Eluru District News
-
గుబ్బల మంగమ్మ తల్లి గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అధికంగా తరలివచ్చిన భక్తుల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారితోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు. కుక్కునూరు: మండలంలోని వేలేరు గ్రామ సమీపంలో ఆదివారం రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం గుండాలపాడు గ్రామానికి చెందిన మడకం కన్నారావు (28) తన బైక్పై వేలేరు మీదుగా భద్రాచలం వెళ్తుండగా, ఎదురుగా మరో బైక్పై వచ్చిన వెంకటాపురం గ్రామానికి చెందిన కొండ చిట్టిబాబు ఆటోను ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో కన్నారావు బైక్ను ఢీకొట్టాడు. దీంతో రోడ్డుపై పడిపోయిన కన్నారావు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలోని గుబ్బల మంగమ్మ తల్లి గుడి సమీపంలో కింగ్ కోబ్రా (గిరినాగు) సంచరిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు కోర్స రాంబాబు, కోర్స గంగరాజులు తెలిపారు. ఆదివారం సాయంత్రం వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం కావిడగుండ్ల, ఏపీలోని బుట్టాయగూడెం మండలం సరిహద్దు అటవీ ప్రాంతంలో, గుడికి అత్యంత సమీపంలో నీటి కుంట వద్దకు ఈ పాము వచ్చి నీరు తాగి వెళ్తుండగా కొందరు యువకులు చూసినట్లు తెలిపారు. ఆ యువకులు తమ సెల్ఫోన్లో వీడియో కూడా తీశారు. సుమారు 18 అడుగుల పొడవు ఉన్న ఈ గిరినాగు జంతువుల రక్తం వాసనకు గుడి పరిసర ప్రాంతాల్లో తిరిగే అవకాశం ఉన్నందున, భక్తులతో పాటు పరిసర ప్రాంత ప్రజలు అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. అటవీ శాఖ అధికారులు కూడా ప్రజలను హెచ్చరిస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతం నుంచి పెద్ద పులి బుట్టాయగూడెం మండలంలోకి ప్రవేశించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. చాట్రాయి: భూ సమస్య పరిష్కరించాలంటూ బాధితుడు వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. బాధితుడి వాంగ్మూలం ప్రకారం.. మర్లపాలెం గ్రామానికి చెందిన వాసం సత్యం 40 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన వెల్ది నాభూషణం, భూషయ్యల దగ్గర 6 సెంట్లు భూమి కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ భూమిలోనే 40 ఏళ్లుగా సత్యం కొడుకు వాసం రమేష్ కుటుంబం నివాసం ఉంటున్నారు. ఆదివారం భూమి అమ్మిన వారి వారసులు వేగుంట రామకృష్ణ, వంశీకృష్ణలు తమ ఇంటిని ఆక్రమించుకోవడానికి పోలీసులు, రెవెన్యూ సిబ్బందిని తీసుకుని కొలతలు కొలుస్తుండగా తట్టుకోలేక, రమేష్ తన పిల్లలతో కలిసి వాటర్ ట్యాంకు ఎక్కాడు. సమస్య పరిష్కరించకపోతే దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఎస్ఐ డి. రామకృష్ణ ఇరువర్గాల వద్ద ఉన్న డాక్యుమెంట్లు తీసుకుని, సోమవారం నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు కిందకు దిగారు. భీమడోలు: యువతిని మానసిక, శారీరకంగా వేధిస్తున్న యువకుడిపై భీమడోలు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పూళ్ల పంచాయతీలోని ఎంఎం పురంలో ఓ యువతి బీఎస్సీ కంప్యూటర్ చదివి ఇంట్లో ఉంటోంది. అదే గ్రామానికి చెందిన జగదీష్కుమార్ పరిచమయ్యాడు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి కుదిరింది. సహించని జగదీష్ కొంత కాలంగా ఆమెను వేధిస్తున్నాడు. గత నెల 28వ ఇంట్లోకి చొరబడి ఆత్యాచార యత్నాన్ని ప్రయత్నించాడు. ఆ యువతి కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమెతో కలిసి ఉన్న ఫొటోలను ఆమె కుటుంబ సభ్యులతో పాటు వివాహాం చేసుకునే బంధువులకు పంపుతూ బెదిరిస్తున్నాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు భీమడోలు ఎస్సై ఎస్కే మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అటకెక్కిన పేదల బీమా పథకం
భీమవరం (ప్రకాశం చౌక్): పేద, మధ్యతరగతి కుటుంబానికి చెందిన యజమాని చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అమలు చేసే బీమా పథకాన్ని ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల బీమా పథకం గురించి ఊసే ఎత్తడం లేదు. గత రెండేళ్లుగా బీమా క్లయిమ్స్పై పైసా ఖర్చు చేయలేదు. దాంతో కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పేదవాడి కుటుంబానికి బీమా చెల్లించడానికి నిధులు లేవని సాకు చూపిస్తున్న చంద్రబాబు, యోగా కోసం ఒక రోజుకు రూ.300 కోట్లు ఖర్చు చేశారు. ప్రమాదవశాత్తు చనిపోతే రూ.5 లక్షల బీమాను నామినీగా ఉన్న లబ్ధిదారులకు అందించాల్సి ఉంది. పోస్టుమార్టం రిపోర్ట్, పోలీసు నివేదికలు ఇలా అన్ని అర్హత పత్రాలు సిద్ధంగా ఉన్నప్పటికీ, అర్హులైన వారికి బీమా అందడం లేదు. శ్రీచంద్రన్న బీమాశ్రీగా పేరు మార్చి, ప్రమాదవశాత్తూ మరణించిన వారికి ఇచ్చే సాయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకూ ఆ పథకం ఊసే ఎత్తడం లేదు. పేదలను ఆదుకునే బీమా పథకాన్ని నిలిపివేయడం దారుణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1500 మంది వరకు.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో ప్రమాదవశాత్తు, సహజంగా మరణించి బీమా పథకానికి అర్హులైన వారు ఉమ్మడి జిల్లాలో సుమారు 1500 మంది వరకు ఉన్నారు. వీరిలో ప్రమాదవశాత్తు చనిపోయిన వారు 600 మంది ఉండగా, సహజ మరణం పొందిన వారు మరో 600 మంది ఉన్నారు. అలాగే ప్రమాదాల్లో శాశ్వత లేదా పాక్షిక అంగవైకల్యం పొందిన వారు 300 మంది వరకు ఉన్నారు. వీరంతా బీమా పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బీమా కోసం ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి కూడా అవకాశం లేకపోవడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గత ప్రభుత్వంలో.. రూ. 5 లక్షల బీమా చెల్లింపు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీవైఎస్సార్ బీమాశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసింది. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల లోపు వారు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షలు, 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు వారు సహజ మరణం పొందితే రూ.లక్ష అందించేవారు. అలాగే శాశ్వత అంగవైకల్యానికి రూ.5 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.2.50 లక్షల బీమా సొమ్మును చెల్లించేవారు. దీంతో బాధిత కుటుంబాల బతుకుదెరువు సాఫీగా సాగేది. ఎవరైనా వ్యక్తి చనిపోయారని తెలిసిన వెంటనే సచివాలయ సిబ్బంది బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి వెంటనే బీమా క్లయిమ్ కోసం ఆన్లైన్ చేసేవారు. దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే నామినీ బ్యాంకు ఖాతాలో బీమా సొమ్ము జమ అయ్యేది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఏడాదికి సగటున రూ. 10 కోట్లు బీమా కోసం ప్రభుత్వం ఖర్చు చేసేది. కూటమి ప్రభుత్వంలో నిలిచిపోయిన చెల్లింపులు రెండేళ్లుగా పైసా చెల్లింపు చేయని వైనం ఉమ్మడి జిల్లాలో రెండేళ్లలో ప్రమాదాల్లో చనిపోయిన వారు 600 మంది సహజ మరణం పొంది అర్హత కలిగిన వారు 600 మంది బీమా కోసం ఎదురుచూపులు గత ప్రభుత్వంలో (2023–24) బీమా చెల్లింపులు: పశ్చిమగోదావరి జిల్లా వివిధ ప్రమాదాల్లో మరణించిన వారు 50 మంది కాగా, వారికి రూ. 2.50 కోట్ల బీమా చెల్లింపు.. అర్హత కలిగి సహజ మరణం పొందిన 300 మందికి రూ.3 కోట్ల ఆర్థిక సాయం ఏలూరు జిల్లా ప్రమాదవశాత్తూ మరణించిన వారు 45 మందికి రూ.2.25 కోట్లు సహజ మరణం పొందిన 381 మందికి రూ.3.81 కోట్ల బీమా సొమ్ము చెల్లింపు కూటమి ప్రభుత్వంలో రెండేళ్ల బీమా చెల్లింపులు: ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ప్రమాదవశాత్తు చనిపోయిన 600 మందికి, సహజ మరణం పొందిన 600 మందికి బీమా చెల్లింపులు సున్నా -
కలగా ఫిషింగ్ హార్బర్
నరసాపురం: సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న నరసాపురంలో దశాబ్దాల కలగా ఉన్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం కీలకమైన ఈ ప్రాజెక్టుపై ఉలుకూ పలుకూ లేకుండా ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసిన ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చూపించడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మొత్తం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధికి సంబంధించిన ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించకపోవడానికి కారణాలు ఏమిటో ప్రభుత్వం చెప్పాలనే డిమాండ్లు ప్రజల నుంచి వస్తున్నాయి. ఈ ఏడాది బడ్జెట్లో ప్రాజెక్టు ఊసే లేకపోవడంతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కలేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో నరసాపురం మండలం బియ్యపుతిప్ప వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి పూనుకున్నారు. 2024 ఎన్నికలకు ముందే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఉమ్మడి పశ్చిమ జిల్లా అభివృద్ధిలో గీటురాయిగా, మొత్తం గోదావరి జిల్లాలకు మణిహారంగా నరసాపురంలో మేజర్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టింది. బియ్యపుతిప్పలో మేజర్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి 2022 మే నెలలో ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లు పిలవగా, విశ్వసముద్ర సంస్థ పనులు దక్కించుకుంది. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ చూపించడంతో ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులతో పాటు ఇతర సాంకేతిక అనుమతులు కూడా వెంటనే తెప్పించారు. రూ. 429.43 కోట్ల వ్యయంతో నిర్మించే హార్బర్కు సంబంధించిన ప్రాథమిక పనులు 2023 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి. మత్స్యకారులను నమ్మించి మోసం అయితే చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హార్బర్ అంశం మూలనపడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు పనులను పట్టాలెక్కించడంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యానికి కారణాలు ఏమిటనే అంశం ఎవరికీ అర్థంకాకుండా ఉండటం గమనార్హం. పనులు దక్కించుకున్న విశ్వసముద్ర సంస్థ ఎన్నికలకు ముందు ప్రాథమిక సర్వే వంటి పనులు చేసింది. చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత సదరు సంస్థ పనులు చేపట్టేందుకు వెనకడుగు వేసింది. 19 కిలోమీటర్ల సముద్ర తీరప్రాంతం ఉన్న నరసాపురంలో బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ నిర్మించాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న మత్స్యకారుల ఓట్లు దండుకోవడానికి ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఫిషింగ్ హార్బర్ నిర్మించి తీరుతామని ఎన్నో ప్రకటనలు గుప్పించారు. నిర్మాణానికి అన్నీ గత ప్రభుత్వం సిద్ధం చేసినా కూడా ప్రస్తుత చంద్రబాబు సర్కార్ పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని దశాబ్దాలుగా మత్స్యకారులు కోరుతున్నారు. నరసాపురంలో హార్బర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఖర్చు భరించేలా మా హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం చేశారు. పర్యావరణ అనుమతులతో పాటు ఇతర అన్ని సాంకేతిక అనుమతులు వచ్చేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. టెండర్లు పిలిచి, పనులు విశ్వసముద్ర సంస్థకు అప్పగించాం. పనులు ప్రాథమికంగా ప్రారంభమయ్యాయి కూడా. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పనులు ఎందుకు మొదలు పెట్టించడంలేదనేది అర్థం కావడం లేదు. –ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్య సంపద, ఆక్వా ఎగుమతుల్లో ఉమ్మడి పశ్చిమ జిల్లాకు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ నుంచి దేశ, విదేశాలకు భారీగా ఆక్వా ఎగుమతులు జరుగుతుంటాయి. రొయ్యలు, చేపల సాగు పెరగడంతో ఆక్వా రంగం గడిచిన మూడు దశాబ్దాల కాలంలో బాగా పుంజుకుంది. ఏటా కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆక్వా ద్వారా జిల్లా నుంచి ప్రభుత్వానికి వస్తోంది. మరోవైపు తీరప్రాంతంలో సముద్ర మత్స్య సంపద ద్వారా కూడా భారీగా ఆదాయం సమకూరుతుంది. ఏటా నరసాపురం తీరంలో రూ. 300 కోట్ల విలువ చేసే మత్స్య ఎగుమతులు సాగుతాయి. కానీ హార్బర్ లాంటి మౌలిక వసతులు ఉంటే మరో 40 శాతం ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంతోనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హార్బర్ నిర్మాణానికి పూనుకుంది. బియ్యపుతిప్ప వద్ద ఫిషింగ్ హార్బర్ను 600 ఎకరాల విస్తీర్ణంలో రూ. 429.43 కోట్ల భారీ వ్యయంతో నిర్మించ తలపెట్టి పనులు మొదలుపెట్టింది. హార్బర్కు సమీపంలోని 216 జాతీయ రహదారిని అనుసంధానం చేయడం, మరోవైపు పక్కనే ఉన్న మచిలీపట్నంలో కూడా హార్బర్ పనులు చేపట్టడం గత ప్రభుత్వం చేసింది. ఇంత ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికై నా రాష్ట్ర సర్కార్ స్పందించాలనే డిమాండ్లు జిల్లా వాసుల నుంచి వస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిర్మాణానికి గ్రహణం రూ 429.43 కోట్లతో నిర్మాణానికి శ్రీకారం చుట్టిన జగన్ సర్కార్ టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసిన గత ప్రభుత్వం -
క్రీడాకారులకు ప్రోత్సాహం అందించాలి
పెనుమంట్ర: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలుగు రాష్ట్రాల క్రీడాకారులకు ఆధునిక పరిపాలన అందుబాటులో తెచ్చి శిక్షణతో పాటు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఒలింపిక్ క్రీడాకారిణి సత్తి గీతారెడ్డి అన్నారు. మార్టేరులో జరిగిన ఉమ్మడి రాష్ట్ర రీజనల్ స్పోర్ట్స్ హాస్టలర్స్ రీ యూనియన్ సర్వసభ్య సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లోని క్రీడాకారులకు ఆధునిక శిక్షణతో పాటు తగిన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గతంలో క్రీడల్లో రాణించి ప్రస్తుతం ఉన్నత పదవుల్లో ఉన్న పాత తరం క్రీడాకారులు అందిస్తున్న సహకారం సరిపోదని, మరిన్ని స్పోర్ట్స్ స్కూళ్లు, అకాడమీలను అందుబాటులోకి తేవాలని సూచించారు. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పి. వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, క్రీడలకు పూర్వవైభవం రావాలంటే స్పోర్ట్స్ హాస్టళ్లను పునరుద్ధరించాలని, కోచ్లను క్రమబద్ధీకరించాలని కోరారు. క్రీడాకారులకు బీమా సౌకర్యం కల్పించి, ఉద్యోగ అవకాశాలు పెంచడంతో పాటు క్రీడా గ్రామాల ఏర్పాటుకు ప్రభుత్వాలు భూమి కేటాయించాలని అభ్యర్థించారు. వచ్చే ఏడాది ఈ సమావేశాన్ని తెలంగాణలోని పెద్దపల్లిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. యూనియన్ కార్యదర్శి ఎన్. రామిరెడ్డి మాట్లాడుతూ, రాజధానుల్లో మెయిన్ హాస్టళ్లు, జిల్లాల్లో రీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని, మౌలిక సదుపాయాల కోసం తగిన బడ్జెట్ కేటాయించాలని కోరారు. అడిషనల్ ఎస్పీ కోటీశ్వరరావు క్రీడాకారులకు ఆరోగ్య భీమా కల్పించవలసిన అవసరాన్ని వివరించారు. ఈ సమావేశంలోని పలు సూచనలను త్వరలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు వెంకట్ నారాయణ, అరుణ, రమేష్, అనిత, సురేంద్ర సింగ్ తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి పి.హరికృష్ణ ప్రసాద్, కార్యక్రమ నిర్వాహకుడు సీనియర్ క్రీడాకారులు టి.ఈశ్వర్ రెడ్డి, కర్రి కృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, వెలగల సత్తిరెడ్డి, మల్లెల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఒలింపిక్ క్రీడాకారిణి సత్తి గీతారెడ్డి -
వేడుకగా వసంతోత్సవం
ముగిసిన వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ద్వారకాతిరుమల: శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉదయం స్వామి, అమ్మవార్లకు వసంతాలను సమర్పించి, చూర్ణోత్సవాన్ని వైభవంగా నిర్వ హించారు. స్వామివారిని కీర్తిస్తూ అర్చకులు, మహిళా భక్తులు వడ్లు దంచారు. ఆ తరువాత రాజాధిరాజ వాహనంపై శ్రీవారికి తిరువీధి సేవను నిర్వహించి, భక్తులకు వసంతాలను అందజేశారు. రాత్రి ఆలయంలో స్వామి వారికి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగోత్సవాన్ని అర్చకులు, పండితులు వైభవోపేతంగా నిర్వహించారు. ద్వాదశ కోవెల ప్రదక్షిణలు : ఉభయ దేవేరులతో శ్రీవారికి రాత్రి ఆలయంలో 12 ప్రదక్షిణలు, 12 సేవా కాలాలు, 12 రకాల పిండి వంటలతో నివేదనలు జరిపారు. అందులో అర్చకులు, పండితులు, భక్తులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో సేవాకాలాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీపుష్ప యాగోత్సవాన్ని వైభవోపేతంగా జరిపారు. ఆలయ ముఖ మండపంలో శయన మహావిష్ణువు అలంకారంలో ఉన్న స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించారు. అలాగే శ్రీహరి కళాతోరణ వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నేటి నుంచి ఆర్జిత సేవలు : శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో రద్దు చేసిన నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను సోమవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. -
ఆంధ్రా కాల్వను బాగు చేయాలి
చింతలపూడి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రా కాల్వ మరమ్మతు పనులకు నిధులు కేటాయించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాల్వపై ఆధారపడి ఉన్న పంట కాల్వలను కూడ మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాకాలానికి ముందే పూడిక తీసి బాగు చేసుకుంటే సాగు నీరు చివరి పొలాలకు కూడ చేరడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. చింతలపూడి మండలం రాఘవాపురం ఇరిగేషన్ సెక్షన్ పరిధిలో ఉన్న ఆంధ్రా కాల్వ పూడుకుపోయి దశాబ్దాలు దాటింది. అనేక చోట్ల గండ్లు పడ్డాయి. అవి పూడ్చమని ఆయకట్టు రైతులు సంవత్సరాలుగా మొర పెట్టుకుంటున్నా పూడ్చడం లేదు. దీంతో ఏటా వరద నీరు పంటపొలాలపై నుంచి ప్రవహించి వృథాగా పోతూంది. 1967లో ఏలూరు జిల్లాలోని మెట్ట ప్రాంతంలో 21 చెరువులకు సాగు నీరు అందించడానికి ఖమ్మం జిల్లా ,తుమ్మూరు వద్ద ఆనకట్ట నిర్మించారు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లోని చింతలపూడి మండలంలో 18 కిలోమీటర్ల పొడవున కాల్వ నిర్మాణం చేపట్టి వరద నీటిని సాగునీటి చెరువులకు మళ్ళిస్తున్నారు. మండలంలో దాదాపు 11 వేల ఎకరాలకు అధికారికంగాను, అనధికారికంగా మరో 10 వేల ఎకరాలకు ఏటా సాగునీరు అందుతోంది. దీంతో పాటు జిల్లాలోని చింతలపూడి మండలం, నాగిరెడ్డిగూడెం వద్ద నిర్మించిన తమ్మిలేరు ప్రాజెక్టు సైతం ఆంధ్రా కాల్వ ద్వార వచ్చే వరద నీటిపై ఆధారపడి ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2023లో అప్పటి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్బాబు ఆంధ్రా కాల్వ మరతుత్తులకు తన పార్లమెంట్ నిధుల నుంచి 30 లక్షలు కేటాయించారు. దీంతో కొంత మేర మరమ్మతు పనులను పూర్తి చేశారు. మిగిలిన నిధులు మంజూరు చేసి కాల్వను మరమ్మతు చేయాల్సి ఉంది. -
సర్వజన కష్టాలు
ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల, అనుబంధ బోధనాస్పత్రి (జీజీహెచ్)లో సర్వజన కష్టాలు వర్ణణాతీతం. అత్యాధునిక వైద్య చికిత్సలు అందుతాయనే ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా రోగులకు ఇబ్బందులు తప్పటం లేదు. ప్రొఫెసర్లు తమ నైపుణ్యంతో సామాన్యులకు అత్యాధునిక వైద్యసేవలు అందిస్తారని ఆశించగా భంగపాటు తప్పలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోగులు, సహాయకులకు సదుపాయాల కల్పనలోనూ వైద్య అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి జీజీహెచ్లో ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో వైద్యసేవల్లో డొల్లతనం బయటపడింది. సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆస్పత్రిలో రోగు లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజూ సు మారు 1,800 నుంచి 2 వేల మంది వరకూ ఓపీ, అత్యవసర సేవలకు వస్తుంటారు. అయితే నిపుణులైన వైద్యులు ఉన్నా రోగులకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందనే అపవాదు ఉంది. ఒకవైపు రో గులు ఓపీ సేవలకు వేచి ఉంటే.. వైద్యులు మాత్రం ప్రత్యేక మీటింగుల పేరుతో ఓపీ గదుల్లో ఉండటం లేదు. రోగులు వచ్చి చూస్తే వైద్యులు కుర్చీలు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఇదేంటని అడిగే పరిస్థితి లేదు. దంతవైద్య విభాగం, ఈఎన్టీ విబాగంలో, జనరల్ మెడిసిన్ ఇలా ఆయా విభాగాల్లో వైద్యులు అందుబాటులో లేకపోవటంతో వైద్యసేవలు అందే పరిస్థితి లేదు. ఎంసీహెచ్ బ్లాక్లో గర్భిణుల కష్టాలు జీజీహెచ్లోని ఎంసీహెచ్ బ్లాక్లో పలు సమస్యలు గర్భిణులు, బాలింతలను వేధిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల నుంచి గర్భిణులు వైద్యసేవలకు వస్తూంటారు. గర్భిణులు వేచి ఉండేందుకు ఏర్పాటు చేసిన ప్రాంతంలో కనీసం ఒక ఫ్యాన్ కూడా ఉండదు. సూర్యరశ్మి కోసం పైకప్పులో ఫైబర్ గ్లాస్ ఉండటంతో నేరుగా పైనుంచి ఎండవేడిమి వస్తూ ఉంటుంది. తీవ్ర ఉక్కపోతతో గంటల తరబడి వేచి ఉంటూ అనారోగ్యం బారిన పడుతున్నారని గర్భిణుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్కానింగ్ ప్రాంతంలోనూ ఎండవేడిమి రావటంతో గర్భిణులు, బాలింతలకు అవస్థలు తప్పటం లేదు. నిలువ నీడ లేదు ఎంసీహెచ్ విభాగంలో గర్భిణులు వైద్యచికిత్సలకు వస్తే... వారి కుటుంబ సభ్యులు, సహాయకులకు ని లువ నీడలేకుండా పోయింది. ఏదో ఒకటి, రెండు చెట్ల నీడన ఆశ్రయించాల్సిన దుస్థితి. ఇటీవల ఎండలతో విపరీతమైన వేడి వస్తుండటంతో సహాయ కులు ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీ గోడలు, చె ట్లకింద కూర్చోవాల్సి వస్తుందనీ, కనీసం వెయిటింగ్ రూమ్ కూడా లేదని వాపోతున్నారు. నిరుపయోగంగా వెంటిలేటర్ పరికరాలు కరోనా విపత్తు సమయంలో ఆక్సిజన్, వెంటిలేటర్ల సహాయంతో వైద్య చికిత్సలు అందించాల్సి వచ్చేది. ఆ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్పత్రికి భారీఎత్తున వెంటిలేటర్ పరికరాలు సమకూర్చా యి. యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్స్ సైతం ఏర్పాటుచేశారు. అయితే నేడు వైద్య అధికారుల ఉదాసీనత, నిర్లక్ష్య వైఖరితో రోగులకు సరైన వైద్యసేవలు అందటం లేదనే ఆరోపణలు ఉన్నా యి. విలువైన వెంటిలేటర్ పరికరాలను నిరుపయోగంగా పడవేయటంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. పైగా ప్రస్తుతం జీజీహెచ్లో ఆరుగురు వెంటిలేటర్ టెక్నీషియన్లు అందుబాటులో ఉండగా... సక్రమంగా వినియోగించుకోలేక పోతున్నా రని అంటున్నారు. ప్రాణాపాయ స్థితిలో రోగులు వస్తే వెంటనే విజయవాడ, గుంటూరుకు రిఫర్ చేస్తున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. సర్వజన ఆసుపత్రిలో ఈఎన్టీ విభాగంలో ఖాళీగా సీట్లు ఎంసీహెచ్ బ్లాక్లో స్కానింగ్ కోసం ఇలా..పడకేసిన వైద్యం ఏలూరు జీజీహెచ్లో సేవలు నిల్ ఓపీ వేళల్లో మీటింగుల పేరుతో సీట్లు ఖాళీ ఉక్కపోతలో ఎంసీహెచ్ బ్లాక్లో గర్భిణులు నిరుపయోగంగా వెంటిలేటర్లు ఆరుబయట సహాయకుల పడిగాపులు -
అటవీ ఫలసాయం.. అంతంతమాత్రం
బుట్టాయగూడెం: అడవిపై ఆదివాసీ గిరిజనుల జీవనాధారం క్రమేపీ తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు గిరిజనులకు ఎంతో ఆసరాగా నిలిచిన అటవీ ఉత్పత్తులు నేడు నామమాత్రంగానే లభిస్తున్నాయి. రానురాను అటవీ ఫలసాయం తగ్గుతూ కొన్నిరకాలు మాత్రమే లభించడంతో గిరిజనులు అడవిబాట పట్టడం తగ్గిస్తున్నారు. అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకూ తిరిగినా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఏటా వేసవిలో సహజసిద్ధంగా లభించే అటవీ ఉత్పత్తులను గిరిజనులు సేకరించి గిరిజన సహకార సంస్థ (జీసీసీ)కి విక్రయిస్తారు. అయితే గతంలో మాదిరిగా అటవీ ఉత్పత్తుల సేకరణపై ప్రస్తుతం గిరిజనులు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. యువత ఆసక్తి చూపకపోగా.. ముందు తరం వారు మాత్రమే ఫలసాయం సేకరించేందుకు వెళుతున్నారు. ఆశించిన ధర లేక.. డిమాండ్ రాక ప్రస్తుత విదేశీ అటవీ ఉత్పత్తుల తయారీ రంగంలో అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో అటవీ ప్రాంతంలో సేకరించిన ఉత్పత్తుల ను కొనుగోలు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. టెండర్లు కూడా నిలిచిపోవడంతో సేకరించిన అటవీ ఉత్పత్తులకు గిరిజనులు ఆశించిన స్థాయిలో ధర రాకపోవడంతో అటవీ ఉత్పత్తుల సేకరణపై నిరాసక్తత చూ పుతున్నారు. రూ.8 లక్షల వరకు కొనుగోళ్లు గతేడాది నుంచి ముషిణి గింజలు, నరమా మిడి చెక్క, తిప్పతీగ, షీకా కాయలకు ధర పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ సుమారు రూ.8 లక్షల వరకూ ఉత్పత్తులు కొనుగోలు చేసినట్టు జీసీసీ అధికారులు తెలిపారు. పెరిగిన ధర ప్రకారం ముషిణి గింజలు కిలో రూ.100 చొప్పున 80 కింటాళ్ల వరకూ కొనుగోలు చేశారు. నరమామిడి చెక్క కిలో రూ.20 చొప్పున 10 క్వింటాళ్లు, తిప్పతీగ కిలో రూ.11 చొప్పున 75 క్వింటాళ్లు, షీకాకాయలు కిలో రూ.55 చొప్పున 100 కిలోల వరకూ కొన్నట్టు జీసీసీ అధికారులు తెలిపారు. అడవి ఉత్పత్తుల చెట్లు పెంచాలి అటవీ ప్రాంతంలో క్రమేపీ తగ్గుతున్న అటవీ ఉత్పత్తుల చెట్లను పెంచేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని గిరిజనులు కోరుతు న్నారు. గతంతో పోలిస్తే అటవీ ఫలసాయ మొక్కల నుంచి ఉత్పత్తులు తగ్గిపోయాయని ముఖ్యంగా పశ్చిమ ఏజెన్సీలో ఇప్పపువ్వు, నరమామిడి చెక్క, తప్సి జిగురు, ఇప్పపరక, కరక్కాయలు వంటి చెట్లు కూడా నామమాత్రంగా ఉన్నాయని అంటున్నారు. ఆయా చెట్లను పెంచడం ద్వారా తమకు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. క్రమంగా తగ్గుతున్న అటవీ ఉత్పత్తులు సేకరించేందుకు గిరిజనుల నిరాసక్తత కొన్నిరకాలే కొంటున్న జీసీసీ ఇప్పటివరకూ రూ.8 లక్షల విలువై న ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు గతంలో మాదిరిగా గిరిజనులు అటవీ ఉత్పత్తుల సేకరణపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గిట్టుబాటు ధర రావడం లేదని చెబుతున్నారు. గతేడాది నుంచి అటవీ ఉత్పత్తుల కొనుగోలుపై గిరిజనులకు అవగాహన కలిగిస్తున్నాం.ఈ ఏడాది రూ.8.17 లక్షల విలువైన ఉత్ప త్తులు కొనుగోలు చేశాం. అటవీ ఉత్పత్తుల కొనుగోలుపై గిరిజనులకు మరింత అవగాహన కల్పించి జీసీసీలో విక్రయాలు పెంచేలా కృషి చేస్తాం. – చెరుకూరి రాజియోగి, జీసీసీ సీనియర్ మేనేజర్, కేఆర్పురం -
పెద్దింట్లమ్మా.. వరాలివ్వమ్మా
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ.. నీ చల్లని దీవెనలందించమ్మా. అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం పెద్దింట్లమ్మను దర్శించుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలాచరించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈఓ కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ.. ఒక్క ఆదివారమే ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి ఫొటోల అమ్మకం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ. 62,445 ఆదాయం వచ్చిందని చెప్పారు. భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. గణపవరం: గణపవరం బస్టాండు ఏరియాలో శనివారం రాత్రి ఓ చుక్కల దుప్పి ప్రత్యక్షమైంది. దీనిని గుర్తించిన స్థానికులు గణపవరం పోలీసులకు సమాచారం అందించారు. అటవీ ప్రాంతం నుంచి తప్పిపోయి జనావాసాల్లోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. బస్టాండు వద్ద నుంచి వెంకయ్య కాల్వ గట్టు వెంబడి చెట్ల మధ్యలో ఈ జింక సంచరిస్తూ కనిపించింది. దీనిని గమనించిన స్థానిక యువకులు సలాది అజయ్, చిలకా రమేష్లు చాకచక్యంగా దానిని బంధించారు. గణపవరం ఎస్ఐ మణికుమార్ తన సిబ్బందితో ఆ ప్రాంతానికి వచ్చి, దుప్పిని బస్టాండు వద్దనున్న శివాలయం ఆవరణలో సురక్షితంగా ఉంచారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం ఉదయం గణపవరం వచ్చిన భీమవరం రేంజ్ ఫారెస్ట్ అధికారి ఎం.కరుణాకర్ సదరు చుక్కల దుప్పిని పరీక్షించి ఆరోగ్యంగానే ఉన్నట్లు నిర్ధారించారు. దీనిని నిర్దేశిత పద్ధతుల ద్వారా తరలిస్తామన్నారు. సహజంగా ఇది చాలా బెదురు జంతువని, ఎక్కువ భయానికి లోనైతే శ్రీక్యాప్చర్ మయోపతిశ్రీకి గురై చనిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. రాజమండ్రి ప్రాంతీయ వన్యప్రాణి సంరక్షణ మరియు చికిత్స కేంద్రం సిబ్బంది వచ్చి దీనికి మత్తు ఇచ్చి, సోమవారం ఉదయమే అటవీ ప్రాంతానికి తరలిస్తామని ఆయన తెలిపారు. జనసంచారం, కేకల వల్ల జంతువు భయపడే ప్రమాదం ఉందన్న అటవీ అధికారుల సూచనతో ఎస్సై మణికుమార్ ఆ ప్రాంతంలో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. -
అల్లూరులో ఆరకమణల జోరు
● దేవస్థానం, ఆర్అండ్బీ భూముల్లో పాగా ● కూటమి నేత అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులు సాక్షి టాస్క్ఫోర్స్: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో దేవస్థాన భూములకు రక్షణ కరువయ్యింది. అలాగే ఆర్అండ్బీ రోడ్డు పక్కనే అక్రమార్కులు పాగా వేస్తున్నారు. పబ్లిక్గా పరజాలు అడ్డుపెట్టి మరీ అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నా ప్రభుత్వాధికారులు పట్టించుకోవడం లేదు. కై కలూరు నియోజకవర్గంలో ఇప్పటికే అర్అండ్బీ, ఇరిగేషన్, దేవస్థాన భూములను పలువురు కబ్జాలు చేసి షాపింగ్ కాంప్లెక్సులు కట్టేశారు. ఈ తంతూ నియోజకవర్గం మొత్తం పాకింది. పురాతన దేవస్థానం భూముల్లో.. ముదినేపల్లి మండలం అల్లూరులో పురాతన పార్వతీ సమేత సోమేశ్వరస్వామి దేవస్థానం ఉంది. దేవస్థానానికి పూర్వం దాతలు 3.79 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. దేవస్థానం నుంచి ఆర్అండ్బీ రోడ్డు వరకు, రోడ్డు దాటిన తర్వాత పొలాలు దేవస్థానం భూములుగా ఉన్నాయి. చాలా ఏళ్ల క్రితం రోడ్డుకు కుడివైపున దేవస్థాన భూమిలో కొందరు నివాసాలు, దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. దేవదాయశాఖ కోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు ప్రకారం నెలకు రూ.1,000 చొప్పున అద్దెను ఆక్రమణదారులు దేవస్థానానికి చెల్లిస్తున్నారు. వీటిని ఎప్పటికై నా తొలగించే అవకాశం ఉంది. పరదాలు కట్టి మరీ.. రోడ్డుకు ఎడమ వైపున బస్టాండ్, ఆంజనేయస్వామి ఆల యం ఉంది. దీని వెనుక దేవస్థానం పంట భూములు ఉ న్నాయి. ఓ వ్యక్తి దేవస్థాన భూమిలో ఏకంగా ఇంటి నిర్మాణానికి ప్రయత్నిస్తే రెండు రోజుల క్రితం ఆలయ ఈఓ శింగనపల్లి శ్రీనివాసరావు, రెవెన్యూ, పోలీసు అధికారులతో వెళ్లి వాటిని తొలగించారు. అలాగే చాలా మంది ఆర్అండ్బీ రోడ్డు సమీపంలో పరదాలు కట్టుకుని మరీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వాస్తవానికి ఆక్రమణదారులు పంట బోదెను సైతం పూడ్చివేశారు. ఇదే రోడ్డుకు చివరన కూటమి నేత అండతో కబ్జా చేయడానికి ప్రయత్నించి మీడియాలో అల్లరవ్వడంతో ఆ ప్రాంతంలో దేవస్థానం పేరుతో చలివేంద్రం ఏర్పాటుచేశారు. ఇటు ఆర్అండ్బీ దాని సమీపంలో దేవస్థాన భూమిని కొట్టేయడానికి శతవిధాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోడ్డు సమీపంలో ప్రైవేట్ భూములు సెంటు రూ.80 వేలు ధర పలుకుతోందని అంచనా. ఆక్రమించుకోండి.. అండగా ఉంటాను అక్రమార్కులకు గ్రామంలో ఓ కూటమి నేత అండగా ఉన్నాడు. దేవస్థానం భూములు ఆక్రమించుకున్న జాబితాలో అతడి బంధువులు ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే మరింత చెలరేగి పోయి ఆక్రమణలకు ఆజ్యం పోస్తున్నాడు. గ్రామంలో వర్గాలుగా విభజించి పెత్తనం చెలాయిస్తున్నాడు. అధికారపక్ష నేతలతో అంటకాగడంతో అధికారులు సైతం అతడికి అడ్డు చెప్పలేకపోతున్నారు. ఏకంగా దేవస్థాన భూమిలో సైతం సంక్రాంతికి పేకాట, కోడిపందాలు జరుగుతుంటే ఏం చేయలేని పరిస్థితిలో అధికారులు చూస్తున్నారు. అల్లూరు దేవస్థానం భూమి కోర్టులో ఉండగా ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి ప్రయత్నించాడు. రెవెన్యూ, పోలీసు సహకారంతో తొలగింపజేశాం. పంట బోదె, డ్రెయిన్లనూ ఆక్రమిస్తున్నారు. రెవెన్యూ అధికారులకు ఈ విషయంపై దేవస్థానం తరఫున ఫిర్యాదు చేస్తాం. దేవస్థాన భూముల్లో ఆక్రమణలను అడ్డుకుంటాం. – శింగనపల్లి శ్రీనివాసరావు, సోమేశ్వర దేవస్థానం ఈఓ, అల్లూరు -
ప్రశాంతంగా నీట్
ఏలూరు (ఆర్ఆర్పేట): నీట్ యూజీ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. నగరంలోని 6 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 1,680 మంది అభ్యర్థులకు 1,619 మంది హాజరయ్యారు. గోపన్నపాలెం కేంద్రీయ విద్యాలయంలో 360 మందికి 344 మంది, సుబ్బమ్మ దేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో 312 మందికి 299 మంది, కస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాఠశాలలో 288 మందికి 276 మంది, కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 288 మందికి 283 మంది, కోటదిబ్బ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 192 మందికి 185 మంది, గాంధీనగర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో 240 మందికి 232 మంది హాజరయ్యారు. దెందులూరు: పెదవేగి మండలం రాట్నాలకుంటలోని రాట్నాలమ్మవారి ఆలయంలో ఆదివారం విశేష పూ జలు జరిగాయి. అధి క సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మన్నే శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నల్లూరి సతీష్కుమార్, జూనియర్ అసిస్టెంట్ విడుదల సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏలూరు (టూటౌన్): మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కోరుతూ సీపీఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 5న తహసీల్దార్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ ఆదివారం ప్రకటనలో పిలుపునిచ్చారు. మొక్కజొన్న పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా వ్యాపారులు దయాదాక్షిణ్యాలకు వదిలివేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్కు రూ.2,400 మద్దతు ధర ప్రకటించినా వ్యాపారులు రూ.1,400 నుంచి రూ.1,700కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని ఆరోపించారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా సంప్రదించి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు తెరిచి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని అన్నారు. ద్వారకాతిరుమల: బైక్ను తప్పించే క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడగా.. ఆరుగురు మహిళలకు తీవ్రగాయాలైన సంఘటన ఎం. నాగులపల్లి పంచాయతీ ద్వారకానగర్ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని లైన్ గోపాలపురానికి చెందిన గురపర్తి రమాదేవి, వడ్లమూడి గోపమ్మ, రాజులపాటి గంగమ్మ, మల్లుల ప్రసన్న, టి.వెంకటలక్ష్మి, యార్లగడ్డ మహాలక్ష్మి ద్వారకానగర్లో ఓ శుభకార్యక్రమానికి హాజరయ్యారు. తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా ఆటో అదుపుతప్పింది. స్థానికులు క్షతగాత్రులను భీమడోలు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భీమవరం: ఆకివీడులో దళితులపై అక్రమ కేసు లు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులకు అండగా నిలవడానికి వెళుతున్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ను భీమవరంలో శనివారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పుష్ప రాజ్ మాట్లాడుతూ కులమతాలను రెచ్చగొట్టేలా డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు చేస్తున్న అరాచకాలను తక్షణం ఆపాలన్నారు. రఘురామ వ్యవహారంపై ప్రభుత్వం కలుగజేసుకుని చట్టం అందరికీ ఒకేలా వర్తించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
అలరించిన నాటికలు
యలమంచిలి: కొంతేరు గ్రామంలోని శ్రీ పులపర్తి వీరాస్వామి యూత్ క్లబ్ కళామందిర్ ఆధ్వర్యంలో జరుగుతున్న 44వ అఖిల భారత స్థాయి నాటిక పోటీల ముగింపు రోజైన ఆదివారం రెండు నాటికలు ప్రదర్శించారు. మొదటి నాటిక మనిషి వ్యక్తిత్వం గురించి, రెండవ నాటిక వివాహ బంధం ప్రాశస్త్యం గురించి సాగి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మూడో రోజు నాటక ప్రాంగణానికి భీమవరం పట్టణానికి చెందిన దివంగత తిరుమల కామేశ్వరరావు పేరును నామకరణం చేశారు. ప్రతి మనిషి జీవితంలో ఒక లక్ష్యం ఏర్పరచుకుని, దాని సాధనకు రాజీ పడకుండా ఎలా కృషి చేయాలో గుంటూరు అభినయ ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘ఇది అతని సంతకం’ నాటికలో అద్భుతంగా చూపారు. ఈ నాటిక దర్శకుడు ఎన్. రవీంద్రరెడ్డి కథానాయకుడు కృష్ణమూర్తి పాత్రలో నటిస్తూ, జీవిత చరమాంకంలో భార్యాభర్తలు ఎలా ప్రణాళికాబద్ధంగా జీవించాలో చూపించారు. మరో నాటికగా విశాఖపట్నం చైతన్య కళా స్రవంతి వారిచే ‘అగ్ని సాక్షి’ ప్రదర్శితమైంది. వివాహ బంధం పవిత్రమైనదని, అందులో ప్రణయం ఉండాలి తప్ప తప్పుడు అడుగులు వేస్తే ప్రళయం తప్పదని రచయిత మాడభూషి దివాకర్బాబు, దర్శకుడు పి. బాలాజీ నాయక్ కళ్లకు కట్టినట్లు చూపారు. ఈ పోటీల నిర్వహణలో యూత్ క్లబ్ కార్యవర్గ సభ్యులు అంబటి మురళీకృష్ణ, గంటా ముత్యాలరావు, బోణం రవిబాబు, జక్కంశెట్టి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యాలయానికి కరెంట్ కట్
● హైకోర్టు ఆదేశాలు బేఖాతరు ● రాజకీయ కక్షతోనే అంటున్న వైఎస్సార్సీపీ వర్గాలు ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయానికి విద్యుత్ సరఫరా కట్ చేసి... కూటమి సర్కారు కనుసన్నల్లో అధికారులు తమ కక్ష పూరిత చర్యలను అమలు చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించినా కుట్ర పూరిత రాజకీయాలతో విషం చిమ్ముతున్నారు. ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియం, పెద్ద రైల్వేస్టేషన్ ఎదురుగా నిర్మించిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయ భవనానికి శనివారం విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంపై పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు ఏమాత్రం సంబంధం లేని ఒక సంఘం ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్కు ఫిర్యాదు చేస్తే.. నగర కమిషనర్ హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ విద్యుత్ శాఖ అధికారులకు చెప్పి సరఫరా నిలిపివేయించారు. కోర్టు ఆదేశాలు పట్టించుకోరా ? ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం భవనంపై రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిట్ పిటిషన్ 22124/ 2025లో.. నాట్ టూ టేక్ ఎనీ కోయిర్సివ్ స్టెప్ అండర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వైఎస్సార్సీపీ బిల్డింగ్ అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు భవనాన్ని సీజ్ చేయటం, డిమాలిష్ చేయటం వంటివి చేయకూడదని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఏపీఈపీడీసీఎల్ నుంచి అధికారికంగా విద్యుత్ సరఫరా కనెక్షన్ తీసుకోవడంతోపాటు ప్రతి నెలా విద్యుత్ బిల్ చెల్లిస్తున్నారు. ప్రెసిడెంట్, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరుతో వీటిని కొనసాగిస్తున్నారు. ఏప్రిల్ 10న రూ.525 బిల్లును పార్టీ ప్రతినిధులు చెల్లించిన రసీదు ఉంది. ఈ నేపథ్యంలో బీ.ఆర్.అంబేద్కర్ కొల్లేరు గ్రామ షెడ్యూల్ కులాల సంఘం పేరుతో ఏలూరు నగర కమిషనర్కు ఫిర్యాదు చేయటంతో కమిషనర్ ఆదేశాలతో విద్యుత్ శాఖ పవర్కట్ చేసినట్లు చెబుతున్నారు. ఇంతకీ వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి అనుమతులపై సరైన అవగాహన లేకుండానే ఫిర్యాదు చేయటం.. దాన్ని ఆసరాగా చేసుకుంటూ కమిషనర్ కక్షపూరిత చర్యలకు చేపట్టడంపై పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇడా అనుమతులు తీసుకున్నాకే.. ఇడా అనుమతులతోనే ఏలూరులో వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇడా బిల్డింగ్ ప్లాన్ ఆర్డర్లో స్పష్టంగా భవన నిర్మాణాన్ని 2030 జూన్ 25 లోపు నిర్మించుకోవాలని చెప్పింది. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ ఆథారిటీకి వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణ ప్లాన్ అప్రూవల్ కోసం రూ.12.45 లక్షల నగదును చెల్లించింది. ఈ సొమ్మును ఇడాకు 2024 జూన్ 25న వైఎస్సార్సీపీ చెల్లించిందనే విషయం నగర కమిషనర్కు తెలియకపోవటం విడ్డూరంగా ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏలూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణం పూర్తి చేసుకోవడానికి ఇడా అనుమతులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు సొమ్ములు చెల్లించాం. జిల్లా కార్యాలయ భవనంపై రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు సైతం కమిషనర్ పట్టించుకోకపోవటం దారుణం. ఇడా పర్మిట్ నెంబర్ 1075/0173/బీ/ఈఎల్ఈ/ఆర్ఏఐఎల్ఎస్టీఏ/2023 పేరుతో 2024 జూన్ 25న భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. భవన నిర్మాణాన్ని 2025 డిసెంబర్ 25లోపు ప్రారంభించి, 2030 జూన్ 25 లోపు పూర్తి చేయాలని ఆర్డర్లో పొందుపరిచారు. ఇవన్నీ నగర కమిషనర్కు తెలియవా?. దీనిపై మేము చట్టం ప్రకారం పోరాటం చేసేందుకు సిద్దంగా ఉన్నాం. – ప్రత్తిపాటి తంబి, వైఎస్సార్సీపీ ఏలూరు లీగల్ సెల్ అధ్యక్షుడు -
విదేశాలకు వెళ్తూ.. విగతజీవిగా
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి ముదినేపల్లి(కై కలూరు): ఏడేళ్ల వయస్సులో తండ్రి మరణించాడు. చెల్లికి గుండె ఆపరేషన్ జరిగింది. అయినా పట్టుదలతో ప్యారిస్లో ఎంఎస్ పూర్తి చేసి ఇంటర్న్షిప్ చేశాడు. ఇండియా వచ్చి తిరిగి కొన్ని గంటల్లో విమానంలో వెళ్ళాల్సిన అతను రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. దీంతో పెదనాన్న కుమార్తె పెళ్లి ఇంటి విషాద చాయలు అలుముకున్నాయి. ఈ ఘటన ముదినేపల్లి మండలం చినపాలపర్రు పామర్రు– దిగమర్రు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగింది. ముదినేపల్లి మండలం వణుదుర్రు గ్రామానికి చెందిన నవుడు భాను జయప్రకాష్(29) ప్యారిస్లో ఎంఎస్ పూర్తి చేసి ఇంటర్న్షిప్ నిమిత్తం 4 నెలల క్రితం ఇండియా వచ్చాడు. పెదనాన్న కుమార్తె వివాహం ఉండడంతో ఉండిపోయాడు. శుక్రవారం రాత్రి వివాహం ముగించుకుని వాహనంలో బంధువులను వణుదుర్రులో దించి తిరిగి గుడివాడలో తన బాబాయి శివ శంకర నాగరాజు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకున్నాడు. హైదరాబాదు నుంచి శనివారం సాయంత్రం వెళ్ళడానికి టికెట్లు బుక్ అయ్యాయి. తన బాబాయి కారులో గుడివాడ వస్తుండగా ప్రమాదం జరిగి జయరాం ప్రకాష్ మరణించాడు. మృతుడు బాబాయి శివశంకర నాగరాజు ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. కారును చనుబండకు చెందిన విస్సంశెట్టి నవీన్ నడుపుతున్నాడు. చినపాలపర్రు వద్దకు తెల్లవారుజామున 4 గంటలకు వచ్చారు. జాతీయ రహదారిలో ఎదురుగా వస్తున్న లారీని నవీన్ రాంగ్రూట్లో వెళ్ళి ఢీకొట్టాడు. దీంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. అంబులెన్సులో గుడివాడ ఈవీఆర్ హాస్పటల్కు చేర్చారు. చికిత్స పొందుతూ జయరాం ప్రకాష్ మరణించాడు. నవీన్కు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. భాను ప్రకాష్ మరణంతో అనారోగ్యంతో బాధపడుతున్న చెల్లెలు, తల్లి ఆధారం కోల్పోయారు. దీంతో వణుదుర్రులో విషాద చాయలు అలుముకున్నాయి. -
శ్రీవారి భక్తులకు ఆన్లైన్ కష్టాలు
● అవగాహన లేని భక్తులకు తప్పని ఇక్కట్లు ● కేశఖండన శాల వద్ద కౌంటర్లు చాలక తోపులాటలు ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో శనివారం భక్తులకు ఆన్లైన్ కష్టాలు ఎదురయ్యాయి. శనివారం కావడం, పదో తరగతి పరీక్షా ఫలితాలు వెలువడటంతో క్షేత్రానికి తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి ఎక్కువైంది. దాంతో కేశఖండనశాల వద్ద ఉన్న కియోస్క్ మెషిన్, ఆన్లైన్ టికెట్ బుకింగ్ కౌంటర్లు చాలక భక్తులు ఇక్కట్లుకు గురయ్యారు. ఒకానొక దశలో కౌంటర్ల వద్ద భక్తులు తోపులాడుకున్నారు. టికెట్ కూలైన్లలో భక్తులు గంటల తరబడి బారులు తీరారు. మహిళా భక్తులు కేశఖండనశాల బయట పడిగాపులు పడ్డారు. పరిస్థితిని గమనించిన ఆలయ అధికారులు వెంటనే క్యాష్ కౌంటర్ను ఓపెన్ చేసి, నగదు లావాదేవీలను ప్రారంభించి, త్వరితగతిన టికెట్లను జారీ చేశారు. దాంతో పరిస్థితి సద్దుమణిగింది. పెద్దల పరిస్థితి అగమ్య గోచరం ముఖ్యంగా శనివారం క్షేత్రానికి వచ్చే భక్తుల్లో అధిక శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారే ఉంటారు. అందులో నిరక్షరాస్యులైన పెద్దవారి వద్ద ఆండ్రయిడ్ ఫోన్లు ఉండవు. దాంతో వారికి ఫోన్పే, గూగుల్ పేలు గురించి తెలియవు. అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా నగదు రహిత లావాదేవీలు వల్ల పెద్దవారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటోంది. శనివారం కొందరు పెద్దవారు కేశఖండన టికెట్ల కోసం నానా పాట్లు పడ్డారు. యువకుల వద్దకు వెళ్లి డబ్బులిచ్చి, తమకు టికెట్లు బుక్చేసి పెట్టమని ప్రాధేయపడ్డారు. ఆలయాల్లో పూర్తిగా నగదు రహిత లావాదేవీలు జరపడం సాధ్యం కాదని పలువురు భక్తులు అంటున్నారు. కౌంటర్లు పెంచాలి క్షేత్రానికి వచ్చిన వెంటనే భక్తులు ముందుగా కేశఖండన శాలకు వెళ్లి, అక్కడ మొక్కులు తీర్చుకున్న తరువాత ఆలయానికి వెళతారు. కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే కేశఖండన శాల వద్ద ఆన్లైన్ టికెట్ బుకింగ్ కౌంటర్లను, కియోస్క్ మెషిన్లను మరింతగా పెంచాలని భక్తులు కోరుతున్నారు. కియోస్క్ మెషిన్లో భక్తుడి పేరు, ఫోన్ నెంబర్, ఇతర వివరాలను ఎంటర్ చేసి, ఓకే చేసి, స్కానర్ ద్వారా నగదు చెల్లిస్తున్నారు. ఆ తరువాత దాదాపు 20 సెకన్లకు గానీ టికెట్ రావడం లేదు. దాంతో మెషిన్ వద్ద భక్తుల రద్దీ పెరిగిపోతోంది. వాట్సప్ గవర్నెన్స్తో ఇక్కట్లు : మన మిత్ర యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు కేశఖండన శాల సిబ్బందికి ఫోన్లో వాటిని చూపారు. వివరాలను నమోదు చేసుకున్న సిబ్బంది వారికి టికెట్ల స్థానంలో ప్రత్యేకంగా స్లిప్పులను జారీ చేశారు. ఆ తరువాత సిబ్బంది మన మిత్ర యాప్లోని టికెట్లను ప్రింట్ తీసుకోవడానికి నానా పాట్లు పడ్డారు. రద్దయిన సేవా టికెట్లు జారీ ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అన్ని ఆర్జిత సేవలను, నిత్యార్జిత కల్యాణాలను రద్దు చేశారు. అయితే కియోస్క్ మెషిన్లలో అష్టోత్తర సేవా టికెట్లను తొలగిచలేదు. దాంతో రద్దయిన విషయం తెలియక కొందరు భక్తులు కియోస్క్ల ద్వారా అష్టోత్తర సేవా టికెట్లను పొందారు. వాటిని తీసుకుని ఆలయానికి వెళ్లిన భక్తులకు అక్కడ చుక్కెదురైంది. అష్టోత్తరం సేవ లేదని అధికారులు వారిని నిలిపివేశారు. కొద్దిసేపటి తరువాత ఆ టికెట్లపై స్వామివారి దర్శనానికి అనుమతించారు. -
చిన వెంకన్నకు శ్రీచక్ర స్నానం
ద్వారకాతిరుమల: శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు శనివారం శ్రీచక్ర స్నాన వేడుకను ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవార్లు తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. అనంతరం అర్చకులు ఆలయ యాగశాలలో శ్రీవారు, అమ్మవార్లు, శ్రీచక్ర పెరుమాళ్ల ఉత్సవ మూర్తులను ఒక వేదికపై వేంచేపు చేశారు. పూజాధికాల అనంతరం సుగంధ ద్రవ్యాలు, పంచ పల్లవులు, శ్రీచందనం, పసుపు, మంత్రపూత అభిషేక తీర్థంతో శ్రీచక్ర స్వామిని అభిషేకించారు. ఆ తరువాత శ్రీచక్ర పెరుమాళ్లతో పాటు ఉభయ నాంచారులకు, శ్రీవారికి తిరుమంజనాలు జరిపి, హారతులిచ్చారు. అభిషేక జలాన్ని భక్తుల శిరస్సులపై చల్లారు. సాయంత్రం ఆలయంలో నిత్యహోమ బలిహరణలు, పూర్ణాహుతి, అనంతరం ధ్వజ అవరోహణ వేడుకలను నిర్వహించారు. శ్రీవారి నవనీత కృష్ణ అలంకారం భక్తులకు కనువిందు చేసింది. రాత్రి స్వామివారికి అశ్వవాహనంపై తిరువీధి సేవను నిర్వహించారు. ఆదివారం రాత్రి జరిగే శ్రీపుష్ప యాగోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని, సోమవారం నుంచి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను పునరుద్ధరిస్తామని దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. మండవల్లి: వీఆర్వోపై దాడి చేసి గాయపరచి, అతని విధులకు ఆటంకం కలిగించిన వారిని అరెస్టు చేసినట్లు ఎస్సై రామచంద్రరావు పేర్కొన్నారు. ఏప్రిల్ 29న దెయ్యంపాడులో వీఆర్వోపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ముంగర రాజు, ముంగర శ్రీనివాసరావు, ముంగర సావిత్రిని వారి ఇళ్ళ వద్ద అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై తెలిపారు. వారిని రిమాండు నిమిత్తం కై కలూరు కోర్టులో హాజరు పర్చినట్లు తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఐసెట్ ప్రవేశ పరీక్ష శనివారం నగరంలోని రెండు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షకు ఉదయం 146 మందికి 115 మంది హాజరు కాగా మధ్యాహ్నం 146 మందికి 123 మంది హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో నిర్వహించిన పరీక్షకు ఉదయం సెషన్లో 146 మందికి గాను 132 మంది హాజరు కాగా మధ్యాహ్నం సెషన్లో 146 మందికి గాను 125 మంది హాజరయ్యారు. -
హత్య కేసులో నిందితుల అరెస్టు
ఏలూరు టౌన్: ఏలూరు మాదేపల్లి రోడ్డు హేలాపురి టౌన్షిప్ వెనుక ఖాళీ స్థలంలో ఏడు రోజుల క్రితం వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ హత్యకేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, డీఎస్పీ శ్రావణ్కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 25న రాత్రి వేళ రాయి నూకరాజును రాళ్ళతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై ఏలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వన్టౌన్ సీఐ సత్యనారాయణ, రూరల్ ఇన్చార్జి ఎస్ఐ నాగబాబు, ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. శనివారం ఏలూరు రూరల్ పరిధిలోని నోవా కళాశాల సమీపంలో కొందరు వ్యక్తులు అనుమానస్పదంగా ఉన్నట్లు పోలీసులకు అందిన సమాచారంతో వెళ్ళి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. నూకరాజును హత్య చేసిన వారిగా గుర్తించారు. ఈ హత్యలో ప్రధాన నిందితుడు మహంకాళి సత్తిబాబు అలియాస్ సత్తిపండు, నక్కా ఏసురత్నం అలియాస్ లక్ష్మణ్, గుమ్మళ్ళ సాయి అలియాస్ స్టైలిష్ సాయి, కొల్లి అనిల్ అలియాస్ మున్నా, కొట్టు ప్రశాంత్కుమార్, గెడ్డం బ్రహ్మనందరావును అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి స్కూటర్, బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సత్తిపండుపై 12కేసులు ఉన్నాయని, అనకాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అధికంగా కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. ఏ2 నిందితుడిపై ఏలూరులో కేసులు ఉన్నాయనీ ప్రతీ ఒక్కరిపై నిఘా మరింత పెంచామని స్పష్టం చేశారు. ఏ6 నిందితుడు బ్రహ్మానందరావుపై కేసులు ఉన్నాయని, ప్రస్తుతం అతను బెయిల్పై ఉన్నాడని తెలిపారు. -
పెండింగ్ భూ సమస్యల కేసులు పరిష్కరించాలి
నూజివీడు: పట్టణంలోని పేదలకు నివేశన స్థలాలను పంపిణీ చేసేందుకు 2019–24 కాలంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సేకరించిన భూములకు సంబంధించి కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులను త్వరతగతిన పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నను కోరారు. స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయంలో శనివారం ప్రతాప్ అప్పారావు సబ్కలెక్టర్ను కలిసి పలు విషయాలు చర్చించారు. పట్టణంలోని ఇళ్లు లేని పేదలందరికీ నివేశన స్థలాలు ఇచ్చి సొంతింటి కలను నిజం చేసేందుకు పట్టణ పరిధిలో ఉన్న సీలింగ్ భూములను, చేతులు మారిన అసైన్మెంట్ భూములను తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సేకరించారని, దీనిపై కొందరు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్నారన్నారు. దాదాపు 45 ఎకరాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించి వివరాలను కోర్టుకు సమర్పించి క్లియర్ చేస్తే వందలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మార్గం సుమగం అవుతుందన్నారు. సబ్కలెక్టర్ స్పందిస్తూ కోర్టు కేసులకు సంబంధించి పూర్తి వివరాలు తెప్పించుకుని కేసులను క్లియర్ చేస్తానని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీ సమీపంలోని జగనన్న లే అవుట్లో స్థానికులు మంచినీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మున్సిపల్ అధికారులను పంపించి మంచినీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రతాప్ అప్పారావు కోరగా సానుకూలంగా స్పందించి నీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
చాలా మందికి తెలియడం లేదు
ఆన్లైన్ ద్వారా నగదు లావాదేవీలు జరపడం చాలా మంది పెద్దవారికి తెలియడం లేదు. తెలిసిన వారికి కౌంటర్ల వద్ద ఇబ్బందులు తప్పలేదు. కౌంటర్ల వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆన్లైన్ ద్వారా టికెట్లు తీసుకోవడానికి గంటల సమయం పట్టింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ఆన్లైన్ టికెట్ బుకింగ్ కౌంటర్లను పెంచాలి. ఏవైనా సేవలు రద్దు చేస్తే వాటిని కియోస్క్ల నుంచి తొలగించాలి. – బొప్పన సురేష్, భక్తుడు, అచ్చెన్నపాలెం, నల్లజర్ల మండలం స్వామివారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా అష్టోత్తరం, తదితర సేవలను రద్దు చేశారు. కియోస్క్ మెషిన్లో ఆ సేవా టికెట్లు వచ్చాయి. వాటిని తీసుకుని ఆలయంలోకి వెళ్తే అక్కడ సిబ్బంది అష్టోత్తర సేవ జరగదన్నారు. ఏం చేయాలో మాకు అర్ధం కాలేదు. రూ.500 టికెట్ తీసుకున్న మా పరిస్థితి ఏంటని ప్రశ్నించగా, కొద్దిసేపటి తరువాత ఆ టికెట్పై దర్శనానికి పంపారు. చాలా ఇబ్బంది పడ్డాం. – కరుటూరి నాగేంద్ర, అంకంపాలెం, ఆత్రేయపురం మండలం -
దెందులూరులో మద్యం దందా
400కు పైగా బెల్టు షాపులు సాక్షి ప్రతినిధి, ఏలూరు: దెందులూరులో మద్యం దందా పరాకాష్టకు చేరింది. పగలూ రాత్రి సంబంధం లేకుండా 24 గంటలూ మద్యం అందుబాటులో ఉంటుంది. నియోజకవర్గంలో బెల్టు షాపు లేని గ్రామమే లేదు. క్వార్టర్కు రూ.30 నుంచి రూ.60 వరకు అధికంగా వసూలు చేస్తూ దోపిడీకి తెరతీశారు. ఎకై ్సజ్, పోలీస్ శాఖ మాముళ్ల మత్తులో అధికార పార్టీకి దాసో హమనే రీతిలో వ్యవహరిస్తున్నారు. దీంతో నియోజకవర్గ నేత రింగ్ లీడర్గా మారడంతో సర్వం ఆయన కనుసన్నల్లో నడుస్తోంది. ఈ వ్యవహారంపై టీడీపీ నేత శనివారం తీవ్ర ఆరోపణలు గుప్పించడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. సాయి బాలాజీ కేరాఫ్.. దెందులూరు నియోజకవర్గంలో 20 మద్యం దుకాణాలు కేటాయించారు. దీనికి సంబంధించి 2024లో టెండర్లు ఆహ్వానిస్తే అధికార పార్టీ కీలకనేత ఎకై ్సజ్ కార్యాలయం వద్ద వీధి గుండాలను పెట్టి మరీ దాష్టికం చేయడంతో ఎవరూ టెండర్లు దాఖలు చేయలేదు. చివరిలో బయట ప్రాంత వ్యక్తులకు నలుగురికి ఈ నియోజకవర్గంలో షాపులు దక్కితే వారిపై దాష్టికం చేసి తన దారికి తెచ్చుకున్నారు. నియోజకవర్గంలో ప్రస్తుతానికి అధికారికంగా 17 షాపులున్నాయి. 17 వైన్ షాపుల లైసెన్స్ల పేర్లు గాని, ఏ షాపు ఎంత వరకు విక్రయిస్తుంది.. షాపు నిర్వాహకులు ఎవరనేది ఎవరికీ తెలియదు. తెలిసిందల్లా 17 షాపులు సాయి బాలాజీ వైన్స్వే. ఈ షాపులన్నీ మొత్తం సిండికేట్ చేసి అధికార పార్టీ కీలక నేతే సాయిబాలాజీ పేరిట వైన్షాపు దందా నిర్వహిస్తున్నారు. మద్యం షాపుల్లో రూ.10 ఎక్కువకు అమ్ముతున్నారు. బెల్టు షాపుల్లో రూ. 30 నుంచి రూ.60 వరకూ అధికంగా దోచుకుంటున్నారు. 2024లో ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తి మద్యం దుకాణం దక్కించుకుంటే షాపు పెట్టడానికి వీల్లేకుండా నానా హంగామా చేశారు. చివరికి నిర్వాహకుడు టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత ఈడ్పుగంటి శ్రీనివాసరావు సహకారంతో 7వ మైలురాయి వద్ద కంటైనర్ ఏర్పాటు చేసి షాపు పెడితే 2వ రోజే పొక్లెయిన్తో షాపు మాయం చేశారు. దీనికి సహకరించిన టీడీపీ నేత శ్రీనివాసరావు, అతని తండ్రి వెంకటేశ్వరరావుపై దొంగతనం కేసు నమోదు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వం రూపొందించిన లిక్కర్ పాలసీకి టీడీపీ కీలక నేత తూట్లు పొడిచి దెందులూరు నియోజకవర్గంలో పార్టీని నాశనం చేస్తున్నారని టీడీపీ నేత, న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రెండేళ్ళుగా అరాచకం సాగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో తాను మాట్లాడుతున్నానని, నియోజకవర్గంలో మద్యం దందాను అరికట్టడానికి తాను పోరాటం మొదలుపెట్టానని, తనపై ఎలాంటి దాష్టికాలకు పాల్పడినా అన్నింటికి ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కీలక నేత కనుసన్నల్లోనే మద్యం సిండికేట్ 17 లైసెన్సులు సాయి బాలాజీ పేరిటే నియోజకవర్గంలో 400కు పైగా బెల్టు షాపులు ఎమ్మార్పీ కంటే రూ.30 నుంచి రూ.60 వరకు అధికంగా క్వార్టర్పై వసూలు తీవ్ర ఆరోపణలు చేసిన టీడీపీ నేత ఈడ్పుగంటి నియోజకవర్గంలో మద్యం దందా ఏ స్ధాయిలో సాగుతుందో వివరిస్తూ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. క్వార్టర్ బాటిల్(చీప్) రూ.30, మీడియం బ్రాండ్ రూ.50, కొద్దిగా నాణ్యమైన బ్రాండ్కు రూ.60 అదనంగా వసూలు చేసి విక్రయిస్తున్నారు. నాణ్యమైన మద్యం తక్కువ ధరకు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అధికార పార్టీ నేతలే బెల్టుషాపుల నిర్వాహకులుగా వ్యవహరించడం, బెల్టు షాపుల్లోని ప్రతి క్వార్టర్ సీసా సాయిబాలాజీ నుంచే కొనుగోలు చేయడం, అడ్డగోలుగా, సమయ పాలనతో సంబంధం లేకపోవడం, అత్యధిక ధరకు విక్రయించడం, మందు బాబులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం, ఇలా అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన కొనసాగుతోంది. ప్రజా ప్రతినిధి సొంత దందా కావడంతో ఎకై ్సజ్ అధికారులు నాలుగు మండలాల్లో కన్నెత్తి చూడలేని పరిస్థితి. దీన్ని సాకుగా చూపి ఎకై ్సజ్ అధికారులు పూర్తిగా నియోజకవర్గంలో జరిగే మద్యం విక్రయాల అవకతవకలు గాలికి వదిలేయడం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల సైతం ఇదే రీతిలో వ్యవహరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నియోజకవర్గంలో రోజుకు సగటున రూ.30 లక్షలు, నెలకు రూ.5 కోట్ల మేర విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. సంక్రాంతి లాంటి పండగ వస్తే మూడు రోజుల్లోనే రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల విక్రయాలు సాగుతున్నాయి. -
చూసిన కనులదే భాగ్యం
ముదినేపల్లి(కై కలూరు): చూసిన కనులదే భాగ్యం అన్న రీతిలో సాగింది చినపూరిగా పేరొందిన వడాలి శ్రీ జగన్నాథస్వామి రథోత్సవం. ఏప్రిల్ 29 నుంచి వడాలిలో శ్రీ సుభద్ర బలరామ సహిత శ్రీ జగన్నాథస్వామి వార్షిక కల్యాణోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఉదయం నిత్యోపాసన, బలిహరణ అర్చకులు చేశారు. ఒడిశా రాష్ట్రం పూరి తరహాలోనే ఇక్కడ దేవాలయంలోనూ స్వామి కై ంకర్యాలు చేస్తారు. ఆలయ ఈవో శింగనపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 4 కల్యాణోత్సవాలు ముగింపు సందర్భంగా భారీ అన్నసమారాధన జరుగుతుందన్నారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్పర్సన్ వీరమల్లు రత్నకుమారి, ధర్మకర్తలు చిలకలపల్లి నాగరాజు, పరసా గంగాధరరావు, గూడవల్లి పద్మావతి, అనగాని వెంకట నర్సమ్మ, రాజులపాటి వెంకటేశ్వరమ్మ, కల్లూరి సుబ్రహ్మణ్యం, గుర్ర పు రజనీ, నక్క వెంకట నాగలక్ష్మీ పాల్గొన్నారు. -
నాణేలతో శ్రీవారి విగ్రహం
ద్వారకాతిరుమల: కొందరు భక్తులు వినూత్నంగా చిల్లర నాణేలతో శ్రీవారి విగ్రహాన్ని తయారు చేయించి తమ భక్తిని చాటారు. విగ్రహ తయారీకి రూ.1.65 లక్షలు ఖర్చు చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడికి చెందిన కొందరు భక్తులు చిల్లర నాణేలతో అదే గ్రామానికి చెందిన యర్రంశెట్టి రామకృష్ణతో శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ విగ్రహ తయారీకి రూ.10, రూ.5, రూ.2, రూ.1 చిల్లర నాణేలను వినియోగించారు. వెండితో తయారు చేసిన యజ్ఞోపవీతం, నామం, కళ్లు, ముక్కు, నోరు, గెడ్డం విగ్రహానికి అమర్చారు. విగ్రహాన్ని శుక్రవారం క్షేత్రానికి ఊరేగింపుగా తీసుకొచ్చి, కల్యాణకట్ట వద్ద ఏర్పాటుచేశారు. ఏలూరు (ఆర్ఆర్పేట): క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకూ ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో బౌద్ధమతానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయని పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కే.తిమ్మరాజు తెలిపారు. బుద్ధ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర పురావస్తు, ప్రదర్శన శాలల శాఖ ఏలూరు మ్యూజియం, బుద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా, గుత్తా చిత్తరంజన్ దాస్, శ్రీకృష్ణ భారతీమణి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు పురావస్తు ప్రదర్శన శాలలో శుక్రవారం విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. బుద్ధుడి జీవిత విశేషాలు, బోధనలను నేటి తరం విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్ధేశంతో ఈ పోటీలు నిర్వహించామని తెలిపారు. బుద్ధిస్ట్ స్కాలర్ పీ భారతి, బుద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా ఏలూరు మాజీ అధ్యక్షురాలు ఆర్.మణి సుందర్ సింగ్, భారతీమణి ట్రస్ట్ ప్రెసిడెంట్ కే.అమరవాణి తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్సులో గురువారం ప్రయాణిస్తూ మహిళా ప్రయాణికురాలు పర్సు పోగొట్టుకుంది. పర్సును గుర్తించిన సర్వీసు కండక్టర్ పీఎస్ నారాయణ భద్రంగా తీసుకొచ్చి భీమవరం డిపో ఎర్నింగ్ సెక్షన్లో అప్పగించారు. ప్రయాణికురాలు పల్లేటి మార్త ఆధార్ కార్డు ఆధ్వారంగా ఏరియా తహసీల్దార్తో మాట్లాడి భర్త పల్లేటి ఏసును భీమవరం డిపోకు రప్పించి జిల్లా ప్రజా రవాణాధికారి ఎస్.గిరిధర్ కుమార్ సమక్షంలో అప్పగించారు. పర్సులో నగదుతో పాటు బంగారు, వెండి నగలు వస్తువులున్నాయి. భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం జువ్వలపాలెం రోడ్డులోని కేఎఫ్సీలో శుక్రవారం ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఆర్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. నఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేఎఫ్సీలో ఆయిల్తో తయారు చేసిన ఆహార పదార్థాలు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. కేసు నమోదు చేసి ఆ ఆయిల్ ఉపయోగించిన చికెన్ ఫ్రై ఐటెంలను ఆహార పరీక్షల కోసం శాంపుల్స్ తీసుకుని స్టేట్ ఫుట్ ల్యాబ్కు పంపిచామన్నారు. చికెన్, ఇతర ఆహార పదార్థాలు నిలువఉంచే డీప్ ఫ్రిడ్జ్ ప్రాంతంలో అపరిశుభ్ర వాతావరణం ఉందని తెలిపారు. చాట్రాయి: మహిళపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఇన్చార్జి ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మండలంలోని సి.గుడిపాడు గ్రామానికి చెందిన నక్కా శ్రీనివాస్ ఏప్రిల్ 29న ఓ మహిళపై దాడి చేసి తప్పించుకున్నాడని ఆయన చెప్పాడు. విస్సన్నపేట బస్టాండ్ వద్ద తిరుగుతుండగా పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించడంతో అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. -
శోభాయమానంగా కాళ్లకూరు వెంకన్న రథయాత్ర
కాళ్ల: ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా.. గోవిందా.. అంటూ గోవింద నామస్మరణతో కాళ్లకూరు మార్మోగింది. మండలంలోని కాళ్లకూరులో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వరస్వామి తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథయాత్ర వైభవంగా జరిగింది. వేద మంత్రాల నడుమ, వివిధ మేళతాళాలతో సుందరంగా అలంకరించిన రథంపై స్వామివారు ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని రథాన్ని లాగారు. బుట్ట బొమ్మలు, శక్తి వేషాలు, తీన్మార్ డప్పులు, డీజే ఆకర్షణగా నిలిచాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో పురవీధులన్నీ కిక్కిరిసిపోయాయి. వైశాఖ పూర్ణిమ సందర్భంగా స్వామి, అమ్మవార్లను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈఓ ఎం. అరుణ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ఘనంగా యూత్ క్లబ్ నాటక పోటీలు
పాలకొల్లు సెంట్రల్: యూత్క్లబ్ నాటక పరిషత్ 44వ వార్షికోత్సవం సందర్భంగా నాటక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. యలమంచిలి మండలం కొంతేరులో పులపర్తి వీరాస్వామి యూత్ క్లబ్ కళామందిర్, కొంతేరు ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు నాటక పోటీలు ప్రారంభించారు. శుక్రవారం బీవీకె క్రియేషన్స్ కాకినాడ వారి తితిక్ష నాటిక ప్రదర్శించారు. శ్రీ కరణం సురేష్ మోమోరియల్ ధియేటర్ గుంటూరు వారి తరమెల్లిపోతుంది నాటిక అలరించింది. నూజివీడు: స్థానిక ట్రిపుల్ ఐటీలో ఈ నెల 2న శ్రీబిల్డ్ విత్ ఏఐశ్రీ అనే అంశంపై వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమం క్యాంపస్లోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. గూగుల్ డెవలపర్ గ్రూప్ (విజయవాడ) సహకారంతో దీనిని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్, ఆర్జీయూకేటీ చాన్సలర్ ఆచార్య కొత్తా మధుమూర్తి హాజరవుతారు. ఆర్జీయూకేటీ ఉపకులపతి ఆచార్య విజయ్ కుమార్, నూజివీడు డైరెక్టర్ ఆచార్య గోపాలరాజు ప్యాట్రన్లుగా పాల్గొంటారు. ఈ వర్క్షాప్లో ప్రముఖ ఏఐ నిపుణులు మధు వడ్లమాని, ప్రదీప్ వడ్లమూరి, జగదీష్ బాబు కొర్ల ముఖ్య వక్తలుగా పాల్గొని తమ అనుభవాలను పంచుకోనున్నారు. గణపవరం : గణపవరం మండలం మొయ్యేరు గ్రామానికి చెందిన కానుమిల్లి వెంకట శ్రీహరి అప్పుల బాధతో కలుపు మందు తాగి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. గణపవరం ఎస్సై ఆకుల మణికుమార్ తెలిపిన వివరాల ప్రకారం శ్రీహరి అప్పులు పెరిగిపోవడం, బాకీదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీహరి తల్లి గంగారత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కోళ్ల ఎరువుతో అధిక లాభాలు
చింతలపూడి: అధిక దిగుబడుల కోసం రైతులు విచక్షణారహితంగా రసాయన మందులు, పురుగు మందులు వాడటంతో భూములు నిర్జీవంగా మారుతున్నాయి. సూక్ష్మ జీవులు నశించడం వల్ల వాటి ద్వారా లభించే సేంద్రియ పదార్థాలు, సూక్ష్మ పోషక పదార్థాలు నేలలో అదృశ్య మవుతున్నాయి. దీని వల్ల మొక్కల్లో పెరుగుదల నశిస్తుంది. ఉద్యాన పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యాన్ని రైతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. ముఖ్యంగా ఉద్యాన పంటల్లో 50 శాతం సేంద్రియ ఎరువులు, 50 శాతం రసాయన ఎరువులు వాడితే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చనని ఉద్యానశాఖ అధికారిణి ఎండీ షాఫియా ఫర్హీన్ సూచిస్తున్నారు. సేంద్రియ ఎరువులంటే.. సేంద్రియ ఎరువుల్లో పశువుల ఎరువు, మేకలు, గొర్రెల ఎరువు, వర్మి కంపోస్ట్తో పాటు కోళ్ళ పెంట ప్రముఖమైనవి. వీటిల్లో మొక్కలకు కావాల్సిన అన్నిరకాల ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలైన జింక్ మెగ్నీషియం, మాంగనీస్, బోరాన్ తదితర పోషకాలు దొరుకుతాయి. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు లభించే ఏకై క సేంద్రియ ఎరువు కోళ్ల ఎరువు మాత్రమే. కోళ్ల ఎరువులో ఎక్కువ మొత్తంలో నత్రజని 3 శాతం, భాస్వరం 2.5 శాతం, పొటాష్ 1.2 శాతం ఉంటాయి. ఉద్యాన పంటలైన కూరగాయల పంటలకు ఎకరానికి 500 కేజీల కోళ్ల ఎరువు సరిపోతుంది. ఈ ఎరువును రసాయన ఎరువుతో కలిపి వాడితే 20 నుండి 25 శాతం నత్రజని ఆదా చేయవచ్చు. కోళ్ళ ఎరువును వివిధ ఉద్యాన పంటల్లో ఈ మోతాదులో వినియోగిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. పచ్చి కోళ్ల ఎరువు వద్దు పచ్చి కోళ్ల ఎరువును ఎట్టి పరిస్ధితుల్లోను మొక్కలకు వేయకూడదు. దానిలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల వేరు వ్యవస్థ మాడిపోయి మొక్కలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే కోళ్ళ ఎరువును సేకరించాక బాగా మాగిన తరువాత మొక్కలకు వేసుకోవాలి. టన్ను కోళ్ల ఎరువుకు 15 కేజీల సూపర్ ఫాస్ఫేట్ కలిపితే తొందరగా కుళ్ళిపోతుంది. కోళ్ళ ఎరువును సాధారణంగా మొక్కలు నాటడానికి 20 రోజుల ముందుగా వేయాలి. పామాయిల్ తోటలకు – 6 ఏళ్ల వయస్సున్న చెట్టుకు 50 కేజీలు కొబ్బరి – 8 సంవత్సరాల వయస్సున్న కాపుకాసే చెట్టుకు 30 నుంచి 50 కేజీలు అరటి – ఎకరానికి 5 టన్నులు మామిడి – 10 ఏళ్ళ కాపు కాసే చెట్టుకు 50 నుంచి 70 కేజీలు జీడి మామిడి – 7 ఏళ్ల వయసున్న కాపు కాసే చెట్టుకు 40 కేజీలు నిమ్మ, బత్తాయి – 6 ఏళ్ల వయసున్న కాపు కాసే చెట్లకు 30 కేజీలు బొప్పాయి – ఎకరానికి 3 నుంచి 5 టన్నులు మిరప – ఎకరానికి 3 టన్నులు పూల తోటలకు – ఎకరానికి 2 టన్నులు -
ప్లేస్మెంట్స్లో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ
నూజివీడు: 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యార్థులు ప్రతిభ చూపి అత్యధికంగా ప్లేస్మెంట్లు సాధించినట్లు డైరెక్టర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో క్యాంపస్ ప్లేస్మెంట్లలో 80 శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారని, మొత్తం 661 మంది విద్యార్థుల్లో 540 మంది ప్రతిష్టాత్మక సంస్థల్లో నియామకాలు పొందినట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం విద్యార్థులకు లభించిన గరిష్ట వేతనం రూ.27 లక్షలు కాగా, సగటు వేతనం రూ.6 లక్షలుగా నమోదైంది. కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జికల్ – మెటీరియల్స్ ఇంజినీరింగ్ (ఎం.ఎం.ఈ), మెకానికల్ విభాగాల విద్యార్థులకు వంద శాతం ప్లేస్మెంట్లు లభించాయి. పలు ప్రముఖ సంస్థలు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా చేపట్టిన ఈ నియామకాల్లో విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చి ఉద్యోగాలు సాధించడం గర్వకారణమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను డైరెక్టర్తో పాటు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, పరిపాలనాధికారి బి. లక్ష్మణరావు, డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి, ప్లేస్మెంట్ ఆఫీసర్ రుద్రం చింతయ్య నాయుడు, ఈ.ఐ.టి.పి డీన్ శ్యామ్, వివిధ విభాగాల శాఖాధిపతులు, అధ్యాపకులు అభినందించారు. -
ప్రాణాలకు భరోసా
● ఇంతవరకూ 15,000 మందికి రక్తదానం ● హోప్ చారిటబుల్ ట్రస్ట్ కృషిపై ప్రశంసలు కై కలూరు: ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తూ మేమున్నాం అంటూ ఆశను కల్పిస్తున్నారు హోప్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. కై కలూరు నియోజకవర్గం కలిదిండి మండలం పడమటిపాలెం గ్రామానికి చెందిన అల్లాడి రవితేజ తన స్నేహితుడు బచ్చు నాగరాజుతో కలిసి 2022లో సంస్థను స్థాపించి ఓ వాట్సప్ గ్రూపు క్రియేట్ చేశాడు. ప్రస్తుతం గ్రూపులో 150 మంది సభ్యులు ఉన్నారు. వీరందరూ శ్రీఏ డ్రాఫ్ ఆఫ్ బ్లడ్ ఈజ్ హోప్ ఫర్ లైఫ్శ్రీ అనే నినాదంతో స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. ఒక్కరే 50 సార్లు రక్తదానం చేసిన రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. 15,000 మందికి రక్తదానం ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలు, విశాఖపట్నం, కాకినాడ ఇలా అనేక జిల్లాల్లో రక్తం అవసరమైన వారికి హోప్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు 15,000 మందికి పైగా రక్తదానం చేసి రికార్డు సృష్టించారు. రోడ్డు ప్రమాదాలు, గర్భిణులు, క్యాన్సర్ పేషెంట్లు, తలసేమియా చిన్నారులు, అత్యవసర చికిత్సలు ఇలా ఏదైన అర్థరాత్రి సైతం సుదూర ప్రాంతాలకు వెళ్ళి మరీ రక్తదానం చేశారు. ప్రధానంగా అల్లాడి రవితేజ, బచ్చు నాగరాజుకు తోడు నూకల శివ, చిన్నవరపు నాగార్జున తోడయ్యారు. వీరితో పాటు క్రియశీలకంగా లింగం పవన్కిషోర్, సబ్బారపు వినోద్, వక్కసల్లి గణి, ఈ.కృష్ణ, గంధం దుర్గాప్రసాద్, ప్రభాకర్ మాస్టార్, కట్టా సత్యనారాయణ, సమయం మురళీకృష్ణ, ఎస్పీ వివేకానంద, ఆటపాక ప్రసాద్, పనస సుబ్బు, పేటేటి రామాంజనేయులు, మేకల వెంకటేశ్వరరావు, ఉండి రాజశేఖరరెడ్డి వ్యహరిస్తున్నారు. వీరిలో గంధం దుర్గాప్రసాద్ 28 సార్లు రక్తదానం చేయడం విశేషం. తలసేమియా చిన్నారులకు అండగా.. తలసేమియా చిన్నారులకు ప్రతి 21 రోజులకు రక్తం మార్చాలి ఉండగా.. భీమవరం, ఉండి, కై కలూరు, కలిదిండి, పాలకొల్లు, నరసాపురం తణుకు ఇలా అనేక ప్రాంతాల్లో మొత్తం 35 మంది చిన్నారులను గుర్తించారు. వీరికి క్రమం తప్పకుండా రక్తం అందిస్తున్నారు. ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. కోవిడ్ సమయంలోనూ ట్రస్ట్ సభ్యులు పలువురికి రక్తదానం చేశారు. ఆక్సిజన్ సిలిండర్లు అందించారు. రక్తదానం చేయడంలో అనేక మందికి ఇప్పటికీ కొన్ని అపోహలు వెంటాడుతోన్నాయి. వాటిని ఎవరూ నమ్మవద్దు. నా బ్లడ్ గ్రూపు ఓ పాజిటివ్. నేను ఇప్పటికీ 50 సార్లు రక్తదానం చేశాను. ఇంకా చేస్తూనే ఉంటాను. హోప్ సంస్థ ద్వారా సేవ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. – తమ్మిరెడ్డి వెంకట అప్పారావు, ఉపాధ్యాయుడు, కై కలూరు సకాలంలో రక్తం అందక ఓ నిండు గర్భిణి మరణించింది. దీంతో స్నేహితులతో కలసి హోప్ చారిటబుల్ ట్రస్టును స్థాపించాను. సంస్థ 6వ వార్షికోత్సవం జరుపుకుంది. సంస్థలో ప్రతి సభ్యుడు ఎవరికి రక్తం కావాలన్నా స్వచ్ఛందగా వెళ్తున్నారు. రానున్న రోజుల్లో సేవలను మరింత విస్తరిస్తాం. – అల్లాడి రవితేజ, సంస్థ ఫౌండర్, పడమటిపాలెం -
పరకే బంగారమాయెనే!
● వరి గడ్డికి యమ డిమాండ్ ● యంత్రాలతో మాసూళ్లు ● గడ్డిని ఒబ్బిడి చేసుకుంటున్న రైతులు భీమవరం: జిల్లాలో ఆక్వారంగం విస్తరించడంతో వరి పండించే భూమి విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. దీంతో పశువులను పెంచే రైతులకు వరి ఎండుగడ్డి కొరత తీవ్ర ఇబ్బంది పెడుతోంది. ఇదే తరుణంలో వరి మాసూళ్లకు కోత యంత్రాలను విని యోగించడంతో గడ్డి కొరత మరింత పెరుగుతోంది. జిల్లాలో సుమారు 2.35 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తుండగా దాళ్వా సీజన్లో రైతులు దా దాపు కోతలకు యంత్రాలను వినియోగిస్తున్నారు. దీని వల్ల గడ్డి ముక్కలు మారి పశువుల దాణాకు కూడా పనిచేయడం లేదని చాలా మంది చేలోనే గడ్డిని తగలబెడుతున్నారు. దీంతో గడ్డి కొరత మరింత పెరుగుతోంది. ఈ గడ్డిని దాణాగా ఉపయోగించినా బలం ఉండదని కొంత రైతులు చేలలోని గడ్డిని అక్కడికక్కడే తగలబెడుతున్నారు. దీంతో కొరత మరింత ఎక్కువై పొరుగు జిల్లాల నుంచి గడ్డిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం డిమాండ్ బాగుండటంతో ఎకరా గడ్డి సుమారు రూ.8 వేలు పలుకుతోంది. సుమారు 2.5 లక్షల పశువులు జిల్లాలోని 20 మండలాల్లో సుమారు 2.5 లక్షల పశువులున్నట్లు అంచనా. వాటిలో 45 వేలు ఆవుజాతి పశువులు, 1.80 లక్షల గేద జాతి పశువులు ఉన్నాయి. కొందరు రైతులు ఇతర జిల్లాలకు వెళ్లి గడ్డి తీసుకురాలేక యంత్రాల ద్వారా మాసూళ్లు చేసిన గడ్డిని పశువులకు దాణాగా ఉపయోగిస్తున్నారు. మాసూళ్లు అనంతరం గడ్డిని చేలల్లోనే నాలుగైదు రోజులు ఎండబెట్టి ప్రత్యేక యంత్రాలతో కట్టలు కట్టించి వాములుగా వేసి పశువుల దాణాకు ఉపయోగిస్తున్నారు. యంత్రాలతో కోసిన గడ్డి ముక్కలుగా మారడంతో పాటు గడ్డిలోని సారం పోతుందని, అందువల్ల గడ్డి ఉపయోగపడదనే అపోహలతో కొందరు రైతులు ఉన్నారు. కట్టకు రూ.30 ఖర్చు యంత్రాల ద్వారా మాసూళ్లు చేసిన చేలల్లో కూలీలతో గడ్డి వాములు వేయించడానికి ఎక్కువ ఖర్చవుతుండటంతో రైతులు గడ్డి కట్టలు కట్టడానికి యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ప్రత్యేక యంత్రం ద్వారా కట్టలు కట్టించి ట్రాక్టర్స్తో గట్టుకు చేర్చి గడ్డివాములుగా వేస్తున్నారు. యంత్రం ద్వారా ఒక్కో కట్టకు రూ.30 ఖర్చవుతోంది. ఈ లెక్కన ఎకరా గడ్డిని ఒబ్బిడి చేయడానికి సుమారు రూ.2 వేలు ఖర్చవుతుందని రైతులు అంటున్నారు. యంత్రాల ద్వారా మాసూళ్లు చేసిన వరి గడ్డిలో ఏమాత్రం పోషక విలువలు తగ్గవు. గడ్డి పొడవుగా కాకుండా చిన్న ముక్కలుగా ఉండటం వల్ల పశువులు సులభంగా తింటాయి. ఈ గడ్డిని పశువులకు వేయడంలో ఎలాంటి సంకోచాలు వద్దు. –పి.సుధీర్బాబు, అసిస్టెంట్ డైరెక్డర్ పశుసంవర్ధకశాఖ, భీమవరం -
కార్మికుల సంక్షేమం వైఎస్సార్సీపీ లక్ష్యం
ఏలూరు టౌన్: కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పేద, మద్యతరగతి వర్గాలకు మేలు చేయటమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ పనిచేస్తోందని ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. ఏలూరులోని పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం వైఎస్సార్టీయూ నగర అధ్యక్షుడు గంటా రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ని ర్వహించారు. డీఎన్నార్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్తో కలిసి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పథకాలు అందించారని గుర్తుచేశారు. దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర మరువలేమన్నారు. తమ పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షపాతిగా ఉంటుందనీ, రాబోయే కాలంలో అధికారంలోకి వచ్చిన అనంతరం సమాజంలోని అన్నివర్గాలకు మేలు చేసేలా పథకాలు అందిస్తామని చెప్పారు. అనంతరం చల్లటి మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశారు. నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, కై కలూరు నియోజకవర్గ పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్బాబు, చింతలపూడి నియోజకవర్గ పరిశీలకుడు దాసరి రమేష్, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, వైఎస్సార్టీయూ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, నాయకులు కిలాడి దుర్గారావు, భోగిశెట్టి పార్వతి, స్టాన్లీబాబు, షేక్ బాజీ, భాస్కర్ల బాచి, లూటుకుర్తి సుభాష్, జిజ్జువరపు విజయనిర్మల, ఇనపనూరి జగదీష్,మేతర సురేష్, ఉమామహేశ్వరరావు, లక్కాబత్తుల ఏసుపాదం, కొల్లిపాక సురేష్, సాసుపల్లి యుగంధర్ప్రసాద్, కంచుమర్తి తులసీ, బండ్లమూడి సునీల్ తదితరులు పాల్గొన్నారు.జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ -
బుద్ధుడి బోధనలు ఆదర్శనీయం
శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు భీమవరం: ప్రపంచ మానవాళికి చక్కటి జీవన విధానాన్ని అందించిన గౌతమబుద్ధుడు గొప్ప దార్శనీయుడని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు అన్నారు. శుక్రవారం భీమవరం అంబేడ్కర్ భవనంలోని బుద్ధుని విగ్రహం వద్ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బుద్ధ పూర్ణిమ (బుద్ధ జయంతి) నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. గౌతమి బుద్ధుని బోధనలు ప్రపంచ మొత్తానికి ఆదర్శనీయమని అన్నారు. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కోనా జోసెఫ్, జిల్లా అధ్యక్షుడు ఈది రవికుమార్ మా ట్లాడుతూ బుద్ధుడు చూపిన అహింసా మార్గం ఆధునిక ప్రపంచంలో ఒత్తిడితో కూడిన జీవితానికి అనుసరణీయమన్నారు. వన్టౌన్ ఎస్సై కృష్ణాజీ, గౌరవాధ్యక్షుడు కేసీ రాజు, గంటా సుందరకుమార్, బోకూరి విజయరాజు, డీకేవీ ప్రకాష్, జి.గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
జగన్ హయాంలోనే పెట్టుబడులకు పునాది
దెందులూరు: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లోనే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లకు పునాది పడిందని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి తెలిపారు. అప్పుడే ప్రధాన టెక్నాలజీ, ఇన్ఫ్రా సంస్థలతో చర్చలు ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. విశాఖలో గూగుల్, రిలయన్స్ భారీ డిజిటల్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడాన్ని ఆయన స్వాగతించారు. పెట్టుబడులు రాష్ట్ర ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూర్చేలా చూ డాలని కోరుతూ, ఇలాంటి భారీ డేటా సెంటర్ల కారణంగా ఏర్పడే సవాళ్లను తెలియజేస్తూ, వాటిని అధిగమించాల్సిన విధానాలపై సూ చనలను చేస్తూ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు ఆయన బహిరంగ లేఖ రాశారు. డేటా సెంటర్ల నిర్వహణకు భారీగా నీటి వినియోగం అవసరమవుతుందని రీసైకిల్డ్ నీటిని వాడాలనే నిబంధన పెట్టాలని కోరా రు. విశాఖ తీర ప్రాంత సహజ పర్యావరణ, ఆర్థిక మౌలిక సదుపాయాలపై స్వతంత్ర కమిటీతో అధ్యయనం చేయించి, వాతావరణ ప రిస్థితులు, మౌలిక వసతుల భద్రతపై దృష్టి సారించాలని సూచించారు. ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు శుక్రవారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. రిటైర్డ్ న్యాయమూర్తి దంపతులు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేయించారు. అర్చకులు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలకగా, అధికారులు చినవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఉంగుటూరు: ఏలూరు జిల్లాలో ధాన్యం కొనుగోలులో సమస్యల పరిష్కారానికి టోల్ఫ్రీ కంట్రోలు రూం నం. 18004256453, హెల్ప్ డెస్క్ 77020 03584కి ఫోన్ చేసి తెలియజేయా లని జేసీ అభిషేక్ గౌడ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని తల్లాపురం రోడ్డులో, చేబ్రో లు, నారాయణపురం ఆయకట్టు ప్రాంతాల్లో ధాన్యం ఎగుమతులను ఆయన పరిశీలించా రు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 58 లక్షల గోనె సంచులు అందుబాటులో ఉంచామన్నారు. ఇప్పటివరకూ 1.55 లక్షల టన్నుల ధాన్యం సేకరించామన్నారు. వర్షాలతో ధాన్యం దెబ్బతినకుండా టార్పాలిన్లు సిద్ధం చేశామన్నారు. ఉంగుటూరు మండలంలో 53,485 టన్ను ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని అన్నారు. రైతులు సొంతంగా ఏర్పాటు చేసుకునే గోనె సంచికి రూ.4.47, హమాలీలకు క్వింటాల్కు రూ.25.06 చొప్పున చెల్లిస్తామన్నారు. అనంతరం కైకరంలో రైతు సేవా కేంద్రాన్ని జేసీ పరిశీలించి రైతులతో మాట్లాడారు. సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ పి.శివరామమూర్తి, జిల్లా సహకార శాఖ అధికారి ఆరిమిల్లి శ్రీనివాస్, త హసీల్దార్ పూర్ణచంద్రప్రసాద్ ఉన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం డివిజన్ దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ వర్ధినీడి వెంకటేశ్వరరావుకు కాకినాడ జిల్లా దేవదాయశాఖ అధికారిగా (డీఈఓ) పదోన్నతి లభించింది. ఆయనకు డివిజన్ ఈఓలు అభినందనలు తెలిపారు. భీమవరం: జిల్లాలో ఈనెల 9న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ జూలై 11కి వాయిదా పడినట్టు భీమవరం మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ బి.లక్ష్మీనారాయణ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. -
రైతుల పాలిట పగాకు
శనివారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: పొగాకు ధరలు రైతు కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. గత రెండేళ్లలో ధరలు కొంత మేరకు ఆశాజనకంగా ఉండటంతో రూ.లక్షల్లో అప్పులు తెచ్చి మరీ సాగు చేసిన రైతులు భారీగా నష్టాలు చవిచూస్తున్నారు. దేశంలోనే అత్యంత నాణ్యమైన పొగాకు దిగుబడి అయ్యే జిల్లాలో ఉమ్మడి పశ్చిమగోదావరి ఒకటి. పంట నాణ్యత గతం కంటే మెరుగైనా, ధరలు మాత్రం గణనీయంగా పతనమవుతున్నాయి. సీజన్ ప్రారంభంలో సరాసరి కిలోకు రూ.35లు ధర తగ్గించి కొనుగోలు మొదలుపెట్టగా.. నెలరోజుల వ్యవధిలో మరింత తగ్గించడంతో పొగాకు రైతుల గోడు అరణ్య రోదనగా మారింది. 29 వేల హెక్టార్లకు పైగా.. ఉమ్మడి పశ్చిమలోని దక్షిణాది తేలిక నేలలు (ఎన్ఎల్ఎస్)లో ఈ ఏడాది 29,074 హెక్టార్లల్లో పొగాకు సాగు జరిగింది. 80 మిలియన్ కేజీల దిగుబడి అంచనా వేశారు. ఉమ్మడి పశ్చిమలో జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాల పరిధిలో 12,021 మంది రైతులు 13,864 బ్యారన్లను రిజిస్టర్ చేశారు. బ్యారన్ల పరి ధిలో 22194 హెక్టార్లల్లో సాగు విస్తీర్ణంలో 48.75 మిలియన్ కేజీలు దిగుబడి అంచనా ఖరారు చేసి ఆ మేరకు పొగాకు బోర్డు అనుమతించింది. అయితే గత రెండేళ్లు సరాసరి కిలో రూ.300 ధర పలకడం కొంతమేరకు గిట్టుబాటుగా ఉండటంతో అనధికారిక సాగు విస్తీర్ణం 7 వేల హెక్టార్ల మేర పెరిగింది. అలాగే దిగుబడి కూడా భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో నాణ్యమైన పొగాకు దిగుమతయ్యే బ్రెబిల్, జింబ్వాబేతో ఎన్ఎల్ఎస్ పరిధిలోని పొగాకు పోటీ పడుతుంది. ఈ క్రమంలో కర్ణాటకతో పాటు ఆంధ్రాలోనూ ఎన్ఎల్ఎస్ పరిధిలో ఈ ఏడాది మార్చి 25 నుంచి కొనుగోళ్లు ప్రా రంభించారు. 2024 నుంచి సగటున కిలోకు రూ.270 నుంచి 450 అత్యధిక ధర వరకు పొగాకు కొనుగోళ్లు జరగ్గా సరాసరి రూ.290 నుంచి 300 పలికింది. ఈ క్రమంలో కర్ణాటకలో రూ.300 నుంచి రూ.320 కొనుగోలు చేస్తున్న వ్యాపారులే స్థానికంగా మాత్రం రూ.240 నుంచి రూ.262 ధర మధ్య కొంటున్నారు. సగటు ధర రూ.261.88 దక్కుతుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. నాణ్యత బాగున్నా.. ధర లేదన్నా.. దేశీయ వర్జీనియా టుబాకోలో ఎన్ఎల్ఎస్ పరిధిలో పంటకు మంచి డిమాండ్ ఉంటుంది. సిగరెట్ తయారీలో దీనిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. తేమ వాతావరణంలో పండే పంట కావడంతో నాణ్యత బాగుంటుందనే కారణంతో అంతర్జాతీయంగా డిమాండ్ ఉంటుంది. గతేడాది కిలో రూ.300లతో ముగిసిన సీజన్ ఈ ఏడాది రూ.265 ధరతో ప్రారంభించారు. సీజన్ ప్రారంభమైన నెల రోజుల వ్యవధిలో 5 వేలం కేంద్రాల పరిధిలో 8,02,746.70 కిలోల పొగాకును సరాసరి రూ.261.88 ధరకు కంపెనీలు కొనుగోలు చేశాయి. కంపెనీలే సిండికేటుగా మారి ధరను నిర్ణయించడంతో పొగాకు బోర్డు సైతం చేతులేత్తిసిన పరిస్థితి. సీజన్ ప్రారంభంలో రూ.265 ధరను రైతులు వ్యతిరేకించి జంగారెడ్డిగూడెం–1, కొయ్యలగూడెం వేలం కేంద్రాల్లో ఆందోళన చేశారు. అయినా మరో రూ.3 ధర తగ్గిపోయింది. కేవలం పది మందికి మించి వ్యాపారులు రాకుండా కొనుగోళ్లు చేయడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కనీసం మద్దతు ధర లేకపోవడం, పొగాకు బోర్డు పట్టించుకోకపోవడంతో ధర మరింత పతనమవుతుందన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సీజన్ పరిధిలో రూ.350 ధర వస్తే కనీసం సీజన్ మధ్యలో రూ.280 నుంచి రూ.300 మేరకు ధరకు కొనుగోలు చేస్తే రైతుకు కొంత గిట్టుబాటు అయ్యేది. ఎలాంటి అంతర్జాతీయ పరిణామాలు లేనప్పటికీ ధరలు తగ్గించడం గమనార్హం. ఎన్ఎల్ఎస్ పరిధిలో.. ఏప్రిల్ 30 వరకు ఎన్ఎల్ఎస్ పరిధిలో కొనుగోళ్లు జరిగాయి. మొత్తంగా 8,02,746.70 కిలోల పొగాకును సరాసరి రూ.261 ధరకు కొనుగోలు చేశారు. కేంద్రం కిలోలు జంగారెడ్డిగూడెం–1 2,40,967.10 జంగారెడ్డిగూడెం–2 1,60,653.20 కొయ్యలగూడెం 1,10,568.60 దేవరపల్లి 1,38,094.70 గోపాలపురం 1,52,463.10 బెంబేలు పతనం అంచున పొగాకు ధరలు గతేడాదితో పోలిస్తే ధరలు తిరోగమనం రూ.261 సగటు ధరతో కొనుగోలు తొలిరోజు నుంచే రైతుల నిరసన జిల్లాలో 8.02 లక్షల కిలోల కొనుగోళ్లు ప్రస్తుతం పొగాకు రైతు పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎన్నో ఆశలతో పంటలు వేశాం. కనీసం గిట్టుబాటు ధర కల్పించే పరిస్థితి కనిపించడం లేదు. కిలో రూ.230 నుంచి రూ.260 వరకు కొంటున్నారు. గిట్టుబాటు ధర రూ.300 ఇస్తేనే రైతుకు మనుగడ. లేదంటే ఆర్థ్ధిక ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వం, బోర్డు అధికారులు కల్పించుకుని గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేయాలి. – సయ్యద్ బాజీ, పొగాకు రైతు, అచ్చియ్యపాలెం పొగాకు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. కౌలు, పెట్టుబడులు పెరిగినా పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. వేలం కొనుగోలు ప్రారంభమై నెల రోజులు దాటినా ఇప్పటివరకు ఆశించిన మేర ధర కల్పించకపోవడంతో ఇళ్ల వద్దనే బేళ్లు ఉంచుకుంటున్నాం. ప్రభుత్వం పట్టించుకోకపోతే రైతులు అప్పులపాలు కావడం ఖాయం. – కలగర నాని, పొగాకు రైతు, కొమ్ముగూడెం -
తిరువీధుల మెరసీ దేవదేవుడు
● అట్టహాసంగా రథోత్సవం ● మార్మోగిన గోవింద నామస్మరణలు ● నేడు శ్రీచక్రస్నానం, ధ్వజావరోహణం ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రంలో వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం రాత్రి శ్రీవారి రథోత్సవం కనులపండువగా సాగింది. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారికి భక్తులు స్వయంగా సేవ చేసుకునే భాగ్యం ఈ రథ వాహనం ద్వారానే కలుగుతుంది. వేలాది మంది వేడుకలో పాల్గొన్నారు. ముందుగా అర్చకులు ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తొళక్క వాహనంపై ఉంచి పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట భజనలు, అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణల నడుమ వాహనాన్ని రథం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ రఽథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కల్యాణమూర్తులను ఉంచి, విశేష పుష్పాలంకారాలు చేసి, హారతులిచ్చారు. అనంతరం ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు దంపతులు, దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావు తదితరులు పూజలు నిర్వహించి, బలిహరణను సమర్పించగా రథోత్సవం ప్రారంభమైంది. గోవింద నామస్మరణల నడుమ దివ్య రథం క్షేత్ర పురవీదుల్లో తిరుగాడింది. ఇదిలా ఉంటే శ్రీ కూర్మ జయంతి, అలాగే బ్రహ్మోత్సవాలు సందర్భంగా స్వామివారు ఆలయ ముఖ మండపంలో శ్రీ కూర్మ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీహరి కళాతోరణ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బ్రహ్మోత్సవాల్లో నేడు.. ● ఉదయం 9 గంటల నుంచి.. శ్రీ చక్రవారి, అపభృధోత్సవం ● మధ్యాహ్నం 3 గంటల నుంచి.. వేద సభ ● రాత్రి 9 గంటల నుంచి.. ధ్వజావరోహణం, అనంతరం అశ్వవాహనంపై గ్రామోత్సవం ● శ్రీవారి ప్రత్యేక అలంకారం – నవనీత కృష్ణ రథంలో శ్రీవారు, అమ్మవార్లకు హారతులుబలిహరణ సమర్పిస్తున్న దృశ్యం -
వడదెబ్బతో మహిళ మృతి
కై కలూరు: కై కలూరు మండలం గోపవరంలో వడదెబ్బ తగిలి ఓ మహిళ మరణించింది. కై కలూరు టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జంగం వెంకటేశ్వరమ్మ (50) భర్త లేకపోవడంతో అదే గ్రామంలో కూతురు వంగలపాటి శాంతి స్పందన వద్ద ఉంటోంది. గురువారం గ్రామంలో కాగితాల కొండమ్మ, ఆమె కూతురు గడిదేశి కృష్ణ తులసిల నుంచి అప్పు డబ్బు రావల్సి ఉంటే అడగడానికి మధ్యాహ్నం కూతురుతో కలిసి వెళ్లింది. అక్కడ కొంత ఘర్షణ జరిగింది. అనంతరం వెంకటేశ్వరమ్మ ఇంటి వద్ద అంట్లు తోముతూ కుప్పకూ లడంతో కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మరణించిందని చెప్పారు. తల్లి మూడు రోజులుగా కూలి పనులకు సైతం వెళుతోందని, వడదెబ్బ తగిలి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. కుమార్తె ఫిర్యాదుతో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
లారీని ఢీకొని.. ఇద్దరు మృతి
నూజివీడు: లారీని వెనకనుంచి ట్రక్కు వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మీర్జాపురం వద్ద గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నూజివీడు వైపు నుంచి జంక్షన్ వైపు వెళ్తున్న లారీ మీర్జాపురంలో ఆగగా వెనుక నుంచి వచ్చిన గేదెల ట్రక్కు లారీని వెనుకభాగంలో వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో అప్పనవీడుకు చెందిన ట్రక్కు డ్రైవర్ కచ్చా బాల వెంకట సాయి(21), కృష్ణాజిల్లా గుడ్లవల్లేరుకు చెందిన గేదెల వ్యాపారి గుమ్మడి కోటేశ్వరరావు(43) అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు కోటేశ్వరరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నూజివీడు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. రూరల్ ఎస్సై జ్యోతీబసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాహనం ఢీకొని యువకుడి మృతి
కలిదిండి(కై కలూరు): వివాహం జరిగి ఏడాది కూడా కాలేదు. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కలిదిండి మండల కాళ్ళపాలెంకు చెందిన పాశం నాగ సాయి మణికంఠ(31)కు కై కలూరు మండలం ఆటపాక గ్రామానికి చెందిన సౌజన్యతో 6 నెలల క్రితం వివాహమైంది. మణికంఠ చేపల చెరువులపై కూలీ పనులు చేస్తాడు. గురువారం మధ్యాహ్నం సమీప ఆరుతెగళపాడులో వాటర్ క్యాన్ తీసుకుని తిరిగి కాళ్ళపాలెం మోటార్సైకిల్పై వస్తుండగా, కలిదిండి నుంచి వరహాపట్నం వెళుతున్న వ్యాన్ నిర్లక్షంగా ఢీకొట్టింది. అనంతరం వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మోటార్సైకిల్పై వెళుతున్న మణికంఠ అక్కడికక్కడే మరణించాడు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాలని కాళ్ళపాలెం గ్రామానికి చెందిన అనేక మంది మణికంఠ మృతదేహంతో సహా రోడ్డుపై బైటాయించి నినాదాలు చేశారు. దీంతో సర్కిల్ సీఐ వి.రవికుమార్ ఘటన స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
జనగణనకు ఏర్పాట్లు పూర్తి
ఏలూరు (టూటౌన్): జిల్లాలో ఇంటింటి జనగణన నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. మే నెలలో నిర్వహించాల్సిన ఇంటింటి జనగణన కార్యక్రమంపై రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ జె.నివాస్తో కలిసి గురువారం జిల్లా కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ఇన్చార్జి డీఆర్ఓ దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు. జేసీ డా.ఎంజే అభిషేక్ గౌడ ఏలూరు (టూటౌన్): రబీలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యానికిగాను ఇప్పటివరకు 1,54,386 టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ చెప్పారు. ధాన్యం సేకరణకు గాను 128 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశామని, 58 లక్షల గొనె సంచులను రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. ఉంగుటూరు మండలంలో 53,485 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. అలాగే అక్కడ 157 వాహనాలను రిజిస్ట్రేషన్ చేసి 16,93,747 గోనె సంచులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతుల ధాన్యాన్ని భద్రపరుచుటకు 325 టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ 18004256453కి లేదా హెల్ప్ డెస్క్ నెంబర్ 77020 03584 నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు. ఏలూరు (టూటౌన్): ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల ఆగడాలను అరికట్టడంలో విఫలమైన ఇంటర్మీడియెట్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి (ఆర్ఐఓ) కే యోహాన్ను ఆ పోస్ట్ నుంచి తొలగించాలని కోరుతూ పీడీఎస్యూ నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు కాకినాని మాట్లాడుతూ ప్రభుత్వం ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రకటించినా ఇంకా ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలో క్లాసులు నిర్వహిస్తున్నా ఆర్ఐఓ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. అలాగే బెటర్మెంట్, సప్లిమెంటరీ నిమిత్తం విద్యార్థుల నుంచి కొన్ని విద్యాసంస్థలు అదనపు ఫీజులు వసూలు చేస్తున్నా, బుక్స్, యూనిఫామ్ పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నా ఆర్ఐఓ పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో పీడీఎస్యూ నగర ప్రధాన కార్యదర్శి ఎస్ సునీల్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు సీహెచ్ చరణ్. చింతలపూడి నగర కార్యదర్శి ఎండీ రయాన్, బాలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగిపై చెప్పుతో దాడి
● కై కలూరులో పేట్రేగిపోతున్న అక్రమార్కులు ● ప్రశ్నించినందుకు వీఆర్వోపై దాడి ● విచారణ పేరుతో నాన్చుతున్న పోలీసులు సాక్షి, టాస్క్ఫోర్స్: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కరువయ్యింది. దందాగిరి, మోసాలు, అక్రమ చెరువులు, మైనింగ్, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు కేరాఫ్ అడ్రాస్గా నిలిచిన కై కలూరు నియోజకవర్గం పరువు మరోసారి దిగజారింది. ఇందుకు ఉదాహరణగా మండవల్లి మండలం పులపర్రు శివారు దెయ్యంపాడు వద్ద బుధవారం వీఆర్వోపై జరిగిన దాడి ఘటన నిలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ పేరుతో నిందితులను అరెస్టు చేయడానికి కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. మండవల్లి మండలం పులపర్రు సమీపంలో దెయ్యంపాడు వద్ద ముంగర శ్రీనివాసరావు అనే వ్యక్తి ప్రభుత్వ మోటూరు చానల్ను అక్రమంగా పూడ్చేస్తున్నాడు. మండవల్లి తహసీల్దార్ గోపాల్కు సమాచారం రావడంతో వీఆర్వో వెంకటేష్ను పనులు నిలుపుదల చేయించాలని ఆదేశించారు. దీంతో వెంకటేష్ ఆక్రమణలు సమీపంలోనే నివసిస్తున్న శ్రీనివాసరావును పనులు ఆపాలని కోరారు. కోపంతో విచక్షణ కోల్పోయిన శ్రీనివాసరావు, అతడి భార్య సావిత్రి, సోదరుడు రాజు కలిసి చెప్పుతో వీఆర్వోపై ఏకధాటిగా దాడి చేశారు. అవమానభారంతో ద్విచక్రవాహనంపై వెళ్లిపోడానికి ప్రయత్నించిన వీఆర్వోపై మరోసారి దాడి చేయడానికి ప్రయత్నించారు. దాడికి గురైన వీఆర్వో కై కలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏడుకొండులు ఆశీస్సులు ప్రభుత్వ స్థలం కనిపిస్తే కబ్జా చేసే ఓ దేవుడు పేరు పెట్టుకున్న అక్రమార్కుడి అండతోనే దాడి జరిగినట్టు అక్కడ ప్రజలు భావిస్తున్నారు. దెయ్యంపాడు సమీపంలో సదరు వ్యక్తి 20 ఎకరాలు చేపల చెరువు తవ్వుతున్నాడు. దీనిలో సుమారు 3 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని దాడికి గురైన వీఆర్వో వెంకటేష్ ఇప్పటికే తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. మోటూరు చానల్ను పూడ్చేస్తున్నా శ్రీనివాసరావుకు మట్టి కూడా సదరు కబ్జాదారుడు నుంచే వెళుతోంది. నిత్యం కూటమి నేతల చుట్టూ తిరుగుతూ అక్రమ చెరువుల తవ్వకాలు, ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలకు అలవాటుపడిన వ్యక్తిని నాయకులు సైతం పక్కనే కూర్చోబెట్టుకోవడం వల్లే ఇటువంటి దాడులు జరుగుతున్నాయని పలువురు అంటున్నారు. ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి ముగ్గురు కలిసి వీఆర్వోను కొడుతున్నట్టు సీసీ ఫుటేజ్లో కనిపిస్తున్నా విచారణ పేరుతో పోలీసులు కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం కేసు నమోదు చేశాం, చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే కూటమి నేతలు కేసు నీరగార్చడానికి రంగంలోకి దిగారు. ఏదో ఆవేశంలో దాడి చేశామని బతిమలాడే ధోరణికి దిగారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ ఉద్యోగాలపై కూటమి నేతలు దురుసుగా ప్రవర్తిస్తున్నా ఘటనలు వెలుగు చూడటం లేదు. దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని రెవెన్యూ సంఘ నేతలు హెచ్చరిస్తున్నారు. -
కల్యాణ వైభోగమే..
ద్వారకాతిరుమల: సుస్వరాల మంగళ వాయిద్యాలు వీనుల విందుగా మార్మోగుతుండగా.. వినువీధుల నుంచి పండు వెన్నెల నిండుగా జాలువారుతుండగా.. ఒళ్లంతా కళ్లు చేసుకుని భక్తజనమంతా తిలకిస్తుండగా.. అర్చకులు, పండితులు వేద మంత్రోచ్ఛరణలు పఠిస్తుండగా.. ఆ శ్రీవారు, సిగ్గులొలుకుతున్న అమ్మవార్లను పరిణయమాడారు. ఈ అపురూపమైన అద్భుత దృశ్యం ద్వారకాతిరుమల క్షేత్రంలో ఆవిష్కృతమైంది. చినవెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. వేడుక జరిగిందిలా.. ముందుగా ఆలయ తూర్పు రాజగోపురం వద్ద పచ్చిపూలతో కల్యాణ వేదికను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అనంతరం శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ మూర్తులను ఆలయం నుంచి రెండు వేరువేరు వాహనాలపై అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అట్టహాసంగా కల్యాణ వేదిక వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వేదికపై ప్రత్యేకంగా అలంకరించిన రజిత సింహాసనంపై కల్యాణ మూర్తులను ఉంచి, అర్చకులు కల్యాణ తంతును ప్రారంభించారు. వివిధ ఘట్టాలను పూర్తిచేసి శుభముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేసి, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను భక్తుల గోవింద నామస్మరణల నడుమ నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు, దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు పట్టు వస్త్రాలను సమర్పించారు. పాంచాహ్నిక దీక్షతో వైఖానస ఆగమాన్ని అనుసరించి జరిపిన ఈ వేడుక భక్తజనులను పరవశింపజేసింది. ఈ వేడుకలో ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు పాల్గొన్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లు వెండి గరుడ వాహనంపై క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. బ్రహ్మోత్సవాల్లో నేడు.. : రాత్రి 8 గంటల నుండి – శ్రీవారి రథోత్సవం శ్రీవారి ప్రత్యేక అలంకారం : శ్రీ కూర్మ అలంకారం వైభవంగా శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం వెండి గరుడ వాహనంపై ఊరేగిన స్వామివారు నేడు రాత్రి 8 గంటల నుంచి రథోత్సవం -
చినవెంకన్న సాక్షిగా ప్రమాణస్వీకారం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్లో ఉదయం 11.47 గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. ట్రస్టుబోర్డు సభ్యులకు ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. గోపాలపురం, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకటరాజు, బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు ఈఓ త్రినాథరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒకేసారి సభ్యులందరితో.. ధర్మకర్తల మండలి సభ్యులందరితో ఒకేసారి ఆలయ ఈఓ త్రినాథరావు ప్రమాణస్వీకారం చేయించారు. ట్రస్టుబోర్డు చైర్మన్గా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్వీ సుధాకరరావు (మైలవరం), సభ్యులుగా చింతమనేని హనుమంతరావు, యెలమాటి శ్రీనివాసరావు, చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య, పల్లి శ్రీనివాసరెడ్డి, ఆల్టి సత్యనారాయణ, కాకి సురేష్కుమార్, అచ్యుత సత్యనారాయణ, హోట వీరభద్రరావు, కంపసాటి నాగ సీత, పాలూరి వెంకట చరిత, కింతాడ కళావతి, బత్తిన ప్రమీల, కడియం సత్యవతి, చిరుగూరి సుశీల, కసిరెడ్డి మధులత, యుకే సుహాసిని, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఆలయ ప్రధానార్చకులు పీవీఎస్ఎస్ఆర్ జగన్నాథాచార్యులు, ప్రత్యేక ఆహ్వానితులుగా ముప్పరాజు శ్రీనివాసరావు, గెడ్డమనుగు రవికుమార్, తాండ్ర సందీప్లతో చినవెంకన్న సాక్షిగా ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు మాట్లాడుతూ శ్రీవారి సేవలో తరిస్తూ, భక్తులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ట్రస్ట్బోర్డు సభ్యులకు దక్కిందన్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డీవీ భాస్కర్, డీఈఓ వై.భద్రాజీ, ఏఈఓలు ఎం.దుర్గారావు, పి.నటరాజారావు, ఉమాపతి, సూపరింటెండెంట్లు ఎంఎస్ఎల్ శ్రీనివాస్ (వాసు), ఐ.రమణరాజు, వి.నగేష్, పద్మావతి, కె.కిషోర్, జి.సుబ్రహ్మణ్యం, డీఈ టి.సూర్యనారాయణ తదితరులున్నారు. -
పదిలో 21వ స్థానం
ఏలూరు (ఆర్ఆర్పేట): పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లాకు మరోసారి నిరాశ తప్పలేదు. గత ఏడాది రాష్ట్రస్థాయిలో 21వ స్థానంలో నిలిచిన ఏలూరు జిల్లా ఈ ఏడాది సైతం అదే స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఉత్తీర్ణతా శాతం మాత్రం గత ఏడాది కంటే కొద్దిగా మెరుగవడడం ఆశాజనకం. కాగా ఈ ఏడాది ఫలితాల్లో సైతం బాలికలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. బాలురకంటే ఎక్కువ మంది పరీక్షలు రాయగా వారికంటే ఎక్కువ మంది ఉత్తీర్ణులై సత్తా చాటారు. గత మార్చి 16 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించగా ఏప్రిల్ 6 నుంచి 15వ తేదీ వరకూ జవాబుపత్రాల మూల్యాంకనం జరిగింది. ఈ ఏడాదీ బాలికలే టాప్.. ప్రతి ఏటా లానే ఈ ఏడాది కూడా పదో తరగతి ఫలితాల్లో బాలికలు తమ సత్తా చాటారు. బాలురకంటే అధిక ఉత్తీర్ణత శాతం సాధించి తమదే పైచేయి అని మరోసారి నిరూపించుకున్నారు. ఈ ఏడాది 85.62 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది మొత్తం 22,585 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో బాలురు 10,884 మంది, బాలికలు 11701 మంది ఉన్నారు. బాలురలో 77.53 శాతంతో 8,438 మంది ఉత్తీర్ణులు కాగా బాలికల్లో 85.62 శాతంతో 10,017 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం మీద జిల్లాలో 18455 మంది 81.72 శాతంతో ఉత్తీర్ణత సాధించారు. కాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థినుల్లో పెదనిండ్రకొలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సరెళ్ళ కీర్తన 591 మార్కులతో అగ్రస్థానంలో నిలువగా, ఏలూరు కస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాఠశాలకు చెందిన పోలరోతు కావ్య 587 మార్కులతో జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం, గుండుగొలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పర్వతం దుర్గా వెంకట హైమావతి 586 మార్కులతో జిల్లా స్థాయిలో 3వ స్థానంలో నిలిచింది. బెటర్మెంట్కు దరఖాస్తులు ఈ పరీక్షల్లో ఆశించిన మార్కులు కంటే తక్కువ వచ్చిన వారు బెటర్మెంట్, రీ కౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. రీ కౌంటింగ్కు సబ్జెక్టు ఒక్కింటికి రూ.500,, రీ వెరిఫికేషన్కు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆయా ఫీజులు మే 1 నుంచి 7వ తేదీ లోగా చెల్లించాలన్నారు. కాగా అనుత్తీర్ణులైన విద్యార్థులు 3 సబ్జెక్టుల వరకూ రూ.110, నాలుగు సబ్జెక్టులు అంతకంటే ఎక్కువ అయితే రూ.125 చెల్లించాలన్నారు. అలాగే అనుత్తీర్ణులైన విద్యార్థుల కోసం మే 25 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో ఈ ఏడాది జిల్లాలో ఉత్తీర్ణతా శాతం గణనీయంగానే పెరిగింది. గడిచిన నాలుగు సంవత్సరాల ఫలితాలు గమనిస్తే 2022–23 సంవత్సరంలో 22259 మంది పరీక్షలు రాయగా 64.35 శాతంతో 14,323 మంది ఉత్తీర్ణులయ్యారు. 2023–24లో 23,163 మంది పరీక్షలు రాయగా 80.08 శాతంతో 18,549 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే 2024–25 సంవత్సరంలో 22,365 మంది పరీక్షలు రాయగా 77.24 శాతంతో కేవలం 17,274 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అంటే ఈ ఏడాది 4.47 శాతం మంది అదనంగా ఉత్తీర్ణులు కావడం ఆశాజనక ఫలితమనే చెప్పాలి. టెన్త్ ఫలితాల్లో మరోసారి నిరాశే.. మొత్తం 18,455 మంది ఉత్తీర్ణత 81.72 శాతం ఉత్తీర్ణత శాతం జిల్లాకు గతేడాదీ ఇదే స్థానం 25 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు -
కొనసాగిన మట్టి పరీక్షలు
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్ట్లో కేంద్ర మట్టి, పదార్థాల పరిశోధనా సంస్థ (సీఎస్ఎంఆర్ఎస్) బృందం బుధవారం కూడా పరీక్షలు నిర్వహించింది. మట్టి, రాతి నాణ్యతా నిపుణులు అన్వేష్, గౌరవ్ పాండే, ఉదయ్ చక్రవర్తి, హరీందర్ సింగ్ప్రకాష్ జలవనరుల శాఖ, ఎంఈఐఎల్ ప్రతినిధులతో కలిసి కొత్తూరు చెరువులో 28 నమూనాలు సేకరించారు. ఈ నమూనాలకు ఢిల్లీ కేంద్ర కార్యాలయ పరిశోధనా కేంద్రంలో మరిన్ని పరీక్షలు చేయనున్నారు. పోలవరం ప్రాజెక్ట్లో ఈసీఆర్ఎఫ్తో పాటు పలు కీలక నిర్మాణాల్లో రాళ్లు, మట్టిని వినియోగిస్తున్న విషయం తెలిసిందే. జలవనరులశాఖ ఈఈ డి.శ్రీనివాస్, ఎంఈఐఎల్ జీఎం గంగాధర్, డీజీఎం మురళి పమ్మి, నాణ్యతా విభాగం డీజీఎం శంకరయ్య శాస్త్రవేత్తలకు తాము అంతర్గతంగా చేస్తున్న పరీక్షల వివరాలు, తమ ల్యాబ్లో ఉన్న పరికరాలను చూపించి వివరించారు. గ్యాప్ 1, 2లో మట్టి, రాళ్ల నాణ్యతను బృందం రింగ్ టెస్ట్ ద్వారా పరిశీలించింది. ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో పలువురు జడ్జీలు బదిలీ అ య్యారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యా య సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్ర సాద్ రాజమహేంద్రవరం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రాజమహేంద్రవరంలో పనిచేస్తున్న డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి రానున్నారు. ఏలూరులో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్)గా పనిచేస్తున్న కేకేవీ బులికృష్ణ ప్రకాశం జిల్లా కందుకూరు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తూర్పుగోదావరి జిల్లా రాజోలులో పనిచేస్తున్న ఎం.ప్రమీలారాణి బదిలీపై రానున్నారు. దెందులూరు: దళిత ఎంపీ గొల్ల బాబూరావును అవమానించి దళితులపై కూటమి ప్రభుత్వానికి ఉన్న విధానాన్ని తేటతెల్లం చేసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ డాక్టర్ పండుల రవీంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కొవ్వలిలోని ఆయన కార్యాలయంలో ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవానికి రాజ్యసభ స భ్యుడు గొల్ల బాబూరావును ఉద్దేశపూర్వకంగా ఆహ్వానించకపోవడం నిర్వాహకులు, ప్రభుత్వ పెద్దల అహంకారానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. వేదికపై రాజ్యసభ సభ్యుడి ప్రొటోకాల్ ఏమిటో వైస్ చాన్సలర్, సంబంధిత అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. దళిత ప్రజాప్రతినిధి అయితే ఒక గౌరవం.. వేరే సామాజికవర్గం ప్రజాప్రతినిధులు అయితే గౌ రవం వేరేగా ఉంటుందా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. అధికారులు అధికారం ఉంది కదా అని ప్రభుత్వం చెప్పినట్టు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. దీనిపై భవిష్యత్ కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. ఏలూరు (టూటౌన్): జిల్లాలో వచ్చేనెల 1 నుంచి జరిగే ఇంటింటి జనగణన నమోదుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.వెట్టిరసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి బుధవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈనెల 16 నుంచి 30 వరకు జిల్లాలో స్వీయగణన కా ర్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారన్నారు. మే 1 నుంచి 30 వరకు ఇంటింటా గణనకి ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను నియమించామన్నారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, ఇన్చార్జి డీఆర్వో దేవకీదేవి, సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): కాలుష్య నియంత్రణ మండలి అనుమతుల కోసం పరిశ్రమలు సింగిల్ డెస్క్ పోర్టల్లో దరఖాస్తు చేసేటప్పుడు పూర్తి సమాచారంతో పాటు కావాల్సిన పత్రా లు సమర్పించాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, ఏలూరు ప్రాంతీయ కార్యాలయ పర్యావరణ ఇంజనీర్ ఏఎస్ఆర్సీ మూర్తి ప్రకటనలో తెలిపారు. వీటిని సమర్పిస్తే సీటీఈ (స్థాపన) అనుమతి, సీటీఓ రెన్యూవల్ (ఆపరేషన్ అనుమతి)కి వేగంగా చర్యలు తీసుకుంటామన్నారు. మరిన్ని వివరాలకు తమ కార్యాలయంలోని హెల్ప్డెస్క్ సేవలను వినియోగించుకోవాలన్నారు. -
దోమ తెరలు పంపిణీ చేయలేదు
రెండేళ్ల నుంచి దోమ తెరలు పంపిణీ లేదు. గతంలో ఇచ్చిన దోమ తెరలు చిరిగిపోయాయి. మా గ్రామాల్లో దోమలు విపరీతంగా ఉన్నాయి. దోమ తెరల కోసం ఎదురు చూస్తున్నాం. వెంటనే పంపిణీ చేయాలి. – నడపల ముక్కారెడ్డి, గడ్డపల్లి, పోలవరం మండలం కూటమి ప్రభుత్వానికి దోమ తెరల పంపిణీపై చిత్తశుద్ధి లేదు. అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకూ పంపిణీ చేయలేదు. ప్రస్తుతం గ్రామాల్లో మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంటికొక్కరు బాధపడుతున్నారు. – కారం రాఘవ, ఏఐకేఎంఎస్ నాయకులు, అలివేరు జిల్లాలో మలేరియా నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాం. దీనికోసం సుమారు 2.50 లక్షల దోమ తెరలు అవసరమని కీటక జనిత వ్యాధులు నివారణ సంస్థకు ప్రతిపాదనలు పంపించాం. వచ్చిన వెంటనే పంపిణీ చేస్తాం. – ఎన్ఎస్ఎస్ ప్రసాద్, జిల్లా మలేరియా అధికారి, కేఆర్పురం -
ఎదుర్కోలు వైభవం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో నాల్గో రోజు బుధవారం రాత్రి నిత్య కల్యాణ మండపంలో జరిగిన ఎదుర్కోలు వేడుక భక్తులకు నేత్రపర్వమైంది. ఈ వేడుకను శ్రీవారి కల్యాణానికి ముందురోజు జరపడం సాంప్రదాయంగా వస్తోంది. ముందుగా స్వామి, అమ్మవార్లను ఆలయం నుంచి తొళక్క వాహనంపై నిత్య కల్యాణ మండపం వద్దకు అట్టహాసంగా తీసుకెళ్లారు. అక్కడ వెండి శేష వాహనంపై కల్యాణమూర్తులను ఉంచి హారతులిచ్చారు. అనంతరం ఎదుర్కోలు ఉత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ అధికారులు, అర్చకులు, పండితులు, భక్తులు రెండు జట్లుగా విడిపోయి ఒక జట్టు శ్రీవారి గుణగణాలను, ఆయన విశిష్టతను, రెండో జట్టు అమ్మవార్ల గుణగణాలను కొనియాడారు. వివాహానికి ముందురోజు వధూవరుల తరఫు బంధువులు శుభలేఖను పటించేందుకు జరిపే కార్యక్రమమే ఎదుర్కోలు ఉత్సవమని పండితులు తెలి పారు. ఉదయం హనుమద్వాహనంపై, రాత్రి వెండి శేషవాహనంపై జరిగిన తిరువీధి సేవలు ఆకట్టుకున్నాయి. ఆలయ ముఖ మండపంలో శ్రీనివాస కల్యాణం అలంకారంలో ఉన్న శ్రీవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించారు. శ్రీహరి కళాతోరణ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బ్రహ్మోత్సవాల్లో నేడు ● ఉదయం సింహ వాహనంపై తిరువీధి సేవ ● రాత్రి 8 గంటల నుంచి కల్యాణోత్సవం ● శ్రీవారి ప్రత్యేక అలంకారం – మోహినీనేడు చినవెంకన్న తిరు కల్యాణోత్సవం హనుమద్వాహనంపై స్వామి, అమ్మవార్లకు పూజలు ఎదుర్కోలు ఉత్సవంలో స్వామి, అమ్మవార్లకు హారతులిస్తున్న అర్చకులు -
మన్యంలో మలేరియా పంజా
బుట్టాయగూడెం: జిల్లాలోని మన్యం ప్రాంతంలో మలేరియా జ్వరాలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టకపోవడంపై గిరిజన సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ప్రస్తుతం గిరిజన పల్లెల్లో మలేరియా, టైఫాయిడ్ కేసులు న మోదవుతున్నాయి. ఈ ఏడాదిలో జనవరి నుంచి ఇప్పటివరకూ సుమారు 33 మలేరియా కేసులు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వర్షాలు కురిస్తే ఎలా ఉంటుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. దోమల నివారణలో భాగంగా దోమ తెరల పంపిణీని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో 220 మలేరియా సమస్యాత్మక గ్రామాలను అధికారులు గుర్తించారు. రెండింతల కేసులు గిరిజన ప్రాంతంలో సుమారు 33 మలేరి యా కేసులు నమోదైనట్టు అధికారులు చెబుతున్నా.. వాస్తవానికి రెండింతల కేసులు ఉంటాయని అంచనా. అధికారులు వాస్తవాలను దాస్తున్నారని గిరిజన సంఘ నాయకు లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో న మోదవుతున్న కేసుల కంటే కంటే రికార్డుల్లో తక్కువ చూపిస్తున్నారని అంటున్నారు. అ లాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదైన కేసుల ను లెక్కలోకి తీసుకోవడం లేదని అంటున్నారు. స్ప్రేయింగ్ చేసినా.. మలేరియా నివారణలో భాగంగా ఏటా మూడు దశల్లో మలాథియన్ స్ప్రేయింగ్ పనులు చేస్తుంటారు. గతేడాది మూడు దశల్లో పనులు చేసినా మలేరియా కేసులు అధికంగా పెరిగాయి. దోమ తెరలతోనే నివారణ సాధ్యమని గిరిజనులు అంటున్నారు. అ యితే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా దోమ తెరల పంపిణీపై ఎటువంటి చర్యలు చేపట్టలేదని, మలేరియా జ్వరాల నివారణకు కృషి చేయాలని గిరిజన సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.బుట్టాయగూడెం సీహెచ్సీలో మలేరియాతో వైద్యం పొందుతున్న సరియం గంగరాజు టైఫాయిడ్, మలేరియా, కామెర్లతో వైద్యం పొందుతున్న కరకాల గంగమ్మ గిరిజన గ్రామాల్లో మలేరియా నియంత్రణకు గత వైస్సార్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసింది. గ్రామాల్లో దో మలను అరికట్టేందుకు అధికారులు పగక్బందీగా చర్యలు చేపట్టారు. 2021లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం సంస్థ (ఎన్విబీడీసీపీ) నుంచి సుమారు 2.50 లక్షల దోమ తెరలను రప్పించి బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో పంపిణీ చేయించా రు. అలాగే గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు దోమ తెరలు పంపిణీ చేశారు. 2024 జనవరిలో దోమ తెరల కోసం వైద్యారోగ్య శాఖ ద్వారా ప్రతిపాదనలు కూడా పంపించారు. గిరిజన ప్రాంతాల్లోపెరుగుతున్న కేసులు సుమారు 220 సమస్యాత్మక గ్రామాలు గుర్తింపు మొక్కుబడిగా నియంత్రణ చర్యలు రెండేళ్లుగా నిలిచిన దోమ తెరల పంపిణీ గత ప్రభుత్వంలో 2.50 లక్షల దోమ తెరల పంపిణీ -
మామిఢీలా
నూజివీడు: ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా మామిడి రైతులు నష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. మామిడి దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో ధర ఎక్కువగా ఉంటుందనుకున్న మా మిడి రైతులు, తోటలు కొనుగోలు చేసిన వ్యాపారుల ఆశలు అడియాసలు అవుతున్నాయి. పండ్లలో రారాజుగా కీర్తిని సంపాదించుకున్న మామిడిని సాగు చేసిన రైతులు నష్టాలను మూటగట్టుకుంటున్నారు. రోజురోజుకూ మామిడి ధరలు పతనమవుతుండటంతో ఏంచేయాలో తెలియని స్థితిలో రైతులు, వ్యాపారులు కొట్టుమిట్టాడుతున్నారు. మామిడి దిగుబడి ప్రారంభమైన ఫిబ్రవరి ద్వితీయార్థంలో ధరలు బాగానే ఉన్నా రానురాను పతనమవుతూ రైతులకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. కాయలకు డిమాండ్ ఉన్నా ధర మాత్రం పెరగడం లేదు. ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కూడా మామిడి విస్తీర్ణం పెరగడంతో ఉత్తరాది ఢిల్లీ సేట్లు మామిడికాయల కొనుగోలుకు రాకపోవడమే ధర పెరగకపోవడానికి కారణమని రైతులు, తోటలు కాపునకు కొనుగోలు చేసిన వ్యాపారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని నూజివీడు, చింతలపూడి నియోజకవర్గంలో కలిపి మామిడి తోటలు 45 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఎక్కువగా బంగినపల్లి, తోతాపురి రకాలతో పాటు పెద్దరసం, చిన్నరసాలు ఉన్నాయి. సీజన్ ప్రారంభంలో బాగున్నా.. మామిడి సీజన్ ప్రారంభమైన ఫిబ్రవరి ద్వితీయార్థంలో ముంబై మార్కెట్లో బంగినపల్లి టన్ను రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల ధర పలికింది. క్రమేణా ఆ ధర కాస్తా రూ.60 వేలకు పడిపోయి ప్రస్తుతం రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్య నడుస్తోంది. దీంతో కిరాయిలు, కోత ఖర్చులు పోను రైతులకు గిట్టుబాటు కావడం లేదు. కలెక్టర్ (తోతాపురి) పరిస్థితి సైతం అలాగే ఉంది. టన్ను ధర రూ.4 వేల నుంచి రూ.7 వేలు మాత్రమే లభిస్తోంది. దుక్కి ఖర్చులు, మందుల ఖర్చులు, కాపలా ఖర్చులు, కోత కూలి ఖర్చులు, ట్రాక్టరు కిరాయిలు పెరగడం, దిగుబడి పడిపోవడం, ధర తగ్గడంతో తోటలను కొనుగోలు చేసిన వ్యాపారులు, రైతులు లబోదిబోమంటున్నారు. కమీషన్ దుకాణాల్లోనూ ధర తక్కువే.. మామిడి దిగుబడి లేనప్పటికీ స్థానికంగా ఏర్పాటుచేసిన కమీషన్ దుకాణాల్లో కూడా ధర తక్కువగానే ఉంది. ఆగిరిపల్లి మండలం ఈదర, ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం, విస్సన్నపేట, కొండపర్వలలో మామిడి కమీషన్ దుకాణాలున్నాయి. అక్కడ కూడా బంగినపల్లి టన్నుకు రూ.15 వేల నుంచి రూ.25 వేల ధర మాత్రమే లభిస్తోంది. అలాగే తోతాపురికి కాయలు బాగుంటే టన్నుకు రూ.7 వేలు లభిస్తోంది. లోకల్ దుకాణాల్లో సూటు పేరుతో టన్నుకు 100 కిలోల కాయలను తీసుకోవడం, కమీషన్ 10 శాతం, వీటితో పాటు హమాలీ చార్జీలు తీసుకుంటుండటంతో రైతులకు మిగిలేది ఏమీ ఉండటం లేదు. విజయవాడ సమీపంలోని నున్న మార్కెట్కు కాయలను తరలించే వారే కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో నష్టాలను చవిచూస్తున్న మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ ఏటా నష్టాలే పతనమైన బంగినపల్లి, కలెక్టర్ రకాల ధరలు నష్టాల సుడిగుండంలో మామిడి రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల డిమాండ్ మామిడి సీజన్ ప్రారంభంలో ఉన్న ధర ఆ తరువాత ఉండటం లేదు. రోజురోజుకూ ధర తగ్గిపోతుండటంతో పెట్టుబడులు కూడా వస్తాయో రావోనని ఆందోళన పెరుగుతోంది. రసాయన మందుల పిచికారీ, తోట కాపలా, ఇతర ఖర్చులు కలిపి పెట్టుబడులు తడిసి మోపెడవుతుండగా మామడికి మాత్రం ధర పెరగడం లేదు. – పాలడుగు విజయకుమార్, తుక్కులూరు, నూజివీడు మండలం ఈ ఏడాది మామిడి ధర పడిపోయింది. బంగినపల్లికి టన్నుకు రూ.15 వేల నుంచి రూ.25 వేలే ధర వస్తోంది. కలెక్టర్ రకం రూ.7 వేలు మాత్రమే పలుకుతోంది. గిట్టుబాటు ధర రాక ఏమి చేయాలో తెలియడం లేదు. కాపు తక్కువగా ఉండటంతో ధర ఎక్కువగా ఉంటుందని ఆశిస్తే పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. – బాణావతు రాజు, లైన్తండా, నూజివీడు మండలం -
ఇళ్ల నిర్మాణాలు వేగిరపర్చాలి
ఏలూరు (టూటౌన్): పోలవరం ప్రాజెక్ట్ పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో బుధవారం పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల ఇళ్ల నిర్మాణం, నిర్వాసితులకు భూపరిహారం, ప్రభుత్వ ప్రాజెక్టులకు భూసేకరణ తదితర అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు. నిర్వాసిత కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేసేందుకు, నిర్వాసితులను వెంటనే కాలనీలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్వాసితులకు భూమికి భూమి పరిహారం అందించేందుకు, అవసరమైన భూములు సేకరణ పనులను పూర్తి చేయాలన్నారు. నూజివీడు ఔటర్ రింగ్ రోడ్డుకు భూసేకరణ పనులను వేగిరపర్చాలన్నారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, ఐటీడీఏ పీఓ రాములునాయక్, ఆర్డీఓ రమణ, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు. భీమవరం: పట్టణంలోని రైతు బజార్ సమీపంలో ఉన్న సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ కాలేజీ బాలికల వసతి గృహాలను బుధవారం కలెక్టర్ సీహెచ్ నాగరాణి సందర్శించారు. ఇటీవల కలెక్టర్ చొరవతో ఏర్పాటు చేసిన 10 సోలార్ లాంపుల పనితీరును పరిశీలించారు. సోలార్ లైటింగ్ వ్యవస్థ గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టోర్ రూమ్ను పరిశీలించారు. తాగునీటి కోసం ఒకటే కుళాయి ఉండటంతో ఇబ్బంది పడుతున్నట్టు బాలికలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మరో కుళాయి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సోషల్ వెల్ఫేర్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా సామాజిక సంక్షేమ శాఖ అధికారి ఏవీ అరుణకుమారి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఏవీ సూరిబాబు, వసతి గృహ సంక్షేమ అధికారి సీహెచ్ భానుమణి పాల్గొన్నారు. -
జగన్ 2.0 పాలన ఖాయం
భూసారానికి ముప్పు వరి చేలలో ఎండుగడ్డి, వరి మోళ్లను తగలబెట్టడం వల్ల నేలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ అధికారులు అంటున్నారు. 8లో uకొయ్యలగూడెం: జగన్ 2.0 పాలన ఖాయమని, ప్రజలు మళ్లీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. బుధవారం బయ్యన్నగూడెంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతన తాతారావు నివాసానికి విచ్చేసిన సందర్భంగా ఆయన పార్టీ నేతలతో ముచ్చటించారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ శ్రేణులపై కక్ష సాధింపునకు వాడుకుంటున్న రెడ్బుక్ రాజ్యాంగానికి జగన్ తీసుకువచ్చిన డిజిటల్ బుక్ చమరగీతం పాడనుందన్నారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు, అమలు చేసిన అభివృద్ధికి కొత్త పేర్లు తగిలిస్తూ తాను పబ్లిసిటీ సీఎంని అంటూ మరోసారి చంద్రబాబు నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. బలమైన సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని పాలనలోకి వచ్చిన పవన్కల్యాణ్ వారి అభివృద్ధి గురించి నోరు మెదపకపోవడం ఆ సామాజికవర్గంలో తీవ్ర నైరాశ్యం నింపిందన్నారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు న్యా యం చేయగల నేత జగన్ మాత్రమేనని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. పోలవరం నియోజకవర్గం వైఎస్సార్సీపీకి కంచుకోట వంటిదని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెల్లం బాలరాజును మంత్రిగా నియోజకవర్గ ప్రజలు చూడబోతున్నారంటూ పే ర్కొన్నారు. పార్టీ నాయకులు కంచర్ల సత్యనారాయణ, దొండపాటి సత్తిరెడ్డి, పోతన చైతన్య, మిరియాల సుందరం, పోతన కృష్ణ కిషోర్ పాల్గొన్నారు. -
అన్నింటా ప్రథమమే
ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాలకు వచ్చే భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సర్వేలో ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానానికి అన్నింటా ప్రథమ ర్యాంకు లభించింది. ప్రతి నెలా వాట్సప్, ఐవీఆర్ఎస్ ద్వారా దర్శనం సంతృప్తికరంగా జరిగిందా? దేవాలయాల్లో త్రాగునీటి వసతులు బాగున్నాయా? ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా? పారిశుధ్యం సంతృప్తికరంగా ఉందా? అనే ఈ నాలుగు అంశాలపై సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో ఏదొక అంశంలో ద్వారకాతిరుమల దేవస్థానానికి ప్రతి నెలా మొదటి ర్యాంకు లభిస్తోంది. గత నెల 26 నుంచి, ఈ నెల 26 వరకు జరిపిన సర్వేలో అన్నింటా చినవెంకన్న దేవస్థానం మొదటి ర్యాంక్ పొందింది. దర్శనం ఇతర అంశాల్లో.. ద్వారకాతిరుమల 73.8 శాతంతో మొదటి ర్యాంక్ సాధించగా, శ్రీకాళహస్తి 73.7 శాతంతో రెండో ర్యాంక్, సింహాచలం 72.7 శాతంతో మూడో ర్యాంక్, కాణిపాకం 72.4 శాతంతో నాలుగో ర్యాంక్, అన్నవరం 72.3 శాతంతో ఐదో ర్యాంక్, విజయవాడ 71.3 శాతంతో ఆరో ర్యాంక్ సాధించగా, శ్రీశైలం 67.7 శాతంతో ఆఖరి స్థానంలో నిలిచింది. సౌకర్యాల కల్పనలో.. ద్వారకాతిరుమల 73.71 శాతంతో మొదటి ర్యాంక్, శ్రీకాళహస్తి 73.60 శాతంతో రెండో ర్యాంక్, సింహాచలం 72.62 శాతంతో మూడో ర్యాంక్, అన్నవరం 72.31 శాతంతో నాలుగో ర్యాంక్, కాణిపాకం 72.21 శాతంతో ఐదో ర్యాంక్, విజయవాడ 71.28 శాతంతో ఆరో ర్యాంక్, శ్రీశైలం 67.73 శాతంతో ఏడో ర్యాంక్ సాధించాయి. మెరుగైన సేవల్లో శ్రీవారి దేవస్థానానికి మొదటి ర్యాంక్ -
వడాలిలో జగన్నాథుడి కల్యాణోత్సవాలు
ముదినేపల్లి (కై కలూరు): ముదినేపల్లి మండలం వడాలిలో సుభద్ర, బలరామ సమేత జగన్నాథ స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. దాదాపు 247 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. దేశంలో శ్రీ కృష్ణ ఆలయాల రీతిలో ధ్వజ స్తంభంతో సహా ఇక్కడ దేవాలయం చూడవచ్చు. నాణ్యమైన కొయ్యతో ఎడమ జగన్నాథుడు, కుడివైపు బలరామస్వామి మధ్య సుభద్ర దేవీ ఇక్కడ భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. సప్త, స్వర్ణ శోభితంగా మకర తోరణాలు, పట్టు వస్త్రాలతో స్వామివార్లు ఆకర్షణీయంగా దర్శనమిస్తారు. మూలవిరాట్కు ముందు ఉత్సవ విగ్రహాలు కనిపిస్తాయి. మే 4 వరకు సుభద్రా బలరామ సహిత శ్రీ జగన్నాథ స్వామి, ప్రత్యామ్నాయ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివార్ల కల్యాణ మహోత్సవములు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. వడాలిలోని జగన్నాథ స్వామి దేవస్థానానికి చిన పూరిగా పేరు. ఇక్కడ దేవాలయం పూరి దేవాలయాన్ని పోలి ఉంటుంది. ఇంచుమించు పూజా కార్యక్రమాలు సైతం ఒకేలా ఉంటాయి. రథోత్సవాన్ని గ్రామంలో నిర్వహిస్తారు. ఈ నెల 30న స్వామివారి కల్యాణం, మే 1న స్వామి రథోత్సవం, 4న అఖండ అన్నసమారాధన జరుగనుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విష్ణు సహస్ర పారాయణం, ఆధ్యాత్మిక ప్రవచనాలు, హరికథ, కూచిపూడి, జానపద నృత్యాలు, కోలాటాలు, భక్త రంజనీ, పంచరత్నాలు, శ్రీలక్ష్మీ తిరుపతమ్మ బుర్రకథలను ఏర్పాటు చేశారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఏడంతస్తుల రాజగోపురాన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో చిన పూరి క్షేత్రంగా ప్రసిద్ధి వడాలిలో సుభద్రా బలరామ సహిత శ్రీ జగన్నాథ స్వామి దర్శనం పూరి జగన్నాథుడి దర్శనంతో సమానం. మే 4న అఖండ అన్నసమారాధన నిర్వహిస్తున్నాం. వేలాదిగా తరలిరావాలని కోరుతున్నాం. –శింగనపల్లి శ్రీనివాసరావు, ఆలయ ఈవో -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యా యత్నం
తాడేపల్లిగూడెం రూరల్: కుమార్తెను చూసేందుకు వెళ్ళిన తనపై హత్యాయత్నం కేసు పెట్టి పోలీస్స్టేషన్ రప్పించడంతో మనస్తాపం చెందిన మండలంలోని కుంచనపల్లి వాసి మామిళ్ళపల్లి మురళీ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రిలో మురళీ మీడియాతో మాట్లాడారు. తాను, తన భార్య గత కొంతకాలంగా విడిగా ఉంటున్నామని తెలిపారు. రెండ్రోజుల క్రితం తన కుమార్తెతో మాట్లాడేందుకు వెళ్ళానని, తన భార్య రూపావతి, అత్త కలిసి తనపై హత్యాయత్నానికి పాల్పడ్డానని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అదే రోజు రాత్రి రూరల్ పోలీసులు తన ఇంటి వద్దకు వచ్చి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారని, రెండ్రోజుల పాటు పోలీస్ స్టేషన్ వద్ద ఉంచారని వాపోయాడు. దీంతో మనస్తాపం చెంది స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో మురళీ చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. రూరల్ ఎస్సై రవికుమార్ను ప్రశ్నించగా, భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకే అతనిని స్టేషన్కు తీసుకొచ్చామని, మురళీ స్టేషన్ బయట ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. -
గొల్ల బాబూరావును అవమానించడం బాధాకరం
ఏలూరు (టూటౌన్): ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్ది ఉత్సవాల వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావును ఉద్దేశపూర్వకంగా అవమానించడం బాధాకరమని, విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష చూపడం సిగ్గు చేటైన విషయమని పలువురు దళిత నాయకులు విమర్శించారు. స్థానిక ఎన్ఆర్పేటలోని ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. ఏఐఏవైఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి డా.మెండెం సంతోష్కుమార్ మాట్లాడుతూ ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వాన పత్రికలో బాబూరావు పేరును వేసి వేదికపైకి పిలవకపోవడం యూనివర్శిటీ అధికారుల పక్షపాత ధోరణికి నిదర్శనమన్నారు. ఆహ్వాన పత్రికలో లేని వారిని ప్రొటోకాల్ను పక్కనబెట్టి వేదిక మీదకు పిలిచారన్నారు. రాజ్యసభ సభ్యుడిగా, యూనివర్శిటీ ఓల్డ్ స్టూడెంట్గా ఉన్న బాబూరావును పిలిచి మరీ అవమానించడం హేయమైన చర్య అన్నారు. ఎస్సీ సెల్ అధ్యక్షుడు తేరా ఆనంద్, రాష్ట్ర కార్యదర్శి నిట్టా గంగరాజు, వైఎస్సార్సీపీ నాయకులు పల్లెం ప్రసాద్, పాకా ప్రభాకరరావు, బత్తిన ప్రభాకరరావు మాట్లాడారు. -
కల్యాణానికి భారీ ఏర్పాట్లు
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని గురువారం రాత్రి వైభవంగా నిర్వహించేందుకు దేవస్ధానం అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ తూర్పు రాజగోపురం వద్ద భారీ వేదికను నిర్మిస్తున్నారు. ఈఓ వేండ్ర త్రినాథరావు పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. స్వామివారు ఆలయం నుంచి తూర్పురాజగోపురం మీదుగా కల్యాణ వేదిక వద్దకు రాత్రి 7.30 గంటల సమయంలో చేరుకుంటారు. 8 గంటల నుంచి కల్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. శుక్రవారం రాత్రి శ్రీవారి రథోత్సవం జరుగనుండగా, ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. -
భూసారానికి ముప్పు
భీమవరం: వరి చేలలో ఎండుగడ్డి, వరి మోళ్లను తగలబెట్టడం వల్ల నేలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. వేడి వల్ల మిత్ర కీటకాలు, శిలీంద్రాలు చనిపోయి పైరుకు నష్టం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. వరి సాగులో కూలీల కొరతను అధిగమించడానికి, సాగు ఖర్చులు తగ్గించుకోవడానికి యంత్రాలను వినియోగిస్తున్నారు. వరికోత యంత్రాల ద్వారా మాసూళ్లు చేస్తున్న పంటలో వరిగడ్డి, మోళ్లను చేలలోనే తగలబెట్టడం పరిపాటిగా మారింది. వరిచేలలో గడ్డిని తగలబెట్టడం వల్ల అనేక అనర్థాలున్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 5.40 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. వరికోత యంత్రాలను ఉపయోగించడంతో వరిగడ్డిని గతంలో మారిదిగా రైతులు ఒబ్బిడి చేయడం లేదు. దీంతో యంత్రాలతో మాసూళ్లు చేసిన చేలలో గడ్డిని కొంతమంది రైతులు తగలబెడుతున్నారు. గడ్డిని తగలబెట్టే పద్దతి గతంలో కేవలం పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో మాత్రమే ఉండేది. గడ్డి తగలబెట్టడం వల్ల నష్టాలు రైతులు పొలంలో గడ్డిని మండించడం వల్ల వేడి భూమిలో సుమారు సెంటీమీటరు లోతు వరకు వెళ్తుంది. దీనివల్ల భూములు నిర్జీవంగా మారిపోతాయి. వేడి వల్ల మిత్ర కీటకాలు, మిత్ర శిలీంద్రాలు చనిపోయి చీడపీడల ఉధృతి పెరిగిపోతుంది. టన్ను గడ్డిని తగులబెట్టడం వల్ల నేలలో 5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల ఫాస్ఫరస్, 2.5 కిలోల పొటాషియం, 1.0 కిలోల సల్ఫర్తో పాటు నేల సేంద్రీయ కర్బనాన్ని కూడా కోల్పోతుందని పరిశోధనలో తేలింది. గడ్డిని తగలబెట్టడం ద్వారా వ్యాపించే పొగ వల్ల 76 శాతం మందికి కళ్ళ మంటలు, 44.8 శాతం మందికి ముక్కులో మంట, 45.5 శాతం మంది గొంతు నొప్పి బారిన పడినట్టుగా గుర్తించారు. గడ్డి తగలబెట్టడం వల్ల వచ్చే పొగను పీల్చడంవల్ల శ్వాస సంబంధ సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం పంట వ్యర్థాల సమర్ధ వినియోగంపై శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. మిగిలిన గడ్డిని కంపోస్టు చేయడం వల్ల ఎంతో విలువైన సేంద్రియ ఎరువు తయారవుతుంది. సేంద్రియ ఎరువులు పర్యావరణ హితమైనవే గాక సాగు ఖర్చును తగ్గించుకోవచ్చు. వరి గడ్డి పుట్టగొడుగుల పెంపకంలో బెడ్డింగ్ మెటీరియల్గా ఉపయోగపడుతుంది. కొన్ని ప్రైవేటు సంస్థలు వరిగడ్డిని ఉపయోగించి ప్యాకింగ్ మెటీరియల్, కార్డ్ బోర్డ్లు, ప్లేట్స్, స్పూన్లు, బయో–ఇథనాల్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారుచేస్తున్నందున గడ్డిని విక్రయించుకోవడం ద్వారా కొంత ఆదాయం పొందవచ్చు. వరిగడ్డిని తగలబెడితే దుష్పరిణామాలు వేడి వల్ల మిత్ర కీటకాలు, శిలీంధ్రాలు నాశనం 5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల ఫాస్ఫరస్ కోల్పోయే ప్రమాదం చేలలో వరిగడ్డిని తగలబెట్టడం వల్ల అనేక అనర్థాలున్నాయి. గడ్డి తగలబె ట్టిన వేడి వల్ల భూమికే గాకుండా మనుషులకు తీవ్ర నష్టాలున్నాయి. గడ్డిని సమర్ధంగా వినియోగించుకోవడం వల్ల పర్యావరణానికి మేలు కలగడమేగాక రైతులు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చును. వరిగడ్డిని చేలలో దుక్కిదున్నడం వల్ల పైరుకు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి, భీమవరం -
9న లోక్ అదాలత్
భీమవరం: కేసులు ఎక్కువ సంఖ్యలో రాజీచేయడం ద్వారా వచ్చేనెల 9న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్, పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి బి.లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం భీమవ రంలో పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కక్షిదారుల్లో లోక్ అదాలత్ రాజీలపై అవగాహన కల్పించాలన్నారు. ఎటువంటి ఇబ్బందులున్నా న్యాయమూర్తుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఎకై ్సజ్ కేసుల్లో కాంపౌండ్ ఫీజు కట్టించి అ వార్డు కాపీలను దాఖలు చేసుకోవచ్చన్నారు. భీమవరం, ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకోడేరు, వీరవాస రం పోలీసు అధికారులు, భీమవరం, ఆకివీడు ఎకై ్స జ్ పోలీసు స్టేషన్ల అఽధికారులు పాల్గొన్నారు. -
రూ.3.82 లక్షలకు దొడ్డిపట్ల ఫెర్రీ
యలమంచిలి: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం 2026–27 సంవత్సరానికి దొడ్డిపట్ల ఫెర్రీ వేలం నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.3,50,000 ధరకు వేలం ప్రారంభించగా దొడ్డిపట్ల గ్రామానికి చెందిన చేగొండి వీర వెంకట రమణ రూ.3.82 లక్షలకు పాట దక్కించుకున్నారు. ఫెర్రీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మీ, ఎంపీడీఓ జేడీవీ ప్రసాద్, ఎంపీడీఓ కార్యాలయ పరిపాలన అధికారి పద్మజ తదితరులు ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. వేలం పాటపై నివేదికను జిల్లా పరిషత్ సీఈఓకు పంపుతామని ఆయన నుంచి అనుమతి వచ్చిన తరువాత వేలం ఖరారు చేస్తామని ఎంపీడీఓ జేడీవీ ప్రసాద్ తెలిపారు. -
శ్రీవారి క్షేత్రంలో పెళ్లి సందడి
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో బుధవారం రాత్రి భారీగా వివాహాలు జరగడంతో పెళ్లి సందడి నెలకొంది. వివాహాలకు బలమైన ముహూర్తం కావడంతో కొండపైన, కింద పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగాయి. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలోని అనివేటి మండపాలు పూర్తిగా నిండిపోవడంతో, తూర్పు, దక్షిణ రాజగోపురాల వద్ద పలు జంటలు కిందే వివాహాలు చేసుకున్నారు. అలాగే స్వామివారి పాదుకా మండపం వద్ద ఉన్న పాత కల్యాణ మండపంలో అధికంగా వివాహాలు జరిగాయి. పెళ్లి జనాల వాహనాలతో క్షేత్రంలోని ఘాట్ రోడ్లు రద్దీగా మారాయి. ఆలయ ప్రధాన కూడలిలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో, పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. క్షేత్రంలోని అన్ని కల్యాణ మండపాల వద్ద పెళ్లి జనాలు భారీగా కనిపించారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
తాడేపల్లిగూడెం అర్బన్ : స్థానిక యాగర్లపల్లిలో ఈ నెల 14న పెరుమాళ్ళ నాగమణి(76) హత్య కేసులో నిందితుడి వివరాలను డీఎస్పీ డి.విశ్వనాథ్ వెల్లడించారు. నాగమణి హోటల్ వ్యాపారం చేసుకుంటూ జీవించేది. అదే ప్రాంతానికి చెందిన దగ్గుపల్లి దుర్గాప్రసాద్ కూలి పని చేసేవాడు. వ్యసనాలతో అప్పుల పాలయ్యాడు. దీంతో నాగమణితో పరిచయం పెంచుకొని ఈ నెల 14న అర్ధరాత్రి ప్రసాద్ ఇంట్లోకి ప్రవేశించి నాగమణి తలపై బండరాయితో మోది హత్య చేశాడు. ఇంట్లో నగదుతో పాటు రూ.3,45,500 విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. నాగమణి బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రసాద్ స్థానిక మహాలక్ష్మి నగర్ సమీపంలో ఉన్నట్లు సమాచారం అందడంతో సీఐ బోణం ఆదిప్రసాద్ ఎస్ఐలు పి.నాగరాజు, బి.శ్రీనివాస్ బృందాలుగా వెళ్ళి వల పన్ని అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన సిమెంట్ రాయిని స్వాధీనం చేసుకున్నారు. -
వీఆర్వోపై దాడి
మండవల్లి: ప్రభుత్వ భూమి పూడ్చివేతపై పరిశీలనకు వెళ్ళిన పులపర్రు వీఆర్వో ముద్రబోయిన వెంకటేష్పై బుధవారం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దాడిచేసి గాయపర్చారు. వీఆర్వో కై కలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తహసీల్దార్ గోపాల్ ఆదేశాల మేరకు పులపర్రులో పరిశీలనకువె వెళ్ళిన వీఆర్వోపై ముంగర రాజు, ముంగర సావిత్రి, ముంగర శ్రీనివాసరావు దాడి చేశారు. దెందులూరు: పెదవేగి మండలం విజయరాయి నూజివీడు సీడ్స్ ఫ్యాక్టరీలో బుధవారం తనిఖీలు జరిగాయి. నిషేధిత పత్తి విత్తనాల తయారీని అరికట్టేందుకు విజిలెన్స్ సిబ్బంది ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): రాష్ట్రానికి మతోన్మాదం అంటువ్యాధిగా మారిందని, కూటమి ప్రభుత్వం దానిని రాజకీయ అజెండాగా మార్చేసిందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ భవనంలో బుధవారం అమెరికా యుద్ధోన్మాదం కారణాలు, ప్రభావాలు అంశంపై సెమినార్ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆర్ఎస్ఎస్ ఆవహించిందని, మోదీని ప్రసన్నం చేసుకునేందుకు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ఆకివీడు ఘటనను క్రిస్టియన్, హిందువుల మధ్య విభేదంగా సృష్టించారని, దీనికి డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు వైఖరే కారణం అన్నారు. ప్రపంచ దేశాలన్నీ డాలర్ను వ్యతిరేకిస్తుంటే అదే డాలర్ను ప్రోత్సహిస్తున్న వ్యక్తి మోదీ మాత్రమేనని విమర్శించారు. ఎన్నికల కమిషన్ను కూడా రాజకీయ వ్యూహంలో ఉపయోగించడం రాజ్యాగ విరుద్ధమన్నారు. బీజేపీకి ఓటు వేయకపోతే ఆ ఓటును తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆగిరిపల్లి: మండలంలోని ఈదులగూడెంలో టీడీపీ నాయకుడు చెరువులోని మట్టిని గత రెండు రోజుల నుంచి రాత్రిపూట తరలిస్తున్నాడు. మండలంలోని ఈదులగూడెంలో ఏడు నెలల క్రితం టీడీపీకి చెందిన నాయకుడు గ్రామంలో పొలాల మెరక కోసమని అనుమతి తీసుకొని సుమారు 4 వేల ట్రక్కుల మట్టిని అక్రమంగా ఈదులగూడెంలో నిల్వ ఉంచాడు. ఇటుక బట్టీలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా సాక్షిలో అక్రమంగా మట్టి నిల్వలు కథనం ప్రచురితమైంది. అధికారులు మట్టిని తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో విరమించుకున్నాడు. గత రెండు రోజుల నుంచి రాత్రిపూట లారీల్లో వీరపనేనిగూడెంలోని ఇటుక బట్టీలకు తరలించేస్తున్నాడు. తహసీల్దార్కు సమాచారం అందడంతో ఆయన ఆదేశాల మేరకు ఆర్ఐ యూనస్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ ఉన్న లారీని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
అన్నదాతకు డీజిల్ వెతలు
డీజిల్ కొరత అన్నదాతను అతలాకుతలం చేస్తోంది. ఒకవైపు కోతలు వేగంగా సాగుతున్నాయి. కోత యంత్రాలకు ధాన్యం లోడుతో తిరిగే లారీలకు, రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ నింపే ఏరియేటర్లు తిరగడానికి డీజిల్ అవసరం. ఇలా అన్నదాతలు, ఆక్వా రైతులకు డీజిల్ అనివార్యమైన తరుణంలో, కొరతతో అల్లాడిపోతున్నారు. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమలో 1,900కు పైగా కోత యంత్రాలకు రోజుకు సగటున 2 లక్షల లీటర్ల డీజిల్ డిమాండ్ ఉండగా, దానిలో నాలుగో వంతు సరఫరా కూడా లేకపోవడంతో ఇబ్బందులు తీవ్రమయ్యాయి. బుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026పెట్రోల్, డీజిల్ సరఫరాలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఎన్నికల ముందు రైతు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, రైతుకే తొలి ప్రాధాన్యత అని ప్రతి సభలోనూ చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైనా స్పందిస్తున్నారా? క్షేత్రస్థాయిలో రైతులకు డీజిల్ అందేలా వెంటనే చర్యలు చేపట్టాలి. – డీవీఆర్కే చౌదరి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రైతులు కన్నీరు పెడుతున్నారు. ధాన్యం సరఫరాకు, చేపలు, రొయ్యల చెరువుల వాహనాలకు డీజిల్, పెట్రోల్ కూడా సరఫరా చేయలేకపోతే ప్రభుత్వం రైతులకు మేలు చేసినట్టేనా? క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న పాట్లు, డీజిల్ బ్లాక్ మార్కెట్ విక్రయాల పరిస్థితిని నేరుగా గమనించి, ప్రభుత్వం తక్షణమే పరిస్థితిని చక్కదిద్దాలి. – ఎన్.గాంధీ, రైతు, జోగన్నపాలెం సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధానంగా రెండు జిల్లాల్లో కలిపి 4.25 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ప్రస్తుతం మెట్ట ప్రాంతాల్లో 80 శాతం పైగా కోతలు పూర్తవగా, డెల్టాలో 40 నుంచి 50 శాతం మాత్రమే కోతలు పూర్తయ్యాయి. జిల్లాలో వరి కోతకు హార్వెస్టింగ్ యంత్రాల వినియోగం తప్పనిసరిగా మారింది. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే 1,600 హార్వెస్టింగ్ యంత్రాలు ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయి. ఎకరం కోత పూర్తి చేయడానికి సగటున 10 లీటర్ల డీజిల్ తప్పనిసరి. అదేవిధంగా ధాన్యం రవాణా చేసే లారీలకు 30 లీటర్లు, ట్రాక్టర్లకు 20 లీటర్ల మేర డీజిల్ అవసరం. వరి కోతలు వాయిదా ఈ క్రమంలో ఉమ్మడి పశ్చిమలో కేవలం వరి కోతలు, రవాణాకే రోజుకు సగటున 2.5 లక్షల లీటర్ల డీజిల్ డిమాండ్ ఉంది. జిల్లాలో ఆ మేరకు సరఫరా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆక్వా సాగులో రొయ్యల చెరువులకు ఆక్సిజన్ నింపే ఏరియేటర్లకు ఎకరాకు సగటున 5 నుంచి 10 లీటర్ల మేర డీజిల్ అవసరం. జిల్లాలో అత్యధికంగా సుమారు 2 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. వ్యవసాయానికి, ఆక్వాకు కలిపి మొత్తం 3.5 లక్షల లీటర్ల మేర డీజిల్ డిమాండ్ ఉంది. డీజిల్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో కోతలు వాయిదా పడుతుండగా, ధాన్యం లోడును కళ్లాల్లోనే ఉంచుతున్నారు. వాతావరణ మార్పులతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు జిల్లాలో 232, పశ్చిమ గోదావరి జిల్లాలో 160 పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు సరిపడా లేని పరిస్థితి టోకెన్లు, క్యూలైన్లు కోత యంత్రాలకు, రైతుల ఇతర అవసరాలకు స్థానిక తహసీల్దార్ల ద్వారా టోకెన్ల పంపిణీకి ప్రభుత్వం తెరదీసింది. తహసీల్దార్ కార్యాలయాల్లో, రైతు భరోసా కేంద్రాల వద్ద గంటల కొద్దీ పడిగాపులు పడి టోకెన్లు తీసుకుని, మళ్లీ బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. రెండు జిల్లాల్లో అధికార యంత్రాంగం యథావిధిగా బంకుల తనిఖీలు నిర్వహించడంతో పాటు కంట్రోల్ రూంలో ప్రత్యేక ఫోన్ నెంబర్లు కేటాయిస్తున్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలకు, మెడికల్, ఆర్టీసీకి ఇబ్బందులు లేకుండా టోకెన్లు జారీ చేశామని, అవసరమైన మేర డీజిల్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగానే ఉంది. ఎకరా కోతకు 10 లీటర్ల డీజిల్ వినియోగం ఆక్వాకు, ధాన్యం రవాణా లారీలకు డీజిల్ తప్పనిసరి ఉమ్మడి పశ్చిమలో 1,900కు పైగా కోత యంత్రాలు తహసీల్దార్లు స్లిప్పులు ఇస్తేనే యంత్రాలకు డీజిల్ -
డీజిల్ కొరత చేతకానితనమే
జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణుల నిరసనలు ఏలూరు టౌన్: రాష్ట్రంలో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని.. డీజిల్ కృత్రిమ కొరతతో వాహనదారులు, వ్యాపారులు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని. ఇది కూటమి ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఏలూరులో పార్టీ నేతలు, కేడర్ ప్రజా నిరసన చేపట్టింది. సీఎస్ఐ చర్చి సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి జేపీ కొద్దిసేపు నిరసన తెలిపారు. ఆటోడ్రైవర్లు, వాహనదారులు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. తొలుత వైఎస్సార్సీపీ ఏలూరు కార్యాలయం నుంచి ర్యాలీగా నడుచుకుంటూ పెట్రోల్ బంకు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ.. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో డీజిల్, పెట్రోల్ కొరత దుస్థితి లేదని, ఏపీ ప్రభుత్వం చేతకానితనం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇబ్బందిపడ్డారని, తాజాగా డీజిల్ కొరత ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, బీసీ సెల్ అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, నగర మహిళ అధ్యక్షురాలు విజయ నిర్మల, బీసీ సెల్ అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, వైఎస్సార్సీపీ నాయకులు ఇమ్మానియేల్ జయకర్, భాస్కర్ల బాచి, పల్లి శ్రీనివాస్, కొల్లిపాక సురేష్, సాయిప్రదీప్, రాజేష్, గంటా రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మద్ది క్షేత్రంలో విశేష పూజలు
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ముఖ మండపం వద్ద స్వామివారికి తమలపాకులతో అష్టోత్తర పూజలు జరిపారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ. 2,00,379 ఆదాయం వచ్చిందని, అన్నదాన సత్రంలో 1,925 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): సమగ్రశిక్ష ఏలూరు జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో ఖాళీగా ఉన్న అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఉర్దూ), అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారి, అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ అధికారి (ఏపీఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ కే పంకజ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన స్కూల్ అసిస్టెంట్లు, సెంకడ్ గ్రేడ్ టీచర్లు తమ దరఖాస్తులను మే 4వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కార్యాలయంలో అందజేయాలన్నారు. సమాచారం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉందని, మరిన్ని వివరాలకు 63032 09397 నంబర్లో సంప్రదించవచ్చన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్ బాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి అతిథులుగా వయోజన విద్య అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్.విజయ్ కుమార్, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఏలూరు అధ్యక్షురాలు ఈ. సరోజ, టీమ్ సభ్యులు పాల్గొని చిన్నారులకు విజ్ఞానంతో కూడిన సందేశాన్ని అందించారు. శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడానికి వాలంటీర్లు, రిసోర్స్ పర్సన్లుగా ముందుకు వచ్చిన సుజయ్ కృష్ణ (కార్టూన్లు, స్టోరీస్) ఆర్.భాస్కర్ సాయి కుమార్ (డ్రాయింగ్, ఇతరాలు), యోహాను (చదరంగం), వై కృష్ణ ఫణికాంత్ (వెస్ట్రన్ డాన్స్) సీహెచ్వీ సురేంద్ర (మైండ్ మెమరీ గేమ్స్, స్కిల్స్), జీ అశోక్ కుమార్ (స్పోకెన్ ఇంగ్లీషు), జే మూర్తి (శతక పద్యాలు, భగవద్గీత, కథలు), కొడాలి హిమబిందు (తెలుగు సాహిత్యం, పద్యాలు)లను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం చిన్నారులకు స్వీట్లు, బిస్కట్లు పంచిపెట్టారు. ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో సమగ్రశిక్ష ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మే 15వ తేదీన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి నారా లోకేష్ నివాసం వరకూ చేపట్టనున్న పాదయాత్రను జయప్రదం చేయాలని సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ కాంతారావు, వైస్ చైర్మన్ వాసా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈమేరకు మంగళవారం విజయవాడలోని రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయానికి వెళ్లి ఏఎస్పీడీని కలిసి పాదయాత్రకు సంబంధించిన నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని కేడర్లకు జీతాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, ఈపీఎఫ్, ఈఎస్ఐ, ఎంటీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రకు సమగ్రశిక్ష ప్రాజెక్టు ఉద్యోగి కుటుంబ సభ్యులతో సహా సన్నద్ధమౌతున్నామని స్పష్టం చేశారు. అలాగే కేజీబీవీ టీచర్లకు జరుగుతున్న లాంగ్ స్టాండింగ్ బదిలీలను న్యాయబద్ధంగా జరపాలని కోరారు. ఏలూరు (టూటౌన్): రసాయనిక పరిశ్రమల్లో విపత్తు సమయంలో నష్ట నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 30న చింతలపూడిలో ఐఓసీఎల్ పైప్లైన్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి చెప్పారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫెరెన్స్ హాల్లో మాక్ డ్రిల్ నిర్వహణకు సంబంధించి టేబుల్ టాప్ ఎక్సరసైజ్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మాక్ డ్రిల్లో సంబంధిత అధికారులు తప్పనిసరిగా పాల్గొని, జాగ్రత్త చర్యలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ రత్నబాబు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘పోలవరం’లో మట్టి, రాతి నాణ్యతా పరీక్షలు
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టులో కేంద్ర మట్టి, పదార్థాల పరిశోధనా సంస్థ (సీఎస్ఎంఆర్ఎస్) బృందం మంగళవారం విస్తృతంగా పర్యటించి నాణ్యతా పరీక్షలు నిర్వహించింది. ఈ బృందంలో నిపుణులు అన్వేష్, గౌరవ్ పాండే, ఉదయ్ చక్రవర్తి, హరీందర్ సింగ్ ప్రకాష్లు ఉన్నారు. గతంలో ప్రాజెక్టు కాంక్రీట్ పనులను పరిశీలించిన ఈ బృందం, తాజాగా ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి వినియోగిస్తున్న రాళ్లు, మట్టి నాణ్యతను పరీక్షించింది. గ్యాప్–1, గ్యాప్–2 ప్రాంతాల్లో జరుగుతున్న పనులతో పాటు అక్కడ వినియోగిస్తున్న ఇసుకను కూడా వారు పరిశీలించారు. ప్రాజెక్టు ఆవరణలో నిల్వ ఉన్న రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి స్థానిక ల్యాబ్లో పరీక్షించిన నిపుణులు, నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గ్యాప్–1లో ఇప్పటివరకు జరిగిన పనుల్లో వాడిన పదార్థాలకు రింగ్ టెస్ట్ నిర్వహించారు. మరిన్ని లోతైన పరీక్షల కోసం కొంత మట్టిని ఢిల్లీలోని తమ కేంద్ర పరిశోధనాలయానికి తీసుకెళ్లారు. -
డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే కేసులు
ఏలూరు (టూటౌన్): డీజిల్ కృత్రిమ కొరత సృష్టించే బంకు యజమానులపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరులోని పలు పెట్రోల్ బంకులను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి డీజిల్ నిల్వలు, సరఫరా, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డీజిల్ కొరత ఏర్పడుతుందేమోనని ఆందోళనతో ప్రజలు కొనుగోళ్లకు ప్రయత్నిస్తుండడంతో సమస్య ఏర్పడుతుందన్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు బంకు యజమానులు డీజిల్ నిల్వలు ఉన్నప్పటికీ బంకుల ముందు నో స్టాక్లు పెడుతున్నారన్నారు. తహసీల్దార్లు, పౌర సరఫరాల శాఖాధికారులు తమ పరిధిలోని బంక్లను పరిశీలించి డీజిల్ నిల్వలు ఉన్నా నో స్టాక్ బోర్డులు పెట్టి కృత్రిమ కొరత సృష్టించే వారిపై, పెట్రోల్, డీజిల్ను బ్లాక్ మార్కెటింగ్ చేసే బంకు యజమానులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. డీజిల్ను ఇళ్ల వద్ద నిల్వ ఉంచవద్దని, మండే స్వభావం ఉన్న డీజిల్, వేసవి తీవ్రత దృష్ట్యా అగ్నిప్రమాదాలకు కారణమవుతుందని, ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టరు సీహెచ్ శ్రావణ్కుమార్ రెడ్డి, డీఎస్ఓ బాబు ఇ.బి.విలియమ్స్, తహసీల్దారు కె.గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారికి నృత్య నీరాజనం
ద్వారకాతిరుమల: మయూరాలు పురివిప్పి నర్తించినట్టు.. ఆ కళాకారుల నాట్య హేలాను కన్నులారా వీక్షించిన నృత్యాభిమానులు ఆనందంతో పులకించిపోయారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ కామాక్షి నృత్యాలయం (మైలవరం), శ్రీ పాద వల్లభ కూచిపూడి నాట్య నిలయం (ఏలూరు), డీజీ సరస్వతి (విజయవాడ), శ్రీ జననీ నృత్య నికేతన్ (కాకినాడ) వారు మంగళవారం శ్రీహరి కళాతోరణ వేదికపై కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా విభిన్న నృత్య రీతులను ప్రదర్శించి చూపరులను ఆకట్టుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. కూచిపూడి నృత్య ప్రదర్శన విభిన్న భంగిమల్లో చిన్నారులు -
న్యాయం జరిగే వరకు పోరాటం
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో నిరంకుశ రాజ్యం నడుస్తోందని, టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వైఎస్సా ర్సీపీ లీగల్ సెల్ ఏలూరు నగర అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది జూన్ నెలలో సాక్షి దినపత్రిక కార్యాలయంపై టీడీపీ అరాచక శక్తులు దాడులు చేసి ఫర్నిచర్ను ధ్వసం చేసిన సంఘటనలో పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసులు కట్టకుండా కాలయాపన చేశారని మండిపడ్డారు. దీనిపై వైసీపీ లీగల్ సెల్ పక్షాన ఏలూరు మొబైల్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ నమోదు చేయగా గౌరవ న్యాయస్థానం ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించిందని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు హత్యా రాజకీయాలు చేస్తూ సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వీటన్నింటినీ ప్రజల వద్దకు తీసుకువెళుతున్న సాక్షి దినపత్రిక గొంతు నొక్కాలని పత్రికా కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని, న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
జంగారెడ్డిగూడెం: ఆయిల్ పామ్ లోడ్ లారీ మోటార్సైకిల్ను ఢీకొన్న ఘటనలో ఒక బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మండలంలోని పుట్లగట్లగూడెంలో జంగారెడ్డిగూడెం–ఏలూరు రాష్ట్ర రహదారిపై జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామానికి చెందిన చల్ల మౌళి (17) మండలంలోని గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి క్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించుకుని, తన మోటార్సైకిల్పై తిరిగి ఇంటికి వెళుతున్నాడు. పుట్లగట్లగూడెం వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఆయిల్ పామ్ లోడ్ లారీ మౌళి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో మౌళి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న లక్కవరం ఎస్సై షేక్ జబీర్ సిబ్బందితో కలిసి ఘటనానికి స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ను క్లియర్ చేసి మౌళి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై తెలిపారు. అయితే మృతుడు చల్ల మౌళి (17)కి తండ్రి లేకపోవడంతో నాయనమ్మ భగవతి వద్ద పెరిగినట్లు బంధువులు తెలిపారు. మౌళి కూలి పనులు చేసుకుంటూ నాయనమ్మకు ఆసరాగా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. మౌళి మృతితో వృద్ధురాలు భగవతికి ఆధారం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఇటీవల ఏర్పడిన డీజిల్ కొరత పరిస్థితి క్రమంగా తగ్గుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి తెలిపారు. రోజురోజుకూ డీజిల్ సరఫరా పెరుగుతుండగా, వినియోగదారులు అవసరం మేరకే కొనుగోలు చేయడం వల్ల పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని ఆయన వెల్లడించారు. మంగళవారం రాత్రి భీమవరం పట్టణంలోని ఉమామహేశ్వర ఆగ్రో సర్వీసెస్ పెట్రోల్ బంక్, పుష్ప పెట్రోల్ బంక్, ఉండి ఎన్ఆర్పీ అగ్రహారంలోని పౌర సరఫరాల శాఖ పెట్రోల్ బంక్, గణపవరంలోని పెట్రోల్ బంకులను రాహుల్కుమార్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు, రైతులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో డీజిల్ అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. -
కామినేని.. అట్టుకు అట్టున్నర వడ్డిస్తాం
కైకలూరు: ‘అవినీతి, అక్రమ కేసులు, మట్టి మాపీయా, పిల్లల విక్రయాలు, గంజాయి అమ్మకాలు, చేపల దొంగతనాలు, పేకాట, పొట్టెళ్ల పందాలు, ఇటువంటి వాటిని అడ్డుకోలేని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ రౌడీ మూకలను పెంచి పోషిస్తున్నారని, అధికారంలోకి రాగానే అట్టుకు అట్టున్నర వడ్డిస్తాం’ అని వైఎస్సా ర్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) హెచ్చరించారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ మద్దతుతో పాలన సాగించిన మాజీ సర్పంచులకు మంగళవారం సన్మానం చేశారు. కూటమి నుంచి కై కలూరు మాజీ సర్పంచ్ దానం మేరీ నవరత్నకుమారి తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు. ఆమెకు డీఎన్నార్ కండవా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ కూటమి పాలనలో తన కుటుంబానికి చెందిన 100 ఎకరాల చేపల చెరువులో రౌడీ మూకలతో మూడు రోజుల పాటు రూ.48 లక్షల విలువైన చేపలను పట్టివేశారన్నారు. ఇందులో ఎమ్మెల్యే ప్రమేయం లేదని ఆయన గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి వద్ద ప్రమాణం చేస్తే తన కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరారు. ఈ పరిస్థితుల్లోనే చేపల దొంగ అనే పదం వాడనని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా కై కలూరు సీహెచ్సీని 50 పడకల ఆస్పత్రిగా మార్పు, డయాలసిస్ సెంటర్, సున్నంపూడి నుంచి గొల్లగూడెం పైపులైన్, గుడ్లవల్లేరు వద్ద స్లూయిజ్ తొలగింపు, పెద్దింట్లమ్మ వారధి, అనివేటిమండపం, వెంకటాపురంలో పాలిటెక్నిక్ కాలేజీ, 100 ఎకరాల్లో గ్రీన్ విలేజ్, వైవాకలో 317 మంది దళితులకు పట్టాలు, సంతమార్కెట్ క్లాంప్లెక్సు, పెనుమాకలంక రోడ్డుకు శంకుస్థాపన ఇలా అనేకం చేశామన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డకు పేరు పెట్టుకున్నట్లు గ్రీన్ విలేజ్, పాలిటెక్నిక్ కాలేజీలకు పేరు మారుస్తున్నారన్నారు. గోపవరంలో 220/33 విద్యుత్ సబ్స్టేషన్ తానే తీసుకొచ్చానని చెప్పారు. కూటమి నాయకులకు వంత పాడుతున్న కై కలూరులో ఇద్దరు పోలీసు అధికారులు ఇక్కడ నుంచి వెళ్లినా వైఎస్సార్ సీపీ పాలన రాగానే వారితోనే ఇక్కడే డ్యూటీలు చేయిస్తామన్నారు. ఎమ్మెల్యే కామినేని హావభావాలను అనుకరిస్తూ డీఎన్నార్ మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. ముదినేపల్లి మండలం శ్రీహరిపురంలో బాబు మిస్సింగ్ కేసు 100 రోజుల దాటినా కనిపెట్టలేదన్నారు. బంధువులు రోడ్డుపై ధర్నా చేసిన తిరిగి వారిపైనే కేసులు కడతామని పోలీసులు బెదిరిస్తున్నారన్నారు. పసిపిల్లల విక్రయాలు కేసులో మరింత దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏలూరు పార్లమెంటు కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ముదిరాజుల విభాగ అధ్యక్షుడు కోమటి విష్ణువర్థనరావు, రాష్ట్ర మహిళా విభాగ సెక్రటరీ గంటా సంధ్య, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చేబోయిన వీరరాజు, ఎంపీపీలు రామిశెట్టి సత్యనారాయణ, చందన ఉమామహేశ్వరరావు, పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ హెచ్చరిక -
మా పొగాకు కొనేవారేరి?
ఆగిరిపల్లి: మండలంలో కనసానపల్లి, నెక్కలం గొల్లగూడెం, అడవినెక్కలం గ్రామాల్లో పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. పొగాకు కంపెనీకి చెందిన ప్రతినిధులు గ్రామాలకు వచ్చి రైతులకు క్వింటాకు రూ.16 వేలు ఇస్తామని చెప్పి, నారు కూడా ఇవ్వడంతో ఈ నాలుగు గ్రామాల్లో సుమారు 400 ఎకరాల్లో వైట్ బర్లి పొగాకును రైతులు అప్పులు చేసి మరీ సాగు చేశారు. ఎకరానికి రూ.1.50 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. అయితే కొనుగోలుకు సంబంధించి బాండ్లు కూడా ఇస్తామని చెప్పి రైతులతో సంతకాలు చేయించుకున్నారు. తర్వాత బాండ్లు ఊసే ఎత్తలేదు. తీరా పంట చేతికి వచ్చాక కంపెనీ ప్రతినిధులు ప్లేట్ ఫిరాయించి పొంతన లేని మాటలు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు నాణ్యత బాగా లేదని, కంపెనీలో సరిపడా నిలువలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కంపెనీలు ఎప్పుడు కొంటాయో? తెలియక రైతులు పొలాల్లో, ఖాళీ స్థలాల్లో మండేలు వేసి కాపలా కాస్తున్నారు. కొంతమంది రైతులు కోత కోయడానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఉసురుమంటూ పొలాల్లోనే వదిలేస్తున్నారు. ఇప్పటికై నా కంపెనీలు కొనుగోలు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.దయనీయంగా నాలుగు గ్రామాల రైతుల పరిస్థితి -
శేష్మహల్ రోడ్డులో ఏం జరుగుతోంది?
తాడేపల్లిగూడెం: స్కామ్లు, స్కీమ్లు.. హవాలా.. దివాలా...ఆత్మహత్యలు, టోకరాలకు పట్టణంలో శేష్మహల్ రోడ్డు కేరాఫ్గా మారిందా..? అనే సందేహాలు ప్రజల్లో వస్తున్నాయి. ఒక్కప్పుడు సినిమా థియేటర్లకు కేరాఫ్ అడ్రస్గా ఉండే ఈ ప్రాంతం ఎనిమిది నెలలుగా తరచూ వార్తల్లోకి వస్తుంది. ఓ పక్క జీఎస్టీ అధికారుల దాడులు, మరో వైపు చోరీ సొత్తు రికవరీ పేరిట కోనసీమ జిల్లా కొత్తపేట పోలీసులు సోదాలతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇటీవలకాలంలో కొత్తపేట పోలీసు స్టేషన్లో కొన్ని చోరీలు జరిగాయి. నిందితులు నలుగురిని విచారించగా, చోరీ సొత్తులో 21 గ్రాముల బంగారాన్ని శేష్మహల్ రోడ్డులోని ఒక బంగారు దుకాణంలో విక్రయించినట్టుగా చెప్పారు. కొత్తపేట సబ్ఇన్స్పెక్టర్ నిందితులు నలుగురిని సంకెళ్లతో ఓ వాహనంలో తీసుకొచ్చారు. దుకాణం చూపించాక హైడ్రామా సాగింది. చివరికి ఆరోపణ ఎదుర్కొన్న వ్యక్తి చోరీ సొత్తు కొనలేదని చెప్పడంతో, తదుపరి విచారణ కోసం పోలీసులు సదరు వ్యాపారిని కొత్తపేట తీసుకెళ్లారు. చోరీ బంగారు బరువు కాస్తా నిందితులు మాట మార్చడంతో ఎనిమిది గ్రాములకు తగ్గింది. తాడేపల్లిగూడెంలో విక్రయించింది ఎనిమిది గ్రాములే అని చెప్పారు. ఆ బంగారం కోసం తాను కొనలేదని దుకాణ యజమాని చెప్పడంతో పూచీకత్తు మీద పెద్ద మనుషుల సమక్షంలో అతడిని వదిలేశారు. జీఎస్టీ అధికారుల దాడులు ఈ ప్రాంతంలో బంగారు దుకాణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే నెల రోజుల ముందు ఒక దుకాణంలో మూడు రోజుల పాటు జీఎస్టీ దాడులు జరిగాయి. ఆ సమయంలో కూడా ఈ ప్రాంతం గురించి చర్చ సాగింది. ఎఫ్ఎంబీ ప్రకారం వంద అడుగుల రోడ్డు ఉండాల్సిన ఈ ప్రాంతంలో నాయకులను ప్రసన్నం చేసుకుని రోడ్డును దర్జాగా ఆక్రమించి, షాపులు కట్టేశారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఒక వ్యాపారి వ్యాపారంలో దెబ్బతిని రాజమండ్రి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కూటమి నాయకుడొకరు విషయం సెటిల్మెంటు పేరిట కేజీలకు కేజీలు వెండి నొక్కేశాడని సమాచారం. ఇదే ప్రాంతానికి ఒకరు ఇటీవల బంగారం సరఫరా చేస్తే, వ్యాపారులను మోసం చేయబోయి దొరికిపోయారు. వీటన్నింటికి శేష్మహల్ రోడ్డు కేరాఫ్గా మారడం చర్చనీయాంశంగా మారింది. కాబట్టి వినియోగదారులు బంగారం కొనుగోలు చేసే విషయంలో దుకాణదారుల ట్రాక్ను పరిగణనలోకి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా చోరీ సొత్తు కోసం పోలీసుల తనిఖీలు -
గేట్లో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ
నూజివీడు: గేట్లో ఉత్తమ ర్యాంకులు సాధించి ట్రిపుల్ఐటీల ప్రతిష్టను మరింత పెంచారని రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ అన్నారు. నూజివీడు ట్రిపుల్ఐటీలో గేట్–2026లో ప్రతిభ కనబర్చిన నేపధ్యంలో మంగళవారం గేట్–2026 సక్సెస్ మీట్ను నిర్వహించారు. గేట్ పరీక్షలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు అర్హత సాధించిన ఇతర విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జాతీయస్థాయిలో 100 లోపు ర్యాంకులు సాధించిన హర్షిత్ రెడ్డి (26వ ర్యాంక్), ఆర్. సురేష్ (37వ ర్యాంక్), మనోజ్ కుమార్ (43వ ర్యాంక్), తిలక్ (54వ ర్యాంక్), నాగరాజు (66వ ర్యాంక్), అజయ్ కుమార్ (69వ ర్యాంక్), హర్షిత్ రెడ్డి (70వ ర్యాంక్), శ్రీనివాస్ (95వ ర్యాంక్)లను వారి తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నూజివీడు డైరెక్టర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు, ఏస్ ఇంజినీరింగ్ అకాడమీ రీజినల్ మేనేజర్ దోసపాటి హర్షవర్ధన్, సెంట్రల్ అకడమిక్ డీన్ దువ్వూరి శ్రావణి, సెంట్రల్ ఫైనాన్స్ ఆఫీసర్ నాగార్జునదేవి, పరిపాలనాధికారి బి.లక్ష్మణరావు పాల్గొన్నారు. -
స్టీమింగ్ రైస్ ప్రక్రియను ప్రోత్సహించాలి
పెనుమంట్ర: రైతులకు, మిల్లర్లకు ఆమోదయోగ్యంగా ఉండే రైస్ స్టీమింగ్ చేసే ప్రక్రియను రైతుల అవగాహన కల్పించి ప్రోత్సహించాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకుడు డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులకు సూచించారు. మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానంలో మంగళవారం గోదావరి మండల పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గోదావరి మండల వరి రైతులు ఉత్పత్తి చేస్తున్న ధాన్యాలు మిల్లింగ్ చేస్తున్న సమయంలో నూక శాతం పెరిగి ఆ బియ్యనికి మార్కెట్ విలువ తగ్గిపోవడం గోదావరి మండల రైతులకు ప్రధాన సమస్యగా ఉందన్నారు. రైస్ను స్టీమింగ్ చేసి మిల్లింగ్ చేయడం వల్ల ధాన్యం పై పోరలో ఉండే పోషకాలు బియ్యంలో చేరి పోషక విలువలు పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి ప్రాంతీయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పీవీకే జగన్నాథరావు వరి, చెరకు పంటలు విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. అనంతరం గోదావరి మండల సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు అభ్యుదయ రైతులను బృందాలుగా ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల గురించి 2026–27 సంవత్సరానికి సంబంధించి పరిశోధన, విస్తరణ ప్రణాళికలను రూపొందించారు. -
జీజీహెచ్లో మరణ మృదంగం
● వైద్యుల నిర్లక్ష్య వైఖరితో రోగుల మరణాలు? ● మృతదేహాలకు పోస్టుమార్టం చేయని వైనం ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రికి రోగమొచ్చింది. ప్రజలకు వైద్యసేవలు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిరోజూ వందలాదిమంది రోగులు అనార్యోగంతో ఏలూరు జీజీహెచ్కు వస్తూ ఉంటారు. కానీ రోగులకు మెరుగైన వైద్యం అందించటంలో ఘోర వైఫల్యం కనిపిస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హెచ్చరించినా డోంట్ కేర్ అనే ధోరణితో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పని చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారు. ఇటీవల వైద్యులు, సిబ్బంది ఉదాసీన వైఖరితో ఒక 14 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోగా... ఒక వృద్ధురాలు సైతం సకాలంలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవటంతో మృతి చెందింది. ఇక ఎంసీహెచ్ విభాగంలో వారంలో రెండు, మూడు సంఘటనలు చోటు చేసుకోవడంతో గర్భిణులను భయబ్రాంతులకు గురి అవుతున్నారు. కుట్లు విడిపోవటం, ఇన్ఫెక్షన్లు రావటం, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం వంటి పరిస్థితులు హాస్పిటల్ వైద్యులపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. అత్యవసర విభాగానికి రాత్రివేళల్లో ప్రాణాపాయ స్థితిలో తీసుకెళ్తే వైద్యం అందుతుందనే గ్యారెంటీ లేదంటున్నారు. సిఫార్సులు లేకుంటే రోగి చేతిని కూడా ముట్టుకునే పరిస్థితి ఏలూరు జీజీహెచ్లో లేదని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఏలూరు జీజీహెచ్లో కోకొల్లలుగా జరుగుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. బాలిక మృతితో ఆందోళన మూడు రోజుల క్రితం పెదపాడు మండలం తాళ్లమూడికి చెందిన 14 ఏళ్ల బాలిక అనారోగ్యంతో ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చేరింది. తొలుత హనుమాన్ జంక్షన్లోని ఆస్పత్రికి తీసుకువెళ్లగా... ఏలూరు జీజీహెచ్లో మంచి వైద్యం దొరుకుతుందనే ఆశతో తల్లితండ్రి బాలికను తీసుకువచ్చారు. కానీ వైద్యుల నిర్లక్ష్యం బాలిక ప్రాణాలు తీసింది. బాలిక నోరు, ముక్కు నుంచి నురగలు కక్కుతూ మృతి చెందడంతో తల్లిదండ్రులు రోధించారు. తమ కుమార్తెను సరైన వైద్యం అందించలేదనీ, వైద్యుల నిర్లక్ష్యమే బాలిక ప్రాణాలు బలితీసుకుందంటూ హాస్పిటల్లోనే ఆందోళనకు దిగారు. పోస్టుమార్టం చేయరా? ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ బోధనాసుపత్రి (సర్వజన ఆసుపత్రి)లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు పాటించే పరిస్థితి కానరావడం లేదు. ఒక బాలిక వైద్యం పొందుతూ ఆకస్మికంగా మృతి చెందినా బాలిక మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే పంపివేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎవరి ఒత్తిడితో, సిఫార్సుతో పోస్టుమార్టం చేయలేదో ? తెలియాల్సి ఉంది. -
ధాన్యం బస్తాల లారీ కాలువలో బోల్తా
దెందులూరు: మండలంలోని కొవ్వలి గ్రామంలో ధాన్యం బస్తాలతో వస్తున్న లారీ కాలువలో బోల్తా పడిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. 650 బస్తాలతో లోడుతో ఉన్న లారీ కాలువలో బోల్తా పడింది. కొవ్వలి గ్రామానికి చెందిన గరికపూడి సత్యనారాయణ కౌలు రైతు దాళ్వాసాగు చేసి పండిన ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పొలంలోకి నేరుగా లారీ వెళ్లి అక్కడే బస్తాలును లోడ్ చేసుకుని మిల్లుకు తరలించేందుకు వస్తుండగా చేపల ఫారం సమీపంలో వచ్చేసరికి లారీ అదుపుతప్పి కాలువలో బోల్తా పడింది. దీనివల్ల ధాన్యం మొత్తం తడిచి పనికి రాకుండా పోయింది. లారీ తో సహా దాన్యపు బస్తాలు నీటిలో మునిగిపోవడంతో రూ.8 లక్షలు నష్టం జరిగిందని కౌలు రైతు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. టి.నరసాపురం: ఆయిల్ పామ్ తోటలో వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.జయబాబు మంగళవారం విలేకరులకు తెలిపారు. వివరాల ప్రకారం ఈ నెల 25న జంగారెడ్డిగూడెం మండలం టెక్కినవారిగూడెం గ్రామానికి చెందిన పసుపులేటి రామచంద్రరావు (40) గుడికి వెళుతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వచ్చాడన్నారు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు రామచంద్రరావు కోసం వెతుకున్నారన్నారు. ఈ క్రమంలో ఈ నెల 27న సాయంత్రం మండలంలోని తిరుపతిపాడు గ్రామ శివారులో ఓ రైతుకు చెందిన ఆయిల్ పామ్ తోటలో రామచంద్రరావు మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. కుటుంసభ్యులకు సమాచారం అందడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రామచంద్రరావు మద్యానికి బానిసై బయట వ్యక్తులకు ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం, షుగర్ వ్యాధి వచ్చి ఆరోగ్యం క్షీణించడంతో మానసికంగా బాధపడుతున్నాడన్నారు. రామచంద్రరావు మృతిపై మృతుని అన్న నాగ పుల్లారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నరసాపురం రూరల్: మండలంలోని కాళీపట్నం తూర్పు గ్రామంలో నిద్రస్తున్న సమయంలో పాము కాటుకు గురై గ్రామానికి చెందిన బాలం కొండబాబు (45) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబందించి వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం కొండబాబు తన ఇంటిలో నిద్రిస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్య సేవలు పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని సోదరుడు బాలం రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కె.నాగేశ్వరరావు తెలిపారు. దెందులూరు: మసీదుపాడు గ్రామానికి చెందిన పైడి తరుణ్ను ఈనెల 26న సానిగూడెం అడ్డరోడ్డు వద్ద కత్తితో నరికి గాయపర్చిన గాలాయగూడెం గ్రామానికి చెందిన కూచిపూడి హర్షవర్ధన్ను అరెస్ట్ చేశామని దెందులూరు ఇన్చార్జ్ ఎస్సై ఆర్.శ్రీను మంగళవారం విలేకరులకు తెలిపారు. గాయపడ్డ బాధితుడు తరుణ్ చెల్లెలు వివాహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఇతర విషయాలపై ఇద్దరికి ఘర్షణ జరిగిన నేపథ్యంలో దాడి చేశాడని స్పష్టం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్ట్ చేశామని వివరించారు. -
వ్యక్తిపై కత్తితో దాడి
దెందులూరు: ఓ వ్యక్తిపై కత్తితో దాడి జరిగిన ఘటన సానిగూడెం అడ్డరోడ్డు వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దెందులూరు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మసీదుపాడు గ్రామానికి చెందిన పైడి తరుణ్ చెల్లి, గాలాయగూడెం గ్రామానికి చెందిన కూచిపూడి హర్షవర్థన్ గతంలో ప్రేమించుకుని విడిపోయారు. ప్రస్తుతం ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే హర్షవర్థన్ సెల్ఫోన్లో ఆమె స్టేటస్ పెట్టుకోవడంపై తరుణ్ నిలదీయడంతో ఇద్దరికీ ఫోన్లో వాగ్వాదం జరిగింది. అనంతరం పని నుంచి ఇంటికి వస్తున్న పైడి తరుణ్ను సానిగూడెం అడ్డరోడ్డు వద్ద కూచిపూడి హర్షవర్థన్ దారి కాచి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన బాధితుడు ఏలూరు వైద్యశాలలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. ఏలూరు (టూటౌన్): వెలుగు వీవోఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ వెలుగు వీవోఏ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ఎస్కే సుభాషిణి, జిల్లా గౌరవాధ్యక్షుడు డీఎన్వీడీ ప్రసాద్ మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, రాజకీయ వేధింపులు అరికట్టాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకొని పొదుపు మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీ రాయితీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్కు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ జిల్లా సహాయ కార్యదర్శి పార్వతి, ఉపాధ్యక్షులు విజయకుమారి, ఇందిరా, లక్ష్మీదేవి, లలిత కుమారి, కుమారి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్లు కూల్చొద్దంటూ నిరసన
● తహసీల్దార్ కార్యాలయం వద్ద మహిళల బైఠాయింపు ● తమకు న్యాయం చేయాలని వేడుకోలు ఉండి: మా ఇళ్లు కూలగొట్టొద్దు.. మా తాళిబొట్లు తాకట్టు పెట్టి మరీ కట్టుకున్నాం.. మా బతుకులు నాశనం చేయొద్దు బాబూ అంటూ మహిళలు అఽధికారుల కాళ్లవేళ్లా పడ్డారు. ఉణుదుర్రులోని ఆలకోడు వద్ద ఆక్రమణలు ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు ఇవ్వడంతో తమ ఇళ్లు కూల్చవద్దంటూ 70 కుటుంబాలకు చెందిన మహిళలు సోమవారం ఉండి తహసీల్దార్ కార్యాలయం వద్ద నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఇళ్లు రోడ్డును ఆక్రమించుకుని గానీ, ఇతరులకు ఆటంకంగా గానీ లేకపోయినా గ్రామానికి చెందిన కొందరు కక్షకట్టి మా ఇళ్లు కూల్చి వాటిపై ఆక్వాచెరువులకు వెళ్లాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలైన తమపై ఎందుకింత కక్షకట్టారో తెలియడం లేదని వాపోయారు. మా ప్రాణాలైనా అర్పిస్తాం గానీ మా ఇళ్లు మాత్రం కూలగొట్టేందుకు అంగీకరించమంటూ వారు నినాదాలు చేశారు. అధికారులు మాకు స్థలం ఇస్తామని చెప్పి.. కనీసం పూడిక కూడా చేయని గోతిలో స్థలాలున్నాయి వెళ్లండి అని చెప్పడం ఎంత వరకు సమంజసమంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలకోడు ఆక్రమించుకున్న స్థానిక ఆక్వారైతులకు సహకరిస్తూ నిరుపేదల బతుకులు బుగ్గిచేయడానికి నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రయత్నించడం సబబు కాదని కన్నీళ్లు పెట్టుకున్నారు. మా ఇళ్లు కూల్చొద్దు. మా జీవితాలు ఫణంగా పెట్టి ఇళ్లు కట్టుకున్నాం. ఇప్పుడు వాటిని కూలగొట్టేస్తామంటే మేం ఎలా బతకాలి. దయచేసి మా జీవితాలను నాశనం చేయవద్దు. – కటికిరెడ్డి అన్నపూర్ణ, ఉణుదుర్రు చాలాకాలంగా మేము ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నాం. మేం నివసించే స్థలం ఎవ్వరికీ అడ్డులేదు. ఆక్వా,చేపల చెరువుల యజమానుల కోసం నిరుపేదల ఇళ్లు కూలగొట్టడం అన్యాయం. కటికిరెడ్డి వెంకటసుబ్బమ్మ, ఉణుదుర్రు మేం నివసిస్తున్న ప్రాంతంలో కాలువ పేరు చెప్పి నిరుపేదల ఇళ్లు కూలగొట్టేందుకు సిద్ధపడడం దారుణం. మాకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే మాపై కక్ష కట్టి మా జీవితాల్లో నిప్పులు పోస్తోంది. – కండిబోయిన పద్మ, మాజీ వార్డు సభ్యురాలు కూటమి ప్రభుత్వం వచ్చాక మూడు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని చెప్పి ఇప్పుడు ఉణుదుర్రు వాసుల ఇళ్లు అక్రమంగా కూలగొట్టడం దారుణం. జీవో నంబర్ 30 ప్రకారం నివసిస్తున్న ప్రాంతంలోనే నిరుపేదలకు ఇంటిపట్టాలు ఇవ్వాలి. – ధనికొండ శ్రీనివాస్, సీపీఎం జిల్లా నాయకుడు -
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతిలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి పెద్ద తిరుపతి దేవస్థానం అధికారులు సోమవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. టీటీడీ ఏఈఓ కె.మోహన్ రాజు, సిబ్బంది ముందుగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలతో ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం శ్రీవారు, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తరువాత ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు వారికి వేద ఆశీర్వచనాన్ని, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా పట్టు వస్త్రాలను స్థానిక దేవస్థానం ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు, సూపరింటెండెంట్ ఐవీ రామారావులకు అందించారు. పెనుమంట్ర: వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (గుంటూరు) పరిశోధన సంచాలకులు డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానంలో రెండు రోజులపాటు జరిగే గోదావరి జిల్లాల మండల పరిశోధన, విస్తరణమండలి సమావేశాలను సోమవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ నానో ఎరువులు, డ్రోన్ టెక్నాలజీ, సేంద్రియ వ్యవసాయం, పోషక విలువలు కలిగిన రకాల అభివృద్ధి, ఎండాకు తెగులు యాజమాన్యం వంటి అంశాలపై పరిశోధనలను విస్తృతం చేయాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలపై ఉందన్నారు. డాక్టర్ జి శివన్నారాయణ, డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మస్తర్ ఒకచోట.. పని మరో చోట
కుక్కునూరు: ఉపాధి హామీ పథకంలో వర్క్ ఆర్డర్ ఇచ్చిన చోట మస్తర్ వేయించుకొని.. పని మరో ప్రదేశంలో చేయించడం స్థానికంగా విమర్శలకు దారి తీసింది. మండలంలోని దాచారం పంచాయతీ, నెమలిపేట గ్రామ సమీపంలో ఎన్ఆర్ఈజీఎస్లో భాగంగా చెరువు పూడికతీత పనిని స్థానిక రైతు వర్సా నాగేశ్వరరావు పేరుమీద వర్క్ ఆర్డర్ను మంజూరు చేశారు. గత రెండు వారాలుగా చెరువు పూడికతీత పనులు నిర్వహిస్తున్నారు. కాని రెండు రోజులుగా చెరువు వద్ద మస్తర్ తీసుకొని పనులు మాత్రం ఆర్అండ్ఆర్ కాలనీలో చేయిస్తున్నారు. అదేంటని అడిగితే ఆర్అండ్ఆర్ కాలనీలో పట్టాల పంపిణీ కార్యక్రమం ఉందని చెట్ల పొదలను తీయించమని ఐటీడీఏ పీఓ ద్వారా వచ్చిన ఆర్డర్ మేరకు కాలనీలో పనిచేస్తున్నట్టు సిబ్బంది తెలిపారు. ఈ విషయమై స్థానిక రైతు, ఉపాధి హామీ కూలీ వర్షా నాగేశ్వరరావు మాట్లాడుతూ, చెరువు పూడిక తీత పనుల్లో మట్టిని పొలాల్లోకి తోలుకుంటామంటే కేసు పెడతామని ఏపీవో హెచ్చరించారని అలాంటిది నిబంధనలకు విరుద్ధంగా ఒకచోట మస్తర్ తీసుకొని మరోచోట పని చేయించడం ఏంటని ప్రశ్నించారు. నిబంధనలు కేవలం సామాన్యులకు మాత్రమేనా అధికారులకు ఉండవా.. వారు పాటించరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా రైతులకు ఉపయోగపడే పనులు మాత్రమే చేయించాలని డిమాండ్ చేశారు. -
ఉపాధి హామీలో అవినీతిని అరికట్టాలి
ఏలూరు (టూటౌన్): ఉపాధి హామీ పథకంలో అవినీతిని అరికట్టాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షుడు వెన్నుపూస రవీంద్రరెడ్డి పిలుపు మేరకు జిల్లా పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షుడు పుప్పాల గోపి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని, కూలీల వేతనాలు చెల్లించాలని సోమవారం కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందించారు. జిల్లాలో ఉపాధి శ్రామికుల వేతనాల బకాయిలు మంజూరు చేయించాలని కోరారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి చిలుకూరి జ్ఞానారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి కోటగిరి రాజా నాయన, రాష్ట్ర పంచాయతీ విభాగం కార్యదర్శి మల్నీడి బాబి, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి నిట్ట గంగరాజు, దెందులూరు జెడ్పీటీసీ నిట్ట లీలా నవకాంతం, పెదపాడు ఎంపీపీ బత్తుల రత్నకుమారి ఏసు రాజు, జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు ద్వంతంశెట్టి సత్యనారాయణ, పోలవరం నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు శ్యామ్బాబు, చింతలపూడి నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు చండీ ప్రియారెడ్డి, సర్పంచ్ పుచ్చకాయల విష్ణు, తమ్మినేని శ్రీనివాసరావు, గౌతు రాము, మిద్దె వెంకటేశ్వరరావు, ఎలిశెట్టి బాబి, గాది రమణ, శ్రీనివాసరావు, ఎంపీటీసీలు పంతుల వెంకన్న బాబు, బండారు నాగరాజు, ఉంగుటూరు విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపతి గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
కొంతేరులో నాటికల పోటీలు
యలమంచిలి: కొంతేరు గ్రామంలోని యూత్ క్లబ్ నాటక పరిషత్ ఆధ్వర్యంలో మే 1, 2, 3 తేదీల్లో 44వ అఖిల భారత స్థాయి నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు యూత్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అంబటి మురళీకృష్ణ, గంటా ముత్యాలరావు (నాయుడు) తెలిపారు. నాటిక పోటీల సావనీర్ సోమవారం యూత్ క్లబ్ నాటక పరిషత్ పాలకవర్గ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూత్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ పులపర్తి వీరాస్వామి యూత్ క్లబ్ కళామందిరం వేదికపై జరిగే ఈ పోటీల్లో మొదటి రోజు ప్రముఖ టీవీ, సినీ నటుడు నిర్మాత ఖండవల్లి అనిల్ ఆర్కాను సన్మానిస్తామన్నారు. మొదటి రోజు మొదటి ప్రదర్శనగా కాకినాడ బీవీకే క్రియేషన్స్ వారిచే తితిక్ష, రెండవ ప్రదర్శనగా గుంటూరు శ్రీ కరణం సురేష్ మెమోరియల్ థియేటర్ వారిచే తరమెల్లిపోతున్నదో నాటికలు ప్రదర్శిస్తారు. రెండవ రోజు మొదటి నాటికగా హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారిచే అమ్మ చెక్కిన బొమ్మ రెండవ ప్రదర్శనగా విజయవాడ హర్ష క్రియేషన్స్ వారిచే భువికోరని భ్రమణం, మూడవ ప్రదర్శనగా యడ్లపాడు మానవత వారిచే అందరూ మంచివారే..కానీ నాటికలు ఉంటాయి. మూడవ రోజు మొదటి ప్రదర్శనగా గుంటూరు అభినయ ఆర్ట్స్ వారిచే ఇది అతని సంతకం, రెండవ ప్రదర్శనగా విశాఖపట్నం చైతన్య కళా స్రవంతి వారిచే అగ్ని సాక్షి నాటికలు ప్రదర్శిస్తారు. ఏలూరు టౌన్: పోలీస్ సిబ్బంది సంక్షేమమే ప్రధాన లక్ష్యమని ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. చాట్రాయి పోలీస్స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మరణించిన వీ.మాధవరెడ్డి సతీమణి సుజాతకు సోమవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ శివకిషోర్ చేతులమీదుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఫ్లాగ్ ఫండ్ రూ.25 వేలు, విడో ఫండ్ రూ.50 వేల చెక్కును ఎస్పీ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాధవరెడ్డి సేవలు ఎనలేనివనీ, ఆయన మరణం పోలీస్ శాఖకు తీరని లోటన్నారు. కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి కారుణ్య నియామకం చేపట్టేందుకు సిఫార్సు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో పోలీస్ ప్రధాన కార్యాలయ బీ సెక్షన్ సూపరింటెండెంట్ పీ.నాగేశ్వరరావు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. -
అంగరంగ వైభవం.. ధ్వజారోహణం
ద్వారకాతిరుమల: సహస్ర నామాలతో భక్తజన నీరాజనాలు అందుకునే చినవెంకన్న బ్రహ్మోత్సవాలకు చరాచర సృష్టిని ఆహ్వానిస్తూ.. సోమవారం రాత్రి నిర్వహించిన ధ్వజారోహణ వేడుక భక్తజన కోటికి కనుల పండువయ్యింది. వైఖానస ఆగమయుక్తంగా ఇంద్రాది అష్టదిక్పాలకులను, భేరీ దేవతలను, గంధర్వ, కిన్నెర, కింపురుషాది దేవగణాలను, సప్త అధోలోక జీవులను స్వాగతిస్తూ లాంఛనంగా వేద మంత్రోచ్ఛరణలతో శ్రీవారి ఆలయ ప్రాకారంలోని ధ్వజస్తంభంపై గరుడపటాన్ని అర్చకులు ఎగురవేశారు. ఉదయం ఆలయంలో ఉత్సవ నిత్యహోమ గ్రామ బలిహరణలు, వేద స్వస్తి, సాయంత్రం రుత్విగ్వరణ, మృద్గ్రహణ, అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రాత్రి హంస వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో స్వామివారి సత్యా కృష్ణుని అలంకారం ఆకట్టుకుంది. శ్రీహరి కళాతోరణ వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. సాయంత్రం ఆలయంలో అంకురార్పణ వేడుక అట్టహాసంగా జరిగింది. బ్రహ్మోత్సవాలకు సర్వదేవతలను ఆహ్వానించే దిశగా గరుడపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసి ధ్వజారోహణను వైభవంగా నిర్వహించారు. అర్చకులు పంపిణీ చేసిన గరుడ ప్రసాదాన్ని సంతానం లేని మహిళలు స్వీకరించారు. ఈ ప్రసాదం తింటే పిల్లలు పుడతారన్నది భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో నేడు ● ఉదయం 7 గంటల నుంచి.. సూర్యప్రభ వాహనంపై గ్రామోత్సవం. ● రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనంపై శ్రీవారి తిరువీధి సేవ ● శ్రీవారి ప్రత్యేక అలంకారం : అహల్య శాపం విమోచనం -
అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి
ఏలూరు (టూటౌన్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సూచించారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్లో జిల్లాస్థాయి పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లలో 203 అర్జీలను స్వీకరించారు. అర్జీలు పెండింగ్లో ఉండకుండా చూడాలని, పరిష్కార ప్రక్రియలో పారదర్శకత ఉండాలని అన్నారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, ట్రైనీ ఐఏఎస్ చింతకింది శ్రావణ్కుమార్రెడ్డి, ఇన్చార్జి డీఆర్వో ఎల్.దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు. సాధారణ పరిస్థితికి చర్యలు జిల్లాలో డీజిల్ సమస్యకు మంగళవారం ఉదయం నాటికి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి చెప్పారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై తీసుకుంటున్న చర్యలను జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్తో కలిసి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం 600 కిలోలీటర్ల వరకు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డీజిల్ సమస్యలు తెలియజేసేందుకు కలెక్టరేట్లో 7569296272 నంబర్తో కంట్రోల్రూమ్ ఏర్పాటుచేశామన్నారు. జిల్లాలో రబీ ధాన్యం రవాణా, ఆక్వా రైతులకు, అత్యవసర వైద్య వాహనాలకు 12 వేల లీటర్ల డీజిల్ అందించామన్నారు. జిల్లా ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ అవసరానికి మించి డీజిల్ కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేసుకుంటే ప్రస్తుత వేసవి దష్ట్యా అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో శాఖా గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్టు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు ఓ ప్రకటనలో తెలిపారు. శిబిరాల్లో పుస్తక పఠనం, కథారచన, పద్యరచన, వక్తృత్వ పోటీలు, చిత్రలేఖనం, కార్టూన్ రూపకల్పన, హస్తకళలు, క్విజ్, సాంస్కృతిక కార్యక్రమాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ, వ్యక్తిత్వ వికాస తరగతులు తదితర అంశాలు చేర్చామన్నారు. అలాగే ప్రాథమిక కంప్యూటర్ అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామన్నారు. ప్రత్యేక కార్యాచర ణ ప్రణాళికలను రూపొందించి పిల్లలు, యు వత అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ద్వారకాతిరుమల: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు సోమవారం ఉదయం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రాళ్లకుంటకి చెందిన గజ్జరపు రంగారావు (60) ఈనెల 25న ఉదయం తన బైక్పై శ్రీవారి దర్శనార్థం ద్వారకాతిరుమల వస్తున్నారు. రాళ్లకుంటలోని సెయింట్ గ్జేవియర్ పాఠశాల వద్దకు వచ్చేసరికి బీపీ పెరిగి బైక్పై నుంచి పడిపోయారు. దీంతో ఆయన తలకు తీవ్రగాయాలు కాగా రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. మృతుడి కుమారుడు రాము ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్టు హెడ్ కానిస్టేబుల్ జి.దుర్గారావు తెలిపారు. దెందులూరు: పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నాలమ్మవారి ఆలయంలో హుండీల ఆ దాయాన్ని సోమవారం లెక్కించారు. దేవదా య శాఖ ఏలూరు డివిజనల్ ఇన్స్పెక్టర్ సురేష్బాబు ఆధ్వర్యంలో లెక్కించగా 33 రోజులకు రూ.8,72,346 సమకూరింది. ఆలయ చైర్మన్ మన్నే శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారి ఎన్.సతీష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. పెనుగొండ : అయోధ్యలంక రావిలంకలో మట్టి, ఇసుక దందాపై వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా మట్టి, ఇసుక రాత్రి వేళ్లల్లో తరలించుకుపోతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ అండతో చెలరేగిపోతున్నారని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వి మర్శించారు. ఆచంట నియోజకవర్గంలోని ఇ సుక ర్యాంపులన్నీ సీఆర్జెడ్ పరిధిలో ఉన్నా తవ్వకాలను అడ్డుకోకపోవడం దారుణమన్నారు. -
బంకుల్లో నో స్టాక్
నో ఆయిల్.. నో స్టాక్.. పెట్రోలు బంకులకు నాలుగువైపులా తాళ్లు కట్టి మరీ ప్రత్యేక ఏర్పాట్లు.. బంకుల ముందు 300 నుంచి 500 మీటర్ల మేర భారీ క్యూలైన్లు.. 10 లీటర్ల డీజిల్, 2 లీటర్ల పెట్రోలు కావాలంటే కనీసం రెండు గంటలు పడిగాపులు అనివార్యం.. ఇక మండలాల్లో అయితే క్యాన్లు పట్టుకుని మరీ అన్నదాతల పడిగాపులు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల డీజిల్ కోసం ఆటోడ్రైవర్లు బారులు తీరిన దృశ్యాలు. ఇది పెట్రోలు, డీజిల్ కొరత పరిస్థితి. ఏలూరు అశోక్నగర్ బంకు వద్ద ఆటోలు సాక్షిప్రతినిధి, ఏలూరు : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ కొరత తారాస్థాయికి చేరింది. రెండు రోజుల నుంచి జిల్లావ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ నిల్వలు గణనీయంగా తగ్గడంతో వాహనదారులు బారులు తీరుతున్నారు. డిమాండ్కు తగినంతగా సప్లయ్ లేకపోవడంతో అన్నదాతలు మొదలు ఆటోడ్రైవర్ల వరకు అందరూ ఇంధన కొరతతో అతలాకుతలమ వుతున్న పరిస్థితి. ఇక ప్రభుత్వం మాత్రం యథావిధిగా కమాండ్ కంట్రోల్ రూమ్లు, ఆకస్మిక తనిఖీ లు, ఆయిల్ డీలర్లతో సమావేశాలు నిర్వహి స్తూ హడావుడి చేస్తోంది తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దలేకపోతోంది. ఏలూరు జిల్లాలో 232, పశ్చిమగోదావరి జిల్లాలో 160 పెట్రోలు బంకులున్నాయి. ఏలూరు జిల్లాలో రోజుకు సగటున 3.65 లక్షల లీటర్ల డీజల్, 2.60 లక్షల లీటర్ల పెట్రోలు, అలాగే పశ్చిమగోదావరిలో 3.50 లక్షల లీటర్ల డీజిల్, సుమారు 2 లక్షల లీటర్ల పెట్రోలు వినియోగిస్తున్నా రు. ద్విచక్రవాహనాలు, కార్లు, సాధారణ గృహావసరాలకే కాకుండా వ్యవసాయం, ఆక్వా, ప్రైవేటు రవాణా ఇలా అన్నింటిలో డీజిల్ వినియోగం అ త్యధికంగా ఉంటుంది. వరి కోతలకు తప్పని వెతలు ప్రధానంగా ఏలూరు జిల్లాలో ధాన్యం రవాణా లారీలకు, కోతల సమయంలో యంత్రాలకు డీజిల్ వినియోగం అధికంగా ఉంది. అలాగే ఆక్వాకు రోజు సగటున ఏలూరు జిల్లాలో 15 నుంచి 20 వేల లీటర్ల డీజిల్ ఏలూరు జిల్లాలో, పశ్చి మలో 30 నుంచి 40 వేల లీటర్ల డీజిల్ అవసరం ఉంది. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి మా ర్కెట్లో డీజిల్ నిల్వలు పూర్తిగా తగ్గిపోవడం, కంపెనీలు అవసరాలకు అనుగుణంగా డీజిల్ సరఫరా చేయకపోవడం అధికారులకు ఆయిల్ కంపెనీలతో సమన్వయలోపం ఉండటం వెరసి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అధికారుల హడావుడి ఏలూరులో కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, పశ్చిమగోదావరిలో కలెక్టర్ సీహెచ్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పెట్రోలు బంకులు తనిఖీలు చేశారు. రెండు జిల్లాల్లో కలెక్టరేట్లో ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి ఫిర్యాదులు ఉంటే ఫోన్ చేయాలని నంబర్లు ప్రకటించారు. అలాగే తహసీల్దార్లు తదితర అధికారులు బంకుల వద్ద పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమలో ఆక్వా సాగు అత్యధికంగా ఉంది. రెండు జిల్లాల్లో కలిపి సగటున 50 వేల లీటర్ల డీజిల్ను ఆక్వా సాగుదారులు ప్రతిరోజూ వినియోగిస్తున్నారు. రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ నింపే ఏరియేటర్లు తిరగటానికి, చెరువులో నీటిని నింపుకునేందుకు మోటార్లు, అలాగే అప్రకటిత కరెంట్ కోతలు ఉన్న సమయంలో జనరేటర్ వినియోగానికి డీజిల్ తప్పనిసరి. దీంతో ఆక్వా రైతులు రెండు జిల్లాల్లో బంకుల వద్ద భారీగా క్యూలు కట్టారు. కొన్నిచోట్ల మాత్రమే రెండు గంటలకుపైగా పడిగాపులు కాస్తే 5 లీటర్ల డీజిల్ ఇస్తున్నారు. వాహనాలకు మాత్రమే ఇంధనం సరఫరా చేయాలని అధికారులు ఆదేశించారని, డబ్బాల్లో ఆయిల్ నింపమని బంకు సి బ్బంది చెబుతున్నారు. దీంతో పాటు ఏ లూరు జిల్లాలో ధాన్యం రవాణా లారీలు, కోతల సమయంలో యంత్రాల వినియోగానికి రోజూ వేల లీటర్ల డీజిల్ అవసరం ఉంటుంది. పూర్తిగా కొరత ఉండటం, అనేకచోట్ల నోస్టాక్ బోర్డులు ఏర్పాటు చేయడం, మండల కేంద్రాల్లో పూర్తిగా నిల్వలు లేక బంకులు నిలిచిపోయిన పరిస్థితుల్లో ఆయిల్ డ బ్బాలతో రైతులు అన్ని బంకులు తిరుగుతుండటం గమనార్హం. పశ్చిమగోదావరిలో రబీ సీజన్ నేపథ్యంలో 2.80 లక్షల ఎకరాల్లో కో తలు జరుగుతున్నాయి. సుమారు 1,675 కో త యంత్రాలకు రోజుకు సగటున లక్ష లీటర్లు డీజిల్ అవసరం. కానీ వందల లీటర్లు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో కోతలపై తీవ్ర ప్రభావం పడింది. ఇంధన వెతలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరత బంకుల వద్ద భారీగా క్యూలైన్లు ఏలూరులో ప్రధాన బంకుల వద్ద అర కిలోమీటర మేర క్యూలైన్లు ధాన్యం కోతలు, రవాణాకు తప్పని డీజిల్ కష్టాలు ఆక్వా రైతులకూ అవే తిప్పలు బంకులు తనిఖీ చేసిన కలెక్టర్లు, ఎస్పీలు ప్రైవేటు రవాణారంగంపై తీవ్ర ప్రభావం -
విద్యుత్ వైర్లు తగిలి ఎండు గడ్డి దగ్ధం
భీమడోలు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ట్రాక్టర్లోని ఎండు గడ్డి పూర్తిగా దగ్ధమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. అంబర్పేట గ్రామం నుంచి దెందులూరు మండలం రామారావుగూడెం వైపుగా రెండున్నర ఎకరాల గడ్డితో వెళ్తున్న ట్రాక్టర్ భీమడోలు శ్రీవేంకటేశ్వర కళాశాల రోడ్డుకు వచ్చేసరికి కిందకు ఉన్న విద్యుత్ వైర్లను తాకడంతో ఒక్కసారి మంటలు రేగి ట్రాక్టర్లోని గడ్డి పూర్తిగా కాలి బూడిదైంది. ట్రాక్టర్ పాక్షికంగా దెబ్బతింది. సుమారు రూ.25వేల ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న భీమడోలు అగ్నిమాపక అధికారి వి.రవికుమార్ ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఏలూరు టౌన్: వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని రాగివైరును చోరీ చేస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్.సుస్మిత వివరాలు వెల్లడించారు. చింతలపూడి గ్రామశివారు ఎన్వీఎన్ కాలనీ సమీపంలోని బొల్లినేని డుండి అనే వ్యక్తి పొలంలో ఈనెల 17వ తేదీ రాత్రి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పగులగొట్టి కాపర్వైరు దొంగతనం చేశారు. దీనిపై 18న చింతలపూడి విద్యుత్ శాఖ ఏఈ పజ్జూరి కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతలపూడి సీఐ టీ.క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఎస్సై కే.సతీష్ కుమార్ కేసు నమోదు చేశారు. ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఏఎస్పీ సుస్మిత పర్యవేక్షణలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి 160 కిలోల రాగి వైరును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చింతలపూడి ఎన్వీఎన్ కాలనీకి చెందిన చుండ్రు అనిల్కుమార్ అలియాస్ సన్నీ, యామర్ల వీరాంజనేయులు అలియాస్ వీరబాబు, బట్టువారిగూడెం కాలనీకి చెందిన అందుగుల వెంకటేశ్వరరావు, లింగపాలెంలో నివాసం ఉంటున్న ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ పా షాతో పాటు మైనర్ బాలుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి చింతలపూడి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కై కలూరు: మద్యం మత్తులో ఏటీఎం పగులగొట్టి దొంగతనానికి యత్నించిన వ్యక్తిని కై కలూరు టౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. టౌన్ సీఐ ఏవీఎస్.రామకృష్ణ, ఎస్సై డి.వెంకట్కుమార్ పోలీసు స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. కై కలూరు మండలం భుబలపట్నంలో వెల్పూరి నాగరాజు రొయ్యల చెరువుపై పనిచేయడానికి అల్లూరి సీతారామరాజు జిల్లా, పెదబయలు మండలం, గుల్లేలా పంచాయతీకి చెందిన వందలం నాగరాజు దాదాపు 3 నెలల క్రితం పనిలో చేరాడు. పని విషయంలో యజమాని తిట్టడంతో ఇంటికి వెళ్లిపోతానని చెప్పారు. ఈ నేపధ్యంలో యజమాని ఈనెల 24న కై కలూరు రైల్వేస్టేషన్లో వందలం నాగరాజును దించాడు. అతడు తెల్లవారుజామున 3 గంటలకు మద్యం మత్తులో కేడీసీసీ ఏటీఎంలో డబ్బులు కోసం వచ్చాడు. ఏటీఎం కార్డు బదులు ఆధార్ కార్డును మిషన్ శ్లాట్లో పెట్టాడు. అది రాలేదు. దీంతో అప్పటికే పగిలి ఉన్న కీబోర్డును గట్టిగా కొట్టడంతో ఊడి వచ్చింది. దీంతో చేతిని గట్టిగా లోపలకి దూర్చి కార్డు కోసం ప్రయత్నించాడు. అదే సమయంలో డబ్బులు ఉంటే తీసుకోడానికి సిద్ధమయ్యాడు. చివరకు అతని వల్ల కాక పారిపోయాడు. దీనిపై బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. -
ఇంధన కొరత తీర్చడంలో విఫలం
కామవరపుకోట: పెట్రోల్, డీజిల్ కొరత తీర్చటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బూటకపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, అమరావతి రాజధాని పేరుతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, ఇప్పుడు డీజిల్, పెట్రోల్ కొరత వల్ల వాహనదారులు, రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. డీజిల్ కొరత వల్ల రవాణా వ్యవస్థ స్తంభించిపోయిందన్నారు. దీంతో నిత్యావసర సరుకులకు సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రబీ సీజన్ కావడం వల్ల పంట కోత మెషీన్లకు, ట్రాక్టర్ల వాడటానికి డీజిల్ లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వెంటనే ఇంధన సరఫరా సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. మండల కన్వీనర్ రాయంకుల సత్యనారాయణ, నానాది సాగర్, భీమిరెడ్డి వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే డీజిల్ కొరత
భీమడోలు: పెట్రోల్, డీజిల్ కొరత కూటమి ప్రభుత్వ వైఫల్యమేనని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. భీమడోలులో సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి సరుకు కొనుగోలుకు క్యూ కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని, యూరియా, గ్యాస్ కోసం ఇప్పటికే ఇబ్బంది పడుతుండగా.. తాజాగా డీజిల్, పెట్రోలు కోసం బారులు తీరాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇదంతా విజన్ ఉన్న చంద్రబాబుకు ముందుగా తెలియదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో క్యూ కట్టకుండా దొరికేది కేవలం మద్యం మాత్రమేనని విమర్శించారు. విజయవాడ నుంచి తిరుపతి వరకు హైవేలపై బంకులన్నీ మూసివేయడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. వరి కోత యంత్రాలు, ఆక్వా రంగాలకు కూడా డీజిల్ సరఫరా చేయకుండా నాలుగు రోజులుగా రైతులు, ప్రజలను మానసిక క్షోభను అనుభవిస్తున్నారన్నా రు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అనాలోచిత విధానాలే ఇందుకు కారణమన్నారు. రవాణా రంగం కుదేలై నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశనంటుతున్నాయన్నారు. గంటల తరబడి పెట్రోలు బంకుల వద్ద ప్రజలు పడిగాపులు పడాల్సి వస్తోందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ రాలేదని, ప్రజావసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు. కూటమి ఫ్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని డీజిల్, పెట్రోలు సరఫరాను సాధారణ స్థాయికి తీసుకురావాలని వాసుబాబు డిమాండ్ చేశారు. -
పల్లెల్లో అనుగృహమెప్పుడో..?
ఇళ్ల మంజూరు 72,059 తొలి రెండేళ్లలో పూర్తయినవి 15 వేలు శ్లాబ్ పూర్తయినవి 1,513 శ్లాబ్ దశకు వచ్చినవి 2,025 పలు దశల్లో నిర్మాణాలు 34,000 గ్రామాల్లో ఇళ్ల మంజూరు నిల్ పట్టణాలకు ఇళ్ల మంజూరు 595 వాటిలో పూర్తయినవి 57 నిర్మాణంలో ఉన్నవి 224 భీమవరం(ప్రకాశం చౌక్): రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పల్లెవాసులకు‘గృహ’యోగం కలగడం లేదు. ప్రభుత్వం గద్దెనెక్కి రెండేళ్లు కావస్తున్నా ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయకపోవడం పేదల సంక్షేమంపై నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దీంతో పేదల సొంతింటి కల సాకారం కావడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు భూమి చొప్పున మంజూరు చేయగా.. వేలాది ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. కొందరికి స్థలాలు మంజూరు కాగా ఇళ్ల నిర్మాణాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఇళ్ల ఊసే ఎత్తడం లేదు. దీంతో అద్దె ఇళ్లలోనే కాలం గడుపుతున్నారు. కొందరు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టినా బిల్లులు రావడం లేదు. నిర్మాణాలకు వేసవి అనుకూలమైనా.. వేసవి కాలం ఇళ్ల నిర్మాణాలకు అనుకూలం. ఏటా జనవరి నుంచి జూన్ వరకు నిర్మాణ పనులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇలాంటి సమయంలో నిర్మాణాలు చేపడదామని ఆలోచిస్తున్న పేదల కు ప్రభుత్వ సాయం మాత్రం అందడం లేదు. దీంతో చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. అక్కడక్కడా కొందరు మాత్రమే అప్పులు చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. చాలా చోట్ల గ్రామాల్లో గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్ల స్థలాలు ఖాళీగానే ఉంటున్నాయి. బెస్మెంట్, దశల వారీగా నిర్మాణాలు చేపట్టినా బిల్లులు వస్తాయో రావో అన్న సందిగ్ధంలో చాలా మంది ఉన్నారు. 595 ఇళ్లు మంజూరు చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా జిల్లాలో పట్టణాలకు 595 ఇళ్లు మా త్రమే మంజూరు చేసింది. వీటిలో 57 ఇళ్లు మా త్రమే పూర్తయ్యాయి. 2014 నుంచి 2019 వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం సెంటు భూమి కూడా పే దలకు ఇవ్వలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నూ ఇళ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం చూపుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు. అప్పట్లో సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేవారికి గృహాలు మంజూరు కూడా అరకొరగానే ఉంది. అది కూడా టీడీపీ నాయకులు, అనుయాయులకే ప్రాధాన్యమిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో గృహయజ్ఞం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల ఇళ్ల నిర్మా ణాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. జగనన్న లేవుట్లు, సొంత స్థలాలు మొత్తంగా సుమారు 70 వేల ఇళ్లు మంజూరు చేయగా వాటిలో 30 వేల నిర్మాణా లు పూర్తయ్యాయి. అధికారం చేపట్టిన తొలి రెండేళ్లలోనే 15 వేల వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేశారు. వేలాది ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లలో సుమారు 6 వేల నిర్మాణా లు ప్రస్తుత చంద్రబాబు పాలనలో పూర్తికాగా.. చంద్రబాబు తన మంత్రులు, అధికారులతో గృహప్రవేశాలు చేయించి వాటిని తానే మంజూరు చేసినట్టు గొప్పులు చెప్పుకుంటున్నారు. యూనిట్ కాస్ట్ పెంచాలి పెరుగుతున్న భవన నిర్మాణ సామగ్రి ధరల దృష్ట్యా ఇంటి యూనిట్ కాస్ట్ పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం యూనిట్ కాస్ట్ రూ.1.80 లక్షలు ఉండగా కనీసం రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెంచాలని స్థలాల లబ్ధిదారులు కోరుతున్నారు. గూడు.. గోడు ఇళ్ల మంజూరు కోసం పేదల ఎదురుచూపులు గ్రామీణ ప్రాంతాలకు ఇళ్ల మంజూరు నిల్ రెండేళ్లలో పట్టణాలకు కేవలం 595 ఇళ్లు మంజూరు వాటిలో నిర్మాణం పూర్తయినవి 57 గృహాలే.. ఇళ్ల నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం -
చినవెంకన్న పెళ్లి కొడుకాయెనే..
● వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు ప్రారంభం ● గజవాహనంపై అట్టహాసంగా శ్రీవారి తిరువీధి సేవ ● ఉదయం 8 గంటల నుంచి భజన కార్యక్రమాలు ● ఉదయం 9 గంటల నుంచి భక్తిరంజని ● రాత్రి 7 గంటల నుంచి అంకురార్పణ, రుత్విగ్వరణ, ధ్వజారోహణం ● రాత్రి 9 గంటల నుంచి హంసవాహనంపై తిరువీధి సేవ ● శ్రీవారి ప్రత్యేక అలంకారం : సత్యా కృష్ణుని అలంకారం ద్వారకాతిరువుల: సర్వాభరణ భూషితుడైన శ్రీవారు పెండ్లి కుమారుడిగా, నుదుటున కల్యాణ తిలకం.. బుగ్గన చుక్కలతో పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు పెండ్లి కుమార్తెలుగా శోభిల్లారు. ద్వారకాతిరుమలలో చినవెంకన్న వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు శ్రీహరి కళాతోరణ వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అర్చకులు ఆలయం నుంచి నిత్య కల్యాణ మండపం వద్దకు తొళక్క వాహనంపై తీసుకెళ్లారు. అక్కడ వేదికపై అలంకరించిన సు వర్ణ సింహాసనంపై శ్రీవారు, అమ్మవార్లను వేంచేపు చేశారు. పండితులు పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేసే వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు. ఈఓ త్రినాథరావు దంపతులు పూలు, పండ్లు సమర్పించారు. అర్చకులు, పండితులకు నూతన వస్త్రాలు అందించారు. శ్రీహరి కళాతోరణం వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలంకరించాయి. రాత్రి గజ వాహనంపై స్వామివారి తిరువీధి సేవ నేత్రపర్వంగా సాగింది. ఆలయ ముఖ మండపంలో స్వామివారి శ్రీ మహావిష్ణువు అలంకారంలో దర్శనమిచ్చారు. -
బెధరగొడుతున్నాయ్
బుట్టాయగూడెం: పేదలపై ధరల దరువు తీవ్ర ప్ర భావం చూపుతోంది. ముఖ్యంగా నిత్యావసర స రుకులు, కూరగాయల ధరల పెరుగుదల భారంగా మారింది. అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడంతో బతికేదెలా అంటూ సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో అధికారమే పరమావధిగా కూటమి నాయకులు ఎడాపెడా హామీలు గుప్పించారు. తీరా అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా వాగ్దానాలు నెరవేర్చకపోవడంతో ఇప్పటికే ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ సమయంలో ధరల బాదుడు వీరికి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకులు ధరలతో సతమతమవుతుండగా.. తాజాగా కూరగాయల ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా యుద్ధ ప్రభావంతో గ్యాస్ సిలిండర్లకు కొరత ఏర్పడగా.. వంటకు కష్టాలు తప్పడం లేదు. సామాన్యులకు వెజ్‘ట్రబుల్స్’ ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్నంటి సా మాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్కసారిగా కూరగాయాల ధరలన్నీ పెరిగిపోయాయి. నాలుగు రోజుల్లో కూరగాయలు ధరలు కిలోకు రూ.30 పైగా పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. కిలో వంకాయలు రూ.30 నుంచి రూ.70కు పెరిగాయి. వారంతపు సంతల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కిలో నిమ్మకాయలు రూ.160, టమాటా రూ.40, చిక్కుడు రూ.140కు విక్రయిస్తున్నారు. కూ రగాయలు రకాన్ని బట్టి రూ.10 నుంచి రూ.30 వ రకు పెరిగినట్టు వినియోగదారులు చెబుతున్నారు. నెత్తిన గుది‘బండ’ పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వద్ద రవాణా అంతరాయాలతో దేశంలో వంట గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఇదే అదనుగా కొందరు గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గృహ వినియోగ సిలిండర్ రూ.2 వేల వరకూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నా గ్రామాల్లో గ్యాస్ కష్టాలు మాత్రం తప్పడం లేదు. ధరలను నియంత్రించడంతో పాటు గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలన్నీ మండిపోతున్నాయి. సామాన్య ప్రజ లు ఏమి కొనాలో? ఏమి తినాలో? తెలియక సతమతమతున్నారు. గత వారం కంటే ప్రస్తుతం కూరగాయల ధరలు కిలో రూ.30కు పైగా పెరిగాయి. ప్రభుత్వం పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు కృషి చేయాలి. – కారం రాఘవ, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ నేత, అలివేరు, బుట్టాయగూడెం మండలం రోజురోజుకూ ధరలు పె రుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాల తీరుతో సామాన్యుడికి తీరని నష్టం కలుగుతోంది. వంట గ్యాస్ కూడా సకాలంలో దొరకని పరిస్థితి నెలకుంది. ఇప్పటికై నా ప్రభుత్వాలు స్పందించి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి – తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, దుద్దుకూరు, బుట్టాయగూడెం మండలంధరల దరువు కూరగాయల ధరలకు రెక్కలు తీరని వంట గ్యాస్ కష్టాలు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశంలో.. సామాన్యుడు బతికేదెలా? -
ప్రాణం తీసిన వేగం
తణుకు అర్బన్: కారు, మోటార్సైకిల్ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తణుకు జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఉండ్రాజవరం మండలం చివటం గ్రామానికి చెందిన అడపా సత్యనారాయణ (48) తణుకులోని ఆసుపత్రిలో తన కుమార్తె ఉండడంతో మోటార్ సైకిల్పై బయలుదేరాడు. జాతీయ రహదారి షర్మిష్ట సెంటర్ వద్ద రోడ్డు దాటుతుండగా విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే ఆయన మృతిచెందారు. ప్రమాదంలో మృతుడు నడుపుతున్న మోటార్ సైకిల్ నుజ్జునుజ్జు కాగా కారు అదుపుతప్పి డివైడర్ ఎక్కింది. తణుకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరిన వేగం జంక్షన్ ప్రాంతంలో వేగ నియంత్రణ నిబంధనలు ఉన్నా ఖమ్మంనకు చెందిన కారు అతి వేగంగా జంక్షన్లో రోడ్డు దాటుతున్న సత్యనారాయణ వాహనాన్ని ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. కారు వేగానికి ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకుంటూ ఏకంగా డివైడర్ ఎక్కి ఆగింది. వేగం కారణంగా నిండు ప్రాణం బలైపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కారు ఢీకొని మోటార్సైక్లిస్టు మృతి -
గిరిజనుల సంస్కృతికి బాట
● పూర్వీకుల నుంచి వస్తున్న బాట పండుగ ● ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్న ఆదివాసీలు బుట్టాయగూడెం: సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా ఆదివాసీ కొండరెడ్లు బాట పండుగను జరుపుకుంటారు. ఇప్పటికే ఈ పండుగలు ప్రారంభం కావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. గిరిజన నృత్యాలతో డోలు కొయ్యల వాయిద్యాలతో గిరిపల్లెలు సందడిగా మారాయి. గిరిజనుల ఆచారం ప్రతి ఏటా వేసవిలో మామిడికాయల కాపు చేతికి వచ్చిన తర్వాత ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. పండుగ జరిగే వరకూ చిన్నపిల్లలతో సహా ఎవ్వరూ కూడా జీడిమామిడి, మామిడి, పనస పండ్లను ముట్టుకోరు. వాటివైపు కన్నెత్తి చూడరు. ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచారం. కొండరెడ్లు బాట పండుగ జరిపిన తర్వాతే మామిడి కాయలు, పనసకాయలు తింటారు. అలాగే కోయతెగలకు చెందిన గిరిజనులు ఉగాది తర్వాత నుంచి మామిడికాయ పండుగను వైభవంగా నిర్వహించిన అనంతరం తినడం సాంప్రదాయంగా వస్తుంది. అయితే ఈ పండుగల్లో ప్రతి ఇంటికీ ఒక కోడి చొప్పున గ్రామంలో ఎన్ని ఇళ్లు ఉంటే అన్ని కోళ్లను కోసి దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. వీటితో పాటు మేకలను కూడా కోసి దేవతలకు నైవేద్యంగా పెట్టి సహపంక్తి భోజనాలు చేస్తారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ కూడా పాల్గొంటారు. బాట పండుగను కన్నారప్పాడు ఉప్పరిల్ల, ముంజులూరు, చింతకొండ, రేపల్లె, రేగులపాడు, తదితర గ్రామాల్లో ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. గిరిజనుల పండుగలను ప్రభుత్వం గుర్తించాలని గిరిజనులు కోరుతున్నారు. గిరిజన సంప్రదాయ పండుగలైన బాట పండుగ, మామిడికాయ పండుగ, చిక్కుడు, పప్పుల పండుగలను ప్రభుత్వం గుర్తించాలి. ఐటీడీఏ ద్వారా ఈ పండుగలను ఘనంగా జరిపించే విధంగా ఏర్పాటు చేయాలి. మా పూర్వీకుల నుంచి వస్తున్న పండుగలను నేటికీ మేము ఆచరిస్తున్నాము. – కొక్కెర భీమరాజు, అలివేరు, బుట్టాయగూడెం మండలం -
పెద్దింట్లమ్మా.. చల్లగా చూడమ్మా
కై కలూరు: రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ ఆదివారం కనిపించింది. పాఠశాలలకు వేసవి సెలవులు వల్ల సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సమీపంలో పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మవారికి వేడి నైవేద్యాలను భక్తులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం విక్రయం, దేవస్థాన గదుల అద్దెలు, అమ్మవారి ఫొటోల విక్రయం, వాహన పూజలు, విరాళాల ద్వారా మొత్తం రూ. 72,492 ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు. ముదినేపల్లి (కై కలూరు): సుబ్రహ్మణ్యేశ్వరా.. శరణు అంటూ భక్తులు ఆర్తీతో వేడుకున్నారు. సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లో వేంచేసియున్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సమీప జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు దేవాలయ ప్రాంగణంలో ఉన్న పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాలను ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారిణి ఆర్.గంగాశ్రీదేవి, ఆలయ చైర్మన్ బొంగు రవికుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. దెందులూరు: పెదవేగి శ్రీ రాట్నాలమ్మ తల్లి ఆలయంలో ఆదివారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. సేవ టికెట్లు, దర్శనం, ప్రసాదాల విక్రయం తదితర సేవల రూపంలో అమ్మవారికి మొత్తం రూ.98,413 ఆదాయం లభించిందని ఆలయ చైర్మన్ మన్నె శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సతీష్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ విడుదల సత్యనారాయణ తెలిపారు. బుట్టాయగూడెం: కామవరం సమీపంలో అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడి దర్శనార్థం ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అలాగే విజయవాడకు చెందిన భక్తులు డప్పు వాయిద్యాల నడుమ నైవేద్యాలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం దూపదీప నైవేద్యాలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ వారితోపాటు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
ప్రపంచ సాహిత్య మహాసభల ప్రోగ్రాం కన్వీనర్గా పార్థసారథి
ఏలూరు (ఆర్ఆర్పేట): శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న 7వ తెలుగు ప్రపంచ సాహిత్య మహాసభలు ప్రోగ్రాం కన్వీనర్గా టీ పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్ కుమార్ పార్థసారథికి నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ 2024, 2025 సంవత్సరాల్లో 48 గంటల పాటు తెలుగు ప్రపంచ సాహిత్య మహాసభలు నిర్వహించిన అనుభవం ఉన్నందున తనను మళ్లీ ప్రోగ్రాం కన్వీనర్గా నియమించారని తెలిపారు. తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తంగా ప్రతిధ్వనింపచేయాలనే మహత్తర సంకల్పంతో జూన్ 6, 7 తేదీల్లో రాజమహేంద్రవరం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో 7వ తెలుగు ప్రపంచ సాహిత్య మహాసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. -
ఎర్రకాలువ జలాశయానికి తూట్లు
జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో ఎర్రకాలువ జలాశయం మరోవైపున తవ్వకాలు జంగారెడ్డిగూడెం: ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. తవ్వేయ్.. తరలించేయ్.. అన్నట్టు ఇష్టానుసారంగా చెరువులు, కాలువ గట్లు, జలాశయాలను తవ్వేస్తున్నారు. మట్టిని తవ్వి కమర్షియల్ లేఅవుట్లకు, ఇటుక బట్టీలకు మట్టిని తరలించి లక్షలాది రూపా యలు దోపిడీ చేస్తున్నారు. వాస్తవానికి మట్టి తరలింపునకు అనుమతులు తీసుకున్నా, కేవలం రైతులు తమ పొలాలను మెరక చేసుకునేందుకు మాత్రమే తరలించాలి. కానీ మట్టి మాఫియా మాత్రం యథేచ్ఛగా కమర్షియల్ వెంచర్లకు మ ట్టిని తరలించేస్తున్నాయి. జంగారెడ్డిగూడెం మండలంలోని ఎర్రకాలువలో జలాశయ గర్భాన్నీ తవ్వేస్తున్నారు. దీంతో జలాశయంలో భారీ గోతులు ఏర్పడి మృత్యుపాశాలుగా మారుతున్నాయి. రేయింబవళ్లు యథేచ్ఛగా తవ్వకాలతో ఎర్రకాలువ జలాశయానికి, పర్యావరణానికి తీవ్ర నష్టం తప్పదని పలువురు అంటున్నారు. తవ్వకాలు ఇంతలా జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. అలాగే మండలంలోని శ్రీనివాసపురం, తిరుమలాపురం, కేతవరం తదితర గ్రామాల్లో చెరువులను తవ్వేసి మట్టిని కొల్లగొడుతున్నారు. కొయ్యలగూడెం మండలంలో బయ్యన్నగూడెం, యర్రంపేట, కనకాద్రిపురం, రాజవరం, గవరవరం, అలాగే జీలుగుమిల్లి మండలంలో కాలువ గట్లు, చెరువుల్లో కూడా మట్టి తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. తాజాగా తాటియాకులగూడెంలోని చెరువుల్లో మట్టిని తవ్వి అక్రమంగా రవాణా చేస్తున్నారు.యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు -
రోడ్డు నిర్మాణంలో నాణ్యత డొల్ల
పాలకొల్లు సెంట్రల్: రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని మంత్రి చెబుతున్నా కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆవ డ్రెయినేజీపై గ్రావెల్ రోడ్డు నిర్మాణంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని పలువురు బాహటంగా విమర్శిస్తున్నారు. మండలంలోని పెదగరువు ప్రాంతంలో ఉన్న ఆవ మీడియం డ్రెయిన్పై రూ.17.69 లక్షల నిధులతో గ్రావెల్ రహదారి నిర్మాణం చేపట్టారు. సహజంగా పుంత రోడ్డు నిర్మాణం చేయాలంటే ముందుగా జంగిల్ (మొక్కలు) శుభ్రం చేయాలి. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు తొలగించకుండానే షట్రు (పెద్ద రాళ్లు) వేసి గ్రావెల్ వేస్తున్నారు. గ్రావెల్ సైతం దాదాపుగా నాలుగు అంగుళాలు మందం వేయాల్సి ఉన్నా నామమాత్రంగా గ్రావెల్ వేసుకుని వెళుతున్నారు. అలాగే రోడ్డు సమానం చేయకుండా ఎత్తు పల్లాలుగా నిర్మాణం చేసుకుని వెళుతున్నారు. దీంతో రోడ్డు నిర్మాణంపై స్థానికులు, రైతులు పెదవి విరుస్తున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ అధికారికి ఫోన్ చేయగా ఆయన అందుబాటులో లేరు. -
వాసవీ మాత.. ఆరాధ్య దేవత
జై వాసవీ.. జైజై వాసవీ స్మరణలు మార్మోగాయి. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అశేష భక్తజనంతో పెనుగొండలో ఆధ్యాత్మిక శోభ వెల్లివెరిసింది. అమ్మవారిని వెండి పల్లకిలో ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామంలోని బజారు రామాలయం నుంచి నగరేశ్వరస్వామి ఆలయం వరకు మహిళలు కలశాలతో ఊరేగారు. అడుగడుగునా భక్తులు నీరాజనాలు అర్పించారు. అనంతరం మూలవిరాట్కు అభిషేకాలు నిర్వహించారు. వాసవీ శాంతిథాంలో విశేష పూజలు, లక్ష కుంకుమార్చనలు జరిగాయి. సాయంత్రం వెండి రథోత్సవం కనులపండువగా జరిగింది. రాష్ట్రంతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ నుంచి వాసవీ మాలధారులు గణపతి, వాసవీ హోమాలు నిర్వహించి మాల విరమణ గావించారు. –పెనుగొండ -
డిమాండ్ ఎక్కువ.. సరఫరా తక్కువ
● 40 శాతం మేరే డీజిల్ సరఫరా ● బంకులపై తీవ్ర ఒత్తిడి ● డీజిల్, పెట్రోల్ కొరతతో ఇక్కట్లు నూజివీడు: బంకుల యజమానులు అడిగినంత డీజిల్ను ఆయిల్కంపెనీలు సరఫరా చేయడం లేదు. 10వేల లీటర్లకు ఇండెంట్ పెడితే కేవలం 4వేల లీటర్లు ఇచ్చి సరిపెట్టేస్తున్నారు. దీంతో డీజిల్ కోసం పెట్రోలు బంకులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ప్రభుత్వ రంగంలోని ఆయిల్ కంపెనీలు అడిగినంత డీజిల్ను ఎందుకు సరఫరా చేయడం లేదని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. మామిడి కోతలు, దాళ్వా వరికోతలు, మొక్కజొన్న నూర్పుడిలు ప్రారంభం కావడంతో ట్రాక్టర్లు, లారీలు, ట్రక్కు వాహనాలు, వరికోత మిషన్లకు డీజిల్ అవసరం నెలకొంది. అంతేగాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనందున ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నుంచి కేటాయించిన రైసుమిల్ వద్దకు తరలించాల్సి ఉండగా డీజిల్ కొరతతో లారీలు కదలడం లేదు. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బంది, ధాన్యం విక్రయించిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పెట్రోలు బంకుల్లో పెట్రోలు లేకపోతే స్పీడ్ పెట్రోలు అంటగట్టేస్తున్నారు. ఇది లీటరుకు రూ.10 ఎక్కువైనప్పటికీ చేసేదేమీ లేక వాహనదారులు పోయించుకుంటున్నారు. డీజిల్, పెట్రోలు కొరతతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పలుచోట్ల బంకుల మూసివేత జిల్లా వ్యాప్తంగా డీజిల్, పెట్రోలు కొరతతో పెట్రోలు బంకుల వద్ద తమ వాహనాలకు డీజిల్, పెట్రోలు కొట్టించేందుకు ప్రజలు బారులు తీరారు. కొన్ని బంకులు అయితే డీజిల్, పెట్రోలు అయిపోవడంతో బంకులనే మూసివేశారు. డీజిల్ కొరత కారణంగా ట్రాక్టర్లు, వరికోత మిషన్లకు డీజిల్ దొరకక వ్యవసాయ పనులు నిలిచిపోయాయి. వరికోత మిషన్ యజమానులు బంకుల వద్దకు క్యాన్లు తీసుకొని వచ్చి డీజిల్ కొట్టమంటే బంకుల నిర్వాహకులు క్యాన్లలో కొట్టేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో వరికోత మిషన్ యజమానులకు, పెట్రోలు బంకు నిర్వాహకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంటోంది. వరికోత మిషన్లను బంకు వద్దకు ఎలా తీసుకురావాలని నిలదీస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 59 పెట్రోలు బంకులుండగా పెట్రోలు వాహనదారులకు ఎంతోకొంత దొరుకుతుండగా డీజిల్ మాత్రం దొరకడం లేదు. దీంతో ఆటో వాలాలు, ట్రక్కు వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, టాక్సీలు, లారీలు, ట్రాక్టర్లు కదలని పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచి డీజిల్ కోసం పదుల సార్లు బంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని వాహనదారులు వాపోతున్నారు. -
ముగిసిన ర్యాపిడ్ చెస్ పోటీలు
ఏలూరు రూరల్: నగరంలోని సత్రంపాడు సిద్ధార్థ విద్యాలయంలో నాల్గో ఏజీసీఓ, ఎంకేపీజే రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చెస్ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్ర నలుమూలల నుంచి 114 మంది చిన్నారులు తరలివచ్చారు. వై.ప్రేమరక్షిత ప్రథమ, కుష్యంత్ ద్వితీయ, సీహెచ్ వివేక్ తృతీయ స్థానంలో నిలిచారు. వీరితో పాటు ప్రతిభ చాటిన కె.ఓంకార్, జి.కృష్ణారెడ్డి, జి.అవ్రహామ్, కె.తిషంకాకోటి, ఎ.అభిరామ్, జి.అనురూప్మోషే, జ్యోతిస్వరూప్లకు నిర్వాహకులు సర్టిఫికెట్లు, షీల్డ్స్ అందజేశారు. విజయ మల్టీస్పెషాలటీ హాస్పటల్ ఎండీ డాక్టర్ కల్పన, చెస్ అకాడమీ డైరెక్టర్ జి.యోహనాన్, ఎంకేపీజే డైరెక్టర్ వై.మహేష్, సెయింట్ ఆన్స్ కళాశాల అధ్యాపకులు కె.అరుణ, జి.స్వరూపరాణి, జి.విజయ్ పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని దుకాణాల్లో పనిచేసే కార్మికులంతా స్వీయగణన నమోదు చేసుకోవాలని ఉప కార్మిక కమిషనర్ పి.శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సో మవారం ఈ కార్యక్రమం చేపట్టాలని కోరారు. కార్మిక సంఘాల నాయకులు తమ సంఘాల్లోని కార్మికులు స్వీయగణనలో నమోదు చేసుకునేలా అవగాహన కలిగించాలని సూచించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చేనెల 6న మహాధర్నా నిర్వహించనున్నట్టు వైఎస్ఆర్టీఏ రాష్ట్ర అధికార ప్రతినిధి గెడ్డం సుధీర్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వడ్లమూడి రామ్మోహన్, పగడాల సాంబశివరావు ప్రకటనలో తెలిపారు. విజయవాడ ధర్నా చౌక్లో ఉదయం 10 గంటలకు మహా ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి 26 జి ల్లాల నుంచి వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొంటున్నారని, ఉపాధ్యాయ ఎ మ్మెల్సీలు టి.కల్పలతరెడ్డి, పి.చంద్రశేఖర్రెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి పాల్గొంటారన్నారు. ధర్నాకు వైఎస్సార్టీఏ మండల, జిల్లా నాయకులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. తక్షణమే పీఆర్సీ కమిషన్ నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న డీఏలను మంజూరు చేయాలని, పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆగిరిపల్లి: త్వరలోనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఏడీఏ భవానీ తెలిపారు. ఆదివారం ‘సాక్షి’లో ‘మొక్కజొన్నకు అందని మద్దతు ధర’ శీర్షికన ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి నివేదికలు పంపించామని, ఆదేశాలు రాగానే ఏర్పాటుచేస్తామని ఏడీఏ భవానీ తెలిపారు. -
డీఏ బకాయిలు విడుదల చేయాలి
పాలకొల్లు సెంట్రల్: ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలను విడుదల చేయాలని మహి ళా, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగుల సంఘం రా ష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్రాజు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీకాంత్రాజు మాట్లాడుతూ పీఆర్సీని ఏర్పాటుచేసి మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటులో సంఘంతో అధికారుల సమన్వయ స మావేశం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశా రు. యాప్ల భారం తగ్గించి ఉదయం, సా యంత్రం సమయాల్లో జూమ్ సమావేశాలు ర ద్దు చేయాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు 62 ఏళ్ల పదవీ విరమణ అమలు చేయాలని కోరారు. డీసీపీఓ, ఐసీపీఎస్, డీఈఓ, బీపీసీలకు బదిలీలు కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస టైం స్కేల్ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ కుమారి, జిల్లా అధ్యక్షుడు జెట్టి సత్యనారాయణ -
అబాసుపాలు
సాక్షి, భీమవరం : ఆపద ఎదురైనప్పుడు ఎవరైనా రక్షణ కోసం చూసేది పోలీసుల వైపే. కాగా జిల్లాలోని పోలీసు లోకల్ బాస్లు కొందరు పాలక పక్షాల నేతలకు కొమ్ముకాస్తూ గుట్టుచప్పుడు కాకుండా తెరవెనుక సెటిల్మెంట్లు, పైరవీలు ఎన్నో చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యేలు, ఇతర నేతల వద్ద మెప్పు కోసం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారంటున్నారు. 2022 ఆగస్టు 5న పాలకొల్లులో టిడ్కో లబ్ధిదారులకు ప్లాట్ల పంపిణీ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై రెండేళ్ల తర్వాత 2024 డిసెంబర్ 13న పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీకి చెందిన 24 మందిపై కేసులు నమోదు చేశారు. కూటమి పాలన వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న వారిని పాలకపక్షం నేతలు పోలీసుల అండతో కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. కక్షతో వైఎస్సార్సీపీ నేతలపై వేధింపులు అత్తిలి ఎంపీపీ ఉప ఎన్నికలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసాన్ని అల్లరి మూకలు ముట్టడించి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు ఎన్నికకు హాజరుకాకుండా అడ్డుకున్నప్పుడు పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారన్న విమర్శలున్నాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తణుకు వై జంక్షన్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద కూటమి నేతల ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వివాదస్పదమైంది. అప్పుడు మొదలైన పోలీస్ పికెటింగ్ కొద్దిరోజుల క్రితం వరకు కొనసాగింది. అత్తిలిలో విగ్రహం ఏర్పాటు ప్రయత్నాలు వివాదస్పదం కావడంతో కొద్దినెలలుగా పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. కూటమి హయాంలో జిల్లాలోని భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాలు కోడిపందేలు, పేకాట తదితర జూదాలకు స్థావరాలకు నిలయంగా మారాయన్న విమర్శలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటున్నారు. తణుకు పోలీసు సర్కిళ్లు వివాదస్పదంగా మారాయి. ఏళ్ల తరబడి కొందరు సర్కిళ్ల పరిధిలో తిష్టవేసి సెటిల్మెంట్లు వ్యవహారాలు నడుపుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. రెండు సర్కిళ్లలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి. జనవరి 25న తణుకు రూరల్ సీఐ, ఎస్సైలు, 27న అత్తిలి ఎస్సై లీవ్పై వెళ్లిపోయారు. రెండు రోజుల వ్యవధిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు సెలవుపై వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఫిబ్రవరిలో తణుకు అర్బన్ సీఐ, ఎస్సైలను ఉన్నతాధికారులు రేంజ్ వీఆర్కు పంపడం గమనార్హం. ఫ్లెక్సీల వివాదాలు, ఇతర ఆరోపణలకు వారిపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆకివీడు సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. దళిత బాలికపై లైంగిక దాడికేసులో భీమవరం పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బాలికకు న్యాయం చేయాల్సింది పోయి నిందితులకు కొమ్ము కాస్తారా? అంటూ మండిపడింది. అధికార పక్షానికి చెందిన నిందితులను రక్షించేందుకు పోలీసులు కేసు వాపసు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారంటూ న్యాయం కోసం బాలిక తల్లి హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. జిల్లా వ్యాప్తంగా బయటపడని ఉదంతాలెన్నో?.నక్కల డ్రెయిన్లో అక్రమ మట్టి తవ్వకాలు అడ్డుకోవాలని ఆచంటకు చెందిన రైతులు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేక వారం క్రితం డ్రెయిన్ వద్ద బైఠాయించారు. స్థానిక కూటమి నేతల ఒత్తిళ్లతో పోలీసులు రైతులను నిర్భంధించి పక్కకు తరలించారు. మరుసటిరోజు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకోసం ముందస్తు అనుమతి తీసుకున్నారు. ఎండ తీవ్రతతో నీడ కోసం టెంట్ ఏర్పాటు చేసుకుంటుండగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అక్రమ తవ్వకాలు అడ్డుకోవడం మాని తమపై జులం ప్రదర్శిస్తున్నారంటూ పోలీసుల తీరు పట్ల రైతులు నిరసన తెలిపారు. పాలక పక్షాల సేవలో పోలీసు అధికారులు నిబంధనలు తుంగలో తొక్కి రెడ్బుక్ రాజ్యాంగం సెటిల్మెంట్లు, పైరవీలతో సరి ఇప్పటికే వీఆర్, సెలవులో పలువురు సీఐలు, ఎస్సైలు చర్చనీయాంశంగా భీమవరం పోలీసులపై హైకోర్టు అక్షింతల వ్యవహారం -
బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
నేడు వరుడు కానున్న శ్రీవారు ద్వారకాతిరుమల: చిన వెంకన్న వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలకు ద్వారకాతిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు వచ్చేనెల 3తో ముగియనున్నాయి. ఆలయాన్ని, పరిసరాలను విద్యుద్దీప తోరణాలతో అలంకరించారు. ఆలయ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన స్వామివారి భారీ విద్యుత్ కటౌట్ చూపరులను ఆకట్టుకుంటోంది. ఉత్సవాలను పురస్కరించుకుని ఇప్పటికే ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లను నిర్మించారు. ప్రతి రోజు ఉదయం, రాత్రి వేళల్లో నిర్వహించే శ్రీవారి తిరువీధి సేవలకు స్వామివారి వాహనాలను ముస్తాబు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదికను సుందరీకరించారు. ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వ అక్స్ అఫీషియో కార్యదర్శి డాక్టర్ ఎం.హరి జవహర్లాల్కు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేయడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని ఆలయ ఈఓ తెలిపారు. -
మొక్కజొన్నకు అందని మద్దతు ధర
ఆగిరిపల్లి: మొక్కజొన్న దిగుబడి ఆశాజనకంగా ఉన్న ప్రభుత్వం మద్దతు లేకపోవడంతో ఆరుగాలం కష్టపడిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం పంట పూర్తిగా కొతకు వచ్చి దిగుబడులు సైతం రైతు చేతికి వచ్చాయి. అయితే ఆశించిన ధర లభించక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ.30 వేల వరకు నష్టం మండలంలో 1,600 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను వేశారు. ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలు దిగుబడి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం సైతం మొక్కజొన్న పంటకు క్వింటాకు రూ.2400 మద్దతు ధర ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు మద్దతు ధర అందని పరిస్థితి. దీంతో దళారులు రూ.1,600 నుంచి రూ.1,700కు మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారు. చేసేది లేక రైతులు ఈ ధరకు అమ్ముకోవడంతో క్వింటాకు రూ.700 నుంచి రూ.800కు నష్టపోతున్నారు. అంటే ఎకరాకు సుమారు రూ.25 నుంచి రూ.30 వేల వరకు నష్టపోతున్నారు. అంతేకాకుండా దళారులు క్వింటా బస్తాకు అదనంగా కేజీ తీసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్వింటాల్ మొక్కజొన్నకు రూ.2,600 వరకు మద్దతు ధర లభించేది. అంతేకాకుండా ప్రతి ఏడాది మద్దతు ధర పెంచుతూ వచ్చింది. దీంతో మొక్కజొన్న సాగు చేసిన రైతులకు నష్టం పోవడం అనే ప్రశ్న ఉండేది కాదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మద్దతు ధర రూ.200 రూపాయలు తగ్గించడంతోపాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని రాష్ట్ర ప్రభుత్వం రైతులను దోచుకుంటున్న దళారులు కిలోకు రూ.700 వరకు నష్టపోతున్నామని ఆవేదన నేను ఐదు ఎకరాల్లో మొక్కజొన్న పంటను వేశాను. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు క్వింటా మొక్కజొన్నను రూ.1500కు కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. దీంతో పంట కోయకుండా వదిలేశాను. – దండిబోయిన వెంకటేశ్వరరావు, రైతు, ఈదులగూడెం మొక్కజొన్న పంటకు శ్రమ, చీడపీడలు ఎక్కువే. పంట చివరి వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో క్వింటాకు రూ.700 వరకు నష్టపోతున్నాం. మద్దతు ధర అందితే రైతులకు లాభం వచ్చేది. – గుజ్జర్లపూడి తిరుపతిరావు, రైతు, చొప్పరమెట్ల -
ఏలూరు మాదేపల్లిలో వ్యక్తి హత్య
పాతకక్షల నేపథ్యంలోనే గొడవ? ఏలూరు టౌన్: ఏలూరు రూరల్ పరిధిలోని మాదేపల్లి రోడ్డు వంకినేని ప్లాట్స్ సమీపంలో శనివారం రాత్రి ఒక వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు రాళ్లతో కొట్టి హతమార్చారు. పదిమందికి పైగా వ్యక్తులు పేకాట ఆడుతూ ఉండగా... వివాదం చెలరేగి ఒక వ్యక్తిని అత్యంత కిరాతకంగా రాళ్లతో కొట్టి చంపారు. సమాచారం అందుకున్న ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, ఏలూరు వన్టౌన్ సీఐ సత్యనారాయణ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. వంకినేని ప్లాట్స్ సమీపంలో రాత్రివేళ పేకాట ఆడుతూ ఉండగా... వివాదం చెలరేగి మాదేపల్లి ప్రాంతానికి చెందిన రాయి నూకరాజు అనే వ్యక్తిని పాలగూడెం ప్రాంతానికి చెందిన సంచర్ల మహేష్, సుంకరవారితోటకు చెందిన సత్తిబాబు అనే ఇద్దరు ఇటుకరాయిలతో తలపై విచక్షణారహితంగా కొట్టి హత్య చేశారు. నిందితుల్లో ఒకరు మహేష్పై పోలీస్ షీట్ ఉన్నట్లు సమాచారం. హత్యకు గురైన నూకరాజుకు భార్య, పిల్లలు ఉండగా, కూలిపనులు చేస్తుంటాడని తెలుస్తోంది. ఏలూరు రూరల్ పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైందని చెబుతున్నారు. ఇంతకీ ఈ హత్యఘటనలో ఇద్దరు మాత్రమే ఉన్నారా ? లేక ఇంకా ఎవరైనా ఉన్నారా ? అనేది పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది. ద్వారకాతిరుమల: మండలంలోని పంగిడిగూడెంకు చెందిన పారా అథ్లెట్ కస్సే పవన్ కుమార్ జాతీయ స్థాయిలో మరో విజయాన్ని సాధించాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) నిర్వహించిన నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఎన్సీఓఈ) పారా అథ్లెటిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అద్భుత ప్రతిభ కనబరిచి శిక్షణకు ఎంపికయ్యాడు. ఖీ46 కేటగిరీలో పాల్గొన్న పవన్ కుమార్ 100 మీటర్లు, 200 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి అంతర్జాతీయ కోచ్లను ఆకట్టుకున్నాడు. అతని ప్రతిభను గుర్తించిన అధికారులు అతనిని ఎన్సీఓఈ శిక్షణకు ఎంపిక చేశారు. ట్రైనింగ్ లిస్ట్ విడుదలైన తరువాత పవన్ కుమార్ గుజరాత్, బెంగళూరు, కేరళ లేదా కోల్కతా లోని ఎస్ఏఐ ఎన్సీఓఈ కేంద్రాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నత స్థాయి శిక్షణ పొందనున్నాడు. పాలకొల్లు సెంట్రల్: ఈ నెల 16వ తేదీన యలమంచిలి మండలం బూరుగుపల్లి గ్రామంలో నూకాలమ్మవారి జాతరలో రౌడీ షీటర్లు, కిరాయి వ్యక్తులు హల్చల్ చేసి కారుతో గుద్ది ఒక వ్యక్తిని హత్యచేసి మరో వ్యక్తిపై హత్యాయత్నం జరిపిన ఘటనలో బోణం గణేష్కుమార్తో పాటు మరో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారి గురించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా శనివారం మరో ఐదుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులను కోర్టు రిమాండ్కు పంపినట్లు రూరల్ సీఐ జి శ్రీనివాస్ తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. దొరికిన ఐదుగురు నిందితుల్లో భీమవరంనకు చెందిన నలుగురు రౌడీషీటర్లు ఉన్నట్లు చెప్పారు. -
డీజిల్ నో స్టాక్
జిల్లా వ్యాప్తంగా ఈనెల 26, 29, 30న, అలాగే మే 7, 8, 9, 13 తేదీల్లో భారీగా వివాహాలు జరగనున్నాయి. ఇప్పటికే పెళ్లివారు వివాహాలు, రిసెప్షన్లు జరుపుకునేందుకు ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకున్నారు. ప్రస్తుతం ఎండ వేడి, ఉక్కబోత తీవ్రంగా ఉండటంతో ఏసీ ఫంక్షన్ హాల్స్కే వారు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పెళ్లి వారి నుంచి ఫంక్షన్ హాల్స్ యజమానులు సెంట్రల్ ఏసీకి గంటకు రూ.2,500 నుంచి రూ.3 వేలు వరకు తీసుకుంటున్నారు. ఫంక్షన్ అయ్యే వరకు జనరేటర్ మీదే సెంట్రల్ ఏసీ పనిచేస్తుంది. అందువల్ల ఇప్పుడు ఫంక్షన్ సజావుగా సాగాలంటే డీజిల్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని ఫంక్షన్ హాల్స్ యజమానులు అంటున్నారు. ద్వారకాతిరుమల: గతంలో ఎన్నడూ లేని పరిస్థితి. డీజిల్ కోసం అన్నదాతలు, ఆక్వా రైతులు, ఆటో కార్మికులు, లారీ డ్రైవర్లు రోడ్డెక్కాల్సిన దుస్థితి. పాలకుల అసమర్థత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అన్నివర్గాల ప్రజలు డీజిల్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొరత లేదంటూ అధికారులు ప్రకటనలు చేస్తున్నా.. కళ్లముందు బంకుల్లో క్యూలు పరిస్థితి అద్దం పడుతోంది. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో శనివారం డీజిల్ నో స్టాక్ బోర్డులే కనిపించాయి. ఉదయం కొన్ని బంకుల్లో డీజిల్ ఉన్నట్టు తెలుసుకున్న రైతులు, వ్యాపారులు, వాహన చోదకులు బారులు తీరారు. డీజిల్ నిల్వ చేసుకునేందుకు డబ్బాలు పట్టుకుని బంకుల వద్ద పడిగాపులు పడ్డారు. కొద్దిసేపటికే బంకుల యజమానులు డీజిల్ లేదంటూ చేతులెత్తేశారు. దాంతో వారంతా నిరాశతో వెనుదిరిగారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే లోడు లారీలు రహదార్లపై భారీగా నిలిచిపోయాయి. ప్రస్తుతం జరిగే వివాహాలపై డీజిల్ ఎఫెక్ట్ పడింది. డీజిల్ కొరత కొనసాగితే ప్రజలకు ఇక్కట్లు తప్పవు. రవాణా నిలిచిపోతే నిత్యావసర సరుకులతో పాటు, ప్రతి వస్తువు ధర రెట్టింపయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అన్ని సరుకులు రవాణా చేసే లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉరుకులు పరుగులు జిల్లా వ్యాప్తంగా జరిగే వేలాది వివాహాల్లో అధిక శాతం వివాహాలు ద్వారకాతిరుమల శ్రీవారి సన్నిధిలోనే జరుగుతాయి. అధిక శాతం ఏసీ కల్యాణమండపాలే ఉన్నాయి. ఆదివారం క్షేత్రంలో భారీగా పెళ్లిళ్లు జరగనున్న నేపధ్యంలో దాదాపు కల్యాణ మండపాలన్నీ ముందే బుక్ అయ్యాయి. శనివారం డీజిల్ కొరత ఏర్పడడంతో ఫంక్షన్ హాల్స్ యజమానులపై పిడుగు పడింది. వెంటనే డీజిల్ కోసం పరుగులు తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొందరు యజమానులు పక్క రాష్ట్రంలోని సత్తుపల్లి నుంచి డీజిల్ను దిగుమతి చేసుకున్నారు. ట్యాంకర్ డీజిల్ను రెండు మూడు రోజుల పాటు జనాలకు సరిపెట్టాలని బంకుల యజమానులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ద్వారకాతిరుమల తహసీల్దార్ జేవీ సుబ్బారావు డీజిల్ను డబ్బాల్లో కొట్టొద్దని, ఒక్కొక్కరికి 10 లీటర్లు మాత్రమే అందించాలని బంకుల యజమానులకు సూచించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే శనివారం సాయంత్రం కొన్ని బంకులకు వచ్చిన ట్యాంకర్లు తక్కువ డీజిల్ను దిగుమతి చేసి వెళ్లిపోయాయి. దాంతో యజమానులు కొద్దిసేపు ఆయిల్ కొట్టి, లాక్ పడిందంటూ చేతులెత్తేశారు. ఇదిలా ఉంటే డబ్బాల్లో ఆయిల్ కొట్టకపోతే తమకు ఇబ్బందులు తప్పవని పలువురు రైతులు అంటున్నారు. ద్వారకాతిరుమల శ్రీవారి కొండపైన మాధవ కల్యాణ మండప సముదాయం గ్యాస్ కొరతకు ప్రత్యామ్నాయం కట్టెలు. కానీ డీజిల్కు ప్రత్యామ్నాయం లేదు. దాంతో డీజిల్ కోసం పరుగులు తీయాల్సి వస్తోంది. ఆదివారం నుంచి ఫంక్షన్లు భారీగా జరుగుతాయి. డీజిల్ లేకపోతే సెంట్రల్ ఏసీలు పనిచేయవు. అలాగే ఫంక్షన్ జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినా ఇబ్బందే. వివాహాలను దృష్టిలో పెట్టుకుని ఫంక్షన్ హాల్స్కు ఎక్కువ డీజిల్ సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – ఓజీఆర్ కుమార్, ఎస్వీఎస్ ఫంక్షన్హాల్ యజమాని, ద్వారకాతిరుమల జిల్లా వ్యాప్తంగా రైతులు, వ్యాపారులు, వాహనదారుల ఇక్కట్లు పెళ్లిళ్లపై తీవ్ర ప్రభావం దిక్కుతోచని స్థితిలో ఫంక్షన్ హాల్స్ యజమానులు -
క్రీడా శిక్షణ శిబిరాలు విజయవంతం చేయాలి
ఏలూరు రూరల్ : మే 1 నుంచి 31 వరకూ జిల్లాలో చేపట్టనున్న 60 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు విజయవంతం చేయాలని సెట్వెల్ సీఈఓ కేఎస్ ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఆట స్థలాలను పరిశీలించారు. అనంతరం డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్ ఆధ్వర్యంలో జిల్లా స్కూల్గేమ్స్ సెక్రటరీ అలివేలుతో పాటు పలువురు వ్యాయామ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. నెల రోజుల పాటు సాగే క్రీడా శిక్షణ శిబిరాల్లో పాల్గొనే బాలబాలికలకు ఆటలపై ఆసక్తి పెంచాలన్నారు. ఉదయం 6 నుంచి 8 వరకూ, సాయంత్రం 5 నుంచి 7.30 నిమషాల వరకూ శిక్షణ కొనసాగుతుందన్నారు. ఇందులో 8 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపు బాలబాలికలకు శిక్షణ ఇచ్చి, ప్రతిభ గలవారిని గుర్తించి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాల పిల్లలను శిబిరాలకు తరలివచ్చేలా కృషి చేయాలన్నారు. -
దేవస్థానం అన్నప్రసాదంలో పురుగు
జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అందిస్తున్న అన్నప్రసాదంలో పురుగు రావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్న ఓ చిన్నారి భోజనంలో పురుగు రాగా తండ్రికి చూపించింది. దీంతో వెంటనే ఆ విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లగా ప్లేటులో ఉన్న అన్నం పడేసి రండి... మళ్లీ పెడతామంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని చిన్నారి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చిన్నారి తండ్రి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. ఆలయ ఈఓ చిన్నారి తండ్రికి ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పోలీస్స్టేషన్లో పెట్టి కుమ్మించేస్తానని.. కేసులు బనాయిస్తానని ఈఓ బెదిరించినట్లు చెప్పారు. జరిగిన తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి ఆలయ సిబ్బంది, ఈఓ కూడా దురుసుగా వ్యవహరించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఈ ఘటనపై ఆలయ ఈఓ కలగరశ్రీనివాస్ను వివరణ కోరగా అదంతా ఒట్టిదేనని.. అలాంటిదేమి జరగలేదని తెలిపారు. -
మద్దతు ధర చట్టం చేయాలి
జంగారెడ్డిగూడెం: పంట రుణాలను పూర్తిగా రద్దు చేసి, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకువచ్చినపుడే రైతులు సంక్షోభం నుంచి బయటపడతారని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా ఉద్దరాజు రామం మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలోని సూర్య కిరణ్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. జూన్ 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరగనున్న రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు అశోక్ ధావలేకు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఆగిరిపల్లి: మండలంలోని నెక్కలం గొల్లగూడెంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను డీసీఎం వాహనం ఢీకొనడంతో ఒక యువకుడు మృతి చెందగా, మరొక యువకునికి గాయాలయ్యాయి. ఎస్సై శుభశేఖర్ తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన పిన్నిబోయిన హరికృష్ణ (18) ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. శనివారం మధ్యాహ్నం అడ్డరోడ్డు నుంచి తన ద్విచక్ర వాహనంపై తన మిత్రుడితో కలిసి ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హరికృష్ణని చికిత్స కోసం విజయవాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తండ్రి పంగిడియ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై శుభశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లీబిడ్డ ఆరోగ్యానికి ప్రాధాన్యం
కై కలూరు : ఆరేళ్ల లోపు పిల్లల మెదడును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం అందరి బాధ్యతని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. పోషణ పక్వాడా ముగింపు కార్యక్రమం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మండల పరిషత్ మీటింగ్ హాలులో శనివారం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటే సమాజం బాగుంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్రావు, ఆర్డీవో కిశోరు, ఐసీడీఎస్ అధికారి పి.శారద తదితరులు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దారు కార్యాలయంలో ఎన్ఆర్ఈజీఎస్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, మత్స్యశాఖ అధికారులలో కలెక్టరు సమీక్ష నిర్వహించారు. ఆక్వా వాహనాలను రోడ్లపై పెట్టి నీటిని వదలడంతో రోడ్లు పాడవుతున్నాయని ఎమ్మెల్యే కలెక్టర్కు చెప్పారు. దీంతో ఆమె నాలుగు మండలాల రెవెన్యూ, ఫిషరీస్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు మీటింగ్ పెట్టి వాహనదారులకు అవగాహన కలిగించాలన్నారు. సుఖ ప్రసవాలకు ప్రాధాన్యం అన్ని డెలివరీలు ప్రభుత్వ హాస్పిటల్లో జరగాలని, సుఖప్రసవాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. కై కలూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టరు శనివారం తనిఖీ చేశారు. 50 పడకల హాస్పటల్లో పనిచేసే వారి వివరాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటరు ప్రగతి సూచిక బోర్డులను పరిశీలించి వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. హాస్పిటల్లో స్కానింగ్ సెంటర్, రేడియాలజిస్ట్ పోస్టు, వైద్యుడి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. -
భక్తులతో పోటెత్తిన ద్వారకాతిరుమల
ద్వారకాతిరుమల: సదా వేంకటేశం.. స్మరామి.. స్మరామి అంటూ శ్రీవారిని భక్త జనం మనసారా కొలిచింది. చిన్నతిరుపతిగా పేరొందిన ద్వారకాతిరుమల క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ వేసవి సెలవులు కావడంతో వేలాది మంది భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూకాంప్లెక్స్, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, ఉచిత ప్రసాద వితరణ క్యూలైన్లు, తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో కిక్కిరిసాయి. పలు భజన మండలి సభ్యులు అనివేటి మండపంలో ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. -
రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక
భీమవరం: ఈనెల 28 నుంచి మూడు రోజులపాటు అనంతపురంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు విష్ణు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ముగ్గురు ఎంపికయ్యారని కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావు చెప్పారు. తాడేపల్లిగూడెంలో ఈనెల 23న జరిగిన ఎంపిక పోటీల్లో తమ విద్యార్థులు ఎన్ శ్రీమాన్సాత్విక్, డి లీలాప్రవీణ్నాయక్, డి సత్యదేవిశ్రీసంతోష్ ప్రతిభ కనబరిచి జిల్లా టీమ్కు ఎంపికయ్యారన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రిన్సిపాల్ ఎం.వేణు, వైస్ ప్రిన్సిపాల్ ఎం.శ్రీలక్ష్మి, పీడీ శ్రీనివాసరావు అభినందించారు. -
ఉపాధ్యాయుల మహాధర్నా
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించే వరకూ పోరాటం కొనసాగిస్తామని పీఆర్ఆటీయూ ఏలూరు జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం విజయవాడ ధర్నా చౌక్లో శనివారం పీఆర్టీయూ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిటీని తక్షణం నియమించాలని, 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను ప్రకటించాలని, సీపీఎస్ను రద్దు చేయాలని, ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని, ఈహెచ్ఎస్ (హెల్త్ కార్డ్స్) వినియోగంలో లోపాలను సరిచేసి అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో అన్ని వ్యాధులకు వర్తించేలా చూడాలని, 1998, 2008 ఎంటీఎస్ టీచర్లను క్రమబద్ధీకరణ చేయాలన్న ముఖ్యమైన 27 డిమాండ్ల సాధనకై ధర్నా చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఏలూరు (ఆర్ఆర్పేట): వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ ఒక ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈనెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించిందని, అయినప్పటికీ కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఈ సెలవుల కాలంలో కూడా తరగతులు నిర్వహిస్తున్నట్టు అధికారుల దృష్టికి సమాచారం అందిందన్నారు. వేసవి సెలవుల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలను నిర్వహించడం గాని, విద్యార్థులకు తరగతులు నిర్వహించడం గాని పూర్తిగా నిషేధించినట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించిన పక్షంలో పాఠశాలల గుర్తింపు రద్దు సహా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
ప్రశాంతంగా పాలిసెట్
ఏలూరు (ఆర్ఆర్పేట): పాలిసెట్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని ఏలూరు జిల్లా కోఆర్డినేటర్ పీ.సుబ్రహ్మణ్యం తెలిపారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జిల్లాలోని ఏలూరులో 9 కేంద్రాలతో పాటు జంగారెడ్డిగూడెంలో మూడు, నూజివీడులో మరో మూడు కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. ఏలూరులోని 9 కేంద్రాల్లో మొత్తం 3248 మంది విద్యార్థులకు గాను 2905 మంది హాజరయ్యారు. జంగారెడ్డిగూడెంలోని 3 పరీక్షా కేంద్రాల్లో 1272 మందికి 1149 మంది విద్యార్థులు హాజరు కాగా, నూజివీడులోని మూడు కేంద్రాల్లో మొత్తం 835 మంది విద్యార్థులకు 765 మంది విద్యార్థులు హాజరయ్యారు. జంగారెడ్డిగూడెం: పట్టణంలోని ఏలూరు రోడ్డు మహేంద్ర ట్రాక్టర్ షోరూం వద్ద 7 అడుగుల గోధుమ త్రాచుపామును గుర్తించారు. వెంకటేశ్వర ఇంజనీరింగ్ వర్క్ షాప్ దగ్గర స్క్రాప్ తీస్తుండగా రేకు కింద పాము ఉండటాన్ని గమనించి స్నేక్ సేవియర్స్ సొసైటీకి సమాచారం అందించారు. సంస్థ ప్రతినిధి చదలవాడ క్రాంతి అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఏలూరు రూరల్ : మే 5, 6 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఆవరణలో రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్, ఉమెన్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 29న ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు చేపట్టనున్నామని వివరించారు. ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటిన అథ్లెట్లను జిల్లా జట్లకు ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఆసక్తి గలవారు రూ.100 ఎంట్రీ ఫీజు చెల్లించి ఆధార్, వయస్సు ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 6.30 గంటలకు హాజరుకావాలని సూచించారు. మరింత సమాచారం కోసం 6281431202 నెంబర్కు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు. బుట్టాయగూడెం: జిల్లాలోని కేఆర్పురం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి బ్యాక్లాగ్ సీట్లకు, ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశం కోసం గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటీడీఏ పీఓ కె. రాములు నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బుట్టాయగూడెం మండలం కేఆర్పురం బాలుర గురుకుల పాఠశాల, బుట్టాయగూడెం గురుకుల పాఠశాల, జీలుగుమిల్లి బాలుర గురుకుల పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు బ్యాక్లాగ్ సీట్లను ప్రవేశ పరీక్ష మెరిట్ మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 22 నుంచి మే 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జూన్ 15వ తేదీన సంబంధిత పాఠశాలల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులై ఉండాలి. భీమవరం(ప్రకాశంచౌక్) : దేవదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన ఆలయాలు, సత్రాలకు సంబంధించిన భూములను పరిరక్షించుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్వి రమేష్బాబు తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఆలయాల ఈవోలతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు సంబందించి 700 ఎకరాల రికార్డులు పరిశీలించామని, దీనిపై సంబందిత ఈవోలు నివేదికలు సిద్ధం చేశారని తెలిపారు. తన పరిధిలోని 7 జిల్లాలకు సంబంధించి దేవాలయాల ఆస్తుల నివేదికలు సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు. -
ఉపాధి హామీ అమలులో విఫలం
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కూలీల జీవనంపై దెబ్బకొడుతోందని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ వింగ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు పుప్పాల గోపి ఆరోపించారు. శనివారం ఏలూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి జ్ఞానారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కోటగిరి రాజా నాయనతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి అవినీతిపై ఉన్న శ్రద్ధ కూలీలకు వేతనాలు చెల్లించటం లేదన్నారు. 2025 డిసెంబర్ నుంచీ రాష్ట్రంలో ఏకంగా రూ.1000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని విమర్శించారు. ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు మండుటెండలో కనీసం మంచినీరు ఇవ్వలేని స్థితిలో ఈ దద్దమ్మ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మారిన వెంటనే కూటమి నేతలు తమకు అనుకూలమైన ఎఫ్ఏలను నియమించుకుని, ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. నకిలీ మస్తర్లు, బినామీ కూలీలతో అవినీతి దందా సాగుతుందని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 27న వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం నాయకత్వంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉపాధి కూలీల సమస్యలు, అవినీతి, బకాయిల విడుదలపై ధర్నా చేపడతామని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ కార్యదర్శి చిన్న అనిల్కుమార్, ఎంపీటీసీ సభ్యులు పంతులు వెంకన్నబాబు, వార్డు సభ్యులు రామయ్య తదితరులు ఉన్నారు. వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ జిల్లా అధ్యక్షుడు పుప్పాల గోపి -
ఆగని మట్టి దోపిడీ
కొయ్యలగూడెం: అధికార గణం చేతులెత్తేయడంతో మట్టి దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ఎర్రంపేట శరత్ చంద్ర చెరువు నుంచి మట్టి అక్రమ రవాణా 8వ రోజైనా శనివారం కూడా కొనసాగింది. భారీగా టిప్పర్లను ఏర్పాటు చేసి ఇటుక బట్టిలకు సాగునీటి చెరువు మట్టిని తరలించారు. దీంతో ఎర్రంపేట, ఆరిపాటి గ్రామాల మధ్య అంతంతమాత్రంగా ఉన్న రహదారి ఛిద్రమైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మట్టి అక్రమ రవాణా నిరోధించాలని ప్రజలు కోరుతున్నారు. కై కలూరు: ఆటపాక పక్షుల విహార కేంద్రంలో సంచరిస్తున్న మైనర్ ప్రేమజంటకు ఐసీడీఎస్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కై కలూరుకు చెందిన ఇంటర్ చదువుతున్న బాలిక, ఇదే గ్రామానికి చెందిన యువకుడు (19) ఆటపాక పక్షుల విహార కేంద్రంలో సంచరిస్తుండగా జిల్లా ఐసీడీఎస్ పీడీ పీ.శారద వారిని చూసి ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా పీడీ శారద మాట్లాడుతూ నిర్మానుష్య ప్రదేశాలలో జంటలు ఎవరైనా కనిపిస్తే 181 లేక 1098 టోల్ ఫ్రీ నెంబర్లకు తెలియజేయాలని కోరారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సీహెచ్.సూర్యచక్రవేణి, మిషన్ కోఆర్డినేటర్ ఈ. తులసి, కై కలూరు సీడీపీవో దీప్తి, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా ఈ ఘటనపై అటవీశాఖ రేంజర్ కె.రామలింగాచార్యులను వివరణ కోరగా పర్యాటకుల పేరుతో టిక్కెట్లు తీసుకుని లోపలకి వెళుతున్నారని, వారి మధ్య అనుబంధం తెలీయడం లేదన్నారు. ఇకపై సిబ్బందితో నిఘాను పటిష్టం చేస్తామన్నారు. భీమవరం: నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో గైనకాలజిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ పొన్నమండ వెంకట మహాలక్ష్మి (40) శుక్రవారం రాత్రి భీమవరం పట్టణంలోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై రహమాన్ చెప్పారు. గుంటూరుకు చెందిన పి విజయలక్ష్మి కుమార్తె వెంకట మహాలక్ష్మికి రాజమహేంద్రవరానికి చెందిన పొన్నమండ చంద్రశేఖర్తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. వెంకట మహాలక్ష్మి నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తుండగా చంద్రశేఖర్ భీమవరం టూటౌన్ పరిధిలో సొంతంగా ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. అయితే శుక్రవారం రాత్రి 1 గంట సమయంలో వారు నివాసముంటున్న ఇంటిలో ఆమె ఉరివేసుకోగా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందింది. తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రహమాన్ చెప్పారు. డాక్టర్ వెంకట మహాలక్ష్మి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
మెట్టలో జల సంక్షోభం
చింతలపూడి: జిల్లాలోని మెట్ట ప్రాంతంలో వేసవి పూర్తిగా మొదలవ్వకముందే నీటి కష్టాలు మొదలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భూగర్భ జల మట్టాలు పడిపోయాయి. జలవనరులు అడుగంటిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతుంటే, ఇటు పశువుల దాహం తీర్చేందుకు గుక్కెడు నీరు దొరకని పరిస్థితి ఏర్పడేలా ఉంది. నియోజకవర్గ పరిధిలో దాదాపు 450కి పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. సాధారణంగా ఈ సమయంలో కళకళలాడాల్సిన ఈ వనరులు ఇప్పుడు ఎడారిని తలపిస్తున్నాయి. వేలాది ఎకరాలకు జీవనాడి అయిన ఆంధ్ర కాలువ, ఎరక్రా లువలు పూర్తిగా ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బోర్లలో నీరు పడిపోవడంతో రైతులు భారీగా పెట్టుబడులు పెట్టిన తోటలు, పంటలు కళ్లముందే ఎండిపోయే పరిస్ధితి ఏర్పడింది. పశువుల పరిస్థితి మరీ ఘోరం రైతుకు చేదోడు వాదోడుగా ఉండే పశుగ్రాసం, పశువుల తాగునీటి సమస్య ఇప్పుడు జటిలంగా మారింది. చెరువులు, కుంటల్లో నీరు లేకపోవడంతో మూగజీవాలు దాహంతో అలమటిస్తున్నాయి. పశువుల దాహం ఎలా తీర్చాలనేది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అతిపెద్ద ప్రశ్నగా మారింది. మెట్ట ప్రాంత ప్రజల కష్టాలను తీర్చడానికి తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మెట్ట ప్రాంతానికి శాశ్వత పరిష్కారం చూపే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఇది పూర్తయితేనే వేలాది ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందుతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావస్తున్నా చింతలపూడి పథకం వైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. అడుగంటుతున్న భూగర్భ జలాలు చెరువుల్లో నీరు ఎండి పోవడంతో ప్రభుత్వం పశువుల తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. చెరువుల సమగ్ర సర్వే చేపట్టి ఆక్రమణలో ఉన్న చెరువులకు విముక్తి కలిగించాలి. ఉపాధి హామీ నిధులతో చెరువుల పూడికను పూర్తి స్థాయిలో తీయిస్తే వర్షాకాలంలో చెరువుల్లో నీరు నిల్వ చేసుకోవచ్చు. – ఖాదర్బాబు రెడ్డి, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరించాలి. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలను మళ్ళించాలి. రైతులకు శాశ్వత సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలి. –కంభం విజయరాజు, వైఎస్సార్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి -
రేపటి నుంచి బ్రహ్మోత్సవ వైభవం
● 30న రాత్రి తిరుకల్యాణం, మే 1న రాత్రి రథోత్సవం ● రోజుకో ప్రత్యేక అలంకారంలో శ్రీవారి దర్శనం ద్వారకాతిరుమల: చిన్నతిరుపతిలో జరిగే బ్రహ్మోత్సవాలు ఇలలో ఓ అద్భుతం.. బ్రహ్మోత్సవాలను ఈనెల 26 నుంచి వచ్చేనెల 3 వరకు ద్వారకాతిరుమల దేవస్థానం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది. ఏటా వైశాఖ మాసంలో వెలసిన స్వామికి, ఆశ్వయుజ మాసంలో ప్రతిష్ఠ స్వామికి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నెల 26 నుంచి శ్రీవారి వైశాఖమాస బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. స్వామివారు ఉభయ దేవేరులతో కలసి ఉదయం, సాయంత్రం వేళల్లో పలు వాహనాలపై తిరువీధుల్లో విహరించనున్నారు. రోజుకో విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. శ్రీహరి కళాతోరణ వేదికపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఉత్సవ విశేషాలు ● ఈ నెల 26న ఉదయం 10.30 గంటలకు శ్రీవారిని పెండ్లికుమారుడిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేసి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. రాత్రి 7 గంటల నుంచి గజ వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. ● 27న రాత్రి 7 గంటల నుంచి అంకురారోపణ, ధ్వజారోహణ, అనంతరం రాత్రి 9 గంటల నుంచి హంస వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. ● 28న ఉదయం 7 గంటల నుంచి సూర్యప్రభ, రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనాలపై గ్రామోత్సవాలు జరుగుతాయి. ● 29న ఉదయం 7 గంటల నుంచి హనుమద్వాహనంపై గ్రామోత్సవం, రాత్రి 7.30 గంటల నుంచి ఎదుర్కోలు ఉత్సవం, అనంతరం వెండి శేష వాహనంపై శ్రీవారి గ్రామోత్సవం జరుగుతుంది. ● 30న రాత్రి 8 గంటల నుంచి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం, అదే రోజు ఉదయం 7 గంటల నుంచి సింహ వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. ● మే 1న రాత్రి 8 గంటల నుంచి క్షేత్ర పురవీధుల్లో రథోత్సవం జరుగుతుంది. ● 2న ఉదయం 9 గంటల నుంచి చక్రవారి–అపభృధోత్సవం, మధ్యాహ్నం 3 గంటల నుంచి వేద సభ, రాత్రి 9 గంటల నుంచి పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజావరోహణ, అనంతరం అశ్వ వాహనంపై శ్రీవారి గ్రామోత్సవం జరుగుతుంది. ● 3న ఉదయం 9 గంటల నుంచి చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటల నుంచి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగము–పవళింపుసేవ కార్యక్రమాలతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి. పూర్తయిన ఏర్పాట్లు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి వాహనాలను సిబ్బంది ముస్తాబు చేస్తున్నారు. చలువ పందిళ్లు నిర్మించారు. రాజగోపురాలు, పరిసరాలకు విద్యుద్దీప అలంకారాలు చేశారు. రూ. 29 కోట్లతో నిర్మించిన అనివేటి మండప విస్తరణ, శాశ్వత క్యూ కాంప్లెక్స్, శివాలయం రాజగోపురాన్ని ఈ నెల 30 న ప్రారంభించనున్నారు. ఈనెల 26న శ్రీ మహావిష్ణువు అలంకారం 27న సత్యా కృష్ణుడి అలంకారం 28న అహల్య శాపం విమోచన అలంకారం 29న శ్రీనివాస కల్యాణం అలంకారం 30న మోహిని అలంకారం మే 1న శ్రీ కూర్మ అలంకారం 2న నవనీత కృష్ణ అలంకారం 3న శయన మహావిష్ణువు అలంకారం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉత్సవాల్లో పాల్గొనే సామాన్య భక్తుల నుంచి వీవీఐపీల వరకు అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. 30న శ్రీవారి కల్యాణం, మే 1న రథోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తాం. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 26 నుంచి, వచ్చేనెల 3 వరకు నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నాం. – వేండ్ర త్రినాథరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ -
పాలిసెట్కు సర్వం సిద్ధం
● నేడు జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాల్లో పరీక్ష ● పరీక్షలు రాయనున్న 5278 మంది విద్యార్థులు ఏలూరు(ఆర్ఆర్పేట): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ పరీక్ష జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షల నిమిత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. పరీక్ష ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో సమీక్షించి సౌకర్యాల కల్పనపై ఆదేశాలు జారీ చేశారు. ఏలూరులోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, సీఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏ, బీ సెంటర్లు, సీఆర్ఆర్ జూనియర్ మహిళా కళాశాల, డిగ్రీ మహిళా కళాశాల, సీఆర్ఆర్ అటానమస్ కళాశాల, సీఆర్ఆర్ ఇంటర్మీడియట్ బ్లాక్, సీఆర్ఆర్ పబ్లిక్ స్కూల్, ఏలూరులోని సెయింట్ థెరిస్సా అటానమస్ కళాశాల ఉన్నాయి. వీటితో పాటు జంగారెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, సూర్య జూనియర్ కళాశాల, శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్, నూజివీడులోని ఎస్ఆర్ఆర్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఈ పరీక్షలకు మొత్తం 5,278 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు అధికారులు తెలిపారు. వీరిలో ఏలూరులోని 9 పరీక్షా కేంద్రాల్లో 3,183 మంది విద్యార్థులు ఉండగా, జంగారెడ్డిగూడెంలోని 3 పరీక్షా కేంద్రాల్లో 1,270 మంది రాయనున్నారు. నూజివీడులోని మరో మూడు పరీక్షా కేంద్రాల్లో 825 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అన్ని శాఖల సమన్వయంతో పరీక్షలు ఈ పరీక్షలను అన్ని శాఖల సమన్వయంతో నిర్వహించడానికి జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పోలీసు, ట్రెజరీ, వైద్య ఆరోగ్య శాఖలతో పాటు విద్య, విద్యుత్, రెవెన్యూ, ఆర్టీసీ శాఖలు సమయ్వనం చేసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద రక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రాథమిక చికిత్సకు శిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు. దీనితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్గా వ్యవహరించడానికి మండల విద్యాశాఖాధికారులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులు పరీక్షా సమయానికి అందుకునేలా తగిన బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఈ పాలిసెట్ పరీక్షలకు కూడా ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉంది. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించం. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష జరుగుతుంది. ఉదయం 10 గంటల లోపు విద్యార్థులంతా పరీక్షా కేంద్రంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. పీ. సుబ్రహ్మణ్యం, పాలిసెట్ ఏలూరు జిల్లా కో–ఆర్డినేటర్ -
చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు
కుక్కునూరు: విద్యుత్ కోతలతో పోలవరం నియోజకవర్గ రైతులు అల్లాడుతున్నా చంద్రబాబుకు చీమకుట్టినట్టు లేదని పోలవరం వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి తెల్లం బాలరాజు విమర్శించారు. శుక్రవారం కుక్కునూరు పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు తాండ్ర రాజేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బాలరాజు మాట్లాడారు. విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విద్యుత్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు కట్ చేస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తాము పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర అందక కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలనలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర అందించడంతో పాటు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకుందని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. పత్తి, మొక్కజొన్న, పొగాకు పంటలకు సరైన మద్దతు ధర అందక రైతులు ఇబ్బంది పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మేల్కొని రైతులకు మంచి చేసేలా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ సరఫరాను సక్రమంగా అందించాలని, రైతులు పండించిన ఇతర పంటలకు మద్దతు ధర అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మండల ఉపాధ్యక్షుడు రాయి సత్యనారాయణ, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గాడిద రాంబాబు, వైస్ ఎంపీపీ గాడిద రామచంద్రం, మండల యువజన విభాగం అధ్యక్షుడు చేకూరి నవీన్ వర్మ, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ మల్లెల చంటి నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
షార్ట్ సర్క్యూట్తో లారీ దగ్ధం
ఏలూరు – జంగారెడ్డిగూడెం రోడ్డు పుట్లగట్లగూడెం సమీపంలోని లారీ ఇంజిన్లో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. 8లో uఏలూరు (ఆర్ఆర్పేట): ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరంలో వివిధ తరగతుల్లో ప్రవేశాల నిమిత్తం జరిగే ప్రవేశ పరీక్షలు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో జరిగాయి. నగరంలోని 6 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకూ నిర్వహించారు. 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు జరిగిన పరీక్షకు 901 మందికి 714 మంది హాజరయ్యారు. గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఆర్జేసీ పరీక్షకు 1604 మందికి 1440 మంది హాజరు కాగా 164 మంది గైర్హాజరయ్యారు. గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఆర్జేసీ సెట్ పరీక్షకు 26 మందికి 23 మంది హాజరు కాగా ముగ్గురు గైర్హాజరయ్యారు. -
అటు కొరత.. ఇటు కోత
● ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే చందాన ఆక్వా రైతుల పరిస్థితి ● వేధిస్తున్న విద్యుత్ కోత, డీజిల్ కొరత భీమవరం: ఆక్వా రంగాన్ని అందలమెక్కిస్తాం... రైతులను ఆదుకుంటామంటూ గొప్పగా చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వ పాలనలో విద్యుత్ కోతలు, డీజిల్ కొరతతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో రాష్ట్రంలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ఆక్వా రంగంపై మరింత ప్రభావం చూపుతోంది. ఒక పక్క డీజిల్ కొరతతో సతమతమవుతున్న రైతులు ఇటీవల విద్యుత్ కోతలు అధికం కావడంతో తీవ్ర సంక్షోభాన్ని సృష్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత ఏర్పడింది. ఆయిల్ కంపెనీలు రేషన్ పద్ధతిలో బంక్లకు డీజిల్ సరఫరా చేస్తున్నాయి. దీంతో చాలా చోట్ల బంక్ల వద్ద నోస్టాక్ బోర్డులు ప్రత్యక్షమవుతున్నాయి. రొయ్యల సాగుకు ఈ సమయమే కీలకం రొయ్యల సాగులో వేసవికాలం రైతులకు ఎంతో కీలకం. మార్చి నెల నుంచి అనుకూల వాతావరణంతో రొయ్యల పెంపకానికి రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. రొయ్యల చెరువులో ఎక్కువ సంఖ్యలో సీడ్ వేసి మంచి దిగుబడులు సాధించడానికి కృషి చేస్తారు. వేసవిలో రొయ్యల ఎదుగుదల బాగుండడం, పెద్దగా తెగుళ్లు లేకపోవడం వల్ల పెట్టుబడులు తగ్గి మంచి ఆదాయం పొందుతారు. ఇదే ఆశతో రైతులంతా జిల్లాలో దాదాపు 1.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా దీనిలో రొయ్యల సాగు 90 వేల ఎకరాల వరకు ఉంటుందని అంచనా. రైతులంతా రొయ్యల సాగుపై ఆశలు పెట్టుకున్న దశలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఏరియేటర్స్ను ఎక్కువగా వినియోగించాల్సి ఉన్నందును విద్యుత్, డీజిల్ వాడకం అధికమైంది. ఇటువంటి తరుణంలో డీజిల్ కొరత ఏర్పడడం దానికి తోడు విద్యుత్ కోతలు పెరగడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రధానంగా రాత్రి సమయంలో విద్యుత్ కోత ఏర్పడితే రొయ్యలు చనిపోతాయని రైతులు చెబుతున్నారు. కొంతమంది ఆక్వా రైతులకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్న్లు, ఐస్ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రియల్ ఫీడర్లు కింద ఉండడం ఇతర ఇండస్ట్రీస్తో పాటు రైతులు, ఐస్ ఫ్యాక్టరీలు కూడా విద్యుత్ కోతల బారిన పడుతుండడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఆక్వా రైతులను డీజిల్ కొరత, విద్యుత్ కోతల నుంచి కాపాడాలంటూ ఆక్వా రైతుల సంఘం నాయకులు శుక్రవారం జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి, విద్యుత్శాఖ ఎస్ఈ పి ఉషారాణి, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకటసత్యనారాయణ తదితరులను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినందున తక్షణం చర్యలు తీసుకోకుంటే తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు. రొయ్యల పట్టుబడిలో ఐస్కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఇండస్ట్రీయల్ పవర్ కట్ చేసే సమయంలో ఐస్ ఫ్యాక్టరీలకు విద్యుత్ కోత విధించడం వల్ల ఐస్ కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకంగా ఆక్వా రైతులకు విద్యుత్ కోతల నుంచి మినహాయింపు, డీజిల్ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – గాదిరాజు వెంకటసుబ్బరాజు, వెస్ట్గోదావరి ప్రాన్ఫార్మర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ కార్యదర్శి రొయ్యల సాగుకు కీలమైన వేసవిలో విద్యుత్ కోతల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్నందున ఎక్కువ సమయం ఏరియేటర్స్ తిప్పాల్సివుంటుంది. ఇలాంటి సమయంలో విద్యుత్ కోతలు విధిస్తే ఏరియేటర్స్ తిరగక రైతులు నష్టపోతారు. – మళ్ల తులసీరామ్, వెస్ట్గోదావరి ప్రాన్ఫార్మర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు -
తాడేపల్లిగూడెంలో సినీ హీరో అడవి శేష్ సందడి
తాడేపల్లిగూడెం: సినీ హీరో అడవి శేష్ శుక్రవారం పట్టణంలో సందడి చేశారు. పట్టణంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఓ కంప్లెక్స్లో డెకాయిట్ సినిమాను ప్రేక్షకులతో కలిసి చూసిన అనంతరం మాట్లాడారు. మరో మూడు చిత్రాలలో నటిస్తున్నానని, గూఢచారి–2 మేకింగ్లో ఉందన్నారు. ప్రేక్షకులతో కలిసి సందడి చేశారు. థియేటర్ నిర్వాహకులు గన్నమనేని శ్రీనివాసరావు, చలంచర్ల హరి, సౌమ్య, ఆడిటర్ ఎన్వీ రమణరావు, డాక్టర్ సందీప్ ఉన్నారు. కాళ్ల: మండలంలోని కాళ్లకూరులో ఉన్న వేంకటేశ్వరస్వామి తిరుకల్యాణ మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం నుంచి ప్రారంభించే ఈ ఉత్సవాలు మే 3వ తేదీ వరకు నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈఓఅరుణ్ కుమార్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. కల్యాణ మహోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణం, వెలుపల ఇప్పటికే చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్లాత్ డెకరేషన్ భక్తులను ఆకర్షిస్తుంది. 27న కల్యాణం, మే 1న స్వామి వారి రథోత్సవం, 9న అఖండ అన్నసమారాధన నిర్వహిస్తారు. తాడేపల్లిగూడెం: బయో ఫెర్టిలైజర్ల వినియోగం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. ఐసీఏఆర్ , అటారీ జోన్ పది ఆధ్వర్యంలో శుక్రవారం వెంకట్రామన్నగూడెంలోని కేవీకేలో ఖరీఫ్ 2026 పంటలలో సమతుల్య ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పచ్చి రొట్టల పంటల ద్వారా నేలలో సేంద్రియ పదార్థం పెరిగి పంట ఉత్పాదకత మెరుగుపడుతుందన్నారు. వెంకట్రామన్నగూడెం గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన రచ్చబండలో రైతుల సమస్యలకు సమాధానలిచ్చారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): ఇంజనీరింగ్, వైద్య విద్యలో చేరాలనుకునే విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఈనెల 26న (ఆదివారం) 6, 7, 8, 9, 10, 10+1 విద్యార్థులకు ఐఐటీ, నీట్ విద్యపై విశాఖపట్నం సంగివలసలోను, తాడేపల్లిగూడెం కడకట్ల క్యాంపస్లోను అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ శుక్రవారం విలేకరులకు తెలిపారు. నిష్ణాతులైన సీనియర్ అధ్యాపక బృందం సందేహాలను నివృత్తి చేస్తారని పేర్కొన్నారు. సదస్సులకు వచ్చేవారు ముందుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.శశిస్కూల్.కామ్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి సదస్సులు నిర్వహిస్తామని, భోజన వసతి కల్పిస్తామని శశి విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేకా కాంత్రి సుధ పేర్కొన్నారు. -
ఎంటీఎస్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ప్రాతిపదికన పని చేస్తున్న ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు తోట ఎడ్వర్డ్ డిమాండ్ చేశారు. శుక్రవారం అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఎడ్వర్డ్ మాట్లాడుతూ ఎంటీఎస్ టీచర్లలో చాలామందికి 50 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత ఉద్యోగాలు వచ్చాయని, అందువల్ల వారి పదవీ విరమణ వయస్సును కనీసం 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే అందరు రెగ్యులర్ టీచర్లతో సమానంగా ఎంటీఎస్ టీచర్లూ పని చేస్తున్నారని వారికి ఇప్పటి వరకూ ప్రభుత్వం ఏడాదికి 11 నెలల జీతాలు మాత్రమే ఇస్తోందని, ఇకపై తమకూ 12 నెలల జీతాలూ ఇవ్వాలని కోరారు. పదవీ విరమణ చేసిన ఎంటీఎస్ టీచర్లకు కనీస పెన్షన్ విడుదల చేయాలని, అలాగే మినిమం టైమ్ స్కేల్ నుంచి తమను కూడా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఈ నెల 26న విజయవాడలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించే రిలే నిరాహార దీక్షల నిరసన కార్యక్రమానికి ఎంటీఎస్ టీచర్ల సంఘం మద్దతు పలుకుతూ తీర్మానం చేశారు. ఈ మేరకు జిల్లాలో పని చేస్తున్న ఎంటీఎస్ టీచర్లు ఈ నెల 26న విజయవాడకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంటీస్ టీచర్ల సంఘం నాయకులు కె.స్వామిదాసు, కె.కరుణానిధి, వీవీ రాజు, ఎండీ పాషా, బాజీ పాల్గొన్నారు. -
ఫిర్యాదుదారుల నుంచి స్టేట్మెంట్ నమోదు
జంగారెడ్డిగూడెం: సొసైటీలో అవినీతి, అక్రమాలు, అధికారుల విచారణ తదితర అంశాలపై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారుల నుంచి జిల్లా సహకార అధికారి ఎ.శ్రీనివాస్ స్టేట్మెంట్ నమోదు చేశారు. స్థానిక డీసీసీబీ బ్యాంకు కార్యాలయ భవనంలో శుక్రవారం ఫిర్యాదుదారులను విచారించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని డీసీసీబీ పరిధిలో ఉన్న పెనుగొండ, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం సొసైటీలతో పాటు 11 సొసైటీల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై 2023–24లో అప్పటి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ 51 ఎంకై ్వరీ ఆర్డర్తో విచారణకు ఆదేశించారన్నారు. దీనిలో భాగంగా విచారణాధికారులగా నియమించిన వారు సరిగా విచారణ చేయలేదని టి.నరసాపురం మండలం వెలగపాడుకు చెందిన న్యాయవాది బొడ్డు శ్రీనివాసరావు 2025లో పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారన్నారు. అలాగే జంగారెడ్డిగూడేఇకి చెందిన నేట్ర గణపతిరావు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఏలూరులో ఏజీఎంగా పనిచేస్తున్న జి.శ్రీనివాస్ 2008లో తన ఉద్యోగానికి రాజీనామ చేసిన తర్వాత కూడా తిరిగి విధుల్లోకి ఏ నిబంధనలు అనుసరించి తీసుకున్నారు? ఏ నిబంధనలు ప్రకారం పదోన్నతి ఇచ్చారు? అని తెలపాలని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై ఫిర్యాదుదారులను విచారించామని, విచారణ నివేదికలను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఆయన తెలియజేశారు. -
ట్రాక్టరు బోల్తా.. ఒకరి మృతి
గణపవరం: మండలంలోని కోమర్రు గ్రామ పరిధిలో ఓ ట్రాక్టరు పంట కాలువలో తిరగబడింది. ఈ ప్రమాదంలో వట్టిప్రోలు జగదీశ్ (43) అనే కౌలురైతు అక్కడికక్కడే మరణించాడు. జగదీష్ సాగుచేసిన తన పొలంలో వరికోత యంత్రంతో కోతకోయించి ధాన్యాన్ని ట్రాక్టర్మీద సమీప పుంతగట్టుకు చేరవేయించాడు. అనంతరం ట్రాక్టర్పై తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి ప్రక్కనే ఉన్న పంట కాలువలోకి తిరగబడింది. ఈ ప్రమాదంలో ట్రక్కులో కూర్చున్న రైతు జగదీశ్పై ట్రక్కు పడడంతో కింద ఊపిరాడక అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు ఎస్సై మణికుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు రూరల్: శాప్ లీగ్ పోటీల్లో భాగంగా ఈనెల 28వ తేదీ నుంచి 30 వరకూ అనంతపురంలో రాష్ట్రస్థాయి పుట్బాల్ పోటీలు జరుగుతాయని ఏలూరు జిల్లా డిఎస్డీఓ ఎస్ఏ చెప్పారు. శుక్రవారం ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో అండర్–15, అండర్–21 బాలబాలికల జిల్లా జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్ –15 బాలికల విభాగంలో ఎస్.సౌమ్య, సీహెచ్ బ్లెస్సీ, ఎ.మౌనిక, వి.లిషిత, టి.సుభశ్రీ, ఎం.చైత్రవల్లి, పి.చందు, సీహెచ్ హిమవర్షిణి, డి.రిషితసాయి, డి.చరణ్య్, ఎ.చంద్రిక, ఎస్.తేజశ్రీ, ఎం.సహస్త్ర, కె.కార్తిక, పి.గాయత్రి ఉన్నారు. బాలుర విభాగంలో ఎన్.రావణఉదయ్, ఎ.అఖిల్వర్మ, ఎన్.తేజస్వినయ్, ఎస్.మణ్య, జె.రామ్, వేవన్, తవన్, భువన్, కిన్నీ ఎలిజా, రిషేంద్ర, అమ్నాజ్, గంగాధర్, రిషబ్, ముస్తఫా, ప్రణీత్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. -
పోలీసు స్టేషన్ ఎదుట ఏటీఎం చోరీకి యత్నం
కై కలూరు: సర్కిల్ పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న కేడీసీసీ బ్యాంకు ఏటీఎంలో చోరీ యత్నం జరగడం కై కలూరులో శుక్రవారం తీవ్ర చర్చనీయాంశమైంది. బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి భుజానికి బ్యాగ్ తగిలించుకుని వచ్చి ఏటీఎం కార్డ్ రీడర్, డయల్ ప్యాడ్ను పగలుగొట్టాడు. నైట్ వాచ్మెన్ అప్పటి వరకు విధులు నిర్వహించి సమీపంలో నిద్రకు ఉపక్రమించడంతో ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉదయం ఏటీఎంను శుభ్రం చేయడానికి వచ్చిన స్వీపర్ గమనించి మేనేజర్కు చెప్పడంతో విషయం బయటపడింది. ఈ ఘటనపై ఎస్సై డి.వెంకట్కుమార్ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఏలూరు క్లూస్టీం వచ్చి వేలిముద్రలు సేకరించారు. ఇదిలా ఉంటే నిందితుడు ఏటీఎం కార్డు మిషన్లో ఇరుక్కుపోవడంతో డయల్ ప్యాడ్ను పగలుగొట్టి కార్డు తీసుకువెళ్లాడా? అనే అనుమానాలు కలుగుతుంది. ముఖానికి ఎటువంటి మాస్క్ కట్టుకోలేదని, మెషీన్ మిషన్ను ఊడదీయడానికి ఎటువంటి పరికరాలు ఉపయోగించినట్లు సీసీ కెమెరా ఫుటేజ్లో కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు. నిందితుడి ఆచుకీ తెలిస్తే 94407 96434, 94407 96433 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. -
ప్రేమ వివాహం.. జంటపై దాడి
● కుమార్తెను కిడ్నాప్ చేసిన తండ్రి , మరో ముగ్గురు ● కేసు నమోదు చేసిన పోలీసులు ద్వారకాతిరుమల: ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెను ఆమె తండ్రి, బంధువులు కలిసి కిడ్నాప్ చేశారు. ఆ సమయంలో అడ్డు వచ్చిన ఆమె భర్త, అత్తమామలపై విచక్షణారహితంగా ఇనుప రాడ్లతో దాడి చేసి, గాయపరిచారు. మండలంలోని ఐఎస్ రాఘవాపురంలో గురువారం వేకువజామున జరిగిన ఈ ఘటనపై స్థానిక పోలీస్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం. ద్వారకాతిరుమల మండలం ఐఎస్ రాఘవాపురానికి చెందిన సంజిత్, కామవరపుకోట మండలం వెంకటాపురానికి చెందిన పద్మ ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి వివాహానికి పద్మ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దాంతో గతనెల 20న ఏలూరులోని అంబేడ్కర్ నవ సమాజ్ సొసైటీలో వారు పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఐఎస్ రాఘవాపురంలోనే కాపురం ఉంటున్నారు. ఇదిలా ఉంటే పద్మ తండ్రి వెంకటకృష్ణ, కుటుంబ సభ్యులు వెంకటేశ్వరరావు, దుర్గారావు, వెంకటరమణలు గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సంజిత్ ఇంటికి వెళ్లారు. తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం వారు పద్మను బలవంతంగా తీసుకెళ్లిపోతుండగా సంజిత్, అతని తల్లిదండ్రులు సలోమోను, శ్యామల అడ్డుకున్నారు. ఆ సమయంలో వారిపై ఇనుప రాడ్లతో దాడి చేసి, పద్మను బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయారు. గాయాలపాలైన సంజిత్, అతని తల్లిదండ్రులు జరిగిన విషయాన్ని ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో తెలిపి, ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందారు. అనంతరం సంజిత్ తండ్రి సలోమోను ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడి చేసిన వారిపై కిడ్నాప్, తదితర సెక్షన్ల కింద ఎస్సై టి.సుధీర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ తీగల ఏర్పాటులో డ్రోన్ సాయం
పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి దగ్గరలో ఉన్న ఇండోర్ విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో కొత్త విద్యుత్ తీగల ఏర్పాటును శుక్రవారం డ్రోన్ సహాయంతో వేయడం ఆకట్టుకుంది. రోడ్డు వెంబడి ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి కొత్త విద్యుత్ తీగలను విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా డ్రోన్ సహాయంతో తీగలను ఏర్పాటు చేయడంతో తీగలను డ్రోన్ ఎత్తులో ఉన్న స్తంభాలకు చేర్చడం వాటిని సిబ్బంది ఒక క్రమంలో ఏర్పాటు చేయడాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. - భీమవరం -
ఈఎస్జెడ్ ప్రతిపాదనల ఖరారుపై సమీక్ష
భీమవరం (ప్రకాశంచౌక్): కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో ఈఎస్జెడ్ ప్రకటన ప్రక్రియలో భాగంగా ప్రతిపాదనల ఖరారు కోసం శుక్రవారం భీమవరం కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో స్థానిక ప్రజల నుంచి అందిన విజ్ఞాపనలు, అభ్యంతరాలు, సూచనలను సమగ్రంగా పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం చుట్టూ ఉన్న పర్యావరణ సున్నిత మండలి పరిధిలోకి వచ్చే పెంటపాడు, గణపవరం, ఉండి, కాళ్ల, ఆకివీడు మండలాల్లో 2025 జనవరి 6 నుండి 8 వరకు గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయాలను సేకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి, ఏలూరు జిల్లా అటవీ శాఖ వైల్డ్ లైఫ్ అధికారి, మెంబర్ కన్వీనర్ డాక్టర్ ఎ.త్రిమూర్తులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
షార్ట్ సర్క్యూట్తో లారీ దగ్ధం
జంగారెడ్డిగూడెం: సిమెంట్ విద్యుత్ స్తంబాల లోడుతో వెళుతున్న 16 చక్రాల లారీ అగ్నిప్రమాదానికి గురైంది. లారీ పూర్తిగా కాలిపోగా డ్రైవర్, క్లీనర్లు సురక్షితంగా బయటపడ్డారు. వివరాల ప్రకారం విజయవాడ నుంచి విద్యుత్ స్తంభాల లోడుతో బయలుదేరిన లారీ టి.నరసాపురంలో కొన్ని స్తంభాలు దించి, అక్కడ నుంచి జంగారెడ్డిగూడెం వచ్చి ఇక్కడ మరికొన్ని స్తంభాలు దించింది. అలాగే తడికలపూడిలో మరికొన్ని విద్యుత్ స్తంభాలు దించాల్సి ఉంది. మండలంలోని ఏలూరు – జంగారెడ్డిగూడెం రాష్ట్ర ప్రధాన రహదారి పుట్లగట్లగూడెం సమీపంలోని పెట్రోల్ బంక్ వద్దకు వచ్చేసరికి లారీ ఇంజిన్లో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదం గుర్తించిన తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ పాతూరి పౌల్రాజు, క్లీనర్ శామ్యుల్ లారీ నుంచి దూకేశారు. లక్కవరం ఎస్సై షేక్ జబీర్, ఏఎస్సై భాస్కర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక వాహనాన్ని రప్పించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే లారీ పూర్తిగా దగ్ధమైంది. ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. -
శ్రీవారి వైభవాన్ని చాటేలా బ్రహ్మోత్సవాలు
● 26 నుంచి చినవెంకన్న వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలు ● 30న ఆలయ కట్టడాలు ప్రారంభోత్సవం ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న వైభవాన్ని చాటేలా ఈనెల 26 నుంచి వచ్చేనెల 3 వరకు వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. గురువారం ఆయన తన చాంబర్ లో ఈఈ డీవీ భాస్కర్, ఏఈఓ ఎం.దుర్గారావుతో క లిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చినవెంకన్న బ్రహ్మోత్సవాల విశేషాలు, ఈనెల 30న జరిగే ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ వివరాలను వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. సామాన్య భక్తుల నుంచి వీవీఐపీల వరకు అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుతం క్షేత్రంలో ఉత్సవ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నా యని అన్నారు. ఉత్సవాల తొలి రోజు 26న స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేయడం, 27న ధ్వజారోహణం, 28న సూర్య, చంద్ర ప్రభ వాహన సేవలు, 29న ఎదుర్కోలు ఉత్సవం, 30న రాత్రి శ్రీవారి తిరుకల్యాణం, వచ్చేనెల 1న రాత్రి రథోత్సవం, 2న చక్రస్నానం, ఆఖరి రోజు 3న ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తామన్నా రు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రథోత్సవాన్ని జరుపుతామని తెలిపారు. గరుడ ప్రసాదం స్వీకరించాలి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు రాత్రి ఆలయంలో జరిగే ధ్వజారోహణ అనంతరం అర్చకులు భక్తులకు ధ్వజ ప్రసాదాన్ని అందిస్తారని ఈఓ తెలిపారు. సంతానం లేని మహిళలు ఈ ప్రసాదాన్ని తింటే పిల్లలు పుడతారన్న నమ్మకం ఉందని, దీంతో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారన్నారు. ప్రారంభోత్సవాలు ఇలా.. ఈనెల 30న దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దేవస్థానానికి రానున్నారని, ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం నిర్వహిస్తారన్నా రు. రూ.12 కోట్లతో విస్తరించిన అనివేటి మండపా న్ని, రూ.12.50 కోట్లతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ ను, రూ.4.50 కోట్లతో నిర్మించిన శివాలయం రాజగోపురాన్ని మంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. -
చలివేంద్రంపై కక్ష సాధింపు సిగ్గుచేటు
ఏలూరులో వైఎస్సార్సీపీ నేతల ధర్నా ఏలూరు టౌన్: ఏలూరు నియోజకవర్గంలో పాలకులకు ప్రజలకు మేలు చేయటం చేతకాదనీ.. కనీసం మంచిచేసే వారినైనా ప్రోత్సహించేలా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని 45వ డివిజన్ ఆదివారపుపేట మార్కెట్ ప్రాంతంలో పార్టీ యువజన నేత పసుపులేటి దినేష్ ఇటీవల చలివేంద్రాన్ని ఏర్పాటుచేశారు. గురువారం వేకువజామున రాజకీయ కక్షలతో కొందరు ఈ చలివేంద్రాన్ని తొలగించారు. దీనిపై పార్టీ శ్రేణులు మండిపడ్డారు. పాతబస్టాండ్ ప్రాంతంలోని అంబేడ్కర్ విగ్రహం సెంటర్ ప్రాంతంలో నగర అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆధ్వ ర్యంలో శాంతియుత నిరసన, ధర్నా చేపట్టారు. నగర పాలకులు ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పా ల్పడటం సిగ్గుచేటని ఆయన అన్నారు. చలివేంద్రా న్ని తొలగించడాన్ని ప్రజలు హర్షించరని గుర్తుచేశా రు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేసేందుకు అందరూ ముందుకు రావాలని, రాజకీయ కక్షలతో ప్రజలకు ఉపయోగపడే చలివేంద్రాన్ని చెప్పకుండా తొలగించటం సరైన విధానం కాదన్నారు. నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల మాట్లాడుతూ ఏలూరులో కూటమి నేతలు వైఎస్సా ర్సీపీ అంటే భయపడుతున్నారనీ, అందుకే చలివేంద్రం పెట్టినా తట్టుకోలేకపోయారని విమర్శించారు. బెల్టు షాపులకు అనుమతులు ఇస్తారు కానీ.. చలివేంద్రానికి అనుమతులు లేవా అంటూ ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, జిల్లా ప్రధాన కా ర్యదర్శి లంకపల్లి గణేష్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి ము న్నుల జాన్గురునాథ్, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్, జిల్లా కార్యదర్శులు కంచుమర్తి తులసీ, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి భాస్కర్ల బాచి, నగర బీసీ సెల్ అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గాజుల బాజీ, జిల్లా కార్యదర్శి సాసుపల్లి యుగంధర్, ఆర్టీఐ జిల్లా అధ్యక్షుడు స్టాన్లీ బాబు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రాజేష్, వైఎస్సార్టీయూ నగర అధ్యక్షులు గంటా రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం టూటౌన్ పోలీసులకు వినతిపత్రం అందజేసి, చలివేంద్రం తొలగింపుపై విచారణ చేయాలని కోరారు. -
పేరు మోసిన దొంగ అరెస్ట్
రెండు రాష్ట్రాల్లో 100కు పైగా కేసులు ఏలూరు టౌన్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీగా చోరీ కేసుల్లో నిందితుడిగా పేరు మోసిన దొంగ ఏలూరు త్రీటౌన్ పోలీసులకు చిక్కాడు. 100కు పైగా చోరీ కేసులు అతడిపై నమోదు కావడం గమనార్హం. నిందితుడిని అరెస్ట్ చేసి గురువారం విలేకరుల సమావేశంలో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ వివరాలు వెల్లడించారు. విశాఖలోని మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన శీల అనిల్కుమార్ జల్సాలు, విలాసాలకు అలవాటుపడ్డాడు. కొన్నేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో చోరీలకు పాల్పడుతుండగా.. కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఏలూరు త్రీటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన కేసు 28/2026ను సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై అప్పారావు దర్యాప్తు చేపట్టారు. కేసును విచారిస్తున్న పోలీస్ బృందం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని అదుపులోకి తీసుకుంది. విచారణ చేయగా ఏలూరుతోపాటు పలు ప్రాంతాల్లో నేరాలకు పాల్పడినట్టు అంగీకరించాడు. నిందితుడి నుంచి సుమారు 7 కాసుల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి వస్తువులు, రూ.5 లక్షల నగదు, నేరాలకు వినియోగిస్తున్న రెండు మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవటం ద్వారా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ద్వారకాతిరుమల, మచిలీపట్నం, కొవ్వూరు, సర్పవరం, తెలంగాణలోని సత్తుపల్లి ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో పురోగతి సాధించినట్లేనని డీఎస్పీ శ్రావణ్కుమార్ చెప్పారు. కేసును ఛేదించి నిందితుడిని పట్టుకోవటంలో ప్రతిభ చూపిన త్రీటౌన్ ఎస్సై అప్పారావు, సిబ్బందిని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, డీఎస్పీ శ్రావణ్కుమార్ అభినందించారు. -
అక్రమ చెరువుల జాతర
సాక్షి టాస్క్ఫోర్స్: పచ్చని పొలాలు ఆక్వా చెరువులుగా మారిపోతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోవడం లేదు. రెవెన్యూ, మత్స్యశా ఖాధికారులు ప్రజాప్రతినిధుల సిఫార్సులను కాదనలేకపోతున్నారు. అక్రమ చెరువులను ఆపండని జిల్లా అధికారులకు గ్రామస్తులు మెరపెట్టుకున్నా పొక్లయిన్లతో విధ్వంసం కొనసాగుతూనే ఉంది. వేసవి దాటితే తవ్వకాలకు అడ్డంకులని భావించి రాత్రి, పగలూ తేడా లేకుండా వందలాది ఎకరాల్లో చెరువుల జాతర మొదలయ్యింది. ప్రధానంగా ఆక్వారంగానికి ఆయువుపట్టుగా పేరొందిన కై కలూరు నియోజకవర్గంలో తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత చెరువులు అన్న చందంగా యంత్రాల మోత మోగిస్తున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వుతూ.. ఉమ్మడి జిల్లాలో చేపలు 1.80 లక్షలు, రొయ్యలు 1.10 లక్షలు కలిపి మొత్తం 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. కై కలూరు నియోజకవర్గం కై కలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాలు కలిపి 84,775.88 ఎకరాల్లో ఆక్వా సాగు ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కైకలూరు నియోజకవర్గం నాలుగు మండలాల్లో ఆక్వా చెరువులు వందల ఎకరాల్లో తవ్వేస్తున్నారు. కొందరు మత్స్యశాఖ అనుమతులు ఉన్నాయని, మరికొందరు మరమ్మతులు చేసుకుంటున్నామని, ఇంకొందరు ఏకంగా ఎమ్మెల్యే పేరు చెప్పి దాబాయిస్తూ ఇష్టానుసారంగా చెరువులు తవ్వుతున్నారు. అప్సడా చట్టం.. అభాసుపాలు : ఆక్వారంగం అభివృద్ధితో పాటు పర్యావరణానికి విఘాతం లేకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) చట్టాన్ని తీసుకొచ్చారు. ఆక్వా జోన్ల వ్యవస్థ అందుబాటులో ఉంది. నూతన చెరువు తవ్వాలంటే ముందుగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. జిల్లాస్థాయి కమిటీ (డీఎల్సీ)లో కలెక్టర్ అనుమతులు మంజూరు చేయాలి. ఇక డివిజన్, మండల స్థాయి కమిటీల్లో రెవెన్యూ, వ్యవసాయం, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు, ఇరిగేషన్, భూగర్భశాఖ ఇలా అన్ని శాఖలు తనిఖీలు చేసి ఓకే అంటేనే చెరువులు తవ్వుకోవాలి. ఇంత తతంగం ఉంటే ఇవేమీ మాకు వర్తించవంటూ ప్రజాప్రతినిధులు అండతో వందలాది ఎకరాలు తవ్వుతున్నారు. ముదినేపల్లి ముందంజ పచ్చని వరి పైర్లతో కళకళలాడే ముదినేపల్లి మండలం ఇప్పుడు సర్వం ఆక్వా చెరువులు మయంగా మారుతోంది. మండలంలో చేవూరు, ములకలపల్లి, వైవాక, చినపలపర్రు, పెయ్యేరు, పెదగొన్నూ రు, కాకరవాడ, కొత్తపల్లి, వణుదుర్రు, వాడవల్లి, కొత్తపల్లి, పెదపాలపర్రు, గోగినంపాడు గ్రామాలు, కలిదిండి మండలంలో మూలలంక, పెదలంక, గోపాలపురం, తాడినాడ, పుట్లపూడి, భాస్కరరావుపేట, సానారుద్రవరం, కోరుకొల్లు గ్రామాలు, మండవల్లిలో నందిగామలంక, కై కలూరు మండలంలో ఆలపాడు, శీతనపల్లి గ్రామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులు తవ్వారు. కొల్లేరును కొల్లగొడుతూ.. కొల్లేరు అభయారణ్యంలో ఫారెస్టు, అక్రమార్కుల మధ్య దోబూచులాట కొనసాగుతోంది. ఇటీవల చటాకాయి గ్రామంలో కొల్లేరులో బొదె పేరు చెప్పి ఏకంగా పెద్ద కాల్వనే తవ్వేశారు. ఇదే అదునుగా చటాకాయి గ్రామస్తులు అక్రమ గట్లుకు ఉపక్రమించారు. మీడియాలో కథనాలు రావడంతో చేసేది లేక బోదె పనులు 90 శాతం పూర్తయిన తర్వాత ఫారెస్టు అధికారులు ఆపేశారు. ఇప్పటివరకు గట్లును తొలగించలేదు. కొద్దిరోజుల క్రితం మండవల్లి మండలంలో కొల్లేరు ప్రాంతంలో చెరువు తవ్వకానికి పొక్లయిన్ దిగింది. ఫారెస్టు అధికారులు అతికష్టం మీద ఆపారు. కొత్తగా చెరువులు తవ్వాలంటే కచ్చితంగా నిబంధనలు పాటించాలి. రైతులు ఆన్లైన్లో దరఖాస్తులు పంపితే వివిధ శాఖల అధికారుల కమిటీ అనుమతులు ఇస్తుంది. కై కలూరు నియోజకవర్గంలో కొన్ని చెరువులకు అనుమతులు ఇచ్చాం. అప్పడా నిబంధనలు అందరూ పాటించాలి. – ఎం.రవికుమార్, మత్స్యశాఖ సహాయ సంచాలకుడు, కై కలూరు అడ్డంగా తవ్వేయ్! తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత చెరువులు పచ్చని పొలాలు ఆక్వా చెరువులుగా రూపాంతరం ఆక్వా రంగానికి చెందిన అప్సడా చట్టానికి తూట్లు అక్రమాలపై ప్రజలు తిరగబడుతున్నా ఆగని వైనం కొల్లేరు అభయారణ్యంలోనూ ఇదే తంతు -
ఆస్తి పన్ను వసూళ్లలో రెండో స్థానం
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణ పురపాలక సంఘంలో 2025–26 ఆర్ధిక సంవత్సరానికి ఆస్తిపన్ను వసూళ్లలో డిమాండ్ రూ.21.85 కోట్లుకు గానూ కలెక్షన్ రూ.14.83 కోట్లు (67.86 శాతం) వసూళ్లు చేసి ఏపీ రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (విజయవాడ)లో గురువారం 123 పురపాలక సంఘాల మునిసిపల్ కమిషనర్ల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంఈ అండ్ యూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్, పుర పరిపాలన శాఖ కమిషనర్ అండ్ సంచాలకుడు పి.సంపత్ కుమార్ చేతుల మీదుగా తాడేపల్లిగూడెం మునిసిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబును సన్మానించి అవార్డును అందించారు. టి.నరసాపురం : స్థానిక పాత పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న ఎల్ఈఎఫ్ ప్రార్థనా మందిరాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారని, చర్చి సంఘ విశ్వాసులు, పాస్టర్లు అంబేడ్కర్ సెంటర్లో గురువారం రాత్రి ఆందోళన చేపట్టారు. ప్రధాన సెంటర్లో బైఠాయించి చర్చి కూల్చివేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంఘానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి జేసీబీ సహాయంతో కూల్చివేశారని ఇది సంఘవిద్రోహ చర్యగా అభివర్ణించారు. చర్చి కూల్చివేత వెనుక కొందరు రాజకీయ నేతలు హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. కార్యక్రమంలో పాస్టర్లు డి.సామ్యూల్ రాజు, రేమల్లి జాషువా, రాజేష్ రావు యోహాను తదితరులు పాల్గొన్నారు. భీమవరం: పట్టణంలో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని టూటౌన్ ఎస్సై రామరావు గురువారం విలేకరులకు తెలిపారు. వివరాల ప్రకారం భీమేశ్వరస్వామి కాలనీలో నివాసం ఉంటున్న మిండాల మోజేష్(25) పెయింట్ పని చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే ఈ నెల 22న అతనికి స్నేహితులు ఫోన్ చేసినా ఎత్తకపోవడం, ఇంటి తలుపులు వేసి ఉండడంతో రామకృష్ణ అనే వ్యక్తి ఇంటి కిటికిలో చూడగా సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. దీనిపై నక్కా వరప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామరావు తెలిపారు. కామవరపుకోట: మద్యం తాగి వాహనం నడుపుతున్న వ్యక్తికి చింతలపూడి మెజిస్ట్రేట్ రెండు నెలల జైలు శిక్ష విధించినట్లు తడికలపూడి ఎస్సై వల్లి పద్మ తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం కామవరపుకోటలో గురువారం తన సిబ్బందితో వాహనాలు తనిఖీలు చేస్తుండగా కామవరపుకోటకు చెందిన బొల్లి బోయిన పోసి నాగేంద్ర అనే వ్యక్తి వాహనం ఆపి పరీక్షించగా మద్యం తాగినట్లు నిర్ధారించినట్లు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి చింతలపూడి కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ ఆ వ్యక్తికి 2 నెలలు జైలు శిక్ష, రూ.300 జరిమానా విధించినట్లు ఆమె తెలిపారు. భీమవరం : ఆకివీడు రైల్వే స్టేషన్ కు సమీపంలో గురువారం గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు భీమవరం రైల్వే ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మృతుని వివరాలు తెలిసిన వారు భీమవరం రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. ఉండి: బైక్ను ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని యండగండి గ్రామ శివారు ప్రాంతమైన రాయనివానిగూడెంకు చెందిన తంగెళ్ళ వెంకటేశ్వర్లు తన కుమార్తె వివాహ శుభలేఖలు పంచేందుకు ఈ నెల 21న సాయంత్రం 4 గంటల సమయంలో తన ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. యండగండి ప్రభుత్వసుపత్రి వద్దకు వచ్చేసరిగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వేగంగా అతడి ని ఢీ కొట్టడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు అతనిని వైద్య చికిత్స నిమిత్తం భీమవరం తరలించారు. అక్కడ ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు ఏఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేస్తున్నారు. -
ఈత విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి
బుట్టాయగూడెం: వేసవి వచ్చిందంటే చిన్నారుల్లో ఎక్కడలేని ఆనందం ఉంటుంది. ఏడాది పొడవునా బడిలో చదువుకుంటూ గడిపిన విద్యార్థులు సెలవుల్లో వారి ఉత్సాహంగా గడపాలని కోరుకుంటారు. ముఖ్యంగా పట్టణాల్లో చదివిన విద్యార్థులు తమ స్వగ్రామాలకు వచ్చి వేసవిని ఆశ్వాదిస్తారు. శుక్రవారం నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చారు. అయితే సెలవు రోజుల్లో చిన్నారులు చెరువులు, బావులు, ప్రాజెక్టుల్లో ఈత కొట్టాలని కోరకుంటూ ఉంటారు. అయితే సరదాగా ఈతకు దిగుతున్న చిన్నారులు మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈతపై అప్రమత్తంగా లేకుంటే తల్లిదండ్రులకు గుండె కోత తప్పదంటున్నారు నిపుణులు. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే పోలవరం నియోజకవర్గంలో పరిధిలో గిరిజన మండలాల్లో గల గ్రామాల్లో సుమారు 128 చెరువులు ఉన్నాయి. వీటిలో 40 పెద్ద చెరువులు, చిన్న చెరువులు 81 ఉన్నాయి. గుబ్బల మంగమ్మతల్లి జల్లేరు జలాశయం, కొవ్వాడ ప్రాజెక్టు, పోగొండ రిజర్వాయర్ ఉన్నాయి. ఆయా చెరువుల్లో, ప్రాజెక్టుల్లో కొంతమేర నీరు ఉంది. అనేక మంది గ్రామాల్లో ఉంటున్న ప్రజలు దుస్తులు ఉతకడానికి వెళ్తుంటారు. అలాగే సరదాగా ఈతకు వెళ్లి మృత్యువాత పడిన సంఘటనలు జరిగాయి. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిందే ఈత రానివారు ఈతకు వెళ్లే ప్రతీ ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కచ్చితంగా మనిషి నీటిలో మునిగిపోకుండా మునగ, కలబంద కట్టెలను కట్టుకోవాలి. ఈత నేర్పిచాలనుకునేవారు ఈత రాని వారి నడుముకు తాడుట్టి గట్టుపై ఒకరు ఉండి ఈత నేర్పించాలి. ఈతకు వెళ్లే వారు తప్పనిసరిగా తమ వెంట మునగ కట్టెలు, ఈత వచ్చిన వారిని వెంట తీసుకుని వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈత రాని వారిని ఈత నేర్చుకుంటున్న వారు ఒక కంట కనిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈత కొట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే ● ఈత కోట్టేటప్పుడు శరీర నిర్మాణానికి అనువైన స్మిమింగ్ సూట్ వేసుకోవాలి. ● తల వెంట్రుకలు తడవ కుండా మాస్క్ లాంటిది ధరించాలి. ● నీటిలో తడవటం వల్ల చర్మ సంబంధింత వ్యాధులు రాకుండా వాజిలిన్ వంటివి పూసుకోవాలి. ● ముఖాన్ని పైకి ఉంచి ఈదాలి. ఊపిరి పీల్చుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ● బావి, చెరువులోకి దూకేటప్పుడు కాళ్లు ముందుగా నీళ్లను తాకేలా చూసుకోవాలి. తలకిందులుగా డైవింగ్లా దూకడం ప్రమాదం. ● అడుగుభాగంలో బండరాళ్లు, చెరువుల్లో ఎండిన కొమ్మలు ఉంటాయి. అలాంటి వాటిలో లోతును ముందుగా అంచనా వేయకపోతే ప్రమాదం. ● అరగంట కంటే ఎక్కువసేపు ఈత కొట్టకూడదు. గంటల కొద్దీ ఈదడం వల్ల ఊపిరి ఆడదు. ఈతకొట్టే సమయంలో ఇతరులు మునిగిపోయినట్లు గమనిస్తే ఎంతటి నిపుణులైనా ఈత కొట్టేందుకు దూకకూడదు. కర్రలు, తాడు పరికరాల సహాయంతో కాపాడాలి. జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. సరదాకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న విద్యార్థులు, యువకులు -
అక్రమ వ్యాపారంపై కఠిన చర్యలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో నాటుసారా, ఎస్డీపీఎల్ లిక్కర్, స్పూరియస్ లిక్కర్, కల్తీ కల్లు వంటివాటిపై పటిష్టమైన నిఘాతో నిరంతర తనికీలతో నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని ఏపీ ఎకై ్సజ్, ప్రొహిబిషన్ శాఖ డైరెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశంలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల ఎకై ్సజ్ శాఖ అధికారులతో ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ప్రత్యేకంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ డిప్యూటీ ఎకై ్సజ్ కమిషనర్ బి.శ్రీలత ఆధ్వర్యంలో చేపట్టిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని మద్యం షాపుల్లోనూ ప్రతీ లిక్కర్ బాటిల్ విధిగా ఏపీ సురక్ష యాప్తో స్కాన్ చేశాక మాత్రమే మద్యం విక్రయాలు చేయాలని ఆదేశించారు. అనంతరం నగరంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలోని అజయ్ వైన్స్లో ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బీ.శ్రీలతతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సురక్ష యాప్లో మద్యం బాటిళ్ళను స్కాన్ చేసి పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో ఎకై ్సజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్, ఏలూరు జిల్లా ఎకై ్సజ్ అధికారి ఎ.అవులయ్య, పశ్చిమగోదావరి జిల్లా ఎకై ్సజ్ అధికారి బి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా
ముసునూరు : మండలవ్యాప్తంగా మట్టి దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మట్టి దోపిడీ కోసమే మేమున్నాం అన్నట్టుగా అధికార పార్టీకి చెందిన నాయకులు అందరికీ అభయం ఇచ్చేసి, పగలు రాత్రి తేడా లేకుండా అనుమతులతో పని లేకుండా, రోజుకో చెరువులో మట్టిని కొల్లగొడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, నేతల ధనార్జనే ధ్యేయంగా సహజ సంపదైన మట్టిని కొల్లగొడుతూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. నూజివీడు డివిజన్కు సబ్ కలెక్టర్గా ఐఏఎస్ అధికారి ఉన్నప్పటికీ, యథేచ్ఛగా జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై నియంత్రణ లేదని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. దూరాన్ని బట్టి రేటు మండల కేంద్రం ముసునూరులోని చోటా నాయకులు రెవెన్యూ, నీటి పారుదల, గనుల శాఖల అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, దూరాన్ని బట్టి ట్రాక్టర్ ట్రక్కుకు రూ.800 నుంచి రూ.1000 వరకు రేటు నిర్ణయించి, నల్లచెరువు, ఊర చెరువు, ముత్తర బోయిన కుంటల్లో నుంచి మట్టిని అక్రమంగా తరలించి, విక్రయిస్తూ తమ జేబులు నింపుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏకంగా జేసీబీలు పెట్టి రేయింబవళ్లు తేడా లేకుండా వందలాది ట్రాక్టర్లతో విలువైన మట్టిని తరలిస్తున్నారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పేరు చెప్పి, వాణిజ్య అవసరాలకు, భూస్వాముల తోటలు, పొలాలకు వేలాది ట్రాక్టర్ల మట్టి తరలిస్తూ, అక్రమాలకు పాల్పడుతున్నట్లు పలువురు బాహాటంగా విమర్శిస్తున్నారు. అధికారులు మాత్రం గృహావసరాలు అని చెప్పి, తప్పించుకుంటున్నారే గానీ చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు చెబుతన్నారు. ఈ తవ్వకాలపై తహసీల్దార్ డి.ప్రశాంతిని వివరణ కోరగా, తక్షణం వీఆర్ఓను పంపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముసునూరులో ప్రధాన రహదారి పక్కనే డంప్ చేసిన మట్టి ముసునూరు నల్ల చెరువులో నుంచి మట్టి తరలిస్తున్న దృశ్యం -
రైలు ఢీకొని ఇద్దరు మహిళల మృతి
భీమడోలు: మండలంలోని సూరప్పగూడెం, పాతూరు గ్రామాల మధ్య ఉన్న రైలు పట్టాలు దాటుతున్న ఇద్దరు మహిళలను గురువారం ఓ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో సూరప్పగూడేనికి చెందిన వెజ్జు లక్ష్మీ(50), నిడమర్రు గ్రామానికి చెందిన సకినిశెట్టి సత్యవతి(59) మృతి చెందారని ఏలూరు రైల్వే ఎస్సై దానం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సూరప్పగూడెంలో ఆలయ ప్రతిష్ఠ వేడుకలు నిర్వహిస్తుండడంతో గ్రామస్తులు ఈ సంబరానికి బంధువులను ఆహ్వానించారు. ఈ క్రమంలో వెజ్జు లక్ష్మీ బంధువు నిడమర్రు మండలం సకినిశెట్టి సత్యవతి సూరప్పగూడెం వచ్చేందుకు పాతూరు గ్రామంలో బస్సు దిగింది. అక్కడ నుంచి సూరప్పగూడెం గ్రామంలోని ఆలయం వద్దకు రావడానికి చిరునామా తెలియక వెజ్జు లక్ష్మీకి ఫోన్ చేసింది. దీంతో ఆమెను తీసుకుని రావడానికి లక్ష్మీ పాతూరు వెళ్లి అక్కడ నుంచి సత్యవతిని వెంటబెట్టుకుని తీసుకుని వస్తుంది. ఈ క్రమంలో పాతూరు, సూరప్పగూడెం గ్రామాల మధ్య రైల్వే అండర్ ట్రన్నెల్ బ్రిడ్డి నుంచి వీరు రావాల్సి ఉండగా, వారిద్దరు ఇంటిని ముందుగా చేరుకునేందుకు మూసి ఉన్న రైల్వే గేటు పక్క నుంచి ట్రాక్ దాటుతుండగా అతివేగంగా వస్తున్న ఎక్స్ప్రెస్ వారిద్దరినీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరికీ తలకు బలమైన గాయాలుతో పాటు చేతులు, కాళ్లు ఛిద్రంగా మారాయి. ఈ సమాచారం అందుకున్న ఏలూరు రైల్వే ఎస్సై దానం సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే ఈ రెండు కుటుంబాలు పేద కుటుంబాలు కావడంతో పెద్ద దిక్కులను కోల్పోయమంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వెజ్జు లక్ష్మీ(ఫైల్) సకినిశెట్టి సత్యవతి(ఫైల్) -
లక్ష్యం ఎక్కువ.. సంచులు తక్కువ
భీమవరం: అన్నదాతలను ఆదుకుంటామంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు అవసరమైన గోనె సంచులను సైతం అందించలేకపోతుంది. రైతులకు అందించే సంచుల్లో ఎక్కువ శాతం చిరిగిపోవడంతో ధాన్యం కారిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో దాళ్వా వరి మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్న సమయంలో గోనె సంచుల సరఫరా ఇబ్బందికరంగా మారింది. జిల్లాలోని 20 మండలాల్లో దాదాపు 2.30 లక్షల ఎకరాల్లో దాళ్వా వరిని పండించారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి పంటను గట్టుకు చేర్చుతున్నా ధాన్యం రైసుమిల్లులకు తరలించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. దిగుబడి అంచనా 9.50 లక్షల మెట్రిక్ టన్నులు జిల్లాలో ప్రస్తుత దాళ్వా సీజన్లో 9.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. దీనిలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. దీనికి గానూ దాదాపు 1.90 కోట్ల గోనె సంచులు అవసరమవుతాయని నిర్ణయించగా, కేవలం 1.25 కోట్లు సంచులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీనితో రైస్ మిల్లుల నుంచి రైతులకు ఎక్కువగా చిరిగిన పాత సంచులను మాత్రమే చేరుతుండడంతో పట్టుబడి పట్టిన ధాన్యం చిల్లుల నుంచి కారిపోయి తూకంలో తేడాలు రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గోనె సంచుల విషయంలో గత మూడు సీజన్లుగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలను వేధిస్తున్న గోనె సంచుల కొరత డిమాండ్.. 1.90 కోట్లు.. ఇచ్చింది 1.25 కోట్లు మాత్రమే జిల్లాలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం రైతులను నుంచి ధాన్యం దిగుమతి చేసుకున్న రైస్మిల్లర్లు మరపట్టించిన తరువాత బియ్యాన్ని ఎఫ్సీఐ గోదాములకు పంపిస్తారు. దిగుమతి చేసుకున్న వెంటనే ధాన్యం మరపట్టిస్తే గోనె సంచులు ఖాళీ అయి తిరిగి రైతులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత సీజన్లో కేంద్రప్రభుత్వం బియ్యంలో నూక శాతంలో మార్పులు తీసుకురానుండడంతో ఎఫ్సీఐ అధికారులు బియ్యం దిగుమతి నిలిపివేశారు. గతంలో బియ్యంలో నూక 15 శాతం ఉన్నా మిల్లర్ల నుంచి బియ్యం దిగుమతి చేసుకునేవారు. అయితే కేంద్రం కొత్తగా నూక శాతాన్ని 10 శాతానికి తగ్గించడం దానికి సంబంధించి ఎఫ్సీఐకి పూర్తిగా ఆదేశాలు అందకపోవడంతో మిల్లర్ల నుంచి బియ్యం దిగుమతులు నిలిచిపోయాయని మిల్లర్లు చెబుతున్నారు. దీంతో ధాన్యాన్ని మరపట్టించకపోవడంతో సంచులు ఖాళీ కావడం లేదని అధికారులు సంచులు కోసం ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు. మొత్తం మీద కేంద్రప్రభుత్వం నిబంధనలు రాష్ట్రప్రభుత్వ వైఖరి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పూర్తిస్థాయిలో చిరుగులులేని సంచులు సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. -
నవధాన్యాల సీడ్ కిట్లు సిద్ధం
ద్వారకాతిరుమల: మండలంలోని గుండుగొలనుకుంటలో మెగా బయో ఇన్ఫుట్స్ రిసోర్స్ సెంటర్ (బీఆర్సీ)లో గురువారం ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగపడే పీఎండీ నవధాన్యాల సీడ్ కిట్ల తయారీ కార్యక్రమం నిర్వహించారు. తొలి విడతగా 800 పీఎండీ కిట్లు సిద్ధం చేశారు. ప్రతి కిట్లో 15 కిలోల బరువైన 25 రకాల విత్తనాలు ఉన్నాయి. ఒక్కో కిట్ను రూ. 1,400 కు రైతులకు అందిస్తున్నారు. కార్యక్రమాన్ని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి.వెంకటేష్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎండీ నవధాన్యాల విత్తనం వల్ల రైతులకు అనేక లాభాలు కలుగుతాయన్నారు. నవధాన్యాల పంటలు వేసుకోవడం ద్వారా నేల ఎర్రదనం తగ్గి, సంవత్సరం పొడవునా భూమి పచ్చగా కప్పబడి ఉంటుందన్నారు. 365 రోజులు భూమి కప్పబడి ఉండటం వల్ల నేల నష్టం తగ్గి, భూతాపాన్ని తగ్గించడంలోనూ, ప్రకృతి విపత్తులను తట్టుకునే శక్తిని పెంచడంలోనూ పీఎండీ నవధాన్యాల కిట్లు కీలక పాత్ర పోషిస్తాయని వెంకటేష్ తెలిపారు. దెందులూరు: మండలంలోని గోపన్నపాలెంలో ఈ నెల 25న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. గురువారం గోపన్నపాలెంలోని శ్రీసీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల గ్రౌండ్, సోమరప్పాడుకాలనీ, పీఈటీ గ్రౌండ్, గాలాయిగూడెం, తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం జనాభా నిర్వహణ–ప్రతిపాదిత గ్రామసభ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, జేసీ ఎంజే అభిషేక్ గౌడ, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్.సుస్మిత, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ పాల్గొన్నారు. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
అత్తిలి: మండలంలోని మంచిలి గ్రామం వద్ద గంజాయి తరలిస్తున్న కాళ్ల మండలం జక్కరంగరువుకు చెందిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు అత్తిలి ఎస్సై కేఎన్ విశ్వనాథ్ గురువారం విలేకరులకు తెలిపారు. పముజుల పవన్న్కుమార్, ఎజ్జర్ల జీవరాణిలను అరెస్టు చేసి వారి వద్ద 2.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం బుధవారం రాత్రి మంచిలి గ్రామం వద్ద గంజాయి మత్తులో పవన్కుమార్ వీరంగం సృష్టించడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారన్నారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు పవన్కుమార్ తో పాటు అతని వెంట ఉన్న జీవరాణిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విచారణలో వారు విశాఖ జిల్లా పాడేరులో గంజాయి కొనుగోలు చేసి వస్తుండగా మంచిలి వద్ద పవన్కుమార్ గంజాయి మత్తులో అలజడి సృష్టించాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
పారా క్రీడాకారుల ప్రతిభ
అత్తిలి: అంతర్జాతీయ స్థాయి పోటీల్లో అత్తిలికి చెందిన పారా క్రీడాకారుడు యడ్లపల్లి సూర్యనారాయణ ప్రతిభ కనబరిచాడు. థాయ్లాండ్లోని శ్రీరాచా పట్టణంలో ఈనెల 17 నుంచి 19 వరకు జరిగిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ చాంపియన్ షిప్స్–2026లో అథ్లెటిక్స్ విభాగంలో శారీరక వికలాంగుల కేటగిరీ షాట్పుట్లో బంగారు పతకం, జావెలిన్ త్రోలో కాంస్య పతకం సాధించారు. పాలకొల్లు సెంట్రల్: థాయ్లాండ్లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 పోటీల్లో పాలకొల్లు పట్టణానికి చెందిన ఎం నళిని రాజశేఖర్ ప్రతిభను చాటారు. వీల్చైర్ కేటగిరి పారా పికిల్బాల్ డబుల్స్లో నళిని రాజశేకర్ కోన ఏసుబాబుతో కలిసి కాంస్య పతకం సాధించారు. అథ్లెటిక్స్ విభాగంలో షాట్పుట్లో స్వర్ణ పతకం, జావెలిన్ త్రోలో కాంస్య పతకం సాధించాడు. రోడ్డు ప్రమాదంలో మరో యువకుడి మృతి కాలువలో లభ్యమైన మూడు చక్రాల వాహనం -
శ్రీవారి కొండపై గోబర్ధన్ ప్లాంట్
● రూ.50 లక్షల ఎస్బీఎం 2.0 నిధులతో ఏర్పాటు ● గో సంరక్షణ శాలకు గ్యాస్, విద్యుత్ ఖర్చులు ఆదా ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానం రోజూవారీ ఖర్చులను తగ్గించుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంంది. గతంలో దేవస్థానం అధికారులు కొండపైన పాత గోసంరక్షణశాల వద్ద గోబర్ గ్యాస్ ప్లాంట్ను నిర్మించి, దాన్ని సమర్ధవంతంగా నిర్వహించారు. గో వ్యర్ధాల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసి, నిత్యావసరాలకు వినియోగించేవారు. ధర్మఅప్పారాయ నిలయం (120 గదుల సత్రం)కు ఆ విద్యుత్ను సరఫరా చేసేవారు. దాని ద్వారా దేవస్థానానికి ప్రతి నెలా వేలాది రూపాయల విద్యుత్ బిల్లు ఆదా అయ్యేది. అభివృద్ధిలో భాగంగా గోసంరక్షణశాలను 2018లో శివాలయానికి సమీపంలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి గోపోషణ అక్కడే నిర్వహిస్తున్నారు. పాత గోసంరక్షణ శాల ప్రదేశంలో నిత్యాన్నదాన భవనం, అంబరుఖానా (ప్రసాదాల తయారీ శాల)ను నిర్మించే సమయంలో గోబర్ గ్యాస్ ప్లాంట్ను తొలగించారు. అప్పటి నుంచి గో వ్యర్ధాలను సేంద్రీయ ఎరువుగా మార్చి, వేలం ద్వారా విక్రయించి, వచ్చిన ఆదాయాన్ని దేవస్థానానికి జమ చేసేవారు. 1.0 టీపీడీ సామర్ధ్యంతో.. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) 2.0 గ్రాంట్ రూ.50 లక్షలతో గోసంరక్షణశాల వద్ద నిర్మించిన 1.0 టీపీడీ సామర్ధ్యం గల గోబర్ధన్ ప్లాంట్ వాడుకలోకి వచ్చింది. దాంతో గోసంరక్షణ శాలలోని 350 గోవుల నుంచి వచ్చే వ్యర్ధాల(పేడ)ను ఈ గోబర్ధన్ ప్లాంట్కు వినియోగిస్తున్నారు. రోజుకు 500 కేజీల పేడను వేయడం ద్వారా వచ్చే గ్యాస్, విద్యుత్ను ప్రస్తుతం గోసంరక్షణశాలకు వినియోగిస్తున్నారు. విద్యుత్, గ్యాస్ ఆదా ఆవులు, గుర్రానికి పెట్టే దాణాను ఉడకబెట్టేందుకు మూడు రోజులకు ఒక గ్యాస్ సిలెండర్ ఖర్చు అయ్యేది. ఈ నూతన గోబర్ధన్ ప్లాంట్ ఏర్పాటుతో ఇప్పుడు గ్యాస్ సిలెండర్లతో పనిలేకుండా పోయింది. ఆవుల షెడ్లలో నిరంతరాయంగా తిరిగే ఫ్యాన్లకు ఈ ప్లాంట్ ద్వారా సరఫరా అయ్యే విద్యుత్ను వినియోగిస్తున్నారు. దాంతో విద్యుత్ ఖర్చు కూడా ఆదా అవుతోంది. ఉత్పత్తి సామర్ధ్యం ఇలా నూతన ప్లాంట్ నుంచి రోజుకి బయోగ్యాస్ 30–40 క్యూబిక్ మీటర్లు, విద్యుత్ రోజుకు 60–70 యూనిట్లు, సేంద్రీయ ఎరువు 700–800 కేజీలు ఉత్పత్తి అవుతుంది. ప్లాంట్ నుంచి విద్యుత్ సరఫరా చేసేందుకు జనరేటర్, గ్యాస్ను సరఫరా చేసేందుకు కంప్రెషర్ను ఏర్పాటు చేశారు. గోసంరక్షణశాల సిబ్బందికి ప్లాంట్ నిర్వహణపై అవగాహన కల్పించారు. గోబర్ధన్ గ్యాస్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. కొండపై నిర్మించిన ఈ ప్లాంట్ ద్వారా బయోగ్యాస్, విద్యుత్, సేంద్రీయ ఎరువులు ఉత్పత్తి అవుతున్నాయి. దాంతో గో సంరక్షణ శాలలో గ్యాస్, విద్యుత్ ఖర్చు అదా అవుతోంది. ఈ ప్లాంట్ల ఏర్పాటుతో పర్యావరణం పరిరక్షణ జరుగుతోంది. – వేండ్ర త్రినాథరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ -
ఆటస్థలాల అభివృద్ధికి మీనమేషాలు
ఏలూరు నగరంలో ఆట స్థలాలు కరువయ్యాయి. కార్పొరేషన్ పరిధిలో ఆడేందుకు ఆట స్థలాలు లేకపోవడంతో యువత తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 8లో uగురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి, భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల మధ్య ఉప్పుటేరు మేజర్ డ్రెయిన్. కొల్లేరు నుంచి మొదలై ఆకివీడు, కాళ్ల, భీమవరం మండలాల మీదుగా 67 కి.మీ ప్రయాణించి కృష్ణా జిల్లా గొల్లపాలెంవద్ద కడలిలో కలుస్తుంది. కొల్లేరుకు అవుట్లెట్గా ఉన్న ఉప్పుటేరులో రెండు జిల్లాల్లోని 120 వరకు బుడమేరు, రామలేరు, తమ్మిలేరు, యనమదుర్రు, బొండాడ తదితర మేజర్, మైనర్ డ్రెయిన్లు, పంట కాలువలు కలుస్తుంటాయి. వీటిద్వారా గుర్రపుడెక్క, కిక్కిస ఉప్పుటేరులోకి చేరుతోంది. ఏళ్ల తరబడి ప్రక్షాళనకు నోచుకోక ఎక్కడికక్కడ డ్రెయిన్ పూడికతో మేటలు వేసింది. ఆక్రమణల చెరలో.. డ్రెయిన్ వెంబడి 70 వేలకు పైగా ఎకరాల్లో ఆక్వా చెరువులు సాగవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని లోసరి, దొంగపిండి, మాలవానితిప్ప, కృష్ణా జిల్లాలోని గొల్లపాలెం, లక్ష్మీపురం, మాట్లం తదితర పలుచోట్ల పీడబ్ల్యూడీ (డ్రెయిన్ మార్జిన్) భూమి వంద మీటర్ల నుంచి 500 మీటర్లకు వరకు ఉంటుంది. సారవంతమైన భూమి కావడంతో చాలా చోట్ల డ్రెయిన్ మార్జిన్ను ఆక్రమించి ఆక్వా చెరువులుగా మార్చేశారు. కూటమి హయాంలో చెరువుల అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వారం రోజుల క్రితం లోసరి వద్ద ఉప్పుటేరు మార్జిన్ ఆక్రమించి ఆక్వా చెరువులు తవ్వేశారు. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి. కొల్లేరు నుంచి గొల్లపాలెం వరకు డ్రెయిన్ మార్జిన్ ఎంతమేర ఆక్రమణలకు గురైంది అధికారుల వద్ద వివరాలు లేకపోవడం ఉప్పుటేరు దుస్థితికి అద్దం పడుతుంది. వానా కాలంలో ముప్పు ఆక్రమణలు, పూడికలతో ఉప్పుటేరు సామర్థ్యం నానాటికీ తగ్గుతోంది. మూడు నుంచి ఆరు మీటర్లు వరకు ఉండాల్సిన డ్రెయిన్ లోతు కొన్నిచోట్ల మీటరు మాత్రమే ఉంది. గతంలో 25 వేల క్యూసెక్కుల సామర్థ్యం కాగా ఎనిమిది క్యూసెక్కులకు తగ్గిపోయింది. అధిక వర్షాలు, వరదల సమయంలో ముంపు ముప్పు వెంటాడుతోంది. ఏటా రెండు జిల్లాల్లోని పరివాహక గ్రామాలు, చెరువులు, పంటపొలాలు ముంపు బారిన పడి అపారనష్టం వాటిల్లుతోంది. తండ్రీకొడుకుల చొరవ కొల్లేరు సరస్సు ప్రక్షాళన సమయంలో ఉప్పుటేరు అభివృద్ధికి దివంగత వైఎస్సార్ చర్యలు చేపట్టారు. పూడిక తొలగింపు కోసం ఆకివీడు వద్ద డ్రెడ్జింగ్ పనులు చేపట్టారు. జువ్వ కనుమ నుంచి ఆర్అండ్బీ వంతెన సమీపం వరకు కొంతమేర పనులు పూర్తిచేయగా తర్వాత వాతావరణం అనుకూలించక అప్పట్లో పనులు వాయిదా పడటంతో తర్వాత పట్టించుకునే వారు కరువయ్యారు. 2019–24 మధ్యకాలంలో జగన్ ప్రభుత్వం స్వచ్ఛ కొల్లేరులో భాగంగా ఉప్పుటేరు ముంపు బెడద పరిష్కారానికి నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ చూపారు. ఆకివీడు మండలం దుంపగడప, మొగల్తూరు మండలం పడతడిక, మోళ్లపర్రు వద్ద మూడు రెగ్యులేటర్ల నిర్మాణానికి రూ.412 కోట్ల కేటాయింపులు చేసి టెండర్ల ప్రక్రియను చేపట్టారు. ముప్పుటేరుపూడికతో నిండిన ఉప్పుటేరు ఉప్పుటేరు మార్జిన్ ఆక్రమించి ఆక్వా చెరువులు తవ్వుతున్న దృశ్యం కొల్లేరుకు ప్రధాన డ్రెయిన్గా ఉన్న ఉప్పుటేరుపై చంద్రబాబు ప్రభుత్వం శీతకన్ను వేసింది. రూ.525 కోట్లతో డ్రెడ్జింగ్ పనులు చేపట్టేందుకు డ్రెయినేజీ శాఖ పంపిన డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)ను అటకెక్కించింది. ఆక్రమణలు, పూడికతో డ్రెయిన్ కుచించుకుపోగా ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాలకు ఉప్పుటేరు ముంపు బెడదకు ఈ ఏడాది మోక్షం కలిగేలా లేదు. కొల్లేరు ప్రధాన అవుట్లెట్గా ఉప్పుటేరు ఆక్రమణలు, పూడికతో నీటి ప్రవాహానికి ఆటంకం 25 వేల నుంచి 8 వేల క్యూసెక్కులకు పడిపోయిన సామర్థ్యం డ్రెడ్జింగ్ కోసం రూ.525 కోట్లతో డీపీఆర్ ఏడాదవుతున్నా అతీగతీ లేని వైనం -
కాలువ గట్టు.. కొల్లగొట్టు !
● తాడిపూడి గట్లను యథేచ్ఛగా తవ్వేస్తున్న మాఫియా ● పట్టించుకోని అధికారులు తాడేపల్లిగూడెం రూరల్: శివారు భూముల రైతులకు మూడో పంటకు సాగు నీరు అందించేందుకు దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి తాడిపూడి కాలువ నిర్మాణం చేశారు. తాడేపల్లిగూడెం మండలంలోని వీరంపాలెం, జగ్గన్నపేట, వెంకట్రామన్న గూడెం గ్రామాల మీదుగా తాడిపూడి కాలువ ఉంది. కాలువ నీరు ఉప్పొంగిన సమయంలో సమీప పొలాలను ముంచెత్తకుండా కాలువ తవ్విన కంకరను తాడి చెట్టు ఎత్తున గట్లు వేశారు. ప్రభుత్వాలు మారడంతో మైనింగ్ బకాసురులు గట్లనే వ్యాపారంగా మార్చుకున్నారు. దీంతో గట్లను రాత్రింబవళ్లు తవ్వేసి కంకరను బయట ప్రాంతాలకు తరలిస్తూ లక్షలాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. ప్రస్తుతం జగ్గన్నపేట ప్రాంతంలో తాడిపూడి కాలువ గట్లను జేసీబీలతో రేయింబవళ్లు తవ్వేస్తున్నారు. ప్రత్యేకించి రాత్రి సమయాల్లో లైట్ల కాంతుల్లో కంకర గట్లను తవ్వేసి పెద్ద ఎత్తున లారీల్లో తరలిస్తున్నారు. రాత్రి సమయాల్లో లారీల చక్రాలకు బ్రేక్లు ఉండటం లేదని, ఇష్టారీతిగా లారీలను నడుపుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ సమయంలో ఏ జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు మిన్నకుండటంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారా ? అనే అనుమానాలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి. -
అవినీతి, జూదం ఆదాయ వనరులు
ప్రశ్నిస్తున్న కారుమూరిపై కేసుల పర్వం: సాయిబాబా రెడ్డి తణుకు అర్బన్: కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్ల కాలంలో జూదాలు, ఇతర అవినీతి మార్గాలనే కూటమి నేతలు తమ ఆదాయ వనరులుగా మార్చుకున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి విమర్శించారు. వీటిపై ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును టార్గెట్ చేసి, కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయాలని తణుకు టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ నేతలు తమ ఆనందం కోసం అదే నోటీసు పత్రాలను సిట్ అధికారుల వేషంలో వచ్చి కారుమూరి నివాసానికి అతికించి సంబరాలు చేసుకోవడం దారుణమని విమర్శించారు. కారుమూరిపై పెట్టిన కేసులకు ఆయన ఎప్పుడూ భయపడలేదని, ఇంట్లోని మహిళలపై కూడా కేసులు పెట్టడంపైనే ఆయన బాధపడ్డారని తెలిపారు. అత్తిలి మండలం ఆరవల్లిలో టీడీపీ నాయకులు 50 మంది నిరుద్యోగులను నమ్మించి, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. 3 కోట్లకు పైగా వసూలు చేయడం దుర్మార్గమన్నారు. ఆరవల్లిలోని టీడీపీ నాయకులే ఈ మోసంలో ప్రధాన పాత్ర పోషించి, మళ్లీ వారే పోలీసులకు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జూద కేంద్రంగా అత్తిలి కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో తణుకు నియోజకవర్గాన్ని జూద కేంద్రంగా మార్చారని సాయిబాబారెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా అత్తిలిలో తాజాగా కూటమిలోని జనసేన నాయకులు క్రికెట్ బుకీలుగా అరెస్టు కావడం సంచలనం సృష్టించిందని, వారి వివరాలు పూర్తిగా బయటపెట్టకుండా స్థానిక ప్రజాప్రతినిధి పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. అత్తిలి టీడీపీ ప్రధాన నాయకుడి బంధువు ఇంట్లోనే పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని, తణుకు పట్టణంలో 12 ప్రాంతాల్లో పేకాట నిర్వహిస్తున్నారని, ఆ కమిషన్లతోనే పార్టీని నడపడం దౌర్భాగ్యమని విమర్శించారు. ఆరవల్లిలో టీడీపీ దౌర్జన్యాలను నిలదీస్తున్న వైఎస్సార్సీపీ నేత రొయ్యల చెరువులో విషప్రయోగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ సేవలో పోలీసులు ఆరవల్లిలో జరిగిన ఉద్యోగాల మోసానికి గురైన నిరుద్యోగుల సమస్యను వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టుల కథనాలు ప్రశంసనీయమని సాయిబాబారెడ్డి కొనియాడారు. దువ్వ గ్రామంలో ఒక నిరుద్యోగికి ప్రజాప్రతినిధి సమక్షంలో సెటిల్మెంట్ చేసి డబ్బులు తిరిగి ఇచ్చారని, నవుడూరు బాధితులకు స్థలం రాసిస్తామని నమ్మబలికారన్నారు. ఉద్యోగాల మోసంపై వార్తలు రాసిన మీడియా ప్రతినిధులను పోలీసులు టార్గెట్ చేయడం వారి విధి నిర్వహణలోని లోపాలను చూపిస్తోందన్నారు. ఉప ముఖ్యమంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి మోసం చేసినా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీకి ఇబ్బంది కలగకుండా పోలీసులు ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, నాయకులు జల్లూరి జగదీష్, మెహర్ అన్సారీ, జంగం ఆనంద్కుమార్, పెనుమాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి సౌకర్యం ఏర్పాటు
ఆగిరిపల్లి: స్థానిక బస్టాండ్ ఆవరణలో ఉన్న వాటర్ కూలర్ వద్ద తాగునీరు ఏర్పాటు చేశారు. మంగళవారం ‘నిరుపయోగంగా చలివేంద్రం’ కథనం సాక్షిలో ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి బస్టాండ్ ఆవరణలో తాగునీరు ఏర్పాటు చేశారు. ఏలూరు(టూటౌన్): వృద్ధుల చట్టాలు, పథకాలపై అవగాహన కలిగి ఉండాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్నప్రసాద్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సంక్షేమ విభాగం వయోవృద్ధుల చట్టాలు, పథకాలపై అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ మాట్లాడుతూ.. వయోవృద్ధుల సంక్షేమం కోసం అనేక చట్టాలను రూపొందించారని, పిల్లల నుంచి నిరాదరణకు గురైనప్పుడు సంబంధిత శాఖ అధికారులను గానీ లేదా న్యాయ సేవాధికార సంస్థలను గాని సంప్రదించవచ్చని సూచించారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల శాఖ అదనపు డైరెక్టర్ బి.రామకుమార్, న్యాయవాది పి.రత్నరాజు, పోలీసు అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో సమగ్రశిక్ష ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మే నెల 15వ తేదీన సమగ్రశిక్ష ఉద్యోగులు తమ కుటుంబాలతో సహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర వైస్ ఛైర్మన్ వాసా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏలూరు సమగ్రశిక్ష కార్యాలయం వద్ద పాదయాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సమగ్రశిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం అందించాలని, హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని, విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి సమగ్రశిక్ష ఉద్యోగులపై చిన్నచూపు తగదని, పెరగని జీతాల గురించి ఎన్నోసార్లు విద్యాశాఖ మంత్రికి వినతిపత్రం ఇవ్వడంతో పాటు, అనేకసార్లు కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరామన్నారు. అయినప్పటికీ ఆయన నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో మే 15వ తేదీన విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుండి మంత్రి నివాసం వరకు తమ ఉద్యోగ భద్రత కోసం పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ద్వారకాతిరుమల: శ్రీవారి రూ.200 నకిలీ దర్శనం టికెట్ల స్కామ్ కేసులో ముగ్గురు నిందితులకు భీమడోలు కోర్టు న్యాయమూర్తి ఎస్.ప్రియదర్శిని నూతక్కి బుధవారం బెయిల్ మంజూరు చేశారు. ఇద్దరికి బెయిల్ నిరాకరించారు. ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో గతనెల 15న రూ. 200 నకిలీ టికెట్ల విక్రయాల స్కామ్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు 9 మందిని అరెస్టు చేసి, రిమాండ్కు పంపగా, అందులో నలుగురు నిందితులకు గత మంగళవారం బెయిల్ మంజూరయ్యింది. మిగిలిన ఐదుగురిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఐఎస్జే రాజు, ఎం.రమేష్కు మినహా మిగిలిన ముగ్గురు నిందితులకు బుధవారం బెయిల్ మంజూరయ్యింది. -
చిరిగిన సంచులే దిక్కు
దాళ్వా కోతల నేపథ్యంలో రైతులకు ఇక్కట్లు ఆకివీడు: రైతులకు సంచుల బెడద తీవ్రమైంది. దాళ్వా కోతలు ముమ్మరమవుతుంటే, ప్రభుత్వం రైతులకు సంచుల సరఫరాలో పూర్తిగా విఫలమైంది. రైస్ మిల్లర్లు సంచులను సరఫరా చేస్తారని చెప్పడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. సకాలంలో మిల్లర్లు సంచులు సమకూర్చలేకపోతున్నారు. ఆయా గ్రామాల్లోని రైతులకు కేటాయించిన మిల్లుల వద్ద నుంచి వచ్చే సంచులలో 60 శాతానికి పైగా చినిగినవి ఇవ్వడంతో రైతులు అయోమయంలో ఉన్నారు. స్థానిక మాదివాడ ఆయకట్టులో రైతులు కోతలు ముమ్మరం చేశారు. అయితే చినిగిన సంచులతో సతమతమవుతున్నామని, ధాన్యం పూర్తిస్థాయిలో మిల్లులకు ఏ విధంగా చేరుతుందోనన్న భయంతో ఉన్నామని పలువురు రైతులు వాపోతున్నారు. పాత సంచులే ఇస్తున్నారని, వాటిలో చిల్లులు ఉన్న సంచులకు ప్యాచ్ వర్కులు వేసి సరఫరా చేయడంతో ధాన్యం నింపిన వెంటనే కారిపోతున్నాయని లబోదిబోమంటున్నారు. మరికొన్ని సంచులు చిన్నవిగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఒక్కో సంచిలో 45 కేజీల ధాన్యం నింపాల్సి ఉండగా, ఈ సంచుల నాణ్యత లేకపోవడం వల్ల కేవలం 35 నుంచి 40 కేజీలు మాత్రమే నింపుతున్నారు. దీనివల్ల అదనపు బస్తాలను వాడాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో రైతులకు కొత్త సంచులు సరఫరా చేసేవారని, కనీసం చిరుగులు లేని సంచులు సరఫరా చేస్తే ధాన్యం భద్రంగా ఉంటుందని రైతులు మొరపెట్టుకుంటున్నారు. చిరిగిన సంచుల్లోనే ధాన్యం చిల్లుల వల్ల కారిపోతున్న ధాన్యం -
అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టే లేదు
ముదినేపల్లి (కై కలూరు): లైంగిక దాడికి యత్నంపై ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. ప్రొద్దువాక గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త ఇద్దరు పిల్లలతో కలసి బడ్డి కొట్టు నిర్వహిస్తోంది. ఇదే గ్రామానికి చెందిన కూర్మా దేవదాసు బడ్డికొట్టు వద్దకు అప్పుడప్పుడు వస్తుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం భర్త, అత్తా లేని సమయంలో దేవదాసు మద్యం సేవించి వచ్చి ఆ మహిళను ఇంట్లోకి లాక్కువెళ్లి లైంగికదాడికి యత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయగా చుట్టుపక్కల వారు రావడంతో పరారయ్యాడు. భార్యభర్తల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు. -
సంచి నిండా చిల్లులే
పాత సంచులు సరఫరా చేయడంతో వాటి నిండా చిల్లులే ఉంటున్నాయి. ఒక్కో సంచిలో 45 కేజీల ధాన్యం నింపాల్సి ఉండగా, కేవలం 35 నుంచి 40 కేజీలే పడుతున్నాయి. సంచుల తేడాతో రైతులు తీవ్ర నష్టానికి గురికావాల్సి వస్తోంది. ప్రభుత్వం తక్షణమే నాణ్యమైన సంచులను సరఫరా చేయాలి. – గంధం మధుసూధనరావు, రైతు, మాదివాడ, ఆకివీడు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పాత సంచులు ఇస్తున్నారు. అవి సకాలంలో అందడం లేదు. రైతులు సంచుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాళ్వా కోతలు ముమ్మరంగా సాగుతున్నందున సంచుల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – తుంపుళ్ల సూర్యనారాయణ, రైతు, ఆకివీడు


