సమగ్ర విచారణ జరిపించాలి
పెదవేగి: గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆ త్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని పీడీఎస్యూ నాయకుడు కాకి నాని డిమాండ్ చేశారు. పెదవేగి గురుకుల పాఠశాలకు వెళ్లి తమ బృందం విచారణ చేసినట్టు ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఈపుచర్ల అజిట్ ఆత్మహత్య చేసుకో వడం బాధాకరమని, పూర్తిస్థాయిలో విచారణ జరిపించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో పోలసానిపల్లి, జంగారెడ్డిగూడెంలో ఇద్దరు బాలికలు, పెదవేగిలో బాలుడు ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వ గురుకుల పాఠశాలల నిర్వహణపై తీవ్ర చర్చనీయాంశంగా మారుతుందన్నారు. నగర అధ్యక్షు డు వై.యశ్వంత్ పాల్గొన్నారు.


