కొల్లేరులో పక్షుల గణన
● ఈ ఏడాది పెరిగిన పక్షుల సంఖ్య
● అటవీశాఖ అధికారుల వెల్లడి
కై కలూరు: కొల్లేరు అభయారణ్యంలో పక్షుల గణన బుధవారం నుంచి ప్రారంభమైంది. మొత్తం ఆరు జట్లుగా ఒక్కో జట్టులో 5 సభ్యులతో బుధవారం, శుక్రవారం పక్షుల లెక్కింపు చేశారు. కొల్లేరు అభయారణ్య పరిధిలో మదాపురం, మెండికోడు, గుడివాకలంక, ప్రత్తికోళ్ళలంక, కొక్కిరాలలంక, బొమ్మిలిలంక, ఆగడాలలంక, చెట్నెంపాడు, మల్లవరం, దోసపాడు, క్రొవ్వలి, కేదవరం, పోతులూరు, కొల్లేటికోట, పైడిచింతపాడు, గోకర్ణపురం, గుమ్మళ్లపాడు, ఆలపాడు, పల్లెవాడ, అడవికొలను, పెదనిండ్రకొలను, డీ.గోపవరం, సిద్దాపురం, పల్లెవాడ, ఆటపాక, పెదఎడ్లగాడి, శ్రీపర్రులో కొల్లేరు పక్షుల సర్వే జరుగుతుంది. గత శీతాకాలంతో పోల్చుకుంటే ఈ ఏడాది పక్షుల సంఖ్య పెరిగిందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.


