ఆటపాకలో పర్యాటకుల సందడి
కై కలూరు: పక్షి ప్రేమికుల స్వర్గథామంగా పేరుగడించిన ఆటపాక పక్షుల కేంద్రంలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. సమీప జిల్లాల నుంచి వచ్చిన యాత్రికులతో కేంద్రం కళకళలాడింది. బోటు షికారులో పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షుల కేరింతలను దగ్గర నుంచి ఆశ్వాదించారు. కేంద్రంలో పక్షి నమూనా మ్యూజియంను ఎక్కువమంది తిలకించారు. చిల్డ్రన్స్ పార్కులో చిన్నారులు, పెద్దలు ఆటలాడుకున్నారు. ఫారెస్టు బీట్ ఆఫీసర్ రాజేష్, సిబ్బంది కొల్లేరు భౌగోళిక పరిస్థితులు, విదేశీ, స్వదేశీ పక్షుల విశేషాలను వివరించారు. పక్షుల వీక్షణకు అనువైన శీతాకాలం కావడంతో పక్షి ప్రేమికులు సందర్శించాలని కోరారు.
ఆటపాకలో పర్యాటకుల సందడి


