breaking news
Eluru District News
-
కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
టి.నరసాపురం: కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిలు అన్నారు. టి.నరసాపురం ఎస్ఎస్ కన్వెన్షన్లో సోమవారం సాయంత్రం జరిగిన పోలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. పోలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ తెల్లం బాలరాజు అధ్యక్షత వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందన్నారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకుని పార్టీ ముందుకు సాగనుందని కార్యకర్తలకు భవిష్యత్తులో అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కార్యకర్తల ద్వారానే జరుగుతుందన్నారు. కార్యకర్తలు బలోపేతం కావడానికి భవిష్యత్తులో పార్టీ దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన: బాలరాజు సంస్థాగత నిర్మాణం పారదర్శకంగా రచ్చబండ పెట్టి చేయాలని సూచించారు. మెజార్టీ సభ్యులు కోరిన వారిని కమిటీల్లో సభ్యులుగా నియమించుకోవాలన్నారు. ప్రభుత్వం అసత్య ప్రచారాలను మానుకోవాలని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంతో దృష్టి పెట్టాలని హితవు పలికారు. తెల్లం బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ళల్లో తట్టా బుట్టా సర్ధుకుని పోతోందన్నారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్లను ధ్వంసం చేయడం అరాచక పాలనకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో లోకేష్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. ఈ నెల 10 లోపు గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలా చేయడం ద్వారా నియోజకవర్గానికి 8 నుంచి 10 వేల మంది కార్యకర్తలు అనుబంధ సంఘాల్లో సభ్యులుగా ఉంటారని వివరించారు. కార్యక్రమంలో టి.నరసాపురం మండల కన్వీనర్ శ్రీను రాజు, మచిలిపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథరావు, జెడ్పీటీసీ సామంతపూడి బాల సూర్యనారాయణ, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు వాసిరెడ్డి మధు, కొత్త ప్రకాష్బాబు, చిక్కాల దుర్గాప్రసాద్, ఆరేటి సత్యనారాయణ, పి.అభిషేక్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సరిత, తుమ్మలపల్లి గంగరాజు, గంజిమాల రామారావు తదితరులు పాల్గొన్నారు. -
కనుల పండువగా చందనోత్సవం
ద్వారకాతిరుమల: ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామికి చందనోత్సవాన్ని సోమవారం కనుల పండువగా నిర్వహించారు. ఈ వేడుకతో ఉగ్ర రూపంలో ఉన్న నారసింహుడు చందన లేపంతో సేదతీరారు. ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయానికి దత్తత దేవాలయమైన ఈ ఆలయంలో భీష్మ ఏకాదశి పర్వదినం ప్రారంభమైన స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున ఆలయంలో నిత్య హోమాలు, మూలమంత్ర హవనాలు జరిగాయి. అనంతరం స్వామి, అమ్మవార్లకు పంచామృత అభిషేకాలను ఆలయ అర్చకులు, పండితులు ఘనంగా నిర్వహించారు. ఆ తరువాత స్వామి మూలవిరాట్కు చందన మహోత్సవాన్ని వేద మంత్రోచ్ఛరణలతో పండితులు వైభవంగా నిర్వహించారు. ఉగ్రరూపంలో ఉండే లక్ష్మీనారసింహుడిని శాంతింపజేసేందుకు జరిపిన ఈ ఉత్సవాన్ని వీక్షించిన భక్తులు పరవశించారు. పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, నీరు, తేనెతో ముందుగా స్వామిని అభిషేకించారు. మహా పూర్ణాహుతి, కలశోద్వాసన, అపబృదం, ధ్వజ అవరోహణ కార్యక్రమాలు నేత్రపర్వంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ, ఏఈఓ రమణరాజు తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి, తీర్ధప్రసాదాలను స్వీకరించారు. పెద్ద ఎత్తున మహిళా భక్తులు సుందరగిరిపై పాలపొంగళ్లను వండి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. మంగళవారం స్వామివారికి జరిగే ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని ఈఓ భద్రాజీ తెలిపారు. సుందరగిరిపై అట్టహాసంగా వేడుక -
క్షమించరాని నేరం
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై, ఆయన ఇంటిపై దాడి చేయడం హేయం. కక్షకట్టి, రె చ్చగొట్టి అంబటి రాంబాబు, జోగి రమేష్లపై రౌడీలను, గూండాలను ఉసిగొలిపి భయభ్రాంతులకు గురి చేయడం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడం తప్ప మరేమీ కాదు. దాడులకు పూనుకోవడం క్షమించరాని నేరం. – పుప్పాల వాసుబాబు, ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే రాజకీయాలు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. విమర్శల సైతం హుందాగా ఉండాలి. దాడులు దౌర్జన్యాలు అక్రమ కేసులు సరి కాదు. బాధితులూ అదే బాటలో పయనిస్తే పరిస్థితి ఏమిటి. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతల అమలు విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది. – కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే రెడ్బుక్ రాజ్యాంగం పరాకాష్టకు చేరింది. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దౌర్జన్య కాండ దుర్మార్గపు పాలనకు, దుష్ట సామ్రా జ్యానికి నిదర్శనం. ప్రజలు హేయమైన ప్రభుత్వ పాలన చూస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించి మరలా జగనన్న రాజ్యాన్ని త్వరలో తీసుకువస్తారు. – కంభం విజయరాజు, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి నేతలు పాలనను విస్మరించి ఆటవిక దాడులు, దహనకాండలకు తెరదీయడం నీతిమాలిన చర్య. ఎన్నికల ముందు నీతి వ్యాఖ్యలు వల్లించిన కూటమిలోని మిగతా పార్టీలు ఇప్పుడు దహనకాండలపై ఎందుకు నోరువిప్పడం లేదు. ప్రజలే కూటమి నేతలకు బుద్ధి చెప్పాలి. – మామిళ్లపల్లి జయప్రకాష్, ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త -
ప్రజాస్వామ్య విలువలకు పాతర
చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తున్నారు. ప్రశ్నించిన వారిని టార్గెట్ చేసి ఇళ్లపై రౌడీలతో దాడులు చేయించడం దుర్గార్మం. ఈ దాడులను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. తిరుమల నెయ్యిలో కల్తీ జరగలేదని నివేదికలు రావడంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టించడానికి వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. – దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, కై కలూరు నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రులు జోగి రమేష్ ఇంటిని తగలబెట్టడం, అంబటి రాంబాబు ఇంటి వద్దకు వెళ్లి ధ్వంసం చేయడం దుర్మార్గం. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను అణచివేయాలనే నిరంతరం కేసులు పెడుతూ వేధిస్తోంది. ఎంతగా అణచివేయాలని చూస్తే తిరిగి అంత వేగంగా పైకి లేస్తాం. ప్రభుత్వం సక్రమ పాలన అందించాలి. – మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులను భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదు. అక్రమ కేసులు పెట్టి దుర్మార్గంతో కూడిన రాక్షస చర్యలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదు. అంబటి రాంబాబు, జోగి రమేష్లపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. – తెల్లం బాలరాజు, పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే -
పంచాయతీ అభివృద్ధి అధికారులకు శిక్షణ తరగతులు
ఏలూరు(మెట్రో): గ్రామస్థాయిలో వివిధ ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో పంచాయతీ అభివృద్ధి అధికారులదే కీలక పాత్ర అని జిల్లా ప్రజా పరిషత్ సీఈవో ఎం.శ్రీహరి పేర్కొన్నారు. సోమవారం ఏలూరులోని సోషల్ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రేడ్ 4, 5 పంచాయతీ అభివృద్ధి అధికారులకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమాలను జెడ్పీ సీఈఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పంచాయతీ అభివృద్ధి అధికారులు వారధి వంటివారని ప్రజలకు ప్రభుత్వ సేవలను సకాలంలో సమర్ధవంతంగా అందించవల్సిన బాధ్యత పంచాయతీ అభివృద్ధి అధికారులదేనని తెలిపారు. జిల్లా ట్రైనింగ్ మేనేజర్ గుర్రాల ప్రసంగి రాజు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిపాలన సమర్ధవంతంగా జరగాలంటే ప్రతీ పంచాయతి అభివృద్ధి అధికారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాలలో నేర్చుకొని పరిపాలన అంశాలపై పట్టు సాధించాలన్నారు. -
గంగానమ్మకు నీరాజనం
ఏలూరు (ఆర్ఆర్పేట): చల్లని తల్లి.. సిరులు కురి పించే కల్లవల్లి.. ఏలూరు నగర ఆరాధ్య దేవత గంగానమ్మవారి జాతర మహోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. పడమర వీధి గంగానమ్మవారి జాతరలో భాగంగా అమ్మవారికి సోమవారం నగరవాసులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఏడేళ్లపాటు నీరాక కోసం ఎదురుచూస్తాం గంగానమ్మ అంటూ ఇంటింటా నీరాజనాలు అర్పించారు. సుమారు వంద రో జులపాటు ప్రత్యేక పూజలు, నైవేద్యాలతో కొలిచిన అమ్మవారిని కొర్లబండిపై నగర శివార్లకు సాగనంపే ప్రక్రియ నేత్రపర్వంగా జరిగింది. ఊరేగింపులో కొర్లబండిపై అమ్మవారి వేషధారణలో పంబల వారు కూర్చొని భక్తులకు కుంకుమబొట్లు పెడుతూ ఆశీర్వదిస్తూ ముందుకు సాగారు. తీన్మార్ డప్పు లు, బుట్టబొమ్మలు, శక్తివేషాలు, డీజేలు, కోయ, శాసీ్త్రయ, జానపద నృత్యాలతో ఊరేగింపు జనసంద్రాన్ని తలపించింది. ఉదయం 10 గంటల సమయంలో ప్రారంభమైన కొర్లబండి ఊరేగింపు రాత్రి 7.30 గంటలకు సగం దూరం కూడా పూర్తికాలేదు. పడమర వీధిలో అమ్మవారి మేడల నుంచి మొదలైన ఊరేగింపు కుండీ సెంటర్, గడియార స్థంభం సెంటర్, మెయిన్బజార్, బిర్లా భవన్ సెంటర్, వైఎంహెచ్ఏ హాలు, రామకోటి ప్రాంగణం, అంబికా సెంటర్ మీదుగా ఓవర్బ్రిడ్జి డౌన్లోని జ్యూట్మిల్లు వద్దకు చేరుకోవడానికి దాదాపు తొమ్మిది గంటలు పట్టింది. నగరం.. భక్త జన సంద్రం కొర్లబండి ఊరేగింపును తిలకించడానికి లక్ష మందికి పైగా భక్తులు వచ్చినట్టు అంచనా. నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆటోలు, ట్రా క్టర్లు, కార్లు, ద్విచక్రవాహనాల్లో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వీరితో పాటు ఇప్పటికే నగరానికి వచ్చిన అతిథులు, నగర ప్రజలతో ఊరంతా జన ఉప్పెనను తలపించింది. ఊరేగింపుతో నగరం అష్టదిగ్బంధమైంది. ఎటు చూసినా భక్తులతో నిండిపోవడంతో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చెమటోడ్చారు. అమ్మవారి ఊరేగింపు జ్యూట్మిల్లు ప్రాంతాన్ని దాటిన తరువాత ట్రాఫిక్ను వదిలారు. స్థానిక ఓవర్బ్రిడ్జిపై ప్రజలు వేలాదిగా నడుచుకుంటూ తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సి వచ్చింది. అలా గే కై కలూరు రోడ్డు, పెదపాడు రోడ్డు, పాతబస్టాండు సెంటర్, వంగాయగూడెం సెంటర్, విజయ విహార్ సెంటర్, రైల్వే ట్రాక్ రోడ్డు, రాజీవ్ స్నేహవారధి ఇలా ఎక్కడ చూసినా కోలాహలమే కనిపించింది. ఆయా మార్గాల్లో కిలోమీటరు దూరం వెళ్లడానికి గంటకు పైగా సమయం పట్టింది. శక్తి వేషాలు కొర్లబండిలో పంబల వారు భక్త జన ఉప్పెన ఏలూరులో జన జాతర నేత్రపర్వంగా కొర్లబండిపై ఊరేగింపు నగరం అష్టదిగ్బంధనం అమ్మవారికి ఘనంగా వీడ్కోలు -
వైద్య,ఆరోగ్యశాఖలోఅవకతవకలు
● మల్టీ పర్పస్ ఆరోగ్య కార్యకర్తల నియామకాల్లో గోల్మాల్ ● అనర్హులతో జాబితా తయారుచేసి హడావుడిగా విడుదల ఏలూరు టౌన్ : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో మల్టీ పర్సస్ ఆరోగ్య కార్యకర్తల (ఎంపీహెచ్డబ్ల్యూ) పునర్ నియామకాల్లో అధికారులు అనేక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులకు అన్యాయం చేస్తూ... అనర్హులతో జాబితా హడావుడిగా విడుదల చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక్కో ఉద్యోగానికి ఎంత మొత్తంలో సొమ్ములు దండుకున్నారో? అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను సైతం తోసిరాజని.. పోస్టులు అమ్మేసుకున్నారనే అభిప్రాయం ఉద్యోగుల్లో నెలకొంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యంతో అర్హులు ఉద్యోగాలకు దూరం కావాల్సి వస్తోందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతలు అధికారుల తీరుపై ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం 2013లో రాష్ట్రంలో సుమారు 1200 మందికి కాంట్రాక్ట్ విధానంలో ఎంపీహెచ్డబ్ల్యూ (ఎం)గా ఉద్యోగాలు కల్పించారు. దీనిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 104 మంది ఉద్యోగాలు పొందారు. అప్పటి నుంచి వీరంతా రెగ్యులర్ చేయాలంటూ ప్రభుత్వాలను కోరుతూ వస్తున్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో కాంట్రాక్ట్ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. తమకు న్యాయం చేయాలంటూ ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2025 అక్టోబర్ 9న సుప్రీంకోర్టు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు చెబుతూ తొలగించిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం పునర్ నియామకాలకు ఉత్తర్వులు జారీ చేసింది. జాబితాలో లేని వ్యక్తులకు ఉద్యోగాలా? ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని 104 మంది మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్(మేల్) ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో ప్రస్తుతం 86 మంది ఎంపీహెచ్డబ్ల్యూ ఉద్యోగులు ఉండగా... హడావుడిగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు 69 మందితో ఒక జాబితా తయారు చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సిద్ధపడింది. ఈ జాబితా తప్పులతడకగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీం తీర్పు ఆధారంగా, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా... ఏలూరు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా ఉద్యోగ నియామకాలు చేపట్టారనే విమర్శలు వస్తున్నాయి. 2013లో నియామకం పొందిన 104 మంది ఉద్యోగుల జాబితా వైద్య ఆరోగ్యశాఖలో ఉందా ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నూతనంగా ఉద్యోగాలకు ఎంపిక చేసిన జాబితాలో జీవోలో లేని వ్యక్తులకు సైతం ఉద్యోగాలు ఇచ్చేందుకు సిబ్బంది సిద్ధపడడంపై ఆరోపణలు వస్తున్నాయి. జూనియర్ల ఎంపికపై అనుమానాలు ఎంపీహెచ్డబ్ల్యూ(ఎం) కాంట్రాక్ట్ ఉద్యోగుల పునర్నియామకాల్లో జూనియర్లను ఉద్యోగాలకు ఏవిధంగా ఎంపిక చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అనర్హులు, జూనియర్లను ఎంపిక జాబితాలో పెట్టటం వెనుక భారీ అవినీతి జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అవగాహన రాహిత్యం, రికార్డులు లేకపోవటంతో ఇష్టారాజ్యంగా చేస్తున్నారని చెబుతున్నారు. జీవోకు విరుద్ధంగా ఎంపిక సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా విడుదల చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు చేసేందుకు సిబ్బంది సిద్ధపడటంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు వై.మోహనరావు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ఏలూరు జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు జే.గోవిందరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. ఎంపిక జాబితాను వెంటనే సరిచేసి అర్హులైన 86 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూనియర్లు, అనర్హులకు ఉద్యోగాలు ఏ విధంగా కల్పిస్తారంటూ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పును, ప్రభుత్వ ఉత్తర్వులను సైతం పక్కనబెట్టి ఎంపిక జాబితా సిద్ధం చేయడంపై సందేహాలు వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేసి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. -
కూటమి గూండాగిరి
మంగళవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రశ్నిస్తే.. దాడులు.. అదేంటని మళ్లీ అడిగితే రౌడీమూకలతో ఇళ్లపైకి తెగబడి దహనకాండ.. ఇది రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న పాలన. తిరుమల లడ్డూ వ్యవహారం, వైజాగ్ గీతం యూనివర్సిటీ భూముల వ్యవహారాన్ని పక్కదోవ పట్టించడానికి ఆటవిక దాడులు, దౌర్జన్యాలతో డైవర్షన్ రాజకీయాలకు దిగింది సీఎం చంద్రబాబు అండ్ కో. వైఎస్సార్సీపీ ముఖ్య నేతలైన అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలకు నిప్పంటించి భౌతికదాడులకు తెగబడ్డాయి పచ్చ మూకలు. ఇదే తరహాలో జిల్లాలోని కై కలూరు, దెందులూరు నియోజకవర్గాల్లోనూ రాజకీయాలు కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలతో పాటు ప్రజలు ముక్తకంఠంతో దాడుల సంస్కృతిని ఖండిస్తున్నారు. రాజకీయ దాడులు : గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాల కోసం కూటమి నేతలు దాడులకు తెరదీశారు. ఎమ్మెల్యేలు స్వయంగా దాడుల్లో పాల్గొనడం, తీవ్ర అసభ్యపదజాలంతో దూషించి రివర్స్లో కేసులు పెట్టించడం పరిస్థితి పరాకాష్టకు నిదర్శనం. జిల్లాలోని కై కలూరులో ఇదే తరహా దాడులు కొనసాగిస్తున్నారు. ఎన్నికల హామీ నెరవేర్చలేదని ఈనెల 22న కొల్లేటికోటకు వచ్చిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ను నత్తగుళ్లపాడు వైఎస్సార్సీపీ సర్పంచ్ రామకృష్ణరాజు ప్రశ్నించడంతో ఇంటిపై దాడి చేసి సర్పంచ్పై హత్యాయత్నం చేశారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. దెందులూరు నియోజకవర్గంలో నిన్నమొన్నటి వరకూ ఇదే తరహాలో రాజకీయ దాడులు కొనసాగాయి. జంగిల్ రాజ్ రాష్ట్రంలో ఆటవిక పాలన ప్రశ్నిస్తే దాడులు, ఇళ్లకు నిప్పు జిల్లాలోనూ ఇదే సంస్కృతి వైఎస్సార్సీపీ నేతలపై దాడుల పర్వం కూటమి అరాచకాలపై సర్వత్రా నిరసనలు -
సచివాలయ ఉద్యోగినిపై దాడి దారుణం
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులో ధనలక్ష్మి టిఫిన్ సెంటర్కు డిమాండ్ నోటీసు ఇచ్చేందుకు వెళ్లిన సచివాలయ ఉద్యోగిని షేక్ షకీనాపై సోమవారం హోటల్ నిర్వాహకులు దాడి చేసిన ఘటనపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నాయకులు మండిపడ్డారు. బాధితురాలు షకీనాతో కలిసి పట్టణ పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ షేక్ ఉమర్ ఆలీషా మాట్లాడుతూ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై భౌతిక దాడులకు దిగడం దారుణమన్నారు. సచివాలయ మహిళా ఉద్యోగులకు రక్షణ కరువయ్యిందని, ఇటీవల దాడులు పెరుగుతున్నాయన్నారు. ఇప్పటికే పని ఒత్తిడితో సతమతమవుతున్న ఉద్యోగులు ఇలా భౌతిక దాడులు ఎదురైతే ఎలా పనిచేస్తారని, షకీనాకు న్యాయం జరగకపోతే సంఘం ఆధ్వర్యంలో ఉద్యమానికి సైతం వెనకాడబోమని హెచ్చరించారు. ఎన్నడూ చూడలేదు : తాను ఐదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నానని, ఇంత దారుణం ఎన్నడూ చూడలేదని షకీనా అన్నారు. ఉన్నతాధికారులు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీ గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘాల సూచనల మేరకు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. అనంతరం పోలీసులు టిఫిన్ సెంటర్ నిర్వాహకులను పోలీస్స్టేషన్కు తరలించారు. దాడికి ఖండన యలమంచిలి: పాలకొల్లులో సచివాలయ ఉద్యోగినిపై దాడిని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పాలకొల్లు తాలూకా యూనిట్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సంఘ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు షేక్ ఉమర్ ఆలీషా ప్రకటన విడుదల చేశారు. పోలీసులు నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని కోరా రు. పాలకొల్లు తాలూకా అధ్యక్షుడు వి.సునీల్కుమార్, ఎం.నారాయణ రాజు మద్దతు తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్
రూ.25 వేలు తీసుకుంటూ పట్టుబడిన వైనం తణుకు అర్బన్: హెడ్ కానిస్టేబుల్ రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటన తణుకు పట్టణ పోలీస్స్టేషన్లో సోమ వారం రాత్రి చోటుచేసుకుంది. చీటింగ్కి సంబంధించి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ నమోదు చేయకుండా ఉండాలంటే రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఘటనలో హెడ్ కానిస్టేబుల్, స్టేషన్ రైటర్ కె.సుబ్బారావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ జీవీ కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన జక్కంశెట్టి మావుళ్లేశ్వరరావు అనే వ్యక్తి మరో నలుగురు వ్యక్తులతో కలిసి ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశారని తణుకుకి చెందిన రావిపాటి నాగదేవి అనే మహిళ కలెక్టర్ను ఆశ్రయించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తణుకు పట్టణ పోలీస్స్టేషన్లో తప్పుడు కేసు నమోదు చేయించారని ఆ కేసుకు సంబంధించి 41 నోటీసు ఇచ్చేలా హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు రూ.25 వేలు డిమాండ్ చేశారని, పట్టణ సీఐ ఎన్.కొండయ్యకు రూ.20 వేలు, సుబ్బారావుకు రూ.5 వేలు అని డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏలూరు ఏసీబీ డీఎస్పీని ఆశ్రయించారు. ఈనెల 1న కేసు నమోదుచేసిన డీఎస్పీ సోమవారం రాత్రి మావుళ్లేశ్వరరావు రైటర్ సుబ్బారావుకు స్వయంగా రూ.25 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో తణుకు సీఐ ఎన్.కొండయ్యకు రూ.20 వేలు ఇవ్వాలన్న వ్యవహారంపై సీఐ పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామని, నింది తుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు వెల్లడి ంచారు. దాడిలో ఏసీబీ సీఐలు కె.శ్రీనివాస్, ఎం.బాలకృష్ణ, సిబ్బంది ఉన్నారు. -
సరిపల్లిలో భారీ చోరీ
కొయ్యలగూడెం: ఇంట్లో ఎవరూ లేని సమయంలో పట్టపగలు ఆగంతకులు ఇంటి తలుపులు పగలకొట్టి బీరువాలో ఉన్న నగలు నగదు అపహరించిన సంఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో సోమవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం మండలంలోని సరిపల్లి గ్రామానికి చెందిన మేరీ కుమారి ఉదయం సుమారు పదిన్నర సమయంలో సమయానికి వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వచ్చింది. వచ్చేసరికి ఇంటి తలుపులు పగులకొట్టి ఉండడంతో లోపలికి వెళ్ళి చూడగా బీరువా తలుపు తీసి సామాన్లు చిందరవందరగా పడి ఉన్నట్లు తెలిపింది. లోపల దాచిన సుమారు రూ.4.30 లక్షల నగదు, 4 కాసుల బంగారు ఆభరణాలు 12 తులాల వెండి పట్టీలు కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. జంగారెడ్డిగూడెం: జాతరకు వెళ్లి వచ్చేసరికి దుండగులు దోచేశారు. బాధితుడు మేడూరి రవితేజ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన రవితేజ, స్థానిక బైనేరు వాగు వద్ద ఉన్న శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నారు. ఆయన ఏరియా ఆసుపత్రి వెనుక ఉన్న ఎస్ఎస్ నగర్లో ఉంటున్నారు. ఈ నెల 1న ఏలూరులో జరుగుతున్న జాతర మహోత్సవానికి కుటుంబంతో కలిసి వెళ్లారు. సోమవారం పనిమనిషి ఇంటికి వచ్చి చూడగా, తలుపులు పగులగొట్టి ఉండటంతో రవితేజకు సమాచారం ఇచ్చింది. రవితేజ వచ్చి చూడగా, బీరువాలో ఉంచిన 3 కిలోల వెండి వస్తువులు, రూ. 50వేల నగదు, 10 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించాడు. చోరీకి గురైన వస్తువుల్లో సుమారు 2.50 కిలోల వరకు తాను పనిచేసే శివాలయంలోని దేవుడి వస్తువులని రవితేజ తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించినట్లు రవితేజ తెలిపారు. ఉండి: ఉండిలో మైనర్పై అత్యాచార ఘటనపై నమోదైన పోక్సో కేసులో భాగంగా నిందితుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించినట్లు ఎస్సై ఎండీ నసీరుల్లా తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం 2023 డిసెంబరులో ఉండిలోని పడవలవాని పేటలో మైనర్ బాలికపై వరుసకు మేనత్త కొడుకు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అప్పటి మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ నున్న మురళీకృష్ణ విచారణ చేపట్టి నాగాంజనేయులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నేరం రుజువు కావడంతో జడ్జి బీ లక్ష్మీనారాయణ జీవితకాలం జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా, బాధితురాలికి రూ.5.80 లక్షల పరిహారం అందజేయాలని ఆదేశించినట్లు ఎస్సై తెలిపారు. భీమవరం: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆశాజనకంగా లేదని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.ప్రకాశం, బీవీ నారాయణ సోమవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయ పన్ను నిబంధనల్లో ఎలాంటి మార్పు లేకపోవడం నిరాశపర్చిందని, కొత్త పన్ను నిబంధనల్లో పొదుపు, ఇతర తగ్గింపులకు అవకాశం లేకపోవడం దారుణమన్నారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షలకు పెంచాలన్నారు. -
భూసేకరణ వేగిరపర్చాలి
ఏలూరు(మెట్రో) : జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి సోమవారం పోలవరం ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ పునరావాస కార్యక్రమాలు, జాతీయ రహదారుల నిర్మాణం, సెల్ఫోన్ నెట్వర్క్ టవర్ల ఏర్పాటు, ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు నిమిత్తం భూసేకరణపై అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భీమవరం: చంద్రబాబు ప్రభుత్వంలో కూటమి నాయకుల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయని, ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, వైఎస్సార్సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు ధ్వజమెత్తారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజినీ, జోగి రమేష్లపై దాడులను ఖండిస్తూ సోమవారం రాయలం గ్రామంలోని వెంకటరాయుడు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజాసమస్యలను గాలికి వదిలి వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులే పరమావిధిగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని నిగ్గుతేలడంతోపాటు విశాఖలో కోట్లాది రూపాయల వి లువ చేసే భూములను అప్పనంగా ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడికి కట్టబెట్టడం వంటి వ్యవహారాల్లో కూటమి పార్టీలకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్సీపీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో భయాందోళనలు కలిగించి కూటమి నేతలు లబ్ధి పొందాలని చూస్తున్నారని, అయితే దాడులు, కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులకు నిరసనగా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం భీమవరం డీఎస్పీ రఘు వీర్విష్ణును కలిసి వినతిపత్రం అందజేశారు. తాడేపల్లిగూడెం రూరల్: గత వైఎస్సార్సీపీ ప్రభు త్వం అమలు చేసిన నవరత్నాలు పథకాల ద్వారా లబ్ధి పొందిన యువతి గ్రూప్–1 పరీక్షల్లో సత్తాచాటింది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ విభాగంలో కొలువు సాధించింది. పెదతాడేపల్లికి చెందిన జాలాది రమ్యశ్రీ గత ప్రభుత్వం అందించిన విద్యాదీవెన సాయం ద్వారా బీటెక్ పూర్తిచేసింది. గ్రూప్–1 పరీక్ష సన్నద్ధతకు అవసరమైన ఆర్థిక సాయాన్నీ నాటి జగన్ ప్రభుత్వం అందించింది. దీంతో గ్రూప్–1 పరీక్షల్లో ప్రతిభ కనబర్చింది. ఆమె తండ్రి కుటుంబరావు ప్రైవేట్ డ్రైవర్ కాగా తల్లి సునీత అంగన్వాడీ టీచర్. అక్క మౌనిక వెల్లమిల్లి ఆర్ఎస్కేలో వీఏఏగా, మరో సోదరి మనీష హైదరాబాద్లో పనిచేస్తున్నారు. రమ్య శ్రీ పెదతాడేపల్లి శ్రీరామా విద్యానికేతన్ పూర్వ విద్యార్థిని కాగా ప్రిన్సిపాల్ ఎ.వీరవెంకటసుబ్బరాజు ఆమెను అభినందించారు. భీమవరం(ప్రకాశం చౌక్): విద్యుత్ మీటర్ రీడర్లు సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో ధర్నా చేయడంతో రెండు రోజులుగా జిల్లాలో విద్యుత్ మీటర్ల రీడింగ్ నిలిపోయింది. జిల్లాలో సుమారు 500 మంది మీటర్ రీడర్లు ఉన్నారు. భీమవరం డివిజన్లో 2,09,970, నరసాపురం డివిజన్లో 2,24,354, తాడేపల్లిగూడెం డివిజన్లో 2,19,440 మొత్తంగా 6,53,764 సర్వీసులకు సంబంధించిన బిల్లింగ్ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో శ్లాబ్ రేట్లు మారి బిల్లులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వినియోగదారులు అంటున్నారు. భీమవరం: సమస్యల పరిష్కారం కోసం పోలీసులను ఆశ్రయించే బాధితులకు పోలీసు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి వారికి అండగా నిలవాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. సోమవారం భీమవరం వన్టౌన్ పోలీసుస్టేషన్ వద్ద నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులు స్వీకరించి ఆయా స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వినతులు సమగ్రంగా పరిశీలించి శాత్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఏఎస్పీ వి.భీమారావు, డీఎస్పీ రఘువీర్విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యత
కై కలూరు: చిత్తడి నేలలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాజమండ్రి సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు బీఎన్ఎన్.మూర్తి చెప్పారు. వరల్డ్ వైడ్ ఫండ్(డబ్ల్యూడబ్ల్యూఎఫ్), అటవీశాఖ సంయుక్తంగా ఆటపాక పక్షుల కేంద్రంలో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సోమవారం నిర్వహించింది. నేషనల్, జాగృతి, ఆక్స్ఫర్డ్, ఏలూరు పీపుల్ ఉడ్స్, శృంగవరప్పాడు, వడాలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ స్టేట్ డైరెక్టర్ ఫరిదా టంపల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథి అటవీశాఖ సీసీఎఫ్ మూర్తి మాట్లాడుతూ విదేశీ పక్షులు 30,000 కిలోమీటర్లు ప్రయాణించి శీతాకాలంలో ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం కొల్లేరు చిత్తడి నేలలే అన్నారు. ప్రస్తుతం కొల్లేరులో 40 లక్షల నుంచి 50 లక్షల పక్షులు ఉన్నాయన్నారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ స్టేట్ డైరెక్టర్ ఫరిదా టంపల్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు తడి నేలలు – సంప్రదాయ జ్ఞానం, సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం అనే నినాదంతో జరుగుతున్నాయన్నారు. జిల్లా అటవీశాఖ అధికారిణి బి.విజయ కొల్లేరులో జీవవైవిద్యం గురించి అందరూ తెలుసుకోవాలన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఫారెస్టు రేంజర్ రామలింగాచార్యులు, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లీడ్ పార్టనర్ బీఎస్ఎం.శ్రీనివాస్, నిర్వాహకులు ఎంఎస్.తిరుమలేశ్వరరావు, శశాంక్, ఇన్చార్జి డీఆర్వో రాంబాబు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, ఫారెస్టు సిబ్బంది హాజరయ్యారు. ఆటపాక పక్షుల కేంద్రంలో చిత్తడి నేలల దినోత్సవం -
గంగానమ్మ తల్లి.. భక్తులు ప్రణమిల్లి
అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జన జాతరను తలపిస్తోంది. నగరమంతా గంగానమ్మవారి జాతర సందడి కనిపిస్తోంది. పడమరవీధిలో గంగానమ్మవారి జాతర ఆదివారం అట్టహాసంగా నిర్వ హించారు. గత వారం తూర్పువీధి, దక్షిణపువీధి, పవర్పేట, లక్ష్మీవారపుపేట, ఆదివారపుపేటలో జాతర సంబరాలు జరగ్గా.. ఇప్పుడు పడమరవీధిలో వేడుకలు నిర్వహిస్తున్నారు. పడమరవీధి గంగానమ్మవారి జాతరను నగరంలోని దాదాపు సగం మంది జనం పైగా పాటించారు. జాతర పూనకాలే.. ఏడేళ్లకోసారి వచ్చే జాతర కావడంతో నగరవాసులంతా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. మూడు నెలలుగా అమ్మవారిని పడమరవీధి వద్ద మేడల్లో ప్రతిష్ఠించి ప్రత్యేక పూ జలు చేశారు. ఆదివారం వేకువజాము 2.30 గంటల నుంచి నైవేద్యాలు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. భారీగా భక్తులు తరలిరావడంతో ఈ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. భారీ కుంభం ఉదయం 9 గంటలకే అమ్మవారి మేడల వద్ద భక్తులు సమర్పించిన నైవేద్యాలతో భారీ కుంభం ఏర్పడింది. ఉదయం 10, 11 గంటల సమయానికి భక్తుల రాక మరింత పెరిగింది. భక్తులంతా నైవేద్యాలు సమర్పించడంతో అమ్మవారి మేడల వద్ద కుంభం కొండను తలపించింది. సాయంత్రానికి సుమారు లక్ష మందికి పైగా భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించినట్టు అంచనా. అమ్మవారికి నీరా‘జనం’ జాతర మహోత్సవానికి నగర ప్రజల ఆహ్వానం మే రకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అతిథులు ఏలూరు చే రుకున్నారు. ముందస్తు బుకింగ్లతో లాడ్జీల్లో గదులన్నీ ఫుల్ అయ్యాయి. పడమరవీధి గంగానమ్మవారి దేవస్థానం పరిధిలోని పడమరవీధి, వంగాయగూడెం, రామకృష్ణాపురం, గులాబీతోట, ఎన్టీఆర్ నగర్, నరసింహరావుపేట, పోస్టల్ కాలనీ, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో ప్రతి వీధిలో టిప్టాప్ పందిళ్లు వేసి బంధుమితుల్రకు విందు భోజనాలు ఏర్పాటుచేశారు. దీంతో ఆయా మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. ప్రధాన రహదారుల్లో కిటకిట వీధులన్నీ రద్దీగా ఉండటంతో ప్రధాన రహదారులపై ప్రయాణించాల్సి వచ్చింది. దీంతో పాత బ స్టాండు, కొత్త బస్టాండు ప్రాంతాలు, రామకృష్ణాపురంలోని మినీ బైపాస్ రోడ్డు, విజయవిహార్ సెంటర్, వసంతమహల్ సెంటర్, పవర్పేట స్టేషన్ రో డ్డు తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరా యం ఎదురయింది. కిలోమీటరు దూరం బైక్పై వెళ్లేందుకు దాదాపు రెండు గంటల సమయం పట్టింది. పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకున్నారు. హేలాపురి.. ఆధ్యాత్మిక సిరి అట్టహాసంగా పడమర వీధి జాతర నైవేద్యాలు సమర్పించిన లక్ష మందికి పైగా భక్తులు నగరంలో పండుగ వాతావరణం నేడు అమ్మవారిని సాగనంపనున్న భక్తులు -
నత్తగుళ్లపాడు వైఎస్సార్సీపీ సర్పంచ్పై హత్యాయత్నం
● ఎన్నికల హామీలపై ప్రశ్నించినందుకు దాడి ● ఇల్లు ధ్వంసం కై కలూరు: చంద్రబాబు పాలనలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులపై దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఏలూరు జిల్లా నత్తగుళ్లపాడు వైఎస్సార్సీపీ సర్పంచ్ ముంగర రామకృష్ణరాజు (రూబేన్)పై శనివారం అర్ధరాత్రి హత్యాయత్నం చేశారు. దాదాపు 60 మంది సర్పంచ్ ఇంటిని ధ్వంసం చేసి ఆయన తలపై ఇనుప రాడ్డుతో కొట్టారు. అడ్డువచ్చిన సర్పంచ్ భార్య నవ్య దుస్తు లు చించి దాడి చేశారు. కుటుంబసభ్యులు పోలీసు ల సాయంతో వారిని కై కలూరు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. కొల్లేరు ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని గత నెల 22న కొల్లేటికోటకు వచ్చిన కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినే ని శ్రీనివాస్ను కొల్లేరు పెద్దలు నిలదీశారు. దీనిపై నత్తగుళ్లపాడు సర్పంచ్ రామకృష్ణరాజు కొల్లేరులో నివసించే ప్రతి కుటుంబానికీ అర ఎకరం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి కామినేని శ్రీనివాస్ మోసం చేశారని వీడియో విడుదల చేశారు. దానిని సహించలేక టీడీపీ నాయకుడు బలే ఏసురాజు తనపై దాడి చేయించాడని బా ధిత సర్పంచ్ రామకృష్ణరాజు ఆరోపించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్ రామకృష్ణరాజు దంపతులను వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షు డు, కై కలూరు నియోజకవర్గ కన్వీనర్ దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ఆదివారం పరామర్శించారు. దాడికి గురైన సర్పంచ్ రామకృష్ణరాజు వీపుపై గాయాలు -
పరాకాష్టకు పచ్చమూకల దాడులు
మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బుట్టాయగూడెం: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం తారాస్థాయికి చేరుకుందని పోలవరం మాజీ ఎ మ్మెల్యే, వైఎస్సార్సీపీ కన్వీనర్ తెల్లం బాల రాజు అన్నారు. ఆదివారం ఆయన దుద్దుకూరులో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏదో రూపంలో దాడులు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం జరుగుతుందన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్, అలాగే భూమన బ్రహ్మనాయుడు ఇళ్లపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పచ్చమూకలు దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోకపో వడం బాధాకరమన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, అన్నింటికీ చంద్రబాబు, పవన్కల్యా ణ్, లోకేష్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వైఎస్సార్ నాయకులు, కార్యకర్తలు భ యపడే ప్రసక్తే లేదని, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేస్తామని అన్నారు. ఉంగుటూరు: అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడిగా డా.కోనా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. బాదంపూడి శివారులో కల్యాణ మండపంలో ఈ కార్య క్రమం నిర్వహించారు. రాజ్యసభ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, తెలంగాణ రాష్ట్ర ఐవీఎఫ్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస గుప్త, ఐవీఎఫ్ వ్యవస్థాపక సభ్యులు రమేష్ అగర్వాల్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్లు పాల్గొన్నారు. వాసవీ మాత ఆలయంలో పూజలు చేసిన అనంతరం ర్యాలీగా కల్యాణ మండపానికి వెళ్లారు. ఈ సందర్భంగా పలు కమిటీల్ని నియమించి ప్రమా ణ స్వీకారం చేయించారు. ఐవీఎఫ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వక్తలు తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని 54 కేంద్రాల్లో ఆదివారం ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగాయి. 5,076 మంది హాజరయ్యారు. పెదపాడు: ఏలూరు కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన పీజీఆర్ఎస్కు రద్దు చేశారు. జాతర దృష్ట్యా రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. -
శ్రీవారి క్షేత్రం.. భక్తజన సంద్రం
ద్వారకాతిరుమల: చిన వెంకన్న దివ్య క్షేత్రం శనివారం భక్తజన సంద్రమయ్యింది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, అనివేటి మండపం, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, కల్యాణకట్ట, నిత్యాన్నదాన భవనం ఇలా అన్ని విభాగాలు భక్తులతో పోటెత్తాయి. భక్తుల వాహనాలతో ఘాట్ రోడ్లు నిండిపోయాయి. అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. లింగపాలెం: పంట కాలువలోకి ట్రాక్టర్ దూసుకెళ్లిన ఘటన శనివారం లింగపాలెం శివారులో చోటుచేసుకుంది. ఎస్బీఐ బ్యాంకు సమీపంలోకి ట్రాక్టర్ వెళుతుండగా ఒక్కసారిగా గేదెలు అడ్డు వచ్చేసరికి ట్రాక్టర్ డ్రైవర్ వాటిని తప్పించేందుకు సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పాలకోడేరు: మండలంలోని వేండ్ర రైల్వే గేటు సమీపంలో సుమారు 32 సంవత్సరాల వయసు గల గుర్తుతెలియని వ్యక్తిని రైలు ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు భీమవరం రైల్వే ఎస్సై ఎస్ సుబ్రహ్మణ్యం తెలిపారు. శుక్రవారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో కాకినాడ– లింగంపల్లి ప్రత్యేక రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. వివరాలు తెలిసిన వారు భీమవరం రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు. -
గేదెల కోసం చెరువులోకి దిగి..
ద్వారకాతిరుమల : గేదెల కోసం చెరువులోకి దిగిన ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మారంపల్లి గ్రామంలోని చంద్రవంక చెరువులో చోటుచేసుకుంది. మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది శనివారం చెరువులోంచి వెలికితీశారు. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల మండలం, ఘంటావారిగూడెం గ్రామానికి చెందిన దొబ్బిడి వెంకట సుబ్బారావు (60) శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లి గేదెలకు గడ్డి వేశాడు. తిరిగి మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేసిన తరువాత, మళ్లీ పొలానికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి రాకపోయే సరికి ఆయన కుమారుడు గంగాధరరావు పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో సాయంత్రం పొలానికి వెళ్లి చుట్టుపక్కల వెతికాడు. చంద్రవంక చెరువు గట్టుపై వెంకట సుబ్బారావు సెల్ఫోన్, పొగాకు కవరు, అలాగే చెరువులో గేదెలు ఉన్నట్టు గుర్తించాడు. దాంతో తన తండ్రి గేదెల కోసం చెరువులోకి దిగి, గల్లంతైనట్టు తెలుసుకున్నాడు. కాగా హెడ్ కానిస్టేబుల్ కె.శ్రీనివాసరావు సమక్షంలో శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని వెలికితీశారు. గంగాధరరావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్సీ శ్రీనివాసరావు తెలిపారు. -
కోపల్లె వంతెన వద్ద ఉద్రిక్తత
● జక్కరంలోని ఆర్సీఎం చర్చి విద్యుత్ మీటర్ తొలగింపు ● భగ్గుమన్న క్రైస్తవ సంఘాల నాయకులు కాళ్ల: జక్కరంలోని ఆర్సీఎం చర్చి విద్యుత్ మీటర్ తొలగింపుపై క్రైస్తవ సంఘాలు భగ్గుమన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ శనివారం కోపల్లె వంతెన వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల జక్కరం–కోపల్లె వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. నాలుగు లైన్ల వంతెన, రోడ్డు పనుల కోసం ఆర్అండ్బీ అధికారులు కొలతలు నిర్వహించారు. రోడ్డు మార్జిన్లో ఉన్న ఇళ్లు, చర్చిలను తొలగించాలని నిర్ధారించారు. జక్కరంలోని అరుంధతి పేటలో ఆర్సీఎం చర్చి విద్యుత్ మీటర్ను పంచాయతీ, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు శుక్రవారం తొలగించారు. ఈ విషయం తెలిసిన స్థానిక ఆర్సీఎం చర్చి విశ్వాసులు, పాస్టర్లు క్రైస్తవ సంఘాలతో కలిసి శనివారం కోపల్లె వంతెన వద్ద ఆందోళన చేశారు. కోపల్లె వంతెన వద్ద మూడు వైపులా క్రైస్తవ సంఘాల నాయకులు, మహిళలు నిరసన చేశారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, సీఐలు జగదీశ్వరరావు, కాళీచరణ్, ఎస్సైలు, తహసీల్దార్ సుందర్ సింగ్, ఆర్అండ్బీ ఏఈ శ్రీహరిరాజు, ఇతర అధికారులు ఆందోళనకారులతో మాట్లాడారు. ఆర్సీఎం చర్చి విద్యుత్ మీటర్ను ఏర్పాటు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. శనివారం రాత్రి కూడా ఆందోళన కొనసాగుతూనే ఉంది. వంతెన ఏర్పాటుకు 100 మీటర్ల దూరంలో ఉన్న చర్చి విద్యుత్ మీటర్ తొలగించటం చాలా అన్యాయమని, క్రైస్తవుల మనోభా వాలకు ఇబ్బంది కలిగించే విధంగా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని ఏపీ సీపీఏ ఫౌండర్ చైర్మన్ ఎండీ ఇస్మాయిల్ మండిపడ్డారు. ఆందోళనలో ఏఐసీఎఫ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మత్తే రాజ్ కుమార్, ఏపీ సీపీఏ పొలిటికల్ ప్రెసిడెంట్ జి రాజేష్ ఖన్నా, పాలకొల్లు ప్రెసిడెంట్ జోసెఫ్ రాజకుమార్, స్టేట్ కోఆర్డినేటర్ బెనర్జీ, ఎఫ్ఎఫ్సీఐ నాయకులు స్టాల్ని థామస్, ఆర్సీఎం ఫాదర్లు స్టాల్ని బాలయేసు తదితరులు పాల్గొన్నారు. -
లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయుడిని శిక్షించాలి
కుక్కునూరు: ఇబ్రహీంపేట స్కూల్లో స్వీపర్పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సీఐటీయూ మండల కన్వీనర్ యర్నం సాయికిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఎంఈఓ, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయికిరణ్ మాట్లాడుతూ మండలంలోని ఇబ్రహీంపేట ప్రాథమిక పాఠశాలలో గత పదేళ్లుగా స్కూల్ స్వీపర్గా పనిచేస్తున్న కాకర్ల వెంకటేశ్వరమ్మను అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కొద్ది రోజుల నుంచి అసభ్యకరంగా తిడుతూ, లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయం కలెక్టర్కి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఉద్యోగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, స్కూల్ స్వీపర్ను, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి, ఉద్యోగం నుంచి తొలగించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని సాయికిరణ్ హెచ్చరించారు. ధర్నా కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్ గిరిజన సంఘం మండల ఉపాధ్యక్షుడు కాక ఆనంద్, బాధితురాలు కాకర్ల వెంకటేశ్వరమ్మ, నాయకులు కారం నాగలక్ష్మి, కాక కమలమ్మ, సీత, పాపమ్మ, సీతమ్మ, కృష్ణవేణి, చంద్రమ్మ, పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. -
నయన మనోహరం.. నారసింహుని పరిణయోత్సవం
ద్వారకాతిరుమల : భక్తజన నృసింహ నామస్మరణలు.. వేద పండితుల సుస్వర మంత్ర పఠనాలు.. ప్రతి ఘట్టాన్నీ గుర్తు చేసేలా మంగళవాయిద్య నాదాలు.. అందంగా అలంకరించిన పందిళ్లు, సుగంధభరిత పుష్పమాలికలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన కల్యాణ వేదిక.. దానిపై పట్టువస్త్రాలు, సర్వాభరణాలు ధరించి, బుగ్గన చుక్కతో వరుడిగా మెరిసిపోతున్న స్వామివారు.. ఆ పక్కనే వధువులుగా కొలువుదీరిన అమ్మవార్లు.. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో.. జగదానంద కారకుడైన నారసింహ స్వామివారి వార్షిక దివ్య తిరుకల్యాణోత్సవం జరిగిన వేళ.. ఐఎస్ జగన్నాధపురం క్షేత్రం భూతల వైకుంఠాన్ని తలపించింది. దేదీప్యమానంగా వెలిగిపోయింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. నయనానందకరంగా సాగిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కల్యాణోత్సవాన్ని కనులారా తిలకించి, పులకించిపోయారు. కన్నులపండువగా.. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత నారసింహుని ఉత్సవ మూర్తులను సుందరగిరిపై నుంచి శనివారం ఉదయం కొండ కింద కల్యాణ మండపం వద్దకు పల్లకీ వాహనంలో తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపు చేసి, అలంకరించారు. అనంతరం పరిణయ వేడుకల్లో ఒక్కో ఘట్టాన్ని పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కన్యాదానం జరిపి, సరిగ్గా 11.10 గంటల సుముహూర్త సమయంలో స్వామి, అమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేశారు. ఆ తరువాత వేద మంత్రోచ్ఛరణలతో మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకను పండితులు అట్టహాసంగా జరిపారు. ప్రభుత్వం తరుఫున గోపాలపురం ఏఎంసీ చైర్మన్ వై.బ్రహ్మరాజు, దేవస్థానం తరుఫున ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావు, ఈఓ యర్రంశెట్టి భద్రాజీ అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. వేడుక అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు, స్వామివారి అన్నప్రసాదాన్ని అందించారు. ఈ వేడుకలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కల్యాణ ఘడియలో స్వామి, అమ్మవార్లు, కల్యాణ వేడుకను వీక్షిస్తున్న భక్తులు ఐఎస్ జగన్నాధపురంలో అట్టహాసంగా వేడుక కనులారా తిలకించి, పులకించిన భక్తజనం భక్తులతో పోటెత్తిన సుందరగిరి -
బైక్లు ఢీ.. ఒకరి మృతి
నలుగురికి గాయాలు ఆకివీడు: ఎదురెదురుగా రెండు మోటార్సైకిళ్లు అతివేగంగా ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జాతీయరహదారిపై దుంపగడప గ్రామ అడ్డరోడ్డు సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం కై కలూరు మండలం పెదరామవరంనకు చెందిన బొక్కవరపు రాఘవేంద్రరావు, సామియేలు పనిమీద ఆకివీడు వచ్చి తిరిగి తమ గ్రామానికి బైక్పై తిరిగి వెళ్తుండగా ఆకివీడు వెలంపేటకు చెందిన అల్లు మణికంఠ, ఎస్కే అభి, మరో వ్యక్తి మోటార్సైకిల్పై వస్తూ దుంపగడప అడ్డరోడ్డు సమీపంలో ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బొక్కవరపు రాఘవేంద్రరావు (20) స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా అతడితోపాటు వచ్చిన సామియేలుకు తీవ్ర గాయాలయ్యాయి. మరో బైక్పై ఉన్న ముగ్గురికి కూడా గాయలవడంతో చికిత్స నిమిత్తం 108లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుడు రాఘవేంద్ర చిన్నాన్న బొగ్గవరపు సాయిబాబా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై హనుమంతు నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. భార్యాభర్తలకు తీవ్ర గాయాలు భీమడోలు: దైవదర్శనానికి మోటార్సైకిల్పై వెళ్తున్న భార్యాభర్తలను వెనుకనుంచి కారు ఢీకొట్టింది. శనివారం ఉదయం జాతీయ రహదారి కురెళ్లగూడెం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరవాసరం మండలం మత్య్సపురి గ్రామానికి చెందిన పిప్పళ్ల రామకృష్ణ, పుణ్యవతి బైక్పై ద్వారకాతిరుమలలోని స్వామి వారి దర్శనానికి బయలుదేరారు. మార్గమధ్యమైన కురెళ్లగూడెం వద్దకు వచ్చేసరికి తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వైపు వెళ్తున్న కారును డ్రైవర్ అతివేగంగా నిర్లక్ష్యంగా నడపడంతో రామకృష్ణ మోటార్సైకిల్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు ఎస్సై ఎస్కే మదీనా బాషా తెలిపారు. నలుగురికి తీవ్ర గాయాలు ద్వారకాతిరుమల: రాళ్లకుంటలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలగురికి తీవ్ర గాయాలయ్యాయి. రాజమండ్రికి చెందిన దుర్గారావు, నాగరాజు, నాగ అశ్విన్ కె.గోకవరంలోని ఇటుకల బట్టీలో పనిచేస్తున్నారు. వారు బైక్పై స్వగ్రామానికి వెళుతుండగా ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి బైక్పై వెళుతున్న గోపీ అనే వ్యక్తి, వీరి బైక్ను ఎదురుగా ఢీకొట్టాడు. నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను 108 ఆంబులెన్స్లో నల్లజర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీ
పాలకొల్లు సెంట్రల్: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలని రామాలయం సమీపంలో చోటుచేసుకుంది. బాధితురాలు సయ్యపురాజు పద్మ తెలిపిన వివరాల ప్రకారం ఆమె భర్త అర్ధకట్ల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఆరు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉంటుండగా కుమార్తె ఇటీవల బ్లడ్ కేన్సర్తో మృతి చెందింది. జనవరి 26వ తేదీన పద్మ ఇంటికి తాళాలు వేసుకుని ఉండిలో ఉన్న అమ్మగారి ఇంటికి వెళ్లారు. శనివారం ఉదయాన్నే స్థానికులు ఫోన్చేసి ఇంటి తాళాలు తీసి ఉన్నాయని సమాచారం ఇవ్వడంతో ఆమె ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటిలోని మూడు బీరువాలు పగల గొట్టి ఉన్నాయి. పది కాసుల బంగారు, రూ.50 వేలు నగదు, ద్విచక్ర వాహనం చోరీ జరిగినట్లు గుర్తించినట్లు చెప్పారు. శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో దొంగ ఇంటి ముందు గునపంతో తిరుగుతుండగా సీసీ కెమెరాలో రికార్డయ్యిందన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉందన్నారు. -
రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు
ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్థన్ ఏలూరు టౌన్: రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని.. మాజీ మంత్రి విడుదల రజనీపై దాడులకు పాల్పడడం దుర్మార్గమని, కూటమి పాలనలో ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నారని వైఎస్సార్సీపీ ముదిరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్థన్ ముదిరాజ్ విమర్శించారు. ఏలూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి రజనీపై జరిగిన దాడిపై స్పందిస్తూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి మహిళలకు రక్షణ లేదనీ, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, అఘాయిత్యాలు, ఆఖరికి మాజీ మంత్రులకు సైతం భద్రత లేని దుస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రిపై దాడులు చేయటం బాధాకరమని, ఇలాంటివి విరమించుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. పోలీసులు సైతం కూటమికి కొమ్ము కాయటం చూస్తే రాష్ట్రంలో చట్టం పనిచేస్తుందా అనే అనుమానం వస్తుందన్నారు. మాజీ బీసీ మహిళ మంత్రిని అవమానిస్తే ప్రభుత్వం చోద్యం చూస్తోందనీ, ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సమావేశంలో కై కలూరు నియోజకవర్గం ప్రచార విభాగం అధ్యక్షుడు పాము వీరవెంకట రవికుమార్, సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు మణిమాల రాజేష్, మండవల్లి మండల పంచాయతీరాజ్ ఉపాధ్యక్షుడు పెరుమాళ్ళ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కల్తీ కుట్రలపై మండిపాటు
ఆదివారం శ్రీ 1 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి మంచి బుద్ధి ప్రసాదించాలని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ తిరుమల లడ్డూ ప్రసాదాన్ని స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా కదం తొక్కాయి. చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టులా సీబీఐ నివేదిక ఇచ్చిందని, ఇకనైనా తీరుమారకపోతే ప్రజలే గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. కూటమికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి ఆలయాల్లో పూజలు చేశారు. హిందువుల మనోభావాలతో చెలగాటమాడుతూ కలియుగదైవాన్ని కించపరిస్తే ప్రజలు తీవ్రంగా స్పందిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, కై కలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. కై కలూరులోని మీసాల వెంకన్న దేవస్థానంలో దూలం నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామికి అభిషేకం చేశారు. పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు కోమటి విష్ణువర్దనరావు, రాష్ట్ర నాయకులు రామిశెట్టి సత్యనారాయణ, గంటా సంధ్య, పాల్గొన్నారు. నూజివీడులో నియోజకవర్గంలో.. నూజివీడులో నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప అప్పారావు ఆధ్వర్యంలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. స్వామికి సాష్టాంగ నమస్కారం చేశారు. చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడటం మానుకోవాలని, సమస్యలపై ప్రశ్నించినప్పుడల్లా ఇలాంటి డైవర్షన్ రాజకీయాలతో కాలం గడుపుతూ రాష్ట్ర ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శీలం రాము, మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు, జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమెళ్ళ కృష్ణంరాజు, ముసునూరు జెడ్పీటీసీ వరికూటి ప్రతాప్, ఆగిరిపల్లి ఎంపీపీ బోళ్ళ అనూష తదితరులు పాల్గొన్నారు. పోలవరం నియోజకవర్గంలో.. పోలవరం నియోజకవర్గం బుట్టాయగూడెంలోని శివాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో ఆలయంలో పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు. తెల్లం బాలరాజు మాట్లాడుతూ సీబీఐ ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సుదీర్ఘ విచారణ అనంతరం నివేదిక ఇచ్చిందని ఇకనైనా చంద్రబాబు మంచి బుద్ధితో పరిపాలన సాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో.. ఉంగుటూరులో సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో పార్వతీ సమేత భీమేశ్వర స్వామి, వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. వాసుబాబు మాట్లాడుతూ కోట్లాది మంది హిందువుల మనోభావాలపై దాడి చేసిన చంద్రబాబునాయుడు, పవన్కళ్యాణ్ను దేవుడు కూడా క్షమించరని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్ధానం మాజీ మెంబర్ గాదిరాజు సుబ్బరాజు పాల్గొన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో.. చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి రామాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం విజయరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేసిన చంద్రబాబుకు సీబీఐ నివేదిక చెంపపెట్టులాంటిదని, తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాధరావు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలి ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో వైఎస్సార్సీపీ ప్రత్యేక పూజలు సమస్యలపై ప్రశ్నిస్తే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం -
నగరంలో జాతర సందడి
● నేడు పడమర వీధి గంగానమ్మ జాతర ● వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లుఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలో మరోసారి జాతర సందడి నెలకొంది. గత ఆదివారం నగరంలోని తూర్పువీధి, దక్షిణపు వీధి, పవర్పేట, లక్ష్మీవారపు పేట, ఆదివారపు పేట ప్రాంతాల్లో నిలిపిన అమ్మవార్ల జాతర నిర్వహించి సోమవారం అమ్మవారికి వీడ్కోలు పలికారు. ఈ ఆదివారం నగరంలోని పడమర వీధి శ్రీ గంగానమ్మ జాతర మహోత్సవం నిర్వహించడానికి కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. నేడే గంగానమ్మ జాతర మహోత్సవం పడమర వీధి శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అమ్మవారి మేడల వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడానికి వివిధ మార్గాల్లో దర్శనం క్యూలైన్లు అందుబాటులోకి తెచ్చారు. సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని కమిటీ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. వచ్చిన వారందరికీ అమ్మవారికి దర్శనం కల్పించే దిశగా చర్యలు చేపట్టారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఉచిత దర్శనమనేదే లేకుండా సామాన్య భక్తుల వద్ద నుంచి దర్శనం నిమిత్తం టిక్కెట్టు పెట్టి రూ. 20 రూపాయలు వసూలు చేయనున్నట్టు ఇప్పటికే కమిటీ ప్రతినిధులు ప్రకటించారు. నగర ప్రజలకు దర్శనమిచ్చిన కొర్లబండి జాతర ముగిసిన అనంతరం అమ్మవారిని సోమవారం ఊరి పొలిమేరలకు సాగనంపుతారు. కొర్ల బండిని నగర ప్రజల సందర్శనార్థం పడమర వీధి జాతర కమిటీ సభ్యులు రెండు రోజులు ముందుగానే శనివారం నగరంలో ప్రధాన రహదారుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా కొర్లబండిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ప్రత్యేక ఏర్పాట్లు ఆదివారం అమ్మవార్లకు నైవేద్యం సమర్పించడానికి, దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం వివిధ శాఖలు సమన్వయం చేస్తున్నాయి. రెడీమేడ్ మరుగుదొడ్లు సిద్ధం చేశారు. పారిశుద్ధ్యం కోసం బృందాలను ఏర్పాటు చేశాారు. జాతర ప్రాంతంలో విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా అందుబాటులో ఉండేలా ఈపీడీసీఎల్ ఎస్ఈ ఆదేశాలిచ్చారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రజలకు ట్రాఫిక్ మళ్ళింపుపై సమాచారం ఇస్తున్నారు. ఈ మేరకు ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే నైవేద్యాలు పడమర వీధి శ్రీ గంగానమ్మ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడానికి భక్తులు లక్ష మందికి పైగా వస్తారని అంచనా వేయడంతో భక్తుల తాకిడిని ఎదుర్కోవడానికి తెల్లవారుజామున 2.30 గంటల నుంచే నైవేద్యాలు సమర్పించే వెసులుబాటు కల్పించారు. జాతరను పురస్కరించుకుని బంధుమిత్రులకు విందు భోజనాలు ఏర్పాటు చేసుకున్న నగర ప్రజలు వారికి సమయానికి భోజనాలు అందించాలంటే అమ్మవారికి తొందరగా నైవేద్యం సమర్పిస్తే అంత తొందరగా ఇతర పనులు చేసుకునే అవకాశం ఉంటుందనే తెల్లవారుజామునుంచే భక్తులు దర్శనం కోసం పొటెత్తే అవకాశం ఉంది. -
సమన్వయంతోనే ప్రమాదాల నివారణ
ఏలూరు (ఆర్ఆర్పేట): రహదారి నియమాలను పాటించడంతో పాటుగా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతోనే రహదారి ప్రమాదాల నివారణ సాధ్యమని అడిషినల్ ఎస్పీ నక్కా సూర్య చంద్రరావు అన్నారు. శనివారం సీఆర్రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో రవాణా శాఖ నిర్వహించిన రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లా డుతూ ప్రతి ఒక్కరు రహదారి నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలన్నారు. ఆర్టీవో ఎస్.బాలేందు శేఖర్ మాట్లాడుతూ ప్రమాదాల సంఖ్యను తగ్గించడంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. గత ఏడాది జిల్లాలో 760 రహదారి ప్రమాదాలు జరగ్గా.. 300 మంది చనిపోయారని, 430 మందికి గాయాలయ్యాయన్నారు. హెల్మెట్ తప్పక ధరించాలన్నారు. కార్యక్రమంలో 3 టౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ రాంబాబు, వాహన తనిఖీ అధికారులు రమేష్ బాబు, జీ.ప్రసాదరావు, ఎన్డీ విఠల్, జమీర్, సురేష్, జగదీశ్, స్వామి, నెహ్రు, కళ్యాణి, ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఈ నె 18 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సులైన డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ (లోయర్, హయ్యర్ గ్రేడ్) పరీక్షలు జిల్లాలో నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. టైమ్ టేబుల్ సంబంధిత వెబ్సైట్లో పొందుపరిచినట్టు తెలిపారు. ఏలూరు(మెట్రో): గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో శనివారం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్ మన్ యోజన, తదితర కార్యక్రమాల ద్వారా మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు గృహాలు, తాగునీరు, రోడ్లు, విద్యుత్, విద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పనకు నిధులు మంజూరు చేసిందని, వాటికి సంబందించిన పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తిచేసి, నిధులు పూర్తిస్థాయిలో వినియోగించాలన్నారు. గ్రామీణ నీటి సరఫరా పథకం ద్వారా 86 పనులు మంజూరుకాగా, 78 పనులు పూర్తయ్యాయని, మిగిలినవి 15 రోజులలో పూర్తిచేయాలన్నారు. గిరిజన ప్రాంతాలలోని 86 గ్రామాలకు 81 గ్రామాలలో విద్యుత్ సౌకర్యం అందించారని, మిగిలిన 5 గ్రామాలలో విద్యుత్ సౌకర్యం పనులు పూర్తి చేయాలన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఒకేషనల్(బ్రిడ్జ్ కోర్సు) విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షల 5వ రోజు మొత్తం 503 మంది హాజరయ్యారు. జిల్లాలోని 8 పరీక్షా కేంద్రాల్లో ఉదయం పరీక్షలు నిర్వహించలేదు. మధ్యాహ్నం పరీక్షలకు 556 మందికి 503 మంది హాజరు కాగా 53 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి యోహాను తెలిపారు.నేటి నుంచి జనరల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు (మెట్రో): కోకో రైతుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ద్వారా ఉద్యాన శాఖ నిర్వహిస్తున్న కోకో కాంక్లేవ్ 2026 రెండో రోజు జరిగింది. ఏలూరులో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వ్యవసాయ, అనుబంధ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ కె.శ్రీనివాసులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ కోకో అభివృద్ధి కోసం చర్యలు, కోకో గింజల ప్రాసెసింగ్ రాయితీలపై వివరించారు. డా. చలపతిరావు, విశ్రాంత శాస్త్రవేత్త కాళిదాస్లు కోకోలో చీడ పీడల లక్షణాలు, యాజమాన్య పద్ధతులు వివరించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వివరాలు, రైతులకు కావలసిన సదుపాయాలు గురించి ఇష్టాగోష్టి నిర్వహించారు. -
రాయల్ కిరణ్ నోరు అదుపులో పెట్టుకోవాలి
వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు చిరంజీవి ఏలూరు టౌన్: కూటమి నేతల ప్రోద్భలంతో కిరణ్ రాయల్ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను తీవ్ర పదజాలంతో కించపరిచే వ్యాఖ్యలు చేశాడని, నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదుండి సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బీసీ సెల్ నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. బీసీలు, యాదవులకు వైఎస్సార్సీపీ అధినేత అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే అక్కసుతో యాదవులను అణచివేయాలనే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని యాదవులకు కేటాయించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది కాదా? అని ప్రశ్నించారు. బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి మాట్లాడుతూ... రాయల్ కిరణ్ చేసిన వ్యాఖ్యలను బీసీ సంఘాలన్నీ ఖండిస్తున్నాయని, వైఎస్సార్సీపీ నేతలను ఇష్టారాజ్యంగా తిడుతూ మళ్ళీ పార్టీలో చోటు సంపాదించాలనే కుటిల రాజకీయాలు చేయటం మానుకోవాలన్నారు. కూటమి నేతలు ఇకనైనా అరాచకాలు, దాడులు, కించపరిచే వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. సమావేశంలో బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కిలారు బుజ్జి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, బీసీ సెల్ నేతలు హాజరయ్యారు. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 30 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించే ఏర్పాటు చేయాలని యూటీఎఫ్ నాయకులు ఎమ్మెల్యే బడేటి చంటిని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసిన యూటీఎఫ్ నాయకులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు. యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ పీఆర్సీపీకి కొత్త కమిషనర్ను ఇంతవరకు నియమించలేదన్నారు. కొత్త పీఆర్సీ అమలు చేసేవరకు ఐఆర్ మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 3 సంవత్సరాలుగా సరెండర్ లీవులు చెల్లించడం లేదని, 4 డీఏలు పెండింగ్లో ఉండగా ఒక డీఏ మాత్రమే ఇచ్చారన్నారు. రాష్ట్రంలో అర్హులైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాల్సి ఉందన్నారు. సానుకూలంగా నిర్ణయాలు తీసుకొనకపోతే సమస్యల పరిష్కారం నిమిత్తం ఉద్యమించక తప్పదని, ఫిబ్రవరి 17న ‘చలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.సుభాషిని, రవికుమార్ రుద్రాక్షి తదితరులు ఉన్నారు. -
గ్రూప్–2లో సత్తా
గ్రూప్ –2 ఫలితాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పలువురు సత్తా చాటారు. తణుకుకు చెందిన సాయి ఫణీంద్ర ఎకై ్సజ్ ఎస్సైగా, పాలకొల్లుకు చెందిన మౌనిక సబ్ రిజిస్ట్రార్గా, ఏలూరుకు చెందిన అజయ్ కుమార్ కోఆపరేటివ్ సొసైటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ఎంపికయ్యారు. – తణుకు అర్బన్, పాలకొల్లు సెంట్రల్, ఏలూరు (ఆర్ఆర్పేట)గ్రూప్–2 ఫలితాల్లో తణుకుకు చెందిన దుద్దుపూడి సాయి ఫణీంద్ర మొదటి ప్రయత్నంలోనే ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. గ్రూప్–2 ఫలితాల్లో 300 మార్కులకు 220.66 మార్కులు సాధించి ఈ ఘనత సాధించారు. దుద్దుపూడి మోహన్రావు, పోసి రత్నం కుమారుడైన ఫణీంద్ర తాడేపల్లిగూడెంలోని వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. పదో తరగతి చదువుతున్న సమయంలోనే తండ్రి చనిపోగా తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో 2020లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సంపాదిచారు. మూడేళ్ల పాటు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన ఫణీంద్ర సివిల్స్పై మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రూప్స్కు సిద్ధమయ్యారు. అమ్మ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని భవిష్యత్తులో ఐఏఎస్ కావాలనే తన లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయనున్నట్లు ఫణీంద్ర తెలిపారు. కొంచాడ చిన్ని మౌనిక పాలకొల్లు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కొంచాడ అప్పలరాజు, రమణి దంపతులకు కుమార్తె చిన్ని మౌనిక గ్రూప్–2 పలితాల్లో సబ్ రిజిస్ట్రార్గా ఎంపికై ంది. ఐఏఎస్ సాధించాలనేది తన లక్ష్యమని తెలిపింది. నవోదయలో 6 నుంచి 10 వరకూ చదివినట్లు తెలిపారు. అగ్రికల్చరల్ బీఎస్సీ అనంతరం.. 2023 మే నెలలో కోర్టులో ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం భీమవరం కోర్టులో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. గ్రూప్–2లో సెలెక్ట్ అవ్వడంతో సబ్రిజిస్ట్రార్ ఉద్యోగం సాధించానని.. సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నానని తప్పనిసరిగా ఐఏఎస్ సాధిస్తానని ఆమె తెలిపింది. తండ్రి, సోదరుడు పట్టణంలోనే వ్యాపారం చేస్తుంటారు. తల్లి యలమంచిలి మండలంలో కలగంపూడి గ్రామ సచివాలయ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. -
జాతరకు పటిష్ట ఏర్పాట్లు
● ఏలూరు పడమరవీధి శ్రీ గంగమ్మ జాతర ● 800 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏలూరు టౌన్: ఏలూరు నగరం పడమర వీధిలోని శ్రీ గంగమ్మతల్లి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా.. భక్తి శ్రద్దలతో జరుపుకునేందుకు భక్తులు సిద్ధపడుతున్నారు. వేలాదిగా భక్తులు జాతర మహోత్సవాలకు తరలివస్తారనే అంచనాలతో పోలీస్ అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులకు అసౌకర్యం లేకుండా జాతర కమిటీ ప్రత్యేక శ్రద్ధ వహించాలంటూ ఐజీ జీవీజీ అశోక్కుమార్ సూచించారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్తో కలిసి ఆయన శుక్రవారం పడమరవీధి గంగమ్మ తల్లి జాతర మహోత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భారీ పోలీస్ బందోబస్తు వన్టౌన్ ప్రాంతంలో శ్రీ గంగమ్మతల్లి జాతర మహోత్సవం ముగింపు సందర్భంగా ఫిబ్రవరి 1, 2 తేదీల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ యంత్రాంగం పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ ఆధ్వర్యంలో వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణతోపాటు పోలీస్ సిబ్బందిని భారీ సంఖ్యలో నియమించారు. జాతర ముసుగులో మద్యం సేవించి అల్లర్లకు పాల్పడే వ్యక్తులను ముందుగానే గుర్తించేలా మఫ్టీలో పోలీసులను రంగంలోకి దించారు. ఆలయ సమీపంలో సీసీ కెమెరాల ఏర్పాటు, డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచారు. ఫిబ్రవరి 1న ఆదివారం మహా కుంభం, ఫిబ్రవరి 2న ఊరేగింపునకు వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. జాతర ప్రాంతంలో భక్తులకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. జాతర కమిటీ సభ్యులు, రెవెన్యూ, ఏలూరు నగరపాలక సంస్థ, వైద్య ఆరోగ్యశాఖల అధికారులతో పోలీస్ యంత్రాంగం సమన్వయం చేసుకుంటూ భక్తులకు అసౌకర్యం లేకుండా చర్యలు చేపట్టేలా ఎస్పీ ప్రత్యేక ప్రణాళికతో ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అసౌకర్యం, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాం. ఆదివారం తెల్లవారుజాము నుంచి నగరంలోకి భారీ వాహనాలకు అనుమతులు లేవు. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. మఫ్టీలో పోలీసులు అల్లర్లకు పాల్పడే వారిపై నిఘా ఉంచుతారు. – డీ.శ్రావణ్కుమార్, డీఎస్పీ -
వేడుకగా నరసన్న కల్యాణోత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్.జగన్నా పురంలోని సుందరగిరిపై స్వయంభూగా కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం ఆలయంలో విశేష కార్యక్రమాలు జరిగాయి. ఉదయం అర్చకులు, పండితులు నిత్యహోమములు, మూలమంత్ర హవనములు, బలిహరణ, వేదపారాయణ ఔపాసన మండప పూజలు జరిపి స్వామివారికి, అమ్మవార్లకు హారతి, మంత్రపుష్పములు సమర్పించారు. సాయంత్రం మూలమంత్ర హవనములు, బలిహరణలు, హారతి, మంత్రపుష్పాలు తదితర కార్యక్రమాలు నేత్రపర్వంగా జరిగాయి. ప్రాణాచారాలు పడిన మహిళలు సంతానం కోసం పరితపించే పలువురు మహిళలు ఉదయం ఆలయ ప్రాంగణంలో దీక్షతో ప్రాణాచారాలు నిర్వహించారు. ముందుగా వారంతా నారసింహుడిని దర్శించారు. అనంతరం సుందరగిరిపై పాలపొంగళ్లను వండి స్వయంగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ఆ తరువాత తడిదుస్తులతో వారంతా ఆలయం వెనుక ప్రాణాచారం పడ్డారు. సాయంత్రం వరకు ఆ మహిళలు నరసింహుని స్మరిస్తూ ఉపవాస దీక్షను చేశారు. ఇలా చేయడంవల్ల వారికి స్వామివారు మదిలో సాక్షాత్కరించి కోరిన కోర్కెలను తీరుస్తాడని భక్తుల నమ్మకం. అలాగే వారు నవగ్రహ పూజలు జరిపారు. నేడు నారసింహుడి కల్యాణం.. సుందరగిరి దిగువనున్న కల్యాణ మండపంలో నరసన్న దివ్య కల్యాణ మహోత్సవం శనివారం ఉదయం 11.10 గంటలకు వైభవంగా జరగనుంది. ఇందుకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ కోరారు. నేడు నారసింహుని దివ్య కల్యాణం -
ఎన్టీఆర్ యూనివర్సిటీ బాల్ బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక
ఏలూరు రూరల్: ఫిబ్రవరి 11 నుంచి 15 వరకూ దిండిగుల్ల పీఎస్ఎన్ఏ ఇంజినీరింగ్ కాలేజ్లో ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ మహిళల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నాయని ఆశ్రం కళాశాల పీడీ వీవీఎస్ఎం శ్రీనివాసరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ మహిళల జట్టు కోసం ఈ నెల 30న ఆశ్రం కళాశాల ఆవరణలో ఎంపిక పోటీలు చేపట్టామని వెల్లడించారు. ఆశ్రం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ చేబ్రోలు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్, సీఈఓ డాక్టర్ కె.హనుమంతురావు పర్యవేక్షణలో సెలక్షన్ కమిటీ సభ్యులైన ఫిజికల్ డైరక్టర్లు ఈ.త్రిమూర్తి, డీవీవీఎస్ శ్రీనివాస్, వీవీఎస్ఎం శ్రీనివాసరాజు, జి.నాగరాజు కలిసి జట్టును ఎంపిక చేశశాని పేర్కొన్నారు. టి.నరసాపురం : విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెడ్లం గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ రహీమ్(38) అదే గ్రామానికి చెందిన అసిస్టెంట్ లైన్మెన్ వద్ద హెల్పర్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న సాయంత్రం ఇద్దరు వెళ్ళి తెడ్లం గ్రామ శివార్లలో రైతు పొలంలో ట్రాన్స్ఫార్మర్ బాగు చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఎల్టీ వైరులోని కండక్టర్ కుడి చేతి బొటన వేలుకు తగిలి కరెటుషాక్ తో ట్రాన్స్ఫార్మర్పై నుంచి కిద పడిపోయాడు. వెంటనే అసిస్టెంట్ లైన్మెన్, రైతు ఇద్దరు కలిసి చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. డాక్టర్ పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కమనీయం.. శివయ్య కల్యాణం
ద్వారకాతిరుమల: క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శివదేవుని కల్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుక ఆద్యంతం భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా దేవస్థానం సిబ్బంది ఆలయాన్ని, పరిసరాలను సుగంధభరిత పుష్పమాలికలు, మామిడి తోరణాలు, అరటిబోదెలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి, అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేశారు. ఆ తరువాత కల్యాణ తంతును ప్రారంభించి, సుముహూర్త సమయంలో నూతన వధువరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేశారు. సుముహూర్త సమయంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల శివనామస్మరణల నడుమ మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను కన్నులపండువగా జరిపి, కల్యాణ మూర్తులకు హారతులిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు తీర్ధప్రసాదాలను స్వీకరించారు. -
ప్రయాణికుల భద్రతకు భరోసా
ఏలూరు (ఆర్ఆర్పేట): ఆర్టీసీ అంటే భద్రత, భరోసాకు మారుపేరని ఎస్పీ కే ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ ఏలూరు డిపో గ్యారేజ్లో ఆర్టీసీ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన చిన్నప్పుడు తన తల్లి తనతో ఆలస్యమైనా పరవాలేదు.. ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయమని చెప్పారని, నేటికీ దూర ప్రాంతాలు వెళ్ళాల్సి వస్తే ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్ళడానికి ఇష్టపడతానని తెలిపారు. రహదారి ప్రమాదాలను నివారించడం మనచేతుల్లోనే ఉందని, రహదారిపై వాహనాలతో వెళ్ళేటప్పుడు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం మాట్లాడుతూ డ్రైవర్లకు నిరంతరం శిక్షణ ఇస్తూ వారిని మానసికంగా కూడా సిద్ధం చేసేలా సైకాలజిస్టులతో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది రహదారి ప్రమాదాలు తగ్గించడంలో సఫలీకృతమయ్యామని, రహదారి ప్రమాదాల శాతాన్ని సున్నాకు చేర్చడమే లక్ష్యంగా ఆర్టీసీ డ్రైవర్లు మరింత అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు శేఖర్, జగదీష్, సురేష్, ఏలూరు ఆర్టీసీ డిపో మేనేజర్ బీ వాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం గత ఏడాదిలో ప్రమాద రహితంగా బస్సులు నడిపిన డ్రైవర్లను అతిథుల ద్వారా ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందచేశారు. ఉత్తమ డ్రైవర్ అవార్డులు అందుకున్నవారు ఏలూరు డిపోకు చెందిన ఆర్వీ రావు, జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన బీకే రెడ్డి, ఎం.చిన్నయ్య జిల్లా స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ఏలూరు డిపో స్థాయిలో ఎంఎస్రావు, ఎంఎస్నారాయణ, వీవీఎస్ రెడ్డి. జంగారెడ్డిగూడెం డిపో స్థాయిలో ఎస్కేఎం షాకీర్, ఎంబీ రావు, ఎంపీఆర్ రావు, నూజివీడు డిపో స్థాయిలోఎంజీ రావు, కేఆర్ కృష్ణ, ఎండీ సిద్ధిక్ అవార్డులు అందుకున్నారు. ప్రథమ ఉత్తమ డ్రైవర్గా అవార్డు అందుకుంటున్న కేవీ రావు, బీకే రెడ్డి, ద్వితీయ ఉత్తమ డ్రైవర్ డ్రైవర్లు ఎం. చిన్నయ్య, ఎంఎస్ రావు, ఎంఎస్ నారాయణ, వీవీఎస్ రెడ్డి, ఎస్కేఎం షాకీర్డ్రైవర్లు ఎంబీ రావు, ఎంపీఆర్ రావు, ఎంజీ రావు, కేఆర్ కృష్ణ, ఎండీ సిద్ధిక్ -
అక్షరాస్యత పెంపునకు చర్యలు
ఏలూరు(మెట్రో): అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో అక్షరాస్యత పెరుగుదలకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి శుక్రవారం అక్షర ఆంధ్ర, యూనిఫైడ్ ఫామిలీ సర్వే, పీ–4 తదితర కార్యక్రమాలపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలోని 97,200 మందికి అక్షరాస్యత, ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యత అందించడం లక్ష్యంగా ని ర్ణయించామన్నారు. యూనిఫైడ్ ఫామిలీ సర్వే పనులు వేగవంతం చేయాలని, పీ–4 ద్వారా గుర్తించిన బంగారు కుటుంబాలు, మార్గదర్శుల వివరాలను యాప్లో నమోదు చేయాలన్నారు. జెడ్పీ సీఈఓ శ్రీహరి, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఏలూరు టౌన్: చింతలపూడిలోని కనకదుర్గ ఫైనాన్స్ కంపెనీలో ఆడిటర్ భారీ చోరీకి పాల్పడ్డాడు. ఈ కేసును అత్యంత చాకచక్యంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోలీసులు ఛేదించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన ఆడిటర్ వడ్లమూడి ఉమమహేష్ను పోలీసులు అరెస్ట్ చేసి అతడి నుంచి భారీ ఎత్తున సుమారు రూ.7 కోట్ల విలువైన 4.490 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీ నం చేసుకున్నారు. ఈ బంగారు ఆభరణాలు 378 మంది ఖాతాదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ బంగారు ఆభరణాలను కనకదుర్గ ఫైనా న్స్ ప్రధాన కార్యాలయ ప్రతినిధులకు శుక్రవా రం అందజేశారు. వందలాది మంది ఖాతాదారులకు చెందిన బంగారు ఆభరణాలను తిరిగి రికవరీ చేయటంలో పోలీసుల కృషిని ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు అభినందించారు. జంగారెడ్డిగూడెం ఇన్చార్జి డీఎస్పీ యు.రవిచంద్ర, ఏలూరు మహిళ స్టేషన్ సీఐ ఎం.సుబ్బారావు, ఫైనాన్స్ కంపెనీ యాజమాన్యం ఉన్నారు. ఏలూరు (టూటౌన్): జిల్లా పరిధిలో బాలల సంరక్షణ కేంద్రాల రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించినట్టు జిల్లా పర్యవేక్షణాధికారి టి.జ్యోతి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు సహా సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జతచేసి వచ్చేనెల 13లోపు ఏలూరులోని కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు జ్యోతి సెల్ 7780399779, జిల్లా బాలల సంరక్షణ అధికారి సీహెచ్ సూర్యచక్రవేణి సెల్ 89191 60257 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్మీడియెట్ ఒకేషనల్ (బ్రిడ్జ్కోర్సు, ఆన్జాబ్ ట్రైనింగ్) విద్యార్థులకు ప్రాక్టికల్స్ శుక్రవారం కొనసాగాయి. జిల్లాలోని 34 కేంద్రాల్లో ఉదయం 2,320 మందికి 2,286 మంది, మధ్యాహ్నం 2,502 మందికి 2,457 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాను తెలిపారు. ఏలూరు (టూటౌన్): ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు ఉద్యమిస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ)జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరుతూ స్థానిక డీమార్ట్ సెంటర్లో గాంధీజీ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధి చట్టానికి బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని, కార్పొరేట్ల ప్రయోజనం కోసం ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. జీ రాం జీ పేరిట కొత్త పథకాన్ని తీసుకువచ్చిందని దీనిపై రాష్ట్రంలో ఉన్న పాలకులు ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, బీకేఎంయూ జిల్లా సహాయ కార్యదర్శి గోలిమే బాలయేసు, మండల కార్యదర్శి పొటేలు పెంటయ్య, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి పి.కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
గూడెం విమానాశ్రయంపై కదలిక
జాతరకు పటిష్ట ఏర్పాట్లు ఏలూరు పడమరవీధిలో గంగానమ్మవారి జాతర మహోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. 8లో uతాడేపల్లిగూడెం: రాష్ట్రంలో ఏర్పాటుచేయబోయే నాలుగు కొత్త విమానాశ్రయాలపై శుక్రవారం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయడంతో తాడేపల్లిగూడెం విమానాశ్రయ ఏర్పాటుపై కదలిక వచ్చింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట గ్రామాల్లో భూసేకరణ చేసి విమానాశ్రయం ఏర్పాటు చేస్తారని ప్రచారం ఉంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో భూపరిశీలన చేశారు. రెండు, మూడు నెలల క్రితం ఈ ప్రతిపాదన హల్చల్ చేసినా, తర్వాత ఆగిపోయింది. తాజా ప్రకటనతో గూడెం విమానాశ్రయం ఏర్పాటుపై మరలా చర్చ ప్రారంభమైంది. గూడెంలో కొత్త ఎయిర్పోర్టు ఏర్పాటుపై అధ్యయనం చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టుగా వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి అడిగిన ప్రశ్నకు పౌరవిమానయాన సహాయ మంత్రి మురళీధర్ మో హోల్ సమాధానం ఇచ్చినట్టు సమాచారం. వి మానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన స్థల వివరాలను ఎయిర్పోర్టు అఽథారిటీ ఆఫ్ ఇండి యాకు ప్రభుత్వం అందజేసినట్టు తెలిసింది. -
ఉద్యాన పంటలకు ప్రోత్సాహం
ఏలూరు(మెట్రో): రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. స్థానిక చింతలపూడి రోడ్డులోని బాలాజీ గార్డెన్స్ ఫంక్షన్ హాలులో శుక్రవారం రాష్ట్రస్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోకో పంట విస్తీర్ణం పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు తక్కువ ఖర్చు తో నాణ్యమైన కోకో ఉత్పత్తి, సాగులో మెలకువలు, మార్కెటింగ్ సౌకర్యాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించడమే ఈ కాంక్లేవ్ ఉద్దేశమన్నారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 44,984 ఎకరాల్లో కోకో సాగవుతుందని, అదనంగా 1,200 హెక్టార్లలో పంట సాగుచేసేలా రైతులు శిక్షణ ఇచ్చా మన్నారు. ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కు మార్, పత్సమట్ల ధర్మరాజు మాట్లాడారు. అనంత రం కోకో పంటకు సంబంధించి కరపత్రాలు వి డుదల చేశారు. ఉద్యాన శాఖ కమిషనర్ కె.శ్రీనివాసులు, ఉద్యాన అధికారి సాజా నాయక్, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్ తదితరులు పాల్గొన్నారు. కోకో బోర్డు కోసం వినతి ఏలూరు (టూటౌన్): కోకో బోర్డు, కోకో పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని, కోకో గింజలకు ధరల పాలసీ ప్రకటించాలని కోరుతూ ఏపీ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి అచ్చెన్నాయుడుకు వినతిపత్రం అందించారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కోకో రైతులు సాగులో కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారని ఆదుకోవాలని కోరారు. -
విజిలెన్స్ దాడులు
ఏలూరు టౌన్: ఏలూరులో విజిలెన్స్, రెవెన్యూ, జీఎస్టీ అధికారులు శుక్రవారం సంయుక్తంగా దా డులు చేశారు. ఐదు షాపుల్లో నిషేదిత గుట్కా ప్యా కెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను గుర్తించి కేసులు నమోదు చేశారు. విజిలెన్స్ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. ఏలూరు వన్టౌన్ పోలీసులకు వీటిని అప్పగించి, క్రిమినల్ కేసులు నమోదుకు సిఫార్సు చేశామని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ వెంకటేశ్వరరా వు తెలిపారు. విజిలెన్స్ సీఐ డి.ప్రసాదకుమార్, గంగాభవానీ, ఎస్సై సీహెచ్ రంజిత్కుమార్, కె.సీతారాము, కె.నాగరాజు, జీఎస్టీ అధికారి కె.శ్రీనివాసమూర్తి, రెవెన్యూ అధికారులు ఉన్నారు. -
వారానికే కుప్పకూలిన డ్రెయినేజీ గోడ
● నాణ్యత డొల్ల.. నిర్మాణం గుల్ల ● చంద్రబాబు ప్రభుత్వంలో పనుల తీరిది నూజివీడు: చంద్రబాబు ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యే విషయంలోను, పనులను పంచుకోవడంలో చూపుతున్న శ్రద్ధ అభివృద్ధి పనుల నాణ్యతపై చూపడం లేదు. పర్యవేక్షించాల్సిన అధికారులు పనులు జరుగుతున్న ప్రాంతానికి రా కుండా కార్యాలయాల్లోనే కూర్చోని కాలం వెళ్లబుచ్చుతుండటంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నూజివీడులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బాపూనగర్ రోడ్డులో నిర్మించిన సీసీ డ్రెయినేజీ గోడ శుక్రవారం కుప్పకూలింది. ఈ డ్రెయిన్ను నిర్మించి పట్టుమని వారం రోజులు కాకుండానే కూ లిపోవడం సంచలనంగా మారింది. మున్సిపాలిటీ చరిత్రలోనే ఇలాంటి సంఘటన చోటుచేసుకోలేదని, ఇంత దారుణంగా అభివృద్ధి పనులు నిర్వహించడంపై ప్రజలు విస్మయం వ్యకం చేస్తున్నారు. బాపూనగర్ రోడ్డులో రామకృష్ణ మఠం ఎదురుగా మురుగునీరు వెళ్లే వాగుకు రూ.9 లక్షల అంచనాతో సీసీ డ్రెయినేజీ నిర్మిస్తున్నారు. ఈ పనులను సాయి సారథి ఇన్ఫ్రా అనే కాంట్రాక్టు కంపెనీ దక్కించుకుంది. ఈనెల 24న సీసీ డ్రెయినేజీని నిర్మించగా వారం రోజులు తిరగకుండానే గోడ కూలిపోయింది. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా.. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే డ్రెయినేజీ గోడ కూలి ఉండవచ్చని భావిస్తున్నారు. కాలువ అడుగు భాగంలో బెడ్ సరిగా వేయకుండానే గోడలను నిర్మించడం, అది కూడా ఎస్టిమేషన్లో పేర్కొన్న విధంగా చేసి ఉండరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంజనీరింగ్ సిబ్బంది అభివృద్ధి పనులను దగ్గరుండా పర్యవేక్షించాల్సి ఉండగా ఇటువైపు పనులను చూడలేదని స్థానికులు చెబుతు న్నారు. వర్క్ ఇన్స్పెక్టర్, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఏఈ, డీఈలు ఉన్నా ఒక్కరూ కూడా వచ్చి పనులను పర్యవేక్షించలేదని అంటున్నారు. నిర్మాణ సమయంలో సిమెంట్, కంకర, ఇసుక ఏ దామాషాలో కలుపుతున్నారనే దానిపై కూడా పట్టించుకున్న వారే లేరనే విమర్శలు ఉన్నాయి. విజిలెన్స్ విచారణకు డిమాండ్ కూలిన సీసీ డ్రెయినేజీ గోడను వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ శీలం రాము, మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ కొడవటి రాంబాబు, నాయకులు తలారి సతీష్, పిళ్లా చరణ్, గిరి వరలక్ష్మి, ఉదయగిరి కృపారావు తదితరులు పరిశీలించారు. కూటమి ప్రభుత్వంలో పనులు పంచుకోవడానికి చూపుతున్న శ్రద్ధ నాణ్యతతో చేయడానికి చూపడం లేదన్నారు. అధికారులు కూడా అధికార పార్టీ నాయకులు, కాంట్రాక్టర్ల మాటలు వినడమే తప్ప నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేయించకపోవడంతోనే ఈ దుస్థితి ఎదురైందన్నారు. ప్రస్తుతం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పనుల నాణ్యతపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
సా..గుతున్న రబీ
నరసన్న కల్యాణోత్సవాలు ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నరసన్న కల్యాణోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. 8లో uశనివారం శ్రీ 31 శ్రీ జనవరి శ్రీ 2026సాక్షి, భీమవరం: ఉమ్మడి పశ్చిమలో రబీ సాగు జాప్యమవుతోంది. ఖరీఫ్ కలిసిరాక, ప్రభుత్వం సహకారం అందక దాళ్వా పనులు నత్తనడకన జరుగుతున్నాయి. సాగు చివరిలో నీటి ఎద్దడి రాకుండా డిసెంబరు నెలాఖరవు నాటికి నాట్లు పూర్తిచేయాల్సి ఉండగా జనవరి ముగుస్తున్నా ఇంకా సాగుతూనే ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని 2.25 లక్షల ఎకరాలు, ఏలూరు జిల్లాలో 80 వేల ఎకరాల్లో రైతులు రబీ సాగు చేస్తున్నారు. మున్ముందు ఎండల తీవ్రత, నీటి ఎద్దడితో పంటకు నష్టం కలుగకుండా సకాలంలో సాగు పూర్తిచేసేందుకు డిసెంబరు నెలాఖరు నాటికి నాట్లు పూర్తిచేయాలని, వెదజల్లు పద్ధతిని అవలంభించే వారు డిసెంబరు మొదటి వారంలోపు విత్తుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు గతంలోనే సూచించారు. కలిసిరాని ఖరీఫ్ : సాగునీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్ ఆలస్యమైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 4.01 లక్షల ఎకరాల్లో తొలకరి సాగు చేయగా పంట పాలుపోసుకునే, గింజ గట్టిపడే కీలక దశల్లో మోంథా తుపాను తీవ్ర నష్టం కలిగించింది. స్వర్ణ, సంపద స్వర్ణ సాగుచేసిన పొలాల్లో పంట నేలకొరిగింది. ఎంటీయూ 1318, పీఎల్ఏ 1100, తదితర రకాల్లో తాలు గింజలు పెరిగి దిగుబడులు తగ్గిపోయాయి. పశ్చిమలోని ఆకివీడు, నరసాపురం, భీమవరం, పెంటపాడు, మొగల్తూరు తదితర మండలాల్లోని 25 వేల ఎకరాలు, ఏలూరులోని ఉంగుటూరు, దెందులూరు, చింతలపూడి తదితర చోట్ల సుమారు 30 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఖరీఫ్లో ఎకరాకు సగటున 26.25 క్వింటాళ్లు చొప్పున దిగుబడి రావాల్సి ఉండగా తుపాను ప్రభావంతో 21 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఎకరాకు 5.25 క్వింటాళ్ల దిగుబడి తగ్గిపోయింది. క్వింటాల్కు మద్దతు ధర రూ.2,369లు మేరకు ఒక్కో ఎకరాకు రూ.12,437లు వరకు నష్టపోయి పెట్టుబడులు దక్కని దుస్థితి ఎదురైంది. మరో 20 వేల ఎకరాల్లో.. పశ్చిమలో ఇప్పటివరకు రెండు లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తికాగా మరో 20 వేల ఎకరాల్లో జరగాల్సి ఉంది. ముందుగా రబీ నాట్లు వేసిన తాడేపల్లిగూడెం రూరల్ తదితర ప్రాంతాల్లో వరి పంట దుబ్బు చేస్తుండగా యలమంచిలి, ఆచంట, నరసాపురం తదితర చోట్ల ఇంకా నాట్లు జరుగుతున్నాయి. ఈ సీజన్లో అధిక శాతం విస్తీర్ణంలో 120 నుంచి 125 రోజులు సాగుకాలం కలిగిన వంగడాలు సాగవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఏప్రిల్ నెలాఖరు, మే మొదటి వారం వరకూ సాగు జరిగే అవకాశం ఉందని అంచనా. సాగు చివర్లో ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన నాట్లు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జనవరిలోనూ నాట్లు దాళ్వా సాగు ఆలస్యం రైతులకు నష్టాలు మిగిల్చిన ఖరీఫ్ సాయం అందించని ప్రభుత్వం రబీ పెట్టుబడులకు సతమతం ఉమ్మడి జిల్లాలో 3.15 లక్షల ఎకరాల్లో సాగు దాళ్వా సాగు (ఎకరాల్లో) జిల్లా విస్తీర్ణం పశ్చిమగోదావరి 2.25 లక్షలు ఏలూరు 80 వేలు -
శ్రీవారిని, లడ్డూని అవమానించిన కూటమి
తణుకు అర్బన్: పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందంటూ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని అవమానం పాలుచేశారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. లడ్డూలో ఎటువంటి కొవ్వులూ కలవలేదని సీబీఐ సిట్లో నివేదిక ఇచ్చిందని, దీనిపై కూటమి నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఏ రకంగా ప్రాయశ్చిత్యం చేసుకుంటారని నిలదీశారు. వేంకటేశ్వరస్వామిని అవమానించి పాపం మూటగట్టుకున్నారన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా విష ప్రచారం చేసిన కూటమి నేతలను భగవంతుడు క్షమించడని స్పష్టం చేశారు. తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయంగా వాడుకున్నారన్నారు. ఆర్ఎస్ఎస్, సనాతన ధర్మం, బీజీపీ ఏం చేస్తున్నారు లడ్డూ కల్తీ జరిగిందని కూటమి నేతలు గుళ్ల చుట్టూ తిరుగుతున్నారని, కానీ తణుకులో ఆవులను, పాలి చ్చే గేదెలను కోసేస్తుంటే ఆర్ఎస్ఎస్, సనాతన ధ ర్మం, బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి ప్రశ్నించారు. ఏ కల్తీ లేనిచోట రాద్ధాంతం చేస్తున్నారని, కానీ తణుకులో జరుగుతున్న గోవధపై మాత్రం మాట్లాడరని మండిపడ్డారు. చేతనైతే గోవధ నిలిపివేసేందుకు పాటుపడాలని కారుమూరి సూచించారు. కూటమి కవ్వింపులు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తమ పార్టీ శ్రేణులతో కలిసి ఒకరోజు ముందుగా ప్రకటించిన ప్రకారం శుక్రవారం ఉదయం తణుకులోని రాష్ట్రపతి రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చారు. అదే సమయంలో తాము కూడా అదే ఆలయానికి వస్తున్నట్టుగా ఎమ్మెల్యే రాధాకృష్ణ కూడా ప్రకటించారు. దీంతో పోలీసులు సైతం ముందుగానే ఆలయం వద్ద మోహరించారు. ఉద యం 9 గంటల తరువాత మాజీ మంత్రి కారుమూరి, పార్టీ నాయకులతో కలిసి వచ్చి స్వామిని దర్శించుకుని అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. అప్పటికే భారీగా వచ్చిన కూటమి నా యకులు కారుమూరి కారు ఎక్కిన తరువాత ‘కల్తీ లడ్డూ గోవింద’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయినా కారుమూరితో పాటు పార్టీ శ్రేణు లు సంయమనం పాటించారు. కూటమి నేత ల నినాదాలు, కవ్వింపులతో ఏం జరుగుతుందో నని పోలీసు అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఎలాంటి కొవ్వులూ కలవలేదనిసీబీఐ నివేదిక బాబు, పవన్ ఎలా ప్రాయశ్చిత్తం చేసుకుంటారు ? మాజీ మంత్రి కారుమూరి ఆగ్రహం -
బలివే ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
నూజివీడు: మహాశివరాత్రిని పురస్కరించుకుని వచ్చేనెల 15న జరిగే బలివే ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం మహా శివరాత్రి ఉత్సవాలపై అధికారులతో సమీక్షించారు. ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఉండాలని, దాదాపు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి తోపులాటలు జరగకుండా చూడాలన్నారు. ఆలయ పరిసరాల్లో దుకాణాలు పెట్టనీయొద్దని, కనీసం 500 మీటర్ల దూరం పాటించాలన్నారు. తమ్మిలేరులో భక్తులు స్నానాలాచరించాల్సి ఉన్న నేపథ్యంలో తమ్మిలేరులో నీటి ప్రవాహంపై నివేదిక ఇవ్వాలన్నారు. ఆరోగ్య శిబిరాలు, పారిశుద్ధ్యంపై సూచనలిచ్చారు. తిరునాళ్లలో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేస్తున్నారని, జెయింట్వీల్, ఇతర వినోదం కలిగించే పరికరాల ఫిట్నెస్ను పరిశీలించాలన్నారు. అధికారులంతా సమన్వయంతో ఉ త్సవాలను విజయవంతం చేయాలని కోరారు. డీ ఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్, సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ, ఆలయ ఈఓ పామర్తి సీతారామ య్య, ఎస్సై మేడిబోయిన చిరంజీవి, ఇన్చార్జి ఎంపీడీఓ బసవరాజు సత్యనారాయణ పాల్గొన్నారు. -
తాగునీటి పైప్లైన్లకు మరమ్మతులు
బుట్టాయగూడెం: మండలంలోని నందాపురం సమీపంలోని పునరావాస కాలనీలో మంచినీటి సమస్య పరిష్కారానికి శుక్రవారం అధికారులు చర్యలు తీసుకున్నారు. కాలనీలో పైప్లైన్లు పగిలిపోయి బురదనీరు రావడంతో నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’లో ప్రచురించిన ‘పునరావాస కాలనీలో సమస్యల పోరు’ కథనానికి అధికారులు స్పందించారు. పంచాయతీరాజ్ డీఈ, ఏఈలు, నిమ్మలగూడెం పంచాయతీ కార్యదర్శి జి.విమలాదేవి పునరావాస కాలనీని సందర్శించారు. పాడైపోయిన పైప్లైన్లను మరమ్మతులు చేయించారు. మరో రెండు లైన్లు ఉన్నాయని అవి శనివారం పూర్తి చేస్తే మొత్తం కాలనీ అంతటికీ మంచినీరు సరఫరా అవుతుందని అధికారులు చెప్పారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన ‘సాక్షి’కి నిర్వాసితులు కృతజ్ఞతలు తెలిపారు. -
పోస్టాఫీస్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ఏలూరు (టూటౌన్) : ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన పోస్టాఫీస్ పొదుపు, జీవిత బీమా పథకాలను ఉద్యోగులంతా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ కె.సంతోష్ నేత పిలుపునిచ్చారు. పోస్టాఫీస్ పొదుపు పథకాలు, తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్ గల తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా ఆవశ్యకతపై భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు డివిజన్ల తపాలా సిబ్బందితో గురువారం ఏలూరులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఏలూరు తపాలా సూపరింటెండెంట్ ఎస్.విజయ్ భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ అవగాహన సదస్సులో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ కె.సంతోష్ నేత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వినియోగదారులు తమ సమీప పోస్టాఫీస్లను సందర్శించి వివిధ పొదుపు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వచ్చే నెల 18, 19, 20వ తేదీల్లో జరుగు మెగా తపాలా జీవిత బీమా డ్రైవ్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ రెవెన్యూ లక్ష్యాలను సాధించిన ప్రతిభావంతులైన ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భీమవరం డివిజన్ సీనియర్ తపాలా సూపరింటెండెంట్ కె.హరికృష్ణ ప్రసాద్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఏవీ సరేష్ కుమార్, తాడేపల్లిగూడెం సూపరింటెండెంట్ ఎం.శ్రీనివాసు, మూడు డివిజన్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ కె.సంతోష్ నేత -
జగనన్న క్రీడలను ప్రోత్సహించారు
తణుకు అర్బన్: సంక్రాంతి పండుగలో యువత జూద క్రీడల జోలికి పోకండా జగనన్న 2.0 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి క్రీడలపైపు మళ్లించడం మంచి పరిణామమని వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్కుమార్ అన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తణుకు జాతీయ రహదారి సమీపంలో నిర్వహిస్తున్న జగనన్న 2.0 క్రికెట్ టోర్నమెంట్ను గురువారం సునీల్కుమార్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యలమల నాగార్జునయాదవ్ సందర్శించారు. సునీల్కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వయస్సుల వారికి క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించారని గుర్తుచేశారు. క్రీడా సామగ్రి ఉచితంగా ఇవ్వడంతోపాటు క్రీడాకారులకు అల్పాహారం, భోజన వసతి కల్పించి విజేతలకు నగదు బహుమతులు అందజేసి ప్రోత్సహించారన్నారు. ముఖ్యంగా జగనన్న 2.0 క్రికెట్ టోర్నమెంట్లో పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల నుంచి 40 జట్లు పాల్గొనడం విశేషమని, నిర్వాహకుడైన వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ తణుకు పట్టణ అధ్యక్షుడు పెనుమాల రాజేష్ను ప్రత్యేకంగా అభినందించారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గోపె ఎడ్వర్డ్ పాల్, రెండు జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. -
దొరకునా ఇటువంటి సేవ..
● క్షీరారామలింగేశ్వరస్వామికి 47 ఏళ్లుగా పాగా నేస్తున్న వీరన్న కుటుంబం ● పూర్వీకుల ఆనవాయితీ నిలబెడుతున్న సోమేశ్వరరావు పాలకొల్లు సెంట్రల్: మహాశివరాత్రి ఉత్సవాలు మరో ఇరవై రోజుల్లో ప్రారంభంకానున్నాయి. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి మల్లన్న పాగా ఏర్పాటుచేస్తారు. అటు శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో తదుపరి పంచారామక్షేత్రాల్లో ఒకటైన శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామివార్లకు మహాశివరాత్రి పర్వదినం నాడు లింగోద్భవ సమయంలో మల్లన్న పాగాను సమర్పిస్తారు. లింగోద్భవ సమయానికి స్వామివారి గర్భాలయం శిఖరం నుంచి గాలిగోపురం శిఖరం వరకూ రెండు పేటలుగా అమరుస్తారు. ఈ వేడుకను తిలకించడానికి భక్తులు అర్థరాత్రి సమయంలో తండోపతండాలుగా తరలివస్తుంటారు. 1979లో ప్రారంభం స్వామివారికి సమర్పించే ఈ పాగాను పాలకొల్లు మండలంలోని దగ్గులూరు గ్రామానికి చెందిన అందే వీరన్న 1979లో ప్రారంభించారు. శ్రీశైలంలో ఏర్పాటుచేసే పాగాను చూసిన వీరన్న నాడు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సంప్రదించి ఆలయ అధికారుల అనుమతితో నాడు మల్లన్న పాగాను స్వయంగా మగ్గంపై నేచి స్వామివారికి సమర్పించేవారు. అనంతరం వీరన్న అల్లుడుకు వారసికంగా ఈ పాగాను నేయడం అందించారు. నేడు వారి మనవడు వరదా సోమేశ్వరరావు తన తాతగారి వారసికాన్ని నిలబెడుతున్నారు. ఖర్చుతో కూడుకున్నా, పనిభారమైనా.. స్వామివారు కల్పించిన అదృష్టాన్ని ఎంతో ఇష్టంగా చేస్తున్నారు. కార్తీకమాసంలో పాగా నేతకు ఏర్పాట్లు కార్తీకమాసం ప్రారంభంలో పాగా నేతకు పనులు ప్రారంభిస్తారు. ముందుగా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం పాగా పనులు ప్రారంభిస్తారు. కృష్ణాజిల్లా పెడన వెళ్లి నూలు (దారం) తెచ్చుకుని ఆ నూలును తడిపి ఐదు రోజులు పాటు నానబెడతారు. ఆరవ రోజు ఆ నూలుకు గెంజి పెట్టి ఎండలో ఆరబెడతారు. అనంతరం రాట్నంతో నూలు తోడుకుంటారు. నూలు తోడుకున్న డబ్బాలతో తూర్పుగోదావరి జిల్లా బండారులంక తీసుకువెళ్లి అక్కడ ఈ నూలును రోలింగ్ (దంత్రం) చేయిస్తారు. 200 గజాల పొడుగు వచ్చేలా రోలింగ్ చేస్తారు. అక్కడ నుంచి ఆ రోలింగ్ను నరసాపురం తీసుకువస్తారు. ఇక్కడ సుమారు 26 మంది భక్తి శ్రద్ధలతో రోలింగ్కు గెంజి పెట్టి పడుగు ఏర్పాటుచేస్తారు. అనంతరం దానిని చుట్టుకుని ఇంటికి తెచ్చి అల్లుసాపుకుని అంతరం బొండకు చుడతారు. ఈ సమయంలో సుమారు చుట్టుపక్కల ఓ పది, పదిహేను మంది భక్తులు వచ్చి ఇందులో పాల్గొంటారు. ఆ బొండను మగ్గం ఎక్కిస్తారు. మహాశివరాత్రికి ముందుగా రెండు లేక మూడు నెలలు ముందు ఇంటిలో స్వామివారి పీఠం ఏర్పాటుచేసుకుని ఆ బొండను మగ్గం ఎక్కించి అప్పటి నుంచి పాగాను నేయడం మొదలు పెడతారు. ప్రతి రోజు ఉదయం కొబ్బరికాయ కొట్టి మగ్గం నేయడం ప్రారంభించి ఉదయం రెండు గంటలు, రాత్రి ఓ ఆరు గంటలు పాటు నేస్తుంటారు. రాత్రి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి నేతను ముగిస్తారు. ఇలా రోజుకు దాదాపు నాలుగు లేదా ఐదు మూరలు నేస్తుంటారు. మిగిలిన సమయంలో వాళ్ల వృత్తి ప్రకారం నేత చీరలు నేస్తుంటారు. ఈ పాగాను 180 మీటర్లు పొడవు, 90 సెం.మీ వెడల్పుతో ఏర్పాటుచేస్తారు. స్వామివారికి రోజుకు ఓ మూర చొప్పున లెక్కించి 365 మూరలు వచ్చేలా పాగా తయారు చేస్తారు. అలాగే మరో 20 మూరలు పార్వతి అమ్మవారికి సమర్పిస్తారు. పాగా నేస్తున్న అన్ని రోజులు ఎక్కడకు పలకరింపులకు వెళ్లరు, మాంసాహారం ముట్టుకోకుండా దీక్షతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తుంటారు. అలాగే ఈ మగ్గాన్ని ఒక్క స్వామివారి పాగా నేయడం కొరకే ఉపయోగిస్తుంటారు. పంచారామాల్లో ఎక్కడా లేని ఈ పాగా నేత మాకు క్షీరారామలింగేశ్వరస్వామి కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాం. మా తాతగారు మాకు అప్పగించిన వారసికాన్ని నిలబెట్టుకుంటున్నాము. ప్రస్తుతం పాగా తయారీ ఖర్చుతోపాటు, సహకరించే మనుషులు పెద్దగా దొరక్కపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆలయ అధికారులు ఆర్థికంగా కొంతవరకూ సహాయం చేస్తుంటారు. – వరదా సోమేశ్వరరావు, రామకోటి దంపతులు, దగ్గులూరు -
శ్రీమావుళ్లమ్మ ఆలయ హుండీల ఆదాయం రూ.59.25 లక్షలు
భీమవరం (ప్రకాశం చౌక్): పట్టణ ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయ హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. సింగరాయపాలెం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ జి గంగా శ్రీదేవి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారికి 26 రోజులకుగాను హుండీల ద్వారా రూ.59,25,41 ఆదాయం లభించగా బంగారం 45.100 గ్రాములు, వెండీ 210 గ్రాములు, విదేశీ కరెన్సీ లభించినట్లు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలు, భీమవరం దేవదాయ ధర్మదాయశాఖ తనిఖీదారు వి వెంకటేశ్వరరావ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్వేది ఉత్సవాలకు పెరిగిన రద్దీ
నరసాపురం: అంతర్వేది ఉత్సవాలకు సంబంధించి నరసాపురంలో గురువారం రద్దీ మరింత పెరిగింది. స్వామి పవిత్ర రథోత్సవం నేఫధ్యంలో యాత్రికులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. తెల్లవారుజామున కల్యాణ మహోత్సవాన్ని తిలకించి వెనుదిరిగిన భక్తులతో పట్టణంలో గోదావరి పంటురేవు వద్ద రద్దీ నెలకొంది. భక్తుల సౌకర్యార్థం 3 పంటులు ఏర్పాటు చేశారు. ఇక స్టీమరన్రోడ్డు పొడవునా అంతర్వేది యాత్రికులకు పలు స్వచ్ఛంధ సంస్థలు, రాజకీయ పార్టీల వారు పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకీరామ్ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ చేశారు. వన్నెంరెడ్డి శ్రీనివాస్, గుగ్గిలపు మురళి, బళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి సేవా సమితివారు మజ్జిగ పంపిణీ చేశారు. -
సుందరగిరిపై కల్యాణోత్సవాలు ప్రారంభం
● పెండ్లికొడుకై న నారసింహుడు ● స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు ద్వారకాతిరుమల : శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన మండలంలోని ఐఎస్.జగన్నాధపురం సుందరగిరిపై కొలువైన స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారు భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం పెండ్లి కుమారుడయ్యారు. స్మార్త ఆగమయుక్తంగా పాంచాహ్నిక దీక్షతో వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కనకవల్లీ, లక్ష్మీ అమ్మవార్లు పెండ్లి కుమార్తెలయ్యారు. ముందుగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి, విశేష పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ పండితులు నారసింహుడిని పెండ్లి కుమారునిగాను, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగాను చేశారు. వేడుకలో పాల్గొన్న ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ, ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం గర్భాలయంలో విశేష అలంకారాల్లో దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. సాయంత్రం ఆలయంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచన, రుత్విగ్వరణ, అంకురార్పణ, కలశస్థాపన, ధ్వజారోహణ, అగ్నిప్రతిష్టాపన వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి, తీర్థ ప్రసాదాలను, అలాగే అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఉత్సవాల్లో నేడు : ● ఉదయం 8 గంటల నుంచి నిత్య పూజలు, హోమము, బలిహరణ ● సాయంత్రం 6 గంటల నుంచి నిత్య పూజలు, హోమములు, బలిహరణ, నీరాజన మంత్రపుష్పములు ● సాంస్కృతిక కార్యక్రమం : రాత్రి 7 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శనలు -
పంట కాలువలో ఆక్వా వ్యర్థాల విడుదల
ఉండి: పంట కాలువలోకి ఆక్వా వ్యర్థాలు విడుదల చేయడంతో పంట కాలువ కలుషితమవుతోంది. దీంతో సాగు, తాగునీరు కలుషితమై ఇటు రైతులు, అటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉండి శివారు ఉప్పుగుంట పంట కాలువలోకి ఓ ఆక్వా రైతు దర్జాగా ఆక్వా వ్యర్థాలను విడిచిపెట్టేశాడు. పెద్ద చెరువులో పట్టుబడి జరిగిన అనంతరం దానిలోని మొత్తం వ్యర్థాలను పంట కాలువలోకే విడిచిపెట్టేశారు. దీంతో స్థానికంగా ఉండే ప్రజలు వాడుకునే నీరు కలుషితమైంది. సదరు రైతు చెరువుకు మాత్రమే కాకుండా వేలాది ఎకరాల్లో చెరువులకు ఇన్లెట్ సౌకర్యం మాత్రమే ఉండి అవుట్లెట్ సౌకర్యం లేకపోవడం గమనార్హం. కాసులకు కక్కుర్తిపడిన అధికారులు నిబంధనలకు తూట్లు పొడిచి ఎడాపెడా ఆక్వా చెరువులకు అనుమతులు ఇవ్వడం దీనికి ప్రధాన కారణం. ఆక్వా చెరువుకు అనుమతివ్వాలంటూ ప్రాథమికంగా పరిశీలించాల్సి ఉంది. సాగునీరు చెరువుకు అందుతుదా లేదా అని, అలాగే చెరువులోని మురుగునీరు డ్రెయిన్లోకి వెళ్లే సదుపాయం ఉందా లేదా అని చూడాలి. కానీ ఒక్క మండలమే కాకుండా నియోజకవర్గంలోని వేలాది ఎకరాల ఆక్వా చెరువులకు ఇదే సమస్య ఉంది. దీనివల్లనే చెరువుల పట్టుబడి జరిగిన అనంతరం దానిలో విషపూరితమైన వ్యర్థాలను నేరుగా పంటకాలువల్లోకి వదిలేస్తున్నారు. దీంతో నీటిని కనీస అవసరాలకు తాగునీటికి వినియోగించిన ప్రజలు అంతుచిక్కని రోగాలతో ప్రాఽణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఇటీవల కేన్సర్ వ్యాధి ఎక్కువగా ప్రబలేందుకు ఆక్వా వ్యర్థాలు కూడా ఒక కారణంగా పేర్కొంటున్నారు. ఇంతటి ప్రాణాపాయం ప్రజలకు సంభవిస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఉద్యోగుల హామీలు నెరవేర్చాలి
పెదవేగి : రాష్ట్ర ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన 4 డీఏలను వెంటనే ప్రకటించి, సీపీఎస్ను రద్దు చేయాలని, 12వ పీఆర్సీ కమిటీ నియమించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, ఫ్యాప్టో చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పెదవేగి మండలం నందు వివిధ పాఠశాలలను ఆయన సందర్శించి మాట్లాడారు. హామీల సాధన కోసం ఎస్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించే దశల వారీ పోరాటంలో ఉపాధ్యాయులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్టీయూ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కేఆర్ పవన్ కుమార్, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శులు బీ మహేష్, ఎండీ షఫీయుద్దిన్, పెదవేగి మండల అధ్యక్షుడు పి నాగార్జున, ప్రధాన కార్యదర్శి టి ప్రవీణ్ కుమార్, నెరుసు శ్రీనివాస్, వీ అమృత్, టి.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కొల్లేరు సమస్య పరిష్కారానికి అడ్డుపడుతున్నదెవరు?
ఏలూరు (టూటౌన్): కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి అడ్డుపడుతున్నది ఎవరని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి సూటిగా ప్రశ్నించారు. కొల్లేరు సమస్యపై కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు పత్రికా ముఖంగా చేసిన వ్యాఖ్యలపై గురువారం నిర్వహించిన సమావేశంలో రవి మాట్లాడారు. కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కల్లబొల్లి మాటలు చెప్పడం కాదని, మొసలి కన్నీరు కార్చడం కాదని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది వారి ప్రభుత్వమేనని కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారానికి అడ్డు చెప్పేవారు ఎవరూ లేరని, చిత్తశుద్ధి ఉంటే సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. లేనిపక్షంలో కొల్లేరు ప్రజలే భవిష్యత్తులో సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 120 జీవోను రద్దు చేయాలని, కొల్లేరును 3వ కాంటూర్కు కుదించాలని, ఆ పరిధిలోనే అభయారణ్యాన్ని అభివృద్ధి చేయాలని, పక్షులను పరిరక్షించాలని, 3వ కాంటూర్ కు వెలుపల ఉన్న ప్రభుత్వ భూములు, పట్టా భూములు కొల్లేరు ప్రజలు సాగు చేసేందుకు అవకాశం కల్పించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, కొల్లేరు ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఇంప్లీడ్ అవ్వాలని, అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కొల్లేరు ప్రజల తరఫున సీపీఎం నిరంతరం పోరాటాలు సాగిస్తుందని ఎ.రవి స్పష్టం చేశారు. -
వీర వనితలకు జేజేలు
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యార్థినులకు వీరోచిత వనితల త్యాగాలు, అసమాన ప్రతిభా, పాటవా లను బోధించాల్సిన అవసరం ఉందని బాలోత్సవా ల రాష్ట్ర సమన్వయకర్త పిన్నమనేని మురళీకృష్ణ అ న్నారు. నగరంలో గంగానమ్మ జాతర సందర్భంగా హేలాపురి బాలోత్సవం, మానవత, ఏవీఆర్ విజ్ఞా న కేంద్రం ఆధ్వర్యంలో గురువారం స్థానిక సురేష్ చంద్ర బహుగుణ పాఠశాల ఆడిటోరియంలో వీర వనితల జీవితాలతో కూడిన ప్రదర్శనలు ఇచ్చారు. మురళీకృష్ణ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ జాతర సందర్భంగా ఇటువంటి బహుముఖ కార్యక్రమాలు హేలాపురి బాలోత్సవం నిర్వహించడం ఆదర్శనీయమన్నారు. బాలోత్సవం అధ్యక్షుడు ఆలపాటి నాగేశ్వరరావు, దేవరకొండ వెంకటేశ్వర్లు, గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ బాల్యంలోనే విద్యార్థులకు దేశభక్తి భావాలను సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు వీరవనితలకు జేజేలు పేరు తో కార్యక్రమం నిర్వహించామన్నారు. విద్యార్థిను లు వీర వనితల వేషధారణలతో ఆకట్టుకు న్నారు. మ్యాజిక్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ని ర్వహించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రి మీదుగా ఫైర్స్టేషన్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
స్వామి చందాల సొమ్ము ఎక్కడ?
ఆగిరిపల్లి: 22 ఏళ్లుగా అన్నదాన కమిటీ సభ్యులు భక్తుల నుంచి చందాలు వసూలు చేసి మంత్రి కొలుసు పార్థసారథికి అందించిన రూ.28.50 లక్షలు ఎక్కడ ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రశ్నించారు. గురువారం స్థానిక శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పది రోజుల క్రితం అన్నదాన కమిటీ నిర్వాహకులు మంత్రి పార్థసారథికి నగదు రూపంలో రూ.15.50 లక్షలు, చెక్కు ద్వారా రూ.13.00 లక్షలు అందజేశారని గుర్తుచేశారు. ఇప్పటివరకు ఆ నగదు ఎక్కడుందని, దేవస్థానం ఖాతాలో ఎందుకు జమచేయలేదని ప్రశ్నించారు. దీనిపై మంత్రి పార్థసారథి సమాధానం చెప్పాలన్నారు. వాస్తవంగా నిర్వాహకులు ఇవ్వాల్సింది రూ.56 లక్షలు కాగా రూ.28.50 లక్షలు ఇచ్చేందుకు ఆగిరిపల్లి గ్రామస్తులు ఒప్పుకున్నారని, ఆ నగదును మంత్రి దగ్గర పెట్టుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఈనెల 25న జరిగిన అన్నదాన కార్యక్రమంలో వసూలు చేసిన విరాళాల వివరాలను ఆలయ ఈఓ తెలియజేయకుండా అన్నదాన కమిటీ సభ్యులతో కుమ్మక్కవడం ఏంటని మండిపడ్డారు. భక్తు లు ఇచ్చిన విరాళాలు రూ.4.10 లక్షలు మాత్రమే జమ చేయడం ఏంటని, మిగతా నగదు ఎక్కడుందని ప్రశ్నించారు. పూర్తి వివరాలు వెల్లడించకుంటే దేవదాయ కమిషనర్కు, దేవదాయ శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామని వెంకట ప్రతాప్ అప్పారావు హెచ్చరించారు. -
ప్రాణాలైనా అర్పిస్తాం.. మా భూములు ఇవ్వలేం
కొయ్యలగూడెం: ప్రాణాలైనా అర్పిస్తాం.. పుడమి తల్లిని వదులుకోం.. అంటూ పోలవరం, గోపాలపురం నియోజకవర్గాల రైతులు గళమెత్తారు. నేవీ ఆయుధ డిపో పేరుతో బలవంతపు భూసేకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని బోడిగూడెం, మంగపతిదేవిపేట, బర్కెట్నగర్, రేగులగుంట, ఊట్లగూడెం, త్రినాథపురం గ్రామాల రైతులు, రైతు కూలీలు, మహిళలు, ప్రజలు కొయ్యలగూడెంలో కదం తొక్కారు. తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. మెయిన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. ఆయుధ డిపోను అడ్డుకుంటే అరెస్టుల పర్వం కొనసాగుతుందన్న ఏలూరు ఎంపీ మహేష్యాదవ్ మాటలను ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడిగూడెం నుంచి కొయ్యలగూడెం వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర ర్యాలీ జరిగింది. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు కోసం తమ భూములను లాక్కోవద్దని, తమ జీవితాలను బలిపెట్టవద్దని నినదించారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే మూడుచోట్ల తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న ఆయుధ డిపోను కొయ్యలగూడెం మండలంలో ఏర్పాటు చేస్తామనడంపై రైతుల్లో అను మానాలు నెలకొన్నాయి. తక్షణమే నిలుపుదల చేయాలి ఆయుధ డిపో నిర్మాణానికి 1,200 ఎకరాల భూసేకరణ కోసం చేస్తున్న ప్రయత్నాలు తక్షణమే నిలుపుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పొగాకు, ఆయిల్పామ్, మొక్కజొన్న, అరటి, కూరగాయలు, కోకో, కొబ్బరి, నిమ్మ వంటి పంటలు పండే సారవంతమైన భూములను నాశనం చేయడం తగదన్నారు. 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవహరించడం అన్యాయమన్నారు. ఇప్పుడిప్పుడే పంట భూములు పూర్తిస్థాయిలో సాగులోకి వచ్చాయని, ఫలసాయం పొందే సమయంలో రైతుల పొట్టకొట్టడం తగదన్నా రు. భూసేకరణపై ఏలూరు ఎంపీ అసత్య ప్రచారం చే స్తున్నారని, తాము ఎక్కడ అంగీకరించామో ని రూపించాలని డిమాండ్ చేశారు. సర్వే పేరుతో తమ భూముల్లోకి వస్తే ఆత్మార్పణ చేసుకుంటామని అల్టిమేటం ఇచ్చారు. అనంతరం తహసీల్దార్కి వినతిపత్రం అందించారు. తహసీల్దార్ ఎన్.నాగరాజు మాట్లాడుతూ బలవంతంగా భూసేకరణ చేయమని, గ్రామసభ నిర్వహించిన తర్వాతే ముందుకు వెళతామని హామీ ఇవ్వడం ఆందోళన విరమించారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణ చైతన్య, సీపీఐ, సీపీఎం మండల కన్వీనర్లు తాడిగడప ఆంజనేయరాజు, శుక్లబోయిన రాంబాబు, చలసాని కిషోర్, ఆతుకూరి వీర్రాజు, సర్పంచ్లు పాల్గొన్నారు. కొయ్యలగూడెంలో కదం తొక్కిన రైతులు నేవీ ఆయుధ డిపో నిర్మాణం కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడం కోసమే అని వైఎస్సార్సీపీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. ఆయన మాట్లాడుతూ వేలాది మంది రైతులను కడుపు కొట్టేలా భూదోపిడీకి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. రెండు పంటలు పండుతూ సస్యశ్యామలంగా ఉన్న భూములను నేవీ డిపోకి ఎంపిక చేయడం రైతులకు తీవ్ర అన్యాయం చేయడమే అన్నారు. ఇక్కడ నేవీ డిపో ఏర్పాటుపై ఎంపీ మహేష్ యాదవ్ అత్యుత్సాహం కనబర్చడం అనుమానాలకు తావిస్తోందన్నారు. తక్షణమే ఆయుధం నిర్మాణ ప్రతిపాదన విరమించుకోవాలని లేదంటే రైతులకు మద్దతుగా ప్రజాస్వామ్యవాద పార్టీలు అంతా ఏకం కావాల్సి ఉంటుందని బాలరాజు హెచ్చరించారు. -
జగన్ పేరు చెబితే కూటమికి వణుకు
ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీ ఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు వింటేనే కూటమి నేతలకు వణుకు పుడుతుందనీ, కేక్ కట్ చేసుకున్నా భయంతో అక్రమ కేసులు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారనీ వైఎస్సార్సీపీ నాయకులు అన్నా రు. ఏలూరు నియోజకవర్గ సంస్థాగత కమిటీల నిర్మాణ ప్రత్యేక సమావేశం గురువారం నిర్వహించారు. పార్టీ ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారు మూరి సునీల్కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి నా గార్జున యాదవ్ హాజరయ్యారు. ముందుగా దివంగత వైఎస్సార్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరింత బలోపేతం చేయాలి ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్సార్సీపీని నియోజకవర్గంలో మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయి నుంచి నేతలు, కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేస్తూ సంస్థాగత నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏలూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసేందుకు సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యకర్తలకే ప్రాధాన్యం రాబోయే కాలంలో పార్టీ కార్యకర్తలకే జగన్ ప్రాధాన్యమిస్తారని, ఆయన మాట ఇస్తే కచ్చితంగా నిలబెట్టుకుంటారని నాగార్జున యాదవ్ అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉండగా ధైర్యంగా నిలబడి, అక్రమ కేసులను తట్టుకున్న వారందరినీ జగన్ ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుంటారనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ కార్యకర్తలకు సైతం భయపడుతుందన్నారు. పార్టీ శ్రేణులంతా జగన్కు అండగా నిలవాలని, రాబోయే ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలతో కలిసి కూటమిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, రాష్ట్ర కార్యదర్శులు డీవీఆర్కే చౌదరి, దాసరి రమేష్, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటా మోహనరావు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గేదెల సూర్యప్రకాశరావు, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్ గురునాథ్, నాయకులు ఇనపనూరి జగదీష్, కేదారేశ్వరి, జిజ్జువరపు విజయనిర్మల, చిలకపాటి డింపుల్, షేక్ రియాజ్, గుడివాడ రామచంద్రకిషోర్, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్ మాట్లాడుతూ 2019–24 వరకు సంతోషంగా జీవిస్తే కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనతో నరకం చూస్తున్నామని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ఖజానా ఖాళీ అని చెప్పగానే ప్రజలంతా మరోసారి మోసపోయామని చెంపలేసుకున్నారన్నారు. ఏలూరు సమన్వయకర్త జయప్రకాష్ మాట్లా డుతూ ఏలూరు నియోజకవర్గంలో పార్టీని కొందరు నేతలు నట్టేట ముంచి వెళితే, పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో తన కు బాధ్యతలు అప్పగించారన్నారు. ఏలూరులో ఎంతో మంది సైనికుల్లాంటి నేతలు, కార్యకర్తలు ఉన్నారని, వారంతా అండగా ఉంటారని జగన్ భరోసా ఇచ్చారన్నారు. పార్టీ శ్రేణులంతా సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు చంద్రబాబువి నీచ రాజకీయాలు ఏలూరు సంస్థాగత కమిటీల నిర్మాణ సమావేశంలో నాయకులు -
లడ్డూపై కూటమి కుట్ర భగ్నం
కూటమి నేతలకు సద్బుద్ధి ప్రసాదించాలని ఏలూరులో వైఎస్సార్సీపీ నాయకుల పూజలుఏలూరు టౌన్: వేంకటేశ్వరస్వామీ.. కూటమి నేతలకు బుద్ధి ప్రసాదించు అంటూ వైఎస్సార్సీపీ నాయకు లు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదంటూ సీబీఐ ఇచ్చిన నివేదికతో కూటమి నేతల రాజకీయ కుట్ర బద్ధలైందంటూ వైఎస్సార్సీపీ ఏ లూరు కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్ అన్నారు. గురువారం ఏలూరులోని ఆర్ఆర్పేట వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, చంద్రబాబు, పవన్కల్యాణ్, కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా తిరుపతి వెంకన్న పవిత్రను కించపరిచేలా, స్వామివారి ప్ర సాదం లడ్డూని ఆయుధంగా మార్చి చంద్రబాబు రచించిన కుట్రపూరిత నాటకం పూర్తిగా భగ్నమైందన్నారు. ఇంత నీచమైన రాజకీయాన్ని, మతం పేరు తో ప్రజలను రెచ్చగొట్టి అలజడులు సృష్టించాలనే రాజకీయ క్రీడను ఎన్నడూ చూడలదేన్నారు. 18 నెలల అనంతరం సీబీఐ చార్జిషీట్లో లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని స్పష్టం చేసిందన్నారు. కూ టమి నేతలకు భవిష్యత్తులో ప్రజలు సరైన గుణపా ఠం చెబుతారని జయప్రకాష్ అన్నారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బా బు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, బీసీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, నాయ కులు గంటా మోహనరావు, భాస్కర్ల శంకర్, ప్రత్తిపాటి తంబి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డుపై ఒట్టు.. నాణ్యత తీసికట్టు
నూజివీడు: లక్షలాది రూపాయల ప్రజాధనంతో వేసిన సిమెంట్ రోడ్డుకు ఏడాది కాలంలోనే మూడో సారి మరమ్మతులు నిర్వహిస్తున్న ఘనత చంద్రబాబు సర్కారుకే సాధ్యం. బహుశా సిమెంట్ రోడ్డుకు మరమ్మతుల పనులు రాష్ట్రంలో ఎక్కడా జరిగి ఉండవు. తారు రోడ్డుకంటే ఎక్కువ కాలం మన్నుతుందనే ఉద్దేశంతో తారురోడ్డు నిర్మాణానికి అయ్యే వ్యయంలో రెట్టింపు వ్యయమవుతున్నా సిమెంట్ రహదారులను నిర్మిస్తున్నారు. అయితే నూజివీడు పట్టణంలోని విస్సన్నపేట రోడ్డులో పెట్రోలు బంకుల సమీపంలో ఆర్అండ్బీకి చెందిన సిమెంట్ రహదారికి మూడోసారి మరమ్మత్తులు చేస్తున్నారు. ఈ సిమెంట్ రహదారికి గతేడాది ఫిబ్రవరిలో నితిన్ సాయి కనస్ట్రక్షన్ కంపెనీ నిర్మించింది. రూ.60 లక్షలతో 20 మీటర్ల వెడల్పున, 200 మీటర్ల పొడవునా 9 అంగుళాల మందంతో సిమెంట్ రోడ్డును నిర్మించారు. అయితే సిమెంట్ రోడ్డు నిర్మాణం జరిగిన తరువాత క్యూరింగ్ పీరియడ్ ముగిసిన అనంతరం వాహనాల రాకపోకలను అనుమతించిన నెల రోజుల్లోపే రోడ్డు దారుణంగా ధ్వంసమైంది. రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలపై అప్పట్లో పట్టణ ప్రజల్లో తీవ్ర చర్చ జరిగింది. అయితే అప్పటినుంచి అప్పుడప్పుడూ సిమెంట్ లేచిపోయి కంకర బయటపడిన చోటల్లా సంబంధిత కాంట్రాక్టర్తో సిమెంట్తో ప్లాస్టింగ్ చేయిస్తూ వచ్చారు. అలా చేసినప్పటికీ చేసిన ప్లాస్టింగ్ సైతం వాహనాల రాకపోకలకు లేచిపోయి మళ్లీ కంకర బయటపడుతోంది. కనస్ట్రక్షన్ కంపెనీ మంత్రి తనయుడిది కావడంతో ఆర్అండ్బీ అధికారులు ఏంచేయాలో పాలు పోక తలలు పట్టుకున్నారు. సిమెంట్ రోడ్డుకు నిర్మించిన అప్రోచ్ రోడ్డు సైతం గుంతలు పడుతూనే ఉండేది. ఈ గుంతల్లో పాత గృహాలను కూల్చగా వచ్చిన రాళ్లు, మట్టిని పోసి పూడుస్తూ వచ్చారు. సిమెంట్ రోడ్డు అధ్వానంగా మారడం మంత్రికి రాజకీయంగా డ్యామేజీని తెచ్చిపెట్టింది. తాజాగా సిమెంట్ రోడ్డు నిర్మాణం ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా సిమెంట్ రోడ్డుపై గుంతలు పడుతుండటంతో ఎట్టకేలకు కాంట్రాక్ట్ కంపెనీ మళ్లీ మూడంగుళాల మందంతో దానిపైన సిమెంట్ రోడ్డును నిర్మిస్తోంది. ఇనుప ఊసలతో మూస కట్టి కాంక్రీట్ను పోస్తున్నారు. ఈ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. ఆర్అండ్బీ అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నా రు. మళ్లీ సిమెంట్ రోడ్డు పోస్తుండటంతో పట్టణ ప్రజలతో పాటు రాజకీయ వర్గాలు సైతం ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి. ఏడాదిలోనే మూడోసారి సిమెంట్ రోడ్డుకు మరమ్మతులు నెలరోజుల్లోనే అధ్వానం ౖపైపె పూతలతో సరి మరలా రోడ్డు నిర్మాణం నూజివీడులో రాజకీయ చర్చ సిమెంట్ రోడ్డు ఉపరితలం లేచిపోయి కంకర బయట పడుతున్నందున సంబంధిత కాంట్రాక్టు కంపెనీనే మరలా ఇనుప ఊసలతో మూస కట్టి మూడంగుళాల మందంతో కాంక్రీటు వేసే పనులను చేపట్టింది. గతంలో చేసిన పనికి తాము ఒక్క రూపాయి కూడా బిల్లు చెల్లించలేదు. – బాబూరావు, ఆర్అండ్బీ డీఈ, నూజివీడు -
శ్రీవారి క్షేత్రం.. స్వచ్ఛతలో ప్రథమం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రానికి స్వచ్ఛతలో మొదటి ర్యాంక్ దక్కింది. రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాలకు వస్తున్న భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా భక్తుల నుంచి నిర్వహించిన అభిప్రాయ సేకరణలో ద్వారకాతిరుమల దేవస్థానానికి సంతృప్తికర ఫలితాలు లభించాయి. గత నెల ప్రసాదాలకు మొదటి ర్యాంక్ రాగా, ఈసారి స్వచ్ఛతకు ఆ ర్యాంక్ దక్కింది. శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, అన్నవరం, విజయవాడ, సింహాచలం, కాణిపాకం, శ్రీశైలం దేవస్థానాల్లో భక్తులకు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం గత డిసెంబర్ 25 నుంచి ఈనెల 25 వరకూ వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా ఈ సర్వేను నిర్వహించి, ర్యాంకులను ప్రకటించింది. ద్వారకాతిరుమల 75.8 శాతంతో మొదటి ర్యాంక్ సాధించిది. శ్రీకాళహస్తి 75.8 శాతంతో రెండో ర్యాంక్, అన్నవరం 74.1 శాతం, కాణిపాకం 73.1, సింహాచలం 72.5, విజయవాడ 72.5 శాతం, శ్రీశైలం 69.8 శాతం సాధించాయి. ఏ అంశానికి ఏ ర్యాంక్ మొత్తం 4 అంశాలపై భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపారు. అందులో సంతృప్తికర దర్శనం అంశానికి మొదటి ర్యాంక్ శ్రీకాళహస్తికి, రెండో ర్యాంక్ అన్నవరానికి, మూడో ర్యాంక్ ద్వారకాతిరుమలకు లభించాయి. తాగునీటి సదుపాయం అంశానికి మొదటి ర్యాంక్ శ్రీకాళహస్తికి, రెండో ర్యాంక్ ద్వారకాతిరుమలకు, మూడో ర్యాంక్ అన్నవరానికి లభించాయి. ప్రసాదం తాజా, రుచి అంశానికి మొదటి ర్యాంక్ శ్రీకాళహస్తికి, రెండో ర్యాంక్ ద్వారకాతిరుమలకు, మూడో ర్యాంక్ అన్నవరానికి వచ్చాయి. పారిశుధ్య నిర్వహణ అంశానికి మొదటి ర్యాంక్ ద్వారకాతిరుమలకు, రెండో ర్యాంక్ కాణిపాకంకు, మూడో ర్యాంక్ సింహాచలంకు లభించాయి. ఓవరాల్గా అధిక శాతం మంది భక్తులు ద్వారకాతిరుమల దేవస్థానం అందిస్తున్న సేవలకే మొదటి ఓటు వేయడంతో, ప్రథమ ర్యాంక్ దక్కింది. శ్రీవారి ధనుర్మాస మండప ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్న పారిశుధ్ధ్య కార్మికులు శ్రీవారి కొండపైన జల ప్రసాదం వాటర్ ప్లాంట్ పారిశుద్ధ్య విషయంలో దేవస్థానం అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచడం వల్లే ఈ ర్యాంక్ లభించింది. క్షేత్రంలో 2022 అక్టోబర్ 1 నుంచి 2025 సెప్టెంబర్ 30 వరకు పారిశుద్ధ్య పనులను నిర్వహించిన సెవెన్ హిల్స్ ఫెసిలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (మంగళగిరి) కంపెనీకి దేవస్థానం నెలకు సుమారు రూ. 18.28 లక్షలు చెల్లించింది. కూటమి ప్రభుత్వం పారిశుధ్య ఇతర పనుల కాంట్రాక్ట్ను 2025 అక్టోబర్ 1 నుంచి పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (తిరుపతి) సంస్థకు నెలకు రూ. 54 లక్షలకు అప్పగించింది. అరకోటికి పైగా ఖర్చు అవుతున్నా.. మొదట్లో పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా జరిగేవి. కాంట్రాక్టర్కు ఇంత పెద్ద మొత్తంలో నగదు చెల్లిస్తున్నందున పారిశుద్ధ్య పనులపై దేవస్థానం అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే శ్రద్ధగా పనులు చేయిస్తున్నారు. ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో చినవెంకన్న దర్శనం సంతృప్తికరంగా జరిగిందని 67.7 శాతం మంది, జరగలేదని 32.3 శాతం మంది తెలిపారు. తాగునీటి సదుపాయం, ఇతర మౌలిక వసతులు బాగున్నాయని 73.5 శాతం, బాగోలేదని 26.5 శాతం మంది తెలిపారు. ప్రసాదం తాజాగా, రుచిగా బాగుందని 83.4 శాతం మంది, బాగోలేదని 16.6 శాతం మంది తెలిపారు. పారిశుధ్యం బాగుందని 71.2 శాతం మంది, బాగోలేదని 28.8 శాతం మంది తెలిపారు. దేవస్థానం సేవలకు శ్రీవారి భక్తుల సంతృప్తి ప్రభుత్వం నిర్వహించిన వాట్సాప్, ఐవీఆర్ఎస్ సర్వేలో వెల్లడి నాలుగు అంశాలపై సర్వే.. మొదటి ర్యాంక్ ద్వారకాతిరుమలకు -
వైఎస్సార్సీపీ విజయానికి సైనికుల్లా పనిచేయాలి
కై కలూరు: వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అన్నారు. పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణ సమావేశం బుధవారం నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళి అర్పించారు. డీఎన్నార్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త, నాయకులు పూర్తి వివరాలతో డిజిటలైషన్ చేయించుకోవాలన్నారు. పార్టీ గుర్తింపు కార్డులు ప్రతి ఒక్కరి వద్ద ఉండాలన్నారు. పార్టీ అనుంబంధ కమిటీలను అందరూ పూర్తి చేయాలన్నారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ, టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు మొండితోక అరుణ్కుమార్, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్ కారుమూరు సునీల్ కుమార్, నియోజకవర్గ ఇన్చార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాష్, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ అధ్యక్షులు కోమటి విష్ణువర్థన్, పార్టీ ఎంపీపీలు రామిశెట్టి సత్యనారాయణ, చందన ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ పరీక్షల్లో భాగంగా ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలకు రెండో రోజు మొత్తం 1312 మంది హాజరయ్యారు. జిల్లాలోని 10 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షల్లో ఉదయం 806 మందికి 678 మంది హాజరుకాగా 128 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 696 మందికి 634 మంది హాజరు కాగా 62 మంది గైర్హాజరయ్యారు. -
జేఈఈ మెయిన్స్కు 1,397 మంది హాజరు
ఏలూరు (ఆర్ఆర్పేట): దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఎన్ఐటీ విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే జేఈఈ మెయిన్స్ తొలివిడత పరీక్షల్లో బుధవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 6 కేంద్రాల్లో మొత్తం 1397 మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలి సెషన్లో ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్లో 150 మందికి 149 మంది హాజరు కాగా సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కేంద్రంలో 150 మందికి గాను 150 మంది హాజరయ్యారు. తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కేంద్రంలో 140 మందికి గాను 140 మంది, శశి ఇంజనీరింగ్ కేంద్రంలో 111 మందికి గాను 111 మంది హాజరయ్యారు. భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కేంద్రంలో 50 మందికి 49 మంది, డీఎన్నాఆర్ కేంద్రంలో 101 మందికి గాను 100 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్లో 150 మందికి 149 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కేంద్రంలో 151 మందికి గాను 148 మంది, వాసవి ఇంజనీరింగ్ కేంద్రంలో 133 మందికి గాను 133 మంది, శశి ఇంజనీరింగ్ కేంద్రంలో 117 మందికి గాను 117 మంది హాజరయ్యారు. భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కేంద్రంలో 50 మందికి గాను 50 మంది హాజరు కాగా, డీఎనన్నాఆర్ కళాశాల కేంద్రంలో 101 మందికి గాను 101 మంది హాజరయ్యారు. -
మళ్లీ రిజిస్ట్రేషన్ల బాదుడు
ఏలూరు (ఆర్ఆర్పేట): చంద్రబాబు ప్రభుత్వం మరోసారి రిజిస్ట్రేషన్ చార్జీలు భారీగా పెంచి జనం నెత్తిన భారం మోపడానికి సిద్ధమైంది. దీంతో జిల్లాలో భూముల కొనుగోలు కలగా మిగిలే పరిస్థితిలా తయారైంది. కేవలం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే భూముల ధరలు పెరుగుతాయని ప్రభుత్వం చెబుతున్నా పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం కారణంగా మొత్తం జిల్లాలోని మారుమూల పల్లెల్లో కూడా ధరలు పెరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం మార్కెట్ విలువ సవరణకు రిజిస్ట్రేషన్ శాఖకు అనుమతులు ఇచ్చారు. గతేడాది ప్రాంతాన్ని బట్టి 0 నుంచి 25 శాతం భూముల ధరలను పెంచిన ప్రభుత్వం.. వరుసగా రెండో ఏడాది భూముల విలువలు పెంచడానికి తీసుకున్న నిర్ణయం అశనిపాతంలా మారింది. రెండో ఏడాదీ భూముల విలువను 0 నుంచి 25 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల భూముల ధరల్లో మొత్తంగా 50 శాతం పెరుగుదల ఉంటుంది. భూముల మార్కెట్ విలువల పెంపు నిర్ణయాన్ని ఫిబ్రవరి 1 నుంచే అమలు చేస్తున్నారు. ఈ మేరకు భీమడోలు రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో 0 నుంచి 20 శాతం, చింతలపూడి రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో 10 నుంచి 25 శాతం, జంగారెడ్డిగూడెం పరిధిలో 10 నుంచి 17 శాతం భూముల ధరలు పెరుగనున్నాయి. కామవరపుకోట పరిధిలో 5 నుంచి 25 శాతం, పోలవరం కార్యాలయం పరిధిలో 0 నుంచి 20 శాతం, ఏలూరు కార్యాలయం పరిధిలో 5 నుంచి 10 శాతం, గణపవరం కార్యాలయం పరిధిలో 0 నుంచి 25 శాతం పెరుగనున్నాయి. వీటితో పాటు వట్లూరు కార్యాలయం పరిధిలో 10 నుంచి 20 శాతం, కై కలూరు కార్యాలయం పరిధిలో 17 నుంచి 20 శాతం, మండవల్లి కార్యాలయం పరిధిలో 7 నుంచి 25 శాతం, ముదినేపల్లి కార్యాలయం పరిధిలో 5 నుంచి 20 శాతం, నూజివీడు కార్యాలయం పరిధిలో 0 నుంచి 15 శాతం భూముల ధరలు పెరుగనున్నాయి. జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 5 కార్యాలయాల్లో దస్తావేజుల సంఖ్య కూడా పడిపోయింది. ఏలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే 5,070 దస్తావేజులు తక్కువగా రిజిస్ట్రేషన్ చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో 15,912 దస్తావేజుల రిజిస్ట్రేషన్ జరగ్గా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 10,842 మాత్రమే జరిగాయి. చింతలపూడి కార్యాలయంలో 361, గణపవరం రిజిస్ట్రార్ కార్యాలయంలో 46, కై కలూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో 20 ముదినేపల్లి రిజిస్ట్రార్కార్యాలయంలో 9 దస్తావేజుల రిజిస్ట్రేషన్ తగ్గాయి. గతేడాది భూముల విలువలను పెంచినా ఆదాయం పెరగలేదు. భూముల ధరలు పెంచడంతో వాటి కొనుగోలుకు ప్రజలు నిరాసక్తత చూపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో రెండు నెలలు మిగిలి ఉండగా ఇంతవరకూ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపు రూ.5 కోట్లు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా 75,660 దస్తావేజులు రిజిస్ట్రేషన్ జరగ్గా వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.297.84 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకూ ఈ 12 కార్యాలయాల్లో 74,057 దస్తావేజులు రిజిస్ట్రేషన్ జరగ్గా.. రూ. 292.94 కోట్ల ఆదాయం వచ్చింది. వాస్తవానికి భూముల ధరలు పెంచితే రిజిస్ట్రేషన్ల ద్వారా ఎక్కువ ఆదాయం రావాలి. గత 25 ఏళ్ళుగా దస్తావేజుల లేఖరిగా పని చేస్తున్నాను. గతంలో ఎప్పుడు భూముల ధరలు పెరిగినా ఆదిలో కొంత రిజిస్ట్రేషన్లు తగ్గినా తరువాత పుంజుకునేవి. గత ఏడాదిలో పెంచిన భూముల ధరల కారణంగా రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గిపోయాయి. దీంతో మాకు వచ్చే ఆదాయం కూడా పూర్తిగా తగ్గిపోయింది. కుటుంబ పోషణకు కూడా ఆదాయం రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – వీ చంద్రశేఖర ఫణి కుమార్, దస్తావేజుల లేఖరి ప్రభుత్వం గతేడాది భూముల ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం కారణంగా ఇళ్ళ స్థలాలు, పొలాలు కొనుగోలు చేసే నాథుడే కరువయ్యాడు. గత ఏడాది రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా నాశనమైంది. ఈ ఏడాది కూడా ధరలు పెంచాలని తీసుకున్న నిర్ణయంతో అసలు భూముల కొనుగోలుపై ఆలోచన కూడా చేసే పరిస్థితి కనిపించడం లేదు. – గంటా రాజేశ్వరరావు, రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మరోసారి మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం 25 శాతం వరకూ భూముల విలువ పెంచేందుకు నిర్ణయం ఫిబ్రవరి 1 నుంచే అమలు గతేడాది రూ. 5 కోట్లు తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం -
మొక్కజొన్న పంట పరిశీలించిన అధికారులు
కొయ్యలగూడెం: మొక్కజొన్న పంట వేసి నష్టపోయిన రైతులకు సంబంధిత కంపెనీ వెంటనే తగిన నష్టపరిహారం అందజేయాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏడీఏ పి.బుజ్జిబాబు పేర్కొన్నారు. సాక్షి దినపత్రికలో బుధవారం ప్రచురితమైన శ్రీకల్తీ విత్తనాలతో నష్టం్ఙ కథనానికి స్పందించిన వ్యవసాయ శాఖ అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు రైతులను పరామర్శించారు. పొంగుటూరు, కన్నాయగూడెం, గవరవరం గ్రామాల రైతులతో నష్టం అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీడ్ని అందజేసిన కంపెనీ ప్రతినిధులను రప్పించి జరిగిన నష్టానికి బాధ్యత వహించాల్సిందిగా సూచించారు. ఈ నేపథ్యంలో రైతు ప్రతినిధులు కంపెనీ ప్రతినిధులు ఒప్పందానికి వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల ఆదాయాన్ని బుధవారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో లెక్కించారు. 20 రోజులకు నగదు రూపేణా రూ. 2,24,23,765 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 174 గ్రాముల బంగారం, 3.594 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. నూజివీడు: ట్రిపుల్ఐటీలో క్వాంటం కంప్యూటింగ్పై నిర్వహిస్తున్న ఐదురోజుల వర్క్షాపులో భాగంగా బుధవారం క్వాంటం భౌతిక శాస్త్రం, క్వాంటం ఆల్గోరిథం, క్వాంటం కమ్యూనికేషన్కు సంబంధించిన కీలక అంశాలపై అవగాహన కల్పించారు. రెండో రోజు సాంకేతిక సెషన్ను ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ మాజీ డైరెక్టర్ ఆచార్య జీ భగవన్నారాయణ నిర్వహించారు. భౌతిక శాస్త్ర అధ్యాపకుడు, వర్క్షాప్ కన్వీనర్ దుర్గాబాబు క్వాంటం ఆప్టిక్స్పై ఉపన్యాసం ఇచ్చారు. కాంతి క్వాంటం స్వభావం, ఆధునిక క్వాంటం సాంకేతికతల్లో ప్రాముఖ్యతను వివరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉడతా పావని క్వాంటం ఆల్గోరిథంపై సాంకేతిక సెషన్ నిర్వహించి, సంప్రదాయ ఆల్గోరిథంలతో పోలిస్తే క్వాంటం ఆల్గోరిథంకు ఉన్న తేడాను వివరించారు. ఏలూరు(మెట్రో): రాష్ట్రంలో ఉగాది నాటికి 5 లక్షల నిరుపేదలకు ఇళ్ళు అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం జిల్లాలో పేదల గృహ నిర్మాణాల లక్ష్యాలపై గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యాల సాధనకు అనుగుణంగా సిబ్బంది పనిచేసి లక్ష్యాలు సాధించాలన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రగతిపై ప్రతి వారం సమీక్షిస్తానని, నిర్లక్ష్యం వహించే అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థలోని ఉద్యోగాల దరఖాస్తు తేదీ పొడిగించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తెలియజేసారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థలోని డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లుగా తెలిపారు. అభ్యర్థులు 30వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు న్యాయ సేవాధికార కార్యాలయం చేరేలా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు
ఏలూరు టౌన్: రాష్ట్రంలో కూటమి పాలనలో మహిళలకు భద్రత కరువైందని.. అకృత్యాలు, ఆచారకాలతో సామాన్యులకు, ముఖ్యంగా మహిళలకు రక్షణ లేకుండా పోతుందని.. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు కీచకులుగా మారారని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి విమర్శించారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మలతో కలిసి మాట్లాడారు. ప్రధాన కార్యదర్శి స్రవంతి మాట్లాడుతూ.. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచకపర్వం సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. బాధిత మహిళకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. బాధితులపైనే కేసులు పెట్టటం, బెదిరింపులకు పాల్పడడం దారుణం అన్నారు. ప్రజలకు భరోసా కల్పించాల్సిన ప్రజా ప్రతినిధులే అఘాయిత్యాలకు పాల్పడుతూ పశువుల్లా వ్యహరిస్తే.. ఇక మహిళలకు న్యాయం ఎవరు చేస్తారని ప్రశ్నించారు. ఒక మహిళ బయటకు వచ్చి తనకు అన్యాయం జరిగిందని చెబితే న్యాయం చేయాల్సిన బాధ్యత మీపై ఉందని ప్రభుత్వ నేతలు గుర్తు పెట్టుకోవాలన్నారు. ఏలూరు నగర మహిళ అధ్యక్షురాలు విజయనిర్మల మాట్లాడుతూ.. టీడీపీ కూటమి ప్రభుత్వంలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు పెచ్చుమీరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ బాధిత మహిళకు అండగా ఉంటుందని, టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విచారణ చేపట్టి బాధితురాలికి న్యాయం చేయాలన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ వలంటీర్స్ వింగ్ జిల్లా అధ్యక్షురాలు భోగిశెట్టి పార్వతి, జిల్లా మహిళ కార్యదర్శి అచ్యుతకుమారి, జిల్లా కార్యదర్శి కే.తులసీ, మహిళ నాయకురాలు కుమారి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి స్రవంతి -
కొల్లేరులో పక్షుల గణన
● ఈ ఏడాది పెరిగిన పక్షుల సంఖ్య ● అటవీశాఖ అధికారుల వెల్లడికై కలూరు: కొల్లేరు అభయారణ్యంలో పక్షుల గణన బుధవారం నుంచి ప్రారంభమైంది. మొత్తం ఆరు జట్లుగా ఒక్కో జట్టులో 5 సభ్యులతో బుధవారం, శుక్రవారం పక్షుల లెక్కింపు చేశారు. కొల్లేరు అభయారణ్య పరిధిలో మదాపురం, మెండికోడు, గుడివాకలంక, ప్రత్తికోళ్ళలంక, కొక్కిరాలలంక, బొమ్మిలిలంక, ఆగడాలలంక, చెట్నెంపాడు, మల్లవరం, దోసపాడు, క్రొవ్వలి, కేదవరం, పోతులూరు, కొల్లేటికోట, పైడిచింతపాడు, గోకర్ణపురం, గుమ్మళ్లపాడు, ఆలపాడు, పల్లెవాడ, అడవికొలను, పెదనిండ్రకొలను, డీ.గోపవరం, సిద్దాపురం, పల్లెవాడ, ఆటపాక, పెదఎడ్లగాడి, శ్రీపర్రులో కొల్లేరు పక్షుల సర్వే జరుగుతుంది. గత శీతాకాలంతో పోల్చుకుంటే ఈ ఏడాది పక్షుల సంఖ్య పెరిగిందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. -
బైపాస్ రోడ్డు కల నెరవేరేనా?
నూజివీడు: నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న పట్టణ ప్రజల అసౌకర్యాన్ని తొలగించేందుకు రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడుకు గత ప్రభుత్వంలో మంజూరైన బైపాస్ రోడ్డు నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. పట్టణానికి మైలవరం రోడ్డు నుంచి విస్సన్నపేట రోడ్డు వరకు బైపాస్ రోడ్డు నిర్మాణానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. దీంతో బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగితే ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయని పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ బైపాస్ రోడ్డు ట్రిపుల్ ఐటీ వెనుక భాగం నుంచి గొడుగువారిగూడెం మీదుగా పెద్దచెరువు కళంగి పైభాగాన విస్సన్నపేట రోడ్డుకు కలుస్తుంది. ఈ బైపాస్ రోడ్డు నిర్మాణానికి దాదాపు 22.50 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, దీనికి సంబంధించి ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ను సైతం విడుదల చేసింది. భూ యజమానులు సైతం బైపాస్ రోడ్డు నిర్మాణానికి తమ భూమిని ఇవ్వడానికి అప్పట్లోనే అంగీకరించారు. 4.30 కిలోమీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో నిర్మాణం బైపాస్ రోడ్డును మైలవరం రోడ్డు వద్ద నుంచి విస్సన్నపేట రోడ్డు వరకు గొడుగువారిగూడెం ఎగువ భాగం మీదుగా నిర్మించనున్నారు. రోడ్డు పొడవు మొత్తం 4.30 కిలోమీటర్లు కాగా, వెడల్పు 10 మీటర్లు (33అడుగులు). ఈ మార్గంలో బిల్లుడు వాగుపై వంతెనను నిర్మించడంతో పాటు మరో రెండు శ్లాబ్ కల్వర్టులను సైతం నిర్మిస్తారు. బైపాస్ రోడ్డుకు అవసరమైన భూమిని సేకరించేందుకు గాను అప్పటి ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రత్యేక చొరవ తీసుకొని భూముల యజమానులతో నిరంతరం చర్చిస్తూ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ భూమిని ఇచ్చేలా అంగీకరింపజేశారు. రోడ్డు నిర్మిస్తే ట్రాఫిక్ కష్టాలకు తెరపడినట్లే ఇబ్రహీంపట్నం, కొండపల్లి, జీ కొండూరు, గంపలగూడెం మండలం వినగడప ప్రాంతాల్లో ఉన్న స్టోన్క్రషర్ల నుంచి కంకర లారీలు నిత్యం నూజివీడు మీదుగా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాకు రాకపోకలు సాగిస్తుంటాయి. 40 టన్నుల నుంచి 60 టన్నుల లోడుతో భారీ వాహనాలు పట్టణంలోకి వస్తుండటంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయినట్లయితే నూజివీడు పట్టణానికి ట్రాఫిక్ కష్టాలు తీరతాయని భావించారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై 19 నెలలు గడిచినా బైపాస్రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ఇంత వరకు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణం నిమిత్తం భూమిని సేకరించే పనులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో శరవేగంగా జరుగుతున్న తరుణంలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైనప్పటికీ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడిచినా బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనులు ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా నిలిచిపోయాయి. ఎంతో శ్రమించి భూములను ఇవ్వడానికి రైతులందరినీ ఒప్పించినప్పటికీ ప్రస్తుత పాలకులు మాత్రం రోడ్డు నిర్మాణం విషయమై పట్టించుకున్న దాఖలాలే కనిపించడం లేదని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. బైపాస్ రోడ్డు పనులు చేపట్టి పూర్తి చేస్తే పట్టణ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరతాయి. మైలవరం, గంపలగూడెం వైపు నుంచి వచ్చే హనుమాన్ జంక్షన్ వైపు నుంచి వెళ్లే వాహనదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది. భారీ వాహనాలు పట్టణంలోనికి రాకుండా ఉంటాయి. – జీ రాజు, సీపీఎం నాయకుడు, నూజివీడు బైపాస్ రోడ్డు నిర్మిస్తే పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగడమే కాకుండా, రైతులకు కూడా ఎంతో లాభం చేకూరుతుంది. మామిడి తోటల్లోకి వెళ్లి రావడానికి, వ్యవసాయ దిగుబడులను సులువుగా మార్కెట్కు తెచ్చుకోవడానికి వీలవుతుంది. అంతేగాకుండా బైపాస్ రోడ్డు వెంబడి ఉండే రైతుల భూముల ధరలు సైతం పెరుగుతాయి. – షేక్ మస్తాన్వలీ, నూజివీడు గత ప్రభుత్వంలోనే నూజివీడు బైపాస్కురూ.25 కోట్లు మంజూరు భూములిచ్చేందుకు రైతులు సైతం అంగీకారం పట్టించుకోని ప్రస్తుత పాలకులు -
గ్రావెల్ లారీల పట్టివేత
తణుకు అర్బన్ : అక్రమ మార్గంలో గ్రావెల్ రవాణాకు పాల్పడుతున్న లారీలను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు విజిలెన్స్ ఎస్పీ కె.నాగేశ్వరరావుకు వచ్చిన సమాచారంతో విజిలెన్స్, మైన్స్, రవాణాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామం నుంచి గ్రావెల్ లోడుతో వచ్చిన 6 యూనిట్ల గ్రావెల్ లారీలు 5, 3 యూనిట్ల గ్రావెల్ లారీ ఒకటి తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో అదుపులో తీసుకున్నట్లు విజిలెన్స్ ఎస్సై కె.సీతారాము తెలిపారు. గ్రావెల్ లోడుతో ఉన్న లారీలకు సంబంధించి ఎటువంటి మైనింగ్ బిల్లులు లేకుండా, అధిక లోడుతో రవాణా చేస్తున్నట్లుగా నిర్ధారించి సదరు వాహనాలపై మైనింగ్ అపరాధ రుసుముగా రూ. 66 వేలు, అధిక లోడు కారణంగా రూ. 2.56 లక్షలు అపరాధ రుసుము విధించినట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఏజీ కె.శ్రీధర్, ఇన్స్పెక్టర్ డి.ప్రసాద్ కుమార్, సీహెచ్.రంజిత్ కుమార్, మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్ పి.అన్నపూర్ణ, రవాణా శాఖ అధికారి కేవీ.సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్) : కొయ్యలగూడెం మండలంలో పొంగుటూరు, గవరవరం గ్రామాల్లో నకిలీ మొక్కజొన్న విత్తనాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, విత్తన కంపెనీల మోసాలను అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కట్టా భాస్కరరావు, కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక పవరుపేటలోని అన్నే భవనంలో నకిలీ మొక్కజొన్న విత్తనాలపై వారు బుధవారం మాట్లాడారు. విత్తన కంపెనీలు రైతులను మోసగిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. కంపెనీల ఇష్టారాజ్యంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను మోసగించిన విత్తన కంపెనీ ప్రతినిధులపై చర్యలు తీసుకుని రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. రైతులు చేస్తున్న ఆందోళనకు రైతు సంఘం సంఘీబావం ప్రకటిస్తోందని చెప్పారు. భీమవరం: పెన్నాడ – భీమవరం రైల్వే స్టేషన్ల పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు జీఆర్పీ ఎస్సై ఎం.సుబ్రహ్మణ్యం తెలిపారు. మృతుడికి సుమారు 40 ఏళ్లు వయస్సు ఉంటుందని, రైలు ఢీకొనడం వల్ల చనిపోయాడని భావిస్తున్నామన్నారు. మృతుడు నలుపు రంగు ప్యాంటు, నలుపు రంగు షర్ట్ ధరించి ఉన్నాడని, కుడి చేతి మీద షణ్ముఖరావు, లక్ష్మి అని పచ్చబొట్టు ఉందన్నారు. వివరాలు తెలిసిన వారు 99084 48729కు సమాచారం అందించాలని కోరారు. దెందులూరు : దెందులూరు పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైనట్లు ఎస్సై ఆర్ శివాజీ తెలిపారు. గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలికపై మంగళవారం రాత్రి 15 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడినట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. బాలుడు పరారీలో ఉన్నాడని, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై చెప్పారు. -
ఉపాధ్యాయుల సమస్యలపై ఎస్టీయూ ఉద్యమ కార్యాచరణ
ఏలూరు (ఆర్ఆర్పేట) : ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ రా ష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను రూపొందించినట్టు ఆ సంఘ ఏలూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీబీవీఎన్ఎల్ నారాయణ, కేఆర్ పవన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, పదవీ విరమణ చేసిన మరుసటి రోజునే పెన్షన్ సౌకర్యాలు చెల్లించాలనేవి తమ ప్రధాన డిమాండ్లని స్పష్టం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ మెమో. 57 మేరకు 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అనులు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన నాలుగు డీఏలను వెంటనే మంజూరు చేయాలలని డిమాండ్ చేశారు. ఆయా డిమాండ్ల సాధనకు తలపెట్టిన దశలవారీ పోరాటాన్ని విజయవంతం చేయాలని ఏలూరు జిల్లాలోని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. డిమాండ్ల సాధన కోసం ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పిస్తామన్నారు. అలాగే ఫిబ్రవరి 10వ తేదీన ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన చేస్తామన్నారు. ఫిబ్రవరి 25వ తేదీన విజయవాడలో బహిరంగ సభ, నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. -
సుందరగిరిపై ‘కల్యాణ కాంతులు’
●నారసింహుని కల్యాణోత్సవాలకు సర్వం సిద్ధం ●నేడు వరుడు కానున్న స్వామివారు కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో ఇరువైపులా విద్యుద్దీప అలంకారాలు, నారసింహుని భారీ విద్యుత్ కటౌట్ద్వారకాతిరుమల: నారసింహుని దివ్య కల్యాణ మహోత్సవాలకు ఐఎస్ జగన్నాధపురంలోని సుందరగిరి పర్వతం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయ పరిసరాలు విద్యుద్దీప కాంతులీనుతున్నాయి. అలాగే సుందరగిరిపై ఏర్పాటు చేసిన నారసింహుని భారీ విద్యుత్ కటౌట్, ఘాట్ రోడ్డుకు ఇరువైపులా అమర్చిన విద్యుద్దీప తోరణాలు మిరుమిట్లు గొలుపుతున్నాయి. వృక్షాలు సైతం విద్యుత్ అలంకరణలతో కనువిందు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈనెల 29 నుంచి వచ్చేనెల 3 వరకు స్వామివారి కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. అందులో భాగంగా ఉత్సవాల తొలిరోజు గురువారం ఉదయం 10.15 గంటలకు ఆలయ అర్చకులు, పండితులు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా చేస్తారని ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. యావన్మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొనాలని ఆయన కోరారు. -
కబడ్డీ పోటీల్లో ట్రిపుల్ ఐటీ విద్యార్థికి కాంస్య పతకం
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన కెమికల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సర విద్యార్థి వై శ్రీనివాస్ కబడ్డీ పోటీలో ప్రతిభను కనబరిచి కాంస్య పతకం సాధించాడు. విశాఖపట్నం మెడ్టెక్ జోన్లో ఈనెల 21 నుంచి 26 వరకు జరిగిన మూడవ జాతీయ పురుషుల పారా కబడ్డీ పోటీల్లో పాల్గొని జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించి కాంస్యం పతకం సాధించడం విశేషం. శ్రీనివాస్ను డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్, పరిపాలనాధికారి బీ లక్ష్మణరావు, అకడమిక్ డీన్ సాదు చిరంజీవి, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ సుబ్బలక్ష్మి తదితరులు బుధవారం అభినందించారు. ఆకివీడు: స్థానిక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న దేవర కొండ ఏడుకొండలు (58) చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు బుధవారం తెలిపారు. గత నెల 31న సెలవుపై తన స్వగ్రామం బాపట్ల వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని, అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు చెప్పారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారని, 2023 నుంచి ఆకివీడు పోలీస్ స్టేషన్లోనే ఆయన విధుల్ని నిర్వహిస్తున్నట్లు ఎస్సై వివరించారు. జంగారెడ్డిగూడెం: ఆర్టీసీ బస్సు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురైన ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు బుధవారం ద్వారకాతిరుమల వెళ్లి మధ్యాహ్నాం స్థానిక కొత్తబస్టాండ్కు తిరిగి వచ్చింది. డ్రైవర్ వాహనాన్ని బస్టాండ్లో ఓ పక్కగా నిలుపుదల చేసి భోజనం చేసేందుకు వెళ్లారు. కొద్ది సేపటికి బస్సు ముందు భాగం నుంచి పొగలు రావడంతో స్థానికులు గుర్తించి సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు ముందు జాగ్రత్తగా బకెట్లతో నీటిని చల్లి పొగను కట్టడి చేశారు. ఇంజన్ వద్ద ఉన్న క్వాయిల్ వైర్లు డైరెక్ట్ కావడంతో పొగలు వచ్చాయని, వెంటనే బస్సును డిపోకు తరలించి క్వాయిల్ మార్చడం జరిగిందని డీఎం గంగాధరరావు తెలిపారు. బుట్టాయగూడెం: జిల్లాలోని మూడు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పీఓ కె. రాములు నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుట్టాయగూడెం గురుకుల బాలికలు, కేఆర్పురం, జీలుగుమిల్లి బాలురు గురుకులాల్లో ఒక్కో పాఠశాలలో 80 ఖాళీలు ఉండగా వాటిలో 2 ఓసీ, 10 ఎస్సీ, 4 బీసీ, 2 ఏఈక్యూ, 55 ఎస్టీ, 2 పీసీటీ ఏనాది పీహెచ్సీ, 5 పీటీజి చొప్పున ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 28వ తేదీ లోగా ఆన్లైన్ చేసుకోవాలని కోరారు. అలాగే ఈ పాఠశాలల్లో ఏప్రిల్ 4వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. పెదవేగి : పాత కక్షల నేపథ్యంలో కత్తులతో దాడి చేసి ఓ వ్యక్తిని తీవ్రంగా గాయపరచిన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. స్థానికులు తెలిిపిన వివరాలు ఇవి. బుధవారం పెదవేగి మండలం, రామచంద్రపురం గ్రామం లో కర్ణాటక మధు అనే వ్యక్తిని పాత గొడవలు పురస్కరించుకుని నక్క రాము అనే వ్యక్తి కత్తితో తీవ్రంగా నరికాడని, ఈ మేరకు వైద్య చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని సమాచారం. భర్తపై కేసు నమోదుయలమంచిలి: స్థానిక అంబాల చెరువుగట్టుకు చెందిన చదలవాడ సుశీల (51)ను ఆమె భర్త సుబ్బారావు ఈ నెల 26న తలపై కర్రతో కొట్టడంతో రక్త గాయమైంది. ఆమె పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై కర్ణీడి గుర్రయ్య బుధవారం తెలిపారు. -
యథేచ్ఛగా కలప అక్రమ రవాణా
బుట్టాయగూడెం: కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అటవీశాఖ అధికారులు ఎప్పుటికప్పుడు దాడులు జరిపి కలపను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నా కలప అక్రమ రవాణా ఆగడం లేదు. ప్రస్తుతం వర్జీనియా పొగాకు క్యూరింగ్ పనులు ప్రారంభం కావడంతో పొగాకు బేరన్లకు కూడా అడవిలోని కలపను నరికి యథేచ్ఛగా తరలిస్తున్నారు. అటవీశాఖ అధికారుల కంట పడకుండా ఈ చీకటి వ్యాపారం జోరుగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బుట్టాయగూడెం మండలం రాజానగరంలో, దండిపూడి సమీపంలో అడవిలో కలపను నరికి ట్రాక్టర్లపై తరలిస్తుండగా కన్నాపురం రేంజ్ అధికారి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో పట్టుకుని కలప ట్రాక్టర్లను కార్యాలయానికి తరలించారు. అదేవిధంగా రెడ్డిగణపవరం సమీపంలో కూడా ట్రాక్టర్లో కలప తరలిస్తుండగా ములగలంపల్లి బీట్ ఆఫీసర్ కుర్స రాంబాబు పట్టుకుని జంగారెడ్డిగూడెం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. కాగా రాత్రి వేళల్లో కొందరు వ్యక్తులు ట్రాక్టర్లలో కలపను గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు. బుట్టాయగూడెం మండలం వీరన్నపాలెం సమీపంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం కాల్వ వద్ద తరలించేందుకు అడవిలో నుంచి నరికిన కలపను సిద్ధంగా ఉంచి భద్రపరచి ఉంచారు. అయితే ఇది ఎవరు, ఎందుకు అక్కడ ఉంచారో తెలియాల్సి ఉంది. ఫారెస్ట్ అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేసి కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. -
గరుడ వాహనంపై శోభనాచలుడు
ఆగిరిపల్లి : శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి మాఘమాస రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం స్వామివారి కల్యాణ మండపంలో వలివేటి శేష శోభనాచల శ్రీనివాసరావు దంపతులు, వలివేటి హేమ శ్రీధర్ దంపతుల కై ంకర్యంలో స్వామివారి శాంతి కల్యాణం వైభవంగా జరిపించారు. రాత్రి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వామివారిని పెండ్లి కుమారుడిగా అలంకరించి గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంతకృష్ణ స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. పెదపాడు: మండలంలోని అప్పనవీడులో అభయాంజనేయస్వామి వారి హుండీ ఆదాయాన్ని బుధవారం ఏలూరు తనిఖీదారు వి సురేష్ పర్యవేక్షణలో లెక్కించారు. స్వామివారికి రూ.12,44,579 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ తారకేశ్వరరావు తెలిపారు. 85 రోజులకు గాను ఈ ఆదాయం లభించిందన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వేమూరి శ్రీనివాసరావుతోపాటు భక్తులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
మీటర్ రీడర్లకుఉద్యోగ భద్రత కల్పించాలి
ఏలూరు (టూటౌన్): విద్యుత్ మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనాలు అమలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్కు మంగళవారం ఉదయం విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి పి.కిషోర్, ఏరియా కార్యదర్శి ఏ.అప్పలరాజు మాట్లాడుతూ మీటర్ రీడర్లుగా నాలుగు వేల మంది పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని అన్నారు. స్మార్ట్ మీటర్లను తీసుకొస్తున్న నేపథ్యంలో విద్యుత్తు మీటర్ రీడర్స్ ఉపాధి ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. విద్యుత్ మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపించాలని డిమాండ్ చేశారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో 25 శాతం సహకార సంఘాల ఉద్యోగుల కోటా ప్రకారం అర్హులైన వారితో భర్తీ చేయాలని సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో డీఆర్వో, సహకార శాఖ అధికారికి మంగళవారం వినతి పత్రాలు అందజేశారు. యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు డీఎన్వీడి ప్రసాద్, మాజీ ప్రధాన కార్యదర్శి టి.గంగరాజు వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ 2023లో పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి కాల్ లెటర్స్ పంపించి ఇంటర్వ్యూలు నిర్వహించారన్నారు. 25 శాతం సహకార సంఘాల ఉద్యోగుల కోటాకు సంబంధించిన పోస్టులు భర్తీ చేయకుండా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో మంగళవారం జాతీయ క్వాంటమ్ కంప్యూటింగ్ వర్క్షాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ మాట్లాడుతూ ఈ నెల 31 వరకు వర్క్షాపు జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఉన్నత స్థాయి అకడమిక్ కార్యక్రమాల నిర్వహణకు సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. తొలిరోజు మాజీ చీఫ్ సైంటిస్ట్, అరకు వ్యాలీ మాజీ డైరెక్టర్ డాక్టర్ జీ.భగవన్నారాయణ, ఏపీ ఉన్నత విద్యామండలి గౌరవ చైర్మన్, ఆర్జేటీయూకేటీ ఆచార్య కె.మధుమూర్తి, ఉపకులపతి ఆచార్య ఎం.విజయ్ కుమార్ పర్యవేక్షించారు. నరసాపురం: నరసాపురం కొండాలమ్మ గుడి ప్రాంతంలో మంగళవారం తుపాకీ పేలుడు కలకలం రేపింది. సమీపంలో వైఎన్ కళాశాల గ్రౌండ్లో ఎన్సీసీ క్యాడెట్ల గన్ ఫైరింగ్ మిస్ అయ్యి ఈ ప్రమాదం జరిగిందని తెలుసుకుని కుదుట పడ్డారు. ఉదయం 12.30 గంటల సమయంలో కొండాలమ్మగుడి ప్రాంతంలో కొపనాతి రాము ఇంటి రెండో అంతస్తులో భారీ శబ్ధంతో అద్దం ముక్కలైంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న యజమాని రాము వచ్చి పరిశీలించగా బుల్లెట్ లభించింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని ఆరాతీశారు. నేవీ, ఎన్సీసీ క్యాంపులు వైఎన్ కళాశాల గ్రౌండ్లో జరుగుతుంటాయి. క్యాంపులో గన్ఫైరింగ్ ప్రాక్టీస్ సమయంలో ఓ క్యాడెట్ గన్ నుంచి మిస్ ఫైరింగ్ జరిగి బుల్లెట్ 200 మీటర్లు దూరంలో ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. -
సచివాలయ ఉద్యోగులపై సవతి తల్లి ప్రేమ
రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ శాఖలోనూ లేని విధంగా సచివాలయ ఉద్యోగుల శాఖపై అధికారులు చూపడం దారుణం. ఒక రకంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖపై సవతి తల్లి ప్రేమను చూపడం బాధాకరం. మా శాఖలోని సమస్యలు పరిష్కరించకుండా భారం మోపుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, అధికారులు తమ తీరును మార్చుకోవాలి – జీవీఎస్ శ్రీనివాస్, రీజినల్ కో–ఆర్డినేటర్, సచివాలయ ఉద్యోగుల సంఘం సర్వేలు, యాప్ల నిర్వహాణ సచివాలయ ఉద్యోగులకు భారంగా మారింది. కొన్ని సందర్భాల్లో సర్వేలకు ప్రజలకు సహాకరించకపోయినా దానికి కూడా ఉద్యోగులనే బాధ్యులను చేసి మాట్లాడుతున్నారు. పండుగలు, సెలవుల్లో ప్రత్యేక పనులు అప్పగిస్తున్నారు. పూర్తి చేయకపోతే సెలవులు రద్దు చేస్తామంటూ బెదిరిస్తున్నారు. – జె.శ్యాం చంద్రబాబు, శానిటేషన్ సెక్రటరీ,ఏలూరు రాష్ట్ర వ్యాప్తంగా పని ఒత్తిడి వల్ల అశువులు బాసిన సచివాలయ ఉద్యోగుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం కల్పించాలి. బాధితుల పిల్లలు, తల్లిదండ్రుల పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక సహాకారం అందించాలి. – మెట్టపల్లి కావ్య, ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ, ఏలూరు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న వివిధ శాఖల ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించాలి. సచివాలయం పరిధిలో అధికారులు చెప్పిన పనులు చేయడంతో పాటు అటు మాతృశాఖ ద్వారా అప్పగించే పనులు కూడా చేయాల్సి రావడం భారంగా మారింది. కొన్ని సందర్భాల్లో పని భారం పెరిగి ఆలస్యం అవుతుంది. – టి.శ్రీలక్ష్మి, హెల్త్ సెక్రటరీ, ఏలూరు -
పని ఒత్తిడితో ప్రాణాలు పోతున్నాయ్!
● ఆందోళనలో సచివాలయ ఉద్యోగులు ● సర్వేలు, యాప్ల నిర్వహణ వంటి పనులతో దిగాలు ● పనిభారం తగ్గించాలని వినతి ఏలూరు (టూటౌన్): పని ఒత్తిడితో ప్రాణాలు పోతున్నాయని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదనపు పనిభారం, ఒత్తిడి కారణంగా ప్రభుత్వంలోని ఏ శాఖలోనూ లేని విధంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2025, డిసెంబరులో 13 మంది సచివాలయ ఉద్యోగులు ఆకస్మికంగా మృతి చెందితే తాజాగా 2026 జనవరిలో ఇంత వరకు ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. సచివాలయ ఉద్యోగులపై అధికారుల వేధింపులు ఎక్కువ కావడం వల్ల ఈ పరిస్థితి ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు 75 శాఖలు ఉండగా మిగతా 74 శాఖల్లో లేని విధంగా ఒక్క సచివాలయ ఉద్యోగుల శాఖలోనే ఆకస్మిక మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయంటూ సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనుల అప్పగింత ఎన్నికల కమిషన్ నిబంధనలు పక్కన బెట్టేసి కమిషన్ సూచించిన ప్రభుత్వ శాఖలకు కాకుండా సచివాలయాల్లోని అన్ని శాఖల ఉద్యోగులకు బీఎల్వో విధులు అప్పగిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ బుక్ నిబంధనలను పక్కన బెట్టి సచివాలయ ఉద్యోగులకు బలవంతంగా బీఎల్వో విధులు, వాటితో పాటు డోర్ టూ డోర్ సర్వేలు, కార్యాలయాల్లోని పనులు అప్పగిస్తున్నారు. ఫోన్లు, ఇతర సౌకర్యాలు కల్పించకుండా ఆ ఆర్థిక భారం కూడా సచివాలయ ఉద్యోగులపైనే వేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే సదరు ఉద్యోగి అధికారులకు టార్గెట్ అయిపోతున్నాడు. మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు రాష్ట్రంలో పని ఒత్తిడితో పిట్టల్లా రాలిపోతున్న సచివాలయ ఉద్యోగుల అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ జాతీయ మానవ హాక్కుల సంఘానికి సచివాలయ ఉద్యోగుల సంఘం ఫిర్యాదు చేసింది. దీనిపై జాతీయ మానవ హాక్కుల సంఘం సైతం కేసు నమోదుచేసి నెంబరు కేటాయించినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు చెబుతున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని, వారికి న్యాయం చేయాలని, వారి కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల్లో ఉద్యోగం కల్పించాలని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు కోరుతున్నారు. అన్ని శాఖల ఉద్యోగుల మాదిరిగానే గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆదివారాలు, పండుగ సెలవుల్లో ఎలాంటి పనులు అప్పగించకూడదని, జూమ్ మీటింగ్లు వంటివి నిర్వహించకూడదని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా సచివాలయాలు ఉద్యోగులు ఏలూరు 547 4,412 పశ్చిమగోదావరి 535 4,331 ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1082 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా వీటి పరిధిలో మొత్తం 8,743 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 321 గ్రామ, 223 వార్డు సచివాలయాలు కలిపి మొత్తం 547 గ్రామ, వార్డు ఉండగా వీటి పరిధిలో మొత్తం 4,412 మంది పనిచేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 380 గ్రామ, 155 వార్డు సచివాలయాలు కలిపి మొత్తం 535 ఉన్నాయి. వీటి పరిధిలో 4,331 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
ఏజెన్సీలో పులి పంజా
సాక్షి ప్రతినిధి ఏలూరు: ఏజెన్సీని పెద్ద పులి వణికిస్తోంది. పులి సంచారంతో మన్యం వాసులు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. 10కిపైగా మూగజీవాలను చంపిన క్రమంలో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. ప్రశాంతంగా ఉండే పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద పులి గత వారం రోజులుగా ఈ ప్రాంత వాసులకు, ఫారెస్టు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తెలంగాణా రాష్ట్రంలోని అశ్వారావుపేట మండలం కావిడిగుండ్ల సమీపంలో ఈ నెల 21న రాత్రి సోడెం నాగేశ్వరరావు తన వ్యవసాయ భూమిలో కట్టేసిన లేగదూడ, ఆవుపై దాడి చేసి చంపింది. ఈ నెల 22న బుట్టాయగూడెం మండలం పందిరిమామిడిగూడెం, గుబ్బల మంగమ్మగుడి మార్గం వైపు సంచరించి అక్కడ కొందరు గిరిజనులకు కనిపించి హడలెత్తించింది. అదే రోజు సాయంత్రం అంతర్వేదిగూడెం సమీపంలో ఒక ఆవు, లేగ దూడను చంపేసింది. 23న నాగులగూడెం సమీపంలో మూడు ఆవులపై విరుచుకుపడి వాటిని హతమార్చింది. ఆవులపై దాడి చేస్తున్న పులి ఆచూకీ కోసం ఫారెస్టు అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాత్రి వేళ ఆవులను చంపడానికి వచ్చి ట్రాప్ కెమెరాకు చిక్కిన పెద్దపులిని చూసి అందరూ బిత్తరపోయారు. సుమారు 4 అడుగుల ఎత్తు మీటరున్నర పొడవున్న పెద్దపులి చిత్రాన్ని చూసి అందరూ భయాందోళన చెందారు. అదే రోజు మధ్యాహ్నం సమయానికి అంతర్వేదిగూడెం సమీపంలో కొండ ప్రాంతంలోని గాడిదబోరు వద్ద సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించి ఆ పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. 24న బుట్టాయగూడెం మండలం గుర్రప్పగూడెంలో గేదె పై, కోట నాగవరంలో లేగ దూడపై పెద్దపులి దాడి చేసి చంపింది. అక్కడ నుంచి కంసాలికుంట, అల్లికాల్వ మీదుగా రాయిగూడెం వెళ్లి అక్కడ తెల్లం వెంకటేష్కు చెందిన దూడపై దాడి చేసింది. కొయ్యలగూడెం మండలం బిల్లుమిల్లి చేరుకుని ఆవులపై పులి దాడి చేసింది. బుట్టాయగూడెం మండలంలోని నాగులగూడెం, అంతర్వేదిగూడెం, బూరుగువాడ, కామవరం, గాడిదబోరు, గుర్రప్పగూడెం, కోటనాగవరం, కండ్రికగూడెం, రాయిగూడెం, అమ్మపాలెం తదితర గ్రామాల్లోని ప్రజలు రాత్రిపూట భయం భయంగా గడుపుతున్నారు. పగలంతా పొదల్లో, కొండ ప్రాంతాల్లో దాక్కున్న పులి రాత్రి సమయంలో గాండ్రిస్తూ గ్రామాల వెంట తిరుగుతూ ఆవుల మందపై దాడి చేయడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఆవులు, గేదెలపై దాడి చేయడంతోపాటు వారం రోజుల నుంచి ఇంకా ఈ ప్రాంతంలోనే సంచరించడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని భయబ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో సంచరిస్తూ పశువులపై దాడి చేసి చంపుతున్న పెద్ద పులి ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై అటవీశాఖ అధికారులు దృష్టి సారించారు. పాపికొండల అభయారణ్యం ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలతో పాటు పోలవరం జిల్లాలోని దేవీపట్నం వీఆర్పురం, చింతూరు మండలాల పరిధిలో సుమారు 1,012.85 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఈ అభయారణ్యంలో పులులు ఉన్నట్లు వైల్డ్లైఫ్ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా గుర్తించారు. పులులతోపాటు చిరుతలు, ఎలుగుబంటులు, అడవి దున్నలు, జింకలు, అలుగులు, తదితర జంతువులతో పాటు 250 పక్షి జాతులను గుర్తిచారు. అయితే ప్రస్తుతం గిరిజన ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి ఇక్కడిదేనా? తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిందా? ఇతర ప్రాంతాల నుంచి వచ్చిందా అనే కోణంలో అటవీశాఖ అధికారులు పరిశీలన చేస్తున్నారు. వణుకుతున్న గిరిజన గ్రామాలు ఖమ్మం నుంచి దారి తప్పి జిల్లాలోకి పులి ప్రవేశం? వారం వ్యవధిలో పది మూగజీవాలను చంపిన పులి -
శేష వాహనంపై శోభనాచలుడు
ఆగిరిపల్లి: స్థానిక శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి మాఘమాసం మంగళవారం రాత్రి చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటలకు ఆలయంలో నాగిరెడ్డి పాపా అప్పారావు దంపతులు కై ంకర్యపరులుగా వ్యవహరించి స్వామివారికి శాంతి కల్యాణం జరిపారు. రాత్రి 8 గంటలకు వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిత్య కల్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంత కృష్ణ వైభవంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి తమలపాకులతో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహనం పూజలను ఆలయ అర్చకులచే నిర్వహించుకున్నారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ. 2,07,755 ఆదాయం వచ్చిందని, నిత్యాన్నదానం సత్రంలో 2,221 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఆలయ సహాయ కమిషనరు, కార్యనిర్వహణాధికారిణి ఆర్వీ చందన తెలిపారు. ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సమీక్షా సమావేశానికి అధికారులు బాధ్యతాయుతంగా హాజరుకావాలని చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ సూచించారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి అధికారుల గైర్హాజరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు. ఏలూరు జిల్లాలో శానిటేషన్, చెత్త ప్రాసెసింగ్ కార్యక్రమాలకు సంబంధించి డీపీఆర్ ఆధారంగా పనులను వేగవంతంగా ప్రారంభించి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని చైర్పర్సన్ ఆదేశించారు. బోరు నీటి నుంచి వచ్చిన గ్యాసే ప్రమాదానికి కారణం ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానం మాధవునికుంట చెరువులో మంగళవారం ఉదయం చేపలు, చేప పిల్లలు పెద్ద ఎత్తున చనిపోయాయి. వివరాల్లోకి వెళితే. మాధవుని కుంట చెరువులోకి ఎలా వచ్చాయో తెలియదు కానీ గొరక, బంగారుతీగ, శీలావతి చేపలు వచ్చాయి. ఆ ప్రాంతంలో ఇటీవల పంచాయతీ వారు నూతనంగా బోరును నిర్మించారు. ఆ నీటిని చెరువులోకి పంపుతున్నారు. చెరువులోని నిల్వ నీరు బయటకు వెళ్లేందుకు అవుట్లెట్ లేకపోవడంతో, బోరు నీటిలోంచి వచ్చిన గ్యాస్ కారణంగా ఆక్సిజన్ అందక చేపలు, చేప పిల్లలు చనిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. కాగా చనిపోయిన చేపలు కారణంగా తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని చుట్టుపక్కల వారు దేవస్థానం అధికారులకు సమాచారం అందించగా వారు పంచాయతీ అధికారులతో మాట్లాడారు. దీంతో పంచాయతీ కార్యదర్శి జీటీవీ శ్రీనివాస్ పారిశుద్ధ్య కార్మికులతో చెరువులో చనిపోయిన చేపలు, చేప పిల్లలను తొలగింపజేశారు. -
కల్తీ విత్తనాలతో నష్టం
కొయ్యలగూడెం: కల్తీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయామని పొంగుటూరు, గవరవరం గ్రామాల సమీపంలో మొక్కజొన్న పంట వేసిన రైతులు గగ్గోలు పెడుతున్నారు. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి సీడ్ పెట్టించారని, తీరా చూస్తే చేను మొలకెత్తలేదని, ఇదేంటని కంపెనీ ప్రతినిధులను ప్రశ్నిస్తే పెట్టుబడిగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యవర్తుల ద్వారా బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. మంగళవారం పలువురు రైతులు విలేకరుల ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నానని రైతు నిమ్మగడ్డ కిషోర్ తెలిపారు. కంపెనీ సీడ్ ఎకరానికి నాలుగు టన్నుల దిగుబడి వస్తుందని చెప్పడంతో పెట్టుబడి పెట్టామని, ప్రస్తుతం చేను సగానికి పైగా మొలకెత్తలేదని చెప్పారు. కంపెనీ ప్రతినిధులను సంప్రదిస్తే భాస్వరం లోపం అంటూ పంచదార, డీఏపీ లిక్విడ్, ఇసబియన్ మందులు కొట్టమన్నారని, వాటితోనూ ఎలాంటి ఫలితం లేకపోయిందన్నారు. అనంతరం కంపెనీ ప్రతినిధులు స్వయంగా వచ్చి చూసి, మీరు కొట్టిన మందుల వల్లే పంట నష్టం జరిగిందని చెప్పి ఇప్పటివరకు పెట్టుబడిగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో రైతు గుడిసె పోసరావు మాట్లాడుతూ తన మూడు ఎకరాల్లో పంట నష్టపోయినట్లు చెప్పారు. మధ్యవర్తులు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. తాము చిన్న, సన్నకారు రైతులమని, మరో పంట వేసే స్థోమత కూడా లేకుండా పోయిందన్నారు. రైతు వామిశెట్టి పవన్ కుమార్ మాట్లాడుతూ, మూడు ఎకరాల్లో కంపెనీ సీడ్ వేసినట్లు తెలిపారు. దాదాపు ఒక ఎకరం పూర్తిగా నష్టపోయిందని, మిగిలిన రెండు ఎకరాలు కూడా పోతాయేమోనని భయంగా ఉందన్నారు. మరో రైతు గుడిసె సత్యనారాయణ మాట్లాడుతూ, రెండు ఎకరాలపైగా కంపెనీ సీడ్ వేస్తే నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. -
ఈ–రిక్షాలు పంపిణీ చేయాలి
రిక్షా కార్మికులకు ప్రత్యేక పెన్షన్లు లేదా ఆర్థిక సాయం అందించాలి. కాలం చెల్లిన రిక్షాల స్థానంలో రాయితీపై ఈ–రిక్షాలు పంపిణీ చేయాలి. రిక్షా కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, వారి కుటుంబాలకు ఆరోగ్య భీమా కల్పించాలి. – ముళ్ళగిరి ఇమ్మానియేలు, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకుడు 40 ఏళ్లుగా రిక్షా తొక్కుతున్నాను. అప్పట్లో మా కుటుంబాన్ని, పిల్లలను రిక్షా తొక్కే పోషించాను. గతంలో రోజంతా కష్టపడితే రూ.500 నుంచి వెయ్యి వరకు వచ్చేది. కానీ ఇప్పుడు రోజుకు రూ.300 రావడం కూడా గగనమైపోయింది. ఆటోలు వచ్చాక మమ్మల్ని పట్టించుకునేవారే లేరు. – హెచ్ భీమయ్య, రిక్షా కార్మికుడు, చింతలపూడి -
ఏసు ప్రభువు ప్రేమ విశ్వవ్యాప్తమైనది
గణపవరం (ఉంగుటూరు): ఉంగుటూరు మండలం నాచుగుంటలో బైబిలు మిషన్ 88వ మహాసభలు మంగళవారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలు ఈనెల 29వ తేదీ వరకూ జరగనున్నాయి. మహాసభల్లో ముఖ్య అతిథిగా బైబిల్ మిషన్ అధ్యక్షుడు సజీవరావు ప్రసంగించారు. ఏసుప్రభువు ప్రేమ విశ్వవ్యాపితమైనదని, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది విశ్వాసులు ప్రభువు సందేశాలను ఆచరిస్తూ వారిజీవితాలను మార్చుకున్నారని అన్నారు. తద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. క్రీస్తు బోధనలు అందరూ ఆచరిస్తే సమాజంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి విశ్వాసులు ఈ మహాసభల్లో పాల్గొన్నారు. అందరికీ భోజన వసతి సదుపాయాలు కల్పించామని తెలిపారు. ఈ సభలకు వైస్ ప్రెసిడెంట్ ఎ.దైవారావు, కార్యదర్శి డి.ఇమ్మానుయేల్, జాయింట్ సెక్రటరీ జీఆర్ ఇమ్మానియేల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభలకు పరిసర గ్రామాలకు చెందిన విశ్వాసులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. దెందులూరు: దెందులూరులోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన పాఠశాల బస్సు మంగళవారం విద్యార్థులతో చిన్న దళితవాడ వస్తుండగా వైఎస్సార్ విగ్రహం దాటిన తర్వాత బోరు సమీపంలో రోడ్డు పూర్తిగా పాడైన నేపథ్యంలో బస్సు పక్కకు ఒరిగిపోయింది. ఒకవైపు సీతంపేట కాలువ మరొకవైపు చెరువు ఉండడంతో బస్సు ఎటుపక్కకు ఒరిగినా పెను ప్రమాదం సంభవించేది. అదే సమయంలో అటుగా వస్తున్న వైఎస్సార్సీపీ నేత వన్నెకూటి రాజు వెంటనే స్పందించి బస్సు నుంచి చిన్నారులను కిందకు దింపారు. హుటాహుటిన ట్రాక్టర్ ఏర్పాటు చేయించి బస్సును రోడ్డు మీదకు లాగారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు వన్నెకూటి రాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
సత్వర న్యాయం అందించాలి
ఏలూరు (టూటౌన్): కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవిజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడుతూ ఎంపిక చేసిన న్యాయవాదులకు 5 రోజులపాటు అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ నెల 27 నుండి 31 వరకు మధ్యవర్తిత్వంపై శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు. రాజీయోగ్యమైన కేసులలో ఇరుపక్షాలకు మధ్యవర్తిత్వం నిర్వహించి త్వరితగెత్తిన పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రెండో అదనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని, పర్మినెంటు లోక్ అదాలత్ చైర్పర్సన్ ఏ.మేరీ గ్రేస్ కుమారి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంటు కొనే సీతారాం తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల నిరసన
ఏలూరు (టూటౌన్): వారానికి ఐదు రోజుల పని దినం అమలు చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరులో బ్యాంకు ఉద్యోగుల సమ్మె మంగళవారం జరిగింది. ఆర్ఆర్ పేట శ్రీనివాస్ థియేటర్ రోడ్డులోని యూనియన్ బ్యాంకు ప్రధాన కార్యాలయం వద్ద బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాళే శ్రీనివాసరావు, రీజనల్ సెక్రటరీ విమల్ మాట్లాడుతూ వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలుగా గుర్తించి, శని, ఆదివారాలు సెలవులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు ఏఐటీయూసీ మద్దతు తెలిపింది. శనివారం పూర్తిగా బ్యాంకు ఉద్యోగులకు సెలవు ప్రకటించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకులను ప్రైవేటు పరం చేయడంపై ఉన్న శ్రద్ధ బ్యాంకు ఉద్యోగులపై లేదని విమర్శించారు. బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కె.జె సత్యనారాయణ తదితరులు మద్దతు తెలిపారు. -
వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ
కామవరపుకోట: ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్థి అర్ధరాత్రి చొరబడి వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ చేసిన ఘటన కామవరపుకోట మండలం గుంటుపల్లి పంచాయతీ జీలకర్రగూడెంలో చోటుచేసుకుంది. తడికలపూడి ఎస్సై పి.చెన్నారావు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నల్లూరి ధర్మలింగేశ్వరీ అదే గ్రామంలో రోడ్డు పక్కన పాన్ షాప్ నిర్వహిస్తూ జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమె ఒంటరిగా నివసిస్తున్నట్లు గమనించిన గుర్తు తెలియని వ్యక్తి సోమవారం రాత్రి ఆమె ఇంట్లో వృద్ధురాలి కంట్లో కారం చల్లి మెడలోని బంగారు గొలుసు లాక్కుని పారిపోయాడు. దీంతో బాధితురాలు ధర్మలింగేశ్వరి మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏలూరు క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి వివరాలు సేకరించినట్లు తడికలపూడి ఎస్సై చెన్నారావు తెలిపారు. పెదపాడు: ఇంట్లోని చెత్తను రోడ్డు అవతలి వైపు పారవేసేందుకు వెళ్లిన ఓ వృద్ధురాలు కారు ఢీకొని దుర్మరణం చెందింది. ఈ ఘటన పెదపాడు పోలీసు స్టేషన్ పరిధిలోని తాళ్లమూడిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వీరమాచనేని వెంకటసుబ్బారావు భార్య సీతామహాలక్ష్మి (65) 15 ఏళ్లుగా అప్పనవీడు శివారు తాళ్లమూడిలోని తన కుమార్తె బంటు శివదుర్గ అల్లుడు రమేష్ల ఇంట్లో నివాసం ఉంటోంది. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఇంట్లోని చెత్తను బయట తారురోడ్డులో డివైడర్ ఆవల పోసేందుకు వెళ్లింది. అదే సమయంలో విజయవాడ వైపు నుంచి ఏలూరు వైపు వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై కుమార్తె శివ దుర్గ పెదపాడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై ఆర్ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దేవుని ముందే అశ్లీల నృత్యాలు
ఆగిరిపల్లి: శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం సమయంలో అశ్లీల నృత్యాలు ప్రదర్శించడంపై గ్రామ ప్రజలతో పాటు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి సన్నిధిలోనే అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేయడం ద్వారా పవిత్ర రథోత్సవ గౌరవాన్ని దిగజార్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి సంవత్సరం రథోత్సవం సందర్భంగా కోలాటం, సంప్రదాయ నృత్యాలు, హరికథలు ఆనవాయితీ. సోమవారం ఉదయం జరిగిన రథోత్సవంలో ఈ సంప్రదాయాలకు విరుద్ధంగా అశ్లీల నృత్యాలు వేయించడంతో భక్తులు నివ్వెరపోయారు. దేవుడి దర్శనం కోసం మహిళలు, వృద్ధులు, చిన్నారులు వేచి చూస్తున్న వేళ ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. ఇన్నేళ్ల చరిత్రలో ఇలా ఎప్పుడూ లేదని.. ఇది కొత్త సంప్రదాయమా.. లేక అధికార బలంతో కొత్త సంస్కృతిని తీసుకువచ్చారా అంటూ చర్చ జరుగుతోంది. నిర్వాహకులంతా అధికార పార్టీకి చెందిన టీడీపీ నాయకులే కావడంతో ఇష్టానుసారంగా వ్యవహరించారని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. ఎస్సై శుభశేఖర్ వెంటనే రథోత్సవ ప్రాంగణానికి చేరుకుని అశ్లీల నృత్యాలు వేస్తున్న యువతులను ట్రాక్టర్పై నుంచి కిందకు దించి అక్కడి నుంచి పంపించారు. నిర్వాహకులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆలయ పరిసరాల్లో భక్తుల భావాలను దెబ్బతీసే కార్యక్రమాలు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. -
నారసింహుని కల్యాణోత్సవాలకు వేళాయె
క్షేత్ర విశిష్టత ఇదీ ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాధపురంలోని సుమనోహర సుందరగిరి పర్వతంపై.. శ్రీ కనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. భీష్మ ఏకాదశి పర్వదినం మొదలుగా ఆరు రోజుల పాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అందులో భాగంగా ద్వారకాతిరుమల దేవస్థానం అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం షామియానా, చలువ పందిళ్లు, ప్రత్యేక దర్శనం క్యూలైన్లను నిర్మించారు. విద్యుద్దీప అలంకారాలు, ఇతర పనులు తుది దశకు చేరుకున్నాయి. ఉత్సవాలు జరిగే రోజుల్లో రాత్రి 7 గంటల నుంచి ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే ఆహ్లాదకర వాతావరణంలో, పురాణ ప్రాశస్త్యం గల ఈ ఆలయాన్ని దర్శిస్తే కోరిన కోర్కెలు తీరి, సకల శుభాలు కలుగుతాయన్నది భక్తుల నమ్మకం. అందుకే ఏకాదశి వంటి పర్వదినాల్లో వేలాదిగా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. చిన వెంకన్న దేవస్థానం ప్రతి ఏటా స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. మతంగి మహర్షి తపస్సు ఫలితంగా ఈ సుందరగిరి పర్వతంపై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు స్వయంభూగా, శాలిగ్రామ రూపంలో వెలిశారు. ఇప్పటికీ మతంగి మహర్షి సర్ప రూపంలో స్వామి వారిని నిత్యం సేవిస్తారని ప్రసిద్ధి. ఆలయం వెనుక ఎన్నో ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న పుట్ట ఇందుకు సాక్ష్యమని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఉగ్ర రూపంలో ఉన్న స్వామివారిని శాంతింప జేసేందుకు 1995లో తమిళనాడుకు చెందిన శ్రీధర్ గురూజీ, హైదరాబాద్కు చెందిన ఆయన ప్రధాన శిష్యులు కొచ్చెర్లకోట నరసింహ గురూజీలు ఆలయ ఆవరణలో కనకవల్లీ దేవి అమ్మవారి విగ్రహాన్ని, అలాగే అష్ట దిక్కులలో 8 మండపాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఏ ఆలయంలోను లేనటువంటి ఏకాక్షరి గణపతి, కాలభైరవుడు, సర్ప వెంకటేశ్వరుడు, చింతామణి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయుడు, నవగ్రహాలు, అలాగే ఆలయ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారు ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రతి ఏటా మహా శివరాత్రి పర్వదినం నాడు కొచ్చర్లకోట సత్యవెంకట నరసింహ గురూజీ ఆధ్వర్యంలో మహా సుదర్శన యాగాన్ని పెద్ద ఎత్తున జరుపుతున్నారు. అందులో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నారు. రేపటి నుంచి ఐఎస్ జగన్నాధపురంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణోత్సవాలు ప్రారంభం 6 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు 31న స్వామివారి కల్యాణం తుది దశకు ఏర్పాట్లు -
వైఎస్సార్సీపీబలోపేతమే లక్ష్యం
కల్తీ విత్తనాలతో నష్టం కల్తీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయామని కొయ్యలగూడెం మండలం పొంగుటూరు, గవరవరం గ్రామాల సమీపంలో మొక్కజొన్న రైతులు గగ్గోలు పెడుతున్నారు. 8లో uచింతలపూడి: వైఎస్సార్సీపీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జ్ కంభం విజయరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జెట్టి గురునాథరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి కార్యకర్తలే బలమని, వారి కృషితోనే పార్టీ ఎప్పుడూ పటిష్టంగా ఉందని కొనియాడారు. త్వరలోనే గ్రామ, వార్డు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని, నిబద్ధతతో పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని వివరించారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనపై నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు, ఎంపీపీ బి.రాంబాబు నాయక్, జెడ్పీటీసీ ఎం.నీరజా సుధాకర్, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, నాయకులు ఎస్.రమేష్రెడ్డి, ఎ.శాంతారావు, ఓరుగంటి నాగేంద్ర కుమార్, గుప్తా, బొడ్డు వెంకటేశ్వరరావు, సీహెచ్ జ్ఞానారెడ్డి, మల్నీడి బాబి, గోలి చంద్రశేఖర్రెడ్డి, ఎ.సుబ్బారావు, మట్టా సురేష్, మందలపు సాయిబాబు, బీవీఆర్ చౌదరి, ముప్పిడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీ సీట్ల పెంపు అంశం ప్రస్తావించాలి
ఏలూరు (టూటౌన్): ఈనెల 28వ తేదీ నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ పునర్విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంపు అంశం ప్రస్తావించాలని, తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్ పొలిమేర హరికృష్ణ డిమాండ్ చేశారు స్థానిక సంఘ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ విభజన చట్టంలో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పదేళ్ల లోపు పెంచుకోవచ్చని పేర్కొనబడిందని, ఇప్పటికి 12 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించాలన్నారు, 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల సమయానికి ఏపీలో 225, తెలంగాణలో 153 సీట్లకు ఎన్నికలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలను, వివిధ రాజకీయ పార్టీల పెద్దలను కోరుతున్నట్లు హరికృష్ణ చెప్పారు, ఈ సమావేశంలో సమితి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. -
వెనుకబడిన రిక్షా చక్రం
● ఆటోల జోరుతో అగమ్యగోచరంగా రిక్షా కార్మికుల జీవనం ● ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు చింతలపూడి: ఒకప్పుడు ఊరిలో అయినా, పట్టణంలో అయినా సామాన్యుడి రాజవాహనం రిక్షా రైలు దిగినా, బస్సు దిగినా ప్రయాణికులు ముందుగా వెతికేది రిక్షా కార్మికుల కోసమే. కానీ కాలక్రమేణా మారుతున్న రవాణా రంగం, పెరిగిన సాంకేతికత ఆ పేద కార్మికుల పొట్ట కొడుతోంది. వేగంగా దూసుకెళ్తున్న ఆటోలు, క్యాబ్ ల మధ్య రిక్షా చక్రం వెనకబడిపోతోంది. అప్పట్లో గిరాకీ.. ఇప్పుడు నిరీక్షణ! రెండు దశాబ్దాల క్రితం వరకు రిక్షా కార్మికులకు చేతినిండా పని ఉండేది. సినిమా హాల్స్, మార్కెట్లు, పాఠశాలలకు వెళ్లేవారు రిక్షాలనే ఆశ్రయించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి తలకిందులైంది. ప్రతి గల్లీలోనూ ఆటోలు అందుబాటులోకి రావడంతో రిక్షా ఎక్కేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ప్రజలు వేగానికి అలవాటు పడటంతో, నెమ్మదిగా వెళ్లే రిక్షాల కంటే ఆటోలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనివల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసినా కనీసం వంద రూపాయల సంపాదన కూడా రావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో గతంలో వందల సంఖ్యలో ఉండే రిక్షా లు నేడు పదుల సంఖ్యకు చేరుకున్నాయి. ముదిరిన వయసు.. తీరని కష్టం రిక్షా తొక్కడం అనేది శారీరక శ్రమతో కూడిన పని. ప్రస్తుతం ఈ రంగంలో ఉన్నవారిలో ఎక్కువ శాతం 50 ఏళ్లు పైబడిన వారే. వేరే పనులు చేయలేక, కుటుంబ పోషణ కోసం వయసు పైబడినప్పటికీ ఎండనక, వాననక కష్టపడుతున్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో పోల్చితే వారి సంపాదన కనీసం ఒక్క పూట గడవడానికి కూడా సరిపోవడం లేదు. దుర్భర స్థితిలో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని రిక్షా కార్మికులు కోరుతున్నారు. -
దేశానికి దిక్సూచి రాజ్యాంగం
భీమవరం: భారత రాజ్యాంగం దేశానికి దిక్సూ చి అని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు అన్నారు. సోమవారం స్థానిక బీఆర్ అంబేడ్కర్ భవనంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు రచించిన భారత రాజ్యాంగం (సంక్షిప్తంగా) అనే పుస్తకాన్ని మోషేన్రాజు, బాలల కోసం భారత రాజ్యాంగం ప్రవేశిక అనే పుస్తకాన్ని ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి ఆవిష్కరించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి మోషేన్ రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.క్రాంతికుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మోషేన్రాజు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని సరళంగా, సామాన్యులకు అర్థమయ్యే రీతిలో సంక్షిప్తంగా రాసిన లక్ష్మణరావును అభినందించారు. దేశంలో విభి న్న జాతులు, సంస్కృతులు ఉన్నా అందరూ ఐక్యంగా ఉన్నారంటే అది రాజ్యాంగం గొప్పతనమన్నారు. పుస్తక రచయిత కేఎస్ లక్ష్మణ రావు, మంతెన సీతారాం, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, టి.సురేష్, పీఎస్ విజయరామరాజు, బి.వాసుదేవరావు, కె.క్రాంతిబాబు, జె.రామలక్ష్మణరావు, మల్లుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నూజివీడు: మండలంలోని కొత్త రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావును రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్లో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నుంచి పురస్కారం అందుకున్నారు. ఉత్తమ పంచాయతీగా కొత్త రావిచర్ల, ఉత్తమ సర్పంచ్గా కాపా శ్రీనివాసరావు ఎంపిక కావడంతో ఆయనకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. ఢిల్లీలో ఆయన్ను సత్కరించి మహాత్మాగాంధీ 150వ జయంతి పురస్కారాన్ని అందజేశారు. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం దిశగా అంకితభావంతో పనిచేస్తున్న వారికి ఇచ్చే ఈ పురస్కారం శ్రీనివాసరావుకు దక్కడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజధానిలో పురస్కారం అందుకోవడం మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందన్నారు. తన బాధ్యత మరింత పె రిగిందని, కొత్త రావిచర్ల అభివృద్ధికి, ప్రజల సే వకు నిరంతరం కట్టుబడి ఉంటానని అన్నారు. ఏలూరు టౌన్: అమరావతిలో జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్.సుస్మితకు అరుదైన అవకాశం లభించింది. పోలీస్ పరేడ్లో ఆమె సారథ్యం వహిస్తూ కమాండెంట్గా వ్యవహరించారు. ఐపీఎస్ అధికారిగా శిక్షణా కాలంలోనూ ఆమె కమాండెంట్గా ప్రతిభ చాటుకోగా తాజాగా మరోసారి కవాతులో నాయకత్వం వహిస్తూ ఉన్నతాధికారుల అభినందనలు అందుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, డీజీపీ హెచ్కే గుప్తా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు. భీమవరం (ప్రకాశంచౌక్): అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా ఈనెల 28, 29వ తేదీల్లో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్వీఆర్ ప్రసాద్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి ఆయా బస్స్టేషన్ల నుంచి ప్రతి 30 నిమిషాలకు బస్సు ఉంటుందన్నారు. భీమవరం నుంచి 20, నరసాపురం నుంచి 5, పాలకొల్లు నుంచి 20, మ చిలీపట్నం నుంచి 5 ప్రత్యేక బస్సులు నడుపు తున్నామన్నారు. అలాగే భక్తుల సౌకర్యార్థం దిండి–చించినాడ బ్రిడ్జిపై ఆర్టీసీ బస్సుల రాకపోకలకు అనుమతిచ్చారన్నారు. -
సగర్వం.. గణతంత్రం
రైల్వే కాలనీలో చోరీ భీమవరం రైల్వే కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు 13 కాసుల బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నట్టు తెలిసింది. 8లో u● ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు ● అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ● ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని వై భవంగా నిర్వహించారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి జా తీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కలెక్టర్ మా ట్లాడుతూ జిల్లాను అన్నిరంగాల్లో ప్రగతి పథంలో నిలిపేందుకు అందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. పేదరికం లేని సమాజం కోసం జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. పోలీసు శాఖకు చెందిన 8 విభాగాల కంటింజెంట్లు పరేడ్ కమాండర్ ఆర్మ్డ్ పోలీస్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ జీఎస్పీ పవన్కుమార్ సారథ్యంలో గౌరవ వందనం సమ ర్పించారు. ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందించారు. జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్, జేసీ ఎంజే అభిషేక్ గౌడ, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, జె డ్పీ సీఈఓ కె.సుబ్బారావు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, తహసీల్దార్ గాయత్రి, సెట్వెల్ సీఈఓ కె.ప్రభాకరరావు, డీఎస్డీఓ అజీబ్ తదితరులు పాల్గొన్నారు. భళా.. సాంస్కృతిక హేల గణతంత్ర వేడుకల్లో జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నూజివీడుకు చెందిన త్రివిధ హైస్కూల్ విద్యార్థుల ప్రదర్శనకు ప్రథమ, బుట్టాయ గూడెం మండలం తెల్లంవారిగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల ప్రదర్శనకు ద్వితీయ, రెడ్డి చిన్నవెంకన్న శిష్య బృందం వందే మా తరం కర్ర సాము విన్యాసాలకు తృతీయ బ హుమతి లభించాయి. ఆయా బృందాలకు కలెక్టర్, ఎస్పీ మెమెంటోలు అందించారు. శకటాలు.. స్టాల్స్ ప్రదర్శనలు : ప్రభుత్వ శాఖల శకటాలు, స్టాల్స్ ఆకట్టుకున్నాయి. విద్యాశాఖ శకటానికి ప్రథమ, ఐటీడీఏ (కేఆర్పురం) శకటానికి ద్వితీయ, గృహ నిర్మాణ శాఖ శకటానికి తృతీయ బహుమతి లభించింది. వీటికి సంబంధించి జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, ఐటీడీఏ అధికారులు, హౌసింగ్ పీడీ సత్యనారాయణకు కలెక్టర్ బహుమతులు అందించారు. ఉద్యాన శాఖ స్టాల్కు ప్రథమ, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ (ఐసీడీఎస్) స్టాల్కు ద్వితీయ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) స్టాల్కు తృతీయ బహుమతి లభించింది. కలెక్టర్ స్టాల్స్ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
రాజ్యాంగ విలువలు పరిరక్షించాలి
ఏలూరు టౌన్: దేశ రాజ్యాంగ విలువలకు ప్రాముఖ్యత ఇస్తూ ప్రజాసేవలో పోలీసుల పాత్ర కీలకమైందని, దేశ సమైక్యతకు ప్రతిఒక్కరూ పాటుపడాలని ఏలూ రు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. సో మవారం ఏలూరు రేంజ్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యాన్ని స్థాపించి ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం అందించిన గొప్ప రాజ్యాంగం మన సొంతం అన్నారు. అలాగే ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ కేపీ శివకిషోర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశ అభివృద్ధికి, సమగ్రతకు, శాంతియుత జీవనానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఏఆర్ ప్రధాన కార్యాలయంలో ఏ ఆర్ అదనపు ఎస్పీ జి.మునిరాజా జెండా వందనం చేశారు. ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, ఆర్ఐలు పవన్కుమార్, సతీష్ ఉన్నారు. -
శోభాయమానం.. శోభనాచలుని రథోత్సవం
ఆగిరిపల్లి: ఆగిరిపల్లిలో శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం సోమవారం నేత్రపర్వంగా జరిగింది. ఆదివారం అర్ధరాత్రి స్వామివారి కల్యాణ మండపంలో నృసింహస్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం నూతన వధూవరులను విశేష పుష్పాలతో అలంకరించిన రథంపై ఆశీనులు గావించగా.. మంత్రి పార్థసారథి ప్రత్యేక పూ జలుచేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. కల్యాణ మండపం మీదుగా దమ్మన్న మండపం, వెంకటాచల మండపం, పొగడ చెట్ల మండపం మధ్య ఉన్న నాలుగు వీధుల నడుమ రథోత్సవం సాగింది. అధిక సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. కోలాట నృత్యాలు, బుట్టబొమ్మల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో రథం ముందుకు సాగింది. పొన్నం వెంకట లక్ష్మణరావు సో దరులు రథాన్ని అలంకరించగా అద్దంకి శివ సత్యనారాయణ బృందం రథసారథులుగా వ్యవహరించారు. ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంతకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈఓ సాయి ఏర్పాట్లను పర్యవేక్షించారు. తహసీల్దార్ ప్రసాద్, ఎస్సై శుభశేఖర్, పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. -
మాటేసి.. మట్టుబెడుతూ..
కొనసాగుతున్న పులి దాడులు కొయ్యలగూడెం: పెద్దపులి సంచారం ప్రజల్లో కునుకు లేకుండా చేస్తోంది. రెండు రోజులుగా మండలంలోని మర్రిగూడెం, బిల్లిమిల్లి గ్రామాల మధ్య సంచరిస్తున్న పెద్దపులి మూడో రోజు కూడా అదే ప్రాంతాల మధ్య తిష్ట వేసిందని అటవీ శాఖ అధికారులు సోమ వారం తెలిపారు. పెద్దపులి సంచరించిన ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను అమర్చుతూ దాని ఉనికిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రెండు గ్రామాల మధ్య ఉన్న మందపాటి చెరువులో పులి అడుగుజాడలు గుర్తించామన్నారు. కాగా రెండు రోజుల క్రితం దాడి చేసి చంపిన ఆవు, గేదల్లో ఆవును పెద్ద పులి ఆదివారం రాత్రి కొంతమేర ఈడ్చుకుపోయి తినేసిందన్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం రీత్యా పెద్దపులిని వలల్లో బంధించడం లేదా పెద్దపులి తిరిగి అభయారణ్యంలోకి వెళ్లేలా చేయటమే తమ విధి అని అధికారులు చెబుతున్నారు. అప్పటివరకు పెద్దపులి బారి నుంచి ప్రజలను, పశువులను కాపాడడం మి నహా తాము చేయగలిగింది ఏమీ లేదని అన్నారు. -
వెళ్లి రావమ్మా.. గంగానమ్మ
పవర్పేటలో శక్తివేషాల ప్రదర్శన ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు నగరం జనసాగరాన్ని తలపించింది. మూడు నెలల పాటు విశేష పూజలందుకున్న నగర ఇలవేల్పు, కొంగు బంగారం గంగానమ్మవారి జాతరలో భాగంగా సోమ వారం భారీ ఊరేగింపులు జరిగాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మేడల వద్ద అమ్మవార్లకు నైవేద్యాలు, చీరలు, రవికలు, పసుపు, కుంకుమలను భక్తులు సమర్పించారు. ఏడేళ్లకోసారి.. ఏడేళ్లకోసారి (పుట్టింటికి) నగరానికి విచ్చేసే అమ్మవారు పూజలు అందుకుని సోమవారం నగరాన్ని వీడుతుండగా ప్రజలు భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. నగరంలోని తూర్పువీధి, దక్షిణపు వీధి, లక్ష్మీవారపుపేట, పవర్పేట, ఆదివారపుపేట ప్రాంతాల్లో కొలుపులు అందుకున్న అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగించారు. కాగా నగరంలోని పడమరవీధి, తంగెళ్లమూడి ప్రాంతాల్లో కొలుపులు కొనసాగుతున్నాయి. పడమరవీధిలో అమ్మవారికి వచ్చేనెల 1న, తంగెళ్లమూడిలో అమ్మవారికి 8న నైవేద్యాలు సమర్పించనున్నారు. కొర్లబండ్లపై ఊరేగింపులు అమ్మవార్ల ఊరేగింపును అత్యంత పవిత్ర కార్యంగా భక్తులు భావిస్తారు. ఒకే వేప చెట్టు నుంచి తీసిన కలపతో కొర్లబండిని తయారుచేయించి పంబలవారి రూపంలో అమ్మవారిని కూర్చోబెట్టి యాత్ర ప్రారంభించారు. యాత్రలో అమ్మవారి అక్కాచెల్లెళ్లు కూడా వచ్చి చేరి కాలక్షేపం చేస్తారనే నమ్మకంతో వారి కోసం ప్రత్యేకంగా పీటలు, కోలాటం కర్రలు కూడా ఏర్పాటుచేశారు. దారి పొడవునా.. కొర్లబండ్లపై అమ్మవార్ల ఊరేగింపు ప్రారంభమైనప్పటి నుంచి ఊరి పొలిమేరల వరకూ సాగనంపేందుకు భక్తులు పోటెత్తారు. దారి పొడవునా భక్తులు నీరాజనాలు అర్పించారు. దారులన్నీ జనాలతో నిండిపోయాయి. ఊరేగింపును తి లకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అమ్మవార్ల ఊరేగింపులో డీజేలు, బాణసంచా కా ల్పులు, శక్తివేషాలు, కోలాటాలు ప్రత్యేకంగా నిలి చాయి. ఆయా ప్రాంతాల్లో నిర్దేశించిన రూట్ మ్యాప్ల మీదుగా ఊరేగింపులు జరిగాయి. ఎటువంటి అ వాంఛనీయ సంఘటనలు జరగకుండా 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్లతో నిరంతరం నిఘా పెట్టారు. ఎక్కడా ట్రా ఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు.ఏలూరులో జన జాతర నగర ప్రజల ఘన వీడ్కోలు అడుగడుగునా నీరాజనం కొర్లబండ్లపై భారీ ఊరేగింపులు ఐదు ప్రాంతాల్లో జాతర సందడి -
కన్నాపురం సమీపంలో అక్రమ తవ్వకాలు
కొయ్యలగూడెం: పుడమి తల్లికి అక్రమార్కులు చిచ్చు పెడుతున్నారు. కన్నాపురం సమీపంలో గతకొద్ది రోజుల నుంచి సాగునీటి చెరువులో మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. జెడ్పీ హైస్కూల్కు వెనుక ఉన్న చెరువులో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జేసీబీని ఏర్పాటు చేసి ట్రక్కుల్లో తరలిస్తున్నాడు. రాత్రి వేళల్లో కొనసాగుతున్న మట్టి తరలింపు అడ్డుకోవడంలో ఇరిగేషన్ శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. అక్రమ మట్టి తోలకాలు నిరోధించాల్సిన ప్రభుత్వ శాఖలోని అధికారులు పట్టించుకోవడం లేదు. పులి సంచరిస్తున్న ప్రదేశం వద్దనే చెరువులలోని మట్టి తోలకాలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. సరిహద్దులను దాటించి టిప్పర్లు, ట్రక్కులలో మట్టిని తరలిస్తున్నారు. రావిగూడెం సమీపంలోని దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన జేసీబీ, టిప్పర్లు కలిగిన వ్యక్తులు కొద్ది రోజుల నుంచి కాలువ గట్టు మట్టిని కొయ్యలగూడెం మండలంలోని పలు గ్రామాలకు తరలిస్తున్నారని గిరిజనులు ఆరోపించారు. -
అభయారణ్యంలో అద్భుత వీక్షణం
● జంతువుల కదలికలు గుర్తించే ట్రాప్ కెమెరా ● జంతువులు కెమెరా ముందుకొస్తే ఆటోమెటిక్గా చిత్రాలు బుట్టాయగూడెం: అభయారణ్యాల్లో జంతువుల కదలికలు, సంరక్షణ, లెక్కింపు కోసం అటవీశాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు ఉపయోగిస్తారు. ఈ కెమెరా ఏర్పాటు చేసిన పరిసర ప్రాంతంలో ఏదైనా జంతువు, మనుషుల కదలికలు, ఉష్ణోగ్రతలో మార్పు జరిగినప్పుడు మోషన్ సెన్సార్ ద్వారా ఆటోమెటిక్గా ఫొటోలు, వీడియోలు తీస్తుంది. జంతువులు తాగునీటి కోసం వచ్చే ప్రదేశాలను గుర్తించి అక్కడికి దగ్గరగా ఉన్న చెట్లకు ట్రాప్ కెమెరాలను అమరుస్తారు. పగలు, రాత్రి వేళల్లో అక్కడికి వచ్చే జంతువులు కెమెరా ముందుకు వెళ్తే ఆటోమెటిక్గా చిత్రాలు తీస్తాయి. గ్రామాల్లో సంచరిస్తూ ఆవులు, గేదెలపై దాడి చేస్తే జంతువులను ఈ ట్రాప్ కెమెరా ద్వారా గుర్తిస్తారు. గత ఐదురోజులు గిరిజన ప్రాంతంలోని గ్రామాల్లో ప్రజలను, ఫారెస్టు అధికారులు కంటి మీద కునుకు లేకుండా చేసి సుమారు ఆవులు, గేదెలపై దాడి చేసి చంపిన పెద్దపులిని ఈ ట్రాప్ కెమెరానే స్పష్టమైన ఫొటోలు తీసింది. ట్రాప్ కెమెరాతో గుర్తింపు పాపికొండల అభయారణ్యం ఏలూరు జిల్లాలోని బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలతోపాటు పోలవరం జిల్లాలోని దేవీపట్నం, వీఆర్పురం, చింతూరు మండలాలను కలిపి సుమారు 1,012.85 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఈ పాపికొండల అభయారణ్యంలో పులులు, చిరుతలతోపాటు అరుదైన పక్షులు, విలువైన వృక్ష సంపద ఉంది. ఈ అభయారణ్యంలో ప్రతి నాలుగేళ్లకొకసారి ట్రాప్ కెమెరాల ద్వారానే జంతుగణన నిర్వహిస్తారు. 2018, 2022లో జంతుగణన నిర్వహించారు. ఆ సమయంలో 116 ప్రాంతాల్లో 2,032 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి సర్వే చేశారు. ఈ సర్వేలో అన్ని రకాల జంతువులు ట్రాప్ కెమెరాకు చిక్కాయి. ప్రస్తుతం జంతుగణన జరుగుతున్న నేపథ్యంలో మొత్తం 130 ప్రాంతాల్లో 300కుపైగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి జంతుగణన చేయనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. బుట్టాయగూడెం మండలం నాగులగూడెం సమీపంలో ట్రాప్ కెమెరాకు చిక్కిన పెద్ద పులి జంతువులను గుర్తించేందుకు చెట్టుకొమ్మకు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరా -
సొసైటీ ఉద్యోగి ఆత్మహత్య
ద్వారకాతిరుమల: స్థానిక శ్రీ వేంకటేశ్వర విశాల సహకార సంఘం (సొసైటీ) పెట్రోల్ బంకులో గుమస్తాగా పనిచేస్తున్న బాలిన వెంకటేశ్వరరావు(అంజిబాబు) (56) సోమవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య, కుటుంబ సభ్యులు సొసైటీ యాజమాన్యం వేధింపులే అంజిబాబు మృతికి కారణమని ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసుస్టేషన్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. స్థానికుల కథనం ప్రకారం. అంజిబాబు గత 11 ఏళ్ల నుంచి పెట్రోల్ బంకులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. భార్య నాగలక్ష్మి శ్రీవారి దేవస్థానంలో ఎన్ఎంఆర్గా పనిచేస్తోంది. గతేడాది నవంబర్ నెలలో సొసైటీ బంకులోకి ఆయిల్ ట్యాంకర్ వచ్చింది. సిబ్బంది పొరపాటున పవర్ పెట్రోల్ ట్యాంకులో డీజిల్ను నింపారు. దాంతో సుమారు 4,500 లీటర్లకు పైగా డీజిల్ పెట్రోల్లో కలిసింది. సొసైటీకి సుమారు రూ.10 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని అంజిబాబుకు డిసెంబర్ నెలలో షోకాజ్ నోటీసు జారీ చేశారు. ట్యాంకర్ సిబ్బంది తప్పిదమే దీనికి కారణమని, తనకు సంబంధం లేదని అంజిబాబు ఆ నోటీసుకు బదులిచ్చాడు. ఈ విషయంలో అంజిబాబు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ఆదివారం రాత్రి 10.30 గంటల వరకు స్నేహితులతో గడిపిన అనంతరం ఆయన ఇంటికి వెళ్లాడు. రాత్రి సుమారు 2 గంటల సమయంలో బయటకు వచ్చిన అంజిబాబు సొసైటీ పెట్రోల్ బంకుకు వెళ్లి అక్కడి సిబ్బందికి తాళాలు అప్పగించాడు. సిబ్బంది ప్రశ్నించగా ‘నేను వెళ్లిపోతున్నాను.. మీరు ఇబ్బంది పడకూడదు కదా’ అని బదులిచ్చాడు. ఎక్కడికి వెళుతున్నావని సిబ్బంది అడుగగా బయటకు వెళుతున్నానని చెప్పి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో లింగయ్య చెరువు గట్టుపైన షెడ్డులో దూలానికి వేలాడుతున్న అంజిబాబు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్సై టి.సుధీర్ సిబ్బందితో కలసి ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇబ్బంది పెట్టడం వల్లే.. తన భర్త సొసైటీలో దెబ్బతినడం ఇది రెండోసారని మృతుడి భార్య నాగలక్ష్మి అన్నారు. గతంలో 14 ఏళ్లు ఉద్యోగం ఇవ్వకుండా వేధించారన్నారు. అంజిబాబు కుటుంబానికి సొసైటీ యాజమాన్యం న్యాయం చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. సొసైటీ చైర్మన్ స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. చైర్మన్ అందుబాటులో లేరని సొసైటీ కార్యదర్శి చెప్పడంతో, ఆయన వచ్చే వరకు మృతదేహాన్ని ఇంటి వద్దే ఉంచుతామన్నారు. కొందరు పెద్దలు న్యాయం జరిగేలా చూస్తామని నచ్చజెప్పడంతో మృత దేహాన్ని ఖననం చేసేందుకు ఒప్పుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు -
భీమవరం రైల్వే కాలనీలో చోరీ
భీమవరం: భీమవరం వన్టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఇంటి తలుపుల తాళాలు బద్ధలు కొట్టి బీరువాలోని సుమారు 13 కాసుల బంగారు అభరణాలు, దాదాపు 30 వేల నగదు దోచుకున్నట్లు తెలిసింది. ఆదివారం రాత్రి భర్త విధి నిర్వహణకు వెళ్లగా భార్య అత్తిలి మండలంలోని పుట్టింటికి వెళ్లింది. సోమవరం ఉదయం భార్య ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురైనట్లు గుర్తించి వన్టౌన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసు విచారణ చేస్తున్నారు. పెనుగొండ: వడలిలో ఒకే రోజు మూడు ఆలయాల్లో దొంగతనానికి పాల్పడిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. పెనుగొండ సీఐ ఆర్.విజయకుమార్, ఆచంట ఎస్సై వెంకట రమణ ప్రత్యేక టీంగా ఏర్పడి దర్యాప్తు చేయగా బొమ్మూరుకు చెందిన ప్రగడ నాగ శివ, యర్రవరం గ్రామానికి చెందిన ఆచంట శివ పద్మనాభంలను సోమవారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.4,350 నగదుతో పాటు మోటర్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. -
దివ్య తేజోమయ.. ధన్యోస్మి
● సూర్య, చంద్ర ప్రభ వాహనాలపై మెరిసిన శ్రీవారు ● చిన వెంకన్న ఆలయంలో వైభవంగా రథసప్తమి వేడుకలు ద్వారకాతిరుమల: చిన్న తిరుపతిగా పేరొందిన ద్వారకాతిరుమల దివ్య క్షేత్రంలో రథసప్తమి వేడుకలు ఆదివారం కన్నులపండువగా జరిగాయి. సూర్య జయంతిని పురస్కరించుకుని శ్రీవారు ఉదయం సూర్య ప్రభ, రాత్రి చంద్ర ప్రభ వాహనాలపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తకోటికి కనువిందు చేశారు. తేజోవిరాజితుడైన స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని వీక్షించిన భక్తులు పునీతమయ్యారు. ఉదయం ఆలయంలో శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సూర్య ప్రభ వాహనంపై ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. ఆ తరువాత విశేష పూజాధికాలు నిర్వహించి, హారతులిచ్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ స్వామివారి వాహనం ప్రధాన రాజగోపురం మీదుగా తిరువీధులకు పయనమయ్యింది. అశ్వ, గజ సేవలు, కోలాట నృత్యాల నడుమ తిరువీధుల్లో సూర్యప్రభ వాహనంపై దేదీప్యమానంగా వెలుగొందిన స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించి, తరించారు. ఈ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే సూర్యదేవుని అనుగ్రహంతో సకల విద్యా, ఆరోగ్య, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు తెలిపారు. అలాగే రాత్రి చంద్ర ప్రభ వాహనంపై స్వామివారి తిరువీధి సేవ క్షేత్రంలో నేత్రపర్వంగా జరిగింది. చంద్ర కిరణాల వెలుగుల్లో, చల్లని గాలుల నడుమ అట్టహాసంగా తిరువీధుల్లో దర్శనమిచ్చిన శ్రీవారు, అమ్మవార్లను అధిక సంఖ్యలో భక్తులు దర్శించి, పరవశించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఏఈఓ పి.నటరాజారావు, సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్ పర్యవేక్షించారు. -
చైన్ స్నాచింగ్ కేసుల్లో ఇద్దరి అరెస్ట్
జంగారెడ్డిగూడెం: వృద్ధ మహిళలను టార్గెట్ చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. లక్కవరం ఎస్సై షేక్ జబీర్ తెలిపిన వివరాలు ఇవి. గతేడాది సెప్టెంబర్లో జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం గ్రామ శివారు పొలాల్లో పాకనాటి సావిత్రి అనే వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు దోపిడీ చేసిన కేసులో, అలాగే జీలుగుమిల్లి పోలీస్స్టేషన్ పరిధిలో మరో మహిళ చెవిదుద్దులు దోపిడీ చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. ఈ రెండు కేసుల్లోనూ జంగారెడ్డిగూడెంకు చెందిన భీమడోలు నాగ ఫణీంద్ర, బోర నరేంద్రలను నిందితులుగా గుర్తించి వారి నుంచి సుమారు రూ.3 లక్షలకు పైగా విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. కేసు ఛేదనలో కృషి చేసిన క్రైంపార్టీ ఏఎస్సై ఎన్వీ సంపత్కుమార్, కానిస్టేబుళ్లు రమేష్, షాన్బాబు, లక్కవరం ఏఎస్సై భాస్కర్, కానిస్టేబుళ్లకు రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్లు చెప్పారు. -
మళ్లీ పంజా విసిరిన పెద్ద పులి
బుట్టాయగూడెం: పెద్దపులి మళ్లీ పంజా విసిరింది. ఆదివారం వేకువజామున బుట్టాయగూడెం మండలం రావిగూడెంకు చెందిన తెల్లం వెంకటేష్ అనే గిరిజనుడికి చెందిన గేదె దూడపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. దీనితో సుమారు 9 పశువులపై ఇప్పటివరకూ పులి దాడి చేసి చంపింది. పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు వేస్తున్న వ్యూహాలకు, అంచనాలకి చిక్కకుండా పెద్దపులి సంచరిస్తోంది. వాస్తవానికి గుర్రప్పగూడెం, మెట్టగూడెం, కోటనాగవరం గ్రామాల్లో గేదెలపై, ఆవులపై దాడి చేసిన పెద్దపులి మళ్లీ అదే ప్రాంతానికి వస్తుందని భావించిన ఫారెస్ట్, పాపికొండల అభయారణ్యం వైల్డ్లైఫ్ సిబ్బంది సుమారు 20 ట్రాప్కెమెరాల వరకూ రాత్రంతా ఏర్పాటు చేశారు. అయితే వారు ఊహించిన దానికి భిన్నంగా పెద్దపులి కంసాలికుంట మీదుగా అల్లికాల్వ దాటుకుంటూ రావిగూడెం చేరుకుని అక్కడి నుంచి బిల్లిమిల్లి మీదుగా దిప్పకాయలపాడు చేరుకుంది. పెద్దపులి ఎప్పుడైనా తాను పర్యటించిన ప్రాంతాల్లోనే మళ్లీ పర్యటించే అవకాశం ఉంటుందని భావిస్తున్న తమకు అంతు చిక్కకుండా పెద్దపులి సంచరిస్తుందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. గిరిజన గ్రామాల ప్రజలను అల్లాడిస్తున్న పెద్దపులిని పట్టుకుని ఈ ప్రాంత ప్రజలను భయాందోళన నుంచి బయటపడేయాలని రావిగూడెం గ్రామస్తులు కోరుతున్నారు. -
ఆస్తి వివాదంలో వ్యక్తిపై దాడి
ముసునూరు: అధికార పార్టీ వత్తాసుతో ముప్ఫై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూయజమానిపై దాడికి పాల్పడి గాయపరిచిన ఘటన ముసునూరు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని చింతలవల్లి గ్రామంలో బొద్దు కోళ్ళ సుందరరావు తల్లి పేరున డి–ఫారమ్ పట్టా భూమి మంజూరైంది. ఆ భూమిలో సుందరరావు కుటుంబ సభ్యులు సాగు చేసుకుంటున్నారు. అదే గ్రామానికి చెందిన మందపాటి బెనర్జీ, అతని కుమారులు సురేష్, కిషోర్లు భూమి తమదంటూ పదే పదే బెదిరింపులకు దిగి, రెండేళ్ల క్రితం పత్తి పంటను నరికి వేశారు. ఈ నేపథ్యంలో శనివారం బెనర్జీ కుటుంబం, ఏఎస్సై బేగ్, మహిళా పోలీసులు, సిబ్బంది, సర్వేయర్లతో కలిసి అక్కడకు వచ్చి భూమి కొలతలు అంటూ రాళ్లు పాతే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది మా పట్టాభూమి అని సుందరరావు కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీంతో పోలీసుల సమక్షంలోనే బెనర్జీ అతని కుమారులు సుందరరావు కుటుంబ సభ్యులపై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. సుందరరావు కుమారుడి సాయంతో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. పోలీసుల సమక్షంలోనే దాడి చేస్తున్నా వారు ప్రేక్షక పాత్ర వహించడంపై బాధితులు, గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెనుమంట్ర: మోటార్సైకిల్ కారుని ఢీకొన్న ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. మార్టేరు – పెంటపాడు స్టేట్ హైవే రోడ్డుపై ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ఈ హేమంత్ కుమార్(22), ఎస్ బున్ని (22), ఈ.చాణిక్య (11), ఈ.కౌశిక్ (10) మోటార్సైకిల్పై పెనుమంట్రవైపు నుంచి అత్తిలి వైపు వెళ్తుండగా నత్తారామేశ్వరం పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వస్తున్న చిన్న కారును ఢీకొట్టడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను హటాహుటిన తణుకులోని ప్రైవేట్ హాస్పటల్కు తరలించగా చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఏమీ తెలియ రాలేదని పోలీసులు చెబుతున్నారు. -
పోలీసులకు అవార్డులు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్తమ సేవలకు అవార్డులు దక్కాయి. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది డీజీపీ కమెండేషన్ డిస్క్ మెడల్ అవార్డులకు ఎంపికయ్యారు. ఏలూరు జిల్లాలో 10 మంది డీజీపీ కమెండేషన్ డిస్క్ మెడల్స్కు ఎంపికయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వీరంతా మెడల్స్ అందుకుంటారు. ఏలూరు జిల్లా ఎస్బీ సీఐ ఎంవీఎస్ మల్లేశ్వరరావు, కై కలూరు రూరల్ సీఐ వీర రవికుమార్కు డీజీపీ కమెండేషన్ సిల్వర్ మెడల్స్ దక్కాయి. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఐటీ కోర్ టీమ్లో పనిచేస్తున్న ఆర్ఎస్ఐ బాలిబోయిన నరేంద్రకుమార్, జిల్లా పోలీస్ కార్యాలయం డీఏఆర్లో ఏఆర్ ఎస్ఐగా పనిచేస్తున్న ఉప్పులూరి హరిబాబు డీజీపీ కమెండేషన్ బ్రాంజ్ మెడల్కు ఎంపికయ్యారు. ఏలూరు మహిళా స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ తోట శ్రీనివాసరావు, ఏలూరు వన్టౌన్ పోలీస్స్టేషన్ పోలీస్ కానిస్టేబుల్ లంకా మరియరాజు, ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయం ఐటీకోర్ టీమ్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ తోట పార్థసారథి, ఏలూరు మహిళ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పల్లెల మధుసూధన్రావు, ఏలూరు డీఏఆర్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు కొవ్వూరు శేఖర్, కర్రి నాగేంద్రబాబు డీజీపీ కమెండేషన్ బ్రాంజ్ మెడల్స్కు ఎంపికయ్యారు. ఎకై ్సజ్ సీఐ మద్దాలకు కమిషనర్ అవార్డు పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు ఎకై ్సజ్ సీఐ మద్దాల శ్రీనివాస్ కమిషనర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకొల్లు సర్కిల్ పరిధిలో అనేక విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ సమావేశాలు నిర్వహించామని అన్నారు. వరుసగా రెండో ఏడాది ఈ అవార్డు దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు. -
29 నుంచి నారసింహుని కల్యాణోత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన మండలంలోని ఐఎస్.జగన్నాధపురంలో సుందరగిరిపై కొలువైన స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాలు ఈనెల 29న ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను వచ్చేనెల 3 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. 29న ఉదయం 10.15 గంటలకు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా ముస్తాబు చేస్తారు. 30న ఆలయంలో నిత్య పూజలు, హోమాలు, బలిహరణ, నీరాజన మంత్రపుష్పాలు తదితర కార్యక్రమాలు జరుగుతాయి. 31న ఉదయం 11.10 గంటలకు కొండ కింద కల్యాణ మండపంలో దివ్యకల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. వచ్చేనెల 1న సాయంత్రం 6.30 గంటల నుంచి గరుడ వాహనంపై గ్రామోత్సవం, 2న పంచామృతాభిషేకాలు, చందనోత్సవం, పూర్ణాహుతి, రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ వేడుకలు జరుగుతాయి. 3న జరిగే ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీ పుష్ప యాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని ఈఓ తెలిపారు. -
దినకరా.. శుభకరా
● ఘనంగా రథసప్తమి వేడుకలు ● వైభవంగా సూర్యభగవానుడి కల్యాణ వేడుకలుతణుకు అర్బన్: రథసప్తమి సందర్భంగా తణుకులో సూర్యభగవానుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ ఏడాది స్వామివారికి ప్రీతికరమైన రోజు ఆదివారం రావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయం వద్ద క్యూకట్టారు. జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి సైతం భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో తణుకు పట్టణ ప్రాంతమంతా రద్దీగా మారింది. తెల్లవారుజాము 1 గంట నుంచే భక్తులు క్యూలైన్లో ఉన్నారు. ముందుగా ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన అనంతరం సుందరంగా అలంకరించారు. ప్రసిద్ధిగాంచిన ఆలయం కావడంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. కన్నులపండువగా కల్యాణం దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆలయ ధర్మకర్తల మండలి పెద్దల ఆధ్వర్యంలో ఉషా, పద్మిని, ఛాయ, సౌంజ్ఞ సమేత శ్రీసూర్యనారాయణస్వామి కల్యాణాన్ని స్వామివారి కల్యాణ మండపంలో ఉదయం 11.30 గంటల ముహూర్తానికి వేదపండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ గమిని రాము దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కల్యాణ ఘట్టాన్ని జరిపించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు స్వామి, అమ్మవార్ల రథోత్సవాన్ని పురవీధుల్లో నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారికి పుష్పయాగం చేశారు. సుమారుగా 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో ముత్యాల సత్యనారాయణ తెలిపారు. తణుకు పోలీసు అధికారులు తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశారు. స్వామివారి దర్శనం, కల్యాణ ఘట్టాన్ని వీక్షించిన వారందరికీ అన్నసమారాధాన నిర్వహించారు. సూర్యభగవానుడి కల్యాణం సందర్భంగా తణుకు సూర్యదేవాలయానికి వచ్చిన భక్తుల తాకిడికి తణుకు సూర్యాలయం వీధితోపాటు రాష్ట్రపతి రోడ్డు, పిండిమర్ల వీధి, బాబువారి వీధితోపాటు తణుకు ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. -
అసైన్డ్ భూముల ఆక్రమణ
చాట్రాయి: ప్రభుత్వం మాది ఆక్రమించుకునే హక్కు మాదే అన్న రీతిలో ఉంది టీడీపి నాయకుల తీరు. మండలంలోని కొత్తగూడెం శివారు యర్రవారిగూడెం గ్రామంలో 206 సర్వే నంబరులో 2 ఎకరాలు అసైన్డ్ భూమి, 26–1 సర్వే నెంబర్లలో 10.90 ఎకరాల పశువుల బీడు(ప్రభుత్వ భూమి) ఉంది. ఖాళీగా ఉన్న ఈ భూముల్లో స్థానిక టీడీపీ నేతల కన్ను పడింది. దీంతో వారం క్రితం ఆక్రమించుకుని జేసీబీతో చదును చేసి మడులు కట్టి పామాయిల్ మొక్కలు నాటారు. గత ప్రభుత్వంలో ఎస్సీలు సాగు చేసుకుంటున్న భూమిని సైతం లాగేసుకున్నారు. రెండ్రోజుల క్రితం మళ్లీ భూమిని రాత్రి సమయంలో జేసీబీతో చదును చేస్తుండగా బీట్లో ఉన్న పోలీసులు పట్టుకుని స్టేషన్కి తరలించి తహసీల్దార్కి సమచారం ఇచ్చారు. ప్రభుత్వ భూమి ఆక్రమించుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ హెచ్చరిక బోర్డు పెట్టింది. -
ఆయుధ డిపోని అడ్డుకుంటాం
కొయ్యలగూడెం: మండలంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటు అడ్డుకుంటామంటూ పోలవరం, గోపాలపురం నియోజకవర్గాలకు చెందిన రైతులు ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం బోడిగూడెం గ్రామంలో సమావేశంలో పాల్గొని నేవీ డిపో ఏర్పాటుపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎంపీ పుట్టా మహేష్ నేవీ డిపో ఏర్పాటుపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని గ్రామ సభలు నిర్వహించకుండా పంచాయతీల తీర్మానం చేయకుండా డిపో ఏర్పాటుపై ప్రకటనలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టు పనులు దక్కించుకోవడం కోసం దళారుల వ్యవస్థ తయారయిందని దీంతో ఎంపీకి తప్పుడు సమాచారం అందించారని రైతులు ఆరోపించారు. నూటికి 10 మంది రైతులు కూడా నేవీ ఆయుధ డిపోకు సుముఖంగా లేరన్నారు. ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులు మాట్లాడుతూ 24న కొయ్యలగూడెం పర్యటనకు వచ్చిన ఎంపీ 90 శాతం రైతులు భూములు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని 10 శాతం మాత్రమే సిద్ధంగా లేరని అనడాన్ని రైతులు ఖండించారు. బోడిగూడెం, మంగపతిదేవిపేట, రేగులగుంట, ఊట్లగూడెం, బర్కెట్నగర్ గ్రామాలలో ఏ విధమైన గ్రామ సభలు, అవగాహన సదస్సు నిర్వహించకుండా నేవీ డిపో ఏర్పాటుకు రైతుల అభిప్రాయం ఎలా తెలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో జక్కు పెద్ద వెంకన్న, ఆవూరి గంగరాజు, మోసం దుర్గారావు, ఇళ్ల శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
గణతంత్ర వేడుకల్లో శ్రీనిజ ప్రదర్శన
గణపవరం: పిప్పరకు చెందిన శ్రీనిజకు ఈనెల 26న ఢిల్లీలో నిర్వహించే భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కింది. ఇతర కళాకారులతో కలిసి భరతనాట్యం ప్రదర్శించనుంది. ఆమె ప్రస్తుతం ఎన్వీడియా కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. విద్యార్థి దశ నుంచే భరతనాట్యంపై మక్కువతో నేర్చుకుని అనేక ప్రదర్శనలిచ్చి ప్రశంసలందుకుంది. నూజివీడు: మండలంలోని కొత్తరావిచర్ల సర్పంచి కాపా శ్రీనివాసరావుకు రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. ఉత్తమ పంచాయతీగా కొత్త రావిచర్ల, ఉత్తమ సర్పంచిగా కాపా శ్రీనివాసరావు ఎంపిక కావడంతో ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్లో నిర్వహించే 77వ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనాలని అధికారికంగా ఆహ్వానం అందింది. దీంతో ఆయనకు పలువురు అధికారులు, రాజకీయ నాయకులు అభినందనలు తెలిపారు.ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో సహకార సంఘాల్లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 27 నుంచి గుంటూరులోని సహకార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తూ వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు జిల్లా సహకార సంఘాల ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పీ.సుబ్బారావు, కోశాధికారి జీ.వీరయ్య ప్రకటనలో తెలిపారు. వంటావార్పు కార్యక్రమాలు జిల్లాల వారీగా ఏఏ తేదీల్లో నిర్వహించాలో రాష్ట్ర జేఏసీ షెడ్యూల్ ప్రకటించిందని తెలిపారు. వచ్చే నెల 4న పశ్చిమగోదావరి జిల్లాలో వంటావార్పు నిర్వహిస్తామని, 13న రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఉద్యోగులందరూ గుంటూరులో కమిషనర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటారని స్పష్టం చేశారు. చింతలపూడి: చింతలపూడి మండలంలో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి, గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్లను ఆదివారం రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ట్రాక్టర్ యజమానులు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని ఏలూరు–చింతలపూడి ప్రధాన రహదారిపై ట్రాక్టర్లను అడ్డుగా నిలిపి నిరసన తెలిపారు. తమను మట్టి తోలుకోనివ్వకపోతే ఉపాధి కోల్పోతామని అధికారులను నిలదీశారు. రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చింతలపూడి పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మట్టి, గ్రావెల్ తరలింపునకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని, అనుమతి పత్రాలు పొందిన తర్వాతే తోలకాలు చేపట్టాలని ఎస్ఐ కె సతీష్ కుమార్ స్పష్టం చేశారు. పోలీసులు నచ్చజెప్పడంతో ట్రాక్టర్ యజమానులు ఆందోళన విరమించి అక్కడి నుండి వెనుదిరిగారు. భీమవరం: ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని జిల్లా అధ్యక్షుడు జి.ప్రకాశం తెలిపారు. ఈ కమిటీలో జిల్లా గౌరవ అధ్యక్షుడిగా పి.ఎన్.వి.ప్రసాద్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా జి.ప్రకాశం, బి.వి. నారాయణ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కె.రాంబాబు, ఎల్.రాజు, జి. ప్రసన్న కుమార్, ఎం.శ్రీలక్ష్మి, కార్యదర్శులుగా పి.జనార్దన స్వామి, వి.రామ్మోహన్, ఎం.విజయ్ బాబు, పి.వి.రాఘవులు, ఏ.వీరభద్ర రావు, ఆడిట్ కమిటీ కన్వీనర్గా ఎస్.ఎస్.జాన్సన్, సభ్యులుగా ఎం.పుష్పరాజు, జి.దేవదాస్, వై.ఏడు కొండలు, రాష్ట్ర కౌన్సిలర్గా సీహెచ్ సత్యనారాయణ ఎన్నికయ్యారని తెలిపారు. -
క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ బోల్తా
దెందులూరు: దెందులూరులోని ఆయిల్ ఫ్యాక్టరీకి ఎడిబుల్ ఆయిల్ తరలిస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఆదివారం మధ్యాహ్నం దెందులూరు గ్రామంలో బోల్తా పడింది. ఎస్సై రాచమల్లు శివాజీ ఘటనా స్థలానికి చేరుకుని ద్వారకాతిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులకు, ప్రయాణికులకు, పాదచారులకు, స్థానిక రైతులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. 28 టన్నుల క్రూడ్ ఆయిల్ రోడ్డుపై ఒలికిపోయింది. ఇది మండే స్వభావం లేని ఆయిల్ కావడంతో ప్రజలు భయపడనవసరం లేదని ఎస్సై శివాజీ తెలిపారు. ఆ రోడ్డుపై వెళ్లేటప్పుడు వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని ఎస్సై సూచించారు. నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఈనెల 27 నుంచి 31 వరకు క్వాంటం టెక్నాలజీపై వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు ఏఓ బీ లక్ష్మణరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిజిక్స్ డిపార్ట్మెంట్, క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వర్క్షాపునకు న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్లో గతంలో శాస్త్రవేత్తగాను, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ పూర్వ డైరెక్టర్గా పనిచేసిన ఆచార్య జీ భగవన్నారాయణ రీసోర్స్ పర్సన్గా వ్యవహరించనున్నారు. వర్క్షాపులో 74 మంది అధ్యాపకులు, నూజివీడు ట్రిపుల్ ఐటీ నుంచి 118 మంది విద్యార్థులు, ఒంగోలు ట్రిపుల్ ఐటీ నుంచి 32 మంది, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ నుంచి 10 మంది, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ నుంచి ఆరు మంది విద్యార్థులు పాల్గొనేందుకు తమపేర్లను రిజస్టర్ చేసుకున్నారు. ముసునూరు: గ్రామ ప్రజల అవసరాల కోసం తరాల నాడు తవ్వించి ఇచ్చిన చెరువు ఆక్రమణకు గురైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని చింతలవల్లిలో 200 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన దాత నాగళ్ళ రామయ్య గ్రామ అవసరాల కోసం తన భూమిలో సొంత నిధులతో చెరువు తవ్వించి దానంగా ఇచ్చారు. రెండేళ్లుగా దాతకు ఏ మాత్రం సంబంధం లేని అధికార పార్టీకి చెందిన కొందరు కబ్జాదారులు అధికారుల ద్వారా రెవెన్యూ రికార్డుల్లో ఆన్లైన్ చేయించుకొని, ఆ రోజు నుంచి పనిగట్టుకొని చెరువును భౌతికంగా ఆక్రమించే పనిలో పడ్డారు. కాగా కబ్జాదారులు తమకు పట్టాలు ఉన్నాయని, ఆన్లైన్లో నమోదయ్యాయని చెబుతూ శనివారం రాత్రి కబ్జాకు దిగి, చెరువు కట్టను తవ్వించారు. ఆ మట్టి, గ్రావెల్తో చెరువును పూడ్చడం ఆరంభించగా గ్రామస్తులంతా అడ్డుకున్నారు. అనంతరం ముసునూరు తహసీల్దార్కు, నూజివీడు సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసి, పరిష్కారం కోరారు. ఆదివారం మండలంలోని అఖిల పక్ష పార్టీల నేతలు చెరువును పరిశీలించి, సంఘీభావం తెలిపి, చెరువు పూడ్చి వేతను ఆపి, సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కుక్కునూరు: సారా తయారీ కేంద్రాలపై ఆదివారం కుక్కునూరు పోలీసులు దాడిచేసి 1200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి చెప్పిన వివరాల ప్రకారం, మండలంలోని కివ్వాక గ్రామ సమీపాన అటవీ ప్రాంతంలో సారా తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్టు తెలిపారు. అటవీప్రాంతంలో సారా తయారీ కోసం సిద్ధంగా ఉంచిన 1200 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశామన్నారు. దాడుల్లో స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. వ్యక్తి అదృశ్యం పెదవేగి : వ్యక్తి అదృశ్యంపై పెదవేగి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై ఎం హరిగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం పెదవేగి మండలం కొప్పులవారిగూడెం గ్రామానికి చెందిన ఉండవల్లి శేషగిరిరావుకు అతని భార్యకు మధ్య కుటుంబ వ్యవహారంలో సమస్యలు తలెత్తడంతో నాలుగు రోజుల నుంచి పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈనెల 20వ తేదీ సాయంత్రం నుంచి ఇంటి వద్ద నుంచి కూడా కనిపించడం లేదు. చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో శేషగిరిరావు కుమారుడు ఉండవల్లి శ్రీహరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఓటు హక్కు వినియోగం మన బాధ్యత
ఏలూరు(మెట్రో): ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్క పౌరుడి సామాజిక బాధ్యతని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో ఆదివారం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దదన్నారు. ఓటు వేసేందుకు పోలింగ్స్టేషన్కు రాలేని వృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల ఇంటి వద్దే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందన్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యావంతులు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడం ద్వారా 85 నుంచి 90 శాతం వరకు పోలింగ్ జరిగితే ఉత్తమమైన నాయకులను ఎన్నుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ, జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ కె.సుబ్బారావు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్ పాల్గొన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె బాట
బ్యాంకులను ప్రైవేటీకరణ చేయవద్దని డిమాండ్ ఏలూరు (టూటౌన్): అపరిష్కృతంగా ఉన్న బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బ్యాంకుల వద్ద ధర్నాలు, నిరసన ర్యాలీలు నిర్వహించిన ఉద్యోగులు తాజాగా ఈ నెల 27న దేశవ్యాప్తం సమ్మెకు దిగుతున్నారు. ఈ సమ్మెలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 252 జాతీయ బ్యాంకు శాఖల పరిధిలో 1,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా సమ్మెలో పూర్తి స్థాయిలో దిగుతున్నారు. గత రెండు, మూడు సంవత్సరాలుగా అనేక జాతీయ బ్యాంకుల్ని విలీనం చేశారు. దీనిపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ జాతీయ బ్యాంకుల్లో సుమారు రెండు లక్షల పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో పని భారం పెరిగిందని వాపోతున్నారు. వారానికి ఐదు రోజులు పని కల్పిస్తామని భారత బ్యాంకుల అసోసియేషన్కు హామీ ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్నా, అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని యూనియన్ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారానికి ఐదు రోజులు పని దినాలు కల్పించాలని కోరుతూ జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి జిల్లాలో గతంలో 28 రకాల జాతీయ బ్యాంకులు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 25కు తగ్గింది. ఆయా బ్యాంకుల పరిధిలో సుమారు 252 శాఖలు ఉన్నాయి. రోజూ సుమారు రూ.400 కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి. ఆయా బ్యాంకుల్లో సుమారు 1,500 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని జాతీయ బ్యాంకుల్లో కలిపి 2 లక్షల మేరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తక్షణం ఖాళీలను భర్తీ చేయాలి. కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులకు బ్యాంకుల ద్వారా ఇచ్చిన రుణాలను తక్షణం వసూలు చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ నెల 27న జరిగే దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. – దుగ్గిరాల శ్రీనివాస మోహన్, అధ్యక్షుడు, యూఎఫ్బీయూ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గతంలో భారత బ్యాంకుల అసోసియేషన్తో చేసుకున్న ఒప్పందం మేరకు వారానికి ఐదు పనిదినాలు చేయాలి. బ్యాంకుల ప్రైవేటీకరణ తక్షణం నిలుపుదల చేయాలి. పేదలు, రైతులు, వ్యాపారులకు బ్యాంకులు ఎంతో మేరకు సేవ చేస్తున్నాయి. అలాంటి సేవలను దూరం చేసేలా ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం దారుణం. – కాలే శ్రీనివాసరావు, కన్వీనర్, యూఎఫ్బీయూ -
జాతర సంబరం
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలో ఆదివారం నిర్వహించిన గంగానమ్మ జాతరతో ఏలూరు జనసంద్రంగా మారింది. ఏ రోడ్డు చూసినా జనంతో కిక్కిరిసిపోయింది. ఏడేళ్ళకు ఒకసారి వచ్చే జాతర సందర్భంగా నగర ప్రజలు తమ బంధుమిత్రులను ఆహ్వానించడంతో నగరం సంక్రాంతి శోభను మించి సందడిగా మారింది. అమ్మవారి జాతర జరుగుతుండడంతో సంక్రాంతి పండుగ చేసుకోలేకపోయిన ప్రజలు జాతరను అంతకుమించిన వైభవంతో జరుపుకున్నారు. నగరంలోని తూర్పువీధి, దక్షిణపు వీధి, లక్ష్మీవారపు పేట, ఆదివారపు పేట, పవర్ పేట ప్రాంతాల్లో అమ్మవార్ల మేడలు ఏర్పాటు చేసి గత మూడు నెలలుగా అమ్మవారి కొలుపులు నిర్వహించారు. ఆదివారం జాతర సందర్భంగా అమ్మవార్లకు మేడల వద్ద ప్రజలు నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయా మేడల వద్దకు భక్తులు పోటెత్తారు. అమ్మవార్లను దర్శించుకుని నైవేద్యాలు సమర్పించడానికి క్యూలైన్లలోనే గంటల కొద్దీ సమయం వేచి ఉండాల్సి రావడంతో కొంత అసౌకర్యానికి గురయ్యారు. భక్తుల నైవేద్యాలతో భారీ కుంభాలు జాతర ముగింపు సందర్భంగా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడమే కీలక ఘట్టం కావడంతో నగరంలోని దాదాపు ప్రతి కుటుంబం అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన నైవేద్యాలతో అమ్మవార్ల మేడల వద్ద భారీ స్థాయిలో కుంభాలు ఏర్పడ్డాయి. భక్తులు గారెలు, బూరెలు, చలిమిడి, వడపప్పు, పానకం, పరమాన్నం తదితరాలు సమర్పించగా ఆయా పదార్థాలతో కుంభాలు పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జాంతో ఇబ్బంది జాతర సందర్భంగా నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ స్తంభించింది. ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. లక్షలాది మంది జనం ఒకే రోజు నగరంలో సంచరించడం, ద్విచక్రవాహనాలు, కార్లతో అమ్మవార్ల మేడల వద్దకు వెళ్ళడానికి బయటకు రావడంతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. దీంతో చిన్న చిన్న సందుల్లోంచి వెళ్ళడానికి ప్రయత్నించారు. చిన్నచిన్న సందుల్లో సైతం ప్రజలు తమ బంధుమిత్రులకు విందు భోజనాల కోసం టిప్టాప్ పందిళ్ళు, భోజనాలు చేయడానికి డైనింగ్ టేబుళ్ళు, కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు అటువైపు ఎవరూ రావడానికి వీలు లేకుండా సైడ్ వాల్స్ కట్టేయడంతో ఎటూ వెళ్ళే అవకాశం లేకపోయింది. ఊరంతా చుట్టు తిరిగి తమ గమ్య స్థానాలకు చేరుకోవాల్సి వచ్చింది. ప్రధానంగా స్థానిక పాత బస్టాండు వద్ద ఉన్న ఫ్లై ఓవర్పై వాహనాలు ఎటూ కదలలేక ఉండిపోయాయి. దీంతో పాటు కొత్తపేట, తూర్పువీధి, చాటపర్రు రోడ్డు తదితర ప్రాంతాల్లో సైతం ట్రాఫిక్ జాం ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడ్డారు. నగర ప్రజల ఆహ్వానం మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన బంధుమిత్రులు సైతం అమ్మవార్లను దర్శించుకోవడానికి మేడల వద్దకు తరలివచ్చారు. దీంతో మేడల ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. సుమారు 2.50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్టు అంచనా. తరాలు మారినా అమ్మవారిపై సడలని నమ్మకంతో నిర్వహించిన జాతర వైభవానికి ఇతర ప్రాంతాల ప్రజలు సైతం పులకించిపోయారు. ఏలూరు.. భక్త జన హోరు గంగానమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు అమ్మవార్లను దర్శించుకున్న లక్షలాది మంది మేడల వద్ద భక్తుల నైవేద్యాలతో భారీ కుంభాలు ఎక్కడ చూసినా ట్రాఫిక్ జాంతో ఇబ్బంది -
వైభవం.. శోభనాచలుని గరుడోత్సవం
ఆగిరిపల్లి: మాఘమాస రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి శనివారం గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటలకు స్వామి వారి కళ్యాణ మండపంలో హైదరాబాద్కు చెందిన ఆకుల బసవ ప్రసాద్రావు దంపతులు కై ంకర్యాపరులుగా వ్యవహరించారు. అనంతరం రాత్రి 8 గంటలకు కమ్మ సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహ స్వామిని పెళ్లి కుమారుడిగా అలంకరించి గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారి కల్యాణ మండపంలో నిత్య కల్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంతకృష్ణ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భీమవరం: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ విమెన్ టోర్నమెంట్ జేఎన్టీయూకే మహిళా క్రికెట్ టీమ్కు భీమవరం డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని సీహెచ్ వర గాయత్రి ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం అంజన్కుమార్ చెప్పారు. ఈ నెల 26 నుంచి ఫిబ్రవరి 2వ తేదీవరకు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ విమెన్ టోర్నమెంట్ చైన్నెలోని అన్నా యూనివర్సిటీలో జరుగుతుందన్నారు. పోటీలకు ఎంపికై న వరగాయత్రిని ప్రిన్సిపాల్ అంజన్కుమార్, ఫిజికల్ డైరెక్టర్ పి మురళీధర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఫణికుమార్ తదితరులు ఈ సందర్భంగా అభినందించారు. గణపవరం: ఉంగుటూరు మండలం నాచుగుంటలో ఈనెల 27, 28, 29 తేదీల్లో బైబిల్ మిషన్ 88వ మహాసభలు జరుగుతాయని బైబిల్ మిషన్ ప్రెసిడెంట్, మహాసభల చైర్మన్ బి.సంజీవరావు తెలిపారు. ఈ సభలకు వైస్ ప్రెసిడెంట్ ఎ.దైవారావు, కార్యదర్శి డి.ఇమ్మానుయేల్, జాయింట్ సెక్రటరీ జీఆర్ ఇమ్మానియేల్రాజు తదితరులు పాల్గొంటారన్నారు. ఈ మహాసభలకు పరిసర గ్రామాలకు చెందిన విశ్వాసులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన కోరారు. ద్వారకాతిరుమల: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ద్వారకాతిరుమల మండలం సీహెచ్ పోతేపల్లి గ్రామ సర్పంచ్ పోల్కంపల్లి అనీల్ కుమార్ను పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ సందర్భంగా అనీల్ కుమార్ మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్ఆర్), ఏలూరు మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్, పార్టీ మండల కన్వీనర్ ప్రతాపనేని వాసులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రంలో శనివారం భక్తులు పోటెత్తారు. శ్రీవారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో క్షేత్ర పరిసరాలు భక్తులతో పోటెత్తాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల, నిత్యాన్నదాన భనం, ఇతర విభాగాల వద్ద భక్తులు కిటకిటలాడారు. పలు భజనల మండలి సభ్యులు అనివేటి మండపంలో ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. -
●భక్తిశ్రద్ధలతో పసుపు కొమ్ముల నోము
అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవీ శాంతిథాంలో శనివారం లక్ష పసుపు కొమ్ముల నోము భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బెంగుళూరు నుంచి వచ్చిన భక్తులు 102 రుషీ గోత్ర మందిరంలోని 90 అడుగుల పంచలోహ వాసవీ మాత విగ్రహాన్ని దర్శించుకొని, మరకత శిల వాసవీ మాతకు పూజలు, అభిషేకాలు జరిపారు. అనంతరం మరకత శిల వాసవీ మాతను గాజుల అలంకరణ చేశారు. రుషీ గోత్ర మందిరంలో బెంగుళూరు దంపతులు లక్ష పసుపు కొమ్ముల నోము నిర్వహించారు. పసుపు కొమ్ములు స్వీకరించడానికి పరిసర ప్రాంత భక్తులు పోటీ పడ్డారు. దంపతుల పూజ, పసుపుకొమ్ముల నోముతో వాసవీ థాం కిక్కిరిసిపోయింది. భక్తులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. – పెనుగొండ -
కానరాని పసివాడి జాడ
● అదృశ్యమై నాలుగు రోజులైనా లభించని ఆచూకీ ● దర్యాప్తు చేస్తున్న పోలీసులు ముదినేపల్లి రూరల్: రెండున్నరేళ్ల బాలుడు ఇంటి ముంగిట ఆటలాడుకుంటూ తప్పిపోయాడు. నాలుగు రోజులు గడిచినా ఆచూకీ లభించకపోవడంతో ఆ తల్లి కంట కన్నీరు ఆగడం లేదు. పోలీసులు పలు విధాలుగా గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటివరకు ఎటువంటి ప్రయోజనం లేదు. వివరాలు ఇలా ఉన్నాయి. మండవల్లి మండలం కానుకొల్లుకు చెందిన ఆకేటి శిరీష ముదినేపల్లి మండలంలోని శ్రీహరిపురంలో ఉన్న పుట్టింటికి వచ్చింది. ఆమె కుమారుడు రెండున్నర సంవత్సరాల వయసు గల మోక్షిత్ ఈ నెల 20న ఆటలాడుకుంటూ అదృశ్యమయ్యాడు. దీనిపై స్థానిక పోలీసుస్టేషన్లో బాలుడి తల్లి శిరీష ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరిసర ప్రాంతాల్లో పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలించినప్పటికీ ఫలితం కనిపించలేదు. స్థానికంగా ఉన్న పంట కాలువలో పడి బాలుడు గల్లంతయి ఉంటాడని భావించి నాలుగురోజులుగా స్థానికంగా ఉన్న క్యాంపుబెల్ పొడవునా గాలింపు చర్యలు చేపట్టినప్పటికి జాడ దొరకలేదు. అదేవిధంగా బాలుడిని ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా ఫలితం లేకపోవడంతో బాలుడి తల్లి, కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ లతీఫ్ పాషా, ఎస్సై వీరభధ్రరావుతో శ్రీహరిపురం వెళ్లి బాలుడి తల్లితో పాటు స్థానికులను విచారించారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారని త్వరలోనే ఆచూకీ తెలుసుకుంటారని చెప్పారు. ఇందుకు సంబంధించి ఎస్సైతో పాటు సిబ్బందికి తహసీల్దార్ పలు సూచనలు చేశారు. -
తల్లిని కోల్పోయాం.. ప్రభుత్వమే ఆదుకోవాలి
జంగారెడ్డిగూడెం: ఇటీవల జరిగిన దాడిలో తమ తల్లిని కోల్పోయామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ జంగారెడ్డిగూడెం వచ్చిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ను ఇటీవల హత్యకు గురైన కలపాల జీలుగులమ్మ కుమార్తెలు కోరారు. ఈ మేరకు ఎంపీకి వినతిపత్రం అందజేశారు. వారసత్వంగా తమకు రావాలసిన పొలం తమకు ఇవ్వకపోగా, గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేసి తమ తల్లి జీలుగులమ్మ, అమ్మమ్మ ముప్పిడి చుక్కమ్మలను హత్య చేసి తమకు ఆధారం లేకుండా చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. తమ తల్లి ఎంతో కష్టపడి తమను ఉన్నత చదువులు చదివించిందని తెలిపారు. తమకు ప్రభుత్వమే ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరారు. స్పందించిన ఎంపీ కలెక్టర్తో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కొండ్రెడ్డి కిషోర్, ఎస్సై ఎన్వీ ప్రసాద్ తదితరులు ఉన్నారు. చాట్రాయి: కప్పుకున్న దుప్పటికి నిప్పంటుకుని వృద్ధురాలు మృతి చెందిన ఘటన చాట్రాయి మండలంలోని చనుబండలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం చనుబండ గ్రామానికి చెందిన గజవెల్లి నారాయణమ్మ (90) తాటాకింట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు చుట్ట తాగే అలవాట ఉండడంతో శుక్రవారం రాత్రి చుట్ట వెలిగించుకున్న అగ్గిపుల్ల మంచం మీద పడి పక్క దుప్పటికి అంటుకుని ఆ మంటల్లో నారాయణమ్మ శరీరం పూర్తిగా కాలిపోయింది. కోడలు గజవెల్లి చెన్నమ్మ శనివారం ఉదయం నారాయణమ్మకు టీ టిఫిన్ ఇవ్వడానికి వెళ్లగా మంచం మీద కాలిపోయి ఉండడాన్ని గుర్తించింది. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
ఆది దేవా.. ప్రణమామ్యహం
ఉష, పద్మిని, ఛాయ, సౌంజ్ఞ సమేతుడైన శ్రీ సూర్యభగవానుడికి శ్రీ వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం ఆదివారం ఉదయం 11.30 గంటలకు కల్యాణ మహోత్సవం నిర్వహించేందుకు పండితులు ముహుర్తం నిర్ణయించారు. వేద పండితుల వేదమంత్రోచ్ఛరణాల మధ్య ఆలయ చైర్మన్ గమిని రామచంద్రరావు (రాము) దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కల్యాణ ఘట్టం నిర్వహిస్తారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు స్వామివారి దివ్య దర్శనం, మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారి రథోత్సవం, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి స్వామి వారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, పూజాధికాలు నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి స్వామివారి ఆలయ ప్రాంతంలో అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేశారు. రథసప్తమి సందర్భంగా తణుకు సూర్యదేవాలయాన్ని సందర్శించేందుకు సమారుగా 50వేలకు పైగా భక్తులు వస్తారని అంచనా. భక్తుల సౌకర్యార్థం సూర్యాలయం వీధి పొడవునా చలువ పందిర్లు, భక్తులు క్యూలో వెళ్లి స్వామివారిని దర్శించుకునేలా బారికేడ్లు సిద్ధం చేశాం. క్యూలో ఉన్న వారికి తాగునీరు సరఫరా చేస్తాం. స్వామివారి దివ్య దర్శనం, కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేస్తాం. – ముత్యాల సత్యనారాయణ, ఈవో, తణుకు సూర్యదేవాలయం తణుకు అర్బన్: భక్త ప్రజానీకం ఆరోగ్య ప్రదాతగా కొలిచే శ్రీ సూర్యనారాయణస్వామి కల్యాణమహోత్సవానికి తణుకు శ్రీసూర్యదేవాలయం ముస్తాబైంది. ఆదివారం రథసప్తమి సందర్భంగా సూర్యదేవాలయంలో ఉష, పద్మిని, ఛాయ, సౌంజ్ఞ సమేతుడైన శ్రీ సూర్యభగవానుడికి కల్యాణం నిర్వహించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆలయ కమిటీ పెద్దల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యదేవాలయం తరువాత రెండో ఆలయం తణుకులో ఉండడంతోపాటు అదే తరహాలో స్వామివారి కల్యాణం జరిపించే తణుకు సూర్యదేవాలయానికి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వేలసంఖ్యలో భక్తులు ప్రతి ఏడాది తరలి వస్తుంటారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ ప్రాంతంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఏ ఇబ్బందులు లేకుండా భక్తులంతా స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించే విధంగా సూర్యాలయం వీధి రోడ్డు పొడవునా చలువ పందిర్లు వేసి బారికేడ్లు ఏర్పాటుచేశారు. ప్రసిద్ధి చెందిన ఆలయం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి తరువాత రాష్ట్రంలో రెండో సూర్యదేవాలయంగా తణుకు సూర్యదేవాలయం పేరుగాంచింది. ముఖ్యంగా ప్రతి ఏడాది రథసప్తమి సందర్భంగా స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి 50 వేలకు పైగా భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది స్వామివారికి ప్రీతికరమైన రోజు ఆదివారం రథసప్తమి రావడంతో భక్తుల తాకిడి మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆలయ కమిటీ పెద్దల పర్యవేక్షణలో స్వామి వారి కల్యాణం, దివ్య దర్శనం కార్యక్రమాలకు అంతా సిద్ధం చేశారు. అరుదైన విగ్రహం తణుకు సూర్యదేవాలయంలోని స్వామి విగ్రహం సప్త అశ్వాలతో అనూరుడను సారధితో ద్వారపాలకుల పహరాతో ఉష, పద్మిని, ఛాయ, సౌంజ్ఞ సమేతుడైన సూర్యభగవానుడి విగ్రహం అరుదైనదిగా చరిత్రలో నిలిచింది. 1942వ సంవత్సరంలో తణుకుకు చెందిన జోశ్యుల శ్రీరామమూర్తి స్థాపించిన తణుకు ఆలయంలోని ఈ సూర్య విగ్రహం స్కాంద, పద్మ పురాణాల్లో ప్రసుత్తించబడిన విధంగా చూపరులకు నేత్రానందం కలిగిస్తోంది. 2001వ సంత్సరంలో తణుకుకు చెందిన చిట్టూరి పరిపూర్ణ బ్రహ్మానంద చౌదరి, భక్తుల సహకారంతో ఆలయాన్ని పునఃప్రతిష్ట చేశారు. ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలు నేడు రథసప్తమి ముస్తాబైన తణుకు సూర్యదేవాలయం స్వామి దర్శనార్థం తరలిరానున్న భక్తులు ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి -
నేడు శ్రీవారి క్షేత్రంలో రథసప్తమి వేడుకలు
ద్వారకాతిరుమల: రథసప్తమి వేడుకలకు శ్రీవారి క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. అందులో భాగంగా ఆదివారం నిర్వహించనున్న స్వామి, అమ్మవార్ల తిరువీధి సేవలకు వినియోగించే సూర్య, చంద్ర ప్రభ వాహనాలను ఆలయ సిబ్బంది శనివారం ముస్తాబు చేశారు. ముందుగా వాహన శాల నుంచి తీసుకొచ్చిన సూర్య, చంద్ర ప్రభ వాహనాలను ఆలయ ఆవరణలో ఉంచారు. అనంతరం వాటిని శుభ్రం చేశారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 7 గంటల నుంచి స్వామి, అమ్మవార్లకు సూర్య ప్రభ వాహనంపై, అలాగే రాత్రి 7 గంటల నుంచి చంద్ర ప్రభ వాహనంపై తిరువీధి సేవలను కన్నులపండువగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొనాలని ఆయన కోరారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరుకు చెందిన బెజగం వెంకట శ్రీనివాసు ప్రతిష్టాత్మక గురురత్న అవార్డుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన నగరంలోని గ్రీన్సిటీలో నివసిస్తూ నారాయణపురంలోని మహాత్మాగాంధీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్స్పాల్గా, జంతుశాస్త్ర అధ్యాపకునిగా పని చేస్తున్నారు. గత 37 సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో సేవలు అందిస్తూ రచయితగా, పాఠ్యపుస్తక రచయితగా, విద్యా వ్యాసకర్తగా, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అసోసియేట్ అధ్యక్షునిగా వివిధ రంగాల్లో అందిస్తున్న ఆయన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ మేరకు చైన్నెకి చెందిన అమెట్ యూనివర్సిటీ, జే. రామచంద్రన్ మారిటైమ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఆయన్ను గురురత్న అవార్డుకు ఎంపిక చేసినట్టు ప్రకటించాయి. ఈ నెల 25వ తేదీన చైన్నెలోని అమెట్ యూనివర్సిలో వర్సిటీ ఛాన్సలర్ జే.రామచంద్రన్ చేతులమీదుగా శ్రీనివాస్ అవార్డు అందుకోనున్నారు. ఏలూరు(మెట్రో): విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఫిబ్రవరి 5 వ తేదీన జరుగబోయే ఏపీ జేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం స్థానిక ఏలూరు రెవెన్యూ భవన్లో నాయకులు పోస్టర్ను ఆవిష్కరించారు. ఆ సంఘం ఏలూరు జిల్లా చైర్మన్ కె.రమేష్ కుమార్ మాట్లాడుతూ ఈ మహాసభకు జిల్లా ఉద్యోగులు తరలి వెళ్లడానికి ఏలూరు నుంచి బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి తదితర ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారాల కోసం మహాసభల్లో ఉద్యోగుల గళం వినిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి జనరల్ సెక్రెటరి బి.రాంబాబు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఏ.ప్రమోద్ కుమార్, ఏపీపీటీఏ గౌరవ అధ్యక్షుడు వై.శ్రీనివాస్, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మహాలక్ష్ముడు, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్, ఏలూరు డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణ స్వామి, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కొల్లేరులో జనాగ్రహం
రెండున్నరేళ్ల బాలుడు అదృశ్యమై నాలుగు రోజులు గడిచినా ఆచూకీ లభించకపోవడంతో ఆ తల్లి కన్నీరు ఆగడం లేదు. ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరులో జనాగ్రహం కట్టలు తెంచుకుంది. కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని గద్దెనెక్కిన కూటమి పాలకులు రెండేళ్లుగా మాయమాటలు చెబుతున్నారు. సమస్యకు పరిష్కారం లభించకపోగా ఆక్రమణల తొలగింపు పేరుతో కొల్లేరువాసుల కడుపుకొట్టడంతో జనాగ్ర హం పెల్లుబికింది. అటవీశాఖ అధికారులు స ర్వేలు, రీ సర్వేలు, ఆక్రమణల తొలగింపు అంటూ కొల్లేరు గ్రామాల్లో హడావుడిని కొల్లేరు వాసులు బలంగా ప్రతిఘటిస్తుండటంతో లంక గ్రామాల్లో టెన్షన్ మొదలైంది. రెండు రోజుల క్రితం కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ను కొల్లేరువాసులు కడుపు మండి నిలదీశారు. వీడని చిక్కుముడులు : గత ప్రభుత్వం హయాంలో సజావుగా ఉన్న కొల్లేరు వ్యవహారం ఒక్కసారిగా కదిలింది. సుప్రీంకోర్టు ఆదేశాలు పేరుతో కొల్లేరు అభయారణ్యంలో ఆక్రమణలు తొలగించి, నివేదిక ఇవ్వడానికి అటవీశాఖ అధికారులు హడావుడి చేస్తున్నారు. అసలు కొల్లేరు సరిహద్దుల అంశం ఇంకా పూర్తిస్థాయిలో చిక్కుముడి వీడకపోవడం, దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న కొల్లేరు వ్యవహారాన్ని సుప్రీంకోర్టు పేరుతో తీవ్ర కదలికలు ప్రారంభమయ్యాయి. కొల్లేరు ప్రజల అమాయకత్వాన్ని ప్రజాప్రతినిధులు ఆసరాగా చేసుకుని శాశ్వత పరిష్కారం చూపిస్తామంటూ గద్దెనెక్కి అధికారంలోకి రాగానే అంతా సుప్రీంకోర్టు చేతుల్లో ఉంది, మా పరిధిలో ఏమీ లేదంటూ కూటమి ప్రజా ప్రతినిధులు మాట దాటవేస్తుండటంతో నిత్యం గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో 10వ కాంటూరు వరకు 2.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో కొ ల్లేరు విస్తరించి ఉంది. ఆక్రమణల కారణంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జీఓ నం.120ను జారీ చేశారు. ఈ క్రమంలో 5వ కాంటూరు వరకు అ భయారణ్యంగా గుర్తించి 77,135 ఎకరాల విస్తీర్ణా న్ని నిర్ణయించారు. ఆ తరువాత కొల్లేరు ఆపరేషన్ లో రెండు జిల్లాలో 31120 ఎకరాల్లో అక్రమ చెరువులను ధ్వంసం చేశారు. వీటిలో 14,932 ఎకరాల జిరాయితీ, 5510 ఎకరాల డి.ఫారం భూములు ఉన్నాయి. వీటికి పరిహారం ఇవ్వకుండా ధ్వంసం చేశారని రాష్ట్ర చేపల రైతుల సంఘం సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది. తదనంతర పరిణామాల్లో కాకినాడకు చెందిన పర్యావరణవేత్త కొల్లేరు అభయారణ్యంలో ఆక్రమణలు పెరిగాయని, కొల్లేరు ఆపరేషన్ అనంతరం సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం పాటించలేదంటూ దాఖలు చేసిన పిటీషన్ను కోర్టు విచారణకు గత ఏడాది స్వీకరించింది. ఈ క్రమంలో గతేడాది ఆక్రమణల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి కేంద్ర సాధికార కమిటీని నియమించడం, కమిటీ సభ్యులు నలుగురు గతేడాది జూన్ 17, 18 తేదీల్లో కొల్లేరులో పర్యటించడం, ప్రజాప్రతినిధులు, రైతులతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అటవీ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం నుంచి కొల్లేరుపై పూర్తి సమాచారం ఇవ్వని కారణంగా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించలేదు. దీంతో అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ రెండు జిల్లాల్లో అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో హడావుడిగా సమీక్ష నిర్వహించి, నిడార్ సర్వే టెక్నాలజీ ద్వారా అభయారణ్యం సరిహద్దులను గుర్తించి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆ తరువాత వ్యవహారం ముందుకు సాగలేదు. ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్లోని ఈవీఎం గోడౌన్ను శనివారం కలెక్టర్ కె.వెట్రిసెల్వి తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వచ్చే నెలాఖరులో కేసు విచారణకు రానుండటంతో అటవీశాఖ అధికారుల హడావుడి, అలజడి మొదలైంది. అదేస్థాయిలో కొల్లేరువాసులు అటవీశాఖ అధికారులను తిప్పి కొడుతున్నారు. అటవీశాఖ అధికారులు 18 వేల ఎకరాలు ఆక్రమణలో ఉందని, 9 వేల ఎకరాల్లో ఆక్రమణలను తొలగించామని నివేదికలు సమర్పించారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నం. ఈ క్రమంలో మళ్లీ కేంద్ర సాధికార కమిటీ నుంచి హడావుడి ఉంటుందని ఆక్రమణల తొలగింపు మొదలు పెట్టారు. ఈ క్రమంలో కై కలూరు మండలం చటకాయి, వడ్లకూటితిప్ప, శృంగవరప్పాడు, కొట్టాడ, ఏలూరు మండలంలో పత్తికోళ్ల లంక, అలాగే నిడమర్రు మండలం తోకలపల్లి, సాయన్నపాలెం గ్రామాల్లో అటవీశాఖ అధికారుల హడావుడిని కొల్లేరు ప్రజలు తీవ్రస్థాయిలో అడ్డుకోవడం, నిరసనలు నిర్వహించడం కొనసాగించారు. ఇక తాజాగా, ఎమ్మెల్యే కామినేని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్గా మారింది. కొల్లేరు ప్రజలకు వేధింపులు పెరిగాయని, ఈనెల 27, 28 తేదీల్లో ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ను కలవడానికి కొల్లేరు నుంచి పాదయాత్రగా వెళ్లాలని కొల్లేరువాసులు నిర్ణయించారు. ఈ క్రమంలో గురువారం కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద కొల్లేరు పెద్దల సమావేశానికి ఎమ్మెల్యే కామినేని హాజరై పాదయాత్ర వద్దు, తాను మాట్లాడతానని, లేదంటే కొద్దిమందిని కలిసే ఏర్పాటు చేస్తానని పెద్దలకు చెప్పారు. దీంతో కూటమి మాటలు నమ్మి మోసపోయాం, వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఐదేళ్లలో అటవీశాఖ అధికారుల నుంచి ఇబ్బంది రాలేదని, కూటమి నేతలకు ఓట్లు వేసి గెలిపిస్తే మా పొట్టకొట్టారని తీవ్రస్థాయిలో నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. కూటమి మాటలు నమ్మి మోసపోయామంటూ మండిపాటు కొల్లేటికోటలో ఎమ్మెల్యే కామినేనిని నిలదీసిన కొల్లేరు పెద్దలు ఆక్రమణల తొలగింపు పేరిట అటవీ శాఖ హడావుడి అధికారులను ప్రతిఘటిస్తున్న కొల్లేరు ప్రజలు సమస్యకు పరిష్కారం చూపాలంటూ వేడుకోలు -
హేలాపురి కల్పవల్లి
ఏలూరు నగర ఇలవేల్పు.. హేలాపురి ఆరాధ్య దేవత గంగానమ్మవారి జాతర మహోత్సవం వచ్చేసింది. మూడు నెలలుగా నగరంలోని ఏడు ప్రాంతాల్లో అమ్మవార్ల మేడల వద్ద చేస్తున్న కొలుపులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఆదివారం నగరంలోని మూడొంతుల ప్రాంతాల్లో జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏడేళ్లకోసారి వచ్చే జాతర కావడంతో నగరవాసులు మేడల వద్దకు వెళ్లి అమ్మవార్లకు నైవేద్యాలు, చీరలు, పసుపు కుంకుమలు సమర్పిస్తున్నారు. అలాగే సామాజికవర్గాలు, ప్రాంతాల వారీగా, అపార్ట్మెంట్ వాసులు బృందాలుగా వెళ్లి సారెలు సమర్పించారు. లక్ష్మీవారపుపేటలోని మేడలో.. ఏలూరు లక్ష్మీవారపుపేటలో అమ్మవారి ఉత్సవమూర్తి ఏలూరు (ఆర్ఆర్పేట): జాతరను పురస్కరించు కుని ఏలూరు నగరమంతా కోలాహలంగా మారింది. నగరవాసులు తమ బంధువులు, మిత్రులను ఆహ్వానించారు. ఇప్పటికే నగరంలోని లాడ్జీల్లో గదులు నిండుకున్నాయి. శనివారం సాయంత్రం నుంచి అతిథులు రాక మొదలుకాగా.. ఆదివారం ఉదయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఆదివారం వేకువజాము 4 గంటల నుంచి అమ్మవార్ల మేడల వద్ద భక్తుల సందడి మొదలుకానుంది. మేడల వద్ద పూర్తయిన ఏర్పాట్లు అమ్మవార్ల మేడల వద్దకు చేరుకునే భక్తుల కోసం జాతర కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీగా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. నైవేద్యాలు సమర్పించేందుకు ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉండేలా చర్యలు తీసుకున్నారు. జాతర ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని కమిటీల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మేడల వద్ద వైద్యారోగ్యశాఖ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేయనుంది. అతిథులకు ప్రత్యేక ఆతిథ్యం : నగరమంతా జాతర సందడి నెలకొంది. ప్రతి ఇంటి వద్ద అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, టిప్టాప్ పందిళ్లు ఏర్పాటుచేశారు. నగరంలోని టిప్టాప్ సామగ్రికి డిమాండ్ రావడంతో పొరుగు గ్రామాల నుంచి తెప్పించారు. అలాగే వంట పాత్రలను శుక్రవారం సాయంత్రం నుంచి దింపుకుంటున్నారు. జాతరను పురస్కరించుకుని బంధు, మిత్రులకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. నిరంతర నిఘా అమ్మవార్ల మేడల వద్దకు లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ఇప్పటికే అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. మద్యం సేవించి అల్లర్లకు పాల్పడే వారిని నియంత్రించడానికి మఫ్టీలో పోలీసులను పహారా కోసం ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా పెట్టారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు తీసుకున్నారు. మది నిండుగా.. ఊరంతా పండుగ నేడు గంగానమ్మ జాతర నగరమంతా కోలాహలం అమ్మవార్ల మేడల వద్ద సర్వం సిద్ధం ఇళ్ల వద్ద సందడే సందడి -
జాతరలో డ్రోన్ నిఘా
ఏలూరు టౌన్: ఏలూరు తూర్పువీధిలో గంగానమ్మ జాతరకు భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారని, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని రేంజ్ ఐజీ జీ వీజీ అశోక్కుమార్ ఆదేశించారు. ఏలూరు వన్టౌన్ తూర్పువీధి, దక్షిణపువీధి జాతర ప్రాంతాలను ఎస్పీ కేపీ శివకిషోర్తో కలిసి ఆయన శనివారం ఆయన పోలీస్ బందోబస్తు చర్యలపై ఆరా తీశారు. ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పర్యవేక్షించాలన్నారు. జాతర కమిటీ సభ్యులు, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పా ట్లు చేయాలన్నారు. జాతర ఊరేగింపులో మఫ్టీలో పోలీసులను రంగంలోకి దించాలనీ, డ్రోన్ కెమెరా లు, సీసీ కెమెరాలతో నిత్యం నిఘా ఉంచాలని ఆదేశించారు. డీఎస్పీ డి.శ్రావణ్కుమార్, వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ, ఎస్సై సుధాకర్, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు ఉన్నారు. -
కొనసాగుతున్న పులి దాడులు
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలంలో పులి దాడి చేసి చంపిన పశువులకు సంబంధించి వాటి యజమానులకు నష్టపరిహారం చె ల్లించాలని మాజీ ఎమ్మె ల్యే తెల్లం బాలరాజు అన్నారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నాలుగు రో జులుగా ఈ పులి నాగులగూడెం, కోటనాగవరం, మెట్టగూడెం తదితర గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలను భయపెడుతోందని, పులిని పట్టుకోవడంలో ఫారెస్ట్ అధికారులు విఫలమైనట్టు కనిపిస్తోందన్నారు. సకాలంలో పులిని బంధించి ఉంటే పశువులు మృత్యువాత పడేవి కావన్నారు. ఇప్పటివరకూ సుమారు 9 పశువుల వరకు పశువులను పులి వేటాడి చంపిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రిళ్లు బయటకు రావద్దని సూచించారు. బుట్టాయగూడెం: ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో ఎన్నడూలేని విధంగా పెద్దపులి సంచరిస్తూ పశువులపై పంజా విసురుతోంది. శనివారం వేకువజామున గుర్రప్పగూడెంలో లేగ గేదె దూడ, కోటనాగవరంలో మరో లేగ దూడ, గేదైపె దాడి చేసి హతమార్చింది. ఇలా కనిపిస్తున్న పశువులపై దాడి చేస్తూ ఫారెస్ట్ అధికారులకు చిక్కకుండా సంచరిస్తోంది. ఇదిలా ఉండగా పులిని తిరిగి అడవిలో పంపించేందుకు లేదా పులి నుంచి పశువులను, ప్రజలను రక్షించేందుకు ఫారెస్ట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గిరిజనులు విమర్శిస్తున్నారు. నాలుగు రోజులుగా.. పశువుల మందలపై దాడి చేస్తున్న పులిని మీరు బంధిస్తారా లేక మాకు అప్పగిస్తారా అంటూ గిరిజనులు ఫారెస్ట్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. నాలుగు రోజులుగా భయంతో బతుకుతున్నామని, ఎన్నిరోజులు బయటకు రాకుండా ఉంటామని ఆవేదన చెందుతున్నారు. సాయంత్రం 5 గంటలకు ఇళ్లకు చేరుకుంటున్నామని, తెల్లవారిన 8 గంటల తర్వాత గానీ బయటకు రావడం లేదని చెబుతున్నారు. కూలీలు పను లు మానేసే పరిస్థితి ఉందని, ప్రస్తుతం ముమ్మరంగా మొక్కజొన్న, వర్జీనియా పొగాకు పను లు ఉన్నాయని అంటున్నారు. పులి కారణంగా ఎవరూ పొలానికి వెళ్లలేని పరిస్థితులు నెలకొ న్నాయని చెబుతున్నారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పులిని త్వరితగతిన అడవిలోకి పంపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అంతర్వేదిగూడెం సర్పంచ్ జోడే సత్య దుర్గాప్రసాద్ కోరుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోలవరం రూరల్: పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు శనివారం ప్రకటనలో తెలిపారు. పులి కదలికలపై సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు. -
ఎమ్మెల్యే పితాని వైఖరి మార్చుకోవాలి
పెనుగొండ: రాజ్యాంగ బద్ధంగా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన స్థానిక సంస్థల ఎస్సీ, బీసీ ప్రజాప్రతినిధుల హక్కులకు, విధులకు ఆటంకం కల్పించే విధంగా ఆచంట నియోజకవర్గంలో వ్యవహరిస్తున్నారని, ఇప్పటికై నా స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ వైఖరిని మార్చుకోవాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చిన్నం ఏడుకొండలు, నియోజకవర్గ అధ్యక్షుడు పిల్లి రుద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. బుధవారం ఆచంటలో ఎస్సీ సెల్, బీసీ సెల్ల ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆచంట పంచాయతీలో దళిత మహిళా సర్పంచ్ కోట సరోజనీ వెంకటేశ్వరరావు హక్కులను కాలరాసి గ్రామ కార్యదర్శి అధికార నాయకుల కనుసన్నల్లో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆచంట గ్రామ కార్యదర్శిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొడమంచిలి పంచాయతీకి సంబంధించి రికార్డులను తారుమారు చేసి, ఓచర్లను చింపివేసి సర్పంచ్ను విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని వివరించారు. అలాగే పండితవిల్లూరు సర్పంచ్ బీసీ మహిళ చెక్ పవర్ రద్దు చేయించారని, జగన్నాధపురం బీసీ సర్పంచ్ బిల్లులు నిలుపుదల చేశారన్నారు. పెనుగొండ మండల పరిషత్లో బీసీ ఎంపీపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నారు. కోరం ఉన్నా సమావేశం నిర్వహించకుండా గుండెపోటు నాటకం ఆడడమే కాకుండా, ఎమ్మెల్యే పితానిని కలిస్తేనే ముందుకు సాగడం జరుగుతుందని స్వయనా ఎంపీడీవో హెచ్చరించడం దారుణమన్నారు. ఇటువంటి దురాగతాలను ఆపకపోతే నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధులతో కలసి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యే చేయాల్సిన ప్రభుత్వ కార్యక్రమాలను ఎమ్మెల్యే కుమారుడు చేయడం ఎంతవరకూ సమంజవసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కేతా తాతారావు, జక్కంశెట్టి శ్రీరాములు, కాండ్రేకుల కనకేశ్వరరావు దొమ్మేటి రాంబాబు, గుబ్బల రామకృష్ణ, కొవ్వూరి సురేష్, దొంగ ఉపేంద్ర, చదలవాడ ముత్యాలరావు, పీతల అంబేడ్కర్, పీతల జ్ఞానరాజు, కోటగిరిధర్, మండేల శ్రీను, యడ్ల రామకృష్ణ, కుసుమే వెంకటేశ్వరరావు, ఏనుగుపల్లి వరప్రసాద్, బ్యూలా ప్రసాద్, కోటే శశిమధు, బొరుసు రాంబాబు, యల్లమెల్లి రాజేష్, కొండేటి భవానీ ప్రసాద్, నక్కా శ్రీనులు పాల్గొన్నారు. ఆచంటలో ప్రజాప్రతినిధుల నిరసన -
జాతరకు పటిష్ట బందోబస్తు
పూతపైనే ఆశలన్నీ నూజివీడు నియోజకవర్గంలో మామిడి పూతలు బాగుండటంతో రైతులు ఆశతో ముందుకు సాగుతున్నారు. దాదాపు 85 శాతం తోటల్లో పూతలు వచ్చాయి. 8లో uఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో ఈనెల 25, 26 తేదీల్లో జరిగే గంగానమ్మవారి జాతర మహోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. తూర్పువీధిలో జాతర జరిగే ప్రాంతాన్ని గురువారం ఆయన పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణపై ఆదేశాలు జారీ చేశారు. భక్తుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉందని, తోపులాటలు జరగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయాల న్నారు. ట్రాఫిక్ మళ్లింపునకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. జాతర ముసుగులో అసాంఘిక కార్య కలాపాలు జరగకుండా డ్రోన్లతో త నిఘా ఉంచాలన్నారు. అనంతరం దక్షిణపు వీధిలో జాతర జరిగే ప్రాంతాలను పరిశీలించారు. డీఎస్పీ డి.శ్రావణ్కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఏలూరు వన్టౌన్ ఇన్స్పెక్టర్ సత్య నారాయణ, ఎస్ఐ సుధాకర్ ఉన్నారు. -
మామిడి పూతపైనే ఆశలన్నీ
● నూజివీడు నియోజకవర్గంలో 35 వేల ఎకరాల్లో మామిడి విస్తీర్ణం ● మామిడి తోటల్లో కనిపిస్తున్న పూతలు నూజివీడు: నూజివీడు నియోజకవర్గంలో ప్రధాన వాణిజ్య పంటగా విలసిల్లుతున్న మామిడి పంట రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఈ ఏడాది మామిడి పూతలు నియోజకవర్గ వ్యాప్తంగా బాగానే ఉండటంతో రైతులు ఎంతో ఆశతో ముందుకు సాగుతున్నారు. ఒక ఏడాది కాస్తే మరొక ఏడాది కాయకపోవడం మామిడి ప్రధాన లక్షణం. గతేడాది మామిడి కాపు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది కాపు ఎక్కువగా ఉండవచ్చనేది కూడా వస్తున్న పూతలను బట్టి రైతులు భావిస్తున్నారు. దాదాపు 85 శాతం తోటల్లో పూతలు నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు మండలాల్లో పండ్ల తోటల్లో మామిడి ప్రధాన పంటగా విలసిల్లుతోంది. ఈ సీజన్లో డిసెంబరు ద్వితీయార్థం నుంచి తోటల్లో పూతలు రావడం ప్రారంభమై ప్రస్తుతం దాదాపు 85 శాతం తోటల్లో పూతలు వచ్చాయి. మిగిలిన తోటల్లో కూడా మరో వారం, పది రోజుల్లో పూతలు వచ్చే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని తోటలు తెల్లపూత దశలో ఉండగా, మరికొన్ని తోటలు పచ్చిపూత దశలో ఉన్నాయి. బంగినపల్లి, తోతాపురి, రసాలు తదితర అన్ని రకాల్లో పూతలు కనిపిస్తున్నాయి. నూజివీడు బంగినపల్లి కాయలకు, రసాలు, చెరుకు రసాలకు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా మంచి పేరుంది. రైతులు పూతల కోసం డిసెంబరు నెల ప్రారంభం నుంచే రసాయన మందులను పిచికారీ చేయడం ప్రారంభించి ప్రస్తుతం పూతలు నిలిచేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. గత రెండేళ్లుగా మామిడి తోటలపై ఆదాయం ఏమీ రాకపోవడంతో రైతులు ఈ ఏడాదైనా కలిసి వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. వాతావరణమే కీలకం మామిడి డిసెంబరు నెలలో పూతలు ప్రారంభమై ఫిబ్రవరి తొలి వారంలో పిందెలు రావడం జరుగుతుంది. మామిడి పూత రావడానికి పగటి పూట అత్యధిక ఉష్ణోగ్రతలు, రాత్రి పూట అధిక చలి వాతావరణం ఉండాలి. గత 20 రోజులుగా వాతావరణం అనుకూలంగా ఉండటంతో పూతలు వస్తున్నాయి. సంక్రాంతి సమయంలో నాలుగు రోజుల పాటు పెద్ద ఎత్తున ఏర్పడిన పొంగమంచుకు తోటల్లో పురుగులు ఆశించి పూత ఏమైనా దెబ్బతింటుందేమోనని రైతులు ఆందోళన చెందారు. అయితే అలాంటి నష్టం ఏమీ జరగకపోవడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. మామిడి తోటల్లో పూతలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. పూత నిలవడం కోసం రైతులు రసాయన మందులు పిచికారీ చేసుకుంటున్నారు. బంగినపల్లి, రసాలు, తోతాపురి వంటి రకాల్లో పూతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దిగుబడి వచ్చిన తరువాత మార్కెట్లో ధర కూడా నిలకడగా ఉంటే మామిడి రైతులకు మేలు జరుగుతుంది. – పాలడుగు విజయ్కుమార్, మామిడి రైతు, తుక్కులూరు, నూజివీడు మండలంఇప్పటికే 85 శాతం తోటల్లో మామిడి పూతలు వచ్చాయి. ఈ నెలాఖరుకు మిగిలిన తోటల్లో కూడా పూతలు వచ్చేస్తాయి. వాతావరణం అనుకూలంగా ఉండటం మామిడికి మంచి పరిణామం. ఇప్పటి వరకు ఎలాంటి తెగుళ్లు, పురుగులు లేవు. రైతులు ఉద్యాన అధికారులు చెప్పిన విధంగా సలహాలను పాటిస్తే నాణ్యమైన దిగుబడులు వస్తాయి. పిందెలు వచ్చిన యెడల వాటికి కవర్లు కట్టుకుంటే మంచిది. – ఆర్ హేమ, ఉద్యాన అధికారిణి -
ప్రకృతి సాగుపై కేంద్ర బృందం అధ్యయనం
ద్వారకాతిరుమల: రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం అమలు విధానాలపై కేంద్ర బృందం ప్రత్యేక అధ్యయనాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (గోల్) వ్యవసాయ ప్రణాళిక విభాగం, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖకు చెందిన పది మందితో కూడిన కేంద్ర కమిటీ ప్రతినిధుల బృందం గురువారం ద్వారకాతిరుమల మండలం సూర్యచంద్రరావుపేట, గుండుగొలనుకుంట గ్రామాల్లో పర్యటించింది. తొలుత ఈ బృందం సూర్యచంద్రరావుపేట లోని రైతు సరిపల్లి భాస్కర్ రాజు పొలాన్ని సందర్శించారు. గత ఏడేళ్లుగా ఆయన 11 ఎకరాల్లో ద్రవ జీవామృతం, సహజ వృద్ధి ప్రోత్సాహకాలతో సాగు చేస్తున్న కోకో, కొబ్బరి ఉద్యాన పంటలను సందర్శించి, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం గుండుగొలనుకుంటలోని ఒ.గోపాలకృష్ణ నిర్వహిస్తున్న బయో రిసోర్స్ సెంటర్ (బీఆర్సీ)ను సందర్శించి, అక్కడ తయారవుతున్న వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు, వాటి వినియోగం, అలాగే గత 8 ఏళ్లుగా అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయంలోని 9 సూత్రాలపై లైవ్ డెమో మోడల్ గురించి తెలుసుకున్నారు. అదనంగా ఏటీఎం(ఎనీ టైమ్ మనీ) మోడల్ ద్వారా 28 కి పైగా రకాల పండ్లు, కూరగాయల సాగు విధానాన్ని పరిశీలించి, కషాయాలు–ద్రావణాల తయారీతో పాటు, విత్తన పెల్లైటెజేషన్పై ప్రత్యక్ష ప్రదర్శనను వీక్షించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న రైతు సాధికార సంస్థ (రైస్) పనితీరును కేంద్ర బృందం అభినందిస్తూ, రైతులు చేస్తున్న కృషిని ప్రశంసించింది. ఈ పర్యటనలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బి.వెంకటేష్, సీనియర్ కన్సల్టెంట్ కె.వరప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్కే హబీబ్ బాషా, డీహెచ్ఓ సజా నాయక్, మండల ఉద్యానశాఖ అధికారి అమర్నాథ్ పాల్గొన్నారు. -
వేగంగా వైఎస్సార్సీపీ కమిటీల డిజిటలైజేషన్
కై కలూరు: గ్రామాల్లో వైఎస్సార్సీపీ సంస్థాగత నిర్మాణ కమిటీల డిజిటలైజేషన్ వేగవంతం చే యాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూ లం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కలిదిండి మండలం మట్టగుంట వైఎస్సార్సీపీ గ్రామ అ ధ్యక్షుడు బొమ్మిడి మర్రాజు ఇంటి వద్ద గురువారం ఈ కార్యక్రమం నిర్వహించారు. కమిటీ సభ్యుల ఫొటో వివరాలు డిజిటలైజేషన్ చేశారు. కలిదిండి మండల పార్టీ అధ్యక్షుడు తిరుమాని రమేష్, నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షుడు కొల్లాటి సత్యనారాయణ, రేవు నరసింహారావు, సిరింకి జల్సారాయుడు, తిరుమని నాగేశ్వర రావు, కొప్పనాతి యేసురాజు, బొడ్డు దుర్గాప్రసాద్, బలగం శ్యాంబాబు పాల్గొన్నారు. చాట్రాయి: అన్నదమ్ముల మధ్య ఏర్పడిన భూమి వివాదంలో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని చోటుచేసుకుంది. ఎస్సై డి.రామకృష్ణ కథనం మేరకు మండలంలోని కృష్ణారావుపాలెం గ్రామానికి చెందిన పండు తిరుపతి దాసు, అన్న రామచంద్రయ్య మధ్య భూవివాదం నెలకొంది. మూడు నెలల క్రితం వివాదంలో ఉన్న 90 సెంట్ల భూమిలో తమ్ముడు తిరుపతిదాసు మామిడి మొక్కలు నాటాడు. గురువారం రామచంద్రయ్య కుటుంబసభ్యులు ఈ మామిడి మొక్కలను నరుకుతుండగా తిరుపతిదాసు, అతడి భార్య బేబి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు వారిని 108లో విస్నన్నపేట ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై చెప్పారు. ఏలూరు (టూటౌన్): పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంచాలని ఇఫ్టూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ ఆయిల్ ఫెడ్ ప్రాసెసింగ్ యూనిట్ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ బాలాజీ నాయక్కి ఇఫ్టూ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. వివరాలను ఏలూరులో గురువారం పత్రికలకు వెల్లడించారు. పామాయిల్ ఫ్యాక్టరీని ఆధునికీకరించాలని, నూతన ఫ్యాక్టరీని నిర్మించాలని, రైతులకు అండగా ఉండాలని, పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే ఆలోచన చేయాలని ఎండీని కోరామన్నారు. ఎండీని కలిసిన వారిలో మాణికొండ కాంతారావు, ముక్కు సుబ్బారావు, సింహాచలం, ఈశ్వరరావు ఉన్నారు. ఏలూరు (టూటౌన్): మధ్యాహ్న భోజన కార్మికులకు నెలల తరబడి బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. స్థానిక ఏఐటీయూ సీ కార్యాలయంలో గురువారం మిడ్డే మీల్ వర్కర్స్ సమావేశంలో జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా సహాయ కార్యదర్శి పి. కిషోర్ మాట్లాడారు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో భోజన కార్మికులు అప్పులు చేసి వండి వార్చాల్సి ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుల విడుదలతో నిర్లక్ష్యం తగదని, అలాగే కార్మికులకు కేవలం రూ.3 వేలు గౌరవ వేతంన ఇవ్వడం సిగ్గుచేటన్నారు. వీరి గౌరవ వేతనం పెంచాలని కోరారు. దెందులూరు: మండలంలోని జోగన్నపాలేనికి చెందిన అంతర్జాతీయ ఐస్ స్కేటర్ జెస్సీరాజ్ మత్రాపు ఖేలో ఇండి యా వింటర్ గే మ్స్–2026లో రజత పతకం సాధించింది. లడక్లో ఈనెల 20 నుంచి ఈ పోటీలు జరుగుతున్నాయి. జెస్సీరాజ్ సీనియర్ గరల్స్ ఫిగర్ స్కేటింగ్ కేటగిరీలో రెండో స్థానంలో ని లిచి పతకం సాధించింది. ఆమెను ఐస్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అమితాబ్ శర్మ, ఏపీ ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ సెక్రటరీ ఖాజా, అధ్యక్షుడు మురళి, కోచ్ అబ్దుల్ హఫీజ్, శాప్ క్రీడల అధికారి సురేందర్బాబు తదితరులు అభినందించారు. -
గణతంత్ర వేడుకలకు ఆహ్వానం
కొయ్యలగూడెం: భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అరుదైన అవకాశం కొయ్యలగూడెం మండలం కనకాద్రిపురం (ఆరిపాటి) గ్రామానికి చెందిన తోట కృపామణికి దక్కింది. ఈ మేరకు రాష్ట్ర ఎక్స్ అఫీషియల్ కార్యదర్శి నుంచి ఉత్తర్వులు జారీ అయినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం కృపామణి ఆంధ్ర ప్రదేశ్ సీ్త్ర నిధి బ్యాంక్ డైరెక్టర్గా, ఏలూరు జిల్లా మహిళా సమాఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కనకాద్రిపురంలో ఆమె తయారు చేస్తున్న చిరుధాన్యాల ఉత్పత్తులకుగాను గ్రామం పేరు ప్రపంచ ఫుడ్ ఫెస్టివల్లో మార్మోగింది. అంతేగాక నాబార్డు ద్వారా ఉత్తమ మహిళా ఎంటర్ప్రిన్యూర్ అవార్డు అందుకున్న కృపామణిని గతేడాది కలెక్టర్ వెట్రీ సెల్వి జిల్లా తరుపున సత్కరించారు. యలమంచిలి: అధికంగా మద్యం సేవించి రోడ్డుపై పడిపోయిన వ్యక్తి గాయాలతో ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ మృతి చెందాడు. ఎస్సై కర్ణీడి గుర్రయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బూరుగుపల్లి గ్రామానికి చెందిన అంజూరి శ్రీను (45) ఈ నెల 20వ తేదీ రాత్రి అధికంగా మద్యం సేవించి బూరుగుపల్లి బస్టాండ్ సెంటర్లో పడిపోయాడు. అతను సిమెంట్ బల్లపై పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. అతడికి బుధవారం దొడ్డిపట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. శ్రీను మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై గుర్రయ్య తెలిపారు. శ్రీను భార్య గంగావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మండవల్లి : పందెం కోళ్ల చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై సీహెచ్ఎస్ రామచంద్రరావు తెలిపిన వివరాలివి. గత నెలలో పసలపూడి గ్రామంలో గన్నమనేని సుధాకర్కు చెందిన 12 పందెం కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు తస్కరించారు. వీటి విలువ రూ.లక్షా 50 వేలు ఉంటుంది. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామచంద్రరావు చెప్పారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి గురువారం రిమాండుకు పంపినట్లు తెలిపారు. కోళ్లను రికవరీ చేసినట్లు చెప్పారు. పెదవేగి : మద్యం మత్తులో ఓ వ్యక్తి ఎలుకల మందు తిని మృత్యువాత పడ్డాడు. పెదవేగి ఎస్సై ఎం హరిగోపాల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామానికి చెందిన కిలారి కుర్మినాయుడు (30) ఈనెల 17న మద్యం సేవించి తాగిన మత్తులో కడుపునొప్పి తట్టుకోలేక ఇంట్లో ఉన్న ఎలుకల మందు పేస్టును తిన్నాడు. వెంటనే కుటుంబీకులు అతడిని హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుర్మినాయుడుకి 21వ తేదీ వరకు బాగానే ఉందని వైద్యులు చెప్పారని, కానీ గురువారం చనిపోయినట్లు వెల్లడించారని, మృతుడి సోదరుడు కిలారి నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. భీమవరం: మహాత్మాగాంధీ వర్థంతిని పురస్కరించుకుని సర్వోదయ మండలి ఆధ్వర్యంలో సర్వోదయమే గాంధేయం అనే అంశంపై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాస్థాయిలో నిర్వహించిన సీనియర్ రచయితల కవితా రచనల పోటీల్లో విజేతల వివరాలను సర్వోదయ మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు గురువారం తెలిపారు. పోటీల్లో 17 రచనలు ఉత్తమ రచనలుగా ఎంపికయ్యాయన్నారు. విజేతలుగా వీఎస్వీ ప్రసాద్ (తణుకు), పి నాగరాజు (జీలకర్రగూడెం), టి లక్ష్మీనర్సింహమూర్తి (పాలకోడేరు), ఎం సూర్యనారాయణ (పెనుమదం), వై పాండురంగాచార్యులు (గణపవరం), కె గోపాలశర్మ (భీమవరం), బి జ్ఞానప్రసాద్ (తాడేపల్లిగూడెం), జీఆర్కే రాజువంశీ (భీమవరం), కె రామప్రసాద్ (పాలంగి), డీవీ బాలసుబ్రహ్మణ్యం (ఉండి), కె సుబ్రహ్మణ్యశర్మ (గునుపూడి), ఎల్ఎన్ శశికళ (అజ్జమూరు), కె కుషాలివెంకట్ (బొర్రంపాలెం), సీహెచ్ లక్ష్మీనారాయణ (భీమవరం), జి శేషేంద్రరావు (అత్తిలి), డి శ్రీరామకృష్ణంరాజు (తాడేపల్లిగూడెం), వి శ్రీనివాస్ (పెదతాడేపల్లి) నిలిచారన్నారు. వీరికి ఈనెల 30వ తేదీన పెదనిండ్రకొలను మహాత్మాగాంధీ భవనంలో కవితా పురస్కారాలు, బహుమతులు అందజేస్తామని ప్రసాదరాజు తెలిపారు. -
టెక్నీషియన్ ఆత్మహత్య ఘటనలో ఇద్దరి అరెస్ట్
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం ఏరియా ఆసత్రిలోని అపోలో డయాలసిస్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న టెక్నీషియన్ ముప్పిడి సుధాకర్ ఆత్మహత్య ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు ఇన్చార్జి డీఎస్పీ యు.రవిచంద్ర గురువారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఉండేశ్వరపురానికి చెందిన సుధాకర్ డయాలసిస్ సెంటర్లో ఔట్సోర్సింగ్ విధానంలో సీనియర్ టెక్నీషియన్, సెంటర్ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. 2023లో డయాలసిస్ చికిత్సకు వచ్చే ఓ రోగి కుమారుడు కొమ్ము అజయ్బాబు, సెంటర్లో ఆయా యరమాల కరుణకుమారితో చనువుగా ఉండటంతో సుధాకర్ మందలించాడు. దీంతో వీరిద్దరూ కక్ష పెంచుకుని సుధాకర్పై అక్రమ కేసు పెట్టడంతో అధికారులు సుధాకర్ను అవనిగడ్డ బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్లో సుధాకర్ బదిలీపై మరలా జంగారెడ్డిగూడెం వచ్చారు. అప్పటి నుంచి అజయ్బాబు, కరుణకుమారి, అలుగు ఆనందశేఖర్, మరో డయాలసిస్ రోగి ములకాల వీరరాఘవులతో కలిసి సుధాకర్పై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసి వేధించడం మొదలుపెట్టారు. 2023లో పెట్టిన కేసుకు సంబంధించి రాజీ పేరుతో భారీగా డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు ఇవ్వకపోతే కేసులు, పిటీషన్లు పెడతామని బెదిరించారు. వేధింపులు తాళలేక ఈనెల 18న ఏరియా ఆస్పత్రిలోని ఆర్వో ప్లాంట్లో సుధాకర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్ రాసి బాధ్యులైన నలుగురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసులో నింది తులు అజయ్బాబు, కరుణకుమారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ చెప్పారు. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై ఎన్వీ ప్రసాద్ పాల్గొన్నారు. -
పులి దాడులు.. ఏజెన్సీ బెంబేలు
● ఆవులపై దాడి చేసి హతమార్చిన వైనం ● భయాందోళనలో ప్రజలు ● అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారుల సూచన బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తూ ఆవులపై దాడి చేస్తున్న సంఘటనతో కలకలం రేగింది. బుధ వారం బుట్టాయగూడెం మండలం పందిరిమామిడిగూడెం గుబ్బల మంగమ్మతల్లి గుడికి వెళ్లే మార్గంలో పులి కనిపించగా అధికారులు పాదముద్రలను గుర్తించారు. అలాగే అంతర్వేదిగూడెం సమీపంలో గోపాలరాజు అనే రైతుపై దాడికి యత్నించగా ఆయన ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పారిపోయాడు. గురువారం నాగులవారిగూడెం సమీపంలో కొవ్వాసి దూలయ్య, మల్లం కాంతమ్మకు చెందిన కట్టేసి ఉన్న మూడు ఆవులపై పెద్ద పులి దాడి చేసి చంపివేసింది. వీటిలో ఒక ఆవు సూడిది. కాగా రాత్రికి ఇదే ప్రాంతానికి మరలా పెద్ద పులి వచ్చి మరో రెండు ఆవులపై దాడి చేసింది. దీంతో ఈ ప్రాంతవాసుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పెద్ద పులి జాడ కోసం అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిపుణులతో పా టు క్లూస్ టీమ్, వైల్డ్లైఫ్ అధికారులు రంగంలోకి దిగారు. ఆవులపై దాడి చేసిన ప్రదేశాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటుచేశారు. అప్రమత్తంగా ఉండాలి ఏలూరు (టూటౌన్)/జంగారెడ్డిగూడెం: జిల్లాలో పులి సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమాచారం తెలిసినా అధికారులకు తెలియజేయా లని జిల్లా అటవీశాఖ అధికా రి సందీప్రెడ్డి తెలిపారు. గురువారం ఏలూరు జిల్లా కార్యాలయం, జంగారెడ్డిగూడెం అటవీ శాఖ కార్యాలయాల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం కావడిగుండ్లలో, గురువారం అంతర్వేదిగూడెం, నాగులగూడెం గ్రామాల్లో పులి సంచరించిందన్నారు. ములగలంపల్లి సెక్షన్, ములగలంపల్లి బీట్ బెడదనూరు రిజర్వ్ ఫారెస్ట్లో తిరుగుతున్నట్టు గుర్తించామన్నారు. ఇదే పులి తెలంగాణలోని కావిడగుండ్ల అటవీ ప్రాంతం నుంచి అంతర్వేదిగూడెం బీట్ పరిధిలోని నాగవరం ముఠా రిజర్వ్ ఫారెస్ట్ కంపార్టుమెంట్ నం.128 నుంచి జిల్లాలోకి ప్రవేశించినట్టు గుర్తించామన్నారు. బెడదనూరు, పాకలగూడెం, అంకన్నగూడెం మొదలగు రిజర్వ్ ఫారెస్ట్కు సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా సంచరించవద్దని సూచించారు. పశువుల పాకల వద్ద వెలుతురు వచ్చేలా దీపాలు ఏర్పాటుచేయాలన్నారు. ఇప్పటికే తమ సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేశారన్నారు. సామాజిక మాధ్యమాల్లో పులి సంచారంపై అవాస్తవాలు వస్తే నమ్మవద్దన్నారు. తమ సిబ్బంది బృందాలుగా ఏర్పడి పులి కదలికలను గమనిస్తున్నారు. ఎన్టీపీఏ (న్యూఢిల్లీ) సూచనల మేరకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కంట్రోల్ రూమ్ల ఏర్పాటు జిల్లాలో అటవీ శాఖ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశారు. సబ్ డివిజనల్ అటవీ అధికారి, జంగారెడ్డిగూడెం, సెల్ 95054 99141, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, జంగారెడ్డిగూడెం, సెల్ 94408 10223, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ములగలంపల్లి సెల్: 95509 02333, కంట్రోల్ రూమ్ ఏలూరు, సెల్ 9908880327లకు పులికి సంబంధించిన సమాచారం అందించాలని కోరారు. బుట్టాయగూడెం మండలం నాగులగూడెం సమీపంలో మృతి చెందిన ఆవును పరిశీలిస్తున్న అటవీ శాఖ అధికారులు, ట్రాప్ కెమెరాను అమరుస్తున్న దృశ్యం -
కిచెన్ గార్డెన్లతో ఆరోగ్యం
కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన్ పథకంలో భాగంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు, బాలింతలు, గర్భిణులకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఆకు కూరలు, కూరగాయలను పండిస్తున్నాం. అలాగే ఆహ్లాదం కోసం అందమైన పూలమొక్కలను పెంచేలా కృషి చేస్తున్నాం. – యూవీ పద్మావతి, సీడీపీఓ, బుట్టాయగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టు బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో చుట్టూ పచ్చదనం, అందమైన పూలమొక్కలతో ఆహ్లాదకరంగా దర్శనమిస్తున్నాయి. అలాగే వీటితోపాటు కూరగాయలు, ఆరోగ్యాన్నిచ్చే ఆకుకూరలు వంటివి కూడా అంగన్వాడీ కేంద్రం చుట్టూ అంగన్వాడీ కార్యకర్తలు పెంచుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, గర్భవతులు, బాలింతలకు కలుషితంలేని ఆహారం అందించాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా న్యూట్రీషన్ గార్డెన్లను ఏర్పాటు చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు, గర్భవతులు, బాలింతలకు సేంద్రియ ఎరువుల ద్వారా పెంచుతున్న తోటకూర, గోంగూర, మెంతికూర, బచ్చలికూర, పాలకూరతోపాటు వంగ, బెండ, చిక్కుడు, తదితర కూరగాయలను ఆహారంగా అందిస్తున్నారు. అలాగే రకరకాల పూలమొక్కలను కూడా పెంచి కార్యకర్తలు వాటిని రక్షిస్తున్నారు. వీటి పెంపకానికి ఎటువంటి రసాయనిక ఎరువులు వినియోగించకుండా కేవలం సేంద్రియ ఎరువులను మాత్రమే వినియోగించడం విశేషం. 63 న్యూట్రిషన్ గార్డెన్లు బుట్టాయగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రిషన్ గార్డెన్లను కార్యకర్తలు పెంచుతున్నారు. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో కూడా పోషణ అభియాన్ పథకంలో నూట్రిషన్ గార్డెన్లను ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఒక్క బుట్టాయగూడెం మండలంలోనే సుమారు 63 అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన న్యూట్రిషన్ గార్డెన్లు కళకళలాడుతూ దర్శనమిస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో కూరగాయలు, ఆకుకూరలు, మొక్కల పెంపకం -
కేంద్రం పన్నుతో రైతు కుటుంబాల్లో సంక్షోభం
మినహాయింపు కోరుతూ కేంద్ర మంత్రికి వినతి కొయ్యలగూడెం: అకస్మాత్తుగా పన్ను పెంపు వల్ల ఎఫ్సీవీ పొగాకు సాగుపై ఆధారపడిన లక్షలాది రై తు కుటుంబాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని, అలాగే నియంత్రిత మార్కెటింగ్ వ్యవస్థకు భంగం కలుగుతుందని కొయ్యలగూడెం వర్జీనియా పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు కాకర్ల నంది తెలిపారు. చట్టబద్ధ వ్యాపారం తగ్గడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గే ప్రమాదం ఉందన్నారు. రైతుల ఆదాయం, వేలం స్థిరత్వం, మొత్తం డిమాండ్ కొనసాగాలంటే తక్కువ గ్రేడ్ పొగాకు లభ్యత, వినియోగం కీలకమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఎకై ్సజ్ డ్యూటీ పన్ను రద్దు చేయాల్సిందిగా వర్జీనియా పొగాకు రైతు సంఘం ప్రతినిధుల బృందం కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్కు విన తిపత్రం సమర్పించారు. గురువారం బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్కుమార్, ఎంపీ దగ్గుబాటి పు రందేశ్వరితో కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రైతుల బృందం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు. ఈ వివరాలను కాకర్ల నంది వివరించారు. కొనుగోలుదారుల పాల్గొనడం తగ్గితే వేలాల్లో పోటీ తగ్గి ధరలు పడిపోవడం, అమ్ముడుపోని నిల్వలు పెరగడం, చివరకు రైతుల జీవనోపాధితో పాటు మొత్తం విలువ గొలుసుపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. ఆంధ్రా, తెలంగాణలో రైతు లు, పంట సిద్ధంగా ఉన్నాయని, వచ్చే నెల నుంచి వేలాలు ప్రారంభం కానున్నాయన్నారు. పన్ను పెంపుతో దేశీయ వినియోగం గణనీయంగా తగ్గి, ధరలు తీవ్రంగా పడిపోతాయన్నారు. దక్షిణాఫ్రికాలో అక్రమ వ్యాపారం సుమారు 75 శాతం మార్కెట్కు విస్తరించడంతో చట్టబద్ధ ఫ్యాక్టరీలు మూతపడ్డ వ్యవహారాన్ని ప్రస్తావించామన్నారు. -
కవి ప్రసాద్కు జాతీయ పురస్కారం
తణుకు అర్బన్: తణుకుకు చెందిన ప్రముఖ కవి వీఎస్వీ ప్రసాద్ అక్షర ప్రవీణ జాతీయ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. ఈనెల 21వ తేదీన విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్, శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డు అందుకున్నట్లు కవి ప్రసాద్ తెలిపారు. తెలుగు భాషకు గౌరవం, తెలుగు సంస్కృతికి గుర్తింపు, తెలుగు సంప్రదాయలకు చేస్తున్న సాహిత్య కృషిని గుర్తించి ఈ పురస్కారం అందజేసినట్లు వివరించారు. కవి సార్వభౌమ శ్రీనాధ కవి వంశీయులు డాక్టర్ కావూరి శ్రీనివాసశర్మ, శ్రీశ్రీ కళాశేదిక జాతీయ కార్యదర్శి నూకే బాలార్జున సత్యనారాయణ, సుప్రసిద్ధ సామాజిక సేవకులు, కవి జాబాది మోహన్ తదితరులు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేసి గజమాలతో సత్కరించినట్లు చెప్పారు. శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ సీఈవో డాక్టర్ కత్తిమండ ప్రతాప్ జాతీయ అధ్యక్షురాలు జి.ఈశ్వరీ భూషణం, ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి.పార్థసారధి కవి ప్రసాద్ను ప్రత్యేకంగా ప్రశంసించారు. -
అనుగృహమెప్పుడో..?
ఏలూరు(మెట్రో): అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు సర్కారు ఏరుదాటాక తెప్పతెగలేసిన చందంగా పాలన సాగిస్తోంది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా జిల్లాలో ఒక్క కొత్త ఇంటిని కూడా మంజూరు చేయలేదు. అలాగే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి మంజూరు చేసిన ఇళ్లను మధ్యలో నిలిపివేసిన ఘనత కూడా చంద్రబాబు సర్కారుకే దక్కుతుంది. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు జగన్ సర్కారు ఉద్యమంలా ఇళ్లు మంజూరు చేస్తే, వీటి నిర్మాణాలకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. అప్పుడప్పుడూ పేదల ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ హడావుడి చేస్తూ సరిపెడుతోంది. గత ప్రభుత్వంలో 82 వేలకు పైగా.. జిల్లావ్యాప్తంగా గత ప్రభుత్వంలో 82,578 గృహ నిర్మాణాలు మంజూరు చేయగా వాటిలో 80,885 నిర్మాణాలు అప్పట్లోనే ప్రారంభమయ్యాయి. 2024 జూన్ నాటికి 30,429 ఇళ్ల నిర్మాణాలను అప్పటి ప్రభుత్వం పూర్తి చేయించింది. అనంతరం మరో 15 వేల నిర్మాణాలను పూర్తి చేసి 45,453 మందితో గృహప్రవేశాలు చేయించి పేదల సొంతింటి కల సాకారం చేసింది. అదే ప్రగతిని ప్రస్తుత చంద్రబాబు సర్కారు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తోంది తప్ప ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదు. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్ నాటికి 18,625 గృహ నిర్మాణాలు బేస్మెంట్ కంటే కింది స్థాయిలో, 9,569 నిర్మాణాలు బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి. 4,158 గృహాలు లెంటిల్ స్థాయిలో, 2,594 గృహాలు రూఫ్ స్థాయిలో నిలిచాయి. 486 గృహాలు రూఫ్ పైకి చేరుకోగా 1,693 గృహనిర్మాణాలు అ సలు ప్రారంభం కాకుండానే ఉండిపోయాయి. గృహ నిర్మాణాలపై ఇంత నిర్లక్ష్యం జరుగుతున్నా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. నూతనంగా గృహ నిర్మాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం, కొత్తగా గృహాలు మంజూరు చేస్తాం అని ప్రకటిస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. ఇళ్ల మంజూరు నిల్లు రెండేళ్లుగా నిలిచిన నిర్మాణాలు మాటలతో సరిపెట్టిన చంద్రబాబు సర్కారు జిల్లాలో పలు దశల్లో నిలిచిన 35,432 ఇళ్లు ఇప్పటికీ మొదలుకాని 1,693 నిర్మాణాలు జిల్లాలో 678 లేఅవుట్లలో ఇంటి నిర్మాణాలను చేపట్టిన ఘనత గత జగన్ సర్కారుకే దక్కుతుంది. గతంలో గృహ నిర్మాణాలకు భూసేకరణలో అవినీతి చోటుచేసుకుందని హడావుడి చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు ఇళ్ల నిర్మాణాలనే పట్టించుకోవడం లేదు. దీనిని బట్టి పేదల సంక్షేమంపై చంద్రబాబు సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది. ఇప్పటికై నా గృహ నిర్మాణాలను మంజూరు చేసి సొంతింటి కల సాకారం చేయాలని పేదలు కోరుతున్నారు. -
హెల్మెట్ ధారణతో ప్రాణరక్షణ
ఏలూరు (ఆర్ఆర్పేట): హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ద్వారా రహదారి ప్రమాదాల నుంచి ప్రాణ రక్షణ పొందవచ్చని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా స్థానిక శాంతినగర్లో గురువారం నిర్వహించిన బైక్ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని, రహదారి నియమాలు పాటించాలని సూచించారు. రహదారి ప్రమాదాల నియంత్రణకు రహదారి భద్రత నియమాలపై అవగాహన పెంచేలా పాఠశాల, కళాశాల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఉప రవాణా కమిషనర్ కేఎస్ఎంవీ కృష్ణారావు, ఆర్టీఓ శేఖర్, మోటార్ వాహనాల డీలర్లు, అధికారులు పాల్గొన్నారు. -
హెల్మెట్ భారం కాదు.. భద్రత
● 37వ జాతీయ భద్రతా మాసోత్సవాలు ● హెల్మెట్ ధారణపై అవగాహన కార్యక్రమాలు యలమంచిలి: గమ్యస్థానాలకు చేరుకోవాలనే తొందరలో ద్విచక్ర వాహన చోదకులు అతివేగంగా వాహనాలను నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారు. దీనికి తోడు హెల్మెట్ ధరించకపోవడంతో ప్రమాదాల్లో మృత్యువాతకు గురై కుటుంబ సభ్యులకు తీరని దుఃఖం మిగుల్చుతున్నారు. నిబంధనలు పాటించాలని ప్రభుత్వ అధికారులు మొత్తుకుంటున్నా వాహనచోదకులు లెక్కపెట్టక ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. 37వ జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రస్తుతం మోటార్ వెహికల్స్ అధికారులు రోడ్డు భద్రతా నియమాలపై వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నారు. వాహనచోదకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. అనుకోని ప్రమాదాలు జరిగినా హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి బయట పడవచ్చని చెబుతున్నారు. హెల్మెట్ ధారణతో లాభాలు ద్విచక్రవాహనాలు నడిపే వ్యక్తులకు ప్రమాదంలో తలకు దెబ్బ తగిలితే, మెదడు దెబ్బ తినడంతో ఒక్కోసారి దెబ్బ తీవ్రతను బట్టి శరీరంలో కొన్ని అవయవాలు శాశ్వతంగా చచ్చుబడడం, జ్ఞాపకశక్తిని కోల్పోవడం, మంచానికే పరిమితం కావడం, పలు సందర్భాల్లో మరణించడం జరుగుతుంది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ప్రతి ఒక్కరూ సూచిస్తున్నారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు తలకు అయ్యే గాయాల తీవ్రతను తగ్గించడం వల్ల చాలావరకు ప్రాణాపాయం నుంచి బయటపపడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేస్తూ వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధనలను కఠినతరం చేసింది. హెల్మెట్ వాడకంపై వాహనచోదకులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న దృశ్యం వాహన చోదకులు నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు. మద్యం సేవించి, మితిమీరిన వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. హెల్మెట్ ధరించడంతో పాటు నిబంధనలు పాటించాలి. హెల్మెట్ లేకుంటే మొదటిసారిగా అపరాధం రుసుము విధిస్తాం. రెండోసారి, మూడోసారి పట్టుబడితే వాహనం సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం. – అజ్మీర బద్దు, పాలకొల్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ -
కాలువలో గుర్రపు డెక్క తొలగింపు
ఎఫెక్ట్ భీమడోలు: గోదావరి కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్క, కర్ర నాచు తొలగింపు పనులను సాగునీటి సంఘాలు, ఇరిగేషన్ అధికారులు చేపట్టారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వంతుల వారీ విధానం అమలయ్యే అవకాశాలున్నందున ఇప్పటికే సాగునీరు అందక వరి నాట్లు పూర్తి కాని స్థితిలో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 3వ తేదీన దాళ్వాకు సాగు నీరందేనా? అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పందించారు. రెండు రోజులుగా సాగునీటి సంఘాల ప్రతినిధులు, అధికారులు చెత్తాచెదారం తొలగింపు పనులు చేస్తున్నారు. ఇరిగేషన్ ఏఈ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో గోదావరి కాలువ శివారు గుండుగొలను నుంచి దిగువ ప్రాంతాల్లో దట్టంగా పేరుకుపోయిన గుర్రపుడెక్క, కర్రనాచులను పంటుపై ఎక్స్కవేటర్ను ఏర్పాటు చేసి వాటిని తొలగించే పనులు చేస్తున్నారు. దెందులూరు మండల పరిధిలోని పాలగూడెం ఏరియాలో 600 ఎకరాల్లో నీరందక నేటికీ దాళ్వా వరి నాట్లు వేయలేని పరిస్థితి. ఈ క్రమంలో ఆ ప్రాంతానికి నీరందించేందుకు గుర్రపు డెక్క తొలగింపు పనులను అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. -
జాతీయ పురస్కారానికి తడికలపూడి పాఠశాల
కామవరపుకోట : జాతీయ స్థాయి స్వచ్ఛ పురస్కారానికి తడికలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయులు అంగులూరి సర్వేశ్వరరావు తెలిపారు. పాఠశాలలో పరిశుభ్రత ,పచ్చదనం, నీటి సంరక్షణ, పునరుత్పాదక శక్తి వినియోగం వంటి అంశాలను ప్రోత్సహిస్తూ మన రాష్ట్రం నుంచి 20 పాఠశాలల జాబితాలో తడికలపూడి పాఠశాల కూడా ఎంపికై నట్లు ఆయన తెలిపారు. అందుకు కృషి చేసిన హెచ్ఎం సర్వేశ్వరావును మండల విద్యాశాఖ అధికారులు డి. సుబ్బారావు, చిన్నం ప్రశాంత్ కుమార్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, గ్రామస్తులు అభినందించి సత్కరించారు. సర్పంచ్ కొత్తపల్లి రజనీ శ్రీనివాస్, స్కూల్ కమిటీ చైర్మన్ వెలమాటి నాగేశ్వరరావు, కొండపల్లి వెంకటేశ్వరరావు, బొంతు వెంకటేశ్వరరావు, తూతా లక్ష్మణరావు, తూతా బాలాజీ తదితరులు పాల్గొన్నారు ఏలూరు (ఆర్ఆర్పేట): జేఈఈ మెయిన్స్ తొలివిడత పరీక్షలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 6 కేంద్రాల్లో బుధవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహించిన తొలి సెషన్ పరీక్షలకు మొత్తం 700 మంది విద్యార్థులు హాజరు కాగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నిర్వహించిన రెండో సెషన్ పరీక్షకు 708 మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలిసెషన్లో ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్లో 150 మందికి 146 మంది హాజరు కాగా సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కేంద్రంలో 150 మందికి గాను 144 మంది, తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కేంద్రంలో 150 మందికి 149 మంది, శశి ఇంజనీరింగ్ కేంద్రంలో 115 మందికి గాను 113 మంది హాజరయ్యారు. భీమవరం విష్ణ ఇంజనీరింగ్ కేంద్రంలో 50 మందికి 49 మంది హాజరు కాగా. డీఎనన్నాఆర్ కళాశాలలో 100 మందికి 99 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్లో 150 మందికి గాను 149 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కేంద్రంలో 150 మందికి 147 మంది, వాసవీ ఇంజనీరింగ్ కేంద్రంలో 147 మందికి 144 మంది, శశి ఇంజనీరింగ్ కేంద్రంలో 119 మందికి 118 మంది భీమవరం విష్ణ ఇంజనీరింగ్ కేంద్రంలో 50 మందికి 50 మంది, డీఎన్నాఆర్ కళాశాల కేంద్రంలో 100 మందికి గాను 100 మంది హాజరయ్యారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ప్రథమ సంవత్సరం విద్యార్థులకు బుధవారం జిల్లాలోని 130 కేంద్రాల్లో ఎథిక్స్, అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే.యోహాన్ తెలిపారు. పరీక్షకు మొత్తం 15,258 మంది జనరల్ విద్యార్థులకు 14,881 మంది హాజరు కాగా 377 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. 2319 మంది ఒకేషనల్ విద్యార్థులకు 2,209 మంది హాజరు కాగా 110 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట) : ఈ నెల ఒకటి నుంచి రవాణా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 22, 24 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఇన్చార్జ్ ఉప రవాణా కమిషనర్ కేఎస్ఎంవీ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు హెల్మెట్ ర్యాలీని స్థానిక శాంతినగర్ పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి స్థానిక పాత బస్టాండు వరకూ నిర్వహిస్తామన్నారు. అధిక సంఖ్యలో ప్రజలు హెల్మెట్ ధరించి పాల్గొనాలని కోరారు. అలాగే ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటల నుంచి వాక్థాన్ నిర్వహిస్తామన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట) : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏలూరు జిల్లాలోని ఎనిమిది, తొమ్మిది తరగతుల విద్యార్థులకు జిల్లా స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్టు విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న స్థానిక ఈదర సుబ్బమ్మ దేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తామన్నారు. విజేతలకు ఈ నెల 25న కలెక్టరేట్లోని గోదావరి ఫంక్షన్ హాల్లో బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. -
నూజివీడు ఆస్పత్రిని అప్గ్రేడ్ చేయాలి
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు నూజివీడు: నూజివీడులోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా మంత్రి కొలుసు పార్థసారథి చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు డిమాండ్ చేశారు. నూజివీడులో బుధవారం ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వంలో రూ.25 కోట్లు మంజూరు చేయించి నూతన భవనాన్ని అన్ని వసతులతో నిర్మించామన్నారు. దీంతో ఆస్పత్రిలోని పాత బిల్డింగులో వంద పడకలు, నూతన బిల్డింగ్లో 200 పడకల సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. అలాగే ఐసీయూ యూనిట్, ఏడు ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేసుకునేందుకు సైతం వసతులు, ఆక్సిజన్ ప్లాంట్ కూడా అందుబాటులో ఉందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తే స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఏరియా ఆస్పత్రిని 300ల పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేయించి, ఆ తరువాత జిల్లా ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. పాలకొల్లు సెంట్రల్: స్థానిక కూరగాయల మార్కెట్లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి పట్టణానికి చెందిన బంగారు కృష్ణబాబు, నాగరాణి దంపతులు బుధవారం 20 కిలోల వెండి మకర తోరణాన్ని సమర్పించారు. అర్చకులు పూజలు చేసి అలంకరించారు. దాతలను మంత్రి నిమ్మల రామానాయుడు సత్కరించారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు, మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, పట్టణ ప్రముఖులు, ఆలయ ఈఓ పులగం వేణుగోపాలరావు పాల్గొన్నారు. ఏలూరు టౌన్: ఏలూరులో ఓ కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఏలూరు అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు వన్టౌన్ గడియార స్థంబం పక్కవీధిలో ఏపీ 16 ఎఫ్ఎల్ 3478 నెంబర్ ఇన్నోవా వాహనం చాలా రోజులుగా రోడ్డు పక్కనే పార్కింగ్ చేసి ఉంటుంది. బుధవారం ఒక్కసారిగా కారు ఇంజన్లో నుంచి మంటలు చెలరేగటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కారు ఇంజన్ మంటల్లో దగ్ధమైంది. కారు యజమాని అందుబాటులో లేకపోవటం, పూర్తి సమాచారం లేకపోవటంతో నష్టాన్ని అంచనా వేయలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. పెదపాడు: అనారోగ్యంతో బాధపడత్ను ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాలివి. కొత్తూరు బీసీ కాలనీలో నివాసం ఉంటున్న పెద్దిబోయిన ధనంజయ కుమారుడు వెంకటరావు (48) ఏలూరులోని ఓ హోటల్లో వంటమేస్త్రిగా పనిచేస్తున్నాడు. వారం రోజులుగా ఇంటి వద్దనే ఉంటూ మనస్తాపంలో ఉంటున్నాడు. ఈనెల 20వ తేదీన రాత్రి ఇంట్లో భోజనం చేసిన తరువాత అందరూ నిద్రించారు. 21న తెల్లవారు జామున 4.30గంటల సమయంలో వెంకటరావు కనపడకపోవడంతో చుట్టుపక్కల వెదికి చూసే సరికి కాలనీలోని పడమర వైపున ప్లాట్లలో వేపచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నా చావుకు ఎవరూ కారకులు కాదని ఉత్తరం రాసి జేబులో పెట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. పెదపాడు హెచ్సీ కమలాకరబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కార్గో సేవల్లో తణుకు హ్యాట్రిక్
తణుకు అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహించిన కార్గో పార్సిల్స్ అండ్ కొరియర్ డోర్ డెలివరీ మాసోత్సవాల్లో తణుకు ఆర్టీసీ డిపో రీజియన్లో మొదటి స్థానంలో నిలిచింది. గతనెల 20 నుంచి ఈనెల 19వ తేదీ వరకు నిర్వహించిన మాసోత్సవాల్లో భాగంగా తణుకు డిపో మొదటి స్థానంలో నిలిచి సత్తాచాటింది. రీజియన్లోని 4 డిపోల ఆవరణల్లో ఉన్న కార్గో కేంద్రాలతోపాటు 5 పట్టణాల్లోని కార్గో ఏజెంట్ పాయింట్ల ద్వారా డోర్ డెలివరీ సేవలు అందుతున్నాయి. తణుకులో మాసోత్సవాల్లో వినియోగదారులను ఆకర్షించే రీతిలో డోర్ డెలివరీలకు సంబంధించి లక్కీ డిప్ల ద్వారా ప్రత్యేకమైన బహుమతులను అందజేశారు. డోర్ డెలివరీ మాసోత్సవాలకు సంబంధించి ప్రచారాలు, అవగాహన ర్యాలీలు నిర్వహించారు. వరుసగా మూడో సంవత్సరం కూడా తణుకు డిపోలోని కార్గో కేంద్రం మొదటి స్థానంలో నిలిచి హాట్రిక్ సాధించడంతో సిబ్బంది సంబరాలు చేసుకుంటున్నారు. మాసోత్సవంలో పార్సిల్ బుకింగ్స్ డిపో లక్ష్యం బుకింగ్స్ గ్రోత్ శాతం తణుకు 3,007 5,986 199.07 తాడేపల్లిగూడెం 2,511 3,659 145.72 నరసాపురం 2,511 3009 119.83 భీమవరం 3,503 4,101 117.07 199.07 శాతం గ్రోత్తో ఈ ఏడాది కూడా మొదటి స్థానం గత రెండేళ్లుగా కూడా తణుకు డిపోనే ఫస్ట్ ముగిసిన డోర్ డెలివరీ మాసోత్సవాలు -
అందరి కృషితోనే..
కార్గో డోర్ డెలివరీ మాసోత్సవంలో భాగంగా రీజియన్లో అత్యధిక బుకింగ్స్ చేసిన డిపో తణుకు అవ్వడం చాలా సంతోషంగా ఉంది. డీపీటీవో వరప్రసాద్ నిరంతర పర్యవేక్షణ, వినియోగదారులు గిఫ్ట్ స్కీం, స్పాన్సర్స్ సహకారం, కార్గో డీఎంఈ షేక్ లాల్ నిరంతర కృషితోపాటు కార్గో ఆపరేటర్స్, హమాలీల కష్టంతోనే మొదటి స్థానంలో నిలవగలిగాం. వినియోగదారుల్లో అత్యధిక డీడీలు బుక్ చేసిన లావణ్య ఫీడ్స్ ప్రాప్రెయిటర్ కోసూరి సతీష్ వర్మకు అభినందనలు. – సప్పా గిరిధర్కుమార్, తణుకు డిపో మేనేజర్ రీజియన్లో పరిధిలో అత్యధిక డోర్ డెలివరీలు చేయగలిగామంటే వినియోగదారులు, కార్గో కేంద్ర సిబ్బంది, హమాలీల కృషే. అధికారుల నిరంతర పర్యవేక్షణతోపాటు నరేష్ క్లాత్ షోరూం, షాలేం పెన్ కార్నర్, డాక్టర్ టీపీఎన్ ప్రసాద్, డాక్టర్ నల్లపాటి అనూషల సహకారంతో నిర్వహించిన గిఫ్ట్ స్కీం కీలకంగా పనిచేసింది. అలాగే సేవలపై విస్తృతస్థాయిలో ప్రచారం కూడా చేశాం. –షేక్ లాల్, తణుకు ఆర్టీసీ డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ -
దాడి ఘటనలో మరో మహిళ మృతి
జంగారెడ్డిగూడెం: స్థానిక దళిత పేటలో ఆస్తి తగాదాల నేపధ్యంలో మంగళవారం రాత్రి నలుగురు మహిళలపై దాడి ఘటనలో తాజాగా మరొకరు మృతిచెందారు. మంగళవారం రాత్రి జీలుగులమ్మ మృతి చెందగా.. బుధవారం ఆమె తల్లి చుక్కమ్మ చికిత్స పొందుతూ మృతిచెందింది. జీలుగులమ్మ కూతుళ్లు ధనలక్ష్మి, ఉషారాణి ఏరియా ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. బుధవారం ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో కోలుకుంటున్న ధనలక్ష్మి, ఉషారాణిని పరామర్శించి వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీమ్, ఎఫ్ఎస్ఎల్ నిపుణులు ఘటనా స్థలంలో వేలి ముద్రలు, రక్తనమూనాలు, ఘటనకు సంబంధించి ఇతర ఆధారాలు సేకరించారు. ఏఎస్పీ, డీఎస్పీ యు.రవిచంద్ర వివరాలు వెల్లడించారు. ముప్పిడి వివేక్, ముప్పిడి పవన్, ముప్పిడి రవికుమార్, ముప్పిడి నాగేశ్వరి, కొత్తూరు శ్యామ్లు జీలుగులమ్మ కుటుంబంపై మంగళవారం రాత్రి గొడ్డలి, కర్రలతో దాడి చేశారన్నారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో రాత్రి సమయంలో జీలుగులమ్మ ఇంటికి వెళ్లే దారిలో ముప్పిడి నాగేశ్వరి మంత్రించిన నిమ్మకాయలు, ఎండు మిరపకాయలు వేసి.. మళ్లీ వారే 112కు కాల్ చేసి దీనిపై ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు ఇరువర్గాలను పిలిచి సర్ధిచెప్పి ఇంటికి పంపించేశారు. పొద్దుపోయాక వివేక్, పవన్, రవికుమార్, నాగేశ్వరి, కొత్తూరి శ్యామ్ వీరంతా జీలుగులమ్మ ఇంట్లోకి ప్రవేశించి ఆమె కుటుంబసభ్యులపై దాడి చేశారు. వివేక్ గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేయగా, జీలుగులమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, తల్లి చుక్కమ్మ, జీలుగులమ్మ కుమార్తెలు ధనలక్ష్మి, ఉషారాణి తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. చుక్కమ్మ చికిత్స పొందుతూ మృతిచెందగా, ధనలక్ష్మి, ఉషారాణి కోలుకున్నట్లు తెలిపారు. ఘటనపై జీలుగులమ్మ కూతురు ఉషారాణి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. -
ఊరు శిథిలం.. జనం శోకం
ప్రాజెక్టు 41వ కాంటూరు పరిధిలోని కొంతమంది నిర్వాసితులకు మాత్రమే పట్టాలు అందించారు. అంతేకాకుండా మాకు భూమికి భూమి కింద ముంపులో భూములు ఇచ్చారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేశాం. ఈ సమస్య పరిష్కారమైతే అందరికీ ఇళ్ల పట్టాలు అందించిన తరువాత, ఆర్అండ్ఆర్ కాలనీలో అన్ని సౌకర్యాలు కల్పించిన తరువాతే అక్కడకు తరలివెళ్తాం. – తరుసం నరేష్, బోనగిరి సర్పంచ్, కుక్కునూరు ఆర్అండ్ఆర్ పరిహారం ఇంటి విలువ పరిహారం ఇచ్చి ఒకేసారి తరలిస్తే నిర్వాసితులందరూ కాలనీలకు వెళ్ళేందుకు సిద్ధంగా ఉండేవారు. ఇలా వేర్వేరుగా పరిహారం ఇవ్వడంతోనే 41 కాంటూరు నిర్వాసితులు వెళ్ళకుండా ఆగిపోవాల్సి వచ్చింది. – ఇర్పా వెంకటేష్, అల్లిగూడెం, కుక్కునూరు సాక్షి ప్రతినిధి, ఏలూరు: ముంపు బాధితుల వేదన అరణ్య రోదనగా మారింది. పోలవరం ప్రాజెక్టులో ఇళ్లు, భూములు కోల్పోయిన గిరిజనుల గోడును సర్కారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీలపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకోవడంతో శిథిలమవుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించి ఇళ్ళకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించకపోవడంతో నిర్వాసితులు కాలనీల వైపు కన్నెత్తి చూడటం లేదు. దాంతో వందల ఇళ్ళు మొండిగోడలుగా మారిపోయాయి. కుక్కునూరు మండలంలోని గిరిజన గ్రామాల్లోని నిర్వాసితులకు పెదరావిగూడెం పంచాయతీ పరిధిలోని వెంకటాపురంలో పోలవరం పునరావాస కాలనీ నిర్మించారు. గత ప్రభుత్వ హయాంలో 758 ఇళ్ళను రూ.78 కోట్ల వ్యయంతో నిర్మించేలా ప్రాజెక్టును ఖరారు చేసి 565 ఇళ్ళను పూర్తి స్థాయిలో పూర్తిచేశారు. 41, 45 కాంటూరు పరిధిలోని గిరిజన గ్రామాల నిర్వాసితుల కోసం ఈ కాలనీని నిర్మించారు. కుక్కునూరు మండలంలో ఉప్పేరు, గణపవరం, తొండిపాక, పెదరావిగూడెం, వేలేరు, సీతారామనగరం పంచాయతీల్లోని గిరిజన నిర్వాసితుల కోసం ఈ ఇళ్ళ నిర్మాణం చేపట్టారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత 41వ కాంటూరు వరకే తరలించాలని నిర్ణయించడంతో 45వ కాంటూరు పరిధిలోని నిర్వాసితుల ఇళ్ల నిర్మాణాలను నిలిపివేశారు. గత ప్రభుత్వ హయాంలో రూ.42 లక్షల వ్యయంతో గ్రామ సచివాలయం, వైఎస్సార్ రైతుసేవా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్, ఇలా అన్ని కార్యాలయాలు నిర్మించారు. పాలకులు పునరావాస కాలనీలపై దృష్టి సారించకపోవడం, పరిహారాల పంపిణీలో జాప్యం, ఇతర కారణాలతో కోట్లాది రూపాయలతో నిర్మించిన మెగా కాలనీ శిథిలమవుతుంది. శిథిలావస్థకు చేరిన ‘కోట్ల’ స్వప్నం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్వాసితుల కోసం 758 ఇళ్ళను భారీ వ్యయంతో ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. నిర్వాసితులు సొంత గూడును వదులుకుని ఇక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని భావించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కాలనీ నిర్మాణం పూర్తయినా మౌలిక వసతుల కల్పనలో వైఫల్యం లేదా ఇతర కారణాల వల్ల నిర్వాసితులు ఇక్కడ ఉండటం లేదు. ఫలితంగా పాడుబడ్డ భవనాల్లా కాలనీ శిథిలావస్థకు చేరుకుంది. నిరుపయోగంగా ఉన్న వైఎస్సార్ హెల్త్ క్లినిక్ గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయం గిరిజన నిర్వాసితుల కాలనీపై సర్కారు నిర్లక్ష్యం గత ప్రభుత్వంలో రూ.78 కోట్లతో 758 ఇళ్ల మంజూరు మూడేళ్లలో 565 ఇళ్ల నిర్మాణం కనీస సౌకర్యాల కల్పనలో చంద్రబాబు సర్కారు వైఫల్యం ఆర్ అండ్ ఆర్ కాలనీలపై శీతకన్ను నిర్వాసితులు లేకపోవడంతో ఈ కాలనీ దొంగలకు అడ్డాగా మారింది. ఇళ్లకు అమర్చిన తలుపులు, కిటికీలు, విలువైన కలపతో చేసిన తలుపులు దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి లోపల ఉండే విలువైన కాపర్ వైర్లను దొంగిలించారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే), హెల్త్ క్లినిక్ భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. కిటికీలు ఊడిపోయి, గోడలు బీటలు వారి అసాంఘిక కార్యక్రమాలకు వేదికలుగా మారుతున్నాయి. జన సంచారం లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ కరువవడంతో సాయంత్రం అయితే ఈ ప్రాంతం మందు బాబులకు, అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులు కళ్ల ముందే ధ్వంసమవుతున్నా సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, దొంగతనాలకు గురైన వస్తువులను రికవరీ చేయడంతో పాటు, కాలనీని పునరుద్ధరించి అర్హులైన నిర్వాసితులకు అప్పగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
పులి సంచారంతో భయం భయం
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం పందిరిమామిడిగూడెం నుంచి గుబ్బల మంగమ్మ గుడికి వెళ్ళే రహదారి మధ్యలో పెద్దపులి సంచారంతో గిరిజన ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది. సరిహద్దు గ్రామం కావిడిగూడెంలో పులి దాడి చేసి ఆవును చంపడంతోపాటు ఒక లేగదూడను చాలా దూరం వరకూ ఈడ్చుకెళ్లిన సంఘటనతో ఒక్కసారిగా ఈ ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు. అనుకున్నట్టుగానే బుధవారం రాత్రి పొలం వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తున్న రాజు అనే ఒక రైతుపై అంతర్వేదిగూడెం సమీపంలో పులి దాడి చేసే ప్రయత్నం చేసిందని గ్రామస్తులు తెలిపారు. దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న రాజు గ్రామస్తులను కలవగా అతనికి ధైర్యం చెప్పి అనంతరం ఇంటికి పంపినట్లు తెలిపారు. గుబ్బల మంగమ్మ గుడికి భక్తులు ద్విచక్ర వాహనాలపై, కాలినడకన వెళ్తుంటారు. ప్రస్తుతం రబీ సీజన్లో మొక్కజొన్న పంటల్లో, వర్జీనియా పొగాకు, పనుల్లో కూడా కూలీలు పొలాలకు వెళ్తున్నారు. మరోపక్క కొండప్రాంతంలోని జీడిమామిడి తోటల్లో శుభ్రం చేసే పనులు, మందు వేసే పనుల్లో కూడా కూలీలు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. బుధవారం పెద్దపులి గిరిజనుడికి కనిపించి అక్కడి నుంచి గ్రామ సమీపంలోని కొండవైపుకు వెళ్ళినట్లు చెబుతున్నారు. ఫారెస్ట్ అధికారులు పులి ఆచూకీని కనిపెట్టి సురక్షితంగా అడవిలో వదిలేలా ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని, పిల్లలను ఒంటరిగా వదలొద్దని, పొలాలకు వెళ్ళేటప్పుడు గుంపులుగా వెళ్ళాలని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. గత ఏడాదీ ఇదే పరిస్థితి గత ఏడాది కూడా ఇదే రోజుల్లో పోలవరం, బుట్టాయగూడెం మండలాల్లో పులి సంచారంతో ప్రజలు భయంతో బెంబేలెత్తిపోయారు. పాపికొండల అభయారణ్యం నుంచి బయటకు వచ్చిన పెద్ద పులి ద్వారకా తిరుమల, గోపాలపురం, బుట్టాయగూడెం మండలాల్లో సంచరించి పాడిపశువులపై దాడి చేసింది. ద్వారకా తిరుమల కొవ్వాడ, ఉడతపల్లి గ్రామాల్లో కూడా పులి సంచరించి భయబ్రాంతులకు గురి చేసి అనంతరం మళ్లీ పాపికొండల అభయారణ్యం వైపు వెళ్ళిపోయింది. ఈ ఏడాది పులి సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుతం ఆవులపై దాడి చేసిన పులి గ్రామాల్లో ఎవరిపై దాడి చేస్తుందో అనే భయాందోళనలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. అంతర్వేదిగూడెం సమీపంలో రైతుపై దాడికి ప్రయత్నించిన పులి తాటి కల్లు తీసేందుకు తాడిచెట్టు ఎక్కాను. కిందకు తొంగి చూడగా పులి కనిపించింది. దగ్గరగా వచ్చేసరికి కేకలు పెట్టాను. ఒక్కసారిగా గాండ్రించుకుంటూ గ్రామ సమీపంలోని కొండవైపు వెళ్ళింది. పులిని చూసిన నేను భయాందోళన చెందాను. మా సోదరుడు కూడా పులిని చూశాడు. – బొల్లి రవీంద్రరెడ్డి, పందిరిమామిడిగూడెం, బుట్టాయగూడెం మండలం -
సమష్టిగా పోరుబాట
● వైఎస్సార్సీపీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి ● ఏలూరు జిల్లా స్థాయి సమావేశంలో నేతలు ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ నేతలంతా పోరుబాట పడుతూ.. పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉందని ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. నగరంలో జిల్లా స్థాయి పార్టీ సంస్థాగత కమిటీ నిర్మాణ సమావేశం బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పార్లమెంట్ పరిశీలకులు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుత్తా ప్రతాప్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్రెడ్డి, శివారెడ్డి, ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్కుమార్ హాజరయ్యారు. ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీని సంస్థాగతంగా పటిష్టంగా నిర్మించడంతో ప్రతి నాయకుడు, కార్యకర్త కీలకపాత్ర పోషించాలని నేతలు చెప్పారు. జిల్లాలో మండల కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలు, వార్డు, గ్రామస్థాయి పార్టీ కమిటీలు వేగంగా పూర్తి చేయాలన్నారు. రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేననీ, వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవటమే లక్ష్యంగా సైనికుల్లా పనిచేయాలన్నారు. ఉంగుటూరు సమన్వయకర్త పుప్పాల వాసుబాబు, పోలవరం సమన్వయకర్త తెల్లం బాలరాజు, ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్, చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు, కొఠారు రామచంద్రరావు, రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్) నూకపెయ్యి సుధీర్బాబు, దాసరి రమేష్, డీవీఆర్కే చౌదరి, ఎస్ఈసీ మెంబర్ దయాల నవీన్బాబు, బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ, ముదిరాజ్ కార్పొరేషన్ అధ్యక్షులు కోమటి విష్ణువర్థన్, వడ్డీలు కార్పొరేషన్ అధ్యక్షులు ముంగర సంజయ్, సూర్యబలిజ కార్పొరేషన్ అధ్యక్షులు శెట్టి త్యాగరాజు, రాష్ట్ర బూత్ కమిటీ జోన్ అధ్యక్షులు బీవీఆర్ చౌదరి, ఏలూరు నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్, జెడ్పీ వైస్ ఛైర్మన్ పెనుమాల విజయ్, జెట్పీటీసీ నిట్టా లీలానవకాంతం తదితరులు పాల్గొన్నారు. -
లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
ఉంగుటూరు: తాడేపల్లిగూడెం వైపు వెళుతున్న లారీని హైదరాబాద్ నుంచి తాడేపల్లిగూడెం వస్తున్న ట్రావెల్స్ బస్సు వెనుకనుంచి ఢీకొన్న ఘటన బుధవారం ఉదయం జాతీయరహదారిపై బాదంపూడి – ఉంగుటూరు గ్రామాల మధ్య చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సులో డ్రైవరు మినహా ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు ముందు భాగం నుజ్జు అవడంతో అందులో డ్రైవర్ ఇరుక్కుపోయి గాయాలయ్యాయి. స్థానికులు బస్సు నుంచి గాయపడిన డ్రైవర్ను బయటకు తీసి 108 అంబులెన్స్లో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్సై సూర్యభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ మినహా ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం -
పారిశుద్ధ్య కార్మికుల ‘శ్రమ’ గోవిందా.!
ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల శ్రమ దోపిడీకి గురవుతోంది. నెలరోజులూ పూర్తిగా పనిచేసినా వారికి 26 రోజులకు మాత్రమే వేతనాలు అందుతున్నాయి. మిగతా రోజుల్లోని శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతోంది. ఇదేంటని పారిశుద్ధ్య కాంట్రాక్ట్ మేనేజర్ను కార్మికులు ప్రశ్నిస్తుంటే, దేవస్థానం అధికారులు ఇలానే బిల్లులు ఇస్తున్నారని చెబుతున్నాడు. ఇంతకు మించి ప్రశ్నిస్తే.. తమను పనిలోంచి ఎక్కడ తీసేస్తారోనన్న భయంతో కార్మికులు కిమ్మనకుండా ఉంటున్నారు. వివరాల్లోకి వెళితే. శ్రీవారి ఆలయంలో పారిశుద్ధ్య, ఇతర (ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఏసీ మెకానిక్, కార్పెంటర్, మేషన్) పనులను పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (తిరుపతి) సంస్థకు గతేడాది అక్టోబర్ 1 న అప్పగించారు. అగ్రిమెంట్ ప్రకారం 212 మంది పనిచేయాల్సి ఉంది. అయితే నూతన క్యూ కాంప్లెక్స్, కొత్త అనివేటి మండపం, ధర్మ అప్పారాయ నిలయం (120 గదుల సత్రం) పైన నిర్మిస్తున్న సూట్ రూమ్లు, ఇతర అభివృద్ధి పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంతో ప్రస్తుతం 180 మంది పారిశుద్ధ్య, హౌస్ కీపింగ్ సిబ్బంది, సూపర్వైజర్లు, మేనేజర్తో మాత్రమే పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి దేవస్థానం ప్రతి నెలా సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ 18 శాతం, టీడీఎస్ 2 శాతం, ఇతర ట్యాక్స్లను కట్ చేసి సుమారు రూ. 34 లక్షలను కాంట్రాక్టర్కు అందజేస్తోంది. శ్రమ దోపిడీ ఇలా.. పారిశుద్ధ్య కార్మికులు మూడు షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు. అనారోగ్యం ఇతర కారణాల వల్ల ఎవరైనా సెలవులు పెడితే, వారి స్థానంలో మిగిలిన వారితో ఓవర్టైమ్ పని చేయిస్తున్నారని, దానికి ఓటీలు చెల్లించడం లేదని కార్మికులు చెబుతున్నారు. అలాగే నెల రోజులూ పూర్తిగా పనిచేసినా.. నెలకు నాలుగు సెలవులు తీసేసి 26 రోజులకు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని, మిగిలిన రోజులకు ఓడీలు ఇవ్వడం లేదని అంటున్నారు. నెలలో ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వకుండా, పనిచేసిన రోజులకు పూర్తిగా వేతనాలు చెల్లించకుండా తమ శ్రమను దోచుకుంటున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా అడిగితే పనిచేస్తే చేయండి.. లేకపోతే పోమ్మని అంటున్నారని కొందరు కార్మికులు వాపోతున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే పర్వదినాల్లో అదనపు సిబ్బందిని నియమించకుండా, తమతోనే అన్ని పనులు చేయిస్తున్నారని అంటున్నారు. ఈ విషయాలను బయటకు చెబితే తమను పనిలోంచి తీసేస్తారన్న భయంతో కుక్కిన పేనులా పడుంటున్నామని అంటున్నారు. కార్మికశాఖ అధికారులు ఎక్కడా? క్షేత్రంలో పారిశుద్ధ్య కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నా.. సంబంధిత కార్మికశాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఫలితంగా కార్మికుల కష్టనష్టాలు, వారి ఆవేదనను పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కార్మికుల శ్రమ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. అధికారుల వివరణ నెలరోజులూ పూర్తిగా పనిచేసినా కార్మికులకు 26 రోజులకు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్న విషయం వాస్తవమేనని శానిటేషన్ మేనేజర్ ప్రవరాక్య వివరణ ఇచ్చారు. దేవస్థానం అధికారులు ఓడీలు, ఓటీలకు బిల్లులు చెల్లించడం లేదని, అదనంగా సిబ్బందిని నియమించనివ్వక పోవడంతో ఉన్న వారితోనే ఎక్కువ సమయం పనులు చేయిస్తున్నామని చెప్పారు. నిబంధనల ప్రకారమే.. టెండర్ నిబంధనల ప్రకారమే కాంట్రాక్టర్కు ప్రతి నెలా బిల్లులు చెల్లిస్తున్నామని పారిశుద్ధ్య విభాగం ఏఈ ఆదిత్య వివరణ ఇచ్చారు. అడిగిన కార్మికులకు సెలవులు ఇచ్చి, మిగిలిన వారితో పనులు చేయించమని మేనేజర్కు చెబుతున్నామన్నారు. నెల పూర్తిగా పనిచేసినా.. 26 రోజులకే వేతనాలు పర్వదినాల్లో ఓవర్ టైమ్ డ్యూటీలు అయినా ఓడీలు, ఓటీలు లేవు ప్రశ్నిస్తే పని పోతుందని కిమ్మనకుండా ఉంటున్న కార్మికులు -
రగులుతున్న కొల్లేరు
● పవన్ కల్యాణ్ కార్యాలయం వరకు పాదయాత్రకు శ్రీకారం ● కొల్లేరులో చెరువుల సాగుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ కై కలూరు: కొల్లేరు ప్రజలు రగిలిపోతున్నారు. అటవీశాఖ అధికారులు అక్రమ చేపల చెరువులను ధ్వంసం చేసి నివేదిక అందించాలని కొల్లేరు గ్రామాల్లో అవగాహనల పేరుతో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో కొల్లేరు ప్రజల్లో అలజడి రేగింది. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోడానికి ప్రజలు సిద్దమవుతోన్నారు. సుప్రీంకోర్టు నియమించిన కేంద్రం సాధికారిత కమిటీ(సీఈసీ) కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చెరువుల లెక్కలు పక్కాగా అందించాలని కొరడా ఝులిపించడంతో అటవీశాఖ ఉన్నతాధికారులు మినీ కొల్లేరు ఆపరేషన్కు సిద్ధమవుతున్నారు. పలు మండలాల్లో ఆక్రమ చెరువులను ధ్వంసం చేసే క్రమంలో రాజమండ్రి సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు బీఎన్ఎన్.మూర్తి, డీఎఫ్ఓ బి.విజయ ఆధ్వర్యంలో మూడు రోజులుగా కొల్లేరు గ్రామాల్లో ప్రజలకు అక్రమ చెరువులను ఖాళీ చేయాలని అవగాహన కలిగిస్తున్నారు. కొల్లేరు ప్రజలు సైతం మా ప్రాణాలైన వదులుతాం.. చెరువుల్లో సాగు వదలం.. మాకు జీవనోపాధి ఇదే అంటూ ధిక్కార స్వరాన్ని వినిపిస్తోన్నారు. కై కలూరు మండలం చటాకాయి, వడ్లకూటితిప్ప గ్రామాలకు వెళ్ళి వచ్చిన ఫారెస్టు అధికారులు, బుధవారం కొల్లేటికోటలో అమ్మవారి దేవస్థానం వెనుక 60 ఎకరాల అక్రమ చెరువు పరిశీలనకు వెళ్ళారు. ఇక్కడ కూడా ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. ఉప ముఖ్యమంత్రి, అటవీ మంత్రి పవన్ కల్యాణ్కు కొల్లేరు ప్రజలు సమస్యలు వివరించి, చెరువుల ధ్వంసాన్ని అడ్డుకోడానికి ఈ నెల 27, 28 తేదీలలో సుమారు 25,000 మందితో మంగళగిరిలో ఆయన కార్యాలయం వరకు భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తుదీ తేదీల ప్రకటనకు కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే వడ్డీ సాధికారిత రాష్ట్ర చైర్మన్ బలే ఏసురాజు ఆధ్వర్యంలో కొల్లేరు గ్రామాల్లో పెద్దలతో సమావేశాలు నిర్వహించారు. కై కలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర నిర్వహణ నిమిత్తం గురువారం వస్తున్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్కు సమస్యను తీసుకువెళ్ళి, కొల్లేరు పెద్దలందరూ ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. చట్టం అంటే అందరికీ సమానంగా పనిచేయాలి. సంక్రాంతి పండగ రోజుల్లో సుప్రీంకోర్టు కోడిపందేలు వద్దని చెబుతున్నా మూడు రోజులు జరుగుతున్నాయి. కొల్లేరు ప్రజలు చేపల చెరువులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వాటిని ధ్వంసం చేస్తే ఎలా? కొల్లేరు ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మా సమస్యను పవన్కల్యాణ్కు తెలియచేయడానికి పాదయాత్ర నిర్వహిస్తాం. –బలే ఏసురాజు, వడ్డీ సాధికారత రాష్ట్ర చైర్మన్, కొట్టాడ, కై కలూరు మండలం -
పనివేళల్లో మూసి ఉన్న సచివాలయం
కొయ్యలగూడెం: యర్రంపేట సచివాలయం–1 కార్యాలయాన్ని బుధవారం వేళకు తీయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివిధ సేవల కోసం ఉదయం 9 గంటల నుంచి ప్రజలు ఎదురుచూశారు. పదకొండు గంటలు దాటినప్పటికీ ఉద్యోగులు ఎవరూ రాకపోవడం, కార్యాలయం తెరవకపోవడంతో నిరుత్సాహంగా వెనుతిరిగారు. ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం సచివాలయం సేవలు అవసరమై ఉండగా సకాలంలో తెరవకపోవడం వలన తాము నష్టపోయామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వాటిని వదులుకుని సచివాలయ సేవలకు వచ్చామని, కానీ పని వేళల్లో కార్యాలయం తెరవకపోవడంతో తాము నష్టపోయామని వాపోయారు. సుమారు సచివాలయంలో పది మంది వరకు ఉద్యోగులు సేవలు అందించాల్సి ఉండగా, ఒక్కరూ కూడా అందుబాటులోకి రాకపోవడం ఏంటని, విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


