breaking news
TVK Vijay
-
విజయ్ను రాహుల్గాంధీ ద్రోహి అంటారా?
తమిళనాడులో డీలిమిటేషన్ అంశం మరోసారి రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ విషయంలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, ముఖ్యమంత్రి విజయ్ వైఖరి మారిందంటూ అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం విజయ్ తన వైఖరిని సడలించారని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఇప్పుడు విజయ్ మిత్రపక్షం కాంగ్రెస్, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏం చేస్తారని నిలదీస్తున్నాయి.. డీఎంకే ఎంపీ దయానిధి మారన్, సీఎం విజయ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో డీలిమిటేషన్ బిల్లుపై ఓ పెద్ద జాతీయ పార్టీ డీఎంకేను ‘‘తమిళనాడు ద్రోహులు’’గా అభివర్ణించిందని గుర్తు చేశారు. డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే ఎప్పుడూ తన వైఖరిని మార్చుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయ్ వైఖరిలో మార్పు కనిపిస్తోందని ఆరోపించారు.‘‘అఖిలపక్ష ఎంపీల సమావేశంలో ఒక తీర్మానం, అసెంబ్లీలో మరో తీర్మానం చేసి డీలిమిటేషన్కు వ్యతిరేకంగా నిలిచిన విజయ్.. ఇప్పుడు న్యాయమైన డీలిమిటేషన్ కావాలని చెబుతున్నారు. మరి విజయ్ను రాహుల్గాంధీ ద్రోహి అంటారా?’’ అంటూ దయానిధి మారన్ ప్రశ్నించారు.అర్ధరాత్రి భేటీతో మార్పు వచ్చిందా?కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో విజయ్ భేటీ అయిన తర్వాతే ఆయన వైఖరిలో మార్పు వచ్చిందని డీఎంకే ఆరోపిస్తోంది. గతంలో డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించిన టీవీకే.. ఇప్పుడు ‘‘న్యాయమైన డీలిమిటేషన్’’ అంటూ కొత్త వైఖరి తీసుకుందని విమర్శించింది. ఈ పరిణామాలను డీఎంకే రాజకీయంగా ఉపయోగించుకుంటూ విజయ్ స్థిరత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.ఇది పూర్తి యూటర్న్: అన్నాడీఎంకేవిజయ్ వైఖరిపై అన్నాడీఎంకే కూడా తీవ్రంగా స్పందించింది. టీవీకే ప్రభుత్వం పూర్తిగా యూటర్న్ తీసుకుందని ఆరోపించింది. ‘‘ఇప్పుడు మీరు చెబుతున్నదే కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరి అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ తర్వాత మాట మార్చడం ఎందుకు?’’ అంటూ అన్నాడీఎంకే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. డీలిమిటేషన్ అంశంపై టీవీకే ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని అన్నాడీఎంకే ‘‘రాజకీయ డ్రామా’’గా అభివర్ణించింది.టీటీవీ దినకరన్ విమర్శలుఅమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) నేత టీటీవీ దినకరన్ కూడా విజయ్పై విమర్శలు గుప్పించారు. తమిళనాడులోని కీలక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీవీకే అసెంబ్లీలో తీర్మానం చేసిందని ఆరోపించారు. డీలిమిటేషన్ అంశంలో విజయ్ వైఖరి మారడంతో ఆ రాజకీయ వ్యూహం బయటపడిందని వ్యాఖ్యానించారు.మా వైఖరిలో మార్పు లేదు: టీవీకేవిమర్శల నేపథ్యంలో టీవీకే ఐటీ విభాగం స్పందించింది. డీలిమిటేషన్ అంశంపై పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. తమిళనాడు ప్రయోజనాలను కాపాడటమే తమ లక్ష్యమని, న్యాయమైన డీలిమిటేషన్ కోసం మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామని పేర్కొంది.డీలిమిటేషన్పై కొత్త రాజకీయ సమరండీలిమిటేషన్ అంశం ఇప్పటికే తమిళనాడులో సున్నితమైన రాజకీయ అంశంగా మారింది. ఇప్పుడు విజయ్ వైఖరిలో మార్పు వచ్చిందనే ఆరోపణలు రావడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. విజయ్ను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు ముప్పేట విమర్శలు గుప్పిస్తుండగా.. టీవీకే మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. దీంతో రానున్న రోజుల్లో డీలిమిటేషన్ అంశం తమిళనాడు రాజకీయాల్లో కీలక చర్చగా మారే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: డీలిమిటేషన్.. కేంద్రం కీలక నిర్ణయం -
డీలిమిటేషన్పై బిగ్ ట్విస్ట్.. ప్రత్యేక పార్లమెంట్ భేటీకి కేంద్రం కసరత్తు?
సాక్షి, ఢిల్లీ: డీలిమిటేషన్ బిల్లు కోసం పార్లమెంట్ను మరోసారి కొలువుదీర్చేందుకు కేంద్రం సిద్ధమవుతోందా? వర్షాకాల సమావేశాలు ముగిసినా.. పార్లమెంట్ను ఇప్పటివరకు ప్రొరోగ్ చేయకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. దీంతో అవసరమైతే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి డీలిమిటేషన్ బిల్లును ముందుకు తీసుకురావచ్చన్న ప్రచారం ఊపందుకుంది.ఇప్పటికే డీలిమిటేషన్ అంశంపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. 543 నుంచి లోక్సభ స్థానాల సంఖ్య పెరిగినా.. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం ఉండదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత 129 స్థానాలకు గాను కొత్తగా 195కు పెరుగుతాయని, మొత్తం లోక్సభలో వాటి వాటా దాదాపు 24 శాతంగానే ఉంటుందని ఆయన వివరించారు.తమిళనాట ట్విస్ట్.. ఇక తాజాగా దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశంలోనూ డీలిమిటేషన్ అంశం చర్చకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమిళనాడు సీఎం విజయ్.. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభావం పడొచ్చన్న ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో దక్షిణాది వాటా తగ్గకుండా కేంద్రం హామీ ఇవ్వాలని కోరారు. అయితే విజయ్ వైఖరిలో మార్పు వచ్చిందన్న ప్రచారం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. గతంలో డీలిమిటేషన్ను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన.. ఇప్పుడు “దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గకపోతే?” అన్న కోణంలో మాట్లాడటం చర్చకు దారితీసింది. ఈ మార్పును విపక్షాలు, ముఖ్యంగా డీఎంకే, రాజకీయంగా ప్రశ్నిస్తోంది.ఇది కూడా చదవండి: డీకే ఎదుట విజయ్ సరెండర్.. డీఎంకేకు చిక్కిన అస్త్రంమరోవైపు డీఎంకే వైఖరి కూడా కీలకంగా మారింది. దక్షిణాది రాష్ట్రాల లోక్సభ వాటా తగ్గకుండా ఉంటే డీలిమిటేషన్ను పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం మాత్రం ప్రస్తుత 543 స్థానాల సంఖ్యను, తమిళనాడుకు ఉన్న 39 స్థానాలను మరో 25 ఏళ్లపాటు కొనసాగించాలన్న డిమాండ్ను తాజాగా వెల్లడించారు.ప్రత్యేక సమావేశాలపై చర్చ..ఇక అసలు ఆసక్తి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపైనే! వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13తో ముగిశాయి. అయినప్పటికీ పార్లమెంట్ను ఇంకా ప్రొరోగ్ చేయకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో కేంద్రం వ్యూహాత్మకంగా ప్రత్యేక సమావేశాలకు మార్గం సిద్ధం చేస్తోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రత్యేక సమావేశాలు ఖరారయ్యాయని కేంద్రం అధికారికంగా ప్రకటించలేదు. మొత్తంగా చూస్తే.. డీలిమిటేషన్ బిల్లు, దక్షిణాది ప్రాతినిధ్యం, మహిళా రిజర్వేషన్, లోక్సభ స్థానాల పెంపు.. ఈ నాలుగు అంశాలు మరోసారి జాతీయ రాజకీయాలను వేడెక్కించే అవకాశముంది. అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం ఉండదని చెబుతుంటే.. దక్షిణాది నేతలు మాత్రం “సంఖ్య పెరిగినా.. రాజకీయ వాటా తగ్గకూడదు” అన్న హామీ కోరుతున్నారు. మరి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయా? వస్తే డీలిమిటేషన్ బిల్లు టేబుల్పైకి వస్తుందా? అదే ఇప్పుడు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్లో అసలు ప్రశ్న! -
డీకే ఎదుట విజయ్ సరెండర్.. డీఎంకే చేతికి చిక్కిన అస్త్రం
కావేరి నీళ్ల వివాదం మరోసారి దక్షిణాది రాజకీయాల్లో కాక రేపుతోంది. కర్ణాటక-తమిళనాడు మధ్య నీళ్ల పంచాయితీకి కేంద్రంగా మారిన మేకేదాటు డ్యామ్ అంశం.. ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్ను చుట్టుముడుతోంది. మహాబలిపురంలో జరిగిన దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశంలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మేకేదాటు ప్రాజెక్టుకు గట్టిగా బ్యాటింగ్ చేస్తే.. అదే వేదికపై ఉన్న విజయ్ మాత్రం ప్రాజెక్టు పేరెత్తకుండానే ‘చట్టబద్ధమైన నీటి వాటా’ అంటూ జాగ్రత్తగా మాట్లాడారు. దీంతో అసలు విజయ్ స్టాండ్ ఏంటి? అన్న ప్రశ్నను డీఎంకే తెరపైకి తీసుకొచ్చింది.‘కర్ణాటక సీఎం మేకేదాటుకు అనుకూలంగా బహిరంగంగా మాట్లాడుతుంటే.. తమిళనాడు సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారు?’ ఇదే ఇప్పుడు డీఎంకే ప్రధాన అస్త్రం. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ విజయ్పై నేరుగా విమర్శలు గుప్పించారు. తమిళనాడు నీటి హక్కుల విషయంలో సీఎం మౌనం.. రాష్ట్ర ప్రయోజనాలతో రాజీ పడటమే అంటూ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మొదలుపెట్టింది డీఎంకే.విజయ్ మౌనం.. డీఎంకేకు రాజకీయ అస్త్రం!మేకేదాటు డ్యామ్ అనేది కేవలం ఒక ప్రాజెక్టు కాదు.. తమిళనాడు రాజకీయాల్లో కావేరి సెంటిమెంట్తో ముడిపడిన అంశం. రైతుల ప్రయోజనాలు, నీటి హక్కులు, కర్ణాటకతో పోరాటం.. ఈ మూడు అంశాల చుట్టూనే డీఎంకే తన రాజకీయ దాడిని పదును పెడుతోంది. గతంలోనూ మేకేదాటు విషయంలో విజయ్ వైఖరిని డీఎంకే తప్పుబట్టింది. ఇప్పుడు మరోసారి అదే అంశాన్ని పట్టుకుని ‘తమిళనాడు హక్కుల కోసం ఎవరు గట్టిగా నిలబడుతున్నారు?’ అనే ప్రశ్నను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది.అయితే విజయ్ మాత్రం మరో వ్యూహాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. మేకేదాటు పేరును నేరుగా ప్రస్తావించకుండా.. ఎగువ రాష్ట్రం చేపట్టే ఎలాంటి చర్యలూ దిగువ రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాను ప్రభావితం చేయకూడదని, అన్నీ చట్టపరమైన పరిధిలోనే జరగాలని స్పష్టం చేశారు. అంటే.. డీఎంకే కోరుతున్నట్టుగా కర్ణాటకపై నేరుగా రాజకీయ యుద్ధం చేయకుండా.. చట్టం, హక్కులు, నీటి వాటా అనే మూడు అంశాల చుట్టూ తన వైఖరిని పరిమితం చేశారు.అసలు మేకేదాటు గేమ్ ఏంటి?కర్ణాటక ప్రతిపాదిస్తున్న మేకేదాటు ప్రాజెక్టుతో బెంగళూరుకు తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి వంటి ప్రయోజనాలు కలుగుతాయని ఆ రాష్ట్రం చెబుతోంది. ప్రతిపాదిత రిజర్వాయర్లో 5 టీఎంసీలను తాగునీటి అవసరాలకు కేటాయిస్తామని, మిగిలిన నీరు తమిళనాడుకు వెళ్తుందని డీకే శివకుమార్ అంటున్నారు. కాగా, తమిళనాడుకు ఒక్క చుక్క కూడా నష్టం చేయం అన్నది కర్ణాటక వాదన. కానీ తమిళనాడు అనుమానం మాత్రం అక్కడే మొదలవుతోంది. నీరు ఎప్పుడు విడుదల చేస్తారు? ఎంత విడుదల చేస్తారు? కరువు వచ్చినప్పుడు కర్ణాటక తన రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసుకుంటే.. దిగువన ఉన్న తమిళనాడు పరిస్థితి ఏంటి?. అదే మేకేదాటు వివాదానికి అసలు కేంద్రబిందువు.కావేరిపై ఇప్పటికే టెన్షన్!ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై ఒత్తిడి నేపథ్యంలో.. తమిళనాడుకు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని 15 రోజుల పాటు విడుదల చేయాలని కావేరి వాటర్ రెగ్యులేషన్ కమిటీ ఆదేశించింది. ఈ ఆదేశాలపై కర్ణాటకలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అటు తమిళనాడు మాత్రం ఆదేశాల అమలుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో, నీటి వాటాల విషయంలో రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
విజయ్ సర్కార్ కీలక నిర్ణయం.. మూడో బిడ్డకూ ఏడాది సెలవు
రాష్ట్ర మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు మూడో సంతానం పుట్టినప్పుడు ఇకపై ఏడాది పాటు ప్రసూతి సెలవు ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 12 వారాల సెలవుని 365 రోజులకు పెంచుతూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దీంతో మొదటి ఇద్దరు పిల్లలకు అందుతున్న ప్రసూతి సెలవు ప్రయోజనం మూడో బిడ్డకు కూడా వర్తించనుంది. రాష్ట్ర అసెంబ్లీలో మానవ వనరుల నిర్వహణ శాఖకు సంబంధించిన పద్దులపై చర్చ సందర్భంగా సంబంధిత శాఖ మంత్రి డి.శరత్కుమార్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇద్దరి కంటే తక్కువ మంది జీవించి ఉన్న పిల్లలు ఉన్న మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 365 రోజుల ప్రసూతి సెలవు లభిస్తుంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఉద్యోగులకు గరిష్ఠంగా 12 వారాలు (84 రోజులు) మాత్రమే పూర్తి వేతనంతో సెలవు ఇచ్చేవారు. మూడో బిడ్డ విషయంలోనూ ప్రసూతి ప్రయోజనాలని నిరాకరించరాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన వివరణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.తమిళనాడులో జనాభా మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రసూతి సెలవుల పెంపు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం నిర్వహించిన ఓ వర్క్షాప్లో ఆరోగ్య మంత్రి కేజీ అరుణ్రాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.4 కంటే దిగువకు పడిపోయిందని తెలిపారు. జనాభా పునరుత్పత్తికి అవసరమైన 2.1 స్థాయి కంటే ఇది గణనీయంగా తక్కువని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 16 శాతం మంది 60 ఏళ్లకు పైబడినవారే ఉన్నారని, ఈ జనాభా మార్పు భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారుతోందని మంత్రి అన్నారు. మూడో బిడ్డని కనేందుకు దంపతులని ప్రోత్సహించే విధానాలని కూడా భవిష్యత్తులో పరిశీలించే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
విజయ్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు?
చెన్నై: తమిళనాడులో సీఎం కార్యాలయ మార్పు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ కొత్త కార్యాలయానికి మారాలన్న నిర్ణయం కొత్త రాజకీయ వివాదానికి దారితీసింది. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ నుంచి నామక్కల్ కవింగర్ మాలిగైకి మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఈ టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.బీజేపీ నేత సీఆర్ కేశవన్ ఈ అంశంపై స్పందిస్తూ.. కొత్త టీవీకే ప్రభుత్వం ప్రభుత్వ టెండర్ల ప్రక్రియలో పారదర్శకత తీసుకొస్తామని పదేపదే చెబుతోందని, అయితే కొత్త ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన టెండర్ ప్రక్రియలో అనేక అవకతవకలు జరిగినట్లు ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనం వెల్లడించిందని అన్నారు. ఆయన మాట్లాడుతూ "టెండర్ విలువ సుమారు రూ.5.5 కోట్లు. టెండర్ ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగినట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 100 రోజులు మాత్రమే అయ్యింది. అప్పుడే ప్రభుత్వం ఈ ఆరోపణలతో పరిశీలనకు గురవుతోంది. అయితే, టెండర్లో అవకతవకలు ఉన్నాయని ఒక ఆంగ్ల దినపత్రికలో కథనం వచ్చింది. టెండర్ను ఆన్లైన్లో కూడా ఆహ్వానించలేదని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వాలి" అని కేశవన్ అన్నారు.అయితే ఈ ఆరోపణలు మంత్రి, టీవీకే నేత ఆధవ్ అర్జున ఖండించారు. టెండర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి విజయ్ తన కోసం మాత్రమే సౌకర్యవంతమైన కార్యాలయం కోరుకోవడం లేదని, తనతో కలిసి పనిచేసే అధికారులు, సిబ్బందికి కూడా మెరుగైన పని వాతావరణం ఉండాలనే ఉద్దేశంతోనే కార్యాలయాన్ని తాత్కాలికంగా మార్చాలని నిర్ణయించారని చెప్పారు.ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారులు, సిబ్బంది పనిచేస్తున్న ప్రదేశం 100 చదరపు అడుగుల కంటే కూడా తక్కువగా ఉందని ఆధవ్ అర్జున తెలిపారు. అందుకే తాత్కాలికంగా కార్యాలయాన్ని మరో భవనానికి మార్చే ప్రణాళిక రూపొందించామని చెప్పారు.ముఖ్యమంత్రి విజయ్ చాలా సాధారణంగా, సౌకర్యాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా పనిచేసే వ్యక్తి అని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో కూడా సాధారణ హోటల్లో లేదా వ్యాన్లో విశ్రాంతి తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉండేవారని పేర్కొన్నారు.టెండర్ ప్రక్రియలో పూర్తిస్థాయి పారదర్శకత ఉండేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని, ఎలాంటి బినామీ కంపెనీలను ఉపయోగించబోమని ఆయన స్పష్టం చేశారు. -
మంత్రి చేసిన తప్పు.. సభలో సారీ చెప్పిన సీఎం విజయ్
-
సీఎం విజయ్కు జైకొట్టిన అన్నామలై.. ఇక TVKలోకేనా?
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చకు తెరలేచింది. మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారాయి. తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ పాలనపై అన్నామలై సానుకూలంగా స్పందించడం ఇప్పుడు కొత్త ఊహాగానాలకు తెరతీసింది.విజయ్ ప్రభుత్వం ఇంకా కొత్తదేనని, దానికి కనీసం ఒక సంవత్సరం సమయం ఇవ్వాలని అన్నామలై అన్నారు. తొలి 100 రోజుల్లో ప్రభుత్వంలో కొత్త ఉత్సాహం కనిపించిందని, అవినీతిని ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వం నిజాయితీగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ప్రస్తుతం విజయ్కు నా మద్దతు ఉందని చేశారు.అన్నామలై వ్యాఖ్యలు ఇక్కడితో ఆగలేదు. బీజేపీ నిర్ణయాలు మరింతగా ఢిల్లీ కేంద్రీకృతమవుతున్నాయని, రాష్ట్ర స్థాయి నాయకులకు మరింత స్వేచ్ఛ, అధికారం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ అభివృద్ధి విషయంలోనూ గుజరాత్ కేంద్రీకృత మోడల్ మారాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.ఒకవైపు బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు.. మరోవైపు విజయ్కు బహిరంగ మద్దతు ఇవ్వడం తమిళనాడు రాజకీయాల్లో చర్చకు దారితీసింది. దీంతో అన్నామలై తదుపరి రాజకీయ అడుగు ఏంటి? విజయ్ నేతృత్వంలోని టీవీకే వైపు ఆయన అడుగులు వేస్తారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.అయితే ఇప్పటివరకు అన్నామలై టీవీకేలో చేరుతున్నట్లు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఇది ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో ఏర్పడిన రాజకీయ ఊహాగానంగానే చూడాలి. విజయ్కు అన్నామలై మద్దతు ప్రకటించడం, అదే సమయంలో బీజేపీ నిర్ణయాలపై విమర్శలు చేయడం.. తమిళనాడు రాజకీయాల్లో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. -
సీఎం విజయ్ 100 రోజుల పాలన
-
తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు కారు..
సాక్షి, చెన్నై: తమిళనాడు శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ప్రభుత్వమే కారు, వ్యక్తిగత సహాయకుడిని కేటాయించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం వెలువడింది. వివరాలు.. రాష్ట్రంలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో టీవీకేకు చెందిన 107 మంది అత్యధిక సభ్యులుగా ఉన్నారు.వీరిలో సీఎం విజయ్తో పాటూ 90 శాతం మంది తొలి సారిగా అసెంబ్లీ మెట్లు ఎక్కిన వారే. ఇక, డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, వీసీకే, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్ , ఎండీఎంకే ,డీఎండీకే తదితర పారీ్టలలో ఇద్దరు ముగ్గురు కొత్త వారు ఉన్నారు. ఈసారి అసెంబ్లీకి ఎన్నికైన వారిలో మెజారిటీ శాతం కొత్త వారు, తొలి సారిగా అడుగు పెట్టినవారే ఉన్నారు. వీరికి అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన ప్రత్యేక శిక్షణను కూడా ఇవ్వాల్సిన పరిస్థితిఏర్పడింది. టీవీకే నుంచి గెలిచిన వారిలో అత్యధిక శాతం అభిమానులే. వీరి ఆస్తి పస్తులు అంతంత మాత్రమే. అప్పోసొప్పో చేసి ఎన్నికల్లో గెలిచిన అసెంబ్లీలోకి వచ్చిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వీసీకే చెందిన కాట్టుమన్నార్కోయిల్ ఎమ్మెల్యే జ్యోతిమణి మాట్లాడుతూ.. సభలో చెప్పులు కూడా వేసుకోలేని నిరుపేద ఎమ్మెల్యేలు ఉన్నారని వివరించారు.. నియోజకవర్గంలో పర్యటించి ప్రజలకు సేవ చేయడానికి తమకు సొంత వాహనాలు లేవు అని, అద్దె వాహనాల్లో తిరగాల్సి వస్తున్నట్టు వివరించారు. అలాగే సహాయకుడిని పెట్టుకుని జీతం ఇచ్చే ఆర్థిక స్థోమత కూడా లేదన్నారు. అవినీతి లేని పాలన అందించాలంటే ఎమ్మెల్యేల కనీస అవసరాలను ప్రభుత్వం తీర్చాలని కోరారు. ఈ విజ్ఞప్తిపై శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ స్పందిస్తూ.. ఎమ్మెల్యేలు , మాజీ ఎమ్మెల్యేల నుండి వచ్చిన విజ్ఞప్తులను ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి తీసుకెళ్తానని, ఆయన సానుకూల నిర్ణయం తీసుకుంటారని హామీ ఇచ్చారు. సీఎం వద్దకు ప్రతిపాదన.. ఈ విషయంగా స్పీకర్ వినతిపత్రాన్ని సీఎం విజయ్కు పంపించారు. ఎమ్మెల్యేలు ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ప్రజలకు సేవ చేసేలా చూడాలనే ఉద్దేశంతో.. తొలిసారి సభలోకి అడుగుపెట్టిన శాసనసభ్యులకు కారు, అసిస్టెంట్ను కేటాయించేందుకు సీఎం విజయ్ ఆమోదం తెలిపినట్లు, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఈ దృష్ట్యా,కారు కూడా లేని ఎమ్మెల్యేలందెరికో వాహనాలు మరికొద్ది రోజులలో దరి చేరనున్నాయి. ఎవ్వరెవ్వరికి కార్లు లేవో, వారి వివరాలను సేకరించి కార్ల కొనుగోలుకు సంబం«ధించిన కసరత్తులపైఅ ధికారులు దృష్టి పెట్టారు. -
సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. రగులుతున్న తమిళనాడు రాజకీయం?
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తమిళగ వెట్రి కళగం అధినేత, ముఖ్యమంత్రి విజయ్ను ఉద్దేశించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొన్ని రోజుల క్రితం అసెంబ్లీలో సీఎం విజయ్ ఓ చిన్న కథ చెబుతూ.. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి కౌంటర్గా చెన్నైలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం కమలాలయంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో తండ్రి ఎక్కడ ఉన్నారని వెతికే బదులు..అంటూ.. సీఎం విజయ్ తల్లిని ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు నేరుగా సీఎం విజయ్ కుటుంబాన్ని, ముఖ్యంగా ఆయన తల్లిని ఉద్దేశించినవేనంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలపై అధికార టీవీకే పార్టీతో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి అనాగరిక, అనుచిత వ్యాఖ్యలు బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తికి తగవని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎ. రాజ్మోహన్ తదితరులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వయంగా బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై కూడా నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలను బహిరంగంగా ఖండించారు. రాజకీయంగా విధానాలను, ప్రభుత్వాన్ని విమర్శించడంలో తప్పులేదని, కానీ ఒక నాయకుడి కుటుంబాన్ని, ప్రత్యేకించి తల్లిని కించపరిచేలా మాట్లాడటం ఆమోదయోగ్యం కాదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇది తమిళనాడు రాజకీయ సంస్కృతిని దిగజార్చేలా ఉందని మండిపడ్డారు. తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో నైనార్ నాగేంద్రన్ స్పందిస్తూ.. తాను ఎవరిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ఆ వ్యాఖ్యలు చేయలేదని, తన ప్రసంగాన్ని కొందరు రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించారని వివరణ ఇచ్చారు. తాను ఎప్పుడూ మాతృమూర్తిని, మాతృభాషను గౌరవిస్తానని స్పష్టం చేశారు. ఏదేమైనా, విజయ్ 'తండ్రి' వ్యాఖ్యలకు బీజేపీ 'అమ్మ' అంటూ ఇచ్చిన కౌంటర్ తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. -
సీఎం విజయ్ స్పీచ్.. జెన్జీ, కులం, మతంపై కీలక వ్యాఖ్యలు..
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ తన తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో రాజకీయ సందేశంతో గట్టిగా గళం విప్పారు. కులం, మతం పేరుతో ప్రజలను విభజించే సంకెళ్లను తెంచినప్పుడే నిజమైన స్వేచ్ఛ సాధించినట్లని, అవినీతి నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడం కూడా మరో రకమైన స్వాతంత్ర్యమేనని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ.. ‘ప్రజలు తమను బానిసలుగా ఉంచుతున్నారని గుర్తించినప్పుడే ఐక్యంగా మారతారని అన్నారు. అప్పుడు కులం, మతం వంటి సంకెళ్లు తెగిపోతాయని, మహాత్మా గాంధీ నాయకత్వంలోని స్వాతంత్ర్య పోరాటంలోనూ ఇదే స్ఫూర్తి కనిపించిందని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించిన విజయ్.. ఆ పోరాట స్ఫూర్తి నేటి సమాజానికి కూడా మార్గదర్శకంగా ఉండాలని అన్నారు. “తమిళనాడును అవినీతి నుంచి విముక్తి చేయడం కూడా ఒక రకమైన స్వాతంత్ర్యమే” అంటూ అధికారులను అవినీతి రహిత పాలన కోసం పనిచేయాలని కోరారు.CM Vijay - Thank the Tamil people across the world & Gen Z youth ...🔥‼️ pic.twitter.com/eJ8Ww4pqGE— Hari (@hari_noty) August 15, 2026 కేంద్ర ప్రభుత్వంతో పరిపాలనా అంశాల్లో కలిసి పనిచేస్తామని, అయితే తమిళనాడు ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని విజయ్ స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేసే గత ప్రభుత్వాల సంక్షేమ పథకాలను కూడా కొనసాగిస్తామని తెలిపారు. 2036 నాటికి తమిళనాడును 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఓటు వేయడంతో ప్రజల బాధ్యత పూర్తికాదని, ప్రభుత్వ పనితీరులో ప్రజలు నిరంతరం భాగస్వాములు కావాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు, జెన్-జీ యువత కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఇదిలా ఉండగా, నటి త్రిష కృష్ణన్ కూడా చెన్నైలో జరిగిన వేడుకలకు హాజరయ్యారు. స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆమె ముందు వరుసలో కూర్చున్నారు. విజయ్ తల్లిదండ్రుల పక్కన కూర్చుని, అనంతరం పరేడ్ సమయంలో విజయ్కు సెల్యూట్ చేసిన దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.CM Vijay, salute to Trisha ...👀🔥‼️ pic.twitter.com/Y1RZi0LoHr— Hari (@hari_noty) August 15, 2026 -
విజయ్ సర్కార్కు బిగ్ విక్టరీ
కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు బిగ్ రిలీఫ్ లభించింది. తొక్కిసలాట బాధిత కుటుంబాలకు తమిళనాడు సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన విషయంలో ఈ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కరూర్ బాధిత కుటుంబాలకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం సరైంది కాదని ఈ ఉద్యోగాలు చెల్లవని ఈ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది.కాగా గతేడాది సెప్టెంబర్లో కరూర్లో టీవీకే నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తొక్కిసలాట జరిగి 41మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ క్రమంలో గత నెలలో సీఎం విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలలోని 32 మందికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందించారు. ఆ నియామకాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు కరూర్ బాధిత కుటుంబాలకు సీఎం విజయ్ అందించిన ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు చెల్లవని స్పష్టం చేసింది. రాజ్యాంగ పరిమితులకు లోబడే వ్యవహరించాలని ఆదేశించింది. బాధితులకు ఆర్ధిక సాయం అందించవచ్చు. కానీ ఉద్యోగం ఇవ్వడం సమంజసం కాదని తెలిపింది. ప్రభుత్వ బస్సుల్లో మరణించినవారికి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తారా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగం అనేది అర్హత, నిర్దేశిత నియామక ప్రక్రియ (TNPSC వంటి పరీక్షలు) ద్వారా రావాలే తప్ప, ఇలా ఉచితంగా పంచేది కాదని స్పష్టం చేసింది.ఇది సాధారణ అభ్యర్థుల సమానత్వ హక్కును దెబ్బతీస్తుందని పేర్కొంది. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ఎంతైనా ఆర్థిక సాయం అందించుకోవచ్చని, కానీ రాజ్యాంగ నిబంధనలు, పరిమితులను దాటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. అర్హత ఉన్నవారికే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా పెట్టేది కాదని వ్యాఖ్యానిస్తూ కరూర్ బాధితులకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టేవిధించింది. దీంతో కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ఊరట లభించింది. -
విజయ్ పార్టీలో చేరిన యువనేత
చెన్నై: తమిళనాడులో రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీ తమిళగ వెట్రి కళగం(టీవీకే)లోకి చేరికలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అన్నాడీఎంకే పార్టీకి చెందిన యువ నాయకుడు సింగై జి రామచంద్రన్.. (Singai G Ramachandran) టీవీకేలో చేరారు. ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ను కలిసి టీవీకే కండువా కప్పుకున్నారు. ఆయనకు సీఎం విజయ్ సాదర స్వాగతం పలికారు. విజయ్ను స్వయంగా కలిసి అధికార పార్టీలో చేరిన అతి కొద్దిమందిలో రామచంద్రన్ ఒకరు కావడం గమనార్హం.రామచంద్రన్ గతంలో ఏఐఏడీఎంకే విద్యార్థి విభాగం, ఐటీ విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు. గత నెల 23న అన్నాడీఎంకే పార్టీని వీడారు. రామచంద్రన్ తండ్రి ఏఐఏడీఎంకేలో నిబద్దతత కలిగిన కార్యకర్త కావడంతో ఆయనకు పార్టీలో కీలక పదవులు దక్కాయి. మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత 2016లో రామచంద్రన్ను పార్టీ ఐటీ విభాగానికి కార్యదర్శిగా నియమించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అన్నాడీంకే పార్టీలో కొనసాగారు. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి వైఖరి కారణంగా అన్నాడీఎంకేకు గుడ్ బై చెప్పారు.జూలై 23న పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశానికి రామచంద్రన్ హాజరయ్యారు. తర్వాత కొద్ది గంటలకే పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. తన అభిప్రాయాలను పంచుకోవడానికి తగిన అవకాశం ఇవ్వలేదని పళనిస్వామిపై ఆరోపణణలు చేశారు. కాగా, ఏఐఏడీఎంకేలో రామచంద్రన్కు ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని.. టీవీకేలో ఆయనకు కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.చదవండి: మమతా బెనర్జీ మేనల్లుడికి ఊరట -
విజయ్ సర్కార్ కీలక తీర్మానం.. బీజేపీ వాకౌట్
చెన్నై: టీవీకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీంతో సభ నుంచి బీజేపీలు ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. నీట్ కారణంగా విద్యార్థుల దృష్టి స్కూల్ చదువు నుంచి కోచింగ్లపైకి మళ్లుతోందని మంత్రి అరుణ్రాజ్ అన్నారు. భారీ ఫీజులు వసూలు చేసే కోచింగ్ సెంటర్లను నీట్ ప్రోత్సహిస్తోందంటూ మంత్రి ఆరోపించారు.నీట్ అనేది సామాజిక న్యాయం, సమానత్వం, రాష్ట్ర హక్కులకు విరుద్ధంగా ఉందని మంత్రి అరుణ్రాజ్ పేర్కొన్నారు. పేపర్ లీక్లు, విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం వంటి అంశాలను అరుణ్రాజ్ ప్రస్తావించారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. టీవీకేను బలమైన రాజకీయ శక్తిగా నిలబెట్టేందుకు అడుగులు వేస్తున్నారు. యువత, విద్యార్థులు, రాష్ట్ర హక్కులు వంటి అంశాలను ప్రధాన అజెండాగా విజయ్ సర్కార్ ముందుకెళ్తుంది. నీట్ వ్యతిరేకతను బలంగా వినిపించడం ద్వారా విద్యార్థుల్లో, యువ ఓటర్లలో తన పార్టీకి స్థానం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.కాగా, డ్రగ్ రహిత తమిళనాడు కార్యక్రమంలో సీఎం విజయ్ పాల్గొన్నారు. డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఆయన ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులతో కలిసి డ్రగ్ ఫ్రీ ఫ్లైడ్జ్ చేసిన సీఎం విజయ్.. డ్రగ్స్ వాడొద్దు.. సన్నిహితులు వాడుతుంటే ఊరుకోవద్దు.. డ్రగ్స్ ఫ్రీ తమిళనాడు కోసం అంతా కృషి చేద్దామంటూ పిలుపునిచ్చారు. -
సీఎం విజయ్పై కమల్ హాసన్ ప్రశంసలు
తమిళనాడు సీఎం విజయ్పై ప్రముఖ నటుడు కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నిర్వహించే అన్ని అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్ర గీతమైన తమిళ్ తాయ్ వాల్తుకు తొలి ప్రాధాన్యతను ఇచ్చి ఆలపించాలని అసెంబ్లీ వేదికగా చేసిన తీర్మానాన్ని కమల్ హాసన్ స్వాగతించారు. ప్రభుత్వం నిర్ణయం అభినందనీయం అని.. రాష్ట్ర హక్కులు, సాంస్కృతిక గుర్తింపుపై గట్టిగా నిలబడే ధోరణిని కొనసాగించాలని ఆయన ట్వీట్ చేశారు.సీఎం విజయ్ తీసుకొచ్చిన ఈ తీర్మానాన్ని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ సీఎం విజయ్ అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడారు. సీఎం విజయ్ ప్రసంగిస్తూ భాష అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ మాత్రమే కాదని, ప్రపంచంలో ఏ భాషకైనా అది వర్తిస్తుందన్నారు. అయితే, తమిళం కేవలం ఒక భాష మాత్రమే కాదని, అది మన ప్రాణం, మన భావోద్వేగం. అమ్మ అని పిలిచినప్పుడు ఏ బంధం, ప్రేమ మనలో ఉప్పొంగుతుందో, మన మాతృభాష అయిన తమిళం కూడా అంతే పవిత్రమైనదని వ్యాఖ్యలు చేశారు.1891లో మనోన్మణియం సుందరనార్ రాసిన గీతాన్ని ప్రస్తావిస్తూ భారత ఉపఖండం అనే అందమైన ముఖానికి నొసటిపై రూపకమైన తిలకం వంటిది తమిళనాడు అని, దాని పరిమళం ప్రపంచమంతా వ్యాపించాలని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో తమిళులు లేని దేశమంటూ లేదని, తమిళం అంటే కేవలం ఒక భాష కాదని, అదొక సంస్కృతి, ఆలోచన , ఆతిథ్యానికి ప్రతీక అని చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే తమిళం అంటే గెత్తు (స్టైల్ లేదా గెలుపు), తమిళం అంటే పవర్‘ అని సీఎం స్పష్టం చేశారు. అనంతరం ఈ ప్రత్యేక తీర్మానానికి అసెంబ్లీలోని డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, పిఎంకే, వీసీకే సహా అన్ని రాజకీయ పక్షాలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి.அரசு நிகழ்ச்சிகளில் தமிழ்த்தாய் வாழ்த்து முதலாவதாகப் பாடப்பட வேண்டும் என சட்டமன்றத்தில் தீர்மானம் நிறைவேற்றியிருப்பது மகிழ்ச்சிக்குரியது; வரவேற்கத்தக்கது. மாநில உரிமைகளை விட்டுத்தராத இந்தப் போக்கு தொடரவேண்டும்.— Kamal Haasan (@ikamalhaasan) August 11, 2026 -
విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం
చెన్నై: విజయ్ ప్రభుత్వం కీలక చట్టం చేసింది. అసెంబ్లీతో పాటు ఇతర ఏ ప్రభుత్వ కార్యక్రమాలలోనైనా రాష్ట్ర గీతం ‘తమిళ్ తాయ్ వాజ్తు’ను తప్పనిసరిగా ముందుగా ఆలపించాలని నిబంధనలు చేస్తూ చట్టం చేసింది. ఈ తీర్మానాన్ని డీఎంకే, ఏఐడీఎంకేతో పాటు ఇతర పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఇటీవలే వందేమాతరంపై ప్రత్యేక చట్టం తీసుకవచ్చిన నేపథ్యంలో ఈ చట్టం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశమై తమిళనాడు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ మాట్లాడుతూ తీర్మానం ఆమోదించబడిందని తెలిపారు. దీని అమలుకు ఇక ఎలాంటి అదనపు అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు. ఈ తీర్మానం ప్రకారం విద్యాసంస్థలు. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు వంటి అనేక చోట్ల జరిగే అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో తమిళ్ తాయ్ వాజ్త్తును మొదటగా ఆలపించాలి.సీఎం విజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తమిళ గీతానికే తొలి ప్రాధాన్యత ఉండాలని సీఎం విజయ్ స్పష్టం చేశారు. రాష్ట్ర భాషా హక్కులు, సాంస్కృతిక హక్కుల విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి రాజీకి వెళ్లబోదన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో ఉద్వేగభరితంగా ప్రసంగించిస్తూ " తమిళం ఒక భాష మాత్రమే కాదు.. మా జీవనాడి మా భావోద్వేగం. మాతృభాష ఎంత పవిత్రమో, తల్లి ఎంత పవిత్రమో తమిళం కూడా అంతే పవిత్రమైనది తమిళం అంటే గర్వం. తమిళం అంటే శక్తి. ‘తమిళం’ అనే మాట వినగానే తమిళనాడు మొత్తం ఒక్కటై నిలబడుతుంది. తమిళ్ తాయ్ వాజ్తుకు తమిళనాడులో మొదటి స్థానం ఉండాలి. తమిళ్ తాయ్ వాజ్తుకు తొలి స్థానం ఇవ్వడం మా హక్కు” అని విజయ్ పేర్కొన్నారు.కాగా ఇటీవల తమిళ రాష్ట్ర గీతం అధికారిక కార్యక్రమాల్లో చివరగా పాడడంతో వివాదం చెలరేగింది. ఈ ఏడాది మేలో ఒక విశ్వవిద్యాలయ కార్యక్రమంలో తొలుత జాతీయ గీతం, ఆ తర్వాత జాతీయ జాతీయ గీతం ఆలపించి, చివరగా తమిళ్ తాయ్ వాజ్తును ఆలపించారు. దీంతో వివాదం చెలరేగింది.అనంతరం కొన్ని వారాల తర్వాత విజయ్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా తమిళ్ తాయ్ వాజ్తు మూడో స్థానానికి వెళ్లింది. దీంతో దీనిపై రాజకీయంగా దుమారం చెలరేగింది. దీనిపై గవర్నర్కు 21 మంది ఎంపీల లేఖఅధికారిక కార్యక్రమాల్లో రాష్ట్ర గీతమైన తమిళ్ తాయ్ వాజ్తును మొదటగా, జాతీయ గీతాన్ని కార్యక్రమం చివరలో ఆలపించేలా ఆదేశాలు జారీ చేయాలని వారు గవర్నర్ను కోరారు.ఈ పరిణామాలన్నింటి మధ్య ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ తమిళ్ తాయ్ వాజ్త్తుకు రాష్ట్రంలో మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం పొలిటికల్ హీట్గా మారింది. -
విజయ్, పీకే, అన్నామలై.. భారత రాజకీయాల్లో కొత్త గేమ్?
కులం.. మతం.. కేడర్ బలం.. దశాబ్దాలుగా భారత ఎన్నికల రాజకీయాలను నడిపించిన ప్రధాన శక్తులు ఇవే. కానీ ఇప్పుడు ఆ లెక్కలు మారుతున్నాయా? బ్రాండ్.. యువత.. టెక్నాలజీ.. సోషల్ మీడియా.. ప్రజలతో డైరెక్ట్ కనెక్ట్ ఆధారంగా కొత్త రాజకీయ శక్తిని నిర్మించే ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. పాత రాజకీయ వ్యవస్థకు భిన్నంగా సొంతంగా బలం కూడగట్టుకుని.. కొత్త ఓటు బ్యాంకును తయారు చేసుకునే ప్రయోగాలు ఆసక్తి రేపుతున్నాయి.ఈ మారుతున్న రాజకీయ గేమ్లో మూడు పేర్లు ఇప్పుడు హాట్టాపిక్గా మారాయి. అవే తమిళనాడు సీఎం విజయ్, ప్రశాంత్ కిశోర్, తమిళనాడుకు చెందిన అన్నామలై. ముగ్గురి దారులు వేరు.. నేపథ్యాలు వేరు.. కానీ టార్గెట్ ఒక్కటే.. తమకంటూ కొత్త రాజకీయ మోడల్ను నిర్మించడం. మరి భారత రాజకీయాల్లో కొత్త గేమ్ నిజంగానే మొదలైందా?సీఎం విజయ్.. తమిళనాడులో విజయ్ ప్రయోగం మరింత వేగంగా సాగింది. సినీ స్టార్డమ్ను రాజకీయ బ్రాండ్గా మార్చేందుకు తమిళగ వెట్రి కజగం ఏర్పాటు చేశారు. డీఎంకే, అన్నాడీఎంకే వంటి దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీల మధ్య కొత్త రాజకీయ శక్తిగా ఎదిగారు. యువత, ఉద్యోగాలు, విద్య, సంక్షేమం వంటి అంశాలతో ముందుకు వెళ్లారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిందని కథనం పేర్కొంటోంది. విజయ్ సీఎం కావడంతో ఒక స్టార్ తన వ్యక్తిగత బ్రాండ్ను రాజకీయ అధికారంగా మార్చగలడా? అన్న ప్రశ్నకు కొత్త సమాధానం కనిపించింది.పీకే.. ఇతర పార్టీలను గెలిపించిన ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిశోర్.. చివరకు తనకంటూ జన సూరాజ్ పార్టీని నిర్మించారు. 2025 బీహార్ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా విఫలమైనా వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత బంకీపూర్ ఉపఎన్నికలో విజయం సాధించడం ద్వారా ఓటమి తర్వాత కూడా కొత్త పార్టీని తిరిగి నిలబెట్టుకోవచ్చని చూపించారు. ఒక్క గెలుపుతో బీహార్ రాజకీయాలను మార్చేశారని చెప్పలేం.. కానీ కొత్త రాజకీయ స్టార్టప్ ఫెయిల్ అయితే అంతే సంగతులు కాదనే సంకేతం మాత్రం ఇచ్చారు.అన్నామలై.. అన్నామలై ప్రయోగం మరో రకం. బీజేపీలో పనిచేసి ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడిగా ఎదిగిన ఆయన.. చివరకు ఆ వ్యవస్థ నుంచి బయటకు వచ్చి ‘వీ ది లీడర్స్’ పేరుతో కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. వెంటనే ఎన్నికల బరిలోకి దిగకుండా.. ముందుగా సంస్థను నిర్మించడం, సభ్యత్వాన్ని పెంచడం, నాయకత్వాన్ని తయారు చేయడంపై దృష్టి పెట్టారు. అంటే ఎన్నికల ముందు పార్టీ కాదు.. పార్టీ కోసం ముందే సంస్థ అనే మోడల్ను పరీక్షిస్తున్నారు.ఈ ముగ్గురిలో కామన్ పాయింట్ ఏంటంటే.. తమ బ్రాండ్, తమ ఆలోచన, తమ నెట్వర్క్తో కొత్త రాజకీయ స్థావరాన్ని నిర్మించాలనుకుంటున్నారు. అయితే కులం, మతం, ప్రాంతీయ సమీకరణాలు భారత రాజకీయాల్లో ఇంకా బలంగానే ఉన్నాయి. దశాబ్దాలుగా గ్రామస్థాయిలో పనిచేస్తున్న సంప్రదాయ పార్టీల కేడర్ను సోషల్ మీడియా ఒక్కరోజులో భర్తీ చేయలేదు. అలాగే నాయకుడి వ్యక్తిగత బ్రాండ్పై ఆధారపడిన పార్టీకి.. ఆ బ్రాండ్ బలహీనపడితే ఏం జరుగుతుందన్నది మరో పెద్ద ప్రశ్న.కొత్త గేమ్ మొదలైందా?అందుకే పీకే, విజయ్, అన్నామలై ప్రయోగాలను ఇప్పుడే విజయవంతమైన కొత్త మోడల్గా తేల్చలేం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. భారత రాజకీయాల ‘గేమ్’లో కొత్త ప్లేయర్లు రంగంలోకి దిగారు. ఇక అసలు ప్రశ్న ఒక్కటే.. కులం.. కుటుంబం.. కేడర్ చుట్టూ తిరిగిన పాత రాజకీయాలకు ఇది ప్రత్యామ్నాయమా? లేక కొత్త బ్రాండ్తో అదే పాత రాజకీయాలకే మరో రూపమా?. మూడు ప్రయోగాలు. భారత రాజకీయాల్లో కొత్త గేమ్ మొదలైందా? అనే చర్చ నడుస్తోంది. -
నో డివోర్స్ సీఎం విజయ్ కి బిగ్ రిలీఫ్
-
ఎన్ని అవమానాలకైనా సిద్ధమే.. విజయ్ స్పీచ్ తో దద్దరిల్లిన అసెంబ్లీ
-
తమిళనాడు అసెంబ్లీలో CM విజయ్ Vs ఉదయనిధి స్టాలిన్
-
తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన విజయ్ ప్రభుత్వం
-
త్రిష మేడం రాజకీయ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు
-
ట్రెండింగ్లో ఉదయ్నిధి.. భార్య కృతికా, పిల్లలను చూశారా? (ఫొటోలు)
-
సీఎం విజయ్కు బిగ్ షాక్.. ఉదయనిధి సంచలన ఆరోపణలు..
చెన్నై: తమిళనాడులో అధికార టీవీకే ప్రభుత్వంపై మాజీ మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజల జీవనాధారమైన కావేరి జలాల అంశంలో ముఖ్యమంత్రి విజయ్ మౌనం పాటిస్తున్నారని ఆరోపించారు. కావేరి వివాదంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని అన్నారు.తాజాగా మీడియాతో మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్.. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాల్లో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందించడం లేదని విమర్శించారు. ముఖ్యంగా కావేరి జలాల అంశం తమిళనాడు రైతుల జీవనాధారానికి సంబంధించిన సమస్య అయినప్పటికీ, ముఖ్యమంత్రి విజయ్ ఇప్పటివరకు దీనిపై స్పష్టమైన ప్రకటన చేయలేదని ఆరోపించారు.‘కావేరి వివాదంపై ముఖ్యమంత్రి విజయ్ ఎందుకు నోరు విప్పడం లేదు? రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడాల్సిన సమయంలో ప్రభుత్వం మౌనం పాటిస్తోంది’ అని ఉదయనిధి ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో సోషల్ మీడియా ప్రచారానికే పరిమితమైందని కూడా ఆయన విమర్శించారు. ‘ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరూ రీల్స్ చేయడంలోనే బిజీగా ఉన్నారు. పాలన కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు’ అంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వంపై కూడా టీవీకే ప్రభుత్వం ప్రశ్నలు లేవనెత్తడం లేదని ఉదయనిధి ఆరోపించారు. "బీజేపీని ముఖ్యమంత్రి విజయ్ ఒక్క మాట కూడా అనడం లేదు. రాష్ట్ర హక్కుల విషయంలో కేంద్రాన్ని నిలదీయాల్సిన సమయంలో మౌనం ఎందుకు పాటిస్తున్నారు?" అని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా.. కావేరి జలాల అంశం దశాబ్దాలుగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా ఉంది. ప్రతి ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు నీటి విడుదల అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తుతుంటాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బలమైన వైఖరి తీసుకోవాలని ఉదయనిధి స్టాలిన్ సూచించారు. రాష్ట్ర హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్న ఆయన.. కావేరి వివాదంపై సీఎం విజయ్ తన వైఖరిని ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై దృష్టి సారించి, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. ఉదయనిధి చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో మరోసారి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. కావేరి జలాల అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. -
విజయ్ Vs ధనుష్ రాధన్ పండిత్ మరో సంచలనం
-
సరికొత్త రికార్డుపై కన్నేసిన విజయ్ సర్కార్!
సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మిల్లో భాగంగా విద్యార్థులకు వారానికి ఓకసారి చికెన్ బిర్యానీ పెట్టేందుకు దాదాపు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఒక వేళ ఈ పథకం అమలైతే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చికెన్ బిర్యాణీ పెట్టిన రాష్ట్రంగా తమిళనాడు రికార్డు సృష్టించనుంది.మధ్యాహ్న భోజన పథకంలో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీని చేర్చాలనే ప్రతిపాదన వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల్లో హాజరు శాతం పెంచడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్లను తగ్గించడం తదితర కారణాలున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు, విద్యార్థులకు మరింత పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు పాఠశాలలపై ఆసక్తిని పెంచేందుకు సీఎం విజయ్ ఈ అంశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న సుమారు 40 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అందుతోంది. 11, 12వ తరగతులు (ఇంటర్మీడియట్) చదివే విద్యార్థులకు కూడా పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఒకవేళ అది అమలైతే అప్పుడు విద్యార్థుల సంఖ్య దాదాపు 48 లక్షలకు చేరుతుంది.కాగా ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో వారానికి ఒకసారి కేవలం వెజిటబుల్ బిర్యానీ లేదా పులావ్ మాత్రమే మెనూలో భాగంగా ఇస్తున్నారు. దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు కేవలం గుడ్లు, అరటిపండ్లు లేదా పాలు మాత్రమే అదనపు పోషకాహారంగా అందిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాలు గతంలో చికెన్ కర్రీ ఇస్తామని ప్రకటించినప్పటికీ, అది కొన్ని నెలల ప్రత్యేక ప్యాకేజీగా మాత్రమే ఉంది తప్ప నిరంతరంగా వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ ఇచ్చేలా ఏ రాష్ట్రం కూడా శాశ్వత ప్రతిపాదనలు సిద్ధం చేయలేదు.తొలిసారిగా మిడ్డే మీల్ భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం తమిళనాడే. బ్రిటీష్ కాలంలో (1920లలో) మద్రాస్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని పాఠశాలల్లో దీన్ని చిన్నస్థాయిలో ప్రారంభించగా, ఆ తర్వాత ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కె. కామరాజ్ ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల కోసం ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగావిస్తరింపజేశారు.ఇప్పుడు విద్యార్థుకు చికెన్ బిర్యాణీ పెడితే మరోసారి తమిళనాడు రికార్డు సృష్టించనుంది. -
విజయ్ సర్కార్ ఆంక్షలు.. ఏపీ సహా మూడు రాష్ట్రాలకు సరఫరా బంద్!
తమిళనాడులో టీవీకే విజయ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణ రంగానికి కీలకమైన రఫ్ స్టోన్, ఎం-శాండ్, మెటల్ జెల్లీ వంటి నిర్మాణ సామగ్రిని పొరుగు రాష్ట్రాలకు తరలించడంపై తమిళనాడు ప్రభుత్వం మూడు నెలలు తాత్కాలిక నిషేధం విధించింది. రాష్ట్రంలో పెరుగుతున్న నిర్మాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా, తమిళనాడు నిర్ణయం దక్షిణ రాష్ట్రాల మధ్య మౌలిక వసతుల అభివృద్ధి, వనరుల వినియోగం, ప్రాంతీయ ఆర్థిక సమతుల్యతపై ప్రభావం చూపే నిర్ణయంగా మారింది.అయితే, ముఖ్యమంత్రి విజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, రహదారులు, గృహ నిర్మాణాలు, పారిశ్రామిక ప్రాజెక్టుల కారణంగా తమిళనాడులో నిర్మాణ సామగ్రికి డిమాండ్ భారీగా పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పనిచేస్తున్న క్వారీల నుంచి లభిస్తున్న రాళ్లు, నిర్మాణ అగ్రిగేట్లు స్థానిక అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతున్నాయని పేర్కొంది. పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి తరలిపోవడం వల్ల రాష్ట్రంలో సరఫరా తగ్గి, ధరలు పెరుగుతున్నాయని ప్రభుత్వం అభిప్రాయపడింది.ఈ నిషేధం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు వెళ్లే నిర్మాణ సామగ్రిపై వర్తించనుంది. అయితే.. పుదుచ్చేరి, కారైకాల్కు మాత్రం మినహాయింపు ఇచ్చారు. నిషేధాన్ని అమలు చేసేందుకు సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు కఠిన పర్యవేక్షణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే అక్రమ మైనింగ్, ఖనిజ రవాణా చట్టాల కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ముఖ్యంగా కేరళలో నాణ్యమైన రాయి అగ్రిగేట్ల లభ్యత పరిమితంగా ఉండటంతో తమిళనాడులోని తిరునెల్వేలి, తెంకాసి, కన్యాకుమారి ప్రాంతాల నుంచి వచ్చే నిర్మాణ సామగ్రిపై అనేక ప్రాజెక్టులు ఆధారపడుతున్నాయి. జాతీయ రహదారులు, విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయం వంటి కీలక ప్రాజెక్టుల పనులకు సరఫరా అంతరాయం కలగవచ్చని కేరళ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని కోరింది.ఎందుకు ఈ నిర్ణయం?కాగా, తమిళనాడులో ప్రస్తుతం భారీ స్థాయిలో నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయి. కొత్త రహదారులు, పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులు, పరిశ్రమలు, గృహ నిర్మాణాల కోసం రాళ్లు, ఇసుక, ఇతర అగ్రిగేట్ల అవసరం పెరిగింది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న నిర్మాణ సామగ్రిలో కొంత భాగం పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడంతో స్థానిక మార్కెట్లో సరఫరా తగ్గుతోందని ప్రభుత్వం చెబుతోంది. దీని వల్ల ధరలు పెరిగి నిర్మాణ వ్యయాలు పెరుగుతున్నాయని వాదిస్తోంది.తమిళనాడు నిర్ణయం సహజ వనరుల నిర్వహణ, రాష్ట్ర అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలను ముందుకు తెస్తోంది. ఒక రాష్ట్రంలోని ఖనిజ వనరులు మరో రాష్ట్రంలోని అభివృద్ధి పనులకు ఉపయోగపడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలు-ప్రాంతీయ అభివృద్ధి అవసరాల మధ్య సమతుల్యతపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ అంశం కేవలం నిర్మాణ సామగ్రి రవాణా సమస్యగానే కాకుండా, దక్షిణాది రాష్ట్రాల మధ్య వనరుల వినియోగం, మౌలిక వసతుల అభివృద్ధి సమన్వయానికి సంబంధించిన అంశంగా మారింది. మూడు నెలల నిషేధ కాలంలో నిర్మాణ సామగ్రి ధరలు, సరఫరా పరిస్థితులు, ప్రాజెక్టులపై ప్రభావాన్ని ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది. ఆ తర్వాత నిషేధాన్ని కొనసాగించాలా, సడలింపులు ఇవ్వాలా అన్నదానిపై నిర్ణయం తీసుకోవచ్చు. -
డిప్యూటీ సీఎంగా సౌమ్య అన్బుమణి?
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు సతీమని , ఎమ్మెల్యే సౌమ్య మంత్రి కానున్నారన్న చర్చ ఊపందుకుంది. సీఎం విజయ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలోకి నలుగురు ఎమ్మెల్యేల్ని కలిగిన పీఎంకే చేరబోతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. టీవీకేతో ఇటీవల కాలంలో పీఎంకే సన్నిహితంగా ఉంటూ వస్తోంది. తాజాగా పార్టీకి సంబంధించిన పూర్తి బాధ్యతలు, అధికారాలు అన్బుమణికి ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు అప్పగించేశారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడేందుకు పీఎంకే సిద్ధమవుతున్నట్టు చర్చ ఊపందుకుంది. అదే సమయంలో సౌమ్య అన్బుమనికి మంత్రి పదవి అప్పగించనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం సీఎం విజయ్ మంత్రి వర్గాన్ని విస్తరించనున్నట్టు ఇప్పటికే చర్చజోరుగా సాగుతుండటం గమనార్హం. -
‘ఆ ప్రభుత్వ ఉద్యోగాలు చెల్లవు’.. సీఎం విజయ్కు మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ
సాక్షి,చెన్నై: మద్రాస్ హైకోర్టులో సీఎం విజయ్కు ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ తొక్కిసలాట కుటుంబాలకు సీఎం విజయ్ అందించిన ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను రద్దు చేసింది. గతేడాది సెప్టెంబర్లో కరూర్లో టీవీకే నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తొక్కిసలాట జరిగి 41మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు నేతృత్వంలో తమిళనాడు రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం, సీబీఐ దర్యాప్తును కొనసాగిస్తున్నాయి.ఈ క్రమంలో గత నెలలో సీఎం విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలలోని 32 మందికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందించారు. ఆ నియామకాలపై దాఖలైన పిటిషన్లపై సోమవారం మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో కరూర్ బాధిత కుటుంబాలకు సీఎం విజయ్ అందించిన ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు చెల్లవని స్పష్టం చేసింది. రాజ్యాంగ పరిమితులకు లోబడే వ్యవహరించాలని ఆదేశించింది. బాధితులకు ఆర్ధిక సాయం అందించవచ్చు. కానీ ఉద్యోగం ఇవ్వడం సమంజసం కాదని తెలిపింది. ప్రభుత్వ బస్సుల్లో మరణించినవారికి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తారా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగం అనేది అర్హత, నిర్దేశిత నియామక ప్రక్రియ (TNPSC వంటి పరీక్షలు) ద్వారా రావాలే తప్ప, ఇలా ఉచితంగా పంచేది కాదని స్పష్టం చేసింది.ఇది సాధారణ అభ్యర్థుల సమానత్వ హక్కును దెబ్బతీస్తుందని పేర్కొంది. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ఎంతైనా ఆర్థిక సాయం అందించుకోవచ్చని, కానీ రాజ్యాంగ నిబంధనలు, పరిమితులను దాటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. అర్హత ఉన్నవారికే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా పెట్టేది కాదని వ్యాఖ్యానిస్తూ కరూర్ బాధితులకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని తీర్పు ఇచ్చింది. దీంతో సీఎంగా విజయ్కు తొలిసారి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే సీఎం విజయ్ తీసుకున్న ఈ ప్రతిష్టాత్మక నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చడం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. -
సీఎం విజయ్పై సీనియర్ నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయాల్లోకి వస్తారని అస్సలు ఊహించలేదని సీనియర్ నటుడు నిళ్గల్ రవి అన్నారు. షూటింగ్లో రాజకీయాల గురించి విజయ్ ఎప్పుడూ మాట్లాడేవారు కాదని, అలాంటిది పాలిటిక్స్లోకి ఎంటరై ముఖ్యమంత్రి కావడం తనకు ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.విజయ్ రాజకీయ ప్రయాణం ఊహించలేదువిజయ్ ముఖ్యమంత్రిగా ఎదుగుతారని తాను ఎప్పుడూ ఊహించలేదని నిళ్గల్ రవి అన్నారు. "నేను విజయ్తో 'ఖుషి' (2000), 'తిరుమలై' (2003), 'కావలన్' (2011) చిత్రాల్లో కలిసి నటించాను. షూటింగ్ సమయంలో ఎన్నోసార్లు మాట్లాడినా, ఆయనలో రాజకీయాలపై ఆసక్తి కనిపించలేదు. నిజంగా ఇది నాకు పెద్ద ఆశ్చర్యమే. 1990ల మధ్యలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నాను. కానీ ఆ అవకాశం విజయ్కు రావడం ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండేవారు. తెరపై ఎలా భిన్నంగా కనిపిస్తారో, రాజకీయాల్లో కూడా 'సైలెంట్ డైనమైట్'గా తన సత్తా చాటార''ని కొనియాడారు.అభిమానుల ప్రేమ అసాధారణం'జన నాయగన్' సినిమాను అభిమానుల సమక్షంలో ధియేటర్లో చూసినట్టు వెల్లడించారు. "మదురైలో జన నాయకన్ సినిమా చూశాను. విడుదల రోజున అక్కడ షూటింగ్ ఉండటంతో ప్రత్యేకంగా అనుమతి తీసుకుని సినిమాకు వెళ్లాను. కమల్ హాసన్ 'నాయకన్' విడుదల సమయంలో చూసిన సంబరాల తర్వాత, ఇలాంటి అభిమానుల ఉత్సాహాన్ని ఇప్పుడు 'జన నాయకన్'కే చూశాను. విజయ్పై ప్రజలకు ఉన్న ప్రేమ, అభిమానం అసాధారణం. సినిమాలో నా పాత్రకు కూడా మంచి స్పందన వచ్చింది. చాలా ఏళ్లుగా మాట్లాడని వారు కూడా ఫోన్ చేసి అభినందించడం ఆనందంగా ఉంది" అని తెలిపారు.నేరేషన్ అవకాశాలు పెరిగాయి'జన నాయకన్' సినిమాలో స్క్రీన్ టైమ్ తక్కువే ఉన్నప్పటికీ, కథను ముందుకు నడిపే పాత్ర దక్కడం సంతృప్తినిచ్చిందని రవి చెప్పారు. "వాయిస్ యాక్టింగ్ ఎంత శక్తివంతమైన అంశమో 'కేజీఎఫ్' సినిమా తర్వాత అందరికీ తెలిసింది. అప్పటి నుంచి నాకు నేరేషన్ అవకాశాలు పెరిగాయి. 'జన నాయకన్'లో కూడా అలాంటి అవకాశం వచ్చింది. డాక్యుమెంటరీలకు నేరేషన్ ఇవ్వడం ఒకలా ఉంటే, సినిమాల్లో మాత్రం సన్నివేశానికి అనుగుణంగా స్వరంలో భావోద్వేగాలు జోడించే అవకాశం ఉంటుంది. దర్శకుడు వినోద్ నాపై పూర్తి నమ్మకం ఉంచి స్వేచ్ఛ ఇచ్చారు" అని తెలిపారు.విలన్ పాత్రలకు సిద్ధమేతన సినీ జీవితంలో ఎక్కువగా తెలివైన, అసలు స్వరూపాన్ని చివర్లో బయటపెట్టే పాత్రలే వచ్చాయని, కానీ పూర్తిస్థాయి విలన్ పాత్రలు మాత్రం ఎక్కువగా దక్కలేదని రవి తెలిపారు. "రజనీకాంత్తో చేసిన అనేక సినిమాల్లో మాయమాటలు చెప్పే, కుట్రలు పన్నే పాత్రల్లో కనిపించాను. దర్శకులు నన్ను అలాంటి పాత్రలకే ఎక్కువగా ఎంపిక చేశారు. అయితే బహిరంగంగా కనిపించే విలన్ పాత్రలు చేయడానికి కూడా నేను సిద్ధమే. నాకు పాత్రల పరిమాణం కంటే నటనపై ఉన్న ప్రేమే ముఖ్యమైనది. అందుకే పాత్రల కోసం ఎప్పుడూ వెతకాలేదు. వచ్చిన అవకాశాలనే స్వీకరించాను" అని చెప్పారు.చదవండి: 23 ఏళ్లుగా కనిపించని ప్రముఖ నటుడు!తదుపరి చిత్రాలుప్రస్తుతం నిళ్గల్ రవి (Nizhalgal Ravi) కార్తీ–పీఎస్ మిత్రన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'సర్దార్ 2'లో నటిస్తున్నారు. అలాగే దర్శకుడు చింబు దేవన్ రూపొందిస్తున్న కామెడీ చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. -
పాపం ధనుష్.. ఆ మాటలకే ఇన్ని తిట్లా?
సినీ పరిశ్రమకు, రాజకీయాలకు మధ్య అనుబంధం తమిళనాట కొత్తేమీ కాదు. తెరపై భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్న పలువురు నటులు.. ఆ తర్వాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. అభిమాన సంఘాలను సేవా కార్యక్రమాల వేదికగా మార్చుకుని.. ఆ తర్వాత రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్ ప్రయాణం ఇప్పుడు మరికొందరు సినీ ప్రముఖుల భవిష్యత్తుపైనా ఆసక్తి పెంచింది.ఈ క్రమంలోనే మరో స్టార్ హీరో ధనుష్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. అభిమానుల్లో, నెటిజన్లలో కొత్త చర్చకు కారణమయ్యాయి. అయితే ధనుష్ అసలు రాజకీయాల గురించి ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఆయన మాటలను కొందరు పొలిటికల్ యాంగిల్లో విశ్లేషిస్తున్నారు. తన అభిమానులను ఉద్దేశించి ధనుష్ మాట్లాడుతూ.. కేవలం సినిమా వేడుకలు, అభిమానుల సమావేశాలకే పరిమితం కాకుండా.. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.“ఒకచోట ఇంతమంది కలవడం వెనుక ఎంతో శక్తి ఉంది. ఆ శక్తికి ఒక లక్ష్యం ఉండాలి. ఆడియో లాంచ్లు, మీటింగ్స్కే పరిమితం కాకుండా.. మీ చుట్టూ ఉన్న ప్రజలకు సహాయం చేయండి. మీ ప్రాంతంలోని కుటుంబాలకు అండగా నిలవండి. మీపై నేను మరింత గర్వపడేలా చేయండి” అంటూ ధనుష్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.ఇక్కడి నుంచే అసలు చర్చ మొదలైంది. “ఇది కేవలం అభిమానులకు ఇచ్చిన సామాజిక సందేశమా? లేదంటే భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి సంకేతమా?” అని చర్చ మొదలుపెట్టారు. అయితే ఈ చర్చకు మరో కారణం విజయ్ రాజకీయ ప్రయాణమే. విజయ్ కూడా గతంలో తన అభిమాన సంఘాల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో ధనుష్ కూడా అదే దారిలో వెళ్తున్నారా? అంటూ కొందరు పోల్చడం మొదలుపెట్టారు.ఇటు విజయ్ అభిమానులు మాత్రం ఈ ప్రచారాన్ని తప్పుబడుతున్నారు. “విజయ్ బాటను కాపీ చేస్తున్నారా?” అంటూ కొందరు సోషల్ మీడియాలో ధనుష్ను ట్రోల్ చేస్తున్నారు. ఇదే సమయంలో ధనుష్ను ఆయన మాజీ మామ, సూపర్స్టార్ రజినీకాంత్తో పోలుస్తూ కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఏళ్ల తరబడి ఊహాగానాలు వచ్చినప్పటికీ.. చివరకు ఆయన వెనక్కి వెళ్లిపోయారు. విజయ్ గెలుపు సమయంలోనూ అభినందించకుండా ‘అసూయ’ను ప్రదర్శించారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో “రజినీకాంత్ వల్లే కాలేదు.. ఇంక ధనుష్ ఏం చేస్తారు?” అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.అయితే ధనుష్ అభిమానులు మాత్రం సేవా కార్యక్రమాల వైపు మళ్లించడం మాత్రమే రాజకీయ ఎంట్రీకి సంకేతం కాదని, ప్రతి హీరో వ్యాఖ్యలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదంటున్నారు. రాజకీయ ప్రవేశంపై ధనుష్ ఇప్పటిదాకా ఎలాంటి సంకేతం ఇవ్వలేదు. ఆయన వ్యాఖ్యలు అభిమానులను బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరిన సందేశంగానే కనిపిస్తున్నాయి. కానీ తమిళనాడులో సినీ హీరోలకు ఉన్న ప్రజాదరణ, అభిమాన సంఘాల ప్రభావం కారణంగా ఇలాంటి చిన్న వ్యాఖ్యలు కూడా పెద్ద రాజకీయ చర్చలకు దారి తీస్తున్నాయి. -
కర్ణాటకకు సీఎం విజయ్.. డీకేతో సమావేశం
సాక్షి, చెన్నై/బనశంకరి: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆగస్టు 3న కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్తో సమావేశమై కావేరి జలాల పంపిణీతో పాటు మేకెదాటు డ్యామ్ నిర్మాణం అంశాలపై చర్చించనున్నారు.ఈ విషయాన్ని తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి వినోద్ కుంభకోణంలో శుక్రవారం వెల్లడించారు. కర్ణాటక ప్రభుత్వం కావేరి నీటిని విడుదల చేయకపోవడంతో మెట్టూరు జలాశయం పూర్తిగా ఎండిపోయిందని, దీంతో తమిళనాడులోని డెల్టా జిల్లాల్లో వరి సాగు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆయన తెలిపారు. అలాగే, కావేరి నదిపై మేకెదాటు వద్ద కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డ్యామ్ నిర్మాణాన్ని తమిళనాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని మంత్రి స్పష్టం చేశారు.కావేరి జల వివాదం నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కీలకంగా మారింది. ఈ భేటీలో నీటి విడుదల, రైతుల ప్రయోజనాలు, మేకెదాటు ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
‘జన నాయగన్’ ట్విటర్ రివ్యూ
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్( తెలుగులో జన నాయకుడు). . హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాల మధ్య నేడు(జులై 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చెన్నైతో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకుల సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.ఎక్స్లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా అదిరిపోయిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తే.. యావరేజ్ సినిమా అని మరి కొంతమంది చెబుతున్నారు. విజయ్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరోని తెరపై చూసి మురిసిపోతున్నామని చెబుతున్నారు. సినిమాలో విజయ్ వేసిన స్టెప్పులకు సంబంధించిన వీడియో క్లిప్పులు నెట్టింట వైరల్గా మారాయి.‘సీఎం విజయ్ యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. దర్శకుడు వినోద్ సినిమాను బాగా తెరకెక్కించాడు. యాక్షన్ సీన్స్కి అనిరుధ్ ఇచ్చిన బీజీఎం అదిరిపోయింది. పూజా హెగ్డే గ్లామర్ మరో ప్లస్ పాయింట్ అంటూ ఓ నెటిజన్ 4 రేటింగ్ ఇచ్చాడు.#JanaNayaganReview : 4/5 ⭐️⭐️⭐️⭐️#JanaNayagan CM Vijay's High Action & Political Sequence Movie Director #HVinoth Balanced both Cenematic Metric Space @anirudhofficial BGM Score action Sequence, Choreography #PoojaHegde Glamour and #Vijay Fans Fest in Theatres..— South Digital Media (@SDM_official1) July 23, 2026#JanaNayaganReview1st Half:Kerala Fan sitting nearby ~Ditto of leaked version it seems😂Lag, CG worst 😂Cringe pro maxxx dialogues & delivery🤣🐿️s Vinoth ah thookitu poga poranunga😭Most importantly waiting for the response from Islamic parties who offered Support🫣 pic.twitter.com/nM2E1bvWlD— Kingsley (@CineKingsley) July 23, 2026❤️❤️❤️From Thalapathy to CM – today marks one last big-screen journey for Anna with #JanaNayagan ❤️❤️❤️ Fans across TN & beyond are pouring love, from FDFS crowds to emotional celebrations.Cinema gave us a hero; politics now tests the leader. ❤️#JanaNayagan #ThalapathyVijay… pic.twitter.com/EvIvgI5tt9— CM Vijay Rising (@CMVijayRising) July 23, 2026#JanaNayagan Mediocre 1st Half!The interval block is solid and the main highlight so far. Apart from that and a few template elevation scenes, the execution has been sloppy. Bobby Deol’s villain track is absurd, the VFX is poor, and the core daughter emotion feels half baked.…— Venky Reviews (@venkyreviews) July 23, 2026#JanaNayaganFirst half is purely Mass Overloaded... THALAPATHY peak elevation...Never seen before....Enjoy Thalapathy..KGF elevation pathurukom.... Thalapathy ku intha padathula parungaaaa🔥🔥🔥— Praveen Kumar (@Praveen02kumar) July 23, 2026#ThalapathyViiay #JananayaganFirst Half - A Pakka commercial entertainer filled with complete mass moments🥶🔥Anirudh bgm elevate scenes🔥🔥🥵One last dance pic.twitter.com/HLkat99789— Ad Entertainment (@AdithianAd74923) July 23, 2026#JanaNayagan:One Last Dance – the extended 1.5-minute vintage Thalapathy dance sequence is an absolute treat for fans. 💥The interval fight is pure fire! 🔥🔥🔥The first half is a complete mass entertainer, especially for those who haven't watched Bhagavanth Kesari. For…— cinee worldd (@Cinee_Worldd) July 23, 2026One last Peak Tittle Card for Honourable CM @actorvijay ❤️🔥💥 #JanaNayakudu #JanaNayagan pic.twitter.com/gT8PGOAi9r— Rãm Teetøtàller (@urstruly_hrb23) July 23, 2026Exact remake of Bhagavat kesariFirst half looks very bad#JanaNayagan #JananayaganReview#JananayaganDisaster— AssaultSethu (@Assault002) July 23, 2026 -
నంబర్-1గా తమిళనాడు
తమిళ భాషా, సంస్కృతి పరిరక్షణకు, తమిళుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు టీవీకే ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని సీఎం విజయ్ స్పష్టం చేశారు. తమిళనాడు దినోత్సవం సందర్భంగా ప్రజలతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సాక్షి, చెన్నై: తమిళనాడు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం విజయ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ చారిత్రాత్మకమైన రోజున, తమిళనాడును భారతదేశంలోనే అన్ని రంగాలలో అగ్రగామి (నంబర్ వన్) రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం విజయ్ తన సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ సందేశాన్ని పంచుకున్నారు. తమిళుల ప్రాచీనత, ఘనమైన చరిత్ర, సంస్కృతి , భాషా చైతన్యానికి గౌరవసూచకంగా రాష్ట్రానికి తమిళనాడు అని నామకరణం చేస్తూ నాటి శాసనసభలో తీర్మానం ఆమోదించిన చారిత్రాత్మక రోజు ఇదే అని వ్యాఖ్యలు చేశారు. ఈ పవిత్రమైన ’తమిళనాడు దినోత్సవం’ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. రెండు ముఖ్యమైన రోజులు మద్రాసు రాష్ట్రం ఏర్పడిన నవంబర్ 1వ తేదీని, అలాగే పెరరిగ్నర్ అన్నాదురై నేతృత్వంలోని శాసనసభలో రాష్ట్రానికి తమిళనాడు అని పేరు మార్చాలనే చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదించిన జూలై 18వ తేదీ అంటూ ఈ రెండు రోజులను తమ ప్రభుత్వం అధికారికంగా జరుపుకోబోతోందని ప్రకటించడానికి సంతోషిస్తున్నానని సీఎం తెలిపారు. ‘సమానత్వం, సామాజిక న్యాయం వర్ధిల్లేలా.. విద్య, ఆధునిక సాంకేతికత, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధిలో రాణిస్తూ, శాస్త్రీయ భాషా సంపదకు పుట్టినిల్లుగా ఉన్న తమిళనాడును భారతదేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా నిలబెట్టాలని అందరం ప్రతిజ్ఞ చేద్దాం అని పిలుపునిచ్చారు. చివరగా, తమిళ భాషా మాధుర్యం, తమిళుల ఉన్నత సంస్కృతి , మానవతా సంప్రదాయం రాబోయే తరాలకు సగర్వంగా వరి్ధల్లాలని ఆకాంక్షిస్తూ, తమిళనాడు రాష్ట్ర ఏర్పాటు కోసం , తమిళ గుర్తింపు కోసం కఠోర శ్రమ చేసిన అమరవీరులను, త్యాగధనులను ఈ సందర్భంగా స్మరించుకుంటూ సీఎం విజయ్ వారికి ఘన నివాళులరి్పంచారు. కాగా, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సైతం తమిళనాడు దినోత్సవాన్ని పురస్కరించుకుని లండన్ నుంచి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలుతెలియజేస్తూ, తన సందేశాన్ని పంపించారు. -
‘ప్రాజెక్ట్ మేఘాలయ’ కలకలం.. విజయ్ ప్రభుత్వమే టార్గెట్?
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘ప్రాజెక్ట్ మేఘాలయ’ వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పథకం రచించారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేకు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేసి పార్టీ విప్కు వ్యతిరేకంగా ఓటు వేయించే ప్రయత్నం జరిగిందని వచ్చిన ఆరోపణలతో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ వ్యవహారానికి కేంద్రబిందువుగా నిలిచింది టీవీకే ఎమ్మెల్యే ఎన్. ఎలైయరాజా చేసిన ఫిర్యాదు. తనను కొందరు వ్యక్తులు సంప్రదించి, అసెంబ్లీలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారని ఆయన ఆరోపించారు. అందుకు ప్రతిఫలంగా రూ.35 కోట్ల వరకు నగదు ఇస్తామని, భవిష్యత్తులో రాజకీయంగా కూడా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆరోపణల ప్రకారం, ఈ మొత్తం ప్రణాళికను ‘ప్రాజెక్ట్ మేఘాలయ’ అనే కోడ్ పేరుతో నిర్వహించినట్లు తెలిపారు. అయితే ఈ పేరును ఎందుకు ఉపయోగించారు? దీనికి మేఘాలయ రాష్ట్రంతో ఏమైనా సంబంధం ఉందా? లేక ఇది కేవలం రహస్య కోడ్ నామమా? అనే విషయంపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి వివరణ వెలువడలేదు. దర్యాప్తు అధికారులు కూడా ఈ అంశంపై వ్యాఖ్యానించలేదు.ఎలైయరాజా ఫిర్యాదు అనంతరం తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులను గుర్తించే పనితో పాటు, ఫోన్ కాల్ రికార్డులు, డిజిటల్ కమ్యూనికేషన్, ఆర్థిక లావాదేవీలు తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో యూట్యూబర్ తిరునావుక్కరసు, ఐపీడీఎస్ (IPDS) అభిప్రాయ సర్వే సంస్థతో అనుబంధం ఉన్న వ్యక్తి పేరు కూడా ప్రస్తావనకు రావడంతో దర్యాప్తు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.ఈ పరిణామాలపై అధికార టీవీకే పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరిగిందని ఆరోపించింది. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే చర్యలను సహించబోమని పార్టీ నాయకులు పేర్కొన్నారు. కుట్రలో పాల్గొన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.మాకేం సంబంధం?మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించాయి. ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాయి. ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందేందుకు నిరాధార ఆరోపణలు చేస్తోందని విమర్శించాయి. పూర్తి స్థాయి, నిష్పాక్షిక దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇటీవలి కాలంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నాలపై ఆరోపణలు రావడంతో, తమిళనాడులో వెలుగులోకి వచ్చిన ఈ కేసు కూడా జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. అయితే ఈ కేసులోని ఆరోపణలు నిజమా? లేదా రాజకీయ ఆరోపణలేనా? అన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం ఈ వ్యవహారం దర్యాప్తు దశలో ఉంది. ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు, రూ.35 కోట్ల లంచం ప్రతిపాదన, అలాగే ‘ప్రాజెక్ట్ మేఘాలయ’ పేరుతో ప్రభుత్వం అస్థిరపరిచే కుట్ర జరిగిందనే అంశాలు ఇంకా అధికారికంగా నిరూపితం కాలేదు. దర్యాప్తు సంస్థలు సేకరించే ఆధారాలు, విచారణలో వెలుగులోకి వచ్చే వివరాలు, తదుపరి న్యాయపరమైన ప్రక్రియల ఆధారంగానే ఈ కేసు వాస్తవ స్వరూపం బయటపడనుంది.జర్నలిస్టు విజయన్ను విచారించిన పోలీసులుదర్యాప్తులో భాగంగా ఓ చానల్కు చెందిన సీనియర్ జర్నలిస్టు విజయ్న్ను జూలై 15, 16 తేదీల్లో చెన్నై పోలీసులు విచారించారు. ప్రధాన నిందితుడు తిరునావుక్కరసుతో విజయన్కు ఫోన్ సందేశాలు, ఇతర కమ్యూనికేషన్ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం ఆయన మొబైల్ ఫోన్ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే జర్నలిస్టుపై నేరారోపణలు చేశామని పోలీసులు ప్రకటించలేదు. ఆయనతో జరిగిన సంప్రదింపుల స్వభావంపై మాత్రమే విచారణ సాగుతోందని తెలిపారు. -
మంత్రులకు సీఎం విజయ్ వార్నింగ్
-
విజయ్ దూకుడు.. అలాంటి అధికారులకు చెక్ పెట్టే కొత్త ప్లాన్!
తమిళనాడులో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల వ్యవహారాలను అరికట్టేందుకు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. లంచం అడిగే అధికారులు, ఉద్యోగులపై ప్రజలు నేరుగా సమాచారం అందించేలా కొత్త ఫోన్ నంబర్ను అందుబాటులోకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. లంచంపై సమాచారం ఇవ్వడానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. ఇందుకోసం 9498180936 నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.సీఎం విజయ్ కూడా తన పాలనలో అవినీతికి తావులేని ప్రభుత్వం అందిస్తామని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయబోమని గతంలో స్పష్టం చేశారు. పారదర్శక పాలన, జవాబుదారీతనం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలు పొందేందుకు ప్రజలు లంచాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉండకూడదని, అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తామని సీఎం విజయ్ ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రజల ఫిర్యాదుల ఆధారంగా తమిళనాడు అవినీతి నిరోధక శాఖ (DVAC) రంగంలోకి దిగి విచారణ చేపట్టనుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు, అనుమతులు, సంక్షేమ పథకాలు, ఇతర సేవల కోసం కొందరు అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.లంచం అడిగిన సందర్భాల్లో బాధితులు ఆలస్యం చేయకుండా విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. ఫిర్యాదుల ఆధారంగా అధికారులు నిఘా పెట్టి, అవసరమైతే ట్రాప్ ఆపరేషన్లు నిర్వహించే అవకాశం ఉంది. లంచం తీసుకుంటూ పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. అవినీతి రహిత పాలన అందించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని సీఎం విజయ్ చెబుతున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత పెంచడం, ప్రజలకు వేగంగా సేవలు అందించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే ఫిర్యాదుల వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలంటే వచ్చిన ప్రతి ఫిర్యాదుపై వేగంగా విచారణ, చర్యలు ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల నుంచి వచ్చే సమాచారంతో అవినీతిపై పోరాటం మరింత బలపడుతుందని అధికారులు భావిస్తున్నారు. -
రీల్స్ వ్యామోహం వదిలి హామీలు నెరవేర్చండి!
చెన్నై: తమిళగ వెట్రి కళగం పార్టీ ఎన్నికలలో చేసిన వాగ్దానాలను నెరవేర్చాలి, దాన్ని వదిలేసి, అనవసరంగా పంచి డైలాగ్ల గురించి మాట్లాడటంలో అర్థం లేదని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి, ప్రచార డిప్యూటీ సెక్రటరీ అప్సరా రెడ్డి విమర్శించారు. చెన్నై విమానాశ్రయం జరిగిన విలేకర్ల సమావేశంలో అన్నాడీఎంకే లో ప్రచార శాఖ డిప్యూటీ సెక్రటరీగా పనిచేసే అవకాశం కల్పించినందుకు ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళణి స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఏఐఏడీఎంకే పాలనలో ప్రజలకు ఇచ్చిన, చెప్పిన అన్ని వాగ్దానాలు నెరవేర్చిందన్నారు. ఏఐఏడీఎంకే ప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చిన ఏకైక ప్రభుత్వం అని అన్నారు. విజయ్ ప్రభుత్వం రీల్స్ వ్యామోహాన్ని విడిచిపెట్టాలన్నారు. ఎప్పటికైనా, ఏఐఏడీఎంకే ప్రభుత్వం చేసిన మంచి ప్రణాళికలను, ప్రస్తుత ప్రభుత్వ అవకతవకలను ప్రజలు గ్రహిస్తారని అభిప్రాయపడ్డారు. -
విజయ్ బర్త్డే వేడుకలపై ట్విస్ట్.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..
సాక్షి, చైన్నె: పాఠశాలలు, కళాశాలల్లో తమిళగ వెట్రి కలగం టీవీకే అధ్యక్షుడైన సీఎం విజయ్ జన్మదిన వేడుకలను నిర్వహించడంపై వివాదం నెలకొంది. ఈ వేడుకలపై దాఖలైన పిటిషన్ను స్వీకరించిన మద్రాస్ హైకోర్టు, దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.పిటిషనర్ అభ్యంతరంచైన్నె కార్పొరేషన్ డీఎంకే కౌన్సిలర్, న్యాయవాది అయిన కవిగణేశన్ ఈ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తన పిటిషన్లో జూన్ 22న టీవీకే అధ్యక్షుడి పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా ఉన్న పలు పాఠశాలల్లో ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలు, గుర్తులతో విద్యాసంస్థల ప్రాంగణంలో కార్యక్రమాలు నిర్వహించారని ఆరోపించారు. ఈ వేడుకల సందర్భంగా విద్యార్థులతో బలవంతంగా పుట్టినరోజు పాటలు పాడించి, నినాదాలు చేయించారన్నారు. మరీ ముఖ్యంగా, తిరువళ్లూరు జిల్లాలో దాదాపు 3000 మంది విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టి టీవీకే అధ్యక్షుడి ముఖచిత్రం (హ్యూమన్ చైన్ ఫార్మేషన్) వచ్చేలా చేశారని పేర్కొన్నారు. విద్యార్థులను ఇలాంటి రాజకీయ వేడుకలకు ఉపయోగించడం విద్యాసంస్థల మౌలిక ఆశయాలకే విరుద్ధమన్నారు. రాజకీయ, మతపరమైన సిద్ధాంతాలకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలను విద్యాసంస్థల ప్రాంగణాల్లో నిర్వహించరాదని తమిళనాడు ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన జీవో జారీ చేసిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.కఠిన చర్యలకు డిమాండ్..పాఠశాలల్లో రాజకీయ కార్యక్రమాలను నిషేధిస్తూ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను అత్యంత కఠినంగా అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని, విద్యాసంస్థల్లో ఇలాంటి ఉల్లంఘనలకు అనుమతించిన ప్రధానోపాధ్యాయులు, బాధ్యులైన సిబ్బందిపై విచారణ జరిపి వారిని సస్పెండ్ చేయడంతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు.న్యాయస్థానం స్పందనఈ కేసు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. ధర్మాధికారి, న్యాయమూర్తి జస్టిస్ జి. అరుళ్ మురుగన్ నేతత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది జె. రవీంద్రన్ వాదనలు వినిపిస్తూ, పాఠశాలల్లో రాజకీయ కార్యక్రమాలను అడ్డుకునే నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన న్యాయమూర్తులు, ఈ వ్యవహారంపై స్పందిస్తూ వివరణాత్మక కౌంటర్ దాఖలు చేయాలని తమిళనాడు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. -
మా జోలికి వస్తే.. మీ తాత వచ్చినా భయపడం
సాక్షి, చెన్నై : కేంద్రంలోని బీజేపీ అనే పెద్ద వాషింగ్ మెషీన్కు పోటీగా, తమిళనాడులో అవినీతిపరులను శుభ్రం చేయడానికి టీవీకే ఒక చిన్న వాషింగ్ మెషీన్లా ఆవిర్భవించిందని డీఎంకే యువజన నేత ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయ నిధి స్టాలిన్ ఎద్దేవా చేశారు. అయితే, ఎలాంటి ఆయుధంతోనైనా సరే.. డీఎంకేని ఎవరూ, ఏ పార్టీ కూడా తాకలేవని వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత, కరుణా నిధి 103వ జయంతిని పురస్కరించుకుని చెన్నైలో డీఎంకే ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ కార్యకర్తల సన్మాన కార్యక్రమం జరిగింది. ఇందులో 800 మందికి పైగా డీఎంకే కార్యవర్గ సభ్యులను ఉదయనిధి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అది ’రీల్స్’ ప్రభుత్వం – మంత్రులంతా దొంగలే ప్రస్తుత విజయ్ ప్రభుత్వంపై ఉదయనిధి స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాము సో షల్ మీడియాలో రీల్స్వేసి అధికారంలోకి వచ్చామ ని ఎంత చెప్పుకున్నా, ప్రస్తుతం వారు చేస్తున్నది కూడా కేవలం రీల్స్ వేయడమే తప్ప పాలన కాద న్నారు. ఈ ప్రభుత్వంలో ఎవరు మంత్రులో ముఖ్య మంత్రికే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. గతంలో పైరసీ వీసీడీలు అమ్మిన వ్యక్తి, బ్లాక్లో సినిమా టిక్కెట్లు అమ్మిన వ్యక్తి, బ్లాక్లో లాటరీ టిక్కెట్లు అమ్ముకున్న వ్యక్తులే తాజాగా మంత్రులుగా కూర్చున్నారనిధ్వజమెత్తారు. వీరి పేర్లు అందరి కీ తెలుసు, వీరిని ప్రత్యేకంగా శిక్షించాల్సిన అవస రం లేదని, ప్రజలే బుద్ధి చెబుతారని ఎద్దేవా చేశారు. మా జోలికి వస్తే.. మీ తాత వచ్చినా భయపడం: డీఎంకేను కేవలం రాజకీయ ప్రతీకార చర్యలతో భయపెట్టాలని చూస్తున్నారని ఉదయనిధి మండిపడ్డారు. తమ పార్టీ వర్గాలపై తప్పుడు కేసులు, బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేయాలనుకుంటే, తాను ఒకటే చెబుతున్నానని తమరు కాదు కదా, తమరి తాత దిగివచ్చినా సరే ఒక్క డీఎంకే కార్యకర్తను భయట పెట్టలేరని హెచ్చరించారు. అవినీతి కేసుల్లో ఉన్న అన్నాడీఎంకే నాయకుల్ని టీవీకేలోకి చేర్చుకోవడమే అవినీతి రహిత పాలనా.?. అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో శత్రువు ఎవరో తేల్చుకుంటాం గత ఎన్నికల్లో అసలైన శత్రువు ఎవరో తమకు స్పష్టత రాలేదని, అన్నాడీఎంకేను ఓడించడమే లక్ష్యంగా ముందుకెళ్లామన్నారు. అయితే, ఇక, రాబోయే ఎన్నికల్లో తమకు అసలైన శత్రువు ఎవరో పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వ్యూహాత్మకంగా బరిలోకి దిగుతామన్నారు. -
అప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా: కమల్ హాసన్
జీవితం అంటే కేవలం సోషల్ మీడియా రీల్స్ మాత్రమే కాదు. నేటి యువత, విద్యార్థులు మంచి రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలి అని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, తమిళ హీరో కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. విల్లుపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈయన, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తనకు రాజకీయాలు నేర్పిన వారు, తన లాంటి వారు, తందై పెరియార్ చేసిన రాజకీయాలనే చేస్తున్నారని అన్నారు. అందుకే రాజకీయమే తన వృత్తిగా మార్చుకున్నానని పేర్కొన్నారు.(ఇదీ చదవండి: ఆ ఒక్క కారణం వల్లే 'అబ్సెషన్' చూశారు)తాను ప్రజల కోసం పనిచేయడానికి వచ్చానని చెప్పి నాటకాలు ఆడాలనుకోవడం లేదని అన్నారు. సమాజంలో అవినీతి ఉందని చెబితే సరిపోదని, ఎవరైనా లంచాలు తీసుకుంటుంటే, అందులో ఇచ్చే వారి ప్రమేయం కూడా ఉంటుందన్నారు. లంచం ఇస్తే, తీసుకునే చేయి మరింత బలపడుతుందని స్పష్టం చేశారు. తాను చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పుడు నేరుగా స్టార్గానో, దర్శకుడిగానో రాలేదన్నారు. తన కష్టార్జితం, అర్హతల వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా తాను నేరుగా ముఖ్యమంత్రిగా రాలేదని, దానికి కావలసిన అర్హతలు తనకు వచ్చినప్పుడు, ప్రజలు తనకు ఆ పదవిని ఇస్తారని వ్యాఖ్యానించారు.సోషల్ మీడియా రీల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మంచి, చెడు రెండూ ఉన్నాయని కమల్ హాసన్ వివరించారు. సాంకేతికతను నేర్చుకున్న వారు దానిని ఒక వ్యాపారంగా మార్చుకునేంత వరకు నేర్చుకుంటున్నారని చెప్పారు. యువత వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో మంచి రాజకీయ నాయకుడు ఎవరో గుర్తించే వయసుకు తమరు చేరుకున్నారని ఆయన పేర్కొన్నారు. (ఇదీ చదవండి: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. మేకర్స్కి తమిళ నేత వార్నింగ్) -
విజయ్ మరో సంచలన నిర్ణయం.. కఠిన మార్గదర్శకాలు!
సాక్షి, చైన్నె: అవినీతి అంతం దిశగా రాష్ట్రంలోని సీఎం విజయ్ ప్రభుత్వం దూకుడు పెంచుతోంది. ప్రభుత్వ ఉద్యోగులపై నమోదయ్యే అవినీతి నిరోధక దర్యాప్తులు, శాఖాపరమైన విచారణలు సంవత్సరాల తరబడి సాగకుండా ఉండేందుకు కఠినమైన నిర్ణయానికి వచ్చారు. కాలపరిమితితో కూడిన సరికొత్త వివరణాత్మక మార్గదర్శకాలను తాజాగా జారీ చేసింది. అయితే, వివిధ శాఖలలో క్రమశిక్షణా చర్యల దర్యాప్తులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉండటంపై మద్రాస్ హైకోర్టు ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక ఉత్తర్వులను వెలువరించింది. అనవసరమైన జాప్యానికి కారణమయ్యే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన హైకోర్టు, అన్ని శాఖలలో పారదర్శకతను పెంచేలా మార్గదర్శకాలు ఉండాలని కోరింది.కాలపరిమితి నిర్దేశం, కొత్త నిబంధనలుప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులు, పింఛను (పెన్షన్) ప్రయోజనాలు ఈ పెండింగ్ కేసుల వల్ల నిలిచిపోకుండా చూసేందుకు ప్రత్యేక మార్గదర్శాలు, గడువులను విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.● అవినీతి నిరోధక శాఖలో నమోదైన కేసులలో, కేసు నమోదైన తేదీ నుండి 3 నెలలలోపు తుది నివేదిక ముసాయిదాను తప్పనిసరిగా సిద్ధం చేయాలి.● ప్రభుత్వ ఉద్యోగులపై నేరపూరిత దుష్ప్రవర్తన ఆరోపణలకు సంబంధించిన క్రమశిక్షణా చర్యల ప్రక్రియను గరిష్టంగా 9 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.● ఆరోపణలకు సంబంధించిన విచారణల్లో అవసరమైన పత్రాలు, సాక్ష్యాధారాలను 4 నెలల్లోగా సంబంధిత విభాగానికి అందజేయాలి.● అవినీతి కేసులలో ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత, దర్యాప్తు అధికారి 6 నెలల్లోగా దర్యాప్తును పూర్తి చేయాలి. అనంతరం 2 వారాల వ్యవధిలో తుది నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.● విచారణ నోటీసు అందిన 20 రోజుల్లోగా ప్రభుత్వం దీనిపై ఒక తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.ఉద్యోగ సంఘాల ఆహ్వానం..తాజాగా ఉత్తర్వులను ఉద్యోగ సంఘాలు ఆహ్వానించాయి. నిజాయితీపరులైన అధికారులు కూడా ఈ నిరంతర క్రమశిక్షణా చర్యల జాప్యం వలన ఇబ్బందులు పడుతున్నారని తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యనిర్వాహకులు పేర్కొన్నారు. టీవీకే విజయ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కాలపరిమితి విధానాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే దర్యాప్తు అధికారులు నిర్దేశించిన ఈ గడువులను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పాటించేలా చూడాలని వారు కోరారు. -
డీఎంకే ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. అరెస్టుకు కసరత్తు!
సాక్షి, చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేసిన కేసులో మాజీ మంత్రి, డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీని అరెస్టు చేయడానికి చెన్నై పోలీసులు కసరత్తు చేపట్టారు. ఇప్పటికే ఆయన సోదరుడు అశోక్ కుమార్పై కేసు నమోదు చేశారు.కాగా, విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు పలు బృందాలు రంగంలోకి దిగినట్టు ఇళయరాజ అనే ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం బుధవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు. వీరు ఇచ్చిన సమాచారంతో గురువారం మరో ఐదుగురిని అరెస్టు చేశారు. ఇందులో ఓ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత ఉన్నారు. కొందరు టీవీకే ఎమ్మెల్యేలకు రూ. 35 కోట్లు, మరికొందరికి రూ. 50 కోట్ల మేరకు ఆఫర్ ఇవ్వడం, బెదిరింపులకు కూడా పాల్పడినట్టు చెన్నై పోలీసుల విచారణలో తేలింది. పట్టుబడ్డ వారు ఇచ్చిన సమాచారంతో మాజీ మంత్రి , డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్కుమార్పై పోలీసులు దృష్టి సారించారు. అశోక్కుమార్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. సెంథిల్ బాలాజీని సైతం ఈ కేసు పరిధిలోకి తెచ్చి, ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ అన్నదమ్ముల కోసం కరూర్, కోయంబత్తూరులో పోలీసులు గాలిస్తున్నారు. -
విజయ్ దూకుడు.. తమిళ రాజకీయాల్లో సంచలనం!
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే (AIADMK) నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వందలాది మంది కీలక నేతలు అధికార తమిళగ వెట్రి కళగం (TVK)లో చేరేందుకు సిద్ధమవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కనీసం ఐదుగురు మాజీ మంత్రులు, సుమారు 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, వందలాది మంది జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు టీవీకేలో చేరనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.ఈ చేరికల్లో మాజీ మంత్రులు సీ. విజయభాస్కర్, ఎం.ఆర్. విజయభాస్కర్, ఎం.ఎస్.ఎం. ఆనందన్, ఎస్. వలర్మతి వంటి ప్రముఖ నేతలు ఉన్నట్లు సమాచారం. వీరిలో కొందరు ఇప్పటికే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. దీంతో అసెంబ్లీలో అన్నాడీఎంకే బలం కూడా క్రమంగా తగ్గుతోంది.అన్నాడీఎంకేలో వరుస వలసలు..కాగా, గత కొన్ని వారాలుగా అన్నాడీఎంకే నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు వరుసగా టీవీకే వైపు వెళ్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు విజయ్ సమక్షంలో టీవీకేలో చేరారు. తాజా చేరికలతో ఈ వలసలు మరింత వేగం పుంజుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, టీవీకే అధికారంలోకి వచ్చిన తర్వాత టీవీకే రాష్ట్రవ్యాప్తంగా తన సంస్థాగత బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అధికార పార్టీ కావడంతో అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఇతర పార్టీల నాయకులు టీవీకే వైపు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు, పాత ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే టీవీకేలో రాజకీయ భవిష్యత్ మెరుగ్గా ఉంటుందనే భావన కూడా కొంతమంది నాయకుల్లో కనిపిస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.అన్నాడీఎంకేకు ఇది హెచ్చరికేనా?వరుస రాజీనామాలు, సీనియర్ నేతల నిష్క్రమణ అన్నాడీఎంకే సంస్థాగత బలంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా జిల్లా స్థాయిలో ప్రభావం ఉన్న నాయకులు పార్టీని వీడటం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్పై ప్రభావం పడొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ వలసలను ఎదుర్కొనేందుకు అన్నాడీఎంకే నాయకత్వం సంస్థాగత పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టే అవకాశముందని కూడా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలుఒకప్పుడు డీఎంకే–అన్నాడీఎంకే మధ్యే పరిమితమైన తమిళ రాజకీయాలు ఇప్పుడు టీవీకే ఎదుగుదలతో కొత్త దిశలో ప్రయాణిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ్ పార్టీ ఇతర పార్టీల నుంచి నాయకులను ఆకర్షించడంలో సఫలమవుతోంది. ఈ పరిణామాలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
సీఎం విజయ్కి బిగ్ షాక్.. కూటమి తొలి మీటింగ్లోనే భారీ ట్విస్ట్!
సాక్షి,చెన్నై: టీవీకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు అదిలోనే హంసపాదు ఎదురైంది. రాజకీయంగా ఒక కీలక పరిణామం ఎదురైంది. టీవీకే ప్రభుత్వానికి తాము కేవలం బయటి నుంచే మద్దతు ఇస్తామని వామపక్షాలు స్పష్టం చేశాయి. అందుకు ఊతం ఇచ్చేలా.. సీఎం విజయ్ అధ్యక్షతన జరిగిన కూటమి భాగస్వామ్య పార్టీల తొలి సమావేశానికి లెఫ్ట్ పార్టీల నాయకులు గైర్హాజరయ్యారు.రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహాన్ని ఖరారు చేసేందుకు కూటమి పార్టీలతో కలిసి సీఎం విజయ్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీకి టీవీకే మిత్రపక్షాలైన కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్, ఎండీఎంకే పార్టీల అగ్రనేతలు హాజరయ్యారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ బి. మాణిక్యం ఠాగూర్, సీనియర్ నాయకుడు పి. చిదంబరం, వీసీకే అధినేత తొల్ తిరుమావళవన్, ఎండీఎంకే నాయకుడు వైకో, ఐయూఎంఎల్ అధ్యక్షుడు కె.ఎం. ఖాదర్ మొహిదీన్లతో పాటు టీవీకే సీనియర్ నేతలు, మంత్రులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.దాదాపు గంటపాటు సాగిన ఈ సమావేశంలో.. మిత్రపక్షాలతో కలిసి రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని అందించడం, ఐదేళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేయడంపై ప్రధానంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్ర ఇంధన, న్యాయశాఖ మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ.. టీవీకే నేతృత్వంలోని ఈ కూటమికి ఒక ప్రత్యేక పేరును పెట్టాలనే ప్రతిపాదనను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిందని వెల్లడించారు. దీనిపై సీఎం విజయ్ కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులతో మరోసారి చర్చించి త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని చెప్పారు.నిర్మల్ కుమార్ వ్యాఖ్యలను సమర్థిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఎంపీ ఎస్. జోతిమణి మాట్లాడారు. టీవీకే, దాని భాగస్వామ్య పక్షాలకు ముఖ్యంగా లౌకికవాద సిద్ధాంతాలపై ఒకే రకమైన స్పష్టత ఉన్నందున ఈ కూటమి చాలా బలంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో తమ ఆలోచనలన్నింటినీ సీఎం విజయ్ చాలా శ్రద్ధగా విన్నారని ఆమె పేర్కొన్నారు. కాగా, కూటమి కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు త్వరలోనే ఒక సమన్వయకర్తను (కోఆర్డినేటర్) నియమించే అవకాశం ఉందని టీవీకే వర్గాలు తెలిపాయి. -
పెను సంచలనం.. సీఎం విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రూ.35 కోట్ల కుట్ర..
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం రేగింది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. టీవీకే పార్టీకి చెందిన ఉత్తంగరై ఎమ్మెల్యే డాక్టర్ ఎన్. ఇళయరాజాను రూ.35 కోట్ల భారీ లంచంతో ప్రలోభపెట్టి, క్రాస్ ఓటింగ్కు పాల్పడేలా చేయడానికి ఒక ముఠా ప్రయత్నించింది. దీనిపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు ఈ కుట్రతో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.తమిళనాడు అసెంబ్లీ స్పీకర్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని (క్రాస్ ఓటింగ్), ఇందుకు ప్రతిఫలంగా రూ.35 కోట్లు ఇస్తామని ఎమ్మెల్యే ఇళయరాజాకు ఆఫర్ వచ్చింది. ఒక పొలిటికల్ సర్వే సంస్థ ప్రతినిధిగా పరిచయం చేసుకున్న వ్యక్తి ఈ డీల్ మాట్లాడారు. మొత్తం 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి విజయ్ ప్రభుత్వాన్ని కూల్చడమే వీరి ప్రధాన లక్ష్యమని పోలీసుల దర్యాప్తులో తేలింది.ఈ రూ.35 కోట్ల లంచం ఆఫర్ వెనుక డీఎంకే అగ్రనేత, మాజీ మంత్రి వి. సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ కుమార్ ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారి కనుసన్నల్లోనే ఈ ఆపరేషన్ జరిగినట్లు నిఘా వర్గాల ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలు లభ్యమయ్యాయి. ఆఫర్ను తిరస్కరిస్తే ఎమ్మెల్యేను, ఆయన కుటుంబాన్ని చంపేస్తామని నిందితులు బెదిరించారు.బెదిరింపులు రావడంతో ఎమ్మెల్యే ఇళయరాజా వెంటనే చెన్నై పోలీస్ కమిషనర్ను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను (తిరునావుక్కరసు, నరేష్, త్యాగరాజన్) అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో ఈ ‘హార్స్ ట్రేడింగ్’(ఎమ్మెల్యేల కొనుగోలు) వ్యవహారం బయటపడటంతో తమిళనాడులో రాజకీయ వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. -
సీఎం విజయ్కు వైకో మద్దతు.. నిలదీసిన రిపోర్టర్పై తీవ్ర ఆగ్రహం!
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన రెండు రోజులకే, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో విలేకరుల సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చెంగల్పట్టులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన వైకో, ఆ సమయంలో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సహనం కోల్పోయారు. సదర జర్నలిస్టుపై నోరు పారేసుకున్నారు. గత ఐదేళ్ల డీఎంకే పాలనలో అవినీతి రాజ్యమేలిందని, భూ రిజిస్ట్రేషన్ల నుండి ప్రతిదానిలోనూ ‘కటింగ్, కమిషన్’ వసూలు చేశారని వైకో ఆరోపించారు. ఈ క్రమంలో ఒక జర్నలిస్ట్ జోక్యం చేసుకుంటూ..గత ఐదేళ్లుగా అదే కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఈ అవినీతిపై ఎందుకు నోరు మెదపలేదు?అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. కూటమి రాజకీయాల్లో కొన్ని పరిమితులు ఉంటాయని, కూటమి ధర్మాన్ని పాటించడం వల్లే అప్పుడు మాట్లాడలేకపోయానని వైకో వివరణ ఇచ్చారు.అయితే సదరు జర్నలిస్ట్ అదే ప్రశ్నపై పట్టుబట్టడంతో వైకో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. నువ్వు ఒక దురుద్దేశంతోనే ఇక్కడికి వచ్చావు. నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారు? మీ యజమాని పత్రికను అమ్ముకున్నాడు. నువ్వు కూడా ఒక అమ్ముడుపోయిన వ్యక్తివి’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతటితో ఆగకుండా సదరు విలేకరిని ప్రెస్ మీట్ వదిలి వెళ్ళిపోవాలని ఆదేశించారు. వైకో ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడున్న ఎండీఎంకే కార్యకర్తలు, మద్దతుదారులు సదరు జర్నలిస్ట్పైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే స్పందించి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు, డీఎంకే కూటమి నుండి బయటకు వస్తున్నట్లు జూన్ 27న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో వైకో అధికారికంగా ప్రకటించారు. గత తొమ్మిదేళ్లుగా కూటమిలో తమకు సరైన గౌరవం దక్కలేదని, డీఎంకే గుర్తుపై పోటీ చేయాల్సి రావడం తమ ఆత్మగౌరవానికి దెబ్బ తగిలిందని ఎండీఎంకే నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే కూటమి వీడిన వైకో, ఇప్పుడు డీఎంకే ప్రభుత్వ అవినీతిని టార్గెట్ చేస్తుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
రాజకీయ ఎంట్రీపై యూటర్న్.. లారెన్స్ షాకింగ్ నిర్ణయం
కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఎట్టకేలకు మౌనం వీడాడు. కొన్నిరోజుల క్రితం నుంచి ఇతడు రాజకీయాల్లోకి రానున్నాడని.. సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానంలో జరిగే ఉపఎన్నికల్లో నిలబడతాడనే రూమర్స్ చాలా వినిపించాయి. మూడు వారాల క్రితం దీని గురించి ప్రెస్ మీట్ పెట్టిన లారెన్స్.. చెప్పి చెప్పకుండానే మాట్లాడాడు. ఇప్పుడు ఎట్టకేలకు పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: కుమారస్వామి ఎక్కడివాడు? ఎన్టీఆర్ సినిమా వల్ల తెలుగు vs తమిళం)రెండు వారాల క్రితం ఓ వీడియో పోస్ట్ చేసిన లారెన్స్.. నేను రాజకీయాల్లోకి రావడం పట్ల మీ సలహాలను కామెంట్స్లో పంచుకోండి. మీరు నో అని చెబితే నేను రాజకీయాల్లోకి రాను. సమాజానికి నా నిస్వార్థ సేవ కొనసాగిస్తా. మీరు ఎస్ అంటే మాత్రం వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. మీ అందరి ఆశీస్సులతో నేను ఈ ప్రయాణాన్ని ఎప్పుడు, ఎవరితో ప్రారంభించాలనుకుంటున్నానో వెల్లడిస్తా అని అన్నారు.తాజాగా మంగళవారం మధ్యాహ్నం దాదాపు 16 నిమిషాల వీడియో పోస్ట్ చేసిన లారెన్స్.. చాలా విషయాలు మాట్లాడాడు. నేను తిరుచిరాపల్లి తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేయను. కానీ రాజకీయాల్లోకి రానని మాత్రం అనుకోవద్దు అని చెప్పాడు. దీంతో విజయ్ ఖాళీ చేసిన స్థానంలో పోటీ చేస్తాడని ఆశపడ్డ అభిమానులకు నిరాశ ఎదురైంది. అయితే లారెన్స్ ఊపు చూసి పక్కాగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడని భావించారు. మరి ఏమైందో ఏమో గానీ సడన్ యూటర్న్ తీసుకుని అందరికీ షాకిచ్చాడు.(ఇదీ చదవండి: సీఎం విజయ్లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ) View this post on Instagram A post shared by Ragava Lawrence (@actorlawrence) -
ఓదార్పు యాత్రలో సీఎం విజయ్.. ఏం హామీ ఇచ్చారు?
-
కరూర్ ఘటన.. విజయ్ కీలక నిర్ణయం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరూర్ తొక్కిసలాట బాధితులను కలిసేందుకు ముఖ్యమంత్రి విజయ్ సిద్దమయ్యారు. ఇందులో భాగంగా విజయ్ ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. జూలై రెండో సీఎం విజయ్.. కరూర్లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా బాధితులను కలిసి మాట్లాడనున్నారు. కాగా, ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కూడా విజయ్.. కరూర్ ఘటనను గుర్తు చేసుకున్నారు. కాగా, తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ ఇటీవల జరిగిన ప్రసంగంలో కరూర్ తొక్కిసలాట ఘటనను ప్రస్తావించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇలాంటి విషాదాలు మళ్లీ జరగకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటామని తెలిపారు.Vijay Anna karur visit July second week 🥺🥺pic.twitter.com/rU7w3rxZRv— Parthiban 🦁 (@parthi_off) June 29, 2026ఈ ఘటన 2025 సెప్టెంబర్లో కరూర్లో జరిగిన టీవీకే సభ సందర్భంగా చోటుచేసుకుంది. నాడు సభ కోసం భారీ సంఖ్యలో ప్రజలు ఒక్కసారిగా వేదిక వైపు దూసుకెళ్లడంతో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించగా, 80 మందికి పైగా గాయపడ్డారు. విచారణలో సభా నిర్వహణలో లోపాలు, జనసమూహ నియంత్రణలో వైఫల్యాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు ప్రస్తుతం సీబీఐ దర్యాప్తులో ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి విజయ్ను కూడా సీబీఐ విచారించింది. ఇటీవల అసెంబ్లీలో ఆయన ఈ విషాదాన్ని ప్రస్తావిస్తూ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు కొనసాగుతాయని చెప్పారు. -
పళనికి మరో ఎదురుదెబ్బ.. ఆరో ఎమ్మెల్యే రాజీనామా
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుతో అన్నాడీఎంకేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ.. విజయ్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా మరో అన్నాడీఎంకే ఎమ్మెల్యే తన పార్టీకి రాజీనామా చేశారు. అయితే, ఆయన టీవీకే చేరనున్నట్టు సమాచారం.తమిళనాడులో మాజీ మంత్రి, అన్నాడీఎంకే ఎమ్మెల్యే విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజీనామా చేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది. విజయభాస్కర్ తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్కు సమర్పించగా, అది ఆమోదించబడినట్లు నివేదికలు తెలిపాయి.అయితే, ఇప్పటికే పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అధికార పక్షంలో చేరడంతో, పార్టీ శాసనసభ బలం తగ్గుతూ వస్తోంది. ఈ పరిణామం పార్టీలో అంతర్గత విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయనే సంకేతంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, పార్టీని వీడుతున్న వారంతా టీవీకే తరఫున పోటీ చేసేందుకే ఇలా రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తోంది. -
త్రిషకు డిప్యూటీ సీఎం ఇచ్చినా ఆశ్చర్యం లేదు!
సాక్షి, చెన్నై: సొంత స్నేహాలు, సినిమా సంబంధాల కోసమే ప్రభుత్వ పదవులను పంచుతున్న సీఎం జోసఫ్ విజయ్, రానున్న రోజుల్లో నటి త్రిషకు డిప్యూటీ సీఎం పదవిని ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన అవశ్యం లేదని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన ఓ వీడియో రికార్డింగ్ సందేశం విడుదల చేస్తూ, సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.సినిమా వాళ్లకే అధికార కేంద్రాలా? ప్రభుత్వ పదవుల నియామకాలపై ఉదయకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమిళనాడులోని 8 కోట్ల మంది ప్రజల హక్కులను ఢిల్లీలో పరిరక్షించేందుకే రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి అనే ప్రతిష్టాత్మక పదవి ఉందన్నారు. తమిళనాడులో అర్హులైన వారెవరూ ఈ పదవికి దొరకలేదా అని ప్రశ్నిస్తూ, తనతో సినిమాలు తీసిన వారికి, తన చిత్రాల్లో నటించిన వారికి, తన పర్సనల్ మేనేజర్లు జగదీష్ పళనిస్వామి, జాన్ ఆరోగ్యస్వామి, విష్ణురెడ్డి, రాధన్ పండిట్, వెంకట్ నారాయణ వంటి వారికే సీఎం విజయ్ ప్రభుత్వ పదవులు ఇచ్చుకుంటూ పోతున్నారని ఆరోపించారు. ఇదే ధోరణి కొనసాగితే త్వరలోనే త్రిషను కూడా ఉప ముఖ్యమంత్రిని చేస్తామని ఆయన ప్రకటించవచ్చని ఎద్దేవా చేశారు.అన్నాడీఎంకే వర్గాలకు పదవులు మరోవైపు.. ప్రస్తుతం తిరుక్కళుక్కున్రం తూర్పు యూనియన్ కార్యదర్శిగా ఉన్న చెంగల్పట్టు తూర్పు జిల్లా ఎంజీఆర్ జి.కె.బాబు, అసోసియేషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈమేరకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుక్కళుకుండ్రం వెస్ట్ యూనియన్ లీగ్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కె.ఆర్.సెల్వంను ఆ పదవి నుంచి తొలగిస్తున్నారు. ప్రస్తుతం యూనియన్ లీగ్ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న పి. ముకుందన్, తిరుక్కలకుండ్రం వెస్ట్ యూనియన్ లీగ్ సెక్రటరీగా, చెంగల్పట్టు తూర్పు జిల్లా మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శిగా మధురాంతకం పంచాయతీ యూనియన్ కమిటీ అధ్యక్షురాలు గీత, అజయ్ మోహన్కుమార్ తిరుపోరూర్ ఉత్తర యూనియన్ కార్యదర్శిగా నియమితులయ్యారని తెలిపారు. -
డీఎంకే పార్టీకి మరో షాక్
చెన్నై: తమిళనాట ప్రతిపక్ష డీఎంకే పార్టీకి మరో షాక్ తగిలింది. తాజాగా డీఎంకే కూటమి నుంచి ఎండీఎంకే(మరుమలర్చీ ద్రావిడ మున్నేట్ర కజగం) వైదొలిగింది. సీఎం విజయ్కు మద్దతిచ్చే క్రమంలోనే డీఎంకే నుంచి ఎండీఎంకే తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డీఎంకే కూటమి నుంచి ఐయూఎంల్ వైదొలగగా, ఇప్పుడు ఎండీఎంకే వైదొలగడం తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు మరోసారి చర్చకు దారి తీశాయి. ఎండీఎంకే ఇంకా కొత్త రాజకీయ భాగస్వామ్యాన్ని ప్రకటించలేదు. అయితే, టీవీకే (తమిళగ వెట్రి కజగం) ప్రభుత్వాన్ని ప్రశంసించడం వల్ల భవిష్యత్తులో ఆ పార్టీతో కలిసే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. -
స్పోర్ట్ ఆడు... డ్రగ్స్ వీడు సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్
-
లోకల్ బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్
-
విజయ్ Vs స్టాలిన్.. బస్సు ప్రయాణం వీడియోలు వైరల్
చెన్నై: తమిళనాడులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త బస్సులను ప్రారంభించడంతో పాటుగా ఆయన కూడా బస్సులో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే సమయంలో గత ముఖ్యమంత్రి స్టాలిన్ బస్సులో ప్రయాణించిన వీడియోలను విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో, విజయ్, స్టాలిన్ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల సౌకర్యార్థం రూ.127 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 300 కొత్త ప్రభుత్వ బస్సులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ స్వయంగా కొత్త బస్సులో ప్రయాణించారు. చెన్నైలో ప్రారంభ కార్యక్రమం అనంతరం మెరీనా బీచ్ వరకు బస్సులో ప్రయాణించిన ఆయన, సాధారణ ప్రయాణికుడిలా కండక్టర్ వద్ద టికెట్ కొనుగోలు చేశారు. టికెట్కు సరిపడా చిల్లర డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాధారణంగా టికెట్ ఇస్తున్న సమయంలో "చిల్లర ఇవ్వండి" అనేది కండక్టర్ల నుంచి తరచూ వినిపించే ఫిర్యాదు. అయితే సీఎం విజయ్ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితమైన చిల్లరతో టికెట్ కొనుగోలు చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.300 new buses inaugurated by CM Vijay today!! pic.twitter.com/X51NeJ2zDE— TVK Mathan (@VMathanRaj29086) June 25, 2026ప్రారంభించిన 300 బస్సుల్లో డీజిల్, సీఎన్జీ వాహనాలు ఉన్నాయి. ఈ బస్సులు చెన్నైతో పాటు రాష్ట్రంలోని ఆరు రవాణా జోన్లలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రజా రవాణా సేవల నాణ్యతను మెరుగుపరచడం, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. తమిళనాడు ప్రజా రవాణా వ్యవస్థ దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రవాణా నెట్వర్క్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రవాణా సంస్థలు ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. The reason people rejected MK Stalin and accepted Thalaivar Vijay as the CM ❤ pic.twitter.com/gFlNLKQqkz— George 🍿🎥 (@georgeviews) June 25, 2026 -
బిగ్ షాక్ ఇచ్చిన త్రిష - విజయ్ షేక్ అవుతున్న తమిళనాడు
-
తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చెన్నై తాంబరం రోడ్డుకు మేజర్ ముకుంద్ వరదరాజన్ పేరు పెట్టారు. భారత ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ సాహసానికి, త్యాగానికి నివాళిగా చెన్నైలోని వేలచ్చేరి - తాంబరం రోడ్డును 'మేజర్ ముకుంద్ వరదరాజన్''గా మారుస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద నిరోధక చర్యలకు నాయకత్వం వహిస్తూ మేజర్ ముకుంద్ వరదరాజన్ వీరమరణం పొందారు. ఆయన ప్రదర్శించిన అసాధారణ తెగింపుకు, శౌర్యానికి గాను అప్పట్లో ప్రభుత్వం ఆయన మరణానంతరం ఆయనకు అశోక్ చక్రను ప్రదానం చేసింది. దేశానికి ఆయన చేసిన సేవలను గౌరవిస్తూ.. ఆయన త్యాగాన్ని భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునేలా చేసేందుకు చెన్నైలోని ఈ కీలకమైన రహదారికి ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.కాగా, బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు నిషేధం విధిస్తూ.. తమిళనాడు సర్కార్ ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా రోడ్లపై, వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు అంటించడం నిషేధమని స్పష్టం చేసింది. ఇటీవల రాష్ట్రంలో భారీ కటౌట్లు, పోస్టర్లు పాదచారుల రాకపోకలకు అడ్డంకిగా మారాయి.పాదచారులు రోడ్లపైకి రావడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు పెరిగాయి. వర్షాకాలం ప్రారంభం కావడంతో బ్యానర్లు, కటౌట్ల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గత నెలలో పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, బస్ స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను విజయ్ మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకుకున్నారు. -
విజయ్ Vs ఉదయ్ తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ
-
అసెంబ్లీలో అల్లు అర్జున్ స్టైల్లో సీఎం విజయ్ కౌంటర్.. సైగల వీడియో వైరల్
తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి విజయ్..తనదైన స్టైల్లో ప్రసంగిస్తూ ప్రతిపక్ష డీఎంకేకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ తన ప్రభుత్వంలో వాటికి అడ్డుకట్ట వేస్తుందని విజయ్ ప్రకటించారు. నీట్, హిందీ భాష వివాదంతో పాటు కరూర్ తొక్కిసలాట ఘటన గురించి కూడా విజయ్ ఆవేశంగా మాట్లాడాడు. అయితే ఇదంతా ఒకెత్తు అయితే..ఆయన అసెంబ్లీలో చేసిన సైగలు మరో ఎత్తు. ఆ సైగలు చూసి డీఎంకే నేతలు రగిలిపోతుండగా.. నెటిజన్స్ మాత్రం తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తూ..నవ్వులు పూయిస్తున్నారు.స్పీకర్ అనుమతితో..అసెంబ్లీలో ఎంతో ఆవేశంగా మాట్లాడిన విజయ్.. తన ప్రసంగం ముగించే ముందు స్పీకర్కు ఓ విజ్ఞప్తి చేశాడు. తాను సినిమా స్టైల్ లో ఓ సంజ్ఞ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. దీనికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఆయన అనుమతి ఇవ్వగానే అల్లు అర్జున్ స్టైల్లో గడ్డం కింద చేయి పెట్టి అంతా అయిపోయిందన్న తరహాలో ఓ సైగ చేశారు. దీంతో టీవీకేతో పాటు కూటమి ఎమ్మెల్యేలు హర్షధ్వానాలు చేశారు. డీఎంకే సభ్యులు మాత్రం రగిలిపోతూ వాకౌట్ చేశారు.స్టాలిన్కి కౌంటర్గా..గతంలో స్టాలిన్ కూడా ఇదే తరహా సైగలు చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్తో సీట్ల పంపకాల చర్చల అనంతరం డీఎంకే కార్యాలయం నుంచి తిరిగెళ్లే సందర్భంలో స్టాలిన్.. మ్యాటర్ సెటిలైందనే అర్థం వచ్చేలా చేతితో ఇలానే సైగ చేశారు. అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. స్టాలిన్కి కౌంటర్గానే విజయ్ ఇలా సైగలు చేసినట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది.నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్.. విజయ్ చేసిన సైగలకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొంతమంది నెటిజన్స్ విజయ్పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘విజయ్ అన్న సినిమాల షూటింగ్ని మిస్ అవుతున్నాడేమో’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. మరో నెటిజన్ ఏమో.. ‘త్వరలోనే తమిళనాడు అసెంబ్లీకి ఓటీటీ రైట్స్ పెడతారోమో అని వ్యాఖ్యానించాడు. మరొకరు.. ‘స్పీకర్ కట్ అన్న ప్రతిసారి.. సీఎం విజయ్ సినిమా కట్ అనుకుంటున్నాడేమో’ అని కామెంట్ చేశాడు. చాలా మంది విజయ్ హాస్య చతుర బాగుందని పోస్టులు పెడుతున్నారు.#WATCH | Chennai: Tamil Nadu Chief Minister C Joseph Vijay seeks permission from the Speaker and performs a cinematic gesture as he concludes his speech in the State Assembly.(Video source: Tamil Nadu State Assembly) pic.twitter.com/Y7BlOXHkYI— ANI (@ANI) June 23, 2026 -
సీఎం విజయ్ - త్రిష బ్రేకప్ ..?
-
సీఎం విజయ్ తొలి స్పీచ్ దద్దరిల్లిన అసెంబ్లీ..
-
సీఎం విజయ్ని అన్ ఫాలో చేసిన త్రిష
హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి కావడం మాటేమో గానీ ఆ టైంలో హీరోయిన్ త్రిష తెగ వైరల్ అయిపోయింది. వీళ్లిద్దరూ డేటింగ్ ఉన్నారన రూమర్సే దీనికి కారణం. ఇదే కాదు విజయ్ వదిలేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానం నుంచి ఉపఎన్నిక కోసం త్రిషనే పోటీలో నిలబెడతారనే రూమర్స్ కూడా వచ్చాయి. అలా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచిన ఈ జంట.. ఊహించని విధంగా ఇప్పుడు చర్చకు కారణమయ్యారు.(ఇదీ చదవండి: సమంత-నయనతార.. ఇంట్రెస్టింగ్ బాండింగ్)సోమవారం విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు చాలామంది శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అభిమానులు మాత్రం త్రిష నుంచి స్పెషల్ విషెస్ వస్తుందని ఎదురుచూశారు. రోజు గడిచిపోయింది కానీ ఎలాంటి శుభాకాంక్షల పోస్ట్ కనిపించలేదు. పైపెచ్చు విజయ్ని త్రిష.. ఇన్ స్టాలో అన్ ఫాలో చేయడం కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది.ఇన్నాళ్ల పాటు సాగిన బంధానికి పుల్స్టాప్ పడిపోయిందా? మరి త్రిష ఎందుకిలా చేసింది అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంపై త్రిష స్పందించి క్లారిటీ ఇస్తే తప్పితే ఈ చర్చ ఆగదు. ప్రస్తుతం త్రిష తెలుగులో 'విశ్వంభర' చేసింది. ఈ మధ్యే సూర్య 'వీరభద్రుడు' మూవీతో హిట్ అందుకుంది. కెరీర్ పరంగా అయితే పీక్ స్టేజీలో ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్) -
నీట్పై సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు
చైన్నై: నీట్ పరీక్షపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైద్య అర్హత పరీక్షలకు దేశవ్యాప్తంగా నీట్ ఒక్కటే అర్హత పరీక్షగా ఉందని తద్వారా అది అనేక వివాదాలకు మూలంగా నిలిచిందన్నారు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. విజయ్ సీఎం హోదాలో తొలిసారిగా ఈ రోజు (మంగళవారం) ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారు. విజయ్ మాట్లాడుతూ" గత కొన్నేళ్లుగా నీట్ పరీక్ష అనేక వివాదాలకు మూలంగా ఉంది. ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుకొని, దేశంలో వైద్య విద్య విశ్వసనీయతను దెబ్బతీసేలా ప్రశ్నపత్రాలు లీకవడం వరకు ఈ వివాదం కొనసాగింది. ఈ పరీక్షను రద్దు చేసి, 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను కేటాయించాలని తమిళనాడు పదేపదే పిలుపునిచ్చింది". అని అన్నారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో అమలులో ఉన్న రెండు భాషల విధానం, అంటే తమిళం (రాష్ట్ర భాషగా), ఇంగ్లీష్ (ప్రపంచ భాషగా) సరిపోతుందని నొక్కి చెప్పారు.కరూర్ తొక్కిసలాటకరూర్ తొక్కిసలాటపై ఆయన మాట్లాడుతూ "41 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ విషాదం గురించి నా బాధను నేను మాటల్లో చెప్పలేను. ఆ బాధ నన్ను ఎప్పటికీ వదిలిపెట్టదు. కానీ ఆ నిందను కూడా మాపై వేస్తున్నారు. ఇది దారుణం. రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ విజయంపై విజయ్ ప్రసంగిస్తూ " ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ అన్ని కష్టాలను అధిగమించి విజయం సాధించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే గెలవడానికి అనేక కుట్రలను, ఆంక్షలను అధిగమించాల్సి వచ్చిందని తెలిపారు.తమిళనాడు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడానికి మేము పడిన కష్టాలు మాకు మాత్రమే తెలుసు… కానీ ఇదంతా తెలిసినప్పటికీ, కొందరు ఏమీ అర్థం కానట్టు నటిస్తూ, అతను కేవలం ఒక నటుడు, పార్టీ కూడా నటుల పార్టీనే అని ఎగతాలిగా మమ్మల్ని విమర్శిస్తారు. ఈ విజయం కోసం ఎన్నో కుట్రలను, కుతంత్రాలను అధిగమించి విజయం సాధించాం. " అని విజయ్ అన్నారు.డీఎంకే అవినీతిఇది వరకూ ప్రభుత్వం డీఎంకేలా తాము అవినీతి చేయబోమని పార్టీ ఫండ్స్ కోసం టాస్మాక్ ఆదాయాన్ని డీఎంకే లూటీ చేసిందని ఆరోపించారు. ద్విబాషా విధానానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు.కాగా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవలే రైతులకు భారీ స్థాయిలో రుణమాఫీ ప్రకటించారు. అదేవిధంగా మరెన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తారుమారు చేస్తూ ఆ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం కొద్ది రోజల పాటు గవర్నర్ వ్యవహారంతో డ్రామా నడిచిన మిత్రపక్షాల సహాయంతో ఎట్టకేలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో తొలిసారిగా సీఎం హోదాలో ప్రసంగించారు. -
విజయ్ బర్త్ డే స్పెషల్.. తెరపై 'దళపతి' ఇప్పుడేమో 'ముఖ్యమంత్రి' (ఫొటోలు)
-
అతడు అరవడు.. హంగామా చేయడు.. సునామీలా ప్రభావం చూపిస్తాడు!
రాజకీయాల్లో విజయానికి పెద్ద పెద్ద సభలు, ఘాటు విమర్శలు, నిత్యం వార్తల్లో ఉండే హడావిడి తప్పనిసరి కాదని నిరూపించిన నాయకుడు విజయ్. వెండితెరపై స్టార్గా కోట్లాది అభిమానులను సంపాదించిన ఆయన.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అదే నిశ్శబ్ద శైలిని కొనసాగించారు. కానీ ఆ మౌనం బలహీనత కాదు!. విమర్శలు, అవమానాలు, వ్యక్తిగత విషాదాలు, ఎన్నో ఒడిదొడుకులను దాటుకుంటూ ఆయన ఈ స్థాయికి వచ్చారు. బయటకు కనిపించే విజయ్ కథ ఒకటైతే.. ఆయన విజయానికి పునాది వేసిన మరో కథ ఉంది. చాలా మందికి తెలియని ఆ ప్రయాణం పరిశీలిస్తే.. తమిళ సినీ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభ దంపతుల కుమారుడిగా సినీ కుటుంబంలో జన్మించిన విజయ్, చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చారు. అయితే ఆయన బాల్యం పూర్తిగా ఆనందంగా సాగిపోలేదు. విజయ్కు ఎంతో ఇష్టమైన సోదరి విద్య చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించింది. ఆ ఘటన విజయ్ను తీవ్రంగా కలచివేసిందని ఆయన కుటుంబ సభ్యులు పలుమార్లు చెప్పారు. సోదరి మరణం తర్వాత విజయ్ మరింత మౌనంగా మారిపోయారని, తన భావోద్వేగాలను బయటకు వ్యక్తపరచడం తగ్గించారని చెబుతుంటారు. నేటికీ ఆయన నిర్మించిన కొన్ని సంస్థలు, సేవా కార్యక్రమాల్లో ‘విద్య’ పేరు కనిపించడం ఆ అనుబంధానికి నిదర్శనం.చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ను ప్రారంభించిన విజయ్.. హీరోగా మారిన తొలి రోజుల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. నటన రాదని, స్టార్ మెటీరియల్ కాదని, తండ్రి అండతో మాత్రమే అవకాశాలు వస్తున్నాయని విమర్శకులు ఎద్దేవా చేశారు. కానీ విజయ్ ఎప్పుడూ మాటలతో సమాధానం ఇవ్వలేదు. ప్రతి సినిమాతో తనను తాను నిరూపించుకుంటూ ముందుకు సాగారు. అదే ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.కాలక్రమంలో తమిళ సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా ఎదిగిన విజయ్ను ప్రత్యేకంగా నిలబెట్టింది కేవలం స్టార్డమ్ కాదు.. ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధం. విద్యార్థులకు ప్రోత్సాహం, పేదలకు సాయం, ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలవడం వంటి సేవా కార్యక్రమాలను ఆయన నిశ్శబ్దంగానే కొనసాగించారు. ముఖ్యంగా అభిమాన సంఘాలను సేవా కార్యక్రమాల వైపు మళ్లించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు.తమిళుల ఆత్మగౌరవం, భాష, సంస్కృతి, యువత భవిష్యత్తు వంటి అంశాలపై ఆయన తీసుకున్న వైఖరి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. జల్లికట్టు ఉద్యమం నుంచి వివిధ ప్రజా సమస్యల వరకు తన మద్దతును వ్యక్తం చేస్తూ యువతకు మరింత చేరువయ్యారు. ఈ క్రమంలో స్టార్డమ్ను పరిగణనలోకి తీసుకుని.. ముసుగులేసుకుని మరీ ఆయన ఆయా వేదికల వద్దకు వెళ్లేవారు. ఇక.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన శైలి మారలేదు. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడటం, చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పడం, ప్రజల మధ్య నిశ్శబ్దంగా పని చేయడం ఆయన బలంగా మారింది.విజయ్ వ్యక్తిత్వంలో మరో ఆసక్తికర కోణం కూడా ఉంది. బయటకు కనిపించేంత హడావిడి ఆయన జీవితంలో ఉండదు. సినిమా వేడుకలు, వ్యక్తిగత కార్యక్రమాలు, రాజకీయ సమావేశాల్లో కూడా అవసరమైనంత మేరకే కనిపిస్తారు. అందుకే ఆయనను దగ్గరగా చూసిన వారు ‘రిజర్వ్డ్’ వ్యక్తిగా అభివర్ణిస్తుంటారు. కానీ ప్రజల సమస్యల విషయంలో మాత్రం తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడంలో వెనుకాడరు.అందుకే విజయ్ కథ కేవలం ఓ సినీ హీరో సీఎం అయిన కథ కాదు. వ్యక్తిగత విషాదాలను అధిగమించి, విమర్శలను అవకాశాలుగా మలుచుకుని, మౌనాన్నే తన బలంగా మార్చుకున్న వ్యక్తి కథ. అందుకే అభిమానులు ఆయన గురించి ఒక్క మాట చెబుతారు...“ఆయన కొందరిలా అరవడు.. హంగామా చేయడు.. సినీ ప్రత్యర్థులపై నోటికి వచ్చినట్లు మాట్లాడడు.. రాజకీయాల్లో ఇష్టానుసారం విమర్శలు చేస్తూ ఊగిపోడు.. సైలెంట్ సునామీలా ప్రభావం మాత్రమే చూపిస్తాడు!”. -
సీఎం విజయ్ పుట్టినరోజు.. ప్రభుత్వం బంపర్ ఆఫర్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ 52వ పుట్టినరోజు సందర్భంగా జూన్ 21, 22 (ఆదివారం, సోమవారం) తేదీల్లో రాష్ట్రంలోని మూడు ప్రధాన జంతుప్రదర్శనశాలల్లో ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.అటవీ శాఖ మంత్రి ఆర్.వి.రంజిత్కుమార్ మాట్లాడుతూ.. వండలూరులోని అరిజ్ఞర్ అన్నా జంతుప్రదర్శనశాల, వెల్లూరు జిల్లాలోని అమిర్థి జంతుప్రదర్శనశాల, సేలం జిల్లాలోని కురుంబపట్టి జంతుప్రదర్శనశాలలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు.ఉచిత ప్రవేశం పొందాలంటే సందర్శకులు ముందుగానే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని టికెట్లు తీసుకోవాలి. "ఉచిత ప్రవేశం వల్ల శాఖకు ఆర్థిక నష్టం ఉండదు. ఈ రెండు రోజుల టికెట్ వ్యయం సుమారు రూ.కోటి అవుతుంది. ఆ మొత్తాన్ని నా కుటుంబ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తాం" అని మంత్రి స్పష్టం చేశారు.భారీ రద్దీ?వన్యప్రాణి ప్రేమికులు, జంతుప్రదర్శనశాల అధికారులు వండలూరు జంతుప్రదర్శనశాలకు భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకేసారి గరిష్ఠంగా 15,000 మంది మాత్రమే ఈ జంతుప్రదర్శనశాలకు వెళ్లే వీలు ఉంటుంది. అయితే ఉచిత ప్రవేశం వల్ల సందర్శకుల సంఖ్య లక్ష దాటితే జంతువుల సంక్షేమం, ప్రజల భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.ఈ ఆందోళనలపై మంత్రి స్పందిస్తూ.. ముందు జాగ్రత్తగా వండలూరు జంతుప్రదర్శనశాలకు రోజుకు గరిష్ఠంగా 50,000 ఆన్లైన్ టికెట్లు మాత్రమే జారీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే లోపల ఉన్న సందర్శకుల సంఖ్య ఆధారంగా కౌంటర్ల వద్ద టికెట్ల పంపిణీని నియంత్రిస్తామని చెప్పారు.గిండి చిల్డ్రన్స్ పార్కుకు మినహాయింపు లేదుచెన్నైలోని గిండి చిల్డ్రన్స్ పార్కును స్థలాభావం, అధిక రద్దీ కారణంగా ఉచిత ప్రవేశ పథకం నుంచి మినహాయించారు. వండలూరు జంతుప్రదర్శనశాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై సమీక్షించేందుకు ప్రధాన వన్యప్రాణి సంరక్షణ అధికారి రాకేశ్ కుమార్ దోగ్రా ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా జూన్ 22న కాంచీపురం జిల్లావ్యాప్తంగా 52,000 మొక్కలు నాటే భారీ కార్యక్రమాన్ని అటవీ శాఖ చేపడుతుందని మంత్రి తెలిపారు. -
‘జననాయగన్’ కోసం ఢిల్లీకి సీఎం విజయ్!
ప్రముఖ నటుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఇంతకు ముందు కథానాయకుడిగా నటించిన కొన్ని చిత్రాలు విడుదల సమయంలో సమస్యలు ఎదుర్కొన్నాయి కానీ , జననాయగన్ చిత్రం అంత పెద్ద సమస్యలను ఎదుర్కొన లేదని చెప్పవచ్చు. చిత్రం ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు చాలా స్మూత్గా జరిగిపోయింది. ఎటు తిరిగీ సెన్సార్ విషయంలోనే పీట ముడిపడింది. నిజానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సార్ లో సమస్య ఎదురౌతుందని ఎవరు ఊహించలేదు. శాసనసభ ఎన్నికల సమయం కావడం, నటుడు విజయ్ పార్టీని ప్రారంభించి ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావడం వంటి విషయాలు తోడవడం, చిత్రంలో చర్చనీయాంశ సన్నివేశాలు చోటు చేసుకోవడంతో వంటి అంశాలు జననాయగన్ చిత్రానికి సెన్సార్ సమస్యలకు కారణం కావచ్చు. దీంతో గత జనవరి నెల నుంచి ఇప్పటి వరకు సుమారు 6 నెలలుగా ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్రం ఇంటర్నెట్లో అనధికారికంగా విడుదలై యూనిట్ సభ్యులకు పెద్ద షాక్ ఇచ్చింది. అయితే చిత్ర నిర్మాత వెంకట్ నారాయణన్ మాత్రం జననాయగన్ చిత్రాన్ని తెరపైకి తీసుకు రావడానికి శత విధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన చిత్ర విడుదల విషయమై ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ సెన్సార్ బోర్డు ప్రధాన అధికారితో మాట్లాడనున్నట్లు సమాచారం. దీంతో జననాయగన్ చిత్రానికి ఈ నెల 19వ తేదీ (శుక్రవారం) లోపల సర్టిఫికెట్ వస్తుందనే నమ్మకంతో యూనిట్ సభ్యులు ఉన్నారు. ఇదే జరిగితే జననాయగన్ చిత్రం ఈ నెల 25వ తేదీన తెరపైకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విజయ్ అభిమానులు జననాయగన్ చిత్ర విడుదల కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. -
నా కొడుకు రాజకీయాల్లోకి రాడు.. పళని సంచలన ప్రకటన
సాక్షి, చైన్నె: తన కుమారుడు మిథున్ రాజకీయాల్లోకి ప్రవేశించబోవడం లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి కె. పళనిస్వామి స్పష్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాలో వస్తున్న ఊహాగానాలను ఖండిస్తూనే, కొత్తగా ఏర్పాటైన టీవీకే కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.వారసత్వ రాజకీయాలపై క్లారిటీతన కుమారుడు మిథున్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు కొన్ని టీవీ ఛానళ్లలో జరుగుతున్న చర్చలు ముమ్మాటికీ అవాస్తవమని ఖండించారు. ఆయన కేవలం అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యుడిగా మాత్రమే ఉన్నారన్నారు. పార్టీలో ఎలాంటి పదవిలోనూ లేరని, తన కుమారుడు మిథున్ భవిష్యత్తులోనూ రాజకీయాల్లోకి రాబోరని నేను కచ్చితంగా, స్పష్టంగా తెలియజేస్తున్నానని అన్నారు. మీడియా సంస్థలు ఇలాంటి అవాస్తవ ప్రచారాలను నిలిపివేయాలని కోరారు. అలాగే అన్నాడీఎంకేను ఎవరూ కదిలించలేరని, గెలుపోటములు సహజమని వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగం కేవలం కలలో వేసిన నీటి మూట లాంటిదని ఎద్దేవా చేశారు.మళ్లీ రాజుకున్న అసంతృప్తి మరోవైపు.. అన్నాడీఎంకేలో అసమ్మతి జ్వాలలు చల్లారడం లేదు. గురువారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే, అసంతృప్త ఎమ్మెల్యేలంతా సీనియర్ నేత సి.వి. షణ్ముగం నివాసంలో ఆకస్మికంగా సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలుతలెత్తిన విషయం తెలిసిందే. పార్టీ సీనియర్లు వేలుమణి, సి.వి. షణ్ముగం నేతృత్వంలోని 25 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడంతోపార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి షాక్ తప్పలేదు. ఆ తదుపరి పరిణామాలతో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి నలుగురు రాజీనామా చేశారు. చివరకు రాజీ చర్చలతో వేలుమణితోపాటుగా ఇతర ఎమ్మెల్యేలు పళణి పక్షాన చేరారు. అయితే, సీవీ షణ్ముగం, సీ విజయ భాస్కర్ మాత్రం దూరంగా ఉంటూ వచ్చారు. వీరిలో సీ విజయ భాస్కర్ తన ఎమ్మెల్యే పదవికి బుధవారం రాజీనామా చేశారు. సీవీ షణ్ముగం మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ సర్వ సభ్య సమావేశం నిర్వహించాలని పట్టుబడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం చెన్నైలోని సీవీ షణ్ముగం నివాసంలో జరిగినæ ఆకస్మిక సమావేశంలో వేలుమణి, నత్తం విశ్వనాథన్, కె.పి. అన్బళగన్ హాజరు కావడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. -
ముఖ్యమంత్రి విజయ్కి విశాల్ ఇచ్చిన బహుమతి ఏమిటి?
టీవీకే పార్టీ అధ్యక్షుడు జోసఫ్ విజయ్ను ముఖ్యమంత్రి అయిన తరువాత చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆయన్ని కలవడానికి వరుస కడుతున్నారనే చెప్పాలి. అలా తాజాగా నటుడు విశాల్ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్కు మర్చిపోలేని బహుమతిని ఇచ్చారు. అందుకు ముఖ్యమంత్రి విశాల్కు ధన్యవాదాలు తెలిపారు.ఇంతకీ నటుడు విశాల్ ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్కి అందించిన ఆ బహుమతి ఏమిటి? దీని గురించి మీడియా విడుదల చేసిన ప్రకటనలో విశాల్ తెలుపుతూ నేను నెలకొల్పిన దేవి ట్రస్ట్ ద్వారా పలువురు విద్యార్థుల ఉన్నత విద్య సాయం చేస్తున్నాను. అదే విధంగా నేను నిర్వహించే కార్యక్రమాలకు అభినందించడానికి వచ్చే ప్రముఖులకు బొకేలు, పూల మాలలు వంటివి కాకుండా ఆ డబ్బును పేద విద్యార్థులకు సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా సోమవారం ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ని కలినప్పుడు ఆయనకు బహుమతిగా ఆయన పేరుతో ముగ్గురు పేద విద్యార్థులకు ఉన్నత విద్య చదివిస్తానని చప్పాను. ఆ ముగ్గురు విద్యార్థుల పేరు వివ రాలను కూడా తెలియజేశాను. ఈ బహుమతికి ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ ధన్యవాదాలు తెలిపా రు" అని నటుడు విశాల్ పేర్కొన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ను నటుడు శింబు, నటి సిమ్రాన్ కుటుంబం, నటుడు శ్యామ్ తదితర సినీ ప్రముఖులు కలిశారు. ఇటీవల నటి స్నేహ, ప్రసన్న దంపతులు కూడా తమ పిల్లలతో సహా కలిశారన్నది గమనార్హం. -
సీఎం విజయకి వ్యతిరేకంగా DMK నిరసనలు ఎందుకంటే..?
-
డీఎంకే స్టాలిన్కు బిగ్ షాక్
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకేకు చిరకాల మిత్రుడిగా భావించే ఎండీఎంకే (MDMK) అధినేత వైకో, టీవీకే (TVK) అధినేత విజయ్ను కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అంతేకాదు, విజయ్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించడం, రాబోయే ఎన్నికల్లో టీవీకే ఆశ్చర్యకర ఫలితాలు సాధించే అవకాశం ఉందని వ్యాఖ్యానించడం స్టాలిన్ శిబిరంలో కలకలం రేపుతోంది. దీంతో, వైకో వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.విజయ్ను కలిసిన వైకో.. తాజాగా వైకో, విజయ్ మధ్య భేటీ జరిగింది. ఈ సందర్భంగా విజయ్ రాజకీయ భవిష్యత్తుపై వైకో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాజకీయాల్లో టీవీకే ఇప్పటికే ఒక శక్తిగా అవతరించిందని, యువత, మహిళలు, తొలి ఓటర్లలో విజయ్కు విశేష ఆదరణ ఉందని పేర్కొన్నారు. అలాగే, టీవీకే భవిష్యత్తులో తమిళ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగగలదు. రాబోయే ఎన్నికల్లో మ్యాజిక్ చేసే అవకాశం కూడా లేకపోలేదు అని వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.డీఎంకే కూటమికి గుడ్బై?1994లో డీఎంకే నుంచి విడిపోయి ఎండీఎంకే స్థాపించారు వైకో. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్తో చేతులు కలిపి పోటీ చేశారు. ఎండీఎంకేకు నాలుగు సీట్లు కేటాయించగా.. అందులో మూడు సీట్లను డీఎంకే గుర్తు(ఉదయించే సూర్యుడు), మరో అభ్యర్థిని స్వంత గుర్తుతో వైకో బరిలోకి దించారు. ఎన్నికల్లో ఒక చోట విజయం సాధించారు. అయితే, గత కొంతకాలంగా ఎండీఎంకే నేతల వైఖరిలో మార్పు కనిపిస్తోందన్న చర్చ సాగుతోంది. వైకో కుమారుడు, పార్టీ కీలక నేత దురై వైకో కూడా ఇటీవల టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది.ఇక, వైకో వంటి సీనియర్ ద్రవిడ నాయకుడు విజయ్ను బహిరంగంగా ప్రశంసించడం సాధారణ విషయం కాదు. ప్రస్తుతం ఆయన.. డీఎంకే కూటమిలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్తు రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఎండీఎంకే నిజంగానే డీఎంకే కూటమిని వీడి టీవీకేకు చేరితే, అది స్టాలిన్కు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగా మారవచ్చు. అదే సమయంలో విజయ్ పార్టీకి ద్రవిడ రాజకీయాల్లో విశ్వసనీయత పెరిగే అవకాశం ఉంది.நல்லது நடந்தால் ஆதரிப்பேன் வைகோ அதிரடி 🔥🔥🔥@DMKITwing எதுக்கும் துரோகி பட்டம் கட்டி ஒப்பாரி வைக்க ரெடியா இருங்க 🤣🤣🤣 pic.twitter.com/WAVDSuUXFp— TVK Sqυα∂💥 (@TVKVijay24x7) June 18, 2026అయితే, సినీ నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తమిళనాడులో సంప్రదాయ డీఎంకే-ఏఐఏడీఎంకే రాజకీయాలకు ప్రత్యామ్నాయం ఏర్పడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యువ ఓటర్లలో విజయ్కు పెరుగుతున్న ఆదరణ కారణంగా పలు చిన్న, మధ్య తరహా పార్టీలు కూడా టీవీకే వైపు మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైకో భేటీ సాధారణ మర్యాదపూర్వక సమావేశమా? లేక భవిష్యత్తు రాజకీయ పొత్తులకు సంకేతమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.ఎమ్మెల్యే రాజీనామా?ఇటీవల చెన్నైలో పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి ఆదవ్ అర్జునా వైకోను కలవగా, మరుసటి రోజు సీఎం విజయ్తో వైకో సమావేశం కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం ఇచ్చింది. అయితే ఈ భేటీ పూర్తిగా రాజకీయ అంశాలపై కేంద్రీకృతమైందని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ, అధికారికంగా కూటమి మార్పుపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు.. ఎమ్మెల్యే డీఎంకే గుర్తుపై పోటీ చేసి గెలిచినందున తక్షణమే ప్రభుత్వానికి ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వలేని పరిస్థితి ఉందని, అందుకే రాజీనామాలపై ఆలోచన జరుగుతోందన్న సమాచారం కూడా పార్టీ వర్గాల నుంచి వెలువడుతోంది. -
నాన్స్టాప్ పాలనలో సీఎం విజయ్! దొరికిన ఆ కాస్త టైంలోనూ ఇలా..(ఫొటోలు)
-
విజయ్, ఉదయనిధికి బిగ్ రిలీఫ్..
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్కు ఊరట లభించింది. వీరు ముగ్గురు ఎన్నికల అఫిడవిట్లలో తమ ఆస్తి వివరాలను దాచారని, దీనిపై ఆదాయపన్ను శాఖ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.వివరాల మేరకు.. పెరంబూర్ నియోజకవర్గ ఓటరు విఘ్నేష్ దాఖలు దాఖలు చేసిన పిటిషన్లో సీఎం విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ స్థానాల్లో వేర్వేరు ఆస్తి వివరాలను చూపించారని ఆరోపించారు. పెరంబూర్లో రూ. 115 కోట్లుగా చూపిన ఆస్తులను, తిరుచ్చి ఈస్ట్లో రూ. 220 కోట్లుగా పేర్కొన్నారు. ఈ తప్పుడు సమాచారాలపై ఐటీ శాఖ, ఎన్నికల సంఘం విచారణ జరపాలని కోరారు. అలాగే, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ 2021 ఎన్నికలతో పోలిస్తే ఈసారి చేపాక్కం –ట్రిప్లికేన్ నియోజకవర్గ అఫిడవిట్లో తప్పుడు వివరాలు ఇచ్చారని పేర్కొంటూ ఓటరు కుమారవేల్ పిటిషన్ వేశారు. మైలాపూర్ బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ గత లోక్సభ ఎన్నికల కంటే ఇప్పుడు భిన్నమైన వివరాలు సమర్పించారని గౌతమ్ శివ అనే ఓటరు పిటిషన్ వేశారు. ఎన్నికల సంఘం వివరణ..ఈ మూడు వేర్వేరు పిటిషన్లు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, న్యాయమూర్తి జి. అరుళ్మురుగన్ ధర్మాసనం ఎదుట బుధవారం విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది నిరంజన్ రాజగోపాల్ వాదనలు వినిపించారు. సీఎం విజయ్ రెండు నియోజకవర్గాల్లోనూ పేర్కొన్న ఆస్తి విలువలు సరిగ్గానే ఉన్నాయని స్పష్టం చేశారు. ఇలాంటి విషయాల్లో కేవలం ఎన్నికల పిటిషన్ మాత్రమే వేయడానికి చట్టంలో వీలుంటుందన్నారు. ఇప్పటికే ఇలాంటి పలు పిటిషన్లను కోర్టులు కొట్టివేసాయని వివరించారు. ఎన్నికల సంఘం వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తులు.. సీఎం విజయ్, ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయనిధి స్టాలిన్, బీజేపీ అభ్యర్థి, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై దాఖలైన పిటిషన్లను పూర్తిగా కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
తమిళ పాలిటిక్స్.. స్టాలిన్కు కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, చైన్నె: తమిళనాడులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రజల తీర్పును గౌరవించి డీఎంకే ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలే గానీ, కూటమి పార్టీలపై నిందలు వేస్తూ విమర్శలు కొనసాగిస్తే ఆ పార్టీ ఇక ఎన్నటికీ తమిళానాడులో అధికారంలోకి రాలేదని కాంగ్రెస్ మంత్రులు రాజేష్ కుమార్, విశ్వనాథన్లు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం సంయుక్తంగా డీఎంకేకు హెచ్చరికలు చేస్తూ వ్యాఖ్యల తూటాలను పేల్చారు. దీంతో తమిళనాట కాంగ్రెస్ వర్సెస్ డీఎంకే అనే విధంగా పొలిటికల్ హీట్ పెరిగింది. విజయ్ నాయకత్వానికే ప్రజల మొగ్గుఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పెట్టిన 27 నెలల్లోనే 108 స్థానాలు గెలుచుకుని తమిళగ వెట్రి కళగం(టీవీకే) చరిత్ర సృష్టించిందని మంత్రులు పేర్కొన్నారు. జోసెఫ్ విజయ్ సీఎం కావాలన్నదే తమిళనాడు ప్రజల తీర్పు అని వారు స్పష్టం చేశారు. టీవీకేకు మెజారిటీకి 10 సీట్లు తక్కువైనప్పటికీ, అన్నాడీఎంకే మద్దతుతో సులభంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా, లౌకిక విలువల కోసం కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే వంటి పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారని కొనియాడారు. అధికారంలో వాటా.. ఇదే నిజమైన కూటమి ధర్మం అని వ్యాఖ్యలు చేశారు. కేవలం 5 సీట్లున్న కాంగ్రెస్కు రెండు మంత్రి పదవులు విజయ్ ఇచ్చారని, అలాగే వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ మద్దతుతో గతంలో డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి గొప్ప మనసు చాటుకోలేదని విమర్శించారు.బీజేపీ కుట్రను అడ్డుకున్నాం..ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేలా బీజేపీ పన్నిన కుట్రకు డీఎంకే కూడా సహకరించిందని, అయితే లౌకిక శక్తులు బలంగా నిలబడటం వల్ల ఆ ప్రయత్నం విఫలమైందన్నారు. అయితే, డీఎంకే అధికారిక పత్రిక ’మురసోలి’లో కాంగ్రెస్ను, రాహుల్ గాంధీని కించపరుస్తూ రాస్తున్న వ్యాసాలపై మండిపడ్డారు. తమకు కూడా తిట్టడం తెలుసనని, అయితే, తమ నాయకులు తమకు రాజకీయం నేర్పారన్నారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని, ఒకవేళ తాము హద్దులు దాటితే డీఎంకే తట్టుకోలేదని హెచ్చరించారు. మైనారిటీలు, దళితులు డీఎంకేకు ఎందుకు ఓటు వేయలేదో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. అది వదిలేసి మిత్రపక్షాలపై పడి ఏడిస్తే, వచ్చే ఎన్నికల్లో తమరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, ప్రజలు ఇచ్చే శిక్ష నుండి తప్పించుకోలేరని పేర్కొన్నారు.పుదుచ్చేరిలోనూ పొత్తే.. ఇదిలా ఉండగా.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో తమిళగ వెట్రి కళగంతోనే కాంగ్రెస్ పొత్తు అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ వైద్యలింగం స్పష్టం చేశారు. తట్టాంచావడి ఉప ఎన్నికల్లో టీవీకే పోటీ చేస్తే, కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం వైద్యలింగం విలేకరులతో మాట్లాడుతూ.. పుదుచ్చేరి సీఎం రంగస్వామి నియంతృత్వ పోకడలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. మంత్రివర్గం, శాసనసభ అవసరం లేదంటూ ఆయన ఒక్కరే పరిపాలనను నడుపుకుంటారా..? అని ప్రశ్నించారు. పుదుచ్చేరిలో టీవీకేతో కాంగ్రెస్ పొత్తు అని ప్రకటించిన ఆయన తట్టాంచావడి నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఉప ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీకి అవకాశం లేదున్నారు. విజయ్ పార్టీ అయిన టీవీకేను డీఎంకే తక్కువ అంచనా వేయడమే ఓటమికి కారణంగా పేర్కొన్నారు. తాము స్నేహపూర్వకంగా పోటీ చేసిన స్థానాల్లో డీఎంకే విజయం సాధించిందని పేర్కొంటూ, తట్టాంచావడి ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. పుదుచ్చేరిలో కూటమికి డీఎంకే నాయకత్వం వహించింది, ఈ దృష్ట్యా, ఓటమికి కూడా డీఎంకేనే బాధ్యత వహించాలని హితవు పలికారు. కూటమిలోని పార్టీలతో డీఎంకే ఏకపక్షంగా చర్చలు జరిపిందని మండి పడ్డారు. తట్టాంచావడిలో టీవీకే పోటీ చేస్తే కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని, ఇది సీఎం నియోజకవర్గం అని ఎన్నికలలో ప్రజలు ఓట్లు వేశారని, అయితే, ఉప ఎన్నికలలొఓ ఆ పరిస్థితి ఉండదన్నారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని , ఉప ఎన్నికలలో కాంగ్రెస్మద్దతు కీలకంగా మారిందన్నారు. -
అన్నామలై వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి,చెన్నై: తమిళనాడు తిరువల్లూర్ జిల్లా గుమ్మిడిపూండి అనే స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ అఫ్ తమిళనాడు (SIPCOT) ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలో మూడేళ్ల బాలికపై లైంగిక దాడి, ఆపై చిన్నారి మరణం రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రేకెత్తుతున్నాయి. ఈ ఘటనపై మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే.అన్నామలై చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.జూన్ 14న బిహార్ రాష్ట్రం బిబిన్ మంజికి చెందిన అభియోగి అనే 19ఏళ్ల వలస కార్మికుడు చిన్నారికి బిస్కెట్లు కొనిస్తానని చెప్పి తీసుకెళ్లాడు. ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్న పొదల్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో తాళలేక గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారిని స్థానికులు, కుటుంబసభ్యులు గమనించి అత్యవసర చికిత్స నిమిత్తం గుమ్మిడిపూండి ప్రభుత్వ ఆసుపత్రికి, తరువాత చెన్నై స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. జూన్ 15 ఉదయం బాలిక తీవ్ర గాయాలతో మరణించింది. దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దారుణానికి ఒడిగట్టిన అభియోగిని దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు.విజయ్ ప్రభుత్వానికి డిమాండ్ఆ ఘటనపై స్పందించిన అన్నామలై.. పోలీసులు వేగంగా చర్యలు తీసుకోవడం ప్రశంసించారు. అయినప్పటికీ, ఇలాంటి నేరాలను ముందుగానే నివారించడంపై దృష్టి పెట్టాలి అని అన్నారు. ఉద్యోగాల కోసం వలస రావడం సహజమని పేర్కొంటూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కార్మికుల రికార్డులు సరైన విధంగా నిర్వహిస్తుందా, యజమానులు, కాంట్రాక్టర్లు వారి వివరాలను అధికారులకు అందిస్తున్నారా అని ప్రశ్నించారు. వలస కార్మికుల వివరాలు, వారి స్వస్థలం, పని చేసే ప్రదేశం, నివాసం, రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది పనిచేస్తున్నారు వంటి సమాచారం సేకరించి, ట్రాక్ చేసి, పర్యవేక్షించే విధంగా తమిళనాడు ప్రభుత్వం వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వాళ్లవల్లే దారుణాలు అందుకు ఇటీవల రాష్ట్రంలో జరిగిన దుర్ఘటనలను ఎక్స్ వేదికగా ఉదహరించారు. ‘ జూన్ నెల ప్రారంభంలో చెన్నైలో ఒక వృద్ధ మహిళ నుండి బంగారు గొలుసు లాక్కోవడానికి ప్రయత్నించిన ఉత్తర భారత రాష్ట్రానికి చెందిన యువకుడు అరెస్టయ్యాడు. గత నెలలో, తాంబరం వద్ద యువతిపై లైంగిక వేధింపులు, తిరువల్లూరు సమీపంలో ఒంటరిగా ఉన్న మహిళపై దాడి, చెన్నై వెలాచేరి బస్ స్టాండ్ దగ్గర 61 ఏళ్ల మహిళపై సామూహిక హత్యాచారం, చెన్నై వెలాచేరిలో మానసిక సమస్యలతో బాధపడుతున్న మహిళపై లైంగిక వేధింపుల కేసులో 15 ఏళ్ల బాలుడితో పాటు ముగ్గురు ఉత్తర భారత కార్మికుల అరెస్టు, చెన్నై మదురవోయల్ ప్రాంతంలో తెల్లవారుజామున ఇంటి ముందు కోలమ్ వేస్తున్న మహిళపై లైంగిక వేధింపులు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.ఈ సంఘటనల్లో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన యువకులు అరెస్టు కావడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది’ అని అన్నామలై పేర్కొన్నారు. திருவள்ளூர் மாவட்டம் கும்மிடிப்பூண்டி அருகே, 3 வயது பெண் குழந்தை பாலியல் தாக்குதலுக்குள்ளாகி, சிகிச்சை பலனின்றி உயிரிழந்த செய்தி, மிகுந்த அதிர்ச்சியும், வருத்தமுமளிக்கிறது.இந்தக் குற்றத்தில் தொடர்புடைய வடமாநிலத்தைச் சேர்ந்த ஒரு நபர் கைது செய்யப்பட்டிருக்கிறார். அதே போல,…— K.Annamalai (@annamalai_k) June 15, 2026 తనదైన మార్క్ పాలిటిక్స్కు అన్నామలై తాజా వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మాజీ బీజేపీ నేత ద్రావిడ సిద్ధాంతాలు, ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తనదైన మార్క్ పాలిటిక్స్కు శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు.తమిళనాడు రాజకీయాలు తమిళ గుర్తింపు, భాష, ద్రావిడ సిద్ధాంతం, ప్రాంతీయం, ఉత్తర భారత వ్యతిరేక వాదనల చుట్టూ తిరుగుతున్నాయి. ఇదే సిద్ధాంతం ఆధారంగా ద్రావిడ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలు ఆరు దశాబ్దాలుగా శక్తివంతమైన రాజకీయాలే చేశాయి. ఇప్పుడు తమిళనాడు మాజీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కే. అన్నామలై ఇదే పంథాలో సరికొత్త రాజకీయానికి తెరతీశారు. ద్రావిడ పార్టీలను వారి విభజనాత్మక రాజకీయాలపై విమర్శిస్తూ, ఇప్పుడు ఉత్తర భారత వ్యతిరేక వాదనను కొత్త కోణంలో ముందుకు తెస్తున్నట్లు కనిపిస్తున్నారు.గుమ్మిడిపూండి ఘటనలో అభంశుభం తెలియని మూడేళ్ల బాలికపై లైంగిక దాడి,మరణంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తరుణంలో అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ఉత్తర భారత కార్మికుల నేరాలలో పెరుగుతున్న ప్రమేయం ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. పోలీసుల వేగవంతమైన చర్యలను ప్రశంసించినప్పటికీ, నేరాలను ముందుగానే నివారించే విధానాలు అవసరమని సూచించారు. తద్వారా మిగిలిన ద్రావిడ పార్టీల తరహా ఉత్తర భారత వ్యతిరేక వాదనను భాష, సంస్కృతి, ప్రాంతీయం ఆధారంగా కాకుండా పాలన, భద్రత, వలస కార్మికుల నియంత్రణ అంశాలపై దృష్టి పెట్టి, కొత్త రాజకీయాలకు తెరతీశారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. -
బిస్కెట్స్ ఆశ చూపి పసిబిడ్డపై పైశాచికం చేసినవాడిపై విజయ్ సంచలన నిర్ణయం
-
22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రస్తుతం బాధ్యతలు నిర్వహణలో బిజీగా ఉన్నారు. ఓవైపు రాజకీయాలు చూసుకుంటూనే మరోవైపు తనతో పాటు కలిసి నటించిన సినిమా సెలబ్రిటీలని ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నారు. సీఎం అయిన తర్వాత కోలీవుడ్కి చెందిన చాలామంది విజయ్ని కలిశారు. అయితే వాళ్లతో పోలిస్తే తాజాగా జరిగిన రీయూనియన్ ఎవర్గ్రీన్ అని చెప్పొచ్చు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది)టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ సిమ్రాన్.. ప్రస్తుతం సహాయ పాత్రలతో అడపాదడపా మూవీస్ చేస్తోంది. అయితే 1997-2004 మధ్య కాలంలో దళపతి విజయ్తో కలిసి నెరుక్కు నెర్ (1997), వన్స్ మోర్ (1997), తుళ్లత్త మనముమ్ తుళ్లుమ్ (1999), ప్రియమనవలె(2000), యూత్ (2002), ఉదయ(2004) తదితర చిత్రాలు చేసింది. వీటిల్లో వీరిద్దరూ కెమిస్ట్రీకి పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. అలాంటిది మళ్లీ ఇన్నేళ్ల తర్వాత విజయ్ని కలిశానని చెబుతూ సిమ్రాన్ పోస్ట్ పెట్టింది.తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయ్ని నా కుటుంబంతో కలిసి కలుసుకోవడం ఆనందంగా అనిపించింది. సీఎం విజయ్ ఆప్యాయత, వినయం, నిజాయితీ ఇప్పటికీ అలానే ఉన్నాయి. ప్రజల ప్రేమని సంపాదించుకున్న ఆయన వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదు. తమిళనాడు అభివృద్ధి కోసం విజయ్ దూరదృష్టి, సంకల్పం ఎంతో స్ఫూర్తిదాయకం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే ఆయన నాయకత్వానికి శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా అని సిమ్రాన్ రాసుకొచ్చారు. సిమ్రాన్తో పాటు ఈమె ఇద్దరు కొడుకులు, భర్త ఉన్నారు.(ఇదీ చదవండి: హీరోయిన్గా ఫేమస్ తెలుగు యూట్యూబర్ నాగదుర్గ.. టీజర్ రిలీజ్) View this post on Instagram A post shared by SIMRAN (@actorsimranofficial) -
సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు నిషేధం విధించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా రోడ్లపై, వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు అంటించడం నిషేధమని స్పష్టం చేసింది. ఇటీవల రాష్ట్రంలో భారీ కటౌట్లు, పోస్టర్లు పాదచారుల రాకపోకలకు అడ్డంకిగా మారాయి. పాదచారులు రోడ్లపైకి రావడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు పెరిగాయి.వర్షాకాలం ప్రారంభం కావడంతో బ్యానర్లు, కటౌట్ల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.అదే సమయంలో టీవీకే తన పార్టీ కార్యకర్తలకు సైతం విజ్ఞప్తి చేసింది. పార్టీ కార్యకర్తలు పోస్టర్లు, బ్యానర్లు, ప్లకార్డులు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించొద్దని కోరింది. జన్మదిన వేడుకలు, కుటుంబ వేడుకలు, రాజకీయ సమావేశాలు వంటి సందర్భాల్లో బహిరంగ ప్రదేశాల్లో డెకరేషన్లు చేయద్దని సూచించింది. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా ఏ వేడుకలు జరపరాదని, ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గత నెలలో పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, బస్ స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను విజయ్ మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే రోజు మధ్యాహ్నం, ఆయన తన తమిళగ వెట్రి కజగం కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. పుట్టినరోజులు, కుటుంబ కార్యక్రమాల వంటి సందర్భాలలో ప్రజలకు లేదా ట్రాఫిక్కు ఆటంకం కలిగించే విధంగా... బహిరంగ ప్రదేశాలలో బ్యానర్లు, పోస్టర్లు అంటించొద్దని కోరారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు,కటౌట్లు,పోస్టర్లు అంటించడంపై ఆంక్షలు విధించడంతో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
విజయ్-సంగీత విడాకుల కేసు విచారణ వాయిదా
-
‘కుక్క’ వ్యాఖ్యలపై దుమారం.. స్పందించిన లారెన్స్
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం మధ్య నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ చేసిన ఓ వ్యాఖ్య వివాదానికి దారితీసింది. అధికారంలో ఉన్న విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ పనితీరుపై మాట్లాడుతుండగా.. ఆయన చేసిన "కుక్క" పోలిక సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు కారణమైంది. దీంతో లారెన్స్ స్వయంగా రంగంలోకి దిగి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.ఇటీవల మీడియాతో మాట్లాడిన లారెన్స్.. కొత్త ఇంటికి మారినప్పుడు ఆ పరిసరాలు, అక్కడి పరిస్థితులు, అక్కడ తిరిగే కుక్కల అలవాట్లు కూడా తెలుసుకోవడానికి సమయం పడుతుందని ఉదాహరణ చెప్పారు. అలాగే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికీ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలను కొందరు ప్రజలను ఉద్దేశించి చేసినట్లుగా అర్థం చేసుకోవడంతో వివాదం చెలరేగింది.దీనిపై ఎక్స్లో స్పందించిన లారెన్స్.. తాను ప్రజలను ఎప్పుడూ తన తల్లితో సమానంగా భావిస్తానని స్పష్టం చేశారు. "నేను ప్రజలను కుక్కలతో పోల్చానంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. అది పూర్తిగా అవాస్తవం. కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుందన్న ఉద్దేశంతోనే ఆ ఉదాహరణ చెప్పాను. ఎక్కడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడలేదు" అని పేర్కొన్నారు. అంతేకాకుండా పూర్తి వీడియో చూడకుండా వ్యాఖ్యలను వక్రీకరించవద్దని కోరారు. తన మాటల అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని అభిమానులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.Hi everyone,I would like to clarify a misunderstanding regarding my recent press meeting.I have always said that my fans and the people are equal to my mother. Some are spreading false news that I referred to people as dogs, which is completely untrue and misleading. All I… pic.twitter.com/576GhWsI61— Raghava Lawrence (@offl_Lawrence) June 14, 2026అయితే వివరణ ఇచ్చినప్పటికీ.. లారెన్స్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ మాత్రం ఆగలేదు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడకపోయినా, ఆయన ఉపయోగించిన ఉపమానం అనవసర వివాదానికి తావిచ్చిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, పూర్తి వ్యాఖ్యలను సందర్భంతో పాటు చూడాలని ఆయన అభిమానులు వాదిస్తున్నారు. దీంతో "కుక్క" వ్యాఖ్యల వివాదం ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతోంది.ఇదిలా ఉండగా, గత కొద్ది రోజులుగా లారెన్స్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఇటీవల ఆయన ప్రకటించారు. అందుకు తన తల్లి అంగీకరించారనని.. ప్రజలు డిసైడ్ చేయడమే ఆలస్యమని అన్నారు. అయితే ఏ పార్టీలో చేరతారన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ముఖ్యమంత్రి విజయ్తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో టీవీకేలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం కొనసాగుతోంది. -
సీఎంలంతా ఆ అమ్మ చెంతకే ఎందుకంటే..?! ఆఖరికి విజయ్ సైతం..
తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి, పార్టీ పెట్టిన రెండేళ్లకే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టార్ హీరో విజయ్. ఆయన ఇటీవలే కర్ణాటకలోని కొల్లూరు శ్రీ మూకాంబికా అమ్మవారిని సందర్శించుకుని పూజలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ముఖ్యమంత్రి హోదాలో తమిళనాడు ఆలయాన్ని ఎందరో దర్శించుకున్నారు. అంతేగాదు సెలబ్రిటీలు, ప్రముఖులు సైతం ఈ ఆలయానికే తరలి వస్తుంటారు. మన టాలీవుడ్ హీరో ఎన్టీర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సంగీత మాంత్రికుడు ఇళయరాజా వంటి దిగ్గజాలు వరకు చాలామంది ఈ అమ్మవారిని దర్శించుకుని, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రులు ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు అంతా ఈ అమ్మవారిని దర్శించుకున్నారు. అలా అంతటి అతిరథమహారథులంతా తరలివస్తున్న ఈ కొల్లూరు మూకాంబిక క్షేత్రం విశిష్టత ఏంటి, ఎందుకు రాజకీయ నాయకులు దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఈ అమ్మ దర్శనానికి బారులు తీరుతున్నారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా.!.కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఉన్న కొల్లూరు మూకాంబికా దేవాలయం.. దక్షిణాదిన ప్రసిద్ధ శక్తి పీఠాల్లో ఒకటి. పార్వతీదేవి ఇక్కడ మూకాంబికాగా పూజలందుకుంటోంది. దీన్ని పరశురాముడు సృష్టించిన ఏడు మోక్ష క్షేత్రాల్లో ఒకటిగా స్థానిక పురాణాలు పేర్కొంటున్నాయి.ఆకుపచ్చని పశ్చిమ కనుమల్లో వెలిసిందీ ఆలయం. ఇక్కడి అమ్మవారి విగ్రహం.. బంగారం, వెండి, రాగి, ఇనుము, సీసం అనే అయిదు పంచలోహాల సమ్మేళనంతో రూపొందింది. మూకాంబికా దేవిని మాట, అక్షరం, విద్యకు సంబంధించిన శక్తిగా భక్తులు ఆరాధిస్తారు. అందుకే విద్యాభ్యాసం ప్రారంభించే పిల్లలను ఈ ఆలయానికి తీసుకువచ్చే సంప్రదాయం కూడా ఉంది.ఎంజీఆర్ టు అమ్మ జయలిలత వరకు..అంతేగాదు 1200 ఏళ్ల చరిత్ర కలిగిన కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రులు దర్శించుకుని, ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. గతంలో ఎంజీ రామచంద్రన్ ఈ అమ్మవారిని దర్శించుకుని బంగారు కత్తిని కానుకగా అందజేశారు. ఆయన భార్య జానకీ రామచంద్రన్ కూడా సీఎం అయిన తర్వాత ఇక్కడకు వచ్చారు. అలాగే, ‘అమ్మ’ జయలలిత కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. జులై 30, 2004లో కొల్లూరు నూకాంబిక ఆలయంలో ప్రత్యేకంగా చండీయాగం కూడా జరిపించి, అన్నదానం కోసం రూ. 30,000లను జయలలిత సమర్పించారు. ఇక, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గ కూడా ఎన్నికలకు ముందు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. వారి బాటలోనే ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ సైతం ఈ అమ్మవారిని దర్శించుకుని వెండి ఖడ్గాన్ని సమర్పించారు. ఆలయ చరిత్ర..పురాణాల ప్రకారం.. ఈ ప్రాంతాన్ని పాలించిన కౌమాసురుడనే రాక్షసుడు తనకు మరణం లేకుండా వరం పొందడానికి శివుడి కోసం తపస్సు చేశాడట. తన మనోబలంతో ఆ రాక్షసుడి కోరికను పసిగట్టిన కోల మహర్షి.. సరస్వతికి తెలియజేయడంతో శివుడు ప్రత్యక్షమయ్యే సమయంలో అతడ్ని అమ్మవారు మూగవాడిని చేసిందట. అప్పటి నుంచి అతడ్ని మూసాసురుడిగా పిలిచేవారు. అయినప్పటికీ అతడు గర్వం వీడకపోగా.. దేవతలను, యక్షులను హింసించేవాడట. తననే పూజించాలని హుకుం జారీచేసి.. యజ్ఞయాగాదులను కూడా అడ్డుకోవడంతో కోల మహర్షి ఆధ్వరంలో మునులు పార్వతిదేవి వద్దకు వెళ్లి తమ కష్టాలను చెప్పుకున్నారు. దీంతో అమ్మవారు దైవగణాలతో వచ్చి ఆ మూసాసురుడిని సంహరించింది.ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత ఆది శంకరాచార్యులు కుడజాద్రి కొండలలో ధ్యానం చేస్తున్న సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగిందట. దీనికి శంకరాచార్యులు.. కేరళలోని తాను చెప్పిన చోట వెలిసి పూజలు అందుకోవాలని, తద్వారా ఆ ప్రాంతం సుభిక్షమవుతుందని, ఆలయాన్ని దర్శించుకునే వారికి ఎన్నుకున్న రంగంలో విజయం సిద్ధించేలా వరాలు ఇవ్వాలని కోరారట. ఇందుకు సరేనన్న అమ్మవారు.. ముందుగా శంకరాచార్యులను నడవమని, తర్వాత వెనుకగా వస్తాని, గమ్యం చేరే వరకూ తిరిగి చూడొద్దని చెప్పిందట. అలా మూకాసురుడ్ని వధించిన ప్రాంతానికి వచ్చేసరికి దేవి ఆగిపోయిందట. అమ్మవారి గజ్జల శబ్దం వినబడకపోవడంతో శంకరాచార్య వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడే మూకాంబికగా వెలిసిందట.దీంతో నిరాశకు గురైన శంకరాచార్యలకు అమ్మవారు తన విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పడంతో ఆయన అలాగే చేశారని అంటారు. అమ్మవారి మొట్టమొదటి స్థానం కోడచాద్రి శిఖరంపై ఉండేదని.. కానీ అక్కడకు వెళ్లడం భక్తులకు కష్టంగా ఉండటంతో శంకరాచర్య ఆలయాన్ని కొల్లూరులో తిరిగి ప్రతిష్ఠించారని చెబుతుంటారు స్థానికులు.అంతేగాదు ఆదిశంకరాచార్యులు స్వయంగా ఇక్కడ తపస్సు చేసి, అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఆయనే ఇక్కడ స్వయంభూ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ లింగం మధ్యలో ఒక 'స్వర్ణ రేఖ' ఉంటుంది. ఇది శివశక్తుల కలయికకు ప్రతీకగా నిలుస్తుంది. అంటే ఒకే క్షేత్రంలో అటు పరమశివుడిని, ఇటు పరాశక్తిని కలిపి దర్శించుకునే అరుదైన భాగ్యం భక్తులకు ఇక్కడ కలుగుతుంది.ఈ అమ్మ ఆసీస్సుల కోసమే ఎందుకంటే..ఈ మూకాంబికా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే, తమ కెరీర్ అద్భుతంగా రాణిస్తుందని, విజయాలు వరిస్తాయని ఇండస్ట్రీ వర్గాల గట్టి నమ్మకం. అందుకే ముఖ్యమైన సినిమాలు ప్రారంభించే ముందు లేదా రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రముఖులు ఇక్కడికి రావడం ఆనవాయితీగా మారింది. అంతేగాదు ఈ అమ్మవారిని మహిమాన్వితమైన శక్తిగా (లక్ష్మి, సరస్వతి, కాళీ స్వరూపిణిగా) భక్తులు విశ్వసిస్తారు. ఆ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు ఎన్నికల్లో జయాలు సాధించిన తర్వాత, తమ పదవికి, ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిపాలన సాగాలని కోరుకుంటూ ఇక్కడ ప్రత్యేక పూజలు, చండీ యాగం వంటివి నిర్వహిస్తారు. పచ్చని ప్రకృతి ఒడిలో, సౌపర్ణిక నది తీరాన వెలసిన కొల్లూరు క్షేత్రం అటు ఆధ్యాత్మిక ప్రశాంతతను, ఇటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే మహిమాన్విత క్షేత్రం. అందుకే సామాన్య భక్తుల నుంచి కోట్లాది మంది అభిమానులు ఉన్న సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ అమ్మవారి పాద చెంతకు చేరుకుంటున్నారు.🚨 Why CM Vijay’s visit to the Kollur Mookambika Temple is a massive political statement.Tamil Nadu Chief Minister Vijay is visiting the Kollur temple in Karnataka today at 3 PM. While it looks like a standard spiritual visit, the historical context is fascinating.He is…— MacroMatrix (@MacroMatrix1) June 12, 2026 (చదవండి: ఈతరం పిల్లల ఆసక్తికే మద్దతు) -
విజయ్.. అధికార మత్తులో మర్చిపోయారా?: స్టాలిన్
తమిళనాడు రాజకీయాల్లో అధికార తమిళగ వెట్రి కళగం, ప్రతిపక్షం డీఎంకే మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది. చెన్నైలోని అన్నా అరివాలయంలో శనివారం జరిగిన డీఎంకే మహిళా విభాగం లోక్సభ కార్యకర్తల సన్నాహక సమావేశంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సీఎం విజయ్ను టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీబీఐ కేసుల నుంచి తప్పించుకోవడానికే తమరు ఢిల్లీ వెళ్లారా?, బీజేపీని గట్టిగా విమర్శిస్తే తమరి కుర్చీకి ముప్పు వస్తుందని భయపడుతున్నారా? అంటూ స్టాలిన్ ప్రశ్నలు సంధించారు.డీఎంకే మహిళా విభాగం సమావేశంలో స్టాలిన్ టీవీకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గత ఐదేళ్ల డీఎంకే ద్రావిడ మోడల్ పాలన మహిళల సంక్షేమమే ధ్యేయంగా సాగిందన్నారు. అయితే, ప్రస్తుత టీవీకే ప్రభుత్వంలో రోజురోజుకూ పెరుగుతున్న నేరాలు, విద్యుత్ కోతలు, రైతుల రుణాల మాఫీ నాటకాలతో.. ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటేశామా.? అని ప్రజలు తీవ్ర ఆగ్రహంతో, ఆవేదనతో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు మహిళల భద్రత గురించి మాట్లాడిన సీఎం విజయ్.. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై దాడుల్లో మెజారిటీ కేసుల్లో టీవీకే నిర్వాహకులే నిందితులుగా ఉన్నారని వార్తలు వస్తున్నాయని వివరించారు. ఇప్పుడు టీవీకే నుంచి మహిళలకు రక్షణ కావాలని ప్రజలు కోరే పరిస్థితి వచ్చిందన్నారు.డీఎంకే బ్లూప్రింట్ కాపీ కొట్టారు ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం విజయ్ హాజరు కావడంపై స్టాలిన్ స్పందించారు. ఇందులో సీఎం ప్రసంగం అంతా గతంలో డీఎంకే ప్రభుత్వం సాధించిన విజయాలు, రాష్ట్ర హక్కుల కోసం తాము రూపొందించిన పాలసీ నోట్ లాగే ఉందని ఎద్దేవా చేశారు. ఇది సినిమా కాదు.. రాష్ట్ర పరిపాలన, రాష్ట్ర హక్కుల విషయంలో ద్రావిడ మోడల్ ప్రభుత్వం వేసిన బ్లూప్రింట్ ప్రకారమే ఎవరైనా నడవాల్సిందేనని స్పష్టం చేశారు. తాను గతంలో 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అని చెప్తే.. విజయ్ మాత్రం కాస్తమెరుగు దిద్ది మార్చి 2036 నాటికి ఒకటిన్నర ట్రిలియన్ డాలర్ ఎకానమీ అని మాట్లాడారని గుర్తు చేశారు. ఏదేమైనా అందుకు నా అభినందనలు అని వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలకు పిలుపు గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్తే.. ఇరుపక్షాలు ఎల్కేజీ, యూకేజీ పిల్లల్లా కొట్టుకుంటున్నాయని ఎగతాళి చేసిన విజయ్, ఇప్పుడు నిబంధనలు లేకుండా నిధులు ఇవ్వాలని అదే ఢిల్లీ పెద్దలను కోరి వచ్చారని ఎద్దేవా చేశారు. ఈ విషయాలన్నింటినీ డీఎంకే మహిళా విభాగం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. పార్టీ స్థాపకుడు కరుణానిధి చెప్పినట్లుగా పార్టీ అనేది తల, అధికారం అనేది కిరీటం అని , అయితే, తల ఉంటే కిరీటాన్ని ఎప్పుడైనా ధరించవచ్చు అని గుర్తు చేస్తూ, డీఎంకే పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. బీజేపీకి జిరాక్స్ కాపీలా విజయ్ పాలన.. సీఎం విజయ్ ప్రస్తుతం బట్టల షాపింగ్ తరహాలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కొనేస్తున్నారని ఆరోపించారు. తన ప్రభుత్వంపై తనకే నమ్మకం లేక, మొదట అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో తనకు అనుకూలంగా ఓటు వేయించుకున్నారన్నారు. ఇప్పుడు వారితో రాజీనామాలు చేయించి వెంటనే తన పార్టీలో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో చేస్తున్న దాన్నే ఇక్కడ విజయ్ చేస్తున్నారని, విజయ్ పూర్తిగా బీజేపీకి జెరాక్స్ కాపీలా వ్యవహరిస్తున్నారన్నారని అన్నారు. -
డ్రైవర్గా మారిన సీఎం విజయ్.. 130 కిలోమీటర్లు స్వయంగా డ్రైవింగ్!
తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి, పార్టీ పెట్టిన రెండేళ్లకే అధికారంలోకి వచ్చాడు స్టార్ హీరో విజయ్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైనశైలీలో పరిపాలన సాగిస్తున్నాడు. హీరోగా ఉన్నప్పుడే ఆయన చాలా సింపుల్ లైఫ్ని లీడ్ చేసేవాడు. స్టార్ అనే గర్వం ఎక్కడ చూపించేవాడు కాదు. ఇక సీఎం అయిన తర్వాత ఆయనలో మరింత మార్పు వచ్చింది. ఎక్కడ కూడా అధికార గర్వం కనిపించడం లేదు. ప్రజలకు మరింత చేరువయ్యేలా ఆయన ప్రణాళికలు ఉంటున్నాయి. తాజాగా ఆయన కర్ణాటక కొల్లూరులోని శ్రీ మూకాంబికా అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అయితే ఈ పర్యటన సందర్భంగా విజయ్ చేసిన ఫీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత విజయ్ ఒక్కసారిగా డ్రైవర్ అవతారం ఎత్తాడు. ఆలయం నుంచి మంగళూరు విమానాశ్రయం వరకు దాదాపు 130 కిలోమీటర్లు కాన్వాయ్లో తాను ప్రయాణించే కారును స్వయంగా డ్రైవ్ చేశారు.సీఎం విజయ్ కారు నడుపుతుండగా, భద్రతా సిబ్బందికి చెందిన కాన్వాయ్ వాహనాలు ఆయనను అనుసరించాయి. ఈ ప్రయాణంలో భాగంగా ఒక టోల్ గేట్ వద్ద కారు ఆగినప్పుడు, పక్కనే ఉన్న అభిమానులను గమనించిన విజయ్.. ఎంతో నమ్మకంతో, చిరునవ్వుతో వారికి చేయి ఊపుతూ అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. He Himself drives His own convoy for more than 130+KM's From Kollur to Mangaluru Airport🥶🙌🫡🔥🦁@CMOTamilnadu Na Loves Driving❤️#Jananayagan @TVKVijayHQ pic.twitter.com/PkyyYU2OIW— MR.BK👺 (@_kishore__vj) June 12, 2026Most Valuable Driver 🔥🔥🔥#CMJosephVijay #TVKVijay pic.twitter.com/eAPer8fCvQ— Swara TVK ❤️💛 (@SwaraVijay_) June 12, 2026 -
పుట్టినరోజు నాడే.. విజయ్ నుంచి బిగ్ లాంచ్?
రాజకీయాల్లో గెలవాలంటే కేవలం ప్రజాబలం మాత్రమే కాదు.. తమ మాటలను ప్రజల్లోకి తీసుకెళ్లే ‘బలం’ కూడా అవసరమే. అందుకే డిజిటల్ యుగంలో సోషల్ మీడియాను అన్లిమిటెడ్గా వాడేసుకుంటున్నాయి పార్టీలు. అలాగే.. పార్టీలకు అనుకూలంగా పేపర్లు, టీవీ చానెల్స్ ఉండటం కొత్త విషయం కాదు. తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత జోసెఫ్ విజయ్ కూడా అదే బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ అఖండ విజయం సాధించింది. అయితే ఆ గెలుపులో మీడియా కంటే.. సోషల్ మీడియానే అధిక పాత్ర పోషించింది. అందుకు కారణం.. అప్పటి అధికార, ప్రతిపక్షాల చేతుల్లోనే మీడియా చానెల్స్, పేపర్లు మొత్తం ఉండడం. ఆ సమయంలో ఆయన ఈ పరిస్థితిని పార్టీ మీటింగ్లోనూ ప్రస్తావించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు తన టీవీకే పార్టీ తరఫున కొత్త వార్తా చానెల్ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. జూన్ 22న ‘వెట్రి న్యూస్’ అనే న్యూస్ చానెల్ సీఎం విజయ్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోందట. అదే రోజు ఆయన పుట్టినరోజు కావడం గమనార్హం. తమిళగ వెట్రి కగళం అంటే తమిళ విక్టరీ క్లబ్ అని అర్థం. విజయ్ తన పేరులోని విజయాన్ని పార్టీకి పెట్టారు. ఇప్పుడు చానెల్కు కూడా వెట్రి(విజయం) అనే ఉంచాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ప్రముఖ ఇన్ఫ్లున్సెయర్, పొలిటికల్ అనలిస్ట్గా పేరుగాంచిన మణికందన్ భాస్కరన్ తన bbtrackermanix ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ విషయం ప్రకటించారు. దీంతో టీవీకే వర్గాలు ఫుల్ జోష్లో ఉన్నాయి. రాజకీయ పార్టీలు, మీడియా మధ్య ఉన్న అనుబంధం దేశంలో.. తమిళనాడులో కొత్త విషయం కాదు. దశాబ్దాలుగా రాజకీయాలు, మీడియా రంగం పరస్పరం ప్రభావితం చేసుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీలు మీడియా వేదికలను వినియోగించుకోవడం సాధారణంగా మారిపోయింది.తమిళనాడులో అధికార డీఎంకేకు మద్దతుగా భావించే మీడియా సంస్థల్లో ప్రముఖంగా సన్ టీవీ గ్రూప్ పేరు వినిపిస్తుంది. డీఎంకే తొలి కుటుంబంతో సన్ గ్రూప్కు ఉన్న సాన్నిహిత్యం బహిరంగ రహస్యమే. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేకు అనుబంధంగా జయ టీవీ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. పార్టీ కార్యక్రమాలు, నాయకత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ ఛానెల్ కీలక పాత్ర పోషించింది. అలాగే విజయ్కాంత్ పార్టీ కోసం కెప్టెన్ అనే ఓ చానెల్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంతెందుకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (AMMK) నేత టీవీవీ దినకరన్కు అనుకూలంగా జయా న్యూస్, ఇతర మీడియా వేదికలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి అధికారాన్ని అందుకున్న విజయ్ ఇప్పుడు మీడియా రంగంలో కూడా తన ముద్ర వేయాలనుకుంటున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వ విధానాలు, రాజకీయ సందేశాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘వెట్రి న్యూస్’ వేదికగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఛానెల్ పూర్తిస్థాయి వార్తా సంస్థగా పనిచేస్తుందా? లేదంటే పార్టీ అనుకూల వేదికగా నిలుస్తుందా? అన్నది ప్రారంభం తర్వాతే స్పష్టత రానుంది. వెట్రి న్యూస్ చానెల్ యాజమాని ఎవరు?.. దాని వెనుక ఏ సంస్థ అయినా స్పాన్సర్షిప్ ఉండనుందనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. విజయ్కు అత్యంత ఆప్తుడైన ఓ వ్యాపారవేత్త ఈ చానెల్ను టేకప్ చేస్తారని.. డీఎంకే హయాంలో వివాదాస్పదుడిగా పేరుగాంచిన ఓ ప్రముఖ న్యూస్ యాంకర్ ఆ చానెల్ను హ్యాండిల్ చేయబోతున్నారని ప్రచారం మాత్రం జోరుగా వినిపిస్తోంది. ఇప్పటికే శాటిలైట్, డిజిటల్ విభాగాల కోసం జర్నలిస్టులు, వీడియోగ్రాఫర్లు, జిల్లా రిపోర్టర్లు, న్యూస్ ఎడిటర్లు తదితర పోస్టులకు నియామక ప్రకటనలు కూడా వెలువడటం చర్చనీయాంశంగా మారింది. ఇటు ఛానెల్ ప్రారంభంపై తమిళగ వెట్రి కళగం నుంచి మాత్రం ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. -
విజయ్ ఎఫెక్ట్.. స్టాలిన్ కళ్లు తెరిపించిన నివేదిక
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కోల్పోవడంపై నియోజకవర్గాల వారీగా తెప్పించుకున్న క్షేత్రస్థాయి విచారణ నివేదికలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్కు షాక్ తగిలే విధంగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల్లో ఘోర పరాజయానికి గల కారణాలను విశ్లేషిస్తూ పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలు రెండు రోజుల క్రితమే ఒక సమగ్ర నివేదికను స్టాలిన్కు సమర్పించాయి.తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయడం, మహిళల్లో వ్యక్తమైన తీవ్ర అసంతృప్తి పార్టీని పూర్తిగా ముంచేసిందని ఈ నివేదిక తేల్చిచెప్పింది. శుక్రవారం డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో ఈ ప్రత్యేక కమిటీతో స్టాలిన్ సమావేశమయ్యారు. ఇందులోని అంశాలను పరిశీలించి, నియోజకవర్గాల వారీగా చర్చించారు. ఓటమికి ప్రధాన కారణాలు తాజా నివేదిక మేరకు వెలుగులోకి వచ్చాయి.విజయ్ను తక్కువగా అంచనా విజయ్ క్షేత్రస్థాయిలో సాధిస్తున్న ప్రజాదరణను, ఆయనకు లభిస్తున్న నిశ్శబ్ద మద్దతును డీఎంకే జిల్లా అధికారులు, స్థానిక నాయకత్వం గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని తేలింది. గెలుపు గుర్రాలైన స్థానిక పలుకుబడి కలిగిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి, కొత్త ముఖాలను పోటీలో పెట్టడం కూడా ఓటమికి ఓ కారణంగా గుర్తించారు. నియోజకవర్గాల్లో కూటమి పార్టీల మధ్య కనీస సమన్వయం లేదని నివేదిక స్పష్టం చేసింది.ఇక యాక్షన్ ప్లాన్ ఈ పరాజయం నేపథ్యంలో డీఎంకేలో భారీ సంస్థాగత మార్పునకు ఎం.కె. స్టాలిన్ శ్రీకారం చుట్టారు. పార్టీ పరిపాలనా యంత్రాంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం పెద్ద జిల్లాల పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల వరకు ఒక జిల్లా కార్యదర్శి ఉండగా, ఆ నియోజకవర్గాల సంఖ్యను తగ్గించి కేవలం రెండు లేదా మూడు నియోజకవర్గాలకు ఒక జిల్లా కార్యదర్శిని నియమించేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం పార్టీ పరంగా ఉన్న 78 మంది జిల్లా కార్యదర్శుల సంఖ్యను 115కు పెంచనున్నారు. ఈ విభజన ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మరో 30 మంది పార్టీ కోసం పనిచేసే కొత్త వారికి జిల్లా కార్యదర్శులుగా అవకాశం దక్కనుంది.దక్షిణ, కొంగు మండలాలపై దృష్టి డీఎంకే తీవ్రంగా దెబ్బతిన్న దక్షిణ జిల్లాలు, పశ్చిమ ప్రాంతమైన కొంగు మండలం పార్టీని పునరుద్ధరించడానికి ప్రత్యేక కమిటీని రంగంలోకి దించారు. అలాగే, పార్టీ అగ్రనాయకత్వంలో కూడా అధికార వికేంద్రీకరణ జరగబోతోందని అరివాలయం వర్గాలు తెలిపాయి. కలైంజ్ఞర్ కాలం నాటి పాత రాజకీయ వ్యూహాలు ఇప్పుడు పని చేయవని, కొత్త తరం ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా సరికొత్త నాయకత్వ ఫార్ములాను స్టాలిన్ సిద్ధం చేసినట్టు తెలిసింది.కనిమొళి, ఉదయనిధి: ఇప్పటికే యువజన విభాగంలో కీలకంగా ఉదయనిధి స్టాలిన్తో పాటు, ఢిల్లీ రాజకీయాల్లో అపార అనుభవం, మహిళల్లో మంచి పట్టు ఉన్న సీనియర్ నేత కనిమొళికి కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. వీరిద్దరిని కలిపి ద్వంద్వ బృందం పద్ధతిలో పార్టీని నడిపించేందుకు అధిష్ఠానం కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే జరగబోయే డీఎంకే జనరల్ సర్వసభ్య సమావేశంలో ఈ సంచలన మార్పులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.మహిళా లబ్దిదారుల ఆగ్రహం.. డీఎంకే హయాంలో ప్రవేశపెట్టిన మహిళా హక్కుల పథకం డీఎంకే ఓటమికి ప్రధాన కారణంగా నిలవడం గమనార్హం. రాష్ట్రంలో 2 కోట్ల 20 లక్షల రేషన్ కార్డులు ఉంటే, కేవలం ఒక వర్గానికి మాత్రమే కోటి 34 లక్షల మందికి ఈ సాయం అందించడం, ఇందులోనూ ఇతర పార్టీల వారు ఉండడంతో, మిగిలిన కోటి మంది మహిళలు డీఎంకేకు వ్యతిరేకంగా ఓటు వేశారన్నది స్పష్టం కావడం ఆలోచించ దగ్గ విషయం. అలాగే, ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు ప్రభుత్వం అందించిన రూ.5వేలు వేసవి సాయాన్ని కూడా కేవలం కొద్దిమంది అర్హులకు మాత్రమే పరిమితం చేయడం వలన సాధారణ మహిళా ఓటర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమై ఓట్లను దూరం చేసినట్టు తేటతెల్లమైంది.సోఫా మోడల్ ప్రభుత్వం.. మరోవైపు.. తమిళనాడులో డీఎంకే ఐదేళ్ల ద్రావిడ మోడల్ పాలనలో సాధించిన అద్భుత విజయాలను, అభివృద్ధిని తాజా సీఎం విజయ్ ఆయన ఖాతాలో వేసుకుంటున్నారని డీఎంకే యువజన నేత, ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆయన సోఫా మోడల్ ప్రభుత్వంగా అభివర్ణించారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం విజయ్ చేసిన ప్రసంగంపై శుక్రవారం ఉదయనిధి తన ఎక్స్ పేజీలో స్పందించారు.అవన్నీ డీఎంకే సాధించినవే.. ఎన్నికల ప్రచారంలో తమిళనాడు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, పాతాళానికి పడిపోయిందని అబద్దపు కథనాలను ప్రచారం చేసిన విజయ్, ఇప్పుడు అధికారంలోకి రాగానే, ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో, తమిళనాడు సాధించిన ఘనతలను ఒక పెద్ద జాబితా రూపంలో చదివి వినిపించారని గుర్తు చేశారు. తమిళనాడు రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, దేశంలో ఉద్యోగాలు చేసే మొత్తం మహిళల్లో 42 శాతం మంది తమిళనాడుకు చెందినవారేనని సీఎం విజయ్ అక్కడ ప్రస్తావించారని గుర్తు చేశారు. అలాగే మహిళా విద్య, రక్షణ, ఆరోగ్యం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధిపై కూడా సీఎం మాట్లాడారన్నారు. ఇవన్నీ ఆయన అధికారంలోకి వచ్చిన ఈ ఒక నెల రోజుల సోఫా మోడల్ పాలనలో జరిగినవా? లేక ఐదేళ్లపాటు తమ డీఎంకే ప్రభుత్వం రాత్రింబవళ్లు కష్టపడి సాధించిన ద్రావిడ మోడల్ విజయాలా అని ప్రశి్నస్తూ, దీనికి సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.మౌనం ఎందుకు? ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత విజయ్ తీసుకున్న యూ–టర్న్లపై ఉదయనిధి మండిపడ్డారు. నీట్ పరీక్షే ప్రపంచమా అని ఎన్నికల సమయంలో వ్యాఖ్యలు చేసిన విజయ్, ఇప్పుడు అదే నీట్ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఢిల్లీ వరకు వెళ్లిన సీఎం కర్ణాటకలో అధికారంలో ఉన్న తన కొత్త మిత్రపక్ష పార్టీతో కానీ, నీతి ఆయోగ్ సమావేశంలో కానీ, మేఘధాతు వ్యవహారంపై నోరు విప్పలేదని ఆరోపించారు. మనకెందుకులే వచ్చిన గొడవ అన్నట్లుగా ఆయన మౌనంగా తిరిగి వచ్చేశారని ఎద్దేవా చేశారు. వాస్తవానికి నీతి ఆయోగ్ సమావేశంలో డీఎంకే ప్రభుత్వ విజయాలపై ఈ సోఫా మోడల్’ ప్రభుత్వం పూర్తిగా వారి స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుందని ధ్వజమెత్తారు. -
రాజకీయాల్లోకి లారెన్స్.. కీలక ప్రకటన
ప్రముఖ నటుడు రాఘవా లారెన్స్ ఎట్టకేలకు ఊహాగానాలపై స్పందించారు. గత కొంతకాలంగా ఆయన రాజకీయాల్లోకి వస్తారని.. ఫలానా పార్టీలో చేరి ఉపఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. అయితే రాజకీయాల్లోకి వచ్చే విషయంపై ఇంకొంత కాలం సస్పెన్స్ను కొనసాగించాలనే ఆయన నిర్ణయించారు. రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేదానిని లారెన్స్ ప్రశ్నార్థకంగా వదిలేశారు. ఈ అంశాన్ని ప్రజలే నిర్ణయించాలంటూ ఎక్స్ ఖాతాలో తాజాగా ఆయనో వీడియో రిలీజ్ చేశారు. కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కమ్ నటుడైన లారెన్స్.. అటు సమాజ సేవతోనూ మంచి గుర్తింపు పొందారు. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీపై కుతూహలం నెలకొంది. ఈ ప్రచారం స్వయంగా ఆయనే స్పందించారు. తాను ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని.. పదవి కోసమో లేదంటే డబ్బు కోసం రాజకీయాలను ఆశ్రయించడం లేదని రాఘవ లారెన్స్ స్పష్టం చేశారు. అయితే తనకు నమ్మకమైన, సన్నిహిత వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే.. అతనికి అండగా నిలిచి, వ్యక్తిగతంగా చేస్తున్న సమాజ సేవను మరింత పెద్ద స్థాయిలో చేయాలనే ఆలోచన మాత్రమే తనకు ఉందన్నారు. ప్రస్తుతం పరిస్థితులు తనను రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సిన స్థితికి తీసుకొచ్చాయని పేర్కొన్నారు. రాజకీయాలపై తానే ఓ కీలక ప్రకటన చేస్తానని లారెన్స్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. అయితే దర్శక దిగ్గజం భారతీరాజా మృతితో ఆ ప్రకటనను ఇవాళ్టికి వాయిదా వేశారు. ఈ తరుణంలో ఓ వీడియో రిలీజ్ చేశారిప్పుడు. ప్రజలు ఆమోదిస్తేనే తాను రాజకీయాల్లోకి వస్తానని, లేకుంటే లేదని తేల్చేశారు. ప్రజాశీర్వాదంతోనే.. తాను ఏ పార్టీలో చేరతాననేది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. దీంతో ఆయన కామెంట్ సెక్షన్లో పలువురు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఆయన ట్వీట్ సారాంశం.. Do your duty sincerely, without expecting anything in return.After watching this video, please share your advice and guidance in the comments. If you say “No,” I will not enter politics and will continue my selfless service to society. But if you say “Yes,” I am ready to enter… pic.twitter.com/VwPFjdaUqy— Raghava Lawrence (@offl_Lawrence) June 12, 2026ఫలితాలపై ఆశలు పెట్టుకోకుండా మీ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. మీరు 'వద్దు' అంటే నేను రాజకీయాల్లోకి రాను.. సమాజ సేవనే కొనసాగిస్తాను. 'అవును' అంటే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు, ఎవరితో కలిసి నా రాజకీయ ప్రయాణం ప్రారంభమవుతుందో త్వరలో వెల్లడిస్తాను.అయితే.. లారెన్స్ కేవలం నటుడిగానే కాదు, కొరియోగ్రాఫర్, దర్శకుడు, నిర్మాతగానూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. చిన్న డ్యాన్సర్గా సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. నటుడిగా, తర్వాత స్టార్ కొరియోగ్రాఫర్గా ఎదిగారు. అనంతరం హీరోగా మారి ముని, కాంచన, కాంచన-2, కాంచన-3 వంటి హారర్-కామెడీ చిత్రాలతో భారీ విజయాలు అందుకున్నారు. ముఖ్యంగా కాంచన సిరీస్తో దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు తన తల్లి పేరిట దివ్యాంగులు, అనాథలు, పేద విద్యార్థుల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేశారు. అందుకే ఆయన రాజకీయ అరంగేట్రంపై తమిళనాడులో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అయితే.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు లారెన్స్కు మధ్య మంచి స్నేహం ఉంది. గతంలో విజయ్ నటించిన పలు చిత్రాలకు లారెన్స్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే లారెన్స్ సేవా కార్యక్రమాలకు విజయ్ ఆర్థిక సాయం అందించారు. దీంతో లారెన్స్ టీవీకే పార్టీలో చేరతారని, విజయ్ రాజీనామాతో(రెండింటిలో ఒకటి రాజీనామా చేయాల్సిన పరిస్థితిలో) ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ నుంచే పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో టీవీకే పార్టీ ఇప్పటిదాకా ఓ స్పష్టమైన ప్రకటన చేయలేదు. -
ఆ కారణంగానే టీవీకేకు మద్దతు.. చిదంబరం కీలక వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె: సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్ స్పష్టత నిచ్చింది. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం పూర్తిగా సమర్థించారు. ‘మతసామరస్యం , రాష్ట్ర హక్కుల పరిరక్షణ అనే రెండు ప్రాథమిక సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నంత వరకు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు.గురువారం చైన్నెలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, తమిళనాడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఊహించని మహా విజయంమీడియా, రాజకీయ విశ్లేషకులు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అందకుండా టీవీకే పార్టీ ఎన్నికల్లో ఏకంగా 35 శాతం ఓట్లను కొల్లగొట్టిందని కొనియాడారు. పార్టీ స్థాపించిన కేవలం రెండేళ్లలోనే ఇంతటి ఘనవిజయం సాధించడం అద్భుతమని విజయ్ను అభినందించారు. తమిళనాడు ప్రజలు ఇప్పుడు మళ్లీ ముందస్తు ఎన్నికలను కోరుకోవడం లేదని చిదంబరం అభిప్రాయపడ్డారు. ఒకవేళ ప్రభుత్వం పడిపోతే, రాష్ట్రపతి పాలన నెపంతో బీజేపీ దొడ్ది దారి గుండా అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉందని, అందుకే ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ప్రజాస్వామ్యబద్ధంగా సరైన నిర్ణయమని ఆయన విశ్లేషించారు. ప్రస్తుత టీవీకే ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా 31 మంది మంత్రులకు అసెంబ్లీలో ఎలాంటి ముందస్తు అనుభవం లేదన్నారు. అలాగే 101 మంది ఎమ్మెల్యేలు మొదటిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టారని వివరించారు. వీరందరికీ కొంత సమయం ఇవ్వాలని చిదంబరం కోరారు. బీజేపీ నుండి బయటకు వచ్చి అన్నామలై ఒక కొత్త ఉద్యమాన్ని ప్రారంభించడం గురించి స్పందిస్తూ, అది రాజకీయ పార్టీగా మారుతుందో లేదో నాకు తెలియదన్నారు. అయితే, బీజేపీలో ఆయనకు సరైన గుర్తింపు, గౌరవం దక్కలేదనే విషయం పలు ఇంటర్వ్యూలు చూస్తే స్పష్టంగా అర్థమవుతోందన్నారు. తాను ఇటీవల మాజీ సీఎం స్టాలిన్ను మర్యాదపూర్వకంగా కలిశానని, ఆయన ఇండియా కూటమి నుండి వైదొలుగుతున్నట్లు తనతో ఏమీ చెప్పలేదని వివరణ ఇచ్చారు. -
ఆ విషయంలో తగ్గేదేలే.. నీతి ఆయోగ్ భేటీలో సీఎం విజయ్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తమిళనాడు సీఎం విజయ్ కీలక డిమాండ్లు లేవనెత్తారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) పరీక్షను తీవ్రంగా వ్యతిరేకించిన విజయ్.. 12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య సీట్లను భర్తీ చేసేందుకు అనుమతించాలని కోరారు. దీంతో పాటు కోయంబత్తూరులో ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు, పెండింగ్లో ఉన్న రూ.3,284 కోట్ల విద్యా నిధుల విడుదల, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఆమోదం, శ్రీలంక, పాకిస్తాన్లలో బందీలుగా ఉన్న తమిళ మత్స్యకారుల విడుదల కోసం కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్ష వల్ల గ్రామీణ, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని సీఎం విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటును కోరుతూ.. కోయంబత్తూరులో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఏర్పాటుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని సీఎం విజయ్ కేంద్రానికి హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వైద్య విద్యను, అత్యాధునిక ప్రపంచ స్థాయి వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయవచ్చని ఆయన వివరించారు.పాక్ జలసంధి ప్రాంతంలో భారతీయ మత్స్యకారుల సాంప్రదాయ చేపల వేట హక్కులను రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజయ్ కోరారు. ప్రస్తుతం శ్రీలంక, పాకిస్తాన్ దేశాల జైళ్లలో మగ్గుతున్న తమిళనాడు మత్స్యకారులను, వారి బోట్లను విడిపించేందుకు అత్యవసర దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర రోడ్డు రవాణా, రైల్వే మంత్రిత్వ శాఖలు కింది ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారుసమగ్ర శిక్షా అభియాన్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.3,284 కోట్ల పెండింగ్ నిధులను ముందస్తు షరతులు లేకుండా విడుదల చేయాలన్నారు. అలాగే, ఆధునిక భారతదేశ లౌకిక విలువల చాటిచెప్పే ప్రాచీన తమిళ గ్రంథం 'తిరుక్కురళ్' (Thirukkural)ను జాతీయ సాహిత్యంగా ప్రకటించాలని కౌన్సిల్ ముందు ప్రతిపాదించారు. -
'భారతీ రాజా మరణం.. రాఘవ లారెన్స్ కీలక నిర్ణయం'
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రభంజనం తర్వాత మరో స్టార్ హీరో అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. పాలిటిక్స్లో తన ఎంట్రీపై కీలక నిర్ణయం ప్రకటిస్తానని ఇప్పటికే రాఘవ లారెన్స్ వెల్లడించారు. ఈనెల 11న ఉదయం 9:30 గంటలకు కీలక ప్రకటన ఉంటుందని తెలిపారు. అయితే దర్శకుడు భారతీ రాజా మరణంతో తన సమావేశాన్ని 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు లారెన్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు.రాఘవ లారెన్స్ తన ట్వీట్లో రాస్తూ.. 'అందరికీ నమస్కారం.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ భరతిరాజా మృతికి సంతాపం ప్రకటించింది. ఈ నష్టం మా కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత వ్యక్తిగతంగా నన్ను బాధ కలిగిస్తోంది. భరతిరాజా చిత్ర పరిశ్రమకు చేసిన అపారమైన సేవ పట్ల గౌరవంతో.. నేను నా ప్రకటనను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నా. ఈనెల 12వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు నా నిర్ణయం ప్రకటిస్తా' అని పోస్ట్ చేశారు.కాగా.. సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నుంచి టీవీకే తరఫున రాఘవ లారెన్స్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాఘవ లారెన్స్ ప్రకటనపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. Hi everyone, I had earlier informed you that I would be making an important life decision announcement on Thursday, the 11th, at 9:30 AM.The industry is currently mourning the passing of Bharathiraja sir. This loss feels deeply personal, like losing a member of the family.… pic.twitter.com/eNfEG6LxRr— Raghava Lawrence (@offl_Lawrence) June 10, 2026 -
ప్రభుత్వ లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు: సీఎం విజయ్
దర్శక శిఖరం భారతీరాజా అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు. తమిళ చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. భారతీరాజా(84) మరణ వార్త వినగానే విజయ్ సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం చెన్నైలోని భారతీరాజా నివాసానికి వెళ్లి పార్థీవదేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. ఆయన మృతి భారతీయ సినిమాకు తీరని లోటని సతాపం తెలిపారు. విజయ్తో పాటు తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్, సీనీ నటి సినీ నటి రాధికా, హీరో సూర్య కూడా భారతీరాజా నివాసానికి చేరుకొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్టాలిన్ భారతీరాజాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. -
Tamil Nadu: కాంగ్రెస్ వర్సెస్ టీవీకే
సాక్షి, చెన్నై : కన్యాకుమారి జిల్లా కిల్లియూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే , మంత్రి రాజేష్ కుమార్ ఎన్నికను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించేందుకు టీవీకే అభ్యర్థి సబీన్ నిర్ణయించారు. ఆయన గెలుపు చెల్లదని ప్రకటించాలని కోరుతూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికలలో 1,311 ఓట్లతో రాజేష్ కుమార్ సబీన్పై గెలిచారు. సోమవారం సబీన్ స్వయంగా కన్యాకుమారి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించిన ఫిర్యాదు లేఖను కిల్లియూర్ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కౌన్సిల్ కార్యదర్శి , ప్రధాన ఎన్నికల కమిషనర్కు కూడా పంపినట్టు ఆయన తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోస్టల్ ఓట్ల నిర్లక్ష్యం : ఎన్నికల నిబంధనల ప్రకారం లెక్కింపు జరపాల్సిన అనేక పోస్టల్ ఓట్లను అధికారులు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ నిర్దేశిత సమయం కంటే ముందే, అంటే ఉదయం 6 గంటలకే ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారని వివరించారు. సాంకేతిక లోపం పేరిట ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు సరిగ్గా జరగలేదని, తాము ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా, కౌంటింగ్ అధికారులు సరైన వివరణ ఇవ్వకుండా రకరకాల కారణాలు చెబుతూ తుది ఫలితాన్ని ఏకపక్షంగా ప్రకటించారని సబీన్ ఆరోపించారు.నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ లెక్కింపు ఆధారంగా ప్రకటించిన రాజేష్ కుమార్ విజయాన్ని తక్షణమే రద్దు చేయాలని సబీన్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం జరగకపోతే, త్వరలోనే ఉన్నత న్యాయస్థానాన్ని (హైకోర్టు) ఆశ్రయించి ఎన్నికల పిటిషన్ దాఖలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు.కాగా టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యే గెలుపును వ్యతిరేకిస్తూ అధికార పక్షం అభ్యర్థి న్యాయ పోరాటానికి సిద్ధం కావడం చర్చకు దారి తీసింది. -
సీఎం విజయ్ రాకతో నెరవేరిన 56 ఏళ్ల కల
తమిళనాడు: బస్సు లేక 56 ఏళ్లుగా అవస్థలు పడుతున్న కొండ గ్రామ ప్రజల కలలో తమిళనాడు ప్రభుత్వం నెరవేర్చింది. దీంతో ఆ గ్రామ ప్రజలు పాఠశాల విద్యార్థులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. వివరాలు.. తేని జిల్లాలోని మారుమూల కోటగుడి కొండ గ్రామం ప్రాంతం చాలా మంది సినిమాటోగ్రాఫర్లను ఆకర్షించింది. ఈ ప్రాంతంలోని కోటగుడి కొండ గ్రామంలో 200కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇది నీలగిరి పరిధిలో ఉంటుంది.ఈ గ్రామానికి చెందిన 25 మందికి పైగా పిల్లలు పోడి నాయక్కనూరులోని ప్రభుత్వ , ప్రభుత్వ – సహాయక పాఠశాలల్లో చదువుకుంటున్నారు. కోటగుడి నుండి బస్సు సౌకర్యాలు లేకపోవడంతో, ఇక్కడి నుండి పాఠశాలకు వెళ్లే పిల్లలు రోజూ 2 నుండి 3 కిలోమీటర్లు నడిచి, ఆ తర్వాత పాఠశాలకు వెళ్లడానికి కోటగుడి డివిజన్ సమీపంలోని కురంగానికి బస్సు ఎక్కవలసి వచ్చేది. దీంతో కోటగుడి కొండ గ్రామానికి బస్సు, మినీబస్సు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు చాలాసార్లు నిరసనలు చేపట్టారు. కానీ ఫలితం లేకుండా పోయింది. తాజాగా సీఎం ఆదేశాల మేరకు రవాణా శాఖ మంత్రి విజయ్ తమిళన్ పార్థిబన్ తక్షణ చర్యలు తీసుకున్నారు. కోట గుడి కొండకు ప్రభుత్వ బస్సు సర్వీసును ప్రారంభించే విషయంపై అధ్యయనం చేయాలని తేని జిల్లా కలెక్టర్ వైద్యనాథన్ రాష్ట్ర రవాణా సంస్థ అధికారులను ఆదేశించారు. దీని ప్రకారం, కోట గుడి రోడ్డుపై బోడి నుండి కురంగణి వరకు ఉదయం 3.30 నుండి సాయంత్రం 5.30 వరకు బస్సును నడపాలని నిర్ణయించారు. మొదటిసారిగా బస్సు గ్రామంలోకి ప్రవేశించడాన్ని చూసి మలై గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. -
ప్రజ్ఞానందకు రూ. 50 లక్షల నజరానా
సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మక నార్వే ఓపెన్ చెస్ టోర్నిలో టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన తమిళనాడు గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందకు నగదు ప్రోత్సాహకం లభించింది. విజేత హోదాలో చెన్నై వచ్చిన ప్రజ్ఞానంద తన తల్లిదండ్రులతో సోమవారం సచివాలయంలో సీఎం విజయ్ను కలిశాడు. ఈ సందర్భంగా ప్రజ్ఞానందను విజయ్ సత్కరించారు. తమిళనాడు ప్రభుత్వం తరపున రూ. 50 లక్షల నగదు ప్రోత్సాహానికి గాను చెక్ను అందజేశారు. అనంతరం ప్రజ్ఞానందతో చెస్ బోర్డు తెచ్చావా? అని అడిగి మరీ విజయ్ 15 నిమిషాలపాటు స్నేహపూర్వక గేమ్ ఆడారు. వీరిద్దరి మధ్య గేమ్ను ఛాంబర్లో ఉన్న క్రీడా మంత్రి ఆధవ్ అర్జునతో పాటుగా అ«ధికారులు ఆసక్తితో తిలకించారు. గేమ్లో తనను ఓడించిన ప్రజ్ఞానందను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. -
విజయ్ కి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం!
-
ప్రజ్ఞానంద తో చెస్ ఆడిన CM విజయ్
-
బీజేపీని ఎదుర్కొనే ధైర్యం విజయ్కు లేదా?
తమిళనాడు రాజకీయాల్లో రాజ్యసభ సీటు సరికొత్త హీటు పుట్టిస్తోంది. పార్టీ పుట్టి, అధికారంలోకి వచ్చాక తమ తొలి రాజ్యసభ సీటును కాంగ్రెస్కు కేటాయించింది విజయ్ నేతృత్వంలోని అధికార టీవీకే పార్టీ. అయితే ఈ వ్యవహారంపై ప్రతిపక్ష డీఎంకే ఘాటు విమర్శలు గుప్పించింది. ఈ వ్యవహారం వెనుక కృతజ్ఞత కాదని.. రాజకీయ లెక్కలు ఉన్నాయని అంటోంది. ఆ విమర్శలు ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి.తమిళగ వెట్రి కళగం (TVK) తన తొలి రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్కు కేటాయించడంపై అధికార డీఎంకే తీవ్ర విమర్శలు చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి విజయ్ ఉద్దేశపూర్వకంగానే తన పార్టీ నేతలను రాజ్యసభకు పంపకుండా కాంగ్రెస్కు సీటు ఇచ్చారని ఆరోపించింది. బీజేపీని నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే ఈ పని చేశారని ఎద్దేవా చేసింది. డీఎంకే అధికార ప్రతినిధి శ్రవణన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "రాజ్యసభకు వెళ్తే ప్రతి జాతీయ అంశంపై స్పష్టమైన వైఖరి తీసుకోవాలి. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా నేరుగా పోరాడాల్సి ఉంటుంది. అందుకే టీవీకే నుంచి ఎవరినీ రాజ్యసభకు పంపలేదు" అని విమర్శించారు. విజయ్ బీజేపీపై తన అసలు రాజకీయ వైఖరిని బయటపెట్టేందుకు సిద్ధంగా లేరని.. పార్లమెంట్ వేదికపై బీజేపీని నేరుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని భావించే ఆ బాధ్యతను కాంగ్రెస్పైకి నెట్టేశారని డీఎంకే ఆరోపిస్తోంది.If you go to Rajya Sabha you’ll have to take a stand on every issue. More importantly you have to oppose BJP directly. That’s the only reason no member from TVK was sent to Rajya Sabha. Let’s not forget that Mr. Vijay did not even meet the Congress leaders, Mrs. Sonia Gandhi,… pic.twitter.com/qZZnS7jGAM— Saravanan Annadurai (@saravofcl) June 3, 2026ఇదిలా ఉండగా.. తన తొలి రాజ్యసభ సీటును కాంగ్రెస్కు కేటాయించడం ద్వారా రెండు పార్టీల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని మరింత బలపరిచినట్లు టీవీకే చెబుతోంది. మరీ ముఖ్యంగా ఇరు పార్టీల సంబంధాలను బలోపేతం చేయడం, ప్రభుత్వ ఏర్పాటు దిశగా జరిగిన మంతనాల్లో కీలక పాత్ర పోషించిన నాయకుడినే కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక చేయడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే డీఎంకే ఈ నిర్ణయాన్ని రాజకీయ వ్యూహంగా కాకుండా.. విజయ్ రాజకీయ సంకోచంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక రాజకీయాల్లో తాము ముందుంటే, టీవీకే మాత్రం స్పష్టమైన వైఖరి వెల్లడించకుండా ముందుకెళ్తోందని డీఎంకే వాదిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో అసలు చర్చ రాజ్యసభ సీటు గురించి కాదు.. విజయ్ నిజంగా బీజేపీ వ్యతిరేక రాజకీయాలకు కట్టుబడి ఉన్నారా? లేదంటే రాజకీయంగా తటస్థంగా ఉండాలనుకుంటున్నారా? అన్నదే డీఎంకే లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు ఇచ్చిన ఒక రాజ్యసభ సీటు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో పెద్ద సిద్ధాంతపరమైన చర్చకు దారి తీసింది. డీఎంకే విమర్శలకు టీవీకే ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. -
తొలి క్యాబినేట్ భేటీలోనే దుమ్మురేగొట్టిన విజయ్
చైన్నై: తమిళనాడు సీఎం విజయ్ తొలి క్యాబినేట్ భేటీలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్లో నిధుల లీకేజీలు, అనధికారిక వసూళ్లు మద్యం విక్రయాల ద్వారా వచ్చే ప్రతి రూపాయి నేరుగా ప్రభుత్వ ఖజానాకే చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. టాస్మాక్ కార్యకలాపాల ద్వారా ప్రతి నెలా దాదాపు రూ. 102 కోట్లు అనధికారికంగా "పార్టీ ఫండ్" రూపంలో పక్కదారి పడుతున్నట్లు తనకు సమాచారం అందిందని ముఖ్యమంత్రి విజయ్కు అధికారులు వివరించారు. గత ఐదేళ్లలో దాదాపు రూ.1,600 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరకుండా దారి మళ్లించబడ్డాయని అంచనా వేస్తున్నారు. దీంతో టాస్మాక్ హోల్సేల్, రిటైల్ నెట్వర్క్లలో చాలా కాలంగా నడుస్తున్న అనధికారిక నగదు వసూళ్ల వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.ఈ విషయమై తమిళనాడు మంత్రి మీడియాతో మాట్లాడుతూ " అవినీతి ద్వారా వచ్చే ఆదాయం మా ప్రభుత్వానికి అవసరం లేదు. లీకేజీలను వెంటనే అరికట్టండి, ప్రజల సొమ్మును తిరిగి ఖజానాకు చేర్చండి." అని మంత్రికి చెప్పినట్లు తెలిపారు. ఒక సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రతి సాధారణ మద్యం కేస్పై దాదాపు రూ. 90, బీర్ కేస్పై దాదాపు రూ. 40, మరియు వైన్ కేస్పై రూ. 20 చొప్పున రాజకీయ లేదా మంత్రిత్వ నిధుల కోసం అనధికారికంగా వసూలు చేసి మళ్లించేవారని తెలుస్తోంది. ఈ వసూళ్లు వేర్హౌస్లు, రవాణా, రిటైల్ దుకాణాల వ్యాప్తంగా జరిగేవని అధికారులు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి నెలా దాదాపు 88 లక్షల మంది వినియోగదారులు టాస్మాక్ ద్వారా మద్యం కొనుగోలు చేస్తుండగా.. నెలకు కనీసం రూ. 102 కోట్లు అనధికారిక మార్గాల్లోకి వెళ్తున్నట్లు అంతర్గత అంచనాలు చెప్తున్నాయి.ఈ బాటిల్ రిటర్న్ వసూళ్లలో జరుగుతున్న అక్రమాల వల్ల మాత్రమే ప్రతి నెలా దాదాపు రూ. 300 కోట్ల అవినీతి జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లీకేజీలను అరికట్టడానికి ఆ రూ. 10 డిపాజిట్ను నేరుగా ఎమ్ఆర్పీ ధరలోనే కలపడం లేదా డిజిటల్ రీఫండ్ విధానాన్ని తీసుకురావాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. జూన్ చివరి నాటికి ఖాళీ బాటిళ్ల సేకరణ బాధ్యతలను అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని మంత్రి విఘ్నేష్ స్పష్టం చేశారు.717 టాస్మాక్ దుకాణాల మూసివేతముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్ తీసుకున్న సంచలన నిర్ణయాలలో రాష్ట్రవ్యాప్తంగా 717 టాస్మాక్ రిటైల్ దుకాణాలను మూసివేయడం ఒకటి. ఈ షాపులను మూసివేయడం వల్ల ప్రభుత్వానికి ఏడాదికి దాదాపు రూ. 8,000 కోట్ల ఆదాయం తగ్గుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది. ఆదాయం తగ్గినప్పటికీ, ఆ నష్టాన్ని పూడ్చడానికి మద్యం ధరలను పెంచే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. -
అలా చేయకపోతే.. అదే జరిగేది: ఎంకే స్టాలిన్
చెన్నై: తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించడాన్ని నివారించేందుకే తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ పార్టీ కూటమి భాగస్వాములను తానే అనుమతించినట్లు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. శనివారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు మిత్రపక్షాలు తనకు తెలిపినప్పుడు తాను అభ్యంతరం చెప్పలేదన్నారు.'మీరు వెళ్ళవచ్చు. అది మీ ఇష్టం, మీ ప్రజాస్వామ్య హక్కు. నేను మిమ్మల్ని ఆపను' అని చెప్పాను. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించడాన్ని నివారించాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే నేను వారికి అభ్యంతరం చెప్పలేదని.. ఎందుకంటే రాష్ట్రపతి పాలన వస్తే అది తమిళనాడులో బీజేపీ పాలనకు దారి తీసే అవకాశం ఉందంటూ ఆయన పేర్కొన్నారు.గతంలో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న పార్టీల మద్దతుపైనే ప్రస్తుత (టీవీకే) ప్రభుత్వం ఆధారపడి నడుస్తోందని ఆయన అన్నారు. డీఎంకే అధికారంలోకి రావాలని నమ్మి, మా కూటమిలో భాగమైన పార్టీల మద్దతు వల్లే ఈ రోజు ఈ ప్రభుత్వం నడుస్తోంది. టీవీకేకు మద్దతు ఇచ్చే ముందు తాము స్టాలిన్కు సమాచారం అందించినట్లు కూటమి పార్టీల నాయకులు బహిరంగంగానే అంగీకరించారు’’ అంటూ స్టాలిన్ చెప్పుకొచ్చారు.అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమిపై స్టాలిన్ స్పందిస్తూ... ఎన్నికల ఓటములు పార్టీని నిరుత్సాహపరచలేన్నారు. గెలుపోటములు సహజం. విజయాలు వచ్చినప్పుడు మనం తలబిరుసుగా ప్రవర్తించం.. అలాగని ఓటమికి నిరాశ పడిపోము. మనకు విజయావకాశాలు లభించకపోయినా.. అధికారంలో లేకపోయినా... ప్రతిపక్ష పాత్రలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం’’ అని స్టాలిన్ పేర్కొన్నారు. -
దూసుకుపోతున్న అన్నామలై కొత్త ఉద్యమం.. అంతా జెన్ Z మాయ
బీజేపీ నుంచి అన్నామలై బయటకు వచ్చేసిన తర్వాత చెన్నై ఈసీఆర్లోని ఆయన నివాసం సందడిగా కనపడుతోంది. ఆయన మద్దతుదారులు హడావుడిగా ఫోన్ కాల్స్ చేస్తుండడం, సీరియస్గా చర్చల్లో పాల్గొనడం కనిపిస్తున్నాయి. అన్నామలై బీజేపీతో బంధం తెంచుకోవడం చాలా తక్కువ కాలంలో, పెద్ద హడావుడి లేకుండానే ముగిసింది. న్యూఢిల్లీ పర్యటన, పార్టీ అగ్ర నాయకత్వంతో చర్చల అనంతరం అన్నామలై తన రాజీనామాను ప్రకటించారు.ప్రస్తుతం అన్నామలై కొత్త రాజకీయ ఉద్యమంలో ఇప్పటివరకు 14 లక్షలకు పైగా సభ్యత్వ నమోదులు జరిగాయి. ఆ సంఖ్య ఇంకా పెరుగుతోంది. జెన్ జీను ఆకర్షించే ప్రయత్నం వెబ్సైట్ (wetheleader.org) ప్రారంభంతో మొదలైంది. ఆ వెబ్సైట్లో పేరును నమోదు చేసుకుని అన్నామలై కొత్త రాజకీయ ఉద్యమానికి మద్దతు లేదా దానిపట్ల ఆసక్తిని తెలియజేయవచ్చు.జెన్ జీ యువతలో అన్నామలైకు మద్దతు వేగంగా పెరుగుతోంది. సోషల్ మీడియా వేదికలపై ఆయన సందేశాలకు భారీ స్పందన లభిస్తోంది. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా కొత్త తరహా రాజకీయాలను యువత స్వాగతిస్తోంది. "వి ది లీడర్స్" ఉద్యమంలో వారు స్వచ్ఛందంగా చేరుతుండడమే దీనికి నిదర్శనం.డిజిటల్ వేదిక ద్వారా చేసిన ప్రసంగంలో అన్నామలై మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాలను వేధిస్తున్న ప్రాథమిక సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండటంతోనే బీజేపీ నుంచి వైదొలుగుతున్నానని చెప్పారు. “ప్రజలు తరచూ నన్ను అడుగుతుంటారు. మీరు తమిళ వ్యక్తా? లేక భారతీయుడా? అని. నేను ఎప్పుడూ ఒకటే చెబుతాను. నేను గర్వించే భారతీయుడిని. తమిళనాడు సంస్కృతి, సంప్రదాయాల్లో పెరిగాను” అని చెప్పారు.వైఖరిని చెప్పేసిన ప్రసంగం ఆ వీడియో సందేశం, ఆయనతో జరిగిన సంభాషణల ఆధారంగా చూస్తే.. ప్రాంతీయతను పక్కన పెట్టినా స్థానిక ప్రయోజనాలను వదలకుండా, సమైక్య రాజకీయాలను ముందుకు తీసుకెళ్లే, అధికారంలో ఉన్నవారిని జవాబుదారులుగా నిలబెట్టే కొత్త రాజకీయ వేదికను అన్నామలై నిర్మించబోతున్నట్లు కనిపిస్తోంది.మరోవైపు, “ఈ ఉద్యమాన్ని ప్రారంభించేందుకు మాకు 3 నెలలు పట్టింది. వి ది లీడర్స్” అని అన్నామలై కొత్త రాజకీయ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన ఓ వ్యక్తి చెప్పారు. ఈ టీమ్లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు లేరు. “అన్నామలై ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన 25 మంది ఉన్నారు. వారిలో కొందరు ఆయనకు అత్యంత సన్నిహిత మిత్రులు, కొందరు ఐఐఎం లక్నోకు చెందినవారు, మరికొందరు సాఫ్ట్వేర్ రంగం నుంచి వచ్చినవారు” అని ఆ వ్యక్తి తెలిపారు.అన్నామలై కొత్త రాజకీయ ప్రయాణంపై అవగాహన ఉన్న ఇద్దరు వ్యక్తులు తెలిపిన సమాచారం ప్రకారం.. యువతను చేరుకోవాలనే ఉద్దేశంతో అన్నామలై ఇప్పుడు సాంప్రదాయ మాధ్యమాలను పక్కన పెట్టి సామాజిక మాధ్యమాల ద్వారా వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇదే విధానం టీవీకేకు మంచి ఫలితాలు ఇచ్చింది. సాధారణంగా నిర్వహించే పత్రికా సమావేశానికి బదులుగా, ఈ సారి తన ప్రణాళికను నేరుగా ప్రజలకు సామాజిక మాధ్యమ వేదికల ద్వారా తెలియజేయాలని ఆయన నిర్ణయించారు.జాతీయవాదం+తమిళ గుర్తింపు అన్నామలై టీమ్లో ఉన్నవారు మాట్లాడుతూ.. “మా నాయకుడి సిద్ధాంతం జాతీయవాదం-తమిళ గుర్తింపు/తత్వం కలయికగా ఉంటుంది. అవసరమైతే బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానైనా ప్రజా సమస్యలను లేవనెత్తుతాం” అన్నారు. మూడు భాషల విధాన అమలుకు వ్యతిరేకంగా అన్నామలై చేసిన ట్వీట్ దీనికి ఉదాహరణ.విజయ్కు పోటీగా నిలిచే, ప్రజలను ఆకర్షించే నాయకుడి స్థానం ఖాళీగా ఉందని అన్నామలై భావిస్తున్నారు. ఆ ఖాళీని తాను భర్తీ చేయగలనని అన్నామలై నమ్ముతున్నారు.2031 తమిళనాడు ఎన్నికలు లక్ష్యం రానున్న కొన్ని నెలల్లో ప్రజలతో, ముఖ్యంగా యువతతో మరింతగా మమేకమవడం, “వి ది లీడర్స్” అనే వెబ్సైట్లో లక్షలాది సభ్యులను చేర్చుకోవడం, 2031 తమిళనాడు ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకోవడం అన్నామలై ప్రణాళికగా సోర్సెస్ తెలిపాయి.తన కొత్త రాజకీయ ప్రయాణంలో సూపర్స్టార్ రజనీకాంత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని వర్గాలు సూచిస్తున్నాయి. రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ కూడా ఇలాంటి ఉద్యమాన్ని ప్రకటించారు.తమిళనాడు స్పష్టంగా కొత్త యుగంలోకి అడుగుపెడుతోంది. కొత్త వ్యక్తులు రాజకీయ చర్చలను ప్రభావితం చేస్తున్నారు. ఒకవైపు సి జోసెఫ్ విజయ్ సంచలనం సృష్టించారు. అధికారిక రాజకీయ ప్రవేశం చేసిన 28 నెలల్లోనే అధికారంలోకి వచ్చి అసాధ్యాన్ని సాధించారు.మరోవైపు ద్రావిడ పార్టీలు ఉన్నాయి. వాటిలో ప్రతీదానికి అంతర్గత సవాళ్లు ఉన్నా, గత 6 దశాబ్దాలుగా సంపాదించుకున్న ప్రజా మద్దతుపై అవి ఆధారపడుతున్నాయి. సామాజిక మాధ్యమాల యుగంలోకి మనం మరింతగా ముందుకు వెళ్తున్నాం. అక్కడ క్యాన్సల్ కల్చర్ (ప్రజా వ్యతిరేకత కారణంగా వ్యక్తులు లేదా సంస్థలను సామాజికంగా తిరస్కరించే ధోరణి), ఎవరినీ విడిచిపెట్టకుండా చేసే విమర్శలు చురుకుగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయన గౌరవాన్ని సంపాదించి, దాన్ని నిలబెట్టుకోగలరా? దానికి సమాధానం కాలమే చెబుతుంది. -
నా గర్భస్రావానికి సీఎం విజయ్ నే కారణం
-
విజయ్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. సీఎం అయినా తీరని కష్టాలు
-
డీఎంకే అవుట్.. టీవీకే ఇన్: రౌత్ వ్యాఖ్యలు
ముంబై: ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఎటువంటి విభేదాలు లేవని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ చెప్పారు. కూటమి నుంచి డీఎంకే బయటకు వెళ్లిపోవడంతో ఏర్పడిన ఖాళీ టీవీకే చేరికతో భర్తీ అయ్యిందన్నారు. ఈ నెల 8వ ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ హాజరవుతున్నందున తాము రాలేమని డీఎంకే ప్రకటించడంపై ఆయన ఈ మేరకు స్పందించారు.ఈ సందర్భంగా రౌత్.. ‘ఇండియా కూటమిలో చీలిక ఉందనడం తప్పు. తమిళనాడు ఎన్నికల తర్వాతే డీఎంకే కొంత దూరం పాటించడం ప్రారంభించింది. బదులుగా, కూటమిలోకి టీవీకే వచ్చింది. కూటమిలో చీలిక ఉందని అనకండి. ఇండియా కూటమికి ప్రత్యామ్నాయ మిత్రుడు ఉన్నాడని చెప్పండి’ అని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు అసెంబీ ఎన్నికల్లో స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ఓటమి పాలై, సినీ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే అధికారంలోకి రావడం తెల్సిందే. దీంతో, డీఎంకే కూటమిలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. విజయ్ ప్రభుత్వానికి మద్దతు పలకడం తెల్సిందే. ఈ పరిణామం పట్ల డీఎంకే గుర్రుగా ఉంది. -
విజయ్ చివరి సినిమా.. రిలీజ్ కానట్లేనా?
విజయ్ ముఖ్యమంత్రి కాకముందు నటించిన చివరి చిత్రం జననాయకన్. పూజాహెగ్డే నాయకిగా నటించిన ఇందులో మమిత బైజు కీలక పాత్రను పోషించారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో కేవీ ఎన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం జననాయకన్. ఈ చిత్రం జనవరి 9వ తేదీన విడుదల కావలసి ఉంది. అయితే సెన్సార్ సమస్యల కారణంగా విడుదల కాలేదు. కారణాలేమైనా ఆ చిత్రం చిక్కు ముడి వీడలేదు. విజయ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. దీంతో జననాయకన్ చిత్రానికి మంచి రోజులు వస్తాయని అందరూ భావించారు. చిత్ర నిర్మాత కూడా జననాయకన్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది అని మీడియాకు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్రానికి ఇప్పటి వరకు సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు సరికదా, చిత్రం ఇంటర్నెట్లో అనధికారికంగా విడుదలై తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీ సంస్థ చిత్ర ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో సమస్య మరింత జటిలమైంది. మరోపక్క జననాయకన్ చిత్రం వ్యవహారంలో ముఖ్యమంత్రి విజయ్ని మౌనం పాటించాల్సిదిగా కేంద్ర ప్రభుత్వం ఆ దేశించిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో చిత్ర డిస్ట్రిబ్యూటర్లలో నిర్లిప్తత నెల కొంది. ఈ విషయం ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి వెళ్లిందని, ఆయన డిస్ట్రిబ్యూటర్ల వద్ద తీసుకున్న అడ్వాన్న్స్ను తిరిగి ఇచ్చేయాల్సిందిగా చెప్పినట్లు సమాచారం. అయితే ఆయన నిర్ణయం డిస్ట్రిబ్యూటర్లను సంతృప్తి పరుస్తుందా ? ఇక జననాయకన్ను తెరపై చూసే అవకా శం లేదా ? అనే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో జననాయకన్ చిత్రానికి దారేది అనే ప్రశ్న ఎదురవుతోంది. -
ఓటమి గుణపాఠం.. స్టాలిన్ సంచలన నిర్ణయం
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమిని చవిచూసిన డీఎంకే పార్టీలో అంతర్గత పునర్వ్యవస్థీకరణకు కసరత్తులు చేపట్టింది. పథకాలే గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ను ఫలితాలు డీలా పడేలా చేశాయి. తాను సైతం కొళత్తూరులో ఓడినా, ప్రధాన ప్రతిపక్షంగా డీఎంకే నిలవడం కాస్త ఊరటగా మారింది. దీంతో స్టాలిన్ పార్టీలో సమూల మార్పులకు చర్యలు చేపట్టారు.30 మంది సభ్యుల కమిటీ విచారణనియోజకవర్గాల వారీగా ఓటమికి గల కారణాలను విశ్లేషించడానికి డీఎంకే అధినాయకత్వం 30 మంది సభ్యులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే, పార్టీ వలంటీర్లు, సాధారణ ప్రజలు తమ అభిప్రాయాలను నేరుగా పంచుకోవడానికి ‘ఉడన్ పెరప్పే’ అనే ప్రత్యేక వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. ఈ కమిటీలు ఇచ్చే నివేదికను జూన్ 10వ తేదీలోగా పార్టీ అధ్యక్షుడికి సమర్పించాల్సి ఉంది.జిల్లా కమిటీల విభజనపార్టీ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రస్తుతం ఉన్న 78 జిల్లాల కార్యదర్శుల సంఖ్యను 115కు పెంచనున్నారు. తద్వారా నియోజకవర్గాల వారీగా పట్టు సాధించవచ్చని భావిస్తున్నారు. యువజనులకు అత్యధికంగా జిల్లాల కార్యదర్శుల పదవులు కేటాయించేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో పార్టీలోని ఇతర సీనియర్ నేతలలో కె.ఎన్. నెహ్రూ, వేలు మాత్రం ప్రస్తుతానికి తమ పదవుల్లోనే కొనసాగుతారని సమాచారం.యువతకు చాన్స్ఎన్నికల నివేదికల ఆధారంగా జూన్ 10 తర్వాత డీఎంకే బైలాస్ (రాజ్యాంగం)ను సవరించి భారీ మార్పులు చేయనున్నారు. పార్టీలో సుదీర్ఘకాలంగా సీనియర్ నాయకుడిగా, ప్రధాన కార్యదర్శిగా ఉన్న దురైమురుగన్న్ను ఆ పదవి నుంచి తప్పించాలని ఎం.కె. స్టాలిన్ నిర్ణయించినట్టు సమాచారం. వయసు పైబడడంతో ఆయన్ను తప్పించి యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించనున్నారన్న సంకేతాలు వెలువడ్డాయి. ఆయనను కేవలం ఒక ఉప–కార్యదర్శి పదవికి పరిమితం చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే, మరి కొందరు సీనియర్లను తప్పించనున్నట్టు తెలిసింది. దీంతో, తమిళనాడులో డీఎంకే రాజకీయం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
సీఎం విజయ్ తొలి కేబినెట్ మీటింగ్
-
తమిళ రాజకీయం.. టీవీకే ఎమ్మెల్యే Vs మేయర్
సాక్షి, చైన్నె: ‘ మీరా? నేనా? చైన్నెలో అంటూ మేయర్ ప్రియ, టీవీకే ఎమ్మెల్యే పల్లవి మధ్య ప్రోటోకాల్ అధికార పోరు గురువారం చోటు చేసుకుంది. తమిళనాడులో ప్రభుత్వం మారిన తర్వాత చైన్నె కార్పొరేషన్లో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య తీవ్రమైన ఈగో క్లాష్ (అధికార పోరు) మొదలైంది. తిరు.వి.కె. నగర్ నియోజకవర్గ పరిధిలోని పులియంతోపులో కొత్తగా నిర్మించిన పాఠశాల భవన ప్రారంభోత్సవంలో చైన్నె మేయర్ ప్రియ (డీఎంకే), స్థానిక మహిళా ఎమ్మెల్యే పల్లవి (టీవీకే) ల మధ్య జరిగిన ఘర్షణ హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో డీఎంకే అధికారం కోల్పోయినప్పటి నుండి మేయర్ ప్రియ బహిరంగ కార్యక్రమాలకు పెద్దగా హాజరుకావడం లేదు. ఈ నేపథ్యంలో పులియంతోపు స్కూల్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే పల్లవి ట్రాఫిక్ జామ్ కారణంగా కొద్దిగా ఆలస్యంగా రావడం వివాదానికి కారణమైంది. ఎమ్మెల్యే పల్లవి లోపలికి వచ్చే సమయానికి మేయర్ ప్రియ ప్రోటోకాల్ను పక్కనబెట్టి ఒంటరిగా తానే రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. దీంతో ఎమ్మెల్యే పల్లవి ముఖం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ తర్వాత లోపల సాంప్రదాయ కుతువిళక్కు (జ్యోతి ప్రజ్వలన) వెలిగించే సమయంలో, మేయర్ ప్రియ మొదటి దీపం వెలిగించారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే పల్లవికి దీపం వెలిగించే అవకాశం ఇవ్వ కుండా అధికారులు నిర్లక్ష్యం వహించారు. விளக்கேற்ற மெழுகுவர்த்தியை கொடுக்காத மேயர் பிரியா.. கோபப்பட்டு வெளியே சென்ற தவெக எம்எல்ஏ பல்லவி#MayorPriya | #MLAPallavi | #Chennai | #TVK | #DMK pic.twitter.com/XuJsKUQL6H— PttvOnlinenews (@PttvNewsX) June 4, 2026పల్లవి దీపం వెలిగించడానికి కొద్దిగా కదలగా, అక్కడి అధికారి ఆమెను వెనక్కి జరగమన్నట్లు మాట్లాడటంతో పల్లవి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తనకు జరిగిన అవమానానికి నిరసనగా ఎమ్మెల్యే పల్లవి కార్యక్రమాన్ని మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన 75వ వార్డు చిన్నబాబు వీధి పాఠశాల ప్రారంభోత్సవంలో కూడా ఆమె మేయర్తో కలిసి దీపం వెలిగించడానికి నిరాకరించి, ‘మీరే వెలిగించుకోండి‘ అని ఖరాఖండీగా చెప్పేశారు.అవమానించారు: ఎమ్మెల్యే పల్లవి ఆవేదనఈ ఘటనపై ఎమ్మెల్యే పల్లవి స్పందిస్తూ.. ‘తాను బిడ్డకు జన్మనిచ్చి కేవలం 10 రోజులే అయిందన్నారు. కనీసం మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారని, అయినా ప్రజా సమస్యల కోసం, తన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం అని వచ్చాననని, అయితే, ఈ విధంగా అవమానించడం దారుణం అని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే మేయర్ ప్రియ స్పందిస్తూ చిన్న విషయాన్ని పెద్దది చేస్తూ, వివాదం సృష్టిస్తున్నారని వివరణ ఇచ్చారు. -
త్రిషతో వివాదం.. సీఎం విజయ్కి పార్తీబన్ కానుక!
తమిళనాడు ఎన్నికల సమయంలో నటుడు పార్తీబన్ త్రిషను లక్ష్యంగా చేసుకుని ఆమెను బయటకు రానివ్వకూడదు, కొన్నాళ్లు త్రిష ఇంట్లో ఉంటేనే మంచిది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి.అయితే ఇప్పుడు అదే పార్తీబన్ నేరుగా తమిళనాడు సీఎం విజయ్ని కలవడం ఆసక్తికరంగా మారింది. విజయ్-త్రిష మధ్య సంబంధాలపై ఊహాగానాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వీరిద్దరి భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత భేటీలో అసలు వీరిద్దరూ త్రిష గురించి మాట్లాడుకున్నారా లేదా..?, పార్తీబన్ తను అప్పట్లో త్రిషపై చేసిన వ్యాఖ్యల గురించి ఏదైనా వివరణ ఇచ్చారా లేదా అనే విషయం మాత్రం బయటకు రాలేదు.ఇక సీఎం విజయ్ను కలిసిన సందర్భంగా పార్తీబన్ ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించారు. విజయ్ను చక్రవర్తిగా పోలుస్తూ రూపొందించిన ఓ పెయింటింగ్ను విజయ్కు అందజేశారు. దాంతో ఈ బహుమతి కూడా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
సీఎం విజయ్ త్యాగం.. కాంగ్రెస్కు గుడ్న్యూస్
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో రాజ్యసభకు జరగనున్న ఉప ఎన్నికలో అధికార టీవీకే పార్టీ ఆ సీటును కాంగ్రెస్కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీవీకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం విజయ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీవీకేతోపాటు కూటమిలోని పార్టీలు ఇందుకు అంగీకారం తెలిపాయి. ఇక, ఈ నెల 18న రాజ్యసభ ఉప ఎన్నిక జరగనుంది.ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే తరఫున రాజ్యసభలో ఎంపీగా కొనసాగిన సీవీ షణ్ముగం.. తమిళనాడు ఎన్నికల సందర్భంగా రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మైలాం అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో షణ్ముగం తన రాజ్యాసభ పదవికి మే 7న రాజీనామా చేసి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో ప్రధాన పోటీదారుగా కాంగ్రెస్ ఉండనుంది. అధికార టీవీకే కూటమి మద్దతు ఉండటంతో కాంగ్రెస్కు విజయావకాశాలున్నాయి.కాగా, తమిళనాడులో టీవీకేకు మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యసభ సీటు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాజ్యసభకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 8 వరకు, ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన జూన్ 9 నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 11 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. జూన్ 18న ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా పీ తెన్మోళి కొనసాగనున్నారు. -
తమిళనాట భారీ ట్విస్ట్.. విజయ్, పళనిస్వామి భేటీపై కీలక వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామిని కలవడానికి తమిళనాడు సీఎం విజయ్ ఎప్పుడూ సమయం కోరలేదని ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేపీ మునుసామి స్పష్టం చేశారు. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి నిర్మల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఆయన పూర్తిగా ఖండించారు. బుధవారం హోసూరులో మీడియాతో కేపీ మునుస్వామి మాట్లాడుతూ.. మంత్రి నిర్మల్ కుమార్ ప్రెస్మీట్లలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, అనవసర వ్యాఖ్యలు చేస్తే చిక్కుల్లో పడతారని హెచ్చరించారు. సీఎం విజయ్ ఇప్పటివరకు పళణి స్వామిని కలవడానికి అనుమతి అడిగింది లేదన్నారు. తాము నిరాకరించింది లేదని ఆయన తేల్చి చెప్పారు.సీఎం విజయ్పై ఘాటు వ్యాఖ్యలుఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ రాజకీయ శైలిపై కేపీ మునుసామి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం విజయ్ కష్టపడి ఈ స్థాయికి రాలేదని, సినిమా పరిశ్రమలో ఒక మాయను సృష్టించి, ఆ మాయా రూపాన్ని ఇన్స్ట్రాగామ్, రీల్స్లో చూపించారని ఎద్దేవా చేశారు. యువత నమ్మి ఓటేశారని పేర్కొంటూ, తిరుచ్చిలో జరిగిన కృతజ్ఞత సభలో సినిమాలో డైలాగులు చెప్పినట్లే కేవలం 15 నిమిషాలు మాట్లాడి వెళ్లిపోయారు. వెనుక ఉండి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను ఆయన చదివారు అంతే అని వ్యంగ్యాస్త్రం సంధించారు.సొంత ఆలోచన లేదుప్రజలు మనకెందుకు ఓటేశారని, మనం ఇచ్చిన హామీలు ఏంటి అని, వాటి కోసం ఎలాంటి పథకాలు తీసుకురావాలనే విషయాలపై సీఎం విజయ్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం రోజే మాట్లాడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అయితే అక్కడ ఆయన మౌనంగా ఉండిపోయారని, ప్రధాని మోదీతో కేవలం 10 నిమిషాలు మాత్రమే మాట్లాడి బయటకు వచ్చేశారని, ఇందులో ఓ ఐదు నిమిషాలు కుశల ప్రశ్నలకు, మరో ఐదు నిమిషాలు రాష్ట్ర సమస్యలు చర్చించేందుకు సమయం ఉంటుందా..? అని ప్రశ్నించారు. సీఎం విజయ్కు సొంత ఆలోచనలు లేవని, ఆయన విషయం లేని సీఎం అని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఏ పార్టీ అంతరించిపోదని, ఒకే ఒక్క కార్యకర్త ఉన్నా ఆ పార్టీ బతికే ఉంటుందని మునుసామి పేర్కొన్నారు. కమ్యూనిస్టులు వందేళ్లుగా అధికారంలోకి రాకపోయినా సిద్ధాంతం కోసం పోరాడుతున్నారని, అన్నాడీఎంకే కూడా అలాంటి బలమైన సిద్ధాంతం కలిగిన పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలు సీఎం విజయ్కు తెలియవని , ఒకవేళ విజయ్ నిజంగానే ఎంజీఆర్, జయలలితను విమర్శించకూడదు అనుకుంటే.. ఆయన మొదట కలవాల్సింది అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామినే అని స్పష్టం చేశారు. -
విజయ్ బ్రో.. మీ పాలన చూస్తుంటే భయమేస్తోంది..!
సాక్షి, చెన్నై : తమిళనాడు సీఎం విజయ్ తిరుచ్చి పర్యటనలో డీఎంకేను లక్ష్యంగా చేసుకుని చేసిన ఘాటు వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీ ఎ రాజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చెన్నైలోని అన్నా అరివాలయ మంగళవారం పార్టీ సీనియర్నేత ఆర్ఎస్ భారతీతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి విజయ్ వైఖరిని, పరిపాలనా పరిణితిని తీవ్రంగా ఎండగట్టారు. అసెంబ్లీలో చూస్తే విచారంగా, అలసటతో, తడబాటుగా, నిస్సహాయతతో కనిపించే సీఎం విజయ్.. తిరుచ్చి సభకు వెళ్లేసరికి అంత ఉత్సాహంగా, వ్యంగ్యంగా ఎలా మాట్లాడగలిగారు? ఆ స్క్రిప్ట్ రాసిచ్చింది ఎవరు?‘ అని రాజా ప్రశ్నించారు. మోదీ ముందు ఎందుకు నోరు విప్పలేదు: తాను కూర్చున్న సీఎం పదవికి తగినట్లు కాకుండా, తన స్థాయిని తగ్గించుకుని విజయ్ సినిమా డైలాగులు వల్లిస్తుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రధాని మోదీని ఢిల్లీలో కలిసినప్పుడు కేవలం 10 నిమిషాలే కదా సమయం ఇచ్చారు... ’విజయ్ బ్రో’.. అప్పుడు ప్రధాని ముందు మీ శౌర్యం ఏమైంది?, అక్కడ ఎందుకు మాట్లాడకుండా వచ్చారు?, వచ్చాక కనీసం ప్రెస్మీట్ కూడా పెట్టకుండా ఎందుకు వెళ్లిపోయారు? అని రాజా నిలదీశారు. పాలనపై అవగాహన లేదు రైతుల సమస్యలు, ఎన్నికల మేనిఫెస్టోపై విజయ్ ప్రభుత్వాన్ని రాజా తప్పుపట్టారు. రిజర్వు బ్యాంక్ మార్గదర్శకాలు లేకుండా పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయడం సాధ్యం కాదన్న కనీసం ఈ ప్రాథమిక విషయం కూడా తెలియకుండానే 2026 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేశారా? అని ప్రశ్నించారు. పలు అంశాలను ప్రస్తావిస్తూ, ఈ విషయాల్లో టీవీకే ప్రభుత్వం తన స్టాండ్ ఏంటో చెప్పడం లేదని మండి పడ్డారు.స్టాలిన్ సీఎంగా ఉన్నంత వరకే మేఘదాతు సమస్య, విజయ్ ఒక లెక్కే కాదని కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ అంటుంటే.. దానికి తమరి ప్రభుత్వం ఎందుకు బదులివ్వడం లేదు? అని ప్రశ్నించారు.నిద్ర పట్టడం లేదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య వస్తే ఇప్పటికీ స్టాలిన్ కారణం అంటున్నారని మండి పడ్డారు. విజయ్ బ్రో.. మీ పాలన చూస్తుంటే భయమేస్తోంది, రాత్రిళ్లు నిద్ర రావడం లేదు. మనం అసలు ఎటు వైపు వెళ్తున్నామో అర్థం కావడం లేదు. ప్రభుత్వానికి ఎలాంటి దీర్ఘకాలిక ప్రణాళికలు లేవు, డీఎంకే ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి అని హితవు పలికారు. డీఎంకే, అన్నాడీఎంకే కూటమి ఊహాగానాలపై స్పందిస్తూ, పార్టీలోని రెండు, మూడో శ్రేణి నాయకులు ఏవైనా మాట్లాడి ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంది. కానీ తమ పార్టీ అధినేత తుది నిర్ణయం ఏంటి? తాము అధికారికంగా ఎగ్జిక్యూటివ్ లేదా జనరల్ కౌన్సిల్ సమావేశాలు పెట్టి తీర్మానాలు చేశామా? లేదు కదా‘ అని స్పష్టం చేశారు. వీసీకే తిరుమాపై అమితమైన ప్రేమ ఉందని, ప్రేమ ఉన్నచోటే కోపం వస్తుంది. కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టులపై తమకు అంతగా కోపం రాదు. ఇది కేవలం ఒకే కూటమిలోని సోదరుల మధ్య వచ్చిన చిన్నపాటి అభిప్రాయ భేదం మాత్రమే. ఇది శాశ్వతం కాదు అని ఆ. రాజా తేల్చిచెప్పారు. -
విజయ్కు గట్టి పోటీ! అతడి ఎంట్రీతో సంచలనం తప్పదా?
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. బీజేపీకి అన్నామలై గుడ్బై చెప్పారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన తదుపరి రాజకీయ అడుగు ఏంటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అధికారంలో ఉండగా, డీఎంకే–అన్నాడీఎంకే వంటి సంప్రదాయ పార్టీలు ప్రతిపక్ష పాత్రలో కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి.డీఎంకే–అన్నాడీఎంకే మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్విముఖ రాజకీయ పోరాటానికి ఇప్పుడు కొత్త శక్తులు సవాల్గా నిలుస్తున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. ఇందులో ముఖ్యంగా సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సీఎం విజయ్ నాయకత్వం ఒకవైపు చర్చనీయాంశంగా ఉండగా, మరోవైపు బీజేపీలో తనదైన ముద్ర వేసుకున్న అన్నామలై పేరు మరింత బలంగా వినిపిస్తోంది.అన్నామలై బీజేపీని వీడుతున్నారన్న వార్తలను కేవలం సంస్థాగత మార్పుగా మాత్రమే చూడలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయనకు ఉన్న దూకుడు రాజకీయ శైలి, యువతలో ఉన్న క్రేజ్, ప్రత్యక్ష విమర్శల ధోరణి ఆయనను తమిళ రాజకీయాల్లో ఒక ప్రత్యేక ముఖంగా నిలబెట్టాయి. ఎన్నికల్లో పెద్ద విజయాలు సాధించకపోయినా, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆకర్షణను పూర్తిగా తక్కువ అంచనా వేయలేమన్న చర్చ సాగుతోంది. అందుకే బీజేపీ ఆయన్ని నిలువరించే ప్రయత్నాలు చేస్తోంది.ఇక సీఎం విజయ్ విషయానికి వస్తే.. కొత్త ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆయన రాజకీయ ప్రయాణం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని విశ్లేషణలు ఉన్నాయి. పార్టీ నిర్మాణ బలం, అనుభవం వంటి అంశాల్లో ఇంకా ఎదగాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ లోటును ప్రత్యర్థులు ఎలా ఉపయోగించుకుంటారన్నదే భవిష్యత్ రాజకీయ సమీకరణాన్ని నిర్ణయించనుంది.ఈ నేపథ్యంలో అన్నామలై పాత్రపై చర్చ మరింత కీలకంగా మారింది. ఆయన బీజేపీలోనే కొనసాగి పార్టీని బలోపేతం చేస్తారా? లేక స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదిగి సీఎం విజయ్ టీవీకేకు, డీఎంకే–అన్నాడీఎంకే కూటములకు ప్రత్యక్ష సవాల్గా మారతారా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల విజయాలకంటే కూడా ఆయనకు ఉన్న ఇమేజ్, యువతలో ప్రభావం ఆయనను ఒక “పొలిటికల్ ఫోర్స్”గా చూస్తున్న వాదన బలపడుతోంది.ప్రస్తుత పరిస్థితుల్లో “సీఎం విజయ్ ప్రభుత్వానికి ప్రధాన రాజకీయ సవాలుగా ఎవరు ఎదుగుతారు?” అనే ప్రశ్నే తమిళనాట కీలకంగా మారింది. ఈ కోణంలో చూస్తే అన్నామలై ప్రవేశం రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి తమిళ రాజకీయాలు మరో కీలక మలుపు దిశగా సాగుతున్నాయి. ఒకవైపు సీఎం విజయ్ కొత్త ప్రభుత్వం, మరోవైపు డీఎంకే–అన్నాడీఎంకే సంప్రదాయ ప్రతిపక్ష బలాలు, మధ్యలో అన్నామలై వంటి కొత్త ముఖం రాజకీయ సమీకరణాన్ని మరింత ఉత్కంఠగా మార్చుతోంది. రాబోయే రోజుల్లో తమిళనాట అసలైన ప్రతిపక్ష శక్తి ఎవరు అన్నదానికి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
బ్లాక్ అండ్ వైట్ సూట్ అందుకే: ఎం విజయ్
తిరుచ్చి: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నలుపు-తెలుపు సూట్లోనే కనబడుతున్నారు జోసఫ్ విజయ్. ఇంతకుముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి వస్త్రధారణకు భిన్నంగా మోడ్రన్గా కనిపించడంతో జనమంతా ఆసక్తికరంగా ఆయనను గమనిస్తున్నారు. సీఎం విజయ్ వస్త్రధారణపై సోషల్ మీడియాలో చాలా చర్చలు జరిగాయి. కొంతమంది నాయకులు విజయ్ వస్త్రధారణపై విమర్శలు కూడా చేశారు. తన వస్త్రధారణపై వస్తున్న విమర్శలకు సీఎం విజయ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.తిరుచ్చి సభలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను కోట్ సూట్ వేసుకోవడం పైనా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకు, మనం సూటుకోటు వేసుకోకూడదా? కేవలం అణచివేసే శక్తులు, అధికారం చెలాయించే వారే సూటుకోటు వేసుకోవాలా? అయినా నేనేమైనా రంగురంగుల సూట్లు వేసుకుంటున్నానా? నా మనసు లాగే కేవలం రెండు రంగులు.. నలుపు, తెలుపు మాత్రమే ధరిస్తున్నాను. నన్ను ట్రోల్ చేసేవారికి ఒకటే విన్నపం.. దయచేసి మీ విమర్శలు ఆపకండి. అవే నాకు మరింత శక్తినిస్తాయి. మీరు విమర్శలు చేస్తూనే ఉండండి, నేను ప్రజలకు మంచి చేస్తూనే ఉంటాను’ అని వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకుల విమర్శలు తన ఎదుగులకు దోహదపడతాయన్నారు.ఇప్పుడు వార్తలు చూస్తున్నారుఇదివరకు కాలక్షేపం కోసం సోషల్ మీడియాలో ‘రీల్స్’ చూసే జెనరేషన్ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యూస్ ఛానళ్లు చూస్తోందని విజయ్ అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ‘జెన్–జీ’ ఆసక్తి కనబరుస్తోందన్నారు. వారి కోసం ప్రతిపక్షాలు తమ ప్రెస్నోట్లను తమిళం, ఇంగ్లీష్ భాషల్లో ఇస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు ప్రజల్లో మార్పు స్పష్టంగా కనబడుతోందని, వారిని తక్కువ చేసి చూడొద్దని విపక్షాలకు హితవు పలికారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, అసెంబ్లీ సమావేశాల్లో ఎవరేం మాట్లాడుతున్నారో చూస్తున్నారని చెప్పారు.#WATCH | “ஏன் நம்ம கோட் சூட் எல்லாம் போடக் கூடாதா?”திருச்சியில் முதலமைச்சர் விஜய் பேச்சு#SunNews | #TVKVijay | #Trichy pic.twitter.com/27QCiWxJx9— Sun News (@sunnewstamil) June 1, 2026 -
డీఎంకే గుర్తుపై పోటీ చేయడం దురదృష్టకరం
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. శాసనసభ ఎన్నికల విజయం అనంతరం ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ డీఎంకే కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షమైన ఎండీఎంకే ఎంపీ దురై వైకో స్వయంగా పలకడం చర్చకు దారి తీసింది. అంతే కాదు, డీఎంకే చిహ్నంపై తాము పోటీ చేయడం దురదృష్టకరం అని ఆవేదనతో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్న సీఎం విజయ్కు తిరుచ్చి లోక్సభ సభ్యుడైన దురై వైకో శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.విజయ్ సీఎం అయిన తర్వాత ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకోను నేరుగా కలిసి ఆశీస్సులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి దురై వైకో వరుసగా విజయ్పై సానుకూల వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. సీఎం విజయ్కు ఆహా్వనం పలికినానంతరం దురై వైకో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ గారు తొలిసారి తిరుచ్చి వచ్చారని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గ ఎంపీగా ఆయనకు స్వాగతం పలకడం నా బాధ్యత అని వ్యాఖ్యలు చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రిని అధికారికంగా కలిసి తిరుచ్చి లోక్సభ పరిధిలోని పెండింగ్ డిమాండ్లపై వినతిపత్రం సమరి్పస్తానని పేర్కొన్నారు. అలాగే, తిరుచ్చి ఎయిర్పోర్ట్ రన్వే విస్తరణకు కేంద్రం నుండి నిధులు రాబట్టేందుకు ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిశానని తెలిపారు. సాంకేతిక కారణాల వల్లే.. పొత్తులు, అసెంబ్లీ సమీకరణాలపై చేసిన వ్యాఖ్యలు డీఎంకే వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తమ ఎండీఎంకే ఎమ్మెల్యేలు దురదృష్టవశాత్తూ ఎన్నికల్లో డీఎంకేకు చెందిన ఉదయసూర్యుడు గుర్తుపై పోటీ చేసి గెలిచారన్నారు. ఆ సాంకేతిక కారణం వల్లే ఈరోజు తాము అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి నేరుగా మద్దతు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. అయితే, గతంలో తమ కూటమిలో ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు వంటి ఇతర ప్రజాస్వామ్య శక్తులు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రజలు టీవీకేను సింగిల్ లార్జెస్ట్ పారీ్టగా గెలిపించారని, ఆ ప్రజా తీర్పును అందరూ గౌరవించాలన్నారు. భవిష్యత్తులో ఎండీఎంకే ఏ కూటమిలో ఉండాలో అన్న విషయంగా జూన్ 27వ తేదీన పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
తిరుచ్చి ప్రాణసమానం
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ పెరంబదూరు, తిరుచ్చి ఈస్ట్లలో పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి విజయ్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గ ప్రజలకు స్వయంగా కృతజ్ఞతలు తెలిపేందుకు సోమవారం మధ్యాహ్నం చైన్నె నుంచి తిరుచ్చికి వెళ్లారు. తిరుచ్చి విమానాశ్రయంలో సీఎం విజయ్కు అధికారులు, టీవీకే ముఖ్య నేతలు, మంత్రలు ఆహ్వానం పలికారు. విమానాశ్రయం నుంచి సభ జరిగే జోసెఫ్ కాలేజీ మైదానం వరకు 10 కిలోమీటర్ల మేర ప్రజలు, టీవీకే శ్రేణులు బ్రహ్మాండమైన రోడ్ షోతో సీఎం విజయ్కు స్వాగతం పలికారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య, ఎంపిక చేసిన 5 వేల మందిని ఈ సభకు అనుమతించారు. అయినప్పటికీ ఆ సంఖ్యను దాటిమహిళలు తరలి రావడం విశేషం. సభలో మంత్రులు ఆనంద్, రమేష్, రాజ్ మోహన్, మాజీ మంత్రి కు.ప.కృష్ణన్ ప్రసంగించారు. చివరగా సీఎం విజయ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆవేశ పూరితంగా తనదైన శైలిలో ప్రసంగించారు.ఎమ్మెల్యేల కొనుగోలు వంటి అంశాలను నమ్మొద్దు..ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు ఎమ్మెల్యేలను కొనడానికి తాను ప్రయత్నిస్తున్నానంటూ వస్తున్న ఆరోపణలను సీఎం విజయ్ పూర్తిగా కొట్టిపారేశారు. తాను భేరసారాలకు పాల్పడుతున్నానని.. కొందరు పనిగట్టుకుని తప్పుడు కథలు అల్లుతున్నారని మండి పడ్డారు. నిజానికి ఒక తీరని శక్తి (డీఎంకే), తీరిపోయిన శక్తి (అన్నాడీఎంకే) కలిసి, దొడ్డి దారిలో అధికారం కోసం భేరసారాలు సాగించి, కూటమి కట్టి మళ్లీ అధికారాన్ని దోచుకోవాలని కుట్ర పన్నాయని ఆరోపించారు. ఎందుకంటే, త్వరితగతిన టీవీకే పూర్తిస్థాయి మెజారిటీతో స్థిరపడితే పప్పులు ఉడకవని వారి భయం అని పేర్కొన్నారు. ఈ ఎన్నికలతో 50, 60 ఏళ్లుగా ఉన్న కులం, మతం, డబ్బు పంపిణీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. టీవీకేకు పూర్తి స్థాయిలో మరి కొంత మెజారిటీ ఇచ్చి ఉండే బాగుండేదని ఈసందర్భంగా మైనారిటీ అన్న అంశంపై వ్యాఖ్యలు చేశారు.స్టాలిన్ వర్సెస్ విజయ్..తమిళనాడు భవిష్యత్తు ఎటువైపు అనేది తేలిపోయిందంటూ ప్రజల కోసం నిజాయితీగా పనిచేయడానికి వచ్చిన ఈ విజయ్ వైపా? లేదా మన ప్రజా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చూస్తున్న స్టాలిన్ వైపా? అనేది స్పష్టమైందన్నారు. డీఎంకే తమను ఎంత అవమానిస్తే తమకు అంత మేలు జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కొన్నివారాలలో తన ప్రభుత్వం సాధించిన విజయాలను సీఎం విజయ్ ఈసందర్భంగా గుర్తు చేశారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేశామన్నారు. ఇందులో మొదటి 100 యూనిట్లు ఉచితం అన్న పథకం డీఎంకే ఇచ్చింది కాదని, గతంలో దివంగత సీఎం జయలలిత ఇచ్చిన పథకం అని గుర్తు చేశారు. దానికి అదనంగా మరో 100 యూనిట్లు కలిపి 200 యూనిట్లు తాము చేశామన్నారు. మహిళలకు, కుటుంబాలకు శాపంగా మారిన టాస్మాక్ మద్యం దుకాణాలను దశలవారీగా మూసివేస్తున్నామన్నారు. అలాగే రైతుల ప్రయోజనాల కోసం వ్యవసాయ రుణాలను వీలైనంత మేరకు మాఫీ చేశామన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అగాథంలోకి నెట్టి, అన్ని తలుపులు మూసేసి వెళ్లిందిదని, దాన్ని చక్కదిద్దడానికి సమయం పడుతుందన్నారు.శాంతిభద్రతలపై స్పందనరాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణించిందన్న ఆరోపణలపై సీఎం స్పందిస్తూ.. ‘గత స్టాలిన్ మోడల్ పాలనలో రాష్ట్రంలోని ప్రతి వీధికి, ఊరికి గంజాయి, డ్రగ్స్ సంస్కృతిని వ్యాపింపజేశారన్నారు. దాన్ని అప్పుడే అణచివేసి ఉంటే, ఈరోజు మహిళలపై ఇన్ని నేరాలు జరిగేవి కావు అని పేర్కొన్నారు. పాపాలన్నీ వారు చేసి, ఇప్పుడు పగటి వేషాలు వేస్తూ నిందలు తన మీద వేస్తున్నారన్నారు. మహిళల భద్రత కోసం ’సింగపెన్’ వంటి బలమైన విభాగాలను బలోపేతం చేశామని, సమర్థులైన పోలీస్ అధికారులను నియమించామని స్పష్టం చేశారు.చివరగా, తాను ఇచ్చిన మాట ప్రకారం అవినీతి, లంచం లేని స్వచ్ఛమైన పాలన అందిస్తానని, ద్రవిడ సిద్ధాంతాలైన సామాజిక న్యాయం, రాష్ట్ర హక్కులు, నదీ జలాల హక్కులు, లౌకికవాద విధానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోనని సీఎం విజయ్ స్పష్టం చేశారు. ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికల్లో స్థానిక నియోజకవర్గం కుటుంబం నుంచే ఒకరిని అభ్యర్థిగా నిలబెడతానని, వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన తిరుచ్చి ప్రజలను కోరారు. -
సీఎం విజయ్ బ్లాక్ అండ్ వైట్ సూట్ రహస్యం బయట పడింది
సాక్షి,చెన్నై: రాష్ట్ర హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడబోమని తమిళనాడు సీఎం విజయ్ స్పష్టం చేశారు. టీవీకే పార్టీ భారీ విజయం సాధించిన తర్వాత విజయ్ తిరుచ్చిలో తన మొదటి సభను నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ పోరాటం ఇప్పుడు టీవీకే , డీఎంకే మధ్య మాత్రమే. ఇకపై ఎఐఎడీఎంకేకు రాష్ట్ర రాజకీయాల్లో స్థానం లేదు. మా ప్రభుత్వం అందరి కోసం పని చేస్తోంది. రాష్ట్ర హక్కులు, లౌకికవాదం విషయంలో ఎలాంటి రాజీ పడబోదు’అని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా తనపై వచ్చిన హార్స్ ట్రేడింగ్ (ఎమ్మెల్యేల కొనుగోలు) ఆరోపణలను విజయ్ ఖండించారు. డీఎంకే ఎఐఎడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. మీరు ఎన్నో సంవత్సరాలుగా మోసం చేసిన ఇద్దరిని తిరస్కరించి మీ విజయ్ను, మీ అన్నను, మీ తమ్ముడిని ఎన్నుకున్నారు. నేను ముఖ్యమంత్రి కాదు, మీ సేవకుడినంటూ సభకు హాజరైన ప్రజలు, పార్టీ శ్రేణుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దుస్తులపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ.. నేను సూట్ ఎందుకు ధరించకూడదు? నేను రంగులు మార్చలేను, రంగురంగుల దుస్తులు ధరించలేను. అందుకే సూట్ ధరిస్తున్నాను. నేను ధరిస్తున్న సూట్ను కూడా వాళ్లు విమర్శిస్తున్నారు. మనం కోటు సూటు ధరించకూడదా? విజయ్ ఎప్పుడూ బ్లాక్ అండ్ వైట్ నిజాయితీగా ఉంటాడనే విషయాన్ని ఇది సూచిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. విజయ్ తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి గెలిచిన తర్వాత రాజీనామా చేసి, చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గాన్ని కొనసాగించారు. సభకు ఆయన రాక సందర్భంగా విమానాశ్రయం నుంచి వేదిక వరకు ప్రజలు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. -
నన్ను గెలవలేవ్ అన్నారు సీఎంగా మీ ముందుకొచ్చా
-
విజయ్ ర్యాలీకి పోటెత్తిన జనం
-
సీఎం విజయ్ లేటెస్ట్ విజువల్స్
-
40 మంది ఐఏఎస్ల బదిలీ
తిరువొత్తియూరు: తమిళనాడు ప్రభుత్వం 40 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, చెన్నై కలె క్టర్తో సహా మరికొంతమంది ఐఏఎస్ అధికారుల ను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్ విడుదల చేసిన ఉత్తర్వు ల మేరకు.. గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న కిర్లోష్ కుమార్, గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సామాజిక సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ శరణ్య అరి, పెరంబలూరు జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. పెరంబలూరు జిల్లా కలెక్టర్ మృణాళిని, అరియలూరు జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. చెంగల్పట్టు జిల్లా మాజీ కలెక్టర్ మాలతి హెలెన్, చెన్నై జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. కో యంబత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శివగురు ప్రభాకరన్, రామనాథపురం జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు. తమిళనాడు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. కవిత, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. మదురై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చిత్ర విజయన్, చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ డిప్యూటీ కమిషనర్ (నార్త్)గా బదిలీ అయ్యారు. ప్రభుత్వ పరిపాలన శాఖ డిప్యూటీ సెక్రటరీ వీరప్రతాప్ సింగ్, తిరుచ్చి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నియమితులయ్యారు. చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కవరాజ్ కుమార్, మదురై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బదిలీ అయ్యారు. చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ డిప్యూటీ కమిషనర్ (నార్త్) కట్టా రవి తేజ, కోయంబత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నియమితులయ్యారు. -
అవినీతికి సింహస్వప్నం.. ‘లేడీ సింగం’ చిత్రా బదిలీ
సాక్షి, చెన్నై: మదురై నగర పాలక సంస్థ (కార్పొరేషన్) చరిత్రలో అత్యంత నిజాయితీ కలిగిన అధికారిణిగా పేరు తెచ్చుకున్న కమిషనర్ చిత్రా బదిలీ అయ్యారు. కార్పొరేషన్లో భారీ స్థాయిలో జరిగిన ఆస్తి పన్ను (ప్రాపర్టీ టాక్స్) కుంభకోణాన్ని వెలికితీసి, అసిస్టెంట్ కమిషనర్ నుండి బిల్ కలెక్టర్ల వరకు ఏకంగా 28 మంది సిబ్బందిని సస్పెండ్ చేసి సంచలనం సృష్టించిన ఆమెను ప్రభుత్వం బదిలీ చేయడంతో మదురై వాసులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆమెను చెన్నై కార్పొరేషన్ నార్త్ జోన్ డిప్యూటీ కమిషనర్గా నియమించారు. అవినీతిపై ’చిత్రా’స్త్రం.. మదురై కార్పొరేషన్కు 71వ కమిషనర్గా, అలాగే తొలి మహిళా కమిషనర్గా చిత్రా 2025 ఫిబ్రవరి 3న బాధ్యతలు స్వీకరించారు. ఆమె వచ్చే నాటికి కార్పొరేషన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అంతకుముందు 2021 నుండి 2025 వరకు కేవలం నాలుగేళ్లలో ఐదుగురు కమిషనర్లు మారారంటే అక్కడ రాజకీయ ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టిన చిత్రా, కేవలం ఏడాదిన్నర కాలంలోనే కార్పొరేషన్ రూపురేఖలను మార్చేశారు. కేవలం ఆరోపణలకే పరిమితమైన ఆస్తి పన్ను అవినీతిపై గట్టి నిఘా పెట్టి, నిరూపించడమే కాకుండా పోలీసు విచారణకు ఆదేశించారు. ఈ విప్లవాత్మక చర్యే చివరకు మదురై మేయర్, ఐదుగురు జోనల్ చైర్మన్ల పదవులు ఊడిపోవడానికి ముఖ్య కారణమైంది. కార్పొరేషన్ ఖజానాకు భారీగా ఆదాయం కమిషనర్ చిత్రా తనదైన శైలిలో సంస్కరణలు చేపట్టారు. మదురై ప్రగతికి బాట వేయడమే కాకుండా పేద విద్యార్థులకు తోడ్పాటుగా నిలిచే కార్యక్రమాలు విస్తృతం చేసిన చిత్రాను కొత్త ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల బదిలీల పర్వంలో భాగంగా మదురై నుండి చెన్నైకు స్థాన చలనం కల్పించారు. అయితే, మదురై వాసులు ఈ బదిలీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. -
అన్నామలై కొత్త పార్టీ?
సాక్షి, చైన్నె: తమిళనాడులో రాజకీయం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కొత్త పార్టీతో రాజకీయాలలోకి రాబోతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఇందుకు అనుగుణంగా జూన్ 4వ తేదీన అన్నామలై పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన మద్దతుదారులు, అభిమానులు కోయంబత్తూరు నగరంలో పెద్దఎత్తున పోస్టర్లను హోరెత్తించడం చర్చకు దారి తీసింది. అయితే, తమిళనాడులో బీజేపి బలోపేతానికి కృషి చేసి అన్నామలైను అన్నాడీఎంకే ఒత్తిడితో అధ్యక్ష పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. కానీ, ఆయనకు ఇంత వరకు బీజేపీలో గానీ, కేంద్రంలోని ఎలాంటి పదవీ అన్నది ఇవ్వలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి సైత దూరంగా నిలబడ్డ అన్నామలై తాజాగా కొత్త పార్టీతో రాజకీయాలలోకి రాబోతున్నట్టు ఆదివారం ప్రచారం ఊపందుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా ‘మా నాయకుడా. ముందుండి నడిపించు అన్న నినాదంతో కోయంబత్తూరు మాజీ మేయర్ ఉత్తమ్ బాలాజీ రామస్వామికి చెందిన ఉత్తమ్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో నగరమంతటా అన్నామలైకు మద్దతుగా భారీ పోస్టర్లను అతికించారు. సింగనల్లూరు, అవినాశి రోడ్డుతో పాటు నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. వాటిపై అన్నామలై చిత్రాలతో పాటు.. ‘మా నాయకా, ముందుకొచ్చి నాయకత్వం వహించండి..రా.. నాయకత్వం వహించు‘ అనే నినాదాలను ముద్రించడం చర్చకు దారి తీసింది.BIG NEWS - Annamalai to launch People’s Movement in Tamil Nadu.It won't be a political party. He will enrol like-minded people and build a strong volunteer base as per reports.Your thoughts?pic.twitter.com/eekuEIb1rK— News Algebra (@NewsAlgebraIND) May 31, 2026 -
విజయ్ని అడిగితే.. డిప్యూటీ సీఎం ఇచ్చేవారు: ప్రేమలత
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ చేసిన ఆదివారం వ్యాఖ్యలు కొత్త ట్విస్టుకు దారి తీశాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చైన్నెలో నిర్వహించిన డీఎండీకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం తమిళనాడులో మంత్రి పదవుల కోసం రాజకీయ నాయకులు ఎగబడుతున్నారని ప్రేమలత ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా టీవీకే అధినేత, ప్రస్తుత సీఎం విజయ్ను ఉద్దేశించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.‘నేను అనుకుంటే విజయ్ను కలవడం పెద్ద విషయమా? అని పేర్కొంటూ, ఇప్పుడు చాలా మంది మంత్రి పదవుల కోసం ఆయన చుట్టూ పరుగులు తీస్తున్నారు. అయితే, నేను గనుక ఒక్క మాట చెప్పి ఉంటే.. విజయ్ స్వయంగా నా ఇంటికి వచ్చి మరీ నాకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి ఉండేవారు. ఇది పచ్చి నిజం.’ అని వ్యాఖ్యలు చేశారు. అయితే, డీఎండీకే ఎప్పుడూ పదవులకో, డబ్బులకో ఆశపడే పార్టీ కాదని నమ్ముకున్న సిద్ధాంతాలకు, కూటమి ధర్మానికి కట్టుబడి ఉండే పవిత్రమైన పార్టీ అని స్పష్టం చేశారు.టీవీకే ప్రభుత్వంపై విమర్శల బాణాలు..తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా కాకముందే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు మొదలయ్యాయని ప్రేమలత ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీవీకే.. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం శాంతిభద్రతల క్షీణించాయని, మహిళలపై లైంగిక దాడులు, విద్యుత్ కోతలు, మేఘదాతు వివాదం, రైతుల రుణమాఫీ నిరసనలు పెరిగిపోతున్నాయని, వీటికి ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎన్నికల ప్రచారంలో ఎవరినైతే ’దుష్ట శక్తి’ అని విమర్శించారో, ఇప్పుడు అదే పార్టీ మద్దతుతో ఇక్కడ ’పవిత్ర శక్తి’ అని చెప్పుకునే వారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, ఈ రాజకీయ డ్రామాలను ప్రజలంతా గమనిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.పళనిస్వామి తీరుపై ఫైర్2024 లోక్సభ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేకు అండగా డీఎండీకే నిలిచిన విషయాన్ని ప్రేమలత గుర్తుచేశారు. అయితే, 2024లో వదిలేసి వెళ్లిన వారినే మళ్లీ 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం పిలిచి పళని చర్చలు జరిపారని పేర్కొన్నారు. కష్టకాలంలో తోడున్న తమను కనీసం గౌరవించి పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఫస్ట్ టైమ్ ప్రజల్లోకి విజయ్.. రేపు తిరుచ్చిలో పర్యటన
సాక్షి, చెన్నై: తిరుచ్చి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు సీఎం విజయ్ సోమవారం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందు కోసం తిరుచ్చి తూర్పు నియోజకవర్గం పరిధిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివరాలు.. సీఎం విజయ్ చెన్నై పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాలలో పోటీ చేసిన విషయం తెలిసిందే. తిరుచ్చి తూర్పు నియోజకవర్గానికి ఆయన రాజీనామా చేశారు.సీఎంగా బాధ్యతలు చేపట్టడం, మంత్రి వర్గం విస్తరణ, వాగ్దానాల అమలు, ఢిల్లీ పర్యటన అంటూ బిజీగా ఉన్న విజయ్ ఎట్టకేలకు తిరుచ్చి తూర్పు నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం సోమవారం సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయ్ సీఎంగా బాధ్యలు చేపట్టినానంతరం ప్రజలలోకి ప్రథమంగా వస్తున్నారు. చెన్నై నుంచి తిరుచ్చికి విజయ్ విమానంలో వెళ్లారు. తిరుచ్చి విమానాశ్రయం టెర్మినల్ నుండి తన సొంత, ప్రత్యేక వాహనంలో (ఓపెన్ వ్యాన్)లో బయలుదేరుతారు. తిరుచ్చి–పుదుక్కోట్టై రోడ్డులోని టీవీఎస్ టోల్ గేట్, ఓల్డ్ డెయిరీ ఫామ్ ,మిల్క్ స్టేషన్ మీదుగా ప్రయాణించి సెయింట్ జోసెఫ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. ఆయన ఓపెన్ వ్యాన్లో నిలబడి ప్రజలకు , కార్యరర్తలకు చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతూ, అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ సభలో ప్రసంగిస్తారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత ఆయన తమిళనాడులోని ఇతర జిల్లాలలో కూడా పర్యటించి ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారని సమాచారం. -
విజయ్కి బిగ్ షాక్.. ప్రేమలత విజయకాంత్ సంచలన ఆరోపణలు
సాక్షి, చెన్నై: తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలు, పిల్లలకు రక్షణ కరువైందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవల వరుసగా జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, ఘోర దాడుల సంఘటనలను ప్రస్తావిస్తూ ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి తక్షణమే ఈ వ్యవహారాలపై దృష్టి సారించి, శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.కాపాడాల్సిన వారే కీచకులవుతున్నారు రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని దారుణ సంఘటనలను ప్రేమలత ప్రత్యేకంగా ప్రస్తావించారు. చెన్నై వడపళనిలో 16 ఏళ్ల మైనర్ బాలుడికి మద్యం ఇప్పించి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు స్వయంగా ఒక హెడ్ కానిస్టేబుల్పైనే కేసు నమోదు కావడం సమాజంలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నట్టు మండిపడ్డారు. చెన్నై వేళచ్చేరి బస్టాండ్ సమీపంలో గాయాలతో స్ప్పహతప్పి పడివున్న 61 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి జరగడం అత్యంత వేదనాభరితమని, వృద్ధులకు కూడా రక్షణ లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విల్లుపురం,కడలూరు అంటూ చెన్నై నుంచి తేనివ రకు నిత్యం నేరాల పర్వం కొనసాగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఎం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలి.. రాష్ట్రంలో మార్పు వస్తుందనే ఆశతో ప్రజలు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని, కానీ ఇలాంటి వరుస నేరాలు ప్రజల్లో తీవ్ర నిరాశను, అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయని ప్రేమలత పేర్కొన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు ప్రశాంతంగా జీవించే వాతావరణాన్ని కల్పించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిందితులు ఎంతటి వారైనా పక్షపాతం లేకుండా కఠినంగా శిక్షించాలని, ఇప్పటికైనా సీఎం స్వయంగా స్పందించి, శాంతిభద్రతలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. -
REEL సీఎం కి REAL సీఎంకి తేడా అదే
-
విజయ్ సతీమణి బీజేపీలోకి?
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చ జోరందుకున్నట్లు తెలుస్తోంది. తమిళ వెట్రి కళగం (TVK) అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత జీవితం ఆ చర్చల కేంద్రంగా మారింది. ఆయన సతీమణి సంగీత సోర్నలింగంకు బీజేపీ ఆహ్వానం పలికిందని.. అతిత్వరలో ఆమె ఆ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారమే అందుకు కారణం. చెన్నై రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై గుసగుసలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి.ఎన్నికలకు ముందు విజయ్ వ్యక్తిగత జీవితం చుట్టూ అనేక ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. తన భర్తకు ఓ ప్రముఖ నటితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సంగీత ఆరోపించడం.. అదే సమయంలో ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడం సంచలన చర్చకు దారి తీసింది. అయితే ఈ విషయాలపై విజయ్ కుటుంబం ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. మరోవైపు, విజయ్ను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రచారాన్ని కొందరు నడిపించారన్న వాదనలు కూడా అప్పట్లో బలంగా వినిపించాయి.ఆ తర్వాత సంగీత విజయ్ను భారీగా భరణం కోరారని.. మనస్పర్థల నేపథ్యంలోనే పిల్లలతో భర్తకు దూరంగా ఉంటున్నారనే కథనాలు తమిళ మీడియాలో తరచూ కనిపించాయి. అభిమానుల తలనొప్పి లేకుండా చెన్నైలో కాకుండా విదేశాల్లోనే గడుపుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. దీంతో కుటుంబ విభేదాల ప్రభావం ఎన్నికలపై పడవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. వ్యక్తిగత వివాదాల కంటే రాజకీయ మార్పుకే ప్రజలు ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ సంగీత, పిల్లలు కనిపించకపోవడం మరోసారి చర్చకు దారితీసింది.ఇప్పుడు అదే కుటుంబ వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. సంగీత బీజేపీలో చేరే అవకాశాలపై చెన్నై రాజకీయ వర్గాల్లో గుసగుసలు(Gossips) వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీకి చెందిన ఓ ప్రముఖ సినీ నటి, జాతీయ స్థాయి నాయకురాలు ఈ చేరిక కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని చెబుతున్నారు. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం.. విజయ్ రాజకీయంగా బలపడుతున్న తరుణంలో ఆయన కుటుంబానికి చెందిన ఎవరైనా ప్రత్యర్థి రాజకీయ శిబిరంలో చేరితే అది సహజంగానే చర్చనీయాంశం అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు, విజయ్ వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీయడం లేదంటే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నాల్లో భాగంగానే ఈ ప్రచారం ఉండొచ్చని కూడా కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉండగా, సంగీత సోర్నలింగం శ్రీలంక తమిళ వ్యాపార కుటుంబ నేపథ్యం కలిగిన వ్యక్తి. అనంతరం ఆమె కుటుంబం బ్రిటన్కు వలస వెళ్లి లండన్లో స్థిరపడ్డారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సోర్నలింగం కుమార్తె అయిన సంగీత.. లండన్లోనే చదువుకున్నారు. విజయ్కు అభిమానిగా మొదలైన పరిచయం తర్వాత ప్రేమగా మారి, 1999లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు జేసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా ఉన్నారు.అయితే గత కొన్నేళ్లుగా సంగీత–విజయ్ల మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం తమిళనాట తరచూ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఎన్నికల సమయంలో విడాకుల పిటిషన్, ఆరోపణల వార్తలు వెలుగులోకి రావడం అభిమానులకు సైతం మింగుడు పడలేదు. ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ చేరిక ప్రచారం కూడా అదే కోవకి చెందింది అయ్యి ఉండొచ్చన్న చర్చ నడుస్తోంది. విజయ్ను బద్నాం చేసే కుట్రలో ఇదో భాగమని.. అందుకే సంగీత బీజేపీలో చేరతారని రాజకీయ ఊహాగానాలు తెరపైకి వచ్చాయని చెన్నై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
తమిళనాడు కాంగ్రెస్లో భారీ ట్విస్ట్..
సాక్షి, చైన్నె: కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి శుక్రవారం చేసిన ఓ ట్వీట్ తమిళనాడు కాంగ్రెస్(టీఎన్సీసీ)లో రచ్చకెక్కింది. ఎన్నికలలో సీట్ల కేటాయింపులో భారీ స్కాం జరిగినట్టుగా ఆమె కాంగ్రెస్పై ఆరోపణలు చేయడం చర్చకు దారి తీసింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, కాంగ్రెస్ పార్టీలో జరగాల్సిన ఎన్నికల సంస్కరణలు తమిళనాడు నుంచే ప్రారంభం కావాలని ఆమె పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఐదు చోట్ల మాత్రమే గెలిచింది. కూటమితో సీట్ల పందేరం అన్నది పెద్ద వివాదం నడుమే జరిగింది. డీఎంకే అధికారం కోల్పోవడంతో విజయ్ నేతృత్వంలోని టీవీకే పక్షాన కాంగ్రెస్ చేరింది. ఈ కేబినెట్లో రెండు మంత్రి పదవులు సైతం దక్కించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్పై ఎంపీ జ్యోతిమణి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం చర్చకు దారి తీసింది. ఆమె ఎక్స్ పేజీలో అన్ని వివరాలను ప్రకటించారు.కమిటీ ఏర్పాటుపై అభ్యంతరం.. టికెట్ల కేటాయింపుపై అసలు విచారణ జరపకుండా, కేవలం ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై మాత్రమే విచారించడానికి కమిటీని వేయడం అనేది తప్పు చేసిన వారిని కాపాడడానికి చేసిన ఏర్పాటు మాత్రమేనని ధ్వజమెత్తారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అంతా తమిళనాడు కాంగ్రెస్ ఇన్చార్జ్ గిరీష్ చోడంకర్ నేతృత్వంలోని కమిటీ ఆధ్వర్యంలోనే జరిగిందని, ఆ కమిటీపై ఉన్న ఆరోపణలను కాంగ్రెస్ నిబంధనల ప్రకారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మాత్రమే విచారించగలదన్నారు.సర్వేల పేరిట భారీ అవినీతిఅసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు, అభ్యర్థుల ఎంపికలో అక్రమాలు జరిగాయని వివరించారు. ముందే కొందరు అభ్యర్థులను ఖరారు చేసి, ఆ తర్వాత వారికి అనుకూలమైన నియోజకవర్గాలను కూటమి నుంచి అడిగి తీసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల సర్వేల పేరుతో పార్టీలో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన వారిని, గెలిచే అవకాశం ఉన్న నాయకులను పూర్తిగా పక్కన పెట్టేశారని వివరించారు. కొత్తవారికి, అసలు గెలుపు అవకాశాలు లేని చాలామందికి సీట్లు కేటాయించారని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అనేక మంది పార్టీని వీడారని, ఇలాంటి వారికి టికెట్లు ఇచ్చింది ఎవరు? దేని ఆధారంగా ఇచ్చారు? తప్పు చేసిన వారిపై తీసుకున్న చర్యలు ఏంటీ అని ప్రశ్నించారు.పార్టీ సంస్కరణల కోసం పిలుపు ఈ దేశాన్ని బీజేపీ, నరేంద్ర మోదీ నుంచి కాపాడాల్సిన చారిత్రక బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ ఎక్కడా రాజీ పడకుండా పోరాడుతున్నారని పేర్కొంటూ, పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న ఇలాంటి తప్పులు క్షేత్రస్థాయిలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల నమ్మకాన్ని వమ్ముచేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఇలాంటి అభ్యర్థుల ఎంపికపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయని, చాలాచోట్ల ఇది పార్టీ ఓటమికి కూడా కారణమవుతోందన్నారు. అయితే, విచారణ జరపడానికి బదులు తప్పు చేసిన వారిని కాపాడుతున్నారని మండిపడ్డారు. తమిళనాడు అభ్యర్థుల ఎంపికను తాను చాలా దగ్గర నుంచి చూశానని, ఇంత బహిరంగంగా తప్పులు జరగడం పార్టీ భవిష్యత్తుకు పెద్ద మైనస్ అవుతుందని హెచ్చరించారు. ఒక బలమైన ప్రతిపక్షంగా నిలబడి గెలవాలంటే జిల్లా, ప్రాంతీయ స్థాయి నాయకుల, కార్యకర్తల గళానికి విలువ ఇవ్వాలని సూచించారు. పార్టీ పారదర్శకంగా పనిచేయాలని, అందువల్ల కాంగ్రెస్లో అంతర్గత ఎన్నికల సంస్కరణలు తమిళనాడు నుంచే మొదలవ్వాలని కోరారు. ఎన్నికలకు ముందు కూడా అభ్యర్థుల ఎంపికపై జోతిమణి తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు. తాజాగా ఆమె తీవ్ర స్థాయిలో కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడడం చర్చకు దారి తీసింది. -
సీఎం విజయ్ టీమ్లోకి పవర్ఫుల్ పోలీస్ బాస్..!
సాక్షి, చెన్నై: తమిళనాడు పోలీస్ విభాగానికి సంబంధించి ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర శాంతిభద్రతల విభాగం కొత్త డీజీపీగా మహేష్ కుమార్ అగర్వాల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డీజీపీగా విధులు నిర్వహిస్తున్న ఆయన్ను, ఇప్పటివరకు తమిళనాడు డీజీపీగా ఉన్న సందీప్రాయ్ రాథోడ్ స్థానంలో నియమించారు. క్లీన్ ఇమేజ్ అధికారి మహేష్కుమార్అగర్వాల్ తమిళనాడు పోలీస్ సర్వీసులో ఎంతో అనుభవం, క్లీన్ ఇమేజ్ ఉన్న సీనియర్ అధికారి. ఆయన 1994 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. స్వస్థలం పంజాబ్ రాష్ట్రం. తండ్రి లాయర్ కావడంతో ఆయన కూడా లా చదివారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి కేవలం 22 ఏళ్ల వయసులోనే ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. గతంలో తేని, తూత్తుకుడి జిల్లాల ఎస్పీగా, చెన్నై బ్రాడ్ వే డిప్యూటీ కమిషనర్గా, చెన్నై ట్రాఫిక్ సౌత్ డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. సీబీఐలో సేవలు డెప్యుటేషన్పై తన సొంత రాష్ట్రమైన పంజాబ్కు వెళ్లి, అక్కడ ఏడేళ్లు సీబీఐ అధికారిగా పనిచేశారు. పంజాబ్, హర్యానా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో పనిచేశారు. ఐజీగా పదోన్నతి పొందినానంతరం తమిళనాడుకు తిరిగివచ్చిన ఆయన సీబీసీఐడీలో పనిచేశారు. తర్వాత మదురై పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. చెన్నై సౌత్ జోన్ అడిషనల్ కమిషనర్గా, ఎన్న్ఫోర్స్మెంట్ ఏడీజీపీగా పనిచేశారు. 2020లో చెన్నైకి అత్యంత పిన్న వయసు్కడైన పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టి అప్పట్లో రికార్డు సృష్టించారు. -
రీల్స్తో పెట్టుబడులను ఆహ్వానిస్తున్న కొత్త తరం మంత్రులు
సాక్షి, చెన్నై: తమిళనాడు పారిశ్రామిక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన ఎంచుకున్న సరికొత్త డిజిటల్ పద్ధతి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, త్వరితగతిన లభించే అనుమతులపై ఆమె ఇన్స్ట్రాగామ్ ’రీల్స్’ రూపంలో ఒక వీడియోను విడుదల చేశారు. దీనిపై నెటిజన్ల నుండి ఒకవైపు భారీగా ప్రశంసలు దక్కుతుండగా, మరోవైపు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రజల్ని రీల్స్ , డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్ల వేదికగా ఆకర్షించిందన్నది జగమెరిగిన సత్యం. తాజాగా అధికారంలోకి వచ్చినానంతరం కూడా రీల్స్ హోరెతుత్తుతున్నాయి. ఈ పరిస్థితులలో మంత్రి మంత్రి కీర్తన తన రీల్స్ వీడియోలో ‘తమిళనాడు భవిష్యత్తు కోసం ఎదురుచూడటం లేదు.. ఆ భవిష్యత్తును మనమే స్వయంగా నిర్మిస్తున్నాం. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, ఫైళ్లు , అనుమతుల కోసం నెలల తరబడి వేచి ఉండే పాత పద్ధతులను ఎవరూ ఇష్టపడరు. ఆ లోపాన్ని సరిదిద్ది, వ్యవస్థను వేగవంతం చేయడానికే సీఎం విజయ్ తనను ఈ స్థానంలో నియమించారు’ అని వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం కేవలం 21 రోజుల్లోనే అత్యంత వేగంగా సింగిల్ విండో ద్వారా అన్ని రకాల పారిశ్రామిక అనుమతులను ఇచ్చేందుకు కట్టుబడి ఉందని ప్రకటలించారు. ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ తమిళనాడులో పెట్టు బడులు పెట్టండి‘ అని ఆమె ఆ వీడియోలో పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలోనే ’రీల్స్’ , చిన్న చిన్న వీడియోల ద్వారా ప్రజలను ఆకట్టుకుని గుర్తింపు తెచ్చుకున్న కీర్తన, ఇప్పుడు మంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా పెట్టుబడులను ఆకర్షించడానికి అదే సోషల్ మీడియా వ్యూహాన్ని అమలు చేయడం గమనార్హం. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా యువతను, ఆధునిక పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేలా సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో మంత్రి రీల్స్ చేయడం అభినందనీయమని, ఇది పారదర్శకతను పెంచుతుందని ఒక వర్గం మద్దతు తెలుపుతోంది. అదే సమయంలో అంతర్జాతీయ , దేశీయ దిగ్గజ సంస్థల నుండి కోట్లాది రూపాయల పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు అధికారిక సమావేశాలు కాకుండా, ఇలా ’రీల్స్’ ద్వారా పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసం? ఇది ప్రభుత్వ సీరియస్నెస్ను తగ్గిస్తుందంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, ఒక మంత్రి పారిశ్రామిక విధానాలను వివరించడానికి రీల్స్ రూపంలో ముందుకు రావడం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్కు తెరలేపినట్లైంది. View this post on Instagram A post shared by Virudhai Magal Keerthana (@virudhai_magal_keerthana) -
టీవీకేలో చేరుతారా? లేక రాజకీయాలకు విరామమా?
సాక్షి, చెన్నై: ప్రస్తుత రాజకీయ పరిణామాలు? మనం ఏం చేయాలి? అనే విషయాలపై తనకు ఘన విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, భావాలను అడిగి తెలుసుకుంటున్నానని అన్నాడీఎంకే సీనియర్ నేత సీ విజయ భాస్కర్ ప్రకటించారు. వారి నిర్ణయానికి అనుగుణంగానే రాజకీయ భవిష్యత్తుపై తన తదుపరి అడుగు ఉంటుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అన్నాడీఎంకేలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పుదుక్కోట్టై జిల్లా విరాలిమలైలోని తన నివాసంలో విజయభాస్కర్ గురువారం తన ముఖ్య అనుచరులు, నియోజకవర్గ నేతలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. పళనిస్వామితో రాజీపై అసంతృప్తి? పార్టీ మరింత బలహీనపడకుండా చూసేందుకు బుధవారం తిరుగుబాటు వర్గానికి చెందిన కీలక నేతలు ఎస్.పి. వేలుమణి నేతృత్వంలో పలువురు నేతలు చెన్నై గ్రీన్వేస్ రోడ్డులోని పళనిస్వామి నివాసానికి వెళ్లి రాయబార చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో ఇరు వర్గాలు సచివాలయానికి వెళ్లి, పరస్పరం ఎమ్మెల్యేలపై ఇచ్చిన అనర్హత వేటు లేఖలను ఉపసంహరించుకున్నారు. అలాగే అన్నాడీఎంకే శాసనసభ పక్ష నేతగా పళనిస్వామిని, విప్గా అగ్రి కృష్ణమూర్తిని ఎన్నుకున్నట్లు స్పీకర్ జేసీడీ ప్రభాకర్కు లేఖలు అందించారు.అయితే, ఈ రాజీ ప్రక్రియలో సి.వి. షణ్ముగం పాల్గొనలేదు. ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు , మద్దతు దారులతో మంతనాలలో ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈ సమయంలో సి. విజయభాస్కర్ స్పీకర్ను కలవడానికి వచ్చినప్పటికీ, పళనిస్వామిని వ్యక్తిగతంగా కలవకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన కూడా ప్రస్తుత పరిణామాలపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అనుచరుల ముందు 3 ప్రత్యామ్నాయాలు ఈ నేపథ్యంలోనే విజయభాస్కర్ విరాలిమలైలో తన మద్దతుదారులతో అత్యవసర సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై ముఖ్యంగా మూడు ప్రతిపాదనలను అనుచరుల ముందు ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం అన్నాడీఎంకేలో కొనసాగాలా? లేదా, విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరాలా? లేదా ప్రస్తుతానికి రాజకీయాల నుంచే తప్పుకోవాలా? అన్న మూడు అంశాల ఆధారంగా ఈ మంతనాలు జరుగుతుండటం గమనార్హం. ప్రజల తీర్పు ప్రకారమే నిర్ణయం సమావేశం అనంతరం విజయభాస్కర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో తన తదుపరి అడుగు ఎలా ఉండాలనే దానిపై విజయానికి శ్రమించిన పార్టీ నిర్వాహకులు, జిల్లా, మండల, గ్రామ స్థాయి నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నానని తెలిపారు. తనను గెలిపించిన దేవుళ్లు అయిన నియోజకవర్గ ప్రజల మనోభావాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే తదుపరి రాజకీయ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తానని పేర్కొన్నారు. -
చివరకు మిగిలింది రూ.140 మాత్రమే!
తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయ ప్రవేశం.. ఎన్నికల్లో ఘన విజయం.. ఆయన చుట్టూ ప్రజాదరణ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మళ్లీ కదిలిస్తోంది. యువతలో కనిపిస్తున్న మద్దతు, మార్పు కోరుకునే వాతావరణం నేపథ్యంలో ఒక పాత చరిత్ర మళ్లీ చర్చలోకి వచ్చింది. అదే కామరాజ్ ఓటమి. ఒకప్పుడు అపార ప్రజాదరణ కలిగిన మహానేత కూడా ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొన్న సందర్భమది.. కామరాజ్ జీవితం భారత రాజకీయాల్లో ఒక ప్రత్యేక అధ్యాయం. చిన్న వయసులోనే విద్యను వదిలేసినా, ఆయన ప్రజల మధ్యే రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. గ్రామాలు, ప్రజల అవసరాలు, సమస్యలు.. ఇవే ఆయన పాలనకు మార్గదర్శకాలు అయ్యాయి. మాటల కంటే పనితోనే రాజకీయాన్ని నడిపిన నేతగా ఆయన గుర్తింపు పొందారు. అలా ఆయనకు “తమిళనాడులోని ప్రతీ గ్రామాన్ని రెండుసార్లు సందర్శించిన నేత” అనే ముద్ర కూడా ఉంది. 1953–64 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన తమిళనాడులో విద్యా విప్లవానికి బాటలు వేశారు. వేల సంఖ్యలో ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయడం, పేదలకు ఉచిత విద్యను విస్తరించడం, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం వంటి నిర్ణయాలు రాష్ట్ర సామాజిక రూపురేఖలను మార్చేశాయి. గ్రామీణ విద్యుతీకరణ, సాగునీటి ప్రాజెక్టులు, రవాణా అభివృద్ధి.. ఇవన్నీ ఆయన పాలనలో వేగంగా విస్తరించాయి. రాజకీయంగా కాకుండా పాలనాపరంగా ఆయనను “బిల్డర్ ఆఫ్ తమిళనాడు”గా చూస్తారు.అయితే ఇదే ప్రజాదరణ ఆయనకు రాజకీయ రక్షణ ఇవ్వలేదు. ద్రావిడ రాజకీయాల ఉధృతి, ఐడెంటిటీ పాలిటిక్స్, సినిమా ప్రభావం వంటి అంశాలను ఆయన తక్కువ అంచనా వేశారని విశ్లేషకులు చెబుతారు. డీఎంకే ఎదుగుదలతో పాటు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. చివరికి 1967లో తన సొంత ప్రాంతంలోనే ఆయన ఓటమిని ఎదుర్కొన్నారు. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన నేతే ప్రజల తీర్పుతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.ఆ తర్వాత ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. నెహ్రూ మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి, తర్వాత ఇందిరాగాంధీని ప్రధానిగా నిలబెట్టడంలో ఆయన పాత్ర కీలకమైంది. కానీ కాలక్రమేణా కాంగ్రెస్లోనే అంతర్గత మార్పులు, ఇందిరాగాంధీ కొత్త రాజకీయ శైలి, జనాకర్షణ రాజకీయాలు ఆయన ప్రభావాన్ని తగ్గించాయి. చివరికి ఆయన రాజకీయ ప్రయాణం ఒక “మౌన ముగింపు”కు చేరింది.అయితే ఆయన మరణానంతరం ఆయన జీవితం మరో కోణంలో వెలుగులోకి వచ్చింది. అత్యంత సరళ జీవితం గడిపిన ఆయన వద్ద కేవలం రూ.140 మాత్రమే మిగిలాయి. అదీ ఆయన పడుకునే దిండులో దొరికాయి. ఖాదీ దుస్తులు, కొన్ని పుస్తకాలు, రెండు జతల చెప్పులు.. ఆయన చివరి గుర్తులుగా మిగిలాయి. కానీ ఆయన నిర్మించిన విద్యా వ్యవస్థ, పాలనా మౌలిక వసతులు మాత్రం ఇప్పటికీ తమిళనాడును నడిపిస్తున్నాయి.ఇప్పుడీ చరిత్ర మళ్లీ ఎందుకు గుర్తొస్తోంది అంటే.. తమిళనాడులో విజయ్ చుట్టూ పెరుగుతున్న రాజకీయ చర్చలే కారణం. సినిమా ప్రభావం, యువత ఆకర్షణ, మార్పు.. ఇవి కొత్త రాజకీయ శక్తిగా మారుతున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. డబ్బు ప్రభావం తగ్గి, భావోద్వేగ ఓటింగ్ పెరుగుతోందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు శివకుమార్ (సూర్య, కార్తి తండ్రి) చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు మరింత వేడి తెచ్చాయి. ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న ప్రధాన భావన ఒకటే.. ప్రజల తీర్పును ఎవరూ శాశ్వతంగా అంచనా వేయలేరు. “కామరాజ్ లాంటి మహానేతనే ప్రజలు ఒకప్పుడు ఓడించారు. ఇది ప్రజాస్వామ్య స్వభావాన్ని చూపించే ఉదాహరణ. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు ఆ ప్రవాహాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. విజయ్ విజయం నాకు వ్యక్తిగతంగా ఆనందం కలిగిస్తోంది. కానీ చివరికి నిర్ణయం తీసుకునేది ప్రజలే” అని ఆయన పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిగత అభిప్రాయంగా కాకుండా, తమిళనాడు రాజకీయాల్లో తరచుగా కనిపించే “నాయకత్వ మార్పుల చక్రాన్ని” మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఒకవైపు కామరాజ్ లాంటి ప్రజా సేవా ప్రతీకలు ఓటమిని ఎదుర్కొన్న చరిత్ర, మరోవైపు కొత్త తరంలో సినీ ప్రభావంతో ఎదుగుతున్న రాజకీయ ఆకర్షణ.. ఈ రెండు విరుద్ధ ధోరణులు ఇప్పుడు ఒకే చర్చలో కలుస్తున్నాయి. ఇక అసలు ప్రశ్న ఏంటంటే.. ప్రజల తీర్పు నిజంగా స్థిరమైన విలువలపై ఆధారపడుతుందా? లేదంటే ప్రతి తరం తన అవసరాలు, భావోద్వేగాలు, ఆశల ప్రకారం కొత్త నాయకులను ఎంచుకుంటుందా? అని. -
తమిళనాడు సీఎం విజయ్ ఢిల్లీ పర్యటనలో ట్విస్ట్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ దేశ రాజధానిలో తన తొలి అధికారిక పర్యటనను ముగించుకుని గురువారం చెన్నైకి ప్రత్యేక విమానంలో తిరిగి వచ్చారు. అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవకుండానే ఆయన పర్యటన ముగిసింది. సోనియా, రాహుల్తో విజయ్ సమావేశం రద్దయింది. ముఖ్యమంత్రి తన పర్యటనను కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం చేసుకున్నారని.. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదని, అందుకే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశం జరగలేదని కాంగ్రెస్ ఎంపీ క్రిస్టోఫర్ తిలక్ చెప్పుకొచ్చారు.అయితే, ప్రచారం జరుగుతున్నట్లుగా విజయ్, రాహుల్ గాంధీల భేటీ రద్దు కాలేదని... కేవలం వాయిదా మాత్రమే పడిందని తిలక్ పేర్కొన్నారు. సీఎం నీతి ఆయోగ్ సమావేశం కోసం జూన్ 11 ప్రాంతంలో మళ్లీ ఢిల్లీకి వచ్చే అవకాశం ఉందని.. అప్పుడు రాహుల్, సోనియా గాంధీలను కలుస్తారని తాను భావిస్తున్నట్లు ఆయన మీడియాతో అన్నారు.కాగా, తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టినానంతరం టీవీకే చీఫ్ విజయ్ తొలిసారి బుధవారం ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీతో విజయ్కి ఇదే తొలి భేటీ కావడం విశేషం. ప్రధాని మోదీతో సమావేశం ముగిసిన అనంతరం సీఎం విజయ్ తిరిగి తమిళనాడు భవన్కు చేరుకున్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కూడా కలిశారు. రాష్ట్ర నిధులపై చర్చించారు.ఈ క్రమంలో జాతీయ ప్రతిపక్ష నేతలైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోనూ విజయ్ సమావేశమవుతారంటూ ప్రచారం జరిగింది. అటు అధికార పక్ష అగ్రనేతలను, ఇటు ఇండియా కూటమి ప్రతిపక్ష నేతలనూ సమానంగా కలుస్తుండటం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. చివరికి సోనియా, రాహుల్లతో భేటీ కాకుండానే విజయ్ పర్యటన ముగిసింది. -
12ఏళ్ల తర్వాత మోదీని కలిసిన CM విజయ్
-
మోదీతో విజయ్.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న (ఫొటోలు)
-
పవన్పై కోపం చల్లారట్లేదా?
టాలీవుడ్ సీనియర్ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల రాజమండ్రిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. తమిళ రాజకీయాల్లో సినిమా హీరోల ప్రభావాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో.. ఆ చర్చ రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత సినీ–రాజకీయ విమర్శలుగా మొదలైన రియాక్షన్లు ఇప్పుడు సెటైర్ వార్ను దాటి మరింత భావోద్వేగ దశకు చేరుకున్నాయి.మొదట సోషల్ మీడియాలో ఆగ్రహంగా మొదలైన ప్రతిస్పందనలు ఇప్పుడు క్రమంగా విభిన్న రూపాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలో సెటైర్లతో బదులిచ్చిన నెటిజన్లు, ఇప్పుడు తమ అభిమాన హీరో వ్యక్తిత్వం, సినీ ప్రస్థానం, సామాజిక కార్యక్రమాలను ప్రస్తావిస్తూ మరింత గట్టిగా స్పందిస్తున్నారు.పవన్ ప్రసంగంలో “కటౌట్లు, హాలోగ్రామ్స్ పెట్టుకుని ఈజీగా గెలిచేసి సీఎంలు అయ్యారు” అనే వ్యాఖ్యలు వైరల్గా మారడంతో, కొందరు అభిమానులు దాన్ని తమ హీరోలపై వ్యాఖ్యలుగా భావించారు. దీంతో తమిళనాడు సోషల్ మీడియా వేదికలపై “పవన్ సార్… మా దళపతి మీలా కాదు” అనే వాక్యం విస్తృతంగా ట్రెండ్ అవుతోంది. ఇది నేరుగా విజయ్ అభిమానుల భావోద్వేగ కౌంటర్గా మారింది.విజయ్ అభిమానులు ఈ కౌంటర్ ద్వారా ఆయన 25 ఏళ్ల సినీ ప్రస్థానం మాత్రమే కాదు, ప్రజలతో ఏర్పరుచుకున్న అనుబంధాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు. “కేవలం హైప్ వల్ల కాదు… నిజమైన ఫ్యాన్ బేస్, గ్రౌండ్ లెవెల్ కనెక్షన్ వల్లే ఆయన నిలిచారు” అనే వాదనలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను ప్రస్తావిస్తూ అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.చదువులో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం, పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక సహాయం చేయడం, ఫ్యాన్స్ అసోసియేషన్ల ద్వారా విద్యా సామగ్రి పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అలాగే తమిళనాడులో వరదలు, తుఫాన్లు వచ్చిన సమయంలో ఆయన ప్రకటించిన విరాళాలు, సహాయక చర్యల్లో పాల్గొన్న విధానాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు.“సినిమాల్లో మాత్రమే హీరో కాదు… అవసరమైన సమయంలో ప్రజలతో నిలబడే వ్యక్తి” అంటూ కొందరు విజయ్ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. మరికొందరు ఆయన వ్యక్తిత్వం, అభిమానులతో మెలిగే తీరు, పబ్లిక్లో చూపించే సింప్లిసిటీని ఉదాహరణగా చూపిస్తూ సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ చర్చ కేవలం సినిమా లేదా రాజకీయ వ్యాఖ్యలకే పరిమితం కాకుండా, ఇద్దరు నటుల వ్యక్తిత్వాల పోలిక దాకా వెళ్లిన పరిస్థితి వెళ్లింది.#Ilayathalapathy Vijay's helping hand rare old pics! @AllYGirL85 @vijayrambomaxim @Anything4Vj @yok382 @Vicky_VjMsd pic.twitter.com/CgkJS3F0b9— Balaji (@balajiganesan26) August 15, 2016#Vijay has donated relief materials worth Rs 3cr to people affected by Chennai floods #Theri #Ilayathalapathy pic.twitter.com/jCsVZVvIbW— Nandhakumar (@ActorVijayFan1) December 20, 2015మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలను వేరే కోణంలో చూస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలు కాదని, రాజకీయ అనుభవాలపై చేసిన సరదా వ్యాఖ్యలేనని వారు చెబుతున్నారు. 15 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను హైలైట్ చేయడమే ఉద్దేశమని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. విజయ్ కంటే పవనే తోపు అంటూ విజయ్ అభిమానులతో వాదనకు దిగుతున్నారు. దీంతో.. పవన్ వ్యాఖ్యలపై విజయ్ అభిమానుల కోపం ఇంకా చల్లారడం లేదు. మొత్తానికి పవన్ వ్యాఖ్యలు ఒక సాధారణ రాజకీయ హాస్యంగా మొదలై, ఇప్పుడు తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్ వర్గాల మధ్య భావోద్వేగ పోరుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది.Cutouts pettukoni gelichadu 👍 pic.twitter.com/hPoFawOwOp— JD⚡ (@JohnDurdeno) May 26, 2026 -
సూపర్ కాంబో: మోదీ, సురేష్ గోపీలతో విజయ్ స్కెచ్!
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో కీలక భేటీ అయ్యారు. తరువాత కేంద్ర మంత్రి, ప్రముఖ నటుడు సురేష్ గోపీకి ఫోన్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సంభాషణ కేవలం మర్యాదపూర్వకం మాత్రమే కాదని, దేశాభివృద్ధి లక్ష్యంగా సాగిందని సురేష్ గోపీ స్వయంగా వెల్లడించారు.రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిప్రధాని మోదీతో 20 నిమిషాల భేటీ ముగిసిన తర్వాతే తన ప్రియ మిత్రుడు, తమిళనాడు సీఎం విజయ్ ఫోన్ చేశారని సురేష్ గోపీ సోషల్ మీడియాలో తెలిపారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి, తద్వారా దేశ పురోగతికి కలిసి పనిచేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు ఆయన తెలియజేశారు.ఢిల్లీ పర్యటనలో విజయ్ కీలక అజెండాసీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ చేపట్టిన తొలి అధికారిక ఢిల్లీ పర్యటన కీలక అంశాలతో ముగిసింది. మెకేదాటు ప్రాజెక్ట్ వివాదం, తమిళ మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడులు, వందేమాతరం వివాదం వంటి సున్నితమైన సమస్యలను ఆయన ప్రధాని ముందుంచారు. ఈ అంశాలపై కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజయ్ విజ్ఞప్తి చేశారు.చరిత్రక వారసత్వానికి ప్రాధాన్యతప్రాంతీయ సమస్యలతో పాటు, దేశ గౌరవానికి సంబంధించిన అంశాలపై కూడా విజయ్ దృష్టి సారించారు. నెదర్లాండ్స్ నుండి తిరిగి తీసుకువచ్చిన చోళుల కాలం నాటి రాగి శాసనాలను విజయవంతంగా స్వదేశానికి రప్పించినందుకు ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన పదవీకాలంలో ప్రజా సంక్షేమంతో పాటు, చరిత్రక వారసత్వాన్ని కాపాడటంలో కూడా కీలకంగా వ్యవహరిస్తానని విజయ్ పరోక్షంగా సంకేతాలిచ్చారు. -
జనసేన స్టార్.. కన్ఫ్యూజన్ మాస్టర్!
కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు గందరగోళంగా కనిపిస్తున్నాయి. రాజమహేంద్రవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలోని ఆయన ప్రసంగంలో ఒక్క విషయంపై మాత్రం ఆయన చాలా స్పష్టత ఉన్నట్లు తెలిసింది. భవిష్యత్తు రాజకీయ పరిణామాల్లోనూ టీడీపీతోనే కొనసాగాలని ఆయన కాంక్షిస్తున్నట్లు స్పష్టమైంది. కేడర్కు అసౌకర్యం, అవమానాలు ఎదురైనా భరించాల్సిందే అన్నట్టుగా ఆయన మాట్లాడారని విమర్శలు వస్తున్నాయి. తమిళనాడులో ప్రముఖ నటుడు విజయ్ సీఎం కావడం తనకు అసూయ కలిగించిందని చమత్కరిస్తూనే.. అక్కడ అభిమానులు ఏకతాటిపై ఉండి గెలిపించారని, కానీ ఏపీలో మాత్రం తాను స్వయంగా 15 ఏళ్లు రోడ్లపై దేకినా అవకాశం ఇవ్వలేదని అన్నారు. చిత్రంగా.. ఇందుకు కొద్దిరోజుల ముందే విజయ్ గెలుపును ఉద్దేశించి పవన్ ‘‘ఊళ్లో పెళ్లి అవుతుంటే..’’ సామెతను ప్రయోగించి కార్యకర్తలను విస్తుపరిచారు. ఒంటరిగా పోటీచేయడం సంగతి ఎలా ఉన్నా, ఆయన సీఎం కావాలని కోరుకుంటున్న తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేమిటా అన్న బాధను పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేశారు.ఇప్పుడేమో ఇంకోరకంగా మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖునిగా పేరొందిన ఫ్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఒక విశ్లేషణపై ఆయన స్పందించిన తీరు కూడా అంత అర్థవంతం అనిపించదు. అమిత్ షాతో భేటీ కి సంబంధించి నాగేశ్వర్ వెల్లడించిన విషయాలపై అభ్యంతరం ఉంటే చెప్పవచ్చు కానీ.. కేసు పెట్టడాన్ని పవన్ ఎలా సమర్థిస్తారో? దారిన పోయే ప్రతి ఒక్కడు రాళ్లేస్తామంటే ఊరికే ఉండమని, అడ్డగోలుగా మాట్లాడితే పర్యవసనాలు తప్పవని ఆయన హెచ్చరించడం అంత బాగోలేదు. రాజకీయ విషయాలపై, విశ్లేషణలపై కేసు పెట్టిన సందర్భం ఇదొక్కటే కావచ్చు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఒక వ్యక్తి చెప్పిన అంశం నచ్చకపోతే, కరెక్ట్ కాదని భావిస్తే ఖండించవచ్చు. లేదా డామేజీ కోరవచ్చు. కానీ... కేసులు పెట్టి వేధించాలని అనుకుంటే అది ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగించడమే! పవన్ కళ్యాణ్ గతంలో ఆంధ్రప్రదేశ్లో 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని ఏ ఆధారంతో చెప్పారని, పైగా అది ఏపీ మహిళల పరువుకు సంబంధించినందని పలువురు జర్నలిస్టులు వ్యాఖ్యానించారు. అలాగే తిరుమల లడ్డూ వివాదంలో పవన్ ఎంత అభ్యంతరకరంగా వ్యవహరించింది గుర్తు చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యల వల్ల సమాజానికి హాని కలుగుతుంది కాని, అమిత్ షాతో భేటీలో పవన్, మనోహర్లు ఫలానాది కోరారని అని చెబితే దానివల్ల కలిగే ప్రమాదం ఏమిటో తెలియదని వారు అంటున్నారు. నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా పవన్ ఎందుకు ఇలా స్పందించారన్నది చర్చనీయాంశంగా ఉంది. బీజేపీ పెద్దలు ఖండించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఒకవైపు నాగేశ్వర్ అంటే గౌరవమని చెబుతూనే అమిత్ షాతో మాట్లాడిన మాటలు బయటకు ఎలా తెలుస్తాయని ఆయన అన్నారు. ఇంకోసారి అదేమీ జరగలేదని అన్నారు. విశ్లేషకులు వదంతులు మాట్లాడకూడదని అన్నారు. అది ఎవరికైనా వర్తిస్తుంది కదా! ఎల్లో మీడియా ఇలాంటి కథనాలు ఎన్ని వండి వార్చిందో పవన్కు తెలియదా! అమ్మ జగనా అంటూ బ్యానర్ కథనాలు ఇచ్చారే. ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీ అయినప్పుడల్లా ఇలాంటి స్టోరీలు అల్లారే. అప్పుడు వారెవ్వరి మీద కేసులు పెట్లలేదన్న సంగతి గుర్తుంచుకోవాలి. చివరికి జగన్ ఆత్మలతో మాట్లాడుతున్నారంటూ పిచ్చి వార్తలు రాసిన టీడీపీ మీడియాపై ఏమైనా కేసులు పెట్టారా? జగన్ జైలుకు వెళ్లాలని తానెందుకు కోరుకుంటానని పవన్ అన్నారు. ఇంతవరకు సమంజసంగానే ఉంది. కాని జగన్ను గతంలో రాజకీయంగా అష్ట దిగ్బంధనం చేయడానికి కాంగ్రెస్, టీడీపీ కలిసి అక్రమ కేసులు పెట్టిన సంగతి ఆయనకు తెలియదా? ఒకరు జైలుకు వెళితే జనసేన ఎదుగుతుందా! క్రైం చేసినోడి గురించి నేను చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా అంటూ మాట్లాడారు. దీని భావమేమిటో అర్థం కాదు. అవినీతి కేసులలో చంద్రబాబు జైలుకు వెళ్లిన సందర్భంలో రోడ్డుపై కూడా పడుకుని రచ్చ చేసింది ఎవరు? జైలుకు వెళ్లి ఆయనతో పొత్తు ప్రకటన చేసింది ఎవరు? ఒక్కొక్కరి విషయంలో ఒక్కోరకంగా వ్యవహరించడం నేతలకు మామూలే అన్న విమర్శకు ఆస్కారం ఇవ్వడం లేదా?కులం, ప్రాంతం గురించి ప్రస్తావన తెస్తున్నారంటూ పవన్ బాధపడ్డారు.ఆయన నిజంగా వాటి జోలికి వెళ్లకపోతే అభినందించవచ్చు. కాని ఆయన గత కొన్నేళ్లలో చేసిన వ్యాఖ్యలు, ప్రసంగాల వీడియోలు చూస్తే కులం గురించి, సీఎం పదవి గురించి, ఎన్నిసార్లు మాట్లాడింది కనిపిస్తూనే ఉంటుంది కదా? ఒక వైపు జనసేన కేడర్పై జరుగుతున్న దాడులను పరిష్కరించకపోగా, చిన్న, చిన్న వాటి గురించి పట్టించుకోరాదని, సర్దుకుపోవాలని చెప్పడాన్ని వారు ఎలా జీర్ణించుకోగలుగుతారు. బందరులో మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు జనసేన నేతకు సంబంధించి నిర్మాణంలో ఉన్న ఇంటిని అధికారులు, పోలీసులను ప్రయోగించి కూల్చివేస్తే జనసేన ఎంపీ బాలశౌరి అధికారిక సమావేశంలోనే నిలదీశారు. కొల్లూరులో టీడీపీ వారు జనసేన వారిపై దాడి జరిపిన ఘటన కలకలం సృష్టించింది. వీటన్నిటిపై నేరుగా స్పందించలేదు. తాను కమాండర్ అని, తాను చెప్పినట్లు వినాల్సిందేనని, లేకుంటే బయటకు వెళ్లిపోవచ్చన్నట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని చెప్పక తప్పదు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కూటమిపై ఆధారపడడం ఇష్టం లేకనే ప్లాన్ బీ?
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త మెరుపు దాడి రాజకీయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అన్నాడీఎంకేకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, అధికార తమిళగ వెట్రి కళగం పారీ్టలో చేరడం రాష్ట్రవ్యాప్తంగా పెను తుఫానును రేపింది. ఈ పరిణామం డీఎంకే, అన్నాడీఎంకే మాత్రమే కాకుండా.. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్ పార్టీలు సైతం ఈ పరిణామంతో తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి. కూటమిపై ఆధారపడడం ఇష్టం లేకనే ప్లాన్ బీ? ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (118) ను టీవీకే సాధించలేకపోయింది. ఈ సమయంలో కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్, లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇవ్వడంతో విజయ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. లెఫ్ట్ పార్టీలు మినహా మిగిలిన భాగస్వామ్య పక్షాలకు మంత్రివర్గంలోనూ చోటు కల్పించారు. అయితే ఐదేళ్ల పాటు కూటమి పార్టీల దయాదాక్షిణ్యాలపైనే ప్రభుత్వాన్ని నడపాల్సి రావడం సీఎం విజయ్కు కొంత అసంతృప్తిని కలిగించినట్టు సమాచారం. దీంతో ఆయన ’ప్లాన్ బి’ని తెరపైకి తెచ్చారన్న చర్చ ఊపందుకుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఫిరాయింపుల నిరోధక చట్టం అస్త్రంతో రాజీనామా ద్వారా తన వైపుకు తిప్పుకునే వ్యూహాలకు పదును పెట్టినట్టు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కూటమి మద్దతుతో ప్రభుత్వం సురక్షితంగా ఉన్నప్పటికీ, విజయ్ ఎందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారనే ప్రశ్న మిత్రపక్షాల్లో తాజాగా మొదలైంది. ఉపఎన్నికల్లో టీవీకే ను గెలిపించుకుని క్రమంగా బలాన్ని పుంజుకునే దిశగా విజయ్ వ్యూహాలకు పదును పెట్టినట్టుగా చర్చ ఊపందుకోవడం గమనార్హం. మరి కొందరికి సైతం వల వేసినట్టు, తాజాగా ఐదు స్థానాలు ఖాళీగా ఉండటంతో ఉప ఎన్నికలలో వీటిని చేజిక్కించుకున్న పక్షంలో ఆ తదుపరి మరి కొందర్ని తమ వైపునకు తిప్పుకునే వ్యూహంతో విజయ్ ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
విజయ్ సర్కార్కు కొత్త సవాల్..
సాక్షి, చైన్నె: ‘మేమే ప్రత్యామ్నాయం.. సరికొత్త స్వచ్ఛమైన రాజకీయ శక్తి’ అంటూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇచ్చి, 108 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన ‘తమిళనాడు వెట్రి కళగం’ అధినేత విజయ్ సీఎం పగ్గాలు చేపట్టి మూడు వారాలు అయింది. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో మార్పు కోసం ఓట్లేసి గెలిపించిన సామాన్య ప్రజలు, క్షేత్రస్థాయి సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం విజయ్ ముందు 7 కీలక ప్రశ్నలను ఉంచుతున్నారు. వీటిని సామాజిక మాధ్యమాల రూపంలో, లేఖల రూపంలో విజయ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. 1.శాంతిభద్రతలు – మహిళల భద్రతఎన్నికల ప్రచారంలో ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు అని విమర్శించిన విజయ్, అధికారంలోకి రాగానే శ్రీసింగప్పెన్ అదిరడి పడైశ్రీ (మహిళా స్పెషల్ ఫోర్స్) పథకంపై తొలి సంతకాల్లో ఒకటి చేశారు. అయితే, ఇది ఆచరణలో గత ప్రభుత్వంలో ఉన్న పింక్ పెట్రోల్ పథకానికి కేవలం పేరు మార్చడమే (స్టిక్కర్ రాజకీయం) అని విమర్శలు వస్తున్నాయి. గత 15 రోజుల్లోనే రాష్ట్రంలో 19 లైంగిక నేరాలు నమోదయ్యాయని గణాంకాలు చెబుతుండటంతో, మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకోబోయే నిర్మాణాత్మక చర్యలేమిటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.2.అవినీతి నిర్మూలన – రిజిస్ట్రేషన్ శాఖగత డీఎంకే ప్రభుత్వం చివర్లో తెచ్చిన శ్రీస్టార్ 3.0శ్రీ సాఫ్ట్వేర్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసినా, ఇంటర్నెట్ పరిజ్ఞానం లేని సామాన్యులకు దళారీల వేధింపులు ఇంకా తప్పడం లేదు. భూమి పత్రాల సవరణ కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఖజానా ఖాళీ అయింది.. శ్వేతపత్రం విడుదల చేస్తాం అని ప్రకటించిన సీఎం విజయ్, ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రిజిస్ట్రేషన్ , ఆర్టీవీ కార్యాలయాల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన అవినీతిని ఎలా అంతమొందిస్తారనే అంచనాలు పెరిగినట్టు ఎదురు చూస్తున్నారు.3.మహిళల నిరీక్షణ – ఉచిత గ్యాస్, బస్సు ప్రయాణంఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్నపూర్ణి సూపర్ సిక్స్ పథకం కింద ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు, కుటుంబ మహిళలకు నెలకు రూ. 2,500 పెట్టుబడి సాయం, శ్రీవెట్రి పయన తిట్టంశ్రీ కింద అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి హామీల అమలు కోసం మహిళా లోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ప్రశ్నించే వారు అధికమయ్యారు. తమకు ఉచిత ఫ్రిజ్లు, రూ. 8,000 కూపన్లు వద్దు.. నిజమైన మార్పు కావాలి అని ఓట్లేసిన తమ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నినాదిస్తున్నారు.4.నిరుద్యోగ యువత – నన్బాస్, నన్బీస్ ఆశలుతమిళనాడు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే కేటాయిస్తామని, ఉన్నత చదువుల కోసం భరోసా లేకుండా రూ. 20 లక్షల వరకు విద్యా రుణాలు ఇస్తామని, నిరుద్యోగ యువతకు రూ. 4,000 భృతి కల్పిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. అయితే, రెండు వారాల పాలనలో యువత సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించలేదని సామాన్య యువత అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం.5.మత్స్యకారుల సమస్య – కచ్చతీవుపై మౌనంశ్రీలంక నావికాదళం చేతిలో బందీలుగా చిక్కుకున్న తమిళనాడు మత్స్యకారులను, వారి పడవలను విడిపించాలని కేంద్రానికి లేఖలు రాయడం వంటి ప్రక్రియ పాత పద్ధతిలోనే రాష్ట్రంలో కొనసాగుతోంది. మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ కచ్చతీవు వివాదంపై నో కామెంట్స్ అని దాటవేయడం మత్స్యకార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సున్నితమైన అంశంపై సీఎం విజయ్ స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని తీరప్రాంత ప్రజలు కోరుతున్నారు.6.ప్రభుత్వ ఉపాధ్యాయుల డిమాండ్లుప్రభుత్వ బదిలీలు, పదోన్నతుల్లో అవినీతిని అంతమొందిస్తామని టీవీకే హామీ ఇచ్చింది. అయితే, మే నెల ముగుస్తున్నా ఉపాధ్యాయుల సాధారణ బదిలీల కౌన్సెలింగ్పై ఎలాంటి ప్రకటన రాలేదు. గత ప్రభుత్వం తెచ్చిన జీవో 243 (రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్)ను రద్దు చేయాలని జాక్టో–జియో వంటి ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బదిలీల ప్రక్రియలో పారదర్శకతను పాటిస్తారా లేదా అని ఉపాధ్యాయ లోకం నిలదీస్తుంటం గమనార్హం.7.రైతుల ఆవేదన – రుణమాఫీపై అసంతృప్తివ్యవసాయ రుణాల పూర్తి మాఫీపై ప్రభుత్వం ఇచ్చిన హామీకి, ప్రస్తుత ఉత్తర్వులకు పొంతన లేదని రైతులు మండిపడుతున్నారు. సహకార బ్యాంకుల్లో రూ. 50 వేల వరకు రుణం ఉన్న చిన్న, సన్నకారు రైతులకు పూర్తి మాఫీ అని, అంతకు మించి ఉన్నవారికి రేషియో పద్ధతిలో మాఫీ అని ప్రభుత్వం ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూమి పరిమాణాన్ని బట్టి కాకుండా, రుణ మొత్తాన్ని బట్టి రైతులను వర్గీకరించడం మోసపూరితమని వామపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. అలాగే, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బస్తాకు రూ. 60 వరకు వసూలు చేస్తున్న అక్రమాలను అరికట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు(వేలుమణి వర్గం) పళనిస్వామితో సమావేశమయ్యారు. పళనిస్వామితో రాజీపడ్డ తిరుగుబాట ఎమ్మెల్యేల వర్గం.. అన్నాడీఎంకేలో చీలిక లేదంటూ ప్రకటించారు. పళనిస్వామికి వేలుమణి బృందం పూర్తి మద్దతు తెలిపింది. పళనిస్వామితో సమావేశం అనంతరం స్పీకర్ను కలిసిన రెబల్ ఎమ్మెల్యేలు(వేలుమణి బృందం) తామంతా పార్టీగా మళ్లీ ఒకటిగా ఉన్నామంటూ స్పష్టం చేశాయి.తాము ఎల్లప్పుడూ కలిసికట్టుగానే ఉంటామంటూ తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. పళనిస్వామి పట్ల తమ విధేయతను చాటుకున్నారు. ఎన్నికల ఓటమి తర్వాత పళనిస్వామికి వ్యతిరేకంగా సి.వి. షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో అన్నాడీఎంకేలో కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ వర్గం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ప్రతిపాదించగా.. పళనిస్వామి తిరస్కరించారు. అయితే, తిరుగుబాటు వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి మాటను పక్కనబెట్టి.. విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ వ్యవహారం ముదరడంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పళనిస్వామి స్పీకర్కు లేఖ కూడా రాశారు.స్పీకర్ కార్యాలయంలో అనర్హత వేటు ప్రక్రియ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో తిరుగుబాటు వర్గానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి టీవీకే పార్టీలో చేరడంతో ఆ వర్గానికి పెద్ద షాక్ తగిలింది. స్పీకర్ కార్యాలయంలో విచారణ జరుగుతున్నందున ఈ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఈపీఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని తిరుగుబాటు నేతలు పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి నివాసంలో ఆయన్ను కలిసి సంధి ప్రకటించారు. ఈ సమావేశం అనంతరం పళనిస్వామి తమ నాయకుడని వారు స్పష్టం చేశారు. గతంలో కొన్ని భిన్నాభిప్రాయాల వల్లే ఈ తిరుగుబాటు జరిగిందంటూ పేర్కొన్నారు. సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని.. తమ డిమాండ్లను పరిశీలించడానికి పళనిస్వామి అంగీకరించారని నేతలు వెల్లడించారు. తిరుగుబాటుదారులు మళ్లీ సొంత పార్టీలోకి తిరిగి రావడంతో వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ కార్యాలయంలో దాఖలు చేసిన దరఖాస్తును పళనిస్వామి ఉపసంహరించుకున్నారు. -
రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం జోసెఫ్ విజయ్
-
అక్కగా సీఎం విజయ్ని చూసి గర్వపడుతున్నా : నటి ఎమోషనల్
తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి విజయ్కు ప్రజలు, ప్రతిపక్షాలు కొంత సమయం ఇవ్వాలని ప్రముఖ సినీ నటి, బుల్లితెర నిర్మాతల సంఘం అధ్యక్షురాలు కుష్బూ అభిప్రాయపడ్డారు. కేవలం పది రోజుల్లోనే అన్ని మార్పులను ఎలా తీసుకురాగలరని ఆమె ప్రశ్నించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి విజయ్, విద్యా , సాంస్కృతితిక శాఖ మంత్రి రాజమోహనన్ను కుష్బూ నేతృత్వంలోని బుల్లితెర నిర్మాతల సంఘం ప్రతినిధులు కలిసి ఒక కోరికల వినతిపత్రాన్ని సమర్పించారు.సమస్యల పరిష్కారానికి సీఎం హామీముఖ్యమంత్రితో సమావేశం అనంతరం కుష్బూ మీడియాతో మాట్లాడారు. బుల్లితెర రంగంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న, మధ్యతరహా నిర్మాతల సంక్షేమం కోసం కొన్ని ముఖ్యమైన డిమాండ్లను ముఖ్యమంత్రి ముందు ఉంచామన్నారు. తమ విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించిన సీఎం విజయ్, మంత్రి రాజమోహన్ వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని కుష్బూ తెలిపారు.విజయ్ నా తమ్ముడు.. ముఖ్యమంత్రి విజయ్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కుష్బూ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. సీఎం విజయ్ను నా సొంత తమ్ముడిగా చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాననని పేర్కొన్నారు.. ఒక అక్కగా ఈరోజు ఆయనను ముఖ్యమంత్రి హోదాలో చూసినప్పుడు నా మనసు నిండిపోయిందంటూ చాలా ఎమోషనల్ అయ్యానని తెలిపారు. ఆయన పనితీరు, ఆలోచనలు చూస్తుంటే భవిష్యత్తులో తమిళనాడులో కచ్చితంగా ఒక మంచి మార్పును తీసుకువస్తారనే నమ్మకం నాకు కలిగిందన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నింటినీ ఒకే రోజులో సర్దుబాటు చేయడం ఎవరికై నా సాధ్యమేనా?, విజయ్ పగ్గాలు చేపట్టిన కేవలం 10 రోజుల్లోనే ఎలా మార్చగలరు? ముఖ్యమంత్రికి కాస్త సమయం ఇవ్వండి. తమిళనాడులో కచ్చితంగా మార్పు వస్తుంది అని వ్యాఖ్యలుచేశారు. -
విజయ్ సంచలన నిర్ణయం తమిళ్ ఇండస్ట్రీకి గుడ్ న్యూస్
-
అన్నాడీఎంకే సంక్షోభంలో కీలక మలుపు
అన్నాడీఎంకే అంతర్గత సంక్షోభం కీలక మలుపు తిరిగింది. ఎన్నికల అనంతరం పార్టీ లోపల మొదలైన విభేదాలు ఇప్పుడు రాజీ, పునఃసమీకరణల దిశగా కదులుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు ఇచ్చిన పిటిషన్ను వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో “తమదే అసలైన అన్నాడీఎంకే వర్గం” అంటూ స్పీకర్కు ఫిర్యాదు చేసిన రెబల్ శిబిరం కూడా వెనక్కి తగ్గే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల స్పీకర్ను కలిసిన ఈపీఎస్.. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని, అలాగే టీవీకేలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరారు. అయితే ఆ తర్వాత పరిస్థితులు వేగంగా మారడం మొదలైంది. రెబల్ వర్గంలో సంఖ్యా బలం క్రమంగా తగ్గిపోవడం, పలువురు ఎమ్మెల్యేలు తిరిగి ఈపీఎస్ వైపు మొగ్గు చూపడం ఈ పరిణామాలకు కారణంగా కనిపిస్తోంది.ఎన్నికల తర్వాత సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి, విజయ్భాస్కర్ నేతృత్వంలో ఏర్పడిన రెబల్ వర్గం మొదట తమ బలం 30 మంది ఎమ్మెల్యేలని ప్రకటించింది. అయితే అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వ బలనిరూపణ సమయానికి ఆ సంఖ్య 25కు చేరింది. ఇప్పుడు వరుస పరిణామాల తర్వాత ఆ సంఖ్య 16కి పడిపోయిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో రెబల్ వర్గ భవిష్యత్తుపై అనుమానాలు మొదలయ్యాయి.బలపరీక్ష సమయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి రెబల్స్ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మద్దతుకు ప్రతిఫలంగా కేబినెట్లో కీలక మంత్రి పదవులు దక్కుతాయని ఆ వర్గం ఆశించినట్లు తెలుస్తోంది. కానీ టీవీకే మిత్రపక్షాల అభ్యంతరాలతో అది జరగలేదు. అయితే రాజకీయ ప్రాధాన్యం రాకపోవడంతో అసంతృప్తి పెరిగినట్లు సమాచారం. భవిష్యత్లో పార్టీలో స్థానం, పదవుల పునరుద్ధరణ, రాజకీయ భద్రత వంటి అంశాలపై స్పష్టత లేకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు తిరిగి ఈపీఎస్ శిబిరం వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు.ఇప్పటికే కొందరు రెబల్ ఎమ్మెల్యేలు తమ నిర్ణయాలను మార్చుకుని ఈపీఎస్కు చేరువవుతున్నారు. మరోవైపు టీవీకే వైపు వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి అధికారికంగా విజయ్ శిబిరంలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీరికి భవిష్యత్ ఉపఎన్నికల్లో టీవీకే తరఫున అవకాశాలు ఇవ్వొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది.ఈ పరిణామాలన్నింటి మధ్య ఈపీఎస్ అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదట కఠిన వైఖరి తీసుకున్న ఆయన.. ఇప్పుడు రాజీ ఫార్ములాతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. రెబల్స్పై చర్యల పిటిషన్ను వెనక్కి తీసుకోవడం ద్వారా అసంతృప్త వర్గాలను తిరిగి పార్టీలో కలుపుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పార్టీ మరోసారి ఏకీకృతం కావచ్చన్న చర్చ మొదలైంది.అయితే ఇదంతా జరుగుతున్నప్పటికీ విజయ్ ప్రభుత్వానికి తక్షణ ప్రమాదం ఏమీ లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అసెంబ్లీలో 144-22 తేడాతో విజయ్ ప్రభుత్వం బలనిరూపణలో విజయం సాధించింది. కాబట్టి రెబల్స్ మద్దతు ఉపసంహరించుకున్నా(మ్యాజిక్ ఫిగర్ 118) ప్రభుత్వ స్థిరత్వంపై పెద్దగా ప్రభావం ఉండదని చెబుతున్నారు. కానీ ఈ పరిణామాలు భవిష్యత్ రాజకీయ సమీకరణాలను మాత్రం పూర్తిగా మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.మొత్తంగా చూస్తే… అన్నాడీఎంకేలో మొదలైన అంతర్గత పోరు ఇప్పుడు రాజకీయ పునర్వ్యవస్థీకరణ దిశగా సాగుతోంది. రెబల్ వర్గం బలహీనపడుతుండగా, ఈపీఎస్ మళ్లీ పార్టీపై పట్టు బిగిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో విజయ్ టీవీకే చుట్టూ తిరుగుతున్న రాజకీయ లెక్కలు తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త సమీకరణానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
విజయ్ సర్కార్ ఎఫెక్ట్.. 162 మంది న్యాయవాదుల రాజీనామా
సాక్షి, చైన్నె: తమిళనాడులో కొత్తగా తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా విభాగాల్లో ప్రక్షాళన ఊపందుకుంది. ఇందులో భాగంగా, గత డీఎంకే ప్రభుత్వ హయాంలో చైన్నె హైకోర్టు, , హైకోర్టు మదురై బెంచ్లలో నియమితులైన 162 మంది ప్రభుత్వ న్యాయవాదుల రాజీనామాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఎన్నికల ఫలితాల తర్వాత రాజీనామాలుఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘనవిజయం సాధించి, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. డీఎంకే లీగల్ వింగ్కు చెందిన ఈ న్యాయవాదులందరూ నైతిక బాధ్యతగా తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే, కొత్త ప్రభుత్వ న్యాయవాదులను నియమించేంత వరకు విధుల్లో కొనసాగాల్సిందిగా అప్పట్లో ప్రభుత్వం వారిని కోరింది. తాజాగా నూతన న్యాయవాదుల నియామక ప్రక్రియ తుది దశకు చేరడంతో, వీరి రాజీనామాలను ఆమోదిస్తూ జీవో విడుదల చేశారు. స్టేట్ గవర్నమెంట్ ప్లీడర్ ఎడ్విన్ ప్రభాకర్తో పాటుగా మద్రాసు హైకోర్టులో 24 మంది న్యాయవాదులు, 36 మంది అదనపు న్యాయవాదులు, మరో 54 ప్రత్యేక న్యాయవాదులు రాజీనామాలు ఆమోదించారు. అలాగే, హైకోర్టు మదురై బెంచ్ ప్రభుత్వ ప్లీడర్ పి. తిలక్కుమార్తో పాటుగా ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులు 9 మంది, అదనపు న్యాయవాదులు 16 మంది, ఇతర న్యాయవాదులు 21 మంది ఈ జాబితాలో ఉన్నారు.కొత్త నియామకాలపై ఉత్కంఠతమిళనాడు ప్రభుత్వానికి కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించేందుకు వీలుగా.. కొత్త ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం తమ పార్టీకి చెందిన సమర్థులైన న్యాయవాదులను త్వరలోనే ఈ స్థానాల్లో నియమించనుంది. ఇప్పటికే మంగళవారం జరిగిన రిజర్వేషన్ల అత్యవసర సమీక్షలో కొత్త అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హైకోర్టుకు రాబోయే కొత్త ప్రభుత్వ ప్లీడర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల జాబితాపై న్యాయవాదులలో ఆసక్తి నెలకొంది. -
తమిళనాడులో నేరగాళ్లకు ఫ్రీ పాస్
తమిళనాడు విజయ్ ప్రభుత్వానికి హనీమూన్ ముగిసినట్లే కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండు వారాలకే రాష్ట్రంలో వరుసగా నేరాలు ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేత అన్నామలై సంచలన ఆరోపణలకు దిగారు. తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి అసలు పరీక్ష ఇప్పుడే మొదలైందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తాజాగా మైనర్లపై జరిగిన అఘాయిత్యాలు ఆయన ప్రభుత్వాన్ని డిఫెన్స్లోకి నెట్టాయి. మదురైలో మీనాక్షి ఆలయం సమీపంలో 17 ఏళ్ల బాలుడి హత్య, కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ఎన్నికల ముందు భారీ హామీలు ఇచ్చిన విజయ్… ఇప్పుడు వరుస ఘటనలపై ఎందుకు కఠినంగా స్పందించడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ఘటనలపై బీజేపీ నేత కే అన్నామలై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “తమిళనాడులో డ్రగ్ దందాదారులు, లైంగిక నేరస్తులు, హంతకులకు ఫ్రీ పాస్ దొరికినట్టుంది. గతం నుంచి రాష్ట్ర పోలీసులు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు. కొత్త టీవీకే ప్రభుత్వం ఇంకా సంబరాల మూడ్లోనే ఉన్నట్లుంది. ఇప్పుడైనా బయటకు వచ్చి వాస్తవాలను ఎదుర్కొవాలి” అంటూ ఆయన సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ కూడా చిన్నారుల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా “ఇది తమిళనాడా? లేక ఉత్తరప్రదేశ్నా?” అంటూ సెటైర్లు వేశారు. ఎన్నికల ముందు మార్పు తీసుకొస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టవ్యవస్థను అదుపులో పెట్టలేకపోతోందని విమర్శించారు. అన్నాడీఎంకే నేత పళనిస్వామి కూడా మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తారు. “మహిళల రక్షణ ఎక్కడుంది?” అంటూ విజయ్ను నిలదీశారు. ఇక కోయంబత్తూరు ఘటనపై పరిశ్రమల మంత్రి స్పందించిన తీరు కూడా వివాదానికి దారితీసింది. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో బీజేపీ తీవ్రంగా విమర్శించింది. అనంతరం పోలీసులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఉన్నతాధికారులు చిరునవ్వులు చిందించిన వీడియోలు కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. దీంతో చట్టవ్యవస్థ అంశం ఇప్పుడు విజయ్ ప్రభుత్వానికి తొలి పెద్ద రాజకీయ పరీక్షగా మారిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఈ విమర్శల మధ్య సీఎం విజయ్ మాత్రం ఒక పోక్సో కేసు తీర్పును ఉదాహరణగా చూపిస్తూ.. ప్రభుత్వాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తూత్తుకుడి జిల్లాలో బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మూడు నెలల్లోనే డబుల్ డెత్ పెనాల్టీ విధించడాన్ని ప్రస్తావిస్తూ… మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోందని తెలిపారు.అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇప్పుడు విజయ్కు అసలైన సవాలు మొదలైందని భావిస్తున్నారు. ఎన్నికల హామీలు ఇవ్వడం ఒకటైతే… చట్టవ్యవస్థను సమర్థంగా నడిపించడం మరో విషయం అని చెబుతున్నారు. భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేస్తుందన్నదే తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. -
15 సంవత్సరాలు రోడ్లపై డేకించారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సెటైర్లు
-
సీఎం విజయ్ పై పవన్ షాకింగ్ కామెంట్స్
-
అన్నాడీఎంకేకు బిగ్ షాక్ ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకే లోకి జంప్


