జాతరకు పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

జాతరకు పటిష్ట బందోబస్తు

Jan 23 2026 6:41 AM | Updated on Jan 23 2026 6:41 AM

జాతరకు పటిష్ట బందోబస్తు

జాతరకు పటిష్ట బందోబస్తు

పూతపైనే ఆశలన్నీ జాతరకు పటిష్ట బందోబస్తు

పూతపైనే ఆశలన్నీ
నూజివీడు నియోజకవర్గంలో మామిడి పూతలు బాగుండటంతో రైతులు ఆశతో ముందుకు సాగుతున్నారు. దాదాపు 85 శాతం తోటల్లో పూతలు వచ్చాయి. 8లో u

ఎస్పీ ప్రతాప్‌ శివకిషోర్‌

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో ఈనెల 25, 26 తేదీల్లో జరిగే గంగానమ్మవారి జాతర మహోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్‌ శివకిషోర్‌ తెలిపారు. తూర్పువీధిలో జాతర జరిగే ప్రాంతాన్ని గురువారం ఆయన పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణపై ఆదేశాలు జారీ చేశారు. భక్తుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉందని, తోపులాటలు జరగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయాల న్నారు. ట్రాఫిక్‌ మళ్లింపునకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. జాతర ముసుగులో అసాంఘిక కార్య కలాపాలు జరగకుండా డ్రోన్‌లతో త నిఘా ఉంచాలన్నారు. అనంతరం దక్షిణపు వీధిలో జాతర జరిగే ప్రాంతాలను పరిశీలించారు. డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్వరరావు, ఏలూరు వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్య నారాయణ, ఎస్‌ఐ సుధాకర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement