చర్చనీయాంశమైన రాజమౌళి కుమారుడి వీడియో
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వ్యాప్తంగా 4,846 కాలనీల్లోని నీటినిల్వ ప్రదేశాలు, చెరువులు, కుంటలు, సెల్లార్లల్లో దోమల నివారణ చేపడుతున్నట్లు జీహెచ్ఎంసీ యంత్రాంగం చెబుతున్నా నగరవాసులకు దోమకాటు తప్పడంలేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీడైరెక్టర్ రాజమౌళి కొడుకు కార్తికేయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యంగ్య వీడియో చర్చనీయాంశమైంది.
షూటింగ్ సమయంలో దోమల వల్ల నటులు, సిబ్బంది పడుతున్న ఇబ్బందుల్ని ఆ వీడియోలో చూపించారు. నగరంలోని దోమలబెడద,ప్రజల బాధను ప్రతిబింబిస్తోందని పలువురు వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవల కూకట్పల్లికి చెందిన ఓ ఇంజినీరు రూ.15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడారు. చెరువుల్లో గుర్రపుడెక్క నిర్మూలన పనుల బిల్లుల వ్యవహారం కావడంతో అది కూడా చర్చనీయాంశమైంది.
హైదరాబాద్ దోమల సమస్యపై సెటైరికల్ వీడియో పోస్ట్ చేసిన రాజమౌళి కొడుకు కార్తికేయ pic.twitter.com/U0orlNGngM
— Telugu Scribe (@TeluguScribe) February 7, 2026


