Band Melam Movie
-
నిన్ను మస్తు లవ్ చేశిన.. బ్యాండ్మేళం ట్రైలర్
కోర్ట్ జంట హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ను శనివారం (మార్చి 21న) విడుదల చేశారు. చిన్నప్పుడే మా అమ్మ సచ్చిపోతే నా అన్నని మా అమ్మ లెక్క చూసుకున్న.. నేనడిగితే పాణం కూడా ఇస్తడు అన్న డైలాగ్తో వీడియో మొదలయింది. ఎమోషనల్గా ట్రైలర్నేను నిన్ను మస్తు లవ్ చేశిన.. కానీ, నువ్వు నన్ను దేఖలే.., నువ్వు వచ్చినతర్వాతే పగిలిపోయిన నా గుండెను అతుకపెట్టుకున్ననే.. నువ్వు మళ్ల పగలగొట్టినవ్.. నన్ను ఇడ్సిపెట్టు పోవే అంటూ హీరో చెప్పే డైలాగులు బాగున్నాయి. మరదలి ప్రేమ కోసం తపించిపోయిన హీరో చివరకు ఆమెను కాదనుకునే స్థితికి వస్తాడు. మొత్తానికి ట్రైలర్ ఎమోషనల్గా సాగింది. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. చదవండి: ఉస్తాద్ భగత్ సింగ్ రెండో రోజు కలెక్షన్స్ -
బ్యాండ్ మేళం: ఏంటో ఏమో.. సాంగ్ విన్నారా?
కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన మూవీ బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి.ఏంటో ఏమో.. పిచ్చిది ప్రేమతాజాగా ఈ మూవీ నుంచి మరో పాట వదిలారు. ఏంటో ఏమో.. పిచ్చిది ప్రేమ.. ఎపుడో సాయం రానే రాదే.. అంటూ పాట మొదలవుతుంది. ఈ లిరికల్ వీడియోలో శ్రీదేవితో పాటు నటుడు సాయి కుమార్ను చూపించారు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశాడు. సింగర్ సునీత అద్భుతంగా ఆలపించింది. -
బ్యాండ్ మేళం: రామ్ మిరియాల పాడిన బ్రేకప్ సాంగ్ రిలీజ్
కోర్ట్ జంట హర్ష్ రోషన్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్కు మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా సినిమా నుంచి రాజమ్మ అనే మరో పాట వదిలారు.బ్రేకప్ సాంగ్'రాజమ్మ ఇడిసిపోయిందిరో.. రాజమ్మ పొడిసిపోయిందిరో.. నన్నింకా మరిసిపోయిందిరో..' అంటూ హీరో బ్రేకప్ సాంగ్ పాడుతూ బాధతో స్టెప్పులేస్తున్నాడు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ చేకూర్చగా రామ్ మిరియాల ఆలపించాడు.సినిమాబ్యాండ్ మేళం విషయానికి వస్తే.. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మించారు. నిజానికి ఈ సినిమా మార్చి 13న విడుదల కావాల్సింది. కానీ దాన్ని పదమూడు రోజులపాటు వాయిదా వేశారు. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 26న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. -
శ్రీరామ నవమికి...
శ్రీరామ నవమికి ప్రేక్షకులకు బ్యాండ్ మేళం వినిపించ నుంది. ‘కోర్ట్’ మూవీ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి అపల్లా జంటగా నటించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 13న రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే... శ్రీరామ నవమి సందర్భంగా 26కి విడుదల చేయనున్నట్లు గురువారం ప్రకటించారు మేకర్స్. ‘‘బ్యాండ్ మేళం’ నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అలాగే ‘తిప్పూ కుంటున్నావ్...’ అనే మాస్ పెప్పీ సాంగ్, ‘పల్లెలోని సందల్లన్ని మీవే...’ అనే మెలోడీ సాంగ్ కూడా సినిమా పట్ల అంచనాల్ని పెంచాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్. -
శ్రీదేవి 'బ్యాండ్ మేళం' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
క్లయిమాక్స్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది : కోన వెంకట్
‘‘గుండెలో నుంచి వచ్చే ప్రేమకథకు ఎలాంటి ఆదరణ దక్కుతుందని ‘నిన్ను కోరి’ సినిమాతో తెలిసింది. నాని ఫిల్మోగ్రఫీలో ‘నిన్ను కోరి’ మరచిపోలేని చిత్రంగా నిలిచింది. శివ నిర్వాణ ఈ కథను గుండెతో చెప్పాడు. సతీష్ ‘బ్యాండ్ మేళం’ కథను చెప్పినప్పుడు నాకు అదే అనుభూతి కలిగింది. ఈ మూవీ క్లయిమాక్స్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది’’ అని రచయిత, నిర్మాత కోన వెంకట్ తెలిపారు. ‘కోర్ట్’ మూవీ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా జంటగా నటించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మించారు. మార్చి 13న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్కి సంగీత దర్శకుడు తమన్, దర్శకులు నందినీ రెడ్డి, శివ నిర్వాణ, వేణు ఊడుగుల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తమన్ మాట్లాడుతూ– ‘‘కోనగారి వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. ‘దూకుడు’తో నా కెరీర్ ఇంకా కొనసాగుతూనే వెళ్తోంది’’ అని చెప్పారు. ‘‘ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నందినీ రెడ్డి. ‘‘కోనగారి వల్ల ఎంతో మంది దర్శకులు, రచయితలు ఇండస్ట్రీకి వచ్చారు. ఆయన నాకు గాడ్ ఫాదర్’’ అని శివ నిర్వాణ పేర్కొన్నారు. ‘‘తెలంగాణ జీవితం ఉన్న తెలుగు సినిమా ఇది’’ అన్నారు వేణు ఊడుగుల. ‘‘మా సినిమాని అందరూ చూసి, ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అని సతీష్ జవ్వాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి చెప్పారు. -
ప్రకృతి నాకేదో సిగ్నల్స్ ఇస్తోంది.. ఫన్నీగా 'బ్యాండ్ మేళం' టీజర్
గతేడాది రిలీజైన 'కోర్ట్' సినిమాతో ఆకట్టుకున్న రోషన్-శ్రీదేవి.. మరోసారి జంటగా నటించిన మూవీ 'బ్యాండ్ మేళం'. ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాణంలో దీన్ని తెరకెక్కించారు. సతీష్ జవ్వాజీ దర్శకుడు కాగా విజయ్ బుల్గానిన్ సంగీతమందించారు. మార్చి 13న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఎంటర్టైనింగ్గా ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!)'బ్యాండ్ మేళం' సినిమా.. తెలంగాణ బ్యాక్డ్రాప్లో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ. బావమరదలు అయిన హీరోహీరోయిన్ మధ్య గిల్లికజ్జాలు, ప్రేమ, బ్రేకప్ లాంటివి చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధాన పాత్రధారులైన రోషన్, శ్రీదేవి చూడటానికి బాగానే ఉన్నారు. మరి ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి?(ఇదీ చదవండి: 'ఓజీ' హీరోయిన్ కొరియన్ కాన్సెప్ట్ మూవీ.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్) -
మగవాడికి తాళి కట్టి కాపురం? కోన వెంకట్ రియాక్షన్ ఇదే!
కోర్ట్ జంట శ్రీదేవి -రోషన్ మరోసారి జతగా కలిసి నటించిన చిత్రం బ్యాండ్ మేళం. ఈసారి వీళ్లిద్దరూ బావమరదళ్లుగా నటించారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు ఈ మూవీ నుంచి ఊహించని గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందులో ప్రేమ కబుర్లు ఉంటాయనుకుంటే హీరో బ్రేకప్ బాధలో మునిగి తేలుతుంటాడు.ఫ్రెండ్ మెడలో తాళి కట్టిన హీరో'తాళి కట్టుడు కలిసుండటం కోసమే అయితే.. మధ్యలో విడిచిపెట్టి పోయిన దానికి కాదురా, చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్న వీడికి కట్టాలిరా' అంటూ స్నేహితుడి మెడలో మూడు ముళ్లు వేస్తాడు హీరో. ఈ గ్లింప్స్కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సీన్ చూసిన ఓ వ్యక్తి హీరోను లెస్బియన్ అనుకున్నాడట! ఈ విషయాన్ని బ్యాండ్ మేళం నిర్మాత కోన వెంకట్ తాజాగా వెల్లడించాడు.గే లవ్ స్టోరీయా?శనివారం నాడు బ్యాండ్ మేళం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన సందర్భంగా కోన వెంకట్ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. వాలంటైన్స్ గ్లింప్స్ చూశాక నాకో ఫన్నీ మెసేజ్ వచ్చింది. గే లవ్స్టోరీని తెరపై తీసుకొస్తున్నందుకు థాంక్యూ సర్ అని ఓ అబ్బాయి మెసేజ్ పెట్టాడు. అది చూసి షాకైపోయాను. ఎమోషనల్గా ఫీలయ్యా..ఓహో.. మగవాడు మగవాడికి తాళి కట్టాడు కాబట్టి, వాళ్లిద్దరూ కాపురం చేసుకుంటారు, బెడ్రూమ్లో పాల గ్లాసు పట్టుకెళ్తాడు అనుకున్నట్లున్నాడు! చాలా ఎమోషనల్గా ఫీలయ్యాడు. బాబూ, ఇది గే లవ్స్టోరీ కాదు. మనసును తాకే లవ్ స్టోరీ. ఫన్తో పాటు ఎమోషన్స్ కూడా ఈ మూవీలో ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహించిన బ్యాండ్ మేళం మార్చి 13న విడుదల కానుంది.చదవండి: మీ వల్లే ఇలా బతుకుతున్నా.. ఏడ్చేసిన వరలక్ష్మి -
బ్యాండ్ మేళం: తిప్పుకుంటాన్నవ్ పాట రిలీజ్
కోర్ట్ జంట హర్ష్ రోషన్- శ్రీదేవి మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం బ్యాండ్ మేళం. ఈసారి వీరు బావామరదళ్లుగా నటిస్తున్నారు. ఇటీవలే వాలంటైన్స్ డే (ప్రేమికుల రోజు) సందర్భంగా ఎమోషనల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందులో హీరో హీరోయిన్కు బ్రేకప్ అయినట్లు చూపించారు.సాంగ్ రిలీజ్తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వదిలారు. 'బెల్లం చుట్టూ ఈగలెక్క.. మంచం చుట్టూ దోమ లెక్క.. గుడి సుట్టూ భక్తుని లెక్క.. బారు సుట్టూ తాగుబోతు లెక్క.. తిప్పుకుంటాన్నవ్' అంటూ ఈ పాట కొనసాగుతుంది. హుషారుగా సాగే ఈ సాంగ్లో శ్రీదేవి- రోషన్ ఎనర్జిటిక్ స్టెప్పులేశారు.సినిమాబిగ్బాస్ ఫేమ్ రాము రాథోడ్ ఈ పాట పాడటంతో పాటు రోషన్తో కలిసి డ్యాన్స్ చేశాడు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ పాటకు వెంకటేశ్ కాపు కొరియోగ్రఫీ అందించాడు. చంద్రబోస్ లిరిక్స్ సమకూర్చాడు. రాము రాథోడ్, అదితి భావరాజు ఆలపించారు. సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ బ్యాండ్మేళం మూవీ మార్చి 13న విడుదల కానుంది. చదవండి: ధురంధర్.. ఆ సీన్ అయిపోగానే ఏడ్చేశారు: ఆర్.మాధవన్ -
చిన్నప్పటి నుంచి తను నా పెళ్లాం అనుకున్నారా!
'కోర్ట్' సినిమాతో గతేడాది హిట్ కొట్టిన జంట శ్రీదేవి-రోషన్. వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న మరో మూవీ 'బ్యాండు మేళం'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. వచ్చే నెల 13వ తేదీన థియేటర్లలోకి రానుంది. వాలంటైన్స్ డే సందర్భంగా ఎమోషనల్ గ్లింప్స్ ఒకటి రిలీజ్ చేశారు. బ్రేకప్ అయినప్పుడు హీరో బాధపడుతున్నట్లు ఇందులో చూపించారు.'కోర్ట్' మూవీ ఆంధ్ర బ్యాక్డ్రాప్లో ఇది తెలంగాణ నేపథ్యంగా ఉండనుంది. సతీష్ జవ్వాజి దర్శకుడు కాగా విజయ్ బుల్గానిన్ సంగీతమందించాడు. మరి రోషన్-శ్రీదేవి ఈసారి ఏం చేస్తారో చూడాలి? గ్లింప్స్లో ఎమోషన్ చూపించినప్పటికీ.. హీరో, తన ఫ్రెండ్కి తాళి కట్టడం ఫన్నీగా అనిపించింది. -
కోర్ట్ జంట రిపీట్.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)
-
మళ్లీ జతకట్టిన 'కోర్ట్' జంట.. శ్రీదేవి నోట బూతులు
'కోర్ట్' సినిమాతో కోట్లు కొల్లగొట్టిన రోషన్ (Harsh Roshan)-శ్రీదేవి (Sridevi) జంట మరోసారి జత కట్టింది. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త మూవీ బ్యాండ్మేళం (Band Melam Movie). సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తున్నాడు. కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో రోషన్.. రాజమ్మా.. గీడున్నవా.. నీకోసం ఇల్లంత దేవులాడిన, నీ కొరకో కొత్త ట్యూన్ పెట్టిన.. ఇంటవా.. ఈ యాదగిరి వాయిస్తే బోనగిరి దాక ఇనబడ్తది, సూడు అంటూ తను కట్టిన ట్యూన్ వినిపించాడు. మాస్ డైలాగ్స్అటు శ్రీదేవి కూడా.. రాజమ్మ ఎవతిరా? గునపం వేసి గుద్దుతా ** అని బూతు డైలాగ్స్ చెప్పింది. అలా తెలంగాణ యాసలోనే ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. టైటిల్ గ్లింప్స్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా రోషన్కు చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం. వివిధ టీవీ ఛానళ్లలో డ్యాన్స్ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే దర్శకుడు తరుణ్ భాస్కర్ అతడి ప్రతిభను గుర్తించి ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చాడు. సినిమాఅరవింద సమేత, వెంకీ మామ, సలార్, విరూపాక్ష, బచ్చలమల్లి, స్వాగ్, సరిపోదా శనివారం, మిషన్ ఇంపాజిబుల్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. కోర్ట్ సినిమాతో హీరోగా మారాడు. శ్రీదేవి విషయానికి వస్తే ఈమె కాకినాడ అమ్మాచి. సోషల్ మీడియాలో ఆమె రీల్స్ చూసి తనను కోర్ట్ మూవీకి సెలక్ట్ చేశారు. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీ చేస్తోంది. ఇప్పుడు తెలుగులో మరోసారి రోషన్తో జత కడుతోంది. ఈసారి తెలంగాణ అమ్మాయిగా అలరించనుంది. చదవండి: 4 రోజులుగా మాస్క్ మ్యాన్ నిరాహార దీక్ష! నామినేషన్స్లో ఏడుగురు


