మహా ఉత్కంఠకు నేడు తెరపడనుంది. డీఎంకే, ఏఐడీఎంకే కూటమి, విజయ్ టీవీకే పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ప్రజా తీర్పు ఈవీఎంల నుంచి మరికొన్ని గంటల్లో బయటకు రానుంది. మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు.. అధికారంలోకి ఎవరు వస్తారనేది ఉత్కంఠ నెలకొంది. దీంతో గత కొన్ని రోజుల నుంచి రాజకీయ పార్టీల అధినేతల నుంచి సామాన్య ప్రజల వరకు చూస్తున్న ఎదురుచూపులకు ఎండ్కార్డు పడనుంది.
👉చెన్నై సిటీలో డీఎంకే, టీవీకే హోరాహోరీ
- కొళత్తూరులో సీఎం స్టాలిన్ ముందజ
- చెపాక్లో ఉదయనిధి ఆధిక్యం
- తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్లో విజయ్ వెనుకంజ
- మైలాపూర్లో తమిళిసై వెనుకంజ
- తిరుచ్చి వెస్ట్లో మంత్రి నెహ్రూ వెనుకంజ
👉పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్
- డీఎంకే -22 స్థానాలు
- ఏఐడిఎంకే -5 స్థానాలు
- టీవీకే 4 స్థానాల్లో ముందంజ
👉పెరంబూర్లో విజయ్ ముందంజ
- కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు
- తమిళనాడు పోస్టల్ బ్యాలెట్లో డీఎంకే ఆధిక్యం
#WATCH | Tamil Nadu Assembly Elections | Heavy security arrangements have been put in place at the counting centre set up at Loyola College in Chennai, where votes for several key Assembly constituencies will be counted today. pic.twitter.com/JEQmLTjLhh
— ANI (@ANI) May 4, 2026
👉తమిళనాడులో కౌంటింగ్ ప్రారంభం
- మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
- 8.30 నుంచి ఈవీఎం ఓట్లను కౌంట్ చేయనున్న అధికారులు
- రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ విధుల్లో మొత్తం 3.6 లక్షల మంది సిబ్బంది
- చెన్నైలోని లయోలా కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు
- పలు కీలక అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు
👉మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు... అధికారంలోకి ఎవరు?
నేడు తమిళనాడు ఎన్నికల ఓట్ల కౌంటింగ్
ఉదయం 8 గంటల నుంచి ఓట్లని లెక్కించనున్న సిబ్బంది
234 స్థానాల్లో ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికలు
5.73 కోట్ల మంది ఓటర్లలో ఓటు హక్కు వినియోగించుకోగా.. తమిళనాడులో రికార్డ్ స్థాయిలో 85 శాతం పోలింగ్
రాష్ట్రవ్యాప్తంగా 62 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం
మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి 8.30 నుంచి ఈవీఎం ఓట్లను కౌంట్ చేయనున్న అధికారులు
మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు... అధికారంలోకి ఎవరు వస్తారనేది ఉత్కంఠ
డీఎంకే, ఏఐ డిఎంకె కూటమి, విజయ్ టీవీకే పార్టీల మధ్య ప్రధాన పోటీ
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, ప్రత్యేకించి కేంద్ర బలగాలతో పహారా
రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ విధుల్లో మొత్తం 3.6 లక్షల మంది సిబ్బంది
ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్ ఏర్పాటు, సీసీటీవీ పర్యవేక్షణలో కౌంటింగ్
కొళత్తూరు నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్, ఎడప్పాడి నుంచి మాజీ సీఎం పళని స్వామి, చెపాక్-తిరువల్లికేని నుంచి ఉదయ్ నిధి స్టాలిన్ పోటీ
పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేసిన టీవీకే అధినేత విజయ్
కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలి, తెంకాసి జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన ఎన్నికల సంఘం
అక్కడ భారీగా పోలీసు భద్రత ఏర్పాటు
హంగ్ ఏర్పాటయ్యే అవకాశం అంటూ సర్వేలు వెల్లడి
క్యాంప్ రాజకీయాలకు తెరలేపిన టీవీకే
మహాబలిపురం వద్ద రిసార్ట్లు బుక్ చేసిన టీవీకే అధినేత విజయ్
గెలిచిన అభ్యర్థులు వెంటనే రిసార్ట్కి రావాలని ఆదేశం..
ఆసక్తిగా మారిన తమిళ రాజకీయాలు
👉రాష్ట్రంలో ఈసారి ముక్కోణపు పోరు జరిగింది. అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకేతోపాటు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) తొలిసారిగా బరిలోకి దిగింది. వరుసగా రెండోసారి విజయంపై డీఎంకే అధినేత స్టాలిన్ చాలా ఆశలే పెట్టుకున్నారు. బీజేపీతో జతకట్టిన విపక్ష అన్నాడీఎంకే గెలుపు కోసం హోరాహోరీగా పోరాడింది. డీఎంకే మళ్లీ నెగ్గడం తథ్యమని మెజార్టీ ఎగ్జిట్పోల్స్ స్పష్టం చేయగా, విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అధికారంలోకి రాబోతున్నట్లు ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పింది.
👉తమిళనాట ఓట్ల లెక్కింపునకు సమగ్రమైన మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలుండగా, కౌంటింగ్కు మొత్తం 62 కేంద్రాలు సిద్ధం చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అర్చనా పట్నాయక్ తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగ్గా, 85.15 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. కౌంటింగ్ విధుల్లో 1.25 లక్షల మంది భద్రతా సిబ్బంది, అధికారులు, సూక్ష్మపరిశీలకులు పాలుపంచుకుంటున్నారు. ఎన్నికల సంఘం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లను నియమించింది.


