tamilnadu election results
-
'టీవీకే' విజయ్ని ఇలా ఎప్పుడూ చూసుండరు (ఫొటోలు)
-
49 ఏళ్ల రికార్డు బద్దలు
జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) చీఫ్, దళపతి విజయ్ పూర్తి పేరు. తమిళ రాజకీయాల్లో కొత్త చరిత్రను నెలకొల్పారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే అధికారం చేతులు మారుతూ వస్తోంది. మూడో శక్తిగా ఎదిగేందుకు యత్నించిన ఎందరో సినీ దిగ్గజాలకు ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. 1970ల తర్వాత ఎంజీ రామచంద్రన్ సాధించిన అద్భుతమైన విజయాన్ని మళ్లీ ఎవరూ పునరావృతం చేయలేకపోయారు. ఇప్పుడు విజయ్ ఆ పాత రికార్డులను చెరిపి వేసి, కొత్త ప్రత్యామ్నాయంగా ఎదిగారు. నాడు.. నేడు నాటి ఎంజీ రామచంద్రన్కు, నేటి విజయ్కు కలిసొచ్చిన పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఎంజీఆర్ సినిమాలతో ప్రజాదరణ పొంది డీఎంకే నుంచి బయటకు వచ్చారు. పార్టీని ఏర్పాటు చేసిన ఆయనకు సొంత చరిష్మా, ప్రకటించిన సంక్షేమ పథకాలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. అలా తిరుగులేని మెజారిటీ అధికారాన్ని దక్కించుకుని చరిత్ర సృష్టించారు. 1977లో సీఎం పదవిని చేపట్టిన ఆయన 1987లో మరణించే వరకు దశాబ్ద కాలంపాటు కొనసాగారు. తనపై ప్రజలకున్న అభిమానాన్ని ఒక పటిష్టమైన రాజకీయ భావోద్వేగంగా మార్చుకున్నారు. వ్యక్తిత్వం, రాజకీయం ఎలా కలిసి ఉండాలో ఆచరించి చూపారు. నేడు విజయ్కి అనుకూలించిన అంశాలు వేరేగా ఉన్నాయి. యువతలో ఆందోళనలు, ప్రస్తుత పాలనపై ప్రజల్లో ఉన్న విసుగు, స్వచ్ఛమైన రాజకీయ మార్పు కావాలనే బలమైన ఆకాంక్ష.. వీటినే విజయ్ తనవాణిగా మార్చుకున్నారు. తాజాగా ఎన్నికల్లో విజయం సాధించారు. గత 49 ఏళ్లలో ఏ సినీ నటుడు సాధించని అద్భుతాన్ని సుసాధ్యం చేశారు. 1977లో ఎంజీ రామచంద్రన్ తమిళనాడు రాజకీయాలను తిరగరాసిన తర్వాత, ఒక నటుడు నేరుగా ముఖ్యమంత్రి కావడం ఇదే మొదటిసారి. ఎంజీఆర్ తర్వాత సినీ గ్లామర్తో సెయింట్ జార్జి కోటలోని తమిళనాడు అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. జయలలిత ప్రస్థానం వేరు ఎంజీఆర్ తర్వాత ఎందరో నటులు భారీ అభిమాన గణంతో ఇలాంటి ప్రయత్నమే చేసినప్పటికీ ఆయన రికార్డును అధిగమించలేకపోయారు. జయలలిత కూడా గొప్ప సినీ నటి అయినప్పటికీ, సొంతంగా పార్టీని స్థాపించి అధికారంలోకి రాలేదు. ఆమె ఎంజీఆర్ నెలకొల్పిన అన్నాడీఎంకేను వారసత్వంగా పొంది, దానిని పటిష్టం చేసి అ«దీనంలోకి తెచ్చుకోవడం ద్వారానే ముఖ్యమంత్రి అయ్యారు. అట్టడుగు స్థాయి నుంచి నిర్మాణం కేవలం రెండేళ్ల క్రితం స్థాపించిన విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) 100 సీట్లకు పైగా గెలుచుకుంది. దీని వెనుక ముందుచూపు, పక్కా ప్రణాళిక, తీవ్రమైన కృషి ఉన్నాయి. విజయ్ తన అభిమాన సంఘాలను 2009 నుంచే ఒక క్రమబద్ధమైన వ్యవస్థగా మార్చడం మొదలుపెట్టారు. మక్కల్ ఇయక్కం (వీఎంఐ) పేరుతో సంఘాలన్నిటినీ ఒకే వేదికపైకి తెచ్చారు. మొదట్లో కేవలం సేవ, సంక్షేమ కార్యక్రమాలకే పరిమితమై పనిచేసినప్పటికీ, క్రమంగా వరదలు వంటి ప్రకృత్తి విపత్తుల వేళ ప్రజలకు సాయం అందించడం, పేద విద్యార్థులకు ఆసరాగా నిలవడం, స్థానిక సమస్యలపై స్పందించడం వంటి వాటి ద్వారా పోలింగ్ బూత్ స్థాయిలో జనానికి చేరువైంది. 2011లో ఏఐఏడీఎంకే నేతృత్వంలోని కూటమికి బహిరంగంగా మద్దతు తెలపడం ద్వారా విజయ్ మొదటిసారి తన రాజకీయ ఆకాంక్షను చాటారు. నటుడికి ఉన్న ఆకర్షణ ఓట్లుగా మారుతాయా లేదా అనేందుకు ఇదొక తొలి పరీక్ష అయ్యింది. సినిమాల నుంచి సిద్ధాంతాల దాకా 2010– 2020 మధ్య కాలంలో విజయ్ ప్రసంగాలను పరిశీలిస్తే రాజకీయ కోణం కని్పస్తుంది. 2019లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆయన చేసిన విమర్శలు, సినిమాకు మించిన అంశాలపై కూడా స్పందించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని నిరూపించాయి. ఆడియో లాంచ్లు, అభిమానుల సమావేశాలు, సేవా కార్యక్రమాల ద్వారా పరీక్షల ఒత్తిడి, నిరుద్యోగం, అవినీతి, పాలన వంటి అంశాలను ఆయన తరచూ ప్రస్తావించేవారు. ఇవి యువతను, నగరవాసులను ఎక్కువగా ఆకట్టుకున్నాయి. స్థానిక ఎన్నికల్లోనూ సత్తా పార్టీని అధికారికంగా ప్రకటించకముందే విజయ్ తన వీఎంఐ సత్తా ఏపాటిదో నిరూపించుకున్నారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ’విజయ్ మక్కల్ ఇయక్కం’ అభ్యర్థులు పోటీ చేసిన మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. కేవలం జనాన్ని కూడగట్టడమే కాకుండా, తనకున్న పాపులారిటీని ఓట్లుగా మార్చగల శక్తి ఈ వ్యవస్థకు ఉందని ఆ ఎన్నికలు రుజువు చేశాయి. టీవీకే ఆవిర్భావం చివరికి 2024 ఫిబ్రవరిలో విజయ్ తమిళగ వెట్రి కళగం’(టీవీకే) పార్టీని అత్యంత స్పష్టమైన ప్రణాళికతో ప్రారంభించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎటువంటి ముందస్తు పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే–ఏడీఎంకేల ఏకచ్ఛత్రాధిపత్యానికి గండికొట్టి స్వచ్ఛమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తామని స్పష్టం చేశారు. సుమారు 70 చిత్రాలతో తన మూడు దశాబ్దాల సినీ ప్రస్థానానికి ముగింపు పలుకుతున్నట్లు కూడా ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారానే ప్రచారం గత రెండేళ్లుగా టీవీకే తన అభిమాన సంఘాలను ఒక క్రమబద్ధమైన పార్టీగా మార్చింది. జిల్లా కమిటీలు, నియోజకవర్గ విభాగాలు, బూత్ స్థాయి బృందాలను ఏర్పాటు చేసింది. విద్య, ఉపాధి, అవినీతి నిర్మూలన, జవాబుదారీతనంపై దృష్టి సారించింది. విజయ్ ఒక ఆవేశపూరిత వక్తగా కాకుండా, ప్రజల సమస్యలను వినే నాయకుడిగా తనను తాను మలుచుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలతో మమేకమవుతూ, పక్కా ప్రణాళికతో బహిరంగ సభలు నిర్వహించారు. మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూల వంటివేమీ లేకుండానే తనదైన శైలిలో ప్రచారం సాగించారు. 2025లో కరూర్లో టీవీకే నిర్వహించిన బహిరంగ సభ తొక్కిసలాటకు దారితీసింది. పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. విజయ్కు రాజకీయ నాయకుడిగా ఇది మొదటి పరీక్షగా నిలిచింది. ఆయన ఎంతో సంయమనంతో వ్యవహరించారు. తమిళనాట పెనుమార్పు 2026 ఎన్నికల ఫలితాలతో తమిళనాడు రాజకీయాల ఒరవడిని విజయ్ ఒక్కసారిగా మార్చేశారు. టీవీకే రాకతో తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే–అన్నాడీఎంకే ద్వంద్వ పోరు ఇప్పుడు ముక్కోణపు పోటీగా మారింది. ఎంజీఆర్ హయాం తర్వాత తమిళనాడులో ఇంతటి బలమైన ముక్కోణపు పోటీ మళ్లీ ఇప్పుడే కనిపిస్తోంది. ఇంతకాలం పెద్ద పార్టీల నీడలో ఉన్న చిన్న పార్టీలు ఇప్పుడు విజయ్ రూపంలో మూడో ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విజయ్ ఇంటి దగ్గర భారీ భద్రత.. అభిమానుల సంబరాలు (ఫొటోలు)
-
విజయ్ విజిల్ మోత.. రీసౌండ్ ఓ రేంజ్లోనే.. (ఫొటోలు)
-
గవర్నర్ను కలిసి రాజీనామా చేయనున్న స్టాలిన్
తమిళనాడు ప్రజా తీర్పు బయటకు వస్తోంది. మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు.. అధికారంలోకి ఎవరు వస్తారనేది ఉత్కంఠ నెలకొంది. దీంతో గత కొన్ని రోజుల నుంచి రాజకీయ పార్టీల అధినేతల నుంచి సామాన్య ప్రజల వరకు చూస్తున్న ఎదురుచూపులకు ఎండ్కార్డు పడనుంది. టీవీకేకు కంగ్రాట్స్: మోదీతమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై మోదీ స్పందనఎన్డీయేకు మద్దతు ఇచ్చిన ఓటర్లకు కృతజ్ఞతలుప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాంటీవీకే అద్భుత ప్రదర్శనకు అభినందనలురెండు స్థానాల్లోనూ విజయ్ గెలుపుతమిళనాడులో టీవీకే విజయ్ సంచలనం పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ గెలుపుపెరంబూర్, తిరుచ్చిలో గెలిచిన విజయ్ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు విజయ్ టీవీకే పార్టీ సాధించిన ఓట్లు 1.28 కోట్లుడీఎంకే కూటమి సాధించిన ఓట్లు 1.17 కోట్లుఒంటరిగా డీఎంకే సాధించిన ఓట్లు 83 లక్షలుఏఐఏడీఎంకే కూటమి సాధించిన ఓట్లు 1.08 కోట్లుఒంటరిగా ఏఐఏడీఎం సాధించిన ఓట్లు 77 లక్షలు రెండో స్థానంలోకి వచ్చిన డీఎంకేపుంజుకున్న డీఎంకే రెండో స్థానంలోకి వచ్చిన డీఎంకేటీవీకే 107 స్థానాల్లో ఆధిక్యండీఎంకే 59 స్థానాల్లో ఆధిక్యండీఎంకే 47 స్థానాల్లో ఆధిక్యం ప్రభుత్వ ఏర్పాటు దిశగా విజయ్ అడుగులుటీవీకే చీఫ్ విజయ్ కీలక ఆదేశాలుఅభ్యర్థులంతా చెన్నై రావాలని పిలుపుప్రభుత్వ ఏర్పాటు దిశగా విజయ్ అడుగులుస్టాలిన్ రాజీనామా!కాసేపట్లో గవర్నర్ను కలవనున్న స్టాలిన్సీఎం పదవికి రాజీనామా చేయనున్న స్టాలిన్ఒక్కో మెట్టు ఎక్కాడు: విజయ్ తండ్రిటీవీకే గెలుపుపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ హర్షంతమిళ ప్రజలకు మేలు చేయాలనేదే లక్ష్యంగెలుపుపై విజయ్ మొదటి నుంచి ధీమాగా ఉన్నాడుఒక్కో మెట్టు ఎక్కి ఇప్పుడు సీఎం అవుతున్నాడు👉తమిళనాట టీవీకే, కాంగ్రెస్, లెఫ్ట్ జట్టుకంటే అవకాశంకాంగ్రెస్కు 5 సీట్లు వచ్చే అవకాశంసీపీఎం 2, సీపీఐకి 2 వచ్చే సూచనలుతమిళనాడులో కేవల 2 స్థానాల్లోనే బీజేపీ లీడ్అన్నాడీఎంకే కూటమిలో ఉన్న బీజేపీ 👉తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సంచలనంవంద స్థానాలు దాటి దూసుకుపోతున్న టీవీకేతమిళనాడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకేహంగ్ దిశగా తమిళనాడుటీవీకే విజయ్ నివాసం దగ్గర భద్రత పెంపుచెన్నైలోని విజయ్ ఇంటికి భారీగా చేరుకుంటున్న అభిమానులువిజయ్ ఇంటి దగ్గర బాణాసంచా పేల్చి అభిమానుల సంబరాలువిజయ్ తండ్రి నివాసంలో సంబరాలుతమిళనాడులో డీఎంకే సూర్యుడు అస్తమించడం ఖాయం: టీవీకేఎవరి మద్దతు అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు 👉ఓటమి దిశగా సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్సీఎం స్టాలిన్ పోటీ చేస్తున్నకొళతూర్ యోజకవర్గంలో టీవీకే ముందంజడిప్యూటీ సీఎం పోటీ చేస్తున్న చెపాక్-తిరువళ్లికేని నియోజకవర్గంలో సైతం టీవీకే ముందంజకొలతూర్ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు ముందంజచెపాక్-తిరువళ్లికేని నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి సెల్వం ముందంజ👉విరుంబాకంలో టీవీకే ఆధిక్యంవిజయ్ డ్రైవర్ కుమారుడు శబరినాథన్ లీడ్కొళత్తర్లో వెనుకంజలో సీఎం స్టాలిన్చెపాక్లో ఉదయనిధి స్టాలిన్ వెనుకంజ 👉చెన్నైలో బోసిపోయిన డీఎంకే కార్యాలయంఆఫీస్ దగ్గర కనిపించని డీఎంకే కార్యాలయంటెంట్లు తీసేసి కుర్చీలు తీసుకెళ్తున్న డీఎంకే కార్యకర్తలుఎన్నికల ఫలితాల షాక్తో బోరున విలపించిన డీఎంకే శ్రేణులు👉తమిళనాడులో 100 స్థానాల్లో టీవీకే ఆధిక్యంటీవీకే చీఫ్ విజయ్ ఇంటి దగ్గర భారీ భద్రతవిజయ్ నివాసానికి భారీగా చేరుకుంటున్న నేతలు, కార్యకర్తలుజెండాలు పట్టుకుని సందడి చేస్తున్న టీవీకే అభిమానులుకేంద్ర బలగాలతో విజయ్ నివాసం దగ్గర భద్రత కట్టుదిట్టం 👉ఆధిక్యం ఇలా.. విజయ్ టీవీకే పార్టీ 103అన్నాడీఎంకే 76డీఎంకే 53👉తమిళనాడులో సంచలన ఫలితాలుతమిళనాట వెలువడుతున్న సంచలన ఫలితాలు!లీడ్లో సెంచరీ కొట్టిన విజయ్ టీవీకేఎర్లీ ట్రెండ్స్లో.. 100 సీట్ల ఆధిక్యంటీవీకే దూకుడు దాటికి డీఎంకే విలవిలరెండో స్థానంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే మూడో స్థానానికి పరిమితమైన డీఎంకే కూటమిఐదు చోట్ల ఆధిక్యంలో డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్ డీఎంకే ఆఫీస్ ముందు టెంట్ల తొలగింపుతిరుచ్చి ఈస్ట్, పెరంబూర్లో ఆధిక్యంలో విజయ్విజయ్ నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు👉తమిళనాడులో ఒక్కసారిగా మారిన సీన్అనూహ్యంగా ఆధిక్యంలోకి దూసుకొచ్చిన టీవీకేడీఎంకేను దాటి దూసుపోతున్న టీవీకేతమిళనాడు ఫలితాలపై సర్వతా ఉత్కంఠతమిళనాడులో పోస్టల్ బ్యాలెట్లో టీవీకే ముందంజరెండో స్థానంలో డీఎంకేపోస్టల్ బ్యాలెట్ మూడో స్థానానికి పరిమితమైన అన్నాడీఎంకేతమిళనాడు పోస్టల్ బ్యాలెట్లో మొదటి స్థానానికి దూసుకొచ్చిన టీవీకే 👉తమిళనాడులో డీఎంకే ఆధిక్యంపలు స్థానాల్లో రన్నరప్గానే అన్నాడీఎంకేరెండో స్థానంలో అన్నాడీఎంకే, టీవీకే మధ్య హోరాహరీకొళత్తూర్లో డీఎంకే కన్నా టీవీకే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఆధిక్యం 👉చెన్నై సిటీలో డీఎంకే, టీవీకే హోరాహోరీకొళత్తూరులో సీఎం స్టాలిన్ ముందజచెపాక్లో ఉదయనిధి ఆధిక్యంతిరుచ్చి ఈస్ట్, పెరంబూర్లో విజయ్ వెనుకంజమైలాపూర్లో తమిళిసై వెనుకంజతిరుచ్చి వెస్ట్లో మంత్రి నెహ్రూ వెనుకంజఎడప్పాడిలో పళనిస్వామి ముందంజకోయంబత్తూరు సౌత్లో సెంథిల్ బాలాజీ ముందంజ 👉పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్డీఎంకే -22 స్థానాలుఏఐడిఎంకే -5 స్థానాలుటీవీకే 4 స్థానాల్లో ముందంజ👉పెరంబూర్లో విజయ్ ముందంజకొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుతమిళనాడు పోస్టల్ బ్యాలెట్లో డీఎంకే ఆధిక్యం #WATCH | Tamil Nadu Assembly Elections | Heavy security arrangements have been put in place at the counting centre set up at Loyola College in Chennai, where votes for several key Assembly constituencies will be counted today. pic.twitter.com/JEQmLTjLhh— ANI (@ANI) May 4, 2026👉తమిళనాడులో కౌంటింగ్ ప్రారంభంమొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు8.30 నుంచి ఈవీఎం ఓట్లను కౌంట్ చేయనున్న అధికారులురాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ విధుల్లో మొత్తం 3.6 లక్షల మంది సిబ్బందిచెన్నైలోని లయోలా కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లుపలు కీలక అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 👉మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు... అధికారంలోకి ఎవరు?నేడు తమిళనాడు ఎన్నికల ఓట్ల కౌంటింగ్ఉదయం 8 గంటల నుంచి ఓట్లని లెక్కించనున్న సిబ్బంది234 స్థానాల్లో ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికలు5.73 కోట్ల మంది ఓటర్లలో ఓటు హక్కు వినియోగించుకోగా.. తమిళనాడులో రికార్డ్ స్థాయిలో 85 శాతం పోలింగ్రాష్ట్రవ్యాప్తంగా 62 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘంమొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి 8.30 నుంచి ఈవీఎం ఓట్లను కౌంట్ చేయనున్న అధికారులుమ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు... అధికారంలోకి ఎవరు వస్తారనేది ఉత్కంఠడీఎంకే, ఏఐ డిఎంకె కూటమి, విజయ్ టీవీకే పార్టీల మధ్య ప్రధాన పోటీకౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, ప్రత్యేకించి కేంద్ర బలగాలతో పహారారాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ విధుల్లో మొత్తం 3.6 లక్షల మంది సిబ్బందిప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్ ఏర్పాటు, సీసీటీవీ పర్యవేక్షణలో కౌంటింగ్కొళత్తూరు నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్, ఎడప్పాడి నుంచి మాజీ సీఎం పళని స్వామి, చెపాక్-తిరువల్లికేని నుంచి ఉదయ్ నిధి స్టాలిన్ పోటీపెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేసిన టీవీకే అధినేత విజయ్కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలి, తెంకాసి జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన ఎన్నికల సంఘంఅక్కడ భారీగా పోలీసు భద్రత ఏర్పాటుహంగ్ ఏర్పాటయ్యే అవకాశం అంటూ సర్వేలు వెల్లడిక్యాంప్ రాజకీయాలకు తెరలేపిన టీవీకేమహాబలిపురం వద్ద రిసార్ట్లు బుక్ చేసిన టీవీకే అధినేత విజయ్గెలిచిన అభ్యర్థులు వెంటనే రిసార్ట్కి రావాలని ఆదేశం..ఆసక్తిగా మారిన తమిళ రాజకీయాలు👉రాష్ట్రంలో ఈసారి ముక్కోణపు పోరు జరిగింది. అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకేతోపాటు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) తొలిసారిగా బరిలోకి దిగింది. వరుసగా రెండోసారి విజయంపై డీఎంకే అధినేత స్టాలిన్ చాలా ఆశలే పెట్టుకున్నారు. బీజేపీతో జతకట్టిన విపక్ష అన్నాడీఎంకే గెలుపు కోసం హోరాహోరీగా పోరాడింది. డీఎంకే మళ్లీ నెగ్గడం తథ్యమని మెజార్టీ ఎగ్జిట్పోల్స్ స్పష్టం చేయగా, విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అధికారంలోకి రాబోతున్నట్లు ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పింది.👉తమిళనాట ఓట్ల లెక్కింపునకు సమగ్రమైన మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలుండగా, కౌంటింగ్కు మొత్తం 62 కేంద్రాలు సిద్ధం చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అర్చనా పట్నాయక్ తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగ్గా, 85.15 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. కౌంటింగ్ విధుల్లో 1.25 లక్షల మంది భద్రతా సిబ్బంది, అధికారులు, సూక్ష్మపరిశీలకులు పాలుపంచుకుంటున్నారు. ఎన్నికల సంఘం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లను నియమించింది. -
కెప్టెన్ దుకాణం ఇక బంద్!
అనుకున్నంతా జరిగింది.. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు అయ్యింది. నిన్నమొన్నటి వరకు 28 మంది ఎమ్మెల్యేలకు బాస్గా వ్యవహరించిన కెప్టెన్ విజయకాంత్.. ఇప్పుడు పూర్తిగా దుకాణం కట్టేసుకుని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన పార్టీ డీఎండీకే ఎన్నికల సంఘంలో గుర్తింపును కోల్పోయింది. ఏదైనా పార్టీకి గుర్తింపు ఉండాలంటే అది పోటీ చేసిన ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో కనీసం 6 శాతం సాధించాలి. కానీ ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలవలేని డీఎండీకే.. కేవలం 2.4 శాతం ఓట్లను మాత్రమే పొందింది. దాంతో రాష్ట్ర పార్టీగా ఇన్నాళ్లూ ఎన్నికల సంఘం వద్ద ఉన్న గుర్తింపును కూడా డీఎండీకే కోల్పోయింది. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన డీఎండీకే 29 సీట్లు దక్కించుకుంది. ఈసారి పరిస్థితి తారుమారైంది. డీఎండీకేతో పొత్తుకు డీఎంకే ప్రయత్నించినా కెప్టెన్ ససేమిరా అన్నారు. తాను కింగ్ అవుతాను తప్ప కింగ్మేకర్గా కూడా ఉండే ప్రసక్తి లేదని ఆయన మొండిపట్టు పట్టారు. అందుకే సొంత కుంపటి పెట్టుకుని పోటీ చేశారు. చివరకు తాను డిపాజిట్ సైతం కోల్పోయి దారుణమైన పరిస్థితిలోకి దిగజారిపోయారు. కాగా, ఓటమి గల కారణాలను సమీక్షించుకుంటామని, తమ పరాజయానికి మనీ పవర్ ప్రధాన కారణంగా భావిస్తున్నామని మాజీ ఎంపీ కె. ధనరాజు తెలిపారు. -
కెప్టెన్ ఎలా ఓడాడంటే..!
ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా తానే కింగ్ అన్నాడు. కింగ్ మేకర్ అయ్యే సమస్యే లేదన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో తాను మాత్రమే ముఖ్యమంత్రి అవ్వాలి తప్ప.. వేరేవాళ్లను కానివ్వబోనంటూ డీఎంకేతో కూడా పొత్తుకు నై అన్నాడు. చివరకు ఒక్క స్థానంలో కూడా గెలవలేక చతికిలబడ్డాడు.. అతడే కెప్టెన్ విజయకాంత్. దాదాపు ప్రతి పార్టీ ఆయన పార్టీ అయిన డీఎండీకేతో పొత్తు పెట్టుకోవాలని భావించాయి. కానీ, ఇప్పుడు చూస్తే తాను పోటీ చేసిన చోట డిపాజిట్ కూడా కోల్పోయాడు. కెప్టెన్ పోటీ చేసిన ఉళుందర్పట్టై స్థానంలో అన్నాడీఎంకే అభ్యర్థి విజయం సాధించగా, డీఎంకే అభ్యర్థి రెండోస్థానంలో ఉన్నారు. కెప్టెన్ ఓడిన విషయం తెలియగానే ట్విట్టర్ రకరకాల జోకులతో మోతెక్కిపోయిది. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న డీఎండీకే 41 స్థానాలు గెలవడంతో పాటు రాష్ట్రంలో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జయతో కలిసి అధికారం పంచుకున్నా.. ఏడాది తర్వాత బయటకు వచ్చేశాడు. పాలధరలు, బస్సు చార్జీలు పెంచినందుకు తనకు కోపం వచ్చిందని, అందుకే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశానని అన్నాడు. ఆ తర్వాత సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే, వీసీకేలతో కలిసి ప్రజాసంక్షేమ కూటమి పేరుతో సొంత కుంపటి పెట్టుకుని సీఎం అవుదామని కలలుగన్నాడు. కానీ, ఒకవైపు అన్నాడీఎంకే ప్రభంజనం, మరోవైపు డీఎంకే కూడా 98 సీట్లు సాధించడంతో కెప్టెన్ పార్టీకి, ఆయన కూటమికి కనీసం ఒక్క స్థానం కూడా దక్కకుండా పోయాయి. -
నాటి ల్యాప్టాప్లే నేటి ఓట్లయ్యాయి!!
ఐదేళ్ల క్రితం కూడా తమిళనాడులో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ల్యాప్టాప్లు ఇస్తామని జయలలిత హామీ ఇచ్చారు. అన్నట్లుగానే ఆమె సీఎం అయిన తర్వాత విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇచ్చారు. అలా తీసుకున్నవాళ్లలో చాలామంది ఈసారి ఎన్నికలు వచ్చే సమయానికి తొలిసారి ఓటుహక్కు పొందారు. సహజంగానే, అమ్మకు ఓట్లు వేసేశారు. అవును.. ఈసారి తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేకతను సైతం తోసిరాజని జయలలిత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి కావడం వెనుక యువ ఓటర్ల ప్రభావం చాలానే ఉందని చెబుతున్నారు. దానికితోడు ఈసారి కూడా పెళ్లికూతుళ్లకు బంగారు ఆభరణాలు, ప్రతి కుటుంబానికీ ఉచితంగా మొబైల్ ఫోన్లు ఇస్తామని చెప్పడం లాంటివి బాగానే పనిచేశాయి. మరోవైపు ఇప్పటికే అమలుచేస్తున్న అమ్మ క్యాంటీన్లు, 5 రూపాయలకే భోజనం.. ఇలాంటివి కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మీద బాగా పనిచేశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి అన్నాడీఎంకే తన మేనిఫెస్టోను చాలా ఆలస్యంగా విడుదల చేసింది. అందులో.. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పెళ్లికూతుళ్లకు బంగారు ఆభరణాలు ఇస్తామని, ఉద్యోగాలు చేసుకునే మహిళలు మోపెడ్లు కొనుక్కుంటే వారికి 50% సబ్సిడీ ఇస్తామని, మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరు 10, ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ కనెక్షన్తో కూడిన ల్యాప్టాప్లు ఇస్తామని హామీల వర్షం కురిపించారు. అయితే, పట్టణ ప్రాంత ఓటర్లు మాత్రం ఈ ప్రలోభాలకు పెద్దగా లొంగలేదనే చెప్పాలి. ఎందుకంటే చెన్నైలో డీఎంకే 10 స్థానాలు గెలుచుకుంది. ఇలాంటి చోట్ల ఉచిత హామీలు పనిచేయడం కష్టమేనని బ్రాండింగ్ నిపుణుడు డాన్ కవిరాజ్ చెప్పారు. అయితే.. దీర్ఘకాలిక లక్ష్యాల కంటే ఇలాంటి ఉచిత హామీల వల్లే ఓట్లు ఎక్కువగా పడతాయని, వీటివల్ల ఓటర్ల అభిప్రాయాలు మారే అవకాశం కచ్చితంగా ఉంటుందని జేఎన్యూలో సెంటర్ ఫర్ పొలిటికల్ సైన్సెస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అజయ్ గొడవర్తి అభిప్రాయపడ్డారు. -
అళగిరి దెబ్బ కొట్టాడా?
మదురై.. ఈ ప్రాంతం అంతా కరుణానిధి పెద్దకొడుకు అళగిరికి పెట్టని కోట. అక్కడ ఆయన గీసిందే గీత.. చెప్పిందే వేదం. కానీ అలాంటి మదురై ప్రాంతంలో ఉన్న మొత్తం 10 సీట్లకు గాను డీఎంకే 8 చోట్ల ఓడిపోయింది. ఎందుకిలా జరిగిందని ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకున్నారు. అళగిరి ప్రత్యేకంగా డీఎంకేను ఓడించడానికి ఏమీ చేయలేదనే చెబుతున్నారు. కానీ... అతడు ఒక్క మాట చెప్పినా కనీసం ఆరుచోట్ల డీఎంకే గెలిచేది. ఈసారి తాను డీఎంకేకు ఓటు వేసే ప్రసక్తి లేదని ఇంతకుముందే అళగిరి స్పష్టం చేశారు. అంతేకాదు, కొన్ని ప్రచారసభల సమయంలో కూడా అసలు ఇక్కడ పార్టీ అభ్యర్థులు ఎలా గెలుస్తారన్న కామెంట్లు కూడా చేసినట్లు వినికిడి. అంతేకాదు.. ఆయన మద్దతుదారులంతా కలిసి డీఎంకే ఓటమి కోసం కంకణం కట్టుకుని మరీ పనిచేశారట. డీఎంకే బహిష్కృత నేత అయిన అళగిరి.. తాను తన తండ్రి పార్టీ ఓటమి కోసం ఏమీ చేయలేదని.. అసలు తనకు రాజకీయాలంటేనే ఆసక్తి పోయిందని పైకి చెబుతున్నారు. త్వరలోనే అన్నాడీఎంకేలో చేరుతారన్న ప్రచారం కూడా అళగిరి మీద ఉంది. దాంతో ఆయన కావాలనే తండ్రి పార్టీ ఓటమి కోసం తన అనుచరులతో గట్టిగానే పనిచేయించినట్లు చెబుతారు. పార్టీలోను, కుటుంబంలోను గొడవలు రాకూడదన్న ఉద్దేశంతో పెద్దకొడుకు అళగిరిని కరుణానిధి 1980లలోనే మదురైకి పంపేశారు. అక్కడ పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ పార్టీ పత్రిక మురసోలిని నడిపించాలని చెప్పారు. అయినా.. పార్టీ పగ్గాలు చేపట్టాలన్న కోరిక, తండ్రి తర్వాత సీఎం అవ్వాలన్న ఆకాంక్ష అళగిరిని ఆపలేకపోయాయి. దాంతో చివరకు కరుణ.. పార్టీ నుంచే అతడిని బహిష్కరించారు.


