75 ఏళ్ల వయసులో ప్రభంజనం, ఎవరీ రంగస్వామి | Puducherry Election is CM N Rangaswamy another term special story | Sakshi
Sakshi News home page

75 ఏళ్ల వయసులో ప్రభంజనం, ఎవరీ రంగస్వామి

May 4 2026 12:51 PM | Updated on May 4 2026 1:12 PM

Puducherry Election is CM N Rangaswamy another term special story

మచ్చలేని తెల్లటి ధోవతి, పొడవాటి చొక్కా ఇదే ఆయన ఆహార్యం.  75 ఏళ్ల వయసు,  4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం. ఐదోసారి సీఎం పగ్గాలు  చేపట్టేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఆయన పేరే పుదుచ్చేరి ముఖ్యమంత్రి  ఎన్‌. రంగస్వామి. ఆయన రాజకీయ ప్రస్థానం,  విజయాలపై కొన్ని అంశాలను పరిశీలిద్దాం. 

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగింది. ముఖ్యంగా ఏఐఎన్‌ఆర్‌సి వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి  ప్రజల మద్దతు తమకే, అధికారం తమదే అన్నంత  ప్రశాంతంగా పోలింగ్‌లో దూసుకుపోయారు. ఇంటింటికీ వెళ్తూ, తన విజయాలపై కరపత్రాలను స్వయంగా పంచుతూ చిరునవ్వుతో విజయంపై అడుగులు వేశారు.


ఎవరీ రంగస్వామి
నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన, అవివాహితుడు . న్యాయశాస్త్ర పట్టభద్రుడు. ఆయన తట్టంచవాడి, మంగళం అనే రెండు నియోజకవర్గాల నుంచి ఐదోసారి ముఖ్యమంత్రి పదవికి పోటికి నిలిచారు. 2011లో అఖిల భారత ఎన్. ఆర్. కాంగ్రెస్ (ఏఐఎన్‌ఆర్‌సి) అనే తన సొంత పార్టీని స్థాపించి సంచలనంరేపారు. అప్పటిదాకా  కాంగ్రెస్ పార్టీలో ఎదురులేని  నాయకుడిగా ప్రజల మానాల్ని దక్కించుకున్నారు.

అందుకే ఆయన "వాళుం కామరాజర్" (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, జీవించి ఉన్న కామరాజు),"మక్కలిన్ ముత్తల్వార్" (ప్రజల ముఖ్యమంత్రి) అని కీర్తిస్తారు. అది గృహ కార్యక్రమం అయినా, వివాహం అయినా, ప్రజల  ఆహ్వానాలకు ఆయన ఎల్లప్పుడూ స్పందిస్తారని, ప్రజా అభ్యర్థనలను కాదనరని  జనం గర్వంగా  చెప్పుకుంటారు.

"తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది మేమే. చింతించకండి. మీ సమస్యలను పరిష్కరిస్తాం." ప్రజలతో మాట్లాడేటప్పుడు గానీ, ఓట్లు అభ్యర్థించేటప్పుడు గానీ, రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేటప్పుడు గానీ, ఆయన ప్రశాంతంగా, మృదువైన, ఆదరణపూర్వకమైన స్వరంతో  ఆయన ఇచ్చిన హామీ ఓట్లగా మారిపోయింది.


గురువు అప్పా పైత్యం స్వామి
ప్రజాదరణ పొందిన నాయకుడైన ఆయన సుమారు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు మరియు చాలా మంది ఆయనను ఒక ఆధ్యాత్మిక అన్వేషిగా, సౌమ్యమైన క్రమశిక్షణావాదిగా భావిస్తారు. పూజ్య గురువు అయిన అప్పా పైత్యం స్వామిగారికి పరమ భక్తుడైన రంగస్వామి ఎల్లప్పుడూ తన నుదుటిపై పవిత్ర భస్మాన్ని ధరిస్తారు. ఆ ఆధ్యాత్మిక గురువు  ఫోటో ఆయన ప్రచార వాహనాన్ని అలంకరించడమే కాకుండా, ఆయన ప్రచార సామగ్రిలో కూడా ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తుంది.ఈ ఆలయంలో 'మౌన వ్రతం' పాటిస్తాడు, ఎప్పుడు అన్నదానం చేస్తారని స్థానికులు చెబుతుంటారు.

ప్రజల నాడి ఆయనకు, ఆయన గురించి ప్రజలకు బాగా తెలుసు
అంతేకాదు ఆయన ఎపుడు ఎక్కడ ఉంటాడో ప్రజలకు బాగా తెలుసు. మధ్యాహ్నం సమయంలో ముఖ్యమంత్రిని కలవాలనుకుంటే, బజారులోని నెహ్రూ వీధికి వెళ్లాలి. అక్క ఆయన తన స్నేహితుడి ఇంట్లో ఉంటాని రంగస్వామి నివసించే వీధిలోనే ఉండే ఒక యువకుడు చెప్పిన మాటే ఇందుకు నిదర్శనం. ప్రభావవంతమైన వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన ఆయన, 2001లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2006 నుండి 2008 వరకు రెండోసారి పదవిలో ఉన్నారు. 2011లో మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా, 2021లో నాలుగోసారి పదవి చేపట్టారు. 1991, 1996, 2001, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. ఇక తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 1991లోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.  

ఇదీ చదవండి: పీకే అంచనాలు బ్రేక్‌ : విజయ్‌ విజయ దుందుభి!
 

Advertisement
 
Advertisement
Advertisement