breaking news
Eluru District News
-
యానాం మద్యం విక్రేతకు రూ.లక్ష జరిమానా
తణుకు అర్బన్: యానాం మద్యం విక్రయాలు చేస్తున్న వ్యక్తికి ఇరగవరం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, తహసీల్దార్ ఎం.సుందరరాజు రూ.లక్ష జరిమానా విధించినట్లు తణుకు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ సీఐ సత్తి మణికంఠరెడ్డి తెలిపారు. ఇరగవరం మండలం కంతేరు గ్రామానికి చెందిన కొవ్వూరి శ్రీనివాసరెడ్డి ఇటీవల రెండు పర్యాయాలు యానాం మద్యంతో దొరికిన నేపథ్యంలో ఈ భారీ జరిమానా విధించినట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి 7న కంతేరు గ్రామంలో కారులో 43.1 లీటర్ల యానం మద్యం తరలిస్తూ తణుకు ఎకై ్సజ్ శాఖ దాడుల్లో పట్టుబడ్డాడని, దీంతో అతడిని ఇరగవరం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వద్ద రూ.లక్ష పూచీకత్తుతో ఏడాది కాలానికి బైండోవర్ చేయడం జరిగిందన్నారు. సత్ప్రవర్తన బాండ్ను ఉల్లంఘించి తిరిగి మే 26న యానాం నుంచి మద్యాన్ని కారులో రవాణా చేస్తూ తణుకు ఎక్సైజ్ శాఖకు మరోసారి పట్టుబడ్డాడని చెప్పారు. దీంతో ఈనెల 11న ఇరగవరం తహసీల్దార్ వద్ద హాజరపరచగా దీనిపై విచారణ అనంతరం విధించిన జరిమానాను ముద్దాయి గురువారం చెల్లింపు చేసినట్లు వివరించారు. యువకుడి అదృశ్యంపై కేసు నమోదు ముదినేపల్లి రూరల్ : యువకుడి అదృశ్యంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల ప్రకారం మండలంలోని పెదగొన్నూరు శివారు కర్షకమాలపల్లికి చెందిన మద్దాల మరియమ్మ కుమారుడు కిరణ్బాబు గుంటూరులోని ఒక స్వీటు షాపులో పనిచేసేవాడు. ప్రమాదవశాత్తూ గాయపడడంతో కర్షకపాలెంలోని ఇంటి వద్దకు వచ్చి ఆరోగ్యం కుదుటపడిన తరువాత ముదినేపల్లి, బంటుమిల్లి, సింగరాయపాలెం గ్రామాల్లోని స్వీటుషాపుల్లో పనిచేసేవాడు. ప్రతిరోజు వచ్చే ఆదాయంతో మద్యం సేవించి తల్లిని దుర్భాషలాడుతూ బాధపెట్టేవాడు. ఈ ఏడాది మార్చి 30న మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వమని తల్లి మరియమ్మను ఒత్తిడి చేశాడు. అందుకు నిరాకరించడంతో తల్లిని తూలనాడి ఇంటినుంచి వెళ్లిపోయాడు. నాటి నుంచి కిరణ్బాబు ఆచూకీ తెలియకపోవడంతో తల్లి మరియమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. యథేచ్ఛగా కంకర అక్రమ తవ్వకాలు సాక్షి, టాస్క్ఫోర్స్ : కూటమి పాలనలో మట్టి దందా దోచుకున్నోళ్లకు దోచుకున్నంత అన్న చందంగా తయారైంది. కోర్టు నుంచి స్టే ఉన్నా వారు లెక్క చేయని పరిస్థితి. ఉంగుటూరు మండలం నల్లమాడులో కంకర అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మూడు తరాల నుంచి ఒక పేద కుటుంబం హక్కు భుక్తంలో ఉన్న మెరసుకుంటను ఆనుకొని ఉన్న సుమారు ఒకటిన్నర ఎకరం కంకర బీడులో 15 రోజులుగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తున్నారు. పెద్ద ఎత్తున కంకరను జేసీబీలు, పొక్లయినర్ల సాయంతో తవ్వి లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముసనబోయిన అంజమ్మకు చెందిన ఈ భూమి విషయంలో హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా కూటమి నాయకలు లెక్కచేయడం లేదు. పంచాయతీ, ఇరిగేషన్ అధికారుల అనుమతితో తవ్వకాలు చేస్తున్నట్లు ఆ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో గ్రామ, మండల స్థాయి అధికారుల జేబులు నింపుతున్నారని వినికిడి. కంకర తవ్వకాలపై గ్రామ రెవెన్యూ అధికారి నాగరాజుని వివరణ కోరగా కంకర తవ్వకాలకు అనుమతులు ఉన్నట్లు చెబుతున్నారు. -
వ్యక్తిపై హత్యాయత్నం
ఏలూరు టౌన్, పెదపాడు : దెందులూరు నియోజకవర్గం పెదపాడు గ్రామంలో ఒక వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు కత్తులు, రాడ్లతో దాడులకు పాల్పడ్డారు. బాధితుడి మెడభాగంలో తీవ్ర గాయం కావటంతో అతడ్ని ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. టీడీపీకి చెందిన కార్యకర్తల ఆధ్వర్యంలో పాతకక్షల నేపథ్యంలోనే ఈ దాడులు జరిగాయంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదపాడు గ్రామానికి చెందిన ముమ్మిడి నాగరాజు భవన నిర్మాణ సామాగ్రిని సరఫరా చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. గురువారం సాయంత్రం పెదపాడు సినిమా థియేటర్ సెంటర్లోని ఒక స్థలం వద్ద ట్రాక్టర్లో ఇసుక లోడ్ను చేస్తుండగా రెండు మోటారు సైకిళ్లపై నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఒక్కసారిగా అతనిపై దాడి చేశారు. కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేయటంతో నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. నాగరాజు పక్కన ఉన్న మణిశ్రీ అనే వ్యక్తి దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా నలుగురు అతనిపై దాడి చేసేందుకు రావటంతో అక్కడి నుంచి పరారయ్యాడు. పాత కక్షల నేపథ్యంలోనే తనపై దాడి జరిగిందని బాధితుడు నాగరాజు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. రెండు రోజుల కిత్రం కుటుంబ సభ్యులపై దాడి నాగరాజు కుమారుడు సాయిపై రెండు రోజుల క్రితం పెదపాడుకు చెందిన నర్రా చందు మరికొందరు దాడి చేశారు. అనంతరం నర్రా చందు, అక్కినేని పండు, కళ్యాణ్ ఇంకా మరికొందరు నాగరాజు ఇంటికి వెళ్లి అతడి భార్యను దుర్భాషలాడి, ఆమైపె దాడికి యత్నించారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా పెదపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తనను అంతం చేయాలనే కత్తులు, రాడ్లతో గుర్తు తెలియని వ్యక్తులతో వారే దాడులు చేయించారని బాధితుడు నాగరాజు పేర్కొన్నాడు. తనకు, తన కుమారుడు సాయికి ప్రాణహాని ఉందనీ, రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు. పెదపాడులో వ్యక్తిపై కత్తులు, రాడ్లతో దాడి పాతకక్షల నేపథ్యంలో దాడులు -
కామ్రేడ్ సుధాకర్ సేవలు ఎనలేనివి
పెదపాడు: మండలంలోని సత్యవోలులో కామ్రేడ్ తెంటు సుధాకర్ సంస్మరణ సభ గురువారం నిర్వహించారు. సీపీఐఎంల్ సానుభూతిపరులు, విరసం నాయకులు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థిగా, డాక్టర్గా, కామ్రేడ్గా సుధాకర్ ఎనలేని సేవలందించారని కొనియాడారు. పేద, బడుగు, పీడిత ప్రజల కోసమే సుధాకర్ తన జీవితాన్ని త్యాగం చేశారని, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కొండారెడ్డి, కృష్ణ లావేటి శ్రీనివాసరావు, తూర్పు కాపు కార్పొరేషన్ డైరక్టరు లావేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. హత్యాయత్నం కేసులో ముద్దాయికి జైలు శిక్ష ఉండి: హత్యాయత్నం కేసులో ముద్దాయికి జైలు శిక్ష పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2017లో మండలంలోని కోలమూరు గ్రామంలో కొమ్మర కనకారావు మీద జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు సిర్ర కనకారావుపై నేరం రుజువు కావడంతో అతడికి భీమవరం అసిస్టెంట్ సెషన్స్కోర్టు జడ్జి ఎం సుధారాణి మూడు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించినట్లు ఎస్సై ఎండీ నసీరుల్లా తెలిపారు. కేసు విచారణకు సహకరించిన సిబ్బందిని ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి అభినందించినట్లు ఎస్సై తెలిపారు. -
యోగా మంత్రం.. ఒత్తిడిలో యంత్రాంగం
పాలకోడేరు: కూటమి ప్రభుత్వం కొన్ని రోజలుగా నిరంతరం యోగా మంత్రం జపిస్తుండడంతో ప్రభుత్వ యంత్రాంగం ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతోంది. యోగాంధ్ర కార్యక్రమానికి మే 21 నుంచి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ కేంద్రంగా లక్షల మందితో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ కూడా హాజరవుతుండడంతో ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కుస్తీలు పడుతోంది. దీంతో అధికారులు, ఉద్యోగులకు క్షణం తీరిక లేకుండా పోయింది. యోగాంధ్ర ఎన్రోల్మెంట్, మాస్టర్ ట్రైనీ, రిజిస్ట్రేషన్, యోగ ప్రొటోకాల్ ఆసనాలు పూర్తి చేసినప్పటికీ జిల్లాస్థాయి యోగాసనాల పోటీల నిర్వహణ మాత్రం తమ వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. ఎందుకంటే సాధ్యం కానీ అలవాటు లేని ఆసనాలతో పోటీలు నిర్వహించాలని అధికారులు మార్గదర్శకాలు పేర్కొనడంతో కొత్తగా యోగా నేర్చుకున్న తాము ఈ ఆసనాలను ఎలా వేయగలమంటూ పోటీల్లో పాల్గొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇవేం పోటీలు? జిల్లా స్థాయిలో యోగా పోటీలకు సంబంధించి 10 నుంచి 18 సంవత్సరాలు, 19 నుంచి 35 సంవత్సరాలు, 35 పైబడి అంటూ మూడు భాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి 50 ఏళ్లు పైబడిన కేటగిరీ ఇవ్వకపోవడంతో యోగాలో అనుభవం, ఆసక్తి ఉన్న ఆ వయస్సు వారితో పోటీ పడే పరిస్థితి ఏర్పడింది. వారంతా పోటీలో పాల్గొనడానికి ఆసక్తి కనపరచడం లేదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వారిని సైతం పోటీల్లో అభ్యర్థులుగా చేర్చడంతో క్లిష్టతరమైన ఆసనాలు వేయలేమని తమ పేర్లను తొలగించాలని వారు కోరుతున్నారు. చిన్న పిల్లలకు ఆకర్ణ ధనురాసనం, బకాసనం, 19 నుంచి 35 సంవత్సరాల విభాగంలో మత్స్యేంద్రాసనం, జిల్లా స్థాయిలో విభక్త పశ్చిమోత్తాసనం తదితర ఆసనాలు వేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో పూర్ణమత్స్యేంద్రాసనం, ఓంకారాసనం, కర్ణ పీడనాసనం ఇచ్చారు. మండల స్థాయి పోటీలను ఏదోలా మమ అనిపించినప్పటికీ జిల్లా స్థాయి పోటీలకు వెళ్లేవారిని పంపించడం కష్టతరమేనని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సమయం వృథా అంటూ ఆవేదన యోగాంధ్ర కార్యక్రమం కోసం ప్రతిరోజు కలెక్టర్ నుంచి ఆయుష్ విభాగం అధికారులు పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు గూగుల్ మీట్, వెబ్క్స్ నిర్వహిస్తుండడంతో గంటల కొద్ది సమయం వృథా అవుతుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మూడు రోజులపాటు ఎటువంటి శ్రమ లేకుండా చేపట్టామని అధికారులు చెబుతుండడం గమనార్హం. అప్పటి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. కానీ ఇప్పుడు యోగాంధ్ర కోసం నెలరోజుల పాటు నరకయాతన పడుతున్నామని అధికారులు తమ అంతర్గత సంభాషణలో తలలు పట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమంతో పని ఒత్తిడి భరించలేక సచివాలయం నుంచి మండల స్థాయి ఉద్యోగులు అంతా నరకం చూస్తున్నారు. యోగాంధ్ర విజయవంతానికి ప్రభుత్వం కుస్తీలు ఉద్యోగులు, సిబ్బందిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి -
సందిగ్ధంలో ఎంపీడీఓ పోస్ట్
కొయ్యలగూడెం: కొయ్యలగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి పోస్టు విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇప్పటివరకు ఇక్కడ ఎంపీడీవోగా కె.కిరణ్కుమార్ విధులు నిర్వహిస్తుండగా, ఆయన స్థానంలో మరో ఎంపీడీఓకి పోస్టింగ్ని ఇస్తూ సిఫార్సు లెటర్ అందినట్లు తెలిసింది. అయితే సిఫార్సు లెటర్ తీసుకున్న ఎంపీడీవో ఇటీవలే దేవరపల్లి నుంచి తాళ్లపూడి ఎంపీడీవోగా బదిలీ అయ్యి అక్కడ చార్జీ తీసుకోవడం, అనంతరం మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అయితే హఠాత్తుగా కొయ్యలగూడెం ఎంపీడీవోగా సిఫార్సు లెటర్ తీసుకోవడం, ఆగమేఘాలపై జెడ్పీ ద్వారా కొయ్యలగూడెం ఎంపీడీవో పోస్టింగ్ చేయించుకోవడానికి ఆయన ప్రయత్నాలు చేస్తుండడం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ఉద్యోగ వర్గాల్లో కలకలం లేపుతోంది. కిరణ్కుమార్ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించి పది నెలలు కూడా గడవకముందే మరో ఎంపీడీవోని అది కూడా నిబంధనలకు విరుద్ధంగా నియమించడం వెనుక ఎంపీడీవో కార్యాలయంలోని ఓ సీనియర్ ఉద్యోగి చక్రం తిప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఏవిధమైన ఒత్తిళ్లకు లొంగకుండా ఎంపీడీవో విధులు నిర్వహిస్తూ ఉండగా ఆయనకు తెలియకుండానే బదిలీల ప్రక్రియ కొనసాగిందంటూ ఎంపీడీవో కార్యాలయంలో ప్రచారం సాగుతోంది. కార్యాలయంలోని సీనియర్ ఉద్యోగి చేస్తున్న అక్రమాలను ఎంపీడీవో అడ్డుకుంటున్న నేపథ్యంలో చేసేదిలేక సీనియర్ ఉద్యోగి రాజకీయ పెద్దలను ఆశ్రయించినట్లు తద్వారా తనకు అనుకూలంగా ఉన్న వేరొక ఎంపీడీవోకి పోస్టింగ్ ఆర్డర్స్ ఇప్పించినట్లు ప్రచారం సాగుతోంది. పోస్టింగ్ చేపట్టి పది నెలలు గడవకుండానే వేటు? రాజకీయ ఒత్తిళ్లకు లొంగకపోవడమే కారణమా! -
ఈ సమ్మర్ చాలా కూల్ గురూ..
● వేసవిలో గోదావరి జిల్లాల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు ● రోహిణి కార్తెలో కూడా ఎండలు ప్రభావం చూపని వైనం ● రుతుపవనాలు విస్తరించడంతో చల్లబడ్డ వాతావరణం నరసాపురం: ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే ఎండలు అదరగొట్టాయి. ఉమ్మడి పశ్చిమలో ఫిబ్రవరి నెలలోనే 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో కూడా భానుడు ప్రతాపం చూపించాడు. దీంతో ఈఏడాది వేసవిలో ఎండల ప్రతాపం దారుణంగా ఉంటుందని అంచనా వేశారు. వేసవిలో గరిష్టస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని జనవరి నెలలోనే విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినా అందుకు భిన్నంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెలలో అయితే ఉమ్మడి పశ్చిమలో ఎక్కడా కూడా 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. జూన్ మొదటి వారంలో అత్యధికంగా 41 డిగ్రీలు, అత్యల్పంగా 39 డిగ్రీలు నమోదయ్యాయి. దీనికి తోడు ఈ ఏడాది రుతుపవనాల రాక కూడా దాదాపు 20 రోజులు ముందుగానే రావడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ప్రస్తుతం రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో 2005 తరువాత వేసవిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే ప్రథమం. దీంతో గోదావరి జిల్లాల వాసులు ఈ ఏడాది వేసవి తాపం తెలియకుండానే వర్షాకాలంలోకి ప్రవేశించారు. రోహిణీ కార్తె ప్రభావం కూడా కనిపించలేదు ఈ ఏడాది మే 24 వతేదీ నుంచి రోహిణీ కార్తె ప్రారంభమైంది. రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయని నానుడి ఉంది. రికార్డు స్థాయిలో ఉండే రోహిణి కార్తె ఎండలకు జనం బెంబేలెత్తుతూ ఉంటారు. అయితే ఈ ఏడాది రోహిణి కార్తె కూడా సాధారణ ఉష్ణోగ్రతలో కూల్గా గడిచిపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి ఈ ఏడాది వేసవి పెద్దగా ఇబ్బంది పెట్టకుండా కూల్గా గడిచిపోవడం విశేషం. అప్పుడు కరోనా కారణంగా ఇళ్లలో ఉండి.. కరోనా కారణంగా వేసవిలో వరుసగా రెండేళ్లపాటు జనం ఇళ్లకే పరితమై వేసవి ప్రభావం పడకుండా తప్పించుకున్నారు. 2020 సంవత్సరంలో కరోనా విలయతాండవం, లాక్డౌన్ కారణంగా ఏప్రిల్, మే నెలలు మొత్తం జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక 2021లో కూడా మార్చి నెలలోనే కరోనా సెకండ్వేవ్ ప్రభావం ప్రారంభమైంది. ఏప్రిల్, మే నెలల్లో కల్లోలంగా మారడంతో దీంతో జనం పెద్దగా రోడ్కెక్కలేదు. ఆ రకంగా రెండేళ్లు అధిక మొత్తంలో జనం ఇళ్లపట్టునే ఉండి భానుడి ప్రతాపాన్ని చాలా వరకూ తప్పించుకున్నారు. నిజానికి ఈ రెండేళ్లు కూడా జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిల్లోనే నమోదయ్యాయి. అయితే ఈ సంవత్సరం మాత్రం రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కాకపోవడంతో జనం కూల్ కూల్గా ఖుషీ అయ్యారు. మే మొత్తం కూల్.. జూన్లో కొంత ప్రభావం ఈ ఏడాది మే నెల మొత్తం ఉమ్మడి పశ్చిమలో ఎండల ప్రభావం అంతగా కనిపించలేదు. అంతేకాకుండా మే 16, 17 తేదీల్లో వర్షాలు పడ్డాయి. గత ఏడాది కూడా మే నెలలో ఇదే సమయంలో వర్షాలు పడ్డాయి. అయితే తరువాత వడగాగాలలు దుమ్మురేపాయి. గత ఏడాది పడగాలులకు ఉమ్మడి జిల్లాలో 16 మంది మృత్యువాత పడ్డారు. అయితే ఈ ఏడాది వడగాలుల మరణాలు నమోదు కాకపోవడం విశేషం. ఇక మేనెల ఎండంటే తెలియకుండా గడిపేసిన జిల్లా వాసులకు జూన్ మొదటి వారంలో కొంత ప్రభావం కనిపించింది. జూన్ 2, 3 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీలు దాటి ఉఫ్ణోగ్రతలు నమోదయ్యాయి. మళ్లీ తరువాత అంతకు మించి ఉఫ్ణోగ్రతలు నమోదు కాలేదు. -
ఏడాది చివరికి ఎలక్ట్రిక్ బస్సులు
నూజివీడు: రాష్ట్రానికి ఈ ఏడాది చివరి నాటికి 750 ఎలక్ట్రిక్ బస్సులు రానున్న నేపథ్యంలో వాటిలో జోన్–2 పరిధిలోని విజయవాడకు 100 బస్సులు, కాకినాడకు 50, రాజమండ్రికి 50 బస్సులు చొప్పున కేటాయించనున్నట్లు ఆర్టీసీ జోన్–2 ఈడీ జీ విజయరత్నం పేర్కొన్నారు. నూజివీడులోని ఆర్టీసీ బస్సు డిపోను గురువారం ఆయన సందర్శించి అన్ని విభాగాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించడంతో పాటు బాధ్యతాయుతంగా పనిచేసి డిపోను లాభాల్లో నడపాలన్నారు. బస్సులు సైతం సమయపాలనతో నడిచేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు రావడం వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ఆర్టీసీపై డీజిల్ భారం సైతం తగ్గుతుందన్నారు. ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో బాగుంటే నూజివీడు డిపో నుంచి దూర ప్రాంతాలకు కచ్ఛితంగా బస్సు సర్వీసులను నడుపుతామన్నారు. బెంగళూరు, శ్రీశైలం వంటి దూర ప్రాంతాలకు ఇప్పటికే సర్వీసులు నడుపుతున్నామన్నారు. నాన్స్టాప్ బస్సు సర్వీసులను పెంచాల్సిన అవసరం ఉందని, పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ తిరిగే సర్వీసులు కచ్ఛితంగా సమయానికి బయలుదేరి వెళ్లాల్సిందేనన్నారు. బస్టాండ్లో ఉండే కంట్రోలర్లు బస్సులు సమయానికి వెళ్తున్నాయా, లేదా అనే విషయాన్ని పర్యవేక్షించాలన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సీహెచ్ సూర్యపవన్ కుమార్, ట్రాఫిక్ సీఐ జీ రాంబాబు, పలు యూనియన్లకు చెందిన నాయకులు పాల్గొన్నారు. -
భర్తకు దేహశుద్ధి చేసిన భార్య
కొయ్యలగూడెం: భర్తకు భార్య దేహశుద్ధి చేసిన ఘటన గురువారం కొయ్యలగూడెంలో చోటుచేసుకుంది. బాధితురాలు పూజిత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొయ్యలగూడెంలో ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావుకు చిట్యాల గ్రామానికి చెందిన పూజితకు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. అయితే మగపిల్లాడు కావాలని పూజితను అత్తమామలు, భర్త వేధింపులకు గురి చేస్తున్నారు. ఆమె నుంచి విడాకులు కావాలని భర్త కోర్టును ఆశ్రయించగా కోర్టు పూజితకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో బంధువులు, మహిళ మండలి సంఘాల మద్దతుతో గురువారం పూజిత శ్రీనివాసరావు ఇంటికి వెళ్లగా అదే సమయంలో భర్త మరో మహిళతో విహహేతర సంబంధం పెట్టుకొని సహజీవనం చేస్తున్నాడని తెలియడంతో అవాక్కయింది. పైగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళకు ఆరు నెలల పాప ఉందని తెలియడంతో ఆమెను కూడా తీసుకొని బ్యాంకు వద్దకు వెళ్లి నిరసన తెలిపింది. దీంతో శ్రీనివాసరావు, పూజితల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా మహిళా సంఘాలు బంధువులు కలిసి శ్రీనివాసరావుకు దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రీనివాసరావుని, పూజితను స్టేషన్కు తీసుకుని వెళ్లారు. కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు పూజిత కోరుతోంది. కాగా దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంపై ఆవేదన -
సచివాలయాల్లో.. కూటమి బదిలీలలు
సాక్షి, భీమవరం: నెలాఖరు నాటికి సచివాలయ ఉద్యోగుల బదిలీలను పూర్తిచేసేందుకు మూడు రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. మే నెలాఖరవు నాటికి ఒకే చోట ఐదేళ్ల కాలం పూర్తిచేసుకున్న వారి బదిలీ తప్పనిసరి. అలాగే ఐదేళ్లు పూర్తికాకున్నా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కోరుకునే వారికి అవకాశం ఇచ్చారు. అభ్యర్థన బదిలీ కావాలనుకునే వారు ఈనెల 22 నుంచి 24వ తేదీలోపు రిక్వెస్ట్ ట్రాన్సఫర్ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలోని సొంత మండలాల్లో పనిచేసే వెసులుబాటును తొలగించింది. ఒకే చోట ఐదేళ్లుగా పనిచేస్తున్న వారి వివరాలను ఇప్పటికే ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు సిద్ధం చేశారు. 25 నుంచి 29లోపు ప్రాధాన్యతను అనుసరించి బదిలీలు పూర్తిచేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగి పనిచేసే విభాగాన్ని బట్టి సంబంధిత శాఖల పర్యవేక్షణలో బదిలీలు జరుగుతాయి. సచివాలయ ఉద్యోగులపై కక్ష: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. సర్వేల పేరిట తిప్పడం, గతంలో వలంటీర్లు చేసిన పనులను వీరికి అప్పగించడం ద్వారా పనిభారం పెంచేసింది. క్లస్టర్ల పేరిట ఉద్యోగులను క్రమబద్ధీకరించి మిగిలిన వారిని ఇతర శాఖల్లో భర్తీ చేసే యోచన చేస్తోంది. కేవలం రూ.29 వేల నుంచి రూ.31 వేల జీతంపై పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులు సొంత మండలాల్లో పనిచేయకూడదన్న కూటమి ఆదేశాలు ఇవ్వడం, బదిలీలపై స్పష్టత ఇవ్వకపోవడం వారిని మరింత ఇబ్బంది పెట్టేందుకేనని పలువురు ఉద్యో గులు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో పారదర్శకంగా.. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థను తెచ్చారు. రాజకీయ జోక్యం, అవినీతి, అక్రమాలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా సచివాలయ ఉద్యోగుల నియామకాలు చేశారు. గ్రామాల్లో రెండు వేలు, పట్టణాల్లో నాలుగు వేల జనాభా ప్రాతిపధికన సచివాలయాలను ఏర్పాటుచేశారు. గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శి, ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఏఎన్ఎం, వెల్ఫేర్ అసిస్టెంట్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, అగ్రికల్చర్ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, ఉద్యాన అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్ తదితర పోస్టులను నియమించించారు. తద్వారా జిల్లాలో వేలాది మంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. 35 శాఖలకు చెందిన 500లకు పైగా సేవలను అందుబాటులోకి తెచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయాలను నిర్వీర్యం చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది.సిఫార్సుల పర్వం ఉద్యోగులను కూటమి నేతల చెప్పుచేతల్లో పెట్టే ఎత్తుగడ బదిలీల నిర్వహణపై స్పష్టత లేని జీఓ మెరిట్ను పక్కనపెట్టి సిఫార్సు లేఖలున్న వారికే ప్రాధాన్యం ఈ మేరకు ప్రొఫార్మాలో వీఐపీ కాలమ్ సిఫార్సు లేఖల కోసం నేతల వద్దకు ఉద్యోగుల ప్రదక్షిణలు చెప్పినట్టు పనిచేసే వారికే ఎమ్మెల్యేల లేఖలు -
కొందరికే అన్నదాత సుఖీభవ!
సాగు భారమైంది.. మామిడి ధర భారీగా పతనమైంది.. కోకో ధర నేలచూపులు చూస్తోంది.. పొగాకు, మిర్చి, వాణిజ్య పంటలతో పాటు ధాన్యానికి సైతం గిట్టుబాటు ధర లేక అన్నదాత ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఏడాది క్రితం వరకు రికార్డు స్థాయిలో ధరలు పలికిన పంటలు పతనం కావడం, పెట్టుబడులు పెరగడం, అప్పుల తిప్పలతో అన్నదాత సుఖీభవ సాయంపై ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే మిగిలింది. జిల్లాలో 40 శాతానికిపైగా రైతుల సంఖ్యలో కోత విధించి అర్హుల జాబితాను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. అయినా పథకం అమలు, ఎప్పుడు సాయం జమ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. శురకవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు : వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉమ్మడి పశ్చిమ రాష్ట్రంలోనే ఖ్యాతి గడిచింది. ప్రధానంగా ఏలూరు జిల్లాలో వరి సాగు అత్యధికంగా ఉంటుంది. దీంతో పాటు ప్రధాన వాణిజ్య పంట అయిన కోకో, మామిడి కూడా సాగు విస్తీర్ణంలో జిల్లానే రాష్ట్రంలో నంబర్వన్. ఇక పొగాకు, ఇతర వాణిజ్య పంటలు కూడా జిల్లాలో గణనీయంగా సాగులో ఉన్నాయి. ఈ పరిణామాల క్రమంలో గతేడాదిగా ధాన్యంతో సహా పంటలకు ఆశించిన ధరలు లేకపోవడంతో అన్నదాత అగచాట్లు పడుతున్నాడు. ప్రధానంగా జిల్లాలో 1.91 లక్షల ఎకరాల్లో వరిసాగు ఉంది. అలాగే 36,156 ఎకరాల్లో కోకో, 52 వేల ఎకరాల విస్తీర్ణంలో మామిడి, 33 వేల ఎకరాల్లో పొగాకు సాగవుతోంది. గతేడాది రూ.1,150 పలికిన కిలో కోకో గింజలు ప్రస్తుతం కిలో రూ.300 నుంచి రూ.400కు పరిమితమైంది. అలాగే గతేడాది రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలికిన టన్ను మామిడి ప్రస్తుతం రూ.10 వేలకే పరిమితమై సీజన్ ముగింపులో ఉంది. మామిడి రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. అలాగే పొగాకు కూడా ధరలు భారీగా పతనమయ్యాయి. కిలో రూ.411 పలికిన గ్రేడ్–1 పొగాకు నేడు రూ.270కు పరిమితమైంది. ఇలా వరుసగా ప్రధాన పంటలు ధరలు పతనమయ్యాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన రైతు భరోసా పథకానికి పేరు మార్చి అన్నదాత సుఖీభవగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచే అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించినా ఏడాది పాటు పట్టించుకోలేదు. ఖరీఫ్, రబీ సీజన్లు ముగిసినా పథకం ఎప్పుడు అమలు చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో జిల్లాలో గందరగోళం నెలకొంది. 1.62 లక్షల మందికే అన్నదాత సుఖీభవ ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ అమలుపై స్పష్టమైన ఆదేశాలు అందలేదు. అయితే అర్హుల జాబితాను స్థానిక యంత్రాంగం సిద్ధం చేసింది. గత ప్రభుత్వ హయాంలో 2.35 లక్షల మందికి రైతు భరోసా సాయం అందితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో 1,62,085 మందిని మాత్రమే అన్నదాత సుఖీభవకు అర్హులుగా గుర్తించారు. ఈ లెక్కన జిల్లాలోని 64,873 మందికి పథకం వర్తించదు. అలాగే జిల్లాలో ఇప్పటివరకూ 1,56,461 మంది రైతులు ఈకేవైసీ పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 3.42 లక్షల మంది రైతులు ఉన్నారు. న్యూస్రీల్రైతులను దగా చేశారు దేశానికి అన్నం పెట్టే రైతులను మోసం చేయడం కూటమి ప్రభుత్వానికి తగదు. ఎన్నో ఆశలు పెట్టుకుని రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూశారు. పాలన చేపట్టి ఏడాది అయినా రైతులకు ప్రభుత్వ సహాయం అందలేదు. నిర్దిష్టమైన ప్రకటన చేయలేదు. పెట్టుబడి సాయం కోసం అప్పులు తెచ్చుకుని వ్యవసాయం చేయాల్సిన పరిస్థితికి రైతులు వచ్చారు. – కొలుసు గణపతిరావు, రైతు సొసైటీ మాజీ చైర్మన్ దెందులూరు గతంలో రైతే రాజు గత వైఎస్సార్సీపీ ప్రభు త్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతును రాజుగా చేశారు. బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేశారు. ఏటా వ్యవసాయ సీజన్ సమయానికి పెట్టుబడి సాయం అందించారు. రైతులు, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేశారు. – ఎం.రంగబాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్షకులపై కక్ష జిల్లాలో కొందరు రైతులకే వర్తింపు అర్హుల జాబితా సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం కౌలు రైతులకు దక్కని భరోసా 40 శాతం మేర తగ్గిన లబ్ధిదారులు గత ప్రభుత్వంలో జిల్లాలో 2.24 లక్షల మందికి పథకం కూటమి ప్రభుత్వంలో 1.62 లక్షల మందికే వర్తింపు పథకం అమలుపై లేని స్పష్టత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.1,830 కోట్ల సాయం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ రైతుభరోసా పేరుతో ఏటా మూడు విడతల్లో ప్రతి రైతుకూ నగదు జమ చేసేవారు. జిల్లాలో నాలుగేళ్లలో 2 లక్షల మందికిపైగా రైతులకు రూ.1,830 కోట్ల సాయం చేశారు. అలాగే సున్నా వడ్డీ రుణాల కింద రూ.22.29 కోట్ల లబ్ధి చేకూర్చారు. -
● ప్రాణాలతో సదరంగం
కూటమి ప్రభుత్వంలో దివ్యాంగులకు అవస్థలు తప్పడం లేదు. సామాజిక పింఛన్ల ఏరివేతలో భాగంగా దివ్యాంగులు మళ్లీ సదరం సర్టిఫికెట్ తీసుకోవాలంటూ అధికారులు కొర్రీలు పెట్టి ఆస్పత్రుల చుట్టూ తిప్పుతున్నారు. దీంతో దివ్యాంగులు, మానసిక వికలాంగులు నానా ప్రయాసలు పడుతూ ఏలూరు జీజీహెచ్లో సదరం క్యాంపునకు హాజరవుతున్నారు. మండుటెండల్లో దూర ప్రాంతాల నుంచి సహాయకులను తీసుకుని ఆందోళనతో వస్తున్నారు. బుధవారం ఇలానే ఓ వృద్ధుడు జీజీహెచ్కు వచ్చి గుండె ఆగి ప్రాణాలు విడిచాడు. అయినా అధికారుల్లో చలనం లేదు. సదరం కేంద్రాలు నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటుచేయాలని పింఛన్దారులు కోరుతున్నారు. గురువారం ఏలూరు జీజీహెచ్ వద్ద కనిపించిన దృశ్యాలివి. – సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు వృద్ధుడికి తప్పని తిప్పలు -
మున్సిపల్ కార్మికుల దీక్షకు సంఘీభావం
ఏలూరు (టూటౌన్): మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల దీక్షలకు ఇఫ్టూ సంఘీభావం తెలిపింది. గురువారం ఇఫ్టూ ప్రదర్శనగా వెళ్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద దీక్షలు చేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఇఫ్టూ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా నెల రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం తగదన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో కార్మికులను పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, కనీస వేతనాలు రూ.29 వేలు ఇవ్వాలని తదితర డిమాండ్లు పరిష్కరించాలన్నారు. ఈనెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు సమ్మె బాట పట్టనున్నారని సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. అలాగే ఐఎఫ్టీయూ నాయకులు కూడా మద్దతు తెలిపారు. డీఎస్సీ పరీక్షలకు 1,030 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో గురువారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు 1,030 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 174 మందికి 171 మంది, మధ్యాహ్నం 189 మందికి 180 మంది, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 150 మందికి 141 మంది, మధ్యాహ్నం 140 మందికి 138 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 197 మందికి 193 మంది, మధ్యాహ్నం 215 మందికి 207 మంది హాజరయ్యారని డీఈఓ ఎం. వెంకట లక్ష్మమ్మ తెలిపారు. నేడు ఎంటీఎస్ టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) టీచర్లకు శుక్రవారం బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూరులోని జీఎంసీ బాలయోగి సైన్స్పార్క్లో ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అన్ని కేడర్లనూ చూపించాలి ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్లో అన్ని కేడర్ల ఖాళీలను బ్లాక్ చేయకుండా చూపించాలని ఉపాధ్యాయ జేఏసీ నాయకులు గురువారం డీఈఓ వెంకటలక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఎస్జీటీ ఖాళీలను మాత్రమే కాకుండా హైస్కూళ్లలోని స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను కూడా కోరుకునేలా అవకాశం కల్పించాలన్నారు. జేఏసీ నాయకులు ఎం.ఆదినారాయణ, జి.మోహన్, టి.రామారావు ఉన్నారు. సాగుదారుల చట్టంపై ప్రచారోద్యమం ఏలూరు (టూటౌన్): దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ జా యింట్ డైరెక్టర్ షేక్ హబీబ్ బాషా చేతులమీదుగా పంట సాగుదారులు చట్టంపై ప్రచారోద్యమం కరపత్రాలను గురువారం విడుదల చేశారు. జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బా షా మాట్లాడుతూ జిల్లాలో డీబీఆర్సీ 2025– 26కి గాను భూమి ఉన్న రైతులకు, కౌలుదారులకు మధ్య అవగాహనా కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామమన్నారు. కౌలు కార్డు ల ద్వారా పథకాలు పొందవచ్చన్నారు. ఎన్ఎంఎంఎస్ ఫలితాలు విడుదల ఏలూరు (ఆర్ఆర్పేట): నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థుల మెరిట్ కార్డులను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వెబ్సైట్లో అందుబాటులో ఉంచారన్నారు. మెరిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకుని సరిచూసుకోవాలని సూచించారు. అనంతరం జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ వారి పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత స్కూల్ నోడల్ ఆఫీసర్, జిల్లా నోడల్ ఆఫీసర్, లాగిన్ (డీఎన్ఓ) ద్వారా అప్లికేషన్ను ధ్రువీకరించుకోవాలని కోరారు. -
యోగా డేకు భారీ ఏర్పాట్లు
భర్తకు దేహశుద్ధి కొయ్యలగూడెంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తికి ఆయన భార్య దేహశుద్ధి చేసింది. తనకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగింది. IIలో uఏలూరు(మెట్రో): జిల్లావ్యాప్తంగా ఈనెల 21న యోగా దినోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి యోగా దినోత్సవం, తల్లికి వందనం పథకంపై అధికారుతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా 9 లక్షల మంది యోగాభ్యాసన కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాస్థాయిలో ఏలూరులో మూడు ప్రదేశాల్లో 5 వేల మంది చొప్పున యోగాభ్యాసన చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే కార్యక్రమాల వివరాలను యోగాంధ్ర యాప్లో వెంటనే నమోదు చేయాలన్నారు. తల్లికి వందనం పథకాన్ని అర్హులైన తల్లులందరికీ వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం పెండింగ్లో ఉన్న తల్లుల ఈ–కేవైసీ వెంటనే పూర్తి చేయాలనీ, అభ్యంతరాలపై అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ముఖ్యమంత్రి సమీక్ష సీఎం చంద్రబాబు అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి యోగాంధ్ర కార్యక్రమం, తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, అధికారులు హాజరయ్యారు. నేడు రెవెన్యూ దినోత్సవం ఏలూరు(మెట్రో): రెవెన్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం వేడుకలు నిర్వహించనున్నట్టు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.రమేష్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సభా ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ రెండు శతాబ్దాలకు పైగా ప్రజలకు సేవలందిస్తోందని తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. -
కొల్లేరు సమస్యలపై మొర
పిడుగులు.. తస్మాత్ జాగ్రత్త వర్షాకాలం పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ. తగు జాగ్రత్తలు తీసుకుంటే పిడుగు ప్రమాదాన్ని నివారించవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 10లో uగురువారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2025ఏలూరు(మెట్రో): సుప్రీంకోర్టు ఆదేశాలతో కొల్లేరుపై కేంద్రం నియమించిన సాధికారత కమిటీ బుధవారం కొల్లేరు వాసులు, నేతల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. కొల్లేరు ప్రాంతంలోని ప్రజల జీవన స్థితిగతులు, వారి సమస్యలను ఆ ప్రాంతానికి చెందిన మహిళలు, మత్స్యకారులు, రైతులు, ప్రజాప్రతినిధులు ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలుకు బుధవారం తరలివచ్చి తమ గోడును వెల్లబోసుకున్నారు. కేంద్ర సాధికారత కమిటీ గౌరవ సభ్యుడు చంద్రశేఖర్ గోయల్, సభ్య కార్యదర్శులు జె.ఆర్.భట్, జి.భానుమతి, కమిటీ సభ్యులు సునీల్ లిమాయే, ప్రకాష్ చంద్ర భట్లకు విన్నవించుకున్నారు. జి రాయితీ, డీ–ఫాం భూములు మినహాయించాలి పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు స్థానికులకు జీవనోపాధితో పాటు భూములపై హక్కులు ఉండేలా చూడాలని వినతి పత్రాలు అందజేశారు. అభయారణ్యంలోని జిరాయితీ డీ–ఫామ్ భూములు మినహాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నంబూరి వెంకటరామరాజు మాట్లాడుతూ.. కొల్లేరులో పర్యావరణ, పక్షులను కాపాడేది రైతులేనని, కొల్లేరు అభయారణ్యం నోటిఫికేషన్ విడుదల చట్టంగా రూపొందించే సమయంలో పరిణామాలపై ఆ ప్రాంత ప్రజలకు ఎలాంటి అవగాహన కలిగించలేదన్నారు. అందుకే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కొల్లేరు ప్రాంతంలోని కాలువలు, డ్రెయిన్లలో చెత్తను తొలగించని కారణంగా, సరైన నిర్వహణ పనులు చేపట్టక ఏటా వరదల సమయంలో కొల్లేరు ప్రాంతం ముంపునకు గురవుతుందన్నారు. కొల్లేరు ప్రాంతంలో లక్షలాది మంది ప్రజలు జీవిస్తున్నారని, ప్రజల పౌర హక్కులకు, జీవన విధానాలకు ఎలాంటి భంగం కలగకుండా మానవీయ కోణంతో చూడాలన్నారు. శివాజీ మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతంలో 122 గ్రామాలున్నాయని, అధికశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన ప్రజలున్నారన్నారు. కొల్లేరు అభయారణ్యం చట్టం చేసినప్పుడు ఆ ప్రాంత ప్రజలకు కనీస అవగాహన కలిగించలేదన్నారు. ఆ సమయంలో ఒకే ఒక వ్యక్తి స్పందించారని, దీనినిబట్టి కొల్లేరు చట్టంపై ఏ విధమైన అవగాహన కలిగించారన్నది స్పష్టం అవుతుందన్నారు. కొల్లేరు అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలి కై కలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిశీలించి వారికి న్యాయం జరిగేలా చూడాలని కమిటీని కోరారు. కొల్లేరు అభివృద్ధి బోర్డు ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కొల్లేరు అభయారణ్య పరిధిలోని 14 వేల ఎకరాల జిరాయితీ భూమిదారులు, 20 వేల ఎకరాల డీ–ఫారం పట్టాదారుల హక్కులను కాపాడాలన్నారు. కాంటూర్ పరిధిని తగ్గిస్తామని హామీ ఇచ్చారని, కానీ అది అమలు జరగలేదన్నారు. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, జెడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, అటవీ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, అటవీ ప్రిన్సిపాల్ చీఫ్ కన్ఝర్వేటర్ అజయ్ కుమార్ నాయక్, మత్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, డీఎఫ్ఓలు శుభం, విజయ తదితరులు పాల్గొన్నారు. అదుపు తప్పిన కారు ద్వారకా తిరుమల వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు మార్జిన్లోకి దూసుకెళ్లి, టైల్స్ షాపును ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా, ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. 10లో uఅధికారులతో సమీక్ష కేంద్ర సాధికారత కమిటీ సభ్యులు బుధవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ గోయల్ మాట్లాడుతూ ఉప్పుటేరులోకి కలిసే ఇరిగేషన్ డ్రెయిన్లు, డ్రెయిన్ల ద్వారా కొల్లేరులోకి వచ్చే కాలుష్యం నివారణకు తీసుకుంటున్న చర్యలు, డ్రెయిన్ల డీసిల్టింగ్పై నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ శాఖ ఎస్ఈ నాగార్జునరావును ఆదేశించారు. కొల్లేరు వన్యప్రాణి అభ్యయారణ్యంగా ప్రకటించక ముందు కొల్లేరు గ్రామాల్లోని అంతర్గత రోడ్లు, గ్రామాలను కలిపే లింక్ రోడ్లు, ప్రస్తుతం వాటి నిర్వహణ, కొత్తగా నిర్మించిన, నిర్మించే రోడ్లపై, కొల్లేరు అభయారణ్య పరిధిలో రోడ్ల నిర్మాణం, రోడ్ల నిర్వహణలపై ఉన్న సమస్యలపై నివేదిక అందించాలని పంచాయతీరాజ్ ఎస్ఈ రమణమూర్తిని కమిటీ సభ్యులు ఆదేశించారు. అనంతరం ఏలూరులో పారిశుద్ధ్య వ్యర్థాలు, వ్యర్థాల శుద్ధీకరణ సామర్థ్యం, కొల్లేరులో కలిసే ఏలూరు నగరంలోని పారిశుద్ధ్య వ్యర్థాలు వివరాలపై నివేదిక సమర్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ను ఆదేశించారు. కొల్లేరు పరిధిలో పర్యావరణం, కాలుష్య పరిస్థితులు, చేపల పెంపకానికి వినియోగించే నీరు, తాగునీటి కాలుష్యం, పరిశ్రమల ద్వారా కొల్లేరులోకి వెళ్లే వ్యర్థాల కారణంగా కాలుష్యం తదితర వివరాలపై సవివరమైన నివేదిక సమర్పించాలని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకటేశ్వరరావును ఆదేశించారు. కొల్లేరులో చేపల పెంపకం, కాలుష్య నీటిలో ఉత్పత్తియ్యే చేపల వినియోగం కారణంగా అనారోగ్య సమస్యలు, చేపల పెంపకానికి వినియోగించే రసాయనిక ఎరువులు, పురుగుమందుల వివరాలు, వాటి కారణంగా కొల్లేరులో కలిగే కాలుష్యం తదితర విషయాలపై నివేదిక సమర్పించాలని మత్స్యశాఖ అధికారులను సూచించారు. న్యూస్రీల్ సీఈసీ బృందానికి వినతుల వెల్లువ ఏలూరు కలెక్టరేట్కు పెద్ద ఎత్తున కొల్లేరు వాసులు భూములపై హక్కులుండేలా చూడాలని విజ్ఞప్తి -
స్కూళ్లలో పుస్తకాల అమ్మకం అడ్డుకోవాలి
ఏలూరు(ఆర్ఆర్పేట): ఏలూరు నగరంలో ప్రైవేట్ విద్యాసంస్థలు చట్టవిరుద్ధంగా పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అధిక ధరలకు అమ్మడాన్ని అడ్డుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్ డిమాండ్ చేశారు. బుధవారం శాంతినగర్లోని పలు విద్యాసంస్థల్లో పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్ముతుండగా ఎంఈఓ రవిప్రకాష్, హర్ష కుమార్ పట్టుకున్నారు. ఈ సందర్భంగా లెనిన్ మాట్లాడుతూ మార్కెట్ ధరల కన్నా 150 శాతం అధిక ధరలకు పుస్తకాలను అమ్ముతూ బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఇంగ్లీష్ మీడియం విద్య కోసం ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయించడాన్ని అవకా శంగా తీసుకున్న విద్యాసంస్థలు తల్లితండ్రుల రక్తాన్ని తాగుతున్నాయని ఒకపక్క అధిక ఫీజులు మరోపక్క పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, ట్యూషన్ ఫీజులు ఇలా అనేక రూపాలలో తల్లిదండ్రులను దోచుకు తింటున్నాయన్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.68 కోట్లు ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో బుధవారం అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ జరిగింది. ఈ లెక్కింపులో శ్రీవారికి భారీగా ఆదాయం సమకూరింది. గత 28 రోజులకు నగదు రూపేణా స్వామివాకి రూ. 3,68,88,156 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 317 గ్రాముల బంగారం, 7.877 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2000, రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ. 49 వేలు లభించినట్టు చెప్పారు. యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో బహుమతులు ఏలూరు(మెట్రో): యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీ లలో ఏలూరు జిల్లా రెండు బహుమతులు గెలుచుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి విజేతలకు అభినందనలు తెలిపారు. యోగా స్కిట్ అండ్ రోల్ ప్లే జూనియర్ కేటగిరీలో, సీనియర్ కేటగిరిలో రాష్ట్ర స్థాయిలో బహుమతులు గెలుచుకున్నారు. సమగ్రశిక్ష సిబ్బంది బదిలీలకు అవకాశం భీమవరం: జిల్లాలోని సమగ్ర శిక్ష ప్రాజెక్టులోని కాంట్రాక్ట్ సిబ్బంది బదిలీలకు ఈనెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని సమగ్రశిక్ష అడిషినల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యామ్సుందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్రశిక్ష ప్రాజెక్టులో కాంట్రాక్ట్ సిబ్బందిగా పనిచేస్తున్న ఐఇఆర్పీ, పీటీఐ, సీఆర్ఎంటీ, మండల స్థాయి అకౌంటెంట్, సైట్ ఇంజనీర్స్, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, మేసెంజర్స్, ఆఫీసు సబార్టినేట్స్ తదితర సిబ్బంది రిక్వెస్ట్, సరస్పర ప్రతిపాదనల దరఖాస్తులను ఈనెల 19 నుంచి 21 లోగా సమగ్రశిక్ష ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలని శ్యామ్సుందర్ తెలిపారు. వ్యవసాయంలో సాంకేతికతను వినియోగించాలి భీమవరం: వ్యవసాయంలో సాంకేతికతను వినియోగించి అధిక లాభాలు పొందాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి రైతులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన యంత్ర పరికరాలు, రాయితీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆహార కొరత స్థాయి నుంచి రైతులు విప్లవాత్మకమైన సాగు ద్వారా మిగులు ధాన్యం విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నారన్నారు. జిల్లాకు కిసాన్ డ్రోనన్ గ్రూపులకు 80 శాతం సబ్సిడీతో 41 డ్రోన్లను కేటాయించినట్లు చెప్పారు. 709 మంది సన్న, చిన్నకారు రైతులకు రూ.8.99 కోట్ల విలువైన వ్యక్తిగత యంత్ర పరికరాలకు రూ.3.84 కోట్లు రాయితీపై పంపిణీ చేశామన్నారు. -
ఆయిల్పాం సాగును ప్రోత్సహిస్తాం
పెదవేగి: ఏలూరు జిల్లాలో ఈ ఏడాది 15 వేల హెక్టార్లలో ఆయిల్ పాం విస్తరించాలనే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహార్ తెలిపారు. బుధవారం పెదవేగిలోని ఆయిల్ పాం పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. అధిక దిగుబడినిచ్చే రకాలు, కోకో వంటి అంతర పంటలపై అవగాహన, డెల్టా భూముల్లో ఆయిల్ పాం ప్రోత్సహించడం వంటి వాటిపై సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది 5 వేల నుంచి 15 వేల హెక్టార్ల వరకూ ఆయిల్ పాం సాగు అదనంగా చేపట్టాలని టార్గెట్గా నిర్ణయించామన్నారు. పంట సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో, క్షేత్రస్థాయిలో వాస్తవ సమాచారం అందరితో పాలుపంచుకోవడంలో జాప్యం కనిపిస్తుందన్నారు. దీనిని పరిష్కరించేందుకు జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. కేంద్రం నుంచి సబ్సిడీలను అందిపుచ్చుకుని మన ప్రాంతంలో మెరుగైన ఆయిల్ పామ్ సాగు జరిగేలా ప్రయత్నిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, ఆయిల్ పాం పరిశోదనా కేంద్రం డైరెక్టర్ కంచర్ల సురేష్, జిల్లా ఉధ్యానశాఖ అధికారి ఎస్.రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
పాటించాల్సిన జాగ్రత్తలు
● వర్షం వచ్చేటప్పుడు చెట్ల కింద ఉండరాదు. ముఖ్యంగా ఎత్తయిన చెట్టు కింద అస్సలు ఉండకూడదు. ● ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తే రైతులు పొలాల వద్ద బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. ● లక్షల డిగ్రీల ఉష్ణోగ్రతతో విడుదలయ్యే వేడి ఒక్కసారిగా మనిషిని చేరగానే గుండైపె ప్రభావం చూపుతుంది. ● వర్షపు సూచన ఉన్నప్పుడు గొడుగులపై ఇనుప బోల్టులు, కెమేరాలు, సెల్ఫోన్లు దగ్గర లేకుండా చూసుకోవాలి. లేకుంటే రేడియేషన్ తరంగాలకు గురై ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ● మెరుపులు, పిడుగుల వల్ల విద్యుత్ ఉపకరణాలు కాలిపోయే అవకాశం ఉంది. ఆ సమయంలో టీవీలకు ఉన్న విద్యుత్ కేబుల్ కనెక్షన్ తొలగించాలి. ● వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద ట్రాన్స్ఫార్మర్ సమీపంలో ఉండకూడదు. తడి ప్రదేశాల్లో ఉండకపోవడం చాలా మంచిది. -
కోకో గింజల దొంగలు దొరికారు
ఏలూరు టౌన్ : కోకో గింజల చోరీ కేసులో నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 430 కిలోల కోకో గింజలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఏలూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ వివరాలు వెల్లడించారు. ద్వారకాతిరుమల మండలం వేంపాడు గ్రామంలో ఆలపాటి జగదీష్కుమార్ పొలంలో ఉన్న షెడ్డులోని 160 కిలోల కోకో గింజలను ఈనెల 15వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ద్వారకాతిరుమల పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి భీమడోలు సీఐ విల్సన్ ఆధ్వర్యంలో ఎస్సై సుఽధీర్ దర్యాప్తు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఈనెల 17న సాయంత్రం అంగిడిగూడెం సంతమార్కెట్ సమీపంలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామానికి చెందిన కొత్లపల్లి హర్ష, ద్వారకాతిరుమల మండలం వేంపాడు గ్రామానికి చెందిన గెద్దల నాగరాజు, ముదునూరి శివశంకర్, తడికలపూడి గ్రామానికి చెందిన జొన్నకూటి రాజేష్గా గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. నిందితులు జల్సాలు, వ్యసనాలకు బానిసలై డబ్బు సంపాదించేందుకు రాత్రివేళల్లో పొలాల్లోకి వెళ్లి కోకో గింజలను చోరీ చేస్తున్నట్లు విచారణలో అంగీకరించారు. వీరిపై దెందులూరు, తడికలపూడి, ద్వారకాతిరుమల పోలీస్స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. నిందితుల నుంచి 430 కోకో గింజలను స్వాధీనం చేసుకోగా వాటి విలువ సుమారు రూ.2.15 లక్షలు ఉంటుందని పోలీసుల అంచనా. నేరానికి వినియోగించిన రెండు మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన కోకో గింజలను పెదవేగి మండలం చక్రాయగూడెం గ్రామానికి చెందిన సిరిబత్తుల ఉదయ్కుమార్ కొనుగోలు చేయడంతో అతడ్ని కూడా నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన సీఐ విల్సన్, ఎస్సై సుధీర్, హెచ్సీ ఎస్.శ్రీనివాస్, పీసీ ఎం.వెంకటేశ్వరరావు, సీహెచ్ లక్ష్మీనారాయణ, హెచ్జీ వీజే ప్రకాష్బాబును ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అభినందించారు. చోరీ సొత్తు 430 కిలోల కోకో గింజల స్వాధీనం -
పనికి వెళ్లినా.. నమోదు కాని హాజరు
ముసునూరు: ఫీల్డ్ అసిస్టెంట్, అతని అనుయాయులతో బెదిరింపులకు పాల్పడడంతో ఓ ఉపాధి కూలీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు పేర్కొన్న వివరాల ప్రకారం ముసునూరుకు చెందిన చలపాటి రాణి, ఆమె భర్త తంబి ప్రతి రోజూ ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు. కాని స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ దేవరపల్లి రవితేజ గ్రామస్థాయి రాజకీయాల నేపథ్యంలో గత రెండు వారాలుగా వీరికి హాజరు వేయడం లేదు. దీంతో వారు ఫీల్డ్ అసిస్టెంట్ను హాజరు విషయంపై ప్రశ్నించారు. రెచ్చిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ రోజూ పనికి వచ్చినా మీకు హాజరు వేయనని తెగేసి చెప్పాడు. నిర్ఘాంత పోయిన బాధితులు ఈ విషయంపై న్యాయం కోరుతూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. భయపడిన ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామంలోని తన అనుయాయులు, పనిలో పాల్గొనకుండా హాజరు పొందుతున్న మరికొందరిని బాధితుల ఇంటి మీదకు ఉసిగొల్పాడు. దుక్కిపాటి విజయకుమార్, కొడవలి ఆంద్రెయ, రాజేష్, సర్వేశ్వరరావు తదితరులు తంబి ఇంటి వద్ద లేని సమయంలో బాధితుల ఇంటికి వెళ్లి దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగారు. అంతటితో ఆగకుండా నీ భర్తను చంపేస్తామంటూ రాణిని బెదిరించారు. భయభ్రాంతురాలైన ఆమె తీవ్ర మనస్తాపానికి లోనై మంగళవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు ఆమెను నూజివీడులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతోంది. తమను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్, అతని అనుయాయుల నుంచి ప్రాణరక్షణ కల్పించాలని బాధిత కుటుంబ సభ్యులు మొరపెట్టుకుంటున్నారు. దీనిపై తమకు సమాచారం అందలేదని ఎస్సై ఎం. చిరంజీవి చెప్పారు. ఫీల్ట్ అసిస్టెంటును నిలదీసిన ఉపాధి కూలీలు తన అనుయాయులతో బెదిరింపులకు దిగిన ఫీల్డ్ అసిస్టెంట్ భయభ్రాంతులతో మహిళ ఆత్మహత్యాయత్నం -
ద్వారకాతిరుమలలో అదుపు తప్పిన కారు
ద్వారకాతిరుమల : శ్రీవారి దర్శనార్థం క్షేత్రానికి నలుగురు యువకులతో వెళుతున్న కారు అతివేగం, నిర్లక్ష్యం కారణంగా అదుపుతప్పి రోడ్డు మార్జిన్లోని చెట్లలోకి దూసుకెళ్లి, పక్కనే ఉన్న టైల్స్ షాపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా, ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన ద్వారకాతిరుమలలోని కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయం దాటిన తరువాత మలుపులో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. భీమవరంనకు చెందిన కె.విష్ణు తన అన్న కారును తీసుకుని, అదే పట్టణానికి చెందిన తన స్నేహితుడు మనోజ్తో కలసి ద్వారకాతిరుమల క్షేత్రానికి ధైవదర్శనార్థం పయనమయ్యాడు. మార్గ మద్యలో గణపవరం మండలం పిప్పరలో మరో ఇద్దరు స్నేహితులు బండారపు మోహన వెంకట సాయి, వడ్డీల ప్రభాకర్ను కారులో ఎక్కించుకున్నాడు. అతి వేగంగా వెళుతున్న కారు ఘటనా స్థలం వద్ద మలుపులోకి వచ్చేసరికి అదుపుతప్పి, రోడ్డు మార్జిన్లోని చెట్లలోకి దూసుకెళ్లి, పక్కనే ఉన్న టైల్స్ షాపుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విష్ణు, మోహన్ వెంకట సాయి, ప్రభాకర్లకు తీవ్ర గాయాలు కాగా మనోజ్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు హుటాహుటీన క్షతగాత్రులను 108 ఆంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎస్సై టి.సుధీర్ పరిశీలించారు. ముగ్గురికి తీవ్ర, ఒకరికి స్వల్ప గాయాలు -
తల్లికి వందనం వర్తింపజేయాలి
వీరవాసరం: తల్లికి వందనం పథకాన్ని అంగన్వాడీలకు వర్తింపజేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వీరవాసరం మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. సీఐటీయు జిల్లా నాయకుడు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ.. రూ.10,000 వేతనం దాటిందని, గవర్నమెంట్ ఉద్యోగి అని అంగన్వాడీలకు పథకాన్ని తిరస్కరించడం దారుణమని అన్నారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి అంగన్వాడీలకు వర్తించిందని అన్నారు. అత్యధికమంది కేవలం వేతనం మీద ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. స్కీం వర్కర్లుగా, గౌరవ వేతనంతో బతికే అంగన్వాడీలకు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని అన్నారు. ఇంతవరకు అంగన్వాడీల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరోసారి అంగన్వాడీలు రోడ్డు మీదకు రావడం తప్పదని అన్నారు. -
గుండుగొలను వంతెన పనుల్లో కదలిక
భీమడోలు: గోదావరి కాల్వపై గుండుగొలను వద్ద చేపట్టిన వంతెన నిర్మాణ పనుల్లో బుధవారం కదలిక వచ్చింది. వంతెన శ్లాబ్ పనులు పూర్తి కాగా.. నిధులు లేమితో చివరి దశ పనులు నిలిచిపోయాయి. దీంతో కొల్లేరు వాసుల ‘కలల వారధి ఇంకెన్నాళ్లు?’ అనే శీర్షికన ఈనెల 16న సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించారు. మాజీ ఎంపీపీ శిరిబత్తిన కొండబాబు, గ్రామ పెద్ద గొర్రెల పవన్ల ఆధ్వర్యంలో వంతెన ఆఖరి పనుల చేపట్టేందుకు రూ.4 లక్షల వరకు ఖర్చవుతున్నందున, ఆర్థిక సాయం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. దీంతో వారంతా సుముఖత వ్యక్తం చేయడంతో పనులు పునః ప్రారంభించారు. వంతెనకు ఇరువైపులా జేసీబీ సాయంతో ఎర్ర కంకర వేసి పటిష్టం చేస్తున్నారు. ఈ పనులు పూర్తయ్యిన తర్వాత భారీ వాహనాల మినహా ఇతర వాహనాలను వంతెనపై రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
ఆగిరిపల్లి : రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారని స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత తెలిపారు. ఈనెల 28, 29 తేదీల్లో బెంగళూరులో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఆగిరిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెందిన పదో తరగతి విద్యార్థులు ప్రహర్ష, రోహిత్, అభిలాష్ ఎంపికయ్యారు. విద్యార్థులను, శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు శివ నాగేంద్ర, సుగుణరావును హెచ్ఎం, గ్రామస్తులు అభినందించారు. బాలిక ఆత్మహత్యపై కేసు నమోదు భీమడోలు : గుండుగొలనులో బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం గుండుగొలనుకు చెందిన చిట్టిబొమ్మల మోక్షశ్రీ 16) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల పదో తరగతి పూర్తిచేసింది. 350 మార్కులతో ద్వితీయశ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లి వచ్చిన మోక్షశ్రీతో మంగళవారం తండ్రి పోతురాజు పాఠశాలకు వెళ్లాడు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత కుమార్తె మోక్షశ్రీను మందలించాడు. టెన్త్లో సక్రమంగా చదువుకుంటే మంచి మార్కులు వచ్చేవని, ఇలాగే ఇంటర్లో కూడా చదివితే ఇబ్బందులు పడతావంటూ మందలించి బయటకు వెళ్లాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మోక్షశ్రీ సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంట గదిలో ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక మృతితో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న భీమడోలు సీఐ యూజే విల్సన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై చలపతిరావు తెలిపారు. -
విత్తన ఎంపికే కీలకం
భీమవరం: వ్యవసాయమే జీవనాధారమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సార్వా వరి సాగుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించకపోవడం, గత దాళ్వా సీజన్ ధాన్యం సొమ్ములు ఇంకా చెల్లించపోవడంతో వరిసాగుకు రైతులు మీనవేషాలు లెక్కించాల్సిన పరిస్థితి.. ధాన్యం విక్రయించిన 24 గంటల లోపు సొమ్ములు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకున్న ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే దాదాపు రూ.290 కోట్లు బకాయిపడినా నోరుమెదపపోవడం పట్ల రైతన్నలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సాయం అందకున్నా, సకాలంలో ధాన్యం డబ్బులు చెల్లించపోయినా వరిసాగు తప్పనిసరికావడంతో సార్వా సాగుకు విత్తనాల సేకరణ, భూములు దుక్కులు వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. సార్వా పంటకు అనువైన విత్తనాలు వేసుకోవడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చునని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 5.60 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నందున విత్తన ఎంపిక కీలకం.. సార్వా వరి సాగు ప్రారంభం ఉమ్మడి పశ్చిమగోదావరిలో 5.60 లక్షల ఎకరాల్లో సాగు చీడ పీడలు తట్టుకునే రకాలు ఎంచుకోవాలి వరిసాగులో రైతులు విత్తన ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణం, భూసార పరిస్థితులకు అనువైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు. చీడ, పీడలను తట్టుకునే వరిరకాలను ఎంపిక చేసుకోవడం ద్వారా పెట్టుబడులు తగ్గించుకోవచ్చు. – ఎంవీ కృష్ణాజీ, ప్రధానశాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధనాస్థానం, మార్టేరు -
చోరీ కేసులో మహిళ అరెస్ట్
ద్వారకాతిరుమల : బస్సు ఎక్కుతున్న ఓ ప్రయాణికురాలి బ్యాగ్లో నుంచి పర్సును దొంగిలించిన ఒక మహిళను బుధవారం పోలీసులు అరెస్టు చేసి, ఆమె వద్ద నుంచి 23.92 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో ఎస్సై టి.సుధీర్ వివరాలను వెల్లడించారు. పెరవలి మండలం దేశపాత్రునిపాలెం గ్రామానికి చెందిన బొడ్డు నాగమణి గతేడాది అక్టోబర్ 26న భీమడోలు బస్టాండులో బస్సు ఎక్కుతుండగా, ఆమె భుజానికి ఉన్న బ్యాగ్లోనుంచి పర్సును గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించుకుపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో కేసు నమోదైంది. ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, ఏఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ల ఆధ్వర్యంలో భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్సై టి.సుధీర్, హెడ్ కానిస్టేబుల్ ఎస్.శ్రీనివాస్, సిబ్బంది ఎం.వెంకటేశ్వరరావు, సీహెచ్ లక్ష్మీనారాయణ, వీజే ప్రకాష్బాబు బృందంగా ఏర్పడి విచారణ చేపట్టారు. దర్యాప్తులో భీమవరం మండలం గొల్లవానితిప్పకు చెందిన జడ్డు ముత్యవతి (ముత్యాలమ్మ) చోరీకి పాల్పడినట్టు నిర్ధారించారు. ఇదిలా ఉంటే ద్వారకాతిరుమలలోని గరుడ బొమ్మ సెంటర్ వద్ద నిందితురాలు ముత్యవతిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 15.360 గ్రాముల బంగారు గొలుసు, 2.740 గ్రాముల చిన్నపిల్లల బంగారు చుట్లు (జత), 5.820 గ్రాముల బంగారు చెవి హ్యాంగిల్స్(జత)ను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు గతంలో కూడా అనేక దొంగతనాలు చేసి జైలు శిక్ష అనుభవించినట్టు తమ విచారణలో తేలిందని ఎస్సై సుధీర్ తెలిపారు. రివర్స్ చేస్తుండగా లారీ కింద పడి.. ఉంగుటూరు: రివర్స్ చేస్తుండగా లారీ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన చేబ్రోలు గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ద్వారకాతిరుమల మండలం లైను గోపాలపురంనకు చెందిన కూటమి నాయకుడు చేబ్రోలు గ్రామ పంచాయతీ పరిధిలో తల్లాపురం రోడ్డును ఆనుకుని కొత్తగా వెంచర్ వేస్తున్నారు. ఆ వెంచర్లో మెరక పనులు చేస్తున్న నేపథ్యంలో లారీ రివర్స్ చేస్తుండగా లారీ కింద పడి అక్కడ పనిచేస్తున్న గాది గంటయ్య (55) అక్కడికక్కడే మృతి చెందాడు. గంటయ్యకు భార్య, వివాహం అయిన ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి ఉన్నారు. చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
కరెంటు బిల్లు సాకుతో తల్లికి ఎగనామం
కామవరపుకోట కొత్తూరు యానాదుల కాలనీకి చెందిన చౌటూరి కోటమ్మ , భర్త సురేష్ గ్రామంలో కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తమ పిల్లలు దుర్గాప్రసాద్ ఏడవ తరగతి, దీప్తి 3వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వీరికి తల్లికి వందనం సొమ్ములు జమకాలేదు. దీంతో స్థానిక సచివాలయానికి వెళ్లి అడిగితే 300 యూనిట్లు పైబడి కరెంటు వాడారని.. అందుకే తల్లికి వందనం డబ్బులు పడలేదని సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో ఆ తల్లి లబోదిబోమంది. మాది రెండు గదులు గల చిన్న ఇల్లని, ఇంటా బయట ఎల్ఈడీ బల్బులు రెండు వాడతామని దానికి 300 యూనిట్ల బిల్లు ఎలా వస్తుందని ఆమె వాపోయింది. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటుంది. – కామవరపుకోట -
మహిళలకు రక్షణ కరువు
ఏలూరు టౌన్: రాష్ట్రంలో మహిళలకు, యువతులకు రక్షణ లేకుండా పోయిందని, ఏకంగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే మహిళలపై దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి తెలిపారు. ఒక మహిళ హోమంత్రిగా ఉంటున్నా మహిళలకు రక్షణ లేకపోవటం సిగ్గుచేటని, ఒక మహిళను పట్టపగలు నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళి చెట్టుకు కట్టేసి కొట్టడం దారుణమన్నారు. ఇలాంటి దాడులు, దౌర్జన్యాలపై ప్రభుత్వం స్పందించలేదని, కనీసం దోషులను అరెస్ట్ చేయలేదని, ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహిళల కోసం శక్తి యాప్ పెట్టాం, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పుకునే కూటమి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోకపోవటం బాధాకరమని తెలిపారు. మహిళలు, యువతులు, బాలికలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యాచారాలు చేస్తుంటే వైఎస్సార్సీపీ పెద్దెత్తున మహిళల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని చెప్పారు. -
తాడేపల్లిగూడేనికి ఎయిర్పోర్టు
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్రం నుంచి భూసేకరణకు ఉత్తర్వులు అందాయి. 8లో uకొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలి కేంద్ర కమిటీకి సీపీఎం వినతిఏలూరు (ఆర్ఆర్పేట): కొల్లేరును 3వ కాంటూరుకు కుదించి, వారి ఉపాధిని కాపాడి, అక్కడి ప్రజలను ఆదుకోవాలని కొల్లేరులో మంగళవారం పర్యటించిన సీఈసీకి సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ నాయకులు మాట్లాడుతూ కొల్లేరును 5 నుండి 3వ కాంటూరుకు కుదిస్తామన్న పాలకుల హామీలు అమలు కాలేదని, కొల్లేరులో 46 బెడ్ గ్రామాలు, 74 బెల్ట్ గ్రామాలలో మూడు లక్షల మంది మత్స్యకారులు, దళితులు ఉన్నారన్నారు. 1975–76 సంవత్సరాలలో అప్పటి వెంగళరావు ప్రభుత్వం 146 సొసైటీలు ఏర్పాటు చేసి 7100 ఎకరాలలో చేపల చెరువులు తవ్వించారని అన్నారు. కొల్లేరు ఆపరేషన్ సందర్భంగా వేలాది ఎకరాల్లో చేపల చెరువులను ధ్వంసం చేశారని, అయితే ఆ సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కొల్లేరు ప్రజలకు జీవనోపాధి కల్పించాలని కోరారు. కొల్లేరు ప్రజల సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, ప్రస్తుత అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి, సుప్రీంకోర్టుకు నివేదించాలని కోరారు. కొల్లేరులో ఉన్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని, అటవీ అధికారుల వేధింపులు, అవినీతి అరికట్టాలని కోరారు. కమిటీని కలిసిన వారిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బీ బలరాం, జిల్లా కార్యదర్శి ఏ రవి తదితరులున్నారు. -
వైఎస్ జగన్ను కలిసిన జిల్లా నేతలు
ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏలూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్, ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలోని పలువురు పార్టీ నేతలను సమన్వయకర్త జేపీ పరిచయం చేశారు. పార్టీ బలోపేతానికి పనిచేయడంతోపాటు, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో ప్రజలు పడుతున్న కష్టాలపై ప్రజల్లోకి వెళ్ళి వివరించాలని సూచించారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలుఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నేతలకు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో పదవులు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలకు పదవులు కేటాయిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా వెజ్జు వెంకటేశ్వరరావు (ఉంగుటూరు), ఎస్టీ సెల్ కార్యదర్శిగా బాణావతు రాజు(నూజివీడు), ఎస్టీ సెల్ కార్యదర్శిగా ఉయ్యాల సుబ్బారావు (ఏలూరు), రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శిగా మహ్మద్ గాలీబ్ బాబు(కై కలూరు), రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కార్యదర్శిగా కట్టా యేసుబాబు (దెందులూరు), రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కార్యదర్శిగా మిడతా రమేష్ (చింతలపూడి), రాష్ట్ర కల్చరల్ వింగ్ కార్యదర్శిగా తుమ్మాలపల్లి రామేశ్వర శర్మ (ఏలూరు), రాష్ట్ర కల్చరల్ వింగ్ కార్యదర్శిగా గుమ్మడి సంజీవ్ రావు (పోలవరం)ను నియమించారు. బ్రైట్ మైండ్ స్కూలుకు గుర్తింపు లేదు కామవరపుకోట: మండలంలో తడికలపూడిలో కళ్ళచెరువు వెళ్లే రోడ్డులో ఉన్న కెఆర్ఆర్ బ్రైట్ మైండ్ స్కూలుకు గుర్తింపు లేదని ఏలూరు ఉపవిద్య శాఖ అధికారి ఎన్.రవీంద్రభారతి తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా యాజమాన్యం అడ్మిషన్లు చేస్తున్నారని ఫిర్యాదులు అందటంతో ఆమె మంగళవారం తనిఖీ చేయగా.. పాఠశాలకు గుర్తింపు లేదని తేలింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తింపు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్చి వారి భవిష్యత్తును ఇబ్బందులలో పెట్టకుండా చూడాలని, గుర్తింపు లేని పాఠశాలలో చదివితే, ప్రభుత్వం నుంచి పొందే పథకాలు వర్తించవని విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని గుర్తింపు ఉన్న పాఠశాలల్లో చేర్పించాలని ఆమె కోరారు. డీఎస్సీ పరీక్షకు 1020 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో మంగళవారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు 1020 మంది హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం పరీక్షకు 186 మందికి 183 మంది హాజరు కాగా.. మధ్యాహ్నం సెషన్లో 180 మందికి 168 మంది హాజరయ్యారు. ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం సెషన్లో 147 మందికి 140 మంది హాజరు కాగా, మధ్యాహ్నం సెషన్లో 140 మందికి 136 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 210 మందికి 206 మంది హాజరు కాగా, మధ్యాహ్నం సెషన్లో 200 మందికి గాను 187 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. -
గూడెంలో మద్యం పరవళ్లు
వాణిజ్య కేంద్రంగా పేరొందిన తాడేపల్లిగూడెం ఇప్పుడు లిక్కర్ సిండికేట్కు అడ్డాగా మారింది. అడ్డూ అదుపూ లేకుండా నిరంతరం మద్యం అమ్మకాలు సాగిపోతున్నాయి. దాబాల్లో సైతం లిక్కర్ సులువుగా దొరుకుతోంది. ఈ సిండికేట్ను నడిపించేది కూటమి నేతలే కావడంతో ఎకై ్సజ్, పోలీస్ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సాక్షి, భీమవరం: జిల్లాకు ముఖ్య వాణిజ్య కేంద్రమైన తాడేపల్లిగూడెం ఉల్లి, బెల్లం, మామిడి, పప్పు దినుసుల వ్యాపారానికి ప్రఖ్యాతి. చుట్టుపక్కల ప్రాంతాల వారితో పాటు ఇతర జిల్లాల నుంచి హోల్సేల్, రిటైల్ వ్యాపారులు, వినియోగదారులు, సరుకుల రవాణ వాహనాలతో రోజూ పట్టణానికి భారీగా వచ్చి వెళ్తుంటారు. ఇంత ప్రాముఖ్యమున్న పట్టణంలో మద్యం పరవళ్లు తోక్కుతోంది. గత ప్రభుత్వంలో చాలా వరకు ఊరికి దూరంగా ఉన్న మద్యం షాపులను కూటమి ప్రభుత్వం తెచ్చిన ప్రైవేట్ మద్యం పాలసీతో సిండికేట్లు ఇప్పుడు పట్టణంలోని జనావాసాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లోకి తెచ్చేశాయి. ఎకై ్సజ్ పాలసీకి విరుద్ధంగా షాపుల వద్దనే కూర్చుని తాగేందుకు టేబుళ్లు, కుర్చీలతో సిట్టింగ్ ఏర్పాట్లు చేశారు. మందులోకి మంచింగ్, ఫాస్ట్ఫుడ్స్ అందిస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే అమ్మకాలు చేయాల్సి ఉండగా వేళాపాలా లేకుండా ఇష్టానుసారంగా షాపులు నిర్వహిస్తున్నారు. నిర్ణీత సమయం దాటాక బాటిల్పై అధనంగా రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచి అమ్మకాలు చేస్తున్నట్టు మందుబాబులు చెబుతున్నారు. తాడేపల్లిగూడెం సర్కిల్ పరిధిలోని తాడేపల్లిగూడెం అర్బన్, రూరల్, పెంటపాడు మండలాల్లో 38 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో పట్టణ పరిధిలో 12 షాపులు, నాలుగు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. నియోజకవర్గంలోని ఒక్కో షాపు పరిధిలో రెండు నుంచి ఐదు వరకు బెల్టులు తెరిచి బాటిల్పై రూ.30 నుంచి రూ.40 వరకూ అదనంగా అమ్ముతున్నారు. కొందరు మొబైల్ బెల్టులు నిర్వహిస్తూ నేరుగా మందుబాబుల వద్దకే వెళ్లి మద్యం అందిస్తున్నారు. సిండికేట్ కనుసన్నల్లోనే వీటి నిర్వహణ జరుగుతోంది. సరసమైన ధరలకే సరసమైన ధరలకే మద్యం దొరుకుతుందంటూ కొన్ని దుకాణాల వద్ద గతంలో బోర్డులు సైతం వెలిశాయి. ఇటీవల వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఈ బోర్డులు, విచ్చలవిడిగా సాగుతున్న మద్యం అమ్మకాలు గురించి మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శలు చేయడంతో సంబంధిత అధికారులు ఆగమేఘాలపై షాపుల వద్ద బోర్డులను తొలగించారు. గతంలో నిబంధనలు అమలు బెల్ట్ షాపులపై దాడులు నామమాత్రమే తాడేపల్లిగూడెం సర్కిల్ పరిధిలో బెల్టు అమ్మకాలుపై ఇప్పటి వరకు 85 కేసులు నమోదుచేసిన ఎకై ్సజ్ పోలీసులు 85 మందిని అరెస్టు చేసి వారి నుంచి 160 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయినా ఎక్కడా తగ్గకుండా బెల్టుల నిర్వహణ యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలు తుంగలోకి తొక్కడంతో నియోజకవర్గంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ప్రైవేట్ షాపులు ప్రారంభించిన గత ఏడాది అక్టోబరు 16 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి సర్కిల్ పరిధిలో 1,93,792 కేసుల లిక్కర్, 73,019 కేసుల బీర్లు విక్రయాలు జరగగా వీటిలో అధిక శాతం తాడేపల్లిగూడెంలోనే జరిగినట్టు సమాచారం. గత మూడు నెలల్లో ఈ అమ్మకాలు మరింత పెరిగాయి. గత ప్రభుత్వ మద్యం దుకాణాలతో పోలిస్తే లిక్కర్ సేల్స్ భారీగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. తాడేపల్లిగూడెంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు బార్లను తలదన్నేలా షాపుల వద్ద సిట్టింగ్ ఏర్పాట్లు దాబాల్లోనూ మద్యం లభ్యం గత ఐదున్నర నెలల్లో 1,93,792 కేసుల లిక్కర్, 73,019 కేసుల బీర్లు విక్రయాలు దాబాల్లో విచ్చలవిడిగా మద్యం పట్టణంలో పది వరకు దాబాలు ఉండగా పలుచోట్ల ఫుడ్తో పాటు మద్యం కూడా అందిస్తున్నారు. ఎమ్మార్పీ ధరపై క్వార్టర్ బాటిల్కు అదనంగా రూ. 30, బీర్లకు రూ. 40 వరకు పెంచి సరఫరా చేస్తున్నారు. బార్లను తలపించేలా మందుబాబుల కోసం రాత్రి వేళల్లో ఆరుబయట మంచాలు ఏర్పాటుచేసి మరీ దాబాలను నిర్వహిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. పట్టణ శివార్లు, హైవేకు సమీప దాబాల్లో ఈ తరహా అమ్మకాలు ఎక్కవగా జరుగుతున్నాయి.. వైఎస్సార్సీపీ హయాంలో నిబంధనల మేరకు మద్యం అమ్మకాలు సాగేవి. బెల్టుషాపులు అరికట్టడంతో పాటు నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు చేసేవారు. షాపుల వద్ద కొనుగోలు చేసి తీసుకువెళ్లిపోవడమే తప్ప తాగేందుకు వీలు లేకుండా చేశారు. షాపుల నిర్వహణ ప్రభుత్వ అధీనంలో ఉండటంతో మద్యం ఆదాయం పూర్తిగా ప్రభుత్వ ఖజానాకు చేరేది. కాగా కూటమి ప్రభుత్వం మద్యాన్ని మరలా ప్రైవేట్ పరం చేయడంతో సిండికేట్లు ఇష్టారాజ్యంగా మారింది. -
కొల్లేరులో జిరాయితీ పంచాయితీ
కీలకమైన సిఫార్సులు బుధవారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు ప్రాంతంలో కేంద్ర సాధికారత కమిటీ పర్యటన నేపథ్యంలో జిరాయితీ భూముల వ్యవహారం ప్రధానాంశంగా మారింది. పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు స్థానికులకు జీవనోపాధితో పాటు భూములపై హక్కులు ఉండేలా చూడాలని వందలాది వినతులు వెల్లువెత్తాయి. ప్రధానంగా అభయారణ్యంలోని జిరాయితీ డీ–ఫామ్ భూములు మినహాయించాలని డిమాండ్ స్థానికుల నుంచి బలంగా వినిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రం నియమించిన కేంద్ర సాధికారత కమిటీ మంగళవారం కొల్లేరు ప్రాంతంలో పర్యటించింది. కై కలూరు, ఉండి నియోజకవర్గాల్లోని కొల్లేరు ప్రాంతంలో పర్యటించి అభయారణ్యాన్ని, కొల్లేరు స్థితిగతులను పరిశీలించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కొల్లేరును కాపాడండి– మమ్మల్ని కాపాడండి అంటూ పెద్ద ఎత్తున కొల్లేరువాసులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 10వ కాంటూరు వరకు 2.25 లక్షల ఎకరాల్లో కొల్లేరు విస్తరించి ఉంది. 2004లో కొల్లేరు ఆపరేషన్ నిర్వహించి అక్రమ చేపల చెరువులను ధ్వంసం చేశారు. పేదల ముసుగులో బడా వ్యక్తులు, రాజకీయ నాయకులు అడ్డగోలుగా వేలాది ఎకరాల చేపల చెరువులు ఏళ్ల తరబడి సాగు చేసి వందల కోట్లు ఆర్జించారు. ఈ క్రమంలో ఆపరేషన్ కొల్లేరులో 31,120 ఎకరాల చెరువులను ధ్వంసం చేశారు. దీనిలో 14,932 ఎకరాల్లో జిరాయితీ భూములు, 5,510 ఎకరాల డీ–ఫాం భూములు, ఇతర కొల్లేరు అభయారణ్యం ఉంది. తదనంతరం కొల్లేరు అభయారణ్యంలో మొత్తంగా 77,138 ఎకరాల్లో జిరాయితీ, డీఫాం భూములు ఉన్నట్లు నిర్ధారించారు. 3 లక్షల జనాభా ఉన్న కొల్లేరు ప్రాంతంలో చేపల వేట ప్రధాన వృత్తిగా వేలాది కుటుంబాలున్నాయి. 122 గ్రామాల్లో కొల్లేరు వాసులు నివసిస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలో పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సరస్సులో నీటి కాలుష్యాన్ని తగ్గించడానికి గతంలో అనేక కమిటీలు ఏర్పాటు చేసినా ఆశించిన ప్రయోజనం చేకూరలేదు. అనేక కమిటీలు.. సిఫార్సులు కొల్లేరు పరిరక్షణకు అక్రమ చెరువుల కట్టడికి దాదాపుగా 4 దశాబ్దాల నుంచే కమిటీలు ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినతులు, హైకోర్టు మొదలుకొని సుప్రీంకోర్టు వరకు అనేక న్యాయపోరాటాలు కొనసాగినా శాశ్వత పరిష్కారం నేటికీ దక్కలేదు. సరస్సును పరిరక్షిస్తూ స్థానికుల జీవనప్రమాణాలు పెంచి పూర్తి ఉపాధి అవకాశాలుండేలా చూడాలనేదే ఏళ్ళ నుంచి ఉన్న డిమాండ్. ఈ క్రమంలో 1983లో కేఎల్డీసీ సబ్ కమిటీ, 1987 శ్రీ రామకృష్ణయ్య కమిటీ, 1996లో శాసనసభ కమిటీ, 2006లో సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర సాధికారత కమిటీ, 2010లో అజీజ్ కమిటీ, 2015లో సుకుమార్ కమిటీ ఇలా అనేక కమిటీలు రకరకాల నివేదికలు సమర్పించాయి. ● సముద్రానికి నీరు పోయే కీలక మార్గమైన ఉప్పుటేరులో ఆక్రమణలు తొలగించి సామర్ధ్యం పెంచాలి. ● బుడమేరు, తమ్మిలేరుపై వరద కట్టలు, జలాశయాల నిర్మాణం, చిన్న, పెద్ద కాలువలు మళ్లింపు జరగాలి. ● కొల్లేరు అవుట్ఫాల్ ఉన్న ఉప్పటేరు వద్ద రెగ్యులేటరీ ఏర్పాటు చేయడంతో పాటు వెడల్పు, లోతును సరిచేయాలి. ● సరస్సు పరిరక్షణ కోసం సిల్ట్ తొలగించి 4వ కాంటూరులో వెదురు చెట్లు ఏర్పాట్లు చేయాలి. అక్రమ రొయ్యలు, చేపల చెరువులను నియంత్రించి సరస్సును పరిరక్షించడంతో పాటు నీటి కాలుష్యాన్ని తగ్గించాలి. ● రెగ్యులేటర్ నిర్మాణం తర్వాత చానలైజేషన్్ పథకాన్ని తిరిగి ప్రారంభించి ప్రవాహ మార్గాల్లో అవసరమైన చోట్ల కాల్వ మళ్ళింపు జరగాలి. ● 7500 క్యూసెక్కుల నీటిని కృష్ణా నదికి మళ్లించడానికి బుడమేరులో ఉన్న మళ్లింపు చానెల్ను సాధ్యమైనంత వరకు మెరుగుపరచాలి ● కొల్లేరు సరస్సు ప్రస్తుత స్థితిని అంచనా వేయడానికి క్షేత్ర, ఉపగ్రహ సర్వే నిర్వహించాలి, పాత రికార్డులు 1900 ఏడీ గెజిట్ ప్రకారం సర్వే చేయాలి. వాస్తవ కాంటూరు పరిధులను గుర్తించి సరస్సులో అక్రమ అనధికార చేపల, రొయ్యల చెరువులను ధ్వంసం చేయాలి. న్యూస్రీల్ అభయారణ్యంలో 77 వేల ఎకరాల భూములు కొల్లేరు ఆపరేషన్లో 31 వేల ఎకరాల్లో చెరువులు ధ్వంసం కాంటూరు పరిధిని గుర్తిస్తేనే సమస్యకు పరిష్కారం జిరాయితీ భూములపై హక్కు కల్పించాలని కొల్లేరు ప్రజల డిమాండ్ కేంద్ర సాధికారత కమిటీకివినతుల వెల్లువ నేడు కూడా జిల్లాలో కమిటీ పర్యటన -
కొల్లేరు సమస్యలను సుప్రీంకు నివేదిస్తాం
సీఈసీ సభ్యుడు చంద్రశేఖర్ గోయల్ ఏలూరు(మెట్రో): కొల్లేరు ప్రాంత సమస్యలపై రెండు రోజులు అధ్యయనం అనంతరం నిర్ధేశించిన కాలపరిమితిలోపు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని సీఈసీ సభ్యుడు చంద్రశేఖర గోయల్ వెల్లడించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించిన కొల్లేరు సరస్సు ప్రాంత ప్రజల సమస్యలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధ్యయనం చేసేందుకు గోయల్ నేతృత్వంలో బృందం మంగళవారం జిల్లాకు చేరుకుంది. ఏలూరులో రాత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 1999లో కొల్లేరు పరిరక్షణ అంశం నోటిఫై చేశారన్నారు. కొల్లేరు విషయంలో రీమార్కేషన్, సంబంధిత విషయాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని, ఈ విషయం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లిందన్నారు. ఈ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. ఇంకా పరిష్కారం కాని అంశాలు ఉన్నాయని గోయల్ చెప్పారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చిన అంశాలపై నివేదిక ఇవ్వాలని తమ కమిటీని నియమించారని, ఆ దిశగా తొలిరోజు ఏలూరు జిల్లా పరిధిలోని కొల్లేరు గ్రామాల్లో పర్యటించామన్నారు. అక్కడ వాస్తవ పరిస్థితి, ప్రజలతో ముఖాముఖి, తమకు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పరిశీలించామని వివరించారు. తొలిరోజు పర్యటన తమ పరిశీలనలో ముందడుగు అన్నారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కేంద్ర మంత్రితో భేటీ అయ్యామని చెప్పారు. బుధవారం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా అధికారులుతో మరో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ రెండు రోజుల పర్యటన అనంతరం గుర్తించిన అంశాలను నివేదిక రూపంలో సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తమకు 12 వారాల గడువు ఇచ్చిందని చెప్పారు. సమావేశంలో కమిటీ మెంబరు కార్యదర్శులు డా.జె.ఆర్.భట్, జి.భానుమతి, కమిటీ సభ్యులు సునీల్ లిమాయే, ప్రకాష్ చంద్రభట్లతో పాటు అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ అజేయ్ కుమార్ నాయక్, మత్స్యశాఖ కమిషనరు రమాశంకర్ నాయక్, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె.పి.ఎస్.కిషోర్, తదితరులు పాల్గొన్నారు. మంగళవారం ఏలూరు చేరుకున్న కేంద్ర సాధికార కమిటీ సభ్యులకు కలెక్టర్ ఘనంగా స్వాగతం పలికారు. -
కనెక్షనే లేదు.. బిల్లు ఎక్కువ వచ్చిందంటా
రెండవ తరగతి చదువుతున్న మా పాపకు శ్రీతల్లికి వందనంశ్రీ డబ్బులు వేయలేదు. సచివాలయానికి వెళ్లి అడిగితే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెబుతున్నారు. ఆక్వా పట్టుబడులకు రోజువారీ కూలీ పనులకు వెళ్లే మేము ఇటీవలే ఇంటి నిర్మాణం చేపట్టాం. ఇంకా కరెంటు కనెక్షన్ కూడా ఇవ్వలేదు. – సంగాని కనకదుర్గ, బియ్యపుతిప్ప నేనుండేది అద్దె ఇంట్లో.. నాకు 8 మీటర్లా? ఈ ప్రభుత్వం మాలాంటి పేదలకు అన్యాయం చేయడం దుర్మార్గం. అద్దె ఇంటిలో ఉంటున్న నాకు 8 విద్యుత్ కనెక్షన్లు చూపిస్తున్నాయని చెబుతున్నారు. తల్లికి వందనం ఇవ్వకుండా కుంటి సాకులు చూపడం అన్యాయం. సమస్య పరిష్కారం కోసం నరసాపురం విద్యుత్ సబ్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశాను. – ఇందుకూరి సోమేశ్వరరావు. నరసాపురం కరెంట్ బిల్లు రూ.వంద లోపే ఎన్నికల ముందు పిల్లలందరికీ తల్లికి వందనం వేస్తామన్నారు. మొదటి ఏడాది ఎలాగూ వేయలేదు. నాకు పాప, బాబు ఉంటే ఇప్పుడూ ఒక్కరికీ కూడా వేయలేదు. మాకు కరెంటు బిల్లు వంద రూపాయల లోపే వస్తుంది. అయినా 300 యూనిట్లకంటే ఎక్కువ వినియోగిస్తున్నారనే సాకుతో పథకాన్ని నిలిపివేశారు. – మత్తి జాన్శామ్యూల్, నరసాపురం, క్రిస్టియన్పేట ఒక్కరికీ ఇవ్వలేదు నాకు రెండవ తరగతి చదివే మనుమడు, మూడవ తరగతి చదివే మునుమరాలు ఉన్నారు. ఒక్కరికీ తల్లికి వందనం డబ్బులు వేయలేదు. మాకు కరెంటు బిల్లు రూ.150 మాత్రమే వస్తుంటే.. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందంటున్నారు. మాలాంటి వాళ్లను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. – పిల్లి సుగుణమ్మ, మల్లవరం -
వినతులు.. వేడుకోళ్లు..
కై కలూరు: అయ్యా.. మా జీవనోపాధికి గండికొట్టారు. నష్టపరిహారం చెల్లించకుండా కొల్లేరు ఆపరేషన్లో జిరాయితీ, ఢీపాం భూములలో చెరువులను ధ్వంసం చేశారు. కొల్లేరు గ్రామాల్లో చచ్చిన శవాలను పూడ్చాలన్నా.. అటవీశాఖ నిబంధనలు అడ్డువస్తున్నాయి. మా భూములు తిరిగి ఇచ్చేయండి అంటూ కొల్లేరు ప్రజలు సుప్రీంకోర్టు పంపించిన కేంద్ర సాధికార కమిటీ(సీఈసీ) ముందు గోడు వెళ్లబోసుకున్నారు. సాధికారిత కమిటీ ఏలూరు నుంచి మధ్యాహ్నం 3 గంటలకు కై కలూరు నియోజకవర్గం మణుగునూరులంక వద్దకు వచ్చారు. సమీప కొల్లేరు గ్రామాల ప్రజలు రోడ్లుపై నిలుచున్నారు. ముందుగా పెదఎడ్లగాడి నుంచి కొల్లేరు నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ప్రజలందరూ అక్కడికి వచ్చి సీఈసీ కమిటీనికి వినతిపత్రాలు అందించారు. అక్కడ నుంచి మార్గమధ్యలో కొల్లేరు ప్రాంతాలను చూస్తూ సీఈసీ కమిటీ ముందుగా సాగింది. కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు కామినేని, ధర్మరాజులతో కలసి వచ్చిన సీఈసీ వాహనాలు వీరికి తెలియకుండా కలకర్రులో కొల్లేరును పరిశీలించారు. పెద ఎడ్లగాడి వద్ద దాదాపు 30 నిమషాలు కలెక్టర్, ఎస్పీ సీఈసీ కోసం వేచి ఉన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులకు సంబంధించి 40 కార్లు ఉండటంతో ట్రాఫిక్నకు అంతరాయం కలిగింది. ఆటపాక పక్షుల కేంద్రంలో సమావేశం ఆటపాక పక్షుల కేంద్రం పక్షి నమూనా మ్యూజియాన్ని సీఈసీ బృందం పరిశీలించింది. అక్కడ కొంత సమయం అటవీ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. పక్షుల కేంద్రంలో నీరు లేకపోవడం, వివిధ రకాల పక్షుల గురించి అటవీశాఖ అధికారులు వివరించారు. పక్షుల కేంద్రం సమీపంలోని దెందులూరు నియోజకవర్గం కోమటిలంక ప్రజలు ఎమ్మెల్యే చింతమనేనితో కలసి సీఈసీ సభ్యులకు వినతపత్రం అందించారు. గ్రామానికి అవసరమైన రహదారిని నిర్మించాలని కోరారు. వంతన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వేలాదిగా ప్రజలు కేంద్ర సాధికారిత కమిటీకి అర్థమయ్యే విధంగా ఇంగ్లీషులో ప్లకార్డులను కొల్లేరు ప్రజలు ప్రదర్శించారు. సీఈసీ రాక నేపథ్యంలో కై కలూరు, ఉండి నియోజకవర్గాల పరధిలోని కొల్లేరు గ్రామాల్లో పెద్దలు, మహిళలు, పిల్లలు వేలాదిగా తరలివచ్చారు. సేవ్ పూర్ పీపుల్ ఎడ్యుకేషన్, ప్లీజ్ సేవ్ అజ్, వుయ్ సేవ్ బర్ట్స్.. యూ సేవ్ ఫిషర్మెన్స్ వంటి నినాదాల కార్డులను ప్రదర్శించారు. ఎమ్మెల్యే కామినేని తెలుగును ఇంగ్లీషులో అనువదించి సీఈసీకి వివరించారు. సీఈసీ నుంచి వచ్చిన నలుగురు సభ్యుల్లో జి.భానుమతికి తెలుగు భాష వచ్చినప్పటికీ ఆమె ప్రసంగించలేదు. ఎంపీపీ అడవి కృష్ణ, రాష్ట్ర చేపల రైతు సంఘ అధ్యక్షుడు తాడినాడ బాబు, కొల్లేరు కమిటీ సభ్యుడు నంబూరి శివాజీరాజు, కొల్లి బాబీ, పూల రాజీ, బీకేఎం.నానీ త్రినాథరాజు, సీపీఎం నాయకులు బలరాం, రవి తదితరులు పాల్గొన్నారు. ఆశల పల్లకీలో కొల్లేరు ప్రజలు సీఈసీ కమిటీకి అర్జీలు జనసంద్రమైన పందిరపల్లిగూడెం -
విద్యుత్ సబ్స్టేషన్ వద్ద పడిగాపులు
యలమంచిలి: అధిక విద్యుత్ వినియోగం సాకుతో ప్రభుత్వం చాలామందికి శ్రీతల్లికి వందనంశ్రీ సొమ్ములు జమ చేయలేదు. దీంతో తల్లులు లబోదిబోమంటున్నారు. సోమవారం లబ్ధిదారులంతా సచివాలయానికి వెళ్లి అడిగితే రూ.300 యూనిట్ల లోపే విద్యుత్ వినియోగం ఉంటే కరెంట్ ఆఫీస్ నుంచి సర్టిఫికెట్ తెచ్చుకుంటే గ్రీవెన్స్లో పెడతామని చెప్పారు. దీంతో మండల వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో లబ్థిదారులు మంగళవారం ఉదయం నుంచి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద పడిగాపులు పడ్డారు. విద్యుత్ శాఖ సిబ్బంది ప్రతి ఒక్కరీ విద్యుత్ బిల్లు, సెల్, ఆధార్ నెంబర్లతో ఆన్లైన్లో తనిఖీ చేసి అంత వాడకం లేని వారందరికీ సర్టిఫికెట్లు అందజేశారు. అయితే ఒక్కసారిగా వందల సంఖ్యలో లబ్థిదారులు విద్యుత్ సబ్ స్టేషన్కు తరలిరావడంతో బిల్లులు తనిఖీ చేయడానికి సిబ్బంది నానాయాతన పడుతున్నారు. -
కొందరికే తల్లికి వందనం
నరసాపురం రూరల్: కూటమి సర్కార్ అట్టహాసంగా అమలు చేసిన శ్రీతల్లికి వందనంశ్రీ నిరుపేద తల్లులకు అందకుండా పోయింది. పథకం అమలుకు సవాలక్ష నిబంధనలు విధించిన కూటమి సర్కార్ అంతిమంగా అర్హులకు మొండిచేయి చూపింది. ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అందరికీ ఏటా రూ.15 వేల చొప్పున క్రమం తప్పకుండా ఇస్తామని ఎన్నిక వేళ హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచాక రూ.13 వేలే అంటూ మాటమార్చారు. అది కూడా అందరికీ ఇవ్వకుండా మోసం చేశారు. దీంతో చంద్రబాబు మాటలు నమ్మి తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్న నిరుపేద కుటుంబాల వారు శాపనార్థాలు పెడుతున్నారు. నిబంధనలతో కొర్రీలు తల్లికి వందనం కింద ఎంత మంది విద్యార్థులుంటే అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామన్న చంద్రబాబు.. పథకం అమల్లోకి వచ్చేసరికి సవాలక్ష నిబంధనలు విధించారు. యూడైస్ ప్రకారం జాబితాలు సేకరించామని చెబుతున్నప్పటికీ చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు ప్రభుత్వం సేకరించిన గణాంకాలకు తేడా ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి సర్కార్ (2024–25 విద్యా సంవత్సరం) లో తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకు ఇవ్వాల్సిన మొత్తం ఎగవేసి ఈ సంవత్సరం ఇస్తామన్న మొత్తంలో కూడా భారీగా కోతలు విధించి అర్హత ఉన్నప్పటికీ చాలా మందికి శ్రీతల్లికి వందనంశ్రీ ఆర్థిక సాయం మొత్తం ఖాతాల్లో జమ కాలేదు. దీంతో లబ్ధిదారులు సచివాలయాలు, బ్యాంకులు, కరెంటు ఆఫీసుల వద్దకు పరుగులు తీస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో తల్లికి వందనం డబ్బు జమకానట్లు తెలియడంతో చాలామంది ఉసూరు మంటూ వెనుదిరిగి వెళుతున్నారు. నరసాపురం మండలం, పట్టణంలలో ఎక్కువమందికి విద్యుత్ వినియోగం ఎక్కువ అనే కారణంతో పథకం సొమ్ములు జమకాలేదని తెలియడంతో నరసాపురం పట్టణంలోని విద్యుత్సబ్ స్టేషన్ వద్ద గత రెండు రోజులుగా పథకం లబ్ధిదారులు క్యూకడుతున్నారు. జగన్ హయాంలో విప్లవాత్మక మార్పులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో విద్యార్థుల భవితకు బాటలు వేశారు. అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేశారు. అంతేకాకుండా శ్రీనాడు– నేడుశ్రీ పనులతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. విదేశీ విద్యా దీవెన, గోరుముద్ద తదితర పథకాలతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన విషయాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. నిబంధనల పేరుతో చాలామందికి ఎగనామం మండలానికి వెయ్యి మందికి పైగా కోత కరెంట్ బిల్లులను సాకుగా చూపి అర్హులకూ మొండిచేయి మాట తప్పిన చంద్రబాబుపై మండిపడుతున్న జనం -
పేదల స్థలాల్లో పోలీస్స్టేషన్ నిర్మాణమా?
ఏలూరు (ఆర్ఆర్పేట): మండవల్లి శివారు తరుగుమూల లేఅవుట్లో పేదలకు ఇచ్చిన ఇందిరమ్మ కాలనీ స్థలాల్లోని కామన్ సైట్ను పోలీస్స్టేషన్ నిర్మాణానికి కేటాయించడం దారుణమని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం కాలనీవాసులు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ 2006లో 131 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారని గుర్తు చేశారు. అయితే అప్పటినుంచి ఇళ్ల స్థలాలను మెరక చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇక్కడే 40 సెంట్లు కామన్ సైట్గా ఇచ్చారని, ఇప్పుడు ఈ కామన్సైట్లో పోలీస్స్టేషన్ నిర్మించేందుకు పంచాయతీ తీర్మానం చేసిందని, ప్రభుత్వ అధికారులు అనుమతులు కూడా ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. జేసీ అసహనం తమకు న్యాయం చేయాలంటూ పీజీఆర్ఎస్లో కాలనీవాసులు వినతిపత్రం అందజేయగా.. పోలీస్స్టేషన్ నిర్మాణం చేయవద్దు అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అని లబ్ధిదారులపై జేసీ ధాత్రిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు పట్టాలు ఉంటే చూపించండి, అర్హులైతే మరో చోట స్థలాలు కేటాయిస్తారు అని అనడంపై లబ్ధిదారులు అవాక్కయ్యారు. న్యాయం చేయాల్సిన ఉన్నతాధికారులు ఇలా మాట్లాడితే తమ సమస్యను ఇంకెవరికి చెప్పుకోవాలంటూ ప్రశ్నించారు. -
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకే ప్రథమ ప్రాధాన్యమిస్తామని జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో మేనేజర్గా పనిచేస్తూ పదోన్నతిపై ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారిగా నియమితులైన ఆమె సోమవారం ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోలను అత్యంత సౌకర్యవంతమైన డిపోలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు. ఉద్యోగులు, కార్మికులతో కలిసికట్టుగా బృందంగా పని చేస్తామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. డిపో మేనేజర్ బి.వాణి, ఆర్టీసీ పీఆర్ఓ కేఎల్వీ నరసింహం పాల్గొన్నారు. డీఎస్సీ పరీక్షలకు 984 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు 984 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉద యం 181 మందికి 179 మంది, మధ్యాహ్నం 180 మందికి 164 మంది హాజరయ్యారు. ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 145 మందికి 136 మంది, మధ్యాహ్నం 141 మందికి 132 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 201 మందికి 190 మంది, మధ్యాహ్నం 200 మందికి 183 మంది హాజరయ్యారని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. 20, 21వ తేదీల్లో పరీక్షల మార్పు ఈనెల 20, 21వ తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలు మార్పు చేశారని, 20న జరగాల్సిన పరీక్షను జూలై 1న, 21న జరగాల్సిన పరీక్షను జూలై 2 న నిర్వహించనున్నారని డీఈఓ తెలిపారు. ఈ మేరకు అభ్యర్థులు ఈనెల 25 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పశ్చిమగోదావరి జిల్లాలో.. భీమవరం: జిల్లాలో సోమవారం ఐదు కేంద్రా ల్లో నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షలకు 93 శాతం అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. ఉదయం 605 మందికి 561 మంది, మధ్యాహ్నం 597 మందికి 559 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని చెప్పారు. రూ.260 కోట్లకు టెకు బ్యాంక్ వ్యాపారం ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని ది ఏలూ రు కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ (టెకు బ్యాంక్) వ్యాపారం రూ.260 కోట్లకు చేరుకుందని బ్యాంక్ సీఈఓ ఎం.అచ్యుతరావు తెలిపారు. ఆదివారం జరిగిన టెకు బ్యాంకు మహాజన సభ వివరాలను ఆయన సోమవారం పత్రికలకు విడుదల చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.129.36 కోట్ల నుంచి రూ.146.65 కోట్లకు డిపాజిట్లు పెరిగి 13.37 శాతం వృద్ధి సాధించామన్నారు. రూ.91.47 కోట్ల నుంచి రూ.113.67 కోట్లకు బ్యాంకు రు ణాలు పెరిగి 24.28 శాతం వృద్ధి సాధించామ న్నారు. అలాగే షేరు ధనం రూ.5.35 కోట్ల నుంచి రూ.5.83 కోట్లు పెరిగి 9.10 శాతం వృద్ధి సాధించామన్నారు. బ్యాంక్ సభ్యులకు షేరు ధనంపై 10 శాతం డివిడెండ్గా రూ.5,52,96,423 ప్రకటించామన్నారు. 2025–26లో బ్యాంక్ లెక్కల ఆడిట్కు విజయవాకు చెందిన బీడీపీఎస్ అండ్ కంపెనీ చార్టర్డ్ అక్కౌంటెంట్స్ను ఆడిటర్గా నియమించడా నికి సమావేశం ఆమోదించిందన్నారు. బీవీ సుబ్రహ్మణేశ్వరరావు అధ్యక్షతన జరిగిన మహాజన సభలో డైరెక్టర్లు, బ్యాంక్ సీఈఓ ఎం.అచ్యుతరావు పాల్గొన్నారు. వృద్ధుల ఆస్తులకు రక్షణ కల్పించాలి భీమవరం: తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలని, ట్రిబ్యునల్ తీర్పును కచ్చితంగా అమలు జరిగేలా చూ డాలని జిల్లా వృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అడ్డాల సత్యనారాయణ, కొటికలపూడి చిట్టి వెంకయ్య డిమాండ్ చేశారు. సోమవారం ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ, అవగాహన దినోత్సవం సందర్భంగా భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పా టు చేయాలని, వృద్ధుల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించాలని, మండలానికి ఒక వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేయాలని కోరారు. -
కొల్లేరు దస్త్రాలతో సిద్ధం కండి
కై కలూరు: కొల్లేరులో క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) మంగళ, బుధవారాల్లో పర్యటించనున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అన్ని దస్త్రాలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. రూట్మ్యాప్ పరిశీలన నిమిత్తం నిడమర్రు మండలం తోకలపల్లి, మండవల్లి మండలం మణుగునూరు, పులపర్రు, కై కలూరు మండలం ఆటపాక, ఆలపాడు, కొల్లేటికోట ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజుతో కలిసి సోమవారం ఆమె పర్యటించారు. కొల్లేరులో నివాసిత ప్రాంతాలు, జిరాయితీ, డీఫాం భూములు, 2006 సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఎలా అమలు చేశారనే విషయాలను కమిటీ పరిశీలిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ కొల్లేరులో వాస్తవ పరిస్థితులను పరిశీలించి మూడు నెలల్లో నివేదిక సుప్రీంకోర్టుకు అందిస్తారన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ కొల్లేరు పరిరక్షణ, ప్రజల ఇబ్బందులను కమిటీ దృష్టికి తీసుకువెళతామన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి బి.విజయ, ఎంపీపీ అడవి కృష్ణ, వైస్ ఎంపీపీ మంగినేని రామకృష్ణ, రాష్ట్ర చేపల రైతు సంఘ అధ్యక్షుడు నంబూరి వెంకటరామరాజు (తాడినాడ బాబు) తదితరులు ఉన్నారు. సీఈసీ పర్యటన ఇలా.. ఏలూరు(మెట్రో) : కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఏలూరు చేరుకుంటుంది. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 4 గంటల మధ్య కలకుర్రు, మణుగునూరు, ఆటపాక, కొల్లేటికోటను సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు కొల్లేటికోటలో రైతులు, కొల్లేరువాసులతో సమావేశమవుతారు. 5 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఏలూరు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు ఏలూరు కలెక్టరేట్లో దెందులూరు, ఏలూరు, ఉంగుటూరు మండలాల రైతులు, కొల్లేరువాసులు, అధికారులతో సమావేశమవుతారు. 18న ఉదయం 8 గంటల నుంచి 12.30 గంటల మధ్య నిడమర్రులో జిరాయితీ భూములను, కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం ప్రాంతాలను పరిశీలిస్తారు. ఉంగుటూరులో కలెక్టర్ పర్యటన ఉంగుటూరు: ఉంగుటూరు నియోజకవర్గంలోని కొల్లేరు పరీవాహక ప్రాంతాలను కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే ధర్మరాజు పరిశీలించారు. తోకలపల్లి, వెంకటకృష్ణాపురం, రామన్నగూడెం, నిడమర్రు, ఉంగుటూరు మండలాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. కలెక్టర్ వెట్రిసెల్వీ -
భూ వివాదాల పరిష్కారంలో నిర్లక్ష్యం
పోలవరం: ఏజెన్సీలో భూ వివాదాలు పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తెల్లం రామకృష్ణ అన్నారు. సోమ వారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ 30 ఏళ్లుగా ఎల్టీఆర్, 1/70 చట్టం భూములను సాగు చేస్తున్న గిరిజనులను సాగుదారులుగా రికార్డుల్లో నమోదు చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. గిరిజనేతరులకు రెవెన్యూ అధికారులు కొమ్ముకాయడం దుర్మార్గమన్నారు. గిరిజన చట్టాలపై తహసీల్దార్కు కనీస అవగాహన లేదన్నారు. పోడు భూముల సాగుదారులకు హక్కు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం మండల కార్యదర్శి కారం భాస్కర్ మాట్లాడుతూ మండలంలోని వింజరంలో జీసీసీ రేషన్ దుకాణానికి కొత్త భవనం నిర్మించాలని, కొమ్ముగూడెం, వింజరం, కోయనాగంపాలెం గ్రామాల్లో శ్శశాన వా టికలకు స్థలం చూపించాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ బి.సాయిరాజుకు అందజేశారు. సీపీఎం మండల కమిటీ సభ్యులు బొరగం భూచంద్రరావు, టి.శాంతికుమారి, జి.పాండవులు, డి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
బీటెక్ బేరాలు షురూ!
సాక్షి ప్రతినిధి,ఏలూరు: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించలేదు. కనీసం ప్రభుత్వం కౌన్సెలింగ్ షెడ్యూల్ను కూడా ప్రకటించలేదు. గత నెలలో పరీక్షలు నిర్వహించగా ఈనెలలో ఫలితాలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల ముందస్తు విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. మేనేజ్మెంట్ సీట్ల రిజర్వేషన్ పేరిట పెద్ద ఎత్తున సీట్లను కళాశాలల్లో విక్రయిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 14 ఇంజనీరింగ్ కళాశాలల్లో 13,330 సాధారణ సీట్లు, ఈడబ్ల్యూఎస్ కోటాలో 1,333 సీట్లు మొత్తంగా 14,663 సీట్లు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్కు యమ డిమాండ్ సాఫ్ట్వేర్కు బూమ్ రావడంతో దాదాపుగా రెండు ద శాబ్దాలుగా ఇంజనీరింగ్ కోర్సులకు డిమాండ్ కొ నసాగుతోంది. ప్రధానంగా కంప్యూటర్ సైన్స్ సీట్లు నూరు శాతం డిమాండ్తో భర్తీ అవుతున్న పరిస్థితి. 15 ఏళ్ల క్రితం వరకు ఏలూరు, భీమవరం కేంద్రా లకే పరిమితమైన ఇంజనీరింగ్ కళాశాలలు తర్వాత కాలంలో జిల్లావ్యాప్తంగా ఏర్పాటయ్యాయి. ప్రస్తు తం 14 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఠంచనుగా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో పడటంతో ఆర్థిక భారం లేకుండా నాలుగేళ్లపాటు చదువు సజావుగా సాగింది. కూ టమి పాలనలో గత విద్యా సంవత్సరం ఫీజు రీయి ంబర్స్మెంట్ బకాయిలు నిలిచిపోవడం, ఈ విద్యా సంవత్సరం అసలు అమలు చేస్తారో లేదో ప్రకటించకపోవడంతో గందరగోళం నెలకొంది. మరోవైపు కౌన్సెలింగ్ షెడ్యూల్ రాకముందే ఇంటర్మీడియెట్ మార్కులు, ఏపీ ఈఏపీసెట్ ర్యాంకు ఆధారంగా వందల మంది విద్యార్థుల తల్లిదండ్రులు మేనేజ్ మెంట్ సీట్ల పేరుతో ముందస్తుగా నగదు చెల్లించి సీట్లు లాక్ చేస్తున్నారు. వారం రోజులుగా జిల్లాలో సీట్ల బేరసారాల హడావుడి కొనసాగుతోంది. అడ్వాన్స్ పేమెంట్లతో.. ప్రతి కళాశాలలో ఒక్కో బ్రాంచీలో 30 శాతం మే నేజ్మెంట్ సీట్లు, మిగిలినవి కన్వీనర్ కోటాలో ఉంటాయి. ఉదాహరణకు ఒక బ్రాంచిలో 60 సీట్లు ఉంటే వాటిలో 42 సీట్లు ఈఏపీసెట్ ర్యాంకు ఆధారంగా కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన 18 సీట్లు ఆయా కళాశాలల మేనేజ్మెంట్ భర్తీ చేసుకుంటుంది. ఈ క్రమంలో అన్ని కళాశాలల్లో మేనేజ్మెంట్ల సీట్ల భర్తీకి ప్రత్యేక డ్రైవ్ల హడావుడి కొనసాగుతోంది. సగటున కళాశాల స్థాయిని బట్టి రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు అడ్వాన్స్ పేమెంట్స్ కట్టించుకుంటున్నారు. కన్వీనర్ కోటా సీటు రూ.60 వేలు కాగా మేనేజ్మెంట్ సీటు రూ.1.80 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు డిమాండ్ను బట్టి విక్రయిస్తున్నారు. ప్రధానంగా కంప్యూటర్ సైన్స్కు విపరీతంగా డిమాండ్ కొనసాగుతుండగా తరువాత స్థానంలో ఈసీఈ ఉంది. నెలాఖరుకు ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ద్వారా కన్వీనర్ సీట్లు భర్తీ కానున్నాయి. జిల్లాలో మేనేజ్మెంట్ సీట్లు 6 ప్రధాన కళాశాలల్లో నూరు శాతం పూర్తికాగా మరికొన్ని కళాశాలల్లో 50 శాతానికిపైగా పూర్తయ్యాయి. బీటెక్ బేరాలు షురూ!బీటెక్ బేరాలు షురూ!ఇంజనీరింగ్ ఆన్ డిమాండ్ కౌన్సెలింగ్కు ముందే బేరసారాలు కంప్యూటర్ సైన్స్కు గిరాకీ ఉమ్మడి జిల్లాలో 14,663 సీట్లు భారీగా మేనేజ్మెంట్ సీట్ల అమ్మకాలు కాలేజీల వారీగా సీట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 14 ఇంజనీరింగ్ కాలేజీల్లో 13,330 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏలూరు జిల్లాలో సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 1,200 సీట్లు, రామచంద్ర కళాశాలలో 900 సీట్లు, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో 600 సీట్లు, హేలాపురి కళాశాలలో 360 సీట్లు, ఎన్ఆర్ఐ కళాశాలలో 1,360 సీట్లు, సారథి ఇంజనీరింగ్ కళాశాలలో 420 సీట్లు ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఎస్ఆర్కేఆర్ కళాశాలలో 1,860, శ్రీ విష్ణు మహిళా కళాశాలలో 960, శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో 1,140, భీమవరం ఇంజనీరింగ్ కళాశాలలో 300, స్వర్ణాంధ్ర కళాశాలలో 1,620, శ్రీవాసవి కళాశాలలో 1,200, శశి ఇంజనీరింగ్లో 1,140, వైజ్ ఇంజనీరింగ్లో 270 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాక మరో 10 శాతం సీట్లు అంటే 1,333 సీట్లు ఈడబ్ల్యూస్ కోటాలో కేటాయిస్తారు మొత్తంగా 14,663 సీట్లు అందుబాటులో ఉన్నాయి. -
పీజీఆర్ఎస్కు వెల్లువెత్తిన అర్జీలు
ఏలూరు(మెట్రో) : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలకు నిర్దేశిత సమయంలోపు నాణ్యమైన పరిష్కారం చూపాలని జేసీ పి.ధాత్రిరెడ్డి ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తంగా 376 అర్జీలు అందుకున్నారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, జెడ్పీ సీఈఓ శ్రీహరి, డీఆర్డీఏ పీడీ అర్.విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె.భాస్కర్, దేవకిదేవి పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన రాచర్ల విజయకుమారి తనకు కువైట్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి రూ.2.50 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. ● ఏలూరు పడమరవీధికి చెందిన కొలపల్లి జయరామచందు తన ఇంటి సమీపంలో పిచ్చిమొక్కలతో పాములకు ఆవాసంగా మారిందని చర్యలు తీసుకోవాలని అర్జీ అందించారు. ● దెందులూరు మండలం కొవ్వలికి చెందిన గొరిపర్తి కొండలరావు తనకు శాశ్వత సదరం సర్టిఫికెట్ జారీ చేసి సామాజిక పింఛన్ ఇప్పించాలని కోరారు. ● పెదవేగికి చెందిన తొంటా తాతయ్య పెదవేగి హైస్కూల్లో విద్యార్థులకు మరుగుదొడ్డి సౌకర్యం కల్పించాలని వినతిపత్రం సమర్పించారు. ● పెదవేగికి చెందిన బొల్లికొండ శ్రీనివాసరావు పెదవేగి పీహెచ్సీ ఆవరణలో సుమారు 60 సెంట్ల భూమి ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేశారు. ● ఉంగుటూరు మండలం ఎర్రమిల్లిపాడుకి చెందిన చిలుకూరి సాయిబాబు తనకు గున్నంపల్లిలో ఉన్న భూములను ఆన్లైన్ చేయాలని వినతిపత్రం అందించారు. ● లింగపాలెం మండలం ధర్మాజీగూడెంకు చెందిన గారపాటి వెంకట సుబ్బారావు తాను పక్షవాతంతో బాధపడుతున్నానని, సదరం సర్టిఫికెట్ జారీ చేసి దీర్ఘకాలిక రోగులకు ఇచ్చే పెన్షన్ మంజూరు చేయాలని అర్జీ అందించారు. ● పెదవేగి మండలం కూచింపూడికి చెందిన నిట్టా కృష్ణ తన తండ్రి వైమానికదళంలో పనిచేసిన సమయంలో 5 ఎకరాలు ప్రభుత్వం మంజూరు చేసిందని, సదరు పొలాన్ని సర్వే చేసి ఆన్లైన్ చేయాలని కోరారు. -
రొయ్యకు సిండి‘కాటు’
సాక్షి, భీమవరం: వారం వ్యవధిలో వనామీ రొయ్యల ధరలు అమాంతం పడిపోయాయి. నిన్నమొన్నటి వరకు కిలో రూ.240 ఉన్న 100 కౌంట్ ధర రూ.200 నుంచి రూ.180కి తగ్గించేయడం ఆక్వా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎగుమతిదారులు సిండికేట్గా మారి ధరలు తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం సిండికేటుకు కొమ్ముకాస్తోందని విమర్శిస్తున్నారు. అమెరికా పన్నుల పేరిట దోపిడీ వేసవి ఉష్ణోగ్రతలు అనుకూలించి మార్కెట్లోకి రొయ్యలు రావడం పెరగడంతో ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, వ్యాపారులు ఏకమై ధరలు తగ్గిస్తూ వచ్చారు. ఏప్రిల్ 3న అమెరికా ప్రతీకార సుంకాల ప్రకటన వెలువడే నాటికి 30 కౌంట్ ధర రూ.460, 40 కౌంట్ ధర రూ.370, 100 కౌంట్ ధర రూ.230కి తగ్గించేశారు. అమెరికా పన్నులను సాకుగా చూపించి కౌంట్కు కేజీకి రూ.30 నుంచి రూ.70 వరకు కోత పెట్టారు. ఇప్పట్లో పన్నులు లేవని తర్వాత అమెరికా ప్రకటించినా సిండికేట్ వర్గాలు ధరలను పెంచకపోవడం గమనార్హం. కంటితుడుపు చర్యలతో సరి ఫీడ్ ప్లాంట్ల యజమానులు మేత ధరలు పెంచేసినా.. ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎగుమతిదారులు ఏకమై తమ కష్టాన్ని దోచుకుంటున్నా.. కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏప్రిల్లో రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాల్లోని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పంట విరామం సైతం ప్రకటించారు. ఈ పరిణామాలతో ఉలిక్కిపడిన ప్రభుత్వం ఉండిలో ఆక్వా సదస్సు, విజయవాడలో ప్రాన్స్ కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశాల్లో మేత ధరలను కేవలం టన్నుకు రూ.4 వేలు మాత్రమే తగ్గించడం, 100 కౌంట్ ధరను స్వల్పంగా పెంచడం తదితర కంటితుడుపు చర్యలతో సరిపెట్టింది. మళ్లీ ధరలు పతనం వారం క్రితం 100 కౌంట్ ధర దాదాపుగా రూ.240 ఉండగా, 30 కౌంట్ ధర రూ.385, 40 కౌంట్ ధర రూ.325, 50 కౌంట్ ధర రూ.295, 60 కౌంట్ ధర రూ.265 వరకు ఉన్నాయి. రానున్న సీజన్కు గాను మరలా చెరువులను సిద్ధం చేసుకునేందుకు రైతులు పట్టుబడులు ముమ్మరం చేయడంతో మార్కెట్లోకి రొయ్యలు రావడం ముమ్మరమైంది. ఇదే అదునుగా తిరిగి సిండికేట్లు ధరలను తగ్గించేస్తున్నాయి. పెద్ద రైతులైతే ఎక్కువ టన్నుల్లో పట్టుబడులు జరిగి 100 కౌంట్కు రూ.210 వరకు ధర చెల్లిస్తుంటే.. చిన్న రైతులు మూడు టన్నుల లోపు పట్టుబడులు చేయడం వల్ల పట్టుబడి పరిమాణాన్ని బట్టి 100 కౌంట్ రొయ్యలను కేజీ రూ.200 నుంచి రూ.180కు కొనుగోలు చేస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. మిగిలిన కౌంట్ల ధరలు సైతం తగ్గించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతికూల వాతావరణం, నాణ్యత లేని సీడ్, ఫీడ్తో ఇబ్బందులు పడుతుంటే ధరల పతనం తమను మరింత నష్టాల్లోకి నెట్టేస్తోందని వాపోతున్నారు. నాడు అప్సడాతో అండ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020లో ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా)ని ఏర్పాటు చేసి హేచరీలు, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల ఆగడాలకు చెక్ పెట్టింది. ధరలను పూటకో రకంగా మారుస్తూ రైతుల కష్టాన్ని దోచుకునే పరిస్థితికి చెక్ పెట్టడంతో పాటు 10 రోజులకోసారి సమావేశమై ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లను విశ్లేషిస్తూ రైతుకు లాభసాటి ధర అందేలా పనిచేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆ దిశగా చర్యలు లేకపోవడంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. వనామీ ధరలు పతనం 100 కౌంట్ ధర రూ.240 నుంచి రూ.200కు తగ్గింపు 2 టన్నులలోపు అయితే రూ.180 ఆందోళనలో ఆక్వా రైతులు సిండికేట్గా మారి ధరలు తగ్గించేస్తున్నారని ఆవేదన అప్సడాతో సిండికేట్ ఆగడాలకు చెక్ పెట్టిన జగన్ ప్రభుత్వం ఆక్వా రంగం కుదేలు ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఆక్వా రంగం సిండికేటు దోపిడీతో సంక్షోభంలో కూరుకుపోతోంది. సీడ్, ఫీడ్, లీజు, మెడిసిన్ ధరలు 100 శాతం పెరగ్గా.. రొయ్యల ధర మాత్రం పతనమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే సాగు చేయడం చాలా కష్టం. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టపోతున్నాం. – పొత్తూరి శ్రీనివాసరాజు, ఆక్వా రైతు, కలగంపూడి గత ప్రభుత్వంలో ఇలా లేదు ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు సిండికేట్ అయి ఇష్టానుసారం ధరలు తగ్గించేస్తున్నారు. టన్నులను బట్టి 100 కౌంట్ను కేజీ రూ.210 నుంచి రూ.180కి కొంటున్నారు. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. ధరలు స్థిరంగా ఉండేవి. ఇప్పుడు ఏ రోజు ఎలా మారతాయో తెలియడం లేదు. ఆక్వా రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – పెనుమాల నరసింహస్వామి, ఆక్వా రైతు, గొల్లవానితిప్ప -
ఏజెన్సీలో విజృంభిస్తున్న జ్వరాలు
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు, వర్షాలు కూడా కురుస్తూండడంతో మన్యంలో రోజురోజుకూ టైఫాయిడ్, మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మలేరియా బారిన పడిన జ్వర పీడితులు ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్నారు. అధికారికంగా జనవరి నుంచి ఇప్పటివరకూ 148 మలేరియా కేసులు నమోదైనప్పటికీ అనధికారికంగా ఆ కేసులు రెట్టింపు ఉండొచ్చని పలువురు చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రులు కూడా జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. అధికంగా మలేరియా కేసులు ఇటీవలి వర్షాలతో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలతో పాటు జిల్లాలోని ఏలూరు, ద్వారకాతిరుమల, లక్కవరం తదితర గ్రామాల్లో కూడా మలేరియా కేసులు నమోదైనట్టు చెప్తున్నారు. జనవరి నుంచి జూన్ మొదటివారం వరకు బుట్టాయగూడెం మండల పరిధిలోని కేఆర్పురం పీహెచ్సీలో 12 కేసులు, పీఆర్గూడెం పీహెచ్సీ పరిధిలో 23, నందాపురం పరిధిలో 6, దొరమామిడి పరిధిలో 16, అంతర్వేదిగూడెం పరిధిలో 8, వేలేరుపాడు మండలం కొయిదా పీహెచ్సీ పరిధిలో 28, వేలేరుపాడు 4, పోలవరం మండలం కోండ్రుకోట పీహెచ్సీ పరిధిలో 6, ద్వారకాతిరుమల 1, లక్కవరం 1, ఏలూరు 1, కొయ్యలగూడెం 1, రాచన్నగూడెం 6, కామయ్యపాలెం 3తో పాటు పలు గ్రామాల్లో మొత్తం 148 కేసులు జనవరి నుంచి ఇప్పటివరకు నమోదైనట్లు మలేరియా అధికారులు తెలిపారు. వెంటాడుతున్న మందుల కొరత జిల్లాలో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని మండలాల్లో ప్రతి గ్రామంలోనూ టైఫాయిడ్, మలేరియా కేసులతో బాధపడుతున్నవారు ఉన్నారు. మలేరియా నివారణకు సంబంధించిన క్లోరోక్విన్ మాత్రలు ఆస్పత్రుల్లో అందుబాటులో లేవని సమాచారం. గతంలో ఈ మందులనే మలేరియా నివారణకు అధికంగా ఇచ్చేవారు. ఈ మందుల సరఫరా లేకపోవడం వల్ల కిందిస్థాయి సిబ్బందిని బయట కొనుగోలు చేసి ఇవ్వాలని చెప్పినట్టు సమాచారం. గతంతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్న క్రమంలో వీటి నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న మలేరియా, టైఫాయిడ్ కేసులు నామమాత్రంగానే ఉన్న మలేరియా మందులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్న ప్రభుత్వాస్పత్రులుమలేరియా నివారణకు చర్యలు తీసుకుంటున్నాం జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 148 కేసులు నమోదయ్యాయి. వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఏసీటీ మందులు అందుబాటులో ఉన్నాయి. క్లోరోక్విన్ మాత్రలకు ప్రతిపాదనలు పంపించాం. మలేరియా కేసులు నమోదైన ప్రదేశాల్లో స్ప్రేయింగ్ పనులు చేయించడంతో పాటు అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నాం. – ఎన్ఎస్ఎస్ ప్రసాద్, జిల్లా మలేరియా అధికారి, కేఆర్పురం, బుట్టాయగూడెం మండలం -
వంతెనకు రంధ్రం.. అవస్థల్లో జనం
ఉంగుటూరు: మండలంలోని నారాయణపురం వద్ద జాతీయరహదారికి అనుసంధానంగా ఉన్న వంతెనకు భారీ రంధ్రం పడటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భీమవరం నుంచి గణపవరం మీదుగా నారాయణపురం వద్ద జాతీయరహదారికి చేరుకునేందుకు కీలకంగా ఉన్న ఈ వంతెనకు ఆదివారం రంధ్రం పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ద్విచక్ర వాహనాలు మినహా మరే ఇతర వాహనాలూ వెళ్లకుండా బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. వంతెనపై పెద్ద వాహనాల రాకపోకలకు అవకాశం లేకుండా మట్టిని, రాళ్ల గుట్టలను అడ్డుగా వేశారు. ద్విచక్ర వాహనదారులు వాటి మధ్యే ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. కార్లు తదితర వాహనాలు నారాయణపురం శివారులో ఉన్న మట్టి రోడ్డు ద్వారా ఉంగుటూరుకు, మరికొన్ని తల్లాపురం రోడ్డు మీదుగా చేబ్రోలు వంతెనకు చేరుతున్నాయి. మరికొందరు వాహనదారులు చేబ్రోలు పోలీస్స్టేషన్ నుంచి కాలువ గట్టు మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్గాలు అంత అనుకూలంగా లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎట్టకేలకు ఆర్అండ్బీ అధికారుల రాక వంతెనకు ఆదివారం రంధ్రం పడగా, ఆర్అండ్బీ అధికారులు రెండోరోజైన సోమవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు రావడం గమనార్హం. ఆర్అండ్బీ ఈఈ కిషోర్ బాలాజీ, డీఈ గోవింద మోహన్, ఏఈ ప్రభాకరరావు వంతెన వద్ద రంధ్రం పడిన ప్రాంతాన్ని పరిశీలించి స్థానిక అధికారులు పలు సూచనలు చేశారు. నూతన వంతెన నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు తెలుస్తోంది. బ్రిటీష్ కాలం నాటి వంతెనలు బ్రిటీష్ వారి కాలంలో కట్టిన ఈ వంతెనలకు కాలం చెల్లింది. 1935లో నిర్మించిన ఈ వంతెనలు దశాబ్ద కాలం నుంచి పట్టు కోల్పోయి బలహీనపడ్డాయి. వేలాది వాహనాలు వీటిపై రాకపోకలు సాగిస్తుండటంతో వీటి సామర్థ్యం తగ్గిపోయిందని, ఆయా వంతెనల స్థానంలో కొత్తవి నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఆరేళ్ల క్రితం ఉంగుటూరు బ్రిడ్జి కూడా ఇలాగే ధ్వంసం కాగా, దాని స్థానంలో కొత్త వంతెన నిర్మించకుండా రూ.35 లక్షలు వెచ్చించి మరమ్మతులతో సరిపెట్టారు. ఇక నారాయణపురంలో కొత్త వంతెన నిర్మాణంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి. -
ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో సోమవారం ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 2 నుంచి 10వ తేదీ వరకు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కొరకు ఆర్జీయూకేటీ దరఖాస్తులను స్వీకరించింది. దీంతో 1340 దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్సీసీ, సైనికోద్యోగుల పిల్లలు, క్రీడా, దివ్యాంగులు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలకు చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. క్రీడా విభాగంలో 62 మంది, ఎన్సీసీ విభాగంలో 85 మంది, సైనికోద్యోగుల పిల్లల విభాగంలో 12 మంది, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగానికి సంబంధించి 15 మంది కలిపి మొత్తం 174 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు వచ్చినట్టు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ తెలిపారు. స్కీముల పేరిట మోసగిస్తున్న ముఠా అరెస్ట్ తాడేపల్లిగూడెం అర్బన్ : ఇచ్చిన సొమ్ముకు రెట్టింపు సొమ్ము ఇస్తామంటూ స్కీముల పేరిట అమాయక ప్రజలను మోసగిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాథ్ తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా టేకుల నాయక తండాకు చెందిన సదాసూత సాయికిరణ్, మోహనరావు స్నేహితులు. భీమడోలుకు చెందిన ఆర్కే రెడ్డి అనే ఆనంద్కు సింహాద్రి మోహనరావు స్నేహితుడు. వీరిద్దరికీ సన్నిహితం ఉండటం కారణంగా కోడూరు మండలం చిన్నూరుకు చెందిన నక్క సత్తిబాబు పరిచయమయ్యాడు. ఈ పరిచయంలో భాగంగా సత్తిబాబు తమ వద్ద ఒక స్కీమ్ ఉందని, సొమ్ములు ఇచ్చిన వారికి రెట్టింపు సొమ్ములు ఇస్తామని మోహనరావుతో చెప్పాడు. దీంతో ఆశపడిన సాయికిరణ్, మోహనరావు కొంత సొమ్మును ఈ నెల 13న తాడేపల్లిగూడెం బస్టాండ్ సెంటర్ వద్దకు తీసుకొచ్చారు. వీరు డబ్బు తెచ్చిన విషయం గమనించిన సత్తిబాబు, అతని స్నేహితుడు ఏలూరు ఆనంద్లు వీరిని పిలిచి.. తమ కారులోకి ఎక్కించుకున్నారు. ఈలోగా తాడేపల్లిగూడేనికి చెందిన షేక్ సుబాని, జంగారెడ్డిగూడేనికి చెందిన పిల్లిబోయిన గణేష్ వీరి కారులోకి చొరబడి కత్తిని చూపించి బెదిరించి నగదు బ్యాగ్ను లాక్కున్నారు. అనంతరం కారు నుంచి దించేసి వారంతా పరారయ్యారు. తాము మోసపోయమని గ్రహించిన బాధితులు ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు డీఎస్పీ డి.విశ్వనాథ్ పర్యవేక్షణలో సీఐ బోణం ఆదిప్రసాద్, ఎస్సైలు బాదం శ్రీనివాస్, పి.నాగరాజు సిబ్బందితో కలిసి బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేసి నక్క సత్తిబాబు, ఆనంద్, పిల్లిబోయిన గణేష్, షేక్ సుబానిలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.4,20,000 నగదును, రెండు అరల సూట్కేస్, బ్యాగులు, బ్లేడు కత్తి స్వాధీనం చేసుకున్నారు. -
డ్రోన్లతో ఏజెన్సీని జల్లెడ పడుతున్నాం
జంగారెడ్డిగూడెం: ఛత్తీస్గఢ్లో జరుగుతున్న మావోయిస్టుల ఎన్కౌంటర్ల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, జిల్లా ఏజెన్సీ ప్రాంతాన్ని డ్రోన్లతో జల్లెడ పడుతున్నామని ఎస్పీ కేపీఎస్ కిషోర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల జాడ కోసం కూంబింగ్లు జరిగాయని, ఈ నేపథ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో కొంతమంది మరణించారని చెప్పారు. కూంబింగ్, ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. ఈ నేపథ్యంలో వారు షెల్టర్ కోసం జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. గతంలో వారు ఈ ప్రాంతాన్ని షెల్టర్ జోన్గా వినియోగించుకున్న సంఘటనలు ఉన్నాయని, ఎటువంటి ప్రమాదాలూ జరగకుండా ముందుగానే జిల్లాలో నక్సల్ వింగ్కు సంబంధించి ఒక విధానం రూపొందించనున్నామని చెప్పారు. దీనిలో భాగంగానే తరచుగా పోలీస్స్టేషన్ల తనిఖీలు, పోలవరం ప్రాజెక్టు భద్రత పరిశీలన చేస్తున్నట్టు తెలిపారు. ఏఎన్ఎస్ పార్టీలు జిల్లా ఏజెన్సీలో కూంబింగ్ చేస్తున్నాయన్నారు. ఈ ప్రాంత ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నారని, సంఘ విద్రోహులకు సహాయం చేసే అవకాశాలు లేవని చెప్పారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు. సీసీ కెమెరాలు ప్రారంభం జంగారెడ్డిగూడెంలో పోలీసింగ్ మరింత పటిష్టం చేసే దిశగా పట్టణం మొత్తం సీసీ కెమెరా వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు ఎస్పీ కేపీఎస్ కిషోర్ తెలిపారు. పోలీసింగ్ను ప్రజలకు మరింత నమ్మకంగా మార్చే ఉద్దేశంతో దాత నవభారత్ యాజమాన్యం సహకారంతో డీఎస్పీ యు.రవిచంద్ర, సీఐ వి.కృష్ణబాబు, ఎస్సై షేక్ జబీర్లు పట్టణంలో సీసీ టీవీ వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. అంతర్ రాష్ట్ర సరిహద్దు కలిగి ఉండటం, జంగారెడ్డిగూడెం పట్టణం అభివృద్ధి చెందడంతో నేరాలు జరిగే అవకాశం ఉందని, సీసీ కెమెరాల వ్యవస్థ ఉండటం వల్ల వీటిని అరికట్టే వీలుంటుందని తెలిపారు. ఒకవేళ ఘటనలు చోటుచేసుకున్నా త్వరగా వాటిని ఛేదించవచ్చని చెప్పారు. ఇటీవల కాలంలో జాబ్ ఇస్తానని మోసం చేశారంటూ కేసులు నమోదువుతున్నాయని, ఇలాంటి వారి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల ద్వారకాతిరుమలలో ఇలాంటి ఘటన చోటుచేసుకుందని, నిందితుడిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఏలూరుతో పాటు జంగారెడ్డిగూడెంలో కూడా పోలీస్ గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ఎస్పీ వెల్లడించారు. పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం సబ్డివిజన్ పరిదిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. మావోయిస్టుల ఎన్కౌంటర్ల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నాం షెల్టర్ కోసం జిల్లాలోకొచ్చే అవకాశం ప్రజాప్రతినిధులు, ప్రముఖులు జాగ్రత్తగా ఉండాలి ఎస్పీ కేపీఎస్ కిషోర్ వెల్లడి -
శ్రీవారి సేవలో న్యాయమూర్తులు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (సీఏటీ) న్యాయమూర్తులు సోమవారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తులు డాక్టర్ లతా బస్వరాజ్ పాట్నే, షాలిని మిశ్రా (రిటైర్డ్ ఐఏఎస్), రిజిస్ట్రార్ జి.నవీన్ కుమార్, సీఏటీ సిబ్బందికి ముందుగా దేవస్థానం అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు వారికి స్వామివారి శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఆలయ ఏఈఓ రమణరాజు, సూపరింటెండెంట్ హయగ్రీవాచార్యులు చిన వెంకన్న చిత్రపటాలను, ప్రసాదాలను వారికి అందజేశారు. పోక్సో కేసులో యావజ్జీవశిక్ష వీరవాసరం: బాలికను మోసపూరిత మాటలతో మభ్యపెట్టి, బెదిరించి, గర్భవతిని చేసిన కేసులో నిందితుడికి జీవిత కాల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి బి.లక్ష్మీనారాయణ సోమవారం తీర్పు చెప్పారు. జరిమానాలో రూ.80 వేలు బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొణితివాడకు చెందిన కండెల్లి రమేష్ స్థానిక బాలిక (16)ను మోసపూరిత మాటలతో మభ్యపెట్టి, బెదిరించి గర్భవతిని చేశాడంటూ ఆమె తండ్రి 2020 జూలై 13న పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై నేరం రుజువవడంతో జడ్జి తీర్పు చెప్పారు. -
అందని ద్రాక్షగా హజ్ యాత్ర
ఆకివీడు: హజ్ యాత్రను కూటమి ప్రభుత్వం అందని ద్రాక్షగా మార్చివేసిందని వైఎస్సార్సీపీ ముస్లిం విభాగం నాయకులు ఎండీ. జక్కీ ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ హజ్ యాత్రకు రూ.లక్ష ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మోసగించిందన్నారు. రాష్ట్రంలోని ముస్లింలందరూ హజ్ యత్రకు వెళ్లవచ్చని ఆశపడ్డారని వారి ఆశల్ని నిరాశ చేశారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సాధించిన విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ను కూడా కూటమి ప్రభుత్వం రద్దు చేయించిందన్నారు. -
చిన్నతిరుపతి క్షేత్రంలో పోటెత్తిన భక్తులు
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ఈనెల 11తో ముగిశాయి. అయితే మంచి తిధులు లేకపోవడంతో విద్యార్థులను తమ తల్లిదండ్రులు సోమవారం నుంచి పాఠశాలలకు పంపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆఖరి సెలవురోజును పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. దాంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, కల్యాణకట్ట ఇతర విభాగాలు భక్తులతో కిక్కిరిసాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయ అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. -
సాగుకు సిద్ధం.. సాయం శూన్యం
ఏలూరు (మెట్రో): ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రైతులకు కూటమి ప్రభుత్వం ఎలాంటి సాయం అందించడం లేదు. అరక చేతబట్టి పొలం బాట పట్టిన రైతులు దిగాలుతో వ్యవసాయ పనులు చేపడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా రైతులకు ఎలాంటి పెట్టుబడి సాయం అందించకుండా వ్యవసాయం దండగ అనే రీతిలోనే వ్యవహరిస్తోందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక అప్పులు చేసి వ్యవసాయ పనులు మొదలు పెడుతున్నామని వాపోతున్నారు. గత ప్రభుత్వంలో రైతే రాజుగా.. రాష్ట్రంలో రైతే రాజుగా భావించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్నదాతల సంక్షేమానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ఏటా సీజన్ ప్రారంభంలోనే ఆర్థిక సాయం అందించారు. ఇలా ఏలూరు జిల్లాలో రైతులకు 2019 నుంచి 2023 వరకు రూ.1,339.45 కోట్ల సాయం అందించారు. అయితే ప్రస్తుత కూటమి సర్కారు ఎన్నికల హామీ ల్లో భాగంగా రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.20 వేల చొప్పున అందించాల్సి ఉండగా.. ఏడాది గడిచినా పట్టించుకోవడం లేదు. తా జాగా ఈనెల 20 నుంచి అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభిస్తామని కూటమి నాయకులు ప్రక టించారు. అయితే ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఎప్పుడు పథకాన్ని అమలు చేసి సాయం అందిస్తారని రైతులు నిట్టూరుస్తున్నారు. 13,027 మందికి ఈకేవైసీ జిల్లావ్యాప్తంగా 1,62,085 మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా జిల్లా వ్యవసాయశాఖ అధికారులు లెక్కలు తేల్చారు. రైతులకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం 13,027 మంది రైతుల ఖాతాల ఈకేవైసీ మాత్రమే పూర్తిచేశారు. రైతుల ఇక్కట్లు గత ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సాయం చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ నష్టపోతున్నారు. రైతులు సీజన్ ఆరంభంలో పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తే పంట చేతికొచ్చాక కూడా ఆ అప్పు తీర్చే పరిస్థితి ఉండటం లేదు. ప్రస్తుతం ఖరీఫ్ పనులు చేపడుతున్న రైతులు చేతిలో డబ్బులు లేక మరోమారు అప్పుల కోసం తిప్పలు పడుతున్నారు. సార్వా సాగేనా..? ఖరీఫ్ పనులు ప్రారంభం రైతులను పట్టించుకోని ప్రభుత్వం అన్నదాత సుఖీభవ సాయం ఎప్పటికో? జిల్లాలో 99,512 హెక్టార్లలో సాగు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీజన్ ఆరంభంలోనే సాయం గత ప్రభుత్వంలో రైతు భరోసా సాయం సంవత్సరం రైతులు లబ్ధి (రూ.కోట్లలో) 2019 2,24,016 302.42 2020 2,13,950 288.83 2021 1,90,729 257.48 2022 1,87,950 253.73 2023 1,98,179 236.99 -
విద్యార్థులకు ఉచిత బస్ పాస్లు
భీమవరం(ప్రకాశం చౌక్): స్కూలు, కళాశాలకు విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు ఆర్టీసీ ఏటా ఉచితంగా బస్సు పాసులిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా ఈ పాసులు మంజూరు చేస్తోంది. 12 ఏళ్ల లోపు బాలురు, 18 ఏళ్ల లోపు బాలికలకు వీటిని ఇస్తారు. విద్యా సంవత్సరం మొదలు కావడంతో ఈ నెల 13 నుంచి ఉచిత బస్పాస్లు పశ్చిమ ఆర్టీసీ జారీ చేస్తోంది. భీమవరం, తణుకు, నర్సాపురం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు ఆర్టీసీ బస్టాండ్ల్లో పాస్ల జారీ చేయడానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఉచిత బస్పాస్లతో పాటు రాయితీ, దివ్యాంగుల(పీహెచ్) పాస్లు కూడా జారీ చేస్తున్నారు. విద్యార్థులు విద్యార్థి ఫొటో, స్కూల్ యాజమాన్యం నుంచి (బోనఫైడ్ సర్టిఫికెట్) ధ్రువీకరణ పత్రం సమర్పించి బస్పాస్ పొందవచ్చును. ఆర్టీసీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని కౌంటర్ దగ్గరకు వెళ్తే వెంటనే ఉచిత పాస్ పొందవచ్చు. పాస్ పొందిన విద్యార్థులు తమ ఇంటి నుంచి 20 కిలోమీటర్ల దూరం వరకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. 2024–25 ఏడాదికి జిల్లాలో నాలుగు డిపోల పరిధిలో మొత్తం 13,190 ఉచిత బస్ పాస్లు అందిస్తున్నారు. రాయితీ పాస్లు ఇలా రాయితీ బస్ పాస్ పొందేవారికి పాస్ ధరతో నెలవారీ గుర్తింపు కార్డు రూ.50, సర్వీస్ చార్జీ రూ.40 అదనంగా చెల్లించాలి. రాయితీతోపాటు సంవత్సరం గుర్తింపు కార్డు కోసం రూ.100 చెల్లించాలి. పాస్లు నెల, మూడు నెలలు, ఏడాది కాలపరిమితితో మంజూరు చేస్తారు. గడువు ముగిశాక రెన్యువల్ కోసం ప్రిన్సిపాల్ సంతకం చేయించుకుని తిరిగి పొందాలి. సాధారణ విద్యార్థులకు జూన్ నుంచి ఏప్రిల్ వరకూ, ఐటీఐ, పారా మెడికల్ వంటి కోర్సులు చదివే వారికి మే నెల వరకు పాసులు మంజూరుచేస్తారు. దివ్యాంగులకు ఉచిత పాసులు ఆర్టీసీ దివ్యాంగులకు ఉచిత పాసులు అందిస్తుంది. పాస్ పొందడానికి సర్టిఫికెట్, ఆధార్ కార్డు, అన్ ఎంప్లాయిమెంట్ సర్టిఫికెట్ సమర్పించాలి. మూడేళ్ల కాల వ్యవధితో ఈ పాస్లు జారీ చేస్తారు. అన్ని బస్టాండ్లలో ప్రత్యేక కౌంటర్లు కళాశాలలు, స్కూళ్లు ప్రారంభమైన నేపథ్యంలో కొత్త బస్ పాస్ల జారీకి చర్యలు తీసుకున్నాం. ఈనెల 13 నుంచి పాస్లు మంజూరు చేస్తున్నాం. కొత్తవి మంజూరు, పాత పాస్లు రెన్యువల్ చేసి విద్యార్థులకు వేగంగా అందించడానికి జిల్లాలోని ఐదు బస్టాండ్ల్లో కౌంటర్లు ఏర్పాటు చేశాం. రద్ధీ బట్టి అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తాం. ఎన్వీఆర్ వరప్రసాదరావు జిల్లా ప్రజా రవాణా అధికారి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన ఆర్టీసీ 12 ఏళ్లలోపు బాలురు, 18 ఏళ్ల బాలికలకు ఉచిత పాసులు 2024–2025 ఏడాది జిల్లాలో 1390 ఉచిత పాసుల జారీ గత రెండేళ్లుగా బస్ పాస్ల జారీ ఇలా.. ఏడాది డిపో ఉచిత పాస్లు రాయితీ పాస్లు పీహెచ్సీ పాస్లు 2023–24 భీమవరం 6,056 10,966 319 నర్సాపురం 2,239 6,367 513 తణుకు 1,266 4,705 347 తాడేపల్లిగూడెం 2,142 6,122 506 2024–25 భీమవరం 5,010 4,924 410 నర్సాపురం 2,512 4,518 358 తణుకు 2,108 3,661 363 తాడేపల్లిగూడెం 3,560 3,839 376 -
పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ
కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మ నీ చల్లని దీవెనలు అందించమ్మా అంటూ భక్తులు అమ్మవారిని ఆర్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల ప్రజలు ఆదివారం దర్శించుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలాచరించి అమ్మవారికి వేడి నైవేద్యాలను సమర్పించారు. మహిళలు పొంగళ్లను అమ్మకు అందించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్కరోజు ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల అమ్మకం, వాహన పూజల ద్వారా రూ.73,090 ఆదాయం వచ్చిందని తెలిపారు. -
కొల్లేరులోసీఈసీఅధ్యయనం
నేడు కొల్లేరు గ్రామాల్లో కలెక్టర్ పర్యటన కైకలూరు : కొల్లేరు అభయారణ్య ఆక్రమణలు, పర్యావరణానికి విఘాతం, ప్రజల ఇబ్బందులు, జిరాయితీ, డీఫాం భూముల అంశాలపై సుప్రీంకోర్టులో పిటీషన్ల నేపథ్యంలో ఈనెల 17, 18 తేదీల్లో కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) పర్యటించనుంది. సీఈసీ కమిటీ సభ్యులు జి.భానుమతి, చంద్ర ప్రకాష్ గోయల్, సునీల్ లిమాయే, డాక్టర్ జైవర్థన్ రమన్లాల్ భట్లు కొల్లేరు ప్రాంతాల్లో అధ్యయనం చేయడానికి విచ్చేస్తున్నారు. సోమ వారం ఢిల్లీ నుంచి రానున్న బృందం ముందుగా విజయవాడలో సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. సీఈసీ పర్యటన నేపథ్యంలో అటవీ శాఖ అ ధికారులు అన్ని దస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో అప్రమత్తమయ్యారు. ర్యూట్ మ్యాప్ నిమిత్తం సమావేశం సీఈసీ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ వెట్రిసెల్వి సోమవారం కొల్లేరు ప్రాంతాలను పరిశీలించనున్నారు. సీఈసీకి అందించే నివేదికలపై అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. కైకలూరు రెవెన్యూ కార్యాలయంలో రూట్ మ్యాప్ నిమిత్తం సమావేశం నిర్వహించనున్నారు. ఈనెల 17న మండవల్లి మండలం, 18న కై కలూరు మండలంలో సీఈసీ సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. కొల్లేరు నాయకులు కై కలూరు మండలం పందిరిపల్లిగూడెం వద్ద బహిరంగ సభ, అలాగే నిడమర్రు మండలం తోకలపల్లి, భైనేపల్లి, ఆకివీడు మండలం సిద్దాపురం ప్రాంతాల్లో కొల్లేరును పరిశీలించాలని అధికారుల ద్వారా సీఈసీకి తెలియజేయడానికి సిద్ధమయ్యారు. వినతులు సిద్ధం కొల్లేరులో 122 పరీవాహక గ్రామాలు ఉండగా.. మౌలిక వసతులు, శ్శశానాలకు భూములు, తాగునీటి చెరువులు, మట్టి పూడికలు వంటి అంశాలను సీఈసీకి వినతుల రూపంలో అందించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. కొల్లేరు అభయారణ్యం 77,135 ఎకరాల్లో జిరాయితీ, డీఫాం పట్టా భూములు దాదాపు 20 వేల ఎకరాలు మినహాయించాలనే ప్రధాన డిమాండ్ను సీఈసీ ముందు ఉంచనున్నారు. అటవీ నిబంధనలు కఠినంగా ఉన్నాయని, వాటిని సవరించి ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్పు చేయాలని కోరనున్నారు. కమిటీ సభ్యులు వీరే.. జి.భానుమతి సీఈసీకి సభ్య సెక్రటరీగా జి.భానుమతి వ్యవహరించనున్నారు. ఆమె త్రిపుర కేడర్కు చెందిన 2009 బ్యాచ్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. ప్రస్తుతం న్యూఢిల్లీలో నేషనల్ టైగర్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అథారిటీ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫారెస్ట్గా పనిచేస్తున్నారు. రమన్లాల్ భట్ డాక్టర్ జైవర్థన్ రమన్లాల్ భట్ అంతర్జాతీయ పర్యావరణ నిపుణులు. 35 ఏళ్లుగా పర్యావరణ శాసీ్త్రయ సాంకేతిక సేవలు అందిస్తున్నారు. పలు సంస్థలకు సలహాదారులుగా ఉన్నారు. పర్యావరణంపై 20 పుస్తకాలు రాశారు. 10 అంతర్జాతీయ సమావేశాలకు సంధానకర్తగా వ్యవహరించారు. సునీల్ లిమాయే మహారాష్ట్ర కేడర్కు చెందిన సునీల్ లిమాయే ఇండియన్ ఫారెస్టు సర్వీస్ ఆఫీసర్. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టుగా పనిచేశారు. ఏకో టూరిజం మేనేజింగ్ డైరెక్టర్, మహారాష్ట్ర సంజయ్ గాంధీ నేషనల్ పార్కు డైరెక్టర్గా ఉన్నారు. చిరుత పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.చంద్రప్రకాష్ గోయల్చంద్రప్రకాష్ గోయల్ ఐటీ అధికారి. 1986లో ఐఎఫ్ఎస్లో చేరారు. ఉత్తరప్రదేశ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టుగా పనిచేశారు. కేంద్ర అటవీ, వాతావరణ మార్పుల శాఖ స్పెషల్ సెక్రటరీగా విధులు నిర్వహించారు. పర్యావరణ అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు. -
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామిని భక్తులు ఆదివారం అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఉదయానికే ఆలయానికి చేరుకుకోవడంతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. పుట్టలో పాలు పోసేందుకు, పాల పొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసేందుకు అధిక సమయం వేచి ఉండాల్సి వచ్చింది. స్వామిని దర్శించుకున్న అనంతరం నాగబంధాల వద్ద పూజలు చేశారు. అదేవిధంగా గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సహాయ కమిషనర్ శ్రీదేవి, సిబ్బంది పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ మాట్లాడుతూ ఆలయ ఆవరణలో వాహనాల పార్కింగ్ రుసుము వసూలు చేసుకునేందుకు లైసెన్సు హక్కు ఒక సంవత్సర కాలానికి కల్పించేందుకు ఈనెల 17న టెండర్ కం బహిరంగ వేలం జరుగుతుందని తెలిపారు. ఆటో చోరీపై ఫిర్యాదు భీమవరం: భీమవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి రాయలంలోని ఇంటి ముందు నిలుపుదల చేసిన ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని సీఐ జి. కాళీచరణ్ తెలిపారు. ఈ నెల 11న నిలుపుదల చేసిన ఆటోను యజమాని వై.తాతారావు 12న ఉదయం చూసే సరికి లేకపోవడంతో చుట్టుపక్కల వెతికాడు. కనిపించకపోవడంతో ఆదివారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వైభవంగా శ్రీనివాసుడి కల్యాణం జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరిలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు నల్లూరు రవికుమార్ ఆచార్యులు కల్యాణ తంతును జరిపించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని వీక్షించి తరించారు. ఏర్పాట్లను ఈవో మాణికల రాంబాబు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. -
వృద్ధులకు బాసటగా నిలవాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): వృద్ధులకు ప్రతిఒక్కరూ బాసటగా నిలవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ సూచించారు. ఆదివారం ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో వృద్ధుల హక్కులు, చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ వృద్ధులపై వేధింపులు, నిర్లక్ష్యం, దుర్వినియోగం వంటి సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలను సూచించడానికి ఈ దినోత్సవం వేదికన్నారు. పిల్లలు వారి తల్లిదండ్రులకు రక్షణ, పోషణ, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వృద్ధుల సమస్యలను పరిష్కారానికి ప్రతి రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ప్రత్యేక ట్రిబ్యునల్ ఉందన్నారు. అవసరమైన పక్షంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థను నేరుగా గాని లేదా 15100 లేదా 08812 224555 ద్వారా సంప్రదించి సాయం పొందవచ్చన్నారు. న్యాయవాది రత్నప్రసాద్, ప్రేమాలయం నిర్వాహకులు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గుబ్బల మంగమ్మ గుడి వద్ద ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేదిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధి, సర్పంచ్ కోర్సా గంగరాజు తెలిపారు. గుబ్బల మంగమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా పూర్తి ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. భక్తులు తప్పనిసరిగా పేపర్ బ్యాగ్లను తెచ్చుకోవాలని ఆలయ కమిటీ వారు కోరారు. -
నారాయణపురం వంతెనకు భారీ రంధ్రం
ఉంగుటూరు: ప్రజలు అనుకున్నదంతా జరిగింది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో వంతెన శ్లాబ్ ఊడి పెద్ద రంధ్రం పడింది. ఆదివారం వేకువజామున మండలంలోని నారాయణపురం బ్రిడ్జిపై మీటరున్నర పొడవు, మీటరు వెడల్పున శ్లాబ్ ఊడి పెద్ద రంధ్రం పడింది. ఆ సమయంలో వాహన రాకపోకలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. బ్రిడ్జిపై ద్విచక్రవాహనాలు మినహా మరి ఏ ఇతర వాహనాలు తిరగకుండా పోలీసులు, ఆర్అండ్బీ సిబ్బంది ఆంక్షలు విధించి పహారా కాస్తున్నారు. గణపవరం సీఐ సు భాష్, చేబ్రోలు, నిడమర్రు ఎస్సైలు సూర్యభగవాన్, ప్రసాద్ ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆర్అండ్బీ ఏఈ భాస్కరరావు ఈ ప్రదేశాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించారు. ఉన్నతాధికారులు ఎవరూ ఇప్పటివరకూ ఇక్కడకు రాలేదు. భారీ వాహనాల రాకపోకలతోనే.. 1932లో నారాయణపురం బ్రిడ్జిని నిర్మించగా దాదాపు 12 ఏళ్ల నుంచి శిథిలావస్థకు చేరుకుంది. ఇటుగా 30 టన్నుల వరకు భారీ వాహనాలు ఎక్కువగా తిరగడమే బ్రిడ్జికి రంధ్రం పడటానికి కారణంగా కనిపిస్తుంది. నిత్యం వందలాదిగా చేపలు, రొయ్యలు, కంకర లారీలు ఇటుగా తిరుగుతు న్నాయి. కొన్నేళ్లుగా బ్రిడ్జి కింద భాగం పెచ్చులూడటంతో వంతెన పునర్నిర్మించాలని స్థానికులు ప్రజాప్రతినిధులకు విన్నవించారు. తప్పని దూరాభారం పశ్చిమ డెల్టాతో పాటు కోనసీమ జిల్లా నుంచి విజయవాడ, హైదరాబాద్కు ఇటుగా దగ్గర మార్గం కావడంతో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అలాగే ఆక్వా ఉత్పత్తుల లోడు లారీలు ఇటుగా కోల్కతా, ఈశాన్య రాష్ట్రాలకు వెళుతుంటాయి. ఇప్పుడు ఇటుగా రాకపోకలు నిలిపివేయడంతో కొన్ని వాహనాలు చేబ్రోలు బ్రిడ్జి నుంచి పుంత దారి మీదుగా గణపవరం చేరుకుంటున్నాయి. ఎక్కువ వాహనాలు తాడేపల్లిగూడెం మీదుగా సుమారు 50 మీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించి వెళుతున్నాయి. గత ప్రభుత్వంలో బ్రిడ్జి మంజూరు తాము అధికారంలో ఉండగా అప్పటి సీఎం జగన్కు చెప్పి ఉంగుటూరు నియోజకవర్గంలో మూడు బ్రిడ్జిలు మంజూ రు చేయించాను. అందులో నారాయణపురం బ్రిడ్జి ప్రధానమైంది. రూ.8.50 కోట్ల నిధులు మంజూరు చేయించగా ప్రభుత్వ అధికారుల తాత్సారం, టెండర్ల దశలో ఉండగా ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రభు త్వం మారడంతో ఆ పని పెండింగ్లో పడింది. బ్రిడ్జికి రంధ్రం పడటం దురదృష్టకరం. వంతెన పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. – పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్యే, ఉంగుటూరు శ్లాబ్ ఊడి పడిన వైనం స్తంభించిన రాకపోకలు గత ప్రభుత్వంలో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కూటమి పాలనలో పట్టించుకోని వైనం గత ప్రభుత్వంలో రూ.8.50 కోట్ల మంజూరు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గణపవరం పర్యటనకు వచ్చిన సందర్భంగా అప్పటి ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నియోజకవర్గ సమస్యలను విన్నవించారు. దీంతో 2023లో గుండుగొలను, నారాయణపురం, గణపవరంలో వంతెనల నిర్మాణాలకు మాజీ సీఎం జగన్ నిధులు మంజూరు చేశారు. నారాయణపురం బ్రిడ్జికి రూ.8.50 కోట్లు, గుండుగొలను బ్రిడ్జికి రూ.9 కోట్లు, గణపవరం బ్రిడ్జికి రూ.8.45 కోట్ల నిధులు మంజూరు చేశారు. గుండుగొలనులో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే నారాయణపురం బ్రిడ్జి పనులు టెండర్ల ప్రక్రియ దశకు చేరే సరికి సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పనులు నిలిచిపోయాయి. గతేడాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పనులను పట్టించుకోలేదు. దీంతో బ్రిడ్జి నిర్మాణం ప్రశ్నార్థకమైంది. -
కలల వారధి ఇంకెన్నాళ్లు?
భీమడోలు: గోదావరి కాల్వపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణం ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియక నియోజకవర్గ వాసులు ఆందోళన చెందుతున్నారు. నిర్మాణం చేపట్టి రెండేళ్లు గడిచింది. వైఎస్సార్సీపీ హయాంలో పనులు పరుగు పెట్టగా.. కూటమి పాలనలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల వంతెన శ్లాబ్ వేసినా నేటికి మిగిలిన పనులు జరగకపోవడంతో ప్రజలు కూటమి పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితం జాతీయ రహదారికి అనుసంధానంగా గుండుగొలను వద్ద గోదావరి కాల్వపై నిర్మించిన బ్రిటిష్ కాలం నాటి వంతెన కూలిపోయింది. దీంతో భీమడోలు, దెందులూరు, ఏలూరు రూరల్, కై కలూరు ప్రాంతాలకు చెందిన వేలాది మంది ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు రాకపోకలు స్తంభించాయి. దీంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అప్పటి ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సీఎం హోదాలో గణపవరం వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం స్పందించిన జగనన్న గుండుగొలను, నారాయణపురం వద్ద కొత్త వంతెనల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శాశ్వత వంతెన నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.3 కోట్లు మంజూరు చేశారు. ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నయంగా గుండుగొలను వద్ద కాల్వపై బెయిలీ బ్రిడ్డిని నిర్మించేందుకు రూ.40 లక్షలు మంజూరు చేయించారు. వంతెన నిర్మాణం నేపథ్యంలో కేంద్ర జలరవాణాశాఖ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకుండా, వంతెన నిర్మాణంలో తన వంతు కృషి చేశారు. దీంతో 60శాతానికి పైగా పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సౖరైన విధానాలను పాటించకపోవడం, వారి మధ్య సమన్వయం కరువవడంతో నిర్మాణం చిక్కుముడిలా మారింది. జల రవాణ శాఖ అభ్యంతరం 11 మీటర్ల ఎత్తులో వంతెన నిర్మించాల్సి ఉన్నా 5 మీటర్ల ఎత్తు ఉండడంతో కేంద్ర జల రవాణా శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో కాల్వలో జల రవాణ జరిగే అవకాశం ఉందని, స్టీమర్లు, పడవలు, ఓడల రవాణాకు ఈ వంతెన అడ్డంకిగా మారుతుందని పేర్కొంది. తక్షణం నిలిపివేయాలని ఆ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏలూరు ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదిస్తున్నారు. సమస్య కొలిక్కి రాకపోవడం ఆందోళనకు గురి చేస్తుంది. బెయిలీ వంతెనపై భయం భయంగా గుండుగొలను వద్ద శాశ్వత వంతెన నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఆ వంతెన నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు గోదావరి కాల్వపై బెయిలీ వంతెనను నిర్మించి ప్రజల రాకపోకల కష్టాలకు చెక్ పెట్టారు. ఈ వంతెన వ్యవధి రెండేళ్లని ఆర్ అండ్ బీ అధికారులు ప్రారంభోత్సవం సమయంలో తెలిపారు. ఈ ఏడాది నవంబర్కు గడువు ముగుస్తుంది. ఈ వంతెనపై భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో బిక్కు బిక్కుమంటూ ప్రయాణం చేయాల్సి ఉంది. దీంతో వంతెన ప్రమాదంగా మారింది. గుండుగొలను వంతెన పనుల్లో జాప్యంపై అసంతృప్తి కూటమి పాలనలో ముందుకు సాగని నిర్మాణం వంతెన తక్షణం నిర్మించాలి గుండుగొలను వంతెన నిర్మాణం చేపట్టి రెండేళ్లు గడుస్తుంది. నేటికీ పూర్తి కాలేదు. నిర్మాణానికి రూ.3 కోట్లు, బెయిలీ వంతెన నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేయించాం. దీంతో పనులు సాగుతున్నాయి. కూటమి పాలనలో వంతెన నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు తీసుకు రావాల్సిన బాధ్యత అధికారులు, పాలకులపై ఉంది. పాలకులు, అధికారుల మధ్య సమన్వయం కొరవడంతో ఈ వంతెన నిర్మాణ పనులు జాప్యమవుతున్నాయి. దీంతో కొల్లేరు వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే పూర్తి కావాల్సిన వంతెన అవాంతరాల మధ్య జరుగుతుంది. నారాయణపురం వంతెన కూలిపోతుంది. అప్పట్లో నారాయణపురం వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలకులు పట్టించుకుంటే ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యేది. పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్యే, ఉంగుటూరు -
డ్వాక్రా గ్రూపుల్లో అవినీతి
వీరవాసరం: వీరవాసరం మండలం నందమూరి గరువులో డ్వాక్రా గ్రూపుల్లో భారీ అవినీతి చోటుచేసుకుంది. సుమారుగా రూ.కోటి మేరకు డ్వాక్రా సభ్యుల సొమ్ము పక్కదారి పట్టింది. నందమూరు గరువులో 68 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. నందమూరి గరువు గ్రామ సంఘం వీవోఏగా ముక్కు సత్యవాణి అలియాస్ బోడపాటి సత్యవాణి 2021లో, ఆదర్శ నందమూరి గరువు సంఘం వీవోఏగా పోతుల నాగ స్వాతి 2022లో చేఆరు. గత మూడు సంవత్సరాలుగా డ్వాక్రా గ్రూపు సభ్యుల అనుమతి లేకుండా పొదుపు ఖాతాల నుంచి డబ్బులు గ్రామ సంఘం అకౌంట్కు బదిలీ చేస్తున్నారు. గ్రామ సంఘం ఖాతా నుంచి సీ్త్ర నిధి ద్వారా డ్వాక్రా సంఘ సభ్యులకు సంబంధం లేని వ్యక్తులు ఖాతాల్లోకి నిధులను తరలించారు. సత్యవాణి సుమారు రూ.39,14,700 పక్కదారి పట్టించగా.. పోతుల నాగస్వాతి రూ.43.63 లక్షలు పక్కదారి పట్టించింది. ఇది గమనించి ప్రభ గ్రూపు సభ్యులు ఏపీఎం జ్యోతి రాణి దృష్టికి, గ్రామంలోని నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ఏపిఎం అప్రమత్తమై రికార్డులను పరిశీలించడంతో సుమారు రూ.85 లక్షల మేర అవినీతి చోటుచేసుకుందని గుర్తించారు. ఇదే విషయాన్ని జిల్లా స్థాయి అధికారులకు నివేదించారు. 68 స్వయం సహాయ క సంఘాల్లోని రికార్డులను పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. సత్యవాణి సుమారు రూ.18 లక్షల నగదును తిరిగి ఆయా డ్వాక్రా సంఘ గ్రూపు నిధులకు జమ చేయించారు. గత మూడేళ్ల నుంచి ఇంత పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంటే కనీసం పట్టించుకోలేదని సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు సిబ్బంది ఏం చేస్తున్నారంటూ డ్వాక్రా మహిళలు నిలదీస్తున్నారు. దీనిపై ఏపీఎం జ్యోతిరాణి స్పందిస్తూ.. ఇద్దరు వీవోఏల పరిధిలో సుమారు రూ.85 లక్షల మేర అవినీతి చోటు జరిగిందని.. సత్యవాణి నుంచి రూ.18 లక్షల మేర నగదును తిరిగి జమ చేయించామని చెప్పారు. పరారీలో పోతుల నాగస్వాతిపై వీరవాసరం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సొమ్మును రికవరీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
మృతదేహంతో రెండో రోజూ ఆందోళన
యలమంచిలి: కొంతేరులో ఆత్మహత్య చేసుకున్న చింతా లక్ష్మీ నర్సమాంబ మృతదేహంతో రెండో రోజు కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. ప్రేమలో విఫలమై కొడుకు చనిపోవడం, ప్రియురాలి తండ్రి కోర్టులో కేసు వేయడంతో మనస్తాపానికి గురై నర్సమాంబ శనివారం ఉరి వేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె మృతదేహంతో ప్రియురాలి ఇంటి ముందు ఆందోళన చేశారు. శనివారం రాత్రి పోలీసులు వచ్చి కుటుంబ సభ్యులు, బంధువులకు నచ్చచెప్పి మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆదివారం పోస్టుమార్టం పూర్తి చేసి తిరిగి కొంతేరు తీసుకొచ్చి కుటుంబ సభ్యులు, బంధువులకు అప్పగించారు. మరోసారి మృతదేహంతో ఆందోళన దిగారు. ఆందోళన పెరిగి ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం కనిపించడంతో గ్రామ పెద్దలు, పోలీసులు స్పందించారు. ప్రియురాలి తండ్రిపై కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించి, మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
మున్సిపల్ కార్మికులకు అన్యాయం
ఏలూరు (ఆర్ఆర్పేట): మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాల చెల్లింపులో జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సరిచేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. ఆదివారం ఏలూరులో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ నగర కమిటీ ఆధ్వర్యంలో సీఐటీయూ కార్యాలయంలో ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని సుమారు 12 వేల మంది మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు జీతాల వ్యత్యాసాల వల్ల వందల కోట్ల రూపాయలు నష్టపోతున్నారన్నారు. మున్సిప ల్ కార్మికుల రాష్ట్రవ్యాప్త సమ్మెకు సీఐటీయూ అనుబంధ సంఘాలన్నీ మద్దతుగా పాల్గొంటున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్రావు, మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు అప్పలరాజు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.సోమయ్య మాట్లాడుతూ జీతాల్లో వ్యత్యాసం వల్ల ఒక్కో కార్మికుడు ఆరేళ్లలో రూ.4.50 లక్షలకు పైగా నష్టపోయారన్నారు. పలు సంఘాల నాయకులు వైఎస్ కనకారావు, జె.గోపి, అంగుళూరు జానుబాబు, వినుకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు. నేడు ఏలూరులో పీజీఆర్ఎస్ ఏలూరు(మెట్రో): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని జిల్లాస్థాయిలో సోమవారం ఏలూరు కలెక్టరేట్లో నిర్వహించనున్నట్టు డీఆర్వో వి.విశ్వేశ్వరరావు తెలిపారు. కొల్లేరుకు సంబంధించి కేంద్ర సాధికారత కమిటీ పర్యటన దృష్ట్యా కలెక్టర్ సంబంధిత ప్రాంతాల్లో పర్యటిస్తారని, పీజీఆర్ఎస్కు జాయింట్ కలెక్టర్ హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే సమస్యలపై ఆన్లైన్లో ఫిర్యా దు చేయవచ్చని, 1100 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేయవచ్చని తెలిపారు. కొల్లేరు ప్రజల జీవనాన్ని కాపాడాలి ఏలూరు (ఆర్ఆర్పేట): కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపాలని, కొల్లేరులో పక్షులు, పర్యావరణాన్ని మాత్రమే కాకుండా అక్కడి ప్రజల జీవితాలను, జీవనాన్ని కాపాడాలని ఈనెల 17,18 తేదీల్లో పర్యటించే కేంద్ర సాధికారత కమిటీని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. కొల్లేరును నమ్ముకుని వందలాది ఏళ్లుగా బతుకుతున్న సుమారు మూడు లక్షల మంది ప్రజల జీవనం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కొల్లేరును 3వ కాంటూరుకు కుదించడం, ఎకో సెన్సిటివ్ జోన్ నుంచి మినహాయించడం, వా రికి ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా మాత్రమే ప్రజల జీవితాలను నిలబెట్టగలమని తెలిపారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. జిరాయితీ డీ పట్టాల భూములను రైతులకు కేటాయించాలన్నారు. అటవీ నిబంధనలు సడలించి తాగునీరు, రోడ్లు, శ్శశాన వాటికలు, మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలు, జీవన భద్రతపై నిర్ణయం తీసుకునేలా కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు. ఉత్కర్ష అభియాన్తో గిరిజనుల అభివృద్ధి ఏలూరు(మెట్రో): దార్తీ అభ జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ పథకం జిల్లాలో గిరిజనుల అభివృద్ధికి దోహదపడుతుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. ఆదివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పథకం అమలుపై అధికారులతో సమీక్షించారు. గిరిజన పథకాలను అర్హు లు వినియోగించుకునేలా చూడాలన్నారు. పథకాలు, గిరిజనుల హక్కులపై అవగాహన కలిగించేందుకు ఈనెల 16 నుంచి 30 వరకు గిరిజన గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని 132 గిరిజన గ్రామాల్లో గిరిజనుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తహసీల్దార్లు, ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఐటీడీఏ పీఓ రాములు నాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
బాబు పాలన మొత్తం మోసమే
ఏలూరు (ఆర్ఆర్పేట): కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఏడాది పాలన మొత్తం మోసమేనని, ప్రజలను నిలువునా వంచించి ఏ ఒక్క పథకమూ అమలు చేయకుండా అన్నీ చేశామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. గత జగన్ ప్రభుత్వంలో ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చారని, చంద్రబాబు హయాంలో మోసం, అశాంతి, అరాచకం, ఆటవిక పాలనను ప్రజలు చూస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లికి వందనం పథకం ఇస్తామని ఆడపడుచులను మోసం చేశారని, తాజాగా అమలు చేసినా గతంలో 87 లక్షల మంది లబ్ధిదారులుంటే వారిలో 20 లక్షల మందిని తొలగించడం బాబు దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. జగన్ పాలనలో కోవిడ్ విపత్తు సమయంలోనూ ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని అందించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఏడాది పాలనలో అప్పుగా తెచ్చిన రూ.1.50 లక్షల కోట్లు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. బాబును ముఖ్యమంత్రిని చేసి తప్పు చేశామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని, ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తూ కొత్త తరహా రాజకీయాలకు తెరలేపారని డీఎన్నార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి మోసాలపై పోరు ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ ఏడాది కాలంలో బాబు ప్రజలకు చేసిన మోసాలపై, లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం అమలుపై పుస్తకాన్ని ప్రచురించామన్నారు. బాబు మోసాలపై తరచూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామన్నారు. పాలనలో విఫలం చింతలపూడి ఇన్చార్జి కంభం విజయరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం సాగుతోందని, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పట్టించుకోవడం లేదన్నారు. అక్రమ కేసుల పర్వం ఉంగుటూరు ఇన్చార్జి పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ జగన్ అమ్మఒడి అమలు చేసి పాఠశాల నిర్వహణకు రూ.1,000 కేటాయిస్తే గగ్గోలు పెట్టిన లోకేష్ ఇప్పుడు తల్లికి వందనంలో రూ.2 వేల చొప్పున మినహాయించడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనిపై అక్రమ కేసుపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా అక్రమ కేసుల పర్వం ఆపకపోవడం కూటమి ప్రభుత్వ రాక్షస పాలనకు నిదర్శనమన్నారు. పార్టీ నాయకులు గుడిదేశి శ్రీనివాస రావు, నెరుసు చిరంజీవులు, కోమటి విష్ణువర్ధన్, నూకపెయ్యి సుధీర్ బాబు, గంటా మోహనరావు, మున్నుల జాన్ గురునాథ్, కిలాడి దుర్గారావు, ఇనపనూరి జగదీష్, కిలారపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ -
కల్తీ విత్తనాలతో జాగ్రత్త!
బుట్టాయగూడెం : తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో విత్తనాలు కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నాణ్యమైన విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు అవసరమని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. కల్తీ విత్తనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయించే డీలర్లు ఎరువుల నియంత్రణ చట్టం– 1985 ప్రకారం నిబంధలు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. విత్తనాల కొనుగోలులో.. వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద, గుర్తింపు పొందిన సంస్థల వద్ద మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలి. సీల్ వేసిన ధృవీకరణ పత్రం ఉన్న విత్తన బస్తాలనే కొనుగోలు చేయాలి. విత్తనాల సంచిపై విత్తనాల రకం, ల్యాబ్ నెంబర్, గడువు తేదీ, తదితర విషయాలను గమనించాలి. కొనుగోలు చేసిన బిల్లుపై డీలర్ సంతకం తప్పనిసరిగా ఉండాలి. రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. హైబ్రిడ్ విత్తనాల కొనుగోలుకు విత్తన రకం, స్వచ్ఛత, మొలకెత్తే స్వభావం, జన్యు నాణ్యత వంటి వివరాలు పరిశీలించాలి. మొలకెత్తిన దశ, పూత దశలో లోపం కనిపిస్తే స్థానిక వ్యవసాయ అధికారులను, సిబ్బందిని సంప్రదించాలి. మొలకలను పరీక్షించే విధానం రైతులు విత్తుకోవడానికి ఒకరోజు ముందు విత్తనాలను కొనుగోలు చేయడం వల్ల మొలక పరీక్షలు చేయించుకోవడం లేదు. విత్తనం కొనుగోలు చేసిన తర్వాత తప్పనిసరిగా మొలకలను పరీక్ష చేయించుకోవాలి. రైతు కొనుగోలు చేసిన విత్తనాల సంచి నుంచి 100 గింజలను 24 గంటలపాటు నీటిలో నానబెట్టి అనంతరం ఒక గుడ్డలో గాలి, వెలుతురు తగలని ప్రదేశంలో ఉంచాలి. 24 గంటల తర్వాత తీసి చూస్తే 100 గింజలకు 75 గింజలపైనే మొలక వస్తే మంచి విత్తనంగా నిర్ధారించుకుని నారుమడులు సిద్ధం చేసుకోవాలి. మొలక శాతం కనీసం 75 శాతం వరకూ ఉంటే విత్తనాలు నాణ్యమైనవని భావించి పంటలు విత్తుకోవాలి. గడువు దాటితే కొనుగోలు చేయొద్దు కొనుగోలు చేసే విత్తన ప్యాకెట్, సీసా డబ్బాపై సీలు ఉందా? లేదా? అనేది నిర్ధారించుకోవాలి. అరువు పద్ధతిలో విత్తనాలు కొనుగోలు చేసినప్పటికీ బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. మంచి విత్తనాలతోనే నారు కట్టాలి సొంతంగా తయారు చేసిన విత్తనాలు నారుకు శ్రేయస్కరం. కొనుగోలు చేస్తే మంచి విత్తనాలను ఎంపిక చేయాలి. నారుపోసే ముందు మొలక శాతం గుర్తించి నారు పోయాలి. ఎలాంటి సమస్యలు ఉన్నా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. – పీజీ బుచ్చిబాబు, సహాయ వ్యవసాయ సంచాలకుడు, కేఆర్పురంరైతులకు వ్యవసాయాధికారుల సూచన -
కొంతేరులో మహిళ ఆత్మహత్య
యలమంచిలి: కొడుకు ప్రేమలో విఫలమై ఆత్మహత్య చేసుకోగా.. కొడుకు ప్రియురాలి కుటుంబ సభ్యులు కోర్టు కేసులు వేసి తనను వేధిస్తున్నారని.. కడుపు కోతను, కోర్టు కేసులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సూసైడ్ నోట్ రాసి మహిళ శనివారం కొంతేరు గ్రామంలో ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె మృతదేహాన్ని ప్రియురాలి ఇంటి ముందు ఉంచి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. భీమవరం గ్రామానికి చెందిన చింతా లక్ష్మీ నర్సమాంబ భర్త చనిపోవడంతో పుట్టిల్లు కొంతేరు వచ్చి స్థిరపడింది. ఇద్దరు కుమారులను కష్టపడి ఇంజినీరింగ్ చదువించింది. వారిలో లికిల్ సాయి సమీపంలో ఉంటున్న అమ్మాయిని ప్రేమించాడు. వారిద్దరికి గొడవ జరగడంతో వీడియో కాల్లో ఆ అమ్మాయితో మాట్లాడుతూనే ఉరి వేసుకుని గత డిసెంబరులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంలో తన కుమార్తెను అల్లరిపాలు చేస్తున్నారంటూ ఆ అమ్మాయి తండ్రి వారిపై పోక్సో కేసు నమోదు చేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవైపు కొడుకు మరణం, మరోవైపు కోర్టు కేసులతో నర్సమాంబ మనస్తాపం చెంది శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు అడ్డాల నాగేశ్వరరావు కుటుంబమే కారణమని ఆరోపిస్తూ నర్సమాంబ సూసైడ్ నోట్ రాసింది. ఈ సంఘటనపై ఎవరూ పిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. కుమారుడి ప్రియురాలి ఇంటిముందు మృతదేహంతో ఆందోళన -
రూ.15 కోట్ల బిల్లులు పెండింగ్
నూజివీడు: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులకు భోజనాన్ని అందిస్తున్న మెస్ నిర్వాహకులకు రూ.కోట్ల మెస్ బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తుండంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. నెలల తరబడి మెస్ బిల్లులు చెల్లించకుండా జాప్యం చేయడంతో.. అప్పుల పాలవుతున్నామని లబోదిబోమంటున్నారు. నాలుగు ట్రిపుల్ ఐటీల్లోని మెస్ నిర్వాహకులకు దాదాపు రూ.15 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. దీనిపై నిర్వాహకులు పలుమార్లు ఆర్జీయూకేటీ అధికారులను కలిసి బిల్లులు విడుదల చేయాలని విన్నవించుకున్నా రూపాయి కూడా విడుదల చేయడం లేదు. దీంతో జూలై 1 నుంచి వేసవి సెలవుల అనంతరం ట్రిపుల్ ఐటీల్లో తరగతులు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో మెస్ల నిర్వహణ ఎలా అని తలలు పట్టుకుంటున్నారు. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఉన్న 26,400 మంది విద్యార్థులకు 11 మంది మెస్ నిర్వాహకులు భోజనాన్ని తయారు చేసి అందజేస్తున్నారు. ఈ మెస్లలో కొన్నింటికి గతేడాది సెప్టెంబరు నుంచి మరికొన్నింటికి నవంబరు నుంచి, ఇంకొన్నిటికి జనవరి నుంచి ట్రిపుల్ ఐటీలకు వేసవి సెలవులు ఇచ్చే నాటి వరకు మెస్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. ప్రతి రోజూ ఒక్కొక్క మెస్ కనిష్టంగా 2 వేల మంది నుంచి 6 వేల మందికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం, సాయంకాలం స్నాక్స్ అందిస్తోంది. ఇంత భారీ మొత్తంలో మెస్లు నిర్వహిస్తున్న వీరికి పెట్టుబడి సైతం ఎక్కువగానే ఉంటుంది. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు చేసి సరుకులు తెచ్చి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వండి పెడుతున్నారు. అయినప్పటికీ ఆర్జీయూకేటీ అధికారులు మెస్ నిర్వాహకులకు బిల్లులు సకాలంలో చెల్లించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీల మెస్ నిర్వాహకుల గగ్గోలు బిల్లుల అప్లోడ్లో తీవ్ర జాప్యం నెల గడవగానే ఆ నెలకు సంబంధించిన బిల్లులను సీఎంఎఫ్ఎస్లో అప్లోడ్ చేయడంలో ట్రిపుల్ ఐటీల సిబ్బంది తీవ్ర జాప్యం చేస్తున్నారని మెస్ నిర్వాహకులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఈ బిల్లుల అప్లోడ్ బాధ్యతలను అవుట్ సోర్సింగ్ స్టాఫ్కు అప్పగించడంతో వారు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆరు నెలలు, ఎనిమిది నెలల పాటు బిల్లులు చెల్లించకపోవడంతో మెస్ నిర్వాహకులు కోట్లాది రూపాయల అప్పుల్లో మునిగిపోయారు. నూజివీడు ట్రిపుల్ఐటీలో కేఎంకే సంస్థకు దాదాపు రూ.2.50 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో రూ.1.75 కోట్లు, ఎస్ఎస్ క్యాటరర్స్కు రూ.2.10 కోట్లు, ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఫుడ్సూత్ర హాస్పటాలిటీకి రూ.2.10కోట్లు, శ్రీదేవి క్యాటరర్స్కు రూ.1.40కోట్లు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీలో సరోజ క్యాటరర్స్కు రూ.1.50 కోట్లు, ప్రిజం హాస్పటాలిటీకి రూ.1.30 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇంకా పలువురు నిర్వాహకులకు మెస్ బిల్లులు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఎప్పుడు చెల్లిస్తారో అంతుబట్టడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా మెస్ బిల్లులు చెల్లించాలని నిర్వాహకులు కోరుతున్నారు. -
పోషకాల మేతతోమంచి దిగుబడి
చింతలపూడి: పాడి పశువులకు పుష్టికరమైన మేత అందించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. నాణ్యమైన మేత అందించడం కారణంగా పశువుల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. పాల ఉత్పత్తి కూడ గణనీయంగా పెరుగుతుందని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.లింగయ్య తెలిపారు. సాధారణంగా పాడి పశువుల్లో విటమిన్ ఎ, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషక పదార్థాల లోపం వల్ల పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. చాలామంది రైతులు వర్షాకాలం, చలికాలంలో పచ్చిమేతలు, ఎండాకాలంలో ఎండు గడ్డిని దాణాగా అందిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. పచ్చిమేత ఎక్కువగా దొరికే కాలంలో దానికి పాతర వేసి నిల్వ చేసుకోవాలని.. అన్ని కాలాల్లో పచ్చిమేత అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఎంత మేత అవసరం.. రోజూ ఒక్కో పశువుకు 8 కిలోల వరిగడ్డి, లేదా ఎండు చొప్ప(మొక్కజొన్న, జొన్న) 8 కిలోల లెగ్యూమ్ జాతి పచ్చిమేత(పిల్లిపెసర, అలసంద, గోరు చిక్కుడు) 16 కిలోల గింజ జాతి పచ్చి మేతలు ఇస్తే.. పశువులకు అన్ని రకాల పోషకాలు అందుతాయి. పాల దిగుబడిని బట్టి పశువులకు దాణా అందించాలి. పోషకాలతో కూడిన గడ్డిని ఇస్తే సకాలంలో ఎదకు వస్తాయి. పాల ఉత్పత్తి కూడా అధికంగా ఉంటుంది. గొడ్డుమోతు సమస్య ఉంటే.. పశువుల్లో గొడ్డుమోతు సమస్యకు సకాలంలో ఎదకు రాకపోవడం, గర్భకోశ వ్యాధులు, అండంలో లోపాల వల్ల ఈ సమస్య అధికంగా ఉంటుంది. పశువులు ఈనిన తరువాత పశువులు 60 నుంచి 90 రోజుల్లో ఎదకు వచ్చి చూలు కట్టాలి. ఎదకు రాని పశువులను సకాలంలో పశు వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళి పరీక్ష చేయించాలి. ప్రతీ రోజు ఎద లక్షణాలను పరిశీలించి కృత్రిమ గర్భధారణ చేయించాలి. దూడలకు చూడి కట్టించడం సరికాదు యుక్త వయసు రాని దూడల్ని కత్రిమంగా చూడి కట్టించే పనిని రైతులు మానుకోవాలి. తగిన వయసు, బరువు లేని పశువుల్ని చూడి కట్టించడం వల్ల పశువుల్లో వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ఆవులకు 18 నెలలు, గేదెలకు 24 నెలల వయసు వచ్చిన తరువాత మాత్రమే చూడి కట్టించాలి. ఆవులు 200 కిలోలు, గేదెలు 250–300 కిలోలు బరువు ఉన్నప్పుడు మాత్రమే చూడికట్టించాలి. శారీరకంగా పూర్తిగా ఎదగని పశువులను చూడి కట్టించడం వల్ల కటి వలయం సరైన రీతిలో నిర్మాణం కాక ఈనిక కష్టమవుతోంది. ఒక్కోసారి తల్లి లేదా దూడ లేదా రెండూ మరణించే ప్రమాదం ఉంది. అందు వల్ల రైతులు అశాసీ్త్రయమైన పద్ధతులకు స్వస్తి పలికితే పాడి పశువులు ఆరోగ్యంగా ఉంటాయని పశు వైద్యాధికారి సూచించారు. పాడి – పంట -
రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంక్కు అవార్డు
భీమవరం (ప్రకాశంచౌక్): రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖ రాష్ట్రంలో అత్యధిక రక్త యూనిట్లు సేకరించిన సంస్థగా రెండో స్థానం సాధించింది. ఈ సందర్భంగా గుంటూరులోని భారతీయ విద్యాభవనన్లో జరిగిన ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తణుకు రెడ్క్రాస్ బ్లడ్సెంటర్కు పురస్కారం లభించడం అభినందనీయమని జిల్లా శాఖాధ్యక్షుడు రామ భద్రిరాజు అన్నారు. బస్సు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు ఉండి: ఆసుపత్రికి వెళ్తున్న వృద్ధ దంపతులను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో మహిళ తీవ్రంగా గాయపడింది. శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంపై స్థానికులు, బాధితురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం గణవరానికి చెందిన రిటైర్డ్ టీచర్ గొట్టుముక్కల గోపాలకృష్ణంరాజు తన భార్య సావిత్రితో కలసి బైక్పై భీమవరంలో ఆసుపత్రికి వెళ్తున్నాడు. ఎన్నార్పీ అగ్రహారంలోని ప్రభుత్వ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే నర్సాపురం డిపోకు చెందిన బస్సు లారీని ఓవర్ టేక్ చేయబోయి బైక్ను ఢీకొట్టింది. వెనుక కూర్చున్న మహిళ పట్టుతప్పి ఆర్టీసీ బస్సు వెనక చక్రం కింద పడిపోయింది. ఇంతలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. తలకు తీవ్ర గాయం కావడంతో 108లో ఆమెను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి వచ్చి వివరాలు సేకరించారు. వివాహిత ఆత్మహత్య ఆగిరిపల్లి: వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని వట్టిగుడిపాడులో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్సై శుభశేఖర్ వివరాల ప్రకారం వట్టిగుడిపాడుకు చెందిన రాంబాబు, నాగ తేజస్వినికి( 21) మూడేళ్ల క్రితం వివాహమైంది. ఆ సమయంలో 50 సెంట్లు కట్నంగా ఇచ్చారు. సంవత్సరం క్రితం తండ్రి కూతురి భూమి పట్టాలను బ్యాంకులో తనఖా పెట్టాడు. శుక్రవారం కూతురు తేజస్విని తండ్రి తనఖా పెట్టిన భూమిని విడిపించి ఇవ్వాలని అడగ్గా తండ్రి కొంత సమయం కావాలనడంతో తేజస్విని మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నటుడు అల్లం గోపాలరావు మృతి
భీమడోలు : సినీ, టీవీ ఆర్టిస్ట్ అల్లం గోపాలరావు(75) శనివారం హైదరాబాద్లో కన్నుమూశారు. భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన ఆయన మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గోపాలరావుకు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం స్నేహితుడు. ఆయన సహకారంతో రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్ వెళ్లి టీవీ, సినిమాల్లో నటించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. గోపాలరావు భీమడోలులోని సుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా పని చేసేవారు. గ్రామంలోని గురజాడ కళావేదిక వద్ద క్రీడా పోటీలు నిర్వహించేశారు. అభ్యుదయ వాదిగా అనేక చైతన్య కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేశారు. ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నాటికలు, ప్రదర్శనలు ఇచ్చారు. గోపాలరావు మృతికి నివాళి ఏలూరు (ఆర్ఆర్పేట): గోపాలరావు మృతికి సీపీఐ, ప్రజా నాట్యమండలి, బీకేఎంయూ జిల్లా సమితులు ఓ ప్రకటనలో సంతాపం తెలిపాయి. సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ప్రజానాట్యమండలి ఏలూరు ఏరియా కార్యదర్శి తమ్మా విశ్వేశ్వరరావు మాట్లాడుతూ గోపాలరావు తొలినాళ్లలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజానాట్యమండలిలో ప్రముఖ పాత్ర నిర్వహించారన్నారు. సమాజంలో మార్పునకు కృషి చేశారన్నారు. అభ్యదయ భావాలు కలిగిన గోపాలరావు మృతి కళా రంగానికి తీరని లోటన్నారు. -
కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగియడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, వైకుంఠం క్యూకాంప్లెక్స్, అనివెట్టి మండపం, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల, నిత్యాన్నదాన విభాగాలు భక్తులతో పోటెత్తాయి. దేవస్థానం సిబ్బంది భక్తులకు క్యూ కాంప్లెక్స్లో నిరంతరాయంగా మజ్జిగ, మంచి నీటిని అందించారు. ఆలయ అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. కొండపైన ఘాట్ రోడ్లు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. -
నేరాల నిరోధానికి చర్యలు
ఏలూరు టౌన్: జిల్లాలో ఆయా కేసులకు సంబంధించి కోర్టులో విచారణలోని కేసులను త్వరితగతిన పరిష్కరించేలా, నిందితులకు శిక్షలు పడేలా కోర్టు మానిటరింగ్ సెల్ మరింత పటిష్టంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశించారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం నుంచి ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం పోలీస్ సబ్ డివిజన్లకు సంబంధించి కోర్టు కానిస్టేబుళ్లతో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావుతో కలిసి శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ కోర్టు మానిటరింగ్ సెల్ అధికారులు, కోర్టు కానిస్టేబుల్ విధులు కీలకమైనవన్నారు. కోర్టు పరిధిలోని ఆయా కేసులకు సంబంధించి విచారణలపై కేసుల్లోని సాక్షులను సకాలంలో కోర్టు ఎదుట హాజరుపరచటం, నిందితులకు శిక్షలు పడేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. డీసీఆర్బీ సీఐ హబీబ్ బాషా, మహిళా స్టేషన్ సీఐ ఎం.సుబ్బారావు, డీసీఆర్బీ ఎస్సై రాజారెడ్డి, జిల్లా కోర్టు మానిటరింగ్ సెల్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
తల్లికి పంగనామం
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025అమ్మ ఒడే మేలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రకటించిన వి ధంగా అమ్మ ఒడిని పక్కాగా అమలు చేసింది. 2019–20 మొదలు వరుసగా 4 విద్యా సంవత్సరాల్లో జిల్లాలో రూ.1,069.30 కోట్లను 1,78,919 తల్లుల ఖాతాల్లో జమచేసింది. అలాగే చిరుద్యోగులైన అంగన్వాడీలు, మున్సిపల్, మెడికల్ అండ్ హెల్త్, రెవెన్యూ ఇతర విభాగాల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇలా అన్ని కేటగిరీల్లోని వారికీ పథకాన్ని అమలుచేశారు. కేవలం 75 శాతం హాజరు మినహా గతంలో ఎలాంటి ఆంక్షలు లేవు. కూటమి ప్రభుత్వం మాత్రం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగం, పట్టణాల్లో 1000 చ.అ. కంటే ఎక్కువ ఆస్తి ఉండకూడదని ఆంక్షలు, గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేలు, పట్టణ ప్రాంతంలో రూ.12 వేలు ఆదాయ పరిమితి, తెల్ల రేషన్కార్డు కలిగి ఉండటం, 3 ఎకరాల కంటే ఎక్కువ భూ మి ఉన్నా, ఫోర్ వీలర్ వాహనాలు ఉన్నా ఈ పథకం వర్తించదని ఆంక్షలు విధించడంతో జి ల్లాలో వేలాది మంది అనర్హులుగా మారారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: తల్లికి వందనమంటూ పంగనామం పెట్టారు. ప్రతి ఇంట్లో చదువుకునే విద్యార్థులు ఎంత మంది ఉంటే అంత మందికీ రూ.15 వేలు ఇస్తామని సోషల్ మీడియాలో హోరెత్తించారు. కట్ చేస్తే సరికొత్త ఆంక్షలు, అనర్హులు అంటూ రకరకాల కోతల పేరిట అర్హుల జాబితాను భారీగా తగ్గించారు. దీంతో పాటు ప్రతి విద్యార్థికి రూ.15 వేలు అని ప్రకటించి రూ.13 వేలే జమ చేయడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు గత ప్రభుత్వ హయాంలో ఏలూరు రూరల్ మండలంలో అమ్మఒడి పథకం 4,241 మంది విద్యార్థులకు మొదటి సంవత్సరం అందగా ఈ ఏడాది తల్లికి వందనం పేరుతో 3,888 మందిని అర్హులుగా ప్రకటించి 1,109 మందిని అనర్హులుగా గుర్తించడం విశేషం. జిల్లావ్యాప్తంగా 28 మండలాల్లోనూ ఇదే పరిస్థితి. ఆంక్షల కత్తి : జిల్లాలో 1,818 ప్రభుత్వ పాఠశాలలు, 495 ప్రైవేట్ కళాశాలల్లో కలిపి 2,91,858 మంది, అలాగే 127 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 31,448 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రతిఒక్కరికి తల్లికి వందనం ద్వారా రూ.15 వేల చొప్పున రూ.486.96 కోట్లు జిల్లాలో జమ చేయాల్సి ఉంది. అయితే విద్యుత్ బిల్లుల నెల వారీ వినియోగం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలసరి ఆదాయం, నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉండటం ఇలా అనేక రకాల ఆంక్షలతో అర్హుల జాబితాను 40 శాతానికిపైగా కోత విధించడంతోపాటు రూ.15 వేలు కాకుండా రూ.13 వేలే జమ చేసి మిగిలిన రూ.2 వేలు కలెక్టర్ ఖాతాలో వేసి పాఠశాలల మరమ్మతులు, పరిశుభ్రత ఇతర అవసరాల కోసం వినియోగిస్తామని ప్రకటించారు. రూ.15 వేలు ఇవ్వాల్సిందే.. నూజివీడు: తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన విద్యార్థులందరికీ రూ.15 వేల చొప్పున చెల్లించాల్సిందేనని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు డి.శివకుమార్, కోశాధికారి ఎం.క్రాంతికుమార్ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అందరికీ రూ.15 వేల చొప్పున చెల్లిస్తామని చెప్పిన చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు మాటమార్చి రూ.13 వేలు విడుదల చేయడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు.పాఠశాలల మెయింటినెన్స్ కోసం రూ.2 వేలు తగ్గించామనడం హాస్యాస్పదంగా ఉందని, ప్రైవేట్ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మెయింటినెన్స్ ఏంటో విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే సమాధానం చెప్పాలన్నారు. పథకాన్ని ఎగ్గొట్టడానికి ఏదో ఒక సాకును వెతికే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. తల్లికి వందనం పథకాన్ని సక్రమంగా అమలు చేయాలనే డిమాండ్తో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. సగం మందికి పైగా..జిల్లావ్యాప్తంగా ఉన్న సర్పంచ్లు, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులకు కూడా అనర్హులుగా ప్రకటించారు. దీంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మొదలు సర్పంచ్ల వరకూ జిల్లావ్యాప్తంగా సుమారు 3,500 మందిపైనే అనర్హులుగా మారారు. జిల్లాలో 3,23,303 మంది విద్యార్థులకుగాను కనీసం సగం మందికి పైన కూడా తల్లికి వందనం అందడం అనుమానమే. ఉదాహరణకు ఏలూరు రూరల్ మండలంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇంటికి ఒక్కరికే అమ్మఒడి పథకాన్ని అమలు చేశారు. ఈ లెక్కన 2019–20లో 4,241 మందికి రూ.63.31 లక్షలు జమ చేశారు. ఈ క్రమంలో రూరల్ మండలంలోని 11 సచివాలయాల పరిధిలో ఎక్కువ ఇళ్లల్లో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉంటారు. ఈ క్రమంలో అర్హుల జాబితా 6 వేలపైనే ఉండాలి. అయితే 3,888 మంది విద్యార్థులు అర్హులుగా ప్రకటించి ఇప్పుడు రూ.50.54 లక్షలు మంజూరు చేయగా 1,109 మంది విద్యార్థులను అనర్హులుగా ప్రకటించారు. అలాగే ఉదాహరణకు చింతలపూడి మండలంలోని 10 సచివాలయాల పరిధిలో గతంలో 8,240 మంది విద్యార్థులకు రూ.12.36 కోట్లు అమ్మఒడి జమ కాగా తల్లికి వందనం మాత్రం 4,837 మందే అర్హులుగా ప్రకటించి 2,055 మందిని అనర్హుల జాబితాలో చేర్చారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుండడంపై నిరసన వ్యక్తమవుతోంది. న్యూస్రీల్ ఆంక్షల వలయంలో తల్లికి వందనం జిల్లాలో వేలాది మంది అనర్హులుగా గుర్తింపు ప్రతి మండలంలో సగటున 30 శాతం మందికి కోత జిల్లాలో 3.23 లక్షల మంది విద్యార్థులు అర్హులు పంచాయతీ సర్పంచ్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నో చాన్స్ అంగన్వాడీలు కూడా తల్లికి వందనానికి అనర్హులు రూ.15 వేలు ప్రకటించి రూ.13 వేలే జమ -
ఎకోలి వేస్ట్ మేనేజ్మెంట్ బెస్ట్
కై కలూరు: చెత్త నుంచి సంపద తయారీలో సరికొత్త విధానం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాల్ కార్పొరేషన్లు 17, మున్సిపాలిటీలు 77, నగర పంచాయతీలు 29, గ్రామ పంచాయతీలు 13,325 ఉన్నాయి. రోజూ వేలాది టన్నుల చెత్తను పారిశుద్ధ్య కార్మికులు సేకరిస్తున్నారు. గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు పలు ప్రాంతల్లో నిరూపయోగంగా మారాయి. రోజువారి చెత్త సైతం పేరుకుపోవడంతో డంపింగ్ యార్డులు సరిపోవడం లేదు. పైగా దుర్వాసన కూడిన విష వా యువులతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎకోలి బయో సొల్యూషన్స్ తో చెత్తను సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. 21 రోజుల్లో సేంద్రియ ఎరువు తయారీ ఎకోలి బయోసొల్యూషన్ పేరుతో మైక్రోబియల్ ఎక్స్ ద్రావణాన్ని తయారుచేస్తున్నారు. టన్ను చె త్తకు లీటరు నుంచి లీటరున్నర ద్రావణాన్ని తడి చెత్తకు పిచికారీ చేస్తున్నారు. కేవలం 21 రోజుల్లో చెత్త సేంద్రియ ఎరువుగా మారుతోంది. అదే వర్మీ కంపోస్టులో ఈ కాలం 90 రోజులుగా ఉంది. పైగా కూలీల ఖర్చు అధికం. లీటరు ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి తడి చెత్తపై ఉపయోగించవచ్చు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి, చినఅమిరం గ్రామాల్లో టన్ను చెత్తపై పైలెట్ ప్రాజెక్టుగా మైక్రోబియల్ ద్రావణాన్ని ఉపయోగించి సత్ఫలితాలు సాధించారు. మరిన్ని పంచాయతీలకు దీనిని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎరువు తయారీలో బ్యాక్టీరియా కీలకం మైక్రోబియల్ ఎక్స్ ద్రావణం తయారీకి గుజరాత్ నుంచి మూడు బ్యాక్టీరియాలు కలిగిన నీటిని తీసు కువచ్చి ఉయ్యూరు సమీప పరిశ్రమలో ప్రయోగాత్మకంగా ద్రావణాన్ని తయారు చేశారు. దీనిని తడి చెత్తపై పిచికారీ చేసిన తర్వాత నీటిలోని బ్యాక్టీరియాలు 21 రోజుల్లో చెత్తను తిని విసర్జిస్తాయి. ఇది సేంద్రియ ఎరువుగా మారుతుంది. దీనిని మొక్కలు పెరుగుదల, ఆక్వా చెరువులు, వరి చేలకు ఉపయోగించవచ్చు. ద్రావణం పిచికారీ చేసిన తర్వాత మూడు రోజుల్లో దుర్వాసన సైతం ఉండదు. లీటరు ద్రావణం తక్కువ ధరకే లభిస్తుంది. రసాయనాలను గుర్తించే ఓడోమెన్ డివైజ్ డంపింగ్ యార్డుల వద్ద చెత్త పేరుకుపోయి దుర్వాసనతో వాతావరణం కలుషితమవుతోంది. గాలిలో వాయువుల పరిస్థితిని తెలుసుకోడానికి ఓడోమెన్ డివైజ్ను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత ఉష్ణోగ్రత, తేమ, హైడ్రోజన్, సహజ వాయువుల శాతాన్ని తెలుసుకుంటున్నారు. దీని ప్రకారం గాలి నాణ్యత, కుళ్లిపోయే చెత్త పురోగతిని అంచనా వేస్తున్నారు. దీనిని డ్యాష్బోర్డుకు అనుసంధానం చేసి మిథిన్ వంటి ఉద్గారాలను తగ్గించడానికి ముందస్తు ప్రణాళికలు రూపొందించే అవకాశం కలుగుతుంది. చెత్త నుంచి సంపద సృష్టిలో సరికొత్త విధానం రసాయన పిచికారీతో 21 రోజుల్లో సేంద్రియ ఎరువుగా చెత్త పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో పైలెట్ ప్రాజెక్ట్ కంపోస్టు ఎరువుల తయారీలో నూతన సాంకేతికత టన్ను చెత్తకు లీటరు బయో సొల్యూషన్ లిక్విడ్ స్వచ్ఛ భారత్ వైపు అడుగులు వ్యర్థాలను పూడ్చటం, దహనం చేయడం వల్ల హానికర కాలుష్య కారకాలు విడుద లవుతాయి. ఎకోలి బయో సొల్యూషన్స్ ద్రావణాన్ని చెత్తపై పిచికారీ చేస్తే ఎటువంటి దుర్వాసన లేకుండా కంపోస్టు ఎరువు తయారవుతుంది. చేపల చెరువులకు సైతం దీనిని ఉపయోగించవచ్చు. కై కలూరు ప్రభుత్వ మత్స్యశాఖ లేబోరేటరీ ఎరువులో పోషకాలను పరీక్షించి గుర్తింపు పత్రం ఇచ్చింది. పంచాయతీలు, మున్సిపాలిటీలకు ద్రావణాన్ని తక్కువ ధరకు అందిస్తున్నాం. – నడింపల్లి మణిరాజు, ఎకోలి బయో సొల్యూషన్స్, భీమవరం -
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం
ఆగిరిపల్లి: ఆగిరిపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది నిర్లక్ష్యం రోగులకు ప్రాణసంకటంగా మారింది. స్థానిక కొండ కాలనీకి చెందిన మీర్జావలి శుక్రవారం రాత్రి అనారోగ్యంతో స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా అక్కడి సిబ్బంది కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయలేదు. తమ దగ్గర ఉన్న వైద్య పరికరాలు పనిచేయటం లేదని మరో ఆస్పత్రికి తీసుకువెళ్లండని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో మీర్జా వలి కుటుంబసభ్యులు హుటాహుటిన విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. 20 వేల జనాభా ఉన్న ఆగిరిపల్లి పీహెచ్సీలో వై ద్యుడిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పీహెచ్సీలో రాత్రిళ్లు వైద్యుడు ఉండేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. డీఎస్సీ పరీక్షలకు 341 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లాలో డీఎస్సీ పరీక్షలకు 341 మంది అభ్యర్థులు హాజరయ్యా రు. ఏలూరులోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 180 మందికి 167 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 205 మందికి 174 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగా యని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో.. భీమవరం: జిల్లాలో శనివారం నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షలకు 77 శాతం అభ్యర్థులు హాజరైనట్లు డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. ఉదయం సెషన్లో 100 మందికిగాను 77 మంది అభ్యర్థులు హాజరయ్యారని, ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని చెప్పారు. అనర్హుల వివరాలు నమోదు చేయాలి ఏలూరు (ఆర్ఆర్పేట): తల్లికి వందనం పథకానికి సంబంధించి అనర్హుల జాబితాల్లో తమ పిల్లల పేర్లు ఉన్నాయని తల్లిదండ్రులు ఫిర్యా దు చేస్తున్న సందర్భాల్లో సంబంధిత డేటా ఎంట్రీ ఆపరేటర్లు తక్షణమే ఎన్బీఎం పోర్టల్లో లాగిన్ అయ్యి సర్వీస్ రిక్వెస్ట్లో గ్రీవెన్స్ నమోదు చేయాలని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చారన్నారు. తాత్కాలికంగా సాంకేతిక కారణాల వల్ల అనర్హులుగా కనిపిస్తున్నవారి వివరాలను తప్పనిసరిగా ఆఫ్లైన్ రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. అలా గే ఈ పథకంలో భాగంగా ప్రతి విద్యార్థి వద్ద నుంచి రూ.2 వేలు మౌలిక సదుపాయాల నిర్వహణ నిమిత్తం కోత విధిస్తున్నారని, ఈ మొ త్తాన్ని కలెక్టర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక ఖాతాలో జమ చేసి, ఆయా పాఠశాలల్లో శుభ్రత, మరమ్మతులు, పునరుద్ధరణ కార్యకలాపాలకు వినియోగిస్తారని చెప్పారు. తాగునీటి చెరువు శుభ్రంపెంటపాడు: ‘తాగునీటి కుళాయిల నుంచి కలుషిత జలాలు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. రావిపాడులో నాచుతో అడుగంటిన చెరువులను శనివారం సుమారు 50 మంది కూలీలతో శుభ్రం చేయించారు. సమీపంలోని వెంకయ్య వయ్యేరు నుంచి మోటార్ ద్వారా చెరువులోకి నీరు తోడిస్తున్నారు. రెండు రోజుల్లో కొండేపాడు, రావిపాడు గ్రామాలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందిస్తామని గ్రామ కార్యదర్శి శేఖర్బాబు తెలిపారు. పాలకోడేరులో అధిక వర్షపాతం భీమవరం: జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం నమోదైంది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన వర్షం కొన్నిచోట్ల ఽభారీగా, మరి కొన్నిచోట్ల మోస్తరుగా పడింది. పాలకోడేరు మండలంలో అత్యధికంగా 78 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా వీరవాసరంలో 50.2, భీమవరంలో 47.8, మొగల్తూరులో 33.2, నరసాపురంలో 31.6, ఉండిలో 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
జగన్నాథుని రథోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు
27 నుంచి రథోత్సవాల నిర్వహణ ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని జగన్నాథస్వామి వారి ఆలయంలో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 6 వరకు జగన్నాథుని రథోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను పూరీ క్షేత్రంలో నిర్వహించే విధంగా చిన వెంకన్న దేవస్థానం ఇక్కడ వైభవంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 27న రథంపై స్వామి వారు లక్ష్మీపురం ఆలయం నుంచి ద్వారకాతిరుమల క్షేత్రానికి ఊరేగింపుగా వెళ్తారు. అలాగే ఉత్సవాల ముగింపు రోజు జులై 6న ఆలయం నుంచి సమీప గ్రామమైన తిమ్మాపురానికి రథయాత్రగా వెళ్లనున్నారు. రథోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ఆవరణలోని కల్యాణ మండపంలో జగన్నాథస్వామి వారు రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. భక్తులు స్వామి వారిని దర్శించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని ఆయన కోరారు. దశావతారాలు ఇలా.. 27న మత్స్యావతారం, 28న కూర్మావతారం, 29న వరాహావతారం, 30న నరసింహావతారం, జులై 1న వామనావతారం, 2న పరశురామావతారం, 3న రామావతారం, 4న కృష్ణావతారం, 5న కల్కిఅవతారం, 6న శ్రీవేంకటేశ్వర స్వామి అవతారం -
రక్తదాత.. జీవన ప్రదాత
రాయలంలో అత్యాధునిక బ్లడ్ బ్యాంక్ నూతన జిల్లా ఏర్పడ్డాక 2022లో అప్పటి కలెక్టర్ పి. ప్రశాంతి నేషనల్ రెడ్ క్రాస్ ద్వారా రూ. కోటి 50 లక్షలతో అత్యాధునిక పరికరాలను మంజూరు చేయించారు. అలాగే మండలంలోని రాయలం పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్న ప్రభుత్వ భవనాన్ని బ్లడ్ బ్యాంకు కోసం కేటాయించారు. ఉద్యోగులు, ప్రజల నుంచి జిల్లా శాఖ కోటి రూపాయల మేర విరాళాలు సేకరించి భవనంలో వైద్య పరికరాలు మార్పులు చేయించి వసతులు కల్పించారు. గతేడాది నవంబర్ 18న జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్, ప్రస్తుత కలెక్టర్ సీహెచ్ నాగరాణి బ్లడ్ బ్యాంకును ప్రారంభించారు. అయితే తణుకు, నరసాపురంలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులు హోల్ బ్లడ్ను మాత్రమే అందిస్తాయి. రాయంలోని ఏర్పాటు చేసి రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంకులో అత్యాధునిక పరికరాలు ద్వారా రక్తాన్ని ప్రాసెసింగ్ చేసి హోల్ బ్లడ్తో పాటు ఎర్రరక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్లెట్స్ అందించే విధంగా ఆధునిక వసతులు కల్పించారు. 8 వేల యూనిట్లు రక్తం నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. భీమవరం అర్బన్: ప్రమాద సమయాల్లో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన వారికి రక్తం చాలా అవసరం. ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రెడ్క్రాస్ చొరవతో రక్తం అందుతుంది. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారికే కాకుండా తలసేమియా రోగులకు, ఇతర శస్త్రచికిత్సల్లో రక్తం అవసరమయ్యే వారికి రెడ్క్రాస్ రక్తనిధి దన్నుగా నిలుస్తుంది. నోబుల్ బహుమతి గ్రహీతైన ఆస్ట్రేలియాకు చెందిన కార్ల ల్యాండ్ స్టైనర్ జయంతి, జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. దాతల అవసరం లేకుండానే ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బ్లడ్ బ్యాంకులు రక్తాన్ని అమ్మకూడదు. దాత నుంచి సేకరించాక మరొకరి శరీరంలోకి ఎక్కించేందుకు సురక్షితమో? కాదో నిర్ధారించే పరీక్షలు, భద్రపరిచేందుకు అవసమైన ప్రాసెసింగ్ చార్జీలు మాత్రమే తీసుకోవాలి. ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల్లో దాతలు రక్తాన్ని ఇచ్చిన తరువాత రోగికి కావాల్సిన బ్లడ్ గ్రూపుల రక్తాన్ని విక్రయిస్తారు. రెడ్క్రాస్ సొసైటీలో దాత అవసరం లేకుండా రోగికి కావాల్సిన బ్లడ్ను ప్రభుత్వం నిర్ణయించిన ప్రాసెసింగ్ చార్జీలతో అందజేస్తారు. ముందుకు వచ్చిన ఉద్యోగులు ప్రతి నెలా మొదటి, మూడో శుక్రవారాల్లో మండలంలోని రాయలంలో ఏర్పాటు రెడ్క్రాస్ సొసైటీలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందితో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 12 శిబిరాల ద్వారా 645 యూనిట్లు రక్తాన్ని సేకరించినట్లు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ బద్రిరాజు తెలిపారు. రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి వివరించారు. రక్తదానంతో ప్రాణాలకు రక్షణ ఒక వ్యక్తి చేసే రక్తదానం 4 ప్రాణాలు కాపాడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. రక్తం ఇవ్వగానే దానిని వివిధ భాగాలుగా విభజిస్తారు. దాత నుంచి సేకరించే రక్తాన్ని హోల్ బ్లడ్ అంటారు. ఆ రక్తంలో ప్లాస్మా, ప్లేట్లెట్స్, తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు ఉంటాయి. వీటిని విడదీసి నలుగురికి ఈ రక్తాన్ని ఎక్కించవచ్చు. ఒక వ్యక్తి ప్రతి 3 నెలలకు ఒకసారి సాధారణ రక్తదానం చేయవచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ కానీ, ప్లాస్మాను గానీ దానం చేయవచ్చు. రక్తదానం చేయడానికి ముందు రక్తదాత హెల్త్ ప్రొఫైల్ తెలుసుకోవచ్చు. రక్తదానం చేయడం వల్ల పెద్దపేగు, ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు, క్యాన్సర్లు వంటి రాకపోవడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. రక్తదానం ఎవరు చేయాలంటే? 18–60 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి బరువు 45 కిలోల పైన ఉండాలి. బీపీ అదుపులో ఉండాలి. తీవ్రమైన వ్యాధులు, మూర్చ, మూత్రపిండ వ్యాధులు, అలర్జీ, అసాధారణ రక్తస్రావ లక్షణాలు, హృదయ సంబంధమైన వ్యాధులు ఉండకూడని వారు రక్తదానం చేయవచ్చు. అలాగూ హిమోగ్లోబిన్ 100 మిల్లీ లీటర్లు రక్తంలో 12.5 గ్రాముల కంటే ఎక్కువగా ఉండాలి. రక్తదానం ఎవరు చేయకూడదంటే? గర్భిణులు, ప్రసవానంతరం 6 నెలల వరకు బిడ్డకు పాలిచ్చినంత కాలం, బహిష్టు సమయంలో అధికంగా రక్తస్రావం జరిగే పరిస్థితుల్లో సీ్త్రలు రక్తం ఇవ్వకూడదు. అలాగే టీకాలు వేసుకున్న రెండు వారాల లోపు ఇవ్వకూడదు. జంతువుల కాట్లకు గురైన ఏడాది లోపు ఇవ్వకూడదు. టిటానస్ (ధనుర్వాతం), డిప్తీరియా (కంఠవాపు), గ్యాస్ గ్యాంగ్రీన్ కోసం మందులు వాడినవారు పచ్చకామెర్లు వ్యాధి గ్రస్తులు కూడా రక్తం ఇవ్వకూడదు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం రెడ్క్రాస్ ఆధ్వర్యంలో ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగుల రక్తదానం ప్రభుత్వ ఉద్యోగుల చొరవ అభినందనీయం రక్తదాన శిబిరాలకు ప్రభుత్వ ఉద్యోగుల ప్రత్యేక చొరవ చూపడం అభినందనీయం. వారు రక్తదానం చేయడంతోనే 645 యూనిట్ల రక్తాన్ని సేకరించగలిగాం. ప్రాణాపాయస్థితిలో ఉన్న వారిని ఎంతోమందిని రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా కాపాడగలిగాం. రక్తం కొరతను తీర్చడం, అత్యవసర పరిస్థితులు, శస్త్ర చికత్సల సమయంలో ప్రాణాలను రక్షించే సహాయాన్ని అందించడం లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేస్తుంది. డాక్టర్ బద్రిరాజు, రెడ్క్రాస్ జిల్లా చైర్మన్, భీమవరం -
రాయితీ కొనసాగించాలి
భీమవరం: సీనియర్ సిటిజెన్స్కు రైల్వేలో రాయితీలు పునరుద్ధరించాలని కోరుతూ భీమవరం సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రధానమంత్రికి పోస్టుకార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లం వెంకట కృష్ణనాగేశ్వరరావు, బోనం పాండురంగారావు చేతుల మీదుగా హెడ్ పోస్టా ఫీసులో సుమారు 500 పోస్ట్కార్డులు అందచేశారు. కోవిడ్ ముందు వరకు కేంద్ర ప్రభుత్వం రైల్వే చార్జీలలో మహిళలకు 50 శాతం, పురుషులకు 40 శాతం రాయితీ ఇచ్చేవారన్నారు. కోవిడ్ కారణంగా రాయితీ నిలిపివేసి నేటికీ పునరుద్ధరించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ పరీక్షకు 738 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షకు మెత్తం 738 మంది హాజరయ్యారు. నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం పరీక్షకు 180 మందికి గాను 171 మంది హాజరు కాగా, మధ్యాహ్నం సెషన్లో 180 మందికి 177 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 200 మందికి 194 మంది హాజరు కాగా, మధ్యాహ్నం 200 మందికి 196 మంది హాజరయ్యారు. 14న యోగాంధ్ర మాక్ డెమో ఏలూరు(మెట్రో): జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14న యోగాంధ్ర మాక్ డెమో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఈనెల 14న శనివారం ఉదయం గ్రామ, వార్డు, సచివాలయాల పరిధిలో 6,197 వేదికల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. యోగా మ్యాట్లు, తాగునీరు తదితర ఏర్పాట్లు చేయాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు. మండల స్థాయి అధికారులందరూ ఈ కార్యక్రమం పర్యవేక్షించి అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. జిల్లాలో ఇంతవరకు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు 8,46,428 మంది తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. వట్లూరు టీటీడీసీలో ఉదయం 7 గంటలకు యోగాంధ్ర మాక్ డెమో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘నవోదయ’ దరఖాస్తుకు జూలై 29 వరకు గడువు ఏలూరు (ఆర్ఆర్పేట): 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి జూలై 29 వరకూ గడువు ఉందని ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు జవహర్ నవోదయ విద్యాలయాల్లో సౌకర్యాలు గురించి వివరంగా చెప్పి విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ప్రవేశపరీక్ష డిసెంబర్ 13న నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తాం ఏలూరు(మెట్రో): జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటానని నూతన జిల్లా పరిషత్ సీఈఓ ఎం.శ్రీహరి చెప్పారు. రాష్ట్ర వ్యాప్త బదిలీల్లో భాగంగా నెల్లూరు జిల్లా డీఎల్డీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీహరిని పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ సీఈఓగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈమేరకు ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు బదిలీపై రావడం ఆనందంగా ఉందన్నారు. ఉపాధి హామీ జోలికొస్తే ఊరుకోం అత్తిలి: ఉపాధి హామీ జోలికొస్తే చూస్తూ ఊరుకోబోమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ళ చినవీరభద్ర రావు హెచ్చరించారు. అత్తిలి మండలం కొమ్మరలో ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రాంతాన్ని సందర్శించి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు గత మూడు మాసాలుగా చేసిన పనికి వేతనాలు చెల్లించకపోవడంతో కూలీల ఆర్థిక పరిస్థితి మరింత దుర్భరంగా మారిందన్నారు. కూలీల బకాయిలపై దృష్టి పెట్టకుండా కూటమి ప్రభుత్వం మోడీ భజన చేస్తుందని, ఇలాగయితే భవిష్యత్తులో ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
ట్రిపుల్ ఐటీ డీన్ స్టూడెంట్ వేల్ఫేర్ అధికారిగా ఎల్.రాజేష్
నూజివీడు : స్థానిక ట్రిపుల్ ఐటీ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ (బాలురు) అధికారిగా ఇంగ్లిష్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న ఎల్.రాజేష్ శుక్రవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఏడాది పాటు ఈ పదవిని ఆయన నిర్వర్తించనున్నారు. అలాగే చీఫ్ వార్డెన్ (బాలురు)గా బి.సురేష్బాబు నియమితులయ్యారు. ఈయన పీయూసీలో బయాలజీ మెంటార్గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జి డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారంలో తగిన చొరవ చూపాలని రాజేష్కు సూచించారు. కార్యక్రమంలో సెంట్రల్ డీన్ దువ్వూరి శ్రావణి, సెంట్రల్ ఏఓ బండి ప్రసాద్, ఏఓ బి లక్ష్మణరావు, డీన్ సాధు చిరంజీవి, చీఫ్ వార్డెన్ బి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మద్యం మత్తులో రాయిపై పడి వ్యక్తి మృతి కాళ్ల: మద్యం మత్తులో రోడ్డు పక్కన ఉన్న రాయిపై పడిపోవడంతో తీవ్ర గాయమై ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద అమిరంలోని లిబర్టీ ఫ్యాక్టరీ సమీపంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన ఎన్.లక్ష్మీకాంత్ (34) భీమవరం పట్టణంలోని బాలాజీ మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. అతనికి వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్యానికి బానిసైన లక్ష్మీకాంత్ గురువారం రాత్రి మద్యం సేవించి వస్తూ రోడ్డు పక్కన రాయిపై పడిపోవడంతో కనుబొమ్మ వద్ద గాయమై ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారంతో భీమవరం డీఎస్పీ జయసూర్య, ఆకివీడు సీఐ జగదీశ్వరరావు, ఎస్సైలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి మదనాచారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించడానికి ఏర్పాటు చేసినట్టు ఆ సంస్థ డైరెక్టర్ ఎం.ఫణి కిషోర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ కోర్సులో 30 రోజులు, సీసీ కెమెరాల బిగింపుపై 13 రోజుల శిక్షణ ఉంటుందని వివరించారు. ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ కోర్సుకు 10వ తరగతి ఆపై, సీసీ కెమెరాల బిగింపు కోర్సుకు 5వ తరగతి ఆపై విద్యార్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కోర్సుల్లో చేరడానికి గ్రామీణ ప్రాంతాలకు చెందిన 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన నిరుద్యోగులు అర్హులని తెలిపారు. శిక్షణ తరగతులు ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతాయని వివరించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాలకు 99485 65256, 90140 40780 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. -
నగల షాపు ప్రారంభోత్సవంలో అపశృతి
ఏలూరు టౌన్: ఏలూరు కొత్త బస్టాండ్ ప్రాంతంలో నగల దుకాణం ప్రారంభోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ప్రారంభోత్సవానికి సినీనటులు రావడంతో అభిమానులు ఎగబడ్డారు. తోపులాటలో ఇంజనీరింగ్ విద్యార్థి అభిషేక్ కాలు విరిగింది. అతడిని జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో వాహనదారులు, నగర ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. స్కూల్స్, కాలేజీలు వదిలే సమయం కావటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. నేటి నుంచి సముద్రంలో వేట నరసాపురం: సముద్రంలో వేట నిషేధకాలం గడువు నేటి అర్ధరాత్రితో ముగుస్తుంది. 61 రోజులు పాటు ఖాళీగా ఉన్న గంగపుత్రులు మళ్లీ వేటకు వెళ్లనున్నారు. గత ఏడాది ప్రకృతి విపత్తులతో వేట సవ్యంగా సాగలేదు. సీజన్లో కూడా తీరానికి బోట్లు చేర్చడంతో ఏడాది పొడవునా నష్టాలే చవిచూశారు. ఈ ఏడాదైనా ప్రకృతి కరుణించాలని వేట ముమ్మరంగా సాగాలని గంగమ్మను వేడుకుంటున్నారు. -
మోటార్సైకిళ్ల దొంగ అరెస్ట్
రూ.13 లక్షల విలువైన మోటారు సైకిళ్లు స్వాధీనం తాడేపల్లిగూడెం అర్బన్ : పట్టణంలో రాత్రి సమయంలో మోటారుసైకిళ్లను దొంగలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం పట్టణ ఎస్సై నాగ రాజు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు పట్టణానికి చెందిన పూతి ప్రసాద్ అలియాస్ పెరుమాళ్ల దాలయ్య పలు పట్టణాల్లో రాత్రి సమయాల్లో సంచరిస్తూ ఇళ్ల ముందు ఉన్న కొత్త మోటారుసైకిళ్లను దొంగలిస్తున్నాడు. దీంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పూత్తి ప్రసాద్ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి రూ.13 లక్షలు విలువైన 9 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లిగూడెం పరిధిలో నాలుగు, తణుకు టౌన్లో 1, రావులపాలెంలో రెండు, గుడివాడ టౌన్లో ఒకమోటారుసైకిల్ దొంగలించాడు. ఈ మేరకు ప్రసాద్పై కేసు నమోదు కోర్టుకు హాజరుపర్చనున్నారు. పూతి ప్రసాద్ గతంలో వివిధ జిల్లాల్లో సుమారు వంద నేరాలు చేసి జైలుశిక్ష అనుభవించాడు. ఆరుతడి పద్ధతితో అధిక దిగుబడి ఏలూరు(మెట్రో): వరిలో ఆరుతడి పద్ధతి సాగుతో అధిక దిగుబడిని సాధించవచ్చని డీఏఓ షేక్ హబీబ్ బాషా, జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ బి.వెంకటేష్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కళ్యాణి అపార్ట్మెంట్లో శుక్రవారం కమ్యూ నిటీ రిసోర్స్పర్సన్స్కు అంతర్జాతీయ పరిశోధన కోర్ ప్రాజెక్ట్ గురించి డీఏఓ షేక్ హబీబ్ బాషా వివరంచారు. వరిలో ఆరుతడి పద్ధతి, హరిత గృహవాయువు వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. అలాగే కోర్ ప్రాజెక్టు సిబ్బంది ఈ శిక్షణలో వరిలో ఆరుతడి పద్ధతి ఏ విధంగా పాటించాలి? అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియజేశారు. ఆరుతడి పద్ధతి సాగు వల్ల 30 శాతం వరకు సాగు నీరు ఆదా అవుతుందన్నారు. అలాగే మెరుగైన పంట ఎదుగుదల ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎంయూ స్టాఫ్ శాసీ్త్రయ శాస్త్రవేత్తలు అంకిత పాల్, పవన్ యెగ్గిన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల శిక్షణకు జిల్లా అధికారులు
భీమవరం (ప్రకాశం చౌక్): భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన శిక్షణలో జిల్లా అధికారులు పాల్గొన్నార. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోని నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన బూత్ లెవల్ అధికారులు, బూత్ లెవెల్ సూపర్వైజర్లు, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులకు 12, 13 తేదీల్లో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల తరఫున నరసాపురం ఆర్డీఓ దాసి రాజు, జిల్లా నుంచి ఐదు మంది బీఎల్ఓలు, ఇద్దరు బీఎల్ఓ సూపర్వైజర్లు హాజరయ్యారు. అలాగే శిక్షణ కార్యక్రమంలో కొన్ని అంశాలను బోధించడానికి కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి కూడా వెళ్లారు. శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు విధులు, విధానాలు, ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ, యువ ఓటర్ల నమోదు, విధుల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. దైవ దర్శనానికి వెళ్లి వచ్చేసరికి చోరీ ఏలూరు టౌన్: ఏలూరు వన్టౌన్ ప్రాంతంలోని ఒక కుటుంబం దైవ దర్శనానికి వెళ్లి మొక్కు తీర్చుకుని వచ్చేసరికి దొంగలు ఇంటిని కొల్లగొట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు వన్టౌన్ దక్షిణపువీధి ప్రాంతానికి చెందిన ఇన్నమూరి భాస్కరరావు ఇంటివద్దే కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. ఆయన తన కుటుంబంతో తిరుమల తిరుపతి దర్శనానికి ఆదివారం వెళ్లి శుక్రవారం ఇంటికి వచ్చారు. అయితే ఇంటి తలుపు తాళాలు పగలగొట్టి ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకుపోయినట్లు గుర్తించారు. చోరీ సమాచారం అందుకున్న ఏలూరు వన్టౌన్ సీఐ సత్యనారాయణ, క్లూస్ టీమ్ ఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
జోరుగా విద్యా వ్యాపారం
భీమవరం: జిల్లా కేంద్రమైన భీమవరంలో విద్యా వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రైవేటు విద్యాసంస్థల్లో అక్రమంగా ప్రవేశాలు కల్పిస్తూ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండానే ప్రవేశాలు ప్రారంభించగా, స్కూళ్లు తెరవడంతో పుస్తకాలు, యూనిఫాం వంటి విద్యా సామగ్రి విక్రయాలు జోరందుకున్నాయి. కళ్లెదుటే ఇంత జరుగుతున్నా విద్యా శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు వేసవి సెలవుల్లో ప్రవేశాలకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించగా ప్రభుత్వం ప్రకటించిన తేదీ కంటే ముందుగానే తరగతులు ప్రారంభించారు. అనేక ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం వంటి విద్యా సామగ్రి యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. విద్యాసంస్థల వద్దనే ప్రత్యేక గదుల్లో పుస్తకాలు, సామాగ్రి నిల్వచేసి అమ్ముతున్నారు. ఈ నెలలోనే భీమవరం పట్టణంలోని నారాయణ, చైతన్య స్కూళ్లలో పుస్తకాలు విక్రయిస్తుండగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దాడిచేసి విక్రయాలు అడ్డుకున్నారు. విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేయడంతో నారాయణ స్కూల్ గదిని డీవైఈవో రమేష్ సీజ్ చేశారు. స్కూల్ నిర్వాహకులకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. నారాయణ, చైతన్య గుర్తింపు రద్దు చేయాలి నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్న నారా యణ, చైతన్య స్కూళ్ల గుర్తింపును రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.గణేష్, టి.ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేయడమేగాక పుస్తకాలు, మిగిలిన విద్యాసామాగ్రిని అధిక ధరలకు విక్రయిస్తూ.. విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణలో పుస్తకాల అమ్మకం అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ -
కొల్లేరు అధ్యయనానికి కేంద్ర కమిటీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొల్లేరులో కేంద్ర సాధికారిత కమిటీ(సీఈసీ) బృంద పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఈ నెల 16న అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై కొల్లేరు అంశాలపై చర్చిస్తారు. అనంతరం ఈ నెల 17, 18 తేదీల్లో ఏలూరు జిల్లాలో కొల్లేరు పరీవాహక ప్రాంతాల ప్రజలతో సమావేశమవుతారు. పూర్వం కొల్లేరు ప్రజల స్థితిగతుల అధ్యయనంపై సుప్రీంకోర్టు నియమించిన అజీజ్, రామన్ సుకుమారన్ కమిటీలు నివేదికలు అందించాయి. తాజాగా మరోసారి సీఈసీ కమిటీ రానుండటంతో కొల్లేరు పరివాహక గ్రామాల్లో ఉత్కంఠ నెలకొంది. కొల్లేరు అభయారణ్యంపై 2006 ఏప్రిల్ 10న జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వాధికారులు ఉల్లంఘిస్తున్నారని, దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలని కాకినాడకు చెందిన పర్యావరణవేత్త మృత్యుంజయరావు సుప్రీంలో పిటిషన్ వేశారు. సీఎస్ను ప్రతివాదిగా చేర్చారు. దీంతో ఈ ఏడాది జనవరి 16న జస్టిస్ బీఆర్.గవాయి(ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ అగస్టీ జార్జ్ మసీహ్, జస్టిస్ కె.వినోద్ చంద్రకాంత్లు కొల్లేరులో ఆక్రమణలు తొలగించి మూడు నెలల్లో సరిహద్దులు నిర్ణయించాలని ఆదేశించారు. అనంతరం రాష్ట్ర చేపల రైతు సంఘం తరుపున జీ రాయితీ రైతులు రిట్ పిటిషన్ వేశారు. దీంతో కోర్టు కొంత గడువునిస్తూ సీఈసీ కొల్లేరులో పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఈసీ సభ్యులు కొల్లేరులో పర్యటించనున్నారు. 20 వేల ఎకరాలను మినహాయించాలి కొల్లేరు అభయారణ్యం 77,138 ఎకరాలుగా జీవో 120 ప్రకారం నిర్ణయించారు. కొల్లేరు సరస్సు చుట్టూ 122 గ్రామాల్లో 3 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. సుప్రీం ఆదేశాలతో 2006లో జరిగిన కొల్లేరు ఆపరేషన్లో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 31,125 ఎకరాలలో ఆక్రమిత చేపల చెరువులను ధ్వంసం చేశారు. వీటిలో పట్టా భూములు 14,932 ఎకరాలు, బీఫాం భూములు 5,510 ఎకరాలు ఉన్నాయి. కొల్లేరు పరిధి నుంచి పట్టా, బీఫాం భూములు మినహాయించి, కొత్త సరిహద్దులు నిర్ణయించాలంటూ జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు(ఎన్బీడబ్ల్యూఎల్) 2018లోనే ఆదేశాలిచ్చింది. దీనిని అమలు చేయాలని కోరనున్నారు. వినతులతో కొల్లేరు ప్రజలు సిద్ధం కేంద్ర సాధికారిత కమిటీ(సీఈసీ)కి కొల్లేరు గ్రామాల ప్రజలు వినతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ఈ విషయంపై కొల్లేరు పెద్దలు కీలక సమావేశాలు నిర్వహించారు. ప్రతి గ్రామం నుంచి కొల్లేరు జీ రాయితీ, బీఫాం పట్టా వివరాలతో పాటు గ్రామంలో మౌలిక వసతులైన తాగునీటి చెరువులు, ఇంటి స్థలాల పంపిణీ, రహదారుల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని పంచాయతీ సర్పంచ్ తీర్మానాలు అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. వినతులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న కొల్లేరు ప్రజలు ఈ నెల 17, 18లో కొల్లేరు గ్రామాల్లో పర్యటన -
స్కూళల్లో ఉచిత సీట్ల నిరాకరణపై ఫిర్యాదు
రథోత్సవాలకు ఏర్పాట్లు శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని జగన్నాథస్వామి ఆలయంలో ఈ నెల 27 నుంచి రథోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 8లో uఏలూరు (ఆర్ఆర్పేట): ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని ఆదేశించినా జిల్లాలోని పలు కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు సీట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని ఏపీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్, టీచర్స్, ఆఫీసర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు ఆయా కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు వివిధ కారణాలు చెబుతూ సీట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఏఏ పాఠశాలలో ఎన్ని సీట్లు కేటాయించారో, ఎన్ని సీట్లు భర్తీ చేశారో తెలపాలని డీఈఓను వినతిపత్రం ద్వారా కోరామన్నారు. -
మున్సిపల్ ఇంజినీరింగ్ సిబ్బంది నిరసన
నరసాపురం/తణుకు అర్బన్: ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటి జేఏసీ పిలుపులో మున్సిపల్ ఇంజినీరింగ్ సెక్షన్లో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేవారు. మోకాళ్లపై నిల్చుని ఆందోళన చేశారు. రెగ్యులరైజ్ చేయాలని, హెచ్ఆర్సీ పాలసీ అమలు చేయాలని, సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో తణుకు మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేస్తూ మునిసిపల్ మోకాళ్లపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు శ్రీను మాట్లాడుతూ జీవో 36ను అవుట్సోర్సింగ్ కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నగర అభివృద్ధి కోసం గుత్తేదారులకు చెల్లిస్తున్న ఎస్ఎస్ఆర్ రేట్లను అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా అమలుచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్నారు. చనిపోయిన, రిటైర్ అయిన కార్మికుల వారసులకు ఉపాధి కల్పించాలని, ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ గౌరవ అధ్యక్షుడు పాపారావు, విజయ్కుమార్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు
నూజివీడు: నియోజకవర్గవ్యాప్తంగా మట్టిదందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మట్టిదోపిడీ కోసమే కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్న చందంగా అధికార పార్టీకి చెందిన నాయకులు పగలు, రాత్రి లేకుండా చెరువుల్లోని మట్టిని కొల్లగొడుతున్నారు. అధికారుల పర్యవేక్షణలోపంతో ధనార్జనే ధ్యేయంగా సహజ సంపదైన మట్టిని కొల్లగొడుతూ లక్షలాది రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు. నూజివీడు డివిజన్కు సబ్కలెక్టర్గా ఐఏఎస్ అధికారి ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడంతో మట్టి దందా ఊపందుకుంది. మండలంలోని బోర్వంచ శివారు కొన్నంగుంట గోరింత చెరువు నుంచి మట్టి అక్రమ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ చెరువులో గ్రావెల్ పెద్ద ఎత్తున ఉండడంతో గ్రామంలోని పొలాల్లోకి సారవంతమైన పూడిక మట్టిని తోలుకునేందుకు అనుమతులు పొంది గ్రావెల్ను తవ్వి నూజివీడు పట్టణంలోనికి ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలిస్తూ మట్టిని విక్రయిస్తున్నారు. ట్రక్కు వెయ్యి రూపాయల నుంచి రూ.1200లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ చెరువులో 2014–19 సమయంలో తవ్విన అడ్డగోలు తవ్వకాలతో తూము కంటే పది అడుగుల లోతుకు చేరినా ఇరిగేషన్ అధికారులు మాత్రం మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంపై గ్రామానికి చెందిన పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధురాలు మృతి చెందినా ఆగని రవాణా ముసునూరు: మండలంలోని గోపవరం, రమణక్కపేట, కొర్లగుంట,లోపూడి తదితర గ్రామాల్లో జేసీబీలు పెట్టి, రేయింబవళ్లు తేడా లేకుండా వందలాది ట్రాక్టర్లతో విలువైన చెరువు మట్టి తరలిస్తున్నారు.గోపవరంలో టీడీపి నేతలే ట్రాక్టర్ ట్రక్కు మట్టికి రూ.650 నుంచి రూ.700 గా నిర్ణయించి, మట్టిని యథేచ్ఛగా అమ్ముకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల గోపవరంలో మట్టి ట్రాక్టర్ ఢీకొట్టి వృద్ధురాలు మృతి చెందినా ఆగకుండా అక్రమ మట్టి రవాణా కొనసాగిస్తున్నారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న సమాచార, గృహనిర్మాణ శాఖా మంత్రి పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే అక్రమ మట్టి రవాణాపై తహసీల్దార్ కేవీ రమణను వివరణ కోరగా తక్షణమే సిబ్బందిని పంపి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నీటిపారుదల శాఖ నూజివీడు డీఈఈ అర్జునరావును సంప్రదించగా అన్ని గ్రామాల్లో తోలకాలకు అనుమతులు ఇవ్వలేదని, అనుమతి లేకుండా మట్టి రవాణా చేసేవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఏలూరులో వేగ జ్యూయలర్స్ ప్రారంభం
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజలకు మంచి డిజైన్ ఆభరణాలు అందించాలనే లక్ష్యంతో తమ షోరూం ఏలూరులో ప్రారంభించామని వేగ జ్యూయలర్స్ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్ అన్నారు. శుక్రవారం ఎన్ఆర్పేటలో వేగ జ్యూయలర్స్ ప్రారంభోత్సవంలో సినీ నటులు నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్ పాల్గొన్నారు. ఇది 5వ షోరూం అని.. ఖాతాదారుల నమ్మకానికి కట్టుబడి వ్యాపారం సాగిస్తున్నామన్నారు. షోరూం ప్రారంభం సందర్భంగా ప్రతి రూ.లక్ష కొనుగోలుపై ఉచిత బంగారు నాణెం, పాత బంగారం మార్పిడిపై గ్రాముకు రూ.100 అదనంగా చెల్లించడానికి ఏర్పాటు చేశామన్నారు. డైమండ్ ధర క్యారట్ రూ.51,999 మాత్రమేనని తెలిపారు. లక్కీ డ్రా నిర్వహించి అయిదుగురు విజేతలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు బహుమతిగా అందిస్తామన్నారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ వనమా నవీన్ కుమార్, డైరక్టర్లు వనమా సుధాకర్, చంద్రకాంత్, చిట్లూరు నాగేశ్వరావు పాల్గొన్నారు. -
కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): విద్యను వ్యాపారంగా మారుస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు ఎస్.లక్ష్మణ్ మాట్లాడుతూ పట్టణంలో పలు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు యూనిఫామ్, పుస్తకాలు, ఇతర సామాగ్రి పాఠశాలలోనే కొనాలని ఒత్తిడి చేస్తూ అసలు ధర కన్నా రెండు నుంచి మూడు రెట్లు అధికంగా విక్రయిస్తూ తల్లిదండ్రుల జేబులు గుల్ల చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఫిర్యాదు మేరకు ఎంఈఓ జ్యోతి ప్రైవేట్ పాఠశాల పుస్తకాలు గదిని సీజ్ చేశారు. తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఎస్ఎఫ్ఐ సభ్యులు ఆందోళన విరమించారు. ఆందోళనలో పట్టణ నాయకులు నాగేంద్రబాబు, టి.రవిబాబు, మణికంఠ, గణేష్, సింధు, తదితరులు పాల్గొన్నారు. -
ఆక్వా ఉక్కిరిబిక్కిరి
భీమవరం అర్బన్: గత నెల రోజులుగా వాతావరణంలో విపరీతమైన మార్పులు కనిపిస్తుండడంతో ఆక్వా రంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు వర్షాలు పడడంతో చేపలు, రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ శాతాల్లో మార్పులు తలెత్తుతున్నాయి. దీంతో చేపలు, రొయ్యలు వైరస్ల బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. భీమవరం మండలంలో నాగిడిపాలెం, దొంగపిండి, కొత్తపూసలమర్రు, అనాకోడేరు, కొమరాడ, వెంప, పెదగరువు, దిరుసుమర్రు, గొల్లవానితిప్ప, గూట్లపాడు, కొత్తపూసలమర్రు, లోసరి తదితర గ్రామాల్లో సుమారు 12 వేల ఎకరాల్లో చేపలు, సుమారు 7 వేల ఎకరాల్లో వనామీ రొయ్యల పెంపకం సాగిస్తున్నారు. గత నెల రోజులకుపైగా వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు, వర్షాలు పడటంతో శీలావతి, కట్ల, రూప్ చంద్, గడ్డి చేప, ఫంగస్ తదితర సప్పనీటి చేపలకు రాత్రుళ్లు ఆక్సిజన్ శాతాల్లో హెచ్చుతగ్గులు ఏర్పడి తాటాకు తెగులు, శంకు జలగ, రెడ్ డీసీజ్, పేను కొరుకుడు వంటి వ్యాధులు సోకుతున్నాయని, దీంతో ఉదయం పూట చెరువు ఉపరితలంపై చేపలు అసహనంగా ఈదుతూ మృత్యువాత పడుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని నివారించేందుకు రాత్రులంతా ఇంజిన్ బోట్లతో తిప్పాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలరోజుల క్రితం పంటకాలువలు కట్టేయడంతో చెరువుల్లో నీళ్లు తోడేందుకు సైతం ఆస్కారం లేదని చెరువుల వద్దే పడిగాపులు కాస్తున్నామని చేప రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ దాడికి రొయ్యలు మృత్యువాత వాతావరణంలో ఉష్ణోగ్రతలు స్థిరంగా లేకపోవడంతో చెరువుల్లోని నీటి పరమాణువులైన పీహెచ్, ఆమ్మోనియా, నైట్రోజన్, ఆక్సిజన్ శాతంలలో హెచ్చుతగ్గులు ఏర్పడి వైట్ స్పాట్, విబ్రియో, వైట్గట్, తదితర వైరస్లు వ్యాప్తిచెంది రొయ్యలు మృత్యువాత పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ వైరస్ల వల్ల 30 రోజులలోపే రొయ్యలు చనిపోయి తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతలేని సీడ్తో ఇబ్బందులు నాణ్యత ఉన్న వనామీ సీడ్కు వైరస్ల ప్రభావం తక్కువగా ఉటుంది. కొన్ని రొయ్య పిల్ల ఉత్తత్తి కేంద్రాలు వనామీ పిల్లలు ఉత్పత్తి చేయడంతో రొయ్యపిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువై కొద్దిపాటి వాతావరణ మార్పులకే వైరస్ బారిన పడి మృత్యువాత పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. అలాగే నాణ్యత, నాణ్యతలేని సీడ్ తెలుసుకోవడానికి పీసీఆర్ పరీక్ష ద్వారా ఈహెచ్పీ, విబ్రియో, వైట్ స్పాట్ పరీక్షలు చేస్తేనేగానే తెలియదు. నాణ్యమైన సీడ్ ఉత్పత్తి చేస్తే రొయ్యలు పట్టుబడికి వస్తాయి. దీంతో రైతుకు పెట్టుబడుపోను కొంతైనా మిగిలితే మళ్లీ వనామీ రొయ్యల పెంపకం సాగిస్తాడు. వాతావరణ మార్పులతో ఆక్వా రంగం కుదేలు వైరస్ల బారిన చేపలు, రొయ్యలు ఆందోళనలో ఆక్వా రైతులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎకరం చెరువులో నాణ్యతలేని సీడ్ వేస్తే రొయ్యలకు వైరస్ వచ్చి నెల రోజుల వ్యవధిలోనే రూ.లక్షకు పైగా రైతు నష్టపోతున్నాడు. ఫీడ్ ధరలు పెరిగిపోయాయి. రొయ్య ధరలు తగ్గిపోతున్నాయి. మా తీర ప్రాంత గ్రామాల రైతులంతా రొయ్యల పెంపకంపైనే ఆధారపడుతున్నాం. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి – వాటాల విజయ్ కుమార్, రొయ్య రైతు, నాగేంద్రపురం -
పూడికతీత.. ఏదీ పనుల్లో నాణ్యత?
సాక్షి టాస్క్ఫోర్స్: శివారు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన గోదావరి కాల్వ పూడిక తీత పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. దీంతో తమకు సాగునీటి కష్టాలు తప్పవేమోనని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గోదావరి కాల్వలో పూడిక తీత పనులు చేస్తున్నారా లేక గుర్రపు డెక్క, కర్ర నాచు తొలగింపు పనులు చేపడుతున్నారో అర్థం కాని పరిస్థితి. గుండుగొలను డీసీ పరిధిలో పూళ్ల నుంచి గుండుగొలను వరకు పూడికతీత పనులు జరుగుతున్నాయి. కర్ర నాచు వల్లే గోదావరి కాల్వ నీరు శివారు ప్రాంతాలకు చేరడం లేదని గుర్తించిన ఇరిగేషన్ అధికారులు ఆ కర్ర నాచు ఎదగకుండా పనులు చేస్తున్నారు. వాస్తవానికి కర్రనాచును నాశనం చేసేందుకు రసాయనాలను స్ప్రే వాడాలి. అయితే సంబంధిత అధికారులు మాత్రం అలా కాకుండా కాల్వలోని కర్రనాచును జేబీసీలతో తీసి కాల్వ గట్టుపై వేస్తున్నారు. వర్షం వస్తే గట్టుపై వేసిన మట్టి మళ్లీ కాల్వలో జారిపడుతుందని, మరలా కర్రనాచు పెరిగి ప్రయోజనం శూన్యమని అంటున్నారు. దీనితో లక్షలాది రూపాయలు ప్రజాధనం నీటిలో పోసినట్లేనని పెదవి విరిస్తున్నారు. కాల్వలో కొన్ని చోట్ల పనులు జరుగుతుండగానే కాల్వకు నీటిని విడుదల చేయడంతో పనుల్లో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గుండుగొలను ఇరిగేషన్ సెక్షన్ పరిధిలోని 35 వేల ఎకరాల్లోని వరి పంట సాగు ప్రశ్నార్థకంగా మారనుంది. దాళ్వాలో గోదావరి కాల్వ శివారు రైతాంగానికి సాగునీరు అందక ఇబ్బందులు తప్పవని వాపోతున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో గోదావరి కాల్వకు పూడిక తీత పనులు జరిగాయి. సాగునీటికి గత ఐదేళ్ల కాలంలో ఎన్నడూ రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడిన పరిస్థితులు రాలేదు. దీనితో పాటు దాళ్వాలో రైతులకు సీలేరు జలాలను తీసుకుని వచ్చి రైతులకు సాగునీటికి అందించింది. కానీ కూటమి ప్రభుత్వం దాళ్వాలో రైతులు నీటి కోసం రాత్రిళ్లు జాగారాలు చేశారు. హడావుడి పనులు.. నాణ్యతపై అనుమానాలు దాళ్వాలో రైతులు పడ్డ కష్టాలను చూసిన ఇరిగేషన్ ఉన్నతాఽఽధికారులు ఈ పనులను కాల్వ మూసివేసిన ఏప్రిల్ నెలాఖరు నుంచే చేపట్టాల్సి ఉంది. అధికారులు ముందస్తు ప్రణాళికలు తయారు చేయకపోవడంతో మే నెలాఖరున ఈ పనులు చేపట్టారు. దీనితో పనులు అలస్యమయ్యాయి. హడావుడిగా ఈ పనులు చేపట్టడంతో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరి దశలో పనులు జరుగుతుండగానే గోదావరి కాల్వ వెంబడి గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తడంతో కాల్వలోకి నీటిని విడుదల చేశారు. దీనితో కొన్ని చోట్ల పనులు నిలిచిపోయాయి. ఏడాదంతా డీసీ పరిధిలోని సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా గుర్రపుడెక్క, కర్రనాచులను తొలగించేందుకు వెచ్చించాల్సిన లక్షలాది రూపాయలను ఈ పనుల కోసం నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నారని వాపోతున్నారు. దాళ్వాలో సాగునీటి కష్టాలు తప్పవన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హడావుడిగా గోదావరి కాలువ పూడిక తీత పనులు నిబంధనలను పాటించని వైనం ప్రశ్నార్థకంగా 35 వేల ఎకరాల సాగు సాగునీటి కష్టాలు తప్పవంటున్న రైతన్నలు -
లోతట్టు ప్రాంతాలు జలమయం
కై కలూరు: అకాల వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమమ్యాయి. ఏలూరు జిల్లాలోనే అత్యధిక వర్షపాతం కై కలూరు నియోజకవర్గం ముదినేపల్లిలో 193.6గా బుధవారం నమోదైంది. మండవల్లి మండలంలో 96.4, కై కలూరు మండలంలో 75.2, కలిదిండి మండలంలో 38.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం అర్థరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కై కలూరులో పలు డ్రెయిన్లలో నీరు పొంగి రహదారులపైకి చేరాయి. వెలంపేటలో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. కై కలూరు టౌన్హాల్లో చేరిన నీటితో ఆ ప్రాంతం బురదగా మారింది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా మార్పు జరిగి ఇలాంటి అకాల వర్షాలు కురిస్తే చేపల చెరువుల్లో ఆక్సిజన్ సమస్య ఉత్పన్నం అవుతోందని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. -
విద్యార్థులకు సమస్యల స్వాగతం
యూనిఫాం లేకుండా ఎలా? విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పుస్తకాలు, యూనిఫాం ఇవ్వడం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ ఏడాది ఎక్కువ మంది విద్యార్థులకు యూనిఫాం ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉండడం విచారించదగ్గ అంశం. సమయానికి యూనిఫారం, షూ, స్కూల్ బ్యాగులు ఇవ్వలేకపోవడం ప్రభుత్వ వైఫల్యంగానే పరిగణించాలి. – కాకి నాని, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు ఎస్జీటీల కౌన్సెలింగ్ పూర్తికుండా పాఠశాలలు ప్రారంభిస్తే విద్యార్థులు ఇబ్బందులు పడతారు. వారిని నియంత్రించేవారు కరవై ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పలేం. జిల్లాలో సుమారు 2800 ఎస్జీటీలకు కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉండగా రోజుకు 700 నుంచి 800 మందికి మించి జరిగే పరిస్థితి లేదు. జిల్లాలోనే బదిలీలకు సుమారు 4 రోజులు పట్టొచ్చు. – గెడ్డం సుధీర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్సీపీ టీచర్స్ అసోసియేషన్ ఏలూరు (ఆర్ఆర్పేట): నూతన విద్యా సంవత్సరం నేటి నుంచి ప్రారంభం కానుంది. అయితే వారికి అసౌకర్యాలు స్వాగతం పలుకనున్నాయి. గతంలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లూ జరిగిపోయేవి. ఈ ఏడాది అందుకు భిన్నమైన వాతావరణంలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లనున్నారు. మధ్యలోనే నిలిచిపోయిన నిర్మాణాలు, మరుగుదొడ్లు, ఆహ్లాదకరమైన తరగతి గదులు లేకుండానే తరగతులకు హాజరుకావాల్సిన పరిస్థితి. కనీసం యూనిఫాం, స్కూల్ బ్యాగ్లు, షూలు ఇవ్వలేని పరిస్థితికి ప్రభుత్వం దిగజారి పోయింది. జిల్లాలో మొత్తం 11,227 పాఠశాలలున్నాయి. ప్రభుత్వ రంగానికి సంబంధించి 2641 ప్రాథమిక పాఠశాలలు, 990 పాథమికోన్నత పాఠశాలలు, 3583 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 1,27,699 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో ఏటా దాదాపు ఆగస్టు, సెప్టెంబర్ వరకూ ప్రవేశ అవకాశాలు కల్పించనున్న కారణంగా విద్యార్థుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు ఉపాధ్యాయుల బదిలీల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అనేక నిబంధనలు అసంబద్ధంగా ఉండడంతో మొన్నటి వరకూ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చాయి. ప్రభుత్వం ఉపాధ్యాయుల డిమాండ్లను పెడచెవిన పెట్టడంతో ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిపి ఐక్య ఉపాధ్యాయ వేదికగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశాయి. చివరకు ప్రభుత్వం దిగొచ్చింది. అప్పటి వరకూ బదిలీలను వెబ్ అప్షన్ల ద్వారా నిర్వహించాలని ప్రయత్నించిన ప్రభుత్వం ఉపాధ్యాయుల డిమాండ్లకు తలొగ్గి మాన్యువల్ కౌన్సెలింగ్కు ఏర్పాటు చేయక తప్పలేదు. ఎస్జీటీల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ వాస్తవానికి సోమవారమే ప్రారంభించినప్పటికీ మంగళవారం ఏలూరులో నిర్వహించిన కౌన్సిలింగ్లో సర్వర్ల సమస్య కారణంగా సోమవారం రాత్రి 11 గంటల వరకూ కూడా ప్రారంభం కాలేదు. దీంతో ఈ కౌన్సిలింగ్ను మంగళవారానికి వాయిదా వేసి బుధవారం ఉదయం నుంచి కొనసాగించారు. బుధవారం మొత్తం రోజంతా మున్సిపల్ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్తోనే సరిపోయింది. ఇతర యాజమాన్యాల్లోని పాఠశాలలకు చెందిన సుమారు 2800 మంది ఎస్జీటీల బదిలీలకు సంబంధించి కౌన్సిలింగ్ గురువారం చేపట్టనున్నారు. పూర్తిగా రాని బ్యాగ్లు, షూలు, యూనిఫాం గత ప్రభుత్వ హయాంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన రోజునే జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు అందించేవారు. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, డిక్షనరీలతో పాటు ముఖ్యంగా స్కూల్ యూనిఫారం, షూలు, స్కూలు బ్యాగులు అందించే ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సమయానికి యూనిఫాం ఇచ్చే పరిస్థితి లేదు. ఇంతవరకూ కేవలం 85675 బ్యాగులు మాత్రమే వచ్చాయి. షూలు 59,080 మాత్రమే వచ్చాయి. స్కూల్ యూనిఫారం విషయానికి వస్తే జిల్లాకు ఇంతవరకూ 80,637 జతల యూనిఫాం మాత్రమే వచ్చింది. ఉపాధ్యాయులు లేకుండా తరగతులు ఎలా ? ఒకపక్క ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్ జరుగుతుండగానే తరగతులు ప్రారంభించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉపాధ్యాయులు లేకుండా పాఠశాలలు ప్రారంభించి ఏం లాభమని ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీస్తున్నారు. కౌన్సెలింగ్ పూర్తయిన తరువాత పాఠశాలలను ప్రాంభించే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. నేటి నుంచే పాఠశాలల పునఃప్రారంభం ఇప్పటికీ పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ పూర్తిగా రాని బ్యాగ్లు, షూలు, యూనిఫాం -
సాక్షి కార్యాలయంపై దాడి హేయం
కామవరపుకోట/నిడమర్రు/ఉంగుటూరు: పత్రికల్లో వార్తలు ప్రచురించారనే అక్కసుతో సాక్షి పత్రిక కార్యాలయాలపై దాడి చేయడం హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు అన్నారు. ఏలూరు సాక్షి కార్యాలయంపై టీడీపీ మూకలు చేసిన దాడిని ఖండిస్తూ బుధవారం మండలంలో ఆడమిల్లిలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పత్రికల స్వేచ్ఛను హరించే ఇలాంటి పనులు ప్రజాస్వామ్యంలో సరైనవి కావని, దుశ్చర్యలను కూటమి ప్రభుత్వం ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని అన్నారు. సాక్షి కార్యాలయంపై టీడీపీ నాయకులు, కార్యకర్తల దాడిని ఖండిస్తూ నిడమర్రు పోలీస్ స్టేషన్లో బుధవారం ఎాత్రికేయులు, ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సై వీరప్రసాద్కు ఫిర్యాదు చేశారు. జెడ్పీటీసీ కోడే కాశి మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను హరించేలా ఏలూరు సాక్షి కార్యాలయంపై దాడులు చేసి ఫర్నీచర్ తగల బెడుతున్నా పోలీసులకు పట్టదా? అని ప్రశ్నించారు. మీడియాను బెదిరించి దౌర్జన్యాలకు పాల్పడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వైఎస్సార్సీపీ పార్టీ బూత్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి యెలిశెట్టి పాపారావు బాబ్జి అన్నారు. బుధవారం చేబ్రోలు పోలీస్స్టేషన్లో విలేకరులతో కలిసి దాడులపై ఫిర్యాదు చేశారు. మీడియా వ్యవస్థపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని, దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు. పత్రికా కార్యాలయాలపై దాడులు సరికాదు ఏలూరు(ఆర్ఆర్పేట): ఏలూరులో సాక్షి కార్యాలయం వద్ద ఫర్నిచర్ను తగలబెట్టిన ఘటన దురదృష్టకరమని, పత్రికా కార్యాలయంపై దాడులను పూర్తిగా ఖండిస్తున్నామని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడడం, కార్యాలయాలపై దాడులకు పూనుకోవడం హేయమైన చర్యలని అన్నారు. ఇలాంటి సంఘటనలు తిరిగి జరగకుండా ఉండేలా పోలీస్ అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. -
532 మంది ఎస్జీటీలకు బదిలీ
ఏలూరు (ఆర్ఆర్పేట): పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు బుధవారం బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏలూరు నగరపాలక సంస్థకు చెందిన 166 మందికి బదిలీ చేశారు. అనంతరం పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ మున్సిపల్ యాజమాన్యాల్లో పనిచేస్తున్న 266 మందికి స్థానచలనం కల్పించారు. సాయంత్రం నుంచి జిల్లా పరిషత్ యాజమాన్యం పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలు 100 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి సీనియారిటీ ప్రాతిపదికన కోరుకున్న చోటుకు బదిలీ చేశారు. కౌన్సిలింగ్ గురువారం కూడా కొనసాగుతుందని విద్యాశాఖాధికారి తెలిపారు. -
పంట నాణ్యతపై దృష్టి పెట్టాలి
పెదవేగి: రాష్ట్రంలో ఏ రైతుకు కష్టం వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. పెదవేగి మండలం వంగూరులోని విజయ గార్డెన్స్లో కోకో రైతులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంటల నాణ్యతపై ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు. నాణ్యమైన పంటలకు అధిక ధర లభిస్తుందన్నారు. కోకో రైతులు, కంపెనీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేసి కోకో కేజీ రూ.500 కొనుగోలు చేసేలా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని, దీనిలో రూ.50 ప్రభుత్వం సబ్సిడీగా రైతుకు అందిస్తుందన్నారు. కోకో రైతులు ఆందోళన చెందవద్దని, రైతుల వద్ద ఉన్న కోకో పంటను కంపెనీలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. వ్యవసాయ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి బుడితి రాజశేఖర్ మాట్లాడుతూ కోకో పంటను రైతుల నుంచి పూర్తిగా కొనుగోలుకు చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు, వ్యవసాయ కమిషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, హార్టికల్చర్ డైరెక్టర్ కె. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పీ–4 కార్యక్రమంలో భాగంగా దెందులూరుకు చెందిన పంది శ్రీనుకు 100 గొర్రెలను మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం అందజేశారు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలనే లక్ష్యంతో రూపొందించిన పి–4 విధానం పేదరికంలో ఉన్న ప్రజల జీవన పరిస్ధితులు మెరుగుపరచేందుకు దోహదపడుతుందన్నారు. -
మా జీవనోపాధికి గండి
కై కలూరు: నిబంధనల ప్రకారం సర్వీసు గడువు మిగిలి ఉండగానే ఉద్యోగాలు తీసేశారని రేషన్ దుకాణాల ఎండీయూ ఆపరేటర్లు వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్)ను కై కలూరు పార్టీ కార్యాలయంలో బుధవారం కలిసి వినతిపత్రం అందించారు. ఎండీయూ సంఘ జిల్లా అధ్యక్షుడు సంగుర్తి జయరాజు మాట్లాడుతూ ఆపరేటర్ల సర్వీసు 18 నెలలు ఉందన్నారు. ఉద్యోగాలు పోవడంతో కుటుంబం మొత్తం వీధిన పడ్డాయన్నారు. తమ సమస్యలు వెల్లడించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసే అవకాశం కల్పించాలని కోరారు. డీఎన్నార్ మాట్లాడుతూ ఎండీయూ ఆపరేటర్ల ఇబ్బందులను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో ఎండీయూ సంఘ కార్యదర్శి కమతం సుబ్బయ్యదాసు తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి సాగుపై అవగాహన
ద్వారకాతిరుమల: ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించడం ద్వారా తమకు ప్రకృతి సాగు విధానాలు, ప్రయోజనాలపై అవగాహన కలిగిందని ఇథియోపియా దేశ బృందం తెలిపింది. మండలంలోని గుండుగొలనుకుంటలో ఆదర్శ రైతు గోపాలకృష్ణమూర్తికి చెందిన ప్రకృతి వ్యవసాయ పొలాన్ని ఇథియోపియా దేశానికి చెందిన 10 మంది సభ్యులతో కూడిన బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా బృంద సభ్యులు ప్రకృతి వ్యవసాయ ఇన్పుట్ తయారీ కేంద్రాన్ని(ఎన్పీఎం షాప్) పరిశీలించారు. అనంతరం వారు సీడ్ పెలైటెజేషన్, అగ్నిఅస్త్రం, ద్రవ జీవామృతం, బీజామృతం, దశపర్ణి తయారీ విధానాలను ప్రత్యక్షంగా వీక్షించారు. పొలంలో 25 రకాల పంటలను సాగు చేసి ఆదాయాన్ని పొందుతున్న తీరు వారిని ఆకట్టుకుంది. -
పైప్లైన్ లీకేజీకి పరిష్కారం
కై కలూరు: వాహనదారులు, ప్రజలకు ఇబ్బందికరంగా మారిన బైపాస్ రోడ్డు మలుపు వద్ద ఏర్పడిన పైప్లైన్ లీకేజీ సమస్యను పంచాయతీ అధికారులు పరిష్కరించారు. దీని కారణంగా రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతతో ప్రమాదాలు అనే శీర్షికతో సాక్షిలో కథనం బుధవారం వెలువడిన విషయం పాఠకులకు విధితమే. దీనిపై పంచాయతీ ఈవో ప్రత్తిపాటి ఆనంద భూషణం తక్షణం స్పందించారు. పంచాయతీ సిబ్బంది పొక్లయిన్ ఉపయోగించి పైపులైన్లకు మరమ్మత్తులు చేయించారు. డీఎస్సీ పరీక్షలకు 566 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షకు మెత్తం 566 మంది హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం పరీక్షకు 180 మందికి 177 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 200 మందికి 197 మంది, మధ్యాహ్నం 200 మందికి గాను 192 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. పుస్తకాల పేరిట వ్యాపారం ఏలూరు(ఆర్ఆర్పేట): విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఏలూరు జిల్లా పెదపాడు మండలం హనుమాన్ జంక్షన్ చైతన్య స్కూల్లో పుస్తకాలు అమ్మకాలు జరుగుతున్నాయని.. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కొలిక్కపోగు లెనిన్ అన్నారు. చదువు పేరుని అడ్డుపెట్టుకుని తల్లిదండ్రులపై భారం మోపి దోచుకుంటున్నారని తెలుగు రాష్ట్రాల్లో పుస్తకాల పేరుతోనే కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు విద్యాశాఖ అధికారులు కొమ్ము కాస్తున్నారని.. విద్యాసంస్థల్లో వసతులు లేకుండా అన్ని ఉన్నాయని.. తమ స్కూలు గొప్పదని తల్లిదండ్రులను మోసం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మనోజ్ మహర్షి పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్పై వివక్ష దెందులూరు: గ్రామ సర్పంచ్గా ఉన్న తనకు 8 నెలలుగా సచివాలయంలో కుర్చీ తీసివేశారని, తన గదిలో ఉన్న సర్పంచ్ బోర్డును కూడా తొలగించారని గోపన్నపాలెం సర్పంచ్ కే.నాగమల్లేశ్వరి అన్నా రు. బుధవారం గోపన్నపాలెం సచివాలయంలో విలేకరులకు తొలగించిన కుర్చీ, నేమ్బోర్డు చూపించారు. గ్రామ కార్యదర్శికి ఫోన్ చేస్తే తీయడం లేదని, సమాధానం ఇవ్వడం లేదని, తాను పంచాయతీలో పనులు చేసిన బిల్లులు కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ విషయంపై డీపీఓ, మహిళా కమిషన్, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. నెల క్రితం సర్పంచ్ కుర్చీ తీసిన సంగతి వాస్తవమేనని కార్యదర్శి స్టానిష్బాబు అన్నారు. కుర్చీ రిపేరు నిమిత్తం తీశామని చెప్పారు. విద్యుత్ అధికారుల బదిలీలు ఏలూరు (ఆర్ఆర్పేట): తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు, పశ్చిమ గోదావరి సర్కిళ్ల పరిధిలో పలువురు విద్యుత్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా స్టోర్స్లో ఏఈఈ అవుట్ డోర్గా పని చేస్తున్న మురళీకృష్ణను జంగారెడ్డిగూడెం ఆపరేషన్స్ ఏఈఈగా బదిలీ చేశారు. పెదవేగి డిప్యూటీ ఈఈ ఆపరేషన్స్గా పని చేస్తున్న బీవీ కృష్ణ రాజాను రాజోలు ఆపరేషన్స్ డిప్యూటీ ఈఈగా బదిలీ చేశారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ ఈఈగా పని చేస్తున్న ఐవీ మల్లేశ్వరరావును పెదవేగి, రంపచోడవరం రూరల్ ఆపరేషన్స్ డిప్యూటీ ఈఈ దివాకరరావును తణుకు బదిలీ చేశారు. -
గంజాయి తరలిస్తూ పట్టుబడిన యువకుడు
కుక్కునూరు: గంజాయి తరలిస్తూ ఓ యువకుడు జాలర్లకు పట్టుబడ్డాడు. వివరాల ప్రకారం కూనవరం మండలం పోలిపాక గోదావరి రేవు నుంచి గోదావరి దాటితే కుక్కునూరు మండలంలోని వింజరం గ్రామానికి చేరుకోవచ్చు. ఈ రేవు గుండా పలువురు కుక్కునూరు, కూనవరం మండలాలకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. బుధవారం ఓ యువకుడు వింజరం రేవుకు వెళ్లేందుకు పోలిపాక రేవుకు చేరుకున్నాడు. జాలర్లకు అనుమానం వచ్చి ఆ యువకుడి బ్యాగ్ని తనిఖీ చేయగా అతని వద్ద గంజాయి లభించింది. దీంతో జాలర్లు ఆ యువకుడిని పట్టుకుని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం బహిర్గతమైంది. ఈ విషయమై అక్కడి పోలీసులకు సమాచారం అందడంతో యువకుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. కాగా గత మూడు నెలల క్రితం కూడా పోలిపాక రేవు నుంచి వింజరం రేవు మీదుగా తెలంగాణకు గంజాయి తరలిస్తుండగా తెలంగాణ పోలీసులు బూర్గంపాడు వద్ద పట్టుకున్నారు. -
వృద్ధులకు బాసటగా నిలవాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): వృద్ధులను ఆదరించాలని, వారికి బాసటగా ప్రతి ఒక్కరూ నిలవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ కోరారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 15న ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న సదస్సులో ఎక్కువ మంది పాల్గొని వృద్ధుల సమస్యలు తెలుసుకోవాలని కోరారు. జూలై 5న రెండో జాతీయ లోక్ అదాలత్ జూలై 5వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రెండవ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలిపారు. రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, కుటుంబ వివాదాలు, బ్యాంకు లావాదేవీల కేసులు, వాహన ప్రమాద బీమా కేసులు, సివిల్ వివాదాలు, చిట్ ఫండ్ వివాదాలు లోక్అదాలత్లో రాజీ చేయడం జరుగుతుందన్నారు. గత లోక్ అదాలత్లో 5,236 కేసులు రాజీ చేసినట్లు చెప్పారు. కేసుల పరిష్కారంలో సమస్యలు ఎదురైతే 15100 లేదా 08812 224555 ద్వారా సంప్రదించాలన్నారు. -
ముగిసిన వరాల వెంకన్న కల్యాణోత్సవాలు
అత్తిలి: ఈడూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీవరాల వేంకటేశ్వరస్వామివారి కల్యాణ మహోత్సవాలు శ్రీపుష్పయాగోత్సవంతో బుధవారం ముగిశాయి. గ్రామానికి చెందిన పెరికల పాండురంగ, అనంతలక్ష్మి దంపతులచే స్వామివారిని 200 మూరల మల్లెపూలతో విశేషంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వాడపల్లి శేఖరాచార్యులు ఆధ్వర్యంలో పూజాధికాలను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. మంతెన సీతారామరాజు, కొట్టు పరశురామయ్య పర్యవేక్షణలో అల్లరి పళ్లెం డ్రా తీశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఆకుల వెంకటనారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు. పోక్సో కేసు నమోదు భీమవరం: మైనర్ బాలికను ప్రేమించి వివాహం చేసుకుని తల్లి అయిన తర్వాత తప్పించుకుని వెళ్లిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన సంఘటన ఇది. భీమవరం రెండో పట్టణంలోని ఒడిశాకు చెందిన ఓ బాలిక ఇంటి నుంచి వచ్చి భీమవరంలోని ఓ హోటల్లో పనికి చేరింది. అక్కడ అస్సాంకు చెందిన వ్యక్తితో పరిచయం కాస్తా పెళ్లి వరకు వెళ్లింది. గర్భం దాల్చడంతో విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటిని తీసుకుని అక్కడ ఉంచాడు. ఇటీవల ఆమెకు పాప పుట్టింది. తన తల్లిదండ్రులను చూసి వస్తానని వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాకపోవడంతో అక్కడి పోలీసులను ఆశ్రయించగా కృష్ణలంక పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి వివరాలను భీమవరం పోలీసులకు అప్పగించారు. సీఐ జి. కాళీచరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జీజీయూలో ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు
రాజానగరం: ఆస్ట్రేలియాలోని మెక్వెరీ యూనివర్సిటీ, ప్రముఖ సంస్థ కేపీఎంజీ ఇండియాలతో స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) అవగాహన ఒప్పందాలు చేసుకుంది. యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో దీనికి సంబంధించిన పత్రాలపై ప్రొ.ఛాన్సలర్ కె.శశికిరణ్వర్మ, కేపీజీఎం ఇండియా ప్రతినిధి నారాయణ్ రామస్వామి సంతకాలు చేసి, పరస్పరం మార్చుకున్నారు. ఈ సందర్భంగా జీజీయూ ఛాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో బోధన అందించేందుకు జీజీయూ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ప్రొ.ఛాన్సలర్ శశికిరణ్వర్మ మాట్లాడుతూ దీని ద్వారా బీటెక్లో సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్ చేసేందుకు అవకాశాలుంటాయన్నారు. కేపీజీఎం ఇండియా ప్రతినిధి నారాయణ్ రామస్వామి మాట్లాడుతూ, డిజిటల్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో జీజీయూతో కలిసి పని చేయడం ద్వారా విద్యార్థులకు చక్కటి భవితను అందించే అవకాశం లభించిందన్నారు. మెక్వెరీ యూనివర్సిటీ సైబర్ స్కిల్ అకాడమీ సీఈఓ మాట్ బుష్బై ఆన్లైన్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో కేపీఎంజీ ఇండియా ప్రతినిధులు మహావీర్, రాఘవన్ ఎస్, జీజీయూ సాంకేతిక సలహాదారు సుమంత్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీబీ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంఎంఎస్ శర్మ, డైరెక్టర్ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు, ప్రిన్సిపాళ్లు, డైరెక్టర్లు, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల తనిఖీ జంగారెడ్డిగూడెం: నిబంధనలు ఉల్లంఘించి భవనాలు నిర్మిస్తున్నారని అందిన ఫిర్యాదు మేరకు మంగళవారం పట్టణంలోని ఏడు భవనాలను రాజమండ్రి రీజనల్ డైరెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన అధికారులు తనిఖీలు చేశారు. టౌన్ ఫ్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ జ్యోత్స్న, టీపీఏ రమణ, స్థానిక టీపీవో చాందిని, సచివాలయ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. నిబంధనలను అతిక్రమించినట్లు గుర్తించారని, నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తారని చాందిని తెలిపారు. -
రేణుకాచౌదరిపై చర్యలు తీసుకోవాలి
పెనుమంట్ర: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను పెనుమంట్ర జెడ్పీటీసీ సభ్యురాలు కర్రి గౌరీ సుభాషిణి తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆమె మార్టేరు లో ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. వైఎస్ జగన్పై వ్యక్తిగత కక్షతో మాతృమూర్తులు తలదించుకునే వ్యాఖ్యలు చేసిన రేణుకా చౌదరిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది తల్లులను రెచ్చగొట్టి వారి బిడ్డలను చంపించే ప్రయత్నం చేస్తున్న రేణుకపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలు చూసి సహించలేని పరిస్థితి నెలకొందని, ఒక తల్లిగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సహించరాని విషయం అన్నారు. చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు ఆకివీడు: స్థానిక సంతపేటలోని పడాల వారి వీధిలో ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన వృద్ధుడు షేక్ మీరాను మంగళవారం చెరుకువాడ ప్రాంతంలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ఆకివీడు రూరల్ సీఐ జగదీశ్వరరావు చెప్పారు. నిందితుడిని భీమవరంలోని కోర్టుకు హాజరుపరచగా ఈ నెల 23వ తేదీ వరకూ రిమాండ్ విధించినట్లు తెలిపారు. అతనిపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేసిన విషయం విదితమే. కేసును భీమవరం డీఎస్పీ జయసూర్య దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
తహసీల్దార్ బదిలీ.. రాజకీయ కుట్రేనా!
కొయ్యలగూడెం: కొయ్యలగూడెం తహసీల్దార్ కుంజా చెల్లన్నదొర బదిలీ వ్యవహారం ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఆగస్టులో కొయ్యలగూడెం తహసీల్దార్గా చెల్లన్నదొర బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన్ను కలెక్టరేట్లోని సూపరింటెండెంట్ కార్యాలయంలో కోఆర్డినేషన్ సెక్షన్కి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొయ్యలగూడెంలోని జాతీయ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న భూమి విషయంలో ఆయన రాజకీయ ఒత్తిళ్లకు లొంగకపోవడమే బదిలీకి కారణమని జోరుగా ప్రచారం సాగుతోంది. అసలు కారణం ఇదేనా! గత నెల రోజులుగా కొయ్యలగూడెంలోని ఓ ప్రాంతానికి చెందిన అతి విలువైన ఎకరం యాభై సెంట్లు భూమిపై వివాదం సాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 45 సంవత్సరాల నుంచి సుమారు వంద కుటుంబాల వారు నివసిస్తున్న ప్రాంతాన్ని ఒక వ్యక్తి తనకు చెందినదిగా రికార్డును తహసీల్దార్కు సమర్పించడం జరిగింది. దీనిపై పలుమార్లు అధికారులతో కలిసి సర్వే నిర్వహించి నివేదికను తహసీల్దార్ ఆర్డీవోకి అందజేశారు. సుమారు రూ.15 కోట్ల విలువైన భూమిని తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు దావా వేసిన వ్యక్తి ద్వారా కట్టబెట్టడానికి కూటమి ప్రభుత్వానికి చెందిన ఒక ఎంపీ లాబీయింగ్ నిర్వహించినట్లు తెలిసింది. ఎకరంన్నర భూవివాదం సక్సెస్ అయితే ఇదే ప్రాంతంలోని మరో 11 ఎకరాల భూమి కూడా సొంతం చేసుకోవడానికి (దీని విలువ సుమారు రూ.40 కోట్లు) ఎంపీ కోటరి ప్రయత్నిస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఎంపీ పార్టీకే చెందిన ఎమ్మెల్యే ఒకరు దీనికి వంత పాడగా కూటమిలోని మరో ఎమ్మెల్యే వ్యతిరేకించడంతో ఆయన్ను అధిష్టానం పెద్దల ద్వారా బుజ్జగించినట్లు తెలిసింది. తుదకు తహసీల్దార్ నివాసితులైన వారికే అనుకూలంగా రిపోర్టు ఇవ్వడంతో, మింగుడు పడని ఎంపీ ప్రాధాన్యత లేని శాఖకు తహసీల్దారును బదిలీ చేయించారని రెవెన్యూ శాఖలో గుసగుసలు వినవస్తున్నాయి. అనంతరం తహసీల్దారుగా రెవెన్యూ శాఖలోని డిప్యూటీ తహసీల్దార్ స్థాయి ఉద్యోగిని నియమిస్తూ ఆగమేఘాలపై ఉత్తర్వులు జారీచేశారు. కానీ సదరు రెవెన్యూ ఉద్యోగి కుంపటిలా ఉన్న భూవ్యవహారం ఎక్కడ తన పీకకు చుట్టుకుంటుందోనన్న భయంతో బాధ్యతలు స్వీకరించడానికి విముఖత వ్యక్తం చేశారని అంటున్నారు. కొందరు పెద్దలకి వంత పాడని అధికారి కక్ష గట్టి కలెక్టరేట్కి ట్రాన్స్ఫర్ చేశారని గుసగుసలు -
ఇంజినీరింగ్ కార్మికుల వేతనాలు పెంచాలి
నూజివీడు: ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ పట్టణ కార్యదర్శి జీ రాజు డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపాలిటీలోని ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, రూ.26 వేల కనీస వేతనాన్ని చెల్లించాలన్నారు. ప్రతి నెలా పదో తేదీ లోపు వేతనాలు చెల్లించాలని, 25 శాతం పీఎఫ్ చెల్లించాలన్నారు. సమ్మె ఒప్పంద జీఓలు ఇవ్వాలని, కార్మికులందరికి సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్నారు. -
కొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలి
ఏలూరు(ఆర్ఆర్పేట): కొల్లేరును 5 నుంచి 3వ కాంటూరుకు కుదించాలని, కొల్లేరు ప్రజల ఉపాధిని కాపాడాలని, ఎకో సెన్సిటివ్ జోన్ను ఉపసంహరించుకోవాలని సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. మంగళవారం ఏలూరు ఉద్దరాజు రామం భవనంలో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి అధ్యక్షతన కొల్లేరు ప్రజల సమస్యల పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ ప్రజా సంఘాలు, కొల్లేరు ప్రాంత నాయకులు, రైతు సంఘాలు, సామాజిక వేత్తలు పాల్గొని కొల్లేరు ప్రజల సమస్యలపై చర్చించారు. 2006లో ఆపరేషన్ కొల్లేరు పేరుతో ఐదో కాంటూరు లోపల ఉన్న వేలాది ఎకరాలను చెరువులన్నింటినీ ధ్వంసం చేసి లక్షలాదిమంది కొల్లేరు ప్రజల జీవనాన్ని నాశనం చేశారని విమర్శించారు. దీనికితోడు కొందరు పర్యావరణం పేరుతో సుప్రీంకోర్టుకు వెళ్లారని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ కాకపోవడంతో కొల్లేరు పేదల సాగులో ఉన్న 15వేల ఎకరాలు చెరువులు ధ్వంసం వేయాలని సుప్రీంకోర్టు ఏకపక్షంగా తీర్పు ఇచ్చిందన్నారు. కొల్లేరు చుట్టుపక్కల 89 గ్రామాల్లోని లక్షలాదిమంది ప్రజల పొట్ట కొట్టే నిర్ణయాన్ని తక్షణమే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బీ.బలరాం, రిటైర్డ్ ఐఆర్ఎస్, కొల్లేరు గ్రామాల అభివృద్ధి సంఘం అధ్యక్షుడు చాగంటి సంజయ్, కొల్లేరు ప్రాంత మహిళా నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు, కొల్లేరు రైతు సంఘం, కొల్లేరు గ్రామాల అభివృద్ధి సంఘం నాయకులు తదితరులు మాట్లాడారు. రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్లు ● కొల్లేరును 5 నుంచి 3వ కాంటూరుకు కుదించాలి. కొల్లేరు ఆపరేషన్ సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కొల్లేరు ప్రజలకు జీవనోపాధి కల్పించాలి. 146 సొసైటీలు పునరుద్ధరణ చేయాలి. 14,800 ఎకరాలు జిరాయితీ భూమి హక్కుదార్లకు అప్పగించాలి. ● కొల్లేరు ప్రజల సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. ప్రస్తుత అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి, సుప్రీంకోర్టుకు నివేదించాలి. ● కొల్లేరు చుట్టుపక్కల ఫ్యాక్టరీల నుంచి వస్తున్న మురుగు నివారణకు చర్యలు తీసుకోవాలి. ప్రతిపాదిత రెగ్యులేటర్లు నిర్మించాలి. 3వ కాంటూరు పరిధిలో సరస్సును అభివృద్ధి చేయాలి. ● కొల్లేరులో ఉన్న వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములను పేదలకు పంచాలి. అటవీ అధికారుల వేధింపులు, అవినీతి అరికట్టాలి. ● 5వ కాంటూరు పైన కొల్లేరు ఆపరేషన్ పేరుతో కొట్టేసిన 9వేల ఎకరాలు తిరిగి అప్పగించాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఆ ప్రాంత ప్రజలకు అదనంగా ఉపాధి హామీ పనులు కల్పించాలి. ● కొల్లేరు ఆపరేషన్ సందర్భంగా ప్రజలకు ఇస్తానన్న నష్టపరిహారం, ఉపాధికల్పనకు చర్యలు చేపట్టాలి. కొల్లేరు గ్రామాలకు రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలి. ఎకో సెన్సిటివ్ జోన్ను ఉపసంహరించుకోవాలి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్ -
దగా పాలనకు విజయోత్సవాలా?
బదిలీ.. రాజకీయ కుట్రేనా! కొయ్యలగూడెం తహసీల్దార్ కుంజా చెల్లన్నదొర బదిలీ చర్చనీయాంశంగా మారింది. భూమి విషయంలో ఒత్తిళ్లకు లొంగకపోవడమే బదిలీకి కారణమని ప్రచారం సాగుతోంది. 8లో uజూదాలకు బానిసై.. జూదాలకు బానిసైన ఓ వ్యక్తి యజమాని ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 8లో uబుధవారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2025ఏలూరు (ఆర్ఆర్పేట): దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమం అంటే ఏమిటో ప్రజలకు రుచి చూపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాయంలో పేదల సంక్షేమం కోసం నవరత్నాలు ప్రకటించి వాటిని అమలు చేశారు. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, మద్య నియంత్రణ, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, పేదలందరికీ ఇళ్లు, వైఎస్సార్ ఆసరా, చేయూత, పింఛన్ల కానుక ఇలా అన్నింటిని అమలు చేశారు. సూపర్ సిక్స్ ఊదరగొట్టి.. పథకాలు అమలు చేయలేక చతికిలపడింది కూటమి ప్రభుత్వం. ఓటేసిన ప్రజలను మోసగిండమే కాకుండా.. ఈ నెల 12న భారీ ఎత్తున విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. సంక్షేమ పథకాలు అందించలేని ప్రభుత్వం, అభివృద్ధి కార్యక్రమాలు చేయని నాయకులు విజయోత్సవాలు ఎలా చేసుకుంటారని నిలదీస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఎగ్గొట్టి ప్రజలను మోసం చేసినందుకు విజయోత్సవాలు చేసుకుంటారా? అన్ని ప్రశ్నిస్తున్నారు. మేనిఫెస్టోలో చెప్పన హామీలు కూడా.. జగన్ మేనిఫెస్టోలో ఇవ్వని పలు సంక్షేమ పథకాలను కూడా అందించారు. 43,765 స్వయం సహాయక సంఘాలకు నాలుగు విడతలుగా రూ.221.99 కోట్లు, 9814 గ్రూపుల్లోని 39,225 మందికి రూ.546.53 కోట్ల సీ్త్రనిధి రుణాలు, వైఎస్సార్ కాపు నేస్తంలో 19,868 మందికి రూ.119.21 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారా 14,274 మందికి రూ.42.82 కోట్లు అందించారు. జిల్లాలో 868.566 కిలోమీటర్ల రహదారులను రూ.627.96 కోట్లతో అభివృద్ధి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా సూపర్ సిక్స్ పథకాలనే అమలు చేయలేక చతికిల పడింది. సూపర్ సిక్స్ పేరిట ఇంత మోసమా? గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి సూపర్సిక్స్ పథకాలు పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల సభల్లో ఊదరగొట్టారు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు, ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేల ఆర్థిక సహాయం, మహిళకు నెలకు రూ.1500, మహిళలకు ఉచిత బస్సు. ఈ పథకాలన్నీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమలు చేస్తామని బీరాలు పలికింది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్క గ్యాస్ సిలెండర్ తప్ప ఇంతవరకూ మరో పథకానికి శ్రీకారం చుట్టలేదు. గ్యాస్ సిలెండర్కు కూడా ఒక సిలెండర్కు మాత్రమే నగదు జమచేశారు. న్యూస్రీల్ మేనిఫెస్టోలో చెప్పని హామీలు అమలు చేసిన జగన్ ఏడాది గడుస్తున్నా సూపర్ సిక్స్కు మోక్షం లేదు ఏ పథకం అమలు చేయకుండా కూటమి ఉత్సవాలపై జనాగ్రహం గత ప్రభుత్వంలో జిల్లాకు లబ్ధి అమ్మ ఒడిలో ఏటా 1,78,214 మందికి మొత్తం రూ.1069.30 కోట్లు అందచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్లో ఏటా 37,750 మందికి రూ.142.96 కోట్లు జమ చేశారు. వైఎస్సార్ చేయూతలో 1,16,491 మందికి రూ.561.53 కోట్లు వైఎస్సార్ ఆసరాలో నాలుగు విడతల్లో 3,55,315 మంది మహిళలకు రూ.1305.05 కోట్లు ఆరోగ్యశ్రీ ద్వారా 1,95,651 మందికి రూ.410.18 కోట్లతో వైద్యం పేదలందరికీ ఇళ్ల పథకంలో 1,16,431 మందికి ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్లు, 98,874 మందికి ఇళ్ళనిర్మాణం కోసం రూ.713. 17 కోట్ల ఖర్చు రైతు భరోసాలో 2,35,847 మంది రైతులకు రూ.1839.24 కోట్లు జలజీవన్ మిషన్లో రూ. 606.08 కోట్లతో పల్లెల్లో రక్షిత మంచినీటి పథకాన్ని అమలు ఉద్యోగాలిస్తారనే నమ్మకం పోయింది 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, లేదా నెలకు 3 వేల భృతి అని చెప్పారు. దీంతో కూటమి అభ్యర్థికి గుడ్డిగా ఓటేశాం. ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా ఉద్యోగం మాట అటుంచి భృతి మాట ఎత్తడం లేదు. ప్రభుత్వం వలంటీర్లను తొలగించింది, రేషన్ వాహనాలను తొలగించి మరికొంతమందికి ఉపాధిని దూరం చేసింది. – జొన్నగడ్డ సుజీవ్ కుమార్, నిరుద్యోగి మోసగించడమే.. మహిళలకు ఉచిత బస్సు అనే పథకానికి పెద్ద ఖర్చేమీ అవదు. అలాంటి చిన్న పథకాన్ని కూడా అమలు చేయకపోవడా న్ని ఏమనుకోవాలి. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. మన పాలకులు ఆపాటి చేయలేకపోవడం దురదృష్టకరం. గ్యాస్ తప్ప ఇంకేమీ ఇవ్వక పోవడం మహిళలను మోసగించడమే. – గొల్లవిల్లి ఆదిలక్ష్మి, గృహిణి సంక్షేమం రుచి చూపించిన జగన్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు సంక్షేమం అంటే ఏమిటో రుచి చూపించిన గత ప్రభుత్వాన్ని, ఏడాది గడిచినా ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయని కూటమి ప్రభుత్వాన్ని బేరీజు వేసుకుంటూ ప్రజల్లో పెద్ద చర్చ సాగుతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ సంక్షేమాన్ని మరిచిపోకుండా పేద ప్రజలకు ఇళ్లు, పేద మహిళలకు వివిధ రూపాల్లో నగదు జమ, ప్రతీ నెలా ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించారు. ఏడాది గడుస్తున్నా కేవలం మాటలు తప్ప చేతల్లోకి దిగని కూటమి ప్రభుత్వానికి నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. -
పోలీసుల సాక్షిగా దారుణం
మూడు రోజులుగా ఏలూరు సాక్షి ఆఫీసు వద్ద దాడులు ఏలూరు టౌన్: ఏలూరు ఎన్ఆర్ పేటలోని సాక్షి జిల్లా కార్యాలయం కింద ఉన్న ఫర్నీచర్ను టీడీపీ గూండాలు పెట్రోలు పోసి తగలబెట్టడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తమ ఇళ్లకు ఎక్కడ నిప్పు అంటుకుంటుందోనని ఆందోళనకు గురయ్యారు. అధికార టీడీపీ నేతల ప్రొద్బలంతో సాక్షి కార్యాలయంపై వరుసగా మూడు రోజులు దాడులకు తెగబడడం రెడ్బుక్ రాజ్యాంగం కాక ఇంకేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏలూరు ఎన్ఆర్ పేటలోని సాక్షి జిల్లా కార్యాలయం వద్ద గత మూడు రోజులుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఏలూరు సాక్షి కార్యాలయం వద్దకు దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు భారీగా వస్తున్నారనే విషయం పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగానికి తెలియకపోవడం గమనార్హం. సాక్షి కార్యాలయం వద్ద భవన యజమానులకు సంబంధించిన ఫర్నీచర్ను పెట్రోలు పోసి తగలబెడుతున్నా అక్కడ ఉన్న పోలీసులకు గానీ, నిఘా విభాగానికిగాని ఏ మాత్రం తెలియకపోవడం శోచనీయం. మీడియా గొంతునొక్కే ప్రయత్నం : ఏలూరు సాక్షి కార్యాలయంపై దెందులూరు టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు తెగబడి ఫర్నీచర్ను పెట్రోలు పోసి నిప్పంటించిన సంఘటనను పలువురు తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. అగ్నికి ఆహుతైన ఫర్నిచర్ను పరిశీలించారు. గతంలో సాక్షి కార్యాలయంలో ధ్వంసం చేసిన కంప్యూటర్లను సైతం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మీడియా గొంతునొక్కే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు పత్రికా కార్యాలయాలపై దాడులకు దిగడం దుర్మార్గమన్నారు. జిల్లా ఎస్పీ ప్రతాప శివ కిషోర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి సమగ్రమైన దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి శిక్షించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఇదే తరహాలో ప్రభుత్వంలో ఉన్న నాయకులు మీడియాపై దాడులకు పాల్పడటం ద్వారా చెడు సంప్రదాయానికి బీజం వేస్తున్నట్లు అవుతుందని ఇలాంటివి ఎవరు చేసినా తప్పేనని అభిప్రాయపడ్డారు. -
గ్రామాల్లో తాగునీటి సరఫరాకు చర్యలు
సంత మార్కెట్లో చెత్తాచెదారాల తొలగింపు తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని బ్రహ్మానందరెడ్డి సంత మార్కెట్, పండ్ల మార్కెట్లో మంగళవారం సాయంత్రం చెత్త చెదారాలు, వ్యర్థాలను తొలగించారు. మార్కెట్లో చెత్తాచెదారాలు, వ్యర్థాలు తొలగించడం లేదని, ఈగలు వాలడం, దుర్గంధం వెదజల్లుతుండడంతో ‘పొంచి ఉన్న వ్యాధుల ముప్పు‘ శీర్షికన సాక్షి మంగళవారం కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన మున్సిపిల్ సిబ్బంది కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్ వద్ద పరిసరాలను పరిశుభ్రం చేశారు. పారిశుద్ధ్య కార్మికులచే, రెండు స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కాంపాక్టర్లను ఉపయోగించి చెత్తాచెదారాలు, వ్యర్థాలను తొలగించారు. మామిడి పండ్లు ట్రేలలో వ్యర్థాలను సైతం తొలగించారు. భీమడోలు: గ్రామాల్లో తాగునీటి కోసం గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులపై ‘తాగునీటి వెతలు’ శీర్షికన మంగళవారం సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు స్పందించారు. గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ టి.త్రినాధబాబు ఆకస్మికంగా పర్యటించారు. గుండుగొలనులో ఆర్డబ్ల్యూఎస్ డీఈ రామారావు, ఏఈ సుబ్రహ్మణ్యంలతో కలిసి ఆయన వింధ్యవాసిని, బ్రాహ్మణ చెరువుల నీటి మట్టాలను పరిశీలించారు. ఇకపై పూర్తిగా బోర్ నీటిని ఇవ్వద్దని, తక్కువ బోర్ నీటిని మంచినీటిలో కలిపి ఫిల్టర్ చేసి గ్రామ ప్రజలకు సరఫరా చేయాలని గ్రామకార్యదర్శికి సూచించారు. గుండుగొలను, భీమడోలు, కురెళ్లగూడెం, పూళ్ల తదితర గ్రామాల్లోని మంచినీటి చెరువుల్లో చిక్కపడిన నీరు పల్చబడేందుకు పటికను కట్టించారు. ఫిల్టర్ బెడ్స్లో నింపుతున్న నీటిని ఆయన పరిశీలించారు. చెరువుల్లోని నీటి నాణ్యతను పరీక్షించేందుకు నమూనాలు సేకరించారు. గోదావరి కాల్వకు నీటిని వదిలిన నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో నీటి మట్టాలు పెరిగే అవకాశాలున్నాయన్నారు. తక్షణమే చెరువుల్లోకి నీటిని నింపేలా తగు చర్యలను తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో గ్రామకార్యదర్శి కేవీ తనూజ, సచివాలయ ఉద్యోగులు, ఆర్డబ్ల్యూఎస్ వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్, సిబ్బంది చందు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
చింతలపూడి: చింతలపూడి మండలం, జార్జిపేట గ్రామానికి చెందిన గాదె కుమార్రాజు(45) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. మంగళవారం పొలంలో పనికి వెళ్లిన కుమార్రాజు తెగిపడి ఉన్న విద్యుత్ వైరును చూసుకోకుండా నీళ్లలోకి దిగడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య ఇటీవలే మృతి చెందడంతో కుమారుని వద్ద ఉంటున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమార్రాజు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.విద్యుత్ బిల్లులు పెంచి మరోసారి మోసంఅత్తిలి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిత్యావసరాల ధరలు అడ్డూ అదుపు లేకుండా పెంచి సామాన్య ప్రజలపై పెనుభారం మోపుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగ విభాగం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు బుడితి సుజన్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. విద్యుత్ బిల్లులు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచమని ఎన్నికల ముందు చంద్రబాబు బూటకపు హామీలను గుప్పించి అధికారం చేపట్టిన మరుక్షణమే అనేక సార్లు విద్యుత్ బిల్లులు పెంచి ప్రజలను దారుణంగా మోసం చేశారన్నారు. మరోపక్క వేసవి తాపంతో అల్లాడుతుంటే అసంఘటిత విద్యుత్ కోతలు విధించడంతో వృద్ధులు, చంటిపిల్లలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం ప్రచార ఆర్భాటాలతో కాలం గడిపేస్తోందని ఎద్దేవా చేశారు. విద్యార్థులకు స్కాలర్ షిప్, తల్లికి వందనం, వసతి దీవెన వంటి పథకాలకు తిలోదకాలిచ్చి పేద విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుందని ఆరోపించారు. ప్రభుత్వ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిని దారుణమైన వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.సరిహద్దు వివాదంలో కత్తులతో ఇరువర్గాల దాడిఏలూరు టౌన్: సరిహద్దు వివాదంపై ఇరువర్గాలు కత్తులతో దాడులకు పాల్పడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ఫిరంగులదిబ్బ ప్రాంతానికి చెందిన ఇబ్బా వెంకటేశ్వరరావుకు, మరో వ్యక్తి వెంకటేశ్వరరావు మధ్య ఇంటి సరిహద్దు వివాదం ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం వీరిద్దరూ బాహాబాహీకి దిగి రాడ్డులతో కొట్టుకున్నారు. కుటుంబ సభ్యులు ఇద్దరినీ ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇదే సందర్భంలో నాగరాజు తన తండ్రి ఇబ్బా వెంకటేశ్వరరావును పరామర్శించి ఆసుపత్రి నుంచి ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలో రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో వేరే వర్గానికి చెందిన కొందరు అతడ్ని నిలువరించి ఘర్షణకు దిగారు. ఇరు వర్గాలు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నాగరాజుతో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. వారిని ఏలూరు జీజీహెచ్లో చేర్పించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో అతడ్ని విజయవాడ సర్వజన ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఏలూరు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సాక్షి మీడియాపై దాడులు అరికట్టాలి
చింతలపూడి/తణుకు అర్బన్/ఆకివీడు: సంబంధం లేని విషయాన్ని సాక్షికి ఆపాదిస్తూ అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు సాక్షి కార్యాలయాలపై చేస్తున్న దాడులను అరికట్టాలని, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ చింతలపూడిలో సాక్షి పాత్రికేయుల ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు సిఐ టి.క్రాంతికుమార్కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. సాక్షి కార్యాలయాలకు రక్షణ కల్పించడంతోపాటు జర్నలిస్టులకు కూడా రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమ కేసులో ఇరికించారని తక్షణం విడుదల చేసి అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సాక్షి కార్యాలయాలపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సై కె.ప్రసాద్కు విలేకరులు వినతిపత్రం అందచేశారు. సాక్షి కార్యాలయాలపై దాడికి దిగిన వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని కోరారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని జర్నలిస్టు గుడిపాటి వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీనియర్ జర్నలిస్టు కె.శ్రీనివాసరావును అరెస్టును నిరసిస్తూ మంగళవారం ఆకివాడు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. -
డ్రెయిన్లు ఇలా.. మురుగు పారేదెలా!
ఉండి: మేజర్ డ్రెయిన్లలో పూడిక తొలగింపు పనులు చేపట్టకపోవడంపై రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. డ్రెయిన్లలో ఎక్కడికక్కడ గుర్రపుడెక్క, చెత్తాచెదారం పేరుకుపోయి మురుగు పారుదల సక్రమంగా లేకపోవడంతో వర్షాకాలంలో డ్రెయిన్లు పొంగి పంట పొలాలు నాశనమవుతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో వరిచేలల్లో చేరిన నీరు సైతం బయటకు పోవాలంటే డ్రెయినేజీ వ్యవస్థ కట్టుదిట్టంగా ఉండాలి. కానీ అధికారుల నిర్లక్ష్యమో, పాలకుల పాపమో తెలియదు గాని నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోను మేజర్ డ్రెయిన్ల పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది. పంటకాలువల్లో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో ఇరిగేషన్ అధికారులు పూడికతీత పనులను మమ అనిపించారు. బొండాడను పట్టించుకోలేదు మూడు మండలాల్లో విస్తరించి వున్న బొండాడ మేజర్ డ్రెయిన్ను మాత్రం అధికారులు పట్టించుకోలేదు. ఇక్కడ పూడికతీత పనులు నిర్వహించకుండా అధికారులు నిర్లక్ష్యం చేయడంపై రైతులు మండిపడుతున్నారు. ఈ డ్రెయిన్ ద్వారా ఉండి మండలంలోని కోలమూరు, ఉప్పులూరు, చిలుకూరు, వెలివర్రు, ఉండి, ఎన్నార్పీ అగ్రహారం, మహదేవపట్నం, వాండ్రం, కాళ్ల మండలంలోని బొండాడ, జక్కరం, కోపల్లె, ఎల్ఎన్పురం, ఆకివీడు మండలంలోని పెదకాపవరం, చినకాపవరం గ్రామాల్లోని వరిసాగు, ఆక్వాసాగు వ్యర్థాలు పారుతుంటాయి. అయితే ఈ ఏడాది కొన్ని డ్రెయిన్లలో పూడికతీత పనులు చేపట్టిన అధికారులు మేజర్ డ్రెయిన్ అయిన బొండాడను ఎందుకు పట్టించుకోలేని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బొండాడ మేజర్ డ్రెయిన్లో ఉండి ఆక్విడెక్టు వల్ల దానికి పైనున్న కోలమూరు, ఉప్పులూరు, చిలుకూరు, వెలివర్రు, ఉండి, ఎన్నార్పీ అగ్రహారం, మహదేవపట్నం గ్రామాల వరిసాగుతో పాటు ఆక్వాసాగు నీట మునుగుతుంది. అక్విడెక్టు వద్ద ఎత్తున గుర్రపుడెక్క, చెత్తాచెదారం మేటలు వేయడంతో సమస్య తీవ్రరూపం దాల్చుతుంది. అయితే వేసవి సమయంలో అక్విడెక్టు వద్ద మేటలను తొలగించాల్సిన అధికారులు సాగు సమయంలో లేదా వర్షాలు వస్తున్న సమయంలోనో, రైతులు ముంపునకు గురయ్యామని గగ్గోలు పెట్టినప్పుడు మాత్రమే పొక్లెయిన్ల సహాయంతో తాత్కాలిక పనులు చేపడుతున్నారు. ఈ పనులను కనీసం వేసవిలోగాని, నీరు తగ్గిన సమయంలో గానీ ఎందుకు చేపట్టడం లేదని ముంపు గ్రామాల రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇవే కాకుండా పలు మీడియం, మైనర్ డ్రెయిన్లలోను పూడికతీత పనులు నిర్వహించకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. అలాగే ఆకివీడు మండలంలో ఉప్పుటేరు మేజర్ డ్రెయిన్, కాళ్ళ మండలంలో బొండాడ మేజర్ డ్రెయిన్.7 కిమీ.మేర, పాలకోడేరు మండలంలో పొలిమేర కోడు, గోస్తనీ డ్రెయిన్ వంటి పలు మేజర్ డ్రెయిన్లను కూడా అధికారులు పట్టించుకోలేదు. వీటిలో కనీసం పూడికతీత పనులు చేపడితే రైతులు నిర్భయంగా సాగు చేసుకుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆక్వా సాగుకు ప్రమాదమే నియోజకవర్గంలోని పలు మేజర్ డ్రెయిన్లు బిగదన్నడంతో చాలాసార్లు వరిసాగుతో పాటు ఆక్వాసాగు కూడా నీట మునిగింది. దీంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. ఆక్వాజోన్ ఉన్న ఉండి నియోజకవర్గంలో డ్రెయిన్ల పరిస్థితి దారుణంగా ఉంటే ఇక ఆక్వా పరిస్థితి ఏమవుతుందో అని రైతులు ఆంధోళన చెందుతున్నారు. అరకొరగా కొన్ని డ్రెయిన్ల పూడికతీత పనులు మేజర్ డ్రెయిన్లలో పనులే చేపట్టని వైనం ఏటా పొలాలు ముంపునకు గురవుతున్నాయని రైతుల ఆవేదన ఏటా ముంపు చవిచూస్తున్నాం ప్రతి ఏటా వర్షాకాలంలో, తుపాను సమయాల్లో డ్రెయిన్లు పొంగి పొలాల మీద పడడంతో రైతులు నష్టాలు చవిచూస్తునఆనరు. మేజర్ డ్రెయిన్లు బిగదన్నడంతో ముంపు భయంతోనే వ్యవసాయం చేస్తున్నాం. ఇది అధికారులకు తెలిసి కూడా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టడం లేదు. – నిమ్మల కేశవకుమార్, ఎంపీటీసీ, రైతు, ఉప్పులూరు ప్రభుత్వమే ఆదుకోవాలి రైతకు అండగా నిలిచిన ప్రభుత్వమే పది కాలాల పాటు ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది. రైతుల సమస్యలను తెలుసుకుని అధికారులు ప్రభుత్వానికి నివేదించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. రైతులను పట్టించుకోకపోతే కాడి విడిచి పెట్టి వ్యవసాయానికి నమస్కారం చెబుతాడు. – వర్రే పైడియ్య, మాజీ ఎంపీటీసీ, రైతు, పాములపర్రు -
మహిళల రక్షణలో కూటమి విఫలం
ఏలూరు టౌన్: రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలు, చిన్నారులు, బాలికలు, యువతులపై దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు పెచ్చుమీరిపోతున్నాయని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు పాతబస్టాండ్ సెంటరులోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందచేశారు. కూటమి ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ అనంతపురంలో దళిత బాలికపై దుండగులు అమానుషంగా హత్యాచారానికి పాల్పడినా నేటికీ చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు, ఏలూరు మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, చింతలపూడి మహిళా అధ్యక్షురాలు చండీప్రియ, కై కలూరు మహిళా అధ్యక్షురాలు దున్నా బేబి, దెందులూరు నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు అంగడాల సీతారావమ్మ, జిల్లా అంగన్వాడీ విభాగ అధ్యక్షురాలు సాయిల స్వాతి, తొత్తడి వేదకుమారి, రాష్ట్ర మహిళా కార్యదర్శి మందా జయలక్ష్మి, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు బుజ్జమ్మ, వైస్ఎంపీపీ తమ్మిశెట్టి గిరిజ, తదితరులు పాల్గొన్నారు. ద్వారకాతిరుమలలో.. ద్వారకాతిరుమల: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాకారపు బంగారమ్మ అన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో మహిళలపై జరిగిన అకృత్యాలు, అన్యాయాలకు నిరసనగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో, రాజమండ్రి సిటీ గోకవరం బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బంగారమ్మ, పార్టీ ద్వారకాతిరుమల మండల మహిళా అధ్యక్షురాలు మల్లెపూడి నాగమణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరిగాయన్నారు. ప్రభుత్వం వాటిని అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో గోపాలపురం, దేవరపల్లి మండలాల మహిళా అధ్యక్షురాలు కప్పల వరలక్ష్మి, కడలి హైమావతి, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలకు రక్షణేదీ పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సిపి మహిళా విభాగం జనరల్ సెక్రటరీ కర్రా జయసరిత అన్నారు. మంగళవారం పూలపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వినతిపత్రం అందజేశారు. జయ సరిత మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, హత్యలేనని.. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో నరసాపురం పార్లమెంటు వైఎస్సార్సీపీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, సమన్వయకర్త గూడూరి ఉమాబాల, నరసాపురం మున్సిపల్ చైర్మన్ బర్రి వెంకటరమణ, జెడ్పీటీసీ కర్రి గౌరీ సుభాషిణి, మద్దా చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో.. భీమవరం: కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలపై దాడులు పెచ్చుమీరిపోయాయని భీమవరం ఏఎంసీ మాజీ డైరెక్టర్, వైఎస్సార్సీపీ నాయకురాలు గంటా అనితారాణి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ భీమవరం 13వ వార్డులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసనలు -
జూదాలకు బానిసై యజమాని ఇంట్లోనే చోరీ
ఏలూరు టౌన్: జూదాలకు బానిసైన ఓ వ్యక్తి తాను పనిచేసే యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు. చివరకు ఈ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అతడి నుంచి రూ.23.76 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిషోర్ వివరాలు వెల్లడించారు. గణపవరం గ్రామానికి చెందిన సరిపల్లి రాజు అలియాస్ వెంకటరాజు అనే వ్యక్తి చిలువూరి వెంకట రామరాజు అలియాస్ వెంకన్న బాబు చెరువుపై పనిచేస్తున్నాడు. సరిపల్లి రాజు పేకాట, క్రికెట్ బెట్టింగ్, మద్యం వంటి దురలవాట్లకు బానిసై యజమాని ఇంట్లోనే చోరీ చేసేందుకు స్కెచ్ వేశాడు. యజమాని రామరాజు మే నెలలో హైదరాబాద్ వెళ్లడంతో సరిపల్లి రాజు ఈ నెల మొదటివారంలో రాత్రిపూట యజమాని ఇంటి వెనుక తలుపులు పగులుకొట్టి లోనికి ప్రవేశించి చెక్క బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను అపహరించుకుపోయాడు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు గణపవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను భీమవరంలో విక్రయించేందుకు వెళ్తుండగా ఈనెల 10న సరిపల్లి గ్రామం సీపీఎఫ్ ఫ్యాక్టరీ వద్ద నిందితుడు సరిపల్లి రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. చోరీ సొత్తు 33 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన నిడమర్రు సీఐ ఎంవీ సుభాష్, గణపవరం ఎస్సై ఏ.మణికుమార్, పోలీస్ సిబ్బంది ఏయూజీ శంకర్, డీ.శివాజీ, హోంగార్డు పీ.జగపతిబాబును ఎస్పీ శివ కిషోర్ అభినందించారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ పాల్గొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు చోరీ సొత్తు రూ.23.76 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ ప్రతాప శివ కిషోర్ -
సంక్షేమానికి తూట్లు.. సంక్షోభం నిండేట్లు
రేపు క్యాంపస్ డ్రైవ్ ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు ప్రభుత్వ ఐటీఐ, ఇండస్ట్రీయల్ ఎస్టేట్లో ఈనెల 11న క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. 08812–230269లో సంప్రదించవచ్చు. మంగళవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 2025● నాడు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన సాగించారు.. పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారు.. ఇంటి ముంగిళ్లలోకే సర్కారీ సేవలను అందించి పాలనలో కొత్త ఒరవడిని సృష్టించారు. విద్య, వైద్యరంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు.. మహిళా సాధికారత లక్ష్యంగా పథకాలు అందించారు.. అన్నదాతలకు స్థానికంగా సేవలందించేలా రైతు భరోసాకేంద్రాలు ఏర్పాటుచేశారు. గిరిపుత్రులకునేనున్నానంటూ.. ఆరోగ్య భరోసా కల్పించారు. నాటి పాలనలో సంక్షేమం, సుభిక్షం పరవళ్లు తొక్కాయి. ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వం రైతుల నడ్డి విరిచింది. ఏడాది పాలనలో పెట్టుబడి సాయం ఒక్క రూపాయి ఇవ్వకపోగా.. పంటలకు గిట్టుబాటు ధరలు కూడా కల్పించలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లాలో 2,35,847 మంది రైతులకు రైతు భరోసా కింద రూ.1,839.24 కోట్ల లబ్ధి చేకూర్చారారు. అలాగే 97,584 మంది రైతులకు సున్నా వడ్డీ పంట రుణాల కింద రూ.97.29 కోట్లు అందించారు. ఉచిత విద్యుత్ కింద 70,960 సర్వీసులకు రూ.2467.25 కోట్లు ఖర్చు చేశారు. రూ.60.94 కోట్లతో సుమారు 228 రైతు భరోసా కేంద్రాలు నిర్మించి రైతులకు సేవలందించారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఈ కేంద్రాలు నిరుపయోగంగా మారుతున్నాయి. గ్రామీణ వైద్యంలో విప్లవం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఇంటికే వైద్య సేవలందించారు. కూటమి ప్రభుత్వంలో ఈ విధానం అమలు కావడం లేదు. రూ.39.86 కోట్లతో 178 హెల్త్ క్లినిక్స్ నిర్మాణం చేపట్టి పల్లెల్లో మెరుగైన వైద్య సేవలందించారు. విద్యారంగం.. మహోన్నతం గత ప్రభుత్వంలో విద్యారంగంలో సంస్కరణకు మాజీ సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. జిల్లాలో 2,032 బడులను నాడు–నేడు పథకంలో రూ.270.75 కోట్లతో ఆధునికీకరించారు. ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ బోధనలు అమలులోకి తెచ్చారు. నేడు కూటమి సర్కారులో నాడు–నేడు పథకాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రేషన్ వాహనాల రద్దు : జిల్లాలో ప్రతి కుటుంబానికీ తమ ఇంటి సమీపంలోనే రేషన్ అందించేలా 395 వాహనాలను జిల్లాలోని 1,123 రేషన్ షాపులకు గత ప్రభుత్వం అనుసంధానం చేసింది. అలాగే వాహనంలో ఇద్దరికి చొప్పున ఉపాధి కల్పించింది. ఇలా జిల్లాలోని 6,31,044 కార్డుదారులకు ప్రతి నెలా 8,791.03 టన్నుల బియ్యం, 218.75 టన్నుల పంచదార, కందిపప్పు, గోధుమ పిండి, ఆయిల్ ప్యాకెట్లను పంపిణీ చేసింది. అయితే కూటమి ప్రభుత్వం రేషన్ వాహనాలను రద్దు చేసి ప్రజలకు ఇంటి వద్దనే రేషన్ అందుకునే సౌకర్యాన్ని దూరం చేసింది. అందరికీ ‘గృహ’యోగం గత ప్రభుత్వంలో జిల్లాలో 1,16,431 మందికి ఇళ్ల పట్టాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి అందించింది. 98,874 ఇళ్ల నిర్మాణాల కోసం రూ.713.17 కోట్లు ఖర్చు చేశారు. జిల్లాలో 654 మంది రైతులకు 524.116 ఎకరాల భూమి పంపిణీ చేశారు. 2003 నుంచి 22(ఎ)లో ఉన్న 11715.32 ఎకరాల భూమికి విముక్తి కల్పించి 9,172 మందికి మేలు కలిగించారు. నిషేధిత జాబితాలో ఉన్న 391.45 ఎకరాల భూమిని అర్హులైన 611 మందికి ఎస్సీ లబ్ధిదారులకు అందించారు. 26 గ్రామాల్లో 27.31 ఎకరాల భూమిని ఎస్సీ శ్మశాన వాటికలకు కేటాయించారు. ఏలూరులో వైద్య కళాశాల దశాబ్దాల కలగా ఉన్న ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాకారం చేసింది. రూ.525 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం రెండేళ్లకు గానూ 300 మంది వైద్య విద్య అభ్యసిస్తున్నారు. మొదటి ఏడాది 150 మందితో ఎంబీబీఎస్ తరగతులు 2023 సెప్టెంబర్ 2న ప్రారంభిస్తే, రెండో ఏడాది 2024 సెప్టెంబర్లో మరో 150 మంది మెడిసిన్లో చేరారు. గిరిపుత్రుల కోసం.. జిల్లాలోని ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవలందించేలా గత ప్రభుత్వంలో చింతలపూడిలో 100 పడకల ఆస్పత్రి, బుట్టాయగూడెంలో రూ.55 కోట్ల వ్యయంతో 150 పడకల మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. నూజివీడులో రూ.25 కోట్లతో ఆస్పత్రి సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టారు. సప్త ప్రదక్షిణలు ప్రారంభం పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సప్త సోమవారాల ప్రదక్షిణలు ప్రారంభించినట్టు ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. నేడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏడాది పాలనలో సం‘క్షామం’, సంక్షోభంతో ప్రజలు అల్లాడుతున్నారు. విద్య, వైద్యరంగాలు పూర్తిగా నిర్వీర్యం కాగా.. ప్రజలకు ప్రభుత్వ సేవలు దూరమవుతున్నాయి. సూపర్ సిక్స్ హామీల అమలును గాలికొదిలేస్తూ సంక్షేమాన్ని దూరం చేస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు. పథకాలు అమలు చేయకుండా మొండిచేయి చూపడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు భవితవ్యం అయోమయంగా మారింది. ఇలా ప్రజా జీవనాన్ని ఏడాది పాలనలో అస్తవ్యస్తం చేసిన ఘనత కూటమి సర్కారుకే దక్కుతుంది. న్యూస్రీల్కూటమి కక్ష సంక్షేమ, అభివృద్ధి పథకాల్లేవు ఎండీయూ వాహనాలు రద్దు విద్య, వైద్య రంగాలు నిర్వీర్యం సచివాలయ వ్యవస్థపై శీతకన్ను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యమే లక్ష్యం సచివాలయాల్లో 543 సేవలు ఇంటింటా సంక్షేమ పరవళ్లు కూటమికి గుణపాఠం తప్పదు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు, దౌర్జ న్యాలు, అక్రమ కేసులు, జైళ్లకు పంపటంలో బిజీగా ఉంది. సూపర్సిక్స్ హామీలు అమలుకు నోచుకోలేదు. మహిళలను ఘోరంగా మోసం చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది. ప్రభుత్వానికి చెప్పుకోవటానికి ఏమీ లేకపోవటంతో ప్రజలు నిలదీస్తారనే భయంతో దౌర్జన్యాలు చేస్తూ అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్తులో టీడీపీ కూటమికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. – దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఉద్యోగాలు పీకేస్తున్నారు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో 3 లక్షల ఉద్యోగులను తొలగించింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదు. పేద పిల్లలను చదువులకు దూరం చేస్తున్నారు. నిరుద్యోగ భృతి మాటెత్తడం లేదు. ప్రభుత్వ చర్యలు రైతుల నడ్డివిరిచేలా ఉన్నాయి. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. వైద్య రంగాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. కూట మి ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. – మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, నూజివీడు వైఎస్సార్సీపీ సమన్వయకర్త గత ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యానికి బాటలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా వలంటీర్, సచివాలయ వ్యవస్థలు ఏర్పాటుచేశారు. జిల్లాలో 605 సచివాలయాల్లో 4,701 మంది ఉద్యోగులను నియమించి ప్రజలకు సేవలందించారు. 443 సచివాలయ భవనాల నిర్మాణాలను రూ.193.15 కోట్లతో మొదలుపెట్టి 284 భవనాలను రూ.120.18 కోట్లతో పూర్తిచేశారు. వలంటీర్ల ద్వారా పౌర సేవలు ఇంటి వద్దకే అందించారు. అయితే ప్రస్తుత కూటమి సర్కారులో ప్రజలు, విద్యార్థులు, యువత సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. జేబులు నింపితే కానీ సర్టిఫికెట్ చేతికి రావడం లేదని పలువురు గగ్గోలు పెడుతున్నారు. -
11న చలో మంగళగిరి
ఏలూరు (ఆర్ఆర్పేట): కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 11న చేపట్టిన చలో మంగళగిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ కోరారు. సోమవారం స్థానిక అన్నే భవనంలో కౌలు రైతుల చలో మంగళగిరి కరపత్రాలను ఆవిష్కరించారు. కౌలు రైతుల సమస్యలు పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కౌలు రై తులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేసి అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం రూ.20 వేలు అందించాలని, వడ్డీ లేని పంట రుణాలు ఇవ్వాలని కోరారు. ఈనెల 11న మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రి నుంచి ఉదయం 10 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని కౌలు రైతులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. -
గళమెత్తిన కార్మిక సంఘాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులను తక్షణమే నిలిపివేయాలని, స్టీల్ ప్లాంట్ను పరి రక్షించాలని కోరుతూ సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఏలూరు పాతబస్టాండ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపులు ఆపాలని, విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని, విశాఖ ఉక్కు సొంత గనులు కేటాయించాలని, సెయిల్లో విలీనం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని పెద్ద పెట్టున నినదించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్సులు డీఎన్ వీడి ప్రసాద్, కే.బుచ్చిబాబు, ఎర్ర శ్రీనివాస్ పాల్గొన్నారు. జర్నలిస్టులకు న్యాయం చేయాలి ఏలూరు (ఆర్ఆర్పేట): కేంద్రం రద్దు చేసిన రెండు కార్మిక చట్టాలను పునరుద్ధరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ శంకరరావు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు ఎస్డీ జబీర్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో సంఘాలకు అతీతంగా పాత్రికేయులు, రైతు సంఘ ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని కోరారు. పనిచేసే విలేకరులు అందరికీ ప్రభుత్వ గుర్తింపు అక్రెడిటేషన్ ఇవ్వాలని, మూడు సెంట్ల చొప్పున స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ఫెడరేషన్ కార్యదర్శి హరీష్, సీనియర్ జర్నలిస్టు కె.బాలశౌరి, ఎం.గంగరాజు, జయరాం, హరీష్ తదితరులు పాల్గొన్నారు. నేడు మద్దిలో యోగాంధ్ర ఏలూరు(మెట్రో): గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. అలాగే ఈనెల 18న కామవరపుకోట మండలం జీలకర్రగూడెం–గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద యోగాసనాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశామన్నారు. ఏలూరులో ర్యాలీఏలూరు (ఆర్ఆర్పేట): యోగాంధ్ర అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏలూరు సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ నుంచి ఇండోర్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ వెట్రిసెల్వి, జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే బడేటి చంటి, జేసీ పి. ధాత్రిరెడ్డి, మేయర్ నూర్జహాన్ పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించాలి ఏలూరు(మెట్రో): జిల్లాలో వృద్ధిరేటు సాధన దిశగా జిల్లా, నియోజకవర్గాల వారీగా అభివృద్ధి, విజన్ ప్లాన్ల అమలుకు అధికారులు ప్రత్యే క దృష్టి సారించాలని రాష్ట్ర పౌర సరఫరాల శా ఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను కోరారు. అమరావతి నుంచి సో మవారం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల విజన్ ప్లాన్లను ముఖ్యమంత్రి వర్చువల్గా విడుదల చేశారు. కలెక్టరేట్లో ఈ కార్యక్రమాన్ని వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించిన అనంతరం మంత్రి మనోహర్ జిల్లా, నియోజకవర్గ అభివృద్ధి విజన్ ప్లాన్పై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కలెక్టరేట్లోని ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని మంత్రి మనోహర్ ప్రారంభించారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జేసీ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, సీపీఓ వాసుదేవరావు పాల్గొన్నారు. డీఎస్సీ పరీక్షలకు 720 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో సోమవారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు 720 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 180 మందికి 179 మంది, మధ్యాహ్నం 180 మందికి 159 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 200 మందికి 196 మంది, మధ్యాహ్నం 200 మందికి 186 మంది హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. -
ఆయిల్పామ్ రైతుల ఆక్రందన
ఏలూరు(ఆర్ఆర్పేట): పామాయిల్ దిగుమతి సుంకం 50 శాతానికి పెంచాలని, ఆయిల్పామ్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ ఆయిల్పామ్ రైతుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముడి పా మాయిల్పై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో ఆ యిల్పామ్ గెలల ధరలు తగ్గి రైతులు నష్టపోతున్నారన్నారు. దేశంలోనే అత్యధిక ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్లో, రాష్ట్రంలోనే అధిక సాగు ఏలూరు జిల్లాలో ఉందని, రాష్ట్రంలో రైతులు, కూలీలు, కార్మికులు 10 లక్షలకు పైగా కుటుంబాలు ఆయిల్పామ్పై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, జిల్లా సహాయ కార్యదర్శి సిరిబత్తుల సీతారామయ్య, ఆయిల్పామ్ రైతుల సంఘం నాయకులు గంటా పాపారావు, దాసరి జానకిరామరెడ్డి మాట్లా డుతూ తెలంగాణలో ఆయిల్ఫెడ్ కొత్త ఫ్యాక్టరీలు నిర్మాణం చేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం ఆయిల్ ఫెడ్ కర్మాగారం అభివృద్ధి జరగలేదన్నారు. ఫలితంగా ఆయిల్ రికవరీ శాతం (ఓఈఆర్) తక్కువగా చూపడంతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. -
మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్ విధానంలోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని, ఉపాధ్యాయుల నిరసనలతో ప్రభుత్వం దిగిరాక తప్పదని ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పూర్వపు పశ్చిమగోదావరి జిల్లా కార్యాలయం వద్ద సోమవారం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. బదిలీల అంశంలో ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నామన్నారు. దీక్షల్లో పాల్గొన్నవారికి ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ గుగ్గులోతు కృష్ణ మజ్జిగ ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఎస్టీయూ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కేఆర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ ముస్తఫా అలీ, రవికుమార్ రుద్రాక్షి, యూటీయూ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు విజయ రామరాజు, ఏపీటీఎఫ్ 1938 ఏలూరు జిల్లా అధ్యక్షుడు జి.మోహన్, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు బి.రమణ, ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పీబీవీఎన్ఎల్ నారాయణ, వైఎస్ఆర్టీఏ ఏలూరు జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు అమానుషం
గళమెత్తిన ఉద్యోగులు పెంటపాడు: రాష్ట్రంలోని ‘సాక్షి’ కార్యాలయాలపై తెలుగుదేశం పార్టీ శ్రేణుల కుట్రపూరిత దాడులను ఖండిస్తూ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యూనిట్ ఉద్యోగులు గళమెత్తారు. సాక్షి మీడియాపై భౌతిక దాడులకు నిరసనగా పెంటపాడు మండలం ప్రత్తిపాడులోని సాక్షి యూనిట్ కార్యాలయం వద్ద సోమ వారం రాత్రి ఉద్యోగులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ‘సాక్షి’పై కుట్రపూరిత, అక్రమ దాడులను ఖండించాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని పెద్ద ఎత్తున నినదించారు. ఉద్యోగులు పాల్గొన్నారు. పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు ‘సాక్షి’ కార్యాలయాలపై దాడిని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఏలూరులో డీఎస్పీ డి. శ్రావణ్కుమార్కు, భీమవరంలో సీఐ నాగరాజుకు జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఫిర్యాదులు అందజేశారు. దాడులకు తెగబడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నూజివీడులో సీఐ సత్యశ్రీనివాస్ కు, నరసాపురంలో ఎస్సై జయలక్ష్మికి, జంగారెడ్డిగూ డెం స్టేషన్లో ఎస్సై జబీర్కి, తాడేపల్లిగూడెం స్టేషన్లోనూ మీడియా ప్రతినిధులు ఫిర్యాదులు చేశారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన ఏలూరు టౌన్: ఏలూరు ‘సాక్షి’ కార్యాలయంపై టీ డీపీ కూటమి నేతలు దాడులపై ఏపీయూడబ్ల్యూజే ఏలూరు జిల్లా కమిటీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్కు వినతిపత్రం నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ టీవీ జిల్లా ప్రతినిధి పోతురాజు మాట్లాడుతూ మీడియా కార్యాలయాలపై దాడు లకు పాల్పడటం సరికాదన్నారు. ఏపీయూడబ్ల్యూ జే జిల్లా ప్రధాన కార్యదర్శి బీకే కిషోర్ మాట్లాడు తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రాన్ని హరించేలా కూటమి ప్ర భుత్వం సీనియర్ జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించటాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని, ఇదే తరహాలో అక్రమ కేసులు, దాడులు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు ఉర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ‘సాక్షి’ టీవీ డిబేట్లో ఒక అంశానికి సంబంధించి దొర్లిన తప్పునకు జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణంరాజు బహిరంగ క్షమాపణలు చెప్పినా ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం సరి కాదన్నారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని చెబుతున్నారని, ఇలాంటి చర్యలతో జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయటాన్ని తప్పుబడుతున్నామని చెప్పా రు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు ఎస్.సంజయ్కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు వి.మధుసూర్యప్రకాష్, సీహెచ్ రామకృష్ణరాజు, ఫొటో జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్కే రియాజ్, సీనియర్ జర్నలిస్టులు గుండిమెడ రామచంద్రశర్మ, కర్రి అప్పలరాజు, వంశీధర్, ఎం.రాజేష్కుమార్, బి.భరత్కుమార్, గంజి చంటి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కొయ్యలగూడెం: కొయ్యలగూడెం–జంగారెడ్డిగూడెం జాతీయ ప్రధాన రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. నీలాలమ్మ ఆలయ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించిందని ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపారు. యర్రంపేట గ్రామానికి చెందిన రాపాక కల్యాణ్(26) జంగారెడ్డిగూడెం నుంచి టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్పై స్వగ్రామం వెళ్లేందుకు కొయ్యలగూడెం వైపునకు వస్తుండగా కారు ఢీకొంది. కల్యాణ్కు తీవ్ర గాయాలు కాగా.. వెంటనే జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి అంబులెన్సులో తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై మృతుడి తల్లి రాపాక మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
జైలు నిర్మాణ పనులను పరిశీలించిన డీఐజీ
కై కలూరు: కై కలూరులో నిర్మిస్తున్న జైలు, పెట్రోల్ బ్యాంకు నిర్మాణ పనులను జైళ్ల శాఖ డీఐజీ ఎం.వరప్రసాద్ సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల సంస్థల సూచనలతో ఖైదీలకు అన్ని సౌకర్యాలతో నూతన నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. దాదాపు 60 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. గతంలో కొందరు ఖైదీలు స్నానాల గదుల్లో పైన ఊచలకు ఉరి వేసుకుని ఆత్మహత్యలు చేసుకునేవారన్నారు. అలాంటి సమస్యలు లేకుండా స్నానాల గదుల ఎత్తు తగ్గించి, పైన ఓపెన్గా ఉంచుతామన్నారు. పెట్రోలు బ్యాంకు వచ్చే నెలలో ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో విజయవాడ డీఎస్జేవో ఆఫీస్ జైలర్ వి.ఉమామహేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ ఉత్కర్ష అభయాన్ అమలుపై సమీక్ష ఏలూరు(మెట్రో): జిల్లాలో జాతీయ గ్రామ ఉత్కర్ష అభయానన్ పథకం పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో పథకం అమలుపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంపై గిరిజనులకు అవగాహన కల్పించేందుకు జూన్న్ 15 నుంచి 30 వరకు జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాములు నాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
కుక్కునూరు: బైక్ అదుపు తప్పడంతో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుక్కునూరు గ్రామానికి చెందిన నాగ శ్రీనివాస్ ఆదివారం మధ్యాహ్న సమయంలో పొలం వెళుతుండగా, మోటార్సైకిల్ అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోయాడు. నాగశ్రీనివాస్ తలకు తీవ్ర గాయమైంది. భద్రాచలం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు రిఫర్ చేశారు. ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ నాగశ్రీనివాస్ మృతిచెందాడు. వైఎస్సార్సీపీ నాయకులు నాగశ్రీనివాస్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి జంగారెడ్డిగూడెం: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందినట్లు హెడ్ కానిస్టేబుల్ ఎన్.ఉమామహేశ్వరరావు తెలిపారు. జంగారెడ్డిగూడెంకు చెందిన బోను లక్ష్మీపతి(49) ఈ నెల 8న పనిమీద బైపాస్ రోడ్డు వద్దకు పనిమీద వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో స్థానిక తపస్ స్కూల్ సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద మోటార్సైకిల్ అదుపు తప్పి కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. చికిత్స పొందుతూ 9వ తేదీ ఉదయం లక్ష్మీపతి మృతిచెందినట్లు హెచ్సీ తెలిపారు. -
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
ఏలూరు టౌన్: ఏలూరు మండలం తంగెళ్ళమూడి భాగ్యనగర్ కాలనీలో గత నెలలో జరిగిన చోరీ కేసును వన్టౌన్ సర్కిల్ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయతో ఛేదించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి అతని నుంచి బంగారు ఆభరణాలు, నగదు స్వాదీనం చేసుకున్నారు. డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ వివరాలు వెల్లడించారు. తంగెళ్ళమూడి భాగ్యనగర్ కాలనీకి చెందిన పడవల వెంకట శ్రీనివాస్ ఏపీ ట్రాన్స్కోలో పనిచేస్తున్నారు. మే నెల 26న కుమారుల చదువుల నిమిత్తం రాజమహేంద్రవరంలో అద్దె ఇల్లు చూసుకునేందుకు కుటుంబంతో కలిసి ఇంటికి తాళాలు వేసి వెళ్ళారు. పనులు ముగించుకుని సాయంత్రం 6 గంటలకు ఇంటికి వెళ్లగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూడగా బెడ్రూమ్లో బీరువా తాళాలు పగులగొట్టి దానిలోని బంగారు ఆభరణాలు, నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. శ్రీనివాస్ ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వన్టౌన్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో రూరల్ ఎస్ఐ సీహెచ్కే దుర్గాప్రసాద్ కేసు నమోదు చేశారు. సీసీ టీవీ పుటేజ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడు సత్తినపల్లి రాకేష్ను సోమవారం మధ్యాహ్నం ఏలూరు హనుమాన్నగర్లో అదుపులోకి తీసుకున్నారు. పెదపాడు ఇందిరా కాలనీకి చెందిన రాకేష్ చోరీ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. -
డాంగేనగర్లో అగ్నిప్రమాదం
జంగారెడ్డిగూడెం: పట్టణంలో ఉన్న డాంగే నగర్లో ఆదివారం అర్ధరాత్రి విద్యుత్ హైవోల్టేజ్ రావడంతో పలువురి ఇళ్లలో విద్యుత్ పరికరాలు, సామగ్రి దగ్ధమయ్యాయి. దీంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. పొడుదోలు నాగేంద్రబాబు ఇంట్లో ఫ్రిడ్జ్, కూలర్, ఇన్వర్టర్లు, ఫ్యాన్లు, వైరింగ్, లైట్లు హైవోల్టేజ్ కారణంగా కాలిపోయాయి. ఇంట్లో సామగ్రి కూడా దగ్ధమైంది. సుమారు రూ.2 లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. శీలం మంగరాజు ఇంట్లో టీవీ, ఫ్యాన్లు, కలపాల శ్రీనివాస్ ఇంట్లో ఫ్యాన్లు, బల్బులు దగ్ధమయ్యాయి. విద్యుత్ శాఖ అధికారులు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. సోమవారం విద్యుత్ శాఖ డీఈ యు.సుబ్బారావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. -
ఉద్యాన వర్సిటీతో శశి ఒప్పందం
తాడేపల్లిగూడెం: విద్య, పరిశోధన, శిక్షణ రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించి డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ, శశి ఇంజనీరింగ్ కళాశాల మధ్య సోమవారం ఎంఓయు కుదిరింది. విద్యార్థులకు పరిశోధన అవకాశాలు, పరిశ్రమ ఆధారిత శిక్షణ, ఇంటర్న్షిప్, జాయింట్ ప్రాజెక్టుల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు ఈ ఎంఓయు ద్వారా కలగనుంది. విద్యారంగ అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, వ్యవసాయ, ఉద్యాన సాంకేతికల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. రెండు సంస్థల అభివృద్ధికి ఈ ఒప్పందం తోడ్పాటుగా నిలవనుందని ఉద్యాన వర్సిటీ వీసీ కె.గోపాల్, శశి వైస్చైర్మన్ మేకా నరేంద్రకృష్ణలు అన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ కె.గోపాల్, డైరెక్టర్ ప్రోగ్రామ్స్ కె.ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి సేవలో ‘కేజీఎఫ్’ నటుడు ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయాన్ని కేజీఎఫ్ సినిమాలో విలన్గా నటించిన రామచంద్రరాజు (గరుడారామ్) సోమవారం సాయంత్రం సందర్శించారు. భార్య సుమ, సినీ దర్శకుడు సాయి శివాన్ జంపానతో కలసి ఆలయానికి విచ్చేసిన ఆయన ముందుగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గరుడారామ్ మాట్లాడుతూ ప్రస్తుతం వైరం చిత్రంలో మెయిన్ విలన్గా నటిస్తున్నట్టు చెప్పారు. ఆ చిత్రం వచ్చేనెలలో రిలీజ్ అవుతుందని తెలిపారు. దర్శకుడు సాయి శివాన్ మాట్లాడుతూ వచ్చేనెల మొదటి వారంలో పూరీ జగన్నాఽథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా తెరకెక్కనున్న ఇంటికో సైకో చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. -
నివేదిత విద్యాలయం ఏర్పాటు అభినందనీయం
కాళ్ల: స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నివేదిత విద్యాలయం ఏర్పాటు అభినందనీయమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. కాళ్ల మండలం పెద్ద అమిరంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన నివేదిత విద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోమవారం కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం విద్యాలయాన్ని కలెక్టర్, గుంటూరు శారద మఠం అధ్యక్షురాలు ప్రవాజిక భవాణి ప్రాణమాతాజీ ప్రారంభించారు. తరగతి గదులలో మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భావితరాలకు విద్యతో పాటు విలువలతో కూడిన మన సంస్కృతి, సాంప్రదాయాలను నేర్పి ఉత్తములుగా తీర్చిదిద్దటమే లక్ష్యంతో బాలికలకు ఉచిత విద్యాలయాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. శారద మఠం అధ్యక్షురాలు ప్రవాజిక భవాణి ప్రాణమాతాజీ మాట్లాడుతూ ఎల్కేజీ నుంచి 7వ తరగతి వరకు పేద బాలికలకు మాత్రమే విద్యను అందిస్తామన్నారు. సుమారు 770 మంది బాలికలకు ప్రవేశం కల్పించనునట్లు తెలిపారు. తెలుగుతో పాటుగా ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రత్యేక శిక్షణ ఉంటుందన్నారు. -
విద్యా రంగంలో ఆదర్శంగా నిలపాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రణాళిక బద్ధంగా విద్యారంగంలో వినూత్న మార్పులతో ఏలూరు జిల్లాను ఆదర్శవంతమైన జిల్లాగా నిలపాలని, అందుకు అనుగుణంగా సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం వట్లూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగు కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన షైనింగ్ స్టార్ కార్యక్రమాన్ని మనోహర్ ప్రారంభించారు. కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలోని 163 ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ 32,60,000, ఇంటర్మీడియట్ విద్యార్థులకు రూ 6.80 లక్షలు చెక్కులు అందించి, సర్టిఫికెట్లతో సత్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని, విద్య ఒక్కటే అభివృద్ధికి మార్గమన్నారు. జిల్లాలో 2.78 లక్షలు విద్యార్థులు ఉండగా 1.30 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, ఈ సంఖ్యను మరింత పెంచేందుకు కృషిచేయాలన్నారు. జిల్లాలో 10 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారని వీరంతా ప్రణాళికాబద్ధంగా మరింత మెరుగైన విద్యను అందించడం ద్వారా జిల్లాను ఆదర్శంగా నిలపాలన్నారు. జూన్ 12 నుంచి పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకంలో పౌష్టికాహారం అందించేందుకు సన్న బియ్యం ప్రవేశపెడుతున్నామన్నారు. కలెక్టరు వెట్రిసెల్వి మాట్లాడుతూ డొక్కా సీతమ్మ పేరున మధ్యాహ్నం భోజనం పథకం ద్వారా మంచి పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ పేరున విద్యార్థులకు పుస్తకాలు తదితర కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే బడేటి చంటి, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఆర్టీసీ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఎస్పీ కేపీఎస్ కిషోర్, జాయింటు కలెక్టరు ధాత్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేషన్ షాపు తనిఖీ ఏలూరులోని షాపు నెంబర్ 74 చౌక ధరల దుకాణాన్ని, స్ధానిక ఈదర సుబ్బమ్మ నగరపాలక ఉన్నత పాఠశాలను జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డితో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీలర్ ఇచ్చే బియ్యం నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు ఇంకా డోర్ డెలివరీ పూర్తిచేయకపోవడంపై మంత్రి డీలర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తాగునీటి వెతలు
భీమడోలు: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తింది. మంచినీటి చెరువుల నీటి మట్టాలు అడుగంటాయి. పంచాయతీలు తాగునీటిని సరఫరా చేయలేక గత 10 రోజులుగా బోరు నీరు కలిపిన నీటిని కొన్ని గ్రామాల్లో సరఫరా చేస్తున్నారు. మరిన్ని గ్రామాల్లో బోరు నీటిపైనే ఆధారపడుతున్నారు. గోదావరి కాల్వ మూసి 40 రోజులైంది. చెరువుల్లో అరకొరగా నింపడంతో పాటు వేసవి నీటి వినియోగం పెరగడంతో నీరు అడుగంటింది. దీంతో గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. గోదావరి కాల్వకు అనుకుని ఉన్న పూళ్ల, పాతూరు, కురెళ్లగూడెం, సూరప్పగూడెం, గుండుగొలను, కొల్లేరు గ్రామాల్లో మంచినీటి చెరువుల్లో నీటి మట్టాలు అడుగంటాయి. ఫిల్టర్ చేసి ఆ నీటిని సరఫరా చేయడంతో దుర్వాసన వస్తోంది. నెల రోజులు దాటితే తాగునీటి తీర్చే సామర్థ్యం తీర్చే చెరువులు లేవు. సమ్మర్ యాక్షన్ ప్లాన్పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో తాగునీరు ఇవ్వలేని దయనీయ స్థితిలో ఉన్నారని ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. గోదావరి కాల్వ పూడికతీత, కర్రనాచు తొలగింపు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో వారం రోజులు తర్వాత కాల్వకు నీటిని వదిలే అవకాశాలున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు. ప్రైవేటు వాటర్ను కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గుండుగొలనులోని వింధ్యవాసిని, బ్రాహ్మణ చెర్వులోని నీటి మట్టాలు పడిపోయాయి. బోరు నీరు, ఉప్పునీరు ఇవ్వడంతో ఈ నీటిని నిలుపుదల చేసి ట్యాంకర్ల ద్వారా నీటికి పంపిణీ చేయాలని భీమడోలు ఏఎంసీ మాజీ చైర్మన్ వగ్వాల భాస్కర్ సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీ, ఎస్సీ ఏరియా, ఇతర ప్రాంతాలకు గత పది రోజులుగా బోరు నీరే ఇస్తున్నారని, విషయాన్ని ఇంచార్జి గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లగా గోదావరి కాల్వకు నీటిని విడుదల అయ్యే వరకు ఈ సమస్య పరిష్కారం కాదంటున్నారని ఫిర్యాదు చేసారు. ట్యాంకర్ల ద్వారా మంచి నీటిని సరఫరా చేయాలని ఎంపీడీవో, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యపై గుండుగొలను ఇరిగేషన్ సెక్షన్ ఏఈ సుబ్రహ్మణ్యంను వివరణ కోరగా.. రెండు, మూడు రోజుల్లో గోదావరి నీరు గుండుగొలను సెక్షన్కు చేరుకుంటుందని.. గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నందున ఉన్నతాధికారులు గోదావరి కాల్వకు నీటిని విడుదల చేశారన్నారు. చెరువులలో అడుగంటిన నీరు -
కదం తొక్కిన ఉపాధ్యాయులు
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీల్లో నెలకొన్న సమస్యలను, ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలనే డిమాండ్తో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఏలూరులోని పూర్వపు పశ్చిమగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. డీఈఓ కార్యాలయ గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 500 మంది ఉపాధ్యాయులు హాజరై నిరసన తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మద్దతుగా నిలిచారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే జోక్యం చేసుకుని తక్షణమే ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికతో చర్చించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే జరిపిన చర్చల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇందుకు భిన్నంగా ఇప్పుడు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు ఎనేబుల్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ఉపాధ్యాయులను మోసం చేయడమే అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.శ్రీదేవి మాట్లాడుతూ స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని, ఎస్జీటీలకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తే దాదాపు 2 వేల పాఠశాలలకు ప్రయారిటీ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, ఇది తీవ్ర మానసిక ఒత్తిడితో కూడిన పని అన్నారు. ముట్టడి కార్యక్రమానికి యూటీఎఫ్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రవికుమార్ అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు, రాష్ట్ర బాధ్యులు ఉమ్మడి జిల్లా నుంచి హాజరైన ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. యూటీఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు షేక్ ముస్తఫా ఆలీ, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్కుమార్, ఏపీటీఎఫ్ 1938 ప్రధాన కార్యదర్శి జి.మోహన్, పీఆర్టీయూ అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు, పీఈటీస్ అసోసియేషన్ నాయకులు రమేష్, వైఎస్సార్టీఏ మోహనరావు, యూటీఎఫ్ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు పీఎస్ విజయరామరాజు, ప్రధాన కార్యదర్శి ఏకేవీ రామభద్రం, పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఎస్టీయూ నాయకులు శ్రీనివాస్ వర్మ, ఏపీటీఎఫ్ గౌరవాధ్యక్షుడు సీహెచ్ పట్టాభిరామయ్య తదితరులు హాజరయ్యారు. అనంతరం డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మని కలిసి సమస్యలను తెలియజేశారు. డీఈఓ కార్యాలయం వద్ద గుమిగూడిన ఉపాధ్యాయులు వెబ్ కౌన్సెలింగ్పై మండిపాటు ఏలూరులో డీఈఓ కార్యాలయం ముట్టడి వెబ్ ఆప్షన్లు అప్రజాస్వామికం వెబ్ ఆప్షన్ల విధానంతో గతంలో చాలామంది ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారు. ఆన్లైన్లో కనిపించే రెండు వేలకు పైగా స్థానాలను గుర్తించడం ఉపాధ్యాయులకు కష్టతరమవుతోంది. దీంతో కొందరు 150 కిలోమీటర్లకు పైగా దూరం వెళ్లాల్సి వచ్చింది. మరోసారి ఇలాంటి వి ధానంతోనే నిర్వహిస్తామనడం అప్రజాస్వామికం. ఉపాధ్యాయుల బదిలీలను మాన్యువల్ విధానంలోనే నిర్వహించాలి. లేకుంటే ఉపాధ్యాయుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికావాల్సి వస్తుంది. – రవికుమార్ రుద్రాక్షి, యూటీఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు -
ఏడాది నిండా.. దౌర్జన్యకాండ
సాక్షి ప్రతినిధి,ఏలూరు : జిల్లాలో దాడుల సంస్కృతి తారాస్థాయికి చేరింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు ప్రశాంతతకు మారుపేరు. సాధారణంగా ఎన్నికల సమయంలో మాత్రమే ఇక్కడ రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే గత ఏడాది కాలంలో జిల్లాలో పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, పల్లెల్లో కూటమి నేతలు అడ్డూఅదుపు లేకుండా రెచ్చిపోవడం నిత్యకృత్యంగా కొనసాగింది. ప్రధానంగా దెందులూరు, చింతలపూడి, నూజివీడు, కైకలూరు, పోలవరం నియోజకవర్గాల్లో దా డులు, హత్యాయత్నాలు, హత్యలు వరకు పలు ఘ టనలు నమోదయ్యాయి. తొలిసారిగా జిల్లాలో జర్నలిస్టులు, పత్రికా కార్యాలయాలపై దాడుల సంస్కృతికి కూటమి నేతలు తెరతీశారు. అడ్డూ అదుపూ లేకుండా.. నూజివీడు మండలం తుక్కులూరులో గతేడాది సెప్టెంబర్ 23న టీడీపీ గ్రామ అధ్యక్షుడు అన్నే సురేష్ కార్యకర్తలు శివరామకృష్ణ, కారుమంచి రాజు, కిరణ్లు అదే గ్రామానికి చెందిన అచ్చి నాగరాజు అనే వ్యక్తిని విచక్షణారహితంగా దాడి చేసి కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసి నాగరాజును కారులో పడేసి పోలీస్స్టేషన్లో అప్పగించిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర వైరల్గా మారి టీడీపీ సాగిస్తున్న అరాచకానికి మచ్చుతునకగా నిలిచింది. గతేడాది జూన్ 6న నూజివీడులో అప్పటి వైఎస్సార్సీపీ కౌన్సిలర్ నడకుదురు గిరిష్పై టీడీపీ కార్యకర్త నూకల సాయి అరుణ్ కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి యత్నించిన ఘటన వీడియో వైరల్గా మా రింది. కొద్దిరోజుల క్రితం అధికార పార్టీ ఒత్తిళ్లతో గిరీష్ టీడీపీలో చేరారు. అలాగే వేలేరుపాడు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్పై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో దాడి చేసి గాయపరచడం, ఆగిరిపల్లి గ్రామ సర్పంచ్ చిమటా శ్రీనివాసరావు టెంట్ హౌస్లో టెంట్లు, కుర్చీలు, కంప్యూటర్లు ధ్వంసం చేయడం, ఆగిరిపల్లి–2 ఎంపీటీసీ సాదం గోపినాథ్, మాజీ ఎంపీటీసీ పండుపై దాడులు, వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము ఎంపీటీసీ కొమ్ము రాంబాబు నివాసంపై దాడి చేసి ఇంట్లో ఫర్నీచర్ను ధ్వంసం చేయడం ఇలా వరుస విధ్వంస కాండలు కొనసాగాయి. అక్రమ కేసులు ఎన్నెన్నో.. ● టీడీపీ అరాచకాలకు సోషల్ మీడియా కేసులు పరాకాష్టగా మారాయి. పార్టీ రాష్ట్ర కమిటీ, లోకేష్ ఆదేశాలతో ప్రతి మండలంలో టీడీపీ మండల అధ్యక్షులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, వెంటనే కేసులు నమోదు చేయడం, సీరియస్ టార్గెట్ అయితే నాన్ బెయిల్బుల్ కేసులు నమోదు చేయడం యథేచ్ఛగా జరిగింది. ● 2023 జూలై 15న నూజివీడులోని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాజశేఖర్రెడ్డి పోస్టు పెడితే కొద్దినెలల క్రితం టీడీపీ మండల అధ్యక్షుడు ముసునూరు సీతారామాంజనేయ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం రెండేళ్ల క్రితం ఘటనపై నాన్ బెయిల్బుల్ సెక్షన్ల కింద అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగింది. ● లింగపాలెం మండలం మఠంగూడెంలోనూ ఇదే తరహాలో టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో ముగ్గురు వైఎస్సార్సీపీ నాయకులు అరైస్టె 45 రోజులపాటు రిమాండ్లో ఉన్నారు. ● నిడమర్రు మండలంలో సోషల్ మీడియా కో–కన్వీనర్ బేతు సతీష్ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, న్యాయం చేయండని అన్నందుకు అరెస్టు చేశారు. ● బాపట్ల టౌన్ ఇస్లాంపేటకు చెందిన షేక్ సయ్యద్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టాడని చింతలపూడి టీడీపీ మండల కన్వీనర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ● కొయ్యలగూడెంలో వైఎస్సార్సీపీకి చెందిన మద్దిపాటి కృష్ణ, జింటా వెంకటేశ్వరరావు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు తోట జయబాబుపై హత్యాయత్నం చేయడమే కాకుండా తిరిగి వారిపైనే కేసులు నమోదుచేశారు. ● కన్నాపురం సర్పంచ్ భర్త కృష్ణపై కూటమి నేతలు దాడి చేసి అతనిపైనే రివర్స్ కేసులు నమోదు చేయించారు. అరాచకం కట్టలు తెంచుకుంది.. రెడ్బుక్ పేరుతో కూటమి నేతల దౌర్జనకాండ సాగింది.. పల్లెల్లో వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా భారీస్థాయిలో భౌతికదాడులు మొదలు ఆస్తుల విధ్వంసం కొనసాగింది. ప్రశాంతతకు మారుపేరైన పల్లెల్లో వ్యక్తిగత విద్వేషాలు, దాడులు, అడ్డగోలుగా కేసుల నమోదు, అరెస్ట్లు జరిగాయి. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడులు, వ్యక్తిగతంగా భౌతిక దాడులు, ఆస్తి నష్టాలపై ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయనిపరిస్థితి. ఇలా కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో జిల్లాలో రెడ్బుక్ రాజ్యాంగమే అమలైంది. అమాత్యులు మొదలు ప్రజాప్రతినిధులంతా వ్యక్తిగత టార్గెట్లను నిస్సిగ్గుగా కొనసాగించారు. దెందులూరులో రెచ్చిపోయిన మూకలు దెందులూరు మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కామిరెడ్డి నాని నివాసంపై గతేడాది జూలై 7న వందల సంఖ్యలో కూటమి కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేసి కార్యాలయ అద్దాలు, కుర్చీలు, ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. దాదాపు మూడు రోజుల పాటు పోలీస్ పికెటింగ్ హడావుడి కొనసాగినా కేసులు, అరెస్టులు జరగలేదు. అలాగే పెదవేగి మండలం కవ్వగుంట మాజీ సర్పంచ్ మద్దాల నాగయ్యపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారు. పెదపాడు మండలం, ఏలూరు రూరల్ మండలం, పెదవేగిలోనూ పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు, చేపల చెరువు సాగుకు అడ్డంకులు కల్పించడం యథేచ్ఛగా సాగాయి. దెందులూరు జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం మామ గాంధీపై దాడి, క్రియాశీలక కార్యకర్త రవీంద్ర ఆటో విధ్వంసం అలాగే దెందులూరులో వైఎస్సార్ విగ్రహాన్ని, ప్రభుత్వ శిలాఫలాకలను ధ్వంసం చేయడం ఇలా టీడీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. కూటమి రెడ్బుక్ రాజ్యాంగం జిల్లాలో అంతులేని అరాచకం వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులు తుక్కులూరులో వ్యక్తిపై దాడి చేసి తాళ్లతో నిర్బంధం నూజివీడు, చింతలపూడి, పోలవరంలో దాడుల పర్వం దెందులూరులో అధికార పార్టీ నేతల విధ్వంసాలు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు కూటమి ఏడాది పాలనంతా దౌర్జన్యాలే.. -
ఈఏపీసెట్లో మెరిసిన మనోళ్లు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీఈఏపీ సెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు 3,409 మంది, అగ్రికల్చరల్ కోర్సుల్లో ప్రవేశాలకు 1,726 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో పాకలపాటి హర్షవర్ధన్ 85, ఏలూరుకి చెందిన అల్లు హేమంత్ 97, అగ్రికల్చరల్ కోర్సుల్లో పెదపాడు మండలం కొక్కిరపాడుకు చెందిన కోసూరి వల్లీ ప్రియ 59, ఏలూరుకు చెందిన యర్రా శోభ రిషిత 109వ ర్యాంకులతో ప్రతిభ కనబర్చారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు జిల్లా నుంచి 4,874 మంది దరఖాస్తు చేసుకోగా 4,700 మంది పరీక్షలు రాశారు. వారిలో 1,817 మంది బాలురు, 1,592 మంది బాలికలు అర్హత సాధించారు. అగ్రికల్చరల్ పరీక్షలకు 2,002 మంది దరఖాస్తులు చేసుకోగా 1,899 మంది పరీక్షలు రాశారు. వారిలో 443 మంది బాలురు, 1283 మంది బాలికలు అర్హత సాధించారు. అగ్రికల్చరల్లో.. పెదపాడు మండలం కొక్కిరపాడుకు చెందిన కోసూరి వల్లీప్రియ (59వ ర్యాంకు), ఏలూరుకి చెందిన యర్రా శోభ రిషిత (109), పోలవరానికి చెందిన కొట్టే వెంకట శ్రీ కార్తీక్ (283), కొయ్యలగూడెం మండలం రాజవరానికి చెందిన తిరుమలనాథుని సత్య సృజన్ (313), లింగపాలెం మండలం కొణిజర్లకు చెందిన లక్కపాము కమలాకర్ (318), నూజివీడుకు చెందిన కుప్పాల దేదీప్య సాయి (358), టి.నరసాపురం మండలం సాయంపాలెంకు చెందిన మారిశెట్టి భాగ్యశ్రీ (375), కలిదిండి మండలం పోతుమర్రుకు చెందిన వల్లభుని దినేష్ సాయి (378), ఏలూరుకు చెందిన భీమవరపు హరి ప్రియ రామన్ (447), పెదవేగి మండలం భోగాపురానికి చెందిన యామిని దిమ్మిటి (448) మొదటి పది స్థానాల్లో నిలిచారు. ఇంజనీరింగ్లో 3,409 మంది.. అగ్రికల్చరల్లో 1,726 మంది అర్హత ఇంజనీరింగ్లో తొలి 10 స్థానాల్లో.. ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురానికి చెందిన పాకలపాటి హర్షవర్ధన్ (85వ ర్యాంకు), ఏలూరుకి చెందిన అల్లు హేమంత్ (97), కొయ్యలగూడెం మండలం పరింపూడికి చెందిన బండ్లపల్లి యోగ సాయి శ్రీనివాస్ (162), కామవరపుకోటకు చెందిన ద్వాదశి మోహన (313), నూనె రమేష్ (358), ముత్తంశెట్టి వెంకట్ హనీష్ (378), టి.నరసాపురం మండలం బందంచర్లకు చెందిన అనుమోలు తరుణ్ సాయి (401), లింగపాలెం మండలం యడవల్లికి చెందిన గోల్కొండ జగదీప్ శరణ్ (409), పోలవరానికి చెందిన పడాల జశ్వంత్సాయి చరణ్ (421), చింతలపూడి మండలం రాఘవాపురానికి చెందిన సిరి సంజన మారుమూడి (438) మొదటి పది స్థానాల్లో నిలిచారు. -
శ్రమ పాత్ర కీలకం
ఏలూరు టౌన్: సమాజ పరిమాణం, అభివృద్ధిలో శ్రమ పాత్ర కీలకమని సినీ రచయిత సు ద్దాల అశోక్ తేజ అన్నారు. స్థానిక టుబాకో మర్చంట్స్ కల్యాణ మండపంలో సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన 60వ శ్రమ కావ్యం–గానం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ ఆహ్వానం పలకగా జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు అధ్యక్షత వహించారు. అశోక్ తేజ తాను రచించిన శ్రమకావ్యం పుస్తకంలో అనేక ఘట్టాలను ఆల పిస్తూ సవివరంగా విశ్లేషించారు. రిటైర్డ్ రిజిస్ట్రా ర్ లంక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శ్రమ కా వ్యం రచనలో శ్రమను వస్తువుగా తీసుకుని రచన సాహసోపేతం అన్నారు. సీఐటీయూ రా ష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మా ట్లాడుతూ శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని సీఐటీయూ దేశవ్యాప్తంగా ఉద్య మాలు చేస్తోందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మంతెన సీతారాం పాల్గొన్నారు. రైల్వేస్టేషన్లో తనిఖీలు ఏలూరు టౌన్: ఏలూరు రైల్వేస్టేషన్లో రైల్వే పో లీసులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. విజయవాడ రైల్వే డీఎస్పీ జి.రత్నరాజు పర్యవేక్షణ లో విజయవాడ లైన్ సర్కిల్ సీఐ ఎంవీ దుర్గారావు, ఏలూరు రైల్వే ఎస్సై పి.సైమన్ ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించిన రైల్వే పోలీస్ ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలకు ఆదేశాలు ఇచ్చారని ఎస్సై చెప్పారు. డీఎస్సీ పరీక్షలకు 532 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): డీఎస్సీ పరీక్షలకు రెండో రోజు ఆదివారం జిల్లాలో 532 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఏలూరులోని సిద్ధార్థ క్వెస్ట్లో మధ్యాహ్నం 180 మందికి 156 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 208 మందికి 202 మంది, మధ్యాహ్నం 204 మందికి 174 మంది హాజరయ్యారు. 10న ఆందోళనలు ఏలూరు టౌన్: గ్రామీణ పేదల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10న ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన, వినతిపత్రాల అందజేతకు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కంచర్ల గురవ య్య, బండి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. నేడు యోగాంధ్ర ర్యాలీలు ఏలూరు(మెట్రో): యోగాంధ్ర కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలనీ కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. సోమవారం ఉదయం గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లోలో ర్యాలీలు నిర్వహించాలన్నారు. నేడు పీజీఆర్ఎస్ రద్దు అనివార్య కారణాలవల్ల సోమవారం ఏలూరు కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు డీఆర్వో వి.విశ్వేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. పని వేళల మార్పుపై ఆగ్రహం ఏలూరు టౌన్: కార్మికుల హక్కులను కాలరాస్తూ 10 గంటల పని విధానాన్ని అమలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే విర మించుకోవాలనీ, రాత్రి వేళల్లో మహిళలతో పని చేయించవద్దని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏలూరు ఆర్ఆర్పేట నగరపాలక పార్కు వద్ద ఆదివారం ఆందోళన చేపట్టారు. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాల కాపీలను ఏఐటీయూసీ నాయకులు దగ్ధం చేశారు. రూ.69.30 లక్షల ఆన్లైన్ మోసం ఏలూరు టౌన్: తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయంటూ ఒక మహిళను నమ్మించి ఆన్లైన్లో భారీగా నగదును కాజేశారు. ఏ లూరు రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు రూరల్ వెంకటాపురం పంచాయతీ గ్రీన్సిటీ ప్రాంతానికి చెందిన మె యిదా కృష్ణభవానీ (30) గతంలో ఒక ప్రైవేటు స్కూల్లో పనిచేశారు. ఆమె సెల్ఫోన్ వాట్సాప్కు గతనెల 19న అమాన్సా పీటీ ప్రైవేట్ లి మిటెడ్ యాప్ నుంచి ఇన్వెస్ట్మెంట్ లింకు వచ్చింది. లింకును ఓపెన్ చేసిన కృష్ణభవానీ తనపేరుతో అకౌంట్ రిజిస్టర్ చేసుకున్నారు. మరో నంబర్ నుంచి అదే యాప్ డౌన్లోడ్ చేసి చాటింగ్ చేశారు. ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలు ఆర్జించినట్లు చాటింగ్లో పలువురు చెప్పగా ఆమె నమ్మారు. దీంతో ఆమె పలు దఫాలుగా రూ.69.30 లక్షల పలు ఖాతాలకు చెల్లించారు. అయితే ఎలాంటి లాభాలు లేకపోవడంతో తాను మోసపోయినట్టు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఆదివారం ఏలూరు వన్టౌన్ సీఐ జి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏలూరు రూరల్ ఎస్సై సీహెచ్కే దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కక్షతోనే గోడ కూల్చివేత
దెందులూరు : మండలంలోని చల్ల చింతలపూడిలో ఎంపీటీసీ సభ్యురాలు సింహాద్రి పద్మావతి, మాజీ సర్పంచ్ సింహాద్రి శ్రీమన్నారాయణ ఇంటి ప్రహరీ గోడను టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరినందుకే రాజకీయ కక్ష ధోరణితోనే కూల్చివేశారని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి విమర్శించారు. ఆదివారం ఎంపీటీసీ సింహాద్రి పద్మావతి, మాజీ సర్పంచ్ సింహాద్రి శ్రీమన్నారాయణలను కొఠారు ఫోన్లో పరామర్శించారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని సూచించారు. ఇటువంటి సంఘటనలు ఎంత మాత్రం సరైనవి కాదని, గోడ కూల్చివేతపై ఉన్నతాధికారులతో మాట్లాడతానని ఆయన చెప్పారు. ఈ విషయంలో బాధితులకు అండగా ఉండి న్యాయపోరాటం చేస్తామన్నారు. కూల్చివేతలో విధులు నిర్వహించినవారు కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరిగితే పార్టీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. వీఆర్వో వివరణ గోడ కూల్చివేతపై వీఆర్వో సుబ్రహ్మణ్యంను వివరణ కోరగా.. చల్ల చింతలపూడి గ్రామంలో రోడ్లకు రెండు వైపులా మూడు అడుగుల మేరకు తొలగించాలని గ్రామ పంచాయతీ తీర్మానం చేసిందని చెప్పారు. పంచాయతీ తీర్మానం మేరకు ప్రహరీ గోడ తొలగించినట్టు చెప్పారు. ఎంపీటీసీ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కొఠారు పరామర్శ అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని భరోసా -
కోకో గింజల చోరీ కేసులో నలుగురి అరెస్టు
జంగారెడ్డిగూడెం: కోకో గింజల చోరీ కేసుల్లో నలుగురిని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపారు. ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం, టి.నరసాపురం, లక్కవరం పోలీస్స్టేషన్ల పరిధిలో ఇటీవల కోకో గింజల చోరీ జరిగింది. దొంగిలించిన రూ.8 లక్షలు విలువైన 2 వేల కేజీల కోకో గింజలు అమ్మేందుకు ప్రయత్నించిన క్రమంలో, దాడి చేసి జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లికి చెందిన కంకిపాటి కీర్తిరాజు, మానికల మంగరాజు, దొప్పసాని వెంకన్నబాబు, పుట్లగట్లగూడెంకు చెందిన కటారి సుబ్రహ్మణ్యంను అరెస్టు చేశామన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. వీరిలో కంకిపాటి కీర్తిరాజు పగలు మేకలు కాస్తూ పొలాల్లో ఉన్న కోకో గింజలు ఆరబెట్టిన ప్రదేశాలు గమనించి, బృందంలోని మరో ఐదుగురికి చెబుతాడు. ఆటోలో రహస్య ప్రదేశానికి తరలించేవారు. వీలుచూసుకుని అమ్మేవారు. వీరిపై జంగారెడ్డిగూడెం పోలీస్స్టేషన్ పరిధిలో 2 కేసులు, లక్కవరం పోలీస్స్టేషన్ పరిధిలో 2 కేసులు, టి.నరసాపురం పీఎస్ పరిధిలో ఒక కేసు నమోదైంది. ద్వారకాతిరుమల, తడికలపూడి పోలీస్స్టేషన్ల పరిధిలో సైతం కేసులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకోవడం పాటు, చోరీకి వినియోగించిన ఆటోను సీజ్ చేసినట్లు చెప్పారు. కేసును చేధించిన ఎస్సై జబీర్, ఏఎస్సై సంపత్కుమార్, పీసీలు రమేష్, బి.రాజశేఖర్లకు రివార్డు కోసం ఎస్పీకి సిపార్సు చేస్తున్నట్లు తెలిపారు. -
నేటి నుంచి వేణుగోపాల స్వామి వార్షికోత్సవాలు
చింతలపూడి: మండలంలో యర్రగుంటపల్లిలో సంతాన వేణుగోపాలస్వామి వార్షిక మహోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి, శ్రీ షిరిడీ సాయిబాబా ,అయ్యప్ప స్వామి వైభవంగా విశేష పూజలు ప్రారంభమవుతాయి. ముందుగా గోపూజ, గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభిస్తారు. 1893లో చంద్రగిరి కాశీ అనే భక్తుడికి స్వామివారు స్వప్నంలో కనిపించి యర్రగుంటపల్లి గ్రామంలో వేణుగోపాలస్వామి ఆలయం నిర్మించాలని ఆదేశించడంతో ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చెబుతారు. చివరి రోజుల అన్నదానం చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్త చంద్రగిరి శేష కిరణ్ తెలిపారు. 23 నుంచి పీ సెట్ ఎంపికలు దెందులూరు: వ్యాయామ కళాశాలలో ప్రవేశాలకు ఫిజికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీ–సెట్ ) ఎంపికలు ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతాయని గోపాన్నపాలెం వ్యాయామ విద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.నతానియల్ అన్నారు. రూ.వెయ్యి అపరాధ రుసుంతో ఈనెల 11 వరకు, రూ.2 వేల అపరాధ రుసుంతో 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. -
వానాకాలంలో వ్యాధుల ముప్పు
బుట్టాయగూడెం: వర్షాకాలం వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణంలో మార్పులతో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని లేకుంటే పలు రోగాల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విస్తారంగా వర్షాలు కురిసిన సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. నీటి కలుషితం ద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, మురికి నీటి నిల్వలతో దోమలు కూడా వృద్ధి చెందుతాయని వైద్యాధికారులు అంటున్నారు. వర్షాకాలంలో గిరిజన ప్రాంతంలో ఎక్కువగా వాతావరణ మార్పుల వల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, డయేరియా, కామెర్లు వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయని అధికారులు చెబుతున్నారు. ఏ చిన్న లక్షణం కనిపించినా వెంటనే అందుబాటులో ఉన్న ప్రభుత్వాస్పత్రులకు సూచిస్తున్నారు. జిల్లాలో 153 మలేరియా సమస్యాత్మక గ్రామాలు జిల్లాలోని గిరిజన మండలాలైన పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలో సుమారు 153 మలేరియా వ్యాపించే సమస్యాత్మక గ్రామాలుగా అధికారులు గుర్తించారు. గతంలో 143 సమస్యాత్మక గ్రామాలు ఉండగా ఈ సంఖర్య పెరిగింది. ఆయా గ్రామాల్లో ప్రస్తుతం మొదటి విడత మలేరియా స్ప్రేయింగ్ పనులు మే 1 నుంచి ప్రారంభించారు. ఇందుకోసం 53 టన్నుల మలాథియన్ స్ప్రేయింగ్ మందు డబ్బాలు సిద్ధం చేశారు. గ్రామాల్లో మొదటి విడత పనులు పూర్తయినట్లు అధికారులు చెప్పారు. జున్ 15 నుంచి 2వ విడత మలాథియన్ స్ప్రేయింగ్ పనులకు ఏర్పాట్లు చేస్తున్నారు. మలేరియా జ్వరం ఎనాఫిలస్ దోమ కుట్టడం ద్వారా ఈ జ్వరం వస్తుంది. వైవాక్స్ మలేరియా, ఫాల్స్ ఫారమ్ మలేరియా అనే రెండు రకాలు ఉన్నాయి. ఇందులో రెండో రకం అత్యంత ప్రమాదకరమైంది. జ్వరం వచ్చినప్పుడు టెస్ట్లు చేయించుకుని సకాలంలో చికిత్స చేయించుకోకపోతే రోగి చనిపోయే ప్రమాదం ఉంది. తీవ్రమైన జ్వరం, రోజు విడిచి రోజు జ్వరం, తీవ్రమైన తలనొప్పి ఉంటే అవి మలేరియా లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం. మురికినీరు నిల్వలేకుండా చూసుకోవడం. దోమల నివారణకు చర్యలు తీసుకోవడం వంటి పనులు చేయాలి. టైఫాయిడ్ కలుషిత నీటిని తాగడం వల్ల, బహిరంగ మలవిసర్జన వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. జ్వరం త్వరగా తగ్గకపోవడం, ఒంటి నొప్పులు, తలనొప్పి, కడుపులో అల్సర్ను వ్యాధి లక్షణాలుగా గుర్తించాలి. సురక్షిత నీటిని తాగడం, జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకుని వైద్యం పొందడం ద్వారా నయం కావచ్చు. డయేరియా కలుషిత నీరు తాగడం, కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల డయేరియా వస్తుంది. ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందుతుంది. నిరంతరాయంగా విరోచనాలు, వాంతులు కావడం ఈ వ్యాధి లక్షణాలు. డయేరియా నివారణకు వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు. సురక్షిత, కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పులుపు, కారం ఉండే ఆహారాన్ని తగ్గించడం, ఫాస్ట్ ఫుడ్ వంటివి తినకపోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం దోమల నివారణకు ముందస్తు చర్యలు జాగ్రత్తలు తప్పనిసరి వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కలుషిత నీటిని తాగడం వల్ల వ్యాధులు ప్రబరిల్లే అవకాశం ఉంది. ఎక్కడడపడితే అక్కడ నీరు తాగకూడదు. జ్వరం వస్తే అందుబాటులో ఉన్న ఆస్పత్రికి వెళ్ళి రక్త పరీక్షలు చేయించుకుని వ్యాధిని బట్టి వైద్యం పొందాలి. దోమతెరలు వాడటం మంచిది. ఎన్ఎస్ఎస్ ప్రసాద్, మలేరియా అధికారి, కేఆర్పురం, బుట్టాయగూడెం మండలం మొదటి స్ప్రేయింగ్ పనులు పూర్తి మలేరియా సమస్యాత్మక గ్రామాల్లో మొదటివిడత స్ప్రేయింగ్ పనులు పూర్తయ్యాయి. ఉన్నతాధికారులు పర్యవేక్షణలో పనులు చేస్తున్నాం. జున్ 15 నుంచి రెండో విడత స్ప్రేయింగ్ పనులు జరుగుతాయి. ప్రజలు పనులకు పూర్తి సహకారం అందించాలి. పి. పెద్దిరాజు, సబ్ యూనిట్ ఆఫీసర్, బుట్టాయగూడెం జిల్లాలో మలేరియా సమస్యాత్మక గ్రామాలు– 153 పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో –117 గ్రామాలు విలీన మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరులో – 36 గ్రామాలు మొదటి విడత స్ప్రేయింగ్ పనులకు వచ్చిన మలాథియన్ – 53 టన్నులు -
హాకీ పోటీల విజేతగా అనంతపురం
భీమవరం: క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవచ్చని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ అన్నారు. భీమవరం డీఎన్నార్ కళాశాల ఆవరణలో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా బాలికల హాకీ పోటీల ముగింపు సందర్భంగా ఆదివారం విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీల్లో 16 జట్లు పాల్గొనగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో అనంతపురం, అన్నమయ్య జిల్లాల జట్లు తలపడగా అనంతపురం విజయం సాధించింది. కార్యక్రమంలో భీమవరం మండల పరిషత్ అధ్యక్షుడు పేరిచర్ల విజయ నరసింహరాజు, హాకీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి గంధం హర్షవర్థన్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కలిదిండి ఆనందరాజు, కేవీస్ భరత్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షోభంలో మామిడి రైతులు
నూజివీడు: ఈ ఏడాది బంగినపల్లి మామిడి రైతులను, వ్యాపారులను సంక్షోభంలోకి నెట్టేసింది. ప్రతికూల వాతావరణం, నల్లతామర కారణంగా బంగినపల్లి దిగుబడి దారుణంగా తగ్గిపోగా ఉన్న కాస్త కాయలకు మార్కెట్లో ధర లేకుండా పోయింది. దీనికి తోడు సిండికేట్ మాయాజాలంతో మామిడి ధరలు పతనమయ్యాయి. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు నష్టాలపాలయ్యారు. జిల్లాలో మామిడితోటలు దాదాపు 40 వేల ఎకరాల్లో సాగవుతుండగా ఒక్క నూజివీడు నియోజకవర్గంలోనే 35 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. నాలుగు మండలాల్లోని రైతులకు ప్రధాన ఆదాయ వనరు మామిడే. ఖరీఫ్ సీజన్లో సాగుచేసిన పంటలు నష్టపోయినా, మామిడి ఆదుకుంటుందనే ధీమాతో రైతులు మామిడిపై నమ్మకం పెట్టుకుంటారు. బంగినపల్లి రకం తోటలు దాదాపు 25 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి మామిడి కాయలను స్థానికంగా ఉన్న మార్కెట్లతో పాటు నున్న, హైదరాబాద్లలోని మార్కెట్, ముంబాయి, ఇండోర్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. దిగజారిన ధర మామిడి ధర కూడా దిగజారుతూ వచ్చిందే తప్ప ఈ ఏడాది పెరిగిన దాఖలాలు లేవు. సీజన్ ప్రారంభమైన మార్చి మొదటి వారంలో బంగినపల్లి టన్ను ముంబాయి మార్కెట్లో రూ.80 వేల నుంచి రూ.90 వేల ధర పలకగా స్థానికంగా రూ.40 వేలు పలికింది. రానురాను రూ.30 వేలకు, రూ.20 వేలకు తగ్గుతూ ప్రస్తుతం కాయ బాగుంటే రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ధర లభిస్తోంది. ఏ మాత్రం నాణ్యత లేకపోయినా టన్ను కేవలం రూ.10 వేలకే లభిస్తోందని రైతులు వాపోతున్నారు. మామిడికి ఇంత దారుణమైన పరిస్థితి గత 25 ఏళ్లలో ఎన్నడూ చూడలేదని పేర్కొంటున్నారు. నున్న, హైదరబాద్లలో ఉన్న మామిడి మార్కెట్కు కాయలను కొనుగోలు చేయడానికి వచ్చే ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన సేట్లు సిండికేట్ కావడం వల్ల ధరలు పెరగడం లేదని రైతుల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం. రైతులకు నష్టం చేకూరుస్తున్న సిండికేట్ను నిలువరించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం, అసలు మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలే లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మామిడిపై రైతులు పెట్టుకున్న ఆశలు రాలిపోయాయి. అకాల వర్షాలు దెబ్బతీశాయి ఈ ఏడాది మే నెల అంతా కురిసిన అకాల వర్షాల వల్ల బంగినపల్లి మామిడి కాయలు నాణ్యత కోల్పోవడంతో ధర పతనమైంది. కొన్ని రోజులైతే మామిడి కాయలను ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో కోతలను సైతం నిలిపివేశారు. వర్షాలు పడిన దగ్గర నుంచి కాయలను పురుగులు ఆశించడంతో కొనేవారే లేకుండా పోయారు. ఇలా ప్రతికూల వాతావరణంతో పాటు పలు కారణాల వల్ల ఈ ఏడాది మామిడి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. ధర లేని బంగినపల్లి మామిడి రూ.60 వేల నష్టం వచ్చింది నాలుగు ఎకరాల మామిడి తోట ఉంది. పెట్టుబడి రూ.1.70 లక్షలైంది. బంగినపల్లి రకం కాయలు కోసి మార్కెట్లో విక్రయిస్తే కోతకూలి, కిరాయి పోను రూ.1.10 లక్షలు మాత్రమే వచ్చాయి. దీంతో రూ.60 వేల నష్టం వాటిల్లింది. ఈ ఏడాది కాపు తక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన ధర లేదు. –నీలపాల కోటేశ్వరరావు, మామిడి రైతు, యనమదల, నూజివీడు మండలం -
ఖర్చంతా గ్రంథ పాలకులదే
దెందులూరు: వేసవి సెలవుల్లో విద్యార్థులకు విజ్ఞానం పెంపొందించి, ఆటలు పాటలు ద్వారా మానసిక, శారీరక దృఢత్వం పెంచేందుకు గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులు నెలరోజుల పాటు నిర్వహించారు. పుస్తకాలు, పత్రికలు చదివించడం, నీతి కథలు, ప్రముఖుల జీవితాలు వివరించడం, వ్యాసరచన, డ్రాయింగ్, బొమ్మల తయారీ, చెస్, కబడ్డీ, కోకో పోటీలను నెలరోజుల పాటు గ్రంథాలయంలో గ్రంథ పాలకులు, రిసోర్స్ పర్సన్లు నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చారు. ప్రతిరోజు బిస్కెట్లు, మజ్జిగ ఏదోకటి ఇచ్చారు. ప్రతి గ్రంథాలయంలో చదువరి సంఖ్యను బట్టి 15 మంది నుంచి 20 మంది కొన్ని గ్రంథాలయాల్లో 20 నుంచి 30 వరకు విద్యార్థులు శిక్షణ పొందారు. రోజుకు బిస్కెట్లు, మజ్జిగ నిమిత్తం రూ.150 నుంచి 200 వరకు ఖర్చులయ్యాయి. శిక్షణ అనంతరం వివిధ విభాగాల్లో విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు, బొకేలు, చాక్లెట్లు ఇచ్చారు. నెల మొత్తం మీద ఒక్కో గ్రంథాలయానికి అన్ని ఖర్చులకు రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు పెట్టుబడి పెట్టారు. జిల్లా గ్రంధాలయ సంస్థ, ఒక రూపాయి కూడా గ్రంథాలయాలకు నిర్వహణ ఖర్చులు మంజూరు చేయలేదు. చాలీచాలని తక్కువ జీతాలతో కాలం నెట్టుకు వస్తుంటే వేసవి శిక్షణ తరగతులు పేరిట నెలకు రూ.10 వేల నుంచి 14 వేలు తాము పెట్టుబడి పెట్టడం తలకు మించిన భారంగా తయారైందని అనేకమంది గ్రంథ పాలకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చుతో కూడుకున్న కార్యక్రమానికి నిర్వహణ నిమిత్తం కూడా డబ్బులు మంజూరు చేయకపోతే తాము ఎలా పెట్టుబడి పెడతామని తక్కువ జీతాలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. తీరని ఉద్యోగుల సమస్యలు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో గ్రంథాలయ ఉద్యోగుల పీఆర్సీ, డీఏ ఊసెత్తలేదు. డీఎస్సీ ఇతర పోటీ పరీక్షలకు గ్రంథాలయాల్లో ఇదివరకు ఉన్న జీకే పుస్తకాలే తప్ప నూతనంగా కొన్న పుస్తకాలు ఏవీ లేవు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కొత్త పుస్తకాలు కొనాల్సిన అవసరం ఉంది. శాఖ పరంగా పీఆర్సీ, డీఎ సమస్యలు పరిష్కరించకపోగా డబ్బుతో కూడుకున్న కార్యక్రమాలు తమపై రుద్దితే ఎలాగని గ్రంథాలయ ఉద్యోగుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల పదోన్నతులపై కూడా చర్యలు లేవు. జిల్లాలో అనేకచోట్ల నేటికీ అద్దె భవనాల్లోనే గ్రంథాలయాలు నిర్వహిస్తున్నారు. ఇన్ని సమస్యలతో గ్రంథాలయాలు సతమతమవుతున్నాయి. వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులకు పెట్టుబడి పెట్టామని, ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఇస్తే చెల్లిస్తాం వేసవి విజ్ఞానశిక్షణ తరగతులు నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని... నిధులు వస్తే జమ చేస్తామని ఏలూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శేఖర్ బాబు అన్నారు. వేసవి తరగతుల నిర్వహణ బిల్లులు చెల్లించని ప్రభుత్వం -
గంజాయి రవాణా చేస్తున్న నలుగురి అరెస్టు
గణపవరం : చెడు వ్యసనాలకు బానిసలై, గంజాయి అమ్మకాలు చేస్తున్న నలుగురు యువకులు పోలీసుల వలలో చిక్కారు. గణపవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద పోలీసులు శనివారం ఉదయం మాటువేసి గంజాయి అక్రమంగా రవాణాచేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.50వేల విలువైన 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. శనివారం సాయంత్రం ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాకు చెందిన ఖార అర్జున్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ దొంగతనంగా గంజాయి అమ్మేవాడు. ఇతనికి గణపవరం వెలంపేటకు చెందిన రాయపురెడ్డి తరుణ్, ఇందిరమ్మ కాలనీకి చెందినయాళ్ల సాయికిషోర్, ఉండిమండలం కోలమూరుకు చెందిన దగుగ్పల్లి జోగామారిష్ పరిచయం ఆయ్యారు. ఈ ముగ్గురు యువకులు గంజాయి సేవించడమే కాక, చుట్టుపక్కల యువకులకు గంజాయి అమ్మవారు. ఈ ముగ్గురు యువకులు అర్జున్తో కలసి అరకు వెళ్లి గంజాయి కొని తెచ్చి స్థానికంగా అమ్ముతున్నారు. తనకు అందిన సమాచారం ఆధారంగా సీఐ సుభాష్ సిబ్బందితో కలసి మాటువేసి వీరిని పట్టుకున్నారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్టు తాడేపల్లిగూడెం అర్బన్: తాడేపల్లిగూడెం పట్టణంలోని దానమ్మగుడి సమీపంలో ఆటో డ్రైవర్ పద్మాకర్ ఇటీవల ఇంటి ముందు గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. శనివారం ఇది గమనించిన స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎకై ్సజ్ ఎస్సై రాంబాబు, పట్టణ ఎస్సై బాదం శ్రీనివాసు పద్మాకర ఇంటికి వెళ్లి అక్కడి గంజాయి మొక్కలను పరిశీలించి నిర్ధారించారు. పద్మాకర్ను విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అరెస్టు చేసి విచారణ చేపట్టారు. -
హోరాహోరీగా హాకీ పోటీలు
భీమవరం: భీమవరం డీఎన్నార్ కళాశాల ఆవరణలో 15వ అంతర్జిల్లాల రాష్ట్ర స్థాయి బాలికల హాకీ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 16 టీంలు పాల్గొంటున్నాయి. శనివారం నిర్వహించిన పోటీల్లో 13 జట్లు పాల్గొన్నాయి. వీటిలో కడప– ఎన్టీఆర్ జిల్లాల జట్ల మధ్య పోటీలో కడప 12 గోల్స్ చేసి విజయం సాధించింది. గుంటూరుపై అనంతపురం, కృష్ణాపై ప్రకాశం, పశ్చిమగోదావరిపై అనకాపల్లి జట్టు విజయం సాధించింది. శ్రీసత్యసాయి– నెల్లూరు మధ్య జరిగిన పోటీలో శ్రీసత్యసాయి జట్టు, తిరుపతి–నంద్యాల మధ్య పోటీలో తిరుపతి, విశాఖపట్నం–మన్యం జిల్లా మధ్య పోటీలో విశాఖపట్నం విజయం సాధించాయి. కాకినాడ–అన్నమయ్య జిల్లాల మధ్య పోటీలో ఎవరూ గోల్ చేయకపోవడంతో డ్రాగా ముగిసింది. 288 మంది క్రీడాకారులకు డీఎన్నార్ కళాశాల యాజమాన్యం వసతి కల్పించగా జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోజనం ఇతర సౌకర్యాలు కల్పించినట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కలిదిండి ఆనందరాజు, కేవీఎస్ భరత్ చెప్పారు. -
చెట్టును ఢీకొని యువకుడి మృతి
భీమడోలు: ఆగడాలలంక చానల్ రోడ్డులోని వడ్డిగూడెం సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతిచెందాడు. ఆగడాలలంక వీఆర్వో సైదు గోపాలకృష్ణ రెండో కుమారుడు సైదు సాయికృష్ణ గంగాప్రసాద్ స్నేహితుడి రిసెప్షన్కు బైక్ ఏలూరు వెళ్లాడు. పార్టీ ముగించుకుని స్వగ్రామానికి వస్తుండగా వడ్డిగూడెం సమీపం మలుపు వద్ద ఒక్కసారిగా అదుపు తప్పింది. ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొట్టాడు. సాయి కృష్ణ ఎగిరి పక్కనే ఉన్న పంటబోదెలో పడ్డాడు. తల రాయికి తగలడంతో మృతిచెందాడు. శనివారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలు గమనించి పోలీసులకు, తండ్రికి సమాచారం అందించారు. ఎస్సై వై.సుధాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. -
శ్రీవారిని దర్శించుకున్న నటుడు సుప్రీత్రెడ్డి
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రాన్ని సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుప్రీత్రెడ్డి (కాట్రాజ్) శనివారం మధ్యాహ్నం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయన ముందుగా శ్రీవారు, అమ్మవార్లను దర్శించారు. అనంతరం అర్చకుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. సుప్రీత్రెడ్డి ఛత్రపతి, మిర్చి, మర్యాద రామన్న, ఎక్స్ప్రెస్ రాజా, ఆగడు, బలుపు వంటి చిత్రాల్లో నటించారు. గోదావరిలో పడి యువకుడి మృతి కుక్కునూరు : గోదావరిలో స్నానం చేసేందుకు సరదాగా స్నేహితులతో దిగిన యువకుడు గోదావరిలో మునిగి మృతిచెందిన ఘటన శనివారం మండలంలోని మాధవరం రేవు వద్ద జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వేలేరుపాడు మండలం చాగరపల్లికి చెందిన మొట్టెం చరణ్ (20) శనివారం మధ్యాహ్నం కుక్కునూరు మండలంలోని బంజరుగూడెం గ్రామంలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వివాహానికి హాజరయ్యాడు. భోజనం అనంతరం తిరుగు ప్రయాణంలో మాధవరం గ్రామంలో స్నేహితులు ఉండటంతో ఆగాడు. అక్కడ మరో నలుగురు స్నేహితులతో కలిసి గోదావరిలో ఈత కొట్టేందుకు దిగారు. దిగిన వారెవరికీ ఈత రాకపోవడం, చరణ్ లోతును గమనించకుండా ముందుకు వెళ్లడంతో ఒక్కసారిగా గోదావరిలో మునిగి గల్లంతయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని స్థానిక జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టగా, రాత్రి 8 గంటల సమయంలో చరణ్ మృతదేహం లభ్యమైంది. సింహవాహనంపై గ్రామోత్సవం అత్తిలి: మండలంలో ఈడూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవరాల వెంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం స్వామికి నిత్యార్చనలు, ప్రత్యేక పూజలు జరిపారు. వేదపారాయణం నిర్వహించారు. సాయంత్రం సింహవాహనంపై శ్రీస్వామి, అమ్మవార్లను ఉంచి మేళతాళాల నడుమ శ్రీస్వామివారి గ్రామోత్సవం వైభవంగా జరిపారు. దండు శ్రీనివాసరాజు, ఉమాలక్ష్మిదేవి దంపతుల సౌజన్యంతో శ్రీవెంకటేశ్వర సంబరం నిర్వహించారు. ఆలయ అర్చకులు వాడపల్లి శేఖరాచార్యులు ఆధ్వర్యంలో పూజాదికాలు జరిపారు. -
పంట మార్పిడితో అధిక దిగుబడి
బుట్టాయగూడెం : ఒకే పొలంలో ఒకే పంట సాగు ద్వారా దిగుబడులు తగ్గుతాయి. పంటల్లో ఎదుగుదల ఉండదు. చీడపీడల ఉధృతి అధికంగా ఉంటుంది. పంటల మార్పిడి ద్వారా భూసారం పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఒకే పొలంలో వేర్వేరు పంటలను ఒక క్రమంలో సాగు చేస్తే అధిక ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. పంట మార్పిడితో ప్రకృతి వనరులు సమర్ధవంతంగా వాడుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో భూసారం నష్టపోకుండా అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ ఏడాది ఖరీఫ్కు సిద్ధమవుతున్న నేపధ్యంలో పంట మార్పిడితో కలిగే ప్రయోజనాలపై వ్యవసాయశాఖ అధికారులు రైతులకు పలు సూచనలు చేశారు. ఒకే పంట సాగుతో నష్టాలు ● వేరు వ్యవస్థ ఒకే లోతుకు పోవడం వల్ల ఆ లోతు వరకు ఉన్న పోషకాలు మాత్రమే మొక్కలు వినియోగించుకుంటాయి. ● ఏటా ఒకే పంట పండించడం వల్ల చీడపీడలు, కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది. పైరు కూడా అభివృద్ది చెందదు. దిగుబడులు తగ్గుతాయి. రైతులకు పెట్టుబడుల భారం పెరుగుతుంది. ● నేల కోతకు గురవుతుంది. పండిన పంట నాణ్యత ఉండదు. ఫలితంగా గిటుబాటు ధర లభించదు. దీంతో రైతులకు నష్టం వచ్చే అవకాశం ఉంది. ● మార్కెట్ సమస్యలు ఎదురవుతాయి. పాటించాల్సిన జాగ్రత్తలు ● ఎక్కువ లోతుకు చొచ్చుకుపోయే వ్యవస్థ ఉన్న పంట, తక్కువ లోతుకు చొచ్చుకు పోయే వేరు వ్యవస్థ ఉన్న పంటలను ఒకదాని తర్వాత ఒకటి సాగు చేయాలి. వరి, అపరాలు, జొన్న, పత్తి వంటి పంటలు వరుసగా వేయడం మంచిది. ● నేలను నిర్వీర్యం చేసే పంటలను సారాన్ని అభివృద్ధి చేసే పంటలను ఒకదాని తర్వాత ఒకటి సాగు చేసుకోవటం మేలు. ఉదాహరణకు మొక్కజొన్న, అపరాలు వంటి పంటలు. పంట మార్పిడితో లాభాలు పంట మార్పిడి విధానం ద్వారా అనేక లాభాలు ఉన్నాయి. వీటిపై రైతులు పూర్తి అవగాహన పెంచుకోవాలి, వరి పంట సాగు చేసే ముందు పచ్చిరొట్ట పైర్లు సాగు చేయడం వల్ల భూసారం పెరుగుతుంది. సేంద్రీయ పదార్థం భూమిలో ఎక్కువగా ఉండడం వల్ల పైరు ఏపుగా పెరుగుతుంది. వరి తర్వాత అపరాలు, వేరుశనగ, సోయా చిక్కుడు తదితర పంటలు సాగు చేయడం వల్ల భూమిలో సేంద్రీయ పదార్థం బాగా వృద్ధి చెందుతుంది. దీంతో పంటలపై వచ్చే శీలీంద్రాల ఉధృతి తగ్గుతుంది. వరి తర్వాత చిక్కుడు జాతికి చెందిన శనగ, పెసర, మినుము, వేరుశనగ సాగు వల్ల వాటి వేర్లలోని రైజోబియన్ బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని తీసుకుంటాయి. వేర్లలో బుడుపుల మాదిరి ఏర్పడి తర్వాత సాగు చేసే పంటలకు మంచి సారాన్ని అందిస్తాయి. పంట మార్పిడితో మంచి దిగుబడులు రైతులు ఏటా ఒకే పంట సాగు చేస్తున్నారు. వరి సాగు తప్ప వేరే పంట సాగు చేసేందుకు ఆశక్తి చూపడం లేదు. దీంతో వరి పంటలో చీడపీడల బెడద ఎక్కువై సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. దీన్ని అధిగమించడానికి పంటల మార్పిడి విధానం ఉత్తమం. ఈ విధానంపై రైతులు పూర్తి అవగాహన పెంచుకోవాలి. పంట మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలు ఒకసారి అనుభవంలోకి వస్తే ఈ విధానాన్ని రైతులు కొనసాగిస్తారు. – డి.ముత్యాలరావు, మండల వ్యవసాయాధికారి, బుట్టాయగూడెం పాడి– పంట భూసారం వృద్ధి, చీడ పీడల నివారణ రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ సిబ్బంది -
చెరువు మట్టి అక్రమార్కుల పాలు
నూజివీడు: పొలంలో మెరక నిమిత్తం మట్టి కావాలని అనుమతులు తీసుకుని చెరువు మట్టిని తవ్వి యథేచ్ఛగా విక్రయిస్తూ టీడీపీ నాయకులు జేబులు నింపుకుంటున్నారు. నూజివీడు పట్టణంలోని పెద్దచెరువులో పొలం మెరక చేసుకోవాలనే ముసుగులో అనుమతులు పొంది మట్టిని వాణిజ్య అవసరాలకు, ఇతర అవసరాలకు అక్రమార్కులు అమ్మేస్తున్నారు. రెండు రోజుల నుంచి అక్రమ మట్టి తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నా ఇటు ఇరిగేషన్ అధికారులు గాని, అటు రెవిన్యూ అధికారులు గాని పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ట్రాక్టరు మట్టిని రూ.1000 నుంచి రూ.1200కు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పొక్లెయిన్కు టక్కులో మట్టిని పోసినందుకు రూ.150 ఇస్తుండగా మిగిలిన మొత్తం ట్రాక్టర్ కిరాయి కింద వసూలు చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇంత రేటు గతంలో ఎన్నడూ లేదని రాజకీయ వర్గాల్లోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెరక నిమిత్తం అనుమతులు తీసుకొని.. పట్టణానికి చెందిన వీవీ కృష్ణారావు నూజివీడులోని సర్వే నెంబరు 871–3లోని ఎకరం విస్తీర్ణం గల వ్యవసాయ భూమిని మెరక చేసుకునే నిమిత్తం అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహసీల్దార్, స్థానిక ఇరిగేషన్ డీఈ సిఫార్సుల మేరకు ఇరిగేషన్ ఈఈ 1000 క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని వారి సొంత ఖర్చులతో తవ్వి తోలుకునేందుకు అనుమతి ఇచ్చారు. అది కూడా ఈనెల 1 వరకు మాత్రమే అనుమతినివ్వగా గత రెండు రోజుల నుంచి పెద్ద చెరువులోని మట్టిని అధికార పార్టీకి చెందిన నాయకులు యథేచ్ఛగా, విచ్చలవిడిగా తోలుతూ విక్రయిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ, ఇంజినీరింగ్ అధికారులు మట్టి తవ్వడానికి మార్కింగ్ ఇచ్చిన చోట నుంచి తవ్వకుండా నాయకులు వేరొక చోట తవ్వుతూ మట్టిని ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీ వరకు మాత్రమే అనుమతి ఉండగా, ఈ నెల 6వ తేదీ నుంచి రెండు జేసీబీలతో మట్టిని తవ్వి తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ ఏఈ, డీఈ ఏమాత్రం పట్టించుకోకుండా టీడీపీ నాయకులకు జీ హుజూర్ అంటున్నారు. అధికార పార్టీ వారు కావడంతో అధికారులు కళ్లు మూసుకొని కూర్చుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెరువులో నుంచి తరలిస్తున్న మట్టిని అనుమతి తీసుకున్న పొలం మెరకకు ఉపయోగించకుండా పట్టణంలో ఎవరు కావాలంటే వారికి అమ్మేసుకుంటున్నారు. ప్రజల ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంటే పట్టించుకోవాల్సిన ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకుండా వదిలేయగా, రెవిన్యూ అధికారులు సైతం ఇరిగేషన్ అధికారుల బాటలోనే నడుస్తున్నారు. పార్కు మెరక పేరుతో పెద్ద దోపిడీకి స్కెచ్ వేశారు. ఎలాంటి నిధులు మంజూరు కాకుండానే కొప్పుల వెలమపేటలో పార్కు అభివృద్ధి పనులను టీడీపీ నాయకుడొకరు చేస్తుండగా ఆ పార్కులోకి మెరక నిమిత్తం పెద్ద ఎత్తున మట్టిని తోలుతున్నారు. వాస్తవంగా నిధులు మంజూరయ్యాక టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ను నిర్ణయించి వర్క్ఆర్డర్ ఇచ్చిన తరువాత పనులు చేయాల్సి ఉండగా, అలాంటివేమీ లేకుండానే పార్కు అభివృద్ధి అంటూ పనులు చేస్తున్నారు. తరువాత మెరక పేరుతో భారీ ఎత్తున బిల్లులు చేసుకోవడానికే ఇదంతా చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పొలం మెరక కోసం అనుమతులు.. వేరే అవసరాలకు తరలింపు ట్రక్కు రూ.1000 నుంచి రూ.1200కు అమ్ముకుంటున్న అక్రమార్కులు -
శుభ కార్యాలకు విరామం
శ్రావణం వరకూ ఆగాల్సిందే.. ఈనెల 10 నుంచి గురు మూఢమి. అలాగే 26 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. దీంతో ఆషాఢ మాసం ముగిసే వరకూ వివాహాలు చేసుకునే వారు ఆగాల్సిందే. శ్రావణ మాసమైన జూలై 26 నుంచి బలమైన ముహూర్తాలు ఉన్నాయి. నవంబరు తర్వాత మళ్లీ ముహూర్తాలు లేవు. – గోవింద వఝుల వెంకటరమణ మూర్తి శర్మ, పురోహితుడు, ద్వారకాతిరుమల ద్వారకాతిరుమల: పెళ్లి పనులు ప్రారంభించడం దగ్గర నుంచి అన్ని పనులకు ముహూర్తాలు చూస్తారు. అటువంటి ముహూర్తాలకు 48 రోజుల పాటు బ్రేక్ పడింది. ఈ ఏడాది జనవరి 30 నుంచి జూన్ 7 వరకు వివాహాలు జోరుగా జరిగాయి. ఆయా ముహూర్తాల్లో జిల్లావ్యాప్తంగా వేలాది వివాహాలు నిర్వహించారు. ఈనెల 10 నుంచి గురు మూఢమి, 26 నుంచి ఆషాఢ మాసం కావడంతో జులై 25 వరకు పెళ్లి సందడికి విరామం వచ్చింది. తిరిగి వివాహ ముహూర్తాలు శ్రావణ మాసం జూలై 26 నుంచి ప్రారంభం కానున్నాయి. అప్పటివరకు వివాహాది శుభకార్యాలకు ఆగాల్సిందే. 48 రోజులు పనులు లేనట్టే.. వివాహాది శుభకార్యాలపై ఆధారపడి జీవనోపాధి పొందే పురోహితులు, పచ్చిపూల మండపాలు, డెకరేషన్, షామియానా పందిళ్లు నిర్మించే వారు, వాయిద్యకారులు, క్యాటరింగ్, లైటింగ్ కార్మికులకు 48 రోజుల పాటు పనులు లేనట్టే. వీరంతా మళ్లీ జులై 26 నుంచి బిజీ కానున్నారు. వివాహ ముహూర్తాలు : వివాహాలకు ఈ ఏడాది జూలై 26, 30, 31, ఆగస్టు 1, 3, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 17, సెప్టెంబర్ 23, 24, 26, 27, 28, అక్టోబర్ 1, 2, 3, 4, 7, 8, 10, 11, 12, 16, 17, 22, 23, 24, 26, 28, 29, 30, 31, నవంబర్ 1, 2, 4, 7, 12, 13, 14, 15, 22, 23, 25, 26, 27 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. నేటి నుంచి 48 రోజులపాటు బ్రేక్ జూలై 26 నుంచి మళ్లీ ముహూర్తాలు -
వెబ్ కౌన్సెలింగ్పై గళమెత్తిన టీచర్లు
ఏలూరు (ఆర్ఆర్పేట): సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ పద్ధతిలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక (ఫ్యాప్టో) నాయకులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక డీఈఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయ బదిలీల చట్టం–2025లో ఎస్జీటీల బదిలీలను మాన్యువల్గా చేపడతామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ హామీ ఇచ్చారని, అయితే ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా వెబ్ ఆప్షన్లను కొన్ని జిల్లాలకు విడుదల చేశారన్నారు. దీని ద్వారా కంప ల్సరీ బదిలీలో ఉన్న సుమారు 2,800 మంది ఐచ్ఛి కాలను ఎన్నుకోవాల్సి ఉందని, ఈ మేరకు వెబ్ కౌన్సెలింగ్ను ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక వ్యతిరేకిస్తోందన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని పక్షంలో ఆదివారం డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించా రు. ఫ్యాప్టో నాయకులు ఎం.శామ్యూల్, కేఆర్ పవన్కుమార్, సాంబశివరావు, వి.రామ్మోహన్రావు, ఆర్.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ముసునూరులో.. ముసునూరు: ఎస్జీటీల బదిలీలకు వెబ్ కౌన్సెలింగ్ ఆలోచన మానుకోవాలని మండల ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నేతలు డిమాండ్ చేశారు. మండల ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక ఎంఈఓ కార్యాలయం ఎదుట శనివారం సాయంత్రం నిరసన ధర్నా చేపట్టారు. మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘ నేతలు గాంగేయుడు, బాబురావు, పద్మ కిషోర్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. నూజివీడులో.. నూజివీడు: ఎస్జీటీలకు మాన్యువల్గా బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాలంటూ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక ఎంఈఓ కా ర్యాలయం వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపా రు. ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారుల ఒంటె ద్దు పోకడలను వీడాలన్నారు. యూటీఎఫ్, ఎస్టీయూ, డీటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. -
శ్రీవారి అంతరాలయ దర్శనం రద్దు
ద్వారకాతిరుమల: భక్తుల రద్దీ దృష్ట్యా ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం అధికారులు స్వామి వారి అంతరాలయ దర్శనాన్ని శనివారం ఐదు గంటల పాటు రద్దు చేశారు. దీంతో ప్రజాప్రతినిధుల సిఫార్సులతో వచ్చిన వారికి, వీఐపీలకు షాక్ తగిలింది. కాగా అధికారులు తీసుకున్న నిర్ణయంపై సామాన్య భక్తులు హర్షం వ్యక్తం చేశారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. రద్దీ దృష్ట్యా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీవారి అంతరాలయ దర్శనాన్ని రద్దు చేయాలని ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి ఆదేశించారు. అంతే కాకుండా అధిక సమయం అక్కడే ఉండి పర్యవేక్షించారు. ఎవరైనా ఈ నిర్ణయాన్ని అతిక్రమిస్తే చర్యలు చేపడతానని తీవ్రంగా హెచ్చరించారు. అదే సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులతో వచ్చిన వారికి, వీఐపీలకు చుక్కెదురైంది. అయితే అధికారులు వారికి నచ్చజెప్పి కొండపైన గదుల్లో వసతి కల్పించి, మధ్యాహ్నం నుంచి అంతరాలయ దర్శనం చేయించారు. సౌకర్యాలపై ఆరా : భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఈఓ సత్యనారాయణమూర్తి స్వయంగా పరిశీలించారు. ఆలయంలో భక్తుల వద్ద ఉన్న దర్శనం టికెట్లను ఆయన పరిశీలించారు. నిత్యాన్నదాన భవనంలో అన్నప్రసాదం స్వీకరిస్తున్న భక్తులతో మాట్లాడి, రుచి, నాణ్యతపై ఆరా తీశారు. ప్రసాదం కౌంటర్లు, ఇతర విభాగాలను తనిఖీ చేశారు. రూ.43 లక్షలు ఆదాయం: శ్రీవారిని 30 వేల మంది భక్తులు దర్శించినట్టు ఆలయ అధికారులు తెలిపారు. దర్శనం టికెట్లు, ప్రసాదాల విక్రయాలు, స్వామివారి నిత్యార్జిత కల్యాణాలు, విరాళాలు, ఇతర సేవా రుసుముల ద్వారా రూ.43 లక్షల ఆదాయం సమకూరిందన్నారు. క్షేత్రం కిటకిట.. హరినామమే అందరి నోట శ్రీవారి క్షేత్రం భక్తజన సంద్రాన్ని తలపించింది. సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. వేకువజాము నుంచే భక్తుల రాక మొదలైంది. దీంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివెట్టి మండపం, వైకుంఠం క్యూకాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల, ఉచిత ప్రసాద వితరణ క్యూలైన్లు, నిత్యాన్నదాన విభాగాలు భక్తులతో పోటెత్తాయి. క్యూలైన్లు నిండిపోవడంతో భక్తులు ఆలయ ఆవరణలో బారులు తీరారు. అనివేటి మండపంలో భజన మండలి సభ్యుల కోలాట నృత్యాలు అలరించాయి. స్వామివారి కొండపైన ఘాట్ రోడ్డులో భక్తుల వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. రాత్రి వరకూ క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. చిన వెంకన్న క్షేత్రం.. భక్త జన సంద్రం 5 గంటల పాటు నిలిపివేసిన అంతరాలయ దర్శనం -
గంజాయి రవాణా.. నలుగురి అరెస్ట్
వ్యసనాలకు బానిసలై, గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను గణపవరం పోలీసులు అరెస్ట్ చేశారు. 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 10లో u●ఉచిత ప్రయాణమెప్పుడో? మహిళలకు ఉచిత బస్సు అని ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది. ఉచిత బస్సు గురించి ఊసే ఎత్తడం లేదు. ఎన్నికల సభల్లో మాత్రం మహిళలందరికీ ఉచిత బస్సు ఇస్తాం.. మీరు ఎక్కడి వెళ్లాలన్నా, తీర్థయాత్రలు చేయాలన్నా వెసులుబాటుగా ఉంటుందన్నారు. ఇప్పటివరకు అసలు ఎక్కడా అమలు చేయలేదు. ఈ ఏడాదైనా ప్రకటిస్తారో లేదో చూడాలి. – కూనిశెట్టి నాగమణి, గృహిణి పథకాలన్నీ అమలు చేయాలి పేద కుటుంబాలు గతే డాది నుంచి ఎదురుచూస్తున్న సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి. పథకాలు అమలు చేస్తే మాలాంటి పేద కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. పథకాల ద్వారా అందే సొమ్ముతో కాలేజీ ఫీజులు, చదువుకయ్యే ఖర్చులు చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ ఏడాదైనా పథకాలు అమలు చేస్తే బాగుంటుంది. – మిరియాల శ్రీకృష్ణ, ఇంజనీరింగ్ విద్యార్థి