breaking news
Jangaon District News
-
పాలకుర్తిలో కేంద్ర బృందం పర్యటన
పాలకుర్తి టౌన్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 100 జిల్లాలో జిల్లాకు స్థానం లభించిందని బోస్టన్ కన్సల్టెన్సీ సీనియర్ మేనేజర్ ఆకాశ్ తెలిపారు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రతినిధుల బృందం జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఎస్సీ, మైనారిటీల శాఖ అధికారి విక్రమ్ ఆధ్వర్యంలో బోస్టన్ కన్సల్టెంట్ రాహుల్తో కలిసి మండల కేంద్రంలోని ఇందిర మహిళా శక్తి భవన్లో మహిళలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉపాధి, ఆర్థికాభివృద్ధిపై సమీక్షించారు. అనంతరం ఇందిర మహిళా శక్తి సహకారంతో నిర్వహిస్తున్న మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న దీక్ష కలెక్షన్ కేంద్రాన్ని, శ్రీసోమేశ్వరలక్ష్మీనర్సింహస్వామి ఫంక్షన్ హాల్ను సందర్శించి పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ ఏపీడీ నూరొద్దీన్, క్లస్టర్ పరిశీలకుడు శ్రీనివాస్రెడ్డి, సూపరింటెండెంట్ రవీందర్, ఏపీఎం కారుపోతులు వెంకటేశ్వర్లుగౌడ్, మండల సమైక్య అధ్యక్షురాలు గునిగంటి భాగ్యలక్ష్మి, కార్యదర్శి బేజాడి సుమలత, టెక్నికల్ అసిస్టెంట్ కుమార్, దీక్ష కలెక్షన్ నిర్వహకురాలు వంగ దివ్యమహేందర్, సీఏలు పాల్గొన్నారు. -
విద్యకు 20శాతం నిధులు కేటాయించాలి
జనగామ రూరల్: విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయిస్తేనే విద్యావ్యవస్ధ అబివృద్ధి చెందుతుందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ సంఘం నాయకులు, వక్తలు అభిప్రాయపడ్డారు. జిల్లా అధ్యక్షుడు ఎన్ఎన్ రాజు ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కె.రవిచందర్ మాట్లాడుతూ.. గత 12 ఏళ్లలో ప్రభుత్వాలు విద్యకు బడ్జెట్లో నిధులు తగ్గించడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య 2021–22లో 27 లక్షల ఉంటే ప్రస్తుతం 16 లక్షలకు పడిపోయిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో 15శాతం కేటాయిస్తామని పేర్కొని 7.3 శాతం మాత్రమే కేటాయించడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో ఇప్ప రాంరెడ్డి, బాధ్యులు ఎ.నర్సింహారెడ్డి, రాజా రెడ్డి, కనకారెడ్డి, రాగల్ల ఉపేందర్, అధ్యాపక జ్వాల సంపాదకురాలు ఎ. కళావతి, అడ్వకేట్ సాధిక్ అలీ, చంద్రశేఖర్, రామస్వామి, రామ్మోహన్ రెడ్డి, అంకుషావలి, లక్ష్మయ్య, జగ్గారెడ్డి, శ్రీనివాసులు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ నాయకులు -
ఎథినిక్ నైట్ జోష్..
సంప్రదాయ దుస్తుల్లో విద్యార్ధులునిట్ వరంగల్లో కల్చరల్ ఫెస్ట్ స్ప్రింగ్స్ప్రీ–26 బ్యానర్ను ఎథినిక్ నైట్ పేరిట మంగళవారం రాత్రి ఆకాశంలో ఆవిష్కరించారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కిరణ్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై డ్రోన్సాయంతో ఆకాశంలో బ్యానర్ను ఆవిష్కరించారు. ఈ నెల 27, 28 తేదీల్లో సంస్కృతీసంప్రదాయాలను తెలిపే వేదికగా స్ప్రింగ్స్ప్రీ–26 నిలవనుందని డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. వసంతోత్సవానికి స్వాగతం పలుకుతూ విద్యార్థినులు చీరకట్టు, విద్యార్థులు పంచెకట్టులో అదరగొట్టారు. – కాజీపేట అర్బన్ -
మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దుచేయాలి
జనగామ రూరల్: మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయకుంటే అసెంబ్లీ ముట్టడిస్తామని జీపీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం తమ సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్చార్జ్ డీపీఓ వసంతకు అందజేశారు. అంతకు ముందు జీపీ కార్మికులకు బతుకమ్మకుంట నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బస్వ రామచంద్రం అధ్యక్షత అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో రాపర్తి రాజు మాట్లాడుతూ..ప్రాణాలను తీస్తున్న మల్టీపర్పస్ వర్కర్ విధానం వెంటనే రద్దు చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది గ్రామపంచాయతీ కార్మికులను సమీకరించి అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. గ్రీన్చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని, పెండింగ్లో ఉన్న మూడునెలల వేతనాలు చెల్లించాలన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో జీవో నెంబర్ 51 సవరణ మల్టీపర్పస్ వర్కర్ విధానంపై తీర్మానం చేయాలన్నారు. కార్యక్రమంలో నారోజు రామచంద్రం, పి.మల్లేష్, యు.రాజేశ్, టి.యాకుబ్, సంగీ కరుణాకర్, ఎన్.యాకన్న, జి. రతన్ సింగ్, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట జీపీ వర్కర్స్ యూనియన్ మహాధర్నా -
ఇంటర్ పరీక్షలు షురూ..
పరీక్ష కేంద్రం వద్ద గుమిగూడిన విద్యార్థులుక్యూలో విద్యార్థులుజనగామ రూరల్: జిల్లావ్యాప్తంగా 16 సెంటర్లలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఫస్టియర్ విద్యార్థులు 96.94శాతం హాజరయ్యారని ఇంటర్ విద్యాధికారి (డీఐఈఓ) జితేందర్రెడ్డి తెలిపారు. మొత్తం 4,480మంది విద్యార్థులకుగాను 4,343 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 137 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 3,397మందికి 3,350 హాజరు కాగా 47మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్లో 1,083 మందికి 993 మంది హాజరు కాగా 90 మంది గైర్హాజరయ్యారు. పట్టణంలోని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కాకుండా మంచినీటి వసతి, లైటింగ్తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించారు. పరీక్ష కేంద్రాల వద్ద ప్రతి సెంటర్కు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆశ, ఏఎన్ఎంలను నియమించారు. పొరపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలను నిర్వహించేందుకు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జితేందర్ రెడ్డి, సంబంధిత అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టారు. పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఐఈఓ జితేందర్ రెడ్డి, డెక్ సభ్యులు కె.సునంద, కె.శేఖర్ బోర్డు అబ్జర్వర్లు పాలకుర్తి, కొడకండ్ల పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రాలను పరిశీలించిన డీసీపీ ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో పట్టణంలోని ఏబీపీ జూనియర్ కళాశాలను డీసీపీ రాజమహేంద్ర నాయక్ పరిశీలించారు. పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత ప్రాంతాలకు తరలించాలని, ఎటువంటి మాల్ప్రాక్టీస్కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా, పక్కాగా పరీక్షలు జరిగేలా చూడాలని ఆదేశించారు. పరీక్ష గది నంబర్ చూసుకుంటున్న విద్యార్థులు మొదటి రోజు ఫస్టియర్ పరీక్షకు 96.94శాతం మంది హాజరు పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీ పోలీసు బందోబస్తు -
‘ధన్ధాన్య’ అమలుపై సమీక్ష
జనగామ: ప్రధానమంత్రి ధన్ధాన్య యోజన (పీఎండీడీకేవై) పురోగతిపై బుధవారం కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి చిన్మయ్ పి.గోట్మారే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలు నుంచి ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి.పింకేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ స్కీంలో రూపొందించిన 6 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక అమలు పురోగతి, మండలాల వారీగా లక్ష్య సాధన, డ్యాష్బోర్డ్లో నమోదైన భౌతిక, ఆర్థిక పురోగతిపై ఆరా తీశారు. పంటల ఉత్పాదకత పెంపు, సుస్థిర వ్యవసాయ పద్ధతుల ప్రోత్సాహం, రైతులకు సులభతర రుణ సదుపాయాలు, ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తరణ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధి, సమగ్ర నీటి యాజమాన్యం, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత అమలు వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ మాట్లాడుతూ.. పీఎండీడీకేవే అమలులో జిల్లాను దేశంలో ఆదర్శంగా నిలబెట్టేలా అన్ని శాఖలు సమన్వయంతో, సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. వీసీలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్, సహకార, భూగర్భ జలాలు, పౌర సరఫరాలు, నీటిపారుదల, నాబార్డు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బకాయిల వేట!
ఆస్తి పన్ను వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ జనగామ: ఆస్తి పన్ను (ప్రాపర్టీ ట్యాక్స్) వసూళ్లను వేగవంతం చేసేందుకు మున్సిపల్ శాఖ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారు. జనగామ మున్సిపల్ పరిధిలో 15,818 అసెస్మెంట్లు ఉండగా, ప్రస్తుత, పాత బకాయిలను కలుపుకుని రూ.6.10 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ రావాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.2.86 కోట్లు మాత్రమే వసూలు కాగా, ఇంకా రూ.3.23 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం వసూళ్ల శాతం 47.01శాతంగా నమోదైంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ రూ.3.70 కోట్లు రావాల్సి ఉండగా, దీనిపై రూ.18.61 కోట్లు పెనాల్టీ బకాయి ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న రూ.1.35కోట్ల పన్నులపై రూ.85.36 లక్షల పెనాల్టీ రావాల్సి ఉంది. ప్రస్తుత ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి డిమాండ్లో ఇప్పటి వరకు రూ.2.36 కోట్లు వసూలు కాగా, దీనికి సంబంధించిన పెనాల్టీ రూ.7లక్షలు వసూలు చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పాత బకాయిల్లో రూ.32.68 లక్షలను వసూలు చేయగా, వాటి రూ.10.67 లక్షల పెనాల్టీ రికవరీ చేశారు. ఇంకా కరెంటు డిమాండ్లో రూ.1.34 కోట్లు రావాల్సి ఉండగా, పెనాల్టీగా రూ.11 లక్షలు రావాల్సి ఉంది. పాత బకాయిల్లో రూ.1.02 కోట్లు పెండింగ్ ఉండగా, వాటిపై రూ.74.69 లక్షల పెనాల్టీలు పెండింగ్లో ఉన్నాయి. వచ్చే నెల 31 వరకు వసూళ్లు 100శాతం ప్రాపర్టీ ట్యాక్స్ పూర్తి చేయాలని లక్ష్యంగా బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు రోజూ గృహాలు, వ్యాపార సంస్థలకు వెళ్లి ట్యాక్స్ సేకరణ చేస్తున్నారు. మొండిబకాయిదారుల వల్ల కొంత సమస్యలు వచ్చినప్పటికీ, కమిషనర్ మహేశ్వర్రెడ్డి పర్యవేక్షణలో వసూళ్ల ప్రక్రియ సాగుతోంది. రోజువారీ కలెక్షన్లపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ స్వయంగా వివరాలు సేకరిస్తున్నారు. వచ్చేనెల 31 నాటికి 100 శాతం లక్ష్యం పాతవి, కొత్తవి కలుపుకుని రూ.6.10కోట్లు ప్రస్తుతం 47 శాతం వసూళ్లు ఇంటింటికీ వెళ్తున్న పురపాలక సిబ్బంది -
‘ఈ–నామ్’.. మొరాయింపు
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్లో కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ–నామ్ 2.0 వెర్షన్ మొదటి రోజు బుధవారం సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంది. దేశవ్యాప్తంగా ఈ–నామ్ కొత్త వెర్షన్ ఈనెల 23 నుంచి ప్రారంభం కాగా, 25వ తేదీ నుంచి మొదలైన రైతుల డేటా నమోదు ప్రక్రియలో అనేక సమస్యలు తలెత్తాయి. రైతులకు సంబంధించిన ఐడెంటిటీ వెరిఫికేషన్లో భాగంగా పేరు, లాస్ట్ నేమ్, సన్నాఫ్, డాటర్ ఆఫ్, భార్య పేరు, మొబైల్ నెంబర్, పుట్టినతేదీ, శాశ్వత చిరునామా, పిన్కోడ్, స్టేట్, సిటీ, తహసీల్, ఏరియా తదితర వివరాలను పూర్తిగా నమోదు చేసిన తర్వాతే తదుపరి దశకు వెళ్లే విధంగా సిస్టమ్ రూపొందించారు.ఈ క్రమంలో సైట్ ఓపెన్ అవ్వడం ఆలస్యం, సర్వర్ మొరాయింపు, లాగిన్ సమస్యలు తీవ్రమయ్యాయి. ఫలితంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క రైతు డేటా కూడా నమోదు చేయలేని పరిస్థితి ఏర్పడింది. రైతులు కందులు, మొక్కజొన్న, చింతపండు వంటి సరుకులు అమ్ముకునేందుకు బుధవారం మార్కెట్కు వచ్చారు. మార్కెట్ అధికారులు రైతులు వచ్చే క్రమంలో ఎంట్రీ చేసి ఈ–నామ్ 2.0లో నమోదు చేసే క్రమంలో పని పూర్తిగా నిలిచిపోయింది. దీంతో సరుకుల కొనుగోలు ఆలస్యం కావడంతో అధికారులు మాన్యువల్ చీటీ విధానం ద్వారా బిడ్డింగ్ చేపట్టింది. మార్కెట్ కమిటీలో పనిచేస్తున్న ముగ్గురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించడంతో, ఇప్పుడు ఈ కీలక పనిని సెక్యూరిటీ గార్డ్ ద్వారా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం వచ్చిన రైతులు సాయంత్రం వరకు క్యూలో నిలబడి ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ–నామ్ కొత్త వెర్షన్పై మార్కెట్ సిబ్బందికి ముందస్తు శిక్షణ, రైతులకు అవసరమైన డాక్యుమెంట్లపై అవగాహన లేకపోవడం సమస్యను మరింత పెంచింది. రైతులు మార్కెట్కు వస్తున్నప్పుడు ఏ వివరాలు తీసుకురావాలో తెలియకపోవ డంతో నమోదు ప్రక్రియకు అడ్డంకిగా మారిపోయింది. మొదటి రోజే ఇలాంటి సవాళ్లు ఎదురవుతుండడంతో ఇదే పరిస్థితి కొనసాగుతుందా లేదా సాంకేతిక లోపాలను అధిగమించి ఈ–నామ్ 2.0 సజావుగా పనిచేస్తుందా లేదా అని రైతులు, వ్యాపారులు, మార్కెట్ అధికారులు ఎదురుచూస్తున్నారు. జనగామ మార్కెట్కు కందులు, మొక్కజొన్న, చింతపండు తదితర సరుకులు రాగా, మాన్యువల్గా చీటీ రాసి ఇచ్చారు. 32 మంది రైతుల వద్ద 104 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేయగా (మూడు రకాలవి క్వింటాల్ ధరలు రూ.7,677, రూ.6,799, రూ.7,229), 9 మంది రైతుల వద్ద 223 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేయగా(రూ.1,721, రూ.1,629, రూ.1,651), రైతులకు మద్దతు ధర కంటే చాలా తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. సెక్యూరిటీ గార్డుతో కంప్యూటర్ సేవలు రైతులకు చీటీలిస్తున్న సిబ్బంది వెరిఫికేషన్ ప్రక్రియలో సంక్లిష్టత డేటా ఎంట్రీ ఆపరేటర్లు లేకపోవడంతో సెక్యూరిటీ గార్డులతో సేవలు లోపాలు సరిచేస్తేనే సజావుగా ‘2.0’ అమలు -
పదిశాతం పనులు కూడా చేయలె..
● రెండున్నరేళ్లలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కాంగ్రెస్ చేసిందేమీ లేదు.. ● మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ● వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సందర్శన.. పనుల పరిశీలన – ఎంజీఎంఆస్పత్రి పనులను పరిశీలిస్తున్న మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, చిత్రంలో మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్సీ రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నరేందర్, శంకర్ నాయక్ తదితరులు -
విజయోస్తు
జనగామ రూరల్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు ఈనెల 25 (బుధవా రం) నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 16 సెంటర్లు కేటాయించగా 8 సెంటర్లు జనగామలో, మిగిలినవి 8 ఆయా మండల కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహణ ఉండగా ఉదయం 8.30 వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. మొత్తం 8,605మంది హాజరు కానుండగా ఇందులో 4,211 ప్రథమ సంవత్సరం, 4,394 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు పరీక్ష కేంద్రాల్లో క్లాక్ రూమ్ సౌకర్యం ఉండాలని, ఎట్టి పరిస్థితిలోనూ మొబైల్ ఫోన్లను లోపలికి తీసుకుపోకుండా పక్కాగా నిఘా పెట్టాలన్నారు. పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హాల్టికెట్పై క్యూర్ కోడ్ ఏర్పాటు చేశారు. కోడ్ను స్కాన్ చేస్తే సంబంధిత పరీక్ష కేంద్రాల వివరాలను లొకేషన్ తెలుపుతుందన్నారు. అలాగే పరీక్షల సమయంలో విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురైతే.. తట్టుకొని ప్రశాంతంగా పరీక్షలు రాసేవిధంగా టెలిమానస్ నం. 14416 కి ఫోన్ చేస్తే నిపుణులు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. విద్యార్థులు సమస్యలను నివృత్తి చేసుకొనేందుకు కంట్రోల్ రూమ్ నంబర్ 9550371371 కు ఫోన్ చేయవచ్చన్నారు. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 8,605 మంది విద్యార్థులు 16 పరీక్ష కేంద్రాలు, క్యూఆర్ కోడ్తో లొకేషన్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు -
నేతల ప్రసన్నం కోసం..
నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినీరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి తదితరులు తమ తమ లిస్టులను సిద్ధం చేసుకుంటూ హైకమాండ్తో సంప్రదింపులను ముమ్మరం చే స్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతుండడంతో ఇన్నాళ్లు నామినేటెడ్ పోస్టులకు ఎదురుచూసిన వారికి ఇప్పుడు అవకాశం వచ్చిందనే భావన కనిపిస్తోంది. ఏ పదవి అయినా సాధించాలనే పట్టుదలతో నాయకులు తెల్లవారుజామున ప్రారంభమయ్యే లాబీయింగ్ను రాత్రి వరకూ కొనసాగిస్తున్నారు. అవసరమైతే కొంతమంది నాయకులు హైదరాబాద్కు వెళ్లి హైకమాండ్కు తమ సేవలు, పార్టీ కోసం చేసిన కష్టాన్ని వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు. జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలకు చెందిన నాయకులు తాము అర్హులేనని చూపిస్తూ హైకమాండ్ ఎదుట తమబలం, బలగాన్ని చూపించే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. -
ద్రావిడ వేద ప్రబంధ పారాయణం
చిల్పూరు: చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం సాయంత్రం అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు వేదమంత్రాల నడుమ ద్రావిడ వేద ప్రబంధ పారాయణం భక్తులకు వినిపించారు. ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు–కిరణ్మయి, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహ న్, దాత సంగోజు మోహనాచారి– శంకర్లక్ష్మి, వీరన్న, భక్తులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ను కలిసిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిపాలకుర్తి టౌన్: మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొర్రూరు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్రెడ్డిని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించి, గెలుపొందిన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. లెదర్పార్కును సందర్శించిన లిడ్క్యాప్ ఎండీస్టేషన్ఘన్పూర్: మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న మినీ లెదర్పార్కును లిడ్క్యాప్ ఎండీ ప్రశాంత్కుమార్ మంగళవారం సందర్శించారు. కాగా విషయం తెలుసుకున్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చేపూరి వినోద్కుమార్, లెదర్పార్కు మాస్టర్ ట్రైనర్స్ అక్కడికి చేరుకుని సమస్యలను విన్నవించారు. దళితులకు ఉపాధి కల్పన కోసం ఏర్పాటు చేసిన లెదర్పార్కు నిరుపయోగంగా ఉందన్నారు. దీని కోసం పలువురు చైన్నెలో ప్రత్యేక శిక్షణ సైతం తీసుకున్నారని, ఇప్పుడు వారంతా కూలీ పని చేసుకుంటున్నారని వాపోయారు. లెదర్పార్కుకు వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు ఎండీకి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు అనంతపురం చంద్రమౌళి, జీడి యాకయ్య, రాజారపు మల్లేష్, మారపాక శ్రీనివాస్, గాదె ఈశ్వరయ్య, జీడి రాంచందర్, కుమారస్వామి, ఏలియా, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పెంబర్తిని పరిశీలించిన కేంద్ర బృందంజనగామ రూరల్: గ్రామీణ శ్రేయస్సు, స్థితిస్థాపకత కార్యక్రమంలో భాగంగా కేంద్ర బృందం మంగళవారం వివిధ అంశాలవారీగా జిల్లాలోని క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఇందులో భాగంగా మండలంలోని ఎల్లంల ఇక్కత్ చేనేత కళాకారులను, పెంబర్తి హస్త కళాకారులను కలిసి ఆయా వృత్తిలో వారి జీవనోపాధి గురించి, ప్రభుత్వ సహకారాలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వివిధ వర్గాల ప్రజలకు ఇస్తున్న రుణ సదుపాయల గురించి, అలాగే పశువుల పెంపకం యూనిట్, విజయ డెయిరీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో సభ్యులు హర్షద్, సునయ్ కీమ్ అపర్ణ, ఆనంద్ అంకిత్ వివిధ శాఖల అధికారులు విక్రమ్, మూర్తి, శివకృష్ణ, మురళీధర్రావు, గోపాల్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణాలకు రక్షణ కవచం హెల్మెట్
● వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ రఘునాథపల్లి: ప్రాణాలకు రక్షణ కవచం హెల్మెట్ అని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరి ధరించాలని వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ ద్విచక్ర వాహనదారులకు సూచించారు. మంగళవారం మండలంలోని కోమళ్ల టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన ఎరైవ్, ఎలైవ్ కార్యక్రమంలో వాహనదారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.. కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్ ఏసీపీ భీంశర్మ, జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్రెడ్డి, ఎస్సై దూదిమెట్ల నరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యలు తీరేదెన్నడు?
ఏళ్ల తరబడి కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలుఈ ఫొటోలో కనిపిస్తున్న 70 ఏళ్ల వృద్ధురాలు జనగామ మండలం సిద్దెంకి గ్రామానికి చెందిన గురిజాల బాలమణి. ఇద్దరు కుమారులు ఉన్నారు. తనకున్న 4 ఎకరాల భూమిని 2 ఎకరాల చొప్పున రిజిస్ట్రేషన్ చేసింది. ఇప్పుడు తన బాగోగులు చూసుకోవడం లేదని, దిక్కుతోచని స్థితిలో ఉన్నానని కలెక్టర్ను వేడుకుంది. తన భూమి తనకు ఇప్పించాలని కన్నీటి పర్యంతమైంది. జనగామ రూరల్: కుమారులు చూసుకోవడం లేద ని, ఉద్యోగానికి రానివ్వడం లేదని, అక్రమంగా ప ట్టా చేసిన వారిపై చర్య తీసుకోవాలని, అంత్యోద య కార్డు ఇచ్చి ఆదుకోవాలని.. ఇలా పలు సమస్యలతో ప్రజలు గ్రీవెన్స్ సెల్కు వచ్చారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు ఎక్కువ సంఖ్యలో సోమవారం కలెక్టరేట్కు వచ్చారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ స్టేషన్ఘనన్పూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి డీఎస్. వెంకన్నతో కలిసి 78 దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ప్రజావాణిలో అందించిన అర్జీలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైతే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ దరఖాస్తులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.చద్దన్నం తింటున్న వృద్ధుడు గ్రీవెన్స్లో భూసమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల సమస్యలే అధికం ప్రజావాణిలో 78 అర్జీలు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యం అదనపు కలెక్టర్ బెన్షాలోమ్చద్దన్నంతో కలెక్టరేట్కు.. తమ సమస్యలు, బాధలు కలెక్టర్కు చెప్పుకోవాలని దూరప్రాంతాల నుంచి చద్దన్నంతో పలువురు బాధితులు ప్రజావాణికి వచ్చారు. తమ సమస్యలు విన్నవించిన అనంతరం మధ్యాహ్నం వారు తెచ్చుకున్న చద్దన్నం తిని తిరుగు ప్రయాణమయ్యారు. -
రోడ్డు ప్రమాదాల్లో భవితను కోల్పోతున్నాం..
వరంగల్ క్రైం: రోడ్డు నిబంధనలు పాటించకపోవడంతో దేశ భవిష్యతైన ఎంతో మంది యువతను రోడ్డు ప్రమాదాల్లో కోల్పోతున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ప్రతీ నెల చివరి వారం నిర్వహించే ‘అరైవ్ అలైవ్’ రెండో విడత కార్యక్రమంలో భాగంగా సోమవారం కమిషనరేట్ ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో నగరంలోని వాగ్డేవి కళాశాలలో విధ్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ప్రతీ వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. తన థ్రిల్ కోసం వాహనదారుడు వాహనం నడపటం చాలా ప్రమాదకమని, కొన్ని సందర్బాల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని, ఇలాంటి చర్యల కారణంగా కుటుంబ సభ్యులు ఎంతో నష్టపోతారని సూచించారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల కారణంగా 7,500 మంది మృత్యువాత పడడం చాలా బాధకరమని, ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిన అవశ్యకతను వివరించాలని సీపీ సూచించారు. అనంతరం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామంటూ విద్యార్థుల చేత ట్రాఫిక్ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సెంట్రల్ డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ఏసీపీ సత్యనారయణ, ఇన్స్పెక్టర్లు వెంకన్న, సీతారెడ్డి, సుజాత, వాగ్దేవి కళాశాల ప్రిన్న్సిపాల్ శేషాచలం, కరస్పాడెంట్ శ్రవణ్ రెడ్డి, హరిచంద్రారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. సీపీ సన్ప్రీత్ సింగ్ -
బంజారాల అభ్యున్నతికి కృషి
● ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాలకుర్తి టౌన్: గిరిజనుల ఆరాధ్య దైవం సంత్సేవాలాల్ మహరాజ్ గిరిజన సమాజానికి ఆదర్శమని, ఆయన స్ఫూర్తితోనే ప్రభుత్వం తండాలను అభివృద్ధి చేస్తుందని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని సేవాలాల్ మందిరంలో భోగ్ బండారో కార్యక్రమాన్ని నిర్వహించారు. గిరిజన మహిళలు సాంప్రదాయ దుస్తులతో రాజీవ్ చౌరస్తాలో ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డితో కలిసి నృత్యం చేశారు. అనంతరం గుడివాడ చౌరస్తా నుంచి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఇందిరా మహిళా శక్తి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. సమావేశంలో డీఆర్డీఓ పీడీ వసంత, తహసీల్దార్ సరస్వతి, అజ్మీర కిష్టునాయక్, తిరుపతిరెడ్డి, లావుడ్యి మంజుల, ధరావత్ సురేష్నాయక్, హమ్యనాయక్, రాజేష్నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
అకాల వర్షం
జలమయంగా మారిన జనగామ పట్టణ రోడ్డు ● జనగామలో జలమయమైన రోడ్లు ● విద్యుత్ సరఫరాకు అంతరాయం జనగామ: వేసవి ఉక్కపోత మధ్యలో అకాల వ ర్షం కొంత ఉపశమనం ఇచ్చినా.. సోమవారం సాయంత్రం కురిసిన వర్షంతో పట్టణంలో ప్రజ లు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హనుమకొండ, హైదరాబాద్ రోడ్డుపై డ్రెయినేజీ నాళాలు, పొంగి పొర్లడంతో మురికి నీరు రోడ్డుమీదకు చేరి వ్యాపార సముదాయాల మెట్ల వరకు ప్రవహించింది. రోడ్లు జలమయం కావడంతో వాహనాలు నిలిచిపోయాయి. బయట పనుల కోసం వచ్చిన ప్రజలు సమీప దుకా ణా ల్లో తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. -
బాల్యవివాహాల నిర్మూలన అందరి బాధ్యత
జనగామ రూరల్: బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యతని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం మహిళా శిశు సంక్షేమ శాఖ, స్కోప్ స్వచ్ఛంద సంస్థ (సొసైటీ ఫర్ ప్రోగ్రెసివ్ యాక్షన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్) సంస్థల సహకారంతో ‘బాల్య వివాహ ముక్తభారత్’ ప్రచార రథాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. బాల్య వివాహాలు బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్పై తీవ్ర ప్రభావం చూపుతాయని, వాటి నిర్మూలనకు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, సమాజం సమష్టిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా బాల్య వివాహాలు ఎక్కువగా ఉన్న సుమారు 50 గ్రామాలు, హాట్స్పాట్ ప్రాంతాలు ఆస్పత్రి పరిసరాల్లో ప్రజలకు బాలల హక్కులు, బాల్య వివాహ నిరోధక చట్టం, ఇతర చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ (1098)పై విస్తృత ప్రచారం చేయాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి కోదండరాములు మాట్లాడుతూ బాల్య వివాహ నిర్మూలనలో ప్రభుత్వం–స్వచ్ఛంద సంస్థలు–సమాజం కలిసి పని చేస్తేనే శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో లేబర్ అధికారి కుమారస్వామి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రవికాంత్, ప్రతినిధి మనోజ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్లు సంపత్, రాజు, చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ రవికుమార్, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ శేఖర్, సఖి సెంటర్ నిర్వాహకురాలు రేణుక, శారద, సుధ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
వేసవికి విద్యుత్శాఖ సిద్ధం
జనగామ: జిల్లాలో వేసవికాలంలో పెరగనున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఎన్పీడీసీఎల్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆ శాఖ ఎస్ఈ సంపత్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయా సబ్స్టేషన్లను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. గతేడాది మార్చిలో విద్యుత్ డిమాండ్ 5,816 మెగావాట్లు ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరి 21 నాటికి 5,904 మెగావాట్లకు చేరిందన్నారు. జనగామ సర్కిల్లో ఈ నెల 17న గరిష్టంగా డిమాండ్ 368.17 మెగావాట్లుగా నమోదైందని, రాబోయే వేసవిలో అత్యధికంగా డిమాండ్ పెరిగినా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించేందుకు ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. పట్టణాల్లో పెరుగుతున్న లోడ్ను దృష్టిలో ఉంచుకుని 70 అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుతో సామర్థ్యం పెంచినట్లు తెలిపారు. అలాగే అదనంగా 38 కొత్త పంపిణీ ట్రాన్స్ఫార్మర్లు, 14 పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. సర్కిల్ పరిధిలో 6 కొత్త సబ్స్టేష న్ల నిర్మాణం కూడా ప్రారంభమైందని, విద్యుత్ సరఫరా స్థిరత్వం కోసం 30 కొత్త బ్రేకర్లు, నాణ్యత మెరుగుపరిచేందుకు 14 కొత్త 33/11 కేవీ ఇంటర్ లింకింగ్ లైన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వేసవిలో వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తున్నామని ఎస్ఈ తెలిపారు. అంతరాయం లేని సరఫరా కొనసాగేందుకు అన్ని స్థాయిల్లో ముందస్తు చర్యలు సిద్ధంగా ఉన్నాయన్నారు. డిమాండ్కు అనుగుణంగా సరఫరా ఎస్ఈ సంపత్రెడ్డి -
గురు రవిదాస్ బోధనలు మార్గదర్శకం
జనగామ: సంత్ శిరోమణి గురు రవిదాస్ మహరాజ్ బోధించిన సమానత్వం, మానవత్వం, కుల, మత భేదాలకు అతీతమైన సమాజ నిర్మాణం అత్యంత అవసరమని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సూర్యాపేటరోడ్డు ఎస్పీఆర్ స్కూల్లో జరిగిన వేడుకల్లో రవిదాస్ మహారాజ్ 650వ జయంతిని పురస్కరించుకుని ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురు రవిదాస్ జీవితం సామాజిక న్యాయం, సోదరభావం, సేవాభావానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర మోచి కుల సంఘం పట్టణ వైస్ ప్రెసిడెంట్ చంద్రగిరి శ్రీనివాస్, ట్రెజరర్ సల్లా శివకుమార్, టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్, కీర్తి వీరేందర్, శోభ, జీవన్ రెడ్డి, మనోజ్, సాయిరాం, అరుంధతి, చంద్ర కళ పాల్గొన్నారు. శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలిజనగామ రూరల్: విద్యార్థులు పోటీ ప్రపంచంలో ముందుకువెళ్లాలంటే టెక్నాలజీని ఉపయోగించుకుని శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని జిల్లా సైన్స్ అధికారి ఉపేందర్ అన్నారు. సోమవారం ఫిజికల్ సైన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో మండలంలోని శామీర్పేట పాఠశాలలో జిల్లా స్థాయి ఫిజికల్ సైన్స్ పోటీల ముగింపు సమావేశం ఫోరమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండోజు శ్రీనివాసచారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సైన్స్ అధికారి పాల్గొని మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారన్నారు. అనంతరం గెలుపొందిన వీ.పుష్యమి, కే కావే రి, రిత్విక్లకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డీసీడీఓ గౌసియా బేగం, ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి, లక్ష్మణ్ జీ, బాల రాజు, తదితరులు పాల్గొన్నారు. చిల్పూరుగుట్ట బ్రహ్మోత్సవాలు షురూచిల్పూరు: తెలంగాణలో రెండో తిరుపతిగా పేరుగాంచిన చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు తొళక్కమును అడిషనల్ కలెక్టర్ పింకేష్కుమార్ జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. సాయంత్రం అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజల అనంతరం అడిషనల్ కలెక్టర్తో పాటు జిల్లా పరిషత్ సీఈఓ మాధురిషా ఉత్సవాలను ప్రారంభించారు. ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావులు వారిని స్వామి వారి పట్టు వస్త్రాలతో సన్మానించి తీర్థప్రసాదాలను అందించారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, ధాత సంగోజు మోహనాచారి, శంకర్లక్ష్మి, వీరన్న, మల్లికార్జున్, వసంత, లక్ష్మి, కృష్ణ, హరిఽశంకర్ భక్తులు పాల్గొన్నారు. -
సర్వం సిద్ధం
● రేపటి నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● జిల్లా వ్యాప్తంగా 16 పరీక్షకేంద్రాలు ● హాజరుకానున్న 8,605 మంది విద్యార్థులుసజావుగా నిర్వహించాలి ఇంటర్ వార్షిక పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ఆయా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి. పరీక్ష సమయంలో విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా అదనపు ఆర్టీసీ బస్సులు నడిపించాలి. –రిజ్వాన్బాషా, కలెక్టర్ ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటాం.. జిల్లాలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. హాల్టికెట్ల జారీ విషయంలో విద్యార్థులకు ఇబ్బందులకు గురి చేస్తే ఆయా కళాశాలపై ఫిర్యాదు వస్తే కఠిన చర్య తీసుకుంటాం. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. –జితేందర్రెడ్డి, డీఐఈఓజనగామ రూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 25 నుంచి మార్చి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఎలాంటి మాస్ కాపింగ్ పాల్పడకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య, పోలీసులు, రెవెన్యూ, విద్యుత్, ఆర్టీసీ, పురపాలక, తపాలా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్బాషా ఆదేశించారు. జిల్లాలో మొత్తం 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 16 మంది పర్యవేక్షకులు, అదనపు పర్యవేక్షకులు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్స్తో పాటు 300 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షలకు మొత్తం 8,605 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో ఫస్టియర్ జనరల్లో 3,100, ఒకేషనల్లో 1,111, సెకండియర్ జనరల్లో 3,194, ఒకేషనల్లో 1,200 మంది ఉన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నపత్రాలను ఓపెన్ చేయనున్నారు. కాగా ఈసారి పరీక్ష కేంద్రాల గుర్తింపునకు లొకేషన్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రైవేట్ కళాశాలలు హాల్టికెట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టకుండా వెబ్సైట్లో నేరుగా హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. జిల్లాకు చేరిన ప్రశ్నపత్రాలు ఇంటర్ పరీక్ష ప్రశ్నపత్రాలు జిల్లా కేంద్రానికి చేరుకోగా కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఓఎంఆర్ షీట్లు, బుక్లెట్లు నేరుగా జిల్లా పోలీస్స్టేషన్కు చేరుకోగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేశారు. పోలీస్ ఎస్కార్ట్తో ప్రశ్నపత్రాలను ఆయా కేంద్రాలకు తరలించనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. -
మేడారంలో భక్తుల రద్దీ
ఎస్ఎస్తాడ్వాయి: మేడారానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో గద్దెల ప్రాంగణం భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క–సారలమ్మకు పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొ క్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ప్రధాన ఆర్చీ ద్వారం నుంచి భక్తులను పోలీసులు క్రమపద్ధతిలో దర్శనాలకు పంపించారు. నార్లాపూ ర్ పోలీస్స్టేషన్ ఎస్సై కమలాకర్ భక్తుల రద్దీని పర్యవేక్షించి ప్రశాంతంగా దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. మేడారం కార్యనిర్వహణాధికారి వీరస్వామి కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకు ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎత్తు బంగారం అమ్మవార్లకు మొక్కుగా సమర్పించారు. సంప్రదా యంగా పూజారులు ఆయనకు డోలివాయిద్యాలతో గద్దెలపైకి స్వాగతం పలికారు. ఆయన వెంట సూపరింటెండెంట్ విజయ్కుమార్, జూనియర్ అసిస్టెంట్లు జగదీశ్వర్, మధు, సిబ్బంది ఉన్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు వనదేవతలకు మొక్కులు -
దేవాదుల సమస్యలు పరిష్కరించండి
జనగామ: జనగామ నియోజకవర్గంలో సాగునీటి అవసరాలను తీర్చడంలో కీలకమైన దేవాదుల ప్రాజెక్ట్ 8వ ఫేజ్ ప్యాకేజీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదివారం నివేదించారు. వివిధ గ్రామాల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రాజెక్టు ఆలస్యానికి సంబంధించిన కారణాలను తెలిపారు. దేవాదుల ప్రాజెక్ట్ 8వ ప్యాకేజీలో అత్యవసరంగా పరిష్కారం చేయాల్సిన అంశాలను ఒక్కొక్కటిగా వివరించారు. నియోజకవర్గంలో సాగునీరు పూర్తిస్థాయిలో అందకపోవడంతో పంటల ఉత్పాదకత తగ్గిపోతోందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్పష్టంచేశారు. దేవాదుల ప్రాజెక్ట్లో భాగంగా ధర్మసాగర్ లింక్ కాలువ గండిరామవరం గ్రామ పరిధిలో నాలుగు నెలలుగా నిలిచిపోయిందని, ఈ పని పూర్తికాకపోతే నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా ఆగిపోతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గండిరామారం నుంచి నుంచి కన్నెబోయినగూడెం, బొమ్మకూరు రిజర్వాయర్కు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ముందుకుసాగకుండా ఉన్నాయని, వెంటనే నిర్మాణ సంస్థలను వేగవంతమైన చర్యలు చేపట్టేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, కన్నెబోయిన గూడెం నుంచి నుంచి లద్నూరు, తపాస్పల్లి వరకు మిగిలిన పైప్లైన్ పనులను తక్షణమే పూర్తి చేయాలని, పైన్ ప్యాకేజీ లో కాలువల నిర్మాణం సరిగా జరగకపోవడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతోందన్నారు. భూసేకరణ, చెల్లింపుల సమస్యలకు పరిష్కారం చూపించడంతో పాటు యథావిధిగా నడపడం వల్ల 80 శాతం నీటిపారుదలకు ఇబ్బందులు ఉండవన్నారు. మిగిలిన 20 శాతం ఆయకట్టు అందుబాటులోకి రావాలంటే 530 ఎకరాల భూమికి సంబంధించిన చెల్లింపులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తరిగొప్పుల మండలంలోని 15 గ్రామాలకు లిఫ్ట్ పైప్ లైన్ పనులు పూర్తికాలేదని, మల్లన్నసాగర్ నుంచి టీఎస్పీఎల్ కాలువ పనులు కూడా నిలిచిపోయిన అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
సకలవిద్యార్థి సమీకృతం!
కుల, మత, వర్గ వివక్ష లేకుండా ఒకేచోట విద్యాబోధన జఫర్గఢ్: కుల, మత, వర్గ వివక్ష లేకుండా ఒకేచోట పేద విద్యార్థులకు బోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రూ.200 కోట్ల వ్య యంతో మండలంలోని ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న కోనాయిచలం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న 161/సీ/2 సర్వే నంబర్లోని 21 ఎకరాల సువిశాల ప్రభుత్వ స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ పనుల నిర్మాణానికి గతేడాది మార్చి 16న సీఎం రేవంత్రెడ్డి స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో వర్చువల్గా శంకుస్థాపన చేయగా, ఈ నెల 10న వరంగల్ ఎంపీ కడియం కావ్యతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఇతర పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యాబోధనతో పాటు ఆధునిక మౌలిక వసతులు కల్పించనున్నారు. ఈ భవన నిర్మాణ పనులు 18 నెలల్లోగా పూర్తి చేసేందుకు గడువు విధించింది. . ప్రత్యేకతలివే.. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఒకే గొడుగు కింద ఏర్పాటు కాబోతున్నాయి. ఒకే చోట 2,560 మంది విద్యను అభ్యసించనున్నారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల సొసైటీలకు చెందిన విద్యార్థులు ఈ సమీకృత భవన ప్రాంగణంలో చదువుకోనున్నారు. ఈ పాఠశాల భవనంలో వివిధ బ్లాకులుగా విద్యాబోధన అందించనున్నారు. ఒక్కో బ్లాక్కు 640 మంది విద్యార్థుల చొప్పున ఉంటారు. భాషకు సంబంధించిన ప్రత్యేక గదులను ఏర్పాటు చేయనున్నారు. ఇండోర్ యాక్టివిటీ జోన్లు, ఓపెన్ ఎయిర్ థియేటర్, విస్తృత క్రీడామైదానాలు, మూడు బ్లాక్లలో 10 (ల్యాబ్లు) ప్రయోగశాలలు, 10 డిజిటల్ కూబికల్స్తో కల్గిన లైబ్రరీలు, విద్యార్థులు పలు అంశాలపై చర్చించుకునేందుకు చర్చా గదులు వీటితో పాటు పునరుత్పాదక శక్తి వ్యవస్థలు, ఉద్యానవనాలు, జిమ్ తదితర సౌకర్యాలు కల్పిస్తారు. ఆధునిక వసతి సదుపాయాలు 5 నుంచి 8వ తరగతి విద్యార్థులకు రెండంచెల బంకర్ పడకలు, 9, 12వ తరగతి విద్యార్థులకు ఒకే అంచె మంచాలు ఏర్పాటు చేయనున్నారు. ఒకేసారి 1,280 మంది విద్యార్థులకు భోజన వసతి కల్పించే ఆధునిక హంగులతో కూడిన భోజనశాల, 8 పడకల సామర్థ్యం కల్గిన అరోగ్య సంరక్షణ కేంద్రంతో పాటు తల్లిదండ్రులు, సందర్శకుల కోసం ప్రత్యేక లాంజ్ను ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక నివాస సముదాయాలు విద్యార్థులతో పాటు విద్యా బోధన అందించేందకు జీ ప్లస్ 2 భవనాలు నిర్మించనున్నారు. ఇందులో పాఠశాలల ప్రిన్సిపాళ్లు, బోధన సిబ్బంది, వసతి గృహ వార్డెన్ల కోసం ప్రత్యేకంగా భవన సముదాయాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సమీకృత పాఠశాల భవనంలో మొత్తంగా 86 మంది సిబ్బందికి వసతులు కల్పించనున్నారు. విద్యా హబ్గా ఘన్పూర్ నియోజకవర్గం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణంతో స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంతో పాటు జఫర్గఢ్ మండలం వి ద్యాహబ్గా మారనుంది. ఘన్పూర్ నుంచి జఫర్గ ఢ్ వచ్చే రహదారిలో చేపడుతుండడంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది. ఆధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కార్పొరేట్కు దీటుగా అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలు కోనాయిచలం రెవెన్యూ పరిధిలో నిర్మాణం కాబోతున్న సమీకృత గురుకులం విద్యాహబ్గా మారనున్న స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం -
ఏప్రిల్ 10 నుంచి ఎస్ఏ–2 పరీక్షలు
జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి నుంచి 9వ తరగతుల వరకు నిర్వహించే సమ్మెటివ్ అసెస్మెంటు(ఎస్ఏ)–2 పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యాయి. పరీక్షలను ఏప్రిల్ 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాదేశిక సంయుక్త సంచాలకుడు, జిల్లా, మండల విద్యాశాఖ అధికారులకు పరీక్షల నిర్వహణపై మార్గదర్శకాలు పంపినట్లు అందులో పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలు ముగిసిన వెంటనే మార్కులు ఆన్లెన్ వెబ్సైట్లో నమోదు చేయాలని జిల్లా విద్యాధికారులకు సూచించారు. 23వ తేదీన ప్రకటించనున్న ఫలితాల అనంతరం, అదే రోజు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం తప్పనిసరిగా నిర్వహించాలని కోరారు. పాఠశాలలు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి, నివేదికలు సమర్పించాలని స్పష్టంగా ఆదేశించారు. బుగులు వెంకన్న ఆలయానికి లాకర్ అందజేతచిల్పూరు: చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం స్టేషన్ఘన్పూర్కు చెందిన గూడూరు జగన్నాథం జ్ఞాపకార్థం కుమారుడు నరేందర్–మంజుల దంపతులు రూ.1.10 లక్షల విలువైన లాకర్ అందజేశారు. ఉదయం ఆలయానికి వచ్చిన దాతలు ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ శ్రీధర్రావు సమక్షంలో ఆలయానికి అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్ పాల్గొన్నారు. ‘పీఎం అజయ్ యోజన’ కు కన్నాయిపల్లి ఎంపికరఘునాథపల్లి: మండలంలోని కన్నాయిపల్లి గ్రామం అభివృద్ధిలో మరో ముందడుగు వేసింది. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో పీఎం అజయ్ యోజనకు (పీఎం అనుసుచిత్ జాతి అభ్యుదయ యోజన) జిల్లాలో ఒక్క గ్రామం మాత్రమే ఎంపికై ంది. దీని ద్వారా 15వ ఫైనాన్స్ నిధులతో పాటు రోడ్లు, మౌలిక వసతుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు కానున్నాయి. ఇప్పటికే ఈ గ్రామాన్ని మోడల్ గ్రామంగా ప్రభుత్వం ఎంపిక చేసి వంద శాతం సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. అదనంగా పీఎం అజయ్ యోజన పథకం కింద ఎంపిక చేయడంపై సర్పంచ్ లోనె అంజమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం నుంచి గ్రామంలో ప్రతీ ఇంటికి సర్వే చేయనున్నట్లు అధికారులు చెప్పారు. డీసీసీ అధ్యక్షుల జాతీయస్థాయి శిక్షణలో ధన్వంతి జనగామ: రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల జాతీయ స్థాయి ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆదివారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధన్వంతిలక్ష్మి నారాయణ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పది రోజుల పాటు జరుగుతున్న ఈ శిక్షణలో ప్రజా సమస్యలు, పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై విస్తృత చర్చలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. డీసీసీ పదవి హోదా కాదని, అది ప్రజల పట్ల బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుకు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రెండు మున్సిపాలిటీలను గెలుచుకున్నందుకు సీఎం రేవంరెడ్డి అభినందించినట్లు స్పష్టం చేశారు. -
ప్రతీ ఎకరాకు నీరు
ములుగు: రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పనులను 2027 డిసెంబర్లోగా పూర్తిచేసి 6 లక్షల ఎకరాల ఆయట్టుకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ, దేవాదుల ఇంటెక్వెల్ మోటార్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటెక్వెల్ వద్ద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.15,500 కోట్లు ఖర్చు చేసినా నిర్మాణం పూర్తి కాలేదన్నారు. ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తాం.. ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని మంత్రివర్గంలో ఆమోదించి నిధులు సమకూర్చి పూర్తిచేస్తామని సీఎం అన్నారు. నిర్మాణం పూర్తయ్యేందుకు నిధుల కొరత, భూసేకరణ సమస్య ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే రూ. 8 లక్షల 11 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వంపై అప్పుల భారం ఉందని వెల్లడించారు. గోదావరి, కృష్ణా జలాలపై అపోహలు వద్దని, తెలంగాణకు రావాల్సిన వాటాను, నీటి హక్కులపై ప్రభుత్వం తరఫున పూర్తిగా పోరాడి కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ప్రతీ ఎకరాకు సాగునీరు, ప్రతీ పౌరుడికి తాగునీరు అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కూడా ప్రాజెక్టులు పూర్తికాలేదన్నారు. నీళ్లు, నిధులు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం లోపాల వల్ల ప్రాజెక్టులు పూర్తికాకుండా పోయాయని విమర్శించారు. జూన్ 2 వరకు భూసేకరణ : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దేవాదుల ప్రాజెక్టులో సొరంగ మార్గంతోపాటు పంపుహౌస్లలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల భూసేకరణ జూన్ 2 వరకు పూర్తిచేస్తామని వివరించారు. ఇందుకు అవసరమైన నిధుల విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించారు. గోదావరి నదిలో చుక్క నీటిని వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే జలాశయాల్లో తెలంగాణ వాటా పరిరక్షణకు చర్యలు మొదలయ్యాయని, ట్రిబ్యునల్, సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర ప్రభుత్వం వద్ద పోరాటం చేస్తున్నది తామేనని ఆయన స్పష్టం చేశారు. కొందరు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, మహబూబాబాద్, వరంగల్ ఎంపీలు బలరాంనాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, గండ్ర సత్యనారాయణరావు, పల్లా రాజేశ్వర్రెడ్డి, ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా పాల్గొన్నారు.రెండేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి దేవాదులకు ఇప్పటి వరకు రూ.15,500 కోట్లు ఖర్చు గోదావరి, కృష్ణా జలాల వాటా, నీటి హక్కులు పూర్తిగా కాపాడుదాం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తుపాకుల గూడెంలో సమ్మక్క బ్యారేజీ, దేవాదుల ఇంటెక్వెల్ పరిశీలన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్కనీరు ఎత్తిపోయలే.. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్షా పది వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినా రెండేళ్లలో చుక్క నీరు కూడా ఎత్తిపోయలేదని సీఎం రేవంత్రెడ్డి రు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టుల నిర్మాణాలు, రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, గోదావరి నది జలా లపై ప్రతిపక్షాలతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గోదావరి, కృష్ణా నది జలాల కోసం పక్క రాష్ట్రాలతోపాటు అవసరమైతే కేంద్రంతో పోరాడుతామని పేర్కొన్నారు. కష్టపడి ప్రాజెక్టులను నిర్మించుకొని ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకుందామన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మంత్రివర్గంతో సమీక్షించనున్నట్లు సీఎం తెలిపారు. మేడారం జాతరను మహా కుంభమేళాగా జరిపించామని, మేడారంలో శాశ్వత సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. -
నేటినుంచి శ్రీతిరుమలనాథ ఆలయ బ్రహ్మోత్సవాలు
స్టేషన్ఘన్పూర్: డివిజన్ కేంద్రమైన స్టేషన్ఘన్పూర్ బస్టాండ్ సమీపంలోని శ్రీతిరుమలనాఽథస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలను ఈనెల 23(సోమవారం) నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు దేవస్థాన చైర్మన్ నీల నర్సింహులుముదిరాజ్, ఆలయ అర్చకులు కలకోట రామానుజచార్యులు తెలిపారు. శ్రీతిరుమలనాఽథస్వామి దేవస్థానంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు.. శ్రీతిరుమలనాథస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు శాస్త్రోయుక్తంగా వేదపండితులచే నిర్వహించన్నట్లు, స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని మార్చి 1న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఆహ్వానం శ్రీతిరుమలనాథస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఆదివారం ఆయన నివాసంలో దేవస్థాన చైర్మన్ నీల నర్సింహులు ఆధ్వర్యంలో ఆహ్వానపత్రం అందించారు. 1న జరిగే స్వామివారి కల్యాణానికి హాజరుకావాలని కోరుతూ ఆహ్వానం పలికారు. మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, దేవస్థాన డైరెక్టర్లు యాదగిరి, ప్రశాంత్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఆహ్వానించిన దేవస్థాన చైర్మన్ -
సొంతింటి కలను సాకారం చేసిన ప్రభుత్వం
చిల్పూరు: నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని శ్రీపతిపల్లి గ్రామంలో రంగు రమేష్, శ్రీవాణిలు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ నియోజకవర్గంలోని 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ప్రస్తుతం 85 శాతం పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేసుకున్నారన్నారు. అనుమతులు లేకుండా బేస్మెంట్ నిర్మాణాలు, స్లాబ్ లెవల్ వరకు పూర్తి చేసుకున్న ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రభుత్వం వెసలుబాటు కల్పించేందుకు జీఓ 96 తీసుకువచ్చిందని, ఈ జీఓ ద్వారా లబ్ధిదారులకు ఇండ్లను పూర్తి చేయించేందుకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్రావు, నాయకులు గడ్డమీది సురేష్, బొమ్మిశెట్టి బాలరాజు, షకీల్, పొలబోయిన నరేష్, హరిబాబు, ఏదునూరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
గోదావరి ఇంటెక్ వెల్కు నేడు సీఎం రేవంత్ రెడ్డి
దేవాదుల ప్రాజెక్టు అంశం వివాదం అవుతున్న నేపథ్యంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో ఆ ప్రాజెక్టు ఇంటెక్ వెల్ను సందర్శించనున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న సీఎం.. అక్కడినుంచి ఇంటెక్ వెల్ను సందర్శించి అక్కడే అధికారులతో ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. నీటిపారుదలశాఖ మంత్రి గతంలో 2026 మార్చి వరకు ప్రాజెక్టు పూర్తి చేసి పూర్తి ఆయకట్టుకు నీరందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో నెలరోజులే గడువు ఉండటంతో ప్రాజెక్టు పెండింగ్ భూసేకరణ, మూడో విడత పనులపై సీఎం రేవంత్రెడ్డి అఽధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు అధికారవర్గాల సమాచారం. శనివారం రాత్రి నుంచి పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పామాయిల్ రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించాలి
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలో పామాయిల్ పండించిన రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించి తప్పనిసరిగా అడ్డా ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కనకారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఇండస్ట్రీయల్ రోడ్డుపై విక్రయాలు జరుపుతున్న రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పామాయిల్ పండించే రైతులకు సబ్సిడీలు కల్పించి ప్రోత్సహించడంతోనే జిల్లాలో వందలాది మంది రైతులు పామాయిల్ పండించారన్నారు. పామాయిల్ గెలలను అమ్ముకోవడానికి మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు స్పందించి జిల్లా కేంద్రంలో మార్కెట్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూడిద గోపి, రైతులు వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, ఉపేందర్, అంజిరెడ్డి వెంకటరమణారెడ్డి, రాజు, లక్ష్మారెడ్డి, ప్రభాకర్రెడ్డి, రాంరెడ్డి, భరత్ తదితరులు పాల్గొన్నారు. -
సీపీఆర్తో ప్రాణాలు కాపాడొచ్చు
జనగామ రూరల్: సీపీఆర్తో ప్రాణాలు కాపాడుకోగలమని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె.మల్లికార్జున రావు అన్నారు. శనివారం సమగ్ర సీపీఆర్ శిక్షణ ప్రదర్శన కార్యక్రమం కలెక్టరేట్లోని సమావేశ హాలులో నిర్వహించారు. జిల్లాలోని అన్ని ఆర్బీఎస్కే మొబైల్ హెల్త్ టీమ్స్కు డాక్టర్ సాయి ప్రణీత శిక్షణ ఇచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ముఖ్యంగా అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం వంటి అత్యవసర సందర్భాల్లో సమయోచితంగా స్పందించే సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ శిక్షణ ఉద్దేశ్యమన్నారు. గుండె ఆగిన లక్షణాలను తొందరగా గుర్తించడం, స్పందన పరిశీలించడం, అత్యవసర సేవలను సమాచారం ఇవ్వడం, సరైన చెస్ట్ కంప్రెషన్ పద్ధతి ప్రాక్టికల్ డెమో ద్వారా వివరించారు. అధిక నాణ్యత గల సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలను కాపాడగలమన్నారు. శిక్షణలో అన్ని ఆర్బీఎస్కే సభ్యులు పాల్గొని సీపీఆర్ విధానాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్యామ్ కుమార్, కమల్ హాసన్, శ్రీతేజ, శరత్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు -
హాట్టాపిక్గా ‘దేవాదుల’
విహారయాత్రకు ముఖ్యమంత్రి, మంత్రులు..● దేవాదుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కేటాయించని రేవంత్రెడ్డి ● మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటనతో నిద్రలేచిన ప్రభుత్వం ● బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిసాక్షిప్రతినిధి, వరంగల్ : జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల పథకం ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ఉమ్మడి వరంగల్ ఆయకట్టుకు కీలకమైన ప్రాజెక్టులో దేవాదుల పంపుహౌస్ మోటార్లు పనిచేయకపోవడం వివాదాస్పదంగా మారింది. గత యాసంగి సీజన్లో మోటార్లు మొరాయించాయి. ఫలితంగా 60 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందక ఎండిపోయాయని రైతుల పక్షాన ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు దేవన్నపేట పంపుహౌస్ను హుటాహుటీన సందర్శించారు. మోటార్లు రన్ అయ్యే వరకు అక్కడే ఉంటామని ప్రకటించినా ఆ వెంటనే మోటా ర్లు ఆన్ కాలేదు. మోటార్లలో సాంకేతిక కారణాలు తలెత్తాయన్న అధికారులు.. ఆ తర్వాత రెండింటిని ఆన్చేయగా యాసంగి సీజన్ దాటే సమయానికి నీళ్లందాయి. ఈ సీజన్లోనూ దేవన్నపేట పంపుహౌస్లో మోటార్లు ఆన్ చేయకపోవడంతో శుక్రవారం సందర్శించిన మాజీ మంత్రి హరీశ్రావు బృందం... కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం, మంత్రుల తీరుపై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్షగట్టి, గోదావరిలో సరిపడా నీళ్లున్నా దేవాదుల ఎత్తిపోతల ద్వారా లిఫ్ట్ చేయడం లేదని ఆరోపించా రు. ఇదిలా ఉంటే దేవన్నపేట పంపుహౌస్లో నీటిపారుదలశాఖ అధికారులు శనివారం మోటార్ను ఆన్చేశారు. అక్కడి నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించేందుకు పంపు ఆన్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇదీ సీఎం రేవంత్ టూర్ షెడ్యూల్... ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 2.15 గంటలకు మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామానికి చేరుకుంటారు. 2.45 గంటలకు ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. 3 గంటలకు అక్కడినుంచి బయలుదేరి దేవాదుల ప్రాజెక్టుకు 3.30 గంటలకు చేరుకుంటారు. 5 గంటల వరకు ప్రాజెక్టుపై రివ్యూ నిర్వహిస్తారు. అనంతరం నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డితో కలిసి హెలికాప్టర్లో తిరుగు పయనమై హైదరాబాద్ చేరుకుంటారు. ప్రాజెక్టు పంపుహౌస్లకు నేతల తాకిడి నిన్న బీఆర్ఎస్ నేత హరీశ్, మాజీ ఎమ్మెల్యేల బృందం నేడు సీఎం రేవంత్రెడ్డి రాక.. గంగారం వద్ద పనుల పరిశీలన అనంతరం దేవాదుల ప్రాజెక్టుపై సమీక్ష ఎట్టకేలకు ఒక మోటార్ను ఆన్ చేసిన అధికారులుదేవన్నపేట వద్ద నీళ్లు ఎత్తిపోస్తున్నారు -
రేపు కేంద్ర బృందం పర్యటన
జనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై రేపు (సోమవారం) కేంద్ర బృందం జిల్లా పర్యటించనుందని కలెక్టర్ రిజ్వాన్బాషా తెలిపారు. శనివారం అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి గుగూల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 48 కేంద్ర పథకాల అమలును సమగ్రంగా పరిశీలించేందుకు కేంద్ర బృందం పర్యటించనుందని, ఇప్పటివరకు అందించిన పథకాల పురోగతి, పూర్తి వివరాలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు, రైస్ మిల్లర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులను నేరుగా కలుస్తారన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వసంత, జిల్లా వ్యవసాయ అధికారి అంబిక సోని తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కోదండరాములు ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ట్రాన్స్జెండర్స్కు ఉపాధి పునరావాస పథకం కింద చెక్కులు పంపణీ చేశారు. -
వేగంగా జరుగుతోంది..
జిల్లాలో రైతుల వారీగా యూనిక్ కోడ్ నంబర్ కేటాయింపుల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. సుమారు 60శాతం వరకు యూనిక్ కోడ్ నంబర్లను కేటాయించగా, రోజు వారీగా పనులు జరుగుతున్నాయి. భవిష్యత్లో యూనిక్ కోడ్ ఆధారంగా వ్యవసాయానికి సంబంధించిన ప్రతీ సంక్షేమ కార్యక్రమం దీని ద్వారా జరుగుతుంది. ప్రతీ రైతుకు ఒక యూనిక్ కోడ్ నంబర్ వస్తుంది. – రిజ్వాన్ బాషా, కలెక్టర్ జనగామ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతులందరికీ ఒకే గుర్తింపు, ఒకే నంబర్ నినాదంతో ప్రత్యేక యూనిక్ కోడ్ నంబర్ను కేటాయించే విధానాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా పట్టాదారు పాస్బుక్ ఆధారంగా యూనిక్ కోడ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లాలోని మొత్తం 12 మండలాల్లో రిజిస్ట్రేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పలు మండలాలు 60 శాతానికి పైగా నమోదు పూర్తి చేసి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ మంచి ర్యాంకులు దక్కించుకుంది. దేవరుప్పుల, నర్మెట, చిల్పూరు మండలాలు ముందంజలో ఉండగా, రిజిస్ట్రేషన్ లక్ష్యాన్ని మించిన వేగంతో పనిచేస్తున్నాయి. ప్రతీ రైతుకు యూనిక్ కోడ్ నంబర్ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతులందరికీ ప్రత్యేక యూనిక్ కోడ్ నంబర్ కేటాయించే విధానాన్ని తీసుకురావడంతో భవిష్యత్లో అన్ని వ్యవసాయ కార్యక్రమాలు వ్యవసాయ యాంత్రీకరణ, పంట ప్రోత్సాహకాలు, ఎరువుల సబ్సిడీలు, విత్తనాలు, పంట బీమా, పీఎం కిసాన్, రైతు బీమా, వ్యవసాయ అనుబంధ పథకాలు ఒక్క యూనిక్ కోడ్ నంబర్ ద్వారానే అమలుకానున్నాయి. దీంతో ప్రతీ రైతు వివరాలు సమగ్రంగా ప్రభుత్వ డిజిటల్ డేటాబేస్లో చేరి, పథకాలు పారదర్శకంగా, వేగవంతంగా చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యూనిక్ కోడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతుండగా, జనగామ జిల్లా 12 మండలాల్లో రిజిస్ట్రేషన్ శాతం 63 శాతం దాటగా, ఓవరాల్గా 58.40 శాతం పూర్తయింది. దేవరుప్పుల, నర్మెట, చిల్పూరు, తరిగొప్పుల మండలాలు 60శాతానికి పైగా న మోదు సాధించగా, పాలకుర్తి, రఘునాథపల్లి, బచ్చన్నపేట, జనగామ తదితర మండలాల్లో కూడా మంచి పురోగతి కనిపిస్తోంది. అయితే జిల్లాలో ఇంకా సుమారు 40 శాతానికి పైగా పీపీబీ (పట్టాదారు పాస్బుక్)లకు రిజిస్ట్రేషన్ జరగాల్సి ఉంది. వందశాతం వైపు పరుగులు మండల వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో వ్యవసాయ సిబ్బంది ఇంటింటా పర్యటిస్తూ రైతుల వివరాలను సేకరిస్తున్నారు. ఆధార్, బ్యాంక్ అకౌంట్, భూమి వివరాలు, పంట సాగు సమాచారం వంటి వాటిని ఒకే ప్లాట్ఫామ్లో సమీకరించడంతో రైతుకు భవిష్యత్లో ఎలాంటి పథకమైనా ఈ యూనిక్ కోడ్ ద్వారా నేరుగా అందుబాటులోకి రానుంది. రాబోయే వారాల్లో మిగిలిన పీపీబీల రిజిస్ట్రేషన్లు పూర్తిచేసి జిల్లాను వందశాతం వైపు తీసుకెళ్లాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతుకు ‘ఒకే గుర్తింపు, ఒకే నంబర్’ అనే నినాదంతో యూనిక్ కోడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం గ్రామాల్లో చైతన్యాన్ని పెంచుతోంది. జిల్లాలో 1,98,360 పీపీబీలు జిల్లాలో పట్టాదార్ పాస్ పుస్తకాలు 1,98,360 ఉండగా, ఇప్పటి వరకు 1,15,830 యూనిక్ కోడ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం రిజిస్ట్రేషన్ల శాతం 58.40శాతం పూర్తి కాగా, త్వరలోనే వందశాతం లక్ష్యం చేరుకోనున్నారు. రైతు సంక్షేమానికి కేంద్రం కీలక అడుగు భవిష్యత్ వ్యవసాయ డిజిటలైజేషన్కు మార్గం జిల్లాలో 60 శాతం పూర్తి ఒక్కకోడ్తోనే అన్ని సేవలు మూడు మండలాల్లో ముందంజమండలం పట్టాదారు పూర్తయిన శాతం పాస్పుస్తకాలు రిజిస్ట్రేషన్లు దేవరుప్పుల 18,127 11,491 63.39 నర్మెట 11,198 7,063 63.07 చిల్పూరు 13,920 8,698 62.49 తరిగొప్పుల 8,795 5,432 61.76 కొడకండ్ల 10,609 6,504 61.31 స్టేషన్ఘన్పూర్ 15,443 9,312 60.30 పాలకుర్తి 24,118 14,129 59.79 రఘునాథపల్లి 22,348 13,129 58.75 బచ్చన్నపేట 19,270 10,840 56.25 జఫర్గఢ్ 18,488 9,233 49.93 జనగామ 18,370 10,141 55.20 లింగాలఘణపురం 17,674 9,566 54.12 మొత్తం 1,98,360 1,15,830 58.40 -
రేపటి నుంచి కొమ్మాల బ్రహ్మోత్సవాలు
గీసుకొండ: జిల్లాలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి వచ్చే నెల మార్చి 9 వరకు వైభవంగా జరగనున్నాయి. సోమవారం ఉదయం 8 గంటలకు అధ్యయనోత్సవం ప్రారంభం, 24న సాయంత్రం ప్రబంధ సేవాకాలం, 25న రాత్రి పరమపదోత్సవం, 26న అంకురారోహణం, రక్షాబంధనం, దీక్షావస్త్రధారణ, అగ్ని ప్రతిష్ఠ తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, ఈఓ ప్రసాద్ తెలిపారు. 27న రాత్రి 10 గంటలకు అమ్మవార్లు శ్రీదేవి, భూదేవితో స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. 28 నుంచి మార్చి 2 వరకు ప్రత్యేక పూజలు ఉంటాయని చెప్పారు. మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7.30 వరకు దేవాలయాన్ని మూసి వేస్తామని, రాత్రి 8 గంటల తర్వాత జాతర, బండ్లు తిరగడం, దర్శనాలు ఉంటాయని వివరించారు. మార్చి 7న స్వామివారి రథోత్సవం, ఉగాది వరకు జాతర కొనసాగుతుందని పేర్కొన్నారు. -
‘పది’లంగా ౖపైపెకి!
రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానమే లక్ష్యంగా ప్రణాళికప్రత్యేక తరగతులను బోధిస్తున్న ఉపాధ్యాయుడుటీశాట్లో పాఠాలు వింటున్న విద్యార్థులు జనగామ రూరల్: టెన్త్లో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కలెక్టర్ విద్యాశాఖ సమన్వయంతో వినూత్న కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. కలెక్టర్ ‘విజయోస్తు’ అనే కార్యక్రమాన్ని చేపట్టడంతో గత సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 98.16 శాతంతో జిల్లా 3వ స్థానంలో నిలిచింది. 2024–25లో 4వ స్థానంలో నిలిచింది. కాగా 2025–26 సంవత్సరంలో వచ్చిన స్థానాన్ని మరింతగా మెరుగుపర్చుకునేందుకు తాజాగా విజయోస్తు 2.0 ,ప్రేరణ, అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి అమలు చేస్తున్నారు. ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులకు బాధ్యతలు కేటాయించి గూగూల్ మీట్ ద్వారా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. దీనికి తోడు టీశాట్ ద్వారా రోజూ ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు ప్రసారమయ్యే కార్యక్రమంలో ప్రత్యేక పాఠాలను విషయనిపుణులతో బోధించారు. ఇప్పటికే భౌతిక, జీవశాస్త్రం, ఇంగ్లిష్, హిందీ, బోధన, గణితం, తెలుగు, సాంఘిక శాస్త్రం, ఉర్దూ భాషలో గణిత, భౌతిక, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రాల పట్టు సాధించారు. జిల్లా వ్యాప్తంగా 183 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో 2025–26విద్యా సంవత్సరానికి పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు 6,442 మంది ఉన్నారు. ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో ముందుకు.. గతేడాది వచ్చిన ఫలితాలను దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ విద్యాశాఖ అఽధికారులు ఈఏడాది యాక్షన్ ప్లాన్ రూపొందించారు. కలెక్టర్ నిత్యం పర్యవేక్షిస్తూ పాఠశాలల్లో అమలవుతున్న కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఎస్ఏ 1 పరీక్షల అనంతరం కలెక్టర్ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఏబీసీడీలుగా విద్యార్ధులను వర్గీకరించి సీ, డీ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సబ్జెక్ట్ వారీగా వారికి వచ్చే సమస్యలు నివృత్తి చేస్తున్నారు. పూర్తిగా వెనుకబడిన విద్యార్థులకు కనీసం ఉత్తీర్ణత సాధించడానికి ప్రశ్నల వారీగా ప్రిపరేషన్ చేస్తున్నారు. అలాగే పరీక్షల సమయంలో మూడు నుంచి నాలుగు రోజులు సమయం వస్తుండడంతో విద్యార్థులు ఉన్న మూడు రోజులు కూడా పాఠశాలకు రావాల్సి ఉంటుంది. వారికి ఎలాంటి అంశాలు బోధించాలనే అంశాలను ఉపాధ్యాయులకు తెలియజేశారు. అలాగే 14 రోజల యాక్షన్ ప్లాన్లో భాగంగా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ప్రధానంగా విద్యావిషయక అంశాలను తెలియజేయడం, పునఃశ్చరణ, సాధనపై దృష్టి పెట్టాలి. గతేడాది జిల్లాకు మూడోస్థానం పక్కాగా విజయోస్తు 2.0, ప్రేరణ పేరుతో కార్యక్రమాలు వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వందశాతం ఉత్తీర్ణత దిశగా అధికారుల కృషి సత్ఫలితాలపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ చొరవప్రస్తుతం నిర్వహించే ప్రత్యేక తరగతుల్లో రెండు నుంచి మూడు ముఖ్యమైన భావనలను వివరించాలి. స్వయంగా చదవడం, రాత సాధన, ఉపాధ్యాయుడి మార్గదర్శకత్వం ఉండాలి. 20 నిమిషాల పాటు సబ్జెక్టు ఉపాధ్యాయులతో భావనలపై పూర్తి వివరణ, 40 నిమిషాల పాటు సాధన ఉండాలి. రెగ్యులర్ తరగతిలో ప్రతిరోజు కనీసం మూడు ప్రశ్నలకు సమాధానం రాసేలా సాధన చేయించాలి. మూడేళ్లుగా పరీక్ష ప్రశ్నపత్రా లను విశ్లేషించాలి. సమాధానాల్లో విద్యార్థుల తప్పులను గుర్తించి వివరించాలి. వార్షిక పరీక్షలకు మధ్య విరామ రోజుల్లో ఏం చేయాలనే కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్నారు. ఆయా రోజుల్లో సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి.సమాధాన పత్రాలను ఆలస్యం చేయకుండా మూల్యాంకనం చేపట్టి విశ్లేషణ చేయాలి. ప్రశ్నల వారీగా అంచనా. సమాధాన పత్రాలను రాసే సరైన విధానం.. విద్యార్థులు సాధారణంగా చేసే తప్పులను వివరించాలి. మూల్యాంకనం చేసిన విద్యార్థుల సమాధాన పత్రాలను వారి తల్లిదండ్రులకు పంపించాలి. విద్యార్థి ప్రగతిపై వారికి అవగాహన కల్పించాలి. అలాగే ప్రీఫైనల్ పరీక్షల అనంతరం ఉత్తీర్ణత కాని, సగటు మార్కులు తెచ్చుకున్న, మంచి ప్రగతిని చూపిన విద్యార్థులకు అనుగుణంగా విద్యా వ్యూహాలను అమలు చేయాలి. -
తనిఖీ బృందాలు వచ్చేస్తున్నాయ్!
జనగామ: జిల్లాలో 2025–26 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ విద్యారంగం పర్యవేక్షణ మరింత బలోపేతం చేస్తూ జిల్లా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత స్థాయిల్లో జిల్లాస్థాయి ఇన్స్పెక్షన్ టీమ్ (తనిఖీ బృందాలు)లను ఏర్పాటు చేస్తూ సర్కారు గతంలోనే ఉత్తర్వులు వెలువరించింది. రాష్ట్ర డైరెక్టర్ ఆదేశాలు, కలెక్టర్ ఆమోదంతో స్క్రూ టినీ కమిటీ పరిశీలన అనంతరం టీచర్ల తుది జాబితా విడుదల చేశారు. జిల్లాలో 103 ఉన్నత, 64 ప్రాథమికోన్నత, 348 ప్రాథమిక పాఠశాలకు టీమ్లు కేటాయించగా, నోడల్ ఆఫీసర్లతో సహా పూర్తిస్థాయి సభ్యులు విధుల్లోకి దిగనున్నారు. రిపోర్టులు, రీ–ఇన్స్పెక్షన్లు తప్పనిసరి చేస్తూ డీఈఓ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను అనుసరించి టీచర్ల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఈ టీంలకు తుది ఆమోదం లభించింది. ఉపాధ్యాయుల అర్హత, అనుభవం, సేవా రికార్డుల పరిశీలన వంటి ప్రమాణాల ఆధారంగా జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తుది జాబితా విడుదల జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలపై నిత్య పర్యవేక్షణ, రీ–ఇన్స్పెక్షన్లు ఫాలోఅప్ల కోసం రూపొందించిన హైస్కూల్, ఉన్నత ప్రాథమిక, ప్రాథమిక స్థాయి టీమ్ల పూర్తి వివరాలు స్పష్టం చేశారు. హైస్కూల్ స్థాయిలో 103 పాఠశాలలకు టీమ్లను ఏర్పాటు చేశారు. నోడల్ ఆఫీసర్ బి.రఘుజీ (ఉన్నత, ఇప్పగూడెం, స్టేషన్ఘన్పూర్), బి.రాంబాబు (ఉన్నత, లింగంపల్లి, చిల్పూర్), ఎం.శ్రీనివాస్ (ఉన్నత, ఇప్పగూడెం, స్టేషన్ఘనపూర్), బి.శ్రీకాంత్ (ఉన్నత, స్టేషన్ఘన్పూర్), ఎస్.సత్తయ్య(ఉన్నత, గానుగుపహాడ్, జనగామ), బి.రాజిత కుమారి (ఉన్నత, దేవరుప్పుల), పి.కిషనన్కుమార్ (ఉన్నత, రాజవరం, చిల్పూర్), డాక్టర్ ఎం. సుభాష్ (ఉన్నత, పెంబర్తి, జనగామ), టి.వెంకటేశ్వర్లు (ఉన్నత,ఛాగల్, స్టేషన్ఘన్పూర్) వీరు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విధులు నిర్వర్తించనున్నారు. ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలల ఇన్స్పెక్షన్ టీమ్ల పరిధిలో 64 యూపీఎస్, 348 పీఎస్లు ఉన్నాయి. ఇందులో నోడల్ ఆఫీసర్ కె.నర్సింహారావు (ఉన్నత, కట్కూరు, బచ్చన్నపేట), సభ్యులు టి.హరిప్రసాద్ (యూపీఎస్, గుమ్మడివెల్లి, లింగాలఘన్పూర్), ఎం.రాఘవులు(యూపీఎస్, నేలపోగుల, లింగాలఘన్పూర్), ప్రాథమిక పాఠశాలల పరిఽధిలో 111 స్కూళ్లకు గాను ఒక టీమ్ ఏర్పాటు చేశారు. ఇందులో నోడల్ ఆఫీసర్గా ఎం.రమేశ్బాబు (పీఎస్, అంబేడ్కర్నగర్, జనగామ), పి.సతీష్బాబు(పీఎస్, రైల్వేస్టేషన్, జనగామ), ప్రాథమిక పాఠశాలల ఇన్స్పెక్షన్ రెండో టీంలో నోడల్ ఆఫీసర్ బి.రమేశ్(పీఎస్, కడవెండి, దేవరుప్పుల), ఎన్.జయపాల్రెడ్డి(పీఎస్, బానాజీపేట, రఘునాథపల్లి)ని ఎంపిక చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పర్యవేక్షణ 2025–26 విద్యా సంవత్సరానికి నియామకం టీచర్ల రిలీవింగ్పై ఎంఈఓ, హెచ్ఎంలకు ఆదేశాలు -
రోడ్డెక్కిన హోర్డింగ్లు!
జనగామ: పట్టణంలో ఎక్కడ చూసినా ఎంక్రోచ్మెంట్లు, ఫుట్పాత్ ఆక్రమణలు, రోడ్లపై ప్రచార హోర్డింగ్లతో దారులన్నీ కుదించుకుపోతుంటే మునిసిల్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. పట్టణంలో కృష్ణకళామందిర్ గల్లీలో షాపింగ్మాల్స్, ఆయా దుకాణాల నిర్వాహకులు రోడ్డుపైనే ప్రచార హోర్డింగ్ల ఏర్పాటు చేశారు. దారిని ఆక్రమించేస్తూ, బాటసారులు, వాహన చోదకులు వెళ్లే పరిస్థితి లేకుండా ఆర్చీలు, మినీ బోర్డులను రోడ్డుపైనే పెట్టేసి దర్జా వెలగబెడుతున్నారు. నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతూ ఇబ్బందులు ఎదురవుతున్నా పురపాలిక అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొట్టకూటి కోసం చిరు వ్యాపారులు రోడ్డుపై అమ్ముకుంటే జబర్దస్త్ చేసే అధికారులు, రోడ్లపైనే హోర్డింగ్లను ఏర్పాటు చేసి దారులన్నీ మూసుకుపోయేలా చేస్తున్న వారిని ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. -
టేబుల్ టెన్నిస్లో సీపీకి కాంస్య పతకం
వరంగల్ క్రైం: సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా నిర్వహిస్తున్న నాలుగో రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో టేబుల్ టెన్నిస్ గెజిటెడ్ అధికారుల విభాగంలో వరంగల్ పోలీ స్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నారు. అదేవిధంగా 55 ఏళ్ల గె జిటెడ్ అధికారుల బ్యాడ్మింటన్ విభాగంలో వ రంగల్ కమిషనరేట్కు చెందిన ఏసీపీలు జితేందర్రెడ్డి, మధుసూదన్ జోడీ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని సాధించారు. కమిషనరేట్ హాకీ జట్టుకు కాంస్య పతకంరామన్నపేట: హైదరాబాద్లో జరుగుతున్న రా ష్ట్ర పోలీసుల తెలంగాణ స్టేట్ నాలుగో మీట్లో కమిషనరేట్కు చెందిన హాకీ జట్టు మూడో స్థానంలో నిలిచినట్లు సీపీ సన్ప్రీత్ సింగ్ తెలి పారు. ఆర్ఐ ఉదయభాస్కర్ నాయకత్వంతో పాల్గొన్న ఈ జట్టు కాంస్య పతకం సాధించినట్లు పేర్కొన్నారు. పలు విభాగాల్లో కమిషనరేట్ పోలీసులు క్రమశిక్షణ, శారీరక దారుఢ్యంతో ముందంజలో ఉన్నట్లు వివరించారు. కలెక్టర్కు ఆహ్వానపత్రికచిల్పూరు: ఈనెల 23 నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించనున్న చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హాజ రుకావాలని శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్కు ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న ఆహ్వాన పత్రిక అందించారు. శుక్రవారం అర్చకులు రవీందర్శర్మ, కృష్ణమాచార్యులు, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్తో కలిసి ఆమె జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు అడిషనల్ కలెక్టర్ పింకేశ్కుమార్కు అనంతరం డీసీపీ రాజమహేంద్రనాయక్కు బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలికారు. ‘ఉద్యం’తో నిరుద్యోగులకు ప్రయోజనాలుదేవరుప్పుల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందేందుకు ఉద్యం నమోదు ప్రక్రియతో నిరుద్యోగులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శివకృష్ణ ఠాగూర్ సూచించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల కేంద్రం– జనగామ, వ్యవస్థాపకత అభివృద్ధి కేంద్రం జనగామ ఆధ్వర్యంలో ఉద్యం రిజిస్ట్రేషన్న్పై ఎంపీడీఓ మేనక పౌడేల్ అధ్యక్షతన ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతీ, యువకులు, మహిళలు వ్యక్తిగతం మొదలుకొని కుటీర పరిశ్రమలు నెలకొల్పాలన్నా ఉద్యం పోర్టల్ నమోదు చేసుకోవాలన్నారు. అప్పుడే రుణమంజూరుతో పాటు రాయితీలు పొందుతారన్నారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు కె.శ్రీనివాస్, ఎస్.మూర్తి, ఈడీసీ మేనేజర్ చీటూరి సతీష్, అసిస్టెంట్ మేనేజర్ వడ్లూరి ఫిలిప్, సూపరింటెండెంట్ పుష్పలత పాల్గొన్నారు. విద్యార్థి దశలో పదో తరగతి కీలకం స్టేషన్ఘన్పూర్: విద్యార్థి దశలో పదో తరగతి అత్యంత కీలకమని, విద్యార్థులు కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించాలని డీసీఈబీ సెక్రెటరీ చంద్రభాను అన్నారు. ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో నిర్వహిస్తున్న పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఆయన వెంట ఏసీజీ రవికుమార్ ఉన్నారు. -
మోడల్ మున్సిపాలిటీగా ఘన్పూర్
స్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయడమే అందరి లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ మొదటి పాలకవర్గం సర్వసభ్య సమావేశాన్ని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిఽథులుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హాజరయ్యారు. సమావేశంలో పట్టణాభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల అభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలపై ఎక్కువ దృష్టి సారించాలని, 2050 సంవత్సరపు అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాపై డీటేయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును రూపొందించాలని అధికారులకు సూచించారు. మున్సిపాలిటీకి మంజూరైన రూ.50కోట్ల పనులకు సంబంధించి మార్చి మొదటి వారం నాటికి అన్ని అనుమతులు తీసుకుని టెండర్లు పూర్తి చేసి పనులను ప్రారంభించాలని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు రాలేదని తన దృష్టికి వచ్చిందని, ఈనెల 23న(సోమవారం) 3 నెలల వేతనాలు అందిస్తామని, రానున్న రెండు మూడు నెలల్లో కార్మికుల పెండింగ్ వేతనాలు పూర్తిస్థాయిలో వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా అందరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. వార్డులలో ప్రజల అవసరాలను గుర్తించి ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పింకేశ్కుమార్, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, మేనేజర్ సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోందని, రైతులపై ఆర్థిక భారం తగ్గించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. స్టేషన్ఘన్పూర్ పట్టణ కేంద్రంలోని రైతువేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా డీఆర్డీఏ ఆధ్వర్యంలోమహిళా సంఘాలకు సబ్సిడీపై అందించిన చేపల విక్రయ మొబైల్వ్యాన్ను ప్రారంభించారు. ఏఓ చంద్రన్కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథి ఎంపీ కావ్య మాట్లాడారు.. వ్యవసాయ యాంత్రీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయన్నారు. మారుతున్న పరిస్థితులను అనుగుణంగా రైతులు వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతులను పాటించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సబ్సిడీ వ్యవసాయ పరికరాలు జిల్లాకు 3,320 మంజూరు కాగా అందులో అత్యధికంగా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గానికి 1,600 యూనిట్లు మంజూరయ్యాయని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పింకేష్కుమార్, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికాసోని, డీఆర్డీఏ పీడీ వాసంతి, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, చైర్మన్ వినయ్కుమార్, వైస్ చైర్మన్ రాజమ్మగట్టయ్య, మారపాక రాములు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. తొలి పాలకవర్గ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరైన ఎంపీ కావ్య, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
పన్నులు వందశాతం వసూలు చేయాలి
జనగామ: జనగామ పురపాలిక పరిధిలో మార్చి 31వ తేదీ వరకు ఇంటి, నల్లా పన్నులు వందశాతం వసూలు చేయాలని కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఆదేశించారు. గురువారం మున్సిపల్ కమిషనర్ చాంబర్లో అన్ని శాఖలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో 15,818 అసెస్మెంట్లు ఉండగా, రూ.6.10కోట్ల మేర డిమాండ్ ఉందన్నారు. ఇందులో ఇప్పటివరకు రూ.2.70కోట్లు వసూలు కాగా, ఇంకా రూ.3.45 కోట్లు బాకీ ఉందన్నారు. అలాగే 13,806 నల్లా కనెక్షన్లు ఉండగా, డిమాండ్ రూ.2.90కోట్ల మేర వసూలు కావాల్సి ఉందన్నారు. ఇందులో రూ.19.78లక్షల వరకు వసూలు కాగా, ఇంకా రూ.2.70కోట్ల మేర రావాల్సి ఉందన్నారు. సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ వెళ్లి వచ్చే నెల 31వ తేదీలోపు వందశాతం బాకీలు క్లియరెన్స్ చేయాలన్నారు. పట్టణ ప్రజలు సకాలంలో ఇంటి, నల్లా పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలన్నారు. వచ్చే నెల 31 వరకు డెడ్లైన్ సమీక్షలో కమిషనర్ మహేశ్వర్రెడ్డి -
భద్రకాళి అమ్మవారికి చీర బహూకరణ
హన్మకొండ కల్చరల్: వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి అమ్మవారికి గురువారం వేదుమ ఫ్యాబ్రిక్ హౌజ్ తయారుచేసిన కస్టమైజ్డ్ ఆర్ట్ డిజైన్ చీరను బహూకరించారు. చీరపై హ్యాండ్ ఆర్ట్తో అమ్మవారి ప్రతిరూపాన్ని అందంగా ప్రతిబింబించారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి సంస్థ యజమానులు ఓరుగంటి కార్తీక్, మోర రవళి అందజేసిన చీరను అమ్మవారికి అలంకరించారు. సేవాలాల్ జయంతి ఉత్సవాలను చేపట్టాలి స్టేషన్ఘన్పూర్: ఈనెల 24న ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో నిర్వహించనున్న గిరిజనుల ఆరాధ్యదైవం సంత్సేవాలాల్ జయంత్యోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఘన్పూర్ ఆర్డీఓ డీఎస్ వెంకన్న సూచించారు. సంత్సేవాలాల్ జయంతి నియోజకవర్గ స్థాయి ఉత్సవాల నిర్వహణపై స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి ఆర్.ప్రేమలత, బంజారా కమిటీ సభ్యులతో గురువారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక పద్మావతి ఫంక్షన్హాల్లో ఉత్సవాలను చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సహాయ గిరిజనాభివృద్ధి అధికారి హసీనాబేగం, ట్రైనీ జిల్లా పంచాయతీ అధికారి ఎ.నవీన్, తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, రవీందర్, సదానందం, విజయ్కుమార్, భిక్షపతినాయక్, స్వామినాయక్, కొమురెల్లినాయక్, హుస్సేన్నాయక్ తదితరులు పాల్గొన్నారు. మద్యపాన నిషేధం కోసం సామూహిక సంతకాలు దేవరుప్పుల: మండలంలోని బంజర గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని గ్రామస్తులు సామూహిక సంతకాలు సేకరించారు. స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు సర్పంచ్ ధరావత్ చిరంజీవి, ఉపసర్పంచ్ జోగు నాగయ్య, వార్డు సభ్యులు కలిసి ఎకై ్సజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్కు పంచాయతీ పాలకవర్గం పక్షాన వినతి పత్రం అందించారు. ఈ విషయమై సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామస్తుల సామూహిక సంతకాల సేకరణతో మద్యపాన నిషేధం కోసం కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. సిబ్బందిని మారిస్తేనే అనుమతుల ప్రక్రియలో వేగంజనగామ: పాఠశాల విద్యాశాఖ నుంచి జిల్లా విద్యాధికారులు ప్రాంతీయ సంయుక్త డైరెక్టర్ల(ఆర్జేడీఎస్ఈ)కు ముఖ్యమైన సూచనలు జారీ చేశారు. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల స్థాపన, గుర్తింపు, పునరుద్ధరణ, సీబీఎసీ, ఐసీఎస్ఈ, ఐబీ తదితర బోర్డులకు అనుబంధం కోసం ఇచ్చే ఎన్ఓసీలను నిర్ణీత సమయంలో ఆన్లైన్ ద్వారా మాత్రమే పరిశీలించి ఫార్వర్డ్ చేయాలని, ఇప్పటికే సూచనలు ఇచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ (ఐఏఎస్) అందులో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు ఉన్నప్పటికీ డీఈఓ, ఆర్జేడీఎస్ఈ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ స్థాయిల్లో ఫైళ్ల పరిశీలనలో అనవసరమైన ఆలస్యం జరుగుతోందని ఆక్షేపించారు. ఒకే సిబ్బంది ప్రైవేట్ పాఠశాలల విభాగాన్ని నిరంతరం ఒక సంవత్సరానికి పైగా చూస్తుండడంతో ఆలస్యం పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల విభాగంలో ఒక సంవత్సరానికి పైగా పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లను వెంటనే మార్పు చేయాలని ఆదేశించారు. -
ధర్మం కోసం పోరాటం
● గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చిల్పూరు: పదహారు ఏళ్ల వయసులోనే కత్తి పట్టి సనాతన ధర్మాన్ని కాపాడేందుకు పోరాటం చేసిన మహావ్యక్తి ఛత్రపతి శివాజీ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కొనియాడారు. ముందుగా చిన్నపెండ్యాల గ్రామంలోని ఆర్చిగేట్ నుంచి రాజవరం గ్రామం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నా రు. గ్రామంలో బజరంగ్దళ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పా టు చేసిన శివాజీ విగ్రహాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా భజరంగ్ధళ్ సభ్యులు ఆయనకు కత్తి బహుకరించారు. -
పోర్టల్లో వివరాల నమోదు..
జనగామ వ్యవసాయ మార్కెట్లో ఈ నెల 23 నుంచి అన్ని వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రభుత్వం ఆధునికీకరించిన ఈ నామ్ 2.0 పోర్టల్ ద్వారా మాత్రమే నిర్వహిస్తారు. ఇప్పటివరకు ఉపయోగించిన ఈ నామ్ 1.0 వ్యవస్థకు బదులుగా కొత్త సౌకర్యాలు, ఆధునిక పద్ధతులు అమల్లోకి రానున్నాయి. రైతులు తప్పనిసరిగా ఈ నామ్ 2.0 పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. నమోదు అనంతరం రైతుకు ఒక ప్రత్యేక యూనిక్ ఐడీ కేటాయిస్తారు. ఈ ప్రత్యేక నంబర్తోనే దేశంలోని ఏ మార్కెట్లోనైనా రైతుల వివరాల ఆధారంగా అమ్మకాలు సాగుతాయి. యూనిక్ ఐడీ పొందిన రైతుల ఉత్పత్తులకే మార్కెట్లో లావాదేవీలకు అనుమతి ఉంటుంది. ఆడ్తి, ఖరీదు వ్యాపారులు ఈ నెల 21వ తేదీ లోపు ఈనామ్ 2.0లో తప్పనిసరిగా వివరాలు నమోదు చేసుకోవాలి. నమోదు సమయంలో లైసెన్స్ వివరాలు, ఫోన్ నంబర్, ఫొటో, నోడ్యూ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి. అప్రూవల్ పొందిన వ్యాపారుల వివరాలు మాత్రమే ఈ–నామ్ 2.0లో కనిపిస్తాయి. వారికే వ్యాపారానికి అనుమతి ఉంటుంది. -
రాష్ట్రస్థాయిలో టాప్లో నిలవాలి
జనగామ రూరల్: రానున్న పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లాలో టాప్లో నిలవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో ప్రధాన సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారి పింకేశ్ కుమార్తో కలిసి ఆయన శ్రీవిజయోస్తు 2.0శ్రీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..విజయోస్తు 2.0లో భాగంగా జిల్లాలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే ప్రతీ విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా పాఠశాల స్థాయిలో సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించి అమలుచేయాలని ఆదేశించారు. ప్రీ ఫైనల్, మాక్ టెస్ట్ల ఫలితాల ఆధారంగా విద్యార్థులను స్థాయివారీగా వర్గీకరించి బోధన నిర్వహించాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక రిమీడియల్ తరగతులు నిర్వహించాలని, ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులను దత్తత చేసుకొని వ్యక్తిగత పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశంలో ఏఎంఓ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలి జిల్లాలో వ్యవసాయరంగ అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాకు కేటాయించిన నిధులను ఈ నెలాఖరులోపు అర్హులైన రైతులకు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమంలో ప్రస్తుతం 60శాతం మాత్రమే పూర్తి అయిందని మిగిలిన రైతులు నమోదు చేసుకోవాలన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ విజయోస్తు 2.0పై సమీక్ష -
సనాతన పరిరక్షకుడు శివాజీ
కనుల పండువగా ఛత్రపతి జయంతి జనగామ: సనాతన ధర్మపరిరక్షకుడు ఛత్రపతి శివాజీ అని వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, బీజేపీ నాయకులు కొనియాడారు. శుక్రవారం రాత్రి పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతిని పురస్కరించుకొని శివాజీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ముక్క కుమారస్వామి, జిల్లా నాయకుడు బానోత్ అర్జున్ పిలుపు మేరకు రైల్వే స్టేషన్ నుంచి కాషాయ జెండాలతో భారీ ర్యాలీ ప్రారంభమైంది. ట్రాక్టర్పై శివాజీ మహారాజ్ విగ్రహం, ఆటోల్లో మైక్ సిస్టమ్తో ఊరేగింపు సాగింది. వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తలతో సహా వందలాది మంది హిందువులు పాల్గొనగా, పట్టణమంతా కాషాయమయంగా మారింది. రైల్వే స్టేషన్ నుంచి నెహ్రూ పార్క్ మీదుగా ఆర్టీసీ చౌరస్తా, అనంతరం సూర్యాపేట రోడ్డులోని శివాజీ విగ్రహం వద్దకు ర్యాలీ చేరింది. సీఐ సత్యనారాయణరెడ్డి పర్యవేక్షణలో ఎస్సైలు చెన్నకేశవులు, భరత్ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఆరుట్ల దశమంతరెడ్డి, దొంతుల శేఖర్, కొంతం శ్రీనివాస్ పాల్గొన్నారు.శివాజీ శోభాయాత్రలో పాల్గొన్న విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, బీజేపీ శ్రేణులుఈ–నామ్ మరింత ఫాస్ట్! -
కందుల ధర కిందికి
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్లో కందుల కొనుగోళ్లు జోరుగా జరుగుతున్నప్పటికీ ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాతో పాటు సూర్యాపేట, యాదాద్రి భు వనగిరి, పరిసర ప్రాంతాల నుంచి భారీగా కందులను ఇక్కడి మార్కెట్కు తీసుకొస్తున్నారు. ఇటీవల క్వింటాల్ కందుల ధర రూ.8,200 నుంచి 8,400 వరకు ఉండగా, ప్రస్తుతం ఒక్కసారిగా రూ.7,400 పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. 223 క్వింటాళ్ల కందుల కొనుగోళ్లు మార్కెట్ ఆశించిన మేర ట్రేడర్లు రాకపోవడంతో కొ నుగోళ్ల భారం కేవలం ఇద్దరు, ముగ్గురు వ్యాపారులపైనే పడుతోంది. దీంతో పోటీ తగ్గి ధరలు మరింతగా పడిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. గురువారం మార్కెట్లో 54 మంది రైతుల నుంచి 223 క్వింటాళ్ల (372 బ్యాగులు) కందులు కొనుగోలు చేశారు. రోజువారీ ధరల వివరాల ప్రకారం, అత్యధికంగా క్వింటాకు రూ.7,825, మధ్యరకంగా రూ.7,429, అత్యల్పంగా రూ.7,419 మాత్రమే పలికింది. తగ్గిన ధరలు.. ఇప్పటికే పంట దిగుబడి ఆశించినంతగా రాకపోగా, క్వింటాకు రూ.600 నుంచి రూ.900 మేర ధర తగ్గిపోవడం రైతులకు మరింత నష్టం కలిగిస్తోంది. కందులతో పాటు వేరుశనగ కూడా మార్కెటుకు వస్తున్నప్పటికీ, ధరల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు. కందుల ధర మరింత పడిపోకుండా అధికారులు జోక్యం చేసుకొని కనీసం రూ.8,400 వరకు ధర నిలబెట్టేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్కు వచ్చే ట్రేడర్ల సంఖ్య పెరిగితే ధర కూడా మెరుగయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. సమీప జిల్లాల్లో కందులకు ఎక్కువ ధర పలుకుతున్నప్పటికీ జనగామ మార్కెట్లో మాత్రం తక్కువ ధర రావడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. క్వింటాల్కు ధర రూ.600 నుంచి రూ.900 మేర తగ్గుముఖం ధర అత్యధికం రూ.7,429, అత్యల్పం రూ.7,419 ట్రేడర్లు తక్కువ.. సరుకు రాక ఎక్కువరెండుమూడు రోజుల క్రితం మార్కెట్లో కందులకు రూ.8 వేల వరకు ధర పలికింది. ఇప్పుడేమో క్వింటాల్కు రూ.600 తగ్గించారు. రెండున్నర ఎకరాల్లో కందులు సాగు చేస్తే, రూ.6వేల పెట్టుబడి కాగా, ఏడు క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ధర తక్కువైనా మార్కెట్లోనే అమ్ముకున్నా. – జూకంటి జమాల్, రైతు, కుర్రారం, రాజపేట మండలం, యాదాద్రిఒక ఎకరం 30 గుంటల్లో కందులు సాగు చేసిన. పెట్టుబడి ఖర్చు సుమారు రూ.5వేల వరకు వచ్చింది. 6 క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తుందనుకుంటే 4 క్వింటాళ్ల మాత్రమే వచ్చింది. అమ్ముకునేందుకు జనగామ మార్కెట్కు తీసుకొస్తే క్వింటాల్కు రూ.7,399 మాత్రమే ధర పలికింది. క్వింటాల్కు కనీసం రూ.8వేలు వచ్చినా బాగుండు. – ఐలేని రాములు, రైతు, శాతపురం, పాలకుర్తి -
కేసీఆర్ను జాతిపిత అనడం సిగ్గుచేటు
స్టేషన్ఘన్పూర్: మాజీ సీఎం కేసీఆర్ను తెలంగాణ జాతిపిత అనడానికి బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలని, దేశానికై నా, రాష్ట్రానికై నా ఒక్కరే జాతిపిత మహాత్మగాంధీ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటువ్యాఖ్యలు చేశారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో గురువారం వివిధ గ్రామాలకు చెందిన 28 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతులమీదుగా కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదని, సకల జనుల ఉద్యమ ఫలితంగా సిద్ధించిందన్నారు. ఇంకా ఎంత కాలం తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుంటూ రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, ఘన్పూర్ మున్సిపల్ చైర్మన్ వినయ్కుమార్, వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విజయశ్రీ, బెలిదె వెంకన్న, బూర్ల శంకర్, ఉపేందర్, కిషన్రాజ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అభివృద్ధికి పట్టంకట్టారు.. జఫర్గఢ్ : మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. తహసీల్దార్ రాజేష్రెడ్డి, సర్పంచ్ కుల్లా మోహన్రావు, సింగిల్ విండో మాజీ చైర్మన్ తీగల కర్ణాకర్రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంచాల ఎల్లయ్య, అన్నెబోయిన భిక్షపతి పాల్గొన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
కడియం ఖబడ్దార్
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ: కేసీఆర్పై స్టేషన్ ఘన్ఫూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమైనవని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఖండించారు. గురువారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. కడియం శ్రీహరి అంటే మోసానికి పర్యాయపదమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో దశాబ్దాలుగా ప్రజలను, నాయకులను మోసం చేస్తూ వస్తున్న వ్యక్తి అని ఆరోపించారు. కాంగ్రెస్ సభలో చేరిన శ్రీహరి గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ వంటి ప్రముఖులను వదిలి తిరుగుతూ రాజకీయ లాభాలు పొందిన ఊసరవెల్లి అంటూ విమర్శించారు. శ్రీహరికి రాజకీయ పునర్జీవనం కల్పించింది కేసీఆర్ అని, ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రి, ఎమ్మెల్యే పదవులు మాత్రమే కాక, ఆయన కుమార్తెకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చి గౌరవించినప్పటికీ, కేసీఆర్పై విమర్శలు చేయడం రాజకీయ నైతికత లేకపోవడమేనని వ్యాఖ్యానించారు. ప్రజలే శ్రీహరి రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతారన్నారు. -
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
జనగామ రూరల్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలకు పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులకు సూచించారు. బుదవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండారీ చేతన్ నితిన్తో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 25వ తేది నుంచి వచ్చే నెల16వ తేదీ వరకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వార్షిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 8,605 విద్యార్థులు పరీక్షలు హాజరుకానున్నారన్నారు. ఇందులో 4,211 ప్రథమ సంవత్సరం, 4,394 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. విద్యార్థులు సమస్యలను నివృత్తి చేసుకొనేందుకు కంట్రోల్ రూమ్ నెంబర్ 9550371371 కి ఫోన్ చేయవచ్చన్నారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జితేందర్ రెడ్డి , విద్యుత్, విద్యాశాఖ, మెడికల్, సంబంధిత శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు. పేదల అభ్యన్నతికి ప్రభుత్వం కృషి.. పేద మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శ్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ పని తీరు, ఆర్థిక ప్రణాళికలు, బ్యాంకు లింకేజీ రు ణాలపై బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించా రు. ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ వసంత, ఏపీడీ నూరిద్దిన్, జిల్లా సమైఖ్య అధ్యక్షులు, ఓబీ సభ్యులు, సీ్త్ర నిధి రీజినల్ మేనేజర్ ప్రమీల, అసిస్టెంట్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. వరదల సమయంలో జాగ్రత్తలు అకాల వర్షాలు విపత్కర పరిస్థితుల సమయంలో తీసుకోవలిసిన చర్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నా రు. హైదరాబాద్కు చెందిన 10వ బెటాలియన్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో బుధవారం నెల్లుట్ల చెరువు వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, ఆర్డీఓ గోపిరామ్, ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ ముఖేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.రోడ్డు ప్రమాదాల మాదక ద్రవ్యాల వినియోగ నివారణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో రోడ్డు భద్రత, మాదక ద్రవ్యాల వినియోగ నివారణ మీద తీసుకున్న చర్యలపై సంబంధిత అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలిసి సమీక్షించారు. జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
చిన్నవేం కాదు!
సమస్యలుకొత్త పాలకమండలిదే పరిష్కార బాధ్యతజనగామ: పట్టణాభివృద్ధిపై ప్రజల్లో నెలకొన్న ఆశలు నూతన మున్సిపల్ పాలకవర్గం భుజాలపై మరింత బాధ్యతను పెంచుతున్నాయి. ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న శానిటేషన్, చెత్తసేకరణ, రహదారుల దుస్థితి, డ్రెయినేజీ సమస్యలు రోజువారీగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వర్షం పడితే కాలనీలు వాగులను తలపించే పరిస్థితి నేపథ్యంలో కొత్త కమిటీపై పట్టణ ప్రజలు ఆశలు పెట్టుకుంటున్నారు. జ్యోతినగర్, జీఎంఆర్ కాలనీ, బాలాజీ నగర్, హౌసింగ్ బోర్డు, కురుమవాడ, గిర్నిగడ్డ, గోకుల్ నగర్, బాణాపురం, ప్రెస్టన్ ఏరియా శ్రీహర్ష రెసిడెన్సీ, శ్రీ దుర్గా కాలనీ, అమ్మబావి వంటి ప్రాంతాల్లో చెత్త సేకరణ క్రమం తప్పడంతో పారిశుద్ధ్యం పెరిగిపోయింది. మూసుకుపోయిన డ్రెయినేజీలు, నిండిన నాళాలు ప్రజలకు మేలు చేసేదానికి మించి ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. తాగునీటి సరఫరాలో కలుషిత సమస్య కూడా ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతోంది. ఆయా వార్డులకు నీటి సరఫరా సమయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో పారదర్శకత లోపించడం, సేవల్లో ఆలస్యం ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది. పురపాలక వ్యవస్థలో పబ్లిక్ సిటిజన్ సర్వీస్ సెంటర్, ఈ–ఆఫీస్, స్టేషనరీ కొరత వంటి అంశాలు కూడా తక్షణ పరిష్కారం కావాలి. పనిచేయని సిబ్బంది మీద కఠిన చర్యలు తీసుకోవడం, పనిభారాన్ని సమానంగా పంచడం వంటి సంస్కరణలు కొత్త పాలకవర్గం కోసం ఎదురుచూస్తున్నాయి. పట్టణంలో అక్రమ సెల్లార్లు, రోడ్లపై ఎంక్రోచ్మెంట్లు, అక్రమంగా ఏర్పాటు చేసిన ప్రచార బోర్డుల నియంత్రణపై కూడా చర్యలు తప్పనిసరి. మొత్తం మీద, మున్సిపల్ పరిపాలనను గాడిలో పెట్టి ప్రజ లకు మెరుగైన సేవలు అ ందించడంలో నూతన పాలకమండలి ఎదుర్కొనే పరీక్ష చిన్నది కాదు. నెహ్రూపార్కు ప్రాంతంలోని 60 ఫీట్ల రహదారి అభివృద్ధి, అమ్మబావి–గిర్నిగడ్డ చిన్నమోరికి శాశ్వత పరిష్కారం, ధర్మకంచ 14వ వార్డు(అంబేడ్కర్ నగర్)తో పాటు పలు ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి అత్యవసరం. అనేక కాలనీల్లో సీసీ రోడ్లు లేకపోవడంతో వానకాలం వచ్చేసరికి రవాణా కష్టసాధ్యమైపోతోంది. -
వైభవంగా అగ్నిగుండాలు
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మహా శివరాత్రి జాతర బ్రహ్మో త్సవాలు బుధవారం అగ్నిగుండాలు, మహా అన్నపూజ, పూర్ణహుతితో ముగిశాయి. చివరి రోజు ఆలయంలోని మెట్ల ఎదురుగా ఏర్పాటు చేసిన అగ్నిగుండాల్లో ఆలయ ఈఓ బాగం లక్ష్మీప్రసన్న నేతృత్వంలో తెల్లవారుజామున 4,30 గంటలకు స్వామివార్లను పల్లకిలో వాహనకారులు, భక్తులు నిప్పులపై నడిచి భక్తిపారవశ్యానికి లోనయ్యారు. అర్చకుడు దేవగిరి శ్యాంశర్మ, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రధాన అర్చకుడు దేవగిరి లక్ష్మన్న, అర్చకులు డీవీఆర్శర్మ, అనిల్కుమార్, నాగరాజు పాల్గొన్నారు. పూర్ణహుతితో ముగిసిన సోమన్న జాతర బ్రహ్మోత్సవాలు -
పెళ్లిసందడి మొదలు..
జనగామ: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెళ్లికళ సంతరించుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత నేటి (గురువారం) నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభమవుతుండడంతో కుటుంబాలు పండుగ జోరులో ఉన్నాయి. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి కార్యాలకోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాయి. జోరుగా వ్యాపారం.. పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో బంగారు, వెండివ్యాపార సంస్థలు, పూల దుకాణాలు, బ్యాండ్ బాజా, సన్నాయి మేళా బృందాలు, మేకప్ ఆర్టిస్టులు, పెళ్లిలతో సంబంధం ఉన్న చిన్నా, చిన్న వ్యాపారాల వరకు గిరాకీ బాగా పెరిగింది. ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్లు ముందుగానే బుక్ అయిపోవడంతో చివరి నిమిషంలో ముహూర్తాలు పెట్టుకున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొందరు పట్టణ పరిధిలో హాళ్లు దొరకకపోవడంతో దూర ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లను ఆశ్రయిస్తున్నారు. బడ్జెట్ ఖర్చుపై ఆలోచనలు.. ఈసారి పెళ్లిళ్లకు బడ్జెట్ మాత్రం కుటుంబాలను బాగా ఆలోచింపజేస్తోంది. బంగారం, వెండి ధరలు అంచనాలకు మించి పెరగడంతో సాధారణ, పేద, మధ్యతరగతి కుటుంబాలు గత ఏడాది వేసుకున్న అంచనాలు పెరిగి పోయాయి. దీంతో ఆభరణాల కొనుగోళ్లు సగానికి తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేటినుంచి శుభముహూర్తాలు రెండు నెలల్లో ముహూర్తాలు లిమిటెడ్ -
ఆర్టీసీకి కొమురవెల్లి ఆదాయం రూ.21లక్షలు
జనగామ రూరల్: మహాశివరాత్రి కొమురవెల్లి జాతర సందర్భంగా జనగామ నుంచి ప్రత్యేక బస్సులు నడిపినందుకు ఆర్టీసీకి రూ.21 లక్షల ఆదాయం లభించిందని ఆర్టీసీ డీఎం స్వాతి తెలిపారు. బుధవారం డిపోలో అధికారులు, సిబ్బందికి అభినందన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 14నుంచి 16 వరకు ప్రత్యేక బస్సులు 522 ట్రిప్పులతో 23,490 కిలోమీటర్లు తిప్పడం జరిగిందన్నారు. 22 వేల మంది ప్రయాణికులను చేరవేయగా ఆర్టీసీకి రూ.21.35 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. దీని కోసం కృషి చేసిన ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలిపారు. చిన్నారుల నైపుణ్య అంచనాకు శిక్షణజనగామ: రెండో తరగతి విద్యార్థుల పునాది నైపుణ్యాల అంచనాకు రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్ఎల్ఎన్(ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) సాంపిల్ స్టడీ నిర్వహించేందుకు ఎస్సీఈఆర్టీ కార్యాలయం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రమేశ్ ఆదేశాలు జారీ చేశారు. తెలుగు, ఉర్దూ, గణితం, ఇంగ్లిష్ విషయాల్లో విద్యార్థుల నేర్చుకునే స్థాయిని గుర్తించేందుకు 2025–26 విద్యాసంవత్సరానికి ఈ స్టడీ చేపడుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల పరిధిలోని పలు స్కూల్స్ను ఎంపిక చేశారు. డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్లకు నేటి(19వ తేదీ) నుంచి 20 తేదీల్లో రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనుండగా, 23, 24తేదీల్లో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ల శిక్షణ, 25, 27 తేదీల్లో నమూనా పాఠశాలల్లో ఫైనల్ అసెస్మెంట్ నిర్వహిచనున్నారు. జనగామ జిల్లాకు అవసరమైన తెలుగు ప్రావీణ్యం కలిగిన 51, ఉర్దూ ప్రావీణ్యం కలిగిన 2 అవసరమున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఎంపిక చేసిన వివరాలను గూగుల్ సీట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులో జిల్లాకు రూ.1.20 లక్షలు నిధులు కేటాయించారు. నేడు విద్యార్థి గర్జన సభజనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలలో ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని కోరుతూ ఈనెల 19న(గురువారం) ఉదయం 11 గంటలకు స్థానిక స్కాలర్స్ పాఠశాల క్రీడా మైదానంలో విద్యార్థి గర్జన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సాదిక్ ఫౌండేషన్ చైర్మన్ సాదిక్ అలీ తెలిపారు. ఈసందర్భంగా పట్టణంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి వాల్పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యా పరిరక్షణ సమితి కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్, ఎ.పి.టి.యఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నర్సింహా రెడ్డి, విద్యా పరిరక్షణ సమితి రాష్ట్ర బాధ్యులు, రాష్ట్ర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. వాటర్ప్లాంట్ ఆటో ఢీకొని చిన్నారి దుర్మరణంస్టేషన్ఘన్పూర్: మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులో ఐజల్ వాటర్ ప్లాంట్కు చెందిన ఆటో ఢీకొని చేపూరి మన్విత(2) అనే చిన్నారి బుధవారం సాయంత్రం మృతిచెందింది. గ్రామానికి చెందిన చేపూరి రమేశ్, అనూష దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. చిన్న కుమార్తె మన్విత. రమేశ్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాయంత్రం ఛాగల్లులోని ఎస్సీ కాలనీలో మినరల్ వాటర్ పోసేందుకు వచ్చిన ఐజల్ వాటర్ ప్లాంట్ ఆటో వాహనం ప్రమాదవశాత్తు ఇంటి ముందు ఆడుకుంటున్న మన్వితను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వినయ్కుమార్ తెలిపారు. -
కాంగ్రెస్ కౌన్సిలర్లను అరెస్ట్ చేయండి
● అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన జనగామ: పురపాలిక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో 8వ వార్డు దళిత కౌన్సిలర్ను ఓటు వేయకుండా అడ్డుకోవడమే కాకుండా దాడిచేసిన కాంగ్రెస్కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు చెంచారపు కరుణాకర్రెడ్డి, మారబోయిన పాండును వెంటనే అరెస్ట్ చేయాలని దళిత, గిరిజన మున్సిపల్ కౌన్సిలర్లు ఊడుగుల కిష్టయ్య, పానుగంటి సువార్త ప్రవీణ్, సజ్జ దుర్గప్రసాద్ డిమాండ్ చేశారు. దళిత మహిళా కౌన్సిలర్పై దాడికి నిరసనగా బుధవారం అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ చౌరస్తాలో నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతి చేసిన తర్వాత వారు మాట్లాడారు..చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో గూండాల్లాగా వ్యవహరించిన పాండు, కరుణాకర్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా, వెంటనే వారిని అరెస్ట్ చేయాలన్నారు. ఎస్సీ,ఎస్టీ కమిషన్లో సైతం ఫిర్యాదు చేయబోతున్నామన్నారు. కార్యక్రమంలో పసుల ఏబేలు, గద్దల నర్సింగరావు, కన్నారపు పరుశరాములు, మల్లిగారి రాజు, అనిత, తిప్పారపు విజయ్, కన్నారపు శివశంకర్, ఊడుగుల సాగర్, కందుకూరి ప్రభాకర్, తాళ్లపల్లి సురేష్, బొట్ల శంకర్, అనిల్, తోట సునీల్, కొమ్ము రాజు, బక్క సునీల్, గద్ద సాయికుమార్, గుజ్జిక రాజు, ఇరుగు యాకన్నతో పాటు కుల సంఘాలు, ఎమ్మార్పీఎస్, మాలమహానాడు నాయకులు పాల్గొన్నారు. -
కొత్త ఆశలతో ‘ఘన’స్వాగతం
రేపు నూతన పాలకవర్గం ప్రత్యేక సమావేశంఈ ఫొటోలో కనిపిస్తున్నది స్టేషన్ఘన్పూర్ రైల్వేగేటు సమీపాన ఉన్న వివేకానంద చౌరస్తా. ఘన్పూర్లో ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లేకపోవడంతో కూరగాయల వ్యాపారులు స్టేషన్ఘన్పూర్, శివునిపల్లి పట్టణాల్లో రోడ్లపైనే కూరగాయలను విక్రయిస్తున్నారు. దాంతో ట్రాఫిక్కు తీవ్ర సమస్యగా ఉంది. అదేవిధంగా కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చేవారు ఇష్టారాజ్యంగా రోడ్డుపైనే వాహనాలు నిలుపుతుండగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు షాపుల యజమానులు తమ షాపులకు చెందిన బోర్డులు, హోర్డింగ్లు రోడ్డుపైనే పెడుతుండగా రోడ్లు ఇరుగ్గా మారి సమస్య తీవ్రమవుతోంది.● మున్సిపాలిటీ అయినా మారని తీరు ● కంపు కొడుతున్న వార్డులు ● అధ్వానంగా రోడ్లు, డ్రెయినేజీలు ● పట్టణవాసుల ఆకాంక్షలు నెరవేరేనా!స్టేషన్ఘన్పూర్: కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ పాలకవర్గానికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గతేడాది మున్సిపాలిటీగా మారినా పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రెయినేజీలు తదితర సమస్యలు షరా మామూలుగానే ఉన్నాయి. ప్రధానంగా మార్కెట్, రోడ్ల సమస్య తీవ్రంగా ఉంది. ప్రత్యేకమైన సిబ్బందిని నియమించకపోవడంతో గతంలో పనిచేసిన పారిశుద్ధ్య సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. దాంతో ఏ వార్డులో చూసినా డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా ఉండి కాలనీలు కంపుకొడుతున్నాయి. రోడ్లపై మురుగునీరు పారుతుండగా దుర్వాసనతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. పలు కాలనీలు సీసీ రోడ్లకు నోచుకోక మట్టిరోడ్లకే పరిమితమయ్యాయి. మటన్, చికెన్ వ్యాపారులు, కూరగాయలు అమ్ముకునే వారు ఇష్టారాజ్యంగా రోడ్ల పక్కన వ్యర్ధాలు వేస్తుండగా ఆయా ఏరియాలు కంపుకొడుతున్నాయి. ప్రత్యేకమైన మార్కెట్ సౌకర్యం లేక రోడ్లపై కూరగాయల వ్యాపారులు విక్రయాలు జరుపుతుండగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. రోడ్లపై చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో కాలనీలు అస్తవ్యస్తంగా కనిపిస్తుండగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మున్సిపాలిటీలో సమస్యలతో సతమతమవుతున్నామని, కొత్తగా ఏర్పడిన పాలకవర్గం పరిష్కరించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.పారిశుద్ధ్య, ట్రాఫిక్ తదితర సమస్యలపై పలుమార్లు అధికారులు, సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. శివునిపల్లిలో డ్రెయినేజీల సమస్య తీవ్రంగా ఉంది. గతంలో పలువురు విషజ్వరాలతో ఇబ్బందులకు గురయ్యారు. పాలకమండలి మా సమస్యలను పరిష్కరిస్తుందని ఆకాంక్షిస్తున్నాం. – ఎండీ.దస్తగిరి, పట్టణవాసిస్టేషన్ఘన్పూర్ ఎస్సీ కాలనీలో పలు వార్డుల్లో డ్రెయినేజీలు అధ్వానంగా ఉండగా మురుగునీరు ఇండ్ల ముందు నిలుస్తోంది. దాంతో కాలనీల్లో పందులు, దోమల స్వైర విహారంతో దుర్వాసనతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య సమస్యపై నూతన పాలకమండలి చొరవ చూపాలి. – గుండె మల్లేష్, పట్టణవాసి -
ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం
● పట్టణాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతాం ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి జనగామ: ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనని, పట్టణంలోని 30 వార్డుల సమగ్రాభివృద్ధికే తన మొదటి ప్రాధాన్యమని మున్సిపల్ చైర్పర్సన్గా నూతనంగా ఎన్నికై న 22వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ కడకంచి బాలమణి తెలిపారు. మంగళవారం చైర్పర్సన్ ఎన్నిక అనంతరం సాక్షికి ఇచ్చిన ఇంటర్వూ ఆమె మాటల్లోనే.. అన్నివర్గాల అభివృద్ధే మా లక్ష్యం.. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, స్ట్రీట్లైట్లు అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికీ పరిమితం కాదు. ప్రతీ వార్డు సమాన హక్కులతో ముందుకు సాగాలని చూస్తాం. ప్రజలకు అందుబాటులో ఉంటా. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటా. ప్రముఖ నాయకుల మద్దతే బలం సీఎం రేవంత్రెడ్డి ప్రోత్సాహంతో పాటు నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరు ప్రతాపరెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, డీసీసీ, అన్ని వర్గాలు తీసుకువచ్చిన ఐక్యత నా విజయానికి దోహదపడింది. జనగామను రోల్ మోడల్గా చేస్తా.. పట్టణ అభివృద్ధి కోసం తక్షణ, దీర్ఘకాల ప్రణాళికలను తయారు చేస్తాం. చెత్త నిర్వహణలో స్మార్ట్ విధానం, డ్రైనేజీల పునర్నిర్మాణం, ప్రధాన రహదారుల పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెడతా. పచ్చదన పెంపునకు ప్రత్యేక కార్యక్రమాలు, మున్సిపల్ సేవల డిజిటలైజేషన్, పట్టణ ఆర్థిక వనరుల పెంపుకు కొత్త మోడల్ను తయారు చేస్తాం. పౌరసదుపాయాల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచుతాం. జనగామను ఇతర పట్టణాలకు ఆదర్శంగా నిలబెట్టడమే మా లక్ష్యం. అన్ని వర్గాల సహకారం అవసరం రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే. అభివృద్ధి ఐదు సంవత్సరాలు. అందువల్ల ప్రతీ వర్గం, ప్రతి పార్టీలోని ప్రజలూ కలిసి రావాలి. అభివృద్ధి కోసం ఏకాభిప్రాయం అత్యవసరం. చైర్పర్సన్ బయోడేటా: పేరు: కడకంచి బాలమణి వృత్తి: వ్యాపారం భర్త: కడకంచి శ్రీనివాస్ విద్య: గ్రాడ్యుయేషన్ పిల్లలు: కుమారుడు, కూతురు పుట్టిన ఊరు: ఉప్పల్ -
పట్టణం.. పోలీస్ వలయం
జనగామ: జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాతావరణం రెండో రోజూ బయట ప్రశాంతంగా, కౌంటింగ్ హాల్లో ఉద్రిక్తంగా కొనసాగింది. మొదటి రోజు చోటు చేసుకున్న ఉద్రిక్తతలు, ఘర్షణలు దృష్ట్యా పోలీసుశాఖ అప్రమత్తమై భారీ బందోబస్తు చేపట్టింది. డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో అదనపు బలగాలను జిల్లాకు తరలించి ప్రతి కీలక కేంద్రాన్ని పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. మున్సిపల్ కార్యాలయం, ఆర్టీసీ చౌరస్తా, నెహ్రూ పార్కు, ఆర్అండ్బీ అతిథి గృహం, హెడ్ పోస్ట్ఆఫీస్, గ్రీయిన్ మార్కెట్ రోడ్, రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎంట్రెన్సుల వద్ద బారికేడ్లు, అదనపు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రాజకీయ నాయకు లుగా అనుమానం ఉన్న ఎవరినీ కూడా లోపలికి అనుమతించలేదు. ఐడీ కార్డు ఉన్నవారిని మాత్రమే హాల్లోకి పంపేలా కఠిన నిబంధనలు అమల్లోకి అమలు చేశారు. అడుగడుగునా తనిఖీలు ఉదయం బీఆర్ఎస్ తరఫున వచ్చిన బస్సును ఆర్అండ్బీ అతిథి గృహం వద్దే డీసీపీ, ఏఎస్పీ పండేరి చేతన్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. అందులో ఉన్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో పాటు సభ్యుల భర్తలు, ఇతర కుటుంబ సభ్యులు బస్సు నుంచి దిగిన తర్వాతే కౌన్సిలర్లను లోనికి పంపించారు. అనంతరం ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన కాంగ్రెస్ బస్సును కూడా ఇదే తరహాలో తనిఖీ చేసి కేవలం కౌన్సిలర్లను మాత్రమే హాల్లోకి అనుమతించారు. ముందస్తు అరెస్ట్లు మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు పట్టణానికి రాకుండా పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కీలక నేతల్లో కొందరిని ముందుగానే నిర్బంధంలోకి తీసుకోవడంతో ఉద్రిక్తతలు మరింత తగ్గాయి. దీంతో బయట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అదుపులోకి వచ్చాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులపై కఠిన ఆంక్షలు నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణుల ముందస్తు అరెస్ట్ ఓటింగ్ హాల్ తప్ప, అంతటా ప్రశాంతం -
గ్రామ పాలనలో సర్పంచ్ల పాత్ర కీలకం
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ రూరల్: గ్రామ పంచాయతీ పాలనలో సర్పంచ్ల పాత్ర కీలకమని, ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను సర్పంచులు సద్వినియో గం చేసుకుని గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. చిల్పూర్, స్టేషన్ ఘన్పూర్, రఘునాథపల్లి, లింగాల ఘణపురం, జఫర్గఢ్ మండలాలకు చెందిన నూతనంగా ఎన్నికై న సర్పంచ్లకు మంగళవారం మండలంలోని క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు..తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని అంశాలను, విధి విధానాలను సర్పంచ్లు క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులను సక్రమంగా వినియోగించుకొని గ్రామాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ వసంత, ట్రైనీ డీపీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు. రైతు నమోదు తప్పనిసరి.. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా, సమర్థవంతంగా అర్హులైన వారికి నేరుగా చేరేందుకు రైతు నమోదు తప్పనిసరి చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు.వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడుతూ..పది రోజుల పాటు గ్రామాల్లో ప్రణాళిక ద్వారా ఈ ఫార్మర్ రిజిస్ట్రీని పూర్తిచేయాలని ఆదేశించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం లో భాగంగా జిల్లాకు కేటాయించిన రూ.2.73కోట్ల కేటాయింపునకు సంబంధించిన రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే వారికి పరికరాలు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
లక్కీ హ్యాండ్!
బుధవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026జనగామ: జనగామ పురపాలక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు మంగళవారం తీవ్ర ఉద్రిక్తతల మధ్య నాటకీయంగా సాగాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నికల అధికారి, ఆర్డీఓ గోపిరామ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సమావేశం హాలులో ప్రారంభమైన ప్రక్రియలో మొదట చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ సభ్యుల ఓటింగ్లో ఆ పార్టీకి చెందిన 12 మంది, సీపీఐ(ఎం) నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్రులు, ఎక్స్ అఫీషియో ఓటుగా ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి చేతులు ఎత్తడంతో మొత్తం 16 ఓట్లు వచ్చాయి. వెంటనే బీఆర్ఎస్ సభ్యులు ఓటింగ్కు రాగా 13 మంది సభ్యులు, ఇద్దరు స్వతంత్రులు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఎక్స్అఫీషియో ఓటుతో కలిపి వారికి కూడా 16 ఓట్లు రావడంతో టెన్షన్ నెలకొంది. లాటరీ పద్ధతిలో.. ఇరుపక్షాలకు సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారి గోపిరామ్ లాటరీ విధానాన్ని అమలు చేశారు. కాంగ్రెస్ తరఫున 22వ వార్డు కౌన్సిలర్ కడకంచి బాలమణి, బీఆర్ఎస్ తరఫున 18వ వార్డు సభ్యుడు గోపగోని సుగుణాకర్ గౌడ్ పేర్లను ప్రకటించారు. కాంగ్రెస్ తరఫున చైర్మన్ అభ్యర్థిగా బాలమణిని 15 వార్డు సభ్యుడు మారబోయిన పాండు ప్రతిపాదించగా, 25వ వార్డు కౌన్సిలర్ పాముకుంట్ల ప్రసాద్ మద్దతు పలికారు. బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి గోపగోని సుగుణాకర్గౌడ్ను 17వ వార్డు సభ్యుడు ఉడుగులు కిష్టయ్య ప్రతిపాదించగా, 9వ వార్డు సభ్యురాలు గునిగంటి వెన్నెల పద్దతిచ్చారు. అనంతరం ఇద్దరు చైర్మన్ అభ్యర్థుల పేర్లతో ఐదు చొప్పున చీటీలు రాసి డబ్బాలో వేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులు, పోలీసుల సమక్షంలో మొదట తీసిన చీటీలో బాలమణి పేరు రావడంతో ఆమె లక్కీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆర్డీఓ అధికారికంగా ఫలితాన్ని ప్రకటించారు. తర్వాత వైస్ చైర్మన్ పదవికి కూడా ఇదే విధానం పాటించారు. బీఆర్ఎస్ మద్దతు దారుడు 23వ వార్డు కౌన్సిలర్ భూష పర్వతాలు, కాంగ్రెస్ మద్దతుదారుడు 15వ వార్డు సభ్యుడు మారబోయిన పాండు పేర్లతో చీటీలు వేసి తీసిన సమయంలో భూష పర్వతాలు పేరు రావడంతో ఆయన వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఎన్నికై న ఇద్దరికీ ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించి అధికారిక ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఓటింగ్ సమయంలో ఉద్రిక్తత ఎన్నిక జరిగే సమయంలో ఓటింగ్ హాలులో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. సమావేశం ప్రారంభమైన వెంటనే స్వతంత్ర కౌన్సిలర్ మారబోయిన పాండు సీటింగ్ అమరికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. చేతులెత్తే ప్రక్రియలో బీఆర్ఎస్ టర్మ్ వచ్చిన సమయంలో పాండు, కాంగ్రెస్కు చెందిన 27వ వార్డు కౌన్సిలర్ చెంచారపు కరుణాకర్రెడ్డి కలిసి బీఆర్ఎస్కు మద్దతిస్తున్న 8వ వార్డు మహిళా సభ్యురాలు మంజుల చేయిని కిందికి లాగి గుంజేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో పాటు వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి నియంత్రణలోకి వచ్చింది. చివరకు మంజుల బీఆర్ఎస్కు ఓటు వేశారు. ఈ సంఘటనపై అక్కడే ఉన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. దాదాపు 45 నిమిషాల పాటు హాల్లో ఉద్రిక్తత నెలకొనగా భారీగా పోలీసులు మోహరించారు. ఇరు పక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకోగా, ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకో వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కౌన్సిలర్ బాలమణిని వరించిన అదృష్టం వైస్ చైర్మన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ భూష పర్వతాలు ఎన్నిక ప్రక్రియలో తీవ్ర ఉద్రిక్తతఓటెయ్యకుండా అడ్డుకున్నారు.. ఎమ్మెల్యే పల్లా, దళిత కౌన్సిలర్ల ఆరోపణ ఎమ్మెల్యే..సభ్యులను కొనాలని చూశారు ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి లాటరీ పద్ధతిలో జనగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక -
ఒకే సామాజిక వర్గానికి చైర్పర్సన్, వైస్ చైర్మన్
జనగామ: జనగామ మున్సిపాలిటీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 74 ఏళ్ల పురపాలక చరిత్రలో మొదటిసారిగా చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులు ఒకే సామాజిక వర్గానికి దక్కాయి. కురుమ కులానికి చెందిన కడకంచి బాలమణి చైర్పర్సన్గా, భూష పర్వతాలు వైస్ చైర్మన్గా లాటరీ ద్వారా ఎన్నికయ్యారు. ఇద్దరూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించడం విశేషం. ముఖ్యంగా ఇదే వర్గానికి వరుసగా రెండు కీలక పదవులు దక్కడం జనగామలో అరుదైన సంఘటనగా నమోదైంది. ఈ పరిణామంతో కురుమ కులస్తుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆఫర్లు వచ్చినా నో ‘జంప్’ జనగామ: మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో నాలుగు, ఐదు రోజులుగా రెండు ప్రధాన పార్టీల మధ్య అంతర్యుద్ధం ఉధృతంగా కొనసాగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏదీ స్పష్టమైన మెజార్టీ సాధించకపోవడంతో స్వతంత్రులతో పాటు తమ పార్టీల సభ్యులను ఆకర్షించేందుకు ఇరువైపులా విస్తృతంగా ప్రయత్నాలు జరిగాయి. కోట్ల రూపాయల వరకు ఆఫర్లు జరిగినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చలు జరిగినా, ఎవరూ తమ వైఖరిని మార్చకుండా తమ తమ పార్టీ పట్ల నిబద్ధతగా నిలిచారు. స్వతంత్రులు కూడా ఒకే దిశగా నిలవడంతో ఎవరూ జంపు జిలానీ కాలేదు. చివరకు గెలిచింది.. లక్కు చీటీ! జనగామ: మున్సిపల్ ఎన్నికలు ఈసారి నిజంగానే కోట్ల విలువైన లాటరీగా మారి పట్టణ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. స్థానిక నేతలు, కార్యకర్తలు, పర్యవేక్షకుల మాటల్లో ఒక్క ఓటు ధర రూ.2,500 నుంచి రూ.10 వేల వరకు పలికిందని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ, క్యాంపులు, బూచీలు, ఆర్గనైజింగ్ ఇలా అన్ని ఖర్చులు కలిపి మొత్తం 30 వార్డుల మీద రూ.100 కోట్ల పైగా డబ్బు చలామణి అయ్యిందనే ప్రచారం పట్టణంలో గట్టిగా వినిపిస్తోంది. ఇంత భారీ ఎలక్షన్ ఖర్చు అయినా, జనగామ ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. చివరకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను అధికారులు లాట రీ పద్ధతిలో నిర్వహించాల్సి వచ్చింది. కోట్ల ఖర్చు చేసి, క్యాంపులు మార్చి, గడప గడప ప్రజలను ఒప్పించిన పార్టీలకు చివరికి ‘అదృష్టం’నే నమ్ముకోవాల్సి వచ్చింది. కోట్ల ఖర్చు చేసిన పోరులో చివరికి గెలిపించింది లాటరీ చీటీ అని పట్టణవాసులు వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్కు ఎమ్మెల్యే పల్లా శుభాకాంక్షలుజనగామ: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మంగళవారం జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యంగా, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని, ప్రజల కోసం మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. శివుడికి అన్నపూజతో అలంకరణ జనగామ రూరల్: శ్రీ నగేశ్వర వాసవీ కన్యకాపరమేశ్వరి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా పూజా కార్యక్రమాలు ముగిసిన సందర్భంగా మంగళవారం శివుడికి ప్రత్యేక అన్న పూజ నిర్వహించారు. భక్తులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం జనగామ రూరల్: మండలంలోని చౌడారం కేజీబీవీలో ఖాళీగా ఉన్న నైట్ వాచ్ఉమన్, అసిస్టెంట్ కుక్ పోస్టు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్ఓ రాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత కలిగిన మహిళా అభ్యర్థులు ఈనెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు విద్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరా లకు 9010931250, 7569087633, 970527 0551 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
‘స్టేషన్’ చైర్మన్గా వినయ్కుమార్
స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్, శివునిపల్లి, ఛాగల్లు గ్రామ పంచాయతీలను కలుపుతూ నూతనంగా ఏర్పాటు చేసిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ మొదటి కౌన్సిలర్లుగా ఎన్నికై న వారి ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ప్రశాంతంగా జరిగింది. మొత్తంగా 18 వార్డులకు గాను 13 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, 5 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈమేరకు సోమవారం కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చైర్మన్గా తాటికొండ వినయ్కుమార్(కాంగ్రెస్), వైస్ చైర్మన్గా నీల రాజమ్మ(కాంగ్రెస్) ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు క్యాంపునకు వెళ్లిన 13 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ఉదయం 11 గంటల ప్రాంతంలో మున్సిపాలిటీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే కడియం చివరి నిమిషం వరకు వైస్ చైర్మన్ ఎవరనేది తెలియనీయకుండా సీల్ కవర్లో ప్రతిపాదించిన పేరును కౌన్సిలర్లకు తెలిపి స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. కాగా పోలీసులు కౌన్సిలర్లను తనిఖీ చేసి కార్యాలయంలోకి పంపారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులతో కలిసి నినాదాలు చేస్తూ మున్సిపాలిటీ వద్దకు చేరుకున్నారు. వారిని సైతం తనిఖీ చేసిన పోలీసులు లోపలికి పంపారు. కాగా ఉదయం 11 గంటల అనంతరం నూతన పాలకవర్గ సభ్యులచే ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, ఆర్డీఓ డీఎస్ వెంకన్న నియమనిబంధనలకు అనుగుణంగా ప్రమాణ స్వీకారం చేయించారు. వైస్ చైర్మన్పై ఉత్కంఠ చైర్మన్ అభ్యర్థిని మొదటి నుంచి అందరూ ఊహిస్తున్నప్పటికీ వైస్ చైర్మన్ ఎవరనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా చివరి నిమిషంలో వైస్ చైర్మన్గిరి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నీల రాజమ్మను వరించింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మధ్యాహ్నం 12.30 గంటలకు ఆర్డీఓ డీఎస్ వెంకన్న పర్యవేక్షణలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సభ్యులు ఉండటంతో ఆపార్టీకే రెండు పదవులు దక్కాయి. 13వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన వినయ్కుమార్ చైర్మన్గా ఎన్నికయ్యారు. కాగా వైస్ చైర్మన్గా 11వ వార్డు నుంచి ఎన్నికై న నీల రాజమ్మ(కాంగ్రెస్) ఎన్నికయ్యారు. చైర్మన్గా వినయ్కుమార్ పేరును గుర్రం హరినాధ్ ప్రతిపాదించగా బొల్లు లక్ష్మీ బలపర్చారు. అదేవిధంగా వైస్ చైర్మన్గా నీల రాజమ్మను పొన్న రవి ప్రతిపాదించగా అంగడి రజిత బలపర్చారు. కార్యక్రమంలో కమిషనర్ రాధాకృష్ణ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మేనేజర్ సత్యనారాయణ, కౌన్సిలర్లు తాటికొండ మధు, గుర్రం హరినాధ్, గుర్రం హైమ, బూర్ల రాజేశ్వర్, చల్లా రమ్య, బలగాని అనీల్, అన్నెపు సుమలత, పొన్న రాజేష్, తోకల అనూష, సౌదరపల్లి సంపత్రాజు, గట్టు సంగీత, పెసరు క్రిష్ణవేణి, బొల్లు లక్ష్మీ, అంగడి రజిత, పొన్నం స్వరూప, పొన్న రవి పాల్గొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్థానిక సీఐ జి.వేణు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. వైస్ చైర్మన్గా నీల రాజమ్మ ప్రశాంతంగా ఎన్నిక -
పురన్నాటకం
పోడియం వద్ద బైఠాయించిన కాంగ్రెస్, పలువురు స్వతంత్ర, సీపీఎం సభ్యులు, మద్దతుగా ఎంపీజనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో హైడ్రామాజనగామ: జనగామ పురపాలిక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సోమవారం నాటకీయ పరిణామాల మధ్య వాయిదా పడింది. మూడు రోజులుగా ప్రత్యేక క్యాంపుల్లో బస చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వతంత్ర సభ్యులు ఉదయం 11గంటలకు పోలీస్ ఎస్కార్ట్ నడుమ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం నుంచే ఇరు పార్టీలు రూట్మ్యాప్ మారుస్తూ హైటెన్షన్ పుట్టించారు. ప్రక్రియ మొదలైయింది ఇలా.. భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి ఎక్స్అఫీషియో ఓటు హక్కుతో మొదట మున్సిపల్ కార్యాలయానికి రాగా.. అనంతరం బీఆర్ఎస్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి వెంట నడిచారు. జనగామ పురపాలిక కార్యాలయ సమావేశహాలులో పార్టీలు, స్వతంత్రుల వారీగా అక్షరమాలను అనుసరించి సభ్యులను కూర్చోబెట్టారు. ఓట్ల సమీకరణలో కాంగ్రెస్ పక్షాన ఇద్దరు స్వతంత్రులు, సీపీఎం కలిపి 15 మంది, బీఆర్ఎస్ 13మందితో పాటు మరో ఇద్దరు స్వతంత్రులతో 15 మంది ఉన్నారు. వీరికి ఎంపీ చామల, ఎమ్మెల్యే పల్లా ఎక్స్అఫీషియో ఓట్లు కలవడంతో ఇరువురూ చెరో 16 ఓట్లతో సమాన బలం కలిగివున్నారు. ఈ పరిస్థితులు ఉద్రిక్తతను రెట్టింపు చేశాయి. సభ్యుల ప్రమాణం.. మొదటి ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో ఆర్డీఓ, ఎలక్షన్ అధికారి గోపిరామ్ సభ్యులచే ప్రమాణం చేయించి, మొదటి సంతకం పూర్తి చేయించారు. అనంతరం బీ–ఫామ్ ద్వారా ప్రకటించిన చైర్మన్ అభ్యర్థుల వివరాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ నుంచి 22వ వార్డు సభ్యురాలు కడకంచి బాలమణి శ్రీనివాస్, బీఆర్ఎస్ తరఫున 18వ వార్డు సభ్యుడు గోపగోని సుధాకర్ పోటీలో ఉన్నట్టు ప్రకటించారు. ఈ ప్రక్రియ ఉదయం 11.45కు ముగిసింది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నిక ప్రారంభిస్తున్నట్టు ఆర్డీఓ ప్రకటించగానే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి లేచి బీఆర్ఎస్ సభ్యురాలు హఫీజ్ ఫాతిమా కిడ్నాప్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదై దర్యాప్తు కొనసాగుతోందని, నిజాలు వెలుగుచూడకముందు ఎన్నిక నిర్వహించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. దానిపై అధికారులతో పదేపదే చర్చించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్కు మద్దతిస్తున్న 15వ వార్డు స్వతంత్ర సభ్యుడు మారబోయిన పాండు పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. వెంటనే కాంగ్రెస్ సభ్యులు, సీపీఎం, ఇద్దరు స్వతంత్రులు కలిసి పోడియం ముందు బైఠాయించి నినాదాలు మొదలుపెట్టారు. ఒక్క ఓటే భవిష్యత్తును నిర్ణయిస్తుంది.. నిజాలు బయటకు వచ్చే వరకు ఎన్నిక వాయిదా వేయాలంటూ నిరసన తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి దీనిని ఖండిస్తూ.. ఇది కిడ్నాప్ కాదు.. ఫేక్ కేసు..సభ్యురాలు, ఆమె భర్తతో సహా ఎవరూ కిడ్నాప్ కాలేదని చెబుతున్నారు... అనవసర డ్రామాలు ఆపాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాతిమాకు మద్దతుగా అదే పార్టీకి చెందిన సభ్యులు ఉడుగుల కిష్టయ్య, పానుగంటి సువార్త నిలదీశారు. అయినప్పటికీ పోడియం ముందు కాంగ్రెస్ నినాదాలు ఆగకపోవడంతో, అరగంట పాటు పరిస్థితిని గమనించిన తర్వాత ఎలక్షన్ అధికారి గోపిరామ్ ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నిక కొనసాగించడం సాధ్యం కాదని, నేటి(మంగళవారం)కి వాయిదా వేస్తున్నామని ప్రకటించి హాలు నుంచి వెళ్లిపోయారు. మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను మంగళవారం నిర్వహించనున్నట్లు ప్రిసైడింగ్ అధికారి, ఆర్డీఓ గోపిరామ్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో మధ్యాహ్నం 12.30గంటలకు ఎన్నిక నిర్వహించడం జరుగుతుందన్నారు. వార్డు సభ్యులందరితో పాటు ఎక్స్ఆఫీషియో సభ్యులు కూడా హాజరు కావాలని తెలిపారు. క్యాంపునకు వెళ్లిన ఇరు పార్టీల సభ్యులు, స్వతంత్రులు మళ్లీ రావాల్సి ఉంటుంది. ఎన్నికల హాల్లో సభ్యురాలి కిడ్నాప్ వివాదం కేసు విషయమై ఎంపీ ఆబ్జెక్షన్.. దర్యాప్తునకు డిమాండ్ పోడియం ఎదుట నిరసనకు దిగిన కాంగ్రెస్, స్వతంత్ర సభ్యులు తాను కిడ్నాప్ కాలేదంటూ హఫీజ్ ఫాతిమా స్పష్టీకరణ ‘ఫేక్ కేసు.. నాటకాలు ఆపండి..’: ఎమ్మెల్యే పల్లా గొడవల మధ్య ఎన్నిక నేటికి వాయిదా కీలక మలుపు..కిడ్నాప్ కేసు విత్డ్రా!తన సోదరుడు, మరదలు, కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను ఎమ్మెల్యే కిడ్నాప్ చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లు అక్బర్ సోమవారం డీసీపీ, ఏఎస్పీకు లేఖ పంపించినట్లు సీఐకి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. ఫిర్యాదు వాస్తవాలకు విరుద్ధంగా, బయట వ్యక్తుల ప్రభావంతో, అపోహలతో చేసినట్లుగా చెప్పారు. ఇద్దరు వ్యక్తుల ప్రభావంతో ఇలా చేయాల్సి వచ్చిందని, ఇప్పుడు విషయాలు స్పష్టమవడంతో ఆ ఫిర్యాదును కొనసాగించేందుకు ఆసక్తిగా లేనని తెలిపారు. అపార్థాలు నివృత్తి కావడంతో అపహరణ జరిగినట్లుగా ప్రస్తావించిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. తదుపరి, తన పూర్వ ఫిర్యాదును ఉపసంహరించబడినదిగా పరిగణించి, తగిన విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ విషయమై సీఐ సత్యనారాయణరెడ్డిని అడుగగా ఉపసంహరణ ఫిర్యాదు వచ్చిందని, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత సాధ్యం కాదని, విచారణ చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. -
హైటెన్షన్
జనగామ: జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో శనివారం తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ సభ్యులను ఎమ్మెల్యే క్యాంపు నుంచి మున్సిపల్ కార్యాలయానికి తరలిస్తుండగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆర్టీసీ చౌరస్తా, నెహ్రూ పార్క్, ఫ్లైఓవర్, ఆర్అండ్బీ అతిథిగృహం, బీఎన్ మెడికల్ స్టోర్, పాతబీటు బజార్ ఇలా ఎక్కడ చూసినా భారీ పోలీస్ బందోబస్తు కనిపించింది. మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో 200 మీటర్ల మేర ఆంక్షలు విధించిన పోలీసులు, బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులను మినహా ఎవరినీ ఆవరణలోకి అనుమతించలేదు. బీఆర్ఎస్ ర్యాలీపై అభ్యంతరం..వాగ్వాదం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సులో బీఆర్ఎస్ సభ్యులను తీసుకుని బయలుదేరారు. ఆర్టీసీ చౌరస్తా నుంచి బీఆర్ఎస్ సభ్యులకు మద్దతుగా గులాబీ శ్రేణులు బైక్ ర్యాలీగా ముందుకు కదిలారు. ఊరేగింపుతో ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. నెహ్రూ పార్క్ వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో ఎమ్మెల్యే అనుచరులు దీనిపై ప్రశ్నించారు. ర్యాలీకి ఎందుకు అనుమతి లేదు, ఈ ఆంక్షలు ఏంటీ అంటూ గులాబీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే కూడా పోలీసుల తీరుపై ఆక్షేపణ వ్యక్తం చేశారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఫాతిమా ‘కిడ్నాప్’ వివాదం.. మరోసారి ఉద్రిక్తత ఆర్అండ్బీ అతిథిగృహం వద్దకు బస్సు చేరుకున్న సమయంలో దాదాపు వెయ్యి మందికి పైగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేస్తూ అక్కడకు చేరుకున్నారు. ఇదే సమయంలో 28వ వార్డు బీఆర్ఎస్ సభ్యురాలు హఫీజ్ ఫాతిమా కిడ్నాప్ అయ్యారని వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆమెను విచారణ కోసం తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఫాతిమా స్వయంగా బస్సులో నుంచి ముందుకు వచ్చి ‘నన్నెవ్వరూ కిడ్నాప్ చేయలేదు.. పాప అస్వస్థతతో హైదరాబాద్కు వెళ్లాను.. తప్పుడు కేసులతో మా ఆత్మాభిమానం దెబ్బతీయొద్దు..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పోలీసులు ఆమెను తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యక్షంగా చెబుతున్న మహిళను తీసుకెళ్లడం ఎందుకు అని డీసీపీని ప్రశ్నించారు. అప్పటికీ పోలీసులు వినకపోవడంతో డీసీపీ, ఎమ్మెల్యే మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగగా, ఎమ్మెల్యే డీజీపీతో పాటు సీపీకి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. దీంతో అక్కడ మరోసారి పరిస్థితులు వేడెక్కాయి. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు మళ్లీ లాఠీచార్జ్ చేయగా, శ్రేణులు చెల్లాచెదురయ్యాయి. కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. అనంతరం బస్సు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరగా, సభ్యులు పోలీసుల రక్షణ వలయంలో లోపలికి వెళ్లారు. క్యాంపు నుంచి జనగామకు.. సభ్యులకు అండగా బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే క్యాంపు నుంచి బయలుదేరిన బస్సుయాత్ర అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు ఫాతిమా కిడ్నాప్ ఆరోపణతో ఉద్రిక్తత రెండు సార్లు లాఠీచార్జ్ -
కాంగ్రెస్ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారు
జనగామ: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా కాంగ్రెస్ వ్యవహరిచిన తీరును ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన తర్వాత తమ పార్టీ సభ్యులతో కలిసి సోమవారం పురపాలిక ఎదుట బైఠాయించి నిరసన, ఆందోళన చేశారు. 28వార్డు సభ్యురాలు ఫాతిమా కిడ్నాప్కు గురైనట్లు ఫేక్ కేసు పెట్టడమే కాకుండా, స్వయంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ వచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. తనను కిడ్నాప్ చేయలేదని ఫాతిమా చెప్పినా, వినిపించుకోకుండా డీసీపీ బస్సులోకి రావడం ఏంటని, దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కొంతమంది కాంగ్రెస్ గుండాలు విర్రవీగుతున్నారని, జనగామ పట్టణాన్ని కబ్జాలకు అడ్డా మార్చే ప్రయత్నంలో ఇలాంటి చేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ దగ్గరుండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయించారన్నారు. ఎంపీ అండ చూసుకుని కొందరు వ్యక్తులు హఫీజ్ ఫాతిమా కిడ్నాప్ అయినట్లు కేసు పెట్టించారన్నారు. డీసీపీ ముస్లిం మహిళను ఇలా అవమానపరిచే విధంగా వ్యవహరించడం ఖండిచదగ్గ విషయమని, దీనిపై స్థాయిలో పిర్యాదు చేస్తామని, అలాగే డీసీపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, తన భార్య హఫీజ్పాతిమాను కిడ్నాప్ చేసినట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు వ్యహరించిన తీరుపై హ్యూమన్ రైట్స్కు వెళతామని ఆమె భర్త సమ్మద్ తెలిపారు.మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే పల్లా ఆందోళన -
కమనీయం..శివకల్యాణం
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో ఆదివారం రాత్రివేద పండితుడు తాటిపాముల నరసింహమూర్తి శర్మ నేతృత్వంలో శివ పార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలబ్రాలు తీసుకొచ్చారు. 107 జంటలు కల్యాణంలో పాల్గొన్నాయి. ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ఆర్చకులు,భక్తులు పాల్గొన్నారు. సిద్ధులగుట్టలో.. బచ్చన్నపేట: మండలంలోని కొడవటూరు సిద్ధేశ్వరాలయంలో వీరశైవ సాంప్రదాయం ప్రకారం ఆలయ ప్రధాన అర్చకుడు ఓం నమఃశివాయ మంత్రోచ్ఛరణల నడుమ ఆదివారం రాత్రి 9 గంటలకు శివపార్వతుల కల్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు. గ్రామ సర్పంచ్ నీల కవితమురళి, ఈఓ వంశీ స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. కల్యాణ తంతు అనంతరం మహిళలు అమ్మవారికి ఓడిబియ్యం పోసి, కానుకలు సమర్పించుకున్నారు. కొడవటూర్, బచ్చన్నపేట ఒగ్గు కళాకారులు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కల్యాణ మహోత్సవం ముగిసిన అనంతరం శివపార్వతుల దేవతామూర్తులతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నూకల బాల్రెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మల్లారెడ్డి, సర్పంచ్లు ఆరె రవికుమార్, నల్ల సిద్దినర్సమ్మ, ఇ జ్జగిరి రాములు, అర్చకుతు, సిబ్బంది, పలువురు పాల్గొన్నారు. నర్మెట సీఐ అబ్బయ్య పర్యవేక్షణలో ఎస్సై ఎస్కే హమీద్ బందోబస్తు నిర్వహించారు. -
సంక్షేమ పథకాలు అందరికీ అందాలి
● ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య బచ్చన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికి అందాలన్నదే సీఎం రేవంత్రెడ్డి లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కొడవటూర్ గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినం, బ్రహ్మోత్సవాల సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిద్ధేశ్వరాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ చిందం వంశీ, ఆలయ ప్రదాన పూజారి ఓం నమశివాయ, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, సీపీఐ చేర్యాల మండల కార్యదర్శి జంగిలి యాదగిరి, ఆలయ సిబ్బంది లక్ష్మికాంత్రెడ్డి, శ్రీనివాస్, బానుప్రకాష్రెడ్డి, గుర్రపు బాల్రాజు, జిల్లా సందీప్, జంగిడి సిద్దులు తదితరులు పాల్గొన్నారు. -
సమాన ఓట్లు వస్తే లాటరీ!
జనగామ: జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఇరు పార్టీలకు సమాన ఓట్లు పడే అవకాశం ఉండడంతో లాటరీ ద్వారా పురపాలిక చైర్మన్న్ ఎన్నుకునే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వెల్లడించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇరు పార్టీల అంగీకారంతో ఈ ప్రక్రియ నిర్వహించబడనుందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సూచించిన చైర్మన్ అభ్యర్థుల పేర్లను ఒక్కొక్కరికి ఐదు చీటీల రూపంలో సిద్ధం చేసి, ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన ఓ డబ్బాలో వేసి, వీడియో సర్వైలెన్స్ పర్యవేక్షణలో అందరి సాక్షిగా లాటరీ తీస్తారు. చీటీలో రెండు పార్టీలు కోరంతో సమావేశానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నందున నేడే లాటరీ జరగవచ్చు. అయితే, ఏదైనా పార్టీ సమావేశానికి రాలేని పక్షంలో కోరం లేని సమయంలో ప్రక్రియ వాయిదా పడే అవకాశం ఉంది. నేటి ప్రజావాణి రద్దు జనగామ రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికతో పాటు ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నందున ప్రజలు గమనించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ‘స్టేషన్’ విప్గా సంపత్రాజ్ స్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ విప్గా 9వ వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నికై న సౌదరపెల్లి సంపత్రాజ్ను నియమించినట్లు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఈ మేరకు హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో సంపత్రాజ్కు విప్గా నియమిస్తూ నియామక పత్రాన్ని అందించారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులోని 9వ వార్డుకు చెందిన సంపత్రాజ్ను విప్గా నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ వర్సిటీ టోర్నమెంట్కు కేయూ జట్టు కేయూ క్యాంపస్: రొహతక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో ఈనెల 15న ప్రారంభమైన ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ క్రాస్క్రంటీ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ క్రాస్కంట్రీ పురుషుల జట్టును స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య ప్రకటించారు. జె.రాఘవ, జె.రిషిక్, ఎం.అఖిల్, జె.అనిల్, జి.శివకుమార్, ఎండీ హబీబుద్దీన్ జట్టులో ఉన్నారని ఆయన తెలిపారు. ఈజట్టుకు కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కె.శ్రీధర్కుమార్ కోచ్ కం మేనేజర్గా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
బుగులు వేంకటేశ్వరుడికి వారకల్యాణం
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారికి అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ వైభవంగా వార కల్యాణం నిర్వహించారు. ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు ఆధ్వర్యంలో రామోజు వెంకటేశ్వర్లు–విశాల, ఆదిమూలం సునీల్కుమార్–సాగరికలు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో దాత సంగోజు మోహనాచారి– శంకరలక్ష్మి, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, వీరన్న, మల్లికార్జున్, హరిశంకర్, కృష్ణ పాల్గొన్నారు. సోమేశ్వరాలయంలో ధ్వజారోహణంపాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. గుట్టపై మహామండపంలో గణపతి పూజా, పుణ్యాహవచనం, పంచగవ్వం, అంకురాప్పణ, రుత్తిక్వరుణ, ధ్వజారోహణ, వేదస్వస్తి, త్రిశూలపూజ, స్వామివారికి అభిషేకాలు, అఖండ దీపారాధన అర్చకులు నిర్వహించారు. ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ఏసీపీ అంబటి నర్సయ్య, సూపరింటెండెంట్ వెంకటయ్య, ప్రధాన అర్చకుడు దేవగిర లక్ష్మన్న, అర్చకులు డీవీఆర్శర్మ, అనిల్కుమార్, నాగరాజు, భక్తులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి సదస్సుకు ఎంపికజనగామ రూరల్: జనగామ పట్టణానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, పరిశోధకుడు, సీనియర్ తెలుగు అధ్యాపకుడు కోడం కుమారస్వామి జాతీయస్థాయి సదస్సుకు ఎంపికయ్యారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 17, 18 తేదీల్లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సహకారంతో నిర్వహిస్తున్న ఐరన్ మ్యాన్ విజినరీ లీడర్షిప్ – లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్ అనే అంశంపై రెండు రోజుల సదస్సు జరగనుంది. ఈ సదస్సులో కుమారస్వామి కాళోజీ కవిత్వం–నిజాం పాలన వ్యతిరేకత అనే అంశంపై పరిశోధన పత్రం సమర్పించి ప్రసంగించనున్నారు. జాతీయ సదస్సుకు ఎంపికై న కుమారస్వామిని జనగామ రచయితల సంఘం అధ్యక్షుడు నక్క సురేష్, జి.కృష్ణ, సోమేశ్వర్, పానుగంటి రామ్మూర్తి, శ్రీనివాస్ తదితరులు అభినందనలు తెలిపారు. తల్లుల దీవెనలతో ప్రజలకు సేవ చేస్తాంఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మల తల్లుల దీవెనలతో ప్రజలకు మరింత సేవ చేస్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నూతనంగా ఎన్నికై న స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లతో కలిసి ఆయన శనివారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు ఎత్తు బంగారం, చీరసారె, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలకు మరింత సేవ చేయాలని సంకల్పించామని తెలిపారు. ఆలయ సంప్రదాయ ప్రకారం దేవాదాయశాఖ అధికారులు, పూజారులు కడియం శ్రీహరితోపాటు నూతనంగా ఎన్నికై న కౌన్సిలర్లకు డోలి వాయిద్యాలతో స్వాగతం పలికారు. కంప్యూటర్ సైన్స్ బీఓఎస్గా రమేశ్ కేయూ క్యాంపస్: కేయూ లోని కంప్యూటర్ సైన్స్ విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా (బీఓఎస్) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.రమేశ్ను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రా మచంద్రం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓఎస్గా పనిచేసిన డాక్టర్ మంజుల పదవికాలం ముగియడంతో రమేశ్ను ని యమించారు. రమేశ్ ఈ పదవిలో 2 సంవత్సరాలపాటు కొనసాగనున్నారు. -
సోమేశ్వరాలయంలో ఏర్పాట్ల పరిశీలన
సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో జరిగే మహారాత్రి బ్రహ్మోత్సవాలను అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. శనివారం మండలకేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బ్ర హ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్, లడ్డూ ప్రసాదం తయారు చేయు వంట గది, పోలీసు క్యాంపును కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. డీఆర్డీఓ పీడీ వసంత, ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ఏసీపీ నర్సయ్య, విద్యుత్ డీఈ సారయ్య, ఆర్డబ్ల్యూ డీఈ నవీన్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
16ః16
జనగామ చైర్మన్ పీఠానికి చేరి సగం బలం జనగామ: జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ సమాన బలం, స్వతంత్రుల కీలక మద్దతు, ఎక్స్అఫీషియో ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు అన్నీ కలిసి రాజకీయ సమీకరణాలను మరింత క్లిష్టం చేశాయి. 16ః16 ఓట్ల సమీకరణతో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ కనిపించక చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందనే విషయం పెద్ద ప్రశ్నగా మారింది. స్వతంత్రుల వైఖరి, పార్టీల క్యాంపు రాజకీయాలు 16న జరిగే ఎన్నికలను హాట్టాపిక్గా మార్చాయి. జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై రాజకీయ ఉ త్కంఠ పీక్ స్టేజీకి చేరింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇరు పార్టీలకూ సమాన సీట్లు రావడం, నలుగురు స్వ తంత్రుల్లో ఇద్దరు చొప్పున రెండు పార్టీలకు మద్దతు ఇవ్వడంతో ఎవరు చైర్మన్ పీఠం అధిరోహిస్తారన్న దానిపై అనిశ్చితి నెలకొంది. స్థానిక పురపాలక రాజకీయాల్లో అరుదుగా కనిపించే ఇలాంటి సమీకరణాలు జనగామలో హాట్టాపిక్గా మారాయి. ఇ టీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 12, ఆ పార్టీ మద్దతుతో గెలుపొందిన సీపీఎంకు–1, బీఆర్ఎస్ 13, స్వతంత్రులు 4 స్థానాలు గెలుచుకున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు సాధించాలంటే కనీసం 16 ఓట్లు అవసరం. ఇక్కడే అసలు స స్పెన్స్ మొదలైంది. ఎక్స్అఫీషియో ఓటుగా బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ తరఫున ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి ఓటు హ క్కు వినియోగించనున్నారు. దీంతో ఇరు పార్టీలకూ స్వతంత్రుల మద్దతుతో సమానంగా 16 ఓట్లు చేరుతున్నాయి. ఇదే సమాన బలం ఉండగా, రాబోయే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఎవరి గెలుపునైనా ప్రశ్నార్థకంగా మార్చేయనుంది. నలుగురు స్వతంత్రుల్లో ఇద్దరు బీఆర్ఎస్ క్యాంపులో, మరొకరు కాంగ్రెస్కు పూర్తి మద్దతు ప్రకటించగా, మరో స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్తో చర్చలు కొనసాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇరు పార్టీలకు 16ః16 ఓట్ల సమీకరణంలో ఎవరు చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు దక్కించుకుంటారన్నది ఇప్పుడు జనగామ రాజకీయాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమకు పూర్తి మెజార్టీ వస్తుందని నమ్మినా, ప్రచారంలో స్వతంత్రులతో కలిసి పెద్ద ఎత్తున డబ్బుల లావాదేవీలు జరిగినట్లు ప్రచారం. ఓటర్లు ఇరు పార్టీల నుంచి డబ్బులు తీసుకుని ఎవరి మనసు నొప్పంచకుండా ఓటు షేరింగ్ చేసిన నేపథ్యంలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు వేర్వేరు క్యాంపుల్లో ఉంచగా, 16న జరిగే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఎవరిని భాగ్యం వరిస్తుందన్నది ఆసక్తిగా మారింది. సమాన బలం కొనసాగితే జనగామ మున్సిపల్ చరిత్రలో తొలిసారి టాస్ ద్వారా చైర్మన్ ఎంపిక అయ్యే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్లో ఉత్కంఠ చైర్మన్ ఎన్నికకు 16వ తేదీన ముహూర్తం ఎన్నికపై సస్పెన్స్ పురపాలిక రాజకీయంలో స్వతంత్రుల హాట్టాపిక్ క్యాంపులో ఇరు పార్టీల కౌన్సిలర్లుచైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మొదటిసారి, రెండవసారి కూడా వాయిదా పడే అవకాశం లేకపోలేదు. మూడోసారి మాత్రం సభ్యుల కోరం ఉన్నా.. లేకపోయినా ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాల్సిందే. పరిస్థితి మళ్లీ సమానంగా ఉంటే టాస్ వేసి తుది నిర్ణయం తీసుకునే అ వకాశం అధికార వర్గాల్లో వినిపిస్తుంది. -
ఉత్తమ ఫలితాలు
ఇష్టంతో చదివితేనేదేవరుప్పుల: విద్యార్థులు భవిష్యత్లో రాణించాలంటే కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఉత్తమ ఫలితాలు వస్తాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. శనివారం మండలకేంద్రంలోని తిరుమల గార్డెన్లో దేవరుప్పుల మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల సన్నద్ధం కోసం మండల స్థాయిలో తలపెట్టిన ప్రేరణ కార్యక్రమం ఎంఈఓ జి.కళావతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి.. జిల్లా ప్రథమ స్థానం సాధించుటకు విద్యార్థులు మరింత శ్రమించి చదవాలన్నారు. పరీక్షలు అంటే భయం లేకుండా నమ్మకంగా ఉండాలని, చదువుతోపాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనన్నారు. గత సంవత్సరం జిల్లాలో టాప్ మార్కులతో నిలిచిన టాపర్లను ఆదర్శంగా తీసుకొని ఉత్తమ మార్కులు సాధించాలన్నారు. అంతకుముందు సబ్జెక్టు ఉపాధ్యాయులు రూపొందించిన ఏడు సబ్జెక్టుల ప్రత్యేక స్టడీ మెటీరియల్ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కర్నూలుకు చెందిన మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి విద్యార్థులకు చదువు, వ్యక్తిత్వము, ఆరోగ్యం, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ఏకాగ్రత, వ్యక్తిత్వ నిర్మాణం గురించి సందేశమందించారు. హైకోర్టు అడ్వకేట్ ఈటూరు శ్రీనివాసరావు బాలికల విద్య ప్రాముఖ్యత, వివిధ కోర్సులు, అవకాశాల గురించి వివరించి, మండల విద్యా విషయాలకు తన వంతు తోడ్పాటును అందిస్తామన్నారు. కార్యకమంలో జనగామ ఏరియా ఆస్పత్రి ఆర్ఎంఓ కోటాచలం, ఏఎంఓ బొమ్మనబోయిన శ్రీనివాస్, దేవరుప్పుల సర్పంచ్ పెద్ది కృష్ణమూర్దిగౌడ్, హెచ్ఎం విష్ణువర్దన్రెడ్డి, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. క్రీడలతో మానసికోల్లాసం జనగామ రూరల్: క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. జిల్లా స్థాయి సీఎం కప్ 2025లో భాగంగా శనివారం మినీస్టేడియం, సోషల్ వెల్ఫేర్లో వాలీబాల్, కబడ్డీ, చెస్, క్యారమ్, యోగా, నెట్బాల్, ఫుట్బాల్ తదితర క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మకంచలోని మినీస్టేడియంలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతోపాటు క్రీడల్లోనూ పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో రాణించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి కోదండరాములు, సెక్రటరీ ఘోర్ సింగ్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 18వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.ఆలయ ఈఓ లక్ష్మి ప్రసన్న, డీఆర్డీఓ వసంత, ఏసీపీ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్బాషా జిలాల్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పరోక్ష ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)ను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాలు జారీ చేశారు. శనివారం కలెక్టరేట్ నుంచి అధికారులతో గూగుల్ మీట్లో మాట్లాడారు. ఉదయం 11 గంటలకు సంబంధిత మున్సిపల్ కార్యాలయ సమావేశం హాళ్లలో ప్రారంభమవుతుందన్నారు. ఎన్నికకు 50 శాతం మంది హాజరు కావాలన్నారు. సభ్యులతో 11 గంటలకు ప్రమాణ స్వీకారం నిర్వహించి, మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్, అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తామన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరఫున ఎన్నికై న సభ్యులు పార్టీ విప్ను తప్పనిసరిగా అనుసరించాలన్నారు. ఎన్నిక సమావేశ ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, తహసీల్దార్లు, మాస్టర్ ట్రేనర్లు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ వెంటే ఘన్పూర్ ప్రజలు
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంట, తన వెంట ఉన్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కౌన్సిలర్లుగా గెలుపొందిన పార్టీ అభ్యర్థులతో కలిసి శుక్రవారం ఆయన స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు.. ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులతో కలిసి ఆయన సంబురాల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో జోష్నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ మొట్టమొదటి కౌన్సిలర్లుగా మెజార్టీ స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించిందన్నారు. మున్సిపాలిటీలో 70 శాతానికి పైగా సీట్లను గెల్చుకున్నామని, ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు తమ ఓట్లతో బుద్ధి చెప్పారన్నారు. పనిలేని ప్రతిపక్ష పార్టీల విమర్శలు పట్టించుకోనన్నారు. కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్రెడ్డిపై, ఎమ్మెల్యేగా తనపై ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, అందరూ బాధ్యతగా పనిచేస్తూ మున్సిపాలిటినీ ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయాలన్నారు. విజయం అందించిన ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, జగదీష్చందర్రెడ్డి, సతీష్ పాల్గొన్నారు. -
హంగామా!
స్వతంత్రులదేఏకశిల బీఈడీ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ.. జనగామ: జనగామ పురపోరులో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నువ్వా,నేనా అన్నట్టుగా తలపడగా, ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో హంగ్ పరిస్థితి నెలకొంది. మొత్తం 30 వార్డుల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని పోటీ చేసిన సీపీఎం 1, స్వతంత్రులు నలుగురు విజయం సాధించారు. చైర్మన్ పీఠం సాధించేందుకు 16 స్థా నాలు అవసరమైన నేపథ్యంలో రెండు ప్రధాన పా ర్టీలకు స్వతంత్రుల మద్దతు తప్పనిసరి అయ్యింది. కౌంటింగ్ సెంటర్ వద్దే రాజకీయాలు పట్టణంలోని ఏకశిల బీఈడీ కళాశాలలో శుక్రవారం ఉదయం పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కాగా, 10 గంటలకు తొలి ఫలితం విడుదల అయింది. 30 వార్డుల ఫలితాలు మధ్యాహ్నం 2 గంటల వరకు తేలిపోయాయి. ఓట్ల లెక్కింపు సమయంలో ఎన్నికల, కౌంటింగ్ ఏజెంట్లతో పాటు అభ్యర్థులు, ప్రతిపాదికులు కంటిరెప్ప వాల్చకుండా ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించారు. వార్డుల వారీగా ఎలక్షన్ అధికారులు విజేతలను ప్రకటించగా, విక్టరీ చూపిస్తూ అభ్యర్థులు, అనుచర వర్గం ఉరికించే ఉత్సాహంతో బయటకు రాగా, ఓటమి చెందిన వారు మాత్రం తీవ్ర నిరాశతో వెళ్లిపోయారు.మొత్తంగా 48 పోస్టల్ ఓట్లు పోలు కాగా, నోటాకు 119, రిజెక్ట్ అయిన ఓట్లు 259 ఉండగా మొత్తంగా 478 ఓట్లు చెల్లుబాటు కాలేదు. స్వతంత్రుల కోసం.. 8వ వార్డు నుంచి గెలిచిన స్వతంత్ర అభ్యర్థి సందుపట్ల మంజుల, 15వ వార్డు నుంచి విజయం సాధించిన మారబోయిన పాండు, 23వ వార్డు స్వతంత్ర అభ్యర్థి భూష పర్వతాలు, 5వ వార్డులో గెలిచిన ఇండింపెండెంట్ మిద్దెపాక భాస్కర్ చైర్మన్ రేసులో కీలకంగా మారారు. భూష పర్వతాలను తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా, యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్క్వార్టర్ హైవేపై ఉన్న ఓ హోటల్లో హైడ్రామా చోటుచేసుకున్నట్లు సమాచారం. పర్వతాలు బీఆర్ఎస్ వైపు వెళ్లాలని మొండికేయడంతో పాటు కాంగ్రెస్ నాయకుల నుంచి తప్పించుకుని గులాబీ శ్రేణులు వద్దకు చేరుకోగా, ఆయన్ను రహస్య ప్రాంతానికి తరలించినట్టు సమాచారం. మంజుల సైతం బీఆర్ఎస్ గూటికి చేరినట్లు తెలుస్తుండగా, భాస్కర్ మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. అత్యంత కీలక స్థానంలో ఉన్న మారబోయిన పాండు మాత్రం రెండు పార్టీల మధ్య చర్చలు సాగించడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన్ను తీసుకెళ్లేందుకు రెండు పార్టీలు కార్లు సిద్ధం చేయగా, చివరకు తన సన్నిహితుడి కారులో ఇంటికి వెళ్లిపోయారు. పట్టణంలో ఈ నలుగురు స్వతంత్రులకు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ ఆఫర్లు చేసినట్లు చర్చ నడుస్తోంది. తనకు చైర్మన్ పీఠం ఇస్తే ఆ పార్టీకే మద్దతు ఇస్తానని పాండు మీడియాకు వెల్లడించగా, మిగతా ముగ్గురు కూడా తన మాట వింటారని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఎవరు చైర్మన్ పీఠం ఎక్కినా...వైస్ చైర్మన్ పదవి మాత్రం స్వతంత్రుల్లో ఒక్కరికి అవకాశం వస్తుందని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి 23వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన భూష పర్వతాలకు వైస్ చైర్మన్ ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. చైర్మన్ రేసులో పోటీదారులు కాంగ్రెస్ తరఫున 22వ వార్డు నుంచి కడకంచి బాలమణి, బీఆర్ఎస్ నుంచి 29వ వార్డు ముస్తాల మౌనిక దయాకర్, 18వ వార్డు గోపగోని సుగుణాకర్ గౌడ్ బరిలో ఉన్నారు. రెండు పార్టీలు ఎక్స్అఫీషియో ఓట్లతో కూడి చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకోవాలనే వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. కలెక్టర్ పర్యవేక్షణలో.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, ఆర్డీఓలు గోపిరామ్, వెంకన్న, మునిసిపల్ కమిషనర్లు మహేశ్వర్రెడ్డి, రాధాకృష్ణ, డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారుల కంటిమీద కునుకు లేకుండా బందోబస్తు నిర్వహణ చేపట్టారు. కాగా, ప్రజలు తేల్చుకోలేని తీర్పు ఇవ్వడంతో స్వతంత్రులే గేమ్ఛేంజర్లుగా మారి చైర్మన్ పీఠం ఎటు తిరుగుతుందనే ఆసక్తి జిల్లాలో రాజకీయ హీట్ పెంచుతోంది. ‘ఇండింపెండెంట్లే గేమ్ఛేంజర్లు’ అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనం నిజం కావడం గమనార్హం. వారు మద్దతు ఇచ్చినవారికే జనగామ పుర‘పీఠం’ కాంగ్రెస్–12, బీఆర్ఎస్–13, సీపీఎం–1, స్వతంత్రులు–4 బీఆర్ఎస్ కోటలో ఇద్దరు.. కాంగ్రెస్ పక్కన ఒక్కరు రెండు పార్టీలకు టచ్లో మరో అభ్యర్థి.. స్వతంత్ర విజేత కోసం భువనగిరి హోటల్ వద్ద హైడ్రామా స్వతంత్రులకు లక్షల్లో ఆఫర్..! ఓట్ల శాతంలో బీఆర్ఎస్దే పైచేయి జనగామ,స్టేషన్ ఘన్పూర్లో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు -
భువనగిరిలో హైడ్రామా!
భువనగిరి : జనగామ మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులు కింగ్ మేకర్స్గా మారారు. 23వ వార్డునుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన భూష పర్వతాలును కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కారులో ఎక్కించుకుని హైదరాబాద్కు బయలుదేరారు. మార్గమధ్యలో భువనగిరి బైపాస్ రోడ్డులోని ఓ హోటల్ వద్ద ఆగగా, ఆ అభ్యర్థి.. బీఆర్ఎస్ నాయకులకు సమాచారం అందడంతో వెంటనే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి.. పార్టీ నాయకులతో కలిసి భువనగిరికి చేరుకున్నారు. తమకు మద్దతు తెలిపే అభ్యర్థిని అప్పగించాలని కాంగ్రెస్ నాయకులను కోరారు. అప్పటికే హోటల్కు వద్దకు చేరుకున్న ఎంపీ కిరణ్కుమార్రెడ్డితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు.. అభ్యర్థితో ఉండడంతో ఎమ్మెల్యే పల్లా స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హోటల్ వద్దకు చేరుకోగా, పల్లా వారితో మాట్లాడి తమకు మద్దతు తెలిపే అభ్యర్థిని బలవంతంగా తీసుకెళ్తున్నారని చెప్పారు. పోలీసులు సదరు అభ్యర్థిని ఎవరికి మద్దతు ఇస్తారని అని అడగ్గా బీఆర్ఎస్కు అని చెప్పడంతో అతన్ని ఎమ్మెల్యే పల్లాకు అప్పగించగా ఆయన వెంటబెట్టుకుని తీసుకెళ్లారు. -
చేతికి ‘స్టేషన్’ పగ్గాలు
● పురపోరులో సత్తాచాటిన కాంగ్రెస్ ● 18వార్డులకు 13 స్థానాలు అధికార పార్టీకే ● 5 స్థానాలకే బీఆర్ఎస్ పరిమితంస్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. ఘన్పూర్ శివారు పల్లగుట్ట క్రాస్రోడ్డు సమీపాన ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. మొత్తంగా 18 వార్డులకు గాను 18 టేబుళ్లను ఏర్పాటు చేసి కౌంటింగ్ చేపట్టారు. ఉదయం 8 గంటలకు చేపట్టిన కౌంటింగ్లో మొదట పోస్టల్, సర్వీస్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అందులో మొత్తం 5 ఓట్లు పోల్కాగా రెండు ఓట్లు బీఆర్ఎస్ పార్టీలకు చెందిన అభ్యర్థులకు, మూడు ఓట్లు స్వతంత్రులకు పడ్డాయి. అనంతరం బ్యాలెట్ పేపర్లను కట్టలుగా కట్టి కౌంటింగ్ పూర్తి చేసిన అనంతరం ఉదయం 11.30 గంటల అనంతరం అభ్యర్థుల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. కాగా ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ సెంటర్ సమీపానికి పెద్ద ఎత్తున వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు రాగా సందడి నెలకొంది. మధ్యాహ్నం 12 గంటల అనంతరం పూర్తిస్థాయిలో ఫలితాలు వెలువడ్డాయి. సత్తా చాటిన కాంగ్రెస్ నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలుపొంది సత్తా చాటారు. మొత్తంగా 18 వార్డులకు గాను 13 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకోగా బీఆర్ఎస్ ఐదు స్థానాలతో సరిపెట్టుకుంది. మొత్తంగా స్టేషన్ఘన్పూర్లోని పది వార్డుల్లో తొమ్మిది వార్డులు కాంగ్రెస్ గెలుపొందటం విశేషం. మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో నాలుగు, ఛాగల్లులోని నాలుగు వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ తలా రెండు స్థానాలు దక్కించుకున్నాయి. ఘన్పూర్లోని 1వ వార్డు బీఆర్ఎస్కు రాగా మిగిలిన 10 నుంచి 18 వరకు తొమ్మిదివార్డులు కాంగ్రెస్ కై వసం చేసుకుంది. -
ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ేేేజనగామ: జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు శుక్రవారం విజయవంతంగా ముగిసిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. స్టేషన్ఘన్పూర్ 18, జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులకు జరిగిన ఎన్నికలు, కౌంటింగ్ సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జనగామ, స్టేషన్ఘన్పూర్లో ఎన్నికైన వార్డు సభ్యులకు ఈ నెల 16వ తేదీన ఉదయం 11లకు ప్రతిజ్ఞ, ఆ తర్వాత 12.30 గంటల సమయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధిత మున్సిపల్ కార్యాలయాల్లో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సభ్యులు ప్రతి ఒక్కరు హాజరు కావాలన్నారు. -
కదిలింది..కార్మికదండు!
● లేబర్కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల భారీ ప్రదర్శనజనగామ రూరల్: బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక ప్రజావ్యతిరేక విధానాలను ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని, దానిద్వారానే 4 లేబర్కోడ్లను వెనక్కితీసుకొనేలా చేయగలమని ఐఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఽ శ్రీదేవి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్, ఐఎన్టీయూసీ జిల్లా నాయకుడు డాక్టర్ లక్ష్మీనారాయణనాయక్ పిలుపునిచ్చారు. గురువారం దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా సీఐటీయూ, బీఆర్టీయూ, ఐఎన్టీయూసీ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల కేంద్ర కమిటీల పిలుపులో భాగంగా రైల్వే స్టేషన్ నుంచి ప్రెస్టిన్ గ్రౌండ్ వరకు కార్మికులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వేముల నర్సింగం, బైరగోని అంజమ్, రాజమణి, కోమల్ల ఎల్లమ్మ, బూడిద ప్రశాంత్, తోటగోని రాధ, ఎర్రబెల్లి సంతోష తదితరులు పాల్గొన్నారు. కేంద్రం తీసుకోచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ అన్నారు. -
‘మేడారం’ ఆదాయం రూ.13,51,76,275
హన్మకొండ కల్చరల్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగిన సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఆదాయం రూ. 13,51,76,275 వచ్చినట్లు మేడారం జాతర ఈఓ వీరస్వామి తెలిపారు. మహాజాతర సందర్భంగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద దేవాదాయశాఖ ఏర్పాటు చేసిన 780 ఇనుపరేకు హుండీలు, 45 వస్త్ర, 3 ఒడిబాలబియ్యం హుండీలు కలిపి మొత్తం 828 హుండీలను భారీ సెక్యూరిటీతో ఫిబ్రవరి 2వతేదీ సోమవారం హనుమకొండ లష్కర్బజార్లోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలోకి చేర్చారు. హుండీల లెక్కింపు ఫిబ్రవరి 5న గురువారం ప్రారంభమైంది. చివరిరోజు లభించిన ఆదాయం.. ఎనిమిదో రోజు (చివరిరోజు) గురువారం చిల్లరనాణేలను వేరు చేసి తూకం వేసి లెక్కించడంతో మహాజాతర హుండీల లెక్కింపు పూర్తయ్యింది. చివరిరోజు లెక్కింపులో నాణేల ద్వారా లభించిన ఆదాయం రూ.4,56,399, ఈ–హుండీల ద్వారా (క్యూ ఆర్ ద్వారా) రూ. 21,36,607 మొత్తం కలిపి రూ.25,93,006 సమకూరింది. జాతర ఆదాయం రూ.13,51,76,275 మహా జాతర మొత్తం ఆదాయం రూ.13,51,76,275గా నమోదైందని ఈఓ వీరస్వామి తెలిపారు. భక్తులు వివిధ రకాల వస్తువుల రూపంలో వేసిన బంగారం, వెండి సూక్ష్మ కానుకలను సైతం ప్రత్యేక నిపుణుల సహాయంతో, సెన్సార్ల సహాయంతో గుర్తించి లెక్కకట్టారు. ఏటా పెరుగుతున్న ఆదాయం 1946లో జాతర ఆదాయం రూ.17,173 కాగా, 1968లో దేవాదాయశాఖ మొదటిసారిగా నిర్వహించిన జాతరలో రూ.1,20,113గా నమోదైంది. 1980లో మొదటిసారిగా వరంగల్ జిల్లా కలెక్టర్గా పని చేసిన జె.బాపురెడ్డి ఐఏఎస్ పెద్ద ఎత్తున ప్రచారంతో జాతర ఆదాయం రూ. 4,50,000 వచ్చింది. అదేవిధంగా 2002 నుంచి జాతర ఆదాయం కోటి రూపాయలు దాటింది. 2016 జాతర ఆదాయం రూ. 8.90 కోట్లుగా నమోదైంది. ఈవిధంగా ప్రతిఏటా జాతర ఆదాయం కోట్లల్లో పెరుగుతూ వస్తోంది. 2024లో మేడారం జాతర సందర్భంగా గద్దెల ప్రాంగణంలో 518 హుండీలు, తిరుగువారం హుండీలు 22 కలుపుకుని మొత్తం 540 హుండీలకుగాను ఆదాయం రూ.12,71,79,280 సమకూరింది. కాగా, ప్రస్తుతం జాతరలో గద్దెల ప్రాంగణంలో 828 హుండీలను ఏర్పాటు చేయగా.. రూ.13,51,76,275గా నమోదైంది. గతంకంటే 288 హుండీలను అదనంగా ఏర్పాటు చేశారు. గతంతో పోలిస్తే భక్తుల రద్దీ పెరిగినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదు. గత జాతరలో 779 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం, 55 కిలోల 150 గ్రాముల వెండి కానుకలు లభించాయి. ప్రస్తుత జాతరలో 486 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 31కిలోల 700 గ్రా ముల వెండి లభించింది. గతం కంటే తక్కువగా కానుకలు వచ్చాయి. దీనికి బంగారం, వెండి రే ట్లు పెరగడమే కారణంగా చెప్పవచ్చని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా గత జాతర ఆదాయంతో పోలిస్తే ప్రస్తుత జాతర ఆదాయం ఆశించినంత పెరగలేదు. పూర్తయిన మహా జాతర హుండీల లెక్కింపు చివరి రోజు లభించిన ఆదాయం రూ. 4,56,399 ఈ–హుండీల ద్వారా (క్యూ ఆర్ల ద్వారా) రూ. 21,36,607 గత జాతరకంటే అదనంగా 288 హుండీల ఏర్పాటు అయినప్పటికీ పెరగని ఆదాయం, తగ్గిన బంగారు, వెండి కానుకలు -
పురాధీశులు ఎవరో?
జనగామ, స్టేషన్ఘన్పూర్లో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధంజనగామ: పురపోరు ప్రజాభిప్రాయ తీర్పుతో గెలుపు ఎవరిదోననే ఉత్కంఠ అభ్యర్థుల్లో నెలకొంది. ఈనెల 13న(శుక్రవారం) ఫలితాలు వెలువడనుండగా, జనగామ, స్టేషన్ఘన్పూర్లో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పురపాలక ఎన్నికల పోలింగ్ ముగియడంతో జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జనగామలోని హైదరాబాద్రోడ్డు ఏకశిల బీఈడీ కళాశాల, ఘన్పూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు కేంద్రాల్లో కూడా అధికారులు, పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జనగామ పురపాలికలో 44,045 మంది ఓటర్లు ఉండగా, 34,281 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ శాతం 79.04గా నమోదైంది. స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో 18,850 ఓట్లలో 15,670 ఓట్లు పోలై 84.47 శాతం ఓటింగ్ జరిగింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. జనగామలోని 30 వార్డులకు 30 టేబుల్స్ ఏర్పాటు చేయగా ఒకే రౌండులో ఓట్ల లెక్కింపు పూర్తిచేయనున్నారు. స్టేషన్ ఘన్పూర్లో 18 వార్డులకు 18 టేబుల్స్పై లెక్కింపు చేపట్టి ఒకే రౌండ్లో ప్రక్రియ పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. జనగామ లెక్కింపు కేంద్రంలో 36 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 72 మంది అసిస్టెంట్ సూపర్వైజర్లు విధుల్లో పాల్గొననున్నారు. స్టేషన్ ఘన్పూర్లో 20 మంది సూపర్వైజర్లు, 40మంది అసిస్టెంట్ సూపర్వైజర్లు కౌంటింగ్ సమయంలో సేవలు అందించనున్నారు. ఆర్ఓలు, సిబ్బందికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం స్నాక్స్ మాత్రమే అందజేస్తారు. లంచ్ సదుపాయం లేకపోవడంతో రిలీవ్ సమయంలో ఇంట్లోనే భోజనం చేయాల్సి ఉంటుంది. కౌంటింగ్ హాళ్లలో ప్రత్యేక పాసు ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించ నున్నారు. జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి గురువారం ఆయా శాఖల ఉన్నతాధికారులతో గూగుల్ మీటింగ్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ఎన్నికల నియమావళిని అనుసరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించాలన్నారు. లెక్కింపు ప్రక్రియలో ప్రతీ దశను స్పష్టంగా అమలు చేసే విధంగా సిబ్బందికి ముందస్తుగా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. లెక్కింపు కేంద్రం వద్ద మూడంచెలుగా భద్రతా ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రక్రియ కొనసాగుతుందని, అభ్యర్థులు, ఏజెంట్లకు గుర్తింపు కార్డుల ఆధారంగా ప్రవేశం కల్పించేలా చూడాలని కలెక్టర్ సూచించారు. జనగామ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏకశిల బీఈడీ కళాశాలలో ఏర్పాట్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ పరిశీలించారు. కౌంటింగ్ హాల్స్ నిర్వహణ, టేబుల్స్ ఏర్పాటు, సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా చర్యలు, తాగునీరు, టాయిలెట్ సదుపాయాలు, విద్యుత్ సరఫరాతో పాటు ఇతర మౌలిక వసతులపై అధికారులతో చర్చించారు. ఏసీ వెంట ఆర్డీఓ గోపీరామ్, కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఉన్నారు. ప్రజాతీర్పుపై అభ్యర్థుల్లో ఉత్కంఠ జనగామలో 30, ఘన్పూర్లో 18 టేబుల్స్ రెండుచోట్ల ఒకే రౌండ్ ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలు మధ్యాహ్నం 2 గంటల వరకే ఫలితాలు భద్రత వలయంలో కౌంటింగ్ కేంద్రాలుడీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 200 మీటర్ల దూరంలో ఆంక్షలు అమలు చేస్తూ అవాంఛనీయ ఘటనలను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు, మైక్రో అబ్జర్వర్ సిస్టం ద్వారా కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు మొబైల్ ఫోన్లతో లోపలికి వెళ్లేందుకు అనుమతించరు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో మొత్తం లెక్కింపు ప్రక్రియ జరుగనుంది. అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు మహేశ్వర్రెడ్డి, రాధాకృష్ణ లెక్కింపును సమీక్షించనున్నారు. -
స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించిన డీసీపీ
స్టేషన్ఘన్పూర్: డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్రూమ్ను డీసీపీ రాజమహేంద్రనాయక్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందితో మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, శాంతిభద్రతలకు విఘాతం కల్గించినా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. డీసీపీ వెంట సీఐ జి.వేణు, ఎస్ఐ వినయ్కుమార్ తదితరులున్నారు. జనగామ రూరల్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పా ట్లు చేసినట్లు ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ తెలి పారు. గురవారం పోలీసులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో తగినంత పోలీసు బలగాల ను మోహరించి, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు, అభ్యర్థులు, పార్టీల నాయకులు సహకరించి ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు● సీపీ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధి జనగామ, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల వద్ద శుక్రవారం నుంచి నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా.. 200 మీటర్ల పరిధిలో బీఎన్ఎస్ఎస్, సీఆర్పీసీ–163 ప్రకారం.. ప్రజలు ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ నిషేధం నేడు (శుక్రవారం) ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఎవరైనా ఈ ఉత్తర్వులు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా చేపట్టాలి● అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ స్టేషన్ఘన్పూర్: ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత కీలకమైందని, సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పారదర్శకంగా, కచ్చితంగా కౌంటింగ్ నిర్వహించాలని అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ సూచించారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఓట్ల లెక్కింపు జరుగనున్న స్థానిక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల కౌంటింగ్ కేంద్రాన్ని గురువారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి అంతరాయం కలుగకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘స్వయంభూ’ దర్శనభాగ్యం!
బుగులు వెంకన్న భక్తులకు నెరవేరిన చిరకాల స్వప్నం 650 మెట్లు ఎక్కితే కొండపై గుహలో స్వామి దర్శనంచిల్పూరు: చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరుడి దర్శనానికి వచ్చే భక్తులకు చిరకాల స్వప్నం నెరవేరింది. స్వయం భూవలయుడిగా వెలిసిన ప్రాంతమున్న కొండపైకి చేరుకునేందుకు మెట్ల మార్గం పూర్తయింది. 650 మెట్లు ఎక్కితే కొండ గుహలో వెలిసిన దేవుడిని దర్శనం చేసుకోవచ్చు. ఎత్తైన కొండపై గుహలో వెలిసిన స్వయం భూవలయని దర్శనం కోసం భక్తులు ఒకప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతూ వెళ్లేవారు. పైకి ఎక్కలేని భక్తులు కింది నుంచే దర్శనం చేసుకునేవారు. దీన్ని గమనించిన ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు కొండపైకి మెట్ల మార్గం పూర్తి చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈవిషయాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే, భక్తుల సహకారంతో 650 మెట్లను పూర్తి చేయించారు. దీంతో పాటు లైట్లు, పలు సౌకర్యాలు కల్పించారు. గతంలో ప్రతీ శనివారం అర్చకుడితో పాటు ఒకరికి తోడుగా ఒకరు చేయిపట్టుకుని పైకి ఎక్కి దర్శనం చేసుకునేవారు. ప్రస్తుతం మెట్ల మార్గం పూర్తి కావడంతో భక్తులు ఇక నిత్యం కొండపైకి ఎక్కి స్వయం భూవలయున్ని దర్శించుకోవచ్చు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ, భక్తుల సహకారంతో మెట్ల మార్గం పూర్తి చేయించాను. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎంతో ఉత్సాహంగా కొండపైకి వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. –పొట్లపల్లి శ్రీధర్రావు, చైర్మన్స్వయం భూవలయున్ని దర్శించుకోవాలనే భక్తుల కోరిక మెట్ల మార్గం పూర్తి కావడంతో నెరవేరింది. ప్రస్తుతం మెట్లకు రంగులు, పైవరకు లైట్లు పూర్తి అయ్యాయి. –భాగం లక్ష్మీప్రసన్న, ఈఓ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం మెట్ల మార్గం పూర్తయింది. కొండ గుహలో వెలిసిన దేవుని దర్శన భాగ్యం ప్రతీ ఒక్కరికి కలుగుతుంది. అల్వార్రాజులు, క్షేత్రపాలకులు, ఆంజనేయ స్వామి ఉండడం వల్ల భక్తులు కోర్కెలు నెరవేరుతాయి. – రవీందర్శర్మ, ఆలయ అర్చకులు -
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ
స్టేషన్ఘన్పూర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్టేషన్ఘన్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, శివునిపల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. పోలింగ్ స్టేషన్ ఇన్చార్జులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ట్రైనీ ఐపీఎస్ మనీషానెహ్రా, డీసీపీ రాజమహేంద్రనాయ క్, ఏసీపీలు భీమ్శర్మ, నర్సయ్య, సీఐలు జి.వేణు, ఎ.శ్రీనివాస్రెడ్డి, ఎస్ఐలు తదితరులున్నారు. -
హనుమకొండ జిల్లా : 80.18 శాతం వరంగల్ జిల్లా : 85.42 శాతం జేఎస్ భూపాలపల్లి : 65.18 శాతం ములుగు జిల్లా : 80.41 శాతం మహబూబాబాద్ జిల్లా : 78.90 శాతం జనగామ జిల్లా : 80.66 శాతం
ఉమ్మడి జిల్లాలో 80.09 శాతం పోలింగ్● గతంతో పోలిస్తే పెరిగిన 13.38 శాతం సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాల్లో 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ల నుంచి 1,073 మంది కౌన్సిలర్ల కోసం పోటీ పడ్డారు. బుధవారం రాత్రి వరకు అధికారుల ప్రకటించిన ప్రకారం ఉమ్మడి జిల్లాలో 80.09 శాతంగా పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లా 12 మున్సిపాలిటీల్లో మొత్తం 3,35,244 మంది ఓటర్లకు 2,58,930 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2020లో జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 9 మున్సిపాలిటీలలో 200 వార్డులుండగా ఏకగ్రీవమైన 18 వార్డులు మినహాయించి 182 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. 2,32,763 మంది ఓటర్లకు ఆ ఎన్నికల్లో 1,77,508 (76.26 శాతం) మంది ఓట్లేశారు. 2020 ఎన్నికలకు ఈసారి ఎన్నికలు పోలిస్తే కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలు పెరిగాయి. పెరిగిన మున్సిపాలిటీలు, ఓటర్లు, పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే గతంతో పోలిస్తే 13.38 శాతం పెరిగింది. -
ప్రత్యర్థులతో స్నేహహస్తం!
జనగామ/ జనగామ రూరల్: ఓవైపు ఓటింగ్..మరోవైపు ఓట్లు ఎవరికి పడుతున్నాయోనని టెన్షన్.. అయినా ఆ అభ్యర్థులు ఏకంగా ప్రత్యర్థులతోనే స్నేహహస్తం చాటారు. జనగామ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యాక ఒకటో వార్డు నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి సజ్జ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ అభ్యర్థి మూడ్ లక్షణ్ నాయక్, బీజేపీ అభ్యర్థి కూరాకుల శ్రీలత ముగ్గురూ కలిసి బయటకు వచ్చి స్నేహపూర్వకంగా చేతులు కలిపి గెలుపు గుర్తులు చూపించారు. అలాగే రెండో వార్డు కౌన్సిల్ ఎన్నికల పోలీంగ్ ప్రెస్టన్ కళాశాల ఆవరణలో కొనసాగుతుండగా కాంగ్రెస్ అభ్యర్థి రామగళ్ల విజయ్, బీఆర్ఎస్ అభ్యర్ది రావెల రవి కలుసుకుని రాజకీయాలు పక్కనబెట్టి గెలుపోటములపై సమాలోచనలు చేశారు. కక్షపూరిత రాజకీయాలు పెట్రేగుతున్న కాలంలో ఇలా స్నేహహస్తం చాటడంపై పలువురు అభినందించారు. రెండో వార్డు అభ్యర్థుల మాటాముచ్చటపోలింగ్ కేంద్రం వద్ద 1వ వార్డు అభ్యర్థులు -
పైసామే పురమాత్మ!
జనగామలో 30, స్టేషన్ ఘన్పూర్లో 18 మొత్తంగా 48 వార్డుల్లో 209 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. స్వతంత్రులు అనేక చోట్ల ప్రధాన పార్టీల కు గట్టిపోటీ ఇవ్వగా, వీరికిపడే ఓట్లు ఎవరిని దెబ్బతీస్తాయోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చైర్మన్, వైస్ చైర్మన్ రేస్లో ఉన్నవారు భారీగా ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఉద యం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి అన్ని పార్టీల నాయకులు ఓటర్లను మేనేజ్ చేయడంలో నిమగ్నమైపోయారు. ఇంటెలిజెన్స్ అంచనాలు, రాజకీయ విశ్లేషకుల రిపోర్టులు, గెలుపు, ఓటమి లెక్కలు, డబ్బుల పంపిణీతో తారుమారైనట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.జనగామ: జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ ఎన్నికల్లో పంచిన డబ్బులు అభ్యర్థుల రాజకీయ లెక్కలను పూర్తిగా తారుమారు చేస్తున్నాయి. ఒక్కో ఇంటికి పది, పదిహేను కాదు.. కొన్నిచోట్ల యాభై వేల వరకు చేరి.. చివరకు ఓట్ల పంపకాలపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది. ఏ పార్టీ ఇచ్చినా తీసుకున్న ఓటర్లు, పోలింగ్ రోజున మాత్రం నిశ్శబ్దంగా బూత్కి వెళ్లి ఓటు వేశారు. ఎవరి వైపు మొగ్గు చూపారో.. ఎవరికీ వేశారో అభ్యర్థులు కూడా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ఇంటెలిజెన్స్ రిపోర్టులు, పార్టీల లెక్కలు, రాజకీయ విశ్లేషణలు అన్నీ డబ్బు ట్రెండ్తో తారుమారయ్యాయి. చివరికి డబ్బులు ఇచ్చిన వారు గెలుస్తారా లేక డబ్బులు తీసుకున్న ఓటర్లు గేమ్ మార్చారా అన్నది రేపటి ఫలితాలే చెప్పాలి. పురపాలక ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని రెండు మున్సిపాలిటీల పరిధిలో డబ్బు దందా అమాంతం పెరిగింది. ఓటుకు నోటు లెక్క రాజకీయం మారడంతో ఓటర్ల ఇళ్ల వద్దే వేల రూపాయల నుంచి లక్ష దాకా డబ్బులు పంపిణీ చేశారు. గతంలో ఊహించని విధంగా ఓటర్లకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు, కొన్ని చోట్ల రూ.50 వేల రూపాయల వరకు అభ్యర్థులు ఖర్చు పెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఎక్కడ చూసినా ‘మనీ మోటివేషన్’ స్పష్టంగా కనబడగా, డబ్బులు ఇచ్చిన అభ్యర్థులే ఇప్పుడు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. ఓటుకు నోటు.. జనగామ పట్టణంలోని కొన్ని వార్డుల్లో ఓటుకు రూ.10 వేల వరకు ఇవ్వగా, మరికొన్ని చోట్ల రూ.3వేల రూ.5 వేలకు పైగా పంపిణీ చేశారు. పోలింగ్ రోజు తెల్లవారుజాము వరకూ కూడా డబ్బుల పంపిణీ సాగింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లకు బస్సు ఛార్జీలు, భోజన ఖర్చులు, అదనంగా ఓటుకు నోటు అంటూ వేల రూపాయలు అందించిన ఘటనలు కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు పట్టుచీరలు, చికెన్ ప్యాకెట్లు, మద్యం, సిల్వర్ కాయినన్స్, స్వీట్ బాక్స్లు వంటి తాయిలాలు పంపిణీ చేశారు. బూత్ ల వద్ద కూడా అభ్యర్థుల అనుచరులు డబ్బుతో రెడీగా ఉండి అప్పటికప్పుడు ఓటును తమవైపు తిప్పుకునే దృశ్యాలు ఎక్కడ చూసినా కనిపించాయి. సైలెంట్ ఓటింగ్...అభ్యర్థుల్లో ఆందోళన డబ్బు పంపిణీకి ముందు ఉన్న అంచనాలన్నీ డబ్బులు ఇచ్చిన తర్వాత మారిపోయినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓటర్లు ఇంత పెద్దఎత్తున డబ్బులు తీసుకున్న తర్వాత ఏ పార్టీ వైపు మొగ్గుచూపారో చివరి నిమిషం వరకు చెప్పకుండా సైలెంట్గా వ్యవహరించడం అభ్యర్థుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. గత ఎన్నికల్లో ఓటర్లు బయటే బాహాటంగా చెప్పినప్పటికీ, ఈసారి పూర్తిగా నిశ్శబ్దంగా ఓటింగ్ చేయడం అభ్యర్థుల వారీగా ఓట్లు విభజనకు గురయ్యాయా అనే ఊహాగానాలు వినిపించాయి. పోలింగ్కు ఒక రోజు ముందు రాత్రి నుంచి ప్రారంభమైన డబ్బుల పంపిణీ తెల్లవారుజాము వరకు పలు వార్డుల్లో కొనసాగగా, కొన్ని చోట్ల పోలింగ్ రోజున సాయంత్రం వరకూ రహస్యంగా నోట్ల పంపిణీ జరిగింది. దీంతో అభ్యర్థులు పగలు, రాత్రి తేడా లేకుండా పోల్ మేనేజ్మెంట్లోనే నిమగ్నమయ్యారు. బూత్ల వద్దే పంపకాలు ఇంటికి రూ.2వేల నుంచి 10వేలు.. చైర్మన్, వైస్ చైర్మన్ రేసులో కోట్ల ఖర్చు ఎన్నడూ లేని సైలెన్స్...అందరికీ టెన్షన్ -
నిదానంగా ఓటెత్తారు!
జనగామ: జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ మొదట నిదానంగా ప్రారంభమైనప్పటికీ గంటగంటకూ ఓటర్ల రాక పెరుగుతూ వచ్చింది. పోలింగ్ బూత్లలో ఉదయం 6 గంటలకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, సరిగ్గా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొదటి రెండు గంటల్లో 10 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ నమోదు కాగా, ఉదయం 10 తర్వాత ఓటర్లు వరుసగా బూత్లకు చేరుకోవడం మొదలైంది. జనగామలో 66, స్టేషన్ఘన్పూర్లో 36 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షించగా, ఏఎస్పీ చేతన్ నితిన్, ఏసీబీ, సీఐ, ఎస్సై ఆధ్వర్యంలో 750 మందికి పైగా పోలీసు బలగాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షించడంతో రెండు చోట్ల పోలింగ్ పూర్తిగా ప్రశాంతంగా ముగిసింది. మాకెందుకు డబ్బులు ఇవ్వలేదు.. పట్టణంలోని 23వ వార్డులో ఓటర్లు స్వయంగా ఓ అభ్యర్థిని నిలదీసిన ఘటన ఎన్నికల ప్రక్రియకు విభిన్నంగా నిలిచింది. మా ఓటుకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని ఓటర్లు అభ్యర్థిని ప్రశ్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పోలీసులు చేరుకుని పరిస్థితిని శాంతింపజేశారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్ల కోసం పార్టీ నాయకులు వేచి ఉండి, వాహనం దిగిన వెంటనే వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశారు. కొన్ని చోట్ల వీల్ఛైర్ల కొరత కారణంగా దివ్యాంగులకు ఇబ్బందులు కలగగా తెలుసుకున్న అధికారులు వెంటనే తెప్పించి సేవలను ప్రారంభించారు. కట్టుదిట్టమైన చర్యలతో.. పోలింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లకు అనుమతి ఇవ్వకుండా, ఓటర్లను పూర్తిగా చెక్ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. సీసీ కెమెరాలు, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో పోలింగ్ మొత్తం సాగింది. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ సెంటర్ నుంచి జనరల్ అబ్జర్వర్ నరసింహారెడ్డి, కలెక్టర్ షేక రిజ్వాన్ బాషా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. అలాగే ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి ప్రెస్టన్ మైదానంలోని పోలింగ్ బూత్లను సందర్శించారు. బూత్ల వద్ద స్థానికేతర నాయకులు ఉండకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే వారిని అక్కడి నుంచి పంపించారు. ఇదే క్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ బాల్దె సిద్దిలింగంను అరెస్ట్ చేసి పీఎస్కు తరలించగా, పరిస్థితులు ఉద్రిక్తతమయ్యే అవకాశం ఉండడంతో కావడంతో పోలీస్ జీప్లో పెంబర్తిలోని ఆయన స్వగృహానికి తరలించారు. చిన్న గందరగోళాలు తప్పి తే పోలింగ్ శాంతియుతంగా సాగింది. ఎప్పటికప్పుడు పరిశీలన.. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర పింకేశ్ కుమార్, పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఎప్పటికప్పుడు పరిశీలించారు. జనగామ, స్టేషన్ఘన్పూర్లోని సెయింట్ మెరీస్, ఏబీవీ హైస్కూల్, ధర్మకంచ ఉన్నత పాఠశాల, పోలింగ్ బూత్లను సందర్శించి, అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. పోలీసు బందోబస్తు, ఓటర్లకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, మెడికల్ క్యాంపు తదితర వాటికి సంబంధించి సూచనలు చేశారు. ప్రశాతం వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు సహకరించిన ఓటర్లు, అధికార యంత్రానికి కలెక్టర్ అభినందించారు. 21వ వార్డులో వృద్ధురాలిని ఓటు వేసేందుకు తీసుకెళ్తున్న సిబ్బంది వృద్ధురాలిని తీసుకెళ్తున్న పారిశుద్ధ్యకార్మికురాలుగంటగంటకూ పెరుగుతూ..జనగామ: జనగామ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోలింగ్ ప్రారంభమైన మొదటి గంట నుంచి ఓటర్లు మంచి స్పందన చూపించారు. పట్టణంలో 44,045 ఓట్లు ఉండగా, పురుషులు 21.358, మహిళలు 22,678, అదర్స్ 9 మంది ఉన్నారు. ఉదయం 9 గంటలకే మొత్తం 4,489 మంది, అంటే 10.19శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించారు. 11 గంటల వరకు రద్దీ పెరగడంతో 11,674 ఓట్లు నమోదు కాగా, శాతం 26.5శాతానికి చేరింది. మధ్యాహ్నం 1 గంట సమయానికి పోలింగ్ మరింత ఊపందుకొని 20,545 ఓట్లు పడగా, శాతం 46.65శాతం వద్దకు చేరింది. మధ్యాహ్నం 1గంట నుంచి 3 గంటల వరకు అనూహ్యంగా రద్దీ పెరగడంతో 3 గంటలకు 28,764 ఓట్లు పోలు కాగా, పోలింగ్ శాతం 65.1 శాతానికి చేరుకుంది. సాయంత్రం చివరి గంటల్లోనూ పోలింగ్ వేగం తగ్గకపోవడంతో 5 గంటల నుంచి రాత్రి 7 వరకు పోలింగ్ ముగిసే వరకు 34,821 ఓట్లు పోలు కాగా, 79.04శాతం వద్ద నిలిచింది. ఇందులో పురుషులు 16,914, మహిళలు 17,898 మంది ఓటు వేశారు. జనగామ మున్సిపాలిటీలో ఉత్సాహభరితంగా ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా మహిళల ఓటింగ్ శాతం పురుషుల కంటే ఎక్కువగా ఉంది. ఘన్పూర్లో ఓటింగ్ శాతం.. స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు ఊహించిన దానికంటే ఎక్కువ ఉత్సాహం కనబర్చారు. రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతం విడుదల చేయగా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటింగ్ స్థిరంగా పెరుగుతూ వచ్చింది. మొత్తం 18,550 మంది ఓటర్లలో పురుషులు 8,913, మహిళలు 9, 636, ఇతరులు 1 ఉన్నారు. ఉదయం 9 గంటలకు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్రమంగా రావడంతో మొత్తం 2,138 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, 11.52శాతంగా నమోదైంది. 11 గంటలు వరకు ఓటర్లు పెద్ద సంఖ్యలో కేంద్రాలకు చేరుకోవడంతో 6,181 ఓట్లు పోలయ్యాయి. ఈ దశలో పోలింగ్ శాతం 33.32శాతానికి చేరింది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ కేంద్రాల్లో మరింత రద్దీ పెరిగింది. పార్టీల ప్రతినిధులు ఎక్కువ మొత్తంలో ఓటర్లను తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఈ సమయానికి మొత్తం 10,458 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 56.38 శాతానికి చేరుకుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ఓటర్లు పెద్ద సంఖ్యలో కేంద్రాలకు చేరుకున్నారు. ఈ సమయానికి పోలైన మొత్తం ఓటర్ల సంఖ్య 13,752 కాగా, శాతం 74.13శాతానికి చేరుకుంది. సాయంత్రం చివరి గంటల్లో కూడా ఓటర్లు చురుకుగా స్పందించడంతో 5 గంటల వరకు 15,670 ఓట్లు నమోదు కాగా ఇందులో పురుషులు 7,6 20, మహిళలు 8,049 మందితో 84.47 శాతంతో ముగిసింది. గతం కంటే 0.32 శాతం తగ్గిన ఓటింగ్ జనగామ మున్సిపాలిటీలో 2020 పురపాలిక ఎన్నికల కంటే 0.29శాతం ఓటింగ్ తగ్గింది. గతంలో 40,099 ఓట్లు ఉండగా, 31,822 ఓట్ల పోలింగ్తో 79.36శాతం ఓటింగ్ నమోదు కాగా, ప్రస్తుతం 79.04తో 0.32శాతం ఓటింగ్ తగ్గింది.కొత్త కొత్తగా ఉన్నది!మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు యువత ఉత్సాహం చూపించింది. ముఖ్యంగా ఈ ఏడాదే ఓటు హక్కు వచ్చిన యువత ఓటు వేసి సెల్ఫీలు తీసుకుని, వాట్సాప్ల్లో స్టేటస్లు పెట్టుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఎక్కువగా విద్యార్థులే కావడంతో ఓటు వేయడానికి సొంతూరుకు వచ్చారు. తమ స్నేహితులతో కలిసి పోలింగ్ కేంద్రాల బయట సందడి చేశారు. –జనగామ మరిన్ని వార్తలు, ఫొటోలు 8, 9లో మధ్యాహ్నం వరకు పెరిగిన ఓటింగ్ చిన్న చిన్న ఉద్రిక్తతలు మినహా సజావుగా ఎన్నికలు జనగామ 79.04శాతం, స్టేషన్లో 84.47శాతం పోలింగ్ పట్టణంలో ఓటేసిన ఎమ్మెల్యే పల్లా, కలెక్టర్ రిజ్వాన్ బాషా దంపతులు ఉ 9గంటలు 11గంటలు ఒంటిగంట 3గంటలు 5 గంటలకు జనగామ 10.19 26.5 46.65 65.1 79.04 స్టే.ఘన్పూర్ 11.52 33.32 56.38 74.13 84.47 -
ఆర్టీసీ ఆదాయం రూ. 20.24 కోట్లు
● మేడారానికి మొత్తం ట్రిప్పులు 25,027 హన్మకొండ: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ప్రత్యేక బస్సులు నడిపిన టీజీఎస్ ఆర్టీసీ రూ.20,24,28,124 ఆదాయం రాబట్టుకుంది. జాతరకు 1,711 ప్రత్యేక బస్సులు నడిపి, 9,203 బస్ డేస్లలో, 25,027 ట్రిప్పుల ద్వారా మొత్తం 28,06,155 కిలోమీటర్లు నడిపింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. జాతరలో మొత్తం 12,33,585 మంది ప్రయాణికులు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఇందులో 6,08,686 మంది మహిళ(ఉచిత టికెట్)లు కాగా, 5,12,399 మంది చార్జీల చెల్లింపు ప్రయాణికులు ఉన్నారు. ఉద్యోగుల సమష్టి కృషితో... అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషితో జాతరను విజయవంతం చేశాం. ఏర్పాట్లు మొదలు నుంచి జాతర పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ కష్టించి పని చేశారు. జాతరను విజయవంతం చేసిన అందరికీ అభినందనలు. దర్శనం విజయ భాను, ఆర్ఎం, వరంగల్ -
నోఓటు యుద్ధం!
జనగామ: జనగామ, స్టేషన్ఘన్పూర్ పురపోరు రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. రెబల్స్ దూసుకురావడం, నోటు, మద్యం ప్రవాహం, అనేక వార్డుల వారీగా హోరాహోరీ త్రిముఖ పోటీతో ఎన్నికలను రణరంగంగా మార్చేసింది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు రూ.500 నుంచి రూ.5,000 వరకు నగదు, గిఫ్టులు, మద్యం,, చీరలు, వెండి కాయిన్ల పంపిణీతో ప్రలోభాల రాజకీయాలు చేపట్టారు. పొత్తులు, రెబల్స్ రాజకీయాలు రెండు మున్సిపాలిటీల్లో కలిపి 209 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అందులో జనగామలో 127, స్టేషన్ఘన్పూర్లో 82 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీల పొత్తు ఎన్నికల వేడిని పెంచగా, ముఖ్యంగా జనగామలో 3, 5, 7వ వార్డుల్లో సీపీఎం, 11వ వార్డులో సీపీఐ పోటీతో రసవత్తర రాజకీయం నెలకొంది. 17వ వార్డులో కాంగ్రెస్, సీపీఎం ఇద్దరికీ బీఫాంలు ఇవ్వడంతో అక్కడ ఫ్రెండ్లీ పోటీ నెలకొంది. జనగామ పరిధిలో 17 వార్డుల్లో 40 మంది రెబల్స్ పోటీ బరిలో నిలవడం కాంగ్రెస్కు తలనొప్పిగా మారింది. 23, 14, 5, 3వ వార్డుల్లో కాంగ్రెస్ రెబల్స్ భూష పర్వతాలు, దూసరి ధనలక్ష్మి, మిద్దెపాక భాస్కర్ బరిలో నిలవడంతో అక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. 7వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి, మాజీ కౌన్సిలర్ ఆకుల రజని ప్రధాన పార్టీలకు గట్టి చెక్ పెట్టడంతో గెలుపు ఎవ్వరిదనే అంచనాలు అంతు చిక్కడం లేదు. 15వ వార్డులో బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి, మాజీ కౌన్సిలర్ మారబోయిన పాండు గెలుపు కోసం పరితపిస్తుండగా, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా బలమైన ప్రచారంతో పోటీని హోరాహోరీగా మార్చారు. స్టేషన్ఘన్పూర్లో 30 మంది రెబల్స్ పోటీలో ఉండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలు ఒక్కసారిగా మారిపోయాయి. స్టేషన్లోనూ నువ్వా నేనా? స్టేషన్ఘన్పూర్ 5వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్కు బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. స్టేషన్ఘన్పూర్లో 1, 5, 4, 10, 14వ వార్డుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొంది. 16వ వార్డులో కాంగ్రెస్ రెబల్ గట్టి పోటీ ఇస్తుండగా, 17వ వార్డులో బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి బరిలో నిలిచారు. స్టేషన్లో కూడా ఓటుకు రూ.2 వేల నుంచి రూ.4వేల వరకు పంపిణీ చేసినట్లు సమాచారం. ఓటుకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు డబ్బు, మద్యం, చీరలు, వెండికాయిన్లు ‘మాకు తక్కువ ఎందుకిస్తున్నారు..?’ అంటూ పలు వార్డుల్లో ఓటర్ల ఆగ్రహం రెండు మున్సిపాలిటీల్లో 48వార్డులు.. బరిలో 209 మంది అభ్యర్థులు ఎవరూ తగ్గట్లే! ఈసారి పురపోరులో ఓట్ల కొనుగోలుకు సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు మున్సిపాలిటీల్లో చాలా వార్డుల్లో ఒక్కో ఓటుకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు ఇవ్వడం జరుగుతుండగా, కొన్నిచోట్ల స్వతంత్ర అభ్యర్థులు రూ.4వేల నుంచి కేవలం రూ.500, వెండి ఉంగరం ఇస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. కొన్ని వార్డుల్లో రూ.4వేలు, మద్యం బాటిల్, గిఫ్టులు, చీరలు పంపిణీ చేసినట్లు సమాచారం. ఆయా వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇప్పటికే రెండు మూడు విడతల్లో రూ.ఐదు వేల వరకు పంపిణీ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. స్వతంత్రులు మాత్రం అప్పులు చేసి ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒకచోట రూ.4,000, మరోచోట రూ.2,000, ఇంకోచోట రూ.2,500 పంపిణీ చేస్తున్న సమయంలో పక్క వార్డుల ఓటర్లు తమకు తక్కువ ఎందుకిస్తున్నారు? అంటూ అభ్యర్థులను నిలదీశారు. ఉత్కంఠ గత రెండు ఎన్నికల్లో చోటుచేసుకున్న ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకొని ఈసారి పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. మొత్తం 750 మంది పోలీసు బలగాలను రంగంలోకి దించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ ప్రత్యక్ష పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జనగామలో 8, స్టేషన్ఘన్పూర్లో 4 పోలింగ్ కేంద్రాలను క్రిటికల్ స్టేషన్లుగా గుర్తించి, అక్కడ ఎస్సై స్థాయి అధికారులను మోహరించారు. మొత్తం పోలింగ్ ప్రక్రియ అంతా సీసీ కెమెరాలు, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో సాగనుంది. -
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పరిశీలన
స్టేషన్ఘన్పూర్: మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్, జిల్లా అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ సంయుక్తంగా మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను, స్ట్రాంగ్రూమ్ను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా, భద్రతా ప్రమాణాల మేరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయి సిద్ధం చేయాలని ఆదేశించారు. వారి వెంట డీసీపీ రాజమహేంద్రనాయక్, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, ఏసీపీ భీమ్శర్మ తదితరులున్నారు. -
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో ఎలక్షన్లను స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర రిజ్వాన్ బాషా షేక్ కోరారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనున్నట్లు తెలి పారు. పోలింగ్ నేపథ్యంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, అనుచరులు ఎన్నికల ప్రవర్తన నియమాలు–2019ను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ఆయుధాలు నిషేధమని, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణ కోసం ఎవరూ ఆయుధాలతో పోలింగ్ కేంద్రానికి, దాని పరిసర ప్రాంతాలకు రావడానికి అనుమతి లేదని తెలిపారు. ఉల్లంఘనకు పాల్పడిన వారికి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని హెచ్చరించారు. అభ్యర్థికి ఒక్క వాహనం మాత్రమే అనుమతి ఉంటుందని, అభ్యర్థి ఏజెంట్ లేదా ఇతర పార్టీ నేతలకు వేరే వాహనాలకు అనుమతి లేదన్నారు. అభ్యర్థి హాజరు లేకపోతే, అతడి పేరుతో అనుమతించిన వాహనాన్ని ఇతరులు వినియోగించరాదన్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లడం లేదా తిరిగి తీసుకురావడం పూర్తిగా నిషేధమన్నారు. ఇది క్రిమినల్ నేరంగా పరిగణించబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ప్రచారం పూర్తిగా నిషేధమని, అలాగే పోలింగ్ బూత్తో పాటు వాటి పరిసరాల్లో మొబైల్ ఫోన్లు, వైర్లెస్ సెట్లు, కార్డ్లెస్ ఫోన్లు, వాడటం లేదా తీసుకెళ్లడం నిషేధమన్నారు. అనంతరం కలెక్టర్ ఎన్నికల పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించి, స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ హాల్స్కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట జనగామ ఆర్డీఓ గోపీరాం, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, తహసీల్దార్ తదితర అధికారులు ఉన్నారు. -
కట్టుదిట్టమైన బందోబస్తు: డీసీపీ
జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల పరిధిలో 750 మంది పోలీసులు బలగాల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..అడిషినల్ ఎస్పీతో పాటు రెండు చోట్ల ఏఎస్పీ, ఏసీపీ, 7 సీఐలు, 32 మంది ఎస్సైలు బీఎఎస్ఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ పోలీసులు గట్టి నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. జనగామలో 30, స్టేషన్లో 18 రూట్లను ఏర్పాటు చేసి ఆయా మార్గాల్లో పోలీసు పర్యవేక్షణ ఉంటుందన్నారు. క్రిటికల్ కేంద్రాల వద్ద ఎస్సై ర్యాంకు అధికారి బందోబస్తు ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల లోపు పార్టీ జెండాలు, ప్రచారానికి అనుమతి లేదన్నారు. రెండు పురపాలికల పరిధిలో 30 లోకేషన్ల పరిధిలో మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ ఉంటుందన్నారు. కాగా జనగామలో డీసీసీ, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణరెడ్డి ఆద్వర్యంలో పోలీసులు కవాతు నిరహించారు. -
మున్సిపోల్కు సిద్ధం
బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు పూర్తిఫ్లయింగ్ స్క్వాడ్ : 3స్టాటిక్ సర్వేలెన్స్ : 9 సోమన్న బ్రహ్మోత్సవాలకు కలెక్టర్కు ఆహ్వానం పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 14 నుంచి 18 వరకు జరిగే మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్కు ఆహ్వాన పత్రికను ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న ఆలయ ప్రధాన అర్చకుడు దేవగిరి లక్ష్మన్న అందించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన్ను కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. అలాగే అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, జెడ్పీ సీఈఓ మాధురి షాకు ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు దేవగిరి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సుక్కా.. ముక్కాస్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా ఎన్నికయ్యేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలోని ఓ వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటుకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు అందించడంతో పాటు ఒక ఇంటికి కిలో చికెన్, అర్ధసేరు మద్యం బాటిళ్లను అందించారు. కాగా చికెన్తో పాటు కొత్తిమీర, నిమ్మకాయలను సైతం అందించడం విశేషం. అదేవిధంగా స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ఎస్సీ జనరల్కు కేటాయించగా ఘన్పూర్లో ఎస్సీ జనరల్ రిజర్వేషన్లు ఉన్న ఒకటో, పదమూడో వార్డులలో పోటీ తీవ్రంగా ఉంది. చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థులు సైతం ఓటర్లకు పెద్ద మొత్తంలో తాయిలాలు అందిస్తున్నారు. డీఎం, సిబ్బందికి ప్రశంసలు జనగామ రూరల్: మేడారం జాతర 2026 విజయవంతమైన సందర్భంగా మంగళవారం వరంగల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కరీంనగర్, రీజినల్ మేనేజర్ వరంగల్ ఆధ్వర్యంలో జనగామ డిపో అధికారులకు, సిబ్బందిని ప్రశంసించారు. ఈసందర్భంగా జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో జనగామ డిపో మేనేజర్ ఎస్.స్వాతికి ప్రశంసపత్రాలు అందజేశారు. జనగామలోని ప్రెస్టన్ గ్రౌండ్స్, స్టేషన్ ఘన్పూర్ నుంచి మేడారం జాతరకు 130 స్పెషల్ బస్సులను దిగ్విజయంగా నడిపించారు. సహకరించిన ప్రతి ఒక్కరికి డీఎం కృతజ్ఞతలు తెలిపారు. కొనసాగుతున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనగామ రూరల్: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఇంటర్ విద్యాధికారి జితేందర్రెడ్డి మంగళవారం తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షకు జనరల్లో 270 విద్యార్థులకు గాను 269 మంది, ఒకేషనల్లో 120 మందికి 107 హాజరయ్యారన్నారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షలో జనరల్లో 260 విద్యార్థులకు 257 మంది, ఒకేషనల్లో 40 38 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు.రూట్ ఆఫీసర్స్: 6జనగామ/స్టేషన్ఘన్పూర్: జిల్లాలో జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో ఈనెల 11న(బుధవారం) ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పూర్తి చేసేలా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేస్తున్నారు. జనగామ మున్సిపాలిటీలోని 30వార్డుల పరిధిలో 66, స్టేషన్ఘన్పూర్లో 18వార్డులకు గాను 36 మొత్తంగా 102 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్లు..పోలింగ్ కేంద్రాలు ఇలా.. జిల్లాలోని రెండు పురపాలికల్లో 62,595మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 30,271, మహిళలు 32,314మంది ఉన్నారు. ఇందులో జనగామ పరిధిలో 44,045 ఓటర్లలో పురుషులు 21,358, మహిళలు 2 2,678 ఓటర్లు, ఇతరులు 9 మంది ఉన్నారు. స్టేషన్ఘన్పూర్లో 18,550 ఓట్లలో పురుషులు 8,913, మహిళలు 9,636మంది, ఇతరులు ఒక్కరు ఉన్నారు. జనగామలో 66, ఘన్పూర్లో 36 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని రెండు పురపాలికల్లో ఓట్ల వరకు పరిశీలిస్తే మహిళలదే పైచేయిగా కనిపిస్తోంది. 372మంది అధికారులు, సిబ్బంది జనగామ, స్టేషన్ఘన్ఫూర్లో పీఓ, ఓపీఓ, తదితర అధికారులు, సిబ్బంది 372 మంది సేవలు అందించనున్నారు. జనగామలో 80 మంది ప్రిసైడింగ్, మరో 80 మంది సహాయ ప్రిసైడింగ్ మొత్తంగా 160 మంది ఉన్నారు. స్టేషన్ఘన్పూర్లో 44 మంది ప్రిసైడింగ్, మరో 44 మంది సహాయ ప్రిసైడింగ్తో కలుపుకుని 132 మందితో పాటు ఇతర పోలింగ్ అధికారులను నియమించారు. ఇదిలా ఉండగా జనగామ 28, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలో 9 మంది మొత్తం 37 మంది మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో జరుగనున్నాయి. ఎలక్షన్ కమిషన్ నిఘా నేటి పోలింగ్ సందర్భంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఎప్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసీసీ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. 9మంది జోనల్ ఆఫీసర్స్, 9 మంది రూట్ అధికారులను నియమించామని ఉన్నతాధికారులు తెలిపారు. జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో రెండు చోట్ల ఒక్కొక్కరిని వ్యయ (ఖర్చుల) పరిశీలకులను నియమించారు. కౌంటింగ్ సూపర్వైజర్లు జనగామ మున్సిపల్ పరిధిలో 36, స్టేషన్ఘన్పూర్లో 22మంది కౌంటింగ్ సూపర్మైజర్స్, అలాగే స్టేషన్ఘన్పూర్లో 44, జనగామ మున్సిపల్లో 72 కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఎన్నికలు ప్రక్రియను వందశాతం వెబ్కాస్టింగ్ ద్వారా నిర్వహించనున్నారు. పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలు పోలింగ్ను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఏకశిల బీఈడీ కళాశాల, స్టేషన్ఘన్పూర్లోని పట్టగుట్ట రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో పోలింగ్ సామగ్రి(డిస్ట్రిబ్యూషన్) పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సుల్లో పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. మున్సిపాలిటీ పురుషులు మహిళలు అదర్స్ మొత్తం జనగామ 21,358 22,678 9 44,045 స్టే.ఘన్పూర్ 8,913 9,636 1 18,550 మొత్తం 30,271 32,314 10 62,595పోలింగ్ కేంద్రాలు జనగామ: 66 స్టేషన్ఘన్పూర్: 36సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఇవే.. జనగామ, స్టేషన్ఘన్పూర్లో 12 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఇందులో జనగామలో అంబేడ్కర్నగర్(ప్రాథమిక పాఠశాల/పీఎస్), మున్సిపల్ ఆఫీసు, ఉర్దూ మీడియం(లక్ష్మీబాయ్కుంట), వీవర్స్ కాలనీ (ప్రాథమిక పాఠశాల), ధర్మకంచ(జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల), ధర్మకంచ రైల్వే లైన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, రైల్వేస్టేషన్(ప్రాథమికోన్నత పాఠశాల), గుండ్లగడ్డ ప్రాథమిక ఉర్దూ మీడియం సమస్యాత్మక పరిధిలో ఉన్నాయి. స్టేషన్ ఘన్పూర్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, శివునిపల్లి జెడ్పీహెచ్ఎస్, చాగల్లు జెడ్పీహెచ్ఎస్, ప్రైమరీ స్కూళ్లను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా పోలీసులు గుర్తించారు.జనగామలో నిఘా బృందాలు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఓటు వేయాలంటే గుర్తింపుకార్డు తప్పనిసరి జనగామలో ఏకశిల బీఈడీ కళాశాల, ఘన్పూర్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సామగ్రి పంపిణీ కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తుస్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీఓటేసేందుకు 18 కార్డులు.. మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ -
పోలింగ్ సామగ్రి పంపిణీకి సిద్ధం
స్టేషన్ఘన్పూర్: ఈనెల 9న నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సామగ్రి పంపిణీకి స్థానిక ప్రభుత్వ ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్డీఓ డీఎస్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను మున్సిపల్ కమిషనర్తో కలిసి ఆర్డీఓ సోమవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..18 వార్డులకు ఆరు లొకేషన్లలో 36 పోలింగ్బూత్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్టేషన్ఘన్పూర్లో 2, ఛాగల్లులో 2, శివునిపల్లిలో 2 లొకేషన్లలో పోలింగ్బూత్లు ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. రేపటి నుంచి వ్యవసాయ మార్కెట్కు సెలవులు జనగామ: పురపాలిక ఎన్నికల సందర్భంగా ఈ నెల11, 12వ తేదీన జనగామ వ్యవసాయ మార్కెట్కు సెలవులను ప్రకటించడం జరిగిందని ఏఎంసీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీవన్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 12వ తేదీన హమాలీ కార్మికుల కోరిక మేరకు బంద్ ఇచ్చినట్లు, 13వ తేదీన యథావిధిగా సేవలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు జనగామ రూరల్: జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కలెక్టర్ ఆదేశానుసారం డీఆర్డీఏ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ లాజిస్టిక్స్ ట్రైనింగ్ ఆఫ్ ఎక్స్లెన్స్ సహకారంతో జాబ్ గ్యారంటీతో కూడిన ఉచిత స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు డీఆర్డీఓ వసంత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భాగంగా హైదరాబాద్లోని విద్యానగర్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో 30 మంది యువతీ యువకులు శిక్షణలో చేరారన్నారు. రియల్ టైమ్ ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్, సప్లై చైన్ అసోసియేట్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అంశాలపై వీరికి మూడు నెలల ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇవ్వడం జరిగిందని, ఈ నెల చివరి భాగంలో వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం బహుళ జాతీయ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. బ్యాచ్ కోసం మార్చి 5 వ తేదీ నుంచి పై కోర్సులకు దరఖాస్తులు తీసుకుంటామన్నారు. సుశ్రుత, దేవర్ష్లది కులదురహంకార హత్య పాలకుర్తి టౌన్: సుశ్రుత, దేవర్ష్లది కుల దురహంకార హత్య అని, కులాంతర వివాహాల రక్షణకు చట్టం చేయాలని కులఅసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలు గన్నారపు సరోజన అన్నారు. సోమవారం మండలంలోని గూడూరులో సుశ్రుత, దేవర్ష్ ల ఏడో వర్ధంతిని సుశ్రుత తల్లి కోమల, కుటుంబ సభ్యులతో కలిసి సమాధుల వద్ద నిర్వహించారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కన్వీనర్ గుండె ప్రమోద్, విలాస్, స్పప్న, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కోర్టు ప్రాంగణంలో నిందితుడి ఆత్మహత్యాయత్నం జనగామ రూరల్: తాను జైలుకు వెళ్లే అవకాశం ఉందని జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో సోమవారం ఓ నిందితుడు ఆత్మహత్యకు యత్నించాడు. పాలకుర్తి మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన కర్ణం సాయికి తల్లిదండ్రులు లేరు. ఒక సోదరి ఉంది. దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇటీవల ఉప్పల్కు చెందిన ఒక యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పాలకుర్తిలోని డబుల్ బెడ్ రూంలో అద్దెకు ఉంటున్నాడు. ఇటీవల పక్క ఇంట్లో దొంగతనం చేయగా పోలీసులు పట్టుకొని రిమాండ్ తరలించారు. సోమవారం జడ్జి వాదనలు విని జైలుశిక్ష ఖరారు చేశారు. తాను జైలుకు వెళ్లనని, తనకు భార్య ఉందని ఆమెను కూడా జైలుకు పంపాలని గొంతుకోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. కాగా ఇప్పటికే 14 సార్లు జైలుకు వెళ్లాడని, అతడికి అలవాటుగా మారిందని పోలీసులు తెలిపారు. -
గప్చుప్గా పంచుడు!
జనగామ: మున్సిపల్ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో అధికారికంగా ముగిసింది. ప్రచార పరిమితులు అమల్లోకి రావడంతో జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీల్లో నిశ్శబ్దం అలుముకుంది. పోలింగ్కు 48 గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో మైకులు, ర్యాలీలు, రోడ్షోలు, బహిరంగ ప్రచారం ఆగిపోయినా, పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఇంటింటి ప్రచారంలో వేడి పెంచారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ కాగా, పోలీసులు, ఎలక్షన్ నిఘా టీంలు మద్యం సరఫరా, డబ్బు పంపిణీ, గిఫ్టుల పంపకాలపై నిఘా మరింత కఠినతరం చేశారు. భారీ ర్యాలీలు..జోరు ప్రచారం చివరి రోజు ప్రచారంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, సీపీఎం, బీజేపీ, స్వతంత్రులు ప్రదర్శన, ర్యాలీలు చేపట్టారు. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ తరఫున ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థుల బలం, అభివృద్ధి హామీలను ప్రజలకు నాయకులు వివరించారు. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో 30 వార్డుల్లో వందలాది మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. గులాబీ జెండాలతో నిండిన ర్యాలీలో యువత భారీగా పాల్గొని ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. సీపీఎం, సీపీఐతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈసారి ఓటర్లను ఆకర్షించేందుకు వాడవాడలా భారీ ర్యాలీలతో రంగంలోకి దిగి తమ శక్తిని చాటుకున్నారు. ఎన్నికల సంఘం అప్రమత్తం ప్రచార ముగింపు నేపథ్యంలో ఎన్నికల అధికారులు, పోలీసు బృందాలు రాజకీయ పార్టీల కదలికలపై ప్రత్యేకంగా నిఘా పెట్టాయి. డబ్బు, మద్యం, గిఫ్ట్ సరఫరా జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పోలింగ్కు రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో అన్ని పార్టీలూ ఓటర్లను టచ్ చేస్తూ చివరి నిమిషంలో గెలుపు కోసం ప్రతి ప్రయత్నంలో వేగం పెంచారు. ఈసారి ఫలితాలు ఎలా ఉండబోతాయో పట్టణం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మద్యం దుకాణాలు బంద్ పురపాలిక ఎలక్షన్ల నేపథ్యంలో ఈ నెల9వ తేదీ 5 గంటల నుంచి 11వ తేదీ పోలింగ్ ముగిసే వరకు జనగామ, స్టేషన్ఘన్పూర్ రెండు మున్సిపాలిటీల పరిధిలో 17 మద్యం దుకాణాలు, 5 బార్లు మూసివేయనున్నారు. ఇందుకు సంబంధించి ఎకై ్సజ్ శాఖ మద్యం దుకాణాలతో పాటు బార్లను మూసివేసి సీజ్ చేశారు. అనంతరం ఓట్ల లెక్కింపు రోజు సైతం వీటిని మూసివేయనున్నారు. మున్సిపల్ పరిధిలో వైన్స్లను మూసివేశారు. పెంబర్తి, నెల్లుట్ల, రఘునాథపల్లి మండలాల నుంచి పెద్దఎత్తున మద్యం తరలించనుండగా, చాలా మంది అభ్యర్థులు రెండు రోజలు ముందుగానే రహస్య ప్రాంతాల్లో డంప్ చేసినట్లు సమాచారం. ఓటుకు నోటుతో పాటు సిట్టింగ్లతో పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు అన్ని వార్డుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.బయటి హడావిడి ఆగింది.. ఇంటింటి బాట మొదలైంది సరిగ్గా సాయంత్రం ఐదు గంటలు దాటగానే ఎన్నికల నియమావళి ప్రకారం అన్ని మైకులు ఆగిపోయాయి. రాజకీయ నేతలు కూడా మౌనాన్ని పాటించాల్సి రావడంతో వీధులు ఒక్కసారిగా ప్రశాంత వాతావరణంలోకి జారుకున్నాయి. అయితే ప్రచారం ముగిసిందే కానీ పోరు చల్లారలేదు. విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ, కొమ్మూరి, ధన్వంతి 5 గంటల సమయం కంటే నాలుగు నిమిషాల ముందుగానే ప్రచారరథం నుంచి కిందకు దిగగా, ఎమ్మెల్యే ర్యాలీ నుంచి ముందుగానే క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను సంప్రదించడం మాత్రమే ప్రస్తుతం పార్టీలు, అభ్యర్థుల ప్రధాన వ్యూహంగా మారింది. వార్డుల్లో ఇప్పటికే ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, సంఘాల వారీగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం, గిఫ్ట్ ప్యాకెట్లు, వెండి కాయిన్లు, ఓటుకు నోటు పద్ధతి, బాండ్ పేపర్లపై హామీలు ఇలా ఎన్నో రూపాల్లో గంపగుత్తగా ఓట్ల కొనుగోలు ప్రయత్నంలో వేగం పెంచారు. కొందరు అభ్యర్థులు సంఘాల ఆధ్వర్యంలో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఓట్ల బ్లాకులను తమవైపు తిప్పుకునేందుకు కసరత్తులు చేస్తున్నారని సమాచారం. ముగిసిన పురపోరు ప్రచారం మూగబోయిన జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీల వీధులు చివరిరోజు అన్ని పార్టీల జోరు ప్రచారం కాంగ్రెస్, బీఆర్ఎస్ భారీ ర్యాలీలు సంఘాల వారీగా రహస్య ఒప్పందాలు 48 గంటల్లో పోలింగ్... అంతటా ఉత్కంఠ -
రవీందర్రావుకు జీవిత సాఫల్య పురస్కారం
లింగాలఘణపురం: మండలంలోని నెల్లుట్ల శివారు శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు, నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అనసూయమ్మ లక్ష్మారావు కళాపీఠం నిర్వాహుకుడు నెల్లుట్ల రవీందర్రావుకు ఆదివారం రాత్రి శివానీ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్లో హనుమాన్పేట్లోని కమ్యూనిటీ హాల్లో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో శివానీ ఆర్ట్స్ అసొసియేషన్ అధ్యక్షుడు పరమేశ్వర్, గౌరవ అధ్యక్షుడు దొంతి శిల్పారెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జీసీ రెడ్డి, డైరెక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
నిర్భయంగా ఓటేయాలి
● పోలీస్ కవాతులో ఏసీపీ భీమ్శర్మ స్టేషన్ఘన్పూర్: ఈనెల 11న నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని స్టేషన్ఘన్పూర్ ఏసీపీ భీమ్శర్మ సూచించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్టేషన్ఘన్పూర్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం డివిజన్కేంద్రంలో పోలీసుకవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఎన్నికల కోసం పోలీసుశాఖ తరఫున తగిన బందోబస్తు ఏర్పాటు చేశామని, డీసీపీ పర్యవేక్షణలో ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, 15 మంది ఎస్ఐలు, 200 మంది పోలీసు కానిస్టేబుళ్లు విధుల్లో ఉంటారన్నారు. కార్యక్రమంలో సీఐలు జి.వేణు, శ్రీనివాస్రెడ్డి, ఎస్ఐలు వినయ్కుమార్, రమేశ్, మనీషా తదితరులు పాల్గొన్నారు. -
పక్కాగా పోలింగ్ ఏర్పాట్లు
● డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో వసతులు కల్పించాలి ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్జనగామ రూరల్: జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని ఇందుకు ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. ఈ నెల11న జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పోలింగ్ స్టేషన్లలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, నోడల్ అధికారులతో సోమవారం గూగుల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ అధికారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. వందశాతం వెబ్కాస్టింగ్కు ఏర్పాటు చేస్తామని, పోలింగ్ అనంతరం బ్యాలెట్ పేపర్లను జాగ్రత్తగా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచ్చాలన్నారు. ఎన్నికల నియమాలు కట్టుదిట్టంగా అమలు.. స్వేచ్ఛాయుతంగా, ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ఈ నేపథ్యంలో 09.02.2026 సాయంత్రం 5.00 గంటల నుంచి 11.02.2026 సాయంత్రం 5.00 గంటల వరకు నిశ్శబ్ద కాలం అమల్లో ఉంటుందని తెలిపారు. జనగామ మున్సిపాలిటీకి ఏకశిలా బీఎడ్ కళాశాల, హైదరాబాద్ రోడ్, ఘన్పూర్ మున్సిపాలిటీకి సోషల్ వెల్ఫేర్ స్కూల్ నుంచి పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామగ్రి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ‘పది’ ఫలితాల్లో మొదటి స్థానంలో నిలవాలి విజయోస్తు 2.0తో జిల్లాను మొదటి స్ధానంలో నిలపాలని, విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలంటే ప్రణాళికబద్ధంగా చదవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. స్టేషన్ రోడ్లోని ప్రభుత్వం ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు విజయోస్తు 2.0 స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, హెచ్ఎం నర్సింహరెడ్డి, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన తప్పనిసరి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన తప్పనిసరిగా ఉండాలని, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధి కోసం సోక్ పిట్ల ఏర్పాటు అవసరమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని పొలాల్లో ఎర్త్ ఆగర్యంత్రం ద్వారా సోక్ పిట్లు తవ్వే విధానంపై డెమో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పాలీహౌస్ను సందర్శించి, అందులో కూరగాయల సాగు చేస్తున్న రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, ఏఈఓ అనిల్, అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
ఇచ్చిన మాట తప్పేది లేదు
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడంతో పాటు తమ నీలిమా ఆస్పత్రిలో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం చివరి రోజు ప్రచారంలో భాగంగా పట్టణంలోని 30 వార్డుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలోని ప్రతి వార్డు నుంచి నీలిమా ఆస్పత్రికివె వెళ్లి ఉచిత వైద్యం, మందులు, ఆపరేషన్లతో కార్పోరేట్ చికిత్సలు పొందుతున్నారన్నారు. ఈ సేవలు మరో 3ఏళ్ల పాటు ఇలాగే కొనసాగుతాయన్నారు. జనగామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, పట్టణ ప్రజలు ఆలోచన చేసిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. -
రెండేళ్లలో పదేళ్ల అభివృద్ధి
● చివరి రోజు ఎన్నికల ర్యాలీలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యజనగామ: పదేళ్లలో బీఆర్ఎస్ చేయని అభివృద్ధిని సీఎం రేవంత్రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన రెండేళ్లలో చేసి చూపించారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కొనియాడారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచారం చివరి రోజు పట్టణంలోని 20, 21, 22, 23 వార్డుల్లో ఆయన పాల్గొన్నారు. బీరప్పగడ్డ నుంచి ర్యాలీగా నెహ్రూపార్కు, కుర్మవాడ మీదుగా లక్ష్మీ వాటర్ప్లాంట్ వరకు చేరుకున్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి అధ్యక్షతన జరిగిన ర్యాలీలో ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతితో కలిసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 21వ వార్డులో మైసమ్మ గుడి పునర్మిర్మాణానికి ఎంపీతో కలిసి కృషి చేస్తామన్నారు. కొత్తగా 3,500 ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయని, కాంగ్రెస్, సీపీఎం బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి ప్రజాపాలనకు మద్దతు పలకాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు కడకంచి బాలమనిశ్రీనివాస్, గ్యాదరి రేణుక, బాల్దె మల్లేశం, మోటో రేణుక, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, నాయకులు కంచె రాములు తదితరులు పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్బీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 14 నుంచి 18వరకు జరిగే మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ పరిశీలించారు. ఈసందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో పార్కింగ్ ప్రదేశం, క్యూలైన్ పరిశీలించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ జానకిరాంరెడ్డి, ఎస్సై దూలం పవన్కుమార్, ఆలయ ఈఓ లక్ష్మీప్రసన్న, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అనుమానితుల కదలికలపై నిఘా జనగామ: ఎలక్షన్ ప్రచారం ముగిసిన నేపథ్యంలో పట్టణంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అనుమానిత వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. సోమవారం సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై చెన్న కేశవులుతో కలిసి లాడ్జీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
టూరిజం కోర్సుల అధ్యయనంతో ఉపాధి
● కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ విజయబాబు ● కేడీసీలో సర్టిఫికెట్ కోర్సు ప్రారంభం విద్యారణ్యపురి: టూరిజం కోర్సుల అధ్యయనంతో విద్యార్థులు ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని కేయూ హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం రిటైర్డ్ ఆచార్యులు విజయబాబు అన్నారు. సోమవారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో ‘టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ తెలంగాణ’ సర్టిఫికెట్ కోర్సును బీసీ విద్యార్థులకు ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. టూరిజాన్ని స్మోక్ లెస్ ఇండస్ట్రీగా అభివర్ణించారు. టూరిజం అభివృద్ధితో ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. సమావేశంలో ఆ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రజనీలత, అధ్యాపకులు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ఎ.శ్రీనాఽథ్, చరిత్ర విభాగం అధిపతి ఇందిరాదేవి, ఎస్.సమ్మయ్య, రామ్రెడ్డి, బి.రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ విజయబాబును అధ్యాపకులు సన్మానించారు. -
కొడవటంచ ఆలయంలో పూజలు..
జిల్లా పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సీఎం రేవంత్రెడ్డి తొలుత రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో స్వామివారిని మంత్రులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ.12.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃనిర్మాణ పనులు, అలాగే రూ.74.15 కోట్లతో అతిథి గృహాలు, అంతర్గత రహదారుల నిర్మాణం తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో రావిమొక్క నాటారు. ఆయా కార్యక్రమాల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ హరీశ్, కనీస వేతనాల కార్పొరేషన్ చైర్మన్ జనక్ప్రసాద్, పీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, డీసీసీ అధ్యక్షుడు కర్ణాకర్ పాల్గొన్నారు. -
స్థానికేతరులు వెళ్లిపోవాలి
వరంగల్క్రైం: మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం ముగియనుండడంతో స్థానికేతరులు వెళ్లిపోవాలని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. వెళ్లకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి స్టేషన్ ఘన్పూర్, జనగామ, పరకాల, వర్ధన్నపేట పట్టణాల్లో ప్రచారం ముగియనున్న నేపఽథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రచారం నిమిత్తం వచ్చిన ఆయా పార్టీలకు చెందినవారు గమ్యస్థానాలకు తిరిగి వెళ్లాలని సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ -
బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి
పాలకుర్తి టౌన్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 14 నుంచి 18 వరకు జరిగే మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని దేవస్థానం ఆవరణంలో మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాల ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఓ లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ.. ప్రచార రథాల ద్వారా ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలో మహాశివరాత్రి జాతర ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, అర్చకులు డీవీఆర్శర్మ, అనిల్కుమార్, మత్తగజం నాగరాజు, ఆలయ సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు. సోమన్న ఆలయంలో ప్రచార రథాలు ప్రారంభం -
కేంద్ర నిధులతోనే అభివృద్ధి
● బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ జనగామ రూరల్: కేంద్ర నిధులతోనే సంక్షేమం, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రెండేళ్లుగా రాష్ట్రంలో, జిల్లాలో 5 పైసల పనికుడా చేయలేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా పట్టణంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. నెహ్రూపార్కు ఏరియా, గిర్నిగడ్డ లేబర్ అడ్డా, సంజయ్ నగర్ చమాన్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక, బార్డర్లో ఎలాంటి తుపాకుల మోత లేదని దేశం మొత్తం ప్రశాంతంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. పట్టణం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని ప్రజలు ఒక్క సారి ఆలోచించి బీజేపీకి అవకాశం ఇవ్వాలని అన్నారు. ఈకార్యక్రమంలో అభ్యర్ధులు మాచర్ల స్వరూప, కోట వినోద్,నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పురపాలికలకు నిధుల వరద
సోమవారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026కొద్ది రోజులుగా పలు కొత్త జిల్లాలను రద్దు చేస్తారని, రెండు జిల్లాలను కలిపి ఒకటి చేస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ములుగు, భూపాలపల్లిని కలిపి ఒకటే చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో జిల్లాల రద్దు ప్రచారంపై సీఎం రేవంత్రెడ్డి స్పష్టత ఇచ్చారు. జిల్లాలను రద్దు చేయబోమని, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయమని ప్రకటించారు. దీంతో భూపాలపల్లి జిల్లా రద్దు అనే ప్రచారానికి చెక్ పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భూపాలపల్లి జిల్లా చెల్పూరులో జరిగిన సభకు హాజరైన జనం, అభివాదం చేస్తున్న సీఎం రేవంత్పాలకవర్గాలు లేకపోయినా గడిచిన ఏడాదిలో భారీగా విడుదల చేశాం..భూపాలపల్లి / భూపాలపల్లి అర్బన్ / రేగొండ / గణపురం: ఏడాది కాలంగా మున్సిపాలిటీలకు పాలకవర్గాలు లేకపోయినా భారీగా నిధులు మంజూరు చేసి పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అన్నా రు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారు సింగరేణి వేయి క్వార్టర్ల ఎదురుగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజా పాలన–ప్రగతి బాట బహిరంగ సభకు రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖతో కలిసి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ... గడిచిన ఏడాది కాలంలో భూపాలపల్లి మున్సిపాలిటీకి రూ. 92 కోట్లు, పరకాలకు రూ.52 కోట్లు, జనగామకు రూ.82కోట్లు.. ఇలా ప్రతీ మున్సిపాలిటీ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేశామన్నారు. త్వరలో ఏర్పడబోయే పాలకవర్గం ఆ నిధులతో ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలన్నారు. ఓరుగల్లుది ఉద్యమాల చరిత్ర.. ఉమ్మడి వరంగల్కు గొప్ప చరిత్ర ఉందని, ప్రపంచంలోనే భారత దేశానికి గొప్ప పేరు తెచ్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఈ ప్రాంతానికి చెందిన బిడ్డ అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కర్త, క్రియగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వ్యవహరించారన్నారు. రాష్ట్రాన్ని సాధించడంలో ముందుభాగంలో నిలబడిన ప్రొఫెసర్ జయశంకర్ ఈ ప్రాంతం బిడ్డ అంటూ.. ఓరుగల్లు ఉద్యమ చరిత్రను గుర్తు చేశారు. సింగరేణి కార్మికులు సైతం రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. మెడికల్ బోర్డుపై తప్పుడు ప్రచారం.. తాత్కాలిక ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు సింగరేణి మెడికల్ బోర్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బోర్డును రద్దు చేసేది లేదని, విష ప్రచారం చేస్తున్న వారిని మోకాళ్లపై కూర్చోబెట్టి కొట్టాలని సీఎం అన్నారు. 217 మంది డిస్మిస్డ్ కార్మికులు ఉన్నారని, వారి సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తామన్నారు. సింగరేణి కార్మికులకు నష్టం కలిగించే పనులు చేయబోమన్నారు. బైపాస్కు నిధులు మంజూరు.. భూపాలపల్లి పట్టణంలో నిత్యం రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని, కేంద్రంతో మాట్లాడి బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించామన్నారు. ప్రస్తుతం డీపీఆర్ ప్రక్రియ పూర్తయిందని, టెండర్ దశలో ఉందన్నారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. గత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏనాడూ భూపాలపల్లి పట్టణాన్ని పట్టించుకోలేదన్నారు. ఆయన నకిలీ గండ్ర.. మీ ఎమ్మెల్యే సత్యనారాయణరావు అసలు గండ్ర అని, మరొకరు నకిలీ గండ్ర అని సీఎం రేవంత్ అన్నారు. నకిలీ గండ్రను మీరు నమ్మి గెలిపిస్తే గుండెల మీద తన్ని వేరే పార్టీలో చేరాడన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. అనంతరం మహిళా సంఘాలకు రూ.205 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల నమూనా చెక్కును సీఎం అందజేశారు. ఆకట్టుకున్న ఇందిరా ‘మహిళా’శక్తి చీరల రంగు మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకంకింద అందించిన నీలి రంగు చీరలను కట్టుకుని ప్రాంగణానికి చేరుకున్నారు. అందరూ ఒకేచోట కూర్చోవడంతో ప్రాంగణ మంతా నీలిరంగుతో కళకళలాడింది. సీఎం, మంత్రుల ప్రసంగాల సమయంలో మహిళలు కేరింతలు కొట్టారు. మరికొందరు నృత్యాలు చేశారు. మున్సిపాలిటీలను సుందరంగా తీర్చిదిద్దుతున్నాం భూపాలపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.500 కోట్లు సింగరేణి మెడికల్ బోర్డు రద్దు చేస్తామంటూ విష ప్రచారం మున్సిపల్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి చెల్పూరు ప్రజా పాలన–ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి -
ప్రచారానికి నేటితో తెర!
జనగామ: పది రోజుల పాటు ఉర్రూతలూగించిన పుర ప్రచారం ఈనెల 9న (సోమవారం) సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. గత నెల 31వ తేదీ నుంచి అన్ని రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు వార్డుల వెంట ప్రచార రథాలతో మైకుల మోత మోగించి, ఇంటింటికీ తిరిగి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. హోరెత్తిన వార్డులు నేటి రాత్రితో నిశ్శబ్దంలోకి వెళ్లనున్నాయి. రెండు విడతల్లో..! ప్రచారం ముగియడంతో, ఇప్పుడు అన్ని పార్టీల దృష్టి పోల్ మేనేజ్మెంట్పై కేంద్రీకరించనున్నాయి. ఏ వార్డులో ఎవరికెన్ని ఓట్లు వస్తాయో అన్న లెక్కలను అభ్యర్థులు ముందే సిద్ధం చేసుకుని, దాని ఆధారంగా తాయిలాల పంపిణీ వ్యూహాలు రూపొందిస్తున్నారు. శ్రీఎదుటి పార్టీ అభ్యర్థి ఎంత ఇస్తున్నాడు.. మనం ఎంత ఇవ్వాలి.. ఎక్కడ పంపిణీ చేయాలి..శ్రీఅనే లెక్కలతో పత్రాలు, జాబితాలు సిద్ధమయ్యాయి. నేటి అర్ధరాత్రి నుంచి తొలి విడతగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు మొదలై, ఎన్నికలకు ముందు రాత్రి మరోసారి డబ్బు, గిఫ్టులను పంపిణీ చేయాలనే స్కెచ్ ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. ఓటర్ల కోసం రహస్యంగా డీల్ జనగామ, స్టేషన్న్ ఘన్పూర్ రెండు మున్సిపాలిటీల్లో ఆయా వార్డుల్లో త్రిముఖ పోటీలు ఉండడంతో ఓట్ల కొనుగోలు బరిలో దిగిన అభ్యర్థుల కోసం కీలకంగా మారింది. ముఖ్యంగా 10నుంచి 20శాతం వెనుకబడి ఉన్న అభ్యర్థులు ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో నోట్లకట్టలు విప్పేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం ఉంది. విజయం కోసం ఏ రిస్క్కై నా సిద్ధం అన్న భావనతో ప్రభావితం చేయగలిగే ఓటర్లను గుర్తించి రహస్యంగా డీల్ జరుపుతున్నట్లు సమాచారం.ప్రచారం ముగియడంతో ఓటర్లను ప్రలో భాలకు గురిచేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక ఎన్నికల కమిషన్ నిఘా ఏర్పాటు చేసింది. ఎలాంటి ప్రలోభాలు, డబ్బు పంపిణీ జరగకుండా ఎఫ్ఎస్టీలు, ఎస్ఎఫ్ఎస్టీలు రంగంలోకి దిగారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపాలిటీ పరిధిలో డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆధ్వర్యంలో పో లీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టారు. ముఖ్యమైన వార్డుల్లో అదనపు పికెటింగ్, పెట్రోలింగ్తో చేస్తూ అప్రమత్తంగా ఉన్నారు. రాత్రి నుంచే ప్రలోభపర్వం ‘పోల్ మేనేజ్మెంట్’లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బులు, గిఫ్టులు సిద్ధం రంగంలోకి ఎన్నికల కమిషన్ -
పూర్వ విద్యార్థుల ఔదార్యం
● పాఠశాలకు రూ,1,20,000 విలువైన డెస్క్ బెంచీల అందజేత పాలకుర్తి టౌన్: పాలకుర్తి మండలం గూడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలో 1996–1997 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు అర్జుల రాంరెడ్డి, గందె రాధిక సహకారంతో పాఠశాలకు రూ.1,20,000 విరాళాన్ని ప్రకటించారు. ఆ విరాళంతో 25 డెస్క్ బెంచీలను ఆదివారం పాఠశాలకు అందజేశారు. 2024 డిసెంబర్ 1న నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో.. ఆ నిధులతో విద్యార్థులకు ఉపయోగార్థం 25 డెస్క్ బెంచీలను గ్రామ సర్పంచ్ మాచర్ల స్వరూప, ఉపాధ్యాయల సమక్షంలో పాఠశాలకు అందజేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మాచర్ల పుల్లయ్య, మడత రవీంద్రుడు, బెల్లి సంపత్, సర్థార్ అశోక్, మానుపాటి శ్రీనివాస్, గదరి నర్సింగ్,కూస సోమయ్య, తుమ్మ నాగలక్ష్మీ, సుజాత, పెద్దురి కళావతి, వంగపల్లి స్వరూప, ఎనగందుల సునీత, టీ రమేష్, కుమార్, పూజారి మల్లయ్య పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో నష్కల్ విద్యార్థికి గోల్డ్మెడల్
చిల్పూరు: మండలంలోని నష్కల్ గ్రామానికి చెందిన పాశం వేణు కుమారుడు విశ్వేష్ ఆదివారం సెయింట్ ఆంథోని పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రాండ్మాస్టార్లు పాపయ్య, ప్రశాంత్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్తో పాటు సర్టిఫికెట్ అందుకున్నాడు. అంతర్రాష్ట్ర ఓపెన్ స్కూల్స్ టోర్నమెంట్ సికోకై షీటో రియో కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో కరాటే పోటీలు నిర్వహించగా విశ్వేష్ స్పారింగ్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈసందర్భంగా సర్పంచ్ శాతబోయిన రాజు, పాశం రాజు, శాగంటి మణి, గుంజె రఘుపతి, రంగు రాజు, స్కూలు యాజమాన్యం అభినందనలు తెలిపారు. జనగామ రూరల్: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 57మంది గైర్హాజరయ్యారని ఇంటర్ విద్యాధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 7 కేంద్రాల్లో నిర్వహించగా ఉదయం జరిగిన పరీక్షలో జనరల్లో 287 మంది విద్యార్థులకు గాను 286మంది హాజరు కాగా ఒక్కరు గైర్హాజరయ్యారు. ఒకేషనల్లో 270మంది విద్యార్థులకు గాను 236మంది హాజరు కాగా 34 గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 217మంది విద్యార్థులకు గాను 216మంది హాజరు కాగా ఒక్కరు గైర్హాజరయ్యారు. ఒకేషనల్ 291మంది విద్యార్థులకు గాను 270మంది హాజరు కాగా, 21మంది గైర్హాజరయ్యారు. -
అభివృద్ధి చేసే వారికే ఓటు
నిజాయితీ గల నాయకులను అందలం ఎక్కిస్తామంటున్న ఓటర్లుస్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీని సమగ్రంగా అభివృద్ధి చేసేవారినే అందలం ఎక్కిస్తామని స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ ఓటర్లు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న స్టేషన్ఘన్పూర్.. పక్కనే ఉన్న శివునిపల్లి, ఛాగల్లు గ్రామపంచాయతీలను కలుపుతూ గతేడాది జనవరిలో మున్సిపాలిటీగా అవతరించింది. నియోజకవర్గం, రెవెన్యూ డివిజన్ కేంద్రమైన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీగా ఏర్పడినప్పటికీ పలు సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. మున్సిపాలిటీలో 18 వార్డులుండగా ముప్పైవేల పైచిలుకు జనాభా, 18,550 మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీగా ఏర్పడి ఏడాది గడుసున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ప్రధానంగా పారిశుద్ధ్యం, డ్రెయినేజీలు, రోడ్లు, నీరు, వీధి దీపాలు, పార్కింగ్ తదితర సమస్యలు పేరుకుపోయాయి. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీపై జెండా ఎగురవేసేందుకు వివిధ రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి, పట్టణ ప్రగతికి పాటుపడేవారికే తమ మద్దతు ఉంటుందని మున్సిపాలిటీ పౌరులు అంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో జయగార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ‘సాక్షి’ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన చర్చావేదికలో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తపర్చారు. రోడ్లు, డ్రెయినేజీల సమస్యలు పరిష్కరించాలి ఘన్పూర్ పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి ‘సాక్షి’ చర్చావేదికలో పలువురు ప్రముఖుల అభిప్రాయం -
ఇండిపెండెంట్లే కీలకం!
● చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికపై ప్రభావం ● ప్రధాన పార్టీలకు గుబులు ● గెలుపు అవకాశం ఉన్న ఇండిపెండెంట్లపై గురి ● ఇప్పటి నుంచే టచ్లో పెట్టుకునే ప్రయత్నం ● మొదలైన ముఖ్యనేతల బేరసారాలుపోటీలో అత్యధికంగా స్వతంత్రులు సాక్షిప్రతినిధి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికపై వారు ప్రభావం చూపుతారనే చర్చ జరుగుతోంది. మొత్తం 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులుంటే.. 1,073 మంది కౌన్సిలర్ సీటు కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు కలిసి 260 మంది, బీఆర్ఎస్ నుంచి 259, బీజేపీ నుంచి 240 మంది పోటీలో ఉన్నారు. ఇండిపెండెంట్గా 314 మంది వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమానంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రధాన పార్టీల్లో గుబులురేపుతున్నారు. ఆశించిన పార్టీలో టికెట్లు రాకపోవడంతో కొందరు స్వతంత్రులుగా రంగంలోకి దిగారు. ఇంకొందరు తమ సత్తా చాటేందుకు యత్నిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీల్లో ఎవరి ఓట్లు చీలుస్తారనే భయం అభ్యర్థుల్లో నెలకొంది. ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. టఫ్ ఫైట్.. స్వతంత్రుల కారణంగా ఎవరి ఓట్లకు గండిపడుతుందనే ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ టికెట్లు రానివారు రంగంలో గట్టిగానే పోరాడుతున్నారు. దీంతో ఓవైపు అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తూనే.. మరో వైపు గెలిచే అవకాశం ఉన్న ఇండిపెండెంట్లను ప్రధాన పార్టీల నేతలు టచ్లో పెట్టుకుంటున్నారు. గెలుపు గుర్రాలను ఎంపిక చేసి ఖర్చులు మోసేందుకు చాటుమాటుగా బేరసారాలు చేస్తున్నారు. 12 మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకునేందుకు పోటాపోటీగా ప్రచారం చేస్తున్న ప్రధాన పార్టీల నుంచి మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు స్వతంత్రులను రాజీ చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అంతర్గత మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడెక్కడ.. ఎలా ఉంది? హనుమకొండ పరకాల మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులకు 100 మంది పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి 22 మంది చొప్పున అభ్యర్థులుండగా, బీజేపీ నుంచి 21 కాగా రెబల్స్, స్వతంత్రులు కలిపి 35 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 12 మందికి విజయావకాశాలున్నాయంటున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ 30 వార్డులకు 120 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అన్ని వార్డులకు అభ్యర్థులను నిలపగా, స్వతంత్రులుగా కూడా 30 మంది తలపడుతున్నారు. ఇందులో ఆరుగురు గెలిచే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను బరిలో నిలపగా, అత్యధికంగా 50 మంది ఇండిపెండెంట్లు (రెబల్స్ కూడా) పోటీలో ఉన్నారు. మొత్తం 50 మందిలో 20 మంది ఈజీగా గెలుస్తారన్న చర్చ జరుగుతోంది. జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులకు 27 వార్డుల్లో కాంగ్రెస్, 3 చోట్ల సీపీఐ, సీపీఎంలుండగా, బీఆర్ఎస్ నుంచి 29 మంది, బీజేపీ 26 మంది కౌన్సిలర్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇక్కడి నుంచి రెబల్స్ను కలుపుకుని 45 మంది స్వతంత్రులు బరిలో నిలిచి ప్రధాన పార్టీలకు చుక్కలు చూపెడుతున్నారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలోని 18 వార్డులకు 82 మంది పోటీ చేస్తుండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్కు మొత్తం వార్డుల నుంచి అభ్యర్థులుండగా, 13 వార్డులకు బీజేపీ అభ్యర్థులను నిలిపింది. ఇక్కడ 33 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ టికెట్లు ఆశించి స్వతంత్రులుగా నిలిచిన నలుగురు గట్టి పోటీ ఇస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులకు 155 మందిలో.. 58 మంది ఇండిపెండెంట్లుగా పోటీలో నిలిచారు. కాంగ్రెస్ 32, మిత్రపక్షాలు నాలుగు చోట్ల, బీఆర్ఎస్ 35, బీజేపీ నుంచి 30 మంది పోటీ చేస్తున్నారు. ఇక్కడ సుమారు 8 మంది ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తొర్రూరు మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీ చేస్తుండగా, 15 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 63 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తుండగా, స్వతంత్రులు సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరిపెడ మున్సిపాలిటీ నుంచి 15 వార్డులకు మొత్తం 63 మంది పోటీ చేస్తుండగా, అన్ని వార్డులకు మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలో దింపాయి. 18 మంది ఇండిపెండెంట్లుగా పోటీలో నిలబడి పోరాడుతున్నారు. కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులకు 58 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు అన్ని వార్డులకు అభ్యర్థులను దింపగా, బీజేపీ 15 చోట్ల పోటీ చేస్తుంది. ఇక్కడ 11 మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు. డోర్నకల్ మున్సిపాలిటీలో 15 వార్డులకు 64 మంది పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అన్ని వార్డులకు అభ్యర్థులను పెట్టగా, బీఆర్ఎస్ 14, బీజేపీ 14 వార్డుల్లో పోటీ పెట్టింది. 21 మంది ఇక్కడి నుంచి ఇండిపెండెంట్లుగా పోటీలో ఉన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులకు 107 మంది ఉండగా, కాంగ్రెస్ 25, మిత్రపక్షాలు 5 కలిపి 30 వార్డులకు పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ 30 వార్డుల్లో, బీజేపీ 25 వార్డుల్లో అభ్యర్థులను పోటీలో దింపగా 27 మంది స్వతంత్రులు బరిలో నిలిచి పోరాడుతున్నారు. ములుగు మున్సిపాలిటీలో 20 వార్డులకు 83 మంది బరిలో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీలు అన్ని వార్డులకు పోటీ చేస్తుండగా, 23 మంది ఇండిపెండెంట్లుగా కౌన్సిలర్ కోసం కొట్లాడుతున్నారు. -
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
జనగామ రూరల్: మున్నిపల్ ఎన్నికలను అధికారులు సమర్థవంతంగా, పారదర్శకంగా, చట్టబద్ధంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, ట్రైనింగ్ నోడల్ అధికారి మాధురి షా సూచించారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలపై పీఓ, ఏపీఓలకు కలెక్టరేట్లో సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియలో పాటించాల్సిన నియమాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్లకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, శాంతియుత వాతావరణంలో పోలింగ్ నిర్వహణ, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారు వివరించారు. కౌంటింగ్ విధానం, వివాదాస్పద బ్యాలెట్ పేపర్ల పరిశీలన, రీకౌంటింగ్కు సంబంధించిన నిబంధనలు, ఫలితాల ప్రకటన వంటి పలు అంశాలపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ 13వ తేదీన ఉదయం 8.00గంటలకు ప్రారంభమవుతుంది. హైదరాబాద్ రోడ్డులోని ఏకశిల బీఎడ్ కళాశాలలో జనగామ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు ఉంటుంది. అలాగే, పల్లగుట్టలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు జరగనుంది. స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ శివారు పల్లగుట్ట క్రాస్రోడ్డు సమీపంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ హాల్, టేబుళ్ల అమరిక, భద్రతా చర్యలు, సీసీటీవీ పర్యవేక్షణ, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, తాగునీరు, మూత్రశాలల సదుపాయాలు, విద్యుత్ సరఫరా తదితర వసతులపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, చట్టబద్ధంగా జరగాలని ఆదేశించారు. మొత్తం ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ అత్యంత కీలకమని గుర్తుచేశారు. ఆయన వెంట ఆర్డీఓ డీఎస్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఉన్నారు. అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ -
ప్రభుత్వం మీది.. సీఎం రేవంత్రెడ్డి మీ వారే
కార్నర్ మీటింగ్లో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి, పక్కన కొమ్మూరి ప్రతాప్రెడ్డి, ఎంపీ కిరణ్కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి, హాజరైన జనంజనగామ: ప్రభుత్వం ప్రజలదని.. సీఎం రేవంత్రెడ్డి ప్రజల పక్షపాతి అని.. తామంతా కలిసి ప్రజా పాలనను ముందుకు తీసుకెళ్తూ అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని ధర్మకంచ, ఆర్టీఓ కార్యాలయం, ఆర్టీసీ చౌరస్తా, తహసీల్దార్ కార్యాలయం కూడళ్ల వద్ద జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి అధ్యక్షతన శనివారం కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రతీ పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. తాము జనగామలో కొత్తగా 16 వేల రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. జనగామ పట్టణాని కి 600 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మరో వెయ్యి మంజూరు చేస్తామని తెలిపారు. 53/1 సర్వే నంబర్ పరిధిలోని భూసమస్యను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పురపాలిక ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓట్లు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, యువ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, 30 వార్డుల అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు. జనగామకు 600 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.. ఇంకా మరిన్ని ఇస్తాం 53/1 సర్వే నంబర్లోని భూ సమస్యకు పరిష్కారం చూపిస్తా పురపాలిక ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికాంగ్రెస్ జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఐదేళ్లలో చేస్తామన్న సంక్షేమాన్ని రెండేళ్లలో చేసి చూపించిన ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కుతుందని కాంగ్రెస్ జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే దొంగ ఓట్లతో గెలిచారని ఆరోపించారు. 10ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జనగామ పట్టణానికి ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధే నేటికీ ఉందని, దేవాదుల నీరు ఈ ప్రాంతానికి రావడంలో తన కృషి ఎనలేదని చెప్పారు. ఎనిమిదేళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్న ఎమ్మెల్యే.. నాడు ఈ ప్రాంత అభివృద్ధికి పైసా ఇవ్వలేదన్నారు. అవినీతి చేసి సంపాదించిన డబ్బులతో ఓట్లను కొందామని బీఆర్ఎస్ చూస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబంలో ప్రతిఒక్కరూ రూ.లక్ష కోట్లు సంపాదించారని తెలిపారు. -
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. రాత్రివేళ కాస్త చలి తీవ్రత ఉంటుంది. నేడు భూపాలపల్లికి సీఎం రేవంత్రెడ్డి● కొడవటంచ ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన, ప్రత్యేక పూజలు ● సింగరేణి వేయి క్వార్టర్ల ఎదురుగా బహిరంగ సభ భూపాలపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు (ఆదివారం) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. చాపర్ ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు రేగొండ మండలం కొడవటంచకు చేరుకుంటారు. లక్ష్మీనర్సింహాస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. విశ్రాంతి భవనాన్ని పరిశీలించిన అనంతరం ఆలయంలో రూ.12 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలిస్తారు. అక్కడి నుంచి చాపర్ ద్వారా గణపురం మండలంలోని సింగరేణి వేయి క్వార్టర్ల ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభావేదికపై డీబీఎం 38 కాల్వకు పైప్లైన్ ఏర్పాటు, భీంఘన్పూర్ రిజర్వాయర్ ఆధునీకీకరణ, గణపసముద్రం చెరువు సిమెంట్ లైనింగ్ తదితర పనులకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిసింది. ఏర్పాట్లు పూర్తి.. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్రెడ్డి పర్యటించే స్థలాలు, సభాస్థలి, హెలిపాడ్ ప్రాంతాలను కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సీఎం ప్రత్యేక సెక్యూరిటీ అధికారి వాసుదేవరెడ్డి శనివారం పరిశీలించారు. అనంతరం వాసుదేవరెడ్డి మాట్లాడుతూ సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భారీ బందోబస్తు.. సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ సభ వద్ద సుమారు 1,100 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. 10 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, ఎస్సైలు విధుల్లో ఉండనున్నారు. -
52.27శాతం ఉత్తీర్ణత
● డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల జనగామ రూరల్: కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల అటానమస్గా ఏర్పాటు అయిన తరువాత మొదటిసారిగా కళాశాల ప్రాంగణంలో డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలను ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యాపకులు శనివారం విడుదల చేశారు. అన్ని కోర్సుల విద్యార్థులు 308మందికి 161 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ఉత్తీర్ణత శాతం 52.27గా నమోదైంది. ఈ మేరకు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారికి సహకరించిన అధ్యాపకులకు కాకతీయ విశ్వవిద్యాలయ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ తిరుమలాదేవి, ప్రొఫెసర్ వెంకటయ్య, కళాశాల ప్రిన్సిపాల్ అభినందనలు తెలిపారు.బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి ● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ: పట్టణంలోని 30 వార్డుల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని 5, 6, 7, 8, 9, 10 వార్డుల్లో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీలు అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరిస్తూ, కిడ్నాప్లకు పాల్పడుతున్నారని రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
జనగామ రూరల్: జిల్లాలో జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. పీఓ, ఏపీఓల నియామకంతో పాటు ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరగడంలో మైక్రో అబ్జర్వర్లు అత్యంత కీలకపాత్ర పోషిస్తారని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మైక్రో అబ్జర్వర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జనరల్ అబ్జర్వర్ నర్సింహారెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ హాజరై వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ..పోలింగ్ బూత్లో జరిగే మొత్తం ప్రక్రియను మైక్రో అబ్జర్వర్ నిశితంగా పరిశీలించాలన్నారు. జనరల్ అబ్జర్వర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమన్నారు. కాగా, జనగామ, స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలకు సంబంధించి పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, నోడల్ అధికారి హౌజింగ్ పీడీ మాతృనాయక్ పాల్గొన్నారు. -
అగ్రనేతలకు సవాలే!
సాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా.. రెండు రోజుల ముందే ప్రచారానికి తెరపడనుంది. అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి ఇంకా మూడు రోజులే మిగిలింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు అభ్యర్థుల గెలుపు కోసం దూకుడు పెంచారు. ప్రజాప్రతినిధులు, పార్టీలు నియమించిన ఎన్నికల ఇన్చా ర్జ్లు రెండు రోజులుగా మున్సిపాలిటీలలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటి ప్రచారం, కులసంఘాలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్లో ఈ ఎన్నికలు మూడు పార్టీల నేతలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను సవరించుకుంటూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. 10నియోజకవర్గాలు.. 12 మున్సిపాలిటీలు.. ఉమ్మడి వరంగల్లో 12 మున్సిపాలిటీలలో 260 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిసి 1,073 మంది పోటీలో ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.. 12 మున్సిపాలిటీలను కై వసం చేసుకోవడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ తర్వాత ఎక్కువ పంచాయతీలలో తమ మద్దతుదారులను గెలిపించుకుని రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్.. గత వైభవాన్ని చాటుతామంటోంది. బీజేపీ 12 మున్సిపాలిటీల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. కాగా వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు మినహా 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా నేతలకు ఈ ఎన్నికలు సవాలే.. ● హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ తరఫున కాళిప్రసాదరావు ప్రచారం చేస్తున్నారు. ● వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్దన్నపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్, బీఆర్ఎస్లకు సవాల్గా మారాయి. నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేల పెద్ది సుదర్శన్ రెడ్డిలు చైర్మన్ పీఠం కోసం కుస్తీ పడుతున్నారు. వర్ధన్నపేటలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం వార్డుల్లో తిరుగుతున్నారు. ● జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీ పీఠం కోసం బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభ్యర్థుల గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. ఇన్చార్జ్లు, ముఖ్య నేతలను కలుపుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త, టీపీసీసీ నేత ఝాన్సీ అభ్యర్థులను బరిలోకి దింపారు. వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ● జనగామ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నువ్వా, నేనా అన్న రీతిలో ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వార్డు కౌన్సిలర్ల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఉండగా, భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్రెడ్డి, వెంకటేశ్వర్లులు ఇన్చార్జ్లుగా ఉన్నారు. ● స్టేషన్ ఘన్పూర్ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కాగా.. ఇక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్తో కలిసి నడుస్తున్న కడియం శ్రీహరి ఆ పార్టీ అభ్యర్థులను అందరిని గెలిపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత డా.తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నారు. ● భూపాలపల్లి మున్సిపాలిటీలో పాగా వేసేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (కాంగ్రెస్), గండ్ర వెంకట రమణారెడ్డి (బీఆర్ఎస్)లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మెజార్టీ స్థానాలను దక్కించుకుని చైర్మన్ పీఠంను కై వసం చేసుకోవాలని చూస్తున్నారు. బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి అభ్యర్థులను బరిలోకి దింపారు. ● ములుగు నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ధనసరి సీతక్క కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని భావిస్తున్నారు. ముఖ్యనేతలు, పార్టీ ఇన్చార్జ్లతో కలిసి అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి బీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఉన్న బడే నాగజ్యోతి.. ఆమెకు తోడుగా మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ● మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబాబాద్, కేసముద్రం మున్సిపాలిటీల ఎన్నికలు ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే బి.శంకర్నాయక్(బీఆర్ఎస్)లకు ప్రతిష్టాత్మకం కాగా, బీఆర్ఎస్ నుంచి మాజీ విప్ దాస్యం వినయభాస్కర్, కాంగ్రెస్ నుంచి సీహెచ్ వెంకటేశ్లు ఇన్చార్జ్లుగా ఉన్నారు. బీజేపీ నుంచి హుస్సేన్నాయక్.. అభ్యర్థులను బరిలోకి దింపారు. ● డోర్నకల్ నియోజకవర్గంలో డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల ఎన్నికలు ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్ (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ (బీఆర్ఎస్)లకు సవాల్గా మారాయి. పుర పోరు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకం మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకూ కత్తి మీద సామే గ్రామ పంచాయతీ ఫలితాల బేరీజు.. పకడ్బందీగా గెలుపు కోసం పావులు రెండు రోజులుగా మున్సిపాలిటీల్లోనే నేతల మకాం ఓట్ల కోసం పార్టీల నేతలు, ఇన్చార్జ్ల పాట్లు.. రోజువారీ పరిస్థితిపై అధిష్టానాల ఆరా.. -
వీరిచేతుల్లోనే విజయం!
పురపాలికల ఎన్నికల్లో ఇన్చార్జ్లదే కీలకపాత్రజనగామ: జిల్లాలో జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. రెండుచోట్ల పీఠాలను కై వసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ శక్తిని వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల సర్పంచులు, నాయకులు, స్థానిక ప్రతినిధులు ఇప్పుడు పట్టణ ఎన్నికల్లో కీలక పాత్రధారులుగా మారి అభ్యర్థుల విజయానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. తెల్లవారుజాము ఆరుగంటల నుంచి రాత్రి పన్నెండు వరకు ఎవరికి వారే తమ బృందాలతో వీధుల్లో తిరుగుతూ పోల్ మేనేజ్మెంట్, ఓటర్ కనెక్ట్, ప్రచా ర వ్యూహాలపై దృష్టి సారిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల నుంచి వచ్చిన ఇన్న్చార్జ్ నాయకులు తమకు అప్పగించిన వార్డులపై పూర్తి ఫోకస్ పెట్టారు. వారికి తెలిసిన గ్రామస్తులు, తమ ప్రాంత ప్రజలు జనగామ లేదా స్టేషన్ఘనన్పూర్ పట్టణాల్లో ఓటర్లుగా ఉండడం అభ్యర్థులకు మరింత ప్లస్ పా యింట్గా మారుతోంది. ప్రతీ ఓటర్ను సంప్రదించి సంబంధాలను పటిష్టం చేసి తమ వైపు తిప్పుకోవడంలో వారు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఎక్కడ చూసినా ఇనన్చార్జ్ బృందాల హడావిడి, చురుగ్గా తిరిగే కార్యకర్తలదే ఈ ఎన్నికల్లో అసలు పోరు అని చెప్పవచ్చు. ఒక్కో వార్డులో కనీసం 20 మంది వరకు ఇనన్చార్జ్లు, వార్డు కమిటీ సభ్యులు, సహాయకులు కలిసి ముమ్మరంగా పనిచేస్తున్నారు. పట్టణంలోని ప్రతీ వీధిలో వారి ఉనికి స్పష్టంగా కనిపిస్తోంది. వార్డుల వారీగా ఓటర్ లిస్టులు సిద్ధం చేసి, ప్రభావవంతులైన కుటుంబాలను దగ్గర చేసుకోవడం, అసంతృప్తులను చర్చలతో దగ్గరకు చేర్చుకోవడం, గ్రూపుల మధ్య కలహాలను తగ్గించడం వంటి పనులను వారు ఎంతో వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఆయా మండలాల నుంచి ఇన్చార్జ్లుగా వచ్చిన నాయకులు తమ ప్రాంత పరిచయాలను కూడా పూర్తిగా వినియోగిస్తున్నారు. పట్టణంలో నివసిస్తున్న తమ గ్రామాల ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఓటరు–ఓటరుకు లింక్ విధానం అమలు చేస్తున్నారు. స్థానికంగా తమ ప్రభావం ఉన్న కుటుంబాలకు మరింత చేరువై వారిని అభ్యర్థికి అనుసంధానం చేస్తూ రానిఓట్లను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పురపాలిక ఎన్నికల ప్రచారం పట్టణాన్ని పండుగ వాతావరణంలోకి తీసుకెళ్లింది. రోడ్లపై పార్టీ జెండాలు, గల్లీల్లో నినాదాలు, ఇంటింటికీ తిరిగే ప్రచార బృందాలు ఏ వార్డులోకి వెళ్లినా అదే ఉత్సాహం కనిపిస్తోంది. ఇన్న్ చార్జ్ బృందాల సందడితో పాటు అభ్యర్థుల పాదయాత్రలు, సమావేశాలతో పట్టణంలో సందడి నెలకొంది. తెల్లవారు లేచింది మొదలు అర్ధరాత్రి వరకు గెలుపు వ్యూహాలు 20 మంది జట్టుగా..అహర్నిశలు శ్రమ పట్టణాల్లో ఎటు చూసినా సందడే ప్రతీ ఓటు కీలకం కావడంతో పక్కా ప్రణాళికలుసర్పంచులు, రైతు నాయకులు, స్థానిక నేతలు, గత ఎన్నికల్లో ప్రభావం చూపిన ఓటరు గ్రూపులందరూ తమ అభ్యర్థుల వెనుక నిలబడే విధంగా కసరత్తు సాగుతోంది. ఈసారి మున్సిపల్ పీఠం కోసం జరిగే పోరులో పార్టీలు కాకుండా నాయకుల వ్యక్తిగత ప్రభావం ప్రచారం గెలుపు, ఓటములను నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనగామ, స్టేషన్ఘన్న్పూర్ పురపాలికల్లో ఈసారి ఎన్నికలు తీవ్ర హోరాహోరీ వాతావరణంలో సాగుతున్నాయి. ఇన్చార్జ్లు, కార్యకర్తల కలసికట్టుగా పోరాటం పట్టణంలోని ప్రతీ ఓటును కీలకంగా మార్చబోతోంది. -
పోలీసుల కవాతు
జనగామ: మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు ఓటర్లలో సంపూర్ణ విశ్వాసాన్ని పెంపొందించేందుకు పట్టణంలో శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు. ఏఎస్పీ పండేరి నితిన్ చేతన్ ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై, ఆర్ఏఎఫ్ డిప్యూటీ కమాండెంట్ టి.పి. బగేల్, ఇన్స్పెక్టర్లు రమణారెడ్డి, ఖలీద్తో పాటు 40 మంది బలగాల సహకారంతో ముఖ్య కూడళ్లు, ఆర్టీసీ చౌరస్తా, సున్నితమైన, అప్రమత్తత అవసరమైన ప్రాంతాల్లో కవాతు నిర్వహిచారు. నేడు మహాశివరాత్రి జాతరపై సమీక్షపాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 14 నుంచి 18 వరకు జరిగే మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శనివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ జెండా ఎగురవేయాలిజనగామ: పురపాలిక ఎన్నికల సందర్భంగా పట్టణంలో అత్యధిక స్థానాలు కై వసం చేసుకుని చైర్మన్ పీఠం దక్కించుకునే విధంగా ప్రతీ కార్యకర్త, నాయకులు కష్టపడి పనిచేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. నియోజకవర్గ కార్యాలయంలో మంత్రి జిల్లా ముఖ్యనాయకులతో సమీక్ష నిర్వహించారు. జనగామ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతీ ఒక్క కార్యకర్తను కలుపుకొని కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని దిశనిర్దేశం చేశారు. అంతకు ముందు మంత్రికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, టీపీసీసీ సభ్యులు లక్ష్మీ నారాయణనాయక్, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్, యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, వేమెళ్ల సత్య నారాయణరెడ్డి, కంచె రాములు, వంగాల మల్లారెడ్డి, కొమరవెల్లి దేవస్థాన చైర్మన్ వెంకటనర్సింమారెడ్డి తదితరులు ఉన్నారు. నేడు మంత్రి పొంగులేటి రాకజనగామ: పురపాలిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 7న (శనివారం) గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రానున్నట్లు నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి తెలిపారు. శుక్రవారం కొమ్మూరి మాట్లాడుతూ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి వరకు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తారన్నారు. ఇందులో భాగంగా ధర్మకంచ కమ్యూనిటీ హాల్, 14వ వార్డు అంబేద్కర్ విగ్రహం, ఆర్టీసీ చౌరస్తా, తహసీల్ కార్యాలయం ఏరియాలో కార్నర్ మీటింగ్లను నిర్వహిస్తామన్నారు. స్టేషన్ఘన్పూర్: మొబైల్ యాప్లో ఎల్సీ తీసుకోవడం ద్వారా ప్రాణాలకు భరోసా ఉంటుందని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ టి.మధుసూదన్ అన్నారు. స్టేషన్ఘన్పూర్ 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో విద్యుత్ సిబ్బందికి మొబైల్యాప్లో ఎల్సీ తీసుకోవడంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యుత్ సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ భద్రతా ప్రమాణాలను పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఇ టెక్నికల్ గడ్డం గణేశ్, స్టేషన్ఘన్పూర్ డీఈ సారయ్య, ఏడీఈ రణధీర్రెడ్డి, ఏఈలు శ్వేత, శంకర్, శివకుమార్, సురేష్, సబ్ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడండి
రఘునాథపల్లి: మండల పరిధిలోని పలుప్రాంతాల్లో పులి సంచారం నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అటవీశాఖ సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రఘునాథపల్లి పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్స్టేషన్లోని రికార్డ్, స్టేషన్ రైటర్ రూమ్లు, రిసెప్షన్ సెంటర్, ఇతర విభాగాలను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నేరాల రేటు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, నమోదైన కేసుల పురోగతిపై ఆరా తీశారు. అధికారులు, సిబ్బంది పనితీరును మరింత మెరుగు పరుచుకొని చేపట్టాల్సిన విధి విధానాలపై సీఐ, ఎస్సైలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్ ఏసీపీ భీంశర్మ, జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్రెడ్డి, ఎస్సై దూదిమెట్ల నరేశ్ ఉన్నారు. అటవీశాఖతో సమన్వయం చేసుకోవాలి రఘునాథపల్లి పోలీస్స్టేషన్ను తనిఖీ చేసిన సీపీ -
ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహం
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ రూరల్: ప్రతిభావంతులైన క్రీడాకారులకు సీఎం కప్ ప్రోత్సాహమని, చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. శుక్రవారం స్థానిక ధర్మకంచ మినీ స్టేడియంలో నియోజకవర్గ స్థాయి సీఎం కప్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో క్రీడాకారులు తమ ప్రతిభను చూపించి గుర్తింపు తీసుకురావాలన్నారు. జిల్లా ఇన్చార్జ్ యువజన, క్రీడల శాఖ అధికారి కోదండరాములు, తహసీల్దార్, ఎంపీడీఓలు పాల్గొన్నారు. అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానం సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026–28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్లెన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు తమ జర్నలిస్టుల పేర్ల జాబితాను జిల్లా పౌరసంబంధాల అధికారికి సమర్పించాలని సూచించారు. యాజమాన్యాల ద్వారా పంపిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
పులి.. ఒకటా? రెండా?
● జిల్లాలో పశువులపై సాగిస్తున్న వేట ● పులికోసం బోన్లు.. ట్రాప్ కెమెరాల ఏర్పాటు ● పగలు కొండల్లో.. రాత్రి పొలాల్లో టైగర్ జాడలు ● ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు జనగామ: మూడు రోజులుగా జిల్లాలోని బచ్చన్నపేట, జనగామ, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల పరిసర అటవీ ప్రాంతాల్లో పులి సంచారం వార్తలు గ్రామాలను వణికిస్తున్నాయి. మొదట అటవీ ప్రాంతాల్లోనే తిరుగుతున్నట్లు భావించినా ఇప్పుడు మనుషుల నివాస ప్రాంతాలవైపు వచ్చిందన్న ప్రచారంతో అధికార యంత్రాంగం ప్రజలను మరింత అప్రమత్తం చేస్తోంది. రఘునాథపల్లి, బచ్చన్నపేట మండలాల్లోని చెరువుల అంచులు, పల్లె వెలుపల ఉన్న పొలాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో గ్రామస్తులు రాత్రివేళలో బయటకు రావడానికి, వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లడానికి జంకుతున్నారు. పశువులను కూడా వెలుపల వదలడానికి భయపడుతున్నారు. పగలు కొండకోనల్లో తిష్ట వేసిన పులి ఇప్పటివరకు రాత్రివేళల్లో యాదాద్రి, జనగామ జిల్లాలో 20 వరకు ఆవులు, మేకలను వేటాడినట్టు పలు గ్రామాల్లో వార్తలు, సంఘటనలు వెలుగులోకి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆడనా.. మగనా... ఈ పులి ఎక్కడినుంచి వచ్చింది.. మగపులా? ఆడపులా? లేక రెండు పులులా? అన్న అనుమానాలు కొనసాగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరించిన పులిని అటవీశాఖ అధికారులు రాయల్ బెంగాల్ టైగర్గా గుర్తించారు. ఇది మగ పులిగా నిర్ధారించారు. ఇదిలా ఉండగా బచ్చన్నపేట మండలంలో మరో పులి సంచరిస్తోందనే ప్రచారం ప్రజల్లో మరింత భయాన్ని రేకెత్తిస్తోంది. ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో పులిఛాయలు, పాదముద్రలు భిన్నంగా ఉండటం వంటి అంశాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో అటవీశాఖ, పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. పులి కదలికలను గుర్తించేందుకు అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, ట్రాపింగ్ బోన్లు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో రాత్రి పహారా బృందాలను ఏర్పాటు చేసి గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజల అప్రమత్తతకు.. సూచనలు ● పులి సంచారంపై జిల్లా అటవీశాఖ అధికారులు ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చెబుతున్నారు. ● పులి కదలికలు రాత్రివేళల్లో చురుకుగా ఉంటాయని, వేకువజామున, సాయంత్రం, చీకటి పడిన తర్వాత పులి సంచరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండడం మంచిది. ● పులి కనిపించిన సందర్భంలో పెద్దగా గోల చేయరాదు. శబ్ధాల వల్ల పులి మరింత ఆందోళనకు గురవుతుంది. ● మేకలు, ఆవులు వంటి పశువులను రాత్రివేళల్లో బయట ఉంచవద్దు. ● రాత్రి పొలాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, వృద్ధులు, మహిళలు రాత్రివేళల్లో ఒంటరిగా బయటికి వెళ్లొద్దు. ● వీలైనంత వరకు గుంపులుగా ప్రయాణించాలి. ● పులి కదలికలు కనిపిస్తే వెంటనే ఎస్ఎస్ఓ, ఎఫ్ఆర్ఓ, ఎస్హెచ్ఓ, తహసీల్దార్లకు సమాచారం ఇవ్వాలి.ఎఫ్బీఓ రఘునాథపల్లి : 9603780678ఎస్హెచ్ఓ రఘునాథపల్లి : 8712685211ఎఫ్ఎస్ఓ రఘునాథపల్లి : 7382619411తహసీల్దార్ రఘునాథపల్లి : 9676 388123ఎఫ్ఎస్ఓ జనగామ : 8121316323ఎఫ్ఆర్ఓ జనగామ : 939894 6440డీఆర్ఓ లింగాల ఘణపురం : 9704601785డీఎఫ్ఓ జనగామ : 944 0810093 -
సేంద్రియ సాగుతో బహుళ ప్రయోజనాలు
దేవరుప్పుల: విషతుల్య ఆహారపు ఉత్పత్తులకు స్వస్తి పలికేలా సేంద్రియ పంటల సాగుతో రైతులు బహుళ ప్రయోజనాలు పొందుతారని జిల్లా సాంకేంతిక వ్యవసాయ అధికారులు శరత్చంద్ర, విజయ్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ధారావత్తండాలో కునుసోతు బిచ్చనాయక్ వ్యవసాయ క్షేత్రంలో సాగు చేస్తున్న సేంద్రియ ఎరువు తయారీ, పంటల సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సేంద్రియ సాగులో వర్మికంపోస్టు, జీవామృతం, బీజామృతం, ఘనజీవామృతం వంటి స్వతహాగా తయారు చేసుకొని విజయవంతంగా సాగు చేస్తున్న రైతు బిచ్చానాయక్ను అభినందించారు. కార్యక్రమంలో పెద్దమడూరు ఏఈఓ భాస్కర్, పలువురు రైతులు పాల్గొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్కు 68 మంది గైర్హాజరుజనగామ రూరల్: ఇంటర్ ప్రయోగ పరీక్షలకు 68మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్ విద్యాధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా వ్యాప్తంగా 9 కేంద్రాల్లో జనరల్, ఒకేషనల్ ప్రయోగ పరీక్షలు జరగగా మొత్తం 429 మంది జనరల్ విద్యార్థులకు గాను 425మంది హాజరు కాగా నలుగురు గైర్హాజరయ్యారు. ఒకేషనల్లో మొత్తం 307 విద్యార్థులకు గాను 274మంది హాజరు కాగా, 33మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 410 జనరల్ విద్యార్థులకు గాను 403మంది హాజరు కాగా, 7 గైర్హాజరయ్యారు. ఒకేషనల్లో 222 విద్యార్థులకు గాను 198 హాజరు కాగా 24 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ విద్యాధికారి జితేందర్ రెడ్డి జనగామ, జఫర్గఢ్, స్టేషన్ ఘన్ఫూర్ పరీక్షా కేంద్రాలను సందర్శించగా డీఈసీ సభ్యులు శ్రీనివాస్ పాలకుర్తి, కొడకండ్లలోని పరీక్ష కేంద్రాలను సందర్శించారు. పీహెచ్సీలో ప్రసవాలు పెంచాలిరఘునాథపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్రావు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేషెంట్లకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల వల్ల కలిగే లాభాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పీహెచ్సీలో జరుగుతున్న కార్యక్రమాలపై రివ్యూ చేసి రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ కమలహాసన్, ఎంఎల్హెచ్పి డాక్టర్ ప్రీతి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామ్కిషన్, హెచ్ఈఓ ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు. రూ.5వేల కోట్లు కేటాయించాలిజనగామ రూరల్: రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి రూ.5వేల కోట్లు కేటాయించాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో కుర్ర ఉప్పలయ్య అధ్యక్షతన జరిగిన కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.. రాష్ట్ర బడ్జెట్లో ప్రతిసారి అన్యాయమే జరుగుతోందని, గత సంవత్సరం రూ.70 కోట్లు మాత్రమే కేటాయించి అందులో కేవలం రూ.17 కోట్లే ఖర్చు చేశారన్నారు. ఏప్రిల్ 17న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే నిరాహార దీక్షకు గీత కార్మికులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాల్నే వెంకటమల్లయ్య, కనకట రాజయ్య, పరదుల భాస్కర్, బండపల్లి శంకరయ్య, మాచర్ల రఘురాములు, జొన్నగోని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వాతావరణం
జిల్లాలో ఉదయం పొగమంచు ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు కాస్త ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి సమయంలో చలి తీవ్రంగా ఉంటుంది.‘పుర’పోరుకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లుసాక్షిప్రతినిధి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. మున్సిపాలిటీల వారీగా సీని యర్ నాయకులను ఇన్చార్జ్లు గా నియమించిన టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్.. వార్డుల వారీగా అభ్యర్థుల గెలుపు బాధ్యతలను వారిపైనే పెట్టారు. నియోజకవర్గాల వారీగా ఆయా మున్సిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను సమన్వయం చేసుకుంటూ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ వరంగల్, మహబూబాబాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్లుగా ఉన్నారు. వీరికి తోడు మున్సిపాలిటీల వారీగా కోఆర్డినేటర్లను గురువారం నియమించారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జనగామ మున్సిపాలిటీకి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, పాయం వెంకటేశ్వర్లుకు మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్లుగా బాధ్యతలు ఇచ్చారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని తొర్రూరు మున్సిపాలిటీకి ఎంపీ డాక్టర్ కడియం కావ్య, కొలను హనుమంతరెడ్డిని నియమించారు. పరకాలకు టెస్కాబ్ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, స్టేషన్ఘన్పూర్కు భీమగాని సౌజన్య, భూపాలపల్లికి ఎర్రబెల్లి వరద రాజేశ్వర్రావు, వర్ధన్నపేటకు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని డోర్నకల్ మున్సిపాలిటీకి గాజర్ల అశోక్, మరిపెడకు ఎంపీ పోరిక బలరాంనాయక్, కేసముద్రంకు దూడ వెంకటరమణ, మహబూబాబాద్కు సీహెచ్ వెంకటేశ్, ములుగుకు ఈవీ శ్రీనివాస్రావు, నర్సంపేటకు డాక్టర్ పులి అనిల్కుమార్ను సమన్వయకర్తలుగా టీపీసీసీ నియమించింది. కోఆర్డినేటర్లుగా నియమితులైన వారికి అభ్యర్థుల గెలుపు బాధ్యతలను అప్పగించింది. కోఆర్డినేటర్లుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు మినహా ఇతర సీనియర్లకు భవిష్యత్లో నామినేటెడ్ పోస్టులకు మున్సిపల్ ఎన్నికల విజయాలకు కూడా పార్టీ అధిష్టానం లింకు పెట్టినట్లు సమాచారం. కాగా, టీపీసీసీ నియమించిన సమన్వయకర్తలు అభ్యర్థుల గెలుపు కోసం వెంటనే రంగలోకి దిగారు. 12 మున్సిపాలిటీలకు సీనియర్ల నియామకం జనగామ, తొర్రూరు, మరిపెడకు ఎంపీలు చామల కిరణ్కుమార్రెడ్డి, కడియం కావ్య, బలరాంనాయక్ ఉత్తర్వులు జారీచేసిన టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అభ్యర్థుల గెలుపునకు.. నామినేట్ పదవులకు లింకు -
పట్టణ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం
● నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు జనగామ: పట్టణ అభివృద్ధి ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యమని నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి, పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు అన్నారు. పురపాలిక ఎన్నికల్లో భాగంగా 7,8,9,10 వార్డుల్లో బుధవారం ఇంటింటి ప్ర చారం చేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందన్నారు. పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి, పట్టణ సమగ్రాభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలకు సహకారం అందించాలన్నారు. గృహలక్ష్మి, మహాలక్ష్మి ఇలా అరు గ్యారంటీ పథకాలతో ప్రతీ ఇంటికి లబ్ధి చేకూరుతుందన్నారు. పేద కుటుంబాలకు సొంతింటి కల సాకారం చేస్తున్నామని, అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్కు పట్టం కట్టాలన్నారు. యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ తదితరులు ఉన్నారు. -
శుక్రవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
వలస ఓటర్లపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్, భీమండి, హనుమకొండ, వరంగల్ తదితర ప్రాంతాలకు కూలీ, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వలస వెళ్లిన ఓటర్లు పోలింగ్లో కీలకపాత్ర పోషించనుండటంతో పార్టీలన్నీ వారిని తిరిగి రప్పించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశాయి. వారికి రోజూ ఫోన్ కాల్స్ చేస్తూ మర్యాదపూర్వక పలకరింపులు, చివరి రోజు ప్రత్యేక వాహనాల్లో తరలించేందుకు ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నారు. వలస ఓటర్ల కోసం పోలింగ్ రోజు మినీ వాహనాలతో పాటే ఏసీ లగ్జరీలను ఏర్పాటు చేసేలా ఆయా పార్టీలు ముందు అడ్వాన్స్లను సైతం ఇస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్, వరంగల్, భీమండి ఓటర్లపై అభ్యర్థుల కన్ను ● ఓట్లు రాబట్టుకునేందుకు ‘ప్రత్యేక’ ప్రణాళికలు ● తమకే ఓటు వేయాలంటూ ఫోన్లు ● మందు, పైసలు, ప్రయాణ ఖర్చులు..అన్నీ భారీగానే! జనగామ: ఓట్ల కోసం పోల్ మేనేజ్మెంట్ రాజకీయం తారాస్థాయికి చేరుకుంది. దూరప్రాంతాల్లో ఉపాధి, ఉద్యోగ, చదువురీత్యా ఉన్నవారి ఓట్ల కోసం అభ్యర్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారి ఓట్లను తమకే వేయాలంటూ ముందుగానే మాట తీసుకుంటున్నారు. వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసేందుకు హామీ ఇస్తున్నారు. ప్రచార గడువు నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో జనగామ, స్టేషన్ ఘన్పూర్ పురపాలికల్లో పోటీ చేసే అభ్యర్థులు, పార్టీలు గెలుపు కోసం పోల్ మేనేజ్మెంట్ పేరిట భారీ వ్యూహరచనలో బిజీబిజీ అయిపోయారు. ప్రజల సమస్యలు, అభివృద్ధి హామీలు అన్నీ పక్కనపెట్టి, ఓటును తమ గూటికి దించుకోవడమే ప్రధాన లక్ష్యంగా మిగిలింది. కులాల వారీగా ఓటర్ల లెక్కలు.. ప్రత్యేక కమిటీలు ప్రతీ పార్టీ కులాల వారీగా ఓటర్ల వివరాలు సేకరిస్తూ, పోల్ మేనేజ్మెంట్ ప్రత్యేక బృందాలను మోహరించింది. ఏ కులంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో, ఎవరికి మొగ్గు చూపుతున్నారో, ఎవరిని తమవైపు తిప్పుకోవాలో ప్రత్యేక ప్లానింగ్ చేస్తున్నారు. సంఘాల వారీగా సమష్టి భోజనాలు, విందులు, సమావేశాలు ఈసారి ప్రచారాల్లో ప్రధాన హైలెట్గా మారింది. డబ్బు పంపిణీకి రహస్య ఏర్పాట్లు ఎన్నికల సంఘం కంటపడకుండా డబ్బుల పంపిణీ విషయంలో పార్టీలు సీక్రెట్ను మెయింటెనెన్స్ చేస్తున్నాయి. ఈనెల 11న పోలింగ్ నేపథ్యంలో 8వ తేదీ అర్ధరాత్రి నుంచే వార్డుల వారీగా నమ్మకస్తుల ఇళ్లలో ‘మనీ డంపింగ్’ చేస్తున్నారనే సమాచారం ఉంది. చిన్న చిన్న మొత్తాల్లో ప్యాకెట్లు, పంపిణీ సమయంలో ఎక్కడా పట్టుపడకుండా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మద్యం, వెండి కాయిన్లు, గిఫ్టులు రెడీ క్లస్టర్ల వారీగా భారీగా మద్యం డంపింగ్ జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖరీదైన మందుబాటిళ్లు, వెండి నాణేలు, గిఫ్టులతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎవరికి వారే కొత్త ప్రయత్నాల్లో ఉన్నారు. ఓటరే రాజు అంటూ చెప్పుకుంటూనే... లోపల మాత్రం ఓటును ‘మేనేజ్’ చేసేందుకు అభ్యర్థులు పట్టపగ్గాలు విప్పేశారు. ఈసారి ఎన్నికల్లో అభివృద్ధి చర్చ కంటే, వ్యూహరచన, ఓటు మేనేజ్మెంట్, వలసఓటర్ల లెక్కలు, మద్యం, డబ్బు పంపిణీ ఇవే ప్రధాన అంశాలుగా మారుతున్నాయి. ఓటర్లు ఎవరి మాట నమ్ముతారు, ఎవరి వ్యూహం ఫలిస్తుందనే అసలు పోరు ఇప్పుడే మొదలు కానుంది. స్టార్ క్యాంపెయినర్ల రాక పురపాలిక ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కడియం శ్రీహరి, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్కుమార్రెడ్డి, జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి, పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ క్యామ మల్లేశం, యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి ప్రస్తుతం ప్రచారం చేస్తున్నారు. రాబోయే నాలుగు రోజుల పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్క, మాజీమంత్రులు హరీశ్రావు, కేటీఆర్, ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ తదితర ప్రముఖులు జనగామ, స్టేషన్ఘన్పూర్ పట్టణాలకు రానున్నారు. అన్ని పార్టీలు రోజుకు 5 నుంచి 8 వార్డులను చుట్టేస్తూ ప్రచారంలో స్పీడు పెంచారు. ర్యాలీలతో పాటు ఇంటింటి ప్రచారాన్ని తెల్లవారు జాము 5 గంటల నుంచే మొదలుపెడుతున్నారు. -
భూసేకరణ పనులు వేగవంతంగా చేపట్టాలి
జనగామ రూరల్: భూసేకరణ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, వేగవంతంగా చేపట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో భూసేకరణ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణలో వివిధ దశల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. యూనిట్–1 పరిధిలో, పీఎన్ దశలో, పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియకు సంబంధించిన అవార్డు విచారణను రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు, సర్వేయర్లతో కలిసి గ్రామాల వారీగా సంయుక్త తనిఖీల ద్వారా వారం లోపు పూర్తి చేయాలని, పెగ్ మార్కింగ్ పనులను నెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే యూనిట్–2 పరిధికి సంబంధించి పెండింగ్లో ఉన్న వివిధ పనులను వారం లోపు, పెగ్ మార్కింగ్ను నెలలోపు పూర్తి చేయాలని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, జనగామ పరిధిలో భూసేకరణ పెండింగ్లో పనులను వారం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. చీటకోడూర్ ఆర్ఎంసీకి సంబంధించి అవార్డు విచారణను ‘సర్వే – పేమెంట్ వెరిఫికేషన్ టీం’ ద్వారా ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు, సర్వేయర్లతో కలిసి తనిఖీ నిర్వహించి, పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేయాలని సూచించారు. అదేవిధంగా అశ్వరావుపల్లికి సంబంధించిన భూసేకరణ కూడా వారం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, రెవెన్యూ డివిజనల్ అధికారులు జనగామ, ఘనపూర్ స్టేషన్ ప్రత్యేక ఉప కలెక్టర్ సూపరింటెండింగ్ ఇంజనీర్, ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు. మ్యాపింగ్ ప్రక్రియ.. ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియ, ఎస్సీ స్కాలర్షిప్, మున్సిపల్ ఎలక్షన్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గూగుల్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, బీఎల్వోలు ఆయా పోలింగ్ కేంద్రాల వారీగా క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఎస్ఐఆర్ మ్యాపింగ్ వేగవంతంగా చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. మున్సిపల ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, అధికారులు వసంత, విక్రమ్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
అమలు కాని హామీలతో మోసం
● ప్రచారంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ: ప్రత్యర్థి పార్టీలు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తూ అమలు కాని హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా 13, 17, 18, 19, 22, 23, 24 తదితర వార్డుల్లో గురువారం ఎమ్మెల్యే ప్రచారం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి తప్ప, ప్రస్తుత కాంగ్రెస్ ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండున్నరేళ్లుగా తమ నీలిమా ఆస్పత్రిలో కార్పోరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. పట్టణ ఓటర్లు బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట నాయకులు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, బాల్దె సిద్ధిలింగం, గద్దల నర్సింగారావు తదితరులు ఉన్నారు. -
వామ్మో పెద్దపులి!
లింగాలఘణపురం: మండలంలోని కుందారంలో బుధవారం రాత్రి పులి సంచరించినట్లుగా పాదాల గుర్తుల ఆనవాళ్లు కనిపించాయని ఎఫ్ఆర్ఓ కొండల్రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం కుందారం సమీపంలో పులి పాదాల గుర్తులను గమనించిన రైతులు డయల్ 100కు ఫోన్ చేయడంతో స్థానిక ఎస్సై శ్రావణ్కుమార్ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా డీఎఫ్ఓ తన సిబ్బందితో వెళ్లి పాదాల గుర్తులను పరిశీలించి పులి సంచరించినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. మంగళవారం యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలో శారాజీపేటలో ఆవును చంపిన పులి అక్కడి నుంచి కుందారం వచ్చినట్లుగా గుర్తించామని, రఘునాథపల్లి మండలం నారాయణపురం, లింగాలఘణపురం మండలం కుందారం మధ్య సుమారు నాలుగైదు వందల ఎకరాల్లో సర్కార్ తుమ్మ చెట్లు ఉన్నాయని, అక్కడే ఉండి ఉండవచ్చని అనుమానంతో తమ సిబ్బంది గాలిస్తున్నారని వివరించారు. రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించిన నిపుణుల బృందం కుందారం గ్రామానికి చేరుకుని పులి సంచరించిన పరిసరాలను పరిశీలించారు. అందులో పులిని బంధించేందుకు మత్తు ఇంజక్షన్లు వేసే నిపుణులు, డాక్టర్ల బృందం ఉన్నారు. రఘునాథపల్లి: మండలంలోని శ్రీమన్నారాయణపురం శివారులో పెద్ద పులి సంచారం గుబులు రేపుతోంది. గురువారం తెల్లవారుజామున లింగాలఘణపురం మండలం కుందారం నుంచి మండలంలోని శ్రీమన్నారాయణపురం శివారులోకి వచ్చి నట్లు పాదముద్రలు ఉన్నాయన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు వెళ్లి పరిశీలించారు. స్థానిక ఎస్సై దూదిమెట్ల నరేశ్, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు శ్రీమన్నారాయణపురం, నిడిగొండ, భాంజీపేట రఘునాథపల్లి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. దేవరుప్పుల: మండలంలోని నీర్మాల గ్రామ నర్రెగడ్డ వ్యవసాయ క్షేత్రం ఏరియాలో సరిహద్దు గ్రామమైన వెల్మజాల(గుండాల మండలం)కు చెందిన రైతు జోలం పాండు పులి పాదగుర్తులను గుర్తించి విషయాన్ని అధికారులకు చేరవేశారు. ఈ గుర్తుల ఆధారంగా నీర్మాల నుంచి వనపర్తి మీదుగా కుందారం మీదుగా రఘనాథపల్లి మండలానికి వెళ్లిందనే పులి అడుగుల గుర్తులను బట్టి తెలుస్తోంది. కడవెండి–సీతారాంపురం మధ్య కూటికంటి ఎల్లయ్య అనే రైతు వ్యవసాయ పొలాల వద్ద గుర్తులను చూడగా.. జనగామ ఫారెస్టు డీఆర్ఓ ఆజాజ్ అహ్మద్, బీట్ ఆఫీసర్ రమేశ్, ఎస్ఓ రవీందర్, స్థానిక ఎస్సై ఊర సృజన్కుమార్, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలాన్ని గుర్తించి ఆ ప్రాంత రైతులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎఫ్ఆర్ఓ కొండల్ రెడ్డి జనగామ రూరల్: జిల్లాలోని లింగాల ఘణపురం మండలం కుందారం గ్రామశివారుల్లో పులి సంచరిస్తున్నట్లు దాని పాదముద్రల ద్వారా గుర్తించినట్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఆర్ఓ రావుల కొండల్ రెడ్డి తెలిపారు. లింగాల ఘణపురం, రఘునాథపల్లి, నర్మెట, జనగామ, దేవరుప్పుల మొదలగు మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తప్పనిసరి పరిస్థితులలో తప్ప మిగతా సమయాల్లో బయటకు రావొద్దన్నారు. అత్యవసరమైతే గుంపులు గుంపులుగా వెళ్లాలని తెలిపారు. పశువులను ఇంటివద్దనే సంరక్షించుకోవాలన్నారు. పులి సంచార సమాచారం తెలిస్తే ఫారెస్ట్ అధికారులు, పోలీసులకు తెలియజేయాలన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. పలు మండలాల్లో పాదముద్రలు, సంచరించినట్లు గుర్తింపు భయాందోళనలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్న ఫారెస్ట్, పోలీస్ అధికారులు -
ప్రతిభను వెలికిదీసేందుకే సీఎం కప్ పోటీలు
● అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ పాలకుర్తి టౌన్: గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికిదీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ అన్నారు. గురువారం మండలంలోని కార్మెల్ స్కూల్లో సీఎం కప్ క్రీడలను అదనపు కలెక్టర్ ముఖ్య అఽతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గస్థాయిలో నిర్వహించే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీల్లో యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి కోదండరామ్, ఎంపీడీఓ వేదవతి, తహసీల్దార్ సరస్వతీ, సీఐ జానకీరాంరెడ్డి, సర్పంచ్ కమ్మగాని విజయ, ఎస్సై పవన్కుమార్, ఎంఈఓ పోతుంటి నర్సయ్య, హైస్కూల్ హెచ్ఎం శోభారాణి, ప్రగతి విద్యాలయం ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. నేలను కాపాడుకోవాలి.. జఫర్గఢ్: నేల సంపదను కాపాడుకోవాలని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్ర భుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో స్కూల్ సాయిల్ హెల్త్పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్ వరలక్ష్మి, డీఏఓ అంబికాసోని, ఏడీఏ వసంత సుగుణ, తహసీల్దార్ రాజేశ్రెడ్డి, ఎంపీడీఓ సుమన్, శిరీష, రవి తదితరులు పాల్గొన్నారు. -
బుగులు వెంకన్నకు నాగాభరణాలు
చిల్పూరు: చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామికి బుధవారం సంగోజు మోహనాచారి–శంకర్లక్ష్మి దంపతులు రూ.50వేల విలువైన రెండు వెండి నాగాభరణాలు, ఇత్తడి ప్లేటును ఆలయ అర్చకులకు అందజేశారు. ఆలయానికి చేరుకున్న దాత దంపతులు అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేదమంత్రాల నడుమ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ శ్రీధర్రావు ఆధ్వర్యంలో ఆలయానికి అందజేశారు. కార్యక్రమంలో కుర్రెంల మోహన్ తదితరులు పాల్గొన్నారు. తాటికొండ జాతర ఆదాయం రూ.2లక్షలుస్టేషన్ఘన్పూర్: మండలంలోని తాటికొండ, జిట్టెగూడెం సమ్మక్క–సారలమ్మ జాతర ఆదా యం రూ.2,03,738లు వచ్చినట్లు జాతర కమిటీ బాధ్యులు తెలిపారు. జాతర కమిటీ గౌరవ అధ్యక్షుడు చల్లా సుధీర్రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రాపోలు మధుసూదన్రెడ్డి, సర్పంచ్లు మారపాక సుజనశ్రీను, బానోతు బాలునా యక్ ఆధ్వర్యంలో బుధవారం హుండీల లెక్కింపు చేపట్టారు. జాతర ఆదాయం రూ.2,03,738 వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్లు లునావత్ రజిత రవీందర్, ఎడమ కట్టమల్లు, వార్డు సభ్యులు, వివిధ కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు. ఎల్సీ యాప్ ద్వారా లైన్క్లియర్ తప్పనిసరిజనగామ రూరల్: ఎల్సీ యాప్ ద్వారా లైన్క్లియర్ తప్పనిసరిగా తీసుకోవాలని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆపరేషన్స్ సంపత్రెడ్డి అన్నారు. బుధవారం జనగామ టౌన్–1లో సెక్షన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యుత్ పనుల నిర్వహణలో భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ ఎం.లక్ష్మీనారాయణరెడ్డి, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ డి.వేణుగోపాల్, అసిస్టెంట్ ఇంజనీర్ (టౌన్–1) బి. సౌమ్య, అసిస్టెంట్ ఇంజనీర్ (బచ్చన్నపేట) జి. రాజ్కుమార్, సబ్ ఇంజనీర్ ఎం.మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
రంగా రంగా ప్రచార స్థలాన!
జనగామ: పురపాలక ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్ పురపాలికల్లో బుధవారం నుంచి ప్రధాన పార్టీలన్నీ ప్రచార రంగంలోకి దిగడంతో వార్డులన్నీ పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. రంగంలోకి ముఖ్యనేతలు ప్రచార రథాలు, బైకులు, ఆటోలు, పార్టీ బ్యానర్లు..ఇలా ప్రతి వీధిలోనూ నినాదాల ప్రతిధ్వని వినిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రధాన నేతలతో పాటు ఎమ్మెల్యేలు, సీనియర్ క్యాడర్, డివిజన్ స్థాయి నాయకులు కూడా బూత్ల వారీగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డుల వారీగా క్యాడర్ అభ్యర్థుల వెంట అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థులూ ప్రధాన పార్టీలకు సమానంగా ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. వారికి వచ్చిన ఎన్నికల గుర్తులను చూపిస్తూ ‘తమ గుర్తుకు ఓటేయండి.. అభివృద్ధి కోసం మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి..’ అని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటికీ తిరిగే స్వతంత్రులు ఓటర్లలో ఆప్యాయతను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అవ్వా.. అమ్మా.. తాతా అంటూ.. ప్రచారంలో అభ్యర్థుల మాటతీరు కూడా ఓటర్లలో చర్చనీయాంశమైంది. ‘అమ్మా.. అవ్వా.. తాత.. ఎలా ఉన్నారు.. నేను ఫలానా పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. ఈసారి తప్పకుండా నాకు అశీర్వాదం ఇవ్వండి. మీరు పలికిన వెంటనే ముంగిట ప్రత్యక్షమవుతా.. ఐదు సంవత్సరాలు మీ పక్కనే ఉంటా.. అభివృద్ధి చేస్తా’ అంటూ భరోసా కల్పిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగతంగా ఓటర్లను కలుస్తూ.. వార్డుల వారీగా క్యాడర్ ఇంటింటికీ తిరుగుతుండగా, పలు సమయాల్లో అభ్యర్థులు మాత్రం ముఖ్యమైన ఓటర్ల ఇళ్లకు వ్యక్తిగతంగా వెళ్లి మద్దతు ఇచ్చి గెలిపించాలని విన్నవిస్తున్నారు. మరోవైపు పార్టీ లీడర్ల అలకలను, గ్రూపుల మధ్య చిన్న చిన్న విబేధాలను బుజ్జగించేందుకు అభ్యర్థులు విపరీతంగా శ్రమిస్తున్నారు. అలకలు పోవడం, వర్గాలు కలవడం, అభ్యర్థితో కలిసి ప్రచారంలోకి రావడం ఇవన్నీ ప్రచారంలో భాగమయ్యాయి. తదుపరి రోజుకు నేటి రాత్రే ప్రణాళిక ప్రధాన వీధులు, బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాలు పార్టీల ర్యాలీలతో కళకళలాడుతున్నాయి. హోటళ్లలో కూర్చున్న వారితో చేతులు కలుపుతూ షాప్లను సందర్శిస్తూ, మహిళలను పలకరిస్తూ ప్రతి ఓటరును ప్రేమ, ఆప్యాయతతో తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో అభ్యర్థులు బిజీబిజీగా గడుపుతున్నారు. పొద్ద ంతా ఊరేగింపులు, ర్యాలీలు చేసిన పార్టీల క్యాడర్ రాత్రికి తిరిగి పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు, తదుపరి రోజు వ్యూహరచన...ప్రచారం మరింత వేగం పొందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రజల్లో అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నప్పటికీ ఎవరి ప్రచారం ఎంత ప్రభావం చూపుతుందన్నది పోలింగ్ రోజునే తేలనుంది. మైకుల హోరు..ఊరేగింపుల జోరు పండుగ వాతావరణంలో వీధులు పొద్దంతా ర్యాలీలు..రాత్రికి వ్యూహరచన అమ్మా, అవ్వా, తాతా.. అంటూ ఆకట్టుకునే యత్నం -
వేడెక్కిన ఓరుగల్లు
తల్లులకు తనివితీరా మొక్కులు8 లోuమూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా ‘మున్సిపల్’ పోరుమేడారం బుధవారం భక్తజనసంద్రమైంది.. తిరుగువారం పండుగను మేడారం, కన్నెపల్లిలోని సమ్మక్క, సారలమ్మ ఆలయాల్లో పూజారులు ఘనంగా నిర్వహించారు. తల్లులకు పూజారులు ధూపదీపాలు వెలిగించి యాటలను నైవేద్యంగా సమర్పించారు. తిరుగువారం పండుగకావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. – ఎస్ఎస్ తాడ్వాయి ● మేడారం, కన్నెపల్లిలోని సమ్మక్క, సారలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ● భారీగా తరలివచ్చిన భక్తులు..● అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతల ప్రచారం ● ఈనెల 8న భూపాలపల్లికి సీఎం రేవంత్రెడ్డి.. ● బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు ● కేంద్ర మంత్రులు వస్తారంటున్న బీజేపీ నేతలుసాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగియగా.. 260 వార్డులకు 1,073 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఎంలతో పొత్తులతో సాగుతుండగా, బీఆర్ఎస్, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ప్రచారానికి మరో ఐదు రోజులే సమయం ఉండడంతో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. రెబల్స్పై బుజ్జగింపుల అస్త్రం మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు ఇంకా ఆరు రోజులే ఉండడంతో రెబల్స్ను దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఎంలతో పొత్తులతో పోటీ చేస్తుండగా.. 40 చోట్ల రెబల్స్ బెడద ఉంది. ఒంటరి పోరు చేస్తున్న బీఆర్ఎస్కు సైతం రెబల్స్ సెగ తాకుతోంది. నర్సంపేట, వర్ధన్నపేటలో ఎనిమిది చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ రెబల్స్ ఉన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది, బీఆర్ఎస్ నుంచి ఆరుగురు రెబల్ అభ్యర్థులుగా పోటీలో ఉండగా, వారితో పార్టీ నేతలు మంతనాలు చేస్తున్నారు. డోర్నకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, మరిపెడలో కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్ఎస్ నుంచి నలుగురు, కేసముద్రంలో కాంగ్రెస్ నుంచి ఒక్కరు, బీఆర్ఎస్లో ఇద్దరు చొప్పున రెబల్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరందరితో ఆ పార్టీల నేతలు చేస్తున్న ప్రయత్నాలు నేడో రేపో కొలిక్కి రావచ్చన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 12 మున్సిపాలిటీల్లో మొత్తం 260 వార్డులకుగాను ఒకచోట బీజేపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికాగా 26 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో లేరు.మేడారంలో తిరుగువారం పండుగఅన్ని మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఏఐఎఫ్బీ తదితర పార్టీలు, స్వతంత్రులు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇదే సమయంలో ‘పుర’ పీఠాలు లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు.. ఆ పార్టీల అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు అగ్రనేతలను రంగంలోకి దింపుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్లుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (వరంగల్), పొన్నం ప్రభాకర్ (మహబూబాబాద్)లను నియమించింది. వారు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలను కలుపుకుని సమన్వయం చేస్తున్నారు. ఏఐసీసీ పరిశీలకుడు పి.విశ్వనాథన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం పర్యటించగా.. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి జేఎస్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఏర్పాటు చేసే సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 12 మున్సిపాలిటీలకు ఇన్చార్జ్లను నియమించారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, అరూరి రమేశ్ తదితరులు ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ నుంచి అభ్యర్థుల గెలుపు కోసం కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ జిల్లా అధ్యక్షులను సమన్వయం చేస్తున్నారని, త్వరలోనే వారి పర్యటన ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
వివక్షలేని సమాజమే లక్ష్యం
జనగామ రూరల్: అసమానతలు, వివక్ష లేని సమాజాన్ని నిర్మించడమే తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎన్.ఎల్.నరసింహారావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాలకు సమానత్వం, సాధికారత పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం కలెక్టరేట్లో పనిచేసే హౌస్ కీపింగ్ సిబ్బందిని సన్మానించారు, అంతకుముందు తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్షాలోమ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు. డబుల్ బెడ్రూం నిర్మాణాల వివరాలివ్వండి డబుల్ బెడ్రూం నిర్మాణాల అప్పగింతకు సంబంధించిన వివరాలు అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. గూగుల్ మీట్లో మాట్లాడుతూ.. పంచాయతీరాజ్, ఇరిగేషన్, సోషల్ వెల్ఫేర్ తదితర ఇంజనీరింగ్ అధికారులు గతంలో చేపట్టిన రెండు పడక గదుల నిర్మాణలకు సంబందించిన పూర్తి వివరాలతో టెక్నికల్, ఫిజికల్లతో సహా ఫిబ్రవరి 15వ తేదీలోగా హౌజింగ్ శాఖకి అప్పగించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
డీసీపీకి ఉత్కృష్ట్ట పతకం
● సీపీ చేతుల మీదుగా అందజేత వరంగల్ క్రైం: పోలీస్ విభాగంలో ఉత్తమ సేవలందించినందుకు కేంద్ర ప్రభుత్వం వరంగల్ పోలీస్ కమిషనరేట్ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్కు ఉత్కృష్ట పతకాన్ని అందజేసింది. ఈమేరకు బుధవారం సీపీ క్యాంపు కార్యాలయంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ డీసీపీ రాజమహేంద్ర నాయక్కు పతకాన్ని అందించి అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చే అధికారులకు శాఖాపరమైన గుర్తింపుతో పాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు కూడా లభిస్తుందన్నారు. 2010 డీఎస్పీగా పోలీస్ శాఖలో చేరిన రాజమండ్రి నాయక్ నెల్లూరు జిల్లాతో పాటు వరంగల్ సీసీఎస్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో డీఎస్పీగా పని చేసి 2017 అదనపు ఎస్పీగా భూపాలపల్లి, ఇంటెలిజెన్స్లో పనిచేసి, 2021లో ఎస్పీగా పదోన్నతి పొంది ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. ప్రస్తుతం వెస్ట్ జోన్ డీసీపీగా ఎంతో సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా ఎన్నో కీలక కేసులను పరిష్కరించడం డీసీపీ రాజ మహేంద్ర నాయక్ కీలకంగా నిలిచారు. ఈసందర్బంగా వెస్ట్ జోన్ పరిధి పోలీస్ అధికారులు, సిబ్బంది డీసీపీ అభినందనలు తెలిపారు. -
ఎన్నికల నియమావళి పాటించాలి
జనగామ రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలని ఏఎస్పీ పండారీ చేతన్ నితిన్ సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పోటీచేస్తున్న అభ్యర్థులకు బుధవారం సిద్దిపేట రోడ్డులోని గాయత్రి ఫంక్షన్ హాల్లో ఎన్నికల ఖర్చులు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల నియమావళి అనుసరించి వ్యయాలు ఉండాలని, నిబంధనలు ఉల్లంగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు, మున్సిపల్ కమిషనర్, అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. -
ఆదర్శ మున్సిపాలిటీగా ‘ఘన్పూర్’
స్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదామని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఎంపీ కడియం కావ్య చేతుల మీదుగా బీఫామ్లు అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.. ప్రజల అభిప్రాయాలు, గెలిచే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీరే.. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య మంగళవారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు 1వ వార్డు సింగపురం దయాకర్, 2వ గుర్రం హరినాధ్, 3వ గుర్రం హైమ, 4వ బూర్ల శంకర్, 5వ వార్డు కొంతం రజిత, 6వ కనకం రమేశ్, 7వ అన్నెపు సుమలత, 8వ చాతరబోయిన సత్యనారాయణ, 9వ సౌదరపల్లి సంపత్రాజ్, 10వ తోకల అనూష, 11వ నీల రాజమ్మ, 12వ గట్టు సంగీత, 13వ తాటికొండ వినయ్కుమార్, 14వ పెసరు కృష్ణవేణి, 15వ బొల్లు లక్ష్మీ, 16వ అంగడి రజిత, 17వ పొన్నం స్వరూప, 18వ వార్డుకు కౌన్సిలర్ అభ్యర్థిగా పొన్నం రవిని ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన వరంగల్ ఎంపీ కడియం కావ్య -
బరికి రెఢీ!
బరికి రెఢీ!పూర్తయిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియజనగామ: పురపాలిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ పర్వం పూర్తయింది. జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో కలిపి 91 మంది తమ నామినేషన్లు వెనక్కి తీసుకోవడంతో 209 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. స్టేషన్లో 32 మంది, జనగామలో 59మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. బరిలో 209 మంది.. జనగామ మున్సిపాలిటీలో 127 మంది, స్టేషన్ఘన్పూర్లో 82 మంది పోటీలో నిలిచారు. ఈ రెండు మున్సిపాలిటీల్లో 57 మంది స్వతంత్రులు బరిలో ప్రధాన పార్టీలకు దడ పుట్టిస్తున్నారు. వారిలో జనగామలో 30, స్టేషన్ఘన్పూర్లో 27 మంది ఉన్నారు. జనగామ 22వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఆ పార్టీ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య 29కి చేరింది. కాంగ్రెస్ 30, బీజేపీ 26 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా, (20, 7, 13, 29 వార్డుల్లో) బీజేపీ పోటీ చేయడం లేదు. జనగామ మున్సిపల్లో సీపీఎం–కాంగ్రెస్ పొత్తులో భాగంగా 3, 5, 7 వార్డుల్లో పోటీ చేస్తుండగా, 17, 7 వార్డుల్లో ఇరు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఇద్దరికీ రెండు పార్టీల నుంచీ బీ–ఫామ్లు జారీ అయ్యాయి. ఇక్కడ ఫ్రెండ్లీ పోటీ ఉంటుందని రెండు పార్టీలు పరస్పర అవగాహన కుదుర్చుకుంటున్నాయి. ఇక 22వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి అంజలి విత్డ్రా చేసుకోగా అదే వార్డులో బీజేపీ అభ్యర్థి మాలతి, మరో స్వతంత్ర అభ్యర్థి అల్ల అనిత బరిలో ఉన్నారు. దీంతో అనిత ప్రచారానికి సంబంధించి ప్రధాన ప్రతిపక్షం మద్దతు ఇస్తుందా లేదా ఎలా ముందుకెళ్తుందోననే ఉత్కంఠ నెలకొంది. గుర్తుల కేటాయింపు–అత్యధికంగా.. స్వతంత్రులకు గ్యాస్స్టౌ, విజిల్, ఫుట్బాల్, రింగ్, బ్యాట్, కత్తెర వంటి గుర్తులు కేటాయించారు. జనగామ మున్సిపల్లో 5, 14, 23, 25 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు స్వతంత్రులు కలిపి ఆరుగురు చొప్పున పోటీలో ఉన్నారు. అలాగే 7, 8, 9, 10, 11, 16 వార్డుల్లో ఐదుగురు బరిలో నిలిచారు. 6వ వార్డులో మొత్తం ఏడుగురు పోటీ పడటం ప్రత్యేకత. జనగామ 30 వార్డుల్లో 20వ వార్డులో మాత్రమే ఇద్దరి మధ్యనే పోటీ నెలకొననుంది. ఘన్పూర్లో 13వ వార్డులో అత్యధికంగా ఎనిమిది మంది బరిలో ఉండగా, 10వ వార్డులో ఇద్దరు మాత్రమే పోటీ చేస్తున్నారు. జోరందుకున్న ప్రచారం నామినేషన్ విత్డ్రాలు ముగిసిన వెంటనే అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. పార్టీ గుర్తులు, స్వతంత్రుల ప్రత్యేక గుర్తులు కేటాయించడంతో గంటలోపే పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు సిద్ధం చేసి అభ్యర్థులు విస్త్రత ప్రచారాన్ని ప్రారంభించారు. జనగామ, స్టేషన్ఘన్పూర్ ఉపసంహరణలుపురపాలిక కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సీపీఎం సీపీఐ స్వతంత్రులు జనగామ 26 10 10 – – 13 స్టే.ఘన్పూర్ 18 09 02 01 – 01బీఫామ్ల అందజేత కాంగ్రెస్ తరఫున పినపాక ఎమ్మెల్యే, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ వెంకటేశ్వర్లతో పాటు డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి, యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, వేమెల్ల సత్యనారాయణరెడ్డి బీఫామ్లను ఆర్ఓలకు అందించారు. బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి క్యామ మల్లేశం, ఇర్రి రమణారెడ్డి, బాల్దె సిద్ధిలింగం, పోకల జమున, గాడిపల్లి ప్రేమలతారెడ్డి, తాళ్ల సురేష్రెడ్డి, గజ్జెల నర్సిరెడ్డి, సందీప్, అనిత, మామిడాల రాజుతో కలిసి ఆర్ఓలకు బీఫామ్లను అందించారు. -
అక్రమ మైనింగ్ పరిశీలన
రఘునాథపల్లి: మండలంలోని గోవర్ధనగిరి గోపాలస్వామిగుట్ట వద్ద అక్రమంగా మట్టి, మొరం తరలిస్తున్నారని సర్పంచ్, గ్రామస్తులు సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం ప్రభుత్వ విభాగాలు గుట్ట వద్ద పెద్దఎత్తున జరిపిన మట్టి తవ్వకాల వద్దకు వెళ్లారు. మైనింగ్ ఏడీ విజయ్కుమార్, తహసీల్దార్ ఎస్సై నరేశ్, రాయల్టీ ఇన్స్పెక్టర్ అనిత ఇతర విభాగాల అధికారులు పరిశీలించారు. తవ్వకాలు జరిపిన వద్ద కొలతలు తీసుకున్నారు. అధికారులు వచ్చిన విషయం తెలిసిన గ్రామస్తులు అక్కడికి చేరుకొని జేసీబీ, టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నా ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. మట్టిని తరలించిన అక్రమార్కులపై చర్యలు తీసుకోకుంటే న్యాయస్థానాన్ని అశ్రయిస్తామని సర్పంచ్ తోటకూరి సదానందం పేర్కొన్నారు. అనుమతులు లేకుండా మట్టి తరలించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు గ్రామస్తులకు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ తోటకూరి సదానందం, ఉప సర్పంచ్ యాదగిరి, సర్వేయర్ నరేశ్, ఆర్ఐ శరత్, జీపీఓ విశ్వేశ్వర్రావు, ముప్పిడి రాజు, దుస్స భిక్షపతి, మల్లయ్య, వెంకటరత్నం, రాజు, రవి, సత్యనారాయణరెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
మహా జాతరనూ వదల్లేదు!
సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరను దొంగల ముఠాలు వదల్లే. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ల నుంచి వచ్చి మేడారం జాతరలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని హల్చల్ చేసిన దొంగల వివరాలు ఆలస్యంగా వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా జంపన్న వాగు, గద్దెల పరిసరాల్లో భక్తుల మొబైల్ ఫోన్లు, బంగారు గొలుసులు, నగదును దొంగిలించిన ఘటనల్లో కీలక వ్యక్తుల సమాచారం లభమైంది. ‘వ్యాల్యూ పిచ్’ సాఫ్ట్వేర్ ఆధారంగా ఫేస్ రికగ్నేషన్ సిస్టంతో ఈ దొంగతనాలకు సంబంధించి కొందరు నిందితులను, దొంగిలించిన వస్తువులను కొనుగోలు చేసేవారిని పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా అవుతోంది. మేడారం జాతరలో ఫేస్ రిక గ్నేషన్ ద్వారా గతంలో దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట ముఠాలకు చెందిన దొంగలను గుర్తించినట్లు క్రైం ఇన్వెస్టిగేషన్ విభాగం ప్రకటించింది. సాంకేతిక సహకారంతో దొంగల ఆటకట్టు... సమ్మక్క, సారలమ్మను దర్శించుకునే భక్తులపై పటిష్టమైన పర్యవేక్షణ, వారి కదలికలు, వాహనాల రాకపోకలను నిశితంగా గమనించేందుకు ఈ జాతరలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో కూడిన ప్రత్యేక కెమెరాలు పెట్టారు. ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ కెమెరాలను (ఏఎన్పీఆర్) పదిచోట్ల అమర్చారు. దొంగతనాలకు పాల్పడే పాత నేరస్తులను గుర్తించేందుకు ఆటోమెటిక్ ఫేస్ రికగ్నేషన్ కోసం ప్రత్యేక సీసీ కెమెరాలను జనం రద్దీ ఉండే అన్ని ప్రాంతాల్లో పెట్టారు. గతంలో తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడిన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బీహార్ ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ఫొటోలను కంప్యూటర్లో ఫీడ్ చేశారు. వ్యాల్యూ పిచ్ అనే సాఫ్ట్వేర్తో అనుసఽంధానం చేయడంలో వల్ల కంప్యూటర్లో ఫీడ్ చేసిన ఫొటోల్లోని వ్యక్తులు ఎవరు వచ్చినా పోలీసులకు అలర్ట్ ఇస్తుంది. ఇదంతా గద్దెల పక్కనే ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్లో అమర్చిన పెద్ద ఎల్సీడీ స్క్రీన్లను 24/7 నిరంతర పర్యవేక్షణ చేసేలా ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఈ విధానం ద్వారా జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరిగిన నాలుగు రోజుల్లో పాత దొంగలు వచ్చినట్లు 70 అలర్ట్లు వచ్చాయి. డ్రోన్, సీసీ కెమెరాలు ఆ దొంగలను గుర్తించి కమాండ్ కంట్రోల్ రూమ్కు వారి ముఖాలను పంపడంతో అప్రమత్తమైన పోలీసులు మహారాష్ట్ర, ఏపీలోని నంద్యాల గ్యాంగ్లకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. మేడారంలో మహారాష్ట్ర, నంద్యాల దొంగలు ట్రేస్ చేసిన వ్యాల్యూ పిచ్ సాఫ్ట్వేర్ ‘ఫేస్ రికగ్నేజేషన్ సిస్టం’తో దొరికిన ఆచూకీ 70 మంది గుర్తింపు, ఐదుగురి అరెస్టు.. విచారణ -
నానోయూరియాపై రైతులకు అవగాహన
● వీడియో కాన్ఫరెన్స్లో రైతులతో మాట్లాడిన మంత్రి తుమ్మల జనగామ రూరల్: ప్రతీ మంగళవారం జరిగే రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం చీటకోడూరు రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా రైతులకు వరిలో వచ్చే చీడపీడలు, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టం, నానోయూరియా గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతులకు అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామానికి చెదిందిన రైతు బండారు తిరుపతితో మాట్లాడారు.. గ్రామంలో యూరియా కొరత లేదని యూరియా యాప్ విధానంతో ఇబ్బందులు తొలిగిపోయాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ, జనగామ ఏడీఏ అపర్ణ, చీటకోడూరు సర్పంచ్ కూకట్ల యాదగిరి, ఉప సర్పంచ్ ఎం.చంద్రకళ, ఏఈఓ గిరిరాజు, అనిల్ కుమార్, చింతకింది రాజేష్, బండ మమత, రిషిత పాల్గొన్నారు. -
జిల్లా సరిహద్దులో బోన్ల ఏర్పాటు
● పెద్దపులి సంచారంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులుజనగామ రూరల్: యాదాద్రి జిల్లా శ్రీనివాసపురం నుంచి చుట్టుపక్కల ఉన్న జిల్లాలోని ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉందని, పెంబర్తి, సిద్దెంకి, ఎల్లంల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఆర్ఓ కొండల్రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాలోకి పెద్దపులి ఇంకా ప్రవేశించలేదని, పాదముద్రల ద్వారా సమాచారం సేకరిస్తున్నామన్నారు. జిల్లాలోకి పెద్దపులి వచ్చిందని సమాచారం వస్తుందడంతో ఎఫ్ఆర్ఓను వివరణ కోరగా ఆవును చంపిన తర్వాత 10 కిలోమీటర్లు వెళ్లి వచ్చి మళ్లీ చనిపోయిన అవును తింటుందని, ఈక్రమంలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వారం రోజుల పాటు పశువులు ఇంటి వద్ద ఉంచు కోవాలని బావుల వద్దకు గుంపులుగా వెళ్లాలని సూచించారు. శ్రీనివాసపురం, లక్ష్మక్కపల్లిలో బోనులు ఏర్పాటు చేశామని సీసీ కెమెరాల ద్వారా అన్వేషిస్తున్నామని వివరించారు. -
ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా నిర్వహించాలి
● జనరల్ అబ్జర్వర్ ఎ. నర్సింహారెడ్డి జనగామ రూరల్: ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా సజావుగా నిర్వహించాలని జనరల్ అబ్జర్వర్ ఎ.నర్సింహారెడ్డి సూచించారు. మంగళవారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా జనరల్ అబ్జర్వర్ ఎ.నర్సింహరెడ్డి ఘనపూర్, జనగామ మున్సిపాలిటీ పరిధిలోని నామినేషన్ ఉపసంహరణ కేంద్రం డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్లను సందర్శించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఆయనతో పాటు నోడల్ ఆఫీసర్ మాతృనాయక్ సిబ్బంది ఉన్నారు. -
ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ రూరల్: మున్సిపల్ ఎన్నికల విధులను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేశారు. తెలంగాణ మున్సిపాలిటీలు చట్టం 2019, రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా, పోలింగ్ విధానాలపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి పూర్తి బాధ్యతలు అధికారాలు తెలుసుకోవాలని, ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్ ఒక మార్గదర్శకమన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని జనరల్ ఆబ్జర్వర్ నర్సింహరెడ్డి పరిశీలించారు. శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు మెరుగు రామరాజు, కె.సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యకర జీవనశైలితో క్యాన్సర్ నియంత్రణ
జనగామ రూరల్: ఆరోగ్యకర జీవనశైలి పాటించడం ద్వారా క్యాన్సర్ను నియంత్రించవచ్చని జూనియర్ సివిల్ జడ్జి శశి అన్నారు. బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి జిల్లా న్యాయ సేవా సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్సల ప్రాముఖ్యంపై రోగులు, ప్రజలకు అవగాహన కల్పించారు. సమయానికి స్క్రీనింగ్ చేయించుకోవడం, ఆరోగ్యకర జీవనశైలి పాటించడం ద్వారా క్యాన్సర్ను నియంత్రించవచ్చని సూచించారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె.మల్లికార్జునరావు, ప్రోగ్రాం అధికారులు వైద్యులు అశోక్, కమల్ హసన్, ప్రభాకర్, మల్లికార్జున్, సిబ్బంది పాల్గొన్నారు. జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు చరిష్మాజఫర్గఢ్: మండలంలోని హిమ్మత్నగర్ గ్రామానికి చెందిన తాటికాయల చరిష్మా అనే విద్యార్థిని జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికై నట్లు తెలంగాణ రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ సెక్రెటరీ శీలం పార్థసారథి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చరిష్మా భీమారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నదన్నారు. బాక్సింగ్లో ప్రతిభ చాటడంతో 69వ ఎస్జీఎఫ్ఐ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. విద్యార్థిని చరిష్మాను గ్రామస్తులు అభినందించారు. దివ్యాంగులు సదరం క్యాంపునకు హాజరుకావాలిజనగామ రూరల్: దివ్యాంగులు యూడీఐడీ సదరం క్యాంపునకు హాజరుకావాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వసంత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ రకాల దివ్యాంగులు కొత్తవారు, రెన్యూవల్ వారు మీ సేవలో యూడీఐడీ వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ చేసుకున్న వారు రశీదులో ఉన్న ఫోన్ నెంబర్కు మెసేజ్ వచ్చిన తేదీల్లో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం శిబిరానికి హాజరుకావాలన్నారు. ఈనెల 6వ తేదీ నుంచి కొనసాగే ఈ శిబిరం 6,9,11,18,19,23,27వ తేదీల్లో ఆర్థో, దృష్టి, వినికిడి లోపం, మానసిక, తలసేమియా, క్రానిక్ న్యూరాలజీ, సంబంధిత దివ్యాంగులకు వైద్యులతో క్యాంపులు నిర్వహించబడుతాయన్నారు. కొత్తవి 225 ఉండగా, రెన్యూవల్ 65 ఉన్నాయని మొత్తంగా 290 మందికి అవకాశం ఉన్నదన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 8008202287లో సంప్రదించగలరని ఆమె సూచించారు. ‘ఐదేళ్ల అభివృద్ధిని రెండేళ్లలో చేసి చూపించాం’ జనగామ: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి ఐదేళ్ల అభివృద్ధిని రెండేళ్లలో చేసి చూపించారని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్తో కలిసి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తున్నారన్నారు. కొనసాగుతున్న ఇంటర్ ప్రాక్టికల్స్ జనగామ రూరల్: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఇంటర్ విద్యాధికారి జితేందర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాల్లో జనరల్, ఒకేషనల్ ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ఉదయం జనరల్లో 582 విద్యార్థులకు గాను 573మంది హాజరయ్యారని, 9 మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్ మొత్తం 714 విద్యార్థులకు గాను 652 హాజరయ్యారని, 62 మంది గైర్హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం జనరల్లో 497 విద్యార్థులకు గాను 487 మంది హాజరు కాగా, 10మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్లో మొత్తం 610 విద్యార్థులకు గాను 587మంది హాజరయ్యారని, 23మంది గైర్హాజరయ్యారని తెలిపారు. -
నేడు తిరుగువారం పండుగ
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో సమ్మక్క– సారలమ్మకు బుధవారం పూజారులు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుగువారం పండుగలో భాగంగా మేడారం, కన్నెపల్లి అమ్మవార్ల ఆలయాలను పూజారులు శుద్ధి చేసి దూప దీపాలు వెలిగించి యాటను నైవేధ్యంగా సమర్పిస్తారు. అనంతరం పూజారుల కుటుంబీకులు, స్థానిక ఆదివాసీలు, గిరిజనేతరులు అమ్మవార్ల ఆలయాలకు చేరుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం పూజారులు అమ్మవార్ల పూజాసామగ్రి, వస్త్రాలను తిరిగి ఆలయాల్లో భద్రపర్చనున్నారు. తిరుగువారం పండుగతో మహాజాతర పూజా కార్యక్రమాల తంతు ముగియనుంది. తిరుగువారం పండుగ సందర్భంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవార్లను దర్శించుకోనున్నారు. పుణ్యస్నానాలు.. మొక్కులు జాతర ముగిసి మూడు రోజులు గడిచినా మేడారానికి భక్తులు వస్తూనే ఉన్నారు. మంగళవారం భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల వద్ద పూజలు చేశారు. ఈ క్రమంలో గద్దెల వద్ద పేరుకుపోయిన కొబ్బరి, బెల్లం మిశ్రమాన్ని దేవాదాయశాఖ సిబ్బంది తొలగిస్తున్నారు. -
దిగితే కాని తెలవట్లే!
● ప్రచారానికి తక్కువ టైం.. అయినా పెరుగుతున్న ఖర్చు ● నేటి ఉపసంహరణతో పోటీపై స్పష్టత ● ప్రచారంలో పల్లా, కడియం దూకుడు జనగామ: పురపాలిక ఎన్నికల్లో అభ్యర్థులకు ఫీల్డ్లోకి దిగిన తర్వాతే అసలు పరీక్ష ఎదురవుతోంది. ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో ఖర్చు తగ్గుతుందని ముందుగా భావించారు. ఇంటింటా ప్రచారం, కేడర్తో సమన్వయం, సమావేశాలు, ర్యాలీలు..రాత్రి సమయంలో విందులతో ఖర్చుతో పాటు ఒత్తిడి అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రెండు పురపాలికల్లో ఎన్నికల వేడి రగులుతోంది. పోటీ తీవ్రంగా ఉండడంతో ఖర్చు భారీగానే పెట్టాల్సి వస్తుందని అభ్యర్థులు వణికిపోతున్నారు. హోరాహోరీ.. జనగామ, స్టేషన్న్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో హోరాహోరీ ప్రచారం సాగుతోంది. జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి రోజుకి ఐదు వార్డుల్లో ప్రచారం చేస్తూ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిషలు కష్టపడుతున్నారు. ఇదే వేగంతో స్టేషన్న్ఘన్పూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేడర్కు దిశానిర్దేశం చేస్తుండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక జనగామలో కాంగ్రెస్ పరిస్థితి మాత్రం కొంచెం క్లిష్టంగానే కనిపిస్తోంది. పలు వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక ఆలస్యమవడంతో ప్రచారం ఇంకా పూర్తిగా పట్టాలు ఎక్కలేదు. అధికార పార్టీ, బీజేపీ, ఇతర అభ్యర్థులు ప్రచారం మొదలెట్టిన వేళ అభ్యర్థుల ఖరారులో జాప్యం కాంగ్రెస్ ప్రచారానికి ఇంకా దూరంగానే ఉందని చెప్పుకోవచ్చు. కానీ పలు వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు.నేడు ఉపసంహరణ ఇంతలో నామినేషన్ల ఉపసంహరణ దశకు చేరుకోవడంతో పార్టీల దృష్టి ఆ వైపు మళ్లింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల బీఫామ్లను ఎన్నికల అధికారులు వద్ద సమర్పించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. అదే సమయానికి పార్టీల బీఫామ్ల అందజేత ప్రక్రియ కూడా ముగియనుంది. ఉపసంహరణ కోసం ఎన్నికల కమిషన్ జనగామ మున్సిపల్, స్టేషన్ఘన్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సెంటర్లలో నామినేషన్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉపసం హరణతో తుది జాబితా ఖరారుకానుండడంతో అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఎవరెవరిని నిలబెట్టాలి.. ఎవరిని ఉపసంహరించాలి.. ఏ వార్డులో అధికార పార్టీ, ఏ వార్డులో రెబల్స్ ప్రభావం అన్నదానిపై పార్టీ నాయకులు గంట గంటకు ప్లాన్ మార్చుకుంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్ర చారం మరింత వేడెక్కుతుండడంతో వచ్చే రెండు రోజులపాటు జనగామ, స్టేషన్ ఘన్పూర్ రాజకీయం ఉండే అవకాశం ఉంది. -
మున్సి‘పోల్స్’ను సమర్థవంతంగా నిర్వహించాలి
● అధికారులకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచన స్టేషన్ఘన్పూర్: మున్సిపాలిటీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ రాధాక్రిష్ణకు పలు సూచనలు చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్ను పరిశీలించి విధులు నిర్వహిస్తున్న అధికారులకు పలు సూచనలు చేశారు. పక్కా ప్రణాళికతో చదవాలి పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులు పక్కా ప్రణాళికతో ప్రత్యేక శ్రద్ధతో సిద్ధం కావాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. స్థానిక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ సోమవారం సందర్శించారు. ముందుగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వారు పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతున్నారు.. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో మార్కులు ఎలా వచ్చాయి.. ఏ సబ్జెక్టులను ఎంత వరకు చదవడం పూర్తయిందని తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటశాలకు వెళ్లి వంటలను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులున్నారు. ఉపాధిలో ప్రాధాన్య పనులకు అవకాశం జనగామ రూరల్: ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో జాబ్కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికి 100 రోజుల పని కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనుల పురోగతిపై అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్తో కలిసి పీడీ హౌజింగ్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపిఓలతో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షించారు. ప్రతి గ్రామానికి 75 మందికి తగ్గకుండా కూలీలతో పని చేయించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ వసంత, అదనపు డీఆర్డీఏలు నూరుద్దీన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


