Eluru District News
-
రఘురామకృష్ణరాజుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
నరసాపురం: రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రఘురామకృష్ణరాజు రాజ్యాంగ విలువలను కాలరాస్తూ..దళిత క్రైస్తవులపై దాడులకు దిగుతూ రెచ్చిపోతుంటే కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్కుమార్ ప్రశ్నించారు. గురువారం సాయంత్రం స్థానిక అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన దళిత క్రైస్తవ సమైక్య సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 1.10 కోట్ల ఓట్లు ఉన్న దళిత క్రైస్తవుల ఓట్లు మాకు అక్కరలేదు అనే ధైర్యం రఘురామకృష్ణరాజుకు ఎక్కడి నుంచి వచ్చింది? అని ప్రశ్నించారు. 2029 ఎన్నికల్లో దళితుల ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం అడ్రస్ గల్లంతు కావడం తథ్యమన్నారు. హక్కుల సాధన కోసం దళిత క్రైస్తవులు ఐక్యంగా పోరాడాలని సూచించారు. ఏలూరులో ఈనెల 28న లక్ష మందితో చేపట్టిన దళిత క్రైస్తవ సమరశంఖారావం బహిరంగసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సభ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంబీఎస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న, దళిత క్రైస్తవ సంఘాల నాయకులు ఇంజేటి జాన్కెనడీ, సోడదాసి శ్రీధర్, నల్లిమిల్లి జోసఫ్, గూటం జయరాజు, చదలవాడ జ్ఞానప్రకాష్, దొండపాటి స్వాములు, దీపాటి జానకీరాజు తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్కుమార్ -
మెరుగైన సేవల్లో అద్వితీయం
● భక్తులకు మెరుగైన దర్శనం, సేవలు అందిస్తున్న దేవస్థానాల్లో శ్రీవారి దేవస్థానానికి రెండో ర్యాంక్ ● వాట్సాప్, ఐవీఆర్ఎస్ సర్వేల్లో వెల్లడి ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాలకు వచ్చే భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సర్వేలో ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానానికి రెండో ర్యాంకు దక్కింది. ప్రతి నెలా వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా దర్శనం సంతృప్తికరంగా జరిగిందా? దేవాలయాల్లో తాగునీటి వసతులు బాగున్నాయా? ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా? పారిశుద్ధ్యం సంతృప్తికరంగా ఉందా? అనే ఈ నాలుగు అంశాలపై సర్వే నిర్వహిస్తున్నారు. అందులో గత నెల అన్ని అంశాల్లోనూ మొదటి ర్యాంక్ సాధించిన ద్వారకాతిరుమల దేవస్థానం, ఈనెల 16న వెలువడిన జూన్ నెలకు సంబంధించిన సర్వేలో ఓ మెట్టు దిగి, ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే ఈసారి దర్శనం ఇతర అన్ని అంశాల్లో శ్రీకాళహస్తి దేవస్థానం మొదటి ర్యాంక్ సాధించగా, శ్రీశైలం దేవస్థానం ఆఖరి స్థానంలో నిలిచింది. దర్శనం ఇతర అంశాల్లో.. శ్రీకాళహస్తి 75.8 శాతంతో మొదటి ర్యాంక్ సాధించగా, ద్వారకాతిరుమల 74.2 శాతంతో రెండవ ర్యాంక్, అన్నవరం 73.0 శాతంతో మూడవ ర్యాంక్, సింహాచలం 72.6 శాతంతో నాల్గవ ర్యాంక్, కాణిపాకం 72.0 శాతంతో ఐదవ ర్యాంక్, విజయవాడ 71.2 శాతంతో ఆరవ ర్యాంక్ సాధించగా, శ్రీశైలం 68.8 శాతంతో ఆఖరి స్థానంలో నిలిచింది. సౌకర్యాల కల్పనలో.. శ్రీకాళహస్తి 75.75 శాతంతో మొదటి ర్యాంక్, ద్వారకాతిరుమల 74.21 శాతంతో రెండవ ర్యాంక్, అన్నవరం 73.0 శాతంతో మూడవ ర్యాంక్, సింహాచలం 72.61 శాతంతో నాల్గవ ర్యాంక్, కాణిపాకం 71.97 శాతంతో ఐదవ ర్యాంక్, విజయవాడ 71.16 శాతంతో ఆరవ ర్యాంక్, శ్రీశైలం 68.80 శాతంతో ఏడవ (ఆఖరి) ర్యాంక్ సాధించింది. -
నవ్విపోదురుగాక.. మాకేంటి!
భారీ భూ కుంభకోణం నకిలీ పత్రాలు, తప్పుడు రిజిస్ట్రేషన్లతో అమాయకులను మోసం చేస్తూ సాగుతున్న భారీ భూ కుంభకోణాన్ని జంగారెడ్డిగూడెం పోలీసులు ఛేదించారు. 8లో uనవ్విపోదురుగాక నాకేంటన్న చందాన ఉంది కూటమి పాలకుల తీరు. ఎన్నికల హామీలను గాలికొదిలేసి రెండేళ్ల పాలనపై విజయోత్సవ సంబరాలు చేసుకోవడం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. మద్యాన్ని ఏరులై పారించడం, ఇసుక, మట్టి దోపిడీ తప్ప పేదల కోసం ఏం చేశారని ప్రజాధనం వృథా చేస్తూ వేడుకలు చేసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో కూటమి సంబరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.● హామీలు విస్మరించి.. వంచనతో పాలించి ● కూటమి రెండేళ్ల సంబరాలపై ముక్కున వేలేసుకుంటున్న జనం ● జిల్లాలో నేడు సంబరాలు శురకవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2026సాక్షి, భీమవరం ● వ్యవ‘సాయ’మేది? గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత పంటల బీమాని ఎత్తేసి ప్రీమియం భారాన్ని రైతులపై మోపారు. పాత బకాయిలతో దాదాపు రూ. 21 కోట్లు నీటి తీరువాను వడ్డీతో సహా వసూలు చేస్తున్నారు. గత ఖరీఫ్లో మోంథా తుపానుతో 9,201 హెక్టార్లలో రూ.23 కోట్ల మేర పంట నష్టం వాటిల్లితే మళ్లీ ఖరీఫ్ మొదలైన పరిహారం ఇవ్వలేదు. జిల్లాలోని 80 వేల మంది కౌలు రైతులకు సాయంపై మాట్లాడటం లేదు. అగ్రిల్యాబ్లు, ఆర్బీకేలను అధోగతిపాల్జేశారు. ఆక్వా రైతులకు రూ.1.50 రాయితీ విద్యుత్ ఇస్తామని ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ పేరుతో ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీకి ఎగనామం పెట్టే పనిలో ఉన్నారు. రొయ్య రేట్లు తగ్గించి, మేత ధరలు పెంచేసి సిండికేటు చేస్తున్న దోపిడీకి కళ్లెం వేయలేకపోతున్నారు. ● అను‘గృహం’ ఎప్పుడు? ఇళ్లు లేని పేదలకు మూడు సెంట్లు స్థలం ఇస్తామని సెంటు కూడా ఇవ్వలేదు. ఇంటి నిర్మాణానికి రూ.నాలుగు లక్షలు సాయం అందిస్తామని చెప్పినా ఆ ఊసేలేదు. సొంతింటి కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క ఇళ్లు మంజూరులేదు. పీఎం ఆవాస యోజనగా ఇటీవల పట్టణ ప్రాంతాల్లోని 595 ఇళ్లను మంజూరు చేశారు. ఆవాస్ ప్లస్లో 16,773 ఇళ్లను సర్వే చేసి 10,789 మంది అర్హులుగా గుర్తించగా వీరంతా మంజూరు కోసం చూస్తున్నారు. గతంలో ఇచ్చిన ఇళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. ● వైద్యానికి సుస్తీ ఆనారోగ్యం వస్తే ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్యులు వస్తారన్న భరోసా. ఎంత పెద్ద రోగమైనా ఆరోగ్యశ్రీలో రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందుతుందన్న ధీమా. కోలుకునే వరకు జీవనోపాధికి ఆరోగ్య ఆసరా వస్తుందన్న నమ్మకాన్ని కూటమి దూరం చేసింది. గతంలో జిల్లాలోని ఆచంట, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం సీహెచ్సీల్లో ఉచితంగా కంటి వైద్య సేవలు, కళ్లజోళ్ల పంపిణీకి మంగళం పాడింది. బకాయిల కోసం నెట్వర్క్ ఆస్పత్రులు పలుమార్లు ఆరోగ్యశ్రీ సేవలను బహిష్కరించిన దుస్థితి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత, అరకొర సేవలతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. ● ఏదీ ధీమా ఇంటి యజమాన్ని కోల్పోయి దిక్కుతోచని కుటుంబానికి ఆధారమైన బీమా పథకాన్ని నిర్వీర్యం చేశారు. ప్రమాదం, ఆనారోగ్యం కారణంగా రెండేళ్లలో ఇంటి పెద్ద మృతితో బీమా సాయం అందక జిల్లాలో రోడ్డున పడ్డ కుటుంబాలెన్నో. ● ఏమీలేదని‘పింఛెన్’ పేదలకు ఆర్థిక భరోసానిచ్చే పింఛన్ల మంజూరును విస్మరించింది. 2024 జూన్ నాటికి జిల్లాలో 2,32,885 మంది లబ్ధిదారులు ఉంటే ప్రస్తుతం వారి సంఖ్య 2,20,843 తగ్గింది. రెండేళ్లలో కొత్త పింఛన్ ఒక్కటి ఇవ్వక వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్లు కోసం జిల్లాలో వేల మంది ఎదురుచూస్తున్నారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛన్ హామీ ఊసెత్తడంలేదు. జిల్లాలో 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య పింఛన్కు అర్హత కలిగిన వారు 2 లక్షల మంది ఉంటారని అంచనా. ● మహిళకు వంచన సూపర్సిక్స్లో మొదటిదైన ఆడబిడ్డ నిధి అమలవ్వక రెండేళ్లలో జిల్లాలో అర్హత కలిగిన సుమారు 5,96,313 మంది మహిళలు రూ.2147 కోట్లు నష్టపోయారు. మహిళల కోసం గత ప్రభుత్వం తెచ్చిన చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వడ్డీ రాయితీ పథకాలను తుంగలోకి తొక్కారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు రూ.10 లక్షల వరకు పెంపు, మహిళ ఉద్యోగులకు హాస్టల్ వసతి, అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ, ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపు హామీలను గాలికొదిలేశారు. జిల్లాలోని 3,486 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి ఏడాదవుతున్నా మిషన్లు ఇవ్వలేదు. ‘‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఫొటోలతో ఉన్న ఈ చిత్రాన్ని చూశారా? కూటమి వచ్చిన 2024 జూన్ నుంచే ఇచ్చే పథకాలు అమలు చేస్తామంటూ ఎన్నికల్లో ఇంటింటికీ పంచిన కరపత్రమిది. పాలకొల్లులోని ఒక కుటుంబంలో నలుగురు సభ్యుల్లో ఇద్దరు మహిళలకు ఆడబిడ్డ నిధిగా ఒక్కొక్కరికి రూ.1500 చొప్పున ఏడాదికి రూ.36 వేలు. ఇద్దరు యువకులకు నిరుద్యోగ భృతిగా నెలకు ఒక్కొక్కరికి రూ.3 వేలుచొప్పున ఏడాదికి రూ.72 వేలు. మొత్తం రూ.1.08 లక్షలు లబ్ధి చేకూరుతుందని స్పష్టంగా పేర్కొన్నారు. దీనినే బాండ్ పేపర్గా భావించమని సంతకాలు చేసిచ్చారు. రెండేళ్లలో ఆ కుటుంబానికి రూ.2.16 లక్షల సాయం అందాలి. నెలనెలా ఇస్తామన్న ఆడబిడ్డ నిధి, రూ.మూడు వేల నిరుద్యోగ భృతి కోసం పేదలు ఎదురుచూస్తున్నారు. ఎంత మేలు చేసింది పాలకులే చెప్పాలి’’ ప్రగతి.. అధోగతి జిల్లాకు తలమానికంగా నరసాపురం రూరల్ లిఖితపూడిలోని 40 ఎకరాల స్థలంలో రూ.వంద కోట్లతో చేపట్టిన ఆక్వా వర్సిటీ పనులను ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేసింది. అద్దె భవనంలో ఆక్వా కళాశాల నిర్వహిస్తోంది. రూ.475 కోట్లతో పాలకొల్లు రూరల్ దగ్గులూరులోని 60 ఎకరాల్లో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల పనులకు ప్రైవేటీకరణ గ్రహణం పట్టింది. పేదల విద్యకు ఎసరు కార్పొరేట్కు కొమ్ముకాస్తూ సంస్కరణల పేరుతో ప్రభుత్వ పాఠశాలలను అధోగతి పాల్జేస్తున్నారు. నాడు–నేడు అభివృద్ధి పనులను, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీని ఆపేశారు. గతంలో పాఠశాలలు తెరిచిన రోజునే బుక్స్, యూనిఫాం, బూట్లు తదితర వాటితో విద్యార్థులకు విద్యాకానుక కిట్లు పంపిణీ చేస్తే అరకొరగా నాసిరకం కిట్లను అందజేస్తూ వస్తున్నారు. -
నాడు–నేడు పనులకు మోక్షమెప్పుడో?
భీమవరం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేసింది. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు మనబడి, నాడు – నేడు పేరిట అభివృద్ధి పనులు చేపట్టింది. అనంతరం ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టడంతో పాఠశాలల అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయినా నేటికీ ఆ పనులు పూర్తిచేయడం లేదు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగన్ హయాంలో కార్పొరేట్కు దీటుగా.. జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 1,399 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 90 వేలకు పైగా విద్యార్థులు విధ్యనభ్యసిస్తున్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు లేకపోవడంతో పేదలు సైతం తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించక తప్పేదికాదు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన తరువాత ప్రభుత్వ పాఠశాలలపై దృష్టిపెట్టి మనబడి, నాడు–నేడు పథకంతో ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించడమేగాక ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి పాఠశాలల్లో డిజిటల్ బోధన అమలు చేశారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు ఆసక్తి పెరిగింది. అసంపూర్తిగా నిర్మాణాలు వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ అధునీకరిస్తున్న సమయంలో 2024లో ప్రభుత్వం మారింది. నాడు–నేడు పనులకు బ్రేక్ పడింది. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో కొన్ని భవనాలు పునాదుల్లోనే నిలిచిపోగా మరికొన్ని భవనాలు గోడలు నిర్మాణం, ప్లాస్టింగ్ పనులు పూర్తికాక నిరుపయోగం ఉన్నాయి. జిల్లాలోని 254 స్కూళ్ల మరమ్మతులు, మరో 158 స్కూళ్లలో అదనపు తరగతి గదులు నిర్మాణం జరగాల్సి ఉంది. వీటికిగాను దాదాపు రూ.13 కోట్లు నిధులు అవసరం ఉంటుంది. -
తాత ఏర్పాటు చేస్తే మనుమడు మూసేస్తాడా?
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన పులిరామన్నగూడెంలో గత వారం రోజులుగా మా పాఠశాల మాకే కావాలంటూ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల గేట్లకు తాళాలు వేసి పాఠశాలలు తెరవకుండా గ్రామస్తులు అడ్డుకుంటున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె.రాములు నాయక్ అక్కడికి ఆందోళన కారులతో చర్చలు జరిపారు. పాఠశాల కొనసాగింపుపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపించామని అవి వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తమ పాఠశాల దశాబ్దాల క్రితమే ఏర్పడిందని అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పాఠశాల స్థాయికి పెంచడంతోపాటు వసతిగృహం సదుపాయాన్ని కూడా కల్పించారని తెలిపారు. అయితే ఆయన మనుమడు మంత్రిగా ఉన్న విద్యాశాఖ రేషనలైజేషన్ పేరుతో గిరిజన ఆశ్రమ పాఠశాలను కుదించడం వల్ల గిరిజన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డీడీ జనార్థన్రావు, న్యాయవాది యు.ఏసుబాబు, గ్రామస్తులు మూలెం రమేష్, మడకం వెంకటేశ్వరరావు, జి.లక్ష్మీనారాయణ, బండారు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇటికిలకోటలో.. పోలవరం రూరల్: మండలంలోని ఇటికలకోటలో గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలలో 8, 9, 10 తరగతులను కుదించాలనే ప్రభుత్వ నిర్ణయంపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం గ్రామస్తులు పాఠశాల గేట్లకు తాళాలు వేసి ధర్నా నిర్వహించారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల కథనం ప్రకారం, గత రెండు రోజుల క్రితం ఉన్నతాధికారులు ఫోన్ ద్వారా పాఠశాల విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపించాలని సూచించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే పాఠశాలకు తాళాలు వేయడంతో విద్యార్థులను ఎదురుగా ఉన్న భోజనశాలలో కూర్చోబెట్టి ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు సున్నం గంగాజలం, తామా బాలరాజు, ధర్ముల లక్ష్మి, పోసి రత్నం తదితరులు పాల్గొన్నారు. బుట్టాయగూడెం : పీఆర్గూడెం పాఠశాల గేటు వద్ద గ్రామస్తులతో చర్చిస్తున్న పీఓ పోలవరం రూరల్ : ఇటికిలకోటలో పాఠశాల గేటుకు తాళాలు వేసి ఆందోళన చేస్తున్న గిరిజనులు -
కాళ్లకూరు వెంకన్న హుండీ ఆదాయం లెక్కింపు
కాళ్ల: మండలంలోని కాళ్లకూరులో స్వయంభూః శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో హుండీ ఆదాయాన్ని లెక్కించగా 83 రోజులుగాను రూ.21,25,181 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం.అరుణ్ కుమార్ తెలిపారు. ముసునూరు: గత కొన్ని రోజులుగా రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ మోటార్ల వైర్లను వరుసగా చోరీ చేసిన దొంగలను అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు. ఈ చోరీలపై కొద్ది రోజుల నుంచి గస్తీ ముమ్మరం చేసి, విస్తృతంగా తనిఖీలు చేస్తుండగా బైక్పై మోటారు వైర్లు తరలిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు చెప్పారు. కాగా దొంగల ముఠాలో పరివర్తన కోసం నూజివీడు ప్రధాన కూడలి నుంచి కోర్టు వరకు బహిరంగంగా నడిపించుకుంటూ తీసుకువెళ్లి కోర్టులో హాజరుపర్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ ఐవీ నాగేంద్ర కుమార్, పోలీసులు పాల్గొన్నారు. భీమడోలు: మండలంలోని పూళ్లలో ఓ పాఠశాల విద్యార్థిని అదృశ్యమైన ఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం పూళ్లకు చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఉండగా, కుమార్తె పూళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటుంది. ఈ క్రమంలో యథావిధిగా పాఠశాలకు వెళ్లిన విద్యార్థినీ మధ్యాహ్న భోజనం చేసి ఉపాధ్యాయులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లిపోయింది. పాఠశాలలోని మధ్యాహ్నం తరగతులకు హాజరుకాకపోవడంతో హెచ్ఎం బాలిక తండ్రికి సమాచారం అందించారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యుల సాయంతో ఆచూకీ కోసం బంధువులు, ఇతర పరిసరాలను గాలించారు. ఫలితం లేకపోవడంతో గురువారం రాత్రి భీమడోలు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని భీమడోలు ఎస్సై మదీనా బాషా తెలిపారు. గూటాల ఎత్తిపోతల ద్వారా నీటి విడుదల పోలవరం రూరల్: మండలంలోని గూటాల ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతులకు అవసరమైన గోదావరి సాగునీటిని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అనంతరం ప్రజల నుండి వినతులు స్వీకరించారు. -
జంగారెడ్డిగూడెంలో భారీ భూ కుంభకోణం
జంగారెడ్డిగూడెం: నకిలీ పత్రాలు, తప్పుడు రిజిస్ట్రేషన్లతో అమాయకులను మోసం చేస్తూ సాగుతున్న ఒక భారీ భూ కుంభకోణాన్ని జంగారెడ్డిగూడెం పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ మాట్లాడుతూ ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు. పట్టణంలోని రామచంద్రపురం ప్రాంతానికి చెందిన రాజనాల రమాదేవి అనే మహిళకు చెందిన 625 చదరపు గజాల విలువైన స్థలాన్ని అక్రమంగా కాజేయడానికి కుట్ర చేశారన్నారు. రమాదేవి తన ఆస్తిని ఉండి కృష్ణవేణి అనే మహిళకు వీలునామా రాసిచ్చినట్లు ఒక నకిలీ వీలునామాను, అలాగే రమాదేవి మరణించినట్లు ఒక నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించారన్నారు. ఆ తర్వాత ఈ తప్పుడు పత్రాలను నిజమైనవిగా నమ్మించి సబ్–రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. అనంతరం ఆ స్థలాన్ని భాగాలుగా విభజించి, ఇతర నిందితుల పేర్లపై మార్చి, చివరకు వేగవరం ప్రాంతానికి చెందిన కొనుగోలుదారులకు విక్రయించారన్నారు. ఈ విధంగా అసలు యజమానురాలిని మోసం చేసి సుమారు రూ.55 లక్షలు అక్రమంగా ఆర్జించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితులు వీరే ఈ కేసుపై లోతుగా దర్యాప్తు జరిపిన జంగారెడ్డిగూడెం ఎస్సై ఎన్వీ ప్రసాద్, సిబ్బంది గురువారం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారన్నారు. ఈ కేసులో జంగారెడ్డిగూడేనికి చెందిన ఉండి కృష్ణవేణి, మత్స లోవరాజు, సింగంశెట్టి సత్యనారాయణ అలియాస్ సత్తిరాజు, సజ్జా రమేశ్ బాబు, జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ మాజీ అధికార ప్రతినిధి గెడా సుబ్రహ్మణ్యం, నిడదవోలుకు చెందిన జెట్టి ఉమామహేశ్వరరావు అలియాస్ ఉమ, తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన దాసరి సురేశ్ అలియాస్ స్టాలిన్లను అరెస్టు చేసి వారి నుంచి నేరానికి ఉపయోగించిన ల్యాప్టాప్, ప్రింటర్, నకిలీ వీలునామా, నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంత మందిని అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని ఏఎస్పీ తెలిపారు. స్థలాలు, ఇళ్లు వంటి స్థిరాస్తులను కొనుగోలు చేసేటప్పుడు ఆస్తి పత్రాలు, రిజిస్ట్రేషన్ వివరాలు, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ), రెవెన్యూ రికార్డులను అసలు యజమాని వివరాలతో సరిచూసుకోవాలని ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. మహిళతో సహా ఏడుగురు నిందితుల అరెస్ట్ -
పామాయిల్ రైతుల ఆందోళన
చింతలపూడి: సీతానగరంలోని గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని గురువారం పామాయిల్ రైతులు ముట్టడించారు. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరను ఫ్యాక్టరీ యాజమాన్యం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ ప్రధాన గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతు ప్రతినిధులు పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.రంగారావు, జగ్గవరపు ముత్తారెడ్డి, ఆచంట సూర్య నారాయణ, పెన్మెత్స రామరాజు, సూరానేని గోపినాథ్, అలవాల ఖాదర్బాబురెడ్డి, కె రమేష్రెడ్డి, శంకర్రెడ్డి, తెగడ వెంకన్న మాట్లాడుతూ పండించిన పంటకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను ఇవ్వకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. తక్షణమే గిట్టుబాటు ధరను రైతులకు చెల్లించాలని, రైతులపై ఫ్యాక్టరీ యాజమాన్యం పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం స్పందించి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదని రైతులు తెగేసి చెప్పడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు, యాజమాన్యం స్పందించి శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
తాడేపల్లిగూడెం రూరల్: మోపెడ్ సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో మృతి చెందిన సంఘటన మండలంలోని నవాబుపాలెంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వేమగిరి రాజు (42) తాడేపల్లిగూడెంలోని ఒక బట్టల దుకాణంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం బట్టల దుకాణానికి వెళ్తున్న సమయంలో గ్రామంలోని కూడలికి కొంచెం దూరంలోనే టిప్పర్ లారీ ఢీకొనడంతో దాని చక్రాల కింద పడ్డాడు. దీంతో లారీ చక్రాలు రాజు నడుముపై నుంచి వెళ్లాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య మహాలక్ష్మి, నలుగురు కుమార్తెలు ఉన్నారు. బట్టల దుకాణానికి వెళ్తూ తన తండ్రి ఫొటో తీయించుకున్నట్లు మూడో కుమార్తె ప్రత్యూష విలపించడం చూపరులను కలచివేసింది. ఈ మేరకు రూరల్ ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. పాలకోడేరు: అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారంటూ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు పాలకోడేరు ఏఎస్సై నరసింహమూర్తి తెలిపారు. మోగల్లు గ్రామానికి చెందిన జోగి అనూషకు పెనుమంట్ర మండలం, బ్రాహ్మణచెరువుకు చెందిన సత్య హరిశ్చంద్ర ప్రసాద్ తో 2013లో వివాహమైంది. వారికి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే ఇటీవల అదనపు కట్నం కావాలంటూ భర్తతో సహా ఐదుగురు అత్తింటి వారు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. -
విగ్రహాల ఏర్పాటులో ‘పచ్చ’పాతం
సాక్షి, టాస్క్ఫోర్స్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంక్షేమానికి చిరునామాగా నిలిచి, పేదల గుండెల్లో కొలువైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలు ముదినేపల్లి తహసీల్దారు కార్యాలయంలో ఓ మూలన పడి ఉన్నాయి. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ముదినేపల్లి ప్రధాన సెంటర్లో ఉన్న టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహంతో పాటు బస్టాండ్, పోలీస్ స్టేషన్ల వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహాలను, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని అధికారులు గతంలో తొలగించారు. అయితే అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు కోసం దళితులు పెద్ద ఎత్తున ధర్నా చేయడంతో జాతీయ రహదారి నిర్మాణదారులు సొంత నిధులతో కొంత దూరంలో దాన్ని తిరిగి ప్రతిష్ఠించారు. కానీ వైఎస్సార్ విగ్రహాల పునఃప్రతిష్ఠ విషయంలో మాత్రం అధికారులు, పాలకులు వివక్ష చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నాయకుల పక్షపాత ధోరణి కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో వందలాది మంది అభిమానులు గుండె ఆగి మృతి చెందారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా అభిమానులు, ప్రజలు గ్రామగ్రామాన విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగానే ముదినేపల్లి ప్రధాన సెంటర్లోని పోలీస్ స్టేషన్, బస్టాండ్ సమీపంలో వైఎస్సార్ విగ్రహాలను నిర్మించారు. ఏటా వైఎస్సార్ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, సంతాప సభలు నిర్వహిస్తుంటారు. జాతీయ రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్నాయనే కారణంతో నాడు అధికారులు అన్ని పార్టీల నాయకుల విగ్రహాలను తొలగించారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్ విగ్రహాల పునఃనిర్మాణంలో కక్షపూరిత ధోరణి ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వినతులు బుట్టదాఖలు ముదినేపల్లి బస్టాండ్, పోలీస్ స్టేషన్ల వద్ద తొలగించిన వైఎస్సార్ విగ్రహాలను వై–జంక్షన్, లేదా ఎంపీడీఓ కార్యాలయ ఆవరణ వెలుపల ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని మే 24న వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు బోయిన రామరాజు ఆధ్వర్యంలో తహసీల్దారు ఎస్కే. లతీఫ్పాషాకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముదిరాజుల సంఘ విభాగం అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధనరావు, ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర మహిళా విభాగ కార్యదర్శి గంటా సంధ్య, జిల్లా అధికార ప్రతినిధి మోట్రూ ఏసుబాబు పాల్గొన్నారు. వినతిపత్రం ఇచ్చి రోజులు గడుస్తున్నా అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం లేదు. అధికార పక్షానికి ఒక న్యాయం.. ప్రతిపక్షానికి మరో న్యాయం రహదారి విస్తరణలో భాగంగా తొలగించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ముదినేపల్లి శ్రీవైశ్రీ జంక్షన్లో పునఃప్రతిష్ఠించడానికి దిమ్మల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆదేశాలతో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని కూడా దాని పక్కనే ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా అట్టహాసంగా నిర్వహించారు. అక్కడ మరో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలం ఉండటంతో, దివంగత వైఎస్సార్ విగ్రహ ఏర్పాటుకు కూడా అవకాశం ఇవ్వాలని ప్రజాప్రతినిధులు, అభిమానులు అధికారులను కోరినా ఎలాంటి స్పందనా లేదు. కనీసం జాతీయ రహదారి, జిల్లా అధికారుల నుంచి ఎలాంటి రాతపూర్వక అనుమతులు లేకుండానే కూటమి నేతలు తమ విగ్రహాల నిర్మాణాలకు ఉపక్రమించడం గమనార్హం. వైఎస్సార్ విగ్రహాల ఏర్పాటుపై వైఎస్సార్సీపీ నాయకులు ఇచ్చిన వినతిపత్రం ఇచ్చిన రోజునే ఫైల్ను జిల్లా కలెక్టర్కు పంపించాం. అక్కడి నుంచి అనుమతులు రావాల్సి ఉంది. – ఎస్కే. లతీఫ్పాషా, ముదినేపల్లి తహసీల్దార్ అనుమతులు లేకుండా ఎన్టీఆర్ విగ్రహ పునఃప్రతిష్ఠ పనులు వైఎస్సార్ విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటామని వినతి పత్రం ఇచ్చినా స్పందన నిల్ -
నేటినుంచి ట్రిపుల్ఐటీ కౌన్సెలింగ్
నూజివీడు: ఆర్జీయూకేటీ పరిఽధిలోని నూజివీడు ట్రిపుల్ఐటీలో 2026–27 విద్యా సంవత్సరంలో పీయూసీలో ప్రవేశాలకు శుక్ర, శనివారాల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 1,100 సీట్లలో ప్రత్యేక కేటగిరీ సీట్లను మినహాయించి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ మేరకు ట్రిపుల్ఐటీలోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లోని ఆడిటోరియంలోని కౌన్సెలింగ్ హాల్లో పటిష్ట ఏర్పాట్లు చేశారు. రోజుకు 550 మంది చొప్పున రెండు రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు 30 కౌంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు 100 మంది సిబ్బందిని, వలంటీర్లుగా మరో 100 మంది విద్యార్థులను నియమించారు. డేటా ఎంట్రీ కౌంటర్స్, అకడమిక్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కౌంటర్స్, ఫీజు చెల్లించే కౌంటర్లు, కుల ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్కు కౌంటర్లు, ఐడీ కార్డుల జారీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియను డైరెక్టర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు, ఏఓ బి.లక్ష్మణరావు పర్యవేక్షిస్తున్నారు. జూలై 1నుంచి పీయూసీ ఫస్టియర్ తరగతులు ప్రారంభమవుతాయి. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇటీవల నిర్వహించిన ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే యోహాను ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 3,563 మంది హాజరుకాగా వారిలో 35.25 శాతంతో 1,256 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 3,514 మంది హాజరుకాగా వారిలో 48.72 శాతంతో 1,712 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. కాగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలు, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో కలిపి ప్రథమ సంవత్సరం విద్యార్థులు 13,539 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 14,193 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రీ కౌంటింగ్కు పేపర్కు రూ. 260, రీ వెరిఫికేషన్కు పేపర్కు రూ.1,300 చెల్లించి తమ కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. భీమవరం (ప్రకాశం చౌక్): స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఈ నెల 20వ తేదీన ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి. లోకమాన్ ఒక ప్రకటనలో తెలిపారు. జగదీశ్ మైరెన్, సంధ్య మైరెన్, ఆనంద్ గ్రూప్ అపోలో ఫార్మసీ, డి మార్ట్, రిలయన్స్ వంటి కంపెనీల్లో భీమవరం ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. 18–35 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. వివరాలకు 73308 03719, 94928 85556 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఏలూరు (టూటౌన్): జిల్లాలో ఈనెల 21వ తేదీన జరగనున్న నీట్ పరీక్షను ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లాలో నీట్ పరీక్ష నిర్వహణపై అధికారులతో గురువారం సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏర్పాటు చేసిన 6 పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి 5.15 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలనీ పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఏలూరు (ఆర్ఆర్పేట): ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న నీట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల నుంచి తిరిగే బస్సుల్లో ఆయా ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. నీట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ను చూపించి ఇంటి వద్ద నుంచి పరీక్షా కేంద్రాలకు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని తెలిపారు. -
● కోర్సవారిగూడెంలో జ్వరాల విజృంభణ
జ్వరంతో బాధపడుతున్న నాగదుర్గ, జంపన, దీక్షిత, చంద్రశేఖర్బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కోర్సవారిగూడెంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామంలోని ప్రతి ఇంటికీ ఒకరు జ్వరాలబారిన పడి మంచం పట్టారు. ఇటీవల అడపాదడపా వర్షాలు కురుస్తూ వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో జ్వరాలు పట్టి పీడిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. టైఫాయిడ్తోపాటు మలేరియా జ్వరాల బారిన కూడా పడినట్లు గ్రామస్తులు తెలిపారు. కొందరు దొరమామిడి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం పొందగా మరికొందరు బయటకు రాలేని పరిస్థితిలో ఇంటి వద్దే ఉన్నట్లు చెబుతున్నారు. గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి జ్వర పీడితులకు వైద్యసేవలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ట్రిపుల్ఐటీ మెస్లలో పొరుగు రాష్ట్ర వర్కర్లు
● ఒడిసా వర్కర్ల నియామకంపై అభ్యంతరం ● స్థానిక మహిళల ఉపాధికి గండి ● విద్యార్థుల భద్రతా ప్రశ్నార్థకం? నూజివీడు: నూజివీడు ట్రిపుల్ఐటీలో పనిచేసేందుకు ఒడిసా నుంచి వర్కర్లను తీసుకురావడంపై అటు స్టాఫ్.. ఇటు విద్యార్థులతో పాటు ఇప్పటివరకూ పనిచేస్తున్న సిబ్బందిలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇతర రాష్ట్రాల నుంచి ఊరూపేరు తెలియకుండా దాదాపు 80 మంది వర్కర్లను తీసుకురావడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నూజివీడు ట్రిపుల్ఐటీలోని మెస్లను హరేరామ హరే కృష్ణ ఫౌండేషన్కు టీడీపీ ప్రభుత్వం గతేడాది అక్టోబర్ నుంచి టెండర్లు ఏమీ లేకుండా ఏకపక్షంగా అప్పగించింది. అయితే ఈ మెస్లలో నూజివీడుతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పేద మహిళలు పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. వీరి ఉపాధికి గండికొట్టేలా మెస్లను నిర్వహిస్తున్న ఫౌండేషన్ ఒడిసా యువకులను తీసుకురావడం ట్రిపుల్ఐటీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మెస్ నిర్వాహకులు తీసుకువచ్చిన 80 మంది ఒడిసా కూలీలు ట్రిపుల్ఐటీలోని మెస్లోనే గత వారం రోజులుగా ఉండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి చెందిన రెసిడెన్షియల్ విద్యాసంస్థ లోపల వాళ్లు ఎలా ఉంటారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. యువకులతో వడ్డనా..? నూజివీడు ట్రిపుల్ఐటీలో మొత్తం విద్యార్థుల్లో 65 శాతం నుంచి 70 శాతం మంది విద్యార్థినులే ఉన్నారు. ఇప్పటివరకు మెస్లలో వడ్డన చేయడం, డైనింగ్ హాల్స్ శుభ్రం చేయడం, వంట పాత్రలు కడగడం, కుర్చీలు, టేబుల్స్ తుడవడం వంటి పనులన్నింటినీ స్థానికంగా ఉండే మహిళలే చేసేవారు. ఇప్పుడు వారిని తొలగించి ఈ పనులను చేయడానికి ఒడిసా యువకులను పెడుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. మెస్లలో ఎక్కువగా ఆడపిల్లలు ఉంటారు కాబట్టి యువకులను ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థినులకు సురక్షితమేనా? యువకులందరిది ఒడిసా కాగా.. వారు ఏ ఊరివారు, ఎక్కడి నుంచి వచ్చారు, వారి ప్రవర్తన, ఏమైనా నేర స్వభావం ఉందా.. గతంలో ఏమైనా నేరాలు చేశారా అనే వివరాలు ఏమీ తెలియకుండా ఇక్కడి మెస్లలో పెట్టడమేంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 8 వేల మంది విద్యార్థుల్లో 5 వేలకు పైగా బాలికలే ఉన్నారు. క్యాంపస్లోనే బోధనా సిబ్బంది అంతా క్వార్టర్స్లో నివాసముంటున్నారు. ఈ పరిస్థితుల్లో వేరే రాష్ట్రానికి చెందిన ముక్కూమొహం తెలియని వారిని తీసుకొచ్చి పెడితే ఎలాగనే ప్రశ్నలు సిబ్బంది నుంచి వ్యక్తమవుతున్నాయి. ట్రిపుల్ఐటీ పెట్టిన నాటి నుంచి నూజివీడుతో పాటు చుట్టుపక్కల ఉన్న సుంకొల్లు, యనమదల, రేగుంట, పోతురెడ్డిపల్లి గ్రామాలకు చెందిన పేద మహిళలు మెస్లలో పనిచేసేవారు. ఒడిసా యువకులతో వీరందరి ఉపాధి పోనుంది. దీంతో వీరు ఆందోళనకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై ట్రిపుల్ఐటీ యాజమాన్యం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
వైఎస్సార్ సీపీ శ్రేణులపై క్రిమినల్ కేసు
దేవరపల్లి: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పోలీస్స్టేషన్ ముందు రోడ్డుపై నిలబడి నినాదాలు చేసిన వైఎస్సార్ సీపీ శ్రేణులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సీఐ బి.నాగేశ్వర్ నాయక్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పోలీస్స్టేషన్ ఎదురుగా ఉన్న పాత జీఎన్టీ రోడ్డుపై వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఆయన ఇద్దరు కుమారులు, సుమారు 100 మంది కలిసి ఎటువంటి ముందస్తు అనుమతీ లేకుండా గుమిగూడారని, రోడ్డుపై నినాదాలు చేస్తూ సమావేశం నిర్వహించారని చెప్పారు. ఈ సంఘటనలో పాల్గొన్న అందరిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసు విచారణ త్వరితగతిన చేపట్టి, ఫొటోలు, వీడియోలు, డ్రోన్ వీడియోల ద్వారా అందరినీ గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాహనాలను కూడా సీజ్ చేస్తామని సీఐ తెలిపారు. విచారణకు శేషుబాబు హాజరు దేవరపల్లి పోలీస్స్టేషన్లోని సర్కిల్ కార్యాలయంలో విచారణకు మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు హాజరయ్యారు. ఆయనను సీఐ నాయక్ సుమారు రెండు గంటల పాటు విచారించారు. అనంతరం 41 నోటీసు ఇచ్చి ఈ నెల 29న మళ్లీ విచారణకు హాజరు కావాలని పంపించారు. విచారణ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు, గౌడ సంఘాల నాయకులు శేషుబాబుకు మద్దతుగా పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన శేషుబాబు మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ ఎదుగుదలను చూడలేక కూటమి నాయకుల అండదండలతో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కంపెనీలకు సంబంధించిన వివాదం న్యాయస్థానం పరిధిలో ఉందన్నారు. అయినా అక్రమంగా కేసులు పెట్టి, విచారణకు పిలిచి అవమానిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై నిలదీస్తున్నామనే కక్షతో, రాజకీయ ఒత్తిళ్లతో తనపై అక్రమ కేసులు, నిర్బంధాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. -
మరో పాఠశాల గేటుకు తాళం
లంకపాకలలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల గేటుకు బుధవారం గ్రామస్తులు తాళాలు వేశారు. పాఠశాలలను రేషనలైజేషన్ పేరుతో కుదించడాన్ని వ్యతిరేకించారు. 8లో uనేడు రొయ్యల సాగు చేస్తున్నాను. మేత ధర టన్నుకు ఏకంగా రూ.10వేలు పెంచేశారు. ఆన్లైన్లో 100 కౌంట్ రూ.280 అని చూపిస్తూ, వాస్తవంగా రూ.220కి కొంటున్నారు. విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చే ఈ రంగంపై ప్రభుత్వ తీరు బాగాలేదు. ఉద్యోగాలు లేక ఆక్వాసాగులోకి వస్తున్న యువ రైతులకు ప్రభుత్వ నిర్ణయం ఆశనిపాతం. – లావేటి వీరశివాజీ, ఆక్వా రైతు, లోకుమూడిగరువు, మండవల్లి మండలం వైఎస్ జగన్ పాలనలో కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆక్వా ఉత్పత్తుల రవాణా ఆగలేదు. రైతులందరికీ మేలు చేసే ఉద్దేశంతో అప్సడా యాక్టును తీసుకొచ్చారు. నేడు రైతుల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా రొయ్యల మేతలు ధరలు పెంచేస్తున్నారు. గతంలో ఆర్బీకేల్లో సైతం రొయ్యల మేతలు లభించేవి. నేడు ఆక్వా రైతులు మేతల ధరలను కొనలేక క్రాఫ్ హాలిడే పరిస్థితికి వచ్చారు. – తోట మహేష్, రొయ్యల రైతు, కై కలూరు -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావిస్తూ.. తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలని, మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించేలా ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ కోరారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న డీఏలను విడుదల చేయాలని, గత ప్రభుత్వం నుంచి నిలిచిపోయిన సరెండర్ లీవ్ ఎన్క్యాష్మెంట్ సొమ్మును ఇప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయాలన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతో పాటు వారికి హెచ్ఆర్ పాలసీని వర్తింపజేయాలని కోరారు. ఉద్యోగుల హెల్త్ కార్డ్స్ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో మెరుగైన ఉచిత (క్యాష్లెస్) వైద్యం అందేలా చూడాలన్నారు. కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, ఆర్టీఎస్ ఉద్యోగులకు రావాల్సిన రాయితీలను సకాలంలో అందించాలని కోరారు. దీంతో పాటు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వివిధ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను జిల్లా కలెక్టరుకు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ఎస్. హరనాథ్, ఏలూరు తాలుకా అధ్యక్షుడు గొన్నూరి శ్రీధర్ రాజు, కార్యదర్శి గంటా చంద్రశేఖర్, జిల్లాకోశాధికారి పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలి 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించి, ఐఆర్ తక్షణమే ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ కే.రమేష్ కుమార్ కోరారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగిన జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నాయకులు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏలూరు జిల్లా జనరల్ సెక్రటరీ బి.రాంబాబు, సెక్రెటరి, ఏ.ప్రమోద్ కుమార్, ఉమెన్ వింగ్ చైర్పర్సన్ గీతిక, జనరల్ సెక్రటరీ భషీర్ తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు ఇంటర్వ్యూలు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ సహాయకురాలు, మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల భర్తీకి స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఏలూరు ఆర్డీవో లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించినట్టు ప్రాజెక్ట్ డైరెక్టర్ శారద తెలిపారు. ఏలూరు, భీమడోలు, కైకలూరు, పెదపాడు ప్రాజెక్టుల్లో మొత్తం 8 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 101 మంది అంగన్వాడీ సహాయకురాలు, 1 మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు ఇంటర్వ్యూలు జరిగాయన్నారు. మొత్తం 270 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏలూరు ప్రాజెక్ట్ సీడీపీవో ఏ.పద్మావతి, భీమడోలు ప్రాజెక్ట్ సీడీపీవో రాజశేఖర్, కై కలూరు ప్రాజెక్ట్ సీడీపీవో దీప్తి, పెదపాడు ప్రాజెక్ట్ సీడీపీవో విజయకుమారి, రోహిత్ పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యార్థుల భద్రత దృష్ట్యా అన్ని విద్యా సంస్థల బస్సుల్లో తప్పనిసరిగా డాష్బోర్డ్ కెమెరాలను అమర్చాలని, ప్రయాణ సమయంలో విద్యార్థులకు పూర్తి భద్రత కల్పించాలని ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో డీటీసీ విద్యా సంస్థల యాజమాన్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల తమ అధికారులు జరిపిన తనిఖీల్లో విద్యా సంస్థల బస్సుల్లో ఇంకా డాష్బోర్డ్ కెమెరాలను ఏర్పాటు చేయలేదని తేలిందన్నారు. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని, తప్పనిసరిగా డాష్బోర్డ్ కెమెరాలను అమర్చాలని ఆదేశించారు. అనంతరం వారం రోజుల్లోగా అన్ని బస్సుల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తామని విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిధులు అధికారులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రవాణా శాఖ ప్రాంతీయ రవాణా అధికారి శేఖర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జూలై 19వ తేదీన రాజమండ్రిలోని మన్యం గార్డెన్స్లో రాష్ట్రస్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్న ట్లు ఆహ్వాన కమిటీ సభ్యులు భమిడిపల్లి వెంకట రమణమూర్తి (బాబు), రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ తెలిపారు. భీమవరం (ప్రకాశంచౌక్): అంతర్జాతీయ యోగా దినోత్సవం – 2026 పురస్కరించుకుని ప్రజల శారీరక–మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర–2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్టన్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 19న స్థానిక ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఉదయం 6.30 నుంచి 8 గంటల వరకు రాష్ట్ర స్థాయి థీమ్ ఆధారిత యోగా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వివిధ అవగాహన కార్యక్రమాలు, యోగా శిక్షణ శిబిరాలు, ప్రదర్శనలు, సామూహిక యోగా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. పాలకొల్లు సెంట్రల్: పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా తటవర్తి కృష్ణమూర్తి ఎంపికయ్యారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ సంఘం నుంచి కృష్ణమూర్తిని 2026– 28 సంవత్సర కాలానికి నియమిస్తూ వచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర మాజీ కార్యదర్శి నాలం బాపిరాజు, మాటూరి నరసింహమూర్తి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం పటిష్టతకు, అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో పట్టణ సంఘ అధ్యక్షుడు రేపాక ప్రవీణ్భాను తదితరులు పాల్గొన్నారు. -
ఒంటరి, వృద్ధ మహిళలే టార్గెట్
● హత్య చేసి బంగారం, డబ్బు చోరీ ● మరో కేసులో గంజాయి ముఠా అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన ఎస్పీ శివకిషోర్ ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా కై కలూరు టౌన్ ప్రాంతంలో ఒంటరి, వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి వేళల్లో హత్యలు చేస్తూ, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, ఇంట్లోని విలువైన వస్తువులు, నగదు దోపిడీ చేస్తున్న వ్యక్తిని కై కలూరు టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జూన్ 13న కై కలూరు పాములవీధికి చెందిన మార్పిన వరలక్ష్మి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, ఆమె ఒంటిపై ఆభరణాలు, నగదు మాయమయ్యాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు, అదే వీధికి చెందిన కోమటి మామ అలియాస్ సోము అనే వృద్ధురాలిని కూడా జూన్ 3న ఇదే తరహాలో హత్య చేసినట్లు ఆధారాలు లభించాయి. ప్రేమ వివాహం చేసుకుని, జూదానికి, మద్యానికి బానిసై అప్పులపాలైన ఽధ్రువంత్ ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. నిందితుడి నుంచి చోరీ సొత్తు, బైక్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన హెచ్సీలు ఎన్. వెంకటేశ్వరరావు, బి. భూషరావు, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, నాగార్జున, వంశీకృష్ణ, హోంగార్డులు రాము, ఫణిలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. గంజాయి ముఠా అరెస్టు మరో కేసులో, ఏలూరు త్రీటౌన్ పోలీసులు, ఈగల్ టీమ్ సంయుక్తంగా జాతీయ రహదారిపై సీతాపురం వద్ద వాహన తనిఖీలు నిర్వహించి భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా నుంచి రాజమహేంద్రవరం మీదుగా శ్రీకాళహస్తికి కారు, బైక్పై తరలిస్తున్న 32 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రవాణాకు పాల్పడుతున్న బోనంగి నానాజీ, బోనంగి సత్యనారాయణ, మర్లపూడి దుర్గాప్రసాద్, మురుకుట్టి ఈశ్వరసాయి సతీష్లను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరిపై గతంలోనే పలు పోలీస్ స్టేషన్లలో పాత కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన బాలెనో కారు, మోటారు సైకిల్ను సీజ్ చేసి, ఈ నెట్వర్క్తో సంబంధమున్న ఇతర వ్యక్తుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. కై కలూరు: వ్యసనాలకు బానిసై రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్న సీరియల్ కిల్లర్ తుపాకుల ధ్రువంత్(24)ను కై కలూరు పోలీసు స్టేషన్ నుంచి కోర్టు వరకు పోలీసులు నడిరోడ్డుపై బుధవారం నడిపించుకుని తీసుకెళ్లారు. స్థానిక ఏజీఎఫ్సీఎం కోర్టులో అతడిని హాజరపర్చగా మేజిస్ట్రేట్ రెండు వారాలు రిమాండ్ విధించారు. అనంతరం నిందితుడిని పోలీసులు బందరు జైలుకు తరలించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ ఏవీఎస్.రామకృష్ణ మాట్లాడుతూ కేసులో ప్రతిభ చూపిన హెచ్సీలు ఎన్..వెంకటేశ్వరరావు, బీ.భూషణరావు, పీసీలు ఎస్.శ్రీకాంత్, కే.నాగార్జున, ఎం.వంశీకృష్ణ, హోంగార్డులు పి.రాము, బి.ఫణీలను ఎస్పీ అభినందించారని తెలిపారు. -
ధరలు పెంచడం దారుణం
రైతుల విషయంలో ఉదారతతో వ్యవహారించాల్సింది పోయి ఇష్టారీతిన ఎరువుల ధరలు పెంచడం సరికాదు. పెట్టుబడులు భారీగా పెరిగి కౌలు రైతులు వ్యవసాయం మానేసే పరిస్థితులు ఎదురుకానున్నాయి. కాంప్లెక్సు, పొటాష్ ఎరువుల ధరలను తగ్గించాలి. – నిమ్మగడ్డ నరసింహ, కౌలు రైతు సంఘం నాయకుడు, గొల్లపల్లి ఇప్పటికే పంటలకు సరైన మద్దతు ధరలు లేక నష్టపోతున్నాం. ఇప్పుడు ఎరువుల ధరలను పెంచడంతో పెట్టుబడులు మరింత భారమవుతాయి. ప్రభుత్వాలు రైతులకు మేలు చేయాల్సిందిపోయి ఎరువుల ధరలను పెంచి భారాన్ని మోపడం సరికాదు. – నక్కనబోయిన వెంకేటేశ్వరరావు, రైతు, తూర్పు దిగవల్లి -
ఆక్వాకు చంద్రగ్రహణం
‘హైస్కూల్ ప్లస్’.. నిర్వీర్యం ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉపాధ్యాయుల అశ్రద్ధ వెరసి గ్రామీణ విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన ‘హైస్కూల్ ప్లస్’ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. 8లో uరైతులకు సిరులు కురిపించే అక్షయపాత్రగా రొయ్యల సాగుకు పేరుంది. దేశవ్యాప్తంగా రవాణా అవుతున్న రొయ్యల ఉత్పత్తులలో 70 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తున్నాయి. సింహభాగం ఉమ్మడి పశ్చిమగోదావరి, కొల్లేరు ప్రాంతాలు ఉన్నాయి. చదువుతో పనిలేకుండా ఆక్వా రైతులు ఆధునిక పద్ధతుల్లో ఆక్వా సాగు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇంతటి చరిత్ర కలిగిన ఆక్వారంగం చంద్రబాబు పాలనలో కుదేలైంది. గురువారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2026కై కలూరు: ఏలూరు జిల్లాలో చేపల, రొయ్యల సాగు 1.49 లక్షల ఎకరాల్లో సాగువుతోంది. ఇందులో సుమారు 30,000 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. జిల్లాలో వార్షిక ఉత్పత్తి 12.49 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. జిల్లాలో ప్రధానంగా కై కలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, భీమడోలు, దెందులూరు, పెదపాడు మండలాల్లో సాగు అధికంగా ఉంది. గత ఎన్నికల ప్రచారంలో సైతం మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆక్వా రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని నాయకులు నమ్మబలికారు. ముఖ్యంగా కొల్లేరు లంక గ్రామాల్లో ప్రజలకు కోటి ఆశలు కల్పించారు. నేడు రొయ్యల మేత ధరలను ఇష్టానుసారంగా కంపెనీలు పెంచుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. విద్యుత్ సబ్సిడీ ఏక్కడ? చంద్రబాబు పాలనలో 2014–19 మధ్య ఆక్వా యూనిట్ విద్యుత్ సబ్సిడీ రూ.3.85 ఉండేది. తర్వాత ఎన్నికలు సమీపిస్తుండటంతో రూ.2కి తగ్గించారు. వైఎస్సార్సీపీ పాలనలో 2019–24 మధ్య యూనిట్ విద్యుత్ను రూ.1.50కే అందించారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా సబ్సిడీ ఊసు లేకపోవడంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించి, రూ.1.50కే యూనిట్ విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. సబ్సిడీలో రైతులను పొమ్మనలేక పొగపెట్టడానికి పవర్ ఫ్యాక్టర్(పీఎఫ్) రూల్ను చేర్చారు. ఏలూరు జిల్లాలో మొత్తం 13,007 ఆక్వా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 9,555 కనెక్షన్లకు సబ్సిడీ అందించారు. కూటమి పాలనలో ప్రస్తుతం 3,452 మంది రైతులకు సబ్సిడీ అందించాల్సి ఉంది. పీఎఫ్ నిబంధన నెరవేరాలంటే ఎకరాకు రూ.లక్షన్నర ఖర్చుతో కెపాసిటర్ల భారాన్ని ఆక్వా రైతులు భరించాల్సి వస్తోంది. ఫీడ్ కంపెనీలు మేతల ధరలను పెంచితే ఊరుకునేదే లేదని పలు సభల్లో గొంతెత్తిన కొందరు నాయకులు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో నోరు మెదపడం లేదు. కనీసం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా రొయ్యల మేతల ధరల పెంపుపై తహసీల్దారు కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి నాయకులు ముఖం చాటేశారు. కూటమితో అంటకాగుతున్న నాయకులు పార్టీపరంగా వ్యవహరించడంపై అనేక మంది గుర్రుమంటున్నారు. సమస్యను కేవలం పార్టీలు, ప్రాంతాలకు పరిమితం చేయకుండా కలసికట్టుగా పోరాడాలని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆక్వారంగానికి వైఎస్సార్సీపీ పాలన స్వర్ణయుగం. 2018–19లో రాష్ట్రంలో 38 లక్షల టన్నులుగా ఉన్న రొయ్యల, మత్స్య ఉత్పత్తులు, 2022–23 నాటికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగాయి. ఆక్వారంగంలో విశేష ప్రతిభకు ఎన్నో అవార్డులు దక్కాయి. ఒడిశా, భువనేశ్వర్, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి ఔత్సాహిక రైతులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆక్వా రైతుల సాంకేతికతను అందుపుచ్చుకున్నారు. నేడు రివర్స్ అయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ నాటికి కిలో ఫీడ్ ధర దాదాపు రూ.16 వరకు పెరిగింది. జూన్ 13న టన్నుకు రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచారు. మే 11న ధరల పెంపునకు పచ్చజెండా ఊపారు. వైఎస్సార్సీపీ పాలనలో 100 కౌంట్ రొయ్యల ధర రూ.245 ఉంటే, నేడు ఇదే ధర రూ.225కి పడిపోయింది. ఆకాశాన్నంటిన మేత ధరలు నేల చూపులు చూస్తున్న రొయ్య రేట్లు మేత కంపెనీలకే ప్రభుత్వ పెద్దల మద్దతు అప్సడా, క్వాలిటీ కంట్రోల్ యాక్టులకు తూట్లు -
దడ పుట్టిస్తున్న ఎరువుల ధరలు
● బస్తాపై రూ.300 నుంచి రూ.700 వరకు పెంపు ● ఆందోళనలో అన్నదాత నూజివీడు: ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు ఎరువుల ధరలు దడ పుట్టిస్తున్నాయి. ప్రాథమికంగా వినియోగించే యూరియా, డీఏపీ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోయినా.. పంట ఎదుగుదలకు, దిగుబడికి అత్యంత కీలకమైన శ్రీకాంప్లెక్స్ ఎరువులశ్రీ ధరలు భారీగా పెరిగాయి. దీంతో తమపై అదనపు భారం పడటమే కాకుండా పెట్టుబడి వ్యయం కూడా పెరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణం సహకరించక.. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలకు మద్దతు ధర లేక.. పెరిగిన సాగు ఖర్చులు సైతం చేతికందక రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎరువుల ధరలు పెంచడంతో మూలిగేనక్కపై తాటికాయ పడిన చందంగా రైతన్న పరిస్థితి తయారైంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మార్కెట్లో ఎరువులు సరిగా లభించడం లేదు. బ్లాక్ మార్కెట్లో అధిక డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన దుస్థితి. యూరియా కోసమైతే క్యూలో నిలబడాల్సిన దుస్థితి రైతన్నలకు ఎదురైంది. ఇప్పుడు ఎరువుల ధరలు పెంచడంతో పంటల సాగులో పెట్టుబడులు మరింత పెరుగుతాయని వాపోతున్నారు. పెట్టుబడులు పెరిగిన మేర గిట్టుబాటు ధర పెరుగుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. యూరియా, డీఏపీ పాత ధరలే ఉన్నప్పటికీ కాంప్లెక్స్ ఎరువులు మాత్రం బస్తాకి రూ.300 నుంచి రూ.700 వరకు పెరిగాయి. కాంప్లెక్స్ ఎరువులే కీలకం పంటల దిగుబడిలో కాంప్లెక్స్ ఎరువులే కీలకమని రైతులు పేర్కొంటున్నారు. వరి, మొక్కజొన్న, మినుము తదితర పంటలు ఈ ప్రాంతంలో సాగవుతాయి. యూరియా కేవలం పంట ఏపుగా పెరిగేందుకేనని, దిగుబడులు రావాలంటే నత్రజని, భాస్వరం, పొటాష్ మిళితమై ఉండే కాంప్లెక్స్ ఎరువులనే వాడతారు. వాటి ధరలను భారీగా పెంచేయడంపై రైతుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఎరువుల ధరలు ఇలా పెంచితే వ్యవసాయం చేయాలా, మానేసి కూర్చోవాలా అని ప్రశ్నిస్తున్నారు. ఎరువుల ధరల పెంపు వల్ల రైతులపై కోట్లలో భారం పడనుంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారనుంది. ఎరువుల ధరలు భారీగా పెంచడం వల్ల కౌలు రైతులు పెట్టుబడులు పెట్టలేక వ్యవసాయం చేయడం మానేసే ప్రమాదం నెలకొంది. బస్తాకు రూ.700 వరకు పెరుగుదల ఎరువుల ధరలు బస్తాకు రూ.300 నుంచి రూ.700 వరకు పెరిగాయి. బస్తాపై వందల్లో పెరగడంతో సాగుఖర్చు తడిసిమోపెడవుతోందని రైతులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం డీఏపీ, యూరియా ధరలను నియంత్రిస్తూ, రాయితీని భర్తిస్తోంది. భాస్వరం, పొటాష్, కాంప్లెక్స్ ధరల నిర్ణయాన్ని తయారీ కంపెనీలకు వదిలేయడం సరి కాదన్నది రైతుల వాదన. ఎరువుల ధరలు ఎప్పుడు ఎంత పెరుగుతున్నాయో రైతులకు సమాచారం ఇచ్చే వ్యవస్థ లేకపోవడం దారుణమని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎరువు రకం పాత ధర పెరిగిన ధర పెంపు (రూ.ల్లో) (రూ.ల్లో) (రూ.ల్లో)12–32–16 1900 2450 550 14–35–14 1900 2350 450 24–24–0 2000 2450 450 10–26–26 1950 2450 500 20–20–0–13 1550 2250 700 16–16–16 1675 2050 325 15–15–15–09 1650 1950 300 16–20–0–13 1400 2000 600 ఎంఓపీ 1850 1975 125 ఎస్ఎస్పీ 615 1000 385 -
పల్స్పోలియో విజయవంతం చేయాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఈ నెల 28వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ కే వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో బుధవారం పల్స్పోలియోపై టాస్క్ఫోర్స్ జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఐదేళ్లలోపు వయసు గల 2,00,073 పిల్లలకు పోలియో చుక్కలు వేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం 1,094 పోలియో బూత్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆరోజు పోలియో చుక్కలు వేయించని పిల్లలను గుర్తించి ఈనెల 29, 30 తేదీల్లో సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో వ్యాక్సిన్ అందించాలన్నారు. మూడు రోజలుపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో నూరుశాతం లక్ష్యాలను సాధించేందుకు వీలుగా ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. స్టాప్ డయేరియా సమర్థవంతంగా నిర్వహించాలి ఈనెల 16 నుంచి జూలై 31వ తేదీ వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ –2026ను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కే వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఈమేరకు జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులకు క్యాంపెయిన్ లక్ష్యాలు, కార్యాచరణ ప్రణాళికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టరు దిశానిర్దేశం చేశారు. అనంతరం గోడపత్రికలను విడుదల చేశారు. -
కారు బోల్తా
బుట్టాయగూడెం : మండలంలోని కండ్రికగూడెం సమీపంలో బుధవారం ఒక కారు బోల్తా పడింది. మండలంలోని కంసాలికుంటకు చెందిన తెల్లం రాకేష్, తన పిన్ని సుజాత, ఒక బాబు ముగ్గురూ నల్లజర్ల వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో చిన్నపాటి కునుకురావడంతో గోతులోకి వెళ్లి తిరగబడిపోయింది. అయితే ఈ సంఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బోల్తాపడిన కారును సమీపంలోని కొందరు బయటకు తీశారు. బుట్టాయగూడెం : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను రేషనలైజేషన్ పేరుతో కుదించడాన్ని వ్యతిరేకిస్తూ మండలంలోని మారుమూల గ్రామమైన లంకపాకలలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల గేటుకు బుధవారం గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు తాళాలు వేశారు. ఈ సందర్భంగా గేటు బయట బైటాయించి యథాతథంగా పాఠశాలలను కొనసాగించాలని నినాదాలు చేశారు. రేషనలైజేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే పులిరామన్నగూడెం, రెడ్డికోపల్లి గ్రామాల్లో కూడా గ్రామస్థులు గత ఐదు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తూ తరగతులు జరగకుండా అడ్డుకున్నారు. తాజాగా లంకపాకల పాఠశాలల కూడా తెరవకుండా తాళాలు వేయడంతో బుట్టాయగూడెం మండలంలోని మొత్తం 3 పాఠశాలల్లో విద్యాబోధన, అడ్మిషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. పాత పద్ధతిలోనే పాఠశాలలను కొనసాగించే వరకూ తెరవబోమని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కారం లక్ష్మి, పీడీఎస్యూ నాయకులు బన్నే వినోద్, ఎంపీటీసీ సభ్యుడు కొవ్వాసి గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలోని వేంకటేశ్వర స్వామి దేవస్థాన అర్చకుడు ఎంఆర్ మంగపతి ఆచార్యులపై వచ్చిన ఆరోపణలపై ఈ నెల 22న విచారణ నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ ఏలూరు డివిజన్ ఇన్స్పెక్టర్ వి.సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్చకుడి ప్రవర్తనపై అదే గ్రామానికి చెందిన వగ్వాల వెంకట భాస్కర్ అనే వ్యక్తి చేసిన లిఖితపూర్వక ఫిర్యాదుపై దేవాదాయ శాఖ జిల్లా అధికారి కె.శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ నెల 22న ఉదయం 11 గంటలకు గుండుగొలను ఆలయ ప్రాంగణంలోనే విచారణ చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఈ విచారణకు ఫిర్యాదీ వెంకట భాస్కర్తో పాటు అర్చకుడు మంగపతి ఆచార్యులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన సూచించారు. దెందులూరు: ఏలూరు రూరల్ మండలం మాదేపల్లిలో కలకలం సృష్టించిన నకిలీ ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ల వ్యవహారంలో.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏలూరు ఆర్డీఓను విచారణ అధికారిగా నియమించారు. నిబంధనలకు విరుద్ధంగా, జాయింట్ కలెక్టర్ సంతకం లేకుండా మాన్యువల్గా ఈ సర్టిఫికెట్లు జారీ చేశారంటూ పీజీఆర్ఎస్ ద్వారా అందిన లిఖితపూర్వక ఫిర్యాదుపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. దీనిపై ఇప్పటికే విచారణ పూర్తి చేశామని, ఆ నివేదికను కలెక్టరుకు అందజేస్తామని రూరల్ తహసీల్దార్ విజయ్కుమార్ రాజు తెలిపారు. కాగా, తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 26న తమ కార్యాలయానికి హాజరుకావాలని రూరల్ మండలం రీ–సర్వే డిప్యూటీ తహసీల్దార్ను ఆర్డీఓ ఆదేశించారు. ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి ఇద్దరు భక్తులు వేరువేరుగా బుధవారం రూ.2,01,116 లను విరాళంగా అందజేశారు. అందులో భాగంగా హైదరాబాద్కు చెందిన నిడుముక్కల గంగాధరరావు రూ.1,00,000 సమర్పించగా, ఏలూరుకు చెందిన పెద్ది శ్రీప్రియ రూ.1,01,116లను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు, ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు విరాళం బాండ్ను అందజేశారు. ఈ సందర్భంగా త్రినాథరావు మాట్లాడుతూ నిత్యాన్నదాన పథకానికి భక్తులు అందిస్తున్న విరాళాలు అన్నదాన కార్యక్రమాల నిర్వహణకు ఎంతో తోడ్పడుతున్నాయన్నారు. -
హైస్కూల్ ప్లస్.. నిర్వీర్యం
● ముసునూరులో అడ్మిషన్లు నిల్ ● ప్రచారంలో ఉపాధ్యాయుల వైఫల్యం ● బడి తెరిచిన రెండు రోజులకే టీచర్ల డిప్యుటేషన్? నూజివీడు: ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉపాధ్యాయుల అశ్రద్ధ వెరసి గ్రామీణ విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన ‘హైస్కూల్ ప్లస్’ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. మండల కేంద్రమైన ముసునూరులోని జెడ్పీ హైస్కూల్ ప్లస్లో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు ఒక్క అడ్మిషన్ కూడా నమోదు కాలేదు. కనీసం అదే పాఠశాలలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినుల తల్లిదండ్రులను కలిసి, ఇంటర్లో చేర్పించేలా ఉపాధ్యాయులు చైతన్యపరచకపోవడం గమనార్హం. బాల్య వివాహాల నివారణే లక్ష్యంగా.. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన బాలికలకు ఉచితంగా ఇంటర్ విద్యను అందించాలనే సదాశయంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మండలానికి ఒక జెడ్పీ హైస్కూల్ను శ్రీహైస్కూల్ ప్లస్శ్రీగా అప్గ్రేడ్ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్యాసంస్థలు అందుబాటులో లేకపోవడం వల్ల పదో తరగతి పూర్తి కాగానే ఆడపిల్లలను దూర ప్రాంతాలకు పంపలేక చాలామంది తల్లిదండ్రులు బాల్య వివాహాలు చేసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను మార్చి, బాలికలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలనే లక్ష్యంతో ఈ పాఠశాలలను ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. విద్యార్థులు లేకున్నా అదనపు ఇంక్రిమెంట్ స్కూల్ అసిస్టెంట్ క్యాడర్తో ఇక్కడ పీజీటీలుగా పని చేస్తున్న వారికి ప్రభుత్వం బేసిక్ జీతంతో పాటు అదనంగా ఒక ఇంక్రిమెంట్ (నెలకు సుమారు రూ.4 వేలు) చెల్లిస్తోంది. గతేడాది విద్యార్థులు లేకపోయినా ఈ నలుగురు ఉపాధ్యాయులు అదనపు ఇంక్రిమెంట్తో కూడిన జీతాన్ని డ్రా చేశారు. విద్యార్థులకు బోధించకుండానే ప్రభుత్వ సొమ్మును జీతంగా పొందిన వీరి నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులపై లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రెండు రోజులకే పని సర్దుబాటా? ఈ నెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కాగా.. 13, 14 తేదీల్లో సెలవులు వచ్చాయి. కేవలం 15వ తేదీ ఒక్కరోజే స్కూల్ నడిచింది. అయితే, విద్యార్థినులు లేరనే సాకుతో ముసునూరు హైస్కూల్లో పనిచేస్తున్న నలుగురు పీజీటీలను నూజివీడులోని బాలికల హైస్కూల్ ప్లస్కు పని సర్దుబాటు (డెప్యుటేషన్) కింద పంపుతూ డీవైఈఓ ఉత్తర్వులు జారీ చేయడం ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. బడి తెరిచిన కేవలం రెండు రోజులకే విద్యార్థులు లేరని తేల్చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. కనీసం నెల రోజుల పాటు అడ్మిషన్ల కోసం ప్రయత్నించి, అప్పటికీ పిల్లలు చేరకపోతే వేరే చోటుకు పంపాలి గానీ.. ఇంత త్వరగా డెప్యుటేషన్ ఆర్డర్స్ ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముసునూరులోని జెడ్పీ హైస్కూల్ ప్లస్ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులనైనా ఇంటర్లో చేర్చుకోవాలని స్థానిక ప్రధానోపాధ్యాయుడికి సూచించాం. ఒకవేళ విద్యార్థినులు చేరితే ప్రస్తుతం పని సర్దుబాటు కింద వేరే పాఠశాలకు పంపిన ఉపాధ్యాయులను మళ్లీ ముసునూరు హైస్కూల్ ప్లస్కే రప్పిస్తాం. – పీఎస్ సుధాకర్, డీవైఈఓ, నూజివీడు ముసునూరు మండల పరిధిలోని ముసునూరు, రమణక్కపేట, గుడిపాడు, వేల్పుచర్ల, గోపవరం, చెక్కపల్లి, కాట్రేనిపాడు, గురుకుల పాఠశాలల్లో కలిపి ఈ ఏడాది 200 మందికి పైగా విద్యార్థినులు పదో తరగతి ఉత్తీర్ణులయ్యారు. కేవలం ముసునూరు హైస్కూల్లోనే 34 మంది బాలికలు పాసయ్యారు. వీరిలో కనీసం 15 మందిని కూడా ఇంటర్లో చేర్పించలేకపోవడంపై ఉపాధ్యాయుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది కేవలం ఒక్క విద్యార్థిని మాత్రమే చేరగా.. ఆ విద్యార్థిని కూడా పరీక్షల్లో ఫెయిలైంది. నలుగురు పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్)లు ఉన్నప్పటికీ, ఉన్న ఒక్క విద్యార్థినిని కూడా పాస్ చేయించలేకపోవడం ఇక్కడి విద్యా ప్రమాణాలకు అద్దం పడుతోంది. -
మహిళలు అప్రమత్తంగా ఉండాలి
కై కలూరు: సమాజంలో మహిళలు అప్రమత్తతతో వ్యవహరించాలని వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) సూచించారు. కై కలూరు 8వ వార్డులో ఇటీవల వరుస హత్యలకు గురైన మార్పిన వరలక్ష్మీ (50), సోము ఆదిలక్ష్మీ (80) కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శింంచారు. ఇదే వార్డులో తుపాకుల ద్రువంత్ (24) అనే వ్యక్తి చెడు వ్యవసనాలకు బానిసై ఇద్దరి మెడలో ఆభరణాలు దొంగిలించి హత్య చేశాడు. దీంతో వార్డుకు వెళ్లిన డీఎన్నార్తో మహిళలు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. భయం భయంగా బతుకుతున్నామని వాపోయారు. అతను పట్టుబడకపోతే మరికొందరి ప్రాణాలు తీసేవాడని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో డీఎన్నార్ మాట్లాడుతూ మద్యం, జూదం, గంజాయి వంటి వ్యసనాలకు బానిసలైన యువకులు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారన్నారు. మహిళలు భయపడవద్దని సూచించారు. కార్యక్రమంలో తోట మహేష్, శంకర్, నానీ తదితరులు పాల్గొన్నారు. -
ఆరు పదుల వయస్సులో.. తొమ్మిదో ర్యాంకు
నరసాపురం రూరల్ : చదవాలనే తపన, పట్టుదల ఉంటే వయస్సు ఏమాత్రం అడ్డురాదని నరసాపురం పట్టణం కోవెల వీధికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి బొప్పన నాగమల్లేశ్వరరావు నిరూపించారు. ఇటీవల ఎల్ఐసీలో బ్రాంచ్ మేనేజర్గా ఉద్యోగ విరమణ పొందిన ఆయన మొదటి నుంచి తనకు ఎంతో ఆసక్తి ఉన్న న్యాయవాద వృత్తిని చేపట్టాలని బలమైన కాంక్షతో ముందడుగు వేశారు. గతంలో ఉద్యోగ బాధ్యతల నేపథ్యంలో ప్రైవేటుగా న్యాయ విద్యను అభ్యసించే అవకాశం లేకపోవడంతో, పదవీ విరమణ తర్వాత తన సుదీర్ఘకాలపు కోరికను నెరవేర్చుకోవాలని 2026–27 విద్యాసంవత్సరానికి గాను మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ లాసెట్ పరీక్షలు రాశారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో ఆయన వందకు వంద మార్కులు సాధించి, రాష్ట్రస్థాయిలోనే అత్యుత్తమంగా 9వ ర్యాంకు కై వసం చేసుకున్నారు. రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించిన విషయం తెలుసుకున్న పలువురు ఎల్ఐసీ ఏజెంట్లు, మిత్రులు బుధవారం నరసాపురంలోని నాగమల్లేశ్వరరావు నివాసానికి వచ్చి, ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. -
ఆక్రమణ చెరలో ఎర్ర కాలువ గట్టు
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని మారంపల్లి వద్ద ఎర్ర కాలువ గట్టును తవ్వి సరిహద్దు చేలలో కలిపేసుకుంటున్న సంఘటన స్థానిక రైతుల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా రైతులు సారిక సత్యనారాయణ, శ్రీనివాసరావు, నిడదవోలు రమేష్బాబు మాట్లాడుతూ ఎర్ర కాలువకు సంబంధించిన గట్టును గత కొంతకాలంగా తవ్వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన రైతు వెంపల్లి రాంబాబు 95 సెంట్లు భూమి ఉందని, ఎర్ర కాలువ గట్టును తవ్వి దానిని మూడెకరాలకు విస్తరించినట్లు తెలిపారు. దీంతో గట్టు బలహీనంగా మారే అవకాశం ఉందని, మారంపల్లి, పరిసర గ్రామాల్లోని వేలాది ఎకరాలు వరద సమయంలో ముంపు బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంపల్ల రాంబాబు, అతని సోదరుడు ఈ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎర్ర కాలువ గట్టు, మురుగునీటి డ్రెయిన్ ఆక్రమణలను తొలగించి, ముంపును అరికట్టాలని అధికారులను కోరారు. లేకుంటే సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. గట్టు తవ్వి కలిపేసుకుంటున్న రైతులు -
ఎకై ్సజ్ అధికారుల దాడులు
చింతలపూడి : చింతలపూడి ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో అధికారులు, సిబ్బంది బుధవారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రాఘవాపురం గ్రామానికి చెందిన పర్స నరసింహారావు అనే వ్యక్తి వద్ద నుంచి 7 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ పి.అశోక్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే కామవరపుకోట మండలంలోని పలు మద్యం దుకాణాల్లో ఎకై ్సజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. శ్రీసురక్షశ్రీ యాప్ ద్వారానే మద్యం అమ్మకాలు జరపాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో చింతలపూడి ఎకై ్సజ్ స్టేషన్ ఎస్సైలు అబ్దుల్ ఖలీల్, జె.జగ్గారావు తదితరులు పాల్గొన్నారు. పోలవరంలో.. పోలవరం రూరల్: మండలంలోని ఎల్ఎన్డీ పేట పరిసర ప్రాంతాల్లోని నాటుసారాయి నిందితుల ఇళ్లలో ఎకై ్సజ్, పోలీస్, ఈఎస్టీఎఫ్ బృందాలు బుధవారం సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల సందర్భంగా నాటుసారాయి తయారీ, విక్రయదారులకు అధికారులు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ దాడుల్లో పోలవరం ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ కె.వీరబ్రహ్మం, పోలీస్ ఇన్స్పెక్టర్ పి.అప్పారావు, ఈఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ ఆర్.సత్యవతి, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ వై.వి.ఎన్.ఎస్.ఫణి కుమార్ పాల్గొన్నారు. -
కూటమి సభలో నాయకుల రగడ
భీమవరం : భీమవరం నియోజకవర్గంలోని కూటమి పార్టీ నాయకుల్లో విభేదాల కుంపటి ఆరడం లేదు. ఏ కార్యక్రమం నిర్వహించినా ప్రోటోకాల్ రగడ జరుగుతోంది. బుధవారం భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన శ్రీరెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి, సంక్షేమంశ్రీ పేరుతో కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రోటోకాల్ పాటించలేదంటూ రగడ సృష్టించారు. నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అధికారంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ హవానే కొనసాగుతుందని జనసేనకు కనీసం గుర్తింపు లభించడంలేదనే ఆందోళన జనసేన నాయకులు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నుంచి జనసేనలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన అంజిబాబు పాత స్నేహితులు, సన్నిహితులైన టీడీపీ నాయకులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని జనసేన క్యాడర్ గుర్రుగా ఉన్నారు. భీమవరం పట్టణంతోపాటు, భీమవరం, వీరవాసరం మండలాల్లోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. రెండేళ్ల నమ్మకం కార్యక్రమానికి మూడు పార్టీల నుంచి 8 మంది చొప్పున నాయకులను వేదికపైకి పిలవాలని వారిలో ఒక్కో పార్టీ నుంచి నలుగురు చొప్పున మాట్లాడే విధంగా నిర్ణయించారు. అయితే వేదిక పైకి పిలిచే సమయంలో టీడీపీకి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని కొంతమంది అలజడి సృష్టించడంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది. దీంతో రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి కలుగుచేసుకుని కార్యకర్తలు సమన్వయం పాటించాలని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశారు. ‘జనసేనలో కార్యకర్తలకు గుర్తింపు లేదు’ జనసేన పార్టీలో కష్టపడి పని చేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయిందని జనసేన నాయకుడు, వీరవాసరం జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్నాయుడు విమర్శించారు. తరచూ పెద్ద నాయకుల చుట్టూ ప్రదక్షణలు చేసేవారికి పదవులు ఇస్తున్నారని, ఇలా అయితే పార్టీ మనుగడ కష్టమేనని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వేదికపై ఉన్న కొంతమంది నాయకులు కలుగుచేసుకుని ఇది పార్టీ కార్యక్రమం కాదని అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడాలి అని అనడంతో నేను కార్యకర్తల గురించే మాట్లాడతానని కార్యకర్తలు లేకుంటే పార్టీ ఎక్కడదని స్పష్టం చేశారు. మొత్తం మీద రెండేళ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి చెప్పుకునే కంటే కూటమి నాయకుల్లో విభేదాలే బయటపడడం విశేషం. -
ఆర్జీయూకేటీలో పుస్తకావిష్కరణ
నూజివీడు: నేటి సమాజంలో ఒత్తిడి, నిరాశ, అపజయాలు, ఒంటరితనం వంటి సమస్యలతో అనేక మంది మానసికంగా కుంగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీవితంపై ఆశ కోల్పోయే వారికి ధైర్యం, ప్రేరణ కలిగించాలనే ఉద్దేశంతో రచించిన ‘ఏం ఇంత బాధ ప్రాణం తీసుకునేంత?’ అనే పుస్తకాన్ని ఆర్జీయూకేటీ వైస్చాన్సలర్ ప్రొఫెసర్ మద్దాలి లక్ష్మీనారాయణ రావు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరికీ మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని, ఎలాంటి సమస్య వచ్చినా ‘ప్రాణం కంటే గొప్పది మరొకటి లేదు’ అనే సందేశాన్ని ఈ పుస్తకం చాటుతుందని పేర్కొన్నారు. ఈ పుస్తక రచయిత గుమ్మడిదల జయకృష్ణ మాట్లాడుతూ ఏ సమస్యా జీవితానికంటే పెద్దది కాదనే సందేశాన్ని అందించాలనే సాధారణ ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని రచించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సండ్ర అమరేంద్ర కుమార్, ఆర్జీయూకేటీ నూజివీడు డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు, డీన్ అకడమిక్స్ దువ్వూరు శ్రావణి, ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ డీవీ నాగార్జునదేవి, నూజివీడు ఏఓ బి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెంలో మద్ది ఆంజనేయస్వామివారికి మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాశనలు, వాహన పూజలను అర్చకులచే జరిపించుకున్నారు. సుమారు 3,321 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ చేశారు. వివిధ సేవల రూపేణా ఆలయానికి రూ.3,33,961 ఆదాయం సమకూరినట్లు ఆలయ సహాయ కమిషనర్, ఈవో ఆర్వీ చందన, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ తెలిపారు. పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టును ట్రైనీ ఐఏఎస్ అధికారుల బృందం మంగళవారం సందర్శించింది. ‘ఏపీ దర్శన్’ కార్యక్రమంలో భాగంగా 2025 బ్యాచ్కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు పోలవరం ప్రాజెక్ట్, జలవిద్యుత్ కేంద్రంతో పాటు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. ఈ బృందంలో సీహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి, హరి ఓం పాండియా, క్షితిజ్ ఆదిత్య శర్మ, నమ్రత్ అగర్వాల్, పవన్ తేజా ఏఆర్, ప్రియా, సుయాష్ కుమార్, వెంకటేష్ బన్నా ఉన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు ఎస్ఈ రెడ్డి రామచంద్రరావు, ఈఈ బాలకృష్ణ, డీఈ శ్రీనివాస్, ఎంఈఐఎల్ ప్రాజెక్టు జీఎం ఎ.గంగాధర్, డీజీఎం మురళి పమ్మి అధికారులకు ప్రాజెక్టు గురించి సమగ్రంగా వివరించారు. ప్రాజెక్టు లక్ష్యాలు, రూపకల్పన, నిర్మాణ పురోగతి, సాంకేతిక సవాళ్లు, పూర్తయిన తర్వాత కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్ట నివారణకు సంబంధిత శాఖలతో ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినట్లు కలెక్టర్ కే.వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీ సాయిప్రసాద్కి తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి వివిధ అంశాలపై రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ జీ జయలక్ష్మితో కలిసి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో సీఎస్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో 22ఏ భూ సమస్యల కింద అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
కనుమరుగవుతున్న తాటిచెట్లు
● ఉపాధి కోల్పోతున్న గీత కార్మికులు ● పర్యావరణానికి ముప్పు అంటున్న నిపుణులు భీమవరం: మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి.. అంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నా.. జిల్లాలో తాటిచెట్లను విచ్చలవిడిగా నరికి ఇటుకల బట్టీల్లో ఇటుకలను కాల్చడానికి వాడుతున్నారు. దీనితో వాతావరణంలో కాలుష్య నివారణకు, లక్షలాదిమంది కల్లుగీత కార్మికుల జీవనోపాధికి ఉపయోగపడుతున్న తాటిచెట్లు కనుమరవుతున్నాయి. ఒకప్పుడు కాలువగట్లు, ఖాళీస్థలాల్లో విఫరీతంగా పెంచిన తాటిచెట్లను ప్రస్తుతం విచ్చలవిడిగా నరికివేస్తున్నా పట్టించుకునే నాథుడు కన్పించడం లేదు. గ్రామాల్లో భవనాలు తక్కువగా ఉన్న రోజుల్లో ఎక్కువ మంది ప్రజలు తాటి చెట్టతో నిర్మించిన తాటిఆకులను పైకప్పుగా వేసుకునే ఇళ్లల్లోనే జీవనం సాగించేవారు. చల్లదనానికి ఎంతో అనువైన తాటి ఆకుల పందిళ్లు ఇళ్లముందు దర్శనమిచ్చేవి. తాటిచెట్ల నుంచి కల్లుతీసి కల్లు విక్రయాలే గాకుండా తాటిబెల్లం తయారీ వంటివాటికి ఉపయోగించి అనేకమంది జీవనోపాధి పొందేవారు. తాటిచెట్టుకు సంబంధించిన ఆకులతో చాపలు, వివిధ రకాల బుట్టలు వినియోగించేవారు. అయితే నేడు తాటిచెట్లు కనబడడం అరుదుగా మారింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడంతో ఇటుకలకు గిరాకీ పెరగడంతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇటుకల బట్టీలు వెలవడంతో తాటిచెట్లను నరికి ఇటుకలను కాల్చడానికి వినియోగిస్తున్నారు. దీనితో ఎక్కడా తాటిచెట్టు కన్పించే పరిస్థితి కానరావడం లేదు. వేసవి సమయంలో చేల గట్లు, కాలువ గట్లు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో ఉండే తాటిచెట్లను నరికి ఇటుకల బట్టీల వద్ద గుట్టలుగా నిల్వచేసుకుంటున్నారు. తాటిచెట్ల ఉపయోగాలు తాటిచెట్టు ఆక్సిజన్ను విడుదల చేసి కార్బన్డైఆకై ్సడ్ను తీసుకుంటుంది. గాలిలోని దూళి కణాలను ఒడిసిపట్టి గాలిని శుద్ధి చేస్తుంది. తాటిచెట్ల వేర్లు మట్టిని బలంగా పట్టుకుని నేలక్షయాన్ని నివారిస్తుంది. వర్షపునీటిని భూమిలోనికి చొప్పించి నీటి నిల్వకు సహాయపడుతుంది. తాటిఆకులు సూర్యకిరణాలను అడ్డగించడంతో వాతావరణాన్ని చల్లగా ఉంచడం వంటి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. తాటిచెట్లను విచ్చలవిడిగా తొలగించడం వలన ప్రకృతిలో జీవ వైవిధ్యం తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తాటిచెట్ల తొలగింపును అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.బొరాసిస్ఫ్లా బెల్లీఫెర్ అనే శాసీ్త్రయనామం కలిగిన తాటిచెట్ట మట్టజాతికి చెందినది. కాలువలు, బోదెలకు ఇరువైపులా తాటిచెట్లను పెంచడం వల్ల మట్టి క్షయాన్ని తగ్గించి గట్లు ధృఢంగా ఉండేందుకు దోహదపడతాయి. తాటిచెట్లు తగ్గడం వల్ల ప్రకృతిలో జీవ వైవిధ్యం తగ్గే ప్రమాదముంది. – డాక్టర్ కె మల్లిఖార్జున, వృక్షశాస్త్ర అధ్యాపకుడు, డీఎన్నార్ కళాశాల, భీమవరం తాటిచెట్లను ఇటీవల విచ్చల విడిగా నరికివేయడం వల్ల కల్లుగీత కార్మికులు ఉపాధినికోల్పోతున్నారు. గీతకార్మికులు ఇప్పటికీ మద్యం బెల్ట్షాపులు కారణంగా కల్లు అమ్మకాలు తగ్గి ఇబ్బందులు పడుతుంటే తాటిచెట్లు తగ్గిపోవడం వల్ల కల్లుతీసే అవకాశాన్ని కోల్పోతున్నారు. – జుత్తిగ నర్సింహమూర్తి, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
కనుమరుగవుతున్న తాటిచెట్లు
జిల్లాలో తాటిచెట్లను నరికి ఇటుకల బట్టీల్లో ఇటుకలను కాల్చడానికి వాడుతున్నారు. దీంతో జీవ వైవిధ్యం తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. 8లో uఅటవీ భూముల్లో గ్రావెల్ దందా ఆగిరిపల్లి: మండలంలోని సూరవరం అటవీ భూముల్లో గ్రావెల్ అక్రమ దందా సాగుతోంది. పాత సురవరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు గ్రావెల్ను ఇష్టారాజ్యంగా తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. అధికార పార్టీకి చెందిన నేత కావడంతో అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడానికి జంకుతున్నారు. గత కొన్ని నెలలుగా పాత సురవరం అటవీ భూముల్లో ఉన్న పినుగుల లంక వద్ద ప్రతి రోజు రాత్రి గ్రావెల్ తవ్వకాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. జనసేన పార్టీ నాయకుడు తనకు ఉన్న రెండు జేసీబీలతో కొండను అక్రమంగా తవ్సేసి ఆ మట్టిని ట్రాక్టర్లలో రోజుకి సుమారు 40 ట్రిప్పుల్లో తరలిస్తున్నాడు. ఉంగుటూరు, తేలప్రోలు, గన్నవరం ప్రాంతాలకు తరలించి ట్రక్కు మట్టిని రూ.2,500 నుంచి రూ.3 వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఇప్పటికే కొండను సుమారు 15 అడుగులలోతు వరకు తవ్వేసినా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. రెండు రోజుల క్రితం రాత్రిపూట అటవీ భూముల్లో తవ్వకాలు సాగిస్తుంటే గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో నామమాత్రంగా రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని, అధికార పార్టీ నేతల ఒత్తిడితో రెండు జేసీబీలను వదిలేశారు. -
బాధితులపై కేసులా?
వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు అబ్బయ్యచౌదరి, జేపీ, విజయరాజు దెందులూరు: కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ రక్షణ లేకుండా పోయిందని, చింతమనేని ప్రభాకర్ న్యాయవాది ఇంటిపై దాడి చేస్తే అతనిపై, అతని అనుచరులపై ఎందుకు కేసు నమోదు చేయలేదని వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు కొఠారు అబ్బయ్యచౌదరి, మామిళ్ళపల్లి జయప్రకాష్, కంభం విజయరాజు ప్రశ్నించారు. దౌర్జన్యం చేసిన వారిని వదిలిపెట్టి బాధితులపై కేసులు పెట్టడం ఆశ్చర్యకరమని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారన్నారు. బుధవారం ఏలూరులో న్యాయవాది శ్రీనివాస్ నివాసంలో ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యులను అబ్బయ్య చౌదరి, జేపి, విజయరాజు పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్కరికీ భద్రత లేకుండా పోయిందన్నారు. జేసీబీ తీసుకొచ్చి ఇల్లు కూల్చడానికి ప్రయత్నించి.. బూతులు తిడుతూ దౌర్జన్యం చేస్తే ఎస్సైలు, సీఐలు, డీఎస్పీ సమక్షంలో ఇదంతా జరిగినా జిల్లా యంత్రాంగం ఏమీ తెలియనట్టు మౌనంగా ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి జరిగిందని అందరినీ అరెస్టు చేసి జైలుకు పంపిన చంద్రబాబు ఏలూరులో న్యాయవాది ఇంటిపై దౌర్జన్యం చేస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉందని పదేపదే చెబుతున్న హోం మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రెడ్బుక్ అని పదే పదే చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలన్నారు. పరామర్శించిన వారిలో వడ్డీల కార్పొరేషన్ మాజీ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్బాబు, జడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, పెదపాడు ఎంపీపీ బత్తుల రత్నకుమారి, దెందులూరు వైస్ ఎంపీపీ వేమూరి జితేంద్ర, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మేకా లక్ష్మణరావు, యువజన భాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని, రాష్ట్ర కార్యదర్శి నిట్టా గంగరాజు, కట్ట ఏసుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల సతీష్ చౌదరి, ఏఎంసీ మాజీ చైర్మన్ నెరుసు చిరంజీవి, లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి పాల్గొన్నారు. -
బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ ‘గోల్డ్’మాల్
● 4.4 కేజీల బంగారం మాయమైనట్లు గుర్తింపు ● ముగిసిన తనిఖీలు జంగారెడ్డిగూడెం: స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో జరిగిన భారీ బంగారం కుంభకోణం (గోల్డ్మాల్) తనిఖీలు మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 6వ తేదీ నుంచి (7వ తేదీ మినహా) వరుసగా 10 రోజుల పాటు పోలీసుల సమక్షంలో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. మొత్తం 2,756 బంగారు రుణ ఖాతాలను పరిశీలించగా, అందులో 139 ఖాతాలకు సంబంధించిన 4.4 కేజీల (4,399.70 గ్రాములు) బంగారం మాయమైనట్లు అధికారికంగా నిర్ధారించారు. బ్యాంకుకు రాని ఖాతాదారులు ఎప్పుడు వచ్చినా వారి సమక్షంలోనే వారి బంగారు వస్తువుల ప్యాకెట్లను పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 6న ముగ్గురు ఖాతాదారులు తమ బంగారాన్ని పరిశీలించగా 30 కాసులు (240 గ్రాములు) మాయమైనట్లు తేలింది. ఈ విషయం బయటకు పొక్కడంతో వందలాది మంది ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు, బ్యాంకు ఉన్నతాధికారులు టోకెన్లు ఇచ్చి వరుసగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో కొన్ని బంగారం ప్యాకెట్లలో అసలు బంగారానికి బదులుగా రోల్డ్గోల్డ్, ఇత్తడి, చాక్పీసులు, స్టాప్లర్ పిన్ల బాక్సులు ఉంచినట్లు గుర్తించడంతో అధికారులు అవాక్కయ్యారు. మొత్తం తనిఖీలు పూర్తయ్యేసరికి మాయమైన బంగారం విలువ రికార్డు స్థాయిలో 4.4 కేజీలకు చేరింది. ఎక్కువ బంగారం పెట్టి తక్కువ రుణం తీసుకున్న ఖాతాలు, అలాగే రెన్యువల్ చేసిన ఖాతాల నుంచే ఎక్కువ శాతం బంగారం మాయమైనట్లు గుర్తించారు. ఖాతాదారుల పత్రాలపై ఎక్కువ బంగారం చూపి, బ్యాంకు రికార్డుల్లో తక్కువ చూపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాకర్లలోని బంగారం మాయం కావడం వెనుక కేవలం అప్రయిజర్ రాజు పాత్రే కాకుండా, బ్యాంకు సిబ్బంది, కస్టోడియన్ల హస్తం కూడా ఉండి ఉంటుందని బాధితులు ఆరోపిస్తున్నారు. -
స్వామీ.. కష్టాలకు కారణమేమి!
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో భక్తులకు మెరుగైన సేవలందించాలన్న లక్ష్యంతో అధికారులు రూ. 12.50 కోట్లతో నిర్మించిన నూతన క్యూ కాంప్లెక్స్ ఇటీవల ప్రారంభమైంది. అప్పటి నుంచి చినవెంకన్న దర్శనానికి వస్తున్న భక్తులు రద్దీ సమయాల్లో పలు ఇక్కట్లకు గురవుతున్నారు. దానికి కారణం నూతన క్యూ కాంప్లెక్స్లో ఏవైనా లోపాలున్నాయా.. లేక పరిపాలనా విభాగంలో ఇంజనీరింగ్ విభాగ అధికారులు, సిబ్బంది జోక్యం పెరగడమే కారణమా అన్న ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలోని తాత్కాలిక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సుమారు ఆరేళ్ల పాటు భక్తులకు సేవలందించింది. ఆ క్యూ కాంప్లెక్స్లోని 6 కంపార్ట్మెంట్లను ఉచిత దర్శనం భక్తులకు వినియోగించేవారు. రూ.100, రూ.200 టికెట్లు పొందిన వారు క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండకుండా, అందులో ఉన్న క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించేవారు. రూ.500 అంతరాలయ దర్శనం టికెట్లు తీసుకున్న వారు తూర్పు రాజగోపురం మీదుగా ఆలయంలోకి వెళ్లేవారు. అప్పుడే ఏ ఇబ్బంది కలుగలేదు. అయితే ప్రస్తుత నూతన క్యూ కాంప్లెక్స్లోని 6 కంపార్ట్మెంట్లలో మొదటి దాన్ని రూ.200, రెండో దాన్ని రూ.100 టికెట్లు తీసుకున్న భక్తులకు కేటాయిస్తున్నారు. మిగిలిన నాలుగు కంపార్ట్మెంట్లను ఉచిత దర్శనం భక్తులకు వినియోగిస్తున్నారు. సమస్య ఇక్కడే మొదలు కొత్త క్యూ కాంప్లెక్స్లో ఉచిత దర్శనం భక్తులకు కేటాయించిన నాలుగు కంపార్ట్మెంట్లు వారికి చాలడం లేదు. అలాగే రూ.100, రూ.200 టికెట్లు తీసుకున్న వారికి కూడా కంపార్ట్మెంట్లు సరిపోవడం లేదు. దాంతో భక్తులతో క్యూలైన్లు కిక్కిరుస్తున్నాయి. ఈ క్రమంలో ఉచిత దర్శనం భక్తులతో సమానంగా తమను పంపుతున్నారని టికెట్లు కొనుగోలు చేస్తున్న భక్తులు మండిపడుతున్నారు. అది కూడా గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. టికెట్లు కొనుగోలు చేసిన వారిని కంపార్ట్మెంట్లలోకి కాకుండా గతంలో వలె క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి పంపాలని పలువురు భక్తులు కోరుతున్నారు. ఇలా చేస్తే ఉచిత దర్శనం భక్తులకు రెండు కంపార్ట్మెంట్లు పెరిగి, కాస్త వారికి కూడా ఉపశమనం కలుగుతుంది. నెరవేరని లక్ష్యం అన్ని సౌకర్యాలతో కూడిన దర్శనాన్ని భక్తులకు కల్పించాలన్నదే ఆలయ అధికారుల లక్ష్యం. అయితే క్యూ కాంప్లెక్స్ నిండిపోయిన తరువాత భక్తులు నూతన అనివెట్టి మండపం పక్కన లక్షలాది రూపాయలతో నిర్మించిన క్యూలైన్లలో అధిక సమయం నిలబడాల్సి వస్తోంది. భక్తులు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే.. అధికారుల లక్ష్యం ఎలా నెరవేరినట్టని పలువురు ప్రశ్నిస్తున్నారు. తొలగించిన పాత తాత్కాలిక క్యూ కాంప్లెక్స్ను ఈ క్యూలైన్ల స్థానంలో ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని భక్తులు వాపోతున్నారు. ఇంజనీరింగ్ విభాగ జోక్యం పరిపాలనా విభాగంలో ఇంజనీరింగ్ విభాగ అధికారుల జోక్యం ఎక్కువైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే శని, ఆదివారాల్లో ఇంజనీరింగ్ విభాగ అధికారులు, సిబ్బంది ఆలయంలోని పలు కీలక విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వారు ఏఈఓలు, సూపరింటెండెంట్లపై సైతం పెత్తనం చేస్తున్నారని, దాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నట్టు తెలుస్తోంది. ఏదైనా జరగరానిది జరిగితే దానికి బాద్యత వహించాల్సింది పరిపాలనా విభాగం వారే. ఇంజనీరింగ్ విభాగం వారు కేవలం పరిపాలనా విభాగం అధికారులు కోరిన విధంగా ఏర్పాట్లు చేయాలి. కానీ ఇక్కడ అంతా రివర్స్లో పనిచేస్తున్నారని కొందరు సిబ్బంది బాహాటంగా చెబుతున్నారు. లోలోపల జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు కారణంగా భక్తులకు కావాల్సిన సమాచారం సైతం వారికి పూర్తిస్థాయిలో అందడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. క్షేత్రంలో ఇటీవల ప్రారంభమైన నూతన క్యూ కాంప్లెక్స్ అప్పటి నుంచి భక్తులకు మొదలైన ఇక్కట్లు ఇంజనీరింగ్ విభాగ అధికారుల జోక్యంపై క్షేత్రంలో చర్చ -
పోలీసుల పచ్చపాతం
ఇంటిపై దాడికి యత్నిస్తే కేసు లేదు. ఇంటి ముందు వందల మంది అనుచరులతో, జేసీబీతో నానా హడావుడి చేసి వాడో.. నేనో తేలిపోవాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ప్రజాప్రతినిధి వీరంగమాడినా పోలీసులు పట్టించుకోరు. కనీసం మొక్కుబడిగానైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా రివర్స్లో న్యాయవాదిపైనే కేసులు నమోదు చేశారు. అది కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు. మరో ఫిర్యాదు పెండింగ్లో ఉంది. రోజంతా స్టేషన్లో ఉంచి బైండోవర్ కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్పై పంపారు. ఇదంతా ప్రజాప్రతినిధిని సంతృప్తి పరచడానికి ఏలూరు పోలీస్ యంత్రాంగం చేసిన హడావుడి. బుధవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసరావు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మధ్య కొద్ది నెలలుగా మాటల యుద్ధం కొనసాగుతుంది. మద్యంలో ప్రజాప్రతినిధి దోపిడీ చేస్తున్న వ్యవహారం, ఇసుక, గ్రావెల్, దౌర్జన్యకాండపై ఇటీవల విలేకరుల సమావేశాలు నిర్వహించి పూర్తి వివరాలను, కొన్ని ఆధారాలను న్యాయవాది శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ పరిణామాల క్రమంలో ఆదివారం అర్ధరాత్రి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరగణంతో, జేసీబీ వాహనంతో ఏలూరు అమీనాపేటలోని న్యాయవాది నివాసాన్ని కూల్చివేస్తానంటూ స్వయంగా వెళ్లి హడావుడి చేశారు. దాదాపు రెండు గంటల పాటు ఇంటి గేటును పగులకొట్టి మరీ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. హైడ్రామా అనంతరం ఏలూరు పోలీసులు చింతమనేనిని ఇంటి వద్ద దింపి బాధితుడిగా ఉన్న న్యాయవాది శ్రీనివాస్కు 151 నోటీసు జారీ చేసి అతని కుమారుడితో సహా మహిళా పోలీస్స్టేషన్కు ఆదివారం అర్ధరాత్రి తరలించారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు మహిళా పోలీస్స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున హైడ్రామా కొనసాగింది. న్యాయవాది అక్రమ నిర్బంధంపై ఏలూరు బార్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయవాదులు నిరసన తెలిపారు. అనంతరం న్యాయవాదులు జిల్లా కోర్టులో సెర్చ్ వారెంట్ పిటిషన్ దాఖలు చేసి న్యాయమూర్తి దృష్టికి ఘటనను తీసుకువెళ్ళిన క్రమంలో న్యాయమూర్తి అడ్వకేట్ కమిషనర్ ఏర్పాటు చేయడంతో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. న్యాయవాదిపై అట్రాసిటీ కేసు నమోదు న్యాయవాదిని వేధించడమే లక్ష్యంగా పచ్చనేతలు పోలీసులను అడ్డంపెట్టుకుని హడావుడికి తెరతీశారు. ఈ నెల 10న ఏలూరు రూరల్ మండల టీడీపీ నాయకుడు నేతల రవి జిల్లా కోర్టుకు వెళ్తే న్యాయవాది శ్రీనివాసరావు ఎదురుపడి కులం పేరుతో దూషించి అసభ్యంగా మాట్లాడారని సోమవారం ఫిర్యాదు చేయడం, వెంటనే ఏలూరు త్రీటౌన్ పోలీసులు హడావుడిగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఏలూరు టూటౌన్లో మరో కేసు నమోదు చేశారు. టీడీపీ మహిళా నేతలు తమను, తమ ప్రజాప్రతినిధి కుటుంబాన్ని అసభ్యంగా మాట్లాడారని ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ప్రస్తుతం పెండింగ్లో ఉంది. మంగళవారం సాయంత్రం న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసరావు ఏలూరు టూటౌన్ పోలీసులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిపై ఫిర్యాదు చేశారు. తన ఇంటిపై దౌర్జన్యం చేసి గేటును పగులకొట్టి దాడికి ప్రయత్నించారని ఫిర్యాదు చేయగా పోలీసులు ఫిర్యాదు స్వీకరించి రసీదు అందచేశారు. ఇంటిపై దాడికి యత్నిస్తే నో కేస్ బాధితుడైన న్యాయవాదిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఏలూరు టూటౌన్లో బైండోవర్ కేసు చింతమనేనిపై కేసు నమోదు చేయాలని న్యాయవాది ఫిర్యాదు ఏకపక్షంగా ఏలూరు పోలీసుల తీరు -
ఆగని అక్రమ గట్ల పర్వం
● కొల్లేరు అభయారణ్యంలో వింత పరిస్థితి ● ప్రజాప్రతినిధుల అండతో రెచ్చిపోతున్న వైనంకై కలూరు: కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చెరువుల గట్ల నిర్మాణం యథేచ్ఛగా సాగుతోంది. ఒకవైపు కొల్లేరు ప్రజలకు అన్యాయం జరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా, నాయకులు మాత్రం ఓట్ల రాజకీయం కోసమే ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు నాటకీయంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నడుమ, అక్రమార్కులు చీకటి చాటున చెరువు గట్లను నిర్మిస్తున్నారు. కై కలూరు మండలం వడ్లకూటితిప్ప వద్ద రహదారికి సమీపంలో, గతంలో ‘కొల్లేరు ఆపరేషన్’ సమయంలో ధ్వంసం చేసిన చెరువు గట్లను ఇప్పుడు పగటిపూటే పూడ్చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నాయంటూ అక్రమార్కులు బహిరంగంగానే సవాళ్లు విసురుతుండటం గమనార్హం. నిబంధనలు బేఖాతరు కై కలూరు మండలం పెంచికలమర్రు శివారు మంచినీటి చెరువు సమీపంలో, దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మూడు చెరువులను అదే గ్రామానికి చెందిన ఓ ప్రముఖ అక్రమార్కుడు సాగు చేస్తున్నాడు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో ఈ చెరువులను పూర్తిగా ధ్వంసం చేసినప్పటికీ, అక్కడ కూల్చకుండా వదిలేసిన ఒక షెడ్డును కేంద్రంగా చేసుకుని ఇతడు కార్యకలాపాలు సాగిస్తున్నాడు. జీవో నెంబర్ 120 ప్రకారం కొల్లేరు అభయారణ్యంలోకి కనీసం అగ్గిపెట్టె తీసుకెళ్లడం కూడా నేరమే. అలాంటిది అటవీ శాఖ నిబంధనలను ఏమాత్రం లెక్కచేయకుండా ఇక్కడ గట్ల నిర్మాణం సాగుతోంది. రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకుంటూ అక్రమ సాగులో ఆరితేరిన సదరు వ్యక్తి, కూటమి ప్రభుత్వ పాలనలో మరింత రెచ్చిపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. కూలీలతో వ్యూహాత్మకంగా.. రాజకీయ ఎత్తుగడలు తెలిసిన సదరు అక్రమార్కుడు, పొక్లెయిన్లతో గట్లు వేస్తే అధికారులకు అనుమానం వస్తుందని భావించి.. నిఘా నుంచి తప్పించుకునేందుకు రోజువారీ కూలీలను రంగంలోకి దించాడు. గత కొన్నేళ్లుగా ఇతడు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాడు. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధుల మద్దతు ఉండటంతో అటవీ శాఖ అధికారులను సైతం ఖాతరు చేయడం లేదు. గతంలో ఇక్కడ పనిచేసిన డీఎఫ్ఓ విజయ సదరు అక్రమ సాగుపై కొరడా ఝుళిపించారు. అయితే, ఆమె బదిలీ కావడం అక్రమార్కులకు కలిసివచ్చింది. రానున్న వర్షాకాలంలో గట్లు కొట్టుకుపోకుండా ఉండేందుకు కూలీలతో ముందుగానే వాటిని పటిష్ఠం చేయిస్తున్నాడు. గతంలో అటవీ శాఖ ఇతనిపై అనేక కేసులు నమోదు చేసినా వైఖరి మారలేదు. సదరు వ్యక్తి తమకు పెద్ద తలనొప్పిగా మారాడని అటవీ అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు.కొల్లేరు అభయారణ్య పరిధిలోని వడ్లకూటితిప్ప వద్ద కూలీలతో అక్రమంగా గట్టు వేయిస్తున్న ఉదంతం మా దృష్టికి వచ్చింది. వెంటనే స్థానిక డీఆర్వో, ఎఫ్బీవోలను అక్కడికి పంపించి పనులను నిలిపివేయించాం. అభయారణ్యంలో గట్లు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరం. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. – కె.రామలింగాచార్యులు, అటవీ శాఖ రేంజర్, కై కలూరు -
● కూటమి సభ కోసం.. స్కేటింగ్ ట్రాక్ ధ్వంసం
కూటమి సభ కోసం చిన్నారులు శిక్షణ తీసుకునే స్కేటింగ్ ట్రాక్ ధ్వంసం చేశారు. ‘కూటమి పాలనకు రెండేళ్లు’ పేరుతో మంగళవారం ఏలూరు ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వచ్చిన వారికి భోజనాలు వంట చేయడానికి ప్రాంగణంలో ఉన్న స్కేటింగ్ ట్రాక్ను ఉపయోగించారు. స్కేటింగ్ ట్రాక్ మధ్యలో పెద్ద పెద్ద గోతులు తవ్వడం, ట్రాక్పై వంట పాత్రలు, నీళ్ల డ్రమ్ములతో అధ్వానంగా తయారు చేశారు. దీంతో స్కేటింగ్ ట్రాక్పై ప్రతిరోజూ సుమారు 100 మందికిపైగా శిక్షణ తీసుకునే పిల్లలకు రెండు రోజుల నుంచి శిక్షణ లేదు. వీటిని ఎప్పుడు తీస్తారో.. తవ్విన గోతులు పూడుస్తారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
వృద్ధుడి అదృశ్యం
భీమడోలు: మండలంలోని పూళ్లకు చెందిన వృద్ధుడు కొత్తపల్లి జార్జి (60) అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం పూళ్లకు చెందిన కొత్తపల్లి జార్జి అనే వృద్ధుడు ఉపాధి హామీ పథకం సొమ్మును ఏలూరులోని బ్యాంక్ ఆఫ్ బరోడాకు వెళ్లి తెచ్చుకుంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. అయితే రెండు రోజులుగా అతను కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలు చేశారు. అయితే ఎలాంటి ఫలితం లేకపోవడంతో వృద్ధుడు కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై మదీనా బాషా తెలిపారు. కుక్కునూరు: మండలంలోని బోనగిరి గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన పోడియం మోటు (35) అనే వ్యక్తి మృతి చెందాడు. కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి చెప్పిన వివరాలు ప్రకారం మృతుడు జామాయిల్ మొక్కలు తీసుకెళ్లే వాహనంపై పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మొక్కలు తీసుకువెళుతున్న వాహనంపై మోటు కూర్చుని ఉండగా భద్రాచలం నుంచి అశ్వారావుపేట వెళ్తున్న ఆటో మొక్కల వాహనాన్ని ఢీకొంది. దీంతో వాహనంపై నుంచి పడిపోయిన మోటుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు చికిత్స నిమిత్తం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మోటు మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. వేలేరుపాడు: మండలంలోని జిన్నెలగూడెం గ్రామంలో మంగళవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు రవ్వ గణేష్ పొలంలో ఉపాధి పనులు చేస్తుండగా, తురసం జోగారావు (62) అనే కూలీ అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి కూలీలు ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే జోగారావు మృతి చెందినట్లు ధ్రువీకరించారని వేలేరుపాడు ఎంపీడీవో తెలిపారు. బుట్టాయగూడెం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వం చేపట్టిన రేషనలైజేషన్ను వ్యతిరేకిస్తూ బుట్టాయగూడెం మండలం మారుమూల గ్రామాలైన పులిరామన్నగూడెం, రెడ్డికోపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చేపట్టిన నిరసన కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. పాఠశాల పునఃప్రారంభం నుంచి మంగళవారం వరకూ పాఠశాలలు తెరవకుండా గేట్లకు తాళం వేసి నిరసన కార్యక్రమాన్ని గ్రామస్తులు చేపట్టారు. వంటావార్పు కార్యక్రమం కొనసాగిస్తున్నారు. పాఠశాల ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నా ఆయా పాఠశాలల్లో అడ్మిషన్లు నిలిచిపోయాయి. విద్యార్థులకు విద్యాబోధన నిలిచిపోయింది. గ్రామస్తులు పాఠశాల గేట్లకు తాళాలు వేయడంతో పాఠశాలలకు వస్తున్న 20 మంది ఉపాధ్యాయులు ఆ పరిసర ప్రాంతాల్లో చెట్ల కింద, బల్లలపైన కుర్చునే పరిస్థితి నెలకొంది. తమకు అధికారులు పాత పద్ధతిలోనే నిర్వహిస్తామని రాతపూర్వకంగా రాసి ఇచ్చే వరకూ తాము చేపట్టిన నిరసన కార్యక్రమం నిలుపుదల చెయ్యమంటూ గ్రామస్థులు తెగేసి చెప్తున్నారు. పులిరామన్నగూడెం, రెడ్డికోపల్లి పాఠశాలల్లో గ్రామస్తులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి అటు పీడీఎస్యూ విద్యార్థి సంఘం, గిరిజన సంఘాలు మద్దతు తెలిపాయి. అలాగే మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు కూడా మద్దతు తెలిపారు. పులిరామన్నగూడెం చేరుకుని అక్కడ గ్రామస్తులతో కలిసి పాఠశాల వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తెల్లమ రమణ, వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్రావు, ఎంపీటీసీ సభ్యులు గాలి దుర్గారావు, మొడియం వెంకమ్మ, మడకం వెంకటలక్ష్మి, ఉయికే రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): నిబంధనలను ఉల్లఘించిన 32 ప్రైవేటు విద్యాసంస్థల బస్సులపై కేసులు నమోదు చేశామని ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ మంగళవారం తెలిపారు. విద్యాసంస్థలు పునఃప్రారంభమైన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో వివిధ ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను తనిఖీలు చేశామన్నారు. భద్రతా నియమాలు, నిబంధనలకు అనుగుణంగా ఉన్న బస్సుల్లో మాత్రమే విద్యార్థులను తరలించాలని యాజమాన్యాలకు సూచించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన తెలిపారు. -
ఏలూరులో ‘ధార్ గ్యాంగ్’ కదలికలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో శ్రీధార్ గ్యాంగ్శ్రీ కదలికలను పోలీస్ నిఘా వర్గాలు గుర్తించాయి. అత్యంత ప్రమాదకరమైన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ దోపిడీ ముఠాను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ధార్ గ్యాంగ్లో ముగ్గురు సభ్యుల ముఠా కదలికలు ఇటీవల ఏలూరు పెద్దరైల్వే స్టేషన్లో గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ నిఘా మరింత పెంచేలా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే తక్షణమే 112కు గానీ, 8332959174 నంబర్కు గానీ ఫోన్ చేయాలని సూచిస్తున్నారు. విశాఖపట్నం వయా రాజమండ్రి, ఏలూరు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లా మారుమూల ప్రాంతాలకు చెందిన అత్యంత ప్రమాదకరమైన అంతరాష్ట్ర దొంగల ముఠానే ‘ధార్ గ్యాంగ్’గా పోలీస్ వర్గాలు గుర్తించాయి. ఈ దోపిడీ ముఠా మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, తమిళనాడు వంటి పలు రాష్ట్రాల్లోనూ దోపిడీలకు పాల్పడుతుంటారు. ఈ ధార్ ముఠా ఈనెల 13న విశాఖపట్నంలోని కంచరపాలెం పరిధిలో సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. ధార్ గ్యాంగ్లోని ముగ్గురు సభ్యులు 15తేదీ సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్, ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్ వెనుకవైపు గేటు నుంచి లోనికి వెళ్లినట్లు పోలీస్ నిఘాలో గుర్తించారు. -
చోరీ కేసులో ఇద్దరి యువకుల అరెస్ట్
కాళ్ల: ఆకివీడు జవహర్ పేటలో ఈ నెల 9న జరిగిన చోరీ కేసును ఛేదించినట్లు ఆకివీడు సీఐ కాళీ చరణ్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెద్దింటి శ్రీను కుటుంబ సభ్యులు పెళ్లి బట్టలు కొనుగోలు నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన సమయంలో తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ కేసును ప్రత్యేక కేసుగా పరిగణించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారించామని పేర్కొన్నారు. ఈ కేసులో ఆకివీడు గంగానమ్మకోడు ప్రాంతానికి చెందిన మేకల తేజ, సాయి నగర్ ప్రాంతానికి చెందిన షేక్ ఫరూక్లను గుర్తించి అరెస్టు చేశామన్నారు. వారి నుంచి రూ.17 లక్షలు విలువైన 14.5 కాసుల బంగారు నగలు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. గతంలో కూడా వీరు రెండు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు ఆయన చెప్పారు. నిందితులపై సస్పెక్ట్ షీట్లు తెరుస్తున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం ఎస్సై హనుమంత నాగరాజు, కానిస్టేబుల్ శివ, విజయ్, వాసు, నాగేశ్వరరావు తదితరులను ఆయన అభినందించారు. -
ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోరా?
టీడీపీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్పై దాడి చేస్తే చర్యలు ఉండవా.. దెందులూరు ఎమ్మెల్యే తో పాటు 100 మంది అనుచరులు దాడి చేసి దౌర్జన్యం చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు. మీకొక న్యాయం.. ఎదుట వాళ్లకు మరో న్యాయమా? రెడ్బుక్ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, లోకేష్ వ్యవస్థలను విచ్ఛిన్నం చేశారు. దెందులూరు నియోజకవర్గంలో మద్యం, మట్టి మాఫియా అరాచకం కొనసాగుతోంది. నియోజకవర్గంలో భయానక పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. –కొఠారు అబ్బయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్యే -
323 అర్జీల స్వీకరణ
ఏలూరు (టూటౌన్): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీని పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టరు కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. కలెక్టరుతో పాటు జాయింటు కలెక్టరు ఎంజె అభిషేక్ గౌడ, ఇంచార్జ్ డీఆర్వో ఎల్.దేవకీదేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె.భాస్కర్ తదితరులు ప్రజలు నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 323 అర్జీలు స్వీకరించారు. కలెక్టరు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అధికారులు స్వీకరించిన ప్రతి అర్జీపై బాధ్యతాయుతంగా వ్యవహరించి, నిర్ణీత గడువు లోపుగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. అర్జీలు నాణ్యత పరిష్కారంతో, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో వెళ్ళి లబ్ధిదారులుతో నేరుగా మాట్లాడి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాలని సూచించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): గతంలో ఎయిడెడ్ పాఠ శాలలుగా పనిచేసి ప్రస్తుతం మండల పరిషత్ యాజమాన్యంలో విలీనం చేసిన ప్రాథమిక పాఠశాలలు, మోడల్ ప్రైమరీ పాఠశాలల నిర్వహణ నిధులు తక్షణమే మంజూరు చేసి విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ –1938 ఏలూరు జిల్లా నాయకులు సమగ్ర శిక్ష ప్రాజెక్టు కోఆర్డినేటర్ కే పంకజ్ కుమార్ను కోరారు. ఈ మేరకు ఫెడరేషన్ నాయకులు సోమవారం ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలకు నిర్వహణ నిధులు మంజూరు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంలో పాఠశాల నిర్వహణ నిధులు కీలకమని వివరించారు. తక్షణమే నిర్వహణ నిధులు విడుదల చేయాలని కోరారు. ఏపీటీఎఫ్ –1938 జిల్లా ప్రధాన కార్యదర్శి జీ మోహన్, ఉపాధ్యక్షుడు డీ శ్రీనివాసరావు, అదనపు కార్యదర్శి పీ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): వృద్ధులపై వేధింపులను మానవహక్కుల ఉల్లంఘనగానే పరిగణించాల్సి ఉంటుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి అన్నారు. వృద్ధులపై వేధింపుల నివారణ దినోత్సవ సందర్భంగా సోమవారం మాదేపల్లి రోడ్లోని ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సులో శ్రీలక్ష్మి మాట్లాడుతూ వృద్ధాప్యంలో సరైన గౌరవం, ఆదరణ, జీవన భద్రత అందేలా చూడాలని, వృద్ధుల సంక్షేమం కోసం ఉన్న చట్టాల గురించి తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఆస్తుల కోసం వేధించడం, ఒంటరితనం వారిని తీవ్రంగా కుంగదీస్తున్నాయన్నారు. పెద్దలకు ఏదైనా అత్యవసర సహాయం, లేదా వేధింపుల సమస్య ఉంటే 15100 కు కాల్ చేసి సహాయం పొందవచ్చన్నారు. వృద్ధుల భద్రత, శ్రేయస్సును పెంచడంలో సహాయపడే వనరులు, సేవలను, వారి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపేలా ప్రపంచాన్ని ప్రోత్సహించడం ఈ అవగాహన దినోత్సవ లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాది పీ. వెంకటేశ్వరరావు, వృద్ధాశ్రమం కార్యదర్శి కే.రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎంఎన్వీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాది శ్రీనివాసబాబుపై కేసు
ఏలూరు టౌన్: న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబును ఏలూరు జిల్లా న్యాయస్థానం నియమించిన అడ్వకేట్ కమిషనర్ సురేష్రెడ్డి సమక్షంలో కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువెళ్ళారు. న్యాయవాది శ్రీనివాసబాబుపై నమోదు చేసిన కేసుల్లో స్టేషన్ బెయిల్కు అవకాశం ఉండటంతో ఆయన్ను ఏలూరు జిల్లా కోర్టుకు తరలించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అమీనాపేటలోని న్యాయవాది శ్రీనివాసబాబు ఇంటివద్దకు వెళ్ళి హంగామా చేశారు. మద్యం సేవించి ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో టూటౌన్ పోలీస్స్టేషన్లో బైండోవర్ కేసు నమోదు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా చింతమనేనిని హౌస్ అరెస్ట్ చేశారు. న్యాయవాది శ్రీనివాసబాబుపై దెందులూరు నియోజకవర్గానికి చెందిన నలుగురు పార్టీ నాయకులు ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 7న శ్రీనివాసబాబు ప్రెస్మీట్ పెట్టి ఎమ్మెల్యే చింతమనేని, కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, మహిళల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతూ కించపరిచారనీ అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
పాఠశాల స్థాయి తగ్గింపుపై మండిపాటు
పోలవరం రూరల్: గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దని గ్రామస్తులు, తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం మండలంలోని ఇటికలకోట ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల స్థాయి తగ్గింపు నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పాఠశాల వద్ద నిరసన చేపట్టారు. ఈ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 8, 9, 10 తరగతులను తొలగించడం దుర్మార్గపు చర్య అని ఆదివాసీ గిరిజన సంఘం ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి కారం భాస్కర్ విమర్శించారు. పాఠశాలలో కేవలం 3 నుంచి 7వ తరగతి వరకు మాత్రమే కొనసాగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఇటికలకోట పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించిందని, గతంలో కలెక్టర్, ఐటీడీఏ అధికారులు ఇక్కడి సిబ్బందిని అభినందించారని గుర్తుచేశారు. ఏలూరు జిల్లాలో రేషనలైజేషన్ విధానాల వల్ల 21 పాఠశాలల్లో విద్యార్థులకు చదువు దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు లేరనే సాకుతో తరగతులు తగ్గించడం సరికాదని, కోర్సవారిగూడెం, కోయనాగంపాలెం గ్రామాల్లో పిల్లలున్నా పాఠశాలలు తెరవడం లేదని ఎత్తిచూపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గిరిజన విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, లేనిపక్షంలో తల్లిదండ్రులు, గ్రామస్తులను ఏకం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
జి రాయితీ భూముల సమస్యలపై కార్యాచరణ
ఏలూరు (టూటౌన్): కొల్లేరు 5వ కాంటూర్ పరిధిలోని జి రాయితీ, డీ ఫారం భూమిదారులు సమస్యల పరిష్కారానికి పునరావాస కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమర్పించాలని సంబంధిత అధికారులను కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో సోమవారం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నాగేశ్వరరావు, జ్యోతి పాల్గొన్నారు. కొల్లేరు అభయారణ్య పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు, జి రాయితీ, డి.ఫారం భూమిదారులు సమస్యల పరిష్కారం, పునరావాస కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంపై అధికారులతో కలెక్టరు సమీక్షించారు. ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్, జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, డీఎఫ్ఓ త్రిమూర్తులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు న్యాయం చేయాలి
ఏలూరు (టూటౌన్): జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ లోన్ బాధితులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం చలో ఏలూరు కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మా బంగారాన్ని మాకు ఇప్పించండి అంటూ జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు, చిరు వ్యాపారులు, వృత్తిదారులు, అనేక మంది జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో తమ బంగారాన్ని తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నారని, కానీ ఇప్పుడు ఆ బంగారం స్థానంలో ఇనుప వస్తువులు, సుద్ద ముక్కలు ఉన్నాయన్నారు. తప్పుడు పత్రాలు చూపిస్తూ బ్యాంకు అధికారులే దొంగతనం చేశారని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.లింగరాజు మాట్లాడుతూ బాధితులకు సీపీఎం అండగా ఉంటుందని ప్రకటించారు. ధర్నా అనంతరం గోల్డ్ లోన్ బాధితులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సీపీఎం నాయకులు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. దీనిపై కలెక్టర్ వెట్రిసెల్వి స్పందిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా బ్యాంక్ ఆఫ్ బరోడా రీజినల్ మేనేజర్ హామీ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ను ఆదేశించారు. కార్యక్రమంలో గోల్డ్ లోన్ బాధితులు కొప్పుల సత్తిరెడ్డి, గెడా ఆనంద ప్రసాద్, తలారి నందిని, ఆర్.దుర్గాభవాని, గోలి కృష్ణారెడ్డి, కోనా రాము తదితరులు పాల్గొన్నారు. -
కొల్లేరులో నో రూల్స్
కై కలూరు: లంక గ్రామాల్లో పెద్దల ముసుగులో ప్రభుత్వానికి సమాంతర పాలన సాగిస్తోన్నారు. గ్రామానికి తాగునీటిని చేరేవేసే పంట బోదెను పూడ్చేశారు. ఈ పంటబోదెలో కొన్ని సంవత్సరాలుగా ఉపాధి పనులు సైతం జరిగాయి. ఇరిగేషన్, డ్రెయినేజీ, రెవెన్యూ, పంచాయతీ అధికారులు మాకు తెలీదు.. అంటే మాకు తెలీదు అంటూ తప్పించు కుంటున్నారు. కొల్లేరు లంక గ్రామాల్లో పెంచికలమర్రు గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ 2,500 మంది జనాభా ఉన్నారు. సమీప 17 గ్రామాలకు తాగునీటి సరఫరా చేసే ఉద్ధేశంతో పెంచికలమర్రులో 2000లో సమగ్ర రక్షిత నీటి పథకాన్ని ప్రారంభించారు. ఇందుకుగాను మూడు తాగునీటి చెరువులు ఉన్నాయి. ఇటీవల ఈ చెరువుల్లో రొయ్యలసాగు వివాదంగా మారింది. పెంచికలమర్రులో సగంలో ఆగిపోయిన సచివాలయ భవనం సమీపంలో 7 ఎకరాల మంచినీటి చెరువు ఉంది. దాదాపు 300 మీటర్ల పంట బోదె ద్వారా ఆలపాడు నుంచి వచ్చే నీరు చెరువులో నింపుతారు. అత్యవసరమైన పంట బోదెను ఏటా ఉపాధి పనుల్లో బాగు చేయిస్తున్నారు. ఏకంగా బోదెను కొన్ని రోజుల క్రితం పూడ్చేశారు. అడుగున తూములు పెట్టామని చెబుతున్నారు. ఆక్రమణల వల్ల ఆలపాడు నుంచి వచ్చే మంచినీటిని చెరువులో నింపే అవకాశం ఉండదు. గ్రామ పెద్దలను కాదని అధికారులు పంట బోదె ఘటనపై కనీసం కన్నెత్తి చూడటం లేదు. మా పరిధి కాదంటే మాది కాదు తాగునీటి చెరువుకు నీటిని పంపించే పంట బోదె పూడ్చడంపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాగబాబును వివరణ కోరితే మాకు సంబంధం లేదన్నారు. ఇరిగేషన్ డీఈ శిరిషకు విషయం చెబితే ఉపాధి పనులు బోదెకు జరిగితే పంచాయతీకి సంబంధించినదని చెప్పారు. పంచాయతీ సెక్రటరీ ప్రసాద్ను వివరణ కోరితే పెద్దలు అందరూ కలసి తీసుకున్న నిర్ణయాన్ని కాదనలేమన్నారు. గ్రామ వీఆర్వో నీలయ్యను ప్రశ్నించగా.. వీఆర్ఏతో కలిసి పరిశీలిస్తానని చెప్పారు. పూర్వ కాలం నుంచి నీటిని సరఫరా చేసే పంటబోదెను పూడ్చడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పెంచికలమర్రులో పంటబోదె పూడ్చివేత -
చింతమనేనిపై చర్యలేవి?
మాడవీధుల స్థలానికి విరాళం కాళ్ల: కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి ఆలయ మాడవీధుల స్థలం కోసం కొమ్మూరి వెంకటనరసింహారావు జ్ఞాపకార్థం కుటుంబసభ్యులు రూ.1,01,116 విరాళంగా అందించారు. మంగళవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2026ఏలూరు టౌన్: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ఏలూరులో రెచ్చిపోయారు.. ఫూటుగా మద్యం సేవించి టీడీపీకి చెందిన ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు ఇంటిపైకి వెళ్ళి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇదంతా ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్, సీఐలు, ఎస్ఐల సమక్షంలోనే జరగటం విశేషం. పోలీసులను ఏంట్రా అంటూ సంబోధించినా.. గుండెలపై చేతులు వేస్తూ గెంటేసినా.. పోలీసులు నోరెత్తలేదు. ఇదిలా ఉండగా న్యాయవాది శ్రీనివాసబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ సమీపంలోని మహిళా పోలీస్స్టేషన్కు తరలించటం విమర్శలకు తావిచ్చింది. దాడి చేసేందుకు వెళ్ళిన ఎమ్మెల్యే చింతమనేనిని క్షేమంగా ఇంటి వద్ద దించిన పోలీసు అధికారులు... బాధితుడు శ్రీనివాసబాబుకు 151 నోటీస్ జారీ చేసి అతని కుమారుడితో సహా స్టేషన్లో ఉంచారు. ఏలూరులో హైడ్రామా న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు పోలీస్స్టేషన్లో అక్రమ నిర్బంధంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోనే సీతారాం, ప్రధాన కార్యదర్శి నిమ్మల జ్యోతికుమార్, ఉపాధ్యక్షుడు ఎన్.కృష్ణారావు, మాజీ ప్రధాన కార్యదర్శి కే.సురేష్రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో న్యాయవాదులు పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. బాధితుడు శ్రీనివాసబాబుకు మద్దతుగా ఏలూరు బార్ సభ్యులు చేరుకున్నారు. పోలీస్స్టేషన్లోకి వెళ్ళేందుకు ప్రయత్నించగా లోనికి వెళ్ళేందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. కనీసం సహచర న్యాయవాదిని కలిసేందుకు పోలీసులు అడ్డుచెప్పటంపై ఏలూరు బార్ అసోసియేషన్ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రోడ్డు వద్దనే నిలబడి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడగా.. ఐదుగురు నాయకులను మాత్రం లోనికి వెళ్ళేందుకు అనుమతించారు. న్యాయవాది శ్రీనివాసబాబు ఆరోగ్య పరిస్థితిని, పోలీస్ అధికారుల తీరును అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు లేకపోగా... బాధితుడిని పోలీస్స్టేషన్లో ఉంచటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కోర్టులో సెర్చ్ వారెంట్కు పిటిషన్ ఏలూరు బార్ సభ్యులు ఈడ్పుగంటి శ్రీనివాసబాబును సాయంత్రంలోగా విడిచిపెడతామని చెప్పిన పోలీస్ అధికారులు ఏవిధమైన చర్యలు తీసుకోలేదు. అక్రమ కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారనే సందేహాల నేపథ్యంలో ఏలూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2వ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో సెర్చ్ వారెంట్ పిటిషన్ను దాఖలు చేశారు. ఏలూరు నగరానికి చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది గొట్టుముక్కల రోనాల్డ్ రాస్, పీపీ నర్సింహమూర్తి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారాం సెర్చ్ వారెంట్ పిటిషన్ వేశారు. రౌడీషీట్ ఉన్న ఎమ్మెల్యే రాత్రివేళ దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, అతనిపై ఎలాంటి చర్యలు లేకపోగా.. న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు, అతని కుమారుడిని అక్రమంగా నిర్బంధించారని, సెర్చ్ వారెంట్ ఇవ్వాలని, అడ్వకేట్ కమిషనర్ను ఏర్పాటు చేయటంతోపాటు కోర్టు సిబ్బంది సమక్షంలో వారెంట్ అమలుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కోర్టు సెర్చ్ వారెంట్ జారీ చేయటంతోపాటు అడ్వకేట్ కమిషనర్గా న్యాయవాది సురేష్రెడ్డిని నియమించారు. మంగళవారం ఏలూరు జిల్లా కోర్టుల్లో విధులను బాయ్కాట్ చేస్తున్నట్లు బార్ అసోసియేషన్ ప్రకటించింది. చింతమనేని ప్రభాకర్ తీరుపై న్యాయవాదులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు ఇంటిని జేసీబీతో కూల్చివేస్తామంటూ.. ఆయన కుటుంబ సభ్యులను తీవ్ర భయాందోళనకు గురిచేయటంపై నిరసన తెలుపుతూ బాయ్కాట్ చేస్తున్నామని ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారామారావు ఒక ప్రకటన విడుదల చేశారు. చింతమనేనిపై ఎలాంటి కేసు నమోదు చేయకపోగా... బాధితుడిని పోలీస్స్టేషన్లో నిర్బంధించటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీస్స్టేషన్లో బాధితుడు శ్రీనివాస్ నిర్బంధం దాడికి పాల్పడ్డ చింతమనేనికి రక్షణగా పోలీసులు ఇదెక్కడి న్యాయం: బార్ అసోసియేషన్ ప్రతినిధులు -
రక్షణ లేకపోతే ఎలా ?
దాడులు, దౌర్జన్యం సమస్యలకు పరిష్కారం కాదు. రోజులన్నీ ఒకేలా ఉండవు. న్యాయ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న న్యాయవాదులకు, వారి కుటుంబాలకు రక్షణ లేకపోవడం బాధాకరం. న్యాయవాదులపై దాడులు విచారకరం. న్యాయవాదికి అందరూ బాసటగా ఉంటాం. న్యాయం జరిగే వరకు పోరాడతాం. –ముదుగురు సూర్యనారాయణ, వైఎస్సార్సీపీ బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్పై దాడి దౌర్జన్యం అనాగరిక చర్య. సమాజంలో భిన్నాభిప్రాయాలు సహజం. ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టపరంగా ఎదుర్కోవాలి తప్ప కుటుంబ సభ్యులపై దాడి చేయడం హేయమైన చర్య. ముమ్మాటికీ శాంతిభద్రతలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం. దాడుల ద్వారా గొంతు నొక్కలేరు. శ్రీనివాస్కు అండగా ఉంటాం. – కామిరెడ్డి నాని, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు -
యోగాతో ఆరోగ్యం
పెనుగొండ: మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు, ఆరోగ్య సమస్యలకు యోగా సమర్థవంతమైన పరిష్కారమని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. పర్యాటకాభివృద్ధిని ప్రోత్సహిస్తూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపు లక్ష్యంగా పెనుగొండ నగరేశ్వర మహిషాసురమర్ధనీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో జరిగిన టెంపుల్ యోగాలో ఆదివారం ఆమె పాల్గొన్నారు. యోగా గురువు, నేషనల్ అథ్లెటిక్స్ యోగా టీచర్ బడుగు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం యోగాతో సాధ్యమన్నారు. యోగా కేవలం వ్యాయామ విధానం మాత్రమే కాదని, సంపూర్ణ జీవన విధానమన్నారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు యోగా కార్యక్రమంలో భాగస్వామ్యులు కావడం అభినందనీయమన్నారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, ఆర్డీఓ దాసి రాజు, జిల్లా ఆయుష్ అధికారి ఎ.శ్రీరామ్, తహసీల్దార్ జి.అనితకుమారి, ఆయుష్ వైద్యులు శాస్త్రి ఆకేళ్ల, ఎన్.గిరీష్, ఎన్.మల్లేశ్వరి, సీహెచ్ సులక్షణ, రామచంద్ర, కిషోర్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
పాపికొండల విహారానికి ఆటుబోట్లు
బుట్టాయగూడెం: గోదావరి అందాలు, పాపికొండల ప్రకృతి సోయగాలను ఆస్వాదించేందుకు ప్రతి వారాంతరంలో అధిక సంఖ్యలో పర్యాటకులు దేవీపట్నం, రాజమండ్రి పరిసర ప్రాంతాలకు తరలి వస్తుంటారు. దేవీపట్నం, గండిపోచమ్మ అమ్మవారి గుడి వద్ద ఏర్పాటు చేసిన రోడ్డు పాయింట్ నుంచి పాపికొండల విహారయాత్రకు బయల్దేరి వెళ్తుంటారు. అయితే ఈసారి పాపికొండల విహారయాత్రకు వెళ్లాలని భావిస్తున్న వారందరికీ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాపికొండల పర్యాటక బోటు ప్రయాణాలు ఆదివారం తా త్కాలికంగా నిలిచిపోయాయి. శుక్రవారం గండిపోచమ్మ బోటు పాయింట్ నుంచి రెండు బోట్లలో పర్యాటకులు పాపికొండల అందాలను వీక్షించేందుకు 89 మంది ప్రయాణికులతో బయలుదేరగా.. బోటు దేవీపట్నం పాత పోలీస్స్టేషన్ సమీపానికి వెళ్లే సరికి సాంకేతికలోపం తలెత్తడంతో గోదావరి నడి మధ్యలోనే నిలిచిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు కేకలు పెట్టారు. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కంట్రోల్రూమ్ అధికారులకు, బోటు యజమానులకు సమాచారం అందించారు. దీంతో నిర్వాహకులు మరో బోటును ఏర్పాటు చేసి ప్రయాణిలను సురక్షితంగా పంపించారు. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై పర్యాటకశాఖ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిట్నెస్ ఉంటేనే.. పాపికొండల పర్యాటక బోట్ల నిర్వహణ, భద్రతపై ఆరోపణలు రావడంతో బోటు ప్రయాణాన్ని నిలిపివేసిన అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఒక ఏపీ టూరిజం, 15 ప్రైవేటు బోట్లు నిలిచిపోయాయి. బోట్ల నిర్వహణ, భద్రతను పరిశీలించిన తర్వాత ఫిట్నెస్గా ఉన్నట్టు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. అనంతరమే పాపికొండల పర్యాటకానికి అనుమతులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే బోట్ల తనిఖీలు, భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాకే బోటు ప్రయాణాలు ప్రారంభమవుతాయని, అప్పటివరకూ పర్యాటకులు తమ ప్రయా ణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గోదావరిపై బోటు ప్రయాణానికి తాత్కాలిక బ్రేక్ పర్యాటక బోట్ల నిర్వహణ, భద్రతపై తనిఖీలు 15 ప్రైవేట్, ఒక టూరిజం శాఖ బోట్ల నిలిపివేత -
● తూడు.. రైతులతో చెడుగుడు
మొగదిండి మురుగు కాలువలో గుర్రపుడెక్కకాళ్ల మండలంలో మురుగు కాలువలు తూడు, గుర్రపుడెక్క, కిక్కసతో నిండిపోయాయి. వేసవిలో ప్రక్షాళన పనులు చేపట్టకపోవడంతో వేలాది ఎకరాల పొలాలకు ముంపు పొంచి ఉంది. భారీ వర్షాల కురిస్తే చేలల్లోని ముంపు నీరు బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువల్లో తూడుతో నీటి ప్రవాహం మందగించి పొలాలు ముంపు నుంచే బయటపడటం కష్టమని అంటున్నారు. మండలంలో ప్రధానంగా సీసలి వద్ద మొగదిండి మురుగు కాలువ కింద భాగంలో బాగు చేసినా ప్రారంభంలో ప్రక్షాళన పనులు చేయకపోవడంతో గుర్రపుడెక్క మేట వేసింది. అలాగే ప్రధానమైన రుద్రయ్యకోడు మురుగు కాలువ అభివృద్ధి పనులు ప్రారంభంలో చేసినా దొడ్డనపూడి గ్రామం నుంచి చేపట్టకపోవడంతో కిక్కిస, తూడు పేరుకుపోయి శివారు ప్రాంతంలో కాలువ అడవిని తలపిస్తుంది. –కాళ్ల -
నేవీ డిపో రద్దుతో పూజలు
కొయ్యలగూడెం: నేవీ ఆయుధ డిపో నిర్మాణ ప్రతిపాదన రద్దు కావడంతో పోలవరం, గోపాలపురం నియోజకవర్గాల్లోని పలు గ్రామాల ప్రజలు ఆదివారం పూజలు నిర్వహించారు. గ్రామ దేవతల ఆలయాలలో నైవేద్యాలు సమర్పించారు. వేలాది మంది రైతుల గోడు తమ గ్రామ దేవతలు విని ఆయుధ డిపో రద్దయ్యేలా అనుగ్రహించారని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఊట్లగూడెం సమీపంలోని కొవ్వాడమ్మ ఆలయం వద్ద అదే విధంగా బోడిగూడెం, మంగపతిదేవిపేట, బర్కెట్ నగర్, రేగులగుంట తదితర గ్రామాలలో గ్రామస్తులు పూజలు చేపట్టడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆదివారం విశేష పూజలు జరిగాయి. చతుర్ధశి తిధిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ గర్భాలయంలోని స్వామివారి మూలవిరాట్్కు విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అలాగే హోమాది కార్యక్రమాలు జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ నారసింహునికి మహా నివేదనను సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించి, తీర్ధప్రసాదాలను స్వీకరించారు. బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం ధూప దీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ వారితోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు. పెనుగొండ: ఆర్యవైశ్యులకు కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పలువురు ప్రస్తావించారని వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం నియోజకవర్గ కన్వీనరు నంబూరి రాజేంద్ర ప్రసాద్(రాజా) తెలిపారు. ఆదివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తాడేపల్లిలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సూచనతో పాల్గొన్నట్లు తెలిపారు. ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు, ట్రస్ట్ బోర్డుల నియామకాల్లో ఆర్యవైశ్యులకు జరిగిన అన్యాయంపై చర్చ జరిగిందని వివరించారు. ద్వారకాతిరుమల: శ్రీవారి విమానగోపుర స్వర్ణమయ పథకానికి ఓ భక్తుడు రూ.1,00,000 విరాళంగా అందజేశారు. సామర్లకోటకు చెందిన దాత జె.రామలక్ష్మణులు ముందుగా కుటుంబ సమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఈ విరాళాన్ని ఆలయ కార్యాలయంలో జమ చేశారు. -
పెద్దింట్లమ్మా.. దీవెనలు అందించమ్మా
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ నీ ఆశీస్సులు మాకు అందించమ్మా.. అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు భక్తులతో కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఆదివారం కిటకిటలాడింది. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం మాత్రమే ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్ధాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాలు విక్రయం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.1,05,567 ఆదాయం వచ్చిందని చెప్పారు. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వేలేరుపాడు: మండలంలోని రుద్రంకోట సమీపంలో ఆదివారం విషాద సంఘటన చోటుచేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగిన కంతిరెడ్డి రాంబాబు (25) ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వేలేరుపాడు పోలీసులు రంగంలోకి దిగారు. అధికారులు స్థానికుల సహకారంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నదిలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రాంబాబు గల్లంతుంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదచాయలు అలముకున్నాయి. రాంబాబు వైఎస్సార్సీపీ కార్యకర్త. ఈ ప్రమాద వార్త తెలియడంతో పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. రాంబాబు ఉదంతంపై వేలేరుపాడు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కేశగాని శ్రీనివాస్ గౌడ్, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు కామినేని వెంకటేశ్వరరావు, మండల ఉపాధ్యక్షుడు గుద్దేటి భాస్కర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
హాస్టళ్ల నిర్వహణపై శ్రద్ధ పెట్టాలి
పెనుగొండ: ప్రభుత్వ హాస్టళ్ల నిర్వహణలో మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి ఆదేశించారు. ఆదివారం పెనుగొండలోని బీసీ బాలికల వసతి గృహా న్ని ఆయన తనిఖీ చేసి విద్యార్థుల హాజరు, వంటశాల, వంట సామగ్రి, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, భవన మరమ్మతులపై ఆరా తీశారు. వసతి గృహాల్లో నూరు శాతం అడ్మిషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువులు అందుబాటులో ఉంచాలి రైతులకు ఎరువులు ఎప్పటికప్పుడు అందుబాటు లో ఉంచాలని జేసీ ఆదేశించారు. దేవ సొసైటీలో ఆ న్లైన్ ఆధారిత ఎరువుల విక్రయాలను పరిశీలించా రు. ఆన్లైన్ అమలులో ఎదురవుతున్న సాంకేతిక స మస్యలను అడిగి తెలుసుకున్నారు. యూరియాను వ్యవసాయేతర అవసరాల విక్రయాల నుంచి నివారించడం, పారదర్శకమైన ఎరువుల విక్రయ వి ధానం కోసం ఆన్లైన్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రైతులు కొత్త విధానాన్ని అలవాటు చేసుకోవాలన్నా రు. ఆర్డీఓ దాసి రాజు, జిల్లా బీసీ సంక్షేమశాఖ అ ధికారి ఏవీ సూరిబాబు, తహసీల్దార్ జి.అనితకుమారి, వ్యవసాయాధికారి జెడ్.వెంకటేశ్వరరావు, వ్యవసాయ సంచాలకుడు రాఘవేంద్రరావు, దేవ సొసైటీ అధ్యక్షుడు జుత్తిగ ఆంజనేయులు ఉన్నారు. -
రక్తదానంతో ప్రాణాలు కాపాడుదాం
భీమవరం (ప్రకాశంచౌక్): సమాజం పట్ల బాధ్యతతో, సేవా దృక్పథంతో నిర్వహించే ప్రజోపయోగ కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం నుంచి ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. ప్రపంచంలో డబ్బుతో కొనలేని విలువైనది రక్తం మాత్రమేనని, స్వచ్ఛంద రక్తదానం ద్వారా మరొకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం భీమవరం ఆనంద ఫంక్షన్ హాలులో ఆర్.ఆర్.ఫ్రెండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని దానాల్లోకెల్లా రక్తదానం అత్యంత గొప్పదని, రక్తదానం నిజమైన ప్రాణదానమని పేర్కొన్నారు. కలెక్టర్ తనయుడు చదలవాడ భరత్ చంద్ర మాట్లాడుతూ, రక్తదానం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు. ఆయన స్వయంగా రక్తదానం చేశారు. భీమవరం రెండో పట్టణ సర్కిల్ ఇనన్స్పెక్టర్ మురళీకష్ణ, పోలీస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మోజెస్, సంఘ సేవకులు అల్లు శ్రీనివాసులు, ఆర్.ఆర్.ఫ్రెండ్స్ సేవా సమితి గౌరవ అధ్యక్షుడు ఆనంద రఘువర్మ, అధ్యక్షుడు గెడ్డం రామారావు తదితరులు పాల్గొన్నారు. -
విత్తన ఎంపికే కీలకం
దాళ్వా సాగులో బిజీగా రైతులుగణపవరం: సార్వా సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. దాళ్వా సాగు కలిసిరావడంతో ఆనందంగా సార్వా సాగుకు రెడీ అవుతున్నారు. గణపవరం, నిడమర్రు మండలాలలో పంట కాల్వలకు దగ్గరగా ఉన్న భూములలో ఇప్పటికే నారుమడులు వేయగా, ఉంగుటూరు, భీమడోలు మండలాల్లోని మెట్ట ప్రాంతంలో బోర్ల కింద సాగయ్యే భూములలో నారుమడులు పూర్తి చేశారు. మిగిలిన భూములలో ఇప్పుడిప్పుడే నారుమడుల తయారీ, విత్తనాలు చల్లుకోవడం వంటి పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. విత్తన నాణ్యతే కీలకం వరి సాగులో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలంటే మంచి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. సాగులో నారుమడి దశ చాలా కీలకం. ఈ సమయంలో సరైన విత్తనాలను ఎంపిక చేసుకుంటే చక్కని ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. పండించే పంటను బట్టి సమీప వ్యవసాయ పరిశోధనా కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలను సంప్రదించాలి. ఆ అవకాశం లేకుంటే డివిజన్, మండల కేంద్రాల్లోని స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించి విత్తనాల కొనుగోలుపై వారి సలహాలు తీసుకోవాలి. రైతులే స్వయంగా విత్తనాలను తయారు చేసుకుంటే వాటి మొలక శాతాన్ని పరీక్షించాలి. పంటల సాగులో సరైన విత్తనాలను వినియోగించకపోతే మొలకల శాతం తగ్గి, దిగుబడులు పడిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాక ఒక్కోసారి తెగుళ్లు, చీడపీడలు ఎక్కువగా ఆశించి రైతులు నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో రైతులు వ్యవసాయ నిపుణులు సూచించిన విత్తనాలను మాత్రమే ఉపయోగించాలి. విత్తన రకాలు బ్రీడర్ సీడ్ : పంటలో అన్ని రకాల విత్తనాలకు మూలంగా బ్రీడర్ సీడ్ను పరిగణిస్తారు. వరి విత్తనోత్పత్తి పరిశోధనా కేంద్రాలలో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో వీటిని ఉత్పత్తి చేస్తారు. ఈ విత్తనాలలో జన్యు స్వచ్ఛత 100 శాతం ఉంటుంది. ఈ విత్తనాల ప్యాకెట్లకు పసుపు రంగు ట్యాగులు ఉంటాయి. సీడ్ : బ్రీడర్ సీడ్ నుంచి ఫౌండేషన్ విత్తనాలను ఉత్పత్తి చేస్తారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ విత్తనాలు కూడా 100 శాతం జన్యు స్వచ్ఛత కలిగి ఉంటాయి. ఈ విత్తనాల సంచులకు తెలుపు రంగు ట్యాగులు ఉంటాయి. çÜÇ-t-OòœyŠæ-ಸರ-್-ಟ-ಿ-ಫೈ-ಡ್ ïÜyŠæ: వ్యవసాయ శాఖ అధికారుల స్వీయ పర్యవేక్షణలో ఫౌండేషన్ విత్తనాల నుంచి రైతులే సొంతంగా తమ పొలాలలో ఈ విత్తనాలను తయారు చేసుకుంటారు. వీటిని వ్యవసాయ శాఖ ప్రయోగశాలల్లో పరీక్షించిన తర్వాత, నిర్దేశించిన ప్రమాణాలు కలిగి ఉంటే వ్యవసాయ శాఖ సీడ్ సర్టిఫికేషన్ ధ్రువీకరణ పత్రం మంజూరు చేస్తుంది. ఈ విత్తనాల సంచులకు నీలి రంగు ట్యాగులు వేస్తారు. రైతుల విత్తనాలు: ఇవేమీ లేకుండా ఎక్కువగా రైతులే తాము స్వయంగా పండించిన విత్తనాలను ఇతర రైతులకు మార్కెట్లో విత్తనాల ధర కన్నా తక్కువ ధరలకే విక్రయిస్తుంటారు. అధిక శాతం రైతులు వీటిపైనే ఆధారపడుతుంటారు. ఈ విత్తనాల నాణ్యతపై అధికారిక భరోసా అంటూ ఏమీ ఉండదు. కానీ, ఈ రైతుల స్థాయిలో పండించిన విత్తనాల వల్ల రైతులు నష్టపోయిన సందర్భాలు అతి తక్కువనే చెప్పవచ్చు. మొలక శాతం పరీక్ష కీలకం: రైతులు విత్తనాలను విత్తుకునే ముందు విత్తనాల నాణ్యత తెలుసుకోవడానికి తప్పనిసరిగా విత్తనాల మొలక శాతాన్ని పరీక్షించుకోవాలి. వినియోగించే విత్తనాలలో కొన్నింటిని గ్లాసులో వేసి నీరు పోసి, 24 గంటల తర్వాత గుడ్డలో మూటకట్టాలి. వీటిలో 80 శాతం మొలకలు వస్తేనే ఆ విత్తనాలను నారుమడిలో చల్లుకోవాలి. శుద్ధి తప్పనిసరి: మొలక శాతం సంతృప్తికరంగా ఉంటే విత్తనాలను చల్లుకునే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. దీని కోసం ఒక కిలో విత్తనాలకు 3 గ్రాముల కార్బండిజం కలిపి రెండు రోజులు ఒక సంచిలో నిల్వ ఉంచాలి. అనంతరం ఆ విత్తనాలను వదులుగా ఉండేలా ఒక సంచిలో వేసి, ఒక రోజు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత బయటకు తీసి మరో రోజు గాలి తగలని (వెచ్చని) ప్రదేశంలో ఉంచాలి. యాజమాన్యం: ముందుగా సిద్దం చేసుకున్న నారుమడిలో ఒక సెంటు నారుమడిలో 5 కిలోల చొప్పున శుద్దిచేసిన విత్తనాలను సమానంగా చల్లుకోవాలి. నారుమడిలో నత్రజని వేసిన 12 నుంచి 16 రోజుల మధ్య పొటాషియం, భాస్వరం ఎరువులు చల్లుకోవాలి. నారుమడి వేసిన 25 రోజుల తర్వాత పొలంలో నాటుకోవాలి. మొలకలు రాకుంటే నష్టపరిహారం: నారుమడి వేసిన పదిరోజుల వ్యవధిలో విత్తనాలనుంచి మొలకలు రాకపోతే సత్వరమే వ్యవసాయ శాఖకు ఫిర్యాదు చేయాలి. డివిజన్ వ్యవసాయశాఖ సహాయ సంచాలకుల ద్వారా జిల్లా విత్తన కమిటీకి ఫిర్యాదు అందేలా చూడాలి. ఒకవేళ విత్తనాలలో లోపాలు ఉండి నారుమడి దెబ్బతింటే సంబంధిత అధీకృత డీలరు, కంపెనీ నుంచి నష్టపరిహారం పొందే వీలు ఉంటుంది. ఇందుకు సంబంధించిన బిల్లులు, విత్తనాల సంచి, ట్యాగ్ తదితర ఆధారాలను రైతులు తమవద్ద ఉంచుకోవాలి విత్తనాల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని గణపవరం ఏవో ఆర్ఎస్ ప్రసాద్ వివరించారు. ● రైతులు ప్రభుత్వ గుర్తింపు ఉన్న విత్తన అధీకృత డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. విత్తనాల బరువును నిర్ధారించుకోవాలి. ● విత్తనాలు కొన్న డీలర్వద్ద రసీదు తీసుకోవాలి. పంట నష్టం జరిగితే బిల్లు సమర్పించి పరిహారం పొందే అవకాశం ఉంటుంది. ● విత్తనాలను ఇంటికి తీసుకెళ్లాక మొలక శాతాన్ని పరీక్షించి, సంతృప్తిగా ఉంటేనే విత్తనాలు చల్లుకోవాలి. ● విత్తనాల రసీదును పంటకాలం పూర్తయ్యే వరకూ భద్రపర్చుకోవాలి. ● సీల్ తీసిన సంచులు, మూతలు తీసిన డబ్బాలు, పగిలిన ప్యాకెట్లలో విత్తనాలు తీసుకోవద్దు. -
కై కలూరులో సీరియల్ కిల్లర్
● ఒంటరి వృద్ధ మహిళలే లక్ష్యం ● ఆభరణాలు లాక్కొని హత్యలు ● పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు ● వ్యసనాలకు బానిసై ఘాతుకాలు కై కలూరు: వరుస హత్యలతో కై కలూరు ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. వ్యసనాలకు బాని సైన ఓ యువకుడు అతడి ఇంటి సమీపంలో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఆభరణాలు కాజేయడంతోపాటు వారి ప్రాణాలను తీసేశాడు. హతమా ర్చిన తర్వాత ఏమీ ఎరుగనట్టు ప్రజల్లో కలిసిపోయి అయ్యో పాపం అంటూ ముసలి కన్నీరు కార్చాడు. చివరికి అతడి పాపం పండింది. పట్టపగలు ఓ వృద్ధురాలిని చంపేసి ఆభరణాలు తీసుకెళ్లిన సమయంలో ఓ వ్యక్తి చూడటంతో బండారం బయటపడింది. అలాగే కొద్దిరోజుల క్రితం మరణించిన ఓ వృద్ధురాలినీ ఇతడే చంపేశాడని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. కై కలూరు పంచాయతీ 8వ వార్డు పాముల వీధిలో మార్పిన వెంకటలక్ష్మి (50) శనివారం సాయంత్రం విగతజీవిగా పడి ఉంది. చెవులు, ముక్కు నుంచి రక్తం కారి ఉంది. మూడు సవర్ల మంగళసూత్రం, చెవిదిద్దులు, రూ.10 వేలు వెరసి మొత్తం రూ.3.10 లక్షలు విలువైన సొత్తు చోరీ జరిగింది. ఇదే వార్డులో ఈనెల 3న ఒంటరిగా జీవిస్తున్న సోము ఆదిలక్ష్మి (80) శరీరం కుళ్లిన రీతిలో మంచంపై మరణించింది. గుండెపో టుతో మరణించిందని బంధువులు దహన సంస్కా రాలు చేశారు. ఆమె ముక్కు, చెవుల నుంచి కూడా రక్తం కారి ఉంది. మృతురాలి ఒంటిపై బంగారు ది ద్దులు, మూడు తులాల ఆంజనేయస్వామి లాకెట్ మాయమయ్యాయి. ఆమె ఇంట్లో ఎక్కడో పెట్టి ఉంటుందని భావించి బంధువులు వెతికి ఊరుకున్నారు. కిల్లర్ దొరికాడిలా.. కై కలూరు 8వ వార్డుకు చెందిన తుపాకుల ధ్రువంత్ (24) చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. తాపీ పనులు, కేటరింగ్కు వెళ్లేవాడు. సంత మార్కెట్ సమీపంలో ఓ యువతిని ప్రేమించి పెళ్లిచేసుకున్నా డు. అతడికి ఇద్దరు సంతానం. భార్యతో గొడవపడి తండ్రి ఇంటి వద్ద ఉంటున్నాడు. శనివారం హత్యచేసిన వెంకటలక్ష్మి కుమారుడికి ఇతడు స్నేహితుడు. వెంకటలక్ష్మి కుమారుడు హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆ పరిచయంతో ఆమె ఇంటికి వెళ్లి హత్య చేసి ఆభరణాలతో ఉడాయించాడు. వీటిని కైకలూరులో విక్రయించి ఏలూరు రోడ్డు తాలింపు హోటల్లో మద్యం సేవించినట్టు తెలిసింది. వెంకటలక్ష్మి ఇంటి నుంచి ధ్రువంత్ బయటకు రావడం సమీప వ్యక్తి చూడటంతో అసలు విషయం బయటపడింది. ఇదిలా ఉంటే ఈనెల 3న మరణించిన వృద్ధురాలు ఆదిలక్ష్మిని మరొకరితో కలిసి హత్య చేసినట్టు పోలీసుల ఎదుట నిందితుడు నేరం అంగీకరించినట్టు సమాచారం. అలాగే ధ్రువంత్ పలు చోరీలకు పాల్పడినట్టు విచారణలో బయటపడింది. కై కలూరు స్టేషన్లో ఏలూరు డీఎస్పీ శ్రవణ్కుమార్, సీఐ ఏవీఎస్ రామకృష్ణ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కిల్లర్ ధ్రువంత్ చిన్ననాటి నుంచి వ్యసనాలకు బానిస కావడంతో పాటు ఘర్షణలకు పాల్పడేవాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. పనికి వెళ్లేవాడు కాదు. ఈజీ మనీ కోసం పన్నాగాలు వేసేవాడు. ఈనెల 3న వృద్ధురాలు ఆదిలక్ష్మి హత్యలో అతడితో పాటు కై కలూరు సిటీకేబుల్లో పనిచేసిన ఓ వ్యక్తి పాత్ర కూడా ఉందని భావిస్తున్నారు. కై కలూరు ప్రాంతంలో ఇటీవల కాలంలో పలువురు వృద్ధుల మరణాలు సంభవించాయి. ఈ కోణంలో ధ్రు వంత్ పాత్రపై అనుమానాలు బలపడుతోన్నా యి. అతడి సెల్ఫోన్ డేటాను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. -
ఇంటర్ చదువుకొనేదెలా!
సోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2026భీమవరం: విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. కళాశాల ఫీజులు, యూనిఫాం, పుస్తకాలు, బస్ ఫీజులు వంటివి తడిసిమోపెడవడంతో ఎలా చదివించాలని తలలు పట్టుకుంటున్నారు. విద్య వ్యాపారంగా మారడంతో ఏటా నూతన విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. భవన నిర్మాణాలు, ప్రభుత్వ అనుమతులు లేకుండానే రూ.లక్షల ఫీజులు వసూలు చేస్తూ అడ్మిషన్స్ నిర్వహించడం గమనార్హం. పశ్చిమగోదావరి జిల్లాలో 15 ప్రభుత్వ, రెండు ఎయిడెడ్, రెండు సోషల్ వె ల్ఫేర్, సుమారు 85 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరం మరిన్ని వి ద్యాసంస్థలు పుట్టుకొచ్చాయి. ప్రైవేట్ కాలేజీల్లో త గిన వసతులు, ఆటస్థలాలు లేకపోయినా భారీ మొ త్తంలో మాత్రం ఫీజులు వసూలు చేస్తున్నా రు. ఫీజుల మోత.. తల్లిదండ్రుల వెత : జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు పలు రకాలుగా ఉన్నాయి. కళా శాలకు ఉన్న పేరును బట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు. భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణు కు, తాడేపల్లిగూడెం వంటి పట్టణాల్లో పేరున్న కళా శాలలు ఏడాదికి ఫీజు రూపంలో రూ.90 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. అలాగే హాస్టల్కు రూ.లక్ష, బస్ చార్జీలు దూరాన్ని బట్టి రూ.30 వేలు, బుక్స్కు రూ.18 వేలు, యూనిఫామ్ రెండు జతలకు రూ.5 వేలు తీసుకుంటున్నారు. గ్రా మీణ ప్రాంతాల్లోని కళాశాలల్లో ఫీజు రూ.60 వేలు, బస్ ఫీజు రూ.18 వేలు, యూనిఫామ్ రూ.2,500, బుక్స్కు రూ.12 వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను చదివించేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఫీజుల దోపిడీతో పాటు సెలవు రోజుల్లో సైతం తరగతులు నిర్వహించడం, గైర్హాజరైతే ఫైన్లు, వారానికి ఒక్క రోజు కూడా క్రీడలకు అనుమతించకపోవడం ప్రై వేట్ కాలేజీల్లో ప్రత్యేకం. విద్యాసంవత్సరం ప్రారంభమైనందును ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధలను పాటించకపోతే చర్యలు తప్పవు. అధిక ఫీజు లు వసూళ్లు చేసినా, సెలవు దినాల్లో తరగతు లు నిర్వహించినా చర్యలుంటాయి. తమ పిల్లలను చేర్చే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ కళాశాలల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తాం. – జి.ప్రభాకరరావు, ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరంవామ్మో.. ఫీజులు ప్రైవేట్ కాలేజీల్లో దోపిడీ ఫీజులు, యూనిఫాం, రవాణా భారం ఏడాదికి రూ.90 వేల నుంచి రూ.3.50 లక్షల వరకు ఖర్చు జిల్లాలోని 85 కళాశాలల్లో ఇష్టారాజ్యం జిల్లాలోని 15 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సరైన సదుపాయాలు, ల్యాబ్స్, లెక్చరర్లు లేరు. అరకొర వసతులు, అన్ని సబ్జెక్ట్స్ బోధించే అధ్యాపకులు లేకపోవడం వల్ల తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. తప్పనిసరై ప్రైవేట్ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. ఇదే అదునుగా జిల్లాలోని ప్రధాన పట్టణాలతోపాటు గ్రామాల్లో సైతం ప్రైవేట్ కళాశాలలు వెలుస్తున్నాయి. రూ.లక్షల్లో ఫీజులతో పాటు బస్ ఫీజులు, హాస్టల్ ఫీజులతోపాటు జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మె యిన్స్, ఎంసెట్, నీట్ ప్రవేశ పరీక్షలకు శిక్షణ అంటూ అదనంగా దోపిడీ చే స్తున్నారు. ఇలా ఏడాదికి ఒక్కో విద్యార్థి నుంచి రూ.90 వేల నుంచి రూ.3.50 లక్షల వరకు గుంజుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో మనబడి నాడు–నేడు పధకంలో ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను అభివృద్ధి చేశారు. అయితే కూటమి ప్రభుత్వ పాలనలో సర్కారీ కళాశాలలను పట్టించుకోవడం లేదు. సౌకర్యాల కల్పనపై దృష్టి సారించడం లేదు. జిల్లాలో ఇంటర్మీడియెట్ విద్యాశాఖాఽధికారి కార్యాలయానికే అనువైన భవనం లేదంటే కళాశాలల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
పరిశ్రమల్లో ప్రమాదాలు అరికట్టాలి
ఏలూరు (టూటౌన్): పారిశ్రామిక రంగాల్లో ప్ర మాదాలను అరికట్టాలని, భద్రతా తనిఖీల విధానాన్ని కఠినంగా కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఐఎఫ్టీయు (ఇఫ్టూ) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఇఫ్టూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కమిటీ సమావేశాన్ని ఆదివారం ఏలూరులో నిర్వహించారు. ఉమ్మడి జి ల్లా అధ్యక్షుడు కేవీ రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల ప్రకారం ఔ ట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదాలను అరికట్టేలా పరిశ్రమల్లో రెగ్యులర్ సేఫ్టీ చెకప్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని, భద్రతా నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అందించాలని కోరారు. ఇఫ్టూ జిల్లా ఆఫీస్ బేరర్స్ బి.సో మయ్య, ఎర్ర శ్రీనివాసరావు, ఈమని గ్రేష్మకుమార్, దానవరప్రసాద్, ఎం.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దెందులూరు: పెదవేగి మండలం రాట్నాలకుంటలో రాట్నాలమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయంలో ఉన్న చెట్టుకు ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఐశ్వర్యం కోసం ము డుపులు కట్టారు. అమ్మవారిని దర్శించి పూ జలు చేయించారు. ఆలయానికి పలు రూ పాల్లో రూ. 98,707 ఆదాయం వచ్చినట్టు ఆలయ కమిటీ చైర్మన్ మన్నే శ్రీనివాసరావు, ఈఓ ఎం.సతీష్కుమార్, జూనియర్ అసిస్టెంట్ విడుదల సత్యనారాయణ తెలిపారు. భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సో మవారం జిల్లా కలెక్టరేట్తో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం కూడా నిర్వహిస్తామన్నారు. ప్రజ లు ఆన్లైన్లోనూ అర్జీలు నమోదు చేసుకోవచ్చని, టోల్ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చని ఆమె సూచించారు. ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా ఏఆర్ హెచ్సీగా పనిచేస్తూ ప్రమాదవశాత్తూ మృతిచెందిన ఎ. భాస్కరరావు కుటుంబానికి పోలీస్ శాఖ అండగా నిలిచింది. ఏలూరు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఏలూరు జిల్లా పోలీస్ అధికారుల సంఘం బాధిత కుటుంబానికి భరోసా కల్పించింది. డిసీజ్డ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ.లక్ష చెక్కును పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.నాగేశ్వరరావు, నాయకులు ఏఆర్ ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు కమిటీ నేతలు మృతుడు భాస్కరరావు భార్య ఝాన్సీ లక్ష్మీకి అందజేశారు. ఏఆర్ ఎస్సై శ్రీనివాసరావు, ఏఆర్ హెచ్సీ రమేష్కుమార్, ఏఆర్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు, రిటైర్డ్ ఆర్ఎస్ఐ ఎం.సత్యనారాయణ, ఏఆర్ ఎస్సై సుగుణరావు, హెచ్సీ రామకృష్ణ ఉన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ఆధ్వర్యంలో 10వ తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవే శాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. 2026–27 వి ద్యా సంవత్సరంలో 10వ తరగతి ప్రవేశాలకు ఆగస్టు 31 నాటికి 14 ఏళ్లు, ఇంటర్లో ప్రవేశాలకు 10వ తరగతి ఉత్తీర్ణులై, ఆగస్టు 31లోపు 15 ఏళ్లు నిండి ఉన్నవారు అర్హులన్నారు. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా జూలై 30 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని, అదే నెల 31 వరకూ ఫీజులు చెల్లించవచ్చన్నారు. గడువు లోపు ఫీజులు చెల్లించలేని వారు రూ.200 అపరాధ రుసుంతో ఆగస్టు 1 నుంచి 15 లోపు ఫీజులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. -
పశువ్యాధులపై అప్రమత్తం
● సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ● ముందుగానే టీకాలు వేయడం ఉత్తమమంటున్న పశు వైద్యులు ● చిన్నపాటి జాగ్రత్తలతో వ్యాధులు దూరం బుట్టాయగూడెం: వర్షాకాలంలో పశువులు, గొర్రెలు ఇతర జీవాలకు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువని, రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పశు సంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. జీవాలకు వచ్చే వ్యాధులను సకాలంలో గుర్తించి సరైన చికిత్స చేయించాలని సూచిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. పశువులకు వచ్చే వ్యాధుల్లో కొన్ని.. బ్లూటంగ్– ఫుట్రాట్ లక్షణాలు గొర్రెలు, మేకల్లో బ్లూటంగ్ వ్యాధులు సోకితే ఎక్కువగా జ్వరం, మూతి వావు, పెదవులు దద్దరించడం, నోటి లోపల పుండ్లు, ముక్కులో చీమిడి, కాళ్లు కుంటడం, ఒంట్లో నీరు చేరడం, పారుకోవడం, మేత మేయకపోవడం, ఈసుకుపోవడం జరుగుతుంది. 30 శాతం వరకూ మరణాలు సంభవించవచ్చు. వీటి నివారణకు సాయంత్రం సమయంలో గొర్రెల మందలో వేపాకు పొగ పెట్టుకుంటూ అప్పుడప్పుడూ బ్లూటాక్స్/టిక్కిల్ మందులు పిచికారీ చేస్తూ పోడు ప్రాంతాల్లో మేతకు తీసుకెళ్లాలి. కాళ్ల పుండ్ల వ్యాధి సోకితే జీవాలకు కాళ్ల పుండ్లు వ్యాధి సోకితే కాలి గిట్టల మధ్య చీము చేరి చెడువాసన వస్తుంది. గొర్రెలు కుంటుతూ నడుస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన్నప్పుడు జీవాలను బురద ప్రాంతంలో మేపకూడదు. పొడి ప్రాంతంలోనే మేత వేసేలా చూడాలి. గొంతువాపు వ్యాధి పశువులకు సోకే వ్యాధుల్లో గొంతువాపు వ్యాధి ప్రమాదకరమైంది. ఈ వ్యాధిని గురక వ్యాధి అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో పశువులకు సూక్ష్మజీవుల వల్ల సంక్రమిస్తుంది. తొలకరి వర్షాలు పడిన సమయంలో కలుషితమైన నీరు, మేత ద్వారా పశువుల రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ వ్యాధుల బారిన పడతాయి. గొంతువాపు వ్యాధి బారిన పడిన పశువులను మిగిలిన పశువులతో కలిపి ఉంచితే ఈ వ్యాధి మిగిలిన వాటికి కూడా వ్యాప్తి చెందుతుంది. వర్షాకాలంలో పశువులు తడవకుండా చూడాలి. నివారణ చర్యలు జూన్, జులై, ఆగస్టు నెలలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. పౌష్టికాహారం అందించాలి. వ్యాధి సోకిన పశువులను మిగిలినవాటి నుంచి వేరు చేయాలి. వాటి స్థావరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలి. చిటిక వ్యాధి ఇది గొర్రెల్లో ఎక్కువగా వస్తుంది. తొలకరి వర్షాలు కురిసే సమయంలో సోకుతుంది. ఏడాది వయసు గల గొర్రెల్లో ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి సోకిన గొర్రె తక్కువ సమయానికే మరణిస్తుంది. వ్యాధి లక్షణాలు ఉదయం, మధ్యాహ్నం వేళ గొర్రెల్లో కనిపిస్తాయి. ఈ వ్యాధి నివారణకు వర్షాలకు ముందే గొర్రెలకు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన గొర్రెలను మంద నుంచి వేరుచేయాలి. వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులపై రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నందున ముందుగానే టీకాలు వేయించుకోవడం ఉత్తమం. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు. పశువులకు సోకే వ్యాధులను గుర్తిస్తే దగ్గరలో ఉన్న పశువుల ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించాలి. మల్లంపల్లి సాయిబుచ్చారావు, సహాయ సంచాలకులు, ప్రాంతీయ పశు సంవర్ధక శాఖ -
3.212 కేజీల బంగారం మాయం
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో ఆదివారం కూడా బ్యాంకు అధికారులు ఖాతాలను పరిశీలించారు. శని, ఆదివారాలు సెలవు అయినప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బ్యాంకును తెరిచి ఖాతాదారులు కుదువ పెట్టిన బంగారం పరిశీలించారు. ఆదివారం పరిశీలనలో 47 ఖాతాదాలను పరిశీలించగా, ఒక ఖాతా మాత్రం తేడా వచ్చింది. ఆ ఖాతాలో 12 గ్రాముల బంగారం మాయమైనట్లు తేలింది. దీంతో ఇంతవరకు 3.212 కేజీల బంగారం మాయమైంది. బ్యాంకులో ఖాతాదారులు కుదువ పెట్టిన బంగారం ఖాతాలు 2756 ఉన్నట్లు తెలిసింది. ఇంతవరకు 1961 ఖాతాలను పరిశీలించారు. దీనిలో 1873 ఖాతాలకు సంబంధించి బంగారం సరిపోగా, 88 ఖాతాలకు మాత్రం మొత్తంగా 3.212 కేజీల బంగారం మాయమైంది. అసలు ఏం జరిగిందంటే...? బ్యాంకులో ఖాతాదారులు కుదువ పెట్టిన బంగారానికి సంబంధించి బంగారం మాయమైనట్లు చూచాయిగా బయటకు లీకై ంది. దీంతో ఈ నెల 2న అప్రైజర్ కలపాక రాజును బ్యాంకు అధికారులు పిలిపించి మాట్లాడారు. 2వ తేదీ పగలు బ్యాంకుకు వెళ్లిన రాజును మాయమైన బంగారంపై బ్యాంకు అధికారులు నిలదీసినట్లు తెలిసింది. దీంతో రాజు బ్యాంకు ఖాతాల్లో తాను తీసి వాడుకున్న బంగారానికి సంబంధించి ఎంతైతే వాడుకున్నాడో అంతా ఇచ్చేసినట్లు సమాచారం. అయితే బ్యాంకు అధికారులు 2వ తేదీ అర్ధరాత్రి వరకు రాజును కూర్చోబెట్టి అతనితో మిగిలిన బంగారానికి కూడా రాజే బాధ్యుడని రాయించుకుని పంపినట్లు తెలిసింది. దీంతో కంగారుపడిన రాజు 3వ తేదీ ఉదయం రాజు, అతని తల్లిదండ్రులతో జంగారెడ్డిగూడెం వదిలి వెళ్లిపోయినట్లు తెలిసింది. భార్య, పిల్లలు పుట్టింటికి వెళ్లినట్లు తెలిసింది. సోదరుడి కుటుంబం జంగారెడ్డిగూడెంలో ఉన్నట్లు సమాచారం. కుటుంబసభ్యులను కూడా తాను ఫలానా చోట ఉన్నాను రమ్మని రప్పించుకున్నట్లు తెలిసింది. వారు వెళ్ళిన తరువాత వారితో కొద్దిసేపు మాట్లాడి తిరిగి వెళ్ళిపోయినట్లు తెలిసింది. అప్పటి నుంచి రాజు కనిపించడం లేదు. రాజు తన కుటుంబసభ్యులతో తాను వాడుకున్న బంగారం బ్యాంకులో జమ చేశానని, మిగిలిన బంగారం గురించి తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. అప్పటి నుంచి రాజు సెల్ఫోన్ పనిచేయకపోగా, ఇంతవరకు ఆచూకీ లభించలేదు. ఈ నెల 6న ముగ్గురు ఖాతాదారులు తమ ఖాతాలను పరిశీలించేందుకు రాగా, అదే రోజున 240 గ్రాములు మాయమైనట్లు గుర్తించారు. అసలు బంగారం అంతా ఏమైంది...? బ్యాంకు ఆఫ్ బరోడాలో ఆదివారం వరకు మాయమైన 3.212 కేజీల బంగారం అసలు ఏమైంది. బంగారం బయటకు వెళ్ళడంలో రాజుతో పాటు మిగిలిన అధికారులు, కస్టోడియన్ల పాత్ర ఎంత అనేది తేలాల్సి ఉంది. లాకర్లో భద్రపరిచిన బంగారం బయటకు రావాలంటే ఒక్క అప్రయిజర్ వల్ల సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. పెద్ద వస్తువులైన వడ్డాణం, హారాలు, బిస్కెట్లు కూడా మాయమయ్యాయి. కుదువ పెట్టినా, లేక కరిగించి అమ్మివేసి ఉన్నా లేక ఆభరణాలు కింద అమ్మేసినా రికవరీ అయ్యే అవకాశం ఉంది. ఆదివారం కూడా కొనసాగిన ఖాతాల పరిశీలన -
రక్తదానంపై అవగాహన పెరగాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రజల్లో రక్తదానంపై మరింత అవగాహన పెరగాలని, ఆరోగ్యవంతులైన 18 నుంచి 65 ఏళ్ల వయసున్న ప్రతిఒక్కరూ క్రమం తప్పకుండా స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్గౌర్ పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏలూరులోని సీఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల కళ్యాణ చక్రవర్తి ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సౌరభ్ గౌర్ మా ట్లాడుతూ... రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, దానికి ప్రత్యామ్నాయం లేదని అన్నారు. సకాలంలో రక్తం అందడం వల్లే ఎందరో ప్రాణాలు రక్షించబడుతున్నాయని, ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని కో రారు. సురక్షిత రక్తసరఫరా వ్యవస్థను బలోపేతం చే యడంలో రెడ్క్రాస్ సొసైటీ పాత్ర అభినందనీయమన్నారు. రక్తదానంతో పాటు అవయవదానంపై కూడా ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ మాట్లాడుతూ.. తలసేమియా బాధితులకు నిరంతరం రక్తాన్ని అందించి, వారి ప్రాణా లు కాపాడటంలో స్వచ్ఛంద రక్తదాతల పాత్ర కీలక మన్నారు. ఏలూరు జిల్లా రెడ్క్రాస్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రెడ్క్రాస్ రాష్ట్ర శాఖ చైర్మన్ వైడీ రామారావు, ప్రధాన కార్యదర్శి ఏకే పరిడా మాట్లాడుతూ.. రక్తం కొరత లేకుండా రాష్ట్రవ్యాప్తంగా రక్తనిల్వలను పెంపొందించేందుకు అన్ని జిల్లా శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ రక్త కేంద్రాలు, అత్యధికంగా శిబిరాలు నిర్వహించిన సంస్థలు, విశిష్ట సేవలు అందించిన దాతలు, విద్యాసంస్థలకు రాష్ట్రస్థాయి అవార్డులు ప్రదానం చేసి సత్కరించారు. రెడ్క్రాస్ ప్రతినిధులు పి.రామచంద్ర రా జు, డి.శ్రీహరిరావు, బీవీఎస్ కుమార్, ఎంబీఎస్వీ ప్రసాద్, అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. -
కేసుల ఛేదనలో ఏఐ కీలకం
ఏలూరు టౌన్: పోలీస్ వ్యవస్థలో నిందితులకు శిక్షలు విధించడంలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాధనా లు కీలకమని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అధ్యక్షతన పోలీస్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్ను శనివారం ఏలూరులో నిర్వహించారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జి ల్లాల పోలీస్ అధికారులు హాజరయ్యారు. ఐజీ అశోక్కుమార్ మాట్లాడుతూ పోలీస్ విధుల్లో దర్యాప్తు, కోర్టు విచారణల రిపోర్టుల తయారీలో ఏఐ ఉపయోగపడుతుందన్నారు. ఏలూరు జిల్లాలో ఎస్పీ శివకిషోర్ ఆధ్వర్యంలో ఏఐని వినియోగిస్తూ మెరుగైన ఫలితాలు సాధించటం అభినందనీయమని, ఇదే తరహాలో అన్ని జిల్లాల్లో ఏఐ టూల్స్ను వినియోగించాలన్నారు. 20 శాతం పెరిగిన కేసుల పరిష్కారం ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ ధర్మా (డిజిటల్ హాలీస్టిక్ ఏఐ డ్రైవెన్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ అసిస్టెంట్) యాప్ను రూపొందించటంలో స్మా ర్ట్ పోలీసింగ్కు కృషి చేశామన్నారు. ధర్మా యాప్ పోలీస్ విధి నిర్వహణలో ఏఐ ఆధారిత సహాయక వేదికగా పనిచేస్తోందన్నారు. గతంతో పోలిస్తే కేసుల పరిష్కారం 20 శాతం పెరిగిందనీ, ఏకంగా 2,344 కేసులు పరిష్కారం కావటం విశేషమన్నారు. నేరాలకు సంబంధించి ఫొటోలు, సాక్ష్యా లు, చార్జిషీట్లు, ప్రకటనలు వంటి అంశాల్లో ఏఐ విశ్లేషణలతో దర్యాప్తులో కచ్చితత్వం మరింత పెరిగిందన్నారు. జిల్లాలో అన్ని స్టేషన్లలో ఏఐ టూల్స్ వినియోగించేలా పోలీసు అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని ఎస్పీ శివకిషోర్ చెప్పారు. ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, సీఐలు ఎం.సుబ్బారావు, వి.రవికుమార్, కె.రామకృష్ణ, సీహెచ్ రాజశేఖర్, ఎంవీ సుభాష్, బోణం ఆదిప్రసాద్, వెంకటేశ్వరరావు, ఎస్సైలు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఐజీ అశోక్కుమార్ -
ఆక్వా రైతులను ఫీడ్యించుకు తినేలా..!
కై కలూరు: ఉమ్మడి జిల్లాలో చేపల సాగు 1.80 లక్షల ఎకరాలు, రొయ్యల సాగు 1.10 లక్షల ఎకరాలు వె రసి 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. వా ర్షిక ఉత్పత్తి 4 లక్షల టన్నులు. సాధారణంగా వ నామీ రొయ్యల ఉత్పత్తికి టన్నుకు టన్నున్నర మేత, టైగర్ రొయ్యలకు టన్నుకు రెండున్నర టన్నుల మేతను రైతులు వినియోగిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టన్నుకు రూ.4 వేల చొప్పున ధరలను మేతల కంపెనీలు పెంచేశాయి. తిరిగి ముడిసరుకుల ధరలు పెరిగాయనే సాకుతో టన్నుకు కనీసం వనామీ ఫీడ్పై రూ.12 వేలు, టైగర్ ఫీడ్పై రూ.14 వేలు పెంచేందుకు అవకాశం ఇవ్వాలని రొయ్య మే త తయారీదారులు కోరారు. తర్వాత ఒక్కసారిగా ధరలు పెంచామని ప్రకటించడంతో రొయ్యల రైతు లు ఆందోళన బాట పట్టారు. ధరలు తగ్గినా రేట్లు తగ్గించలేదు ఫీడ్ తయారీ కంపెనీలు పూర్వం ఫిష్మీల్, సోయాబిన్ వంటి ముడిసరుకుల ధరలు తగినా మేత ధరలను తగ్గించలేదని రైతు సంఘ నాయకులు వాపోతున్నారు. గత నెల 11న వనామీ ఫీడ్పై రూ.8,420, టైగర్ ఫీడ్పై రూ.10,520 చొప్పున పెంచుతూ కంపెనీలు ప్రకటనలు చేశాయి. అప్సడా చట్టం ప్రకారం ఆక్వా రైతులు, సంఘాల నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా నిర్ణయాలు జరిగాయి. దీంతో రొయ్యల రైతులు రోడ్లపై నిరసనలతో పాటు పలు పట్టణాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. మంత్రి అచ్చెన్నాయుడు పరిస్థితిని చక్కదిద్దుతానని చెప్పి నా ఫలితం లేదు. ఇంత జరిగినా శుక్రవారం రొ య్యల మేతల ధరలు పెంచుతూ అధికారిక అనుమతులు కంపెనీలకు చేరాయి. విద్యుత్ సబ్సిడీలోనూ మెలికలే.. ఆక్వా జోన్స్తో సంబంధం లేకుండా కూటమి ప్రభు త్వం రాగానే విద్యుత్ యూనిట్ను రూ.1.50కే సరఫరా, జిల్లాల్లో 5 వేల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన కోల్ట్ స్టోరేజీలు, తగ్గింపు ధరలకు ట్రాన్స్ఫార్మర్లు, సబ్సిడీపై ఏరియేటర్లు అందిస్తామని ఎన్నికల సమయంలో నేతలు వాగ్దానాలు చేశారు. రెండేళ్ల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడటంతో మెలికలు పెట్టి యూనిట్ రూ.1.50కి అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏలూరు జిల్లా లో మొత్తం 13,007 ఆక్వా విద్యుత్ కనెక్షన్లు ఉన్నా యి. వీటిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 9,555 కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ అందించారు. చంద్ర బాబు ప్రభుత్వంలో ప్రస్తుతం 3,452 మంది రైతులకు సబ్సిడీ వర్తింపజేయాలి. ఇదిలా ఉంటే పవర్ ఫ్యాక్టర్ (విద్యుత్ వినియోగ నాణ్యత) 0.90 నుంచి 0.95 శాతం మధ్య ఉండాలని ప్రభుత్వం షరతు పె డుతూ 169 జీఓను విడుదల చేసింది. దీనిపై ఆక్వారైతుల్లో అధిక శాతం మందికి అవగాహన లేదు. లబ్ధిదారులను తగ్గించే ఎత్తుగడగా పలువురు భావిస్తున్నారు. ఏఐ సృష్టించిన చిత్రం ఏఐ సృష్టించిన చిత్రం మాజీ సీఎం వైఎస్ జగన్ ఎటువంటి షరతులు లేకుండా ఆక్వాలో విద్యుత్ సబ్సిడీ అమలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పవర్ ఫ్యాక్టర్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. రొయ్యల రైతులు రూ.వేలల్లో చెల్లించి అద్దె జనరేటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. మేత తయారీదారుల పక్షానే ప్రభుత్వం నిలవడం శోచనీయం. – రామిశెట్టి సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ సెక్రటరీ, ముదినేపల్లి రాష్ట్రానికి అత్యధిక ఆదాయం అందిస్తున్న ఆక్వారంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఇప్పటికే సరైన నీటి వనరులు లేక సాగులో వ్యాధులు ప్రబలుతున్నాయి. రొయ్యల రైతులు అప్పులు చేసి సాగు చేస్తున్నారు. పెంచిన మేతల ధరలను తగ్గించాలి. షరతులు లేకుండా అందరికీ ఆక్వా సబ్సిడీ వర్తింపజేయాలి. – చేబోయిన వీరరాజు, వైఎస్సార్సీపీ, ఏలూరు జిల్లా ఉపాధ్యక్షుడు, మండవల్లి -
భీమవరం అసెంబ్లీ పరిశీలకుడిగా మంతెన
కొయ్యలగూడెం: వైఎస్సార్సీపీ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడిగా తాను నియమితులైనట్టు మంతెన సోమరాజు తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయం ద్వారా నియామక పత్రం జారీ చేశారన్నారు. రీజనల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులకు సహాయకారిగా కూడా తనను నియమించారని తెలిపారు. కాగా మంతెన ఇప్పటికే పార్లమెంట్ కార్యదర్శిగా, ఏలూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
శోభనాచలుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ఆగిరిపల్లి: ఆగిరిపల్లిలోని శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఎన్.జయ సూర్య కుటుంబసమేతంగా సందర్శించారు. ఆలయ ఈఓ సాయి, అర్చకులు ఆయనకు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. న్యాయమూర్తి జయసూర్య స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేయించారు. ప్రధానార్చకులు వేదాంతం శేషుబాబు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించి, పట్టువస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయులు టెట్ పరీక్ష రాసి అర్హత సాధించాలని నిబంధన విధించడం అన్యాయమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిబంధనను రద్దు చేయాలని ఎస్ టీయూ జిల్లా అధ్యక్షుడు పీబీవీఎన్ఎల్ నారాయణ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సు బ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాలో ఎస్టీయూ ద్వితీయ కార్యవర్గ సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ టెట్ రద్దు చేసే దిశగా పార్లమెంట్లో చట్టం చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ప్రధా న కార్యదర్శి కేఆర్ పవన్కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులను టెట్ పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం తగదన్నారు. పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసి ఐఆర్ ప్రకటించాలని, డీఏలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా హెచ్ఎంల సంఘం అధ్యక్షుడు వి.మురళీకృష్ణ, డీసీఈబీ సెక్రటరీ పి.సురేష్, మాజీ రాష్ట్ర నా యకులు డీవీఏవీ ప్రసాదరాజు, జిల్లా ఆర్థిక కార్యదర్శి ఎ.రాము హాజరయ్యారు. కై కలూరు: రైలు పట్టాల మరమ్మత్తుల నిమిత్తం కై కలూరు–ఆకివీడు మధ్యలో భుజబలపట్నం నుంచి నర్సాయిపాలెం చేరే రైల్వే లెవిల్ క్రాసింగ్ గేట్ నం.88ను తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 28న రాత్రి 7 గంటలకు వరకు మూసివేస్తున్నట్టు సౌత్ కోస్ట్ రైల్వే కై కలూరు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (పీవే) అబ్దుల్ రెహ్మన్ శని వారం తెలిపారు. ప్రయాణికులు ప్రత్యామ్నా య మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించడానికి ఇంకెంత సమయం కావాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు టి.నారాయణదాసు ప్రశ్నించారు. శనివారం స్థానిక ఏఆర్డీజీకే నగరపాలక ఉన్నత పాఠశాలలో జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. నారాయణదాసు మాట్లాడుతూ ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని, లేకుంటే కేవలం వారి బోధన సబ్జెక్టుకు సంబంధించి మాత్రమే ప్రత్యేక టెట్ నిర్వహించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామారావు మాట్లాడుతూ వెంటనే ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని, పీఆర్సీ కమిషన్ను నియమించాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు వి.గణేష్, జిల్లా కార్యదర్శి డీకేఎస్ఎస్ ప్రకాష్రావు, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు ఐఎస్వీవీ ప్రసాద్, నగర ప్రధాన కార్యదర్శి అబ్బదాసరి శ్రీనివాస్, జి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని, నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యమని విద్యుత్ ఎస్ఈ కేఎం అంబ్కేర్ అన్నారు. స్థానిక చిత్తూరు గణేశ్వరరావు టౌన్హాల్లో శనివారం జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పీఎం సూర్యఘర్ పథకంపై విస్తృత అవగాహన కల్పించాలన్నా రు. ము ఖ్యంగా ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియో గదారులు లబ్ధి పొందేలా చూడాలని సూచించారు. విద్యుత్ శాఖ ఈఈ పీర్ అహ్మద్ ఖాన్, డీఈఈ శశిధర్, అసిస్టెంట్ ఇంజనీర్లు, లైన్మెన్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
నకిలీ ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ల దుమారం
దెందులూరు: ఏలూరు రూరల్ మండలం మాదేపల్లిలో నకిలీ ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ల పంపిణీ తీవ్ర దుమారం రేపింది. కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ విజయకుమార్రాజు విచారణలో నకిలీ ఎంజాయిమెంట్ సర్టిఫికెట్లుగా నిర్ధారించారు. పీజీఆర్ఎస్లో ఫిర్యాదు మేరకు కలెక్టర్ విచారణకు ఆదేశించారు. వివరాలిలా ఉన్నాయి.. మాదేపల్లిలో 41 ప్లాట్లు ఖాళీగా ఉండగా 2024 జూలైలో రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ ఎస్.నాగమణి నకిలీ ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లు జారీ చేశారు. అధికారిక ఉత్తర్వులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్లు మంజూరు చేశారు. నాగమణి నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చింది వాస్తవమని మాదేపల్లితో పాటు సమీప ప్రాంతాల్లో ఉన్న 21 మందికి ఇచ్చారని, వారిలో 12 మందిని గుర్తించామని తహసీల్దార్ విజయ్కుమార్రాజు చెప్పారు. దీనిపై విచారణ కొనసాగుతుందని, పూర్తి నివేదిక కలెక్టర్కు అందిస్తామన్నారు. నాగమణి ఇచ్చిన మాన్యువల్ నకిలీ ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లు చెల్లవని చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఆన్లైన్లో ధ్రువీకరించిన బుక్లెట్ మాత్రమే చెల్లు తుందన్నారు. ఆ సమయంలో తహసీల్దార్గా నరసింహరావు విధుల్లో ఉన్నారని, తహసీల్దార్ ఉన్నప్పుడు డిప్యూటీ తహసీల్దార్ ఎంజాయ్మెంట్ సర్టి ఫికెట్లు ఇవ్వకూడదని జేసీ అభిషేక్ గౌడ అన్నారు. -
రైలు ఢీకొని వృద్ధుడి దుర్మరణం
భీమడోలు: జాతీయ రహదారి పూళ్ల, భీమడోలు రైల్వే స్టేషన్ల మధ్య గల అండర్ పాస్ సమీపాన శనివారం ఓ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు కనుగొన్నారు. మృతుని శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని రైలు ఢీకొనడం లేదా రైలు నుంచి జారిపడడంతో మృతదేహాం నుజ్జునుజ్జుగా మారిందని రైల్వే పోలీసులు తెలిపారు. వృద్ధుని వయస్సు 60 నుంచి 70 ఏళ్ల మధ్య ఉంటుందని, ఎత్తు 5.5 అడుగులు, ఛామనఛాయ, నలుపురంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. వృద్ధుడి మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గూడెం స్టేషన్ మాస్టార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ఫీడ్ రేట్ల భారం
ఆలయ అభివృద్ధికి విరాళం కాళ్ల: కాళ్లకూరులో వేంకటేశ్వరస్వామి ఆలయ మాడవీధుల అభివృద్ధికి పచ్చిగోళ్ల అన్నపూర్ణమ్మ జ్ఞాపకార్థం ఆమె కుటుంబసభ్యులు రూ.1,01,116 విరాళంగా అందజేశారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ వీరవాసరం: ఆక్వా రైతు నెత్తిపై ఫీడ్ రేట్ల పెంపు మరో పిడుగుపాటు చర్య అని శా సనమండలి సభ్యుడు, వైఎస్సార్సీపీ శెట్టిబలిజ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కవురు శ్రీనివాస్ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల ఫీడ్ ధరను కిలోకు రూ.10 నుంచి రూ.12 పెంచారన్నారు. ఇప్పటికే ఆక్వా సాగు నష్టాల్లో సాగుతోందని, ఈ సమయంలో మేత ధరలను పెంచడం దారుణమన్నారు. చంద్రబాబు సానుభూతిపరులైన కొందరు ఫీడ్ తయారీ కంపెనీల యజమానులు సిండికేట్గా మారి రైతులను జలగల్లా పీల్చిపిప్పి చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ హయాంలో రొయ్య రైతులకు ఏ చిన్న సమస్య వచ్చినా అప్సడా ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుని మేలు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు రొయ్యల మేత ఫ్యాక్టరీలు, రొయ్యల సీడ్ హ్యాచరీ యజమానులు, రొయ్యల ప్లాంట్ యజమానులు, రొయ్యల మందులు యజమానులు ఒక్కరే ఉంటూ రేట్లు పెంచుతున్నారని మండిపడ్డారు. అలాగే రొయ్యల ధరలను ఇష్టానుసారం తగ్గించివేయడంతో రైతులు అయినకాడికి అమ్ము కోవాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ కనుసన్నల్లోనే సిండికేట్ వ్యవస్థ నడుస్తుందని ఎమ్మె ల్సీ కవురు ఆరోపించారు. పెంచిన ఫీడ్ ధ రలు వెంటనే తగ్గించకుంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రై తులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
రోడ్డుపై పడిన యాసిడ్తో ఇబ్బందులు
నూజివీడు: తెల్లవారుజాము సమయంలో వెళ్లిన ట్యాంకర్ నుంచి లీకై న యాసిడ్ రోడ్డుపై పడడంతో శనివారం ఉదయం మండలంలోని తుక్కులూరు దళితవాడ వాసులు కళ్ల మంటలతో తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. జంగంగూడెం వెళ్లే మార్గంలోని దళితవాడలో రోడ్డుపై యాసిడ్ పడగా తెల్లవారుజామున నిద్రలేచి బయటకు వచ్చిన వారికి తీవ్ర ఘాటైన వాసన రావడంతో పాటు కళ్లు మండిపోయాయి. అలా ప్రతి ఒక్కరికి కళ్లు మండుతుండటంతో వెంటనే రూరల్ పోలీసులకు విషయాన్ని తెలిపారు. దీంతో రూరల్ సీఐ జీ జ్యోతీబసు వెంటనే సమాచారాన్ని అగ్నిమాపక కేంద్రం సిబ్బందికి తెలిపి హుటాహుటిన తుక్కులూరులోని సంఘటనా స్థలానికి చేరుకొని ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. అనంతరం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ఫైర్ ఇంజిన్తో వచ్చి యాసిడ్ పడిన రోడ్డుపై నీళ్లు కొట్టారు. దాదాపు రెండు గంటల సేపు శ్రమించిన అనంతరం యాసిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టడం, కళ్ల మంటలు కూడా తగ్గడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
కై కలూరులో మహిళ దారుణ హత్య
● ఒంటిపై నగలు చోరీ ● సమీప వ్యక్తి చేశాడని అనుమానం కై కలూరు: నగలు కోసం ఓ మహిళను దారుణంగా కొట్టి చంపిన ఘటన కై కలూరులో శనివారం చోటుచేసుకుంది. స్థానిక 8వ వార్డు కాల్వగట్టు సమీపాన ముఠా కార్మికుడిగా పనిచేస్తున్న మార్టిన నాగరాజు, భార్య వరలక్ష్మీ(50) నివసిస్తున్నారు. సోదరుడి కూల్ డ్రింక్ షాపులో సహాయం చేయడానికి నాగరాజు వెళ్లాడు. వీరి కుమారుడు హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి ఫోన్ లిప్ట్ చేయకపోవడంతో ఇంటి సమీపంలో తన స్నేహితుడికి ఫోన్ చేసి తల్లి వద్దకు వెళ్లమన్నాడు. అతను వెళ్లి చూసేసరికి వరలక్ష్మి నిర్జీవంగా పడి ఉంది. ఇదే విషయాన్ని అతను కుటుంబ సభ్యులకు తెలియశాడు. వారంతా వచ్చి చూడగా ఆమె ఒంటిపై నానుతాడు, చెవుల దిద్దులు, ఉంగరాలు, ఇంటిలో రూ.10వేలు కనిపించలేదు. ముఖంపై రక్తపు మరకలు ఉన్నాయి. 108 సిబ్బంది రాగా అప్పటికే ఆమె మరణించిందని చెప్పారు. ఇదిలా ఉంటే ఓ వ్యక్తి ఆమె ఇంటిలో నుంచి రావడం చూశామని సమీప వ్యక్తులు చెబుతున్నారు. అతను మృతురాలి కుమారుడి మరో స్నేహితుడు, సమీప వ్యక్తే అని తెలిసింది. ఖచ్చితంగా అతనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని భావిస్తున్నారు. కై కలూరు పట్టణ సీఐ ఏవీఎస్.రామకృష్ణ, రూరల్ ఎస్సై వి.రాంబాబు ఘటనా స్థలంలో విచారణ చేశారు. స్థానికుల కథనం మేరకు అనుమానితుడిని అదుపులోకి తీసుకొన్నట్లు తెలిసింది. -
అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం
జంగారెడ్డిగూడెం: దేవులపల్లి అంగన్వాడీ టీచర్ చీకట్ల వేదకుమారి శనివారం మధ్యాహ్నం అంగన్వాడీ కేంద్రం సమీపంలో దోమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మూడు నెలల క్రితం గుడ్లు పాడయ్యాయనే విషయమై గ్రామానికి చెందిన వారితో వివాదం జరిగిందని బాధితురాలు వేదకుమారి పేర్కొంది. ఆ తర్వాత గ్రామానికి చెందిన కొందరు తనను నిరంతరం వేధిస్తున్నారని తెలిపింది. ఉద్యోగం చేయనివ్వమని బెదిరించడం, కరెంట్ వైర్లు కత్తిరించడం, పోలీస్ స్టేషన్లో తప్పుడు ఫిర్యాదులతో మానసిక క్షోభకు గురిచేశారని తెలియజేసింది. ఈ క్రమంలో జూన్ 13న తనపై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధితురాలు వేదకుమారి చెప్పింది. ఒంటరి మహిళనైన తనకు ప్రాణ ముప్పు ఉందని, రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఆమె అధికారులను వేడుకుంది. కాగా, విషయం తెలుసుకున్న సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, అంగన్వాడీ యూనియన్ నాయకులు ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించారు. -
పోటెత్తిన భక్తులు.. దర్శనానికి అష్టకష్టాలు
● శ్రీవారి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు ● సరిగ్గా మంచినీరు కూడా అందని పరిస్థితి ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న సన్నిధిలో శనివారం భక్తులు అష్టకష్టాలు పడ్డారు. శ్రీవారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరచుకోవడంతో సుమారు 30 వేల మంది భక్తులు చినవెంకన్నను దర్శించుకున్నారు. అయితే వారికి కనీసం సౌకర్యాలు కల్పించడంలో ఆలయ సిబ్బంది విఫలమయ్యారు. నూతన అనివెట్టి మండపం పక్కన నిర్మించిన క్యూలైన్ల లోంచి, నూతన క్యూ కాంప్లెక్స్లోకి వెళ్లేందుకు భక్తులకు కొన్ని గంటల సమయం పట్టింది. ఓ పక్క ఉక్కబోత, మరో పక్క సక్రమంగా మంచి నీరు అందక భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఇదిలా ఉంటే వాట్సాప్ మనమిత్రా సేవలను విస్తృత పరిచేందుకు, కియోస్క్ యంత్రాల సేవలను నిలుపుదల చేయడంతో భక్తులు మరింత అసౌకర్యానికి గురయ్యారు. సైడ్ లైట్స్ ● కియోస్క్ యంత్రాలను నిలుపుదల చేసి, వాట్సాప్ మనమిత్రాలో టికెట్లు బుక్ చేసుకోవాలని దేవస్థానం సిబ్బంది సూచించడంతో, ఆన్లైన్ కౌంటర్ల వద్ద పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. వారికి సమాధానం చెప్పలేక సిబ్బంది సతమతమయ్యారు. ● భక్తులు కొత్త క్యూ కాంప్లెక్స్ క్యూ లైన్లలో దాదాపు 3 గంటలు పాటు వేచి ఉండాల్సి వచ్చింది. వారికి కొన్ని గంటల పాటు మంచి నీరు అందలేదు. దాంతో అక్కడున్న సిబ్బందిపై ఘర్షణకు దిగారు. ఆ తరువాత ఆలయ కార్యాలయానికి వెళ్లి, ఫిర్యాదులు రాసి, వాటిని కంప్లైంట్ బాక్స్లో వేశారు. ● క్యూ కాంప్లెక్స్లోని క్యూలైన్లలో ఏర్పాటు చేసిన హై వాల్యూమ్–లో స్పీడ్ (హెచ్వీఎల్ఎస్) ఫ్యాన్లు ఉదయం దాదాపు 3 గంటల పాటు పనిచేయలేదు. దాంతో భక్తులు ఉక్కిరిబిక్కిరయ్యారు. క్యూ కాంప్లెక్స్ క్యూలైన్ల ఎమర్జన్సీ ఎగ్జిట్ గేట్లకు తాళాలు వేశారు. సెక్యూరిటీ సిబ్బంది ఆ తాళాలు పట్టుకుని కంపార్ట్మెంట్లలో ఉండిపోయారు. దాంతో దేవస్థానం సిబ్బంది లోపలికి, బయటకు వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. షుగర్ పేషెంట్లు మూత్రానికి వెళ్లే వీలు లేక నానా అవస్థలు పడ్డారు. ● క్లోక్ రూమ్ అవుట్సైడ్ ఉండటంతో భక్తులు బ్యాగులతో నేరుగా క్యూ కాంప్లెక్స్ వద్దకు వెళుతున్నారు. వాటిని క్లోక్రూమ్లో పెట్టుకోవాలని అక్కడి సిబ్బంది సూచించారు. అయితే క్లోక్రూమ్ ఆలయం లోంచి బయటకు వెళ్లే మార్గంలో ఉండటంతో దాన్ని వెదుక్కోవడానికి భక్తులకు సమయం పట్టింది. ● క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు మజ్జిగ, రెండేసి బిస్కెట్లు చొప్పున అందించారు. కానీ క్యూ లైన్లలో ఉన్న వారికి మంచినీరు కూడా అందించలేక పోయారు. ● క్యూ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన రూ. 200 ఆన్లైన్ దర్శనం క్యూలైన్ వద్ద సరైన నీడలేక గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు ఇబ్బంది పడ్డారు. అయితే మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. దాంతో భక్తులకు కాస్త ఉపశమనం కలిగింది. ● పాత తాత్కాలిక క్యూ కాంప్లెక్స్ దాదాపు 4 వేల మంది భక్తులకు సరిపోయేది. కొత్త క్యూ కాంప్లెక్స్ 1,950 మందికి మాత్రమే సరిపోతుంది. మిగిలిన వారు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. ● సుమారు రూ.40 లక్షలతో నూతన అనివెట్టి మండపం పక్కన ఐరన్ పైప్లతో క్యూలైన్లు, వాటికి పైకప్పు నిర్మించారు. ఇటీవల గాలి వానకు పైకప్పు ధ్వంసమైంది. నిర్మించి నెల గడవక ముందే అది ధ్వంసం కావడంపై భక్తులు, స్థానికులు విస్తుపోతున్నారు. అయితే ఆ పైకప్పుపై తెల్లని క్లాత్ వేసి ప్రస్తుతం భక్తులకు నీడ కల్పించడం గమనార్హం. ● ఓ భక్తురాలు తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోవడంతో ఆమెకు ప్రథమచికిత్సా కేంద్రం వైద్యసేవలు అందించారు. ● భక్తులు పోటెత్తారన్న సాకుతో అధికారులు ప్రొటోకాల్ కార్యాలయ గేట్లను సైతం మూసివేశారు. దాంతో వీఐపీ దర్శనాలు, ఇతర సమాచారం కోసం అక్కడికి వచ్చిన వారు ఇదేం దారుణమని ముక్కున వేలేసుకున్నారు. ● భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాన్ని ఉదయం 8 గంటల నుంచి నిలుపుదల చేశారు. ఇదిలా ఉంటే నూతన అనివెట్టి మండపంలో అన్నప్రాశనలు జరుపుకునేవారి నుంచి రూ. 2,200 రుసుముగా వసూలు చేస్తున్నారు. అదే కింద జరుపుకుంటే రూ. 200 వసూలు చేస్తున్నారు. దాంతో పలువురు ఈ వేడుకలను కిందే జరుపుకున్నారు. మరీ ఇంత కమర్షియల్ అయితే ఎలా అని వారు వాపోయారు. -
శ్రీకాకుళం అత్యధికం.. అల్లూరి సీతారామరాజు అత్యల్పం
● ట్రిపుల్ఐటీ ప్రవేశాల జాబితా విడుదల ● 4,040 సీట్లకు కౌన్సెలింగ్ నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీల్లో 2026–27 విద్యాసంవత్సరం అడ్మిషన్లలో భాగంగా ఎంపికై న అభ్యర్థుల జాబితాను ఆర్జీయూకేటీ వర్గాలు శనివారం విడుదల చేశాయి. ప్రత్యేక కేటగిరీ కోటా మినహా 4,040 సీట్లకు ఎంపికై న విద్యార్థుల జాబితాను తాజాగా విడుదల చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 366 మంది ఎంపికవ్వగా, అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి అత్యల్పంగా నలుగురు మాత్రమే ఎంపికయ్యారు. ఈనెల 19 నుంచి 24 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. -
సుబ్బారాయుడి శాంతి కల్యాణం
నూజివీడు: చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం నూజివీడు మండలం సుంకొల్లు గ్రామానికి చెందిన మొగదాటి సందీప్ (26) గత నెల 20వ తేదీన మామిడి కోతకు వెళ్లి ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. నూజివీడులో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవలకు విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పేద కుటుంబమైన సందీప్ కుటుంబ సభ్యులు వైద్య ఖర్చులు నిమిత్తం డబ్బులు లేక ఈనెల 12న విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సందీప్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి గతేడాదే వివాహం కాగా ఇప్పుడు ఆమె ఆరు నెలల గర్భిణి. సందీప్ మృతి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బుట్టాయగూడెం: ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి ఏజెన్సీలో పర్యటించనున్నారు. ఆరోజు ఉదయం 7 గంటలకు రంపచోడవరం నుంచి బయలుదేరి 8:30కు బుట్టాయగూడెం మండలం కేఆర్పురం ఐటీడీఏ అతిథి గృహానికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. అనంతరం 9 గంటలకు అక్కడి నుంచి గుబ్బల మంగమ్మ గుడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12:30కు జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి వెళ్లి రోగులకు అందుతున్న వైద్యసేవలను, సౌకర్యాలను పరిశీలిస్తారన్నారు. అనంతరం ఉప్పలమెట్టలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల సందర్శన, మధ్యాహ్నం 3.30కు బుట్టాయగూడెం మండలం వెలుతురువారిగూడెం చేరుకుని అక్కడి గిరిజనులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకుంటారని తెలిపారు. సాయంత్రం 5:15కు కేఆర్పురం ఐటీడీఏ సమావేశ మందిరంలో గిరిజనులు, గిరిజన ఉద్యోగులు, గిరిజన సంఘాల ప్రతినిధులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారని తెలిపారు. రాత్రి 8:30కు ఏలూరు చేరుకుని అక్కడ బస చేస్తారని చెప్పారు. టి.నరసాపురం: ట్రాక్టర్ కింద పడి యువకుడు మృతి చెందాడు. ఏపుగుంట గ్రామానికి చెందిన ఇంగిర్తి నాగరాజు, సుజాతల కుమారుడు వినయ్ (18) చదువు మానేసి స్థానికంగా కూలి పనులు, ట్రాక్టర్ తోలకానికి వెళుతున్నాడు. ఈ నెల 12న గ్రామానికి చెందిన సంక్రాంతి సతీష్ ట్రాక్టర్పై మట్టి తోలకానికి వెళ్లాడు. రాత్రి సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ చాపల మడుగు కళ్యాణ్ ట్రాక్టర్ నడుపుతుండగా ట్రాక్టర్ ఇంజన్పై వినయ్ కూర్చున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తగా ట్రాక్టర్ నడపడంతో ఇంజన్పై కూర్చున్న వినయ్ ఒక్కసారిగా కింద పడగా అతడిపై నుంచి ట్రాక్టర్ వెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన వినయ్ను స్థానికులు వెంటనే చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వినయ్ తల్లి సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.జయబాబు తెలిపారు. -
గట్టుపై గుట్టుగా తవ్వకాలు
ద్వారకాతిరుమల: మట్టి మేతగాళ్లు నిబంధనలకు నిలువునా పాతరేస్తున్నారు. రాత్రింబవళ్లూ కాలువ గట్లపై పొక్లెయిన్, జేసీబీలతో అక్రమ తవ్వకాలు సాగిస్తూ గట్లను మాయం చేస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండలంలోని పోలవరం కుడి కాలువ గట్లు అక్రమ తవ్వకాలు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నాయి. భీమడోలు–ద్వారకాతిరుమల ప్రధాన రహదారిలోని పంగిడిగూడెం వద్ద రోడ్డు పక్కన గత రెండు రోజులుగా పోలవరం కుడి కాలువ గట్టుపై మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అధికార పార్టీకి చెందిన నాయకులు ఈ మట్టి దందాను సాగిస్తున్నారు. కళ్ల ముందే జరుగుతున్న ఈ అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. ట్రక్కు మట్టి రూ. 800 రోజుకు వంద ట్రాక్టర్ ట్రక్కుల మట్టిని తవ్వేస్తున్నారు. ఒక్కో ట్రక్కు మట్టిని రూ. 800 లకు విక్రయిస్తున్నారు. గ్రామంతో పాటు, చుట్టుపక్కల గ్రామాలకు ఈ మట్టిని తరలిస్తున్నారు. అయితే కాలువ గట్టుపై ఉన్న మట్టినే కాకుండా, గట్టుపై గుంతలు పెట్టి మరీ గ్రావెల్ను ఇష్టారాజ్యంగా తవ్వుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ దోపిడీ సాగుతూనే ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. దీనిపై తహసీల్దార్ జేవీ సుబ్బారావును వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఇష్టానుసారంగా చేపల చెరువుల తవ్వకాలు భీమడోలు: నిబంధనలు బేఖాతరు చేస్తూ గుండుగొలను ప్రాంతంలో అక్రమ చేపల చెరువుల తవ్వకాలు యధేచ్చగా సాగుతున్నాయి. ఆక్వా జోన్ పుణ్యమా వరి పొలాలు సైతం చేపల చెరువులుగా మారిపోతున్నాయి. గుండుగొలనులోని కొరుకల్లు రోడ్డు వెంబడి 120 ఏకరాల విస్తీర్ణంలో పంట పొలాలను చేపల చెరువులుగా మార్చేశారు. రత్నాపురానికి వెళ్లే దారిలో గుండుగొలను రెవెన్యూ పరిధిలోని బీసీ కాలనీని ఆనుకున్న సర్వే నెంబర్ 107/20, 106/2, 109, 109/1ఏ లోని 12.09 ఏకరాల విస్తీర్ణంలోని పంట పొలాలను శుక్రవారం జేసీబీల సాయంతో తవ్వుతున్నారు. తవ్వగా వచ్చే మట్టితో మురుగు డ్రైయిన్ను పూడ్చేస్తున్నారు. 2021లో సంబంధిత పొలం యాజమానులు పర్మిషన్ పొందినా అప్పట్లో రైతులు ఆక్వా చెరువులు తవ్వితే మా పంట దెబ్బతింటుందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ పర్మిషన్లును రద్దు చేశారు. ఆ పర్మిషన్ పత్రాలను బూచీగా చూపుతూ సంబంధిత రైతులు తమ రాజకీయ పలుకుబడిని వినియోగించుకుంటూ అక్రమంగా చెరువును జేసీబీల సాయంతో తవ్వేస్తున్నారు. తవ్వకాల గురించి కొంతమంది రైతులు భీమడోలు ఎఫ్డీవో దుర్గాభవానికి ఫిర్యాదు చేశారు. ఎఫ్డీవో ఆదేశాల మేరకు గుండుగొలనులోని గ్రామస్థాయి మత్స్యశాఖ సహాయకుడు, వీఆర్వోలు సంఘటన స్థలానికి వెళ్లి ఆ పనులు అడ్డుకున్నారు. పొలం యాజమానులకు నోటీసులు జారీ చేశారు. జేసీబీలను అక్కడ నుంచి పంపించి వేశారు. రెచ్చిపోతున్న మట్టి మాఫియా -
ప్రతి ఒక్కరికీ అభినందనలు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ కై కలూరు: చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా అన్ని నియోజకవర్గాల్లో విజయవంతం చేసినందుకు ప్రతి కార్యకర్త, నాయకులకు అభినందనలు తెలుపుతున్నానని పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) శుక్రవారం చెప్పారు. ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, నియోజకవర్గ ఇన్చార్జులు మామిళ్ళపల్లి జయప్రకాష్, పుప్పాల వాసుబాబు తెల్లం బాలరాజు, కంభం విజయరాజు, మేకా ప్రతాప్ అప్పారావులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్నారు. కార్యకర్తలు, ప్రజల్లో వచ్చిన స్పందన రానున్న ప్రజా ఉద్యమ కార్యక్రమాలకు నాంది పలుకుతుందన్నారు. ఇదే ఒరవడిని కొనసాగించాలని ఆశిస్తున్నట్టు డీఎన్నార్ పేర్కొన్నారు. ఏలూరు(టూటౌన్): బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో శుక్రవారం ముద్రించిన పోస్టర్ను కలెక్టర్ వెట్రిసెల్వి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ సమాజానికి శాపమని, దీనిని పూర్తిగా నిర్మూలించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, జిల్లాలో బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బాల కార్మిక నిర్మూలన కోసం జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీకి చెందిన అన్ని శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, భాగస్వామ్య సంస్థలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఉప కార్మిక కమిషనర్ పి. శ్రీనివాస్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శారద, సహాయ కార్మిక కమిషనర్ జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మీ అధ్యక్షతన, డిప్యూటి కమిషనర్ ఆఫ్ లేబర్, క్రాఫ్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తముగా శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పారా లీగల్ వాలంటీర్లు, పౌరులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్. శ్రీలక్ష్మీ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ప్రతి సంవత్సరం జూన్ 12న ఈ దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారుఏ. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ పి.శ్రీనివాస్, డీసీపీఓ సీహెచ్ సూర్య చక్రవేణి, సీడబ్ల్యూసీ ఇన్చార్జి చైర్పర్సన్ పి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): ఈ నెల 19న పట్టిసీమలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం పట్టిసీమలో యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పట్టిసీమలో ఈనెల 19న పెద్ద ఎత్తున యోగాభ్యాసన కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, అందుకు అనుగుణంగా కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా కార్యక్రమం ఉదయమే ప్రారంభమయ్యేలా చూడాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా నీడ ప్రదేశంలో ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలలో అధికారులు, సిబ్బంది అందరూ యోగాంధ్ర యాప్లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులను యోగాంధ్ర కార్యక్రమంలో నమోదు చేసి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ, డీపీఓ మల్లికార్జునరావు, స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలు అధికారి జి.వెంకటనాయుడు పాల్గొన్నారు. -
వెన్నుపోటుపై జనాగ్రహం
హోరెత్తిన వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలు ● జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో కదం తొక్కిన పార్టీ కేడర్ ● సూపర్సిక్స్ పేరుతో సూపర్ దగా చేశారంటూ నేతలు ధ్వజం సాక్షి ప్రతినిధి, ఏలూరు: జనాగ్రహం కట్టలు తెంచుకుంది. మోసపూరిత హామీలు, సూపర్ సిక్స్ అంటూ దగా చేసిన కూటమి వెన్నుపోటు పాలనకు రెండేళ్లు ముగియడంతో జనం నిరసన గళం వినిపించారు. సూపర్సిక్స్ పేరుతో దగా చేసి లెక్కకు మించిన హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు రెండేళ్ల పాలనంతా అవినీతిమయమని నేతలు ధ్వజమెత్తారు. వెన్నుపోటుకు రెండేళ్ళు పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రజల భాగస్వామ్యంతో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో పార్టీ కేడర్తో పాటు రైతులు, సామాన్యులు, మహిళలు ఆందోళనకు మద్దతు పలికారు. జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు కై కలూరు నియోజకవర్గంతో పాటు ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో జరిగిన నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు. కూటమి దగాపాలన మెగా డీఎస్సీ పేరుతో మోసాలు, సూపర్ సిక్స్లోని హామీలను గాలికి వదిలేసిన వైనంపై నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం, కై కలూరు, నూజివీడు నియోజకవర్గాల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. కై కలూరు నియోజకవర్గంలో.. కై కలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నాలుగు మండలాలు కై కలూరు, ముదినేపల్లి, మండవల్లి, కలిదిండి నుంచి పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. కై కలూరులోని పార్టీ కార్యాలయం నుంచి ఆటపాకలోని డీఎన్నార్ ఫ్యాక్టరీ వరకు నిరసన ర్యాలీ చేశారు. సంతమార్కెట్ వద్ద ఉన్న దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆటపాక వద్ద రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దెందులూరు నియోజకవర్గంలో.. దెందులూరు నియోజకవర్గంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నాలుగు మండలాలు పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్, దెందులూరు నుంచి పార్టీ శ్రేణులు హాజరయ్యారు. పెదవేగి మండలం రాట్నాలకుంట నుంచి సోమవరప్పాడు చేరుకుని అక్కడ నుంచి దెందులూరు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. దెందులూరు ఎస్ఎంఆర్ సెంటర్ నుంచి ర్యాలీగా బస్టాండ్ సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం దెందులూరులో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెంటరులో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గంలో.. ఉంగుటూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు భీమడోలు, ఉంగుటూరు, గణపవరం, నిడమర్రు నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు నేతృత్వంలో గణపవరంలో పార్టీ కార్యాలయం నుంచి పోలీస్ ఐలాండ్ సెంటరు వరకు నిరసన ర్యాలీ చేశారు. ముందుగా సెంటరులో ఉన్న దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెంటరులో నాలుగు కూడళ్ల వద్ద నిరసన నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గంలో.. నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు నూజివీడు, చాట్రాయి, ఆగిరిపల్లి, ముసునూరు మండలాల నుంచి పార్టీ నాయకులు భారీ సంఖ్యలో నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప అప్పారావు ఆధ్వర్యంలో మోటారుసైకిల్ ర్యాలీ నిర్వహించారు. నూజివీడులోని పార్టీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. పోలవరం నియోజకవర్గంలో.. పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాలు జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, పోలవరం, టీ.నర్సాపురం, వేలేరుపాడు, కుక్కునూరు, కొయ్యలగూడెం నుంచి పార్టీ నేతలు కొయ్యలగూడెంలో జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. బుట్టాయగూడెం నుంచి కన్నాపురం మీదుగా కొయ్యలగూడెం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కొయ్యలగూడెం సెంటరులో దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. చింతలపూడి నియోజకవర్గంలో.. చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. చింతలపూడి, జంగారెడ్డిగూడెం, లింగపాలెం, కామవరపుకోట మండలాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మార్కెట్ కమిటీ నుంచి పాత బస్టాండ్ సెంటర్, బోసుబొమ్మ సెంటర్ మీదుగా ఫైర్స్టేషన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ సెంటరులో అంబేడ్కర్ విగ్రహానికి, ఫైర్స్టేషన్ సెంటరులో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫైర్స్టేషన్ సెంటరులో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఏలూరు నియోజకవర్గం ఏలూరులో సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, పార్లమెంట్ పరిశీలకులు వంకా రవీంద్రనాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పార్టీ జిల్లా కార్యాలయం నుంచి పాతబస్టాండ్ సెంటర్ వరకు భారీగా నిరసన ర్యాలీ చేశారు. ముందుగా పాతబస్టాండ్ సెంటరులో బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. -
విద్యార్థులకు సమస్యల స్వాగతం
● కానరాని విద్యార్థి మిత్ర కిట్లు ● యూనిఫామ్, బూట్లు లేకుండానే తరగతులకు విద్యార్థులు ఏలూరు (ఆర్ఆర్పేట): వేసవి సెలవుల అనంతరం శుక్రవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయాయ్యయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా పునఃప్రారంభ తేదీని పొడిగించాలని ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరినా ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా శుక్రవారమే పాఠశాలలను ప్రారంభించింది. అయితే తొలిరోజు విద్యార్థుల హాజరు శాతం సుమారు 50 శాతానికి మాత్రమే పరిమితమైంది. తొలిరోజు తరగతులకు హాజరైన విద్యార్థులకు మాత్రం సమస్యలు స్వాగతం పలికాయి. బూజు పట్టిన గదులు.. దుమ్ము పట్టిన బెంచీలు వేసవి సెలవుల అనంతరం పాఠశాలలకు హాజరైన విద్యార్థులకు తరగతి గదులు బూజుపట్టి దర్శనమిచ్చాయి. అలాగే వారు కూర్చునే బెంచీలు దుమ్ముతో నిండిపోయాయి. తరగతి గదులను శుభ్రం చేసి విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని ఆదేశించినా సమస్యలే స్వాగతం పలికాయి. పునఃప్రారంభ తేదీని వాయిదా వేస్తారనే ప్రచారం జరగడంతో మరో మూడు రోజులు గడువు ఉంటుందనే ఆలోచనతో చాలా పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు చేయలేదని తెలుస్తోంది. పాఠశాలలోకి అడుగుపెట్టిన వెంటనే ఇటీవల కురిసిన వర్షానికి నీటితో నిండి బురదమయంగా మారిన ప్రాంగణాలు విద్యార్థులకు తొలిరోజే పరీక్ష పెట్టాయి. యూనిఫామ్, బూట్లు నిల్ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే సౌకర్యాలను నిర్లక్ష్యం చేస్తోంది. దీనిలో భాగంగానే పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు యూనిఫరం, బూట్లు, సాక్సులు, టైలు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, డిక్షనరీలు అందించాల్సి ఉండగా కేవలం పుస్తకాలను మాత్రమే సరఫరా చేసింది. దీనితో విద్యార్థులు గత ఏడాది వినియోగించిన యూనిఫారమే వేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. గత ఏడాది నాణ్యతలేని యూనిఫారం అందించడంతో గత విద్యా సంవత్సరం చివరి వరకూ కూడా యూనిఫారం ఉపయోగపడకపోవడంతో కొంతమంది చిరిగిన యూనిఫారమే వేసుకువచ్చారు. ఈ ఏడాది కొత్త యూనిఫారం సరఫరా చేయకపోవడంతో ఆ చిరిగిన యూనిఫారాన్నే కుట్లు వేసుకుని ధరించాల్సి వచ్చింది. అలాగే గత ఏడాది పంపిణీ చేసిన బూట్లు కూడా నాణ్యత లేక విద్యా సంవత్సరం మధ్యలోనే పాడైపోవడంతో చెప్పులు వేసుకువచ్చిన వారు ఈ ఏడాది కొత్త బూట్లు వస్తాయని ఎదురు చూడగా వారికి నిరాశే ఎదురయింది. అనేక మంది చిరిగిన స్కూల్ బ్యాగులు ధరించి రాగా మరికొంతమంది ఇంటిలో ఉన్న చేతి సంచుల్లో పుస్తకాలు తెచ్చుకోవడం కనిపించింది. తొలిరోజు 126085 మంది హాజరు జిల్లాలో తొలిరోజు విద్యార్థుల హాజరు శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం అత్యంత స్వల్పంగానే నమోదయింది. జిల్లాలో మొత్తం 239524 మంది విద్యార్థులుండగా వారిలో తొలిరోజు కేవలం 126085 మంది మాత్రమే హాజరు కావడం విద్యాశాఖాధికారులకు మింగుడు పడలేదు. విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధింత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ముందు నుంచీ సమాచారం అందిస్తున్నా పాఠశాలలకు రావడానికి వారు పెద్దగా ఆసక్తి చూపలేదు అయితే శుక్రవారం పాఠశాలలు తెరిస్తే మరుసటి రోజే రెండో శనివారం వస్తుందని, రెండవ శనివారం పాఠశాలలకు సెలవు ఉంటుందని, దీనితో రెండో రోజు పాఠశాలలకు వెళ్ళే అవకాశం ఉండదనే కారణంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపలేదని తెలుస్తోంది. -
బాధితులకు భరోసా కల్పిస్తూ..
ఏలూరు టౌన్: అన్యాయానికి గురైన బాధితులకు అండగా నిలుస్తూ భరోసా కల్పించే బాధ్యత పోలీస్, న్యాయవ్యవస్థలు తీసుకుని విజయవంతంగా నేరస్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ చెప్పారు. ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్ డీసీఎంఎస్ కళ్యాణమండపంలో జిల్లాలోని బాధితులతో ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిధులుగా ఐజీ అశోక్కుమార్, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ హాజరయ్యారు. జిల్లాలో ఆయా కేసుల్లో న్యాయం పొందిన బాధితులతో మమేకం అవుతూ వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 62 కేసుల్లో ఏకంగా 74 మంది నేరస్తులకు శిక్షలు విధించేలా పోలీస్, న్యాయవ్యవస్థ సమన్వయంతో చేసిన కృషిని అభినందించారు. జిల్లాలో కోర్టు మానిటరింగ్ సెల్ కృషి, సేవలపై బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఐజీ మాట్లాడుతూ.. సీఎంసీ ఏర్పాటుతో సత్ఫలితాలు సాధించామని చెప్పారు. ఎస్పీ శివకిషోర్ ప్రత్యేక శ్రద్ద, సీఎంసీ ప్రత్యేక అధికారి నిబద్ధతతో పనిచేయటం, సిబ్బంది సేవలతో బాధితులకు న్యాయం అందించే అవకాశం ఏర్పడిందన్నారు. నేరస్తులకు కఠిన శిక్షలు విధించేలా చేయడమే పోలీసు ప్రధాన బాధ్యత అన్నారు. ఏలూరు రేంజ్లో 5 జిల్లాల్లో సీఎంసీ ఏర్పాటు చేశామని, మంచి ఫలితాలు వస్తున్నాయని ఐజీ చెప్పారు. ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ.. జిల్లాలో కోర్టు మానిటరింగ్ సెల్ అద్భుత ఫలితాలు రాబట్టిందని.. ఇదే స్పూర్తితో భవిష్యత్లోనూ నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పీ.ఆనంద జ్యోతి, అదనపు పీపీలు చింతమనేని రమేష్, ఎం.కేదారి, ఐ.రాజశేఖర్, స్పెషల్ పీపీలు ఎన్.శారదాని, వీ.అమర్ శ్రీనివాస్, ఓగిరెడ్డి వెంకన్నబాబు హాజరయ్యారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ -
మా స్కూల్ మాకు కావాలి
బుట్టాయగూడెం: మారుమూల గ్రామమైన పులిరాముడుగూడెంలో పాఠశాల పునఃప్రారంభం రోజున ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామ పాఠశాల గేట్లకు గ్రామస్తులు, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు తాళాలు వేసి బైఠాయించారు. మా పాఠశాల మాకే కావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి గిరిజన విద్యా విధానంలో ప్రభుత్వం మార్పులు చేసిన నేపథ్యంలో.. పులిరాముడుగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కేవలం 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకూ మాత్రమే విద్యాబోధనను పరిమితం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ గ్రామస్తులు, విద్యార్థి, గిరిజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కలెక్టర్ స్వయంగా వచ్చి తమ సమస్యను పరిష్కరించే వరకూ పాఠశాల తెరిచేది లేదని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న కేఆర్పురం ఐటీడీఏ డీడీ పి.జనార్దన్రావు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, తమ నిరసనను విరమించేందుకు నిరాకరించారు. న్యాయవాది యేసుబాబు, పీడీఎస్యూ నాయకులు భూషణం, బన్నే వినోద్, గిరిజన సంఘం నాయకుడు తెల్లం రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ.. గతంలో 3 నుంచి 10వ తరగతి వరకూ తరగతులు నిర్వహించేవారని గుర్తుచేశారు. పులిరాముడుగూడెం పరిధిలో దాదాపు 12 కొండరెడ్డి గిరిజన గ్రామాలు ఉన్నాయని, ఆయా గ్రామాల పిల్లలకు ఇక్కడ చదువుకునేందుకు ఎంతో సౌకర్యంగా ఉండేదని చెప్పారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ మడి శ్రీరాములు, ఎంపీటీసీ మడకం వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పులిరాముడుగూడెం ఆశ్రమ పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన -
షరతుల మెలిక.. ఆక్వా సబ్సిడీకి పొగ !
సాక్షి, భీమవరం: జోన్తో నిమిత్తం లేకుండా ఆక్వా సాగు అంతటికీ రాయితీ విద్యుత్ ఇస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా హామీని గాలికొదిలేసింది. తాజాగా కొత్త కనెక్షన్లకు సబ్సిడీ ఇస్తామంటూనే పవర్ ఫ్యాక్టర్ 0.90 నుంచి 0.95 మధ్య ఉండాలంటూ మెలిక పెట్టింది. రూ.1.50 సబ్సిడీ విద్యుత్కు ఎగనామం పెట్టే ఎత్తుగడలో భాగమే షరతులంటూ ఆక్వా రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 14,242 కనెక్షన్లకు.. గతంలో జిల్లాలో ఆక్వా సాగు విస్తీర్ణం 1.24 లక్షల ఎకరాల వరకు ఉండేది. సిండికేట్ దోపిడీ కుదేలైన ఆక్వా రంగానికి అడుగడుగునా అండగా ఉంటూ గత జగన్ సర్కారు కొత్త ఊపిరిలూదింది. ప్రపంచంలోనే రెండోదిగా ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా)ని ఏర్పాటుచేసింది. టీడీపీ హయాంలో ఆక్వాజోన్లో దాదాపు 30 వేలలోపు ఎకరాలు మాత్రమే ఉంటే ఈ–ఫిష్ సర్వేతో 1.17 లక్షల ఎకరాలకు పెంచారు. సబ్సిడీపై యూనిట్ రూ.1.50లతో పాటు ఇతర రాయితీలు అందించారు. మేత, రొయ్య ధరల స్థిరీకరణ, నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరా, ఫిష్ ఆంధ్రా ద్వారా ఆక్వా రైతులకు అండయ్యారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. కోవిడ్ కష్టకాలంలో సైతం సిండికేట్ దోపిడీకి అడ్డుకట్ట వేసి 100 కౌంట్ రూ.180 ఎంఎస్పీగా నిర్ణయించి అమలుచేశారు. సాగు లాభసాటిగా మారి జిల్లాలో ఆక్వా విస్తీర్ణం గణనీయంగా దాదాపు 1.34 లక్షల ఎకరాలకు పెరిగింది. గత ప్రభుత్వ కృషితో ప్రస్తుతం జిల్లాలో 14,242 విద్యుత్ కనెక్షన్లకు నెలకు దాదాపు రూ.23 కోట్ల సబ్సిడీ అందుతోంది. కూటమి వంచన : జోన్, సాగు విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా రైతులు అందరికి యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తానని, 500 టన్నుల కెపాసిటీ కలిగిన కోల్డ్ స్టోరేజీలు కట్టిస్తామని, ఏరియేటర్స్పై సబ్సిడీ ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా వాటిని అమలు చేయకుండా రైతులను వంచించారు. కూటమి పాలనలో సిండికేట్ ఇష్టారాజ్యంగా మారింది. దోపిడీని అడ్డుకుని ఆక్వారంగాన్ని ఆదుకోవాలని ఏడాదిన్నర కాలంగా రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. జిల్లాలో సుమారు 2 వేల కనెక్షన్లకు రాయితీ విద్యుత్ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఖర్చు మూడింతలై.. గతంలో 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్తో కనెక్షన్ కోసం రూ.4.50 లక్షలు ఖర్చయితే ప్రస్తుతం రూ.13 లక్షలకు పైనే వ్యయమవుతోందని, కనెక్షన్, నిర్వహణ ఖర్చులు, పెరుగుతున్న విద్యుత్ బిల్లులతో ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలో 169 జీఓ తమపై మరింత భారం మోపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ షరతు ఆక్వా రైతులకు ఇస్తున్న సబ్సిడీ ఎగ్గొట్టే ఎత్తుగడని విమర్శిస్తున్నారు. షరతులు ఎత్తివేయడంతో పాటు పీఎఫ్ ప్రాముఖ్యత, కెపాసిటర్లు, ఆటోమేటిక్ పీఎఫ్ కంట్రోల్పై విద్యుత్, మత్య్సశాఖ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ, అవసరమైన పరికరాలకు సబ్సిడీ అందించి ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పవర్ ఫ్యాక్టర్పై అవగాహనలేమి తాజాగా రాష్ట్రంలోని 12 వేల కనెక్షన్లకు రాయితీ విద్యుత్ను అందిచనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే పవర్ ఫ్యాక్టర్ (విద్యుత్ వినియోగ నాణ్యత) 0.90 నుంచి 0.95 శాతం మధ్య ఉండాలని షరతు పెట్టింది. ఈమేరకు 169 జీఓను విడుదల చేసింది. సాధారణంగా పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) ఒక శాతంగా ఉంటే సమర్థవంతంగా వినియోగిస్తున్నట్టు, 0.95 ఉంటే మంచి స్థాయిలో ఉన్నట్టు, 0.90 ఉంటే ఆమోదయోగ్యంగా, అంతకంటే తక్కువగా ఉంటే విద్యుత్ వృథా అవుతున్నట్టుగా భావిస్తారు. అయితే ఒక్కో ఆక్వా చెరువు రెండు నుంచి పది ఎకరాలకు పైబడి విస్తరించి ఏరియేటర్లు నడిపేందుకు గట్లు వెంబడి కిలోమీటర్లు పొడవునా విద్యుత్ కేబుల్స్ ఉంటాయి. వాటికి జాయింట్లు, విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు తదితర కారణాలతో పీఎఫ్ చాలా వరకు 0.90 శాతంలోపు ఉంటుందని నిపుణులు అంటున్నారు. అధిక శాతం మంది రైతులకు పీఎఫ్ అంటే ఏమిటి?, ఎలా లెక్కిస్తారు, ఎందుకు తగ్గు తుంది, ఎలా మెరుగుపర్చుకోవాలనే విషయాలపై అవగాహన ఉండదంటున్నారు. గతంలో విద్యుత్ బిల్లుల్లో పీఎఫ్ విలువలు స్పష్టంగా ఉండేవని, ఇప్పుడు ఆ వివరాలు కూడా కనిపించక రైతులు తమ అర్హత కోల్పోతున్న విషయాన్ని కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. కూటమి ‘షాక్’ విద్యుత్ సబ్సిడీకి షరతులు రూ.1.50 విద్యుత్కు పవర్ ఫ్యాక్టర్ మెలిక విద్యుత్ నాణ్యత 0.90 నుంచి 0.95 మధ్య ఉంటేనే రాయితీ 169 జీఓ విడుదల చేసిన ప్రభుత్వం రాయితీకి ఎగనామం పెట్టేందుకేనని ఆక్వా రైతుల ఆవేదన జిల్లాలోని 1.34 లక్షల ఎకరాల్లో ఆక్వాసాగు రాయితీ విద్యుత్ కనెక్షన్లు 16,332 -
చిర్రిబుర్రులు
శురకవారం శ్రీ 12 శ్రీ జూన్ శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం జనసేన ఎమ్మె ల్యే చిర్రి బాలరాజు కాంట్రవర్సికీ కేరాఫ్ అడ్రెస్గా మారారు. పనుల్లో పర్సంటేజీలు, నామినేట్ పదవులకు ఫిక్సెడ్ రేట్లు, మద్యం దందా వీటన్నింటితో పాటు వరుస వివాదాలతో హాట్టాఫిక్గా మారా రు. తాజాగా అవినీతి ఆరోపణలపై ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే భార్యను పవన్కళ్యాణ్ వద్దకు తీసుకువెళ్లేందుకు ముఖ్య అనుచరుడే సహకరించాడని, అతడిని టార్గెట్ చేయడం గురువారం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ క్లాస్ పీకినా వైఖరిలో మార్పు లేకపోగా కాంట్రవర్సీ స్పీడ్ మరింత పెంచడంతో సమస్య మరింత తీవ్రమైంది. పోలవరం నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా చిర్రి బాలరాజు తొలిసారిగా గెలుపొందారు. నాటి నుంచి వరుస వివాదాలు, సోషల్ మీడియా వేదికగా నిత్యం అసమ్మతి సెగలు వెంటాడుతూనే ఉన్నాయి. పార్టీలో కష్టపడి పనిచేస్తే పట్టించుకోకుండా అన్యాయం చేశారని, అలాగే ఇసుక దందా చేస్తూ తమ కడుపుకొడుతున్నారని, గ్రావెల్ దందా పెద్ద ఎత్తున చేస్తున్నారని ఎమ్మెల్యే అయిన రెండు నెలల నుంచే ఫిర్యాదుల పరంపర నియోజకవర్గంలో ప్రారంభమైంది. ఇక ఈ ఏడాది ఎమ్మెల్యే అట్టహాసంగా పుట్టినరోజు చేసుకోవడం, నియోజకవర్గంలో ముఖ్య అధికారి మొదలు గ్రామస్థాయి ప్రభుత్వ ఉద్యోగి వరకు అందరి దగ్గర రూ.లక్షల్లో వసూలు చేసి వేడుక నిర్వహించడం మరింత వివాదంగా మారింది. ఈ వ్యవహారాలు ఇలా కొనసాగుతుంటే ఎమ్మెల్యే కుటుంబంలోనూ విబేధాలు పొడచూపాయి. వేరే మహిళతో సన్నిహితంగా ఉంటూ తనను ఇబ్బంది పెడుతున్నారంటూ ఎమ్మెల్యే సతీమణి నియోజకవర్గంలో ముఖ్యనేత కరాటం రాంబాబు మొదలు అందరి వద్ద వాపోయినా ప్రయోజనం చేకూరలేదు. ఈ క్రమంలో మూడుసార్లు జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ను కలవడానికి ప్రయత్నించి విఫలమైన ఆమె గత నెలలో కలిసి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసి కుటుంబంలో నెలకొన్న పరిస్థితిని వివరించి న్యాయం చేయమని ప్రాధేయపడింది. తదనంతరం దీనికి కొనసాగింపుగా ఎమ్మెల్యే గడిచిన రెండేళ్లల్లో భారీగా అవినీతి పాల్పడ్డారని ఏఏ పోస్టులకు ఎంతెంత వసూలు చేశారనే సమగ్ర వివరాలు బాధితుల ఫోన్ నంబర్లతో ఏడు పేజీల ఫిర్యాదును పార్టీకి అందజేశారు. ప్రధానంగా ఏఎంసీ చైర్మన్ పదవికి రూ. 31 లక్షలు, వైస్ చైర్మన్ పదవికి రూ.15 లక్షలు, పీఏసీఎస్ చైర్మన్ పదవికి ఒకరి వద్ద రూ.10 లక్షలు, మరొకరి వద్ద రూ.12 లక్షలు, ఇంకొకరి దగ్గర రూ.7 లక్షలు , అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు కోసం రూ. లక్ష, గూటాల–2 ఇసుక ర్యాంపునకు రూ.25 లక్ష లు, అండర్–16 క్రికెట్ టీమ్ కోసం రూ.5 లక్షలు వసూలు చేశారని బాధితుల ఫోన్ నంబర్లతో సహా చేసిన ఫిర్యాదులు సోషల్ మీడియాలో వైరల్గా మార్చారు. ఈ క్రమంలో గత నెలలో పవన్కళ్యాణ్ ఎమ్మెల్యేను పిలిపించి నాలుగు వారాల్లోపు అన్నీ పరిష్కరించుకోవాలని గట్టిగా క్లాస్ పీకారు. కుటుంబ వ్యవహారాన్ని కూడా చక్కదిద్దుకోవాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అరాచకాలకు అడ్డులేకుండా పోయిందని వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ పోలవరం నియోజకవర్గ అధ్యక్షుడు సున్నం సురేష్ ఆరోపించారు. ఆయన దగ్గర పనిచేస్తున్న వంశీపై దాడి చేసి జీలుగుమిల్లి పోలీస్స్టేషన్లో అక్రమ కేసు పెట్టారని ఇది సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. ఎమ్మెల్యే రెండో వివాహం చేసుకున్న విషయమై ఆయన మొ దటి భార్య డిప్యూటీ సీఎంను కలిసి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన కారుకు వంశీ డ్రైవర్ అని, అందుకే కక్షపూరితంగా వ్యవహరించి దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. కాంట్రవర్సీ ఎమ్మెల్యే వివాదాలకు కేరాఫ్ చిర్రి బాలరాజు సమాచారాన్ని లీక్ చేస్తున్నాడని ముఖ్య అనుచరుడిపై దౌర్జన్యం ఇదేంటని ప్రశ్నిస్తే ఎమ్మెల్యేపై దాడికి యత్నించాడని రివర్స్లో హడావుడి లెక్కకు మించిన అవినీతి ఆరోపణలతో ఎమ్మెల్యే సతమతం ఎమ్మెల్యే తీరుపై పవన్కల్యాణ్కు సతీమణి ఫిర్యాదు ప్రతి పదవికీ పేమెంట్ వసూలు చేశారనే ఆరోపణలు బంధువు, ముఖ్య అనుచరుడు పూనం వంశీ తన సమాచారాన్ని మొత్తం బయటకు చేరవేస్తున్నాడని, తన భార్యను పవన్కళ్యాణ్ వద్దకు తీసుకువెళ్లాడనే అనుమానంతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దూరం పెట్టారు. ఇదేమిటని వంశీ ప్రశ్నించిన క్రమంలో అతడిని కార్యాలయం నుంచి గెంటివేయించి జీలుగుమిల్లి పోలీసులకు అప్పగించారు. అంతకుముందు వంశీ సోదరి నాగేశ్వరి కూడా ఎమ్మెల్యేను ఇదేంటని ప్రశ్నిస్తే ఆమెను కూడా అనుచరులతో బయటకు పంపివేయించారు. గురువారం ఉదయం నుంచి జీలుగుమిల్లి పోలీసుల అదుపులో వంశీ ఉన్నాడు. వంశీ భార్య మౌనిక విషయం తెలిసి పోలీస్స్టేషన్కు వెళ్లి ప్రశ్నిస్తే ఎస్సై తనకేమీ తెలియదని చెప్పడంతో.. తన భర్తను చూపించకపోతే చనిపోతానని ఆమె హెచ్చరించింది. ఏ తప్పు చేయని తన భర్త వంశీ, శంకర్బాషాను ఎమ్మెల్యేనే ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించింది. -
బీసీ కమిషన్కు వినతుల వెల్లువ
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ గురువారం జిల్లాలో పర్యటించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ సభ్యులు కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలిసి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏకీకృత కుటుంబ సర్వే సమగ్రంగా నిర్వహించి కచ్చిత సమాచారం సేకరించాలని చైర్మన్ సూచించారు. ముందుగా ఆయన జిల్లా బీసీ సంక్షేమ వర్గాల నా యకులు, ప్రతినిధుల నుంచి అర్జీలు స్వీకరించారు. జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, రాష్ట్ర వడ్డీల సంఘ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి తదితరుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. జిల్లాలో ఏకీకృత కుటుంబ సర్వే 97.32 శాతం పూర్తిచేశామని, మరింత స్పష్టత కోసం కొన్ని కుటుంబాల వివరాలను రీ సర్వే చేస్తున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి చె ప్పారు. కమిషన్ కార్యదర్శి చంద్రశేఖరరాజు, ఇన్చార్జి డీఆర్వో దేవకీదేవి, జెడ్పీ సీఈఓ జగదాంబ, డీ పీఓ మల్లికార్జునరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం. ముక్కంటి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ విశ్వమోహన్రెడ్డి, కమిషనర్ ఎ.భానుప్రతాప్ పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● జనాభా దామాషా ప్రకారం బీసీలకు కూడా 50 రిజర్వేషన్ అన్ని రంగాల్లో కల్పించాలని ఏపీ బీసీ కులాల జేఏసీ ప్రతినిధులు కోరారు. ● బీసీ గ్రూపులోని గౌడ కులానికి స్థానిక సంస్థల్లో సబ్ కొత్తగా కల్పించాలని, లేదా బీసీ–బీ లోపల జనాభా ప్రాతిపదికన రొటేషన్ స్పష్టంగా అమలు చేయాలని ఏలూరు నగర గౌడ సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు. ● ట్రిపుల్ టెస్ట్ ప్రక్రియ కేవలం విధాన పరమైన ప్రక్రియగా కాకుండా, బీసీల సామాజిక న్యాయం, రాజకీయ సాధికారతను బలోపేతం చేసేదిగా ఉండాలని జెడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ అభిప్రాయపడ్డారు. ● పోటీ చేయడానికి అవకాశం లేని చోట మండలపరిషత్, జెడ్పీ, మున్సిపాలిటీల్లో కో–ఆప్షన్ సభ్యులుగా విశ్వ బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలని, విశ్వబ్రాహ్మణులను బీసీ–బీ నుంచి బీసీ–ఏకి మార్చాలని విశ్వబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు కోరారు. ● విద్యా, ఉద్యోగ రంగాల్లో మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీ వర్గీకరణ బీసీ–ఏ నుంచి బీసీ–ఈ వరకు అమలు చేయాలని ఏపీ నాయీ బ్రాహ్మణ వెల్ఫేర్, డెవలప్మెంట్ కా ర్పొరేషన్ డైరెక్టర్ లంకా రత్నారావు కోరారు. ● జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేష న్లు, బీ సీ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధుల కోరారు. -
క్షేత్రంలో యోగాంధ్ర ఇక్కట్లు
ఆలస్యంగా కార్యక్రమం ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గుర య్యారు. అధికారుల అలసత్వమే కారణమని పలువురు ధ్వజమెత్తారు. వివరాల్లోకి వెళితే.. శ్రీవారి ఆలయ ఆవరణలోని నూతన అనివెట్టి మండపంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఉదయం 6.30 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ ఆలస్యంగా రావడంతో 9 గంటలకు ప్రారంభమైంది. గంట పాటు కా ర్యక్రమం కొనసాగింది. దీంతో యోగా అ భ్యాసకులు అప్పటివరకు అల్పాహారం తినకుండా వేచి ఉండాల్సి వచ్చింది. పిల్లలు, షు గర్, బీపీ తదితర వ్యాధులతో బాధపడుతున్న పలువురు అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంతో ఏ ర్పాటు చేసిన కార్యక్రమాలకు అధికారులే సకాలంలో హాజరుకాకపోతే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు అ సెంబ్లీ నియోజకవర్గానికి చెందిన దొంగ వెంకట రామాంజనేయులకు పార్టీ రాష్ట్ర న్యాయ విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు టౌన్: విద్యుదాఘాతానికి గురై నవ వధువు దుర్మరణం పా లైన ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. త్రీ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు శాంతినగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మీ ఉష (21)కు వెంకటేష్తో గతనెల 8న వివాహమైంది. ఆమె సత్రంపాడు రోడ్డులో భర్తతో కలిసి కూల్డ్రింక్స్ షాపు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి ఆమె షాపులో ఉండగా భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో ఆమె విద్యుత్ షాక్తో తీవ్ర అస్వస్థతకు గురైంది. స్థానికులు ఆమెను సర్వజన ఆస్పత్రికి తీసుకువెళ్లగా వై ద్యులు పరీక్షించి ఆమె అప్పటికే మృతిచెందిన ట్టు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కాగా మృతురాలి ఉషది ప్రేమ వివాహం. -
రెండేళ్లు.. అతీగతీ లేని హామీలు
సాక్షి ప్రతినిధి,ఏలూరు: ఆడబిడ్డ నిధి అడ్రస్ లేదు.. అర్హులందరికీ తల్లికి వందనం అందలేదు.. జిల్లా దశదిశ మార్చే అభివృద్ధి పథకాల హామీల అమలు అతీగతీ లేదు.. మామిడి నుంచి వరి వరకూ అన్నదాతలకు నిత్య సంక్షోభమే.. లెక్కకు మించి హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత అన్నింటినీ విస్మరించిన కూటమి ప్రభుత్వ పాలనకు రెండేళ్లు నిండాయి. అక్రమ కేసులు, వేధింపుల పర్వం, ప్రతిఘటిస్తే వ్యక్తిగత ఆస్తుల ధ్వంసరచన.. ఇంతకుమించి జిల్లాలో జరిగిందేమీ లేదు. పచ్చనేతల దందా.. ఊరూరా బెల్టుషాపులతో యథేచ్ఛగా మద్యం విక్రయాలకు తెరదీశారు. చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనకు వ్యతిరేకంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా.. కూటమి మోసపూరిత హామీలతో జిల్లా ప్రజలు నష్టపోయిన వైనాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసనలు, సదస్సులు, రౌండ్టేబుల్ సమావేశాల ద్వా రా ప్రజలకు వివరించారు. దీనిలో భాగంగా ఏ లూరు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 14 ని యోజకవర్గాల్లో పార్టీ సమస్వయకర్తల నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ రెండేళ్లలో ఉమ్మడి జిల్లాలో కనీసం రూ.100 కోట్ల అభివృద్ధి పనులు కూడా జరగకపోవడం గమనార్హం. ఉమ్మడి పశ్చిమలో ఆక్వా, వరి, మామిడి, కోకో రైతాంగం తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా 52 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న మామిడి టన్ను రూ.లక్ష పైనే రావాల్సిన ధర రూ.10 వేలకు పరిమితమైనా సర్కారు పట్టించుకోలేదు. ఇక జిల్లాలో 45 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కోకో పంట వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అత్యధికంగా కేజీ రూ.1,040 పలకగా నేడు రూ.300లకు పరిమితమైంది. ఇక వరి రైతులు పూర్తిస్థాయిలో ప్రకృతి విపత్తులు, గిట్టుబాటు ధర కేంద్రం ప్రకటించినా దళారుల చేతికి చిక్కి భారీగా నష్టపోవడం జిల్లాలో నిత్యకృత్యంగా మారింది. అలాగే ఉమ్మడి జిల్లాలో 2.52 లక్షల ఎకరాల్లో విస్తరించిన ఆక్వా సాగు క్రాప్ హాలిడే దిశగా పయనిస్తుంది. ఇంటికో ఉద్యోగం, లేకుంటే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి హామీ కూడా అటకెక్కింది. జిల్లాలో 5,47,790 కుటుంబాలకు నెలకు రూ.3 వేల చొప్పున రూ.164 కోట్లు సర్కారు బకాయి పడింది. రెండేళ్లకు రూ.3,936 కోట్లు నిరుద్యోగభృతిని సర్కారు ఎగ్గొట్టింది. అలాగే పేదరిక నిర్మూలన పీ–4 అంటూ హడావుడి చేస్తున్నారు. పేద కుటుంబాల స్థితిగతులు క్షేత్రస్థాయిలో ఏ మాత్రం మారకపోయినా అధికారుల రికార్డుల్లో మాత్రం 71,910 బంగారు కుటుంబాలను గుర్తించి 70 శాతానికిపైగా దత్తత కార్యక్రమం పూర్తయిందని చెప్పడం విశేషం. 50 ఏళ్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేలు పెన్షన్ ఇస్తామని ప్రకటించి కొత్త పెన్షన్ ఇవ్వకపోగా వేల సంఖ్యలో పెన్షన్లను రకరకాల సాకులతో తొలగించారు. 19 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు ప్రతినెలా రూ.1,500 ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎన్నికల సమయంలో నాయకులు ఇంటింటికీ తిరిగి హామీల బాండ్లు కూడా ఇచ్చారు. ఈ లెక్కన జిల్లాలో 6,71,033 మంది మహిళలకు రూ.120 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. సుమారు రెండేళ్లలో రూ.2,880 కోట్ల మేర మహిళలు మోస పోయారు. అలాగే తల్లికి వందనం కూడా పథకాన్ని కూడా నామమాత్రంగానే ఇస్తున్నారు. విద్యాశాఖ రికార్డుల ప్రకారం జిల్లాలో 2,72,135 మంది విద్యార్థులుండగా 2,38,434 మందికే అమలు చేసి 33,701 మంది విద్యార్థులకు హ్యాండిచ్చారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం 2026 మార్చికల్లా పూర్తి చేస్తామని, 2025 బడ్జెట్లో ప్రకటించి రూ.1,780 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఒక్క రూపాయి ఖర్చు చేయకపోగా పథకాన్ని పూర్తిగా పడకేసేలా చేశారు. ఇక ఏలూరులో ఉన్న శనివారపుపేట కాజ్వే తమ్మిలేరు వరదలకు ఏటా మునుగుతున్న క్రమంలో గతేడాది నగర పర్యటనకు వచ్చిన సీఎం రూ. 90 కోట్లతో కాజ్వే స్థానంలో వంతెన నిర్మిస్తామని వెంటనే అనుమతులు ఇస్తున్నామని ప్రకటించారు. కట్ చేస్తే.. దాని ఊసేలేదు. ఇక కోకో సిటీ అని, ఆక్వా హబ్ అని ఇలా పలు హామీలిచ్చి మొత్తాన్ని మంగళం పాడేశారు. ఆడబిడ్డ నిధి అందలేదు నిరుద్యోగ భృతి ఊసులేదు జిల్లాలో జాడలేని అభివృద్ధి కూటమి రెండేళ్ల పాలనలో దౌర్జన్యకాండ నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసనలు -
ధ్వంసమైన క్యూలైన్ల పైకప్పు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో నూతన అనివెట్టి మండపం పక్కన నిర్మించిన క్యూలైన్లలోని పైకప్పు ఈదురుగాలులకు ధ్వంసమైంది. మరమ్మతులు చేపట్టారు. మొత్తంగా 2 కిలోల 50 గ్రాముల గోల్మాల్ జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో గోల్డ్ మాయం సంఘటనకు సంబంధించి ఐదో రోజు కూడా బంగారం పరిశీలన జరిగింది. ఉదయం నుంచే ఖాతాదారులు బ్యాంకుల వద్దకు చేరుకుని తమ బంగారు ఆభరణాల కోసం ఎదురుచూశారు. బ్యాంకు అధికారులు గురువారం బంగారు రు ణాలకు సంబంధించి బంగారం ఉంచిన ప్యాకెట్లను పరిశీలించగా, వాటిలో 14 ప్యాకెట్లకు సంబంధించి 324 గ్రాములు బంగారం లెక్కల్లో తేడా కనిపించింది. గత నాలుగు రోజులుగా చే పట్టిన బంగారం తనిఖీల్లో 1,726 గ్రాముల బంగారం మాయం కాగా, తాజాగా మరో 324 గ్రా ముల బంగారం మాయమైనట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు జరిపిన తనిఖీల్లో మొత్తం 2 కిలోల 50 గ్రాముల బంగారం మాయమైంది. ఇదిలా ఉండగా పరిశీలనలో ఆయా బంగారం ప్యాకెట్లలో రోల్డ్గోల్డ్, ఇత్తడి, చాక్పీసులు, స్టాప్లర్ పిన్ల బాక్సులు వంటివి బంగారానికి బదులుగా ఉంచినట్టు గుర్తించారు. దీంతో ఖాతాదారులతో పాటు ప్రజలు సైతం బ్యాంకు తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అప్రయిజర్, బ్యాంకు సిబ్బంది పాత్ర లేకుండా ఇటువంటి గోల్మాల్ జరగదని, వెంటనే ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేసి దోషులను శిక్షించడంతో పాటు ఖాతాదారుల బంగారం వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
గంజాయి కేసులో నిందితుడి అరెస్టు
తణుకు అర్బన్: గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడిని తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు అరెస్టు చేశారు. గతేడాది అక్టోబర్లో తణుకు ఉండ్రాజవరం రోడ్డులో శ్శశాన వాటిక ప్రాంతంలో ఐదు కిలోల గంజా యి రవాణా చేస్తూ పట్టుబడిన కేసులో ప్రధాన నిందితుడు తణుకు మండలం మండపాకకి చెందిన పోలవరపు కుమార శివను బుధవారం అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ సత్తి మణికంఠరెడ్డి తెలిపారు. ఒడిసాలోని మల్కాన్గిరి నుంచి గంజాయిని తీసుకువచ్చి తణుకు ప్రాంతంలో విక్రయిస్తున్నట్టు తమ విచారణలో తేలిందన్నారు. ఇటీవల ద్విచక్ర వాహనాల చోరీలకు అలవాటుపడి కృష్ణలంక, రాజమండ్రి, ఉంగుటూరు, మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో వాహనాలు చోరీ చేశాడని చెప్పారు. గంజాయి విక్రయాలపై సమాచారం తెలిస్తే 9490874538 తమకు తెలియజేయాలని ప్రజలను కోరారు. ఎకై ్సజ్ శాఖ ఎస్సైలు బి.లక్ష్మి, ఆర్.మధుబాబు పాల్గొన్నారు. -
వరిసాగులో విత్తనాల ఎంపికే కీలకం
● నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు ● తెగుళ్లు దూరం, అదుపులో సాగు ఖర్చులు ముసునూరు: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కాస్త ముందుగా ప్రారంభం కానున్న దశలో వరి పంట విత్తన ఎంపికలో జాగ్రత్త వహించాలని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు. నకిలీ విత్తనాలను ఎంపిక చేసుకుంటే, పంట దిగు బడులు రాక రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ గుర్తింపు ఉన్న దుకాణాల్లో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. రైతుల నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని విత్తన దుకాణాదారులు నకిలీ విత్తనాలను విక్రయించే అవకాశం ఉంది. వీటిని సాగుచేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు. విత్తనాల ఎంపికలో జాగ్రత్త వహించాలని, నాణ్యమైన విత్తనాలను మాత్రమే విత్తుకోవాలని సూచిస్తున్నారు. రైతులు విత్తనాల ఎంపిక, కొనుగోలు విషయంలో జాగ్రత్తపడాలని వివరిస్తున్నారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని పేర్కొంటున్నారు. నాసిరకం, నకిలీ విత్తనాలు విక్రయించే షాపులపై అధికారులు కఠిన చర్యలు చేపట్టి, కేసులు నమోదు చేయాలి. విత్తనాల ఎంపిక ఇలా ● విత్తనాల ఎంపికలో రైతులు అప్రమత్తతతో వ్యవహరించాలి. నాణ్యత ఉన్న విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. ● విత్తనాలన్నీ ఒకే పరిమాణంలో ఉండే విధంగా ఎంపిక చేసుకుంటే పంట పెరుగుదల సమంగా ఉండి ఒకేసారి కోతకు వస్తుంది. ● తెగులు సోకని విత్తనాలను ఎంపిక చేసుకుంటే ఆరోగ్యకరమైన పంట పెరుగుదలకు దోహదపడుతుంది. పంట దిగుబడి పెరుగుతుంది. ● పురుగు పట్టని విత్తనాలను ఎంపిక చేసుకుంటే నాణ్యమైన, ఆరోగ్యకరమైన పంట చేతికి అందుతుంది. ● భౌతిక స్వచ్ఛత ఉన్న విత్తనాలను ఎంపిక చేసుకుంటే స్వచ్ఛమైన విత్తనాల స్థాయి తెలుస్తుంది. ● పంట ఎదుగుదల, దిగుబడిలో పెరుగుదల ఉంటుంది. జన్యు స్వచ్ఛత ఉన్న విత్తనాలను ఎంపిక చేసుకుంటే పోషకాల లోపం నివారణలో మంచి పంట లభిస్తుంది. ● ముందుగా శాంపిల్స్ ను తీసుకుని, వాటిని నాన బెట్టడం ద్వారా మొలకెత్తే స్థాయిని అవగాహన చేసుకోవాలి. రైతులు విత్తనాలు విత్తుకునే ముందే తగిన జాగ్రత్తతో నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి. ప్రభుత్వ అనుమతి ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన ప్రతి దానికి బిల్లు తీసుకోవాలి. – ఆలూరు చాముండేశ్వరి, మండల వ్యవసాయ శాఖాధికారి, ముసునూరు -
యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు
● చెరుకువాడలో అక్రమార్కుల ఇష్టారాజ్యం ● అధికారుల ఆదేశాలు బేఖాతరు ఉండి : శ్రీఅంతా మా ఇష్టం.. మమ్మల్ని ఆపేదెవ్వరు?్ఙ అన్నట్లుగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రింబవళ్లు అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతోంది. పెద్ద ఎత్తున లారీలు, ట్రాక్టర్లు, బుల్డోజర్ల సహాయంతో ప్రభుత్వ భూములు, పుంతలు, చివరకు వరి పొలాలను సైతం తవ్వేస్తూ మట్టిని ప్రైవేట్ లేఅవుట్లకు, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ధ్వంసమవుతున్న రహదారులు భారీ వాహనాలతో నిరంతరం మట్టిని రవాణా చేస్తుండటంతో గ్రామీణ రోడ్లు, పుంతలు, కాలువ గట్లతో పాటు చివరకు 165 జాతీయ రహదారి కూడా పూర్తిగా అధ్వానంగా తయారైంది. తమ రవాణా సౌకర్యం కోసం కాలువలు, పంట బోదెలు, డ్రెయిన్లపై అక్రమంగా వంతెనలు నిర్మిస్తున్నా స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ రవాణాపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదేశాలు ఇచ్చినా ఆగని తవ్వకాలు చెరుకువాడలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం ఉదయం వీఆర్వో తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. ఎటువంటి అనుమతులు లేనందున తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. అయితే, అధికారులు వెళ్లిన కాసేపటికే మాఫియా మళ్లీ తవ్వకాలను ప్రారంభించింది. అధికారుల ఆదేశాలను సైతం లెక్కచేయకుండా మట్టి మాఫియా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. తహసీల్దార్ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం చెరుకువాడలో మట్టి తవ్వకాలను నిలిపివేయాలని ఆదేశించాను. అయితే కార్యాలయంలో సమావేశం ఉండడంతో నేను వెళ్లి వచ్చేసరికి మళ్లీ తవ్వకాలు ప్రారంభించారు. దీనిపై సమాచారం అందడంతో సాయంత్రం మళ్లీ క్షేత్రస్థాయికి వెళ్లి లారీలను, తవ్వకాలను నిలిపివేయించాను. ఇకపై ఇక్కడ అక్రమ తవ్వకాలు జరగకుండా అన్ని రకాల కఠిన చర్యలు తీసుకుంటాం. – గొల్లమ్మ, వీఆర్వో, చెరుకువాడ -
చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
ఏలూరు టౌన్ : ఏలూరు కండ్రికగూడెం సమీపంలోని దేవీబార్ వద్ద మందుతాగి బయటకు వచ్చిన ఒక యువకుడిని మోటారు సైకిల్పై తీసుకువెళ్లి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్ళి చంపుతామని బెదిరించి బంగారు ఆభరణాలు కాజేసిన ఇద్దరు నిందితులను ఏలూరు టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ ఉన్నారు. వివరాలు వెల్లడించారు. ఏలూరు శాంతినగర్ 3వ లైన్ ప్రాంతానికి చెందిన పర్వతనేని సాయి నవీన్ కండ్రికగూడెం సమీపంలోని దేవీబార్కు ఈనెల 7న రాత్రి 7 గంటలకు మద్యం తాగేందుకు వెళ్ళాడు. అనంతరం రాత్రి 10గంటలకు దేవీబార్ నుంచి బయటకు వచ్చి రోడ్డుపై నిలబడగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్పై వచ్చి ఇంటివద్ద దించుతామని తీసుకువెళ్ళారు. కండ్రికగూడెం సెంటర్ దాటిన అనంతరం మోటారు సైకిల్పై ఉన్న వ్యక్తి నవీన్ను అరవకుండా నోరునొక్కి చొదిమెళ్ళ కోల్ల ఫారం వద్దకు తీసుకువెళ్లారు. ఆయిల్ పామ్ తీసుకువెళ్లి మోటారు సైకిల్ నుంచి దించి ఒక వ్యక్తి చేతులు పట్టుకోగా మరోవ్యక్తి గొంతు నులిమి చంపుతానని బెదిరించాడు. నవీన్ వద్ద నుంచి బంగారు ఆభరణాలు, సెల్ఫోన్ కాజేసి ఉడాయించారు. బాధితుడు నవీన్ ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్కు వచ్చి ఎస్సై రామకృష్ణకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో పెదవేగి మండలం వంగూరు గ్రామానికి చెందిన కొట్టే రాకేష్, కొండవల్లి అభిలాష్ అనే ఇద్దరిని ఈనెల 10న గుర్తించి కండ్రికగూడెం సెంటర్లో అరెస్ట్ చేశారు. ఇద్దరి వద్ద నుంచి బంగారు చైన్, బంగారు బ్రాస్లెట్, రెండు బంగారు ఉంగరాలు, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన సీఐ అశోక్కుమార్, ఎస్సై రామకృష్ణ, ఏఎస్ఐ బంగారు ఏసు, కానిస్టేబుల్ ఇషాక్, శేఖర్ ఎస్పీ అభినందించారు. -
పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి
కొయ్యలగూడెం : వర్జీనియా పొగాకు కొనుగోలుకు పొగాకు బోర్డు నిధుల నుంచి రూ.1000 కోట్లు కేటాయించి, రైతులు వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేయాలని, కిలో వర్జీనియా పొగాకుకు సరాసరి ధర రూ.380 ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని త్రినాథపురంలో వర్జీనియా పొగాకు రైతుల సమావేశం నిర్వహించారు. పొగాకు రైతుల సమస్యలపై చర్చించి గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేపట్టాలని తీర్మానించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కంపెనీలు, బోర్డు అధికారులకు కుమ్మకై ్క పొగాకు రైతులకు పొగ పెడుతున్నారని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. ఎకరాకు మూడు లక్షల 70 వేల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారని, పెట్టుబడికి తెచ్చిన అప్పులు తీర్చే పరిస్థితి లేదన్నారు. కొనుగోళ్లు మందకొడిగా జరిగితే రైతుల నష్టాలు మరింత పెరుగుతాయన్నారు. పొగాకు బోర్డు ముట్టడి కార్యక్రమం సందర్భంగా బోర్డు చైర్మన్ ఇచ్చిన హామీ ప్రకారం కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు శుక్లబోయిన రాంబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకుడు ఆత్కూరి వీర్రాజు, రైతులు యాగంటి కృష్ణ, తిరుమలశెట్టి శ్రీనివాస్, బసిరెడ్డి కేదారేశ్వరరావు పాల్గొన్నారు. -
వినూత్న కథతో ‘కుంభ’ చిత్రం
తణుకు అర్బన్ : తెలుగు తెరపై వినూత్న కథతో కుంభ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లు కథానాయకుడు, దర్శకుడు జై సాయి వెంకట్ అన్నారు. తణుకు కరుటూరి నగర్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కుంభ యూనిట్ ఆధ్వర్యంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. తణుకు, పాలకొల్లు, నర్సాపురం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్న ఈ కుంభ సినిమా సస్పెన్స్ హర్రర్, పూర్తి కామెడీతో వినోద భరితంగా చిత్రీకరణ జరుగుతుందని స్పష్టం చేశారు. అధికశాతం షూటింగ్ తణుకు పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ నిర్వహించామని, వచ్చే ఏడాది చిత్రం విడుదల చేసే విధంగా వేగంగా షూటింగ్ ప్రక్రియ జరుపుతున్నామని వివరించారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలపై హింసకు గురైన బాధితులకు తక్షణ, సమగ్ర సహాయం అందించేందుకు వన్ స్టాప్ సెంటర్కు ప్రత్యేక వాహనాన్ని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి బుధవారం కలెక్టరేట్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మిషన్ శక్తి – సంబల్ పథకం మార్గదర్శకాల మేరకు ఈ వాహనం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ పి.శారద, నోడల్ అధికారి, డీఎంసీ ఇ.తులసి, వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ సీహెచ్. నిర్మల తదితరులు పాల్గొన్నారు. 13 మందికి గాయాలు పాలకొల్లు సెంట్రల్: వివాహ వేడుకకు వెళ్తుండగా పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం కరుగోరుమిల్లు గ్రామం నుంచిబుధవారం పెనుమదంలో జరిగే వివాహ వేడుకకు కొందరు వ్యాన్లో బయలుదేరారు. మార్గమధ్యంలో వద్దిపర్రు వద్దకు వచ్చేసరికి వ్యాన్ అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ఉన్న 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి చేయి విరగడంతో మెరుగైన వైద్యం కోసం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధురి తెలిపారు. మిగిలిన 12 మందికి స్వల్ప గాయాలు కావడంతో పాలకొల్లులోనే ప్రాథమిక చికిత్స అందించినట్లు ఆమె పేర్కొన్నారు. దెందులూరు: ఏలూరు రూరల్ మండలం ఆటోనగర్ వద్ద మంగళవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఏలూరు రోడ్డు పోలీస్ స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు వివరించారు. చాట్రాయి: నాటుసారా తయారు చేసిన పాత నేరస్తులను బైండోవరు చేసినట్లు నూజివీడు ఎకై ్సజ్ సీస్తానరావు తెలిపారు.బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాటు సారా తయారీ, అమ్మకందారులపై నెల క్రితం దాడి చేసినప్పుడు నేర స్థలం నుంచి పారిపోయిన వారిని తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండోవరు చేసినట్లు ఆయన చెప్పారు. జంగారెడ్డిగూడెం: బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం మాయంపై సమగ్ర విచారణ చేసి బ్యాంకు మేనేజర్ను సస్పెండ్ చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ కుటుంబ అవసరాల నిమిత్తం బంగారం కుదువ పెట్టి బ్యాంక్ ఆఫ్ బరోడాలో రుణం తీసుకుంటే, బంగారాన్ని మాయం చేసిన ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. బ్యాంకు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని ఖాతాదారులకు ధైర్యం భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. -
పెంచిన ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలి
ద్వారకాతిరుమల: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన ఎరువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.బలరాం డిమాండ్ చేశారు. మండలంలోని పంగిడిగూడెం గ్రామంలో బుధవారం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు అధ్యక్షతన నిర్వహించారు. రైతుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలతో ఎరువులు, పెట్రోల్, డీజిల్, ఖర్చులు పెరిగి రైతులు దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘం రాష్ట్ర మహాసభలు జూలై 3,4,5 తేదీల్లో ఏలూరులో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, తూంపాటి రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
తప్పిపోయిన చిన్నారుల అప్పగింత
గణపవరం : మండలంలోని పిప్పరలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 8, 11 సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు చిన్నారు లను గుర్తించిన స్థానికులు గణపవరం పోలీసులకు సమాచా రం ఇచ్చారు. దీంతో ఎస్సై మణికుమార్ సిబ్బందితో పిప్పర వెళ్లి ఇద్దరు బాలురను గుర్తించి వారి వివరాలు అడగ్గా ఒకరు తనపేరు మరోలు సాయి అని, తండ్రి పేరు శంకర్, బందరు సమీపంలో గోకవరం గ్రామం అని చెప్పగా, మరో బాలుడు తనపేరు నాగరాజు అని, తండ్రి ఏడుకొండలు అని అదే గ్రామం అని చెప్పగా వారిని గణపవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులను పిలిపించి వారు సమక్షంలో ఇద్దరు బాలురను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్ఐ మణికుమార్ తెలిపారు. -
దుప్పి మాంసం పేరుతో పంది మాంసం విక్రయం
జంగారెడ్డిగూడెం: చుక్కల దుప్పుల మాంసం అంటూ పంది మాంసాన్ని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం అటవీశాఖ రేంజ్ అధికారి వి.దుర్గాకుమర్బాబు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం శివారు మార్కండేయపురం వద్ద సీమ పంది మాంసం విక్రయదారుడైన వల్లపు రాము ఇంటిని తనిఖీ చేయగా, అతని వద్ద రెండు చుక్కల దుప్పుల చర్మాలు, వాటి తలలు, కాళ్లు గుర్తించామన్నారు. వాటిని పశుసంవర్ధక శాఖ ఏడీ పీఎన్వీ శేఖర్ దొరతో పరీక్షలు నిర్వహించి దుప్పి అవశేషాలుగా నిర్ధారించినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న అవశేషాలు సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితుడు వల్లపు రామును కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. కాగా రామును విచారించగా నాలుగు నెలల క్రితం జంగారెడ్డిగూడెంకు చెందిన దేవరకొండ ఏసు అనే వ్యక్తి చుక్కల దుప్పి చర్మాన్ని, తలలను, కాళ్లను తీసుకువచ్చి తనకు ఇచ్చినట్లు అధికారులకు తెలిపాడు. ఆ తల, చర్మం, కాళ్లను చూపించి, పంది మాంసాన్ని చుక్కల దుప్పి మాంసంగా మాంసాహార ప్రియులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపాడన్నారు. అలాగే ఈ అవశేషాలను నిందితుడు రాము ఫ్రిడ్జ్లో భద్రపరిచినట్లు తెలిపారు. ఈ దాడుల్లో డిప్యూటీ రేంజ్ అధికారి పి.ధర్మారావు, బీట్ అధికారి పోలుపర్తి నాగవేణు, వీఆర్ఓ బాజీ, సిబ్బంది పాల్గొన్నారు. చుక్కల దుప్పి చర్మం, తలలు కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్ -
వాల్టా చట్టానికి తూట్లు
పాలకోడేరు: మండలంలోని శృంగవృక్షం గ్రామ శివారు పెర్కిపాలెం వెళ్లే రహదారి పక్కన పచ్చని చెట్లపై మంగళవారం అమానుషంగా గొడ్డలి వేటు పడింది. వాల్టా చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతులు పొందాల్సి ఉండగా, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి సుమారు 100 చెట్లను నరికివేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. వ్యవసాయ భూమి మార్పిడి కోసమేనా? మంగళవారం ఉదయం పొలం గట్లపై ఉన్న దాదాపు 30కి పైగా కొబ్బరి, తాటి మానులను మొదలు వరకు నరికి దొంతరలుగా వేశారు. వీటితో పాటు అనేక తాటి చెట్ల మట్టలను కూడా విచక్షణారహితంగా నరికి కుప్పలుగా పడేశారు. మొత్తంగా వందకు పైగా చెట్లను నేలకూల్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో జేసీబీ కూడా ఉండటంతో, సదరు వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ లేదా ఇతర వాణిజ్య అవసరాలకు మార్చేందుకే ఈ చర్యకు పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చట్టం ఇలా ఆంధ్రప్రదేశ్ నీటి, భూమి, చెట్ల (వాల్టా) చట్టం ప్రకారం.. కొబ్బరి, తాటి వంటి వృక్షాలను నరకాలంటే తహసీల్దార్, ఉద్యానవన శాఖల నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలి. నిబంధనలు అతి క్రమిస్తే జరిమానాతో పాటు చట్టపరమైన కఠిన చర్య లు ఉంటాయి. అయితే ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా చెట్లను కూల్చివేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా అధికారులు చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతులు లేకుండా తాటిచెట్ల నరికివేత -
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి
తణుకు అర్బన్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ, వామపక్షాల రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం తణుకు నరేంద్ర సెంటర్లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ పెట్రల్, డీజిల్ ధరల పెంపుతో సరుకు రవాణా ఛార్జీలు పెరిగి అన్ని నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్నంటి ప్రజల జీవనం దుర్భంరంగా మారుతుందన్నారు. దేశంలోని ప్రస్తుత దుస్థితికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనా వైఫల్యమే కారణమని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, గార రంగారావు, జి.గోపి, బండి సత్యనారాయణ, నాగరత్నం తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం మాయం కావడంతో ఆందోళనలో ఉన్న ఖాతాదారులకు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. జంగారెడ్డిగూడెంలో మంగళవారం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు వద్ద ఖాతాదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు బ్యాంకు వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుల తెలిపిన వివరాలు ప్రకారం ఇప్పటికే రూ.కోటి విలువైన బంగారం మాయమైనట్లు తెలుస్తోందన్నారు. దీనిపై బ్యాంకు అధికారులు సమగ్ర విచారణ చేసి ఖాతాదారులకు న్యాయం చేయాలన్నారు. దీనిపై బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ఎం, పోలీస్ అధికారులతో మాట్లాడానని జెట్టి తెలిపారు. ఆర్ఎం స్పందిస్తూ ప్రస్తుతం బ్యాంకులో బంగారం రుణాలపై విచారణ జరుగుతోందని, ప్రతి ఖాతాదారుడికి న్యాయం చేస్తామని, ఇది పూర్తిగా బ్యాంకు బాధ్యత అని తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, వీరవల్లి సోమేశ్వరరావు, ఉడా నాగేంద్ర కుమార్, గగ్గల కిరణ్ కుమార్, జుత్తిగ ప్రసాద్, పిల్లి రామకృష్ణ, కడిమి కిరణ్ పాల్గొన్నారు. -
ప్రయాణ ఇక్కట్లు ఇంకెనాళ్లు?
ఉండి: ఉండి కాలువలో జాతీయ రహదారి రక్షణ కోసం చేపట్టిన రివిట్మెంట్ వాల్ (రక్షణ గోడ) నిర్మాణ పనుల వల్ల ప్రయాణికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెల ద్వితీయార్ధంలో ప్రారంభమైన ఈ పనుల కోసం జాతీయ రహదారిని, పంట కాలువను అధికారులు మూసివేశారు. పనులు పూర్తిస్థాయిలో ముగిసి, రాకపోకలు యథావిధిగా సాగడానికి మరో నెల రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఉండి మండల శివారు, చెరుకువాడ సరిహద్దుల నుంచి ఆకివీడు మండలం అజ్జమూరు పరిధి వరకు ఈ రక్షణ గోడ నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం ఈ పనులు ప్రాథమిక దశ దాటి కొంత ముందుకు సాగినప్పటికీ, క్షేత్రస్థాయి సమస్యల వల్ల పనుల్లో తీవ్ర ఆలస్యం జరుగుతుంది. మట్టి ఊటతో పనులకు ఆటంకం ఒకవైపు పంట కాలువ, మరోవైపు ఆక్వా చెరువులు ఉండటంతో కాలువ తవ్విన ప్రాంతంలో చెరువుల నుంచి నీరు ఊరుతోంది. దీనికి తోడు కాలువ గట్టే చెరువు గట్టుగా ఉండటం, అధికారులు దీనిపై ముందస్తు శ్రద్ధ తీసుకోకపోవడంతో గట్టు జారి మట్టి తిరిగి కాలువలోకి వచ్చేస్తోంది. ఈ మట్టిని పదే పదే తొలగించాల్సి రావడం వల్లే రక్షణ గోడ పనులు మందగించాయని తెలుస్తోంది. ప్రయాణికుల నరకయాతన.. అదనపు భారం గతంలో ఉండిలో ఆర్ఓబీ నిర్మాణ సమయంలో రైల్వేగేటు కొన్ని రోజులు మూసివేస్తేనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏకంగా జాతీయ రహదారినే మూసివేయడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి.పనులు అనుకున్నట్లు జరిగితే ఈ నెల 20వ తేదీ నాటికి రహదారిని కొద్దిగా తెరుస్తామని అధికారులు చెబతున్నా అది సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కేవలం ద్విచక్ర వాహనదారులు మాత్రమే మట్టి దిబ్బలు ఎక్కుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. సాధారణ ప్రయాణికులు, ఆటోలు కూడా వెళ్లే పరిస్థితి లేదు. ఉండి, ఆకివీడు వైపుల నుంచి వచ్చేవారు పనులు జరిగే ప్రాంతం వరకు వచ్చి, కాలినడకన ఆ ప్రాంతాన్ని దాటి అవతలి వైపు మరో ఆటో ఎక్కాల్సి వస్తోంది. దీంతో ఆటో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. 10 కిలోమీటర్ల మేర అదనపు ప్రయాణం భీమవరం నుంచి ఆకివీడు మీదుగా కై కలూరు, ఏలూరు తదితర ప్రాంతాలకు వెళ్లే కార్లు, ఇతర భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి వస్తోంది. భీమవరం నుంచి జువ్వలపాలెం రోడ్డు మీదుగా వెళ్లి, అక్కడ ఏలూరుపాడు వంతెన నుంచి ఐ.భీమవరం మీదుగా ఆకివీడు చేరుకుంటున్నారు. దీనివల్ల సాధారణ మార్గం కంటే సుమారు 10 కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని, సమయంతో పాటు ఇంధనం వృథా అవుతోందని వాహనదారులు వాపోతున్నారు. సాగు, తాగునీటికీ ముప్పు కాలువలకు నీరు విడుదల చేసి వారం రోజులు గడుస్తున్నా.. చెరుకువాడ, దాని శివారు గ్రామాలకు పూర్తిస్థాయిలో సాగు, తాగునీరు అందడం లేదు. సాధారణంగా ఇక్కడి నుంచి ప్రవహించే నీరు అజ్జమూరు మురుగు కాలువలోకి వెళ్లాలి. కానీ, పనులు జరుగుతున్న ప్రాంతంలో అడ్డుకట్ట వేయడం వల్ల, ఉండి అక్విడెక్టు వద్ద పంట కాలువ నీటిని బొండాడ మేజర్ డ్రెయిన్లోకి విడిచిపెడుతున్నారు. ఫలితంగా కలిసిపూడి, చెరుకువాడ ప్రాంతాలకు నీటిమట్టం తగ్గి, పొలాలకు నీరందడం లేదు. నాణ్యతపై అనుమానాలు.. ప్రభుత్వం, అధికారులు ముందుచూపుతో వ్యవహరించి కాలువలు మూసి ఉంచిన సమయంలోనే ఈ పనులు ప్రారంభించి ఉంటే.. నీటి విడుదలకు ముందే పనులు పూర్తయ్యేవి. ఒకవైపు రక్షణ గోడ కడుతుండగానే జాతీయ రహదారి కుంగిపోవడం, మరోవైపు ఆక్వా చెరువుల వల్ల గట్లు జారిపోతుండటంతో భవిష్యత్తులో ఈ కట్టడం సురక్షితమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నీరు ప్రవహిస్తున్న సమయంలోనే పనులు చేస్తుండటంతో రక్షణ గోడ నాణ్యతపై కూడా స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఉండి కాలువ రివిట్మెంట్ వాల్ నిర్మాణంలో తీవ్ర జాప్యం మట్టి కొట్టుకుపోతుండటంతో మందగించిన పనులు 10 కిలోమీటర్లు అదనంగా ప్రయాణంరక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి మే మొదటి వారంలోనే మట్టి పరీక్షలు ప్రారంభించాం. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పూర్తయిన తర్వాతే పనులను వేగవంతం చేశాం. పనులు పూర్తిస్థాయిలో ముగియడానికి మరో నెల రోజులు పట్టవచ్చు. అయితే, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 20 నాటికి జాతీయ రహదారిపై రాకపోకలను తాత్కాలికంగా పునరుద్ధరిస్తాం. పనులన్నీ త్వరితగతిన, నాణ్యతతో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. – సబీరా సుల్తానా, ఎన్హెచ్ ఏఈ -
ఉపాధ్యాయులకు టెట్ గండం
రేషన్ బియ్యం పట్టివేత ముసునూరు మండలంలోని వలసపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. 8లో uబుధవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 2026ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయులకు ప్రస్తుతం విషమ పరీక్ష ఎదురైంది. 2010వ సంవత్సరానికి ముందు ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన వారు కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సాధించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం ఉపాధ్యాయులను కలవరపెడుతోంది. దాదాపు 16 నుండి 25 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ, ఎందరో విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన వారే ప్రస్తుతం పరీక్షలను ఎదుర్కోవాల్సి రావడం గమనార్హం. అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నిర్వహించిన అన్ని అర్హత పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం సాధించిన తాము, ఇప్పుడు తిరిగి తమను తాము నిరూపించుకోవాలని నిబంధన విధించడాన్ని ఉపాధ్యాయ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. పరీక్షల విధానంలో వచ్చిన మార్పులు, కంప్యూటర్ ఆధారిత పరీక్షల నిర్వహణపై తమలో కొందరికి అసలు అవగాహనే లేదని, ఈ పరిస్థితుల్లో పరీక్షలు ఎలా రాయగలమని వారు ప్రశ్నిస్తున్నారు. ఎంతోకాలంగా పాఠాలు బోధిస్తున్న తమకు ఇప్పుడు ‘టెట్’ నిర్వహించడం ఏమిటంటూ ఉపాధ్యాయులు, సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెట్ అర్హత సాధించాల్సిందే.. అసలే విద్యారంగంలో సంస్కరణల పేరుతో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు ఉపాధ్యాయులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా 1 నుండి 10వ తరగతి వరకు 9 రకాల పాఠశాలల విధానాన్ని తీసుకువచ్చారు. ఇప్పటికే పలు రకాల యాప్ల వినియోగంతో టీచర్లు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇది చాలదన్నట్లు, ఇప్పుడు 2010కి ముందు ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులు కూడా ‘టెట్’ పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదో ఒక సబ్జెక్టులో నైపుణ్యం సాధించి, ఆ సబ్జెక్టుపై విద్యార్థులకు పాఠాలు బోధించే తాము.. ప్రస్తుతం అన్ని సబ్జెక్టులు కలిపి నిర్వహించే ‘టెట్’ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలనడం దారుణమని వారు వాపోతున్నారు. ప్రత్యేక టెట్ నిర్వహించాలని డిమాండ్ టెట్ పరీక్షను 150 మార్కులకు నిర్వహించనున్నారు. ఇందులో అర్హత సాధించాలంటే: ఓసీ కేటగిరీవారు 60 శాతం మార్కులు, బీసీ కేటగిరీ 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, ఎక్స్–సర్వీస్మెన్ కేటగిరీ 40 శాతం మార్కులు సాధించాలి. టెట్ పాస్ కావాలంటే తెలుగు, ఇంగ్లీష్, గణితం, చైల్డ్ డెవలప్మెంట్, పర్యావరణ శాస్త్రం వంటి అంశాలన్నీ చదవాల్సి ఉంటుంది. బయలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు గణితం, తెలుగు పండితులకు సోషల్ స్టడీస్ వంటి సంబంధం లేని సబ్జెక్టులను టెట్లో పెట్టడం వల్ల పాస్ కావడం ఎలా అని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. అందుకోసమే ప్రస్తుతం పనిచేస్తున్న ఇన్–సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ‘ప్రత్యేక టెట్’ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అన్ని కేటగిరీల ఉపాధ్యాయులకూ ఉత్తీర్ణత మార్కులను 35 శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్లలోపు టెట్ రాసి ఉత్తీర్ణత సాధించాలి. లేనిపక్షంలో ఉద్యోగం వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమోననే ఆందోళన గురువులను వెంటాడుతోంది. దీనికి తోడు టెట్ పాస్ కాని వారికి పదోన్నతులతో (ప్రమోషన్లు) పాటు నియామకాలు కూడా ఉండవని కోర్టు తీర్పులో పేర్కొంది. ఐదేళ్లలోపు సర్వీస్ మిగిలి ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇచ్చినప్పటికీ, వారికి పదోన్నతులు కావాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేశారు. ఈ నిబంధన కారణంగా జిల్లాలో 2010వ సంవత్సరానికి ముందు ఉద్యోగాల్లో ప్రవేశించిన సుమారు 6 వేల మంది ఉపాధ్యాయులు ఇప్పుడు టెట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ టెట్ నిబంధనను ఉపసంహరించాలని గత ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళనలు నిర్వహించడంతో పాటు, సుప్రీంకోర్టు ఈ నిబంధనను పునఃపరిశీలించాలని కోరుతూ రివ్యూ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. దీనిపై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. గత మే నెల 29వ తేదీన తుది తీర్పు ఇస్తూ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాల్సిందేనని నొక్కి చెప్పింది. అయితే, గతంలో ఇచ్చిన గడువును మరో ఏడాది పెంచుతూ, అంటే 2028 ఆగస్టు 31వ తేదీలోగా పూర్తి చేయాలని కొద్దిగా సడలింపు ఇవ్వడం ఒక్కటే ఉపాధ్యాయులకు స్వల్ప ఉపశమనం కలిగించే అంశం. సుప్రీంకోర్టు తీర్పుతో గురువుల్లో మళ్లీ మొదలైన టెన్షన్ జిల్లాలో సుమారు 6 వేల మంది టెట్ అర్హత సాధించాల్సిన గురువులు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని డిమాండ్ -
తండ్రి మందలించడంతో యువకుడి ఆత్మహత్య
టి.నరసాపురం: తండ్రి మందలించడంతో కలుపు మందు తాగి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నూజివీడు మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన మొక్కరాల సత్య పవన్కుమార్ అల్లంచర్ల రాజుపాలెం గ్రామ శివార్లలో వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ భార్య పిల్లలతో జీవిస్తున్నాడు. అతని రెండో కుమారుడు ముక్కరాల లోకేష్ (19) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ వేసవి సెలవులకు వచ్చి ఏ పనీ లేకుండా తిరుగుతూ సెల్ ఫోన్ గేమ్స్ ఆడుతున్నాడు. ఈ నెల 8న తండ్రి మందలించడంతో తోటలో ఉన్న కలుపు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతుని తండ్రి సత్య పవన్ కుమార్ ఫిర్యాదుతో ఎస్సై ఎం.జయబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముసునూరు: అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు నూజివీడు సీఎస్ డీటీ గుండుబోయిన వెంకటేశ్వరరావు చెప్పారు. మండలంలోని వలసపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెనన్స్ అధికారుల ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకుని, నిల్వదారులైన బండారు వందనం, కడలి లక్ష్మణరావులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలకు పంపిణీ చేయాల్సిన బియ్యం పక్కదారి పడితే సహించేది లేదని, క్రిమినల్ కేసులు విధించడంతో పాటు, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పంట బోదెలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కాళ్ల: ఆకివీడు శివారు ఐ.భీమవరం రోడ్డులో ఉన్న దుంపగడప పంట బోదెలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనుగొన్నట్లు ఆకివీడు ఎస్సై హనుమంతు నాగరాజు మంగళవారం విలేకరులకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం పంట బోదెలో 35 సంవత్సరాల వయసు ఉన్న పురుషుని మృతదేహం బోర్లా పడి ఉండడాన్నీ కనుగొన్నామన్నారు. నీలిరంగు ఫ్యాంటు, గోధుమ రంగు చారలు షర్టు కలిగి ఉన్నారని ఆయన వివరించారు. వెంకయ్య–వయ్యేరు కాలువలో నీటి ప్రవాహంలో కొట్టుకుని వచ్చి పంట బోదెలోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. కామవరపుకోట: మండలంలో అంకాలంపాడు, కామవరపుకోట కోత్తూరు పరిసర ప్రాంతాల్లో సోమవారం రాత్రి పొలాలలో బోరు మోటర్ కేబుల్ వైర్లు గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించి వెళ్లినట్లు రైతులు తెలిపారు. దీనిపై మంగళవారం పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఈ వైర్లు సుమారు రూ.2 లక్షల రూపాయలు పైగా ఉంటుందని రైతులు తెలిపారు. గతంలో కూడా ఇలాగే ట్రాన్స్ఫార్మర్ వైర్లు, మోటర్ వైర్లు దొంగతనానికి గురైనట్లు రైతులు పేర్కొన్నారు. ఏలూరు (టూటౌన్): రాష్ట్ర డెడికేటెడ్ కమిషన్ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్ర ఈ నెల 11న ఏలూరులో పలు కార్యక్రమాలలో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోటాకు సంబంధించి వివిధ బీసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి అభిప్రాయాలు, వినతులను స్వీకరించేందుకు గోదావరి సమావేశపు హాలులో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): యోగాంధ్ర–2026 కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యోగాంధ్ర–2026 కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4.5 లక్షల మంది పౌరులతో యోగ రిజిస్ట్రేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. జూన్ 13న నరసాపురం వలందర్ రేవు వద్ద 1000 మందితో, జూన్ 14న వాసవి పెనుగొండలో 2500 మందితో, జూన్ 19న స్పోర్ట్స్ అథ్లెటిక్స్ మైదానంలో 1500 మందితో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాస్థాయిలో 1500 మందితో మెగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తాడేపల్లిగూడెం రూరల్: మండలంలో మద్యం సేవిస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్న పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ ఎస్సై రవికుమార్ మంగళవారం విలేకరులకు ప్రజాప్రదేశాల్లో మద్యం సేవించడం, గొడవలు చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం, ప్రజాశాంతి భద్రతలకు భంగం కలిగించడం వంటివి చట్టరీత్యా శిక్షార్హమని హెచ్చరించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏలూరు టౌన్: మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నుంచి బంగారం, సెల్ఫోన్ చేరీ చేసిన ఘటన మంగళవారం ఏలూరులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ఏలూరు అశోక్నగర్ ప్రాంతానికి చెందిన పర్వతనేని సాయినవీన్ బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. నవీన్ తన స్నేహితుడితో కలిసి దేవి బార్ అండ్ రెస్టారెంట్కు మద్యం తాగేందుకు వెళ్లాడు. మద్యం తాగుతున్న సమయంలోనే నవీన్కు అతడి స్నేహితునికి మద్య చిన్న వివాదం ఏర్పడటంతో బార్ నుంచి అతను వెళ్లిపోయాడు. నవీన్ ఒక్కడే బార్ నుంచి బయటకు వచ్చాడు. ఇదే సమయంలో మోటారు సైకిల్పై వేచి ఉన్న ఇద్దరు వ్యక్తులు అతడిని అశోక్ నగర్లో దించుతామని చెప్పి ఎక్కించుకున్నారు. అయితే వారు చొదిమెళ్ల వైపు తీసుకువెళ్తూ గట్టిగా అరవకుండా నోరు మూసేశారు. అతడి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, సెల్ఫోన్ తీసుకుని ఉడాయించారు. ఇద్దరు వ్యక్తులు పారిపోతూ వంగూరు వెళదామని చెప్పుకోవటం తాను విన్నానని నవీన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు ఏలూరు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలి
ఏలూరు (టూటౌన్): కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని, కేజీ బేసిన్ గ్యాస్లో రాష్ట్రానికి 50 శాతం వాటా ఇవ్వాలని, పెట్రోలు, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నేడు స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఏలూరు నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజల నడ్డి విరిచేలా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను విపరీతంగా పెంచిందని విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతుంటే భారతదేశంలో మాత్రం పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయని అన్నారు. అనంతరం ఈ రాస్తారోకో కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం. కృష్ణచైతన్య పాల్గొని మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చారని, ఎన్నికలు కాగానే ప్రజలపై ధరల భారం మోపారని మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు బి.సోమయ్య, యర్రా శ్రీనివాసరావు, మంగం అప్పారావు, కె.విజయలక్ష్మి, సీపీఐ నాయకులు బండి వెంకటేశ్వరరావు, ఉప్పులూరి హేమశంకర్, పి.కన్నబాబు, కురెళ్ల వరప్రసాద్, సీపీఎం నాయకులు పంపన రవి, వై.ఎస్. కనకారావు, జి.ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు. -
కొల్లేరు సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తాం
కై కలూరు: కొల్లేరు ప్రాంత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. తొలి అడుగు పేరుతో కొల్లేరు నాయకుడు బలే ఏసురాజు ఆధ్యరంలో కై కలూరు సీతారామఫంక్షన్ హాలులో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు గ్రామ పెద్దలతో మంగళవారం సమావేశం నిర్వహ/ంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ త్వరలో సుప్రీంకోర్టు నుంచి శుభవార్త వస్తుందని భావిస్తోన్నామన్నారు. ఫోన్లో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్తో మాట్లాడించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ త్వరలో కొల్లేరుపై చర్చిస్తారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మీ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్రావు, జిల్లా అటవీశాఖ అధికారి త్రిమూర్తులురెడ్డి, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న తదితరుల పాల్గొన్నారు. -
టీడీపీ ఫ్లెక్సీతో బస్ షెల్టర్ మూత
కామవరపుకోట: మండలంలోని రావికింపాడు నుంచి ద్వారకాతిరుమల వెళ్లే రోడ్డులో ఉన్న బస్ షెల్టర్ను టీడీపీ ఫ్లెక్సీలతో మూసివేయడంతో గత కొన్ని రోజుల నుంచి ప్రయాణికులు నాన ఇబ్బందులు గురవుతున్నారు. ఇటీవల గ్రామంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ ఓ కార్యక్రమం ప్రారంభోత్సవానికిగానూ స్థానిక టీడీపీ నాయకులు చిత్రపటాలతో పాటు ఎమ్మెల్యే చిత్రపటం ఉన్న ఫ్లెక్సీతో బస్ షెల్టర్ మూసివేశారు. దీంతో ప్రయాణికుల కూర్చోవడానికి నీడ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల వెళ్లాలంటే చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం పలు దూర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ నుంచి ఆటో, బస్సుల్లో ఈ రహదారి మీదుగా ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివెళ్తూ ఉంటారు. ఎండాకాలం బస్సు షెల్టర్ను ఫ్లెక్సీతో మూసివేయడంతో అక్కడికి వచ్చిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పటికైనా అధికారులు, స్థానిక నాయకులు స్పందించి ఫ్లెక్సీ తొలగించాలని కోరుతున్నారు. -
తవ్వేయ్.. తరలించేయ్..!
భీమవరం: జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న యనమదుర్రు గ్రామంలో యథేచ్ఛగా రొయ్యల చెరువులు తవ్వి మట్టిని తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలం కావడంతో జిల్లా వ్యాప్తంగా చెరువులు తవ్వకాలు, స్థలాల పూడిక పనులు విచ్చలవిడిగా సాగుతున్నాయి. రొయ్యల చెరువుల తవ్వకాలకు అనుమతులు లేకపోవడమే గాక చెరువు తవ్విన మట్టిని స్థలాల పూడికకు అమ్మకాలు చేస్తూ కొంతమంది పెద్ద మొత్తంలో జేబులు నింపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. యనమదుర్రు గ్రామంలో ఇటీవల 13 ఎకరాల చెరువు తవ్వకం పనులు చేపట్టారు. గత నెల రోజులుగా పెద్ద సంఖ్యలో భారీ వాహనాలతో మట్టిని తరలిస్తున్నారు. ప్రజాప్రతినిధి పేరు చెప్పుకుని.. యనమదుర్రు గ్రామంలో తవ్వుతున్న చెరువు మట్టిని భీమవరం పట్టణంలో స్థలాల పూడికకు తరలిస్తున్నారు. భారీ వాహనాలతో గ్రామంలోని మిండిపుంత నుంచి మట్టిని తరలిస్తున్నారు. స్థానిక అధికారులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా ప్రజాప్రతినిధికి చెందిన వారికి మట్టి వెళ్తుందని, మీరు అడ్డంకి కలిగిస్తే ఇబ్బందులు తప్పవంటూ కింది స్థాయి అధికారులను బెదిరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువును తవ్వి మట్టి తరలించడం వల్ల మిండిపుంత రోడ్డు దెబ్బతిందని.. దాని వల్ల దాదాపు 300 ఎకరాల భూముల రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద గుంతలు పడడంతో సార్వా సీజన్లో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడుతుందని వాపోతున్నారు. పుంతరోడ్డు వెంబడి ఉన్న నీటిపారుదల బోదె పూడిపోయిందని దీనితో సారునీరు ప్రవాహానికి ఆటంకం ఏర్పడి సాగుకు ఇబ్బందేనంటున్నారు. గ్రామంలో నుంచి భారీ వాహనాలు విచ్చల విడిగా వెళ్లడం వల్ల సీసీ రోడ్లు సైతం దెబ్బతినడమేగాక ప్రమాదాలు జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు గత నెల రోజులుగా యనమదుర్రులో విచ్చలవిడిగా మట్టి తోలకంపై స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో ఇటీవల జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలకు ఫిర్యాదు చేశారు. తవ్వకాలకు అనుమతులు లేవని ల్యాండ్ కన్వర్షన్ లేకుండా వెంచర్స్ వేసి పంట పొలాలను ఇళ్లస్థలాలుగా పూడ్చివేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నతాధికారులైనా మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేసి రోడ్డు ధ్వంసం కాకుండా అడ్డుకోవాలని కోరుతున్నారు. యనమదుర్రు గ్రామంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు -
భూ రికార్డుల స్వచ్ఛతే లక్ష్యం
సీసీఎల్ఏ జీ జయలక్ష్మి నూజివీడు: భూ రికార్డుల స్వచ్ఛీకరణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని సీసీఎల్ఏ అండ్ రెవిన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జీ జయలక్ష్మి పేర్కొన్నారు. మండలంలోని పల్లెర్లమూడి, అన్నవరంలో నిర్వహిస్తున్న రీ సర్వేను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రీసర్వే జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలని రైతులను అడిగారు. సర్వే సిబ్బంది క్షేత్రస్థాయిలో రీ సర్వే చేస్తున్న విధానం పరిశీలించి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పట్టాదార్ పాసు పుస్తకంలో భూ యజమాని పేరు, సర్వే నెంబర్, విస్తీర్ణం, తదితర వివరాలు సక్రమంగా ఉందీ, లేనిదీ రైతులు పరిశీలించుకోవాలన్నారు. వివరాలలో ఏదైనా పొరపాటు ఉంటే వెంటనే రెవెన్యూ సిబ్బందికి అందించి, పొరపాటుగా ముద్రించిన వివరాలను తెలియజేస్తే, రెవిన్యూ సిబ్బంది రికార్డులు మరోసారి పరిశీలించి, వాటిని వెంటనే మార్పు చేసి ఇస్తారన్నారు. రైతులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పొరపాట్లు లేని పట్టాదార్ పాసు పుస్తకాలు పొందాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, సబ్కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, సర్వే అధికారి అన్సారీ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సేవల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు ఏలూరు (టూటౌన్): రెవిన్యూ సేవలందించే విషయంలో నిర్లిప్తంగా ఉంటే అధికారులపై చర్యలు తీసుకుంటానని రాష్ట్ర భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మి అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో మంగళవారం రీ సర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, పీఆర్జీఎస్, 22 ఏ కేసుల పరిష్కారం, తదితర రెవెన్యూ అంశాల అమలు తీరుపై కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిబంధనలను పాటించి పొరపాట్లు లేని భూ రికార్డులు రూపొందించాలన్నారు. రెవెన్యూ సేవలలో ప్రజల సంతృప్తి స్థాయి కనీసం 80 శాతంగా ఉండాలన్నారు. ఏలూరు జిల్లాలో రెవెన్యూ సేవలలో ఐవీఆర్ఎస్ సర్వేలో ఏప్రిల్ కన్నా మే నెలలో ప్రజల సంతృప్తి స్థాయి తక్కువగా నమోదైందని, తహసీల్దార్లు ఆఫీస్లో కూర్చుని విధులు నిర్వర్తించడం కాదని, క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలని, ప్రజల సమస్యలపై అందిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వారితో మర్యాదగా ప్రవర్తించి, వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల రెండుసార్లు మెగా 22ఏ పరిష్కార మేళాను నిర్వహించి వెయ్యి ఎకరాలకు పైగా భూములను నిషేదిత భూముల జాబితా నుంచి తొలగించామన్నారు. జిల్లాలో పట్టాదార్ పాస్ పుస్తకాలను నూరు శాతం పంపిణీ చేశామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.జె.అభిషేక్ గౌడ, ఇన్చార్జి డీఆర్ఓ దేవకీదేవి పాల్గొన్నారు. -
1.2 కిలోల బంగారం మాయం
కొనసాగుతున్న గోల్డ్ ఖాతాల పరిశీలన జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లో ఖాతాదారుల కుదవ పెట్టిన బంగారం ఇంతవరకూ 1210 గ్రాములు(1.21 కిలోలు) స్వాహా అయినట్లు గుర్తించారు. మంగళవారం రాత్రి వరకూ ఖాతాలను పోలీసుల సమక్షంలో బ్యాంకు అధికారులు పరిశీలించారు. మరోవైపు ఖాతాదారులు మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బంగారు వస్తువుల ఖాతాల పరిశీలనలో తీవ్ర జాప్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై ఎన్వీ ప్రసాద్ ఖాతాదారులకు సర్ధిచెప్పారు. రాత్రి పొద్దుపోయే వరకు ఖాతాల పరిశీలన జరుగుతూనే ఉంది. పెద్ద ఎత్తున బంగారం మాయం కావడంతో ఖాతాదారులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సుమారు 2,800 ప్యాకెట్లు అధికారులు పరిశీలించాల్సి ఉందని తెలుస్తోంది. ఈ నెల 6న బ్యాంక్ ఆఫ్ బరోడాలో ముగ్గురు ఖాతాదారులకు సంబంధించి 30 కాసుల(240 గ్రాముల) బంగారం మాయమైంది. దీంతో ముగ్గురు ఖాతాదారులు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు రాత్రి వరకు విషయం తెలుసుకున్న ఖాతాదారులు ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం వరుసగా టోకెన్లు ఇచ్చి ఖాతాదారులు బ్యాంకులో కుదువ పెట్టిన బంగారాన్ని పోలీసుల సమక్షంలో చూపించారు. ఖాతాదారులకు సంబంధించి 118 ప్యాకెట్లలోని బంగారు వస్తువులలో 8 ప్యాకెట్లకు సంబంధించి సుమారు 350 గ్రాముల బంగారం మాయం అయినట్లు గుర్తించారు. లాకర్లో ఉన్న బంగారం మాయం అవడంపై బ్యాంకు సిబ్బంది పాత్రపై కూడా ఖాతాదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బంగారం మాయం ఘటనలో బ్యాంకులో పనిచేసే అప్రయిజర్ పాత్ర కీలకం కాగా, గత కొద్ది రోజులుగా అప్రయిజర్ బ్యాంకుకు రావడం లేదు. ఖాతాదారులు ఎక్కువ బంగారం పెట్టి తక్కువ రుణం పొందిన ఖాతాల నుంచే ఎక్కువ శాతం బంగారం మాయమైంది. రెన్యువల్ చేసిన ఖాతాల నుంచి కూడా బంగారం మాయమైంది. ఖాతాదారులకు తాము పెట్టిన బంగారం మొత్తం పత్రాలపై చూపించి, బ్యాంకులో ఉండే పత్రాలపై మాత్రం తక్కువ బంగారం చూపించడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై బ్యాంకు ఉన్నతాధికారులు మాట్లాడుతూ ప్రతి ఖాతాదారుడి బంగారం తిరిగి చెల్లిస్తామని, తమది ప్రభుత్వ బ్యాంకు అని, బ్యాంకు పూర్తి బాధ్యత వహిస్తుందని, ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. -
ఉపాధ్యాయుల పాత్ర కీలకం
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యార్థి అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర విశిష్టమైనదని, ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు భాషా నైపుణ్యాలు, గణిత ప్రాథమిక నైపుణ్యాలపై పటిష్టమైన అవగాహన కల్పించగలిగితే వారి భవిష్యత్తు విద్యాభ్యాసానికి బలమైన పునాది ఏర్పడుతుందని జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్ ఆరు రోజుల శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో మంగళవారం ఆమె నగరంలోని కోటదిబ్బ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల కేంద్రాన్ని సందర్శించి శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత విద్యా పరిస్థితుల్లో ఎఫ్ఎల్ఎన్ శిక్షణ అత్యంత అవసరమన్నారు. సమగ్ర శిక్ష పరిధిలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై కూడా ఉపాధ్యాయులకు అవగాహన కల్పించినట్లు కోర్స్ డైరెక్టర్, ఏలూరు మండల విద్యాశాఖాధికారి ఈదుపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ద్వారకాతిరుమల: వేసవి సెలవులు ముగుస్తున్న నేపధ్యంలో శ్రీవారి క్షేత్రానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. సాధారణంగా ప్రతి మంగళవారం స్వల్ప సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శిస్తారు. అయితే ఈ వారం వేలాది మంది భక్తులు క్షేత్రాన్ని సందర్శించారు. దాంతో కల్యాణకట్ట, దర్శనం క్యూలైన్లు, ప్రసాదాల విక్రయాల కౌంటర్లు, క్యూ కాంప్లెక్స్ తదితర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో మంగళవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. స్వామికి ఆలయ ముఖ మండపం వద్ద నాగవల్లి దళాలతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామిని విశేషంగా అలంకరించి పూజా కార్యక్రమం చేశారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.3,55,857 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. అన్నదాన సత్రంలో 2365 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు తెలిపారు. భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం పట్టణంలో వేంచేసియున్న మావుళ్లమ్మ అమ్మవారి హుండీలను దేవస్థానం మంగళవారం లెక్కించారు. 75 రోజులకు రూ.61,06,458 లభించగా, 76.700 గ్రాముల బంగారం, 315 గ్రాములు వెండి అమ్మవారికి హుండీల ద్వారా వచ్చిందని తెలిపారు. కాకినాడ ఎంఎస్ఎన్ చారిటీస్ అసిస్టెంట్ కమిషనర్ చాగంటి సురేష్ నాయుడు పర్యవేక్షణలో జరిపిన ఈ లెక్కింపులో ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. భీమవరం: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు సీడబ్ల్యూఎస్ఎన్ ఆధ్వర్యంలో మంజూరైన ఉచిత ఉపకరణాలను మంగళవారం సర్వశిక్ష కార్యాలయం వద్ద పంపిణీ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. అనంతరం 326 మంది విద్యార్థులకు రూ. 29 లక్షల విలువైన డిజిటల్ హియరింగ్ ఎయిడ్స్, కమోడ్ వీల్చైర్స్, టీఎల్ఎం కిట్టు, ట్రై సైకిల్స్ వంటి ఉపకరణాలు పంపిణీ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ, సమగ్రశిక్ష అడిషినల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి.శ్యామ్ సుందర్ పాల్గొన్నారు. -
వీఆర్ఓల నిరసన గళం
ఏలూరు (టూటౌన్): వీఆర్ఓ మహ్మద్ హుస్సేన్ ఆత్మహత్యకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వీఆర్ఓలు ఏలూరు కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఏపీ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు జిల్లా వెంకాయపల్లి వీఆర్ఓ మహ్మద్ హుస్సేన్ మరణానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లు, వీఆర్ఏలపై పనిభారం నానాటికి పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై తామంతా ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మాత్రమే విధులు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ సెలవు రోజులు, పండుగ రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విధులకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. తమకు కేవలం రెవెన్యూ సంబంధిత విధులు మాత్రమే కేటాయించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడపా రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్వి సుబ్బారావు, జిల్లా కోశాధికారి దామరాజు రవికుమార్, నూజివీడు డివిజన్ ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, ఏలూరు మండల వీఆర్ఓలు కరీం తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా బదిలీ కౌన్సెలింగ్
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో పనిచేస్తోన్న పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐల బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా చేపట్టారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ స్వయంగా కౌన్సెలింగ్ పర్యవేక్షిస్తూ నిబంధనల మేరకు బదిలీలు చేశారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా సాధారణ బదిలీల్లో భాగంగా కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఒకే పోలీస్స్టేషన్లో 5 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించిన సిబ్బందికి సాధారణ బదిలీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీ చేశారు. సిబ్బంది కుటుంబ పరిస్థితులు, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టి పెట్టుకుని సిబ్బందికి బదిలీ ఉత్తర్వులు అందజేశారు. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో ఖాళీల వివరాలను ప్రదర్శిస్తూ అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ వారు కోరుకున్న స్థానాలను ఎంపిక చేసుకునే వీలు కల్పించారు. పాఠశాలలు, కళాశాలలు తెరిచే సమయం సమీపించిన నేపథ్యంలో బదిలీ ప్రక్రియ పూర్తి చేయటం పట్ల పోలీస్ సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్పీ శివకిషోర్ పారదర్శకంగా బదిలీలను పూర్తి చేయటం పట్ల సిబ్బంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ బదిలీ ప్రక్రియ కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
టిప్పర్ లారీ బోల్తా
ఉంగుటూరు మండలంలోని రాచూరు వద్ద టిప్పరు లారీ తిరగపడి వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మోటారు సైక్లిస్టును తప్పించబోయి టిప్పర్ తిరగబడింది. 8లో uసుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుల పాలిట గొడ్డలి పెట్టు లాంటిది. టెట్ నిబంధనను అధిగమించడానికి పార్లమెంట్లో చట్టసవరణ చేస్తేనే మేలు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలోని నిబంధనలను సవరించడం ద్వారా ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించవచ్చు. ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను కేవలం టెట్ పరీక్షలతో కొలవలేము. – గెడ్డం సుధీర్, వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ అర్హత సాధించాలనడం ఎంతమాత్రం సహేతుకం కాదు. దాదాపు 20 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారు ఇప్పటికిప్పుడు తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది? కొన్ని అర్హతా ప్రమాణాల మేరకు అప్పట్లోనే ఉద్యోగాలు పొందిన వారికి, దశాబ్దాల తర్వాత మరోసారి అర్హత పరీక్షలు నిర్వహించి తీరాలనడం ప్రపంచంలో ఎక్కడా లేదు. – పువ్వుల ఆంజనేయులు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు. -
కక్ష సాధింపుతోనే అడ్డంకులు
భీమవరం: భీమవరం పట్టణంలోని ప్రకాశం చౌక్ సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన దిమ్మను అధికారులు తొలగించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్, ప్రకాశం చౌక్ సెంటర్లకు అత్యంత ప్రాధాన్యత ఉంది. అంబేడ్కర్ సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహం, ప్రకాశం చౌక్ సెంటర్లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలను గతంలోనే ఏర్పాటు చేశారు. ఇటీవల ప్రకాశం చౌక్ సెంటర్లో ఎన్టీఆర్, టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కోసం విశాలమైన సిమెంట్ దిమ్మను నిర్మించి, విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే కాకుండా చుట్టూ రక్షణ గోడను నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు విగ్రహాల మధ్యలో ప్రకాశం పంతులు విగ్రహం ఏర్పాటుకు ఎత్తుగా సిమెంట్ దిమ్మను నిర్మించారు. ఈ పనులు దాదాపు 20 రోజులుగా జరుగుతున్నా, మునిసిపల్ అధికారులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. వైఎస్ విగ్రహానికి అడ్డంకులెందుకు? ఇదే ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం పక్కనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు సంకల్పించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పేరిచర్ల విజయ నర్సింహరాజు, కోడే యుగంధర్, చిరుగుపాటి సందీప్ తదితరులు స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును క్యాంపు కార్యాలయంలో కలిసి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పగా ఆయన అంగీకరించారు. దీంతో శుక్రవారం రాత్రి విగ్రహ ఏర్పాటుకు దిమ్మను నిర్మించారు. శనివారం ఉదయమే మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో మిగిలిన విగ్రహాల జోలికి వెళ్లకుండా, కేవలం రాజశేఖరరెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన దిమ్మను మాత్రమే తొలగించారు. ఎవరికీ అడ్డులేని ప్రాంతంలో, ఎమ్మెల్యే అనుమతితో విగ్రహం ఏర్పాటుకు తలపెడితే, మున్సిపల్ సిబ్బంది అత్యుత్సాహంతో దిమ్మను తొలగించడం వెనుక రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ప్రోద్బలం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను పాటించాలనుకుంటే మిగిలిన విగ్రహాల ఏర్పాటుకు ఎలా అనుమతినిచ్చారు? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇతరులకు ఒక నిబంధన, వైఎస్సార్సీపీకి మరొక నిబంధన అమలు చేస్తున్నారని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. అధికారులు జోక్యం చేసుకుని వైఎస్ విగ్రహ ఏర్పాటుకు అనుమతించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలతో అన్ని వర్గాల ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం దారుణం. ఇప్పటికే ఎన్టీఆర్, ఇతర విగ్రహాలు ఏర్పాటు చేస్తుండగా, వాటికి లేని అడ్డంకులు వైఎస్ విగ్రహానికే ఎందుకు వచ్చాయో మునిసిపల్ అధికారులు సమాధానం చెప్పాలి. – చిరుగుపాటి సందీప్, వైఎస్సార్సీపీ యూత్ వింగ్ అధ్యక్షుడుప్రకాశం చౌక్ సెంటర్లో అల్లూరి విగ్రహం ఎప్పుడో ఏర్పాటు చేశారు. దాని పక్కనే ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధం కాగా, ప్రకాశం పంతులు విగ్రహాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వాటికి ఏ ఇబ్బందీ లేకుండా, రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నిస్తుంటే దిమ్మను తొలగించడం అన్యాయం. పక్షపాత వైఖరితో వైఎస్ విగ్రహాన్ని అడ్డుకుంటే చూస్తూ ఊరుకునేది లేదు. – గాదిరాజు రామరాజు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు భీమవరంలో వైఎస్ విగ్రహంఏర్పాటుకు అభ్యంతరం ఎన్టీఆర్, ప్రకాశం పంతులు విగ్రహాల ఏర్పాటుకు చురుగ్గా పనులు రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు -
కోర్టు ప్రాంగణంలో అగ్ని ప్రమాదం
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోర్టు భద్రత, నిఘా నిమిత్తం ప్రాంగణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టు గుడారంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చెక్పోస్టులోని కీలకమైన పోలీసు రికార్డులు, సిబ్బందికి సంబంధించిన వస్తువులు, ఫర్నీచర్ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఫైర్ సిబ్బంది తెలిపారు. ఆగిరిపల్లి : వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సింహాద్రి అప్పారావుపేటలో చోటుచేసుకుంది. ఎస్సై శుభ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఎస్ఏ పేటకు చెందిన డేరంగుల విజయలక్ష్మి(22)కి పెదవేగి కి చెందిన నాగేంద్రకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్ని నెలలుగా భార్యాభర్తల గొడవల కారణంగా విజయలక్ష్మి పుట్టింట్లో ఉంటోంది. గత వారం రోజుల నుండి భార్యాభర్తలు ఫోన్ లో గొడవ పడుతున్నారు. ఆమె మనస్థాపం చెంది ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుంది. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. మృతురాలి తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మరో 350 గ్రాముల బంగారం మాయం
జంగారెడ్డిగూడెం: బ్యాంక్ ఆఫ్ బరోడా జంగారెడ్డిగూడెం బ్రాంచ్లో ఖాతాదారులు బంగారం కుదువ పెట్టి రుణాలు తీసుకోగా, ఖాతాదారులకు సంబంధించిన బంగారం మాయమైంది. ఈ నెల 6న బ్యాంక్ ఆఫ్ బరోడాలో ముగ్గురు ఖాతాదారులకు సంబంధించి 30 కాసుల బంగారం మాయమైంది. దీంతో ముగ్గురు ఖాతాదారులు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఖాతాదారులు ఆందోళనకు దిగారు. తాము కుదువ పెట్టిన బంగారం బ్యాంకులో ఉందా? లేదా చూపించాలని ఆందోళనకు దిగారు. శనివారం రాత్రి పొద్దుపోయే వరకు ఆందోళన కొనసాగగా, బ్యాంకు అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని సోమవారం ఖాతాదారులు అందరికీ సంబంధించిన కుదువ పెట్టిన బంగారం చూపిస్తామని చెప్పగా, ఖాతాదారులు వెనుదిరిగారు. సోమవారం ఉదయమే బ్యాంకు వద్దకు వందలాది మంది ఖాతాదారులు చేరుకుని ఆందోళన చేశారు. దీంతో బ్యాంకు అధికారులు, ఎస్సై ఎన్వీ ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది ఖాతాదారులకు వరుసగా టోకెన్లు ఇచ్చి సీరియల్ వారీగా ఖాతాదారులు బ్యాంకులో కుదువ పెట్టిన బంగారాన్ని పోలీసుల సమక్షంలో ఖాతాదారులకు చూపించారు. ఈ విధంగా సోమవారం రాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగగా, ఖాతాదారులకు సంబంధించి 118 ప్యాకెట్లలోని బంగారు వస్తువులను పరిశీలించారు. వాటిలో 8 ప్యాకెట్లకు సంబంధించి సుమారు 350 గ్రాముల బంగారం ఖాతాదారులు పెట్టిన బంగారం కంటే తక్కువగా ఉందని నిర్ధారించారు. దీంతో ఖాతాదారుల నుంచి ఆ 350 గ్రాముల బంగారానికి సంబంధించి ఫిర్యాదులను తీసుకున్నారు. ఇంకా బ్యాంకులో ఖాతాదారులకు సంబంధించి చాలా ప్యాకెట్లు పరిశీలించాల్సి ఉందని, ఈ ప్రక్రియ మొత్తం మరికొన్ని రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 6వ తేదీన 30 కాసులు మాయం కాగా, సోమవారం లెక్కల్లో మరో 350 గ్రాముల బంగారం మాయమైంది. దీంతో మిగిలిన ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, బ్యాంకు ఉన్నతాధికారులు విజయవాడ నుంచి వచ్చి ఘటనపై ఆరా తీసినట్లు తెలిసింది. బంగారం మాయం ఘటనలో బ్యాంకులో పనిచేసే అప్రైజర్ పాత్ర కీలకమని భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా అతను పరారీలో ఉన్నట్లు తెలిసింది. అతను దొరికితే బ్యాంకులో ఖాతాదారులు పెట్టిన బంగారం ఎలా మాయమైందో తెలుస్తుందని భావిస్తున్నారు. బ్యాంకులో ఖాతాదారులు తాము పెట్టిన బంగారానికి ప్రస్తుతం బ్యాంకు అధికారులు చూపిస్తున్న బంగారానికి వ్యత్యాసం ఉండి తక్కువ బంగారం చూపించడంతో అసలు ఆ బంగారం ఎలా మాయమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
దేవాలయాలు సున్నితమైన అంశాలు
ద్వారకాతిరుమల: సోషల్ మీడియాలో దేవాలయాల గురించి ప్రచారం చేసేటప్పుడు ఇన్ఫ్లూయెన్సర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని శ్రీవారి దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావు సూచించారు. కొండపైన పద్మాలయ కల్యాణ మండపంలో సోమవారం ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్లతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈఓ త్రినాధరావు మాట్లాడుతూ క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, స్వామివారి సేవలను భక్తులకు మరింత చేరువచేసే విషయంలో సోషల్ మీడియా ముఖ్య పాత్ర పోషిస్తోందన్నారు. ఆలయ అభివృద్ధికి ఇన్ఫ్లూయెన్సర్లు సహకరించాలని కోరారు. ఆన్లైన్ సేవలను విస్తృత పరచాలని, ముఖ్యంగా మన మిత్ర యాప్ వినియోగంపై భక్తులకు అవగాహన కల్పించాలన్నారు. ఆలయం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు ఇన్ఫ్లూయెన్సర్లు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలన్నారు. ఎందుకంటే దేవాలయాలకు సంబంధించిన ప్రతి విషయం ఎంతో సున్నితమైందన్నారు. కవరేజ్ కూడా పరిమితులకు లోబడి ఉండాలని సూచించారు. ఆలయంలో వీడియోలు తీయకూడదన్నారు. డ్రోన్ కవరేజ్ కూడా దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో జరగాలన్నారు. ఇన్ఫ్లూయెన్సర్లకు తాము పూర్తిగా సహకరిస్తామన్నారు. అనంతరం శ్రీగోమాత ప్రొడక్ట్స్ వారు సమకూర్చిన శ్రీవారి మెమెంటోలను ఈఓ త్రినాధరావు ఇన్ఫ్లూయెన్సర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ డీవీ భాస్కర్, డీఈవో వై.భద్రాజీ, ఏఈఓలు ఎం.దుర్గారావు, పి.నటరాజారావు, వాసు, లక్ష్మీపతి, సూపరింటిండెంట్లు, ఏఈలు, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, ఏలూరు, దెందులూరు, భీమడోలు, విజయవాడ, భద్రాచలం, అత్తిలి, కామవరపుకోట, దూబచర్ల, అయినవెల్లి తదితర గ్రామాలకు చెందిన ఇన్ఫ్లూయెన్సర్లు పాల్గొన్నారు. ఇన్ఫ్లూయెన్సర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి -
స్థానికంగానే ఆక్వా ఉత్పత్తుల అమ్మకం
● పాలకొల్లులో విక్రయ కేంద్రం ప్రారంభం ● మృగశిర కార్తె పురస్కరించుకుని రొయ్య, చేపలతో భోజనాలు పాలకొల్లు సెంట్రల్: గత రెండేళ్లుగా ఆక్వా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తి అరుస్తున్నా, ఫీడ్ ధరల పెంపు, ప్రాసెసింగ్ ధరల తగ్గింపు వంటి ఇబ్బందులను తొలగించడంలో ప్రభుత్వం విఫలమైంది. నిరసనలు, ధర్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో, మన దారి మనమే చూసుకోవాలనే దృఢ సంకల్పంతో జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్రాజు ఆధ్వర్యంలో సోమవారం పాలకొల్లు పూలపల్లి బైపాస్ రోడ్డులో నూతన ప్రాన్ డొమెస్టిక్ సేల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ఫిష్ ఆంధ్రా పథకాన్ని విమర్శించిన వారు, నేడు రైతులు సొంతంగా ఇటువంటి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి రావడాన్ని పలువురు గమనిస్తున్నారు. ఆక్వా రైతులు స్థానికంగా మార్కెట్ను పెంచుకునేందుకు ఈ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇక్కడ రొయ్యలు విక్రయించే వారికి సంఘం తరపున ఫ్రిజ్లు, రూ. 10,000 పెట్టుబడిని సహాయంగా అందిస్తామని గాంధీభగవాన్రాజు ప్రకటించారు. ఆక్వ్రా రైతు సంఘం నాయకులు ఎవరైనా రొయ్యలు విక్రయించాలని అనుకుంటే తాము వారికి సహకరిస్తామని తెలిపారు. ఈ కేంద్రాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మృగశిర కార్తెలో చేపలు, రొయ్యలు తినడం మన పూర్వీకుల సాంప్రదాయమని, ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం మంత్రి స్వయంగా కేజీ, అరకేజీ ప్యాకెట్ల రొయ్యలను వినియోగదారులకు విక్రయించి, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని ఆక్వా రైతులు పాలకొల్లు, ఆచంట, నర్సాపురంలలో ప్రజలకు చేపలు, రొయ్యల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. ఆక్వా సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీభగవాన్రాజు మాట్లాడుతూ ఆక్వా రైతులు ఫీడ్ ధరలు, ప్రాసెస్ యూనిట్ల వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రాసెసింగ్ యూనిట్లు అయినకాడికి దోచుకుంటున్నాయన్నారు. ఫీడ్ ధరలు పెంచడంతో ఆక్వా రైతు తలకుమించిన భారాన్ని మోస్తూ నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారని వాపోయారు. మన సాంప్రదాయాన్ని ప్రజలకు గుర్తుచేస్తూ ఆక్వా రైతులకు ఉపయోగపడేలా ప్రభుత్వాలు కళ్లు తెరిచేలా ఈ మృగశిర కార్తె రోజున పేద ప్రజలకు రొయ్య, చేపలతో భోజనాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. మృగశిర కార్తెతో రుతుపవనాలు మొదలై వాతావరణం చల్లబడుతుందని, శరీరంలో మార్పులు కలిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, చేపలు , రొయ్యలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన విందులో సుమారు ఐదు వేల మంది ప్రజలు పాల్గొని, గోంగూర పచ్చిరొయ్యలు, చేపల పులుసుతో భోజనం చేశారు. ఆక్వా సంఘం నాయకులు బోణం చినబాబు, మేడిది జాన్రాజు, సత్యనారాయణరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మృగశిర కార్తె భోజనాలు వడ్డిస్తున్న దృశ్యం అవుట్లెట్లో ఆక్వా ఉత్పత్తుల అమ్మకం -
10న ప్రభుత్వ ఉద్యోగుల సంఘ భవనం ప్రారంభం
యలమంచిలి: భీమవరం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వెనుక ఉన్న ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పశ్చిమగోదావరి జిల్లా నూతన భవనాన్ని ఈ నెల జూన్ 10న ప్రారంభిస్తున్నట్లు సంఘ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు షేక్ ఉమర్ అలీషా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, సంఘ ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ కుమార్ పాల్గొంటారన్నారు. నూజివీడు: పట్టణంలోని ఏడుమెట్ల బావి సెంటర్లో అద్దె ఇంట్లో ఉండే షేక్ మహబూబ్ సుభానీ(35) ఆదివారం అర్ధరాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన షేక్ మహబూబ్ సూబానీ నాలుగేళ్ల క్రితం నూజివీడు వచ్చి డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తున్నాడు. అతనికి అనారోగ్య సమస్యలతో పాటు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమీపంలోని వారు సోమవారం ఉదయం చూసి పట్టణ పోలీసులకు తెలపడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని కిందకు దింపించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కైకలూరు: అక్రమ కేసులో రిమాండ్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్త శ్రీహరిపురం గ్రామానికి చెందిన శొంఠి రవీంద్ర బెయిల్పై సోమవారం విడుదలయ్యాడు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) ఆధ్వర్యంలో శుక్రవారం జనసేన నేత కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ గొడవలో హెడ్కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. ఇందుకు కారణం వైఎస్సార్సీపీ కార్యకర్త రవీంద్ర అంటూ అదే రోజు రాత్రి 2 గంటల ప్రాంతంలో అరెస్టు చేశారు. బెయిల్పై విడుదలైన రవీంద్ర నాయకులతో కలసి కై కలూరు పార్టీ కార్యాలయంలో డీఎన్నార్ను మర్వాదపూర్వకంగా కలిశారు. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చిన పార్టీ అండగా ఉంటుందని డీఎన్నార్ చెప్పారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): రైలు ఢీకొని ఒకరు మృతి చెందినట్లు తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు వెల్లడించారు. తాడేపల్లిగూడెం సుబ్రహ్మణ్యేశ్వరస్వామి గుడి వద్ద ట్రాక్ సమీపంలో 40–45 ఏళ్ల వయసున్న పురుషుడు సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని రైలు ఢీకొని మరణించినట్లు తెలిపారు. 5 అడుగుల ఎత్తు, నలుపు, తెలుపు రంగు షర్ట్, నీలం రంగు షార్ట్, బనియన్ ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలపారు. భీమవరం: దాడి ఘటనపై పరస్పర ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రెహ్మాన్ తెలిపారు. ఈ నెల 7వ తేదీ రాత్రి రాయలం గ్రామంలో ఉన్న తన స్నేహితుడు తరుణ్కు టిఫిన్ ఇవ్వడానికి వెళుతుండగా భాస్కర దుర్గాప్రసాద్, మరో ఐదుగురు దాడి చేశారని పండ్ల నందకిషోర్ ఫిర్యాదు చేశాడు. తాను పశువుల పాక దగ్గరకు వెళ్లి వస్తుండగా నందకిషోర్ దాడి చేశాడని భాస్కర దుర్గాప్రసాద్ ఫిర్యాదు చేశాడు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
చింతంపల్లిలో ఎస్పీ ‘పల్లెనిద్ర’
చింతలపూడి: గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలు–పోలీసుల మధ్య సత్సంబంధాలు పెంపొందించడమే ధ్యేయంగా ఏలూరు జిల్లా పోలీస్ శాఖ సరికొత్తగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా చింతలపూడి మండలం చింతంపల్లి గ్రామంలో సోమవారం రాత్రి నిర్వహించిన ‘పల్లెనిద్ర’ కార్యక్రమంలో ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ ప్రజలతో గడిపారు. కార్యక్రమంలో భాగంగా ఎస్పీ గ్రామంలోని వీధుల్లో పర్యటించారు. స్థానిక ప్రజలతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, యువత భవిష్యత్తు, మత్తు పదార్థాల నివారణ, ప్రస్తుత రోజుల్లో పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల గ్రామస్తులకు, మహిళలకు అవగాహన కల్పించారు. యువత చెడు అలవాట్లకు, వ్యసనాలకు దూరంగా ఉంటూ.. ఉన్నత విద్య, క్రీడలపై దష్టి సారించి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఎస్పీ హితవు పలికారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. పల్లెనిద్ర కార్యక్రమంలో ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామ యువతతో కలిసి ఆయన వాలీబాల్ ఆడారు. ఎస్పీ స్వయంగా కోర్టులోకి దిగి యువకులతో సరదాగా ఆట ఆడటంతో అక్కడి వాతావరణం ఎంతో ఉత్సాహంగా మారింది. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాధన్, చింతలపూడి సీఐ క్రాంతికుమార్, ఎస్ఐ సతీష్ కుమార్, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్లో 348 అర్జీల స్వీకరణ
ఏలూరు (టూటౌన్): ఏలూరు కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లలో 348 అర్జీలు స్వీకరించి నట్టు జేసీ ఎంజె అభిషేక్ గౌడ తెలిపారు. ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఇన్చార్జ్ డీఆర్వో ఎల్.దేవకీదేవి, ఆర్డీఓ కె.లక్ష్మీప్రసన్న, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి, జిల్లా పంచాయతీశాఖ అధికారి జి.మల్లికార్జురావు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● భీమడోలు మండలం అర్జవారిగూడేనికి చెందిన గండి రాఘవులు బియ్యం కార్డు ఆన్లైన్ కోసం అర్జీ అందించారు. ● పెదవేగి మండలం రాట్నాలకుంటకు చెందిన ఉల్లిబోయిన రాజేష్ తన భూమి 22ఏలో నమోదైందని, తొలగించాలని కోరారు. ● లింగపాలెం మండలం సింగగూడేనికి చెందిన శికాకొల్లు అనురాధ తన కుమార్తెకు మిషన్ వాత్సల్య పథకం వర్తింపజేయాలని కోరారు. ● ఏలూరు అమీనాపేటకు చెందిన పుప్పాల ముకుందరావు ఏలూరు టౌన్ ఆటోమొబైల్స్ సంఘానికి చెందిన నిధులను ప్రెసిడెంటు, కార్యదర్శి స్వాహా చేశారని, రికవరీ చేయాలని అర్జీ అందించారు. ● వేలేరుపాడు మండలం మద్దిగట్లకి చెందిన సొందే భూబమ్మ తన భూమి ఆక్రమణపై ఫిర్యాదు చేశారు. -
గళమెత్తిన మధ్యాహ్న భోజన కార్మికులు
ఏలూరు (టూటౌన్): మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కార్మికుల ఉపాధి పో గొట్టే స్మార్ట్ కిచెన్లు రద్దు చేయాలని కోరుతూ ఏపీ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం.నాగమణి మాట్లాడుతూ కూట మి ప్రభుత్వం 23 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను తొలగించేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. స్మార్ట్ కిచెన్ పేరుతో ఒకేచోట వండి స్కూల్కు క్యారేజీలు పంపాలని నిర్ణయించడంతో వేలాది మంది కార్మికుల ఉపాధి పోతుందన్నారు. ఇప్పటికే పలు సమస్యలతో తాము పథకాన్ని నిర్వహిస్తున్నామని, ఇప్పుడు అన్యాయంగా తొలగించా లని చూడటం దుర్మార్గమన్నారు. పథక కార్మికులకు రూ.10 వేల వేతనం ఇవ్వాలని, ప్రతినెలా 5లోపు వేతనాలు, బిల్లులు చెల్లించాలనీ, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలనీ, రెండు జతల యూనిఫాం, గుర్తింపు కార్డు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె.పోసమ్మ మద్దతు తెలిపారు. -
దగా పాలనకు రెండేళ్లు
నూజివీడు: వైఎస్సార్సీపీ సదస్సులో మాట్లాడుతున్న నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గణపవరం: ఉంగుటూరు మండలం నారాయణపురంలో జరిగినసదస్సులో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు బుట్టాయగూడెం: కూటమి ప్రభుత్వ అరాచకాలను పోస్టర్ ద్వారా వివరిస్తున్న పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గణపవరం (ఉంగుటూరు)/నూజివీడు/బుట్టాయగూడెం/ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వ రెండేళ్ల దగా పాలనకు నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’కార్యక్రమాల్లో భాగంగా సోమవారం జిల్లాలో ని పలు నియోజకవర్గాల్లో సదస్సులు నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం హామీల అమలును విస్మరించడంపై నాయకులు నిలదీశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలు, దౌర్జన్యాలను పోస్టర్లు, ఫొ టో గ్యాలరీల ద్వారా వివరించారు. ఉంగుటూరు మండలం నారాయణపురం కమ్మ కల్యాణ మండపంలో పార్టీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు విచ్చలవిడి గా ప్రజాధనాన్ని వృథా చేస్తూ విమానాలు, హెలికాప్టర్లపై చక్కర్లు కొడుతూ ఇచ్చిన హామీలను, పాలనను గాలికొదిలేశారని మండిపడ్డారు. కూటమి నాయకులు పొదుపుపై ప్రజలకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు, పవన్కల్యాణ్ చెప్పిన మాటలు నమ్మి ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వ మోసాలపై వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళనలకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోందన్నారు. అధికార పార్టీ నాయకులు మట్టి, మద్యం, ఇసుక, కాంట్రాక్టులతో అందినకాడికి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు ఏఎస్ రాజు మాట్లాడుతూ కూటమి రెండేళ్ల పాలనలో ఒక్క కొత్త సామాజిక పింఛను మంజూరు చేయలేదన్నారు. కూటమి అరాచక పాలనపై వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు. కూటమి ఎగ్గొట్టిన హామీల ప్లకార్డులను ప్రదర్శించారు. ముందుగా కూటమి అరాచక, రెడ్బుక్ పాలనకు వ్యతిరేకంగా నల్ల బెలూన్లు ఎగురవేశారు. ప్రభుత్వ దుర్మార్గాలను తెలిపే ఫొటో గ్యాలరీని పార్టీ నేతలు తిలకించారు. నాలుగు మండలాల పార్టీ కన్వీనర్లు మరడ మంగారావు, దండు రాము, సంకు సత్యకుమార్, రావిపాటి శ్రీనివాస్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ ముఖ్యనేతలు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. గణపవరం: నారాయణపురం సదస్సులో కూటమి హామీల ప్లకార్డులు చూపుతూ నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులు ఏలూరు టౌన్: నియోజకవర్గ సమావేశంలో మాట్లాడుతున్న ఏలూరు సమన్వయకర్త జయప్రకాష్ గళమెత్తి.. గర్జించి.. హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఏదంటూ ఆగ్రహం వైఎస్సార్సీపీ రౌండ్ టేబుల్ సమావేశాల్లో నాయకుల నిలదీత మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని, డీఎస్సీలో అవినీతి, అవకతవకలకు పాల్పడిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. నూజివీడు పార్టీ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేయడమే కాకుండా మెగా డీఎస్సీ పేరుతో అనేక అక్రమాలకు, అవినీతికి టీడీపీ ప్రభుత్వం పాల్పడిందన్నారు. క్రీడా కోటా పేరుతో డీఎస్సీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చి అవకతవకలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. దీనివల్ల లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు రాక తీవ్ర అన్యాయానికి గురయ్యారన్నారు. సూపర్ సిక్స్ అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మామిడి, మొక్కజొన్న రైతులు నష్టపోతున్నా వారిని ఆదుకుందామనే ఆలోచన కూడా కూటమి ప్రభుత్వం చేయలేదని దుయ్యబట్టారు. ఆగిరిపల్లి మండలంలో కొండలన్నింటినీ కొల్లగొడుతూ మట్టి, గ్రావెల్ను దోచుకుంటున్నారన్నారు. పార్టీ క్రిస్టియన్ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు పిళ్లా చరణ్, ముసునూరు జెడ్పీటీసీ వరికూటి ప్రతాప్, జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, నూజివీడు పట్టణ, ముసునూరు, చాట్రాయి మండలాల అధ్యక్షులు శీలం రాము, పోలిమెట్ల శివ, మూల్పురి నాగవల్లేశ్వరరావు, పుచ్ఛకాయల సుబ్బారెడ్డి తదితరులు ప్రసంగించారు. నాయకులు వెంకట సుబ్బ య్య, ఆగిరిపల్లి బెజవాడ రాంబాబు, మలిశెట్టి బాబీ, అత్తి మురళీ, బసవా రామకృష్ణ, మందాడ శివశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన సమయం వచ్చిందని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. బుట్టాయగూడెంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ ఈనెల 12న కన్నాపురం నుంచి కొయ్యలగూడెం వరకూ నిరసన ర్యాలీ చేపట్టనున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విధానాలను ప్రజలకు తెలియ జేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా పాటుపడాలన్నా రు. ప్రతిఒక్కరికీ తాను అందుబాటులో ఉంటానన్నారు. పార్టీ మండల కన్వీనర్లు అల్లూరి రత్నాజీరావు, చందా ప్రసాద్, తుమ్మలపల్లి గంగరాజు, బుగ్గా మురళి, ఎస్పీవీఎస్ రాజు, ఎంపీపీలు తెల్లం రమణ, సుంకర వెంకటరెడ్డి, గంజిమాల రామారావు, పార్టీ జిల్లా కార్యదర్శులు ఆరేటి సత్యనారాయణ, సయ్యద్ బాజీ, దాసరి విష్ణు, రాష్ట్ర కార్యదర్శి మంతెన సోమరాజు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి మధు, నాయకులు తాళ్లూరి ప్రసాద్, బానోతు కృష్ణ నాయక్, బగ్గి దినేష్, ఏలేటి చంద్రం తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఏలూరు సమన్వయకర్త జయప్రకాష్ టీడీపీ కూటమి రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసిం దేమీ లేదనీ, సూపర్ సిక్స్ హామీలకే దిక్కులేదనీ, ఇంక మేనిఫెస్టో అమలు చేసే దమ్ము కూటమి ప్రభుత్వానికి లేదని వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ విమర్శించారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ వైఫల్యాలపై సదస్సు నిర్వ హించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలోని 143 హామీలను నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. సూపర్సిక్స్లో నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. గద్దెనెక్కి రెండేళ్లు గడిచినా ప్రజలకు ఏమీ చేయలేక చేతులెత్తేశారనీ, కేవలం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరించటం, అక్రమ కేసులు పెట్టడం, దాడులు, దౌర్జన్యాలు చేయటం మాత్రమే కూటమి ప్రభుత్వం పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే అన్నారు. ప్రస్తుతం అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందనీ వ్యవసాయం చేయలేని దుస్థితిలోకి వెళ్లారన్నారు. పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, బీసీసెల్ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, నాయకులు గంటా మోహనరావు, కొల్లిపాక సురేష్, చిలకపాటి డింపుల్, జిజ్జువరపు విజయనిర్మల, ఇనపనూరి జగదీష్, గాజుల బాజీ, దాసరి రమేష్, కిలాడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు నిర్మాణానికి అనుమతులు
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం గానుగమామిడి నుంచి రేగులపాడు, రేపల్లె గ్రామాలకు రోడ్డు నిర్మాణ పనులకు ఉన్నతాధికారుల నుంచి అనుమతులు వచ్చినట్టు జంగారెడ్డిగూడెం అటవీశాఖ రేంజ్ అధికారి వి.దుర్గాకుమార్ బాబు తెలిపారు. ‘సాక్షి’లో సోమవారం ప్రచురించిన ‘దారీతెన్నూలేదు’ శీర్షికన కథనానికి స్పందించారు. లంకపాకల, డోలుగండి జంక్షన్ నుంచి రేగులపాడు రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదనను ఉన్నతాధికారులు అనుమతించారన్నారు. అయితే కొమ్మలు కత్తిరించడం వంటి పనులు జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ రేంజ్ అధికారి లేదా ఆయన ప్రతినిధి పర్యవేక్షణలో చేయాలన్నారు. అలాగే నిర్మాణ పనులనూ పర్యవేక్షించాల్సి ఉందన్నారు. నిబంధనల మేరకే రోడ్డు పనులు చేస్తారన్నారు. నిబంధనల మేరకే అటవీ శాఖ కూడా అనుమతులు ఇస్తుందన్నారు. అలాగే ప్రస్తుతం పాపికొండల అభయారణ్యంలో ఫినిషింగ్ జోన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, దానిని దృష్టిలో పెట్టుకుని అనుమతులు ఇచ్చినట్టు చెప్పారు. -
డీఎస్సీ అక్రమాలపై విచారణ చేపట్టాలి
ఏలూరు టౌన్: మెగా డీఎస్సీ–25పై అభ్యర్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారనీ, సీబీఐతో విచారణ చేయించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నేతలు సోమవారం జేసీ అభిషేక్ గౌడ్కు వినతిపత్రం సమర్పించారు. పరీక్షల నిర్వహణలో లీకేజీలు, అవకతవకలు, అధికార దుర్వినియోగం అభ్యర్థులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయనీ వారిలో విశ్వాసాన్ని కల్పించేందుకు విచారణ చేపట్టి వాస్తవాలు వెల్లడి చేయాలన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్ మాట్లాడుతూ డీఎస్సీ–25లో ప్రశ్నాపత్రాల భద్రత, పరీక్షల నిర్వహణ, స్పోర్ట్స్ కోటాలో ఎంపిక చేస్తూ ఉద్యోగ నియామకాలు, సర్టిఫికెట్ల పరిశీలనపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద నిరుద్యోగ అభ్యర్థు ల ఆశలపై నీళ్లు చల్లుతూ అన్యాయం జరిగిందనే అ భియోగాలపై విచారణ చేపట్టాలన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో నిరుద్యోగ యువత పక్షాన పోరాటం చేస్తామన్నారు. వినతిపత్రం సమర్పించిన వారిలో వైఎస్సార్సీపీ జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, ఎస్సీసెల్ నగర అధ్యక్షులు ఇనపనూరి జగదీష్ ఉన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నేతలు -
ముగిసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్
నూజివీడు: ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల ప్రక్రియలో భాగంగా మూడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన సోమవారంతో ముగిసింది. చివరి రోజు పరిశీలనకు ఎన్సీసీ కోటాలో 305 మందికి 185 మంది, క్యాప్ కోటాలో 55 మందికి 42 మంది, స్పోర్ట్స్ కోటాలో 119 మందికి 90 మంది, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో 282 మందికి 195 మంది హాజరయ్యారు. ఆర్జీయూకేటీ వీసీ ఆచార్య మద్దాలి లక్ష్మీ నారాయణరావు, నూజివీడు ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ఆచార్య గోపాల రాజు, ఏవో లక్ష్మణరావు, అకడమిక్ డీన్ సాదు చిరంజీవి పరిశీలించారు. మొత్తంగా 761 మంది అభ్యర్థులకు 512 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరయ్యారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ పర్యవేక్షించగా డీఎస్డబ్ల్యూఓ రాజేష్, గణిత అధ్యాపకులు సతీష్కుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అర్జునరావు పాల్గొన్నారు. చిన వెంకన్నకు కాసుల పంట ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి ఆ లయ హుండీల ఆదాయాన్ని సోమవారం దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, మద్ది ఆంజనేయస్వామి ఆలయ ఈఓ ఆర్వీ చందన పర్యవేక్షణలో లెక్కించారు. 18 రోజులకు నగదు రూపేణా రూ.2,42,55,625 ఆదాయం లభించి నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలి పారు. కానుకల రూపేణా 191 గ్రాముల బంగారం, 3.274 కేజీల వెండితో పాటు అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అలాగే లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.1,000, రూ. 500 నోట్ల ద్వారా రూ.8 వేలు లభించినట్టు చెప్పారు. సగటున రోజుకు శ్రీవారికి రూ.13,47,535 ఆదాయం లభించినట్టు ఈఓ చెప్పారు. ఏలూరు (టూటౌన్): స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈనెల 11న జిల్లాలో పర్యటించనున్నారని, బీసీలు తమ వాణి వినిపించాలని బీసీ కులాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక యాదవ సంఘ భవనంలో సోమవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో బీసీల విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సంఘాలు, బీసీ డిమాం డ్లను వినతిపత్రాల ద్వారా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు లంక వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు ఉక్కుసూరి గోపాలకృష్ణ, కార్యదర్శి ఎ.మురళి, సైదు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు రెండో రోజు నవచేతన యాప్పై ఈదర సుబ్బమ్మదేవి స్కూల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీడీపీఓ ఎ.పద్మావతి మాట్లాడుతూ యాప్ ద్వారా స్క్రీనింగ్ ఎలా చేయాలి, ఎదుగుదల స్థాయిని ఎలా గుర్తించాలి అనే అంశాలను వివరించారు. పిల్లల్లో శారీరకంగా మానసికంగా, అభివృద్ధిని ఎలా గమనించాలనే విషయాలపై పూర్తి అవగాహన కల్పించారు. ఆరేళ్లలోపు పిల్లలను సర్వే చేయాల్సి ఉందన్నారు. డాక్టర్ ప్రదీప్ చంద్ర, సూపర్వైజర్లు మంగ, జోషి, మీనాక్షి, సత్య, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘దారీ’తెన్నూ లేదు
● అటవీ శాఖ అభ్యంతరాలు ● ఏజెన్సీలో నిలిచిన రోడ్డు నిర్మాణాలు ● ఆందోళనలో గిరిపుత్రులు బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామాలకు సరైన రోడ్లు లేక కొండరెడ్డి గిరిజనులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పలు రహదారుల నిర్మాణాలకు ప్రభుత్వా లు నిధులు మంజూరు చేసినా అటవీ శాఖ అధికారులు అభ్యంతరాలతో పనులు ముందుకు సాగడం లేదు. దీంతో ఆయా గ్రామాల్లో గిరిజనులు గ్రామా లు దాటాలంటే కొండలు, గుట్టలు ఎక్కిదిగాల్సి వస్తోంది. తమకు రహదారి కష్టాలు తీర్చాలని మొరపెట్టుకున్నా అటవీశాఖ అధికారులు కనికరం చూ పడం లేదని గిరిజనులు అంటున్నారు. ఇదిలా ఉండగా అనుమతుల కోసం ఉన్నతాధికారులకు నివే దించామని స్థానిక అటవీ అధికారులు చెబుతున్నా రు. రానున్న వర్షాకాలంలో మరిన్ని తిప్పలు తప్ప వని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. నిలిచిన పనులు ఇలా.. ● బుట్టాయగూడెం మండలంలో అలివేరు నుంచి లంకపాకల మీదుగా రేగులపాడు, రేపల్లె గ్రా మాలకు సుమారు 5.7 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణానికి 2022–23లో సుమారు రూ.2.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అలివేరు నుంచి లంకపాకల మీదుగా గానుగమామిడి వరకు రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. మిగిలిన రోడ్డు పనులు అటవీ మార్గంలో ఉండడంతో ఫారెస్ట్ అధికారులు అభ్యంతరాలు తెలపగా పనులు నిలిచిపోయాయి. ● వేలేరుపాడు, బుట్టాయగూడెం మండలాల సరిహద్దు మారుమూల అటవీ ప్రాంతంలో కొండరెడ్డి గిరిజనులు స్వాతంత్య్రానికి ముందు నుంచి నివసిస్తున్న మోదేలు గ్రామానికి రహదారి ని ర్మాణం కోసం సుమారు రూ.4 కోట్ల నిధులు మంజూరయ్యాయి. విద్యుత్ సదుపాయానికి మ రో రూ.70 లక్షలు మంజురయ్యాయి. అయితే వీ టికి కూడా అటవీ అధికారులు అభ్యంతరం చె ప్పడంతో ఆయా పనులు నిలిచిపోయాయి. అ లాగే ప్రధానమంత్రి జన్మాన్ పథకం కింద 19 కు టుంబాలకు గృహాలు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి కూడా ఫారెస్ట్ అధికారులు అభ్యంతరాలు చెప్పగా అవీ నిలిచిపోయాయి. ● మారుమూల గ్రామం రామనర్సాపురానికి కూ డా పీఎం జన్మాన్లో నిధులు మంజూరైనా అటవీశాఖ అధికారుల అభ్యంతరాలతో పనులు నిలిచిపోయాయి. ● రెడ్డికోపల్లి నుంచి వీరన్నపాలెం గ్రామానికి సుమారు రూ.4.8 కోట్ల అంచనాలతో 4 కిలోమీ టర్ల మేర రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి కూడా ఫారెస్ట్ అధికారుల అభ్యంతరాలు చెప్పారు. ● ఆయా పనుల కోసం స్థానిక అటవీ అధికారులు పంపుతున్న సర్వే నివేదికలను ఆమోదించకుండా ఉన్నతాధికారులు తిరస్కరిస్తున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ధ్దాలుగా కొండలపై నివసిస్తున్న కొండరెడ్డి గిరిజనులకు సరైన రహదారి లేక అవస్థలు పడతున్నారు. రోడ్ల నిర్మాణాల కోసం ఉన్నతాధికారులు సర్వేలు చేసి ప్రతిపాదనలు పంపిస్తున్నా ఫారెస్ట్ అధికారులు అభ్యంతరాలు తెలిపి తిరస్కరించడం బాధాకరం. వర్షాకాలం రానే వచ్చింది. అధ్వానంగా ఉండే రోడ్లపై గిరిజనులు ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. అటవీ అధికారులు రోడ్డు పనులకు అనుమతులు ఇచ్చేలా కృషి చేయాలి. – కారం రాఘవ, న్యూడెమోక్రసీ నాయకుడు, అలివేరు, బుట్టాయగూడెం మండలం -
డ్రోన్ కెమెరాలతో నిఘా
ఏలూరు టౌన్: ఏలూరు రూరల్ పరిధిలోని వైఎస్సార్ కాలనీ, పోణంగి గ్రామాలపై డ్రోన్ కెమెరాలతో ఆదివారం సాయంత్రం ప్రత్యేకంగా నిఘా ఉంచారు. ఆయా ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు వన్టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు. వైఎస్సార్ కాలనీ, పోణంగి గ్రామాల పరిధిలో అసాంఘిక శక్తుల కదలికలు, సామాజిక నేరాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు డ్రోన్ నిఘా ఉపయోగపడుతుందని సీఐ తెలిపారు. ప్రజలకు భరోసా కల్పించటంతోపాటు నేరాలకు పాల్పడే వారిలో చట్టం పట్ల భయం ఉండాలని తెలిపారు. -
అడ్డూ అదుపు లేని మట్టి దందా
ఉండి: మండలంలో మట్టి అక్రమ రవాణా కోసం పంట కాలువలు, పిల్ల కాలువలు, మేజర్, మైనర్ డ్రెయిన్లను ఆక్రమించి, అక్రమంగా వంతెనలు నిర్మించి మట్టిని తరలిస్తున్నారు. దీంతో కలిసిపూడి పంట కాలువ గట్టు అధ్వానంగా మారడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చెరుకువాడ, కలిసిపూడి గ్రామాల సరిహద్దులో గతంలో నిర్మించిన వంతెనకు అప్రోచ్ రోడ్డు కూడా లేదు. ఇప్పుడు అక్రమ మట్టి రవాణా కోసం తమకు అనుకూలంగా వంతెనకు అప్రోచ్ను ఏర్పాటు చేసుకుని, భారీ వాహనాల్లో మట్టిని తరలిస్తున్నారు. జాతీయ రహదారిపైనే అక్రమ అప్రోచ్ వంతెనకు ఏర్పాటు చేసిన ఈ అప్రోచ్ రోడ్డు, జాతీయ రహదారి–165లో ఒకవైపు భాగాన్ని పూర్తిగా ఆక్రమించేసింది. దానికి తోడు, వంతెన మీదుగా భారీ వాహనాలు అధిక లోడుతో వెళ్లడంతో అప్రోచ్ మట్టి రహదారిపైకి జారిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క అధికారీ పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు విమర్శిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న చినుకులకు, అప్రోచ్ కోసం వేసిన కంకర మట్టిలా మారి జారిపోతోంది. దీనివల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదాల నిలయంగా రహదారి అధిక లోడుతో వెళ్తున్న మట్టి వాహనాల నుంచి పెద్ద పెద్ద మట్టి పెళ్లలు రోడ్డుపై పడుతుండటంతో, వెనుక వస్తున్న వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. శనివారం ఇదే ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. ఓవర్లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్పై నుంచి మట్టి పెళ్ల పడటంతో, దానిని తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కింద పడి గాయాలపాలయ్యారు. జాతీయ రహదారిని సగానికి పూడ్చేసినా, ఓవర్లోడ్ వాహనాలతో ప్రయాణికులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా.. అధికారులు ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని వాహనదారులు వాపోతున్నారు. -
వాగ్దానాలు మరిచి.. వంచనతో పాలించి..
సాక్షి, భీమవరం: ‘ఏం తమ్ముళ్లూ.. అధికారంలోకి రావడమే ఆలస్యం.. అవి చేస్తాం.. ఇవి చేస్తాం..’ అంటూ ఎన్నికల్లో హామీల వరద పారించారు చంద్రబాబు. గోదావరిపై వంతెనలు కట్టేస్తానన్నారు.. విజ్జేశ్వరం నుంచి ఇంటింటికీ రక్షిత నీరు ఇచ్చేస్తానన్నారు.. ఆడబిడ్డకు నిధి అన్నారు.. నిరుద్యోగులకు భృతి అన్నారు.. తణుకులో హైటెక్ టవర్, ఆకివీడులో కోల్డ్ స్టోరేజీలు, ఆక్వా రైతులకు రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ అంటూ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీలను పట్టాలెక్కించలేదు. సీఎం చంద్రబాబు సోమవారం జి ల్లాకు వస్తుండటంతో ఎన్నికల్లో ఆయన ఇచ్చిన వా గ్దానాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ● 2024 ఏప్రిల్ 10.. తణుకులోని నరేంద్ర సెంటర్ వద్ద బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ తణుకులో హైటెక్ టవర్ నిర్మిస్తానన్నారు. ఇంటి వద్ద నుంచే ఉద్యోగాలు చేసుకునేలా సాంకేతికతను అందుబాటులోకి తెస్తానని, తణుకును పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, వలసలు అరికడతానని హామీ ఇచ్చారు. ● 2024 మే 10.. ఉండి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ ఆక్వా రైతుల కోసం 500 టన్నులు కెపాసిటీ కలిగిన కోల్డ్ స్టోరేజీలు కట్టిస్తానన్నారు. ఏరియేటర్స్ మీద సబ్సిడీ ఇప్పిస్తానన్నారు. యూనిట్ రూ.1.50కే ఇచ్చి ఆక్వా రంగాన్ని పైకి తీసుకువస్తానన్నారు. నియోజకవర్గంలో భూగర్భ జలాలు కలుషితం కావడంతో విజ్జేశ్వరం నుంచి ప్రొజెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని ఇంటింటికీ కుళాయిల ద్వారా ఇస్తానన్నారు. ఆకివీడులో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి లేదా ఫ్లైఓవర్ నిర్మిస్తామని హామీల గుప్పించారు. రెండేళ్లు కావస్తున్నా ఇవేమీ కార్యరూపం దాల్చలేదు. ● 2024 జనవరిలో.. ఆచంటలో జరిగిన టీడీపీ రా కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అ యోధ్యలంక–కోడేరు మధ్య గోదావరిపై వారధి నిర్మిస్తామని మాటిచ్చారు. ● కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లయినా కేబినేట్లో ఆమోదం అంటూ వశిష్ట వారధి నిర్మాణం ఇంకా ప్రకటనలకే పరిమితమైంది. ఏటా వరదల సమయంలో లంక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీయాల్సి వస్తుంది. ఆచంట, పెనుగొండ, పోడూరు, పాలకొల్లు, యలమంచిలి మండలాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి దొంగరావిపాలెంలోని కోడేరు బ్యాంకు కెనాల్లోకి ఎత్తిపోతల పథకం నిర్మాణం హామీ అటకెక్కిపోయింది. ఆచంట, పోడూరు, పెనుగొండ, యలమంచిలి మండలాల్లోని నక్కల డ్రెయిన్ ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటామన్నారు. అభివృద్ధి మాట పక్కనపెడితే రెండేళ్లుగా కూటమి నాయకులు డ్రెయిన్ గట్లకు తూట్లు పొడుస్తూ యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. రైతును రాజును చేస్తానంటూ ఎన్నికల్లో చెప్పుకొచ్చిన చంద్రబాబు పాలనలో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. జిల్లాలోని 80 వేల మంది కౌలు రైతులను పూర్తిగా విస్మరించారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కొందరికే పరిమితం చేశారు. రైతుల కోసం గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత పంటల బీమా పథ కాన్ని ఎత్తివేశారు. నీటి తీరువాను వడ్డీలతో కలిపి వసూలు చేస్తూ రైతుల నడ్డి విరుస్తున్నా రు. గత ఖరీఫ్లో మోంథా తుఫానుతో జి ల్లాలో 9,201 హెక్టార్లలో రూ.23 కోట్ల మేర పంట నష్టం వాటిల్లగా ఇప్పటికి పరిహారం అందక తొలకరి పెట్టుబడుల కోసం రైతులు అగచాట్లు పడుతున్నారు. మరోపక్క సీడ్, ఫీడ్, ఎక్స్పోర్టర్స్ సిండికేట్ దోపిడీ నుంచి ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ కూటమి పాలనలో తరచూ జిల్లాలోని ఆక్వా రైతులు రోడ్డెక్కుతున్న పరిస్థితి. ఎన్నికల్లో మాట ఇచ్చినట్టుగా రూపాయిన్నరకే సబ్సిడీ విద్యుత్ అందజేయాలని, కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల వాగ్దానాలు అమలుచేయాలని, స మస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సూపర్ సిక్స్ అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి తొలి ఏడాది ఎగనామం పెట్టారు. లబ్ధిదారుల సంఖ్యకు భారీగా కోతలు పెట్టి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలను మమ అనిపిస్తున్నారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి హామీల అమలు ఊసెత్తడం లేదు. రెండేళ్లలో ఆడబిడ్డ నిధి అందక జిల్లాలో అర్హత కలిగిన సుమారు 5.96 లక్షల మంది మ హిళలు రూ.2,146 కోట్లు నష్టపోయారు. నెలనెలా ఇస్తామన్న రూ.3 వేల భృతి కోసం జి ల్లాలోని వేలాది మంది నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండలం సిద్ధాంతంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు సిద్ధాంతం చేరుకుని గ్రామసభలో పాల్గొంటారు. రైతులతో మాట్లాడి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. బురిడీ బాబూ ! ఎన్నికల్లో జిల్లాకు హామీల వరద పారించిన చంద్రబాబు విజ్జేశ్వరం నుంచి ఇంటింటికీ తాగునీరు వశిష్ట గోదావరిపై వంతెనల నిర్మాణం తణుకులో హైటెక్ టవర్, వలసల నిరోధానికి పరిశ్రమల ఏర్పాటు ఆక్వా రంగానికి రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ హామీల అమలుపై చిత్తశుద్ధి కరువు నేడు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక -
లోకలే బెటరొయ్య
సాక్షి, భీమవరం: సిండికేటు దోపిడీతో కుదేలవుతున్న ఆక్వా రంగాన్ని కాపాడుకునే దిశగా ఆక్వా రై తులు అడుగులు వేస్తున్నారు. చేపలు, రొయ్యలకు లోకల్ మార్కెట్ను పెంచుకునే పనిలో ఉన్నారు. అందులో భాగంగా పాలకొల్లులోని జైభారత్ క్షీరారామ ఆక్వారైతు సంఘం మృగశిర సెంటిమెంట్ను తెరపైకి తెచ్చింది. చేపలు, రొయ్యలతో సోమ వారం ప్రత్యేక భోజనాలు ఏర్పాటుచేసింది. 2.63 లక్షల ఎకరాల్లో.. జిల్లాలోని 2.63 లక్షల ఎకరాల్లో ఆక్వా చెరువులకు 60 శాతం విస్తీర్ణంలో వనామీ సాగు చేస్తున్నారు. ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎక్స్పోర్టర్స్ ఏకమై ఇష్టానుసారం రొయ్య, చేపల ధరలు తగ్గించేసి, మేత ధరలు పెంచుతూ తమ కష్టాన్ని దోచుకుంటున్నారని ఆక్వా రైతులు వా పోతున్నారు. ఇటీవల ఎక్స్పోర్టర్స్ ధరలను తగ్గించడంపై జైభారత్ క్షీరారామ ఆక్వారైతు సంఘం ఆధ్వర్యంలో ఆక్వా రైతులు పాలకొల్లులో రొయ్యలను రోడ్డుపై వేసి నిరసన తెలిపారు. ఫీడ్ ధరలు పెంపుపై పాలకొల్లు, వీరవాసరం, ఉండి తదితర చోట్ల రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేశారు. స్థానిక అమ్మకాలు పెంచేందుకు.. రొయ్యల వినియోగంలో ఏడాదికి తలసరి 10 నుంచి 12 కిలోల సగటుతో చైనా ముందుంటే, 8–10 కిలోలతో అమెరికా రెండో స్థానంలో, ఎనిమిది కిలోలతో యూరోపియన్ దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ దేశాలకు రొయ్యలు ఎగుమతి చేస్తున్న మన రాష్ట్రంలో సగటు వినియోగం కేవలం 1.5 కిలోలు మాత్రమేనని ఆక్వా వర్గాలంటున్నాయి. స్థానిక వినియోగం పెంచడం ద్వారా సిండికేట్ దోపిడీకి కళ్లెం వేయాలన్న యోచనలో రైతులు ఉన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల వివిధ కౌంట్లలోని రొయ్యలను ప్రాసెసింగ్ చేసి విక్రయిస్తున్నారు. పాలకొల్లులో యూనిట్ను ఏర్పాటుచేశారు. ఉచిత భోజనాలు మృగశిర కార్తెతో రుతుపవనాలు మొదలవుతాయి. వర్షాలు కురవడంతో తేమ ఎక్కువై జలుబు, దగ్గు, ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలు వస్తాయి. చేపలు, రొయ్యల్లో ఉండే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఈ, ప్రొటీన్లు, ఐరన్, జింక్ శ్వాసకోశాన్ని బలంగా ఉంచి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే ఈ సీజనన్లో వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కోసం చేపలు, రొయ్యలు తినడం అ నాదిగా వస్తున్న ఆచారం. ఆక్వా రైతుల సమస్యలపై ఉద్యమిస్తున్న జైభారత్ క్షీరారామా ఆక్వా రైతు సంఘం డొమెస్టిక్ సేల్స్ పెంచేందుకు కృషి చేస్తోంది. చేపలు, రొయ్యల్లోని పోషకాలు, ఉపయోగాలపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. మృగశిర కార్తె రోజున ప్రతి కుటుంబం కిలో రొయ్యలు, కిలో చేపలు కొనుగోలు చేయాలని సంఘ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. సోమవారం మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా పేదల కోసం సంఘ ప రిధిలోని పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్, ఆచంట నియోజకవర్గం మార్టేరు సెంటర్, నరసాపురం సెంటర్లో చేపలు, రొయ్యల వంటకాలతో ఉచిత భోజనాలు ఏర్పాటుచేశారు. స్థానిక వినియోగం పెంపు లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సంఘ నాయకులు చెబుతున్నారు. సీ ఫుడ్ డొమెస్టిక్ వినియోగం పెంచేందుకు గత వైఎస్సార్ ప్రభుత్వం కృషి చేసింది. ఫిష్ ఆంధ్రా ద్వారా జిల్లాలో సబ్సిడీపై రూ.లక్ష నుంచి రూ.3 లక్షల విలువైన 250కు పైగా ఔట్లెట్లు ఏర్పాటుచేశారు. అలాగే ఎక్స్పోర్ట్ క్వాలిటీ రొయ్యలను స్థానిక వినియోగదారులకు డోర్ డెలివరీకి కార్యాచరణ చేశారు. ఎక్స్పోర్టు తరహాలో ప్రాసెస్ చేసిన రొయ్య పప్పు కిలో కౌంట్ను బట్టి రూ.600 నుంచి రూ.850 వరకు ధర నిర్ణయించారు. తొలుత ప్రయోగాత్మకంగా భీమవరం పరిసర ప్రాంతాల్లో అమలుచేసి తర్వాత రాష్ట్రవ్యాప్తం చేయాలని భావించగా సార్వత్రిక ఎన్నికలు రావడంతో కార్యరూపం దాల్చలేదు. స్థానిక మార్కెట్ వైపు రైతుల చూపు తెరపైకి మృగశిర సెంటిమెంట్ చేపలు, రొయ్యల ప్రాధాన్యతను వివరిస్తున్న జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం నేడు పాలకొల్లు, నరసాపురం, ఆచంటలో చేపలు, రొయ్యలతో పేదలకు ఉచిత భోజనాలు డొమెస్టిక్ సేల్స్కు గతంలోనే కార్యాచరణ చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 250 ఫిష్ ఆంధ్రా ఔట్లెట్స్ ఏర్పాటు -
కిటకిటలాడిన పెద్దింట్లమ్మ ఆలయం
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరడంతో సమీప జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ, ఆదివారం రోజున ప్రత్యేక దర్శనాలు, కేశఖండన, తీర్థాలు, గదుల అద్దెలు, అమ్మవారి ఫొటోల విక్రయాలు, వాహన పూజలు మరియు విరాళాల ద్వారా రూ.78,915 ఆదాయం వచ్చిందని తెలిపారు. దెందులూరు: పెదవేగి మండలం రాట్నాలకుంటలోని రాట్నాలమ్మ తల్లి ఆలయంలో ఆదివారం అమ్మవారికి ఆలయ అర్చకులు పుష్పాలతో అలంకరణ చేశారు. భక్తులు అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించి మొక్కులు తీర్చుకొని ప్రత్యేక పూజలు చేశారు. సేవా టికెట్ల ద్వారా రూ.4,650, దర్శనం రూ.59,160, విరాళాలు రూ.6,756, ప్రసాదం విక్రయం రూ.3,585, కళ్యాణ కట్ట ద్వారా రూ.800, అమ్మవారి ఫొటోల ద్వారా రూ.365 కలిపి మొత్తం రూ.1,05,276 ఆలయానికి ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు. భీమవరం: వ్యాపారం నిమిత్తం డబ్బు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశారంటూ కె.అనూష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై రెహమాన్ చెప్పారు. భీమవరం మండలం చినఅమిరం గ్రామానికి చెందిన అనూష వద్ద అదే ప్రాంతంలో ఉండే ఎస్.దుర్గ రూ.7 లక్షలు అప్పు తీసుకున్నారు. డబ్బు తిరిగి ఇవ్వక పోవడంతో ఆదివారం ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ముగ్గురి బాలికల అదృశ్యం భీమవరం పట్టణంలోని దుర్గాపురం ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికలు శనివారం రాత్రి నుంచి కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రెహమాన్ తెలిపారు. -
వృత్తి విలువలను కాపాడాలి
నరసాపురం: న్యాయవాద వృత్తిలో విలువలు కాపాడుతూ అడ్వకేట్ యామర్తి వెంకటేశ్వరరావు (వైవీఆర్) జీవించారని త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రామచంద్రరావు అన్నా రు. ఆదివారం స్థానిక తెలగా కల్యాణ మండపంలో యామర్తి శత జయంతి సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ రా మచంద్రరావు మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో విలువలు కాపాడటంలో న్యాయవాదులు సీనియర్లను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కక్షిదారులకు న్యాయం చేయడంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదన్నారు. మూడు దశాబ్దాలపాటు వైవీఆర్ చేసిన సేవలను కొనియాడారు. సభకు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గ్రంధి భవానీప్రసాద్ అధ్యక్షత వహించారు. ఏపీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ సీవై సోమయాజులు, జస్టిస్ డీఎస్ వర్మ మాట్లాడారు. వైవీఆర్ కుమారుడు చంద్రశేఖర్, న్యాయవాదులు పాల్గొన్నారు. పెనుగొండ : పెనుగొండ నగరేశ్వర మహిషాసురమర్ధనీ వాసవీ కన్యకపరమేశ్వరి ఆలయాన్ని పాట్నా హైకోర్టు న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి దంపతులు సందర్శించారు. ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చే యించారు. తణుకు ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జి జి.స్వర్ణ, కొవ్వూరు సివిల్ జడ్జి వి.నాగేశ్వరరావు నాయక్ ఉన్నారు. ఆలయ ఈఓ గుబ్బల రామపెద్దింట్లురావు ఆలయ మర్యాదలతో న్యాయమూర్తులకు స్వాగతం పలికారు. బుట్టాయగూడెం : మండలంలోని కామవరం సమీపంలో అటవీ ప్రాంతంలో కొలువైన గుబ్బ ల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో వేకువజాము నుంచే భక్తుల రాక మొదలైంది. ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూ జలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ పటిష్ట ఏర్పాట్లు చేయగా, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. భీమవరం (ప్రకాశంచౌక్) : జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు ఆదివారం ప్రారంభమయ్యాయయని, ఈనెల 21 వరకు కొనసాగుతాయని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. 13న నరసాపురం వలంధర్ రేవులో, 14న పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నా రు. 21న భీమవరంలో జిల్లాస్థాయి యోగా ది నోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నామన్నా రు. జిల్లాలో ప్రతి మండలంలో ఒక్కో మాస్టర్ ట్రైనర్ ఆధ్వర్యంలో 50 మందికి యోగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నామన్నారు. భీమవరం: రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు, ప్రధాన కార్యదర్శి బూరాడ మధుబాబు హెచ్చరించారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్లో ఆదివారం జరిగిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు జిల్లా వెంకయ్యపల్లె వీఆర్వో మహ్మద్ హుస్సేన్ మరణానికి కారణమైన అధికారుల తీరును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అధికారుల వేధింపులతోనే హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణ మే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కు టుంబానికి సముచిత న్యాయం చేసి ఆర్థిక భ రోసా కల్పించాలని కోరారు. వేధింపులతో ఆ త్మహత్యలకు పాల్పడటం విచారకరమన్నారు. -
కుంచనపల్లిలో ఎయిర్పోర్టు?
● రాజమహేంద్రవరం తరహాలో నిర్మాణం ● ఐదు కిలోమీటర్ల రన్వే ప్రతిపాదన తాడేపల్లిగూడెం: రాజమహేంద్రవరం ఎయిర్పోర్టు తరహాలో, తాడేపల్లిగూడెం సమీపంలోని కుంచనపల్లి గ్రామంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి త్వరలో ఆమోదముద్ర పడనుంది. విమానయానాన్ని ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం సరళీకృత వైమానిక విధానాన్ని ప్రకటించింది. గత పదేళ్లుగా పెరిగిన విమాన ప్రయాణాలు, సరుకు రవాణా (కార్గో) ద్వారా వచ్చే ఆదాయాలను విశ్లేషించి, రాష్ట్రాల వారీగా ఉన్న వెసులుబాటు మేరకు నూతన విమానాశ్రయాల నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వైమానిక రంగంలో సరళీకృత విధానాలను రూపొందించుకుని, సౌలభ్యాలు, వ్యాపార ప్రయోజనాలు, వేగవంతమైన ప్రయాణాల కోసం నూతన ఎయిర్పోర్టుల నిర్మాణాలు చేపడుతున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట గ్రామాల మధ్య ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించి, భూములను కూడా గుర్తించింది. తాజాగా ఎయిర్పోర్టు ఫీజిబిలిటీని నిర్ధారించేందుకు కేంద్రం నుంచి వచ్చిన బృందం ప్రతిపాదిత ప్రాంతంలో ఇటీవల పర్యటించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను విశ్లేషించిన బృంద సభ్యులు వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట ప్రాంతం బహుళ ప్రయోజన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు సరిపడదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కుంచనపల్లి ప్రాంతంలో రాజమహేంద్రవరం ఎయిర్పోర్టు తరహాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మించేందుకు యోచిస్తున్నారు. కుంచనపల్లిలో ఎయిర్పోర్టు ఫీజిబిలిటీ సూచనల మేరకు, మండలంలోని కుంచనపల్లి ప్రాంతాన్ని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీని కోసం సుమారు 1,200 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఈ ప్రాంతంలో భూములు అందుబాటులో ఉండటం, ఎయిర్పోర్టు నిర్మాణానికి వంతెనలు, తోటలు వంటి ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో ఈ ప్రాంతం ఎంతో అనుకూలమని భావిస్తున్నారు. ఢిల్లీలో కీలక సమావేశం తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి మంగళవారం ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. భూసేకరణ ప్రక్రియకు అవసరమైన నిధులు, ఇతర సాంకేతిక అనుమతులు తదితర విషయాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రానికి ఎయిర్పోర్టుకు సంబంధించి కీలక సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెంకట్రామన్నగూడెం ఎందుకు సరికాదు స్థల సేకరణకు ఎలాంటి ప్రతిబంధకాలు ఉండవనే ఉద్దేశంతో, కేంద్ర వైమానిక శాఖ మంత్రి గూడెం ఎయిర్పోర్టును ప్రకటించిన సందర్భంలో వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట ప్రాంతంలో సుమారు 1,100 ఎకరాలను గుర్తించారు. సమీపంలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు చెందిన వేల ఎకరాలు అందుబాటులో ఉన్నప్పటికీ, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నుంచి అనుమతులు రావడం అంత సులభం కాదు. ఈ కారణంతోనే వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట గ్రామాల భూములను గుర్తించారు. ఇక్కడే ఎయిర్పోర్టు వస్తుందని అందరూ భావించారు. అయితే, ఫీజిబిలిటీ కమిటీ వచ్చిన తర్వాత మొత్తం సీన్ మారింది. ఏవియేషన్ నిబంధనల ప్రకారం ప్రతిపాదిత ప్రాంతంలో విండ్ క్లియరెన్స్ సరిగా లేదని గుర్తించారు. అంతేకాకుండా, అక్కడ ఉన్న తోటలు ఎయిర్పోర్టు నిర్మాణానికి ఆటంకంగా మారాయి. తొలి ప్రతిపాదనలో రన్వే రెండు కిలోమీటర్లు ఉంటే చాలనుకున్నప్పటికీ, డొమెస్టిక్, కార్గో విమానాల రాకపోకల కోసం ఎయిర్పోర్టును నిర్మిస్తే రన్వే కనీసం ఐదు కిలోమీటర్ల వరకు ఉండాలని నిర్ణయించారు. దీంతో వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట ప్రాంతంలో ఎయిర్పోర్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. -
వడదెబ్బకు యాచకుడి మృతి
తణుకు అర్బన్: స్థానిక వెంకటేశ్వర థియేటర్ సెంటరులో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు తణుకు పట్టణ పోలీసులు తెలిపారు. సుమారు 60 ఏళ్ల వృద్ధుడు గత కొంతకాలంగా అదే ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడని, ఆదివారం స్పృహ లేకుండా పడి ఉండగా మరణించినట్లు ధ్రువీకరించామని వారు వివరించారు. తీవ్రమైన వడగాల్పుల వల్లే అతను మరణించి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. భీమడోలులో వృద్ధుడి మృతి భీమడోలు: జాతీయ రహదారి భీమడోలు రైల్వే స్టేషన్ ఎదురు ఉన్న బస్ షెల్టర్ వద్ద ఓ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని ఆదివారం పోలీసులు గుర్తించారు. వృద్ధుడు వడదెబ్బకు గురై మృతి చెందాడు. తొలుత సమాచారం అందుకున్న భీమడోలు 104 సిబ్బంది వచ్చి మృతదేహాన్ని పరీక్షించి మృతి చెందినట్లు గుర్తించి భీమడోలు పోలీసులకు తెలిపారు. భీమడోలులో కొంత కాలంగా యాచన చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు పంచాయతీ సిబ్బందికి అప్పగించారు. ముదినేపల్లి (కై కలూరు): విద్యుత్ షాక్కు గురై ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రోవెల్ ఫీడ్స్ ఫ్యాక్టరీలో మిషన్ ఆపరేటర్ శనివారం రాత్రి మరణించాడు. దీనిపై మృతుని తల్లి అంజలి ఆదివారం ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వడాలి గ్రామానికి చెందిన అనగాని మహంకాళి (20) ఇటీవల ఐటీఐ పూర్తి చేసి, 7 నెలలుగా సదరు ఫ్యాక్టరీలో మిషన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. శనివారం బీ–షిఫ్ట్లో విధులు నిర్వహిస్తుండగా రాత్రి 8 గంటలకు విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే అతడిని గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ముసునూరు: పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన విషాద ఘటన మండలంలో జరిగింది. యల్లాపురానికి చెందిన సన్నకారు రైతు చీదిరాల సూర్యచంద్రరావు (60), ఆదివారం ఉదయం జీలుగ పంటకు నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లారు. మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా ఫ్యూజ్ వద్ద విద్యుత్ ప్రసరించి, షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖాధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించి, అనంతరం బంధువులకు అప్పగించినట్లు ఎస్సై ఎం. చిరంజీవి తెలిపారు. కాళ్ల: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువకుడు మృతి చెందినట్లు కాళ్ల పోలీసులు ఆదివారం తెలిపారు. కాళ్ల గ్రామానికి చెందిన తాళ్లూరి యాకోబు (17), తన స్నేహితుడు దండే జాషువరాజుతో కలిసి మోటార్ సైకిల్పై జ్యూస్ తాగడానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా, పెంటపాటి నాగేశ్వరరావు ఇంటి వద్దకు రాగానే, భీమవరం నుంచి కలిదిండి వైపు వేగంగా వెళ్తున్న కారు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న యాకోబుకు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. యలమంచిలి: చించినాడ గ్రామానికి చెందిన పెదపట్నం కిషోర్కుమార్ (35) శనివారం రాత్రి చించినాడ వశిష్ట గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహం ఆదివారం పైకి తేలింది. కిషోర్కుమార్ హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు. బ్యాంకు పని ఉందని చెప్పి శనివారం ఉదయం కిషోర్ చించినాడ వచ్చాడు. రాత్రి బాగా మద్యం సేవించి ఇంటికి రావడంతో తండ్రి శ్రీనివాసరావు మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన కిషోర్ గోదావరిలో దూకాడు. తండ్రి పెదపట్నం శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హెడ్ కానిస్టేబుల్ కె.శ్యాంసన్రాజు కేసు నమోదు చేశారు. -
సంక్షోభంలో పొగాకు రైతులు
బుట్టాయగూడెం: పొగాకు రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.బలరామ్ అన్నారు. జీలుగుమిల్లిలో ప్రజా సంఘాల కార్యాలయంలో సిరిబత్తుల సీతారామయ్య అధ్యక్షతన సంఘ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు రైతులు పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు అప్పులు చేసి పంటలు సాగు చేశారన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం కిలో రూ.360కు పొగాకు కొనుగోలు చేశారని ప్రస్తుతం కేవలం రూ. 240 మధ్యలో కొనుగోలు చేస్తున్నారని అన్నారు. పొగాకు ఉత్పత్తి వ్యయాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రైతులకు సగటున కిలో రూ.360 పైగా ధర లభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ ట్రైనింగ్ కార్పొరేషన్ పొగాకు బోర్డు తక్షణమే స్పందించి పొగాకు రైతులకు న్యాయం చేయాలన్నారు. ఏపీ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు జులై 3, 4,5 తేదీల్లో ఏలూరులో జరుగుతున్నట్లు చెప్పారు. 3వ తేదీన భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహిస్తామని అనంతరం బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ, సహాయ కార్యదర్శి కారం భాస్కర్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గూడెల్లి వెంకట్రావు పాల్గొన్నారు. -
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం పోరాటం
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ స్పష్టం చేశారు. ఆదివారం నగరానికి విచ్చేసిన విద్యాసాగర్తో పాటు ప్రధాన కార్యదర్శి డీవీ రమణలను స్థానిక ఎన్జీఓ హోమ్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు కలిశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, అరకొర జీతాలు తదితర వివరాలను ఎన్జీఓ నాయకులకు దృష్టికి తీసుకువెళ్లారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని కోరుతూ పోరాటం చేస్తున్నామన్నారు. దీనిపై విద్యాసాగర్ స్పందిస్తూ త్వరలోనే రాష్ట్ర నాయకులతో సమావేశం నిర్వహించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా కృషి చేస్తామన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్, రాష్ట్ర సెక్రటరీ కె.నాగభూషణం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.మధుకాంత్, మెంబర్ సెక్రటరీలు సీహెచ్ రాజేష్, డి.మోహన్, టి.చిరంజీవి ఉన్నారు. వీరికి ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ఎస్ హరనాథ్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చోడగిరి శ్రీనివాస్, నెరుసు రామారావు మద్దతుగా నిలిచారు. -
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
దెందులూరు: ఏలూరు రూరల్ మండలం చొదిమెళ్ళ పరిధిలోని కొత్తచెరువు పక్కన ఉన్న వేపూరి శ్రీనివాసరావు కొబ్బరి కోకో తోట గట్టు పక్కన 40–50 ఏళ్ల మధ్య వయస్సు గల పురుషుడి మృతదేహం లభ్యమైంది. సుమారు 10 నుంచి 15 రోజుల క్రితం చనిపోయినట్లు భావిస్తున్నట్లు ఏలూరు రూరల్ ఎస్సై వేముల వెంకటేశ్వరరావు అన్నారు. అతని శరీరంపై నీలం రంగు లుంగీ, తెలుగు పింక్ రంగు గడుల చొక్కా, భుజంపై లేత పచ్చ గడుల కండువా ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. పెనుగొండ: అధికార పక్ష నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామన్నపాలెం పంచాయతీ పాలక వర్గ తీర్మానం చేయగా.. గత పాలకవర్గంలో శిలాఫలకం ఏర్పాటు చేశారు. పాలకవర్గంలో సర్పంచ్, వార్డు సభ్యులతో శిలాఫలకం వేయించడం రివాజు. రామన్నపాలెంలోనూ అలాగే వేయించారు. పాలకవర్గ పదవీ కాలం ముగిసిన అనంతరం అఽధికారులు ఆ శిలాఫలకాన్ని తొలగించడం ప్రస్తుతం విమర్శలకు తావిస్తుంది. కూటమి నాయకుల ఒత్తిడితోనే శిలాఫలకం తొలగించారన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. పాలకవర్గ శిలాఫలకం కూటమి నాయకుల ఒత్తిడితోనే తొలగించారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అఽధికారులు తీరు మార్చుకొని శిలాఫలకం తిరిగి ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్చేశారు. జంగారెడ్డిగూడెం: మోటార్ సైకిల్ ఢీకొన్న ఘటనలో వృద్ధుడు మృతిచెందిన ఘటన ఏలూరు రోడ్డు గుర్వాయిగూడెం పరిధిలోని జీడిపిక్కల ఫ్యాక్టరీ వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి లక్కవరం ఎస్సై షేక్ జబీర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండలపేట మండలం మోదకుదురు గ్రామానికి చెందిన జక్కంశెట్టి నాగేశ్వరరావు (65) చాలా కాలం క్రితం జంగారెడ్డిగూడెం వచ్చి ఉంటూ, జీడిపిక్కల గింజల ఫ్యాక్టరీ వద్ద చెరుకు రసం తీసి జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం చెరుకు తుక్కు రోడ్డు అవతల పడవేసి వస్తున్నాడు. ఇంతలో ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్న బైక్ వృద్ధుడిని అతి వేగంగా ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. యువకులు వాహనంతో సహా పారిపోయారు. ఎస్సై షేక్ జబీర్ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. వృద్ధుడి మృతికి కారణమైన వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
నా భూమి ఎక్కడ?
నరసాపురం: 85 ఏళ్ల భట్టు ప్రభాకరరావుది దయనీయ పరిస్థితి. విశాఖ కేంద్రంగా నేవీలో 40 ఏళ్లపాటు ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేసి, రెండో ప్రపంచ యుద్ధంలోనూ సేవలందించిన ఆయనకు నేడు కనీసం ప్రభుత్వం కేటాయించిన భూమి కూడా దక్కలేదు. ఉద్యోగ విరమణ అనంతరం, ఆయన సేవలకు గుర్తింపుగా 1969 అక్టోబర్ 13న అప్పటి ప్రభుత్వం నరసాపురం మండలం వేములదీవి సముద్రతీర గ్రామంలోని సర్వే నెంబరు 681/1లో 2.40 ఎకరాల భూమిని పట్టాగా ఇచ్చింది. అప్పటి నుంచి ఆ భూమిని రెవెన్యూ అధికారులు ఆయనకు అప్పగించలేదు. గత 57 ఏళ్లుగా ఆ భూమిని తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రభాకరరావు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వృద్ధాప్యంతో గుంటూరులో కుమారుడు ఐజయ్య వద్ద ఉంటున్న ఆయన, ఇప్పటికీ తన భూమి కోసం పోరాడుతున్నారు. ఇటీవల అధికారులు స్పందిస్తూ ఆ భూమిని ఎప్పుడో వేరే వారికి ఇచ్చేశామని చెప్పడంతో ప్రభాకరరావు, ఆయన కుమారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఇప్పించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ప్రారంభంలో ఆ భూమి నీళ్లలో ఉండటంతో స్వాధీనం చేసుకోవడం సాధ్యపడలేదని, ఆ తర్వాత ఎన్నిసార్లు అడిగినా అధికారులు పట్టించుకోలేదని ఆయన వాపోతున్నారు. వేలాది ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతం నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని తీరప్రాంతంలో ఇదే రీతిలో వేలాది ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. స్వాతంత్య్ర సమరయోధులకు, మాజీ సైనిక ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను కొందరు వ్యక్తులు, రెవెన్యూ అధికారుల అండతో తరతరాలుగా అనుభవిస్తున్నారు. నరసాపురం, మొగల్తూరు తహసీల్దార్ కార్యాలయాల కేంద్రంగా నిబంధనలను తుంగలో తొక్కి, అక్రమంగా మ్యూటేషన్లు చేయడం, రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించడం జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. గత రెండేళ్లలో నరసాపురం కార్యాలయం వేదికగా అక్రమ మ్యూటేషన్ల జారీ విస్తృతంగా జరిగిందని విమర్శలు వస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిగితే వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు వెలుగులోకి వస్తాయని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 57 ఏళ్లుగా తిరుగుతున్న 85 ఏళ్ల వృద్ధుడు -
కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ వేసవి సెలవులు ముగుస్తుండటంతో వేలాది మంది భక్తులు, వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో క్షేత్ర పరిసరాలు కిక్కిరిసాయి. తూర్పు రాజగోపుర ప్రాంతం, దర్శనం క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, అనివెట్టి మండపాలు, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. ఆలయ ఆవరణలో పలు కోలాట భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. క్షేత్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సైతం భక్తులతో రద్దీగా మారింది. బస్సులు ఎక్కేందుకు భక్తులు పోటీ పడ్డారు. -
వదిన, అత్తలపై కక్షతోనే..
ఏలూరు టౌన్: ఉంగుటూరు మండలం నల్లమాడు గ్రామ శివారు జీడిమామిడి తోటలో జరిగిన జంట హత్యల కేసును ఏలూరు జిల్లా పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాలు, సీడీఆర్ రికార్డుల ఆధారంగా ఛేదించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కక్షతో పాటు, తీసుకున్న అప్పును ఎగ్గొట్టాలనే దురాశతో ప్రధాన నిందితురాలు ఈ దారుణానికి ప్రణాళిక రచించింది. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఈ వివరాలను వెల్లడించారు. నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన మద్దా వెంకటలక్ష్మి, గంటా ఆంథోబాయి తల్లీ కూతుళ్లు. మే 29న నల్లమాడు సమీపంలోని తోటలో విగతజీవులుగా పడి ఉన్నారు. చేబ్రోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన వెంటనే, ఎస్పీ ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. నిందితుల అరెస్టు పోలీసులు ఈ నెల 5న తాడేపల్లిగూడెం రోడ్డులో పోనమాల శిరీష, కర్రి ప్రసాద్ (బన్ను), ఆశు దుర్గ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి మృతురాళ్ల బంగారు, వెండి ఆభరణాలు, సెల్ఫోన్లు, హత్యకు ఉపయోగించిన రాళ్లు, మద్యం సీసాలు, గుళికలు కలిపిన టీ చిక్కం, మోటారు సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితురాలు శిరీషకు మృతురాలు వెంకటలక్ష్మి వదిన, ఆంథోబాయి అత్త అవుతారు. తన అక్రమ సంబంధాల గురించి శిరీష భర్తకు వీరు చెప్పారన్న కోపంతో పాటు, ఆంథోబాయి దగ్గర తీసుకున్న రూ. లక్ష అప్పు తీర్చాల్సిన పనిలేకుండా చేయాలనే కుట్రతో ఈ హత్యలకు పథకం వేశారు. మే 29న శిరీష మృతురాళ్లను మభ్యపెట్టి తోటలోకి పిలిపించింది. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం, నిందితురాలు ఆశు దుర్గ మద్యం సీసాలలో నిద్రమాత్రలు కలిపి వారికి తాగించింది. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే, కర్రి ప్రసాద్ సహకారంతో బ్లేడుతో దాడి చేసి, రాళ్లతో తలలను పగలగొట్టి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆధారాలు లేకుండా చేసి పరారయ్యారు. ఈ కేసును వేగంగా ఛేదించిన నిడమర్రు, భీమడోలు, కై కలూరు రూరల్, ఏలూరు టూటౌన్, పెదవేగి సీఐలు, ఎస్ఐలు, ఐటీ కోర్ మరియు ప్రత్యేక బృందాల సిబ్బందిని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు. జంట హత్యల కేసును ఛేదించిన ఏలూరు పోలీసులు -
కొయ్యలగూడెంలో అగ్నిప్రమాదం
కొయ్యలగూడెం: స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట షేక్ ఇస్మాయిల్కు చెందిన ఇంటిలో శుక్రవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం నుంచి అగ్ని మాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేసింది. అప్పటికే సుమారు రూ.30 వేల నగదుతో పాటు మొత్తం గృహోపకరణాలు కాలి బూడిదయ్యాయని బాధితులు వాపోయారు. విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ ప్రమాదం సంభవించిందని చెబుతున్నారు. ఇంట్లో మంటలు చేలరేగిన సమయంలో తాము గాఢనిద్రలో ఉన్నామని, ఆ సమయంలో తాము పెంచుకుంటున్న కుక్క అరిచి తమను మేల్కొలపడంతో ప్రాణాలతో బయటపడ్డామని షేక్ ఇస్మాయిల్ చెప్పాడు. ప్రభుత్వం ద్వారా బాధితులకి రావలసిన ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తానని తహసీల్దార్ పేర్కొన్నారు. ఉండి: మండలంలోని ఎన్నార్పీ అగ్రహారంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సార్వాకు అనువైన వరి విత్తనాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నట్లు కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టార్ ఎన్ మల్లిఖార్జునరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంటీయూ 1318, ఎంటీయూ 1293 విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ విత్తనాలు కిలో రూ.42 కాగా 25 కేజీల బస్తా రూ.1,050 ఖరీదు అని తెలిపారు. అలాగే ఎంటీయూ 1282 రిలీజ్ కల్చర్ విత్తనాలు కేజీ రూ.50 కాగా 25 కేజీల బస్తా రూ.1,250గా ఉందన్నారు. విత్తనాలు కావలసిన రైతులు కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ను 99896 23823 నంబర్లో సంప్రదించవచ్చన్నారు. -
సీలేరు నదిలో పడి విద్యుత్ ఉద్యోగి మృతి
చింతూరు: సీలేరు నదిలో పడి ఓ విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి చెందాడు. పోలవరం జిల్లా చింతూరు మండలం కల్లేరు వద్ద శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా బొమ్మిడికి చెందిన మూడు కుటుంబాలకు చెందిన 13 మంది విహారయాత్ర నిమిత్తం చింతూరు ప్రాంతానికి వచ్చారు. ఇక్కడి కల్లేరు సమీపంలోని సీలేరు నది వద్దకు వెళ్లారు. ఇందులో కొందరుస్నానానికి నదిలోకి దిగగా, తేజ అనే బాలుడు ప్రమాదవశాత్తూ నీటిలో కొట్టుకుపోతున్న క్రమంలో సబ్బవరపు ఆనంద్ (37) అతడిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ లోపు ఒడ్డున ఉన్నవారు కేకలు వేయడంతో స్థానికులు నదిలోకి దూకి తేజను రక్షించారు. అనంతరం ఆనంద్ను కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో నీటిలో గల్లంతు కాగా, కొంతసేపటికి సమీపంలోని నది వద్ద పొదల్లో అతని మృతదేహం లభ్యమైంది. మృతుడు విద్యుత్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న చింతూరు ఎస్సై సంతోష్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
ఏలూరు (టూటౌన్): విద్యార్థులు వేసవిలో సమయం వృథా చేయకుండా విజ్ఞానాన్ని నిరంతరం పెంపొందించుకునే దిశగా కృషి చేయాలని జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ నారాయణ రావు, ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు అన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ శిక్షణ, సమ్మర్ క్యాంపు విద్యార్థుల శిక్షణ ముగింపు కార్యక్రమం శనివారం స్థానిక పవరుపేటలోని అన్నే భవనంలో నిర్వహించారు. సభలో గుడిపాటి నరసింహారావు రిటైర్డ్ లెక్చరర్ పి ఆంజనేయులు, కేవీ నారాయణరావు, రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ వై నిర్మల మాట్లాడుతూ ఇంగ్లీషు భాష, ఉపన్యాసం, సులభ గణితం, కంప్యూటర్ కోర్సులు రెగ్యులర్గా నిర్వహించడానికి కార్యక్రమం రూపొందిస్తామన్నారు. 15 రోజుల స్పోకెన్ ఇంగ్లీష్ సమ్మర్ క్యాంపులో విద్యార్థులు ఆసక్తిగా ఇంగ్లీష్ నేర్చుకున్నారన్నారు. పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు. ఆగిరిపల్లి: ఆగిరిపల్లిలో విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధమైంది. రాణి మేకల చుక్కమ్మ అనే వృద్ధురాలు కొండపై ఉన్న సగర్ల కాలనీలో ఒంటరిగా నివసిస్తోంది. శనివారం మధ్యాహ్నం ఆమె నిద్రిస్తున్న సమయంలో విద్యుదాఘాతంతో ఇంటికి మంటలు అంటుకుని ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల వారు మంటలలో చిక్కుకున్న చుక్కమ్మను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో రూ.20 వేల నగదు, వంట సామాగ్రి, దుస్తులు, నిత్యవసర వస్తువులు కాలి బూడిదైనట్లు బాధితురాలు వాపోయింది. గ్రామస్తులు జూలూరు కోటేశ్వరరావు, రేషన్ డీలర్ వేణుగోపాల్, యండురి సుధీర్ నిత్యావసర వస్తువులు, రూ.5 వేల నగదును తహసీల్దార్ ప్రసాద్ చేతుల మీదుగా బాధితురాలు చుక్కమ్మకు అందజేశారు. తల్లీ కుమార్తె అదృశ్యంపై కేసు జంగారెడ్డిగూడెం: తల్లీ కుమార్తె అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు హెచ్సీ ఎన్.ఉమామహేశ్వరరావు తెలిపారు. పట్టణానికి చెందిన కె.రాంబాబు, అతని భార్య ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో తరచూ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో రాంబాబు ఈ నెల 5వ తేదీ బయటకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి, భార్య, 11 ఏళ్ళ కుమార్తె కనిపించలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇంటి వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో రాంబాబు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ తెలిపారు. -
తేతలి గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం
● రూ.10 లక్షల ఆస్తి నష్టం ● రెండు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు తణుకు అర్బన్ : తణుకు మండలం తేతలి ఇండస్ట్రియల్ ఏరియాలో శుక్రవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తేతలి – సత్యవాడ రోడ్డులోని సూర్యప్రభ ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని గోడౌన్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో తణుకు ఫైర్ ఆఫీసర్ అజయ్కుమార్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. మంటల తీవ్రత పెరుగుతుండడంతో అత్యవసరంగా అత్తిలికి చెందిన మరో అగ్నిమాపక వాహనాన్ని రప్పించి సుమారు 5 గంటల పాటు శ్రమించి చివరకు మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో గోడౌన్లో ఉన్న నెయ్యి నిల్వలతోపాటు ప్యాకింగ్ మెటీరియల్, విలువైన సామాగ్రితోపాటు ఒక కారు, బుల్లెట్ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో గోడౌన్ కూలిపోగా ఆస్తి నష్టం సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అగ్నిమాపక అధికారి ఐ.అజయ్కుమార్ తెలిపారు. తణుకు రూరల్ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, ఇన్న్చార్జి ఎస్సై జానా సతీష్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కేదారశెట్టి సుధ పేరుతో ఉన్న గోడౌన్లో మానేపల్లి వెంకట రామగోపాల్కు చెందిన నెయ్యి, ఇతర సామాగ్రి ఉన్నట్లుగా అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. అయితే అగ్నిప్రమాదం చోటుచేసుకున్న గోడౌన్కు ఎటువంటి అనుమతులు లేవని, వాస్తవానికి విరుద్ధంగా మరొక పేరుతో ఈ గోడౌన్ నడుస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఏడాది కాలంలో మార్కెటింగ్ సొసైటీ అభివృద్ధి
ఏలూరు (ఆర్ఆర్పేట): గత ఏడాది కాలంలో ఏలూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీని ఎంతో అభివృద్ధి చేశామని డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ తెలిపారు. శనివారం స్థానిక డీసీఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత జిల్లాలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నరసాపురం, ఉండి, భీమడోలు, కొయ్యలగూడెం, టి.నరసాపురంలలో నూతనంగా ఎరువుల డిపోలు ప్రారంభించి ఆ ప్రాంత రైతులకు కూడా ఎంఆర్పీ కంటే తక్కువ ధరలకే ఎరువులు అందించే ఏర్పాటు చేశామన్నారు. అలాగే సీతానగరంలో మరో ఎరువుల డిపోను ప్రారంభించడానికి ఏర్పాటు చేశామన్నారు. జిల్లా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం తక్కువ ధరలకే మందులు విక్రయించడానికి జనరిక్ మందులు షాపులు నిర్వహిస్తున్నామని, కొత్తగా మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే ప్రజలకు తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులు అందించడానికి ఏలూరులో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్కు విశేష ఆదరణ లభిస్తోందని, దీంతో ఏలూరులోని సత్రంపాడు, నిడదవోలు, భీమవరంలలో కూడా సూపర్ మార్కెట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే డీసీఎంఎస్లో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న 8 మంది ఉద్యోగులను రెగ్యులర్ చేశామని, కొత్తగా మరో 15 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. రానున్న రోజుల్లో డీసీఎంఎస్ ద్వారా జిల్లాలోని రైతులకు సామాన్య, మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి కార్యాచరణ రూపొందించామన్నారు. -
మృత్యుపాశాలు.. లో లెవెల్ కాజ్వేలు
● వర్షాలకు దెబ్బతిని ప్రమాదకరంగా మారిన లో లెవెల్ కాజ్వేలు ● వంతెనలు నిర్మించాలని ప్రజల డిమాండ్ నూజివీడు : నూజివీడు నియోజకవర్గంలోని పలు గ్రామాల పరిధిలో వాగులపై ఉన్న లోలెవెల్ కాజ్వేలు, చప్టా, కల్వర్టులు ప్రమాదభరితంగా తయారయ్యాయి. వర్షాకాలంలో వచ్చిన వరదలకు తోడు, తుపాను ప్రభావానికి కురిసిన వర్షాలకు వాగులు పొంగడంతో వాటికి సమీపంలో రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న కల్వర్టులు, కాజ్వేల వద్ద మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉంది. వీటికి ప్రధానంగా రెయిలింగ్స్ లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోననే ఆందోళన వాహనదారుల్లో వ్యక్తమవుతోంది. నూజివీడు మండలంలో రామిలేరు, ఊటవాగులు ప్రవహిస్తున్నందున వానాకాలంలోను, తుపాన్ల సమయంలోను ఈ వాగులకు వరదనీరు పెద్ద ఎత్తున వస్తుంది. దీంతో ఈ వాగులపై ఉన్న రోడ్లపైకి పెద్ద ఎత్తున వరదనీరు ప్రవహించి రాకపోకలు సైతం స్తంభించిపోతాయి. ఎటుచూసినా పొంచి ఉన్న ప్రమాదం ● రామిలేరుపై ఉన్న కల్వర్టులు, కాజ్వేలకు మరమ్మతులు చేయించాల్సి ఉంది. ● పోతురెడ్డిపల్లి రోడ్డులో నూజివీడు పట్టణ పరిధిలోని ఊటవాగుపై ఉన్న కాజ్వేకు గతంలోనే భారీ రంధ్రం పడగా తాత్కాలికంగా పూడ్చారు. ● అలాగే జంగంగూడెం, తుక్కులూరు, దేవరగుంట, మీర్జాపురం–కాట్రేనిపాడు, పోతురెడ్డిపల్లి–సింహాద్రిపురం మార్గంలో ఉన్న లోలెవెల్ కాజ్వేలు సైతం దెబ్బతినడమే కాకుండా రెయిలింగ్స్ లేవు. గతేడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు తుక్కులూరు వద్ద ఉన్న లోలెవెల్ కాజ్వేపై వరద ఉధృతంగా ప్రహహించడంతో ఆ ప్రవాహంలో యువతి వాగులోకి కొట్టుకుపోయి మరణించింది. అప్పట్లో ఈ కాజ్వేను జిల్లా కలెక్టర్ కే వెట్రిసెల్వీ పరిశీలించి ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడారు. వంతెన నిర్మించడానికి ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని సూచించినా ఇంత వరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ● నూజివీడు మండలంలోని దంతులవారిగూడెం–మర్రికుంట గ్రామాల మధ్య ఊటవాగుపై చప్టా ఉండగా 2024 ఆగస్టు 31న వచ్చిన వరద ఉధృతికి చప్టా అంతా కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించడానికి రెండు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్తూ స్థానికులు కిందపడి గాయాలపాలవుతున్నారు. ● ఆగిరిపల్లి మండలంలో నూగొండపల్లి వద్ద ప్రవహించే కుంపిణీపై వాగుపై ఉన్న వంతెనకు రెయిలింగ్స్ లేక ప్రమాదభరితంగా ఉంది. ఈ వాగుకు వరద ఎక్కువగా వస్తుంది. ఈ వంతెనపై గతంలో రెండుసార్లు మనుషులు కొట్టుకుపోయిన సంఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. ● తోటపల్లి–చిన్నాగిరిపల్లి మధ్య ఉన్న లోలెవెల్ కాజ్వే సైతం ప్రమాదభరితంగా ఉంది. ఇక్కడ కూడా గతంలో వరద వచ్చినప్పుడు వ్యక్తి గల్లంతై మృతదేహం కూడా దొరకలేదు. మంత్రిగారు పట్టించుకోరు నియోజకవర్గానికి మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ చిన్న చిన్న పనులు కూడా పూర్తికాకపోవడంపై ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. లోలెవెల్ కాజ్వేలు, చప్టాలు ప్రమాదభరింతగా మారినా వాటి మరమ్మతులకు ఏవిధమైన చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా మంత్రిగారు స్పందించి ప్రమాదభరితంగా ఉన్న లోలెవెల్ కాజ్వేలను, చప్టాలను, కల్వర్టులకు మరమ్మతులు చేయించి ప్రమాదాలు సంభవించకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. నూజివీడు మండలం దంతులవారిగూడెం–మర్రికుంట గ్రామాల మధ్య వరదలకు దెబ్బతిన్న చప్టా, తుక్కులూరు–కాట్రేనిపాడుల మధ్య ప్రమాదభరితంగా లో లెవెల్ కాజ్వే రామిలేరులో వరద ప్రవాహం అత్యంత వేగంగా ఉంటుంది. వరదలు వచ్చేటప్పుడు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఎవరైనా కాజ్వేలు, చప్టాలు దాటడానికి ప్రయత్నిస్తే వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. గతేడాది సెప్టెంబరులో వచ్చిన వరదకు తుక్కులూరుకు చెందిన యువతి వరదలో కొట్టుకపోయి మృతిచెందింది. ప్రమాదభరితంగా ఉన్న కాజ్వేల స్థానంలో ప్రభుత్వం వెంటనే వంతెనల నిర్మాణం చేపట్టాలి. – పాలడుగు విజయ్కుమార్, వైఎస్సార్సీపీ నాయకుడు, తుక్కులూరు -
బ్యాంకులో బంగారం గోల్మాల్
బ్యాంక్ ఆఫ్ బరోడా జంగారెడ్డిగూడెం బ్రాంచ్లో 30 కాసులు మాయం జంగారెడ్డిగూడెం: బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం మాయం కావడంతో బాధితులు ఆందోళనకు దిగారు. తమ ఆభరణాలను చూపించాలంటూ ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకోవడంతో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. శనివారం ఒక ఖాతాదారుడు తన రుణాన్ని పూర్తిగా చెల్లించి, తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి కోరారు. ఆయన తాకట్టు పెట్టిన 9 కాసుల బంగారానికి బదులుగా, బ్యాంకు సిబ్బంది కేవలం 6 కాసుల బంగారం మాత్రమే ఇచ్చారు. మిగిలిన 3 కాసుల ఆభరణాల గురించి ప్రశ్నించగా, ఇదే క్రమంలో మరో ఇద్దరు ఖాతాదారులు తమ బంగారాన్ని చూపించాలని పట్టుబట్టారు. సదరు ఖాతాదారుల ఆభరణాలను పరిశీలించగా, మొత్తం 30 కాసుల బంగారం తక్కువగా ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో ఖాతాదారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. బ్యాంకు అప్రైజర్ రాజు గత రెండు రోజులుగా విధులకు హాజరుకావడంలేదని, అతనే ఈ 30 కాసుల బంగారాన్ని గోల్మాల్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించామని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఈ ఘటనతో మిగిలిన ఖాతాదారులు సైతం ఆందోళన చెంది బ్యాంకు వద్దకు చేరుకున్నారు. బ్యాంకులో ఆడిట్ జరుగుతోందని, సోమవారం అందరికీ వారి ఆభరణాలను చూపిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించి వెనుదిరిగారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించినట్లు సిబ్బంది వెల్లడించారు.


