breaking news
Eluru District News
-
శాంతించిన గోదావరి
● 72 గంటల పాటు మహోగ్రరూపం ● సాధారణ స్థితికి చేరువలో గోదావరి వరద ● జలదిగ్బంధనంలోనే 16 విలీన గ్రామాలు ● ముంపులోనే ఎద్దులవాగు వంతెన సాక్షి ప్రతినిధి, ఏలూరు/వేలేరుపాడు : గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. 72 గంటలు పాటు మహోగ్రరూపంతో పారిన గోదావరి సాధారణ స్థితికి చేరువలోకి వచ్చింది. ఎగువ ప్రాంతాల్లో గత నాలుగు రోజులుగా సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో వరద నీటి ఉధృతి పూర్తిగా తగ్గింది. దీంతో 17 గ్రామాలు జలదిగ్భందం నుంచి బయటకు రాగా.. 16 గ్రామాలు ముంపులోనే ఉన్నా యి. అలాగే ప్రధాన వారధిగా ఉండే ఎద్దులవాగు వంతెన ఇంకా నీట మునిగే ఉండటంతో ఏజెన్సీలో రాకపోకలకు విఘాతం కొనసాగుతుంది. గతనెల 27 నుంచి పెరుగుతూ.. ఏటా మాదిరిగా ఈ ఏడాదీ గోదావరి వరద అకస్మాత్తుగా వచ్చింది. గత నెల 27 నుంచి క్రమంగా పెరుగుతూ మూడు రోజులుగా లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరింది. దీంతో పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో జనజీవనానికి విఘాతం కలిగింది. గతనెల 27న 1.87 లక్షల క్యూసెక్కులు, 28న 1.16 లక్షల క్యూసెక్కులు, 29న 1.03 లక్షల క్యూసెక్కులు, 30న 2.14 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం ప్రా జెక్టు నుంచి దిగువకు విడుదల చేశారు. 31 నుంచి ఈనెల 2 వరకు వరద తీవ్రత కొనసాగింది. 31న 6.25 లక్షలు, 1న 12.09 లక్షలు, 2న 14.20 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలైంది. సో మవారం భద్రాచలం వద్ద 36.20 అడుగుల నీటిమ ట్టం నుంచి 6.26 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల కాగా పోలవరం ప్రాజెక్టులో స్పిల్వే 32.950 మీటర్ల ఎత్తు నుండి 10.40 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. బయటపడ్డ ఇళ్లు వేలేరుపాడు నుంచి రేపాకగొమ్ము వెళ్లే రహదారి, తాట్కూరుగొమ్ము, కన్నాయిగుట్ట రహదారులు, మేళ్లవాగు వంతెన, వేలేరుపాడు సంతబజారు, టేకూరు, కాకిస్నూరు, పేరంటపల్లి గ్రామాల్లో ఇళ్లు ముంపు నుంచి బయటపడ్డాయి. ఎద్దెలవాగు వద్ద నాటు పడవపై ప్రజలు దాటుతున్నారు. వేలేరు పాడు నుంచి రుద్రమకోట రహదారిలో నడిగడ్డలు ప్రాంతంలో రహదారి నీటమునగడంతో ఇటుగా రాకపోకలు స్తంభించాయి. కూరగాయల పంపిణీతో సరి అధికారిక లెక్కల ప్రకారం వేలేరుపాడు మండలంలో 31 హాబిటేషన్స్లో 31 గ్రామాల్లో 3,381 మంది గో దావరి వరద వల్ల నిరాశ్రయులయ్యారు. ఆయా గ్రా మాల్లో కేవలం ఉల్లిపాయలు, దోసకాయలు, పచ్చిమి ర్చి, ఆలుగడ్డలు పంపిణీ చేసిన ప్రభుత్వం బియ్యం, వంట నూనె అందించకుండా చేతులు దులుపుకుంది. నూనె లేకుండా కూరగాయలు ఎలా వండుకుని తినాలని వరద బాధితులు ప్రశ్నిస్తున్నారు. గోదావరి వరదకు ఇంకా 16 గ్రామాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. వరద నీరు గ్రామాలకు నాలుగువైపులా చేరడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మరోవైపు ప్రధాన రహదారిగా ఉన్న ఎద్దులవాగు ఇంకా నీటిలోనే ఉంది. బుధవారం నాటికి రాకపోకలు పునరుద్ధర ణ జరిగే అవకాశం ఉంది. వేలేరుపాడు మండలంలోని కోయిదా, కట్కరు, దాచారం, తాళ్ల గొంది, పూసుగొంది, చిట్టంరెడ్డిపాలెం, యడవల్లి, బుర్రెడ్డిగూడెం, టేకూరు, సిద్దారం, కుంకు డు కొయ్యలపాకలు, మరో 5 గ్రామాలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. -
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
ఏలూరు (టూటౌన్): కృష్ణా డెల్టా భూములకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఏలూరు కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం రైతు ప్రతినిధుల బృందం పీజీఆర్ఎస్లో కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ దెందులూరు, ఏలూరు నియోజకవర్గాల్లోని కృష్ణా డెల్టా భూములకు ప్రత్యా మ్నాయ మార్గాల ద్వారా గోదావరి జలాలు అందించే అవకాశమున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. జూన్ 15 నుంచే నీరిస్తామని చెప్పి, ఎకరాకు రూ.10–15 వేలు పెట్టుబడి పెట్టి నారుమడులు, నాట్లు వేశాక.. ఇప్పుడు సూపర్ ఎల్నినో సాకుతో వరి సాగు వద్దనడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. శ్రీశైలం, సాగర్, పులిచింతల వద్ద పుష్కలంగా నీరున్నా, పట్టిసీమ ద్వారా నీరు తరలిస్తున్నా సముద్రం పాలు చేస్తున్నారే తప్ప రైతులకు ఇవ్వడం లేదని విమర్శించారు. తక్షణమే పట్టిసీమ జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించాలని, పోణంగి పుంత కాలువ పనులను వేగవంతం చేసి ఏలూరు రూరల్ పరిధిలోని 10 వేల ఎకరాలకు, అలాగే తాడిపూడి ఆయకట్టుకు నీరందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.లింగరాజు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, జిల్లా కమిటీ సభ్యులు గుర్రం రాంబాబు, కృష్ణా డెల్టా ఆయకట్టు రైతులు పైడిపాటి భాస్కరరావు, తలారి జయరాజు, దాసరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
జీతాలు రాక ఆయాల అవస్థలు
భీమవరం: ఎన్నికల సమయంలో రూ. 15 వేలు ఇస్తామంటూ గొప్పగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు పాఠశాలల్లో పనిచేసే ఆయాలు, నైట్ వాచ్మెన్లకు జీతాలు సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గత నాలుగు నెలలుగా జీతాలు అందక వారు ఆందోళన చెందుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ’మనబడి నాడు–నేడు’ పథకంలో భాగంగా పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా తీర్చిదిద్దడమే గాక, పేద విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు స్వస్తి చెప్పకుండా ఉండేందుకు అమ్మ ఒడి పథకం పేరుతో ఏటా రూ.15 వేలు చెల్లించారు. అదే సమయంలో పాఠశాలల్లోని మరుగుదొడ్లు, విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన పరిసరాలను శుభ్రం చేయడానికి అన్ని పాఠశాలల్లో ఆయాలను నియమించారు. పాఠశాలలకు రక్షణగా ఉండేందుకు నైట్వాచ్మెన్లను నియమించి వారికి నెలకు రూ.6 వేలు చొప్పున వేతనాలు చెల్లించారు. ఆయాలు పాఠశాలలను, మరుగుదొడ్లను శుభ్రం చేసి, మధ్యాహ్న భోజనం అనంతరం వ్యర్థాలను తొలగిస్తుంటారు. మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి అవసరమైన మెటీరియల్ను కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో సరఫరా చేసింది. జిల్లాలో పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను బట్టి 300 మంది విద్యార్థులకు ఒక ఆయా, 600 మంది విద్యార్థులకు ఇద్దరు, 900 మంది విద్యార్థులకు ముగ్గురు, 900లకు పైగా విద్యార్థులుంటే నలుగురు ఆయాల చొప్పున నియమించారు. ఈ విధంగా జిల్లాలోని 1,379 పాఠశాలల్లో 1,445 మంది ఆయాలు, 180 మంది నైట్ వాచ్మెన్లను నియమించారు. వీరికి ప్రతి నెలా విద్యాశాఖ నుంచి రూ.6 వేల చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయ్యేది. కోస్తా జిల్లాల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి పారిశుద్ధ్య కార్మికులు మినహా మిగిలిన వారు పెద్దగా ఆసక్తి చూపలేదు. కుటుంబ పోషణకు ఈ జీతం ఉపయోగపడుతుందనే ఆశతో పాటు, స్కూల్ విద్యార్థులకు సేవ చేస్తే తమ పిల్లలకు చేసినట్లుగా ఉంటుందని భావించి కొంతమంది మహిళలు ఆయాలుగా పనిచేస్తున్నారు. ఆయాలకు నాలుగు నెలలు, నైట్వాచ్మెన్లకు ఐదు నెలలుగా జీతాలు నిలిచిపోవడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో జీవనం గడపడం కష్టతరమైపోతున్న తరుణంలో, జీతాలు సక్రమంగా చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, మే, జూన్ నెలల్లో కేవలం సగం జీతం మాత్రమే ఇచ్చారని వాపోతున్నారు. సెలవు రోజుల్లో ఉపాధ్యాయులకు పూర్తి జీతం ఇచ్చే ప్రభుత్వం, ఆయాలు, నైట్వాచ్మెన్ల పట్ల పక్షపాతం చూపడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. జీతాలు ప్రతి నెలా క్రమం తప్పక ఇవ్వాలని, మే, జూన్ నెలల్లో కూడా పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు. స్కూళ్లలో పనిచేసే ఆయాలు, నైట్వాచ్మెన్లకు నాలుగు నెలలుగా జీతాలు అందని మాట వాస్తవమే. వారి జీతాల బడ్జెట్ మంజూరైంది. జిల్లావ్యాప్తంగా 1,445 మంది ఆయాలు, 180 మంది నైట్వాచ్మెన్లు పనిచేస్తున్నారు. వీరందరికీ నాలుగైదు రోజుల్లో జీతాలు చెల్లించే ఏర్పాటు చేస్తున్నాం. ఎం.సత్యనారాయణ, మధ్యాహ్న భోజన పథకం అసిస్టెంట్ డైరెక్టర్ -
నిరుద్యోగుల భవిష్యత్తో ఆటలొద్దు
● డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి ● మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి ● వైఎస్సార్సీపీ నేతల డిమాండ్ ఏలూరు టౌన్ : నిరుద్యోగ యువత, విద్యార్థుల భవిష్యత్తో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోందని, ఉద్యోగాల కల్పన పేరుతో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) హెచ్చరించారు. ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో డీఎస్సీ–25 అక్రమాలపై రాష్ట్రవ్యాప్త నిరసనల్లో భాగంగా ఏలూరు ఏ–1 క్లిష్టల్ కన్వెన్షన్ హాల్లో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు, ముఖ్యనేతలు హాజరయ్యారు. దారుణంగా మోసం చేశారు జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ మాట్లాడుతూ డీఎస్సీ– 25లో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులను ప్రభు త్వం దారుణంగా మోసం చేసిందన్నారు. డీఎస్సీ అవినీతికి బాధ్యత వహిస్తూ విద్యామంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యామంత్రి ప్రధాన్తో రాజీనామా చేయించారనీ, ఇదే తరహాలో రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ పోస్టుల కుంభకోణం జరిగితే విచారణ చేయించకుండా తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటన్నారు. డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థులు నేడు మంత్రి లోకేష్ను బహిరంగ చర్చకు రావాలని కోరుతున్నారనీ, నిజంగా మీకు ధైర్యం ఉంటే అవినీతికి పాల్పడలేదని చెబుతూ చర్చకు వెళ్లగలరా అంటూ డీఎన్నార్ ప్రశ్నించారు. కూటమికి షాక్ తప్పదు విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తో చెలగాటం ఆడాలని చూస్తే యువత షాక్ ఇస్తారని ఏ లూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) అన్నారు. లోకేష్ అవినీతి జరగలేదని భావిస్తే డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పుడు సర్టిఫికెట్లతో అనర్హులకు ఉద్యోగాలు ఇవ్వటం న్యాయమా? అంటూ నిలదీశారు. నిరుద్యోగులకు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం యువతను నట్టేట ముంచిందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రజాపోరాటం చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు మాట్లాడుతూ డీఎస్సీ–25 కుంభకోణంపై ప్రజాపోరాటం చేస్తున్నామన్నారు. ఉద్యోగ కల్పన చేయలేకపోతే కనీసం నిరుద్యోగ భృతి ఇస్తామని యువతను నమ్మించారనీ, కూటమి ప్రభుత్వ గద్దెనెక్కి రెండేళ్లు గడిచినా ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల బకాయిలు వేల కోట్లు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఏలూరు పరిశీలకుడు డీవీఆర్కే చౌదరి, కై కలూరు పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్బాబు, చింతలపూడి పరిశీలకుడు దాసరి రమేష్, ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవ, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు డింపుల్, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి మోటమర్రి సదానందకుమార్, గ్రీవెన్స్ వింగ్ జిల్లా అధ్యక్షులు భాస్కర్ల బాచి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి జయకర్, బీసీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్, జిల్లా స్థాయి ముఖ్యనేతలు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
నూజివీడు: మండలంలోని పల్లెర్లమూడిలో సోమవారం జరిగిన ఘటనలో వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ జ్యోతిబసు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన పులవర్తి వీరబ్రహ్మం(35) తన ఇంట్లో మోటార్ను బిగిస్తుండగా, ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించి షాక్కు గురై అక్కడికక్కడే పడిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నూజివీడు: మండలంలోని మీర్జాపురానికి చెందిన నల్లగుంట్ల సురేష్ (40) ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించగా, విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఎస్సై జ్యోతిబసు తెలిపిన వివరాల ప్రకారం, సురేష్ భార్యతో ఆరేళ్ల క్రితమే విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగా జీవిస్తూ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఈ నెల 1న ఇంట్లో ఉరివేసుకోగా, గమనించిన స్థానికులు అతడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భీమవరం: రాష్ట్ర విద్యా రంగం సమస్యల వలయంలో ఉందని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించలేని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.వలరాజు డిమాండ్ చేశారు. భీమవరంలో సోమవారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా సమితి సమావేశం, అధ్యక్షురాలు యామిని దేవిశ్రీ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో వలరాజు మాట్లాడుతూ, పాఠశాల విద్య నుంచి యూనివర్సిటీల వరకు సమస్యలు తాండవిస్తున్నాయని, ఇంటర్, పీజీ విద్యార్థులకు ఇప్పటివరకు అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వ వసతి గృహాలకు నిధులు కేటాయించకపోవడం, దశాబ్ద కాలంగా ఖాళీగా ఉన్న కుక్, కమాటి, వార్డెన్ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో డ్రాపవుట్స్ పెరిగిపోతున్నాయని, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో సర్టిఫికెట్లు రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సుందర్, హేమంత్, కౌశిక్, అఖిల్ పాల్గొన్నారు. కుక్కునూరు: మండలంలోని అమరవరం శివారులో పాత హైస్కూల్కు వెళ్లే దారిలోని ముత్తయ్య పొలంలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఎస్సై రాజారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం ఇటీవల గోదావరి వరద ప్రవాహంలో కొట్టుకువచ్చి ఉండవచ్చని లేదా నీటిలో మునిగి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు సుమారు 5 అడుగుల ఎత్తు, నలుపు రంగుతో ఉన్నాడని, ఎరుపు రంగు టీ–షర్టు, నీలం రంగు షార్ట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. ఏమైనా వివరాలు తెలిస్తే వెంటనే కుక్కునూరు పోలీస్ స్టేషన్ను గానీ, 7382623699 నంబర్ను గానీ సంప్రదించాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు. భీమడోలు: పూళ్ల పంచాయతీ శివారు ఎంఎంపురంలో చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న ఓ ట్రక్ ఆటోను భీమడోలు పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. 100 కేజీల చికెన్ వ్యర్థాలను పూడ్చి పాతిపెట్టారు. ఎంఎంపురానికి చెందిన భలే సాంబశివరావు ఆక్వా చెరువులోకి మండలంలోని పలు గ్రామాల్లోని చికెన్ దుకాణాల వద్ద చికెన్ వ్యర్థాలు కొనుగోలు చేసుకుని తన ట్రక్ ఆటోలో తీసుకుని వెళ్లాడు. గ్రామస్తులు ఎంఎంపురం బస్టాండ్ వద్ద పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు సాంబశివరావు అదుపులోకి తీసుకున్నారు. ద్వారకాతిరుమల: మండలంలోని బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన బెజవాడ రామారావు అనే 85 ఏళ్ల వృద్ధుడు శనివారం అదృశ్యమయ్యాడు. నల్లజర్ల వెళుతున్నట్టు ఇంట్లో చెప్పి, బయటకు వెళ్లిన రామారావు తిరిగి ఇంటికి చేరుకోలేదు. దాంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద, ఇలా పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. దాంతో రామారావు పెద్ద కుమారుడు చిన్న ఏసు ఆదివారం ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
అధికారుల అండతో అక్రమ మైనింగ్
నూజివీడు: మైనింగ్, రెవెన్యూ అధికారుల అండదండలతోనే తోటపల్లిలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్, రవాణా జరుగుతోందని గ్రామస్తులు, రైతులు ఆరోపిస్తున్నారు. మంత్రి కొలుసు పార్థసారథి కుమారుడు నితిన్ కృష్ణకు చెందిన బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా కొండను చదును చేసే పేరుతో అక్కడ గ్రావెల్ను తవ్వి భారీ ఎత్తున బయట ప్రాంతాలకు తరలిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన రైతులు పట్టా భూముల్లో సాగు చేసుకుంటున్న చోట కూడా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరిపి తరలిస్తున్నారని, దీనిపై ప్రశ్నిస్తే మంత్రి అనుచరులు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. విచారణకు రాని రెవెన్యూ అధికారులు గత నెల 30న జిల్లా కలెక్టర్కు, మైనింగ్ శాఖ అధికారులకు రైతులు, గ్రామస్తులు కలిసి అక్రమ మైనింగ్పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం మైనింగ్ జరిగే ప్రదేశంలో రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు సంయుక్తంగా విచారణ జరుపుతారని రైతులకు సమాచారం అందింది. దీంతో రైతులు అక్రమ మైనింగ్ జరుగుతున్న కొండ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో ఏలూరు జిల్లా మైనింగ్ శాఖ ఆర్ఐలు కె.వి.రమణ, శ్రీనివాస్ ప్రసాద్, సర్వేయర్ శ్రీనివాసరావు ఆగిరిపల్లి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. తహసీల్దార్ పి.ఎన్.వి.ప్రసాద్ ఏలూరులో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారని, తహసీల్దార్ అనుమతి లేకుండా విచారణలో పాల్గొనలేమని, ఆయన కోసం ఎదురుచూస్తున్నామని మైనింగ్ శాఖ అధికారులు తెలిపారు. రెవెన్యూ అధికారులు రాకపోవడంతో, మైనింగ్ శాఖ అధికారులు కొంతసేపు వేచి చూసి వెనుదిరిగారు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అక్రమ మైనింగ్ చేసే వారితో కుమ్మకై ్క కావాలనే విచారణకు రాలేదని వారు ఆరోపించారు. మంత్రి అనుచరులకు అన్నీ అనుమతులు ఉంటే, మమ్మల్ని చూసి ఎందుకు తవ్వకాలు నిలిపివేస్తారని ప్రశ్నించారు. రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో అక్రమ తవ్వకాలు చేసిన వారిపై విచారణ జరిపి జరిమానా విధించాలని వారు డిమాండ్ చేశారు. అక్రమ తవ్వకాల వల్ల కొండపై కొలువై ఉన్న దుగ్గిరాల బాలరావమ్మ తల్లి ఆలయానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు అక్రమ మైనింగ్ను అడ్డుకుంటామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు హెచ్చరించారు. -
ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయొద్దు
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా ఏపీపీటీడీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని, ఎలక్ట్రికల్ బస్సులను పూర్తిగా ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని 1,000 ఉద్యోగులు, ప్రజల నుంచి సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని జేసీ అభిషేక్ గౌడకి సమర్పించారు. జిల్లా జేఏసీ చైర్మన్లు కె.రమేష్కుమార్, రాంబాబు, కో–కన్వీనర్ ఎన్.సురేష్, ఏపీ జేఏసీ చైర్మన్ కె.రమేష్కుమార్ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ప్రజారవాణా వ్యవస్థతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
సార్వాలో ఎరువుల యాజమాన్యం
అత్తిలి: వరిసాగులో రైతులు అవసరం మేరకే ఎరువులు, పురుగు మందులు వినియోగించాలని, దీని ద్వారా సాగు ఖర్చులు తగ్గి, నాణ్యమైన మంచి దిగుబడులు లభిస్తాయని మండల వ్యవసాయశాఖ అధికారి టీకే రాజేష్ చెప్పారు. సార్వా సాగులో రైతులు ఎరువుల యాజమాన్య పద్ధతులను పాటించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాలని ఆయన సూచించారు. భూసార పరిరక్షణకు, ఉత్పత్తి కోసం రసాయన ఎరువులతో పాటు సేంద్రియ జీవన ఎరువులను వాడాలి. సేంద్రియ, రసాయన ఎరువులను కలిపి వినియోగించడం వల్ల భూసారం పెరగడమే కాకుండా పోషకాల లభ్యత పెరుగుతుంది. భూసార పరీక్షా ఫలితాల ప్రకారం నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను వేసుకోవాలి. సార్వాలో ఎకరాకు సిఫార్సు చేసిన 36:24:24 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్ను స్వర్ణ, ఎంటీయూ –1318 రకాలకు తప్ప అన్ని మిగిలిన రకాలకు వేసుకోవచ్చు. స్వర్ణ, ఎంటీయూ 1318 రకాలకు 24:24:24 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్ మాత్రమే వేయాలి. నత్రజని వినియోగ సామర్ధ్యం పెంచడానికి 50 కిలోల యూరియాకి 10 కిలోల వేపపిండి కలిపి రెండు రోజులు నిల్వ ఉంచి పొలంలో వెదజల్లితే నత్రజని వినియోగం సామర్ధ్యం పెరుగుతుంది. పురుగులు, తెగుళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు నత్రజని ఎరువుల వాడకం తగ్గించాలి. నత్రజనిని ఎక్కువగా వాడి భాస్వరం, పొటాష్ ఎరువులను సరైన మోతాదులో వేయకపోతే చీడపీడల ఉధృతి పెరిగి, తాలు, కంకులు ఎక్కువగా ఏర్పడి దిగుబడి తగ్గిపోతుంది. పంట నాణ్యత లోపిస్తుంది. ప్రతి రైతు రెండేళ్లకోసారైనా భూసార పరీక్షలు చేయించుకుని ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. అగ్గితెగులు, పొట్టకుళ్లు తెగులు, గోధుమ రంగు మచ్చ తెగులు నివారణకు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు నివారణ చర్యలు చేపట్టాలి. -
మధ్యవర్తిత్వం 3.0పై అవగాహన
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి జిల్లాలో అక్టోబర్ 31 వరకు నిర్వహించనున్న మధ్యవర్తిత్వం 3.0 ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి ఆధ్వర్యంలో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం వద్ద ర్యాలీని ప్రారంభించి న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడుతూ గతేడాది 1.0, 2.0లో కేసుల పరిష్కారానికి విశేష కృషి చేశామని, అదే స్ఫూర్తితో 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. వారం పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. రాజీయోగ్యమైన కేసుల సామరస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అన్ని కోర్టుల పరిధిలో మధ్యవర్తులు ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని, 7వ అదనపు జిల్లా జడ్జి వైస్. శ్రీనివాసరావు, 8వ అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాసమూర్తి, పర్మినెంట్ లోక్అదాలత్ చైర్పర్సన్ మేరీ గ్రేస్కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనె సీతారాం, న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
అడవికి మేమే రాజులం
బుట్టాయగూడెం: అరుదైన జంతుజాలానికి నిలయమైన పాపికొండల అభయారణ్యంలో అత్యంత క్రూర జంతువులైన అడవి కుక్కలు (వైల్డ్ డాగ్స్) గుంపులుగా సంచరిస్తున్నాయి. ఇవి అటవీ ప్రాంతంలోని అనేక జంతువులను వేటాడుతుంటాయి. అడవికి పులే రాజుగా చెప్పుకుంటున్నప్పటికీ, ఆ పులిని సైతం అడవి కుక్కలు భయపెట్టగలవని చెబుతుంటారు. అడవి కుక్కలు సంచరించే ప్రదేశాల్లో పులులు కూడా సంచరించవని, వాటి ఉనికిని కనిపెట్టి పులులు తప్పించుకుంటూ తిరుగుతాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. పరిమాణంలో ఊరకుక్కల కంటే కొంచెం పెద్దవిగా ఉండే వైల్డ్డాగ్స్, తమకంటే బరువు, శక్తి కలిగిన పెద్ద పులులను సైతం సమూహ శక్తితో తరిమికొట్టగలవు. అడవిలో సంచరించే అడవి పందులను ఈ వైల్డ్డాగ్స్ చిటికెలో వేటాడి ఆహారంగా మార్చుకుంటాయి. వాటి బరువుతో పోల్చుకుంటే ఎన్నో రెట్లు పెద్దవైన కణితి (సాంబార్ డీర్) లాంటి పెద్ద జంతువులను కూడా ఈ అడవి కుక్కల సమూహం వేటాడతాయి. ఈ వైల్డ్డాగ్ గుంపులు ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండకుండా నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. ఇవి ఊరకుక్కల కంటే కాస్త పెద్దవిగా ఉండి, తోకకు కుచ్చుగా వెంట్రుకలు ఉంటాయి. ఇవి యూరప్ దేశాల్లో నల్ల మచ్చలతో కనిపిస్తాయి. పాపికొండల అభయారణ్యంలో 200 వేట కుక్కలు పాపికొండలు, నాగార్జున సాగర్–శ్రీశైలం, గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యాల్లో అడవి కుక్కల సంచారం ఎక్కువగా ఉంటుందని వైల్డ్లైఫ్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ టైగర్ జోన్లో కూడా అడవి కుక్కల సంచారం అధికంగా ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. పాపికొండల అభయారణ్యంలో సుమారు 200కు పైగా కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నట్లు గుర్తించామని, ప్రస్తుతం వాటి జాడ అల్లూరి సీతారామరాజు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో, ఇవి స్వేచ్ఛగా సంచరించడానికి మరింత అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వైల్డ్డాగ్స్ జీవావరణ సమతుల్యతలో ప్రధాన భూమిక పోషిస్తుంటాయి. మాంసాహార జంతువులు, గడ్డి తినే జంతువుల మధ్య సమతుల్యత భూమిపై మొత్తం పర్యావరణ స్థితిని నిర్ణయిస్తుంది. చిరుతపులి, పెద్దపులి, అడవి కుక్కల వంటి మాంసాహార జంతువుల సంఖ్య తగ్గిపోతే, వాటి ఆహార జంతువులైన వివిధ జింకల సంఖ్య అమాంతంగా పెరిగి అడవిలోని వృక్షాలు తగ్గిపోతాయి. రైతులకు ఇబ్బంది కలిగించే అడవిపందులు, జింకల సంఖ్య ప్రమాదకరంగా పెరగకుండా నియంత్రణలో ఈ అడవికుక్కలు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు అంటున్నారు. పాపికొండల అభయారణ్యంలో వైల్డ్ డాగ్స్ సంచారం -
దొరకని పులి ఆచూకీ
బుట్టాయగూడెం: అటవీశాఖ అధికారులు వలలకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న పెద్ద పులి సోమవారం కూడా తప్పించుకుంది. జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం మధ్యలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పులి దాక్కొంది. రేడియో కాలర్ ద్వారా సిగ్నల్ రాకపోవడంతో అటవీశాఖ అధికారులు పులి సంచరించే ప్రదేశంలో కొద్దిసేపు శబ్దాలు చేస్తూ హడావుడి చేశారు. కొంతసేపటికి బయటకు వచ్చిన పెద్దపులి కాల్వ వెంట సంచరిస్తున్నట్లు గుర్తించారు. పులిని క్షేమంగా బంధించేందుకు అటవీశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ వారికి చిక్కకుండా అక్కడి నుంచి జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెం, ములగలంపల్లి మీదుగా రౌతుగూడెం రోడ్డు దాటుకుంటూ బుట్టాయగూడెం మండలం బెడదనూరు అటవీప్రాంతంలోకి చేరుకున్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలో పులి సంచరిస్తున్న సిగ్నల్ లభించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. బెడదనూరు అటవీ ప్రాంతం నుంచి కొద్దిదూరంలో పూచికపాడు ఉంది. అక్కడి నుంచి మళ్లీ తెలంగాణ ప్రాంతం మొదలవుతుంది. పులి ఈ రాత్రికి ఆ ప్రాంతం దాటితే ఇక తెలంగాణ ప్రాంత అటవీశాఖ అధికారులకు సమాచారం అందిస్తామని అధికారులు తెలిపారు. ఉండి: ఉండిలో బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై హెచ్.మల్లికార్జునరావు తెలిపిన వివరాల ప్రకారం ఉండి జెడ్పీ హైస్కూల్లో పదోతరగతి చదువుతున్న కడలి తాప్సీ(15) కొద్ది రోజులుగా టైఫాయిడ్తో పాటు ఇన్ఫెక్షన్తో బాధపడుతుంది. ఆమెకు కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నారు. తండ్రి గల్ఫ్ వెళ్ళగా తల్లి భీమవరంలోని ఓ కార్పొరేట్ దుకాణంలో పని చేస్తుంది. అనారోగ్యం కారణంగా సోమవారం స్కూల్కు వెళ్ళలేదు. సాయంత్రం ఇంటి వద్ద అమ్మమ్మతో పాటు బాలిక మాత్రమే ఉంది. సాయంత్రం అమ్మమ్మ బయటకు వెళ్ళడంతో బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనాస్థలికి చేరుకుని ప్రాథమిక కారణాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆకివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తాడేపల్లిగూడెం రూరల్: దాళ్వాకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి జడ్. వెంకటేశ్వరరావు కోరారు. ఎల్నినో పరిస్థితులపై సోమవారం మండలంలోని కొండ్రుప్రోలు, ఎల్.అగ్రహారం, మెట్ట ఉప్పరగూడెం, కుంచనపల్లి రైతు సేవా కేంద్రాల్లో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు కొనసాగితే ఆయా గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయానికి రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలతో పాటు నూనె గింజలు, పచ్చిరొట్ట పంటలు వేసుకోవాలన్నారు. ప్రస్తుతం నువ్వుల పంటకు మంచి గిరాకీ ఉందన్నారు. -
వరద కష్టాలు.. ఇంకెన్నాళ్లు?
● కుక్కునూరు నిర్వాసితుల ఆవేదన ● కాంటూర్ల పేరుతో పరిహారంలో వివక్ష కుక్కునూరు: పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్రంలో విలీనం చేసిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఆర్అండ్ఆర్ (రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్) అమలుపై స్పష్టత లేకపోవడంతో నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు ఎత్తు ఆధారంగా గ్రామాలను 41, 45 కాంటూర్లుగా విభజించారు. అయితే, ఒకే గ్రామంలోని కొందరికి 41 కాంటూర్ కింద పరిహారం అందించి పునరావాసానికి తరలిస్తుండగా, మిగిలిన వారిని 45 కాంటూర్ పరిధిలోకి తెచ్చి పరిహారాన్ని నిలిపివేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దారులన్నీ జలమయం ఇటీవల భద్రాచలం వద్ద గోదావరి మూడో ప్రమాద హెచ్చరికను దాటడంతో సీతారామనగరం, వెంకటాపురం–వేలేరు, ఎస్సీ కాలనీ దారు లు జలమయమయ్యాయి. కుక్కునూరులో 45 కాంటూరు ఇళ్లతో పాటు ఆంబోతులగూడెం, వింజరం, బెస్తగూడెం సమీపంలోకి వరద నీరు చేరింది. గతంలో వరద ప్రభావం లేని కొన్ని గ్రామాలకు 41 కాంటూరు కింద పరిహారం ఇచ్చారని, ఏటా ముంపునకు గురవుతున్న తమను మాత్రం విస్మరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, కాంటూర్లతో సంబంధం లేకుండా నిర్వాసితులందరికీ ఆర్అండ్ఆర్ పరిహారం అందించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బెస్తగూడెం గ్రామం చుట్టూ వరద నీరు చేరింది. గ్రామంలో అందరూ కూలి పనులకు వెళ్లేవారే. చుట్టూ నీరుంటే ఇప్పుడు రోజు ఎలా గడుస్తుంది. ఏటా ఈ ఇబ్బంది తప్పడం లేదు. అయినా ప్రభుత్వం 45 కాంటూరంటూ మాకు పరిహారం ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. –పెద్దపల్లి రామయ్య, రైతు, బెస్తగూడెం మూడు రోజుల క్రితం వచ్చిన వరదతో దాదాపు మండలంలోని చాలా గ్రా మాలకు వెళ్లే వీలు లేకుండా రోడ్లన్నీ మునిగిపోయాయి. ఇప్పటికై నా ప్రభుత్వం కాంటూర్లతో సంబంధం లేకుండా అందరికీ ఆర్అండ్ఆర్ పరిహారం అందించి పునరావాస కాలనీలకు తరలించాలి. – కొన్నే లక్ష్మయ్య, మండల కార్యదర్శి, సీపీఐ -
నేడు వైఎస్సార్సీపీ కీలక సమావేశం
జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ కై కలూరు: వైఎస్సార్సీపీ కై కలూరు కార్యాలయంలో మంగళవారం సా యంత్రం 4 గంటలకు నియోజకవర్గ నాలుగు మండలాల నాయ కులు, కార్యకర్తలకు స మావేశం నిర్వహిస్తున్నామని జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) సోమవారం తెలిపారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 5న పొగాకు రైతుల కోసం చలో దేవరపల్లి, అలాగే 2005లో డీఎస్సీలో జరిగిన అక్రమాల ఆంశాలపై సమావేశంలో చర్చిస్తామన్నారు. ఈనెల 6 నుంచి 9 వరకు రిలే దీక్షలు జరుగుతాయని, ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో 295 అర్జీలు స్వీకరించినట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టర్తో పాటు జేసీ ఎంజే అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్కుమార్, డీఆర్వో ఎం. శ్రీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వి నూత్న తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు పునరావృతం కాకుండా లబ్ధిదారులు సంతృప్తిని దృష్టిలో ఉంచుకుని, నా ణ్యమైన పరిష్కారం అందించాల్సిన బాధ్యత అధికారులుపై ఉందన్నారు. కలిదిండి(కై కలూరు): ముఖ్యమంత్రి చంద్రబాబు మీ భూమి–మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాల పంపిణీ నిమిత్తం ఈనెల 10న కై కలూరు నియోజకవర్గం కలిదిండి రానున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటుచేస్తున్నారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో సోమవారం కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, జేసీ అభిషేక్ గౌడ్, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న కలిదిండి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణాన్ని అక్కడి నుంచి సమీపంలో హెలీప్యాడ్, మరో మూడు ప్రాంతాలను పరిశీలించారు. అధికారులంతా అప్ర మత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. కలిదిండి, మండవల్లి ఎస్సై పవన్కుమార్, రామచంద్రరావు ఉన్నారు. ద్వారకాతిరుమల: శ్రీవారి హుండీల ఆదాయాన్ని సోమవారం దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, ఎంఎస్ఎన్ చారిటీస్ (కాకినాడ) ఈఓ సీహెచ్ సురేష్నాయుడు పర్యవేక్షణలో లె క్కించారు. గత 25 రోజులకు నగదు రూపంలో 2,81,82,065లు, 242 గ్రాముల బంగారం, 3.330 కిలోల వెండితో పాటు విదేశీ కరెన్సీ లభించినట్టు ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే లెక్కింపులోకి రాని రద్దయిన రూ.2,000, రూ.500 నోట్ల ద్వారా రూ.22 వేలు లభించిందన్నారు. సగటున రోజుకు రూ.11,27,283 ఆదాయం లభించిందన్నారు. శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన మంగళవారం ఏలూరు కలెక్టరేట్లో జిల్లా సమీక్షా సమావేశం (డీఆర్సీ) నిర్వహించనున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. సమావేశంలో జిల్లాలో ఎల్నినో, వర్షపాతం పరిస్థితులు, భూగర్భ జలాల స్థితి, 22ఏ, దేవదాయ శాఖ అంశాలు, వరదల పరిస్థితి తదితర అంశాలపై సమీక్షిస్తారని కలెక్టర్ అన్నారు. -
మద్దిలో హనుమద్ కల్యాణం
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆదివారం శ్రీ సువర్చలా సమేత హనుమద్ కల్యాణం ఘనంగా జరిగింది. స్వామి జన్మ నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఈ కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. వేడుకలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించి తరించారని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వాహణాధికారిణి ఆర్.వి.చందన వెల్లడించారు. -
లోతట్టు ప్రాంతాల్లోకి చేరుతున్న వరద నీరు
నరసాపురం రూరల్: నరసాపురం మండలంలో గోదావరి వరద ఉధృతి ఆదివారం మధ్యాహ్నం నుంచి క్రమంగా పెరుగుతోంది. ఎగువన ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో, దిగువకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో నరసాపురం మండల పరిధిలోని కొత్త నవరసపురం ఎస్టీ కాలనీతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు ఆదివారం సాయంత్రానికి జలమయమయ్యాయి. పరిస్థితిని సమీక్షించేందుకు తహసీల్దార్ నాగార్జున ఆయా ప్రాంతాల్లో నిరంతరం పర్యటిస్తున్నారు. వరద ప్రభావం మరింత పెరిగితే బాధితులను సోమవారం నాటికి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశామని, సిద్ధంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు. ముందస్తు చర్యల్లో భాగంగా రెవెన్యూ, పంచాయతీ, సచివాలయ సిబ్బందితో నిరంతర గస్తీ ఏర్పాటు చేశారు. అలాగే కొత్త నవరసపురం, పాత నవరసపురం గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులకు సేవలందిస్తున్నారు. వరద ముప్పు పెరిగితే తీసుకోవాల్సిన తదితర చర్యలపై సిబ్బందికి తహసీల్దార్ దిశానిర్దేశం చేశారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతి
తణుకు అర్బన్: తణుకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు తణుకు పట్టణ ఎస్ఐ సీహెచ్వీ సత్యనారాయణ తెలిపారు. సుమారు 55 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి అనారోగ్య కారణాలతో మృతిచెందినట్లు తెలిసిందని. మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచినట్లు వివరించారు. మృతుడిని గుర్తించిన వారు తణుకు పట్టణ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. తణుకు అర్బన్: తణుకు పట్టణ పరిధిలోని వెంకటరాయపురంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో రామదాసు వెంకటేశ్వరరావు(64) మృతి చెందారు. వెంకటేశ్వరరావు సైకిల్పై వెళ్తుండగా ఫిట్స్ రావడంతో ప్రమాదవశాత్తు అదుపు తప్పి కింద పడిపోయారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తణుకు రూరల్ ఎస్ఐ నాళం శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాలకొల్లు సెంట్రల్: ఆటోను వెనుక నుంచి మరో ఆటో ఢీకొట్టిన సంఘటనలో మహిళ మృతి చెందింది. రూరల్ పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం చింతపల్లికి చెందిన పడాల పద్మావతి(38) పాలకొల్లులో ఉంటున్న తన సోదరుడి ఇంటికి వెళ్లింది. మధ్యాహ్నం పని చూసుకుని తిరుగు ప్రయాణంలో పాలకొల్లులో ఆటో ఎక్కారు. దిగమర్రు బైపాస్ రోడ్డు వద్దకు వెళ్లేసరికి వెనుక నుంచి మరో ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ముందు ఆటోలో ఉన్న పద్మావతి రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు పద్మావతిని హుటాహుటిన పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సాయంత్రం 5:30 గంటలకు మృతి చెందారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. భీమడోలు: జాతీయ రహదారి భీమడోలు అయ్యప్పస్వామి ఆలయం వద్ద శనివారం రాత్రి బైక్ అదుపు తప్పిన ఘటనలో ఒక వ్యక్తి జారి పడి మృతి చెందాడు, ఏలూరుకు చెందిన పందిరిపల్లి రాము (59), విజయవాడకు చెందిన సంతాట సురేష్లు బాదంపూడిలో వడ్రంగి పనులు చేసేందుకు ఏలూరు నుంచి వస్తున్నారు. బైక్పై ఏలూరు వెళ్తుండగా, అయ్యప్ప స్వామి ఆలయం వద్దకు వచ్చేసరికి బైక్ ఒక్కసారిగా అదుపుతప్పడంతో రోడ్డుపై జారి పడ్డారు. బైక్ నడుపుతున్న రాముకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. రామును అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సురేష్కు తీవ్ర గాయాలు కాగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. భీమడోలు ఎస్సై ఎస్కే మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముదినేపల్లి(కై కలూరు): భర్త వేధింపులు తాళలేక భార్య పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముదినేపల్లి మండలం వైవాకలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వైవాక గ్రామానికి చెందిన నగుళ్ళ నరసింహరావుతో కై కలూరు మండలం వరహాపట్నంకు చెందిన వెంకట సత్యవతికి వివాహం జరిగింది. ఇటీవల పలు సార్లు భార్యభర్తల మద్య విభేదాలు రావడంతో సత్యవతి పుట్టింటికి వెళ్లింది. పెద్దలు సర్దిచెప్పి పంపించేవారు. ఆదివారం తిరిగి భర్త, అత్తతో గొడవ జరగడంతో మనస్తాపం చెంది సత్యవతి పురుగు మందు తాగింది. ఆమెను గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కై కలూరు: వేగంగా ఇద్దరు యువకులు వాహనంతో ఢీకొట్టిన ఘటనలో కై కలూరుకు చెందిన తాపీమేస్తీ గంధం రామయ్య(65) మరణించాడు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్దకు రామయ్య వాహనంపై వస్తుండగా పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన కొత్తపల్లి బాను, చందక ఉమామహేశ్వరరావులు అతి వేగంగా వాహనంతో ఢీకొట్టారు. రామయ్యను కై కలూరు ప్రభుత్వాసుపత్రి అక్కడ నుంచి ఏలూరు ప్రభుత్వాసుపత్రి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. వాహనంతో ఢీకొట్టిన యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. -
పెద్దింట్లమ్మా.. చల్లగా చూడమ్మా
కై కలూరు: అమ్మా.. కొల్లేటికోట పెద్దింట్లమ్మా.. చల్లంగా చూడమ్మా అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు. పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకున్నారు. సమీప కోనేరులో స్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ.. ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదాలు, గదుల అద్దెలు, అమ్మవారి ఫొటోల విక్రయాలు, వాహనపూజలు, విరాళాల ద్వారా రూ.1,30,161 ఆదాయం వచ్చిందని తెలిపారు. ముదినేపల్లి: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంతో ఎలుకల మందు తిని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ముదినేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరం గ్రామానికి చెందిన రమేష్ రొయ్యల చెరువు వద్ద మామిడి గురునాథం(33) నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. శనివారం భార్య దగ్గర రూ.200 మద్యానికి తీసుకున్నాడు. తిరిగి రాత్రికి మళ్ళీ డబ్బులు అడగగా, లేవని చెప్పడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడి నుంచి 108 వాహనంలో గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించాడు. భార్య ఫిర్యాదుపై ఆదివారం కేసు నమోదు చేశారు. -
వణికిస్తున్న పులి
● స్వర్ణవారిగూడెంలో గేదైపె దాడి ● పులిని పట్టుకునేందుకు ప్రత్యేక షూటర్లు బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలంలో సంచరిస్తున్న పులి పశువులపై దాడి చేసి చంపుతూ రోజుకో ఊరు మారుస్తోంది. అటవీ అధికారులకు చిక్కకుండా పెద్దపులి అందరిని భయాందోళనకు గురి చేస్తుంది. శనివారం బుట్టాయగూడెం మండలం మర్లగూడెంలో పూనె నుంచి వచ్చిన మత్తు నిపుణులకు దాదాపు పులి చిక్కినట్టే భావించారు. అయితే పులి భావించి వారికి చిక్కకుండా అటవీ ప్రాంతంలోని పాటెమ్మగుడి దాటుకుంటూ రాత్రి ఒంటి గంట సమయంలో పట్టెనపాలెం, అక్కంపేట మధ్యలో బస చేసింది. పులి అక్కడ ఉన్నట్లు రేడియో కాలర్ ద్వారా గుర్తించిన అధికారులు అక్కడికి చేరుకోగానే అక్కడి నుంచి జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెం వెళ్ళి అక్కడ గేదైపె దాడి చేసి చంపేసింది. అదే ప్రదేశంలో అటు జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి మండలాల సరిహద్దులో ఒక తోటలో మకాం వేసింది. మళ్లీ పులిని పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు పరంజిలు ఏర్పాటు చేశారు. ఇప్పటికై నా చిక్కుతుందో లేదోనని అటు అటవీశాఖ అధికారుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఆందోళన నెలకొంది. ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు పులి స్వర్ణవారిగూడెం సమీపంలోనే మకాం వేయడంతో పాములవారిగూడెం, స్వర్ణవారిగూడెం గ్రామాలతోపాటు జంగారెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలెవరూ భయబ్రాంతులకు గురికాకుండా ఉండాలని పులిని పట్టుకుని సురక్షితంగా తరలిస్తామని చెప్పారు. జిల్లా అటవీశాఖ అధికారి సందీప్ రెడ్డి పర్యవేక్షణలో సబ్ డీఎఫ్ఓ వెంకట సుబ్బయ్య, దావీదురాజు, దుర్గాప్రసాద్ బాబు, తదితరులు పులిని పట్టుకునేందుకు శ్రమిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేక బృందాలు కూడా వస్తున్నట్టు సమాచారం. -
నారు వ్యాపారానికి ఎల్నినో దెబ్బ
గణపవరం: ఏటా తొలకరి వచ్చిందంటే నారు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు ఉండేది. జూన్ ఆరంభం నుంచి సుమారు నాలుగు నెలల పాటు ఈ వ్యాపారం జోరుగా సాగుతుంది. వివిధ రకాల కూరగాయలు, పూలమొక్కలు, విత్తనాలను వారపు సంతలతో పాటు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి అమ్ముతూ సుమారు 200 మంది చిరు వ్యాపారులు జీవనోపాధి పొందుతున్నారు. గణపవరం మండలం వల్లూరు, ముగ్గుళ్ల గ్రామాలకు చెందిన రైతులు దశాబ్దాలుగా నారు మొక్కలు సాగు చేస్తూ జిల్లాలోని పలు సంతల్లో అమ్ముతుంటారు. వర్షాలు పడగానే వంగ, టమాటా, పచ్చిమిర్చి, బంతి, చామంతి, గులాబి వంటి పూలమొక్కల నారును విక్రయిస్తారు. వీటితో పాటు తోటకూర, పాలకూర, బీర, బెండ వంటి పలు రకాల కూరగాయల విత్తనాలను సైతం అమ్ముతుంటారు. సంతలు లేని రోజుల్లో గ్రామాల్లో సైకిళ్లపై తిరుగుతూ రోజుకు మూడు నుంచి నాలుగు వేల రూపాయల వరకూ వ్యాపారం చేస్తుంటారు. ఎల్నినోతో కష్టాలు ఎల్నినో ప్రభావంతో వర్షాలు మొహం చాటేయడం నారు వ్యాపారాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. గత రెండు నెలలుగా వర్షాలు లేకపోవడంతో నారు మొక్కలు కొనేవారే కరువయ్యారు. దీనితో మొక్కలు ముదిరిపోయి వ్యాపారులకు నష్టాలు మిగిలాయి. విత్తనాలు కూడా అమ్ముడుపోక నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. సాధారణంగా జూన్, జూలై నెలల్లో రైతులు పొలాల గట్ల మీద, ప్రజలు తమ ఇళ్ల పెరటిలో కూరగాయల మొక్కలు నాటుతుంటారు. కానీ, ఈ ఏడాది ఎండల తీవ్రతకు నాటిన మొక్కలు చనిపోతుండటంతో నారు పెంచడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. దీనితో నారునే నమ్ముకున్న వ్యాపారులు జీవనోపాధి కోల్పోయారు. వల్లూరు నారుకు డిమాండ్ వల్లూరు, ముగ్గుళ్ల గ్రామాల్లో సాగుచేసే నారుకు జిల్లా వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుంది. ఈ గ్రామాలకు చెందిన రైతులు నాలుగు దశాబ్దాలుగా పొలం గట్లు, ఖాళీ స్థలాలు, చెరువు గట్ల మీద వివిధ రకాల నారు సాగు చేస్తుంటారు. 20 సెంట్ల నారుమడి తయారీ, సస్యరక్షణకు సుమారు రూ.30 నుంచి 40 వేల వరకు ఖర్చవుతుంది. మే చివరి వారంలో నారు మడులు వేసి జూన్ రెండో వారం నుంచి విక్రయిస్తారు. ఇక్కడి వంగ, మిరప, టమాటా నారు మంచి దిగుబడి ఇస్తాయని పేరు. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల గతంలో మాదిరిగా అమ్మకాలు లేవని వ్యాపారులు వాపోతున్నారు. కోతుల బెడదతో తగ్గిన ఆసక్తి గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల వద్ద ఖాళీ స్థలాలు, పొలం గట్లపై ప్రజలు, రైతులు ఎంతో ఆసక్తిగా కూరగాయలు పండించేవారు. కానీ, కొన్నేళ్లుగా కోతుల బెడద ఎక్కువైంది. కోతుల గుంపులు కష్టపడి పెంచిన మొక్కలను పీకేస్తూ, పందిళ్లను పాడు చేస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఆసక్తి సన్నగిల్లి, ఆ ప్రభావం నారు వ్యాపారంపై పడింది. అమ్మకాలు లేక వ్యాపారం వెలవెల రెండు దశాబ్దాలుగా వారపు సంతల్లో నారు వ్యాపారం చేస్తున్నా, ఇప్పుడున్నంత గడ్డు పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. కరోనా సమయంలో దెబ్బతిన్న వ్యాపారం, మళ్లీ ఇప్పుడు ఎల్నినో వల్ల దారుణంగా పడిపోయింది. నారు పెంపకం, సస్యరక్షణ కోసం రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాం. కానీ సంతలో రోజుకు కనీసం వెయ్యి రూపాయలు అమ్మడమే గగనంగా మారింది. నారు ముదిరిపోయి వృథా అవుతోంది. ప్రభుత్వం మా లాంటి చిరు వ్యాపారులకు సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలి. మంగెన రాంబాబు, నారు వ్యాపారి గతంలో వారపు సంతల్లో రోజుకు రూ.3–4 వేల వ్యాపారం జరిగేది. ఇప్పుడు రోజుకు నాలుగైదు వందలు అమ్మడమే కష్టంగా ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల మహిళలు పూల మొక్కల పెంపకంపై ఆసక్తి చూపడం లేదు. గతంలో రైతులు, ఆక్వా రైతులు చెరువు గట్లపై కూరగాయల మొక్కలు నాటేవారు. ఈ ఏడాది వర్షాలు లేక వారు కూడా కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. బేతు శ్రీనివాసరావు, నారు వ్యాపారి -
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించండి
భీమడోలు: ద్వారకాతిరుమల దేవస్థానం ఆధీనంలో భీమడోలు, కామవరపుకోట జూనియర్ కళాశాల్లో అధ్యాపకులుగా, నాన్–టీచింగ్ సిబ్బందిగా మూడు దశాబ్దాలుగా పనిచేసినా.. కొన్నేళ్లుగా దేవస్థానం యాజమాన్యం ఎలాంటి బెనిఫిట్స్, ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా పదవీ విరమణ చేయించిందని అధ్యాపకులు, నాన్–టీచింగ్ సిబ్బంది వాపోయిరు. ఆదివారం భీమడోలులో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఎంపీ పుట్టా మహేష్కుమార్, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు వద్ద తమ గోడును విన్నవించుకున్నారు. 5, 6 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ, పెన్షన్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నవరం దేవస్థానంలో ఉద్యోగులు రిటైర్ కాగానే వారందరికీ అన్ని సదుపాయాలను కల్పించారని, బదిలీపై ఇక్కడకు వచ్చిన ఈవో ఇవ్వకపోవడం దారుణమని వాపోయారు. మా జీవితాలతో దేవస్థానం అధికారులు ఆడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎంపీ ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్లు, ఇంక్రిమెంట్లు, పే స్కేల్స్ చెల్లించేలా తగు చర్యలు తీసుకుంటానని భరోసా కల్పించారు. -
పశువుల్లో గురక నివారణ ఇలా
చింతలపూడి: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పాడి పశువుల పెంపకానికి ప్రసిద్ధి. అనాదిగా పాడి పరిశ్రమను ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. వర్షాకాలం వచ్చిందంటే పశువులు రకరకాల అంటు రోగాల బారినపడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కొత్త నీరు మురుగుతో కలిసి కలుషితం కావడం, ఆ నీటిని పశువులు తాగడం వల్ల అంటు రోగాలు సోకి విలువైన పశు సంపదను కోల్పోయే ముప్పు ఉంటుంది. వర్షాకాలంలో గేదెలు, దూడలకు ఎక్కువగా వచ్చే వ్యాధి గురక.. దీనినే గొంతు వాపు వ్యాధి అని కూడా పిలుస్తారు. పశువుల్లో వచ్చే వ్యాధుల్లో ఇది అత్యంత ప్రమాదకరమైంది. గురక వ్యాధి సోకిన పశువులకు అందించాల్సిన చికిత్స, నివారణ చర్యల గురించి పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ కె. లింగయ్య సూచనలు తెలుసుకుందాం. ఎలా సంక్రమిస్తుంది? పాశ్చురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియా వల్ల పశువులు, గొర్రెలు, మేకల్లో వచ్చే ఈ వ్యాధి క్రిములు ఎడతెరిపి లేని ముసురు వాతావరణంలో వేగంగా వృద్ధి చెందుతాయి. కలుషితమైన నీరు, మేత, పరికరాలు, విసర్జకాలు, స్రావాలు, కళేబరాలు, మాంసం ద్వారా ఇవి వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇందుకు ఈగలు, దోమలు, ఇతర కీటకాలు కూడా దోహదపడతాయి. వ్యాధి క్రిములు శ్వాస, జీర్ణ వ్యవస్థలు, దోమ కాట్ల ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఎర్ర రక్తకణాలను ధ్వంసం చేస్తాయి. రక్తంలో ఆక్సిజన్ సరఫరాను దెబ్బతీస్తాయి. దీంతో ప్రాణవాయువు సరిగా అందక పశువులు గురక పెట్టడం, రొప్పడం, ఆయాస పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పశువుల శరీర ఉష్ణోగ్రత 106 నుంచి 108 డిగ్రీల ఫారెన్హీట్ వరకు పెరగడం, కనుపాపలు ఎర్రగా మారిపోవడం, మేత తినడం, నెమరు వేయడం ఆగిపోవడం, మెడ, గొంతు వాయడం వంటి లక్షణాలు బయటపడతాయి. వ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన 12 నుంచి 36 గంటల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో సరైన వైద్యం అందకపోతే మరో 12 నుంచి 24 గంటల్లో పశువు మరణించే ప్రమాదం ఉంది. గురక వ్యాధికి చికిత్స వ్యాధిని గుర్తించిన మరుక్షణమే రక్త పరీక్షలు నిర్వహించాలి. వ్యాధి సోకిన పశువును వెంటనే ఇతర పశువుల నుంచి వేరు చేయాలి. ప్రశాంత వాతావరణంలో పశువులకు పరీక్షలు చేయిస్తే మంచిది. ఈ పరిస్థితుల్లో పశువులను నిలబెట్టి మాత్రమే వైద్యం చేయడం శ్రేయస్కరం. యాంపిసిలిన్, క్లాక్సాసిలిన్, జెంటామైసిన్, సెఫలెక్సిన్ వంటి యాంటీబయాటిక్ మందులను పశువైద్యుల సూచనల మేరకు అవసరాన్ని బట్టి రక్తంలోకి ఎక్కిస్తే వేగంగా ఉపశమనం కలుగుతుంది. సాంబ్రాణి ధూపం వేయడం కూడా మంచిదే. వ్యాధి నిరోధక శక్తిని పెంచే మోమెజోల్ ఇంజెక్షన్లు, బి–కాంప్లెక్స్ ఇంజెక్షన్లు వాడాలి. బాగా నీరసించిన పశువుకై తే డెక్స్ట్రోజ్ సైలెన్లు ఎక్కించాల్సిన అవసరం కూడా ఉంటుంది. నివారణ చర్యలు గురక వ్యాధి సోకిన పశువులకు, రోగ కారకాలైన కలుషిత మేత, నీరు, పరికరాలకు ఇతర పశువులను దూరంగా ఉంచాలి. చనిపోయిన కళేబరాలను లోతుగా గొయ్యి తీసి పూడ్చివేయాలి. పరిసరాల్లో క్రిమికీటకాలు వృద్ధి చెందకుండా పొడిగా ఉంచాలి. డీడీటీ, గమేక్సన్, సైపర్ మెథ్రిన్, కార్బరిల్ వంటి క్రిమిసంహారకాలను చల్లి పరిసరాలను క్రిమిరహితం చేయాలి. పొరుగు ప్రాంతాల నుంచి కొత్తగా తెచ్చిన పశువులను కనీసం వారం రోజుల పాటు వేరుగా ఉంచి, వాటికి ఎలాంటి వ్యాధి లేదని నిర్ధారించుకున్నాకే మిగిలిన పశువులతో కలవనివ్వాలి. గురక వ్యాధి నివారణకు ప్రభుత్వం ఏటా ఉచితంగా టీకాలు వేయిస్తోంది. ప్రస్తుతం గురక వ్యాధి, జబ్బ వాపు, గాలికుంటు వ్యాధుల నిర్మూలనకు ఒకే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. పశువైద్యుల సూచనల మేరకు ఈ టీకాలను తొలకరి తొలి దశలో లేదా ఎండలు ముదరక ముందే వేయిస్తే పశువులను ఈ ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. డాక్టర్ కె. లింగయ్య, పశుసంవర్ధక శాఖ ఏడీ -
వైభవంగా ఎస్.జానకి స్వర నీరాజనం
ఏలూరు (ఆర్ఆర్పేట): దక్షిణ భారతదేశ నైటింగేల్, గానకోకిల ఎస్.జానకి సుమధుర గీతాలకు స్వర నీరాజనం అర్పిస్తూ నగరంలో ప్రత్యేక సంగీత కార్యక్రమం అలరించింది. కేవీఎస్ ట్రస్ట్, రేహాన్స్ ఈవెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వైఎంహెచ్ఏ హాలులోని కానాల గురుమూర్తి కళావేదికపై ఈ వేడుక ఘనంగా నిర్వహించారు. తొలుత దివంగత గాయని జానకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేఎల్వీ నరసింహం ఆధ్వర్యంలో గాయనీ గాయకులు జానకి పాడిన ప్రజాదరణ పొందిన పాటలను ఆలపించి ప్రేక్షకులను మైమరిపించారు. హైదరాబాద్ నుంచి విచ్చేసిన ఎం.లలిత, రాంబాబు వేణువాయిద్యం, శాక్సోఫోన్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంగీత ప్రియులు, నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ సంగీత విభావరిని ఆశ్వాదించారు. -
అమ్మో.. ఆగస్టు
● ఏటా గోదావరికి భారీ వరదలు ● విలీన మండలాలపై తీవ్ర ప్రభావం ● ముంపు ప్రాంత ప్రజల గుండెల్లో దడ వేలేరుపాడు : ఏటా జూలై నుంచి సెప్టెంబర్ వరకు గోదావరి నది వరదలు విలీన మండలాలను తీవ్రంగా వేధిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆగస్టు నెల వచ్చిందంటే చాలు, ఈ పరీవాహక ప్రాంత ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. ఈ ఏడాది జులైలో వరద ముప్పు తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ఆగస్టులో గోదావరి తన ప్రతాపం చూపిస్తుండటంతో మళ్లీ ఆందోళన మొదలైంది. పరిపాటిగా.. గత గణాంకాలను పరిశీలిస్తే, ఆగస్టులోనే తీవ్రస్థాయిలో వరదలు రావడం పరిపాటిగా మారింది. గోదావరి పొంగినప్పుడల్లా వేలేరుపాడు, కుక్కునూరు, చింతూరు, వీఆర్ పురం, కూనవరం, ఎటపాక వంటి విలీన మండలాల ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. ఇళ్లు, రహదారులు, పంటపొలాలు నీట మునిగిపోవడం, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడం అక్కడ నిత్యకృత్యమైంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీతో ఆగస్టులో ఈ నది ఉగ్రరూపం దాలుస్తోంది. ముఖ్యాంశాలు.. చారిత్రక ఆధారాలు ● ఆగస్టు ప్రాధాన్యం : గోదావరి ఇప్పటివరకు మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి 23 సార్లు ప్రవహించగా, అందులో 12 సార్లు కేవలం ఆగస్టు నెలలోనే నమోదు కావడం గమనార్హం. ● 1986 బీభత్సం : చరిత్రలోనే అత్యంత తీవ్రమైన వరదలు ఆగస్టులోనే వచ్చాయి. 1986లో భద్రాచలం వద్ద గోదావరి 75.60 అడుగుల గరిష్ట స్థాయికి చేరుకొని, 14 మండలాల్లో భారీ బీభత్సాన్ని సృష్టించింది. ● నాటి జ్ఞాపకాలు : భద్రాద్రి రామయ్య పాదాలను గోదారమ్మ తాకిన ఆనాటి నదీ విలయాన్ని ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ చేదు అనుభవాల తర్వాతే చాలామంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లి స్థిరనివాసాలు ఏర్పరుచుకున్నారు. వరదల్లో ప్రజల కష్టాలు (ఫైల్)భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టాన్ని అడుగుల్లో కొలుస్తారు. ఇక్కడ 43 అడుగుల నీటిమట్టం నమోదైతే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులు వస్తే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులు వస్తే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇప్పటివరకు అత్యధికంగా 1986లో 75.60 అడుగులు, 2022లో 71.30 అడుగుల భారీ వరదలు వచ్చాయి. 1990లో 70.80 అడుగులు, 2006లో 66.90 అడుగులు, 1976లో 63.90 అడుగులు వరదలు వచ్చినట్లు సీడబ్ల్యూసీ గణాంకాలు చెపుతున్నాయి. ఈ ఐదు అత్యధిక వరదల్లో మూడు ఆగస్టులో రావడం గమనార్హం. జులై, ఆగస్టు, సెప్టెంబర్లో గోదావరికి వర ద పోటెత్తుతుంది. ఇప్పుడే అధికారులకు వరదలు సవాల్గా నిలుస్తాయి. ఇప్పటివరకూ జూన్లో రెండుసార్లు అత్యధికంగా గోదావరిలో నీటిమట్టం నమోదైంది. 1976 జూన్లో 63.9 అడుగులకు వరద చేరింది. జూలైలో 10 సార్లు 53 అడుగులు దాటి వరదలు వచ్చాయి. ఇందులో 2022లో అత్యధికంగా 71.3 అడుగులు నమోదైంది. సెప్టెంబర్లో ఆరు సార్లు గోదావరికి వరదలు రాగా ఇందులో నాలుగు సార్లు మూడో ప్రమాద హెచ్చరిక దాటి నీటి మట్టం నమోదైంది. అక్టోబర్లో 1995లో మాత్రమే 57.6 అడుగుల వరద వచ్చింది. సంవత్సరం నీటిమట్టం అడుగుల్లో 1963 73.0 1977 49.9 1980 48.0 1981 58.9 1982 34.5 1983 63.5 1984 38.8 1985 36.9 సంవత్సరం నీటిమట్టం అడుగుల్లో 1986 75.6 1990 70.8 1991 46.3 1992 52.9 1993 37.0 1996 30.0 1997 34.7 1999 41.1 సంవత్సరం నీటిమట్టం అడుగుల్లో 2000 54.6 2001 53.8 2002 50.0 2004 37.6 2006 66.9 2007 53.7 2008 47.3 2009 31.0 సంవత్సరం నీటిమట్టం అడుగుల్లో 2010 59.7 2012 46.4 2013 61.6 2018 34.8 2020 61.6 2022 51.6 2025 52.0 2026 55.9 -
డబ్బు కొట్టు.. ఉద్యోగం పట్టు!
● అడ్డదారిలో ట్రిపుల్ఐటీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ● ఇటీవల పది మంది నియామకం ● ఉద్యోగానికి రూ.3 లక్షల వసూలు! నూజివీడు: నాణ్యమైన విద్యకు కేరాఫ్గా నిలిచిన నూజివీడు ట్రిపుల్ఐటీ అక్రమాలు, అవకతకలకు నిలయంగా మారింది. డబ్బు కొట్టు.. ఉద్యోగం పట్టు అన్న రీతిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా అవసరం లేకున్నా పది మందికి పోస్టింగ్లు ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది. దాదాపు రూ.30 లక్షల వరకు చేతులు మారినట్టు ట్రిపుల్ఐటీ క్యాంపస్తో పాటు పట్టణంలోని రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్ గా మారింది. ల్యాబ్ అసిస్టెంట్ల పేరుతో తీసుకుని ఎగ్జామ్ సెల్లో, మరికొందరిని అటెండర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా తీసుకుని ఏఓ ఆఫీసు, ప్రొక్యూర్మెంట్, డీన్ ఆఫీసుల్లో నియమించినట్టు సమాచారం. ఒంగోలు ట్రిపుల్ఐటీ పేరుతో శక్తి సెక్యూరిటీ అండ్ మెయింట్నెన్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా వీరిని నూజివీడు ట్రిపుల్ఐటీలోకి తీసుకున్నారు. నిబంధనలు పాటించరా? నిబంధనల మేరకు ముందుగా అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగులు కావాలని, అర్హులైన సంస్థలు ముందుకు రావొచ్చని పత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సి ఉండగా ఇక్కడ ఇవేమీ పాటించలేదు. డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలకు ఇది బలం చేకూరుతోంది. అలాగే ఒంగోలు పేరుతో నూజివీడుకు చెందిన వారిని తీసుకుని ఉద్యోగాలు ఇస్తుంటే ఒంగోలు జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రులు చూస్తూ ఊరుకుంటారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ట్రిపుల్ఐటీల్లో ఏ నియామకమైనా చేయాలంటే తప్పనిసరిగా చాన్సలర్ ఉంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. అంతేగాకుండా గవర్నింగ్ కౌన్సెల్ సమావేశ అజెండాలో ఉంచి అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అవేమీ లేకుండానే ఈ నియామకాలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విచారణ చేసి వాస్తవాలను వెల్లడిస్తేనే ఆరోపణలకు, విమర్శలకు తెరపడనుంది. -
స్పందన
నూజివీడు : నెల రోజులుగా చికెన్, గుడ్డుకు దూరమైన నూజివీడు ట్రిపుల్ఐటీ విద్యార్థులకు ఎట్టకేలకు చికెన్ అందింది. విద్యార్థులకు ఆదివారం చికెన్తో భోజనం పెట్టారు. చికెన్, గుడ్డు అందించకపోవడంతో పోషకాహారం దూరమైందని ‘సాక్షి’లో గత నెల 17న, 27న వరుసగా కథనాలు ప్రచురించింది. దీంతో యూనివర్సిటీ అధికారులు పలు రకాలుగా ప్రయత్నించి చివరకు గతేడాది మాదిరిగా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. దీంతో విద్యార్థులకు ఒక్కొక్కరికి పులుసుతో కలిసి 150 గ్రాముల చికెన్ను భోజనంలో వడ్డించారు. ఇలా సుమా రు 8 వేల మందికి అందించారు. ఏఓ బి. లక్ష్మణరావు పరిశీలించారు. ‘సాక్షి’కి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. -
చెరువు మట్టి.. కొల్లగొట్టి
● యథేచ్ఛగా తవ్వకాలు ● ట్రాక్టర్లలో అక్రమ రవాణా కొయ్యలగూడెం : మండలంలోని దిప్పకాయలపాడు రాజుచెరువు నుంచి ఆదివారం యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా కొనసాగింది. దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన రెండు పొక్లయిన్లను ఏర్పాటు చేసి అక్రమార్కులు ట్రాక్టర్లు, ట్రక్కుల్లో మట్టిని తవ్వి తరలించారు. దీనిపై ఇరిగేషన్ ఏఈ రాహుల్ భాస్కర్ కు ఫిర్యాదు వెళ్లగా ఆయన సిబ్బందిని పంపి ఒక పొక్లయిన్ను స్వాధీనం చేసుకున్నారు. సెలవు రోజుల్లో అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడం చెరువుల్లో అక్రమంగా మట్టి తోలకాలకు అనువుగా ఉందని ఆయకట్టు రైతులు అంటున్నారు. అలాగే కన్నాపురం జెడ్పీ హైస్కూల్ వెనుక ఉన్న చెరువు నుంచి కూడా పొక్లయిన్లతో తవ్వి టిప్పర్లలో మట్టిని తరలించాలని ఆరోపించారు. -
శ్రీవారి కొండపై ఆటో బోల్తా
ద్వారకాతిరుమల: శ్రీవారి దర్శనానంతరం స్వగ్రామానికి బయలుదేరిన ఓ భక్తుడి కుటుంబానికి కొండపైన ఘాట్ రోడ్డులో ప్రమాదం ఎదురైంది. ప్రమాదకర మలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో చిన్నారులతో సహా, తొమ్మిది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం గుడివాడకు చెందిన తమ్మిశెట్టి అశోక్కుమార్ తన కుటుంబ సభ్యులు వెంకటలక్ష్మి, రేవతి, చాణిక్య, భానుచందు, దుర్గ, దివ్యశ్రీవల్లి, మోక్షిత, మరో బాలుడితో సహా ఆటోలో ద్వారకాతిరుమలకు వచ్చారు. స్వామి దర్శనానంతరం అదే ఆటోలో స్వగ్రామానికి బయల్దేరారు. శివాలయం ఘాట్ రోడ్డు లోంచి కొండ దిగుతుండగా ఓ మలుపు వద్ద ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా తీవ్రంగా గాయపడ్డారు. ఆటో డ్రైవర్ ఎం.ఏసు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ద్వారకాతిరుమల పీహెచ్సీకి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందించారు. ధ్వంసమైన ఆటో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు తొమ్మిది మంది భక్తులకు గాయాలు -
14.20 లక్షల క్యూసెక్కులు దిగువకు..
పోలవరం రూరల్: పోలవరంలో గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. దిగువన స్పిల్వే వద్ద 34.550 మీటర్ల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. స్పిల్వే నుంచి 14.20 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. దిగువన వరద ప్రవాహం కొనసాగుతోంది. పట్టిసం శివక్షేత్రం వద్ద మెట్లను తాకుతూ వరద ప్రవాహిస్తోంది. శివక్షేత్రానికి చేరుకునే లాంచీలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే పోలవరం, పురుషోత్తపట్నానికి లాంచీని నిలిపివేశారు. పట్టిసం ఔట్ఫాల్ స్లూయిజ్ దిగువ వరకు వరద నీరు చేరింది. అలాగే పోలవరంలో కడెమ్మ స్లూయిజ్ వద్ద గేట్లు ముంపు బారిన పడ్డాయి. స్పిల్వే దిగువన లంక ఒడ్డులను తాకుతూ వరద ప్రవాహిస్తోంది. వేలేరుపాడు : ఎద్దెలవాగు వద్ద శుక్రవారం రాత్రి గోదావరి వరద లో గల్లంతైన నూపా ప్రసాద్ (35) మృతదేహం ఆదివారం లభించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గ్రామస్తులు మూడు రోజులుగా విస్తృతంగా గాలింపు చేపట్టగా ఎడవల్లి సమీపంలోని గోదావరిలో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని అక్కడి నుంచి ట్రాక్టర్పై తరలించి నార్లవారం కాలనీ పంపు వద్ద పడవపై దాటించారు. అనంతరం వాహనంపై జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం వేలేరుపాడు ఎస్సై నవీన్ తరలించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను సోమవారం ఏలూరు కలెక్టరేట్తో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ కూడా నిర్వహిస్తామన్నారు. ప్రజలు నేరుగా వెబ్సైట్, టోల్ఫ్రీ 1100 ద్వారా కూడా అర్జీలు సమర్పించవచ్చని సూచించారు. పెదవేగి: రాట్నాలకుంటలోని రాట్నాలమ్మవారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పలు రూపాల్లో ఆలయానికి రూ.82,175 ఆదాయం సమకూరినట్టు ఆలయ కమిటీ చైర్మన్ మన్నే శ్రీనివాసరావు తెలిపారు. ఈఓ నల్లూరి సతీష్కుమార్, జూనియర్ అసిస్టెంట్ విడుదల సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ద్వారకాతిరుమల: శ్రీవారి దర్శనార్థం ఆ దివారం ఉదయం క్షేత్రానికి విచ్చేసిన ఓ వృద్ధ భక్తుడు తీవ్ర అస్వస్థతకు గుర య్యాడు. దేవస్థానం సిబ్బంది వెంటనే పీహెచ్సీకి తరలించా రు. వివరాలిలా ఉన్నాయి.. తణుకుకు చెందిన కె.సూర్యనారాయణ కుటుంబసభ్యులతో కలిసి క్షేత్రానికి వచ్చారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే దేవస్థానం ఆంబులెన్స్లో స్థానిక పీహెచ్సీకి తరలించగా, అక్కడ ప్రథమచికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం 108లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వీరవాసరం: డీఎస్సీ–2025లో జరిగిన పేపర్ లీకేజీ, అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం నౌడూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
వేలేరుపాడును వీడని వరద
వేలేరుపాడు: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం రాత్రి 41.70 అడుగులకు చేరినా వేలేరుపాడు మండలంలో ఉధృతి కొనసాగుతూనే ఉంది. మూడో రోజైన ఆదివారం కూడా 32 గ్రామాలు జల దిగ్బంధనంలోనే ఉన్నా యి. వేలేరుపాడు మండల కేంద్రంలో ఐదు, దిగువ ప్రాంతం టేకూరులో ఏడు, కాకిస్నూరులో పది, పేరంటపల్లిలో ఆరు ఇళ్లు ముంపులోనే ఉన్నాయి. మండలంలోని రుద్రమకోట రహదారిలో పెద్దవాగు వంతెన, ఎద్దెలవాగు, టేకూరువాగు, మేళ్లవాగుల వంతెనలు ఇంకా నీటమునిగే ఉన్నాయి. వసంతవాడ నుంచి రుద్రమకోట వెళ్లే రహదారి, కన్నాయిగుట్ట వెళ్లే రహదారి, రేపాకగొమ్ము, తాట్కూరుగొమ్ము, తిర్లాపురం వెళ్లే రహదారి, నార్లవరం–కొత్తూరు రహదారిలో మంచినీటి పంపు ప్రాంతంలో రహదారి వరద నుంచి బయటపడలేదు. ఎడవల్లి, ఎద్దెలవాగు, టేకూరు, వాగుల వద్ద, నార్లవరం కాలనీ, రేపాకగొమ్ము, రుద్రమకోట ప్రాంతాల్లో అధికారులు నాటు పడవలు ఏర్పాటు చేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. -
చింతలపూడి.. నల్ల బంగారం సవ్వడి
చింతలపూడి: చింతలపూడి ప్రాంతం త్వరలోనే దేశంలోనే అతిపెద్ద ఇంధన హబ్గా మారబోతోంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ ఇటీవల నిర్వహించిన ఈ–వేలంలో చింతలపూడి, రేచర్ల బొగ్గు గనులను ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ సంస్థ దక్కించుకుంది. శనివారం రిలయన్స్ ప్రతినిధుల బృందం చింతలపూడి మండలంలో బొగ్గు నిల్వలు ఉన్న ప్రాంతాలను, గతంలో చేసిన సర్వే స్థలాలను ప్రత్యక్షంగా పరిశీలించింది. సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడితో ఇక్కడ భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి రిలయన్స్ సన్నాహాలు వేగవంతం చేసింది. 2029 నాటికి ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి వాయు వెలికితీతను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 3,130 మిలియన్ టన్నుల బొగ్గు నిఽల్వలు కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ ప్రాంతంలో భూగర్భ బొగ్గు నిల్వలు భారీగా ఉన్నాయి. చింతలపూడి బ్లాక్లో 1,200 హెక్టార్ల విస్తీర్ణంలో 904.94 మిలియన్ టన్నుల ఎ–12 రకం బొగ్గు ఉన్నట్టు గుర్తించారు. రేచర్ల బ్లాక్లో 2,225 హెక్టార్ల విస్తీర్ణంలో 2,225.67 మిలియన్ టన్నుల ఎ–13 రకం బొగ్గు నిల్వలు ఉన్నాయి. మొత్తం రెండు బ్లాకుల్లో కలిపి 3,130.61 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. అండర్గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ అంటే.. ఈ ప్రాంతంలో బొగ్గు పొరలు భూ ఉపరితలానికి 600 మీటర్ల కంటే లోతులో ఉండటం వల్ల మామూలు తవ్వకాల ద్వారా బొగ్గును బయటకు తీయడం అత్యంత ఖరీదైన వ్యవహారం. అందుకే రిలయన్స్ సంస్థ అండర్ గ్రౌండ్ గ్యాసిఫికేషన్ (యూసీజీ) విధానాన్ని ఎంచుకుంది. సాంకేతికత ఎలా పనిచేస్తుంది? భూమి లోపలి బొగ్గు పొరల్లోకి డ్రిల్లింగ్ ద్వారా పైపులు పంపిస్తారు. పరిమిత ఆక్సిజన్, ఆవిరిని పంపి భూమి లోపలే బొగ్గును పాక్షికంగా కాలుస్తారు. దీని వల్ల బొగ్గు వాయువుగా మారుతుంది. ఈ గ్యాస్ను పైపుల ద్వారా భూఉపరితలానికి తీసుకొచ్చి విద్యుత్ ఉత్పత్తికి, రసాయనాల తయారీకి ఉపయోగిస్తారు. ఈ పద్ధతి వల్ల ఓపెన్ కాస్ట్ గనుల మాదిరిగా వేలాది ఎకరాలు తవ్వాల్సిన అవసరం ఉండదు. పైన చెట్లు, పొలాలు దెబ్బతినవు. సాంప్రదాయ గనుల్లో జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టాలు ఇందులో ఉండవు. పైగా వేలాది మంది చదువుకున్న యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. రైతుల్లో తీవ్ర ఆందోళన ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే చింతలపూడి, రాఘవపురం, ప్రగడవరం, లింగగూడెం, ఎరగ్రుంటపల్లి గ్రామాలతో పాటు తెలంగాణ సరిహద్దులోని సత్తుపల్లి వైపు ఉన్న ఖమ్మం జిల్లా సరిహద్దుల వరకు రిలయన్స్ సంస్థ ప్రభావం ఉంటుంది. కేవలం పైప్లైన్లు వేయడానికి, డ్రిల్లింగ్ రంధ్రాలు చేయడానికి, ప్లాంట్ నిర్మాణానికి మాత్రమే భూసేకరణ చేస్తామని చెబుతున్నా, భవిష్యత్తులో ఈ భూసేకరణ ప్రక్రియ ఏ మలుపు తిరుగుతుందోనని స్థానిక రైతులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ ప్రతికూలతలు చింతలపూడి ప్రాంతం అత్యంత సారవంతమైన భూములు, సమృద్ధిగా భూగర్భ జలాలు ఉన్న వ్యవసాయ ఆధారితం. యూసీజీ విధానం వల్ల కొన్ని తీవ్రమైన పర్యావరణ ముప్పులు పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు: తాగు, సాగునీరుపై ప్రభావం భూమి లోపల బొగ్గు కాలినప్పుడు ఫినాల్స్, బెంజిన్, పాదరసం వంటి ప్రమాదకర రసాయనాలు విడుదలవుతాయి. గ్యాసిఫికేషన్ జరిగే ప్రాంతం చుట్టూ ఉన్న మంచినీటి పొరల్లోకి ఇవి కలిస్తే, పరిసర ప్రాంతాల్లోని బావులు, బోరుబావుల నీరు విషపూరితంగా మారే ప్రమాదం ఉంది. ఇది తాగునీటికే కాక వ్యవసాయానికి కూడా పనికి రాకుండా పోతుంది. కఠిన నిబంధనలే శరణ్యం భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూడటమే అతిపెద్ద సవాలు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, పర్యావరణ అనుమతులను కఠినంగా అమలు చేస్తేనే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. లేకుంటే చింతలపూడి ప్రాంతంలో వ్యవసాయం, తాగునీటి వ్యవస్థపై కోలుకోలేని దెబ్బతీనే ప్రమాదం ఉందని స్థానికులు, పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. బొగ్గు నమూనాలు (ఫైల్) చింతలపూడి–రేచర్ల బొగ్గు గనులకు ఈ–వేలం రిలయన్స్ సంస్థ దక్కించుకున్న వైనం భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం 2029 నాటికి పూర్తిస్థాయి ప్లాంట్ పొంచి ఉన్న పర్యావరణ ముప్పు -
మద్దిలో ముగిసిన వరుణ జపాలు
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి క్షేత్రంలో వర్షాభావ నివృత్తి కోసం చేపట్టిన వరుణ జపాలు, వరుణ హోమాలు మహా పూర్ణాహుతితో ముగిశాయి. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ఆలయ అసిస్టెంట్ కమి షనర్, కార్యనిర్వహణాధికారి ఆర్వీ చందన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ధర్మకర్తలు పాల్గొన్నారు. ఏలూరు టౌన్: బాలికను సోషల్ మీడియాలో వేధిస్తున్న వ్యక్తిని ఏలూరు వన్టౌన్ సీఐ కె.రామకృష్ణ చాకచక్యంగా అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు రూరల్ ప్రాంతానికి చెందిన బాలికకు సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడి ప్రవర్తన నచ్చకపోవటంతో ఆమె సోషల్ మీడియా ఖాతాను బ్లాక్లో పెట్టింది. దీంతో ద్వేషం పెంచుకున్న సదరు వ్యక్తి సోషల్ మీడియాలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో బాధితురాలు ఏలూరు రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై వి.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు. వన్టౌన్ సీఐ రామకృష్ణ దర్యాప్తు ప్రారంభించారు. కర్నూలు జిల్లాకు చెందిన పరంపోగు విల్సన్బాబు అనే వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. శనివారం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. సోషల్ మీడి యా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని వన్టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు. కొయ్యలగూడెం: అవినీతి, అక్రమాలు సాక్షాధారాలతో సహా అధికారుల ముందు ఉంచినా చర్యలు తీసుకోకపోవడంపై కూటమి శ్రేణులు ధర్నా నిర్వహించడం శనివారం చర్చనీయాంశంగా మారింది. జనసేన నాయకుడు వాడపల్లి రమేష్ మాట్లాడుతూ రాజవరం పంచాయతీ గంగవరం మెట్టగా పిలవబడే ప్రాంతంలో రెండు నెలల కాలంలో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరిగాయన్నారు. ముఖ్యంగా సర్వే నం.207లో చేసిన తవ్వకాల వలన పొట్టి కొండగా పిలవబడే ప్రాంతం కనుమరుగై పర్యావరణం పాడైందన్నారు. అక్రమ తోలకాలు చేసిన వ్యక్తులపై చర్యలు, డంప్ చేసిన గ్రావెల్, మట్టిని సీజ్ చేసి ప్రభుత్వానికి అందాల్సిన సొమ్మును రాబట్టాలని డిమాండ్ చేశారు. జనసేన, టీడీపీ, కూటమి పార్టీలకు చెందిన శ్రేణులు పాల్గొన్నారు. ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆస్పత్రి ఎంసీహెచ్ బ్లాక్లో శనివారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని చేపట్టారు. తల్లులకు తల్లిపాల విశిష్టతను వివరించారు. బిడ్డకు తల్లిపాలతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. డీఐవో పుల్లయ్య, పిడియాట్రిక్ హెచ్ఓడీ సుజాతదేవి, గైనిక్ ఇన్చార్జి హెచ్ఓడీ విజయలక్ష్మి, పీపీ యూనిట్ డాక్టర్ కె.ఆనంద్కుమార్, సూపరింటెండెంట్ డాక్టర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు. భీమవరం: సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులతో సైన్స్ ప్రాజెక్టులు తయారు చేయించి వారిని బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని డీఈఓ ఈ. నారాయణ పిలుపునిచ్చారు. 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోస్టర్ను శనివారం ఆయన ఆవిష్కరించారు. 10 నుంచి 17 ఏళ్ల వ యసున్న పిల్లలో ప్రాజెక్టులు తయారు చేయించాలన్నారు. అప్కాస్ట్ జిల్లా సమన్వయ అధి కారి మల్లుల శ్రీనివాస్ మాట్లాడుతూ 15లోపు ప్రాజెక్టులకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు. -
కాలేయంలో అరుదైన తిత్తి తొలగింపు
తణుకు అర్బన్: కాలేయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న రోగికి అరుదైన శస్త్రచికిత్స చేసినట్లు తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాకర్లమూడి సాయికిరణ్ తెలిపారు. రోగి బి.ఇస్రాయేల్ (62) కాలేయ సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరగా, వైద్య పరీక్షల అనంతరం ఆస్పత్రిలోని సీనియర్ జనరల్ సర్జరీ వైద్యుడు డాక్టర్ చక్రధర్ శస్త్రచికిత్స చేసి కాలేయంలో ఉన్న అరుదైన తిత్తిని తొలగించినట్లు వివరించారు. మత్తు వైద్యుడు డాక్టర్ శ్రీనివాసరాజు, వైద్య బృందం ఎంతో శ్రమించి ఈ అరుదైన శస్త్రచికిత్సను చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ద్వారకాతిరుమల: చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగింది. ఆషాఢ మాసం కావడంతో పాటు, తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షం కారణంగా భక్తుల రాక తగ్గింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూ లైన్లు, కల్యాణకట్ట, ప్రసాదాల విక్రయాల కౌంటర్ల వద్ద సాయంత్రం వరకు భక్తుల రద్దీ సాధారణంగానే కనిపించింది. వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారికి మొక్కులు చెల్లించుకుని, దర్శించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచి, దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ఎన్నికలు ఆగస్టు 22, 23 తేదీలలో ఏలూరులో జరుగుతాయని ఎన్నికల అధికారి, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ బి.సోమశేఖర రావు తెలిపారు. శనివారం స్థానిక కోట దిబ్బలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ ఏలూరు జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆగస్టు ఒకటో తేదీ ఉదయం 11 గంటల నుంచి ఆగస్టు రెండో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఓటరు లిస్టు నమోదు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఆగస్టు 3 న ఫైనల్ ఓటరు లిస్టును ప్రకటిస్తామన్నారు. ఆగస్టు 22వ తేదీన ఏలూరులోని నేరెళ్ళ రాజా మర్చంట్ చాంబర్స్ కల్యాణ మండపంలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. పోటీ తప్పనిసరి అయితే ఆగస్టు 23న ఎన్నిక జరుగుతుందని, అదే రోజు ఫలితాలను ప్రకటిస్తామని తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఈనెల 6వ తేదీ నుంచి జిల్లా స్థాయి అమరావతి ఛాంపియన్ షిప్ 2026 అంతర్ నియోజకవర్గాల క్రీడా పోటీలు, ఎంపికలు నిర్వహించనున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.ఏ.అజీజ్, సెట్వెల్ సీఈఓ కె.ఎస్.ప్రభాకర రావు, స్కూల్ గేమ్స్ సెక్రటరీ పి.అలివేలు మంగ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని అల్లూరి సీతారామ రాజు స్టేడియంలో ఈ నెల 6 నుంచి 12 క్రీడాంశాలలో ఈ పోటీలు, ఎంపికలు జరుగుతాయన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 6వ తేదీన ఏలూరు అల్లూరి సీతారామ రాజు స్టేడియంలో అండర్–17 (బాలురు – బాలికలు), అండర్–23 (పురుషులు – మహిళలు) విభాగాలకు ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, హాకీ పోటీలు జరుగుతాయన్నారు. నగరంలోని ఏఆర్డీజీకే నగరపాలక ఉన్నత పాఠశాలలో చెస్ పోటీలు జరుగుతాయని తెలిపారు. 6, 7 తేదీల్లో అల్లూరి సీతారామ రాజు స్టేడియంలో కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్ పోటీలు, ఇండోర్ స్టేడియంలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు, యోగా ట్రైనింగ్ సెంటర్లో యోగా పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ పోటీలలో జిల్లా స్థాయిలో ఎంపికై న వారు రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొనడానికి ఎంపికవుతారని, రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన బాలురు, బాలికలకు మొత్తం రూ.94 లక్షల నగదు బహుమతులు లభిస్తాయన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 9948779015లో సంప్రదించాలని కోరారు. -
ముంచెత్తినది
ఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026వేలేరుపాడు: నిన్న మొన్నటి వరకు ఇసుక తెన్నెల్లో ఉన్న గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఉగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద శుక్రవారం రాత్రి నుంచే మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది, దీంతో గోదావరి పరీవాహక ప్రాంతవాసులు భయంతో వణికిపోతున్నారు. భద్రాచలం వద్ద శనివారం రాత్రి 9 గంటలకు నీటిమట్టం 54.50 అడుగులు పెరగడంతో 15,02,258 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలో కలుస్తోంది. శనివారం వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లు నీట మునగ్గా.. మరికొన్ని గ్రామాలు జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. ఏ క్షణాన నీటిమట్టం పెరుగుతుందో అన్న భయంతో పరీవాహక ప్రజలకు కళ్లపై కునుకులేకుండా పోయింది. రెండో రోజు కూడా మండలంలో 32 గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. దిగువ ప్రాంతంలో వేలేరుపాడు మండల కేంద్రంలో ఐదు, టేకూరులో ఏడు, కాకిస్నూరులో పది, పేరటపల్లిలో ఆరు ఇళ్లు నీటమునిగాయి. దిగువ ప్రాంతంలో 16 గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఆయా గ్రా మాల్లో ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. మండలంలో పెద్దవాగు, ఎద్దెలవాగు, టేకూరు వా గు, మేళ్లవాగుల మీదుగా గోదావరి నీరు చేరడంతో రహదారులన్నీ నీటమునిగాయి. వేలేరుపాడు నుంచి రుద్రమకోట వెళ్లే రెండు వైపులా ఉన్న రహదారులు నీట మునిగాయి. వసంతవాడ నుంచి రుద్రమకోట వెళ్లే రహదారి, కన్నాయిగుట్ట వెళ్లే రహదారి, రేపాకగొమ్ము, తాట్కూరుగొమ్ము, తిర్లాపురం వెళ్లే రహదారులన్నీ నీటమునిగాయి. నార్లవరం–కొత్తూరు రహదారిలో మంచినీటి పంపు ప్రాంతంలో రహదారి నీట మునిగింది. ఎడవల్లి, ఎద్దెలవాగు, టేకూరు, వాగుల వద్ద, నార్లవరం కాలనీ, రేపాకగొమ్ము, రుద్రమకోట ప్రాంతాల్లో అధికారులు నాటు పడవలు ఏర్పాటు చేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు వీటిపై రాకపోకలు సాగిస్తున్నారు. జల దిగ్బంధనంలో ఉన్న రేపాకగొమ్ము గ్రామంలో 186 కుటుంబాలను తాడువాయి, కుక్కునూరు మండలం రాయికుంట, పునరావాస కాలనీ, వారి బంధువుల ఇళ్లకు తరలించినట్టు అధికారులు చెబుతున్నారు. వరద గోదావరి రెండోరోజూ జల దిగ్బంధంలోనే 32 గ్రామాలు వేలేరుపాడు, టేకూరు, కాకిస్నూరు, పేరంటపల్లిలో నీటమునిగిన ఇళ్లు ముంపులో రహదారులు.. స్తంభించిన రాకపోకలు భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ భయం గుప్పిట్లో నదీ పరీవాహక జనం -
క్వాంటం టెక్నాలజీస్ ప్రాజెక్టుపై సమీక్ష
నూజివీడు: జాతీయ క్వాంటం మిషన్ కింద నూజివీడు ట్రిపుల్ఐటీలో ఏర్పాటు చేసిన అండర్ గ్రాడ్యుయేట్ క్వాంటం టెక్నాలజీస్ బోధనా ప్రయోగశాల ప్రాజెక్టును సమీక్షించేందుకు భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ ఉన్నత స్థాయి బృందం శనివారం ట్రిపుల్ఐటీని సందర్శించింది. దీనిలో భాగంగా జాతీయ క్వాంటం మిషన్ డైరెక్టర్ జే.బి.వి.రెడ్డి, ఏపీ స్టేట్ క్వాంటం మిషన్ డైరెక్టర్ శ్రీధర్ సి.వి., టీ హబ్ సీఈఓ విజయ్ ఏ.రామానుజన్లతో పాటు ఆర్జీయూకేటీ ఛాన్సలర్ ఆచార్య కొత్తా మధుమూర్తి, ఐఐటీ తిరుపతి డైరెక్టర్ ఆచార్య కె.ఎన్.సత్యన్నారాయణలు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన క్వాంటం టెక్నాలజీ పోస్టర్ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ పోస్టర్ల ద్వారా విద్యార్థులు తమ సాంకేతిక ఆలోచనలు, పరిశోధనా విధానాలు, భవిష్యత్ అనువర్తనాలపై రూపొందించిన ప్రతిపాదనలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఉన్నత స్థాయి బృందం జాతీయ క్వాంటం మిషన్ లక్ష్యాల గురించి వివరించారు. క్వాంటం టెక్నాలజీలో మైనర్ డిగ్రీ అభ్యసిస్తున్న విద్యార్థులతో ప్రత్యేక ఇంటరాక్టివ్ సమావేశం నిర్వహించారు. క్వాంటం హార్డ్వేర్ ప్లాట్ఫారమ్లు, క్వాంటం అల్గోరిథంలు, పరిశోధనా అవకాశాలు, ఉన్నత విద్య, అంతర్జాతీయ స్థాయిలో కెరీర్ అవకాశాలు వంటి అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఆర్జీయూకేటీ వీసీ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు, రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, డీన్ ఆఫ్ అకడమిక్స్ దువ్వూరు శ్రావణి తదితరులు పాల్గొన్నారు. -
పోషకాహారంపై మల్లగుల్లాలు
నూజివీడు: ఆర్జీయూకేటీ అధికారుల అసమర్థత, అనుభవరాహిత్యం, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ట్రిపుల్ఐటీలో చదువుకుంటున్న దాదాపు 8,800 మంది పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా విద్యార్థులకు కోడిగుడ్డు, చికెన్ వడ్డించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల తీవ్ర జాప్యం వల్ల ప్రజల్లో, తల్లిదండ్రుల్లో ట్రిపుల్ఐటీ పట్ల ఉన్న గౌరవం క్రమేణా తగ్గిపోతోంది. నామినేషన్ పద్ధతిలో కేటాయింపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా 2024 సెప్టెంబరులో పాత మెస్ కాంట్రాక్టర్లను తప్పించారు. అయితే పారదర్శకంగా టెండర్లు పిలవకుండా, నామినేషన్ పద్ధతిలో మెస్ నిర్వహణను ‘హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్’కు అప్పగించారు. ముందే తెలిసినా నిర్లక్ష్యం: తాము శాకాహారమే అందిస్తామని, చికెన్, కోడిగుడ్లు పెట్టలేమని ఫౌండేషన్ స్పష్టం చేసినప్పటికీ... అధికారులకు దూరదృష్టి, అవగాహన లేకపోవడంతో వారికి కాక వేరేవారికి టెండర్లు ఇవ్వకుండా అత్యుత్సాహంతో ఫౌండేషన్కే బాధ్యతలు అప్పగించారు. తాత్కాలిక ప్రత్యామ్నాయం విఫలం గతేడాది దసరా నుంచి నాన్–వెజ్ బాధ్యతలను క్యాంపస్లోని ‘హెల్పింగ్ హ్యాండ్స్’ (ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో నడిచే సంస్థ)కు అప్పగించారు. అయితే, ఈ విద్యాసంవత్సరంలో నాన్–వెజ్ పెట్టడం తమవల్ల కాదని హెల్పింగ్ హ్యాండ్స్ చేతులెత్తేయడంతో సమస్య మరింత జటిలమైంది. అధికారుల దిద్దుబాటు చర్యలు.. తాజా పరిస్థితి నెలరోజుల నుంచి చికెన్, గుడ్డు పెట్టకపోవడంతో వస్తున్న తీవ్ర విమర్శలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆర్జీయూకేటీ అధికారులు ఎలాగైనా సరే హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులను బతిమాలైనా సరే వారితోనే పెట్టించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు శుక్రవారం వారితో సమావేశం ఏర్పాటు చేసి చికెన్, గుడ్డు పెట్టేలా ఒప్పించినట్లు తెలిసింది. సేవా ధృక్ఫథంతో ఏర్పాటైన హెల్పింగ్ హ్యాండ్స్కు ఎలా ఇస్తారనే దానిపై గతంలోనే విమర్శలు వ చ్చినా మరలా ఆ సంస్థకే అప్పగించడం గమనార్హం. దీంతో ఇక నుంచి హెల్పింగ్ హ్యాండ్స్ బాధ్యతలు నిర్వర్తించే ఫ్యాకల్టీ గుడ్డు, చికెన్ పెట్టే పనిలో నిమగ్నం కానున్నారు. గుడ్డు, చికెన్ పెట్టడానికి ఒక విద్యార్థికి వారానికి రూ.46.20 కేటాయించిన నేపథ్యంలో వారానికి ఎన్ని రోజులు గుడ్డు, చికెన్ పెడతారో మన్ముందు తెలియనుంది. ట్రిపుల్ఐటీలో విద్యార్థులకు అందని గుడ్డు, చికెన్ మెనూలోనూ కోతలు నెల రోజులు దాటినా పిలవని టెండర్లు హెల్పింగ్ హ్యాండ్స్కు బాధ్యతలు -
ఎల్నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
పెనుమంట్ర: ఎల్నినో కారణంగా సాధారణం కంటే 50 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, దీని ప్రభావం డెల్టా భూములపై పెద్దగా లేకపోయినా, బోర్ల కింద సాగుచేసే పంటలపై ఉండవచ్చని తెలిపారు. మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానంలో శనివారం శిక్షణ, సందర్శన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఏడీఆర్ డాక్టర్ పి.రాధిక మాట్లాడుతూ.. ఎల్.నినో కారణంగా రాష్ట్రంలో వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయని సాధారణం కంటే 50 శాతం తక్కువ వర్షపాతం నమోదయిందన్నారు. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.గిరిజా రాణి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్లో కలుపు నివారణ చర్యలు ముఖ్యమన్నారు. ఇనుప ధాతు లోపం వచ్చే అవకాశం ఉందన్నారు. ఆకులు పసుపు రంగులోకి మారతాయని రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తక్కువ నీరు ఉన్నప్పుడు పొటాషియం నైట్రేట్ లీటరు నీటికి 10 గ్రాములు పిచికారీ చేయాలని, ఆరుతడి పద్ధతి పాటించాలని పొలం గట్లు గట్టిగా చేసుకోవడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ నీరు అందుబాటులో ఉన్నపుడు పంట మూన తిరిగిన దగ్గర నుంచి పిలకలు కట్టే దశ వరకు ఆరు తడి పద్ధతిలో నీటి తడులు పెట్టుకోవాలన్నారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఎంటీయూ 1462 రకాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ఈ రకంగా 135–140 రోజుల కాలపరిమితి ఉంటుందని తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారి జెడ్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జిల్లాలో 60,000 హెక్టార్లలో నాట్లు పూర్తయ్యాయని, వర్షాల వల్ల బాక్టీరియా ఎండాకు తెగులు ఆశించే అవకాశం ఉన్నందున రైతులను అప్రమత్తం చేయాలని కోరారు. అనంతరం ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది విత్తన గుళికల తయారీని, శాస్త్రవేత్తలు బ్రష్ కట్టర్ వినియోగాన్ని ప్రయోగాత్మకంగా చూపారు. శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం.వి.కృష్ణాజీ, వివిధ డివిజన్ల సహాయ వ్యవసాయ సంచాలకులు పాల్గొన్నారు. -
కొల్లేరులో కానరాని నీరు
● ఆగస్టు వచ్చినా నిండని కొల్లేరు ● ఎగువ నుంచి తగ్గుతున్న నీటి వనరులు సూపర్ ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తున్నాయి. కొల్లేరుకు ప్రధానంగా డ్రెయిన్లు, కాల్వల నుంచి నీరు చేరుతుంది. వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి శాతం తగ్గింది. గోదావరి జలాలను కొల్లేరుకు మళ్లించే అంశం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. – ఎం.రామకృష్ణ, ఇరిగేషన్ డీఈఈ, కై కలూరుకై కలూరు: కొల్లేరులో జలకళ కనిపించడం లేదు. సూపర్ ఎల్ నినో ప్రభావం సరస్సుపై స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ఆగస్టు నెలలో కొల్లేరు నీటితో నిండుకుండలా కళకళలాడుతూ, పరివాహక లోతట్టు ప్రాంతాలను ముంపుబారిన పడేసేది. కానీ, ప్రస్తుత పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పటికీ కొల్లేరు మధ్యలో పశువులు మేత మేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎగువ నుంచి కొల్లేరుకు చేరాల్సిన నీటి వనరులు నానాటికీ తగ్గుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నా, పాలకులు మాత్రం కొల్లేరును విస్మరిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదీ డెల్టా ప్రాంతాల మధ్య కొల్లేరు సహజ సిద్ధమైన వరద నివారణ జలాశయంగా ఉంది. సరస్సులోకి ప్రతి ఏటా వర్షాకాలంలో సగటున 65 నుండి 110 టీఎంసీల నీరు చేరుతుంది. వేసవి కాలంలో 135 చదరపు కిలోమీటర్లకు పరిమితమయ్యే సరస్సు వైశాల్యం, వర్షాకాలంలో దాదాపు 901 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది. సాధారణ రోజుల్లో ఇన్ఫ్లో సామర్థ్యం సెకనుకు 90 నుంచి 603 క్యూబిక్ మీటర్ల వరకు ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొల్లేరు నీటి ఇన్ఫ్లో, అవుట్ఫ్లోలలో తీవ్ర వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. కొల్లేరులో కరువైన జలకళ ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 77,138 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు విస్తరించి ఉంది. రెండు జిల్లాల్లోని 122 గ్రామాల్లో సుమారు 3.50 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. కొల్లేరు సరస్సులోకి ప్రధానంగా 4 సహజ నదులు, వాగులతో పాటు 60కి పైగా ప్రభుత్వ, ప్రైవేటు నీటి పారుదల కాలువలు, డ్రెయిన్ల ద్వారా వరద నీరు చేరుతుంది. సాధారణంగా ఆగస్టులోనే కొల్లేరు పరవళ్లు తొక్కుతుంది. అలాంటిది, ఇప్పుడు పెదఎడ్లగాడి వద్ద నీటి ప్రవాహం లేక మధ్యలో పశువులు మేత మేస్తున్నాయి. ఈ నీటి కొరత ప్రభావం సహజ జాతి చేపలపై, అభయారణ్యంలో విహరించే పక్షులపై పడుతోంది. ముఖ్యంగా ప్రసిద్ధ ఆటపాక పక్షుల విహార కేంద్రంలోని చెరువులో నీటిని పూర్తి స్థాయిలో నింపకపోవడంతో బోటు షికారు నిలిచిపోయింది. నిలకడ లేని నీటి వనరులు కొల్లేరులోకి బుడమేరు నుంచి 30 శాతం, తమ్మిలేరు నుంచి 25 శాతం, రామిలేరు, గుండేరుల నుంచి 20 శాతం వరద నీరు చేరుతుంది. కృష్ణా, గోదావరి డెల్టా కాలువల మిగులు జలాలు, ఉప్పునీటి పోటు ద్వారా ఏటా దాదాపు 9.6 టీఎంసీల నీరు చేరుతుందని అంచనా. నీటిని చేరవేసే ప్రధాన వనరులను దారి మళ్లించడం వల్ల సరస్సుకు చేరాల్సినంత నీరు రావడం లేదు. గోదావరి నీటిని మళ్లించాలని కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. ఆటపాక పక్షుల కేంద్రంలో బోటు షికారు లేకపోవడంతో వెలవెలబోతున్న దృశ్యం మండవల్లి మండలం పెదఎడ్లగాడి ప్రధాన వంతెన వద్ద నీరు లేక పశువులు మేస్తున్న దృశ్యం కొల్లేరు అభయారణ్యంలో 18,000 ఎకరాల్లో ఆక్రమిత రొయ్యల, చేపల చెరువులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. కొల్లేరుకు వరదల సమయంలో చేరే లక్షా 11 వేల క్యూసెక్కుల నీరు ఉప్పుటేరు ద్వారా దిగువకు వెళ్లాల్సి ఉండగా, కేవలం 12,000 క్యూసెక్కులు మాత్రమే వెళ్తోంది. మిగిలిన నీరు ఆక్రమిత చెరువుల్లోకి చేరుతోంది. అభయారణ్యంలో 5 నుంచి 10 అడుగుల ఎత్తులో చేపల చెరువుల గట్లు ఏర్పాటు చేయడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకాలు కలుగుతున్నాయి. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని పదేపదే హెచ్చరిస్తున్నా, రాజకీయ నాయకుల అండదండలతో ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. -
సీ్త్ర శక్తి.. అనాసక్తి
ఏలూరు (ఆర్ఆర్పేట): మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అధికారంలోకి వచ్చిన 14 నెలల తర్వాత కూటమి ప్రభుత్వం సీ్త్ర శక్తి పేరుతో ప్రారంభించింది. అన్ని బస్సుల్లో ఉచితమని భావించిన మహిళలకు నిరాశే ఎదురైంది. కేవలం 5 రకాల బస్సుల్లోనే అనుమతి ఇవ్వగా, అందులోనూ గ్రామీణ ప్రాంతాలకు అనుకూలంగా పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో రెండు వారాల్లో ఈ పథకం మొదటి వార్షికోత్సవం జరుపుకోనున్నప్పటికీ, మహిళల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రధానంగా డ్రైవర్లు, కండక్టర్లు మహిళా ప్రయాణికుల పట్ల తీవ్ర అనాసక్తి చూపుతున్నారు. మహిళలు బస్ స్టాప్లలో కనిపిస్తే బస్సులు ఆపకుండా వేగంగా వెళ్తున్నారు. ఖాళీగా ఉన్నా ఆపకుండా.. తాజాగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల నుంచి నాలుగింట ఒక వంతు (60) బస్సులను తరలించడంతో ప్రధాన రూట్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిమితంగా తిరుగుతున్న బస్సుల్లోనూ మహిళలను ఎక్కించుకోవడానికి సిబ్బంది నిరాకరించారు. ‘వెనుక మరో బస్సు వస్తోంది’ అని చెబుతూ వెళ్లిపోవడంతో మహిళలు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. బస్సులు ఖాళీగా ఉన్నప్పటికీ ఆపకపోవడంతో కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే మహిళలు, విద్యార్థినులు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. బస్సులను వెంబడిస్తూ.. శనివారం ఉదయం సుమారు 8.30 గంటల ప్రాంతంలో ఏలూరు కొత్త బస్టాండు నుంచి మచిలీపట్నం డిపోకు చెందిన ఏపీ 39 యూజీ 9495 నంబర్ బస్సు బయలు దేరింది. ఆ సమయంలో బస్సు ఖాళీగానే ఉంది. అప్పుడే బస్టాండులోకి ప్రవేశిస్తున్న ఒక మహిళ బస్సు ఆపాలంటూ చేయి ఎత్తినా డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. అయితే ఆ మహిళ ద్విచక్రవాహనంపై బస్సును వెంబడించి సత్రంపాడులో ఎక్కాల్సి వచ్చింది. సత్రంపాడులో కూడా బస్టాప్లో ఎక్కువ మంది మహిళలు ఉండటాన్ని గమనించి సదరు డ్రైవర్ బస్సును ఆపకుండా కొద్దిగా ముందుకు వెళ్లి సిద్ధార్థ స్కూల్ వద్ద ఆపడంతో ఆ మహిళలు ఆ బస్సును ఎక్కలేకపోయారు. మహిళలను ఎక్కించుకోవద్దని అధికారుల నుంచి సిబ్బందికి లోపాయికారి ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్సులన్నీ భోగాపురానికి.. తిరిగే కొన్ని బస్సుల్లోనూ మహిళలకు నిరాకరణ ఖాళీగా ఉన్నా ఆపకుండా వెళ్లిన వైనం లోపాయికారి ఆదేశాల మేరకేనా..? -
వైఎస్ జగన్ పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
ద్వారకాతిరుమల: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 5న పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు దేవరపల్లి వస్తున్న సందర్భంగా పార్టీ నేతలు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలిరానున్న పార్టీ శ్రేణులు, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏ ర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కార్యాచరణను వేగవంతం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్, మాజీ మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, విశాఖ స్మార్ట్సిటీ మాజీ చైర్మన్ జీవీ తదితరులు శనివారం దేవరపల్లిలోని ఎంపీపీ కుప్పాల దుర్గారావు నివాసంలో సమావేశమయ్యారు. సభా ప్రాంగణ ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, తాగునీరు, భోజనం, రాకపోకలు, ఇతర మౌలిక సౌకర్యాలపై విస్తృతంగా సమీక్షించారు. కార్యక్రమం విజయవంతానికి పార్టీ శ్రేణులు స మన్వయంతో పనిచేయాలని నేతలు సూచించారు. పార్టీ నాయకులు బంకా అప్పారావు, వెల్లంకి సుబ్రహ్మణ్యం, చెలికాని ప్రవీణ్, భోగరాజు సాయికృష్ణ, దాసరి రాంబాబు, షేక్ బాషా, కూచిపూడి సతీష్, కూసంపాటి మోహన్రెడ్డి, వెలగా శ్రీరామూర్తి తదితరులు పాల్గొన్నారు. -
చిక్కని పెద్దపులి
బుట్టాయగూడెం: గత 8 నెలలుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి అధికారులు వేసే ఎరకు చిక్కకుండా తప్పించుకోవడం చర్చనీయాంశంగా మారింది. గ్రామ శివారులో కట్టేసిన పశువులపై తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య పెద్దపులి విరుచుకు పడుతుంది. దాడి చేసి కడుపునిండా తిని రక్తం తాగుతుంది. పగలంతా పులికి అనువైన ప్రదేశాల్లో, పొదల్లో నిద్రపోయి చీకటి పడగానే మళ్లీ వేటకు బయల్దేరుతుంది. పెద్దపులి పేరు వినగానే గ్రామాల్లో ప్రజలు, రైతులు భయపడుతున్నారు. బుట్టాయగూడెం మండలంలో నాలుగు రోజులుగా మళ్లీ సంచరిస్తున్న పెద్దపులి కండ్రికగూడెం, పండుగూడెం గ్రామాల్లో పశువులపై దాడి చేసింది. శనివారం తెల్లవారుజామున మండలంలోని లక్ష్ముడుగూడెం, కొమ్ముగూడెం సమీపంలో కట్టేసి ఉన్న లేగదూడపై దాడి చేసింది. అక్కడి నుంచి మర్లగూడెం సమీపంలో ఉన్న జామాయిల్ తోటలో మకాం వేసింది. పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పులి దాక్కున్న ప్రదేశంలోనే పులిని పట్టుకునేందుకు పూణెకు చెందిన ప్రత్యేక నిపుణుల బృందాలు జామాయిల్ తోటలో మంచెలు ఏర్పాటు చేసారు. పులికి ఎరను ఏర్పాటు చేశారు. మత్తు ఇచ్చేందుకు గన్ను సిద్ధం చేసుకుని సాయంత్రం ఆరున్నర వరకూ సిద్ధంగా ఉన్నారు. పెద్దపులి వారి ఎత్తులకు చిక్కకుండా ఆ ప్రదేశం నుంచి పాటెమ్మ గుడివైపు నడుచుకుంటూ వెళ్ళిపోవడంతో అధికారుల ప్రయత్నాలు ఫలించలేదు. పెద్దపులి కొమ్ముగూడెం, లక్ష్ముడుగూడెం, బూసరాజుపల్లి, పట్టినపాలెం గ్రామాల పరిసర ప్రాంతాల్లో సంచరించడంతో ఆయా పరిసర ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బంధించేందుకు అధికారుల ప్రయత్నాలు విఫలం -
కుక్కునూరులో రాకపోకలు బంద్
కుక్కునూరు: ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కుక్కునూరు మండలంపై వరద ప్రభావం తీవ్రంగా పడింది. మండలంలోని పలు గ్రామాలకు రహదారి సౌకర్యం తెగిపోయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పాములేరు, వేలేరు గ్రామాల వద్ద ఆర్అండ్బీ రహదారి వరద నీటిలో మునిగిపోవడంతో కుక్కునూరు నుంచి బూర్గంపాడు, భద్రాచలంకు సంబంధాలు తెగిపోయాయి. వరద నీరు చుట్టుముట్టడంతో గొ మ్ముగూడెం గ్రామాన్ని ఖాళీ చేయించి, ప్రజలను దాచారం సమీపంలోని ఆర్అండ్ఆర్ కాలనీ పునరావాస కేంద్రాలకు శనివారం నాటికి పూర్తిస్థాయిలో తరలించారు. లచ్చిగూడెం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో గ్రామస్తులు సమీప కొండలపైకి ఎక్కి ఆశ్రయం పొందారు. వింజరం–చిరవెల్లి గ్రామాల మధ్య ఆర్అండ్బీ రహదారిని తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యగా 10 మంది సభ్యులు ఉన్న ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దింపారు. అధి కారులు పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం రూరల్: గోదావరి వరద పరవళ్లు తొక్కుతోంది. వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 34 మీటర్లు నీటిమట్టం చేరుకుంది. స్పీల్ వే 48 గేట్ల నుంచి దిగువకు 12.09 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువుకు చేరుతోంది దిగువన వరద ప్రవాహం మరింత పెరిగింది. పోలవరంలోని కడెమ్మ స్లూయిజ్ వద్ద వరద నీరు చేరడంతో గేట్లు ముంపునకు గురయ్యాయి. దీంతో వరద నీరు పొలాల వైపు వస్తుండటంతో రైతులు ముమ్మరంగా నాట్లు వేసే పనులు ప్రారంభించారు. పట్టిసీమ నుంచి నీరు విడుదల గోదావరి వరద పెరుగుతుండటంతో కృష్ణా డెల్టాకు నీటి తరలింపు మరింత పెంచారు ఎత్తిపోతల పథకం నుంచి కుడి కాలువలోకి 20 మోటార్ల ద్వారా నీరు విడుదల చేస్తున్నారు. -
లోకేష్ రాజీనామా చేయాలి
● మెగా కాదు దగా డీఎస్సీ ● టీచర్ల నియామకాల్లో అక్రమాలు ● సీబీఐ విచారణ చేయించాలి ● వైఎస్సార్సీపీ నాయకుల డిమాండ్ ఏలూరు (ఆర్ఆర్పేట): డీఎస్సీ–2025 స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని, పరీక్ష పత్రాల లీకేజీ, అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ నా యకులు డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పీఏసీ మెంబర్, ఉంగుటూరు నియోజకవర్గ ఇన్చార్జి పు ప్పాల వాసుబాబు, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్తో కలిసి ఏలూరులో డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. డీఎస్సీలో అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నాయకులు మాట్లాడుతూ డీఎస్సీ–2025లో పలు అవకతవకలు జరిగాయని స్పష్టమైన ఆధారాలున్నాయన్నారు. బ్రిడ్జి గేమ్ను కూడా క్రీడా కోటాలోకి చొప్పించడం సిగ్గుచేటన్నారు. క్రీడా కోటాల కింద జరిగిన నియామకాల్లో భారీ కుంభకోణమే దాగుందన్నారు. అర్హులైన అనేక మంది రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ న్యాయం జరిగి వారిని ఉద్యో గాల్లోకి తీసుకునే వరకూ వైఎస్సార్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. విద్యాదీవెన, వసతిదీ వెన బకాయిలు తక్షణమే చెల్లించాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశా రు. నాయకులు గుడిదేశి శ్రీనివాసరావు, దాసరి రమేష్, డీవీఆర్కే చౌదరి, మున్నుల జాన్గురు నాథ్, నెరుసు చిరంజీవులు, కిలాడి దుర్గారావు, గంట మోహన్రావు, లోటుకుర్తి సుభాష్, వేంపాటి స్టాలిన్ బాబు, జెడ్పీటీసీ కావీ, కె.జనార్దన్, ఎస్.యుగంధర్ ప్రసాద్, కంచుమర్తి తులసి, జుజ్జువరపు విజయనిర్మల, చిలకపాటి డింపుల్ జాబు, బసవ, సింగంశెట్టి రాము పాల్గొన్నారు. -
గళమెత్తిన స్కీమ్ వర్కర్లు
ఏలూరు (ఆర్ఆర్పేట): HË*Æý‡$ MýSÌñæMýSt-Æó‡sŒæ Ð]l§ýlª Ô¶æ${MýS-ÐéÆý‡… ïÜPÐŒl$ Ð]lÆý‡PÆý‡$Ï (A…VýS-¯ŒS-Ðéyîl, BÔ>, Ð]l$«§éÅçßæ²… ¿Z-f-¯]l…, çÜ*PÌŒæ Ô>°-sôæ-çÙ-¯Œl M>Ç-ÃMýS$Ë$) ïÜI-sîæÄ¶æÊ B«§ýlÓ-Æý‡Å…ÌZ ÐólÌê¨V> ™èlÆý‡-Í-Ð]l_a ò³§ýlª-G-™èl$¢¯]l Ð]l¬rtyìl °Æý‡Ó-íßæ…-^éÆý‡$. Æý‡Ðé-×ê ÝûMýS-Æ>ÅË$ ÌôæMýS-´ùƇ$$¯é {Oò³Ðólr$ Ðéçßæ¯éÌZÏ Ð]l_a, ò³ÇW¯]l °™éÅ-Ð]lçÜÆý‡ «§ýlÆý‡-ÌSMýS$ A¯]l$-VýS$-׿…V> Ðól™èl-¯éË$ ò³…^éÌS° yìlÐ]l*…yŠæ ^ólÔ>Æý‡$. A«¨-M>Æý‡$Ë$ Æ>MýS-´ù-Ð]lyýl…™ø B…§øâýæ-¯]l-M>-Æý‡$Ë$ »êÇ-MóSyýl$Ï ™øçÜ$-MýS$…r* ÌZç³-ÍMìS ÐðlâôæÏ…-§ýl$MýS$ Ķæ$†²…^èlV> ´ùÎçÜ$-ÌS™ø ™øç³#Ìêr fÇ-W…-¨. D {MýSÐ]l$…ÌZ JMýS Ð]l$íßæâýæ çܵ–çßæ ™èlç³µ-yýl…™ø BçÜ$-ç³-{†MìS ™èlÆý‡-Í…-^éÆý‡$. MýSÌñæ-MýSt-Æó‡sŒæ HÐø ¯é…^é-Æý‡Ä¶æ$Šѯ]l-†ç³{™èl… ïÜÓMýS-Ç…-_, çÜÐ]l$çÜÅ-ÌS¯]l$ {糿¶æ$™èlÓ… §ýl–íÙtMìS ¡çÜ$MðS-âꢯ]l° àÒ$ CÐ]lÓyýl…™ø B…§øâýæ¯]l ™é™éP-ÍMýS…V> ÑÆý‡-Ñ$…-^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> ïÜI-sîæÄ¶æÊ Æ>çÙ‰ {糫§é¯]l M>Æý‡Å-§ýlÇØ HÒ ¯éVóS-ÔèæÓ-Æý‡-Æ>Ð]l# Ð]l*sêÏ-yýl$-™èl*.. MýS±çÜ Ðól™èl¯]l… ₹26,000 CÐéÓ-ÌS-°, G°²-MýSÌS Ð]l¬…§ýl$ C_a¯]l àÒ$-ÌS¯]l$ MýS*rÑ$ {糿¶æ$™èlÓ… ¯ðlÆý‡-Ðól-Æ>aÌS° yìlÐ]l*…yŠæ ^ólÔ>Æý‡$. ç³…^é-Ķæ$-¡-Æ>gŒæ M>Ç-ÃMýS$-ÌSMýS$ 13 ¯ðlÌSË$V> i™éË$ CÐ]lÓ-MýS-´ù-Ð]lyýl… §éÆý‡$-׿-Ð]l$¯é²Æý‡$. Ķæ*‹³ÌS J†¢yìl, íÜVýS²ÌŒæ çÜÐ]l$-çÜÅÌS Ð]lÌSÏ Hyé-¨ÌZ 85 Ð]l$…¨ A…VýS-¯ŒSÐé-yîlË$ E§øÅ-V>Ë$ Ð]l¨-ÌôæÔ>Æý‡° ¯éĶæ$-MýS$Ë$ ™ðlÍ-´ëÆý‡$. {糿¶æ$™èlÓ… çܵ…¨…^èl-MýS$…sôæ çÜÐðl$ÃMýS$ ¨VýS$-™éÐ]l$° òßæ^èla-Ç…-^éÆý‡$. ïÜI-sîæÄ¶æÊ hÌêÏ A«§ýlÅ„ýS, {糫§é¯]l M>Æý‡Å-§ýlÆý‡$ØË$ BÆŠ‡.Í…-VýS-Æ>-k, yîlG-¯ŒSÒyîl {ç³Ýë§Šæ, Hï³ BÔèæ Ð]lÆý‡PÆŠ‡Þ ĶæÊ°Ä¶æ$¯ŒS hÌêÏ A«§ýlÅ-„ýS$-Æ>Ë$ í³.MýS-Ð]l$ÌS, çÜ*PÌŒæ Ô>°-sôæ-çÙ¯ŒS Ð]lÆý‡PÆŠ‡Þ ĶæÊ°Ä¶æ$¯ŒS ¯éĶæ$MýS$-Æ>Ë$ ç³Nh™èl ™èl¨™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. -
పాడె సిద్ధం చేస్తుండగా.. ప్రాణం కదిలొచ్చింది
కై కలూరు: ఆమె ఇకలేరని డాక్టర్లు నిర్ధారించారు. అంబులెన్సులో ఇంటికి చేర్చేలోపే అంత్యక్రియలకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు. శ్రద్ధాంజలి బ్యానర్ కట్టారు. ఆమె మాజీ మహిళా సర్పంచ్. కై కలూరు మండలం భుజబలపట్నం గ్రామం. పేరు గురజాల రామతులసి. 48 ఏళ్లు. భర్త, ఇద్దరు మగ సంతానం. కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యా దితో బాధపడుతున్నారు. ఏలూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గత సోమవారం ఆమెను చికిత్స నిమిత్తం చేర్పించారు. గురువారం ఉదయం పల్స్ లేదని, మెదడుపై ప్రభావం చూపడంతో ప్రాణం పోయిందని వైద్యులు చెప్పడంతో అంబులెన్సులో ఆమెను ఇంటికి తీసుకొస్తుండగా మార్గమధ్యలో కదలిక కనిపించింది. దీంతో తిరిగి ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. కొన ఊపిరితో ఉన్నారని జాయిన్ చేసుకోలేదు. చివరకు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేసి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. గురువారం రాత్రికి ఆమె పల్స్ 70కి చేరింది. ఇంజక్షన్ చేస్తే ఆమె శరీరం బాధతో కంపించింది. నిలిచిపోయిన యూరిన్ సమస్య తగ్గింది. ఇప్పుడామె వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఫ్రీజర్.. పాడె సిద్ధం భార్య ఇకలేరని కడసారి ఏర్పాట్లు సిద్ధం చేయడానికి భర్త వేణు స్వగ్రామం భుజబలపట్నం ముందుగానే చేరుకున్నారు. కర్మకాండలకు పాడె సామగ్రి, మృతదేహాన్ని ఉంచడానికి ఫ్రీజర్, పూలు సిద్దం చేశారు. ఇంటి వద్ద ఆమె ఫొటోతో శ్రద్ధాంజలి బ్యానర్ కట్టారు. ఇక సోషల్ మీడియా వా ట్సాప్లలో శ్రద్ధాంజలి ఘటిస్తూ పలువురు పోస్టులు పెట్టారు. రామతులసి వైఎస్సార్సీపీకి చెందిన మాజీ సర్పంచ్ కావడంతో ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ కై కలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్)తో పాటు గ్రామ పెద్దలు మృతదేహానికి నివాళి అర్పించడానికి భుజబలపట్నం వచ్చారు. ఇంతలో ఆమెలో కదలిక వచ్చిందని చెప్పడంతో డీఎన్నార్ విజయవాడ ప్రభుత్వాసుపత్రి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. నా భార్య బతికింది చనిపోయిందని భావించిన తన భార్య బతకడం ఎంతో సంతోషనిచ్చిందని భర్త వేణు మాటలకందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. విజయవాడ ఆస్ప త్రిలో ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఇది మరో జన్మగా భావిస్తున్నామన్నారు. భుజబలపట్నంలోని ఆయన కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. ఆమె పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అంతా ఆకాంక్షిస్తున్నారు. పల్స్ పడిపోయి మృతి చెందిందని నిర్ధారించిన డాక్టర్లు ఇంటికి తీసుకొస్తుండగా అంబులెన్సులో కదలికలు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో 70కి చేరిన మహిళ పల్స్ మాజీ మహిళా సర్పంచ్ ఇంట వెల్లివిరిసిన సంతోషం -
పొగాకు రైతులకు అండగా వైఎస్ జగన్
● 5న దేవరపల్లిలో పర్యటన ● పొగాకు రైతులూ తరలిరండి ● ప్రభుత్వం దిగి వచ్చేవరకూ పోరాటం ● వైఎస్సార్సీపీ నేతల పిలుపు బుట్టాయగూడెం(జంగారెడ్డిగూడెం): పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 5న దేవరపల్లిలో పర్యటించనున్నారని ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు జెట్టి గురునాథరావు తెలిపారు. శుక్రవారం జంగారెడ్డిగూడెంలో గురునాథరావు కార్యాలయం వద్ద పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు అధ్యక్షతన జగన్ పర్యటన ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. పట్టించుకోని కూటమి ప్రభుత్వం నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుతం గిట్టుబాటు ధర లేక పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకే జగన్ దేవరపల్లి వస్తున్నారని చెప్పారు. గతంలో జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన ‘పొగా కు రైతుల గర్జన’ తర్వాత జగన్ తాడేపల్లిలో రైతులతో సమావేశమయ్యారని గుర్తుచేశారు. ఆ సమయంలో ప్రభుత్వం హామీలు ఇచ్చినా రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. ప్రభు త్వం కళ్లు తెరిచేలా జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం ప్రాంతాల పొగాకు రైతులు భారీగా తరలివచ్చి ఈ పర్యటనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర లభించే వరకూ వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే పు ప్పాల వాసుబాబు, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి జయప్రకాష్, బూత్ కమిటీ రీజనల్ కో–ఆర్డినేటర్ బీవీఆర్ చౌదరి, పోలవరం, భీమవరం నియోజకవర్గ పరిశీలకులు కనుమూరి శివరామరాజు, మంతెన సోమరాజు, మాజీ ఏఎంసీ చైర్పర్సన్ జగ్గారపు జానకిరెడ్డి, నాయకులు బొడ్డు వెంకటేశ్వరరావు, మేడారపు విద్యాసాగర్, బండారు గంగాప్రసాద్, పోలవరం, చింతలపూడి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సుంకర వెంకటరెడ్డి, గంజిమాల రామారావు, ఆరేటి సత్యనారాయణ, గంటా శ్రీను, నాయకులు ఓరుగంటి నాగేంద్రకుమార్, తుమ్మలపల్లి గంగరాజు, రాయి అంకుల సత్యనారాయణ, కర్పూరం గవరయ్య, గుప్తా నాగు, జెట్టి సత్య ఆదిత్య, ముప్పిడి శ్రీనివాసరావు, కుక్కల ధర్మరాజు, కుర్రు రవి, బత్తిన చిన్న, నీకూరి కిషోర్, శేషారెడ్డి, ఉమా మహేశ్వరరావు, షరీఫ్, అక్టర్, జాని, ఆరీఫ్, తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పటికే లేటు.. ఎక్కడుంది బోటు?
● వరద ముంచుకొస్తున్నా కానరాని లాంచీలు ● పెరుగుతున్న గోదావరి వరద వేలేరుపాడు: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. శుక్రవారం రాత్రికి నీటిమట్టం 51.20 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శనివారం ఉదయానికి మూడో ప్రమాద హెచ్చరిక వెలువడే అవకాశముంది. అయితే ఏటా జూన్ 15 కల్లా చేపట్టాల్సిన వరద సహాయక చర్యలను అధికారులు ఇంకా ప్రారంభించకపోవడం గమనార్హం. అత్యవసర సమయంలో అందుబాటులో ఉండాల్సిన లాంచీలు, బోట్లు లేకపోవడంతో ముంపు ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మహారాష్ట్ర సహా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటికి తోడు, భద్రాచలం–రాజమండ్రి మధ్య ఉన్న ఉపనదుల వల్ల గోదావరికి ఆకస్మికంగా వరద పెరుగుతుంది. సాధారణంగా జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఉండే ఈ వరద సీజన్లో ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి, నిత్యావసరాలు అందించడానికి లాంచీలే ఏకైక ఆధారం. అత్యవసర సమయంలో లాంచీలను రా జమండ్రి నుంచి ఎగువకు (ఎదురీతపై) తీసుకురావడం చాలా సమయంతో కూడుకున్న పని. 7 మండలాలకు పొంచి ఉన్న ముప్పు భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయితే ఏలూరు, అల్లూరి సీతారామరాజు/తూర్పు గోదావరి (పోలవరం, రంపచోడవరం) జిల్లాల పరిధిలోని 7 మండలాల్లోని 167 గ్రామాలు నీట మునుగుతాయి. మండలాల వారీగా వేలేరుపాడులో 36, కుక్కునూరులో 28, పోలవరంలో 19, కూనవరంలో 48, వీఆర్ పురంలో 30, చింతూరులో 6 గ్రామాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో ముంపునకు గురయ్యే ప్రజల ప్రాణాలు కాపాడటానికి, నిత్యావసరాలు అందించడానికి ఏటా 25 లాంచీలు, 100 మంది సిబ్బంది అవసరమవుతారు. అధికారులు వెంటనే స్పందించి లాంచీలను స్థానిక రేవుల్లో అందుబాటులో ఉంచాలని ముంపు ప్రాంత ప్రజలు కోరుతున్నారు. -
వేలేరుపాడును వణికిస్తున్న వరద
వేలేరుపాడు: గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. రెండు రోజులుగా పడుతున్న ఎడతెరిపిలేని వర్షాల వల్ల ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 51.20 అడుగులకు చేరింది. దీంతో వేలేరుపాడు మండలంలోని 32 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుని, మండల కేంద్రంతో సంబంధాలు కోల్పోయాయి. పెదవాగు, ఎద్దెలవాగు, టేకూరు, మేళ్లవాగుల ద్వారా గోదావరి నీరు చేరి ప్రధాన రహదారులన్నీ మునిగిపోయాయి. మరో 7–8 అడుగులు పెరిగితే ఇళ్లన్నీ నీట మునుగుతాయని సీడబ్ల్యూసీ అధికారులు హెచ్చరించారు. బాధితుల రవాణాకు అధికారులు నాటుపడవలు ఏర్పాటు చేశారు. రేపాకగొమ్ముతో పాటు ఇతర ముంపు గ్రామాల ప్రజలను తాడువాయి పునరావాస కాలనీకి తరలిస్తున్నారు. ఇప్పటివరకు 70 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు. -
ముసాయిదా సిద్ధం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ముసాయిదా జాబితా విడుదలైంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ముసాయిదా జాబితాను అందజేశారు. ప్రధానంగా రెండు జిల్లాల్లో మృతి చెందిన ఓట్లు సుమారు 99 వేల పైగా, అలాగే వలస వెళ్ళిన ఓట్లు 46 వేలు ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. రెండు జిల్లాలో సమావేశాలు సర్ కార్యక్రమానికి సంబంధించి ఉమ్మడి పశ్చిమలో ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరగ్గా, పశ్చిమగోదావరిలో డీఆర్వో బి.పెంచల ప్రభాకర్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులు, క్లయిమ్స్ పరిష్కార ప్రక్రియ, తప్పులు లేకుండా చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. పశ్చిమలో 14,75,036 మంది ఓటర్లు ఉండగా 13,89,592 ఎలక్ట్రోరల్ ఫామ్స్ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అలాగే 43,746 మంది ఓటర్లు మృతి చెందిన కారణంగా తొలగించారు. 22,131 మంది వలస వెళ్లడంతో ఓట్లను తొలగించారు. అలాగే ఇతర ప్రాంతాల్లో నమోదైన ఓట్లు 15,676 ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇక ఏలూరు జిల్లాలో 16,44,193 మంది ఓటర్లు ఉండగా 6,12,979 మంది మ్యాపింగ్ పూర్తయింది. ఇక 1,02,472 ఓట్లు తొలగించాల్సిన జాబితాలో చేర్చారని, క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు శాశ్వత వలస వెళ్లినవారు, రెండు ఓట్లు ఉన్నవారు, మృతి చెందిన వారి పేర్లను తొలగించాల్సిన జాబితాలో చేర్చారు. ఇక జిల్లాలో 651 సర్వీ సు ఓట్లు ఉన్నాయి. ఆగస్టు 31 వరకు క్లయిమ్లు, దరఖాస్తులు చేసుకోవచ్చని, కొత్త ఓటు నమోదు, అడ్రస్ మార్పులు, సవరణ, తదితర అంశాలకు నెల రోజుల సమయం ఉందని ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు పరిశీలించి, అక్టోబర్ 3న తుది జాబితా ప్రకటిస్తామని ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి ప్రకటించారు. ఏలూరులో 15,41,650 మంది ఓటర్లు పశ్చిమలో 14,75,036 మంది ఓటర్లు ఏలూరులో 55,852, పశ్చిమలో 43,756 మంది మృతి చెందిన ఓట్లు తొలగింపు ఏలూరులో 24,036, పశ్చిమలో 22,131 వలస ఓట్లు తొలగింపు రాజకీయ పార్టీలతో రెండు జిల్లాల్లో అధికారుల సమావేశం ఏలూరు జిల్లాలో 55,852 మంది ఓట్లను మృతి చెందిన కారణంగా తొలగించారు. డెత్ సర్టిఫికెట్ ప్రామాణికంగా తీసుకుని వీటిని తొలగించారు. చింతలపూడిలో అత్యధికంగా 12,172 ఓట్లు ఉన్నాయి. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో 43,746 ఓట్లను తొలగించారు. వీటిలో అత్యధికంగా తణుకు నియోజకవర్గంలో 7,685 ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా ఏలూరు జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వలస వెళ్లిన ఓటర్లు 24,034 మందిగా గుర్తించారు. పోలవరం నియోజకవర్గంలో 4,366 ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. అలాగే పశ్చిమగోదావరిలో 22,131 ఓట్లను గుర్తించారు. వీటిలో తణుకులో 6,600 ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. -
పులిని బంధించేందుకు ప్రత్యేక బృందాలు
బుట్టాయగూడెం: మండలంలోని పండుగూడెంలో లేగదూడపై పెద్దపులి శుక్రవారం దాడి చేసి హతమార్చింది. దీంతో మరింత అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పులిని బంధించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మహారాష్ట్ర, పూనె నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందాలు రంగంలోకి దిగాయి. సీసీఎఫ్ ఆశాజ్యోతి, డీఎఫ్ఓ సందీప్రెడ్డి తదితరులు కండ్రికగూడెం సమీపంలో పులి సంచారాన్ని గుర్తించి, దాన్ని బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతం కొండలు, గుట్టలతో కూడి ఉండటం, వాతావరణం అనుకూలించకపోవడంతో పులిని పట్టుకోవడం సవాలుగా మారిందని డీఎఫ్ఓ తెలిపారు. అయితే పులి మైదాన ప్రాంతంలోకి రాగానే మత్తుమందు (రసాయన పద్ధతి) ఇచ్చి సురక్షితంగా పట్టుకోవడానికి ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, చింతూరు, పాపికొండల నేషనల్ పార్క్ బృందాలు సిద్ధంగా ఉన్నా యని చెప్పారు. మైక్ ప్రచారం, డప్పు చాటింపుల ద్వారా పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కన్నాపురం, పోలవరం, కుక్కునూరు, జంగారెడ్డిగూడెం రేంజ్ అధికారులతో పాటు ఏపీ అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆదేశాల మేరకు సిబ్బంది నిరంతరం పులి సంచారాన్ని ట్రాక్ చేస్తున్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో శనివారం (1వ తేదీన) 2,54,579 మంది పింఛన్దారులకు రూ.112.43 కోట్ల పంపిణీకి ఏర్పాట్లు చేశామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఉదయం 7 ంటల నుంచి పంపిణీ ప్రారంభిస్తామన్నారు. పోలవరం రూరల్: పోలవరంలో గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. భద్రాచలం నుంచి దిగువకు 12.52 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతుంది. దిగువన పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 31.900 మీటర్ల ఎత్తు నీటిమట్టం చేరుకుంది. స్పిల్వే 48 గేట్ల నుంచి దిగువకు 6.25 లక్షల క్యూసెక్కుల నీరు చేరు తుంది. దిగువన ఇసుక దిన్నెలు ముంచుకుంటూ ఉభయగోదావరి జిల్లాల మధ్య లంక ఒడ్డున తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తుంది. వేలేరుపాడు: గోదావరి వరద ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను, గర్భిణులు, వృద్ధులు, విభిన్న ప్రతి భావంతులను ప్రాధాన్యతపై పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. 12 బోట్లు, గజఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, 12 భారీ జనరేటర్లు, 750 టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలన్నారు. పాముకాటు విరుగుడు బిళ్లలతో సహా అవసరమైన మందులతో వైద్య శిబిరాలు, పాఠశాలలకు 1,000 లీటర్ల తాగునీటి ట్యాంకులు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి గ్రామంలో ప్రత్యేక అధికారిని నియమించి, 24/7 కంట్రోల్ రూమ్లను నిర్వహించాలని ఆదేశించారు. నదిలోకి ఈతకు, చేపల వేటకు వెళ్లకుండా టామ్ టామ్ ద్వారా ప్రచారం చేయాలని, మూగజీవాలకు దాణా సౌకర్యం కల్పించాలని సూచించారు. ప్రజలు పుకార్లు నమ్మవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జేసీ అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్ రెడ్డి, జెడ్పీ సీఈఓ పి.జగదాంబ, ఆర్డీఓ ఎంవీ రమణ, ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్, డీపీఓ వీకే మల్లికార్జునరావు, డీఎంహెచ్ఓ శోభ, డీసీహెచ్ఎస్ బేబీ కమల, విద్యుత్ ఎస్ అంబేడ్కర్, వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషా, డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పరిశ్రమల కార్మికులు, మున్సిపల్, పంచాయితీ కార్మికులు, వైద్య ఆరోగ్యశాఖ, ఎన్హెచ్ఎం కాంట్రాక్టు ఉద్యోగులు, 102, సమగ్ర శిక్ష అభియాన్, ఐటీడీఏ, వెటర్నరీ సహా వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్. లింగరాజు అధ్యక్షత వహించగా.. జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ ముఖ్య అతిగా మాట్లాడారు. 15 ఏళ్లుగా ప్రభుత్వం కనీస వేతనాలు సవరించలేదని, కార్పొరేట్లకు వందలాది ఎకరాలు కట్టబెడుతున్న ప్రభుత్వాలు కార్మికుల వేతనాల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా కన్వీనర్ ఎం.నాగమణి, కే. శ్రీనివాస్, ఇతర సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం వివిధ శాఖల ఉద్యోగులు కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు. -
టార్గెట్ ఫిక్స్.. ట్రాన్స్ఫర్ ట్రిక్స్
● శ్రీవారి దేవస్థానంలో ముదిరిన అధికారుల బదిలీల రాజకీయం ● ఎలక్ట్రికల్ డీఈని రిలీవ్ చేసిన అధికారులు ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానంలో అధికారుల బదిలీల వెనుక తీవ్ర రాజకీయ జోక్యం ఉందన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీ నేతలు డిప్యూటేషన్ను అస్త్రంగా చేసుకుని, తమకు అనుకూలంగా లేని అధికారులతో పాటు, దేవస్థానం ఛైర్మన్ ఎస్వీ సుధాకరరావు, ఆయన కుమారుడు నివృతరావులకు మద్దతుగా ఉన్న అధికారులను లక్ష్యంగా చేసుకుని ఒక్కొక్కరిగా సాగనంపుతున్నారనే ప్రచారం నడుస్తోంది. ఇటీవల లక్ష్మీపురంలో దేవస్థానం భూమిని కొందరు అధికార పార్టీ నాయకులు ఆక్రమించిన వ్యవహారంలో భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తాము వివాదంలో చిక్కుకోవడానికి అధికారులే కారణమని భావించిన నేతలు వారిపై కక్ష పూనినట్లు ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హఠాత్తుగా డీఈ రిలీవ్ ఈ పరిణామాల్లో భాగంగా ఎలక్ట్రికల్ డీఈ టి.సూర్యనారాయణను హఠాత్తుగా రిలీవ్ చేశారు. 2022లో ఆయన్ను ద్వారకాతిరుమల నుంచి అన్నవరానికి బదిలీ చేసినా, తదుపరి ఉత్తర్వుల ప్రకారం ఆయన ద్వారకాతిరుమలతో పాటు సింహాచలంలో సేవలు అందిస్తున్నారు. అయితే, పాత 2022 నాటి బదిలీ ఉత్తర్వులను ఆధారంగా చూపిస్తూ గురువారం అకస్మాత్తుగా ఆయన్ను రిలీవ్ చేసి అన్నవరం వెళ్లాలని ఆదేశించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. తదుపరి టార్గెట్ ఎవరో.. ఎలక్ట్రికల్ డీఈ తర్వాత బదిలీల జాబితాలో తదుపరి టార్గెట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) డీవీ భాస్కర్ అని ప్రచారం జరుగుతోంది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న అంశం ఆలయ ప్రాంగణంలో ఆసక్తికరంగా మారింది. ఆలయ భూముల కబ్జాపై మాట్లాడకుండా, నేతలకు లొంగిపోని అధికారులపై ఇలా కక్షసాధింపు చర్యలకు దిగడంపై స్థానికులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుని పరిపాలనలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోవడం పట్ల ఆందోళన చెందుతున్నారు. -
గిరిజన విద్యార్థిని మృతిపై విచారణ
బుట్టాయగూడెం: మలేరియా జ్వరంతో పులిరామన్నగూడెంకు చెందిన గిరిజన విద్యార్థిని మడకం నందిత (12) మృతి చెందిన ఘటనపై గురువారం వైద్యాధికారులు విచారణ చేపట్టారు. ఎస్పీఎమ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్మయి, పీడియాట్రిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాధవి, డీఎంఅండ్హెచ్ఓ శోభ బృందంగా ఏర్పడి బాలిక మృతికి సంబంధించిన కారణాలను సేకరించారు. అనంతరం నందిత చదువుతున్న కామయ్యకుంట పాఠశాలను సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు. త్వరలోనే సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు. ఈ విచారణలో డాక్టర్ అకీబ్, జిల్లా మలేరియా అధికారి ఎన్ఎస్ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, రిజెక్టెడ్ జాబితాలను ఏలూరు జిల్లా వెబ్సైట్, ఏలూరులోని విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయ నోటీసు బోర్డులో ఉంచినట్లు విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, వచ్చే నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తగిన ఆధారాలతో తమ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. సాక్షి, టాస్క్ఫోర్స్: వివాదాలకు పర్యాయపదంగా పేరుగడించిన కై కలూరు జనసేన కార్యకర్త కొల్లి వీర వెంకట సత్యవర ప్రసాద్ (బాబీ)పై ఆయన భార్య దుర్గాదేవీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంనకు చెందిన దుర్గాదేవీని 15 ఏళ్ల క్రితం బాబీ వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో రూ.15 లక్షలు నగదు, 10 సవర్ల బంగారం, వస్తువుల కోసం మరో రూ.లక్ష కట్నంగా ఇచ్చారు. వీరికి ఇరువురు సంతానం. కై కలూరు మండలం కొల్లేటికోటలో కాపురం తర్వాత 2020లో ఆటపాకలో అపార్ట్మెంటుకు మారారు. అనంతరం ఇదే మండలం నత్తగుళ్ళపాడుకు చెందిన ఓ వివాహితతో బాబీ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన భార్య దుర్గాదేవీ నిలదీసింది. దీంతో బాబీ, అక్రమ సంబంధం కలిగిన మహిళ తనను చిత్రహింసలకు గురిచేసి అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారని, తన పిల్లలను సైతం చూడనివ్వడం లేదని, తన భర్తతో తనకు ప్రాణహాని ఉందని ఈ నెల 5న కై కలూరు టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనంతరం పెద్దల ముందు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోవడంతో తిరిగి ఆమె పోలీసులను ఆశ్రయించడంతో టౌన్ పోలీసులు సెక్షన్లు 85, 351(2), 3(5) బీఎన్ఎస్ సెక్షన్ 4 డీపీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): అధికారులు కలిసికట్టుగా పనిచేసి నిర్ధేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ కే.వెట్రిసెల్వి అన్నారు. గురువారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, 22 (ఏ) కేసులు, వరద, విపత్తు నిర్వహణ తదితర 14 అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పౌరసేవలు అందించడంలో మనస్సుపెట్టి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. అలసత్వం, నిర్లక్ష్యం వహించే అధికారులకు చర్యలు తప్పవని హెచ్చరించారు. జేఎన్టీయూకే పాలకమండలి రద్దు బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): కాలపరిమితి నెల రోజులు ఉండగానే జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ పాలక మండలిని రద్దుచేస్తూ ఉన్నత విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మూడేళ్ల కాలపరిమితితో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త పాలక మండలి సభ్యులను నియమించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పాలకమండలి సభ్యులను నిర్వీర్యం చేసి వారితో ఏవిధమైన సమావేశాలూ నిర్వహించలేదు. -
పెద్దపులి పంజాకు రెండు ఆవులు బలి
కొయ్యలగూడెం: ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఏజెన్సీ, మెట్ట ప్రాంత ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలోకి ప్రవేశించింది. బుధవారం రాత్రి మంగపతిదేవీపేట గ్రామంలో రెండు ఆవులపై దాడి చేసి చంపేసింది. తేలే వెంకటేశ్వరరావు, కొండా వీరాస్వామి అనే రైతులు తమ పొలాల్లో పశువులను ఉంచగా, పెద్దపులి దాడి చేసి అందులో ఒక ఆవును సగం తినేసింది. మంగపతిదేవీపేట, ముద్దప్పగూడెం గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో ప్రస్తుతం పులి సంచరిస్తున్నట్లు గుర్తించామని కన్నాపురం అటవీశాఖ రేంజర్ భానుప్రకాష్ తెలిపారు. తాను, రాజమండ్రి రేంజర్, 60 మందికి పైగా సిబ్బంది కలిసి పెద్దపులికి మత్తుమందు ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలు వాతావరణ పరిస్థితులు, పరిసర ప్రాంతాల వల్ల ఫలించడం లేదని చెప్పారు. కాగా, పెద్దపులి సంచారంపై అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
పెరుగుతున్న గోదావరి వరద
పోలవరం ప్రాజెక్టు దిగువన ప్రవహిస్తున్న వరద కుక్కునూరు వద్ద నిండుకుండను తలపిస్తూ..కుక్కునూరు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరి నదికి క్రమంగా నీటి ప్రవాహం పెరిగి కుక్కునూరు మండల పరిధిలో నిండుకుండలా కనిపిస్తూ పరవళ్లు తొక్కుతోంది. గురువారం ఉదయం నుంచి క్రమంగా పెరుగుతున్న గోదావరి సాయంత్రం 6 గంటల సమయంలో భద్రాచలం వద్ద 26 అడుగులకు చేరింది. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. స్థానిక ప్రజలు నదిలో చేపలు పట్టడం, స్నానాలు చేయడం వంటి పనులు చేయరాదాని హెచ్చరించారు. పట్టిసీమ వద్ద ఉధృతంగా వరద పోలవరం రూరల్: గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఉప నదుల నీటితో పాటు శబరి నీరు కూడా నదిలోకి చేరడంతో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటిమీట్టం 29 మీటర్లకు చేరుకుంది. స్పిల్వే 48 గేట్ల నుంచి 2.14 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలంలో 28.70 అడుగులకు నీటిమట్టం ఏలూరు (ఆర్ఆర్పేట): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటి మట్టం పెరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 28.70 అడుగులకు చేరుకుందని, 3,97,281 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంటే 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారని, 9,32,288 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తారని తెలిపారు. వరద పరిస్థితులపై అప్రమత్తం జిల్లాలో గోదావరి వరద పరిస్థితిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లోని కొన్ని గ్రామాల్లో వరద ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. వరద పరిస్థితులపై ప్రత్యేక అధికారులను నియమిస్తూ, కంట్రోల్ రూమ్లు 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన సహాయక చర్యలకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. -
మళ్లీ.. పులి
గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. గడచిన ఎనిమిది నెలలుగా ఏలూరు, తూర్పుగోదావరి, పోలవరం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో సంచరిస్తున్న ఈ పులి, తరచూ పశువులపై దాడి చేస్తూ హతమారుస్తోంది. ఈ పరిణామం అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బుట్టాయగూడెం: తెలంగాణలోని కావిడిగుండ్లలో గత డిసెంబర్లో పశువులపై దాడి చేసిన పెద్దపులి, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో ప్రవేశించింది. పలు గ్రామాల్లో తిరుగుతూ పశువులను హతమార్చిన అనంతరం పోలవరం మండలంలోకి అడుగుపెట్టింది. పట్టిసీమ వద్ద గోదావరి నదిని ఈదుకుంటూ తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించి, కూర్మాపురం వద్ద అటవీశాఖ ప్రత్యేక బృందాలకు చిక్కింది. శ్రీశైలం, బెంగళూరు, విశాఖపట్నం నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందాలు పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి సురక్షితంగా విశాఖపట్నం జూ పార్కుకు తరలించారు. అయితే పులి మనుగడను దృష్టిలో ఉంచు కుని, వన్యప్రాణి సంరక్షణ చట్టాల ప్రకారం అటవీశాఖ అధికారులు దానిని మళ్లీ జూ నుంచి తీసుకొచ్చి, రేడియో కాలర్ అమర్చి పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టారు. దీంతో పులి సంచారం మళ్లీ మొదలైంది. పోలవరం ప్రాంతంలోని దేవీపట్నం, పరిసర సరిహద్దు గ్రామాల్లో తిరిగిన పులి, అక్కడి నుంచి మళ్లీ పోలవరం మండలం మీదుగా బుట్టాయగూడెం చేరి, ఆపై తెలంగాణ ప్రాంతానికి వెళ్లింది. ఆ సమయంలో పులి ఇక రాదని అందరూ భావించారు. కానీ, కొద్ది రోజులకు మళ్లీ పోలవరం, ఏలూరు జిల్లాల్లో దాని కదలికలను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని కంచర్లగూడెం, నందిగూడెం ప్రాంతాలతో పాటు కొయ్యలగూడెం మండలంలోని మంగపతీదేవిపేటలో పశువులపై దాడి చేసిన ఈ పులి, ప్రస్తుతం బుట్టాయగూడెం మండలం మొద్దప్పగూడెంలోని ఒక జామాయిల్ తోటలో మకాం వేసింది. 150కి పైగా పశువులపై దాడి గడచిన ఎనిమిది నెలల్లో ఏలూరు, తూర్పుగోదావరి, పోలవరం జిల్లాల సరిహద్దుల్లో సంచరిస్తున్న ఈ పెద్దపులి సుమారు 150కి పైగా పశువులను హత మార్చినట్లు సమాచారం. పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టినప్పటికీ, అది తిరిగి గ్రామాల వైపు వస్తూ పశువులపై దాడి చేస్తుండటంతో అటవీశాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. పులిని బంధించేందుకు అధికారులు ఎన్ని వ్యూహాలు పన్నుతున్నప్పటికీ, అది చాకచక్యంగా తప్పించుకు తిరుగుతోంది. దీనితో స్థానికులు ఈ పులికి సరదాగా ‘చాణక్య పులి’ అంటూ సైటెర్లు వేస్తున్నారు. ప్రజల్లో తీవ్ర ఆందోళన ఎనిమిది నెలలుగా గోదావరి జిల్లాల ప్రజలు, రైతులు పులి బెడదతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అనేక మంది రైతులు పశువులను కోల్పోయి జీవనోపాధి కరువై నిరాశకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే పులిని సజీవంగా పట్టుకుని దట్టమైన అడవిలోకి తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనుల సీజన్ కావడంతో తోటలకు వెళ్లేందుకు కూలీలు, రైతులు భయపడుతున్నారు. సాయంత్రం ఐదు దాటితే ఇంటి నుంచి బయటకు రావడానికి సాహసించడం లేదు. పిల్లలను ఒంటరిగా స్కూళ్లకు పంపలేకపోతున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు, ప్రత్యేక బృందాలు గత ఎనిమిది నెలలుగా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పులికి అమర్చిన రేడియో కాలర్ సిగ్నల్స్ ఆధారంగా ఎప్పటికప్పుడు దాని కదలికలను పర్యవేక్షిస్తూ, అనువైన ప్రదేశంలో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఆ పులి అధికారులకు చిక్కకుండా మూడు జిల్లాల పరిధిలో ముప్పుతిప్పలు పెడుతోంది. అటవీశాఖ అధికారులు డ్రోన్లతోనూ నిఘా పెట్టి పులి జాడను కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే పులిని బంధిస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు. అడవిని వీడి జనావాసాల వైపు వచ్చిన ఈ పెద్దపులి ఎప్పుడు చిక్కుతుందోనని, ఈ భయాందోళనల నుంచి తమకు ఎప్పుడు విముక్తి కలుగుతుందోనని గోదావరి జిల్లాల ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గోదావరి జిల్లాలను వణికిస్తున్న పెద్దపులి ఎనిమిది నెలలుగా అటవీశాఖ అధికారులకు చుక్కలు చూపిస్తున్న వైనం పులి దెబ్బకు 150కు పైగా పశువుల బలి అధికారులకు సవాల్గా మారిన పెద్దపులి సంచారం ప్రజల్లో, పశురైతుల్లో తీవ్ర ఆందోళన -
వరుణుడు కరుణించాలని..
ద్వారకాతిరుమల: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ ద్వారకాతిరుమల క్షేత్ర పాలకుడైన శ్రీ భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఆలయంలో చేపట్టిన వారుణానువాక జప కార్యక్రమాల్లో రెండో రోజు గురువారం విశేష పూజలు జరిగాయి. ముందుగా ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై గంగా, పార్వతీ సమేత శివదేవుడి ఉత్సవ మూర్తులను, వృష్యశృంగ ప్రతిమను ఉంచి వేద పండితులు పూజలను ప్రారంభించారు. పండితులు మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ గణపతిపూజ, వరుణ జపములు, వారుణానువాక, శతానువాక ,రుద్ర సహిత సహస్రఘట కలశ అభిమంత్రణ, మండప పూజలను నిర్వహించారు. ఆఖరిలో నీరాజన మంత్ర పుష్పములు కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ఈ వరుణ జపములు శుక్రవారం ఆలయంలో జరిగే విశేష కార్యక్రమాలతో ముగుస్తాయని ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు తెలిపారు. -
మా ఫ్లెక్సీలు చింపి.. మా నేతలపైనే కేసులా ?
మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఆగ్రహం దెందులూరు: రాజకీయాలు హుందాగా చేయాలే తప్ప, పదిమంది వేలెత్తి చూపించేలా ఉండకూడదని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. గురువారం ఏలూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షుడు కామిరెడ్డి నాని ఆయనను కలిశారు. చల్ల చింతలపూడి గ్రామంలో బుధవారం రాత్రి బస్టాండ్ సెంటర్ వద్ద పార్టీ ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు చించివేసి, తిరిగి వైఎస్సార్సీపీ నాయకులపైనే దెందులూరు పోలీస్స్టేషన్లో కేసులు పెట్టించారని నాని ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరికి వివరించారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో ఎక్కడా లేనివిధంగా ఈ తరహా కక్షసాధింపు రాజకీయాలను తెరపైకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా ఫ్లెక్సీలు చించి, మా నాయకులపైనే కేసులు పెడతారా? ఇంతకంటే దిగజారుడుతనం ఇంకేముంటుంది?’ అని మండిపడ్డారు. కార్యకర్తలు, నాయకులు అందరూ ధైర్యంగా పోరాడాలని, తాను ఎప్పుడూ అండగా ఉంటానని చల్ల చింతలపూడి పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్ కుమార్, చల్ల చింతలపూడి గ్రామ పార్టీ అధ్యక్షుడు వేమన నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి సింహాద్రి శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. నాయకులతో మాట్లాడుతున్న అబ్బయ్యచౌదరి టీడీపీ శ్రేణులు చించివేసిన ఫ్లెక్సీ -
బస్సుల్లో కెమెరాలు ఏర్పాటు చేయాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని అన్ని విద్యాసంస్థల బస్సుల్లో లొకేషన్ ట్రాకింగ్ డివైస్ (వీఎల్టీడీ), డ్యాష్బోర్డ్ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఉప రవాణా కమిషనరు (డీటీసీ) షేక్ కరీమ్ విద్యాసంస్థల యాజమాన్యాలను కోరారు. చొదిమెళ్లలోని ఆయన కార్యాలయంలో బుధవారం విద్యాసంస్థల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, పలు ప్రయోజనాల రీత్యా విద్యాసంస్థల బస్సుల్లో వీఎల్టీడీతో పాటు డ్యాష్బోర్డ్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం మంచిదని జిల్లా రహదారి భద్రతా కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీటీసీ కరీమ్ మాట్లాడుతూ డ్యాష్బోర్డ్ కెమెరాల ఏర్పాటు వలన అత్యవసర సమయాల్లో, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వీడియోలు కీలక సాక్ష్యాలుగా ఉపయోగపడతాయన్నారు. అంతేకాకుండా, విద్యార్థుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామనే నమ్మకం తల్లిదండ్రుల్లో కలుగుతుందని, రవాణా నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్టీవో బాలేందు శేఖర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు జీ స్వామి, ఎస్.జగదీశ్బాబు, విద్యాసంస్థల ప్రతినిధులు, పాఠశాల బస్సుల నిర్వాహకులు పాల్గొన్నారు. -
పారా స్పోర్ట్స్ మీట్లో విజయకేతనం
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర ప్రభుత్వం, సమగ్ర శిక్ష, పీఎం శ్రీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పారా క్రీడోత్సవాల్లో ఏలూరు జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచి జిల్లా ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో చాటారని జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ ప్రశంసించారు. పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థులను బుధవారం తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏలూరు జిల్లాకు చెందిన క్రీడాకారులు తమ ప్రతిభ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో విశేషంగా రాణించి మొత్తం 37 పతకాలను కై వసం చేసుకున్నారని తెలిపారు. వాటిలో 14 స్వర్ణ పతకాలు, 15 రజత పతకాలు, 8 కాంస్య పతకాలు ఉన్నాయని వివరించారు. ఈ విజయాలు విద్యార్థుల కఠిన శ్రమ, నిరంతర సాధన, అంకితభావానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచి ఏలూరు జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేసిన విద్యార్థులను, వారికి శిక్షణ అందించిన కోచ్లను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను ఆమె అభినందించారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లోనూ మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. -
గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి
బుట్టాయగూడెం: ఆదివాసీల హక్కులను పరిరక్షించాలని, జీఓ నంబర్ 3తో పాటు 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం కేఆర్ పురం వద్ద చలో ఐటీడీఏ కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టి, ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరసన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.అశోక్, గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు కారం దారయ్య, జీఎస్పీ జిల్లా నాయకుడు రమేష్, సంక్షేమ పరిషత్ నాయకుడు సోదెం ముక్కయ్య మాట్లాడుతూ గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కులను ప్రభుత్వం పరిరక్షించాలని, జీఓ–3 అమలుపై అలసత్వం వహించకుండా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో ఉన్న వినతిపత్రాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె.రాములు నాయక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ, ధర్ముల రమేష్, జాతీయ ఆదివాసీ పాస్టర్స్ సంఘం ఉపాధ్యక్షుడు ఫిలిప్స్, గిరిజన నాయకురాలు మోడియం నాగమణి తదితరులు పాల్గొన్నారు. చలో ఐటీడీఏ నేపథ్యంలో కేఆర్పురం వద్ద పోలవరం డీఎస్పీ కె. జయకృష్ణ, జీలుగుమిల్లి సీఐ బి.యాదగిరి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
క్షేత్రంలో వైభవంగా శ్రీమన్నారాయణీయం
వికసిత్ జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం అన్ని రంగాల్లో పశ్చిమగోదావరి జిల్లాను వికసిత్ జిల్లాగా రూపుదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఇరవై సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. 8లో uద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన మాధవ కల్యాణ మండపంలో బుధవారం శ్రీమన్నారాయణీయం సామూహిక గళార్చన వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 1,500 మంది భక్తులు పాల్గొని, నారాయణీయం శ్లోకాలను చదివారు. దాంతో క్షేత్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నారాయణ భట్టాద్రి గురువాయూరు శ్రీకృష్ణునిపై భక్తితో రచించిన మహిమాన్విత గ్రంథం నారాయణీయమని తెలిపారు. ఇందులో 100 దశకాలు, 1,036 శ్లోకాలు ఉన్నాయని, అస్మిన్ పరాత్మన్ పారాయణానికి ఆరోగ్యప్రదమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని పేర్కొన్నారు. పెద్ద తిరుపతి, భద్రాచలం, హైదరాబాద్ తదితర క్షేత్రాల్లో కూడా పారాయణాలు నిర్వహించామని, ఇవన్నీ పూర్తిగా సభ్యుల సొంత ఖర్చులతోనే నిర్వహిస్తున్నామని, దేవస్థానాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కోల్కతా సహా పలు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నట్టు చెప్పారు. -
చెల్లెలికి ‘చినవెంకన్న’ ఆషాఢ సారె
క్షేత్రంలో తొలిసారి వేడుక ద్వారకాతిరుమల: చిన్నవెంకన్నకు చెల్లెలుగా.. క్షేత్ర దేవతగా వెలుగొందుతున్న శ్రీ కుంకుళ్లమ్మ అమ్మ వారికి దేవస్థానం అధికారులు బుధవారం తొలిసారిగా ఆషాఢ సారెను అత్యంత వైభవంగా సమర్పించారు. భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మిక శోభ కలగలిసిన ఈ వేడుక భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు, భాగ్యలక్ష్మి దంపతులు, పలువురు ఆలయ ట్రస్ట్బోర్డు సభ్యులు, పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు శ్రీవారి పాదుకా మండపం వద్ద నుంచి పట్టు చీర, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, వివిధ రకాల స్వీట్లతో కూడిన సారె పళ్లాలను శిరస్సుపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అమ్మ వారి ఉత్సవ మూర్తికి సారెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు, పండితులు వేదమంత్రోచ్ఛరణల నడుమ విశేష పూజలు చేసి, హారతులు సమర్పించారు. ఆ తరువాత ఈఓ దంపతులు, ట్రస్ట్బోర్డు సభ్యులు గర్భాలయంలో కొలువైన శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రారంభించిన ఈ ఆషాఢ సారె సమర్పణ కార్యక్రమాన్ని ఇకపై ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా, మరింత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. వచ్చేనెల 12 వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి సారెను సమర్పించాలని ఆయన కోరారు. వేడుకలో ట్రస్ట్బోర్డు సభ్యులు చింతమనేని హనుమంతరావు, చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య, కాకి సురేష్ కుమార్, కంపసాటి నాగ సీత, కడియం సత్యవతి తదితరులున్నారు. -
రైళ్లలో చోరీలు చేస్తున్న వ్యక్తి అరెస్టు
భీమవరం : వ్యసనాలకు అలవాటుపడి రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 58 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం భీమవరం రైల్వే ఎస్ఐ సుబ్రహ్మణ్యం, ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐ రెహ్మాన్, సీఈబీ ఎస్ఐ ఎం. రమేష్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన మరలపూడి పవన్ జూదం, మద్యానికి బానిసయ్యాడు. జాలీగా జీవించేందుకు దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. గతంలో ఉండి, భీమవరం టౌన్, తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో బైక్ చోరీలకు పాల్పడటంతో ఇతనిపై కేసులు నమోదయ్యాయి. ఇటీవల రాజమహేంద్రవరం టూటౌన్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో జైలుకు వెళ్లి, బెయిల్పై బయటకు వచ్చాడు. అనంతరం పవన్ రైళ్లలో ప్రయాణికుల వద్ద బంగారం చోరీకి పాల్పడ్డాడు. ఆ సొత్తును విక్రయించేందుకు బుధవారం భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లోని 2వ నంబర్ ప్లాట్ఫామ్పైకి రాగా, ముందస్తు సమాచారంతో తనిఖీలు చేస్తున్న రైల్వే సిబ్బందిని చూసి పారిపోయేందుకు యత్నించాడు. సిబ్బంది చాకచక్యంగా వెంబడించి అతడిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 25 గ్రాముల నల్లపూసల తాడు, 33 గ్రాముల సూత్రాల తాళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు. 58 గ్రాముల బంగారం స్వాధీనం -
కాంట్రాక్ట్ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలను అధికారుల సహా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే కార్మిక శాఖకు నివేదిస్తామని ఏఐటీయూసీ నాయకులు హామీ ఇచ్చారు. వర్సిటీ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశంలో సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్ మాట్లాడుతూ పలు శాఖల్లో ఏళ్లకు తరబడి కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ పద్ధతిన పని చేస్తున్న సిబ్బందిని క్రమబద్ధీకరించకపోగా, కనీస వేతనాలు కూడా సరిగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే వేతనాలను కూడా నెలల తరబడి బకాయి పెడుతున్నారని విమర్శించారు. అప్కాస్ పరిధిలోని సిబ్బందిని కాంట్రాక్ట్లోకి మార్చడంతో వేతనాలు తగ్గిపోవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కోటుం నాగేశ్వరరావు, సిద్ధాబత్తుల కృష్ణారావు, ఏఐటీయూసీ నాయకులు ఓసూరి వీర్రాజు, కళింగ లక్ష్మణరావు, మండలపర్తి హరీష్, తాడికొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
కొల్లేరుకు వస్తా.. చర్చకు సిద్ధమా?
దెందులూరు: ‘నేను కొల్లేరు శ్రీపర్రు గ్రామానికి వస్తాను... చర్చకు నువ్వు సిద్ధమా? ఎప్పుడు వస్తావో, ఎక్కడికి వస్తావో టైమ్ ఫిక్స్ చెయ్’ అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి సవాల్ విసిరారు. బుధవారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. పదే పదే కొల్లేరు ప్రజలను తనపై ఉసిగొల్పుతున్నారని.. తన ఇంటి వద్ద ధర్నాలు చేయించడమే కాకుండా, రెండేళ్లుగా తన పొలంలో పంట కోయనివ్వకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఏదైనా ఉంటే నేరుగా తనతో రాజకీయం చేయాలని, తన కుటుంబ సభ్యులతో, పొలాలతో కాదని.. ఎవరి హయాంలో ఏం అభివృద్ధి జరిగింది? ఎవరికి మేలు జరిగిందో కొల్లేరు శ్రీపర్రులో ముఖాముఖి చర్చిద్దామని సవాలు విసిరారు. చింతమనేని సొంత గ్రామమైన దుగ్గిరాలలో పాఠశాల, సచివాలయం కట్టింది కూడా తన హయాంలోనేనని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దెందులూరులో మాత్రమే కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఆధికారం ఎవరికీ శాశ్వతం కాదని, గతంలో తాను, ఇప్పుడు చింతమనేని గెలిచారని గుర్తుచేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. నేటి కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. పోలీసుల తీరుపై మండిపాటు పోలీసులు, రెవెన్యూ అధికారులు తమ విధులను విస్మరించి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన ఇంటి వద్ద సమీక్ష సమావేశం నిర్వహిస్తే 190 మందికి నోటీసులు ఇచ్చారని, ప్రతిపక్షానికి సమావేశం ఏర్పాటు చేసుకునే హక్కు లేదా? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే లేని ఆంక్షలు వైఎస్సార్సీపీకి మాత్రమే ఎందుకని నిలదీశారు. అధికారులకు సెక్షన్ 144, సెక్షన్ 30 మధ్య తేడా కూడా తెలియడం లేదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులపై చట్టపరంగా పోరాడతామని హెచ్చరించారు. అబ్బయ్య చౌదరిపై దాడి చేస్తే నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడతారని.. పార్టీ బలహీన పడుతుందని అనుకుంటే పొరపడినట్లేనన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, పెదపాడు ఎంపీపీ బత్తుల రత్నకుమారి, వైస్ ఎంపీపీ వేమూరు జితేంద్ర, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదుగురు సూర్యనారాయణ, బీసీ విభాగం నేత మండల కొండలరావు, నాయకులు ఆళ్ల సతీష్ చౌదరి, మేక లక్ష్మణరావు, అప్పన ప్రసాద్, కామిరెడ్డి నాని, తేరా ఆనంద్, లాయర్స్ ఫోరం నాయకులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. చింతమనేనికి అబ్బయ్య చౌదరి సవాల్ -
తణుకులో గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తిపై విచారణ
తణుకు అర్బన్: వైఎస్సార్ సీపీ గ్రీవెన్స్సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి బుధవారం తణుకు రూరల్ సర్కిల్ కార్యాలయానికి హాజరయ్యారు. ఇటీవల ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఒక పోస్టుకు సంబంధించి తణుకుకు చెందిన ఓ టీడీపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్టేషన్కు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం 7 గంటలకు తణుకు రూరల్ సర్కిల్ కార్యాలయానికి ఆయన హాజరుగాకా రూరల్ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు నాలుగు గంటలకు పైగా విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డు చేశారు. వైఎస్సార్ సీపీ లీగల్సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి సీఐతో మాట్లాడారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన నారాయణమూర్తితో స్టేషన్కు చేరుకున్న తణుకు వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడారు. భీమవరం: ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంలోకి పోలీసులు అక్రమంగా ప్రవేశించడాన్ని నిరసిస్తూ బుధవారం భీమవరం ప్రకాశం చౌక్ వద్ద వామపక్షాలు, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి. బలరామ్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీపై శాంతియుతంగా ఆందోళన చేసిన విద్యార్థులపై లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగం చేయడం దారుణమన్నారు. పోరాటాల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై ఎలాంటి కేసులు పెట్టబోమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ మాట తప్పి ఇతర కేసుల నెపంతో అక్రమ అరెస్టులకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. చింతలపూడి (జంగారెడ్డిగూడెం): పట్టణానికి చెందిన పదో తరగతి విద్యార్థి కునుసోతు బాలసాయి సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి వ్యవహారంలో అధికారులు విచారణను వేగవంతం చేశారు. రాజులకాలనీకి చెందిన బన్ను రావికంపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. పాఠశాలలో జరిగిన కొన్ని సంఘటనలతో మనస్తాపానికి గురై ఈ నెల 24న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతరం కుటుంబసభ్యులు మృతదేహాన్ని అమ్మమ్మ గ్రామమైన చక్రదేవరపల్లికి తరలించి 25న ఖననం చేశారు. అయితే ఉపాధ్యాయుల వేధింపుల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి పద్మ పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు మంగళవారం జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవజోజి, ఎస్సై కుటుంబరావుల సమక్షంలో సమాధి నుంచి మృతదేహాన్ని వెలికితీసి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ఉపాధ్యాయుల వేధింపుల కోణంతో పాటు అన్ని అంశాలపై వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
వరుణుడి కరుణ కోసం
ద్వారకాతిరుమల: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సకాలంలో వర్షాలు కురవాలని కోరుతూ ద్వారకాతిరుమల క్షేత్ర పాలకుడైన శ్రీ భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఆలయంలో బుధవారం వరుణానువాక జపం వైభవంగా ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ ప్రత్యేక క్రతువుల్లో భాగంగా తొలిరోజు వరుణదేవుని అనుగ్రహం కోసం పండితులు వేద మంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా పండితులు ఆలయంలో గణపతిపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశనం, వృష్యశృంగ ప్రతిమ ప్రధాన మండప ఆరాధనలు, సహస్రఘట మండప ఆవాహనలు, వృష్య శృంగ మహామంత్ర వరుణ జపాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు దంపతులు, దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ వర్షాభావం తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని, దేశం–రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని లోకకళ్యాణార్థం ఈ క్రతువును చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ పూజలు ఈనెల 31 వరకు జరుగుతాయని ఈఓ పేర్కొన్నారు. -
వికసిత్ జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం
భీమవరం (ప్రకాశంచౌక్) : విద్య, వైద్య రంగాలతో పాటు అన్ని రంగాల్లో పశ్చిమగోదావరి జిల్లాను వికసిత్ జిల్లాగా రూపుదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేస్తున్నాయని ఇరవై సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. బుధవారం భీమవరంలోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలసి కేంద్ర పథకాలు, ప్రాజెక్టుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ అనీమియా ముక్త్ భారత్ పథకంలో భాగంగా 19 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న వారితో పాటు ప్రధానంగా 5 నుంచి 19 ఏళ్ల పిల్లలకు, గర్భిణులకు వైద్య సేవలు అందిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం ప్రాంతాల్లో మొబైల్ ఐసీటీఎస్ ద్వారా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద జిల్లాలోని 88,951 మంది విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, బెల్టు, షూలు సహా 9 రకాల వస్తువులతో కూడిన స్టూడెంట్ కిట్లను అందజేస్తున్నామని వివరించారు. జలజీవన్ మిషన్ కింద జిల్లాలో ఇప్పటివరకు 3,09,839 తాగునీటి కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. భీమవరం పట్టణంలో ప్రస్తుతం ఉన్న ట్యాంకుల ద్వారా మంచినీరు సరఫరా జరుగుతున్నప్పటికీ, భవిష్యత్తు అవసరాల కోసం ముందస్తుగానే కొత్త స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పీఎం సూర్య ఘర్ పథకంలో భాగంగా జిల్లాలోని 318 గ్రామాల్లో నూరు శాతం విద్యుదీకరణ పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ, డీఆర్ఓ కె. ప్రభాకర్, భీమవరం ఆర్డీఓ కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, సీపీఓ శివపార్వతి తదితరులు పాల్గొన్నారు. -
పొగాకు రైతు దిగాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఈ ఏడాది వర్జీనియా పొగాకు రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పొరుగు రాష్ట్రంలో మంచి ధర ఉన్నా మన రాష్ట్రంలో మాత్రం కనీస గిట్టుబాటు ధర లేకపోవడంపై రైతులు గత మూడు నెలలుగా విభిన్న రూపాల్లో పోరు సాగిస్తున్నా సర్కారు మాత్రం స్పందించడం లేదు. గతేడాది సరాసరి కిలో రూ.300 పలికిన ధర ప్రస్తుతం రూ.243కు చేరడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఐదు పొగాకు కొనుగోలు కేంద్రాల పరిధిలో భారీగా సాగు చేస్తున్నారు. పొగాకు రైతు ఈ ఏడాది ఆర్థికంగా నష్టపోయాడు. ఒకవైపు ధరలు భారీగా పతనం కావడం, మరోవైపు పెట్టుబడులు ఆకాశన్నంటడంతో లక్షల్లో అప్పులు పేరుకుపోయాయి. మరోవైపు సర్కారు పట్టించుకోకపోవడంపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ఏడాది దేవరపల్లి, జంగారెడ్డిగూడెం 1, 2, కొయ్యలగూడెం, గోపాలపురం వేలం కేంద్రాల పరిధిలో మార్చి 25న పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మొదటిరోజే ధర భారీగా తగ్గించి కిలో సగటున రూ.261తో కొనుగోళ్లు ప్రారంభించడంతో రైతులు నిరసన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రం కర్నాటకలో పొగాకు కొనుగోళ్లు ముగిశాయి. సరాసరి కిలో ధర రూ.320కు అక్కడ జరిగాయి. ఎన్ఎల్ఎస్ పరిధిలో జిల్లాలో 22,194 హెక్టార్ల పరిధిలో పొగాకు సాగు జరుగుతుంది. తేలిక నేలలు కావడంతో కృష్ణా, గోదావరి డెల్టాల మధ్య ఉన్న పరివాహక ప్రాంతం ఉండటంతో గాలిలో అతి స్వల్పంగా తేమ శాతం ఉండటం సాగుకు పూర్తి అనుకూలం. దీంతో జిల్లాలో నాణ్యమైన గ్రేడ్–1 పొగాకు దిగుబడి అధికంగా ఉంటుంది. ఈ పరిణామాల క్రమంలో సగటు సరాసరి రూ.300 ధర దాటితే పెట్టుబడులకు ఇబ్బంది ఉండదనేది అన్నదాతల భావన. సీజన్ ప్రారంభమయ్యాక కిలో రూ.45 తగ్గించి కొనుగోలు చేయడంతో మొదలుపెట్టారు. 100 రోజులు దాటినా అదే రీతిలో కొనుగోళ్లు సాగిస్తున్నారు. కర్నాటక కొనుగోళ్లు ముగిసిన తరువాత కొంత డిమాండ్ వస్తుందని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. దీంతో పోరుబాటకు సన్నద్ధమయ్యారు. బుధవారం 5 ప్లాట్ఫాంల పరిధిలో 2,452 బేళ్ళు అంటే 3,19,286 కిలోల పొగాకును సరాసరి 243.63 ధరకు కొనుగోలు చేశారు. 5 ప్లాట్ఫామ్ పరిధిలో ఇప్పటి వరకు 98.25 లక్షల కిలోల పొగాకును కొనుగోలు చేశారు. కూటమి ప్రభుత్వంలో కష్టాలు ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో వర్షాభావ పరిస్థితులు, విపరీతంగా పెరిగిన సాగు ఖర్చులకు తోడు మార్కెట్లో కొనుగోలుదారులంతా సిండికేట్గా మారి తక్కువ ధరకు అడుగుతుండటంతో పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధరలు పతనమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని మార్క్ఫెడ్ ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోళ్లు చేసి రైతులను ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇదే పరిస్ధితి ఉత్పన్నమైనప్పుడు రూ.289 కోట్లతో మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చేశారు. సిండికేట్ ధరను బలంగా కట్టడి చేసి రైతులను ఆదుకున్నారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి బ్యారన్కు వచ్చి రూ.2 లక్షలు రుణమాఫీ చేయాలి. హైగ్రేడ్కి రూ.10 పెంచారు. అదే సమయంలో లోగ్రేడ్కి రూ.20 తగ్గించారు. పది రూపాయలు పెంచిన నాటి నుంచి ప్రతిరోజూ ఒక్కో రూపాయి తగ్గుతూ వస్తోంది. – ధూళిపూడి బాబురావు, రైతు, కొయ్యలగూడెం కంపెనీలు విదేశీ ఆర్డర్లు రావడం లేదని అంటున్నాయి. కేంద్రం పట్టించుకోవడం లేదు. సీజన్ ప్రారంభానికి ముందే పంటకు అనుమతులు ఇచ్చిన సమయంలోనే పొగాకు కొనుగోలు ధర ప్రకటించాలి. ధర స్థిరీకరణ లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. – తాండ్రు రామకృష్ణ, రైతు, గవరవరం గతేడాదితో పోల్చితే 50 శాతం ధర పతనం కొనుగోళ్లు ప్రారంభం రోజే భారీగా ధరల తగ్గింపు వ్యాపారుల సిండికేట్తో పొగాకు రైతులు బలి సరాసరి కిలోకు రూ.243.. గతేడాది రూ.300 పైమాటే -
జ్ఞాన మార్గానికి నడిపించేది గురువు మాత్రమే
కై కలూరు: అజ్ఞానం నుంచి జ్ఞానమార్గానికి నడిపించే బృహత్తర బాధ్యతను గురువు మాత్రమే స్వీకరిస్తారని పలువురు వక్తలు పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం గురు పౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.సీఎన్నార్ గార్డెన్స్లో... ఓమౌజయా గురు పౌర్ణమి మహోత్సవం సీఎన్నార్ గార్డెన్లో వైభవంగా జరిగింది. దాదాపు 1,700 మంది భక్తుల సమక్షంలో మహా గాయత్రీ గురు ఖడ్గ యజ్ఞం నిర్వహించారు. కై కలూరు కేంద్రం నుంచి 300 మందికి పైగా మహిళలతో స్వయంభూ శక్తిపీఠ మహా ర్యాలీ చేపట్టారు. అనంతరం కలశ పూజ, పరా నాగేంద్రి మహా హారతి, భక్తి గీతాల ఆవిష్కరణ, ప్రసాద వితరణ, మహా అన్నదానం నిర్వహించారు. స్థానిక వీరభ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో జరిగిన వేడుకల్లో మహిళలకు సారె అందజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు టేకి వెంకట సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మహా చండీ సహిత రుద్రహోమం చేశారు. పొన్నూరు బ్రహ్మజీ, కంచర్ల జగదీష్, కంతేటి నాగ వెంకట వరప్రసాద్ హోమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. -
శ్రీవారి గజలక్ష్మికి ‘నెట్టిపట్టం’ బహూకరణ
ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థాన గజలక్ష్మి నుదుటన అలంకరించేందుకు ప్రత్యేక నెట్టిపట్టంను ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు దంపతులు బుధవారం బహూకరించారు. ముందుగా గజలక్ష్మిని దర్శించుకున్న వారు బెల్లం, పుచ్చకాయలను ఆహారంగా తినిపించి ఆశీర్వచనం పొందారు. అనంతరం ఆలయ ట్రస్టుబోర్డు సభ్యులతో కలసి నెట్టిపట్టాన్ని మావటి రంగాకు అందజేసి, దానిని గజలక్ష్మికి అలంకరించాలని ఈఓ సూచించారు. భీమవరం (ప్రకాశంచౌక్) : పట్టణంలోని పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామివారి దేవస్థానంలో కొబ్బరి చెక్కలను పోగు చేసుకునే హక్కు కోసం బుధవారం నిర్వహించిన బహిరంగ వేలం పాట ముగిసింది. ఏనుగులంకకు చెందిన నారిన లక్ష్మీ శివసాయి సీతారాం రూ.17,05,000 గరిష్ట పాటకు లైసెన్స్ దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో తనిఖీదారు పి.సాయికుమారి, ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగార్రాజు, సభ్యులు పడమటి లీలా, పాల వెంకటస్వామి, యార్లగడ్డ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ముదినేపల్లి(కై కలూరు) : రోడ్డు ప్రమాదంలో వైన్షాపు క్యాషియర్ మృతి చెందిన ఘటనపై ముదినేపల్లి పోలీసు స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ముదినేపల్లికి చెందిన ఉప్పునూతల రమేష్(44) గుడివాడ మండలం మోటూరు వైన్షాపులో క్వాషియర్గా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా పెయ్యేరు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో రమేష్కు తలకు తీవ్ర గాయమైంది. మెరుగైన చికిత్స కోసం గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అతను మరణించాడు. మృతుడు భార్యకు విడాకులు ఇచ్చి తల్లి వద్ద ఉంటున్నాడు. తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తణుకు అర్బన్ : బైక్ చోరీల కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష పడినట్లు ఎస్ఐ ఎన్. శ్రీనివాసరావు తెలిపారు. తణుకు మండలం వీరభద్రపురానికి చెందిన మల్లిపూడి సుధీర్పై రెండు చోరీ ఘటనలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. బుధవారం అతడిని కోర్టులో హాజరుపరచగా, విచారించిన ప్రిన్సిపల్ సివిల్ జడ్జి రెడ్డిపోగు ఆశీర్వాదం పాల్ 6 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ ఇ.హనుమంతరావు వాదించగా, ఎస్సైలు ఎన్వీ త్రిమూర్తులు, ఎన్. శ్రీనివాసరావు, కోర్టు కానిస్టేబుల్ జి. దుర్గారావు సహకరించారు. భీమవరం: భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చినఅమిరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు హెడ్ కానిస్టేబుల్ భూషణం బుధవారం విలేకరులకు తెలిపారు. కోపల్లె గ్రామానికి చెందిన ఆర్. సాయివర్మ మంగళవారం రాత్రి మోటారుసైకిల్పై భీమవరం వస్తుండగా, చినఅమిరం వద్ద ఎదురుగా వచ్చిన మరొక బైక్ దాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాళ్లకు తీవ్ర గాయాలైన సాయివర్మ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ చెప్పారు. ద్వారకాతిరుమల: సెల్ఫోన్ వివాదంలో ఓ లారీ డ్రైవర్పై ఆరుగురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటనపై స్థానిక పోలీస్స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. ఎస్సై టి.సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని శరభాపురం గ్రామానికి చెందిన కండవల్లి ప్రవీణ్ లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతనికి పరిచయమున్న సీతారాముడు అనే వ్యక్తి సెల్ఫోన్ పోవడంతో, దాన్ని అదే గ్రామానికి చెందిన మిండా గోపాలకృష్ణ కుమారుడు దొంగిలించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంలో ప్రవీణ్, సీతారాముడి తరఫున మాట్లాడాడు. దీంతో ఆగ్రహం పెంచుకున్న శరభాపురానికే చెందిన కొరపాటి సురేష్ ఈ నెల 25న కర్రతో ప్రవీణ్ తలపై గట్టిగా కొట్టగా, అతని తలకు తీవ్ర గాయమైంది. అనంతరం అదే గ్రామానికి చెందిన కొరపాటి సుబ్బారావు, కొరపాటి దినేష్, పవన్ కుమార్, మిండా రోహిత్, మిండా గోపాలకృష్ణలు ప్రవీణ్ను చేతులు, కాళ్లతో విచక్షణారహితంగా కొట్టడంతో అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని భీమడోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్ అక్కడ చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఆసుపత్రి నుంచి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బుధవారం ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. -
ఏపీ ఏఐఎంఎస్ యాప్తో విప్లవాత్మక మార్పులు
ఆగిరిపల్లి: ఏపీ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టం (ఏపీఏఐఎంఎస్) 2.0 యాప్తో భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీస్ ఎండీ ఎం.సూర్యతేజ ఐఏఎస్ అన్నారు. బుధవారం సాయంత్రం ఆగిరిపల్లిలోని రైతు సేవ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, ఈ యాప్ ద్వారా భవిష్యత్తులో అందించాల్సిన అదనపు సేవలపై రైతులతో చర్చించారు. పొలంలో భూగర్భ జలాల స్థాయిని బట్టి ఏ పంట వేయాలో సూచనలు అందిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు ఈ సందర్భంగా సమాధానమిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, టెక్నికల్ ఏఓ వెంకటేశ్వరరావు, వ్యవసాయ అధికారులు భవాని, చెన్నారావు పాల్గొన్నారు. -
పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి నూతన, మహిళా పారిశ్రామికవేత్తలు ముందుకురావాలని కలెక్టర్ కే.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్లోని గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లోని గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు, అన్నిరకాల ఫుడ్ ప్రాసెసింగు యూనిట్ల స్థాపనకు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గిరిజన తండాల్లో యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెంచి, ఆ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో రెండవ విడత ఫుడ్ ప్రాసెసింగు యూనిట్ల ఏర్పాటు లక్ష్యం 130 కాగా, ఇప్పటివరకు 45 యూనిట్లను గుర్తించామన్నారు. వీటిలో 11 మంజూరు కాగా, వివిధ బ్యాంకుల్లో 20 పెండింగ్లో ఉన్నాయని, ఆగస్టు 15వ తేదీ నాటికి బ్యాంకుల్లోని దరఖాస్తులను మంజూరు చేయించి పనులు మొదలుపెట్టించాలని ఆదేశించారు. చింతలపూడి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయని, ఉత్సాహవంతులైన పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. ఉంగుటూరు, దెందులూరు, నూజివీడు నియోజకవర్గాల్లో స్థలసేకరణ పూర్తయిందని, మిగతా ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సింగిల్ విండో పథకం ద్వారా త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని, అవసరాన్ని బట్టి ఒక్క రోజులోనే మంజూరు చేసి ప్రతి యూనిట్ను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం ఆర్.వెంకటరావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజరు కే.బాబ్జీ, నగర పాలక సంస్థ కమిషనరు ఏ.భానుప్రతాప్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ఏ.శ్రీరామచంద్రమూర్తి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జేడీ వై.విశ్వమోహన్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యూ.శోభ, డ్వామా పీడీ కే.వెంకట సుబ్బారావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కే.షాజానాయక్, డీఆర్డీఏ పీడీ టి.విజయలక్ష్మి, జిల్లా పంచాయతీ శాఖ అధికారి జీ.మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు. -
మద్ది క్షేత్రంలో వరుణ హోమాలు
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): గుర్వాయిగూడెంలోని శ్రీమద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో బుధవారం వరుణ జపాలు, హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులు తొలగి, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ దేవాదాయ ధర్మదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజలతో హోమ ప్రక్రియ ప్రారంభమైంది. ఆలయ ధర్మకర్తలు ధూళిపాల వెంకట ప్రభాకర రావు, ధూనబోయిన నారాయణమూర్తి పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈవో ఆర్వీ చందన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇటీవల దూబచర్లలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో జరిగిన డీసెట్–2026 ప్రవేశాల మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలన (వెరిఫికేషన్) బుధవారం ముగిసినట్లు దూబచర్ల డైట్ ప్రిన్సిపాల్ ఎం.కమలకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు జరిగిన ఈ సర్టిఫికెట్ల పరిశీలన వివరాలను ఆమె వెల్లడించారు. జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) దూబచర్లకు కేటాయించిన 131 సీట్లకు గాను 86 మంది విద్యార్థులు, భీమవరంలోని సీఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రైవేటు కళాశాలకు కేటాయించిన 80 సీట్లకు గాను 30 మంది విద్యార్థులు సర్టిఫికెట్లను పరిశీలించి ప్రవేశపత్రాలు జారీ చేసినట్టు తెలిపారు. ప్రిన్సిపాల్ కమలకుమారి ఆధ్వర్యంలో సీనియర్ అధ్యాపకులు కే సరోజిని, ఏఎస్ఎస్ఆర్ గుప్తా, వీ వెంకటేశ్వరరావు, సీహెచ్ లక్ష్మీనారాయణ ఈ సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ తనిఖీ ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని, ప్రవేశపత్రాలు పొందిన విద్యార్థులకు ఈ నెల 30వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు. పోలవరం రూరల్: గోదావరి వరద రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటిమట్టం 27 మీటర్లకు చేరుకుంది. స్పిల్వే నుంచి 1.03 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి వచ్చే వరద నీరు క్రమేపీ తగ్గుతుండటంతో, ప్రవాహం కూడా తగ్గుముఖం పట్టింది. ఏలూరు (ఆర్ఆర్పేట): ఆగస్టు 1వ తేదీన భోగాపురంలోని అల్లూరి సీతారామ రాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభంకానున్న నేపథ్యంలో, జిల్లాలోని వివిధ ప్రధాన రూట్లలో బస్సు సర్వీసులను రద్దు చేయనున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన బస్సులను ఈ నెల 31, ఆగస్టు 1వ తేదీల్లో రెండు రోజులపాటు విజయనగరం జోన్కు కేటాయించిన కారణంగా, కొన్ని రూట్లలో బస్సు సర్వీసులను రద్దు చేశామని, ప్రయాణికులు సహకరించాలని ఆమె కోరారు. ఏలూరు టౌన్: జిల్లా ట్రెజరీ, గణాంక అధికారిగా (డీటీఏవో) బొడ్డు ఇమ్మానుయేల్ను ప్రభుత్వం నియమించింది. ఈమేరకు బుధవారం ఆయన ఏలూరులో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్విని, జాయింట్ కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో అత్యున్నత గుర్తింపును దక్కించుకుంది. గ్రీన్ మెంటార్స్ సంస్థ నిర్వహించిన ‘నేషనల్ గ్రీన్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ (ఎన్జీయూఆర్) –2026’లో దేశంలోనే 16వ ర్యాంక్ను సాధించి, గోల్డ్ రేటింగ్ కై వసం చేసుకుంది. పర్యావరణ నిర్వహణ, సౌరశక్తి ఉపయోగం, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్ను కేటాయించారు. ఈ జాతీయ గుర్తింపుతో పాటు, అమెరికాలోని న్యూయార్క్లో జరిగే 10వ ‘ఎన్వైసీ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్–2026’ సదస్సులో పురస్కారం అందుకోవడానికి విశ్వవిద్యాలయానికి ప్రత్యేక ఆహ్వానం లభించింది. ఈ సందర్భంగా వీసీ డాక్టర్ ధనుంజయరావు అధికారులను, సిబ్బందిని, విద్యార్థులను అభినందించారు. -
జీజీహెచ్లో నవజాత శిశువు మృతిపై విచారణ
సిబ్బంది తీరుపై కలెక్టర్ వెట్రిసెల్వి సీరియస్ ఏలూరు టౌన్ : ఏలూరు సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో ఇటీవల నవజాత శిశువు మృతి చెందిన ఉదంతంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కే.వెట్రిసెల్వి స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర వైద్య విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ విష్ణువర్ధన్తో కలసి ఆమె ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాధితులు కలెక్టర్ వద్ద బోరున విలపిస్తూ, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మరణించాడని ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టర్ పోస్ట్ ఆపరేటివ్ వార్డులను, రోగులకు అందుతున్న సేవలను పరిశీలించి బాధితుల నుంచి వివరాలు ఆరా తీశారు. ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, బెడ్ షీట్లు మురికిగా ఉండటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేసు షీట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఓపీ కేంద్రాల వద్ద రోగులు ఎక్కువ సేపు వేచి ఉండకుండా చూడాలని, హెచ్వోడీలు సహా వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని, పేదలకు మెరుగైన వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని పేర్కొన్నారు. విజయవాడ జీజీహెచ్ డాక్టర్తో విచారణ శిశువు మృతి ఘటనపై విజయవాడ జీజీహెచ్ వైద్యులు డాక్టర్ అనిల్ను విచారణాధికారిగా నియమించామని డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా, వైద్యుల నిర్లక్ష్యం ఉందని తేలితే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యామల, డాక్టర్ శశిధర్, డాక్టర్ రామయ్య తదితరులు పాల్గొన్నారు. శిశువు మృతిపై బంధువులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్ వెట్రిసెల్వి ఎంసీహెచ్ విభాగంలో వైద్య సేవలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టర్ వెట్రిసెల్వి జిల్లాలో మాతా, శిశు మరణాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, వైద్యుల నిర్లక్ష్యం తేలితే ఉపేక్షించేది లేదని కలెక్టర్ వెట్రిసెల్వి హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో వైద్య సేవలు, సీజనల్ వ్యాధుల నివారణపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు 5 మాతృ మరణాలు, 41 శిశు మరణాలు నమోదయ్యాయని, ప్రతి మరణంపైనా తప్పనిసరిగా డెత్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. వైద్య సేవా లోపాల వల్ల మరణాలు సంభవించినట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. అలాగే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శోభ, డీసీహెచ్ఎస్ బేబీ కమల, ఐసీడీఎస్ పీడీ శారద, బాలల సంరక్షణాధికారి సీహెచ్ సూర్యచక్రవేణి తదితరులు పాల్గొన్నారు. -
కారంతో శివస్వామికి అభిషేకం
ద్వారకాతిరుమల: ప్రత్యంగిరి దేవి అనుగ్రహం కోసం భక్తులు నిర్వహించిన అరుదైన కారాభిషేకం దొరసానిపాడులో ప్రత్యేకతను సంతరించుకుంది. స్థానిక శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిరి వృద్ధాశ్రమంలో బుధవారం ముందుగా పూర్ణాహుతి హోమం, దీపోత్సవం జరిపారు. అనంతరం ప్రత్యంగిరి దేవి ఆవాహనలో ఉన్న శివస్వామికి సుమారు 60 కిలోల ఎర్రని కారంతో భక్తులు అభిషేకం చేశారు. ఈ విశేష పూజలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ పురాణాల ప్రకారం హిరణ్యకశిపుని సంహారం తర్వాత నరసింహస్వామి ఉగ్రరూపాన్ని శాంతింపజేసేందుకు ప్రత్యంగిరి దేవి అవతరించిందని తెలిపారు. దేవికి ఎండు మిరపకాయలు ప్రీతిపాత్రమైనవి కావడం వల్ల వాటిని హారాలుగా అలంకరించి పూజిస్తారన్నారు. దేవి ఆవాహనలో ఉన్న తనకు కారంతో అభిషేకం చేయడం వల్ల కష్టాలు తొలగి, శత్రు నివారణతో పాటు లక్ష్మీకటాక్షం లభిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్లో గత 30 ఏళ్లుగా ఈ కారాభిషేకాన్ని నిర్వహిస్తున్నామని, దొరసానిపాడులో ఇది వరుసగా నాలుగో ఏడని ఆయన వివరించారు. -
పొగాకు రైతులకు అండగా జగన్
● దేవరపల్లి పర్యటనను విజయవంతం చేయండి ● పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి చెల్లుబోయిన పిలుపు ద్వారకాతిరుమల: పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగస్టు 5న దేవరపల్లి పర్యటన చేపట్టనున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు. ఈ పర్యటన రైతులకు భరోసా కల్పించడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే వేదికగా నిలుస్తుందన్నారు. జగన్ పర్యటనను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం ద్వారకాతిరుమల మండలంలోని పార్టీ శ్రేణులతో స్థానిక కాపు కల్యాణ మండపం వద్ద మాజీ హోం మంత్రి, వైఎస్సార్సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చెల్లుబోయిన మాట్లాడుతూ, గతంలో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతుల సమస్యలను జగన్ స్వయంగా విన్నారని, వాటిపై స్పందిస్తూ ఇప్పుడు నేరుగా రైతుల వద్దకు వెళ్లి వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పొగాకు రైతుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. పొగాకు కొనుగోళ్లలో తీవ్ర జాప్యం, గిట్టుబాటు ధర కల్పించకపోవడం, మెయిల్ రిజెక్షన్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ను కూడా ప్రస్తుత ప్రభుత్వం వినియోగించలేదని ఆరోపించారు. రైతులు పడుతున్న కష్టాలపై చంద్రబాబు స్పందించకుండా, జగన్ ప్రశ్నించిన తర్వాతే కేంద్రానికి లేఖ రాసి మమ అనిపించాడని విమర్శించారు. రైతులకు అండగా నిలిచేందుకు జగన్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ప్రతాపనేని వాసు, దాకారపు బంగారమ్మ, బొండాడ వెంకన్నబాబు, పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్, పాకలపాటి త్యాగ భీమేశ్వరరావు, జంగా వెంకట కృష్ణారెడ్డి, గోపా నాగేశ్వరరావు, బిరుదుగడ్డ చల్లారావు, బాలం వెంకటేశ్వరరావు, చెలికాని ప్రవీణ్, తాండ్ర రమేష్, గంటా శ్రీను, ఉప్పల మునేశ్వరరావు, దాసరి రాంబాబు, దొప్పసాని రాంబాబు, బిరుదుగడ్ల బజారయ్య తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యానికి దూరం.. మిషన్ సక్షం
బుట్టాయగూడెం: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల్లో చదువులపై ఆసక్తి పెంచి, పోషకాహారం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మిషన్ సక్షం’ అంగన్వాడీ పథకం క్షేత్రస్థాయిలో తూతూమంత్రంగా మారుతోందని పలువురు విమర్శిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన ఈ పథకం తన లక్ష్యాలను చేరుకోలేకపోతోందని నిపుణులు అంటున్నారు. పథకం అమలును ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వాస్తవాలు వెలుగు చూసి, పథకం తన లక్ష్యాన్ని సాధిస్తుందని పలువురు కోరుతున్నారు. టీవీలు ఇచ్చారు.. నెట్ కనెక్షన్లు లేవు మిషన్ సక్షం అంగన్వాడీ కేంద్రాలుగా ఎంపిక చేసిన చోట విద్యార్థులకు డిజిటల్ పాఠాలు బోధించే విధంగా ప్రభుత్వం టీవీలను ఇచ్చింది. అయితే ఆ టీవీలకు కేబుల్ కనెక్షన్లు ఇవ్వలేదు. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు సెల్ఫోన్ డేటా, పెన్డ్రైవ్ల సహాయంతో టీవీల్లో వీడియోలను పిల్లలకు చూపిస్తూ విద్యాబోధన చేస్తున్నారు. మారుమూల గ్రామాల్లో సెల్ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేకపోవడంతో కేవలం పెన్డ్రైవ్లతోనే పాఠాలు బోధించే పరిస్థితి నెలకొంది. అంగన్వాడీ కార్యకర్తలు తమ సొంత సెల్ఫోన్లను రీచార్జ్ చేసుకుని ఇంటర్నెట్ వినియోగించి బోధించడం భారంగా మారుతోందని ఆరోపిస్తున్నారు. నీళ్ల కోసం అవస్థలు సక్షం అంగన్వాడీలుగా ఎంపిక చేసిన కేంద్రాల్లో పిల్లలకు సురక్షిత మంచినీరు అందించడం కోసం వాటర్ ఫిల్టర్లను అందజేశారు. అయితే అవి చాలా చోట్ల నిరుపయోగంగానే ఉన్నాయి. నీటి సదుపాయం కోసం ఏర్పాటు చేసిన మోటర్లు కొన్నిచోట్ల పాడైపోగా, మరికొన్ని చోట్ల అసలు మోటర్లే బిగించకపోవడంతో చిన్నారులు మంచినీటి కోసం చేతిపంపుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి టీవీలకు కేబుల్ కనెక్షన్లు ఏర్పాటు చేయించడంతోపాటు, పాడైపోయిన మోటర్లకు మరమ్మతులు చేయించి, నిరుపయోగంగా ఉన్నవాటిని వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. 69 కేంద్రాల ఎంపిక బుట్టాయగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 189 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా అందులో 69 కేంద్రాలను ప్రభుత్వం మిషన్ సక్షం అంగన్వాడీ కేంద్రాలుగా ఎంపిక చేసింది. ఆయా కేంద్రాల్లో చదువుతున్న పిల్లలకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం, పోషణ అందించడంతోపాటు క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రతి కేంద్రానికి ఒక టీవీ, వాటర్ ఫిల్టర్, బ్లాంకెట్లు, మెస్ స్టాండ్, ఆట వస్తువులు, 15 పిల్లల కుర్చీలు, 2 పెద్ద కుర్చీలు ఇచ్చారు. అలాగే వాటర్ ట్యాంక్ ఏర్పాటుతోపాటు మోటర్ కూడా బిగించి మంచినీటి సదుపాయం కల్పించాలని పథకంలో పొందుపరిచారు. అయితే, ఎంపికై న అంగన్వాడీ కేంద్రాల్లో 60 శాతానికి పైగా ఈ పథకం నీరుగారిపోయేలా ఉందని అటు గ్రామస్తులు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎంపికై న అన్ని కేంద్రాల్లో పథకం సక్రమంగా అమలయ్యేలా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో టీవీలకు లేని నెట్ కనెక్షన్ పెన్ డ్రైవ్లు, సెల్ఫోన్ డేటాలతో వీడియోలు చూపిస్తున్న వైనం సురక్షిత నీటి కోసం విద్యార్థుల అవస్థలు తూతూమంత్రంగా పథకం అమలు -
నేర నియంత్రణలో టెక్నాలజీ విప్లవం
కై కలూరు: ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ అంశంపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ నిరసనల ముసుగులో క్రిమినల్ రికార్డులున్న సంఘ విద్రోహ శక్తులు పోలీసులపై దాడులకు పాల్పడ్డాయి. ఆందోళనకారుల ముఖాలను గుర్తించేందుకు పోలీసులు అధునాతన ఫేషియల్ రికగ్నేషన్ టెక్నాలజీ (ఎఫ్ఆర్టీ)ని వినియోగించారు. ఈ సాంకేతికత ద్వారా హత్యలు, దోపిడీలు, కిడ్నాప్లు, అత్యాచారాలు, పోక్సో కేసులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి వివిధ తీవ్ర నేరాలకు సంబంధించి ఏకంగా 2,873 మంది నేరస్తులను గుర్తించడం విశేషం. నేర పరిశోధనలో టెక్నాలజీ ఎంతటి సంచలనాత్మక ఫలితాలను ఇస్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఏలూరు జిల్లాలో... ఇదే కోవలో ఏలూరు జిల్లా పోలీసులు నేరస్తులను పట్టుకోవడంలో, గుర్తించడంలో పరిశోధనల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. ఇటీవల ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో ‘ధార్ గ్యాంగ్’కు చెందిన ముగ్గురు సభ్యుల కదలికలను పోలీసులు గుర్తించారు. గత నెల 13న విశాఖపట్నం కంచరపాలెం పరిధిలో సంచరించిన ఈ ముఠా.. జూన్ 15న సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ మీదుగా ఏలూరు చేరుకున్నట్లు ఎఫ్ఆర్టీ టెక్నాలజీ ద్వారా పోలీసులు పక్కాగా గుర్తించి వారి పూర్తి వివరాలు, ఫొటోలను సేకరించారు. ఏఎన్పీఆర్ సహాయంతో పోలీసు వ్యవస్థకు ఏఐ ఆధారిత సాంకేతికత కొండంత అండగా నిలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం రహదారులపై ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ (ఏఎన్పీఆర్) కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను గుర్తించి, దానికి సంబంధించిన సమాచారాన్ని అలారం రూపంలో సమీప పోలీసులకు చేరవేస్తున్నాయి. ఇటీవల కై కలూరులో చోరీకి గురైన బైక్ను పెద్ద తిరుపతిలో పట్టుకోవడంలో ఈ ఏఎన్పీఆర్ టెక్నాలజీయే కీలక పాత్ర పోషించింది. నేరస్తుల ముఖచిత్రాలను ఎఫ్ఆర్ఎస్లో నమోదు చేయడం వల్ల దేశంలో ఎక్కడైనా వారి కదలికలను గుర్తించి సమీప పోలీసు స్టేషన్కు సమాచారం అందే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. నేటి కాలంలో గ్రామాల్లోని ఒక్కో సీసీ కెమెరా ఇద్దరు కానిస్టేబుళ్లతో సమానంగా అప్రమత్తంగా పనిచేస్తోంది. ధర్మా యాప్తో కేసుల పరిష్కారం ఏలూరు జిల్లా ఎస్పీ కే. ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో రూపొందించిన ధర్మా (డిజిటల్ హాలిస్టిక్ ఏఐ డ్త్రెవెన్ రెస్సాన్స్ మేనేజ్మెంట్ అసిస్టెంట్) యాప్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఈ ఏఐ ఆధారిత యాప్ ద్వారా నేరాలకు సంబంధించిన ఫొటోలు, సాక్ష్యాలు, ఛార్జ్షీట్లను ఖచ్చితంగా నిర్ధారించుకునే అవకాశం లభిస్తోంది. గత నెలలో 20 శాతం కేసుల పరిష్కారానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడిందని ఐజీ జీవీజీ అశోక్కుమార్ సైతం ప్రత్యేకంగా అభినందించారు. ‘ఆపరేషన్ ట్రేస్’ వంటి కార్యక్రమాల్లో ఆధార్తో పాటు ఇతర డేటా, ఫేషియల్ రికగ్నేషన్ను జోడించడం ద్వారా తప్పిపోయిన మహిళలు, పిల్లలను అత్యంత కచ్చితత్వంతో నేడు వెతికి పట్టుకోగలుగుతున్నారు. నేరస్తుల గుర్తింపులో నూతన సాంకేతికత ఫలితాలిస్తున్న ఫేషియల్ రికగ్నేషన్ టెక్నాలజీ గ్రామాల్లో విస్తరించిన ఏఎన్పీఆర్, సీసీ కెమెరాలు ఏలూరు జిల్లాలో ధర్మా యాప్తో కేసుల పరిష్కారం పోలీసు శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది. ఈ విషయంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అమరావతిలో 360 డిగ్రీల సెంట్రల్ సిస్టం అందుబాటులోకి వచ్చింది. అన్ని ప్రాంతాల సీసీ కెమెరాలను దీనికి అనుసంధానం చేయడం వల్ల నేరస్తులను పట్టుకోవడం మరింత సులభమైంది. నేరాల అదుపు కోసం ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. – వి.రవికుమార్, కై కలూరు రూరల్ సర్కిల్ సీఐ -
భార్యను చంపిన భర్తకు రిమాండ్
ఉండి: మద్యం డబ్బుల కోసం భార్యను హత్య చేసిన భర్త మంగం మురళీని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై మల్లికార్జునరావు మంగళవారం విలేకరులకు తెలిపారు. ఈ నెల 26న ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడిని శనివారం ఉండి నిమ్మలపేట పరిసర ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారని వెల్లడించారు. ఉండి: అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం చెరుకువాడ గ్రామానికి చెందిన హర్షితకు 2020లో హైదరాబాద్కు చెందిన కట్రిశెట్టి అఖిలేష్తో వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. కాగా ఇటీవల అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని హర్షిత పోలీసులను ఆశ్రయించింది. భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణంలోని శ్రీ మావుళ్లమ్మ వారి శాశ్వత నిత్యాన్నప్రసాద వితరణకు మంగళవారం భీమవరం బిల్డర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గన్నాబత్తుల శ్రీనివాస్, వడుపు గోపి, గ్రంధి రవితేజ, యర్రంశెట్టి నాగేశ్వరావు, లీలా కృష్ణ తదితర మిత్ర బృందం 23 మంది సంయుక్తంగా రూ.3,15,000 విరాళంగా అందజేశారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ దాతలకు శేషవస్త్రం, ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ, చైర్మన్ బొండాడ నాగ భూషణం తదితరుల ప్రసాదం, ఫొటో అందజేశారు. రు. శ్రీవారి ఆలయానికి రూ.2.32 లక్షల విరాళం కాళ్ల: మండలంలోని కాళ్లకూరులో ఉన్న స్వయంభూ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులుకు భక్తులు విరాళాలు అందించినట్లు దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈఓ మోకా అరుణ్ కుమార్ మంగళవారం తెలిపారు. దొడ్డనపూడికి చెందిన దివంగత యిర్రింకి సీతారామయ్య–సూర్యనాగరత్నం, దివంగత కొల్లి వెంకటసుబ్బారావు–రామసుందరమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు మూలస్వామి, నాగబాల త్రిపురసుందరి దంపతులు అన్నదాన భవనానికి రూ.1,16,667, మాడ వీధుల విస్తరణ కోసం స్థలం కొనుగోలుకు రూ.1,16,667 అందించినట్లు ఈఓ తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక దర్శనం కల్పించారు. -
లోకేష్ రాజీనామా చేయాల్సిందే
రహదారి ప్రమాదాలు నివారించాలి జిల్లాలో అధికంగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ అధికారులను ఆదేశించారు. 8లో u● ఏలూరులో వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన సంఘాల ఆందోళన ● డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మిషన్ సక్షం అంగన్వాడీ’ పథకం క్షేత్రస్థాయిలో తూతూమంత్రంగా మారుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 8లో uబుధవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2026ఏలూరు టౌన్: ఏపీలో మెగా డీఎస్సీ –25లో అంతులేని అక్రమాలు, అవినీతి, కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగ నేతలు, పార్టీ నేతలు, శ్రేణులు రోడ్డెక్కాయి. వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు కామిరెడ్డి నాని, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పాతినవలస రాజేష్ ఆధ్వర్యంలో ఏలూరులో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై నాయకత్వం వహించారు. పార్టీ జిల్లా కార్యాలయం నుంచి జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చిన పార్టీ నేతలు, శ్రేణులతో కలిసి ఏలూరు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా ర్యాలీగా ఏలూరు పాతబస్టాండ్ సెంటర్కు చేరుకున్నారు. బీఆర్ అంబేద్కర్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో.. ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, కై కలూరు పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్బాబు, చింతలపూడి పరిశీలకుడు దాసరి రమేష్, దెందులూరు నియోజకవర్గ నేత వెంకటేశ్వరరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సొంగ సందీప్, వైఎస్సార్సీపీ నాయకులు శెట్టి రాజా, కందుల దినేష్ రెడ్డి, జాన్ గురునాథ్, ఇంజేటి నీలిమ, ఆళ్ళ సతీష్ చౌదరి, నెరుసు చిరంజీవి, తేరా ఆనంద్, పల్లి శ్రీనివాస్, చిక్కాల దుర్గాప్రసాద్, భోగిశెట్టి పార్వతి, స్టాన్లీబాబు, పుప్పాల గోపి, చప్పిడి వెంకన్న, పసుపులేటి దినేష్, గంటా సాయి, కాశీ, మిరియాల దిలీప్, చార్లెస్, సింహాద్రి చందు, కిట్టు, ఉదయభాస్కర్ రాజు, తుమరాడ స్రవంతి, వేదకుమారి, పల్లెం ప్రసాద్, గొల్ల కిరణ్, కట్టా ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు. ఏలూరులో వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి పాతబస్టాండ్ సెంటరుకు ర్యాలీగా వస్తున్న పార్టీ నాయకులు, యువత, విద్యార్థులు పాతబస్టాండ్ సెంటరులో నిరసన తెలుపుతున్న జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఉంగుటూరు సమన్వయకర్త వాసుబాబు, ఏలూరు సమన్వయకర్త జయప్రకాష్ తదితరులు -
ట్రిపుల్ఐటీల్లో పుస్తకాల కొరత
● విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ● నెల దాటినా పుస్తకాలు అందని వైనం నూజివీడు: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ట్రిపుల్ఐటీల పరిస్థితి దయనీయంగా మారింది. రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ, ఒంగోలు క్యాంపస్లలో పాలన నానాటికీ దిగజారుతోంది. విద్యా సంవత్సరంలో భాగంగా పీయూసీ ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా ఇంతవరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయలేదు. తెలుగు, ఇంగ్లీషు, గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, బయాలజీ పుస్తకాలు లేకపోవడంతో నాలుగు క్యాంపస్లలోని 4,400 మంది పేద విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెల్ఫోన్లలోనే పాఠాలు.. ఉపాధ్యాయుల తిప్పలు పాఠాలు బోధించడానికి కనీసం అధ్యాపకుల వద్ద కూడా పుస్తకాలు లేని పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు ఫ్యాకల్టీ సభ్యులు బయట షాపుల్లో సొంత డబ్బులతో పుస్తకాలు కొనుగోలు చేయగా, మరికొందరు సెల్ఫోన్లలో పీడీఎఫ్ మెటీరియల్ చూసి బోధిస్తున్నారు. విద్యార్థులకు కూడా ఈ పీడీఎఫ్లనే వాట్సాప్లలో పంపుతుండటంతో, గంటల తరబడి సెల్ఫోన్ స్క్రీన్లను చూస్తూ చదువుకోవడం కష్టంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ల్యాప్టాప్ల స్థానంలో ఇంటర్ పుస్తకాలు ట్రిపుల్ఐటీల్లో 2008 నుంచి గతేడాది వరకు పీయూసీ ప్రథమ సంవత్సరం నుంచే ల్యాప్టాప్లు ఇచ్చి, డిజిటల్ కంటెంట్ ద్వారా బోధించేవారు. అయితే గతేడాది నుంచి ఈ విధానానికి స్వస్తి చెప్పి, ఇంటర్ పాఠ్యపుస్తకాలను పరిచయం చేశారు. ఆగస్టు 4 నుంచి మిడ్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, చేతిలో పుస్తకాలు లేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మీడియాపై ఆంక్షలు ట్రిపుల్ఐటీలో నెలకొన్న లోపాలను, మెస్లలో నాసిరకం ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్న వైనాన్ని గత రెండు రోజులుగా ‘సాక్షి’లో ప్రత్యేక కథనాలు ప్రచురించడంతో ట్రిపుల్ఐటీ అధికారులు మంగళవారం మీడియాపై ఆంక్షలు విధించారు. లోపాలను సరిచేసుకోవాల్సిన ట్రిపుల్ఐటీ అధికారులు అవేమీ చేయకుండా లోపలికి రావాలంటే అనుమతి తీసుకోవాలని ప్రధాన గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఉత్తర్వులు పంపారు. వీసీని కలిసేందుకు మంగళవారం విలేకరులు లోపలికి వెళ్లేందుకు అనుమతి కోసం రెండుసార్లు సెక్యూరిటీ సిబ్బంది ఫోన్ చేయగా రెండుసార్లు కూడా బిజీగా ఉన్నారంటూ లోపలికి వెళ్లడానికి అనుమతించలేదు. ప్రభుత్వ సంస్థ అయిన విద్యాసంస్థలోకి వెళ్లడానికి అనుమతులు తీసుకోవాలనడంపై ట్రిపుల్ఐటీ సిబ్బందే విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పట్టణంలోని టీడీపీకి చెందిన చోటామోటా నాయకులు మాత్రం ట్రిపుల్ఐటీలోకి ఇష్టారాజ్యంగా వెళ్తే వస్తూ ఉండటం గమనర్హం. -
తగ్గుతున్న గోదావరి వరద
పోలవరం రూరల్: గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. మంగళవారం ఉదయం 1.56 లక్షల క్యూసెక్కల నీరు స్పిల్వే నుంచి దిగువకు చేరగా, రాత్రికి ఆ ప్రవాహం 1.16 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి చేరే ఉప నదుల ప్రవాహం క్రమేపీ తగ్గుతుండటంతో వరద ఉధృతి కూడా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం స్పిల్వే వద్ద నీటిమట్టం 28 మీటర్లకు చేరుకుంది. స్పిల్వే లోని 48 గేట్ల ద్వారా 1.16 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వినోద్కుమార్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంలోనూ, జీవో నెం.77 రద్దులోనూ ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి ఐ.రాజేష్ మాట్లాడుతూ.. ‘తల్లికి వందనం’ పథకం కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి కేవలం రూ. 13 వేలు మాత్రమే జమ చేయడం తల్లిదండ్రులను మోసం చేయడమేనని అన్నారు. అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షుడు కాకి నాని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు విద్యాశాఖ ఏడీ–1కి వినతిపత్రం అందజేశారు. చింతలపూడి (జంగారెడ్డిగూడెం): మద్ది ఆంజనేయస్వామివారిని మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. భక్తులు స్వామివారి చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు చేయించుకోవడంతో పాటు, పలువురు భక్తులు అన్నప్రాశనలు, వాహన పూజలు నిర్వహించుకున్నారు. వివిధ సేవల రూపంలో ఆలయానికి రూ.2,91,560 ఆదాయం సమకూరిందని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, సహాయ కమిషనర్, ఈవో ఆర్వీ చందన తెలిపారు. అలాగే 2,172 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ చేసినట్లు వారు పేర్కొన్నారు. -
1/70 చట్టాన్ని పరిరక్షించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): సుప్రీంకోర్టు వేదికగా 1/70 చట్టాన్ని రద్దు చేయడానికి జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఏజెన్సీ గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆదివాసులు భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంఎస్ నాగరాజు మాట్లాడుతూ 1/70 చట్టం వచ్చి 56 సంవత్సరాలు గడుస్తున్నా పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆదివాసీల భూములు భూస్వామ్య, పెత్తందారీ శక్తుల చేతుల్లో బందీగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులు పోరాడి సాధించుకున్న భూములను కబ్జా చేసేందుకే కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. గతంలో జీవో నంబర్ 3ని ఏ విధంగా రద్దు చేయించారో, ఇప్పుడు అదే రీతిలో 1/70 చట్టాన్ని రద్దు చేయడానికి కుట్రలు పన్నుతున్నారని, వీటిని తిప్పికొట్టడానికి ఆదివాసీలంతా సమైక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి షేక్ బాషా, ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు కుంజం రామారావు, సహాయ కార్యదర్శి సవలం రాంబాబు తదితరులు ప్రసంగించారు. ధర్నా అనంతరం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో గిరిజన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ వెట్రిసెల్వికి అందజేశారు. -
అక్రమ తవ్వకాలపై కలెక్టర్కు ఫిర్యాదు
కొయ్యలగూడెం: రాజవరం పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న అక్రమ తవ్వకాలపై కలెక్టర్కి ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు మంగళవారం పేర్కొన్నారు. గంగవరం గ్రామ రెవెన్యూ పరిధిలో గ్రావెల్, మట్టి, ఎర్ర కాలువలోని ఇసుక అక్రమ తవ్వకాల గురించి సాక్ష్యాధారాలతో సహా కలెక్టర్ వెట్రిసెల్వికి ఏలూరు వెళ్లి సమర్పించినట్లు తెలిపారు. మైనింగ్ శాఖ అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వారు చర్యలు తీసుకోలేదని, ఎప్పటికప్పుడు వస్తామంటూ దాటవేస్తున్నారని ఆరోపించారు. దీంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోయి రేయింబవళ్లు అక్రమతోలకాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు గ్యాప్ –2 ప్రాంతంలో సీఫేజ్ నిల్వ ఉన్న ప్రదేశంలోని గొయ్యిలో ప్రమాదవశాత్తు గల్లంతైన ఎక్స్వేటర్ ఆపరేటర్ నాగేశ్వరరావు మృతదేహం వెలికి తీశారు. సోమవారం ఉదయం గల్లంతైన మృతదేహాన్ని గాలింపు చర్యలు చేపట్టి సోమవారం రాత్రి వెలికితీసినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోలవరం మార్చురీకి తరలించి, పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్సై పి.అప్పారావు తెలిపారు. చింతలపూడి (జంగారెడ్డిగూడెం): ఉపాధ్యాయుల వేధింపులు తాళలేకే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం రాజులకాలనీకి చెందిన కునుపోటు బాలసాయి సుబ్రహ్మణ్యం అలియాస్ బన్ను (16) రావికంపాడు జెడ్పీహెచ్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 3న జుట్టు సరిగా లేదనే కారణంతో ఉపాధ్యాయులు అతడిని కొట్టారు. నాటి నుంచి హెచ్ఎంతో పాటు కొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు అతడిని మానసికంగా వేధిస్తున్నారని, తోటి విద్యార్థుల ముందు బ్యాగ్ వెతికించి అవమానించారని తల్లి తెలిపింది. దీంతో మనస్తాపం చెందిన బన్ను ఈ నెల 26న ఇంట్లో ఉరివేసుకున్నాడు. ఈ మేరకు ఎస్సై వీరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు టౌన్: ఏలూరు రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బిస్కెట్ కలర్ ప్యాంట్, పసుపు రంగు బనియన్ ధరించి ఉన్నాడు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఏలూరు సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉండి: ఖాతాదారుడి ప్రమేయం లేకుండా సేవింగ్స్ ఖాతా నుంచి రూ.1.25 లక్షలు మాయమైన సంఘటనపై మంగళవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యండగండికి చెందిన శృంగవృక్షం ఆంజనేయులు విస్సాకోడేరులో ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఆయనకు యండగండి యూనియన్ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ ఏడాది మే 11న ఆయన ప్రమేయం లేకుండానే ఖాతా నుంచి రూ.1,25,295 డ్రా అయినట్లు గుర్తించాడు. బ్యాంకు అధికారులను ఆరా తీయగా ఇది ఆన్లైన్ లావాదేవీ అని, తమకేమీ సంబంధం లేదని సమాధానమిచ్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఉండి ఎస్సై మల్లికార్జునరావు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రతి అర్జీకీ శాశ్వత పరిష్కారం చూపాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ ఫలాలు నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలతో పాటు ప్రతి గడపకూ అందేలా అధికారులు చూడాలని 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ ఆదేశించారు. మంగళవారం ఏలూరు కలెక్టరేట్లో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, అధికారులు సమన్వయంతో వాటికి శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇవ్వాలి అనంతరం కలెక్టరేట్లో వికసిత్ భారత్–స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో ఆయన సమీక్షించారు. జల్ జీవన్ మిషన్, అమృత్ పథకాల ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత నీటి వనరులను గుర్తించి ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇవ్వాలన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా విద్యార్థులు, గర్భిణులు, బాలింతలకు సంపూర్ణ పోషకాహారం అందించాలని, విద్యార్థులకు రక్తహీనత లేకుండా వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. కొల్లేరులో జిరాయితీ రైతుల హక్కులు కాపాడుతూనే, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా రూపొందించిన కార్యాచరణ నివేదికను జిల్లా యంత్రాంగం కేంద్ర సాధికార కమిటీకి పంపిందన్నారు. ‘సూర్యఘర్’ అమలులో జిల్లా ప్రథమం కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం అమలులో ఏలూరు జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపామన్నారు. పీఎంజీఎస్వై పథకం కింద రూ.437 కోట్లతో 427 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, జేసీ ఎంజే అభిషేక్ గౌడ, ఏపీ వడ్డీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, డీఆర్వో ఎం శ్రీదేవి, జెడ్పీ సీఈఓ పి.జగదాంబ, ఆర్డీఓ కె.లక్ష్మీప్రసన్న, అటవీశాఖ అధికారి పీవీ సందీప్రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ భాననుప్రతాప్ తదితరులు పాల్గొన్నారు -
ఏలూరులో పోలీసుల అత్యుత్సాహం
వైఎస్సార్సీపీ జిల్లా యువజన అధ్యక్షుడు నానికి నోటీసులు ఏలూరు టౌన్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో డీఎస్సీ–25 అవినీతిపై పార్టీ జిల్లా యువజన అధ్యక్షులు కామిరెడ్డి నాని ఆధ్వర్యంలో ఏలూరులో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఇదే సందర్భంలో ఏలూరు టూటౌన్ పోలీసులు కామిరెడ్డి నానికి పార్టీ కార్యాలయం వద్ద నోటీసులు జారీ చేశారు. ర్యాలీకి అనుమతి లేదనీ, కాదని చేస్తే చట్టం మేరకు చర్యలు తప్పవంటూ నోటీసు అందజేశారు. మంత్రి లోకేష్ రాజీనామా, సీబీఐ దర్యాప్తు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో ఇప్పటికే కూటమి ప్రభుత్వ వైఫల్యంతో ప్రజల్లో విశ్వాసం కోల్పోగా, మరింత సన్నగిల్లుతుందనే భయంతో పోలీసులను ఉసిగొలిపారని ప్రజలు విమర్శిస్తున్నారు. టీడీపీ నేతల బెదిరింపులకు భయపడేది లేదనీ, యువత, నిరుద్యోగులు, విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తున్నామని, ప్రజల కోసం దేనికై నా సిద్దమని యువజన విభాగం జిల్లా అధ్యక్షులు నాని స్పష్టం చేశారు. -
జిల్లాలో రహదారి ప్రమాదాలు నివారించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో అధికంగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ను గుర్తించి, వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కే. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ కే. ప్రతాప్ శివకిషోర్తో కలిసి రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ప్రమాదాలు, మరణాలు తగ్గినప్పటికీ, 304 రోడ్డు ప్రమాదాల్లో 149 మంది మృతి చెందడం ఆందోళనకరమన్నారు. అతివేగం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడమే మరణాలకు ప్రధాన కారణాలని, ప్రమాదాల నివారణపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ పాఠశాల బస్సుల్లో తప్పనిసరిగా డాష్ కెమెరాలు అమర్చాలని, జాతీయ రహదారిపై నిలుపుదల చేసే వాహనాలతో పాటు అతివేగంతో వెళ్లేవాటిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రవాణా శాఖ ఉప కమిషనర్ షేక్ కరీమ్ గత సమావేశ నిర్ణయాలపై తీసుకున్న చర్యలను వివరించారు. సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఆర్టీఓ ఎస్బీ శేఖర్, డీపీఓ మల్లికార్జునరావు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎ.భానుప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తుడి నగదు చోరీ చేసిన ముఠా అరెస్టు
ద్వారకాతిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుడి వద్ద రూ. లక్ష నగదు చోరీకి గురైన కేసును ద్వారకాతిరుమల పోలీసులు వేగంగా ఛేదించారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 80 వేల నగదు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను ఎస్సై టి. సుధీర్ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఏలూరు మండలం సుంకరివారి తోటకు చెందిన గూరుగుబెల్లి రమణమూర్తి తన భార్యతో కలిసి ఈ నెల 25న తొలి ఏకాదశి సందర్భంగా ద్వారకాతిరుమల వచ్చారు. ఆ సమయంలో ఆయన వద్ద ఉన్న రూ. లక్ష నగదు చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలు, అడిషనల్ ఎస్పీ వై. ప్రసాదరావు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో భీమడోలు సీఐ పి. కృష్ణ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు సభ్యుల ముఠాను గుర్తించిన పోలీసులు నూజివీడుకు చెందిన బొంకూరు కుమార్, శీలం రాజులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేసి, మిగిలిన రూ. 20 వేల నగదును రికవరీ చేస్తామని ఎస్సై తెలిపారు. చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. ఈ సందర్భంగా పుణ్యక్షేత్రాలు, రద్దీ ప్రాంతాల్లో భక్తులు తమ నగదు, విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): పోలవరం పనుల్లో మృతి చెందిన ఆపరేటర్ టి. నాగేశ్వరరావు, యంగ్ ఇంజనీర్ కోడూరు రవికాంత్ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్. లింగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నీటిలో మునిగిపోయిన యంత్రాన్ని తాడుతో బయటకు లాగే ప్రయత్నంలో వారు నీట మునిగి చనిపోయినట్లు తెలిపారు. మృతుడు నాగేశ్వరరావు (తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం మండలం, చిన్న కొండేపూడి)కి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారని, పెద్ద కుమార్తె 10వ తరగతి చదువుతోందని వివరించారు. మరో మృతుడు రవికాంత్కు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుందని వాపోయారు. -
రక్తదానంపై అవగాహన అవసరం
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యార్థి దశ నుంచే ప్రతీ ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకోవాలని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ ఎంబీఎస్వీ ప్రసాద్ పిలుపునిచ్చారు. సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో తలసేమియా బాధితుల కోసం రెడ్క్రాస్ ఆధ్వర్యంలో మంగళవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ రక్తదానం చేసిన విద్యార్థులను అభినందించారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారన్నారు కళాశాల ప్రిన్సిపాల్ వంగ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ విద్యార్థులు స్వచ్ఛందంగా అందించిన రక్తం తలసేమియా రోగులకు ఉపయోగపడటం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా నిర్మల, రెడ్క్రాస్ పీఆర్ఓ కేవీ రమణ, వైస్ ప్రిన్సిపాల్ డీవీవీ ఫణి కుమార్, మెడికల్ ఆఫీసర్ కే. శ్రీమాలక్ష్మి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కె.హరిబాబు, కల్చరల్ కో–ఆర్డినేటర్ పి.సౌభాగ్యలక్ష్మి, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు. -
వైభవంగా సహస్ర దీపాలంకరణ
ఆలయ ఆవరణలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు కుంకుళ్లమ్మ అమ్మవారికి హారతులిస్తున్న అర్చకుడు ద్వారకాతిరుమల: క్షేత్ర దేవత శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయం పౌర్ణమి పర్వదినం సందర్భంగా మంగళవారం రాత్రి సహస్ర దీపాల వెలుగులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు దీపాలను వెలిగించి భక్తి పారవశ్యాన్ని చాటగా, ఆలయ ప్రాంగణం దివ్యకాంతులతో కళకళలాడింది. ముందుగా భక్తులు ఆలయ ఆవరణలో ఓంకారం, శంఖు, చక్ర, నామాలు ఇలా పలు ఆకారాల్లో దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు గర్భగుడిలో కొలువై ఉన్న అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి, మంగళ హారతులిచ్చారు. అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని పలువురు భక్తులు దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
విద్యుత్ షాక్తో వ్యక్తి దుర్మరణం
టి.నరసాపురం: విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషాద సంఘటన ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెడ్లం పంచాయతీ శ్రీరామవరం గ్రామానికి చెందిన చవల అప్పారావు (43) సోమవారం ఉదయం తాను కౌలుకు తీసుకున్న ఆయిల్పామ్ తోటలోని మొక్కలకు నీళ్లు పెడుతున్నాడు. ఈ క్రమంలో పాత బోరు నుంచి కొత్త బోరు వరకు వేసిన కేబుల్ వైరు నీళ్లు పెట్టడానికి అడ్డురావడంతో, దానిని ఒక పైపు ముక్కతో పక్కకు తప్పించేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు ఆ కేబుల్ వైరు, ప్లాస్టిక్ ముక్క చాతీపై పడటంతో తీవ్ర విద్యుత్ షాక్కు గురై అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు టి.నరసాపురం ఎస్ఐ ఎం.జయబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ద్వారకాతిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు తన వద్ద ఉన్న రూ.లక్ష నగదును పోగొట్టుకున్న సంఘటన ద్వారకాతిరుమలలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. ఎస్సై టి. సుధీర్ కథనం ప్రకారం... ఏలూరు జిల్లా మాదేపల్లి గ్రామానికి చెందిన గూరుగుబెల్లి రమణమూర్తి కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 25న భార్యతో కలిసి శ్రీవారి దర్శనార్థం ద్వారకాతిరుమలకు వచ్చాడు. ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో ఇంట్లో ఉన్న రూ.లక్ష నగదును తన ప్యాంటు జేబులో పెట్టుకుని తీసుకొచ్చాడు. శ్రీవారి దర్శనం అనంతరం అన్నదాన భవనంలో ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ప్యాంటు జేబులో నగదు లేదని గుర్తించి, గుర్తుతెలియని వ్యక్తులు జేబులోని డబ్బును దొంగిలించినట్లు సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధీర్ తెలిపారు. -
చట్టాల రక్షణ కోసం ఐటీడీఏ ముట్టడి
బుట్టాయగూడెం: ఏజెన్సీలోని ప్రజల సమస్యలను పరిష్కరించాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, జీఓ నంబర్ 3 తరహా జీఓను తీసుకువస్తామన్న ముఖ్యమంత్రి హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సోమవారం ఐటీడీఏను ముట్టడించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులు పోరంట్ల శ్రీనివాస్, కారం రాఘవలు మాట్లాడుతూ.. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన చట్టాలను, హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1/70, పీసా చట్టాల అమలు విషయంలో ప్రభుత్వ యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. ఏజెన్సీలో విద్య, వైద్యం, అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. మోతుగూడెంకు చెందిన చిన్నారి రిత్విక అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే సరైన వైద్యం అందక మృతిచెందిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను యూపీ పాఠశాలలుగా మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పులిరామన్నగూడెం, రెడ్డికోపల్లి, ఇటుకులకోట, లంకపాకల పాఠశాలలను పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఐటీడీఏ ఏపీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్. రామ్మోహన్రావు, పీఓఎల్ నాయకులు తగరం బాబూరావు, పీఓడబ్ల్యూ నాయకురాలు వెట్టి భారతి, న్యాయవాది యు.ఏసుబాబు, పీడీఎస్యూ నాయకులు బన్నే వినోద్, ఈ.భూషణం తదితరులు పాల్గొన్నారు. -
మెట్ట కొండకు తూట్లు
కొయ్యలగూడెం: రాజవరం (గంగవరం) మెట్ట కొండపై నుంచి గ్రావెల్ అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. సర్వే నంబరు 207 కొండగుట్టను జేసీబీలు, టిప్పర్ లారీలు పెట్టి అక్రమంగా తరలిస్తున్నారు. సుమారు ఏడాదిన్నర కిందట డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించి అక్రమ గ్రావెల్ తవ్వకాలను నిరోధించాలని ఆదేశించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ప్రజలు పేర్కొంటున్నారు. భారీగా కొండను తవ్వడం పర్యావరణానికి చేటుగా మారిందని వాపోతున్నారు. అధికారులు పలుమార్లు దాడులు చేసి అక్రమ రవాణాపై చర్యలు తీసుకున్నప్పటికీ, అవి నామమాత్రమే.. రాత్రి వేళల్లో గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నా మైనింగ్ శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదని ఆరోపిస్తున్నారు. సుమారు వెయ్యి టిప్పర్లకు పైగా గ్రావెల్ మట్టి రవాణా అయిందని, పరిసర ప్రాంతాలలోని టిప్పర్లు, జేసీబీల యజమానులే ఈ గ్రావెల్ దందాకు మూలకారణమని అంటున్నారు. గంగవరం, రాజవరం గ్రామాలు అక్రమాలకు అడ్డాగా నిలిచాయనేది వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోందన్నారు. పొట్టి మెట్ట కొండగా పిలవబడే ప్రాంతం నుంచి కేవలం రెండు సంవత్సరాల కాలంలో రూ. 10 కోట్లకు పైగా విలువైన గ్రావెల్ తవ్వకాలు జరిగాయన్నారు. వేళల్లో అక్రమ తోలకాల వల్ల అంతర్గత రోడ్లు అధ్వానంగా మారుతున్నాయని, నూతనంగా నిర్మించిన బీటీ రోడ్లు సైతం గోతులమయమయ్యాయని ప్రజలు పేర్కొంటున్నారు. గ్రావెల్ తోలకాలు ఇంత పెద్ద ఎత్తున కొనసాగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోకపోగా, తాము ఏవిధమైన చర్యలు తీసుకోలేకపోతున్నామని ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తుండటంపై ప్రభుత్వ శాఖల పట్ల విశ్వసనీయత కోల్పోతున్నామని ప్రజలు తెలిపారు. అధికారుల చర్యలు అక్రమ తోలకాలను నిరోధించలేనప్పుడు, ప్రభుత్వ తీరును ప్రశ్నించడంతో పాటు అక్రమార్కుల దందాకు వెనుక ఉండి కొమ్ముకాస్తున్నది ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా నామమాత్రపు చర్యలు కాకుండా కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరమని ప్రజలు భావిస్తున్నారు. లింగపాలెం మండలంలో లింగపాలెం: లింగపాలెం మండలంలోని వివిధ చెరువుల నుంచి మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మండలంలోని సుమారు 10 గ్రామ పంచాయతీల పరిధిలోని చెరువుల నుంచి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే జేసీబీలు, ట్రాక్టర్లు, టిప్పర్లతో భారీగా మట్టిని తరలిస్తున్నారు. ముఖ్యంగా పాశ్చానగరం చెరువుతో పాటు ఇతర ప్రాంతాల్లో నిత్యం అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువుల్లో ఇష్టారాజ్యంగా పెద్ద పెద్ద గోతులు తీస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, ట్రాక్టర్లు బయటకు వెళ్లేందుకు చెరువు గట్లను నరికివేసి బాటలు ఏర్పాటు చేస్తుండటంతో, వర్షాలు వచ్చినప్పుడు చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. అక్రమ మట్టి తవ్వకాలపై కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారుల తనిఖీలు లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడటమే కాకుండా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని స్థానికులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
ట్రిపుల్ఐటీలో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు
నూజివీడు: ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ట్రిపుల్ఐటీల్లో అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాము ఆడిందే ఆట, పాడిందే పాట అన్న చందంగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్న యూనివర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తమను సంప్రదించకుండా ఇష్టారాజ్యంగా వేస్తున్న డిప్యుటేషన్లపై ఫ్యాకల్టీలో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలుండగా మిగులు అధ్యాపకులు ఎక్కడైనా ఉంటే వారిని అవసరమైన చోటకు పంపుతారు. సాధారణంగా ఏ ప్రభుత్వ శాఖలోనైనా, పాఠశాలల్లోనైనా, కళాశాలల్లోనైనా జరిగేది ఇదే. ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా డిప్యుటేషన్లు వేస్తున్నారు. అక్కడ అవసరం ఉన్నప్పటికీ శ్రీకాకుళం ట్రిపుల్ఐటీలో పనిచేసే ఈసీఈ, సీఎస్ఈ బ్రాంచిలకు ముగ్గురు మహిళా ఫ్యాకల్టీని నూజివీడు ట్రిపుల్ ఐటీకి గతేడాది డిప్యుటేషన్పై నియమించారు. వీరి స్థానంలో ఎవరో ఒకరికి వర్క్లోడు ఎక్కువ వేసి పని చేయిస్తున్నారు. వీరిలో ఇద్దరు ఫ్యాకల్టీని అకడమిక్ ఇయర్ ప్రారంభంలో ఒంగోలు ట్రిపుల్ ఐటీకి డిప్యుటేషన్పై పంపారు. వారిరువురు పదిరోజులు కూడా అక్కడ విధులు నిర్వహించకుండా తిరిగి నూజివీడు ట్రిపుల్ఐటీకి వచ్చేశారు. దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో నూజివీడు ట్రిపుల్ ఐటీకి అంతుబట్టడం లేదు. నలుగురు ఫ్యాకల్టీకి డిప్యుటేషన్ ఉత్తర్వులు ఈ వ్యవహారంపై ట్రిపుల్ఐటీలోని అధ్యాపకుల మధ్య చర్చ సాగుతుండగానే యూనివర్సిటీ అధికారులు ఈసీఈ చెందిన నలుగురు పురుష ఫ్యాకల్టీని ఒంగోలు ట్రిపుల్ఐటీకి డిప్యుటేషన్పై నియమించారు. నూజివీడు ట్రిపుల్ఐటీలో ఈ నలుగురు ఫ్యాకల్టీకి సరిపడా వర్కులోడు ఉన్నప్పటికీ, మూడు వారాలుగా క్లాసులకు వెళ్లి బోధన చేస్తున్న సమయంలో ఒంగోలు ట్రిపుల్ఐటీకి డిప్యుటేషన్పై వెళ్లాలంటూ ఉత్తర్వులు ఇవ్వడంపై స్థానిక ఫ్యాకల్టీలో విస్మయం వ్యక్తమవుతోంది. ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఫ్యాకల్టీ లోటు ఉన్నప్పుడు అక్కడ నియమించిన ఇద్దరు మహిళా ఫ్యాకల్టీని 10 రోజులు గడవకుండానే తిరిగి నూజివీడుకు డిప్యుటేషన్పై ఎందుకు పంపారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి యూనివర్శిటీ అధికారులు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నలుగురు ఫ్యాకల్టీలో చుండ్రు ప్రవీణ్కుమార్, వెంపటి శేఖర్ను మొదటి సెమిస్టర్కు, పున్నపు సురేష్, లంకపల్లి బాబూరావులను రెండో సెమిస్టర్కు ఒంగోలు వెళ్లాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. ఇలా అనేక నిర్ణయాలు ఇష్టారాజ్యంగా తీసుకుంటూ ఆర్జీయూకేటీ ఎప్పుడూ వివాదాల్లో ఉండేలా చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల ట్రిపుల్ ఐటీల ప్రతిష్టకు భంగం కలిగే పరిస్థితులు నెలకొంటాయనే ఆందోళన ఫ్యాకల్టీలో వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా ఆర్జీయూకేటీ చాన్సలర్ పూర్తిస్థాయిలో దృష్టి సారించి వివాదాస్పద నిర్ణయాలకు ఫుల్స్టాప్ పెట్టాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.డిప్యుటేషన్లపై తీవ్ర వ్యతిరేకత -
పిడుగుపాటుకు పశువులు మృతి
బుట్టాయగూడెం: పొలంలో కట్టేసిన మూడు గిత్తలు, రెండు ఆవులపై ఆదివారం రాత్రి పిడుగుపడి ఐదు పశువులు మృతి చెందిన సంఘటన బుట్టాయగూడెం మండలం మారుమూల గ్రామమైన ఇనుమూరులో జరిగింది. బాధిత రైతు చీమల ముత్యాలరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మేతకు వెళ్లి తిరిగొచ్చిన ఐదు పశువులను గ్రామ సమీపంలోని తమకున్న ఎకరం పొలం మధ్యలో కట్టేసినట్లు తెలిపారు. అర్ధరాత్రి తీవ్రమైన ఉరుములు, మెరుపులతో వర్షం వచ్చిందని చెప్పారు. తెల్లవారుజామున పాలు తీసేందుకు వెళ్లి చూడగా అవన్నీ మృతిచెంది ఉన్నట్లు పేర్కొన్నారు. ముత్యాలరావుకు చెందిన రెండు గిత్తలు, ఒక ఆవు, పాయం పాపారావుకు చెందిన పాలిచ్చే ఆవు, కారం సింగరాజుకు చెందిన రెండు గిత్తలు మృతి చెందినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ... పిడుగుపాటుతో మృతి చెందిన పశువుల యజమానులకు ఒక్కొక్క పశువుకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
విలేకరి ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్ట్
తాడేపల్లిగూడెం అర్బన్: యూట్యూబ్ చానల్ జర్నలిస్ట్ ఉర్ల బాలకృష్ణ వర్ధన్ ఆత్మహత్యకు కారణమైన నిందితులను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ రవిచంద్ర బుధవారం నిర్వహించిన విలేకరులతో మాట్లాడుతూ.. బాలకృష్ణ వర్ధన్ సెల్ఫీ వీడియో ఆధారంగా నిందితులు తమ్మిశెట్టి సురేష్, దేవా శివలను అరెస్టు చేశామన్నారు. గతంలో రంగా సురేష్ నిర్వహిస్తున్న యూట్యూబ్ చానల్లో వర్ధన్ రిపోర్టర్గా చేశాడన్నారు. అతనికి నెలవారీ వేతనం చెల్లించకపోగా... వేతనం ఇవ్వమని అడిగితే కులం పేరుతో దూషించినట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో దూషించుకోవడం వల్ల మనస్తాపం చెంది వర్ధన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు. -
వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ద్వారకాతిరుమల: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలోని పొగాకు వేలం కేంద్రాన్ని వచ్చేనెల 5న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు సోమవారం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్, రీజనల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, మాజీ హోం మంత్రి తానేటి వనిత, వైఎస్సార్సీపీ ఏ లూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, తెల్లం బాలరాజు, పార్టీ ఏలూరు ఇన్చార్జి మా మిళ్లపల్లి జయప్రకాష్, మాజీ ఏఎంసీ ౖచైర్మన్ గన్నమని జనార్దనరావు తదితరులు దేవరపల్లిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే స్థానిక కరుటూరి ఫంక్షన్ హాల్ సమీపంలో హెలీప్యాడ్ ఏర్పాటుకు స్థలాన్ని, పొ గాకు వేలం కేంద్రంలో రైతులతో జగనన్న ని ర్వహించనున్న ముఖాముఖీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ శ్రేణులకు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ద్వారకాతిరుమల మండలానికి చెందిన పార్టీ నేతలు పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్, బొండాడ వెంకన్నబాబు, చెలికాని ప్రవీణ్, బిరుదుగడ్డ చల్లారావు, దాసరి రాంబాబు, జంగా వెంకట కృష్ణారెడ్డి, భోగరాజు సాయికృష్ణ, బిరుదుగడ్డ బజారయ్య, మానుకొండ సు బ్బారావు, దాకారపు బంగారమ్మ, అగ్గియ్య, మల్లిపూడి నాగమణి, దాసరి ఏసురత్నం, దొప్పసాని రాంబాబు, షేక్ బాష తదితరులు ఉన్నారు. -
ఫీజు బకాయిల కోసం గర్జన
ఏలూరు (ఆర్ఆర్పేట) : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, జీఓ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల విద్యార్థి సమాఖ్య (పీఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. జిల్లా నాయకులు పి.శివశంకర్, టి.ఉదయ్కుమార్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మెస్ ఛార్జీలను పెంచాలని కోరారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో విఫలమై, పేపర్ లీకేజీలకు కారణమవుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని పూర్తిగా రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలన్నారు. నీట్ పరీక్షలనుయాజమాన్యాలకే కాకుండా, ఆయా రాష్ట్రాలే నిర్వహించుకునేలా వెసులుబాటు కల్పించాలన్నారు. నీట్ పేపర్ లీకేజీల వల్ల ఆత్మహత్య చేసుకున్న 120 మంది విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలి. విద్యావ్యవస్థలో ప్రభుత్వాల తరఫున జవాబుదారీతనం ఉండాలని స్పష్టం చేశారు. ప్రగతి నారీ సంఘం జిల్లా కార్యదర్శి జి.శారద తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ పీజీఆర్ఎస్కు 62 ఫిర్యాదులు
ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రజల సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ అన్నారు. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఆర్)లో అదనపు ఎస్పీ (అడ్మిన్) వై.ప్రసాదరావుతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకుని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మొత్తంగా 62 ఫిర్యాదులు అందాయని, వీటిలో ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆర్థిక మోసాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయన్నారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు జిల్లా పోలీసు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా, తమ సమీపంలోని సబ్ డివిజన్ లేదా సర్కిల్ కార్యాలయాల్లోనే ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారులకు ఏలూరు శ్రీ సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు భోజన సదుపాయం కల్పించారు. -
వర్షాల కోసం ప్రత్యేక పూజలు
ద్వారకాతిరుమల: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేశ, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. క్షేత్ర ఉపాలయమైన భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలో బుధవారం నుంచి 31 వరకు మూడు రోజుల పాటు వరుణదేవుని అనుగ్రహం కో సం వారుణానువాక జపం, వరుణ సూక్త పా రాయణాలు, రుద్రహోమాలు, సహస్ర ఘటాభిషేకాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. కై కలూరు: జిల్లాలో ఆదివారం రాత్రి విస్తార వర్షం కురిసింది. సూపర్ ఎల్నినో నేపథ్యంలోలో వర్షాల కోసం వరుణ పూజలు సైతం పలు గ్రామాల్లో జరుగుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా పెదపాడులో 67.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తర్వాత స్థానాలు కై కలూరులో 51.6, ఆగిరిపల్లిలో 36.4, ముదినేపల్లిలో 28.4, కలిదిండిలో 25.8, మండవల్లి లో 24.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. జిల్లా మొత్తం 331.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. -
నాడి పట్టే నాథుడేడి?
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా లోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉండటంతో పేద, మధ్యతరగతి ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. స్థానిక జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో అన్నిరకాల స్పెషలిస్ట్ వై ద్యులను అందుబాటులో ఉంచాల్సి ఉండగా, ప్ర భుత్వ నిర్లక్ష్యం కారణంగా పరిస్థితులు రోజురోజు కూ దిగజారుతున్నాయి. అత్యవసర, మెరుగైన వై ద్యం కోసం ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి, అప్పులపాలవుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ జ్వరాలు, ప్రసవాలు తప్ప ఇతర వ్యాధులకు సరైన చికిత్స అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 8 ఆసుపత్రులు.. 21 మంది వైద్యుల ఖాళీలు ● జిల్లాలో ఒక జిల్లా ఆసుపత్రి, 4 ఏరియా ఆసుపత్రులు, 3 సామాజిక ఆరోగ్య కేంద్రాలు కలిపి మొత్తం 8 ప్రధాన ప్రభుత్వాస్పత్రులు ఉన్నాయి. వీటిలో మొత్తం 21 మంది వైద్యుల కొరత ఉంది. ● సాధారణ ఎంబీబీఎస్ వైద్యుల నుంచి జనరల్ సర్జన్లు, అనస్థీషియా (మత్తు) నిపుణులు, గైనకాలజిస్టుల వరకు అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ● ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు పైచదువుల కోసమో లేదా సొంత ఆస్పత్రుల ఏర్పాటు కోసమో వెళ్లిపోతుంటే, వారి స్థానంలో కొత్తవారిని నియమించడంలో ప్రభుత్వం విఫలమైంది. ● ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుదామన్నా.. స్థానికంగా అన్ని రకాల వైద్య సేవలు అందించే మల్టీస్పెషాలిటీ నెట్వర్క్ ఆస్పత్రులు లేవు. దీంతో ఒక్కో చికిత్స కోసం వేర్వేరు పట్టణాలకు తి రగాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. అందుబాటులో లేని స్కానింగ్ సేవలు జిల్లాలోని ఏ ప్రభుత్వాసుపత్రిలోనూ ఎంఆర్ఐ, సీటీ స్కాన్ వంటి ఆధునిక, ఖరీదైన పరికరాలు అందుబాటులో లేవు. దీంతో పేదలు అత్యవసర పరిస్థితుల్లో రోగులకు స్కానింగ్ అవసరమైతే, ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయించి రూ.3,000 నుంచి రూ.6,000 వర కు సొంతంగా ఖర్చు చేసుకోవాల్సి వస్తోంది. ప్రభు త్వం సకాలంలో స్పందించి ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు, ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. భీమవరం ఏరియా ఆస్రత్రి ఆస్పత్రి వైద్యుల కొరత తణుకు జిల్లా ఆస్పత్రి జనరల్ ఎంబీబీఎస్ 2, మత్తు డాక్టర్ 1, రేడియాలజిస్ట్ 1, డెర్మటాలజిస్ట్ 1, జనరల్ మెడిసన్ 1, పీఎం 1 (మొత్తం 7) భీమవరం ఏరియా ఆస్పత్రి జనరల్ ఎంబీబీఎస్ 1, జనరల్ మెడిసన్ 2 (మొత్తం 3) తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రి జనరల్ ఎంబీబీఎస్ 1, పిడియాట్రిక్స్ 1, రేడియాలజిస్ట్ 1 (మొత్తం 3) నరసాపురం ఏరియా ఆస్పత్రి జనరల్ ఎంబీబీఎస్ 1, గైనకాలజిస్ట్ 1 (మొత్తం 2) ఆచంట సీహెచ్సీ జనరల్ సర్జరీ 1, జనరల్ మెడిసన్ 1, డెంటిస్ట్ 1 మత్తు డాక్టర్ 1 (మొత్తం 4) పెనుగొండ సీహెచ్సీ గైనకాలజిస్ట్ 1 ఆకివీడు సీహెచ్సీ జనరల్ సర్జరీ 1 వైద్యం.. పూజ్యం ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల కొరత పూర్తిస్థాయిలో అందని సేవలు జనరల్ మెడిసిన్, గైనకాలజిస్టులు లేరు ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్లు లేవు అత్యవసర వైద్యానికి ప్రైవేట్ ఆస్పత్రులే దిక్కు పట్టించుకోని కూటమి ప్రభుత్వం -
అర్జీలు పునరావృతం కారాదు
ఏలూరు (ఆర్ఆర్పేట) : ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోపు పూర్తిస్థాయి పరిష్కారం చూపాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి స్థాయి మరింత పెంచేలా పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా పరిష్కారం అందించాలని ఆదేశించారు. జేసీ ఎంజే అభిషేక్గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్కుమార్రెడ్డి, డీఆర్వో ఎం.శ్రీదేవి, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్.దేవకీదేవి, ఆర్డీఓ కె.లక్ష్మిప్రసన్న, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన ఉయ్యూరు నాగరాజు తనకు అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయం జమ కాలేదని, త్వరగా జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ● ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామానికి చెందిన పేరూరి చంద్రశేఖర్ తన స్థలం ఆక్రమణకు గురైందని, రాకపోకలకు రహదారి లేకుండా చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జ రిపి తగిన పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. ● దెందులూరు మండలం గోపన్నపాలెంకు చెందిన వి.ధర్మారావు గ్రామ పంచాయతీలో డంపింగ్ పనులు పూర్తి చేశానని, చాలా కాలం గడిచినా బిల్లులు రాలేదని, వాటిని వెంటనే చెల్లించాలని కోరారు. ● టి.నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామానికి చెందిన వట్టి రాధాకృష్ణ అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి నిధులు మంజూరు చేయించాలని కోరారు. ● పెదవేగి మండలం పెదకడిమికి చెందిన చల్లగొల్ల వెంకటరావు తమ గ్రామంలో పాడి రైతులు చాలామంది ఉన్నారని తెలిపారు. పశువుల చెరువులో నీటి కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్లక్ష్యం సహించం పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టరేట్ హెచ్చరించారు. పీజీఆర్ఎస్ అర్జీలపై కలెక్టరేట్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. శాఖల వారీగా పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన అర్జీలు పరిష్కార ప్రగతిలో లోటు కనిపించిన అధికారులపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెట్రిసెల్వి -
పెనుగొండలో వేద పాఠశాల
పెనుగొండ : అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవీ శాంతి థాంలో త్వరలోనే వేద పాఠశాల నిర్వహించనున్నట్టు ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజులు తెలిపారు. సోమవారం వాసవీ శాంతి థాంలో విలేకరులతో మాట్లాడుతూ వేద పాఠశాలలో పూర్తిస్థాయిలో వేదాభ్యాసం చేయిస్తామని, ఆలయాల్లో అర్చకులుగా ఉపాధి కల్పించేందుకు కృషిచేస్తామన్నారు. 102 రుషీ గోత్ర మందిరాన్ని సువర్ణ మందిరంగా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. ముందుగా గ్రీన్ టెంపుల్ చేయడమే లక్ష్యంగా అర్కిటెక్లు కృషి చేస్తున్నారన్నారు. ఆధ్యాత్మిక శోభ విరాజిల్లేలా సుందరీకరణ పనులు ప్రారంభించామన్నారు. -
అడవి పులికింత
బుట్టాయగూడెం: పెరుగుతున్న పులుల గాండ్రింపులతో అడవి తల్లి పులకిస్తోంది. నడకలో రాజసం, వేటలో గాంభీర్యంతో అడవికి రారాజుగా వెలుగొందే పెద్ద పులుల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతుండటం జీవ వైవిధ్యానికి శుభపరిణామం. ప్రభుత్వాలు తీసుకుంటున్న సంరక్షణా చర్యలు, ప్రజల్లో పెరిగిన అవగాహన వల్ల పులుల సంతతి వృద్ధి చెందుతోంది. నల్లమలతో పాటు ఏలూరు జిల్లాలోని పాపికొండలు అభయారణ్యంలో పులుల కదలికలు గణనీయంగా పెరిగాయి. విస్తరించిన అభయారణ్యం.. ట్రాప్ కెమెరాలకు చిక్కిన జాడలు ఏలూరు, అల్లూరి, భద్రాద్రి జిల్లాల సరిహద్దుల్లోని పాపికొండల అభయారణ్యం మొదట్లో 590 హెక్టార్ల పరిధిలో మాత్రమే ఉండేది. 2008లో దీనిని వన్యప్రాణి అభయారణ్యంగా గుర్తించారు. ఆ తర్వాత దీనిని జాతీయ పార్క్గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం విస్తీర్ణాన్ని 1,12,500 హెక్టార్లకు (10,12,86 చ.కి.మీ) పెంచింది. ఈ ప్రాంతంలో 2009–10 కాలంలో పులుల అడుగుజాడలు, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వాటి గాండ్రింపులు నమోదయ్యాయి. బుట్టాయగూడెం మండలం ఇనుమూరు, చింతలగూడెం, అంతర్వేదిగూడెం, అటవీ ప్రాంతంలో పులుల అడుగులను ఫా రెస్టు అధికారులు గుర్తించారు. 2022 గణనలో ఇ క్కడి ట్రాప్ కెమెరాలకు పులుల చిత్రాలు చిక్కాయి. ప్రస్తుతం ఈ అభయారణ్యంలో నాలుగుకు పైగా పెద్ద పులులు, ఐదుకు పైగా చిరుత పులులు ఉన్న ట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2026 జనవరిలో నిర్వహించిన గణన వివరాలను అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అధికారికంగా వెల్లడించే అవకాశముంది. పులుల సంరక్షణ అందరి బాధ్యత మానవుని దురాశ, అటవీ విస్తీర్ణం తగ్గడం వల్ల పులుల మనుగడ ప్రమాదంలో పడుతోందని వరల్డ్ వైడ్లైఫ్ గణాంకాలు చెబుతున్నాయి. పులుల సంరక్షణపై అవగాహన పెంచేందుకు 2010లో ర ష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ టైగర్ సమ్మిట్ నిర్ణయం మేరకు ప్రతి ఏటా జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి పులులను సంరక్షించుకోవడం మనందరి బాధ్యత. జీవ వైవిధ్యం.. పులులే ఆధారం పాపికొండల అభయారణ్యంలో పులి గాండ్రింపులు పెరుగుతున్న పులుల సంఖ్య అధికారుల చర్యలు, ప్రజల్లో చైతన్యంతో స్వేచ్ఛగా సంచారం పులి సంరక్షణ అందరి బాధ్యత అంటున్న అటవీ అధికారులు రేపు అంతర్జాతీయ పులుల దినోత్సవం స్వభావం.. జీవనకాలం : పులులు సాధారణంగా ఒంటరిగా జీవిస్తాయి. వీటి జీవితకాలం 18 నుంచి 20 ఏళ్లు. ఇవి రోజుకు దాదాపు 25 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. టెరిటరీ (సంచార పరిధి): ఆడ పులి తన నివాస స్థావరంగా 20 చదరపు కిలోమీటర్ల పరిధిని, మగ పులి 60 నుంచి 100 చదరపు కిలోమీటర్ల పరిధిని ఎంచుకుంటాయి. చెట్ల మొదళ్లపై గోళ్లతో గీరి, మూత్రం ద్వారా తమ సరిహద్దులను గుర్తుంచుకుంటాయి. వేట : పులి ఒకసారి వేటాడితే మళ్లీ వారం రోజుల వరకు వేట జోలికి వెళ్లదు. సంతానోత్పత్తి : నవంబర్–ఏప్రిల్ మధ్య కాలం పులుల పునరుత్పత్తికి అనుకూలం. గర్భధారణ సమయం 93 నుంచి 113 రోజులు (సుమారు 16 వారాలు). ఆడపులి ఒకేసారి 2 నుంచి 3 కూనలకు జన్మనిస్తుంది. పులి పిల్లలు 3 నుంచి 4 ఏళ్ల వరకు తల్లి వద్దే వేట, ఈత నేర్చుకుంటాయి. ఆ తర్వాత మగ పులులు తల్లి నుంచి వేరుపడతాయి. -
పెరుగుతున్న గోదావరి
పోలవరం రూరల్ : గోదావరి వరద ఉధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో ఉప నదుల నీటితో పాటు శబరి నీరు కూడా నదిలోకి చేరడంతో వరద ప్రవాహం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 28.650 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్వే 48 గేట్ల నుంచి దిగువకు 1.87 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది. దిగువన వరద ప్ర వాహం పెరుగుతూ ఇసుక తిన్నెలను ముంచుకుంటూ ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలవరం రూరల్: పాపికొండల అభయారణ్య ప్రాంతం నుంచి పెద్దపులి మైదాన ప్రాంతానికి చేరుకుంది. కొన్ని రోజులుగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని శివగిరి, కొరుటూరు అటవీ ప్రాంతంలో సంచరించింది. ఆదివారం పోలవరం మండలంలోని ఇటికిలకోట, పేడ్రా ల, కుంకాల గ్రామాల మీదుగా ఎల్ఎన్డీపేట గ్రామం చేరుకుంది. గ్రామ శివారులోని చెరువు గట్టు వద్ద పెద్ద పులి పాదముద్రలను సో మవారం గ్రామస్తులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. రేంజర్ ఎస్కే వలీ సిబ్బందితో కలిసి వెళ్లి పులి సంచరించిన ప్రదేశాలను పరిశీలించారు. పులి పాదముద్రలను గుర్తించినట్టు ఆయన చెప్పారు. అక్కడి నుంచి గోపాలపురం మండలంలోని సాగి పాడు, నందిగూడెం, గుడ్డిగూడెం ప్రాంతాలకు వెళ్లినట్లు పులికి అమర్చిన రేడియో సిగ్నల్స్ ద్వారా గుర్తించినట్టు రేంజర్ తెలిపారు. పోలవరం రూరల్: పోలవరం డీఎస్పీగా కె.జయకృష్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇటీవల గ్రూప్–1 అధికారి గా ఎంపికై న తర్వాత తొలిసారిగా పోలవరం డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. మూడు నెలల క్రితం ఇక్కడ డీఎస్పీగా పనిచేసిన వెంకటేశ్వరరావు ఉద్యోగ విరమణ చేశారు. అనంతరం ఇక్కడ డీఎస్పీలుగా ఇన్చార్జిలు వ్యవహరించారు. డీఎస్పీ జయకృష్ణ బాద్యతలు స్వీకరించడంతో పోలీసు సేవలు మరింత అందుబాటులోకి చేరుకున్నాయి. దెందులూరు: ఏరువాక కేంద్రంలో విస్తరణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ ఫణికుమార్కు ఉత్తమ విస్తరణ శాస్త్రవేత్త అవార్డు లభించింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (బాపట్ల) వ్యవసాయ కళాశాలలో గవర్నర్ జస్టిస్ మహమ్మద్ నజీర్ ఆయనకు అ వార్డు అందించి సత్కరించారు. ఏరువాక కేంద్రం ఉద్యోగులు, వ్యవసాయశాఖ అధికారులు ఫణికుమార్ను అభినందించారు. పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో లోక కల్యాణార్థం వరుణ జ్వలాభిషేకం చేయనున్నట్టు ఆలయ ఈఓ ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు. వచ్చేనెల 9న ఉదయం 9 గంటల నుంచి 108 కలశాలతో జ్వలాభిషేకం నిర్వహిస్తామన్నారు. 10న ఉదయం 6 గంటల నుంచి 16 మంది రుత్వికులతో అభిషేకాలు, వరుణ జ్వాలాభిషేక మంత్ర పుష్పం ఏర్పాటుచేస్తామని చెప్పారు. -
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి రోయింగ్ పోటీలు
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఎర్రకాలువ వాటర్ స్పోర్ట్స్ సెంటర్లో రాష్ట్రస్థాయి రోయింగ్ చాంపియన్షిష్–2026 పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. ఎస్ఆర్ఏఏపీ, శాప్, డీఎస్ఏ ఏలూరు సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. శాప్ డైరెక్టర్ జగదీశ్వరి, శాప్ డీఎస్డీఓ అజీజ్ సిరాజ్, ఎస్ఆర్ఏఏపీ అ ధ్యక్షుడు తరుణ్ కాకాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలురు, బాలికలకు సబ్ జూనియర్, జూ నియర్, సీనియర్ విభాగాల్లో సింగిల్, డబుల్ స్కల్స్ అంశాలపై ఎంపిక పోటీలు నిర్వహించారు. ప్రధాన కోచ్ కృష్ణమూర్తి, టెక్నికల్ అఫీషియల్ విజయ్ రో వర్ పర్యవేక్షించారు. జిల్లాల ప్రతినిధులు ఉదర్ల జోషి (ఏలూరు), ఎన్.పవన్ (ఎన్టీఆర్), ఎం.తులసిరామ్ (అనకాపల్లి), పరిగి వేణుగోపాలరావు (సత్యసాయి), పి.శ్రీనివాస్ (శ్రీకాకుళం), వెంకటేష్ (పశ్చిమగోదావరి), ఎన్.దేవుడు (తూర్పుగోదావరి), సర్పంచ్ సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షుడు చంటి పాల్గొన్నారు. విజేతలు వీరే.. సబ్ జూనియర్ బాలికల విభాగం : ఎం.లక్ష్మి (ఏలూరు) స్వర్ణం, జె.హైడి రోసిలిన్ (పశ్చిమగోదావరి) రజతం, ఎం.జాగృతి (నెల్లూరు) కాంస్యం. సబ్ జూనియర్ బాలుర విభాగం : ఎం.కుశాల్ (నెల్లూరు) స్వర్ణం, ఎన్.జస్వంత్ (ఏలూరు) రజతం, బి.నిర్మలా నాయక్ (పశ్చిమగోదావరి) కాంస్యం. జూనియర్ మహిళల విభాగం : కె.ప్రేమకుమారి (ఏలూరు) స్వర్ణం, జె.వాసవి (అనకాపల్లి) రజతం, ఎస్.యమున (ఎన్టీఆర్ జిల్లా) కాంస్యం. జూనియర్ బాలుర విభాగం: జి.మాధవ్ (ఎన్టీఆర్ జిల్లా) స్వర్ణం, బి.లిఖిత్ నాయక్ (శ్రీకాకుళం) రజ తం, ఐ.జగదీష్ (ఎన్టీఆర్ జిల్లా) కాంస్యం. సీనియర్ పురుషుల విభాగ ం: జి.సాయిరామ్ (ఎన్టీఆర్ జిల్లా) స్వర్ణం, బి.సంతోష్ (ఏలూరు) రజతం, ఎన్.దేవరాజ్ (అనకాపల్లి) కాంస్య పతకాలు సాధించారు. -
ఏపీఆర్సెట్లో 42వ ర్యాంక్
నిడమర్రు: పెదనిండ్రకొలను గ్రామానికి చెందిన వంగ వెంకట ప్రభావతి శనివారం విడుదలైన ఏపీఆర్ సెట్లో 42వ ర్యాంక్ సాధించింది. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం పరిధిలో ఒంగోలు డీఎస్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఫర్ ఉమెన్స్లో గణితంలో పీహెచ్డీ సీట్ సాధించినట్లు మండల విద్యాశాఖ అధికారులు అనూరాధ, శేషగిరిరావులు తెలిపారు. తణుకు అర్బన్: అమరావతి ఇన్క్యూజివ్ క్రికెట్ కప్ 2026 కోసం జిల్లా స్థాయి దివ్యాంగ క్రికెటర్ల ఎంపికలు ఆదివారం తణుకు ఏఎస్సార్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించారు. డీసీఏఏ జనరల్ సెక్రటరీ యడ్లపల్లి సూర్యనారాయణ ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ లేళ్ల సుబ్బారాయుడు, ఆర్గనైజర్ పెరుమాళ్ల దిలీప్, డీసీసీఏపీ సభ్యులు కొండా సత్యవరప్రసాద్ పర్యవేక్షణలో జిల్లా జట్టును ఎంపిక చేశారు. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారుల దరఖాస్తుల పరిశీలన అనంతరం నెట్స్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా జట్టును ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. లింగపాలెం: బేర్ సీడ్ కంపెనీ ఏజెంట్ వల్ల సుమారు రూ.50 లక్షలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తొర్లపాటి బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లింగపాలెం మండలం తిమ్మక్కపాలెం గ్రామంలో ఆదివారం నష్టపోయిన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ మాట్లాడుతూ కంపెనీ ఏజెంట్ మన్నే రామకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులను నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ముదినేపల్లి(కై కలూరు): జిల్లాలో ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం భక్తులు రద్దీ కనిపించింది. దేవస్థాన ఆవరణ పుట్టలో భక్తులు పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. ఆలయ చైర్మన్ బొంగు రవికుమార్, ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగాశ్రీదేవీ, ధర్మకర్తల మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కై కలూరు: పెద్దింట్లమ్మా.. నీ భక్తులు కోరిన వరాలివ్వమ్మా.. అంటూ భక్తులు కొల్లేటికోట పెద్దింట్లమ్మను ఆర్తితో వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మకు మొక్కులు ఆదివారం తీర్చుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల విక్రయం, వాహనపూజలు, విరాళాల ద్వారా రూ.1,00,817 ఆదాయం వచ్చిందని తెలిపారు. కొయ్యలగూడెం: రాజవరం పంచాయతీ గంగవరం గ్రామ పరిధిలో నిత్యం కొనసాగుతున్న గ్రావెల్, మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని రాజవరం–1, 2 రెవెన్యూ అధికారులు తహసీల్దార్ ఎన్.నాగరాజుకు ఫిర్యాదు చేశారు. రాజవరం సమీపంలోని పెద్ద చెరువు, గంగవరం మెట్ట, ఎర్ర కాలువ ప్రాంతాల్లో జేసీబీ, టిప్పర్ లారీలు పెట్టి తోలకాలు చేస్తున్నారని దీని అడ్డుకుంటే తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వేనెంబర్ 483లో భారీ స్థాయిలో గ్రావెల్ మట్టి డంప్ చేసి ఉందని అన్నారు. అక్రమ తోలకాలను నిరోధించడంతోపాటు బాధ్యులైన వారిపై చేసి చర్యలు చేపట్టాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. -
పొగాకు నారుమడులకు రిజిస్ట్రేషన్ అవసరం
కొయ్యలగూడెం: పొగాకు నారుమడులు వేసే ప్రతి రైతు తప్పనిసరిగా టుబాకో బోర్డు వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వేలం నిర్వహణ అధికారి వి.శివకుమార్ సూచించారు. పొగాకు బోర్డు జారీ చేసిన ముఖ్యమైన నిబంధనలను వివరించారు. గరిష్ట పరిమితి: నారుమడుల రిజిస్ట్రేషన్కు ఒక వ్యక్తిగత రైతుకు గరిష్టంగా 2 హెక్టార్ల పరిమితి మాత్రమే ఉంటుంది. అంతకు మించి అనుమతి లభించదు. ముందస్తు అనుమతి తప్పనిసరి: రిజిస్టర్డ్ రైతు తన సొంత అవసరాల కోసం నారు పోసుకోవాలనుకున్నా, నేరుగా వేలం నిర్వహణ అధికారికి దరఖాస్తు చేసుకుని ముందస్తు అనుమతి పొందాలి. అధికారిక విత్తనాలే వాడాలి: రైతులు మార్కెట్లో దొరికే విత్తనాలను వాడకూడదు. ఎన్ఐఆర్సీ, ఏటీసీ–ఐఎల్టీడీ సంస్థలు సిఫార్సు చేసిన, ఎస్ఎల్ఎస్ అధికారిక నారుమడి విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. గుర్తింపు లేనివి కొంటే: గుర్తింపు లేని లేదా అనధికార నారుమళ్ల నుంచి నారు కొనుగోలు చేసి తోటలు వేస్తే, ఆ పొగాకును బోర్డు కొనుగోలు చేయదు. అలాంటి తోటలకు ఆథరైజేషన్ కార్డులు జారీ చేయరు. అనుమతి లేకుండా నారుమడులు వేసినా, కేటాయించిన విస్తీర్ణం కంటే ఎక్కువగా వేసినా నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఉల్లంఘనకు పాల్పడిన రైతుల నారుమడి నిర్వహణ, రిజిస్ట్రేషన్, బేరం లైసెన్సులు తక్షణమే రద్దు చేస్తారు. డెడ్లైన్: నారుమడులను నవంబర్ 30 నాటికి పూర్తిగా ధ్వంసం చేయాలి. నిర్ణీత గడువు తర్వాత కూడా నారుమడులు అలాగే ఉంచితే బోర్డు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. -
ఉత్సాహంగా బ్యాడ్మింటన్ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ శ్రీప్రకాష్ పాఠశాలలో రెండురోజులుగా కొనసాగుతున్న సీబీఎస్ఈ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. ఆదివారం ఉదయం మ్యాచ్లను పాఠశాల డైరెక్టర్ విజయ్ప్రకాష్ ప్రారంభించారు. అండర్–14, 17, 19 బాలుర విభాగాల్లో మొత్తం 54 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. క్యార్టర్ ఫైనల్స్ విభాగంలో ప్రతిభ చూపిన ప్రతి విభాగంలోని 4 జట్లు సెమీస్కు అర్హత సాధించాయి. అండర్–14 విభాగంలో గ్రీన్ సిటీ ఇంగ్లీష్ మీడియం (విశాఖ), డాక్టర్ కేఎల్ ప్రసాద్ స్కూల్ (గుంటూరు), గాడియం స్కూల్ (హైదరాబాద్), సర్ సీఆర్ రెడ్డి స్కూల్ (ఏలూరు) సెమీస్కు చేరుకున్నాయి. అండర్–17 విభాగంలో గాడియం స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్, మౌంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ (కర్నూలు), భారతీయ విద్యాభవన్ స్కూళ్లు సెమీస్లో స్థానం పొందాయి. అండర్–19 విభాగంలో శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ (పెద్దాపురం), ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్ (కాకినాడ), పల్లవి మోడల్ స్కూల్ (అల్వాల్), బీవీవీ వెంకటేశ్వర స్కూల్(తిరుపతి) సెమీస్కు చేరారు. ఈ పోటీలను టెక్నికల్ అడ్వైజర్ బృందం పర్యవేక్షించగా, రిఫరీలు శ్రీనివాస్, సాయిబాబు, పరమేశ్వరరావు, డి.శ్రీనివాస్ సహకారం అందించారు. తాడేపల్లిగూడెం: జీతం బకాయి సొమ్ము అడిగితే యూట్యూబ్ చానల్ ప్రతినిధులు వేధింపులకు పాల్పడగా కెమెరామెన్ ఉర్ల బాలకృష్ణ వర్ధన్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దేవ శివప్రసాద్ను ఆదివారం అరెస్టు చేశారు. డీఎస్పీ యు.రవిచంద్ర, ఎస్సై బాదం శ్రీనివాసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఉర్ల బాలకృష్ణ వర్ధన్ ఆత్మహత్యపై అతని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మీడియా సంస్థ నిర్వాహకులు సురేష్, శివలు తమ కుమారుడిని వేధించారని, అవి తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులలో ఒకరైన దేవ శివప్రసాద్ను ఆదివారం అరెస్టు చేశామన్నారు. సోమవారం కోర్టులో హాజరు పరుస్తామన్నారు. మరో నిందితుడు సురేష్ గురించి పోలీసు బృందాలు గాలిస్తున్నాయన్నారు. -
వెలవెలబోతున్న మత్స్య శిక్షణా కేంద్రం
● ఏకై క కేంద్రాన్ని పట్టించుకోని అధికారులు ● ప్రశ్నార్థకంగా విద్యార్థుల భవిష్యత్తు ఉంగుటూరు: రాష్ట్రంలోనే ఏకై క మత్స్య శిక్షణా కేంద్రమైన బాదంపూడి మత్స్య శిక్షణా సంస్థ విద్యార్థులు లేక వెలవెలబోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి భారీగా అభ్యర్థులు తరలివచ్చి ఇక్కడ శిక్షణ పొందేవారు. ఇక్కడ అందించే మూడు నెలల సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసిన వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విస్తృతంగా ఉద్యోగాలు సాధించారు. శిక్షణ ఇలా చేపల విత్తన (నారు) ఉత్పత్తి, చేపల రక్షణ, వ్యాధుల నివారణ చర్యలు, చెరువుల నిర్వహణ వంటి కీలకమైన అంశాలపై ఇక్కడ సమగ్ర శిక్షణ ఇస్తారు. గతంలో స్టైఫండ్తో 20 మంది, నాన్–స్టైఫండ్తో 20 మంది చొప్పున అభ్యర్థులకు హాస్టల్ వసతి కల్పిస్తూ శిక్షణనిచ్చేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత నిర్వహణ లోపాలు, పర్యవేక్షణ కరవవ్వడం వల్ల ఈ కేంద్రం ప్రాధాన్యం క్రమంగా తగ్గుతూ వచ్చింది. దానికితోడు ప్రభుత్వం ఇస్తున్న స్టైఫండ్ను కూడా రద్దు చేయడంతో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ ఏడాది కేవలం 12 మంది మాత్రమే చేరారు. తరగతులు క్రమబద్ధంగా జరగకపోవడం, బోధకులు తరచూ సెలవులు పెట్టడం వల్ల ఈ 12 మంది కూడా సరిగా రావడం లేదు. ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కేంద్రం భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మత్స్య శిక్షణా కేంద్రం నిబంధనల ప్రకారమే నడుస్తోంది. ప్రస్తుతం 12 మంది విద్యార్థులు శిక్షణ పొందుతుండగా తరగతులు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. ఇన్స్టిట్యూట్ సరిగా తెరవడం లేదనే వార్తల్లో నిజం లేదు. విద్యార్థులు ప్రాక్టికల్స్ కోసం బయటకు వెళ్లినప్పుడు కేంద్రం ఖాళీగా కనిపిస్తుంది తప్ప, నిర్వహణలో ఎలాంటి లోపాలు లేవు. – భార్గవి, నిర్వహణ అధికారి -
హోరాహోరీగా చెస్ పోటీలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): మాస్టర్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో వెస్ట్ గోదావరి జిల్లా అండర్–19 ఓపెన్ అండ్ గర్ల్స్ చదరంగం పోటీలు పట్టణంలో ఆదివారం వాణి స్కూల్లో హోరాహోరీగా జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆంధ్ర చెస్ వైస్ చైర్మన్ సీహెచ్ఆర్కే వర్మ, నిర్వాహకుడు ఎస్ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ జమ రాంబాబు హాజరయ్యారు. మొదటి నాలుగు స్థానాలు సాధించిన క్రీడాకారులు జిల్లా తరపున ఆగస్టు 1, 2 తేదీల్లో అనకాపల్లిలో జరిగే రాష్ట్ర అండర్ చదరంగం పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. బాలుర విభాగంలో ఎన్.కుష్వంత్ (భీమవరం), కె.త్రిశాంక్ కోటి (తాడేపల్లిగూడెం), పి.జోగేందర్ (తాడేపల్లిగూడెం) మౌర్య రామసూర్య (పాలకొల్లు), బాలికల విభాగంలో వి.సునీత (గణపవరం), కె.మోక్షిత్ (భీమవరం), కె.సాన్విత (తణుకు), కె.తేజస్విని (తాడేపల్లిగూడెం)లు విజేతలుగా నిలిచారు. -
అమర జవాన్ల త్యాగం స్ఫూర్తిదాయకం
భీమవరం: కార్గిల్ అమరవీరుల త్యాగాల సువర్ణాక్షరాలతో చిరస్థాయిగా నిలిచిపోతాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భీ మవరంలో జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో వీర జవాన్లకు ఘన నివాళులర్పించారు. మాజీ సైనికులను మంత్రి సత్కరించారు. అనంతరం పట్టణంలో భారీ కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ దేశ సరిహద్దులను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకమన్నారు. అమర జవాన్ల స్ఫూర్తితో యువత నవభారత నిర్మాణానికి పునరంకితం కావాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు గోపాల్ పాల్గొన్నారు. -
కళారూపాలు కనుమరుగు
● దయనీయ స్థితిలో కళాకారులు ● సంచార జాతులకు ప్రోత్సాహం కరువు పాలకోడేరు: సంస్కృతి అంటే ఆలయాలు, పండుగలతో పాటు కళారూపాలు కూడా. తెలుగు నేలకు ప్రాణం పోసిన జానపద కళలు ఆధునికత దెబ్బకు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. ఫలితంగా మన గుర్తింపు, సాంస్కృతిక వారసత్వం ప్రమాదంలో పడుతున్నాయి. కాలగర్భంలో కలుస్తున్న ‘బుడబుక్కల’ కళ ఒకప్పుడు తెల్లవారుజామునే ఊరూరా డమరుకం మోగిస్తూ, శ్రీఅంబ పలుకు జగదంబ పలుకుశ్రీ అంటూ ప్రజలను మేల్కొలిపే శ్రీబుడబుక్కలశ్రీ వారు గ్రామీణ జీవనంలో అంతర్భాగంగా ఉండేవారు. రంగురంగుల దుస్తులతో శుభాశుభాలు చెప్తూ, జానపద గేయాల ద్వారా వినోదాన్ని, ఆధ్యాత్మిక సందేశాలను అందించేవారు. తోలుబొమ్మలాట, బుర్రకథ వంటి కళలతో పాటు ఈ రూపం కూడా పురాణ గాథలను, ఆచారాలను తరువాతి తరాలకు అందించేది. ఆధునికత ప్రభావం.. కళాకారుల దయనీయ స్థితి టీవీలు, స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా వంటి ఆధునిక వినోద మాధ్యమాల విస్తరణతో సంప్రదాయ కళలకు ఆదరణ కరువైంది. జీవనోపాధి లేక, కొత్త తరం కూడా ఈ రంగం వైపు రాకపోవడంతో ఈ కళ అంతరించిపోయే దశకు చేరింది. ప్రస్తుతం ఈ కళాకారులు స్థిర నివాసం లేక గుడారాల్లో నివసిస్తూ చిత్తు కాగితాలు ఏరుకోవడం, పూసల దండలు అమ్మడం లేదా యాచక వృత్తి ద్వారా పొట్టపోసుకుంటున్నారు. కాగితాలపై శ్రీబీసీ–ఏశ్రీ జాబితాలో ఉన్నప్పటికీ, దారిద్య్రరేఖకు దిగువన అత్యంత దయనీయ జీవితాన్ని గడుపుతున్నారు. వీరు తమను శ్రీఎస్టీశ్రీ జాబితాలో చేర్చాలని లేదా కనీసం అంత్యోదయ అన్నయోజన (రేషన్) కార్డులు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు ● ఈ పురాతన సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వాలు, సాంస్కృతిక సంస్థలు తక్షణమే స్పందించాలి. ● వృద్ధులకు, కళాకారులకు క్రమం తప్పకుండా పింఛన్లు, ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలి. ● కొత్త తరానికి ఈ కళలను నేర్పించేందుకు ప్రత్యేక శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలి. ● పాఠశాల పాఠ్యంశాల్లో, సాంస్కృతిక ఉత్సవాల్లో జానపద కళలకు ప్రాధాన్యమిచ్చి యువతలో అవగాహన పెంచాలి. ● జానపద కళలను కాపాడుకోవడం అంటే మన అస్తిత్వాన్ని, మూలాలను కాపాడుకోవడమే.బుడబుక్కలు, దొమ్మరి, తోలు బొమ్మలాట వారు సంచార, అర్ధ సంచార, విముక్తి జాతులుగా పిలవబడుతున్నారు. వీరికి తరతరాలుగా అక్షర జ్ఞానం లేకపోయినా, భారత, భాగవత, రామాయణాలను ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. వీరిని గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అలాగే ఇల్లు, ఆహారం వంటి వసతులు కల్పించాలి. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా వీరంతా అన్ని రంగాల్లో దూరంగానే ఉన్నారు. – చింతపల్లి గురుప్రసాద్, సంచార జాతుల రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సంచార జాతుల్లో ఉన్న కళాకారులను గుర్తించి, ప్రభుత్వం ప్రోత్సహించాలి. కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న సాంస్కృతిక రంగానికి, సంచార జాతుల కళాకారులకు ప్రవేశం కల్పించి అసలైన కళారూపాలను ప్రజలకు అందించాలి. ఎన్నికల ముందు ఈ కళాకారులకు గుర్తింపు కార్డులు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి రెండేళ్లయినా ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. – పెండ్ర వీరన్న, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, సంచార జాతుల వ్యవస్థాపక అధ్యక్షుడు -
కళ తప్పిన ఖరీఫ్
● జాడ లేని వానలు ● ఎండిపోతున్న నారుమడులు ● అడుగంటిన చెరువులు లింగపాలెం: జూలై మాసం ముగుస్తున్నా వరుణుడి జాడ లేకపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మెట్ట ప్రాంతంలో వ్యవసాయానికి, తాగునీటికి వర్షపాతమే ప్రధాన ఆధారం. ఏటా ఈ సమయంలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగేవి. అయితే ఈ ఏడాది వర్షాభావం వల్ల పనులు లేక కూలీల కుటుంబ పోషణ కష్టంగా మారింది. కరువు మేఘాలు.. ఎండమావులుగా చెరువులు జూన్లో కురిసిన కొద్దిపాటి వర్షాలకు రైతులు దు క్కులు దున్ని, నాట్లు వేసేందుకు వరి నారుమడులు పోశారు. అయితే జూలైలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ నెలలో సాధారణంగా 140 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 5 మి.మీ. మాత్రమే నమోదైంది. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో తీవ్రమైన ఎండలు, ఉక్కపోత నెలకొన్నాయి. వర్షాలు లేక చెరువులు ఎండిపోయాయి. బోరు బావుల్లో నీటిమట్టాలు అడుగంటిపోయాయి. విత్తిన విత్తనాలు మొలకెత్తక, మొలకెత్తిన నారుమడులు నీరు లేక ఎండిపోతున్నాయి. పడిపోతున్న తమ్మిలేరు నీటిమట్టం ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహాలు రాకపోవడం, స్థానికంగా వర్షాలు కురవకపోవడంతో తమ్మిలేరు రిజర్వాయర్లో నీటిమట్టం దారుణంగా పడిపోయింది. ఈ రిజర్వాయర్ పరిధిలోని దాదాపు 37,000 ఎకరాల ఆయకట్టు సాగు ఇప్పుడు అంధకారంలో పడింది. లింగపాలెం మండలంలో దయనీయం లింగపాలెం మండలంలో ఏటా ఖరీఫ్ సీజన్లో 6,000 ఎకరాల వరకు వరి సాగవుతంది. కానీ ప్రస్తుతం నీటి కొరత కారణంగా కేవలం 350 ఎకరాల్లో మాత్రమే బోరు బావుల కింద సాగు చేపట్టారు. ఈ పంట కూడా తగినంత నీరందక ఎండిపోయే స్థితికి చేరింది. -
5న వైఎస్ జగన్ ‘పొగాకు మహోద్యమం’ సభ
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వచ్చేనెల 5న దేవరపల్లిలో ‘పొగాకు మహోద్యమం’ సభను నిర్వహించనున్నారని, పార్టీ శ్రేణులు జయప్రదం చే యాలని పార్టీ చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు పిలుపునిచ్చారు. ఆదివారం జంగారెడ్డిగూడెంలో పార్టీ నేత జెట్టి గురునాథరావు కార్యాలయం వద్ద పార్టీ ముఖ్య నాయకులు, యువజన విభాగం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయరాజు మా ట్లాడుతూ మెట్ట ప్రాంతంలో పొగాకు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ విషయాన్ని తాము వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లగా, జంగారెడ్డిగూడెంలో గతంలో రైతులు చేసిన ఉద్యమాన్ని ఆయన కొనియాడారని గుర్తుచేశారు. ప్రతి పొగాకు బేలూ కొనుగోలు చేసేంత వరకూ రైతులకు వైఎస్సార్సీపీ అండగా నిలిచి పోరాడుతుందని స్పష్టం చేశారు. దేవరపల్లిలో జరిగే మహాసభకు పార్టీ నా యకులు, కార్యకర్తలు, యువతతో పాటు రైతులంతా పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు కర్పూరం గౌరయ్యగుప్త, యువ నాయకుడు జెట్టి సత్య ఆదిత్య, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ముప్పిడి శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ అయినాల వెంకట రమణమూర్తి, నేకూరి కిషోర్, జిల్లా నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చిప్పాడ వెంకన్న, రాష్ట్ర నాయకుడు భావన ఋషి, నాయకులు కాసర శేషారెడ్డి, కత్తి వసంత్, డాక్టర్ పళ్ల రమణ, గగ్గల కిరణ్ కుమార్, కాటం అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
రోగాలకు తెరపడేదెప్పుడో?
బుట్టాయగూడెం : పశ్చిమ ఏజెన్సీ ప్రాంత గిరిజన గ్రామాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, మారిన వాతావరణ పరిస్థితుల వల్ల బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. కొన్నిచోట్ల బెడ్లు సరిపోక బల్లలపై, నేలపైనే చికిత్స పొందాల్సిన దుస్థితి నెలకొంది. టైఫాయిడ్, మలేరియా కేసులు తీవ్రమవ్వడంతో పాటు రోగులలో ప్లేట్లెట్స్ కూడా పడిపోతున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 313 మలేరియా కేసులు నమోదు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఏజెన్సీ ప్రాంతంలో 313 మలేరియా కేసులు నమో దయ్యాయి. వీటిలో 306 ఏజెన్సీ పరిధిలోనే నమో దు కాగా, 7 కేసులు వెలుపలి ప్రాంతాలకు చెందినవి. ఈ ప్రాంతంలో దాదాపు 220 గ్రామాలను మలేరియా ప్రభావిత ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. నివారణ చర్యల్లో భాగంగా మొదటి విడత స్ప్రేయింగ్ పనులు పూర్తి చేసినప్పటికీ, ప్రస్తుత వాతావరణ మార్పుల వల్ల వ్యాధులు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. దోమ తెరల పంపిణీ ఊసేలేదు సాధారణంగా మలేరియా కట్టడికి మలాథియాన్ స్ప్రేయింగ్తో పాటు దోమతెరలను పంపిణీ చేస్తుంటారు. గతంలో (2021లో) వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 2,50,000 దోమతెరలను అందజేశారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్క దోమతెర కూడా పంపిణీ చేయకపోవడంపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. జ్వరాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించి గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఉచితంగా దోమతెరలు పంపిణీ చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఏజెన్సీ ప్రజలు కోరుతున్నారు. అంతర్వేదిగూడెంలోని ప్రభుత్వాస్పత్రిలో జ్వర పీడితులు మంచం పట్టిన మన్యం విజృంభిస్తున్న జ్వరాలు ఈ ఏడాదిలో 313 మలేరియా కేసులు జ్వరపీడితులతో ఆస్పత్రులు కిటకిట ఇప్పటికీ పంపిణీ కాని దోమ తెరలు ఏజెన్సీ ప్రాంతంలోని గ్రా మాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామాల్లోని ప్రతి ఇంట్లో జ్వరపీడితులు కనిపిస్తున్నారు. ఆస్పత్రులు కూడా నిండిపోయి కిటకిటలాడున్నాయి. గ్రామంలోనే ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి ప్రజలకు వైద్యసేవలు అందించేలా కృషి చేయాలి. – కారం రాఘవ, ఏఐకేఎమ్ఎస్ నాయకులు, అలివేరు, బుట్టాయగూడెం మండలంఈ ఏడాది సరైన వైద్యం అందక పలువురు ప్రాణాలు కోల్పోయారు. మోతుగూడెంకు చెందిన రిత్విక అనే చిన్నారి స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో సకాలంలో వైద్యం అందక మృతి చెందగా, ఇటీవల పులిరామన్నగూడెంకు చెందిన గిరిజన విద్యార్థిని మడకం నందిత మలేరియాతో ప్రాణాలు విడిచింది. -
నకిలీ వీసాలతో మోసం
నూజివీడు: వీసాలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇప్పించి విదేశాలకు పంపిస్తామని నమ్మించి నకిలీ వీసాలతో మోసం చేస్తున్న నిందితులను నూజివీడు పోలీసులు అరెస్టు చేశారు. నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ ఆదివారం వివరాలు వెల్లడించారు. పట్టణంలోని నెహ్రూపేటకు చెందిన రాచప్రోలు ఫణిసుందర్ తన నుంచి నూజివీడుకు చెందిన అట్టారాహ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు కంచల డానియేల్ విక్టర్, హైదరాబాద్కు చెందిన అన్ని ట్రాన్స్ ఓషనిక్ ప్రైవేటు లిమిటెడ్ నిర్వాహకుడు దారా వివేక్ రాజ్ యూకేలో ఉద్యోగం, వీసా ఇప్పిస్తామని నమ్మించి రూ.14.45లక్షలు వసూలు చేసి నకిలీ ఈ వీసా ఇచ్చి మోసం చేశారని ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు తీగలాగితే డొంక కదిలింది. వీరు ఇక్కడ ఒక్కచోటే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన దాదాపు 41 మంది నుంచి దాదాపు రూ.6.50 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. యూకే, కెనడా, లక్సెంబర్గ్ తదితర దేశాలకు పంపుతామని, కావాల్సిన వీసాలు ఇప్పిస్తామని నమ్మబలికి వారందరిని మోసం చేశారు. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి వారిపై బీఎన్ఎస్ ప్రకారం 318(4), 336 రెడ్విత్3(5) కింద కేసు నమోదు చేశారు. దారా వివేక్రాజ్ది పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ కాగా కంచల డానియేల్ విక్టర్ది నూజివీడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేధించిన పట్టణ ఎస్సైలు లక్ష్మణ్బాబు, కే.నాగేశ్వరరావు, మరో ముగ్గురు కానిస్టేబుళ్లను డీఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. సమావేశంలో సీఐ ఐవీ నాగేంద్రకుమార్ పాల్గొన్నారు. విదేశాల్లో ఉద్యోగాలిప్పించి వీసాలిచ్చి విదేశాలకు పంపుతామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా డీఎస్పీ సూచించారు. ఏదైనా కన్సల్టెన్సీ, ఏజన్సీ ద్వారా విదేశాలకు వెళ్లే ముందు ఆ సంస్థ లైసెన్స్, రిజిస్ట్రేషన్ వివరాలను ప్రభుత్వ పోర్టల్లో తనిఖీ చేసుకోవాలన్నారు. పోలీసుల అదుపులో నిందితులు -
ఉచిత న్యాయ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): న్యాయసేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సేవలను అవసరమైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్యానల్ న్యాయవాదులు సూచించారు. రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు కార్గిల్ విజయ దివస్ సందర్భంగా ఆదివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక వన్టౌన్లోని మాజీ సైనిక ఉద్యోగుల అసోసియేషన్లో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సులో ప్యానల్ న్యాయవాదులు మాట్లాడుతూ వీర్ పరివార్ సహాయత యోజన పథకాలపై అవగాహన కలిగించారు. మాజీ సైనిక ఉద్యోగులకు ఎదురయ్యే ఆస్తి, పెన్షన్ బకాయిలు మొదలైన అంశాలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచిత సహాయం అందిస్తుందని ఈ అవకాశాన్ని అవసరమైన సైనిక ఉద్యోగులు ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాదులు సంగీతరావు, జీవీ భాస్కర్, వెంకటేశ్వరరావు, జీవీ రమణ, జిల్లా సైనిక సంక్షేమ ఆఫీసర్ కొండలరావు, మాజీ సైనిక ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
స్ఫూర్తిప్రదాత ప్రగడ కోటయ్య
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో చేనేత రంగ పరిశ్రమ అభివృద్ధికి, చేనేత కార్మికుల సంక్షేమం కోసం విశేషంగా కృషిచేసిన దివంగత ప్రగడ కోటయ్య జీవితం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో జిల్లా చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో కోటయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. కోటయ్య చిత్రపటానికి కలెక్టర్తో పాటు జేసీ అభిషేక్ గౌ డ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పి ంచారు. కలెక్టర్ మాట్లాడుతూ కోటయ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఉత్తర్వు లు జారీ చేయడం శుభపరిణామమన్నారు. చే నేత వర్గాల ప్రయోజనాల కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ఇన్చార్జి డీఆర్వో ఎల్.దేవకీ దేవి, ఉమ్మడి జిల్లా చేనేత జౌళిశాఖ శాఖ అధికారి బి.హనుమంతరావు, కలెక్టరేట్ ఏఓ ఎన్వీ నాంచారయ్య పాల్గొన్నారు. పోలవరం రూరల్: గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఎగువ ప్రాంతాల నుంచి కొండవాగుల నీరు వచ్చి చేరడంతో నదిలో వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటిమట్టం 28 మీటర్లు దాటింది. స్పిల్వేకి చెందిన 48 గేట్ల ద్వారా 52 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లో గోదా వరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆహాకారం
నూజివీడు: ‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు’ అంటారు. అలాంటి ఉల్లిపాయ, వెల్లుల్లి లేని వంటగది సాధారణంగా ఎక్కడా ఉండదు. రోగనిరోధక శక్తిని పెంచి, కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇవేమీ ఉపయోగించకుండా వంటలు చేస్తుండటంతో నూజివీడు ట్రిపుల్ఐటీ విద్యార్థులు రుచీపచీ లేని ఆహారాన్ని తినలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. నామినేషన్ పద్ధతిలో మెస్ కేటాయింపు నూజివీడు ట్రిపుల్ఐటీలోని 8,800 మంది విద్యార్థులకు భోజన వసతి కల్పించే బాధ్యతను ఎలాంటి టెండర్లు పిలవకుండానే ఏకపక్షంగా, నామినేషన్ పద్ధతిలో హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్కు మూడేళ్ల కాలపరిమితితో అప్పగించారు. ప్రతి విద్యార్థికి రోజుకు రూ.110 చొప్పున చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని, 2025 దసరా సెలవుల అనంతరం నుంచి ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెస్ నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో ఉన్న కాంట్రాక్టర్లకు రోజుకు రూ.88 మాత్రమే చెల్లించేవారని, ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఇచ్చినా ఆహార నాణ్యతలో ఎలాంటి మార్పూ లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నం సరిగా ఉడకకపోవడమే కాకుండా తరచూ దుర్వాసన వస్తోందని.. దీనిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిందామంటే తిండి లేదు ఉదయాన్నే ఇచ్చే అల్పాహారంలో ఒక్క ఇడ్లీ తప్ప మిగతావేవీ తినేలా ఉండటం లేదు. గారెలు, పునుగులు చేదుగా ఉండి, చల్లారితే రాతిలా గట్టిపడుతున్నాయి. అట్లు కూడా రుచిగా ఉండటం లేదు. కూరగాయలతో చేసే వంటకాలను అతిగా డీప్ ఫ్రై చే స్తుండటంతో తినలేకపోతున్నారు. ఉల్లి, వెల్లుల్లి అ సలే వాడకపోవడంతో వంటకాలకు రుచి ఉండటం లేదు. దీంతో వేరే దారి లేక విద్యార్థులు పెరుగన్నంతోనే కడుపు నింపుకుంటున్నారు. రుచీపచీ లేని భోజనం అల్పాహారం అంతంతమాత్రమే.. ఉల్లి, వెల్లుల్లి వాడకుండానే కూరలు గుడ్డు, చికెన్ అందించని వైనం ట్రిపుల్ఐటీ విద్యార్థుల ఆవేదన వేసవి సెలవుల అనంతరం జులై 1న తరగతులు ప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇప్పటివరకు గుడ్డు కానీ, చికెన్ కానీ పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. గంలో వారంలో 5 రోజులు కోడిగుడ్డు, 2 రోజులు చికెన్ ఇచ్చేవారు. నూతన యాజమాన్యం వచ్చాక దానిని 4 రోజుల గుడ్డు, ఒక రోజు చికెన్కు కుదించారు. అయితే ప్రస్తుతం ఇవేమీ అందించడం లేదు. అయినా నెలాఖరున మెస్ బిల్లులు వసూలు చేసేటప్పుడు మాత్రం నాన్వెజ్తో కలిపే చార్జి చేస్తారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఉల్లి, వెల్లుల్లితో కూడిన నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడంతో పాటు మెనూ ప్రకారం కోడిగుడ్డు, చికెన్లను రోజూవారీగా సక్రమంగా అందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
శ్రీనివాసా.. గోవిందా..
ద్వారకాతిరుమల : సెలవు దినం కావడంతో ఆదివారం ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట, అనివెట్టి మండపాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. సాయంత్రం వరకూ రద్దీ కొనసాగింది. దెందులూరు : పెదవేగి మండలం వేగివాడలో ఓ 24 ఏళ్ల యువకుడికి కరోనా సోకింది. ఈ విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. సదరు యువకుడికి డయాలసిస్ చేయించాల్సి ఉన్నందున విజయవాడ తరలించామని వైద్యాధికారులు తెలిపా రు. కరోనా వైరస్ తీవ్రతరమైంది కాదని ఫ్లూ మాదిరిగా వచ్చి పోతుందని డీఎంహెచ్ఓ శోభ అన్నారు. ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉంటూ వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, గుంపులుగా ఉన్న సమూహాల్లోకి వెళ్లొద్దన్నారు. కరోనా వైరస్పై సూచనలు, సలహాలు, అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దెందులూరు : ఇటలీలో పోప్ లియోను ఆది వారం దెందులూరుకు చెందిన ఆర్సీఎం ఫాదర్ పులిపాటి అనుదీప్ కలిశారు. పోప్ నుంచి దీవెనలు తీసుకున్నారు. దేశంలో శాంతి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ప్రార్థనలు చేయాలని కోరినట్టు ఫాదర్ అనుదీప్ తెలిపారు. తమ సోదరుడు అనుదీప్ పోప్ లియోను కలవడం అదృష్టం భా విస్తున్నట్టు వైఎస్సార్సీపీ నేత, ఎంపీటీసీ పులిపాటి ఆనంద్ అన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట) : ఆర్టీసీ కార్గో సర్వీసుకు సంబంధించి ఆథరైజ్డ్ పార్సిల్ బుకింగ్ ఏజెంట్లుగా నియమించడానికి అవకాశం కల్పిస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం ప్రకటనలో తెలిపారు. ఏలూరు పరిసర ప్రాంతాలైన వట్లూరు, సత్రంపాడు, శనివారపు పేట, ఆదివారపు పేట తూర్పువీధి, తంగెళ్లమూడి, అలాగే మండవల్లి, పెదపాడు, పెద వేగి, చాటపర్రు, అశోక్నగర్, నరసింహారావుపేట, ఫైర్స్టేషన్, మినీ బైపాస్, రామకృష్ణా పురం తదితర ప్రాంతాల్లో పార్సిల్ బుకింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు ఆర్టీసీ కార్గో ఏటీఎంను సెల్ 73311 47263లో సంప్రదించాలని కోరారు. తాడేపల్లిగూడెం (టీఓసీ) : భారతీయ విద్యాభవన్స్లో 38వ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్షిప్ 2026 ఎంపిక పోటీ లు జరిగాయి. వీరంపాలెం హైస్కూల్కు చెందిన కె.భువనేశ్వరి అండర్–16 షాట్పుట్ విభాగంలో, ఎం.హేమశ్రీ అండర్–14లో ట్రయాతలాన్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచారు. వీరు తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాల హెచ్ఎం బి.సుకుమార్, పీఈటీ బి.ఉమామహేశ్వరి, ఉపాధ్యాయులు వీరిని అభినందించారు. భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను సోమవారం భీ మవరం కలెక్టరేట్తో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ కూడా నిర్వహిస్తామన్నారు. -
ఖర్జూరంలో పురుగులు.. పాడైపోయిన చిక్కీలు
సమస్యల సుడిగుండంలో.. కై కలూరు: కూటమి ప్రభుత్వ పాలనలో అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పంపిణీ చేసే పోషకాహారంలో పురుగులు, బూజు వస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. దీనికితోడు ఐసీడీఎస్ అధికారులకు, అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వ్యత్యాసాలు, అగాధం ఏర్పడుతోంది. పురుగులు పట్టిన ఖర్జూరాలను పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు తమ ముఖంపైనే విసిరికొడుతున్నారని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్లో వెల్లడవుతున్న అసంతృప్తి కేంద్రాలకు సరఫరా అయ్యే వస్తువుల నాణ్యతపై ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. నాణ్యత బాగుంటే ‘1’, బాగోలేకపోతే ‘2’ నొక్కాలని అడగ్గా.. మెజారిటీ లబ్ధిదారులు నాణ్యత సరిగ్గా లేదనే (2) సమాధానమిస్తున్నారు. అయితే, ఐసీడీఎస్ సిబ్బంది సరుకుల నాణ్యతను మెరుగుపరచడం వదిలేసి, కార్యకర్తలపైనే మండిపడుతుండటం గమనార్హం. కార్యకర్తలపైనే ఆర్థిక భారం : పెరిగిన ధరలతో జీవనం భారంగా మారిన తరుణంలో, ఐసీడీఎస్ కార్యాలయం చెల్లించాల్సిన ఖర్చులను కూడా తమపైనే రుద్దుతున్నారని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల పోషణ్ పక్వాడా ముగింపు వేడుకలకు కలెక్టర్ వెట్రిసెల్వి వచ్చారు. ఆ తర్వాత వచ్చిన అధికారులకు భోజనాలు, ఇతర పదార్థాల తయారీకి దాదాపు రూ.30 వేలు ఖర్చవగా, ఆ భారాన్ని తమపైనే వేశారని అంగన్వాడీలు తెలిపారు. కొత్త మెనూ చార్టుల ఫ్లెక్సీల కోసం ఒక్కో కేంద్రం నుంచి రూ.100 వసూలు చేస్తున్నారని, నిజానికి కై కలూరులో ఫ్లెక్సీ తయారీకి రూ.70 మాత్రమే ఖర్చవుతుందని వారు చెబుతున్నారు. అలాగే కై కలూరు ఓరియంటల్ స్కూల్లో జరిగిన ఒక్కరోజు శిక్షణకు సంబంధించిన భోజన ఖర్చులు రూ.270 ఇంకా చెల్లించలేదని, కేంద్రాల్లో నిర్వహించే టీబీ ఈవెంట్ బిల్లులను కూడా సకాలంలో మంజూరు చేయడం లేదని వాపోతున్నారు. నిలదీసి అడుగుతుంటే వేదింపులకు గురుచేస్తోన్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని అంగన్వాడీ కార్యకర్త చెప్పారు.కోడిగుడ్ల సైజుల్లో వ్యత్యాసాలు చిక్కీలోపల బూజు అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం ఇలా.. కోడిగుడ్డు సైజుల్లో వ్యత్యాసాలు ఐవీఆర్ఎస్ కాల్స్లో సరుకులపై తీవ్ర వ్యతిరేకత ఖర్చులు తమపై మోపుతున్నారని కార్యకర్తల ఆవేదన జిల్లాలోని 10 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 2,225 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఒక్క కై కలూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో, 13 సెక్టార్ల పరిధిలో 311 కేంద్రాలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అటుకులు, రాగిపిండి, బెల్లం, ఖర్జూరం, చిక్కి వంటి 6 రకాల పదార్థాలను అందిస్తున్నారు. వీటిలోని ఖర్జూరాల్లో తెల్లటి పురుగులు కనిపిస్తుండగా, చిక్కి బూజు పడుతోంది. నిబంధనల ప్రకారం ఒక్కో గుడ్డు 50 గ్రాములు ఉండాల్సి ఉండగా, చాలావరకు చిన్న సైజు గుడ్లే సరఫరా అవుతున్నాయి. రాగి జావ తయారీకి ఇచ్చే పిండిలో ఇసుక వస్తోంది. ఆన్లైన్ నమోదు ప్రకారమే రేషన్ ఇస్తున్నా, సరుకుల నాణ్యత లోపం వల్ల గ్రామాల్లో జనం తమను నిలదీస్తున్నారని అంగన్వాడీ టీచర్లు వాపోతున్నారు. వైఎస్సార్సీపీ పాలనలోనే సరుకుల నాణ్యత మెరుగ్గా ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కూటమి నాయకుల మాట వినకపోతే తమపై వరుసగా ఫిర్యాదులు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. -
క్యూ కదలక.. స్వామి కానరాక
నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం ద్వారకాతిరుమల: శ్రీవారి శాశ్వత నిత్యాన్నదాన ట్రస్టుకు ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లికి చెందిన బిక్కిన లక్ష్మీనరసమ్మ రూ.1,01,116 విరాళంగా అందజేశారు. పెంటపాడు: ప్రత్తిపాడు గ్రామ దేవత పైళ్లమ్మ అమ్మవారికి శనివారం సారె కార్యక్రమం నిర్వహించారు. అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం శ్రీ 26 శ్రీ జూలై శ్రీ 2026ద్వారకాతిరుమల: తొలి ఏకాదశి సందర్భంగా శనివారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి రావడంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిలబడలేక పలువురు క్యూలైన్లలోనే కింద కూర్చుండిపోగా, ఆలయంలోకి వెళ్లకుండానే దేవుడు బయటే కనిపించాడు అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పాత క్యూ కాంప్లెక్స్ వినియోగంలో ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కావని, కొత్త క్యూ కాంప్లెక్స్ వల్ల ఈ పరిస్థితులు నెలకొన్నాయని చర్చ సాగుతోంది. దర్శనం త్వరగా పూర్తవుతుందన్న ఆశతో రూ.200 దర్శనం టికెట్లు కొనుగోలు చేసి క్యూలైన్లలోకి వచ్చిన భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.100 దర్శనం టికెట్ తీసుకున్నవారు, ఉచిత దర్శనం భక్తులు తమకంటే ముందుగా దర్శనానికి వెళ్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో కొందరు భక్తులు నిలబడలేక క్యూలైన్లలోనే కింద కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెల్ఫోన్లు భద్రపరిచేందుకు బారులు సెల్ఫోన్లను భద్రపరిచేందుకు ఏర్పాటు చేసిన డిపాజిట్ కౌంటర్ల వద్ద కూడా భక్తులు బారులు తీరారు. నూతన అనివెట్టి మండపం నుంచి అన్నమయ్య విగ్రహ కూడలి వరకు క్యూలైన్లు కొనసాగాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కౌంటర్ వద్ద అప్పటికప్పుడు షామియానా ఏర్పాటు చేశారు. కొత్త క్యూ కాంప్లెక్స్ ప్రారంభం తర్వాత.. నూతన శాశ్వత క్యూ కాంప్లెక్స్ ప్రారంభమైనప్పటి నుంచి భక్తుల ఇబ్బందులు మరింత పెరిగాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నమయ్య విగ్రహ ప్రాంతంలో తాత్కాలిక క్యూ కాంప్లెక్స్ ఉన్నప్పుడు భక్తులకు ప్రశాంతంగా స్వామివారి దర్శనం జరిగిందని, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆలయ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. మరోవైపు, అష్టకష్టాలు పడి ఆలయంలోకి చేరుకున్నా.. వెనుక భక్తుల రద్దీ ఎక్కువగా ఉందంటూ సిబ్బంది త్వరత్వరగా బయటకు పంపేస్తున్నారని, దీంతో స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకునే అవకాశం దక్కడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక క్యూ కాంప్లెక్స్ అవసరం ఇటీవల ప్రారంభమైన నూతన శాశ్వత క్యూ కాంప్లెక్స్ భక్తుల రద్దీకి సరిపోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితిని ముందుగానే గుర్తించిన అధికారులు నూతన అనివెట్టి మండపం పక్కన లక్షలాది రూపాయలు వెచ్చించి తాత్కాలిక క్యూలైన్లు నిర్మించి, వాటిపై వాటర్ప్రూఫ్ టాప్ ఏర్పాటు చేశారు. ఆ క్యూలైన్ల లోంచి భక్తులు మళ్లీ శాశ్వత క్యూ కాంప్లెక్స్ వద్ద ఉన్న క్యూలైన్లలోకి వెళ్లి, అందులో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వృద్ధులు, చిన్నారులు ఎక్కువసేపు నిలబడలేక క్యూ లైన్లలోనే ఇబ్బందులు పడుతున్నారు. నూతన అనివెట్టి మండపం పక్కన తాత్కాలిక క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తే భక్తులకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. లేకపోతే ముక్కోటి ఏకాదశి, గోదావరి పుష్కరాలు జరిగే సమయంలో భారీగా తరలి వచ్చే భక్తులకు మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, అవాంచనీయ ఘటనలు జరిగే ప్రమాదం కూడా లేకపోలేదని పేర్కొంటున్నారు.శ్రీవారి అంతరాలయ ద్వారం, దాని ముందు, పక్కన ఉన్న ద్వారాలను పెద్దవి చేయాల్సిన అవసరం ఉందని దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ అధికారులకు సూచించారు. ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డీవీ భాస్కర్, ఆలయ ప్రధానార్చకులు పీవీఎస్ఎస్ఆర్ జగన్నాథాచార్యులను వెంటబెట్టుకుని ఆయన రూ.100, రూ. 200, ఉచిత దర్శనం క్యూలైన్లలోకి వెళ్లారు. అక్కడ నుంచి చూసే సామాన్య భక్తులకు స్వామివారు కనిపించడం లేదని, ఆలయ ద్వారాలను పెద్దవి చేయాల్సి అవసరం ఉందని సూచించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ట్రస్టు బోర్డులో ఆమోదించి తనకు పంపాలని ఆదేశించారు. తొలి ఏకాదశికి ద్వారకాతిరుమలకు పోటెత్తిన భక్తులు దర్శనానికి క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షణ నిలబడలేక చతికిలపడ్డ పలువురు భక్తులు ఆలయ ద్వారాలు పెద్దవి చేయాలని దేవదాయ కమిషనర్ సూచన రూ.200 దర్శనం క్యూలైన్న్లో 4 గంటల నుంచి వేచి ఉన్నా దర్శనం కాలేదు. రూ.100, ఉచిత దర్శనం భక్తులు కూడా ముందే వెళ్తున్నారు. క్యూలైన్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. – చిన్నశెట్టి గోపీ, భక్తుడు – దమ్మపేట, తెలంగాణ గతంలో దర్శనానికి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదు. ఇప్పుడు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. వృద్ధులు, చిన్నారులతో పాటు పలువురు భక్తులు ఎక్కువసేపు నిలబడలేక క్యూలైన్లలోనే కింద కూర్చుంటున్నారు. – మన్నెం గంగాధరరావు – దమ్మపేట, తెలంగాణ -
జయహో జగన్నాథ
ద్వారకాతిరుమల: జై జగన్నాథ.. జయహో జగన్నాథ అంటూ భక్తుల నామస్మరణలతో జగన్నాథ రథయాత్ర శనివారం సాయంత్రం తిమ్మాపురం గ్రామానికి అట్టహాసంగా సాగింది. శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జగన్నాథుని దివ్య రథోత్సవాలు ఈనెల 16 నుంచి వైభవంగా జరుగుతున్నాయి. ఆఖరి రోజు సాయంత్రం ఆలయం వద్ద రథన్ని విశేషంగా అలంకరించారు. అర్చకులు సుభద్ర, బలభద్ర, జగన్నాథుడి దారు విగ్రహాలను ఆలయం నుంచి తీసుకొచ్చి, రథంలో వేంచేపు చేసి, పూజాదికాలను నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ జగన్నాథుడి రథం అశేష భక్తజన సందోహం నడుమ లక్ష్మీపురం మీదుగా సమీప గ్రామమైన తిమ్మాపురం తరలివెళ్లింది. ప్రతి ఇంటి ముంగిట భక్తులు జగన్నాథుడిని దర్శించి తరించారు. తిరిగి రధం రాత్రికి ఆలయానికి చేరుకుంది. నూజివీడు: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలను నిర్వహిస్తున్న ఆర్జీయూకేటీలో ప్రభుత్వం భర్తీ చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ పోస్టులకు వయో పరిమితి విధించడంపై కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెంటార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ట్రిపుల్ ఐటీల్లో 104 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గరిష్ట వయో పరిమితి ఓసీ అభ్యర్థులకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 49 ఏళ్లుగా నిబంధన విధించింది. దీంతో గత 18 ఏళ్లుగా ట్రిపుల్ ఐటీలను నమ్ముకుని పనిచేస్తున్న దాదాపు 200 మంది కాంట్రాక్టు మెంటార్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లలో సుమారు 70 మంది రాత పరీక్షకు అనర్హులుగా మారే ప్రమాదం ఏర్పడింది. 2023లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో లెక్చరర్ పోస్టులకు ఎలాంటి వయో పరిమితి విధించలేదు. దీనివల్ల ట్రిపుల్ ఐటీల ప్రారంభం నుంచి పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లభించింది. వయో పరిమితి నిబంధనను సడలించి న్యాయం చేయాలని కాంట్రాక్టు అధ్యాపకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): అతి వేగమే ప్రమాదాలకు కారణమని, ఓపికతో, నేర్పుతో జాగ్రత్తగా వాహనం నడిపితే మీతోపాటు ఎక్కిన ప్రయాణికులను క్షేమంగా గమ్యం చేర్చవచ్చని ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ సూచించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు డిపో గ్యారేజ్లో శనివారం ప్రమాద రహిత వారోత్సవాల కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కరీమ్ మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు తొందర పని చేయదని, ఓవర్ టేక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, వానాకాలంలో వాహనం నడిపేటప్పుడు మరిన్ని జాగ్రత్తలతో వాహనాన్ని నడపాలని సూచించారు. ప్రమాదాలకు గురికాకుండా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తమ విధులను నిర్వహించాలని సూచించారు. జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వారోత్సవాలు జనవరిలో జరుగుతాయని, ఈ సంవత్సరం జూలైలో వారం రోజులు పాటు నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ బి.వాణి, తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏలూరులో పారా లీగల్ వలంటీర్లుగా పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి శనివారం ప్రకటనలో తెలిపారు. సమాజ సేవ మీద ఆసక్తి ఉండి స్వచ్ఛందంగా కక్షిదారులకు, న్యాయ సేవాధికార సంస్థ కోసం పనిచేసేందుకు ముందుకు రావాలని కోరారు. కనీసం పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఆగస్టు 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోలవరం రూరల్: గోదావరి వరద మళ్ళీ పెరుగుతోంది. నదిలోకి చేరే శబరి నీటితో పాటు ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి భారీగా నీరు చేరడంతో వరద ప్రవాహం పెరిగింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద 28 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్వే నుంచి 51,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది. -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
చింతలపూడి: ఆయిల్పాం తోటలో గెలలు కోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి ఓ వ్యక్తి అక్కడికక్కడే మతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ప్రగడవరం గ్రామానికి చెందిన పల్లపు నాగరాజు (40) జీవనోపాధిలో భాగంగా వ్యవసాయ పనులకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో మండలంలోని యర్రగుంటపల్లి గ్రామంలో ఒక రైతుకు చెందిన ఆయిల్పాం తోటలో గెలలు కోసేందుకు వెళ్లాడు. తోటలో గెలలు కోస్తున్న సమయంలో, విద్యుత్ వైర్లు గెడకు తగలడంతో తీవ్ర విద్యుత్ షాక్కు గురై అపస్మారక స్ధితికి చేరుకున్నాడు. నాగరాజును ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. నాగరాజు మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, ప్రగడవరం గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉపాధి కోసం వెళ్లిన వ్యక్తి శవమై తిరిగిరావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబ యజమాని దూరమవ్వడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. ఎస్సై కె సతీష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాటు తుపాకీతో హత్యకు కుట్ర
ఏలూరు టౌన్: వివాహేతర సంబంధాన్ని కొనసాగించవద్దని హెచ్చరించినా పట్టించుకోకుండా, తన వదినతో చనువుగా ఉంటున్నాడనే కోపంతో నాటు తుపాకీతో ఒక వ్యక్తిని హతమార్చేందుకు వేసిన కుట్రను చింతలపూడి పోలీసులు భగ్నం చేశారు. తీగ లాగితే డొంక కదిలినట్లు... ఈ హత్య ప్రయత్నంపై దర్యాప్తు చేయగా ఏకంగా నాటు తుపాకులు తయారు చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనంతరం ఆయన నాటు తుపాకీలను, తయారీ సామగ్రిని పరిశీలించారు. హెచ్చరించినా వినలేదని.. చింతలపూడి మండలం బట్టువారిగూడెం గ్రామానికి చెందిన సందక సాయిబాబు వదినతో, సుబ్బారాయుడుగూడెం గ్రామానికి చెందిన పల్నాటి మహేష్ చనువుగా ఉంటున్నాడు. వివాహేతర సంబంధం కొనసాగుతుందనే అనుమానంతో మహేష్ను మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో చింతలపూడి మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామం ఎన్ఆర్టీఆర్ సెంటర్కు చెందిన తాళం వీరబాబు నుంచి సాయిబాబు ఒక నాటు తుపాకీ తీసుకున్నాడు. పల్నాటి మహేష్ను అంతం చేయాలనే ఉద్దేశంతో గణిజర్ల ప్రాంతంలోని ఆయిల్పాం తోట వద్ద రెండు రోజులుగా అదను కోసం వేచి ఉన్నాడు. ఈ నెల 24న సాయిబాబు, వీరబాబు ఇద్దరూ మోటారు సైకిల్పై గణిజర్ల వెళ్లి వస్తుండగా.. చింతలపూడి ఎస్సై తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఇద్దరూ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా, వారి వద్ద ఒక నాటు తుపాకీ, ఒక లైవ్ బుల్లెట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నాటు తుపాకుల తయారీ గుట్టురట్టు జంగారెడ్డిగూడెం డీఎస్పీ బీహెచ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ టీ. క్రాంతికుమార్, ఎస్సై కే. సతీష్కుమార్ దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాటు తుపాకీ కలిగి ఉన్న వీరబాబును విచారించగా, వెంకట్రాదిగూడెం గ్రామానికి చెందిన యలగం నాగేశ్వరరావు పేరు బయటకు వచ్చింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి 5 నాటు తుపాకులు, ఒక తుపాకీ చెక్క, తుపాకులు తయారు చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తుపాకీ పనిచేసే మెకానిజానికి వెల్డింగ్ పనులు చేస్తున్న రాఘవాపురం, కమలాపురం గ్రామానికి చెందిన తోటకూర రామరాజును అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి వెల్డింగ్ మిషన్, నాటు తుపాకీ మెకానిజం భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. తుపాకీ బ్యారల్ గొట్టం తయారు చేస్తున్న ఏలూరు పవర్పేట రైల్వేస్టేషన్ రోడ్డు ప్రాంతానికి చెందిన మంతెన వీరభద్రాచారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి తుపాకీ బ్యారల్ తయారీకి వినియోగించే రెండు ఇనుప గొట్టాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 6 నాటు తుపాకులు, తుపాకీ తయారీ చెక్క, 4 తుపాకీ తూటాలు, తుపాకీ తయారీకి వినియోగించే పేలుడు పదార్థం, తుపాకీ తయారీ పరికరాలు, ఒక తుపాకీ మెకానిజం భాగం, రెండు ఇనుప బ్యారల్ గొట్టాలు, ఒక వెల్డింగ్ మిషన్, ఒక హీరో గ్లామర్ మోటారు సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన చింతలపూడి సీఐ క్రాంతికుమార్, ఎస్సై సతీష్కుమార్, కానిస్టేబుళ్లు వినోద్కుమార్, హనుమంతరావు, భగవాన్, సత్యనారాయణ, ప్రకాష్, లక్ష్మణరావు, బాబురావు, రమేష్, హోంగార్డు సురేష్లను ఏలూరు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు. హత్యాయత్నాన్ని భగ్నం చేసిన జంగారెడ్డిగూడెం పోలీసులు ఐదుగురి అరెస్ట్, నాటు తుపాకులు, తయారీ సామగ్రి స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ శివకిషోర్ -
ప్రభుత్వ ఐటీఐలో ఆన్లైన్ అడ్మిషన్లు
నూజివీడు: నూజివీడులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాల కోసం రెండో విడత కౌన్సెలింగ్కు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రధాన అధికారి పి.రజిత శుక్రవారం ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 3న సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు కాపీని ప్రింట్ తీసుకుని ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆగస్టు 4లోపు వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. 6న ఐటీఐ కళాశాలలో కౌన్సెలింగ్కు హాజరు కావాలని పేర్కొన్నారు. ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాలతో ఏలూరుకి చెందిన భాస్కర్ల ఆర్ఎన్ శంకర్ (బాచి)ను వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఎస్సీ యువతకు పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు షెడ్యూల్ కులాల సహకార సంఘం కార్యనిర్వాహక ఇంజనీర్ ఎం.ముక్కంటి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. కిసాన్ డ్రోన్ ఆపరేటర్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నిషియన్, బ్యూటీ థెరపిస్ట్, ప్లంబర్–జనరల్ కోర్సులకు టెన్త్ పాస్, డ్రోన్ సర్వీస్ టెక్నీషియన్, సోలార్ పీవీ ఇన్స్టాలర్ కోర్సులకు ఇంటర్మీడియట్ పాస్ కావాలన్నారు. అభ్యర్థుల వయసు 21–45 ఏళ్ల మధ్య ఉండాలని, శిక్షణ వ్యవధి 90 రోజులు ఉంటుందని, ఉచిత భోజనం, వసతి కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు కంప్యూటర్ ఆపరేటర్ ఎ.రవికుమార్ సెల్: 9393527666, జూనియర్ అసిస్టెంట్ ఎం.శ్రీనివాసరావు 98498 42059, సీనియర్ అసిస్టెంట్ ఎం.సుషుమాదేవి 9177721350 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. -
తొలి ఏకాదశికి ముస్తాబు
ఈవీఎం గోడౌన్ తనిఖీ ఏలూరు (ఆర్ఆర్పేట): కలెక్టరేట్లోని ఈవీఎం గోడౌన్ను రాష్ట్ర ఎలెక్టోరల్ అధికారి కార్యాలయ డిప్యూటీ సీఈఓ ఎస్.ఆంజనేయులుతో కలిసి కలెక్టర్ కె.వెట్రిసెల్వి తనిఖీ చేశారు. ద్వారకాతిరుమల: ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. శనివారం తొలి ఏకాదశి కావడంతో ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని శుక్రవారం దేవస్థానం సిబ్బంది సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శిస్తారని ఆలయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తొలి ఏకాదశి రోజున అన్నం, మాంసాహారం తీసుకోకూడదని శ్రీవారి దేవస్థానం ఆగమ పండితులు సుదర్శనం శ్రీనివాసాచార్యులు తెలిపారు. తులసి ఆకులు కోయడం, జుట్టు, గోర్లు కత్తిరించుకోవడం, గొడవలు, దుర్భాషలు, పగలు నిద్రపోవడం, ఇతరులను అవమానించడం వంటి పనులకు దూరంగా ఉండాలన్నారు. వేకువజామున స్నానం చేసి శ్రీమహావిష్ణువును తులసీ దళాలతో పూజించాలని, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ మంత్రాన్ని జపిస్తూ విష్ణు సహస్రనామ పారాయణం చేయాలన్నారు. ఉపవాసం పాటించి, దానధర్మాలు చేసి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే శ్రీహరి అనుగ్రహం లభిస్తుందని చెప్పారు. లబ్బీపేట (విజయవాడతూర్పు): రోయింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 26న జంగారెడ్డిగూడెంలో రాష్ట్ర రోయింగ్ చాంపియన్ షిప్–2026 పోటీలు నిర్వహించనున్నట్టు ఏపీ స్కల్లింగ్ అండ్ రోయింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ తరుణ్ కాకాని తెలిపారు. శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఈ పోటీల్లో 500 మీటర్ల దూరంలో సబ్ జూనియర్, జూనియర్ సీనియర్ విభాగాల్లో బాలురు, బాలికలకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
మక్కినవారిగూడెం సొసైటీలో విచారణ
టి.నరసాపురం: మక్కినవారిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో అవకతవకలు జరిగాయంటూ స్థానిక రైతులు సిరిమళ్ల జనార్దనరావు, ఆచంట అనిల్కుమార్, సిరిమళ్ల వెంకటేశ్వరరావులు ఇటీవల ఏలూరులో పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన చింతలపూడి కో–ఆపరేటివ్ సహాయ రిజిస్ట్రార్ ఏకేఎస్ఎస్ మూర్తి, సీనియర్ ఇన్స్పెక్టర్ నజీమ్లు శుక్రవారం సొసైటీలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. విచారణ అనంతరం సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఈ సందర్భంగా విచారణ అధికారులు తెలిపారు. -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
ముదినేపల్లి (కై కలూరు): ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాట పటిమకు ఆకర్షితులై పలువురు పార్టీలోకి చేరుతున్నారని జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అన్నారు. ముదినేపల్లి మండలం ప్రొద్దువాక గ్రామంలో టీడీపీకి చెందిన దొడ్డాకుల సాయి శివకుమార్, బోయిన వెంకట నరసింహ, కుందేటి వీరాంజనేయులు శుక్రవారం కై కలూరులో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. డీఎన్నార్ వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. మండల పార్టీ అధ్యక్షుడు బోయిన రామరాజు, జిల్లా పంచా యతీరాజ్ విభాగ కార్యదర్శి బొబ్బిలి రత్తయ్యనాయుడు, సిరిపురపు సత్యనారాయణ, కర్రే సోమశేఖరరావు పాల్గొన్నారు. భీమవరం: అమరావతి చాంపియన్షిప్ నియోజకవర్గ సెలెక్షన్ ట్రెయిల్స్ను శనివారం నుంచి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్నట్టు జిల్లా క్రీడాధికారి శుక్రవారం ప్రకటన లో తెలిపారు. అండర్–17, అండర్–23 విభాగాల్లో 12 ఆటల్లో సెలెక్షన్స్ ఉంటాయన్నారు. -
విద్యాసంస్థల బంద్ జయప్రదం
ఏలూరు (ఆర్ఆర్పేట): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ శుక్రవారం జిల్లాలో జయప్రదమైంది. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ముందు రోజునే తమ సంస్థలకు సెలవు ప్రకటించి బందులో పాల్గొన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్ మీటింగ్ (పీటీఎం) ఏర్పాటు చేయడంతో వాటికి బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్ కాలేజీలను ఆయా విద్యార్థి సంఘాల నాయకులు మూయించి వేశారు. ఏలూరులో కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీ వద్ద విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయగా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకు నేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు పి.శివాజీ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.శివకుమార్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని, డీవైఎఫ్ఐ జిల్లా నాయకుడు గేదెల శివకుమార్ కేంద్ర ప్రభుత్వ తీరుపై శాంతియుత పద్ధతుల్లో నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై ఢిల్లీలో పోలీసులు అమానుష లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల నాయకులు బంద్లో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పీవీ రామకృష్ణ, సీఐటీయూ జిల్లా నాయకులు పంపన రవికుమార్, మంచెల్ల ఇస్సాక్ పాల్గొన్నారు. -
తీరు మారాలి బాబు
శనివారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2026ద్వారకాతిరుమల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ ఆలయాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారిందనే ఆరోపణలకు ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం ట్రస్టు బోర్డు సమావేశం బలంచేకూర్చింది. నెలకు రూ.40 లక్షలకు పైగా వెచ్చిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిశుభ్రత కనిపించడం లేదని బోర్డు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అధికారులను నిలదీశారు. చివరకు 15 రోజుల్లోగా పరిస్థితి మెరుగుపడకపోతే కాంట్రాక్టు రద్దుకు తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని సభ్యులు అల్టిమేటం జారీ చేశారు. సీఎం బంధువైన కాంట్రాక్టర్ తీరుపై కూటమి సభ్యులే గళమెత్తడం క్షేత్రంలో హాట్టాపిక్గా మారింది. ట్రస్టు బోర్డు సమావేశంలో తీవ్ర చర్చ కొండపై ఉన్న ద్వారకా అతిథి గృహంలో గురువా రం జరిగిన ట్రస్టు బోర్డు సమావేశంలో దాదాపు 40 నిమిషాల పాటు పారిశుద్ధ్య నిర్వహణపైనే సుదీర్ఘంగా చర్చ సాగింది. పర్వదినాలు, వివాహ శుభకార్యాలు ఎక్కువగా జరిగే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని సభ్యులు మండిపడ్డారు. సిబ్బంది గైర్హాజరు గతంతో పోలిస్తే పారిశుద్ధ్య కాంట్రాక్టులో కార్మికుల సంఖ్య పెరిగినా, క్షేత్రస్థాయిలో కొద్దిమంది మా త్రమే కనిపిస్తున్నారని ద్వారకాతిరుమల మండలానికి చెందిన ఇద్దరు సభ్యులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం 200 మంది విధులు నిర్వహించాల్సి ఉండగా, తక్కువ మందితోనే మమ అనిపిస్తున్నారని ఆరోపించారు. మేనేజర్పై ఆగ్రహం.. 15 రోజుల అల్టిమేటం పారిశుద్ధ్య కాంట్రాక్ట్ మేనేజర్పై కూడా సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళా కార్మికులతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నాడని, అధికారులను ఏమాత్రం లెక్కచేయడం లేదని వచ్చిన ఫి ర్యాదులపై నిలదీశారు. దీనికి ఆయన నుంచి ఎ లాంటి సమాధానం రాకపోవడంతో సభ్యులు మ రింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీ వెనుక ఎవరున్నా ఇకపై సహించేది లేదు. 15 రోజుల్లోగా ప రిస్థితి మెరుగుపడకపోతే కాంట్రాక్టును రద్దు చేస్తూ తీర్మానం చేసి, ప్రభుత్వానికి నివేదిస్తాం.’అంటూ ట్రస్టు బోర్డు సభ్యులు హెచ్చరించారు. అధికారి సంచలన వ్యాఖ్యలు సమావేశంలో ఓ పర్యవేక్షణాధికారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. తన 40 ఏళ్ల సర్వీసులో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య లోపాలపై కాంట్రాక్టర్కు పలుమార్లు నోటీసులు జారీ చేస్తే, దేవదాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి తిరుగు ప్రయాణంలో తనకే హెచ్చరికలు వచ్చాయని, చర్యలు తీసుకుంటామని భయపెట్టారని సభ్యుల ఎదుట వెల్లడించడంతో సమావేశంలో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ఆలయాల ఆదాయ, వ్యయాలను బట్టి ఆయా దేవస్థానాల అధికారులే టెండర్లు ఖరారు చేసేవారు. అప్పట్లో ద్వారకాతిరుమల పారిశుద్ధ్య కాంట్రాక్టు విలువ నెలకు రూ.18.28 లక్షలుగా ఉండేది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పారిశుద్ధ్య సేవలను మెరుగుపరుస్తామనే కారణంతో రాష్ట్ర దేవదాయ శాఖ కార్యాలయం ద్వారానే అన్ని ప్రముఖ ఆలయాల టెండర్లను నిర్వహించింది. ఈ క్రమంలో 2015–2019 మధ్య (టీడీపీ హయాంలో) పనిచేసిన కాంట్రాక్టర్ భాస్కరనాయుడికే మళ్లీ టెండర్ లభించింది. ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టు మొ త్తాన్ని రూ.50 లక్షలకు పెంచినా పారిశుద్ధ్యంలో మార్పు రాకపోవడం, పైగా సీఎం చంద్రబాబుకు బంధువైన కాంట్రాక్టర్ తీరుపై కూటమి సభ్యులే గళమెత్తడం ఇప్పుడు నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శ్రీవారి క్షేత్రంలో పారిశుద్ధ్య నిర్వహణపై ట్రస్టుబోర్డు సభ్యుల ఆగ్రహం సమావేశంలో 40 నిమిషాలపాటు వాడీవేడిగా చర్చ కాంట్రాక్టర్కు 15 రోజుల గడువిస్తూ అల్టిమేటం తీరు మారకుంటే కాంట్రాక్ట్ రద్దుకు తీర్మానం చేస్తామని హెచ్చరిక సీఎం బంధువు (కాంట్రాక్టర్) నిర్వాకంపై కూటమి సభ్యులే గళం ఏఐ సృష్టించిన చిత్రం -
నేడు మెగా పీటీఎం
నవజాత శిశువు మృతి ఏలూరు జీజీహెచ్లో నవజాత శిశువు మృతి చెందడంతో బాధితులు ఆందోళనకు దిగారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. 8లో uకలెక్టర్ వెట్రిసెల్విఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని 1772 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శుక్రవారం మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించనున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రమాణాలు పెంపుదల, తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, పాఠశాల–కుటుంబ సంబంధాలను పటిష్టపరచడం మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ ప్రధాన ఉద్దేశమన్నారు. నిర్వాసితులను తరలించాలి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కాలనీలను డిసెంబర్లోపు పూర్తిచేసి, నిర్వాసితులందరినీ కాలనీలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి పోలవరం ప్రాజెక్ట్ పునరావాసం, కాలనీల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ, కాలనీల నిర్మాణ పనులపై అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సీఎం ఆదేశాల మేరకు కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులతో పాటు రోడ్లు, డ్రైనేజీ, అంగన్వాడీ, పాఠశాలలు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను కల్పి ంచాలన్నారు. భూసేకరణలో అవకతవకలకు పాల్పడినా, కాలనీల నిర్మాణాల విషయంలో అలసత్వం వహించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాములు నా యక్, ఎస్డీసీ దేవకీదేవి, ఎస్ఈలు జెడ్.రమేష్, విజయరత్నం తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక చింతన, క్రమశిక్షణతో జీవించాలి
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): స్థానిక పద్మ థియేటర్ ఎదురుగా ఉన్న శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాల్లో ప్రముఖ సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, వారాహి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ కమిటీ, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు కురెళ్ళ రాంబాబు శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో గరికపాటి ప్రసంగిస్తూ... మానవ జీవితంలో వారాహి దేవి ఉపాసన, బ్రహ్మచర్యం, దైవీ గుణాల ప్రాధాన్యతను వివరించారు. దైవభక్తితో పాటు ప్రతి ఒక్కరిలో కరుణ, దయ, సద్గుణాలు ఉండాలని... తోటివారికి సహాయపడే మనస్తత్వమే నిజమైన భక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. దేవసేన అంటే కేవలం సైన్యం మాత్రమే కాదని, మనిషిలో ఉండాల్సిన దైవీ గుణాలకు ప్రతీక అని వ్యాఖ్యానించారు. సమాజంలో అసూయ, గర్వం వీడి అంతా ఐక్యతతో మెలిగినప్పుడే ఆత్మజ్ఞానం, సుఖశాంతులు కలుగుతాయని ఉద్బోధించారు. ఆధ్యాత్మిక చింతనతో పాటు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలని భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, వేద పండితులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
జోరుగా పాత బట్టల వ్యాపారం
భీమవరం : విద్య, వ్యాపార, వైద్య కేంద్రాలుగా వేగంగా అభివృద్ధి చెందుతున్న భీమవరం పట్టణంలో ఒకవైపు భారీ షాపింగ్ మాల్స్ వెలుస్తుంటే... మరోవైపు పేదల కోసం పాత బట్టలు అమ్మే దుకాణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆక్వా హబ్గా పేరుగాంచి, ప్రభుత్వానికి కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్నప్పటికీ, భీమవరం పరిసర ప్రాంతాల్లో అనేక మంది పేదలు పూట గడవడానికి పడుతున్న పాట్లు వర్ణనాతీతం. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి పేరుతో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నా, ఒంటి నిండా బట్ట కప్పుకోవడానికి అనేక మంది పేదలు పాత బట్టల వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. పాత బట్టలను విక్రయిస్తూ పట్టణంలో అనేక కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. అంతా డబ్బున్నవారే అనుకుంటే పొరపాటే... పట్టణ పరిసర ప్రాంతాల్లోని ప్రజలంతా ధనవంతులేనని, ఇక్కడ భారీ ఎత్తున వ్యాపారాలు సాగుతున్నాయనే ప్రచారం ఉంది. ఆక్వా చెరువుల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందన్నది నిజమే అయినా, ఽపేదలు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో నాణ్యమైన కొత్త దుస్తులు కొనలేని పేదలు ఎక్కువగా ఉండటంతో, పట్టణంలో పాత బట్టల వ్యాపారం జోరుగా సాగుతోంది. బస్టాండ్ వెనుక జోరుగా విక్రయాలు... పట్టణంలోని బస్టాండ్ వెనుక ఉన్న సాయిబాబా గుడి ప్రాంతంలో చాలాకాలంగా పాత బట్టల వ్యాపారం సాగుతోంది. వీటితో పాటు ఇండస్ట్రియల్ ఏరియా, లారీ స్టాండ్ల వద్ద చిరిగిన వస్త్రాల అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ వ్యాపారంలో ఎక్కువగా మహిళలే ఉండటం విశేషం. వీరికి కొందరు పురుషులు గ్రామాల్లో తిరిగి పాత బట్టలు సేకరించి తెచ్చి ఇస్తుంటారు. ఇక్కడ చీరలు, ప్యాంట్లు, షర్టులు, లుంగీలు, నైటీలు, చిన్నపిల్లల దుస్తులు ఇలా అన్ని రకాల వస్త్రాలు లభిస్తాయి. పట్టణంలో మంగళ, శుక్రవారాలు మినహా మిగిలిన అన్ని రోజుల్లోనూ ఈ వ్యాపారం జరుగుతుంది. మంగళ, శుక్రవారాల్లో పాత దుస్తులు కొనకూడదనే సెంటిమెంట్ ఉండటంతో కొనుగోలుదారులు రారని వ్యాపారులు చెబుతున్నారు. కాగా, భీమవరంలో పాత బట్టల వ్యాపారం నెలకు సుమారు రూ. 50 లక్షల వరకు ఉంటుందని అంచనా. పాత బట్టలు కొనుగోలుచేసేవారు ఎక్కువగానే ఉంటారు, ప్రధానంగా పండుగ రోజుల్లో వ్యాపారం ఎక్కువగా ఉంటుంది. కొత్త బట్టలు కొనుగోలు చేయలేని పేదలు కనీసం శుభ్రమైన చిరుగులు లేని వస్త్రాలు ధరించాలనే పాత బట్టలు కొంటుంటారు. – చింతా జ్యోతి, వ్యాపారి దాదాపు 20 ఏళ్లుగా పాతబట్టల వ్యాపారంతోనే జీవనం సాగిస్తున్నాం. కొత్త బట్టల షాపులెన్ని వచ్చినా మా వ్యాపారం మాత్రం కొనసాగుతూనే ఉంది. కార్మికులు, పేదలు పాత బట్టలు కొనుగోలు చేస్తుంటారు. – కానేటి ధనలక్ష్మి, వ్యాపారి పాత బట్టలను ఎక్కువగా కార్మికులు కొనుగోలు చేస్తుంటారు. ప్రతి రోజు తాపీపనులు, బంటా పనులకు వెళ్లే పేద కార్మికులు పాత బట్టలు కొనుగోలు చేస్తారు. చిరుగులు లేని చీరలు, ఫ్యాంటు, షర్ట్స్ తక్కువ ధరలకు లభించడంతో కార్మికులు వాటిని వినియోగిస్తారు. – గంటా పుష్పలత, వ్యాపారి కొత్తబట్టలు కొనుగోలు చేయలేని పేదలు చిరుగులు లేని, శుభ్రమైన పాతబట్టలే కొత్తవిగా భావిస్తారు. మావద్దకు వచ్చే వారంతా పేదలు కావడంతో మేము కూడా పెద్ద మొత్తంలో లాభాల కోసం చూడకుండా తక్కువ ధరలకే విక్రయిస్తుంటాం. – గంటా ఇందిర, వాప్యారి భీమవరం బస్టాండ్ వెనుక పాత బట్టల దుకాణాలు 20 ఏళ్లకు పైగా విక్రయాలు నెలకు సుమారు రూ.50 లక్షల వ్యాపారం -
అప్పుల ‘పొగ’లో ఆరిపోయిన రైతు ప్రాణం
● గిట్టుబాటు ధర దక్కక.. అప్పులు తీర్చే మార్గం కనిపించక పొగాకు రైతు మృతి ● మనోవేదనతో గుండెపోటుకు గురై మరణించాడన్న భార్య, కుటుంబ సభ్యులు బుట్టాయగూడెం: పొగాకు పంటకు గిట్టుబాటు ధర దక్కలేదన్న దిగులు.. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడం ఆ రైతును తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. వేలం కేంద్రానికి 8 బేళ్లు తరలించగా.. రెండు బేళ్లను కొనుగోలు చేసిన అధికారులు 6 బేళ్లను వెనక్కి పంపించారు. చివరకు బంటా కూలీ చెల్లించేందుకు కూడా డబ్బుల్లేకపోవడంతో ఆ రైతు కుంగిపోయాడు. చివరకు గుండె పగిలి మరణించాడు. మండలంలోని ముప్పినవారిగూడెంకు చెందిన పొగాకు రైతు పాలా వెంకటేశ్వరరావు (70) గుండెపోటుకు గురై రాజమహేంద్రవరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళ వారం సాయంత్రం మృత్యువాత పడిన ఘటన వి దితమే. గురువారం అతడి భార్య సీతారత్నం, కు మారుడు శ్రీనివాసరావు, కుమార్తెలు వెంకటరమణ, సుజాత మీడియాతో మాట్లాడారు. ‘మాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదయ్యా’ రైతు భార్య సీతారత్నం మాట్లాడుతూ.. ‘నా భర్త ఈ ఏడాది 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పొగాకు పండించారు. సీజన్ ప్రారంభంలోనే వేసిన పంట పాడైపోవడంతో దానిని దున్ని మళ్లీ పంట వేశాం. సాగు కోసం బ్యాంకు నుంచి రూ.12 లక్షల రుణం తీసుకున్నాం. ప్రైవేట్ అప్పులు మరో రూ.10 లక్షలు పంట కోసం వెచ్చించాం. పాడైన పంటను దున్ని మళ్లీ పంట వేయడం వల్ల అదనంగా అప్పుల భారం పడింది. పొగాకు కొనుగోళ్ల ప్రారంభం నుంచీ పంటకు గిట్టుబాటు ధర లేదు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మా ఆయన దిగులుపడ్డారు. ఇటీవల జంగారెడ్డిగూడెం వేలం కేంద్రానికి 8 బేళ్లు అమ్మకానికి తీసుకెళ్లగా.. కేవలం 2 బేళ్లు మాత్రమే కొన్నారు. మిగిలిన 6 బేళ్లు వెనక్కి పంపించారు. పొ గాకు పనులు వేసిన బంటాకు సుమారు రూ.1.50 లక్షల వరకు బకాయి పడ్డాం. ఆ డబ్బుల కోసం కూలీలు మా ఇంటికొచ్చి గొడవ చేశారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురై నా భర్త ఇబ్బంది పడే వారు. అప్పుల బాధ ఎలాగైనా తీర్చుకోవచ్చు ఆందోళన చెందవద్దని చెబుతూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదయ్యా’ అంటూ కన్నీటి పర్యంతమైంది. ‘ఈ అన్యాయం మరే రైతు కుటుంబానికి జరగకూడదు’ రైతు వెంకటేశ్వరరావు కుమారుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘వ్యవసాయం అంటే మా నాన్నకు ఎంతో ఇష్టం. పొగాకు ధరలు పెరగకపోవడంతో అప్పులవాళ్లు ఇబ్బంది పెడుతున్నారని డబ్బు స ర్దాలని నాన్న అడిగారు. ఆందోళన చెందొద్దని.. తా ను ఏదోలా డబ్బులు సమకూరుస్తానని చెప్పాను. ఇంతలోనే ఆయన గుండెపోటుకు గురై మరణించారు. వైఎస్సార్సీపీ పాలనలో కిలో పొగాకు ధర సుమారు రూ.450 చొప్పున వచ్చింది. రైతు కుటుంబాలు ఎంతో ఆనందించాయి. ఇప్పుడు హైగ్రేడ్ పొ గాకు కిలో రూ.265, లోగ్రేడ్ పొగాకు కిలో రూ.175 పలుకుతోంది. దీంతో గిట్టుబాటు ధరలేక ఇళ్ల వద్దే పొగాకు బేళ్లు నిల్వ ఉంచే పరిస్థితి. ఇలాంటి అ న్యాయం మరే రైతు కుటుంబానికి జరగకూడదు.’ అని అన్నారు. బాధిత కుటుంబానికి పరామర్శ వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులను పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గురువారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడు వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అ నంతరం బాలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభు త్వం రైతుల కష్టాలను పట్టించుకోకపోవడంతో రై తు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు వ స్తున్నాయన్నారు. ప్రభుత్వం పొగాకు రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. బాధిత రైతు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఆరేటి సత్యనారాయణ, జెడ్పీటీసీ మొడియం రామతు ల సి, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు తాళ్లూరి ప్ర సాద్, మాజీ సర్పంచ్ తెల్లం వెంకటలక్ష్మి, నాయకు లు కుక్కల రాంపండు, పంపన కృష్ణ, పంపన నాగబాబు, మేకరబోయిన శ్రీను, జిత్తుక సురేష్ ఉన్నారు. -
హత్యాయత్నం సెక్షన్లు నమోదు చేయాలి
పాలకోడేరు: తనపై, తన కుమారుడు పాలా రాధాకృష్ణపై ఈ నెల 6వ తేదీన జరిగిన దాడి కేసులో పోలీసులు బలహీనమైన సెక్షన్లు నమోదు చేశారని వేండ్ర గ్రామానికి చెందిన బాధితురాలు పాలా గోగులమ్మ ఆరోపించారు. పొలం సరిహద్దు వివాదాన్ని పురస్కరించుకుని అదే గ్రామానికి చెందిన కవురు గంగాధరరావు, ఆయన భార్య, కొడుకు కలిసి తమపై కత్తులతో దాడి చేశారని ఆమె తెలిపారు. ఈ ఘటనలో గోగులమ్మ తలకు తీవ్ర గాయమై 18 కుట్లు పడ్డాయని, రాధాకృష్ణకు కూడా తీవ్ర గాయాలు కావడంతో నేటికీ ప్రైవేట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారని వాపోయారు. ఈ ఘటనపై పాలకొడేరు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెం. 96/2026 కింద కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లో బీఎన్ఎస్ 329(3), 118(1), 351(2), 3(5) సెక్షన్లు నమోదు చేసినప్పటికీ.. దాడి తీవ్రతను, ప్రాణహాని తలపెట్టాలనే ఉద్దేశాన్ని పరిగణనలోకి తీసుకుని హత్యాయత్నం వంటి బలమైన సెక్షన్లు జోడించాలని గోగులమ్మ డిమాండ్ చేశారు. ‘మమ్మల్ని చంపాలనే ఉద్దేశంతోనే కత్తులతో తలపై కొట్టారు. నా కొడుకు ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నాడు. ఇంత జరిగినా పోలీసులు సరైన సెక్షన్లు పెట్టకుండా నిందితులకు కొమ్ము కాస్తున్నారా?’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి దాడికి ప్రతిదాడి జరిగినట్లుగా క్రైమ్ నెం. 97/2026 కింద ఎదురు కేసు కూడా నమోదైనట్లు ఎఫ్ఐఆర్ ద్వారా తెలుస్తోంది. న్యాయం జరిగే వరకు పోరాడతామని, అవసరమైతే ఉన్నతాధికారులను కలుస్తామని బాధితుల కుటుంబం స్పష్టం చేసింది. కేసులో కఠినమైన సెక్షన్లు జోడించి నిందితులను శిక్షించాలని వేండ్ర అగ్రహారం మాజీ సర్పంచ్ ముత్యాలరావుతో పాటు గ్రామస్తులు కోరుతున్నారు. మరొకవైపు, మెడికల్ రిపోర్ట్ ఆధారంగానే కేసు నమోదు చేశామని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. తణుకు అర్బన్: తణుకు మండలం కొమరవరం గ్రామ శివారులోని కొండాలమ్మ గుడిలో చోరీకి ప్రయత్నించిన దొంగను స్థానికులు పట్టుకున్నారు. గురువారం గుర్తుతెలియని వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి చోరీకి ప్రయత్నించగా పట్టుకున్న గ్రామస్తులు స్తంభానికి కట్టి దేహశుద్ధి చేశారు. అనంతరం తణుకు రూరల్ పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ ఘటనపై గ్రామస్తులు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నట్లు ఎస్సై నాళం శ్రీనివాసరావు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుల ఆవేదన ఏలూరు టౌన్ : ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో ప్రజలకు మెరుగైన వైద్యం అందే పరిస్థితి కనిపించడం లేదు. వైద్యులు, సిబ్బంది తీవ్ర నిర్లక్ష్య వైఖరి వల్ల కళ్లు తెరవకముందే పురిటిలోనే పసిబిడ్డల ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. లింగపాలెం మండలం అయ్యపరాజుగూడెంకు చెందిన సిలారపు స్వీటీ అనే మహిళ తన మొదటి కాన్పు కోసం మూడు రోజుల క్రితం (మంగళవారం) జీజీహెచ్లో చేరింది. మొదటి సంతానం కావడంతో స్వీటీ, ఆమె భర్త మహేష్ తమ బిడ్డ కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు. తీరా గురువారం ప్రసవం పూర్తయ్యాక చూస్తే... నవజాత శిశువు తలకు గాయాలు ఉండటంతో పాటు బిడ్డ మృతి చెంది ఉండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డను దక్కకుండా చేసిందంటూ హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. -
విద్యార్థులతో వెట్టి చాకిరీ
నూజివీడు: విద్యార్థులతో పాఠశాలలో పనులు చేయించడంపై యనమదల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని హైస్కూల్ ఆవరణలోని శాటిలైట్ స్కూల్లో ఉపాధ్యాయులు గురువారం సాయంత్ర సమయంలో పాఠశాల ముందు భాగంలో ఉన్న సిమెంట్ చేసిన ఫ్లోరింగ్ను, బాత్రూమ్లను విద్యార్థులతో కడిగించారు. విద్యార్థులు బాత్రూమ్ల వద్ద నుంచి బకెట్లతో నీళ్లను మోసుకొస్తూ, ఆవరణను శుభ్రం చేస్తుండటంపై స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు పిల్లలతో పనులు చేయిం చడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
నిర్వాసితుల పునరావాస భూసేకరణపై సర్వే
కొయ్యలగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసానికి సంబంధించి భూసేకరణ కోసం గురువారం సర్వే ప్రక్రియ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అభిషేక్ శర్మ (ఐఏఎస్) ఆధ్వర్యంలో అధికారుల బృందం అచ్చుతాపురం సమీపంలోని రెవెన్యూ పరిధిలో గల సుమారు 75 ఎకరాల ప్రాంతాన్ని పరిశీలించింది. చింతూరు, ఎటపాక ప్రాంతాలకు చెందిన పోలవరం నిర్వాసిత కుటుంబాల పునరావాసం కోసం ఈ భూసేకరణ ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా సర్వే నంబర్లు 1043, 1044లకు సంబంధించిన భూములను అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో కొవ్వూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, చింతూరు, ఎటపాక, జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారులు, కొయ్యలగూడెం తహసీల్దార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూముల వివరాలు, సేకరణ ప్రక్రియ పురోగతి, స్థానిక పరిస్థితులు, అవసరమైన పరిపాలనా చర్యలపై ఉన్నతాధికారులు విస్తృతంగా సమీక్షించారు. భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఐఏఎస్ అభిషేక్ శర్మ ఆదేశించారు. నూజివీడు : చెల్లని చెక్కు కేసులో నూజివీడు మండలం గొల్లపల్లికి చెందిన చల్లారి సత్యన్నారాయణకు ఆరునెలల జైలు శిక్ష, రూ.11 లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మేజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూర్తి గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం గొల్లపల్లికి చెందిన చల్లారి సత్యన్నారాయణ, చల్లారి శివనాగమల్లేశ్వరరావు అన్నదమ్ములు. 2020 అక్టోబరు 4న శివనాగమల్లేశ్వరరావు, సత్యన్నారాయణకు రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం తరువాత తన బాకీ తిరిగి చెల్లించమని అడగగా సత్యన్నారాయణ 2023 జూన్ 19న రూ.10 లక్షలకు చెక్కును శివ నాగమల్లేశ్వరరావుకు ఇచ్చాడు. ఆ చెక్కును బ్యాంకులో వేయగా సత్యన్నారాయణ బ్యాంకు ఖాతాను నిలిపివేసినట్లు ఆ చెక్కును బ్యాంకు అధికారులు తిప్పి పంపారు. దీంతో శివ నాగమల్లేశ్వరరావు కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం సత్యన్నారాయణకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. -
భక్తుల సౌకర్యాలు, అభివృద్ధికి పెద్దపీట
ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో భక్తుల సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి, సేవల విస్తరణ, ఆదాయ వృద్ధి, విద్యా సంస్థల అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకర్రావు అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు, ఆలయ ప్రధానార్చకులు పీవీఎస్ఎస్ఆర్ జగన్నాధాచార్యులు (ఎక్స్అఫిషియో మెంబర్), బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ట్రస్ట్బోర్డు కీలక నిర్ణయాలు ఇవీ.. ● ద్వారకాతిరుమల గ్రామస్తులకు ప్రస్తుతం అమలులో ఉన్న శీఘ్ర దర్శనాన్ని ఉత్తర ద్వారం ద్వారా కొనసాగించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ● అంతరాలయంలో శ్రీవారి మూలమూర్తులకు అష్టోత్తర శతనామార్చన సేవను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ సేవలో పాల్గొనే దంపతులకు రూ.3,116 రుసుం నిర్ణయించారు. అలాగే గతంలో నిర్వహించిన కోటి తులసీ పూజను తిరిగి ప్రారంభించే అంశంపై సమీక్షించారు. ● దేవస్థానం సంస్కృతోన్నత పాఠశాల వెలుపల ఉన్న వినాయకుని మందిరాన్ని పాఠశాల గ్రౌండ్లోని ఖాళీ స్థలంలోకి మార్పు చేసి, నూతన ఆలయాన్ని నిర్మించేందుకు అంచనాలను ఆమోదించారు. ● భక్తులకు నాణ్యమైన పాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచే లక్ష్యంతో విజయ డెయిరీ (కృష్ణ జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్ కం లిమిటెడ్) పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రం ఏర్పాటుకు షాపు కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ● శ్రీవారి ఆగమ పాఠశాలలో ఆగమ విద్య పూర్తి చేసిన విద్యార్థులు తప్పనిసరిగా 3 నెలల పాటు దేవస్థానానికి చెందిన ఆలయాల్లో అప్రెంటిస్ చేయాలని నిర్ణయించారు. ● వాహనాల టోల్ రుసుంను వసూలు చేసుకునే లైసెన్స్ హక్కునకు రెండేళ్ల కాలపరిమితికి నిర్వహించిన బహిరంగ వేలం, సీల్డ్ టెండర్ ద్వారా వచ్చిన అత్యధిక బిడ్ను ఆమోదించారు. ● శ్రీవారి క్షేత్ర దత్తత దేవాలయాలైన మైలవరంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయాల్లో కొబ్బరి చెక్కల సేకరణ లైసెన్స్ హక్కునకు జరిగిన బహిరంగ వేలం ద్వారా వచ్చిన హెచ్చు పాటలను ఆమోదించారు. ● శ్రీవారి ప్రసాదాల తయారీ, పడితరం, అన్నప్రసాదం తయారీకి అవసరమైన 21 రకాల రసవర్గాల సరఫరా కోసం నిర్వహించిన ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్ల ద్వారా వచ్చిన తక్కువ ధరలను ఆమోదించారు. ● రాబోయే ఆశ్వయుజ మాస తిరుకల్యాణ మహోత్సవాలను దృష్టిలో ఉంచుకొని తాత్కాలిక గోల్డ్ కలర్ ఫైబర్ మండపం, పందిళ్లు, రంగులకు అవసరమైన అంచనాలను ఆమోదించారు. ● క్షేత్రంలోని హైస్కూల్ గ్రౌండ్లో ఉన్న గరుడాళ్వార్, ఆళ్వార్ సదనం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామి భారీ విగ్రహాలకు రంగులు వేయడానికి అవసరమైన అంచనాలను ఆమోదించారు. ● శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవాలయం వద్ద, వకుళమాత అన్నప్రసాద భవనం సమీపంలో పీపీజీఐ బస్సు షెల్టర్ల నిర్మాణానికి అంచనాలు ఆమోదించారు. ● ప్రధాన ఆలయం, దత్తత దేవాలయాలు, వివిధ ట్రస్టుల జూన్–2026 నెల ఆదాయ, వ్యయాలను పరిశీలించి ఆమోదించారు. -
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు మనోజ్ఞ ఎంపిక
తణుకు అర్బన్ : స్థానిక ఎస్కేఎస్డీ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థిని మానె మనోజ్ఞ (ఎంపీసీ) రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ భూపతిరాజు హిమబిందు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో మనోజ్ఞ అండర్ 17 బాలికల సింగిల్స్ విభాగంలో విన్నర్గాను, అండర్ 19 బాలికల డబుల్స్ విభాగంలో విన్నర్గాను, అండర్ 19 బాలికల సింగిల్స్ విభాగంలో రన్నర్గా నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. ఈ సంద్భంగా ప్రశంసాపత్రాలు, ట్రోఫీలు అందుకున్నట్లు చెప్పారు. గురువారం కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్య ఉషారాణి, జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకట కృష్ణారావు విద్యార్థిని మనోజ్ఞతోపాటు ఫిజికల్ డైరెక్టర్, అధ్యాపకులను ప్రత్యేకంగా అభినందించారు. పాలకొల్లు సెంట్రల్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన జిల్లా స్థాయి శారీరక దివ్యాంగుల క్రికెట్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ కన్వీనర్ లేళ్ల సుబ్బారాయుడు తెలిపారు. గురువారం మీడియాకు వివరిస్తూ డిఫరెంట్లీ అబలీడ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ (డీసీసీ, ఏపీ), డిఫరెంట్లీ అబ్లీడ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ (డీఏసీఏ) సంయుక్త ఆధ్వర్యంలో అమరావతి ఇన్క్లూజివ్ క్రికెట్ కప్ 2026 టోర్నమెంట్కు సంబంధించి జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 8 గంటల నుంచి తణుకు సమీపంలోని పైడిపర్రు వై జంక్షన్ వద్ద ఉన్న ఏఎస్ఆర్ బీఈడి క్యాంపస్లోని ఏఎస్ఆర్ క్రికెట్ అకాడమీ నెట్స్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఎంపికలో పాల్గొనే దివ్యాంగ క్రీడాకారులు తమ వ్యక్తిగత క్రికెట్ కిట్ తప్పనిసరిగా వెంట తీసుకురావాలన్నారు. పూర్తి వివరాలకు 95159 21299, 97019 22334 సెల్ నంబర్లలో సంప్రదించాలన్నారు. బుట్టాయగూడెం: గిరిజన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ నెల 25వ తేదీ కేఆర్పురం వైటీసీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లలిత గిరిజన మహిళా మండలి సంస్థ ద్వారా ఉద్యోగ కల్పన కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు శనివారం ఉదయం 10 గంటలకు వైటీసీలో జరిగే కార్యక్రమంలో తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాలకు 94933 59574, 73825 52616 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
టీడీపీ దౌర్జన్యకాండ
రెచ్చిపోతున్న మట్టి మాఫియా కామవరపుకోట మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను లక్ష్యంగా చేసుకుని మట్టిని తోడేస్తోంది. 8లో uశురకవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026సాక్షిప్రతినిధి, ఏలూరు: దెందులూరులో అధికార పార్టీ దౌర్జన్యకాండ తారాస్థాయికి చేరింది. సామాన్యుడిని మొదలు ప్రతిపక్ష పార్టీ ప్రధాన నేతల వరకూ అందరినీ లక్ష్యంగా చేసుకుని ఆస్తినష్టాలకు తెగబడే కొత్త సంస్కృతికి తెరలేచింది. సాక్షాత్తూ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ప్రజాప్రతినిధి కొఠారు అబ్బయ్యచౌదరిని లక్ష్యంగా చేసుకుని రెండేళ్ల నుంచి ప్రత్యక్ష వేధింపులకు విడతల వారీగా దిగుతుండటం నియోజకవర్గంలో హాట్టాపిక్గా మారింది. రెండేళ్లుగా అబ్బయ్యచౌదరి కుటుంబానికి చెందిన పొలంలో ఫలసాయం కోయకుండా దాడి, దౌర్జన్యం, తప్పుడు కేసులతో అధికార పార్టీ ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారు. కక్ష సాధింపు ధోరణితో.. దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు ధోరణి కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలో పోలీసుల ద్వారా అడ్డగోలు చర్యలకు దిగుతూ హడావుడి కొనసాగిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే అబ్బయ్యచౌదరి లక్ష్యంగా దాడులు, ధ్వంస రచనకు సన్నద్ధమైతే ప్రతిపక్ష పార్టీ నేతలు బలంగా తిప్పుకొట్టారు. కొల్లేరు రైతులకు లీజు డబ్బులు ఇవ్వాలనే సాకుతో చింతమనేని నియోజకవర్గంలో కొత్త వివాదానికి తెరదీశారు. కౌంటింగ్ మరుసటి రోజు నుంచే అబ్బయ్యచౌదరి ఇంటి వద్ద డప్పు కొట్టించడం, వంటావార్పు చేయించడం, కొల్లేరు ప్రాంతానికి చెందిన వారనే ముసుగులో టీడీపీ కార్యకర్తలతో హడావుడి కొన్ని నెలల పాటు కొనసాగించారు. అబ్బయ్యచౌదరి తానేమీ ఎవరికీ బాకీ లేనని, డబ్బులు ఇవ్వాల్సిందేమి లేదని ఖరాఖండీగా తేల్చి చెప్పడంతో వివాదం సర్దుమణిగింది. అబ్బయ్యచౌదరి, సోదరిమణులకు స్వగ్రామమైన కొండలరావుపాలెంలో 70 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. దానిలో ఆయిల్పామ్, కోకో, కొబ్బరి సాగులో ఉంది. ఈ క్రమంలో రెండేళ్ల నుంచి ఇక్కడ ఫలసాయం కోయనివ్వకుండా ఎమ్మెల్యే వర్గీయులు, టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని గందరగోళం సృష్టిస్తున్నారు. కొద్ది నెలల క్రితం పంట కోసే సమయంలో దాడులు, దౌర్జన్యాలకు తెగబడి పొలంలో చెట్లు నరకడంతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడి వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనే ఎదురు కేసు నమోదు చేయించారు. ఆ తరువాత మళ్లీ ఇదే తరహాలో హడావుడి జరగడంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటుచేసి టీడీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడటం కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా పొలంలో పని చేయించుకోవడానికి కూలీలను మాట్లాడుకుంటే టీడీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేసి రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో రెండేళ్లుగా ఫలసాయం చెట్లపైనే కుళ్లిపోవడంతో 400 లకుపైగా ఆయిల్పామ్ మొక్కలు చనిపోవడం, కొబ్బరి, మరికొన్ని మొక్కలు మృత్యువాత పడటంతో రూ.2.20 కోట్ల మేర ఫలసాయం నష్టం జరిగింది. ఈ పరిణామాల క్రమంలో బుధవారం అబ్బయ్యచౌదరి పొలంలో ఉండి పనులు చేయిస్తుండగా మళ్లీ పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యేకు తప్పని వేధింపులు అబ్బయ్యచౌదరి పొలంలో పంట కోయనీయకుండా అడ్డుకునే యత్నం రెండేళ్లుగా ఇవే వేధింపులు కొనసాగిస్తున్న చింతమనేని 70 ఎకరాల్లో కుళ్లిపోతున్న ఫలసాయం దాదాపు రూ.2.20 కోట్ల నష్టం ఆయిల్పామ్, కొబ్బరి మొక్కల మృత్యువాత కోతకు వచ్చే కూలీలపై టీడీపీ నేతల బెదిరింపులు చింతమనేని బెదిరింపులకు భయపడేది లేదు: అబ్బయ్యచౌదరి పొలంలో పనులు చేయడానికి వచ్చే కూలీల ఇళ్లకు ఎమ్మెల్యే చింతమనేని వెళ్లి పనులకు వెళ్లవద్దని అడ్డగించడం సిగ్గుమాలిన చర్య అని అబ్బయ్యచౌదరి ధ్వజమెత్తారు. తనలాంటి వారికి కూడా కొత్త రాజకీయాలు నేర్పిస్తున్నారని, కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఆయన హెచ్చరించారు. -
సచివాలయం.. సేవలకు దూరం
● పనిచేయని కంప్యూటర్లు ● వేధిస్తున్న సిబ్బంది కొరత ● సేవల్లో జాప్యం ● కూటమి పాలనలో ప్రజలకు తిప్పలు కై కలూరు: ఒకే చోట ప్రజల సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా ప్రారంభమైన సచివాలయాలు నేడు పూర్వ వైభవాన్ని కోల్పోయి వెలవెలబోతున్నాయి. గతంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య క్లినిక్ వంటి సేవలు గ్రామంలోనే లభించగా, నేడు మళ్లీ చిన్నచిన్న పనుల కోసం మండల కేంద్రాలకు తిరగాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మౌలిక వసతుల లేమి.. పనిచేయని కంప్యూటర్లు గ్రామాల్లో వివిధ రకాల ప్రభుత్వ ధ్రువపత్రాలను వేగంగా అందించడానికి గతంలో ప్రతి సచివాల యానికి రెండు కంప్యూటర్లు, పవర్ బ్యాకప్, ఫర్నిచర్ సమకూర్చారు. అయితే ప్రస్తుతం నిర్వహణ లోపంతో అనేక చోట్ల కంప్యూటర్లు మూలన పడ్డాయి. కనీసం తాగునీటి సదుపాయం కూడా లేక సచివాలయాలకు వచ్చే ప్రజలు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇంటి వద్దకే రేషన్, పెన్షన్ సేవలు అందగా, నేడు మళ్లీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. తీవ్రమైన సిబ్బంది కొరత : ఉద్యోగుల సర్దుబాటు (రేషనలైజేషన్) కారణంగా సచివాలయాల్లో సిబ్బంది సంఖ్య గణనీయంగా తగ్గింది. ఖాళీ అయిన స్థానాల్లో కొత్తవారిని నియమించకపోవడంతో సేవలందించడం భారంగా మారింది. ఉదాహరణకు కై కలూరు నియోజకవర్గంలో 79 సచివాలయాల్లో గతంలో 230 మంది పనిచేయగా, ప్రస్తుతం ఆ సంఖ్య 150 కన్నా తగ్గింది. శృంగవరప్పాడు సచివాలయ బాధ్యతలను కేవలం ఒకే ఒక్క ఏఎన్ఎం చూసుకుంటోంది. కలిదిండి మండలంలోని 20 సచివాలయాలకు గాను మొత్తం మండలంలో ఒకే ఒక్క వ్యవసాయ సహాయకుడు అందుబాటులో ఉన్నారు. పనులు మానుకుని పడిగాపులు : మహిళా పోలీసులు, వెల్ఫేర్, డిజిటల్ అసిస్టెంట్లు లేకపోవడం వల్ల కొ ల్లేరు గ్రామ ప్రజలు సర్టిఫికెట్ల కోసం పనులన్నీ వదులుకుని మండల కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఖాళీలను భర్తీ చేసి, మౌలిక వసతులు కల్పించి సచివాలయాలకు పూర్వవైభవం తీసుకురావాలని గ్రామీణులు కోరుతు న్నారు. కంప్యూటర్ల సమస్యపై కలిదిండి ఎంపీడీఓ కె.రమణబాబును వివరణ కోరితే ఇప్పటికే కంప్యూటర్లు పాడైన సచివాలయాల్లో కొత్తవి అందించామని, సమస్యను పరిశీలిస్తామని చెప్పారు. కై కలూరు–2 సచివాలయంలో పనిచేయని కంప్యూటర్లు శృంగవరప్పాడు సచివాలయంలో సిబ్బంది లేని దృశ్యం సచివాలయాల్లో ఏడుగురు పనిచేయాల్సిన చోట కేవలం ఒక్కరూ మాత్రమే ఉంటున్నారు. ప్రధానంగా డిజిటల్ అసిస్టెంట్లపై భారం పడుతోంది. కలిదిండి మండలంలో పలు సచివాలయాల్లో ఒకరు, ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వెంటనే సిబ్బందిని భర్తీ చేయాలి. – ఎస్.మహంకాళిరావు, సీపీఎం కార్యదర్శి, మండవల్లి మండలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో సచివాలయాలు పారదర్శకంగా, అర్హతే ప్రామాణికంగా సేవలు అందించాయి. సచివాలయంలో సర్వే అసిస్టెంట్లను ఏర్పాటుచేశారు. నేడు సిబ్బంది కొరత కనిపిస్తోంది. సచివాలయాలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించాలి. – బలే నాగరాజు, చింతపాడు, మండవల్లి మండలం -
రెచ్చిపోతున్న మట్టి మాఫియా
కామవరపుకోట: మండలంలో మట్టి మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోతోంది. స్థానిక ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను లక్ష్యంగా చేసుకుని జేసీబీలతో తోడేస్తూ, టిప్పర్లు, ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. ఆ మట్టిని ప్రైవేట్ నిర్మాణాలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ఇటుక బట్టీలకు అమ్ముకుంటూ అక్రమార్కులు లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. గత కొంతకాలంగా రాత్రి, పగలు తేడా లేకుండా ఈ అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. స్థానిక అధికార పార్టీ నాయకుల అండదండలతో, నకిలీ అనుమతులు చూపిస్తూ అవసరానికి మించి మట్టిని తోడేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు సైతం తరలిస్తూ అక్రమార్కులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. జనావాసాల మధ్య అతివేగం.. ప్రశ్నిస్తే బెదిరింపులు! జనావాసాల మధ్య నుంచి టిప్పర్లు, ట్రాక్టర్లు అతివేగంగా రాకపోకలు సాగిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అక్రమ రవాణాను స్థానికులు ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. ఇటీవల తడికలపూడిలో జరుగుతున్న మట్టి తవ్వకాలపై ఓ విలేకరి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు, అతనిని కూడా బెదిరించి హెచ్చరించినట్లు సమాచారం. పర్యావరణానికి తీవ్ర ముప్పు! ఈ మట్టి మాఫియా వల్ల ఒకవైపు ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు, మరోవైపు గుట్టలు, కొండలను ఇష్టానుసారంగా తవ్వేయడం వల్ల పర్యావరణ సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, కుంటల్లో పరిమితికి మించి మట్టి తీయడం వల్ల నీరు నిల్వ ఉండే సామర్థ్యం తగ్గిపోతోందని, భూగర్భ జలాలు ఇంకిపోయి బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు లేకపోవడంతో ఈ ప్రాంతం మాఫియాకు అడ్డాగా మారుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, మట్టి అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని, అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజాసంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులే లక్ష్యం రాత్రింబవళ్లూ అక్రమ రవాణా ప్రభుత్వ ఆదాయానికి గండి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని పర్యావరణవేత్తల ఆందోళనగత కొంత కాలంగా అక్రమార్కులు టీడీపీ అండదండలతో చెరువులు, ప్రభుత్వ భూములు, గుట్టలను ఇష్టానుసారం తవ్వి మట్టిని అక్రమంగా తరలిస్తూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. దీనివలన ప్రభుత్వ ఆదాయానికి గండిపడటంతో పాటు భూగర్భజలాలు ఇంకిపోయి బోర్లలోని నీరు ఎండిపోయి రైతులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. అధికారులు వెంటనే స్పందించి మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలి. – కంభం విజయరాజు, వైఎస్సార్ సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ -
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ వి.గోపాలకృష్ణారావు బుధవారం సతీసమేతంగా సందర్శించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రదక్షిణలు నిర్వహించిన అనంతరం న్యాయమూర్తి స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆయనకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలుకగా, దేవస్థానం ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. న్యాయమూర్తి వెంట భీమడోలు కోర్టు జడ్జి ఎస్. ప్రియదర్శిని నూతక్కి, ఆలయ సూపరింటెండెంట్ ఐవీ రామారావు తదితరులున్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): యోగాసన క్రీడల ప్రోత్సాహం, ఆరోగ్యంపై చైతన్యం, క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యంగా యోగాసన భారత్ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించనున్నట్టు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి మోటమర్రి మల్లిఖార్జునరావు ఒక ప్రకటనలో తెలిపారు. రతుంగ గేమ్స్ పేరిట నిర్వహిస్తున్న ఈ పోటీలు స్థానిక వన్టౌన్లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి సత్రంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమౌతాయన్నారు. ఆర్టిస్టిక్ సింగల్, ఆర్టిస్టిక్ పెయిర్, రిథమిక్ పెయిర్, ఆర్టిస్టిక్ గ్రూప్, ట్రెడిషనల్ గ్రూప్ అంశాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీలు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ల విభాగాల్లో జరుగుతాయని, జిల్లాలోని అన్ని పాఠశాలల, కళాశాలల విద్యార్థులతో పాటు యోగాసన కేంద్రాల విద్యార్థులు, ప్రజలు పాల్గొనవచ్చన్నారు. వివరాలకు 98486 11744, 83094 15417, 94907 34033 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): నీట్ పరీక్షా పత్రాల లీకేజీపై ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థి, యువజనులపై ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు సాగించిన పాశవిక లాఠీచార్జీని ఖండిస్తూ ఐఎఫ్టీయూ, పీవైఎల్, ఏఐకేఎంఎస్ సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఫ్టూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యూవీ మాట్లాడుతూ... లక్షలాది మంది విద్యార్థులు, యువజనుల భవిష్యత్తును నాశనం చేసేలా నీట్ పరీక్షా పత్రాల లీకేజీకి కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా కోరుతూ విద్యార్థి, యువజనులు చేపట్టిన ఉద్యమంపై మోదీ, అమిత్ షాల ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా దమనకాండను ప్రయోగించడాన్ని తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా, పోలీసుల ముసుగులో ఆర్ఎస్ఎస్ గూండాలు కూడా దాడికి దిగారని ఆరోపించారు. ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకుడు టి. బాబురావు మాట్లాడుతూ విద్యార్థి, యువజనులపై దారుణంగా లాఠీచార్జ్ చేసి తీవ్ర హింసకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు పోరండ్ల శ్రీనివాస్, ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, నగర అధ్యక్షుడు బి.సోమయ్య, నగర ప్రధాన కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు, నాయకులు డి.వీరినాయుడు, మంగం అప్పారావు పాల్గొన్నారు. పోలవరం రూరల్: ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి నీరు భారీగా చేరడంతో వరద ప్రవాహం క్రమేణా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటిమట్టం 26 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం స్పిల్వే నుంచి 32 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లో కూడా వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. -
వసూల్ రాజా !
షరా‘మామూలే’ సాక్షి, భీమవరం: పైవాళ్లకు పంపాలంటూ అసోసియేషన్ నేత అదనపు వసూళ్లు పశ్చిమ రైస్ మిల్లింగ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఏసీకే ఫార్మాలిటీస్ అన్నీ ఇచ్చేశాక రాష్ట్రంలో ఏ జిల్లాలోను లేని విధంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పుడు మళ్లీ ప్రత్యేక వసూళ్లు ఎవరి జేబులోకని చర్చించుకుంటున్నారు. ఎందుకొచ్చిన గొడవని ఎవరికి వారు గుట్టుచప్పుడు కాకుండా ముట్టచెబుతున్నారు. రూ.12 కోట్లు టార్గెట్కు రెండు రోజుల్లో రూ.10 కోట్లకు పైగానే కలెక్షన్ వసూలు చేసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. రైతుల నుంచి సివిల్ సప్లయిస్ శాఖ సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం మిల్లులకు అప్పగిస్తుంది. మిల్లింగ్ చేసి 67 శాతం బియ్యాన్ని మిల్లర్లు సివిల్ సప్లయిస్కు అప్పగించాలి. గత ఖరీఫ్లో జిల్లాలోని రైతుల నుంచి దాదాపు 4.45 లక్షల మెట్రిక్ టన్నులు, రబీలో 7.82 లక్షలు మెట్రిక్ టన్నులు కలిపి 12.27 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 29 టన్నుల బియ్యాన్ని ఒక ఏసీకే (ఎక్నాలెడ్జ్మెంట్)గా పరిగణిస్తారు. ఈ మేరకు 28,116 ఏసీకేల బియ్యాన్ని సివిల్ సప్లయిస్కు అప్పగించాలి. దీనిలో కొంత మొత్తం ఎఫ్సీఐకు, మిగిలిన బియ్యాన్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషనన్ సిస్టమ్ (పీడీఎస్)కు సివిల్ సప్లయిస్ కేటాయింపులు చేస్తుంది. ప్రత్యేక కలెక్షన్ ఖరీఫ్, రబీ సీఎంఆర్ మేరకు ఇప్పటికే ఫార్మాలటీస్ పూర్తిచేసినట్టు సమాచారం. కాగా అసోసియేషన్లోని కీలక నేత తాజాగా బ్రోకెన్ పర్సంటేజీని మేనేజ్ చేసే నిమిత్తం ప్రభుత్వంలోని పైవాళ్లకు ఇవ్వాలంటూ ఏసీకేకు రూ.4,500 చొప్పున ఇవ్వాలని మిల్లర్లకు హుకుం చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో 207 మిల్లులకు గాను సీఎంఆర్ కేటాయింపుల మేరకు దాదాపు రూ.12 కోట్లు కలెక్షన్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. కూటమి పక్షాలకు చెందిన నేతల అండదండలు పుష్కలంగా ఉన్న సదరు నేతతో ఎందుకొచ్చిన గొడవని మిల్లర్లు చెప్పిన మొత్తం చెల్లిస్తున్నారు. రెండు రోజుల్లో పలు మిల్లుల నుంచి రెండు రోజుల్లో రూ.10 కోట్ల వరకు కలెక్షన్ చేసినట్టు రైస్మిల్లింగ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇరుగుపొరుగు జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా కేవలం పశ్చిమగోదావరి జిల్లాలోనే ఈ స్పెషల్ కలెక్షన్ జరుగుతోందని, ఈ మొత్తం ఎవరి జేబుల్లోకి వెళుతుందని మిల్లర్లు చర్చించుకుంటున్నారు. మరోపక్క సీఎంఆర్ కేటాయింపుల్లోను సదరు నేత ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్న టాక్ ఉంది. మిల్లింగ్ కెపాసిటీ మేరకు సీఎంఆర్ కేటాయింపులు చేయాలి. ప్రైవేట్ ట్రేడింగ్ చేసే మిల్లులకు సీఎంఆర్ ఇవ్వకూడదు. కాగా కూటమికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను అడ్డంపెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్న పేరుంది. తనకు కావాల్సిన వారికి ఎక్కువగాను, లేనివారికి తక్కువగాను కేటాయింపులు చేస్తున్నారనుకుంటున్నారు. అధికారులు ఆయన చెప్పిన విధంగానే నడుచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. పైవాళ్ల పేరిట పశ్చిమలో ప్రత్యేక దందా రైస్ మిల్లర్ల నుంచి ఏసీకేకు రూ.4,500 అదనపు వసూలు ఖరీప్, రబీలో సీఎంఆర్ ద్వారా 28,347 ఏసీకేల బియ్యం ఉత్పత్తి రైస్ మిల్లుల నుంచి రూ.12 కోట్ల మేర కలెక్షన్ టార్గెట్ రెండు రోజుల్లో రూ.10 కోట్లకు పైగానే వసూలు (ఏఐ సృష్టించిన చిత్రం)మిల్లర్లు ఇచ్చే బియ్యంలో నూకలు (బ్రోకెన్) పర్సంటేజీ గతంలో 25 శాతం వరకు ఎఫ్సీఐ అనుమతి ఇచ్చేది. గత సీజన్ నుంచి బ్రోకెన్ను 10 శాతానికి పరిమితం చేసింది. ఎఫ్సీఐ ప్రమాణాలకు లోబడి బియ్యం నాణ్యత ఉండాలి. సీఎంఆర్ బియ్యం తీసుకునే సమయంలో నిబంధనల పేరిట సంబంధిత అధికారులు ఇబ్బందులు పెట్టకుండా కింది స్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు మిల్లర్లు మామూళ్లు ముట్టజెబుతుంటారు. ఒక ఏసీకేకు సుమారు రూ. 2,500 చొప్పున కేటాయింపుల మేరకు ఈ ముడుపులు ఉంటాయి. రీసైకిల్ చేసిన పీడీఎస్ బియ్యానికి రూ.10 వేల వరకు ఉంటుంది. రాజకీయ నేతలకు ఇచ్చే మామూళ్లు సెపరేటుగా ఉంటాయి. మిల్లర్ల నుంచి సేకరించి పైస్థాయికి చేరేవేసే బాధ్యతను అసోసియేషన్ చూసుకుంటుంది. ఈ వ్యవహారమంతా తెరవెనుక గట్టుచప్పుడు కాకుండా సాగిపోతుంది. -
ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి
లింగపాలెం: ఎల్నినో ప్రభావంతో సాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సూచించారు. బుధవారం ధర్మాజీగూడెంలో పర్యటించిన ఆమె, పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. సాగునీటి లభ్యత తక్కువగా ఉన్నందున ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని, ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక రామకృష్ణ మేన్యూర్ డిపోను తనిఖీ చేసి, నిల్వల పట్టికను బోర్డుపై ఉంచాలని, యాప్ ద్వారానే ఎరువుల విక్రయాలు జరపాలని ఆదేశించారు. నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, తహసీల్దార్ నజీముల్లాషా పాల్గొన్నారు. పాఠశాల ఆకస్మిక తనిఖీ ధర్మాజీగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పాఠాలు బోధించి, వారి సమాధానాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన నాణ్యత, మౌలిక వసతులను పరిశీలించి, పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు స్పష్టం చేశారు. అనంతరం గ్రామంలోని ‘భవిత’ దివ్యాంగుల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న వసతులు, వైద్య సేవలను పరిశీలించారు. -
అక్రమంగా తరలిస్తున్న పొగాకు బేళ్లు సీజ్
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): జీలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామం నుంచి గుంటూరుకు అక్రమంగా రవాణా అవుతున్న పొగాకు బేళ్లను పొగాకు బోర్డు విజిలెన్స్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో మంగళవారం నిఘా ఉంచిన అధికారులు, దర్భగూడెం–వంకవారిగూడెం రోడ్డు వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దళారులు అక్రమంగా కొనుగోలు చేసి గుంటూరుకు తరలిస్తున్న క్రమంలో ఎలాంటి పర్మిట్లు లేని సుమారు 27 హై గ్రేడ్ పొగాకు బేళ్లను గుర్తించి, వాటిని తక్షణమే సీజ్ చేశారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి, సీజ్ చేసిన పొగాకును తదుపరి చర్యల నిమిత్తం జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ఎన్ఎల్ఎస్ రీజనల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్ మాట్లాడుతూ పొగాకు రైతులు ఎవరూ తమ పంట బేళ్లను బయట వ్యక్తులకు, దళారులకు అమ్మకూడదని సూచించారు. ఈ దాడుల్లో పొగాకు బోర్డు విజిలెన్స్ అధికారులు జీఎం కిరణ్, సాయి ప్రశాంత్, ధర్మతేజ పాల్గొన్నారు. -
బదిలీల రాజకీయం
చిక్కిన చైన్ స్నాచర్ చేపలు అమ్ముకుంటున్న వృద్ధురాలిని బురిడీ కొట్టించి ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 8లో uభూ వివాదం సద్దుమణిగింది.. రాజకీయ వేడి రాజుకుంది. చివరకు బదిలీల కత్తి దేవస్థానం అధికారుల మెడపై వేలాడుతోందన్న చర్చ ద్వారకాతిరుమల క్షేత్రంలో జోరందుకుంది. ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావుకు అనుకూలంగా ఉన్నారనే కారణంతోనే అధికారులను ఒక్కొక్కరిని పచ్చనేతలు టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇద్దరు సూపరింటెండెంట్లు డిప్యుటేషన్పై బదిలీ కాగా.. మరి కొందరిపై, ముఖ్యంగా ఇద్దరు ఇంజనీరింగ్ విభాగ అధికారులపై బదిలీ వేటు తప్పదన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆలయ చైర్మన్ వయోభారాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపాలన సౌలభ్యం కోసం చైర్మన్కు ఆయన కుమారుడిని సహాయకుడిగా నియమిస్తూ ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీఓను సైతం రద్దు చేయించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. గురువారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2026ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్ర దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ భూకబ్జా వివాదం ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. భూవివాదం కూటమి పాలకులకు, నేతలకు తలనొప్పిగా మారిన నేపథ్యంలో.. అందుకు కారణమయ్యారన్న అనుమానంతో కొందరు దేవస్థానం అధికారులపై బదిలీ వేటు మొదలైంది. ఇప్పటికే ఇద్దరు అధికారులు బదిలీ కాగా.. మరికొందరు కీలక అధికారులు టార్గెట్ లిస్టులో ఉన్నారన్న చర్చ సాగుతోంది. దీంతో శ్రీవారి దేవస్థానంలో అసలు నడుస్తోంది పరిపాలనా ప్రక్రియా..? రాజకీయ కక్ష సాధింపా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భూవివాదంతో మొదలైన రగడ దేవుడి భూకబ్జా వ్యవహారం బయటకు రావడంతో వివాదం రాజుకుంది. దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు కుమారుడు, అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావు గత నెల 23న వివాదాస్పద భూమి అంశంపై ఓ టీడీపీ నేతను నిలదీయడం, అదే రోజు తొలి ట్రస్ట్ బోర్డు సమావేశంలో ఆ నేతతో వాగ్వాదం జరగడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. అనంతరం దేవుడి భూమి.. దేవుడికే దక్కాలంటూ మాజీ హోం మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నేతలు చేపట్టిన ఆందోళనలు రాజకీయ దుమారాన్ని రేపాయి. దాంతో అధికారులు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి, జరిగిన తప్పులను సరిచేయడం కూడా పాలకుల కబ్జాకోరుతనాన్ని మరింత బహిర్గతం చేసింది. ఇప్పటికే ఇద్దరిపై బదిలీ వేటు గతంలో శ్రీవారి దేవస్థానం నుంచి అన్నవరం దేవస్థానానికి బదిలీ అయిన సూపరింటెండెంట్ కోటగిరి కిషోర్ ఏడాది క్రితం డిప్యూటేషన్పై తిరిగి మళ్లీ ఇక్కడికి వచ్చారు. ఆయన డిప్యుటేషన్ కాలం ఇటీవల ముగియడంతో, మరో ఏడాది పాటు దాన్ని పొడిగించుకునేందుకు కిషోర్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాజాగా మంగళవారం సూపరింటెండెంట్ వాసా నగేష్ను పెనుగంచిప్రోలు దేవస్థానానికి ఏడాది పాటు డిప్యూటేషన్పై బదిలీ చేయడం క్షేత్రంలో చర్చకు దారితీసింది. ఈ ఇద్దరు బదిలీ పచ్చ పాలకుల కనుసన్నల్లో జరిగిందేనన్న చర్చ జరుగుతోంది. పరిపాలనా అవసరాల దృష్ట్యా అని సాకుచూపి, పాలకుల ఆదేశాలను దేవాదాయశాఖ అధికారులు అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో ఇద్దరు అధికారులపై గురి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డీవీ భాస్కర్, ఎలక్ట్రికల్ డీఈ టి.సూర్యనారాయణ కూడా టార్గెట్ లిస్టులో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. త్వరలో వీరిపైనా బదిలీ చర్యలు ఉంటాయని కొందరు నేతలు బహిరంగంగా చెబుతున్నారు. ఈ ఇద్దరూ చైర్మన్కు సన్నిహితులుగా గుర్తింపు పొందిన అధికారులే కావడం గమనార్హం. ఉద్యోగం చేయలేం బాబోయ్ రాజకీయ ఒత్తిళ్లు, బదిలీల బెదిరింపులతో దేవస్థానం అధికారులు, సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలా ఒత్తిళ్లు కొనసాగితే ఉద్యోగాలు చేయడం కష్టమే’ అని పలువురు వాపోతున్నారు. గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు తమకు ఎదురవలేదని అంటున్నారు. లక్ష్మీపురం భూవివాదం తర్వాత దేవస్థానం అధికారులపై బదిలీ బాణం ఇప్పటికే ఇద్దరు బదిలీ.. మరో ఇద్దరిపై గురి చైర్మన్ కుమారుడి జీఓను రద్దు చేయించేందుకు ప్రయత్నాలు? శ్రీవారి క్షేత్రంలో హాట్టాపిక్గా బదిలీ రాజకీయాలు (ఏఐ సృష్టించిన చిత్రం)


