సినీగేయరచయిత వైరముత్తుపై ఓ మహిళ చెప్పు విసిరిన ఘటన ఇటీవల కలకలం రేపింది. తమిళనాడులోని తిరుప్పూర్లో కొంగు కళ, సాహిత్య సంస్కృతి మండలి ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకలో పాల్గొనేందుకుగానూ తిరుప్పూర్ కలెక్టరేట్కు రాగా అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో అక్కడున్న ఓ మహిళ చెప్పు విసిరింది.
తొలి పోస్ట్
అయితే అది వైరముత్తుపై కాకుండా మరోవైపు పడింది. వెంటనే పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. తనకు మతిస్థిమితం సరిగా లేదని తెలిపారు. ఈ ఘటన తర్వాత వైరముత్తు సోషల్ మీడియలో తొలిసారి ఓ పోస్ట్ పెట్టాడు. తిరుప్పూర్లో తను హాజరైన మరో కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. రెండువేలమంది విద్యార్థులు ఒక్కచోట చేరి చప్పట్లు కొడుతుంటే తనను తాను మర్చిపోయానన్నాడు.
గతంలో ఆరోపణలు
కాగా వైరముత్తు గతంలో మీటూ ఉద్యమ సమయంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. చాలామంది మహిళలతో వైరముత్తు అసభ్యంగా నడుచుకున్నారంటూ సింగర్ చిన్మయి శ్రీపాద సంచలన ఆరోపణలు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ ఆరోపణలను వైరముత్తు కొట్టిపారేశాడు.
திருப்பூரில்
வெற்றித் தமிழர் பேரவை
‘வள்ளுவர் மறை
வைரமுத்து உரை’
கையொப்பத் திருவிழாவை
நிகழ்த்தியது
ஏ.வி.பி அரங்கு முழுக்க
ஆயிரத்துக்கு மேற்பட்ட
பள்ளிப் பிள்ளைகள்;
கல்லூரிக் கண்மணிகள்
வெற்றித் தமிழர் பேரவையின்
அவைத் தலைவர்
ராம்ராஜ் நாகராஜன்
அற்புதமான அறவுரை ஆற்றினார்… pic.twitter.com/Sjx88vuwvL— வைரமுத்து (@Vairamuthu) January 23, 2026
చదవండి: ప్రెగ్నెన్సీ అనుమానాలపై క్లారిటీ ఇచ్చిన బిగ్బాస్ శివజ్యోతి


