మ్యాజిక్ ఫిగర్ దాటిన BJP నేతృత్వంలోని కూటమి
- 80 స్థానాల్లో ఆధిక్యంతో, అసాంలో BJP నేతృత్వంలోని కూటమి 64 స్థానాల మెజారిటీ మార్కును అధిగమించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 19 నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది.
- జలుక్బరీలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆధిక్యంలో ఉండగా, జోర్హాట్లో కాంగ్రెస్కు చెందిన గౌరవ్ గొగోయ్ ముందంజలో ఉన్నారు.
- దిస్పూర్లో ప్రద్యుత్ బోర్డోలోయ్ ముందంజలో ఉన్నారు
- బిహ్పురియాలో భూపేన్ బోరా ముందంజలో ఉన్నరు
- శివసాగర్లో అఖిల్ గొగోయ్ ముందంజలో ఉన్నారు
- ఖోవాంగ్లో లూరింజ్యోతి గొగోయ్ ముందంజలో ఉన్నారు
- జాగీ రోడ్లో పిజూష్ హజారికా ముందంజలో ఉన్నారు
విజయం మాదే : అఖిల్ గోగోయ్
శివసాగర్లో అఖిల్ గొగోయ్ ముందంజలో ఉన్నారు

48 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి ముందంజ
- జోర్హాట్లో కాంగ్రెస్ అభ్యర్థి గౌరవ్ గొగోయ్ ముందంజ, 14 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం
- కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి మొత్తం 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
బీజేపీ నేతృత్వంలోని కూటమికి స్పష్టమైన ఆధిక్యం
- బీజేపీ నేతృత్వంలోని కూటమికి స్పష్టమైన ఆధిక్యం
- కాంగ్రెస్ ఖాతా తెరిచిన కాంగ్రెస్
- ప్రాథమిక సరళి ప్రకారం, బీజేపీ నేతృత్వంలోని కూటమి 21 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, AIUDF , కాంగ్రెస్ చెరో రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
అస్సాంలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 722 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
ఈశాన్య రాష్రం అస్సాంలో అధికారి పీఠాన్ని దక్కించుకునేందుకు బీజేపీ మరోసారి ఉవ్విళ్లూరుతోంది. ఈ ఎన్నికలలో ప్రధాన పోటీదారులుగా, బీజేపీ, అసోం గణ పరిషత్ (AGP), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (BPF) భాగస్వామ్యంతో ఏర్పడిన బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి, అలాగే INC, అసోం జాతీయ పరిషత్ (AJP), రైజోర్ దళ్, ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ (APHLC), CPI (M) మరియు CPI (ML) పార్టీలతో కూడిన కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి నిలిచాయి.
చాలా వరకు ఎగ్జిట్ పోల్స్, బీజేపీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. బీజేపీ కూటమి 88 నుండి 101 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ కూటమి 22 నుండి 36 స్థానాలను గెలుచుకోవచ్చని, కాగా AIUDF 2 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని అంచనా.


