breaking news
Eluru District News
-
కోకో బోర్డు ఏర్పాటు చేయాలి
పెదవేగి: రాష్ట్రంలో కోకో బోర్డు ఏర్పాటు చేయాలని ఏపీ కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని వంగూరులో కోకో రైతు సదస్సు నిర్వహించా రు. సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి పానుగంటి అచ్యుతరామయ్య అధ్యక్షత వహించారు. సదస్సులో కోకో రైతుల సమస్యలు చర్చించి పలు తీర్మానాల ను ఆమోదించారు. అనంతరం కె.శ్రీనివాస్ మా ట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో కోకో సాగును ప్రోత్సహిస్తామని చెబుతున్నా.. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కోకో గింజలను మార్కెట్లో విక్రయించడానికి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరో లక్ష ఎకరాలు పెంచితే ఆ పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోతే కోకో రైతులకు మరిన్ని అవస్థలు తప్పవన్నారు. రాష్ట్రంలో కోకో బోర్డు ఏర్పాటు చేయాలని, విదేశీ కోకో గింజలు దిగుమతులు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ధర వ చ్చేలా ఫార్ములా రూపొందించి కోకో గింజలకు ధర నిర్ణయించి అమలు చేయాలని కోరారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షు డు గుదిబండి వీరారెడ్డి మాట్లాడుతూ కోకో రైతులంతా రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడి భవి ష్యత్తులో కోకో గింజలను తామే మార్కెటింగ్ చేసుకునేలా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఆలపాటి వాసు, పానుగంటి నరేష్, కొండపల్లి స త్యనారాయణ, గోపిశెట్టి శ్రీనివాస్, సింహాద్రి సతీ ష్, ఏపూరి శ్రీనివాసరావు, కొట్టే సురేష్, మామిళ్లపల్లి వెంకట్రావు, పానుగంటి సుధాకర్ పాల్గొన్నారు. -
ఉధృతంగా గోదావరి
‘కళ్ల కలక’లం వర్షాకాలం కావడంతో జిల్లాలో కళ్ల కలకతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. 8లో uఆదివారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2025పోలవరంలో క్రమేపీ పెరుగుతూ.. పోలవరం రూరల్: గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఉప నదుల నీరు చేరడంతో వరద ప్రవాహం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 31.430 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్వే 48 గేట్ల నుంచి 7,43,222 క్యూసెక్కుల నీరు దిగువకు చేరు తోంది. అయితే భద్రాచలం వద్ద శనివారం ఉద యం 11 గంటలకు 41.30 అడుగులకు చేరుకున్న నీటిమట్టం క్రమేపీ స్వల్పంగా తగ్గుతూ రాత్రికి 41 అడుగులకు చేరుకుంది. భద్రాచలం వద్ద వరద స్వల్పంగా తగ్గుతూ నిలకడగా ప్రవహిస్తోంది. దిగువన వరద స్వల్పంగా పెరుగుతోంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరికి వరద పోటెత్తుతోంది. పూర్తి జలకళతో గోదావరి, శబరి నదులు ప్రవహిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురిసిన వర్షాలతో లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతుంది. ముంపు మండలాలైన ఏజెన్సీ గ్రామాలను అతలాకుతలం చేస్తూ పోలవరం నుంచి ధవళేశ్వరం మీదుగా లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోంది. శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి పోలవరం ప్రాజెక్టు నుంచి 7,43,222 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. మరోవైపు మండలాల్లోని మూడు గ్రామాలకు చెందిన ప్రజలను పునారావాస కేంద్రాలకు తరలించారు. ముంపు మండలాల్లో హైఅలర్ట్ గోదావరికి వరద ఉధృతి కొనసాగుతున్న క్రమంలో ముంపు మండలాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరికి పది రోజులుగా భారీగా వరద నీరు చేరు తుంది. ఈనెల 2 నుంచి ప్రారంభమైన వరద నీరు శుక్రవారం 5,02,478 క్యూసెక్కులు, శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి 7,43,222 క్యూసెక్కులు నీరు పోలవరానికి చేరింది. భద్రాచలం వద్ద 41.30 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తుంది. మరోవైపు ఆదివారం, సోమవారం గోదావరి నిలకడగా కొనసాగే అవకాశం ఉందని, ఎగువ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో తీవ్రత కొంత తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 2 నుంచి శనివారం వరకు 30.52 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతాల నుంచి పోలవరానికి చేరుకుంది. పోలవరం నుండి దిగువకు విడుదల చేశారు. ముంపు గ్రామాల్లో భయం.. భయం పోలవరం ముంపు గ్రామాల్లో వరద భయం వెంటాడుతోంది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో మూడు గ్రామాలకు వరద ముంపు పొంచి ఉంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం కుక్కునూరు మండలంలోని గొమ్ముగూడెం, లచ్చిగూడెం గ్రామాలకు చెందిన 70 కుటుంబాలు దాచారంలోని ఆర్అండ్ఆర్ కాలనీకి తరలించారు. వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ముగూడెంకు చెందిన సుమారు 100కు పైగా కుటుంబాలు పునరావాస కాలనీకి తరలివెళ్లాయి. అలాగే రాష్ట్రం విపత్తుల నివారణ దళం సభ్యులు (ఎన్డీఆర్ఎఫ్) రెండు మండలాలకు చేరుకున్నారు. ఒక్కో మండలంలో 35 మంది బృందంతో అత్యవసర సేవలందించడానికి వీలుగా సిద్ధం చేశారు. జిల్లా అధికార యంత్రాంగం పునరావాస కేంద్రంలో పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు వేలేరుపాడు, కోయిదా, ప్రధాన రహదారిపై ఉన్న ఎద్దులవాగు వంతెన గోదావరి వరద పొంగిపొర్లడంతో వంతెన పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో 18 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు శివారులో వేలేరు వద్ద కిన్నెరసాని వాగుకు వరద నీరు చేరడంతో సమీపంలోని పొలాల్లోకి వరద నీరు పోటెత్తింది. అలాగే కుక్కునూరు మండలంలో గుండేటివాగు లోలెవల్ వంతెన జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి. న్యూస్రీల్ 7.43 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల వేలేరుపాడు, కుక్కునూరులో పునరావాస కేంద్రాలు నిలకడగా శబరి, గోదావరి రెండు రోజుల్లో వరద తగ్గుముఖం పట్టే అవకాశం నీటమునిగిన ఎద్దులవాగు, గుండేటివాగు వంతెనలు వేలేరుపాడులో 18 గ్రామాలకు నిలిచిన రాకపోకలు -
ఆదుకోవాలంటూ రోడ్డు ప్రమాద బాధితుల ధర్నా
ఆగిరిపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించడంతో ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులతో పాటు గ్రామస్తులు ధర్నా నిర్వహించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. మండలంలోని నెక్కలం గొల్లగూడెంకి చెందిన పటాపంచల గంగరాజు (35) శుక్రవారం మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై ఆగిరిపల్లి వెళ్తుండగా బొలెరో వాహనం ఢీకొట్టింది. గంగరాజును విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. గంగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ టీడీపీ నాయకులు, గ్రామస్తులు పోలీస్స్టేషన్ కు వచ్చారు. అక్కడ చర్చలు ఫలించకపోవడంతో శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నెక్కలం గొల్లగూడెంలో ధర్నా నిర్వహించారు. న్యాయం చేయాలని ధర్నా నిర్వహిస్తున్నా మంత్రి పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా నిర్వహిస్తున్న ప్రభుత్వం గానీ, పార్టీ నాయకులు గాని పట్టించుకోలేదని స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండు వైపులా నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నూజివీడు డీఎస్పీ గ్రామానికి చెందిన పెద్దలతో చర్చలు జరిపి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. -
ఆషాఢం
సంప్రదాయ సమ్మేళనం ● జిల్లాలో ఆధ్యాత్మిక శోభ ● అమ్మవార్లకు సారెలు, విశేష అలంకరణలు ● ఇళ్లలో తెలగ పిండి, మునగాకు వంటకాలు ● ఆడపడుచుల చేతికి గోరింటాకు లేపనాలు ● చక్కర్లు కొడుతున్న కొత్త జంటలు ● దుకాణాల్లో ఆఫర్ల మేళాలు సాక్షి, భీమవరం: సంస్కృతి, సంప్రదాయాల పుట్టిల్లు తెలుగు నేల. ప్రకృతితో మమేకం చేస్తూ ఇక్కడి ప్రతి నెలకి ఏదోక విశిష్టత ఉంటుంది. అందులోనూ నాలుగో నైలెన ఆషాఢ మాసం మరింత ప్రత్యేకమైనదిగా భావిస్తారు. వాతావరణాన్ని చల్లబరుస్తూ తొలకరి వర్షాలు, పొంగి ప్రవహించే కాలువలు, వరి నాట్లుతో పచ్చ తివాచీని పరుచుకునే పంట పొలాలు, గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, ప్రత్యేక వంటకాలు, ఆచారాలు ఆహ్లాదాన్ని అందిస్తాయి. పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రాల్లో సంచరించడం వలన ఈ నెలను ఆషాఢ మాసంగా పిలుస్తారు. మిగిలిన నెలలతో పోలిస్తే శూన్య మాసంగా భావించి శుభకార్యాలు తలపెట్టనప్పటికి దేవతారాధనకు ఇదే సరైన సమయంగా పెద్దలు చెబుతారు. ఆషాఢంలోని తొలి ఏకాదశి రోజునే శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్లేది. హిందువుల తొల పండుగ కూడా ఇదే. గురు పౌర్ణమి, స్కంధ షష్ఠి తదితర పర్వదినాలు జరుపుకుంటారు. జిల్లాలోని గ్రామ దేవతలకు ఆషాఢం సారెలు, మొక్కుబడులు సమర్పించుకోవడం అనాదిగా వస్తోంది. భీమవరం మావూళ్లమ్మ, రాయకుదురు మావూళ్లమ్మ, మహాలక్షి, ఏలూరుపాడులోని ముసలమ్మ, ఎల్లమ్మ, మోగల్లులోని పెన్నేరమ్మ, మారమ్మ, గంగాదేవి అమ్మవార్లు, జిల్లాలో పేరొందిన గ్రామ దేవతల ఆలయాల్లో ఆషాఢ మాసం పూజలు ఘనంగా జరుగుతున్నాయి. శాఖాంభరిగా, ప్రత్యేక అలంకరణల్లో అమ్మవార్లు భక్తులకు దర్శనిమిస్తున్నారు. నవ దంపతుల చక్కర్లు కొత్తగా పెళ్లైన జంట ఆషాఢంలో అత్తవారింటి గడప దాటకూడదని సంప్రదాయం. ఈనెల్లో దంపతులు కలిస్తే తొమ్మిది నెలల తర్వాత మండు వేసవిలో కాన్పు వచ్చే అవకాశం ఉంది. వైద్య సదుపాయాలు అంతగా లేని ఆ రోజుల్లో ఇది తల్లీబిడ్డకు మంచిది కాదు. తొలకరి జల్లులతో సార్వా పనులు మొదలయ్యేది ఇప్పుడే. కొత్త పెళ్లికొడుకు పొలం పనులకు పోకుండా భార్య కొంగు పట్టుకుని తిరిగితే తిండి గింజలకు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నది ఒక కారణం. అనుభవ జ్ఞానంతోనే పూర్వీ కులు ఆషాఢం వేళ కొత్తజంట అత్తింటి గడప దాటకూడదనే ఆచారం తెచ్చారంటారు. అయినా ఇంటిలోని వారికి ఏవో సాకులు చెప్పి నవ దంపతులు చక్కర్లు కొట్టడం, ఏమీ తెలీనట్టుగా అత్తమామలు లోలోపల మురిసిపోవడం ప్రతి ఇంటా జరిగే తంతే. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని పట్టణాల్లో పార్కులు, పేరుపాలెం బీచ్, ఇతర పర్యాటక కేంద్రాలు కొత్త జంటలతో కళకళతాడుతున్నాయి. గోరింట పూస్తుంది ఆరేళ్ల పాపాయి నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు అరచేతులు, కాళ్లకు పారాణిగా గోరింటాకు పెట్టుకునేందుకు ఉత్సాహపడతారు. పల్లెల్లోని అమ్మ మ్మలు, నానమ్మలు గోరింటాకును రుబ్బించి పట్టణాల్లోని తమ కుమార్తెలు, కోడళ్లు, మనవరాళ్లకు పంపిస్తుంటారు. ఈ సీజన్లో గోరింటాకు పెట్టుకోవడం వెనుక శాసీ్త్రయ కారణంగా ఉంది. వర్షాల వలన ఇంట్లో పనులు చేసుకునే మహిళల కాళ్లు, చేతులు పగుళ్లు తీస్తుంటాయి. గోరింటాకు పగుళ్లు రాకుండా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబు తున్నారు. ఇలా ఆషాఢ ఆచారాలు ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య కారకాలుగా ఉన్నాయి. అన్నింటా ఆఫర్ల మేళా ఆషాఢం వేళ అన్నింటా ఆఫర్ల మేళానే. జిల్లాలో ఏలూరు, భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెం, నరసాపురం, నూజివీడు తదితర పట్టణాల్లోని క్లాత్, రెడీమేడ్, జ్యూయలరీ, కాస్మోటిక్స్ షోరూంలతో పాటు మండల కేంద్రాల్లోని చిన్న దుకాణాల్లో సైతం ప్రస్తుతం ఆషాఢం ఆఫర్లు నడుస్తున్నాయి. మహిళల్ని ఆకర్షించి అమ్మకాలు ఆషాఢం సేల్ అంటూ వ్యాపారులు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వంటకాలూ ప్రత్యేకమే వర్షాలతో శరీరం చల్ల బడి నజ్జు చేయడం, ప్రతికూల వాతావరణంతో ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. వీటికి నివారణగా తెలగపిండి–మునగాకు, పప్పు–వాగ కాయలు ఈ ఆషాఢ మాసంలో వండుకోవడం జిల్లా అంతటా కనిపిస్తుంది. గ్రామల్లో నివసించే వారు పట్ట ణాల్లోని తమ వాళ్లకు ప్రత్యేకంగా వండి పంపిస్తుంటారు. వీటిలోని పోష కాలు శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆషాఢంలో ఒక్కసారైన ఈ కూరలు తినాలనేది ఆనాదిగా వస్తున్న ఆచారం. ఈ సీజన్లో వచ్చే నేరేడుపండ్లు, తాటికాయాలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. అరుదైన కాలం ఆషాఢం ఆషాఢ మాసం అన్ని నెలల్లోనూ అరుదైనది. సూర్యుడు మిధున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తాయి. వీటిని తట్టుకునేలా మనుషులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వచ్చే మార్పుల ప్రభావం వ్యాధి నివారణకు ఉపకరిస్తుంది. పండితులు చాతుర్మాస దీక్షలు చేపడతారు. ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యం పెనవేసుకున్నా మాసం ఆషాఢం. – రామశాస్త్రి, పండితులు, ఆకివీడు -
నేటి నుంచి వెబ్ ఆప్షన్లు
హెల్ప్లైన్ సెంటర్లు ఇవే.. విద్యార్థులకు సహకరించేందుకు సాంకేతిక విద్యాశాఖ అధికారికంగా కొన్ని హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఏలూరు జిల్లాలో అధికారిక హెల్ప్లైన్ సెంటర్ ఒక్కటీ కూడా ఇవ్వలేదు. ఏలూరు జిల్లా విద్యార్థులు అధికారిక హెల్ప్లైన్ సెంటర్ సేవలు పొందాలంటే తణుకులోని ఎస్ఎంవీఎం పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్ళాలి. విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజ్, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ డిగ్రీ కళాశాల, స్టెల్లా కాలేజ్ ఎదురుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో హెల్ప్లైన్ సెంటర్లకు వెళ్ళవచ్చు. కాకినాడలోని ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల, జేఎన్టీయూ కాకినాడల్లో ఏర్పాటు చేసిన అధికారిక హెల్ప్లైన్ సెంటర్లకు వెళ్ళవచ్చు. ఏలూరు (ఆర్ఆర్పేట): నేటి నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించి వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ మొదలు కానుంది. ర్యాంకులు సాధించడం ఒక ఎత్తయితే అనుకున్న కళాశాలల్లో సీట్లు సాధించడం మరొక ఆప్షన్ల ఎంపికలో తొందరపడితే భవిష్యత్పై ప్రభావం పడుతుందంటున్నారు. అందువల్ల ఆచితూచి ఆప్షన్లు పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 నుంచి 18 వరకూ వెబ్ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది. మంచి ర్యాంకులు సాధించిన వారు సీఎస్ఈకే మొగ్గుచూపుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల కొత్తగా ఒక ట్రెండ్ నడుస్తోంది. ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఆయా ప్రాంతాల్లోని ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులకు మంచి ఆఫర్లు ఇస్తున్నారు. తమ కళాశాలకు తొలి ప్రాధాన్యతగా వెబ్ ఆప్షన్లు ఇచ్చేలా ఇంటర్నెట్ సెంటర్కు వచ్చే విద్యార్థులతో ఒప్పించి ఆప్షన్ పెట్టిస్తే ఒక్కో విద్యార్థికి రూ.5 వేల కమిషన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో పాటు వివిధ కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులకు కూడా ఆయా ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఇలాంటి ఆఫర్లనే ఇస్తున్నారని తెలిసింది. ఆయా లెక్చరర్ల ద్వారా తమ కళాశాలలో విద్యార్థులను చేర్చితే లెక్చరర్కు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ ఇస్తున్నారంటున్నారు. దళారులను నమ్మొద్దు అయితే ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకులు, మరికొందరి మాటలు నమ్మితే విద్యార్థులు నష్టపోయే ప్రమాదముందంటున్నారు. బాగా నమ్మకస్తులైన వారి సూచనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. కొంతమంది కేవలం తాము చెప్పిన కళాశాలకే ఆప్షన్ పెట్టి మరే ఆప్షన్ అవసరంలేదని నమ్మిస్తున్నారని తెలుస్తోంది. అలా చేస్తే సాంకేతిక కారణాల వల్ల సీటు రాకపోతే రెండో కౌన్సెలింగ్ వరకూ వేచి ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో తమకు ఆశించిన కళాశాలలో సీటు కోల్పోయే ప్రమాదముంటుందని చెబుతున్నారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చే సమయంలో పాస్వర్డ్ను ఎవరికీ చెప్పవద్దని సూచిస్తున్నారు. ఇటీవల వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు నేరుగా తమకు సమీపంలోని కళాశాలలకే వెళుతున్నారని, అక్కడ వెబ్ ఆప్షన్ ఇచ్చే క్రమంలో పాస్వర్డ్ వారికి చెప్పాల్సి వస్తోందని, ఆ సందర్భం వస్తే విద్యార్థులే వారి పాస్వర్డ్ను ఎంటర్ చేస్తామని సంబంధిత వ్యక్తులకు ఖరాఖండిగా చెప్పాలని సూచిస్తున్నారు. వారికి వచ్చే ఓటీపీని కూడా ఇతరులతో పంచుకోవద్దని చెబుతున్నారు. ఇలా చేస్తే విద్యార్థుల ఎదుట వారు చెప్పిన క్రమంలోనే ఆప్షన్లు ఇచ్చినా వారు వెళ్ళిన తరువాత వారే ఆప్షన్లు మార్చే అవకాశముందంటున్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు ఇలా.. ఇంజనీరింగ్ విద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం ఏలూరు జిల్లాలో మొత్తం 6 ఇంజనీరింగ్ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాల, హేలాపురి ఇంజనీరింగ్ కళాశాల ఏలూరు శివారు ప్రాంతాల్లో ఉన్నాయి. ఆగిరిపల్లిలో ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కళాశాల, నూజివీడులో సారధి ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి ఈ ఏడాది విద్యార్థులకు ఆయా బ్రాంచుల్లో మొత్తం 4920 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 14 ఇంజినీరింగ్ కళాశాలలుండగా దాదాపు 14,600 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయి. ఏలూరు జిల్లాలో 6, పశ్చిమ గోదావరిలో 14 ఇంజినీరింగ్ కాలేజీలు ఆచితూచి ఆప్షన్లు పెట్టుకోవాలంటున్న నిపుణులు -
మైనింగ్ దెబ్బకు రోడ్లు ఛిద్రం
సాక్షి, టాస్క్ఫోర్స్: మైనింగ్ మాఫియాకు కై కలూరు నియోజకవర్గం కేజీఎఫ్ గనిగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే మట్టి, ఇసకను ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. రెవెన్యూ, పోలీసు శాఖలు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు. ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత రావడంతో పగటిపూట కాకుండా సాయంత్రం నుంచి తెల్లవార్లు టిప్పర్లతో ఇతర జిల్లాలకు తరలించేస్తున్నారు. నేషనల్ హైవే పనులు పేరు చెప్పి సీనరేజ్ చెల్లించకుండా రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్.. శ్రీనా బంధువులైనా టిప్పర్లతో మైనింగ్ చేస్తూ బయట విక్రయిస్తే కేసులు పెట్టండిశ్రీ అని మీడియా ముందు పోలీసులకు చెప్పడం ఉత్తుత్తి మాటలని తేలిపోయాయి. హైవే పనులు చెప్పి అక్రమార్జన నియోజకవర్గంలో పెదపాలపర్రు నుంచి ఉప్పుటేరు వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు రూ.275 కోట్లతో చేస్తున్నారు. ఈ పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. అధికారంలోకి రాగానే హైవే పనులకు మట్టిని తరలించే వాళ్ళను కాదని, కూటమి నేతలు కొందరు టిప్పర్లతో ఇసుకను రవాణా చేస్తున్నారు. టిప్పర్లపై తీవ్ర విమర్శలు రావడంతో మార్చి 22న ఎమ్మెల్యే కామినేని నెల రోజుల్లో 5,000 టిప్పర్ల తరలింపునకు హైవేకు అవకాశం కల్పించాలన్నారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి హైవేకు కాకుండా బయటకు వెళ్తే సీజ్ చేయాలని ఆర్డీవో, సీఐలకు అదేశించారు. తిరిగి ఏప్రిల్ 27న హైవే పనులకు 10,000 టిప్పర్లు అవసరం ఉందని, కై కలూరు, మండవల్లి మండలాల్లో మాత్రమే అనుమతించాలని చెప్పారు. చివరకు పోలీసులు ఏర్పాటు చేసిన సరిహద్దుల్లో చెక్ పోస్టులు సైతం తీసేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అమెరికా వెళ్ళారు. ఇదే అదునుగా రాత్రి వేళ టిప్పర్లను ఇతర జిల్లాలకు కూటమి నేతలు తరలిస్తున్నారు. టిప్పర్లతో రోడ్లు ధ్వంసం టిప్పర్ల దెబ్బకు నియోజకవర్గంలో పలు రహదారులు ధ్వంసమయ్యాయి. వాస్తవానికి ఆర్అండ్బీ రహదారులు 25 నుంచి 30 టన్నులను భరించగలవు. టిప్పర్లు ఏకంగా 40 టన్నుల పైగా అధికలోడుతో వెళ్తున్నాయి. దూరాన్ని బట్టి ఒక్కో టిప్పరును రూ.10,000 నుంచి రూ.11,000 విక్రయిస్తున్నారు. ఇటీవల కై కలూరు – కలిదిండి రోడ్డును నిర్మించారు. ఈ రహదారి టిప్పర్ల కారణగా దెబ్బతింది. ప్రధానంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్వగ్రామమైన వరహాపట్నం రింగ్ వద్ద మరింత దారుణంగా మారింది. రాచపట్నం, గోపవరం, వేమవరప్పాడు, వెంకటాపురం, గోపాలపురం పెదగొన్నూరు, వణుదుర్రు, దేవపూడి, బొమ్మినంపాడు, శీతనపల్లి, చిగురుకోట, భైరవపట్నం, గన్నవరం వంటి ప్రాంతాల్లో మైనింగ్ కారణంగా రోడ్లు పాడవుతున్నాయి. అధిక లోడు వాహనాల కారణంగా పాడైన రోడ్డుకు రూ.20 లక్షల వరకు పరిహారం చెల్లించాలనే నిబంధన అమలు కావడం లేదు. నేషనల్ హైవే డీఈఈ సత్యనారాయణను వివరణగా కోరగా ప్రస్తుతానికి హైవే పనులకు టిప్పర్లు తిరగడం లేదన్నారు. కై కలూరు నియోజకవర్గంలో నిబంధనలు పాటించని మైనింగ్ నిర్వాహకులు ఎమ్మెల్యే కామినేని స్వగ్రామం వరహాపట్నం రోడ్డుకూ గుంతలు సీనరేజ్ చెల్లించకుండా రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి నిబంధనలు గాలికి.. ఆదాయం జేబులోకి.. మైనింగ్ చేయాలంటే సవాలక్ష నిబంధనలు విధించారు. మైనింగ్ మాఫియాకు మాత్రం ఇవేవీ పట్టదు. ప్రభుత్వానికి వచ్చే రూ.కోట్ల అదాయాన్ని మాట్టి మాఫియా తమ జేబుల్లో నింపుకుంటుంది. మైనింగ్ విషయంలో టిప్పర్లకు, ట్రాక్టర్లకు ఒకే నిబంధన ఉంటుంది. ఇక్కడ ట్రాక్టర్లకు ఏకంగా అధికారులే మినహాయింపు ఇస్తున్నారు. ఇప్పటికే ఆక్వా చెరువుల కారణంగా అధిక ఉత్పత్తులతో వెళ్తున్న చేపల లోడులతో ఈ ప్రాంతంలో రహదారులు పాడయ్యాయి. ఇప్పుడు మట్టి టిప్పర్లతో మరింతగా ధ్వంసమవుతున్నాయి. ఇప్పటికై న జిల్లా అధికారులు మట్టి అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
అధికారులూ.. వరదలపై అప్రమత్తం
ఏలూరు(మెట్రో): జిల్లాలో వరద తగ్గే వరకూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కుక్కునూ రు, వేలేరుపాడు మండలాల్లో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. వరదల కారణంగా ఒక్కరికీ ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లకుండా చూడాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు పటిష్ట పర్యవేక్షణ చేయాలన్నారు. నిండు గర్భిణులను సామాజిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని, పునరావాస కేంద్రాల్లో జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని, తాగునీరు, వంట సామగ్రి, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలన్నారు. వరద నీరు ఉధృతంగా ప్రవహించే కల్వర్టులు, కాజ్వేలు, రహదారులను ముందస్తుగా మూసివేయాలన్నారు. వరదల కారణంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. -
‘కళ్ల కలక’లం
దెందులూరు: శరీరంలో ఏ భాగానికి అనారోగ్యం వచ్చిన తట్టుకోవచ్చు కానీ కళ్లకు చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేం. వర్షాకాలం కావడంతో జిల్లాలో కళ్ల కలకతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వైరస్ వల్ల సోకే ఈ అంటువ్యాధి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఎక్కువగా వ్యాపిస్తుంది. వ్యాధి లక్షణాలు కళ్ళు ఎరుపుగా మారి వెలుతురు చూడలేకపోవడం. కంటి నుంచి నీరు కారటం, దురద, మంట, పుసులు కట్టడం, కన్ను నొప్పి. వ్యాధి వ్యాప్తి కళ్ల కలక ఉన్న వ్యక్తి వాడిన వస్తువులు వ్యాధి లేని మరో వ్యక్తి తాకి కళ్లను ముట్టుకోవడం వల్ల ఇది వ్యాపిస్తుంది. నివారణ చర్యలు గోరువెచ్చని నీటితో కళ్లను తరచూ శుభ్రం చేసుకోవాలి. శుభ్రమైన తువాలుతో కళ్లను తుడవాలి. కళ్లద్దాలు ధరించాలి. వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. కళ్లలో మందులు వేయడానికి ముందు తరువాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలి. చేయకూడనివి కళ్ల కలక ఉన్న వ్యక్తి వాడిన టవల్స్, దిండ్లు, దుప్పట్లు వేరొకరు వాడకూడదు. కళ్ళు ఎరగ్రా ఉంటే పాఠశాలకు పంపించకూడదు. కళ్ళలో ఆకుపసరు వంటివి వేయకూడదు. మూడు నుంచి నాలుగు రోజుల్లో పరిస్థితి మెరుగు పడకపోతే కంటి వైద్యుడిని సంప్రదించాలి. కళ్ల కలక విస్తరింపకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. అవగాహన సమావేశాలు కళ్ల కలక లక్షణాలు, నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దెందులూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిధిలో ప్రజలకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నా. కళ్ల కలక విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ సుందర్ బాబు, సూపరింటెండెంట్ దెందులూరు సీహెచ్సీ సులువుగా వ్యాపిస్తుందంటున్న వైద్యులు వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం -
వైద్యుడు లేకపోవడంపై గ్రామస్తుల నిలదీత
ద్వారకాతిరుమల: మండలంలోని వేంపాడులో 104 వైద్య సిబ్బందిని గ్రామస్తులు శనివారం నిలదీశా రు. వైద్యుడు లేకుండా సేవలు ఎలా అందిస్తారని మండిపడ్డారు. గ్రామంలో ప్రజలకు ప్రతినెలా 104 సేవలను అందిస్తున్నారు. అయితే గత నెల మా దిరిగా ఈ నెల కూడా వైద్యుడు లేకుండా వైద్య సిబ్బంది మాత్రమే గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చారు. వైద్యుడు లేకుండా మీ రిచ్చే మందులను ఏ నమ్మకంతో వాడమంటారంటూ బాధితులు ప్రశ్నించారు. డాక్టర్ ఏమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యురాలు ట్రైనింగ్ నిమి త్తం ఏలూరు వెళ్లారని సిబ్బంది బదులిచ్చారు. అ యితే గత నెల ఎందుకు రాలేదని అడగ్గా, అప్పుడు డాక్టర్ వ్యక్తిగత సెలవు పెట్టారని సమాధానమిచ్చారు. డాక్టర్ లేకపోతే మరో రోజు రావచ్చుగా అ న్న ప్రశ్నకు.. మరో రోజు రావడం కుదరదని, డా క్టర్ పీహెచ్సీలో డ్యూటీ చేయాలి కదా అని సిబ్బంది సమాధానం ఇచ్చారు. డాక్టర్ వచ్చేనెల తప్పనిసరిగా వస్తారులే.. అయినా మేం మందులు ఇస్తున్నాంగా, గొడవ చేయకండి అని అన్నారు. డాక్టర్ సెలవు పెడితే మరో డాక్టర్ను పంపించాలి గాని, ఇలా సిబ్బందితో సేవలు అందించడం ఏంటని గ్రామస్తులు మండిపడ్డారు. -
జెడ్పీ చైర్పర్సన్ కారుపై దాడి అమానుషం
కై కలూరు: కూటమి పాలనలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని ముదినేపల్లి మండలానికి చెందిన వైఎస్సార్సీపీ ముదిరాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కో మటి విష్ణువర్థన్ అన్నారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ గుడివాడలో జరిగే పార్టీ కార్యక్రమానికి హాజరవుతున్న కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారు అద్దాలను పగలగొట్టి కూటమి గూండాలు బీభత్సం చేయడం అత్యంత బాధాకరమన్నారు. దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దాడులు దేనికి సంకేతం? దెందులూరు: కృష్ణా జిల్లాపరిషత్ చైర్పర్సన్ హారికపై దాడి చేసి, దౌర్జన్యానికి పాల్పడటం దుర్మార్గపు చర్య అని ఉమ్మడి పశ్చిమగోదా వరి జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు అన్నారు. శనివారం సాక్షితో ఆయన మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. కూటమి ప్రభుత్వంలో సామాన్య ప్రజానీకంతో పా టు జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేకుండా పోయిందనే విషయాన్ని ఈ దాడి నిరూపించిందన్నారు. వెంటనే న్యాయస్థానాలు ఈ ఘ టనను సుమోటోగా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. దాడి చేసి, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై ప్రభు త్వం సీరియస్గా స్పందించి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటించడానికి ఎంతో సమయం పట్టదని అన్నారు. -
తీర్పులు వేగంగా వెలువరించాలి
ఏలూరు (టూటౌన్): కేసుల తీర్పులు త్వరితగతిన వెలువరించాలని, అలాగే తీర్పుల్లో నాణ్యత లోపించకూడదని న్యాయమూర్తులకు ఏపీ రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తి, ఉమ్మడి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె.సురేష్రెడ్డి సూచించారు. ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులతో శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆయన జ్యూడీషియల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సివిల్ కేసులు, విచారణలో ఉన్న ఖైదీల కేసులను త్వరితగతిన తీర్పులను వెలువరించడానికి ప్రయత్నించాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి ఉమ్మడి జిల్లాలో పెండింగు కేసులు వివరాలు, భవన సము దాయాల పరిస్థితులపై వివరించారు. జిల్లా న్యాయమూర్తులు, సీనియర్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు పాల్గొన్నారు. అందుబాటులో ఎరువులు ఏలూరు(మెట్రో): జిల్లాలో పుష్కలంగా ఎరువులు ఉన్నాయని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. జిల్లాకు వచ్చిన ఎరువులను తరలిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు. 50 శాతం సొసైటీల ద్వారా, 50 శాతం ప్రైవేట్ డీలర్ల ద్వారా రైతులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. డీలర్లు బ్లాక్ మార్కెటింగ్ చేసినా, అధిక ధరలకు అమ్మినా, అక్రమంగా తరలించినా, వారి లైసెన్సులు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. 86 సొసైటీల ద్వారా 10 డీసీఎంఎస్ల ద్వారా పంపిణీ చేస్తామన్నారు. నేడు ప్రజా సంఘాల సదస్సు ఏలూరు (టూటౌన్): విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారాల మోపడానికి ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు శనివారం ప్రకటన విడుదల చేశారు. గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల ప్రజలపై భారం పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ట్రూఅప్, సర్దుబాటు చార్జీలు తదితర రూపాలలో అధిక బిల్లుల భారాలను ప్రజలు మోస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధి కూలీలపై వివక్ష తగదు ఏలూరు (టూటౌన్): ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని పాలకవర్గాలు కుట్ర చేస్తున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. శనివారం ఏలూరులో ఉపాధి హామీ కూలీలు, పేదలతో కలిసి ని రసన తెలిపారు. ఉపాధి కూలీలకు వేతన బకా యిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేద న్నారు. పొమ్మన లేక పొగబెట్టే తీరుగా ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయని, ఉపాధి కూలీలపై వివక్ష తగదని అన్నారు. జిల్లా అధ్యక్షుడు ఎం. జీవరత్నం, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బదిలీ ఉపాధ్యాయులకు జీతాలెప్పుడు? ఏలూరు (ఆర్ఆర్పేట): ఇటీవల బదిలీ చేసిన ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు క్రియేట్ చే సి వెంటనే జీతాలు చెల్లించాలని ఫ్యాప్టో నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక పవర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఫ్యాప్టో జిల్లా సమావేశం జిల్లా అధ్యక్షుడు జి.మోహన్ అధ్యక్షతన నిర్వహించారు. పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించి తక్షణమే ఐఆర్ను ప్రకటించాలని, బకా యి ఉన్న మూడు డీఏలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్/జీపీఎస్లను రద్దు చేస్తూ ఓపీఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశా రు. పీఎఫ్ లోన్లు, ఏపీ జీఎల్ఐ లోన్లకు దర ఖాస్తు చేసుకున్న వారి అమౌంట్లను క్రెడిట్ చేయాలని, సరెండర్ లీవులు ఎన్క్యాష్మెంట్ చేసుకున్న వారికి వెంటనే ఆ మొత్తాన్ని ఖాతా ల్లో జమచేయాలని కోరారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులో పనిచేస్తున్న ఎల్పీలు, పీఈటీలకు వెంటనే జీతాలు చెల్లించాలని, 1 నుంచి 10వ తరగతి వరకూ నడుస్తున్న పాఠశాలల్లో వేర్వేరు యూడైస్లు క్రియేట్ చేసి ఎవరి పరిధిలో వారు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు పంపిణీ కాలేదన్నారు. ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్ ఎం.ఆదినారాయణ పాల్గొన్నారు. -
మైనింగ్ దెబ్బకు రోడ్లు ఛిద్రం
మైనింగ్ మాఫియాకు కై కలూరు నియోజకవర్గం కేజీఎఫ్ గనిగా మారింది. కూటమి పాలనలో మట్టి, ఇసుకను ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. 8లో uకిన్నెరసాని వాగులోకి వరద కుక్కునూరు: గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువవ్వడంతో అఽధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవీ రమణ, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు ముంపు గ్రామాలను, దాచారం ఆర్అండ్ఆర్ కాలనీలోని పునరావాస కేంద్రాలను సందర్శించారు. గోదావరి వరద వేలేరు సమీపంలోని కిన్నెరసాని వాగులోకి చొచ్చువచ్చింది. వాగుకు సమీపంలోని జామాయిల్ తోటల్లోకి వరద నీరు చేరింది. -
వాసవీ మాతకు సారె సమర్పణ
తాడేపల్లిగూడెం (టీఓసీ): స్థానిక ఏలూరు రోడ్డులో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ పంచాయతన క్షేత్రంలోని వాసవీ అమ్మవారికి శనివారం 250 కేజీల ఆషాఢం సారె అందజేశారు. వివిధ రకాల పండ్లు, స్వీట్లు, పూలతో పాటు చీరలు, పసుపు, కుంకుమ, గాజులు అమ్మవారికి సారెగా సమర్పించారు. ఈ సందర్భంగా విశేష పూజలు జరిగాయి. 500 మంది మహిళలు పాల్గొన్నారు. ఆర్యవైశ్యులు మారం వెంకటేశ్వరరావు, కొర్లేపర రాము, నున్నా సుందరరావు, బోగవిల్లి రమేష్, ఆలపాటి చిన్న, సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వనితా క్లబ్, వాసవీ క్లబ్, ప్రపంచ ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
ఏ క్షణాన కూలుతుందో..
ఆకివీడు: స్థానిక వ్యవసాయ మార్కెట్(ఏఎంసీ) సమీపంలో ఉన్న భవనం కూలడానికి సిద్ధంగా ఉన్నా ఆ భవనంలోనే విద్యా సంస్థను నడుపుతున్నారు. అందులో వార్డు సచివాలయ కార్యాలయం ఉంది. అన్ని అంతస్తుల్లోనూ పెచ్చులూడిపోయాయి. పిల్లర్లలో వేసిన కాంక్రీట్ పూర్తిగా దెబ్బతింది. బీములో కూడా ఇదే పరిస్థితి. భవనం అండర్ గ్రౌండ్ భాగంలో వర్షపు నీరు నిలిచిపోతోంది. వర్షాకాలం వస్తే చెరువును తలపిస్తుందని విద్యార్థులు, సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ కార్యాలయాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని సచివాలయ సిబ్బంది ప్రజా పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. అధిక సంఖ్యలో విద్యార్థులు భవనంలోని ప్రైవేటు విద్యా సంస్థలో చదువుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయాందోళనలో ఉన్నారు. భవనంలో విద్యాభ్యాసం కొనసాగించడం ప్రాణాలమీదకు తెచ్చుకోవడమేనని అంటున్నారు. -
తప్పిన ముప్పు
దెందులూరు: జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సీతంపేట పాల డెయిరీ వద్ద అత్యంత వేగంతో లారీని వెనుక నుంచి వైజాగ్ నుంచి చైన్నె వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. ఆ సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు ఉన్నారు. ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న వెంటనే దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ, హైవే సేఫ్టీ పోలీస్ సిబ్బంది బాధితులను హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వేరే బస్సులో ప్రయాణికులను గమ్యస్థానాలకు తరలించారు. 54 మంది ప్రయాణికులు సురక్షితం ముగ్గురికి స్వల్ప గాయాలు -
ఆషాఢంలోనూ తగ్గని భక్తుల రద్దీ
ద్వారకాతిరుమల: ఆషాఢ మాసం అయినప్పటికీ శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గలేదు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో శనివారం వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. ఆలయ అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, షాపింగ్ కాంప్లెక్స్, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. పురుగుల మందు తాగి ఆత్మహత్య కై కలూరు: జీవితంపై విరక్తి చెందిన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలిదిండి మండలం మూలలంకలో శనివారం జరిగింది. కలిదిండి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మామిడిశెట్టి రాము(45) భార్య రెండేళ్ళ క్రితం బతుకుదెరువు నిమిత్తం కువైట్ వెళ్ళింది. వీరికి పాప, బాబు సంతానం. పాప వసతిగృహంలో చదువుతోంది. బాబు తండ్రి వద్దే ఉంటున్నాడు. రాము చేపల చెరువులపై పనులు చేస్తాడు. కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. తల్లి కృష్ణవేణి ఫిర్యాదుపై ఎస్సై వి.వేంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేకలను కబళిస్తున్న వింత వ్యాధి ఆగిరిపల్లి: మండలంలోని వడ్లమాను గ్రామంలో గత మూడు రోజుల నుంచి వింత వ్యాధితో మరణించడంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. గ్రామానికి చెందిన సాదం స్వామికి 50 మేకలుండగా.. గురువారం ఒక మేక నురగ కక్కుతూ మృతి చెందింది. ఆ వ్యక్తి మందులు వేసినా శుక్రవారం మరో నాలుగు మేకలు మరణించాయి. శనివారం నాలుగు మేకలు పొట్ట ఉబ్బి నురగ కక్కుతూ చనిపోయాయి. ఎంపీటీసీ రాణి మేకల సత్యనారాయణ ఆగిరిపల్లి పశువైద్యాధికారి హనుమంతరావుకు సమాచారం అందించారు. ఆయన తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మేకలను పరీక్షించి వైద్యం అందజేశారు. ఇదే విషయమై పశు వైద్యాధికారి హనుమంతరావుని సంప్రదించగా శ్రీకాప్రియన్ క్లోరో న్యుమోనియ్ఙోఅనే బ్యాక్టీరియా వల్ల మేకలు మరణించవచ్చని తెలిపారు. శాంపిల్స్ ఏలూరు ల్యాబ్కు పంపించామని తెలిపారు. వైద్యం అందించిన ఇంకా పది మేకల పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు స్వామి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. -
రైళ్లలో ప్రత్యేక తనిఖీలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలోకి గంజాయి, మత్తుపదార్థాలు రవాణా కాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ఆకస్మిక తనిఖీలు చేస్తూ నిఘా ఏర్పాటు చేశామని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. ఈగల్ ఐజీ రవికృష్ణ ఆదేశాల మేరకు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షణలో ఏలూరులో పోలీస్, రైల్వే పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఒడిశా నుంచి వచ్చే ప్రతి రైలులో తనిఖీలు చేశారు. అనుమానస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు రవాణా అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే 1972కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. విద్యుత్ రెవెన్యూ అధికారిగా బాధ్యతల స్వీకరణ ఏలూరు (ఆర్ఆర్పేట): ఈపీడీసీల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని ఏలూరు డివిజన్ విద్యుత్ అసిస్టెంట్ రెవెన్యూ అధికారిగా టీ.వెంకాయమ్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిగూడెం డివిజన్లో జూనియర్ అకౌంట్స్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వెంకాయమ్మకు ఇటీవల సంస్థ సీఎండీ ఏఏఓగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
డ్రోన్ల వినియోగంపై రైతులకు శిక్షణ
దెందులూరు: వ్యవసాయ రంగంలో యాంత్రికరణ వేగంగా వృద్ధి చెందుతుంది. ఇటీవల డ్రోన్ల ద్వారా పంట చేలకు ఎరువులను వేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ, ఆత్మ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో డిప్లమో ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ (దిశి) కార్యక్రమం ద్వారా జిల్లాలో రైతులకు, ఎరువుల వర్తకులకు శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పంటల యాజమాన్య పద్ధతులు, డ్రోన్ల వినియోగం, ఎరువులను సకాలంలో వాడకం గురించి శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా పంట పెట్టుబడి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ హబీబ్ భాష వ్యవసాయ శాఖ అధికారులు ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ప్రతిభ చూపుతున్న అభ్యర్థులు దిశి శిక్షణ భాగంగా 2023– 24 సంవత్సరానికి గ్రూపులకు సంబంధించిన కొన్ని రోజులు వనరులు సమకూర్చి వ్యాపారస్తులకు కంపెనీ క్షేత్ర పరిశీలకులకు శిక్షణ అందిస్తున్నారు. వారిలో తొమ్మిదో తరగతి ఉత్తీర్ణత అయిన వారికి డైరెక్టర్ ఆత్మ ద్వారా ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారు. గ్రూపులకు సంబంధించి పరీక్షకు హాజరైన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ముగ్గురు డిస్టింక్షన్లో నిలిచారు. రైతులు, వ్యాపారులు శాసీ్త్రయ పరిజ్ఞానంతో పాటు వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందడమే లక్ష్యంగా ఈ శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక శిక్షణ దిశి శిక్షణలో ఒక బ్యాచ్కి 48 క్లాసులు ఉంటాయి. 40 థియరీ క్లాసులు, 8 ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి బ్యాచ్కు ఒక ఫెసిలిటేటర్ను కేటాయించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. – హబీబ్ బాషా, జాయింట్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ -
ఆలయ మరమ్మతులకు అంచనాలు
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో కొన్ని నిర్మాణాలు, మరమ్మతులు కోసం అంచనాలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.శ్రీనివాసరావు శుక్రవారం ఆలయానికి విచ్చేసి, పరిసరాలకు పరిశీలించారు. 2027 గోదావరి పుష్కరాలకు మరమ్మతులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆలయంలో స్వామివారి చుట్టూ ఉన్న ప్రాకార మండపం లోపలి భాగంలో బేడా మండపం లీకేజీలు అవుతున్నాయి. అలాగే పార్వతి దేవి, లక్ష్మీదేవి గర్భాలయాల్లో కూడా వర్షం నీరు కారిపోతుంది. జనార్ధనస్వామి ఆలయం గర్భగుడిలో టైల్స్ ముక్కలుగా ఊడిపడిపోతున్నాయి. జనార్ధనస్వామి ఉపాలయం పక్కన ఉన్న బేడా మండపానికి సంబంధించి సుమారు మూడు స్తంభాలు ప్రమాదకరంగా ఒరిగిపోయి ఉన్నాయి. ముఖ్యంగా 120 అడుగుల ఎత్తయిన గాలిగోపురం లోపల శిథిలావస్థకు చేరుకుంటుంది. ఆయా సమస్యలను శ్రీనివాసరావు పరిశీలించారు. కార్యాలయ నిర్మాణంపై తర్జనభర్జన ప్రస్తుతం ఆలయ కార్యాలయం ఉన్న ప్రాంతంలో మరో మండపం నిర్మాణానికి అంచనాలు తయారు చేస్తున్నారు. ఆలయానికి నైరుతి మూలలో గత కొంతకాలం క్రితం ఖాళీ చేసిన ఎస్పీఆర్ఆర్ క్లబ్ స్థలం ఆలయానికి చెందినదే కావడంతో అప్పట్లో ఆ స్థలం ఆలయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో కార్యాలయం నిర్మాణం చేయడమా లేఖ అన్నదాన భవనంగా ఉంచడమా? అనే దానిపై చర్చ లు సాగుతున్నాయి. కార్యక్రమంలో దేవదాయ శాఖ భీమవరం అధికారి సూర్యప్రకాశరావు, వర్దినీడి వెంకటేశ్వరరావు, ఈఓ ముచ్చర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రసాదం తీసుకోని డీఈ ఆలయం ప్రాకారం బేడా మండపంలో లీకేజీలను తనిఖీ చేస్తూ అంచనాలు వేస్తున్న సమయంలో పక్కన ఉన్న కనకదుర్గమ్మ వారికి తయారు చేసిన దద్దోజనం ప్రసాదాన్ని అక్కడ పురోహితులు పంచిపెడుతున్నారు. అటుగా వస్తున్న డీఈతో పాటు మిగిలిన అధికారులను సైతం అయ్యా ప్రసాదం ఇదిగోండని పెట్టగా చేతులు బాగోలేదు వద్దుల్లేండి అని వెళ్లిపోవడంతో భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. -
ముంచెత్తుతున్న వరద
గోతుల యాతన తీరేదెన్నడు? ఏలూరులో రోడ్లన్నీ గోతులమయం. ఏదో గోతిలో పడి వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. వర్షం పడితే ఏది గొయ్యో, ఏది గొప్పో తెలియడం లేదు. 8లో uశనివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరికి వరద సీజన్ వచ్చేసింది. శుక్రవారం ఒకేరోజు 6.35 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతాల నుంచి పోలవరానికి పోటెత్తింది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో అప్రమత్తమయ్యారు. ఎద్దులవాగు వంతెన పైకి నీరు చేరి శుక్రవారం అర్ధరాత్రికి నీటమునిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో 18 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోనున్నాయి. మరో మూడు రోజులు పాటు వరద ఉధృతి తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరికి ఉపనది శబరి వరద నీటితో పోటెత్తుతోంది. గత వారం రోజులుగా రోజూ సగటున 2 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం మీదుగా సముద్రంలో వరద నీరు కలుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఆకస్మాత్తుగా వరద తీవ్రత రెట్టించింది. ఏటా జూలై, ఆగస్టు నెలలో గోదావరికి వరదలు పోటెత్తడంతో ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని లంక గ్రామాలున్న యలమంచిలి, ఆచంట మండలాల్లో వరద తీవ్రత ఉంటుంది. ప్రధానంగా ముంపు మండలాల్లో రాకపోకలు నిలిచిపోయి.. వందలాది ఇళ్ళు జలదిగ్భందంలో చిక్కుకుంటాయి. ఈ పరిణామాల మధ్య ఈ ఏడాది కూడా గోదావరి వరద తీవ్రత శుక్రవారం ఆకస్మాత్తుగా పెరగడంతో ఏజెన్సీ మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారుఉ. రాత్రి 7 గంటల సమయానికి భద్రాచలం వద్ద 37.60 అడుగులకు నీటిమట్టం చేరింది. 6,98,510 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రాత్రి 8 గంటల సమయానికి పోలవరం నుంచి దిగువకు 6,35,634 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వరద తీవ్రత శనివారం మధ్యాహ్నానికి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉందని, 7.50 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేసే స్థాయిలో ఇన్ఫ్లో ఉందని అధికారుల అంచనా. మహారాష్ట్ర, తెలంగాణాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో వరద తీవ్రత మొదలైంది. న్యూస్రీల్ పోలవరం నుంచి 6.35 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల ఏజెన్సీలో నీటమునిగిన ఎద్దులవాగు వంతెన 18 గ్రామాలకు నిలిచిన రాకపోకలు మరో మూడు రోజులు ఉధృతి కొనసాగే అవకాశం ఏజెన్సీలో అప్రమత్తం జలదిగ్బంధంలో ఎద్దులవాగు వంతెన వేలేరుపాడు–కొయిదా మార్గంలోని ఎద్దులవాగు వంతెన జలదిగ్బంధంలో చిక్కుకుంది. శుక్రవారం రాత్రికి పూర్తిగా నీటమునిగింది. దీంతో 18 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండల కేంద్రానికి జిల్లా కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. కుక్కునూరు– దాచారం రహదారిలో గుండేటివాగు ఉధృతంగా ప్రవహించి వంతెన నీటమునిగింది. దీంతో ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయితే కుక్కునూరు మండలంలో దాచారం, గొమ్ముగూడెం పంచాయితీ నలువైపులా నీరు చేరి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. గొమ్ముగూడేనికి చెందిన 15 కుటుంబాలను పునరావాస కాలనీలకు తరలించారు. ముంపు ప్రాంతాల్లో ఐటీడీఏ పీవో పర్యటన వేలేరుపాడు/కుక్కునూరు/పోలవరం రూరల్ : ఏలూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో శుక్రవారం ఐటీడీఏ పీవో రాములనాయక్ పర్యటించారు. కుక్కునూరు మండలంలో వరద ప్రభావిత గ్రామాలైన లచ్చిగూడెం, గొమ్ముగూడెంలో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలిరావాలని గ్రామస్తులకు చెప్పారు. వరద పెరిగే వరకు ఉండకుండా ముందుగా పునరావాస కేంద్రాలకు రావాలన్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటిమట్టం 30.110 మీటర్లకు చేరింది. స్పిల్ వే 48 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం
ఏలూరు (టూటౌన్): కక్షిదారుల మధ్య సామరస్య వాతావరణంలో కౌన్సెలింగ్ నిర్వహించి కేసులు పరిష్కరించడమే మధ్యవర్తిత్వ లక్షణం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం అంశంపై వారం రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ తదితర ప్రాంతాలలో 1కే వాక్ నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించారు. మధ్యవర్తిత్వం చేసేందుకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 80 మంది న్యాయవాదులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, సోషల్ వర్కర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, ఈ కార్యక్రమం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని కక్షిదారులు, న్యాయవాదులు సంప్రదించి మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారాన్ని కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రెండో అదనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని, 7వ అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.కె.వి.బులి కృష్ణ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి పి.ఎస్.వి.కృష్ణ సాయి తేజ, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
ఏలూరు (టూటౌన్): మున్సిపాల్టీ, కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఇంజినీరింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ధర్నా ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాస్, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి ఏ.అప్పలరాజు మాట్లాడుతూ మున్సిపాలిటీ, కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ కార్మికులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించే జీతభత్యాల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని అన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా ఈనెల 15న చలో విజయవాడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు పి.కిషోర్, జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, నాయకులు బుగత జగన్నాథరావు, పోలా భాస్కరరావు, మున్సిపల్ యూనియన్ నాయకులు బి.నారాయణ రావు, ఎస్.శ్రీనివాస రావు, డి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
లైంగిక వేధింపులపై చర్యలు ఎప్పుడు ?
దెందులూరు: కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి తొత్తడి వేదకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం దెందులూరులో విలేకరులతో మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీకి మద్యం సేవించి వస్తున్నప్పటికీ కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పక్క జిల్లాలో ఉన్న హోం మంత్రి సైతం మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, 50 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వేధింపులకు పాల్పడిన ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలన్నారు. తూతూ మంత్రంగా సస్పెండ్ చేస్తే 10 రోజుల తర్వాత మళ్లీ కళాశాలకు వస్తారని.. బాధితులకు భద్రత ఏం ఉంటుందని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గణేష్ ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా లంకలపల్లి వెంకట గణేష్ను నియమించారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులు కావటం పట్ల గణేష్ ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్, జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానన్నారు. హమాలీల కూలి రేట్లు పెంచాలి ఏలూరు (టూటౌన్): ఏలూరు నగరంలో మర్చంట్ అండ్ చాంబర్ పరిధిలో హమాలీ కార్మికులకు కూలీ రేట్ల పెంపుదలలో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఏలూరు వైఎంహెచ్ఏ హాలు నుంచి విజ్ఞాపన యాత్రను శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంపు కార్యాలయం వద్దకు పదర్శన చేశారు. ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పించారు. ఏఐటీయూసీ జిల్లా నాయకుడు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూలి రేట్ల పెంపుదల విషయంలో సానుకూలంగా ఉండాలన్నారు. ఐఎఫ్టీయు ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ కూలి రేట్ల పెంపుదల కాల పరిమితి ముగిసినప్పటికీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందని, అది సరి కాదన్నారు. ఎస్ఎస్సీ మార్కుల లిస్టు ఇంటికే ఏలూరు (ఆర్ఆర్పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్, ఎస్ఎస్సీ కోర్సులకు ఇటీవల నిర్వహించిన పరీక్షలకు సంబంధించి పాస్ సర్టిఫికెట్లు అభ్యర్థుల ఇంటికే వస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ప్రవేశాల సమయంలో ఇచ్చిన చిరునామాలకు స్పీడ్ పోస్ట్ ద్వారా పాస్ సర్టిఫికెట్లతో పాటు మైగ్రేషన్ కం ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లను పంపినట్టు తెలిపారు. ప్రైవేట్ జూనియర్ కళాశాల వద్ద ఉద్రిక్తత భీమవరం: భీమవరం పట్టణంలోని ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల వద్ద ర్యాగింగ్ అంటూ కలకలం రేగింది. బైపాస్ రోడ్డులోని ఈ జూనియర్ కళాశాలలో ఈ నెల 5న జూనియర్, సీనియర్ విద్యార్థుల వద్ద టాయిలెట్ల వద్ద వివాదం ఏర్పడింది. వివాదానికి కారణమైన ఏడుగురు విద్యార్థులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు తెలిసింది. బాధిత విద్యార్థుల్లో ఒక విద్యార్ధి తండ్రి శుక్రవారం కళాశాలకు చేరుకుని వివాదం వివరాలు తమకెందుకు చెప్పలేదంటూ కళాశాల ప్రిన్సిపల్ను నిలదీశారు. దీంతో కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడినట్లు తెలిసింది. దీనిపై ఇంటర్మీడియట్ జిల్లా అధికారి జి.ప్రభాకరరావును వివరణ కోరంగా వివాదం తన దృష్టికి రాలేదని, వివరాలు తీసుకుంటానన్నారు. -
బీజీబీఎస్ పాలకవర్గ ఆగడాలపై చర్యలు తీసుకోవాలి
నరసాపురం: బీజీబీఎస్ మహిళా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నూలి శ్రీనివాస్, పాలకవర్గంపై ఆగడాలపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్న నలుగురు మహిళా అధ్యాపకులు గత 15 రోజులుగా కళాశాల వద్ద ఆందోళన చేస్తున్నసంగతి తెలిసిందే. తమను అకారణంగా విధులు నుంచి తొలగించి పాలకవర్గం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం అధ్యాపకులకు మద్దతుగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడీ రాజు మాట్లాడుతూ కళాశాల ఆస్తులు అమ్మకానికి పెట్టడం, మహిళా అధ్యాపకులపై లైగింక వేధింపులకు పాల్పడం దారుణమన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం ఏంటి అని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ఆందోళన మరింత ఉధృతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ, సీపీఎం నేత కవురు పెద్దిరాజు, కోట్ల రామ్కుమార్, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
●అదుపు తప్పితే అంతే
పొట్టకూటి కోసం కొందరు కూలీలు ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు. వాహనాల పైన, వెనుక కూర్చుని ప్రయాణిస్తున్నారు. అదుపు తప్పితే ఎంతటి ప్రమాదానికి గురి కావాల్సి వస్తుందనే కనీస విషయాన్ని పట్టించుకోవడం లేదు. నిత్యం రహదారులపై ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలు సాగించే వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. శుక్రవారం ద్వారకాతిరుమల వైపు నుంచి భీమడోలు వైపుగా వెళుతున్న ఒక లోడు లారీపై కూలీలు ఇలా ప్రయాణిస్తూ కనిపించారు. – ద్వారకాతిరుమల -
తహసీల్దార్ కార్యాలయంలో వసూళ్ల పర్వం
వివాదాలకు కేంద్రంగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగి కొయ్యలగూడెం: కొయ్యలగూడెం తహసీల్దార్ కార్యాలయంలో భారీ ఎత్తున అవినీతి జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుల ధ్రువీకరణ పత్రం మొదలుకొని పాస్ బుక్లు చేయడానికి రూ.వేలు వసూలు చేస్తున్నారని అంటున్నారు. కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఈ అవినీతి ఆరోపణలకు కేంద్ర బిందువుగా ఉన్నాడు. తాజాగా కొయ్యలగూడెం మండలం పరింపూడి రెవెన్యూ భూమికి సంబంధించి సుమారు తొమ్మిది ఎకరాల భూమి మ్యుటేషన్, సబ్ డివిజన్ చేసేందుకు సదరు కాంట్రాక్టు ఉద్యోగి వ్యవహారం నడిపాడు. ఇందుకు రూ.2 లక్షలు ఒప్పందం కుదుర్చుకొని ఒక రైతు నుంచి రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. తదుపరి భూమి విలువ ఎక్కువగా ఉందని అదనంగా మరో రూ.1.50 లక్షలు ఇవ్వాల్సిందిగా కార్యాలయ ఉద్యోగులతో కలిసి రైతుపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డాడు. గతంలో ఒక గ్రామానికి చెందిన దళిత రైతులకు సంబంధించి ఆన్లైన్లో తప్పుడు పేర్లు, తప్పుడు ఖాతా నెంబర్లు, రికార్డులు సృష్టించి అవినీతికి పాల్పడి విచారణను ఎదుర్కొన్నాడు. ఇటీవల కొయ్యలగూడెంలోని నడిబొడ్డున జాతీయ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న స్థలానికి సంబంధించి కాంట్రాక్టు ఉద్యోగి కీలకంగా వ్యవహరించినట్లు ఇంటెలిజెన్స్, విజిలెన్స్ అధికారులు సైతం ధ్రువీకరించారు. జిల్లా వ్యాప్తంగా అటు రాజకీయ ప్రకంపనలు సృష్టించడంతోపాటు ఇటు రెవెన్యూ యంత్రాంగాన్నే కుదిపేసిన సుమారు రూ.40 కోట్ల విలువైన భూమికి సంబంధించిన వ్యవహారంలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భారీ స్థాయిలో దండుకున్నట్లు తెలిసింది. కాంట్రాక్ట్ ఉద్యోగి తీరుపై ఉన్నతాధికారులు విచారణ చేయించి నివేదికలు తెప్పించుకున్నారు. కార్యాలయ ఉద్యోగులకు ప్రజల నుంచి వసూళ్లు రాబట్టడంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తూ రూ.లక్షలు చేతులు మారడానికి దళారీగా వ్యవహరిస్తున్నాడు. వివాదాస్పద స్థలాలు కొనుగోలు చేసి డాక్యుమెంట్లు సృష్టించి వాటిని సొమ్ము చేసుకుంటూ రూ.కోట్లు అర్జించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతని వ్యవహారంపై రెవెన్యూ శాఖ మొత్తం గుర్రుగా ఉన్న అతనితో చేయించుకున్న అక్రమాలు ఎక్కడ బయటపడతాయేమోనని మౌనంగా ఉంటున్నారు. -
హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం
తణుకు అర్బన్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుచేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ విమర్శించారు. తణుకు సీపీఎం భవనంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆడ బిడ్డ నిధి, ఉచిత బస్సు హామీల అమలుకోసం మహిళలు వేచిచూస్తున్నారని అన్నారు. విద్యుత్ బిల్లులు పెంచబోమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పి నేడు రూ.15 వేల కోట్ల విద్యుత్ భారాన్ని ఇంధన సర్దుబాటు చార్జీలుగా వేయడం దుర్మార్గమని అన్నారు. మరో రూ.842 కోట్ల విద్యుత్ భారాన్ని బిల్లుల్లో కలిపేందుకు ప్రతిపాదన చేస్తున్నారని మండిపడ్డారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగులకొట్టమని అప్పట్లో మంత్రి లోకేష్ అన్నారని నేడు యథేచ్ఛగా బిగిస్తున్నారని అన్నారు. నేటికీ ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు అల్లాడుతున్నారని స్పష్టం చేశారు. తమ సైకిల్ యాత్రలో ప్రజలు ఈ సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో జిల్లా విస్త్రృతస్థాయి సమావేశాలు తణుకులో నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ‘దారి తప్పుతున్న టీడీపీ కూటమి ఏడాది పాలన’ పుస్తకాలను ఆవిష్కరించారు. -
ఉన్నత విద్యామండలి తీరు దారుణం
ఏలూరు (ఆర్ఆర్పేట) : రోజుకో మాట పూటకో విధానంలా ఉన్నత విద్యామండలి తీరు ఉందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి కె.లెనిన్ అన్నారు. శుక్రవారం స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లెనిన్ మాట్లాడుతూ డ్యూయల్ డిగ్రీ విధానం అమలు పరుస్తున్నామని ఉత్తర్వులు ఇచ్చి తిరిగి రివ్యూ చేసి సింగిల్ మేజర్ విధానం కొనసాగిస్తామని పేర్కొనడం హాస్యస్పదమన్నారు. రాష్ట్రంలో ఉన్న స్టేక్ హెూల్డర్స్తో సంప్రదించకుండా ఇష్టానుసారంగా నెలకో నిర్ణయం చేయడం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటమేనని దుయ్యబట్టారు. గత నిర్ణయానికి అనుగుణంగా డిగ్రీలో డ్యూయల్ మేజర్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.అదే విధంగా ఇంటర్న్షిప్ భారాన్ని తగ్గించి, మైనర్ సబ్జెక్టులకు క్రెడిట్ పాయింట్స్ పెంచాలని కోరారు. విద్యార్థి చదువుకు తగ్గట్టుగా ఇంటర్న్షిప్ ఇవ్వాలని, ఇంటర్న్షిప్ చేస్తున్న సందర్భంలో విద్యార్థులకు తగిన స్టైఫండ్ ఇచ్చే విధంగా సంబంధిత పరిశ్రమలతో ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలవడి మూడు నెలలు గడుస్తున్నా ఇంత వరకూ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించకపోవడం దుర్మార్గమన్నారు. ఆఫ్లైన్ పద్ధతిలో డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
డ్రోన్ల వినియోగంపై శిక్షణ
వ్యవసాయ రంగంలో ఇటీవల డ్రోన్ల వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం ద్వారా డ్రోన్ల వినియోగంపై శిక్షణకు శ్రీకారం చుట్టారు. 8లో uఅలక్ష్యానికి తావు లేదు ఏలూరు(మెట్రో): గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో వరద ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు యుద్ధప్రాతిపదికపై తరలించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారు లను ఆదేశించారు. గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం సాయంత్రం సంబంధింత అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి ప్రమాద హెచ్చరిక ముంపు ప్రాంతాలైన కుక్కునూరు మండలం లచ్చిగూడెం, గొమ్ముగూడెం ప్రజలను తక్షణమే దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీకి తరలించాలన్నారు. రెండో ప్రమాద హెచ్చరిక ప్రభావితమయ్యే ముంపు గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేయాలన్నారు. గర్భిణులు, వయోవృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిని సమీప సీహెచ్సీలకు తరలించాలన్నారు. అవసరమైన టార్పాలిన్లు, బోట్లు, లైఫ్ జాకెట్లు, గజ ఈతగాళ్లను, రోప్ పార్టీలు అందుబాటులో ఉంచాలన్నారు. పునరా వాస కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాస్థాయిలో 1800 233 1077 నెంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 833 390 5022, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీసు 83092 69056, కుక్కునూరు తహసీల్దారు కార్యాలయం 83092 46369, వేలేరుపాడు తహసీల్దారు కార్యాలయంలో 83286 96546 నెంబర్లతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు ఈపీడీసీఎల్ ఎస్ఈ పీ.సాల్మన్ రాజు తెలిపారు. ఏలూరులో 9440902926 నెంబర్తో, జంగారెడ్డిగూడెంలో 9491030712 నెంబర్తో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. -
పాఠశాల విలీనంపై మిన్నంటిన నిరసన
సర్పంచ్ ప్రియాంక నిరహార దీక్షను అడ్డుకున్న పోలీసులుపెనుమంట్ర: పెనుమంట్ర దళితవాడలోని ఎలిమెంటరీ పాఠశాలను దూరంగా ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సర్పంచ్ తాడిపర్తి ప్రియాంక, ప్రసన్న కుమార్ దంపతులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా దీక్ష చేయడానికి ఏర్పాటు చేసుకున్న శిబిరాన్ని అనుమతులు లేవంటూ ఉదయమే పోలీసులు తొలగించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రియాంక దంపతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నేలపైనే బైఠాయించారు. వీరికి మద్దుతుగా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా నేలపైనే బైఠాయించి అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మండల విద్యాశాఖ అధికారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన విషయాన్ని తెలుసుకున్న ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్ర, పోడూరు జెడ్పీటీసీ సభ్యులు కర్రి గౌరీ సుభాషిని, గుంటూరు పెద్దిరాజులతో పాటు పలువురు గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని సర్పంచ్ ప్రియాంకకు మద్దతుగా నిలిచారు. తహసీల్దార్ వై.రవికుమార్, ఎస్సై స్వామి నాయకులతో గంటకు పైగా చర్చించిన అనంతరం విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి కొద్ది రోజుల్లోనే న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో సర్పంచ్ ప్రియాంకతో పాటు తల్లిదండ్రులు నిరసన విరమించారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు వాసంశెట్టి కిరణ్, ఈది అనిత ప్రవీణ్, మండల సర్పంచ్ల చాంబర్ అధ్యక్షుడు తమనంపూడి వీర్రెడ్డి, వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు, సర్పంచ్ గూడూరు దేవేంద్రుడు, నాయకులు కొవ్వూరి వేణుమాధవ్ రెడ్డి, కర్రి రామలింగేశ్వరరెడ్డి, సత్తి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి లేజర్ రన్ పోటీల్లో విద్యార్థి ప్రతిభ
తణుకు అర్బన్: స్థానిక చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి లేజర్ రన్ (రన్నింగ్ –షూటింగ్ )పోటీల్లో తణుకు మండలం మండపాక గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎస్. నాగ సత్య గణేష్ అండర్ 17 బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు పాఠశాల హెచ్ఎం కె.ఫణిశ్రీ తెలిపారు. గణేష్ ఈ నెల 12, 13 తేదీల్లో పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి లేజర్ రన్ పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థి గణేష్తో పాటు శిక్షణనిచ్చిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సంకు సూర్యనారాయణను పలువురు అభినందించారు. చేబ్రోలు సర్పంచ్కు అరుదైన గుర్తింపు ఉంగుటూరు: మండలంలోని చేబ్రోలు సర్పంచ్ రందే లక్ష్మీసునీతకు అరుదైన గుర్తింపు లభించింది. జాతీయస్థాయిలో నిర్వహించే సర్పంచ్ సంవాద్లో ప్రథమ స్థానం లభించింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సర్పంచ్ సంవాద్ అనే వేదికను ఏర్పాటు చేశారు. ఈ డిజిటల్ వేదిక ద్వారా ప్రతి నెలా దేశంలో ఉండే సర్పంచ్లు గ్రామాలు ఎలా అభివృద్ధి చేస్తున్నారు? ఇంకా ఎలా చేయాలి? అనే అంశాలపై వారి అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. అయితే చేబ్రోలు సర్పంచ్ సునీత వర్మీ కంపోస్టు తయారు చేయడం, పరిశుభ్రత విషయం, తడిచెత్త పొడిచెత్త విడదీయటం, మంచినీటి వనరులు కాపాడుకునే విషయంపై 80 సెకన్లు నిడివితో ఉన్న వీడియో పంపారు. ఈ నేపథ్యంలో ఆమె జూన్ నెలకు సంబంధించి ప్రథమ స్థానంలో నిలిచారు. లక్ష్మీసునీతకు ప్రోత్సాహకంగా రూ.35 వేలు అందిస్తారు. ఈ సందర్భంగా లక్ష్మీ సునీత శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ అవార్డు రావడం తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. గోదావరికి పంచ హారతుల సమర్పణ పెనుగొండ: ఆషాఢ పౌర్ణమి సందర్భంగా వశిష్టాగోదావరికి శుక్రవారం సిద్ధాంతంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పంచ హారతులు ఇచ్చారు. పూజా కార్యక్రమాలు అనంతరం కలగ భద్రుడు బ్రహ్మత్వంలో గోదావరి హారతులునిచ్చారు. కార్యక్రమంలో హిందూ ధర్మపరిరక్షణ సభ్యులు, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు దెందులూరు: మండలంలోని మేధినరావుపాలెం గ్రామానికి చెందిన గారపాటి నాగేంద్ర అదృశ్యమయ్యాడంటూ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. నాగేంద్ర గురువారం కుటుంబ సభ్యులపై అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అయితే శుక్రవారం పోలవరం కాలులో అతని సెల్ఫోన్, చెప్పులు కనిపించాయంటూ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. -
పాఠశాల విలీనానికి నిరసనగా ఆమరణ దీక్ష
పెనుమంట్ర: పెనుమంట్ర దళితవాడలోని ఎంపీపీ ఎలిమెంటరీ పాఠశాలను దూరంగా ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తాను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు పెనుమంట్ర సర్పంచ్ తాడిపర్తి ప్రియాంక గురువారం విలేకరులకు తెలిపారు. 80 ఏళ్ల నాటి పాఠశాలను గత ప్రభుత్వంలో నాడు– నేడు నిధులతో అభివృద్ధి చేశారని, విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియకుండా గత హెచ్ఎం, ఎంఈఓ కలిసి విద్యాకమిటీ సభ్యులను పక్కదారి పట్టించి ఇష్టానుసారం పాఠశాలను మరో పాఠశాలలో విలీనం చేశారన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తాను దీక్షకు దిగనున్నట్టు చెప్పారు. ఈ మేరకు తహసీల్దార్, పోలీస్ అధికారులు కూడా వినతి పత్రాల అందించానన్నారు. ఈ పాఠశాలలో 32 మంది విద్యార్థులు చదువుకునే వారన్నారు. అలాగే గురువారం వైఎస్సార్ నగర్లో శంకుస్థాపన కార్యక్రమాలు జరగ్గా తాము వెళ్లేలోపు ప్రజాప్రతినిధులు కానివారితో కొబ్బరికాయలు కొట్టించి అధికారులు తమను అవమానపరిచారని ప్రియాంక వాపోయారు. సమావేశంలో పెనుమంట్ర–1 ఎంపీటీసీ చింతపల్లి మంగాదేవి, ఉప సర్పంచ్ భూపతిరాజు శ్రీనివాసరాజు పాల్గొన్నారు. -
బెల్టు షాపులు రద్దు చేయాలి
తణుకు అర్బన్: గ్రామాల్లో బెల్ట్ షాపులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి డిమాండ్ చేశారు. స్థానిక అమరవీరుల భవనంలో గురువారం తణుకు డివిజన్ గీత కార్మికుల సహకార సొసైటీల అధ్యక్షుడు కట్టా వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మునిస్వామి మాట్లాడుతూ గీత కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. గ్రా మాల్లో తాటి, ఈత చెట్లను దౌర్జన్యంగా నరికి వేస్తున్నారని, ఆపాలని కోరారు. వృత్తిలో భా గంగా దివ్యాంగులైన, మరణించిన వారి కు టుంబాలకు గతంలో పరిహారం ఇచ్చేవారని, ప్రస్తుతం ఆ విధానం రద్దు చేయడం తగదన్నారు. ఈనెల 14న కలెక్టర్కు గీత కార్మికుల సమస్యలను చెప్పుకుందాం తరలిరండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కల్లుగీత సహకార సొసైటీల అధ్యక్షుడు కాసాని శ్రీనివాసు, తొంట ముత్యాలు పాల్గొన్నారు. -
నేటి నుంచి ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ పర్యటన
ఏలూరు(మెట్రో): స్వచ్చ సర్వేక్షణ్లో భాగంగా జిల్లాలో ఉత్తమ గ్రామాలను ఎంపిక చేసే కార్యక్రమానికి కేంద్ర అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ బృందాలు శుక్రవారం నుంచి పర్యటించనున్నా యని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. గురువారం జిల్లా అధికారులతో కేంద్ర బృంద సభ్యుల స్టేట్ నోడల్ కో–ఆర్డినేటర్ ఎస్.సందీప్, జిల్లా కో–ఆర్డినేటర్ పి.సత్తిబాబు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రోజుకి రెండు గ్రామాల చొప్పున 36 గ్రామాల్లో బృందం పర్యటించనుంది. సర్వేలో భాగంగా ప్రజాభిప్రాయాల సేకరణ, మరుగుదొడ్ల వినియోగం, పంచాయతీ, పాఠశాల, అంగన్వాడీ, సచివాలయాలు, మార్కెట్ యార్డ్స్, డ్రైనేజ్ వ్యవస్థ, చెత్త సేకరణ డంపింగ్ యార్డ్స్ తరలింపు, ప్లాస్టిక్ నిషేధం, వేస్ట్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై సమాచారం సేకరిస్తారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ త్రినాథ్బాబు, డీపీఓ కె.అనురాధ ఉన్నారు. -
‘ఉపాధి’ బకాయిలు విడుదల చేయాలి
ఏలూరు (టూటౌన్): ఉపాధి కూలీల వేతనాల విడుదలలో జాప్యం జరుగుతోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.జీవరత్నం, పి.రామకృష్ణ ఆరోపించారు. స్థానిక అన్నే వెంకటేశ్వరరావు భవనంలో గురువారం కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కూలీల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. పనులు చేసి రెండు నుంచి మూడు నెలలు కావస్తున్నా నేటికీ కూలీలకు వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు. దీంతో కూలీల జీవనం కష్టంగా మారిందన్నారు. కూలీల వేతనాలను కాంట్రాక్టర్లకు అప్పగించే పని కూటమి ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. మంత్రి పవన్ కల్యాణ్ పేదల పక్షాన లేదా కాంట్రాక్టర్లు పక్షాన అనేది స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కూలీలకు వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా, మండల స్థాయి అధికారులు జాబ్ కార్డులు కోసం కూలీల నుండి డబ్బులు వసూలు చేయడం దుర్మార్గమన్నారు. వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగ కార్యదర్శిగా శ్రీనివాసరెడ్డి ఆకివీడు: వైఎస్సార్సీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగం జనరల్ సెక్రటరీగా ఆకివీడుకు చెందిన పడాల శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కమిటీ ఉత్తర్వులు జారీచేసింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియామకం జరిగింది. ఆకివీడు నగర పంచాయతీ విప్గా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. గోదావరి వరదపై అప్రమత్తం ఏలూరు(మెట్రో): గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. బలహీనంగా ఉన్న కాలువలు, నదీ పరీవాహక ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు అధిక వర్షాలు, వరదల దృష్ట్యా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పునరావాస కార్యక్రమాల నిర్వహణకు మండల ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. వేలేరుపాడు మండలానికి డీఆర్డిఏ పీడీ ఆర్.విజయరాజు, స్కిల్ డెవలప్మెంట్ అధికారి జితేంద్ర, కుక్కునూరు మండలానికి జెడ్పీ సీఈఓ శ్రీహరి, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి అన్సారీలను ప్రత్యేక అధికారులుగా నియమించామన్నారు. విద్యతోనే కలల సాకారం ఏలూరు (ఆర్ఆర్పేట): కలలను సాకారం చేసు కునేందుకు విద్య ఒక్కటే ఉత్తమ మార్గమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. గురువారం మెగా పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమావేశంలో భాగంగా స్థానిక కోటదిబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూరిబా బాలికోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నూరుశాతం నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కస్తూరిబా బాలికోన్నత పాఠశాలలో గతేడాది టెన్త్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉపాధ్యాయుల సమకూర్చిన నగదు బహుమతులను అందజేశారు. ఆర్డీఓ ఎం.అచ్యుత అంబరీష్, డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ, ఆర్ఐఓ కె.యోహన్ తదితరులు పాల్గొన్నారు. తిరువన్నామలై రైలుకు వీరవాసరంలో హాల్ట్ రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): నర్సాపూర్–తిరువన్నామలై ప్రత్యేక రైలుకు వీరవాసరం స్టేషన్లో రెండు నిమిషాలు హాల్టింగ్ సదుపాయం కల్పించినట్టు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ ప్రకటనలో తెలిపారు. నర్సాపూర్ నుంచి వెళ్లే రైలు (07219) వీరవాసరం స్టేషన్కు మధ్యాహ్నం 1.23 గంటలకు చేరుకుని, 1.25 గంటలకు బయలుదేరుతుందని పేర్కొన్నారు. తిరువన్నామలై నుంచి వచ్చే రైలు (07220) రాత్రి 11.28 గంటలకు వీరవాసరం స్టేషన్కు చేరుకుని, తిరిగి 11.30 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు. -
బెధరగొడుతున్నాయ్
ఏలూరు (ఆర్ఆర్పేట): కూరగాయల ధరలు రోజు రోజుకూ పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏటా వేసవిలో కూరగాయల ధరలు పెరుగుతూ.. వర్షాలు పడగానే తగ్గుతుంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కాగా ఇప్పుడు అన్నిరకాల కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. మూడు రోజులుగా కూరగాయల ధరలు కిలోకు రూ.5 నుంచి రూ.15 వరకు పెరిగాయి. టమాటా గత నెలలో కిలో రూ.16 నుంచి రూ.18 ఉండగా ప్రస్తుతం రూ.36కు చేరింది. పచ్చిమిర్చి కిలో గత గురువారం రూ.40 ఉండగా ఇప్పుడు రూ.60కు, పందిరి బీర కాయలు రూ.40 నుంచి రూ.50కు, వంకాయలు (కాంతులు) రూ.38 నుంచి రూ.50కు చేరాయి. ఒక్క రోజులో దొండకాయలు కిలో రూ.6, గోరుచిక్కుడు రూ.8 చొప్పున పెరిగాయి. గత సోమవారం కీరా దోస కిలో రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.50 పలుకుతోంది. ఇలా అన్నిరకాల కూరగాయల ధరలు పెరిగాయి. రైతు బజారుల్లోనే 400 క్వింటాళ్లు ఏలూరులో సుమారు 90 వేల కుటుంబాల్లో 3.10 లక్షల జనాభా ఉన్నారు. నగరంలో రెండు రైతు బజార్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి వన్టౌన్లో ఎన్ఎస్ కూరగాయల మార్కెట్, పలు ప్రాంతాల్లో చిన్నపాటి కూరగాయల దుకాణాలు ఉన్నాయి. వీటితో పాటు ఇంటింటా తిరుగుతూ కూరగాయలు అమ్మే వ్యాపారులు 30 మంది వరకు ఉన్నాయి. నగరంలోని వన్టౌన్, టూటౌన్ ప్రాంతాల్లోని రైతు బజార్ల ద్వారా రోజుకు సుమారు 400 క్వింటాళ్ల కూరగాయలు, దుంపలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు విక్రయాలు జరుగుతున్నాయి. ఇతర దుకాణాలు, ఇంటింటా తిరిగి విక్రయించే వారి ద్వారా మరో 800 క్వింటాళ్ల విక్రయాలు జరుగుతున్నట్టు అంచనా. ఈ లెక్కన నగరవాసులపై పెరిగిన కూరగాయల ధరల భారం రోజుకు సుమారు రూ.6 లక్షల వరకు ఉంటోంది. పట్టించుకోని అధికారులు కూరగాయల ధరలు పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ కంటే రైతు బజార్లతో కొద్దిమేర ధరలు తక్కువగా ఉన్నా.. ధరల పెరుగుదల అసాధారణంగా ఉందని అంటున్నారు. గతంలో కూరగాయల ధరలు పెరిగితే రైతు బజార్లలో సబ్సిడీపై అందించేవారు. టమాటా, ఉల్లిని ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించేవారు. కొనలేకపోతున్నాం మూడు రోజులుగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కిలోకు రూ.10 వరకు ఎక్కువగా చెబుతున్నారు. టమాటా గతనెలలో కిలో రూ.16 ఉంటే ఇప్పుడు రూ.36 అమ్ముతున్నారు. దొండ, బెండకాయల ధరలు పెరిగాయి. ముఖ్యంగా పచ్చి మిరప నెల క్రితం కిలో రూ.18 నుంచి రూ.24 మధ్య ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.60కు పైగా అమ్ముతున్నారు. – గొల్లవిల్లి ఆదిలక్ష్మి, గృహిణి, ఏలూరు చర్యలు తీసుకోవాలి మా ఇంటి అవసరాలకు వారానికి సరిపడా కూరగాయలు ఒకేసారి తీసుకుంటాం. ఇప్పుడు పెరిగిన ధరల కారణంగా మరో రూ.200 అధికంగా ఖర్చవుతోంది. ఇది సామాన్యులకు భారం. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని కూరగాయల ధరలను తగ్గించే ఏర్పాట్లు చేయాలి. లేదా పేదల కోసం ప్రత్యేక కౌంటర్లలో కూరగాయలు విక్రయించే ఏర్పాట్లు అయినా చేయాలి. – ముమ్మిన గిరిజ, గృహిణి, ఏలూరు వెజిట్రబుల్స్ ఆకాశాన్నంటుతున్న ధరలు కిలోకు రూ.15 వరకు పెరుగుదల ధరల నియంత్రణపై చర్యలు శూన్యం -
మధ్యవర్తిత్వంపై అవగాహన
జీవితాలతో చెలగాటం అగ్నిమాపక అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ప్రమాదా లను అదుపు చేసే వాహనాలు, సిబ్బంది లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. 8లో uఏలూరు (టూటౌన్): కక్షిదారులు మధ్యవర్తిత్వంపై అవగాహన పెంచుకోవాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి సూచించారు. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో కక్షిదారులకు మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారం అనే అంశంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారంపై అవగాహన కల్పించేలా వారం పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి ‘వన్–కే’ వాక్ కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. న్యాయ మూర్తులు, న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, పోలీస్ సిబ్బంది, ప్యానల్ లాయర్లు, పారా లీగల్ వలంటీర్లు, సిబ్బంది పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఏడో అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
బాబు ష్యూరిటీ.. దగా గ్యారెంటీ
గణపవరం: చంద్రబాబు మోసపూరిత ఎన్నికల మేనిఫెస్టోను వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రజల ముందుంచాలని, అధికార దాహంతో వారిచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేయాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పిలుపునిచ్చారు. గురువారం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్కల్యాణ్ ప్రజలను ఏరకంగా ఏమార్చారో ప్రజలకు వివరించాలన్నారు. తాము మోసపోయినట్టు ప్రజలు గ్రహించారని, ఏడాది కూటమి పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. తొలి ఏడాదంతా ఖజానా ఖాళీ అంటూ హామీలను పక్కపెట్టేశారని విమర్శించారు. ఇటీవల తల్లికి వందనం పథకాన్ని అమలుచేసినా కనీసం 50 శాతం మందికి కూడా అందలేదని మండిపడ్డారు. జగన్పై కుట్రలు : కూటమి ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం పూర్తిగా కోల్పోయిందని అందుకే మాజీ సీఎం జగన్ ఎక్కడికి వెళ్లినా లక్షలాది మంది తరలివస్తున్నారని వాసుబాబు అన్నారు. ప్రజాబలాన్ని ఎదుర్కోలేని ప్రభుత్వం తప్పుడు కేసులు, అడ్డమైన నిబంధనలతో జగన్ను ప్రజల్లోకి రాకుండా చేసే కుట్రలకు తెరతీసిందన్నారు. చంద్రబాబు కేవలం మీడియా మేనేజ్మెంట్, ఎల్లో మీడియా గోబెల్స్ ప్రచారంతో కాలం గడుపుతున్నారని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీ శ్రేణులపై ఉందన్నారు. 2014 ఎన్నికల్లో 650 హామీలిచ్చి కనీసం 65 హామీలు కూడా నెరవేర్చలేదని, మళ్లీ 2024లో 140 హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని విమర్శించారు. అయినా రూ.1.70 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని, ఈ నిధులను ఏం చేస్తున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందన్నారు. మోసం బాబుకు వెన్నతో పెట్టిన విద్య ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, సూపర్సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఇప్పటివరకూ సూపర్ వన్ కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారన్నారు. ఈ సందర్భంగా రీకాల్ చంద్రబాబూస్ మేనిఫెస్టో క్యూఆర్ కోడ్ పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు దండు రాము, ధనుకొండ ఆదిలక్ష్మి, గంటా శ్రీలక్ష్మి, కనుమాల రామయ్య, జెడ్పీటీసీ సభ్యులు దేవారపు సోమలక్ష్మి, కోడే కాశీ, కె.జయలక్ష్మి, తుమ్మగుంట రంగాభవాని, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు దండు రాము, సంకుసత్యకుమార్, మరడ మంగారావు, రావిపాటి సత్యశ్రీనివాస్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నడింపల్లి సోమరాజు, రాష్ట్ర క్రిస్టియన్ సెల్ కన్వీనర్ ముళ్లగిరి జాన్సన్, రాష్ట్ర యూత్ కార్యదర్శి మద్దుల రాజా, పార్టీ జిల్లా కన్వీనర్లు కందులపాటి శ్రీను, పొత్తూరి శ్రీనివాసరాజు, రాష్ట్ర వ్యవసాయ విభాగం కార్యదర్శి వెజ్జు వెంకటేశ్వరావు, నాయకులు కమ్మిల భాస్కరరాజు, పుప్పాల గోపి, ఎలిశెట్టి బాబ్జి, తుమ్మగుంటా రంగా, రామకుర్తి నాగేశ్వరరావు, రొంగల శ్రీను, రామిశెట్టి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు సమయం వీరరాఘవులు, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు మందా జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కూటమి వంచనపై నిలదీద్దాం ప్రజల్లో నమ్మకం కోల్పోయిన ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే వాసుబాబు -
కంటైనర్ బోల్తా.. 14 ఆవులు మృతి
దెందులూరు: జాతీయరహదారిపై ఆవులను తరలిస్తున్న కంటైనర్ వాహనం బోల్తా పడి 14 ఆవులు మృతిచెందగా 6 తీవ్రంగా, 15 ఆవులు స్పల్పంగా గాయపడ్డాయి. ఈ ఘటన ఏలూరు జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడు వద్ద చోటుచేసుకుంది. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు ఆవులను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ, సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే మండల పశువైద్యాధికారి డాక్టర్ హరికి సమాచారం అందించగా ఆయన వైద్య సిబ్బందితో వచ్చి గాయపడిన ఆవులను సమీపంలోని గేదెల ఫారం వద్దకు తరలించి వైద్య సేవలందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి జంగారెడ్డిగూడెం: చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్సై షేక్ జబీర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేతవరం గ్రామానికి చెందిన బల్లే వెంకట నరసింహారావు చర్మంపై తెల్లటి మచ్చలు వచ్చి మంట, దురదతో గత రెండేళ్లుగా బాధపడుతున్నాడు. దీంతో మనస్తాపం చెంది పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వాంతులు చేసుకోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు నరసింహారావుని కొయ్యలగూడెంలోని ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైనవైద్యం కోసం రాజమండ్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తండ్రి బల్లే గురవయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 2 కిలోల గంజాయి స్వాధీనం జంగారెడ్డిగూడెం: పట్టణంలో గురువారం జరిపిన దాడుల్లో జెడ్పీ హైస్కూల్ ఎదురుగా గంజాయి కలిగి ఉన్న షేక్ బాషా అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఎంవీ సుభా ష్, ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ను గంజాయి రహితంగా చేసే కార్యక్రమంలో భాగంగా గట్టి నిఘా పెట్టి ఈ దాడులు చేసినట్లు చెప్పారు. -
జీవితాలతో చెలగాటం
ఏలూరు టౌన్: అగ్నిమాపక అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కడైనా భారీ అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వాటిని అదుపు చేసేందుకు అవసరమైన అగ్నిపమాక వాహనాలు, సిబ్బంది లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రజలు, కార్మికుల ప్రాణాల భద్రత గాల్లో దీపమేనా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏలూరు నగరంలోనే గత మూడు నెలల్లో మూడు భారీ అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవటం ఆందోళన కలిగిస్తోంది. పైగా ఒకే తరహా వస్తువుల తయారీ ఇండస్ట్రీల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. యాజమాన్యల నిర్లక్ష్యం.. అగ్నిమాపక అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏలూరులో వరుసగా అగ్నిప్రమాదాలు ఏలూరు జిల్లాలో 2024 జనవరి నుంచి 2025 జూన్ వరకూ సుమారుగా 598 అగ్నిప్రమాదాలు సంభవించగా ఏలూరు శివారు ప్రాంతాల్లో వరుసగా మూడు నెలల్లో మూడు అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ మూడు అగ్నిప్రమాదాలు పరుపులు, ఫర్నిచర్ తయారీ పరిశ్రమల్లో కావటం గమనార్హం. అదృష్టవశాత్తు అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్న సమయంలో కార్మికులు లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఏలూరు శివారులోని గణేష్ సోఫా అండ్ ఫర్నిచర్స్ పరిశ్రమలో జూన్ 5న భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాయంత్రం వేళలో ప్రమాదం జరగడం, కార్మికులు ముందుగానే గుర్తించి బయటకు పారిపోవటంతో ప్రాణనష్టం తప్పింది. ఇదే తరహాలో ఏలూరు సోమవరప్పాడులోని సోఫా, పరుపుల తయారీ కంపెనీలోనూ అగ్నిప్రమాదం జరిగింది. తాజాగా గురువారం వంగాయగూడెం కేన్సర్ హాస్పిటల్ సమీపంలో సుష్మిత ఫర్నిచర్, కుషనింగ్ తయారీ ఇండస్ట్రీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయాల ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదాల నివారణ సాధ్యమేనా? ఏలూరు జిల్లా కేంద్రంలో అగ్నిమాపక శాఖకు కేవలం రెండే ఫైరింజన్లు ఉన్నాయి. ఒక ఫైరింజన్ మరమ్మతుల్లో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఫైరింజన్ సామర్థ్యంపై ఆధారపడితే తీవ్ర పరిణామాలు తప్పవని అంటున్నారు. అగ్నిమాపక సిబ్బంది సైతం పూర్తిస్థాయిలో లేరంటున్నారు. దీనితోడు పరిశ్రమల్లో పాటించాల్సిన భద్రతా చర్యలపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని పలువురు విమర్శిస్తున్నారు. తాజాగా వంగాయగూడెం సుస్మిత ఫర్నిచర్ అండ్ కుషనింగ్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం సంభవించడంతో.. అసలు పరిశ్రమకు ఫైర్సేఫ్టీ సర్టిఫికెట్, అత్యవసర ద్వారం లేదని, ఫైర్సేఫ్టీ చర్యలపై అధికారుల పర్యవేక్షణపైనా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏలూరు నగరంలోనూ, శివారు ప్రాంతాల్లోనూ పరిశ్రమలు, ఇండస్ట్రీలు, ఆయా వస్తువుల ఉత్పత్తి సంస్థల్లో ఫైర్సేఫ్టీపై నిఘా, పర్యవేక్షణ, తనిఖీలు లేవంటున్నారు. మూడు నెలల్లో 3 భారీ అగ్నిప్రమాదాలు రెండు ఫైరింజన్లతో నెట్టుకొస్తున్న అగ్నిమాపక శాఖ కొరవడిన అధికారుల పర్యవేక్షణ ప్రజలు భద్రత ప్రశ్నార్థకంగా మారిన వైనం -
అక్రమాలకు అడ్డా.. ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
ఉండి: భూ అక్రమార్కులకు పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అడ్డాగా మారిందంటూ రంగబాబు అనే వ్యక్తి గురువారం కార్యాలయం ముందు టెంట్ వేసి ఆందోళనకు దిగడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చినగొల్లపాలెంలో తమ ఆస్తికి సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయన్నారు. భూ అక్రమాలకు సంబంధించి తనతో పాటు మరికొందరు గత కొద్దికాలం నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రావడంతో సబ్ రిజిస్ట్రార్ సెలవుపై వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు. కృష్ణాజిల్లాతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల నుంచి రిజిస్ట్రేషన్ల కొరకు ఉండికి తరలివస్తున్నట్టు తెలిపారు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు లంచాలు తీసుకుంటున్న అధికారులు భూ ఆక్రమణ దారులకు కొమ్ముకాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తగిన న్యాయం చేయకపోతే భార్యాబిడ్డలతో ఉండి రిజిస్ట్రార్ ఆఫీసు ముందు ఆత్మహత్యకు పాల్పడతానని హెచ్చరించారు. తమకు సంబంధించిన 32 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించుకునేందుకు ఓ మంత్రి సమీప ఉద్యోగి, రిజిస్ట్రేషన్ శాఖలో ఓ ఉన్నతాధికారి ప్రయత్నిస్తున్నట్లు తనకు అనుమానంగా ఉందని చెప్పారు. దీనిపై అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఇన్చార్జి టి.శరాబందురాజు ఖండించారు. ఇలా చేయడం ఎవరివల్లా కాదన్నారు. ఆరోపణలు చేస్తున్న రంగబాబు ఆస్తి కోర్టు పరిధిలో, అదీ నిషేధిత భూముల జాబితాలోనూ ఉందని పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్ళారు గానీ, ఎవ్వరికీ భయపడికాదని స్పష్టం చేశారు. కలకలం రేపిన బాధితుని ఆందోళన -
పారిజాతగిరి హుండీ లెక్కింపు
జంగారెడ్డిగూడెం : పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవదాయశాఖ ఏలూరు జిల్లా ఇన్స్పెక్టర్ వి.సురేష్కుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం 105 రోజులకు గాను రూ.11,35,112 ఆదాయం వచ్చినట్లు ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు. హుండీ లెక్కింపులో విజయవాడ, ఏలూరు, రిటైర్డ్ ఉద్యోగులు, కామయ్యపాలెం, పుట్లగట్లగూడెం సేవాసంఘం, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాగా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి తోమాల సేవ, తీర్థప్రసాద గోష్టి, తదితర పూజలు నిర్వహించారు. స్వామి వారిని నరసాపురం, పాలకొల్లు, తణుకు భక్తులు దర్శించుకున్నారు. 20న చెస్ టోర్నమెంట్ భీమవరం: ఇంటర్నేషనల్ చెస్ డేను పురస్కరించుకుని అనసూయ చెస్ అకాడమీ, వెస్ట్ గోదావరి చెస్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన గ్రంధి వెంకటేశ్వరరావు మెమోరియల్ ఇన్విటేషనల్ ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు మాదాసు కిషోర్ చెప్పారు. గురువారం టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. పట్టణంలోని తాలూకా ఆఫీసు సెంటర్లోని జీవీఆర్ కళ్యాణ మండపంలో టోర్నమెంట్ జరుగుతుందన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఉచితంగా మాస్టర్ చెస్ బోర్డులు, విజేతలకు రూ.20 వేల నగదు బహుమతులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు తోట భోగయ్య విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షుడు అల్లు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి కొయ్యలగూడెం: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన కొయ్యలగూడెం సుందరయ్యనగర్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మేదే రాజేశ్వరి (24) బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి వద్ద ఉరి వేసుకుని మృతి చెందినట్లు రాజేశ్వరి బంధువులు పేర్కొన్నారు. ఆమెకు భర్త ధనుష్, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ కింద పడి వ్యక్తి మృతి తాడేపల్లిగూడెం రూరల్: లారీ వెనుక చక్రాల కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన చినతాడేపల్లిలో గురువారం చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టెంపాలెం గ్రామానికి చెందిన నీలం రవితేజ (35) తాడేపల్లిగూడెంలోని ఒక ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నాడు. గురువారం మోటారు సైకిల్పై తాడేపల్లిగూడెం వస్తుండగా చినతాడేపల్లి వచ్చేసరికి ముందు వెళ్తున్న ఎరువుల లోడు లారీని తప్పించబోయి ప్రమాదవశాత్తు వెనుక చక్రాల కింద పడి రవితేజ దుర్మరణం చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. -
భార్య దారుణ హత్య
కై కలూరు: ఆస్తిని పెద్ద కొడుక్కి రాసివ్వమని అడిగిన భార్యను అంతమొందించాడో భర్త. ఈ ఘటన ఏలూరు జిల్లా కలిదిండి మండలం ఎస్ఆర్పీ అగ్రహారంలో చోటుచేసుకుంది. వివరాలివి.. గ్రామానికి చెందిన కట్టా పెద్దిరాజు (50), జయలక్ష్మి (47) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు మగ సంతానం. పెద్ద కుమారుడికి ఇటీవల పెళ్లయింది. ఇద్దరు కుమారులు వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పెద్దిరాజుకు గ్రామంలో 40 సెంట్ల భూమి ఉంది. దీనిని అమ్మకానికి సిద్ధం చేస్తున్నాడు. పెద్ద కొడుక్కి వివాహం జరగడంతో దంపతులు ఇల్లు కట్టుకుంటారని, స్థలం పెద్ద కొడుక్కి రాయాలని జయలక్ష్మి భర్తను కోరింది. ఈ విషయంలో తరచూ భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. తన కంటే బిడ్డలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని పెద్దిరాజు భార్యపై ద్వేషం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి నిద్రపోతున్న జయలక్ష్మిపై కత్తితో విచక్షణారహితంగా దాడిచేశాడు. దీంతో ఆమె ఘటనాస్థలిలోనే ప్రాణం విడిచింది. అనంతరం పెద్దిరాజు భయపడి పురుగు మందు తాగి, చాకుతో పీక కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. ప్రాణాలతో ఉన్న పెద్దిరాజును ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తిని పెద్ద కుమారుడికిరాసివ్వమని అడగడమే కారణం అనంతరం ఆత్మహత్యకు యత్నించిన భర్త -
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్, జిల్లా అధ్యక్షుడు డి.శివకుమార్ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గురువారం విద్యార్థులతో కలిసి ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. దీనివల్ల డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయన్నారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు సైతం హాల్ టికెట్లు ఇవ్వకుండా ఒత్తిడి చేస్తున్నారన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు దూరం చేసే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా కోశాధికారి, ఎం.క్రాంతికుమార్, సునీల్, ప్రదీప్, విద్యార్థులు పాల్గొన్నారు. -
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్
కై కలూరు: భార్య వివాహేతర సంబంధానికి సహాకరిస్తోందనే కోపంతో ఎదురింటి మహిళను కత్తితో నరికి చంపిన వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కై కలూరు సీఐ కార్యాలయంలో కేసు వివరాలను ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్, రూరల్ సర్కిల్ సీఐ వి.రవికుమార్ వెల్లడించారు. కలిదిండి మండలం పోతుమర్రు శివారు గొల్లగూడెంలో మంగళవారం మధ్యాహ్నం భోజనానికి కూర్చున్న నంగెడ్డ వరలక్ష్మీదేవీ(39)ని ఎదురింటిలో నివాసం ఉంటున్న కట్టా రామాంజనేయులు(33) బయటకు పిలిచి కత్తితో నరికి పరారయ్యాడు. రామాంజనేయులు భార్య కృష్ణవేణి ఇదే గ్రామానికి చెందిన కట్టా నాగమల్లేశ్వరరావుతో చనువుగా ఉంటోంది. ఈ విషయాన్ని పలువురు గ్రామస్తులు భర్త రామాంజనేయులుకు చెప్పారు. మృతురాలు వరలక్ష్మీదేవీ నాగమల్లేశ్వరరావు వద్ద పనిచేస్తుండడంతో రామాంజనేయులు భార్య వివాహేతర సంబంధానికి వరలక్ష్మీదేవి సహాకరిస్తోందని గట్టిగా నమ్మాడు. దీంతో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న ఆమెను నరికి చంపి పరారయ్యాడు. కై కలూరు మండలం ఉప్పుటేరు వద్ద నిందితుడు రామాంజనేయులును పోలీసులు అరెస్టు చేశారు. సమావేశంలో కలిదిండి, కై కలూరు రూరల్, ముదినేపల్లి ఎస్సైలు వేంకటేశ్వరరావు, రాంబాబు, వీరభద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
పరుపుల పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
ఏలూరు టౌన్: ఏలూరు నగరంలో శివారు వంగాయగూడెంలోని పరుపుల పరిశ్రమలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వంగాయగూడెం కేన్సర్ హాస్పిటల్ సమీపంలోని సుస్మిత ఫర్నిచర్ కుషనింగ్ పరిశ్రమలో ఉదయం 9.30 గంటల సమయంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఎవరూ రాకముందే ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పింది. ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతో ఫోమ్ను తయారు చేస్తారు. ఈ రసాయనాల మిక్సింగ్కు వినియోగించే ట్యాంకర్ను మైనస్ డిగ్రీల్లో చల్లబరుస్తారు. కెమికల్ మిక్సింగ్ ట్యాంకర్కు సంబంధించిన ఏసీలను ఆన్ చేసిన వాచ్మెన్లు ఇద్దరూ కాలకృత్యాలు తీర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాప్తి చెందటంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. డీఎస్పీ శ్రావణ్కుమార్, వన్టౌన్ సీఐ సత్యనారాయణ, రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించిందని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. -
కదం తొక్కిన కార్మికులు
ఏలూరు (టూటౌన్): కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త సమ్మె ఏలూరులో బుధవారం విజయవంతంగా జరిగింది. వివిధ రంగాల కార్మికులతో పాటు బ్యాంకులు, బీమా, పోస్టల్ ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులు తదితర రంగాలకు చెందిన వారు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏలూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు. పవర్ పేట రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన రమా మహల్ సెంటర్ మీదుగా ఆర్ఆర్ పేట పార్క్ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, పని గంటల పెంపును రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, ధరలను అరికట్టాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ పేట పార్కు వద్ద బహిరంగ సభ నిర్వహించారు. సభకు డీఎన్వీడి ప్రసాద్, బి.వెంకటరావు, ఆర్.శ్రీనివాస డాంగేలు అధ్యక్షత వహించారు. -
నన్ను చంపాలని చూస్తున్నారు
దెందులూరు: కొల్లేరు వాసులకు ఒక్క రూపాయి బాకీ ఉన్నానని నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. బుధవారం ఏలూరు జిల్లా కొండలరావుపాలెంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, అబ్బయ్యచౌదరిని ఇబ్బంది పెడితే దెందులూరులో రాజకీయంగా పెత్తనం చేయవచ్చని భావిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే అబ్బయ్యచౌదరి ఇంటికి వెళ్లండి.. ముట్టడించండి, వంటావార్పు చేయండని ఎమ్మెల్యే చింతమనేని పిలుపునిచ్చారని మండిపడ్డారు. తనను బెదిరించి హతమార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. తాను ఉన్నత ఉద్యోగాన్ని వదిలి మంచి చేసేందుకే రాజకీయాల్లో వచ్చానని అన్నారు. ఐదేళ్లు శాసనసభ్యుడిగా ప్రజలకు ఎంతో సేవ చేశానని.. ఏ ఒక్కరి దగ్గర రూపాయి కూడా తీసుకునే ఆలోచన తమకు లేదన్నారు. నాలుగు దశాబ్దాలుగా సేవ చేసే కుటుంబంగా ప్రజలతో కొఠారు కుటుంబానికి అనుబంధం ఉందన్నారు. తన హయాంలో టీడీపీ కార్యకర్తలకు సైతం మంచి చేశానన్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కుటుంబంతో కూడా సమయం గడపకుండా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నానన్నారు. దెందులూరు నియోజకవర్గంలో 20 ఏళ్ల తర్వాతైనా తాను చేసిన మంచి కనిపిస్తుందన్నారు. అలాంటి తన ఇంటిపై రాళ్లు వేసి, వంటావార్పులు పెట్టించి ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు చెరువులు, పొలాలు ఆక్రమిస్తున్నారని, పెట్రోల్ బంకులు, ఇల్లు ధ్వంసం చేస్తున్నారన్నారు. రౌడీషీటర్లను పంపి భయపెట్టాలని చూశారని.. 144 సెక్షన్ ఉన్నా, పోలీసులు ఆపుతున్నా దెందులూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు తన ఇంటికి వచ్చి అండగా నిలిచారని అబ్బయ్యచౌదరి అన్నారు. కొల్లేరులో వికృత రాజకీయ క్రీడ కొల్లేరు ప్రాంతంలో వికృత రాజకీయ క్రీడ జరుగుతుందని అబ్బయ్యచౌదరి అన్నారు. తన తండ్రి రామచంద్రరావు సహకారంతోనే చింతమనేని ఎంపీపీ అయ్యారని గుర్తు చేశారు. కొల్లేరు వాసులను బెదిరించి, తమపై ఉసిగొల్పుతున్నారని.. మీకు గాని, మీ గ్రామానికి గాని బాకీ ఉన్నానని నిర్ధారించేందుకు తాను కమిటీ వేస్తానని, మీరు కూడా ఒక కమిటీ వేసి నిజనిర్ధారణకు రావాలని ఏలూరు కోటదిబ్బ వద్ద నిరసన తెలుపుతున్న వారిని ప్రశ్నించారు. కలెక్టర్, ఎస్పీ కూడా కమిటీలో భాగస్వాములై నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు, వడ్డీల కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్, దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల పార్టీ అధ్యక్షులు కామిరెడ్డి నాని, జానంపేట ప్రసాద్బాబు, అప్పన్న ప్రసాద్, తేరా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఏఎస్పీకి ఫిర్యాదు : నియోజకవర్గంలో పరిణామాలతో పాటు రెండు రోజులుగా జరుగుతున్న సంఘటనలపై కొఠారు అబ్బయ్యచౌదరి ఏలూరులో ఏఎస్పీ నక్కా సూర్య చంద్రరావుకు లిఖితపూర్వకంగా వినతిపత్రం అందచేశారు. మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
ఆగిరిపల్లి: ఆగిరిపల్లి మండలంలోని శోభనాపురం గ్రామంలో టీడీపీని వీడి రెండు కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. నూజివీడు నియోజకవర్గ తెలుగు యువత సభ్యుడు పెనుముచ్చు మహేష్, కాకి భాగ్యరాజు కుటుంబ సభ్యులు టీడీపీని వీడి వైఎస్సార్సీపీ నాయకులు బోయపాటి శ్రీనివాసరావు, రావి విష్ణువర్ధన్రావుల సమక్షంలో కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీలో దళిత నాయకులంటే చిన్న చూపని, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారని త్వరలోనే తెలుగుదేశం పార్టీకి దళితుల సత్తా ఏంటో చూపిస్తామని, నూజివీడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ బలోపేతానికి శాయిశక్తుల కృషి చేస్తామని పెనుముచ్చు మహేష్, కాకి భాగ్యరాజు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు దాసరి రామారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు నక్కనబోయిన సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు ఉద్యోగుల నిరసన ఏలూరు (టూటౌన్): సార్వత్రిక సమ్మెకు మద్దతుగా బుధవారం నాడు బ్యాంకు ఉద్యోగులు సామూహిక ప్రదర్శనలు నిర్వహించారు. ఆర్ఆర్పేట యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ కార్యా లయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఏలూరు, ఏలూరు చుట్టు పక్కల బ్యాంకు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం అధ్యక్షుడు దుగ్గిరాల శ్రీనివాస్ మోహన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీనం పేరుతో బ్యాంకింగ్ సెక్టార్ను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. కార్మిక వర్గం ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ 44 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు లక్ష్మణరావు, ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు రామకోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవేపై నిరసన చింతలపూడి: చింతలపూడి మండలం శెట్టివారిగూడెం–వెంకటాపురం గ్రామానికి అనుసంధానంగా ఉన్న రోడ్డును తక్షణం నిర్మించాలని కోరుతూ గ్రీన్ఫీల్డ్ హైవేపై బుధవారం గ్రామస్తులు టెంట్ వేసి నిరసనకు దిగారు. గతంలో గ్రీన్ ఫీల్డ్ హైవే కాంట్రాక్టర్ హైవే నిర్మాణం సమయంలో రోడ్డు ధ్వంసం అవ్వడంతో ప్రత్యా మ్నాయంగా తమ గ్రామాల మధ్య రోడ్డు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టక పోవడంతో తప్పనిసరి పరిస్ధితుల్లో నిరసన చేపట్టామని గ్రామస్తులు తెలిపారు. మాట ఇచ్చి వారికి సంబంధం లేనట్టుగా ప్రవర్తించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ధ్వంసం చేయడంతో సుమారు 600 ఎకరాలకు దారి లేకుండా పోయిందని వాపోయారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సతీష్ కుమార్ సంఘటనా స్ధలానికి చేరుకుని కాంట్రాక్టర్, గ్రామస్తులతో చర్చలు జరిపారు. అక్షరాస్యత పెంచేందుకు కృషి చేయాలి ఏలూరు(మెట్రో): వయోజనుల్లో అక్షరాస్యత పెంచడమే లక్ష్యంగా చేపట్టిన ఉల్లాస్–అక్షరాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టర్ బంగ్లాలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి ఉల్లాస్ – అక్షరాంధ్ర జిల్లా స్థాయి అధికారులతో సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 100 గంటల శిక్షణతో ఈ ఏడాది 97,200 నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ఉల్లాస్–అక్షరాంధ్ర కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. -
వరద గోదావరి
మత్స్యం.. కొల్లేరు ప్రత్యేకం చేపల గుడ్ల ఉత్పత్తి పెంచేందుకు చేసిన ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఏటా జూలై 10న చేప రైతుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 4లో uగురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: వరద గోదావరి మళ్లీ పోటెత్తుతుంది. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరిలో జలకళ మొదలైంది. గత వారం రోజులుగా రోజుకు సగటున 2 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో తీవ్రత మరింత పెరుగుతుందని దానికనుగుణంగా 9.32 లక్షల క్యూసెక్కుల నీరు 15 కల్లా వస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు వరద ప్రవాహంతో ముంపు మండలాల్లో అలజడి మొదలైంది. గోదావరికి వరదల సీజన్ ప్రారంభమైంది. వాస్తవానికి జూలై మొదటి వారం నుంచి వరద హడావుడి ప్రారంభమై ఆగస్టు వరకు రెండు సార్లు ముంపు మండలాల్ని అతలాకుతలం చేస్తోంది. ఈ ఏడాది వర్షాలు కొంత ఆలస్యం కావడం, ఇతర కారణాలతో వరద ఉధృతి గతంతో పోల్చితే తక్కువగానే ఉంది. ఈ నెల 2 నుంచి ప్రారంభమైన వరద నీరు క్రమేపీ పెరుగుతూ వచ్చింది. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి ఉపనది శబరి పోటెత్తుతుంది. ఈ క్రమంలో ఈనెల 2న 1.06 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం స్పిల్వే నుంచి దిగువకు విడుదల చేశారు. 5వ తేదీ నాటికి 2.09 లక్షల క్యూసెక్కులు, 9 నాటికి 2.27 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. వరద పోటెత్తే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేశారు. ఈ నెల 15 కల్లా 9,32,288 క్యూసెక్కుల నీరు పోలవరానికి చేరుతుందని, అదే విధంగా భద్రాచలం వద్ద 43 అడుగుల నీటిమట్టంతో మొదటి ప్రమాదహెచ్చరిక జారీ చేయవచ్చని చెబుతున్నారు. ఈ నేనపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. దిగువకు విడుదలవుతున్న నీటిని పోలవరం నుంచి పూర్తి స్థాయిలో డిశ్చార్జ్ చేస్తున్నారు. న్యూస్రీల్ముంపు మండలాల్లో భయం.. భయంపోలవరం ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుకు వరద ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రమంలో 9.32 లక్షల క్యూసెక్కులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఈ దశలో రహదారులపైకి నీరు చేరుతుంది. 11.44 లక్షల క్యూసెక్కులు దాటితే రెండవ ప్రమాద హెచ్చరికకు రహదారులు నీటముగి రాకపోకలు నిలిచిపోయి పదుల సంఖ్యలో గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ళలోకి నీరు చేరుతుంది. 14.26 లక్షల క్యూసెక్కులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికతో రెండు మండలాల్లో 18 గ్రామాలు పూర్తిగా జలదిగ్భందంలోకి వెళ్తాయి. ఈ క్రమంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కే.వెట్రిసెల్వి ఆదేశించారు. ఇప్పటివరకు కుక్కునూరు మండలం గొమ్ముగూడానికి చెందిన 15 కుటుంబాలను మాత్రమే దాచారంలోని పోలవరం పునరావాస కాలనీకి తరలించారు. కొనసాగనున్న ఉధృతి బుధవారం మధ్యాహ్నానికి భద్రాచలంలో 22.40 అడుగుల మేర నీటిమట్టం ఉంది. ఎగువ నుంచి ఇన్ఫ్లో ఎక్కువగా ఉండటంతో గురువారానికి 3 నుంచి 4 అడుగులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 1986లో 75.60 అడుగుల మేర నీటి మట్టం ఉండటంతో 27 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలైంది. ఇంతవరకు అత్యధికంగా వచ్చిన వరద ఇదే. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో అత్యధిక గ్రామాలు భారీగా నష్టపోయాయి. ఆ తరువాత 2022లో 71.30 అడుగుల నీటిమట్టంతో 21.78 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరానికి ఒకేసారి విడుదలైంది. ఈ క్రమంలో ముంపు మండలాలతో పాటు పశ్చిమలోని లంక గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. 2022లో జూలై 6న, 2023లో జూలై 20న 2024 జూలై 19న వరదలు ప్రారంభమై సుమారు వారం రోజులు పాటు ఇన్ఫ్లో కొనసాగింది. ముంపు మండలాల్లో అప్రమత్తం ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పోటెత్తుతున్న గోదావరి, శబరి 8 రోజుల వ్యవధిలో పోలవరం నుంచి 13.88 లక్షల క్యూసెక్కులు విడుదల మరో వారం కొనసాగనున్న గోదావరి ఉధృతి గోదావరి ఉధృతి ఇలా (పోలవరం నుంచి నీటి విడుదల) తేదీ విడుదలైన నీరు (క్యూసెక్కుల్లో) జూలై 5 2,09,733 6 2,023,309 7 1,95,294 8 2,02,463 జూలై 9 2,27,066 -
టీడీపీ మూకల అరాచకం
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని పల్లెర్లమూడిలో మంగళవారం రాత్రి నిర్వహించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి కార్యక్రమంలో టీడీపీ మూకలు అడుగడుగునా రెచ్చగొట్టి గొడవలకు విశ్వప్రయత్నాలు చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ముందుకు సాగగా చివరకు వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను చించివేశారు. ఇంత జరిగినా పట్టించుకోని పోలీసులు బుధవారం మాత్రం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పోలిమెట్ల శివను ఉదయం నుంచి పోలీస్స్టేషన్లో ఉంచారు. వైఎస్ జయంతి సందర్భంగా పల్లెర్లమూడిలో కేక్ కటింగ్ ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావును ఆహ్వానించారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో రాట్నాలగూడెంలో కేక్ కట్చేసి అక్కడి నుంచి పల్లెర్లమూడి వెళ్లారు. పల్లెర్లమూడిలోకి ర్యాలీ ప్రవేశించిన దగ్గర నుంచి రాటాలు అనే అతను ట్రాక్టర్తో ర్యాలీ చేస్తున్న వారిని గుద్దించాలని మీదకు పోనిచ్చాడు. పక్కన వాళ్లు లాగడంతో బతికి బయటపడ్డారు. పల్లెర్లమూడిలోని దళితవాడకు వెళ్లి అక్కడ వైఎస్ విగ్రహానికి ప్రతాప్ అప్పారావు పూలమాల వేసి కేక్ కట్ చేసిన అనంతరం శివాలయం సెంటర్కు ర్యాలీగా రాగా అక్కడ డీజే బండికి బైక్లు అడ్డం పెట్టడంతో పాటు మహిళలను అడ్డం కూర్చోబెట్టి కులంపేరుతో వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను దూషించారు. ర్యాలీని అడ్డుకొని అరాచకంగా వ్యవహరించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, వైఎస్సార్సీపీ నాయకులు వచ్చి ఘర్షణ వాతావరణం పెరగకుండా అడ్డుకున్నారు. టీడీపీ మూకలు గ్రామంలో వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను చించివేశారు. దాడిలో గాయపడ్డ నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు నూజివీడు ఏరియా ఆసుపత్రిలో చేశారు. గ్రామంలోని టీడీపీ ఫ్లెక్సీలను చించారంటూ బుధవారం ఉదయం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పోలిమెట్ల శివను పోలీసులు తీసుకొచ్చి పోలీస్స్టేషన్లో ఉంచారు. దీనిపై జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు శీలం రాము, మండలంలోని, పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు పోలీస్స్టేషన్ వద్దకు చేరుకున్నారు. కవ్వింపునకు పాల్పడిందే టీడీపీ వాళ్లే.. కవ్వింపు చర్యలకు దిగి రెచ్చగొట్టింది టీడీపీ వాళ్లేనని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు రూరల్ సీఐకు తెలిపారు. పోలిమెట్ల శివను స్టేషన్కు తీసుకురావడంతో ఆయన స్టేషన్కు వచ్చారు. బైక్ ర్యాలీ చేసుకుంటూ ప్రశాంతంగా వెళ్తుంటే రాటాలు అనే అతను ట్రాక్టర్తో గుద్దించడానికి ప్రయత్నించాడని చెప్పారు. వైఎస్సార్ జయంతి ర్యాలీకి ట్రాక్టర్ అడ్డుపెట్టి కవ్వింపు చర్యలు పల్లెర్లమూడిలో వైఎస్సార్సీపీ ఫ్లెక్సీల చించివేత -
పాఠశాలలు, రేషన్ షాపుల తనిఖీ
641 కిలోల గంజాయి ధ్వంసం జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 641 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు వర్గాలు తెలిపాయి. 4లో uఏలూరు (టూటౌన్): జిల్లాలో పలు పాఠశాలలు, రేషన్ షాపులు, ఎంఎల్ఎస్ పాయింట్లను బుధవారం రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్త విజయప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏలూరు, భీమడోలు, ద్వారకాతిరుమల మండలాల్లో పర్యటించారు. తొలుత ఏలూరు జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో వంటశాల స్టోర్ రూమ్ పరిశీలించారు. కొన్ని గుడ్లు కేవలం 31 గ్రాముల ఉండడం గమనించి సప్లయర్ను సంప్రదించి తక్కువ బరువు ఉన్న గుడ్లను వెంటనే మార్చాలని, ఇకనుంచి ఇలాంటి పొరపాట్లు జరగకూడదని చెప్పారు. భీమడోలు మండలం గుండుగోలనులో రేషన్ షాపు, మండల పరిషత్ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పాతూరు ఎమ్ఎల్ఎస్ పాయింట్ పరిశీలించారు. ద్వారకా తిరుమల మండలంలో బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. వంటశాల, స్టోర్ రూం తనిఖీలు నిర్వహించారు. 682 మంది విద్యార్థులకుగాను కేవలం నలుగురు వంటవాళ్లు మాత్రమే ఉన్నారని పాఠశాల ప్రిన్సిపల్ చైర్మన్ దష్టికి తీసుకురాగా ఈ విషయంపై అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. -
నాణ్యమైన ఆహారం అందించాలి
ఏలూరు (టూటౌన్): వసతి గృహాంలోని విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ సూచించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ అమీనాపేట ఏటిగట్టున ఉన్న సాంఘిక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలలకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వసతి గృహం కిటికీలకు దోమల మెష్ లేకపోవడం వల్ల దోమల బెడద ఉంటుందని విద్యార్థులు తెలిపారని, ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. వసతి గృహానికి రాని విద్యార్థుల వివరాలు సేకరించి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి, తిరిగి పాఠశాలకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో వ్యాపారాలతో అభివృద్ధి
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆర్టీసీకి సంబంధించి ఖాళీగా ఉన్న స్థలాలను ఔత్సాహిక వ్యాపారవేత్తలకు లీజుకు ఇవ్వడం ద్వారా వారి ఆర్థిక అభివృద్ధికి ఆర్టీసీ కృషి చేస్తోందని ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం అన్నారు. బుధవారం స్థానిక జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో ఔత్సాహిక వ్యాపారులతో ఆమె అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లాలోని కలిదిండి, భీమవరం, ఆకివీడు ప్రాంతాల్లోని ఆర్టీసీ ఖాళీ స్థలాలను 15 సంవత్సరాలకు లీజుకు ఇవ్వడానికి టెండర్లు ఆహ్వానించామన్నారు. ఈ టెండర్లకు సంబంధించిన వివరాలు, లీజుకు ఉండే నియమ నిబంధనలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజ్ బీ. వాణి, డీఈ బీవీ రావు, ఏఈ సీహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉర్దూ పాఠశాల వివాదంపై ఆర్జేడీ విచారణ ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ (మాకా) ఉర్దూ పాఠశాల, తూర్పువీధి ఉర్దూ పాఠశాలల్లో జరుగుతున్న వివాదాలపై పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ జి.నాగమణి బుధవారం విచారణ నిర్వహించారు. తొలుత ఆ రెండు పాఠశాలల్లోని ఉపాధ్యాయులతో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి పాఠశాలలోనూ రెండు మాధ్యమాల్లో విద్యాబోధన చేయాల్సిన పరిస్థితి ఉందని, ఈ రెండు పాఠశాలల్లో సైతం అదే విధానం అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు అర్థమయ్యే మాధ్యమంలోనే ఉపాధ్యాయులు బోధించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయుల నుంచి రెండు మాధ్యమాల్లో బోధిస్తామని లేఖలు రాయించుకున్నారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటామని ఈ విచారణలో జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ పాల్గొన్నారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి భీమవరం: ఉండి మండలం చెరుకువాడ వద్ద గుర్తుతెలియని రైలు నుంచి జారిపడి గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందినట్లు భీమవరం రైల్వే ఎస్సై ఎం.సుబ్రహ్మణ్యం బుధవారం చెప్పారు. ఈ నెల 1న గుర్తు తెలియని 50 ఏళ్ల వ్యక్తి రైలు నుంచి జారిపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా బుధవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. -
కుమారుడిపై తల్లి ఫిర్యాదు
ముదినేపల్లి రూరల్: మద్యం మత్తులో తనపై దాడి చేస్తున్నాడంటూ కుమారుడిపై తల్లి స్థానిక పోలీసుస్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని వాడవల్లికి చెందిన నిమ్మగడ్డ నాగేశ్వరరావు, మేరమ్మ దంపతులకు నలుగురు కుమారులున్నారు. తండ్రి నాగేశ్వరరావు అనారోగ్యంతో మంచంపై ఉన్నాడు. చివరి కుమారుడైన విజయకుమార్ భార్యను వదిలేసి తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి విజయకుమార్ మద్యం మత్తులో కత్తిపీటతో తనపై దాడి చేసినట్లు మేరమ్మ ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఫిర్యాదు చేయగా ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ అధికారుల బదిలీలు ఏలూరు (ఆర్ఆర్పేట): తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో పని చేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల నిర్వహించిన పదోన్నతుల్లో నిడదవోలు విద్యుత్ రెవెన్యూ కార్యాలయానికి జేఓగా నియమితులైన సీహెచ్ శ్రీనివాసరావును పరిపాలనా సౌలభ్యం కోసం రామచంద్రాపురం విద్యుత్ రెవెన్యూ కార్యాలయానికి బదిలీ చేశారు. అలాగే రామచంద్రాపురం విద్యుత్ రెవెన్యూ కార్యాలయానికి ఇటీవల పదోన్నతిపై వెళ్ళిన ఎంవీఎస్ఎస్వీ ప్రసాద్ను నిడదవోలు విద్యుత్ రెవెన్యూ కార్యాలయానికి బదిలీ చేశారు. జెడ్పీ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ ఇరగవరం : మండలంలోని ఇరగవరం జిల్లా పరిషత్ హైస్కూల్ను బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ స్కూలు ఆవరణ అంతా తిరిగి పరిశీలించారు. విద్యార్థులు అమ్మ పేరుతో నాటేందుకు సిద్ధపరిచిన మొక్కలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం పథకంలో తయారు చేసే వంటశాలకు వెళ్లి వండిన వంటకాలను, స్టాక్ రూములో ఉన్న స్టాకును పరిశీలించారు. గురువారం నిర్వహించే మెగా పేరెంట్స్ టీచర్స్ డే మీట్ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భానో, తహసీల్దార్ ఎం.సుందర్ రాజు ఉన్నారు. విద్యాసంస్థల బస్సులపై 18 కేసులు ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లావ్యాప్తంగా బుధవారం వాహన తనిఖీ అధికారులతో విద్యా సంస్థల బస్సులను తనిఖీ చేయించినట్టు ఏలూరు ఇన్చార్జ్ రవాణా శాఖాధికారి ఎస్బీ శేఖర్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం వివిధ విద్యా సంస్థలకు చెందిన 63 బస్సులను తనిఖీ చేసినట్టు తెలిపారు. వాటిలో పన్నులు చెల్లించని, ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్ లేని, పలు నిబంధలను అతిక్రమించిన 18 బస్సులపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. జిల్లాలో విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో ప్రారంభమైన కారణంగా విద్యా సంస్థల యాజమాన్యాలు నిర్వహించే బస్సులన్నీ నిబంధనలకు లోబడి తిప్పాలని, అన్ని బస్సులు పూర్తి ఫిట్నెస్తో, ఇన్సూరెన్స్తో, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన డ్రైవర్లతో మాత్రమే తిప్పాలని సూచించారు. -
పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు
ఏలూరు టౌన్: జిల్లాలో పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహిస్తున్నామనీ, సిబ్బంది సంక్షేమం, ఆరోగ్య భరోసాకు ఉచిత మెగా హెల్త్ చెకప్ ఏర్పాటు చేసినట్లు ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చెప్పారు. ఏలూరు పత్తేబాదలోని కామినేని హాస్పిటల్లో ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందికి ఉచితంగా హెల్త్ చెకప్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం పోలీస్ సబ్ డివిజన్లలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో పని చేస్తోన్న పోలీస్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది, హోంగార్డులకు ఆరోగ్య పరీక్షలు ఉచితంగా అందించేలా చర్యలు చేపట్టారు. బీపీ, షుగర్, ఈసీజీ, లివర్ ఫంక్షనింగ్ టెస్ట్, కిడ్నీ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, విటమిన్ డీ, బీ12, సీబీపీ, వంటి ముఖ్యమైన పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 30 వరకూ ప్రతి రోజూ 100మంది చొప్పున 1969 మంది సిబ్బందికి వైద్య పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో కామినేని హాస్పిటల్స్ డాక్టర్ కొడాలి రామ్ ప్రసీన్, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐ పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక చింతనలో అతివలు
ద్వారకాతిరుమల: మానసిక ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతతనిచ్చేది ఆధ్యాత్మిక చింతన. ఆ దిశగా అడుగులు వేస్తూ తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, దేవుని సేవలో తరిస్తున్నారు వందలాది మంది మహిళలు. బృందాలుగా ఏర్పడి, దేవాలయాల్లో భగవద్గీత పారాయణలు చేస్తున్నారు. అందులో భాగంగా తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ద్వారకాతిరుమల శ్రీవారి సన్నిధిలో శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ శిష్య బృందం భగవద్గీత పారాయణం, స్వామివారి గానామృతం చేశారు. ఇందులో రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన 500 మంది మహిళలు పాల్గొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కామవరపుకోట మండలం జలపవారిగూడెంకు చెందిన కామిశెట్టి రాంబాబు, ఉషారాణి దంపతుల ఆధ్వర్యంలో సామాన్య భక్తులు సైతం భాగస్వాములయ్యారు. దూరాన్ని లెక్కచేయకుండా.. ఏలూరు జిల్లాకు చెందిన మహిళలతో పాటు బెంగళూరు, హైదరాబాద్, ఖమ్మం, వైర, సత్తుపల్లి, అశ్వారావుపేట, భద్రాచలం, పాల్వంచ, అలాగే విశాఖపట్నం, నూజివీడు, తిరువూరు, విసన్నపేట, భీమవరం తదితర ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మహిళా భక్తులకు శ్రీవారి దేవస్థానం ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి ఆదేశాల మేరకు స్వామి వారి ఉచిత దర్శనంతో పాటు, అన్నప్రసాదాన్ని అందజేశారు. ఏర్పాట్లను ఆలయ ఏఈఓలు పి.నటరాజారావు, రమణరాజు, సూపరింటెండెంట్లు కోటగిరి కిషోర్, గోవాడ సుబ్రహ్మణ్యం, దుర్గాప్రసాద్ పర్యవేక్షించారు. శ్రీవారి క్షేత్రంలో భగవద్గీత పారాయణం, స్వామివారి గానామృతం రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేస్తున్న మహిళలు 500 మందితో జరిగిన కార్యక్రమాలు సంతృప్తినిచ్చింది ఆన్లైన్లో భగవద్గీత పారాయణం నేర్చుకున్నాను. తొలిసారిగా శ్రీవారి సన్నిధిలో, అది కూడా తొలి ఏకాదశి రోజున భగవద్గీత పారాయణం, గానామృతం చేయడం సంతృప్తినిచ్చింది. ఈ కార్యక్రమాల నిర్వహణకు దేవస్థానం అధికారులు పూర్తి సహకారాన్ని అందించారు. – కామిశెట్టి ఉషారాణి, కామవరపుకోట మండలం జలపవారిగూడెం ప్రశాంతత లభిస్తుంది ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే హైదరాబాద్ నుంచి వచ్చాను. తొలి పండుగ నాడు అధిక సమయం శ్రీవారి సన్నిధిలో గడపడం, ఆ స్వామివారిని దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. – కొమ్మూరి గాయత్రి, హైదరాబాద్. ఏడు వందల శ్లోకాలు కంఠస్థం భగవద్గీత పారాయణను ఆన్లైన్ ద్వారా నేర్చుకున్నాను. గోల్డ్మెడల్ కూడా వచ్చింది. శ్రీవారి సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో 700 శ్లోకాలు కంఠస్థం చేసిన సుమారు 200 మంది గోల్డ్మెడలిస్టులం పాల్గొన్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరాయంగా పారాయణం, గానామృతం చేశాం. – సెనగపల్లి పూర్ణిమ, విజయవాడ -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
చింతలపూడి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతి చెందినట్లు ఎస్సై సతీష్కుమార్ బుధవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లింగంపాలెం గ్రామానికి చెందిన తులిమెల్లి త్రినాథ్ (24) చింతలపూడి వైష్ణవి మెడికల్ షాప్లో సేల్స్మేన్గా పని చేస్తున్నాడు. ఈ నెల 5న రాత్రి మెడికల్ షాప్ కట్టి ద్విచక్రవాహనంపై స్వగ్రామం లింగపాలెం బయలుదేరాడు. చింతలపూడి బైపాస్ రోడ్డు వద్ద పెట్రోల్ బంక్ సమీపంలో బైక్ అదుపుతప్పి గుంతలో పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. స్థానికులు యువకుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించి మెరుగైన చికిత్సకోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ త్రినాథ్ చనిపోవడంతో మృతుని తండ్రి తులిమెల్లి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భార్య, పిల్లలు కనిపించడం లేదని భర్త ఫిర్యాదు భీమవరం: తన భార్య బెల్లం రమ్య, తన పిల్లలు కన్పించడం లేదంటూ భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన బొల్లం సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై రామరావు చెప్పారు. వివరాల ప్రకారం ఈ నెల 5న సుబ్బారావు పనికివెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్య, పిల్లలు కన్పించలేదు. దీంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద వెతికిన ప్రయోజనం లేకపోవడంతో సుబ్బారావు పోలీసులను ఆశ్రయించాడు. -
మత్స్యం.. కొల్లేరు ప్రత్యేకం
అవగాహన కల్పిస్తాం ప్రేరేపిత ప్రయోగం విజయవంతం ద్వారా డాక్టర్ హీరాలాల్ చౌదరీ నీలి విప్లవానికి పితామహుడిగా మారారు. ఆయన 1994లో వరల్ట్ ఆక్వాకల్చర్ అవార్డు అందుకున్నారు. ప్రతి ఏటా మత్స్యశాఖ ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కై కలూరు ప్రభుత్వ ఆక్వా ల్యాబ్లో రైతులకు గురువారం అవగాహన కలిగిస్తాం. – సీహెచ్ గణపతి, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కై కలూరుకై కలూరు: చేపల గుడ్లు(స్పాన్) ఉత్పత్తికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి చేసిన ప్రయోగ ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ఆక్వారంగం అగ్రభాగాన నిలుస్తోంది. ఒడిశా రాష్ట్రం కటక్ సెంట్రల్ ఇన్ల్యాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనన్స్టిట్యూట్ (ఐసీఏఆర్)లో 1957 జూలై 10న డాక్టర్ హీరాలాల్ చౌదరీ, డాక్టర్ అలికున్హి శాస్త్రవేత్తలు కలిసి భారతదేశ మేజర్ కార్ప్స్పై విజయవంతమైన ప్రేరిత పెంపక ప్రయోగాన్ని(ఇన్డ్యూసిడ్ బ్రీడింగ్) చేపట్టారు. సాధారణ చేపల్లో ఉదాహరణకు ఐదు లక్షల స్పాన్ ఉత్పత్తి చేస్తే ప్రేరిత ప్రయోగం వల్ల ఆ సంఖ్య 10 నుంచి 20 లక్షలకు చేరింది. అప్పటి నుంచి నీలి విప్లవం తారా స్థాయికి పాకింది. బ్రీడింగ్ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా జాతీయ చేపల రైతుల దినోత్సవం జూలై 10న జరుపుకుంటారు. ఉమ్మడి జిల్లాల్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో రైతులకు గురువారం అవగాహన కార్యక్రమాలన నిర్వహిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఆక్వా సాగు ఉమ్మడి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఆక్వా రంగం నుంచి వార్షిక ఉత్పత్తి 4 లక్షల టన్నులు ఉండగా, వార్షిక టర్నోవర్ రూ.18 వేల కోట్లు ఉంది. దాదాపు ఆక్వా రైతులు 75 వేల మంది ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ జిల్లాల నుంచి 3.5 లక్షల టన్నులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక రాష్టం విషయానికి వస్తే 974 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. రాష్ట్రంలో మొత్తం ఆక్వా సాగు 2.26 హెక్టార్లులలో కొనసాగుతుంది. దిగుబడులు 10 లక్షల టన్నులుగా ఉంది. అమెరికాకు ఎగుమతి చేసే రొయ్యలు 3.27 లక్షల టన్నులుగా నమోదైంది. దేశంలోనే సింహభాగం ఉత్పత్తులకు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు మణిహారంగా మారాయి. నీలి విప్లవంతో రికార్డులు ఆక్వా సాగులో 1955 పూర్వం చేపల సాగు చేయాలంటే నదులు, సముద్రాలలో చేప పిల్లలను సేకరించాల్సి వచ్చేది. దీన్ని వైల్ట్ కలక్షన్ అంటారు. డాక్టర్ హీరాలాల్ చౌదరీ భారతీయ మేజర్ కార్ప్స్ (కట్లా, రోహు, మ్రిగల్)పై హార్మోన్ ప్రేరేపిత ప్రయోగం చేశారు. దీంతో కోట్లలో చేప స్పాన్ అందుబాటులోకి వచ్చింది. తర్వాత అన్యదేశ కార్ప్స్(కామన్ కార్ప్, గ్రాస్ కార్ప్, సిల్వర్ కార్ప్), టిలాపియా, పంగాసియస్ వంటి ఇతర చేపలు, మంచినీటి రొయ్యలైన మాక్రోబ్రాకియం, రోజెంబర్గి(స్కాంపీ) కూడా అభివృద్ధి చెందాయి. ఒక్క ప్రయోగం భారతీయ మత్స్య పరిశ్రమను సమూలంగా మార్చివేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నర్సరీలు, పెంపక చెరువులు నాణ్యమైన చేప విత్తనాల సరఫరాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఇవి రాష్ట్రానికి మాత్రమే కాక, దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా చేప విత్తనాలను సరఫరా చేస్తున్నాయి.కొల్లేరులో చేపల పట్టబడులు చేస్తున్న దృశ్యం (ఫైల్) నేడు జాతీయ చేపల రైతు దినోత్సవం ఉమ్మడి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు ఆక్వా అంటేనే కొల్లేరు ఆక్వా పరిశ్రమకు కొల్లేరు లంక గ్రామాలు పెట్టింది పేరుగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల్లో 9 మండలాల్లో కొల్లేరు విస్తరించి ఉంది. చిత్తడి నేలల కారణంగా చేపల, రొయ్యల పెరుగుదల అధికంగా ఉంటుంది. ఇక చేప పిల్లలను ఉత్పత్తి చేసే ప్రభుత్వ హేచరీ ఏలూరు జిల్లా బాదంపూడిలో ఉంది. చేప నారును సాగు చేసే మత్స్యశాఖనకు చెందిన సీడ్ ఫాంలు ఏలూరు, కొవ్వలిలో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల నుంచి ప్రతి రోజూ 240 లారీలు ఎగుమతులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి. రాష్ట్రంలో ఆక్వాకు సంబంధించి ప్రాసెసింగ్ ప్లాంట్లు 106, ఐస్ ప్లాంట్లు 258, ఏడాదికి 60,000 మినియన్ల ఉత్పత్తి చేసే రొయ్యల హేచరీస్, ప్రతి రోజూ 9,750 టన్నుల ఉత్పత్తి చేసే మేతల ఫ్యాక్టరీలు 429, ఆక్వాషాపులు 1104, ఆక్వా ల్యాబ్లు 237 ఉన్నాయి. -
మామిడి తోటల్లో కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి
నూజివీడు: కోతలు పూర్తయిన నేపథ్యంలో మామిడి తోటల్లో రైతులు కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలని నూజివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె.రాధారాణి పేర్కొన్నారు. మండలంలోని కొత్తరావిచర్లలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో బుధవారం మామిడి రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా రాధారాణి మాట్లాడుతూ కొమ్మ కత్తిరింపులు చేయడం వల్ల చెట్ల గాలి వెలుతురు ప్రసరణ బాగా జరిగి పూత, కాపు సరిగ్గా వస్తాయని, తెగుళ్లు, పురుగుల బెడద తగ్గుతుందన్నారు. చెదురుమదురుగా ఉన్న కొమ్మలను ఏటవాలుగా కత్తిరించి కత్తిరించిన చోట బ్లైటాక్స్ను పూయాలన్నారు. తోటల్లో దుక్కులు చేపట్టి చెట్టుకు చుట్టూ పాదులు చేసి పదేళ్ల వయస్సు పైబడిన చెట్లకు యూరియా 2 కిలోలు, సింగిల్ సూపర్ ఫాస్పేట్ 4 కేజీలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1.5కేజీలు, బోరాన్ 100గ్రాములు, జింక్ సల్ఫేట్ 100గ్రాములు చొప్పున ఒక్కొక్క చెట్టుకు వేయాలన్నారు. ఆమె వెంట ఉద్యానశాఖ అధికారి ఆర్.హేమ, సర్పంచి కాపా శ్రీనివాసరావు ఉన్నారు. -
641 కిలోల గంజాయి ధ్వంసం
భీమవరం : జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 641 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్లు జిల్లా పోలీసు కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో జిల్లాలోని 23 పోలీస్ స్టేషన్ల పరిధిలో 64 కేసుల్లో సుమారు 641 కిలోల గంజాయిని బుధవారం గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామపరిధిలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ వద్ద ధ్వంసం చేసినట్లు తెలిపారు. ధ్వంసం చేసిన గంజాయిని ముందుగా ఈనెల 8న భీమవరం పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని రిసెప్షన్ హాల్లో మధ్యవర్తుల సమక్షంలో కేసుల వారీగా తూకం వేసి పరిశీలించి దానిని ప్రత్యేక కవర్లు, సంచులలో పెట్టి సీలు వేసి పోలీసు బందోబస్త్ మధ్య గుంటూరు తరలించినట్లు పేర్కొన్నారు. -
వరద ముప్పును ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు
వేలేరుపాడులో కలెక్టర్ సమీక్ష వేలేరుపాడు: గోదావరి వరదలు ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి పేర్కొన్నారు. వరదలు ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం వరదలపై ముందస్తు ప్రణాళిక సమావేశంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రానున్న 3 రోజుల్లో భద్రాచలం నుంచి గోదావరి వరద నీరు 9 లక్షల క్యూసెక్కులపైగా పైగా దిగువకు వచ్చే అవకాశం ఉందని, పెద్దవాగు, ఎద్దువాగుల నుంచి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు వరద ముంపు ప్రభావం పొంచి ఉన్నందున, ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీకి ముందుగానే సహాయక చర్యలకు సిద్ధం కావాలన్నారు. ముంపు ప్రమాద ప్రాంతాల్లో గర్భిణులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొయిదా వంటి కొండ ప్రాంతాల గ్రామాల ప్రజలకు, వరద ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు టార్పాలిన్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 3 నెలలకు సరిపడా నిత్యావసరాలు సిద్ధం చేయాలని పౌర సరఫరాల శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
పునరావాస కేంద్రం పరిశీలన
కుక్కునూరు: గోదావరి వరదల దృష్ట్యా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశాల మేరకు మంగళవారం పలువురు అధికారులు మండలంలోని దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన పునరావాస సహాయక కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు పునరావాస కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు చేపట్టారు. దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీని సందర్శించిన వారిలో పంచాయతీరాజ్ ఎస్ఈ కె.శ్రీను, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జి.త్రినాథ్బాబు, గృహనిర్మాణ శాఖ పీడీ జి.సత్యనారాయణ తదితరులున్నారు. ఉపాధ్యాయులను నియమించాలి ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాఠశాలలో ప్రస్తుతం ఎస్ఏ ఉర్దూ, ఎస్ఏ గణితం, ఎస్ఏ పీఎస్ ఉపాధ్యాయులు లేనందున వెంటనే అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించాలని మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. కొన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందనందున పూర్తిస్థాయిలో చేరేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటు తూర్పువీధి ఉర్దూ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల, తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లీషు మీడియంలోనే బోధన కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డీఈఓకు వినతిపత్రం సమర్పించిన వారిలో ఏపీటీఎఫ్ ఆడిట్ కమిటీ సభ్యుడు ఎస్కే రంగావలి, రూరల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామశేషు కుమార్, శ్రీనివాస్ తదితరులున్నారు. బంద్ను జయప్రదం చేయాలి భీమడోలు: కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 9న దేశ వ్యాప్తంగా తలపెట్టిన భారత్ బంద్ను విజయవంతం చేయాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు కోరారు. పూళ్ల రై్స్ మిల్లు వర్కర్లతో కలిసి గోడ పత్రికలు, కరపత్రాలను మంగళవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పని చేస్తున్న కోట్లాది మంది కార్మికులు కనీస వేతనాలు లేక పీఎఫ్, ఈపీఎఫ్ పింఛన్ ప్రమాద బీమా లాంటివి లేనందున అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలన్నారు. పరిశ్రమల్లో పని చేసే కార్మికులకు భద్రత కల్పించాలని కోరారు. వివిధ శాఖల్లో పని చేసే ఉద్యోగులు, ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వెంకటేశ్వరరావు, బెండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు అధికారులకు రాష్ట్ర స్థాయి అవార్డులు భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు జిల్లా అధికారులు జూలై 9న విజయవాడలో గవర్నర్ చేతుల మీదుగా రెడ్క్రాస్ అవార్డులు అందుకోనున్నారు. అవార్డులు పొందిన వారిలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, గ్రామీణ అభివద్ధి శాఖ అధికారి ఎం.ఎస్.ఎస్.వేణుగోపాల్, మాజీ విద్యా శాఖ అధికారి ఆర్.వెంకటరమణ ఉన్నారు. వీరు 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో రెడ్క్రాస్ కోసం రూ.5 లక్షలకుపైగా నిధులు సమీకరించారన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, రెడ్క్రాస్ అధ్యక్షురాలు చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, రెడ్క్రాస్ చైర్మన్ డా.ఎం.ఎస్.వి.ఎస్.భద్రిరాజు, వైస్ చైర్మన్ వబిలిసెట్టి కనకరాజు తదితరులు అభినందనలు తెలిపారు. -
సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన
ఏలూరు (ఆర్ఆర్పేట): ఎంటీఎస్, హెచ్ఆర్ పాలసీ, సమ్మె అగ్రిమెంట్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏపీ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ చైర్మన్ కే.వినోద్ కుమార్ మాట్లాడుతూ విద్యా శాఖ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు పని భారం తగ్గించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ఈపీఎఫ్ వర్తింప చేసి, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెడికల్ లీవులు, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయాలని తాము అడుగుతున్నామని స్పష్టం చేశారు. -
మరపురాని మహానేత
బుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: జనహృదయ నేత దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి 76వ జయంతిని ఏలూరు జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అభివృద్దికి ఆ మహానేత చేసిన సేవలు స్మరించుకుని నివాళులర్పించారు. వాడవాడలా వైఎస్సార్ విగ్రహాలకు పూల మాలలు వేసి కేక్లు కట్ చేశారు. రక్తదాన, అన్నదాన శిబిరాలతో పాటు చీరలు, దుప్పట్లు, పండ్ల పంపిణీ సేవా కార్యక్రమాలతో అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ పేదల సంక్షేమమే పరమావధిగా ఆయన పాలనను కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, 108 వంటి పథకాల లబ్ధితో పేదల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. రాజన్న స్మృతిలో.. ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ నేతృత్వంలో ఏలూరులో 10 ప్రాంతాల్లో 8 వేల మందికి అన్నదానం నిర్వహింశారు. నగరంలోని అన్ని ప్రధాన సెంటర్లల్లో ఉన్న మహానేత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పండ్లు పంపిణీ చేయడంతో పాటు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ● నూజివీడు నియోజకవర్గంలో వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. నూజివీడులోని చినగాంధీబొమ్మ సెంటరులో వైఎస్సార్ జయంతి వేడుకలు నియోజకవర్గ ఇన్చార్జి మేక వెంకట ప్రతాప అప్పారావు ఆధ్వర్యంలో జరిగాయి. ఆయన కేక్ కట్ చేసి, అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ● దెందులూరులో నియోజకవర్గ ఇన్ఛార్జి కొఠారు అబ్బయ్యచౌదరి క్యాంపు కార్యాలయంలో, పెదపాడు మండలం అప్పనవీడులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ● పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయగూడెంలో వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సీహెచ్సీలో రోగులకు పాలు, పళ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కొయ్యలగూడెం, టీ.నర్సాపురం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో జరిగిన వైఎస్సార్ జయంతి కార్యక్రమాల్లో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ● ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో నియోజకవర్గ ఇన్చార్జి పుప్పాల వాసుబాబు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. నిడమర్రు, భీమడోలు, ఉంగుటూరు మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ● చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, లింగపాలెం, జంగారెడ్డిగూడెం కామవరపుకోటల్లో జరిగిన వైఎస్సార్ జయంతి కార్యక్రమాల్లో నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ● కై కలూరు నియోజకవర్గం కై కలూరులో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కై కలూరు సంత మార్కెట్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కై కలూరు నియోజకవర్గ ఇన్చార్జి దూలం నాగేశ్వరరావు కుమారుడు వినయ్ కేక్ కట్ చేశారు. రాష్ట్ర ముదిరాజుల సంఘ అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. న్యూస్రీల్ ఊరూరా వైఎస్సార్కు ఘన నివాళులు అన్ని నియోజకవర్గాల్లో ఘనంగా జయంతి వేడుకలు ఏలూరులో 10 ప్రాంతాల్లో అన్నదానం దెందులూరులో రక్తదాన శిబిరం -
బాబు మోసాన్ని ఇంటింటికీ వివరించాలి
ఇరగవరం: ప్రజలకు మోసపూరిత హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు ఏ ఒక్క హమీ కూడా నేరవేర్చకుండా ప్రజలను దగా చేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఇరగవరం మండలంలోని కొత్తపాడు గ్రామంలో శ్రీబాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీశ్రీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళలను, యువతను, ఉద్యోగులను మోసం చేశారన్నారు. చంద్రబాబు మోసపూరిత హమీలపై క్యూఆర్ కోడ్తో కూడిన బ్రోచర్ను ఇంటింటికీ అందించాలన్నారు. ప్రజలను మోసం చేయడలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు, మాజీ డీసీఎంస్ డైరెక్టర్ పెన్మెత్స సుబ్బరాజు, పెన్మెత్స రాంభద్ర రాజు, పార్టీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గారావు, సత్తి వెంకట రెడ్డి, గుడిమెట్ల వీర్రెడ్డి, మేట్ల కిరణ్మయి, వీరమల్లు ఫణీంద్ర, కోవ్వూరి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ బొక్కా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళ దారుణ హత్య
కలిదిండి(కై కలూరు): భార్య వివాహేతర సంబంధానికి ఎదురింటి మహిళ సహకరిస్తోందనే అనుమానంతో వివాహితను హత్య చేసిన ఘటన కలిదిండి మండలం పోతుమర్రు శివారు గొల్లగూడెంలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కట్టా రామాంజనేయులు, కృష్ణవేణి భార్యభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. రామాంజనేయులు చెరువులు సాగు చేస్తున్నాడు. ఇంటి ఎదురుగా నంగెడ్డ వరలక్ష్మీదేవీ(37) భర్తతో కలసి జీవిస్తోంది. ఆమె భర్త ఆటో నడపుతుంటాడు. గ్రామానికి చెందిన కట్టా నాగమల్లేశ్వరరావు(48) తరుచుగా రామాంజనేయులు ఇంటి వద్దకు వస్తున్నాడు. ఆ సమయంలో ఎదురింటి వరలక్ష్మీదేవితో మాట్లాడేవాడు. రామాంజనేయులు తన భార్య కృష్ణవేణికి నాగమల్లేశ్వరరావుతో వివాహేతర సంబంధం ఉందని, దీనికి మధ్యవర్తిగా వరలక్ష్మీదేవి వ్యవహరిస్తోందని అనుమానించాడు. మంగళవారం మధ్యాహ్నం వరలక్ష్మీదేవి కూలి పనుల నుంచి ఇంటికి వచ్చింది. ఆమె భర్త కుమార్తె టీసీ నిమిత్తం వెంకటాపురం స్కూల్ వద్దకు వెళ్ళాడు. వరలక్ష్మి ఇంట్లో ఒంటరిగా భోజనం చేస్తోంది. ఇదే అదనుగా వెళ్ళి కత్తితో ఆమె మెడపై నరికి రామాంజనేయులు పరారయ్యాడు. ఆమె రక్తపు మడుగులో కొట్టుకుని మరణించింది. కొన్ని గంటలకు భర్త వచ్చి చూసేసరికి అప్పటికే ఆమె మరణించింది. భర్త ఫిర్యాదుపై ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్, రూరల్ సర్కిల్, టౌన్ సీఐలు వి.రవికుమార్, పి.కృష్ణ, ఎస్సైలు వెంకటేశ్వరరావు, రాంబాబు, వీరభ్రదరావు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. డీఎస్పీ మాట్లాడుతూ భార్యపై అనుమానం.. ఎదురింటి వరలక్ష్మీదేవి అందుకు సహకరిస్తోందనే హత్యకు పాల్పడినట్లు చెప్పారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామన్నారు. మృతదేహాన్ని కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య వివాహేతర సంబంధానికి సహకరిస్తోందని ఘాతుకం కలిదిండి మండలం గొల్లగూడెంలో ఘటన -
ఏలూరు వేగా జ్యూయలర్స్ లక్కీ డ్రా విజేతలు వీరే
ఏలూరు (ఆర్ఆర్పేట): వేగా జ్యుయలర్స్ గత నెలలో తమ 5వ షోరూంను ఏలూరులో ప్రారంభించిన సందర్భంగా ఖాతాదారులకు అద్భుతమైన ఆఫర్లను ప్రవేశ పెట్టిందని, దానిలో భాగంగా మంగళవారం లక్కీడ్రాను ఖాతాదారుల సమక్షంలో నిర్వహించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. లక్కీ డ్రాలో గెలుపొందిన అయిదుగురికి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల విలువైన డైమండ్ నెక్లస్ను యాజమాన్యం అందజేసినట్లు చెప్పారు. లక్కీ డ్రా విజేతలుగా టీ ఆరుణశ్రీ (గన్ బజార్, ఏలూరు), ఏ.శారదా దేవి (హనుమాన్ జంక్షన్), (వీ.రాంబాబు, ఏలూరు), గండికోట నాగలక్ష్మి (ఏలూరు), టీ.శత్రుఘ్నకుమార్ (పవర్ పేట, ఏలూరు) నిలిచారన్నారు. లక్కీ డ్రా సందర్భంగా విజేతలకు వేగా జ్యుయలర్స్ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్, మేనేజింగ్ డైరెక్టర్ వనమా నవీన్ కుమార్, డైరెక్టర్లు వనమా సుధాకర్, చిట్లూరి నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖాతాదారుల కోరిక మేరకు ప్రస్తుతం అందిస్తున్న ఆఫర్లు కొనసాగిస్తున్నామని రూ.లక్ష కొనుగోలుపై ఉచిత బంగారు నాణెం, పాత బంగారం మార్పిడిపై గ్రాముకు రూ.100 అదనంగా చెల్లించటం, డైమండ్ ధర క్యారెట్కు రూ.51,999 మాత్రమే అని తెలిపారు. ఈ ఆఫర్లు ఏలూరు షోరూమ్లో ఈ నెల 25 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు. -
తడి బట్టలు ఆరేస్తూ విద్యుత్ షాక్తో మృతి
కై కలూరు: ఉతికిన తడి బట్టలు దండెంపై ఆరేస్తుండగా ఇనుప రాడ్డుకు తాకి విద్యుదాఘాతానికి గురై వివాహిత మృతి చెందిన ఘటన పెంచికలమర్రు గ్రామంలో సోమవారం జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెంచికలమర్రుకు చెందిన జయమంగళ చిన సుబ్బరావు డ్రైవర్గా పని చేస్తున్నాడు. భార్య గంగ(50) గృహిణి. మంగళవారం ఇంటి దగ్గర ఉతికిన తడి బట్టలు దండెంపై ఆరేస్తుండగా సమీపంలో ఉన్న ఇనుప రాడ్డుకు ఉన్న మెయిన్ వైరు కారణంగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. ఆమెకు భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
సమన్వయంతో కేసుల సత్వర పరిష్కారం
ఏలూరు (టూటౌన్): మధ్యవర్తులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి పిలుపునిచ్చారు. మంగళవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని శిక్షణ పొందిన మధ్యవర్తులతో ఒకరోజు దిశా నిర్దేశ (ఓరియంటేషన్) కార్యక్రమాన్ని ఏలూరు బార్ అసోసియేషన్ హాలు నందు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడుతూ గౌరవ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మధ్యవర్తిత్వము ద్వారా కేసుల పరిష్కారానికి 90 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని, అందుకు శిక్షణ పొందిన మధ్యవర్తులకు నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఒక రోజు దిశా నిర్దేశ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కక్షిదారులకు త్వరితగతిన న్యాయ పరిష్కారం అందించే దిశగా అందరూ కృషి చేయాలని కోరారు. రెండవ అదనపు జిల్లా జడ్జి యు ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ ఇరు పార్టీలను సమన్వయం చేసి మధ్యవర్తిత్వం నిర్వహించడం ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్ ప్రసాద్, ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనె సీతారాం, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రిసోర్స్ పర్సన్ సుదర్శన సుందర్, విజయ కమల, న్యాయవాదులు పాల్గొన్నారు. -
మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించి, ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బొర్రంపాలెం పీహెచ్సీ వైద్యశిబిరం సిబ్బంది ఆలయ ప్రాంగణంలో భక్తులకు వైద్య సేవలు అందించారు. ఏలూరు జిల్లా పంచాయతీ అధికారిణి కె.అనురాధ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ మండపం వద్ద వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. మద్యాహ్నం వరకు దేవస్థానమునకు వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,99,207 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. సుమారు వెయ్యి మంది భక్తులు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాదం స్వీకరించారు. -
పైసలిస్తేనే మీటర్లు..!
బ్యాంక్ కాలనీలో రూ.10 వేలు డిమాండ్ తణుకు బ్యాంక్ కాలనీలో ఒక భవనానికి రెండు మీటర్లు ఇచ్చే క్రమంలో గత నెలలో రూ.10వేలు డిమాండ్ చేసిన అవినీతి భాగోతం ప్రస్తుతం తణుకులో చర్చనీయాంశమైంది. మీటరుకు రూ.5 వేలు చొప్పున రెండు మీటర్లకు రూ. 10 వేలు ఇవ్వాలన్న డిమాండ్ను వినియోగదారుడు గట్టిగానే ఎదుర్కొనడంతో మెల్లగా జారుకున్నారు. పైగా ఈ వసూళ్ల పర్వంలో నేను ఒక్కడినే తినేయనని మాపై అధికారులకు కూడా ఇవ్వాలంటూ ఘరానాగా వసూళ్లకు దిగుతుండడం శోచనీయం. అపార్టుమెంట్లలో ట్రాన్స్ఫార్మర్లు,, మీటర్లు ఇచ్చే క్రమంలో జరుగుతున్న అవినీతిలో వినియోగదారులు, అధికారుల మధ్య వారధిగా ప్రైవేటు వ్యక్తుల జోక్యం కూడా ఉండడంతో విషయం బయటకు పొక్కకుండా లక్షల్లో దోచేస్తున్న వైనాన్ని విద్యుత్ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. సాధారణ ఇంటికి మీటరు బిగించాలంటే రూ.5 వేలు అడుగుతున్నారంటే మేమెక్కడి నుంచి తేవాలంటూ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులివ్వకపోతే ఏదోక కొర్రీలు వేసి మీటర్ల పంపిణీలో జాప్యం చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. తణుకు అర్బన్: తణుకు విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయ సేవలకు అవినీతి మరకలు అంటుతున్నాయి. అత్యవసరంగా అందాల్సిన విద్యుత్ శాఖ సేవలు వినియోగదారులకు కరెంట్ షాకిస్తున్నాయి. సబ్ డివిజన్ పరిధిలోని కిందిస్థాయిలో అవినీతి తిమింగలాల మాదిరిగా ఉన్న కొందరు ఉద్యోగుల తీరుతో వినియోగదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అవినీతికి సంబంధించి జరుగుతున్న పంపకాల్లో తేడాలు ఇటీవల ఆ అవినీతి వ్యవహారాన్ని బయటపెడుతున్నాయి. పైసలిస్తేనే మీటరు అనే స్థాయిలో కొందరు కిందిస్థాయి ఉద్యోగులు వినియోగదారుల నుంచి అందినకాడికి గుంజేసే పరిస్థితి నేడు దాపురించిందని పలువురు వాపోతున్నారు. ఇందుకు ఉదాహరణగానే ఇటీవల డీ 2 సబ్ స్టేషన్లో పంపకాల్లో వాటాలు తెగకపోవడంతో ఒకరిపై ఒకరు వాగ్వాదాలు, ఘర్షణలు, దాడులకు పాల్పడుతున్నట్లుగా సాక్షాత్యూ విద్యుత్ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. మీటరు బిగించాలంటే.. మీటరు బిగించాలంటే పైసలివ్వాల్సిందే అనే రీతిలో కొందరు ఉద్యోగులు ఖరాకండిగా తెగేసి చెబుతుండడం వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఎందుకు డబ్బులివ్వాలని నిలదీస్తుంటే ఇంత డబ్బు పెట్టి ఇళ్లు కట్టుకున్నారు కదా మాకు ఇవ్వడానికి చేతులు రావడంలేదా అని నిలదీసే పరిస్థితి తణుకులో దాపురించిందని వినియోగదారులు వాపోతున్నారు. ఏళ్ల తరబడి కిందిస్థాయిలో పాతుకుపోయిన కొందరు ఉద్యోగులు ఇక్కడే తిష్టవేసి జబర్దస్త్గా అందినకాడికి గుంజేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం ఈ విషయంపై తణుకు సబ్ డివిజన్ డీఈఈ బోడపాటి దివాకర్ను శ్రీసాక్షిశ్రీ వివరణ కోరగా ఇటీవల డీ2 సబ్స్టేషన్లో జరిగిన గొడవపై విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపించానని, మీటర్లపై డబ్బులు వసూలు చేస్తున్న వ్యవహారం తన దృష్టికి రాలేదని చెప్పారు. తాను గతనెల 27న విధుల్లో చేరానని డబ్బులు డిమాండ్ చేసే వ్యవహారంపై వినియోగదారులు ఫిర్యాదు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖలో అవినీతి తిమింగలాలు అపార్టుమెంట్లకు ట్రాన్స్ఫార్మర్లు, మీటర్ల మంజూరులో లక్షల్లో చేతులు మారుతున్న వైనం డబ్బులివ్వకపోతే మీటర్ల జారీలో కొర్రిలు -
అన్నదాత సుఖీభవ అర్హతను పోర్టల్లో చూసుకోవాలి
తణుకు అర్బన్: అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత వివరాలపై పోర్టల్ వెబ్సైట్లో చూసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి జెడ్ వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం తణుకు మండలం దువ్వలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హులైన రైతులకు అనర్హత వస్తే తమ అర్హతకు సంబంధించిన పత్రాలను గ్రామ వ్యవసాయ సహాయకుల వద్దకు వెళ్లి గ్రీవెన్స్ పోర్టల్లో ఈనెల 12వ తేదీలోపు నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని ప్రస్తుతం 44,792 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాలోని ప్రైవేటు, మార్క్ఫెడ్స్లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఎరువల కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దువ్వ గ్రామంలో 3,530 ఎకరాలు వరి సాగు చేస్తున్నారని దీనిలో సుమారు 40 శాతం మిషన్ ద్వారా నాట్లు వేస్తున్నారని ఇది చాలా శుభ పరిణామం అన్నారు. త్వరలో ధాన్యం డబ్బులు రైతులు గత సీజన్కు సంబంధించిన మిగిలిన ధాన్యం డబ్బులు రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో రైతుల ఖాతాలకు జమవుతాయని జిల్లా వ్యవసాయాధికారి జెడ్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. దువ్వ గ్రామానికి చెందిన కొందరు రైతులు గత సీజన్లో ట్రాక్టర్లు, లారీల ద్వారా రైస్ మిల్లులకు రైతుల ధాన్యాన్ని చేరవేశామని దీనికి సంబంధించి ఇప్పటి వరకు మాకు రవాణా సొమ్ము అందలేదని అడగ్గా, ఈ సమస్యను సివిల్ సప్లయి విభాగ దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం యాంత్రీకరణ ద్వారా రైతులు నాట్లు చేస్తున్న తీరును స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తణుకు ఎంపీపీ రుద్రా ధనరాజు, తణుకు వ్యవసాయ సహాయ సంచాలకులు జి నరేంద్ర, డీఆర్సీ వ్యవసాయ అధికారిణి జి. బాల నాగేశ్వరమ్మ, మండల వ్యవసాయ అధికారి కే రాజేంద్రప్రసాద్, దువ్వ పీఏసీఎస్ సెక్రటరీ కిరణ్ వీఏఏలు మల్లికార్జున్, అరుణ్, పుష్ప, ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వరరావు -
కొబ్బరి ధర అదుర్స్
దెందులూరు: గత నాలుగైదేళ్లుగా సరైన ధర లేక నిరాశ చెందిన కొబ్బరి రైతులకు ఈ ఏడాది పంట పండింది. కొబ్బరి బొండాలకు మంచి ధర పలకడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 33 వేల ఎకరాల్లో కొబ్బరి తోటల సాగు జరుగుతుండగా దిగుబడిలో 60 శాతాన్ని హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తారు. మిగిలిన 40 శాతం దిగుబడిన దేవాలయాలకు, తాగడానికి ఉపయోగిస్తున్నారు. ఒక ఎకరానికి రూ.50 వేలు నుంచి రూ.60 వేలు సాగు ఖర్చు అవుతుండగా 9 వేల కొబ్బరికాయలు దిగుబడి లభిస్తుంది. ఈ ఏడాది కొబ్బరికాయ ధర రూ.17 పలకడంతో కొబ్బరి రైతులు లాభాలను చూస్తున్నారు. దీనికితోడు వారు అంతర పంటలు సాగు చేస్తున్నారు. కొబ్బరిలో అంతరపంటలుగా కోకో తోటలు, మిరియాలు, జాజీ సాగు చేసి అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అలాగే ఈ ఏడాది చీడపీడల వ్యాధుల ప్రభావం కూడా లేకపోవడం రైతులకు కలిసివచ్చింది. జిల్లాలో 200 ఎకరాల్లో మిరియాలు, 36 వేల ఎకరాల్లో కోకో, జాజి 15 ఎకరాల్లో అంతర పంటలుగా రైతులు పండిస్తున్నారు. కోకో నట్ ఫారం రైతులకు వరం కొబ్బరి విస్తరణ పథకంలో భాగంగా పెదవేగి మండలం వేగివాడలో కేంద్ర ప్రభుత్వం కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోకోనట్ ఫారం కొబ్బరి రైతులకు వరంగా మారింది. ఈ ఫారంలో కొబ్బరి సాగుకు అనువైన ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్, మల్కన్ గ్రీన్ చౌగాన్ ఆరెంజ్ వంటి రకాల మొక్కలను రైతులకు నిర్ణీత ధరకు విక్రయిస్తున్నారు. మొక్కలను బయట కొనుగోలు చేసి ఈ ఫారంలో బిల్లు చూపించి ఆయా గ్రామాల్లో రైతు సేవ కేంద్రంలో నమోదు చేసుకున్న 50 శాతం రాయితీ ఇస్తున్నారు. యాజమాన్య పద్ధతులు పాటిస్తే మరిన్ని లాభాలు జిల్లాలో కొబ్బరి తోటల సాగు లాభదాయకంగా ఉంది. గత నాలుగైదేళ్లుగా పోలిస్తే ఈ ఏడాది సంతృప్తికరమైన దిగుబడులు వచ్చి మంచి ధర కూడా పలకడంతో లాభాలను ఇచ్చింది. రైతులు ఉద్యానవన శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మరిన్ని లాభాలు సాధించవచ్చు. – మోహనరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి -
మందుల షాపుల్లో విస్తృతంగా తనిఖీలు
జంగారెడ్డిగూడెం: పట్టణంలో మంగళవారం పలు మందుల షాపుల్లో ఔషద నియంత్రణ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి బిల్లులు లేని మందులను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా డ్రగ్ కంట్రోల్ ఏడీ డి,కళ్యాణ చక్రవరి, డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ అబిద్ ఆలీ విలేకరులతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో జ్యోతి మెడికల్స్, వాసవీ మెడికల్స్, లక్ష్మీసూర్య గణేష్ మెడికల్ షాపులను సీజ్ చేసినట్లు చెప్పారు. అలాగే లక్ష్మీ శ్రీనివాస మెడికల్స్ షాపులో తనిఖీ చేయగా, షాపు యజమాని కొయ్యలగూడెం షాపునకు బిల్లులు లేకుండా మందులు సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గత నాలుగు రోజులుగా బుట్టాయగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. బుట్టాయగూడెంకు చెందిన కె.గణేష్ హైదరాబాద్ నుంచి బిల్లులు లేకుండా గర్భ విచ్ఛిత్తి, వయాగ్రా లాంటి మందులు కొనుగోలు చేసి మోటార్సైకిల్పై తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో బుట్టాయగూడెంలో లక్ష్మీదుర్గ, కార్తికేయ మెడికల్ షాపులు, కొయ్యలగూడెంలో మురళీకృష్ణ మెడికల్ షాపును సీజ్ చేశామని, వీరికి నోటీసులు జారీ చేసి లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పారు. త్వరలో మరికొన్ని మండలాల్లో దాడు లు చేస్తామన్నారు. ఇప్పటి వరకు రూ.లక్ష విలువైన మందులను సీజ్ చేశామన్నారు. నూజివీడు, ద్వారకాతిరుమల, అత్తిలిలో మూడు మెడికల్ షాపుల లైసెన్సులు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. దాడుల్లో తణుకు డీఐ మల్లికార్జున్ పాల్గొన్నారు. స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి కామవరపుకోట: స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన తడికలపూడిలో జరిగింది. ఎస్సై చెన్నారావు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు మండలం జాలిపూడి గ్రామానికి చెందిన గండికోట నవీన్ (40) గండిగూడెం గ్రామంలో పదేళ్ల నుంచి వ్యవసాయ పనులు చేసుకుంటూ అత్తవారింటిలో ఉన్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సొంతూరు జాలిపూడి వెళ్లే నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళుతుండగా తడికలపూడి గ్రామంలో శ్రీనివాస వే బ్రిడ్జి దగ్గరకు వచ్చేసరికి ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. దీంతో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, నవీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్లు ఎస్సై చెన్నారావు తెలిపారు. -
మదినిండా పెద్దాయనే..
ఏలూరు (ఆర్ఆర్పేట): ముఖ్యమంత్రిగా, ప్రజానేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన సేవలు ఇప్పటికీ ప్రజల హదయాల్లో పదిలమే. అందుకే ఆయన్ను రాష్ట్రమంతా పెద్దాయనగా పిలుచుకుంటుంది. ఆ మహానీయుడి జయంతి సందర్భంగా నగరానికి చెందిన మైక్రో ఆర్టిస్టులు తమ కళ ద్వారా వైఎస్కు ఘనంగా నివాళులర్పించారు. ఏలూరుకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ ప్రసాద్ వైఎస్ చిత్రపటాన్ని రావి ఆకుపై చిత్రించి తన అభిమానాన్ని చాటుకోగా, మరో మైక్రో ఆర్టిస్ట్ మేతర సురేష్ అగ్గిపుల్లపై వైఎస్ చిత్రాన్ని చిత్రించి కృతజ్ఞత చాటుకున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎందరికో ప్రాణభిక్ష పెట్టడమే కాకుండా, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేద విద్యార్థులు ఉన్నత చదువులకు కృషి చేసిన మహామనిషి వైఎస్సార్ అని మైక్రో ఆర్టిస్టులూ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
తహసీల్దార్కు వీఆర్ఏల సమ్మె నోటీసులు
కుక్కునూరు: ఈనెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటునట్లు వీఆర్ఏలు సోమవారం కుక్కునూరు తహసీల్దార్కు నోటీసు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలనం రూ.10 వేల వేతనంతో జీవితాలను నెట్టుకొస్తున్న వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని, పనిభారం తగ్గించాలని, జీతాలు పెంచాలని, లేబర్కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి యర్నం సాయికిరణ్, వీఆర్ఏ యూనియన్ అధ్యక్షుడు పోచారపు వెంకన్నబాబు, కురాకుల మోహన్రావు, వీఆర్ఏలు ఇరకం సుజాత, వర్క శివ, శేఖర్, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు ఏలూరు(మెట్రో): గోదావరి బేసిన్లో రాబోయే 3 రోజులు భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ, జలవనరుల శాఖల అంచనా మేరకు కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను అప్రమత్తం చేశారు. ప్రస్తుత అంచనా ప్రకారం సర్దార్ కాటన్ బ్యారేజీలో ఈనెల 12వ తేదీ నాటికి 9 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు చేరే అవకాశం ఉందనీ జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ చెబుతున్నారని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాలి రాష్ట్ర, జిల్లా ఆర్థిక పురోగతికి దోహదపడే వ్యవసాయ అనుబంధ రంగాలపై పూర్తి దృష్టి పెట్టాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, సిబ్బందితో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో ఆయిల్పామ్ ప్లాంటేషన్, మైక్రోఇరిగేషన్, అన్నదాత సుఖీభవ, సీసీఆర్సీ కార్డులు, ఈ పంట, ఎరువుల పంపిణీ, మామిడి పంట, పంటల బీమా, వ్యవసాయ ఆధునీకరణ యంత్రాలు తదితర అంశాలపై కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షించి అధికారులకు దిశా, నిర్ధేశం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
యలమంచిలి: లారీ ఢీకొని మోటార్సైక్లిస్టు మృతి చెందాడు. వివరాల ప్రకారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం రామరాజులంక గ్రామానికి చెందిన మేడిచర్ల పూర్ణచంద్ర ఉదయభాస్కర్ (64) తాపీమేసీ్త్రగా జీవనం సాగిస్తున్నాడు. పని నిమిత్తం చించినాడ వచ్చి తిరిగి బైక్పై వెళ్తుండగా చించినాడ వశిష్ట గోదావరి నది వంతెనపై సిమెంట్ లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో భాస్కర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భాస్కర్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గుర్రయ్య వివరించారు. హత్య కేసులో 8 మంది అరెస్ట్ దెందులూరు: మండలంలోని వీరభద్రపురం వద్ద ఇటీవల జరిగిన హత్య కేసులో 8 మందిని పెదవేగి సీఐ రాజశేఖర్ అరెస్ట్ చేసినట్లు దెందులూరు ఎస్సై ఆర్ శివాజీ తెలిపారు. 8 మంది నిందితులను భీమడోలు కోర్టులో హాజరుపరచుగా మేజిస్ట్రేట్ రిమాండ్ విధించినట్లు ఎస్సై చెప్పారు. నాటుసారా కేంద్రాలపై దాడులు కుక్కునూరు: మండలంలోని నాటుసారా తయారీ కేంద్రాలపై సోమవారం జంగారెడ్డిగూడెం ఎకై ్సజ్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సీతారామనగరం గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 600 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకోని ధ్వంసం చేసినట్టు ఎకై ్సజ్ సీఐ కే శ్రీనుబాబు తెలిపారు. అంతేకాక మండలంలోని మారేడుబాక, శ్రీధరవేలేరు గ్రామాల్లో సారా వలన దుష్ఫలితాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొని గిరిజనుడి మృతి వేలేరుపాడు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని గిరిజన యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామవరం గ్రామానికి చెందిన మడకం ప్రకాష్ మొహర్రం (పీర్లపండుగ)ను పురస్కరించుకొని సోమవారం మధ్యాహ్నం కన్నాయిగుట్ట గ్రామానికి తన ద్విచక్రవాహనంపై బయలు దేరాడు. వేలేరుపాడు మండల పరిధిలోని విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టగా తలకు తీవ్ర గాయమైంది. వైద్యం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ప్రకాష్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేలేరుపాడు ఎస్సై నవీన్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సామాన్యులకు వెజిట్రబుల్స్
గణపవరం: కూరగాయల ధరలు సామాన్యులను కంగారు పుట్టిస్తున్నాయి. కిలో ఉల్లి రూ.20 నుంచి రూ.50కు చేరి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఇదే బాటలో మిగిలిన కూరగాయల ధరలు ఉన్నాయి. సోమవారం గణపవరం సంతలో కిలో ధరలు ఇలా ఉన్నాయి. ఉల్లి రూ.40 నుంచి రూ.50, పచ్చిమిర్చి రూ.70, బీర రూ.60, వంకాయలు రూ.60, బెండ రూ.50, క్యారెట్ రూ.50, బీట్రూట్ రూ.50, దోస రూ.30, దొండ రూ.40, కాకర రూ.60, ఆకాకర రూ.80, కీరదోస రూ.80, కంద రూ.50, చిక్కుడు రూ.120, టమాట రూ.60, అల్లం రూ.120, మునగ రూ.10, ఆనబ రూ.30, బీన్స్ రూ.80, క్యాప్సికం రూ60, క్యాబేజీ రూ. 50, కాలిఫ్లవర్ రూ.50 చొప్పున పలికాయి. ఆకుకూరలు ధరలు అదేబాటలో ఉన్నాయి. తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర తదితర రకాలు కట్ట రూ.20 చొప్పున విక్రయించారు. -
అపర భగీరథ.. అభివృద్ధి ప్రదాత
పుణ్యక్షేత్రాల వైపు ఆర్టీసీ అడుగులు ఆర్టీసీ ఆదాయం పెంచుకునే మార్గంలో పుణ్యక్షేత్రాల వైపు అడుగులు వేస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలకు బస్సు సర్వీసులను నడుపుతోంది. 8లో uట్రిపుల్ ఐటీలో కొరవడిన భద్రత నూజివీడు ట్రిపుల్ ఐటీలో భద్రత కొరవడింది. శ్రీకాకుళం ఇంజినీరింగ్ విద్యార్థులు ఉంటున్న హాస్టల్ గదులను అగంతకులు లూటీ చేశారు. 8లో uమంగళవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: మెట్ట ప్రాంత అభివృద్ధికి బీజం వేశారు.. విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యతమిచ్చారు.. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి వ్యవస్థను గాడిలో పెట్టే బృహత్తర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. లక్షలాది ఎకరాలకు సాగునీరిచ్చి మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి అపర భగీరథుడిగా రైతుల హృదయాల్లో నిలిచిపోయారు దివంగతం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. జిల్లాలో గిరిపుత్రులకు పోడుభూములకు పట్టాలిచ్చి సాగుదిశగా మళ్లించారు. ప్రతిష్టాత్మకమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏలూరులో ప్రారంభించి జిల్లాపై ఎనలేని అభిమానాన్ని చూపారు. ఆయన మరణించి ఏళ్లు గడుస్తున్నా జిల్లావాసుల మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయారు. తమ్మిలేరు వరదలను అడ్డుకునేలా.. 2004–2009 వైఎస్సార్ హయాంలో జిల్లాలో అభివృద్ధి పరుగులు తీసింది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం లభించింది. ఏలూరులో ముంపు సమస్యను తీర్చేలా 2005లో రూ.17 కోట్లతో తమ్మిలేరు రిటైనింగ్ వాల్కు శంకుస్థాపన చేయగా 2024లో వైఎస్ జగన్ హయాంలో రూ.90 కోట్లతో పూర్తయ్యింది. ఉమ్మడి పశ్చిమలో నూజివీడులో ట్రిపుల్ఐటీ, తాడేపల్లిగూడెంలో హార్టికల్చ ర్ యూనివర్సిటీ, పోలవరం ప్రాజెక్టు, చింతల పూడి ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపనలు ఇలా కీలక ప్రాజెక్టులకు ఆయన హయాంలోనే అంకురార్పణలు జరిగాయి. జరిగాయి. పోడుభూముల పంపిణీ : గిరిపుత్రులను వ్యవసాయం వైపు మళ్లించాలన్న ఉద్దేశంతో 2,200 మంది గిరిజనులకు 4,500 ఎకరాల పోడుభూములను పంపిణీ చేశారు. ఇప్పటికీ వేలాది మంది గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. మళ్లీ 15 ఏళ్ల తర్వాత వైఎస్ జగన్ హయాంలో 2,700 మంది గిరిజనులకు 3,500 ఎకరాల పోడు భూమిని పంపిణీ చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం డెలివరీ పాయింట్ న్యూస్రీల్రాజన్నా.. నిను మరువలేమన్నా.. మెట్ట సస్యశ్యామలంలో రాజన్న ముద్ర నూజివీడులో ట్రిపుల్ఐటీతో విద్యావిప్లవం తమ్మిలేరు రిటైనింగ్ వాల్కు చర్యలు గిరిపుత్రులకు పోడు భూముల పంపిణీ ఏలూరు సమగ్రాభివృద్ధికి బీజం నేడు వైఎస్సార్ జయంతి చింతలపూడి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చింతలపూడి ఎత్తిపోతల పథకానికి వైఎస్సార్ హయాంలో శంకుస్థాపన చేశారు. పూర్వ కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 15 మెట్ట ప్రాంతా మండలాల్లో 2.10 లక్షల ఎకరాల సాగునీరు అందించే లక్ష్యంతో రూ.1,701 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును ప్రారంభించారు. ఏజెన్సీ ముఖద్వారంగా ఉన్న జంగారెడ్డిగూడెంలో 100 పడకల ఆస్పత్రి నిర్వాణానికి శంకుస్థాపన చేశారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో శాశ్వత రీతిలో నిలిచిపోయే కీలక అభివృద్ధి పనుల్లో రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు. ట్రిపుల్ఐటీతో వెలుగు రేఖలు రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో భాగంగా రాష్ట్రంలో మూడు ట్రిపుల్ఐటీలను ప్రారంభించారు. నూజివీడులో 120 ఎకరాల విస్తీర్ణంలో ఏటా 2 వేల అడ్మిషన్లతో అధునాతన భవనాలను ట్రిపుల్ఐటీని ఏర్పాటుచేశారు. 6 వేల సీట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సును ఇక్కడ పేద పిల్లలు చదువుతున్నారు. సుమారు 5 వేల మందికిపైగా విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉన్నత కొలువులు సాధించారు. అలాగే ఎన్ఐటీ, ఐఐటీ, ఐఐఎన్లో అడ్మిషన్లతో పాటు గ్రూప్–2 మొదలు పంచాయతీరాజ్, ఇరిగేషన్లో ఇంజనీర్లుగా సేవలందిస్తున్నారు. ప్రాణదాత వైఎస్సార్ ముదినేపల్లికి చెందిన ఈ మహిళ పేరు నగడం రాములమ్మ. రోజువారి కూలి. 2007లో ఆమెకు ప్యాంక్రీయాసిస్ వ్యాధి రాగా రూ.లక్షకు పైగా ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెకు ఆరోగ్యశ్రీ అపర సంజీవనిలా ఆదుకుంది. విజయవాడలోని కార్పొరేట్ ఆస్పత్రిలో ఆమెకు ఉచిత చికిత్స అందింది. అప్పటినుంచి తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని, మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి తనకు పునఃజన్మనిచ్చారని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె తెలిపింది. పోడు భూములకు పట్టాలిచ్చారు నాకు 3.70 ఎకరాల పోడు భూమి ఉంది. పట్టాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగాను. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతో అటవీహక్కుల చట్టంలో నా భూమికి పట్టా ఇచ్చారు. నాతోపాటు మా గ్రామంలో మరో 35 కుటుంబాలకు కూడా వైఎస్సార్ హయాంలో పోడుభూములకు పట్టాలిచ్చారు. ఆయన్ను మేం దేవుడిగా కొలుచుకుంటున్నాం. – ఎం.రవిభాస్కర్, పోడు వ్యవసాయ రైతు, లక్ష్మీపురం, బుట్టాయగూడెం మండలం ఇంటి నిర్మాణానికి సాయం వైఎస్ రాజశేఖరరెడ్డి వల్ల నాకు ఎంతో మేలు చేకూరింది. మాది పెరికెగూడెం గ్రా మం. నా పేరు పెరుమాళ్ల స త్యనారాయణ. నా భార్య పద్మ పెరికెగూడెం సర్పంచ్గా ఉంది. మాకు ఇద్దరు కుమారులు. మా ఇంటి నిర్మాణానికి రాజశేఖరరెడ్డి పాలనలో నాకు రూ.1.30 లక్షలు సాయం అందించారు. నాలా మా ఊరిలో చాలా కుటుంబాలు వైఎస్ రాజశేఖరరెడ్డి వల్ల లబ్ధి పొందాయి. – పెరుమాళ్ల సత్యనారాయణ, పెరికెగూడెం, మండవల్లి మండలం -
నిట్లో సీట్లు ఫుల్
తాడేపల్లిగూడెం: జాయింట్ సీట్ అలొకేషన్ అఽథారిటీ (జోసా) పర్యవేక్షణలో జాతీయ విద్యాసంస్థలైన నిట్ తదితర సంస్థల్లో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెండు రౌండ్లు ముగియగా మరో ఆరు రౌండ్లు మిగిలాయి. తొలి విడతలోనే ఏపీ నిట్లో ఉన్న 480 సీట్లకు ఆప్షన్లను విద్యార్థులు ఎంపిక చేసుకున్నారు. మొదటి రౌండ్లోనే సీట్లు భర్తీ అయ్యాయి. నిట్లో ఉన్న ఎనిమిది బ్రాంచిలలో చేరడానికి విద్యార్థులు ఫ్లోట్ ( బ్రాంచి మారడానికి వీలుగా) ఫ్రీజింగ్ ( సీటు నిర్ధారణ చేసుకోవడం)వంటి ఐచ్ఛికాలను ఎంపిక చేసుకున్నారు. హోమ్ స్టేట్ కోటా కింద 240 మంది, అదర్ స్టేట్ కోటా కింద 240 మంది ఆప్షన్లను ఎంపిక చేసుకోగా, మిగిలిన నాలుగు రౌండ్లు ముగిసిన తర్వాత వెరిఫికేషన్ కేంద్రాల్లో జోసా నుంచి తుది జాబితా వచ్చిన తర్వాత సర్టిఫికెట్లను పరిశీలన చేసిన తర్వాత నిట్లో విద్యార్థులు చేరే ప్రక్రియ పూర్తి కానుంది. తర్వాత ఇండక్షన్, తరగతుల ప్రారంభం కార్యక్రమాలు జరగాల్సి ఉంది. ఆగస్టు నెల వరకు విద్యార్థులు ప్రాంగణానికి వచ్చే అవకాశాలు లేవు. ఎంటెక్ సీట్ల భర్తీ ప్రక్రియ షురూ కొంతకాలం విరామం తర్వాత ఏపీ నిట్లో ఎంటెక్ కోర్సు ప్రారంభం కానుంది. ఎంటెక్ కోర్సులో ఇక్కడ 99 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియ ప్రారంభమైంది. వంద సీట్లు పైన ఉంటేనే ఆయా నిట్కు వెరిఫికేషన్ సెంటర్ ఇస్తారు. ఏపీ నిట్లో 99 సీట్లు ఉండటంతో ఇక్కడకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం నిట్ రాయపూర్లో ఏర్పాటుచేశారు. హెఫా నిధుల కోసం నిరీక్షణ ఏపీ నిట్లో రెండోదశ పనుల కోసం రూ.430 కోట్ల ప్రతిపాదనతో కెనరా బ్యాంకు ద్వారా హైర్ ఎడ్యుకేషన్ ఫండింగ్ ఏజన్సీ(హెఫా) నుంచి నిధుల కోసం కేంద్ర ఉన్నత విద్యాశాఖకు వినతులు పంపారు. ఏపీ నిట్కు బోర్డు ఆఫ్ గవర్నెన్సు(బీఓజీ) చైర్మన్ లేకపోవడం, పాత చైర్పర్సన్ పదవీకాలం ముగిసి ఏడాది గడుస్తున్నా , ఇంకా ఆ స్థానంలో చైర్మన్ ఎంపిక జరుగలేదు. నిధుల్లో కదలిక లేకపోవడానికి ఇది ఒక కారణంగా తెలుస్తోంది. ఆరో రౌండ్ తర్వాత చేరికలు ఎంటెక్ తరగతులు త్వరలో ప్రారంభం హెఫా నిధుల కోసం నిరీక్షణ -
వైఎస్ పాలనలో ఏజెన్సీలో అభివృద్ధి పరుగులు
బుట్టాయగూడెం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధి పరుగులు పెట్టిందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. సోమవారం సాయంత్రం దుద్దుకూరులో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్సార్తో ఆయనకున్న అనుబంధం, వైఎస్సార్ చేసిన అభివృద్ధి పనులను వివరించారు. గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమై డ్రాప్ఔట్స్గా మిగులుతున్న సమయంలో జూనియర్, డిగ్రీ, ఐటీఐ, పాల్టెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసి ఉన్నత విద్యల్లో ముందుకు సాగే విధంగా వైఎస్ కృషి చేశారన్నారు. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో 70 వేల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించిన ఘనత వైఎస్సార్దే అని అన్నారు. 400 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ల నిర్మాణానికి కృషి చేసి రహదారుల సమస్య లేకుండా చేశారన్నారు. అదేవిధంగా అటవీ హక్కుల చట్టంలో సుమారు 10 వేల ఎకరాలకు పైగా భూములను పేదలకు వైఎస్సార్ పంచడం జరిగిందని గుర్తుచేశారు. రూ. 26 కోట్ల వ్యయంతో గిరిజనుల బీడు భూములకు సాగు నీరు అందించే విధంగా పోగొండ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రతి ఏటా కొండ కాలువల ప్రవాహానికి అనేక మంది గిరిజనులు మృతి చెందుతుంటే వాటిని నివారించేందుకు రూ.26 కోట్లతో నాలుగు ప్రదేశాల్లో హైలెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి కృషి చేశారన్నారు. వైఎస్ చలువతోనే పోలవరం ప్రాజెక్టు పోలవరం మండలంలో ప్రతి ఏటా గోదావరి వరదనీరు ప్రవాహానికి 50 వేల ఎకరాల పంట భూములు ముంపునకు గురై రైతులు అనేక ఇబ్బందులు పడేవారన్నారు. దీంతో చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వైఎస్ చలువతోనే ప్రారంభమైందని చెప్పారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సుమారు రూ.70 కోట్లతో కొవ్వాడ ఔట్పాల్స్ క్లూయిస్ పనులకు శ్రీకారం చుట్టారని చెప్పారు. అలాగే గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని 5 ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు జంగారెడ్డిగూడెంలో 100 పడకల నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు. ఇలా వైఎస్సార్ పాలనలో తాము ఏ సమస్య అయినా దరఖాస్తు రూపంలో అందజేస్తే వెనువెంటనే నిధులు మంజూరు చేసేవారని చెప్పారు. నాడు వైఎస్సార్ చేసిన అభివృద్ధి పనులను చూసి రాజశేఖరరెడ్డిని దేవుడిగా కొలుచుకుంటున్నారని చెప్పారు. మళ్లీ అదే రీతిలో తండ్రి బాటలో పాలన చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజన ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని చెప్పారు. -
ట్రిపుల్ ఐటీలో కొరవడిన భద్రత
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో భద్రత కొరవడింది. ట్రిపుల్ ఐటీలోని శ్రీకాకుళం ఇంజినీరింగ్ విద్యార్థులు ఉంటున్న ఐ1 హాస్టల్ భవనంలోని మూడో అంతస్తులో ఉన్న హాస్టల్ గదులను ఆగంతకులు లూటీ చేశారు. ఇంజనీరింగ్ తృతీయ సంవత్సర విద్యార్థులు వేసవి సెలవులకు వెళ్లి జూలై ఐదో తేదీ నుంచి తిరిగి రావడంతో హాస్టల్ గదుల్లో చోరీ జరిగిన విషయం వెలుగు చూసింది. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి చెందిన ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం, మూడో సంవత్సరం విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో ఐ1 హాస్టల్ వసతి గృహంలోని రెండో ఫ్లోర్లో నాలుగో సంవత్సరం విద్యార్థులు, మూడో అంతస్తులో తృతీయ సంవత్సర విద్యార్థులు ఉంటున్నారు. మే 15 నుంచి వేసవి సెలవులు ఇవ్వడంతో ఈ 4 విద్యార్థులు తమ సామగ్రినంతా తీసుకొని హాస్టల్ గదులను ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ3 విద్యార్థులు మాత్రం తమ దుస్తులను, ట్రాలీ బ్యాగ్లను, పుస్తకాలను, షూలను ఇతర సామగ్రిని తమ గదుల్లోనే ఉంచి తాళాలు వేసుకొని ఇళ్లకు వెళ్లారు. అయితే ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ4 విద్యార్థులకు తరగతులు శ్రీకాకుళంలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోనే నిర్వహిస్తున్నామని, నూజివీడులో ఈ3 పూర్తి చేసుకున్న విద్యార్థులందరూ శ్రీకాకళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్కు వచ్చేయాలని ట్రిపుల్ ఐటీ అధికారులు ఫోన్లకు మెసేజ్లు పెట్టారు. దీంతో వారంతా తమ సామగ్రిని తీసుకెళ్లేందుకు నూజివీడు ట్రిపుల్ ఐటీకి వచ్చి తమ రూమ్లకు వెళ్లగా తాళాలు పగులగొట్టి, లోపలి దుస్తులను, పుస్తకాలను చిందరవందరగా పడేసి ఉండటం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. మూడో అంతస్తులో దాదాపు 100 గదులు ఉండగా 30 గదుల వరకు తాళాలు పగులగొట్టి, గడులు పగుల గొట్టి విద్యార్థుల పుస్తకాలను, దుస్తులను చిందరవందరగా పడేయడంతో పాటు సూట్కేసులు, ట్రాలీ సూట్కేసులు, కొందరి ల్యాప్ట్యాప్లు, విద్యార్థుల బూట్లు చోరీ చేశారు. ఇంత పెద్ద ఎత్తున లూటీ జరిగినా సమాచారం బయటకు పొక్కకుండా ట్రిపుల్ ఐటీ అధికారులు అది విషయమే కానట్లుగా వ్యవహరిస్తున్నారు. తమ గదుల్లోని వస్తువులు చోరికి గురికావడంపై విద్యార్థులు మెయిల్ ద్వారా యూనివర్సిటీ ఛాన్సలర్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. హాస్టల్ గదులకు కూడా భద్రత లేకపోతే ఎలాగని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. సెక్యూరిటీ వ్యవస్థ నిద్రపోతోందా..! ట్రిపుల్ ఐటీలో 24 గంటలూ సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. షిఫ్టుకు 55 మంది చొప్పున మూడు షిఫ్టులు విధుల్లో ఉంటారు. అలాగే హాస్టల్ భవనంలో నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన కేర్ టేకర్, శ్రీకాకుళంకు చెందిన కేర్ టేకర్లు విధుల్లో ఉంటారు. హాస్టల్ భవనం వద్ద సైతం 24 గంటలూ సెక్యూరిటీ సిబ్బంది కాపలా కాస్తూ ఉంటారు. అంతేగాకుండా ట్రిపుల్ ఐటీలో పోలీస్ అవుట్పోస్టు సైతం ఉంది. అయినప్పటికీ విద్యార్థుల రూమ్ల తాళాలు పగులగొట్టి, గడులను విరగ్గొట్టి చోరీలకు పాల్పడటం సంచలనంగా మారింది. గతంలో రెండు సార్లు ఫ్యాకల్టీ గృహాల్లో సైతం దొంగతనాలు జరిగాయి. వాటికి సంబంధించి దర్యాప్తు ఇంత వరకు అతీగతీ లేదు. ఇప్పుడు తాజాగా విద్యార్థుల హాస్టల్ గదుల్లో జరగడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇప్పటికై నా చోరీకి పాల్పడిన వారు ఎవరో నిగ్గు తేల్చాల్సిన బాధ్యత యాజమాన్యంపైన, పోలీసులపైనా ఉంది. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ విద్యార్థుల హాస్టల్ గదుల లూటీ పలు రూమ్ల తాళాలు పగులగొట్టి, గడులు విరగ్గొట్టి చోరీ విద్యార్థులు వేసవి సెలవులకు వెళ్లి వచ్చాక వెలుగు చూసిన వైనం -
ధీమా ఇవ్వని బీమా
ఏలూరు (మెట్రో): అన్నదాతకు కష్టాలు వెంటాడుతున్నాయి. గతంలో సాగు అంటే పండుగ అనేరీతిలో ప్రతి సీజన్ను ఉత్సాహంగా రైతులు మొదలుపెట్టేవారు. అయితే ప్రస్తుత కూటమి పాలనలో అడుగడుగునా ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమాతో రైతులకు అండగా నిలవగా.. ప్రస్తుత కూటమి సర్కారు ఉచిత పంటల బీమాకు మంగళం పాడింది. పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇప్పటికీ అమలు చేయలేదు. దీంతో సీజన్ ప్రారంభంలో పెట్టుబడులకు రైతులు అప్పులు చేయాల్సి వస్తోంది. జిల్లాలో 99,515 హెక్టార్లలో రైతులు పలు పంటలు సాగుచేస్తున్నారు. రైతులే చెల్లించాలని.. ప్రకృతి విపత్తుల సమయంలో రైతులను ఆదుకునేలా గత జగన్ సర్కారు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లించేది. దీంతో రైతులకు భారం ఉండేది కాదు. అలాగే విపత్తుల సమయంలో నష్టపరిహారం సులభంగా అందేది. అయితే ప్రస్తుతం బీమా ప్రీమియం రైతులే చెల్లించాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రూ.25 కోట్ల మేర భారం జిల్లాలో వరి, మినుములు, పత్తి, నిమ్మ పంటలకు ప్రీమియం చెల్లించేందుకు చివరి తేదీలు సైతం ప్రభుత్వం ఖరారు చేసింది. జిల్లాలో ఎకరా చొప్పున వరికి రూ.840, మినుముకు రూ.300, పత్తికి రూ.1,900, నిమ్మకు రు.2,500 చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. వరికి ఆగష్టు 15, మినుముకు జూలై 31, పత్తి, నిమ్మకు జూలై 15న చివరి తేదీగా గడువు విధించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకులో రైతులకు ఇచ్చే పంట రుణాల్లోనే ప్రీమియం సొమ్ము మినహాయించుకునేలా ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో సుమారు 99 వేల హెక్టార్లలో పలు రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. సుమారు 4.50 లక్షల మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వీరిపై సుమారు రూ.25 కోట్ల మేరకు బీమా ప్రీమియం భారం పడనుంది. ఉచిత పంటల బీమాకు తిలోదకాలు ప్రీమియం చెల్లించేందుకు రైతుల అవస్థలు ఇప్పటికీ అందని ‘అన్నదాత సుఖీభవ’ జిల్లాలో 99 వేల హెక్టార్లలో సాగు -
కౌన్సిల్లో ప్రొటోకాల్ పాటించేలా చూడాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల్ల పట్ల ప్రొటోకాల్ పాటించడం లేదని, కౌన్సిల్లో మాట్లాడే అవకాశం కల్పించడం లేదని, నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం వైఎస్సార్సీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) ఆధ్వర్యంలో కార్పొరేటర్లు కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం సమర్పించారు. జేపీ, కార్పొరేటర్లు మాట్లాడుతూ ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. ప్రజాసమస్యలు చర్చించకుండా అడ్డుకుంటున్నారని, చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాల్లో కో–ఆప్షన్ సభ్యులు మాట్లాడేందుకు అనుమతి లేకపోయినా సభా మర్యాద పాటించకుండా ప్రతిపక్ష సభ్యులను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి స్థానిక కార్పొరేటర్లకు కనీస సమాచారం ఇవ్వడం లేదని వీటిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులు గుడిదేశీ శ్రీనివాసరావు, నెరుసు చిరంజీవులు, గంట మోహన్ రావు, మున్నుల జాన్ గుర్నాథ్, నూకపెయ్యి సుధీర్ బాబు, తుమరాడ స్రవంతి, జి.విజయనిర్మల, కేదారేశ్వరి డింపుల్ తదితరులు ఉన్నారు. రెయిలింగ్కు అనుమతివ్వాలి ఏలూరులోని ఫైర్స్టేషన్ సెంటర్లో 2010లో ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద గ్రానైట్, రెయిలింగ్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని పార్టీ ఇన్చార్జి జయప్రకాష్ (జేపీ) ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. 2023లో కార్పొరేషన్ ఆధ్వర్యంలో విగ్రహం చుట్టూ అభివృద్ధి పనులు, రెయిలింగ్ పనులు మొదలుపెట్టారని, అయితే అనివార్య కారణాల వలన పనులు నిలిపివేశారన్నారు. దీంతో వైఎస్సార్ అభిమానులు విగ్రహం వద్ద కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఇబ్బంది పడుతున్నారన్నారు. విగ్రహం వద్ద గ్రానైట్, రెయిలింగ్ పనులు చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. వైఎస్సార్సీపీ ఇన్చార్జి జేపీ వినతి -
కూటమి వంచనపై నిలదీద్దాం
నూజివీడు : ఎన్నికల ముందు సూపర్సిక్స్ అని చె ప్పి అధికారం చేపట్టాక సూపర్సిక్స్ను పక్కన పెట్టి ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ అనే అంశంపై నియోజకవర్గస్థాయి విస్తృత స్థాయి సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా కల్లబొల్లి మాటలు చెబుతోందన్నారు. ఏడాదిలో రూ.1.50 లక్షల కో ట్లు అప్పుచేసిన చంద్రబాబు ఈ సొమ్మును ఎక్కడ ఖర్చు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, రూ.1,500 ఆడబిడ్డ నిధి ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. రైతులకు అన్నదాత సుఖీభవ సాయం, మహిళలకు ఉచిత బస్సు ఎప్పుడని నిలదీశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటంతో విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం అమలు చేసిందని, లేకపోతే అది కూడా ఉండేది కాదన్నారు. రూ.10 వేలు జీతం అంటూ వలంటీర్లను నమ్మించి వెన్నుపోటు పొడిచారన్నారు. రేషన్ వాహనాలు తొలగించి మహిళలకు కష్టాలు తెచ్చిపెట్టారన్నారు. నూజివీడు ప్రజల సంక్షేమం కోసమే.. నూజివీడు ఏరియా ఆసుపత్రిని రూ.21 కోట్లతో అభివృద్ధి చేస్తే దానిని ఉపయోగించడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని మాజీ ప్రతాప్ అప్పారావు అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే జిల్లా ఆసుపత్రిగా మారుస్తామన్నారు. నూజివీడులో కేంద్రీయ విద్యాలయం కోసం మూడేళ్లు కష్టపడి మంజూరు చేయిస్తూ కూటమి ప్రభుత్వ పాలకులు ఇప్పటివరకూ దానిని ప్రారంభించలేకపోయారని మండిపడ్డారు. తాను గెలిచినా, ఓడినా నూజివీడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సంక్షేమం కోసమే పనిచేస్తానన్నారు. మామిడి ధర పతనమై రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, ఎన్నడూ లేనివిధంగా కలెక్టర్ రకం టన్ను రూ.3 వేలకు, బంగినపల్లి రకం రూ.9 వేలకు పడిపోయిందన్నారు. కోత ఖర్చులు కూడా రావడం లేదని కలెక్టర్ రకం కాయలను కోయకుండా రైతులు తోటల్లోనే వదిలేశారన్నారు. ప్రభుత్వం టన్నుకు రూ.12 వేలు ఇస్తుందని చెబుతుందే తప్ప ఇప్పటివరకూ ఒక్క రైతుకూ ఇవ్వలేదని ప్రతాప్ అప్పారావు అన్నారు. చంద్రబాబు పాలనంతా మోసమే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనంతా మోసపూరితమేనని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తా, నిలదీస్తా అని చెప్పిన పవన్కల్యాణ్ సినిమాలు తీసుకుంటున్నారే గాని రాష్ట్రంలోని ప్రజల బాధలు పట్టడం లేదన్నారు. 50 ఏళ్లకే ఎస్సీ,ఎస్టీ, బీసీలకు పింఛన్లు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలని కోరారు. ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాఽథ్ మాట్లాడుతూ హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. హామీలను అమలు చేయాలంటూ బాధ్యతాయుత ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలను వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, జెడ్పీటీసీలు వరికూటి ప్రతాప్, పిన్నిబోయిన వీరబాబు, ఎంపీపీలు కొండా దుర్గాభవాని, గోళ్ల అనూష, వైఎస్సార్సీపీ పట్టణ, మండలాల అధ్యక్షులు శీలం రాము, పోలిమెట్ల శివ, బెజవాడ రాంబాబు, మూల్పూరి నాగవల్లేశ్వరరావు, పుచ్చకాయల సుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు దేశిరెడ్డి రాఘవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు -
పిచ్చికుక్క స్వైరవిహారం
బుట్టాయగూడెం : జీలుగుమిల్లి మండలం తా టాకులగూడెంలో పిచ్చికుక్క 9 మందిపై దాడి చేసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారంఆదివారం వేకువజాము నుంచి ఉదయం 10 గంటల వరకు ఓ పిచ్చికుక్క గ్రామంలో స్వైరవిహారం చేస్తూ 9 మందిని గాయపర్చింది. దీంతో గ్రామస్తులు దానిని హతమార్చారు. ఎస్.భద్రమ్మ, ఎస్.నాగేశ్వరమ్మ, పి.కవలమ్మ, కె.రాణి, ఎం.దావీదుతోపాటు మరో నలు గురికి తీవ్ర గాయాలు కాగా వారిని జీలుగుమిల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు సకాలంలో వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితులు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని బాధితులను పరామర్శించడంతోపాటు వైద్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూటీ దగ్ధం ఏలూరు టౌన్: జిల్లాలోని 16వ నంబర్ జా తీయ రహదారిపై వెళుతున్న స్కూటీ దగ్ధమైంది. పెదవేగి మండలం అమ్మపాలేనికి చెందిన మెడంకి ఏసుపాదం కుమారుడు, స్నేహితుడు కలిసి ఏలూరు వెళుతుండగా చుట్టుగుంట బ్రిడ్జి సమీపంలో స్కూటీ నుంచి పొగలు రావడంతో వారు అక్కడే నిలిపివేశారు. అనంతరం మంట లు చెలరేగి స్కూటీ పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. మంటలకు గల కారణాలపై స్పష్టత లేదు. స్కూటీని 2021లో కొనుగోలు చేసినట్టు తెలిసింది. పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎస్సై కుటుంబానికి చేయూత నరసాపురం : తూర్పుగోదావరి జిల్లా ఆలమూ రు ఎస్సైగా పనిచేస్తూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్సై ఎం.అశోక్ కుటుంబానికి సహచర పోలీసు అధికారులు అండగా నిలిచారు. ఉమ్మడి రాష్ట్రంలోని 2009 బ్యాచ్కు చెందిన 1,100 మంది సీఐలు, ఎస్సైలు 2009 బ్యాచ్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా రూ.26 లక్షలు సేకరించారు. సోమవారం నరసాపురంలోని అశోక్ ఇంటి వద్ద జరిగిన సంతాప కార్యక్రమంలో ఈ మొత్తాన్ని ఆయన కుటుంబానికి అందించారు. తర్వాత ఆలమూరు వెళ్లి ఎస్సైతో పాటు మృతి చెందిన కానిస్టేబుల్ బ్లెన్సన్ జీవన్ కుటుంబానికి రూ.5 లక్షలు అందించారు. నరసాపురం టౌన్ సీఐ బి.యాదగిరి మాట్లాడుతూ 2009 బ్యాచ్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఎలాంటి ఆపద వచ్చినా స్పందిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ రూ.2 కోట్లకుపైగా ఆర్థిక సాయం అందించినట్టు చెప్పారు. ఉరకలేస్తున్న గోదావరి పెనుగొండ/నరసాపురం : వశిష్టా గోదావరి వరద నీటితో ఉరకలేస్తోంది. రెండు రోజు లుగా గోదావరిలోకి ఎర్రనీరు వచ్చి చేరుతోంది. పెనుగొండ మండలం దొంగరావిపాలెం, చినమల్లం, పెదమల్లం, కోడేరు, భీమలాపురం వద్ద గోదావరి నిండుగా ప్రవహిస్తుంది. సిద్ధాంతంలో మధ్య లంకను నీరు తాకింది. ఆచంట మండలంలో అయోధ్యలంక, పెదమల్లంలంక, పల్లిపాలెం, పుచ్చల్లంక వద్ద పల్లపు ప్రాంతాలకు నెమ్మదిగా నీరు చేరుతోంది. రైతులు రాకపోకలు సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. నరసాపురంలో.. నరసాపురం: నరసాపురంలోని వశిష్ట గోదావరిలో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. వలంధర్ రేవు వద్ద పరవళ్లు తొక్కుతూ గోదావరిలో నీటి ప్రవాహం కనిపిస్తోంది. గోదావరి క్రమేపీ ఎర్ర రంగులోకి మారుతోంది. -
ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు
దెందులూరు: గోపన్నపాలెం గ్రామంలో ఆదివారం ఆటో బోల్తా పడిన సంఘటనలో పెదపాడు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎనిమిది మంది కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన డి.సాయికుమారి, సీహెచ్ నాగబాబులు ఏలూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కూలి పని కోసం కొత్తూరు నుంచి గోపన్నపాలెం గ్రామానికి వచ్చి పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కూలీల ఆటో బోల్తా పడింది. -
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సదూర ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి వారి పుట్టలో పాలు పోశారు. పాలపొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామివారి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. స్వామిని దర్శించుకునే భక్తులు అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొంటే మేలు జరుగుతుందనే విశ్వాసం ఉంది. గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కాపవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారు జాము వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆలయ కమిటీ వారు ఆలయంలో సోలార్ విద్యుత్ సదుపాయం, కల్పిచడం, ఫ్యాన్లు ఏర్పాటు చేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెలలో షార్ట్ ఫిలిం పోటీలు పాలకొల్లు సెంట్రల్: తెలుగు సాహిత్యం, సంస్కృతిని ప్రోత్సహిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని జాతీయ తెలుగు సారస్వత పరిషత్ అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం స్థానిక రోటరీ క్లబ్ భవనంలో మాట్లాడుతూ.. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిషత్కు మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య గౌరవ సలహాదారుగా వ్యవహరిస్తున్నారన్నారు. సంఘ పరిషత్ సభ్యులుగా కెఎస్పిఎన్ వర్మ, కె.రాంప్రసాద్, చేగొండి సత్యనారాయణమూర్తి, రాజా వన్నెంరెడ్డి, గుడాల హరిబాబు, బోణం వెంకట నర్సయ్య, విన్నకోట వెంకటరమణ, యిమ్మిడి రాజేష్ను నియమించినట్లు తెలిపారు. పోటీలు ఆగస్టు నెలాఖరులో నిర్వహిస్తామని చెప్పారు. ఆగస్టు 10 లోపు అప్లికేషన్స్ పంపించాలన్నారు. ఫిలిం 15 నిమిషాలు మించి ఉండరాదని అన్నారు. పోటీలకు దర్శకులు వీర శంకర్, రేలంగి నరసింహరావు, రాజా వన్నెంరెడ్డి, ఏఎన్ ఆదిత్య, రచయిత రాజేంద్రకుమార్లు జడ్జిలుగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. -
తాగిస్తాం.. తూలిస్తాం
ఏలూరు (టూటౌన్): కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం మద్యాంధ్రప్రదేశ్గా మారింది. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగడంతో పాటు వీధివీధినా బెల్టుషాపులు దర్శనమిస్తున్నాయి. ఏలూరులో మద్యం మత్తులో యువత జోగుతోంది. మందుబాబులు ఫూటుగా మద్యం సేవించి ఎక్కడపడి తే అక్కడ దొర్లుతున్నారు. నగరంలో పదుల సంఖ్య లో మద్యం షాపులు వీటికి తోడు అనధికారంగా నిర్వహించే బెల్టు షాపుల్లో ఎనీ టైమ్ మందు అందుబాటులో ఉంటోంది. ఫుల్గా మద్యం తాగిన మందుబాబులు ఎటు వెళ్లాలో తెలియక రోడ్లపై, షాపుల మెట్ల వద్ద, ఖాళీ ప్రదేశాల్లో, పార్కుల్లో మద్యం మత్తులో పడి దొర్లుతున్నారు. గత ప్రభుత్వంలో సమయం మేరకే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించింది. దీంతో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే విక్రయాలు జరిపేవారు. అలాగే బెల్టుషాపులకు పక్కాగా అడ్డుకట్ట వేశారు. ప్రభుత్వ షాపుల్లో మాత్రమే విక్రయా లు జరపడం, అక్కడ సిట్టింగులు లేకపోవడం, బెల్టుషాపులు ఉండకపోవడంతో యథేచ్ఛగా అమ్మకాలు జరిగేవి కాదు. దీంతో మందుబాబులు ఫుల్గా మద్యం తాగి రోడ్లపై దొర్లే దృశ్యాలు కనిపించేవి కావు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. సందు సందునా.. కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాల నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది. ఈ షాపులకు అనుబంధంగా అనధికారికంగా బెల్టుషాపులు వెలిశా యి. బెల్టుషాపులను అడ్డుకుంటామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. మద్యం, బెల్టుషాపులు అధికార పార్టీ నాయకులు, అనుచరులవి కావడంతో అధికారులు అటుగా కన్నె త్తి చూడటం లేదు. నామమాత్రపు దాడులతో సరి పెడుతున్నారు. ఏలూరులో గుడి, బడి తేడా లేకుండా బెల్టుషా పులు నిర్వహిస్తుండటంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. విచ్చలవిడిగా అమ్మకాలు ఏలూరు నగరం పరిధిలో మద్యం షాపుల ఏర్పాటు, బెల్టు షాపుల నిర్వహణకు వ్యతిరేకంగా ఎన్ని ఆందోళనలు చేపట్టినా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులకు సైతం వీటికి వ్యతిరేకంగా వినతి పత్రాలు అందజేశాం. ఓపక్క మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోవడానికి యథేచ్చగా మద్యం అమ్మకాలు కారణంగా కనిపిస్తోంది. తక్షణమే విచ్చలవిడి మద్యం అమ్మకాలను నిలుపుదల చేయాలి. – ఎ.రాణి, ఐద్వా జిల్లా కార్యదర్శి, ఏలూరు●ఇంటింటా మద్యం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటా విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు అందేవి. ఇందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వ పాలనలో ఇంటింటా మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది. ప్రతి టీడీపీ నాయకుడు, కార్యకర్త ఇళ్లల్లో మద్యం ఫుల్గా లభిస్తోందంటే అతిశయోక్తి లేదు. ఇంటింటా రేషన్ సరుకులను అందించే వాహనాల్లో ఇప్పుడు మద్యం సరఫరా చేయడం సిగ్గుచేటు. – జుజ్జువరపు విజయనిర్మల, వైఎస్సార్సీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు, ఏలూరుమద్యం ఏరులు.. బెల్ట్ బారులు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు వేళాపాళా లేకుండా విక్రయాలు ఏలూరులో వీధివీధినా బెల్టు షాపులు మద్యం మత్తులో జోగుతున్న యువత కూటమి ప్రభుత్వంలో ‘ఎనీ టైమ్ మందు’ యువత పెడదోవ యథేచ్ఛగా విక్రయాలతో నగరంలోని యువత మద్యానికి బానిసవుతున్నారనే ఆందోళన వ్యక్త మవుతోంది. దీంతో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని మహిళా సంఘాలు అంటున్నాయి. గతంలో రోడ్డుకు 200 మీటర్ల దూరంలో మద్యం షాపును నిర్వహించే వారు. కూటమి ప్రభుత్వంలో ఈ నిబంధన లేకపోవడంతో రోడ్లను ఆనుకుని దుకాణాలు ఏర్పాటుచేశారు. దీంతో అటుగా వెళుతున్న వాహనచోదకులు, మహిళలు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. -
ప్రాణాంతకం.. గొంతువాపు
భీమవరం: పాడి రైతులు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ పాడిని అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఆదాయాన్ని పొందేందుకు అవకాశముంటుంది. వర్షాకాలంలో పశువులకు గొంతువాపు, గుది పెట్టు వ్యాధులు సోకే ప్రమాదమున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలో 1,78,137 గేదేలు, 45,539 ఆవులున్నాయి. పశువులకు సోకే వ్యాధుల పట్ల రైతులకు పెద్దగా అవగాహన లేకపోవడంతో వ్యాధి తీవ్రత ఎక్కువై పశు మరణాలు సంభవించడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యాధులపై రైతులు సంపూర్ణ అవగాహన కలిగి ఉంటే ఇంటి వద్దనే నిరోధించేందుకు వీలుంటుందని పశు వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలంలో గేదెలకు సోకే ప్రాణాంతక వ్యాధుల్లో గొంతువాపు ఒకటి. ఈ వ్యాధి పందుల్లో తరచుగా, గొర్రెలు, మేకల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ వ్యాధి ఏడాది పొడవునా ఎప్పుడైనా వ్యాపించే అవకాశం ఉంది. ఎక్కువగా వర్షాకాలంలో దీనిని గుర్తించవచ్చు. నదీ పరివాహక ప్రాంతాలు, డెల్టాలు, వరిసాగు అధికంగా ఉన్న ప్రదేశాల్లో ఉండే గేదెలకు ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. ఇది ఒక రకమైన సూక్ష్మజీవి ద్వారా పశువులకు వ్యాపిస్తుంది. వ్యాధి లక్షణాలు ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి వ్యాధి సోకిన 8 నుంచి 24 గంటల వ్యవధిలో పశువు చనిపోయే ప్రమాదముంది. వ్యాధి ప్రారంభ దశలో పశువు నీరసంగా ఉంటుంది. తరువాత నడవలేక పోవడం, అధిక జ్వరం, నోటి నుంచి సొంగ కారడం, ముక్కు నుంచి చిక్కటి ద్రవం స్రవించడం, కళ్లు ఎరబ్రడి నీరు కారుతూ ఉండటం లక్షణాలు. ముందుగా గొంతు భాగంలో వాపు ఉండి తరువాత వాపు చెంపలు, మెడ, ముందుకాళ్ల మధ్య భాగం, పొట్ట కింద భాగం వరకూ విస్తరిస్తుంది. పశువు ఆయాసపడుతూ శ్వాస పీలుస్తుంది. సాధారణంగా ఈ దశలో పశువు నాలుక బయటకు తీస్తూ శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ దశ తరువాత కొన్ని గంటల వ్యవధిలో పశువు చనిపోతుంది. వ్యాధి వ్యాప్తి ఇలా.. వ్యాధి సోకిన పశువుల నుంచి కారే సొంగ, ముక్కు నుంచి స్రవించే ద్రవాల ద్వారా వ్యాధి బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. తరచుగా వ్యాధి సోకే ప్రాంతాల్లో నివసించే ఐదు శాతం పశువులు ఈ వ్యాధికి వాహకాలుగా ఉంటాయి. అలసిపోయిన, ఒత్తిడికి గురైన పశువులకు ఈ వ్యాధి త్వరగా వ్యాపిస్తుంది. సాధారణంగా కలుషితమైన మేత, గాలి ద్వారా వ్యాధి కారకం పశువుల శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరంలోకి ప్రవేశించిన క్రిమి త్వరగా విభజన చెంది ఎండోక్సిన్స్ అనే విష పదార్థాలను విడుదల చేస్తుంది. ఇది రక్తంలోకి ప్రవేశించిన అనంతరం వ్యాధి లక్షణాలు బయటపడతాయి. పశువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. వర్షాకాలానికి ముందు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన పశువులను మంద నుంచి వేరు చేయాలి. పశువుల పాకలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు విధిగా వేయించాలి. పశువైద్యుడి సలహా మేరకు సల్ఫాన్మైడ్స్, టెట్రాసైక్లినన్స్, పెన్సులిన్, క్లోరామ్ ఫినికాల్ వంటి యాంటి బయోటిక్ మందులు ముందుగా వాడితే ఫలితం ఉంటుంది. వ్యాధి ముదిరిన తరువాత చికిత్స పెద్దగా ఫలితం ఇవ్వదు. పి.సుధీర్బాబు, పశుసంవర్ధశాఖ సహాయ సంచాలకుడు, భీమవరం -
పేరెంట్స్ మీట్పై టీచర్లకు షరతులు
నిడమర్రు: పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 10న నిర్వహించనున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.ఓ కార్యక్రమం నిర్వహణపై విద్యాశాఖ అధికారులు షరతు విధించారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12.30 వరకూ జరుగుతుందీ లేనిది ఇతర శాఖ ఉద్యోగి పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆ ఉద్యోగి మెగా పీటీఎం రోజున 30 సెకన్ల వీడియో, నాలుగు ఫొటోలు, మొత్తం సమాచారాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ప్రధానోపాధ్యాయులు ఉపయోగిస్తున్న లీప్ యాప్లో సాక్షిగా వచ్చిన వ్యక్తి అప్లోడ్ చేయాని గురువులకు విద్యాశాఖ అధికారులు షరుతు విధించారు. దీని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యాప్ల భారంతో సతమతం ఉపాధ్యాయులకు యాప్ల భారం తగ్గించి అన్ని యాప్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, సరికొత్త యాప్ రూపొందిస్తామని విద్యా శాఖ మంత్రి లోకేష్ ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన తొలి సమావేశంలో ప్రకటించారు. లీప్ యాప్ను రూపొందించినా.. రోజూ మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం నిర్వహణ వంటి కార్యక్రమాలతోపాటు స్టాక్ అందిన ప్రతిసారి పాత ఐఎంఎంఎస్లో నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇటీవల పాఠశాలలకు అందిస్తున్న సన్నబియ్యంపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్టాక్ అందిన వెంటనే స్కాన్ చేయాలి. తర్వాత బస్తా ఓపెన్ చేసిన వెంటనే స్కాన్ చేయాలి. విద్యార్థులకు మొక్కలు, అపార్ ఐడీ క్రియేట్ వంటి అనేక అన్లైన్ కార్యక్రమాలతో బోధనకు దూరమవుతున్నామంటూ ఉపాధ్యాయులు అందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కుంటుపడుతున్న బోధన పాఠశాల తెరిచిన నాటి నుంచి పాఠశాలల్లో సంసిద్ధతా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. 1, 2 తరగతులకు 45 రోజులు, మిగిలిన ప్రాథమిక తరగతులకు 30 రోజులుగా అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. ఇంతవరకూ గమనిస్తే ప్రారంభంలో బదిలీలు, జాయినింగ్లు, రిలీవింగ్లతో 10 రోజులు గడిచిపోయాయి. తర్వాత గిన్నిస్ రికార్డ్ కోసం అంటూ యోగాంధ్ర కార్యక్రమాలు, విద్యార్థుల రిజిస్ట్రేషన్లతో మరికొన్ని రోజులు గడిచాయి. జులై 1 నుంచి పూర్తిస్థాయిలో బోధనపై దృష్టి పెడతామంటే మరో గిన్నిస్ రికార్డు పేరుతో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.ఓ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మొక్కల కోసం విద్యార్థుల వివరాలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, కమిటీల ఏర్పాటు, ఆహ్వానాలు, మండల స్థాయి నుంచి, పాఠశాల స్థాయి వరకూ ముందస్తు సమావేశాలతో ఉపాధ్యాయులంతా బిజీగా ఉండటతో, బోధనా కార్యక్రమాలు కుంటుపడినట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. కార్యక్రమం నిర్వహణపై ఇతర శాఖల ఉద్యోగులు సాక్ష్యంగా ఉండాలి విద్యా శాఖ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న టీచర్ సంఘాలు ఇతరుల పర్యవేక్షణ అంగీకరించం ఈ నెల 10న జరిగే మెగా పీటీఎంకు ఇతర శాఖల ఉద్యోగుల పర్యవేక్షణ ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గత పీటీఎంను విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల సహకారంతో విజయవంతం చేశాం. ఇప్పడు బాహ్య పరిశీలకుల పేరిట ఇతర శాఖ ఉద్యోగుల నియమించడం పాఠశాల నిర్వహణ వ్యవస్థను, ఉపాధ్యాయుల పనితీరు కించపరచడమే. –షేక్ రంగా వళి, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే.. మెగా పీటీఎంను విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విద్యాశాఖకు సంబంధం లేని ఓ వ్యక్తిని బాహ్య పరిశీలకుడిగా నియమించుకోవాలని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకే అమలు చేస్తున్నాం. సాక్షి సంతకం నిబంధన గిన్నిస్ బుక్ రికార్డు కోసమే అని, గిన్నిస్ రికార్డుల నమోదు బృందం సూచనల మేరకే సాక్షి సంతం తీసుకుంటున్నట్లు ఉన్నత అధికారులు తెలిపారు. ఏవీఎస్ఎస్ భాస్కర కుమార్, ఎంఈవో–2, నిడమర్రు -
జగన్నాథ..మోక్షప్రదాత
జై జగన్నాథ.. జయహో జగన్నాథ స్మరణలు మార్మోగాయి. ఆదివారం మండలంలోని లక్ష్మీపురం, తిమ్మాపురం గ్రామాల్లో జగన్నాథ రథయాత్ర అట్టహాసంగా నిర్వహించారు. చినవెంకన్న క్షేత్ర దత్తత ఆలయం లక్ష్మీపురంలోని సంతాన వేణుగోపాల జగన్నాథ, వేంకటేశ్వరస్వామి ఆలయంలో జగన్నాథుని దివ్య రథోత్సవాల ముగింపును పురస్కరించుకుని రథోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. సుభద్ర, బలభద్ర, జగన్నాథుని దారు విగ్రహాలను రథంలో వేంచేపు చూసి ప్రత్యేక పూజల అనంతరం రథయాత్ర ప్రారంభమైంది. రథం లక్ష్మీపురం నుంచి తిమ్మాపురం వరకూ వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకుంది. ఆలయ డీఈఓ వై.భద్రాజీ పర్యవేక్షించారు. – ద్వారకాతిరుమల -
పెద్దింట్లమ్మా చల్లంగా చూడమ్మా
కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మా.. నీ చల్లని దీవెనలు అందించమ్మా.. అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాలు, విరాళాలు, వాహన పూజల ద్వారా మొత్తం రూ.65,580 ఆదాయం వచ్చిందని తెలిపారు. -
స్కాంలకు సహకారం
భక్తుల రద్దీ సాధారణం ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు అయినప్పటికీ ఆషాఢ మాసం కావడంతో రద్దీ తగ్గింది.ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: రైతులకు తెలియకుండా రైతుల పేరుతో కోట్లలో రుణాలు తీసుకుంటారు. రైతుల నుంచి డిపాజిట్లు సేకరించి విచారణ పేరుతో కాలపరిమితి ముగిసినా తిరిగి చెల్లించరు. కార్యదర్శులు మినిట్ బుక్లో రాసిందే శాసనం. విచారణాధికారులే కింగ్ మేకర్లుగా మారి సమస్య సృష్టించి దానిని ఫిర్యాదుగా మలిచి దాని మీద విచారణ చేసి కావాల్సిన మేరకు దండుకుంటారు. ఇదీ జిల్లా సహకార శాఖ పరిధిలోని కొన్ని సొసైటీల్లో జరుగుతున్న అవినీతి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని కొన్ని సొసైటీల్లో రూ.కోట్ల అవినీతి జరుగుతున్నా ఉన్నతాధికారులు సైతం దృష్టి సారించడం లేదు. దీనిని బట్టి అవినీతి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా టి.నర్సాపురం సొసైటీలో రూ.15 కోట్లకుపైగా డిపాజిట్లను తిరిగి ఇవ్వాలని రైతులు ఆందోళన నిర్వహించి సొసైటీకి తాళం వేయించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 258 సహకార సంఘాలున్నాయి. వీటి పరిధిలో ఏటా సుమారు రూ.5 వేల కోట్ల మేర టర్నోవర్ జరుగుతుంది. ఐదారు గ్రామాలు కలిపి సొసైటీగా ఏర్పడి రైతులను సభ్యులుగా చేర్చుకుని సొసైటీ ద్వారా ఎరువులు, పురుగు మందులు విక్రయించడం, రైతుల నుంచి డిపాజిట్లు స్వీకరించడం, రైతులకు రుణాలు ఇస్తూ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. రూ.50 కోట్ల పైగా టర్నోవర్ జరిగే సొసైటీలు ఉమ్మడి జిల్లాలో అనేకం ఉన్నాయి. ఆదాయం పెరిగి వృద్ధిలోకి వస్తే సేవలు విస్తరించాలి. ఆదాయం పెరిగే ప్రతి సొసైటీలో అవినీతి పెరగడం స్థానిక ఉద్యోగులు మొదలుకొని జిల్లా స్థాయి అధికారుల వరకు పెంచి పోషిస్తూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. రూ.100 కోట్లకుపైగా అవకతవకలు జిల్లాలో గంగన్నగూడెం, విజయరాయి, జోగన్నపాలెం, చింతలపూడి, రాఘవాపురం, పోతునూరు, టీ. నర్సాపురం ఇలా సుమారు 25కుపైగా సొసైటీల్లో అవకతవకలు జరిగాయి. కొద్దిమందిపై విచారణ, సస్పెన్షన్లతో కోట్లాది రూపాయల అవినీతిని మరుగున పడేస్తున్నారు. కొన్నిచోట్ల వ్యవహారం బయటకు వచ్చినా ఇబ్బంది లేకుండా రికార్డులను తమదైన శైలిలో మార్చి మొక్కుబడి ఎంకై ్వరీ పేరుతో ఫైల్స్ మూసేస్తున్నారు. చింతలపూడి సొసైటీలో రూ.30 కోట్ల మేర అవినీతి జరిగింది. 8,928 మంది సభ్యులున్న సొసైటీలో ఏటా సగటున రూ.61.22 కోట్ల మేర టర్నోవర్ జరుగుతుంది. గతంలో ఈ సొసైటీలో రైతులకు తెలియకుండా రూ.కోట్ల రుణాలు సొసైటీ, శాఖలోని కీలక వ్యక్తులే తీసుకున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో విచారణ నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోపు పూర్తి చేసి చర్యలు తీసుకోవాలి. గురుకుల విద్య.. భద్రత మిథ్య శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే గురుకుల విద్య తరగతులు నిర్వహిస్తుండడంతో ఏ క్షణాన ఏ భవనం కూలిపోతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 8లో uఅక్రమాలకు సహకరిస్తున్న విచారణాధికారులు విచారణాధికారి అన్ని విధాలా సహకారం అందించి ఆరు నెలల్లో జరగాల్సిన విచారణను నిలుపుదల చేస్తూ.. సొసైటీ సభ్యులు కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చేలా సాయపడుతున్నారు. సీజ్ చేసిన సొసైటీ రికార్డులు విచారణాధికారి వద్ద ఉంటాయి. దాంట్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు మార్చి కమిటీ తీర్మానం చేసినట్లు రికార్డు ట్యాపరింగ్ చేసి మరీ ప్రత్యేకంగా ఉత్తర్వులు తెచ్చారు. అనేక సొసైటీల్లో ఇదే తరహా వ్యవహారాలు జరిగాయి. గంగన్నగూడెంలో రూ.25 లక్షలు, జోగన్నపాలెంలో రూ.75 లక్షలు, చింతలపూడిలో రూ.30 లక్షలు, రాఘవాపురంలో రూ.40 లక్షలు, పోతునూరులో రూ.30 లక్షలకుపైగా జరిగిన అవినీతిలో కొద్ది మందిని సస్పెండ్ చేశారు. కీలక విచారణాధికారి మాత్రం విచారణ నిర్వహించి రిపోర్టును మాత్రం ప్రత్యేక వ్యవహారాలతో పెండింగ్లో ఉంచారని ఆరోపణలు ఉన్నాయి. సదరు విచారణాధికారికి ప్రత్యేకంగా నలుగురు అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, ఒక సీనియర్ ఇన్స్పెక్టర్తో బృందం ఉంటుంది. సదరు బృందమే సొసైటీల్లోని తప్పులు తెలుసుకుని సొసైటీ కార్యదర్శులను పిలిచి మాట్లాడి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు, తీవ్రతను బట్టి రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రతి సొసైటీలో ఆడిట్ పూర్తి చేసి బేరం కుదిరితేనే సర్టిఫికెట్ ఇచ్చేలా వ్యవహారం సాగిస్తున్నారు. సొసైటీల్లో జరుగుతున్న అవినీతి వ్యవహారంపై ఇటీవల కొందరు ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసి సహకార శాఖకు సంబంధం లేని వ్యక్తితో విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. న్యూస్రీల్ రైతుకు తెలియకుండానే రైతుల పేరుతో రుణాలు పలు సహకార సొసైటీల్లో అవినీతి విచారణాధికారులే కింగ్ మేకర్లుగా మారుతున్న వైనం చింతలపూడి సొసైటీలో గతంలో రూ.30 కోట్ల మేర అవినీతి డిపాజిట్లు ఇవ్వాలంటూ టి.నర్సాపురం సొసైటీ వద్ద రైతుల ఆందోళన అవకతవకలు పరిశీలిస్తాం సహకార సొసైటీలో జరిగిన అవినీతి, విచారణలు పూర్తిగా మా దృష్టికి రాలేదు. కొత్తగా ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించాను. అన్నింటిని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటామం. – కే.వెంకటేశ్వరరావు, జిల్లా సహకార శాఖ ఇన్చార్జి టి.నర్సాపురం సొసైటీకి తాళం టి.నర్సాపురం సొసైటీలో గతంలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. కొన్నేళ్లుగా త్రిసభ్య కమిటీతో సొసైటీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 370 మందికి సంబంధించి రూ.15 కోట్ల మేర మెచ్యూరిటీ పూర్తయినా డబ్బు ఖాతాల్లో జమ చేయలేదని ఆగ్రహించిన రైతులు డిపాజిట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం సొసైటీ సిబ్బందితోనే తాళాలు వేయించి సొసైటీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. -
జగన్ 2.0 లో కార్యకర్తలదే పాలన
కొయ్యలగూడెం: జగన్మోహన్రెడ్డి 2.0 పాలనలో కార్యకర్తలే పాలకులు అని, ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు కార్యకర్తల ద్వారానే కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి కారుమూరి సునీల్ పేర్కొన్నారు. శనివారం కొయ్యలగూడెంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అధ్యక్షతన నిర్వహించిన ‘రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో’ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాధరావు, చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజుతో కలసి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి అంశాన్ని జగన్ మోహన్ రెడ్డి నిశితంగా పరిశీలిస్తున్నారని, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకుని రిటర్న్ గిఫ్ట్ అందిస్తారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో గెలుచుకోబోయే మొట్టమొదటి స్థానం పోలవరం అని చెప్పారు. వైఎస్సార్సీపీకి రక్షణ కార్యకర్తలు అని జెట్టి గురునాథరావు పేర్కొన్నారు. సంవత్సరం వ్యవధిలోనే ప్రజా వ్యతిరేకత ఉప్పెనలా మారిందని, పోలవరం నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి తారాస్థాయిలో ఉందన్నారు. చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గాన్ని వైఎస్సార్సీపీ కంచుకోటగా మలుస్తూ విజయరాజు పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తున్నారని బాలరాజు పేర్కొన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు మంతెన సోమరాజు, అధికార ప్రతినిధి దాసరి విష్ణు, ఎంపీపీలు సుంకర వెంకటరెడ్డి, గంజిమాల రామారావు, చందా ప్రసాద్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ మండలాల అధ్యక్షులు తుమ్మలపల్లి గంగరాజు, కెఎస్ఎస్ శ్రీను రాజు, బుగ్గ మురళి, అల్లూరి రత్నాజీ, తాండ్రు రాజేష్, తదితరులు పాల్గొన్నారు. -
కూటమి మోసాలను నిలదీద్దాం
కామవరపుకోట: సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వ మోసాన్ని నిలదీద్దామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో చింతలపూడి వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ’ అని నాయకులు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులనే టార్గెట్గా చేసుకుని అక్రమ కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాష్ట్రంలో అలజడలు సృష్టిస్తున్నారని వీరి మోసాలను గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. ఏలూరు పార్లమెంట్ కో–ఆర్డినేటర్ కారుమూరి సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంపద సృష్టిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్కు, పవన్ కల్యాన్కు సంపద సృష్టించి పెడుతున్నారన్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను దగా చేశారన్నారు. కంభం విజయరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో రాష్ట్ర ప్రజలు విసుగు చెంది తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. వారి మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు మోసాలను వివరించాలన్నారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సరిత భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలతో మహిళలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారన్నారు. వీరి మోసాలను ప్రతి మహిళ గమనించాలన్నారు. ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ జయప్రకాష్, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు, పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకి రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణ, జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి, అంగన్వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలు సాయిలు స్వాతి, లింగపాలెం, చింతలపూడి, కామవరపుకోట,జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు అన్నపనేని శాంతారావు, కొప్పుల నాగేశ్వరరావు, రాయంకుల సత్యనారాయణ, ఓరుగంటి నాగేంద్ర, జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షుడు కర్పూరం గురవయ్య తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు -
రాజీ మార్గమే ఉత్తమం
ఏలూరు (టూటౌన్)/ఏలూరు(ఆర్ఆర్పేట): రాజీ మార్గమే ఉత్తమమని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. శనివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి మాట్లాడుతూ కక్షిదారులకు త్వరితగతిన కేసుల పరిష్కారం నిమిత్తం జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నామని చెప్పారు. కక్షిదారులు సౌలభ్యం కోసం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 35 బెంచీలు ఏర్పాటు చేసి త్వరితగతిన కేసుల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని తెలిపారు. రెండో అదనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని, ఐదో అదనపు జిల్లా జడ్జి ఆర్వీవీఎస్ మురళీకృష్ణ, ఏడో అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు, ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాస మూర్తి, పోక్సో జడ్జి కుమారి శ్రీవాణి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ పాల్గొన్నారు. లోక్ అదాలత్లో 6324 పెండింగ్ కేసులను, 141 ప్రీ లిటిగేషన్ కేసులను రాజీచేసినట్టు జిల్లా జడ్జి ఎస్.శ్రీదేవి తెలిపారు. రాజీ కేసుల్లో మోటార్ వాహన ప్రమాద కేసులు 129, సివిల్ కేసులు 219, క్రిమినల్ కేసులు 5,976 ఉన్నాయన్నారు. వైఎస్సార్టీయూసీ కార్యదర్శిగా పల్లె రవీంద్రరెడ్డి నూజివీడు: రాష్ట్ర వైఎస్సార్టీయూసీ సెక్రటరీగా నూజివీడుకు చెందిన పల్లె రవీంద్రరెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రవీంద్రరెడ్డిని నియమించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో రవీంద్ర రెడ్డి మార్కెట్ యార్డు చైర్మన్గా, రైతు సలహా సంఘం జిల్లా సభ్యుడిగా, వైఎస్సార్టీయూసీ జిల్లా సెక్రటరీగా పనిచేశారు. నిండుకుండలా గోదావరి కుక్కునూరు: ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద నీరు చేరింది. శనివారం భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 20 అడుగులకు చేరుకుంది. కుక్కునూరు వద్ద నిండుకుండను తలపిస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో శనివారం ఉదయం వరకు గోదావరి ఇసుక తెన్నెల మీద ఉన్న జాలర్లు సామన్లు, వలలతో సహా ఒడ్డుకు చేరుకున్నారు. గోదావరి వరద ప్రవాహంగా స్వల్పంగా పెరిగిందని కుక్కునూరు తహసీల్దార్ కె.రమేష్బాబు అన్నారు .రానున్న రోజుల్లో ప్రవాహం మరింత పెరిగినా బాధిత గ్రామాల ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వరద ప్రభావిత గ్రామాల ప్రజలకు పునరావాస సహాయక కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. 1.87 లక్షల క్యూసెక్కులు విడుదల పోలవరం రూరల్: గోదావరి వరద పెరుగుతూ ఉభయగోదావరి జిల్లాల మధ్య లంక ఒడ్డులను తాకుతూ ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 27.920 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్వే నుంచి దిగువకు 1.87 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీరు చేరుతోంది. పాఠశాల లాగిన్కు ఎస్ఎస్సీ జవాబు పత్రాలు ఏలూరు (ఆర్ఆర్పేట): ఇటీవల నిర్వహించిన ఎస్ఎస్సీ ఎస్ఈ పరీక్షలకు సంబంధించి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జవాబుపత్రాలు సంబంధిత పాఠశాలల లాగిన్కు విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జవాబు పత్రాలు వెంటనే సదరు విద్యార్థులకు ప్రింట్ తీసి అందచేయాలని ఆదేశించారు. -
నష్టాల ఊబిలో మామిడి రైతు
నూజివీడు: లాభాలు పంచుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్న మామిడి రైతుకు ఏటా నష్టాలు తప్పడం లేదు. ఈ ఏడాది మామిడి కాపు తగ్గిపోయినప్పటికీ మార్కెట్లో ధర ఏమాత్రం పెరగకుండా పడిపోవడంతో రైతులకు ఆదాయం లేక నష్టాల ఊబిలోకి కూరుకుపోయారు. పండ్లలో రారాజుగా మామిడికి పేరున్నా ఏటా మామిడి పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. ఎకరాకు వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన మామిడి రైతులు పెట్టుబడులు కూడా రాక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. మామిడి సీజన్లో మామిడి ధరలు గతంలో ఎప్పుడూ లేనంతగా దారుణంగా పతనమవ్వడంతో రైతులకు కోత కూలి, కిరాయి రాని పరిస్థితుల్లో కొందరు రైతులు చెట్లకే కాయలు వదిలేశారు. దీంతో మామిడిపై రైతులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. మామిడి మార్కెట్ను కమిషన్ వ్యాపారులు, కాయలను కొనుగోలు చేసే ఢిల్లీ వ్యాపారులు కలిసి తమ గుప్పెట్లో ఉంచుకోవడంతో మామిడికి ధర లేకుండా పోతోంది. దీంతో మామిడి ధర రోజురోజుకు దిగజారుతుందే తప్ప ఒక్క రూపాయి కూడా పెరగడం లేదు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉందే తప్ప గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయింది. జిల్లాలో 45 వేల ఎకరాల్లో మామిడి ఏలూరు జిల్లాలో 45 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించాయి. నూజివీడు డివిజన్లోనే దాదాపు 40 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో బంగినపల్లి, తోతాపురి, రసాలను రైతులు ఎక్కువగా సాగుచేస్తున్నారు. కాపు బాగా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది ధర బాగా లభిస్తుందని రైతులు ఆశించగా ధర లేక వారి ఆశలు అడియాశలయ్యాయి. ఇతర పంటల సాగు వైపు దృష్టి ఒకప్పుడు మామిడి తోటలే జీవనాధారంగా ఉన్న నూజివీడు డివిజన్లో నేడు మామిడి తోటలంటే అయిష్టత కనబరుస్తున్నారు. మామిడి తోటలలో తెగుళ్ల ఉధృతి పెరగడం, సస్యరక్షణ చర్యలు చేపట్టినా నివారణ అంతంత మాత్రంగానే ఉండటంతో దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనికి తోడు మామిడి ఎగుమతులు క్షీణిస్తూ ఉండటంతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. వ్యయ ప్రయాసలకోర్చి కాయలను మార్కెట్కు తరలిస్తే అక్కడ సరైన ధర లభించకపోగా రైతులు దోపిడీకి గురవుతున్నారు. ధర ఉన్నా లేకపోయినా మామిడి కాయలను రైతులు ఏదో ఒక రేటుకు అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో మామిడి సాగు తలకు మించిన భారంగా పరిణమించింది. గతంలో రైతులు తమకున్న మామిడితోటల నుంచి వచ్చే ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకునేవారు. నేడు ఆ పరిస్థితులు కనుమరగయ్యాయి. మామిడితోటలు తొలగించిన తరువాత సారవంతమైన భూముల్లో స్వల్పకాలిక పంటలను సాగుచేయడం ద్వారా మామిడిలో వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ ఆదాయాన్ని గడించవచ్చనే ఆలోచనకు రైతులు వచ్చారు. గత రెండేళ్ల కాలంలో తోటలను నరికివేసిన భూముల్లో మొక్కజొన్న, పత్తి, మిరప, నాటు పొగాకుతో పాటు వేరుశనగ, కూరగాయలు తదితర పంటలను సాగుచేస్తున్నారు. మరికొందరైతే ఆయిల్పామ్ సాగువైపు వెళ్తున్నారు. ఖర్చులు రావడం లేదు మామిడి ధరలు దారుణంగా పడిపోయాయి. కోత కోస్తే ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పడిపోయినప్పటికి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహ రిస్తోంది. పరిస్థితులు ఇలాగే ఉంటే మామిడి సాగు పట్ల రైతుల్లో ఆసక్తి తగ్గిపోతుంది. నూజివీడు ప్రాంతంలో మామిడి పంట కనుమరుగయ్యే పరిస్థితులు ఎదురవుతాయి. – శీలం రాము, నూజివీడు ఈ ఏడాది పతనమైన మామిడి ధరలు కోత ఖర్చులు రాక చెట్లకే కాయలు వదిలేసిన రైతులు మామిడి రైతును ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం పట్టించుకోని ప్రభుత్వం ప్రధాన వాణిజ్య పంటగా ఉన్న మామిడిని రాష్ట్ర ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. మంత్రులు, ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెప్పడం తప్పితే మామిడి రైతును ఆదుకున్న దాఖలాలు లేవు. మామిడికి గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు విమర్శిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా మామిడి మార్కెట్లో ధరలు పెరిగేలా ఎంత మాత్రం చర్యలు చేపట్ట లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆదుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు. మామిడి ధరలు (టన్ను సగటు ధర) రకం గతేడాది ఈ ఏడాది బంగినపల్లి రూ.30 వేలు రూ.12వేలు తోతాపురి రూ.15 వేలు రూ.4 వేలు బంగినపల్లికి దక్కని ధర బంగినపల్లి రకం కాయలకు ప్రారంభంలో టన్నుకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ధర లభించింది. సీజన్ గడిచిన కొద్దీ ధర తగ్గుముఖం పట్టి సీజన్ ముగిసే సమయానికి టన్ను రూ.8 వేల నుంచి రూ.12 వేలకు పడిపోయింది. దీంతో కోత కూలి, కిరాయి ఖర్చులు కూడా రాని పరిస్థితి. అయినప్పటికీ కాయలను అలాగే ఉంచి చూస్తూ ఊరుకోలేక ఎంతో కొంత డబ్బులు వస్తాయనే ఆశతో కాయలు కోసి మార్కెట్కు తరలించారు. తోతాపురి పరిస్థితి దారుణం తోతాపురి(కలెక్టర్) రకానికి కూడా ఈ ఏడాది ధర లేదు. గతేడాది సీజన్ ముగిసే వరకు టన్ను ధర రూ.9 వేలకు పైగానే లభించగా ఈ ఏడాది మాత్రం టన్ను ధర రూ.3 వేలకు పడిపోయింది. మామిడి సేఠ్ల సిండికేట్, చిత్తూరు జిల్లాలోని జ్యూస్ ఫ్యాక్టరీలు తెరవక కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో తోతాపురి ధరలు పతనమయ్యాయి. టన్ను రూ.3 వేలకు పడిపోవడంతో కోత కూలి, కిరాయి ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో రైతులు తోతాపురి కాయలను చెట్లకే వదిలేశారు. -
జంతువుల వ్యాధులతో జర జాగ్రత్త..!
కై కలూరు/కొయ్యలగూడెం : మనుషుల నుంచి జంతువులకు, జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు. పిచ్చికుక్క కరిచిన ఓ బాలుడికి 1885లో ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ రేబీస్ టీకాను ప్రయోగించి, విజయం సాధించిన సందర్భంగా ప్రతి ఏటా జూలై 6న జూనోసిస్ దినోత్సవం జరుపుతారు. జూనోసిస్ డే సందర్భంగా జిల్లాలో పశువైద్యశాలల్లో ఆదివారం కుక్కలకు ఉచిత రేబీస్ టీకాలు వేస్తారు. జూనోటిక్ వ్యాధులపై అప్రమత్తత జంతువుల నుంచి సోకే వ్యాధులపై అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్యులు సూచిస్తున్నారు. జంతువుల లాలాజలం, రక్తం, మూత్రం, శ్లేష్మం, మలం, ఇతర శరీర ద్రవాల కారణంగా మనుషులకు జూనోటిక్ వ్యాధులు సోకుతాయి. వీటిలో పాడి పశువుల నుంచి ఆంత్రాక్స్, బ్రూసిల్లోసెస్, లప్టిరియోసిస్, రింగ్ వార్మ్ వ్యాధులు, గొర్రెలు, మేకలు నుంచి హైడాటిడోసిస్, సార్కోసిప్టిస్, ఆంత్రాక్స్, బ్రూసిల్లోసెస్, లప్టిరియోసిస్, సాల్మోనెల్లోసిస్, క్యూ–పివర్, మేంజ్ వ్యాధులు, కుక్కల నుంచి రేబీస్, లీష్మీనియా, బద్దెపురుగుల వ్యాధి, రింగ్ వార్మ్, హైడాటిడోసెస్, మీసిల్స్, మంప్స్, మేంజ్ వ్యాధులు సోకుతున్నాయి. జూనోటిక్ వ్యాధులు ఎక్కువగా కేన్సర్ వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, గర్భిణీ రోగులు, 5వ సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లలు, అడవిలో జంతువులతో సహజీవనం చేసే వ్యక్తులకు సోకే అవకాశం ఉంది. జిల్లాలో 25 వేల ఉచిత రేబీస్ టీకాలు ఏలూరు జిల్లాలోని 7 నియోజకవర్గాలకు కలిపి మొత్తం 25 వేల ఉచిత రేబీస్ టీకాలు వచ్చాయి. జిల్లాలో ప్రాంతీయ పశువైద్యశాలలు 11, వెటర్నరీ డిస్పెన్సరీలు 66, గ్రామీణ పశు వైద్యశాలలు 57, రైతు సేవాకేంద్రాలు 315 ఉన్నాయి. వీటి పరిధిలో ఆవులు, గేదెలు కలిపి 6,01,589, మేకలు, గొర్రెలు కలిపి 8,06,374, కుక్కలు 15,222 (వీధి కుక్కలు మినహాయించి)గా గుర్తించబడ్డాయి. ఆదివారం ఉదయం నుంచి ఆయా కేంద్రాల్లో పశువైద్యులు ఉచితంగా రేబీస్ టీకాలు అందిస్తారు. అదే విధంగా జూనోటిక్ వ్యాధులపై పెంపుడు జంతువుల యజమానులకు అవగాహన కలిగిస్తారు. 46 వేల బ్రూసెల్లా ఉచిత టీకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ యానిమల్ డీసీస్ కంట్రోల్ ప్రోగ్రాం(ఎన్ఏడీసీపీ)లో భాగంగా బ్రుసెల్లా వ్యాధిని 2030 నాటికి నిర్మూలించాలనే ధ్యేయంతో మూడేళ్లగా ఉచిత వ్యాధి నిరోధక టీకాలు అందిస్తున్నారు. ఏలూరు జిల్లాలో మూడు విడతల్లో 46 వేల బ్రుసెల్లా వ్యాధి నిరోధక టీకాలు 4–8 నెలల మధ్య వయస్సు కలిగిన ఆడ దూడలకు మాత్రమే ఉచితంగా అందించారు. అది జీవితకాలం వ్యాధి సోకకుండా రక్షణ ఇస్తుంది. నేడు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ఏలూరు జిల్లాకు 25 వేల ఉచిత రేబీస్ వ్యాక్సిన్లు బ్రూసెల్లోసిస్ అంటువ్యాధిపై ప్రజలకు అవగాహన జిల్లాలో 134 పశు వైద్యశాలల్లో కుక్కలకు ఉచిత టీకాలు మనుషులకు సోకుతున్న బ్రూసెల్లోసిస్ వ్యాధి బ్రూసెల్లోసిస్ వ్యాధి జంతువుల నుంచి మనుషులకు సోకే ఒక ముఖ్యమైన జూనోటిక్ వ్యాధి. వ్యాధి సోకిన జంతువులు, కలుషితమైన జంతు ఉత్పత్తులు, ప్రయోగశాలలో బ్రూసెల్లోసిస్ సోకిన జంతువుల ద్రావములను తాకడంతో మానవులకు ఇది వ్యాపిస్తోంది. పశువైద్యులు, పాడి రైతులు, కబేళాల కార్మికులకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఇదే కాకుండా పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులు, వ్యాధి సోకిన జంతువుల నుంచి ఉడికించని మాంసం తీసుకోవడం వల్ల కూడా ఇది సోకుతోంది. జ్వరం, కీళ్ల నొప్పులు, అలసట, నీరసం. మగవారిలో వృషణాల వాపు, కుచించుకుపోవడం, వంధ్యత్వానికి గురవుతున్నారు. రేబీస్ వ్యాధి సులభంగా వ్యాపిస్తుంది ఇది కేవలం కుక్క కాటుతోనే కాక, వ్యాధిసోకిన జంతువు లాలాజలం గాయాల మీద పడితే కూడా వ్యాపిస్తుంది. రేబీస్ అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి. కాబట్టి, కుక్కలు, పిల్లుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, టీకాలు వేయించడం చాలా ముఖ్యమైనది. కాటు సంభవించినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించి రేబీస్ వ్యాధి వ్యాప్తిని నిరోధించడం చాలా అవసరం. – బీఆర్ శ్రీనివాస్, పశు వైద్యాధికారి, కొయ్యలగూడెంటీకాలు తప్పనిసరి పెంపుడు జంతువులతో మానవులకు అవినాభవ సంబంధం ఉంది. ప్రతి ఒక్కరూ పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. జూనోటిక్ వ్యాధులపై అందరూ అవగాహన పెంచుకోవాలి. పశుసంవర్థకశాఖ ద్వారా ఏటా జూనోసెస్ డే సందర్భంగా ఉచిత రేబీస్ టీకాలు వేస్తున్నాం. అందరూ సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ పఠాన్ ముస్తాఫా ఖాన్, పశుసంవర్థకశాఖ సహాయ సంచాలకులు, కై కలూరు -
ప్రేమ వివాహం.. గ్రామాల మధ్య వివాదం
ప్రేమికుడిపై దాడి చేసిన యువతి బంధువులు కై కలూరు: ఓ ప్రేమ వివాహం ఇరు గ్రామాల మధ్య వివాదానికి దారితీసింది. ప్రేమికుడు, అతని బంధువులపై యువతి బంధువులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కై కలూరులో శనివారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కై కలూరు మండలం చటాకాయి గ్రామానికి చెందిన ఘంటసాల రోజాకుమార్(22), నత్తగుళ్ళపాడు గ్రామానికి చెందిన నబిగారి లక్ష్మీ ప్రసన్న(22) కై కలూరు కాలేజీలో చదువుతూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రోజాకుమార్ కుటుంబం కొన్ని నెలలుగా నెల్లూరులో చేపల చెరువులు సాగు చేస్తూ అక్కడే ఉంటున్నారు. ఇంట్లో వివాహం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రసన్న చెప్పడంతో రోజాకుమార్ ఆమెను తీసుకువెళ్లి నెల్లూరు సమీప బుచ్చిరెడ్డిపాలెం కామాక్షి దేవాలయంలో తాళి కట్టి దండలు మార్చుకున్నారు. అక్కడ పోలీసు స్టేషన్కు వెళ్లారు. విషయం తెలుసుకున్న రోజాకుమార్ గ్రామ పెద్దలు కారులో ప్రేమ జంటను తీసుకువస్తుండగా రాత్రి సమయంలో ఒంగోలు వద్ద యువతికి చెందిన నత్తగుళ్ళపాడు గ్రామస్తులు తారసపడ్డారు. అందరూ కలసి వస్తుండుగా ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు వంతెన వద్ద యువతి మేనమామ ఘంటసాల చందు, బంధువులు మరో నలుగురు బయట వ్యక్తులతో కలిసి యువకుడి కారుపై దాడి చేసి యువతిని తీసుకువెళ్లారు. ఈ దాడిలో రోజాకుమార్తోపాటు చటాకాయికి చెందిన ఘంటసాల సుబ్బరాజు, ముంగర గంగాథరరావు, జల్లూరు శ్రీను, ఘంటసాల నారాయణ, డ్రైవర్ సైదు హేమ కిరిటీలకు దెబ్బలు తగిలాయి. వీరు కై కలూరు ప్రభుత్వాసుపత్రిలో చేరగా వీరిని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, వడ్డి కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బలే ఏసురాజు పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి వద్ద, పోలీసు స్టేషన్ వద్ద ఇరు గ్రామాల పెద్దలు గొడవకు దిగారు. ఈ విషయంపై కై కలూరు రూరల్ సర్కిల్ సీఐ వి.రవికుమార్ మాట్లాడుతూ బయట వ్యక్తులు దాడి చేసిన ప్రాంతం శ్రీపర్రు కావడంతో అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారన్నారు. తల్లిదండ్రులతోనే ఉంటానని యువతి చెప్పడంతో ఇరు గ్రామస్తులతో మాట్లాడామన్నారు. విభేదాలు పడవద్దని గ్రామస్తులకు తెలిపామన్నారు. -
26 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నూజివీడు: మండలంలోని మొర్సపూడిలో అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లయిస్ డీటీ జీ వెంకటేశ్వరరావు, వీఆర్వో నాగరాజు గ్రామస్తులతో కలిసి శనివారం పట్టుకున్నారు. రేషన్ షాపులోని బియ్యాన్ని ట్రక్కు వాహనంలోకి లోడు చేస్తుండగా గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించడంతో హుటాహుటిన మొర్సపూడికి చేరుకొని ట్రక్కు వాహనంలో ఉన్న 26 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న రేషన్ డీలర్ గొడవర్తి అచ్చయ్య, రేషన్ బియ్యం అక్రమ వ్యాపారి సోలా రాములపై 6ఏ కేసు నమోదు చేశారు. అనుమతి లేని బస్సులపై అపరాధ రుసుం తాడేపల్లిగూడెం: అనుమతులు లేకుండా నడుపుతున్న విద్యాసంస్థలకు చెందిన బస్సులకు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు జరిమానా విధించారు. డీటీఓ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. పిప్పర పరిధిలోని స్కూల్స్ బస్సుల్లో ఒకటి టాక్స్ లేకుండా, మరొకటి ఎఫ్సీ లేకుండా తిరుగుతున్నట్టుగా గుర్తించారు. ఈ మేరకు ఆ బస్సుల యజమానుల నుంచి రూ.39 వేల అపరాధ రుసుంను వసూలు చేశారు. గూడెం మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ నాయక్, అసిస్టెంటు ఇన్స్పెక్టర్ సుబ్బలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు. -
పోలవరంపై చంద్రబాబు వాస్తవాలు బయట పెట్టాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చింతలపూడి : పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు వాస్తవాలు బయటపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. చింతలపూడిలో ఏలూరు జిల్లా సీపీఐ ద్వితీయ మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పోలవరం ఎత్తు 41.15 మీటర్లు తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వమే తెలిపిందని, దీనిపై చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పోలవరం నివాసితులకు న్యాయం జరిగే వరకూ ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. చంద్రబాబు ఇప్పుడు కొత్తగా పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు అంటూ ప్రజలను ఏమారుస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ ఎక్కడ బాబూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని, సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 20 ఏళ్లపాటు రూ.1.10 లక్షల కోట్ల భారాన్ని విద్యుత్ చార్జీల పెంపు రూపంలో ప్రజలపై ప్రభుత్వం మోపుతుందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో స్మార్ట్మీటర్లను ఏర్పాటు చేస్తే తప్పు అన్న చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు ఎందుకు స్మార్ట్మీటర్లు ఏర్పాటు చేయాల్సి వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షత వహించగా జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శి కేవీపీ ప్రసాద్, రాష్ట్ర సమితి సభ్యులు, మండల కార్యదర్శి టి.బాబు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మద్యం మత్తులో కాలువలో పడి రౌడీషీటర్ మృతి ఏలూరు టౌన్: ఏలూరు వన్టౌన్ పరిధిలో ఒక రౌడీషీటర్ మద్యం మత్తులో ఒక మురికి కాలువలో పడి ఊపిరాడక మృతిచెందాడు. వివరాల ప్రకారం.. ఏలూరు వన్టౌన్ ప్రాంతంలోని వంగాయగూడేనికి చెందిన బలిరెడ్డి విజయసాయి (36) సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. విజయసాయిపై వన్టౌన్ పోలీస్స్టేషన్లో ప్రస్తుతం రౌడీషీట్ కొనసాగుతోంది. మద్యం సేవించిన సాయి శనివారం తెల్లవారుజామున వంగాయగూడెం వైపు నుంచి వస్తూ అక్కడి మురికి కాలువపై ఉన్న గట్టుపై పడుకున్నాడు. పూటుగా మద్యం సేవించి ఉండడంతో ప్రమాదవశాత్తు కాలువలో పడి ఊపిరాడక మృతిచెందాడు. ఈ విషయంపై పోలీసులు సీసీ కెమెరాల పుటేజ్ పరిశీలించి మృతుడు కాలువ గట్టుపై పడుకుని ప్రమాదవశాత్తు జారిపడినట్లు గుర్తించారు. అనంతరం సాయి మృతదేహానికి జీజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఏలూరు వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్సై నాగబాబు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గురుకుల విద్య.. భద్రత మిథ్య
భీమడోలు: అధికారుల నిర్లక్ష్యం.. గురుకుల విద్యార్థినుల పాలిట శాపంగా మారింది. శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే గురుకుల విద్య తరగతులు నిర్వహించడంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో గుబులు రేపుతోంది. ఏ క్షణాన ఏ భవనం కూలిపోతుందోనని, తమ పిల్లల పరిస్థితి ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలసానిపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల భవనంలోని రెండు ల్యాబ్లకు చెందిన శ్లాబ్లు మే 30వ తేదీన రాత్రి సమయంలో కూలిపోయాయి. అయితే వేసవి సెలవులు కావడం, రాత్రి పూట కూలడంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ నేపథ్యంలో విద్యార్థినుల భద్రతపై ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో సంబంధిత గురుకుల సొసైటీ అధికారులు పరిస్థితిని సమీక్షించారు. పాత భవనాలు క్షేమం కాదని కళాశాలను తాత్కాలికంగా వేరే ప్రదేశానికి మార్చాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. భీమడోలు, ద్వారకాతిరుమల, నల్లజర్ల మండలాల్లో ఎక్కడైనా అద్దె భవనాన్ని తీసుకుని విద్యార్థినులకు తరగతులు నిర్వహించేలా తగు చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇందుకు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తూ పోలసానిపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు 710 మంది విద్య అభ్యసిస్తున్నారు. టీచర్లు, కార్యాలయ సిబ్బంది, ఇతర సిబ్బందితో కలిసి 100 మందికి పైగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరడం, తరచూ వంటశాల, భోజన శాల, డార్మిటరీల్లో శ్లాబ్లు ఊడి కింద పడుతుండడం, అంతేగాకుండా హాస్టల్ ఆవరణలో విష సర్పాలు సంచరించడంతో విద్యార్థినులు, సిబ్బంది బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో జూన్ 12వ తేదీ నుంచి తరగతులు పునఃప్రారంభమైనా విద్యార్థినులను ఎక్కువ మంది ఇక్కడ చదివించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ఏడు వందల మందికిగాను కేవలం 180 మంది బాలికలు మాత్రమే హాజరవుతున్నారు. బడ్జెట్ కేటాయింపులేవి? ప్రతి ఏటా గురుకులాల్లో మౌలిక వసతులు, మరమ్మతులకు బడ్జెట్లో గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు నిధులు కేటాయించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం పొంచి ఉన్నా శిథిలావస్థకు చేరిన భవనాలకు కనీసం మరమ్మతులు నిర్వహించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలిన రెండు ల్యాబ్లు (ఫైల్) పోలసానిపల్లి గురుకులంలో శిథిలావస్థకు చేరిన భవనాలు విద్యార్థినుల భద్రత దృష్ట్యా వేరే ప్రాంతానికి తరలింపు చర్యలు రాష్ట్ర స్థాయి అధికారుల నిర్ణయం కోసం ఎదురు చూపుఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం పోలసానిపల్లి గురుకుల కళాశాల పరిస్థితిపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు డీసీవో బి.ఉమాకుమారి తెలిపారు. కళాశాలను వేరే ప్రాంతానికి తరలించే నిర్ణయంపై వారం రోజుల్లో ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలాగే భవనాల్లోని పటుత్వాన్ని గుర్తించేందుకు ఉన్నతాధికారులతో సంప్రదిస్తుమని, వారిచ్చే నివేదికను సొసైటీ ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. విద్యార్థినుల భద్రతే లక్ష్యంగా తమ వంతు కృషి చేస్తున్నామని, బాలికల తల్లిదండ్రులు ఆందోళన చెందనవసరం లేదని వెల్లడించారు. -
తొలి ఏకాదశి.. పుణ్యాల రాశి
ద్వారకాతిరుమల: ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నుంచే పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీన్ని తొలి పండుగ అని పిలుస్తారు. ఈ ఏకాదశిని శయన ఏకాదశి, దేవశయన ఏకాదశి, పద్మ ఏకాదశి అని కూడా అంటారు. ఆదివారం తొలి ఏకాదశి కాగా పండుగ విశిష్టతను శ్రీవారి దేవస్థానం ఆగమ పండితులు సుదర్శనం శ్రీనివాసాచార్యులు మాటల్లో తెలుసుకుందాం. తొలి ఏకాదశి విశిష్టత ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు (కార్తీక మాసం శుక్ల ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి) వరకు) విష్ణుమూర్తి పాలకడలిపై నిద్రిస్తారు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లోనూ ఈ రోజు మొదటిది. అందుకే ఈ రోజు ఉపవాసం ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అందుకోసం దశమి రాత్రి నుంచే నిరాహారంగా ఉండాలి. ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి విష్ణుమూర్తిని తులసీదళాలతో పూజించాలి. రాత్రి అంతా జాగరణ చేస్తూ భాగవతం లేదా విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి. మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు దగ్గరలోని ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. దీనినే తొలి ఏకాదశి వ్రతం అని అంటారు. ఈ రోజున అన్నం, మాంసాహారం తినకూడదు. తులసి ఆకులు కోయడం, జుట్టు, గోర్లు కత్తిరించుకోవడం, గొడవలు, దుర్భాషలాడటం, పగలు నిద్రపోవడం, ఇతరులను అవమానించడం, చెడుగా ఆలోచించడం, దానం నిరాకరించడం వంటివి చేయరాదు. శ్రీవారి క్షేత్రంలో.. ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం విశేష కార్యక్రమాలు జరగనున్నాయి. అందులో భాగంగా రాత్రి స్వామివారి గ్రామోత్సవం క్షేత్ర పురవీధుల్లో కన్నుల పండువగా జరుగనుంది. తొలి పండుగ కావడంతో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శిస్తారని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నేడు శ్రీవారి క్షేత్రంలో ప్రత్యేక పూజలు -
మందుల షాపుల్లో తనిఖీలు
కొయ్యలగూడెం: మండలంలోని పలు మెడికల్ షాపుల్లో శనివారం ఏలూరు నుంచి వచ్చిన డ్రగ్ ఇన్స్పెక్టర్ అబిద్ ఆలీ షేక్ నేతృత్వంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. కన్నాపురం రోడ్డులోని మురళీకృష్ణ మెడికల్స్ షాపులో తనిఖీలు నిర్వహించి ఆరు రకాల నిషేధిత ఔషధాలను స్వాధీనం చేసుకొని షాపును సీజ్ చేశారు. అలాగే బుట్టాయగూడెంలోని లక్ష్మీ దుర్గ మెడికల్ స్టోర్స్, కార్తికేయ మెడికల్ స్టోర్స్, కృష్ణ మెడికల్ స్టోర్స్లలో కూడా తనిఖీలు జరిపారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ అబిద్ ఆలీ షేక్ మాట్లాడుతూ ఓ వ్యక్తి ముసుగు, కళ్లజోడు ధరించి బండిపై తిరుగుతూ ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఏలూరు జిల్లాలోని పలు మెడికల్ షాపులకు నిషేధిత ఔషధాలను (వయాగ్రా టాబ్లెట్లు, అబార్షన్ కిట్లు) సరఫరా చేస్తున్నాడని, అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
కలల తీరాలకు తొలి అడుగు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఎన్నో ఆశయాలు, మరెన్నో లక్ష్యాలు నిర్దేశించుకుంటున్న విద్యార్థులు వాటిని సాధించడానికి, చేరుకోవడానికి వేయి ఆశలతో ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. తమ లక్ష్యాలను సాధించడానికి తొలి అడుగు వేసే తరుణం వచ్చేసింది. ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ఈఏపీ సెట్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు వెబ్ ఆప్షన్లపై పూర్తి స్థాయిలో ఆలోచించుకుని తుది నిర్ణయం తీసుకోవాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల్లో ఏలూరు జిల్లా నుంచి 4700 మంది పరీక్ష రాయగా వారిలో ఇంజనీరింగ్ కోర్సుకు 3409 మంది మాత్రమే అర్హత సాధించారు. ఈ కోర్సుల గురించీ తెలుసుకోండి.. ఇంజనీరింగ్లో సంప్రదాయ కోర్సులతో పాటు కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈసీఈ, మెకానికల్, ఈఈఈ, సీఎస్ఈ, సివిల్ వంటి సంప్రదాయ కోర్సులు ఇప్పటికే ఉన్నాయి. కొత్తగా సీఎస్ఈలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ (వీఎల్ఎస్ఐ) డిజైన్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఏరోస్పేస్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, నెట్ వర్కింగ్, అల్గారిథమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామ్ డిజైన్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ హార్డ్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, అగ్రికల్చరల్, మైరెన్, మైనింగ్, స్కిల్ అండ్ టెక్స్టైల్ వంటి కొత్త బ్రాంచిలు వచ్చాయి. ఈ కోర్సుల్లో నైపుణ్యం సాధించినా అపార అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ఆరు ఇంజనీరింగ్ కళాశాలలు ఏలూరు జిల్లాలో ఆరు ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా మొత్తం 4,920 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 1,200 సీట్లు, ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో 900 సీట్లు, ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో 660 సీట్లు, హేలాపురి ఇంజనీరింగ్ కళాశాలలో 420 సీట్లు, ఆగిరిపల్లిలో ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కళాశాలలో 1,320 సీట్లు, నూజివీడు సారథి ఇంజనీరింగ్ కళాశాలలో 420 సీట్లు ఉన్నాయి. ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ షురూ 7 నుంచి షెడ్యూల్ ప్రారంభం 10 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం ఆగస్టు 4 నుంచి తరగతులు ప్రారంభం షెడ్యూల్ ఇలా.. తొలి విడత కౌన్సెలింగ్ జూలై 7 నుంచి 16 వరకూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు జూలై 7 నుంచి 17 వరకూ ఆన్లైన్లో విద్యా ర్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల వరిశీలన జూలై 10 నుంచి 18 వరకూ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం జూలై 19న వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం జూలై 22న సీట్ల కేటాయింపు. జూలై 23 నుంచి 26 వరకూ కళాశాలలో ప్రవేశాలు ఆగస్టు 4 నుంచి తరగతుల ప్రారంభం మలివిడత కౌన్సెలింగ్ జూలై 25 నుంచి 27 వరకూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు జూలై 26 నుంచి 28 వరకూ ఆన్లైన్లో విద్యార్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల పరిశీలన జూలై 27 నుంచి 29 వరకూ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం జూలై 30న వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం ఆగస్టు 1న సీట్ల కేటాయింపు ఆగస్టు 2 నుంచి 5 వరకూ కళాశాలలో ప్రవేశాలు -
వైద్యుడి ఇంట్లో భారీ చోరీ
ఏలూరు టౌన్: ఏలూరు శివారు ఆశ్రం హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్యుడి ఇంట్లో శుక్రవారం పట్టపగటే భారీ చోరీ జరిగింది. ఏలూరు రూరల్ ఆరఽశం ఆస్పత్రిలో దాసరి లోకనాథం సీనియర్ వైద్యుడిగా పని చేస్తున్నారు. ఆయన భార్యతో కలిసి ఆశ్రం హాస్పిటల్ క్వార్టర్స్లోని ఇంట్లో నివాసం ఉంటున్నారు. వ్యక్తిగత పనులపై భార్య ఊరు వెళ్లగా ఆయన ఒక్కరే ఉంటున్నారు. ఈ నేపథ్యం శుక్రవారం ఉదయం యథావిధిగా వైద్యుడు లోకనాథం విధులకు వెళ్లారు. అనంతరం ఇంటికి తిరిగి వచ్చి చూసుకునే సరికి ఇంటి తాళం చెవులు కనిపించలేదు. కొంతసేపు వెదికిన అనంతరం ఆయనే ఇంటి తాళాలు స్వయంగా పగులగొట్టి లోనికి వెళ్లి చూసేసరికి బీరువా పగులగొట్టి ఉంది. బీరువా లోని సుమారు 70 కాసుల బంగారు ఆభరణాలు, వజ్రాలు, ఇతర విలువైన వస్తువులు, నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. వేసిన తాళాలు వేసినట్లే ఉండి లోపల చోరీకి గురికావటంపై ఆయన షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఏలూరు వన్టౌన్ సీఐ సత్యనారాయణ, రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీకి గురైన బంగారు ఆభరణాలు విలువ భారీగా ఉంటుందని, ఇక వజ్రాలు విలువ సుమారు రూ.కోటికి పైగా ఉంటుందని సహచర వైద్యులు గుసగుసలాడుతున్నారు. ఈ వజ్రాలు చోరీ ఇంటి దొంగల పనేనా? లేక బయట నుంచి వచ్చిన దొంగలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వృద్ధుడైన డాక్టర్ తన జీవితకాలం సంపాదించిన బంగారు ఆభరణాలు, నగదు అపహరణకు గురి కావడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. 70 కాసుల బంగారు ఆభరణాలు, వజ్రాలు, నగదు అపహరణ -
వృద్ధులే టార్గెట్గా దాడులు, చోరీలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో వృద్ధులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తూ చోరీలకు పాల్పడుతున్న కేసులను పోలీస్ యంత్రాంగం ఛేదించింది. కై కలూరు రూరల్ పరిధిలో వృద్ధులను కొట్టి బంగారు ఆభరణాలు దోచుకెళ్ళిన దొంగలను పట్టుకున్న పోలీసులు, భారీగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఊలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ కేసుల వివరాలు వెల్లడించారు. కై కలూరు మండలం రామవరంలో ఒంటరిగా జీవిస్తోన్న వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను కై కలూరు రూరల్ సీఐ వి.రవికుమార్ పట్టుకున్నారు. రామవరం గ్రామంలో భర్త చనిపోయి గూడూరు నాగలక్ష్మి ఒంటరిగా ఉంటుంది. మే నెల 28తేదీ రాత్రి 9.20గంటల సమయంలో ఇంట్లోకి చోరబడిన ఇద్దరు దొంగలు ఆమె తలకు ముసుగు వేసి చేతులతో ముఖంపై తీవ్రంగా కొట్టి గోడకు తలను కొట్టారు. ఆమె సృహతప్పి పడిపోవటంతో మెడలోని ఐదు కాసుల బంగారు చైన్, రెండు చేతులకు ఉన్న రెండు బంగారపు గాజులు లాక్కుని చనిపోయిందనే ఉద్దేశ్యంతో పరారయ్యారు. కొంతసేపటికి కోలుకున్న వృద్ధురాలు చుట్టుపక్కల వారి సహాయంతో పోలీస్స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో రూరల్ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కై కలూరు మండలం రామవరం గ్రామానికి చెందిన పంతగాని జాన్కుమార్, గరికిముక్కు రాజ్కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 40 గ్రాముల బంగారు చైన్, 24గ్రాముల రెండు బంగారు గాజులు రికవరీ చేశారు. బంగారు గాజుల చోరీ కై కలూరు మండలం రామవరంలో సోము సీతామహాలక్ష్మి ఒంటరిగా ఉంటూ కిరాణా కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తోంది. అయితే 2024 ఫిబ్రవరి 13న పగటి వేళ ఆమె దుకాణం వద్దకు వెళ్లి ఎవ్వరికీ అనుమానం రాకుండా లోనికి వెళ్లిరెండు బంగారు గాజులు చోరీ చేసి పరారయ్యారు. దీనిపై కై కలూరు రూరల్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీస్ అధికారులు రామవరం గ్రామానికి చెందిన భూపతి ప్రదీప్ అలియాస్ బన్ను, కురెళ్ళ సుబ్బారావు అలియాస్ సుబ్బు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుల నుంచి రూ.1 లక్ష నగదును స్వాదీనం చేసుకున్నారు. రికవరీ సొమ్ము అందజేత కై కలూరు రూరల్ సర్కిల్ పరిధిలో మూడు కేసులు, మండవల్లి స్టేషన్ పరిధిలో మూడు కేసులు, ముదినేపల్లి స్టేషన్ పరిధిలో రెండు కేసుల్లో మొత్తంగా సుమారు రూ.12,21,126 విలువైన బంగారు ఆభరణాలు, ఒక ఆటో, నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఈ రికవరీ నగదు, నగలు, వస్తువులను బాధితులకు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చేతులమీదుగా అందజేశారు. సైబర్ నేరగాళ్ళబారిన పడి పోగొట్టుకున్న మరో రూ.2లక్షల నగదును సైబర్ సెల్ సీఐ దాసు, కానిస్టేబుల్ శివ ఆధ్వర్యంలో రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ అభీబ్ భాషా ఉన్నారు. నలుగురు నిందితుల అరెస్ట్, భారీగా రికవరీ -
●ఇరుకు వంతెనతో యాతన
గరగపర్రులో భీమవరం–తాడేపల్లిగూడెం ప్రధాన రహదారిపై ఉన్న వంతెనపై భారీ కంటైనర్ శుక్రవారం సుమారు రెండు గంటల ప్రాంతంలో ఇరుక్కుపోయింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి, భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వంతెన శిథిలావస్థకు చేరడంతో ఈ వంతెనపై భారీ వాహనాలను అనుమతించేది లేదని గతంలో అధికారులు ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పట్టించుకోకపోవడంతో యథావిధిగా వాహనాలు తిరుగుతున్నాయి. – పాలకోడేరు -
కండిగలమ్మ ఆలయంలో భారీ చోరీ
ద్వారకాతిరుమల: మండలంలోని గుండుగొలనుకుంట గ్రామంలో ఉన్న కండిగలమ్మ, పోతురాజు స్వామి వార్ల ఆలయంలో గురువారం అర్ధరాత్రి సమయంలో భారీ చోరీ జరిగింది. ఈ ఘటనలో అమ్మవారి మూలవిరాట్ మీద ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు, హుండీలోని నగదు చోరీకి గురైంది. ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సుమారు రాత్రి 1 గంట సమయంలో ఆలయం గేట్లకు ఉన్న తాళాలను, ద్వారాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం అమ్మవారి మూలవిరాట్పై ఉన్న రెండున్నర కేజీల వెండి కిరీటం, ఒక వెండి కనురెప్ప, ఒక కాసు బంగారపు కళ్లు, అరకాసు బంగారు మంగళ సూత్రం, ముప్పావు కాసు బంగారు ముక్కుపుడక, బీరువా లోని విలువైన పట్టు చీరలను చోరీ చేశారు. అలాగే హుండీని పగలగొట్టి అందులోని సుమారు లక్ష రూపాయలను చోరీ చేశారు. ఆ తరువాత ఖాళీ హుండీని, అమ్మవారి మెడలోని గిల్టు మంగళ సూత్రాలను, చోరీకి ఉపయోగించిన సమిట, పలుగును ఆలయం పక్కనున్న కోకో తోటలో పడేశారు. రోజూలానే శుక్రవారం ఉదయం ఆలయాన్ని తెరిచేందుకు వెళ్లిన ఆలయ కమిటీ చైర్మన్ చిలుకూరి ధర్మారావు చోరీ జరిగినట్టు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై టి.సుధీర్ ఆలయాన్ని, పరిసర ప్రాంతాలను, తోటలో దుండగులు పడవేసిన హుండీని, చోరీకి ఉపయోగించిన ఆయుధాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ జాగిలంతో తనిఖీలు జరిపారు. అలాగే క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించింది. ధర్మారావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సుధీర్ తెలిపారు. -
మెడికల్ షాప్, ల్యాబ్, క్లినిక్లలో తనిఖీలు
కామవరపుకోట: స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి స్కే బీబీ జాన్, డీఎంహెచ్ఓ కార్యాలయ అడ్వకేట్ వడ్డీ సత్యా రవి స్థానిక కొత్తూరులో ఉన్న మందులు షాపు, క్లినిక్, ల్యాబ్లో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. సాయిరాం క్లినిక్, దుర్గా మెడికల్ షాప్, శ్రీ సాయిరాం డయాగ్నస్టిక్ సెంటర్, సాయిరాం క్లినిక్, సాయిరాం మెడికల్ షాప్లో తనిఖీలు చేయగా సాయిరాం క్లినిక్లో 20 ఏళ్లుగా వైద్యం చేస్తున్న వ్యక్తికి సరైన సర్టిఫికెట్లు లేవని, అతను వైద్యం చేసేందుకు అనర్హుడని గుర్తించారు. శ్రీ సాయిరాం డయగ్నొస్టిక్ సెంటర్ టెక్నీషియన్కు రిజిస్ట్రేషన్ లేదని తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ల్యాబ్లు, క్లినిక్లు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు అధికారులు నివేదికి ఇస్తామని వైద్యాధికారి పి.బీబీ జాన్ తెలిపారు. -
ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తత
కామవరపుకోట : స్థానిక గుర్రాల చెరువు గట్టు వినాయక గుడి వెనుక శుక్రవారం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు చినికి చినికి తీవ్రంగా మారాయి. గురువారం రెండు వర్గాల మధ్య చిన్నపాటి వివాదం జరగ్గా శుక్రవారం మధ్యాహ్నం దానికి కొనసాగింపుగా ఓ వర్గం వారు చేసిన దాడుల్లో ఓ కుటుంబానికి చెందిన టిప్టాప్ సామగ్రి ధ్వంసమై భారీ నష్టం జరిగిందని బాధితులు చెబుతున్నారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్రతో ఆధ్వర్యంలో నలుగురు ఎస్సైలు, పలువురు పోలీసు సిబ్బంది పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు. డీఎస్పీ రవిచంద్ర రాత్రి 8 గంటలు అయినా కూడా అక్కడే ఉండి పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. ఈ సంఘటనపై డీఎస్పీని వివరణ కోరగా వివాదం పూర్తి వివరాలను పరిశీలించి చెబుతానని తెలిపారు. అయితే ఈ వివాదం జరిగిన ప్రాంతంలో ఉన్న భూమిని దేవదాయ శాఖ అధికారులు శుక్రవారం రాత్రి రంగంలోకి దిగి స్వాధీనం చేసుకునే పనులు మొదలు పెట్టారు. ఆ స్థలంలో ఉన్న తూములను కూలీలతో పక్కకు తొలగిస్తున్నారు. -
జల్లేరు ఆధునికీకరణ పనులు ప్రారంభం
బుట్టాయగూడెం: మండలంలోని దొరమామిడి సమీపంలో ఉన్న గుబ్బల మంగమ్మతల్లి జల్లేరు జలాశయం నిర్వహణ పనుల నిమిత్తం రూ. 20 లక్షల నిధులు మంజూరు చేసినట్లు మైనర్ ఇరిగేషన్ ఏఈ టి.సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ నిధులతో గేట్లు, రంగులు వేయడం, ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్, ఆయిల్, గ్రీజు పనులు ఏడాది పాటు నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నట్లు, గతంలో రూ. 8 లక్షల వ్యయంతో స్పిల్వే గేట్లు మరమ్మతులు కూడా పూర్తి చేశామని తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలందించాలి బుట్టాయగూడెం: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందేలా అధికారులు, సిబ్బంది, కృషి చేయాలని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ సాల్మన్రాజు అన్నారు. స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ వద్ద సిబ్బందితో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుట్టాయగూడెం సబ్స్టేషన్ పరిధిలో ప్రజలకు అందించే సేవలపై పలు ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. తీరు మార్చుకుని సక్రమంగా పని చేయాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో 9.2 మిలియన్ యూనిట్ల కరెంట్ వినియోగం జరుగుతున్నట్లు తెలిపారు. రీవెంప్డ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ద్వారా జిల్లాలోని ప్రతి గ్రామంలో 3 ఫేస్ కరెంట్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లాలో నూతనంగా 24 సబ్స్టేషన్లతోపాటు 5 నుంచి 10 పవర్ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు, మధ్యతరగతి వినియోగదారుల కోసం పీఎం సూర్యఘర్ పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. ఈ పథకంలో వినియోగదారులు తమ విద్యుత్ను తామే తయారు చేసుకునే విధంగా ఇళ్లపై సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారన్నారు. ఇప్పటివరకూ 2600 యూనిట్లను రిలీజ్ చేశామని ఈ పథకం అమలులో ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. -
స్నాతకోత్సవానికి గవర్నర్కు ఆహ్వానం
తాడేపల్లిగూడెం: రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ కె.గోపాల్ రాజ్భవన్లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 10న కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం, ఆత్కూర్లోని స్వర్ణభారతి ట్రస్ట్లో నిర్వహించనున్న ఉద్యానవర్సిటీ ఆరో స్నాతకోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఉద్యాన వర్సిటీ సాధించిన ప్రగతిని వీసీ గవర్నర్కు వివరించారు. ఆయన వెంట రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు ఉన్నారు. పార్సిల్ కార్యాలయాల తనిఖీ తాడేపల్లిగూడెం: పట్టణంలోని పార్సిల్ కార్యాలయాలను శుక్రవారం ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్ సీఐ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ పార్సిల్స్ ద్వారా స్పిరిట్, గంజాయి, డ్రగ్స్ వంటివి తరలించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ తనిఖీలు చేస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పార్సిల్ కార్యాలయాలు, కొరియర్ కార్యాలయాలు చట్ట విరుద్ధమైన వస్తువులు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్ఆర్ఎంటీ, నవత, వీఆర్ఎల్ లాజిస్టిక్ , బ్లూడార్ట్, ఆర్టీసీ, రైల్వే పార్సిల్ కార్యాలయాలు, డీటీడీసి, ప్రొఫెషనల్ కొరియర్ సర్వీసుల కార్యాలయాలను, గోదాములను తనిఖీ చేశారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి ముదినేపల్లి రూరల్: చేపల పట్టుబడికి వెళ్లి అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పెదగొన్నూరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఎ.హేమంతరావు ఈ నెల 1న చేపల పట్టుబడికి వెళ్లి ప్రమాదవశాత్తూ తల తిరిగి జారిపడిపోయాడు. చికిత్స నిమిత్తం పెదఅవుటుపల్లి ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం గురువారం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికి త్స పొందుతూ శుక్రవారం మరణించాడు. మృతుడి భార్య రాఘవమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఐచ్ఛిక సెలవులకు అనుమతి ఇవ్వండి
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు క్యాలెండర్ సంవత్సరం ప్రకారం ఐచ్ఛిక సెలవులకు అనుమతులివ్వాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు ఫ్యాప్టో నాయకులు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 5వ తేదీన మొహర్రం, అక్టోబర్ 9న యజ్దహుకు షరీఫ్, నవంబర్ 5న కార్తీక పౌర్ణమి, డిసెంబర్ 26న బాక్సింగ్ డేలను పురస్కరించుకుని ఐచ్ఛిక సెలువులు తీసుకునేందుకు అనుమతులివ్వాలని కోరారు. వినతిపత్రం సమర్పించన వారిలో ఫ్యాప్టో ఛైర్మన్ జీ మోహన్రావు, సెక్రటరీ జనరల్ ఎం.ఆదినారాయణ, ఫ్యాప్టో నాయకులు ఆర్.రవికుమార్, టీ రామారావు, సీహెచ్ శివరామ్ తదితరులున్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలి ఏలూరు (టూటౌన్): హాస్టల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ వై.విశ్వమోహాన్ రెడ్డి ఆదేశించారు. ఏలూరు నగరంలోని బాలికల హాస్టల్ నెంబర్ 1 ను గురువారం సాయంత్రం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో వసతులను, విద్యార్థినులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. హాస్టల్లో సమస్యలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. డ్రాప్ ఔట్ లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హాస్టల్ వార్డెన్కు సూచించారు. డ్రాపవుట్స్ను పాఠశాలల్లో చేర్పించాలి ఏలూరు(మెట్రో): జిల్లాలో 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలందరూ విధిగా పాఠశాలలకు వెళ్లేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు, అధికారులపై కూడా ఉందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి స్పష్టం చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో నేను బడికి పోతా కార్యక్రమం అమలుపై జిల్లాస్థాయి అవగాహన పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. డ్రాపవుట్స్కు సంబంధించి సమాచారం ఇచ్చేందుకు 95333 99981 నంబరుతో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పంటల బీమా పథకంపై అవగాహన ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగినపుడు రైతును ఆర్ధికంగా ఆదుకునేందుకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. జిల్లాలో సార్వా 2025కి వరి పంటకు గ్రామ యూనిట్గా, మినుములు పంటకు జిల్లా యూనిట్గా, పత్తి యాసిడ్ లైన్ పంటలకు మండల యూనిట్గా పంట బీమా అమలు చేయడం జరుగుతుందన్నారు. నేడు మునిసిపల్ కార్మికుల మహాధర్నా ఏలూరు (టూటౌన్): విజయవాడలో శుక్రవారం నిర్వహించనున్న మహాధర్నాకు మునిసిపల్ ఇంజనీరింగ్, పారిశుధ్య విభాగాల కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.సోమయ్య ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. మునిసిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని, పారిశుద్ధ్య విభాగం వారికి 17 రోజుల సమ్మె కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఉదయం 10 గంటలకు విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్లో ఈ మహాధర్నా జరుగుతుందని ఆయన తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్ బృందం పర్యటన భీమవరం (ప్రకాశంచౌక్): స్వచ్ఛ సర్వేక్షన్ ఉత్తమ పంచాయతీలు ఎంపికలో భాగంగా జిల్లాలో 25 గ్రామ పంచాయతీల్లో నేటి నుంచి స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ సెంట్రల్ టీం పర్యటిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. రోజుకి రెండు గ్రామాల చొప్పున జిల్లాలోని 25 గ్రామాల్లో 20 రోజులు ఈ బృందం పర్యటిస్తోందన్నారు. -
బాబు వంచనపై పోరుబాట
రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో ఆవిష్కరణ శురకవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: కూటమి ప్రభుత్వం వంచనపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం కొలువుదీరి ఏడాది గడిచినా ఇచ్చిన హామీలుగాని, సూపర్సిక్స్ హామీలు అమలు చేయని వైనంపై ప్రజా క్షేత్రంలో నిరంతర ఉద్యమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పార్టీ పిలుపుమేరకు బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ పేరుతో ఉమ్మడి పశ్చిమగోదావరిలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా జిల్లాస్థాయి సన్నాహాక సమావేశాలు శుక్రవారం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ రెండు జిల్లాలో జరిగే సమావేశాల్లో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న కార్యక్రమంపై సన్నాహక సమావేశం శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఏలూరు జిల్లాలోని పెదవేగి మండలం కొండలరావుపాలెంలో దెందులూరు నియోజకవర్గ ఇన్చార్జి కొఠారు అబ్బయ్యచౌదరి క్యాంపు కార్యాలయంలో నిర్వహించనున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు భీమవరంలోని ఆనంద్ ఇన్లో నిర్వహించనున్నారు. ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు వంకా రవీంద్ర, మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్, పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్, పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, నియోజకవర్గ సమన్వయకర్తలు మేకా వెంకట ప్రతాప అప్పారావు, పుప్పాల వాసుబాబు, తెల్లం బాలరాజు, మామిళ్ళపల్లి జయప్రకాష్, కంభం విజయరాజుతోపాటు పార్టీ ముఖ్యులు, మండల నియోజకవర్గ నేతలు పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం పశ్చిమగోదావరిలో జరిగే సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజుతో పాటు పార్లమెంట్ ఇన్చార్జి గూడూరి ఉమాబాల, పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు గుడాల గోపి, చినమిల్లి వెంకట్రాయుడు, పీవీఎల్ నర్సింహరాజుతో పాటు పార్టీ ముఖ్యులు హాజరుకానున్నారు. న్యూస్రీల్దెందులూరులో టీడీపీ చిల్లర రాజకీయాలు ఏలూరు జిల్లా స్థాయి సమావేశాన్ని అడ్డుకోవడానికి అధికార టీడీపీ చిల్లర రాజకీయాలకు తెరతీసింది. తొలుత పెదపాడు మండలంలోని వట్లూరులోని శ్రీకన్వెన్షన్లో సమావేశాన్ని ఖరారు చేసి ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి చిల్లర రాజకీయాలతో కన్వెన్షన్ నిర్వాహకులపై ఒత్తిడి తెచ్చి సమావేశాన్ని అక్కడ జరగకుండా అడ్డుకున్నారు. అలాగే మరో రెండు ఫంక్షన్ హాల్స్కు కూడా ముందుస్తు హెచ్చరికలు జారీ చేసి అడ్డుకున్నారు. ఈ క్రమంలో వేదికను పెదవేగి మండలంలోని కొండలరావుపాలెంలోని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. దగాపై ధర్మాగ్రహం ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ పేరిట వైఎస్సార్ సీపీ నిలదీత నేడు జిల్లాస్థాయి సమావేశాలకు రీజనల్ కోఆర్డినేటర్ బొత్స హాజరు ఉదయం కొండలరావుపాలెంలో ఏలూరు జిల్లాస్థాయి.. మధ్యాహ్నం భీమవరంలో ‘పశ్చిమ’ జిల్లాస్థాయి సమావేశం రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో ఆవిష్కరణ ఇంటింటికీ వైఎస్సార్సీపీ శ్రేణులు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 14 నియోజకవర్గాల్లో రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహించడానికి వీలుగా రెండు జిల్లాల్లో జరిగే సమావేశాల్లో మేనిఫెస్టో పోస్టర్ను ఆవిష్కరించి కార్యక్రమం నిర్వహించాల్సిన తీరు విధి విధానాలపై శ్రేణులకు వివరించనున్నారు. సూపర్ సిక్స్ పేరుతో హామీలు, రాష్ట్రస్థాయిలో లెక్కకు మించిన హామీలు, జిల్లా స్థాయిలో పదుల సంఖ్యలో హామీలిచ్చి ఏడాది గడిచినా ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం, చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత రాజకీయాలు, ఎన్నికల సమయంలో ప్రతి పథకానికి ఎంత నగదు కుటుంబానికి జమ అవుతుందో వివరిస్తూ టీడీపీ ఇచ్చిన ఎన్నికల బాండ్ల మోసాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించేలా ఐదు వారాలు పాటు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా 4వ తేదీన దెందులూరు, 5న చింతలపూడి, పోలవరం, 6న నూజివీడు, 7న ఉంగుటూరు, 8న కై కలూరు, 10వ తేదీన ఏలూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా పార్టీ ముఖ్యులు నిర్ణయించారు. -
గడువు తీరిన కందిపప్పు సరఫరా
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి జూలై నెలకు సంబంధించిన అంగన్వాడీ సరుకుల్లో గడువు తీరిన కందిపప్పును రేషన్ దుకాణాలకు చేరవేశారు. ప్రతినెలా రేషన్ దుకాణాలకు చెందిన సరుకులతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు చెందిన బియ్యం, కందిపప్పు, నూనె ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సరఫరా చేస్తారు. అయితే ఈనెల పంపిన సరుకుల్లో కందిపప్పు ప్యాకెట్లు గడువు తీరిపోయినట్టు అంగన్వాడీ అధికారులు గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ఇప్పటికే జంగారెడ్డిగూడెం మండలంలోని 54 రేషన్ దుకాణాలకు గత నెల 20 నుంచి అంగన్వాడీ సరుకులతో పాటు కందిపప్పును కూడా పంపించేశారు. కందిపప్పు ప్యాక్ చేసిన 5 నెలలలోపు వాడాలని ప్యాకెట్పై రాసి ఉంది. గత నెలలో డిసెంబర్లో ప్యాక్ చేసిన కందిపప్పును అంగన్వాడీ కేంద్రాలకు పంపగా అంగన్వాడీ అధికారులు గుర్తించి మార్చి తీసుకువచ్చారు. ఈ నెలలోనూ జనవరి నెలలో ప్యాక్ చేసిన కందిపప్పు ప్యాకెట్లను పంపించారు. ఈ కందిపప్పునూ వెనక్కి పంపాలని ఎంఎల్ఎస్ పాయింట్ అధికారులు డీలర్లకు తెలిపారు. గడువు తీరిన కందిపప్పును డీలర్లకు పంపడం విమర్శలకు తావిస్తోంది. కాగా కొత్త కందిపప్పు కూడా ఎంఎల్ఎస్ పాయింట్కు చేరుకుందని అధికారులు తెలిపారు. -
మొరాయిస్తున్న బస్సులతో అవస్థలు
జంగారెడ్డిగూడెం: ఆర్టీసీ బస్సులు తరచూ మొరాయిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జంగారెడ్డిగూడెంకు చెందిన బస్సులు ఇటీవల మార్గమధ్యలో ఆగిపోతుండడంపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అత్యవసర పనులపై వెళ్లే వారు ఆర్టీసీ అంటనే హడలెత్తిపోతున్నారు. తరచూగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా ఆర్టీసీ అధికారులు కొత్త బస్సులు ఏర్పాటు చేయడం లేదని, బస్సులకు సరైన మరమ్మతులు నిర్వహించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రయాణం నరకప్రాయం ఏపీఎస్ ఆర్టీసీ అంటే పేద, బడుగు, బలహీన వర్గాల సొంత వాహనంగా పేరుంది. కాని నేడు ఆ బస్సుల్లో ప్రయాణించాలంటే నరకం చూడాల్సిన పరిస్థితి. నిత్యం ఎక్కడో చోట ఏదో ఒక బస్సు రోడ్డుపై ఆగిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ ప్రకటనలు గుప్పిస్తోంది. కానీ తరచుగా బస్సులు బ్రేక్డౌన్ కావడంతో ఉచిత బస్సు ప్రయాణం దేవుడెరుగు, కనీసం మంచి కండీషన్లో ఉన్న బస్సులను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆమ్మో ఆర్టీసీ ● ఇటీవల జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం నుంచి పెదవేగి మండలం కొండలరావుపాలెం పెళ్లి నిమిత్తం పెళ్లివారు బస్సును మాట్లాడుకున్నారు. మార్గమధ్యలో వడ్లపల్లి వద్ద బస్సు ఆగిపోయింది. దీంతో పెళ్లి సమయానికి బంధువులు వెళ్లలేకపోయారు. కాలం చెల్లిన బస్సులు పెళ్లి వారికి పంపించడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ● జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు కామవరపుకోట మండలం తడికలపూడి వద్ద గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఆగిపోయింది. డ్రైవర్ గేరు మార్చుతుండగా గేర్ రాడ్ ఊడి డ్రైవర్ చేతిలోకి వచ్చేసింది. దీంతో బస్సు ఆగిపోయింది. రాత్రి సమయంలో బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. అరగంట తర్వాత జంగారెడ్డిగూడెం నుంచి వచ్చిన మరో బస్సులో ప్రయాణికులు ఏలూరు చేరుకుని ఊపిరి పీల్చుకున్నారు. -
దోమలపై దండెత్తరే?
వర్షపు నీరు నిలిచిపోయి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా తయారయ్యాయి. దోమల విజృంభణతో విష జ్వరాల బెడద ఆందోళనకు గురిచేస్తోంది. 8లో uనేడు ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ ప్రారంభం కై కలూరు: ఎన్నికల హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసంపై ప్రజలకు వివరించేందుకు ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామంలో శుక్రవారం ప్రారంభిస్తున్నామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) చెప్పారు. దెందులూరు పార్టీ ఇన్చార్జి కొఠారు అబ్బయ్య చౌదరి క్యాంప్ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు జిల్లా విస్తృత స్థాయి సమావేశం, దెందులూరు నియోజకవర్గ సమావేశం జరుగుతోందన్నారు. కై కలూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఉదయం 8.00 గంటలకు కై కలూరు ఏలూరు రోడ్ పార్టీ కార్యాలయానికి చేరుకోవాలన్నారు. పట్టిసీమ నీరు విడుదల పోలవరం రూరల్: పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం నీటిని విడుదల చేశారు. ముందుగా 24 పంపులకు పూజలు నిర్వహించి కుడి కాలువలోకి నీరు విడుదల చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం రెండు పంపుల ద్వారా కుడి కాలువలోకి నీరు విడుదల చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీటి విడుదలను క్రమేపీ పెంచే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు. అనంతరం డెలివరీ సిస్టమ్ వద్ద గోదావరి నీటికి పూజలు నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
సొసైటీ కార్యాలయానికి తాళాలు
టి.నరసాపురం: డిపాజిట్లు చెల్లించడం లేదని ఆగ్రహించిన రైతులు టి.నరసాపురం సహకార సంఘ కార్యకలాపాలను గురువారం స్తంభింపజేశారు. కార్యాలయ సిబ్బందిని బయటకు రప్పించి వారితోనే సంఘ కార్యాలయానికి తాళాలు వేయించారు. ఉన్నతాధికారులు స్పందించి డిపాజిట్లు చెల్లించేవరకు తమ నిరసన కొనసాగుతుందని, సంఘ కార్యకలాపాలు జరగనివ్వబోమని స్పష్టం చేశారు. టి.నరసాపురం సహకార సంఘంలో అవకతవకలు బయట పడటంతో రెండేళ్ల క్రితం సహకార సంఘ పాలకవర్గాన్ని తొలగించి అప్పటి సీఈవోను సస్పెండ్ చేశారు. కొద్ది మంది సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. ప్రభుత్వ అధికారులను త్రిసభ్య కమిటీగా నియమించి సంఘ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే దాదాపు 370 డిపాజిట్లకు సంబంధించి రూ.15 కోట్లకు పైగా రైతులకు చెల్లించాల్సి ఉంది. రైతులకు ఆ బాండ్లకు సంబంధించి మెచ్యూరిటీ సొమ్ము చెల్లించడం గాని, బాండ్లు క్యాన్సిల్ చేసుకున్న సొమ్ము చెల్లించడం గాని, ఎస్బీ ఖాతాల్లో ఉన్న సొమ్ము నిల్వలు చెల్లించడం గాని చేయడం లేదు. గత మార్చి వరకు డిపాజిట్ల సొమ్మును బాకీదారుల బకాయిల్లో జమ చేసుకునేవారు. ఏప్రిల్ నుంచి ఆ డిపాజిట్ల సొమ్మును కూడా బాకీలకు జమ చేసుకోవడం నిలిపివేశారు. దాంతో ఆగ్రహించిన రైతులు తమ డిపాజిట్ల సొమ్ములు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరేవరకు కార్యాలయ కార్యకలాపాలు జరగనివ్వబోమని స్పష్టం చేశారు. సీఈవో అగస్టీన్ మాట్లాడుతూ ఇక్కడ పరిస్థితి ఉన్నతాధికారుల దృష్టిలో ఉందని, మరోసారి ఆయా అధికారుల దృష్టికి తీసుకువెళతానన్నారు. టి.నరసాపురం సొసైటీ వద్ద రైతుల నిరసన డిపాజిట్ల సొమ్ములు చెల్లించడం లేదని ఆగ్రహం -
కొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలి
రౌండ్టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్ కృష్ణలంక (విజయవాడ తూర్పు): కొల్లేరును 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదించాలని, కొల్లేరు ప్రజలకు ఉరితాడుగా మారిన 120 జీఓను రద్దు చేయాలని, పర్యావరణంతో పాటు స్థానికుల జీవనోపాధిని కాపాడాలని రౌండ్టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రైతు సంఘం సీనియర్ నాయకుడు వై.కేశవరావు అధ్యక్షతన గురువారం కొల్లేరు ప్రజల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొల్లేరు ప్రజల ప్రస్తుత సమస్యలను పరిష్కరించడానికి బదులుగా వారు కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని విమర్శించారు. కొల్లేరు ప్రజలకు హానికరమైన ఎకో సెన్సిటివ్ జోన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కొల్లేరు ప్రజల సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కొల్లేరు ప్రజలకు సీపీఎం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతు సంఘం సీనియర్ నాయకుడు వై.కేశవరావు మాట్లాడుతూ.. మూడో కాంటూరు నుంచి ఐదో కాంటూరు వరకు పది కిలోమీటర్ల దూరంలో సున్నితమైన పర్యావరణ ప్రాంతం పేరుతో 26 నిబంధనలు విధించి మొత్తం కొల్లేరును పూర్తిగా అటవీ శాఖ చేతుల్లో పెట్టబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావం నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, ఏలూరు, పెదపాడు, మండవల్లి, కై కలూరు, ఆకివీడు మండలాల్లోని కొల్లేటి ప్రాంతంలోని 89 గ్రామాలపై పడుతుందన్నారు. అధికారులు తూతూ మంత్రంగా ప్రజాభిప్రాయాలను సేకరించి నివేదికలు పంపించడం దారుణమన్నారు. ఎకో సెన్సిటివ్ జోన్పై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేసి ఆమోదించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు. -
ఆన్లైన్ బిజినెస్ పేరిట మోసం
ఏలూరు టౌన్: ఆన్లైన్ బిజినెస్ పేరుతో ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టిన ఓ మహిళ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంది. ఆమె నుంచి సైబర్ నేరగాళ్లు భారీగా సొమ్ములు కాజేశారు. తాను మోసపోయాయని గ్రహించిన బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించగా కేసును ఛేదించి సొమ్ము రికవరీ చేశారు. ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒక మహిళ సోషల్ మీడియాలో వాట్సాప్, టెలీగ్రామ్ గ్రూపుల్లో వచ్చిన ట్రేడింగ్, బిట్కాయిన్, క్రిప్టోకరెన్సీ పేర్లతో అధిక లాభాలు వస్తాయనే ఆశతో సొమ్ములు పెట్టుబడి పెట్టింది. బాధిత మహిళ నుంచి రూ.2,56,000 సైబర్ నేరగాళ్లు కాజేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసు 290/2024 సెక్షన్ 318(4) బీఎన్ఎస్, 66(సీ)(డీ) ఐటీ యాక్ట్ నమోదు చేశారు. ఏలూరు టూటౌన్ సీఐ కే.అశోక్కుమార్, ఎస్సై మధు వెంకటరాజా ఆధ్వర్యంలో సైబర్ సెల్ సీఐ దాసు, మహిళా ఎస్సై వల్లీపద్మ కేసును ఛేదించారు. సొమ్మును ఫ్రీజ్ చేయించి, తిరిగి రికవరీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల మాయమాటలకు మోసపోవద్దని సూచించారు. ఏదైనా ఆన్లైన్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని చెప్పారు. నకిలీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ పేరుతో జరిగే మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రూ.2.56 లక్షలు పొగొట్టుకున్న మహిళ కేసును ఛేదించి సొమ్ము రికవరీ చేసిన పోలీసులు మహిళకు సొమ్ము అందజేసిన ఎస్పీ -
సోలార్ లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు
బుట్టాయగూడెం : మండలంలోని ప్రసిద్ధ గుబ్బల మంగమ్మ గుడికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సోలార్ ద్వారా లైట్స్, ఫ్యాన్లు, సీసీ కెమెరాలతోపాటు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధి కొర్సా గంగరాజు మాట్లాడుతూ తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకునే భక్తులు చీకటిగా ఉండడంతో మంగమ్మతల్లిని దర్శించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో టెల్ టవర్స్ సోలార్ కంపెనీ ద్వారా మంగమ్మతల్లి ఆలయం వద్ద సోలార్ కరెంట్ సదుపాయం, సీసీ కెమెరా, ఫ్యాన్లు, మంచినీటి సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 14 నెలల తర్వాత బంగారం చోరీపై కేసు నమోదు కై కలూరు: బంగారు గాజులు చోరీ జరిగిన 14 నెలల తర్వాత ఓ మహిళ కై కలూరు రూరల్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేసింది. రామవరం గ్రామానికి చెందిన సోము సీతామహాలక్ష్మీ(62) భర్త ఆరేళ్ల క్రితం మరణించాడు. కుమారుడు ఇతర ప్రాంతంలో ఉంటాడు. ఆమె ఇంటి వద్ద కిరాణా దుకాణం నడుపుతోంది. అయితే 2024 ఫిబ్రవరి 13న ఆమె రెండు బంగారు గాజులు గల్లా పెట్టెలో వేసి స్నానానికి వెళ్లింది. తిరిగి వచ్చి చూసుకునేసరికి కనిపించలేదు. కొన్నాళ్లు వెతికి ఊరుకుంది. ఇటీవల కుమారుడు ఇంటికి రావడంతో అతడికి విషయం చెప్పింది. దీంతో అతని సలహా మేరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు రూరల్ ఎస్సై రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో వ్యక్తిపై బ్లేడుతో దాడి భీమవరం: స్థానిక టూ టౌన్ ఏరియా బైపాస్ రోడ్డు దగ్గర ఓ వ్యక్తిని బ్లేడుతో గొంతుకోసిన సంఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లంకపేటకు చెందిన సీహెచ్ సాయిబాబు, ఎస్కే వినోద్ ఇద్దరూ ఓ చోట మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో ఇద్దరూ సరదా కబుర్లతో కోడిగుడ్లు విసురుకున్నారు. అంతలోనే వినోద్ కోపోద్రిక్తుడై బ్లేడుతో సాయిబాబు గొంతు కోసి పారిపోయాడు. బాధితుడు ప్రస్తుతం భీమవరం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సీఐ జి.కాళీచరణ్, పోలీసులు బృందాలుగా వెళ్లి నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
దోమలపై దండెత్తరే?
వైఎస్సార్ సీపీ హయాంలో.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పట్టణాలు, పల్లెల్లో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ ద్వారా దోమల నిర్మూలన చర్యలు చేపట్టేవారు. డ్రెయినేజీల్లో ఆయిల్బాల్స్, స్ఫ్రేయింగ్ చేయించేవారు. క్రమం తప్పకుండా ఫాగింగ్ జరిగేది. జ్వరపీడితులను గుర్తించేందుకు వలంటీర్లు, ఆరోగ్య సిబ్బందితో ఇంటింటా ఫీవర్ సర్వే చేయించి రోగులకు వైద్య సాయం అందించేవారు. దోమల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై వలంటీర్లతో ఇంటింటా అవగాహన కల్పించేవారు. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు కానరావడం లేదని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఇండస్ట్రీయల్ ఏరియా, చినరంగనిపాలెం, బందరుపుంత, గంగమ్మగుడి ఏరియా, హౌసింగ్బోర్డు కాలనీ, మెంటే వారితోట, టిడ్కో ప్లాట్లు తదితర డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయి. పలుచోట్ల మురుగునీరు నిలిచిపోయి అపారిశుద్ధ్యంతో దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. తమ వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేదని, వారం పది రోజులకు డ్రెయినేజీలను శుభ్రం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల నిర్మూలనకు పురపాలక సంఘం రూ. 10 లక్షలు బడ్జెట్లో కేటాయిస్తుండగా నివారణ చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయంటున్నారు. దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.సాక్షి, భీమవరం : ప్రస్తుతం రుతుపవనాల రాకతో జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా పట్టణాలు, పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతున్న దాఖలాలు లేవు. ఎక్కడికక్కడ డ్రెయినేజీలపై గడ్డి, పిచ్చిమొక్కలతో అధ్వానంగా ఉన్నాయి. ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిలిచిపోయి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా తయారయ్యాయి. దోమల విజృంభణతో విష జ్వరాల బెడద ఆందోళనకు గురిచేస్తోంది. భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాలు, ఆకివీడు నగర పంచాయతీల్లో దోమల నిర్మూలన పేరిట రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలు వరకు బడ్జెట్లో కేటాయిస్తున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో 409 పంచాయతీలు ఉండగా పెద్ద పంచాయతీల్లో రూ.రెండు లక్షలు వరకు, చిన్న పంచాయతీల్లో రూ. 25 వేలు నుంచి రూ. లక్ష వరకు వెచ్చిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రూ. 5 కోట్లకు పైగానే కేటాయిస్తున్నట్టు అంచనా. కానరాని నిర్మూలన చర్యలు దోమల నిర్మూలన చర్యల్లో భాగంగా లార్వా దశలోనే వాటిని నిర్మూలించేందుకు డ్రెయినేజీలు, నీరు నిల్వ ఉండే ఖాళీ ప్రదేశాలను శుభ్రం చేయించి ఆయిల్ బాల్స్, కెమికల్స్ స్ప్రేయింగ్, సాయంత్ర వేళల్లో ఫాగింగ్ చేయించాలి. డ్రెయినేజీల్లో నీరు నిల్వ ఉండకుండా మురుగునీరు పారే విధంగా ప్రతిరోజూ శుభ్రం చేయించాలి. క్షేత్రస్థాయిలో ఈ చర్యలు తూతూమంత్రంగానే ఉంటున్నాయి. నిధుల లేమితో పంచాయతీల్లో ఫాగింగ్ ఊసే ఉండటం లేదు. పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం పట్టణాల్లోనూ ఫాగింగ్ జరగడం లేదని స్థానికులు అంటున్నారు. దీంతో పట్టణాలు, గ్రామాల్లో దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దండయాత్ర ఊసేది? ‘దోమలపై దండయాత్ర’ అంటూ గతంలో టీడీపీ అధికారంలో ఉండగా సీఎం చంద్రబాబు హడావుడి చేసిన విషయం విధితమే. పట్టణాలు, గ్రామాల్లో డ్రెయినేజీలను శుభ్రం చేయడం, తుప్పలు తొలగించడం, చెత్తను ఎత్తడం తదితర కార్యక్రమాలకు అప్పట్లో పిలుపునిచ్చారు. ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో ఎక్కడికక్కడ ప్రచార ఆర్భాటంగానే దండయాత్ర సాగింది. పారిశుద్ధ్య కార్మికులతో పనులు చేయించి, ఉపాధ్యాయులు, విద్యార్థులతో ర్యాలీలు చేయించి మమ అనిపించడంతో అప్పట్లో ఈ కార్యక్రమంపై విమర్శలు వెల్లువెత్తాయి. రోజుకు రూ.50 లక్షలకుపైగా ఖర్చు జిల్లా జనాభా 18.48 లక్షలు. అర్బన్, రూరల్ ఏరియాల్లో నాలుగు లక్షలకు పైగా నివాస గృహాలు ఉన్నాయి. దాదాపు 4.62 లక్షల కుటుంబాలు నివసిస్తుండగా ఉపాధి కోసం ఒరిస్సా, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు మరో లక్షకు పైగా ఉంటారు. దోమల బెడద నుంచి ఉపశమనం కోసం కాయిల్స్, స్టిక్స్, కెమికల్స్ తదితర వాటిపై సగటున ఒక్కో కుటుంబం రోజుకు రూ.10 చొప్పున జిల్లావ్యాప్తంగా రూ.50 లక్షలకు పైగానే వెచ్చిస్తున్నట్టు అంచనా. ఇప్పటికై నా మున్సిపల్, పంచాయతీ అధికారులు స్పందించి దోమల నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతికూల వాతావరణంలో పడకేసిన పారిశుద్ధ్యం గతంలో దోమలపై దండయాత్ర పేరిట హడావుడి చేసిన టీడీపీ ప్రభుత్వం డ్రెయినేజీలు శుభ్రం చేయడం లేదు వర్షాకాలం కావడంతో ప్రస్తుతం దోమలు బెడద చాలా ఎక్కువగా ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వర్షాకాలంలో డ్రెయిన్లు శుభ్రం చేసేవారు. దోమల మందు, బ్లీచింగ్ పౌడర్ క్రమం తప్పకుండా చల్లేవారు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. పగలు, రాత్రి తేడా లేకుండా దోమలు దండయాత్ర చేస్తున్నాయి. – నలభ పోతురాజు, ఎనంఆర్పీ అగ్రహారందోమల బెడద ఎక్కువగా ఉంది భీమవరం టిడ్కో ప్లాట్లలో నివాసం ఉంటున్నాం. మా ప్రాంతంలో దోమలు బెడద ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నాం. దోమల నివారణకు ఫాగింగ్ చేయడంగాని, నివారణ చర్యలు తీసుకోవడం లేదు. దోమలతో రాత్రిళ్లు కంటిమీద కునుకు ఉండటం లేదు. రాత్రిళ్లు రెండు కాయిల్స్ వెలిగిస్తున్నా తర్వాత మామూలుగా వచ్చేస్తున్నాయి. – వై.వీర్రాజు, భీమవరం -
అప్రమత్తతతో రక్తహీనత దూరం
పాడి–పంటజంగారెడ్డిగూడెం: రక్తహీనత అనేది మనుషులతో పాటు పశువులనూ ఇబ్బంది పెట్టే ప్రధాన వ్యాధి. పశువుల విషయానికి వస్తే ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడం లేదా హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడం వల్ల రక్తంలో ఆమ్లజనకం సరఫరా తగ్గిపోవడం వల్ల రక్తహీనత వేధిస్తుంది. రక్తహీనత వల్ల పశువులు మేత మానేసి, పనిలో బలహీనత ఉంటాయి. దీంతో ఆవులు, గేదెల రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. రక్తహీనత తగ్గించే చర్యలు చేపట్టి పాడి అభివృద్ధిని మెరుగుపరిచే సూచనలు, సలహాలు పశువైద్యాధికారి బీఆర్ శ్రీనివాసన్ వివరించారు. రక్తహీనత లక్షణాలు బలహీనత, అలసట, తెల్లబడ్డ లేదా పసుపు కొమ్ములు, మేత, నీరు తీసుకునే అలవాటు తగ్గిపోవడం, శ్వాసకష్టం, బరువు తగ్గడం, పని సామర్థ్యం తగ్గిపోవడం చికిత్స విధానాలు ● అల్లోపతి విధానంలో : తీవ్ర రక్తహీనతకు రక్త మార్పిడి అవసరం కావచ్చు. ● ఐరన్ లోపం కారణంగా రక్తహీనత ఉన్నప్పుడు ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వాలి. ● కీటకాల నివారణ, పరాన్నజీవాల మీద కట్టడి చేయడం ద్వారా రక్తహీనత నివారించవచ్చు. ● బాక్టీరియా లేదా పకిటీరియా సంక్రమణకు యాంటీబయోటిక్స్ ఇవ్వాలి. నేచురోపతి విధానంలో.. ● పచ్చ కూరలు, ఆకుకూరలు, ఆహారంలో ఇనుమును ఐరన్ను చేర్చాలి. ● హెర్బల్ చికిత్సా విధానంలో నెటిల్, స్పిరులినా వంటి ఐరన్ అధికంగా ఉన్న ఉత్పత్తులు ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. ● ఆక్యు పంక్చర్ విధానంలో చికిత్స రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. హోమియోపతి విధానం ఫెర్రఫోస్పోరికమ్ చికిత్సలో రక్తహీనత ప్రారంభ దశలో ఉత్పత్తి స్థాయిలు పెంచడానికి ఉపయోగపడుతుంది. చైనా ఆఫిసినాలిస్ చికిత్సలో రక్త పోత తర్వాత రక్తహీనత ఉన్న జంతువులకు ఇది ఇవ్వవచ్చు. నాట్రమ్ మురియాటికమ్ చికిత్సలో జిగురు తగ్గిన రక్తహీనతకు ఉపయోగపడుతుంది. ఆర్సెనికమ్ ఆల్బమ్ చికిత్సలో తీవ్ర బలహీనత, శ్వాసకష్టం ఉన్న రోగులకి ఇది ఇవ్వవచ్చు. చికిత్సతో రక్తహీనత దూరం రక్తహీనతకు సమయానుకూలంగా చికిత్స ఇవ్వడం చాలా ముఖ్యం. అల్లొపతి, నాచురోపతి, హోమియోపతి పద్ధతులను సమ్మిళితం చేసి, వెటర్నరీ డాక్టర్ సలహా మేరకు జాగ్రత్తలు తీసుకుంటే, రోగం నుంచి కోలుకోవడం సులభం. – బీఆర్ శ్రీనివాసన్, పశు వైద్యాధికారి -
ఇంటి స్థలం వివాదం.. ఇద్దరిపై దాడి
నూజివీడు: మండలంలోని గొల్లపల్లిలో ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరొకరి చేతికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బోనాల నాగేంద్రబాబు(34), బోనాల దశరథ రామాంజనేయులు ఇద్దరూ అన్నదమ్ములు. వీళ్లతో పాటు వాళ్ల బాబాయ్ బోనాల శ్రీనివాసరావులకు కలిపి ఏడు సెంట్ల ఇళ్ల స్థలం ఉంది. దీనిలో చెరి సగం కాగా బోనాల శ్రీనివాసరావు మొత్తం నాదేనంటూ బోనాల నాగేంద్రబాబు, దశరథ రామాంజనేయులను రానీయడం లేదు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇళ్ల స్థలంలోకి వెళ్లగా బోనాల శ్రీనివాసరావుతో పాటు అతని కుమారులు, భార్య కలిసి నాగేంద్రబాబు, బోనాల దశరథ రామాంజనేయులపై కత్తితో దాడి చేసి కొట్టారు. దీంతో నాగేంద్రబాబుకు తలపై తీవ్ర గాయమైంది. దశరథరామాంజనేయులకు చేతిపై దెబ్బ తగిలింది. దీంతో స్థానికులు వారిని హుటాహుటిన నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 51 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత నూజివీడు: పట్టణంలోని బైపాస్ రోడ్డులో బుధవారం అర్ధరాత్రి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ట్రక్కు వాహనంలో తరలిస్తున్న అక్రమ బియ్యాన్ని పట్టుకున్నారు. వారికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు బైపాస్ రోడ్డులో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో 51 క్వింటాళ్లు రేషన్ బియ్యం ఉన్నట్లుగా గుర్తించారు. ఈ బియ్యం ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట ఏరియా నుంచి హనుమాన్ జంక్షన్కు రవాణా చేస్తున్నారు. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని, బియ్యాన్ని సీజ్ చేశారు. వాహన డ్రైవర్ నక్కా శివ, రేషన్ బియ్యం సరఫరాదారులు ధనికొండ గోపిరాజు, ధనికొండ గణేష్, వారికి సాయం చేస్తున్న ఖాసీంబాబు, వాహన యజమాని నక్కా నాగగోపాలకృష్ణలపై 6ఏ, 7(1)కేసులను నమోదు చేశారు. విజిలెన్స్ ఎస్సై నాగరాజు, హెచ్సీ వెంకటేశ్వరరావు, సీఎస్ డీటీ జి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైలు నుంచి జారిపడి ఉపాధ్యాయుడి మృతి ఏలూరు టౌన్: నగరంలోని ఫిల్హౌస్ పేటకు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు నేతల చంద్రశేఖర్ ఆజాద్ (51) రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ఏలూరు రైల్వే ఎస్సై పి.సైమన్ తెలిపిన వివరాల ప్రకారం వన్టౌన్ ఫిల్హౌస్ పేటకు చెందిన చంద్రశేఖర్ ఆజాద్ శ్రీపర్రు జెడ్పీస్కూల్లో బయాలజీ టీచర్గా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి విజయవాడలోని తన సోదరుడి ఇంటికి వెళ్లేందుకు ఏలూరు రైల్వేస్షేషన్లో కాకినాడ–తిరుపతి రైలు ఎక్కాడు. రైలు వట్లూరు సమీపానికి వచ్చేసరికి రైలు నుంచి ప్రమాదవశాత్తూ జారిపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఆజాద్ విజయవాడ చేరుకోలేదని తెలియడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు. గురువారం మధ్యాహ్నం రైల్వే గ్యాంగ్మెన్ ఓ మృతదేహాన్ని గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే ఎస్సై సైమన్ మృతుడిని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. -
ఆటో, బ్యాటరీల దొంగల అరెస్ట్
భీమవరం: జల్సాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడి ఆటోలు, బ్యాటరీ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి సుమారు రూ. 23 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నటు ఏఎస్పీ వి భీమారావు చెప్పారు. గురువారం భీమవరం వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. వీరవాసరం గ్రామానికి చెందిన కంచర్ల శ్రీరామ్కుమార్ లారీలను కిరాయికి తిప్పుతుంటాడు. ఈ క్రమంలో పట్టణంలోని మెంటేవారితోట బైపాస్ రోడ్డులోని లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం వద్ద జూన్ 14న తన మూడు లారీల పార్క్చేసి ఉంచగా వాటిలోని 6 బ్యాటరీలు దొంగిలించారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్టౌన్ ఎస్సై ఎస్వీవీఎస్ కృష్ణాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో పట్టణానికి చెందిన తీగల నరేంద్రభవాని, పైలా రాకేష్, యలగడ కోదండశివసాయివెంకట సత్యనారాయణలను అదుపులోనికి తీసుకుని విచారించగా భీమవరం వన్ టౌన్, భీమవరం టూ టౌన్, కాళ్ల, ఆకివీడు, ఉండి, వీరవాసరం, పాలకోడేరు పోలీసుస్టేషన్ల పరిధిలో దొంగిలించిన 65 బ్యాటరీలు దొంగతనం చేసినట్లు గుర్తించారు. దీంతో వారి వద్ద నుంచి సుమారు రూ. 6 లక్షల విలువైన 65 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ భీమారావు చెప్పారు. ఇద్దరు ఆటోల దొంగల అరెస్టు భీమవరం పోలీసు సబ్డివిజన్ పరిధిలో ఇటీవల ఆటో దొంగతనాలు ఎక్కువ జరగడంతో భీమవరం టుటౌన్ పోలీసుస్టేషన్ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 2న కృష్ణా జిల్లా మండవల్లి మండలం పేరికిగూడెం గ్రామానికి చెందిన పరస నాగరాజును అరెస్ట్ చేసి విచారించారు. విచారణలో భీమవరం పట్టణంలోని వన్టౌన్, టూటౌన్, రూరల్, ఆకివీడు, అమలాపురం, వైజాగ్ వన్టౌన్, టూటౌన్, మండవల్లి ప్రాంతాల్లో 13 ఆటోలను దొంగతనాలు చేశానని నేరం అంగీకరించారు. దీంతో నాగరాజుతో పాటు అనకాపల్లి మండలం సబ్బవరం గ్రామానికి చెందిన పోలిశెట్టి గణేష్లను అరెస్టు చేసి వారి నుంచి సుమారు రూ. 17 లక్షల విలువైన 10 ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ భీమారావు చెప్పారు. సమావేశంలో భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య, సీఐలు ఎం.నాగరాజు, జి.కాళీచరణ్, ఎస్సై కృష్ణాజీ తదితరులు పాల్గొన్నారు. 10 ఆటోలు, 65 బ్యాటరీల స్వాధీనం -
అగ్గిపుల్లపై అల్లూరి
ఏలూరు (టూటౌన్) : అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఏలూరుకు చెందిన సూక్ష్మ కళాకారుడు మేతర సురేష్ అగ్గిపుల్లపై ఆయన చిత్రాన్ని నిర్మించి అబ్బుర పరుస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఆయా నాయకుల చిత్రాలను తనదైన శైలిలో నిర్మించి నివాళులర్పించడం సురేష్కు పరిపాటి. ఈ క్రమంలోనే ఈ నెల 4వ తేదీ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రాన్ని అగ్గిపుల్లపై నిర్మించి నివాళి అర్పించారు. ఏలూరులో ఈగల్ టీమ్ తనిఖీలు ఏలూరు టౌన్ : గంజాయి, మత్తు పదార్థాల రవాణా అడ్డుకునేందుకు ఈగల్ టీమ్, రైల్వే పోలీస్, జిల్లా పోలీస్ సంయుక్తంగా గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏలూరు రైల్వే స్టేషన్లో ఈగల్ టీమ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవికృష్ణ స్వయంగా తనిఖీల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఈగల్ టీమ్ ఎస్పీ నాగేశ్వరరావు, ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు ఉన్నారు. ఏలూరు రైల్వే స్టేషన్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. డాగ్ స్క్వాడ్తో రైల్వే స్టేషన్లో క్షుణ్ణంగా తనికీలు చేశారు. కోరమాండల్ ఎక్స్ప్రెస్తో సహా పలు రైళ్ళలో తనిఖీలు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్, రైల్వే పోలీస్ డీఎస్పీ రత్నరాజు, టూటౌన్ సీఐ అశోక్కుమార్, త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎకై ్సజ్ సీఐ ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్వీ రంగారావుకు భారతరత్న ఇవ్వాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): విశ్వనట చక్రవర్తి స్వర్గీయ ఎస్వీ రంగారావుకు భారతరత్న ఇవ్వాలని పలు సంఘాలు డిమాండ్ చేశాయి. స్థానిక ఎస్వీఆర్ సర్కిల్లో గురువారం ఎస్వీ రంగారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎస్వీఆర్ సేవా సమితి అధ్యక్షుడు భోగిరెడ్డి రాము మాట్లాడుతూ తెలుగు సినీ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పిన తొలి తెలుగు నటుడు ఎస్వీ రంగారావు అని కొనియాడారు. కాపునాడు అధ్యక్షుడు మాకా శ్రీనివాసరావు మాట్లాడుతూ అద్భుత నటనతో ప్రపంచాన్ని మెప్పించిన నటుడు ఎస్వీ రంగారావుకు తక్షణమే భారత రత్న అవార్డును ప్రకటించాలని డిమాండ్ చేశారు. తొలుత ఎస్వీ రంగారావు సర్కిల్ నుంచి ర్యాలీగా పోస్టాఫీస్ వరకు చేరుకున్నారు. భారతరత్న ఇవ్వాలనే విన్నపాన్ని రిజిస్టర్ పోస్టులో ప్రధాని నరేంద్ర మోదీ అడ్రస్కు పంపారు. కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, బండి రామస్వామి, గంధం రాజశేఖర్, జంగా రామ్రాయ్, పి.కుమార్స్వామి, సామినేటి రంగారావు, బాకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రొయ్య పిల్లా.. సిద్ధం చేయండిలా..
కై కలూరు: రొయ్యల సాగును పసిబిడ్డను అమ్మ జాగ్రత్తగా సాకిన విధానంతో పోల్చుతారు. హేచరీలో రొయ్య విత్తనం కొనుగోలు నుంచి తిరిగి చెరువులో రొయ్య పిల్లలను వదలడం ఎంతో కీలకమైన ప్రక్రియ. పెనాయిస్ మోనోడాన్ (టైగర్ రొయ్యలు), లటోపెనియస్ వన్నామీ (వైట్ లెగ్ పసిఫిక్ రొయ్యలు) వంటి జాతుల పెంపకం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యమైన రొయ్యల పరిశ్రమగా ఏపీ గుర్తింపు పొందింది. నాలుగు గోడల మధ్య తయారీ చేసిన రొయ్య విత్తనాలను ఆరుబయట చెరువుల్లో విడుదల చేస్తున్నప్పుడు యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో రొయ్య పిల్లలు మరణించి, రైతులకు నష్టాన్ని మిగుల్చుతున్నాయి. రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా సాగు చేస్తున్నారు. వీరిలో రొయ్యల సాగు రైతులు 1.5 లక్షలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుండగా వీటిలో రొయ్యల సాగు 1.10 లక్షల ఎకరాల్లో సాగువుతోంది. ఉమ్మడి జిల్లాలో ఆక్వారంగం నుంచి వార్షిక ఉత్పత్తి 4 లక్షల టన్నులు ఉండగా, వార్షిక టర్నోవర్ రూ.18 వేల కోట్లుగా నమోదవుతోంది. రాష్ట్రంలో రెండు నెలల వ్యవధిలో సుమారు రూ.60 కోట్ల విలువైన రొయ్యలు చనిపోయాయి. రొయ్యల సాగులో ప్రధానంగా ఎంటెరోసైటటోజాన్ హెపాటోపెనాయ్(ఈహెచ్పీ), రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్(ఆర్ఎంఎస్), వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్(డబ్ల్యూఎస్ఎస్వీ), లూస్ షెల్ సిండ్రోమ్(ఎల్ఎస్ఎస్) వ్యాధుల వల్ల రూ.కోట్లలో రైతులు నష్టాల బారిన పడుతోన్నారు. ఎక్లిమైటెజేషన్ అంటే.. రొయ్యలు చెరువుల్లో సీడ్(రొయ్య విత్తనాలు)ను అలవాటు చేసే ప్రక్రియను ఎక్లిమైటెజేషన్ అంటారు. రొయ్యల ఆరోగ్యం చెరువు నీటి నాణ్యత, నిర్వహణ, వదిలే పిల్లల సంఖ్య, మేత నాణ్యత వంటి అంశాలపై ఆధారపడి ఉంటోంది. హేచరీలో రొయ్య విత్తనాలు అక్కడ ఉష్ణోగ్రత, సెలినిటీ(లవణీయత), పీహెచ్లకు అలవాటు పడి ఉంటాయి. వీటిని చెరువుల్లో వదిలే ముందు చెరువు నీటిలో ఉష్ణోగ్రత, పీహెచ్లకు తగ్గట్టుగా అలవాటు చేయాలి. హేచరీ నుంచి తెచ్చిన విత్తన సంచులను చెరువు నీటిలో అర్ధగంట కర్ర,తాడుతో కట్టివేయాలి. తర్వాత హేచరీ నుంచి తెచ్చిన సంచుల్లో స్థానిక చెరువు నీటిని నింపుతూ రెండు పర్యాయాలు చేయాలి. ఈ పక్రియ అనంతరం విత్తనాలను చెరువులో వదలాలి. ఇలా చేయకుండా అనేక మంది రైతులు నేరుగా రొయ్య విత్తనాలను చెరువులో వదలడం వల్ల ఉష్ణోగ్రతలకు అలవాటు పడక రొయ్య పిల్లలు మరణిస్తున్నాయి. రొయ్యల రైతులు ఇలా చేయండి ● రొయ్య విత్తనాలను చెరువులో వదిలేటప్పుడు ఉష్టోగ్రత 28– 32 డిగ్రీల సెంటీగ్రేట్, పీహెచ్ 7.5–8.5, లవణీయత 15–35 పీపీటీ (స్థానిక పరిస్థితులను బట్టి), కరిగిన ఆక్సిజన్ 5 పీపీఎం కంటే ఎక్కువ ఉండాలి. ● రవాణా సమయంలో ఒత్తిడి తగ్గించడానికి రొయ్యల సీడ్ను శుభ్రమైన, ఆక్సిజన్ బ్యాగులు, సింటెక్స్ కంటైనర్లలో రవాణా చేయండి. ● ప్రతి 10–20 నిమిషాలకు 10–20 శాతం చొప్పున కంటైనర్, బ్యాగ్లలో చెరువు నీటిని కలపండి. ఇది రొయ్యలు క్రమంగా పీహెచ్, ఉష్టోగ్రత, లవణియతలో తేడాలకు అనుగుణంగా మారడానికి సహకరిస్తుంది. ● ఉష్ణోగ్రతను ట్రాక్ చేయడానికి ధర్మామీటర్, లవణీయత కోసం రిఫ్రాక్టోమీటర్, నీటి విలువల కోసం పీహెచ్ మీటర్ను ఉపయోగించండి. ● సీడ్ను ఒకేసారి డంప్ చేసే బదులు చెరువు వాతావరణానికి సమర్థవంతంగా అనుగుణంగా ఉండేలా, వాటిని కొంత వ్యవధిలో చిన్న బ్యాచ్లుగా విడుదల చేయటం మంచిది. ● చెరువు నీటి నాణ్యత, ఉష్ణోగ్రత, లవణీయత, ఆక్సిజన్ స్థాయిలో మార్పులు ఎప్పటికప్పుడు గమనించాలి. రికార్డు చేయాలి. ● ఒత్తిడిని తగ్గించడానికి తక్కువ సంఖ్యలో రొయ్యలు విడుదల చేయాలి. ● వాతావరణానికి బాగా సర్దుబాటు అవుతున్నాయని నిర్ధారించుకోడానికి కొన్ని రోజుల పాటు రొయ్యల ఆరోగ్యం, ప్రవర్తన నిశితంగా గమనించండి. రొయ్యల సాగులో ఎక్లిమైటెజేషన్ ప్రక్రియ తప్పనిసరి హేచరీ నుంచి రొయ్య విత్తనం సరఫరా కీలకం నిర్లక్ష్యంతో నష్టాల బారిన పడుతున్న రైతులు ఉమ్మడి జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు బతుకు రేటు 90 శాతం మంచిది హేచరీ నుంచి చెరువులో రొయ్య పిల్లలు వేసే సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. హోపా(విత్తనాల నిల్వ తొట్టె) బతుకుదలను 24 గంటలు కంటే 48 గంటల తర్వాత మాత్రమే తనిఖీ చేయాలి. సుమారు 200 విత్తనాలకు హోపాలో 180 విత్తనాలు జీవిస్తే అటువంటి వాటిని విడుదల చేయాలి. రొయ్య విత్తనాలను నేరుగా చెరువులో విడదల చేయకూడదు. పంట విజయానికి చెరువు నీటికి రొయ్య విత్తనాలను అలవాటు చేయడమే ఉత్తమ మార్గంగా రైతులు భావించాలి. – డాక్టర్ పి.రామమోహనరావు, మాజీ డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్, కాకినాడ -
వేగవరం వద్ద భారీ రోడ్డు ప్రమాదం
జంగారెడ్డిగూడెం: జాతీయ రహదారి 516డి పై జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వద్ద బుధవారం భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక లారీని మరో లారీ వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి వైజాగ్కు సిమెంటు లోడుతో వెళుతున్న లారీని, ముంబయి నుంచి రాజమండ్రికి పేపర్ లోడ్తో వెళుతున్న లారీ మండలంలోని వేగవరం ప్రధాన సెంటర్ వద్ద వెనుక నుంచి ఢీకొంది. దీంతో సిమెంట్ లోడు లారీ అదుపు తప్పి రోడ్డు ఎడమపక్క ఉన్న దుకాణాల్లో దూసుకుపోయింది. ఇదే సమయంలో పేపర్ లోడ్ లారీ కుడి పక్కన దుకాణాల్లోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో పేపర్ లోడ్ లారీ డ్రైవర్ పప్న పిన్నెబాయ్, అలాగే రోడ్డుపక్కనే ఉన్న కొప్పర్తి నాగేంద్రబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, సీఐ సుభాష్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తన వాహనంలో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. గ్రామస్తుల ఆందోళన రహదారికి ఇరువైపులా దుకాణాలు ముందుకు వచ్చేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వేగవరం గ్రామస్తులు ఆందోళన చేశారు. జాతీయరహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రజలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. వెంటనే అధికారులు స్పందించి అక్రమణలను తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆందోళనకారులతో సీఐ సుభాష్ మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. దుకాణాల్లోకి దూసుకెళ్లిన లారీలు పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు ధ్వంసం ఇద్దరికి గాయాలు -
స్నేహితుడే హంతకుడు
● కీలకమైన హత్య కేసును ఛేదించిన పోలీసులు ●● డీఎన్ఏ రిపోర్టు ఆధారంగా దర్యాప్తు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ నయీం అస్మి నరసాపురం: గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించి, సదరు వ్యక్తి హత్య చేయబడ్డాడని నరసాపురం పోలీసులు నిర్ధారించారు. లోతైన దర్యాప్తు జరిపి హత్యగా తేల్చడమే కాకుండా డీఎన్ఏ రిపోర్టు ఆధారంగా మృతుడిని గుర్తించడం విశేషం. దీనికి సంబంధించి వివరాలను బుధవారం ఎస్పీ నయీం అస్మి నరసాపురం డీఎస్పీ కార్యాలయంలో వెల్లడించారు. పంట కాలువలో లభించిన మృతదేహం నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలో డంపింగ్ యార్డ్ సమీపంలో పంట కాలువలో ఈ ఏడాది జనవరి 27వ తేదీన సుమారు 30 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తొడ ఎముక, మరికొన్ని లోపలి అవయవాలను పోస్టుమార్టం సమయంలో భధ్రపరిచారు. పోస్టుమార్టం నివేదికలో అతను నీటిలో పడిపోవడం వల్ల చనిపోలేదని తేలింది. పొట్టలో కుడివైపు గాయాలు కూడా ఉండటంతో హత్యచేసి పడేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఫోరెన్సిక్ ఆధారాలతో మృతుడి గుర్తింపు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హత్యపై కూపీ లాగారు. ముందుగా ఉభయగోదావరి జిల్లాలు, పక్క జిల్లాల్లో నమోదైన మిస్సింగ్ కేసులు, అందులో గుర్తించిన వారి వివరాలు సేకరించారు. పెరవలి పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదై గుర్తింపు లభించని చుక్కల శ్రీనివాస్ విషయంలో దృష్టి పెట్టారు. శ్రీనివాస్ తల్లితండ్రుల డీఎన్ఏలను సేకరించి, మృతుడి భధ్రపరిచిన ఎముక డీఎన్ఏ ద్వారా సరిచూసి మృతుడు శ్రీనివాస్గా నిర్ధారించారు. హత్యగా గుర్తించింది ఇలా పెరవలి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన చుక్కల శ్రీనివాస్ (37) డీఎస్సీకి ప్రిపేరవుతున్నాడు. అయితే అతని స్నేహితులు, దినచర్య వంటి అంశాలపై పోలీసులు దృష్టిపెట్టి విచారణ చేశారు. శ్రీనివాస్తో అత్యతం సన్నిహితంగా ఉండే పెరవలి మండలం కాకరపర్రుకు చెందిన పూల వ్యాపారి మల్లెపూడి శ్రీనివాస్ను అనుమానంతో అదపులోకి తీసుకుని విచారించగా అతడే చంపినట్టు తెలిసింది. స్నేహితుడే చంపేసి కాలువలో పడేశాడు చుక్కల శ్రీనివాస్ డీఎస్సీకి ప్రిపేర్ కావడానికి రాజమండ్రి వెళతానని స్నేహితుడు మల్లెపూడి శ్రీనివాస్కు చెప్పాడు. అయితే వెళ్లొద్దని స్నేహితుడితో ఓసారి గొడవపడ్డాడు. మళ్లీ 2025 జనవరి 3వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో దువ్వ గ్రామం నుంచి ఒకే మోటార్సైకిల్పై వెళుతుండగా ఇదే విషయంపై మళ్లీ ఇద్దరూ వాదులాడుకున్నారు. పెరవలి సమీపంలో ప్లేబాయ్ ఫ్యాక్టరీ వద్ద నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి మోటార్సైకిల్ను తీసుకెళ్లి అక్కడ కొంతసేపు వాదులాకున్నారు. ఈ క్రమంలో మల్లెపూడి శ్రీనివాస్ బీర్బాటిల్ పగలకొట్టి చుక్కల శ్రీనివాస్ పొట్టలో కుడివైపుపొడిచి హత్య చేశాడు. కాళ్లు, చేతులు కట్టి, దుస్తులు తొలగించి శవాన్ని పెరవలి కాలువలోకి తోసేశాడు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే హత్య చేసిన ప్రదేశం నుంచి శవాన్ని కాలువలోకి నెట్టిన ప్రాంతం 3 కిలోమీటర్లు. 24 రోజుల తరువాత శవం దాదాపు 42 కిలోమీటర్లు దూరంలో కొప్పర్రు గ్రామంలో బయటపడటం మరో అంశం. ఇది దాదాపు అసాధ్యమైన కేసని వైద్య పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కేసు ఛేదించినట్లు ఎస్పీ చెప్పారు. విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ భీమారావు, నరసాపురం డీఎస్పీ డాక్టర్ బి.శ్రీవేద ఉన్నారు. -
బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృత్యు ఒడికి
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో డెలీవరి సమయంలో బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృత్యు ఒడికి చేరింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని 28వ వార్డుకు చెందిన సంగినీడి మనోజ్, జయశ్రీ (28) దంపతులు. ఎనిమిదేళ్ల క్రితం వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆరేళ్ల క్రితం వీరికి ఒక బాబు జన్మించాడు. అనంతరం మరో బిడ్డకు జన్మనిస్తూ జయశ్రీ దురదృష్టవశాత్తూ మృతి చెందింది. మంగళవారం స్కానింగ్ తీసుకుని రమ్మని వైద్యులు సూచించడంతో స్కానింగ్ తీసుకువెళ్లారు. అంతాబాగానే ఉందని, నార్మల్ డెలీవరికి రిపోర్టులు కూడా అనుకూలంగానే ఉన్నాయని వైద్యులు చెప్పడంతో మంగళవారం ఆసుపత్రిలో చేర్చారు. బుధవారం ఉదయం డెలీవరి చేస్తుండగా పాప జన్మించినా తల్లి జయశ్రీకి అధికంగా బ్లీడింగ్ అవ్వడంతో మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. శిశువు పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం పిల్లల ఆసుపత్రికి తరలించారు. ఎంతో ఇష్టపడి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నామని, ఇటీవల ఆమె డీఎస్పీ పరీక్షలకు కూడా హాజరైందని, ఇంతలోనే ఇలా మృతి చెందిందని భర్త కన్నీరు మున్నీరుగా విలపించాడు. -
6న ఉచితంగా రేబిస్ నిరోధక టీకాలు
భీమవరం: ఈనెల 6వ తేదీన జంతు సంక్రమణ వ్యాధి నిరోధక దినం (జూనోసిస్ డే) సందర్భంగా భీమవరంలోని ప్రాంతీయ పశువైద్యశాఖలో ఉదయం 9 గంటల నుంచి రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా వేస్తామని పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి సుధీర్బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు ప్రధానంగా రేబిస్వ్యాధి సోకుతుందని, ఈ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని రైతులు, జంతుప్రేమికులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సుధీర్బాబు కోరారు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం పంట కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు నరసాపురం రూరల్: ఓ ప్రైవేటు స్కూల్ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. నరసాపురం పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బుధవారం సాయంత్రం స్కూల్ నుంచి విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లే సమయంలో మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో అదుపుతప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో బస్సులో ఉన్న 33 మంది విద్యార్థులు ఆర్తనాదాలు చేయడంతో అక్కడకు చేరుకున్న స్థానికులు స్పందించి పిల్లలను బస్సు నుంచి దించేశారు. ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పలువురు స్థానికులు పేర్కొంటున్నారు. -
లైసెన్స్ లేని వ్యక్తుల నుంచి మద్యం కొనుగోలు ప్రమాదకరం
భీమవరం: రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన రిటైల్ మద్యం దుకాణాల నుంచి మాత్రమే మద్యం కొనుగోలు చేయాలని జిల్లా ఎకై ్సజ్శాఖ సూపరింటెండెంట్ ఆర్ఎస్ కుమరేశ్వరన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. లైసెన్స్ లేని వ్యక్తుల నుంచి మద్యం కొనుగోలు ప్రమాదకరమన్నారు. వేడుకలకు మద్యాన్ని తక్కువ ధరకు సరఫరా చేస్తామని చెప్పి మోసంచేసే అవకాశముందని హెచ్చరించారు. మద్యం అమ్మకాల్లో అనుమానిత వ్యక్తుల వివరాలను టోల్ఫ్రీ నంబర్: 14405, లేదా సెల్: 98482 03823 నంబర్కు సంప్రదించాలని కుమరేశ్వరన్ తెలిపారు. చికిత్స పొందుతూ వివాహిత మృతి జంగారెడ్డిగూడెం: మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన ఓ వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. లక్కవరం ఎస్సై బి.శశాంక తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గౌతు వెంకట రామకృష్ణకు, నాగ వెంకట శిరీష (39)కు 19 ఏళ్ల క్రితం వివాహమైంది. మంగళవారం శిరీష, ఆమె అత్త కోడిపిల్లల విషయమై గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన శిరీష కలుపు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించగా, చికిత్స పొందుతూ శిరీష మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. లోక్ అదాలత్తో సత్వర పరిష్కారం ఏలూరు (టూటౌన్): కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి కోరారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్ భవన్ నందు బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిలాల్లోని అన్ని కోర్టుల్లో ఈనెల 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 4,633 రాజీకాదగిన కేసులు గుర్తించామని, వీటిలో 1,891 క్రిమినల్, 2,501 సివిల్, 241 ఇతర కేసులు ఉన్నాయన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 5న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నిర్వహణకు జిల్లాలో 34 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కక్షిదారులు ఆన్లైన్ ద్వారా కూడా తమ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. సమావేశంలో ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోనే సీతారాం పాల్గొన్నారు. -
ఇంజనీరింగ్ కోర్సులు.. భవితకు బాటలు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్మీడియెట్ తరువాత డిగ్రీ కోర్సుల వైపు వెళ్లడం గత రెండు దశాబ్దాల క్రితం ఉండేది. అప్పట్లో డిగ్రీలు, పీజీలు చేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండేవి. దానికి తోడు సివిల్స్, ఏపీపీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే ఉద్యోగాలకు క్రేజ్ ఉండేది. అనంతరం విద్యారంగంలో సమూల మార్పు వచ్చింది. సమాజంలో సాంకేతిక విప్లవం వేగంగా వ్యాప్తి చెందడంతో ఆ రంగంలో ఉపాధి అవకాశాలు అత్యధికంగా లభిస్తున్నాయి. దీనితో ఇంటర్మీడియెట్ తరువాత విద్యార్థుల తొలి ప్రాధాన్యత సాంకేతిక ఉన్నత విద్య ఇంజనీరింగ్ వైపే మొగ్గు చూపింది. కృత్రిమ మేథ (ఏఐ) వైపు చూపు రానున్నది కృత్రిమ మేథ శకమని నిపుణులు అంచనా వేస్తున్న తరుణంలో విద్యార్థులు అటువైపు ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తునట్టు తెలుస్తోంది. గత నాలుగేళ్లుగా ఏఐ బ్రాంచ్లు అందుబాటులో ఉన్న అన్ని కళాశాలల్లోనూ, సీఎస్ఈతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్ తదితర బ్రాంచ్లు సైతం పూర్తి సీట్లు భర్తీ కావడం చూస్తుంటే విద్యార్థులు ఏఐ వైపు ఎంత ఆసక్తిగా ఉన్నారో గ్రహించవచ్చు. ఎవర్గ్రీన్గా మెకానికల్ బ్రాంచ్ ఏ కోర్సు తీసుకుంటే తేలికగా ఉత్తీర్ణులవడంతో పాటు చదువు పూర్తి కాగానే ఉద్యోగాలు లభిస్తాయా అనేది విద్యార్థులను వేధిస్తున్న ప్రధాన ప్రశ్న. ముఖ్యంగా మెకానికల్ ఇంజనీరింగ్కు ఎవర్ గ్రీన్ బ్రాంచ్గా గుర్తింపు ఉంది. ద్విచక్ర వాహనాల నుంచి విమానాల తయారీ వరకూ మెకానికల్ ఇంజనీర్ల ప్రాతే కీలకంగా ఉంటుంది. అలాగే కెమిస్ట్రీ, ఫిజిక్స్, గణితం సమ్మిళితంగా ఉండే కెమికల్ ఇంజనీరింగ్కు సైతం మంచి భవిష్యత్ ఉందని తెలుస్తోంది. డీఎన్ఏ సీక్వెన్సింగ్, మానవ జీనోమ్ ప్రాజెక్టు, జెనెటిక్ ఇంజనీరింగ్ వంటివి కెమికల్ ఇంజనీరింగ్లో మార్పులకు తెరతీశాయి. సీఎస్ఈకే తొలి ప్రాధాన్యత ఈఏపీ సెట్లో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థుల్లో ఎక్కువమంది సీఎస్ఈలో చేరడానికే ఆసక్తి చూపుతారు. ఈ బ్రాంచ్తో ఐటీ కొలువులు, ఆకర్షణీయ ప్యాకేజీలు లభిస్తాయనే నమ్మకమే కారణం. అందుకు తగ్గట్టుగానే క్యాంపస్ రిక్రూట్మెంట్లలో ఐటీ రంగ కంపెనీలు ముందుగా సీఎస్ఈ విద్యార్థులకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. నాలుగేళ్ల కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ బ్రాంచ్లో ముఖ్యంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్, నెట్ వర్కింగ్, అల్గారిథమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామ్ డిజైన్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ హార్డ్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా బేస్, డేటా స్ట్రక్చర్స్ తదితర అంశాలను అధ్యయనం చేస్తారు. ఈసీఈతో రెండురకాల లాభం ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు రెండో ప్రాధాన్యంగా ఈసీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూ నికేషన్ ఇంజినీరింగ్) నిలుస్తోంది. ఈ బ్రాంచ్లో ప్రధానంగా ఎలక్ట్రికల్ పరికరాలు, అనలాగ్ ఇంటిగ్రేటేడ్ సర్క్యూట్స్, శాటిలైట్ కమ్యూనికేషన్, మైక్రోవేవ్ ఇంజినీరింగ్, మైక్రో ప్రాసెసర్స్, మైక్రో కంట్రోలర్స్, ట్రాన్స్మీటర్, రిసీవర్, ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్ పరికరాల తయారీ, యాంటెన్నా, కమ్యూనికేషన్ సిస్టమ్స్ గురించి అవగాహన కలిగిస్తారు. ఈ బ్రాంచ్లో చేరడం వల్ల కోర్ సెక్టార్తో పాటు సాఫ్టవేర్ రంగాల్లోనూ కొలువులు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ట్రిపుల్ ఈలో 2 లక్షల ఉద్యోగాలు రెడీ ప్రైవేట్ రంగంలో ఏర్పాటవుతున్న హైడల్ పవర్ ప్రాజెక్ట్ కారణంగా రానున్న నాలుగేళ్లలో రెండు లక్షల మంది ఈఈఈ ఇంజినీర్ల కోసం ఉద్యోగాలు ఎదురు చూస్తాయని నిపుణుల అంచనా. ఈఈఈ ద్వారా అటు ఎలక్ట్రికల్, ఇటు ఎలక్ట్రానిక్స్ రెండింటిపైనా పట్టు లభిస్తుంది. ఫలితంగా రెండు రంగాలకు చెందిన పరిశ్రమల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. అందుకే ఇంజినీరింగ్ విద్యార్థుల భవిష్యత్తుకు ఈ కోర్సు భరోసాగా నిలుస్తోంది. ఎలక్ట్రికల్ టెక్నాలజీ, మెషీన్, మోటార్లు, జనరేటర్లు, సర్క్యూట్ అనాలసిస్, పవర్ ఇంజినీరింగ్ తదితర అంశాలను ఇందులో చదువుతారు. జిల్లాలో 6 ఇంజనీరింగ్ కళాశాలలు ఏలూరు జిల్లాలో మొత్తం 6 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఏలూరులోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 1,200 సీట్లు, రామచంద్ర కళాశాలలో 900, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో 600, హేలాపురి కళాశాలలో 360 సీట్లు, ఆగిరిపల్లిలోని ఎన్ఆర్ఐ కళాశాలలో 1,360, నూజివీడులోని సారథి కళాశాలలో 420 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ల కోసం జిల్లా విద్యార్థుల నుంచి పోటీ తక్కువగానే ఉంటుంది. కాకపోతే ఇతర జిల్లాల విద్యార్థులు కూడా ఇక్కడి కళాశాలల్లో చేరేందుకు ఉత్సాహం చూపడంతో సీట్లు లభించడం కష్టతరంగా మారింది. ఈ ఏడాది నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల్లో ఏలూరు జిల్లా నుంచి 4,700 మంది పరీక్ష రాయగా వారిలో ఇంజనీరింగ్ కోర్సుకు 3,409 మంది మాత్రమే అర్హత సాధించారు. జిల్లాలో 6 కాలేజీలు.. 4,840 సీట్లు కృత్రిమ మేథ (ఏఐ) వైపు అందరి చూపు సీఎస్ఈకి తగ్గని క్రేజ్ బ్రాంచ్ ఏదైనా పట్టు సాధిస్తే విజయ తీరాలకు సృజనాత్మకతతో అద్భుతాలు పదును పెట్టి నూతన ఆవిష్కరణల దిశగా విద్యార్థులు అడుగులు వేయాల్సిన తరుణం ఆసన్నమైందని గుర్తించాలి. విద్యార్థులు తమ సృజనాత్మకతకు సానపెడితే అద్భుతాలు సాధ్యమౌతాయి. అటువంటి విద్యార్థులు వారి అబివృద్ధితో పాటు దేశాభివృద్ధిలో కూడా తమ భాగస్వామ్యాన్ని ఘనంగా చాటిచెప్పే అవకాశం ఉంటుంది. –డాక్టర్ కే వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, ఏలూరు -
పంట చేతికొచ్చిన ఆనందం లేదు
గత ప్రభుత్వంలో నీటి తీరువా ఊసే ఉండేది కాదు. ఈ ప్రభుత్వం వచ్చాక పాత బకాయిలంటూ వడ్డీలు వేసి మరీ చెల్లించాలని రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. మూడేళ్లకు కలిపి నీటితీరువా రూ. 21 వేలు చెల్లించాను. పంట డబ్బులు చేతికొచ్చాయన్న ఆనందం లేకుండా పన్నుకే సరిపోయింది. – వెలగల వెంకటేశ్వరరెడ్డి, రైతు, పెనుమంట్ర రైతులపై భారం మోపుతున్నారు రైతులను ఆదుకోవాల్సింది పోయి ఏదో రూపంలో ఈ ప్రభుత్వం మాపై భారం మోపుతోంది. ఉచిత పంటల బీమాను రద్దుచేయడంతో ప్రీమియం రైతులే చెల్లించుకోవాల్సి వస్తోంది. కొన్నేళ్లుగా నీటి తీరువా ఊసులేకుండా ఉంది. ఇప్పుడు వడ్డీలు, జరిమానాలు అంటూ రైతులపై భారం మోపుతున్నారు. – కందుల సత్యనారాయణ, రైతు, వీరవాసరం -
కేరళ డీజీపీగా రావాడ చంద్రశేఖర్
స్వస్థలం వీరవాసరంలో ఆనందోత్సాహాలు వీరవాసరం: కేరళ రాష్ట్ర పోలీస్ బాస్గా పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరానికి చెందిన రావాడ ఆజాద్ చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. కేరళ నూతన డీజీపీగా ఆయనను నియమిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలియడంతో చంద్రశేఖర్ స్వగ్రామం వీరవాసరంలో ఆయన బంధుమిత్రులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. 1991లో ఐపీఎస్కు ఎంపికై న చంద్రశేఖర్ కేరళ క్యాడర్లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. కేరళలో పోలీస్ ఉన్నతాధికారిగా పలు కీలక బాధ్యతల్లో పనిచేసి రాష్ట్రపతి నుంచి ఉత్తమ సేవల అవార్డును అందుకున్నారు. అక్కడ నుంచి డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న చంద్రశేఖర్ను ఇటీవలే సెంట్రల్ క్యాబినెట్ సెక్రటేరియట్ (స్పెషల్ సెక్యూరిటీ) కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ బాధ్యతల్లో చేరకముందే.. కేరళ ప్రభుత్వం చంద్రశేఖర్ను డీజీపీగా ప్రకటించింది. ఒక రాష్ట్రానికి పోలీస్ బాస్ తమ ఊరి వ్యక్తి కావడంతో చంద్రశేఖర్ బంధుమిత్రులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రశేఖర్కు ఆత్మీయులైన జీవీవీ ప్రసాద్, నేతల జ్ఞాన సుందర్రాజు, పీతల సుబ్రహ్మణ్యం, బాజింకి కృష్ణారావు, రాయపల్లి వెంకట్, నక్కెళ్ల వెంకట్, గూడూరి ఓంకార్, వీరవల్లి చంద్రశేఖర్, గుండా రామకృష్ణ, వీరవల్లి రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ.. కష్టపడే తత్వం ఉన్న ప్రతి ఒక్కరూ మహోన్నత వ్యక్తిత్వం గల చంద్రశేఖర్లా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పారు. చంద్రశేఖర్ నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కాచెల్లెళ్లలో చిన్నవారు. ఇంటర్ వరకూ వీరవాసరంలోనే చదివారు. బాపట్లలో అగ్రికల్చర్ బీఎస్సీ, హైదరాబాద్లో అగ్రికల్చర్ ఎమ్మెస్సీ పూర్తి చేశారు. బంధువులు ఇళ్లలో వివాహాలు, ఇతర ఫంక్షన్లకు, సంక్రాంతికి తప్పనిసరిగా వీరవాసరం వస్తుంటారు. వీరవాసరంలోని కమ్యూనిటీ హాల్, రామాలయం, చర్చికి కుటుంబ సభ్యుల పేరిట పెద్ద మొత్తాల్లో ఆర్థిక సాయం చేశారు. రావాడ ఆజాద్ చంద్రశేఖర్ ఐపీఎస్ అధికారిగా ఎదగడం వీరవాసరానికి గర్వకారణమని, అందరితో చనువుగా ఉంటూ, చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా మనసు విప్పి మాట్లాడే మంచి మనిషని ఆయన స్నేహితుడు నేతల జ్ఞాన సుందర్రాజు అన్నారు. -
కోకో రైతుల నిరసన
పెదవేగి: ఈ నెల 15 వరకు కిలో కోకో గింజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.50 ప్రోత్సాహంతో రూ.500 ధర రైతులకు వచ్చేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కొండలరావుపాలెంలో జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు. కొండరాలవు పాలెం,రైతు సేవా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు నరసింహారావు అధ్యక్షతన కోకో రైతుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల్లో అనేక చోట్ల కోకో రైతుల నుంచి సక్రమంగా దరఖాస్తులు తీసుకోకుండా ఇబ్బందులకు గురి చేయడం వల్ల ఇంకా గింజలు అమ్ముకోలేని పరిస్థితి ఉందన్నారు. కోకో రైతులు చేసిన పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ పథకం వర్తింపజేసి కిలో కోకో గింజలకు రూ.50 ప్రోత్సాహం ఇస్తుందని, కంపెనీలు ఇస్తున్న ధర కిలోకు రూ.450 కలిపి రూ.500గా నిర్ణయించి జూన్ 30 వరకు కొనుగోలు చేశారని, మిగిలిన గింజలు కొనుగోలు చేసేలా ఈనెల 15 వరకు రైతుల నుంచి కోకో గింజలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర వచ్చేలా ఫార్ములా రూపొందించాలని కోరారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం నాయకులు గుదిబండి వీరారెడ్డి,పాలడుగు నరసింహారావు, యరకరాజు శ్రీనివాసరాజు, కోనేరు సతీష్ బాబు, కరెడ్ల సత్యనారాయణ, బింగిన శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు -
కేరళ డీజీపీగా రావాడ చంద్రశేఖర్
స్వస్థలం వీరవాసరంలో ఆనందోత్సాహాలు వీరవాసరం: కేరళ రాష్ట్ర పోలీస్ బాస్గా పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరానికి చెందిన రావాడ ఆజాద్ చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. కేరళ నూతన డీజీపీగా ఆయనను నియమిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలియడంతో చంద్రశేఖర్ స్వగ్రామం వీరవాసరంలో ఆయన బంధుమిత్రులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. 1991లో ఐపీఎస్కు ఎంపికై న చంద్రశేఖర్ కేరళ క్యాడర్లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. కేరళలో పోలీస్ ఉన్నతాధికారిగా పలు కీలక బాధ్యతల్లో పనిచేసి రాష్ట్రపతి నుంచి ఉత్తమ సేవల అవార్డును అందుకున్నారు. అక్కడ నుంచి డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న చంద్రశేఖర్ను ఇటీవలే సెంట్రల్ క్యాబినెట్ సెక్రటేరియట్ (స్పెషల్ సెక్యూరిటీ) కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ బాధ్యతల్లో చేరకముందే.. కేరళ ప్రభుత్వం చంద్రశేఖర్ను డీజీపీగా ప్రకటించింది. ఒక రాష్ట్రానికి పోలీస్ బాస్ తమ ఊరి వ్యక్తి కావడంతో చంద్రశేఖర్ బంధుమిత్రులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రశేఖర్కు ఆత్మీయులైన జీవీవీ ప్రసాద్, నేతల జ్ఞాన సుందర్రాజు, పీతల సుబ్రహ్మణ్యం, బాజింకి కృష్ణారావు, రాయపల్లి వెంకట్, నక్కెళ్ల వెంకట్, గూడూరి ఓంకార్, వీరవల్లి చంద్రశేఖర్, గుండా రామకృష్ణ, వీరవల్లి రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ.. కష్టపడే తత్వం ఉన్న ప్రతి ఒక్కరూ మహోన్నత వ్యక్తిత్వం గల చంద్రశేఖర్లా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పారు. చంద్రశేఖర్ నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కాచెల్లెళ్లలో చిన్నవారు. ఇంటర్ వరకూ వీరవాసరంలోనే చదివారు. బాపట్లలో అగ్రికల్చర్ బీఎస్సీ, హైదరాబాద్లో అగ్రికల్చర్ ఎమ్మెస్సీ పూర్తి చేశారు. బంధువులు ఇళ్లలో వివాహాలు, ఇతర ఫంక్షన్లకు, సంక్రాంతికి తప్పనిసరిగా వీరవాసరం వస్తుంటారు. వీరవాసరంలోని కమ్యూనిటీ హాల్, రామాలయం, చర్చికి కుటుంబ సభ్యుల పేరిట పెద్ద మొత్తాల్లో ఆర్థిక సాయం చేశారు. రావాడ ఆజాద్ చంద్రశేఖర్ ఐపీఎస్ అధికారిగా ఎదగడం వీరవాసరానికి గర్వకారణమని, అందరితో చనువుగా ఉంటూ, చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా మనసు విప్పి మాట్లాడే మంచి మనిషని ఆయన స్నేహితుడు నేతల జ్ఞాన సుందర్రాజు అన్నారు. -
ఇదేం తీరువా బాబూ !
బాదుడే.. బాదుడు గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025నీటి తీరువా డివిజన్ల వారీగా రెవెన్యూ రైతు నీటి తీరువా డివిజన్ ఖాతాలు మొత్తం భీమవరం 99,329 రూ. 11.83 కోట్లు తాడేపల్లిగూడెం 90,475 రూ. 4 కోట్లు నరసాపురం 1,41,365 రూ. 5.98 కోట్లు సాక్షి, భీమవరం: సూపర్ సిక్స్లోని అన్నదాత సుఖీ భవ సాయం అందించకపోగా రైతులపై భారం మోపడమే పనిగా కూటమి పాలన సాగుతోంది. ఇప్పటికే గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత పంటల బీమా పథకానికి ఎసరుపెట్టి ఏడాదికి దాదాపు రూ.28 కోట్ల ప్రీమియంను రైతులపై మోపింది. మరుగున పడిన నీటితీరువాను తాజాగా తెరపైకి తెచ్చి పన్నుల రూపంలో రూ.21.81 కోట్లు రైతుల నుంచి వసూలు చేసే పనిలో పడింది. తొలకరికి పెట్టుబడులకు సొమ్ముల్లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు వేలకు వేలు నీటి తీరువా చెల్లించాల్సి రావడం భారంగా మారింది. సాగునీటి సరఫరాకు గతంలో నీటి తీరువా పేరిట రెవెన్యూ శాఖ రైతుల నుంచి పన్ను వసూలు చేసేది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది ఈ సొమ్ములు వసూలు చేసేవారు. ఈ విధానంలో అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలు ఉండటంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆన్లైన్ విధానం తీసుకురావాలని భావించినప్పటికీ రైతులకు ఊరటనిస్తూ ఆ ప్రక్రియను పక్కన పెట్టేసింది. వెబ్సైట్ సిద్ధం కాకపోవడంతో గత మూడేళ్లుగా నీటి తీరువా ఊసేలేకుండా పోయింది. నీటి తీరువా భారం రూ.21.81 కోట్లు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ.20 వేల సాయం అందిస్తామని చెప్పి గద్దెనెక్కిన కూటమి మొదటి ఇంతవరకూ చిల్లిగవ్వ ఇవ్వలేదు. తొలకరి పెట్టుబడుల కోసం సొమ్ముల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారి నుంచి నీటి తీరువా వసూళ్ల కోసం రెవెన్యూ శాఖకు ఆదేశాలిచ్చింది. ఆన్లైన్ ప్రక్రియ పూర్తిచేయడం ద్వారా రెండు పంటలు పండే వ్యవసాయ భూములైతే ఎకరానికి మొదటి పంటకు రూ.200, రెండవ పంటకు రూ.150 వంతున మొత్తం రూ.350, ఆక్వా చెరువులకు ఏడాదికి ఒకే పంట లెక్కన ఎకరానికి రూ.500 వసూలుకు ఆదేశాలిచ్చింది. జిల్లాలోని 3,31,169 మంది రైతుల ఖాతాల నుంచి పాత బకాయిలు రూ.5.62 కోట్లకు వడ్డీ రూ.33.77 లక్షలు, ప్రస్తుత డిమాండ్ రూ.15.84 కోట్లు కలిపి రూ. 21.81 కోట్లు నీటితీరువా వసూలు చేయాల్సి ఉంది. ఈ మేరకు ఆర్డీఓలు, తహసీల్దార్లకు ఉత్తర్వులు రావడంతో పన్నుల వసూళ్లలో నిమగ్నమయ్యారు. మూడేళ్లకు పాత బకాయిలు, వడ్డీలతో కలిపి ఒక్కసారే రైతుల నుంచి వేలల్లో వసూలు చేస్తున్నారు. పంట పెట్టుబడులకు సొమ్ములు లేక ఇబ్బందులు పడుతుంటే మూడేళ్ల బకాయి ఒక్కసారే కట్టాలని రెవెన్యూ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఆలస్యం చేస్తే పెనాల్టీతో చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అయినకాడికి అప్పులు చేసి చెల్లిస్తున్నామంటున్నారు. నీటి తీరువా మొత్తం రూ.21.81 కోట్లకు గాను ఇంతవరకు రూ.8.36 కోట్లు వసూలైనట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. సర్వీస్ ట్యాక్స్ అదనం నీటి తీరువాతో పాటు రైతుల నుంచి సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తుండటం గమనార్హం. పన్ను చెల్లింపు కోసం చేసే ప్రతి ట్రాన్సాక్షన్్కు అదనంగా రూ.35 సర్వీసు టాక్స్ వసూలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడు ఇలాంటి ట్యాక్స్లు చూడలేదని రైతులు వాపోతున్నారు. న్యూస్రీల్ రైతులపై కక్ష కట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఉచిత పంటల బీమాకు ఎసరు తాజాగా నీటి తీరువా వసూలుకు ఆదేశం రైతుల నుంచి రూ. 21.81 కోట్లు వసూలు చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం నీటి తీరువా వసూలు చేయని గత వైఎస్సార్సీపీ సర్కారు పంట చేతికొచ్చిన ఆనందం లేదు గత ప్రభుత్వంలో నీటి తీరువా ఊసే ఉండేది కాదు. ఈ ప్రభుత్వం వచ్చాక పాత బకాయిలంటూ వడ్డీలు వేసి మరీ చెల్లించాలని రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. మూడేళ్లకు కలిపి నీటితీరువా రూ. 21 వేలు చెల్లించాను. పంట డబ్బులు చేతికొచ్చాయన్న ఆనందం లేకుండా పన్నుకే సరిపోయింది. – వెలగల వెంకటేశ్వరరెడ్డి, రైతు, పెనుమంట్ర రైతులపై భారం మోపుతున్నారు రైతులను ఆదుకోవాల్సింది పోయి ఏదో రూపంలో ఈ ప్రభుత్వం మాపై భారం మోపుతోంది. ఉచిత పంటల బీమాను రద్దుచేయడంతో ప్రీమియం రైతులే చెల్లించుకోవాల్సి వస్తోంది. కొన్నేళ్లుగా నీటి తీరువా ఊసులేకుండా ఉంది. ఇప్పుడు వడ్డీలు, జరిమానాలు అంటూ రైతులపై భారం మోపుతున్నారు. – కందుల సత్యనారాయణ, రైతు, వీరవాసరం జగన్ సర్కారు 2019 ఖరీఫ్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చిన విషయం విదితమే. ఈ క్రాప్ నమోదు ప్రామాణికంగా సాగు విస్తీర్ణం అంతటికి రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ వచ్చింది. కూటమి వచ్చాక ఈ పథకాన్ని ఎత్తివేయడంతో ప్రీమియం వాటాను రైతులే చెల్లించాల్సి వస్తోంది. ఎకరాకు పంట విలువ రూ. 41,000లో ప్రీమియంగా రెండు శాతం మొత్తం రూ. 820 బీమా కంపెనీకి చెల్లించాలి. దీనిలో ప్రభుత్వ వాటా 0.5 శాతం (రూ.205) కాగా, మిగిలిన 1.5 శాతం (రూ.615లు) రైతులే చెల్లించాలి. ఏడాదికి ప్రీమియం రూపంలో వరి రైతులపై రూ.28 కోట్ల భారం పడుతున్నట్టు అంచనా. -
త్వరలో పోలీస్ అకాడమీ సెంటర్కు శంకుస్థాపన
ఆగిరిపల్లి: పోలీస్ అకాడమీ సెంటర్ నిర్మాణం కోసం త్వరలో శంకుస్థాపన చేస్తామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్కుమార్ గుప్తా తెలిపారు. ఏపీ పోలీస్ అకాడమీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కోసం బుధవారం మండలంలోని నూగొండపల్లి గ్రామంలో ఉన్న 94.49 ఎకరాల భూమిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూగొండపల్లిలో పోలీస్ శిక్షణ సదుపాయాల కోసం త్వరలో అధునాతన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహిస్తామని తెలిపారు. పోలీస్ అకాడమీ సెంటర్ రాష్ట్ర పోలీస్ శాఖకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మధుసూదన్ రెడ్డి, డీఐజీలు జీవీజీ అశోక్ కుమార్, ఎం.రవి ప్రకాష్, సత్య ఏసుబాబు, ఎస్పీ కే. ప్రతాప్ శివ కిషోర్, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, డీఎస్పీ ప్రసాద్ పాల్గొన్నారు. నేడు రౌండ్ టేబుల్ సమావేశం ఏలూరు (టూటౌన్): కొల్లేరు ప్రజల సమస్యలపై ఈనెల 3న విజయవాడలో రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయా సంఘాల నాయకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర నాయకులు బి.బలరాం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రవి, జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు విజయవాడ రాఘవయ్య పార్కు ఎదురుగా ఉన్న బాలోత్సవ భవనంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీఆర్టీయూ నాయకులు బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల బదిలీ అయినా.. రిలీవర్ లేక పాత స్థానాలలోనే కొనసాగుతున్న వివిధ కేడర్ల ఉపాధ్యాయులను ప్రత్యామ్నాయ విధానాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. సెలవు పెట్టుకునే విషయంలో పెట్టిన సమయ నిబంధనలు సవరించాలన్నారు. నోట్బుక్స్తో పాటు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లు కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు కూడా త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి బీ.త్రినాథ్ ఉన్నారు. ముగిసిన డీఎస్సీ పరీక్షలు ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. వివిధ పరీక్షా కేంద్రాల్లో చివరి రోజు బుధవారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు మొత్తం 961 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం సెషన్ పరీక్షలకు 180 మందికి 177మంది హాజరు కాగా ముగ్గురు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 180 మందికి 168 మంది హాజరు కాగా, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం సెషన్లో 140 మందికి 136 మంది, మధ్యాహ్నం సెషన్లో 140 మందికి 133 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 200 మందికి 194 మంది, మధ్యాహ్నం సెషన్లో 156 మందికి ను 153 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రారంభమై నాటి నుంచి ఇప్పటి వరకూ మొత్తం 17386 మందికి 16154 మంది పరీక్షలు రాయగా 1232 మంది గైర్హాజరయ్యారు. నేడు మహిళా కమిషన్ చైర్మన్ పర్యటన ఏలూరు(మెట్రో): రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ డాక్టర్ రాయపాటి శైలజ నేడు జిల్లాలో పర్యటిస్తారు. ముసునూరు, ఏలూరు, దెందులూరులో ఆమె పర్యటన ఉంటుంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వన్ స్టాప్ సెంటర్ను సందర్శిస్తారు. -
ఇదేం తీరువా బాబూ !
బాదుడే.. బాదుడు గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి, భీమవరం: సూపర్ సిక్స్లోని అన్నదాత సుఖీ భవ సాయం అందించకపోగా రైతులపై భారం మోపడమే పనిగా కూటమి పాలన సాగుతోంది. ఇప్పటికే గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత పంటల బీమా పథకానికి ఎసరుపెట్టి ఏడాదికి దాదాపు రూ.28 కోట్ల ప్రీమియంను రైతులపై మోపింది. మరుగున పడిన నీటితీరువాను తాజాగా తెరపైకి తెచ్చి పన్నుల రూపంలో రూ.21.81 కోట్లు రైతుల నుంచి వసూలు చేసే పనిలో పడింది. తొలకరికి పెట్టుబడులకు సొమ్ముల్లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు వేలకు వేలు నీటి తీరువా చెల్లించాల్సి రావడం భారంగా మారింది. సాగునీటి సరఫరాకు గతంలో నీటి తీరువా పేరిట రెవెన్యూ శాఖ రైతుల నుంచి పన్ను వసూలు చేసేది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది ఈ సొమ్ములు వసూలు చేసేవారు. ఈ విధానంలో అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలు ఉండటంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆన్లైన్ విధానం తీసుకురావాలని భావించినప్పటికీ రైతులకు ఊరటనిస్తూ ఆ ప్రక్రియను పక్కన పెట్టేసింది. వెబ్సైట్ సిద్ధం కాకపోవడంతో గత మూడేళ్లుగా నీటి తీరువా ఊసేలేకుండా పోయింది. న్యూస్రీల్ రైతులపై కక్ష కట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఉచిత పంటల బీమాకు ఎసరు తాజాగా నీటి తీరువా వసూలుకు ఆదేశం రైతుల నుంచి రూ. 21.81 కోట్లు వసూలు చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం నీటి తీరువా వసూలు చేయని గత వైఎస్సార్సీపీ సర్కారు జగన్ సర్కారు 2019 ఖరీఫ్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చిన విషయం విదితమే. ఈ క్రాప్ నమోదు ప్రామాణికంగా సాగు విస్తీర్ణం అంతటికి రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ వచ్చింది. కూటమి వచ్చాక ఈ పథకాన్ని ఎత్తివేయడంతో ప్రీమియం వాటాను రైతులే చెల్లించాల్సి వస్తోంది. ఎకరాకు పంట విలువ రూ. 41,000లో ప్రీమియంగా రెండు శాతం మొత్తం రూ. 820 బీమా కంపెనీకి చెల్లించాలి. దీనిలో ప్రభుత్వ వాటా 0.5 శాతం (రూ.205) కాగా, మిగిలిన 1.5 శాతం (రూ.615లు) రైతులే చెల్లించాలి. ఏడాదికి ప్రీమియం రూపంలో వరి రైతులపై రూ.28 కోట్ల భారం పడుతున్నట్టు అంచనా. -
అబద్ధాల్లో బాబుది గిన్నిస్ రికార్డ్
లింగపాలెం: అలవిగాని హామీలతో గద్దెనెక్కడం తరువాత, వాటిని పక్కన పెట్టడం బాబు నైజమని, ఆయన అబద్ధపు హామీలు లెక్కేస్తే గిన్నిస్ రికార్డుకు ఎక్కడం ఖాయమని చింతలపూడి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ కంభం విజయరాజు అన్నారు. ధర్మాజీగూడెంలో బుధవారం శ్రీరీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో – బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీశ్రీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయరాజు మాట్లాడుతూ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ ఈనెల 4న ఏలూరులో జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందన్నారు. మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ముందు 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మహిళలకు ప్రతి నెలా రూ.1500 చొప్పున ఇస్తామన్న బాబు అధికారంలోకి వచ్చాక మొహం చాటేశారన్నారు. దీపం పథకంలో ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారని, సగం మందికి కూడా పథకం డబ్బులు అందడం లేదని విమర్శించారు. ధాన్యం సొమ్ములు నేటికి జమకాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చింతలపూడి నియోజకవర్గంలో రోడడ్లు అధ్వానంగా ఉన్నాయని ఇంతవరకు మరమ్మతులు చేయకపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చింతలపూడిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారే తప్ప ఇంతవరకు అమలు కాలేదని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, ధర్మాజీగూడెం సొసైటీ మాజీ అధ్యక్షుడు ఉప్పలపాటి వరప్రసాద్, మండల ముఖ్యనేత ముసునూరి వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ మట్టా సురేష్, కొత్తూరి రమేష్, భూపతి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
నల్ల అద్దాలపై నిర్లక్ష్యమేల?
తణుకు అర్బన్ : నల్ల అద్దాలు కలిగిన కార్లు రోడ్లపై చక్కర్లు కొడుతున్నా రవాణా శాఖ, పోలీసు అధికారులు చోద్యం చూస్తుండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నల్ల అద్దాలు కలిగి ఉన్న కార్లలో అసాంఘిక కార్యకలాపాలు.. మద్యం అక్రమ రవాణా.. పిల్లల కిడ్నాప్లు.. సంఘ విద్రోహశక్తుల కదలికలను గుర్తించేందుకు వీలు పడదు. దీంతో ఈ తరహా అద్దాలను వాడకూడదని సుమారుగా పదేళ్ల క్రితమే ఉన్నత న్యాయస్థానం ఆదేశాలివ్వడంతో అప్పట్లో రవాణా శాఖ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. కార్లకు ఉన్న నల్ల అద్దాలు, నల్ల ఫిల్మ్లను తొలగింపజేశారు. కానీ ఇటీవల రహదారులపై తిరుగుతున్న కార్లు, ట్యాక్సీల్లో 30 శాతంపైగా నల్ల అద్దాలు, నల్ల ఫిల్మ్ ఏర్పాటుచేసుకుని లోపల ఉన్నవారు బయటకు కనిపించకూడదనే ఉద్ధేశ్యంతో హల్చల్ చేస్తున్నారు. మోటారు వెహికల్ యాక్ట్ 1989/100, సీఆర్పీసీ 188 ప్రకారం నలుపు రంగు ఫిల్మ్ వాడకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ వేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నా బయటవారికి 70 శాతం విజిబులిటీ ఉండేలా ఏర్పాటుచేసుకోవాలని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. నల్ల అద్దాలతో యథేచ్ఛగా తిరుగుతున్న కార్లు ప్రస్తుతం జిల్లాలో తిరుగుతున్న సుమారు లక్షన్నరకుపైగా ఉన్న కార్లలో 30 శాతం కార్లకు నల్ల అద్దాలతో తిరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మద్యం అక్రమ రవాణాలో కార్లకు నూరు శాతం నల్ల రంగు అద్దాలతో కార్లు తిరుగుతున్న పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి. గతనెలలో యానాం నుంచి వస్తున్న కారులో తణుకు ఎకై ్సజ్ శాఖ అధికారులు అక్రమ మద్యాన్ని గుర్తించి పట్టుకున్న ఘటనలో సదరు కారుకు పూర్తిస్థాయిలో నల్ల అద్దాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం కారు తణుకు ఎక్సైజ్ శాఖ కార్యాలయం ముందే సీజ్ చేయబడి ఉంది. రహదారుల్లో ప్రయాణించే కార్లలో ఉన్న వారు రోడ్డుపై ప్రయాణించే వారికి పూర్తిగా బహిర్గతం కావాలని న్యాయస్థానం ఇచ్చిన నిషేదాజ్ఞలు కొందరు కార్ల యజమానులు పట్టించుకోకుండా యథేచ్ఛగా అదే కార్లలో తిరుగుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలే కాకుండా కార్లలో చిన్నారులు ఆడుకుంటూ డోర్ లాక్ అయిపోయి లోపల ఇరుక్కుని ప్రాణాలు వదలిన ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. యథేచ్ఛగా తిరుగుతున్న నల్ల అద్దాల కార్లు అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఉండే ప్రమాదం అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు అమలు కాని వైనం చర్యలు తీసుకోవాలంటున్న ప్రజానీకం జెడ్ ప్లస్కు ఓకే ప్రముఖుల భద్రతా ప్రమాణాల్లో భాగంగా జెడ్ప్లస్ కేటగిరీలో ఉన్న వారికి మాత్రమే బ్లాక్ ఫిల్మ్ వినియోగించుకునే వెసులుబాటును న్యాయస్థానం కల్పించింది. చివరకు మంత్రులు, ఎంపీలు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు సైతం బ్లాక్ ఫిల్మ్లేని వాహనాలనే వినియోగించాలనే నిబంధనలు సైతం రవాణా శాఖ నియమావళిలో పొందుపరిచారు. తప్పనిసరి పరిస్థితుల్లో గోప్యంగా ప్రయాణం చేయాల్సి ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర హోం సెక్రటరీ ఆధ్వర్యంలో డీజీపీతోపాటు ఇతర ప్రముఖ అధికారులతో కూడిన కమిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తుది నిర్ణయం ఆ కమిటీలో ఉన్న వ్యక్తులపై ఆధారపడి ఉంది.నిబంధనలు మీరితే చర్యలు తప్పవు కార్లకు ఉండే నల్ల అద్దాల విషయంలో కారులో ఉన్న వారిని బయటనుంచి చూసేవారికి 70 శాతం కనిపించే విధంగా ఏర్పాటుచేసుకోవాలి. నిబంధనలు మీరి వంద శాతం నల్ల అద్దాలు కలిగి ఉన్న వాహనాలకు రూ. వెయ్యి జరిమానా విధించి నల్ల అద్దాలు, నల్ల ఫిల్మ్ను తొలగింపజేస్తాం. నిబంధనలు పాటించకుండా రహదారులపై తిరిగే కార్లపై రానున్న రోజుల్లో స్పెషల్ డ్రైవ్ల ద్వారా చర్యలు తీసుకుంటాం. – ఎస్. శ్రీనివాస్, తణుకు మోటారు వెహికల్ ఇనస్పెక్టర్ -
పిడుగులతో అప్రమత్తం
పాలకొల్లు సెంట్రల్: వర్షాకాలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుంటాయి. ఆ సమయంలో ఎక్కువగా పిడుగులు పడుతుంటాయి. పిడుగుల మూలంగా ఏటా సుమారు రెండువేల మంది చనిపోతున్నట్లు అంచనా. అలాగే పిడుగుల మూలంగా గృహోపకరణాలు కాలిపోతుంటాయి. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో పిడుగుల పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులను చూసి కొందరు చాలా భయపడతారు. దీనిని అస్ట్రఫోబియా అంటారు. పిడుగు ఒకసారి పడినచోట రెండోసారి మళ్లీ పడదనుకోవడం అపోహ మాత్రమే. ఒకే చోట ఒకే ప్రదేశంలో ఎన్నిసార్లయినా పడే అవకాశం ఉంటుంది. పిడుగు పడిందంటే... పిడుగు శబ్ధం వినగలమే తప్ప చూడాలంటే మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. పిడుగు పడే సమయంలో మెరుపు మేఘాల నుంచి భూమికి తాకినట్టుగా కనిపిస్తుంది. అలా తాకినప్పుడు మేఘాలలో తయారైన పాజిటివ్ శక్తి, భూమిలోని నెగెటివ్ శక్తిని చేరుతుంది. ఒకవేళ మేఘాలలో నెగటివ్ శక్తి తయారైతే అప్పుడు భూమిలో ఉన్న పాజిటివ్ శక్తిని చేరుతుంది. ఏ విధంగానైనా సర్క్యూట్ పూర్తవుతుంది. పిడుగు పడిన సమయంలో ఆ ప్రదేశంలో ఉష్ణోగ్రత కొన్ని వేల డిగ్రీల ఫారన్హీట్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాపర్ ఎర్త్ ముఖ్యం పిడుగుల ప్రమాదాల నుంచి రక్షించుకోవాలంటే ఎత్తయిన భవనాల నుంచి లేదా టవర్లు, పొగ గొట్టాలు ఇలా ఏదైనా సరే పై నుంచి భూమిలోపలి వరకూ కాపర్ ఎర్త్ను తప్పనిసరిగా ఏర్పాటుచేసుకోవాలి. ఇది దాదాపుగా కిలో మీటరు దూరంలో పడిన పిడుగును సైతం నేరుగా భూమిలోకి లాక్కునే అవకాశం ఉంటుంది. కాపర్ ఎర్త్ వేసే ముందు ఉప్పు, కర్పూర బొగ్గు, నీటి మిశ్రమాలతో రాగి వైరు కలిగిన రాడ్ను భూమిలోపలకు ఏర్పాటుచేయడం వల్ల ప్రమాదాలను నివారించుకునే అవకాశం ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి పిడుగులు పడే అవకాశం ఉందని సమాచారం రాగానే ప్రధానంగా పశువులు లేదా మేకలను చెట్లకింద కట్టకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ● రహదారులపై హోర్డింగ్లు, ఎత్తయిన, బలహీనమైన చెట్లు కింద నిలబడరాదు. ● ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఆరు బయట తిరగకూడదు. ● ఇంట్లో కేబుల్ టీవీ, కంప్యూటర్లు, ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను వాడకుండా కనెక్షన్లు తొలగించాలి. ● పొలం దగ్గర మైదాన ప్రాంతంలో ఉన్నట్లయితే ఎత్తయిన చెట్ల కింద నిలబడకూడదు. ట్రాక్టర్లతో పనులు నిలుపుదల చేసుకోవాలి. లేదంటే పిడుగు పడితే వాహనాల్లో ఉన్న లోహపు పరికరాలను ఆకర్షించే ప్రమాదం ఉంటుంది. ● హైటెన్షన్ వైర్లు, సెల్ టవర్లు కింద ఉండకుండా చూసుకోవాలి. ● చెరువు, కొలనులు ఉన్నట్లయితే దూరంగా ఉండాలి. ● మోటార్సైకిల్, స్కూటర్, సైకిల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ప్రయాణం చేసే సమయాల్లో వాహనాలు పక్కకు ఆపి ఎత్తయిన చెట్లు పక్కన కాకుండా నిలబడడం మేలు. ● ఉరుములతో వర్షం కురుస్తున్న సమయంలో ఇంట్లో షవర్బాత్ చేయడం, నీళ్లతో పాత్రలు శుభ్రం చేయడం వంటి పనులను చేయకూడదు. పైపుల గుండా పిడుగు ప్రయాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా ఇంటికి ఎర్తింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలి. లైట్నింగ్ అరెస్టర్ అవసరం పిడుగు విద్యుత్ ప్రవాహం అధికంగా ఉండడం వల్ల విద్యుత్ పరివర్తకాలు, సామగ్రిని కాపాడుకోవడానికి లైట్నింగ్ అరెస్టర్ (పిడుగును అరెస్ట్ చేసేది) ఉపయోగిస్తుంటాము. ఎత్తయిన భవనాలకు కూడా ఇది అమర్చుకోవడం వల్ల ఉపయోగంగా ఉంటుంది. సోలార్ ప్యానల్లకు లైట్నింగ్ అరెస్టర్ ఏర్పాటుచేసుకోవాలి. సోలార్ ప్యానల్లోనే వీటిని బిగిస్తున్నారు. – చిటికెన రామకృష్ణ, డీఈఈ తూర్పు ప్రాంత విద్యుత్ శాఖ, పాలకొల్లు -
వయ్యారిభామతో ముప్పు
యలమంచిలి: రైతులు తెగుళ్ల కంటే అధికంగా భయపడేది వయ్యారిభామ (పార్థీనియం) కలుపు మొక్కకే. ఎక్కడైనా పెరగడం ఈ మొక్క లక్షణం. ఈ కలుపు మొక్క ప్రధాన పంటకు నష్టం కలిగిస్తుంది. మొలిచిన నెల రోజుల్లోనే పూతకు వస్తుంది. ఒక్కో మొక్క 50 వేల విత్తనాలను ఉత్పత్తి చేయడంతో పాటు గాలి పాటుకు దూర ప్రాంతాలకు సైతం తేలికగా విస్తరిస్తుంది. ఈ కలుపు మొక్క గురించి మండల వ్యవసాయాధికారి షేక్ అబ్దుల్ రహీమ్ తెలిపిన వివరాలు.. జీవరాశికి ప్రమాదమే వయ్యారిభామ వల్ల పంటలకే కాదు మనుషులు, పశువులకూ ముప్పే. మనుషులకు జ్వరం, ఉబ్బసం వంటి వ్యాధులతో పాటు చర్మ సంబంధిత అలర్జీ వస్తుంది. జలుబు, కళ్లు ఎర్రబడడం, కనురెప్పల వాపు తదితర సమస్యలు వస్తాయి. ఈ మొక్కలను తింటే పశువులు అయితే హైపర్ టెన్షన్కు గురవుతాయి. ఇక పంటలకు నీరు, పోషకాలు అందకుండా వాటి కన్నా ముందుగా ఇవే శోషించుకుంటాయి. తద్వారా దిగుబడులు 40 శాతం వరకు తగ్గుతాయి. వంగ, మిరప, టమాట, మొక్కజొన్న పైర్లు పూత దశలో ఉన్నప్పుడు వాటిపై వయ్యారిభామ పుప్పొడి పడితే ఉత్పత్తి తగ్గుతుంది. పైర్లకు మొవ్వ, కాండం కుళ్లు తెగుళ్లు సోకే ప్రమాదముంది. ఈ మొక్కలు పశుగ్రాస పంటలకు కూడా నష్టం కలిగిస్తాయి. ఈ మొక్క ల్ని నిర్మూలించాలంటే రైతులు తప్పనిసరిగా సమగ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇలా తొలగించాలి వయ్యారిభామ మొక్కలు తక్కువ సంఖ్యలో ఉంటే చేతితో పీకేయాలి. మొక్కలు పూతదశకు రాక ముందే పీకి తగలబెట్టాలి. లేకపోతే వాటి వ్యాప్తిని నివారించడం కష్టం. ఒకవేళ పూత దశకు చేరుకున్న తర్వాత మొక్కలను పీకినట్లయితే వాటిని వెంటనే కుప్పగా వేసి తగలబెట్టాలి. రసాయనాలతో.. మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాల పంటల్లో విత్తనాలు మొలక రాకముందు లీటరు నీటికి 4 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేస్తే వయ్యారిభామ మొక్కల బెడద ఉండదు. విత్తనాలు మొలకెత్తిన 15–20 రోజులకు లీటరు నీటికి 2 ఎంఎల్ పేరాక్వాట్ మందును కలిపి పిచికారీ చేసుకోవచ్చు. పశుగ్రాసం వేసేవారు పైరు వేయకముందే లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేయాలి. ఈ కలుపు మొక్కతో పంటకు నష్టం, జీవరాశికీ ప్రమాదమే పూతకు ముందే తొలగించాలి కంపోస్ట్ తయారీ చేయవచ్చు వయ్యారిభామ మొక్కలు ఎంతో హానికరమైనప్పటికీ వాటిని ఉపయోగించి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఇందుకు నీరు నిలవని చోట 3 మీటర్ల లోతు, 6 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవు ఉండేలా గుంత తవ్వాలి. ఇందులో 50 కిలోల వయ్యారిభామ మొక్కలను వేసి, వాటిపై 5 కిలోల యూరియా, 50 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి కూడా చల్లాలి. ఈ విధంగా పొరలు, పొరలుగా గుంతను డోము ఆకారంలో నింపుకోవాలి. పొరల పైన పేడ, మట్టి, ఊక మిశ్రమాన్ని వేసి కప్పేయాలి. నాలుగైదు నెలల్లో కంపోస్ట్ తయారవుతుంది. దానిని జల్లెడ పట్టి పంటకు వేసుకోవాలి. ఈ కంపోస్టులో నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పోషకాలు అధికంగా ఉంటాయి. ఇలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకుని అన్ని పంటలకు వేసుకోవచ్చు. – షేక్ అబ్దుల్ రహీమ్, యలమంచిలి మండల వ్యవసాయాధికారి -
మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామివారికి ఆలయ అర్చకులు ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో బారులుదీరి స్వామివారిని దర్శించి, 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,75,143 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. సుమారు 1400 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేసినట్లు చెప్పారు. ఆలయం వద్ద బొర్రంపాలెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది వైద్య శిబిరం నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో చోరీ తాడేపల్లిగూడెం అర్బన్ : పట్టణంలోని ఝాన్సీరాణి ఆస్పత్రి సమీపంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి రూ.7 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు అపహరించారు. వివరాల ప్రకారం సుబ్బారావు పేటలో ఉంటున్న బల్ల వేణువర్మ, లలిత గత నెల 24వ తేదీన తిరుమల తిరుపతి వెళ్లి మంగళవారం వచ్చారు. ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండడం, ఇంటిలోని వస్తువులు చిందర వందరగా పడి ఉండడంతోపాటు బీరువాలో దాచిన ఆరు కాసుల బంగారు నగలు, కిలో వెండి సామగ్రి కనిపించలేదు. దీంతో బాధితురాలు బల్ల లలిత స్థానిక పట్టణ పోలీస్స్టేసన్లో ఫిర్యాదు చేయగా ఎసై నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం నరసాపురం: పట్టణ పరిధిలోని నరసాపురం–నిడదవోలు ప్రధాన పంట కాలువలో మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పంటకాలువలో మహిళ మృతదేహం ఉన్నట్టుగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టౌన్ సీఐ బి.చాదగిరి, ఎస్సై జయలక్ష్మి అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతురాలి వయస్సు సుమారు 53 సంవత్సరాలు ఉంటుందని సీఐ వివరించారు. పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వివరించారు. -
● నయనానందకరం.. జగన్నాథుని రథోత్సవం
ఏలూరు నగరంలో జగన్నాథుని రథోత్సవం నయనానందకరంగా సాగింది. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. వందలాది మంది భక్తులు నృత్యాలు, కీర్తనలు, గానాలు, కోలాట ప్రదర్శనలతో నగర వీధుల్లో ఆనందోత్సాహాల నడుమ రథం వెంట నడిచారు. రథంపై ఊరేగిన జగన్నాథుడు, బలదేవ్, సుభద్ర మహారాణి ఉత్సవ విగ్రహాలను భక్తులు సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్నప్రసాద విందు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు. – ఏలూరు (ఆర్ఆర్పేట)