Five State Elections 2026
-
226 స్థానాల్లో గెలుస్తాం
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల్లో తాము 226కు పైగా సీట్లలో విజయం సాధిస్తామని టీఎంసీ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. వివిధ సంస్థలు చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ వెనుక బీజేపీ హస్తముందని, వాటిని తాము విశ్వసించలేమని ఆమె తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో తమ కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కాషాయ పార్టీ ప్రయతి్నస్తోందని ఆరోపించారు. షేర్ మార్కెట్ను నిలకడగా ఉంచేందుకు బీజేపీ నేతలు చేసిన చిట్టచివరి ప్రయత్నం ఎగ్జిట్పోల్స్ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు గురువారం సీఎం మమత సోషల్మీడియాలో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. బీజేపీ కార్యాలయం నుంచి వచి్చన ఆదేశాల మేరకే టీవీ చానళ్లలో ఎన్నికల ఫలితాలపై ముందస్తు అంచనాలు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. బెంగాల్ అసెంబ్లీలోని 294 స్థానాల్లో బీజేపీ మెజారిటీ సాధించనుందంటూ బుధవారం వెలువడిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పడం తెల్సిందే. ‘బీజేపీ కార్యాలయం నుంచి 1.08 గంటలకు వచి్చన ఆదేశాల ప్రకారమే టీవీ చానళ్లు చూపించాయి. అదంతా ప్రసారమయ్యేలా వాళ్లకు డబ్బు అందింది. దీనిపై నా వద్ద కచి్చతమైన సమాచారముంది. తాము చెప్పినట్లే చూపించాలని బీజేపీ నేతలు చానళ్లపై ఒత్తిడి తెచ్చారు’అని మమత ఆరోపించారు. ‘226కు పైగా సీట్లను గెల్చుకుంటాం. 230 వరకు కూడా రావచ్చు. ప్రజల తిరుగులేని తీర్పు మాపక్షానే ఉంటుంది’ అని అన్నారు. -
ఈవీఎం స్ట్రాంగ్ రూంల వద్ద టీఎంసీ ధర్నా
కోల్కతా: ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్రూంల వద్ద అప్రమత్తంగా ఉండాలంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఆ పార్టీ అభ్యర్థులు కునాల్ ఘోష్, శశి పంజా గురువారం ధర్నాకు దిగారు. ఖుదీరాం అనుశీలన్ కేంద్రలోని స్ట్రాంగ్రూంలో అవకతవకలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఇక్కడ బుధవారం రెండో విడత పోలింగ్ ముగియడం తెల్సిందే. ‘స్ట్రాంగ్ రూం వద్ద బైటాయించిన తమను అధికారులు మధ్యాహ్నం అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. సాయంత్రం 4 గంటలకు స్ట్రాంగ్రూంలను తిరిగి తెరుస్తామంటూ ఆ తర్వాత మాకు సమాచారమిచ్చారు’అని కునాల్ ఘోష్ తెలిపారు. ‘దీంతో, మా కార్యకర్తలంతా వెళ్లిపోయారు. మళ్లీ తెరుస్తామని సమాచారమివ్వడంతో హడావుడిగా తిరిగి వచ్చేశాం. ఇప్పుడేమో మమ్మల్ని రానివ్వడం లేదు. బీజేపీ నేతలకు మాత్రం అనుమతిచ్చారు’అని ఆయన ఆరోపించారు. ‘బ్యాలెట్ పేపర్లను లోపలకు తీసుకెళ్లారు. లైవ్లో ఇదంతా కనిపిస్తూనే ఉంది. అయిన్పటికీ, ఏమీ జరగడం లేదని సీఈవో అంటున్నారు’అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. భవానీపూర్ స్ట్రాంగ్రూంలో మమత తన నియోజకవర్గం(భవానీపూర్) ఈవీఎంలను భద్రపరచిన షకావత్ స్కూల్ వద్దకు సీఎం మమత సాయంత్రానికల్లా చేరుకు న్నారు. అవకతవకలు జరిగే ఆస్కారముందన్న అనుమానంతో తన ఎన్నికల ఏజెంట్తోపాటు స్ట్రాంగ్రూంలోకి వెళ్లి అక్కడే కూర్చున్నారు. -
బెంగాల్ కిరీటం బీజేపీదే!
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో రాజకీయ మార్పు నకు ప్రజలు పట్టం కట్టబోతున్నారని ‘టుడేస్ చాణక్య’ఎగ్జిట్పోల్ స్పష్టంచేసింది. బెంగాల్ అధికార కిరీటం ఈసారి బీజేపీకి దక్కడం ఖాయమని అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 294 ఉండగా మెజార్టీ మార్కు 147 స్థానాలు. బీజేపీ 192కిపైగా స్థానాలు గెల్చుకొని స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నట్లు స్పష్టంచేసింది. చాణక్య ఎగ్జిట్పోల్ ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 100 సీట్లు గెల్చుకొనేందుకు ఆస్కారం ఉన్నట్లు తేలింది. ఇతరులు కేవలం 2 స్థానాలకే పరిమితం అవుతారని చాణక్య తెలియజేసింది. ఈ ఫలితాలు వాస్తవ రూపం దాలిస్తే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అది అతిపెద్ద మార్పు అవుతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. 15 ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యానికి తెరపడినట్లేనని అంటున్నారు. బీజేపీకి అనుకూలంగా ప్రజల మద్దతు బలంగా ఏకీకృతం అవుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది ఓటర్ల ప్రాధాన్యతలో నిర్ణయాత్మక మార్పును తెలియజేస్తోంది. బెంగాల్లో ఇప్పటికే మెజార్టీ ఎగ్జిట్పోల్స్ బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. మరికొన్ని ఎగ్జిట్పోల్స్ తృణమూల్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపించాయి. మమతా బెనర్జీ పార్టీ వరుసగా నాలుగోసారి అధికారంలోకి రాబోతున్నట్లు వివరించాయి. మొత్తానికి ఈ ఎన్నికల్లో రెండు కీలకమైన పార్టీల మధ్య హోరాహోరీ పోరాటం సాగుతుందని పేర్కొన్నాయి. 2021 ఎన్నికల్లోనూ ఇలాంటి పరిణామాన్నే అంచనా వేసినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్కు విజయం దక్కింది. ఆ పార్టీ 215 సీట్లు గెల్చుకుంది. బీజేపీ 77 స్థానాలు మాత్రమే దక్కించుకొని ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. తమిళనాట రెండో స్థానంలో విజయ్ పార్టీ తమిళనాడులో దళపతి విజయ్ నిర్ణయాత్మక శక్తిగా అవతరించబోతున్నట్టు టుడేస్ చాణక్య స్పష్టంచేసింది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) ఈ ఎన్నికల్లో 30 శాతం ఓట్లతో దాదాపు 63 సీట్లు సాధించబోతున్నట్లు తెలియజేసింది. అధికార డీఎంకేకు 125 స్థానాలు, విపక్ష అన్నాడీఎంకేకు కేవలం 45 స్థానాలు దక్కే వీలున్నట్లు వివరించింది. విజయ్ పార్టీ రెండో స్థానంలో నిలవబోతున్నట్లు తెలిపింది. సామాజికవర్గాల పరంగా చూస్తే బీసీల్లో 29 శాతం మంది, అత్యంత వెనుకబడిన వర్గాల్లో 27 శాతం మంది, ఎస్సీలు, క్రైస్తవుల్లో 34 శాతం మంది విజయ్ పార్టీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. ముస్లింలు మాత్రం అధికార డీఎంకేకు మద్దతు పలికినట్లు స్పష్టమవుతోంది. యువతలో టీవీకేకు అమితాదరణ కనిపించింది. 30 ఏళ్లలోపు ఓటర్లు, ప్రధానంగా తొలిసారి ఓటు వేసినవారు, విద్యార్థులు నిరుద్యోగులు దళపతి పార్టీకి జైకొట్టారు. మరోవైపు మెజార్టీ ఎగ్జిట్పోల్స్ మళ్లీ డీఎంకే గెలుపు ఖాయమని తెలియజేశాయి. ‘యాక్సిస్ మై ఇండియా’మాత్రమే విజయ్ పార్టీ జయకేతనం ఎగురవేయబోతున్నట్లు తేల్చిచెప్పింది. కేరళలో యూడీఎఫ్కు విజయావకాశాలు కేరళలో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ మధ్యగట్టి పోటీ నెలకొన్నట్లు టుడేస్ చాణక్య ప్రకటించింది. అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు విజయావకాశాలు ఉన్నట్లు తెలిపింది. 140 సీట్లకు గాను యూడీఎఫ్కు దాదాపు 69 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. అస్సాంలో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని వెల్లడించింది. 126 సీట్లకు గాను బీజేపీ 50 శాతం ఓట్లతో ఏకంగా 102 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. బెంగాల్ ఎగ్జిట్పోల్స్ ప్రకటించని ‘యాక్సిస్ మై ఇండియా’ పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ను ‘యాక్సిస్ మై ఇండియా’ప్రకటించలేదు. బుధవారం ఇతర రాష్ట్రాల ఫలితాలను ప్రకటించినప్పటికీ బెంగాల్ విషయం ప్రస్తావించలేదు. గురువారం ప్రకటిస్తారని భావించగా.. అది సాధ్యం కాలేదు. బెంగాల్లో భయానక వాతావరణం నెలకొందని, ఇతరులతో మాట్లాడేందుకు ప్రజలు ఇష్టపడడం లేదని, శాంపిల్ సేకరించే పరిస్థితి కూడా లేదని ‘యాక్సిస్ మై ఇండియా’అధినేత ప్రదీప్ గుప్తా చెప్పారు. అసంపూర్ణమైన సమాచారంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించలేమని నిస్సహాయత వ్యక్తంచేశారు. -
‘క్యూఆర్’ గుర్తింపు కార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పారదర్శకతకు, భద్రతకు పెద్దపీట వేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ పలు కీలక చర్యలు చేపట్టింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనధికార వ్యక్తుల ప్రవేశానికి అడ్డుకట్ట వేసేందుకు క్యూఆర్ కోడ్ ఆధారిత ఫొటో గుర్తింపు కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన మాడ్యూల్ను ఈసీఐనెట్ వేదికగా ప్రవేశపెట్టినట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. మే 4వ తేదీన అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలతో పాటు, 5 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్లోనూ ఈ విధానాన్ని తొలిసారిగా అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద గుర్తింపు కార్డుల వెరిఫికేషన్ కోసం ఈసీ ప్రత్యేకంగా మూడంచెల భద్రతా యంత్రాంగాన్ని ఖరారు చేసింది. మొదటి రెండంచెల్లో రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ) జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులను భద్రతా సిబ్బంది మాన్యువల్గా తనిఖీ చేస్తారు. మూడో అంచె, కౌంటింగ్ హాల్కు అతి సమీపంలో ఉండే ఈ కీలకమైన పాయింట్ వద్ద క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తారు. సాఫ్ట్వేర్ ద్వారా వెరిఫికేషన్ సక్సెస్ అయ్యాకే సంబంధిత వ్యక్తిని లోపలికి అనుమతిస్తారు. ఎన్నికల సంఘం అనుమతి పొందిన అన్ని విభాగాల వారికి అంటే.. రిటర్నింగ్ అధికారులు (ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్వో), కౌంటింగ్ సిబ్బంది, టెక్నికల్ టీమ్, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు ఈ కొత్త క్యూఆర్ కోడ్ కార్డులు తప్పనిసరి. కౌంటింగ్ కేంద్రాల వద్ద మీడియా సెంటర్ జర్నలిస్టుల కోసం కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా ‘మీడియా సెంటర్’ఏర్పాటు చేయనున్నారు. మీడియా ప్రతినిధుల ప్రవేశం మాత్రం ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారమే, ఈసీ జారీ చేసే అథారిటీ లెటర్ల ఆధారంగా కొనసాగుతుంది. కొత్త వ్యవస్థను పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులను ఈసీ ఆదేశించింది. భవిష్యత్తులో జరగబోయే అన్ని లోక్సభ, అసెంబ్లీ సాధారణ, ఉప ఎన్నికల్లోనూ ఇదే విధానాన్ని అనుసరించనున్నట్లు స్పష్టం చేసింది. ఏడాది కాలంగా చేపట్టిన 30కి పైగా సంస్కరణల్లో భాగంగానే క్యూఆర్ కోడ్ ఐడీ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. -
అర్ధరాత్రి హైడ్రామా.. మమతా బెనర్జీ సైతం ఎంట్రీ ఇచ్చి..
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతాలోని భవానీపూర్ నియోజక వర్గానికి సంబంధించిన స్ట్రాంగ్రూమ్కు చేరుకున్నారు. ఈవీఎం స్ట్రాంగ్రూమ్లో బ్యాలెట్ బాక్సులు తెరిచారని ఆమె ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు మమతా బెనర్జీ వచ్చారు. దక్షిణ కోల్కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్కు వచ్చారు. ఇది భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రం. అక్కడ ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్కు సంబంధించిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ ఉంది. ఆ కౌంటింగ్ కేంద్రాన్ని మమతా బెనర్జీ పరిశీలించి, అర్ధరాత్రి దాటాక మీడియాతో మాట్లాడారు. “అభ్యర్థి లేదా ఒక ఏజెంట్ మాత్రమే పై అంతస్తులో ఉండవచ్చు. మీడియా కోసం సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయాలని కూడా నేను సూచించాను. పారదర్శకతను కొనసాగించాలి. ఫిర్యాదులు రావడంతో నేను వెంటనే ఇక్కడికి వచ్చాను. కేంద్ర బలగాలు మొదట నన్ను లోపలికి అనుమతించలేదు. లెక్కింపు ప్రక్రియలో జోక్యం చేసుకుంటే మేము సహించం. ఇక్కడ ఈవీఎంల కోసం స్ట్రాంగ్రూమ్ ఉంది. చాలా చోట్ల మానిప్యులేషన్ జరుగుతోందని మేము గమనించాము. ఎన్నికల నియమాల ప్రకారం పార్టీ అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్కు సీల్ చేసిన గది వరకు వెళ్లే అనుమతి ఉంటుంది. మా ఏజెంట్ను అరెస్ట్ చేశారు. ఏకపక్ష వైఖరి కనిపిస్తోంది. తప్పుడు చర్యలకు పాల్పడితే ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడతాం” అని తెలిపారు.నేతాజీ ఇండోర్ స్టేడియంలోనూ అంతే.. కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో ఈవీఎం స్ట్రాంగ్రూమ్ బయట కూడా అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. సంబంధిత పార్టీ ప్రతినిధులు లేకుండా బ్యాలెట్ బాక్సులను తెరుస్తున్నారని ఆరోపించారు. ఈ స్ట్రాంగ్రూమ్లో పలు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను ఉంచారు.బెంగాల్ మంత్రి శశి పాంజా, తృణమూల్ ప్రతినిధి కునాల్ ఘోష్ ఈవీఎంల భద్రతపై అనుమానం వచ్చి స్వయంగా అక్కడికి వచ్చి నిరసన చేపట్టారు. వారిద్దరు నేతాజీ ఇండోర్ స్టేడియం బయట ధర్నా ప్రారంభించారని తృణమూల్ ఓ ప్రకటనలో తెలిపింది.మరోవైపు, తృణమూల్ ఆరోపణలను బీజేపీ నేత తాపస్ రాయ్ పూర్తిగా ఖండించారు. “ఇవి అన్నీ తృణమూల్ ఇప్పుడు భయ వాతావరణాన్ని సృష్టించేందుకు వ్యాపింపజేస్తున్న వదంతులు. వాళ్లే భయపడుతున్నారు. నేనూ స్ట్రాంగ్రూమ్ పరిశీలించేందుకు వచ్చాను. తృణమూల్ అబద్ధాలు చెబుతోంది” అన్నారు. #WATCH | West Bengal Elections 2026 | Chief Minister Mamata Banerjee arrives at the Bhabanipur strong room in Kolkata. pic.twitter.com/29buaqzUCy— ANI (@ANI) April 30, 2026 -
టీవీకే విజయ్ కీలక సూచనలు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వచ్చే నెల 4వ తేదీన జరుగనున్న కౌంటింగ్కు సంబంధించి టీవీకే అధినేత విజయ్.. పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. ఆ రోజు జరిగే కౌంటింగ్కు సంబంధించి అభ్యర్థులు, ఏజెంట్లు ఉదయం ఆరుగంటల కల్లా ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలన్నారు. అలాగే ఒకసారి లోపలికి వెళ్లిన ఏజెంట్ కడవరకూ అక్కడే ఉండాలని, అత్యంత జాగ్రత్తగా కౌంటింగ్ పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఏమాత్రం ఏమరపాటుకు గురైనా అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, అందుకుని అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రధానంగా అభ్యర్థులు గెలిచిన తర్వాత తన వద్దకు నేరుగా రావాలన్నారు. గెలిచిన అభ్యర్థుల కోసం తాను నిరీక్షిస్తూ ఉంటానని, మధ్యలో ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ పార్టీ ఆఫీస్కే రావాలన్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపులో కీలకమైన ఫారమ్ 17C(పోలింగ్ కేంద్రాల వారీగా నమోదైన ఓట్ల సంఖ్య, లెక్కింపులో చూపిన ఓట్లతో సరిపోతుందా లేదా అనే విషయాన్ని ధృవీకరించే పత్రం)ని అభ్యర్థులు కచ్చితంగా సరిపోల్చుకోవాలన్నారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ఉండి మభ్య పెట్టడానికి యత్నించే వారికి చెక్ పెట్టాలన్నారు. -
టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్.. బెంగాల్ వారిదే.. తమిళనాడులో..?
ఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థ టుడేస్ చాణుక్య విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఆ రాష్ట్రంలో బీజేపీ 192 సీట్లను కైవసం చేసుకుంటుందని, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి ఓటమి ఖాయమని పేర్కొంది.ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, బీజేపీకి 48 శాతం ఓటు షేర్తో 192 సీట్లు, టీఎంసీకి 38 శాతం ఓటు షేర్తో 100 సీట్లు, ఇతరులకు 14 శాతం ఓటు షేర్తో 2 సీట్లు లభిస్తాయని అంచనా వేసింది.అదే సమయంలో తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వస్తుందని టుడేస్ చాణుక్య అంచనా వేసింది. 234 అసెంబ్లీ స్థానాల్లో డీఎంకే 39 శాతం ఓటు షేర్తో 125 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. విజయ్ పార్టీ 30 శాతం ఓటు షేర్తో 63 స్థానాలు సాధిస్తుందని, మరో 10 స్థానాల్లో ఎడ్జ్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే-బీజేపీ అలయన్స్ నిరాశ చెందుతుందని, 27 శాతం ఓటు షేర్తో 45 స్థానాలు మాత్రమే దక్కుతాయని సర్వేలో తేల్చింది. -
బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయని ‘యాక్సిస్ మై ఇండియా’
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగిసిన అనంతరం వివిధ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడించాయి. అయితే, ప్రముఖ సంస్థ యాక్సిస్ మై ఇండియా (Axis My India) మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేయబోమని ప్రకటించింది. బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ను ఎందుకు విడుదల చేయలేదో చెప్పింది యాక్సిస్ మై ఇండియా.ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రదీప్ గుప్తా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. దాదాపు 60-70 శాతం మంది ఓటర్లు సర్వేలో తమ అభిప్రాయాన్ని చెప్పడానికి నిరాకరించారు. ప్రజలు తమ మనసులో ఏముందో వెల్లడించడానికి ఇష్టపడకపోవడంతో మౌనమే ప్రధాన అవరోధంగా మారిందంటూ చెప్పుకొచ్చారు. ఎందుకో బెంగాల్ ఓటర్లు మాత్రం గుంబనంగా ఉన్నారని తెలిపారు. కేవలం 20-30 శాతం మంది ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫలితాలను అంచనా వేయడం శాస్త్రీయంగా సరైనది కాదని.. అది సరైన ఫలితాన్ని ప్రతిబింబించదని సంస్థ భావించిందని ఆయన పేర్కొన్నారు.పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్పై బీజేపీ స్పల్ప ఆధిక్యత సాధిస్తుందని మాట్రిజ్, పి–మార్క్ ఫలితాలు తెలియజేశాయి. టీఎంసీకి 125–140 స్థానాలు వస్తాయని, బీజేపీకి 146–161 స్థానాలు లభిస్తాయని మాట్రిజ్ వెల్లడించింది. పి–మార్క్ అంచనా ప్రకారం బీజేపీకి 150–174 సీట్లు, టీఎంసీకి 118–138 సీట్లు లభిస్తాయి. బీజేపీకి 142–171, టీఎంసీకి 99–127 సీట్లు లభించేందుకు ఆస్కారం ఉన్నట్లు ‘పోల్ డైరీ’ఎగ్జిట్ పోల్ తేల్చింది.తృణమూల్ కాంగ్రెస్ తన సంక్షేమ పథకాలు మరియు సంస్థాగత బలంతో బీజేపీ సవాల్ను తట్టుకుంటుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. మరికొన్ని సర్వేలు బీజేపీ భారీ విజయంతో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని అంచనా వేస్తున్నాయి. లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ కూటమి ఈసారి కూడా ఒక అంకె (సింగిల్ డిజిట్) స్థానాలకే పరిమితం కావచ్చని మెజారిటీ పోల్స్ అభిప్రాయపడ్డాయి. యాక్సిస్ మై ఇండియా వంటి అనుభవజ్ఞులైన సంస్థ కూడా అంచనా వేయలేకపోయిందంటే.. బెంగాల్ ఓటరు తీర్పు ఎంత ఉత్కంఠభరితంగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. -
బెంగాల్ పీఠంపై సస్పెన్స్.. ‘హంగ్’ వస్తే ఎవరికి ఛాన్స్?
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసింది. మే 4న వెలువడనున్న ఫలితాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొనడంతో, అక్కడ ‘హంగ్ అసెంబ్లీ’ ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని మెజారిటీ సర్వేలు అంచనా వేస్తున్నాయి. అసలు ఈ హంగ్ అసెంబ్లీ అంటే ఏమిటి? మెజారిటీ రాకపోతే బెంగాల్ రాజకీయాల్లో జరగబోయేది ఏమిటి?హోరాహోరీ పోరు: ఎగ్జిట్ పోల్స్ అంచనాలుఅస్సాం, పుదుచ్చేరిలలో బీజేపీ, తమిళనాడులో డీఎంకే, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అయితే, అందరి దృష్టీ పశ్చిమ బెంగాల్ పైనే పడింది. ఇక్కడ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి స్వల్ప ఆధిక్యం వస్తుందని అంచనా వేస్తుండగా, రెండు పార్టీల మధ్య నరాలు తెగే ఉత్కంఠ పోరు సాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తీవ్రమైన పోటీ కారణంగా, పశ్చిమ బెంగాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితి తలెత్తవచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.హంగ్ అసెంబ్లీ అంటే ఏమిటి?ఏదైనా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి లేదా ఎన్నికల ముందు ఏర్పడిన కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్పష్టమైన మెజారిటీ రాకపోవడాన్ని ‘హంగ్ అసెంబ్లీ’ అంటారు. నిబంధనల ప్రకారం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మొత్తం సీట్లలో సగానికంటే కనీసం ఒక్క సీటు అయినా అదనంగా (సింపుల్ మెజారిటీ) గెలుపొందాలి. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ సాధించి అధికార పీఠం దక్కించుకోవాలంటే ఏ పార్టీ అయినా కనీసం 148 సీట్లు కైవసం చేసుకోవాల్సి ఉంటుంది.ఎవరికీ మెజారిటీ రాకపోతే ఏమవుతుంది?హంగ్ అసెంబ్లీ ఏర్పడిన పక్షంలో రాష్ట్ర గవర్నర్ పాత్ర అత్యంత కీలకంగా మారుతుంది. అత్యధిక స్థానాలు గెలుపొందిన అతిపెద్ద పార్టీని లేదా కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించి, అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి 10 రోజుల గడువు ఇస్తారు. ఒకవేళ ఆ పార్టీ మెజారిటీ నిరూపించుకోలేకపోతే, అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించే అధికారం గవర్నర్కు ఉంటుంది. అయితే, గడువులోపే చిన్న పార్టీల మద్దతు కూడగట్టడం, పోస్ట్-పోల్ (ఎన్నికల అనంతర) పొత్తులు పెట్టుకోవడం వంటి వ్యూహాలకు పార్టీలు పదును పెడతాయి. బయటి మద్దతుతో ఏర్పడే ఇలాంటి మైనారిటీ ప్రభుత్వాలు చాలా అస్థిరంగా ఉంటాయి. అవి ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానం ద్వారా కూలిపోయే ప్రమాదం ఉంటుంది.ఇది కూడా చదవండి: Bihar: ఎన్కౌంటర్తో సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ -
బెంగాల్ రాజకీయాల్లో ‘అభిషేక్’ శకం షురూ!
రాజకీయాల్లో వారసత్వం సాధారణమే.. అయితే ఈ జాబితాలోని వారు సొంతంగా తమదైన ముద్రను దక్కించుకోవడం అనేది అంత ఈజీగా జరగదు. అయితే పశ్చిమ బెంగాల్లో దీనికి భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. ప్రస్తుత 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని వాడవాడలా అభిషేక్ బెనర్జీ పేరు మారుమోగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లునిగా రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ, కేవలం ఆ గుర్తింపునకే పరిమితం కాకుండా, పార్టీలో అత్యున్నత స్థాయికి ఎదిగారు అభిషేక్ బెనర్జీ. మేనత్త నీడ నుంచి బయటపడి, బీజేపీకి దీటైన సవాల్ విసురుతూ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సేనాధిపతిగా మారిన అభిషేక్ ప్రయాణం అత్యంత ఆసక్తికరం.నెత్తురోడిన అత్తను చూసిన రెండేళ్ల చిన్నారిఅది 1990వ సంవత్సరం. సీపీఎం కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడి, తలకు కట్టుతో మంచంపై ఉన్న మమతా బెనర్జీని చూసి ఆ రెండేళ్ల బాలుడు చలించిపోయాడు. తన అత్తపై ఎందుకు దాడి జరిగిందని ఇంట్లో నినాదాలు చేస్తూ, అప్పటి నుంచే రాజకీయ పరిణతిని కనబరిచాడు. దశాబ్దాల తర్వాత అదే ఫోటోను ఓ సభలో మమత స్వయంగా అతనికి బహుకరించారు. ఆనాటి ఆ చిన్నారే నేటి తృణమూల్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ అభిషేక్ బెనర్జీ.23 ఏళ్లకే యూత్ ఐకాన్గా ఎంట్రీపశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ల వామపక్షాల కోటను బద్దలు కొట్టి, తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2011 సంవత్సరంలోనే అభిషేక్ రాజకీయ అరంగేట్రం జరిగింది. కేవలం 23 ఏళ్ల వయసులో ఆల్ ఇండియా తృణమూల్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. పాత తరం నేతల భావోద్వేగ, పోరాట పద్ధతులకు భిన్నంగా.. అట్టడుగు స్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని పటిష్టంగా తీర్చిదిద్దడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు.రికార్డు మెజారిటీలతో తిరుగులేని సత్తా2014లో లోక్సభ బరిలోకి దిగిన అభిషేక్, తన 26వ ఏట డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి గెలిచి, 16వ లోక్సభలో అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీగా చరిత్ర సృష్టించారు. ఆ ఎన్నికల్లో 71,000 ఓట్ల మెజారిటీ సాధించిన ఆయన, ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. 2019లో బీజేపీ హవాలోనూ తన మెజారిటీని 3.2 లక్షలకు పెంచుకున్నారు. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో ఏకంగా ఏడు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు.పార్టీ పగ్గాలు.. ఈడీ, సీబీఐ సవాళ్లుఅంచెలంచెలుగా ఎదిగిన అభిషేక్ ప్రభావం 2021 నాటికి పార్టీలో పూర్తిగా స్థిరపడింది. ఆయన తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. బెంగాల్లో దూసుకువస్తున్న బీజేపీని అడ్డుకోవడంలో, పార్టీ జాతీయ ఆశయాలకు ప్రధాన ముఖచిత్రంగా మారారు. అయితే దశాబ్ద కాలంపైగా సాగిన ఆయన రాజకీయ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. బొగ్గు కుంభకోణం, ఉపాధ్యాయ నియామకాల స్కామ్ వంటి అవినీతి ఆరోపణలతో ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థల (సీబీఐ, ఈడీ) విచారణలను సైతం ధైర్యంగా ఎదుర్కోవాల్సి వచ్చింది.ఓల్డ్ వర్సెస్ న్యూ.. సరికొత్త వ్యూహంగత కొంతకాలంగా తృణమూల్ కాంగ్రెస్లో సీనియర్లకు, అభిషేక్ నేతృత్వంలోని యువ నాయకత్వానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోందనే వార్తలు వచ్చాయి. కానీ, 2026 ఎన్నికల్లో ఈ విభేదాలన్నీ సమసిపోయినట్లు కనిపించింది. ఇప్పుడు పార్టీలో పక్కా వ్యూహం అమలవుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతా కేంద్రంగా పరిపాలనను పర్యవేక్షిస్తూ, ఉత్తర బెంగాల్పై దృష్టి పెడితే.. అభిషేక్ గ్రామీణ ప్రాంతాల్లో, ప్రత్యేకించి దక్షిణ బెంగాల్లో పార్టీ ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు.2026 ఎన్నికలు.. అసలైన అగ్నిపరీక్షఅభిషేక్ బెనర్జీకి 2026 ఎన్నికలు అత్యంత కీలకం. ఇవి పార్టీలో తన స్థానాన్ని, నాయకత్వాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఎదురైన అగ్నిపరీక్షలాంటివి. డేటా ఆధారిత, యువతను ఆకర్షించే సరికొత్త వ్యూహాలతో, కచ్చితమైన బూత్ స్థాయి మేనేజ్మెంట్తో ఆయన ముందుకు వెళ్లారు. తృణమూల్ కాంగ్రెస్ను కేవలం ఒక ప్రాంతీయ పార్టీగానే కాకుండా, బీజేపీ సంస్థాగత బలాన్ని దీటుగా ఢీకొట్టగల శక్తిగా మలచే ప్రయత్నం చేశారు. ఈ ఎన్నికలు అభిషేక్ బెనర్జీకి తనను తాను అత్యున్నత నేతగా నిరూపించుకునేందుకు దక్కిన అతిపెద్ద అవకాశంగా మారాయి.ఇది కూడా చదవండి: కేజ్రీవాల్ బాటలో దుర్గేష్.. న్యాయమూర్తికి షాకింగ్ లేఖ -
రెండో దశలోనూ రికార్డ్ స్థాయిలో
కోల్కతా: బీజేపీ, టీఎంసీ ముఖ్యనేతల హోరాహోరీ ప్రచారపర్వం తర్వాత బుధవారం పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బుధవారం రాత్రి 7.45 గంటలకు అందిన సమాచారం మేరకు రెండో దఫాలో రికార్డ్ స్థాయిలో 92.48 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సమయం ముగిసేనాటికి క్యూ వరసల్లో నిల్చున్న వాళ్లకు సైతం ఓటేసే అవకాశం కల్పించారు. దీంతో పోలింగ్ శాతం పెరిగే వీలుంది. తొలి దశలో 93.19 శాతం పోలింగ్ నమోదైన విషయం తెల్సిందే. మొదటి, రెండో దశ పోలింగ్ శాతాలను కలుపుకుంటే సగటును 92.84 శాతం పోలింగ్ నమోదైంది. ఇది రాష్ట్రచరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతమని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో 2011లో 84.72 శాతం పోలింగ్ నమోదైంది. బుధవారం రెండో దశలో 142 స్థానాలకుగాను బుధవారం 40వేలకుపైగా పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు బారులు తీరి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూర్బ బర్ధమాన్ జిల్లాలో అత్యధికంగా 93.78 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్ర రాజధాని కోల్కతాలో 88.59 శాతం పోలింగ్ నమోదైంది. భవానీపూర్ నుంచి పోటీచేస్తున్న 71 ఏళ్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఉదయం నియోజకవర్గంలోని చక్రబేరియా ప్రాంతంలోని 70వ నంబర్ వార్డ్లో పోలింగ్కేంద్రంలో ఓటేసి బయటికొచ్చి కూర్చున్నారు. అదే సమయానికి మమతపై పోటీకి దిగిన బీజేపీ రాష్ట్ర ముఖ్యనేత సువేంధు అధికారి అక్కడికి వచ్చారు. కానీ ఇద్దరి మధ్యా ఎలాంటి సంభాషణ జరగలేదు. ఈమెకు ఒక్కరు కూడా ఓటేయబోరు అని సువేంధు వ్యాఖ్యానించారు. పానీహటిలో బీజేపీ మహిళా అభ్యర్థి, ఆర్జీకర్ బోధనాస్పత్రిలో హత్యోదంతంలో బాధిత వైద్యురాలి తల్లి రత్నా దేభ్నాథ్ కారును టీఎంసీ కార్యకర్తలు అడ్డుకుని నిరసనతెలిపారు. బసంతిలో తమ కారును టీఎంసీ గూండాలు అడ్డుకుని డ్రైవర్ను కొట్టారని బీజేపీ అభ్యర్థి బికాశ్ సర్దార్ ఆరోపించారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద సీఆర్పీఎఫ్జవాన్లు గూండాల్లా ప్రవర్తిస్తూ మహిళా ఓటర్ల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని టీఎంసీ ఆరోపించింది. హౌరాలోని సథాఛియాలో నాలుగేళ్ల పిల్లాడిని, ఆమె తల్లిని క్యూవరసలో సరిగా నిల్చోలేదని సీఆర్పీఎఫ్ జవాన్లు విచక్షణారహితంగా కొట్టారని టీఎంసీ ఆరోపించింది. -
విజయ్.. మరో ఎంజీఆర్!
చెన్నై: డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో తమిళనాడు దశాబ్దాలుగా ద్విముఖ పోరుగా మారిన రాజకీయ చదరంగంలో విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ ప్రభంజనంలా దూసుకొచ్చి అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోందని యాక్సిస్ మై ఇండియా సంచలన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. బ్లాక్బస్టర్ సినిమాలతో సినీప్రియులను ఉర్రూతలూగించిన హీరో విజయ్ ఇకపై ముఖ్యమంత్రిగా తమిళనాడు పౌరులనూ పాలించబోతున్నారని బుధవారం ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెల్లడైంది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ తాజా ఎన్నికల్లో ఏకంగా 98 నుంచి 120 స్థానాల్లో గెలిచే వీలుందని ఎగ్జిట్పోల్ పేర్కొంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీ సులభంగా సాధారణ మెజారిటీని సాధిస్తుందని యాక్సిస్ మై ఇండియా ఛైర్పర్సన్ ప్రదీప్ గుప్తా చెప్పారు. ఎన్నికల తర్వాత తమిళనాడులో ఎంజీఆర్లా, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్లా విజయ్ సినీరంగం నుంచి వచ్చి నేరుగా ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోబోతున్నారని ఎగ్జిట్ పోల్ అంచనావేసింది. అరంగేట్రం అదిరేలా.. స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే పార్టీ సాధారణ మెజార్టీ కంటే తక్కువగా 92 నుంచి 110 స్థానాలకు పరిమితంకావొచ్చు. ఎన్డీఏ కూటమి 22 నుంచి 32 సీట్లు సాధించొచ్చు. టీవీకే మాత్రం విజయదుందుభి మోగించే వీలుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం...ఈ ఎన్నికల్లో డీఎంకే పార్టీ 35 శాతం ఓట్లు సాధించనుంది. టీవీకే సైతం 35 శాతం ఓట్లు సాధించనుంది. అయితే సీట్లపరంగా చూస్తే డీఎంకే కంటే టీవీకే ఎక్కువ సీట్లను గెల్చుకోనుంది. అన్నాడీఎంకే 23 శాతం ఓట్లు సాధించి 22 నుంచి 32 చోట్ల గెలిచే ఆస్కారముంది. యువ ఓటర్ల ఓట్లే కీలకం.. ఎగ్జిట్ పోల్ గణాంకాల ప్రకారం చూస్తే టీవీకే పార్టీకి యువత మద్దతు ఎక్కువగా ఉంది. → 18–19 ఏళ్ల వయసులో తొలిసారిగాఓటేసిన యువ ఓటర్లలో 68 శాతం మంది టీవీకే పార్టీకే ఓటేశామని చెప్పారు → 20–29 ఏళ్ల వయసు వారిలో 59 శాతం మంది విజయ్కే తమ మద్దతు అని వెల్లడించారు → 30–39 ఏళ్ల వయసు వారిలో 45 శాతం మంది టీవీకే పార్టీకే ఓటేశామని తెలిపారు → విద్యార్థులు, నిరుద్యోగులు, పట్టణ ఓటర్లలో ఏ పార్టీకి ఇంతటి మద్దతులేకపోవడం విశేషం మార్పు... అసలైన మంత్రం పాలనలో మార్పును కోరుకుంటూ ఓటేశామని 35 శాతం మంది ఓటర్లు తెలిపారు. మరీ ముఖ్యంగా డీఎంకే, అన్నాడీఎంకే విధానాలతో విసిగిపోయి మార్పు కోసమే విజయ్ వైపునకు మళ్లామని 77 శాతం మంది ఆయన మద్దతుదారులు తెలిపారు. కేవలం విజయ్ హుందాతనం, ఛరిష్మాను చూసి ఓటేశామని మరికొందరు చెప్పారు. కొత్తతరహా రాజకీయం, ప్రభుత్వ వ్యతిరేకత సైతం విజయ్కి కలిసిరావొచ్చని ఎగ్జిట్ పోల్ పేర్కొంది. కులాలు, మతాలకతీతంగా.. కులాలు, మతాలకతీతంగా రాష్ట్రవ్యాప్తంగా విజయ్కు ఓట్లేశారని ఎగ్జిట్ పోల్ అంచనావేసింది. ఓబీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, గ్రామీణ,పట్టణ ప్రాంత ఓటర్లు అందరూ టీవీకేకు పట్టం కట్టబోతున్నారని ఎగ్జిట్పోల్ విశ్లేషించింది. ఉపకులాల వారీగా చూసినా ఇతర పార్టీలతో పోలిస్తే విజయ్కు మద్దతు ఎక్కువగా కన్పించింది. ప్రచారకాలంలో పట్టణ ప్రాంతాల్లో మాత్రమే విజయ్కు హవా ఉన్నట్లు ప్రచారసభలకు వచ్చిన జనాలను బట్టి తెలుస్తోంది. తీరా పోలింగ్ సమయం సమీపించేనాటికి టీవీకే పట్ల అభిమానం అంతకంతకూ పల్లెలకూపాకిందని ఎగ్జిట్పోల్ తెలిపింది. ముఖ్యమంత్రిగానూ.. రాష్ట్రంలో తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండొచ్చనే ప్రశ్నకు ఓటర్లు విజయ్ పేరే ఎక్కువగా చెప్పారు. విజయ్ సీఎం కావొచ్చని 37 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి సీఎం కావొచ్చని 35 శాతం మంది అంచనావేశారు. తొలి ఎన్నికల్లోనే ప్రస్తుత సీఎంకు గట్టిపోటీ ఇచ్చేస్థాయికి విజయ్కు ప్రజాదరణ దక్కడం విశేషమని యాక్సిస్ మై ఇండియా ఛైర్పర్సన్ ప్రదీప్ గుప్తా చెప్పారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో తేలిందేంటంటే.. → ద్విముఖ పోరుగా ఉన్న తమిళనాడు ఎన్నికల్లో హఠాత్తుగా టీవీకే వచ్చి కీలకశక్తిగా మారుతోంది→ డీఎంకేకు క్షేత్రస్థాయిలో ఇప్పటికీ గట్టిపట్టున్నా ఆ పునాదులను టీవీకే పెకళించే అవకాశాలు మెండుగా ఉన్నాయి→ జయలలిత మరణం, పన్నీర్సెల్వం, పళనిస్వామి మధ్య విభేదాలు, పన్నీర్సెల్వం ని్రష్కమణ, అంతర్గత విభేదాలతో అన్నాడీఎంకే ప్రభ కోల్పోయింది→ విజయ్ పార్టీ శాశ్వతంగా రాష్ట్రరాజకీయాల్లో కీలకభూమిక పోషించే అవకాశం → తాజా ఎగ్జిట్పోల్ అంచనాలు నిజమైతే టీవీకే పార్టీ తమిళనాట కీలకరాజకీయ శక్తిగా ఎదుగుతుంది. భవిష్యత్తు ఎన్నికల్లోనూ కింగ్మేకర్గా మారొచ్చు. -
ఐదింటిలో మేమే గెలుస్తాం!
వారణాసి/లక్నో: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించబోతోందని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. వచ్చే నెల 4న వెలువడే ఫలితాలు వికసిత్ భారత్ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయని, దేశ పురోగతి వేగానికి నూతన శక్తిని ఇస్తాయని అన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేయడం తథ్యమని స్పష్టంచేశారు. ప్రధాని బుధవారం ఉత్తరప్రదేశ్లో పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించి హర్డోయిలో జరిగిన సభలో ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్లో ప్రజలు ఈసారి నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని, గత ఏడు దశాబ్దాల్లో ఇది కనీసం కలలో కూడా ఊహించని పరిణామం అని చెప్పారు. ప్రజాస్వామ్య వేడుకలో నేడు ఒక ముఖ్యమైన రోజు అని ఉద్ఘాటించారు. పశ్చిమ బెంగాల్ ప్రజలకు కృతజ్ఞతలు బెంగాల్లో మొదటి దశ పోలింగ్లో జరిగినట్లుగానే రెండో దశ పోలింగ్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరుగుతోందని మోదీ తెలిపారు. పోలింగ్ బూత్ల ముందు ఓటర్లు బారులు తీరిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయని చెప్పారు. తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలనే ప్రజల ఉత్సాహాన్ని ఈ ఓటింగ్ ప్రతిబింబిస్తోందని స్పష్టంచేశారు. బెంగాల్లో ఈసారి భయానికి తావులేని వాతావరణంలో ప్రజలు ఓటు వేస్తున్నారని పేర్కొన్నారు. ఇది దేశ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య బలోపేతానికి ఒక శక్తివంతమైన చిహ్నమని వ్యాఖ్యానించారు. హక్కుల పట్ల అవగాహన కలిగి, పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్న పశ్చిమ బెంగాల్ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే చరిత్రాత్మక, నిర్ణయాత్మక విజయం సాధించిందని మోదీ గుర్తుచేశారు. తాజాగా గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అద్భుత విజయం సొంతం చేసుకుందని తెలిపారు. దాదాపు 85 శాతం మున్సిపాల్టీలు, పంచాయతీలు బీజేపీకే దక్కాయన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అఖండ విజయం తథ్యమని పునరుద్ఘాటించారు. విపక్ష సమాజ్వాదీ పార్టీపై మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలకు ఆ పార్టీ వ్యతిరేకమని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్ ప్రజలను దూషించే డీఎంకే వంటి పార్టీలతో చేతులు కలిపిందని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు వ్యతిరేకంగా సమాజ్వాదీ పార్టీ ఓటు వేసిందని ఆక్షేపించారు. గంగా ఎక్స్ప్రెస్ వే ప్రారంభం ఉత్తరప్రదేశ్లో 594 కిలోమీటర్ల గంగా ఎక్స్ప్రెస్ రహదారిని ప్రదాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఆ ఆరు వరుసల అత్యాధునిక రహదారి మీరట్, ప్రయాగ్రాజ్లను అనుసంధానిస్తుంది. ఈ హైస్పీడ్ కారిడార్ ఉత్తరప్రదేశ్ అంతటా అనుసంధానాన్ని గణనీయంగా పెంచుతుందని, పారిశ్రామిక పెట్టుబడులు, లాజిస్టిక్స్, వ్యవసాయ మార్కెటింగ్, ప్రాంతీయ సమతుల్యతకు ఊతం ఇస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) మోడల్ కింద గంగా ఎక్స్ప్రెస్వేను నిర్మించారు. ఇందులో 3.2 కిలోమీటర్ల ఎయిర్స్ట్రిప్ కూడా ఉంది. వాయుసేన విమానాలు అత్యవసర సమయాల్లో దిగేందుకు దీనిని నిర్మించారు.వారణాసిలో మోదీ రోడ్ షో ప్రధాని మోదీ బుధవారం ఉదయం తన సొంత నియోజకవర్గం వారణాసిలో భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు స్వాగతం పలికారు. అలాగే కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని మోదీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రాలు పఠించారు. మోదీకి స్థానిక నాయకులు త్రిశూలం, ఢమరుకం, సంప్రదాయ కండువా బహూకరించారు. బాబా విశ్వనాథ్ ఆలయంలో పూజలు చేయడం, శివ లింగాన్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశ పౌరుల సుఖ సంతోషాల కోసం విశ్వనాథుడిని ప్రార్థించానని తెలిపారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ వద్ద చిన్నారులతో మోదీ సంభాషించారు. -
బెంగాల్లో హోరాహోరి!
న్యూఢిల్లీ: పార్టీల పోటాపోటీ ప్రచారంతో హోరెత్తిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్పోల్స్ ఫలితాలు కూడా ఒకట్రెండు సంచలన అంచనాలతో హోరెత్తాయి.పశ్చిమ బెంగాల్లో తుది విడత పోలింగ్ బుధవారం సాయంత్రం ముగిసిన వెంటనే ఫలితాలను ఆయా సర్వే సంస్థలు ప్రకటించాయి. కీలక రాష్ట్రమైన బెంగాల్లో ఈసారి మమతా బెనర్జీ పార్టీకి పరాజయం తప్పదని కొన్ని సంస్థలు వెల్లడించగా, ఆమె వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావడం తథ్యమని మరికొన్ని సంస్థలు అంచనా వేశాయి. మరో పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో అధికార డీఎంకే కూటమి స్పష్టమైన మెజార్టీతో మళ్లీ జయకేతనం ఎగురవేయనున్నట్లు అత్యధిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలిపాయి. దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) మూడో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇక్కడ అన్నాడీఎంకే కూటమి రెండో స్థానంలో నిలుస్తుందని వెల్లడించాయి. అయితే విజయ్ మరో ఎంజీఆర్గా అవతరించబోతున్నారని యాక్సిస్ మై ఇండియా సంస్థ ప్రకటించడం గమనార్హం. టీవీకే పార్టీ 35 శాతం ఓట్లతో 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అతిపెద్ద పార్టీగా నిలవబోతోందని ఆ సంస్థ తేల్చిచెప్పింది. అస్సాంలో ఎన్డీయే మరోసారి నెగ్గడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టంచేశాయి. కమ్యూనిస్టుల అడ్డా అయిన కేరళలో ఈసారి వారికి పరాభవం తప్పదని, పినరయి విజయన్ గద్దె దిగబోతున్నట్లు పేర్కొన్నాయి. రాష్ట్రంలో వామపక్ష కూటమి ఎల్డీఎఫ్ ఓడిపోతుందని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వచ్చే సూచనలున్నాయని వెల్లడించాయి. కేరళ ప్రజలు మార్పునకు అనుకూలంగా ఓటు వేశారని తెలిపాయి. పుదుచ్చేరిలో ఎన్డీయేకు మళ్లీ స్పష్టమైన విజయావకాశాలు ఉన్నట్లు అభిప్రాయపడ్డాయి. టీఎంసీపై బీజేపీకి స్వల్ప ఆధిక్యం పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్పై బీజేపీ స్పల్ప ఆధిక్యత సాధిస్తుందని మాట్రిజ్, పి–మార్క్ ఫలితాలు తెలియజేశాయి. టీఎంసీకి 125–140 స్థానాలు వస్తాయని, బీజేపీకి 146–161 స్థానాలు లభిస్తాయని మాట్రిజ్ వెల్లడించింది. పి–మార్క్ అంచనా ప్రకారం బీజేపీకి 150–174 సీట్లు, టీఎంసీకి 118–138 సీట్లు లభిస్తాయి. బీజేపీకి 142–171, టీఎంసీకి 99–127 సీట్లు లభించేందుకు ఆస్కారం ఉన్నట్లు ‘పోల్ డైరీ’ఎగ్జిట్ పోల్ తేల్చింది. అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పిన సందర్భాలు గతంలో ఉన్నాయి. వాస్తవమైన ఫలితాలను అంచనా వేయడంలో అవి విఫలమయ్యాయి. -
దేశంలో అప్పట్లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో అదే జరిగి..
పశ్చిమ బెంగాల్ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలపై అంచనాలు ఇప్పటికే వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ చాలాసార్లు ఏయే పార్టీలు గెలుస్తాయో సరిగ్గా అంచనా వేశాయి. ఆయా పార్టీలే ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి.. ఎప్పుడెప్పుడో చూద్దాం..లోక్సభ ఎన్నికల్లో..2014 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 280-300 స్థానాలు వస్తాయని అంచనా వేయగా, 336 స్థానాలు దక్కాయి.2019 లోక్సభలో కూడా ఇదే ధోరణి కనిపించింది. అంచనాలు 300-350 స్థానాల మధ్య ఉండగా, ఎన్డీఏ 353 స్థానాలు గెలుచుకుంది.1998 లోక్సభలో బీజేపీ నేతృత్వంలోని కూటమికి 260 స్థానాలు వస్తాయని అంచనా, అప్పుడు 254 స్థానాలు వచ్చాయి.1999 లోక్సభలో 280 స్థానాలు అంచనా వేయగా, 303 స్థానాలు గెలిచింది.రాష్ట్రాల ఎన్నికల్లో..2006 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్కు 95-105 స్థానాలు వస్తాయని అంచనా వేయగా 99 స్థానాలు వచ్చాయి.2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎఐఏడీఎంకే+కు 140-160 స్థానాలు వస్తాయని అంచనా వేయగా, 150 స్థానాలు గెలుచుకుంది.2016 తమిళనాడు ఎన్నికల్లో ఎఐఏడీఎంకేకు 130-150 స్థానాలు అంచనా ఉండగా, 136 స్థానాలు సాధించింది.2016 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి 210-230 స్థానాలు వస్తాయని అంచనా వేయగా, 211 స్థానాలు వచ్చాయి.అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పిన సందర్భాలూ ఉన్నాయి. -
ముగిసిన ఎన్నికల రణం
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఏప్రిల్లో ఎన్నికలుంటాయని గత నెల 16న ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది మొదలు అలుముకున్న ఒక రకమైన యుద్ధ వాతావరణం పరిసమాప్తమైంది. పశ్చిమ బెంగాల్లో బుధవారం ముగిసిన రెండో దశ పోలింగ్లో అనుకున్నట్టే భారీ స్థాయి ఓటింగ్ జరిగింది. సాయంత్రానికల్లా వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలవరకూ చూస్తే దాదాపు అన్ని సర్వే సంస్థలూ కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్, పుదుచ్చేరిలో ఎన్డీయే విజయం ఖాయమని తెలిపాయి. తమిళనాడులో కొత్త పార్టీ టీవీకే ప్రభావం ఎక్కువగా ఉందని చెబుతూనే డీఎంకే తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని అయిదు సంస్థల్లో మూడు అంచనా వేయగా, ఒక సంస్థ అన్నాడీఎంకే–బీజేపీ కూటమివైపు మొగ్గింది. బెంగాల్లో తృణమూల్, బీజేపీలు హోరాహోరీగా తలపడ్డాయని సర్వేలు తేల్చాయి. ఆరు సంస్థల్లో రెండు తృణమూల్వైపు, మిగిలిన సంస్థలు బీజేపీవైపు మొగ్గాయి. వాస్తవ ఫలితాలకు ఇవి ఏమేరకు దగ్గరగా ఉంటాయన్నది వచ్చే నెల 4న జరిగే ఓట్ల లెక్కింపు తర్వాతగానీ తెలియదు. పోలింగ్ వరకూ చూస్తే మిగిలినచోట్ల దాదాపు ప్రశాంతంగానే ముగిసినా పశ్చిమ బెంగాల్ ఎప్పటిలాగే తనదైన ముద్ర మిగిల్చింది. రెండు దశల్లోనూ హింసాత్మక ఘటనలు తప్పలేదు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి జరిగిన హింస చాలా తక్కువని విశ్లేషకులు చెబుతున్నారు. కావొచ్చు... కానీ శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో దాదాపు రెండున్నర లక్షలమంది బలగాలను మోహరించటం, ముఖ్యంగా రెండో దశ పోలింగ్ జరిగిన దక్షిణ బెంగాల్ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో భద్రతా బలగాలు అతిగా ప్రవర్తించిన తీరు సబబు కాదు. ఒకరి హింసకు మరొకరి హింస ప్రత్యామ్నాయం కాదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరిట ఏకంగా 91 లక్షలమంది ఓటర్ల పేర్లు గల్లంతు కావటం, ఎక్కడెక్కడికో పనుల కోసం వలసపోయినవారు తిరిగొచ్చి కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా తగిన పత్రాలు సంపాదించలేకపోవటం, దాఖలు చేసినవారు సైతం భంగపడటం ఎందరినో కలవరపెట్టింది. చివరకు తొలి దశలో 139 మంది, మలి దశలో 1,468 మంది మాత్రమే న్యాయసమీక్షలో ఓటుహక్కు పొందారు. ఇక ఈసీ వివాదాస్పద పాత్ర సరేసరి. ముఖ్యంగా బెంగాల్లో ఎన్నికలు సక్రమంగా నిర్వహించటం కోసం తాను తటస్థంగా వ్యవహరించాలన్న సంగతిని అది మరిచింది. ఈ ఎన్నికల బరిలో తానూ ఉన్నానన్నట్టు వ్యవహరించింది. నిజానికి 2024 ఎన్నికల సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో ఈ పోకడలు కనబడ్డాయి. అధికారుల బదిలీలు మొదలుకొని అనేక అంశాల్లో విపక్షం చెప్పినట్టల్లా ఈసీ ఆడిందని అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి. ఇప్పుడు బెంగాల్లో అది మరింత బాహాటంగా జరిగింది. కేంద్ర పరిశీలకులుగా వచ్చిన ఒకరిద్దరు బెదిరింపు ధోర ణిలో మాట్లాడటం ఆశ్చర్యపరిచింది. అందులో ‘ఎన్కౌంటర్ స్పెషలిస్టు’గా మీడియా చెబుతున్న యూపీకి చెందిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా ఉన్నారు. ఏ అభ్యర్థి అయినా సక్రమంగా వ్యవహరించకపోతే, డబ్బు పంచుతుంటే లేదా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తుంటే చట్టం అనుమతించిన మేరకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ బహిరంగ సవాళ్లు దేనికి? ఇది మంచి సందేశాన్ని పంపదు. ఇతరచోట్ల గణనీయమైన విజయాలు సాధిస్తున్నా... బీజేపీకి మాతృసంస్థ అనదగ్గ జనసంఘ్కు నారూ నీరూ పోసిన స్వర్గీయ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్వస్థలమైన బెంగాల్లో అది సాధించలేకపోతున్నామని మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి ఒక దశలో ఆవేదన వ్యక్తం చేశారంటారు. ఆయన తొలినాళ్లలో ముఖర్జీకి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనైనా అదెంతవరకూ సాకారమవుతుందన్న విషయంలో ఎవరి అంచనాలు వారివి. ‘స్ట్రీట్ ఫైటర్’గా పేరున్న ముఖ్యమంత్రి మమతకు దీటుగా నిలబడగల స్థానిక నాయకులు ఇంతవరకూ బీజేపీకి తారసపడలేదు. అందుకే ప్రచార బాధ్యతల్ని స్వయంగా నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు మోయాల్సివచ్చింది. అక్కడొచ్చే ఫలితాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పాలక, విపక్షాల వ్యూహాలపై రానున్న రోజుల్లో తీవ్ర ప్రభావం చూపగలవనటంలో సందేహం లేదు. -
విజయ్దే విజయం.. యాక్సిస్ మై ఇండియా సంచలన రిపోర్ట్
సాక్షి,చెన్నై: తమిళనాడులో టీవీకేదే విజయమంటూ యాక్సిస్ మై ఇండియా సంచలన రిపోర్ట్ విడుదల చేసింది. మెజార్టీ సర్వే సంస్థలకు భిన్నంగా టీవీకే చీఫ్ విజయ్దే ప్రభంజనమన్న ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్.. టీవీకే 98-120 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. రెండో స్థానంలో డీఎంకే 92-100 సీట్లు సాధించే అవకాశముందని అభిప్రాయం పడింది. మొత్తానికి టీవీకేకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ ఇన్సైట్ సర్వే అంచనా వేసింది. డీఎంకే-122-140, ఏఐడీఎంకే-60-70, టీవీకే 30-40, ఇతరులు-4 సీట్లు గెలిచే అవకాశముందని పేర్కొంది. మాట్రిజ్ సర్వే.. డీఎంకే: 122-132, అన్నా డీఎంకే: 87-100, టీవీకే 10-12, ఇతరులు 0-6 సీట్లు సీట్లు వస్తాయని పేర్కొంది. డీఎంకే 134-141, అన్నా డీఎంకే 84-90, టీవీకే 4-8 సీట్లు సాధించే అవకాశముందని ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి.పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. డీఎంకే రెండో సారి అధికారం చేపట్టే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటముల మధ్య తీవ్ర పోటీ ఉన్నా డీఎంకే ఆధిపత్యం కనిపిస్తోందని సర్వేలో తేలింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రెండు కూటములకు గట్టి పోటీ ఇస్తుందని సర్వేలో వెల్లడైంది. కాగా, యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ మాత్రం మిగతా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు విభిన్నంగా ఎగ్జిట్పోల్స్ ఫలితాలను ప్రకటించింది. టీవీకే 98-120 స్థానాల్లో గెలిచే అవకాశముందని చెప్పింది.తమిళనాడులో ఈసారి ప్రధాన పోటీ డీఎంకే , అన్నాడీఎంకే కూటముల మధ్య ఉన్నప్పటికీ, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభావంపైనే అందరి దృష్టి నెలకొన్న సంగతి తెలిసిందే విజయ్ పార్టీ చీల్చే ఓట్లు అధికార డీఎంకే కూటమిపై ప్రభావం చూపుతాయా లేక అన్నాడీఎంకే ఓటు బ్యాంక్ను దెబ్బతీస్తాయా అన్నది సోషల్ మీడియాలో ఇప్పటికే హాట్ టాపిక్గా మారింది. ఈ ముక్కోణపు సమరంలో కొన్ని నియోజకవర్గాల్లో విజయ్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందన్న అంచనాల నడుమ, ప్రధాన పార్టీలలో టెన్షన్ పెట్టిస్తోంది. ఇవాళ విడుదలైన పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని అంచనా వేయగా.. యాక్సిస్ మై ఇండియా మాత్రం విజయ్కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది. -
అస్సాంలో మరోసారి బీజేపీదే అధికారం
డిస్పోర్: అసోం అసెంబ్లీ ఎన్నికలపై యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేసింది. ఈ ఎగ్జిట్స్ పోల్స్లో మరోసారి బీజేపీ అధికారంలోకి రానున్నట్లు తెలిపింది. యాక్సిస్ మై ఇండియాతో పాటు ఇతర సర్వే సంస్థలన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. బీజేపీ-ఏపీజీ-బీపీఎఫ్ కూటమి 88 నుండి 100 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పోల్స్ సూచించాయి. ఇందులో బీజేపీ 70-80 స్థానాలు, ఏజీపీ 7-9 స్థానాలు, బీపీఎఫ్ 9-11 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఎన్డీఏ మొత్తం ఓటు శాతం 48శాతంగా అంచనా వేయబడింది. బీజేపీకి 37శాతం, ఏజీపీకి 7శాతం,బీపీఎఫ్కికి 4శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని పోల్స్ తెలిపాయి.కాంగ్రెస్ కూటమి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి 24 నుండి 36 స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా.కాంగ్రెస్ పార్టీకి 22-30 స్థానాలు వచ్చే అవకాశం ఉంది.మిగతా మిత్రపక్షాలు: రైజోర్ దల్ 1-4 స్థానాలుఏజీపీ 1-2 స్థానాలుసీపీఐ(ఎం) 0-1 స్థానాలుఐఎన్డీ0-2 స్థానాలుఎన్డీఏలో బీజేపీ 90 స్థానాలు, ఏజీపీ 26 స్థానాలు, బీపీఎఫ్ 11 స్థానాలు పోటీ చేసింది.కాంగ్రెస్ 99 స్థానాలు, రైజోర్ దల్ 13 స్థానాలు,ఏజీపీ 10 స్థానాలు పోటీ చేశాయి.ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏ మరోసారి అసోంలో అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. తుది ఫలితాలు విడుదల తర్వాతే అధికారం ఎవరిదనేది తేలనుంది. -
పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్.. హవా ఆ పార్టీదే..?
కేంద్ర పాలిత ప్రాంతం పుదిచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది.పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా మెజార్టీకి 17 స్థానాలు కావాలి. మరో మూడు నామినేటెడ్ స్థానాలున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 16-19 స్థానాలు, సెక్యూలర్ ప్రొగ్రెసివ్ (ఎస్పీఏ) కూటమి 10-12 స్థానాలు, ఇతరులు 1-2 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలో తెలింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 34 నుండి 36 శాతం, ఎస్పీఏ కూటమి 30 నుండి 32 శాతం, టీవీకే, ఎన్ఎమ్కే కూటమి 15 నుండి 17 శాతం, ఎన్టీకే 4 నుండి 6 శాతం, వీసీకే 1 నుండి 3 శాతం, ఇతరులు 2 నుండి 5 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఏన్డీఏ కూటమిలోని ఏఐఎన్ఆర్సి పార్టీ 10-12 సీట్లతో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా నిలవనుంది. ఎన్డీఏలోని బీజేపీ 5-6 స్థానాలు, ఎల్జేకే 1-2, ఏఐఏడీఎమ్కే 0-1 స్థానాలు గెలవొచ్చు. ఎస్పీఏ కూటమిలోని డీఎమ్కే 6-8, కాంగ్రెస్ 1-3 స్థానాలు, టీవీకే, ఇతరులు 1-2 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది. పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు ఆ కూటమి విజయానికి దోహదం చేస్తున్నాయి.ఎన్డీఏ ప్రభుత్వానికి మరోసారి అవకాశమిస్తామని దాదాపు 60 శాతం చెప్పగా, 36 శాతం మరోసారి అవకాశమివ్వమని చెప్పారు. ఎస్ఏఎస్ గ్రూప్ NDA-17-19 CONG 11-12 OTH 1-3చాణక్య స్ట్రాటజీస్ NDA- 17-20 SPA - 9-13 TVK - 1 -
పినరయ్కి షాక్ తప్పదా? కేరళలో యూడీఎఫ్కే పట్టం!
సాక్షి, తిరువనంతపురం: కేరళలో అధికార మార్పు సంప్రదాయానికే మళ్లీ రాష్ట్ర ప్రజలు ఓటేశారని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది. కేరళలో వరుసగా 2016, 2021లో అధికారంలోకి వచ్చిన వామపక్షాల ఎల్డీఎఫ్ కూటమికి ఈ సారి భంగపాటు తప్పదని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి పీఠం ఖాయమని సర్వేలో వెల్లడైంది. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో మెజార్టీకి 71 సీట్లలో గెలవాలి. కేరళ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ 75-85, ఎల్డీఎఫ్ 55-65, ఎన్డీఏ 0-3 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది. యూడీఎఫ్ కూటమి ఎల్డీఎఫ్ కంటే 2 శాతం ఆధిక్యత కనబరుస్తుందని సర్వేలో వెల్లడైంది. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం పనితీరుపై సర్వేలో 55.1 శాతం సంతృప్తి వ్యక్తం చేసినా ఎల్డీఎఫ్కు మళ్లీ అధికారం కట్టబెట్టక పోవడం ఇక్కడ విశేషం. ఎల్డీఎఫ్కు మరోసారి అవకాశం ఇవ్వమని 42 శాతం చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పినయర్ విజయన్కు 22.3 శాతం మద్దతివ్వగా, కాంగ్రెస్ నేత సతీషన్కు 14.5 శాతం మద్దతిచ్చారు. ఎన్నికల్లో పార్టీకి ప్రాధన్యతిచ్చామని 51.8 శాతం చెప్పగా, 33.1 శాతం మంది అభ్యర్థులను బట్టి ఓటు వేశామని చెప్పారు.కేరళలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభావం నామమాత్రంగానే కనిపించింది. రాష్ట్రంలో ఎన్డీఏ మూడో ప్రత్యామ్నాయంగా ఎదగలేదని సర్వేలో వెల్లడైంది. 59.4 శాతం మంది రాష్ట్రంలో మూడు ఫ్రంట్ అవసరం లేదని సర్వేలో చెప్పారు.కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై 50.9 శాతం అసంతృప్తి వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రచారంపై కేరళలో ఆసక్తి కనిపించలేదు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య ముఖాముఖి పోటీ జరిగిన కేరళలో పదేళ్ల వామపక్ష ప్రభుత్వానికి ప్రజలు బ్రేకులు వేసినట్టు పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది.యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ : యూడీఎఫ్(కాంగ్రెస్ కూటమి) 78 నుంచి 90 స్థానాలుపినరయ్ విజయ్ కూటమి,ఎల్డీఎఫ్కి 49 నుంచి 62 స్థానాలుబీజేపీ ఒకటి నుంచి 3 స్థానాల్లో విజయం సాధించే అవకాశంఆత్మసాక్షి.ఎగ్జిట్పోల్స్ UDF 76-81LDF 61-66BJP 3- 4ఇతరులు 1 -
తమిళనాడు ఎగ్జిట్ పోల్స్.. విజయ్ సీఎం అవుతాడా?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఇవాళతో (బుధవారం)తో ముగిసింది. పలు సంస్థలు ఎగ్జిట్పోల్స్ విడుదల చేశాయి. తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ ఇన్సైట్ సర్వే అంచనా వేసింది. డీఎంకే-122-140, ఏఐడీఎంకే-60-70, టీవీకే 30-40, ఇతరులు-4 సీట్లు గెలిచే అవకాశముందని పేర్కొంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 84 శాతంపైగా ఓటింగ్ నమోదయ్యింది. గత 2021 ఎన్నికల కంటే 11 శాతం ఎక్కువగా ఓటింగ్ నమోదయ్యింది.మాట్రిజ్ సర్వే:DMK: 122-132ADMK: 87-100TVK: 10-12ఇతరులు 0-6ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్DMK 134-141AIDMK 84-90TVK 4-8టీవీకే విజయ్దే విజయం: యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్టీవీకే 98-120 స్థానాల్లో గెలిచే అవకాశంరెండో స్థానంలో డీఎంకే 92-100పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. తమిళనాడు చరిత్రను పరిశీలిస్తే గత నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే సంప్రదాయం ఉంది. అయితే 2016లో మాత్రం జయలలిత నేతృత్వంలో ఏఐడీఎంకే వరుసగా రెండోసారి అధికారం చేపట్టారు. ఇప్పుడు డీఎంకే రెండో సారి అధికారం చేపట్టే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటముల మధ్య తీవ్ర పోటీ ఉన్నా డీఎంకే ఆధిపత్యం కనిపిస్తోందని సర్వేలో తేలింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రెండు కూటములకు గట్టి పోటీ ఇస్తుందని సర్వేలో వెల్లడైంది.తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. డీఎంకే కూటమి 125-145 స్థానాలతో అధికారం చేపట్టనుందని సర్వేలో తేలింది. ఏఐడీఎంకే 65-80 స్థానాలతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. టీవీకే 18-24 స్థానాలు, ఇతరులు 2-6 స్థానాలు గెలుపొందే అవకాశాలున్నాయి. డీఎంకే కూటమి 38.4 శాతం, ఏఐడీఎంకే 31.5 శాతం, టీవీకే 23.6 శాతం, ఇతరులు 6.5 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఎన్నికల సర్వేలో 3 శాతం ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశం ఉంది.మహిళలు డీఎంకేకు 37.8 శాతం, ఏఐడీఎంకేకు 30.2 శాతం, టీవీకేకు 26 శాతం, ఇతరులకు 6 శాతం మద్దతివ్వగా, పురుషులు డీఎంకేకు 39.5 శాతం, ఏఐడీఎంకేకు 32.6 శాతం, టీవీకేకు 21.1 శాతం, ఇతరులకు 6.8 శాతం మద్దతిచ్చారు. 18 నుండి 24 ఏళ్ల మధ్య నూతన యువ ఓటర్లలో డీఎంకేకు 34.9 శాతం, ఏఐడీఎంకు 25.8 శాతం, టీవీకేకు 32.3 శాతం, ఇతరులకు 7 శాతం మద్దతిచ్చినట్టు సర్వేలో తేలింది. సినీ నటడు విజయ్ యువ ఓటర్లపై భారీ ఆశలు పెట్టుకున్నా అధికార డీఎంకే వైపు యువత మొగ్గు చూపినట్టు సర్వేలో వెల్లడైంది. డీఎంకే, ఏఐడీఎంకే ప్రత్యక్షంగా పోటీ పడకుండా వారి మిత్రపక్షాలు పోటీ పడిన స్థానాల్లో టీవీకే గట్టి పోటీ ఇచ్చిందని సర్వేలో తేలింది. ప్రధాన అభ్యర్థుల స్థానాలను పరిశీలిస్తే డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ కొలతూరులో, ఏఐడీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి ఎడప్పాడిలో విజయం దిశగా కొనసాగుతున్నారు. మరో ఏఐడీఎంకే మాజీ సీఎం పన్నీరు సెల్వం ఎన్నికల ముందు డీఎంకేలో చేరి బోడినాయకనూర్ నుండి పోటీ చేస్తుండగా అక్కడ టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేస్తుండగా పెరంబూర్ నుండి గెలిచే అవకాశాలుండగా, ఈస్ట్ తిరుచిరాపల్లిలో వెనకబడినట్టు సర్వేలో తేలింది. డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చపాక్ నుండి పోటీ పడుతుండగా ఆయన అక్కడ టీవీకే పార్టీ నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. శ్రీపెరంబదూర్ నుండి పోటీలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సెల్వ అక్కడ టీవీకే చేతిలో వెనుకబడినట్టు సర్వేలో తేలింది.తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సై మైలాపూర్లో బీజేపీ తరఫున పోటీ పడుతుండగా ఆమె టీవీకే చేతిలో ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు బీజేపీ చీఫ్ నయనార్ నాగేందర్ పోటీ పడుతున్న సత్తూరులో ఆయన గెలిచే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. సినీ నటడు దివంగత విజయ్కాంత్ సతీమణి, డీఎండీకే చీఫ్ ప్రేమలత గతంలో విజయ్కాంత్ గెలిచిన విరుదాచలం నుండి పోటీ పడుతుండగా ఆమె మూడో స్థానానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.తమిళ రాజకీయాల్లో వృద్ధ నేత. కరుణానిధి సన్నితులైన 86 ఏళ్ల దురై మురుగన్ డీఎంకే తరఫున కాట్పడి నుండి పోటీ పడుతుండగా ఆయన ఇప్పుడు పదకొండవ సారి గెలిచే అవకాశాలున్నాయి. ఏఐడీఎంకే మిత్రపక్షం పీఎంకే చీఫ్ అన్బమణి రాందాస్ సతీమణి సౌమ్య అన్బమణి రాందాస్ ధర్మపురి నుండి పోటీ చేస్తుండగా ఆమె టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీవీకే, ఏఐడీఎంకే మధ్య చీలిపోతున్నాయి. టీవీకే, పీఎమ్కే (ఆర్), శశికళ కూటమితో ఏఐడీఎంకే నష్టపోతోంది. ముఖ్యంగా ఏఐడీఎంకే ట్రెడిషనల్ ఓటు బ్యాంకు అయిన తేవర్ శశికళ కూటమి, ఓపీఎస్ వల్ల, వన్నియార్ ఓటు పీఎమ్కే (ఆర్) పార్టీ వల్ల నష్టపోతుంది. తద్వారా గ్రాస్ రూట్లో ఏఐడీఎంకే చాలా స్థానాల్లో దెబ్బతింది. ఎస్సీ యూత్ టీవీకే ఆకర్షించగా, వీసీకే మద్దతుతో డీఎమ్కే తన ఎస్సీ ఓటు బ్యాంకు పదిలపరుకుంటుంది. విజయ్ వల్ల డీఎంకే కొంత క్రిస్టియన్ ఓట్లు కోల్పోపోతున్నప్పటికీ, ముస్లింలు డీఎంకే వైపే మొగ్గు చూపారు. డీఎంకే ప్రభుత్వ పథకాలతో మహిళలు ఆ కూటమి వైపు మొగ్గు చూపారు. -
ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. అధికారం ఆ పార్టీలదే
ఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీయే ప్రభంజనం ఖాయమని తేల్చాయి. మే 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. మే 4న ఎన్నికల కౌంటింగ్ జరగాల్సి ఉండగా.. వివిధ సంస్థలు ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఎగ్జిట్స్ పోల్స్ను విడుదల చేశాయి. తమిళనాడు (మొత్తం: 234)ఏజెన్సీ: పీపుల్స్ పల్స్డీఎంకే: 125 – 145ఏడీఎఎంకే: 65 – 80టీవీకే (విజయ్): 18 – 24ఇతరులు : 2 – 6కేరళ (మొత్తం: 140)ఏజెన్సీ: పీపుల్స్ పల్స్యూడీఎఫ్: 75 – 85ఎల్డీఎఫ్: 55 – 65బీజేపీ: 0 – 3ఇతరులు : 0అసోం (మొత్తం: 126)ఏజెన్సీ: యాక్సిస్ మై ఇండియాబీజేపీ: 88 – 101కాంగ్రెస్: 15 – 36ఏఐయూడీఎఫ్: 0ఇతరులు: 0 – 3పశ్చిమ బెంగాల్ (మొత్తం: 294)ఏజెన్సీ: పీపుల్స్ పల్స్టీఎంసీ: 177 – 187బీజేపీ: 95 – 110కాంగ్రెస్: 1 – 3వాపక్షాలు: 0 – 1పుదుచ్చేరి (మొత్తం: 30)ఏజెన్సీ: పీపుల్స్ పల్స్ఎన్ఆర్సీ: 16 – 19కాంగ్రెస్: 10 – 12ఇతరులు: 1 – 2 అస్సాంలో బీజేపీ సునామీఅస్సాంలో బీజేపీ మరో భారీ విజయం సాధించబోతోందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత శర్మ నేతృత్వంలోని ఆ పార్టీ మరోసారి అధికారంలోకి రావచ్చు. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం ఆ పార్టీ 88-100 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 24-36 సీట్లతో సరిపెట్టుకోవచ్చని తెలిపింది. పశ్చిమ బెంగాల్రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీఎంసీ, బీజేపీ మధ్య పోటీ కనిపిస్తోంది. అధిక సంఖ్యలో పోలింగ్ శాతం నమోదు కావడం, ముఖ్యంగా మహిళా ఓటర్లు పాల్గొనడం ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.తమిళనాడు234 నియోజకవర్గాల్లో ఒకే దశలో జరిగిన ఎన్నికల్లో 82 శాతం పైగా ఓటింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం డీఎంకే ఆధిక్యం కొనసాగుతుందని అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో టీవీకే విజయ్, బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని సూచనలు వెలువడుతున్నాయి.కేరళంఎప్పటిలాగే అధిక ఓటింగ్ నమోదైన కేరళంలో ఎగ్జిట్ పోల్స్ స్పష్టమైన మెజారిటీని చూపడం కష్టం. ఎల్డిఎఫ్, యూడిఎఫ్ మధ్య పోటీ తీవ్రంగా ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఓటర్ల అభిప్రాయం చివరి నిమిషంలో మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.అసోం85 శాతం పైగా పోలింగ్ నమోదైన అసోంలో బీజేపీ ఆధిక్యం కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలతో పోటీ ఉన్నప్పటికీ, ఎన్డీఏ బలంగా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.పుదుచ్చేరి89 శాతం పైగా పోలింగ్ నమోదైన పుదుచ్చేరి రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ఆధిక్యం సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అధిక ఓటింగ్ ప్రజల రాజకీయ చైతన్యాన్ని ప్రతిబింబిస్తోంది.ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బలంగా నిలుస్తోంది. తమిళనాడులో డీఎంకే ఆధిక్యం కొనసాగుతుందని అంచనాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ–బీజేపీ మధ్య పోటీ, కేరళలో ఎల్డిఎఫ్–యూడిఎఫ్ మధ్య పోటీ కనిపిస్తోంది. -
బెంగాల్లో ఈ సారి జెండా వారిదే.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే?
పశ్చిమబెంగాల్లో రికార్డులు బద్దలయ్యాయి. స్వాత్యంత్ర్యం వచ్చిన తర్వాత అత్యధిక పోలింగ్ శాతం జరిగిన ఎన్నికలుగా పశ్చిమబెంగాల్ ఎన్నికలు రికార్డుల్లోకెక్కాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రానే వచ్చాయి. చాణక్య స్ట్రాటజీ ఎగ్జిట్ పోల్స్టీఎంసీ-130-140బీజేపీ- 150-160 కాంగ్రెస్2-4పీమార్క్ ఎగ్జిట్ పోల్స్TMC 118-138BJP 150-175CONG 2-6దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే పై చేయి సాధిస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. పశ్చిమ బెంగాల్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ పోటాపోటీగా తలపడినా మమతా బెనర్జీ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని సర్వేలో తేలింది.పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ సర్వే పూర్తి వివరాలురాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలుండగా అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148 స్థానాలు.అధికార టీఎంసీ 177-187, బీజేపీ 95-110, కాంగ్రెస్ 1-3, వామపక్షాలు 0-1, బీజీపీఎమ్ 1-2, గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో వెల్లడైంది.టీఎంసీ కూటమి 46.5 శాతం, బీజేపీ 41.5 శాతం, వామపక్షాలు 4.1 శాతం, కాంగ్రెస్ 2.1 శాతం, బీజీపీఎమ్ 0.7 శాతం,ఇతరులు 5.1 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది ఎస్సీ, ఎస్టీ ఆధిపత్యం ఉండే జల్పాయ్గురి డివిజన్లో టీఎంసీ, బీజేపీ పోటాపోటీగా తలపడ్డాయి. ఈ డివిజన్లో బీజేపీ కొంత మెరుగ్గా ఉన్నా కూచ్ బీహార్లో బలహీనంగా ఉంది. ఇక్కడ దళితులు, గుర్ఖాలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది..మైనార్టీలు అధికంగా ఉండే మాల్దా డివిజన్లో టీఎంసీ తన బలాన్ని మరోసారి నిరూపించుకునే అవకాశాలున్నాయని ప్రెసిడెన్సీ డివిజన్లో మరోసారి టీఎంసీ పూర్తి ఆధిపత్యం కనబరుస్తుందని సర్వేలో తేలింది. కోల్కతా, హౌరా, నార్త్, సౌత్ 24 పరగణ జిల్లాల్లో బీజేపీపై టీఎంసీ పై చేయి సాధించినట్లు సర్వేలో వెల్లడైంది. సామాజిక వర్గాలుగా పరిశీలిస్తే దళితులు, ముస్లింలు టీఎంసీ వైపు మొగ్గు చూపారు. ఓబీసీలు టీఎంసీ, బీజేపీ మధ్య చీలిపోయారు. మాతూస్ సామాజిక వర్గం ‘సర్’ పై ఆగ్రహంతో బీజేపీకి దూరమయ్యారు. ముస్లిం సామాజిక వర్గంలో ఎలాంటి చీలిక కనిపించకపోవడం టీఎంసీకి కలిసి వచ్చింది. ఏఐఎంఐఎం, జేయూపీ, కాంగ్రెస్, వామపక్షాలు ముస్లిం ఓట్లమై ఆశలు పెట్టుకున్నా వారు బీజేపీకి వ్యతిరేకంగా టీఎంసీకే మూకుమ్మడిగా ఓటు వేశారు.అని సర్వే చెబుతోంది.రాష్ట్రంలో 35 శాతంపైగా ముస్లిం జనాభా ఉన్న అసెంబ్లీ సీట్లు 89 కాగా, 25 శాతంపైగా ముస్లింలున్న స్థానాలను కలుపుకుంటే మొత్తం 112 స్థానాల్లో ముస్లింలు కీలకంగా ఉన్నారు.‘సర్’ తో 90 లక్షల ఓట్లు తొలగించడం కూడా బీజేపీకి ప్రతికూలంగా మారింది. ఇప్పుడు ఓటు హక్కు పోయిందని, తర్వాత రేషన్ కార్డులు, పౌరహక్కులు కూడా పోతాయనే భయం ఓటర్లలో నెలకొందని సర్వేలో తేలింది. టీఎంసీ ప్రవేశపెట్టిన లక్కీ భండార్ పథకంతో మహిళలు మమతా బెనర్జీ వైపు మొగ్గు చూపారు. బీజేపీ జాతీయ వాదంపై మమతా బెనర్జీ బెంగాలీ సెంటిమెంట్ బాగా పనిచేసింది. రాష్ట్రంలో మమతా బెనర్జీకి సరితూగే నేతలు ఏ పార్టీలో లేకపోవడం టీఎంసీకి కలిసివచ్చింది. బీజేపీ నేత సువేందు అధికారి కీలకపాత్ర పోషించినా మమతా బెనర్జీకి సరితూగలేదు. కాంగ్రెస్, వామపక్షాల నుండి ఆమెకు సమానంగా ఏవరూ లేరు. కాగా స్వాతంత్య్రానంతరం బెంగాల్ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే అక్కడ ప్రజలకు సహనం, ఓర్పు ఎక్కువని స్పష్టమవుతోంది. మొదటి దశలో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 25 ఏళ్ల పాటు అధికారం కట్టబెడితే, ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలకు 35 ఏళ్ల పాటు అధికారం కట్టబెట్టారు. ఆ ఒరవడిలోనే టీఎంసీకి నాలుగో దఫా కూడా అధికారం కట్టబెట్టే అవకాశాలున్నాయి. బీజేపీ టీఎంసీకి గట్టి పోటీ ఇచ్చిన క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి పూర్తి స్థాయిలో కార్యకర్తలు, పార్టీ యంత్రాంగం లేకపోవడం ప్రతికూలంగా మారింది. కాగా ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే చాలా సార్లు ఇవి తారుమారైన సందర్బాలున్నాయి. వాస్తవిక ఫలితాలు మే 4న ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. -
బెంగాల్ పోరులో ఒక సెన్సేషన్ కలితా మాఝీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సాధారణ డొమెస్టిక్ వర్కర్ (Domestic Worker) పోటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా ఇళ్లలో పాచిపని చేస్తూ అతి సాధారణ జీవనం సాగిస్తున్న ఆమె, ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.పరిమిత వనరులతో జీవిస్తున్న లక్షలాది మందికి బెంగాల్ ఎన్నికల్లో కలితా మాఝీ ఎంట్రీ స్ఫూర్తివంతంగా నిలుస్తోంది. నేటికీ ఆమె ఇంట్లో టెలివిజన్, రిఫ్రిజిరేటర్, లేదా ఎయిర్ కండిషనింగ్ వంటి కనీస సౌకర్యాలు లేవు. అయినప్పటికీ, ఆమె నిరాడంబరత, అవిశ్రాంత పోరాటం ఆమెకు గుర్తింపును, రాజకీయ రంగంలోకి అడుగుపెట్టే అవకాశాన్ని సంపాదించిపెట్టాయి. ఒకప్పుడు నలుగురి ఇళ్లలో అలసిపోకుండా పాత్రలు కడిగిన అవే చేతులు, ఇప్పుడు బెంగాల్ రాజకీయాల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి, మార్చడానికి సిద్ధంగా ఉన్నాయిపశ్చిమ బెంగాల్లోని ఔస్గ్రామ్ (Ausgram) నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న 37 ఏళ్ల కలితా మాఝీ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పేదరికం నుండి వచ్చి, రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ, క్షేత్రస్థాయి నుండి ఎదిగిన నాయకురాలిగా గుర్తించిన బీజేపీ ఆమె రెండోసారి పోటీలో నిలపడం విశేషం. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె ఇదే స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2026లో కూడా పార్టీ ఆమెపై నమ్మకంతో మళ్ళీ టికెట్ ఇచ్చింది. ఇంటింటి ప్రచారం నిర్వహించి వార్తల్లో నిలిచారు. ఆమెకు భర్త (ప్లంబర్), ఒక కుమారుడు ఉన్నారు.ఆమె పనిచేసే ఇంటి యజమాని ప్రతీలాల్ పాత్ర మాట్లాడుతూ.. "ఆమె మాకు కూతురు లాంటిది. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా ఆమె పనికి వస్తానంది, కానీ మేమే ఆమెను ప్రచారానికి వెళ్లమని పంపించేశాం. ఆమె లేకపోవడంతో ఇంట్లో పనులు చేసుకోవడం మాకు కష్టమవుతోంది, కానీ ఆమె ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నాం" అన్నారు. అంతేకాదు ఆమె ప్రచారంలో తలనమునకలై ఉన్నప్పటికీ, ఆమె యజమానులు ఈ నెల జీతాన్ని కూడా ఇస్తామని హామీ ఇవ్వడం విశేషం.ఇదీ చదవండి: జస్ట్, పెళ్లికి ముందు : వరుడి వింత ప్రశ్న, అతిథులు అవాక్కుఎవరీ కలితా మాఝీఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుండి వచ్చిన కలితా ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తూ, నెలకు సుమారు రూ.4,500 సంపాదిస్తూ జీవనం సాగిస్తున్నారు. కలిత తన నిజాయితీతో, కష్టపడే తత్వంతో తాను పనిచేసే ఇళ్లలో కుటుంబ సభ్యురాలిగా మారిపోయారు. ఇపుడు ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. కలితా కుటుంబ మద్దతు కూడా బాగానే లభిస్తోంది. ఆమె అత్తగారు ఇంటి పనుల్లో సాయం చేస్తుండగా, ఆమె కుమారుడు పార్థ తన తల్లి ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. కలిత బావ కార్తీక్ బాగ్ 2006లో ఇదే నియోజకవర్గం నుండి సీపీఎం ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఆ కుటుంబంతో వీరికి ఎటువంటి సంబంధం లేదు.ఇదీ చదవండి: నో క్రాష్ డైట్, నో షార్ట్కట్ : కేవలం 45 రోజుల్లో 12 కిలోలు"నాలాంటి ఒక సామాన్య మహిళ కూడా ఎమ్మెల్యే కాగలదని నిరూపించాలనుకుంటున్నాను. గెలిచిన తర్వాత నాలాంటి పేద ప్రజల గొంతుకగా అసెంబ్లీలో మాట్లాడతాను" అని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక సాధారణ కార్మికురాలు ప్రజా ప్రతినిధిగా ఎదగాలనుకోవడం ప్రజాస్వామ్యానికి నిదర్శనమని స్థానికులు కొనియాడుతున్నారు. ఆల్ది బెస్ట్ చెబుతున్నారు. కలిత గెలుపు కోసం మే 4 వరకు ఎదురు చూడాల్సిందే. కాగా పశ్చిమ బెంగాల్లో జరిగిన తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో 91.78శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్లో ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంఓలని అధికార టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. దీదీని ఓడించి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రధాని మోదీ, షాలు తీవ్రప్రయత్నాలు చేయగా, నాలుగోసారి సీఎం పదవే తనదేనని దీదీ ధీమాగా ఉన్నారు. మే 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.ఇదీ చదవండి: బంపర్ ఆఫర్ : డేటింగ్ యాప్ వాడితే వారికి డబ్బులు -
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. మమతా బెనర్జీ ఓటమి ఖాయం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానిపూర్ చక్రబేరియా పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్ష నాయకుడు, ఒకప్పుడు ఆమెకు అత్యంత సన్నిహితుడైన సువేందు అధికారి ఒకే పోలింగ్ బూత్ ప్రాంతానికి చేరుకోవడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తమైంది.స్థానిక టీఎంసీ నాయకులను బెదిరిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో మమతా బెనర్జీ పార్టీ కార్యాలయం బయట కూర్చుని ఉండగా.. అదే సమయంలో అక్కడికి చేరుకున్న సువేందు అధికారి ఆమెపై తీవ్ర విమర్శలు చేశారు. తనకి ఒక్క ఓటు పడటం లేదని మమతా బెనర్జీ గ్రహించారు’ అని ఆయన ఆరోపించారు. మరోవైపు మమతా బెనర్జీ, కేంద్ర బలగాలు, పోలీసు పరిశీలకులు, ఎన్నికల అధికారులను ఉపయోగించి బీజేపీ ఎన్నికలను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.ఈ సందర్భంగా సువేందు అధికారి మాట్లాడుతూ.. ‘మమతా బెనర్జీ భయపడుతున్నారు. ఆమె పోలీసుల స్థానంలో కేంద్ర బలగాలను నియమించారు. ఇక్కడ ఈసీ సీఏపీఎఫ్లను మోహరించింది. ఆమెకు ఏమైనా సమస్య ఉంటే వారిని సంప్రదించాలి. కానీ ఆమెతో పాటు 40-50 మందిని ఎందుకు తీసుకువస్తున్నారు?’అని ప్రశ్నించారు.అలాగే, సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నప్పటికీ మమతా యాబై, అరవై మంది గూండాలతో తిరుగుతున్నారు. ఆమె ఒక అభ్యర్థి కాబట్టి బూత్లను సందర్శించవచ్చు. కానీ ఈ గూండాగిరి ఎందుకు? నేను కోల్కతా డీఈఓకు ఫిర్యాదు చేశాను. ఈసారి ఎవరినీ బెదిరింపులకు పాల్పడటానికి అనుమతించబోము’అని అన్నారు. ఆమెకు ఎవరూ ఓటు వేయడం లేదు. ప్రజలను స్వేచ్ఛగా ఓటు వేయనివ్వాలి. నేను భవానిపూర్లో కనీసం 30,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాను’అని సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు.ఇక మమతా బెనర్జీ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల రెండవ, చివరి దశలో 142 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. నేను చెట్లా, పద్మపుకూర్, చక్రబేరియా ప్రాంతాల్లోని బూత్లను సందర్శించాను. బీజేపీ ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ చేయాలని చూస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు సాధారణంగా ప్రశాంతంగా జరుగుతాయి. ఇక్కడ గూండా రాజ్ ఉందా?’అని ప్రశ్నించారు. -
‘ఐదు రాష్ట్రాల్లో బీజేపీదే హ్యాట్రిక్’.. ప్రధాని మోదీ
హర్దోయ్: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ‘హ్యాట్రిక్’ విజయం ఖాయమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలోని హర్దోయ్లో బుధవారం గంగా ఎక్స్ప్రెస్వేను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ వేదికగా బెంగాల్ ఎన్నికల తీరును, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రశంసిస్తూనే, భవిష్యత్ ఎన్నికల ఫలితాలపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.యూపీకి జీవనాడి: గంగా ఎక్స్ప్రెస్వేయూపీలోని హర్దోయ్ వేదికగా మీరట్, ప్రయాగ్రాజ్ నగరాలను కలుపుతూ నిర్మించిన ప్రతిష్టాత్మక గంగా ఎక్స్ప్రెస్వేను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ అత్యాధునిక రహదారి గంగామాత ఆశీర్వాదమని, రెండు నగరాల మధ్య ప్రయాణాన్ని అత్యంత సులభతరం చేస్తుందని అన్నారు. కేవలం రవాణాకే పరిమితం కాకుండా, ఈ బృహత్తర ప్రాజెక్టు యావత్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికే ఒక జీవనాడి (లైఫ్లైన్) లాంటిదని మోదీ అభివర్ణించారు. VIDEO | Hardoi, Uttar Pradesh: PM Modi inaugurates 594-km-long Ganga Expressway connecting Meerut to Prayagraj.(Source: Third Party)(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/LgDE2YNc3G— Press Trust of India (@PTI_News) April 29, 2026ఏడు దశాబ్దాల్లో తొలిసారి.. భయం లేని బెంగాల్పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న రెండో విడత ఎన్నికల పోలింగ్పై మోదీ హర్షం వ్యక్తం చేశారు. గత ఆరేడు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని విధంగా, ఎలాంటి భయం లేని వాతావరణంలో బెంగాల్ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం దేశ ప్రజాస్వామ్య బలానికి నిదర్శనమన్నారు. సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న పొడవైన క్యూ లైన్లే ఇందుకు సాక్ష్యమని అన్నారు. మొదటి దశ తరహాలోనే పోలింగ్ ముగిసేవరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని ఆయన బెంగాల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. VIDEO | Hardoi, Uttar Pradesh: PM Modi (@narendramodi) inaugurates Ganga Expressway. The 594-km-long Ganga Expressway, a mega infrastructure project connects Meerut to Prayagraj.The high-speed corridor is expected to significantly boost connectivity across Uttar Pradesh, while… pic.twitter.com/AaqjWKOStO— Press Trust of India (@PTI_News) April 29, 2026మే 4న సంచలనం.. 5 రాష్ట్రాల్లో బీజేపీదే హ్యాట్రిక్ఇటీవలే ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన అద్భుత విజయాలను ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇదే జోరుతో రాబోయే మే 4వ తేదీన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాషాయ పార్టీ ఘనవిజయం సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలు అభివృద్ధి వైపే నిలుస్తున్నారని మోదీ పేర్కొన్నారు. -
ఈసీకి మహువా మోయిత్రా షాక్: బైక్ వద్దన్నారని..
నాడియా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండవ విడత పోలింగ్ నేడు (బుధవారం) తీవ్ర ఉత్కంఠ నడుమ ప్రారంభమైంది. ఇది కేవలం ఎన్నికల సమరం మాత్రమే కాదని, ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే పోరాటం’ అని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ఎంపీ మహువా మోయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడియా జిల్లాలోని కరీంపూర్ గర్ల్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 120లో బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్న ఆమె.. ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. #WATCH | West Bengal Assembly Elections 2026: On arriving in an e-rickshaw to cast her vote, TMC MP Mahua Moitra says, "Because the ECI has said that not to come by motorbike. So we have come by TOTO.""This time, we are engaged in the fight to save democracy. 2.7 million voters… https://t.co/JlRbauNv4V pic.twitter.com/NGo9jH83Ph— ANI (@ANI) April 29, 2026‘టోటో’లో వచ్చి ఓటేసిన ఎంపీఎన్నికల సంఘం నిబంధనలకు వినూత్న రీతిలో సమాధానమిచ్చారు మహువా మోయిత్రా. పోలింగ్ కేంద్రాల వద్దకు మోటార్బైక్లపై రాకూడదని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో, ఆమె ఏకంగా ఓ ‘టోటో’ (ఈ-రిక్షా)లో వచ్చి ఓటు వేశారు. నిబంధనలను పాటిస్తూనే, తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడానికి ఎలాంటి ఆటంకాలు అడ్డురావని ఈ చర్య ద్వారా తెలియజేశారు.27 లక్షల ఓట్ల గల్లంతుపై ప్రతీకారంకేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీరుపై మహువా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 2.7 మిలియన్ల (27 లక్షల) మంది ఓటర్లను జాబితా నుంచి అక్రమంగా తొలగించారని ఆమె ఆరోపించారు. అయితే, మిగిలిన ఓటర్లు కచ్చితంగా వంద శాతం ఓటింగ్లో పాల్గొంటారని, అందుకే ఈసారి పోలింగ్ శాతం భారీగా నమోదు కావడం ఖాయమని అన్నారు. ఇది సాధారణ లెక్క అని, కేంద్రం, ఈసీ ఆడిన ఈ నాటకానికి బదులు తీర్చుకోవడానికే ప్రజలు కసితో ఓటు వేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: మేఘాలయ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! -
ఎగ్జిట్ పోల్స్ నిజమేనా? ‘ఈసీఐ’ ఏమంటోంది?
న్యూఢిల్లీ: ఎన్నికల పోలింగ్ ముగియగానే అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్పైనే పడుతుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల హోరు ముగింపు దశకు చేరుకోవడంతో, ఈరోజు (ఏప్రిల్ 29) సాయంత్రం 6:30 గంటల తర్వాత వెలువడే ఈ సర్వే ఫలితాల కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇంతకీ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించే ఈ ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి? ఇవి ఏ మేరకు వాస్తవాలను ప్రతిబింబిస్తాయి?సర్వేల వెనుక..ఎగ్జిట్ పోల్స్ (పోస్ట్-పోల్ సర్వేలు) అంటే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత.. వారి నుంచి పోలింగ్ కేంద్రం బయట తీసుకునే అభిప్రాయ సేకరణ.. దీనికోసం సర్వే సంస్థలు వయసు, కులం, లింగం, గ్రామీణ-పట్టణ నేపథ్యం వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని, శాస్త్రీయ పద్ధతిలో ఓటర్లను ఎంపిక చేస్తాయి. ఓటర్లు ఎవరికి ఓటేశారు అనేది నిర్దిష్ట ప్రశ్నల ద్వారా అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆ డేటాను గణాంక నమూనాలతో విశ్లేషించి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఒక ప్రాథమిక అంచనాకు వస్తారు.చట్టం ఏం చెబుతోంది? జైలు శిక్ష తప్పదా?ఈ ఎగ్జిట్ పోల్స్పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ)కఠిన నిబంధనలు అమలు చేస్తున్నది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 126ఏ ప్రకారం, పోలింగ్ జరిగే సమయంలో వీటిని ప్రసారం చేయడం, ప్రచురించడం చట్టరీత్యా నేరం. 2026 ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 9 ఉదయం 7 గంటల నుండి ఏప్రిల్ 29 సాయంత్రం 6:30 వరకు ఎగ్జిట్ పోల్స్పై కఠిన నిషేధం అమలులో ఉంది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంది.ఎగ్జిట్ పోల్స్ 100 శాతం పక్కానా?ఈ సర్వేలు ఎన్నికల సరళిని, ఓటర్ల నాడిని ముందుగానే పసిగట్టేందుకు ఒక అంచనా సాధనంగా ఉపయోగపడతాయి. అయితే ఇవి ఎల్లప్పుడూ కచ్చితమైనవి కావు. గత ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, పలుమార్లు ఎగ్జిట్ పోల్ అంచనాలు తుది ఫలితాలకు పూర్తి భిన్నంగా వచ్చాయి. శాంప్లింగ్ లోపాలు, ఓటర్లు తమ అసలు ఎంపికను చెప్పడానికి ఇష్టపడకపోవడం, చివరి నిమిషంలో ఓటర్ల నిర్ణయాలు మారడం వంటివి ఇందుకు కారణం. ఇవి కేవలం ముందస్తు అంచనాలు మాత్రమేనని, ఎన్నికల సంఘం ప్రకటించేవే అంతిమ, అధికారిక ఫలితాలని గ్రహించాలి.ఇది కూడా చదవండి: Kerala: ముస్లిం లీగ్ ‘మాస్టర్ ప్లాన్’.. అదిరిపోయే టార్గెట్? -
Kerala: ముస్లిం లీగ్ ‘మాస్టర్ ప్లాన్’.. అదిరిపోయే టార్గెట్?
మే 4న కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో రెండు కీలక ప్రశ్నలు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవేళ యూడీఎఫ్ (యూడీఎప్) కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? నాలుగు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ముస్లిం లీగ్ పార్టీ మళ్లీ ఉప ముఖ్యమంత్రి (డిప్యూటీ సీఎం) పదవిని దక్కించుకుంటుందా? ప్రస్తుతం ముస్లిం లీగ్ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు కేరళ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారాయి.ముస్లిం లీగ్ వ్యూహాత్మక మౌనంఎన్నికలకు ముందే ముస్లిం లీగ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే చర్చ మీడియా, రాజకీయ పరిశీలకుల మధ్య తీవ్రంగా జరిగింది. అయితే బహిరంగంగా ఈ డిమాండ్ చేయకుండా పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగులేస్తోంది. తాము అధికారికంగా ఎలాంటి డిమాండ్ చేయలేదని పార్టీ సీనియర్ నేత పీకే కున్హాలికుట్టి స్పష్టం చేశారు.‘అడగరు కానీ.. ఇస్తే కాదనరు’ప్రస్తుతం ముస్లిం లీగ్ నాయకత్వం అవలంబిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వారు బహిరంగంగా డిప్యూటీ సీఎం కుర్చీని డిమాండ్ చేస్తూ మిత్రపక్షాలను ఇబ్బంది పెట్టకపోయినా, ఒకవేళ ఆ పదవిని ఆఫర్ చేస్తే మాత్రం సంతోషంగా స్వీకరించేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా కూటమిలో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవాలని లీగ్ భావిస్తోంది.కున్హాలికుట్టికి దక్కేనా ఆ అరుదైన గౌరవం?యూడీఎఫ్ కూటమికి ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న పీకే కున్హాలికుట్టికి, ఆయన సేవలకు గుర్తింపుగా డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టాలని కొందరు సీనియర్ నేతలు వాదిస్తున్నారు. అయినప్పటికీ, గతంలో తలెత్తిన ‘ఐదవ మంత్రి’ వివాదం లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, కూటమిలో ఎలాంటి అంతర్గత విభేదాలు రాకుండా పార్టీ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.కేరళ రాజకీయ చరిత్రలో డిప్యూటీ సీఎంల ప్రస్థానంకేరళ రాష్ట్ర రాజకీయ చరిత్రను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే, ఇప్పటివరకు కేవలం ముగ్గురు నేతలు మాత్రమే ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు. విశేషమేమిటంటే అందులో ఇద్దరు ముస్లిం లీగ్కు చెందినవారే కావడం గమనార్హం. రాష్ట్రంలో చివరిసారిగా ఒక నాయకుడు డిప్యూటీ సీఎం పదవిని చేపట్టి దాదాపు 39 ఏళ్లు గడిచిపోయింది. ఇప్పుడు ఆ పాత చరిత్ర మళ్లీ ప్రాణం పోసుకోనుందా అనే చర్చ జరుగుతోంది.తొలి ఉప ముఖ్యమంత్రులురాష్ట్ర మొట్టమొదటి డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్ నేత ఆర్ శంకర్ (ఫిబ్రవరి 22, 1960 - సెప్టెంబర్ 26, 1962) పట్టమ్ థాను పిళ్లై మంత్రివర్గంలో పనిచేశారు. ఆ తర్వాత ముస్లిం లీగ్ (IUML) నేత సీహెచ్ మహమ్మద్ కోయా, కే కరుణాకరన్ రెండవ, మూడవ మంత్రివర్గాల్లో రెండుసార్లు (1981-1982, 1982-1983) ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన తన తుదిశ్వాస వరకు డిప్యూటీ సీఎంగానే కొనసాగారు.సుదీర్ఘకాలం పనిచేసిన కే అవకదర్ కుట్టి నహాసీహెచ్ మహమ్మద్ కోయా మరణానంతరం, కే కరుణాకరన్ మూడవ మంత్రివర్గంలో ముస్లిం లీగ్కే చెందిన కే అవకదర్ కుట్టి నహా (అక్టోబర్ 24, 1983 - మార్చి 25, 1987) డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కేరళ చరిత్రలో అత్యధిక కాలం (మూడేళ్ల 152 రోజులు) ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అరుదైన రికార్డు ఆయన పేరిటే ఉంది. ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడే అవకాశం కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: బెంగాల్కు యూపీ ‘సింగం’.. ఊర మాస్ వార్నింగ్! -
బెంగాల్ను ఏలేదెవరు? కూలేదెవరు?
ఉత్తర బెంగాల్లో రికార్డు స్థాయి ఓటింగ్తో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికలు, ఇవాళ దక్షిణ బెంగాల్లో రెండో విడతతో మరింత ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. 142 నియోజకవర్గాల్లో 3 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ విడతలో భవానీపూర్ పోరు ప్రత్యేక ఆకర్షణ. మమతా బెనర్జీ (TMC) మరియు సువేందు అధికారి (BJP) మధ్య జరుగుతున్న ఈ పోటీ కేవలం ఒక నియోజకవర్గం పోరాటం కాదు. అది బెంగాల్ భవిష్యత్తు దిశను నిర్ణయించే ప్రతీకాత్మక యుద్ధంగా మారింది.సంక్షేమం Vs పరివర్తనం..ఇదే ఈ విడతలో ప్రధాన నినాదం. మమతా బెనర్జీ సంక్షేమ పథకాలతో గ్రామీణ మహిళల మద్దతు పొందుతుండగా బీజేపీ “మార్పు” వాగ్దానంతో ముందుకు వస్తోంది. మరోవైపు సర్ సమస్య (ఓటర్ల పేర్లు తొలగింపు) ప్రజల్లో ఆందోళన కలిగించి, అధిక ఓటర్ల హాజరుకు దారితీస్తోంది. కోల్కతా, హౌరా, హుగ్లీ, నాదియా, బర్దమాన్ జిల్లాల్లో కీలక పోటీలు జరుగుతున్నాయి. టీఎంసీ మంత్రులు తమ స్థానాలను కాపాడుకోవడానికి పోటీ పడుతుండగా బీజేపీ ఈ ప్రాంతాల్లో తన ప్రభావాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది.ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. 41,000కి పైగా పోలింగ్ కేంద్రాల్లో CAPF బలగాలు మోహరించబడ్డాయి. సున్నితమైన బూత్లలో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ జరుగుతోంది. తొలి విడతలో 93% పైగా ఓటింగ్ నమోదైన నేపథ్యంలో, రెండో విడతలో కూడా అధిక హాజరు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు మౌనంగా ఉన్నా, వారి ఓటు నిర్ణయం ఈ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనుంది. మొత్తంగా, ఇవాళ జరుగుతున్న రెండో విడత పోలింగ్, బెంగాల్ ఎన్నికల తుది ఫలితాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. “ఏలేదెవరు? కూలెదెవరు?” అన్న ప్రశ్నకు సమాధానం దిశగా ప్రజాస్వామ్య యాత్ర కొనసాగుతోంది. -
బెంగాల్ పోలింగ్: ఐదు గంటలకే 90 శాతం దాటిన పోలింగ్
పశ్చిమ బెంగాల్ రెండో దశ ఎన్నికల్లో భాగంగా కీలకమైన 142 నియోజకవర్గాల్లో నేడు జరగబోయే పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. -
మలి యుద్ధం నేడే
కోల్కతా: దశాబ్దన్నరకాలంగా పశ్చిమబెంగాల్ రాజకీయాలను శాసిస్తూ అధికారపీఠంపై కూర్చున్న మమతా బెనర్జీని గద్దె దించే లక్ష్యంతో కమలనాథులు చేసిన విస్తృతప్రచారం, ప్రజాకర్షక పథకాలతో బెంగాళీలను మెప్పించానని చెబుతూ ప్రచారంచేసిన దీదీ మాటలు ఓట్లరూపంలో ఏమేరకు సఫలీకృతమవుతుందనేది నేటితో తేలిపోనుంది. రెండో దశ ఎన్నికల్లో భాగంగా కీలకమైన 142 నియోజకవర్గాల్లో నేడు జరగబోయే పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఏప్రిల్ 23వ తేదీన జరిగిన తొలిదఫా పోలింగ్లో భారీ ఓటింగ్ నమోదుకావడంతో ఇది ప్రభుత్వవ్యతిరేక సరళి అని ఢంకా భజాయించిన బీజేపీ నేతలు అదేఊపుతో దక్షిణ ప్రాంత జిల్లాల్లోనూ విస్తృత ప్రచారంచేశారు.అయితే అధికార తృణమూల్ కాంగ్రెస్కు కంచుకోటలైన కోల్కతా, హౌరా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, నదియా, హుగ్లీ, పూర్బా బర్ధమాన్ జిల్లాల్లో బీజేపీ ఆధిపత్యం సాధించాల్సి ఉంది. నేడు పోలింగ్ జరగనున్న 142 స్థానాల్లో గతంలో టీఎంసీ హవా కొనసాగింది. 2021 శాసనసభ ఎన్నికల్లో ఈ 142లో 123 చోట్ల టీఎంసీ గెలవగా 18 చోట్ల బీజేపీ, ఒక స్థానంలో ఐఎస్ఎఫ్ గెలిచాయి. గత ఐదేళ్లుగా ఈ 142 స్థానాల్లో బీజేపీ క్షేత్రస్థాయిలో బాగా వేళ్లూనుకుంది. అయినాసరే ఈసారి కూడా ఉత్తర 24 పరగణాలు(33 సీట్లు), దక్షిణ 24 పరగణాలు(31 సీట్లు), హౌరా(16), నదియా(17), హుగ్లీ(18), పూర్బా బర్ధమాన్(16), కోల్కతా(11 సీట్లు) ఈదఫా ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారాయి.నేడు జరగబోయే ఎన్నికల్లో మొత్తంగా 3,21,73,837 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,64,35,627 మంది పురుషులుకాగా 1,57,37,418 మంది స్త్రీలు, 792 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. మొత్తంగా 41,001 పోలింగ్స్టేషన్లలో పోలింగ్ జరగనుంది. 142 మంది సాధారణ పర్యవేక్షకులు, 95 మంది పోలీస్ పర్యవేక్షకులు, 100 మంది ప్రత్యేక పర్యవేక్షకులు పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తారు. బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చిన మథువా హిందూ శరణార్థులు, పౌరసత్వ సవరణ చట్టం, ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీ క్షేత్రస్థాయిలో బలపడటం వంటివి బీజేపీకి ఈదఫా సానుకూల అంశాలుగా కన్పిస్తున్నాయి. పదేళ్లు పాలించిన 2021లో మమతను మళ్లీ బెంగాళీలు గెలిపించడం తమ పార్టీకి ఇంకా అత్యంత ప్రజాదరణ ఉందని టీఎంసీ ప్రకటించింది. అదేఊపుతో నాలుగోసారి నెగ్గుకురాగలమనే ధీమా పార్టీలో ఎక్కువైంది. అయితే కట్ మనీ, బొగ్గు కుంభకోణం, పథకాల్లో అవినీతి, టీఎంసీ గూండాయిజం, మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి ముస్లింల చొరబాట్లు, ఖాళీ ప్రాంతాల ఆక్రమణల అంశాలు ఈసారి టీఎంసీకి వ్యతిరేకతను పెంచేలా కన్పిస్తున్నాయి. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితరులు కీలక జిల్లాల్లో చాలా ప్రచారసభల్లో పాల్గొని భారీ స్థాయిలో హామీల వర్షం కురిపించారు. మమతా బెనర్జీ సైతం టీఎంసీ తరఫున సుడిగాలి పర్యటనలు చేసి మరోమారు తన పార్టీని ఆశీర్వదించాలని ఓటరు మహాశయులను వేడుకున్నారు. ఎక్కడా అవాంఛనీయఘటనలు, ఘర్షణలు చోటుచేసుకోకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నడూలేనంతటి భారీ సంఖ్యలో కేంద్రరిజర్వ్ బలగాలను పోలింగ్ జరిగే ప్రాంతాల్లో మోహరించింది.తొలి దశ ఎన్నికల్లో 93.19 శాతం పోలింగ్ నమోదవడంతో రెండోది, చివరిదైన ఈ దఫాలో ఎంతటి పోలింగ్ నమోదవుతుందనేది ఆసక్తికరంగా మారింది. కంచుకోట భవానీపూర్ నుంచి మమతాబెనర్జీ పోటీపడుతున్నారు. ఆమెకు పోటీగా బీజేపీ అగ్రనేత సువేంధు అధికారి నిలబడ్డారు. బెంగాళీలు, గుజరాతీలు, మార్వాడీలు, జైనులు, సిక్కులు, ముస్లింలు, బిహార్, జార్ఖండ్ శరణార్థులతో నిండిన భవానీపూర్ నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ మరింత ఎక్కువైంది. -
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయా?
సాక్షి,న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచనుందనే ప్రచారం జోరందకుంది. అయితే, ఆ ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఇంధన ధరల్ని పెంచడం లేదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరుగుతున్నా, ఇంధన రిటైలర్లు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నా ప్రజల మీద భారం వేయకుండా ధరలను స్థిరంగా ఉంచుతామని తెలిపింది.ఈ మేరకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే ఊహాగానాలు కొన్ని రాష్ట్రాల్లో కలకలం రేపాయి. దీనివల్ల అవసరానికి మించి ఇంధన కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇంధన ధరల పెంపుదలపై వస్తున్నవన్నీ ఊహాగానాలే. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రతిపాదన లేదు. వదంతులను నమ్మొద్దు. దేశంలో తగినంత పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ నిల్వలు ఉన్నాయి. ధరలు స్థిరంగా ఉన్నాయి, రేట్లలో ఎలాంటి పెరుగుదల ఉండదు’అని స్పష్టం చేశారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు కారణంగా చమురు ధరలు పెరుగుతున్నా.. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల్ని స్థిరంగా ఉంచింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వరంగ చమురు సంస్థలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు ఇంధనాన్ని విక్రయించడం వల్ల భారీ నష్టాల్ని చవిచూస్తున్నాయి. ఫలితంగా పెట్రోల్పై లీటరుకు రూ. 20 వరకు, డీజిల్పై లీటరుకు దాదాపు రూ.100 వరకు నష్టాలు వస్తున్నాయి. రోజువారీ నష్టాలు సుమారు రూ.2,400 కోట్ల వరకు చేరుతున్నాయని కొద్దిరోజుల క్రితం సుజాత శర్మ తెలిపారు. పెరిగిన చమురు ధరలు గత రెండు నెలల్లో అంతర్జాతీయ ముడి చమురు ధరలు 50 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో ఈ పెరుగుదల మరింత తీవ్రంగా మారింది. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభించాయి. ప్రతీకారంగా ఇరాన్ హర్మూజ్జలసంధిని మూసివేసింది. ఫలితంగా గల్ఫ్ దేశాలనుంచి రవాణా అయ్యే చమురు నౌకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత సంవత్సరం బ్యారెల్కు సుమారు 70 డాలర్లుగా ఉన్న ముడి చమురు ధర, ఈ నెలలో సగటున 114 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినా, భారత్లో రిటైల్ ఇంధన ధరలు ఏప్రిల్ 2022 నుండి ఇప్పటివరకు మారలేదు. -
ఎవరీ యాక్షన్ ఓరియెంటెడ్ సింగం.. !
అజయ్ పాల్ శర్మ.. ఆయనొక ఐపీఎస్ అధికారి. 2011 ఐపీఎస్ బ్యాచ్ యూపీ క్యాడర్కి చెందిన అధికారి. ఇప్పుడు మరొకసారి వార్తల్లోకి వచ్చారు. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ పోలీస్ అబ్జర్వర్గా నియమితులైన అజయ్ పాల్ శర్మను యాక్షన్ ఓరియెంటెడ్ ఐపీఎస్ అధికారిగా చెప్పుకోవచ్చు. తాజాగా పశ్చిమ బెంగాల్లో అధికార టీఎంసీ అభ్యర్థికి ఐపీఎస్ అజయ్ పాల్ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇప్పుడు బెంగాల్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. తాను ఎక్కడైనా ఒక్కటేనని, అది యూపీ అయినా, పశ్చిమ బెంగాల్ అయినా యాక్షన్ ఓరియెంటేషన్ ఉంటుందనే విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ఫలితంగా మరోసారి హాట్ టాపిక్గా మారారు అజయ్ పాల్ శర్మ. యూపీ సింగంగా, ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా ఆయన ప్రజలకు సుపరిచితం. ఇంతకీ ఈ అజయ్ పాల్ శర్మ ఎవరు? ఏమిటా కథ అనే దానిపై ఓ లుక్కేద్దాం. అజయ్ పాల్ శర్మకు ముందు డాక్టర్ అనే బిరుదు కూడా ఉంది. 1985లో పంజాబ్ రాష్ట్రంలోని లూధియానాలో జన్మించిన ఈ ‘సింగం’.. ముందు డెంటల్ సర్జన్. తొలుత ప్రజలకు పళ్లు ట్రీట్మెంట్ చేసిన అజయ్ పాల్.. ఆ తర్వాత 2008లొ సివిల్ సర్వీస్ కోసం సిద్ధం కాగా, 2011లో ఐపీఎస్ అయ్యారు. ఆపై 2013 నుంచి తనలో ఉన్న అసలు సిసలైన సింగంను చూపించసాగాడు. జౌన్పూర్, షామ్లీ, రాంపూర్, హత్రాస్, నోయిడా వంటి జిల్లాల్లో ఎస్పీ, ఎస్ఎస్పీగా పనిచేసిన అజయ్ పాల్.. ప్రస్తుతం ప్రయాగరాజ్లో అదనపు పోలీస్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) గా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఓవరాల్గా 500కిపైగా ఎన్కౌంటర్లలో పాల్గొన్న సింగం అజయ్ పాల్.. 22 నెలల కాలంలో జౌన్పూర్లో 136 ఎన్కౌంటర్లు చేసి రికార్డు సృష్టించారు. ప్రధానంగా అక్రమార్కులు, గ్యాంగ్స్టర్లు, దొంగలు, దాడులు చేసే గ్యాంగ్లు, కిడ్నాప్ కేసుల్లో ఉన్నవారు, మాఫియా గ్యాంగ్ తదితర ఎన్కౌంటర్లలో పాల్గొన్నారు. ఆయన పని చేసిన జిల్లాల్లో (జౌన్పూర్, షామ్లీ, రాంపూర్, నోయిడా మొదలైనవి) స్థానిక క్రిమినల్ గ్యాంగ్లను అణచివేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇంటెలిజెన్స్ ఆధారంగా, ఎదురుకాల్పులలో నేరస్థులను అణచివేయడంలో దిట్ట. కఠినమైన పోలీసింగ్ శైలితో ఆయనకు ‘యూపీ సింగం’ అనే పేరు వచ్చింది. డీజీ కమండేషన్ డిస్క్ (సిల్వర్ – 2017), డీజీ కమండేషన్ డిస్క్ (గోల్డ్ – 2025) ఈ రెండు పురస్కారాలు అజయ్ పాల్ గెలుచుకున్నారు. ఇవి ఉత్తరప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఇచ్చే ప్రత్యేక గుర్తింపు. అత్యుత్తమ సేవలు, ధైర్యం, నేర నియంత్రణలో విశేష కృషి చేసిన అధికారులకు ఈ అవార్డు లు ఇస్తారు. పోలీస్ విభాగంలో తన ప్రత్యేకమైన సేవతో తొలుత సిల్వర్ డిస్క్ సాధించిన అజయ్ పాల్.. ఆపై తన అత్యున్నత స్థాయి కృషితో గోల్డ్ డిస్క్ను తన ఖాతాలో వేసుకున్నారు.బెంగాల్కు యూపీ ‘సింగం’.. ఊర మాస్ వార్నింగ్! -
టీ కొట్టు మూయించిన ‘చాయ్వాలా’.. మహువా సెటైర్లు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకున్న వేళ.. కోల్కతాలో ఓ ఆసక్తికరమైన రాజకీయ వివాదం రేగింది. అదే ప్రముఖ ‘బల్వంత్ సింగ్ చాయ్’ దుకాణం మూసివేత.. ఈ నేపద్యంలో ఇప్పుడు ‘చాయ్వాలా’ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పోరుగా మారి రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.మహువా మొయిత్రా ఘాటు విమర్శలుకోల్కతాలో ఏప్రిల్ 29న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో, స్థానికంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ‘బల్వంత్ సింగ్ చాయ్’ దుకాణాన్ని రెండు రోజుల పాటు మూసివేశారు. దీనిపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీని పరోక్షంగా లక్ష్యంగా చేసుకుంటూ, ‘చాయ్వాలా మనల్ని బల్వంత్ సింగ్ చాయ్ తాగకుండా ఆపినప్పుడే ఒక విషయం స్పష్టమైంది... కోల్కతాలోని ప్రతి సీటులోనూ బీజేపీ ఓడిపోవడం ఖాయం’ అని ఆమె ఘాటుగా విమర్శించారు. When the Chaiwalla stops us drinking Balwant Singh’s Chai, one thing is sure - BJP losing each & every seat in Kolkata. pic.twitter.com/x2zhms8RO6— Mahua Moitra (@MahuaMoitra) April 28, 2026మహువా పంచుకున్న ఒక స్క్రీన్షాట్ ప్రకారం.. భవానీపూర్ ప్రాంతంలో ఉన్న ఈ టీ స్టాల్ పోలింగ్ బూత్లకు 100 మీటర్ల లోపు ఉండటంతో అధికారులు సెక్షన్ 144 విధించారు. దీనివల్ల బల్వంత్ సింగ్ ధాబా, వారి చాయ్ అండ్ సమోసా కంపెనీలు ఏప్రిల్ 28, 29 తేదీల్లో వినియోగదారులకు నేరుగా సేవలు అందించవు. కేవలం ఆన్లైన్ డెలివరీ ద్వారా మాత్రమే ఈ రెండ్రోజులు తమ వ్యాపారాన్ని కొనసాగించనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఉదయం పూట ఎంతో రద్దీగా ఉండే ఈ ప్రదేశం ఇప్పుడు నిబంధనల వల్ల నిర్మానుష్యంగా మారింది.భవానీపూర్లో భీకర పోరుకోల్కతా నడిబొడ్డున ఉన్న భవానీపూర్ నియోజకవర్గం ఇప్పుడు రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేపీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి (నందిగ్రామ్లోనూ పోటీ చేస్తున్నారు) మధ్య తీవ్ర పోటీ నెలకొంది. భవానీపూర్తో పాటు మరో 141 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఏప్రిల్ 23న 152 స్థానాలకు ఎన్నికలు పూర్తి కాగా, మే 4న తుది ఫలితాలు వెలువడనున్నాయి.ఇది కూడా చదవండి: గ్రౌండ్లో ప్రధాని మోదీ ‘కిక్’.. గ్యాంగ్టక్ షేక్! -
బెంగాల్కు యూపీ ‘సింగం’.. ఊర మాస్ వార్నింగ్!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న యూపీకి చెందిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, పోలీస్ అబ్జర్వర్ అజయ్ పాల్ శర్మ.. అధికార టీఎంసీ అభ్యర్థికి ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇప్పుడు బెంగాల్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.ఆకతాయి పనులొద్దుఫల్టా నియోజకవర్గంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థి జహంగీర్ ఖాన్ అనుచరులు.. ఓటర్లను బెదిరిస్తున్నారంటూ స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో అజయ్ పాల్ శర్మ స్వయంగా రంగంలోకి దిగారు. జహంగీర్ నివాసానికి చేరుకున్న ఆయన, అక్కడ అభ్యర్థి లేకపోవడంతో కుటుంబ సభ్యులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ‘జహంగీర్కు స్పష్టంగా చెప్పండి.. ప్రజలను బెదిరించినట్లు మళ్లీ ఫిర్యాదులు వస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి.. ఎవరైనా తప్పుడు పనులకు పాల్పడినా, ఓటర్లను వేధించినా వదిలే ప్రసక్తే లేదు’ అని ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం.భద్రతపై అనుమానాలు.. ఎస్పీకి నోటీసులుజహంగీర్ ఖాన్ నివాసం వద్ద మోహరించిన భద్రతా సిబ్బంది వివరాలను కూడా శర్మ ఆరా తీశారు. అక్కడ 14 మంది పశ్చిమ బెంగాల్ పోలీసులు ఉండటాన్ని గమనించిన ఆయన స్థానిక ఎస్పీ నుంచి వివరాలు కోరారు. అయితే, జహంగీర్కు ఉన్న వై-కేటగిరీ భద్రత కింద కేవలం 10 మంది సిబ్బందిని మాత్రమే కేటాయించినట్లు ఎస్పీ తెలిపారు. దీంతో మంజూరైన దానికంటే అదనంగా నలుగురు పోలీసులను ఎందుకు మోహరించారనే దానిపై వివరణ కోరుతూ శర్మ నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.భగ్గుమన్న టీఎంసీఈ సంఘటనతో బెంగాల్లో తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. శర్మ చర్యలను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్వాగతిస్తూ.. ‘బెదిరింపుల శకం ముగిసింది, చట్టం తనపని తాను చేసుకుపోతుంది’ అని అన్నారు. మరోవైపు టీఎంసీ తీవ్రస్థాయిలో మండిపడింది. వివాదాస్పద ఎన్కౌంటర్లతో పేరుగాంచిన అధికారిని ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ నియమించిందని, ఆయన నిష్పాక్షికతపై అనుమానాలున్నాయని విమర్శించింది.ఇది కూడా చదవండి: Indonesia: ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి -
కమలానికి ‘వంద’ కష్టాలు: షా వ్యూహం రివర్స్?
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంటున్న తరుణంలో రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన ప్రశ్న చక్కర్లు కొడుతోంది. 2021లో 77 సీట్లు సాధించిన బీజేపీ, ఈసారి కనీసం 100 సీట్ల మార్కును కూడా దాటలేకపోతే ఆ పార్టీ పరిస్థితి ఏమిటి? బెంగాల్ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక ఘట్టంలో ఓటర్ల జాబితా సవరణ (SIR) పేరిట జరిగిన వ్యూహాలు, నాయకత్వ లేమి బీజేపీకి అడ్డంకిగా మారనున్నాయని విశ్లేషకులు అంటున్నారు.చరిత్ర చెప్పిన చేదు నిజంబెంగాల్ రాజకీయ చరిత్రను నిశితంగా గమనిస్తే, ఏ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా ఇంతవరకు 100 సీట్ల మార్కును దాటలేకపోయింది. అధికార పార్టీకి ఎప్పుడూ అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీ దక్కుతూ వస్తోంది. అంతేకాకుండా 1977 నుంచి జరిగిన పరిణామాలను పరిశీలిస్తే, అధికార పార్టీలను ఏ ఒక్క పార్టీ ఒంటరిగా గద్దె దించలేదు. 1977లో కాంగ్రెస్ను లెఫ్ట్ ఫ్రంట్ ఓడించగా, 34 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనను తృణమూల్-కాంగ్రెస్ కూటమి అంతం చేయడం ఈ చారిత్రక వాస్తవాలకు నిదర్శనం.లోక్సభ ఫలితాలే అసెంబ్లీకి పునాదిబెంగాల్లో మరో విచిత్రమైన రాజకీయ సంప్రదాయం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన ప్రతిపక్ష కూటములు, అంతకు ముందు జరిగిన లోక్సభ ఎన్నికల్లో అగ్రస్థానంలో నిలిచాయి. 1977లో కమ్యూనిస్టులు, 2009లో తృణమూల్ కాంగ్రెస్ కూటమి లోక్సభలో సత్తా చాటిన తర్వాతే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాయి. కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వమే ప్రజల రోజువారీ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపుతుందనేది ఇక్కడి ఓటర్ల నమ్మకం. కానీ బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ (29 సీట్లు) చేతిలో ఓడిపోయి కేవలం 12 సీట్లకే పరిమితమైంది. ఈ ఫలితం కమలనాథులకు ఒక అతిపెద్ద ప్రతికూలాంశం.ఓటర్ల జాబితా సవరణ.. ఒక వ్యూహాత్మక అస్త్రం?పదేళ్ల పాటు మతపరమైన ధ్రువీకరణ, తృణమూల్ నేతలపై అవినీతి ఆరోపణలు చేసినప్పటికీ బీజేపీ ఆశించిన స్థాయిలో హిందూ ఓట్లను ఆకర్షించలేకపోయింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఉన్న 48 శాతం ఓటు బ్యాంకును దెబ్బతీయడానికే ఎన్నికల సంఘం ద్వారా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) అనే భారీ ప్రక్రియను బీజేపీ తెరపైకి తెచ్చిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మమతకు మద్దతుగా నిలిచే ముస్లింలు, మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రక్రియను ప్రయోగించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.బలమైన స్థానిక నాయకత్వ లేమిబెంగాల్లో బీజేపీ ఓటు బ్యాంకు విస్తరణకు ప్రధాన ఆటంకం ప్రజాకర్షణ కలిగిన బలమైన స్థానిక నాయకుడు లేకపోవడం. జ్యోతి బసు రెండు దశాబ్దాల పోరాటం తర్వాత సీఎం కాగా, మమతా బెనర్జీ కూడా 90ల నుంచి విపక్షంలో ఉంటూ, సుదీర్ఘ పోరాటం చేసి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ప్రస్తుతం బీజేపీ ప్రధాన ముఖచిత్రంగా ఉన్న సువేందు అధికారి, 2020 వరకు మమత వెంటే ఉండి పార్టీ మారిన నాయకుడు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలిగే స్థాయిలో ఆయనకు ప్రజాదరణ లేకపోవడం బీజేపీకి అతిపెద్ద లోపం.వామపక్ష, కాంగ్రెస్ ఓటర్ల వలసలు2011లో కేవలం 4 శాతంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు, 2021 నాటికి 38 శాతానికి పెరగడం వెనుక వామపక్ష, కాంగ్రెస్ ఓటర్ల వలసలే ప్రధాన కారణం. 2018 నాటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తృణమూల్ సృష్టించిన తీవ్ర హింస (34.2% సీట్లు ఏకగ్రీవం) నుండి రక్షణ పొందేందుకు ఆ ఓటర్లు బీజేపీని ఒక సురక్షిత ఆశ్రయంగా భావించారు. అయితే, ఆ తర్వాత మమతా బెనర్జీ తన శ్రేణులను నియంత్రించడం, సంక్షేమ పథకాలను మరింత విస్తరించడంతో బీజేపీ వైపు ఓటర్ల వలసలు నెమ్మదించాయి.బెడిసికొట్టిన వ్యూహం.. ప్రత్యామ్నాయాల వేటబీజేపీ ప్రయోగించిన ‘సర్’ వ్యూహం బెడిసికొట్టి, ముస్లింలతో పాటు మతువా, రాజ్బన్షీ వంటి అణగారిన వర్గాలు, బెంగాలీయేతర వలసదారులు, సవర్ణ హిందువుల ఓట్లను కూడా గల్లంతు చేసిందనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 100 సీట్లు సాధించడంలో విఫలమైతే, తృణమూల్కు ప్రత్యామ్నాయంగా ఓటర్లు మళ్లీ కాంగ్రెస్ లేదా వామపక్షాల వైపు చూసే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: ఢిల్లీలో ‘ఆప్’ క్లీన్ స్వీప్.. రాజ్యసభలో బీజేపీ రికార్డ్! -
దక్షిణ కోట ఎవరికి దక్కేను?
కోల్కతా: పశ్చిమబెంగాల్ ఎన్నికల చదరంగంలో గెలుపు పావులను ఉత్తరబెంగాల్ కొండ ప్రాంతాలు, జంగల్మహల్ అటవీప్రాంతాల్లో కాకుండా దక్షిణబెంగాల్ మైదానప్రాంతాల్లోనే కీలక పార్టీలు మొహరిస్తుంటాయి. ఈసారి కూడా అదే ఆట మొదలైంది. జంట జిల్లాలైన ఉత్తర, దక్షిణ 24 పరగణాల్లో, కోల్కతా, హౌరా ప్రాంతాల్లో గెలుపు అనేది అధికారపీఠానికి రాచబాటగా చెబుతుంటారు. గత ఎన్నికల్లో ఈ ప్రాంతాలపై తృణమూల్కాంగ్రెస్ గెలుపు జెండా ఎగరేయగా ఈసారి జెండా కిందకు దింపి కాషాయజెండా రెపరెపలాడేలా చేస్తామని కమలదళ నాయకులు కంకణం కట్టుకున్నారు. ఉత్తర 21 పరగణాల జిల్లాలో 33 సీట్లు, దక్షిణ 24 పరగణాల జిల్లాలో 31 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రాష్ట్ర ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో గెలుపు అనేది అత్యంత కీలకం. కోల్కతా నగర పరిధిలోని 11 సీట్లు, హౌరా నగర పరిధిలోని 16 సీట్లు కూడా కలుపుకుంటే కీలక నియోజకవర్గాల సంఖ్య 91కి పెరుగుతోంది. 294 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో ఇవి మూడింట ఒకవంతు స్థానాలతో సమానం. అలా ఇవి ఈసారి ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయి. ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలను యావత్ రాష్ట్రంలోని కీలక జిల్లాలుగా చెబుతుంటారు. పెద్ద ప్రెసిడెన్సీ డివిజన్గా కొనసాగుతున్న కోల్కతా, హౌరా, నదియా, నార్త్, సౌత్ 24 పరగణాల్లో మొత్తంగా 111 సీట్లున్నాయి. వీటిని గెలిస్తే రాష్ట్ర సచివాలయం ‘నబన్నా’లో అధికారం చక్రం తిప్పొచ్చని అటు టీఎంసీ, ఇటు బీజేపీ గట్టిగా నమ్ముతున్నాయి. ఈ 111 స్థానాలకుగాను 2021 ఎన్నికల్లో టీఎంసీ ఏకంగా 96 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక్కడ బీజేపీ 14 స్థానాలతో సరిపెట్టుకుంది. ది ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్) ఒకే ఒక్క చోట గెలిచింది. ఇంతటి కీలక దక్షిణబెంగాల్ను గుప్పిటపట్టకుండా అధికారాన్ని కైవసం చేసుకోవడం అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానించారు. అయితే 2024 లోక్సభ ఎన్నికలు వచ్చేనాటికి బీజేపీ బలం పుంజుకుంది. ఇక్కడి 21 సెగ్మెంట్లలో బీజేపీ హవా కొనసాగింది. నదియా, ఉత్తర 24 జిల్లాల్లో బీజేపీ, దక్షిణ 24, హౌరా, కోల్కతాల్లో టీఎంసీ సత్తాచాటాయి. ఇక్కడి మెజార్టీ స్థానాల్లో గెలిచి నాలుగోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని టీఎంసీ ఉవ్విళ్లూరుతోంది. ‘‘ఇక్కడి స్థానాలను పదిలపర్చుకుంటే అధికారం మనదే. ఇవి కేవలం సీట్లు కాదు. మమతా బెనర్జీ రాజకీయ ఎత్తులకు సామాజిక వేదికలు’’అని టీఎంసీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘మాకూ ఈ స్థానాలు చాలా ముఖ్యం. నార్త్ 24 పరగణాల జిల్లాలో మతువాలు, శరణార్థుల ఓట్లను కొల్లగొడితే మాకు పని సులువు అవుతుంది’’అని బీజేపీ సీనియర్ నేత చెప్పారు. ఒకప్పుడు ఈ ప్రాంతం వామపక్ష పార్టీలకు కంచుకోటగా ఉండేది. 2006లో సీపీఐ(ఎం) లెఫ్ట్ కూటమి ఏకంగా 72 చోట్ల గెలిచింది. కానీ సచార్ కమిటీ నివేదిక తర్వాత ముస్లింలు లెఫ్ట్పార్టీలకు ముఖంచాటేశారు. సింగూర్–నందిగ్రామ్ ఉద్యమం తర్వాత మమతబెనర్జీ హవా కొనసాగి ఈ ప్రాంతంపై టీఎంసీ పట్టుసాధించింది. ఇప్పుడీ ప్రాంతం మమత ప్రభుత్వానికి రాజకీయ ఇంజిన్గా మారింది. 2008లో దక్షిణ 24 పరగణాలు, పూర్బా మేదినీపూర్ జిల్లా పరిషత్లను గెల్చుకుని టీఎంసీ ఇక్కడ పాగావేసింది. నార్త్ 24 పరగణాల్లో బంగ్లాదేశ్ సరిహద్దు ఉండటంతో అక్కడి నుంచి వచ్చిన శరణార్థులు ఎక్కువ. ఇక్కడి మతువాలు 14 సీట్లలో నిర్ణయాత్మక ఓటు బ్యాంక్గా ఉన్నారు. వీళ్లందరికీ పౌరసత్వం ఇస్తామని, సీఏఏ అమలుచేస్తామని బీజేపీ చేసిన వాగ్దానాలు పనిచేశాయి. దీంతో 2021లో ఇక్కడి ప్రెసిడెన్సీ డివిజన్లో బీజేపీ గెల్చింది. 2024 లోక్సభ ఎన్నికలవేళ నదియాలోని 11 అసెంబ్లీ, నార్త్ 24 పరగణాల్లో ఎనిమిది సెగ్మెంట్లలో బీజేపీ ఓట్ల శాతం మెరుగుపడింది. అయితే ఈసారి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే అమలుతో సమీకరణాలు మారిపోయే అవకాశముంది.ముగిసిన రెండో దశ ఎన్నికల ప్రచారం ఏప్రిల్ 29న జరగబోయే రెండో దశ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం సోమవారంతో ముగిసింది. 142 స్థానాలకుగాను ఈసారి 41,001 పోలింగ్ స్టేషన్లలో 3,21,73,837 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లలో 1,64,35,627 మంది పురుషులుకాగా, 1,57,37,418 మంది స్త్రీలు, 792 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. మొదటిదశ మాదిరే రెండో దశ పోలింగ్నుప్రశాంతంగా చేపట్టేలా హింసకు తావులేకుండా 2,321 కంపెనీల కేంద్రబలగాలను ఎన్నికలసంఘం పోలింగ్ స్థానాల్లో మొహరించింది. పోలీసులకు తోడు కెమెరాలు బిగించిన డ్రోన్లు సైతం ఆయా ప్రాంతాల్లో పహారాకాస్తున్నాయి. భంగర్ నియోజకవర్గంలో అత్యధికంగా 19 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కంచుకోట భవానీపూర్ నుంచి సీఎం మమతాబెనర్జీ మరోసారి పోటీకి నిలబడ్డారు. మైనార్టీలు అత్యధికంగా ఉండే కోల్కతా పోర్ట్ నియోజకవర్గంలో టీఎంసీ తరఫున ఫిర్హాద్ హకీం, బీజేపీ తరఫున రాకేశ్ సింగ్ నిలబడి పోటీకి రసవత్తరంగా మార్చారు. భాత్పారా, జగత్దల్, బరాక్పూర్, బంగావ్, డమ్డమ్, సందేశ్ఖాలీ, హింగల్గంజ్, రాణాఘాట్ ఉత్తర్, దక్షిణ్, రాశ్బెహారీ, జాదవ్పూŠ, బలేగంజ్ స్థానాల్లో బలమైన నేతలు పోటీపడుతున్నారు. -
బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి వస్తా
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో తాను వెళ్లిన ప్రతిచోటా ప్రజల నాడిని గమనించానని, బీజేపీ విజయం ఖాయమని తేలిపోయినట్లు వెల్లడించారు. మే 4 తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి పశ్చిమ బెంగాల్కు తిరిగి వస్తానని ప్రకటించారు. సోమవారం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారక్పూర్లో ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. రెండో విడత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికార తృణమూల్ కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. సిండికేట్ రాజ్, రాజకీయ హింస, చొరబాట్లు, ఆర్థిక పతనానికి తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోందని మండిపడ్డారు. తూర్పు భారతదేశ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. పశ్చిమ బెంగాల్ ప్రగతి దేశ అభివృద్ధితో ముడిపడి ఉందన్నారు. తూర్పు ప్రాంతం తన చారిత్రక బలాన్ని, ప్రతిష్టను తిరిగి పొందాలని ఆకాంక్షించారు. మా, మాటీ, మానుష్ ను వదిలేశారు తృణమూల్ కాంగ్రెస్ పాలనలో బెంగాల్ అభివృద్ధి తిరుగుముఖం పట్టింది. బెదిరింపులు, దూషణలు, అబద్ధాలకు ఆ పార్టీ పర్యాయపదంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ పెద్దలు నన్ను, రాజ్యాంగబద్ధ సంస్థలను, చివరికి సాయుధ దళాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఇష్టానుసారంగా దూషించారు. గత 15 ఏళ్లలో ఏం సాధించారని ప్రశ్నిస్తే ఒక్కరు కూడా సమాధానం చెప్పడం లేదు. అధికారంలోకి వచ్చేందుకు వాడుకున్న నినాదాన్ని తృణమూల్ కాంగ్రెస్ నేడు వదిలేసింది. మా, మాటీ, మానుష్ను పక్కనపెట్టారు. మహిళలు, రైతులు, యువత కోసం చేసిందేమీ లేదు. ఇది మోదీ గ్యారంటీ కోల్కతాను లండన్లా మారుస్తామని టీఎంసీ హామీ ఇచ్చింది. కానీ, చొరబాటుదార్లకు అడ్డాగా మార్చేసింది. బీజేపీ అధికారంలోకి రాగానే చొరబాటుదార్లను బయటకు పంపిస్తాం. భారతదేశ పౌరులకు రక్షణ కల్పిస్తాం. కుల, మతాలకు అతీతంగా భారతీయులకు రక్షణ ఉంటుంది. పొరుగు దేశాల్లో మత హింసను తట్టుకోలేక శరణార్థులుగా వచ్చినవారికి భారత పౌరసత్వం కల్పిస్తాం. బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తాం. ఇది మోదీ గ్యారంటీ. ఇప్పుడు బెంగాల్ వంతు గతంలో భారతదేశం సుసంపన్నంగా ఉన్నప్పుడు.. దానికి అంగ, బంగా, కళింగ(నేటి బిహార్, బెంగాల్ ఒడిశా) అనే మూడు బలమైన మూలస్తంభాలు ఉండేవి. ఈ మూలస్తంభాలు బలహీనపడినప్పుడు దేశానికి పెద్ద దెబ్బ తగిలింది. తూర్పు ప్రాంతాల అభివృద్ధి లేకుండా దేశ అభివృద్ధి అసంపూర్ణం. బిహార్, ఒడిశాలో కమలం వికసించింది. ఇప్పుడు బెంగాల్ వంతు వచ్చింది. ఇక్కడి పరిస్థితి చూస్తూ ఉంటే కమల వికాసానికి అడ్డే లేదని స్పష్టమవుతోంది. పశ్చిమ బెంగాల్కు సేవ చేయడం, భద్రత కల్పించడం, కాపాడడం నా కర్తవ్యం, బాధ్యత’’అని మోదీ స్పష్టంచేశారు.తీర్థయాత్రలాగ గడిచిందిఆడియో సందేశం, బహిరంగ లేఖ విడుదల చేసిన మోదీ పశ్చిమ బెంగాల్లో ర్యాలీల్లో ప్రసంగించినప్పుడు, రోడ్ షోల్లో పాల్గొన్నప్పుడు తాను ఒక తీర్థయాత్రలో ఉన్నట్లుగా భావించానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఎన్నికల ప్రచారమంతటా కాళీమాత భక్తుల నుండి లభించిన దైవిక శక్తి, ప్రజల ఆశీర్వాదాలు తనకు ఎంతో బలాన్నిచ్చాయని వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని మోదీ సోమవారం ఒక ఆడియో సందేశం, బహిరంగ లేఖను విడుదల చేశారు. బెంగాల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందని పునరుద్ఘాటించారు. బీజేపీ సీఎం ప్రమాణ స్వీకార వేడుకను ప్రజలతో కలిసి జరుపుకుంటానని వివరించారు. తీవ్రమైన ఎండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ తనకు ఏమాత్రం అలసట అనిపించలేదని పేర్కొన్నారు. ర్యాలీలు, రోడ్ షోల్లో పాల్గొనడం తీర్థయాత్రకు వెళ్లిన భావన కలిగించిందని స్పష్టంచేశారు. -
'నేను చద్దాను కాదు.. పార్టీ మారను'
కోల్కతా: తమ పార్టీ నాయకురాలు మమతా బెనర్జీని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి, గాయకురాలు సయాని ఘోష్ అన్నారు. 2029లో దేశానికి మమత ప్రధాని అవుతారా అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఈ విధంగా జవాబిచ్చారామె. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ టీవీ చానల్ రిపోర్టర్తో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. మమత ప్రధాని అయితే ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఉందా అని ప్రశ్నించగా.. అటువంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు.రాఘవ్ చద్దా లాగా మీరు కూడా ఎప్పుడైనా సొంత పార్టీని వీడిని బీజేపీలో చేరే అవకాశం ఉందా అని అడగ్గా.. అలాంటి పరిస్థితే ఉత్పన్నం కాదన్నారు. ''నేను సయాని ఘోష్, రాఘవ్ చద్దాను కాదు. ఎప్పటికీ సంఘ పరివార్కు దూరంగానే ఉంటాన''ని చెప్పారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష ఎంపీలను బీజేపీ భయపెడుతోందని ఆరోపించారు. బీజేపీ దగ్గర వేల కోట్ల డబ్బు, ఈడీ, సీబీఐ, అధికారం ఉంటే.. తమకు అండగా హవాయి చెప్పులు, తెల్లచీర ధరించిన మమతా బెనర్జీ ఉన్నారని అన్నారు.బెంగాల్ బీజేపీ నాయకుడు సువేందు అధికారి బ్రిగేడ్ నేత అంటూ ఎన్నికల ప్రచారంలో తాను చేసిన వ్యాఖ్యలను సయాని ఘోష్ (Saayoni Ghosh) సమర్ధించుకున్నారు. మమతా బెనర్జీని ఉద్దేశించి ఆయన దిగజారుడు వ్యాఖ్యలు చేశారని.. ఆ మాటలు వింటే బిగ్రేడ్ కాదు, సీగ్రేడ్ నాయకుడంటారని పేర్కొన్నారు. బెంగాల్ ప్రజలు మళ్లీ తమ పార్టీకే పట్టం కడతారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణజాదవ్పూర్ లోక్సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సయాని ఘోష్.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరపున పెద్ద ఎత్తున ప్రచారం సాగించారు. తన వాక్చాత్యురం, హావభావాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడికి వెళ్లినా తనదైన శైలిలో ఓటర్లకు దగ్గరయ్యారు. దీంతో ఎన్నికల ప్రచారంలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తృణమూల్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు.చదవండి: కేజ్రీవాల్కు షాక్.. చద్దాకు జాక్పాట్? ముగిసిన ఎన్నికల ప్రచారంపశ్చిమ బెంగాల్ రెండో దశ ఎన్నికలకు ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. ప్రధాన పార్టీలు హోరాహోరీగా ఎన్నికలు ప్రచారం సాగించాయి. ఆయా పార్టీల అగ్రనేతల ప్రచారంతో బెంగాల్ హోరెత్తింది. బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా.. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సుడిగాలి పర్యటనలు చేశారు. 29న రెండో విడత పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడతాయి. Anchor : Will you also someday switch parties and join BJP like Chadha?TMC MP : I am Sayoni Ghosh , not Raghav Chadha, it will never become Sanghi Chadhi.This woman is on fire 🔥 pic.twitter.com/70bixFBihA— Roshan Rai (@RoshanKrRaii) April 27, 2026 -
‘టీఎంసీ పతనం ఖాయం.. మే 4న మళ్లీ వస్తున్నా’
బరాక్పూర్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమరంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. రెండో విడత పోలింగ్కు ముందు బరాక్పూర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇది రాష్ట్రంలో తన చివరి ఎన్నికల ప్రచారమని ప్రకటించిన ఆయన, మే 4న ఫలితాల తర్వాత బీజేపీ ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవానికి తాను తిరిగి వస్తానంటూ ప్రదర్శించిన అచంచల విశ్వాసం అందరి దృష్టిని ఆకర్షించింది.బరాక్పూర్లో జరిగిన ఈ సభకు ప్రజలు పోటెత్తారు. హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర దారిపొడవునా బారులు తీరిన జనసందోహం తన ఉత్సాహాన్ని రెట్టింపు చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఉదయాన్నే వేలాదిగా తరలివచ్చి తనను ఆశీర్వదించిన ప్రజల ఆప్యాయతను ఆయన కొనియాడారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందనడానికి, తనలో ఉన్న అపార నమ్మకానికి ఈ జనప్రభంజనమే నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.టీఎంసీపై తీవ్రస్థాయిలో ధ్వజంఅధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లక్ష్యంగా ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఎంసీ పాలనలో పరిశ్రమలు మూతపడ్డాయని, రాష్ట్ర అభివృద్ధికి వారి వద్ద ఎలాంటి భవిష్యత్ ప్రణాళిక లేదని మండిపడ్డారు. అధికార పార్టీ నడుపుతున్న ‘సిండికేట్ వ్యవస్థ’ను కూకటివేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నిర్మాణాత్మక పాలనను గాలికొదిలేసి, బెదిరింపులు, దుర్భాషలాడే రాజకీయాలపైనే టీఎంసీ ఆధారపడుతోందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తేనే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, బెంగాల్కు ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ ఆవశ్యకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.యువతకు ఐదు కీలక హామీలురాష్ట్ర యువతను ఆకర్షించేలా ప్రధాని మోదీ ఉపాధి, సంక్షేమం లక్ష్యంగా ఐదు గ్యారెంటీలను ప్రకటించారు. సకాలంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఖాళీలన్నింటినీ తక్షణమే పూరించడం, నైపుణ్యాభివృద్ధితో కూడిన ఉపాధి కల్పన, 7వ వేతన సంఘం ప్రయోజనాల అమలు, గ్రామాల్లో ఉపాధి పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుండగా, ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. -
బీజేపీ అభ్యర్థి ఇంటివద్ద బాంబుల మోత
భట్పారా: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఏప్రిల్ 29న జరగనున్న రెండో విడత పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భట్పారా ప్రాంతం నెత్తురోడింది. అధికార టీఎంసీ , ప్రతిపక్ష బీజేపీ వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు చివరకు కాల్పులు, నాటు బాంబుల దాడులకు దారితీయడంతో ఓ సీఐఎస్ఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది.బీజేపీ అభ్యర్థి ఇంటి వద్ద కాల్పుల మోతఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బీజేపీ అభ్యర్థి పవన్ సింగ్ (సీనియర్ నేత అర్జున్ సింగ్ కుమారుడు) నివాసం వెలుపల భయానక వాతావరణం నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తులు నాటు బాంబులు విసరడంతో పాటు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో పవన్ సింగ్ భద్రతా బృందంలో విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ జవాన్ యోగేష్ శర్మ కాలికి తూటా తగిలింది. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ కాల్పులు ఎవరు జరిపారన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.పోలీస్ స్టేషన్ వద్దే ఘర్షణ, రాళ్లదాడిఆదివారం సాయంత్రం జగద్దల్ ప్రాంతంలోనూ తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పార్టీ జెండాలు కడుతున్న ఓ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై ఫిర్యాదు చేసేందుకు టీఎంసీ నేతలు స్థానిక పోలీస్ స్టేషన్కు చేరుకోగా, అప్పటికే అక్కడకు చేరుకున్న బీజేపీ మద్దతుదారులకు, వారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.రాజకీయ ఆరోపణలుఈ దాడులపై అటు టీఎంసీ, ఇటు బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తమ కార్యకర్తలపై అకారణంగా దాడులు చేశారని టీఎంసీ ఆరోపిస్తుండగా, టీఎంసీకి చెందిన రౌడీ మూకలే కాల్పులు జరిపారని, వారి వల్లే జవాన్ గాయపడ్డారని బీజేపీ ప్రతివిమర్శలు చేస్తోంది. ఈ ఘటనల నేపథ్యంలో భట్పారా, జగద్దల్ ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఇది కూడా చదవండి: చద్దా టీ పార్టీకి సీచేవాల్ ‘షాక్’.. దిమ్మతిరిగే కౌంటర్తో.. -
అస్సాంలో ‘విజయ్’లాంటోడు?.. ఫలితాలను శాసిస్తూ..
డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఒకే ఒక్క సీనియర్ నేత చేతుల్లోకి వెళ్లనున్నట్లు కనిపిస్తోంది. ఆయనే బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) అధినేత హగ్రామా మొహిలారీ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ ఎటువంటి ప్రకంపనలు సృష్టిస్తున్నాడో అస్సాంలో హగ్రామా మొహిలారీ అదే పంథాలో కనిపిస్తున్నారు.అత్యంత శక్తివంతమైన నేతఒకప్పుడు బద్ధ శత్రువుగా ఉన్న అధికార బీజేపీతో ఇప్పుడు మళ్లీ చేతులు కలిపి, తదుపరి ప్రభుత్వాన్ని శాసించే కింగ్ మేకర్గా హగ్రామా మొహిలారీ అవతరించారు. పశ్చిమ అస్సాంలోని బోడోలాండ్ ప్రత్యేక స్వయంప్రతిపత్తి ప్రాంతంలో మొహిలారీ అత్యంత శక్తివంతమైన నాయకుడు. ఒకప్పుడు సాయుధ తిరుగుబాటుదారునిగా ఉన్న ఆయన, 2003లో కేంద్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకుని, ప్రధాన స్రవంతిలో కలిసిపోయి, రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన పార్టీ ఒక ప్రత్యేక కౌన్సిల్ ద్వారా ఐదు జిల్లాలను పరిపాలిస్తూ, రాష్ట్ర అసెంబ్లీలోని కీలకమైన 15 స్థానాలపై తన ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది.బీజేపీకి అత్యవసరమైన ‘సోషల్ ఇంజనీరింగ్’మొహిలారీ అసలు బలం సమాజంలోని భిన్న వర్గాలను ఏకం చేయగలగడమే. కేవలం ఒకే సామాజిక వర్గానికి పరిమితం కాకుండా గిరిజనులు, బెంగాలీ మూలాలున్న ముస్లిం మైనారిటీల మద్దతు కూడగట్టుకోవడంలో ఆయనది అందెవేసిన చేయి. ఈ ‘సోషల్ ఇంజనీరింగ్’ వ్యూహమే బీజేపీకి ఆయనను అత్యవసర భాగస్వామిగా మార్చింది. ఒకవేళ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే, మొహిలారీ అండతోనే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని కమలనాథులు ఆశిస్తున్నారు.నిధుల కోసమే ఈ రాజకీయ రాజీ?బీజేపీ, బీపీఎఫ్ల మధ్య సంబంధం ఎప్పుడూ ఒకేలా లేదు. కొన్నేళ్ల క్రితం మొహిలారీని జైలుకు పంపుతామని అగ్రశ్రేణి బీజేపీ నేతలు హెచ్చరించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇరు పార్టీలు పాత పగలు మరిచి ఒక ‘రాజకీయ రాజీ’కి వచ్చాయి. గిరిజన కౌన్సిల్స్ మనుగడకు, అభివృద్ధికి ప్రభుత్వ నిధులు అత్యవసరం కావడంతో, అధికార పార్టీకి దగ్గరగా ఉండటం మొహిలారీకి కూడా తప్పనిసరి. 85 శాతానికి పైగా భారీ పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో మొహిలారీ మళ్లీ తిరుగులేని నాయకునిగా ఎదుగుతారా లేదా అనేది ఓట్ల లెక్కింపుతో తేలనుంది.ఇది కూడా చదవండి: మాలి రక్షణ మంత్రి దారుణ హత్య -
బెంగాల్ కోటలో సెలబ్రిటీలకు షాక్
బెంగాల్ రాజకీయాల్లో ఒకప్పుడు గ్లామర్ ఉంటే గెలుపు ఖాయమనే నమ్మకం బలంగా ఉండేది. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికలు ఈ పాత ఫార్ములాను పూర్తిగా మార్చేస్తున్నాయి. కేవలం ముఖ పరిచయం, సినిమా క్రేజ్ చూసి ఓట్లు వేసే రోజులు పోయాయని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండూ గ్రహించాయి. అందుకే ఈసారి ఎన్నికల బరిలో సినీ, క్రీడా తారల సందడి అంతగా కనిపించలేదు. ఇది కేవలం టికెట్ల పంపిణీలో జరిగిన పరిణామం మాత్రమే కాదు.. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, ఇరు పార్టీలు వ్యూహాత్మకంగా తీసుకున్న కఠిన నిర్ణయం. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు, భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దే క్రమంలో కేవలం ఆకర్షణపైననే ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని రెండు పార్టీల అధిష్టానాలు ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చాయి.గత అనుభవాలతో దెబ్బతిన్నాక..కొన్నేళ్ల క్రితం వరకు రాజకీయ ముఖచిత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉండేది. 2019 లోక్సభ ఎన్నికల్లో టీఎంసీ.. సినీ తారలు నుస్రత్ జహాన్, మిమీ చక్రవర్తిలను బరిలోకి దించి ఘన విజయం సాధించింది. ఆ విజయాల ఉత్సాహంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు పార్టీలు ఇదే ‘సెలబ్రిటీ మోడల్’ను గుడ్డిగా అనుసరించాయి. టీఎంసీ తరపున సాయోని ఘోష్, జూన్ మాలియా.. బీజేపీ తరపున లాకెట్ ఛటర్జీ, రుద్రనీల్ ఘోష్, పాయెల్ సర్కార్ వంటి ఎంతోమంది తారలు పోటీ పడ్డారు. అయితే ఫలితాలు మాత్రం రెండు పార్టీల అంచనాలను దారుణంగా తలకిందులు చేశాయి. సాయోని ఘోష్, జూన్ మాలియా లాంటి కొద్దిమంది మినహా, చాలామంది తారలు తమ క్రేజ్ను ఓట్లుగా మార్చుకోవడంలో విఫలమయ్యారు. ఎన్నికల తర్వాత ఓడిపోయిన చాలామంది తారలు రాజకీయాలకు దూరమయ్యారు.అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి భిన్నంపార్లమెంట్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసమే తారల వైఫల్యానికి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. లోక్సభ ఎన్నికలు భారీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతాయి. అక్కడ అభ్యర్థి ఇమేజ్, పార్టీ జెండా, అధినేత చరిష్మా ఎక్కువగా పనిచేస్తాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి దానికి భిన్నంగా ఉంటుంది. ఒక ఎమ్మెల్యే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. స్థానిక సమస్యల పరిష్కారం, బూత్ స్థాయి కార్యకర్తలతో సమన్వయం ఇక్కడ అత్యంత కీలకం. షూటింగులతో బిజీగా ఉండే సెలబ్రిటీలు ఈ స్థాయిలో ప్రజలతో మమేకం కావడంలో, క్షేత్రస్థాయి నెట్వర్క్ను నడపడంలో విఫలమవుతున్నారు. అందుకే కేవలం ప్రచార ఆకర్షణగా మిగిలిపోయే తారల కన్నా, 24 గంటలు జనంలో ఉండే నాయకులకే టికెట్లు ఇవ్వాలని పార్టీలు నిర్ణయించాయి.2026 ఎన్నికల్లో ప్రక్షాళన ఈ వ్యత్యాసాన్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకున్న టీఎంసీ, బీజేపీలు 2026 ఎన్నికల్లో ప్రక్షాళన చేపట్టాయి. కేవలం గ్లామర్ కోసమే వచ్చిన వారిని పక్కనపెట్టి, పార్టీ సిద్ధాంతాలతో మమేకమైన వారినే అంటిపెట్టుకున్నాయి. 2021లో శిబ్పూర్ నుంచి గెలిచిన మాజీ క్రికెటర్ మనోజ్ తివారీకి టీఎంసీ ఈసారి మొండిచెయ్యి చూపింది. అలాగే నటులైన ఎమ్మెల్యేలు కంచన్ ముల్లిక్, రాజ్ చక్రవర్తిలకు కూడా సీట్లు దక్కలేదు. సోహమ్ చక్రవర్తి, అదితి మున్షీ లాంటి ఒకరిద్దరికి మాత్రమే పార్టీలో మినహాయింపు దొరికింది. మరోవైపు టీఎంసీని వీడి బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్కు సైతం కాషాయ పార్టీ టికెట్ నిరాకరించింది. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీని అంటిపెట్టుకుని, టీఎంసీ ఒత్తిళ్లను తట్టుకుని నిలబడిన రుద్రనీల్ ఘోష్కు మాత్రం బీజేపీ మరోసారి అవకాశం ఇచ్చింది.ప్రజాకర్షణ ఒక్కటే సరిపోదుపశ్చిమ బెంగాల్లో స్పష్టంగా కనిపిస్తున్న ఈ మార్పు కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ ధోరణికి ఇది అద్దం పడుతోంది. ఒకప్పుడు తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి లాంటి వారు సినిమా గ్లామర్తో పాటు రాజకీయాల్లో క్షేత్రస్థాయిలో కష్టపడి తిరుగులేని ప్రజా నాయకులుగా ఎదిగారు. కానీ ప్రస్తుత తరం తారలకు ఆ మోడల్ను పునరావృతం చేయడం సాధ్యం కావడం లేదు. కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చినా, పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. రజనీకాంత్ వెనక్కి తగ్గారు. దళపతి విజయ్ సొంత పార్టీతో 2026 పోరుకు సిద్ధమవుతున్నా.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అంత సులభంగా లేవు. పంజాబ్లో సీఎం భగవంత్ మాన్ సక్సెస్ అయినా, హిమాచల్ ప్రదేశ్లో ఎంపీ కంగనా రనౌత్ లాంటి వారు నిత్య రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోవడం కష్టమని తేలింది. గతంలో సన్నీ డియోల్ లాంటి వారు కూడా చేతులెత్తేసిన పరిస్థితిని మనం చూశాం.క్షేత్రస్థాయిలో పనిచేసే నేతలకే..ఈ పరిణామాలన్నీ భారత ఎన్నికల వ్యవస్థలో వస్తున్న ఒక స్పష్టమైన, ప్రాథమిక మార్పును సూచిస్తున్నాయి. ప్రచార సభలకు జనాన్ని ఆకర్షించడానికి, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి రాజకీయాల్లో చరిష్మా ఇంకా పనిచేస్తుండవచ్చు. కానీ.. ఆ గ్లామర్.. ఓట్లను బూత్ దాకా తీసుకురాలేదు. సంస్థాగత బలాన్ని భర్తీ చేయలేదు. ఓట్లను సమీకరించడం, సామాజిక వర్గాలను ఏకం చేయడం, క్షేత్రస్థాయిలో బూత్లను మేనేజ్ చేయడం లాంటి కఠినమైన పనులు చేయగలిగిన వారే ఇప్పుడు పార్టీలకు అవసరం. కేవలం ప్రచారానికి ‘ముఖచిత్రం’గా ఉండే తారల కంటే, ఎన్నికలను క్షేత్రస్థాయిలో నడిపించే వారికే రాజకీయ పార్టీలు పెద్దపీట వేస్తున్నాయి. బెంగాల్ నేర్పుతున్న ఈ పాఠం దేశవ్యాప్తంగా విస్తరిస్తే, భారత ఎన్నికల రూపురేఖలు మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: గుండెకు క్యాన్సర్ ఎందుకు రాదో తెలుసా? -
బెంగాల్లో గూండారాజ్
కోల్కతా: టీఎంసీ పాలనలో పశ్చిమ బెంగాల్లో గూండారాజ్ సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. మహిళలను వేధించే గూండాలకు తృణమూల్ ఆశ్రయమిస్తోందని ఆరోపించారు. ఆదివారం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఠాకూర్నగర్, హూగ్లీ జిల్లాలోని అరామ్బాగ్లో ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. ‘‘క్రూరమైన తృణమూల్ ప్రభుత్వం మహిళలను హింసించే గూండాలకు అండగా నిలుస్తోంది. ఈ అరాచకాలను ఇకపై సహించబోమని చెప్పాల్సిన సమయం వచ్చింది’’ అని అన్నారు. మహిళల భద్రతకు బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. సందేశ్కాళీ బాధితురాలు రేఖా పాత్ర, ఆర్జీ కర్ బోధనాసుపత్రి బాధితురాలైన వైద్యురాలి తల్లి రత్న దేవనాథ్కు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్లిచ్చిందని ఆయన గుర్తు చేశారు. పొరుగు దేశాల్లో మత హింసను తట్టుకోలేక వలస వచ్చినవారికి సీఏఏ కింద భారత పౌరసత్వం కల్పిస్తామని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో తృణమూల్ చెప్పే అబద్ధాలను నమ్మొద్దని ఆయన కోరారు. మహిళలపై అత్యాచారాలు, హింసకు పాల్పడే దుండగులను మే 4 తర్వాత రాబోయే బీజేపీ ప్రభుత్వం న్యాయస్థానం ముందు నిలబెడుతుందని మోదీ స్పష్టం చేశారు. ‘‘బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఎప్పుడో ఖాయమైంది. రెండో దశ పోలింగ్ ఆ విజయాన్ని సుస్థిరం చేస్తుంది. తొలి దశలో 93 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావడంతో తృణమూల్ అహం దెబ్బతిన్నది. ఆ పార్టీ ఇప్పుడు ‘మా, మాటీ, మానుష్’ గురించి మాట్లాడడం మానేసింది. ఎందుకంటే వారి అరాచక పాలనలో మా (అమ్మ) కన్నీరు పెడుతోంది. మాటీ (భూమి)ని ముఠాలు, చొరబాటుదారులకు అప్పగించారు. మానుష్ (ప్రజలు) ఉద్యోగాలు, ఉపాధి కోసం వలస పోవాల్సిన దుస్థితి దాపురించింది’’ అని ఆక్షేపించారు. ‘‘మేం అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ బెంగాల్లో అమలు చేస్తామన్నారు. ఈ దిశగా తొలి కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకుంటాం’’ అని ప్రకటించారు. ఆలయాల్లో మోదీ పూజలు ప్రధాని మోదీ బెంగాల్ ఠాకూర్ నగర్లో ఠాకూర్బారీ ఆలయంలో పూజలు చేశారు. కోల్కతాలో ప్రఖ్యాత థన్థానియా కాళీ ఆలయాన్నీ దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని దుకాణంలో పూజా సామగ్రి కొనుగోలు చేశారు. అనంతరం ఉత్తర కోల్కతాలో భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. -
‘మీ కన్నీటి జల్లుకు.. భయమనే ముల్లుకు గుడ్ బై చెప్పండి’
కోల్కతా: ఈసారి పశ్చిమబెంగాల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పశ్చిమబెంగాల్ తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యి.. రెండో విడతకు సిద్ధమైన తరుణంలో మోదీ ప్రచారం మరింత ఊపదుకుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీనే లక్ష్యంగా మోదీ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈరోజు(ఆదివారం, ఏప్రిల్ 26వ తేదీ) మమతా బెనర్జీ కీలకంగా భావించే నియోజకవర్గాల్లో పర్యటించిన మోదీ.. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత 15 ఏళ్ల నుంచి ఇక్కడ మమతా బెనర్జీ అధికారంలో ఉన్నప్పటికీ పరిస్థితుల్లో ఏమీ మార్పులేదని, ఈసారి కచ్చితంగా ప్రభుత్వం మారాల్సిందేనన్నారు. ‘ పశ్చిమ బెంగాల్ ఎక్కడా చూసినా అమ్మ కన్నీటి జల్లే కనిపిస్తుంది. మనిషి అనేవాడు భయమనే ముల్లుపై అడుగులు వేస్తూ జీవిస్తున్నాడు. ఇక్కడ మట్టి ద్రోహల చెరలో ఉంది. ప్రధానంగా మహిళలకు రక్షణ కల్పించడంలో మమతా బెనర్జీ సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళల పట్ల అరాచకాలే కన్పిస్తున్నాయి. కోల్కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో ఓ యువ మహిళా డాక్టర్ను దారుణంగా పాడుచేసి చంపేశారు. ఇక కోల్కతా నగరానికి 20 కి.మీ దూరంలో ఉన్న కమ్దునిలో 20 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ తరహా ఘటనలే పశ్చిమ బెంగాల్లో కనిపిస్తున్నాయి. ఇటువంటి ప్రభుత్వం మీకు కావాలా.. లేక మహిళలకు అండగా ఉండే మా ప్రభుత్వం కావాలా?, ప్రభుత్వాన్ని మార్చి చూడండి’ అంటూ బెంగాల్ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. #WATCH | North 24 Parganas, West Bengal: Addressing a public rally in Bangaon, Prime Minister Narendra Modi says, "BJP gives security to sisters and daughters and also gives opportunities. BJP has given a ticket to a sister who is connected to the struggle of Sandeshkhali's… pic.twitter.com/K0jxTup4b8— ANI (@ANI) April 26, 2026 -
‘మే 5 నుంచి..’ ఆడపిల్లలకు అమిత్ షా భరోసా!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. మహిళల భద్రత విషయంలో తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మే 5 తర్వాత రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు రాత్రి ఒంటిగంట దాటినా ఆడపిల్లలు ఎలాంటి భయం లేకుండా వీధుల్లో తిరగగలరని ఆయన భరోసా ఇచ్చారు.మహిళల భద్రతపై దీదీకి సూటి ప్రశ్నలుగత పదిహేనేళ్ల మమతా బెనర్జీ పాలనలో రాష్ట్రంలోని తల్లులు, సోదరీమణులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని అమిత్ షా ఆరోపించారు. ఆర్జీ కర్, సందేశ్ ఖాలీ, కలకత్తా లా కాలేజ్ వంటి ఘటనలే ఇందుకు సజీవ సాక్ష్యాలన్నారు. ‘రాత్రి 7 గంటల తర్వాత మహిళలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని దీదీ చెబుతున్నారు. దేశంలో ఏ బీజేపీ ముఖ్యమంత్రీ ఇలాంటి మాట అనలేదు. ఒక మహిళ.. సీఎంగా ఉండి కూడా భద్రత కల్పించలేకపోయినందుకు సిగ్గుపడాలి. మే 5న మేం అధికారంలోకి వచ్చాక ఏ రౌడీ కూడా మహిళల వైపు కన్నెత్తి చూడలేడు, అలాంటి వారిని కటకటాల వెనక్కి నెడతాం’ అని జమాల్పూర్ ర్యాలీలో అమిత్ షా హెచ్చరించారు. जमालपुर वासी भी भाजपा सरकार बना रहे हैं...ভোটের প্রথম দফাতেই ১১০টি আসনে জয়লাভ করে বিজেপি পশ্চিমবঙ্গে সরকার গঠনের পথে অনেকটাই এগিয়ে গিয়েছে। জামালপুর বিধানসভার বাসিন্দারাও তৃণমূল কংগ্রেসকে সম্পূর্ণভাবে পরাজিত করার জন্য প্রস্তুত।#BanglarHridoyeBJP https://t.co/E5l9lC5GPy— Amit Shah (@AmitShah) April 25, 2026తొలి దశలో 110కి పైగా స్థానాలు మావేమొదటి దశ పోలింగ్ సరళిని బట్టి బీజేపీకి తిరుగులేని విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోల్కతాలో మీడియాతో మాట్లాడుతూ.. 152 స్థానాలకు గాను 110కి పైగా సీట్లను కైవసం చేసుకుంటామని జోస్యం చెప్పారు. 16 జిల్లాల్లోని 52 స్థానాల్లో ఏకంగా 92.98 శాతం పోలింగ్ నమోదు కావడమే మమతా సర్కార్ పతనానికి సంకేతమన్నారు. బెంగాల్ ప్రజల్లో భయం పోయిందని, బీజేపీ పట్ల నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు. రెండో దశ పోలింగ్ పూర్తయ్యే సరికి బెంగాల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.మతువా సామాజిక వర్గానికి ‘సీఏఏ’ రక్షణ కవచంపౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును మమతా బెనర్జీ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని షా విమర్శించారు. అయితే బీజేపీ అధికారంలోకి రాగానే సీఏఏను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ మూలాలున్న మతువా సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరికీ భారత పౌరసత్వం కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఇది కూడా చదవండి: 29న కోల్కతాలో బిగ్గెస్ట్ ఫైట్ -
‘గంగ’ చుట్టూ బెంగాల్ రాజకీయం..
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో రెండో దశ ఎన్నికలకు గడువు దగ్గరపడుతున్న వేళ పవిత్ర గంగా నది చుట్టూ రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. కాలుష్యమయంగా మారిన గంగా నది శుద్ధి, పరీవాహక ప్రాంత ప్రజల జీవనోపాధి, మత్స్యకారుల సమస్యలు, పెరుగుతున్న భూక్షయం వంటి అంశాలు పార్టీలకు రాజకీయ అ్రస్తాలుగా మారుతున్నాయి.బెంగాల్లో ముఖ్యమైన నది అయిన గంగ ఉత్తర నుండి దక్షిణం వరకు సుమారు 520 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 7 జిల్లాల్లోని సుమారు 90 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నది ప్రవహిస్తోంది. తీర ప్రాంతాల్లో 2.80 కోట్లకు పైగా జనాభా నివసిస్తున్నట్లు అంచనా. రెండో దశలో ఎన్నికలు జరుగనున్న ముర్షిదాబాద్, నాదియా, మాల్దా, హౌరా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు వంటి జిల్లాల్లో గంగా నది ప్రక్షాళన అంశమే ప్రచారాస్త్రంగా మారింది. తృణమూల్దే హవా ప్రతి ఏటా వర్షాకాలంలో గంగా నదికి భారీ వస్తోంది. తీర ప్రాంతాల్లో 8,000–10,000 హెక్టార్ల భూమి కోతకు గురై భూక్షయానికి కారణమవుతోంది. ముర్షిదాబాద్, మాల్డా జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. వరదల కారణంగా దాదాపు 20 లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. పంటలు, ఇళ్లు నష్టపోతున్నారు. నిరాశ్రయులుగా మారుతున్నారు. అధిక వర్షాల సమయంలో మత్స్యకారుల జీవనోపాధికి భరోసా లేకుండా పోతోంది. దీనికి తోడు పరీవాహక ప్రాంతాల్లో కాలుష్యం వల్ల తాగునీటి ఇక్కట్లు పెరుగుతున్నాయి.అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని, గంగా నదిని పరిశుభ్రంగా మారుస్తామని ప్రధాన పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. గంగా పరీవాహక ప్రాంతాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా కనిపిస్తోంది. 2016, 2021 ఎన్నికల్లో ఆ పార్టీ ఏకంగా 80 శాతానికి పైగా సీట్లు గెల్చుకుంది. 2026 ఎన్నికల్లోనూ తమకు తిరుగులేదని తృణమూల్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తన పట్టు పెంచుకొనేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. గంగా నదిపై ఆధారపడిన ఓటర్ల మనసులు గెల్చుకుంటే విజయం తథ్యమని ప్రధాన పార్టీలు నిర్ణయానికొచ్చాయి. ఆ దిశగానే వ్యూహాలు అమలు చేస్తున్నాయి. పోటాపోటీ విమర్శలుగంగా నది చుట్టూ పెనవేసుకున్న సమస్యల పరిష్కారం కోసం తీర రక్షణ గోడల నిర్మాణం, వరద నియంత్రణ ప్రాజెక్టులు, మత్స్యకారులకు ఆర్థిక సాయం, గంగా శుద్ధి ప్రణాళికలు వంటివి ప్రతిసారీ రాజకీయ హామీలుగా తెరపైకి వస్తున్నాయి. గంగా నది వరద నియంత్రణకు రూ.150 కోట్లకు పైగా ఖర్చు చేశామని, మరో రూ.100 కోట్లు మంజూరు చేశామని ఇటీవల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. వరద ప్రభావిత కుటుంబాలకు రూ.1,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినట్లు తెలిపారు. గంగా నది శుద్ధికి బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇస్తున్న మాదిరిగా బెంగాల్కు నిధులు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అయినప్పటికీ నది ప్రక్షాళనకు రాష్ట్ర నిధులు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు.ప్రధాని నరేంద్ర మోదీపై సైతం ఎన్నికల ప్రచారంలో గంగా నదిపై దృష్టి పెట్టి ప్రకటనలు చేస్తున్నారు. ‘‘బీహార్ తర్వాత గంగా నది పశ్చిమ బెంగాల్ను శుభ్రం చేస్తుంది’’అని వ్యాఖ్యానించారు. బీహార్లో పాగా వేశామని, ఇకపై బెంగాలో జెండా ఎగురవేయబోతున్నామని పరోక్షంగా తేల్చిచెప్పారు. నమామి గంగే కార్యక్రమం ద్వారా గంగా శుద్ధి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా సహకరించడం లేదని, అందుకే ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.నది ప్రక్షాళన కోసం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని బెంగాల్ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే స్వచ్ఛమైన నది సాకారమవుతుందని ఎన్నికల ప్రచారంలో తేల్చి చెబుతున్నారు. ప్రధాని మోదీ రెండు రోజుల క్రితం ఆయన గంగా నదిలో పడవపై విహరించారు. ఈ విహారాన్ని సైతం సీఎం మమతా బెనర్జీ తప్పుపట్టారు. ప్రధానమంత్రి ఢిల్లీలోని యమునా నదికి వెళ్లి స్నానం చేస్తారా? అక్కడ నదిలో ప్రయాణించే సాహసం చేయగలరా? అని సవాల్ విసిరారు. మొత్తానికి గంగా నది వ్యవహారం అధికార, విపక్షాలకు ప్రచార ఆయుధంగా మారిపోయింది. -
29న కోల్కతాలో బిగ్గెస్ట్ ఫైట్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని అతిపెద్ద సమరానికి రంగం సిద్ధమైంది. సత్యజిత్ రే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి ఎందరో ఉద్దండులకు నిలయమైన కోల్కతాలోని ప్రతిష్టాత్మక ‘భవానీపూర్’ నియోజకవర్గం ఇప్పుడు మహా సంగ్రామానికి వేదికగా మారింది. 2026, ఏప్రిల్ 29న జరగనున్న ఈ హై-వోల్టేజ్ ఎన్నికల్లో.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మాజీ ప్రియ శిష్యుడు, ప్రస్తుత బీజేపీ విపక్ష నేత సువేందు అధికారి మధ్య భీకర పోరు జరగనుంది. బెంగాల్ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఈ స్థానంలో గెలుపు ఇరు పార్టీలకు జీవన్మరణ సమస్యగా పరిణమించింది.చారిత్రక వారసత్వం.. ఉద్దండుల నిలయందక్షిణ కోల్కతాలోని భవానీపూర్ నియోజకవర్గానికి రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య పరంగా ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్, దేశబంధు చిత్తరంజన్ దాస్, విద్యావేత్త అశుతోష్ ముఖర్జీ, మాజీ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రే, దిగ్గజ ఫిల్మ్ మేకర్స్ సత్యజిత్ రే, మృణాల్ సేన్, నటుడు ఉత్తమ్ కుమార్, గాయకుడు హేమంత్ కుమార్ వంటి ఎందరో ప్రముఖులు ఇక్కడే నివసించారు. ఈ ప్రతిష్టాత్మక స్థానం ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య భీకర పోరుకు సాక్ష్యంగా నిలవనుంది. కాళీఘాట్ ఆలయం, గురుద్వారాలు, మసీదులు, బ్రిటిష్ కాలం నాటి చర్చిలతో కూడిన ఈ ప్రాంతం భిన్న సంస్కృతులకు సజీవ ప్రతీకగా నిలిచింది.సొంత గడ్డపై ‘దీదీ’ వర్సెస్ ‘బయటి వ్యక్తి’2011 నుంచి ఈ నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్న మమతా బెనర్జీ ఇక్కడి హరీష్ ఛటర్జీ వీధిలోనే నివసిస్తున్నారు. స్థానిక అశుతోష్ కళాశాలలో చదువుకున్న ఆమె కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలకు సుపరిచితురాలు. ప్రచారంలో భాగంగా ఆమె తనకు తెలిసిన పాత పరిచయస్థులను పలకరిస్తూ, వీధుల్లో కలియతిరుగుతున్నారు. మరోవైపు నందిగ్రామ్ నుంచి వచ్చిన సువేందు అధికారి ఈ పాత కోల్కతా ప్రాంతంలో ‘బయటి వ్యక్తి’ అనే ముద్రను ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఇక్కడ ఆయన దీదీని ఓడిస్తే, రాష్ట్రంలో బీజేపీ వెతుకుతున్న తిరుగులేని నాయకునిగా ఆయన అవతరిస్తారు.మమత ఓడిపోయే అవకాశం ఉందా?ఈసారి ఎన్నికల వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉందని స్థానికులు అంటున్నారు. ‘మమత ఇక్కడి నుంచి ఎప్పటికీ ఓడిపోరు. కానీ తొలిసారిగా నాన్-బెంగాలీ ప్రాంతాల్లో టీఎంసీకి వ్యతిరేకంగా బహిరంగ చర్చలు జరుగుతున్నాయి’ అని అదితి సర్కార్ అనే స్థానికురాలు అభిప్రాయపడ్డారు. అయితే మమత విద్యార్థి దశ నుంచి సాగిస్తున్న పోరాటాలను చూస్తున్నామని, ఆమె తమ ప్రాంతపు ఆడపడుచే అని స్థానిక కేఫ్ నిర్వాహకుడు అమోల్ సగర్వంగా చెబుతున్నారు. ఎవరి ధీమా వారికున్నా.. ఉత్కంఠ మాత్రం తారాస్థాయికి చేరుకుంది.కీలక సమస్యలు.. వ్యాపారుల ఆందోళనసరిహద్దు చొరబాట్లు, ఆర్జీ కర్ ఉదంతం, రాష్ట్ర ఆర్థిక మందగమనం లాంటివి ఈ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా మారాయి. 1953లో కచ్ నుంచి వలస వచ్చిన వ్యాపారి భరత్ మెహతా మాట్లాడుతూ.. ‘భవానీపూర్లో గెలవడం మమతకు ప్రతిష్టాత్మక సమస్య. సువేందు ఇక్కడ పోటీ చేసి తప్పు చేశారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల వల్ల మమత మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. ఆర్థిక మందగమనం వల్ల బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్లకు ఇప్పటికే చాలా మంది వ్యాపారులు వలస వెళ్లిపోతున్నారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.స్థానికత వర్సెస్ వలసదారుల విభజనఈ ఎన్నికల్లో బెంగాలీ, నాన్-బెంగాలీ విభజన స్పష్టంగా కనిపిస్తోంది. మహిళలకు బెంగాల్ సురక్షితమైన ప్రాంతమని యువ ఓటరు, బ్యాంకర్ కరబి ఘోష్ బలంగా విశ్వసిస్తున్నారు. మమతా దీదీ తమకు ఎంతో సాయం చేశారని, తమ గురుద్వారాను సైతం సందర్శించారని ట్యాక్సీ డ్రైవర్ సుఖ్విందర్ సింగ్ కృతజ్ఞతగా గుర్తుచేసుకున్నారు. కానీ బీహార్కు చెందిన మరో ట్యాక్సీ డ్రైవర్ రతన్ కుమార్ మాత్రం.. ‘మేము గతంలో తృణమూల్కే ఓటేశాం, కానీ ఈసారి ప్రజలు ‘పరివర్తన్’ (మార్పు) కోరుకుంటున్నారు’ అని అన్నారు.ఎన్నికల జ్వరంతో నిద్రలేని రాత్రులుపోలింగ్కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో భవానీపూర్ వీధులన్నీ రాజకీయ వేడితో మరింత హీటెక్కిపోతున్నాయి. పగటి ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు టీఎంసీ, బీజేపీ నాయకులు రాత్రి వేళల్లో సమావేశాలు, భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కాషాయ జెండాలతో సువేందు వర్గం, తమదైన శైలిలో దీదీ వర్గం ప్రచారాలు హోరెత్తిస్తుండటంతో ఈ ప్రాంతమంతా అర్ధరాత్రి వరకు కోలాహలంగా ఉంటోంది.ఇది కూడా చదవండి: రగిలిపోతున్న బెంగాల్ ఓటర్లు.. ఈ సారీ తగ్గేదేలే? -
‘ఇది ఎన్నికల పోరాటం కాదు.. సిద్ధాంతాల పోరాటం’
హుగ్లీ: ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అమ్మకానికి పెట్టారంటూ కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ప్రచారంలో భాగంగా హుగ్లీ జిల్లాలోని శ్రీరాంపూర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మోదీ ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో ద్వేషాన్ని, భయాన్ని నింపుతారు. ఇది ఎన్నికల పోరాటం కాదు.. సిద్ధాంతాల పోరాటం’’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.ప్రధాని మోదీతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలపై తీవ్ర స్థాయిలో రాహుల్ విమర్శలు గుప్పించారు. ఇద్దరివి.. అవినీతి, బెదిరింపులతో ఒకే రకమైన పాలన విధానాలు అంటూ ఆరోపించారు. మమతా బెనర్జీ.. మోదీ కంటే ఏమాత్రం తక్కువ అవినీతిపరురాలు కాదు. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ రెండూ భయాందోళనలు, అరాచక వాతావరణాన్ని పెంచి పోషిస్తున్నాయని రాహుల్ అన్నారు.‘‘మమతా నేరుగా బీజేపీతో పోరాడదు కాబట్టే ఈడీ కేసులు లేవు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తనపై అనేక కేసులు నమోదు చేసింది.. కానీ మమతా బెనర్జీపై ఒక్క కేసు కూడా లేదు. ఆమె బీజేపీతో నేరుగా పోరాడకపోవడమే దీనికి కారణమంటూ రాహుల్ ఆరోపించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తనను వరుసగా ఐదు రోజుల పాటు 55 గంటల సేపు ప్రశ్నించిందని గుర్తు చేస్తూ.. మమతా బెనర్జీని ఎన్ని గంటల పాటు విచారించారు?’’ అంటూ రాహుల్ ప్రశ్నించారు. తాను ప్రస్తుతం బెయిల్పై ఉన్నానని, తన ఇంటిని లాక్కున్నారని, తన లోక్సభ సభ్యత్వాన్ని కూడా తొలగించారని రాహుల్ చెప్పారు. "నాపై 36 కేసులు ఉన్నాయి. ప్రతి 10-15 రోజులకు ఒకసారి జార్ఖండ్, మహారాష్ట్ర, యూపీ, గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాలకు కోర్టు కేసుల కోసం తిరగాల్సి వస్తోంది" అని ఆయన పేర్కొన్నారు.‘‘కేవలం కాంగ్రెస్ మాత్రమే బీజేపీతో సైద్ధాంతికంగా పోరాడుతోందని, అందుకే మోదీ తనను, పార్టీ అధ్యక్షుడు ఖర్గేను ఎప్పుడూ టార్గెట్ చేస్తారు. బెంగాల్ ఎన్నికలు ముగియనివ్వండి. ఆ తర్వాత మోదీ ఒక్క మాట కూడా మమతకు వ్యతిరేకంగా మాట్లాడరు. పశ్చిమ బెంగాల్లో పరిశ్రమలను మమత నాశనం చేశారు. నిరుద్యోగాన్ని పెంచారు ఆరోపించారు. బెంగాల్లో ఉద్యోగం రావాలంటే టీఎంసీలో బంధువులు ఉండాలి. లేకపోతే రాదు’’ అంటూ రాహుల్ విమర్శించారు. -
భారత్ భవిష్యత్తు బెంగాల్తోనే.. సీఎం హాట్ కామెంట్స్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్కతాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బెంగాల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని, ఈ ఎన్నికలు కేవలం బెంగాల్కే కాకుండా యావత్ భారతదేశ భవిష్యత్తుకు అత్యంత కీలకమని పేర్కొన్నారు. చొరబాటుదారుల ముప్పును అరికట్టకపోతే తూర్పు భారతదేశ రూపురేఖలే మారిపోతాయని హెచ్చరిస్తూ.. ముస్లిం ఓటుబ్యాంకు రాజకీయాలపై మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు.200 సీట్లతో బీజేపీ సునామీపశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తున్నదని హిమంత బిశ్వ శర్మ ధీమా వ్యక్తం చేశారు. తొలి విడత పోలింగ్లో బీజేపీకి వచ్చిన మద్దతుతో రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయిందని, బీజేపీ 200కు పైగా స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. ఈ ఎన్నికల్లో వీస్తున్న గాలిని ‘బీజేపీ సునామీ’గా అభివర్ణించిన ఆయన, రాష్ట్రంలో మార్పు తథ్యమని అన్నారు.పెను ముప్పుటీఎంసీ ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బంగ్లాదేశ్ చొరబాటుదారులను ప్రోత్సహిస్తోందని సీఎం హిమంత మండిపడ్డారు. సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి బీఎస్ఎఫ్ (బీఎస్ఎఫ్)దళాలకు మమతా బెనర్జీ ప్రభుత్వం స్థలం ఇవ్వడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ చొరబాట్లను అడ్డుకోకపోతే భవిష్యత్తులో దేశంలోని తూర్పు ప్రాంతమంతా బంగ్లాదేశ్లో కలిసిపోతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశాన్ని సురక్షితంగా ఉంచుకోవాలంటే బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.ప్రమాదంలో హిందువుల జనాభాఅసోం, బెంగాల్ రాష్ట్రాల్లో వేగంగా మారుతున్న జనాభా సమీకరణలపై శర్మ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అసోంలో 60 శాతం హిందువులు, 40 శాతం ముస్లింలు ఉన్నారని.. రాబోయే రెండు దశాబ్దాల్లో అసోం, బెంగాల్ రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ప్రభావం బీహార్, జార్ఖండ్ సహా ఈశాన్య రాష్ట్రాలన్నింటిపై పడుతుందన్నారు. కాగా బెంగాల్లో ఏప్రిల్ 23న బెంగాల్ తొలి దశ పోలింగ్ ముగియగా, ఏప్రిల్ 29న రెండో దశ జరగనుంది. ఫలితాలు మే 4న వెల్లడికానున్నాయి.ఇది కూడా చదవండి: గేటుకి వేలాడిన గజదొంగ.. గ్రేట్ ఎస్కేప్ ఫెయిల్! -
రీపోలింగ్పై ఈసీ సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ)కీలక ప్రకటన చేసింది. మొదటి విడత పోలింగ్ ముగిసిన ఈ రెండు రాష్ట్రాల్లో ఎలాంటి రీపోలింగ్ నిర్వహించబోమని స్పష్టం చేసి, పలువురి ఊహాగానాలకు తెరదించింది. ఏప్రిల్ 23న (2026) జరిగిన పశ్చిమ బెంగాల్ (152 స్థానాలు), తమిళనాడు (234 స్థానాలు) ఎన్నికల్లో ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదని ఈసీ అధికారులు తేల్చి చెప్పారు.బెంగాల్లోని 44,376 పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని వెల్లడించారు. మిగిలిన 142 స్థానాలకు బెంగాల్లో ఏప్రిల్ 29న రెండో విడత పోలింగ్ జరగనుంది. తొలి విడత తరహాలోనే రెండో విడతను కూడా ప్రశాంతంగా, కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహించాలని బీజేపీ నేత తపస్ రాయ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించిన ఐదుగురు పోలీస్ అధికారులపై ఈసీ కొరడా ఝుళిపించింది. డైమండ్ హార్బర్ అదనపు ఎస్పీ సందీప్ గరాయ్, ఎస్డీపీఓ సజల్ మండల్, ఇన్స్పెక్టర్ మౌసమ్ చక్రవర్తితో పాటు ఫాల్టా, ఉస్తి పోలీస్ స్టేషన్ల అధికారులైన అజయ్ బాగ్, శుభేచ్ఛా బాగ్లను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వీరందరిపై కఠిన క్రమశిక్షణ చర్యలకు కూడా ఆదేశాలు జారీ చేసింది.విజయంపై అంచనాలు..ఎన్నికల ఫలితాలపై అటు అధికార తృణమూల్ కాంగ్రెస్, ఇటు మిత్రపక్షాలు తీవ్ర ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బెంగాల్లో మొదటి విడత ఎన్నికల్లోనే టీఎంసీ ‘సెంచరీ (100+ స్థానాలు)’ కొట్టేసిందని, ఈ పరిణామంతో బీజేపీ శిబిరంలో వణుకు పుట్టిందని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించారు. మరోవైపు, నార్త్ 24 పరగణాల జిల్లాలో టీఎంసీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా వరుసగా నాలుగోసారి మమతా బెనర్జీ బాధ్యతలు చేపట్టడం ఖాయమని అన్నారు.ఇది కూడా చదవండి: రగిలిపోతున్న బెంగాల్ ఓటర్లు.. ఈ సారీ తగ్గేదేలే? -
విజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఓటర్లకు, తన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. రాజకీయాల్లో తమను తక్కువ అంచనా వేసిన వారికి ప్రజలు చేతలతో సమాధానం చెప్పారని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలు అంటే కేవలం అనుభవం ఉన్న వారికి లేదా పదవులను అనుభవించే వారికి మాత్రమే పరిమితం అని భావించే వారి అంచనాలను సామాన్య ప్రజలు చిత్తు చేశారని విజయ్ వ్యాఖ్యానించారు. చారిత్రాత్మక పోలింగ్ తమిళనాడు ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85 శాతం పోలింగ్ నమోదు కావడం ఒక గొప్ప మైలురాయి అని, ఇది నిజమైన ప్రజాస్వామ్య పండుగ అని ఆయన అభివర్ణించారు. రాజకీయాలకు దూరంగా ఉంటారని భావించే యువత, మహిళలు ఈసారి పెద్ద ఎత్తున ఓటు వేయడం ఒక చారిత్రాత్మక మార్పు అని పేర్కొన్నారు. కేవలం ఓటు వేయడం కోసం విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఖర్చుతో వచ్చిన వారి ప్రజాస్వామ్య స్ఫూర్తికి శిరస్సు వంచి తాను నమస్కరిస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. పిల్లలకు స్పెషల్ థ్యాంక్స్ కుటుంబసభ్యులను పోలింగ్ కేంద్రాలకు నడిపించిన తన ‘కుట్టి ఫ్రెండ్స్’ (పిల్లలకు) ‘విజయ్ మామ’ ప్రత్యేక ధన్యవాదాలు అని వ్యాఖ్యలు చేశారు. విమర్శకులకు గట్టి కౌంటర్గా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి విజయ్ వ్యాఖ్యలు చేస్తూ, “వీరికి రాజకీయాల గురించి ఏం తెలుసు? ఎలా తట్టుకోగలరు? అని ఎగతాళి చేసిన వారికి, పోలింగ్ రోజున క్రమశిక్షణతో పని చేసి తమ చేతలతోనే సమాధానం చెప్పారని విజయ్ ప్రశంసించారు. బూత్ ఏజెంట్లు, పార్టీ శ్రేణులు రాత్రింబవళ్లు కష్టపడి పని చేయడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన కొనియాడారు. “రాజకీయాలను ఒక నిర్దిష్ట పరిధిలో ఉంచాలనుకున్న వారి అంచనాలు సామాన్య ప్రజల దెబ్బకు చెల్లాచెదురయ్యాయని, ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే అని ముగించారు. -
రగిలిపోతున్న బెంగాల్ ఓటర్లు.. ఈ సారీ తగ్గేదేలే?
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 92.9 శాతం రికార్డ్ స్థాయి పోలింగ్ నమోదు కాగా.. ఇప్పుడు అందరి దృష్టి బుధవారం జరగనున్న రెండో విడతపైనే పడింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతవుతున్నాయనే భయం, తీవ్రమైన రాజకీయ ఉత్కంఠ నడుమ.. ఫేజ్-2లో కూడా ఓటర్లు ఉప్పెనలా పోలింగ్ కేంద్రాలకు బారులు తీరడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.ఆస్పత్రి నుంచి.. ముంబై నుంచి..ఓటు హక్కు ఎక్కడ కోల్పోతామో అనే ఆందోళన బెంగాల్ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. క్యాన్సర్ చికిత్సను సైతం వాయిదా వేసుకుని ఓటు వేసేందుకు ఒకరు సిద్ధపడగా.. ముంబైలో పనిచేసే రొకిడా బీబీ లాంటి వలస కార్మికులు రూ.8,000 ఖర్చు పెట్టి మరీ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ‘గతంలో ఓటు వేయలేదు, కానీ ఇప్పుడు వేయకపోతే మళ్లీ అవకాశం రాదేమో’ అన్న వారి మాటలే ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి. అర్బన్ ఓటర్లు, ఇతర రాష్ట్రాల్లో ఉండే నిపుణులు సైతం రిటర్న్ టికెట్లు బుక్ చేసుకుని మరీ ఓటు వేసేందుకు తరలి వస్తున్నారు.45 లక్షల పేర్లు గల్లంతు.. వణికిపోతున్న జిల్లాలురెండో దశ ఎన్నికలు జరగనున్న నార్త్ 24 పరగణాలు, సౌత్ 24 పరగణాలు, కోల్కతా (నార్త్, సౌత్), హౌరా, హుగ్లీ, నదియా, ఈస్ట్ బర్ద్వాన్ తదితర ఎనిమిది జిల్లాల్లోని 142 నియోజకవర్గాల్లో ఏకంగా 45 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించడం సంచలనంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా తీసేసిన పేర్లలో సగానికి పైగా ఇక్కడే ఉండటం గమనార్హం. కేవలం నార్త్ 24 పరగణాల్లోనే 10 లక్షలు, సౌత్ 24 పరగణాల్లో 9.1 లక్షల పేర్లు జాబితాలో లేవు. నదియా జిల్లాలోని మతువా సామాజిక వర్గ ప్రాంతాల్లో అత్యధికంగా 78% తొలగింపులు జరగడం ఓటర్లలో తీవ్ర ఆందోళన పెంచుతోంది.రాజకీయ ప్రకంపనలు.. భారీ పోలింగ్ అంచనాఈ పరిణామాలపై బెంగాల్ రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల పేర్లు పెద్ద ఎత్తున తొలగించడం వల్లే వారు కసితో ఓటేయడానికి వస్తున్నారని తృణమూల్ మంత్రి శశి పంజా ధీమా వ్యక్తం చేయగా.. అధికార పార్టీపై ఉన్న ప్రజా వ్యతిరేకతే ఈ భారీ పోలింగ్కు కారణమని ప్రతిపక్ష నేత సువేందు అధికారి విమర్శించారు. గల్లంతు భయాలు, వలస కార్మికుల రాక, హోరాహోరీ రాజకీయ పోరు నేపథ్యంలో ఈసారి కూడా పోలింగ్ 90 శాతానికి పైగానే (రికార్డు స్థాయిలో) నమోదయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇది కూడా చదవండి: సముద్రంలో ఉద్రిక్తత: ఇరాన్కు అమెరికా మరో షాక్ -
మోదీజీ.. యమునలో స్నానం చేయండి: మమత సవాల్
కోల్కత్తా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార టీఎంసీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్కు చేరుకుంది. తాజాగా ప్రధాని మోదీ హుగ్లీ నదిలో పడవ షికారు చేయడం.. గంగా, హుగ్లీ నది గురించి మాట్లాడటంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ప్రధాని మోదీ యమునా నదిలో స్నానం చేయాలని సవాలు విసిరారు.ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హౌరాలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. గంగానది శుభ్రంగా ఉందని, యమునా మాత్రం కాలుష్యంతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. “ఢిల్లీ యమునాలో ఒకసారి స్నానం చేసి చూపించండి. అది పూర్తిగా కాలుష్యంతో నిండిపోయింది. మీరు యమునాను శుభ్రం చేయలేరు, కానీ ఇక్కడ గంగానది మీద ఫోటోలు దిగడానికి వస్తారు” అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదే సమయంలో ప్రధానమంత్రి పర్యటనను మమతా బెనర్జీ స్వాగతించారు. కానీ నదిని శుభ్రపరచడానికి మరియు దాని నదీ తీరాన్ని సుందరీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం, కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ను ప్రశంసించారు. రాష్ట్రంలో ఓట్లు రాబట్టడానికే ఆయన పడవ ప్రయాణం చేశారని ఆమె ఆరోపించారు. కానీ, బెంగాలీలు అంత అమాయకులు కాదంటూ వ్యాఖ్యానించారు.హూగ్లీలో మోదీ పడవ షికారు.. ఇక, అంతకుముందు ప్రధాని మోదీ.. హూగ్లీ నదిలో కొద్దిసేపు బోటు షికారు చేశారు. అక్కడి రమణీయమైన దృశ్యాలను వెంటతీసుకొచ్చిన తమ కెమెరాలో బంధించారు. గంగానదికి హూగ్లీ ఉపనది. ‘‘గంగానది అనేది ప్రతి ఒక్క బెంగాళీ మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది. బెంగాల్ ఆత్మలో గంగానదీ సజీవంగా పారుతుంది. యావత్ మానవ నాగరికత స్ఫూర్తిని ఈ పవిత్ర నదీజలాలు వెంట తీసుకొచ్చాయి. ఈరోజు ఉదయం కోల్కతాలో హూగ్లీ నది హొయలను నా కెమెరా కంటితో చూశా. కొన్ని జ్ఞాపకాలను ఫొటోలుగా కెమెరాలో బంధించా. విద్యాసాగర్ సేతు, ప్రఖ్యాత హౌరా వంతెనను పడవలో ప్రయాణిస్తూ దగ్గర్నుంచి తిలకించి ముగ్ధుడినయ్యా. హూగ్లీ నదీతీరంలో కాసేపు గడిపి గంగామాత రుణం తీర్చుకునే సదవకాశం సంపాదించా’’అని అన్నారు. తాను తీసిన ఫొటోలను తర్వాత మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. -
విజయ్ ఒక ప్రయోగం.. మమత ఒక పాఠం!
ఒకరు వెండితెరను ఏలుతున్న మకుటం లేని మహారాజు, మరొకరు దశాబ్దాలుగా న్యాయ పోరాటాలతో గద్దెనెక్కిన విప్లవ జ్వాల. తమిళనాడులో ‘టీవీకే’ పార్టీతో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడమే తరువాయి.. దానికి మమతా బెనర్జీ మార్కు స్టైల్తో పోలికలు మొదలయ్యాయి. ఇద్దరి లక్ష్యం ఒక్కటే.. అదే అధికార పీఠం. ఈ నేపధ్యంలో ఈ ఇద్దరు దిగ్గజాల సత్తా ఏమిటనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.విజయ్: సైలెంట్ వేవ్విజయ్ బలమంతా యువత, మహిళా ఓటర్లే. సుమారు 15 లక్షల మంది యాక్టివ్ సభ్యులతో ఉన్న తన ఫ్యాన్స్ క్లబ్ను రాజకీయ పార్టీగా మార్చడం విజయ్ చేసిన మాస్టర్ స్ట్రోక్. అయితే మమతా బెనర్జీ లాగా విజయ్కి జైలుకెళ్లిన అనుభవం గానీ, లాఠీ దెబ్బలు తిన్న చరిత్ర గానీ లేదు. అయితే విక్రవాండి సభలో ఆయన చూపిన జనసమీకరణ చూస్తుంటే, మమత మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు చూపిన సత్తా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.మమత: అగ్నిపర్వతంలా..ఇక మమతా బెనర్జీ విషయానికొస్తే, ఆమె రూటే వేరు. కాంగ్రెస్ నుంచి విడిపోయి, తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించినప్పుడు ఆమెను అందరూ లైట్ తీసుకున్నారు. కానీ కమ్యూనిస్టుల కోటను కూల్చిన ఆమె వ్యూహాలు ఇప్పుడు విజయ్కి పాఠాలుగా మారాయి. విజయ్ సాఫ్ట్ పవర్ను నమ్ముకుంటే, మమత ‘మా, మాటి, మానుష్’ (తల్లి, మట్టి, మనుషులు) అనే ఎమోషనల్ సెంటిమెంట్తో జనాల్లోకి వెళ్లారు. విజయ్ సినిమాల ద్వారా ప్రజల గుండెల్లో ఉంటే, మమత తన నిరసనల ద్వారా ప్రజల కళ్లముందు నిలిచారు.విజయ్ పోరాటం వీరితోనే..తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఒక పక్కా సిద్ధాంతం చుట్టూ తిరుగుతాయి. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో బీజేపీని ఎదుర్కొంటున్న తీరు, విజయ్కు ఒక రోల్ మోడల్లా కనిపిస్తోంది. కానీ విజయ్ ముందున్న సవాలు ఏంటంటే.. ఎం.కె. స్టాలిన్ వంటి బలమైన నాయకుడిని ఢీకొట్టడం. మమతకు లెఫ్ట్ పార్టీల రూపంలో శత్రువు ఉంటే, విజయ్కి అటు డీఎంకే, ఇటు బీజేపీ రూపంలో రెండు సవాళ్లు ఎదురయ్యాయి.ఓటు బ్యాంకు లెక్కలువిజయ్ తన పార్టీ జెండాలోనూ, స్లోగన్స్లోనూ సెక్యులరిజాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. ఇది సరిగ్గా మమతా బెనర్జీ ఫార్ములానే! మైనారిటీ ఓట్లు మమతను ఎలాగైతే కాపాడుతున్నాయో, విజయ్ కూడా అదే మార్గంలో వెళ్లినట్లు కనిపిస్తోంది. అయితే మమతకు ఉన్న అడ్మినిస్ట్రేటివ్ అనుభవం విజయ్కి లేదు. సినిమా ఇమేజ్ ఓట్లుగా మారుతాయా లేదా అన్నదే ఇప్పుడు దేశమంతా ఉత్కంఠగా చూస్తున్న అతిపెద్ద ప్రశ్న.ఫైనల్ కంక్లూజన్: సత్తా ఎవరిది?నిజానికి వీరిద్దరి మధ్య పోలిక కేవలం ‘జనబలం’ విషయంలోనే! మమత ఒక సక్సెస్ ఫుల్ ‘రెబెల్’. విజయ్ ఒక రైజింగ్ ‘స్టార్’. మమత రాజకీయాల్లో తన సత్తాను నిరూపించుకుని సీఎం కుర్చీలో కూర్చుంటే, విజయ్ ఇంకా ‘నాయకుడు’ అనిపించుకోవాల్సిన దశలో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, విజయ్ ఒక ప్రయోగం అయితే, మమత ఒక పాఠం!ఇది కూడా చదవండి: విజయ్ రణభేరి: పళనిస్వామికి జీవన్మరణం.. స్టాలిన్కు ప్రతిష్టాత్మకం! -
మలి దశ.. మహా సంగ్రామం!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరుకుంది. రాష్ట్ర భవితవ్యాన్ని, రాబోయే ఐదేళ్ల అధికార పీఠాన్ని శాసించే అత్యంత కీలకమైన రెండో దశ పోలింగ్కు రంగం సిద్ధమైంది. తొలి దశలో 152 స్థానాలకు ప్రశాంతంగా పోలింగ్ ముగియగా..29న మిగిలిన 142 స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ బెంగాల్, కోల్కతా, హౌరా, హూగ్లీ, దక్షిణ 24 పరగణాల జిల్లా పరిధిలో జరగనున్న ఈ పోరును అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీలు జీవన్మరణ సమస్యగా తీసుకున్నాయి. దశాబ్దన్నర కాలంగా కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకోవాలని దీదీ సైన్యం సర్వశక్తులూ ఒడ్డుతుండగా.. ఎలాగైనా కోటను బద్దలు కొట్టి తీరాలని కమలనాథులు వ్యూహాలకు పదును పెట్టారు. సమరానికి సై అంటున్న కీలక నియోజకవర్గాలు ఇవే.. : రెండో దశలో అర్బన్, సెమీ–అర్బన్, చారిత్రక ప్రాధాన్యం ఉన్న అనేక నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో గెలుపు ఆయా పార్టీల నైతిక స్థైర్యాన్ని నిర్ణయించనున్నాయి. → సింగూరు (హూగ్లీ జిల్లా): బెంగాల్ రాజకీయాల్లో సింగూరుకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. టాటా నానో ప్లాంట్కు వ్యతిరేకంగా మమతా బెనర్జీ చేసిన చారిత్రక పోరాటం టీఎంసీని అధికారంలోకి తెచ్చింది. అయితే, ఇక్కడ ఇప్పుడు పారిశ్రామికీకరణ, ఉపాధి లేమి ప్రధాన సమస్యలుగా మారాయి. ఈసారి ఇక్కడ బీజేపీ గట్టి పోటీ ఇస్తుండటంతో, సింగూరులో మళ్లీ సెంటిమెంట్ గెలుస్తుందా లేక అభివృద్ధి నినాదం నెగ్గుతుందా అనేది ఆసక్తికరం. → భవానీపూర్ (కోల్కతా): ఇది ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత పట్టున్న వీఐపీ నియోజకవర్గం. ఇక్కడ తమ ఆధిపత్యాన్ని ఏకపక్షంగా కొనసాగించడం టీఎంసీకి ప్రతిష్టాత్మకం. ఈ స్థానంలో మెజారిటీ తగ్గకుండా చూసుకునే బాధ్యతను టీఎంసీ అగ్రనాయకత్వం భుజాన వేసుకుంది. → డైమండ్ హార్బర్ (దక్షిణ 24 పరగణాలు): మమత మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కంచుకోట ఇది. ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీ ప్రాబల్యాన్ని దెబ్బకొట్టాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. → టోలీగంజ్ (కోల్కతా): టాలీవుడ్ (బెంగాలీ సినిమా) పరిశ్రమకు గుండెకాయ లాంటి ఈ నియోజకవర్గంలో గ్లామర్తో పాటు రాజకీయ వేడి ఎక్కువే. ఇక్కడ సినీ ప్రముఖుల ప్రభావం ఎక్కువ. ఇరు పార్టీలు ఇక్కడ హోరాహోరీగా తలపడుతున్నాయి. → హౌరా సెంట్రల్, శివపూర్ (హౌరా జిల్లా): పారిశ్రామిక ప్రాంతాలైన ఈ నియోజకవర్గాల్లో కార్మికులు, మైనార్టీ ఓటర్లు కీలకం. ఇక్కడ మూతపడిన పరిశ్రమలు, మౌలిక సదుపాయాల లేమిని ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకున్నాయి. → జాదవ్పూర్, కసబ (కోల్కతా పరిసరాలు): విద్యావంతులు, ఉద్యోగులు, మేధావులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ చూస్తుండగా.. ఐటీ, ఉపాధి నినాదంతో, నూతన టెక్ పార్కుల ప్రగతితో టీఎంసీ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. టీఎంసీకి కలిసొచ్చే అంశాలు.. సవాళ్లు మమతా సర్కార్కు క్షేత్రస్థాయిలో ఉన్న పటిష్టమైన కేడర్ అతిపెద్ద ఆయుధం. ముఖ్యంగా ‘లక్ష్మీర్ భాండార్’, ’కన్యాశ్రీ’లాంటి మహిళా సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో టీఎంసీకి ఓటు బ్యాంకుగా మారాయి. మహిళా ఓటర్లు ఆ పార్టీకి వెన్నెముకగా నిలుస్తున్నారు. అయితే, స్థానిక నేతలపై ఉన్న అవినీతి ఆరోపణలు (ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం, రేషన్ కుంభకోణం), సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం వల్ల సహజంగానే వ్యక్తమయ్యే ప్రభుత్వ వ్యతిరేకత వారికి ప్రధాన సవాల్. బీజేపీ ఆశలు.. ఆందోళనలు ప్రతిపక్ష నేత సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ఈసారి మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఏకీకృతం చేయడంలో, అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సఫలమవుతోంది. మైనార్టీల బుజ్జగింపు రాజకీయాలను ఎండగడుతూ మెజారిటీ వర్గాలను ఏకం చేసే వ్యూహం అమలు చేస్తోంది. అయితే, దక్షిణ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడం ప్రధాన లోపం. (ఆచార్య శరత్ చంద్ర ముక్తవరం) -
బెంగాల్ ఫైల్స్ బయటపెడతాం
కోల్కతా: పశ్చిమబెంగాల్ రెండో దశ ఎన్నికల ప్రచారసభల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పాలనపై ప్రధాని మోదీ విమర్శల నిప్పులు కురిపించారు. శుక్రవారం నార్త్ 24 పరగణాల జిల్లా, జాదవ్పూర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని బారూయ్పూర్, డమ్డమ్ లోక్సభ నియోజకవర్గంలోనే పానీహటిల్లో ఎన్నికల ప్రచారర్యాలీల్లో మోదీ ప్రసంగించారు. ‘‘టీఎంసీ అంటేనే మహిళా వ్యతిరేక పార్టీ. న్యాయం కావాలని బెంగాలీ మహిళలు అడిగితే టీఎంసీ ప్రభుత్వం ఇల్లుదాటి బయటకు రాకండి అని ఉచిత సలహాలు పడేస్తుంది. మేం అధికారంలోకి రాగానే టీఎంసీ ప్రభుత్వం మహిళలపై చేసిన అకృత్యాలు, ప్రజలపై దౌర్జన్యం, దోపిడీ సంబంధిత ప్రతి ఫైల్ను బయటపెడతాం. మహిళలపై అరాచకాల ప్రతి ఫైల్ను తెరుస్తాం. న్యాయం చేస్తాం. ఇది మోదీ గ్యారంటీ’’అని మోదీ అన్నారు. ‘‘తొలిదఫా ఎన్నికల్లో పోలింగ్శాతం భారీస్థాయిలో నమోదైంది. ఇది టీఎంసీ సాగించిన మహా ఆటవిక పాలన అంతంకాబోతోందనడానికి సూచిక. ఇది టీఎంసీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలంటూ బీజేపీ చేసిన ప్రచారానికి దక్కిన భారీ మద్దతు. 3.6 కోట్ల మంది ఓటర్లు ఏకంగా 93 శాతం పోలింగ్ నమోదుచేసి రాష్ట్రంలో మార్పురాబోతోందని స్పష్టంచేశారు’’అని మోదీ అన్నారు. కొన్ని నెలల క్రితం ఆర్జీకర్ బోధనాస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటనను మోదీ గుర్తుచేశారు. ‘‘తన కూతురు వైద్యురాలిగా మారేందుకు ఒక తల్లి ఎంతగానో శ్రమించింది. రాష్ట్రంలోని టీఎంసీ ప్రభుత్వం ఆ కుమార్తెను తల్లికి దూరం చేసింది. మేం ఆ అత్యాచార బాధితురాలి తల్లి రత్నా దేబ్నాథ్ను పానిహటీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చాం. సందేశ్ఖాలీ అరాచకాల బాధితుల్లో ఒక మహిళను సైతం అభ్యర్థిగా బరిలో నిలిపాం. మమతా బెనర్జీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్య దేవాలయాలను నేలమట్టం చేసింది. ఓటర్లు కదిలొచ్చి స్వయంగా మళ్లీ బ్యాలెట్ ఓట్ల ద్వారా ఆ ఆలయాలను పునర్నిర్మిస్తున్నారు. తొలి దశ పోలింగ్లో భారీ ఓటింగ్తో ఇది మొదలైంది. రెండో దశ పోలింగ్తో నిర్మాణం సంపూర్ణమవుతుంది. అప్పుడు మేం గెలిచి ప్రజాస్వామ్య ఆలయంపై విజయపతాక ఎగరేస్తాం. ఓటింగ్ వరద చూసి టీఎంసీ నేతలు వణికిపోతున్నారు. కోపంతో ఓటర్లు, బీజేపీ కార్యకర్తలను టీఎంసీ గూండాలు బెదిరిస్తున్నారు. తొలిదఫా ఎన్నికల ఓటింగ్ అధికార పార్టీ ఓటమిని కళ్లకు కట్టింది. మే 4వ తేదీన ఫలితాలొస్తాయి. అప్పుడు టీఎంసీ గూండాలకు రాష్ట్రంలో దాక్కోడానికి చోటే ఉండదు. మార్పు కావాల్సిందే... బీజేపీ సర్కార్ రావాల్సిందే అని బెంగాల్ ప్రతిధ్వనిస్తోంది’’అని మోదీ అన్నారు. ఇది పోరాటాల గడ్డ.. ‘‘ఎన్నికలు అనేవి అతిపెద్ద సైద్ధాంతిక పోరాటం. పశ్చిమబెంగాల్ అనేది పోరాటాల గడ్డ. ధైర్యవంతుల అడ్డా. దాస్యశృంఖలాలు తెంపాలంటే రక్తం ధారపోయండి మీకు స్వేచ్ఛా స్వాతం్రత్యాలను సిద్ధింపజేస్తానని నేతాజీ సెలవిచ్చారు. ఇప్పుడు బెంగాల్లో మరో విప్లవం రావాల్సిన తరుణమొచ్చింది. మీ ఓటుతోనే ఈ విప్లవం సుసాధ్యం. ఏళ్ల కష్టాలను బీజేపీ ఒక్క దెబ్బతో తొలగించబోతోంది. భయం, అవినీతి, సిండికేట్ పాలన, మహిళలపై దౌర్జన్యాలు, నిరుద్యోగం, బలవంతపు వలసలు, చొరబాటుదారుల ఆక్రమణల నుంచి బీజేపీ శాశ్వత పరిష్కారం చూపిస్తుంది’’అని మోదీ హామీ ఇచ్చారు. ‘మీ సోదరుడిగా చెబుతున్నా. మహిళల భద్రతే మాకు అత్యంత ముఖ్యం. బెంగాల్లో మహిళా శక్తే ఈ రాష్ట్రంలో నూతన శకాన్ని లిఖించబోతోంది’అని అన్నారు.దశాబ్దానికి మించి దారుణ దోపిడీ ‘‘గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుంటోంది. అవినీతి, చొరబాట్లతో రాష్ట్రం పరువు తీస్తోంది. బొగ్గు, ఇసుక, రేషన్, చిట్ఫండ్ ఇలా ప్రతిదాంట్లో కుంభకోణాలుచేశారు. అవినీతి మరకలు అంటని రంగమే లేదు. ఉన్నత విద్యా ప్రమాణాలతో భాసిల్లిన జాదవ్పూర్ వర్సిటీ వంటి ప్రతిష్టాత్మకవర్సిటీలను రాజకీయ క్రీడాస్థలిగా మార్చేసింది. విద్యార్థులతో బలవంతంగా ధర్నాలు, నిరసన ర్యాలీలు చేయిస్తున్నారు. ఇలాంటి దారుణాలకు మేం వచ్చాక చరమగీతం పాడుతాం. చిన్న దుకాణదారులు మొదలు పెద్ద వ్యాపారులదాకా, ట్యాక్సీ డ్రైవర్లు మొదలు రిక్షావాలాలదాకా, ప్రభుత్వ ఉద్యోగులు మొదలు పోలీస్లదాకా అందరూ ధైర్యంగా కమలదళానికి దన్నుగా నిలుస్తున్నారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వైద్యులు సైతం బీజేపీకే మద్దతు పలుకుతున్నారు. తొలిదఫాలో తొలిసారి ఓటేసిన వాళ్లూ మాకే అండగా నిలబడ్డారు. ఇక మీవంతు’’అంటూ యువ ఓటర్లకు మోదీ పిలుపునిచ్చారు.హూగ్లీలో మోదీ పడవ షికారు ఎన్నికల ప్రచారం కోసం కోల్కతాకు వచ్చిన మోదీ అక్కడి ప్రిన్సిప్ ఘాట్కు చేరుకుని హూగ్లీ నదిలో కొద్దిసేపు బోటు షికారు చేశారు. అక్కడి రమణీయమైన దృశ్యాలను వెంటతీసుకొచ్చిన తమ కెమెరాలో బంధించారు. గంగానదికి హూగ్లీ ఉపనది. ‘‘గంగానది అనేది ప్రతి ఒక్క బెంగాళీ మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది. బెంగాల్ ఆత్మలో గంగానదీ సజీవంగా పారుతుంది. యావత్ మానవ నాగరికత స్ఫూర్తిని ఈ పవిత్రనదీజలాలు వెంటతీసుకొచ్చాయి. ఈరోజు ఉదయం కోల్కతాలో హూగ్లీ నది హొయలను నా కెమెరా కంటితో చూశా. కొన్ని జ్ఞాపకాలను ఫొటోలుగా కెమెరాలో బంధించా. విద్యాసాగర్ సేతు, ప్రఖ్యాత హౌరా వంతెనను పడవలో ప్రయాణిస్తూ దగ్గర్నుంచి తిలకించి ముగ్ధుడినయ్యా. హూగ్లీ నదీతీరంలో కాసేపు గడిపి గంగామాత రుణం తీర్చుకునే సదవకాశం సంపాదించా’’అని అన్నారు. తాను తీసిన ఫొటోలను తర్వాత మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేశారు. మోదీ తన పడవలో షికారుకు రావడంతో పడవనడిపే గౌరంగా బిశ్వాస్ ఆనందం వ్యక్తంచేశారు. ‘‘ప్రధాని రాబోతున్నారని నాకు ముందస్తుగా ఎవరూ చెప్పలేదు. హఠాత్తుగా అధికారులు వచ్చి షికారుకు వస్తావా? అని అడిగారు. సరేనన్నా. హఠాత్తుగా మోదీ వచ్చి పడవలో కూర్చున్నారు. గంటసేపు నదిలో తిప్పా. రూ.1,000 ఇచ్చారు’’అని బిశ్వాస్ వెల్లడించారు. -
రేస్ స్టార్
వైట్ అండ్ వైట్ సూట్, కళ్ళకి నల్ల కళ్ళజోడు... గంభీరమైన చూపు... తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బూత్ దగ్గర కనిపించిన అజిత్.. ఓటర్లు రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్నా, ఉదయం అందరికంటే ముందు వచ్చి ఓటు వేసిన అజిత్ గురించే తమిళనాడు మొత్తం ఈరోజు మాట్లాడింది. అజిత్ ను చూస్తే ఎంజిఆర్ను చూసినట్లే ఉందంటూ సామాన్య ప్రజలు మాట్లాడుకున్నారు.సినిమాల్లోనే కాదు సినీ ప్రపంచానికి ఆవల కూడా అజిత్ జీవితం ఆసక్తికరం. ఒకసారి ఫోటోగ్రఫీ, మరోసారి డ్రోన్ టెక్నాలజీ, ఇప్పుడు కార్ రేసింగ్... సినిమాకు అవతల ఎన్నో....కార్ రేసింగ్... ఒక హీరోని తలచుకోగానే అతను నటించిన సినిమా సన్నివేశాలో, డైలాగులో డ్యాన్సులో...గుర్తుకొస్తాయి. కానీ తమిళ స్టార్ హీరో అజిత్ గుర్తొస్తే సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ నుంచి ఆయన కార్ రేసింగ్ హాబీ దాకా మరెన్నో గుర్తొస్తాయి. తెరపై టాప్ హీరోల్లో ఆయన ఒకరు కానీ తెరవెనుక మాత్రం ఆయన ఒక్కరే. ఆయన గత సెప్టెంబర్లో ‘54 ఏళ్ల అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో తన జట్టును కూడా ప్రారంభించారు. ఇటీవల బెల్జియంలో జరిగిన ఒక ప్రధాన కార్ రేసింగ్ ఈవెంట్లో అజిత్ జట్టు రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. అలా యూరప్లో విజయవంతమైన కార్ రేసింగ్ ప్రదర్శన తర్వాత తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడం కోసం చెన్నైకి తిరిగి వచ్చారు.సాల్ట్ అండ్ పెప్పర్... సాదా సీదాగా కనిపించే హీరోల్లో అజిత్ ముందున్నా ఆయన స్టైల్స్ ఎప్పుడూ టాక్ ఆఫ్ ద టౌన్ అవుతూనే ఉంటాయి. చెన్నై విమానాశ్రయంలో అజిత్ తన ట్రేడ్మార్క్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్తో సాధారణ దుస్తులలో రిలాక్స్డ్గా, నిరాడంబరంగా కనిపించినప్పటికీ.. ఆయన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అనేక మంది ఆయన లుక్ను ‘క్లాసీ లుక్’ అని ‘అప్రయత్నంగా స్టైలిష్’ అని అభివర్ణించారు. నిజానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేకమంది సెలబ్రిటీలకు అనుసరణీయంగా మారిన ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ పరిచయం చేసింది ఆయనే. ఆ మాట కొస్తే... ఆయన లుక్లో మాత్రమే కాదు ఆయన జీవితంలో కూడా వెలుగు నీడలు చాలానే ఉన్నాయి. ఆ విషయాలు ఆయనే పలు మార్లు పంచుకున్నారు కూడా.కొన్ని పరిణామాల నేపథ్యంలో ఇటీవలే అజిత్ దుబాయ్లో నివసించాలని నిర్ణయించుకున్నారు. ‘‘ప్రధానంగా మోటార్ స్పోర్ట్స్ కోసమే ఈ నిర్ణయం. ఎందుకంటే ప్రధాన సర్క్యూట్లు అన్నీ ఇక్కడే జరుగుతాయి’’ అని ఆయన చెప్పారు. గత 2025లో ‘విడాముయార్చి’ ’గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాలు విడుదలైన తర్వాత, అజిత్ తన దృష్టిని మరింత ఎక్కువగా రేసింగ్ వైపు మళ్లించారు.స్వంతంగా వంట... తన పనులన్నీ తానే స్వయంగా చూసుకోవాలనే తన నిర్ణయం గురించి మాట్లాడుతూ ‘నేను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను. నాకు అడ్వాన్స్ డ్గా ఆలోచించే అద్భుతమైన తల్లిదండ్రులు ఉన్నారు, మా పనులు స్వయంగా చేసుకునేలా మమ్మల్ని పెంచారు. మాకు చిన్న వయసులోనే వంట నేర్పించారు’ అని అజిత్ అంటారు.– ఎస్. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
మే 4న మిఠాయిలు, ఝాల్మురీ తినిపిస్తాం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మే 4వ తేదీయే ‘ఎక్స్పైరీ డేట్’ అని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. రాష్ట్రంలో 15 ఏళ్ల సిండికేట్ వ్యవస్థ, మహా జంగిల్రాజ్ అంతమైపోతుందని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ గురువారం బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు జరిగే మథురాపూర్, కృష్ణానగర్ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో ప్రసంగించారు. తొలి విడత ఎన్నికల్లో భారీగా ఓటింగ్ నమోదు కావడం తృణమూల్ కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఓటర్లకు అభినందనలు తెలియజేశారు. ఈ ఓటింగ్ను ‘మార్పు కోసం ఇచ్చిన తీర్పు’గా అభివరి్ణంచారు. బెంగాల్ ఓటర్ల నిర్ణయం మేరకు మార్పునకు అనుకూలంగా అఖండమైన తీర్పు రాబోతోందని అన్నారు. అధికార పార్టీ సృష్టించిన భయాన్ని బీజేపీ ఇస్తున్న భరోసా చిత్తుచిత్తుగా ఓడించబోతోందని స్పష్టంచేశారు. బీజేపీ ప్రభంజనం సృష్టించడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. దేశంలో భారీ ఓటింగ్ నమోదైన ప్రతిచోటా బీజేపీ విజయాలు సాధిస్తోందని వెల్లడించారు. వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక విజయోజత్సవాలు నిర్వహిస్తామని, బెంగాల్ ప్రజలకు మిఠాయిలతోపాటు ఝాల్మురీ పంపిణీ చేస్తామని మోదీ ప్రకటించారు. బెంగాల్లో తాను ఝాల్మురీ రుచిని ఆస్వాదించడం కొందరికి పిడుగుపాటు లాంటి షాక్ ఇచ్చిందన్నారు. తాను ఝాల్మురీ రుచి చూస్తే తృణమూల్ కాంగ్రెస్ నాయకులకు మిరపకాయల ఘాటు తగులుతోందని ఎద్దేవా చేశారు. తొలి దశ ఎన్నికల సందర్భంగా హింసాకాండను కనిష్ట స్థాయిలో ఉంచినందుకు ఎన్నికల సంఘాన్ని అభినందించారు. 50 ఏళ్ల బెంగాల్ ఎన్నికల చరిత్రలో హింసాత్మక ఘటనలు కనిష్ట స్థాయికి తగ్గడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే.. అరాచకం ఆగాలంటే బీజేపీ ముఖ్యమంత్రి రావాలి ‘‘బెంగాల్లో లంచాలు లేకుండా పనులు జరిగే రంగం ఒక్కటి కూడా లేదు. టీఎంసీ సిండికేట్లు, వారి మధ్యవర్తులు కట్ మనీ తీసుకోని రంగమే లేదు. 15 ఏళ్ల సిండికేట్ వ్యవస్థ, మహా జంగిల్రాజ్కు కాలం చెల్లిపోయింది. ఆ గడువు మే 4వ తేదీ. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసినందుకు మమతా బెనర్జీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో వంతెనలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. చివరకు ప్రజలను దగా చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు బెంగాల్లో అమలు కాకుండా అడ్డుకున్నారు. అభివృద్ధి పనుల కోసం కేంద్రమిచ్చిన నిధులను స్వాహా చేశారు. ఈ అరాచకం ఆగాలంటే రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రి రావాలి. 2029 నుంచి మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మేము సంకల్పిస్తే టీఎంసీ, కాంగ్రెస్ పారీ్టలు ఒక్కటై అడ్డుకున్నాయి. చొరబాట్లను సహించే ప్రసక్తే లేదు. చొరబాటుదార్లపై కఠినంగా వ్యవహరిస్తాం. బీజేపీ అధికారంలోకి వచ్చాక వారిని బెంగాల్ నుంచి బయటకు పంపిస్తాం. మన స్థానిక వనరులను దోచుకుంటూ దేశ భద్రతకు ముప్పుగా మారినవారిని ఎలా సహిస్తాం? చొరబాటుదార్లు సముద్ర మార్గాల ద్వారా రహస్యంగా మన దేశంలోకి ప్రవేశిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అండతో ఇక్కడ స్థిరపడుతున్నారు’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. -
పోటెత్తిన ఓటింగ్
కోల్కతా/చెన్నై: ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యానికి సంకేతంగా పశ్చిమ బెంగాల్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో, ఒకే విడతలో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. గురువారం 152 స్థానాలకు జరిగిన బెంగాల్ ఎన్నికల్లో 92.72 శాతం, మొత్తం 234 స్థానాలకు జరిగిన తమిళనాడు ఎన్నికల్లో 85.14 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం. రెండు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే ద్వారా అర్హత లేని లక్షలాది ఓట్లను తొలగించిన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో ఓటింగ్ నమోదవడం గమనార్హం. శుక్రవారం ఉదయం కల్లా తుది గణాంకాలు రావొచ్చు. బెంగాల్లో అక్కడక్కడా హింసాకాండ చోటుచేసుకోవడం మినహా తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కనిష్ట స్థాయిలో హింస జరగడం బెంగాల్ ఎన్నిక చరిత్రలో ఇదే మొదటిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. తమిళనాడులోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో ఎన్నికల సంఘం ఊపిరి పీల్చుకుంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకోవడానికి, దేశ పౌరులుగా తమ విధిని నిర్వర్తించడానికి ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి ఉత్సాహంగా ఓటువేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సమయం ముగిసినా పోలింగ్ కేంద్రాల ఎదుట రద్దీ తగ్గలేదు. వరుసలో నిల్చున్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్వాతంత్య్రం తర్వాత అత్యధిక ఓటింగ్ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ నెల 9న జరిగిన అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల్లోనూ మునుపెన్నడూ లేని రీతిలో అత్యధిక ఓటింగ్ నమోదైంది. అస్సాంలో 85.38 శాతం, పుదుచ్చేరిలో 89.83 శాతం నమోదయ్యింది. బెంగాల్, తమిళనాడులో ఇప్పటిదాకా 2011 నాటి ఎన్నికల ఓటింగే అత్యధికం. అప్పట్లో బెంగాల్లో 84.72 శాతం, తమిళనాడులో 78.29 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ రికార్డును ఈసారి ఓటర్లు తిరగరాశారు. రెండు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటింగ్లో పాల్గొన్నారు. తమిళనాడులో పురుషులు 83.57 శాతం మంది ఓటువేయగా, మహిళలు 85.76 శాతం మంది ఓటువేశారు. బెంగాల్లో పురుషులు 90.92 శాతం, మహిళలు 92.69 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్లో సరికొత్త రికార్డు సృష్టించిన రెండు రాష్ట్రాల ఓటర్లకు సెల్యూట్ చేస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అన్నారు. బెంగాల్లో ఎస్ఐఆర్ ద్వారా 91 లక్షల ఓట్లను తొలగించారు. ఈ నేపథ్యంలో అర్హులైన ఓటర్లలో 91.78 శాతం మంది ఓటు వేశారు.పశ్చిమ బెంగాల్లో స్వల్ప హింస బెంగాల్లో తొలి విడత ఎన్నికల సందర్భంగా హింసాకాండ చోటుచేసుకుంది. అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఉద్రిక్తత పరిస్థితులను సైతం లెక్కచేయకుండా జనం భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. హింసాత్మక ఘటనలు ఓటర్ల ఉత్సాహాన్ని తగ్గించలేకపోయాయి. 2021లో 82.30 శాతం ఓటింగ్ నమోదు కాగా, గురువారం 92 శాతం దాటేసింది. బెంగాల్ ప్రజలు తమ హక్కులను కోల్పోకుండా ఉండేందుకే అధిక సంఖ్యలో ఓటు వేశారని టీఎంసీ పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఓటు వేయకపోతే పౌరులుగా తమ హక్కులను, పౌరసత్వాన్ని కోల్పోతామని ప్రజలు ఆందోళనకు గురయ్యారని, అందుకే ఆ ప్రమాదం తలెత్తకుండా అధిక సంఖ్యలో పాల్గొన్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బీర్భూమ్లోని ఖరిసోల్లో ఈవీఎంలలో టీఎంసీకి వేసిన ఓట్లను బీజేపీకి అనుకూలంగా నమోదు చేస్తున్నారని అధికార పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. దాంతో అధికారులు పోలింగ్ను తాత్కాలిక నిలిపివేశారు. స్థానికులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు రాళ్లతో దాడికి దిగారు. పారామిలిటరీ బలగాలు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. దక్షిణ దినాజ్పూర్లోని కుమార్గంజ్లో బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్పై దాడి జరిగిందని, అసన్సోల్ దక్షిణ నియోజకవర్గంలోని రహమత్ నగర్ సమీపంలో బీజేపీ ఎమ్మెల్యే అగి్నమిత్ర పాల్ కారుపై రాళ్లతో దాడి చేసి వెనుక కిటికీని పగలగొట్టారని ఆరోపణలు వచ్చాయి. నవోడాలో ఏజేయూపీ నాయకుడు హుమాయున్ కబీర్ కాన్వాయ్పై కొందరు రాళ్లు విసిరారు. దీంతో అతడి మద్దతుదారులకు, ప్రత్యర్థులకు మధ్య ఘర్షణచోటుచేసుకుంది. లాభ్పూర్, చంచల్. మురారైలలో హింసాత్మక, బెదిరింపు ఘటనలు జరిగాయి. వేర్వేరు పారీ్టల కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. డోమ్కల్లో ఓటర్లు పోలింగ్ బూత్ల వద్దకు చేరుకోకుండా కొందరు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. మొత్తం పోలింగ్ ప్రక్రియ చాలావరకు ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి వందలాది ఫిర్యాదులు అందినట్లు తెలియజేసింది. జిల్లాల వారీగా చూస్తే ముర్షిదాబాద్, బంకూర, కూచ్ బెహార్లో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదయ్యింది. అత్యల్పంగా కలింపాంగ్లో 81 శాతం నమోదయ్యింది. బెంగాల్ ఎన్నికలు అంటేనే హింసాకాండకు మారుపేరుగా చెబుతుంటారు. ఈసారి అలాంటి పరిస్థితి లేకపోవడం విశ్లేషకులను ఆశ్చర్యపర్చింది. రాష్ట్రంలో మిగిలిన 142 స్థానాలకు ఈ నెల 29న రెండో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. తమిళనాడులో అంతా ప్రశాంతం అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకే, కొత్తగా రంగప్రవేశం దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే మధ్య జరిగిన త్రిముఖ ఎన్నికల పోరులో 85.14 శాతం మంది ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు. అన్నాడీఎంకే–బీజేపీ కూటమిని లక్ష్యంగా చేసుకుని నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తీవ్రంగా పోరాడిన డీఎంకే అధికారాన్ని నిలబెట్టుకోవడానికి హోరాహోరీగా పోరాడింది. విజయ్ పార్టీ తమిళగ వేట్రి కళగం(టీవీకే), తమిళ జాతీయవాది సీమాన్కు చెందిన నాన్ తమిళర్ కట్చి(ఎన్టీకే) ఎన్నికల రంగంలో గట్టి పోటీదారులుగా నిలిచాయి. డీఎంకే–కాంగ్రెస్, అన్నాడీఎంకే–బీజేపీ కూటములు తమ విజయం పట్ల ధీమాగా ఉన్నాయి. అత్యధికంగా కరూర్ స్థానంలో 91.86 శాతం, అత్యల్పంగా కన్యాకుమారిలో 75.50 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. చెదురు ముదురు ఘటనల మినహా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించినా, తక్షణం మరమ్మతులు చేసి ఓటింగ్ను కొనసాగించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఓటింగ్ను బహిష్కరించారు. చెన్నైలోని మైలాపూర్లో ఓటర్లకు డీఎంకే డబ్బులు పంపిణీ చేస్తోందని బీజేపీ ముఖ్యనేతలు అన్నామలై, వనతి శ్రీనివాసన్ ఆరోపించారు. అధికార డీఎంకే పార్టీ ఉదయించే సూర్యుడి చిహ్నాన్ని బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ నేత డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ తమ కుటుంబంతో సహా చెన్నైలో ఓటు వేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సేలం సిలువం పాళయం నెడుంకుళం పంచాయతీ పరిధిలోని యూనియన్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్లో కుటుంబంతో సహా వచ్చి ఓటు వేశారు. టీవీకే అధినేత విజయ్ చెన్నై నీలాంకరై పోలింగ్ బూత్లో గట్టి భద్రత నడుమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సంగీత దర్శకుడు ఇళయరాజా, తమిళ సినీ నటులు రజనీకాంత్, కమలహాసన్, అజిత్, సూర్య, జ్యోతిక దంపతులు, కార్తీ, అర్జున్, విక్రమ్, ధనుష్, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్, విశాల్, మణిరత్నం, సంగీత దర్శకుడు అనిరుద్, నటీమణులు త్రిష, కీర్తి సురేష్, రాధిక, తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారీ ఓటింగ్ మాకే అనుకూలం: అన్నాడీఎంకే తమిళనాడులో 2021లో 73.63 శాతం ఓటింగ్ నమోదు కాగా, స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే విజయం సాధించింది. 2011లో 78.29 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే జయకేతనం ఎగురవేసింది. వరుసగా రెండుసార్లు గెలిచింది. ఈసారి 85 శాతానికిపైగా ఓటింగ్ నమోదు కావడాన్ని తమకు సానుకూలాంశంగా అన్నాడీఎంకే–బీజేపీ కూటమి నాయకులు భావిస్తున్నారు. తమిళనాట ఎస్ఆఐర్ ద్వారా ఓట్లను తొలగించారు. 2025 అక్టోబర్లో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 5.73 కోట్లకు తగ్గింది. 2021 ఎన్నికల సమయంలో 6.29 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 56 లక్షల మేర తగ్గినట్లు స్పష్టమవుతోంది. తమిళనాట ఓటింగ్ సరళి తమిళనాడులో 1957లో అత్యల్పంగా 47 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత 1960వ దశకం నుంచి నేటి వరకు సగటు ఓటింగ్ శాతం 70కి దరిదాపుల్లోనే ఉంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పాత రికార్డులు చెదిరిపోయాయి.👉 : (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం స్టాలిన్ కుమార్తెను చూశారా?
చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సినిమా, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. గురువారం ఉదయం పోలింగ్ మొదలు కాగానే సెలబ్రిటీలు ఓట్లు వేసేందుకు బారులు తీరారు. సామాన్యుల్లా క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖులు తమతో పాటే క్యూలో నిలబడి ఓటు వేయడాన్ని జనం ఆసక్తిగా గమనించారు. కెమెరాల ముందు పెద్దగా కనబడని ప్రముఖ రాజకీయ నేతల కుటుంబ సభ్యులను చూసేందుకు కూడా జనం ఉత్సుకత కనబరిచారు.చెన్నైలోని ఒక పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమార్తె సెంథమరై స్టాలిన్ (Senthamarai Stalin), అల్లుడు శబరీసన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత నిశ్శబ్దంగా అక్కడి నుంచి నిష్క్రమించారు. పోలింగ్ కేంద్రంలోని ఉన్నవారంతా సీఎం స్టాలిన్ కుమార్తె, అల్లుడిని ఆసక్తిగా గమనించారు. వ్యాపారవేత్త అయిన సెంథమరై రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. దీంతో ఆమెకు సంబంధించిన సమాచారం పబ్లిక్ డొమైన్లో ఎక్కువగా అందుబాటులో లేదు.#WATCH | Tamil Nadu Elections 2026 | Chief Minister MK Stalin's daughter Senthamarai Stalin and son-in-law Sabarisan cast their votes at a polling station in Chennai. pic.twitter.com/UAsFX7VGs4— ANI (@ANI) April 23, 2026కాగా, సూపర్స్టార్ రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాల పోలింగ్ బూత్లో తన ఓటు వేశారు. సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్, తన భార్య కావేరి, కుమార్తె కావ్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. హీరో విశాల్.. అన్నా నగర్లోని పోలింగ్ కేంద్రంలో తన హక్కు వినియోగించుకున్నారు. నటుడు ఆది పినిశెట్టి తన భార్య నిక్కీ గల్రాని, తండ్రి రవిరాజా పినిశెట్టితో కలిసి ఓటు వేయడానికి వచ్చారు. శింబు సింగిల్గా వచ్చి ఓటు వేశారు. Actor couple Aadhi and Nikki Galrani cast votes in Chennai, urges public to vote. pic.twitter.com/XIQkMZjfzf— News Arena India (@NewsArenaIndia) April 23, 2026 చదవండి: ఫస్ట్ టైమ్ ఓటు వేసిన ఉదయనిధి స్టాలిన్ కొడుకుశివగంగలో ఓటు వేసిన కార్తీ చిదంబరంకాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం తన భార్య శ్రీనిధి, కుమార్తె అదితితో కలిసి శివగంగలో ఓటు వేశారు. ఈ సందర్భంగా శ్రీనిధి మీడియాతో మాట్లాడుతూ.. ''నేను నా ఓటు వేశాను. ఎన్నికల రోజులన్నీ పండుగ రోజులే అని భావిస్తాను. ఇది ప్రజాస్వామ్య విజయమని నేను అనుకుంటున్నాను. ప్రజలు వచ్చి ఓటు వేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంద''ని అన్నారు. -
టీవీకే కార్యకర్త అరెస్ట్.. పోలింగ్ కేంద్రంలో ఏం చేశాడంటే..?
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో టీవీకే పార్టీ కార్యకర్త అత్యుత్సాహం ప్రదర్శించారు. టీవీకే గుర్తుపై ఓటు వేస్తూ వీడియో చిత్రీకరణ చేసిన ఆ కార్యకర్త.. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద టీవీకే కార్యకర్త శక్తివేల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపత్తూరు నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్లో ఈ ఘటన జరిగింది.అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. పోలింగ్ కేంద్రంలోకి తన మొబైల్ ఫోన్ను తీసుకెళ్లిన శక్తివేల్.. పార్టీ గుర్తు ‘ఈల’కు ఓటు వేస్తున్నట్లు వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో 'రీల్'గా షేర్ చేయడంతో.. సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్న ఎన్నికల అధికారుల దృష్టికి ఈ విషయం వచ్చింది. ఓటు రహస్యాన్ని భంగపరిచే విధంగా పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడం, వీడియోలు తీయడం ఎన్నికల నిబంధనల ప్రకారం నేరమని భారత ఎన్నికల సంఘం (ECI) ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే.సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అధికారులు పోలీసులను అప్రమత్తం చేయడంతో.. వారు బూత్కు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శక్తివేల్పై ఎన్నికల చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా కఠిన నిఘా కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 4,023 మంది అభ్యర్థుల భవిష్యత్తును 5.73 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 75,064 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాగా.. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివచ్చారు -
బెంగాల్లో భారీగా పోలింగ్ : ఎండ తీవ్రతకు నలుగురు మృతి
సాక్షి,కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026 మొదటి దశలో భాగంగా ఈరోజు (గురువారం) పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటa వరకు 70 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పశ్చిమ మేదినిపూర్ 65.77 శాతం పోలింగ్తో అగ్రస్థానంలో నిలిచింది. ఈ పోలింగ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓటు వేసే ప్రయత్నంలో తీవ్రమైన వేడి, శారీరక శ్రమ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నలుగురు ఓటర్లు మరణించారు. తూర్పు, పశ్చిమ మేదినీపూర్, మాల్దా, బీర్భూమ్ జిల్లాల్లో ఈ మరణాలు నమోదయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఏప్రిల్ మాసంలో తీవ్రమైన వేడి కారణంగా పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల ఈ నలుగురూ గుండెపోటుకు గురయ్యారు. పోలింగ్ ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతున్నప్పటికీ, జరిగిన మరణాలు ఆనాటి కార్యకలాపాలపై నీడను పడేశాయి. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నడుమ ఓటర్ల భద్రతపై ఆందోళనలు రేకెత్తాయి.మృతులను తూర్పుమేదినీపూర్ జిల్లాలోని పటాష్పూర్కు చెందిన నృపేంద్ర దాస్, పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని కేశ్పూర్కు చెందిన ఇస్రతన్ బీబీ, మాల్దా జిల్లాలోని మాలతీపూర్కు చెందిన ప్రమీలా బాగ్డి, బీర్భూమ్ జిల్లాలోని సూరికి చెందిన అసిమ్ రాయ్గా గుర్తించారు.మాలతీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కందరన్ ప్రాంతంలో పోలింగ్ బూత్ వద్ద మహిళా ఓటరు స్పృహ కోల్పోయింది. కాసేపటికే ఆమె కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది. తన తల్లి, తన సోదరుడితో కలిసి ఓటు వేయడానికి వెళ్లిందనీ, ఆమె ఓటు వేయబోతుండగా స్పృహ కోల్పోందని మృతురాలి కుమారుడు సన్నీ తెలిపాడు. ఆమె పోలింగ్ బూత్లోనే మరణించిందని కంట తడి పెట్టాడు. ఈ జిల్లాల్లో ఏప్రిల్ మధ్య నుంచి వడగాలుల పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓటర్లు, ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువసేపు ఎండలో ఉండకుండా ఉండాలని వైద్య నిపుణులు కూడా సూచించారు.#WATCH | Malda, West Bengal | Woman voter falls unconscious and passes away at a polling booth in Kandaran area of Malatipur assembly constituencyThe deceased woman's son, Sunny, says, "My mother, along with my brother, had gone to cast her vote. Just as she was about to cast… pic.twitter.com/v7xhWKh4R1— ANI (@ANI) April 23, 2026 > కాగా ఉత్తర బెంగాల్లోని 152 నియోజకవర్గాల్లో, రాష్ట్రంలోని దక్షిణ భాగంలోని పలు జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని 294 నియోజకవర్గాలలో 152 నియోజకవర్గాల్లో సుమారు 3.6 కోట్ల మంది ఓటర్లు ఈరోజు ఓటు వేయనున్నారు. కనీసం 80 స్థానాల్లో హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా సవరణపై చెలరేగిన రాజకీయ దుమారం , బెంగాల్లో ఎలాగైనా పాగా వేయాలన్న ప్రతిపక్ష బీజేపీ వ్యూహాలు,తిరిగి అధికారం తమదే అని చెబుతున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉత్కంఠగామారుతోంది. రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
నా ఓటు టీవీకే పార్టీకే వేశా.. విజయ్ సీఎం అవుతాడు: వీటీవీ గణేష్
తమిళనాడులో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకే కూడా ఈ సారి పోటీలో ఉండడంతో సినీ తారలంతా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు. రజనీకాంత్, ధనుష్, త్రిష, మణిరత్నం, అజిత్, శృతీహాజన్తో పాటు పలువురు తమిళ స్టార్స్ ఇప్పటికే తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వీరితో పాటు సినీ నటుడు వీటీవీ గణేష్ కూడా తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు. చెన్నై నందనంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో ఓటు వేశాడు. అనంతరం పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న ఆయనను మీడియా పలకరించగా, తాను టీవీకే పార్టీ అభ్యర్థికి ఓటు వేశానని.. విజయ్ సీఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు.‘ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకున్నాను. విజయ్ పార్టీ టీవీకేకు ఓటు వేశాను. సొసైటీని అప్గ్రేడ్ చేయడానికి విజయ్ పర్ఫెక్ట్ ఫిట్ అని నేను నమ్ముతున్నాను. సిస్టమ్, ప్రజలకు మంచి చేస్తారని బలంగా నమ్ముతున్నాను. నాకు ఇతర పార్టీల గురించి మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే నేను టీవీకే పార్టీకి చెందిన వాడిని కాబట్టి ఆ పార్టీ గురించే మాట్లాడుతాను. టీవీకే పార్టీ గెలువాలని కోరుకొంటున్నాను. నిన్నటి వరకు విజయ్ పార్టీ గెలుస్తుందా? లేదా? అనే కొంత గందరగోళం ఉంది. ఓటింగ్ సరళిని చూస్తే ఈ రోజు మాత్రం విజయ్ పార్టీ విజయం సాధించడం ఖాయమని తేలిపోయింది. మే 4వ తేదీ వరకు వేచి ఉండండి. టీవీకే పార్టీ గెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు’ వీటీవీ గణేష్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, విజయ్ టీవీకే పార్టీ తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. విజయ్ కూడా తిరుచురాపల్లి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. మే 4న తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.#WATCH | Tamil Nadu Elections 2026 | Actor VTV Ganesh says, "I cast my vote to TVK. Vijay is a perfect fit to upgrade the society, people and the system... I want him to become the CM..."He also says, "Young voters should exercise their voting rights..." pic.twitter.com/RWJ5mc5ydS— ANI (@ANI) April 23, 2026 -
ఫస్ట్ టైమ్ నా కొడుకు ఓటు వేస్తున్నాడు: ఉదయనిధి భార్య
చెన్నై: ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సతీమణి కృతిగ ఉదయనిధి కోరారు. చెన్నైలోని జస్టిస్ బషీర్ అహ్మద్ సయీద్ మహిళా కళాశాలలో కుటుంబ సభ్యులతో పాటు ఆమె తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. "మీరు బయటకు వచ్చి ఓటు వేయండి. నేను గత 25 ఏళ్లుగా ఇదే చేస్తున్నాను. నా కుమారుడు ఇన్బానిథి మొదటిసారి ఈ ఎన్నికల్లో ఓటు వేస్తున్నాడు" అని తెలిపారు. తన అత్తమామలు దుర్గ, స్టాలిన్తో పాటు భర్త ఉదయనిధితో కలిసి ఆమె ఓటు వేశారు. కాగా, కృతిగ- ఉదయనిధి స్టాలిన్ దంపతులకు ఇన్బానిథితో పాటు కూతురు తన్మయ ఉన్నారు. మా అబ్బాయి కూడా.. ఫస్ట్ టైమ్ ఓటు వేస్తున్నాడు: దయానిధి మారన్తన కుమారుడు కూడా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నాడని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వెల్లడించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలో ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. "నా ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడానికి, ఓటు వేయడానికి నేను నా కుటుంబంతో వచ్చాను. నా కుమారుడు మొదటిసారి ఓటు వేస్తున్నాడు. అతడు కూడా తన ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నందుకు సంతోషంగా ఉన్నాడు. సుపరిపాలన కొనసాగుతుందని, తమిళనాడు విజయం సాధిస్తుందని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇది 'చెడు' ఢిల్లీకి, 'మంచి' తమిళనాడుకు మధ్య జరుగుతున్న యుద్ధం'' అని అన్నారు. ఆలోచించి ఓటు వేశా: కరణ్ దయానిధి మారన్తన రాజ్యాంగబద్దమైన హక్కును వినియోగించుకోవడం తనకు ఉత్సాహాన్ని కలిగించయిందని కరణ్ దయానిధి మారన్ అన్నారు. ఓటు వేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాగా ఆలోచించి ఓటు వేశానని చెప్పారు. తాను సరైందని నమ్మిన దానికే మద్దతు ఇచ్చానని అన్నారు. తమిళనాడు ప్రజలు చాలా విద్యావంతులని, వారు కూడా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని నమ్ముతున్నట్టు తెలిపారు.చదవండి: ఫస్ట్ టైమ్.. ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసిన విజయ్ఓటు వేసిన సినీ సెలబ్రిటీలుతమిళ అగ్ర కథానాయకులు రజనీకాంత్, కమల్హాసన్, అజిత్, విజయ్, సూర్య, కార్తి, శరత్ కుమార్, శశికుమార్, విక్రమ్, శివకార్తికేయ, ధనుష్, విజయ్ సేతుపతి, ప్రదీప్ రంగనాథన్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కథానాయికలు రాధిక, కుష్బూ, గౌతమి, స్నేహ, త్రిష, జ్యోతిక, శృతి హాసన్, వరలక్ష్మి శరత్కుమార్ కూడా ఓటు వేశారు. సంగీత దర్శకుడు ఇళయరాజా, దర్శకులు ప్రభుదేవా, ఆట్లీ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితో నటులు సత్యరాజ్, సిద్ధార్థ్, యోగిబాబు, సూరి తదితరులు ఓటు వేసిన వారిలో ఉన్నారు. సెలబ్రిటీల గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నందిగ్రామ్ సెగలు: పోలీసులపై సువేందు ఫైర్
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ అత్యంత ఉత్కంఠ భరితంగా మారింది. రాజకీయంగా కీలకమైన నందిగ్రామ్ నియోజకవర్గంలో ఎన్నికల ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పోలీసులు.. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేసిన సంచలన ఆరోపణలు బెంగాల్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.పోలీసుల పక్షపాత వైఖరిపై ఫైర్తమ పోలింగ్ ఏజెంట్ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని నందిగ్రామ్, భవానీపూర్ స్థానాల నుంచి బరిలో ఉన్న సువేందు అధికారి ఆరోపించడంతో వివాదం మొదలైంది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసుల తటస్థతపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా పింగ్లా పోలీస్ స్టేషన్ ఓసీ చిన్మోయ్ ప్రమాణిక్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే ఆయనను సస్పెండ్ చేసి, విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) మనోజ్ అగర్వాల్, పోలీసు పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన స్పష్టం చేశారు. VIDEO | West Bengal election: BJP candidate from Bhabanipur and Nandigram, Suvendu Adhikari, said,"Murder accused Sheikh Shahuddin is threatening voters. I am not afraid of anything. My fight is not against any religion. My fight is against the goons of TMC."… pic.twitter.com/z2EYl7Tmjs— Press Trust of India (@PTI_News) April 23, 2026‘ఆ గూండాలతోనే నా పోరాటం’ఓటర్లను ప్రభావితం చేసేందుకు అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని సువేందు తీవ్ర ఆరోపణలు చేశారు. ‘హత్య కేసులో నిందితుడైన షేక్ షాహుద్దీన్ ఓటర్లను బెదిరిస్తున్నాడు. నేను దేనికీ భయపడను. నా పోరాటం ఏ మతానికి వ్యతిరేకం కాదు, కేవలం టీఎంసీ గూండాలపైనే నా యుద్ధం’ అని ఆయన పేర్కొన్నారు. బిన్పూర్, ఖరగ్పూర్ లాంటి ఇతర ప్రాంతాల్లోనూ బీజేపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, ఏజెంట్లను బలవంతంగా తీసుకెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్కు ముందు రోజు రాత్రి కూడా నందిగ్రామ్లో టీఎంసీ, బీజేపీ వర్గాల మధ్య దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. -
ఓటేయకుండానే సిరా చుక్క..
మొతాబరి: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. ఒకవైపు ఈవీఎంల మొరాయింపుతో ఓటర్లు తీవ్ర అసహనానికి గురవగా, మరోవైపు బాంబు దాడులు, ఘర్షణలు ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించాయి. కనీసం ఓటు వేయకుండానే వేలికి సిరా చుక్క వేయించుకుని వెనుదిరగాల్సిన దయనీయ పరిస్థితి మాల్దా, ముర్షిదాబాద్ సహా పలు ప్రాంతాల్లో నెలకొంది.మొరాయించిన ఈవీఎంలుమొతాబరి పోలింగ్ బూత్లో ఈవీఎం సాంకేతిక లోపంతో గందరగోళం చెలరేగింది. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడిన ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అత్యంత విచిత్రంగా, ఒక ఓటరు వేలికి అధికారులు సిరా పూశారు కానీ మిషన్ పనిచేయకపోవడంతో ఓటు వేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. సెక్టార్ అధికారికి ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో ఓటర్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధికారి ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే బూత్ వద్ద స్వల్ప తోపులాట జరిగింది. ఎట్టకేలకు సుమారు 90 నిమిషాల ఆలస్యంగా పోలింగ్ తిరిగి ప్రారంభమైంది.పలుచోట్ల నిలిచిపోయిన పోలింగ్బెంగాల్లోని 16 జిల్లాల్లో 152 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో పలుచోట్ల ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయి. ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్దంగా, శంషేర్గంజ్, కంది ప్రాంతాలతో పాటు నందిగ్రామ్, సిలిగురిలలో ఓటింగ్ నిలిచిపోయి, ఆలస్యంగా సాగింది. కూచ్ బిహార్లో ఒక బూత్లో పోలింగ్ కొద్దిసేపు నిలిపివేశారు. సెంట్రల్ ఫోర్స్ బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినప్పటికీ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వైఫల్యం పోలింగ్ ప్రక్రియను తీవ్రంగా ఆటంకపరిచింది. -
పోలింగ్ బూత్ వద్ద ఏనుగు కలకలం
జార్గ్రామ్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. అయితే ఓటర్ల క్యూ లైన్ల మధ్య ఒక ఊహించని ‘అతిథి’ రాకతో ఒక్కసారిగా గందరగోళం, ఆశ్చర్యం నెలకొన్నాయి. సాక్షాత్తూ ఒక అడవి ఏనుగు పోలింగ్ బూత్ వద్దకు రావడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.జార్గ్రామ్లో ఏనుగు టెన్షన్గురువారం ఉదయం బెంగాల్లోని 152 నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలైంది. అయితే జార్గ్రామ్లోని జితుసోల్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ బూత్ వెలుపల ఒక అడవి ఏనుగు ప్రత్యక్షమవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలు ఆ గజరాజును చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. భారీ సంఖ్యలో గుమిగూడిన జనం ఆ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో బంధించడంతో ఆ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.ఉత్కంఠగా తొలి విడత పోలింగ్ఉదయం 7 గంటల నుంచే ఉత్తర బెంగాల్లోని డార్జిలింగ్, జల్పైగురి నుంచి దక్షిణాన ముర్షిదాబాద్, నాదియా, హుగ్లీ వరకు భారీ క్యూలైన్లు కనిపించాయి. మొత్తం 294 స్థానాలకు గాను సగానికి పైగా సీట్లలో జరుగుతున్న ఈ తొలి దశ ఓటింగ్ అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), బీజేపీలకు అత్యంత కీలకం. సుమారు 3.60 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును ఈవిఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పండుగలో యువత, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా పిలుపునిచ్చారు. VIDEO | West Bengal Polls: An elephant entered the area near the polling station at Jitusol Primary School in Jhargram.(Source: Third Party)#AssemblyPollsWithPTI #WestBengalPollsWithPTI(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/UN6axPscmO— Press Trust of India (@PTI_News) April 23, 2026కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు సుమారు 2.5 లక్షల మంది కేంద్ర సాయుధ బలగాలు, వేలాది నిఘా బృందాలను రంగంలోకి దించారు. ఈ తొలి దశలో సువేందు అధికారి, నిసిత్ ప్రామాణిక్, ఉదయన్ గుహ వంటి కీలక నేతల భవితవ్యం తేలనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుండగా, మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
పోలింగ్ బూత్ వద్ద పేలుడు.. ప్రాణభయంతో పరుగులు
ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్ తొలి విడత ఎన్నికల పోలింగ్ బాంబుల మోతతో దద్దరిల్లింది. ఉత్సాహంగా సాగుతున్న ప్రజాస్వామ్య పండుగలో కలకలం చోటుచేసుకుంది. ముర్షిదాబాద్ జిల్లాలోని నవ్దా ప్రాంతంలో ఓటర్లు బారులు తీరిన సమయంలో దుండగులు నాటు బాంబులతో విరుచుకుపడటం ఆందోళనకు దారితీసింది.బాంబుల దాడిగురువారం ఉదయం పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్న సమయంలో, నవ్దాలోని ఓటింగ్ కేంద్రం సమీపంలో ఒక్కసారిగా నాటు బాంబు పేలింది. ఈ హఠాత్పరిణామంతో ఓటర్లు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. పోలింగ్ ప్రక్రియకు ఒక్కసారిగా తీవ్ర ఆటంకం ఏర్పడింది. VIDEO | West Bengal Election 2026: Several people injured as unidentified people hurled crude bomb in Nowda, Murshidabad district. More details are awaited.#AssemblyPollsWithPTI#WestBengalPollsWithPTI(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/W7G5A9OqR6— Press Trust of India (@PTI_News) April 23, 2026#WATCH | Murshidabad, West Bengal: ASP Majid Khan, says, "The situation is peaceful. Nothing has happened anywhere..." https://t.co/EnfCtiAmLd pic.twitter.com/8tA8M18anU— ANI (@ANI) April 23, 2026రంగంలోకి భద్రతా దళాలుఈ ఘటనలో పలువురు గాయపడగా, వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారి సంఖ్య, తీవ్రతపై అధికారులు ఇంకా వెల్లడించలేదు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే పరిస్థితి ప్రశాంతంగా ఉందని, ఎక్కడా ఏమీ జరగలేదని ముర్షిదాబాద్ ఏఎస్పీ మజిద్ ఖాన్ విలేకరులతో పేర్కొనడం గమనార్హం. 152 స్థానాలు.. ఉత్కంఠ పోరుతొలి విడతలో భాగంగా పశ్చిమ బెంగాల్లోని 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ జరుగుతోంది సుమారు 3.22 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వరుసగా నాలుగోసారి అధికార పీఠం దక్కించుకుంటారా? లేదా బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అనేది ఈ రెండు విడతల ఎన్నికల్లో తేలనుంది. -
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. పొద్దుపొద్దున్నే ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)
-
విజయ్ రణభేరి: పళనిస్వామికి జీవన్మరణం.. స్టాలిన్కు ప్రతిష్టాత్మకం!
చెన్నై: తమిళనాడు రాజకీయ ముఖచిత్రం నేడు ఓ చారిత్రక ఘట్టానికి సాక్షీగా నిలవనుంది. గత 37 ఏళ్లుగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్యే మారుతున్న అధికార పీఠం.. ఈసారి ఒక కొత్త సవాలును ఎదుర్కొంటోంది. కరుణానిధి సైతం వరుసగా రెండుసార్లు అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయిన చరిత్రను తిరగరాయాలని డీఎంకే ఉవ్విళ్లూరుతోంది. నేడు 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. నాలుగు దశాబ్దాల ద్రవిడ ద్వయం ఆధిపత్యానికి ముగింపు పలకగల సత్తా దళపతి విజయ్కు ఉందా?.. దీనిపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.విజయ్ సృష్టిస్తున్న ప్రకంపనలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, తన ‘తమిళగ వెట్రి కజగం (TVK)’ పార్టీతో విజయ్ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగారు. ముఖ్యంగా యువత, మహిళల్లో ఆయనకు విశేషమైన మద్దతు లభిస్తోంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అధికార డీఎంకే పార్టీని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ 'దుష్టశక్తి'గా అభివర్ణించిన విజయ్.. వ్యూహాత్మకంగా అన్నాడీఎంకేను పెద్దగా విమర్శించలేదు. ప్రత్యామ్నాయం లేక గతంలో అన్నాడీఎంకేకు ఓటేసిన డీఎంకే వ్యతిరేక ఓటర్లను ఆకర్షించడమే ఆయన లక్ష్యం. అయితే ఈ ఓట్ల చీలిక అన్నాడీఎంకేను దెబ్బతీసి పరోక్షంగా స్టాలిన్కే లాభిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలోని 5.68 కోట్ల ఓటర్లలో దాదాపు 40 శాతం మంది 39 ఏళ్ల లోపు వారే ఉండటం విజయ్కు సానుకూలాంశం. ఓటర్లకు డబ్బులు పంచకూడదన్న ఆయన నిర్ణయం, సిస్టమ్లో మార్పును కోరుకునే వర్గాలను విపరీతంగా ఆకర్షిస్తోంది.ద్రవిడ పార్టీల స్థిరమైన ఓటు బ్యాంకు తమిళ రాజకీయాల్లో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు దశాబ్దాలుగా చెక్కుచెదరని 20 శాతానికి పైగా స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. ‘ఉదయించే సూర్యుడు’, ‘రెండు ఆకులు’ గుర్తులకు వీరు కట్టుబడి ఉంటారు. 1991లో డీఎంకే కేవలం రెండు సీట్లకు పరిమితమైనా 22.46% ఓట్లు సాధించింది. 1996లో అన్నాడీఎంకే ఘోరంగా నాలుగు సీట్లే గెలిచినా 21.47% ఓట్లు దక్కించుకుంది. ఇప్పుడు విజయ్ 20 శాతం ఓట్లు సాధించినా అవి భారీ సంఖ్యలో సీట్లుగా మారుతాయా అనేది ప్రశ్నార్థకమే. అయితే తొలి ప్రయాణంలోనే ఓ మోస్తరు సీట్లు సాధించినా అది రాజకీయంగా ఒక చరిత్రే. మరోవైపు, మైనారిటీ ఓట్ల విషయంలో బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు కారణంగా ముస్లింలు డీఎంకే వైపు ఏకపక్షంగా మొగ్గుచూపుతుండగా, క్రిస్టియన్ యువతలో ఒక వర్గం విజయ్ వైపు ఆకర్షితులవుతున్నారు. క్షేత్రస్థాయిలో చివరి నిమిషంలో జరిగే నగదు పంపిణీ కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుందనే వాదన వినిపిస్తోంది.స్టాలిన్, పళనిస్వామిలకు చావో రేవోఈ ఎన్నికలు ఇద్దరు ద్రవిడ దిగ్గజాలకు అత్యంత కీలకం. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామికి ఇది దాదాపు జీవన్మరణ సమస్య లాంటిది. 2021 అసెంబ్లీ, 2024 లోక్సభ ఎన్నికల్లో వరుస దెబ్బలు తిన్న అన్నాడీఎంకే.. మరోసారి ఓడిపోతే పార్టీలో తీవ్ర అంతర్గత సంక్షోభం తలెత్తుతుంది. ఓపీఎస్, శశికళ వర్గాలను దూరం పెట్టి పార్టీపై పూర్తి పట్టు సాధించిన ఆయన, దినకరన్తో పొత్తు పెట్టుకుని తన నాయకత్వ పటిమను నిరూపించుకోవాల్సి ఉంది. శశికళ కొత్త పార్టీ పెట్టి అన్నాడీఎంకే ఓట్లకు గండికొట్టాలని చూస్తున్నారు. మరోవైపు, 73 ఏళ్ల సీఎం స్టాలిన్కు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం. ఈ విజయం భవిష్యత్తులో తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్కు పార్టీ పగ్గాలు అప్పగించడానికి మార్గం సుగమం చేస్తుంది. ‘ఇండియా’ కూటమికి కూడా ఈ విజయం కీలకం కానుంది. -
ఓటు హక్కు వినియోగించుకున్న అజిత్, విజయ్
తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్ మొదలైంది. కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైకి దక్షిణాన ఉన్న తిరువన్నీయుర్ పోలింగ్ కేంద్రంలో తొలి ఓటు వేసిన వ్యక్తిగా అజిత్ గుర్తింపు పొందారు. బెల్జియంలో అంతర్జాతీయ కార్ రేసింగ్ పోటీలో విజేతగా నిలిచిన అజిత్.. ఎన్నికల సందర్భంగా బుధవారం ఇండియాకు వచ్చారు. అందరికంటే ముందుగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేయడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. చెన్నైలోని నీలాంకరై మున్సిపల్ స్కూల్లో ఆయన ఓటు వేశారు. ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ తన కూతురు శృతి హాసన్తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలో నిల్చొని ఓటు వేసిన అనంతరం అందరూ తమ హక్కును ఉపయోగించుకోవాలని కోరారు. தமிழ்நாட்டின் முதல் ஓட்டு.. முதல் ஆளாய் வாக்களித்த நடிகர் அஜித்! | Tamil Nadu Assembly election | TNElection | Election2026 | Tamilnadu Legislative Assemblyel ection2026 |#Ajith #AK #AjithKumar #TNElection #Election2026 #Electionday #PollingDay #Assemblyelections… pic.twitter.com/AiSrEumptI— News Tamil 24x7 (@NewsTamilTV24x7) April 23, 2026 News Tamil Breaking || நீலாங்கரையில் தனது வாக்கை செலுத்திய விஜய்!#Vijay #TVK #TVKVijay #TNElection #Election2026 #Electionday #Assemblyelections #NewsTamil24x7 pic.twitter.com/AnD0dtaQZD— News Tamil 24x7 (@NewsTamilTV24x7) April 23, 2026 -
Bengal Elections: పోటెత్తిన ఓటరు.. రికార్డు పోలింగ్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది.. -
తమిళనాడులో భారీగా ఎన్నికల పోలింగ్
తమిళనాడులో నేడు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. కట్టుదిట్టమైన పోలీస్ భద్రత నడుమ ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది.. -
అల్లరిమూకలపై డేగ కన్ను
సాక్షి, న్యూఢిల్లీ: బెంగాల్లో తొలి దశ పోలింగ్ సందర్భంగా సమస్యలు సృష్టించే వారు, అల్లరి మూకలను కట్టడి చేయడంపై ఈసీ దృష్టిపెట్టింది. ఇలాంటి వారితో కూడిన వెయ్యిమంది జాబితాను సిద్ధం చేసింది. ఇందులో 9మంది వరకు తృణమూల్ ఎమ్మెల్యేలున్నారు. పలువురు అభ్యర్థులు, కౌన్సిలర్లు ఉన్నారు. వీరిపై పోలీసు నిఘా పెరిగింది. ఈ జాబితాపై టీఎంసీ తీవ్రంగా స్పందించింది. తమ నాయకులను ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికే ఈ ప్రయత్నమని ఆరోపించింది. దీనిపై టీఎంసీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. నిర్దిష్ట ఆధారాలు లేకుండా రాజకీయ నాయకులను సమస్యాత్మక వ్యక్తులుగా గుర్తించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన సమయంలో ఈ జాబితా వెలుగులోకి రావడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. -
బెంగాల్లో నేడు తొలి దశ పోలింగ్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు తొలి దశ పోలింగ్ జరగనుంది. అసెంబ్లీలోని మొత్తం 294 స్థానాలకు గాను 152 సీట్లకు ఎన్నిక జరగనుంది. ఉత్తర బెంగాల్లోని 8 జిల్లాలతోపాటు ముర్షిదాబాద్, హుగ్లీ, నడియా, బిర్భూమ్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 54 సీట్లు బీజేపీకి కీలకంగా మారాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్లో 3.60 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 167 మంది మహిళలు సహా మొత్తం 1,478 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన 8 వేలకు పైగా పోలింగ్ స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈసీ రికార్డు స్థాయిలో 2,450 కంపెనీల బలగాలను మోహరించింది. వీరితోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించింది. ప్రభావం చూపే కీలకాంశాలివే.. అవినీతి, నిరుద్యోగం వంటి కీలక అంశాల కంటే ఈసారి సామాజిక గుర్తింపు, పౌరసత్వం, ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు వంటి అంశాలకే ప్రాధాన్యం పెరిగిన విభిన్న పరిస్థితులు నెలకొన్న వేళ ఈ జిల్లాల్లో సాధించే ఆధిక్యాన్ని బట్టే బెంగాల్లో బీజేపీ అధికారం చేపట్టడం ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గట్టి ప్రతిపక్షంగా ఎదిగేందుకు ఉత్తర బెంగాల్లో సాధించిన ఫలితాలే కీలకంగా మారాయి. ఇదే ఊపుతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశలో ఈ ప్రాంతంలో ఉన్న 152 సీట్లకుగాను బీజేపీ 59 చోట్ల విజయం సాధించగా, అధికార టీఎంసీ 93 సీట్లు దక్కించుకుంది. ఉత్తరబెంగాల్లో బీజేపీ ప్రభావాన్ని అడ్డుకోవడం అధికార పక్షానికి కూడా చాలా కీలకం. ఎందుకంటే, ఇది రెండో దశతోపాటు రాష్ట్రంలో మొత్తం రాజకీయ వాతావరణంపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ప్రాంతాలేవైనా సర్ ఒక్కటే.. ఉత్తర బెంగాల్లో తేయాకు తోటలున్న జల్పాయ్గురి అలీపూర్దువార్, కొండప్రాంతాలైన డార్జిలింగ్, కాలింపాంగ్, రాజ్బన్షీలున్న కూచ్ బెహార్ ఉన్నాయి. సరిహద్దుల్లోని మల్దా, ఉత్తర దినాజ్పూర్, మైనారిటీల ప్రాబల్యమున్న ముర్షిదాబాద్, నడియాలున్నాయి. ఎన్ని తేడాలున్నప్పటికీ, ప్రతి జిల్లాలోనూ ఓటింగ్ సరళిని ప్రభావితం చేయనున్న ఏకైక అంశం ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) అనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో సర్ కారణంగా 91 లక్షలకు పైగా పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో ఇవి సుమారు 12 శాతం. ఒక్క ముర్షిదాబాద్ జిల్లాలోనే 7.48 లక్షల ఓట్లు తొలగింపునకు గురయ్యాయి. తర్వాత, నడియాలో 4.85 లక్షలు, మాల్దాలో 4.59 లక్షలు, ఉత్తర్ దినాజ్పూర్లో 3.63 లక్షలు, కూచ్ బెహార్లో 2.42లక్షలకు పైగా ఓట్లను పక్కనబెట్టారు. దీంతో, ఎన్నికల్లో ప్రచారాంశాలే ఏకంగా మారిపోయాయి. అవినీతి, నిరుద్యోగం, సంక్షేమ పథకాలు అప్రాధాన్యాంశాలు కాగా, పౌరసత్వం, చొరబాట్లు, బోగస్ ఓట్లు, తొలగింపునకు గురైన ఓటర్లు, విదేశీయులు వంటివాటికి ప్రాధాన్యం పెరిగిపోయింది. చొరబాట్లు, పౌరసత్వం అంశాలకు సర్ను రెఫరెండంగా బీజేపీ అభివర్ణించగా, నిజమైన ఓటర్లను ముఖ్యంగా మైనారిటీలు, వలస కార్మికులు, పేదల పేర్లను తొలగించారంటూ టీఎంసీ ప్రచారం చేసుకుంది. బరిలో పలువురు ప్రముఖులు మొదటి దశ బరిలో పలువురు ప్రముఖ నేతలున్నారు. ముఖ్యంగా నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఒకరు. 2021 ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీని ఆయన ఇక్కడ ఓడించారు. రాష్ట్రంలో బీజేపీ రాజకీయాలు ఈయన చుట్టూతా నడుస్తున్నాయి. ఈసారి ఇక్కడ సువేందుకు నమ్మినబంటుగా ఉన్న పబిత్రా కర్ టీఎంసీ తరఫున బరిలో ఉన్నారు. అదేవిధంగా, బహరంపూర్లో కాంగ్రెస్ సీనియర్ నేత ఆధిర్ రంజన్ చౌదరి, బీజేపీ ఎమ్మెల్యే సుబ్రతా మైత్రా పోటీ పడుతున్నారు. మాతాభంగలో కేంద్ర మాజీ మంత్రి నిశిత్ ప్రామాణిక్ పోటీ చేస్తున్నారు. ఖరగ్పూర్ సదర్లో రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, టీఎంసీకి చెందిన ప్రదీప్ సర్కార్ తలపడుతున్నారు.నన్ను భయపెట్టాలని చూస్తున్నారు: మమతఆమ్డాంగా(పశ్చిమ బెంగాల్): పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ భారీ సంఖ్యలో శాంతి భద్రతల కోసమంటూ సాయుధ బలగాలను మోహరించడంతోపాటు సీఆర్పీఎఫ్ వాహనాలను రంగంలోకి దించడంపై సీఎం మమతా బెనర్జీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లక్షలాదిగా బలగాలను తరలించి కేంద్రం తనను భయపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. సీఎం మమత బుధవారం ఉత్తర 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. ‘సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్లతోపాట రైల్వే బలగాలను కూడా కేంద్రం ఇక్కడ ఎన్నికల కోసం తీసుకువచి్చంది ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండగ మాత్రమే, ఎవరినీ చంపడానికి కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల కోసం బెంగాల్కు మునుపెన్నడూ లేని విధంగా సుమారు రెండు లక్షల కేంద్ర బలగాలను తీసుకువచ్చారు. ఇంత భారీ స్థాయిలో బలగాలను మోహరించి నన్ను భయపెట్టాలని చూస్తున్నారా?’అంటూ కేంద్రాన్ని ఆమె ప్రశ్నించారు. -
నేడే తమిళనాడు సమరం
సాక్షి, చెన్నై: వరుసగా రెండోసారి విజయం దక్కించుకోవాలని ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్... ఐదేళ్ల క్రితం దూరమైన అధికారాన్ని తిరిగి హస్తగతం చేసుకోవడానికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి... తొలి పోటీలోనే సత్తా చాటాలని సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్ తహతహలాడుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమయ్యింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 234 స్థానాల్లో ఒకే విడతలో జరిగే ఓటింగ్లో 5.73 కోట్ల మంది ఓటర్లు 4,023 మంది అభ్యర్థుల తలరాతలను నిర్దేశించబోతున్నారు. ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యే పోటీ నెలకొన్నప్పటికీ విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) గణనీయమైన ప్రభావం చూపడం తథ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విజయ్ పార్టీ ఏ కూటమి ఓట్లను చీలుస్తుంది? లాభపడేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎన్నికల సర్వేలు స్టాలిన్ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేయడం గమనార్హం. డీఎంకే–కాంగ్రెస్ కూటమి 40.1 శాతం ఓట్లతో 181 నుంచి 189 స్థానాలు గెల్చుకోనున్నట్లు సర్వేలు తెలిపాయి. అన్నాడీఎంకే–బీజేపీ కూటమి 29 శాతం ఓట్లతో 38 నుంచి 42 సీట్లు సాధిస్తుందని వెల్లడించాయి. విజయ్ పార్టీ టీవీకే 23.9 శాతం ఓట్లతో 8 నుంచి 10 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేశాయి. యువ ఓటర్లకు గాలం ఎన్నికల్లో ప్రధాన పార్టీలు యువత ఓట్లపై గురిపెట్టినట్లు స్పష్టమవుతోంది. అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని హామీ ఇచ్చాయి. దేశ విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు రప్పిస్తామని పేర్కొన్నాయి. తమ ఎన్నికల ప్రణాళికలో ఈ అంశానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోపాటు స్టార్టప్లకు ప్రోత్సాహకాలు ప్రకటించాయి. యువత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వీలుగా వడ్డీ లేని రుణాలు అందజేస్తామని వెల్లడించాయి. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అన్నాడీఎంకే హామీ ఇవ్వడం విశేషం. దళపతి విజయ్ యువ ఓటర్లనే నమ్ముకున్నారు. ఆయన సభలకు యువత పోటెత్తారు. విజయ్ అభిమానుల్లో యువత, మహిళలు అధికంగా ఉండడం ఆయనకు అనుకూలాంశంగా మారింది. అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 చొప్పున అందజేస్తామని విజయ్ హామీ ఇవ్వడం ఆకట్టుకుంటోంది. నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం పలు పథకాలు ప్రకటించారు. యువతకు చేరువకావడానికి పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేశాయి. తొలిసారి ఓటర్లు 14.59 లక్షల మంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. చివరి నిమిషంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా అధికారులు నిఘా ముమ్మరం చేశారు. రాష్ట్రంలో మొత్తం 5.73 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వీరిలో 2.93 కోట్ల మంది మహిళలు, 2.83 కోట్ల మంది పురుషులు, 7,728 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు తమిళనాడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అర్చనా పటా్నయక్ తెలిపారు. 14.59 లక్షల మంది యువ ఓటర్లు తొలిసారిగా ఓటు వేయబోతున్నట్లు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 75,064 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోసం 1,06,418 బ్యాలెట్ యూనిట్లు, 75,064 కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాలు సిద్ధం చేసినట్లు ప్రకటించారు. ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తితే ఓటింగ్లో జాప్యం జరగకుండా అదనపు యంత్రాలను సమకూర్చినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 249 మోడల్ పోలింగ్ స్టేషన్లు, పూర్తిగా మహిళలే నిర్వహించే 325 పింక్ స్టేషన్లు, దివ్యాంగులు నిర్వహించే 71 పోలింగ్ స్టేషన్లు, యువత నిర్వహించే 29 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టంచేశారు. 83,875 మంది స్థానిక పోలీసులతోపాటు 300 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలను మోహరించినట్లు వివరించారు. ఎన్నికల్లో అక్రమాలను చాలావరకు అరికట్టామని, ఇప్పటిదాకా స్వా«దీనం చేసుకున్న వస్తువుల విలువ రూ.1,262 కోట్లకు చేరిందని, అందులో నగదు, ఇతర సామగ్రి విలువ రూ.543 కోట్లు అని అర్చనాపట్నాయక్ తెలియజేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 163 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు పేర్కొన్నారు. విదేశాల నుంచి రాక తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు స్వరాష్ట్రానికి తరలివచ్చారు. గత రెండు రోజుల్లో చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి విమానాశ్రయాలకు పది వేల మందికి పైగా తరలిరావడం విశేషం. ఓటింగ్ ప్రక్రియను స్వయంగా తిలకించడానికి కొందరు విదేశీయులు సైతం వచ్చారు. -
ఇన్ని లక్షల మందిని ఎందుకు పంపారు?: మమతా బెనర్జీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ రాష్ట్రంలో కేంద్ర బలగాలను భారీగా మోహరించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ చర్య వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వ యంత్రాంగాన్ని సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందని విమర్శించారు.ఉత్తర 24 పరగణాలలో తృణమూల్ కాంగ్రెస్ ర్యాలీలో మాట్లాడిన బెనర్జీ.. శాంతిభద్రతలు కాపాడటానికి వచ్చిన సీఆర్పీఎఫ్ సాయుధ వాహనాల వినియోగం చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ వంటి కేంద్ర బలగాలు, రైల్వే వంటి సంస్థలు కూడా పోలింగ్ విధుల్లో నిమగ్నమయ్యాయని అన్నారు.“ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండుగ, ఇది ప్రజలకు హాని చేసే సమయం కాదు” అని మమతా బెనర్జీ చెప్పారు. ఎవరైనా పోలింగ్ వేళ చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని తర అనుచరులను కోరారు. సుమారు 2 లక్షల కేంద్ర సిబ్బందిని రాష్ట్రానికి తీసుకువచ్చారని చెప్పారు. “ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించడం ద్వారా నన్ను భయపెట్టాలనుకుంటున్నారా?” అని ప్రశ్నించారు.బీజేపీకి మమత సవాల్ విసురుతూ.. “సాయుధ వాహనాలకు శక్తి ఎక్కువా లేక ప్రజలకు శక్తి ఎక్కువా చూడాలి. నేను దేనికీ భయపడను. ఇలాంటి సాయుధ వాహనాలను మణిపూర్లో వినియోగించాలి. మణిపూర్లో మూడు సంవత్సరాలుగా అశాంతి కొనసాగుతోంది. బెంగాల్లో అన్ని మతాల ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారు” అని తెలిపారు.జాతీయ భద్రత అంశాలపై కూడా ఆమె మాట్లాడారు. “పహల్గామ్లో ఉగ్రవాదులు భారతీయులను హతమార్చినా, కేంద్ర సర్కారు పాకిస్థాన్పై చర్య తీసుకోలేకపోతోంది. కానీ బెంగాల్ ఎన్నికల కోసం మాత్రం అన్ని బలగాలను తీసుకువస్తున్నారు” అని అన్నారు. కాగా, గురువారం (ఏప్రిల్ 22) పశ్చిమ బెంగాల్లో మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. -
‘మమత చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టాయి’
న్యూఢిల్లీ: కేంద్ర సంస్థ దర్యాప్తు జరుపుతుండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్యలోకి వెళ్లడం సరైంది కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి చర్య ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతుందని తెలిపింది. పశ్చిమ బెంగాల్లో గురువారం (ఏప్రిల్ 23)న మొదటి దశ పోలింగ్ జరగాల్సి ఉండగా, బుధవారం కోర్టు నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం గమనార్హం.జనవరిలో మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ అధికారులు కొందరు కలిసి తమ దర్యాప్తు, సోదాల్లో జోక్యం చేసుకున్నారని ఈడీ తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి కీలక వ్యాఖ్యలు చేసింది."ఇది రాష్ట్రం-కేంద్రం మధ్య వివాదం కాదు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా దర్యాప్తు మధ్యలోకి వెళ్లి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడం సరికాదు. దీన్ని రాష్ట్ర -కేంద్ర వివాదంగా మార్చవద్దు అని చెప్పలేరు" అని సుప్రీంకోర్టు తెలిపింది.ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. మమతా బెనర్జీ రాష్ట్ర అధికారులతో కలిసి ఐ-ప్యాక్ కార్యాలయం, దాని స్థాపకుడు ప్రతిక్ జైన్ నివాసంలోకి వెళ్లి, ఈడీ దర్యాప్తు జరుగుతుండగా ల్యాప్టాప్, ఫోన్, పత్రాలు తీసుకెళ్లారు.అందుకే, "ఇది ఒక వ్యక్తి చేసిన చర్య అయినా, ఆ వ్యక్తి ముఖ్యమంత్రి కావడం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది" అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈడీ దాడులు రాజకీయ ఉద్దేశంతో జరిగాయని, ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్ను బలహీనపరచే ప్రయత్నం చేశారని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వాదించింది. -
TN Election: విజయ్ పొలిటికల్ థ్రిల్లర్.. ఇన్వెస్టర్లలో గుబులు!
చెన్నై: దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రాజకీయ, ఆర్థిక యుద్ధానికి తమిళనాడు వేదిక కాబోతోంది. గత 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 11.19 శాతం రికార్డు వృద్ధితో దూసుకుపోతున్న రాష్ట్రం రేపు (ఏప్రిల్ 23న) ఓటింగ్ కు సిద్ధమైంది. అయితే అందరి దృష్టి పాత రాజకీయ దిగ్గజాలపైనే కాకుండా, కేవలం రెండేళ్ల క్రితం ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీని స్థాపించి 234 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్న సినీ నటుడు విజయ్ పై పడింది. 2030 నాటికి $1 ట్రిలియన్(రూ. లక్ష కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రానికి ఈ సరికొత్త రాజకీయ సమీకరణం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.బలమైన ఆర్థిక శక్తిగా తమిళనాడు2024-25 ఆర్థిక సర్వే ప్రకారం, తమిళనాడు జీఎస్డీపీ ఏకంగా 11.19 శాతానికి చేరుకుని, ప్రధాన భారతీయ రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిచింది. ముఖ్యంగా తయారీ రంగం జాతీయ సగటు (4.5%) కంటే మూడు రెట్లు ఎక్కువగా 14.74 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశ జనాభాలో కేవలం 6 శాతం మాత్రమే ఉన్న ఈ రాష్ట్రం జాతీయ జీడీపీకి 9.4 శాతం తోడ్పాటు అందించడం విశేషం. తలసరి ఆదాయం రూ. 3.62 లక్షలకు చేరింది. హ్యుందాయ్, ఫాక్స్కాన్, శాంసంగ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు ఇక్కడ భారీగా విస్తరిస్తున్నాయి. హోసూర్లో రోల్స్ రాయిస్ మెయింటెనెన్స్ ఫెసిలిటీ ప్రారంభించడం దీనికి నిదర్శనం. 2024-25లో ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్, లెదర్ ఎగుమతుల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం.. సరుకుల ఎగుమతుల ద్వారా $52.07 బిలియన్లు(రూ. 4.35 లక్షల కోట్లు) రాబట్టింది.‘టీవీకే’ ప్రభంజనమా? పెట్టుబడులపై ప్రభావమా?ఎలాంటి పరిపాలనా అనుభవం లేని విజయ్ పార్టీ మే 4న వెలువడే ఫలితాల్లో సృష్టించబోయే ప్రభావాన్ని మార్కెట్ శక్తులు గమనిస్తున్నాయి. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు పారిశ్రామిక అనుకూల విధానాలతో స్థిరమైన పాలన అందించాయి. దీనివల్లే 2019 అక్టోబర్ నుండి 2025 జూన్ నాటికి $17.29 బిలియన్ల (రూ. 1,53,394 కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)ఇక్కడికి వచ్చాయి. అయితే విజయ్ పార్టీ ఓట్లను చీల్చి, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితి తలెత్తితే, అది కూటమి రాజకీయాల అనిశ్చితికి దారితీస్తుంది. ఒకవేళ విజయ్ గణనీయమైన సీట్లు సాధించి ‘కింగ్ మేకర్’ అయితే, భూసేకరణ లేదా పారిశ్రామిక విధానాలపై వారికున్న అనుభవలేమి కారణంగా, హోసూర్లో కొత్తగా రూ. 2,000 కోట్ల ప్లాంట్ను ఆమోదించడానికి కార్పొరేట్ సంస్థలు వెనకడుగు వేసే ప్రమాదం ఉంది.ఉచిత పథకాలు వర్సెస్ సుస్థిర వృద్ధిఎన్నికల హడావిడిలో అసలు చర్చించాల్సిన ప్రధానాంశం ఆర్థిక సుస్థిరత. రాష్ట్ర సామాజిక రంగ వ్యయం 2021-22లో రూ. 1.13 లక్షల కోట్ల నుంచి 2025-26 నాటికి రూ. 1.57 లక్షల కోట్లకు పెరిగింది. రేపటి పోలింగ్ కోసం అన్ని పార్టీలు మరిన్ని ఉచితాలను అందిస్తామని వాగ్దానం చేశాయి. ఈ నేపధ్యంలో ఏదో ఒక దశలో రూ. 36 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ వీటన్నింటికి మూల్యం చెల్లించుకోక తప్పదు. సంక్షేమాన్ని పంచుతూనే 2030 నాటి ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని ఎలా సాధిస్తారన్నదే తదుపరి ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా నిలిచింది.ఇది కూడా చదవండి: Earth Day 2026: అవని అంతం?.. మోగిన ‘కోడ్ రెడ్’! -
తమిళనాడులో జగన్ నామ గర్జన.. విజయ్ అభిమానం
జననేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్కు ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. ఆయన ఎక్కడికి వెళ్లిన అభిమానులు వైఎస్ జగన్ భారీ సంఖ్యలో తరలివచ్చి వెన్నంటే ఉంటారు. తమ అభిమాన నేతపై వారికున్న అభిమానాన్ని చాటుకుంటారు. కాగా, తమిళనాడు ఎన్నికల్లో సైతం వైఎస్ జగన్ పేరు మారుమోగుతోంది.ఎన్నికల ప్రచారంలో భాగంగా టీవీకే అధినేత విజయ్.. వైఎస్ జగన్పై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. జగన్తో కలిసి ఉన్న ఫొటోను విజయ్ ప్రదర్శించారు. దీంతో, ఒక్కసారిగా అక్కడున్న వారిలో జోష్ వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీవీకే అధినేత విజయ్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎన్నికల వేడి మధ్యలో, ప్రచార రథంపై నిలబడి ఉన్న విజయ్ ఒక్కసారిగా వైఎస్ జగన్ ఫొటోను పైకి ఎత్తి చూపించారు. ఆ ఫొటోను పైకెత్తిన క్షణంలోనే సభ మొత్తం ఒక్కసారిగా మార్మోగిపోయింది. “జగన్.. జగన్” అంటూ జనం గళం ఉప్పొంగిపోయింది. అది సాధారణ స్పందన కాదు. ఒక నాయకుడిపై ప్రజల్లో ఉన్న నమ్మకం, గౌరవం, ప్రేమ.. ఒక్క క్షణంలో బయటపడిన ఎమోషన్. అది ఒక ఫొటో మాత్రమే అయినా, స్పందన మాత్రం తుఫాన్లా ఎగిసిపడింది. అక్కడున్న వారంతా జగనన్న సీఎం అంటూ నినాదాలు చేశారు.Vijay holding jagan and vijay photo in TN election campaign 🇺🇿🔥🇪🇸 https://t.co/AwkL1Kuljk pic.twitter.com/SGblloxsRb— ᴊᴀɪxᴊᴀɢᴀɴɪꜱᴍ✨ (@ysj_fanboy) April 21, 2026విజయ్ ఫోటో ఎత్తిన తీరు.. జనం ఇచ్చిన ఆ రియాక్షన్.. ఈ రెండూ కలిసిన ఆ క్షణం నిజంగా ప్రజల గుండెల్లో “జగన్” అనే పేరు ఎంత లోతుగా ఉందో చూపించింది. ఇదీ జగన్ అంటే ప్రజల్లో గుండెల్లో ప్రత్యేక అభిమానమని అనడానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. వైఎస్ జగన్ అంటే ఒక నమ్మకం.. ఒక ఇంపాక్ట్ అని మరోసారి రుజువైంది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒓𝒂𝒏 𝑮𝒖𝒕𝒕𝒂 (@hiran_gutta) -
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. కీలక అభ్యర్థులు వీరే..
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఓటింగ్ ఏప్రిల్ 23న జరుగుతుంది. తొలి దశలో 152 స్థానాలకు పోలింగ్ ఉంటుంది. తొలి దశ ప్రచారం మంగళవారం (ఏప్రిల్ 21)న ముగిసింది. మిగిలిన ప్రాంతాల్లో ఏప్రిల్ 29న ఓటింగ్ జరుగుతుంది. ఫలితాలు మే 4న ప్రకటిస్తారు.రాజకీయంగా కీలకమైన పశ్చిమ బెంగాల్లో ప్రధాన పోటీ తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్యే ఉంది. ఏప్రిల్ 23న ఓటింగ్ 16 జిల్లాల్లోని 152 నియోజకవర్గాల్లో ఉన్నాయి.తొలి దశలో పోటీ చేసే కీలక అభ్యర్థులునందిగ్రామ్లో సువేందు అధికారి vs పబిత్ర కర్బీజేపీ నేత సువేందు అధికారి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు. 2021లో మమతా బెనర్జీని ఓడించి ఈ స్థానాన్ని గెలిచారు. అలాగే భవానీపూర్ నుంచి కూడా ఆన పోటీ చేస్తున్నాడు. నందిగ్రామ్ లో ఏప్రిల్ 23న, భవానీపూర్లో ఏప్రిల్ 29న పోలింగ్ జరుగుతుంది. సువేందు అధికారి 2020లో టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2021 ఎన్నికల్లో టీఎంసీ 294 స్థానాలకుగానూ 213 స్థానాలు గెలిచింది. కానీ, నందిగ్రామ్లో సువేందు అధికారి.. బెనర్జీపై విజయం సాధించారు.ప్రస్తుతం అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అధికారి. టీఎంసీ అభ్యర్థి పబిత్ర కర్ పై ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. కర్ ఒకప్పుడు బీజేపీలో కొనసాగారు. తర్వాత టీఎంసీ చేరారు. ఇప్పుడు తన మాజీ గురువుతో పోటీ పడుతున్నారు.బహరంపూర్లో అధీర్ రంజన్ చౌధురి vs సుబ్రత మైత్రాఅధీర్ రంజన్ చౌధురి దీర్ఘకాలం కాంగ్రెస్ ఎంపీగా బహరంపూర్ నుంచి 5 సార్లు గెలిచారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీ నేత యూసుఫ్ పఠాన్ చేతిలో ఓడిపోయారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలో బహరంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థి సుబ్రత మైత్రాను ఎదుర్కొంటున్నారు.ఆసన్సోల్ దక్షిణలో అగ్నిమిత్ర పాల్ vs తపాస్ బెనర్జీఅగ్నిమిత్ర పాల్ బీజేపీ మహిళా నాయకుల్లో ప్రముఖురాలు. 2019లో బీజేపీలో చేరి, 2021 ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి సాయోని ఘోష్ పై విజయం సాధించారు. ఇప్పుడు టీఎంసీ అభ్యర్థి తపాస్ బెనర్జీతో పోటీ పడుతున్నారు. తపాస్ బెనర్జీ టీఎంసీకి చెందిన సీనియర్ నాయకుడు. 2011 నుంచి 2021 వరకు ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.ఖరగ్పూర్ సదర్లో దిలీప్ ఘోష్ vs ప్రదీప్ సర్కార్దిలీప్ ఘోష్ బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు. పశ్చిమ బెంగాల్ లో పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. 2016లో ఖరగ్పూర్ సదర్ నుంచి గెలిచారు. 2021లో బీజేపీ అభ్యర్థి హిరణ్ చటర్జీ స్వల్ప తేడాతో విజయం సాధించారు. 2026 ఎన్నికల్లో ఘోష్ మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. టీఎంసీ ప్రదీప్ సర్కార్ ను రంగంలోకి దింపింది. సర్కార్ 2019 ఉపఎన్నికలో గెలిచారు.మథాభంగాలో నిసిత్ ప్రమాణిక్ vs సబ్లు బర్మన్కేంద్ర మాజీ మంత్రి నిసిత్ ప్రమాణిక్ బీజేపీ అభ్యర్థిగా కూచ్ బెహార్ జిల్లా మథాభంగా (ఎస్సీ) స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. టీఎంసీ నుంచి సబ్లు బర్మన్ పోటీకి దిగారు. సీపీఎం అభ్యర్థి ఖగేన్ చంద్ర బర్మన్, కాంగ్రెస్ అభ్యర్థి క్షితేంద్ర నాథ్ బర్మన్ కూడా రంగంలో ఉన్నారు. ప్రమాణిక్ 2021 లో దిన్హాటా నుంచి గెలిచారు. తర్వాత లోక్ సభ సభ్యత్వం కొనసాగించేందుకు ఆ స్థానాన్ని ఖాళీ చేశారు. ఉపఎన్నికలో ఉదయన్ గుహ గెలిచారు.డోంకల్లో హుమాయున్ కబీర్ vs మొస్తాఫిజుర్ రహమాన్మాజీ టీఎంసీ నేత, మమతా బెనర్జీ కేబినెట్లో మంత్రిగా పనిచేసి హుమాయున్ కబీర్.. ఇప్పుడు ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీని స్థాపించి స్వతంత్రంగా పోటీ నిర్ణయం తీసుకున్నారు. 2025 లో బాబ్రీ మసీదు నిర్మాణ ప్రతిపాదన కారణంగా ఆయన పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన కబీర్, సీపీఎం అభ్యర్థి మొస్తాఫిజుర్ రహమాన్ పై పోటీ చేస్తున్నారు. 2021లో ఈ స్థానం నుంచి టీఎంసీకి చెందిన జాఫికుల్ ఇస్లాం గెలిచారు.పానిహాటిలో రత్నా దేవనాథ్ vs నిర్మల్ ఘోష్ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనలో అత్యాచారం, హత్యకు గురైన మహిళా వైద్యురాలి తల్లి రత్నా దేవనాథ్. బీజేపీ అభ్యర్థిగా పానిహాటి నుంచి రత్నా దేవనాథ్ పోటీ చేస్తున్నారు. ఆమె ప్రత్యర్థి టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్. -
PM Modi : పది రూపాయల స్నాక్.. పది కోట్ల వ్యూస్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్ 21న జహాగ్రామ్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభ అనంతరం హెలిప్యాడ్ వైపు వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న దుకాణం వద్ద ఆగి, స్థానిక స్ట్రీట్ ఫుడ్ అయిన ఝల్మురి రుచి చూశారు. అక్కడి ప్రజలతో సరదాగా మాట్లాడారు. ఆ క్షణాల ఫొటోలు, వీడియోలను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు.ఈ సంఘటనతో ఆ దుకాణం యజమాని విక్రమ్ కుమార్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. మోదీ రాకతో నేను ఓవర్నైట్లో ఇంటర్నెట్ సెన్సేషన్గా మారాను అని విక్రమ్ మీడియాతో చెప్పుకొచ్చాడు. ఊహించని విధంగా ప్రజలు తన దుకాణానికి పోటెత్తుతున్నారని, ఫోన్కాల్స్ ఎక్కువై సమాధానం చెప్పలేక ఫోన్ను ఫ్లైట్ మోడ్లో పెట్టాల్సి వచ్చిందని వివరించాడు. కస్టమర్లతో పాటు రీల్స్ తీసుకునేవారు, సెల్ఫీలు దిగేవారు కూడా పెరిగారని చెప్పాడు.ప్రధాని మోదీ కొనుగోలు చేసిన ఝల్మురి ధర కేవలం రూ.10 మాత్రమేనని విక్రమ్ వెల్లడించాడు. మోదీ షేర్ చేసిన వీడియో 24 గంటల్లోపే ఇన్స్టాగ్రామ్లో 10 కోట్ల వ్యూస్, ఫేస్బుక్లో 11 కోట్ల వ్యూస్ దాటింది. అంతేకాదు, ఝల్మురి కోసం గూగుల్లో గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సెర్చ్లు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి.ప్రధాని సభ ముగించుకుని హెలిప్యాడ్ వైపు వెళ్తున్నప్పుడు నా స్టాల్ వద్ద ఆగారు. ఝల్మురి ధర ఎంత అని అడిగారు. నా నేపథ్యం, చదువు గురించి తెలుసుకున్నారు. నేను తొమ్మిదో తరగతి వరకు చదివానని చెప్పాను’అని విక్రమ్ గుర్తు చేసుకున్నాడు. తరువాత మోదీ సోషల్ మీడియాలో ‘జహాగ్రామ్లో మసాలా ఝల్మురి రుచి చూశాను’ అని రాశారు. ఆ రోజు ఆయన నాలుగు సభలు నిర్వహించినప్పటికీ, ఈ చిన్న విరామం ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా, మోదీ స్వయంగా డబ్బు చెల్లించి కొనుగోలు చేయడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ ఒక్క క్షణం వెనుక విక్రమ్ కుటుంబం దీర్ఘ ప్రయాణం ఉంది. 12 ఏళ్ల క్రితం వారు బీహార్ నుంచి జహాగ్రామ్కి వచ్చారు. చిన్న చిన్న స్టాళ్లలో మారుతూ, చివరికి రాజ్ కాలేజ్ మోర్ వద్ద ప్రభుత్వ అనుమతితో 77 అడుగుల స్థలం పొందారు. అక్కడే శాశ్వతంగా ఝల్మురి అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. కుటుంబం జహాగ్రామ్లోని బఛ్ఛుర్దోహా ప్రాంతంలో ఇల్లు కూడా నిర్మించుకుంది. షాపు నుంచే వచ్చే ఆదాయంతో ఆ ఇల్లు నిర్మాణం సాగిందని విక్రమ్ తెలిపారు. ఇప్పుడు తన దుకాణం రద్దీ పెరిగింది. కస్టమర్లతో పాటు నెటిజన్లను ఆకర్షిస్తోంది. Jhalmuri break in Jhargram! pic.twitter.com/LJNjEojAW4— Narendra Modi (@narendramodi) April 19, 2026 -
ఎల్లుండే బెంగాల్ పోలింగ్.. ఈసీ కొత్త ఆంక్షలు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఆంక్షలను తెర మీదకు తెచ్చింది. టూవీలర్స్ ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఎన్నికలు జరగబోయే 152 నియోజకవర్గాలకు ఈ ఆంక్షలు వర్తించనున్నాయి. గురువారం తొలి దఫా పోలింగ్ నేపథ్యంలో.. ఈ రెండ్రోజుల పాటు బైక్ ప్రయాణాలపై నిషేధం విధించింది ఈసీ. సాయంత్రం 6 నుంచి వేకువ జామున 6 దాకా రోడ్లపై బైక్ ఎక్కడానికి వీల్లేదు. అయితే.. అత్యవసరం సేవల కోసం మాత్రమే మినహాయింపు ఉంటుందని ఈసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మధ్య బైక్లు రోడ్ల మీద తిరగవచ్చు. కానీ, ఒంటరిగానే వెళ్లాల్సి ఉంటుంది. అంటే పిలియన్ రైడింగ్(pillion riding) కు అనుమతి లేదన్నమాట. అలాగే.. బైక్ ర్యాలీలకు అస్సలు అనుమతి లేదు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. అయితే.. పగటి పూట పిలియన్ రైడింగ్ విషయంలో టూవీలర్స్ వాహనదారులకు మాత్రం ఈసీ కాస్త ఊరట ఇచ్చింది. పిల్లలను విద్యా సంస్థల్లో దింపడం, వేడుకలకు హాజరు కావడం, మెడికల్ ఎమర్జెన్సీలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఓట్లు వేయడానికి వెళ్లేవారికి కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. పోలింగ్కు విఘాతం కలగవచ్చనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ చెబుతోంది. బెంగాల్లో ఏ ఎన్నికలు జరిగినా.. హింసాత్మక ఘటనలు జరగడం చూస్తున్నదే. అందుకే అక్కడి ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బెంగాల్లో ఈసారి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించి తీరతామని సీఈసీ జ్ఞానేష్ కుమార్ సోమవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కఠిన ఆంక్షలు అమలు చేయాలని ఈసీ భావిస్తోంది. అయితే.. బెంగాల్ ఎన్నికల కోసం ఈసీ ఈ కొత్త ఆంక్షలు తేవడం ఇదే తొలిసారి కాదు. 2021 బెంగాల్ ఎన్నికల టైంలోనూ ద్విచక్ర వాహనాలపై ఇలాంటి ఆంక్షలే విధించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ ఈసీ ఈ తరహా నిర్ణయమే అమలు చేసింది. -
ప్రధాని మోదీకి ‘తమిళ మేకప్?.. నెట్టింట రచ్చ
చెన్నై: సార్వత్రిక ఎన్నికల వేళ సోషల్ మీడియాలో విచిత్ర చర్చ మొదలైంది. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఆ బహిరంగ సభలో మోదీ చర్మం మునుపటికంటే కాస్త ముదురు రంగులో (నల్లగా) కనిపించడం వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా? అనే కోణంలో తీవ్రమైన చర్చ నడుస్తోంది.స్థానిక ఓటర్ల కోసమే మేకప్ వేశారా?ఎక్స్, ఇన్స్టాగ్రామ్ తదితర మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. తమిళనాడు ఓటర్లను ఆకర్షించేందుకు, స్థానికులతో మమేకమయ్యేందుకు ఉద్దేశపూర్వకంగానే మోదీకి ముదురు రంగు మేకప్ లేదా బ్రాంజర్ వేశారంటూ కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వాదనలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని, వీటికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టమవుతోంది. అయినా ఈ అంశంపై వ్యంగ్యాస్త్రాలు, మీమ్స్తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. DARK MAKEUP FOR DARKER VOTES — Tamil Nadu Tantrum!” 😡🎭 ⁉️Everything is a PR stunt for our PM.In Tamil Nadu, he seems to have applied darker skin-tone makeup to “look like one among them. Does he really think all Tamilians are black or dark? If this is true then this is… https://t.co/b8oGXWAZgA— 🥇 Pragnya Gupta (@GuptaPragnya) April 20, 2026కెమెరా ఎఫెక్టా, ఎండ ప్రభావమా?ఒకవైపు ఈ 'తమిళనాడు మేకప్' వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు నెటిజన్లు పెద్ద ఎత్తున మోదీకి మద్దతుగా నిలుస్తున్నారు. తీవ్రమైన ఎండలో బహిరంగ సభలో పాల్గొన్నప్పుడు కెమెరా ఎక్స్పోజర్, లైటింగ్ లోపాలు లేదా సూర్యరశ్మి ప్రభావం వల్ల సహజంగానే చర్మం రంగు అలా కనిపించి ఉండొచ్చని వారు అంటున్నారు. వీడియోలు తీసిన కోణం లేదా పోస్ట్-ప్రాసెసింగ్ ఎఫెక్ట్స్ కూడా దీనికి కారణం కావొచ్చని విజువల్ మీడియా నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు. Different shades; early morning in Bengal election campaign V/s evening election campaig in Tamil Nadu after applying shoe polish on face..He’s not insulting entire Tamilians ? pic.twitter.com/InN7RxsCn1— RajSpeak Parody ☭ (@RajSpeak_) April 21, 2026ఉత్తర-దక్షిణ వివాదంగా మారిన రాజకీయంవాస్తవ నిర్ధారణ జరగకముందే ఈ వివాదం ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య విభజన రేఖలు గీసే స్థాయికి చేరుకుంది. ఆన్లైన్ వేదికగా రెండు వర్గాలు తీవ్రంగా వాదించుకుంటూ సోషల్ మీడియాను రెండుగా చీల్చాయి. ఎన్నికల వాతావరణంలో ఇలాంటి చిన్న చిన్న దృశ్యాలు కూడా ఎంత వేగంగా పెద్ద చర్చకు దారితీస్తాయో ఈ ఘటన నిరూపిస్తోంది. ఇప్పటివరకు ప్రధానమంత్రి కార్యాలయం లేదా ప్రభుత్వ వర్గాల నుంచి ఈ ప్రచారంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఇది కూడా చదవండి: తెల్ల టవల్ జారిపోతే.. అధికారం ఊడినట్లేనా? -
‘టీవీకే’ రోబోను చూశారా? సందడి మాములుగా లేదుగా!
చెన్నై: కోయంబత్తూరులో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. రోబోతో ఓట్ల వేట మొదలుపెట్టింది. టీవీకే కండువా ధరించిన ఒక రోబోను రంగంలోకి దించారు. సౌత్ చెన్నై అభ్యర్థి సెంథిల్ కుమార్కు మద్దతుగా రోబో ప్రజలకు అభివాదం చేస్తూ.. వారితో కరచాలనం చేస్తూ సందడి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధినేత విజయ్ క్షేత్రస్థాయి ప్రచారంలో తక్కువగా పాల్గొంటుండటంతో అభ్యర్థులు వినూత్న పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నారు తిరువెరుంబూర్లో అభ్యర్థి విజయ్ కార్డ్బోర్డ్ కటౌట్ను ఉపయోగించారు. కుంభకోణంలో హోలోగ్రామ్ ఏఐ సాంకేతికతతో ప్రచారం నిర్వహించారు. కొలత్తూరులో విజయ్ పోలికలతో ఉన్న వ్యక్తితో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కోయంబత్తూరు సౌత్లో ఇప్పుడు రోబో ప్రచారం హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి విజయ్ కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే పర్యటించడంతో విపక్షాలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.ఈ విమర్శలపై విజయ్ స్పందిస్తూ.. పోలీసులు, కొందరు అధికారులు చివరి నిమిషంలో టీవీకే కార్యక్రమాలకు అనుమతులు నిరాకరిస్తున్నారంటూ ఆరోపించారు. కేవలం సంప్రదాయ ప్రచార పద్ధతులపైనే తాము ఆధారపడలేదని, ఇప్పటికే తమిళనాడులోని ప్రతి ఇంటిలోనూ సానుకూల పవనాలు వీస్తున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా.. నేటితో(ఏప్రిల్ 21, మంగళవారం) ప్రచార గడువు ముగియనుంది.ఈ చివరి రోజున విజయ్ సౌత్ చెన్నైలో రోడ్షో నిర్వహించడంతో పాటు చెన్నైలోని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పోలింగ్ ఏప్రిల్ 23 (గురువారం) ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు జరగనుంది. ప్రచారం ముగిసిన తర్వాత ఎలాంటి బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సంగీత కచేరీలు, థియేటర్ ప్రదర్శనలు లేదా ఇతర వినోద కార్యక్రమాల ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయకూడదన్నారు. ఎన్నికల అంశాలను టీవీలు, సినిమాలు, ఎఫ్.ఎమ్. రేడియోలు, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్(ట్విట్టర్) వంటి ఏ మాధ్యమం ద్వారా కూడా ప్రసారం చేయకూడదన్నారు. ఎల్రక్టానిక్ రూపంలో వచ్చే సంక్షిప్త సందేశాల, ఇంటర్నెట్ ప్రచారాలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. गजब,अभिनेता विजय चुनाव प्रचार में एडवांस टेक्नोलॉजी का बखूबी इस्तेमाल कर रहे है....अब चुनाव प्रचार में रोबोट को उतार दिया है....यह शायद भारत में संभवत पहला चुनाव होगा, जिसमें रोबोट वोट मांग रहा है....कोयंबटूर साउथ सीट में यह रोबोट विजय की पार्टी के लिए कैंपेन कर रहा है... pic.twitter.com/UmSmlk1Vh9— Dinesh Dangi (@dineshdangi84) April 20, 2026 -
మమత వర్సెస్ మోదీ: ఐ-ప్యాక్ అడ్డాగా యుద్ధం!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను తుఫాను చెలరేగుతోంది. ఎన్నికల వ్యూహకర్త సంస్థ ‘ఐ-ప్యాక్’ చుట్టూ అల్లుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు ఇప్పుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), కేంద్రంలోని బీజేపీ మధ్య యుద్ధానికి దారితీశాయి. మనీ లాండరింగ్ విచారణతో మొదలైన ఈ వ్యవహారం.. దాడులు, అరెస్టులు, సమన్లు దాటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమేయమున్న ‘గ్రీన్ ఫైల్’ ఎపిసోడ్తో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఇంతకీ ఈ ఐ-ప్యాక్ చుట్టూ ఏం జరుగుతోంది?తనిఖీల నుంచి రాజకీయ రగడకు.. ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా, ఊహించని రీతిలో సీఎం మమతా బెనర్జీ అక్కడికి చేరుకోవడంతో హైడ్రామా చోటుచేసుకుంది. ఏజెన్సీ వర్గాల సమాచారం ప్రకారం.. ఆమె తన అనుచరులు, పోలీసులతో కలిసి దాడులు జరుగుతున్న ప్రదేశం నుంచి కీలకమైన పత్రాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను బలవంతంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత సాల్ట్ లేక్లోని ఐ-ప్యాక్ కార్యాలయంలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. మమత చేతిలో ఉన్న ఆ ‘గ్రీన్ ఫైల్’ దృశ్యాలు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.పరస్పర తీవ్ర ఆరోపణలుమనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద జరుగుతున్న విచారణను సీఎం అడ్డుకున్నారని ఈడీ ఆరోపిస్తుండగా.. దర్యాప్తు సంస్థలు ఉద్దేశపూర్వకంగా తమ పార్టీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని, అభ్యర్థుల జాబితాను, హార్డ్ డిస్క్లను లాగేసుకుంటున్నాయని టీఎంసీ ఎదురుదాడికి దిగింది. ‘ఓ పార్టీ వ్యూహాలను, పత్రాలను ఎత్తుకెళ్లడం అమిత్ షా బాధ్యతా?’ అని ప్రశ్నించిన మమత, దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి గెలవాలని సవాల్ విసిరారు.బొగ్గు కుంభకోణం, హవాలా లింక్స్..ఈ మొత్తం వివాదానికి మూలం 2020లో అనూప్ మాఝీ అలియాస్ లాలాకు చెందిన అక్రమ బొగ్గు మైనింగ్ కుంభకోణం. ఈ స్కామ్ ద్వారా వచ్చిన నల్లధనాన్ని హవాలా మార్గాల ద్వారా ఐ-ప్యాక్ మాతృసంస్థ అయిన ‘ఇండియన్ ప్యాక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్’కు మళ్లించారని ఈడీ ప్రధాన ఆరోపణ. హవాలా ఆపరేటర్ల ద్వారా కోట్ల రూపాయలు ఈ సంస్థకు బదిలీ అయ్యాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.సాక్ష్యాలను మాయం చేయడం ఏంటి?ఈ ఆరోపణలపై దాడులు జరుగుతుండగా, ముఖ్యమంత్రి నేరుగా వెళ్లి సాక్ష్యాలను మాయం చేయడంపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి మాఫియాకు మద్దతు ఇస్తున్నారని.. ప్రభుత్వాలను కూల్చడానికి, ఏర్పాటు చేయడానికి ఐ-ప్యాక్ నేరుగా మాఫియా నుంచి డబ్బులు తీసుకుంటోందని బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ ఆరోపించారు. విచారణను అడ్డుకున్న మమతపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దర్యాప్తు సమయంలో ముఖ్యమంత్రి ప్రవేశించి సాక్ష్యాలను తీసుకెళ్లడం బహుశా భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు.అరెస్టులు,ముమ్మర విచారణ..మనీ లాండరింగ్ విచారణలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్లో ఐ-ప్యాక్ మరో సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్ను ఈడీ అరెస్టు చేయడంతో ఈ కేసు ఉచ్చు మరింత బిగుసుకుంది. ఈ వ్యవహారంలో పీఎంఎల్ఏ నిబంధనలకు అనుగుణంగానే ఈడీ వ్యవహరించిందని, సరైన ఆధారాలు సమర్పించిందని ఢిల్లీ కోర్టు సైతం స్పష్టం చేసింది. దర్యాప్తు విస్తృతం కావడంతో డైరెక్టర్ రిషి రాజ్ సింగ్కు విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేయడమే కాకుండా, ప్రతీక్ జైన్, ఆయన భార్య, సోదరుడి వ్యాపార లావాదేవీలపై కూడా ఈడీ నిఘా పెట్టింది.ప్రశాంత్ కిషోర్ తప్పుకున్నాక..2021 ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ ఐ-ప్యాక్ నుంచి వైదొలిగినప్పటికీ, ఈ సంస్థ బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఇంకా కీలకంగానే వ్యవహరిస్తోంది. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు జరుగుతున్న ఈ దాడులు టీఎంసీ ప్రచార యంత్రాంగాన్ని దెబ్బతీసే కుట్ర అని ఆ పార్టీ ఆరోపిస్తుండగా.. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ఈ అంశాన్ని వాడుకుంటోంది. ఈ వ్యవహారం రాబోయే ఎన్నికల్లో ఓటర్ల నాడిని ప్రభావితం చేసే ప్రధాన అస్త్రంగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు. -
‘ఝాల్మురీ’ ఓ డ్రామా: మమత
కోల్కతా: ఝార్గ్రామ్లో సోమవారం ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ దుకాణం వద్ద ఆగి ‘ఝాల్మురీ’ని కొనుగోలు చేయడం ఒక డ్రామా అని సీఎం మమతా బెనర్జీ కొట్టిపారేశారు. ‘అదంతా ప్రణాళికతో చేసిందే. అనుకోకుండా జరిగితే∙అక్కడికి అన్ని కెమెరాలు ఎలా వచ్చాయి?’ అని ప్రశ్నించారు. ప్రధాని వెంట ఉండే భద్రతాధికారులే వీటిని ముందుగానే ఏర్పాటు చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తన జేబు నుంచి రూ.10 నోటు బయటకు తీయడాన్ని ప్రస్తావిస్తూ ‘ఇదంతా నమ్ముతారా? మొత్తం డ్రామయే’ అని ఆమె అన్నారు. ‘మీకు అకస్మాత్తుగా ఝాల్మురీపై ప్రేమ పుట్టుకొచ్చింది. అయితే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలను చేపలు, మాంసం తినకుండా అడ్డుకోవడాన్ని ఏమంటారు?’ అంటూ మోదీని సీఎం ప్రశ్నించారు. -
‘ఝాల్మురీ’కి విశేష స్పందన
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచారం సమయంలో ఝాల్మురీ దుకాణాన్ని సందర్శించినప్పటి ఫొటోలకు సామాజిక మాధ్యమ వేదికల్లో విపరీత స్పందన లభించింది. ఈ ఫొటోలకు 24 గంటల వ్యవధిలో ఇన్స్టాగ్రామ్లో 10 కోట్ల వ్యూస్, ఫేస్బుక్లో 9 కోట్ల వ్యూస్ లభించాయి. గత 22 ఏళ్ల కాలంలో గూగుల్ సెర్చ్లో ‘ఝాల్మురీ’కి ఇంతటి స్పందన రావడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. ప్రఖ్యాత చిరుతిండి ఝాల్మురీని మరమరాలు, పచ్చి మిర్చి, టమాటాలు, ఉల్లి, ఇతర మసాలా దినుసులు కలిపి తయారు చేస్తారు. -
విజయ్ ఎన్నికల ర్యాలీలో అనూహ్య ఘటన
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో పార్టీల నేతల ప్రచారంలో మరింత జోరు కనపడుతోంది. అన్ని పార్టీల ప్రధాన నేతలు ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అలాగే, టీవీకే అధినేత విజయ్ సోమవారం పొన్నేరి అసెంబ్లీ నియోజకవర్గం పంచట్టి సహా పలు ప్రాంతాల్లో భారీ రోడ్షో నిర్వహించారు.ప్రచారం సమయంలో ఓ కొత్త జంట విజయ్ వద్దకు వచ్చింది. వారిని విజయ్ తన వాహనం మీదకు ఎక్కించుకున్నారు. దీంతో ఆనందం పట్టలేక పెళ్లికూతురు ఉబ్బితబ్బిబ్బయిపోయింది. పెళ్లికొడుకు, పెళ్లికూతురిని విజయ్ ఆశీర్వదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కొత్త దంపతులు విజయ్ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. విజయ్ తన జేబు నుంచి ఒక బహుమతిని తీసి ఆ జంటకు ఇచ్చారు. వధువు-వరుడు విజయ్ చేతులను ముద్దుపెట్టుకొని, ఆయన పాదాలను తాకుతూ కనిపించారు. వరుడు విజయ్ను ఆలింగనం చేసుకున్నాడు. విజయ్ ఆ జంట చేతులను పైకి ఎత్తి విజయం మనదే అనే సంకేతం చూపించారు. పరమానందంలో ఉత్సాహంతో ఉన్న వధువు జన సమూహాన్ని అభినందిస్తూ విజిల్ వేసింది. తమిళనాడు ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న జరుగుతుంది. ఓట్ల కౌంటింగ్ మే 4న జరుగుతుంది. ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో ప్రచారంలో నేతలు దూకుడుగా పాల్గొంటున్నారు. #ThalapathyVijay Blessed a Newly Married couple during today's campaign..❣️🤝pic.twitter.com/FPHWZqd4oO— Laxmi Kanth (@iammoviebuff007) April 20, 2026 -
అందుకే మహిళా బిల్లును ఓడించాం: రాహుల్ గాంధీ
కన్యాకుమారి: మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించిన పాపం విపక్షాలదే అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డం పెట్టుకుని అసంబద్ధంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలనుకున్న బీజేపీ పన్నాగాన్ని అడ్డుకున్నామని చెప్పారు. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి, పార్లమెంటులో ఓడించామని వెల్లడించారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కన్యాకుమారిలో బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్డీఏ సర్కారు ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్నారు.''మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయాలని కొద్ది రోజుల క్రితం పార్లమెంటులో ప్రధానమంత్రి చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనతో దేశ ఎన్నికల వ్యవస్థను మార్చాలన్న ఉద్దేశంతోనే ఈ బిల్లు తెచ్చారు. ఏన్డీఏ ప్రతిపాదించిన పునర్విభజనతో తమిళనాడు, కర్ణాటక, కేరళతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం బలహీనపడుతుంది. ఇది రాష్ట్రాల సమాఖ్యకు వ్యతిరేకంగా జరిగిన దేశద్రోహ చర్య. అందుకే మేము మహిళా బిల్లును వ్యతిరేకించి, పార్లమెంటులో ఓడించాం. దేశంలోని ఏ ప్రాంత ప్రాతినిధ్యాన్నైనా తక్కువ చేసే ప్రయత్నాలను ఎప్పటికీ ఒప్పుకోమ''ని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకు మోదీ సర్కారు కుట్ర పన్నుతోందని లోక్సభలో మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ఆరోపించారు. అధికారంలో కొనసాగడం కోసం దక్షిణాది, ఈశాన్య ప్రాంతాలకు, చిన్న రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చే కుట్రగా రాహుల్ గాంధీ వర్ణించారు. కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది అసలు మహిళా బిల్లు కానే కాదని కొట్టిపారేశారు.చదవండి: హమ్మయ్య! అమిత్ షా నవ్వారు.. రాహుల్ గాంధీ సరదా కామెంట్స్ -
విజయ్.. ఇక ఆరంభిద్దామా!
తమిళనాడులో సినీ తారల రాజకీయ ప్రయాణం ఎప్పుడూ ప్రత్యేకమే. ఎంజీఆర్, జయలలిత, సినీ నేపథ్యం ఉన్న కరుణానిధిలు సూపర్ సక్సెస్ అయ్యారు. శివాజీ గణేశన్, విజయకాంత్, కమల్ హాసన్ వంటి కొందరు మాత్రం ఒక స్థాయి వరకే పరిమితం అయ్యారు. రజనీ కాంత్ లాంటి బడా సూపర్ స్టార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టకుండానే వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో మరో అగ్రనటుడు విజయ్ ఎంట్రీ ‘మార్పు’ తేవొచ్చనే అంచనాలను రేకెత్తిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయ వాతావరణానికి మళ్లీ సినిమా రంగు పులుముకుంది. అధికార పార్టీ డీఎంకే పశ్చిమ తమిళనాడు నిజయోకవర్గాల ప్రచారానికి తన మిత్రుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ను రంగంలోకి దించింది. అయితే ఇది విజయ్కు చెక్ పెట్టే వ్యూహంలో భాగమేనన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది. ఆదివారం రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ కోయంబత్తూరులో డీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీ తరఫున ప్రచారం చేశారు. మన నియోజకవర్గం అంటూ ఉద్వేగంగా మాట్లాడిన ఆయన.. మెట్రో ప్రాజెక్టును నిరాకరించిన కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో టీవీకే అనేది అక్కడ పోటీలోనే లేదన్నట్లు కమల్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. కోయంబత్తూరు ప్రతిపక్ష అన్నాడీఎంకేకు కంచుకోటగా ఉంటూ వస్తోంది. అయితే ఈసారి ఎలాగైనా దానిని చేజక్కించుకునేందుకు కమల్ను ముందు ఉంచింది. కమల్కు ఈ నియోజకవర్గంతో వ్యక్తిగతంగా అలాగే రాజకీయంగానూ అనుబంధం ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసి.. బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తన ప్రచారంలో ఆ విషయాన్ని ప్రస్తావించిన కమల్.. బాలాజీని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయించే బాధ్యత తనదేనని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. తమిళనాట టీవీకే అధినేత విజయ్కి యువత, మహిళలు, జెన్జీ ఓటర్లలో విపరీతమైన ఆదరణ ఉంది. అందుకు తగ్గట్లే.. హోలోగ్రామ్లు, కటౌట్లు, సోషల్ మీడియా ద్వారా ఆయన తన ప్రచారాన్ని విస్తృతస్థాయిలో ఉధృతం చేశారు. పైకి పట్టనట్లే కనిపిస్తున్నప్పటికీ.. విజయ్ ప్రచారాన్ని డీఎంకే సీరియస్గానే తీసుకుంది. విజయ్ ఈ ఎన్నికల్లో చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం, త్రిచీ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్లో డీంఎకే, అన్నాడీఎంకే, టీవీకే మధ్య ప్రధాన పోటీ ఉంది. త్రిచీ ఈస్ట్ డీఎంకేకు బలమైన స్థానమే అయినా టీవీకే ఎంట్రీతో పోటీ ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో.. కమల్ను ‘స్టార్’ క్యాంపెయినర్గా సీన్లో ఉంచింది. కమల్ ఇప్పటికే చెపాక్–తిరువల్లిక్కేని నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కోసం ప్రచారం చేశారు. మరో 15 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం బ్యాలెన్స్ ఉంది. ఇందులో పెరంబూర్, త్రిచీ ఈస్ట్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో విజయ్ను కమల్ హాసన్ నేరుగా టార్గెట్ చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. కరూర్ తొక్కిసలాట, జన నాయగన్ చిత్రానికి సెన్సార్ నిరాకరణ అంశాల్లో విజయ్కు కమల్ హాసన్ నేరుగా మద్దతు ఇచ్చారు. అయితే ఇప్పుడు డీఎంకే కోసం ఆయన దళపతిని విమర్శించాల్సిన పరిస్థితి. అదే జరిగితే.. విజయ్ కూడా లోకనాయకుడి(ఉళగ నాయగన్)పై ఎదురు దాడి చేయాల్సి వస్తుంది. అంటే.. ఇదంతా తమిళనాడులో స్టార్ల మధ్య నేరుగా రాజకీయ పోరాటాన్ని ఆసక్తికరంగా మార్చుబోతోందన్నమాట. -
మమతా బెనర్జీకి టెన్షన్.. ఏడు లక్షల కొత్త ఓటర్లు చేరిక
కోల్కతా: బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో సుమారు ఏడు లక్షల మంది కొత్త ఓటర్లను ఎన్నికల సంఘం చేర్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఇప్పుడు 6,82,51,008కి చేరింది. కాగా, ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు జాబితాలో మరికొందరి పేర్లు చేరితే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఈసీ తెలిపింది. కొత్త ఓటర్లలో సుమారు 3.22 లక్షల మంది మొదటి విడతలో, 3.88 లక్షల మంది రెండో విడతలో ఓటేయనున్నారు. వీరిలో తొలిసారి ఓటేస్తున్నవారు ఎందరు అనే వివరాలేవీ ఈసీ వెల్లడించలేదు. అవసరమైతే వాటిని తర్వాత పంచుకుంటామని పేర్కొంది. కాగా, కొత్త ఓటర్ల చేరికతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కొత్త టెన్షన్ మొదలైనట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముఖచిత్రాన్ని ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) సమూలంగా మార్చేసింది. ఓటర్ల జాబితా నుంచి 90.83 లక్షల మంది పేర్లను తొలగించడంతో ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సర్ కారణంగా రాష్ట్రంలో ఓట్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 6.77 కోట్లకు తగ్గింది. 2021 నాటి పరిస్థితులకు భిన్నంగా ఈసారి తృణమూల్, బీజేపీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఓటర్ల జాబితాలో అత్యధిక కోతలు.. ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు ఎల్లప్పుడూ సహకరించే మైనారిటీ ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. తృణమూల్కు వెన్నెముకగా నిలిచే దక్షిణ ప్రాంతంలోనూ భారీగా కోతలు పడ్డాయి. అన్నిచోట్లా పరిస్థితి ఒకేలా లేదు. తృణమూల్కు బాగా బలమున్న దక్షిణ బెంగాల్లో ఇప్పుడు పరిస్థితి ఇబ్బందికరంగా మారినట్లు కనిపిస్తోంది. ఉత్తర బెంగాల్, జంగల్ మహల్ ప్రాంతాల్లో బీజేపీ తన పట్టును నిలుపుకొన్నట్లు కనిపిస్తున్నా మతువా ప్రాంతాల్లో ఓట్లు తగ్గడంతో కొంత ఇబ్బందిగానే కనిపిస్తోంది.తృణమూల్కు సవాలే..పశ్చిమ బెంగాల్లో తృణమూల్ లెక్కలు.. మైనారిటీలు, మహిళలు, 24 పరగణాల జిల్లాలపై ఆధారపడి ఉంటాయి. ఈ జిల్లాల్లో దెబ్బ పడటంతో కొన్ని డజన్ల నియోజకవర్గాల్లో బీజేపీ పోటీనిచ్చే అవకాశం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సర్కు ముందు రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 959 మంది మహిళా ఓటర్లు ఉండేవారు. సర్ తర్వాత అది 950కి పడిపోయింది. దీంతో మమతకు అండగా నిలిచే మహిళల ఓట్లకు భారీగా కోతపడింది. మైనారిటీలు అధికంగా ఉన్న జిల్లాల్లో ఓట్ల కోతతో వారిలో అభద్రతా భావం పెరిగింది. దీనివల్ల తృణమూల్వైపు ఓట్లు మరింత ఏకపక్షంగా మళ్లే అవకాశం కనిపిస్తోంది. గతంలో మైనారిటీ ఓట్లద్వారా లబ్ధి పొందిన ఐఎస్ఎఫ్, ఏజేయూపీ, ఎంఐఎం నష్టపోయే అవకాశముంది.నదియాలో విచారణలో ఉన్న ఓటర్లలో 78శాతం పేర్లను తొలగించారు. ఇది రాష్ట్రంలోనే అత్యధిక తొలగింపు రేటు. 2011 నుంచి తృణమూల్ కాంగ్రెస్కు ఆయువుపట్టులా నిలిచిన జిల్లాలపై భారీగానే దెబ్బ పడింది. ఇందులో ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, ముర్షీదాబాద్, నదియా, మాల్దా, హూగ్లీ, హావ్డా, ఉత్తర్ దినాజ్పుర్, పూర్వ బర్ధమాన్ ఉన్నాయి. ఈ జిల్లాల్లో 66.6 లక్షల మంది పేర్లు గల్లంతయ్యాయి. ఈ జిల్లాల్లోనే 178 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. -
కోల్కతా డీసీ నివాసంపై ఈడీ దాడులు
కోల్కతా: మనీలాండరింగ్ విచారణలో భాగంగా కోల్కతా పోలీస్ డిప్యూటీ కమిషనర్ శంతను సిన్హా బిస్వాస్తో పాటు జాయ్ కామ్దార్ అనే వ్యాపారవేత్త ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ ఆదివారం దాడులు చేసింది. దాడుల సమయంలో బిస్వాస్ అందుబాటులో లేరు. కామ్దార్ను విచారణ నిమిత్తం స్థానిక ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లాక అరెస్టు చేశారు. రాష్ట్రంలో మూడు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నేపథ్యంలో ఈ దాడులు, అరెస్టు చర్చనీయాంశమయ్యాయి. కేసులో ఏప్రిల్ 1న ఈడీ మొదటి విడత సోదాలు నిర్వహించింది. రూ. 1.47 కోట్ల నగదుతో పాటు రూ. 67.64 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి, ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకుంది. అల్లర్లు, హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఆయుధాల చట్ట ఉల్లంఘనల అభియోగాలతో కోల్కత్తా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించింది. -
బీజేపీతోనే మహిళలకు న్యాయం
సాక్షి, చెన్నై: లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి కాంగ్రెస్, డీఎంకే లు మహిళలకు ద్రోహం చేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రమే మహిళలకు న్యాయం జరిగేలా చూస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోదకురిచి నియోజకవర్గ బీజేపీ కృతికా శివకుమార్కు మద్దతుగా ఆదివారం జరిగిన రోడ్షోలో ప్రసంగించారు. అధికార డీఎంకే చేస్తున్న కుటుంబ రాజకీయాలపైనా ఆయన విమర్శలు గుప్పించారు. తన కొడుకు ఉదయనిధిని ముఖ్యమంత్రిని చేయడంపై స్టాలిన్ దృష్టిపెట్టారని, ఈ కుటుంబ రాజకీయాలు రాష్ట్ర ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మేలు చేయలేవని షా ఆరోపించారు. ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి కె.పళనిస్వామి నాయకత్వంలో ఎన్డీయే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏఐఏడీఎంకే–బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలను మెరుగుపరుస్తామని, తమిళనాడుకు పూర్వ వైభవం తీసుకొస్తామబని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి లభిస్తున్న మద్దతుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. -
లూటీలో తృణమూల్ పీహెచ్డీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ 15 ఏళ్ల పాలనలో దోపిడీలో పీహెచ్డీ చేసిందని ధ్వజమెత్తారు. చొరబాటుదార్ల అభివృద్ధిలోనే తృణమూల్కు అమితాసక్తి ఉందని విమర్శించారు. బుజ్జగింపు రాజకీయాలతో యువత, మహిళలు, రైతన్నలను పూర్తిగా నిర్లక్ష్యంగా చేసిందని ఆరోపించారు. చొరబాటుదార్ల ఓట్లతో కేవలం వారి మేలుకోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తృణమూల్ భావిస్తోందని మండిపడ్డారు. ప్రధాని ఆదివారం బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నారాయణ్గఢ్, పురూలియా, బంకురా, ఝార్గ్రామ్ బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఈసారి పోటీ తృణమూల్ లూటీ, ఓటు బ్యాంకు రాజకీయాలకు, బీజేపీ అభివృద్ధి ఎజెండాకు మధ్యేనన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని కోరితే బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇవి బెంగాల్ అస్తిత్వాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలన్నారు. అభివృద్ధి జాడే లేదు ‘‘భారత్ 3జీ నుంచి 5జీకి ఎదిగింది. ప్రపంచంలో మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థ మన దేశంలోనే ఉంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాం. బెంగాల్లో మాత్రం అభివృద్ధి జాడే లేదు’’ అంటూ మోదీ దుయ్యబట్టారు. ‘‘మమత పాలనలో అవినీతి, ఉద్యోగాల కొరత తప్ప ఇంకేమీ లేదు. ఉపాధి లేక బెంగాల్ మహిళలు ఢిల్లీ, ముంబై వలస వెళ్లాల్సి వచ్చింది. స్థానికులకు దక్కాల్సిన ఉద్యోగాలను చొరబాటుదార్లకు తృణమూల్ పంచిపెడుతోంది. బీజేపీ అధికారంలోకి రాగానే ఈ దోపిడీని అడ్డుకుంటాం. ఇది నా హామీ! తృణమూల్ దిగజారుడు రాజకీయాలు రాష్ట్ర సామాజిక స్వరూపాన్నే మార్చేశాయి. చొరబాట్లతో బెంగాల్ భాష, సంస్కృతి మారిపోతున్నాయి. మమత ప్రభుత్వం గిరిజన భాషలను, గుర్తింపును అవమానిస్తోంది. మదర్సాలకు రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తూ సంతాలీ భాషను నిర్లక్ష్యం చేస్తున్నారు. గిరిజనుల భూములను విచ్చలవిడిగా ఆక్రమిస్తున్నారు. తృణమూల్ నేతలకు లంచమివ్వనిదే ఒక్క పనీ జరగడం లేదు. లంచాల సంస్కృతిని తట్టుకోలేక పరిశ్రమలు రాష్ట్రం వీడాయి. అవినీతితో ఉపాధి సంక్షోభం పెరిగింది. ఉద్యోగాల్లేక యువత అలమటిస్తోంది’’ అని విమర్శించారు. మహిళలకు తీరని ద్రోహం మహిళా రిజర్వేషన్ల చట్టం ఆమోదానికి లోక్సభలో తెచ్చిన బిల్లును అడ్డుకుని మహిళలకు తృణమూల్ తీరని ద్రోహం చేసిందని మోదీ ఆరోపించారు. ‘‘2029 నుంచే చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న మహిళల ఆకాంక్షలతో కాంగ్రెస్తో కలిసి తృణమూల్ సమాధి కట్టింది. తద్వారా బెంగాల్ సోదరీమణులనూ దగా చేసింది. బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. కొన్ని జిల్లాల్లో టీఎంసీ ఒక్క సీటూ గెలవదని నా రాజకీయ అనుభవంతో చెప్పగలను’’ అన్నారు. ‘‘బీజేపీ అధికారంలోకి వస్తే మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తాం. మాతృశక్తి భరోసా పథకం కింద వారికి ఏటా రూ.36,000, గర్భిణులకు రూ.21,000, కుమార్తెల చదువుకు రూ.50,000 ఇస్తాం. వరి మద్దతు ధర క్వింటాల్కు రూ.3,100కు పెంచుతాం’’ అని హామీ ఇచ్చారు. ఝాల్మురీ రుచికిమోదీ ఫిదాబెంగాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రఖ్యాత చిరుతిండి ఝాల్మురీని మోదీ రుచి చూశారు. దీన్ని మరమరాలు, పచ్చి మిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు, ఇతర మసాలాలతో తయారు చేస్తారు. ఝార్గ్రామ్ జిల్లాలో మోదీ కాన్వాయ్ ఓ దుకాణం ముందు హఠాత్తుగా ఆగింది. మోదీ వాహనం దిగి దుకాణదారును పలకరించారు. ‘‘సోదరా! ఝాల్మురీ ఎంత? నాకు రుచి చూపించు. రుచికరంగా త యారు చెయ్’’ అని కోరా రు. తను వెంటనే ఝాల్ మురీ చేసి ప్రధానికి అందించాడు. డబ్బులు తీసుకోవడానికి నిరాకరించగా మోదీ బలవంతంగా అతడి చేతిలో పెట్టారు. రుచెలా ఉందని దుకాణదారు ప్రశ్నించగా ఉప్పు తప్ప అన్నీ బాగున్నాయని బదులిచ్చారు. ఆరోగ్యం దృష్ట్యా తాను ఉప్పు వాడడం లేదని చెప్పారు. ఝాల్మురీ ఆరగిస్తున్న ఫొటో, వీడియోను మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
టీఎంసీ గుండాలు పది రోజుల్లో లొంగిపోవాలి.. లేదా: మోదీ వార్నింగ్
కోల్కతా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ప్రధాని మోదీ విరుచుకపడ్డారు. బెంగాల్లో అశాంతి సృష్టిస్తున్న టీఎంసీ గుండాలను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బెంగాల్లోని బిష్ణుపూర్లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మే నాలుగు తర్వాత అవినీతిపరులు, గుండాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. కనుక టీఎంసీ గుండాలు పదిరోజుల్లోపు తమంతట తామే పోలీసుల ఎదుట లొంగిపోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. బిష్ణుపూర్ మాఫియా, టీఎంసీ సిండికేట్ ఆటలు ఇకసాగవన్నారు. గత 15 ఏళ్లుగా పశ్చిమబెంగాల్లో టీఎంసీ ఏవిధమైన అభివృద్ధి చేసిందో ప్రజలకు తెలియజేయాలన్నారు. టీఎంసీ విధానాలతో బెంగాల్ గుర్తింపు ప్రమాదకరంగా మారిందన్నారు. బెంగాల్ బ్రాండ్ను బీజేపీ కాపాడుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.అయితే అంతకుముందు లోక్సభలో లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు చాలా పెద్ద తప్పు చేశాయని పేర్కొన్నారు. దీనికి తగిన పర్యవసానాలను విపక్షాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని దేశ మహిళలకు ప్రతిపక్షాలు సమాధానం చెప్పుకోవాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు దేశ మహిళలను మోసం చేశాయని ఈ సందేశాన్ని దేశంలోని ప్రతి ఒక్కరికీ, ప్రతి గ్రామానికి చేరవేయాలని బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోదీ సూచించినట్లు తెలుస్తోంది -
‘మోదీ జీ.. మీ ప్రసంగం చట్ట విరుద్ధం’
కోల్కతా: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం( ఏప్రిల్ 18వ తేదీ) రాత్రి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రచారం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని మోదీ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. దేశాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు నిజాయితీగా మాట్లాడాలని, కానీ మీరు(మోదీ) ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ఆదివారం(ఏప్రిల్ 19వ తేదీ) హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్లో జరిగిన ఒక ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ బిల్లుపై జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ద్వారా ప్రధాని మోదీ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కోసం చట్టవిరుద్ధమైన ప్రచారం చేశారని ఆరోపించారు. వారు (బీజేపీ) రాజకీయ ప్రచారాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము మరియు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) ఉల్లంఘన జరిగింది’ అని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. తాము మహిళా రిజర్వేషన్ బిల్లు వ్యతిరేకం కాదని ,డీలిమిటేషన్ బిల్లుకు మాత్రమే వ్యతిరేకమన్నారు. డీలిమిటేషన్ అంశం మోదీ పొలిటికల్ అజెండాగా మమతా అభివర్ణించారు.శనివారం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలను ఉద్దేశించి ప్రధాని మోదీ హెచ్చరిస్తూ పాపం చేసినందుకు భారతదేశ మహిళలు వారిని తీవ్రంగా శిక్షించడం ఖాయమన్నారు. మరోవైపు నేటి పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్పై తన దాడిని కొనసాగించారు. శాసనసభలలోకి ఎక్కువ మంది మహిళలు ప్రవేశించకుండా నిరోధించడానికి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), కాంగ్రెస్లు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు మోదీ. ప్రస్తుతం పశ్చిమబెంగాల్లో రాజకీయ సమర శంఖారావం మరింత వేడెక్కింది. మోదీ వర్సెస్ మమతా అన్నట్లుగా పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారం వేడిక్కింది. -
స్వార్థంతోనే బిల్లును వ్యతిరేకించారు
సాక్షి, చెన్నై: తమ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లు ఒక గొప్ప ప్రయత్నమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీల విద్వేష, నీచ రాజకీయాల వల్ల ఆ బిల్లు పట్టాలు తప్పిందని అన్నారు. అధికారం కేవలం తమ కుటుంబాల చేతుల్లోనే ఉండాలన్న స్వార్థంతోనే విపక్షాలు మహిళా రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని, బిల్లు క్రెడిట్ను ప్రతిపక్షాలే తీసుకోవాలంటూ వ్యక్తిగతంగా అభ్యర్థించానని చెప్పారు. అయినా సరే విపక్షాలు మద్దతు ఇవ్వలేదన్నారు. సాధారణ కుటుంబాల్లో జన్మింంచిన ఆడబిడ్డలు అత్యున్నత చట్టసభలకు అధిక సంఖ్యలో రావాలని కోరుకున్నట్లు తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తూ ఈ గొప్ప ప్రయత్నం సాకారం కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలే అందుకు కారణమని మండిపడ్డారు. బిల్లు ఆమోదం పొంది ఉంటే సామాన్య కుటుంబాలకు చెందిన ఎంతోమంది తమిళ మహిళలు ఎంపీలుగా, ఎమ్మెల్యేలు అయ్యేవారని.. 2011 జనాభా లెక్కల ప్రకారం తమిళనాడుకు లోక్సభలో మరెన్నో సీట్లు వచ్చేవని తెలిపారు. కానీ, ఇదంతా జరగడం డీఎంకేకు ఇష్టం లేదని ప్రధానమంత్రి ఆరోపించారు. -
మోదీ గుట్టు ట్రంప్కు తెలుసు
సాక్షి, చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియంత్రిస్తున్నారని.. మోదీ మాత్రం తమిళనాడును నియంత్రించాలని చూస్తున్నారని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ విమర్శించారు. తమిళనాడులో అధికారం దక్కించుకోవడానికి అన్నా డీఎంకేను గుప్పిట పట్టారని చెప్పారు. ప్రధాని మోదీ మన రైతులను, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఇతర దేశాలకు అమ్మేశారని, మన ఇంధన భద్రతను పరాయి దేశాలకు అప్పగించారని, మన డేటాను కూడా పంచిపెట్టారని ఆరోపించారు. శుక్రవారం పార్లమెంట్లో మోదీ ముఖంలో ఆత్మవిశ్వాసం లోపించడం చూశా మని అన్నారు. ఆయన ప్రతిపక్షాలకు ముఖం చూపించలేకపోయారని, పక్కన కూర్చుండిపోయారని చెప్పారు. మోదీ అమెరికా నియంత్రణలో ఉండటమే అందుకు కారణమని తేల్చిచెప్పారు. మన దేశాన్ని అమ్మేయడానికి భారత్–అమెరికా ఒప్పందంపై ప్రధాని సంతకం చేశారని ఆక్షేపించారు. తమిళనాడులోని రాణిపేట, పొన్నేరి, తిరుచిరాపల్లిలో శనివారం ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ట్రంప్ ఎలా చెబితే అలా మోదీ తలవంచే పరిస్థితి ఉందన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారా మోదీని ట్రంప్ నియంత్రిస్తున్నారని చెప్పారు. మోదీ ఆర్థిక లావాదేవీలు, అదానీతో మోదీకి ఉన్న బంధం గురించి ట్రంప్కు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. దేశాన్ని పరిరక్షించుకోవడానికే శుక్రవారం లోక్సభలో ప్రతిపక్షాలు డీలిమిటేషన్ బిల్లును ఓడించాయని రాహుల్ గాంధీ అ న్నారు. పార్లమెంట్లో తమిళనాడు ప్రాతినిధ్యాన్ని తగ్గించాలన్నదే అసలు ఉద్దేశమని విమర్శించారు. దక్షిణ రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల బలాన్ని తగ్గించడానికే బీజేపీ ఈ పునరి్వభజన చర్య చేపట్టిందని ధ్వజమెత్తారు. తమిళనాడును కాపాడుకోవాలంటే డీఎంకే నేతృత్వంలోని కూటమిని ఎన్నికల్లో గెలిపించాలని రాహుల్ కోరారు. -
Tamil Nadu Survey: 178 స్థానాలలో గెలుపు బాటలో డీఎంకే
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. డీఎంకే వర్గాలలో మంచి జోష్ నింపే విధంగా తాజాగా ఏఎన్ఎస్ సర్వే వివరాలు వెలుగు చూశా యి. ఇందులో తమిళనాడులో మళ్లీ డీఎంకే ప్రభంజనం సృష్టించబోతున్నట్టుగా సమాచారం వెలువడింది. తాజా సర్వే గణాంకాల ప్రకారం ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి 178 స్థానాలను కైవసం చేసుకుని భారీ మెజారిటీతో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోనుందని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు మరి కొద్ది రోజులే సమయం ఉంది. ఎన్నికలకు ముందుగా వెలువడ్డ అనేక సర్వేలు డీఎంకేకు అనుకూలంగా ఫలితాల్ని ఇచ్చాయి. అదే సమయంలో ఎన్నికల నగారా మోగినానంతరం ప్రచార హోరు నేపథ్యంలో అన్నాడీఎంకేకు సైతం అనుకూలంగా సర్వేలు రావడంతో ఉత్కంఠ తప్పలేదు. అదే సమయంలో టీవీకే అధినేత విజయ్ కీలక శక్తిగా మారనున్నట్టుగా సర్వేలు పేర్కొంటూ వచ్చాయి. ఓటరు నాడి ఎటు అన్న ఉత్కంఠ నేపథ్యంలో తాజాగా వెలువడ్డ ఈ సర్వే వివరాలను డీఎంకే అనుకూల పత్రిక ప్రకటించింది. జోన్ల వారీగా అంచనాలు సర్వే నివేదిక ప్రకారం వివిధ ప్రాంతాల్లో డీఎంకే కూటమి పరిస్థితిని వివరించారు. ఇందులో చెన్నై జోన్లో 37 నియోజకవర్గాలకు డీఎంకే కూటమి 36 స్థానాల్లో పటిష్టంగా ఉండగా, అన్నాడీఎంకే ఒకే స్థానానికి పరిమితం కానున్నట్టు ప్రకటించారు. సెంట్రల్ జోన్లో 37 స్థానాల్లో 35 చోట్ల డీఎంకే గెలుస్తుందని సర్వేలో తేల్చారు. దక్షిణ జోన్లో 58 స్థానాలకు గాను 42 స్థానాల్లో డీఎంకే కూటమి ఆధిక్యంలో ఉన్నట్టు ప్రకటించారు. జిల్లా వారీగా క్లీన్ స్వీప్ అనేక జిల్లాల్లో డీఎంకే కూటమి 100 శాతం సీట్లు గెలుచుకుంటుందని సర్వేలో వివరించారు. ఆ మేరకు చెన్నై జిల్లాలో 16 సీట్లు, తిరువళ్లూరు జిల్లాలో 10 సీట్లు, తంజావూరు 8 సీట్లు, కాంచీపురం 11 సీట్లు, నీలగిరి, కరూర్, తిరువారూర్, రామనాథపురం జిల్లాల్లోని అన్ని సీట్లను డీఎంకే గెలుచుకునే అవకాశం ఉందని ఆ సర్వే ద్వారా వివరించారు. విజయ్ ప్రభావం ఓట్ల శాతం పరంగా ఈసారి రాజకీయ ముఖచిత్రం ఆసక్తికరంగా మారుతుందని ప్రకటించారు. డీఎంకే కూటమి 45.4 శాతం, అన్నాడీఎంకే కూటమి 35.3 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందని వివరించారు. అయితే, నటుడు విజయ్ టీవీకే 11.5 శాతం ఓట్లు, సీమాన్ ఎన్టీకే 5.6 శాతం ఓట్లను దక్కించుకోనున్నట్టు పేర్కొన్నారు. 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118 కాగా, సర్వే ప్రకారం డీఎంకే 178 సీట్లు సాధించి తిరుగులేని శక్తిగా అవతరించనున్నదని, అన్నాడీఎంకే 56 సీట్ల వద్ద నిలిచిపోయే అవకాశం ఉందని తాజా సర్వే పేర్కొంది. అయితే తుది ఓటరు తీర్పు అన్నది మే 4న వెలువడే ఫలితాల మేరకు ఉండబోతుండడం గమనార్హం. ఈ సర్వే తమకు అనుకూలంగా ఉండడంతో డీఎంకే వర్గాలలో జోష్ పెరిగింది. గెలుపు దిశగా మరింత ఉత్సాహంతో ప్రచారంచేసే పనిలో పడ్డారు. -
దీదీ లోకల్ మంత్రం.. కమలం బూత్ తంత్రం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంటున్న కొద్దీ ప్రధాన రాజకీయ పక్షాలైన అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ తమ ప్రభుత్వంపై వ్యతిరేకతను అధిగమించేందుకు స్థానిక సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈసారి తృణమూల్ను ఎలాగైనా గద్దె దింపి రాష్ట్రంలో తొలిసారి అధికారం చేపట్టాలని పట్టుదలగా ఉన్న బీజేపీ బూత్ స్థాయి నుంచే పక్కా ప్రణాళికలు రచిస్తోంది. తృణమూల్ ‘ప్రతిజ్ఞా స్తంభాలు’ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ‘స్థానిక మేనిఫెస్టో’లతో తృణమూల్ వినూత్నంగా ప్రచారం చేస్తోంది. స్థానికంగా ప్రధాన సమస్యలను గుర్తిస్తూ, వాటి పరిష్కారానికి మేనిఫెస్టోల్లో హామీలిస్తోంది. డార్జిలింగ్ పర్వత ప్రాంతంలో మూడు అసెంబ్లీ స్థానాలు మినహా రాష్ట్రంలోని మిగతా 291 చోట్లా తృణమూల్ బరిలో ఉంది. అభ్యర్థుల్లో జవాబుదారీతనం పెంచేందుకు, ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పేందుకు ప్రతి నియోజకవర్గంలో ‘ప్రతిజ్ఞా స్తంభం’ పేరిట వినూత్న కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. స్థానిక అభ్యర్థి తాలూకు ఎన్నికల కార్యాలయం ముందు ఈ స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానిపై అభ్యర్థి పేరుతో పాటు సమస్యల పరిష్కారానికి చేస్తున్న వాగ్దానాలను పొందుపరుస్తున్నారు. వారంక్రితం ప్రారంభమైన ఈ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా కొనసాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రతిజ్ఞా స్తంభాలు, ప్రచార కార్యక్రమాల వీడియోను పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీలో కూడా పంచుకుంది. అభ్యర్థి ప్రజలకు నేరుగా జవాబుదారీగా ఉంటారనే స్పష్టమైన సందేశాన్ని రాష్ట్రవ్యాప్తంగా పంపడం దీని వెనక వ్యూహమని భావిస్తున్నారు. గతం నుంచి బీజేపీ పాఠాలు ఇక బీజేపీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన సంస్థాగత లోపాలను దిద్దుకునే పనిలో పడింది. ర్యాలీలు, రోడ్షోలు, బహిరంగ సభల ద్వారా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూనే, అసలు యుద్ధభూమి అయిన పోలింగ్ బూత్ల నిర్వహణపై ఈసారి ప్రధానంగా దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని మొత్తం 85,379 పోలింగ్ బూత్ల్లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు మినహాయించి అంతటా ఇప్పటికే బూత్ కమిటీల ఏర్పాటును పూర్తి చేసింది. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు చెలరేగిన హింస కారణంగా బీజేపీ కార్యకర్తలు భారీగా బూత్లను వదిలి వెళ్లడం ఓటింగ్పై తీవ్ర ప్రభావం చూపింది. ఈసారి ఆ పరిస్థితి తలెత్తరాదని కార్యకర్తలకు పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. చివరి నిమిషం దాకా ఎట్టి పరిస్థితుల్లోనూ బూత్ను వదలకూడదని ఆదేశించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నేరుగా బూత్ స్థాయి కార్యకర్తలతో సంభాషిస్తూ ఉత్సాహం నింపుతున్నారు. బూత్ మేనేజ్మెంట్ను పకడ్బందీగా అమలు చేసేందుకు బెంగాల్ను బీజేపీ ఐదు భాగాలుగా విభజించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు అనంత్ నారాయణ్ మిశ్రా, పవన్ రాణా, సిద్ధార్థన్, ఎన్.మధుకర్, పవన్ సాయ్కి వాటి బాధ్యతలు అప్పగించింది. వీరంతా గత అక్టోబర్ నుంచే క్షేత్రస్థాయిలో మకాం వేశారు. సంస్థాగత లోపాలను సరిదిద్దుతూ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. మూడు నుంచి ఐదు బూత్లను కలిపి ఒక ‘శక్తి కేంద్రం’గా ఏర్పాటు చేసి, వాటి పర్యవేక్షణ బాధ్యతలను రా్రõÙ్టతర నేతలకు అప్పగించారు. నిరంతర సమీక్షలతో బూత్ స్థాయిలో రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. బూత్ మేనేజ్మెంట్లో ఈసారి తృణమూల్కు దీటుగా నిలుస్తామని బీజేపీ ధీమాగా ఉంది.రంగంలోకి ఆరెస్సెస్ క్షేత్రస్థాయిలో హిందువులను ఏకం చేసేందుకు ఆరెస్సెస్ ఆధ్వర్యంలో బెంగాల్ అంతటా ముమ్మర ప్రచారం సాగుతోంది. బెంగాలీ హిందువుల ఉనికిని ఈ ఎన్నికలు కీలకమంటూ ప్రచారం చేస్తోంది. ఎన్నికల హింసకు వెరచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉండే ధోరణికి స్వస్తి పలకాలి. ప్రతి బూత్నూ సురక్షితం చేసి, ఓటర్లు నిర్భయంగా ఓటేసేలా చూడాలి’’ అని కార్యకర్తలకు సూచిస్తోంది. ఈసారి ఒక్క బూత్ నుంచి కూడా తమ కార్యకర్తలను తృణమూల్ పారదోలే పరిస్థితి ఉండబోదని ఆరెస్సెస్ ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా వచ్చిన ఆరెస్సెస్ స్వయంసేవకులు జనజాగరణ కార్యక్రమంలో నిమగ్నమైనట్టు వెల్లడించారు. శరత్ చంద్ర ముక్తవరం -
టీఎంసీ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐటీ అధికారులు శుక్రవారం టీఎంసీ నేతల ఇళ్లలో సోదాలు చేపట్టారు. వీరిలో ఒకరు రస్బెహారీ అసెంబ్లీ సీటుకు పోటీ చేస్తున్న టీఎంసీ ఎమ్మెల్యే దేబాశీస్ కుమార్ కాగా, మరొకరు భవానీపూర్ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీని బలపర్చిన మిరాజ్ షా కావడం గమనార్హం. కోల్కతాలోని దేబాశీస్ కుమార్ నివాసం, ఎన్నికల కార్యాలయం, ఆయనకు సంబంధించిన ఇతర కార్యాలయాల్లో ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించిన తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగాయి. ఐటీ అధికారుల మరో బృందం దక్షిణ కోల్కతాలోని ఎల్గిన్ రోడ్డులో ఉన్న మిరాజ్ షా నివాసంపై దాడి చేసింది. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీని బలపర్చిన నాలుగు వేర్వేరు మతాలకు చెందిన నేతల్లో మిరాజ్ ఒకరు. దేబాశీస్ కుమార్ సన్నిహితుడు, టీఎంసీ నేత కుమార్ సాహాకు చెందిన కాళీఘాట్ నివాసంపైనా ఐటీ దాడులు జరిగాయి. భూకుంభకోణం ఆరోపణలున్న దేబాశీస్ కుమార్ ఇప్పటికే పలుమార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. తమ నేతల ఇళ్లలో ఐటీ సోదాలను టీఎంసీ ఖండించింది. తమ పార్టీ నేతలను రెచ్చగొట్టేందుకు, వేధించేందుకే బీజేపీ ప్రభుత్వం ఇలా దాడులు చేయిస్తోందని ఆరోపించింది. ఐటీ సోదాల సమయంలో దేబాశీస్ నివాసం వద్ద గుమికూడిన టీఎంసీ కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందు జాగ్రత్తగా అక్కడ కేంద్ర బలగాలను మోహరించారు. -
అఖిలభారత సర్వీసుల విధానం నిష్ఫలమవుతోంది
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక ఉన్నపళంగా సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సహా 1,000 మందికిపైగా ఉన్నతాధికారులను రాత్రికి రాత్రే ఈసీ బదిలీచేసిన ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తంచేసింది. అయితే ఈ ఘటనలో తాము జోక్యంచేసుకోబోమంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ మేరకు ఈసీ నిర్ణయాన్ని సమరి్థస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్చేస్తూ దాఖలైన పిల్ను కొట్టేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ‘‘ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో ఉన్నతాధికారుల బదిలీలపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ సంప్రదిస్తే సముచితంగా ఉంటుంది. ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాల బేధాలతో అఖిలభారత సర్వీసుల అధికారులు నలిగిపోతున్నారు. ఆలిండియా సర్వీసెస్ ఏర్పాటు ఉద్దేశం నిష్ఫలమవుతోంది. ఇష్టారీతిన వాళ్లను బదిలీచేస్తున్నారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, ఈసీ మధ్య నమ్మకం లోపించిన నేపథ్యంలో సమన్వయం కోసం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)సర్వే కోసం న్యాయాధికారులను మేం నియమించాల్సి వచ్చింది’’అని వ్యాఖ్యానించింది. -
విజయ్ వరాల జల్లు : భారీ హామీలతో TVK మేనిఫెస్టో
సాక్షి, చెన్నై: రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ విజయ్ గురువారం తమిళగ వెట్రి కజగం(TVK) మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఇందులో మహిళలు, రైతులు మరియు బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని పలు సంక్షేమ చర్యలను వాగ్దానం చేశారు. విజయ్ తన మేనిఫెస్టోను నిజాయితీకి నిదర్శనంగా అభివర్ణించారు. విజయ్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలు, వాగ్దానాలు ఆసక్తికరంగా మారాయి.నిజాయితీ పరిపాలనను తన సిద్ధాంతం టీవీకే పార్టీ అధినేత ప్రకటించారు. అందుకే తమ పార్టీ తొలి ఎన్నికల ప్రణాళిక కూడా నిజాయితీకి హామీలనీ, తాము స్టాలిన్ లాగా ప్రజలను తప్పుదోవ పట్టించమని వెల్లడించారు.. ప్రజలకు ఉత్తుత్తి వాగ్దానాలతో రూపొందించిన తొందరపాటు ఎన్నికల ప్రణాళిక తమది కాదని పేర్కొన్నారు. డీఎంకే, మిగతా పార్టీలన్నీ ఒకటే అని చెప్పాం కదా?... కావాలంటే ఇరు పక్షాలు విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలను తీసుకుని పోల్చి చూడండని విజయ్ అన్నారు.పీటీఐ ప్రకారం, ఈ ప్రకటనలలో ముఖ్యంంగా మహిళలకు నెలకు రూ. 2,500 సహాయం, పెళ్లి చేసుకునే పేదింటి వధువులకు నాణ్యమైన పట్టు చీరతో పాటు 8 గ్రాముల బంగారం మహిళలు నడుపుతున్న స్వయం సహాయక బృందాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు , బడి మానేయడాన్ని నివారించడానికి తల్లులకు సంవత్సరానికి రూ. 15,000 సహాయం అందిస్తామని కూడా విజయ్ హామీ ఇచ్చారు. ప్రధాన పార్టీలు నిజమైన విధాన ప్రత్యామ్నాయాలను అందించడం కంటే, ఒకరిని మించి ఒకరు పోటీ పడాలనే లక్ష్యంతో ఒకే రకమైన వాగ్దానాలతో కూడిన తొందరపాటు ఎన్నికల ప్రణాళికలను జారీ చేస్తున్నాయని ఎద్దేవా ఏశారు. ఈ పార్టీలన్నీ ఒకే గొడుగు కింద పనిచేస్తున్న "అవినీతి ముఠాలు" అని ఆయన ఆరోపించారు. టీవీకే ఓటర్లను అదే విధంగా తప్పుదోవ పట్టించదని అన్నారు.ముఖ్యమైన హామీలుమహిళా సంక్షేమానికి నగదు సాయం: మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం.నిరుపేద వధువులకు 8 గ్రాముల (కాసు) బంగారం , పట్టుచీర.మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు.5 ఎకరాలలోపు భూమి ఉన్న చిన్న రైతులకు సహకార బ్యాంకుల్లో ఉన్న పంట రుణాల పూర్తి మాఫీ.వరి పంటకు క్వింటాల్కు రూ. 3,500 మద్దతు ధర (MSP).ఆరోగ్యం మరియు విద్య విషయంలో కూడా కీలక హామీని తన మానిఫెస్టోలో పొందుపర్చారు. దీనికి ప్రకారం ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా.రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక ఆసుపత్రుల ఏర్పాటు మరియు ఏటా ఉచిత ఆరోగ్య పరీక్షలు.విద్యా రంగానికి సంబంధించి, విద్యార్థులకు అండగా నిలిచేందుకు రూ. 20 లక్షల వరకు ఉన్నత విద్యా రుణాలను అందించనున్నట్లు TVK అధినేత ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి కె. కామరాజ్ పేరుతో 100 ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాల విద్యను మధ్యలోనే మానేసే సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో, ప్రభుత్వ, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం. దీంతోపాటు తమిళనాడును డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే అవినీతి రహిత, నిజాయితీతో కూడిన పరిపాలన అందిస్తామని విజయ్ పేర్కొన్నారు.ప్రస్తుత అధికార పక్షం (DMK), ఇతర పార్టీలు తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని, తమ మేనిఫెస్టో మాత్రం ఆచరణాత్మక మైందని ఆయన స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి -
ఈవీఎం బటన్పై పెర్ఫ్యూమ్.. ఎన్నికల సంఘం సీరియస్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ పోలింగ్ బూత్లలో అనూహ్య పరిణామాలకు సంబంధించిన బెదిరిపులు వెలుగుచూస్తున్నాయి. ఓటర్లను భయపెట్టేందుకు, నిఘాను తప్పించుకునేందుకు దుండగులు వేస్తున్న కొత్త ఎత్తుగడలు తెలుసుకున్న ఎన్నికల సంఘం (ఈసీ) అవాక్కవుతోంది. ఈవీఎం బటన్లకు పెర్ఫ్యూమ్ పూయడం, వెబ్కాస్టింగ్ కెమెరాలకు చూయింగ్ గమ్ అంటించడం వంటి చర్యలపై ఈసీ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని, వెంటనే ఆయా బూత్లలో రీపోలింగ్ నిర్వహిస్తామని గట్టి హెచ్చరికలు జారీ చేసింది.ఓటర్లకు పెర్ఫ్యూమ్ బెదిరింపులుఓటర్లను ప్రభావితం చేసేందుకు కొందరు అగంతకులు దారుణమైన బెదిరింపులకు పాల్పడుతున్నారు. ‘మీరు ఏ పార్టీకి ఓటు వేశారో మాకు ఇట్టే తెలిసిపోతుంది, ఎందుకంటే ఈవీఎం బటన్లపై మేము పెర్ఫ్యూమ్ పూస్తాం’ అంటూ ఓటర్లను భయాందోళనలకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల్లో రికార్డింగ్ జరగకుండా ఉండేందుకు సీసీ కెమెరాలకు చూయింగ్ గమ్ అంటిస్తూ, నిఘా వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అక్రమాలపై దృష్టి సారించిన ఎన్నికల సంఘంఓటర్లను బెదిరించినా, నిఘా వ్యవస్థను ట్యాంపరింగ్ చేసినా రీపోలింగ్ తప్పదని స్పష్టం చేసింది.విద్యుత్ కోతలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లుపోలింగ్ సజావుగా సాగేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) మనోజ్ అగర్వాల్ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. పోలింగ్ సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేకంగా జనరేటర్లను సైతం సిద్ధం చేస్తున్నారు. నెట్వర్క్ సమస్యలు ఉన్న డార్జిలింగ్, కాలింపాంగ్ సహా 642 'షాడో జోన్ల'లో వెబ్కాస్టింగ్ ఆగకుండా టెలికాం ఆపరేటర్ల ద్వారా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. పోలింగ్కు 7 రోజుల ముందే బూత్లలో కెమెరాల ఏర్పాటు, 2 రోజుల ముందే లైవ్ వెబ్కాస్టింగ్ ప్రారంభం కానుంది.అడుగడుగునా భారీ భద్రతఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర బలగాలతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 152 నియోజకవర్గాల్లో జరిగే తొలి దశ పోలింగ్ కోసం ఏకంగా 2,404 కేంద్ర బలగాల కంపెనీలను మోహరిస్తున్నారు. అత్యధికంగా ముర్షిదాబాద్లో 316 కంపెనీలు రంగంలోకి దిగుతుండగా.. ఆ తర్వాత తూర్పు మేదినీపూర్ (273), పశ్చిమ మేదినీపూర్ (272) జిల్లాల్లో భారీగా బలగాలను నియమించారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద సాయుధులైన కేంద్ర బలగాలతో పాటు లాఠీలు ధరించిన రాష్ట్ర పోలీసు సిబ్బంది అప్రమత్తంగా కాపలా ఉండనున్నారు.ఇది కూడా చదవండి: లష్కరే టాప్ కమాండర్పై దాడి.. పరిస్థితి విషమం -
వింత ప్రచారాలు: జిలేబీలు వేస్తూ.. గడ్డాలు గీస్తూ..
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. కేవలం రాజకీయ విమర్శలు, సవాళ్లతోనే కాకుండా, ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు అనుసరిస్తున్న వినూత్న వ్యూహాలు ఇప్పుడు బెంగాల్ వీధుల్లో హాట్ టాపిక్గా మారాయి. ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరగనున్న పోలింగ్ కోసం ప్రధాన పార్టీలైన టీఎంసీ, బీజేపీ అభ్యర్థులు ఒకరిని మించి మరొకరు వింత విన్యాసాలతో ప్రజల ముందుకు వస్తున్నారు.బన్స్బేరియాలో ‘స్వీట్’ పాలిటిక్స్సప్తగ్రామ్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి స్వరాజ్ ఘోష్ తనదైన శైలిలో ప్రచార బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. బన్స్బేరియాలో ప్రచారంలో ఉన్న ఆయన అకస్మాత్తుగా ఓ స్థానిక స్వీట్ షాపులోకి వెళ్లారు. అక్కడ హల్వాయి అవతారమెత్తి వేడి వేడి నూనెలో జిలేబీలు వేయడం, రసగుల్లాలను తయారు చేయడం మొదలుపెట్టారు. తనకు పన్నీరుతో స్వీట్లు చేయడం బాగా తెలుసని, ఫలితాలు వెలువడే మే 4వ తేదీన తాను గెలిచినా, ఓడినా తన ప్రత్యర్థులకు కూడా ఈ రసగుల్లాలు తినిపిస్తానని ఆయన ప్రకటించడం విశేషం.చేపతో చెక్ పెట్టిన బీజేపీ అభ్యర్థిమరోవైపు బిధాన్నగర్ బీజేపీ అభ్యర్థి శారద్వత్ ముఖోపాధ్యాయ్ ప్రచారం చర్చనీయాంశమైంది. బెంగాలీల ఆహారపు అలవాట్లపై బీజేపీ ఆంక్షలు విధిస్తుందన్న మమతా బెనర్జీ విమర్శలకు కౌంటర్గా, ఆయన ఏకంగా ఒక పెద్ద చేపను చేతితో పట్టుకుని ప్రచారం నిర్వహించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినా బెంగాలీలు తమకు ఇష్టమైన చేపల కూరను ఆస్వాదించవచ్చని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు భరోసా ఇచ్చారు.గృహిణులతో కలిసి రొట్టెలు.. ఉట్టి కొట్టే వేడుకలుఅధికార టీఎంసీ అభ్యర్థులు కూడా ప్రజలతో మమేకం కావడంలో వెనకడుగు వేయడం లేదు. పుర్సురాయ్ టీఎంసీ అభ్యర్థి పార్థా హజారీ ఒక ఇంటికి వెళ్లి కట్టెల పొయ్యిపై గృహిణి చేస్తున్న రొట్టెలను స్వయంగా కాల్చారు. అలాగే, బీర్భూమ్ జిల్లాలో టీఎంసీ అభ్యర్థి నరేశ్ చంద్ర బౌరీ ఈద్ సందర్భంగా జరిగిన ‘హాండీ ఫోడ్’ (ఉట్టి కొట్టే) కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్లకు గంతలు కట్టుకుని ఆయన కుండను పగలగొట్టిన తీరు ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంది.బార్బర్గా ఎమ్మెల్యే.. యాగంలో కమ్యూనిస్ట్ నేతప్రచార పర్వం పతాక స్థాయికి చేరడంతో అభ్యర్థులు తమ ఇమేజ్ను పక్కన పెట్టి సామాన్యుల్లో కలిసిపోతున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనూప్ కుమార్ సాహా ఏకంగా ఓ గ్రామస్థుడికి గడ్డం గీసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఇక కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఎం) అభ్యర్థి మీనాక్షి ముఖర్జీ ఉత్తరపరాలో ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొని తనదైన శైలిలో అక్కడున్నవారికి ఆకట్టుకున్నారు. మరోవైపు, సీనియర్ నేత సువేందు అధికారి ప్రచారం ముగిసిన తర్వాత ఒక సాధారణ ఓటరు ఇంట్లో మధ్యాహ్న భోజనం చేసి తన సామాన్య జీవితాన్ని చాటుకున్నారు. వంట చేయడం, గడ్డం గీయడం, మసాలా దినుసులు నూరడం, రైతుల పక్కన పొలంలో పనిచేయడం వంటి రోజువారీ పనులతో అభ్యర్థులు సరికొత్త ప్రచార పర్వాన్ని సృష్టించారు. ఓటర్ల మదిలో చెరగని ముద్ర వేసేందుకు సాగుతున్న ఈ 'వినూత్న యుద్ధం'లో చివరకు ఎవరిని విజయం వరిస్తుందో తెలియాలంటే మే 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇది కూడా చదవండి: ‘ఇంతకు తెగిస్తారా?’.. నిర్మలపై మమత ఫైర్ -
‘ఇంతకు తెగిస్తారా?’.. నిర్మలపై మమత ఫైర్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంగ్రామం అనూహ్య మలుపులు తిరుగుతూ మరింత వేడెక్కింది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు వేస్తున్న ఎత్తుగడలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎంసీసీ) ఉల్లంఘించి, మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసేలా వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీఐ)డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది.ఓటర్లకు నిర్భయంగా లంచంతాజాగా బీజేపీ నేతలు పంపిణీ చేసిన ‘మాతృశక్తి గ్యారెంటీ కార్డుల’ చుట్టూనే ఇప్పుడు కొత్త రాజకీయ వివాదం నడుస్తోంది. ఈ కార్డుల ద్వారా మహిళా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.3,000 జమ చేస్తామని బీజేపీ పరోక్షంగా హామీ ఇస్తోంది. ఎన్నికల సమయంలో ఇలాంటి ఆర్థిక ప్రయోజనాలను ప్రకటించడాన్ని మమతా బెనర్జీ తప్పుబట్టారు. ఇది ప్రజాస్వామ్య నిబంధనలను అపహాస్యం చేస్తూ, ఓటర్లకు బహిరంగంగా లంచం ఇవ్వడమేనని ఆమె మండిపడ్డారు. పోలింగ్కు ముందే ఆదరాబాదరాగా కొత్త ఖాతాలు ఎందుకు తెరుస్తున్నారని, ఇదంతా మహిళా ఓటర్లను ప్రలోభపెట్టే ఓటు బ్యాంకు జిమ్మిక్కు మాత్రమేనని ఆమె ఆరోపించారు.ఈసీ నిష్పాక్షికతపై దీదీ ప్రశ్నల వర్షంఈ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును కూడా ముఖ్యమంత్రి తప్పుబట్టారు. ఈసీ కేవలం ప్రతిపక్షాలపై మాత్రమే ఉక్కుపాదం మోపుతోందని, అధికార బీజేపీ నేతలు నిబంధనలు ఉల్లంఘిస్తే ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఆమె ప్రశ్నించారు. అందరికీ చట్టం సమానమే అయినప్పుడు, బీజేపీ నేతలపై వచ్చిన ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ప్రధాని పదవిపై తనకు అపార గౌరవం ఉందని, అయితే ప్రజలను ఇలా బహిరంగంగా తప్పుదోవ పట్టిస్తుంటే తాను మౌనంగా ప్రేక్షకపాత్ర పోషించలేనని మమత అన్నారు. ఆర్థిక మంత్రిపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.ఉత్కంఠ రేపుతోన్న బెంగాల్ పోరురాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఒక కేంద్ర మంత్రిపై ఆరోపణలు చేయడంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే తమవి కేవలం మహిళా సాధికారతకు సంబంధించిన పరిపాలనా పరమైన హామీలే తప్ప, ఎలాంటి ఎన్నికల ప్రలోభాలు కావని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సరికొత్త వివాదం ఓటర్ల మనోభావాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ రాజకీయ పోరులో అందరి దృష్టి ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం మీదే నిలిచింది.ఇది కూడా చదవండి: టీవీకే vs ఆర్బీఐ: విజయ్ రుణ మాఫీ హామీకి బ్రేక్? -
టీవీకే vs ఆర్బీఐ: విజయ్ రుణ మాఫీ హామీకి బ్రేక్?
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేడిలో టీవీకే అధినేత, దళపతి విజయ్ ప్రకటించిన రైతుల రుణమాఫీ హామీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్న ఆయన ప్రకటన అందరినీ ఎంతగానో ఆకర్షిస్తోంది. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ బృహత్తర హామీని అమలు చేయడం ఎంతవరకు సాధ్యమనే దానిపై సహకార శాఖ అధికారులు, ఆర్థిక నిపుణులు తీవ్ర సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.సహకార బ్యాంకుల విలవిలవిజయ్ ప్రకటించిన వ్యవసాయ రుణాల మాఫీ హామీని నెరవేర్చడం అంత సులభం కాదని సహకార శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సహకార బ్యాంకులు కేవలం తమ సొంత నిధులతో నడవవని, అవి ‘నాబార్డ్’ నుంచి రుణాలు తీసుకుని, ప్రజల డిపాజిట్లను ఉపయోగించి రైతులకు అప్పులు ఇస్తాయని వారు వివరిస్తున్నారు. రుణమాఫీ వల్ల కేవలం పేద రైతులకే కాకుండా సంపన్న రైతులకు కూడా లబ్ధి చేకూరుతుందని, తద్వారా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.బ్యాంకులపై పెనుభారంసాధారణంగా ఏ ప్రభుత్వమైనా రుణమాఫీ ప్రకటించిన వెంటనే సహకార సంఘాలకు ఆ మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లించదు. ఐదేళ్ల పాటు వాయిదాల పద్ధతిలో నిధులు విడుదల చేస్తుంది. దీనివల్ల సహకార సంస్థలు తీవ్ర ఆర్థిక అగాధంలో కూరుకుపోతాయి. ఒకపక్క ప్రభుత్వ పరిహారం కోసం ఎదురుచూస్తూనే, తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సిన ఒత్తిడి వాటిపై పడుతుంది. ఈ జాప్యాల వల్ల రైతులకు కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకుల వద్ద తగిన నిధులు ఉండవని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి.ఆర్బీఐ కఠిన నిబంధనలుఈ సమస్యలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024లో తీసుకొచ్చిన కఠిన నిబంధనలు ఇప్పుడు కీలకంగా మారాయి. రుణమాఫీ పరిహారాన్ని ప్రభుత్వాలు వాయిదాల్లో కాకుండా 45 నుంచి 60 రోజుల్లోపు ఒకేసారి చెల్లించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమిళనాడు లాంటి రాష్ట్రాలకు, రెండు నెలల వ్యవధిలో ఇంత భారీ మొత్తాన్ని సర్దుబాటు చేయడం దాదాపు అసాధ్యం. ఈ వాస్తవాన్ని గ్రహించిన మీదటనే అధికార డీఎంకే కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీ హామీని చేర్చలేదని అధికారులు విశ్లేషిస్తున్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ దెబ్బ: బీబీసీలో భారీ లేఆఫ్స్ -
ఖరగ్పూర్: సెకనుకో మలుపు.. ఓటరు నాడి ఎటు?
ఖరగ్పూర్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల రణరంగంలో ఖరగ్పూర్ నియోజకవర్గం ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరిత పోరుకు వేదికగా మారింది. ఇది కేవలం ఒక స్థానిక అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే కాదు.. రాష్ట్ర స్థాయి రాజకీయాలకు, భవిష్యత్ పరిణామాలకు అద్దం పట్టే ఒక ‘మినీ ఇండియా’. దేశంలోనే అతిపెద్ద రైల్వే వర్క్షాప్, ఐఐటీ ఖరగ్పూర్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థతో పాటు, హిందీ మాట్లాడే వలసదారులు, బెంగాలీ స్థానికుల సమ్మేళనం ఈ ప్రాంతం సొంతం. ఈ పారిశ్రామిక నగరంలో ఓటర్లు ఏ ఒక్క రాజకీయ పార్టీకి శాశ్వతంగా ఎప్పుడూ పట్టం కట్టలేదు. 2026 ఎన్నికల నగారా మోగినది మొదలు ఖరగ్పూర్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి.క్షణక్షణానికీ మారుతున్న రాజకీయాలుఖరగ్పూర్ నియోజకవర్గంలోని ఓటర్ల నాడిని పసిగట్టడం ఏ రాజకీయ విశ్లేషకుడికైనా పెద్ద సవాలే. 2006 నుంచి 2011 వరకు కాంగ్రెస్ అభ్యర్థి జ్ఞాన్ సింగ్ సోహన్పాల్ భారీ మెజారిటీలతో ఇక్కడ గెలుపొంది.. దీనిని కాంగ్రెస్ కంచుకోటగా మార్చారు. 2011లో రాష్ట్రమంతటా వీచిన తృణమూల్ (టీఎంసీ)గాలిని సైతం ఎదుర్కొని ఆయన విజయం సాధించారు. కానీ 2016 ఎన్నికలు ఖరగ్పూర్ చరిత్రలో ఒక చారిత్రాత్మక మలుపును లిఖించాయి. బీజేపీ అభ్యర్థి దిలీప్ ఘోష్ సంచలన విజయం సాధించి, బెంగాల్లో కమల వికాసానికి బలమైన పునాది వేశారు. ఆ తర్వాత దిలీప్ ఘోష్ ఎంపీగా వెళ్లడంతో, 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి ప్రదీప్ సర్కార్ గెలుపొందారు. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటు ‘స్వింగ్ సీటు’గా మారింది. హోరాహోరీగా జరిగిన ఆ పోరులో బీజేపీ అభ్యర్థి హిరన్ ఛటర్జీ కేవలం 3,771 ఓట్ల స్వల్ప తేడాతో టీఎంసీని చిత్తు చేశారు. ఇక్కడ ప్రతి ఒక్క ఓటూ ఎంత కీలకమో ఈ చరిత్ర స్పష్టం చేస్తోంది.‘టైగర్ కబ్’ దిలీప్ ఘోష్ దూకుడు2026 మహా సంగ్రామంలో బీజేపీ ఫైర్బ్రాండ్ నేత దిలీప్ ఘోష్ మరోసారి బరిలోకి దిగడంతో ఎన్నికల వేడి అమాంతం పెరిగింది. ‘బాఘేర్ బచ్చా’ (టైగర్ కబ్ - పులి బిడ్డ) అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే దిలీప్ ఘోష్.. తనదైన దూకుడు, ముక్కుసూటితనంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. 35 ఏళ్ల వామపక్షాల పాలన, 15 ఏళ్ల టీఎంసీ పాలనను ప్రశ్నిస్తూ, మార్పు తథ్యమని ఆయన గర్జిస్తున్నారు. మతపరమైన రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణలను తిప్పికొడుతూ, తాము ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ సిద్ధాంతాన్ని నమ్ముతామని స్పష్టం చేశారు. టీఎంసీ హయాంలో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. ‘ఈసారి మా ప్రత్యర్థికి లక్షకు మించి ఓట్లు రానివ్వను’ అంటూ ఆయన విసురుతున్న సవాళ్లు నియోజకవర్గంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.దీటుగా బదులిస్తున్న ‘మట్టి బిడ్డ’బీజేపీ దూకుడుకు ఏమాత్రం తగ్గకుండా, అధికార టీఎంసీ అభ్యర్థి ప్రదీప్ సర్కార్ తనదైన శైలిలో పదునైన వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. 2019లో ఒకసారి ఇక్కడినుంచి గెలిచిన అనుభవంతో, తాను ఖరగ్పూర్ ‘మట్టి బిడ్డ’నని, ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉంటానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కుట్ర జరిగిందని ఆయన బీజేపీపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ముస్లిం ఓట్లను చీల్చేందుకే హుమాయున్ కబీర్ను బీజేపీ బరిలోకి దించిందని విమర్శించారు. అంతేకాకుండా, రైల్వేలు, సీఆర్పీఎఫ్ (సీఆర్పీఎఫ్), ఐఐటీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను బీజేపీ తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. రైల్వే ఉద్యోగాలు, స్థానిక మౌలిక సదుపాయాలు, వలసదారుల సమస్యలు ప్రధాన అస్త్రాలుగా సాగుతున్న ఈ పోరులో ప్రజల విశ్వాసాన్ని ఎవరు చూరగొంటారో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: విజయ్ ర్యాలీలో ఉద్రిక్తత: స్పృహ కోల్పోయిన టీవీకే అభ్యర్థి -
దమ్ముంటే రోజూ నా కారు తనిఖీ చేయండి
ఇస్లాంపూర్: పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచారం వేళ తృణమూల్ కాంగ్రెస్ నేతలను మాత్రమే ఎన్నికల సంఘం అధికారులు లక్ష్యంగా చేసుకున్నారని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఆరోపించారు. బుధవారం ఉత్తర్ దినాజ్పూర్ జిల్లాలోని ఇస్లాంపూర్లో ప్రచారసభలో ఆమె ప్రసంగించారు. ‘‘కోల్కతాలోని డమ్డమ్ ఎయిర్పోర్ట్ సమీపంలో నా కారును తనిఖీచేసేందుకు కేంద్రబలగాలు దుస్సాహసం చేశాయి. మా టీఎంసీ నేతలందరి వాహనాల్లో సోదాలు చేస్తున్నప్పుడు ప్రధాని మోదీ, హోం మంత్రి, ఇతర బీజేపీ అగ్రనేతల వాహనాలను ఎందుకు వదిలేస్తున్నట్లు?. కేంద్రబలగాలకు అంత దమ్ముంటే నా వాహనాన్ని రోజూ తనిఖీచేయండి. ఇదే విషయం ఇవాళ వాళ్లకు చెప్పా. భయంతో వాళ్లు పారిపోయారు’’ అని మమత అన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కారును సైతం తనిఖీచేశారని టీఎంసీ బుధవారం తెలిపింది. ఈసారి ఎలాగైనా బెంగాల్లో టీఎంసీని అన్యాయంగా ఓడించి తాము గద్దెనెక్కాలని బీజేపీ శతథా ప్రయత్నిస్తోందని టీఎంసీ ఆరోపించింది. -
తమిళ పార్టీలకు చిక్కని ఓటరు నాడి
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు మిగతా దేశానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ద్రవిడవాదం తమిళ ప్రజల గుండెల్లో పాతు కుపోయింది. ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) ఆ నినాదం దన్నుతోనే ఒకరి తర్వాత మరొకరు అధికారంలోకి వస్తున్నారు. దివంగత సీఎంలు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత బాటలోనే ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కె.స్టాలిన్ కూడా ద్రవిడ సిద్ధాంతమే ప్రధానాస్త్రంగా అధికారాన్ని నిలుపుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.స్టాలిన్ మహా మెగా కూటమిజయలలిత మాదిరిగా వరుసగా తమిళనాట రెండోసారి విజయం సాధించిన ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిలుస్తారా అన్నది ఈసారి ఆసక్తికరమైన అంశంగా మారింది. ఎన్నికలను ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్, డీఎండీకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ వంటి 21 పార్టీలతో మహా మెగా కూటమికి తెర తీశారు. స్టాలిన్తో పాటు డిప్యూటీ సీఎం ఉదయనిధి తదితరులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ద్రావిడ మోడల్ 2.0 పాలన నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహిణులకు రూ.1,000 ప్రోత్సాహం వంటి పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్న వైనాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఈసారి గెలిపిస్తే రూ.8,000 విలువైన కూపన్లు తదితర హామీలతో మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. అయితే అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కంటే కొత్తగా బరిలో దిగిన సినీ నటుడు జోసెఫ్ విజయ్ డీఎంకేకు గుబులు పుట్టిస్తున్నారు. ఆయన ఎవరి ఓటు బ్యాంకుకు గండి కొడతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకోవడానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ స్టాలిన్ వదులుకోవడం లేదు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణను అందివచ్చిన అస్త్రంగా వాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. లోక్సభ స్థానాల పెంపులో తమిళనాడుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయనుందంటూ ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై కేంద్రంతో ఢీ అంటే ఢీ అనడం ద్వారా ప్రధాని మోదీని ఎదుర్కొంటున్న నేతగా నిలిచే ప్రయత్నంలో పడ్డారు. మైనారిటీ ఓట్లు కూడ ఎంతో కొంత గట్టెక్కిస్తాయని డీఎంకే నమ్ముతోంది.అన్నా కూటమి ఆపసోపాలుఅన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలన్నీ పెట్టుకుంది. బీజేపీతో పాటు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, అన్బుమణి రాందాసు నేతృత్వంలోని పీఎంకే, జికే వాసన్ సారథ్యంలోని తమిళ మానిల కాంగ్రెస్ తదితర పార్టీలను కలుపుకుని పోరాడుతోంది. డీఎంకే కుటుంబ రాజకీయాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాష్ట్రంలో పేట్రేగుతున్న హింస తదితరాలను అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి ప్రధాన ప్రచారాస్త్రా లుగా మలచుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తమిళనాడులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. డీఎంకే మాదిరిగానే అన్నాడీఎంకేకు కూడా విజయ్ పార్టీ గుబులు పట్టుకుంది. ఆయన పార్టీ అంతిమంగా ఎవరి ఓట్లు చీలుస్తోందన్నది ఆసక్తికరంగా మారింది. ఒంటరిగానే బరిలో ఉన్న మరో సినీ నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలో నామ్ తమిళర్ కట్చి కూడా ప్రధాన కూటముల ఓట్లను చీల్చేలా కన్పిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ 8 శాతానికి పైగా ఓట్లు సాధించింది. ఈసారి ఏకంగా 116 మంది మహిళలకు, ఒక ట్రాన్స్జెండర్కు కూడా టికెటిచ్చింది! వీరికి తోడు జయలలిత నెచ్చెలి శశికళ పార్టీ కూడా పలు నియోజకవర్గాల్లో బరిలో ఉంది!ఓటరు నాడి ఎటో..!ఈసారి తమిళ ఓటరు నాడి ఎవరికీ అందడం లేదు! ఇప్పటిదాకా జరిగిన సర్వేలు కూడా ఈ విషయంలో ఎటూ తేల్చిచెప్పలేకపో యాయి. కాకపోతే విజయ్ పార్టీ టీవీకే కనీసం 15 నుంచి 30 స్థానాల దాకా గెలుచుకోవచ్చని పలు సర్వేల్లో తేలింది. అయితే టీవీకే ప్రధాన కూటముల్లో దేని ఓటు బ్యాంకుకు గండి కొట్టవచ్చన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు.మూడో శక్తిగా విజయ్తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాష్ట్రంలో మూడో శక్తిగా అవతరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో విజయ్కి ఉన్న ఆదరణనే టీవీకే నమ్ముకుంది. ఆ ఆదరణ ఏ మేరకు ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందన్నది ప్రశ్నగా మారింది. దీనికి తోడు విజయ్ని మినహాయిస్తే పార్టీలో పెద్దగా ప్రజాదరణ ఉన్న నేతలంటూ ఎవరూ లేకపోవడం ప్రతికూలాంశంగా కనిపిస్తోంది. టీవీకేతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా చివరికి ఆ పార్టీ అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోలేక పోయినా భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఎదగాలన్న భావన టీవీకేలో కనిపిస్తోంది. పార్టీలో జోష్ నింపేందుకు విజయ్ రెండుచోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. యువత, మహిళల్లో డీఎంకే, అన్నాడీఎంకే ఓటు బ్యాంకుకు ఈసారి టీవీకే భారీగా గండి కొట్టవచ్చన్న విశ్లేషణలున్నాయి. -
దక్షిణ రాష్ట్రాలకు ఇదేనా ప్రతిఫలం?
చెన్నై: మోదీ సర్కారు తలపెట్టిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి ఫైర్ అయ్యారు. డీలిమిటేషన్పై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నల్లజెండాలు ఎగురవేయాలని తమిళనాడు ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించబోమని మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఈ మేరకు ఎక్స్లో వీడియో సందేశం విడుదల చేశారు."నల్ల జెండాలు ఎగరనివ్వండి! భారతదేశ ప్రగతికి దోహదపడినందుకు మాకు శిక్ష విధిస్తారా? తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలకు ఇదేనా ప్రతిఫలం? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని యోచిస్తున్న డీలిమిటేషన్ సవరణ బిల్లు.. తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక భారీ చారిత్రక అన్యాయం. డీలిమిటేషన్కు నిరసనగా రేపు తమిళనాడు వ్యాప్తంగా ఇళ్లపైనా, బహిరంగ ప్రదేశాల్లోనూ నల్ల జెండాలు ఎగురుతాయి. తమిళనాడు గళాన్ని గౌరవించి వెనక్కి తగ్గడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తే, తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. డీఎంకే అధ్యక్షుడిగా, అన్నింటికంటే ముఖ్యంగా ఆత్మగౌరవం గల తమిళుడిగా ఇది నా హెచ్చరిక'' అని స్టాలిన్ తన సందేశంలో పేర్కొన్నారు.ఎంపీలతో అత్యవసర భేటీనియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్లో చర్చకు రానున్న నేపథ్యంలో డీఎంకే ఎంపీలతో స్టాలిన్ ఈ రోజు ఉదయం అత్యవసర భేటీ నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల్లో తమ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఎంపీలతో ఆయన చర్చించారు. కాగా, గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్టాలిన్కు ఓటమి భయం: అన్నామలైస్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు అన్నామలై స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో స్టాలిన్ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. డీలిమిటేషన్ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వివాదం చేస్తున్నారని ఆరోపించారు. కోయంబత్తూరులో అన్నామలై మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ వీలైనంత త్వరగా అమలు చేయాలని తమిళనాడు మహిళలు కోరుకుంటున్నారని చెప్పారు. తమిళనాడులో ఈసారి భారీ మెజారిటీతో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, డీఎంకే ప్రభుత్వం పోవాలని భావిస్తున్నారని చెప్పారు. భారీ మెజారిటీతో ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. உயரட்டும் கருப்புக்கொடி!தமிழ்நாடு போராடும்! தமிழ்நாடு வெல்லும்!இந்தியாவின் வளர்ச்சிக்காகப் பாடுபட்ட குற்றத்துக்காக தமிழ்நாடு உள்ளிட்ட தென்மாநிலங்களுக்குத் தண்டனையா? ஒன்றிய பா.ஜ.க. அரசு நாளை நாடாளுமன்றத்தில் கொண்டுவரவுள்ள #Delimitation சட்டத்திருத்தம் தமிழ்நாட்டுக்கும்,… pic.twitter.com/6gbEAHvNn4— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) April 15, 2026 చదవండి: గెలిస్తే ఏఐ యూనివర్సిటీ, మంత్రిత్వ శాఖ -
విజయ్ ర్యాలీలో ఉద్రిక్తత: స్పృహ కోల్పోయిన టీవీకే అభ్యర్థి
తిరుప్పూర్: టీవీకే అధినేత దళపతి విజయ్ ఎన్నికల ప్రచారంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఎండల తీవ్రత, కిక్కిరిసిన జనసందోహం మధ్య గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. తమిళనాడులోని తిరుప్పూర్కు వచ్చిన తమ అభిమాన నాయకుడిని చూడాలని ఆశగా ఎదురుచూసిన అభిమానులు, పార్టీ శ్రేణులు భానుడి భగభగలకు విలవిలలాడారు. ఎండ దెబ్బకు తట్టుకోలేక ఏడుగురు మహిళలు, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి స్పృహతప్పి పడిపోయారు.ఎండకు అల్లాడిన జనంతమిళనాడు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ విజయ్ చెన్నై నుంచి కోయంబత్తూర్ మీదుగా తిరుప్పూర్ బయలుదేరారు. విజయ్ను చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఎండ తీవ్రత విపరీతంగా పెరగడం, మరోవైపు జనసందోహం అదుపు తప్పడంతో అక్కడివారికి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. దాహంతో అలమటిస్తున్న జనాలకు నిర్వాహకులు నీరు అందించినప్పటికీ, వడగాల్పుల తీవ్రతకు ఏడుగురు మహిళలు స్పృహ కోల్పోయారు. వారిని వెంటనే అంబులెన్స్లో స్థానిక ఆసుపత్రికి తరలించారు.స్పృహ కోల్పోయిన సులూరు అభ్యర్థి సుకుమార్ పార్టీ ముఖ్య నేతలకు కూడా ఈ ఎండల సెగ తప్పలేదు. కోయంబత్తూరులోని సులూరు నియోజకవర్గ టీవీకే అభ్యర్థి సుకుమార్, కనియూర్ టోల్ ప్లాజా వద్ద విజయ్కు స్వాగతం పలికేందుకు తన మద్దతుదారులతో కలిసి వేచి ఉన్నారు. విపరీతమైన ఎండ కారణంగా ఆయన అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన అనుచరులు ఆయనకు ప్రథమ చికిత్స అందించి కోలుకునేలా చేశారు.తిరుప్పూర్లో విజయ్ సుడిగాలి పర్యటనఈ పరిస్థితుల నడుమ, కొచ్చిన్-సేలం జాతీయ రహదారి మీదుగా విజయ్ తన ప్రచార రథంపై తిరుప్పూర్ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో (తిరుప్పూర్ నార్త్, తిరుప్పూర్ సౌత్, అవినాషి, పల్లడం, కంగేయం, ధారాపురం, ఉడుమలై, మడతుకులం) పోటీ చేస్తున్న టీవీకే అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఒకే రోజు ఇంత మంది వడదెబ్బకు గురవడం పలు ఆందోళనలకు తావిస్తోంది. -
Kerala: హైకమాండ్ వార్నింగ్.. ఆగని ‘సీఎం’ ఫైట్!
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ఇంకా మూడు వారాల సమయం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో అప్పుడే రాజకీయ సెగలు మొదలయ్యాయి. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం ‘కుర్చీలాట’ షురూ అయ్యింది. అధిష్టానం కఠిన హెచ్చరికలు జారీ చేసినా, సోషల్ మీడియా వేదికగా కొందరు నేతలు తమ వర్గానికే పట్టం కట్టాలని డిమాండ్ చేస్తుండటంతో కేరళ రాజకీయాలు మరింతగా వేడెక్కాయి.వివాదాలకు కేంద్ర బిందువుడీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ షియాస్ ఇటీవల మాట్లాడుతూ తదుపరి ముఖ్యమంత్రి ఎర్నాకులం నుండి ఉండాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఈ చర్చ ఊపందుకుంది. దానికి తోడు ఎమ్మెల్యే కాని వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కావచ్చా? అనే ప్రశ్నకు కేపీసీసీ అధ్యక్షుడు ఇచ్చిన సమాధానం అంచనాలను అమాంతం పెంచేసింది. సీనియర్ నాయకులు వీడీ సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ ఈ విషయంపై నేరుగా స్పందించకుండా పార్టీ విధానమే శిరోధార్యమని సమాధానాన్ని దాటవేస్తున్నారు. గతంలో కరుణాకరన్, ఆంటోనీ, ఊమెన్ చాందీ వంటి నాయకుల కాలంలో ఉన్న స్పష్టత ఇప్పుడు లోపించింది. అయినప్పటికీ, తుది నిర్ణయం తీసుకునే ముందు అధిష్టానం ఖచ్చితంగా ఎమ్మెల్యేలతో చర్చిస్తుందని భావిస్తున్నారు.రేసులో ఉన్న ప్రధాన అభ్యర్థులుముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో మొదటిది వీడీ సతీశన్. ఒకవేళ యూడీఎఫ్ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించిన సతీశన్, కాంగ్రెస్ గెలిస్తే సీఎం పీఠానికి ప్రాధాన్యత కలిగిన అభ్యర్థిగా కనిపిస్తున్నారు. భారీ మెజారిటీ వస్తే అది ఆయన నాయకత్వ విజయంగానే పరిగణిస్తారు. ఇక రెండో అభ్యర్థి మాజీ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల. పార్టీలో ఆయనకున్న సుదీర్ఘ అనుభవం అతిపెద్ద బలం. ఒకవేళ స్వల్ప మెజారిటీ మాత్రమే వస్తే, అందరినీ కలుపుకుపోయే ఆయన విధానం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఢిల్లీ నుంచి అనూహ్య ఎంట్రీ?ఈ ఇద్దరితో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు కూడా తెరపైకి రావడం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. జాతీయ స్థాయిలో సంస్థాగత మార్పులు జరిగే అవకాశం ఉన్నందున, హైకమాండ్ ఆయనను రాష్ట్ర రాజకీయాలకు పంపే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్, సీపీఎం పార్టీలలో ఎమ్మెల్యేలు కాని వారిని కూడా ముఖ్యమంత్రులుగా చేసిన చరిత్ర ఉండటంతో ఆయన అవకాశాలను కొట్టిపారేయలేమని విశ్లేషకులు అంటున్నారు. ఈ ముగ్గురిలో కేరళ కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి దక్కుతాయో తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.ఇది కూడా చదవండి: బెంగాల్ రణరంగం: జెన్ జెడ్ చేతిలో ‘బ్రహ్మాస్త్రం’ -
బెంగాల్ రణరంగం: జెన్ జెడ్ చేతిలో ‘బ్రహ్మాస్త్రం’
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణరంగం(2026) మునుపెన్నడూ లేనంత రసవత్తరంగా మారింది. ఇది రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న పోరు మాత్రమే కాదు.. యువత భవిష్యత్ ఆలోచనల మధ్య సాగుతున్న మహా సంగ్రామం. ఈ చరిత్రక ఎన్నికల్లో గెలుపోటములను శాసించే బ్రహ్మాస్త్రం ఇప్పుడు ‘జెన్ జెడ్’ చేతుల్లోనే ఉంది. మొదటిసారి ఓటు వేస్తున్న లక్షలాది మంది యువత.. కుల, మత, వారసత్వ రాజకీయాలకు అతీతంగా, తమ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ, పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేందుకు సిద్ధమయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మళ్లీ అధికారంలోకి రావాలా లేదా బీజేపీ నేతృత్వంలోని ‘పరివర్తన్ 2.0’కు పట్టం కట్టాలా అనేది ఇప్పుడు ఈ తరం యువత చేతుల్లోనే ఉందంటున్నారు విశ్లేషకులు.సంక్షేమ పథకాలే టీఎంసీకి శ్రీరామరక్షతృణమూల్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకునే యువత, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థినులు ‘కన్యాశ్రీ’, ‘సబుజ్ సాథి’ వంటి సంక్షేమ పథకాలపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఈ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాలేదు. వారి విద్యాభ్యాసానికి, ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడి వారి జీవితాల్లో ప్రత్యక్ష ప్రభావాన్ని చూపాయి. అలాగే, బెంగాలీ సంస్కృతి, అస్తిత్వాన్ని కాపాడే నాయకత్వంపై కొంతమంది యువతకు మక్కువ ఎక్కువ. దీదీ పాలనను కొనసాగిస్తే తమకు అందుతున్న ప్రయోజనాలకు ఎలాంటి ఆటంకం ఉండదన్నది వారి భావన. అయితే 2011లో వచ్చిన రాజకీయ మార్పును కేవలం సుదూర చరిత్రగా మాత్రమే చూస్తున్న నేటి ‘జెన్ జెడ్’ ఓటర్లు.. పాత రాజకీయ కథనాలను గుడ్డిగా నమ్మడం లేదు. డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరిగిన వీరు సోషల్ మీడియా ప్రభావంతో, రాజకీయ నాయకులు ఇచ్చే ప్రతి హామీని నిశితంగా పరిశీలిస్తూ, ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నారు.‘డబుల్ ఇంజిన్’ సర్కార్తోనే..పట్టణ ప్రాంతాల్లోని విద్యావంతులైన యువతలో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అధికార పార్టీ పాలనపై వారిలో క్రమంగా అసంతృప్తి రగులుతోంది. రాష్ట్రంలో భారీ స్థాయి ప్రైవేట్ పెట్టుబడులు లేకపోవడం, ఉపాధి అవకాశాలు మృగ్యం కావడంతో.. బెంగాల్ యువత ఉద్యోగాల కోసం బెంగళూరు, పూణే, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రాసెస్లో వెలుగుచూసిన అవినీతి ఆరోపణలు నైపుణ్యాన్ని నమ్ముకున్న యువతలో తీవ్ర నైరాశ్యాన్ని నింపాయి. సరిగ్గా ఈ అసంతృప్తినే తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చూస్తోంది. పారదర్శకత, అవినీతి రహిత పాలన, కేంద్రంతో కలిసి పనిచేసే ‘డబుల్ ఇంజిన్’ సర్కార్తోనే బెంగాల్ అభివృద్ధి సాధ్యమంటూ 'పరివర్తన్ 2.0' నినాదంతో యువతను ఆకర్షించేందుకు వ్యూహరచన చేస్తోంది.‘సీఈఓ’ లాంటి లీడర్ కావాలినేటి యువత ఏ ఒక్క రాజకీయ పార్టీకీ కట్టుబడి ఉండలేదు. వారు పూర్తిగా సమస్యల ఆధారిత విధానాన్ని నమ్ముతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ తరంలో చాలా మంది తమకు రాజకీయాలంటే ఆసక్తి లేదని చెబుతున్నప్పటికీ, వారు అడిగే ప్రశ్నలు, డిమాండ్లు మాత్రం రాజకీయ వ్యవస్థను నిలదీసేలా ఉన్నాయి. వారికి ఉద్వేగభరితమైన మాటలు చెప్పే నాయకులు కాదు, ఒక బహుళజాతి కంపెనీని నడిపించే ‘సీఈఓ’ మాదిరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సమర్థుడైన నాయకుడు కావాలి. ఉద్యోగాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, సాంకేతికతను యువత కోరుకుంటోంది. రాష్ట్రంలోని పట్టణ యువత ఓటింగ్ శాతమే విజేతను నిర్ణయించనున్నదని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపధ్యంలోనే డిజిటల్ క్యాంపెయిన్ల ద్వారా యువతను ప్రసన్నం చేసుకునేందుకు టీఎంసీ, బీజేపీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.ఇది కూడా చదవండి: కొత్త జంటకు ప్రధాని మోదీ క్షమాపణ.. వైరల్ వీడియో -
ఎన్నికల వేళ బెంగాల్లో కొత్త ట్విస్ట్?
సాక్షి, న్యూఢిల్లీ: బెంగాల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ సిలిగురి కారిడార్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానాంశంగా మారింది. దేశ భద్రత దృష్ట్యా దాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తారంటూ మొదలైన ప్రచారం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. దేశ సమాఖ్య స్వరూపాన్ని దెబ్బతీసేందుకు, రాష్ట్రాల హక్కులను కాలరాసేందుకే మోదీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరుగుతున్నారు. ఈ అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా మలచుకుంటున్నారు.వ్యూహాత్మకంగా కీలకం భారత ప్రధాన భూభాగాన్ని తూర్పు, ఈశాన్య రాష్ట్రాలతో కలిపే అతి సన్నని మార్గం సిలిగురి కారిడార్. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పుండే ఈ కారిడార్ భౌగోళికంగా చిన్నదైనా వ్యూహాత్మకంగా అత్యంత కీలకం. దేశానికే ‘లైఫ్ లైన్’వంటిది. దీనికి ఓ వైపున నేపాల్, మరోవైపు బంగ్లాదేశ్, ఇంకోవైపు భూటాన్, చైనా సరిహద్దు ప్రాంతాలున్నాయి. కోడి తల మాదిరిగా ఉండటంతో ఈ కారిడార్ను ‘చికెన్ నెక్’గా పిలుస్తారు. ఈశాన్య రాష్ట్రాలకు రోడ్డు, రైల్వే, సైనిక సరఫరా, వాణిజ్య రవాణా తదితరాలన్నీ ఈ మార్గంపైనే ఆధారపడి ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల వేళ ఈ మార్గం గనుక మూసుకుపోతే తూర్పు–ఈశాన్య ప్రాంతానికి మిగతా దేశంతో సంబంధాలే తెగిపోయే ప్రమాదముంది.తృణమూల్ మండిపాటు సరిహద్దు ప్రాంతాల పరిరక్షణ, భద్రతపై ఇటీవల పార్లమెంట్లో చర్చ సందర్భంగా సమయంలో సిలిగురిని కేంద్రపాలిత ప్రాంతం చేయవచ్చన్న వార్తలు తెరపైకొచ్చాయి. అలాగైతే ఉద్రిక్తతల వేళ ఆ ప్రాంత భద్రతపై కేంద్రానికి మెరుగైన నియంత్రణ ఉంటుందని, చైనాతో యుధ్ద పరిస్థితుల వంటివి తలెత్తితే త్వరిత నిర్ణయాలు, వ్యూహాత్మక కదలికలకు వీలుంటుందనే వాదన తెరపైకొచ్చింది. అలాంటి ప్రతిపాదనలేవీ లేవని కేంద్రం స్పష్టం చేసినా విపక్షాలు, ముఖ్యంగా తృణమూల్ మాత్రం దీన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకుంది. స్థానికుల్లో తాము బెంగాల్ నుంచి వేరుపడుతున్నామన్న భావన వస్తుందని ఆ పార్టీ వాదిస్తోంది.‘‘ఇలా ఒక రాష్ట్రం నుంచి కొంత ప్రాంతాన్ని విడదీసి కేంద్రపాలిత ప్రాంతం చేయడం సమాఖ్య నిర్మాణానికి విరుద్ధం. ఇది కేవలం పాలనాపరమైన మార్పు కాదు, రాష్ట్ర హక్కులపై దెబ్బ’’అంటూ జోరుగా ప్రచారం చేస్తోంది. మమత సర్కారుపై ఒత్తిడి పెంచడం, బెంగాలీల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం, భద్రతాపరమైన అంశాలను తెరపైకి తేవడం వంటి ఉద్దేశాలతో బీజేపీ తొలుత ఉద్దేశపూర్వకంగానే ‘కేంద్రపాలిత ప్రాంతం’అంశాన్ని ప్రచారంలో పెట్టిందనే విశ్లేషణలు విని్పస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయమేదీ ఉండకపోయినా భద్రతాపరంగా పరిస్థితులు మారి ఉద్రిక్తతలు పెరిగితే ఈ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.ఎన్నికలపై ప్రభావం..సిలిగురి కారిడార్పై రాజకీయ రచ్చ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇదే అంశాన్ని తృణమూల్ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. గౌతమ్ దేవ్ వంటి ఆ పార్టీ నేతలు ‘కేంద్రపాలిత ప్రాంతం’అంశాన్ని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పట్టణ, గ్రామీణ, తేయాకు కార్మికుల మిశ్రమంగా ఉండే సిలిగురి ప్రాంతంలో కనీసం 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాల్లో ఈ ప్రచారం బాగా ప్రభావం చూపనుంది. దీనికి విరుగుడుగా స్థానిక సమస్యలు, ఉద్యోగాలు, వేతనాలు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలను బీజేపీ నమ్ముకుంది. వాటిపైనే ముమ్మరంగా ప్రచారం చేస్తూ స్థానికులను ఆకట్టుకునే పనిలో పడింది. సిలిగురి ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల్లోని తేయాకు తోట కార్మికులు, గిరిజన వర్గాలు, రాజబన్షీలలో బీజేపీ ఇప్పటికే ప్రాబల్యాన్ని పెంచుకుంది. దాంతో ఇక్కడ తిరిగి పట్టు సాధించేందుకు తృణమూల్ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. -
కొత్త జంటకు ప్రధాని మోదీ క్షమాపణ.. వైరల్ వీడియో
సిలిగురి: దేశ ప్రధాని స్థాయి వ్యక్తి, ఒక సామాన్య కొత్త జంటకు స్వయంగా క్షమాపణలు చెప్పడం ఎప్పుడైనా చూశారా? పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో సరిగ్గా ఇదే జరిగింది. ఒక వైపు కట్టుదిట్టమైన భద్రత, మరోవైపు పెళ్లి సందడి.. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది.రిసార్ట్లో అనూహ్య ఘటనపశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సిలిగురిలోని మయ్ఫెయిర్ టీ రిసార్ట్కు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడ శ్రేయ, అక్షయ్ అనే యువజంట వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కారణంగా ఆ పెళ్లి సందడికి కొంత అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని గమనించిన మోదీ, ఊహించని విధంగా ఆ కొత్త జంట వద్దకు వెళ్లి, వారికి కలిగిన అసౌకర్యానికి స్వయంగా క్షమాపణలు తెలియజేశారు. A heartfelt moment from PM Shri @narendramodi ji in Siliguri.He personally apologised to newlyweds Shreya and Akshay, whose wedding celebrations at Mayfair Tea Resort were affected due to heightened security during his visit.𝐀 𝐬𝐦𝐚𝐥𝐥 𝐠𝐞𝐬𝐭𝐮𝐫𝐞, 𝐛𝐮𝐭 𝐢𝐭… pic.twitter.com/JjJGUE86ru— BJP (@BJP4India) April 13, 2026నెట్టింట వైరల్గా మారిన వీడియోదేశ అత్యున్నత నేత తమ వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పడంతో ఆ జంటతో పాటు అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ తమ అధికారిక ‘ఎక్స్’ఖాతాలో పంచుకోగా, అది క్షణాల్లో వైరల్ అయింది. ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరగనున్న రెండు దశల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ సిలిగురిలో పర్యటిస్తున్నారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది. 2021 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాలతో ఘన విజయం సాధించగా, బీజేపీ 77 స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది. -
బీజేపీ మేనిఫెస్టోలో ఊహించని వరాలు.. ప్రత్యర్థులకు షాక్!
చెన్నై: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీ ఓటర్లపై వరాల వర్షం కురిపించింది. చెన్నై వేదికగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళలు, రైతులు, సామాన్యులే లక్ష్యంగా.. ప్రజా సంక్షేమం, మెరుగైన వైద్యం, ఆర్థిక స్థిరత్వమే మహా మంత్రంగా రూపొందించిన ఈ మేనిఫెస్టో ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్గా మారింది.మహిళలకే అగ్రపీఠంబీజేపీ తన మేనిఫెస్టోలో మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది. కుటుంబ యజమానురాళ్లకు ప్రతి నెలా రూ. 2,000 ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, అర్హులైన మహిళలకు ఈ-స్కూటర్ కొనుగోలుకు రూ. 25,000 సాయం ఇస్తామని ప్రకటించింది. ఇల్లు కొనుగోలు చేసే మహిళలకు స్టాంప్ డ్యూటీలో మూడు శాతం రాయితీ, ప్రతి కుటుంబానికి ఏకకాలంలో రూ. 10,000 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. స్వయం సహాయక సంఘాలు, ఎంఎస్ఎంఈ లకు రూ. 50 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపింది.జల్లికట్టుకు జైవిద్యార్థినులు, మహిళల భద్రత కోసం బస్సులు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో పాటు జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. నేరాల సత్వర విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఇక తమిళుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ‘జల్లికట్టు’కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ.. ఎద్దులను పెంచే వారికి నెలకు రూ. 2,000 సాయం, ఒకవేళ ఆటలో పాల్గొనే వ్యక్తి మరణిస్తే రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది.రైతులకు కేంద్ర సాయానికి అదనంగా మరో రూ. 3,000 (మొత్తం రూ. 9,000) ఇస్తామని తెలిపింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, కే అన్నామలై, తమిళసై సౌందరరాజన్ తదితరుల సమక్షంలో విడుదలైన ఈ మేనిఫెస్టో.. ఎన్నికల ప్రచారంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. 🔴LIVE | பாஜக தாமரை வாக்குறுதி 2026 | தமிழக சட்டமன்றத் தேர்தலுக்கான பாஜகவின் தேர்தல் அறிக்கை வெளியீட்டு விழா#தாமரை_வாக்குறுதி #TNBJPManifesto https://t.co/mHA6ezpAnk— BJP Tamilnadu (@BJP4TamilNadu) April 14, 2026 -
తమిళిసై మైలాపూర్ ‘మహారాణి’.. వేచి చూడాలి!
చెన్నై: ఆధ్యాత్మికతకు, చారిత్రక వారసత్వానికి చిరునామా అయిన మైలాపూర్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు అధికార డీఎంకే బలం, మరోవైపు మాజీ గవర్నర్, బీజేపీ ఫైర్ బ్రాండ్ తమిళిసై సౌందరరాజన్ దూకుడుతో ఈ ‘టెంపుల్ టౌన్’లో రాజకీయ సెగలు పుడుతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో గెలుపోటములను శాసించే అసలైన శక్తి మాత్రం మహిళా ఓటర్లే.‘లేడీ పవర్’ ఎవరి వైపు?మైలాపూర్లో పురుషుల కంటే మహిళలే అధికం అని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 2,70,568 మంది ఓటర్లలో మహిళా ఓటర్లు 1,39,349, పురుష ఓటర్లు 1,31,179. ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు అధికంగా ఉండటం తమిళిసైకి అతిపెద్ద ప్లస్ పాయింట్గా మారిందని విశ్లేషకులు అంటున్నారు. ఒక మహిళా నాయకురాలిగా, ఒక వైద్యురాలిగా, మాజీ గవర్నర్గా ఆమెకున్న క్లీన్ ఇమేజ్ మహిళా ఓటర్లను ఆకర్షిస్తోందని చెబుతున్నారు. ఇంటింటి ప్రచారంలో మహిళలతో ఆమె మమేకమవుతున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కమలం వికసిస్తుందా?గత చరిత్రను చూస్తే మైలాపూర్ ఏ పార్టీకీ శాశ్వత చిరునామా కాదు. 2016లో అన్నాడీఎంకేను ఆదరించిన ప్రజలు 2021లో డీఎంకే అభ్యర్థి ధా వేలుకు పట్టం కట్టారు. ప్రస్తుతం డీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే ధా.వేలుపై వ్యతిరేకత ఉందా? లేక పి.వెంకటరమణన్ (టీవీకే), ఆర్ఎల్ అరుణ్ అయ్యంగార్ (ఎన్టీకే)లు ఓట్లను చీల్చుతారా? అన్నది పక్కన పెడితే.. తమిళిసై మాత్రం ‘మహిళా శక్తి’ మీదనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు. మహిళా ఓటర్లు కరుణిస్తే మైలాపూర్ గడ్డపై కమలం వికసించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.బహుముఖ పోరులో ఉత్కంఠతత్వవేత్త తిరువళ్లువర్ జన్మించిన ఈ పవిత్ర నేలపై తనదైన ముద్ర వేయాలని తమిళిసై గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే మైలాపూర్ మహిళా ఓటర్లు ఎవరికి పట్టం కడతారో? ఈ ‘టెంపుల్ టౌన్’ పోరులో చివరకు విజేతగా ఎవరు నిలుస్తారో వేచి చూడాలి. ఇది కూడా చదవండి: నోయిడాలో కార్మిక రణరంగం: ఎవరీ మేధా రూపమ్? -
దళపతి ‘మాయ’.. షాకిస్తున్న ‘హోలోగ్రామ్ విజయ్’
చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. అయితే ఈసారి ఎన్నికల ప్రచారంలో దళపతి విజయ్ సరికొత్త ట్రెండ్ సృష్టించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో స్వయంగా పర్యటించడం అసాధ్యం కావడంతో, ఆయన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ఒక అద్భుతమైన ఐడియాతో ముందుకొచ్చింది. ఏఐ సాంకేతికతతో సృష్టించిన విజయ్ 3డీ హోలోగ్రామ్లు ఇప్పుడు వీధుల్లో అదరగొడుతున్నాయి. ప్రజలను ఈ హైటెక్ ప్రచారం ఎంతగానో ఆకర్షిస్తోంది.ప్రచార బరిలో ‘3డీ విజయ్’ హవాకుంభకోణం టీవీకే అభ్యర్థి వినోద్ రవి ఈ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రచార రథంపై అభ్యర్థితో పాటు నిల్చున్న విజయ్ 3డీ హోలోగ్రామ్.. అచ్చం ఆయన లాగే కనిపిస్తూ, ఆయన గొంతుతోనే ప్రసంగిస్తోంది. ‘విజిల్ వేయడానికి సిద్ధమా? ఓటు మన హక్కు, దాన్ని ఎవరూ తీసుకోలేరు. మన ఓటు విజిల్ (టీవీకే గుర్తు)కే వేయాలి. మనం ఎవరి మాటలకూ మోసపోం’ అని హోలోగ్రామ్ విజయ్ చెబుతుంటే.. అభిమానులు, ఓటర్లు ఆశ్చర్యంతో చూస్తూ అక్కడే ఉండిపోతున్నారు. ఈ డిజిటల్ దళపతి భౌతికంగా ఆయన అక్కడే ఉన్నారన్న భ్రమను కల్పిస్తూ విశేషంగా ఆకట్టుకుంటోంది. TVK candidate in Kumbakonam uses a full hologram of Vijay…. pic.twitter.com/eWooTr2EKk— Vasudha Venugopal (@Vasudha156) April 13, 2026విద్యార్థి మేధస్సుకు ప్రతిరూపంమొత్తం 234 స్థానాల్లో పోటీ చేస్తున్న పార్టీ.. అన్ని చోట్లా విజయ్ సందేశాన్ని చేర్చాలనే ఉద్దేశంతో ఈ వ్యూహం అమలు చేసింది. తంజావూరు జిల్లా టీవీకే కోశాధికారి విజయ్ చంద్రన్ ఆలోచన మేరకు, ప్రవీణ్ అనే 20 ఏళ్ల ఏఐ, డేటా సైన్స్ విద్యార్థి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశాడు. కేవలం మూడు రోజుల్లోనే ఏఐ సాయంతో విజయ్ ప్రసంగాన్ని 50 సెకన్ల వీడియోగా మార్చి, దానిని హోలోగ్రామ్ ద్వారా ప్రదర్శించారు. ఈ ప్రయోగం ఆన్లైన్లో వైరల్ కావడంతో పాటు, క్షేత్రస్థాయిలో విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దీనిని విస్తరించే పనిలో పార్టీ బిజీగా ఉంది.డూప్ల నుంచి డిజిటల్ దాకా..ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం టీవీకే శ్రేణులు చేయని ప్రయత్నం లేదు. హోలోగ్రామ్ల కంటే ముందు తిరువెరుంబూర్ అభ్యర్థి నావల్పట్టు విజి.. విజయ్ మైనపు బొమ్మను (మ్యాన్విన్) ప్రచారానికి వాడారు. అలాగే సీఎం స్టాలిన్పై పోటీ చేస్తున్న కొలత్తూరు అభ్యర్థి వీఎస్ బాబు సైతం, అచ్చం విజయ్లా ఉన్న డూప్లతో ప్రచారం చేయించారు. చెన్నై ఆఫీసులో వందల కొద్దీ విజయ్ బొమ్మలు ఉన్నాయన్న వార్తలు కూడా వచ్చాయి. ఇలా డూప్లు, బొమ్మలతో మొదలైన వారి ప్రచారం.. ఇప్పుడు ఏఐ, 3డీ హోలోగ్రామ్ల స్థాయికి చేరి, రాజకీయ ప్రచార రూపురేఖలనే మార్చేస్తోంది.ఇది కూడా చదవండి: నేడు అంబేద్కర్ జయంతి: ఏవి ఓపెన్? ఏవి క్లోజ్? -
బెంగాల్ ఎన్నికలు: అభిషేక్ బెనర్జీ సరికొత్త ప్రకంపనలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రచారంలో కేంద్ర బిందువుగా మారిన యువ నేత, కీలక వ్యూహకర్త అభిషేక్ బెనర్జీ సరికొత్త రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. పదునైన విమర్శలు, ప్రతిపక్షాలపై సూటి ప్రశ్నలు, క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలతో ఆయన తన ప్రచార శైలికి మరింత పదునుపెట్టారు. ఒకవైపు ప్రతిపక్షాల వ్యూహాలను ఎండగడుతూనే, పార్టీ మూలాలను బలోపేతం చేసే దిశగా ఆయన వేస్తున్న అడుగులు బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.ఈసీ తీరుపై సంచలన ఆరోపణలువరుస ప్రజా సభలు, సమావేశాల్లో పాల్గొంటున్న అభిషేక్ బెనర్జీ.. ఎన్నికల నిర్వహణ, రాజ్యాంగ సంస్థల తటస్థతపై తీవ్రస్థాయిలో ప్రశ్నలు సంధించారు. ఎన్నికల సంఘం (ఈసీ) తీరు పక్షపాతంగా మారిందని, ఎన్నికల ప్రక్రియలో అందరికీ సమాన అవకాశాలు లేకుండా పోయాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వ్యవస్థాగత లోపాలను ఎత్తిచూపుతూనే, టీఎంసీ శ్రేణుల్లో విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలు, ఇతర సంస్థలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, 2021 అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి తృణమూల్ కాంగ్రెస్ మరింత భారీ మెజారిటీతో విజయం సాధించి తీరుతుందని అభిషేక్ బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు.‘ప్రతిపక్షాలది అపవిత్ర కలయిక’రెజీనగర్లో జరిగిన ఓ భారీ బహిరంగ సభలో ప్రతిపక్షాలపై అభిషేక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ, ఏజేయూపీ, ఐఎస్ఎఫ్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కేవలం అవకాశవాదంతో ఏకమయ్యాయని, అదొక అపవిత్ర కలయిక అని ఆయన అభివర్ణించారు. వివిధ పార్టీలకు చెందిన కుళ్టిన మూలకాలను కలపడం వల్ల రాష్ట్రంలో కేవలం అస్థిరత మాత్రమే ఏర్పడుతుందని, ఆ కూటమికి ఎలాంటి సైద్ధాంతిక నిబద్ధత లేదని విమర్శించారు. ఇదే క్రమంలో, ఏజేయూపీ నేత హుమాయున్ కబీర్కు సంబంధించిన వివాదాస్పద వైరల్ వీడియో వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు. పలు పార్టీల సీనియర్ నేతలు, కేంద్ర సంస్థల ప్రమేయంతో భారీ స్థాయిలో రాజకీయ డీల్ జరిగినట్లు ఆ వీడియో స్పష్టం చేస్తోందని ఆరోపించి బెంగాల్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించారు.క్షేత్రస్థాయి వ్యూహాలు.. భవిష్యత్ నాయకత్వంకేవలం మాటలకే పరిమితం కాకుండా, అభిషేక్ బెనర్జీ జిల్లాల స్థాయిలో విస్తృత పర్యటనలు చేస్తూ క్షేత్రస్థాయి కార్యకర్తలతో నేరుగా మమేకమవుతున్నారు. పౌరసత్వం తదితర కీలక అంశాలపై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలో ‘జాతీయ పౌర పట్టిక’(ఎన్ఆర్సీ) అమలును బెంగాల్ ఎంత కఠినంగా వ్యతిరేకించిందో ఆయన ప్రజలకు గుర్తుచేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుందని పదేపదే చెప్పడం ద్వారా క్యాడర్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు.‘దీదీ’ శిష్యరికంలో రాటుదేలి..పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీతో ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఉన్న బంధం కేవలం కుటుంబపరమైనది మాత్రమే కాదు. టీఎంసీలో తిరుగులేని అగ్ర నాయకురాలిగా మమతా బెనర్జీ కొనసాగుతుండగా, ఆమె మార్గదర్శకత్వంలో ఎదిగిన అభిషేక్ ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ప్రధాన వ్యూహకర్తగా, అప్రకటిత ‘నెంబర్ 2’గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యువతను ఏకం చేస్తూ, ఆధునిక సాంకేతిక ప్రచార వ్యూహాలతో సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: బెంగాల్ బరిలో నలుగురు రిపోర్టర్లు -
బెంగాల్లో బాబ్రీ మసీదు కట్టనివ్వం
రాణిగంజ్: టీఎంసీ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ చీఫ్ హుమాయూన్ కబీర్ ఇద్దరూ ఒక్కటేనని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. బెంగాల్లో బీజేపీ గెలిస్తే హుమాయూన్ ప్రకటించినట్లుగా బాబ్రీ మసీదును నిర్మించనివ్వబోమని స్పష్టం చేశారు. సోమవారం ఆయన బీర్భూమ్, పశ్చిమ్ బర్దమాన్ జిల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. అప్పట్లో అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకించగా.. ఆమె పార్టీ మాజీ నేత ఇప్పుడు అయోధ్యలో కూల్చిన బాబ్రీ మసీదును నిర్మించేందుకు చూస్తున్నారన్నారు. ‘550 ఏళ్లుగా టెంట్ కిందే ఉంటున్న రామ్ లల్లాను అలా ఉంచేందుకే కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎస్పీ, బీఎస్పీలు మద్దతు తెలిపాయి. తిరుగులేని మెజారిటీతో గెలిచిన మోదీ ప్రభుత్వం మాత్రమే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించింది. మమతా బెనర్జీ మాదిరిగా ఆలోచించే హుమాయూన్ ఇప్పుడు బెంగాల్లో బాబ్రీ మసీదు కట్టాలనుకుంటున్నారు’అని అమిత్ షా వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బాబ్రీ మసీదు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టం చేశారు. బాంబులు, బుల్లెట్లకు బెంగాల్ ప్రజలు ఓట్లతోనే సమాధానం చెబుతారన్నారు. టీఎంసీ ప్రభుత్వాన్ని సాగనంపండి, ఆ వెంటనే సిండికేట్ కట్మనీ ముఠాదార్లను, వారి మద్దతుదార్లను తలకిందులుగా వేలాడదీసి, తాము దారికి తెస్తామని హెచ్చరికలు చేశారు. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి టాటాబైబై చెప్పి, బీజేపీకి అధికారమిచ్చేందుకు ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారన్నారు. బీజేపీ కార్యకర్తలను చిత్రహింసలు పెట్టేందుకు టీఎంసీ నేరగాళ్లకు ఆశ్రయం కల్పిస్తోందంటూ మండిపడిన అమిత్ షా..మే 5న ఓట్ల లెక్కింపు తర్వాత కాషాయ పార్టీ కార్యకర్తలు ఈ నేరగాళ్లను బయటకు లాగి, చట్టం ముందు నిలబెడతారని స్పష్టం చేశారు. అందుకే టీఎంసీ గూండాలు మొదటి దశ పోలింగ్ జరిగే 23న ఇళ్లలోనే ఉండిపోవాలని సలహా ఇచ్చారు. రాష్ట్రంలోని మెజారిటీ మతస్తులను మమతా బెనర్జీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆయన.. ఈ ఎన్నికల్లో ప్రధాన అంశం చొరబాటుదార్లను వెళ్లగొట్టడమేనన్నారు. -
శిఖరాగ్రం నుంచి శిథిలావస్థకు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు ప్రధానంగా అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్యే కేంద్రీకృతమైంది. రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు అప్రతిహతంగా పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన దురవస్థకు చేరింది. 50 ఏళ్లుగా అధికారానికి దూరమైన కుర వృద్ద పార్టీ ఈసారి ఖాతా తెరిచేందుకే కిందా మీదా పడే పరిస్థితికి చేరుకుంది...! 1977 నుంచి మొదలైన పతనం స్వాతంత్య్రానంతరం నుంచి బెంగాల్ను కాంగ్రెస్ 1977 దాకా పాలించింది. బిదాన్ చంద్రరాయ్, ప్రఫుల్ల చంద్రసేన్, అజయ్ ముఖర్జీ, సిద్ధార్థ శంకర్ రే వంటి దిగ్గజ నేతలు ముఖ్యమంత్రులుగా చేశారు. 1977లో రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం మొదలైంది. ఆ ఏడాది జ్యోతిబసు నాయకత్వంలోని కమ్యూనిస్టులు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. కాంగ్రెస్తో విభేదించి 1998లో మమతా బెనర్జీ సొంత కుంపటి పెట్టుకోవడంతో బెంగాల్లో పార్టీ పరిస్థితి మరింత కునారిల్లుతూ వచ్చింది. అప్పటినుంచీ క్రమంగా ప్రాధాన్యతను కోల్పోయింది. 2011లో బెంగాల్లో తృణమూల్ తొలిసారిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కాంగ్రెస్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు సాధించిన కాంగ్రెస్ 2011లో 42, 2016లో 44 సీట్లు నెగ్గింది. కానీ గత ఐదేళ్లలో బెంగాల్లో బీజేపీ పుంజుకోవడంతో కాంగ్రెస్ భారీగా నష్టపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా నెగ్గలేకపోయింది! ఓట్ల శాతంలోనూ సింగిల్ డిజిట్కు పరిమితమైంది. 2016లో కేవలం 3 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ 2021లో ఏకంగా 77 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదా చేజిక్కించుకుంది. కార్యాలయాల్లోనూ కన్పించని సందడి ప్రస్తుతం బెంగాల్వ్యాప్తంగా ప్రతి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో తృణమూల్, బీజేపీ జెండాలతో ఎన్నికల కోలాహలం కనబడుతుంటే కాంగ్రెస్లో మాత్రం చడీచప్పుడే లేదు. చాలా జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను సైతం తెరిచే పరిస్థితి లేదు! పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హస్తంజెండా పట్టుకునే కార్యకర్తే కరువైన పరిస్థితి! 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకొంటే అన్ని పార్టీలూ ‘సున్నా’చుట్టాయి. దాంతో కాంగ్రెస్ ఈసారి మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తోంది. బెహ్రాంపూర్ నుండి అధిర్ రంజన్ చౌదరి, మాలతీపూర్ నుంచి మౌసమ్ నూర్, సుజాపూర్ నుంచి అబ్దుల్ హన్నన్ తదితరులు బరిలో ఉన్నారు.పతనానికి కారణాలెన్నో బెంగాల్లో కాంగ్రెస్ పతనానికి అనేక కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార పార్టీలకు వ్యతిరేకంగా భారీ ఉద్యమాలు నడపడంలో మూడు దశాబ్దాలుగా పార్టీ విఫలమైంది. తొలుత లెఫ్ట్ ఫ్రంట్కు దన్నుగా ఉన్న మధ్య, ఉన్నత తరగతి ఓటర్లు ఆ తర్వాత టీఎంసీ వైపు మళ్లారు. బీజేపీ ఎదుగుదలతో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు దాదాపుగా గండి పడింది. రాష్ట్రంలో 30 శాతమున్న ముస్లింలు పూర్తిగా తృణమూల్ వైపు వెళ్లారు. -
బెంగాల్ బరిలో నలుగురు రిపోర్టర్లు
కోల్కతా: ఎన్నికల సమయంలో మైకులు పట్టుకుని, నాయకుల వెంటపడే జర్నలిస్టులను మనం చూసేవుంటాం. అయితే ఇప్పుడు ఓటర్ల ముందు చేతులు కట్టుకుని నిలుచుని, ఓట్లు అడుగుతున్న జర్నలిస్టులు తారసపడుతున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వైనం కనిపిస్తోంది. దశాబ్దాల పాటు వార్తలు రాసి, ఎన్నికల విశ్లేషణలు చేసి, నాయకులకు ప్రశ్నలు వేసిన నలుగురు రిపోర్టర్లు ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలోకి దిగారు. న్యూస్ రూమ్ నుంచి నామినేషన్ సెంటర్ల వరకు వీరి ప్రయాణం పలు మలుపులు తిరిగింది. బెంగాల్ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్గా మారింది.ఖర్దహా నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తరపున జర్నలిస్ట్ దేవదీప్ పురోహిత్ బరిలో ఉన్నారు. స్థానికంగా తనకున్న పరిచయాలు, క్షేత్రస్థాయి అవగాహన తనను గెలిపిస్తాయని ఆయన నమ్ముతున్నారు. అయితే ఆయనకు ప్రత్యర్థులుగా కల్యాణ్ చక్రవర్తి (బీజేపీ), జాయ్దేబ్ ఘోష్ (కాంగ్రెస్), దేబ్జ్యోతి దాస్ (సీపీఐ-ఎం)గట్టి పోటీ ఇస్తున్నారు. సియురి (Siuri) నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మరో జర్నలిస్ట్ జగన్నాథ్ ఛటోపాధ్యాయ్ పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు నాయకుల ప్రసంగాలు కవర్ చేసిన ఆయన, ఇప్పుడు స్వయంగా ఇంటింటి ప్రచారంలో మునిగిపోయి ప్రజల మద్దతు కూడగడుతున్నారు.మరోవైపు మేమారి నియోజకవర్గం నుంచి 25 ఏళ్ల సుదీర్ఘ పాత్రికేయ అనుభవం ఉన్న మానబ్ గుహక్.. బీజేపీ టికెట్పై బరిలో నిలిచారు. ఆయనపై టీఎంసీకి చెందిన రాసబిహారి హల్దర్ పోటీలో ఉన్నారు. అలాగే తారకేశ్వర్ నుంచి మరో రిపోర్టర్ సంతు పాన్ సైతం బీజేపీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మే 4న వెలువడే ఎన్నికల ఫలితాల్లో వీరి జర్నలిజం అనుభవం ఓట్లుగా మారుతుందో లేదో వేచిచూడాలి.ఇది కూడా చదవండి: అరుణాచల్ వివాదం: ‘డ్రాగన్’కు దిమ్మతిరిగే రిటర్న్ గిఫ్ట్ -
కోడలికి వ్యతిరేకంగా మామ ప్రచారం
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలలో పీఎంకేలో నెలకొన్న వివాదం మరింతగా ముదురుతోంది. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్భుమణి మధ్య నెలకొన్న వివాదం తెలిసిందే. అన్బుమణికి వ్యతిరేకంగా రాందాసు న్యాయ పోరాటంచేసినా ఫలితం శూన్యం. పార్టీ, ఎన్నికల గుర్తు మామిడి పండు అన్బుమణి గుప్పెట్లోకి చేరింది. దీంతో అన్బుమణి మద్దతుదారులు ఎన్నికలలో పోటీ చేస్తున్న చోట్ల రాందాసు వ్యతిరేక ప్రచారానికి సిద్ధమయ్యారు. వన్నియర్ సామాజిక వర్గంతో నిండిన నియోజకవర్గాలలో అన్బుమణికి వ్యతిరేకంగా రాందాసు వ్యాఖ్యల తూటాలను పేల్చేందుకు సిద్ధమయ్యారు. ఈ పర్యటన ధర్మపురి నుంచే బయలు దేరనుండడంతో వ్యవహారం ఎలాంలలి రచ్చకు దారితీయబోతున్నదో అన్న ఉత్కంఠ నెలకొంది. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్బుమణి సతీమణి సౌమ్య అన్బుమణి పోటీ చేస్తున్నారు. ఆమెకు వ్యతిరేకంగా స్వయంగా ప్రచారానికి రాందాసు రంగంలోకి దిగారు. ప్రచార బాట సోమవారం ధర్మపురిలో సౌమ్య అన్బుమణికి వ్యతిరేకంగా రాందాసు ప్రచారం చేయనున్నారు. 35 ఏళ్లుగా తన భుజాలపై మోసిన పార్టీ, చిహ్నంకు వ్యతిరేకంగా రాందాస్ ప్రచారం నిర్వహించనున్నడం గమనార్హం. రాందాసు మద్దతు దారులకు సిలిండర్ గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో తన అభ్యర్థులకు మద్దతుగా, అన్బుమణి అభ్యర్థులకు వ్యతిరేకంగా రామ్దాసు ప్రచార బాటకు సిద్ధమయ్యారు. సోమవారం ధర్మపురిలో తన కోడలు సౌమ్య అన్బుమణికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నారు. ప్రచార సభ నిర్వహించనున్నారు. కుటుంబ విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో రాందాసు ఎలాంటి వ్యాఖ్యల తూటాలను పేల్చనున్నారో వేచి చూడాల్సిందే. ఆతదుపరి 16న కుంబకోణం. 17న కాట్టుమన్నార్కోయిల్, జయకొండం, 18న తిట్టకుడి, విరుదాచలం, భువనగిరి, 19న చెయ్యార్, పోలూరు, కలసపాక్కం. 20న విక్రవాండి, సెంజి, కీల్పెన్నాత్తూరులలో అన్బుమణి పీఎంకే, మామిడి చిహ్నంకు వ్యతిరేకంగా ప్రచారంకు రాందాసు నిర్ణయించడం గమనార్హం. కాగా ఒకే పారీ్టకి చెందిన తండ్రీకొడుకులు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి, ఒకరిపై ఒకరు ఓట్లు వ్యాఖ్యల తూటాలన పేల్చుకునేందుకు సిద్ధం కావడంతో పీఎంకే కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ధర్మపురిలో ఈ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
యోగి, సువేందుల వైరల్ వీడియో.. ‘ఎంత భక్తో’
కోల్కతా: రాజకీయ వేదికలపై కనిపించే కొన్ని దృశ్యాలు వైరల్గా మారుతుంటాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విషయంలో బెంగాల్ ఫైర్ బ్రాండ్ నేత సువేందు అధికారి చూపిన అనూహ్య భక్తిభావం, అణకువ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.పశ్చిమబెంగాల్లోని కొంటాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభ ఈ ఆసక్తికర ఘట్టానికి వేదికైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ ఇక్కడకు వచ్చారు. ఆయన వేదిక పైకి అడుగుపెట్టగానే సువేందు అధికారి వేగంగా వెళ్లి, కాషాయ కండువాతో స్వాగతం పలికారు. అంతేకాదు, ఏమాత్రం సంకోచించకుండా వేదికపైనే యోగి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. వెంటనే స్పందించిన యోగి ఆయనను ఆప్యాయంగా పైకి లేపి, చేయి పట్టుకుని అక్కడున్న ప్రజల వైపు తిరిగి అభివాదం చేశారు. ఈ క్షణాలను క్యాప్చర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ‘ఎంత భక్తో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Beautiful video ♥️Kanthi, West Bengal : Bengal LoP Suvendu Adhikari seeks blessings from UP CM Yogi Adityanath by prostrating in-front him and touching his feet.#BengalElections #BJP4Bengal pic.twitter.com/eUj1lPdOe9— Amitabh Chaudhary (@MithilaWaaala) April 12, 2026ఈ సభలో యోగి ఆదిత్యనాథ్ అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బెంగాల్ సంస్కృతిని, శాంతిభద్రతలను కాపాడటంలో టీఎంసీ సర్కార్ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, భద్రత కోసం ఇక్కడ కూడా నరేంద్ర మోదీ నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా మాల్దా, ముర్షిదాబాద్, బీర్భూమ్ వంటి ప్రాంతాల్లో హిందువుల జనాభాను తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బెంగాల్లో దుర్గాపూజ, రామ నవమి ఊరేగింపులను అడ్డుకోవడాన్ని యోగి తప్పుబట్టారు. బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.ఇది కూడా చదవండి: Noida: కార్మికుల తిరుగుబాటు.. కలెక్టర్ కీలక నిర్ణయం! -
గెలిస్తే.. ఏఐ మంత్రిత్వ శాఖ
సాక్షి, చెన్నై : టీవీకే అధికారంలోకి వస్తే తమిళనాడును దేశానికే ఏఐ రాజధానిగా మారుస్తామని ఆ పార్టీ అధినేత విజయ్ ప్రకటించారు. రాష్ట్రంలో మొట్టమొదటి ఏఐ సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని, అలాగే ఒక ప్రత్యేక ఏఐ నగరాన్ని నిర్మిస్తామని వివరించారు. ఇక ఒక ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం టీవీకే అధినేత విజయ్ కన్యాకుమారిలో పర్యటించారు. జాతీయ రహదారిలో ప్రజల్ని ఆకర్షించే విధంగా సైకిల్ తొక్కు తూ ముందుకు సాగారు. నా గుండెల్లో.. కన్యాకుమారిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో విజయ్ మాట్లాడుతూ: ‘నా గుండెల్లో నివసించే కన్యాకుమారి, కారైక్కుడి ప్రజలకు నా నమస్కారాలు అని వ్యాఖ్యానించారు. ఆ రోజు కారైక్కుడిలో తాను మాట్లాడలేకపోయానని గుర్తు చేశారు. ఇప్పుడు టీవీకే ప్రభుత్వం చేపట్టబోయే కొన్ని పథకాలను ఇక్కడ ప్రకటిస్తున్నానని వివరించారు. టీవీకే ప్రభుత్వం ఏర్పడితే, పాలనలో ఎటువంటి అవినీతి లేకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ఇందుకోసం ఆధార్ కార్డు తరహాలోనే తమిళనాడులో ఒక ప్రత్యేక గుర్తింపు కార్డును రూపొందిస్తామన్నారు. ఏఐ డేటా సహా యంతో, ఎటువంటి మధ్యవర్తులు లేకుండా, లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈ కార్డు ద్వారా పథకాలు నేరుగా ప్రజలకు అందుతాయని వివరించారు. దీని కోసం ప్రజలు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పని కావాలంటే రకరకాలుగా తిప్పించుకుంటున్నారని, ఇందుకు ప్రధాన కారణం లంచం. లంచం... అంటూ ఇలా తీసుకునే లంచం కేవలం అధికారులకే కాకుండా, మంత్రుల వరకు వెళ్తోందని ఆరోపించారు. సేవా ధృవీకరణ పథకం టీవీకే అధికారంలోకి రాగానే ‘తమిళనాడు సేవ «ధృవీకరణ పథకం రూపొందిస్తామని ప్రకటించారు. ఒక మొబైల్ యాప్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ సహా అన్ని ప్రభుత్వ సేవలను మధ్యవర్తులు లేకుండా, లంచం ఇవ్వకుండా పొందవచ్చు అని వివరించారు. ప్రస్తుతం బడ్జెట్ అనేది కేవలం ఒక పత్రం లాగే కనిపిస్తున్నదని, ఆ నిధులు ఎక్కడికి వెళ్తున్నా యో తెలియడం లేదంటూ, ఇది చిదంబర రహ స్యం లాగా స్టాలిన్ రహస్యంగా ఉంటోందని ఆరోపించారు. ఇక, జాలర్ల భద్రత గురించి ప్రస్తావిస్తూ, నిషేధ కాలంలో ఇస్తున్న రూ. 8 వేలు సాయాన్ని రూ. 20 వేలకు పెంచుతామని ప్రకటించారు. పడవల్ని రక్షించేందుకు రాయబార కార్యాలయం ద్వారా దౌత్య పరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ, అంత వరకు బ్యాంక్ రుణాల చెల్లింపు, జాలర్ల కుటుంబాలకు సాయం నిమిత్తం పడవ యజమానికి రూ. 5 లక్షల వరకు మధ్యంత నివారణ నిధులు అందజేస్తామని వివరించారు. కడల్ తాయ్ ఇల్లం పేరిట సముద్ర తీరంలో ఉన్న గుడిసెలు, పాడు బడ్డ గృహాలను తొలగించి, వాటి స్థానంలో ఎలాంటి విపత్తులైనా ఎదుర్కొనే విధంగా గృహాలను నిర్మించి ఇస్తామన్నారు. అలాగే, ఇంధన రక్షణ పథకం ద్వారా నెలకు 1800 లీటర్ల నుంచి 3 వేల లీటర్లుగా కోటాను పెంచుతామని, లీటరకు రూ. 15 సబ్సిడీ పడవ యజామాని బ్యాంక్ఖాతాలో నేరుగా జమ చేస్తామని ప్రకటించారు. -
బీజేపీని భరించడం కష్టం: ‘దీదీ’ చెంతకు నేతాజీ వారసుడు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. అత్యంత ఉత్కంఠభరితంగా మారిన ఈ పోరులో బీజేపీకి ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబం నుంచి వచ్చిన కీలక నేత, ఆయన మనుమడు చంద్ర కుమార్ బోస్ తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరారు. బీజేపీ సిద్ధాంతాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆయన, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తూ, టీఎంసీ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా చంద్ర కుమార్ బోస్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. నాడు బ్రిటిష్ వారు అవలంబించిన విభజించు, పాలించు విధానాన్నే నేడు బీజేపీ పాటిస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటూ, ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని విమర్శించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, శరత్ చంద్రబోస్ తదితరులు తీవ్రంగా వ్యతిరేకించిన మత రాజకీయాలను బీజేపీ ప్రోత్సహిస్తుండటం ఏమాత్రం అంగీకారం కాదని ఆయన పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, కేవలం సిద్ధాంతపరమైన విభేదాల వల్లే తాను తొమ్మిదేళ్ల బంధాన్ని తెంచుకుని, బీజేపీకి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. #WATCH | Kolkata, West Bengal | Netaji Subhas Chandra Bose's grandnephew Chandra Kumar Bose joins TMC. pic.twitter.com/z8Rzt46XHo— ANI (@ANI) April 12, 2026దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న బీజేపీ విధానాలను భరించలేకే ఆ పార్టీని వీడానని, లౌకికవాదం, అందరినీ కలుపుకుపోయే తత్వం ఉన్న టీఎంసీ విధానాలు నచ్చడంతోనే ఆ పార్టీలో చేరానని చంద్ర కుమార్ బోస్ వివరించారు. రాబోయే ఎన్నికల్లో దీదీ మరోసారి ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కాగా ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతలుగా బెంగాల్ ఎన్నికలు జరగనుండగా మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. గత 2021 ఎన్నికల్లో 213 స్థానాలతో అఖండ విజయం సాధించిన టీఎంసీకి, 77 స్థానాలతో బలపడిన బీజేపీకి మధ్య ఈసారి హోరాహోరీ పోరు జరగనుంది. ఈ తరుణంలో నేతాజీ వారసుడు టీఎంసీలో చేరడం ఆ పార్టీ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. ఇది కూడా చదవండి: ఇరాన్ యుద్ధం: ‘ఐఎంఎఫ్’ తీవ్ర హెచ్చరిక -
అన్నాడీఎంకే కూటమికితిరుగులేదు..!
సాక్షి, చైన్నె : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పారీ్టన్నీ నువ్వా నేనా అనే రీతిలో ప్రచారం సాగిస్తున్నారు. తాజాగా ఎన్నికల్లో అన్నాడీఎంకేే కూటమి వ్యూహాలు.. హామీలపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి స్పందించారు. మీడియాతో వివిధ అంశాలపై ఆయన అభిప్రాయాలను తెలియజేశారు.. ‘‘2009లో జరిగిన తిరుమంగళంలో ఉపఎన్నిక పనుల్లో తనతో పాటుగా కొందరు నిర్వాహకులను అమ్మ జయలలిత పంపించారని వివరించారు. ఒకరోజు అమ్మ పిలిచి, అందరినీ... నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందని అడిగినట్టు పేర్కొన్నారు. అందరు నేతలు అద్భుతం, గెలుపు మనదే అని రిపోర్ట్ ఇవ్వగా, తాను మాత్రం కష్టం అని సమాధానం ఇచ్చానని గుర్తు చేశారు. ఈ సమయంలో ఇక పళణి స్వామి పని అయిపోయిందని అందరూ భావించారని, అయితే, తాను చెప్పినట్టుగానే ఫలితం రావడంతో అమ్మ పిలిచి అభినందించారని తెలిపారు. నిజాయితీగా, ధైర్యంగా నిజాన్ని చెప్పి నందుకు గాను తన మీద నమ్మకం అమ్మకు పెరిగిందని పేర్కొన్నారు. ఆ నిజాయితీ, ధైర్యం తాజాగా ఈ స్థాయికి చేర్చిందని’’ అన్నారు. తమను తీర్చిదిద్దిన పురట్చి తలైవర్ (ఎం.జి.ఆర్) బోధించిన, ‘కష్టపడి పనిచేసేవారే గొప్పవారు’ అనే సిద్ధాంతాన్ని అనుసరించి, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా 50 ఏళ్లకు పైగా పనిచేసిన ఫలితంగా పార్టీ సహచరులు నాకు ఈ హోదాను బహుమతిగా ఇచ్చారన్నారు. వారి నమ్మకాన్ని కాపాడే విధంగా కృషి చేస్తానని.. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాను అని పేర్కొన్నారు. ఏదైనా ఒక పార్టీ నాయకత్వం, ఉద్యమం క్రమశిక్షణతో, నియంత్రణతో సాగాలని కోరుకుంటుంది. మా రాజకీయ గురువు అరిజ్ఞర్ అన్నా ’కర్తవ్యం – గౌరవం – క్రమశిక్షణ’ను బోధించారు. ఆయన మార్గంలోనే ఎం.జి.ఆర్, జయలలిత నడిచారు. నేను కూడా వారు చూపిన బాటలోనే పయనిస్తున్నాను. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, పార్టీకి ద్రోహం చేసిన వారిపై జనరల్ బాడీ సమావేశంలో చర్యలు తీసుకున్నాము. ఇక్కడ ఉన్నంత కాలం పదవులను అనుభవించి, పార్టీకి ద్రోహం చేయడమే కాకుండా, స్వలాభం కోసం వారు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. దాని గురించి మేము ఆందోళన చెందాలా? అని పేర్కొన్నారు.కూటమి అనేది ఎన్నికల పరిస్థితులను బట్టి ఏర్పడుతుంది. 1999లో బీజేపీ కూటమి నుండి వైదొలిగిన అన్నాడీఎంకే, 2004లో మళ్లీ జత కట్టింది. 1999లో బీజేపీతో చేరిన డీఎంకే, 2004లో అక్కడి నుండి విడిపోయి కాంగ్రెస్తో చేరింది. తమిళనాడులోని దుష్టశక్తి అయిన డీఎంకే పాలనను అంతం చేయాలనే ఏకై క లక్ష్యంతో అన్నాడీఎంకే, బీజేపీ కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఇందులో ఢిల్లీ ఒత్తిడి అనేది ఊహ మాత్రమే. అమ్మ మరణం తర్వాత నిజమైన, విశ్వాసపాత్రులైన కార్యకర్తలు ఒక సామాన్య కార్యకర్తగా, కష్టపడే వ్యక్తిగా ఉన్న నాకు మద్దతు ఇచ్చారు. పార్టీని తాకట్టు పెట్టిన వారిని, ద్రోహం చేసిన వారిని గుర్తించి ‘కలుపు మొక్కలను తొలగించి పార్టీని కాపాడుకున్నాం. శత్రువులతో పోరాడుతున్నాం, క్షేత్రస్థాయిలో విజయం సాధించడం ఖాయం అని స్పష్టం చేశారు.మణిపూర్ విషయంలో మేం సరైన రీతిలో గళం విప్పాం. సీఏఏ చట్టం వల్ల భారతీయ ముస్లింలకు, ముఖ్యంగా తమిళనాడు ముస్లింలకు ఎటువంటి నష్టం లేదని నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అసెంబ్లీలో స్పష్టంగా చెప్పాను. సీఏఏ వల్ల ముస్లింలకు కలిగే నష్టం ఏంటో ఆధారాలతో చెబితే నేను సమాధానం ఇస్తాను. ఓట్ల కోసం తమను ఆదరించేది ఎవరు, నిజంగా తమ సంక్షేమం కోసం పాటుపడేది ఎవరు అనేది తమిళనాడులోని ముస్లిం సోదరులకు బాగా తెలుసు. ఈ ఎన్నికల్లో వారు పూర్తి ఇష్టంతో అన్నాడీఎంకేకు ఓటు వేస్తారనే నమ్మకం మాకు ఉంది. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని సిద్ధాంతకర్తలుగా అంగీకరించి వారికి ఎంకే స్టాలిన్ సలాం కొడుతారేమోగానీ, తమ వరకు ఆదర్శ నాయకులు ఎవరో ప్రజలకు బాగా తెలుసని అభిప్రాయపడ్డారు.రాజకీయంలో అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ విజయ్ టీవీకే వారికీ ఉందంటూ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం అని స్టాలిన్ కుటుంబం విదేశాలకు విహారయాత్రకు వెళ్లి వచ్చిందని మరో ప్రశ్నకు ఆరోపించారు. ఎస్ఐఆర్తో దొంగ, బోగస్ ఓట్లను తొలగించారని ఇంకో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలగని విధంగా విమానాశ్రయం నిర్మించాలన్నదే అప్పుడూ, ఇప్పుడూ తమ విధానం అని పరందూరు విషయంగా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వాగ్దానాలను ఉచితం అని అనకండి. లేనివారికి, లేని పక్షంలో ఉన్నవారికి కుటుంబ అవసరాలకు కావాల్సినవి వెల లేకుండా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆ ప్రాతిపదికన ఫ్రిడ్జ్ ఇస్తామని చెప్పాం. అన్ని కుటుంబ కార్డుదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 జమ చేస్తామని హామీ ఇచ్చాం. పేద , మధ్యతరగతి ప్రజలు తమకు ఓటు వేయడానికి ఇప్పటికే సిద్ధమైపోయారు. గెలుపు తమదే, అధికారం తమదే అని ధీమా వ్యక్తం చేశారు.వ్యక్తిగత విమర్శలు చేయనుఇటీవల ప్రసంగాలలో వ్యక్తిగత విమర్శలు తీవ్రంగా ఉన్నట్టుందే ? అని సూచించగా, తాను ఎప్పుడైనా మర్యాద లేకుండా మాట్లాడటం చూశారా?, ఎవరైనా సరే వారు అని గౌరవంగా సంబోధించడమే నా పద్ధతి అని వ్యాఖ్యలు చేశారు. అయితే, అనవసరంగా గొడవకు దిగితే ఎలా వదలగలను? లక్షలాది మంది కార్యకర్తలు ఉన్న పార్టీ అన్నాడీఎంకే, ఊరికే వదిలేస్తే నా గురించి కార్యకర్తలు ఏమనుకుంటారు? అని ప్రశ్నించారు. -
‘లక్ష్మీ’ వర్సెస్ ‘దుర్గ’: ఎవరిది అసలైన స్కెచ్?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు(2026) దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇటు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), అటు బలమైన ప్రతిపక్షంగా ఎదిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య పోరు అత్యంత రసవత్తరంగా మారింది. గెలుపే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలు దాదాపు ఒకే వర్గం ఓటర్లను టార్గెట్ చేశాయి. అవే మహిళలు, యువత, సంక్షేమ పథకాల లబ్ధిదారులు. అయితే ఈ ఓట్లను రాబట్టేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పాత ఫార్ములాను నమ్ముకోగా, ఆమె కోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ సరికొత్త వాగ్దానాలతో రంగంలోకి దిగింది.ప్రభుత్వ వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు..2011 నుండి బెంగాల్లో టీఎంసీకి తిరుగులేని విజయాలు అందిస్తున్న మహిళలు, మైనారిటీలు, ఎస్సీ-ఎస్టీ సామాజిక వర్గాల కూటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదని మమతా బెనర్జీ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగానే అత్యంత ఆదరణ పొందిన ‘లక్ష్మీర్ భండార్’ పథకం కింద జనరల్ కేటగిరీ మహిళలకు నెలవారీ ఆర్థిక సాయాన్ని రూ.1,500కి, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.1,700కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేకతను పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ, పార్టీని ఆదుకుంటున్న మహిళా ఓటర్లను కట్టిపడేసేందుకే టీఎంసీ ఈ ఎత్తుగడ వేసింది. రాష్ట్రంలో 30 శాతంగా ఉంటూ, సుమారు 110 సీట్లలో ప్రభావం చూపే ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు వక్ఫ్ ఆస్తుల రక్షణ, అలియా యూనివర్సిటీ అభివృద్ధి వంటి హామీలను టీఎంసీ ఇచ్చింది. ‘మతం పేరిట రాష్ట్రాన్ని విభజించాలనుకునే వారికి ఒక్కటే చెబుతున్నాం. ఈ రాష్ట్రం ఇక్కడి తల్లులు, కుమార్తెలు, మైనారిటీలు, పేదల పక్షాన నిలబడుతుంది’ అని టీఎంసీ నేత జయప్రకాశ్ మజుందార్ స్పష్టం చేశారు.మహిళల ఆగ్రహానికి అడ్డుకట్ట వేసేందుకు..ఇదే సమయంలో టీఎంసీకి అత్యంత బలంగా ఉన్న మహిళా ఓటు బ్యాంకుకే గండికొట్టాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి సంచలన హామీలు గుప్పించారు. ప్రతి మహిళకు నెలకు రూ.3,000 ఆర్థిక సాయం, ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, మహిళా పోలీస్ స్టేషన్లు, ప్రత్యేకంగా ‘దుర్గా సురక్షా స్క్వాడ్’ల ఏర్పాటు వంటివి బీజేపీ సంకల్ప్ పత్రలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటన, సందేశ్ఖాలీ ఉదంతాలతో మహిళల్లో రగులుతున్న ఆగ్రహాన్ని ఓట్లుగా మలుచుకునేందుకు, వారికి భద్రతపై భరోసా కల్పించేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.‘చేపలు, గుడ్లు తినకుండా ఎవరూ ఆపలేరు’ మహిళా సాధికారతతో పాటు, హిందుత్వ అజెండాను కూడా బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) అమలు చేస్తామని, చొరబాటుదారులను ఏరివేస్తామని, ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’లకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు తెస్తామని హామీ ఇచ్చింది. ‘ఈ ఎన్నికలు బుజ్జగింపులకు-న్యాయానికి, చొరబాట్లకు-భద్రతకు, అవినీతికి-అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరాటం’ అని బీజేపీ నేత దేబ్జిత్ సర్కార్ అభివర్ణించారు. 2021లో బీజేపీ అత్యధికంగా లాభపడిన ఎస్సీ-ఎస్టీ బెల్టుల్లో టీఎంసీ ఈసారి స్కాలర్షిప్లు, హాస్టళ్ల ఏర్పాటుతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి దీటుగా బీజేపీ.. రాజ్బన్షీ, కుర్మి భాషలకు గుర్తింపుతో పాటు, ఉత్తర బెంగాల్కు ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎం వంటి భారీ ప్యాకేజీని ప్రకటించింది. మరోవైపు తమపై ఉన్న ‘ఉత్తరాది పార్టీ’ అనే ముద్రను చెరిపేసుకునేందుకు బీజేపీ ఈసారి ‘బెంగాలీ హిందుత్వ’ నినాదాన్ని ఎత్తుకుంది. వందేమాతరం మ్యూజియం, ఠాగూర్ కల్చరల్ సెంటర్లు, చైతన్య మహాప్రభు సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని చెబుతూనే.. చేపలు, గుడ్లు తినకుండా బెంగాలీలను ఎవరూ ఆపలేరని భరోసా ఇవ్వడం గమనార్హం.ఉనికిని కాపాడుకునేందుకు వామపక్షాలు, కాంగ్రెస్..ఇక ఈ ద్విముఖ పోరులో ఉనికి కాపాడుకునేందుకు పోరాడుతున్న వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు గుర్తింపు రాజకీయాలను పక్కనబెట్టి ఉపాధి చుట్టూ తమ ప్రచారాన్ని అల్లుకున్నాయి. ప్రతి కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని లెఫ్ట్ ఫ్రంట్ హామీ ఇస్తే, అవినీతి లేని సంక్షేమ పాలన అందిస్తామని, ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు విశ్వనాథ్ చక్రవర్తి మాటల్లో.. ‘టీఎంసీ తన పాత ఓటు బ్యాంకును కాపాడుకోవాలని చూస్తుంటే, బీజేపీ దానిని బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తోంది. తాము ఇంకా రేసులో ఉన్నామని గుర్తుచేయడానికే లెఫ్ట్, కాంగ్రెస్ పోరాడుతున్నాయి’. కాగా పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు వేస్తున్న ప్రతి ఎత్తుగడ, ఇస్తున్న ప్రతి హామీ బెంగాల్ ఓటర్లను ఆలోచనలో పడేస్తోంది. ఏ మేనిఫెస్టో ఎవరి ఓటు బ్యాంకును కొల్లగొడుతుందో ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే!ఇది కూడా చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం -
బెంగాల్ను మూడు ముక్కలు చేసేందుకు కుట్ర: మమత
కోల్కతా: డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా పశ్చిమ బెంగాల్ను మూడు ముక్కలుగా విభజించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను ఒడిశా, బిహార్లలో కలుపుతారే మోనంటూ అనుమానం వ్యక్తం చేశారు. బంకురా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో మమత మాట్లాడారు. టీఎంసీ నుంచి గద్దె దించేందుకు బీజేపీ రూ.వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. ఈ విషయమై బీజేపీ తనతో రూ.1,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుందని, ఇప్పటికే రూ.200 కోట్లు ఇచ్చిందని హుమాయూన్ కబీర్ చేసిన ఆరోపణలతో కూడిన వీడియోను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్య చేశారు. -
తుక్డే గ్యాంగ్కు మద్దతా?
సిలిగురి: ‘‘ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగతా భూభాగం నుండి వేరు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. వ్యూహాత్మక సిలిగురి కారిడార్ (చికెన్ నెక్)ను తెంచేస్తామని తుక్డే–తుక్డే గ్యాంగ్ బెదిరించింది. బుజ్జగింపు రాజకీయాలనే నమ్ముకుంటున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ తుక్డే గ్యాంగ్కు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మద్దతిచ్చింది. ఇదే ఆ పార్టీ అసలు రంగు’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ఆ పార్టీ యువత, గిరిజనులు, మహిళల వ్యతిరేకి అని ఆరోపించారు. బుజ్జగింపు రాజకీయాల వల్ల బెంగాల్ తీవ్రంగా నష్టపోయిందని, దుర్బర స్థితిలోకి జారుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సిలిగురి కారిడార్ను దేశ రక్షణకు, శ్రేయస్సుకు మధ్య వారధిగా ప్రధాని అభివరి్ణంచారు. ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి, పటిష్టంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సిక్కింను సిలిగురితో అనుసంధానించే సేవోక్–రాంగ్పో రైల్వే రైల్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుతో బెంగాల్, సిక్కిం అనుసంధానం ఏర్పడడమే గాక స్థానికంగా వాణిజ్యం, పర్యాటకం ఊపందుకుంటుందని, యువతకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. దోషులు మూల్యం చెల్లించాల్సిందే బెంగాల్లో అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని మోదీ అన్నారు. ‘‘ప్రగతిని పక్కనపెట్టి బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్న పార్టీలను చిత్తుగా ఓడించాలి. మదర్సాల కోసం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో రూ.6,000 కోట్లు ఇవ్వడమేమిటి? ఉత్తర బెంగాల్కు నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపారు. గత 15 ఏళ్లలో చేసిన ఖర్చులకు మమత సర్కారు సమాధానం చెప్పాలి. బీజేపీ అధికారంలోకి రాగానే తృణమూల్ కాంగ్రెస్ అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తాం. తప్పు చేసినవారు మూల్యం చెల్లించాల్సిందే. 15 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు బెంగాల్లో అమలు కాకపోవడం దారుణం. తృణమూల్ వైఖరితో ప్రజలు నష్టపోయారు. రాష్ట్రంలో క్రూరమైన ప్రభుత్వం ఉంది. ఆ భయానక పాలన పట్ల జనం విసుగెత్తిపోయారు. దానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని చెప్పారు. బీజేపీకి ఒక్క చాన్స్ తృణమూల్ నిర్వాకాల వల్ల బెంగాల్లోకి అక్రమ వలసలు పోటెత్తాయని మోదీ ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో చొరబాటుదార్లు తిష్టవేశారు. దాంతో స్థానికంగా జనాభా నిష్పత్తి మారిపోయింది. సామాజిక సమతుల్యం దెబ్బతిన్నది. బెంగాల్ ప్రజల భాష, సంస్కృతుల్లో మార్పులొచ్చాయి. స్థానికుల ఉపాధి, ఉద్యోగాలను చొరబాటుదార్లు కొల్లగొట్టారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే చాలా ఆలస్యం చేసినవాళ్లమవుతాం. అందుకే మన నినాదం ‘కమల్ ఖిలావో, ఘుస్పతియా భగావో (కమలానికి ఓటేద్దాం, చొరబాటుదార్లను గెంటేద్దాం)’. ఉత్తర బెంగాల్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేద్దామని కేంద్రం సంకల్పిస్తే మమత సర్కారు సహకరించలేదు. బీజేపీ అధికారంలోకి రాగానే ఉత్తర బెంగాల్కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తాం. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, క్యాన్సర్ ఆసుపత్రి, ఫ్యాషన్ డిజైన్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తాం. బెంగాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, తృణమూల్కు అవకాశమిచ్చారు. ఈసారి బీజేపీకి ఒక్క చాన్సిచ్చి చూడండి. ఆడబిడ్డలకు భద్రత కల్పించడానికి, చొరబాటుదార్ల నుంచి విముక్తి కల్పించడానికి, యువతకు ఉద్యోగాలు కల్పించడానికి, పెట్టుబడులు తీసుకురావడానికి, చట్టబద్ధ పాలన స్థాపించడానికి, పేదలకు ఉచితంగా వైద్యం అందించడానికి, ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి, బుజ్జగింపు రాజకీయాల బారి నుంచి బెంగాల్ సంస్కృతిని కాపాడడానికి మాకు అవకాశమివ్వండి’’ అని బెంగాలీలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. -
‘విజయ్ అంటే విజయకాంత్ కాదు’
చెన్నై: తమిళనాడులో డీఎండీకే వ్యవస్థాపకుడు, దివంగత నేత, సినీనటుడు “కెప్టెన్” విజయకాంత్ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆయన భార్య ప్రేమలత పోరాడుతున్నారు. విజయకాంత్ 2023 డిసెంబరు 28న కన్నుమూశారు. కొన్ని నెలల క్రితం సినీనటుడు విజయ్ కూడా టీవీకే పేరుతో పార్టీని స్థాపించారు. అయితే, కొందరు విజయకాంత్ను విజయ్తో పోల్చుతుండడం సరికాదన్నట్లు ప్రేమలత మాట్లాడారు. తాజాగా ఆమె తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.విజయ్ను కొందరు విజయకాంత్తో పోల్చుతుండడం పట్ల తాను ఎలాంటి అభిప్రాయాన్నీ వ్యక్తం చేయలేనని తెలిపారు. విజయకాంత్ కేవలం నటుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి మాత్రమే కాదని, ప్రజల మధ్య వారి కోసం నిలిచిన నాయకుని చెప్పారు.“కెప్టెన్ ప్రజల నాయకుడు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తన అభిమాన సంఘాలను రాజకీయ పార్టీగా మార్చి ఎన్నికల్లోకి వచ్చారు. ఏ సమస్య వచ్చినా ముందుగా అక్కడికి వెళ్లేవారు. ప్రజలతో నిలబడేవారు. నాయకుడు వేరుగా, ప్రజలు వేరుగా ఉంటే ఆ బంధం నిలబడదు. పార్లమెంటరీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు. విజయకాంత్ కలలు, లక్ష్యాలను నెరవేర్చడమే డీఎండీకే లక్ష్యం. రాజకీయాల్లో లింగ వివక్ష లేదు. నేను పురుషుడు, మహిళ అనే కోణంలో ఆలోచించను. సరైనది ఏదైతే అదే చేస్తాం. మాతృభాషను రక్షించాలి, అన్ని భాషలు నేర్చుకోవాలి. మాతృభాష మన కళ్లలా.. ఇతర భాషలు కళ్లద్దాల్లా.. అవసరమైనప్పుడు వాడుతాం. తమిళనాడులో ఎప్పటినుంచో రెండు భాషల విధానం ఉంది. మూడు భాషల విధానం లేదు’ అని తెలిపారు. -
తమిళనాడు ఎన్నికల వేళ ట్విస్ట్.. కాంగ్రెస్కు బిగ్ షాక్!
సాక్షి, చైన్నె: తమిళనాడులో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో మహిళలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, పార్టీ సీనియర్ నాయకురాలు హసీనా సయ్యద్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ అధిష్టానంపై, ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర అధ్యక్షుడు సెల్వపెరుంతొగైపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయమై హసీనా సయ్యద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వేదికలపై మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గొప్పగా చెబుతుందని, కానీ ఆచరణలో తమిళనాడులో పోటీ చేస్తున్న 28 స్థానాల్లో కేవలం ఇద్దరు మహిళలకు (సుమారు 7%) మాత్రమే అవకాశం ఇచ్చిందని హసీనా మండిపడ్డారు. తనకు పట్టున్న కృష్ణగిరి నియోజకవర్గాన్ని కేటాయించాలని కోరగా, స్క్రీనింగ్ కమిటీలో తన పేరు మొదటి స్థానంలో ఉందని ఆమె తెలిపారు. అయితే, ఎంపీ చెల్లకుమార్ తన పలుకుబడిని ఉపయోగించి ఆ సీటును దక్కించుకున్నారని, దీని వెనుక నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహాలే కారణమని ఆరోపించారు.నాయకత్వంపై ధ్వజం..ఢిల్లీలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తనకు మైలాడుతురై సీటు ఇస్తామని హామీ ఇచ్చి, చివరి నిమిషంలో పార్టీతో సంబంధం లేని వ్యక్తికి కేటాయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గే, సెల్వపెరుంతొగై కుమ్మక్కై అభ్యర్థుల ఎంపికలో ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. 27 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ ఐదుగురు మహిళలకు అవకాశం ఇచ్చిందని, అయితే, మహిళా సాధికారత గురించి మాట్లాడే కాంగ్రెస్ మాత్రం అర్హత ఉన్న మహిళలను విస్మరించిందని విమర్శించారు. రాజకీయంగా అణచివేతకు గురవుతున్న మహిళల గొంతుకను వినిపించేందుకు తాను ’రివల్యూషనరీ పిజియన్స్’ అనే సంస్థను ప్రారంభిస్తున్నట్లు హసీనా ప్రకటించారు. కాగా, ఎన్నికల సమయంలో కీలక మహిళా నేత ఇలా ఆరోపణలు చేస్తూ పార్టీని వీడటం తమిళనాడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. -
‘దళపతి’కి భారీ షాక్.. బరిలో ఇంతమంది ‘విజయ్’లా?
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం రోజురోజుకూ వేడెక్కుతోంది. 2026, ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలిచేందుకు రాజకీయ పార్టీలు సరికొత్త ఎత్తుగడలకు తెరతీస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు తమిళనాట అత్యంత హాట్ టాపిక్గా మారిన అంశం ‘డమ్మీ అభ్యర్థుల వ్యూహం’ ముఖ్యంగా టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్, డీఎంకే నేత సెంథిల్ బాలాజీ వంటి ఉద్దండులను టార్గెట్ చేస్తూ పలు పార్టీలు ఒకే పేరుతో పలువురు అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. ఇది ఓటర్లను తీవ్ర గందరగోళానికి గురిచేసి, ఓట్లను చీల్చేందుకు ప్రతిపక్షాలు పన్నుతున్న పక్కా మాస్టర్ ప్లాన్ అని విశ్లేషకులు చెబుతున్నారు.అసలు ఏమిటీ డమ్మీ అభ్యర్థుల వ్యూహం?ఒక ప్రముఖ నేత పేరుతో మరికొంత మంది డమ్మీ అభ్యర్థులను నిలబెట్టడమే ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశం. ఉదాహరణకు టీవీకే పార్టీ నుండి ‘విజయ్’ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో.. ఏ విజయ్, కె విజయ్ కుమార్, ఎం విజయ్, విజయ్ రాజ్ వంటి పేర్లతో అభ్యర్థులు దర్శనమిస్తారు. పార్టీ గుర్తులపై పెద్దగా అవగాహన లేని ఓటర్లు, కంగారులో తమ అభిమాన నేత పేరు చూసి వేరే ‘విజయ్’కి ఓటు వేసే అవకాశం ఉంది.ఇప్పుడిది ఎందుకు ట్రెండ్ అవుతోంది?మీడియాకు అందిన నివేదికల ప్రకారం తమిళనాడు వ్యాప్తంగా వందకు పైగా ఇలాంటి ‘ఒకే పేరున్న అభ్యర్థులు’ బరిలో నిలిచారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి కొత్తగా ఎంట్రీ ఇస్తున్న నేతలను టార్గెట్ చేస్తూ పట్టణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో ఈ వ్యూహాన్ని ఎక్కువగా అమలు చేస్తున్నారు. కొత్త పార్టీలు బరిలో ఉండటం, ఈసారి పోటీ హోరాహోరీగా సాగుతుండటంతో ఇది ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేసే అంశంగా మారింది.‘విజయ్’నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్.. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలనం. యువతలో ఆయనకున్న విపరీతమైన క్రేజ్, సోషల్ మీడియా మద్దతు, ఎన్నికల బరిలో పార్టీ వేగంగా ఎదుగుతున్న తీరు ప్రత్యర్థి వర్గాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. విజయ్కి పడే ఓట్లను చీల్చడం ద్వారా ఆయన గెలుపు అవకాశాలను దెబ్బతీయాలనేదే ఈ డమ్మీ కాండిడేట్ల ప్రణాళిక.కొత్త ఓటర్లపై ప్రభావం2026 తమిళనాడు ఎన్నికల్లో దాదాపు 12 లక్షల 50 వేల మంది యువత తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీరు పార్టీ గుర్తుల కంటే నాయకుల పేర్లను చూసి ఓటు వేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన పోటీ ఉన్న నియోజకవర్గాల్లో కేవలం ఒకటి లేదా 2 శాతం ఓట్లు చీలిపోయినా తుది ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఇది చట్టబద్ధమేనా?ఒకే పేరున్న వారు పోటీ చేయడం చట్ట ప్రకారం పూర్తిగా సమ్మతమే. ఏ పౌరుడైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. వారి పేర్లు ఒకేలా ఉన్నాయనే కారణంతో నామినేషన్లను తిరస్కరించడానికి వీల్లేదు. అయితే, ఓటర్లలో ఏర్పడే గందరగోళాన్ని తగ్గించడానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈవీఎంల మీద అభ్యర్థుల ఫోటోలు, పార్టీ గుర్తులను స్పష్టంగా ముద్రిస్తుంది. అయినా సరే ఓటర్లు కంగారు పడినప్పుడు కన్ఫ్యూజన్ తప్పదు.ఎక్కడెక్కడ ఈ ప్రభావం ఉంది?చెన్నైలోని పట్టణ నియోజకవర్గాలు, దక్షిణ తమిళనాడులోని ప్రధాన ప్రాంతాలు, ముఖ్యంగా పెరంబూర్, తిరునెల్వేలి, మదురై శివార్లలో, కోయంబత్తూర్ అర్బన్ జోన్లలో ఈ డమ్మీ అభ్యర్థుల బెడద ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో అభ్యర్థుల మధ్య గెలుపు మార్జిన్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు మెజారిటీ రెండు వేల ఓట్లు ఉన్నప్పుడు, డమ్మీ అభ్యర్థికి 1500 ఓట్లు పడితే అసలు అభ్యర్థి ఓడిపోయే ఛాన్స్ స్పష్టంగా ఉంటుంది.ఓటర్లు ఏం చేయాలి?ఈ గందరగోళాన్ని అధిగమించడానికి ఓటర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఓటు వేసేటప్పుడు కంగారు పడకుండా, పార్టీ గుర్తును నిశితంగా పరిశీలించాలి. ఈవీఎంపై ఉన్న అభ్యర్థి ఫోటోను కచ్చితంగా నిర్ధారించుకున్న తర్వాతే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు కేవలం మేనిఫెస్టోలు, పొత్తులకే పరిమితం కాలేదు.. బ్యాలెట్ మీద ఎవరున్నారు, వారిని ఓటర్లు ఎలా గుర్తిస్తున్నారు అనేది కీలకం కాబోతోందనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: ‘దీదీ’కి మైండ్ బ్లాంక్.. బెంగాల్ బరిలో బీజేపీ బ్రహ్మాస్త్రం -
భవానీపూర్లో నా అభ్యర్థిత్వం చెల్లకుండా కుట్ర
కోల్కతా: భవానీపూర్లో తన అభ్యర్థిత్వం చెల్లకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఇందులో భాగంగా రెండు తప్పుడు కేసుల్లో తనను ఇరికించేందుకు చేసిన ప్రయత్నాలను ప్రజలు, టీఎంసీ కార్యకర్తలు వమ్ము చేశారన్నారు. ఆమె శనివారం పశ్చిమ్ మేదినీపూర్ జిల్లాలో జరిగిన టీఎంసీ ప్రచార ర్యాలీల్లో ప్రసంగించారు. ‘ఈసీ సాయంతో భవానీపూర్లో నా అభ్యర్థిత్వాన్ని చెల్లకుండా చేసేందుకు శుక్రవారం బీజేపీ నాకు వ్యతిరేకంగా రెండు తప్పుడు అఫిడవిట్లు సమర్పించేందుకు కుట్ర పన్నింది. వారి ప్రయత్నాలను మేం భగ్నం చేశాం’అని ఆమె ప్రకటించారు. భవానీపూర్లో మమతకు ప్రధాన ప్రత్యర్థిగా ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి బరిలో ఉండటం తెల్సిందే. సర్ ప్రక్రియ సందర్భంగా బీజేపీ బలవంతంగా ఓటరు జాబితాల్లోని 90 లక్షల ఓటర్ల పేర్లను తొలగించిందని మమత విమర్శించారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసి నెగ్గే సత్తా లేకనే బీజేపీ దొడ్డిదారిన ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలను అనుకూలంగా మార్చుకునేందుకు ఈవీఎంలను ట్యాంపర్ చేసేందుకూ బీజేపీ పథకం వేస్తోందన్నారు. -
సానుభూతి కోసం బాధిత కార్డు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కేంద్ర హోం మంత్రి అమి త్ షా నిప్పులు చెరిగారు. ప్రజల సానుభూతి కోసం సీఎం మమత బాధితురా లినంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆరో పించారు. టీఎంసీ 15 ఏళ్ల పాలనతో రాష్ట్రం ఆర్థికంగా, శాంతిభద్రతల విషయంలో పూర్తిగా దిగజారిపోయిందని విమర్శించారు. అమిత్ షా శనివారం బంకురా, పురూలియా జిల్లాల్లో శనివారం బీజేపీ ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. బీజేపీకి అధికారమిస్తే టీఎంసీ సిండికేట్ పాలనకు ముగింపు తప్పదన్నారు. మహిళలకు అన్ని వేళలా రక్షణ కల్పిస్తామని తెలిపారు. అన్యాయానికి గురవుతున్న మహిళలకు న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు. ‘సీఎం మమత బాధితురాలినంటూ చెప్పుకుంటున్నారు. కాలికో తలకో బ్యాండేజీ కట్టుకుని కనిపిస్తుంటారు. ఈసారి అలా జరగదు. కాలికి, చేతికి, తలకు బ్యాండేజీతో కనిపించినా బెంగాల్ ప్రజలు ఆమెకు ఓటేయరు’అని ఆయన స్పష్టం చేశారు. -
వచ్చేది ద్రావిడ మోడల్ 2.0 ప్రభుత్వమే
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 సీట్లకు గాను డీఎంకే కూటమి 200కుపైగా స్థానాలు గెల్చుకోవడం తథ్యమని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తంచేశారు. అన్నా డీఎంకే–బీజేపీ కూటమికి సిద్ధాంతం గానీ, ఒక విధానం గానీ లేవని విమర్శించారు. బీజేపీ స్వరాలకు అనుగుణంగా అన్నాడీఎంకే నర్తిస్తోందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి ఢిల్లీ బీజేపీయే ప్రధాన కార్యాలయంగా మారిపోయిందని అన్నారు. స్టాలిన్ తాజాగా పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. గత ఐదేళ్ల ద్రావిడ మోడల్ పాలనలో ప్రజల కోసం ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. కళైంజర్ మహిళా పథకం కింద నెలకు రూ.1,000, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, రెండు లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్ల జారీ వంటి పథకాలను ప్రస్తావించారు. ప్రజల ప్రేమాభిమానాలు, అండదండలతో లౌకిక ప్రజాస్వామ్య కూటమి(ఎస్పీఏ) 200కుపైగా సీట్లు గెల్చుకొని ద్రావిడ మోడల్ 2.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఉద్ఘాటించారు. అన్నాడీఎంకే నాయకులు ఢిల్లీ పెద్దలకు బానిసలుగా మారిపోయారని మండిపడ్డారు. తమిళనాడు హక్కులను తాకట్టుపెట్టాలని చూస్తున్నవారు ముమ్మాటికీ బానిసలేనని తేల్చిచెప్పారు. స్టాలిన్ ఇంకా ఏం చెప్పారంటే.. మహిళల భద్రత మా బాధ్యత ‘‘మా కూటమిలో సీట్ల పంపకం విషయంలో పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు. సానుకూలంగా చర్చించుకొని సీట్లు ఖరారు చేసుకున్నాం. కూటమి అభ్యర్థుల విజయం కోసం మిత్రపక్షాలు కలిసికట్టుగా కృషి చేస్తున్నాయి. కొత్త పార్టీల చేరికతో ఎస్పీఏ మరింత బలంగా మారింది. తమిళనాడుతోపాటు పుదుచ్చేరిలోనూ అద్భుత విజయం సాధించబోతున్నాం. ద్రావిడ విప్లవ సిద్ధాంతాన్ని విశ్వసించేవారు మా పార్టీలో చేరారు. అందుకే మాజీ సీఎం పన్నీర్సెల్వం డీఎంకేను ఎంచుకున్నారు. జాతీయ స్థాయిలో విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక పాత్ర పోషించాలన్న ఆసక్తి లేదు. నా పరిధి ఏమిటో నాకు తెలుసు. స్టాలిన్ కుటుంబం పవర్ సెంటర్గా మారిందన్న విపక్షాల ఆరోపణల్లో నిజం లేదు. ద్రావిడ మోడల్ సుపరిపాలన, గత ఐదేళ్లలో మేము సాధించిన విజయాలను జీర్ణించుకోలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. మహిళల భద్రతకు మా ప్రభుత్వం పెద్దపీట వేసింది. వారి రక్షణ కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాం. మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి శిక్షలను కఠినతరం చేశాం. మహిళా ఉద్యోగులు, కార్మికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. వారి భద్రత మా బాధ్యత’’ అన్నారు. మనసుకు దగ్గరైన పథకాలు ‘‘మహిళలకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం, స్కూల్ విద్యార్థులకు అల్పహారం పథకాలు నా మనసుకు చాలా దగ్గరయ్యాయి. మహిళలకు ఆర్థిక సాయం పథకం దేశంలో అత్యుత్తమంగా అమలవుతున్న పథకం కావడం గర్వకారణం. ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. విమర్శించినవారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే ఈ సాయాన్ని రూ.2,000కు పెంచుతాం. అలాగే అల్పాహారం పథకాన్ని ఎనిమిదో తరగతి విద్యార్థుల దాకా విస్తరింపజేస్తాం. ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలితో పాఠశాలకు రాకూడదు. అదే మా లక్ష్యం. పిల్లల కడుపు నిండుతోంది, చక్కగా చదువుకుంటున్నారు. అది నాకు చాలా సంతృప్తినిస్తోంది’’ అని ఆయన అన్నారు. తమిళనాడు పోరాడుతుంది.. గెలుస్తుంది‘‘మహిళా రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రాజకీయ లబ్ధి కోసం ఆయుధంగా ఉపయోగించుకుంటోంది. మహిళలకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి. నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టకూడదు. ఈ పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదు. జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించాలనుకోవడం సరైంది కాదు. తమిళనాడు పోరాడుతుంది, తమిళనాడు గెలుస్తుంది. ఇదే మా నినాదం. మైనార్టీలను భయపెట్టాలన్నదే బీజేపీ అసలు ఎజెండా. మోదీ పాలనలో ముస్లింలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. క్రిస్టమస్ పండుగ కూడా ప్రశాంతంగా నిర్వహించుకోలేని దుస్థితి ఏర్పడింది. క్రైస్తవులను కూడా టార్గెట్ చేశారు. భారత్ ఎప్పటికీ లౌకిక దేశంగానే ఉండాలి. మైనార్టీలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడాలి. మైనార్టీల హక్కుల కోసం మొదట మేమే గొంతు వినిపిస్తాం’’ అని స్టాలిన్ స్పష్టం చేశారు. -
బెంగాలీలను మైనార్టీలు కానివ్వం
జాంగీపూర్/కత్వా/కుష్మాండీ: పశ్చిమ బెంగాల్లో బుజ్జగింపు రాజకీయాలను అంతం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని, బెంగాల్ ప్రజలను సొంత రాష్ట్రంలో మైనార్టీలు కానివ్వబోమని తేల్చిచెప్పారు. శనివారం బెంగాల్లోని జాంగీపూర్, కత్వా, కుష్మాండీలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలను బెంగాల్ గుర్తింపు, భవిష్యత్తు పరిరక్షణ కోసం జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని, చొరబాటుదార్లకు మద్దతు ఇస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే చొరబాటుదార్లను బయటకు పంపిస్తామని పునరుద్ఘాటించారు. జాతీయ భద్రతే తమకు ముఖ్యమని తేల్చిచెప్పారు. అక్రమ వలసల కారణంగా బెంగాల్లో చాలా ప్రాంతాల్లో జనాభా నిష్పత్తి మారిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ‘మా, మాటీ, మనుష్’నినాదాన్ని తృణమూల్ కాంగ్రెస్ వదిలేసిందని, అధికారం నిలబెట్టుకోవడానికి చొరబాటుదార్లపై ఆధారపడుతోందని ధ్వజమెత్తారు. వారి ఓట్లతో వారి కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే తృణమూల్ కాంగ్రెస్ ఉద్దేశమని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాలను ఇకపై సహించే ప్రసక్తే లేదన్నారు. ప్రజలంతా ఏకమై ప్రభుత్వాన్ని మార్చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు వేసే ప్రతి ఓటు బీజేపీకి ఆశీర్వాదంగా మారాలని చెప్పారు. ప్రధానమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే.. కమ్యూనిస్టులకు కార్బన్ కాపీగా తృణమూల్ ‘‘బెంగాల్లో మార్పు తీసుకొస్తాం. రాష్ట్రాన్ని కాపాడుతాం. మార్పును ఎవరూ అడ్డుకోలేరు. బెంగాల్లో అహంకారం ప్రదర్శించిన ఎంతోమంది అడ్రస్ లేకుండాపోయారు. బ్రిటిష్ పాలకులతోపాటు కాంగ్రెస్, వామపక్షాలు గతంలో ఏమైందో చూశాం. ఇప్పుడు అదే పరిస్థితి తృణమూల్ కాంగ్రెస్కు ఎదురవుతుంది. బెంగాల్లో శ్రీరామనవమి వేడుకల్లో హింస జరిగితే మమతా బెనర్జీ ప్రభుత్వం నిందితులను కాపాడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని తేలడంతో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అది సహించలేక తప్పుడు వీడియోలు, అబద్ధాలను పోస్టు చేస్తున్నారు. అస్సాం, పుదుచ్చేరిలోనూ ఇలాంటి కుతంత్రాలు సాగించారు. అబద్ధాలను నమ్మొద్దని ప్రజలను కోరుతున్నా. ఎన్నికల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలి. బీజేపీని గెలిపించుకోవాలి. మా, మాటీ, మనుష్ నినాదంతో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టు పార్టీలకు కార్బన్ కాపీగా మారిపోయింది. కమ్యూనిస్టు శక్తులు, సిండికేట్లు తృణమూల్ కాంగ్రెస్తో చేతులు కలిపాయి. కమ్యూనిస్టుల పాలనలో జరిగినట్లుగానే వేధింపులు, అరాచకాలు, అవినీతి అక్రమాలు కొనసాగుతున్నాయి. వామపక్ష కార్యకర్తలు ఓట్ల కోసం ప్రజలను బెదిరించేవారు. నేడు టీఎంసీ రౌడీలు సైతం అదే పని చేస్తున్నారు. అక్రమ ఆయుధా లు, డ్రగ్స్, పశువుల అక్రమ రవాణా, కట్ మనీ, కమీషన్లు.. ఇలా అన్నింటినీ తృణమూల్ కాంగ్రెస్ కాంట్రాక్టు తీసుకుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతిపరులను కచ్చితంగా శిక్షిస్తాం. ప్రజలను వేధించినవారి కోసం జైలు తలుపులు తెరుచుకుంటాయి’’ అని అన్నారు. శరణార్థులకు భారత పౌరసత్వం ‘‘బీజేపీ అధికారంలోకి రాగానే మతువా, నామశూద్ర వర్గాలతోపాటు ఇతర శరణార్థులకు సీఏఏ కింద భారత పౌరసత్వం కల్పించే ప్రక్రియను వేగవంతం చేస్తాం. చొరబాటుదార్లు తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోవాల్సిందే. వారు వెనక్కి వెళ్లిపోవాల్సిన సమయం వచ్చింది. చొరబాటుదార్లను కాపాడేవారికి కూడా శిక్ష తప్పదు. బెంగాల్లో మా నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్ ఒక్కటే కాదు. మరొకటి కూడా ఉంది. అదే సబ్కా హిసాబ్. ప్రతి అరాచకవాదిని, అవినీతిపరుడిని శిక్షిస్తాం. శరణార్థులకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుంది. అలాగే బీజేపీ పాలనలో బెంగాల్ను ఉన్నత శిఖరాలకు చేరుస్తాం. ఓటింగ్లో మహిళల భాగస్వామ్యం అధికంగా ఉన్నచోట బీజేపీ విజయం సాధిస్తోంది. బెంగాల్లోనూ మహిళల ఓట్లతో అధికారంలోకి రాబోతున్నాం. ప్రజలంతా కలిసి తృణమూల్ కాంగ్రెస్ పాలనను అంతం చేయాలి. బీజేపీ పాలన వచ్చాక.. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, సిండికేట్ల అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. బెంగాల్లో అమలవుతున్న పథకాలను కొనసాగిస్తాం. వాటిని ఆపబోం’’అని మోదీ స్పష్టం చేశారు.మహిళల భద్రతే మా ధ్యేయం ‘‘మహిళల భద్రతకు బీజేపీ సర్కార్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో మహిళలపై లెక్కలేనన్ని నేరాలు జరిగాయి. వారిని దారుణంగా వేధించారు. మా ప్రభుత్వం వచ్చాక నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తాం. పాత కేసులను మళ్లీ తెరుస్తాం. ఇది మోదీ గ్యారంటీ. మహిళల భద్రతే మా ధ్యేయం. తృణమూల్ ప్రభుత్వం ఫుట్బాల్ ఆటను కూడా సిండికేట్లకు అప్పగించింది. గత డిసెంబర్లో అర్జెంటీనా ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటన సందర్భంగా గందరగోళం జరిగింది. ఆ సిగ్గుచేటైన చిత్రాలను ప్రపంచమంతా చూసింది. బెంగాల్లో ప్రభుత్వం అంటే సిండికేట్, సిండికేట్ అంటే ప్రభుత్వం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. చట్టవిరుద్ధమైన పాలనకు పర్యాయపదం తృణమూల్ సర్కార్. మమతా బెనర్జీ పార్టీకి సిద్ధాంతాలు, విలువులు లేవు. అందుకే అది ఇతర రాష్ట్రాల్లో అడుగుపెట్టలేకపోయింది’’అని మోదీ అన్నారు. -
పశ్చిమ బెంగాల్లో వచ్చే మార్పు ఇదే: ప్రధాని మోదీ
ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం (ఏప్రిల్ 11) తృణమూల్ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. అధికార టీఎంసీ కూడా వామపక్ష పాలనా విధానాన్ని అనుకరించిందని, పశ్చిమ బెంగాల్లో మార్పును తీసుకురావడంలో విఫలమైందని చెప్పారు. ముర్షిదాబాద్లో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో టీఎంసీని ప్రజలు అదే విధంగా ఓడిస్తారని అన్నారు. “స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. బెంగాల్ను సవాలు చేసిన ప్రతి ఒక్కొక్కరి అహంకారం ఛిద్రమైపోతూ వచ్చింది. మొదట బ్రిటిష్, తరువాత కాంగ్రెస్, చివరికి వామపక్షాలు తమ అహంకారంతో కుప్పకూలిపోయాయి. ఇప్పుడు బెంగాల్ ప్రజలు టీఎంసీ అహంకారాన్ని ఛిద్రం చేస్తారు” అని ప్రధాని చెప్పారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఎంసీ వాగ్దానాలను నెరవేర్చలేకపోయిందని చెప్పారు.అవినీతి వ్యవస్థలను టీఎంసీ ప్రోత్సహించిందని మోదీ ఆరోపించారు. గతంలో ఉన్న ప్రభుత్వాలకు సంబంధించిన వర్గాలు ప్రస్తుత ప్రభుత్వంలో కొనసాగుతున్నాయని అన్నారు. “వామపక్షాలకు చెందిన గూండాలు, సిండికేట్లు అన్నీ తృణమూల్లోకి మారాయి. ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, పశువుల అక్రమ రవాణా నుంచి కమిషన్ల వరకు అన్నింటిని ఇప్పుడు టీఎంసీ నియంత్రిస్తోంది” అని అన్నారు.దేశ భద్రత తమకు అత్యంత ముఖ్యమైనదని మోదీ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో యూసీసీ అమలు చేసి, బుజ్జగింపు రాజకీయాలకు ముగింపు పలుకుతామని అన్నారు. టీఎంసీ జంగిల్ రాజ్, సిండికేట్ రాజ్కు ముగింపు పలకడమే బీజేపీ లక్ష్యమని తెలిపారు. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితి మారుతుందని చెప్పారు. కాగా, ఏప్రిల్ 23, 29 తేదీల్లో పశ్చిమ బెంగాల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 4న ప్రకటిస్తారు. -
మెగా శనివారం.. ఒకేరోజు బరిలో మోదీ, మమత, షా..
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంగ్రామం అత్యంత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. ఏప్రిల్ 11.. శనివారం.. ‘మెగా శనివారం’గా మారింది. నేడు బెంగాల్ రాజకీయ ముఖచిత్రంపై ఒక మహా ఘట్టంగా నిలిచిపోనుంది. ఒకే రోజు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తమ సత్తా చాటేందుకు సుడిగాలి పర్యటనలు చేస్తుండటంతో రాష్ట్రంలో పొలిటికల్ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోయింది.ఈ నలుగురు అగ్ర నేతల రాకతో బెంగాల్ ఎన్నికల వాతావరణం దద్దరిల్లుతోంది. తూర్పు బర్ధమాన్ జిల్లాలోని కల్నా సమీపంలోని సిమ్లాన్ వద్ద ఏర్పాటు చేసిన ‘విజయ్ సంకల్ప్’ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇందుకోసం కల్నా-బర్ధమాన్ స్టేట్ హైవే పక్కన ఉన్న వ్యవసాయ భూమిలో భారీ వేదికను సిద్ధం చేశారు. భద్రత కోసం వేదిక పరిసరాలను సీసీటీవీ నిఘాలోకి తీసుకురావడంతో పాటు, హెలికాప్టర్ ట్రయల్స్ కూడా పూర్తి చేశారు. ఈ సభకు 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు హాజరవుతున్నారని, ప్రతిపక్ష శిబిరాల నుంచి భారీగా వలసలు ఉంటాయని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాజీబ్ భౌమిక్ తెలిపారు.మరోవైపు బంకురా జిల్లా ఈరోజు ఒకేసారి రెండు ప్రధాన పార్టీల బలప్రదర్శనకు వేదిక కానుంది. బర్జోరా కాలేజ్ గ్రౌండ్స్లో సీఎం మమతా బెనర్జీ భారీ ఎన్నికల ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివస్తారని టీఎంసీ నాయకులు తెలిపారు. ఇదే జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఒండాలోని రామ్సాగర్, ఛత్నాలోని ఝాటిపహాడీ వద్ద రెండు వేర్వేరు సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. దీంతో పాటు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కూడా గంగాజల్ఘటిలో బీజేపీ అభ్యర్థి బిల్లేశ్వర్ సిన్హా తరఫున ప్రచారం చేయనున్నారు.బీర్భూమ్ జిల్లాలోనూ రాజకీయ వాతావరణం తారాస్థాయికి చేరింది. టీఎంసీ యువ నేత అభిషేక్ బెనర్జీ సైంథియాలోని జాలీబగాన్ సమీపంలో జరిగే సభలో పాల్గొననున్నారు. ఈ సభ కోసం భారీ వేదికతో పాటు ప్రత్యేక హెలిప్యాడ్ను కూడా సిద్ధం చేశారు. కేవలం సైంథియా నియోజకవర్గం నుంచే 50 నుంచి 60 వేల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్థానిక టీఎంసీ అధ్యక్షుడు దేబాశిష్ సాహా తెలిపారు. లాబ్పూర్, మయూరేశ్వర్, నానూర్ అభ్యర్థులతో పాటు సీనియర్ నేత అనుబ్రత మండల్ కూడా ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఈ అగ్ర నేతల ప్రచార పర్వం ఓటర్లను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. -
‘దీదీ’కి మైండ్ బ్లాంక్.. బెంగాల్ బరిలో బీజేపీ బ్రహ్మాస్త్రం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచార హోరును మరింతగా పెంచింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేసిన ‘సంకల్ప్ పత్ర’ (మేనిఫెస్టో)ను తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండికొట్టేలా రూపొందించారు. ముఖ్యంగా మహిళలు, యువతను ఆకర్షించడంతో పాటు, బెంగాలీ సంస్కృతిని కాపాడేలా బీజేపీ చేసిన హామీలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. బీజేపీ మేనిఫెస్టోలోని ఐదు ప్రధాన అంశాలు ఇవే..చొరబాట్లపై ఉక్కుపాదంఅక్రమ చొరబాట్లను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేసిన బీజేపీ.. చొరబాటుదారులను గుర్తించి, దేశం నుంచి పంపించే (డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్) విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని తీసుకువస్తామని, అలాగే లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్లను అరికట్టేందుకు కఠిన చట్టాలు రూపొందిస్తామని హామీ ఇచ్చింది.మహిళలకు పెద్ద పీటమహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భారీ నజరానాలు ప్రకటించింది. టీఎంసీ ప్రభుత్వం ఇస్తున్న ‘లక్ష్మీర్ భండార్’ సాయం కంటే దాదాపు రెట్టింపుగా ప్రతి మహిళకు నెలకు రూ.3,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాలు, పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు, 75 లక్షల మందిని ‘లఖ్పతి దీదీ’లుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేసింది.యువతకు ఉపాధినిరుద్యోగ సమస్యపై ప్రధానంగా ఫోకస్ పెట్టిన కమలనాథులు.. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 భృతి ఇస్తామని ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో కోటి కొత్త ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు. స్టార్టప్లను ప్రోత్సహించేందుకు 5 లక్షల మంది యువతకు చెరో రూ.10 లక్షల ఆర్థిక సాయం (సగం గ్రాంట్, సగం వడ్డీ లేని రుణం) అందించనున్నామని తెలిపారు.బెంగాలీ సంస్కృతి పరిరక్షణతమను బయటి వ్యక్తులుగా ముద్రవేస్తున్న టీఎంసీ వాదనను తిప్పికొడుతూ.. బెంగాలీ ఆత్మగౌరవాన్ని కాపాడతామని బీజేపీ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా వందేమాతరం మ్యూజియం, ఠాగూర్ కల్చరల్ సెంటర్ల ఏర్పాటుతో పాటు అన్ని శక్తిపీఠాలను కలుపుతూ ప్రత్యేక సర్క్యూట్ అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.మౌలిక సదుపాయాల అభివృద్ధిరాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ.. తాజ్పూర్, కుల్పిలో ఆధునిక డీప్-సీ పోర్టులను నిర్మిస్తామని బీజేపీ తెలిపింది. సుందర్బన్స్ నుండి డార్జిలింగ్ వరకు నేరుగా జాతీయ రహదారితో పాటు, ఉత్తర బెంగాల్లో నాలుగు కొత్త నగరాల నిర్మాణాన్ని తమ ‘సంకల్ప్ పత్ర’లో ప్రముఖంగా పొందుపరిచింది.ఇది కూడా చదవండి: ‘కుంభమేళా మోనాలిసా’ పెళ్లి.. చిక్కుల్లో సీపీఎం నేతలు -
దుర్గా స్టాలిన్ ఎంట్రీతో రాజకీయాల్లో హీట్
సాక్షి,చైన్నె : తమిళనాడు ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకు ఏ అభ్యర్థి తరపున నేరుగా ఓట్లు అడగని సీఎం స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ తొలిసారిగా శీర్గాలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డీఎంకే కూటమి తరపున ఎండీఎంకే అభ్యర్థిగా సెంథిల్ సెల్వన్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఆమె ఇంటింటికీ తిరుగుతూ ‘ఉదయ సూర్యుడు’ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.ప్రప్రథమంగా..సాధారణంగా దుర్గా స్టాలిన్ రాజకీయాలకు దూరంగా ఉంటారు. కేవలం ఆలయ సందర్శనలకే పరిమితం అవుతుంటారు. గతంలో ఓ మారు కొళత్తూరులో తన భర్త స్టాలిన్ తరపున మహిళా ఓటర్లను కలిశారు. ఈ పరిస్థితులలో తాజాగా ఆమె నేరుగా ప్రచార రంగంలోకి దిగడం గమనార్హం.శీర్గాలి సెంటిమెంట్తమిళనాడు రాజకీయాల్లో శీర్గాళి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తుందే, ఆ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న బలమైన నమ్మకం. దీనిని ‘దీర్ఘదర్శి నియోజకవర్గం’ అని కూడా పిలుస్తారు. అంటే రాష్ట్ర భవిష్యత్తును ఈ నియోజకవర్గ ఫలితం ముందుగానే చెబుతుందని అర్థం.ఎండీఎంకే అభ్యర్థి.. డీఎంకే గుర్తువాస్తవానికి ఈ సీటు కూటమిలో ఎండీఎంకే పార్టీకి దక్కింది. వారు సొంత గుర్తుపై పోటీ చేస్తామని తొలుత ప్రకటించినా, చివరకు సెంటిమెంట్ దృష్ట్యా, డీఎంకే గుర్తు అయిన ‘ఉదయ సూర్యుడు’ పైనే అభ్యర్థిని నిలబెట్టారు. ఇక్కడ గెలిస్తేనే డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో స్టాలిన్ దంపతులు ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సీఎం స్టాలిన్ కూడా నాగపట్నంలో జరగాల్సిన సభను రద్దు చేసుకుని మరీ శీర్గాళిలో బహిరంగ సభ నిర్వహించారు. ‘నేను ఈ ఊరి అల్లుడిగా ఓటు అడగడానికి వచ్చాను’ అని స్టాలిన్ ఇప్పటికే వ్యాఖ్యలు చేశారు. దుర్గా స్టాలిన్ తన స్వగ్రామం తిరువెంకాడు ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉండటంతో, తాను ఈ ఊరి కోడలినని, తన ఊరి ప్రజలు తమ పార్టీని ఆశీర్వదించాలని కోరడం విశేషం. సెంటిమెంట్ను బలంగా నమ్మే దుర్గా స్టాలిన్ స్వయంగా రంగంలోకి దిగడంతో, ఈసారి శీర్గాళి సెంటిమెంట్ పలికి మళ్ళీ డీఎంకే అధికారంలోకి వస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
West Bengal: ‘పీకే’ లేని పందెం.. మమత హ్యాట్రిక్ కొడతారా?
అసెంబ్లీ ఎన్నికలు పశ్చిమ బెంగాల్ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. ఈ ఎన్నికల సంగ్రామం పైకి పాత కథలాగే కనిపిస్తున్నా, లోపల మాత్రం అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు సంక్షేమం, ప్రాంతీయ అస్తిత్వం నినాదంతో మమతా బెనర్జీ.. మరోవైపు జాతీయ నాయకత్వం, బెంగాల్ మార్పు నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈసారి కూడా ప్రధాన పోరు తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మధ్యే నెలకొంది. అయితే గత ఎన్నికల్లో భారీ విజయానికి కారణంగా నిలిచిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు దీదీ పక్కన లేరు. ఆయన మార్క్ వ్యూహాలు లేకుండా తృణమూల్ తిరిగి కాషాయ దళాన్ని నిలువరించగలదా? ఇదే ఇప్పుడు బెంగాల్ నుంచి ఢిల్లీ పీఠం వరకూ ఉత్కంఠ రేపుతున్న ప్రధాన ప్రశ్న.భవానీపూర్లో హై ఓల్టేజ్2026, ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్న ఈ అత్యంత కీలకమైన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. మొత్తం 294 స్థానాలకు గానూ 291 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ నేరుగా పోటీ చేస్తుండగా, మిగిలిన మూడు డార్జిలింగ్ హిల్ సీట్లను తన మిత్రపక్షమైన బీజీపీఎంకు కేటాయించింది. భవానీపూర్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై మరోసారి హై-వోల్టేజ్ పోరుకు సిద్ధమయ్యారు. సువేందు అదనంగా తన పాత స్థానమైన నందిగ్రామ్ నుంచి కూడా పోటీకి దిగడం విశేషం.వ్యూహాన్ని మార్చిన బీజేపీమార్చి 17న వెలువడిన టీఎంసీ అభ్యర్థుల జాబితాలో మధుజ, మదన్ మిత్ర, ఫిర్హాద్ హకీమ్ లాంటి సీనియర్ నేతలకు చోటు దక్కింది. సామాజిక సమీకరణల్లో భాగంగా ఏకంగా 52 మంది మహిళలకు, 95 మంది ఎస్సీ, ఎస్టీలకు దీదీ అవకాశం కల్పించారు. ‘ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మేము కచ్చితంగా 226 కు పైగా సీట్లు సాధిస్తాం’ అని మమతా బెనర్జీ అత్యంత ధీమాగా చెబుతున్నారు. మరోవైపు, 2021లో ‘200 పార్’ నినాదంతో బరిలోకి దిగి వెనుకబడిన బీజేపీ, ఈసారి వ్యూహాన్ని మార్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్కతా సభలో మాట్లాడుతూ ‘మేము ఒకదాని తర్వాత ఒకటిగా 170 సీట్లు గెలుచుకుంటాం, ఆ తర్వాతే బెంగాల్లో అసలైన మార్పు వస్తుంది’ అని సవాల్ విసిరారు.సంక్షేమ పథకాల సాయంతో..ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘భయం లేని బెంగాల్’ నినాదంతో పట్టణ, హిందూ మెజారిటీ ప్రాంతాల్లో బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీల ప్రభావం ఉన్నప్పటికీ ప్రధానంగా శాంతిభద్రతల సమస్యలు, నిరుద్యోగంపై అధికార పార్టీని బీజేపీ నిలదీస్తోంది. దానికి ధీటుగా టీఎంసీ ‘లక్ష్మీర్ భండార్’ వంటి ప్రజాదరణ పొందిన సంక్షేమ పథకాలను నమ్ముకుంది. ఓటర్ల జాబితా సవరణలను దీటుగా ఎదుర్కొనేందుకు తమ బూత్ స్థాయి ఏజెంట్లను తిరిగి చురుగ్గా రంగంలోకి దించింది. రెండు దశల్లోనే ఎన్నికలు ఉండటంతో, ఇరు పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి.కుదిపేసిన బొగ్గు కుంభకోణంఎన్నికల ప్రచారం ఊపందుకోకముందే, జనవరి నెలలో జరిగిన ఒక నాటకీయ పరిణామం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది. 2020 నాటి బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి కోల్కతాలోని ఐ-ప్యాక్ ప్రధాన కార్యాలయాలతో పాటు, దాని చీఫ్ ప్రతీక్ జైన్ ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. అయితే, తమ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల రహస్య డేటాను దొంగిలించేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కక్షపూరితంగా ఈ దాడులు చేయిస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. ఏకంగా రాష్ట్ర పోలీసులతో కలిసి దాడులు జరుగుతున్న ప్రాంతానికి ఆమె స్వయంగా చేరుకుని, కీలక పత్రాలను సీజ్ చేయకుండా ఈడీ అధికారులను అడ్డుకున్నారు. దీనిని రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణించి, కోల్కతాలో భారీ నిరసన చేపట్టారు.నాడు ఐ-ప్యాక్ అండతో..అయితే విచారణకు ఆటంకం కలిగించారని ఈడీ ఆరోపించగా, ఈ వివాదంపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, ఈడీ అధికారుల విధులకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దని బెంగాల్ ప్రభుత్వాన్ని కఠినంగా హెచ్చరించాల్సి వచ్చింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 38 శాతం ఓట్లతో 77 సీట్లు గెలుచుకున్న బీజేపీ గట్టి పోటీనిచ్చినా, 213 సీట్లతో దీదీ తన ఆధిపత్యాన్ని ,చెక్కుచెదరనీయలేదు. ఆ చారిత్రక విజయంలో ప్రశాంత్ కిషోర్తో పాటు, ఆయన సంస్థ ఐ-ప్యాక్ పోషించిన పాత్ర అసాధారణం. ‘దీదీ కే బోలో’ లాంటి వినూత్న కార్యక్రమాలను కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయి సమస్యలను ప్రణాళికాబద్ధంగా గుర్తించి వాటిని ప్రభుత్వ విధానాలుగా, హామీలుగా మార్చడంలో ఐ-ప్యాక్ ఒక పటిష్టమైన డేటా వ్యవస్థలా పనిచేసింది.ఏం జరగనుంది?.. సర్వత్రా ఉత్కంఠఅయితే ప్రశాంత్ కిషోర్ బీహార్లో సొంతంగా ‘జన్ సురాజ్ పార్టీ’ పెట్టుకుని రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. (ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు). ఈ 2026 ఎన్నికల్లో ఐ-ప్యాక్ ఇప్పటికీ టీఎంసీకి వ్యూహాత్మక భాగస్వామిగానే కొనసాగుతున్నప్పటికీ, గత ఎన్నికల్లో పీకే స్వయంగా నడిపించిన ఆ పదునైన వ్యూహాత్మక యంత్రాంగం ఇప్పుడు పూర్తిగా కనిపించడం లేదు. ఈ లోటు ఎన్నికల ఫలితాలపై ఎంతగా ప్రభావం చూపుతుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ కిషోర్ లాంటి దిగ్గజ వ్యూహకర్త నేరుగా లేకపోయినా, ఐ-ప్యాక్ మద్దతుతో పాటు, తనకున్న సొంత ఇమేజ్, పటిష్టమైన సంక్షేమ పథకాలతో మమతా బెనర్జీ ఈ మహా పోరును మరోసారి తనవైపు తిప్పుకుంటారో లేదో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: టెక్ ప్రపంచం షేక్.. ‘ఓపెన్ ఏఐ’ సంచలన ప్రతిపాదన! -
మోదీ పొలిటికల్ గేమ్
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల అంశంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సుదీర్ఘ కాలం మౌనంగా ఉండి, ఇప్పుడు అకస్మాత్తుగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడం వెనుక కేవలం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనే కుతంత్రం దాగి ఉందని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలోని ఇందిరా భవన్లో జరిగిన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం (సీడబ్ల్యూసీ)లో ఆయన ప్రారం¿ోపన్యాసం చేశారు. కేంద్రం వైఖరిని ఎండగట్టారు. సమావేశంలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు, కీలక నేతలు ప్రియాంకా గాం«దీ, జైరాం రమేష్, సల్మాన్ ఖుర్షీద్, అంబికా సోనీ, సచిన్ పైలట్, భూపేశ్ బఘేల్ పాల్గొన్నారు. అమలు లేని రిజర్వేషన్ ఎందుకు?... ‘ఏప్రిల్ 16 నుంచి 18వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి అధికారిక ప్రతిపాదన రాలేదు. ప్రధాని రాసే వ్యాసాలు చదివి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి వస్తోంది. మాకు అందిన సమాచారం ప్రకారం.. ఈ రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేవలం ఈ ఎన్నికల్లో లబ్ది కోసమే ఈ బిల్లును తెస్తున్నారు’అని ఖర్గే విమర్శించారు. డీలిమిటేషన్ వెనుక కుట్ర... లోక్సభ సీట్లను 543 నుంచి 816కు పెంచాలన్న ప్రతిపాదనపై ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు సంబంధించి ప్రభుత్వం ముందుకు తెచ్చిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తీవ్ర విపరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ‘డీ లిమిటేషన్ ప్రతిపాదన అత్యంత ప్రమాదకరమైంది. దీనిపై లోతైన చర్చ జరగాలి. బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో ఎంపీలు బిజీగా ఉన్న సమయంలో సమావేశాలు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం నిబంధనల ఉల్లంఘనే. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించడం లేదు. అది హోంశాఖ కింద పనిచేసే ఒక విభాగంలా మారిపోయింది. అందుకే ఈ కోడ్ ఉల్లంఘనలను వారు పట్టించుకుంటారని మేం ఆశించడం లేదు’అని ఘాటుగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సీడబ్ల్యూసీలో తీర్మానం చేశాం మహిళా సాధికారత విషయంలో తమకు ఎవరి సరి్టఫికెట్లు అవసరం లేదని ఖర్గే స్పష్టం చేశారు. ‘స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చొరవతో తెచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణల వల్లే నేడు స్థానిక సంస్థల్లో 14.5 లక్షల మంది మహిళలు ప్రతినిధులుగా ఉన్నారు. 2023లోనే ఈ బిల్లుపై మేం హైదరాబాద్ సీడబ్ల్యూసీలో తీర్మానం చేశాం. సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ అనేకసార్లు ప్రధానికి లేఖలు రాశారు. జనగణన, డీ లిమిటేషన్ పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలి’అని డిమాండ్ చేశారు. పశ్చిమ ఆసియా సంక్షోభం వల్ల తలెత్తిన ఆర్థిక ఒత్తిడిపై విపక్షాలతో కలిసి ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళ్తాం’అని ఖర్గే వెల్లడించారు. వచ్చే వారం ప్రతిపక్ష నేతలతో ఖర్గే భేటీ ప్రభుత్వం తలపెట్టిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్ష నేతలతో సమావేశం జరపనున్నట్లు కాంగ్రెస్ శుక్రవారం తెలిపింది. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి కాకుండా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని ఈ సమావేశాల్లో చర్చించనున్నట్లు ప్రభుత్వం చెబుతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ చెప్పారు. అయితే, ఇందుకు సమాచారాన్ని ప్రభుత్వం ఇంతవరకు ప్రతిపక్షాలకు అందజేయలేదని ఆరోపించారు. ఈ నెల 15వ తేదీన కాంగ్రెస్ చీఫ్ ఖర్గేఅధ్యక్షతన ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశం జరుగుతుందన్నారు. -
ఆరు నెలల్లోనే ఉమ్మడి పౌరస్మృతి
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు చేస్తామని బీజేపీ ప్రకటించింది. పొరుగుదేశాల నుంచి చొరబాట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తామని స్పష్టంచేసింది. రాష్ట్రంలో ప్రధానంగా మహిళలు, యువత, రైతులు, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించింది. వారి కోసం సంక్షేమ పథకాలను విస్తరింపజేస్తామని హామీ ఇచ్చింది. బెంగాల్లో బీజేపీ మేనిఫెస్టో ‘సంకల్ప పత్ర’ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం విడుదల చేశారు. సోనార్ బంగ్లా(బంగారు బెంగాల్)కు ఇదొక రోడ్ మ్యాప్ అని ఆయన అభివరి్ణంచారు. అవినీతి, రాజకీయ హింస, చొరబాట్లు, నిరుద్యోగ సమస్యకు ఈ అసెంబ్లీ ఎన్నికలు ఒక రెఫరెండమ్ అని తేల్చిచెప్పారు. మహిళలకు ఉచిత ప్రయాణం రాష్ట్ర సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లో తిష్టవేసిన ఆక్రమణదారులను, చొరబాటుదార్లను అక్కడి నుంచి వెళ్లగొడతామని పేర్కొన్నారు. ఆయా భూములకు విముక్తి కల్పిస్తామని తెలిపారు. ప్రజా రవాణా సంస్థ వాహనాల్లో మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు రూ.15,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అధికార పార్టీ అవినీతి వ్యవహారాలు, ఉపాధ్యాయ నియామకాల్లో కుంభకోణం వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారికి ఐదేళ్లపాటు వయసు సడలింపు ఇస్తామని చెప్పారు. ఉద్యోగాలను పారదర్శకంగా, నైపుణ్యాల ఆధారంగా భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే ఉద్యోగుల కోసం ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సులు అమలు చేస్తామని వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఏటా రూ.9,000 చొప్పున అందజేస్తామని పేర్కొన్నారు. చేపలు, గుడ్లపై నిషేధం ఉండదు: అమిత్ షా బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాలీ బిడ్డనే పశ్చిమ బెంగాల్కు ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీకి అధికారం అప్పగిస్తే చేపలు, గుడ్లపై నిషేధం విధిస్తారంటూ కొందరు దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి నిషేధం ఉండదని స్పష్టంచేశారు.బీజేపీ సంకల్ప పత్రలో కీలకాంశాలు.. → బెంగాల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం చట్టం. → అక్రమ వలసలపై కఠిన చర్యలు. పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట. → ప్రజలు తమకు నచ్చిన మతాన్ని స్వేచ్ఛగా ఆచరించేలా చట్టం. → మహిళలకు ప్రతినెలా రూ.3,000 చొప్పున ఆర్థిక సాయం. వారి సాధికారతకు చేయూత. → పోలీసు శాఖలో ప్రత్యేకంగా మహిళా బెటాలియన్ ‘దుర్గా సురక్ష స్క్వాడ్’ఏర్పాటు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు. → కోటి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించేదాకా నెలకు రూ.3,000 చొప్పున ఆర్థిక సాయం. → ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం కేంద్ర రేట్లకు అనుగుణంగా మార్పు. ఏడో వేతన కమిషన్ సిఫార్సుల అమలు. → 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలు, దిగజారిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల. → కట్ మనీ(చట్టవిరుద్ధమైన కమిషన్లు/లంచాలు) సంస్కృతికి చరమగీతం. సిండికేట్ వ్యవస్థ అంతం. → ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు బెంగాల్లోనూ అమలు. ఉత్తర బెంగాల్ జిల్లాల్లో ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ఏర్పాటు. → వరి, బంగాళదుంప, మామిడి పండించే రైతులకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రోత్సాహకాలు. పంటలకు గిట్టుబాటు ధరలు. → రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లోకి కుర్మాలీ, రాజ్బన్షీ భాషలు. → అత్యున్నత పారిశ్రామిక హబ్గా బెంగాల్ అభివృద్ధి. అతిపెద్ద చేపల ఎగుమతి కేంద్రం ఏర్పాటు. → పాత తేయాకు తోటల పునరుద్ధరణ. డార్జీలింగ్ తేయాకుకు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు లభించేలా చర్యలు. జనపనార పరిశ్రమ ఆధునీకరణ. → రాష్ట్రంలో వందేమాతరం మ్యూజియం నిర్మాణం. -
యూపీనుంచి 50వేలమంది, పామునైనా నమ్మొచ్చేమో గానీ : మమత మండిపాటు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతున్న నేపథ్యంలో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని తెంతులియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈశాన్య రాష్ట్రమైన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఓటర్ల మద్దతుపై నమ్మకం లేక, బీజేపీ బయటి వ్యక్తులను రప్పించిందని ఆమె ఆరోపించారు.బీజేపీపై ఘాటు విమర్శలుఅయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అస్సాంలో 126 మంది సభ్యులున్న అసెంబ్లీకి ఏప్రిల్ 9, గురువారం నాడు ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఈ సందర్బంగా అస్సాం ఎన్నికల సరళిపై మమతా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలోని ఏ దర్యాప్తు సంస్థా తటస్థంగా లేదని, కాషాయ పార్టీ వాటన్నింటినీ కొనేసిందని ఆరోపించారు. పామునైనా నమ్మవచ్చు కానీ, బీజేపీని మాత్రం నమ్మలేము అంటూ దీదీ ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్ నుండి సుమారు 50వేల మందిని రైళ్లలో అస్సాంకు తీసుకువచ్చారని మమతా బెనర్జీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో కూడా ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేయాలని బీజేపీ చూస్తోందని, అందుకే ఎన్నికల కమిషన్ ద్వారా అధికారులను బదిలీ చేయిస్తోందని విమర్శించారు. ఎన్నికల కోసం డబ్బు, మాదకద్రవ్యాలు, బయటి వ్యక్తులతో ఓటింగ్, లాంటి అక్రమాలకు తెగబడుతోందన్నారు. అయితే తమ కార్యకర్తలు వాటిని ఎదుర్కొని విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ వివాదంపశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుంచి 90 లక్షల పేర్లను తొలగించారని, ఒక వార్తాపత్రిక నివేదిక ప్రకారం, తొలగించిన 90 లక్షల పేర్లలో 60 లక్షలు హిందువులవి, 30 లక్షలు ముస్లింలవి అని కూడా బెనర్జీ అన్నారు. బీజేపీని ఎన్నడూ నమ్మకూడదని బెనర్జీ అన్నారు. అస్సాంలో జరిగిన ఎన్ఆర్సి ప్రక్రియలో తొలగించిన 19 లక్షల పేర్లలో 13 లక్షలు హిందువులు, 6 లక్షలు ముస్లింలు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాల్లో తనను టీఎంసీ అభ్యర్థిగా పరిగణించాలని ఓటర్లను కోరుతూ, "నా నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలంటే, అన్ని స్థానాల్లో నేనే అభ్యర్థిని" అని బెనర్జీ అన్నారు. ఓటర్ల జాబితా నుంచి అనేక షెడ్యూల్డ్ కులాల వారి పేర్లను తొలగించారని, అలాగే తన నియోజకవర్గంలో కూడా ఓటర్ల పేర్లను తొలగించారని టీఎంసీ అధినేత్రి ఆరోపించారు. అయినా తనకు బెంగాల్ ప్రజలపై నమ్మకం ఉందన్నారు.ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?బీజేపీ ప్రభుత్వం బెంగాల్ ప్రజలు ఏం తినాలో, ఏం తినకూడదో నిర్దేశిస్తుందని ఆమె మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజల మాంసాహార అలవాట్లపై ఆంక్షలు విధిస్తుందని ఆరోపించారు.అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయని, అక్కడ వారిని రక్షించలేని ప్రధాని మోదీ, ఇక్కడ 'సోనార్ బంగ్లా' (బంగారు బెంగాల్) నిర్మిస్తామనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ప్రజలకు భద్రత కల్పించిన తర్వాతే మాత్రమే 'సోనార్ బంగ్లా' గురించి మాట్లాడాలన్నారు. (నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే!) -
పశ్చిమబెంగాల్లో బీజేపీ మేనిఫెస్టో విడుదల
కోల్కాతా: పశ్చిమబెంగాల్లో మహిళలు, యువత లక్ష్యంగా బీజేపీ తన మేనిఫెస్టో విడుదల చేసింది. పలు వర్గాలను ఆకట్టుకునేలా బీజేపీ హామీలు ఇచ్చింది. ఇంటికి పెద్దగా ఉన్న మహిళకు నెలకు రూ.3 వేలు ఆర్థిక ప్రోత్సాహకం ప్రకటించింది. ప్రభుత్వ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తామని బీజేపీ హమీ ఇచ్చింది. మేనిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనపై ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారన్నా అమిత్ షా.. బెంగాల్లో చీకటి పాలన ముగుస్తుందన్నారు.వికసిత్ బెంగాల్ రోడ్మ్యాప్ను మేనిఫెస్టోలో పెట్టాం. పేదలకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అమలు చేస్తామన్న అమిత్ షా.. రైతుల సంక్షేమం, యువత ఉపాధి అవకాశాలపై కీలక హామీలు ఇచ్చారు. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక బెంగాల్లో యూసీసీ అమలు చేస్తామని తెలిపారు.భయం లేని బెంగాల్.. పునర్నిర్మాణమే తమ లక్ష్యం అన్న అమిత్ షా.. బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చొరబాటుదారుల ఏరివేత.. 7వ పే కమిషన్ అమలు చేస్తామని తెలిపారు. ‘‘ఆరు నెలల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏ చెల్లిపులు. మహిళలకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్. రాజకీయ హింస కేసులపై ముమ్మర దర్యాప్తు. బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్ కోసం భూముల కేటాయింపు. ఆవుల స్మగ్లింగ్ నిలిపివేస్తాం. దుర్గా సురక్ష స్క్వాడ్ ఏర్పాటు’’ చేస్తామని అమిత్ షా తెలిపారు.


