కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన మూవీ బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఏంటో ఏమో.. పిచ్చిది ప్రేమ
తాజాగా ఈ మూవీ నుంచి మరో పాట వదిలారు. ఏంటో ఏమో.. పిచ్చిది ప్రేమ.. ఎపుడో సాయం రానే రాదే.. అంటూ పాట మొదలవుతుంది. ఈ లిరికల్ వీడియోలో శ్రీదేవితో పాటు నటుడు సాయి కుమార్ను చూపించారు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశాడు. సింగర్ సునీత అద్భుతంగా ఆలపించింది.


