breaking news
Jangaon District News
-
సంక్షేమ పథకాలకు స్మార్ట్ కార్డులే కీలకం
లింగాలఘణపురం: భవిష్యత్లో సంక్షేమ పథకాలన్నింటికీ స్మార్ట్ కార్డులే కీలకం కానున్నాయని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని చీటూరులో రూ.45 లక్షలతో సీసీ రోడ్డు, రూ.10 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ.34.80 లక్షలతో పాఠశాల గదులు, ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన బుధవారం చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రేషన్ బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా, ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకొనే విధంగా, ప్రతీ ప్రభుత్వ పథకానికి ఐడీ కార్డులా స్మార్ట్ రేషన్కార్డు పని చేస్తుందని అన్నారు. మండలంలో 13,803 స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తుండగా అందులో 2,228 కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోనే స్టేషన్ఘన్పూర్ అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలోనే సామాజిక న్యాయం జరుగుతుందని, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. సమావేశాల్లో తహసీల్దార్ అండాలు, ఎంపీఓ సుమన్, సర్పంచ్లు బర్ల గణేష్, ఎడ్ల లావణ్యరాజు, మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు విజయ్మనోహర్, మార్కెట్ డైరెక్టర్ మోహన్, కాంగ్రెస్ జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు వంశీధర్రెడ్డి, దిలీప్రెడ్డి, సర్పంచ్లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
కొత్త పింఛన్లకు కసరత్తు
జనగామ: ప్రభుత్వం అర్హులైన కొత్తవారికి చేయూత పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఒంటరి మహిళలు, వితంతులు, గీత, చేనేత కార్మికులు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులతో పాటు దివ్యాంగులు, తలసే మియా, సికిల్సెల్, హీమోఫీలియా బాధితులకు చోటు కల్పించారు. ఈ నెల 31న దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం అర్హుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. హైదరాబాద్లోని సంబంధిత సాంకేతిక విభాగం సమాచారం. అనంతరం గెజిటెడ్ అధికారి పర్యవేక్షణలో క్షేత్రస్థాయి అధికారులతో కలిసి థర్డ్పార్టీ విచారణ చేపట్టే అవకాశం ఉంది. అర్హతల పరిశీలనలో కుటుంబ ఆర్థిక పరిస్థితి, భూమి, వాహనాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐదు ఎకరాలకు మించి భూమి కలిగి ఉండటం వంటి నిబంధనలు ఉన్నట్లు సమాచారం. అయితే అర్హతలు, అనర్హతలకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు ప్రభుత్వం నుంచి అధికారికంగా వెలువడాల్సి ఉంది. పరిశీలన, విచారణ ప్రక్రియ పూర్తయిన అనంతరం వచ్చే నెల చివరి వారంలో కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అర్హుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతోంది. జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలతోపాటు గ్రామ పంచాయతీల పరిధిలోని దరఖాస్తులను ఎంపీడీఓ కార్యాలయాల్లో నమోదు చేస్తున్నారు. వృద్ధాప్యంతోపాటు ఇతర కేటగిరీల్లో పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. అదే సమయంలో మరణించిన లబ్ధిదారుల పేర్లను ప్రత్యేకంగా కేటాయించిన లాగిన్ ద్వారా తొలగించే ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్లు తెలిసింది.కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు అర్హులైన వారికి దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఆశావహుల ఇళ్లకు వెళ్లి దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియపై అవగా హన కల్పించడంతోపాటు అవసరమైన సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెలలో కొత్త పింఛన్లు మంజూరయ్యే అవకాశం ఉండటంతో రాజకీయ నా యకులు ఈ అంశంపై దృష్టి పెట్టారు. అర్హులైన వా రి వద్దకు వెళ్లి దరఖాస్తులు చేయించేందుకు ఆయా పార్టీలకు చెందిన నాయకులు పోటీ పడుతున్నారు. భవిష్యత్లో పింఛన్ మంజూరైతే తమ చొరవతోనే వచ్చిందని చెప్పుకుని ఓట్లు అభ్యర్థించే పరిస్థితి ఉంటుందనే చర్చ జరుగుతోంది. నాయకులు ఇళ్లకు వెళ్లిన సందర్భంలో వృద్ధాప్య అర్హత ఉన్న తమకు పింఛన్ ఎందుకు రాలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో నాయకులు వారికి సర్దిచెబుతూ అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి అవకాశం కల్పించేలా ప్రయత్నిస్తామని హామీ ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 27 వేలకు పైగా అర్జీలు వచ్చే నెలలో అర్హులకు పింఛన్లు మంజూరయ్యే అవకాశంగ్రేడ్– 2, గ్రేడ్– 3 పైలేరియా బాధితులు, ఆరోగ్యశ్రీలో డయాలసిస్ చికిత్స పొందుతున్న వారికి వయోపరిమితి లేకుండా పింఛన్ మంజూరు చేయనున్నారు. వీరిని సంబంధిత వైద్య, ఆరోగ్యశ్రీ విభాగాలు ధ్రువీకరించాల్సి ఉంటుంది. అర్హులు పంచాయతీ కార్యదర్శి, వార్డు అధికారి లేదా ఎంపీడీఓ కార్యాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నాలుగేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు త్వరలో శుభవార్త అందే అవకాశం ఉంది. జిల్లాలో ప్రస్తుతం 73,829 మంది లబ్ధిదారులకు ప్రతీ నెల రూ.18.32 కోట్ల మేర ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం ఇప్పటివరకు సుమారు 27వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. దరఖాస్తు ప్రక్రియ ఈనెల 31వ తేదీ వరకు కొనసాగనుంది. -
ప్రతీ మహిళ సంఘమిత్రగా మారాలి
జనగామ: మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషించాలని, ప్రతీ మహిళ తన కుటుంబంతోపాటు గ్రామాలు, పట్టణాలను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడే ‘సంఘమిత్ర’గా మారాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత పిలుపునిచ్చారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు సంఘమిత్ర–మాదకద్రవ్యాల నిర్మూలనపై కలెక్టరేట్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి కమిషనర్ శ్వేత.. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీపీ శ్వేత మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో మహిళా సంఘాలు కీలకంగా పనిచేస్తున్నాయని, అదే స్ఫూర్తితో మాదకద్రవ్యాల నిర్మూలనకు సహకరించాలని కోరారు. పోలీసుల సంఖ్య పరిమితంగా ఉన్నందున మహిళా సంఘాల సహకారంతో అవగాహన కల్పించవచ్చన్నారు. గంజాయి విక్రయాలు, రవా ణా, వినియోగంపై సమాచారాన్ని 112కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, అవసరమైతే బహుమతులు అందిస్తామని తెలిపారు. డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుదాం జిల్లాలో సుమారు 1.25 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు ఉన్నారని, వారి ద్వారా డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వల్ల కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, గృహహింస, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. జనగామను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ.. డ్రగ్స్ మొదట సరదాగా ప్రారంభమై ప్రాణాంతక వ్యసనంగా మారుతుందని తెలిపారు. పిల్లల ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు, ఆలస్యంగా ఇంటికి రావడం, కొత్త స్నేహాలు వంటి లక్షణాలను తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. ఎన్డీపీఎస్ చట్టం–1985 ప్రకారం మాదకద్రవ్యాల విక్రయం, రవాణా, వినియోగం, నిల్వపై కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, చికిత్స, పునరావాసంపై సైకాలజిస్ట్ డాక్టర్ విజయక్రాంతి అవగాహన కల్పించారు. విద్యార్థులు నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని అందించారు. అనంతరం డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఏసీపీలు భీం శర్మ, నర్సయ్య, ఏపీడీ నూరుద్దీన్, చాకలి ఐలమ్మ సమాఖ్య నాయకురాలు మమత తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చుదాం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
మళ్లీ ‘లేఖల’ లొల్లి?
సాక్షిప్రతినిధి, వరంగల్ : పోలీస్శాఖలో ఇన్స్పెక్టర్ల బదిలీలు మరోసారి రాజకీయ సిఫారసుల చర్చకు తెరలేపాయి. మల్టీజోన్–1 పరిధిలో తొమ్మిది మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అధికారికంగా పరిపాలనా కారణాలతోనే బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ.. కొందరు ఇన్స్పెక్టర్లు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో తమకు అనుకూలమైన పోస్టింగుల కోసం ప్రయత్నించారన్న ఆరోపణలు పోలీస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. భూపాలపల్లిలో కీలక మార్పులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్బీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న చెన్నూరి శ్రీనివాస్ను జయశంకర్ భూపాలపల్లి ఎస్హెచ్ఓగా నియమించారు. అక్కడ చిట్యాల సర్కిల్లో పనిచేస్తున్న దగ్గు మల్లేశ్ను మల్టీజోన్–1, హైదరాబాద్కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో యడ్లపల్లి సతీష్ చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియమించారు. ఇదే జోన్ పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ముగ్గురు ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. వరంగల్కు ముగ్గురు.. ఒకరు బయటకు.. వరంగల్ కమిషనరేట్కు తాజా బదిలీల్లో ముగ్గురు ఇన్స్పెక్టర్లు వచ్చారు. రామగుండం కమిషనరేట్ టాస్క్ఫోర్స్లో పనిచేస్తున్న తెల్లబోయిన కిరణ్, రామగుండం కమిషనరేట్ లీగల్ సెల్లో పనిచేస్తూ మల్టీజోన్–1 కంట్రోల్ రూమ్కు అటాచ్ అయి ఉన్న అనుముల శ్రీనివాస్ను కూడా వరంగల్ కమిషనరేట్కు పంపారు. హైదరాబాద్ టీజీఐసీసీసీ ఇన్స్పెక్టర్ భరత్ సుమన్ను కూడా కమిషనరేట్లో రిపోర్టు చేయాలన్నారు. మరోవైపు వరంగల్ కమిషనరేట్ సీఎస్బీలో పనిచేస్తున్న యడ్లపల్లి సతీష్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సర్కిల్కు బదిలీ చేశారు. అధికారికంగా మాత్రం ‘అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్’... మల్టీజోన్–1 పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ తొమ్మిది మంది బదిలీలను ‘ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్’గా పేర్కొంది. దీంతో అధికారిక ఉత్తర్వుల్లో పరిపాలనా కారణాలే కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం రాజకీయ సిఫారసులపై చర్చ సాగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఎవరి సిఫారసు పనిచేసింది? ఎవరి పోస్టింగ్ మారింది? అన్నదానిపై పోలీస్ శాఖలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. భవిష్యత్లో జరగనున్న బదిలీలు, పోస్టింగ్ల ఉత్తర్వులు వెలువడితే గాని మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగిన ప్రతీసారి రాజకీయ సిఫారసుల అంశం తెరపైకి వస్తుండటం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా తమకు అనుకూలమైన సర్కిల్, కమిషనరేట్ లేదా కీలక విభాగంలో పోస్టింగ్ కోసం ప్రజాప్రతినిధుల సిఫారసులు తీసుకొస్తున్నారన్న ఆరోపణలు గతంలోనూ వినిపించాయి. తాజాగా మల్టిజోన్–1 పరిధి లోని 9 మందికి బదిలీ కాగా.. తమకు అనుకూలమైన పోస్టింగ్ల కోసం మరికొందరు ఇన్స్పెక్టర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం. త్వరలోనే వరంగల్ కమిషనరేట్, జేఎస్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన కొందరికి బదిలీలు ఉంటాయంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి కరీంనగర్ల నుంచి కొందరు వరంగల్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం ఉంది. పోలీస్ పోస్టింగుల్లో తీవ్ర చర్చ మల్టీజోన్–1లో 9 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ వరంగల్ కమిషనరేట్కు ముగ్గురు.. ఇక్కడినుంచి ఒకరు బయటకు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో పోస్టింగులంటూ ఆరోపణలు.. గతంలోనూ ఇదే తరహా వివాదాలు -
పీపీఈటీఏ నూతన కమిటీ ఏర్పాటు
జనగామ: ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ (పీపీఈటీఏ) జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం తెలిపారు. జిల్లాలోని ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల సమస్యల పరిష్కారం, సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధే లక్ష్యంగా కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతోపాటు పాఠశాలల్లో శారీరక విద్యకు మరింత ప్రాధాన్యత కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. నూతన కమిటీ ఇలా.. చైర్మన్గా జంగిడి గుణవర్ధన్, అధ్యక్షుడిగా మునిగే సురేష్, ఉపాధ్యక్షులుగా టి.రంజిత్, సుధాకర్, ప్ర ధాన కార్యదర్శిగా బి.రమేష్, కోశాధికారిగా కె.మనోజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్.సురేందర్, పబ్లిక్ రిలేషన్స్గా పి.శ్రవణ్, స్పోక్స్ పర్సన్గా వి.వినోద్ కుమార్, అంజి, మీడియా సెక్రటరీగా ఏ.సాయిరాం ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా నరసింహ, స్వాతి, పి.రవి, జి.మధు, టి.మహేష్, మండల ప్రతినిధులుగా రవి, జె.సురేష్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా తిరుమలేష్, రాజు, సరిత, బాలస్వామి, శ్రీధర్, మనీషా, ప్రశాంత్, అశ్విని, సత్య నిరంజన్, చందర్, ప్రదీప్, రాజశేఖర్, శ్రీనివాస్, అజయ్, రణదీప్, హేమలతను నియమించారు. -
ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగం
నిట్ వరంగల్లోని ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనలకు సప్తగాన్ ఏషియా వాహన పనితీరు తోడ్పడుతుంది. మెరుగైన రహదారులు, రవాణా సౌకర్యం నిర్మాణానికి ఆయా ప్రదేశాల డేటా అవసరం. అలాంటి డేటాను సప్తగాన్ అందజేస్తుంది. నేషనల్ హైవేలో నిర్మించే రహదారులపై అవసరమైన సూచనలు, పరిశీలన వివరాలను భారత ప్రభుత్వం.. నిట్ వరంగల్నుంచి కోరుతోంది. అలాంటి పరిశీలనలకు సప్తగాన్ ఏషియాతో ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుంది. – శంకర్, సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, సప్తగాన్ ఏషియా కో–ఆర్డినేటర్ ● -
నిట్తో ఎంఓయూ..
కాజీపేట అర్బన్ : ‘నా దారి రహదారి.. బెటర్ డోంట్ కమిన్ టు మై వే’ అనే సినిమా డైలాగ్ను తలపిస్తూ ‘మెరుగైన రహదారుల నిర్మాణానికి అవసరమైన డేటా అందించడమే నా దారి’ అంటూ ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన సప్తగాన్ వాహనం ఇటీవల నిట్ వరంగల్కు చేరుకుంది. భారతదేశంలోనే తొలిసారిగా హరియాణా, గురుగ్రామ్లో అడ్వాన్స్ టెక్నాలజీ, రూ.30 కోట్ల వ్యయంతో దీన్ని రూపొందించారు. ఆధునిక టెక్నాలజీతో రూపకల్పన మెరుగైన రహదారుల నిర్మాణంలో కీలకం నిట్ వరంగల్తో ఎంఓయూ.. ఇటీవల పనితీరును పరిశీలించిన విద్యార్థులు ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనకు ఉపయుక్తంమెరుగైన రవాణా సౌకర్యం, రహదారుల నిర్మాణాల్లో లోపాన్ని పసిగట్టడం, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ పరిశోధనలకు దేశవ్యాప్తంగా ఈ సప్తగాన్ ప్రయాణం చేస్తోంది. ఇందులో మన ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు ఇటీవల సప్తగాన్ ఏషియా సంస్థ నిర్వాహకులు, నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. భారత ప్రభుత్వం వికసిత్ భారత్, మేక్ ఇన్ ఇండియా విజన్లో భాగంగా ఈ వాహనాన్ని ఇక్కడికి తీసుకురాగా, వాహన పనితీరును విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. వాహన పనితీరుపై పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పర్చుకున్నారు. -
ప్రతీ ఒక్కరు విలువలతో జీవించాలి
జనగామ రూరల్: ప్రతీ ఒక్కరు విలువలతో జీవించాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం తెలంగాణ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ జిల్లా శాఖ, హమ్ సాత్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జనగామ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని, మహ్మద్ ప్రవక్త బోధించిన మానవత, ప్రేమ, దయ, సేవా భావం, సోదరభావం వంటి గొప్ప విలువలను ప్రతీ ఒక్కరు ఆచరించాలని సూచించారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని, ఆరోగ్యవంతులైన వారు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్మీసా జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అంకుషావలి, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎన్ఎన్.రాజు, హమ్ సాత్ ఫౌండేషన్ అధ్యక్షుడు మహ్మద్ యాకూబ్ పాషా, మహ్మద్ తహసీన్, ఖలీల్, మోహసిన్, జమాల్ షరీఫ్, షకీల్, మసీ ఉర్ రెహ్మాన్, సాజిద్, సలీం, అజారుద్దీన్, నూరుద్దీన్, ఖాళీం, అజీమ్, సయ్యద్ జహంగీర్ హుస్సేన్, ఇస్మాయిల్, ఎజాజ్, అజారుద్దీన్ పాల్గొన్నారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ -
జాఫర్గూడెంలో సంపూర్ణ మద్యనిషేధం
రఘునాథపల్లి: మండలంలోని జాఫర్గూడెంలో మద్యం విక్రయాలను నిషేధిస్తున్నట్లు గ్రామసభలో తీర్మానం చేశారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విచ్చలవిడిగా బెల్ట్షాపుల నిర్వహణతో కుటుంబాలు చిద్రమవుతున్నాయని మహిళలు, యువకులు.. పంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ నెల 25 నుంచి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నట్లు సర్పంచ్ శాగ సురేష్ బుధవారం తెలిపారు. గ్రామంలో మద్య నిషేధం అమలుకు సహకరించాలని పోలీసులు, ఎకై ్సజ్ అధికారులకు వినతి పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా గ్రామంలో మద్యం విక్రయిస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పథకాలు నిలిపివేయనున్నట్లు ఆయ న పేర్కొన్నారు. గ్రామంలో మద్య నిషేధం అమలు చేయడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కావ టి రవి, పంచాయతీ కార్యదర్శి బండ మధు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఏఐటీయూసీ మహాసభను జయప్రదం చేయాలి జనగామ రూరల్: ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభ జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సీహెచ్ రాజారెడ్డి అన్నారు. పట్టణంలోని గబ్బెట గోపాల్ రెడ్డి భవనంలో మోటే శ్రీశైలం అధ్యక్షతన బుధవారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో పాలకులు అవలంభిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు, లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులపై తీవ్రమైన దాడికి గురి చేస్తున్నాయన్నారు. ఐక్యతతో లేబర్ కోడ్స్పై దేశవ్యాప్తంగా ప్రతిఘించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మహాసభల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల శ్రీనివాస్, ఆదిసాయన్న, చొప్పరి సోమయ్య, యాకూబ్, సదానందం, నాగరాజు, సుశీల, పోచమ్మ, ఐలయ్య, సిద్దిరాములు, యాకయ్య, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ కార్డుల్లో పలు తప్పులురఘునాథపల్లి: స్మార్ట్ రేషన్ కార్డులు తప్పుల తడకగా ఉన్నాయి. లబ్ధిదారుల పేర్లు మొదలు, గ్రామం, పిన్కోడ్ ఇలా చాలా తప్పులు దొర్లాయి. మండల కేంద్రంలో ఈ నెల 21న ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించిన ఈ కార్డుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇందులోని మెజారిటీ కార్డులో అక్షర దోషాలు ఉంటున్నాయి. రఘునాథపల్లి మండలంలోని పలు గ్రామాల పేర్లు తప్పుగా ముద్రించారు. కంచనపల్లి, రఘునాథపల్లి తదితర గ్రామాల పేరు చివరన పల్లికి బదులు.. పల్లె అని ఉంది. పిన్కోడ్ 506244 బదులు.. 506143 గా ముద్రించారు. కార్డుపై పేరుతోపాటు ఆన్లైన్లో కుటుంబ సభ్యుల పేర్లలోనూ తప్పులు ఉన్నాయి. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉండడంతో కార్డులపై ముద్రించిన వివరాలు తప్పుగా ఉండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై వివరణ కోరేందుకు తహసీల్దార్ రాజేష్రెడ్డిని ఫోన్లో ప్రయత్నించగా.. స్పందించలేదు. అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు జరగనున్న 12వ రాష్ట్ర స్థాయి జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈపోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 33 జిల్లాలు, 4 అకాడమీలు, 3 క్రీడా పాఠశాలల నుంచి 1,600 మంది అథ్లెట్లు పాల్గొన్నట్లు నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. అండర్–14, 16, 18, 20 బాలబాలికలకు రెండు రోజుల పాటు 120 ఈవెంట్లలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన అథ్లెట్లను సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో పాండిచ్చేరీలో జరగనున్న సౌత్జోన్ జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ వరదరాజేశ్వర్రావు ముఖ్య అతిథిగా హాజరై పోటీలు ప్రారంభించారు. -
ఆరోగ్య పుష్టి
జనగామ రూరల్: రైతుల ఆదాయం పెరగాలంటే సంప్రదాయ పంటలతో పాటు ఆరోగ్య సిరి కలిగిన ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. డ్రాగన్ ఫ్రూట్ వంటి అధిక విలువైన ఉద్యాన పంటలు రైతులకు ప్రత్యామ్నాయ ఆదా య మార్గంగా నిలుస్తున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ పంటను జిల్లా వ్యాప్తంగా 52 ఎకరాల్లో 20 మంది రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలోని నర్మెట మండలంలోని గుంటూరుపల్లి గ్రామ రైతులు సంప్రదా య వరి సాగుకు భిన్నంగా ఆలోచిస్తూ, అధిక నీటి అవసరం ఉన్న పంటలకు దూరంగా ఉంటూ పంటల వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తున్నారు. గ్రామంలో రైతులు సమష్టిగా డ్రాగన్ ఫ్రూట్, పత్తి, కందులు, కూరగాయలు, తదితర పంటలను సాగు చేస్తూ ఆదాయ మార్గాలను చూసుకుంటున్నారు. అలాగే రఘునాథపల్లి మండలంలోని గోవర్ధనగిరి వద్ద ఓ రైతు 5 ఎకరాల్లో 4 ఏళ్ల నుంచి సాగు చేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. సాగు ఇలా.. డ్రాగన్ ఫ్రూట్ సాగులో నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు డ్రిప్ ఇరిగేషన్ వంటి సూక్ష్మనీటిపారుదల పద్ధతులు ఉపయోగించుకోవా లి. తోట ఏర్పాటుకు అవసరమైన పందిరి నిర్మాణ ఏర్పాటుకు ఎకరాకు సుమారు రూ.1.35లక్షలు, మొక్కలకు రూ.45వేలు, డ్రిప్ ఇరిగేషన్న్కు రూ.35 వేలు, భూమి తయారీకి రూ.40–50వేలు, బేసల్ అప్లికేషన్కు సుమారు రూ.20 వేల వరకు వ్యయం అవుతుంది. రెండో సంవత్సరం నుంచి ఎకరాకు సుమారు రూ.73 వేల వరకు నిర్వహణ వ్యయం ఉండగా, సరైన నీటి యాజమాన్యం, పోషకాల వినియోగం, కలుపు నియంత్రణ, తెగుళ్ల నివారణ వంటి శాసీ్త్రయ పద్ధతులను పాటిస్తూ స్థిరమైన దిగుబడులు సాధించవచ్చు. అంతర పంటలతో ఆదాయం డ్రాగన్ ఫ్రూట్తో పాటు వివిధ రకాల కూరగాయ పంటలు కూడా రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తాయి. టమాట, వంకాయ, మిరప, బెండ, బీరకాయ, సోరకాయ, కాకరకాయ, ఫ్రెంచ్ బీనన్స్ వంటి పంటలను మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా సాగు చేయడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. టమాటకు ఎకరాకు సుమారు రూ. 96,996 వ్యయం కాగా, సుమారు రూ.4.80 లక్షల స్థూల ఆదాయం, రూ.3.83 లక్షల వరకు నికర రాబడి లభిస్తోంది. అదే విధంగా వంకాయకు రూ. 81,131 వ్యయం కాగా, రూ.3.60 లక్షల స్థూ ల ఆదాయం, రూ.2.79 లక్షల వరకు నిక ర రాబడి వస్తోంది. మిరపలో ఎకరాకు రూ. 76,741 వ్యయంతో రూ.3 లక్షల స్థూల ఆదాయం, రూ.2.23 లక్షల వరకు నికర రాబడి పొందుతున్నారు. సాగుకు ప్రోత్సాహకాలు ఉద్యాన సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సబ్సిడీలు, సాంకేతిక సహాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్, నాణ్యమైన మొక్కలు, తోటల ఏర్పాటు, యాజమాన్య పద్ధతులపై సంబంధిత శాఖల నుంచి మార్గదర్శకాలను పొందాలి. -
యూనిఫామ్ కొలతల్లో తేడాలు సరిచేయాలి
● జూమ్ మీటింగ్లో డీఆర్డీఓ ఆదేశాలు జనగామ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్కారు అందజేస్తున్న ఉచిత యూనిఫామ్లలో అంగీలు పొడవుగా, నిక్కర్లు పొట్టిగా ఉండటంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘యూనిఫామ్.. వేస్తే తంటా–పొడగు అంగీ, పొట్టి నిక్కర్లతో విద్యార్థుల ఇబ్బందులు’ శీర్షికన సాక్షిలో ఈ నెల 25న ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా దేశాల మేరకు డీఆర్డీఓ భాస్కర్ మంగళవారం సంబంధిత ఏపీఎంలతో సమీక్ష నిర్వహించి సమస్యపై ఆరా తీశారు. యూని ఫామ్ల కొలతల్లో హెచ్చుతగ్గులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు, చెక్కర, మేకర్తో మరోసారి కొలతలను పరిశీలించి, విద్యార్థుల కు సరిపడే విధంగా సరిచేయాలని ఆదేశించా రు. డీఆర్డీఓ భాస్కర్ లింగాలఘణపురం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. డ్రెస్ కటింగ్లో తేడాలు రావడం వల్లే కొన్ని యూనిఫామ్లు విద్యార్థులకు సరిపోని పరిస్థితి ఏర్పడిందని ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. -
రాజామహేంద్ర నాయక్కు ఐపీఎస్ హోదా
జనగామ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ వెస్ట్జోన్ (జనగామ) డీసీపీ బి.రాజామహేంద్ర నాయక్కు ఐపీఎస్ హోదా లభించింది. కేంద్ర హోంశాఖ ఈ మేరకు 24న నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ క్యాడర్లో ఖాళీగా ఉన్న తొమ్మిది ఐపీఎస్ పోస్టుల భర్తీకి 2025 సెలెక్ట్ లిస్ట్ను కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక కమిటీ ఆమోదించినట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ సర్వీస్ నుంచి ఐపీఎస్కు పదోన్నతి పొందిన అధికారుల్లో బి.రాజామహేంద్ర నాయక్ ఒకరు. రాజామహేంద్ర నాయక్ ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్ పరిధిలోని వెస్ట్జోన్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా పని చేసిన ఆయన్ను 2024లో జనగామ డీసీపీగా నియమించారు. కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ ప్రకారం ఐపీఎస్ హోదా పొందిన అధికారులపై నిబంధనల ప్రకారం తదుపరి ప్రక్రియ కొనసాగనుంది. 2010 బ్యాచ్ డీఎస్పీగా.. పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన బి. రాజామహేంద్ర నాయక్ 2010 బ్యాచ్ డీఎస్పీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందారు. కరీంనగర్లో రీజినల్ ఇంటెలిజెన్స్ ఆఫీ సర్గా ఎస్పీ హోదాలో పని చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అదనపు ఎస్పీగా, మహబూ బాబాద్, ములుగు ప్రాంతాల్లో ఎస్డీపీఓగా బాధ్యతలు నిర్వర్తించారు. వరంగల్ అర్బన్లో డీఎస్పీ (క్రైమ్స్)గా కూడా సేవలందించారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎస్డీపీఓగా బాధ్యతలు నిర్వహించారు. వివిధ జిల్లాలు, విభాగాల్లో పనిచేస్తూ పోలీసింగ్లో అనుభవాన్ని సంపాదించిన ఆయనకు తాజాగా ఐపీఎస్ హోదా లభించడంతో సహచరులు, పోలీస్ శాఖ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. డీసీపీకి సీపీ అభినందనలు ఐపీఎస్ హోదా పొందిన డీసీపీ రాజామహేంద్ర నాయక్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత(ఐపీఎస్)ను మర్యాదపూర్వకంగా కలుసుకొని మొక్క అందజేశారు. ఈ సందర్భంగా రాజామహేంద్రనాయక్ను పోలీస్ కమిషనర్ అభినందించారు. పోలీస్ శాఖ వర్గాల్లో హర్షం -
నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలి
జనగామ రూరల్: ప్రజల భాగస్వామ్యంతో విరివి గా మొక్కలు నాటడంతో పాటు నాటిన ప్రతీ మొ క్కను సంరక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని చౌడారం గ్రామంలోని వన మహోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంబించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన మహోత్సవ లక్ష్యాలను ప్రజలందరి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ భాస్కర్, అటవీ శాఖ ఎఫ్ఆర్ఓ భాస్కర్, డీఏఓ అంబికా సోనీ, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఎంపీడీఓ మహేష్ నాయక్, సర్పంచ్ కె. పద్మ, ఉప సర్పంచ్ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. మెరుగైన దిగుబడులు సాధించాలి పంటల వైవిధ్యీకరణ, సహజ వ్యవసాయంతో రైతులు మెరుగైన దిగుబడులు సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. చౌడారం గ్రామంలో కలెక్టర్ రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి, పంటల సాగు, సహజ వ్యవసాయం, ఉద్యానవన పథకాల అమలు తీరును పరిశీలించారు. రైతు రామ్ దయాకర్రెడ్డి తన మూడు ఎకరాల భూమిలో సాగు చేస్తున్న కంది, సోర, బీర, దొండతో పాటు ఇతర కూరగాయల పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఏఓ అంబికా సోనీ, ఉద్యానవన అధికారి నర్సయ్య, సర్పంచ్ పద్మ, ఏఓ శరత్, ఏఈవో అనిల్, హెచ్ఈవో అరవింద్, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా -
సర్కార్ బడుల్లో శాస్త్ర విజ్ఞానం
జనగామ: పాఠశాల విద్యార్థుల్లో వైజ్ఞానిక దృక్పథాన్ని, పరిశోధనాత్మక ఆలోచనలను పెంపొందించేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రభుత్వ బడుల్లో శాస్త్ర విజ్ఞానంపై ప్రాయోగిక అవగాహన కల్పించేందుకు సైన్స్ ల్యాబొరేటరీలు ఏర్పాటు చేయనుంది. సమగ్ర శిక్ష తెలంగాణ 2026–27 వార్షిక కార్యాచరణ, బడ్జెట్లో భాగంగా జిల్లాలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలలకు సైన్స్ ల్యాబొరేటరీలను మంజూరు చేసింది. ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలల్లో ల్యాబ్ల ఏర్పాటుకు పరి పాలనా అనుమతులు ఇవ్వగా, ఒక్కో ల్యాబ్కు రూ.26 లక్షల చొప్పున జిల్లాకు మొత్తం రూ.1.04 కోట్ల నిధులు కేటాయించారు. మంజూరు చేసిన నిధులతో కేవలం ల్యాబ్ గదుల నిర్మాణమే కాకుండా వర్క్స్టేషన్లు, ఫర్నిచర్, సైన్స్ ల్యాబ్ పరికరాల కొనుగోలు, సరఫరా, ఏర్పాటు, పరీక్షలు, వినియోగానికి సిద్ధం చేయడం, అంతర్గత విద్యుదీకరణ, అనుబంధ పనులు చేపట్టనున్నారు. పనులను టర్న్కీ విధానంలో తెలంగాణ విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు నిర్వహించి చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. టెండర్లు ఖరారైన 15 రోజుల్లో పనుల కోసం 2025–26 షెడ్యూల్ ఆఫ్ రేట్స్ను, సివిల్ పనులకు 5 శాతం కాంట్రాక్టర్ లాభా న్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. టెండర్లు ఖరారైన 15 రోజుల్లో సంబంధిత సంస్థతో ఒప్పందాలు పూర్తి చేసి, అనంతరం పనులను వెంటనే ప్రారంభించాలి. విద్యార్థులు, ఉపాధ్యాయుల వినియోగానికి అవసరమైన ప్రదర్శన, శిక్షణ, నిర్వహణ పుస్తకాలు, వారంటీ, నిర్వహణ సదుపాయాలను కూడా కల్పించాలి. పనులు పూర్తయిన అనంతరం తెలంగాణ విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్యనిర్వహణ ఇంజినీర్, జిల్లా విద్యాశాఖాధికారి సంయుక్తంగా పరిశీలించి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ధ్రువీకరించిన తర్వాత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ల్యాబ్లను అప్పగించనున్నారు. బాలికల విద్యకు పెద్దపీట జిల్లాలో ఎంపికై న 4 పాఠశాలల్లో 3 పాఠశాలలు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ, రఘునాథపల్లి, నర్మెట, కొడకండ్ల) కావడం విశేషం. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద, వెనకబడిన వర్గాల బాలికలకు సైన్స్ పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రయోగాల ద్వారా నేర్చుకునే అవకాశం లభిస్తుంది. జిల్లాలోని రఘునాథపల్లి, పాలకుర్తి, నర్మెట, కొడకండ్ల మండలాల్లో రూ.1.04 కోట్ల వ్యయంతో సిద్ధం కానున్న ఈ ప్రయోగశాలలు విద్యార్థులలో సైన్స్పై ఆసక్తిని పెంచి, భవిష్యత్తులో వారు పోటీ పరీక్షల్లో రాణించడానికి, ఉన్నత విద్యా అవకాశాలను అందుకోవడానికి ఎంతగానో దోహదపడనున్నాయి. సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణం–వర్క్ స్టేషన్ ఫర్నిచర్ రూ.25 లక్షలు కేటాయించగా, ఇందులో ప్రయోగశాల పరికరాల కొనుగోలు, తదితర వాటి కోసం రూ. లక్ష ఖర్చు చేయనున్నారు. జిల్లాలోని నాలుగు పాఠశాలలకు సైన్స్ ల్యాబ్లు రూ.1.04 కోట్లతో నిర్మాణం ఒక్కో పాఠశాలకు రూ.26 లక్షలు ప్రయోగాత్మక విద్యకు ప్రభుత్వ ప్రోత్సాహంమండలం పాఠశాల యూనిట్లు వ్యయం రఘునాథపల్లి కేజీబీవీ 01 రూ.26 లక్షలు పాలకుర్తి చెన్నూరు 01 రూ.26 లక్షలు హైస్కూల్ నర్మెట కేజీబీవీ 01 రూ.26 లక్షలు కొడకండ్ల కేజీబీవీ 01 రూ.26 లక్షలు మొత్తం పాఠశాలలు 04 రూ.1.04 కోట్లు -
5 ఎకరాల్లో సాగు.. 14లక్షల ఆదాయం
నాలుగేళ్లుగా 5 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నా. యజమాని సాగుకు రెండు లక్షల వరకు పెట్టుబడి పెడుతాడు. ఏటా 40 ట్రిప్పుల పండ్లు మార్కెట్కు తరలిస్తాం. పెట్టుబడి నిర్వహణ ఖర్చులు పోగా రూ.7 లక్షల వరకు మిగులు ఉంటుంది. అంతర పంటలుగా కీరదోస, టమాట పంటలు వేస్తాం. సాగులో ఆర్గానిక్గా గోమూత్రం, ఆవుపెంట వేస్తాం. –బోయిని శ్రీనివాస్, తోట నిర్వాహకుడు, గోవర్ధనగిరి డ్రాగన్ ఫ్రూట్ సాగులో శాసీ్త్రయ పద్ధతులు పాటించడం, సరైన నీటి యాజమాన్యం, పోషకాల వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టా. మొదటి ఏడాది తోట ఏర్పా టు కోసం పెట్టుబడి కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ, తోట ఏర్పాటైన తర్వాత నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. సరైన యాజమాన్య పద్ధతులతో సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నా. – వెలంగన్ రెడ్డి, రైతు, గుంటూరుపల్లి, నర్మెట రైతులు సంప్రదాయ పంటలతో పాటు అధిక విలువ, అధిక ఆదాయం అందించే ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలి. డ్రాగన్ ఫ్రూట్ వంటి అధిక విలువైన పంటలను శాసీ్త్రయ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా రైతులు మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉంది. పంటల వైవిధ్యాన్ని పాటిస్తూ భూమి స్వభావం, నీటి లభ్యత, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కూరగాయలు, ఉద్యాన పంటలు, పత్తి, కంది వంటి పంటలను ఎంపిక చేసుకోవాలి. – సందీప్ కుమార్ ఝా, కలెక్టర్ -
27న గ్రామసభలు, వార్డుసభలు నిర్వహించాలి
జనగామ రూరల్: ఈనెల 27న రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధా న ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. సోమవారం, ఎస్ఐఆర్ కార్యక్రమంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత గ్రామ పంచాయతీ భవనంలో, పట్టణ ప్రాంతాల్లో సంబంధిత పోలింగ్ కేంద్రంలో సభలు నిర్వహించాలని తెలిపారు. సభల వద్ద ఫారం–6, ఫారం–7, ఫారం–8, తదితర అవసరమైన ఫారాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ప్రతీ నోటీసులో విచారణ తేదీ, విచారణ జరిగే ప్రదే శం, సమయాన్ని స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసుల జనరేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఆర్డీఓలు గోపీరాం, కిరణ్ ప్రకాష్, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్ పాల్గొన్నారు. అధ్యాపక పోస్టుల భర్తీకి ఎంపిక పరీక్ష జనగామ రూరల్: జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఎంపిక పరీక్షను నిర్వహించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ – 6, అసోసియేట్ ప్రొఫెసర్ – 12, అసిస్టెంట్ ప్రొఫెసర్ – 7 పోస్టులు కలిపి మొత్తం 25 ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా, మొ త్తం 13 దరఖాస్తులు రాగా 10 మంది అభ్యర్థులు ఎంపిక పరీక్ష రాశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరీక్ష ప్రక్రియను పర్యవేక్షించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా.నాగమణి, జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆర్.కుమారస్వామి పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలిజనగామ రూరల్: ఫీజు రీయింబర్స్మెంట్ అందించి విద్యార్థులను ఆదుకోవాలని బీజేపీ జిల్లా అద్యక్షుడు సౌడ రమేశ్ డిమాండ్ చేశారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో ఎస్ఐఆర్ కమిటీ జిల్లా కన్వీనర్ బొజ్జపల్లి సుభాష్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ అందక చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేస్తున్న దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విడుదల రమేశ్, బల్ల శ్రీనివాస్,ఐలోని అంజిరెడ్డి, పెరుమళ్ళ అమరేందర్ రెడ్డి, దుర్గాప్రసాద్, సట్ల వెంకటరమణ, బైరుపాక కుమార్, పుప్పాల వేణు, గంటే ఉపేందర్, జగదీష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతిచిల్పూరు: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని నిద్రలోనే గుండెపోటుతో చనిపోయింది. ఈ ఘటన మండలంలోని వంగాలపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన గుగులోతు వసంత–రమేశ్ల కూతురు పల్లవి(16) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. మంగళవారం గ్రామంలో ఓ విందు కార్యక్రమంతోపాటు రాఖీ పండగ కోసం పల్లవిని వారం రోజుల సెలవుతో తండ్రి రమేశ్ ఆదివారం సాయంత్రం ఇంటికి తీసుకొచ్చాడు. రాత్రి 10 గంటల వరకు కుటుంబ సభ్యులతో గడిపిన పల్లవి నిద్రపోయింది. సోమవారం ఉదయం 8 అవుతున్నా నిద్రలేవకపోవడంతో తల్లి వసంత లేపే ప్రయత్నం చేయగా కదలిక లేకపోవడంతో అనుమానంతో చుట్టుపక్కల వారిని పిలవడంతోపాటు 108కి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరీక్షించగా అప్పటికే మృతిచెందిందని తెలిపారు. గుండెపోటుతో చనిపోయి ఉంటుందని సిబ్బంది చెప్పినట్లు కుటుంబ సభ్యులు రోదిస్తూ చెప్పారు. వారం రోజులు ఇంట్లో అందరితో కలిసి సంతోషంగా ఉంటుందనుకున్న కూతురు తమను శోకసముద్రంలో ఉంచి వెళ్లిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
రాష్ట్రస్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక..
రఘునాథపల్లి: మండలంలోని అశ్వరావుపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్ఎం శోభన్బాబు, పీఈటీ మచ్చ రాజేందర్ సోమవారం తెలిపారు. హనుమకొండ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 23న ఉమ్మడి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ప్యారాల కావ్యశ్రీ, శివరాత్రి అక్షయ, పొన్నగంటి సంపత్ అద్భుత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంిపికయ్యారన్నారు. ఈ నెల 28,29,30 తేదీల్లో హైదరాబాద్ బీహెచ్ఈఎల్లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈసందర్భంగా ఎంపికై న విద్యార్థులను సర్పంచ్ చైతన్య రాజు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రేణుక, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు అభినందించారు. కూనూరు విద్యార్థులు.. జఫర్గఢ్: మండలంలోని కూనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు బుల్లె అమూల్య, పెద్దపెల్లి భానుశ్రీ, కొలిపాక రిషి వరుణ్, చెవనబోయిన పూజశ్రీ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎండీ పర్వేజ్ ఒక ప్రకటనలో తెలి పారు. ఎంపికై న విద్యార్థులను పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఆకుల సాయికుమార్తోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. -
నామిలేట్ పదవులు
47 రోజులు గడిచినా నామినేటెడ్ పోస్టులపై నాన్చివేత ధోరణిసాక్షిప్రతినిధి, వరంగల్: నామినేటెడ్ పదవులపై మరోసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పలువురు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం జూలై 8న ముగిసింది. వారి స్థానంలో కొత్తవారిని నియమించడమా? లేక పాతవారినే మరో సారి కొనసాగిస్తారా? అనే దానిపై వెంటనే నిర్ణయం వస్తుందని భావించారు. ఆ పదవుల కాలం ముగిసి 47 రోజులు గడిచినా ఆ ప్రస్తావనే లేదు. దీంతో ఇటు తాజా మాజీలు.. అటు ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీకి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే పదవులు ముగిసిన వారిలో కొందరు మరోసారి కొనసాగేందుకు అధిష్టానం పెద్దలను కలుస్తుండగా.. గత ఎన్నికల్లో టికెట్లు ఆశించి అవకాశం దక్కని వారు, ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నాయకులు, దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లు పదవుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశావహుల్లో ఉత్కంఠ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే దశల వారీగా నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. 2024 జూలై 8న ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా 37 మంది చైర్మన్లను ప్రభుత్వం నియమించగా.. ఉమ్మడి వరంగల్ నుంచి ఆరుగురికి అవకాశం లభించింది. పాలకుర్తి, వరంగల్ పశ్చిమ టికెట్లను ఆశించి తప్పుకున్న జంగా రాఘవరెడ్డికి ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి, పరకాల నుంచి పోటీకి వైదొలిగిన ఇనగాల వెంకట్రామిరెడ్డికి ‘కుడా’ చైర్మన్ పదవి లభించాయి. మహబూబాబాద్ నుంచి బెల్లయ్య నాయక్కు ట్రైబల్ కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, భూపాలపల్లి నుంచి అయిత ప్రకాశ్రెడ్డికి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎండీ రియాజ్కు గ్రంథాలయ పరిషత్ వంటి కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు అప్పగించారు. జూలై 8న వారి పదవీకాలం పూర్తయ్యింది. కాగా, జిల్లాలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు తొలుత నామినేటెడ్ పోస్టు (రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్) పదవి కట్టబెట్టిన అధిష్టానం.. ఆయన పదవీకాలం ముగిసిన వెంటనే మరో రెండేళ్లు పొడిగించింది. మిగతా ఆరు పోస్టులపై మాత్రం కొనసాగుతున్న సస్పెన్స్ తాజా మాజీలు, ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. మా పేర్లు పరిశీలించండి.. ఓవైపు తాజా మాజీలు కొనసాగింపు కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు కొత్తగా పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్, ఎమ్మెల్సీ తదితర నామినేటెడ్ పదవుల కోసం పోటీలో ఉన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ, జిల్లా స్థాయిల్లో పార్టీకి సేవలందించిన దొమ్మాటి సాంబయ్య, శనిగరపు ఇందిర, హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, కె.రవళి, నమిండ్ల శ్రీనివాస్, ఈవీ శ్రీనివాసరావు, పింగిళి వెంకట రాంనర్సింహరెడ్డి, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, బొమ్మనపల్లి అశోక్రెడ్డి, గాజర్ల అశోక్తో పాటు పలువురు నేతలు పదవుల రేసులో ఉన్నారు. వెన్నం శ్రీకాంత్రెడ్డి, భరత్ చంద్రారెడ్డి, గొల్లపల్లి రాజేందర్, మార్క విజయ్కుమార్, అబూబక్కర్, పోలెపల్లి రంజిత్రావు, మరికొందరు సీనియర్లు కూడా తమ పేర్లను పరిశీలించాలని అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నట్లు కూడా పార్టీ వర్గాల సమాచారం. మరింత సమయం పట్టే అవకాశం రెన్యూవల్ చేస్తారా.. కొత్తవారికి ఇస్తారా? అని సందిగ్ధం ఎటూ తేల్చని అధిష్టానం.. తాజా మాజీల్లో టెన్షన్ రోజురోజుకూ పెరుగుతున్న ఆశావహులుసీఎం, పీసీసీ చీఫ్, మంత్రులదే తుది నిర్ణయం ఈసారి నామినేటెడ్ పదవుల భర్తీలో అధిష్టానం ఎలాంటి ఫార్ములాను అనుసరిస్తుందన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారా? ఇప్పటికే పదవులు అనుభవించిన వారికి మరో అవకాశం కల్పిస్తారా? సామాజిక సమీకరణా లు, ప్రాంతీయ సమతుల్యతకు పెద్దపీట వేస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరు జిల్లాల మధ్య సమతుల్యతతో పాటు ఆయా సామాజికవర్గాలకు ప్రాతినిథ్యం కల్పించడం కూడా కీలకంగా మారనుంది. ఒకరికి పదవి ఇస్తే మరో సామాజికవర్గం నుంచి వచ్చే డిమాండ్ను ఎలా సమన్వయం చేయాలన్నది అధిష్టానానికి సవాలుగా మారే అవకాశముంది. ఇదిలా ఉండగా.. నామినేటెడ్ పోస్టుల భర్తీకి మరికొంత సమయం పట్టవచ్చని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్), ఇటీవలి రాజ కీయ పరిణామాల నేపథ్యంలో మరింత ఆలస్యం కావొచ్చన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా, ఈసారి కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీలో సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్తో పాటు ఆయా జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులే కీలకంగా మారనున్నాయ న్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో నడుస్తోంది. -
చిన్నవి..పెద్దవి చేయడం ఎలా?
జనగామ: జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత యూనిఫామ్లు ఇబ్బందులకు కారణమవుతున్నాయి. జిల్లాలో సుమారు 500 ప్రభుత్వ విద్యాసంస్థల్లో 30వేల మందికి పైగా విద్యార్థులు చదువుతుండగా, ఇప్పటి వరకు ఒక్కో జత యూనిఫాం మాత్రమే అందింది. రెండో జత యూనిఫాంలను సిద్ధం చేస్తున్నారు. అయితే మొద టి జత దుస్తుల్లో విద్యార్థుల కొలతలకు సరిపోని షర్ట్, నిక్కర్లు, పొడవు, పొట్టి, లూజు, టైట్ సమస్యలు తలెత్తడంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. కొలతలు తీసుకోకుండానే కుట్టించారా..? కొన్ని ప్రాంతాల్లో విద్యార్థుల కొలతలు అరకొరగా తీసుకుని యూనిఫాంలు కుట్టించినట్లు తెలుస్తోంది. దీంతో ఒకరికి షర్టు పెద్దగా, మరొకరికి చిన్నగా, కొందరికి నిక్కర్లు పొట్టిగా, మరికొందరికి పొడవుగా వచ్చాయి. గుండీలు, భుజాల వద్ద కొలతలు కూడా సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గుర్తించిన అధికారులు ఇద్దరు మాస్టర్లను ఏర్పాటు చేసి, పాఠశాలల నుంచి వచ్చిన సమాచారంతో దుస్తుల కొలతలను సరిచేసి ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. సైజు తేడాతో.. బచ్చన్నపేట మండలంలో 12 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఐదు ప్రాథమికోన్నత, 27 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. కేజీబీవీ, మోడల్ స్కూల్ను కలుపుకొని 3,045 మంది విద్యార్థులు ఉన్నారు. కొన్నిచోట్ల యూనిఫాంలు తక్కువగా రావడంతో అదనంగా వచ్చిన పాఠశాలల నుంచి తెప్పించి పంపిణీ చేశారు. అయితే సైజులు సరిపోక కొందరు విద్యార్థులు పిన్నీసులు, టక్కులు వేసుకొని షర్ట్ను సర్దుకుంటున్నారు. జఫర్గఢ్ మండలంలో 30 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 2,542 మంది విద్యార్థులకు గాను ఇప్పటి వరకు 1,900 మందికి మాత్రమే ఒక్క జత యూనిఫాం అందించారు. ముందుగా కొలతలు తీసుకోకపోవడంతో షర్ట్, నిక్కర్లు లూజుగా ఉండటంతో పాటు సైజులు తేడాగా వచ్చాయి. నిక్కర్లు బెల్టు, మొల్దారాలు పెట్టినా జారిపోతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. పంపిణీలోనూ జాప్యం స్టేషన్ ఘన్పూర్ మండలంలో 33 ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు 861 మందికే అందాయి. అవి కూడా ఒక్కొక్క జత మాత్రమే. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో యూనిఫాంలు అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాలకుర్తి, కొడకండ్ల మండలాల్లోనూ ఒక్క జత యూనిఫాం మాత్రమే అందిన పాఠశాలలు ఉన్నాయి. కొడకండ్లలో 2,853 మంది విద్యార్థులకు మొదటి జత అందగా, కొలతలు సరిపోక పలువురు సొంతంగా సరిచేయించుకున్నారు. లింగాలఘణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో 95 మంది విద్యార్థులు ఉన్నారు. కొందరికి పొట్టి షర్ట్లు, నిక్కర్లు, మరికొందరికి పొడవైన దుస్తులు అందాయి. చిన్నవిగా వచ్చిన దుస్తులను ఎలా పెద్దగా చేస్తారంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. నర్మెట మండలంలోని పాఠశాలల్లో మొదటి జత పంపిణీ పూర్తి చేశారు. కొన్ని పాఠశాలల్లో నాణ్యత లేని వస్త్రం, అనుభవం లేని దర్జీలతో కుట్టించడం వల్ల కుట్లు సరిగా లేకపోవడం, జేబులు అస్తవ్యస్తంగా ఉండటం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. జనగామ మండలం, అర్బనన్్ పరిధిలోని 55 పాఠశాలల్లో 4,140 మంది విద్యార్థులకు యూనిఫాంలు అందించారు. అయితే కొలతలు సరిపోకపోవడంతో పలువురు తల్లిదండ్రులు సొంత ఖర్చుతో దుస్తులను సరిచేయించారు.పొడుగు అంగీ..పొట్టి నిక్కర్లతో విద్యార్థుల ఇబ్బందులు పిన్నీసులు, బెల్ట్లతో సర్దుబాటు ఒక్కో విద్యార్థికి ఒక్కో సైజు బట్ట ఇచ్చారు..సైజులో నిర్లక్ష్యం ప్రదర్శించారు ఇంకా పలుచోట్ల కానరాని దుస్తుల పంపిణీ -
నియోజకవర్గాల అభివృద్ధికి సహకరించండి
స్టేషన్ఘన్పూర్: ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డిని వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సోమవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం, స్టేషన్ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎంతో చర్చించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిఽఽధిలో చేపట్టాల్సిన కీలక అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన, పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం, ప్రజలకు అవసరమైన వివిధ అభివృద్ధి పనులకు నిధుల మంజూరు తదితర అంశాలను ఎంపీ కావ్య సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఘన్పూర్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజల అవసరాలు, పెండింగ్ సమస్యలు, వివిధ ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై ఎమ్మెల్యే కడియం ముఖ్యమంత్రితో చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని కోరారు. కాగా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారని వారు తెలిపారు. సీఎంను కలిసిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం -
వినతులకు సత్వర పరిష్కారం
● ప్రజావాణిలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● 186 దరఖాస్తుల స్వీకరణజనగామ రూరల్: తమ సమస్యల పరిష్కారానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజల సమస్యలను కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆలకించి పరిస్కారానికి మార్గం చూపుతున్నారు. ప్రతీ వినతిపై అధికారులు నిర్లక్ష్యం లేకుండా స్పందించి, నిర్ణీత గడువులో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 189 దరఖాస్తులను స్వీకరించారు. కలెక్టర్ వచ్చిన అర్జీలను పరిశీలిస్తూ ఆర్జీదారుల సమస్యలను పూర్తిగా తెలుసుకొని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ ఎన్పీడీసీఎల్ సంపత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, డీపీఓ వెంకట్ రెడ్డి, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదులు ఇలా ఉన్నాయి.. జఫర్గఢ్ మండలం తీగవరం గ్రామానికి చెందిన వై.రాజు, తాను 6 ఎకరాల 21 గుంటల వ్యవసాయ భూమిని కొనుగోలు చేయగా, ఆ భూమి రిజిస్ట్రేషన్ జరగకుండా సంఘం సభ్యులు ఆపారని, ఆ భూమి రిజిస్ట్రేషన్ తన పేరు మీదకు చేసేలా చర్యలు తీసుకోవాలని దరఖాస్తు చేసుకున్నారు. చిల్పూర్ మండలం రాజవరం గ్రామానికి చెందిన ఇమ్మడి నర్తకి, తన 2.27 గుంటల భూమిని అమ్ముకునేందుకు అడ్డుపడుతున్నారని, ఆ భూమిని అమ్ముకునేందుకు తన బావ నుంచి రక్షణ కల్పించి, న్యాయం చేయాలని వినతి అందజేశారు. పాలకుర్తి మండలం మేకలతండా గ్రామానికి చెందిన ఎల్.స్వర్ణ, తమ గ్రామానికి సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని, కానీ స్థలం లేదని స్థలం కేటాయించాలని మనవి చేస్తూ వినతిపత్రం సమర్పించారు. జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్కు చెందిన ఎం.సరిత, తన కుమారుడు ఎం.మణిదీప్కు దివ్యాంగుల పింఛన్ రెండు నెలలుగా నిలిపివేయడం జరిగిందని, ఆధార్ కార్డులో వివరాల సవరణ చేయాలని, ఈ మేరకు నిలిచిన పింఛన్ వెంటనే పునరుద్ధరించాలన్నారు. మండల కేంద్రంలోని బొడ్రాయి సమీపంలో ఇంటి యజమానుల నుంచి అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న ఇండస్ సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేసేలా చర్యలు తీసు కోవాలని పాలకుర్తి మండల కేంద్రంలోని మహిళలు వినతి పత్రం అందించారు. పక్కనే మహిళా సంఘం కార్యాలయం, అంగన్వాడీ కేంద్రం, పిల్లలకు వైద్యసేవలు అందించే హెల్త్ సెంటర్ ఉన్నాయని, భద్రత, ఆరోగ్య కారణాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.అరగంటలోనే పరిష్కారంజిల్లా కేంద్రంలోని బాణాపురం కాలనీకి చెందిన మహమ్మద్ రఫత్ తన ఒక సంవత్సరం వయసు గల కుమార్తె మహమ్మద్ అల్ఫియనూర్ ఆరోగ్యశ్రీ కార్డులో పేరు నమోదు కాకపోవడంతో చికిత్సకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రజావాణిలో కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రఫత్ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. చిన్నారి అల్ఫియనూర్ కంటి సమస్యతో బాధపడుతుండగా, హైదరాబాద్లో శస్త్రచికిత్స చేయించాల్సి ఉందని వైద్యులు తెలిపారని, ఆపరేషన్కు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు అవుతుందని, ఆరోగ్యశ్రీ కార్డులో చిన్నారి పేరు నమోదు లేకపోవడంతో చేర్చాలని కలెక్టర్కు విన్నవించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించి, అరగంట వ్యవధిలోనే చిన్నారి పేరు ఆరోగ్యశ్రీ కార్డులో నమోదు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. -
పంచరాయి గుట్టలను రక్షించాలి
స్టేషన్ఘన్పూర్: మండలంలోని సముద్రాల గ్రామంలో ప్రకృతి సంపద అయిన పంచరాయి గుట్టలను అక్రమార్కుల నుంచి రక్షించాలని గ్రామానికి చెందిన గొర్రెల, మేకల పెంపకందార్లు, యాదవ సంఘం జిల్లా నాయకులు తాటికొండ యాదగిరి, కత్తుల రాజు డిమాండ్ చేశారు. గ్రామ శివారులో ఏదులబోడు వద్ద గొర్రెల, మేకల పెంపకందారులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ శివారులో 189 సర్వేనంబర్లో పంచరాయి భూములు, గుట్టల్లో తమ తాతల కాలం నుంచి గొర్రెలు, మేకలను మేపుతూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఇటీవల కొందరు గుర్తు తెలియని అక్రమార్కులు ఆయా పంచరాయిగుట్టలపై ఉన్న చెట్లను తొలగించారని, అక్రమంగా మొరంను కొల్లగొట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఈ విషయమై కలెక్టర్, రెవెన్యూ అఽధికారులు తక్షణమే స్పందించాలని, అక్రమార్కుల నుంచి సముద్రాల పంచరాయి గుట్టలను రక్షించాలని కోరారు. కార్యక్రమంలో గొర్రెలు, మేకల పెంపకందారులు బండి అశోక్, మేకల కొమురయ్య, ఎల్.ఎల్లయ్య, బండి రాములు, తాటికొండ నాగరాజు, కన్నెబోయిన అంజయ్య, కత్తుల మల్లయ్య, అశోక్, నాంపల్లి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ‘టోసా–ఓయాసిస్కా’
హన్మకొండ అర్బన్: హనుమకొండలో మూడు రోజులపాటు నిర్వహించిన టోసా–ఓయాసిస్కాన్(తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్–ఆర్థోపెడిక్ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్)–2026 ఆదివారం ముగిసింది. దేశవ్యాప్తంగా ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు పాల్గొని ఆధునిక చికిత్సా విధానాలు, శస్త్రచికిత్సలపై తమ అనుభవాలు పంచుకున్నారు. రోబోటిక్ సర్జరీ, కృత్రిమ మేధ, కీళ్ల మార్పిడి, వెన్నెముక శస్త్రచికిత్సలపై సదస్సులో చర్చించారు. ప్రత్యక్ష ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాల ద్వారా వైద్యులకు ఆచరణాత్మక అవగాహన కల్పించారు. సీనియర్ వైద్యుడు వేదుల సత్యనారాయణమూర్తి స్మారక ఉపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓయాసిస్ అధ్యక్షుడు డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి, కార్యదర్శి డాక్టర్ కె.రాంకుమార్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హైదరాబాద్కు చెందిన డాక్టర్ అల్వాల్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు పాల్గొన్నారు. -
స్వచ్ఛతే లక్ష్యం
సోమవారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 202 11100705కొత్త ఆటోలు పాత ఆటోలు ట్రాక్టర్లుప్రైవేట్ ఆటోలుపురపాలికలో వాహనాలు, రోజువారీ చెత్త సేకరణ సమాచారంజనగామ: పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపాలిటీ మరో కీలక అడుగు వేసింది. పట్టణంలో చెత్త సేకరణకు 11 పెద్ద సైజు ఆటోలను కొత్తగా కొనుగోలు చేసింది. ఒక్కో ఆటోకు రూ.10.50 లక్షల చొప్పున వ్యయం చేసినట్లు సమాచారం. కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, కమిషనర్ రాజశేఖర్రెడ్డి పర్యవేక్షణలో స్వచ్ఛత కార్యక్రమాలను మరింత పటిష్టం చేస్తున్నారు. 11 కొత్త ఆటోలు జనగామ మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం ఉన్న వాహనాల ద్వారా రోజుకు సుమారు 10 టన్నుల చెత్తను సేకరిస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో చెత్త సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్య ప్రాంతాలు, రద్దీగా ఉండే వార్డుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ 11 కొత్త ఆటోలను కొనుగోలు చేసింది. కొత్త వాహనాలు ఇప్పటికే మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నాయి. వీటి నిర్వహణ కోసం తాత్కాలిక ప్రాతిపదికన మరో ఐదుగురు డ్రైవర్లను తీసుకున్నట్లు సమాచారం. కొత్త ఆటోలను ఎప్పటి నుంచి వినియోగంలోకి తీసుకురావాలనే విషయంపై చైర్పర్సన్, కమిషనర్ చర్చించిన అనంతరం అధికారికంగా వెల్లడించనున్నారు. ఒక్కో ఆటోకు తగ్గిన రూ.3లక్షల వ్యయం కొత్త వాహనాలు అందుబాటులోకి రావడంతో పాత వాహనాలకు అదనంగా వీటిని వినియోగించి వాణిజ్య ప్రాంతాలు, ముఖ్యమైన వార్డుల్లో రోజుకు రెండుసార్లు చెత్త సేకరించే అవకాశం ఉంది. చైర్పర్సన్, కమిషనర్ ప్రత్యేక కృషితో ఒక్కో ఆటోపై సుమారు రూ.3 లక్షల వరకు వ్యయం తగ్గింది. జనగామ స్వచ్ఛతే లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమాలకు పట్టణ ప్రజలు కూడా సంపూర్ణ సహకారం అందించాలని మున్సిపల్ అధికారులు కోరుతున్నారు. స్వచ్ఛతపై పురపాలిక కఠిన చర్యలు..! పట్టణాన్ని పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పురపాలిక మరింత కఠినంగా ముందుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. బహిరంగ ప్రదేశాల్లో ఇష్టానుసారంగా చెత్త వేస్తే జరిమానాలు విధించడంతో పాటు ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించనున్నట్లు సమాచారం. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధానాన్ని కచ్చితంగా అమలు చేయనున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులు రోజువారీ చెత్తను ప్రత్యేక డబ్బాల్లో వేసేలా పట్టణ ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకుండా చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛత కార్యక్రమాలకు సహకరించాలని పురపాలిక అధికారులు కోరుతున్నారు. మొత్తం వాహనాలు33 పురపాలికకు 11 కొత్త ఆటోలు పట్టణంలో ఇక చెత్త కష్టాలకు చెక్ ఉదయం, సాయంత్రం సేకరణకు సన్నాహాలు పాత వాహనాలకు తోడు కొత్తవి కొనుగోలు పట్టణ పారిశుద్ధ్యంపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టిరోజు చెత్త సేకరణ 10టన్నులు -
పాపన్న స్ఫూర్తితో హక్కులను సాధించుకుందాం
పాలకుర్తి టౌన్ (దేవరుప్పుల): సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితోనే గీత కార్మికుల హక్కులను సాధించుకుందామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ పిలుపునిచ్చారు. ఆదివారం దేవరుప్పుల మండలం చిన్నమడూరు గ్రామంలో మాజీ సర్పంచ్ వంగ పద్మ వెంకటేశ్వర్లు దాతృత్వంతో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా చిన్నమడూర్ టీసీఎస్ అధ్యక్షుడు ముసిగుంపుల నరేష్ అధ్యక్షత జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ట్యాంక్ బండ్పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రతిష్టించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పాపన్న స్ఫూర్తితో శ్రామిక రాజ్య స్థాపన కోసం కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చెట్ల పెంపకానికి సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. సమావేశంలో సుప్రజ హాస్పిటల్ ఎండీ విజయ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాల్నే వెంకట మల్లయ్య, వి. వెంకటనరసయ్య, రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి, బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యులు పరిధిల భాస్కర్, మండల కార్యదర్శి ఉడుగుల ప్రభాకర్, సర్పంచ్లు జోగేశ్వర్, పెద్ది కృష్ణమూర్తి, ధనలక్ష్మీ, వంగ అర్జున్, పరశురాములు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారుకేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ -
పాఠశాల విద్య పరిస్థితి దయనీయం
జనగామ రూరల్: దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాల విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుందని, రాష్ట్రంలో పాఠశాలలను మూసివేసే కుట్ర జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు విమర్శించారు. ఆదివారం జిల్లాలో రాష్ట్రస్థాయి పాఠశాల విద్యార్థుల రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సింది పోయి పాఠశాలల మూసివేత, విలీనాలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తోందన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణాలతో పాఠశాలలను మూసివేయడం ద్వారా గ్రామీణ, పేద, కార్మిక, దళిత, ఆదివాసీ కుటుంబాల పిల్లలకు విద్యను దూరం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరుస్తూ ప్రైవేట్ విద్యను ప్రోత్సహించే విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతతో పాటు ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శనిగారపు రజనీకాంత్, ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి, దామెర కిరణ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మమత, జిల్లా కార్యదర్శి దాసగాని సుమ, కార్తీక్, రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్, విఘ్నేష్, జిల్లా అధ్యక్షుడు పొదల లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రామప్పలో సండే సందడి
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయంలో ఆదివారం సెలవు రోజు కావడంతో పర్యాటకులు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది. ఈ మేరకు హైదరాబాద్లోని అటవీశాఖలో శిక్షణ పొందుతున్న బీట్ ఆఫీసర్లు దేవాలయానికి చేరుకుని రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా శిల్పకళ సంపద అద్భుతంగా ఉందని వారు కొనియాడారు. అలాగే ఇంగ్లండ్ దేశానికి చెందిన హోవార్డ్, రేక్ చోంగ్లు రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్రను టూరిజం గైడ్ విజయ్కుమార్ వారికి వివరించారు. -
ఐక్యతకు నిదర్శనం ‘తీజ్’
జనగామ: బంజారా సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే తీజ్ పండుగ నిమజ్జన కార్యక్రమం జనగామ పట్టణంలో ఆదివారం భక్తి, భావోద్వేగం, ఐక్యతల నడుమ ఘనంగా ముగిసింది. సంత్ సేవాలాల్ మహారాజ్, మెరామయాడి ఆశీస్సులతో తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన తీజ్ ఉత్సవాలకు ముగింపు సందర్భంగా బతుకమ్మకుంట వద్ద నిర్వహించిన నిమజ్జన కార్యక్రమానికి సుమారు 500 మంది బంజారా, గిరిజనులు హాజరయ్యారు. లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి వాంకుడోతు అనిత ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తీజ్ పండుగ బంజారాలకు కేవలం ఆచారం, ఉత్సవం మాత్రమే కాదని, అది వారి ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. తొమ్మిది రోజుల పాటు బంజారా మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తులు, ప్రత్యేక ఆభరణాలతో అలంకరించుకొని తీజ్ను భక్తిశ్రద్ధలతో పూజించారు. చివరి రోజు బతుకమ్మ కుంట వద్ద నిర్వహించిన నిమజ్జన కార్యక్రమంలో మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో బాలునాయక్, భిక్కునాయక్, లాల్మా నాయక్, దేవి, విజయ, మంజుల, రాధ, లలిత తదితరులు పాల్గొన్నారు. -
పారాత్రోబాల్ చాంపియన్షిప్గా రాష్ట్ర మహిళల జట్టు
స్టేషన్ఘన్పూర్: ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు తమిళనాడు కోయంబత్తూర్లో జరిగిన ఐదవ సౌత్ జోన్ పారా త్రోబాల్ చాంపియన్షిప్–2026 పోటీల్లో తెలంగాణ మహిళల జట్టు విజేతగా నిలువగా జట్టు కెప్టెన్ స్టేషన్ఘన్పూర్ మండలంలోని విశ్వనాథపురం గ్రామానికి చెందిన పారాత్రోబాల్ క్రీడాకారిణి ఉత్తమ ప్రతిభ కనబర్చింది. ఈ మేరకు ఉత్తమ ప్రతిభతో చాంపియన్షిప్గా నిలిచి బంగారు పతకం సాధించిన తెలంగాణ మహిళల జట్టుకు, ప్రత్యేకంగా కెప్టెన్ మాచర్ల కృష్ణవేణికి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు, జట్టు కోచ్ సింగారపు బాబు, మేనేజర్ తాళ్ల శ్రీనివాస్రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కాగా రాష్ట్ర మహిళల జట్టు కెప్టెన్గా రాణించిన కృష్ణవేణిని విశ్వనాథపురం గ్రామస్తులతో పాటు మండలంలోని పలువురు క్రీడాభిమానులు అభినందించారు. -
ఫుట్పాత్ ఆక్రమణలపై చర్యలు
జనగామ: పట్టణంలో రైల్వేస్టేషన్ నుంచి ఆర్టీసీ చౌరస్తా జంక్షన్ వరకు ఫుట్పాత్లపై వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాల నివారణకు పోలీసులు శాఖ పరమైన చర్యలు చేపట్టారు. ఫుట్పాత్లు, రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని ట్రాఫిక్ పోలీసులు వెనక్కి జరుపుతున్నారు. సీఐ సత్యనారాయణరెడ్డి పర్యవేక్షణలో హెడ్కానిస్టేబుల్ హిదాయత్ అలీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు రోజువారీగా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఫుట్పాత్లపై వ్యాపారాలు నిర్వహించడంతో వాహనదారులతో పాటు పాదాచారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వ్యాపారులు తమ దుకాణాలను వెనక్కి జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. పాదాచారులు సురక్షితంగా రాకపోకలు సాగించేలా ఫుట్పాత్లను అందుబాటులో ఉంచడంతో పాటు వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ఈ చర్యలను నిరంతరం కొనసాగిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. -
కూరగాయల సాగు బహుబాగు
జనగామ రూరల్: జిల్లాలో కూరగాయల సాగు ప్రోత్సాహానికి ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేసి మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా కేంద్ర వంటశాలలకు సరఫరా చేసేందుకు జిల్లాలో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈనెల 20వ తేదీ వరకు జిల్లా బృందాలు క్షేత్రస్థాయి పర్యటనలు పూర్తి చేశారు. హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్, అక్షయ పాత్ర ఫౌండేషన్, మన్నా ట్రస్ట్ ఆధ్వర్యంలో కేంద్ర వంటశాలలకు కూరగాయల సరఫరా ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఆరోగ్యకరమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందించడంతో పాటు రైతులకు స్థిరమైన మార్కెట్ కల్పించడం, పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించడం, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పించడం కార్యక్రమం ప్రధాన లక్ష్యం క్షేత్రస్థాయి పర్యటనలు జిల్లాలో ఇప్పటికే కూరగాయలు సాగు చేస్తున్న రైతులను గుర్తించడంతో పాటు, సాగునీటి వసతి, మార్కెట్ అనుసంధానం ఉన్న గ్రామాల్లో కొత్తగా కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు జిల్లా స్థాయి బృందం క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జనగామ, రఘునాథపల్లి, బచ్చన్నపేట, లింగాలఘణపురం, చిల్పూరు, జఫర్గఢ్, స్టేషన్ఘన్పూర్, నర్మెట్ట, తరిగొప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో రైతులతో సమావేశాలు పూర్తి కాగా మరో మారు ఈనెల 27, 28 తేదీల్లో గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించనున్నారు. స్థిరమైన మార్కెట్, మెరుగైన ధరలు కేంద్ర వంటశాలలకు అవసరమైన కూరగాయలను మహిళా స్వయం సహాయక సంఘాల సేకరణ కేంద్రాల ద్వారా రైతుల నుంచి నేరుగా సేకరించి సరఫరా చేయనున్నారు. మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించి, రైతులకు మెరుగైన ధరలు లభించేలా చర్యలు తీసుకోనున్నారు. రైతులు కూరగాయలు సరఫరా చేసిన 2–3 రోజుల్లోనే సత్వరం చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వ పథకాల అనుసంధానం కూరగాయల సాగుకు ముందుకు వచ్చే ప్రతీ రైతు వివరాలను సేకరించి, వారికి అవసరమైన విత్తనాలు, నారు, డ్రిప్, స్ప్రింక్లర్లు, శాశ్వత పందిళ్లు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు, మల్చింగ్, ప్లాస్టిక్ క్రేట్లు, వర్మీ బెడ్లు, జీవ ఎరువులు, జీవ పురుగుమందులు తదితర అవసరాలను నమోదు చేయనున్నారు. ఎంఐడీహెచ్, ఆర్కేవీవై, పీఎండీసీ, ర్యాడ్, పథకాలను ఉద్యానవన శాఖ పథకాలతో అనుసంధానం చేసి, అందుబాటులో ఉన్న సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలను ప్రాధాన్యంతో కల్పించేందుకు చర్యలు తీసుకుంటారు. మహిళా సంఘాలకు బాధ్యతలు కూరగాయల సేకరణ, గ్రేడింగ్, సార్టింగ్, రవాణా వంటి పోస్ట్ హార్వెస్ట్ కార్యకలాపాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషించనున్నాయి. కేంద్ర వంటశాలలకు అవసరమైన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కూరగాయలను నిర్వహించేలా మహిళా సంఘాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రైతుల నుంచి సేకరణ కేంద్రాలకు, అక్కడి నుంచి కేంద్ర వంటశాలలకు కూరగాయల రవాణా కోసం వాహనాల మ్యాపింగ్ను కూడా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం అమలుకు జిల్లా స్థాయి బృందాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి చైర్మన్గా, జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమల శాఖ అధికారి కన్వీనర్గా వ్యవహరించనున్నారు. అదనపు కలెక్టర్ పర్యవేక్షణలో పనిచేస్తుంది. ప్రభుత్వ పథకాలతో అనుసంధానం రైతులకు స్థిరమైన ఆదాయం, సత్వర చెల్లింపులు మహిళా సంఘాల ద్వారా కేంద్ర వంటశాలలకు సరఫరా జిల్లాస్థాయి బృందం ఏర్పాటు కొనసాగుతున్న క్షేత్రస్థాయి పర్యటనలు -
పంటలకు కాసింత ఊపిరి
జనగామ: జిల్లాలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కురిసిన ముసురు రైతుల్లో ఆశలు నింపింది. భూగర్భ జలాలు అడుగంటడంతో వానాకాలంలో సాగు చేసిన మొక్కజొన్న, పత్తి తదితర పంటలకు సాగునీరు అందక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆదివారం కురిసిన చిరు జల్లులు పత్తి, వరి పంటలకు కొంత ఊరటనిచ్చాయి. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు బచ్చన్నపేట మండలం పడమటికేశ్వాపూర్లో అత్యధికంగా 15.3 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. వడ్లకొండలో 9.0, బచ్చన్నపేట, జనగామలో 7.5, లింగాలఘణపురంలో 6.0, దేవరుప్పులలో 5.3, పాలకుర్తి, కొడకండ్లలో 5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జఫర్గఢ్లో 1.5, గూడూరు, మల్కాపూర్లో 1 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముసురు ఇలాగే కొనసాగితే పంటలకు మరింత ప్రయోజనం ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
రౌడీషీటర్లపై నిరంతర నిఘా
వరంగల్ క్రైం: పోలీస్ స్టేషన్ పరిధి రౌడీషీటర్ల వ్యవహార శైలిపై అధికారులు నిరంతరం నిఘా పెట్టాలని పోలీస్ కమిషనర్ శ్వేత ఆదేశించారు. నెలవారీ నేర సమీక్ష కమిషనరేట్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ శ్వేత మాట్లాడారు. నేర నియంత్రణలో భాగంగా ప్రతీ పోలీస్ అధికారి నిరంతరం శ్రమించాల్సి ఉంటోందని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడంతో పాటు వారి సమస్యలపై తక్షణమే స్పందించాలని చెప్పారు. అనంతరం పెండింగ్ కేసులకు సంబంధించి నిందితుల అరెస్ట్లు, కేసుల దర్యాప్తు, కోర్టులో ఉన్న కేసుల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీసీపీలు అంకిత్కుమార్, దారా కవిత, రాజమహేంద్ర నాయక్, కిషన్సింగ్, అదనపు డీసీపీలు సురేశ్ కుమార్, బాలస్వామితో పాటు ఏసీపీలు, పోలీస్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. కుసుంబాయితండాలో సంపూర్ణ మద్య నిషేధం రఘునాథపల్లి: మండలంలోని కుసుంబాయితండాను మద్యరహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడ్డాయి. శనివారం సర్పంచ్ కొర్ర స్వరూపరాజేందర్నాయక్ అధ్యక్షతన జరిగిన గ్రామ పంచాయతీ సమావేశంలో గ్రామంలో గుడుంబా, మద్యం విక్రయాలను నిషేధిస్తున్నట్లు పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎవరైనా గ్రామంలో గుడుంబా, మద్యం విక్రయిస్తే రూ.10 వేల జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా జేఏసీ నూతన కార్యవర్గం ఏర్పాటు జనగామ: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ జేఏసీ జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు తొట్ల రాఘవేంద్ర ముదిరాజ్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా బోగా రామ్దయాకర్, ఉపాధ్యక్షులుగా మచ్చ బాలనరసయ్య, కడకంచి మధుసూదన్, పాముకుంట్ల కృష్ణమూర్తి, తుపాకుల బాలనారాయణ, ప్రధాన కార్యదర్శిగా పన్నీరు సత్యం, సహాయ కార్యదర్శులుగా దుర్గం సందీప్కుమార్, మిద్యపాక రాజు, కోశాధికారిగా కోలపూరి రవి, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా బత్తిని నరసింహులు, గాడిపెళ్లి కిషోర్ కుమార్, చింతల చంద్రమోహన్ను నియమించారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులు జనగామ రూరల్: జిల్లాలో 2026 విద్యాసంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి గల ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. తమ దరఖాస్తులను సంబంధిత మండల విద్యాధికారి, ప్రధానోపాధ్యాయుడి ధ్రువీకరణ పత్రంతో పాటు సంబంధిత సర్టిఫికెట్లతో ఈనెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు కలెక్టరేట్లోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. నాన్టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి జనగామ రూరల్: జిల్లాలోని ఆదర్శ పాఠశాల బాలిక వసతి గృహాల్లో రెండు నాన్టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బచ్చన్నపేట మండలంలో 1 అసిస్టెంట్ కుక్ పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణ ఉండాలని, నెలకు రూ.6500 వేతనం ఉంటుందన్నారు. రఘునాథపల్లి ఆద ర్శ పాఠశాలలో ఒక వాచ్ఉమెన్ పోస్టు ఖాళీ ఉందని, టెన్త్ ఉత్తీర్ణత ఉండాలన్నారు. నెలకు రూ.8,710 వేతనం ఉంటుందన్నారు. దరఖాస్తులు ఈనెల 24నుంచి 27 వరకు అందించాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికకు 30న కలెక్టరేట్లో పరీక్ష ఉంటుందన్నారు. కేజీబీవీల్లో 9 పోస్టులు.. జిల్లాలోని కస్తూర్బా విద్యాలయాల్లో 9 నాన్–టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. నెల వేతనం రూ.9,750 ఉంటుందని హెడ్ కుక్, అటెండర్కు 10వ తరగతి, అసిస్టెంట్ కుక్, స్వీపర్కు 7వ తరగతి. స్థానిక మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. 24నుంచి 27సాయంత్రం వరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, 30న ఉదయం 10.30 పరీక్ష ఉంటుదన్నారు. చిల్పూర్లో ఒక స్వీపర్ పోస్టు, నర్మెట లో రెండు స్వీపర్, పాలకుర్తిలో 1 హెడ్ కుక్, కొడకండ్లలో 1 అటెండర్, జనగామలో 1 హెడ్ కుక్, 1అసిస్టెంట్ కుక్, 1 స్వీపర్ పోస్టు, బచ్చన్నపేటలో అసిస్టెంట్ కుక్ ఖాళీగా ఉన్నాయన్నారు. -
కమ్ముకొచ్చిన శ్రావణ మేఘాలు.. ఆకాశం అక్షింతలు వేసినట్లుగా రాలే చినుకులు.. పచ్చని పైర్లు.. చల్లని గాలులు.. నేలమ్మ కొప్పులో ఎర్రని మందారాలు పెట్టినట్లుగా అగుపించే ఆరుద్ర పురుగులు.. ఇవన్నీ బంజారా యువతుల మనస్సులోని కోర్కెలు నెరవేర్చే ప్రకృతి సూచకాలు. వీటన్నింట
తీజ్ వేడుకల్లో నిర్వహించే ప్రతీ ఘట్టం ఆకట్టుకుంటుంది. వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనిగలకు యువతలు రేగుముళ్లు గుచ్చుతారు. ఎంతో నిష్టతో చేసే ఈ ప్రక్రియను బావ వరుస ఉన్న వారు కన్నెపిల్ల మనస్సు చెదిరేలా కదిలి స్తూ ఉంటారు. అప్పుడు రేగుముళ్లు శనిగలకు కాకుండా వారి చేతికి కూడా గుచ్చుకుంటాయి. దీన్ని భరిస్తూ రేగుముళ్లు శనిగలకు గుచ్చడం ఈ తంతు ప్రత్యేకత. ఏడోరోజు ఢమోళీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఢమోళీ చుర్మో (రొట్టెలు, బెల్లం కలిపిన ముద్ద)ను మేరామా భవానీకి నైవేధ్యం పెడతారు. ఎనిమిదో రోజు మట్టితో బంజారా ఆరాధ్య దైవాల ప్రతిరూపాలు తయారు చేస్తారు. అబ్బాయి (డోక్రా), అమ్మాయి (డోక్రీ)లుగా పేర్లు పెడతారు. వీటికి గిరిజన సంప్రదాయాల ప్రకారం పూజ చేస్తారు. తొమ్మిదో రోజు డప్పుచప్పుళ్లు, గిరిజన నృత్యాలతో అంద రూ బుట్టలవద్దకు వెళ్తారు. అక్కడికి తండా నాయక్ వచ్చి యువతులకు బుట్టలిస్తారు. ఈసందర్భంగా అన్నదమ్ములు, అక్కాచెళ్లెళ్ల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకుంటారు.భోగ్ వద్ద తీజ్ బుట్టలతో యువతులు -
గిరిజన తండాల్లో యువతుల సందడే సందడి
●సాక్షి, మహబూబాబాద్: బంజారా యువతులు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్. తీజ్ అంటే గోధుమ నారు. ప్రకృతి శ్రావణంలో వర్షాలు కురిసి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఈ సీజన్లో కనిపించే ఎర్రని వర్ణం గల ఆరుద్ర పురుగులను కూడా తీజ్ అని పిలుస్తారు. అంతటి అందమైన పురుగులను దేవుడు మనకోసమే కిందికి పంపిస్తాడని, ఈ పురుగులు కనిపించినప్పుడు యువతులు మనస్సులో కోరుకున్న కోరిక ఫలిస్తుందనేది గిరిజనుల నమ్మకం. ఈనేపథ్యంలో గోధుమలు బుట్టల్లో అలికి రోజూ నీళ్లు పోస్తే ఆరుద్ర పురుగులాంటి అందం, మంచి నడవడిక, బుద్ధి, సంపదలతో కూడిన వరుడు దొరుకుతాడని గిరిజనులు నమ్ముతారు. ఈనమ్మకం వందల ఏళ్ల కిందట మొదలై రోజురోజుకూ ఆధునిక హంగులు అద్దుకుంటోంది. తొమ్మిది రోజుల తంతు పెళ్లీడుకు వచ్చిన యువతి తనకు కావాల్సిన పెళ్లికొడుకు కోసం చేసే ఈ పండుగలో ముందుగా తల్లిదండ్రులు, తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. ముఖ్యంగా తండా పెద్ద నాయక్ అనుమతి పొందిన తర్వాత పండుగ తంతు మొదలు పెడతారు. తీజ్ (గోధుమ మొలకలు) ఏపుగా పెరిగేందుకు ఆడపిల్లలు అడవికి వెళ్లి దుస్సేరు (ఫిలోణీర్ వేళ్లీ) తెస్తారు. ఈ తీగలతో అందమైన బుట్టలను అల్లుతారు. లంబాడీల ఆరాధ్య దైవం తుల్జా భవానీ, సేవాలాల్ మహరాజ్, సీత్లాభవానీలకు పూజలు చేసి స్నానాలు ఆచరించి పవిత్రతతో పుట్టమట్టిని తెస్తారు. లంబాడీ భాషలో బోరడీ ఝుష్కేరో అంటే రేగుముళ్లు గుచ్చడం. గోధుమబుట్టల్లోని నారుకు నీరు పోస్తున్న యువతి గోధుమ నారు పెంచి.. కోరుకున్న వరుడి కోసం పూజలు ఉమ్మడి జిల్లాలో బంజారాల సంబురం నూతన అలంకరణలతో ఉత్సవం -
వనభోజనాలకు వెళ్లి.. అనంతలోకాలకు..
జనగామ/చిల్పూరు : కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలకు వెళ్లిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మల్లన్న గండి రిజర్వాయర్లో ఈతకు దిగి ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాడు. అతడిని కాపాడేందుకు యత్నించిన ఇద్దరు బంధువులు సైతం ప్రమాదంలో చిక్కుకున్నప్పటికీ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. జిల్లాలోని చిల్పూరు మండలం గార్లగడ్డ జీపీ శివారు మల్లన్న గండి(రిజర్వాయర్) వద్ద శనివారం చోటు చేసుకున్న ఈ విషాద ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. జిల్లాలోని దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఎండీ ఖలీల్, పర్వీన్దంపతులకు కుమార్తె, కుమారుడు నజీర్ (22) ఉన్నారు. ఖలీల్ జనగామలోని సెయింట్ పాల్స్ ప్రైవేట్ పాఠశాలలో హిందీ పండిట్గా పని చేస్తున్నారు. కుమారుడు నజీర్ హైదరాబాద్ ఘట్కేసర్లోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. నజీర్ అక్క కుటుంబం జనగామ మండలం శామీర్పేటలో నివసిస్తోంది. అక్క కూతురు పుట్టిన రోజు వేడుక కోసం ఈ నెల 21న నజీర్ తన బంధువులతో కలిసి శామీర్పేటకు వచ్చాడు. పుట్టిన రోజు వేడుకలు ముగిసిన అనంతరం శనివారం కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి సుమారు 20 మంది వనభోజనాల కోసం చిల్పూరు మండలం గార్లగడ్డ శివారు మల్లన్న గండి రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. కుటుంబ సభ్యులంతా సరదాగా గడుపుతున్న సమయంలో సుమారు ఎనిమిది మంది నీటిలో ఈతకు దిగారు. అదే సమయంలో నజీర్, అతడి బావ యాకూబ్ పాషా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. నజీర్ను గమనించిన బంధువు, హైదరాబాద్ అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న సమీర్ వెంటనే అతడిని కాపాడేందుకు ప్రయత్నించాడు. అయితే నీటి ప్రవాహం తీవ్రంగా ఉండడంతో చేయి పట్టు జారిపోయింది. దీంతో నజీర్ నీటిలో కొట్టుకుపోవడంతో సమీర్ కూడా అతడిని కాపాడేందుకు నీటిలోకి దూకాడు. అయితే ప్రవాహం ఉధృతంగా ఉండటంతో సమీర్ కూడా అదుపుతప్పి కొట్టుకు పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మధ్యలో ఉన్న ఓ ఇనుప రాడ్డును చాకచక్యంగా పట్టుకుని సమీర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మరోవైపు యాకూబ్ పాషా(హైదరాబాద్లో చెఫ్) కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా సమీపంలో ఉన్న బంధువు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన ఎండీ అబ్బు అతడిని అతికష్టం మీద కాపాడాడు. దీంతో యాకూబ్ పాషా, సమీర్ ఇద్దరూ ప్రాణాలతో బయటపడగా నజీర్ మాత్రం నీటిలో గల్లంతయ్యాడు. నజీర్ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు సుమారు అరగంట పాటు గాలించారు. చివరకు నీటిలో అతడి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసుకొచ్చారు. వెంటనే సీపీఆర్ చేసి ప్రాణం కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అనంతరం నజీర్ను జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కళ్లముందే బావమరిది మృతి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన యాకూబ్ పాషా కళ్లముందే బా వమరిది నజీర్ నీటిలో కొట్టుకుపోయి మృతి చెందడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. నజీర్ను కాపాడే ప్రయత్నంలో తాను సైతం ప్రమాదంలో చిక్కుకున్న సమీర్ ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందాడు. కుటుంబ సభ్యులు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు.మల్లన్నగండిలో మునిగి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి ఇద్దరికి త్రుటిలో తప్పిన ప్రమాదం బావమరిది నజీర్ను కాపాడేందుకు బావ సాహసం యాకూబ్పాషాను కాపాడిన అబ్బు అరగంట గాలింపు.. చివరికి మృతదేహం లభ్యంఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు కోడలు పుట్టినరోజు వేడుకలకు వచ్చి కుటుంబీకులతో ఆనందంగా గడిపిన నజీర్ తిరిగి ఇంటికి చేరకుండానే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు ఖలీల్, పర్వీన్దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ప్రమాదకర జలాశయాల్లో అప్రమత్తత అవసరంమల్లన్న గండి వంటి నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలకు విహారయాత్రలు, వన భోజనాల కోసం వెళ్లే సమయంలో ఈతకు దిగకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. నీటి లోతు, ప్రవాహ తీవ్రత తెలియని ప్రాంతాల్లో సరదా కోసం నీటిలోకి దిగడం ప్రాణాలకే ముప్పుగా మారే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. -
పంటకు పొడి ముప్పు
జనగామ: ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా జూలై, ఆగస్టు నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో రైతులు పంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జనగామ రైతు విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ వి.రమ్య సూచించారు. ప్రస్తుత వర్షభావ పరిస్థితుల్లో ఆమె రైతులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 247.4 మి.మీ. వర్షపాతం నమోదై, సాధారణ వర్షపాతంతో పోలిస్తే 43.2 శాతం లోటు ఉన్నట్లు తెలిపారు. పొడి వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తేమ సంరక్షణ, సమతుల్య పోషక యాజమాన్యం, కలుపు, చీడపీడల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వరి నార్లు పోయని రైతులు ప్రస్తుతం వెదజల్లే లేదా డ్రమ్సీడర్ పద్ధతిలో వరి సాగు చేసుకోవచ్చన్నారు. ముదురు నారు నాటాల్సి వస్తే మొక్కల మధ్య దూరాన్ని తగ్గించి దగ్గరగా నాట్లు వేయాలని తెలిపారు. వర్షాధారంగా సాగు చేస్తున్న మొక్కజొన్నలో నీటి కొరతతో ఆకులు ముడుచుకోవడం, మొక్క ఎదుగుదల తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే సకాలంలో నీరు అందించాలన్నారు. నీటి ఎద్దడి ఉన్నప్పుడు యూరియా 2 శాతం ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా బెట్ట పరిస్థితులను కొంతవరకు తట్టుకోవచ్చని తెలిపారు. వర్షాభావం తర్వాత వర్షాలు కురిసినప్పుడు ఎకరాకు 25 కిలోల యూరియాను అదనంగా వేయడం ద్వారా పంట దిగుబడిని పెంచుకోవచ్చన్నారు. కందిపంట ప్రస్తుతం 20 నుంచి 40 రోజుల దశలో ఉందని, తొలి 60 రోజులు కలుపు లేకుండా చూసుకోవడం కీలకమన్నారు. పెసర, మినుము పంటల్లో చిన్న దశలోనే కలుపు నివారణకు అంతరకృషి చేపట్టాలని, పూత దశలో బెట్ట పరిస్థితులు ఏర్పడితే పొటాషియం నైట్రేట్ లేదా 19:19:19 ద్రావణాన్ని ఆకులపై పిచికారీ చేయాలని తెలిపారు. రైతులు పంటలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులను మార్చుకోవాలని సూచించారు. జిల్లాలో 43.2 శాతం వర్షపాతం లోటు పంటల రక్షించుకోవడంలో రైతుల అప్రమత్తంగా ఉండాలి రైతు విజ్ఞాన కేంద్రంకోఆర్డినేటర్ డాక్టర్ వి.రమ్య -
ఉద్యోగుల ఐక్యతకు టీఎన్జీఓస్ జెండా ప్రతీక
జనగామ: ఉద్యోగుల ఐక్యత, హక్కుల సాధనకు టీఎన్జీఓస్ జెండా ప్రతీకగా నిలుస్తుందని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు కాజా షరీఫ్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓస్ భవన్లో సంఘం అధికారిక జెండా, కండువా, ‘ఉద్యోగ గొంతుక’ మాసపత్రికను రాష్ట్ర నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు కాజా షరీఫ్ మాట్లాడుతూ.. ఉద్యోగుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఉద్యోగ గొంతుక మాసపత్రిక కీలక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పెండల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేర్వారం ప్రభాకర్తో పాటు హఫీజ్ చందర్, రమేష్, రాజేశ్, మహేష్, రామనర్సయ్య, నాగార్జున, యశోద, స్టెల్లా, సంపూర్ణ, లక్ష్మి, లావణ్య, అరుణ, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. -
మణికంఠ రైస్మిల్లులో రూ.7కోట్ల అక్రమాలు
● పోలీసు ఫిర్యాదుకు సివిల్ సప్లయ్ అధికారుల సిద్ధం లింగాలఘణపురం: మండలంలోని నెల్లుట్ల పరిధిలో గల మణికంఠ ఆగ్రో ఇండస్ట్రీస్లో సుమారు రూ.7 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. రెండేళ్లుగా సాగుతున్న మిల్లర్ల అక్రమాలపై ప్రభుత్వ సీరియస్గా ఉండడం, సీఎం రేవంత్రెడ్డి సీఎంఆర్ ధాన్యంలో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయడంతో సివిల్ సప్లయ్ అధికారులు చర్యలు తీసుకొనేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మణికంఠ రైస్ మిల్లులో 2022–2023లోనే 1,526.970 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా అక్రమాలకు పాల్పడగా 2025లో అడిషనల్ కలెక్టర్ నోటిసులు జారీ చేశారు. తిరిగి 2023–2024లో కూడా మళ్లీ సివిల్ సప్లయ్ అధికారులు సీఎంఆర్ ధాన్యం అదే మిల్లుకు కేటాయించడం, మళ్లీ ప్రభుత్వానికి బి య్యం అప్పగించకుండా ప్రైవేట్కు విక్రయించుకొ ని అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. దీంతో రూ.7 కోట్లకు పైగా దందా జరిగినట్లు సివిల్ సప్లయ్ అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమా చా రం. ఈ విషయంపై సివిల్ సప్లయ్ డీఎం హతీ రామ్ను వివరణ కోరగా ఇంకా లెక్కలు తేలలేదని, రూ.7 కోట్ల వరకు ఉంటుందని, పూర్తిగా పరిశీలించిన అనంతరం ఫిర్యాదు చేస్తామని వివరించారు. -
ఓవర్ టు ఢిల్లీ..!
● సురేఖ వివరణపై సంతృప్తి చెందని పీసీసీ.. ఏఐసీసీకి ‘క్రమశిక్షణ’ నివేదిక ● సీఎల్పీలో అత్యవసరంగా భేటీ అయిన ఉమ్మడి వరంగల్ నేతలు ● మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల డిమాండ్ ● అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠసాక్షి ప్రతినిధి, వరంగల్ : పరకాల రాజకీయంతో ఓరుగల్లు కాంగ్రెస్లో మొదలైన విభేదాలు.. మంత్రి కొండా సురేఖ కుటుంబం, సీఎం రేవంత్రెడ్డి మధ్య బహిరంగ విమర్శలకు దారితీసి.. ఇప్పుడు ఏఐసీసీ పరిశీలనకు చేరాయి. సురేఖ కుమార్తె సుస్మిత.. సీఎం రేవంత్రెడ్డి, ఆయన కుటుంబం, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిపై చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి ఆమె ఇచ్చిన వివరణపై కమిటీ సంతృప్తి చెందకపోవడంతో పరిస్థితిని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో సీఎల్పీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సమావేశమై సురేఖపై చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. కూతురు వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. ఈ నెల 19న గీసుకొండలో జరిగిన మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్లో చర్చనీయాంశమయ్యాయి. అభ్యర్థిత్వాలను నిర్ణయించేది పార్టీ అధిష్టానమే అయినప్పుడు పరకాల సభలో సీఎం.. రేవూరి ప్రకాశ్రెడ్డిని ఎలా ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు. గతంలో రేవంత్రెడ్డి తమ కుటుంబానికి ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారి తీశాయి. ముఖ్యమంత్రి, సొంత పార్టీ ఎమ్మెల్యేపై బహిరంగ వేదికనుంచి ఈ స్థాయిలో విమర్శలు రావడాన్ని పీసీసీ నాయకత్వం తీవ్రంగా పరిగణించి నోటీసు జారీ చేసింది. మంత్రి వివరణపై సంతృప్తి చెందని కమిటీ.. చల్లారని పంచాయితీ సుస్మిత వ్యాఖ్యలకు మంత్రి సురేఖను బాధ్యురాలిగా పరిగణించిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ.. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంత్రి ఇచ్చిన సమాధానంతో సమస్యకు తెరపడలేదు. కూతురు వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సముచితం కాదని పేర్కొంటూ.. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని కోరడం మరింత వివాదానికి దారి తీసింది. ఈ తంతు కొనసాగుతుండగానే హైదరాబాద్లోని సీఎల్పీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ సారయ్య తదితరులు సురేఖ కుటుంబ రాజకీయ వ్యవహారశైలిని తప్పుబట్టారు. సదరు నేతలు వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణకే పరిమితం చేయకుండా.. మంత్రి పదవి అంశాన్ని కూడా ముందుకుతెచ్చి సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించడంతోపాటు పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీకి నష్టం కలిగించే వ్యవహారాలపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ తలెత్తే అవకాశం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ అంశంపై ఆరా తీసినట్లు పార్టీ వర్గాల సమాచారం. హైకమాండ్ వద్దకు ‘హస్తం’ పేచీ.. ఇప్పటికే షోకాజ్ నోటీసు, మంత్రి వివరణ, సీఎల్పీలో నేతల సమావేశం, చర్యలకు డిమాండ్.. ఇలా వరుస పరిణామాలు చోటుచేసుకోవడంతో బంతి ఇప్పుడు అధిష్టానం కోర్టులోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో మంత్రి సురేఖపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటారా? మంత్రి పదవినుంచి తొలగించాలన్న డిమాండ్పై హైకమాండ్ ఎలా స్పందిస్తుంది? పరకాల టికెట్ విషయంలో రేవూరి ప్రకాశ్రెడ్డి అభ్యర్థిత్వంపై సీఎం చేసిన ప్రకటనకు అధిష్టానం మద్దతిస్తుందా? కొండా కుటుంబంతో రాష్ట్ర నాయకత్వం భవిష్యత్తులో ఏ విధంగా వ్యవహరిస్తుంది? అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. మొత్తానికి ఓరుగల్లు నుంచి కాంగ్రెస్లో మొదలైన పంచాయితీ.. సీఎల్పీకి చేరి.. అక్కడినుంచి టీపీసీసీ దాటి ఏఐసీసీ గడప తొక్కింది. ఇక ఈ వివాదానికి ముగింపు ఎలా పలుకుతారన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠగా మారింది. త్వరలో మీడియా ముందుకు సురేఖ? ఇదిలా ఉండగా.. శుక్రవారం హైదరాబాద్లో తనను కలిసిన మీడియాతో కొండా సురేఖ చిట్చాట్ చేశారు. ‘తన ఇంట్లో ప్రత్యేక పూజ జరుగుతున్నందున బిజీగా ఉన్నాను. చెప్పాల్సినవి గురువారమే చెప్పాను. త్వరలోనే మీడియాతో మాట్లాడుతాను’ అని పేర్కొన్నారు. దీంతో ఒకటి, రెండు రోజుల్లో సురేఖ మీడియా ముందుకు వచ్చి తాజా వివాదంపై పూర్తిస్థాయిలో స్పందించే అవకాశం ఉందని తన అనుచరవర్గాలు తెలుపుతున్నాయి.ఏఐసీసీకి చేరిన ఓరుగల్లు కాంగ్రెస్ పంచాయితీ -
ఘాటెక్కిన ఉల్లి.. చేదెక్కిన చక్కెర
● ఉల్లిగడ్డ కిలో రూ.60.. చక్కెర కిలో రూ.70 ● ధరల మంటతో సామాన్యుల బెంబేలుజనగామ: సామాన్యులపై నిత్యావసర సరుకుల ధరల భారం మరింత పెరుగుతోంది. నిత్యం వినియోగించే చక్కెర, ఉల్లిగడ్డ ధరలు ఒక్కసారిగా పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో ఉల్లిగడ్డ ధర కిలోకు రూ.25 నుంచి రూ.60కు చేరగా, చక్కెర ధర రూ.40 నుంచి రూ.70కు పెరిగింది. దీంతో ఉల్లిగడ్డపై రూ.35, చక్కెరపై రూ.30 మేర భారం పడింది. ఇటీవల కొద్ది రోజుల వ్యవధిలోనే ధరలు వేగంగా పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఉదయం ఒక రేటు...సాయంత్రం మరో ధర మార్కెట్లో ఉదయం ఉన్న ధర సాయంత్రానికి మారుతున్న పరిస్థితి నెలకొందని వ్యాపారులు చెబు తున్నారు. గతంలో కిలోకు కొద్దిపాటి పెరుగుదల కనిపించేది. ప్రస్తుతం ఒకేసారి రూ.10, రూ.20 చొప్పున ధరలు పెరుగుతుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఒక్కసారిగా పెరుగుతున్న నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు హోల్సేల్, రిటైల్ మార్కెట్లలో తనిఖీలు నిర్వహించి నిల్వలు, కొనుగోలు ధరలు, విక్రయ ధరలను పరిశీలించాలని వినియోగదారులు కోరుతున్నారు. కాగా చక్కెరను సబ్సిడీతో రేషన్ దుకాణాల్లో తెల్లకార్డుల లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. గానుగుపహడ్లో మద్యపాన నిషేధంజనగామ రూరల్: మండలంలోని గానుగుపహడ్ గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసేందుకు తీర్మానించినట్లు సర్పంచ్ శానబోయిన అనూష మహిపాల్ తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ..వచ్చే నెల 10వ తేదీలోగా గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తూ తీర్మానం చేశామని, గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ.50వేల జరిమానాతో పాటు పథకాలు రద్దు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఉపసర్పంచ్ కొర్ర శంకర్, వార్డు సభ్యుడు కాల్రాం తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల నిరసన ర్యాలీ
జనగామ: నల్లగొండలో పాఠశాల విద్యార్థుల చేతిలో హత్యకు గురైన ప్రైవేట్ పాఠశాల ప్రి న్సిపాల్ రూపారెడ్డికి సంఘీభావంగా జిల్లా కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు(ట్రస్మా) ఆద్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు పప్పు వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. నెహ్రూపార్కు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నల్లబ్యాడ్జీలు ధరించి, ఫ్లకార్డులు, బ్యానర్లతో ర్యాలీ నిర్వహించారు. ‘సేవ్ టీచర్స్–సే వ్ ఎడ్యుకేషన్’ అంటూ నినదించారు. కార్యక్రమంలో ఏకశిల పబ్లిక్ స్కూల్ సెక్రెటరీ చిర్ర ఉపేందర్రెడ్డి, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పోస్టల్ పెన్షనర్లకు పెన్షన్ అదాలత్ జనగామ: పోస్టల్ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి 9వ ప్రాంతీయ పోస్టల్ పెన్షన్ అదాలత్ నిర్వహించనున్నట్లు హనుమకొండ పోస్టల్ శాఖ డివిజన్ సూపరింటెండెంట్ కె.శివాజీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెన్షన్, కుటుంబ పెన్షన్, పెన్షన్ బకాయిలు, ఇతర సంబంధిత సమస్యలపై పెన్షనర్లు తమ ఫిర్యాదులను అదాలత్లో పరిష్కరించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన 9వ ప్రాంతీయ పోస్టల్ పెన్షన్న్ అదాలత్ను సెప్టెంబర్ 22న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గూగుల్ మీట్ వేదికగా జరిగే ఈ అదాలత్లో పెన్షనర్లు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చన్నారు. ఫిర్యాదులను స్వీకరించేందుకు సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 5.45 గంటల వరకు గడువు విధించినట్లు చెప్పారు. పెన్షనర్లు తమ ఫిర్యాదులను హైదరాబాద్లోని అబిడ్స్ డాక్ సదన్న్ ఐదో అంతస్తులో ఉన్న తెలంగాణ సర్కిల్, హైదరాబాద్ రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్ కార్యాలయంలోని సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (ఐఎఫ్ఏ)కు పంపించాలి. కవర్పై పోస్టల్ పెన్షన్ అడల్ట్ ఆఫ్ హైదరాబాద్ రీజి యన్ అని పేర్కొనాలని సూచించారు. అలాగే aoifa.hydera bad@indiapost.gov.in ఈమెయిల్ అడ్రస్కు కూడా సెప్టెంబర్ 7లోపు ఫిర్యాదులు పంపవచ్చని తెలిపారు.జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు జనగామ రూరల్: పట్టణంలోని స్థానిక మినీ స్టేడియంలో శుక్రవారం జిల్లా స్థాయి 14, 16, 18 20 ఏళ్ల బాలబాలికల అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించారు. దాదాపు 700 మంది క్రీడాకారులు పాల్గొన్నారు, ఎంపికై న క్రీడాకారులు ఈనెల 26, 27 తేదీలలో స్థానిక జేఎన్ స్టేడియం హనుమకొండలో జరిగే 12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్ తెలియజేశారు. 700 మంది క్రీడాకారులు పాల్గొనడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి గంగిశెట్టి మనోజ్ కుమార్, కోశాధికారి ఆవుల అశోక్, కార్యదర్శి వంచా చంద్రశేఖర్ రెడ్డి, అసోసియేషన్ బాధ్యులు రంజిత్ రవీంద్ర ప్రసాద్ సుధారాణి, దిలీప్ కుమార్, అశోక్ పాల్గొన్నారు. నీటి సంరక్షణ పనుల పరిశీలన స్టేషన్ఘన్పూర్: మండలంలోని రాఘవాపూర్, నమిలిగొండ, విశ్వనాధఫురం, ఇప్పగూడెం, సముద్రాల గ్రామాల్లో చేపట్టిన నీటి సంరక్షణ పనులను సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ సైంటిస్ట్ డాక్టర్ సర్తాజ్బాషా ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో చేపట్టిన చెక్డ్యామ్, ఇంకుడుగుంత, తక్కువ ధరతో చేపట్టిన సోప్కిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సైంటిస్ట్ మాట్లాడుతూ.. జల సంచాయ్ జల భాగ్యధారి పథకం కోసం జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి 30వేలకు పైచిలుకు ఫొటోలు అప్లోడ్ చేయగా అందులో ఒక్క శాతం పనులను రాండమ్గా పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా డీఆర్డీఓ కార్యాలయ నోడల్ అధికారి శ్రీనివాస్రెడ్డి, ఎంపీఓ శ్రీనాధ్రెడ్డి, ఏపీఎం ప్రేమయ్య, సర్పంచ్లు పురమాని కోమల ఐలోని, గుర్రం యాదమ్మఎల్లయ్య, మందపురం రాణిఅనీల్గౌడ్, బి.యాదగిరి, ఫీల్డ్ అసిస్టెంట్ మందపురం కవితఎల్లగౌడ్, పంచాయతీ కార్యదర్శులు పవన్, యుగేందర్, వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమంలో కీలక పథకం..
రాష్ట్రంలో రైతు బీమా పథకానికి 2018 ఆగస్టు 15న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతు కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి అకాల మరణానికి గురైతే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడకుండా తక్షణ సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించే విధంగా పథకాన్ని అమలు చేశారు. బీమా పరిధిలో ఉన్న రైతు సహజ లేదా ప్రమాదవశాత్తు మరణించినప్పుడు నామినీకి రూ.5 లక్షల పరిహారం అందుతుంది. పథకం ప్రారంభమైన నాటి నుంచి ఏటా రెన్యువల్ చేస్తూ అమలు చేస్తున్నారు. రైతు కుటుంబాలకు అత్యవసర సమయంలో ఆర్థిక భరోసా కల్పించడంతో రైతు బీమా రాష్ట్రంలోని కీలక సంక్షేమ పథకాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కీంకు సంబంధించి రెన్యువల్ విషయంలో తాత్సారం చేస్తుండడంపై సందిగ్ధత నెలకొంది.జనగామ: రైతు కుటుంబాలకు అండగా నిలిచే రైతు బీమా పథకం రెన్యువల్పై స్పష్టత లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ నెల 13తో రైతు బీమా రెన్యువల్ గడువు ముగిసినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రెన్యువల్ ప్రక్రియపై స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. దీంతో పథకం కొనసాగుతుందా.. రెన్యువల్ ఎప్పుడు చేస్తారు.. ప్రస్తుత కాలంలో రైతు అకాల మరణానికి గురైతే బీమా వర్తిస్తుందా? అనే సందేహాలు రైతు కుటుంబాలను వేధిస్తున్నాయి. వారం దాటుతున్నా.. రైతు బీమా రెన్యువల్ గడువు ముగిసి వారం రోజులు దాటుతున్నా ప్రభుత్వం నుంచి ప్రక్రియపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రెన్యువల్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పథకం అమలుపై స్పష్టత ఉంటుంది. అయితే ఈసారి గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోవడంతో అయోమయం నెలకొంది. అకాల మరణం జరిగితే పరిహారం ఎలా? రెన్యువల్ పూర్తికాకముందే ఏదైనా అనుకోని ఘట నలో రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే అంశంపై వివిధ రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. రైతు బీమా కొనసాగింపుపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. రైతు బీమా రెన్యువల్ చేస్తామని ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన హామీ లేదా ప్రకటన రాకపోవడంతో పథకం భవిష్యత్తుపైనా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం వెంటనే రెన్యువల్ ప్రక్రియపై నిర్ణయం ప్రకటించి రైతులు, వారి కుటుంబాల్లో నెలకొన్న అనిశ్చితికి తెరదించాలని వారు కోరుతున్నారు. గడువు ముగిసి వారం దాటుతున్నా స్పష్టత కరువు 1.85 లక్షల మంది రైతుల ఎదురుచూపులు బీమా రెన్యువల్ కాకుంటే పరిహారం ఎలా? అని ఆందోళనసంవత్సరం జారీచేసిన మరణాలు చెల్లింపులు ఎల్ఐసీఐడీలు (కోట్లలో) 2018 85,755 378 రూ.18.90 2019 84,777 457 రూ.22.80 2020 89,896 690 రూ.34.50 2021 98,106 554 రూ.27.70 2022 1,03,422 581 రూ.29.05 2023 1,11,815 610 రూ.30.50 2024 1,16,036 641 రూ.32.00 2025 1,16,017 560 రూ.28.00 మొత్తం 8,05,824 4,471 రూ.223 -
స్మార్ట్ కార్డులతో సజావుగా రేషన్
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి రఘునాథపల్లి: రేషన్ బియ్యం సరఫరాలో ఎలాంటి అవకతవకలకు అస్కారం లేకుండా అత్యంత భద్రతా ప్రమాణాలతో స్మార్ట్కార్డులు రూపొందించినట్లు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. శుక్రవారం ఆయన శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు ఆయన డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధిని జీర్ణించుకోలేక బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, తహసీల్దార్ రాజేష్రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్చందర్రెడ్డి, సర్పంచ్లు బొమ్మ వీరస్వామి, గైని శ్రీనివాస్, రాంచందర్, రాజశేఖర్, మోతిలాల్, కాంగ్రెస్ నాయకులు గాదె మహేందర్రెడ్డి, భాస్కర్రెడ్డి, గొరిగ రవి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు.. జఫర్గఢ్: బీఆర్ఎస్ నాయకులు పనిగట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అరోపించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో స్మార్ట్ రేషన్కార్డులను ఎమ్మెల్యే శ్రీహరి లబ్ధిదారులకు అందించారు. తహసీల్ధార్ శ్రీనివాస్, ఎంపీడీఓ దయాకర్, సర్పంచ్ కుల్లా మోహన్రావు, సింగిల్ విండో చైర్మన్ తీగల కర్ణాకర్రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, ఆర్ఐ దేవేందర్, సర్పంచ్లు, మార్కెట్ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి
జనగామ రూరల్: రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల పనులు సజావుగా కొనసాగేందుకు ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్ భూసేకరణ కోసం ప్రభుత్వం వెంటనే రూ.2,800 కోట్లు విడుదల చేసిందని, ఇందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.కొత్త ఆయకట్టు సృష్టించేందుకు వీలుగా పెండింగ్ భూసేకరణ, పునరావాస పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. వీసీలో నీటిపారుదల శాఖ ఎస్ఈ సీతారాం పాల్గొన్నారు. వీసీలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి -
17కి.మీ... 18 మూలమలుపులు
కొడకండ్ల–నాంచారిమడూరు, కొడకండ్ల–పాలకుర్తి రహదారుల్లో ప్రమాదకర మూల మలుపులు అధికంగా ఉన్నాయి. 17 కిలోమీటర్ల కొడకండ్ల–నాంచారిమడూరు మార్గంలో 18 మూల మలుపులు ఉండగా, 18 కిలోమీటర్ల కొడకండ్ల–పాలకుర్తి రోడ్డులో పదికి పైగా మలుపులు ఉన్నాయి. హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనాలు అదుపుతప్పి తరచూ చిన్నపాటి ప్రమాదాలు జరుగుతున్నాయి. లింగాలఘణపురం మండలం కళ్లెం–జీడికల్ రోడ్డులో సిరిపురం సమీపాన రోడ్డుకు నాలుగు మీటర్ల దూరంలోనే వ్యవసాయ బావి ఉంది. చుట్టూ చెట్లు, చేమలు ఉండటంతో బావి ఉన్న విషయం ప్రయాణికులకు కనిపించదు. రక్షణ గోడ లేకపోవడంతో ఆటోలు, బస్సులు, కార్లలో ప్రయాణించే వారికి ప్రమాదం పొంచి ఉంది. -
సిద్ధేశ్వరాలయ హుండీ ఆదాయం రూ.5,11,472
బచ్చన్నపేట: మండలంలోని కొడవటూర్ గ్రామంలోని స్వయంభూ శ్రీసిద్ధేశ్వరాలయ హుండీ ఆదాయం రూ. 5,11,472 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి చిందం వంశీ తెలిపారు. గురువారం హుండీ లెక్కించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం మార్చి 24 నుంచి ఆగస్టు 20 వరకు భక్తులు హుండీలో వేసిన కానుకల రూపేణా ఈ ఆదాయం వచ్చిందన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ నల్లగొండ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్రావు పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు చేశామన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఈదులకంటి వెంకట్రెడ్డి, ప్రధాన పూజారి ఓంనమశివాయ, సిబ్బంది నూకల లక్ష్మికాంత్రెడ్డి, బండారి శ్రీనివాస్, భానుప్రకాష్రెడ్డి, అర్చకులు, శ్రీలక్ష్మీవెంకటేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంజనగామ: ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాల నిరోధక చట్టం అమలును పర్యవేక్షించే జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీలో అధికారేతర సభ్యుల నియామకానికి అర్హులైన జిల్లా వాసుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి విక్రమ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీలో ఎస్సీ కులాలకు చెందిన ఐదుగురు సభ్యులు, ఎస్టీ వర్గం నుంచి ఇద్దరు సభ్యుల్లో కనీసం ఒకరు మహిళ ఉండాలన్నారు. ఇతర వర్గాలకు చెందిన ముగ్గురిని కూడా సభ్యులుగా నియమించే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలు, నిర్ణీత దరఖాస్తు నమూనా జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో, జిల్లా వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందన్నారు. సెప్టెంబరు 5వతేదీ సాయంత్రం 5 గంటల్లోపు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందించాలన్నారు. ఎస్ఐఆర్పై ఈఆర్ఓలకు శిక్షణజనగామ: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ముసాయిదా విడుదల అనంతరం సాంకేతిక, పరిపాలనాపరమైన చర్యలను వేగవంతం చేసేందుకు జిల్లా స్థాయిలో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, అధికారులకు గురువారం కలెక్టరేట్లో మాస్టర్ ట్రేనర్లు సాఫ్ట్వేర్ విధానాలపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో ఓటర్ల వివరాల్లోని తప్పులను సరి దిద్దడం, బాధ్యులైన ఓటర్లకు నోటీసులు ఇవ్వ డం, దరఖాస్తుల విచారణ, తుది జాబితా రూపకల్పనపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. కాగా, మండలాల వారీగా బీఎల్ఓలకు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణలో రెవెన్యూ ఏసీ బెన్షాలోమ్, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ శ్రీధర్, ఆర్డీఓ గోపీరామ్, తహసీల్దార్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పీజీ సెమిస్టర్ పరీక్షలు షురూ కేయూ క్యాంపస్: కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో పీజీ కోర్సు ల (నాన్ ప్రొఫెషనల్) రెండో సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని పలు పరీక్ష కేంద్రాలను పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్ష ల నియంత్రణాధికారులు పరిశీలించారు. -
ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి
జనగామ రూరల్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, సత్వరమే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు నిరుద్యోగులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వివిద డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సూపరింటెండెంట్ రవి కిరణ్కు అందజేశారు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని వెంటనే భర్తీ చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేయాలన్నారు. ధర్నాలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ నరేందర్, సింగారపు రమేశ్, బొట్ల శేఖర్, బూడిద గోపి తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి -
కొత్త రైల్వే డివిజన్గా చేయాలని ఎంపీ వినతి
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్గా ఏర్పాటు చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో సమన్వయ్ సమావేశ మందిరంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవను కోరారు. దక్షిణ మధ్య రైల్వే ఎంపీల సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని రైల్వే రంగ అభివృద్ధికి సంబంధించిన 19 కీలక అంశాలను రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు వరంగల్ ప్రాంత ప్రజల చిరకాల డిమాండ్ అని చెప్పారు. -
సాగునీటి కల్పనలో ప్రభుత్వం విఫలం
పాలకుర్తి టౌన్ (దేవరుప్పుల): సాగునీటి కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. గురువారం దేవరుప్పుల మండలంలోని ధరావత్ తండా నుంచి బంజార గ్రామం వరకు నవాబుపేట రిజర్వాయర్ నుంచి మండలానికి వచ్చే కాలువను సుమారు 10 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ పంటల సాగు దుిస్థితిపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సింగరాజుపల్లి గ్రామంలో సాగునీరు విడుదల చేయాలని డిమాండ్తో ధర్నా చేపట్టారు. ఎర్రబెల్లిని పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించే క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అయినా ధర్నా నిర్వహిస్తూ ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు.. వారం రోజుల క్రితం స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబుపేట రిజర్వాయర్ వరకు సాగునీరు విడుదల చేశామని కొందరు నాయకులు గొప్పగా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు సుందర్రామిరెడ్డి, దయాకర్, బస్వ మల్లేశం తదితరులను అరెస్టు చేసిన పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దయాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్సింగ్, దేవరుప్పుల, కొడకండ్ల, గుండాల మండలాల రైతులు, నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు -
జీఓ 97ను రద్దు చేయాల్సిందే
స్టేషన్ఘన్పూర్: పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే జీఓను 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఘన్పూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు గురువారం బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ముందుగా స్థానిక పాలిటెక్నిక్ కళాశాల నుంచి శివునిపల్లి వివేకానంద, శివాజీ చౌక్, గాంధీ చౌక్ల మీదుగా బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించి దాదాపు 20 నిమిషాలపాటు రాస్తారోకో చేపట్టారు. పాలిటెక్నిక్ విద్యార్థుల పోరుకు మద్దతు తెలుపుతూ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యతో పాటు బీఆర్ఎస్ మండల నాయకులు రాస్తారోకో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం ఏమాత్రం సమంజసం కాదన్నారు. జీఓ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు మాట్లాడుతూ.. ఐదు రోజులుగా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. అనంతరం విద్యార్థులు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కిరణ్ప్రకాష్కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్, నాయకులు చల్లా రఘురెడ్డి, శ్యామ్, విద్యార్థులు పాల్గొన్నారు. ఐదో రోజు కొనసాగిన పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన జాతీయ రహదారిపై రాస్తారోకో, ఆర్డీఓకు వినతి పత్రం అందజేత -
శాసీ్త్రయ–ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝానర్మెట: రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని, శాసీ్త్రయ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులు పాటించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మండల కేంద్రంతో పాటు ఇప్పలగడ్డ, గుంటూర్పల్లిలో ఆకస్మిక తనిఖీల్లో భాగంగా గురువారం ఆగ్రోస్ రైతు సేవాకేంద్రం, గోదాము, అంగన్వాడీ కేంద్రంతో పాటు క్షేత్రస్థాయిలో డ్రాగన్ ఫ్రూట్, కంది, పెనర, కూరగాయలు, మిర్చి తదితర పంటలను పరిశీలించిన ఆయన రైతులతో మాట్లాడి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. డ్రిప్ విధానంలో తక్కువ నీటితో ఎక్కువ సాగు చేపట్టాలన్నారు. ఇప్పలగడ్డలో గోదాములో నిల్వ సామర్థ్యం, బియ్యం నిల్వలు, నిర్వహణ, సరఫరా ప్రక్రియలను పరిశీలించారు. రైతులకు అదనపు ట్రాన్స్ ఫార్మర్ను తక్షణం బిగించే ఏర్పాటు చేయాలని ఎస్ఈ సీహెచ్ సంపత్ రెడ్డిని, రైతులు పండించిన పంటలకు మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట డీఏఓ అంబికా సోని, ఏఓ బుర్ర మమత, ఏఈఓ సుంకరి జగదీష్, రైతులు మేకల వెలంగిణి రెడ్డి (డ్రాగన్ ఫ్రూట్), సుధాకర్, వెంకట్ రెడ్డి, భిక్షపతి, మోహన్రెడ్డి, రామలింగం తదితరులున్నారు. జియో నెట్వర్క్ సేవలకు అంతరాయంజనగామ: జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం జియో మొబైల్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు 40 నిమిషాలపాటు సెల్ సిగ్నల్ పూర్తిగా నిలిచిపోవడంతో జియో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫోన్న్ కాల్స్ కలవకపోవడంతో పాటు మొబైల్ ఇంటర్నెట్ కూడా పని చేయలేదు. -
● రోడ్ల పక్కన మృత్యుబావులు
జనగామ: జిల్లాలో పలు మండలాల్లో రోడ్ల పక్కన రక్షణ గోడలు లేని బావులు, ప్రమాదకర మూలమలుపులు, గుంతలమయమైన కల్వర్టులు వాహనదా రులకు ముప్పుగా మారాయి. హెచ్చరిక బోర్డులు, రెయిలింగ్లు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమా దం ముంచుకొస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రహదారులపై పొంచి ఉన్న ప్రమాదంపై సాక్షి ‘గ్రౌండ్ రిపోర్టు’తో ప్రత్యేక కథనం. బావులు.. బెంబేలెత్తిస్తున్నాయి నర్మెట మండలం అమ్మాపురం చౌరస్తా వద్ద రోడ్డు పక్కనే వినియోగంలో లేని పాత బావి చెట్ల పొదలతో కప్పుకుపోయింది. నర్మెట, వెల్దండ, అమ్మాపు రం, పోతారం గ్రామాలకు వెళ్లే ఈ చౌరస్తాలో హె చ్చరిక బోర్డులు లేకపోవడంతో పక్కదారుల నుంచి వచ్చే వాహనాలు గుర్తించలేక ద్విచక్ర వాహనదారులు పలుమార్లు ప్రమాదాలకు గురయ్యారు. బావి చుట్టూ రక్షణ చర్యలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. జఫర్గఢ్ మండలం హిమ్మత్నగర్ సమీ పంలో ప్రధాన రహదారికి సుమారు మూడు మీట ర్ల దూరంలోనే వ్యవసాయ బావి ఉంది. సుమారు తొమ్మిది గజాల లోతున్న ఈ బావిలో నీరు ఉండటంతో పాటు మూలమలుపులో ఉండడం ప్రమాదాన్ని పెంచుతోంది. గతంలో ట్రాక్టర్తో సహా బా విలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కూడా జ రిగింది. ప్రస్తుతం అక్కడక్కడ రాళ్లు పెట్టినా పూర్తి స్థాయి రక్షణ లేదు. ఇదే రహదారిలో మరో రెండు బావులు కూడా ప్రమాదకరంగా ఉన్నాయి. చిల్పూ ర్ మండలం దేశాయితండా నుంచి పల్లగుట్టకు వెళ్లే మార్గంలో లోలెవల్ కల్వర్టు పక్కనే పాడుబడిన వ్యవసాయ బావి ఉంది. రాత్రింబవళ్లు వాహనాలు తిరిగే ఈ మార్గం ఇప్పటికే గుంతలమయమైంది. బావి వద్ద రెయిలింగ్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని రైతు సాధం రాములు కోరుతున్నారు. బచ్చన్నపేట మండల కేంద్రం నుంచి చేర్యాలకు వెళ్లే రహదారిలో రాజన్న బావి చుట్టూ ప్రహరీ, హె చ్చరిక బోర్డులు లేవు. పడమటికేశవాపూర్, కొన్నె గ్రామాల సమీపంలోని బావులు కూడా వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. రాత్రివేళ అదుపుతప్పిన వాహనాలు బావుల్లో పడే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ లేక పొంచి ఉన్న ముప్పు పలు రోడ్లపై ప్రమాదకర మలుపులు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం రెయిలింగ్లు, హెచ్చరిక బోర్డులు కాగితాలకే పరిమితం చర్యలు తీసుకోవాలంటున్న వాహనదారులు -
ఉచిత కుట్టుమిషన్ల పంపిణీకి దరఖాస్తుల ఆహ్వానం
జనగామ రూరల్: బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఉచిత ఆటోమేటిక్ కుట్టుమిషన్ల పంపిణీకి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వెనకబడిన తరగతుల మహిళలకు స్వయం ఉపాధి కల్పించి, వారిని ఆర్థికంగా శక్తివంతులను చేసేందుకు 100శాతం సబ్సిడీపై ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్ల పంపిణీ’ పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. జిల్లాలో అర్హులైన బీసీ మహిళల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. యూనిట్ వ్యయం: రూ.12,000 (100శాతం ఉచిత సబ్సిడీ) ఉంటుందని బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ ఉండాలన్నారు. పేద మహిళలు, నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. మేర, మేరు సామాజిక వర్గానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని, 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000లోపు ఉండాలని రేషన్ కార్డ్ లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి ఉండాలని తెలిపారు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని సెప్టెంబర్ 13వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.నలుగురు ఇన్స్పెక్టర్ల బదిలీవరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నలుగురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కె.ఫణింధర్ వీఆర్ నుంచి నెక్కొండ సర్కిల్, ఎస్.శ్రీనివాస్ నెక్కొండ సర్కిల్ నుంచి వీఆర్ వరంగల్, జె.శంకర్రావు వీఆర్ వరంగల్ నుంచి దుగ్గొండి సర్కిల్, ఎం.సాయిరమణ దుగ్గొండి సర్కిల్ నుంచి వీఆర్ వరంగల్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం విక్రయిస్తే రూ.లక్ష జరిమానారఘునాథపల్లి: మండలంలోని వేపలగడ్డతండాతో పాటు శివారులోని చర్లతండా సంపూర్ణ మద్యపాన నిషేధానికి అడుగులు పడ్డాయి. బుధవారం సర్పంచ్ గుగులోతు మోతిలాల్ అధ్యక్షతన జరిగిన గ్రామ పంచాయతీలో గ్రామ పరిధిలో గుడుంబా, మద్యం విక్రయాలను నిషేదిస్తున్నట్లు పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎవరైనా విక్రయిస్తే రూ.లక్ష జరిమానాతో పాటు ప్రభుత్వ పథకాలు నిలిపివేయనున్నట్లు హెచ్చరించారు. గుడుంబా నిర్మూలనపై పంచాయతీ తీర్మానం చేయడంపై ఎకై ్సజ్ అధికారులు సర్పంచ్ను అభినందించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి క్రాంతి, ఉప సర్పంచ్ భూక్య భజన్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలిబచ్చన్నపేట: ప్రస్తుత సమయంలో ఎల్నినో ప్రభావంతో నీటిమట్టం బాగా తగ్గిపోయిందని, అందరూ నీటి సంరక్షణ చర్యలను చేపట్టాలని కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్కే ఎండీ సర్తజ్ బాషా అన్నారు. మండలంలో అమలవుతున్న జల్ సంచాయి జన్ బాగిదార్ (జేఎస్జేబీ) పథకం కింద జరుగుతున్న నీటి సంరక్షణ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. మండలంలోని కట్కూర్, బచ్చన్నపేట, లింగంపల్లి, కట్కూర్, లక్ష్మాపూర్ గ్రామాలలో పర్యటించి ఫాంపాండ్స్, మ్యాజిక్ సోక్ ఫిట్స్, పెరకోలేషన్ పాండ్స్, బోర్ వెల రీఛార్జీ పిట్స్లను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో నేరుగా రైతులు, లబ్ధిదారులతో మాట్లాడి, వాటితో ప్రయోజనం చేకూరుతుందా అని తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లావణ్య, డీఆర్డీఓ నోడల్ అధికారి కొప్పురపు శ్రీనివాస్రెడ్డి, ఏపీఓ కృష్ణ, లబ్ధిదారులు పాల్గొన్నారు. జఫర్గఢ్లో జాంబీ చేపజఫర్గఢ్: మండల కేంద్రంలోని ఓ కందకంలో మత్స్యకారులు వలలతో చేపలు పడుతుండగా బుధవారం వింత చేప లభ్యమైంది. ఎక్కువగా సముద్రంలో అరుదుగా ఉండే దెయ్యం (జాంబీ) చేప గోదావరి జలాల ద్వారా రిజర్వాయర్లకు వచ్చి ఉంటుందని, వీటి నుంచి వరదల్లో కలిసి కందకంలోకి వచ్చి ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. -
‘శక్తి’లో విలీనం వద్దు..
స్టేషన్ఘన్పూర్: పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను శక్తి ఫ్రేమ్వర్క్ కింద విలీనం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పునఃపరిశీలించాలని, పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే జీఓను 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘన్పూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు బుధవారం డివిజన్ కేంద్రంలో ఆందోళన చేపట్టారు. కళాశాల నుంచి శివునిపల్లి అంబేడ్కర్ సెంటర్ మీదుగా శివాజీచౌక్ వరకు ర్యాలీ చేపట్టి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశా రు. విద్యార్థులు రాస్తారోకో చేయగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ యూనస్ మాట్లాడుతూ.. నాలుగు రోజులుగా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని, జీఓ 97ను రద్దు చేయకుంటే ఆందోళనల్ని మరింత ఉఽధృతం చేస్తామని, అసెంబ్లీ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ ఎఫ్ నాయకులు పృథ్వీరాజ్, రోహిత్, రియాజ్, అభి, విద్యార్థులు చింత శ్రావణ్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.● పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ, రాస్తారోకో ● నాలుగురోజులుగా కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలు -
మున్సిపాలిటీ ఆదాయవనరులు పెంచాలి
జనగామ: మున్సిపాలిటీ ఆదాయ వనరులను పెంపొందించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు అందించేలా సమగ్ర కార్యాచరణ రూపొందించి అమలుచేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ విభాగాల పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి ఉన్న ఆదాయ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో పాటు కొత్త ఆదా య వనరులను అన్వేషించాలన్నారు. ఇంటి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్సులు తదితర పన్నుల వసూళ్లలో పురోగతి సాధించాలని, బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనులను పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేసి వార్డుల వారీగా రూట్ మ్యాప్ రూపొందించి మున్సిపల్ వెబ్సైట్లో పొందుపరచాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తేనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. అర్హులైన దరఖాస్తుదారులకు నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల అనుమతులు జారీ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా లేదా లోపాలు ఉన్న దరఖాస్తులను నిబంధనల ప్రకారం తిరస్కరించాలన్నారు. ట్రేడ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో పురోగతి సాధించాలని, నిబంధనల మేరకు లైసెన్సులు జారీ చేయాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రకటనలపై వసూలు చేసే అడ్వర్టైజ్ చార్జీలను నిబంధనల ప్రకారం పునఃసమీక్షించి అవసరమైన మేరకు రీ–షెడ్యూల్ చేయాలని సూచించారు. సమీక్షలో మున్సిపల్ చైర్పర్సన్ బాలమణిశ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి, మున్సిపల్ మేనేజర్ ప్రభాకర్, డీఈ రాజ్కుమార్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. ప్రజలకు నాణ్యమైన పౌరసేవలు అందించాలి సమీక్షలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
నీటి సంరక్షణకు ఫాంపాండ్లు కీలకం
పాలకుర్తి టౌన్: నీటి సంరక్షణకు ఫాంపాండ్లు కీలకమని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్, జిల్లా ప్రోగ్రాం మానిటరింగ్ అధికారి శైలేష్ అన్నారు. బుధవారం మండలంలోని లక్ష్మీనారాయణపురంలో నిర్మిస్తున్న ఫాంపాండ్ల పనులను ఆయ న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉపాధి హామీ పథ కం కింద పనిచేస్తున్న కూలీలతో డిప్యూటీ కమిషనర్ శైలేష్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ భాస్కర్, అదనపు డీఆర్డీఓ శాసీ్త్ర, ఎండీపీఓ వేదావతి, పంచాయతీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కొడకండ్లలో.. కొడకండ్ల: ప్రతీ నీటి బొట్టును, భూగర్భ జలాలను పరిరక్షించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ శైలేష్ సూచించారు. మండలకేంద్రంలోని రెసిడెన్షియల్ స్కూల్ శానిటరీ కాంప్లెక్స్ను ఆయన పరిశీలించారు. డీపీఓ వెంకట్రెడ్డి, ఏపీడీ నాగశేషాద్రిసూరి, ఎస్బీఎం జిల్లా కోఆర్డినేటర్ కరుణాకర్, ఎంపీడీఓ రవిందర్, ఎంపీఓ వెంకటేశ్, ఏపీఓ కుమారస్వామి పాల్గొన్నారు. పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శైలేష్ -
దేశమంతా సన్నబియ్యం ఇస్తే మోదీ ఫొటో పెడ్తాం
చిల్పూరు: దేశవ్యాప్తంగా కేంద్రం సన్నబియ్యం పంపిణీ చేస్తే మోదీ ఫొటో తప్పకుండా పెడతామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం జరిగిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రూ.33.60 లక్షలతో నూతనంగా నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లతో పాటు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలన్నీ మండల కేంద్రంలోనే నిర్మిస్తామని, ఎవరో ఏదో చెప్పారని ఆగం కావద్దని, నెలరోజులలోపు కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తానని హామీ చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. లబ్ధిదారులకు డిజిట ల్ రేషన్కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్కుమార్, సర్పంచ్ అనిత నవీన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిర్ర నాగరాజు, మాజీ ఎంపీపీ సరితబాలరాజు, గణగోని రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
జిల్లాలో మొత్తం చెరువులు 770 మొత్తం 49,643 ఎకరాలు
చెరువులు ఎకరాలునర్మెట 22 తరిగొప్పుల 06 జనగామ 11 బచ్చన్నపేట 20 రఘునాథపల్లి 36 లింగాలఘణపురం 32 దేవరుప్పుల 23 జఫర్గఢ్ 11 చిల్పూర్ 15 పాలకుర్తి 59 ఘన్పూర్ 554508508903751,9521,573జనగామ రూరల్: ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో అందుబాటులో ఉన్న నీటి వనరులను అత్యంత సమర్థవంతంగా రైతులకు ప్రాధాన్య క్రమంలో అందించేలా సంబంధిత అధికారులు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో పటిష్ట కార్యాచరణ అమలుచేస్తున్నారు. నీటి లభ్యతకు అనుగుణంగా సాగునీటి విడుదలకు ప్రాధాన్య క్రమాన్ని రూపొందించి, రైతులకు ముందస్తు సమాచారం అందించాలని నిర్ణయించారు. వర్షపాతం అనిశ్చితంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న నీటి వనరులను పరిగణనలోకి తీసుకొని, ఈనెల 15వ తేదీ నుంచి మొదటి విడతగా సాగునీరు విడుదల చేయగా.. ఈనెల 25వ తేదీ నుంచి రెండో విడతగా నీటిని అందించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం జిల్లాలోని రిజర్వాయర్లలో సుమారు 1.5 టీఎంసీల నీరు నిల్వ ఉన్నందున, నీటి లభ్యతను బట్టి విడతల వారీగా ఆయకట్టు ప్రాంతాలకు ప్రాధాన్య క్రమంలో నీటిని విడుదల చేయనున్నారు. జిల్లాలో మొత్తం 770 చెరువులు, 49,643 ఎకరాల ఆయకట్టు ఉండగా, వీటిలో 763 చెరువుల్లో 0–25 శాతం మేర మాత్రమే నీటి నిల్వలు, 6 చెరువుల్లో 25–50 శాతం నీటి నిల్వలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. చెరువులు, కాలువలు, కెనాళ్లను పరిరక్షించేందుకు గ్రామస్థాయిలో చెరువుల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి, జీపీఓ, గ్రామ పోలీసు సభ్యులుగా ఉండే ఈ కమిటీలకు నీటిపారుదల శాఖ ఏఈ, డీఈఈ ముఖ్యులుగా ఉంటారు. నీటిని విడుదల చేసే సమయంలో కాలువలు, కెనాళ్లకు ఎలాంటి నష్టం జరగకుండా కమిటీలు నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. ప్రభుత్వ నీటి వనరులు, కాలువలు, కెనాళ్లకు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించినా, నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించినా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధుల్లో అధికారులను అడ్డుకోవడం వంటి సందర్భాల్లో కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నర్మెట, బచ్చన్నపేట, పాలకుర్తి, కొడకండ్ల, రఘునాథపల్లి, తరిగొప్పుల మండలాల్లో నీటి లభ్యత, సాగు పరిస్థితులను ప్రత్యేకంగా పరిశీలించి, తక్షణ నివారణ చర్యలు చేపట్టనున్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న గ్రామాల్లో రైతులు వరిసాగు వైపు వెళ్లకుండా ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించారు. రైతులకు ప్రాధాన్య క్రమంలో విడుదల రెండు విడతలుగా అందించేందుకు అధికారుల నిర్ణయం 25వ తేదీ నుంచి రెండో విడత విడుదలకు చర్యలు1,359వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ రైతులు సాగు చేసుకోవాలి. నీటి లభ్యతను మట్టి కాలువల ద్యారా, ట్యాంకులతో రెండు విడతలుగా సాగు నీరు అందనుంది. ఇప్పటికే మొదటి విడతగా నీరు విడుదల చేయగా 25 నుంచి రెండో విడత విడుదల చేయనున్నారు. –కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 7161,637 -
గంజాయి స్వాధీనం విలువ (రూ. కోట్లలో)
2024 2,97,19,7172025 5,76,39,3532026 1,29,94,670●వరంగల్ నార్కొటిక్ పోలీస్స్టేషన్ పరిధిలో మూడేళ్లలో నమోదైన కేసులు, స్వాధీనం చేసుకున్న గంజాయి (కిలోలు)విద్యార్థులకు అవగాహన, విక్రేతలపై కఠినచర్యలు పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. విక్రయాలు, సరఫరాకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు అవసరమైన సందర్భాల్లో పీడీ యాక్టు కింద కఠిన చర్యలు తీసుకుంటున్నాం. గంజాయికి బానిసలైన యువతను గుర్తించి వారిపై చట్టపరమైన ప్రక్రియతోపాటు డీ–అడిక్షన్ సెంటర్లకు తరలించి, కౌన్సెలింగ్, చికిత్స మార్పు తెచ్చే చర్యలు చేపడుతున్నాం. – పి. రమేశ్కుమార్, డీఎస్పీ, నార్కొటిక్స్ ఈగల్ ఫోర్స్ మాదక ద్రవ్యాల అనుకూల పంటల సాగు వద్దు యువత దేశ భవిష్యత్కు వెన్నెముక. వారు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. మాదక ద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యం, విద్య, కుటుంబ వ్యవస్థ, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. అదేవిధంగా, మాదక ద్రవ్యాల తయారీకి అనుకూలమైన పంటలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగు చేయకుండా చూడాలి. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రభుత్వం, ఆచార్యులు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, ప్రజలు కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. – డా. గాదె సమ్మయ్య, ప్రముఖ విద్యావేత్తసాక్షిప్రతినిధి, వరంగల్: చదువుకోవాల్సిన వయసులో కొందరు మత్తుకు బానిసలవుతున్నారు. తొలుత సరదాగా మొదలుపెట్టి.. ఆపై అలవాటుగా.. చివరకు వ్యసనంగా మార్చుకుంటున్నారు. గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి చిన్నచిన్న గొడవలనుంచి తీవ్రమైన నేరాల వరకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కొందరు మైనర్లు, స్కూల్, కాలేజీ విద్యార్థులే గంజాయి ముఠాల టార్గెట్గా మారుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో గంజాయి మత్తులో మైనర్లు ప్రిన్సిపాల్ను హత్య చేసిన ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా ఉలికిపాటు నెలకొంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్లో గంజాయి సరఫరా, వినియోగం, యువత ప్రమేయంపై మరోసారి చర్చ మొదలైంది. స్కూల్ వెనుక నుంచి, హాస్టళ్ల వరకు.. వరంగల్ నార్కొటిక్ పోలీస్స్టేషన్ పరిధిలో మూడేళ్లలో 134 గంజాయి కేసులు నమోదవగా, 369మందిని అరెస్ట్ చేశారు. 2,571 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు వరంగల్ నగర శివార్లకే పరిమితమైన గంజాయి వినియోగం క్రమంగా కొన్ని విద్యాసంస్థల పరిసరాలకూ చేరిందన్న ఆందోళన ఉంది. స్కూల్ వెనుక ఖాళీ ప్రదేశాలు, పాడుబడిన భవనాలు, చెరువు కట్టలు, రైల్వే పరిసరాలు, కాలేజీ హాస్టళ్లు, అద్దె గదులు.. ఇలా నిర్మానుష్య ప్రాంతాలను కొందరు మత్తు సేవించేందుకు ఉపయోగిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా వరంగల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగుచూసిన గంజాయి కేసు మరింత ఆందోళన కలిగించింది. బీటెక్, ఇంటర్ విద్యార్థులతో కూడిన ముఠా 36 కిలోలకు పైగా గంజాయితో పట్టుబడింది. ఎనిమిది మంది విద్యార్థులు డబ్బులు పోగేసి గంజాయి కొనుగోలు చేసినట్లు ‘ఈగల్’దర్యాప్తులో వెల్లడైంది. ఈ విద్యార్థులు ఇదే తరహా కేసులో నాలుగోసారి పట్టుబడడం ఆందోళనకరం. వినియోగంతో మొదలు.. విక్రయంతో ముగింపు గంజాయి ముఠాలు ముందుగా కొందరు విద్యార్థులను వినియోగదారులుగా మార్చి.. ఆ తర్వాత వా రినే చిన్నస్థాయి క్యారియర్లు, విక్రేతలుగా ఉపయోగించుకుంటున్నాయన్న ఆందోళన ఉంది. మొదట స్నేహితుడి ద్వారా పరిచయం.. ఆపై ఉచితంగా లే దా తక్కువ ధరకు సరఫరా.. అలవాటు పడిన తర్వాత డబ్బుల కోసం ఇతరులకు సరఫరా చేయించడం.. ఇలా మత్తు వల విస్తరిస్తున్నట్లు పోలీసులు గుర్తించిన కేసులు చెబుతున్నాయి. స్కూల్ దశనుంచే గంజాయి కిక్కుకు బానిసలు.. కళాశాలలే లక్ష్యంగా సరఫరా.. మత్తులో పెరుగుతున్న నేరాలు.. విద్యార్థులే ‘క్యారియర్లు’ నల్లగొండ ఘటనతో ఒక్కసారిగా ఉలికిపాటు మేల్కోకపోతే మరిన్ని ఘోరాలు.. నేరాలు -
పునరుత్పాదక ఇంధనంతో విప్లవాత్మక మార్పులు
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హన్మకొండ: డిజిటలైజేషన్, పునరుత్పాదక ఇందనం ద్వారా విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ నోవాటెల్లో మంగళవారం నిర్వహించిన ఇండియా ఎనర్జీ సమ్మిట్ – ఎక్స్పో 2026 కార్యక్రమంలో ‘మోడర్నయిజింగ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్మార్ట్ గ్రిడ్స్ ఫర్ ఎ రిలయబుల్ పవర్ ఫ్యూచర్’ అనే అంశంపై కర్నాటి వరుణ్ రెడ్డి ప్రసంగించారు. ఐఏఎస్ సంస్థలో అమలు చేస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు, నెట్వర్క్ మ్యాపింగ్, స్మార్ట్ మీటరింగ్ కార్యక్రమాలను వివరించారు. సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ చేతుల మీదుగా జ్ఞాపిక, సావనీర్ అందుకున్నారు. -
నిత్యావసర భారం
● సరుకులు పిరం.. సగటుజీవిపై పెనుభారం ● నెల రోజుల్లోనే 20 నుంచి 40 శాతం వరకు పెరుగుదల ● ధరాఘాతంతో పేద, మధ్యతరగతి విలవిల ● రెట్టింపైన వంట, రోజువారీ ఖర్చులుజనగామ: నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్య ప్రజల జీవనం భారంగా మారుతోంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి, చిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, రోజువారీ కూలీలు, కార్మికులపై ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోంది. కేవలం 15 రోజుల నుంచి నెల రోజుల వ్యవధిలోనే సరుకుల ధరలు 20 నుంచి 40 శాతం వరకు పెరగడంతో కుటుంబ బడ్జెట్లు తలకిందులవుతున్నాయి. ఉచిత బియ్యం ఉన్నా.. రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా లభిస్తున్న బియ్యం పేద కుటుంబాలకు కొంత ఊరట ఇస్తున్నా, కూరలు, పప్పులు, నూనె, మసాలాల ధరలు పెరగడంతో రోజువారీ వంట ఖర్చు తగ్గడం లేదు. తక్కువ ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే కూలీలు, చిరుద్యోగులు పోషకాహారాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రవాణా భారం.. ధరల పెరుగుదలకు కారణం పెట్రోల్, డీజిల్ ధరలు, రవాణా ఖర్చులు పెరగడం, ఉత్పత్తి వ్యయాలు అధికం కావడం వంటి కారణాలతో సరుకుల ధరలను పెంచుతున్నట్లు తెలుస్తోంది. సరఫరా వ్యయాలు పెరిగే కొద్దీ మార్కెట్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వినియోగదారుల్లో నెలకొంది. కూరగాయలు..సబ్బులు.. నిత్యావసర సరుకులతోపాటు కూరగాయలు, సబ్బుల ధరలు కూడా సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. కూరగాయలు రకాన్ని బట్టి కిలో రూ.40 నుంచి రూ.60, రూ.80 వరకు విక్రయిస్తున్నారు. కొబ్బరికాయ రూ.25 నుంచి రూ.35కు, కిలో సర్ఫ్ రూ.65 నుంచి రూ.85కు, డిటర్జెంట్ సబ్బు రూ.32 నుంచి రూ.40కు పెరిగింది. దీంతో నెలవారీ ఆదాయంలో ఆహార ఖర్చుకే అధిక భాగం వెచ్చించాల్సి వస్తోంది. ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా మరింత ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఆదాయం పెరగకుండానే ఖర్చులు పెరుగుతుండటంతో పొదుపు మాట అటుంచి, నెలా ఖరుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సరుకు(కిలో/లీటర్) గత ప్రస్తుత పెరుగుదల ధర ధర చక్కెర 44 56 12 వెల్లుల్లి 180 240 60 సన్ఫ్లవర్ ఆయిల్ 140 180 40 ఉల్లిగడ్డ 25 45 20 కారంపొడి 260 350 90 పసుపు 180 240 60 చింతపండు 130 170 40 మినపపప్పు 110 130 20 పల్లీలు 120 150 30 బాదం 850 1,050 200కూలి డబ్బులు సరుకులకే.. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. మా కుటుంబంలో మొత్తం ఆరుగురం కుటుంబ సభ్యులు ఉంటాం. వ్యవసాయ కూలీ పని చేస్తూ జీవిస్తున్నాం. పప్పులు, నూనెలు తదితర నిత్యావసర సరుకులకు గతంలో నెలకు రూ.2,000 ఖర్చు అయ్యేది. ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరగడంతో రూ.4వేలకు పెరిగింది. కూలి చేస్తే వచ్చే డబ్బులన్నీ నిత్యావసర సరుకులకే సరిపోతుంది. ప్రభుత్వం స్పందించి ధరలను నియంత్రించాలి. –తోట కొమురమ్మ, గృహిణి, శివునిపల్లినెల ఖర్చు పెరిగింది మూడు నెలలుగా కిరాణం సామాను ఖర్చు రూ.10వేలకు పైగా పెరిగింది. మూడు నెలల క్రితం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఉన్న మాకు రూ.20 వేలకు నూనెలు, ఉప్పులు, పప్పులు, సబ్బులు వంటి కిరాణం సామాను వచ్చేది. ప్రస్తుతం రూ.30 వేల వరకు పెరిగింది. దీంతో మాలాంటి సామాన్య కుటుంబం గడవడం చాలా కష్టంగా మారింది. –ఇటుకల సక్కుబాయి, లింగాలఘణపురం, గృహిణి -
మారిన ఇంటర్ సిలబస్
● ఫస్టియర్లో ప్రాక్టికల్స్కు 15 మార్కులు ● తెలుగు పాఠ్యాంశాల్లో అధిక మార్పులు జనగామ రూరల్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యాప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ఇంటర్మీడిఝెట్ విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంటర్ విద్యలో సిలబస్లో యూనిట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2026–27 విద్యా సంవత్సరం నుంచి నూతన కరికులమ్తో సవరించిన పాఠ్యపుస్తకాలు యూనిట్ వారీగా డిజిటల్ బోధన పద్ధతులు అమలు చేయనుంది. ఇప్పటికే పలు సబ్జెక్ట్ల వారీగా సిలబస్ పై అధ్యాపకులకు రెండు రోజుల పాటు భువనగిరిలో శిక్షణ ఇచ్చారు. అలాగే ఇంటర్లో మారుతున్న పరిస్థితులను బట్టి ఇంటర్ విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత విద్యపై అధ్యాపకులకు జిల్లాస్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. మార్పులివే.. ఇంటర్లో సబ్జెక్టుల వారీగా అనేక మార్పులు చేశారు. ఇంటర్మీడిఝెట్ తెలుగు పుస్తకాన్ని మార్చేశారు. జంతుశాస్త్రంలో ప్రోటోజోవాలో గమనం, ప్రత్యుత్పత్తి తొలగించగా ఫస్టియర్లో ప్రాక్టికల్స్కు 15 మార్కులు కేటాయించారు. భౌతిక శాస్త్రంలో ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ చేర్చడంతో పాటు ప్రాక్టికల్కు 15 మార్కులు, వృక్షశాస్త్రంలో ఆర్థిక వృక్షశాస్త్రం చేర్చి ప్రాక్టికల్స్కు 15 మార్కులు కేటాయించారు. గణితంలో అనుక్రమాలు, శ్రేణులు, సమితుల సిద్ధాంతాలు అధ్యాయాలు చేర్చారు. రసాయనశాస్త్రంలో పదార్థాల స్థితులు, పర్యావరణ రసాయన శాస్త్రం, స్టోయికియోమెట్రీ పాఠంలో మొలారిటీ భావన తొలగించారు. మొదటి సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షల కోసం క్వాలిటేటివ్ అనాలసిస్ నుంచి లవణాలు కొత్తగా చేర్చారు. హిస్టరీలో యూనిట్ –6లో దక్షిణ భారతదేశం, దక్కన్ రాజ్యాలు, యూనిట్–8లో ప్రాంతీయ రాజ్యాలు కొత్తగా చేర్చగా మరాఠాలు, ప్రాంతీయ శక్తుల ఎదుగుదల తొలగించారు. సుల్తానేట్ రాజవంశీయుల అంశం యూనిట్–7లో కలిపారు. యూరోపియన్ల రాక, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తొలి తిరుగుబాటు, జాతీయోద్యమం (తొలిదశ, మలిదశ) యూనిట్లు విలీనం చేశారు. ఎకనామిక్స్ పాజిటివ్ ఎకనామిక్స్, నార్రేటివ్, నార్మేటివ్ ఎకనామిక్స్ చేర్చారు. సూచీ సంఖ్యలు కొత్తగా చేర్చారు. పాఠ్యాంశం అర్థమయ్యేలా.. కొత్తగా చేర్చిన అంశాలను సులభంగా విద్యార్థులకు అర్థం చేయించనున్నారు. టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాధనాలు, డిజిటల్ పద్ధతులను ఉపయోగించి పాఠాలను ఆకర్షణీయంగా ఎలా చెప్పాలో శిక్షణ ఇస్తున్నారు. 2026–27 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే నూతన అసెస్మెంట్, పరీక్షల ప్యాట్రన్స్పై అవగాహన కల్పిస్తారు. కేవలం సబ్జెక్టు బోధన మాత్రమే కాకుండా విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేలా గైడెన్స్ ఇచ్చేందుకు ఉపయోగపడనుంది.అధ్యాపకులకు శిక్షణ ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు మారిన సిలబస్, అలాగే ఏఐ, డిజిటల్ బోధనపై అధ్యాపకులకు ఆయా సబ్జెక్ట్ల వారీగా రెండు రోజుల పాటు మాస్టర్ ట్రెనర్స్ శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు భవిష్యత్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాల సాథన లక్ష్యంగా విద్యా విధానం ఉంటుంది. –జితేందర్రెడ్డి, డీఐఈఓ -
ఇచ్చిన హామీలు నెరవేర్చండి
● కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణగౌడ్ రఘునాథపల్లి: కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, దీనిపై సీఎం రేవంత్రెడ్డి స్పష్టత ఇవ్వాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణగౌడ్ డిమాండ్ చేశారు. ఆగస్టు 2న ప్రారంభమైన అమరుల యాదిలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గీతన్నల చైతన్య బస్సు యాత్ర మంగళవారం మండలంలోని అశ్వరావుపల్లి నుంచి వెల్ది, రఘునాథపల్లి మీదుగా ఖిలాషాపూర్ చేరుకోగా వారికి గ్రామ గౌడ సంఘం ఘనంగా స్వాగతం పలికారు. పాపన్న కోటలో ఏర్పాటు చేసిన పాపన్నగౌడ్ విగ్రహం ఆవిష్కరించారు. అనంతరం సంఘం జిల్లా కార్యదర్శి బాల్నె వెంకటమల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో రమణ మాట్లాడారు..సమావేశంలో సుప్రజ ఆస్పత్రి ఎండీ విజయ్కుమార్, యాత్ర బృందం సభ్యులు బూడిద గోపి, గౌని వెంకన్న, బీమగోని చంద్రయ్య, అచ్చాలు, జయరాములు, కుర్ర రాజు, నామాల యాదగిరి, బాల్నె రాజయ్య, ఉమాపతి, వెంకన్న, మురళి, సీతారాములు, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఘన్పూర్లో చైతన్యయాత్ర స్టేషన్ఘన్పూర్: గీతన్నల చైతన్యయాత్ర స్టేషన్ఘన్పూర్కు చేరింది. ముందుగా మండలంలోని ఇప్పగూడెంలో కేజీకేఎస్ జెండా ఆవిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు బాల్నె వెంకటమల్లయ్య, ప్రధాన కార్యదర్శి గోపి, మండల అధ్యక్షుడు మాచర్ల రఘురాములు, పులి శ్రీను, గట్టు రమేష్, కౌన్సిలర్ సంగీత పాల్గొన్నారు. -
అంగన్వాడీ సేవలకు ‘సమృద్ధి’
● వినూత్న యాప్ తీసుకొచ్చిన కలెక్టర్ ● రోజువారీ కార్యకలాపాలు ఇక ఒకే వేదికపై పర్యవేక్షణజనగామ: అంగన్న్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అందించేందుకు జిల్లాలో తొలిసారిగా ‘శిశు మహిళా సమృద్ధి’ మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో యాప్ను కలెక్టర్ సందీప్కుమార్ ఝా ప్రారంభించారు. వినూత్న ఆలో చనతో కలెక్టర్ స్వయంగా యాప్ను రూపొందించారు. అంగన్వాడీ కేంద్రాల రోజువారీ కార్యకలాపాలను ఒకే వేదికపై పర్యవేక్షించడమే యాప్ ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. దీని ద్వారా అంగన్వాడీ సిబ్బందిపై ఉన్న రిజిస్టర్లు, పునరావృత నివేదికల భారం తగ్గుతుందన్నారు. ఒకసారి నమోదు చేసిన సమాచారం అన్ని స్థాయిల అధికారులకు అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. నాలుగు ప్రధాన సదుపాయాలు యాప్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతల హాజరు నమోదు, పోషకాహార నిల్వలు, కేంద్రాల పనితీరు పర్యవేక్షణ, సిబ్బంది సెలవుల దరఖాస్తు సదుపాయాలను కల్పించామన్నారు. హాజరు వివరాలను రియల్ టైమ్లో నమోదు చేయడంతో గైర్హాజరవుతున్న లబ్ధిదారులను గుర్తించి చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. పోషకాహార నిల్వల వివరాలతో అవసరమైన సరఫరాను ముందుగానే అంచనా వేయవచ్చని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు మొబైల్ నుంచే సెలవులకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఫొటో, లొకేషన్తో హాజరు నమోదు చేయడంతో పాటు నెట్వర్క్ లేని ప్రాంతాల్లోనూ వివరాలు భద్రపడి, సిగ్నల్ వచ్చిన తర్వాత స్వయంచాలకంగా చేరుతాయని చెప్పారు. యాప్ వినియోగంపై రెవెన్యూ అదనపు కలెక్టర్ జిల్లా సంక్షేమ అధికారి బెన్షాలోమ్ ఆధ్వర్యంలో అంగన్న్వాడీ టీచర్లు, హెల్పర్లు, సూపర్వైజర్లు, సీడీపీఓలకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో సేవలను మెరుగుపర చడమే యాప్ లక్ష్యమని అధికారులు తెలిపారు. -
బుధవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2026
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అటానమస్, గురుకుల డిగ్రీకళాశాలలు 241పీజీ కళాశాలలు 62ఫార్మసీ 24ఇంజనీరింగ్ 06బీఈడీ 43ఫిజికల్ ఎడ్యుకేషన్ 03ఎంసీఏ 10ఎంబీఏ 22 హోటల్ మేనేజ్మెంట్ 03లా 04 కేయూ పరిధిలోని కొత్తగూడెం ఇంజనీరింగ్ కళాశాల డాక్టర్ మనోమోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీగా మార్చారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీకి స్వర్ణోత్సవ శోభ సంతరించుకుంది. నిత్య చైతన్య దీప్తిగా ఉంటూ లక్షలాది మంది విద్యార్థులను అక్షర దివిటీలుగా తీర్చిదిద్దిన ఘన చరిత్ర ఈ యూనివర్సిటీది. సామాజిక ఉద్యమాలు, పోరాటాల గడ్డగా పేరొందింది. బుధవారంతో యూనివర్సిటీ 50 వసంతాలు పూర్తి చేసుకొని (గోల్డెన్ జూబ్లీ) 51 వసంతంలోకి అడుగిడుతోంది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ప్రస్థానంతోపాటు స్థానికంగా నెలకొన్న సమస్యలపై ప్రత్యేక కథనం. కేయూ తొలుత పీజీ సెంటర్గా తొలుత ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెంటర్గా 1968లో మొదలైంది. నాటి పోరాటాల ఫలితంగానే 1976, ఆగస్టు 19న కాకతీయ యూనివర్సిటీగా ఆవిర్భవించింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ 50 వసంతాల్లో ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసించి వివిధ రంగాల్లో, దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. ఇక్కడే ఆచార్యులు అయినవారూ ఉన్నా రు. మొదట కేయూ నాలుగు విభాగాలతో మొదలై రేకుల షెడ్లలోనే విద్య కొనసాగింది. అంచెలంచెలు గా ఎదిగి 29 విభాగాలతో కొనసాగుతోంది. ప్రస్తు తం యూనివర్సిటీలోని అన్ని కాలేజీల్లో 1.20లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. కేయూలో వివిధ సెంటర్లు కాకతీయ యూనివర్సిటీలో అంబేడ్కర్ స్టడీస్ సెంటర్, స్లూడెంట్ వెల్ఫేర్, ఎస్సీ, ఎీస్టీ సెల్, బీసీసెల్, దివ్యాంగసెల్, మహిళా అధ్యయన కేంద్రం, యోగా సెంటర్ ఉన్నాయి. వీటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. విద్యతోపాటు జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డిగ్రీ, జూనియర్, పీజీ కళాశాలల్లో కలిపి 360 ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉండగా అందులో 36వేల మంది ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ఉన్నారు. రక్తదానంలో అనేక అవార్డులు పొందింది. స్పోర్ట్స్బోర్డు కూడా ఉంది. ప్రతీఏటా సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ, ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీల వివిధ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి పంపిస్తున్నారు. నిధులు మంజూరుపై ఆశలు యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటు న్న వేళ.. మౌలిక సదుపాయల కల్పనకు రూ.400 కోట్ల నిధుల కోసం వీసీ ప్రతాప్రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆనిధులు మంజూరు చేస్తే యూనివర్సిటీలో గోల్డెన్ జూబ్లీ, యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్కళాశాల శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే యోచనలో ఉన్నారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు తొలుత ఓయూ పీజీ సెంటర్గా ఆ తరువాత కేయూ నాలుగు విభాగాలతో మొదలై నేడు 29 విభాగాలు యూనివర్సిటీ అభివృద్ధికి రూ.400కోట్లతో ప్రతిపాదనలుకేయూ పరిధిలోని కాలేజీలుకాకతీయ యూనివర్సిటీకి 50 వసంతాలు పూర్తి కేయూలో 332 అధ్యాపక పోస్టులు ఖాళీ బోధన, పరిశోధనలపై ప్రతికూల ప్రభావం విద్యార్థులకు సరిపడా హాస్టళ్లు ఏవీ?స్వర్ణోత్సవం భవిష్యత్కు బలమైన పునాది కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవం గతానికి గర్వకారణం భవిష్యత్కు బలమైన పునాది. విద్య, నాణ్యమైన పరిశోధనల దిశగా కృషి చేస్తున్నాం. రూసా ప్రాజెక్టుకింద రూ.60కోట్ల నిధులు రాగా, రూ.35కోట్లతో 42పరిశోధన ప్రాజెక్టులు, రూ.15కోట్లతో కెహబ్ అభివృద్ధి చేస్తున్నాం. బీఎస్ఎన్ఎల్కు సంబంధించి అండర్గ్రౌండ్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు పూర్తయింది. అకడమిక్ బ్లాక్లు, వర్క్షాప్లు,సెమినార్ హాల్స్, స్వర్ణోత్సవ శతాబ్ది పైలాన్ తదితర పనులకు ఆమోదం లభించింది. రూ.400లకోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇవి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. 50 ఏళ్ల విద్యాప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తాం. – కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి -
పాడిరైతులకు ‘విజయ’ ప్రోత్సాహం
గేదె పాలు లీటరుకు రూ.6 పెంపు ● స్వల్పంగా పెరిగిన ఆవు పాల ధరలు ● రైతులకు ఆర్థిక ఊరటజనగామ: పాడి రైతులకు విజయ డెయిరీ శుభవార్త అందించింది. రైతుల నుంచి సేకరించే పాల ధరలను ఈ నెల 16 నుంచి పెంచింది. పెరిగిన ధరలతో పాడి రైతులకు అదనపు ఆదాయం సమకూరనుండగా, పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రోత్సాహకంగా నిలవనుంది. జిల్లాలో రోజుకు 220 పాల సంఘాల నుంచి సుమారు 30 వేల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. జిల్లాలో సుమారు 6 వేల మంది విజయ పాడి రైతులు ఉండగా, 8 మినీ పాల శీతలీకరణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. గేదె పాలు లీటరుకు రూ.6 పెంపు గతంలో ఆవు పాలకు 320 ఘన పదార్థం విలువ ఉండగా, దానిని 340కి పెంచారు. అదే విధంగా గేదె పాలకు కిలో వెన్న విలువను రూ.850 నుంచి రూ.914కు పెంచారు. దీంతో 4.9 శాతం వెన్న కలిగిన ఆవు పాలకు గతంలో లీటరుకు రూ.42.34 చెల్లించగా, ప్రస్తుతం రూ.44.14 చెల్లించనున్నారు. అంటే లీటరుకు రూ.1.80 పెరిగింది. 10 శాతం వెన్న కలిగిన గేదె పాలకు గతంలో రూ.85 చెల్లించగా, ప్రస్తుతం రూ.91 చెల్లించనున్నారు. గేదె పాల ధర లీటరుకు రూ.6 పెరిగాయి. ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోండి పాడి రైతులకు మరింత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో విజయ డెయిరీ పాల సేకరణ ధరలను పెంచింది. ఆవు, గేదె పాలకు పెరిగిన ధరలతో రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. అలాగే పాడి పశువుల కొనుగోలుకు బ్యాంకుల సహకారంతో రుణాలు అందించేలా చర్యలు చేపట్టాం. రైతులు విజయ డెయిరీ సేవలను సద్వినియోగం చేసుకో వాలి. పాడి రంగాన్ని మరింత బలోపేతం చేసేందు కు రైతులకు అవసరమైన సహకారం అందిస్తాం. –ఎన్.. గోపాల్సింగ్, డిప్యూటీ డైరెక్టర్, విజయ డెయిరీ -
కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
● మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యస్టేషన్ఘన్పూర్: రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, రానున్న రోజుల్లో ప్రజల చేతిలో కాంగ్రెస్కు గుణపాఠం తప్పదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముభారక్, రైతుబంధు తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధుల విడుదల్లో జాప్యంపై నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టగా ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో నిరంకుశ, నియంత పాలన సాగుతుందని, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులైన సర్పంచ్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లకు నిధులు కేటాయించడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారాడని, అసెంబ్లీలో బీఆర్ఎస్, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. ప్రజలంతా గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో శ్రీహరికి రాజకీయ సమాధి తప్పదని అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి, బీఆర్ఎస్ సర్పంచ్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
సిబ్బందికి అండగా నిలవాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత వరంగల్ క్రైం: పోలీస్ అధికారుల సంఘం సిబ్బందికి అండగా నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. ఇటీవల ఎన్నికైన నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు సోమవారం సీపీ ఎన్.శ్వేతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీకి మొక్కలు అందజేశారు. ఎన్నికల నోడల్ అధికారి, అదనపు డీసీపీ ప్రభాకర్రావు నూతన కార్యవర్గ సభ్యులను సీపీకి పరిచయం చేశారు. అనంతరం ఆమె నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సమస్యలపై తక్షణమే స్పందించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పోలీస్ అధికారుల సంఘం స్ఫూర్తిదాయకంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు నాగయ్య, సదయ్యతో పాటు నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
గర్భిణుల నమోదు తప్పనిసరి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆరోగ్య శాఖ అధికారులు, ప్రోగ్రాం అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది సమన్వయంతో గర్భిణులందరి వివరాలను తప్పనిసరిగా నమోదు చేసి వైద్యపరీక్షలు నిర్వహిస్తూ, ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. హైరిస్క్ గర్భిణులను ప్రత్యేకంగా గుర్తించి ఆరోగ్య పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. సాధ్యమైనంత వరకు శస్త్రచికిత్సలను తగ్గించి, వైద్యపరంగా అనుకూలమైన సందర్భాల్లో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. టీబీ వ్యాధికి చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులకు కూడా పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ వాణిశ్రీ, టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రావ్య, మెడికల్ అధికారులు, ప్రోగ్రాం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
దరఖాస్తులు పెండింగ్లో ఉండొద్దు
● ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలి ● కలెక్టరేట్ గ్రీవెన్స్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలొచ్చి అర్జీలు సమర్పించారు. అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజల నుంచి 259 వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని, పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రజావాణిలో డీఆర్డీఓ భాస్కర్, సీపీఓ చిన కోట్యా నాయక్, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల్లో కొన్ని ఇలా.. ● జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్కు చెందిన నల్ల సుజాత.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా ఇబ్బందులు పడుతున్నామని, ఆర్థిక సాయం అందించాలని దరఖాస్తు చేసుకుంది. ● బచ్చన్నపేట మండలం ఇటిక్యాలపల్లి గ్రామానికి చెందిన సుంకె రాములమ్మ.. తన పది గుంటల భూమికి సర్వే నిర్ణయించి, హద్దురాళ్లు పాతించారని, కాని పక్కన ఉన్న వారు వాటిని తొలగించారని వారిపై చర్యలు తీసుకోవాలని వినతి అందించింది. ● తనది నిరుపేద కుటుంబమని, ఎలాంటి ఆధారం లేదని ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని దేవరుప్పుల మండలం పెద్దమడ్డూర్ గ్రామానికి చెందిన గనుపాక సునీత దరఖాస్తు చేసుకుంది. ● బచ్చన్నపేట మండలం కట్కూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు సేకరణ సందర్భంగా ఇచ్చిన గన్నీ బ్యాగులు లారీలు రాకపోవడంతో రెండు రోజులు నీళ్లలో ఉండడం వల్ల 800 బ్యాగులు చెదలు వచ్చి పాడైపోయాయని, వాటిని మార్చి లోనే గోదాంకు తరలించారని, వాటిపై రికన్సలేషన్ ఇచ్చి ఆదుకోవాలని గ్రామైఖ్య సంఘం సభ్యులు పల్లపు దీపారాణి, జంగం మాధవి కలెక్టర్ను కోరారు. ● జనగామ మండలం పెద్దరాంచర్ల గ్రామానికి చెందిన మండ్రోజు కర్ణాకర్ పేరు మీద గ్రామశివారులో సర్వే నెంబర్ 87ఏ1లో 32 గుంటలు, 87ఏ2లో 33 గుంటలు 1ఎకరం. 25 గుంటల భూమి ఉంది. 2011 నుంచి కాస్తులో ఉండగా గ్రామానికి చెందిన మరో వ్యక్తి అక్రమంగా తన భూమిలో 12 గుంటల భూమి సాగు చేస్తున్నాడని హద్దులు ఏర్పాటు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోని తనకు న్యాయం చేయాలని కర్ణాకర్ కోరారు. ఆదుకోండి సారూ.. ఈఫొటోలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు కోటి కొమురయ్య. స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రం. ఆయనకు ముగ్గురు కుమార్తెలు కాగా 35 ఏళ్ల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందింది. ఎలాంటి ఆస్తుల లేకున్నా కాయ కష్టం చేసి తన ముగ్గురు పిల్లల వివాహాలు చేశారు. తనకు 83 ఏళ్లు ఉండగా ఏపని చేయలేక పోతున్నానని, తనకు వచ్చే వృద్ధాప్య పింఛన్ మందులకు సరిపోవడం లేదని, బతుకుదెరువుకోసం ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ను కోరాడు. -
63,891
మంగళవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2026తొలిగిపోయే ఓటర్లుఎస్ఐఆర్ ముసాయిదా ఓటరు జాబితా విడుదల ● మరణించిన వారు 18,615 ● శాశ్వతంగా తొలిగిపోయిన ఓటర్లు 35,428 ● మొత్తం ఓటర్లు 7,67,484.. డిజిటలైజేషన్ 7,03,593 మంది ● అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా జనగామ: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఓటర్ల వివరాల డిజిటలైజేషన్లో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ముందంజలో ఉండగా, జనగామ నియోజకవర్గం వెనుకబడి ఉంది. మరోవైపు డిజిటలైజేషన్ చేసిన ఓటర్లలో అనామలీస్ (అసంగత వివరాలు) శాతం పాలకుర్తిలో అత్యధికంగా నమోదైంది. ఓట ర్ల జాబితాలో మరణించిన వారు, ఆచూకీ లేని వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలినవారు, ఇతర కేటగిరీలను కలిపిన ఏఎస్డీ ఓటర్ల శాతం జనగామ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది. జిల్లాలో మొత్తంగా ఏఎస్డీ కేటగిరీ(చిరునామాలో ప్రస్తుతం లేని వారు, శాశ్వతంగా వేరే ప్రాంతాని కి వెళ్లిన వారు, మరణించిన వారు)లో 18,615 మంది మరణించిన వారు ఉండగా, 1,008 మంది ఆచూకీ లేని వారుగా ముసాయిదా జాబితాలో పేర్కొన్నారు. 35,428 మంది శాశ్వతంగా తరలిపోగా, 163 మంది ఇతర కేటగిరీలో ఉన్నట్లు చూపించగా, మరో 8,677 మంది ఇప్పటికే నమోదు అయిన వారిగా గుర్తించగా, ఈ మొత్తం 63,891గా ముసాయిదాలో చూపించారు. డిజిటలైజేషన్లో స్టేషన్ఘన్పూర్ ముందుండగా, అనామలీస్, మ్యాపింగ్ లేని ఓటర్ల శాతంలో పాలకుర్తి, ఏఎస్డీ ఓటర్ల శాతంలో జనగామ నియోజకవర్గాలు అధికంగా ఉన్నాయి. ఈ వివరాల ఆధారంగా తదుపరి దశలో క్షేత్రస్థాయి పరిశీలన, ధ్రువీ కరణ కీలకంగా మారనుంది. ఏఎస్డీని మినహాయిస్తే జిల్లాలో 100 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్టే. 7,03,593 మంది ఓటర్లు ఎస్ఐఆర్లో భాగంగా జూన్ 10 నాటికి మూడు నియోజకవర్గాల్లో కలిపి 7,67,484 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 7,03,593 మంది ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ అయ్యాయి. అంటే మొత్తం 91.68 శాతం ప్రక్రియ పూర్తయింది. డిజిటలైజేషన్ చేసిన ఓటర్లలో 1,34,392 మంది (19.10 శాతం) అనామలీస్ కేటగిరీలో ఉండగా, 29,465 మంది (4.19 శాతం) ఓటర్లకు మ్యాపింగ్ కాలేదు. మొత్తం 63,891 మంది (8.32 శాతం) ఏఎస్డీ(చిరునామాలో ప్రస్తుతం లేని వారు, శాశ్వతంగా వేరే ప్రాంతానికి వెళ్లిన వారు, మరణించిన వారు) కేటగిరీలో ఉన్నారు. ఘన్ పూర్ ముందంజ స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో 2,56,806 మంది ఓటర్లు ఉండగా 2,39,750 మంది వివరాలు డిజి టలైజేషన్ చేశారు. దీంతో 93.36 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. ఇది మూడు నియోజకవర్గాల్లో అత్యధికం. డిజిటలైజేషన్ చేసిన వారిలో 31,215 మంది (13.02 శాతం) అనామలీస్గా ఉన్నారు. 6,746 మంది (2.81 శాతం) ఓటర్లకు మ్యాపింగ్ కాలేదు. ఏఎస్డీ కేటగిరీలో 17,056 మంది (6.64 శాతం) ఉన్నారు. ఇందులో 4,665 మంది మరణించిన వారు, 318 మంది ఆచూకీ లేనివారు, 9,419 మంది ఇతర ప్రాంతాలకు తరలినవారు, 21 మంది ఇతర కేటగిరీలో ఉండగా, 2,633 మంది ఇప్పటికే నమోదు అయినవారిగా గుర్తించారు. పాలకుర్తిలో అనామలీస్ ఎక్కువ పాలకుర్తిలో మొత్తం 2,61,241 మంది ఓటర్లు ఉండగా, 2,41,462 మంది వివరాలు డిజిటల్ చేశారు. డిజిటలైజేషన్ 92.43 శాతంగా ఉంది. అయితే అనామలీస్ విషయంలో ఈ నియోజకవర్గం ముందుంది. డిజిటలైజేషన్ చేసిన ఓటర్లలో 57,177 మంది అంటే 23.68 శాతం అనా మలీస్ కేటగిరీలో ఉన్నారు. 12,776 మంది (5.29 శాతం) ఓటర్లకు మ్యాపింగ్ కాలేదు. ఏఎస్డీ ఓట ర్లు 19,779 మంది (7.57 శాతం)గా ఉన్నారు. వీరి లో 7,795 మంది మరణించినవారు, 210 మంది ఆచూకీ లేనివారు, 8,393 మంది శాశ్వతంగా తరలినవారు, 85 మంది ఇతర కేటగిరీలో ఉండగా, 3,296 మంది ఇప్పటికే నమోదు అయినవారిగా గుర్తించారు. జనగామలో డిజిటలైజేషన్ తక్కువ.. ఏఎస్డీ ఎక్కువ జనగామ నియోజకవర్గంలో మొత్తం 2,49,437 మంది ఓటర్లు ఉండగా, 2,2 2,381 మంది వివరాలు డిజిటల్ అయ్యాయి. డిజిటలైజేషన్ 89.15 శాతంగా నమోదైంది. మూడు నియోజకవర్గాల్లో ఇదే అత్యల్పం. డిజిటల్ చేసిన ఓటర్లలో 46 వేల మంది (20.69 శాతం) అనామలీస్ కేటగిరీలో ఉన్నారు. 9,943 మంది (4.47 శాతం) ఓటర్లకు మ్యాపింగ్ కాలేదు. ఇందులో ఏఎస్డీ ఓటర్లు 27,056 మంది (10.85 శాతం)గా నమోదయ్యారు. వీరిలో 6,155 మంది మరణించినవారు, 480 మంది ఆచూకీ లేనివారు, 17,616 మంది శాశ్వతంగా తరలినవారు, 57 మంది ఇతర కేటగిరీలో ఉండగా, 2,748 మంది ఇప్పటికే నమోదు అయినవారిగా గుర్తించారు. క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ 17నుంచి వచ్చేనెల 16వరకుముసాయిదా ప్రచురణ 17వ తేదీ తుది ప్రచురణ అక్టోబర్ 19వ తేదీనోటీసుల దశ/క్లెయిమ్లు 17నుంచి అక్టోబర్ 15 వరకు అభ్యంతరాల పరిష్కారం వివరాలు సరిచూసుకోండి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ: ముసాయిదా జాబితాలో ప్రతి ఓట రూ తమ పేరు, వయసు, చిరునామా తదితర వివరాలను పరిశీలించుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. అర్హత ఉన్నప్పటికీ పేరు లేకపోయినా, నమోదైన వివరాల్లో తప్పులు ఉన్నా సెప్టెంబర్ 16లోగా దావాలు, అభ్యంతరాలు సమర్పించవచ్చన్నారు. కొత్తగా పేరు నమోదు కోసం ఫారం–6, పేరు తొలగింపు లేదా నమోదుపై అభ్యంతరానికి ఫారం–7, వివరాల సవరణ లేదా నివాస మార్పు కోసం ఫారం–8 వినియోగించుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుల ను బీఎల్ఓలకు నేరుగా ఇవ్వడంతోపాటు ఈసీఐనెట్ యాప్, ఓటర్ సర్వీస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనూ సమర్పించవచ్చన్నారు. పోలింగ్ కేంద్రాలు, బీఎల్ఓలు, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల్లో జాబితా అందుబాటులో ఉందన్నారు. ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతీ పౌరుడు జాబితాను పరిశీలించి అవసరమైన సవరణలు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. -
రెస్టారెంట్లపై నిఘా ఏది?
● అర్ధరాత్రి వరకు బిర్యానీ హోటళ్ల నిర్వహణ ● తాజాగా ఓ రెస్టారెంట్లో గొడవపై కలెక్టర్కు న్యాయవాది ఫిర్యాదుజనగామ: పట్టణంలో రాత్రి పది గంటలు దాటితే సాధారణ వ్యాపార సంస్థలు, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, టీ కొట్లు మూసివేయిస్తున్న పోలీసులు.. కొన్ని బిర్యానీ హోటళ్లు, రెస్టారెంట్ల విషయంలో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో రెస్టారెంట్లు అర్ధరాత్రి 12.30 గంటలు దాటినా తెరిచి ఉండటంపై ఇతర హోటల్ యజ మానులు, స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందరికీ ఒకే నిబంధనలు వర్తించాలా.. కొందరికి ప్రత్యేక మినహాయింపులున్నాయా అని ప్రశ్నిస్తున్నారు. కలకలం రేపుతున్న నైన్డైన్ వివాదం పట్టణంలోని కురుమవాడ ప్రాంతంలో నైన్ డైన్ రెస్టారెంట్లో ఇటీవల అర్ధరాత్రి జరిగిన గొడవ తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందిన వెంటనే సీఐ సత్యనారాయణరెడ్డి స్పందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి వరకు రెస్టారెంట్లు కొనసాగితే అక్కడికి వచ్చే వ్యక్తులపై నిఘా ఎలా ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గొడవలకు బిల్లుల విషయంలో తలెత్తిన వివాదాలే కారణమా.. లేక ఇంకా ఏమైనా కారణాలతో గొడవ జరిగిందా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది ఆలేటి సిద్ధిరాములు సోమవారం కలెక్టర్ సందీప్కుమార్ ఝాకు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఏకశిలా పబ్లిక్ స్కూల్కు సమీపంలో ఉన్న నైన్ డైన్ రెస్టారెంట్ను అర్ధరాత్రి 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నారని, అందులో కనీసం ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేవని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలోనూ చిన్న చిన్న గొడవలు జరిగినట్లు తెలిపారు. డ్రెయినేజీ సమస్యతో వ్యర్థాలు రోడ్డుపైకి వస్తున్నాయని, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించాలని, అక్కడ పని చేస్తున్న కార్మికుల వివరాలను పరిశీలించేందుకు లేబర్ అధికారులు రావాలని కోరారు. గృహాల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారని, పూర్తిస్థాయి విచారణ చేపట్టి నిబంధనలు ఉల్లంఘిస్తున్న దానిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఇదిలా ఉండగా హైదరాబాద్, హన్మకొండ, సూర్యాపేట, సిద్దిపేట రోడ్లలోనూ అర్ధరాత్రి వరకు కొనసాగుతున్న రెస్టారెంట్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
నిమిషాల్లో రక్తపరీక్షల రిపోర్టు
జనగామ: జిల్లా కేంద్రంలోని చంపక్హిల్స్ మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్)లో వైద్య సేవలు మరింత వేగవంతం కానున్నాయి. గత కొన్నేళ్లుగా అందుబాటులో లేని సీబీపీ రక్త పరీక్షల యంత్రం తాజాగా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడంతో రోగులకు సత్వర రిపోర్టులు అందనున్నాయి. ఎంసీహెచ్కు ప్రతిరోజూ సుమారు 400 మంది వరకు ఓపీకి వస్తుంటారు. రోజుకు సగటున 150 మందికి సీబీపీ పరీక్షలు అవసరమ వుతున్నాయి. ఇప్పటివరకు ఆస్పత్రిలో యంత్రం లేకపోవడంతో రక్త నమూనాలను సేకరించి జిల్లా కేంద్రంలోని డయాగ్నస్టిక్ కేంద్రానికి పంపించేవారు. దీంతో రిపోర్టుల కోసం రోగులు కొంత సమయం వేచి చూడాల్సి వచ్చేది. తాజాగా రూ.10 లక్షల విలువైన కంప్లీట్ బ్లడ్ పిక్చర్(సీబీపీ)యంత్రం అందుబాటులోకి రావడంతో ఈ ఇబ్బందులకు తెరపడనుంది. గంటకు సుమారు 100 పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉన్న ఈ యంత్రం 24 గంటలూ సేవలు అందించనుంది. సీబీపీ పరీక్ష కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకపోవడంతో ఒక్కో రోగికి సుమారు రూ.300 వరకు ఖర్చు తగ్గనుంది. కొత్త యంత్రంతో నిర్ధారణ పరీక్షల వేగం పెరగడంతో ప్రభుత్వ ఆస్పత్రిపై ఆధారపడే పేద, మధ్యతరగతి కుటుంబాలకు మరింత ప్రయోజనం కలగనుంది. ఎంసీహెచ్లో సీబీపీ యంత్రం అందుబాటులోకి పేషెంట్లకు తగ్గనున్న ఆర్థిక భారం -
అభివృద్ధి.. సంక్షేమం.. రాజకీయం!
సీఎం రేవంత్రెడ్డి ములుగు, పరకాల పర్యటన.. ఆద్యంతం ఆసక్తికరంసాక్షి ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదివారం ములుగు, పరకాల పర్యటన అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ సందేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మేడారంలో వనదేవతలను దర్శించుకుని పింఛన్ల పంపిణీ మొదలుపెట్టారు. అక్కడినుంచి ములుగులో హ్యామ్రోడ్ల పైలాన్ ఆవిష్కరణ.. కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం.. చివరగా పరకాలలో ‘ప్రజాపాలన–ప్రగతిబాట’ విజయోత్సవ సభలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. విద్య, వైద్యం, రహదారులు, విద్యుత్, పట్టణ మౌలిక వసతులు, మహిళా సాధికారతకు సంబంధించిన పలు పనులకు శ్రీకారం చుట్టారు. రాజకీయ ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేసిన సీఎం.. సొంతపార్టీలోని అసంతృప్తులకూ చురకలు అంటించారు. చర్చనీయాంశంగా రాజకీయ సందేశం.. పరకాల సభలో సీఎం ప్రసంగం అభివృద్ధి, సంక్షేమంతోపాటు రాజకీయ సందేశాలతోనూ సాగింది. ప్రజలనుంచి ఎన్నికై న ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకులుగా పనిచేయాలన్నారు. ‘కేసీఆర్ ఫ్యామిలీ జస్టిస్ చేస్తే నేను సోషల్ జస్టిస్ చేస్తున్నా.. ఆనాడు కుటుంబసభ్యులకు పదవులు కట్టబెడితే, మేం సామాజిక కోణంలో అవకాశాలు కల్పిస్తున్నాం.. ఇలాంటి నేతలు మహిళలు, ప్రజలకు ఎలా న్యా యం చేస్తారు’ అంటూ ఘాటైన విమర్శలు చేశారు. పాలకుర్తిలాంటి చోట పాలన పరాకాష్టకు చేరి కొండలాంటి వ్యక్తులమని చెప్పుకున్న వారు ఎన్నికల్లో బండలా పగిలిపోయారని, ఇప్పటికై నా ప్రజల చైతన్యమే ప్రజాస్వామ్యానికి బలమని గ్రహించాలని పేర్కొన్నారు. సీఎం పర్యటనతో ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. ఓరుగల్లుపై వరాల జల్లు వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మామునూరు విమానాశ్రయం కోసం భూసేకరణకు రూ.300 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నామని ప్రకటించారు. రెండేళ్లలో విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. వరంగల్ నగరంలో సుమారు రూ.5,700 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సమర్థంగా సిద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నామని, మిగిలిన ఖాళీలను దశలవారీగా భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు. ‘ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక 32 నెలల పాలనలో రోజూ మూడు గంటలైనా రెస్ట్ తీసుకోలేదు. ప్రజలు అండగా ఉంటే చాలు ఏదైనా సాధిస్తా’ అని రేవంత్ స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్క,అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు కావ్య, వేం నరేందర్ రెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, నాయిని రాజేందర్రెడ్డి, దొంతి మాధవరెడ్డి, రాంచంద్రునాయక్, మురళీనాయక్, ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వర్ణ, కలెక్టర్లు హేమంత్ సహదేవరావు, చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద, సీపీ శ్వేత, ఎస్పీ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందడి.. ఓరుగల్లుపై వరాల జల్లు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై హామీలు.. నిరుద్యోగులకు మార్గదర్శనం రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు సొంతపార్టీ అసంతృప్తులకు చురకలు సీఎం పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరం.. పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయాల్లో సీఎం రేవంత్రెడ్డి తాజా పిలుపు ఆసక్తికర చర్చకు తెరలేపింది. ముఖ్యమంత్రి పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి ప్రాధాన్యం దక్కగా.. మంత్రి కొండా సురేఖ ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ప్రకాశ్రెడ్డిని మరోసారి గెలిపించాలని సీఎం ప్రజలకు పిలుపునివ్వడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో గతంలో రేవూరి, మంత్రి కొండా సురేఖ వర్గాల మధ్య విబేధాలు బహిర్గతమైన సందర్భాలున్నాయి. ఫ్లెక్సీల వివాదం ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. కాగా, మంత్రి సురేఖ గైర్హాజరుకు అధికారిక కారణం వెల్లడికాకపోవడంతో స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా.. ‘పరకాలలో రేవూరికే సీఎం అండ’ అన్న సంకేతాన్ని రేవంత్రెడ్డి పర్యటన ఇచ్చిందనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. -
చిక్కవు..దొరకవు
బోను చూస్తే చాలు జారుకుంటున్న వానరాలు మనిషి వ్యూహానికి వానరమూకల ప్రతి వ్యూహం. బోను కనిపిస్తే బుద్ధిగా పక్కకు. గుంపును నడిపించే పెద్ద కోతులే ఇప్పుడు అధికారులకు సవాల్గా మారాయి. బోను పెట్టారు.. ఎర వేశారు..కోతులు వచ్చాయి.. కానీ చిక్కలేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. రోజుల తరబడి ఇదే తంతు. చిన్న కోతులు బోనులో పడుతున్నా.. వాటి వెనుకే ఉంటూ పరిస్థితిని గమనిస్తున్న పెద్ద కోతులు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. బోను ఎక్కడ పెట్టారు, అందులోకి వెళ్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ముందుగానే పసిగట్టినట్టుగా దూరంగా ఉంటున్నాయి. దీంతో పట్టణంలో కోతుల పట్టివేత కార్యక్రమానికి కొత్త చిక్కు ఎదురవుతోంది. వేలసంఖ్యలో కోతులను పట్టుకున్నా, చివరికి మిగిలినవే ‘లీడర్’ కోతులుగా మారి మున్సిపల్ సిబ్బందికి సవాల్ విసురుతున్నాయి. –జనగామ పట్టణంలోని 30 వార్డుల పరిధిలో కొన్నేళ్లుగా కోతుల సంఖ్య విపరీతంగా పెరిగింది. సుమారు ఐదు వేలకుపైగా కోతులు పట్టణంలో సంచరిస్తున్నట్లు అంచనా. ఇళ్లలోకి చొరబడటం, ఆహార పదార్థాలు లాక్కోవడం, చేతిలోని సంచులు ఎత్తుకెళ్లడం, పాదచారులను వెంబడించడం, దాడులకు పాల్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోతుల దాడుల్లో పలువురు గాయపడిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి. రెండున్నర నెలలుగా వేట కోతుల సమస్యకు పరిష్కారం చూపేందుకు మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, కమిషనర్ రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో కోతుల పట్టివేతకు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రత్యేక బృందానికి బాధ్యతలు అప్పగించి బోన్ల ద్వారా కోతులను పట్టుకునే ప్రక్రియ ప్రారంభించారు. సుమారు రెండు నెలల వ్యవధిలో 4,100 కోతులను పట్టుకుని, మున్సిపల్ పర్యవేక్షణలో దట్టమైన అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టారు. మిగిలినవే చిక్కడం లేదు ప్రస్తుతం వెయ్యి నుంచి 1,500 వరకు కోతులు ఇంకా పట్టుబడాల్సి ఉంది. వీటిని పట్టుకునేందుకు పది నుంచి ఇరవై రోజుల పాటు బోన్లు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. చిన్న కోతులు బోన్లలో చిక్కుతున్న సమయంలో పెద్ద కోతులు మాత్రం చుట్టుపక్కల నుంచే పరిస్థితిని గమనిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. బోను దగ్గరకు వెళ్లకుండా గుంపును కూడా వెనక్కి తీసుకెళ్తున్నట్లు పట్టుకునే బృందం గుర్తించింది. జ్ఞాపకశక్తే ఇప్పుడు అడ్డంకి పట్టణంలో అనేక ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేయడం వల్ల కోతులు వాటిని గుర్తుంచుకుంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎర వేసినప్పటికీ గత అనుభవాన్ని బట్టి ప్రమాదాన్ని అంచనా వేస్తున్నట్లు వాటి ప్రవర్తన కనిపిస్తోంది. దీంతో కోతుల అలవాట్లు, గుంపు ప్రవర్తన, ఆహారపు విధానం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం బోన్లు ఏర్పాటు చేయడం ద్వారా సమస్యను పూర్తిగా పరిష్కరించడం కష్టంగా మారింది. కోతుల వేటను పసిగడుతూ పక్కకు.. పట్టివేత బృందానికి కొన్ని రోజులుగా సవాల్ పట్టుబడినవి 4,100.. మిగిలినవి ‘లీడర్’ కోతులు పట్టివేతకు 45రోజుల విరామం.. పట్టణ ప్రజలకు తప్పని వానర బెడద ‘లీడర్’ కోతులదే పైచేయి వానరమూకల్లో పెద్ద కోతులు ముందుండి గుంపును నడిపిస్తుంటాయి. ప్రమాదాన్ని గుర్తించినప్పుడు మిగిలిన వాటిని అప్రమత్తం చేసే స్వభావం వాటిలో కనిపిస్తుంది. పట్టణంలో ప్రస్తుతం పట్టుబడకుండా మిగిలిన కోతుల్లో ఇలాంటి లీడర్ కోతులే ఎక్కువగా ఉన్నాయని పట్టుకునే బృందం భావిస్తోంది. అందుకే మిగిలిన వాటిని పట్టుకోవడం మొదట్లో పట్టుకున్న 4,100 కోతులతో పోలిస్తే మరింత క్లిష్టంగా మారింది. 45 రోజుల విరామం వరుసగా బోన్లు ఏర్పాటు చేస్తే కోతులు మరింత అప్రమత్తమయ్యే అవకాశం ఉండటంతో వానరా లు పట్టుకునే బృందం ప్రస్తుతం విరామం తీసుకుంది. 45 రోజులపాటు బోన్లకు దూరంగా ఉంచి, కోతులు వాటిని మరిచిపోయిన తర్వాత మళ్లీ పట్టుకునే ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందన్నది చూడాలి. ధర్మకంచ, బాలాజీ నగర్, కురుమవాడతో పాటు పలు ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉంది. ఇప్పటివరకు 4,100 కోతులను పట్టుకోవడం కొంత ఉపశమనాన్ని కలిగించినా, మిగిలిన వెయ్యి నుంచి 1,500 కోతులను పట్టుకునే వరకు సమస్య పూర్తిగా తీరినట్లు చెప్పలేని పరిస్థితి. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష
జనగామ: జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీ కోసం సమీకృత కలెక్టర్ కార్యాలయ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో ఆదివారం రాత పరీక్ష నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖలో ఒక కుక్, మూడు కామాటి, షెడ్యూల్డ్ కులాల సర్వీస్ కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ సొసైటీ లిమిటెడ్లో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒక ఆఫీస్ సబార్డినేట్, వ్యవసాయ మార్కెట్ కమిటీలో 2 డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 2 సెక్యూరిటీ గార్డులు, 1 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్కు మొత్తం 575 దరఖాస్తులు రాగా, అందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు (371), ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు (146), కుక్, కామాటి పోస్టులకు (50), సెక్యూరిటీ గార్డు పోస్టులకు (8) దరఖాస్తులు వచ్చాయి. పరీక్షకు 480 మంది హాజరు రాత పరీక్షకు 480 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు 309 మంది, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు 118 మంది, సెక్యూరిటీ గార్డు పోస్టులకు 7 మంది, కుక్ పోస్టుకు 24 మంది, కామాటి పోస్టుకు (22) మంది పరీక్ష రాశారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన రాత పరీక్షను రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షించారు. ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యవేక్షించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
తామర పుష్పాలతో ఉప్పలమ్మ తల్లికి అలంకరణ
జనగామ: శ్రావణ మాసం తొలి ఆదివారం సందర్భంగా పట్టణంలోని ఉప్పలమ్మ దేవాలయంలో అమ్మవారిని తామర పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు వారణాసి పవన్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష అర్చనలు జరిపారు. తొలి ఆదివారం కావడంతో ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని, బోనాలను నైవేద్యంగా సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కుర్రెముల మోహన్, ఆలయ సిబ్బంది పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాంగ్రెస్ పార్టీ వార్డు కమిటీల ఏర్పాటు షెడ్యూల్ విడుదలజనగామ: కాంగ్రెస్ పట్టణ కమిటీ పరిధిలోని 30 వార్డులకు అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు టీమ్లను నియమించేందుకు పార్టీ అధిష్టానం షెడ్యూల్ విడుదల చేసినట్లు పట్టణ అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు వార్డుల వారీగా కమిటీల నిర్మాణ ప్రక్రియ కొనసాగనుంది. ప్రతీ వార్డుకు నిర్ణీత సమయాన్ని కేటాయించి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 18వ తేదీన 1,2,3,4,5,19వ తేదీన 6,7,8,9,10, 20వ తేదీన 11,12,13,14,15, 16,17,18,19,20, 21వ తేదీన 21,22,23,24,25, 22వ తేదీన 26,27,28,29,30 తేదీల్లో వార్డు సమావేశాలు ఉంటాయన్నారు. పార్టీ కార్యకర్తలు, వార్డు స్థాయి నాయకులు నిర్ణీత సమయానికి హాజరై కమిటీల నిర్మాణ ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు. ప్రక్రియ పూర్తయిన అనంతరం పట్టణంలోని 30 వార్డులకు అధ్యక్షులు, కార్యదర్శులు, టీమ్ల సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ‘బొమ్మకూరు’ కుడి కాలువ నీటిని విడుదల చేయాలిజనగామ రూరల్: మండలంలోని పెద్దపహడ్, గోపరాజుపల్లి, తమ్మడపల్లె, ఓబుల్ కేశవాపూర్ గ్రామాలకు చెందిన రైతులు బొమ్మకూర్ రిజర్వాయర్ కుడి కాలువ నీటిని విడుదల చేయాలని జనగామ– సిద్దిపేట జాతీయ రహదారి పెద్దపహడ్ క్రాస్రోడ్డు వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ.. బొమ్మకూరు రిజర్వాయర్లో సరిపడా నీటి నిల్వలు ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంతో నీటిని విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. తక్షణమే నీటిని విడుదల చేసి రైతులకు వరి నాట్లు ఎండిపోకుండా చూడాలని సంబంధిత అధికారులను కోరారు. 24గంటల్లో నీటిని విడుదల చేయని పక్షంలో కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చ రించారు. కాగా, అధికారులు మూడు రోజుల్లో నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ధర్నాలో రైతులు గుండ్లపల్లి రవి, గద్ద చంద్రశేఖర్, బేజాడి సిద్దులు, రాజు, సంజయ్, సిద్దులు, గణేశ్, బాబు,శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. సమాజానికి జ్ఞానం ఇవ్వడమే నిజమైన జీవితంలింగాలఘణపురం: తాము పొందిన జ్ఞానం సమాజానికి తిరిగి ఇవ్వడమే నిజమైన జీవితమని, అదే దివంగత ప్రొఫెసర్ లక్ష్మినారాయణ నేర్పిన పాఠమని ఓయూ మాజీ వీసీ రవీందర్యాదవ్ అన్నారు. దివంగత ప్రొఫెసర్ లక్ష్మి నారాయణ స్వగ్రామమైన సిరిపురంలో ఆదివారం సిరిపురం డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ వీసీ రవీందర్యాదవ్ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ లక్ష్మినారాయణ విద్యావేత్తగా, మానవతావాదిగా, సమాజసేవలో ఎప్పుడూ ముందుండేవారన్నారు. నిరుపేదలకు విద్యను చేరువచేయాలనే లక్ష్యంతో ఉండేవారని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గ్రామంలోని పదో తరగతి విద్యార్థులకు ప్రొఫెసర్ లక్ష్మినారాయణ మెమోరియల్ స్కాలర్షిప్ను అందిస్తామని సిరిపురం డెవలప్మెంట్ ఫోరం ప్రకటించింది. కార్యక్రమంలో ఫ్రొఫెసర్లు చింత సాయిలు, సీహెచ్ భిక్షపతి, పరశురాములు, బుచ్చన్న, సర్పంచ్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్ల పైలాన్ ఆవిష్కరణ.. కలెక్టరేట్ ప్రారంభోత్సవం
ములుగు: ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ వద్ద నిర్మించిన హ్యామ్ రోడ్ల (గ్రామీణ రహదారుల) అభివృద్ధి పైలాన్ను సీఎం ఆవిష్కరించారు. అక్కడినుంచి కలెక్టరేట్కు చేరుకొని రూ.868 కోట్లతో జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి పనుల మరో పైలాన్ను ప్రారంభించారు. పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నూతన కలెక్టరేట్ను సీఎం రేవంత్రెడ్డి.. మంత్రి సీతక్కతో కలిసి ప్రారంభించారు. కార్యాలయం అంతా కలియదిరిగి పరిసరాలు పరిశీలించారు. కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావును కుర్చీలో ఆసీనులు చేసి శాలువా కప్పారు. నూతన కలెక్టరేట్ పక్కన ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టు భవనాలు నిర్మించడంతోపాటు మల్లూరు లక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్లు సీఎం తెలిపారు. కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించి గ్రూప్ ఫొటో దిగారు. -
జనవరి నాటికి వంద పడకల ఆస్పత్రి
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: నియోజకవర్గ కేంద్రంలో రూ.46 కోట్ల నిధులతో నిర్మాణం జరుగుతున్న వంద పడకల ఆస్పత్రిని డిసెంబర్ 31, 2026 నాటికి పూర్తి చేసి జనవరి 2027 నాటికి అన్ని హంగులతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈసీజీ మిషన్ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి శనివారం ప్రారంభించారు. అనంతరం స్వయంగా ఎమ్మెల్యే ఈసీజీ పరీక్ష చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘన్పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి ఈసీజీ మిషన్ అందుబాటులోకి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఘన్పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నారని, త్వరలో డయాలసిస్ సెంటర్ మంజూరు అవుతుందన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంధ్యారాణి, ప్రజాప్రతినిధులు, నాయకులు, వైద్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ రేషన్కార్డులు అందిస్తోందని, కార్డు కల్గిన ప్రతీ కుటుంబం తప్పనిసరిగా డిజిటల్ రేషన్కార్డులను తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో జరుగుతున్న గ్రామసభకు ఎమ్మెల్యే హాజరయ్యారు. కార్యక్రమంలో సర్పంచ్ ముక్కెర స్వరూపరవి, ఉపసర్పంచ్ ఇసాక్ తదితరులు పాల్గొన్నారు. -
పగబట్టిన విధి!
హన్మకొండ చౌరస్తా/ఆత్మకూరు/ఖిలా వరంగల్:/హన్మకొండ అర్బన్: ఆ కుటుంబాన్ని విధి పగబట్టింది. మృత్యువు ఒక్కొక్కరిని తన ఒడికి చేర్చుకుంది. రెండేళ్లలో కుటుంబాన్ని మొత్తం కబళించింది. రెండేళ్ల క్రితం కొడుకు, ఐదు నెలల క్రితం భర్త మృతి చెందగా.. శనివారం భార్య సైతం అనంతలోకాలకు చేరుకుంది. హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన వరంగల్ మార్కెటింగ్ శాఖ అధికారి (డీఎంఓ) కలకోట్ల సురేఖ(43) శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని తెలుసుకున్న స్థానికుల రోదనలతో పెద్దమ్మగడ్డ దుఃఖసాగరంలో మునిగిపోయింది. మృత్యుపాశమైన ఇసుకలారీ.. హనుమకొండలోని పెద్దమ్మగడ్డకు చెందిన కలకోట్ల సురేఖ వరంగల్ డీఎంఓగా విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ ఇన్చార్జ్ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శనివారం ఆమె గుడెప్పాడ్ మార్కెట్ యార్డులో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం వ్యక్తిగత పనుల నిమిత్తం కారులో చింత విజయబాబు అనే వ్యక్తితో కలిసి ఏటూరునాగారం వైపు వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న ఇసుకలారీ ఢీకొట్టడంతో సురేఖతోపాటు విజయబాబు కూడా దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదంలో కొడుకు.. అనారోగ్యంతో భర్త సురేఖ, కిరణ్ స్వస్థలం హనుమకొండలోని పెద్దమ్మగడ్డ అయినప్పటికీ పదిహేనేళ్ల క్రితం జూలైవాడలో ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. సురేఖ ఒక్కగానొక్క కుమారుడు సుక్రీత్ (16) రెండేళ్ల క్రితం క్రికెట్ ఆడేందుకు స్కూటీపై వెళ్తుండగా.. బాలసముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్ వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బస్ ఢీకొట్టడంతో అతడు మృతి చెందాడు. సురేఖ భర్త బొక్క కిరణ్ (50) అనారోగ్యంతో బాధపడుతూ ఐదు నెలల క్రితం మృతిచెందాడు. శనివారం సురేఖ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రెండేళ్లలో కుటుంబమంతా మృత్యు ఒడిలోకి చేరినట్లయ్యిందని కుటుంబీకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చివరి స్టేటస్లో కొడుకు జ్ఞాపకాలు..పతాకావిష్కరణ అనంతరం సురేఖ తన విధి నిర్వహణకు సంబంధించిన ఫొటోలను వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకున్నారు. అదే సమయంలో తన కుమారుడు బతికున్నప్పుడు పాఠశాలలో దిగిన ఫొటోలు, అతడితో సరదాగా గడిపిన సందర్భాల ఫొటోలను కూడా స్టేటస్గా ఉంచుకున్నారు. తల్లిదండ్రులకు తీరని శోకం కొడుకు, భర్త మరణించిన తర్వాత సురేఖ తన వృద్ధ తల్లిదండ్రులతో కలిసి జూలైవాడలోని ఇంట్లో నివసిస్తున్నారు. సురేఖ తండ్రి సురేందర్ సీపీఓ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. కూతురుకు వరుసగా ఎదురైన విషాదాలను తలచుకుంటూ ఇప్పుడు ఆ వృద్ధ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ‘ముందు మనవడిని.. ఆ తర్వాత అల్లుడిని కోల్పోయాం.. ఇప్పుడు కూతురిని కూడా కోల్పోయాం.. ఈ ఘోరాన్ని ఎలా భరించాలి..?’ అంటూ బంధువులను పట్టుకుని వారు గుండెలవిసేలా రోదించడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. సురేఖకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. సురేఖ మృతదేహానికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటివరకు తమతో ఉన్న అధికారి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారన్న విషయం తెలియగానే గూడెప్పాడ్ మార్కెట్ పాలకవర్గం, సిబ్బంది, వరంగల్ మార్కెటింగ్శాఖ అధికారులు విషాదంలో మునిగిపోయారు. మంచి అధికారిని కోల్పోయామని పాలకవర్గం విచారం వ్యక్తం చేసింది. సిబ్బంది.. అధికారి సురేఖతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు. ఒకే కుటుంబంలో రెండేళ్లలో ముగ్గురి మృతి తాడ్వాయి రోడ్డు ప్రమాదంలో వరంగల్ డీఎంఓ సురేఖ దుర్మరణం కన్నీరు మున్నీరైన బంధువులు -
ఉద్యమాలకు పురుడుపోసిన గడ్డ
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ: ఉద్యమాలకు జనగామ పురుడు పోసిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్క రించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులను రీడిజైన్ చేసి సమ్మక్క సాగర్ వంటి ప్రాజెక్టులను నిర్మించడంతో పాటు రామప్ప నుంచి ఉనికిచెర్ల వరకు కాలువల నిర్మాణం, భారీ మోటార్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టినట్లు తెలిపారు. జనగామ గడ్డకు ఉన్న పోరాట చరిత్రను, త్యాగాల వారసత్వాన్ని కాపాడుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని పేర్కొన్నారు. -
కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జెండావిష్కరణ
జనగామ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాలాపన, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఛాగల్లు రోడ్డు ప్రమాద మృతుడు పరకాల వాసి స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులో జాతీయ రహదారిపై యూటర్న్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుడు హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేటకు చెందిన బయ్య సిద్దు(20)గా గుర్తించారు. సిద్దు తండ్రి రాజు మూడేళ్ల క్రితం చనిపోయాడు. తల్లి శ్రీలత, సోదరి ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ రాంచరణ్ అజాగ్రత్తగా రాంగ్రూట్లో అతివేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని, ట్రాక్టర్ డ్రైవర్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సిద్దు బాబాయి ఫిర్యాదులో కోరారు. కాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వేణు తెలిపారు. చికిత్స పొందుతున్న మహిళ మృతి రఘునాథపల్లి: తీవ్ర కడుపునొప్పి భరించలేక పురుగు మందు తాగిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండలంలోని ఖిలాషాపూర్లో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన బాల్నె ఉపేంద్ర (58), భర్త వెంకటేశ్వర్లు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉపేంద్ర మూడు నెలలుగా తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతోంది. 14న రాత్రి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగింది. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. పాడిగేదెలు అమ్ముకున్న బాధతో ఆత్మహత్య జఫర్గఢ్: ఇష్టంగా పెంచుకుంటున్న పాడి గేదెలు అమ్ముకున్నానన్న బాధతో మండలంలోని తమ్మడపల్లి (ఐ) గ్రామంలో బొల్లాల మోహన్(42) అనే రైతు పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులతో పాడిగేదెలను అమ్ముకున్న మోహన్ తీవ్ర మనోవేధనతో 13న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి
నర్మెట: గ్రామాల అభివృద్ధికి పంచాయతీ పాలక వర్గాలు బాటలు వేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని అదనపు డీఆర్డీఓ, మండల ప్రత్యేక అధికారి నాగశేషాద్రిసూరి అన్నారు. మండలంలోని 17 పంచాయతీల్లో శనివారం గ్రామసభలు నిర్వహించగా మచ్చుపహాడ్, గండిరామారం, లోక్యతండా సభలకు ఆయన హాజరయ్యారు. ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్, ఏపీఓ రమాదేవి, సర్పంచ్లు పాల్గొన్నారు. వాచ్మన్ కుటుంబానికి ‘పల్లా’ పరామర్శ జనగామ: మండలం యశ్వంతపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయ వాచ్మన్ మబ్బు ఎల్లయ్య గుండెపోటుతో శని వారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఎల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాస్కెట్బాల్ గ్రౌండ్ ప్రారంభం జనగామ: పట్టణంలోని నెహ్రూపార్కు ఏరియా సెయింట్ పాల్స్ స్కూల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన తరగతి గదులతో పాటు బాస్కెట్ బాల్ గ్రౌండ్ను వరంగల్ బిషప్ డాక్టర్ డి.విజయపాల్రెడ్డి ప్రారంభించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ మరిజ జోసఫ్ ఆధ్వర్యంలో జరిగిన స్వా తం త్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఫాదర్ ఆగస్టిన్రెడ్డి, ఇన్నారెడ్డి, సునీల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాపర్వైరు చోరీ చిల్పూరు: మండలంలోని వంగాలపల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావుల వద్ధ ఉన్న ట్రాన్స్ఫార్మర్ను గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి పగులగొట్టి అందులోని కాపర్ వైరును ఎత్తుకెళ్లారు. రైతులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంస్థకు రూ. 2 లక్షల వరకు నష్టమని తెలిపారు. నిధుల గోల్మాల్పై కొనసాగుతున్న విచారణజఫర్గఢ్: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన నిధుల గోల్మాల్పై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఫోర్జరీ సంతకాలతో పాఠశాలకు సంబంధించిన నిధులు స్వాహ చేసిన విషయం బైటకు రావడంతో సంబంధిత అధికారులు విచారణ చేపడుతున్నారు. శనివారం సంబంధిత శాఖ జోనల్ అధికారి విద్యారాణి విచారణ చేపట్టారు. -
స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ
జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తెలిపారు. శనివారం కలెక్టరేట్లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణితో కలిసి లబ్ధిదారులకు రేషన్ స్మార్ట్కార్డులు పంపిణీ చేశారు. అనంతరం విప్ మాట్లాడుతూ..జననాల నమోదు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం దరఖాస్తు ప్రక్రి య నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డులో 11 ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయని, క్యూర్ కోడ్ కారణంగా నకిలీ కార్డులు తయారు చేయడం కష్టమన్నా రు. 15 రోజుల్లో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా పంపిణీ చేస్తామని తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో మీ–సేవా కేంద్రాన్ని అయిలయ్య ప్రారంభించారు. -
శ్రావణ పూజలు షురూ
జనగామ: శ్రావణమాసం తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని జిల్లాకేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జనగామ పట్టణంలోని బతుకమ్మకుంట శ్రీ విజయదుర్గామాత ఆలయంలో అమ్మవారికి గాజులతో ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అభిషేకా లు, పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లావ్యాప్తంగా శ్రావణమాస పర్వదినాలు ప్రారంభం కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. -
ఉత్సాహంగా టెన్నిస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ జేఎన్ స్టేడియంలో ఒక్క రోజు ఇంటర్నల్ టోర్నమెంట్ నిర్వహించారు. 60 ప్లస్ కేటగిరీలో జరిగిన ఫైనల్ మ్యాచ్ డాక్టర్ ఎరగ్రట్టు స్వామి–కె. రవిచంద్ర, కుంజ్ బిహారి–పి. వెంకటేశ్వరరావు మధ్య పోటీ ఉత్కంఠగా సాగింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఎరగ్రట్టు స్వామి, రవిచంద్ర జట్టు విజేతగా నిలిచింది. ఓపెన్ కేటగిరీ డబుల్స్ విభాగంలో వినీల్కుమార్, శ్రీనివాస్ జట్టు విజేతగా నిలవగా, ద్వితీయ స్థానంలో ప్రదీప్త, కార్తికేయ జట్టు ట్రోఫీని అందుకుంది. సింగిల్స్ విభాగంలో ప్రథమ స్థానంలో టి.సాత్విక్, ద్వితీయ స్థానంలో వినీల్ కుమార్ విజేతలుగా నిలిచారు. -
బాలా పెయింటింగ్స్కు టెండర్లు
జనగామ: జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లోని 39 ప్రీప్రైమరీ విభాగాల్లో బాలా పెయింటింగ్స్ ఏర్పాటు చేసేందుకు అర్హత కలిగిన తయారీదారులు, డీలర్లు, సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్, సమగ్ర శిక్ష చైర్పర్సన్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం తెలిపారు. ఈ పనులకు మొత్తం అంచనా వ్యయం రూ.9.75 లక్షలుగా నిర్ణయించగా, ఒక్కో పాఠశాలకు రూ.25 వేలుగా పేర్కొన్నారు. టెండర్లో పాల్గొనే వారు రూ.24,375 ఈఎండీతో పాటు రూ.500 టెండర్ డాక్యుమెంట్ ధరను జిల్లా విద్యాశాఖాధికారి, జనగామ పేరున డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో సమర్పించాలన్నారు. టెండర్ పత్రాల విక్రయం ఈ నెల 17 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో జరుగుతుంది. టెండర్లను ఈ నెల 22 నుంచి 25 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో టెండర్లను తెరుస్తారు. పూర్తి వివరాలు టెండర్ పత్రాల్లో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు. ఫోర్జరీ సంతకాలతో నిధులు స్వాహా!జఫర్గఢ్: ఫోర్జరీ సంతకాలతో పాఠశాలకు సంబంధించిన నిధులు స్వాహా అయిన సంఘటన మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు పలు రకాల మెటీరియల్ను విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఈ మెటీరియల్ను అందించేందుకు ప్రభుత్వం టెండర్ విధానాన్ని అనుసరిస్తుంది. నిధులను చెక్కుల ద్వారానే సదరు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఓ కాంట్రాక్టర్ తనకు రావాల్సిన చె క్కు నెలలు గడుస్తున్నా.. రాకపోవడంతో ప్రి న్సిపాల్ను సంప్రదించారు. అయితే చెక్కును ఇదివరకే ఇచ్చినట్లుగా పేర్కొనడంతో పాటు దీనికి సంబంధించిన డబ్బులు కూడా డ్రా అయినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. దీంతో నిధులు గోల్మాల్ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం అధికారులకు తెలియడంతో సంబంధిత అధికారులు పాఠశాలలో విచారణ చేపట్టగా పెద్ద మొత్తంలో నిధులు స్వాహా అయినట్లుగా గుర్తించారు. మరిన్ని వివరాలకు స్టేషన్ఘన్పూర్లోని బ్యాంక్ అకౌంట్ వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో విచారణలో తెలియాల్సి ఉంది. ఫోర్జరీ సంతకాలతోపాటు నిధుల గోల్మాల్పై పిన్సిపాల్ వరలక్ష్మి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ శ్రేణుల ర్యాలీజనగామ: హల్ద్వానీ ఘటనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సంఘీభావంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మాగాంధీ విగ్రహం నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు మార్చ్ నిర్వహించి, అనంతరం ఆర్టీసీ చౌరస్తాలో సత్యాగ్రహం చేపట్టారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి మాట్లాడారు. హల్ద్వానీలో మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్న ర్యాలీ ప్రాంగణాన్ని గంగాజలంతో శుద్ధి చేయడం వివక్షపూరిత చర్యగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి, వేమల్ల సత్యనారాయణరెడ్డి, రాజమౌళి, వంగాల కళ్యాణి, బొట్ల శ్రీనివాస్, ఉడత రవి, తదితరులు ఉన్నారు. కేయూ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రతిభ కేయూ క్యాంపస్: హైదరాబాద్లోని తెలంగాణ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సురక్షా తిరంగా సైబర్ అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇందులో సైబర్ మోసాల నిరోధానికి కేయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి సావస్కర్ వీడియో (రీల్)కు ద్వితీయ బహుమతి దక్కించుకుంది. అనంతరం సర్టిఫికెట్, ప్రశంసపత్రాలు అందించారు. డీజీపీ ఆనంద్, ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున, పోలీస్ ఉన్నతాధికారి సజ్జనార్ చేతుల మీదుగా సావస్కర్ ప్రశంసపత్రం అందుకున్నారు. వర్సిటీ ఎడ్యుకేషనల్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన సాయికుందన్, సంజయ్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందుకున్నట్లు ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్ సంతోష్ తెలిపారు. -
ప్రమాదాల నివారణకు చర్యలు
జనగామ: వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిలో ప్రమాదాలను తగ్గించేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు వరంగల్ సీపీ శ్వేత తెలిపారు. శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఆర్టీఏ సభ్యులు చిలువేరు అభిగౌడ్, జాతీయ రహదారి పీడీ నిరంజన్రెడ్డిలతో కలిసి సీపీ శ్వేత సమావేశానికి ముఖ్యఅతిథిగా హా జరయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జిల్లా పరిధిలో సుమారు 46 కిలోమీటర్ల జాతీయ రహదారిని ఇటీవల అధికారులు క్షేత్రస్థాయిలో పరి శీలించి నిత్యం ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, ప్ర ధాన జంక్షన్లు, తగినంత వెలుతురు లేని ప్రదేశాల ను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ జిల్లా పరిధిలో వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాద రహిత రవాణా, సురక్షిత ప్రయాణం, మెరుగైన రహదారి మౌలిక వసతుల కల్పన దిశగా చర్యలను మరింత వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. డీసీపీ రాజ మహేంద్ర నాయక్, ఆర్డీఓ గోపీరాం, ఎస్ఈ ఎన్పీడీసీఎల్ సంపత్ రెడ్డి, డీఎల్పీఓ వెంకట్రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భరోసా కేంద్రం ప్రజలకు చేరువ కావాలి జనగామ రూరల్: భరోసా కేంద్రం ప్రజలకు మరింత చేరువ కావాలని సీపీ ఎన్. శ్వేత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని భరోసా కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి కేంద్రంలో అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సువర్ణ, ఏసీపీలు భీంశర్మ, నర్సయ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ సీపీ శ్వేత -
యథేచ్చగా నీళ్ల దందా!
జనగామ: జిల్లాలో వాటర్ ప్లాంట్ల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో తాగునీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకేంద్రంలోనే 100కు పైగా వాటర్ ప్లాంట్లు, 12 మండలాల పరిధిలో మరో 150కుపైగా ప్లాంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో రోజుకు లక్ష లీటర్లకు పైగా, మండలాల్లో మరో లక్షన్నర లీటర్ల వరకు తాగునీటి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. లైసెన్సులు.. సర్టిఫికెట్లు ఏవీ? వాటర్ ప్లాంట్ల నిర్వహణకు ట్రేడ్ లైసెన్సు, నీటి నాణ్యతకు సంబంధించిన అనాలసిస్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలి. నీటిని ఎలాంటి ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తున్నారు, ఎప్పటికప్పుడు యంత్రాలను శుభ్రం చేస్తున్నారా, నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నారా? అనే అంశాలపై స్పష్టత కనిపించడం లేదు. నిబంధనల ప్రకారం నీటి అనాలసిస్ సర్టిఫికెట్ను మూడు నెలలకు ఒకసారి తీసుకుని సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉన్నప్పటికీ, చాలా చోట్ల ఈ ప్రక్రియ అమలవుతోందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సింటెక్స్ డబ్బాల్లో అమ్మకాలు వాటర్ ప్లాంట్లకే పరిమితం కాకుండా కిరాణా దుకాణాలు, షాపులు, ఇతర గృహాల వద్ద సింటెక్స్ డబ్బాలను ఏర్పాటు చేసి ప్లాంట్ల నుంచి నీటిని కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. ఈ డబ్బాలను ఎన్నిరోజులకు ఒకసారి శుభ్రం చేస్తున్నారు, వాటిలో నిల్వ చేసిన నీటిని ఎంతకాలం తర్వాత మార్చుతున్నారన్నది తెలియని పరిస్థితి. అపరిశుభ్రమైన కంటైనర్లలో నీటిని నిల్వ చేస్తే శుద్ధి చేసిన నీరు కూడా కలుషితమయ్యే అవకాశం ఉంది. హోటళ్లు.. ఫంక్షన్ హాళ్లకు సరఫరా హోటళ్లు, వ్యాపార సంస్థలు, ఫంక్షన్ హాళ్లు, సభలు, సమావేశాలు, శుభకార్యాలకు పెద్ద ఎత్తున వాటర్ క్యాన్లు సరఫరా అవుతున్నాయి. దీంతో ఒక ప్లాంట్లో నాణ్యత లోపిస్తే దాని ప్రభావం వందలాది మందిపై పడే అవకాశం ఉంది. దీనికి తోడు కూలింగ్ వాటర్, ప్యాకేజ్డ్ వాటర్ ప్యాకెట్ల తయారీ కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నట్లు సమాచారం. వీటి నాణ్యతపై కూడా పర్యవేక్షణ అవసరం. మున్సిపల్ నీరే నాణ్యమైనదంటూ పరీక్షలు జనగామ మున్సిపల్ పరిధిలో మిషనన్ భగీరథ ద్వారా 13,806 నల్లా కనెక్షన్లకు ప్రతిరోజూ సుమారు 1.25 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ఫిల్టర్ బెడ్ ద్వారా శుద్ధి చేస్తున్న ఈ నీటిని ఇటీవల అధికారులు ప్రత్యేకంగా పరీక్షించారు. నీరు తాగేందుకు సురక్షితమని ప్రజలకు అవగాహన కల్పిస్తూ అధికారులు సైతం నీటిని తాగి చూపించారు. అయినప్పటికీ ప్రైవేట్ వాటర్ ప్లాంట్లపై అదే స్థాయిలో నాణ్యత పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉంది.20 లీటర్ల క్యాన్లలో వాటర్ అమ్మకాలుకూలింగ్ వాటర్ అమ్మకాలు అనాలసిస్ సర్టిఫికెట్లు ఏవీ? క్యాన్లలో నీళ్లు.. నాణ్యతపై అనుమానాలు నిబంధనలు మరచి విక్రయాలు జిల్లాలో ‘మూడు ప్లాంట్లు, ఆరు క్యాన్ల’లా వ్యాపారంగతంలోనూ వాటర్ ప్లాంట్ల నిర్వహణపై ప్రజలు అనేక సందేహాలు వ్యక్తం చేసినా, తనిఖీలకు మించి కఠిన చర్యలు కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లా కేంద్రంతో పాటు 12 మండలాల్లో ఉన్న ప్లాంట్లన్నింటినీ గుర్తించి ట్రేడ్ లైసెన్సులు, నీటి అనాలసిస్ సర్టిఫికెట్లు, శుద్ధి ప్రక్రియ, యంత్రాల నిర్వహణ, క్యాన్ల పరిశుభ్రత తదితర అంశాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలు పాటిస్తున్న వివరాలు వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా అధికా రులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాణ్యత లేని నీటిని నిరంతరం తాగితే విరేచనాలు, వాంతులు, కడుపు సంబంధిత ఇబ్బందులు, నీటి ద్వారా వ్యాపించే అంటువ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అపరిశుభ్రమైన డబ్బాలు, క్యాన్లు, ఫిల్టర్లు, పైపులైన్ల ద్వారా కూడా సూక్ష్మజీవులు నీటిలో చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారిపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. -
బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ కావాలి
జనగామ రూరల్: జిల్లాలో వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతులకు అవసరమైన ఆర్థిక సహకారం అందించేందుకు బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో బ్యాంకింగ్ రంగం ద్వారా అమలవుతున్న వివిధ కార్యక్రమాలు, రుణ లక్ష్యాలు, వ్యవసాయ రుణాల పంపిణీ, ప్రభుత్వ పథకాల పురోగతిపై సమీక్షించారు. వ్యవసాయ, పంట రుణాల పంపిణీలో జాప్యం ఉండొద్దని స్పష్టం చేశారు. ఈ సమన్వయ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రతిభ, డీఏఓ అంబికా సోనీ, డీఆర్డీఓ భాస్కర్, ఏపీడీ నూరుద్దీన్, ఏడీ ఎస్సీ కార్పొరేషన్ మాధవి లత, బ్యాంకు ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
96 మిల్లులు.. 73,809 టన్నులు!
రైస్మిల్లర్ల నుంచి రావా ల్సిన బకాయిలపై సీరియస్గా ఉండాలి. భవిష్యత్లో వారికి సీఎంఆర్ ఇవ్వొద్దు. ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించినా, సీఎంఆర్ అప్పగించకపోయినా కఠిన చర్యలు తీసుకోవాలి. బకాయిలపై పక్కా లెక్కలు తేల్చాలి. బకాయిదారులనుంచి ధాన్యం లేదా దాని విలువను పూర్తిగా రికవరీ చేయని వారిపై చర్యలు ఉంటాయి.. – సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి సాక్షిప్రతినిధి, వరంగల్ : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లాలో కలకలంరేపుతున్నాయి. ఉమ్మడి వరంగల్లో కోట్లాది రూపాయల విలువైన సర్కారు ధాన్యం కొందరు రైసుమిల్లర్ల జేబుల్లోకి వెళ్లింది. రైతుల నుంచి కొనుగోలు చేసి మిల్లింగ్ కోసం కేటాయించగా, వాటిని పక్కదారి పట్టించి ఆ డబ్బుతో కొందరు జల్సాలు చేస్తున్నారు. మరికొందరు బినామీ పేర్ల మీద బంగళాలు, కార్లు, భూములు కొనుగోలు చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సి న కోట్లాది రూపాయల సీఎంఆర్ ఎగవేసి తిరుగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మంత్రులు, పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. కఠిన నిర్ణయాలు తీసుకుని ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం డిఫాల్టర్లు, వారికి సహకరిస్తున్న అధికారుల్లో గుబులు మొదలైంది. ఆరు జిల్లాల్లో రూ.166 కోట్లు.. మహబూబాబాద్లో అత్యధికం.. ఆరు జిల్లాలకు చెందిన కొందరు రైసుమిల్లర్లు గత వానాకాలం సీజన్ నాటికే రూ.348 కోట్లకు పైగా ధాన్యం బకాయిలు పేరుకుపోయినట్లు సమాచారం. 2022–23 రబీ సీజన్కు సంబంధించి ఆరు జిల్లాల్లో గురువారం నాటికి 96 రైస్మిల్లుల నుంచి 73,809 మెట్రిక్ టన్నుల ధాన్యం విలువకు సమానమైన రూ.166.30 కోట్ల రికవరీ ఇంకా పెండింగ్లో ఉంది. బకాయిల్లో మహబూబాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. తర్వాత వరంగల్ జిల్లా ఉంది. డిఫాల్టర్లకూ సీఎంఆర్..?.. ఇలాగైతే బాకీ తీరేదెప్పుడు? 2022–23 రబీ సీజన్కు సంబంధించిన సీఎంఆర్ బకాయిలు ఇంతవరకు పూర్తిగా రికవరీ కాకపోవడం గమనార్హం. ఆ జాబితాలో ఉన్న కొందరికీ ఆ తర్వాత సీజన్లలో కూడా సీఎంఆర్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పటికే కోట్లాది రూపాయలు ఎగవేసిన మిల్లర్లను డిఫాల్టర్లుగా చూపకుండా ఎలా ఇస్తారు? అన్న చర్చ కొందరు రైసుమిల్లర్లలోనే సాగుతోంది. ఉన్నతాధికారులు అడిగినప్పుడు బకాయిల వివరాలే చూపుతున్న స్థానిక అధికారులు.. డిఫాల్టర్ల జాబితా, సీఎంఆర్ కేటాయింపులు గోప్యంగా ఉంచుతున్నారన్న చర్చ కూడా ఉంది. ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి తాజా ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికై నా బకాయి ఉన్న 96 మిల్లుల నుంచి ధాన్యం లేదా దాని విలువను పూర్తిస్థాయిలో రికవరీ చేయాల్సి ఉంది.ధాన్యం (మెట్రిక్ టన్నులు)మొత్తం మిల్లులుచెల్లించిన మిల్లులుసీఎంఆర్ ఇచ్చిన ధాన్యం (మె.టన్నులు)బకాయి ధాన్యం (మె.టన్నులు)ఇప్పటికీ సరఫరా అయినది (మె.టన్నులు)ఉమ్మడి వరంగల్లో సీఎంఆర్ బకాయి లెక్క ఇదీ.. సీఎంఆర్ బకాయిల కొండ... ఆరు జిల్లాల్లో రూ.348 కోట్లపైనే 2022–23 రబీ సీజన్ బకాయిలే భారీగా.. మహబూబాబాద్లో అత్యధికం ఆ తర్వాత వరంగల్, హనుమకొండ జిల్లాలు... బకాయి మిల్లర్లపై అధికారుల ఉదాసీనత.. సర్కారు సీరియస్.. డిఫాల్టర్లలో కలకలం...1,11,634బకాయి 73,80937,825216120(55.56%)జిల్లా సీఎంఆర్గా మొత్తం బకాయి బకాయి బకాయి ఇచ్చిన ధాన్యం మిల్లులు ధాన్యం మిల్లులు విలువ (మె.టన్నులు) (మె.టన్నులు) (రూ.కోట్లలో..) హనుమకొండ 13,015 34 8,683 12 19.42 వరంగల్ 32,425 67 21,512 27 48.54 జనగామ 4,429 45 3,258 27 7.49 జేఎస్ భూపాలపల్లి 15,900 20 4,204 5 9.59 మహబూబాబాద్ 40,758 25 33,309 12 74.90 ములుగు 5,107 25 2,843 13 6.36 -
కవి భాస్కర్ మరణం సాహిత్యరంగానికి లోటు
జనగామ రూరల్: సామాజిక కవి, ఉపాధ్యాయుడు పొట్టబత్తిని భాస్కర్ ఆకస్మిక మరణం కళా,సాహిత్య రంగాలకు, పోరుగడ్డకు తీరనిలోటని ప్రముఖ చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కెమిస్ట్రీభవన్న్లో కవులు కళాకారుల ఐక్యవేదిక పొట్టబత్తిని భాస్కర్ యాదిలో ఏర్పాటు చేసిన ‘కలాలు గళాల నీరాజనం’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి పెట్లోజు సోమేశ్వరాచారి, జరసం అధ్యక్షుడు నక్క సురేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాస్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సమ్మయ్య మాట్లాడుతూ.. భాస్కర్ సామాజిక స్పృహ కలిగి చక్కని వచన కవిత్వం సృజించారని అన్నారు. కార్యక్రమంలో ప్రజా వైద్యుడు, మాజీ కల్నల్ మాచర్ల భిక్షపతి, నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నెల్లుట్ల రవీందర్ రావు, కవులు కళాకారులు జి.కృష్ణ, లగిశెట్టి ప్రభాకర్, వేముల సదానందం, కొలిపాక బాలయ్య, తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్, గుగ్గిల నర్సయ్య, గట్టగల్ల సంజీవ, కడారి శ్రీను, చిలు మోజు సాయికిరణ్, రంగరాజు ప్రసాద్, సదానందం, గడ్డం మనోజ్ కుమార్ గౌడ్, మాన్యపు భుజేందర్, అంకాల సోమయ్య, మసురం రాజేంద్రప్రసా ద్, బాల్నె నీరజ, కనకయ్య, ఎల్లయ్య, నర్సయ్య, టి.రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య -
పోలీస్ అధికారుల సంఘం కమిటీ ఎంపిక
● అధ్యక్ష, కార్యదర్శులుగా కరుణాకర్, వీరభద్రరావు ● ఎన్నికల తీరును పరిశీలించిన సీపీ శ్వేత వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. కమిషనరేట్ కార్యాలయంలోని రాణి రుద్రమదేవి ప్రాంగణంలో నిర్వహించిన ఈ ఎన్నికలకు నోడల్ అధికారిగా అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులుగా అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు సదయ్య, నాగయ్య వ్యవహరించారు. ఈ ఎన్నిక సందర్భంగా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించడంతోపాటు, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ ఎన్నికల్లో 110 మంది వివిధ హోదాలు కలిగిన పోలీస్ అధికారులు తమ ఓటు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో కానిస్టేబుల్ కొండా కరుణాకర్ (ధర్మసాగర్ పోలీస్ స్టేషన్), ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ టి.బాబుపై 17 ఓట్ల అధిక్యంతో వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బి.సతీష్(ఆర్.ఐ), బి.శరత్ కుమార్(ఆర్.ఎస్ఐ), ప్రధాన కార్యదర్శిగా ఇ.వీరభద్రరావు (దామెర ఎస్ఐ), సంయుక్త కార్యదర్శిగా టి.నరేష్ (కాజీపేట కానిస్టేబుల్), కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎస్.ప్రవీణ్ కుమార్ (ఏఆర్ కానిస్టేబు ల్), కోశాధికారి బి.నరేష్ (పాలకుర్తి కానిస్టేబుల్), కార్యనిర్వాహక సభ్యులుగా ఎం.తులసి (మహిళా కానిస్టేబుల్ కాజీపేట), సీహెచ్ మహేందర్ యాదవ్ (ఏఆర్ కానిస్టేబుల్), ఎ.రమేష్ (ఏఆర్ కానిస్టేబుల్), ఎన్.ప్రవీణ్ (సుబేదారి కానిస్టేబుల్), ఎండీ తాజుద్దీన్ (హనుమకొండ ట్రాఫిక్ కానిస్టేబుల్), పి.సర్వేశ్ (పాలకుర్తి కానిస్టేబుల్) ఎన్నికయ్యారు. కాగా, సంఘం నూతన కార్యవర్గ సభ్యులకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అభినందనలు తెలిపారు. -
దేవాదుల నుంచి సాగునీరు విడుదల
రఘునాథపల్లి : రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయడం లేదని, మొదటిసారి దేవాదుల నుంచి సాగునీరు విడుదల సాధ్యమైందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. గురువారం మండలంలోని అశ్వరావుపల్లిలో సర్పంచ్ పొనగంటి చైతన్య, అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన రిజర్వాయర్ నుంచి సాగు నీటిని విడుదల చేశారు. అనంతరం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. నెల రోజులుగా ముందస్తు చర్యలు తీసుకుని దేవాదుల ద్వారా రిజర్వాయర్లను నింపినందు వల్లే ప్రస్తుతం సాగునీరు విడుదల సాధ్యమైందన్నారు. నేడు గండిరామారం, 15న బొమ్మకూరు రిజర్వాయర్ల ద్వారా నీటిని విడుదల చేస్తామని తెలిపారు. రైతులు కొత్తగా వరిసాగు చేయకుండా ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. కాల్వల నుంచి వెళ్లే నీరు ఎక్కడ నిరుపయోగం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో 15 రోజులకో మారు సాగునీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మారుజోడు రాంబాబు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్చందర్రెడ్డి, మండల అధ్యక్షుడు గాదె మహేందర్రెడ్డి, లింగాజి, క్రాంతికుమార్, మేకల నరేందర్, గొట్టం భాస్కర్రెడ్డి, నామాల బుచ్చయ్య, కోళ్ల రవిగౌడ్, లోనె శ్రవణ్కుమార్, బాషుమియా, పోకల శ్రీనివాస్, కొమురెల్లి, సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ‘హర్ ఘర్’ తిరంగా
జనగామ రూరల్: భారత 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ ఆధ్వర్యంలో గురువారం తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఎందరో మహానీయుల ప్రాణ త్యాగాలతో స్వాతంత్రం సిద్ధించిందని, వారి అడుగుజాడల్లో ప్రతీ ఒక్కరు పయనించి దేశ ఐక్యతను చాటాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు అన్నారు. పట్ట ణంలోని నెహ్రూపార్క్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులతో భారీ జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. యువత దేశభక్తిని స్ఫూర్తిగా నింపుకొని దేశ పునర్నిర్మాణంలో భాగం కావాలన్నారు. కార్యక్రమంలో కేవీఎల్ఎన్ రెడ్డి, సాగర్ రెడ్డి, ఉడుగుల రమేశ్, శివరాజ్ యాదవ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎల్లబోయిన హరీశ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు అనిల్, సంతోష్, నాయకులు, మహిపాల్, రాజు, జగదీష్ పాల్గొన్నారు. -
నాణ్యత ఎంతపాలు?
శుక్రవారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2026పాల సేకరణ తక్కువ.. అమ్మకాలు ఎక్కువ● డబ్బా పాల నాణ్యతపై అనుమానాలు ● అధికారుల పర్యవేక్షణపై తలెత్తుతున్న ప్రశ్నలు ● శాంపిళ్ల ఫలితాల వెల్లడిపై ఎదురుచూపులుజనగామ: జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో లూజు పాల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాత్కాలిక అడ్డాలు ఏర్పాటు చేసుకుని ఉదయం, సాయంత్రం పాలు విక్రయిస్తున్నా, వాటి సేకరణ, నాణ్యత, విక్రయదారుల అనుమతులపై సమగ్ర పర్యవేక్షణ ఉందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లాలో 2లక్షల లీటర్ల సేకరణ జిల్లాలో సుమారు 1.50 లక్షల గోజాతి, గేదెజాతి పశువులు ఉన్నట్లు సమాచారం. ఇందులో పాలిచ్చే గోజాతి పశువులు 20,493, గేదెజాతి పశువులు 26,537 ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు సుమారు 2లక్షల లీటర్ల వరకు పాల సేకరణ అవుతున్నట్లు అంచనా. ఇందులో 30 వేల లీటర్లకు పైగా విజయ డెయిరీకి వెళ్తున్నాయి. ప్రైవేట్ డెయిరీలకు 75వేల లీటర్లకు పైగా చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థలు స్థానికంగా లూజు పాలు విక్రయించకుండా టెట్రా ప్యాక్ తదితర ప్యాకేజింగ్ కోసం ప్రధాన డెయిరీలకు తరలిస్తుంటారు. దీంతో పాటు 50వేల పాడి పరిశ్రమ కుటుంబాలు.. వారి అవసరాలకు అదనంగా ఒక్కో లీటరు వాడుకోవడం, 15వేల లీటర్లకు పైగా పన్నీరు తయారీకి ఉపయోగించగా మిగిలిన సుమారు 30వేల పైచిలుకు లీటర్ల పాలు జిల్లాలో మిగులుతాయనేది అంచనా. అవసరానికి..సేకరణకు పొంతనేదీ? జిల్లాలో సుమారు 1.95 లక్షల కుటుంబాలు, 5.80 లక్షల జనాభా ఉన్నట్లు అంచనా. ఒక్కొక్కరికి రోజు కు 300 గ్రాముల లీటర్ల పాలు అవసరమని తీసుకుంటే సుమారు 1.74 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతాయి. కానీ జిల్లాలో నమోదయ్యే సేకరణ సుమారు 2లక్షల లీటర్లే. ఇందులో 1.70లక్షల లీటర్ల పాలు డెయిరీలు, పన్నీరు, తదితర వాటికి వెళ్తుండగా, మిగిలిన పరిమాణం ఎంత, పట్టణాలు, గ్రామాల్లో లూజుగా విక్రయించే పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది తేలాల్సి ఉంది. ఇందులో సుమారు 40వేల లీటర్లకు పైగా పాల ప్యాకెట్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా. పట్టణంలో ప్రత్యేక ప్రైవేటు అడ్డాలు పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తా, గణేష్ స్ట్రీట్, కురుమవాడ, బాలాజీనగర్, నెహ్రూ పార్కు తదితర ప్రాంతాల్లో తాత్కాలిక ప్రైవేట్ అడ్డాలు ఏర్పాటు చేసుకుని రోజుకు సుమారు 2వేల లీటర్ల వరకు లూజు పాలు విక్రయిస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు గ్రామాల నుంచి వచ్చేవారు డబ్బాల్లో ఇంటింటికీ పాలు సరఫరా చేస్తున్నారని, ఈ విధంగా రోజుకు సుమారు 20 వేల లీటర్ల వరకు విక్రయాలు జరుగుతున్నట్లు స్థానిక అంచనా వేస్తున్నారు. శాంపిళ్ల సేకరణ రెండు వారాల క్రితం మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్ వినీల్ ఆధ్వర్యంలో లూజు పాల విక్రయాలపై తనిఖీలు నిర్వహించి శాంపిళ్లు సేకరించారు. అయితే వాటి పరీక్షల్లో ఏం తేలిందన్న విషయం వెల్లడికావాల్సి ఉంది. ఒక్కరోజు తని ఖీలకే పరిమితం కాకుండా నిరంతర తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పాలలో యూరి యా, ఇతర పదార్థాలు కలుపుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆ రోపణలను నిజమని తేల్చకుండా శాసీ్త్రయ పరీక్షల ద్వారా వాస్తవాలను అధికారులు బహిర్గతం చేయాల్సిన అవసరముంది. పాల నాణ్యత తెలియడం లేదు.. ప్రతీరోజు మా ఇంటికి పాల ప్యాకెట్లను వాడుతున్నాం. రోజుకు ఒక లీటర్ పాలను వాడుతాం. తప్పనిసరి పరిస్థితిలో ప్యాకెట్లను వినియోగిస్తున్నాం. అయితే ఇందులో నాణ్యత ఎంత మేరకు ఉందో మాకు తెలియడం లేదు. పాల ప్యాకెట్ల సరఫరా, నాణ్యతపై అధికారులు తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. –వంచ చంద్రశేఖర్రెడ్డి, పీడీ, స్టేషన్ఘన్పూర్ ధ్రువీకరణ తప్పనిసరిప్రతీరోజు స్టేషన్ఘన్పూర్లో అర లీటర్ లూజు పాలను కొనుగోలు చేస్తాం. లీటర్కు రూ.80 తీసుకుంటున్నారు. అయితే వారు విక్రయించే పాలు నాణ్యమైనవా లేదా అనేది ధ్రువీకరణ లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న మిల్క్ సెంటర్లలో పాలను కొనుగోలు చేస్తున్నాం. మిల్క్ సెంటర్ల అధికారుల పర్యవేక్షణ అవసరం. –కె.శరత్ కుమార్, స్టేషన్ఘన్పూర్నిబంధనలు ఏమిటి? ప్రత్యేక అడ్డాలు ఏర్పాటు చేసి లూజు పాలు విక్రయించేవారు ఆహార భద్రతా నిబంధనలను పాటిస్తున్నారా? ఫుడ్ సేఫ్టీ రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ ఉందా, పాలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు, ప్రతిరోజూ ఎన్ని లీటర్లు విక్రయిస్తున్నారు.. రవాణా, నిల్వ, పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నారా అన్న అంశాలపై అధికారులు పరిశీలించాలి. ముఖ్యంగా జిల్లాలోని పాల ఉత్పత్తి, డెయిరీలకు వెళ్లే పరిమాణం, లూజు పాల విక్రయాల పరిమాణంపై శాసీ్త్రయంగా లెక్కలు తీస్తే అసలు పరిస్థితి స్పష్టమయ్యే అవకాశం ఉంది. -
రిజర్వేషన్లు పక్కాగా అమలుచేయాలి
● రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యజనగామ రూరల్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని, రాజ్యాంగబద్ధంగా కల్పించిన రిజర్వేషన్ విధానాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెనన్స్ హాల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సంబంధించిన రిజర్వేషన్ అమలు, బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ, పదోన్నతులు, సేవా అంశాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఇతర సమస్యలపై అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్తో కలిసి వారు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీ, వర్గాల వారికి అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు తెన్నులను, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, వాటి పురోగతిపై చైర్మన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈపందర్భంగా చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల హక్కులను పరిరక్షించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సబ్ ప్లాన్ నిధులలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఆర్అండ్బీ, ఇరిగేషన్ శాఖల్లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఖర్చు చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల కు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై చైర్మన్ సంతృప్తి వ్యక్తం చేశారు. సమీక్షలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కె.లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్, సంతోష్ నాయక్, శంకర్, హౌజింగ్ పీడీ మాతృనాయక్, సీపీఓ చినకోట్యా నాయక్, డీఎంహెచ్ఓ వాణిశ్రీ, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి విక్రమ్, ఏసీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బహుళ పంటలతో అధిక ఆదాయం
రఘునాథపల్లి: బహుళ పంటల సాగుతో రైతులు అధిక ఆదాయం పొందవచ్చని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. తక్కువ నీటి అవసరముండే పంటలు వేయడం ద్వారా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కోమల్ల గ్రామంలో బహుళ అంతస్తుల వ్యవసాయ పద్దతిలో వివిధ రకాల పంటలు సాగి చేస్తున్న రైతు మంద రాములు వ్యవసాయ క్షేతాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో రైతు చేపడుతున్న సాగు విధానాలు, సాగు నీటి లభ్యత, పంటల నిర్వహణ, దిగుబడులు, మార్కెటింగ్ తదితర అంశాలను కలెక్టర్ ఆరా తీశారు. ఈ వ్యవసాయ క్షేత్రంలో మునగ, సపోటా, సీతాఫలం, అరటి, అంజీర్, నిమ్మ వంటి ఉద్యాన పంటలతో పాటు బీరకాయ, సొర కాయ తదితర తీగ జాతి కూరగాయలను ఒకే భూమిలో సాగు చేస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించి రైతును అభినందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి అంబికాసోని, డీఆర్డీఓ భాస్కర్, కేవీకే శాస్త్రవేత్త రమ్య, డీహెచ్ఎస్ఓ నర్సయ్య, మండల వ్యవసాయాధికారి కర్ణాకర్రెడ్డి, ఏఈఓ కల్పన తదితరులు పాల్గొన్నారు. ఆధునిక సాగు పద్ధతులను రైతులకు చేరువ చేయాలి స్టేషన్ఘన్పూర్: ఆధునిక సాగు పద్ధతులను రైతులకు చేరువ చేస్తూ రైతులు సమీకృత సాగు విధానాలను అవలంబిస్తూ తక్కువ నీటితో అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం పొందేలా వ్యవసాయ శాఖ అధికారులు అవసరమైన సాంకేతిక సహకారం అందించాలని కలెక్టర్ సందీప్కుమార్ఝా సూచించారు. డివిజన్ కేంద్రమైన స్టేషన్ఘన్పూర్లో రైతు ఊరడి లింగయ్య సాగుచేస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ సందర్శించారు. రైతు ఎనిమిది ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్న విధానాన్ని పరిశీలించి రైతుతో పంటసాగు, నీటి వినియోగం, దిగుబడులు, మార్కెటింగ్ తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రైతు లింగయ్య పొలంలో ఆధునిక సాగు పద్ధతులను ప్రదర్శించేలా డెమో ప్లాంట్ను ఏర్పాటు చేయించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులో చిక్కుళ్ల రమేశ్, వెంకన్న అనే రైతులు సాగుచేస్తున్న పొలాలను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో డీఏఓ అంబికాసోని, డీఆర్డీఓ భాస్కర్, కేవీకే శాస్త్రవేత్త రమ్య, ఏఓ కరుణాకర్, వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోమల్ల, ఘన్పూర్, ఛాగల్లులో రైతుల వ్యవసాయక్షేత్రాల పరిశీలన -
శుభకర మాసం.. శ్రావణం
జనగామ: ఆషాఢ మాస పర్వదినాలు ముగియడంతో ఈనెల 13 (గురు వారం) నుంచి శ్రావణ మా స సందడి మొదలు కానుంది. 14వ తేదీ నుంచి శుభముహూర్తాలు మొదలు కానున్నాయి. శ్రావణ మాసం నుంచి వచ్చే రెండు నెలల కాలంలో శుభకార్యాలకు అనుకూలంగా కేవలం పది శుభముహూర్తాలు మాత్రమే ఉండటంతో వీటికి ప్రాధాన్యం పెరిగింది. ఈనెల 16, 20, 21, 22, 23, 26, 27, 30 తేదీలతో పాటు సెప్టెంబర్ 4, 6 తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నట్లు కుటుంబాలు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. శుభకార్యాలతో వ్యాపారాలకు ఊపు శుభముహూర్తాలు ప్రారంభం కావడంతో వివాహాలకు సంబంధించిన అన్ని రంగాల్లో వ్యాపార సందడి పెరగనుంది. ఫంక్షన్హాళ్లు, కల్యాణ మండపాలు, పురోహితులు, డెకరేషన్నిర్వాహకులు, పూల అలంకరణ, క్యాటరింగ్, ఫొటోగ్రఫీ, వస్త్ర దుకాణాలు, బంగారు ఆభరణాలు, వివాహ సామగ్రి విక్రయించే వ్యాపారులకు డిమాండ్ పెరగనుంది. బోనాలు..నోములు..వ్రతాలు పవిత్ర శ్రావణమాసంలో అన్ని కులాల వారు తమ సంప్రదాయాల ప్రకారం విడతలవారీగా బోనాల జాతరలు నిర్వహించనున్నారు. అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో బోనాల ప్రసాదాన్ని సమర్పించడంతో పాటు ఓడిబియ్యం, పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు. ఆయా ఆలయాల్లో నోములు, వ్రతాలు, సామూహిక కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 6వ తేదీ నాటికి శుభ ముహూర్తాలు ముగియనుండగా, తిరిగి నవంబర్ కార్తీక మాసం నుంచి డిసెంబర్ 31 వరకు 45 రోజుల పాటు ఉంటాయని వేద పండితులు ఆరాధ్యశర్మ తెలిపారు. కాగా చివరి ఆషాడమాసం రోజు పట్టణంలో అనేకచోట్ల గోరింటాకు, ఇతర పూజాకార్యక్రమాలు నిర్వహించారు. నెలంతా ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ బోనాలు, పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశాల సందడి ఊపందుకోనున్న వ్యాపారాలు -
పత్తి రైతుకు పెట్టుబడుల భారం
జఫర్గఢ్: వర్షాభావ పరిస్థితులకు తోడు ఎరువుల ధరలు పెరగడంతో పత్తి రైతులకు పెట్టుబడి భారం రెట్టింపు అవుతోంది. పంట ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు వేసిన మొదట్లోనే వర్షాలు లేకపోవడం పత్తి సాగుకు ఇబ్బందికరంగా మారింది. విత్తిన చోటనే రెండు మూడు సార్లు విత్తనాలు విత్తడం, కలుపు పెరగడం ఎక్కువ మంది కూలీలు పెట్టడం, గుంటుకల తోలడం తదితర పనుల వల్ల భారం ఎక్కువైంది. దీనికితోడు గతంలో ఎన్నడూ లేని విధంగా కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఒకేసారి భారీగా పెరగడంతో రైతు కుదేలవుతున్నాడు. ఇప్పటికే పూత, కాత రావాల్సి ఉండగా పత్తి మొక్కల్లో ఎదుగుదల లేదు. కాగా, మండలంలో 12 వేల ఎకరాల్లో రైతులు పత్తి పంట సాగు చేస్తున్నారు. ఇందులో ఎక్కువ శాతం మంది రైతులు వర్షంపైనే ఆధారపడి పంటను వేశారు. ఎన్నడూ లేనంత ఎరువుల భారం.. కాంప్లెక్స్ ఎరువులైన 2020 బస్తాకు గతంలో రూ.1,250 ఉండగా ప్రస్తుతం రూ.2,150కి అమాంతం పెరిగింది. వీటితో పాటు మిగతా ఎరువుల ధరలు కూడా ఒక్కో బస్తాకు కనీసం రూ.1,000 నుంచి రూ.1,300 వరకు పెరగడంతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడింది. వీటితో పాటు పురుగుల మందులను పిచికారీ చేస్తుండడంతో ఒక్కో ఎకరాకు ఇప్పటివరకు రూ.17వేల నుంచి రూ.20వేలకు వరకు పెట్టుబడులు పెట్టారు. కాగా పంట చేతికి అందివచ్చే వరకు పెట్టుబడులు మరింత పెరగనుంది. పైగా ఇప్పటివరకు రైతులు అశించిన స్థాయిలో పంట కనిపిండం లేదు. గతేడాది పంట చేతికి అందివచ్చే సమయంలో అధిక వర్షాలు కురియడం వల్ల పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సారైన దిగుబడి రాకపోతుందా అనే ఆశతో ఉన్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. ఓవైపు వర్షాభావంతో ఇబ్బందులు.. మరోవైపు భారీగా పెరిగిన ఎరువుల ధరలు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పూత, కాత లేని పంట ఆందోళనలో రైతులుఈసారి నాలుగు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశా. దుక్కులు దున్నడం, విత్తిన చోటే మళ్లీ విత్తనాలు పెట్టడం, కలుపుతీయడం, ఎరువుల కోసం ఇప్పటి వరకు కనీసం రూ. 20 వేల వరకు పెట్టుబడులు పెట్టా. సరైన వర్షాలు లేక పంట ఎదుగుదల లేదు. ఇప్పటికే పూత, కాత దశకు రావాల్సి ఉండగా ఇంకా కలుపు దశలోనే ఉంది. ఎరువుల ధరలు పెరగడంతో పెట్టుబడులు ఎక్కువయ్యాయి. – భూక్య సుధాకర్, రైతు, టీబీతండా -
దరఖాస్తుల ఆహ్వానం
జనగామ రూరల్: ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సంబంధిత పీజీ కోర్సుల్లో 55 శాతం మార్కులు ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. హెల్త్ కేర్–1 మైక్రో బయాలజీ, జంతు శాస్త్రం విభాగంలో ఖాళీ ఉందని ఆసక్తి గల అభ్యర్థులు 17వ తేదీలోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మంగళవా రం మధ్యాహ్నం 2: గంటలకు కళాశాలలో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 99591 51051 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. ఎంజేపీ విద్యాసంస్థల్లో టెండర్లకు ఆహ్వానంజనగామ రూరల్: జిల్లాలోని మొండ్రాయి మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చికెన్, మటన్ సరఫరా, క్యాటరింగ్ సేవలకు అలాగే స్టేషన్ ఘన్పూర్ మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో క్యాట రింగ్ సేవలకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ ఆకుల శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి గతంలో ఆహ్వానించిన టెండర్లు ఖరారు కానందున, సంబంధిత పనులకు షార్ట్ నోటీసు ద్వారా తిరిగి టెండర్లు ఆహ్వానిస్తున్న ట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల అర్హత కలి గిన టెండరు దారులు ఈనెల 17లోపు రూ.1,000 చెల్లించి ఫారాలు అందించాలన్నా రు. వివరాలకు 90528 99229 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. పాలకుర్తి టౌన్: ఖోఖో జాతీయ స్థాయి శిక్షణకు మండలంలోని చెన్నూరు గ్రామానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు, జాతీయ ఖోఖో క్రీడాకారుడు రావుల కుమారస్వామి ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ స్పోర్ట్స్(ఎన్ఎస్ఎన్ఐఎస్) లో ఖోఖో కోచ్ శిక్షణ ఎంపికల్లో రాష్ట్రం నుంచి నలుగురిని ఎంపిక చేయగా వారిలో కుమారస్వామి ఒకరు. ప్రస్తుతం కుమారస్వామి బెంగుళూరులో స్పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఇండియా(సాయ్)లో కోచ్ శిక్షణ అభ్యసిస్తున్నారు. జాతీ య ఖోఖో కోచ్ శిక్షణకు ఎంపికై న కుమారస్వామిని గ్రామ సర్పంచ్ కారుపోతుల శ్రీనివాస్, గ్రామస్థులు అభినందించారు. పీజీ కళాశాల భవన పనులు వేగవంతం చేయాలి జనగామ: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని జనగామ పీజీ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను కళాశాల ప్రధానాచార్యులు ఎస్.ఎం.రహమాన్ బుధవారం పరిశీలించారు. కళాశాల అభివృద్ధి పనుల పురోగతిని పర్యవేక్షించిన ఆయన నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. అదే విధంగా 2026 విద్యా సంవత్సరానికి పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా పీజీ కళాశాలలో ప్రవేశాలు పొందే విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, వాణిజ్యం, సామాజిక సేవా విభాగాల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కళాశాల అభివృద్ధి పనుల పరిశీలనలో బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. తాత్కాలిక అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు.. న్యూశాయంపేట: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన సంక్షేమ గురుకులాల రీజినల్ కో–ఆర్డినేటర్ డీఎస్.వెంకన్న బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనగామ జిల్లాలోని పాలకుర్తి బాలికల గురుకులంలో పీజీటీ మ్యాథ్స్(01), ఫిజిక్స్(01), టీజీటీ ఫిజి కల్ సైన్స్(1), బయోసైన్స్(1), హిందీ(01) లైబ్రేరియన్(1) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 21న ఉదయం 9గంటలకు గిరిజన గురుకులం(సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ) పెద్దమ్మగడ్డ, ములుగురోడ్డు, వరంగల్లో ఒరిజినల్ సర్టిఫికెట్స్తోపాటు రెండు జతల జిరాక్స్ కాపీలతో డెమో ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. -
విద్యార్థుల చెంతకు సమాచారం..
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్ తన ప్రత్యేకతను ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంటోంది. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రత్యేకంగా విద్యార్థుల చెంతకు సమాచారం అందజేసేందుకు కొత్తగా రెండు డిజిటల్ ఎల్ఈడీ బోర్డులు ఏర్పాటు చేశారు. సాధారణంగా అధికారులు తన అఫీషియల్ పోర్టల్ అయిన వెబ్సైట్, ఇన్స్ర్ట్రాగామ్లో కళాశాల ప్రాధాన్యం కలిగిన సమాచారం పొందుపరుస్తుంటారు. ప్రతిరోజూ విద్యార్థులు ఆ వెబ్సైట్, ఇన్స్ట్రాగామ్ను ఓపెన్ చేయడం కుదరకపోవడంతో కీలక సమాచారం మిస్సవుతున్నారు. ఆ చిన్న సమాచారం తెలి యాలన్న ఉద్దేశంతో క్యాంపస్లో రెండు డిజిటల్ ఎల్ఈడీ బోర్డులు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఎల్ఈడీ బోర్డులు తాజా సమాచారాన్ని తెలియజేస్తుంటాయి. అదే విధంగా విద్యార్థులకు ఇంటర్న్షిప్, పేపర్ ప్రజంటేషన్,పేటెంట్ హక్కులు సాధించిన వారి వివరాలతోపాటు క్యాంపస్లో చోటుచేసుకునే వివరాలను తెలుసుకునేందుకు కేరాఫ్గా డిజిటల్ ఎల్ఈడీ సమాచారం నిలుస్తోంది. విద్యార్థుల చెంతకు.. నిట్ వరంగల్లో బీటెక్, ఎంటెక్, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు సుమారు 6,500 మంది విద్యనభ్యసిస్తున్నారు. కాలి నడకన, సైక్లింగ్లో కళాశాల తరగతి గదులు, ల్యాబ్స్, ఆడిటోరియం, హాస్టల్స్, కెఫెలకు వెళ్తుంటారు. ఇక్కడికి మెయిన్ బిల్డింగ్, కలాం గెస్ట్హౌజ్ వద్దనుంచి వెళ్లాల్సి ఉంటుండడంతో ఆ డిజిటల్ బోర్డుల్లో ప్లే అవుతున్న సమాచారాన్ని ఆసక్తిగా తిలకిస్తూ తమకు అవసరమైన వాటిని నోట్ చేసుకుంటున్నారు. నిట్లో కొత్తగా డిజిటల్ ఎల్ఈడీల ఏర్పాటు.. ఆసక్తిగా తిలకిస్తూ సమాచారం తెలుసుకుంటున్న విద్యార్థులు -
మహిళకు మనోధైర్యం
జనగామ రూరల్: ఆపద వేళల్లో మహిళలకు సఖి కేంద్రాలు అండగా నిలుస్తున్నాయి. బాధిత మహిళలు పూర్తిగా కోలుకునే వరకు సఖి సిబ్బంది మనోధైర్యం నింపుతూ బాసటగా ఉంటున్నారు. బాధితులకు చేయూతని వ్వడంతో పాటు వివిధ న్యాయపరమైన గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, గృహహింస, పోలీసు, వైద్య, న్యాయ సహాయం అందిస్తున్నారు. ఉచితంగా సేవలు.. మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న వివిధ రకా ల వేధింపులు, హింసల నుంచి వారికి రక్షణ కల్పి స్తూ బాధితుల సమస్యలకు అవసరమైన సహాయాన్ని ఒకే చోట అందించడం సఖి కేంద్రం ముఖ్య ఉద్దేశం. బాధిత మహిళలకు వైద్యం, న్యాయ, కౌన్సెలింగ్, పోలీసు సహాయం, తాత్కాలిక వసతి, అత్యవసర పరిస్థితుల్లో రెస్క్యూ వంటి సేవలు ఉచితంగా అందిస్తారు. సఖి కేంద్రం జిల్లా నిర్వాహకురాలు రేణుక మాట్లాడుతూ ఇప్పటివరకు 1,431 సదస్సుల ద్వారా 1,20,332 మందికి అవగాహన కల్పించినట్లు, 2,333 సెషన్స్ నిర్వహించినట్లు తెలిపారు. మూగమహిళ చేరదీత లింగాల ఘణపురం నుంచి తప్పిపోయిన ఓ మూగ మహిళ ను సఖి కేంద్రానికి తీసుకొచ్చారు. బాధితురాలికి వసతి సౌకర్యం కల్పించి చిరునామా తెలుసుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేశా రు. బాధితురాలితో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్తో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. ఆమె నెల క్రితం ఒక పాపకు జన్మనిచ్చింది. ఆ పాప చనిపోవడంతో పాటు ఆమెకు అనారోగ్య సమస్యలు వచ్చా యి. ఆస్పత్రిలో వివరాలు ఉండడంతో.. ఆ వివరా లు సేకరించిన భర్త మహిళను ఇంటికి తీసుకెళ్లారు. జార్ఖండ్ మహిళను కుటుంబానికి అప్పగించి.. పది రోజుల కిందట జార్ఖండ్కు చెందిన మహిళ జనగామ బస్టాండ్ పరిసరాల్లో ఉంటోందని తెలియడంతో సఖి కేంద్రానికి తీసుకొచ్చారు. బాధిత మహిళతో మాట్లాడితే తాను జార్ఖండ్లోని సోనావా ప్రాంతానికి చెందినట్టు తెలిపింది. అక్కడి సఖి కేంద్రంతో మాట్లాడి రెడ్క్రాస్ సొసైటీ సహాయంతో సోషల్ మీడియాలో, ఫేస్బుక్ ద్వారా ప్రచారం చేయించారు. విషయం తెలుసుకున్న మహిళ కుటుంబ సభ్యులు జనగామ సఖి కేంద్రానికి ఫోన్ చేసి..ఇక్కడికి వచ్చి మహిళను తీసుకెళ్లారు.ఆపదలో ఉన్న మహిళలకు, యువతులకు సఖి సిబ్బంది అండగా ఉంటూ వారికి మానసిక స్థైర్యం అందిస్తున్నారు. సఖి కేంద్రానికి ఫిర్యాదు చేస్తే చాలు కావాల్సిన సహాయం చేస్తున్నారు. కేసు వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు కేసును బట్టి లీగల్ సహాయకులు, లీగల్ కౌన్సెలర్లు, పోలీసు, న్యాయ, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. దీంతో సఖి కేంద్రానికి ఫిర్యాదుల సంఖ్య పెరుగుతున్నాయి. 2019 నుంచి ఇప్పటివరకు 1,470 కేసులు రాగా 90 శాతం పూర్తి చేశారు.పేద మహిళలు, వృద్ధులు, యువతుల సమస్యల పరిష్కారానికి సఖి కేంద్రం ఆధ్వర్యంలో సత్వరం కృషి చేస్తోంది. అత్యవసర సమయంలో 181 డయల్ చేస్తే నిర్వాహకులు ఆదుకుంటారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అవసరమయ్యే న్యాయ, ఇతర సహాయాలు అందజేస్తున్నారు. కేసుల పరిష్కారంలో సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. –బెన్షాలోమ్, అదనపు కలెక్టర్ వేధింపులు, గృహహింస తదితర సమస్యలకు చేయూత 2019 నుంచి ఇప్పటివరకు 1,470కేసులు 90 శాతానికిపైగా కేసుల్లో పరిష్కారం బాధితులకు ఉచిత న్యాయ, పోలీసు, ఇతర సహాయంస్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో 75 సంవత్సరాల వృద్ధురాలు కొంతకాలంగా గ్రామంలోని చెట్ల కింద నివాసం ఉంటోంది. దీంతో సమాచారం అందుకున్న కలెక్టర్ స్పందించి వృద్ధురాలికి కావాల్సిన సహాయం అందించాలని, షెల్టర్ అందించాలని సఖి సిబ్బందిని ఆదేశించారు. వెంటనే సంఘటనా స్థలానికి సఖి సిబ్బంది చేరుకోని సీఐ, సర్పంచ్ ఆధ్వర్యంలో పట్టణంలోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుశీలమ్మ అనాథాశ్రమంలో చేర్పించారు. -
బెల్ట్షాపులపై సమరం
రఘునాథపల్లి: మండలంలోని ఫతేషాపూర్ గ్రామంలో బెల్ట్షాపులను వెంటనే మూసివేయాలని ఫతేషాపూర్, ఇబ్రహీంపూర్ గ్రామాల మహిళలు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. రెండు గ్రామాల్లో సంపూర్ణ మద్య నిషేదం అమలు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ముందుగా ఫతేషాపూర్ సర్పంచ్ సుజాతను కలిసి గ్రామంలో బెల్ట్షాపులు మూసి వేయాలని, గ్రామసభ నిర్వహించి మద్యం విక్రయాలపై నిషేధ తీర్మానం చేయాలని కోరుతూ మహిళలు వినతి పత్రం అందజేశారు. అనంతరం బ్యానర్లతో ర్యాలీ చేపట్టి మద్యం వద్దు..బెల్ట్ షాపులు మూసి వేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బెల్ట్షాపులు నిర్వహిస్తున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి నిరసన తెలుపుతూ మద్యం అమ్మకాలు నిలిపి వేయాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకునేలా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇరు గ్రామాల ఉప సర్పంచ్లు చింత నరేష్, గడ్డం సందీప్, వీఓఏలు గాజులపాటి రమాదేవి, ఉమ్మగోని విమల, నూనె వరలక్ష్మి, నల్ల మౌనిక, వార్డు సభ్యులు గాజులపాటి విజయ, చందుపట్ల లక్ష్మి, నూనె ఉప్పలయ్య, రిటైర్డ్ హెచ్ఎం శంకరయ్య, మేడిపల్లి నరేష్, గ్యార నరసింగరావు, గ్యార నాగరాజు, జోగు శ్రీధర్, మహేష్, హరీష్, యువకులు, మహిళలు పాల్గొన్నారు. బెల్టుషాపు నిర్వాహకుల బైండోవర్ ఫతేషాపూర్లో బెల్టుషాపులు నిర్వహిస్తున్న వ్యక్తులను పోలీసులు స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. బెల్టుషాపులు నిర్వహించడం, అక్రమంగా మద్యం విక్రయాలు చేపట్టడం చట్టరీత్యా నేరమని పోలీసులు వారికి స్పష్టం చేశారు. ఇకపై బెల్టుషాపు నిర్వహించకూడదని హెచ్చరించారు. అనంతరం బెల్టుషాపుల నిర్వాహకులను తహసీల్దార్ రాజేష్రెడ్డి ఎదుట హాజరు పరిచి బైండోవర్ చేసినట్లు ఎస్సై దూదిమెట్ల నరేష్ తెలిపారు. ఫతేషాపూర్లో ఇరుగ్రామాల మహిళల భారీ ర్యాలీ మద్యం విక్రయాలు నిలిపివేయాలని హెచ్చరిక -
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
నర్మెట: గ్రామాల అభివృద్ధిలో అధికారులు, సర్పంచ్లు సమన్వయంతో వ్యవహరించి భాగస్వాములు కావాలని అదనపు డీఆర్డీఓ, మండల ప్రత్యేక అధికారి నాగ శేషాద్రిసూరి అన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్ అధ్యక్షతన బుధవారం ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో అయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయా శాఖ అధికారులు నివేదికలు వినిపించిన అనంతరం జీపీల సమగ్ర అభివృద్ధిపై నిర్వహించిన చర్చలో సర్పంచ్లు, కార్యదర్శులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పంట క్వాలను శుభ్రంచేయాలని, ఓహెచ్ఎస్సార్ ట్యాంకుల మరమ్మతులు చేపట్టాలని సర్పంచ్ శ్రీధర్గౌడ్ సభ దృష్టికి తీసుకువచ్చారు. తహసీల్దార్ రామానుజాచార్యులు, ఎంపీఓ సంపత్ కుమార్, ఎంఓ శ్రీ తేజ, ఏఓ బుర్రా మమత, ఏఈలు ప్రజ్వ ల్, శ్రీని వాస్, సర్పంచ్లు హైమ, రేఖ, చిన్నపురెడ్డి, బుజ్జి, మహేందర్, రమేశ్, కార్యదర్శులు పాల్గొన్నారు. అదనపు డీఆర్డీఓ నాగ శేషాద్రి సూరి -
రేషన్.. ఇక స్మార్ట్
జనగామ: రేషన్ కార్డు ఇక సాధారణ రూపం నుంచి స్మార్ట్ రూపంలోకి మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15 నుంచి కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కా ర్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి పైగా రేషన్ కార్డుదారులకు కొత్త కార్డులు అందించేలా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో జిల్లాలోని రేషన్ కార్డుదారుల కుటుంబాల్లోనూ కొత్త కార్డులపై ఆసక్తి నెలకొంది. కొత్త కార్డుల ప్రధాన ఉద్దేశం రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకతను పెంచడంతో పాటు అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ ప్ర యోజనాలు సులభంగా చేరేలా చేయడమే. ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ పంపిణీ ఆధార్ ఆధారిత వ్యవస్థ ద్వారా కొనసాగుతోంది. స్మార్ట్ కార్డుల రాకతో కుటుంబ సభ్యుల వివరాలు, రేషన్ పొందే వివరాలు మరింత క్రమబద్ధంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. ఒక కార్డు.. అనేక ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన కుటుంబ డిజిటల్ కార్డు విధానంలో రేషన్, ఆరోగ్యం, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలను ఒకే కుటుంబ వివరాలతో అనుసంధానించే ఆలోచనను వెల్లడించింది. కుటుంబ సభ్యుల వివరాలను అవసరానికి అనుగుణంగా చేర్చడం, తొలగించడం వంటి మార్పులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశం కూడా ఉంది. జిల్లాలో అర్హులైన ప్రతీ కుటుంబానికి కార్డు అందేలా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. కొత్త కార్డు ద్వారా రేషన్ సరుకులు పొందడంలో ఇబ్బందులు తగ్గడంతో పాటు, భవిష్యత్లో సంక్షేమ పథకాల అమలులో కుటుంబ వివరాల ఆధారంగా సేవలు అందించే దిశగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. మొత్తంగా స్మార్ట్ రేషన్ కార్డు పేద కుటుంబాల సంక్షేమానికి మరింత చేరువ చేసే డిజిటల్ గుర్తింపుగా మారనుంది. 82శాతం చేరుకున్న ఈ–కేవైసీ జిల్లాలో రేషన్ కార్డుల ఈ–కేవైసీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అన్ని కేటగిరీలకు కలిపి జిల్లాలో 1,15,038 రేషన్ కార్డులు ఉండగా, వాటి పరిధిలో 5,68,817 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటివరకు 4,63,637 మందికి పైగా ఈ–కేవైసీ ప్రక్రియ ను పూర్తి చేసుకున్నారు. అంటే దాదాపు 82 శాతాని కి పైగా మంది లబ్ధిదారుల ఈ–కేవైసీ పూర్తయింది. మరో 18 శాతం లోపు మంది ప్రక్రియను పూర్తి చే యాల్సి ఉంది. రేషన్ కార్డుల వివరాలను డిజిటల్ విధానంలో క్రమబద్ధీకరించడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు స క్రమంగా అందేలా ఈ–కేవైసీ కీలకంగా మారింది. ప్రభుత్వం ఈ–కేవైసీ చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకు అవకాశం కల్పించింది. దీంతో మిగిలిన లబ్ధిదారులు గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఈ నెల15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈ–కేవైసీ పూర్తి చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గడువు ముగిసిన తర్వాత ఇబ్బందులు తలెత్తకుండా మిగిలిన కుటుంబ సభ్యులు వెంటనే ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈనెల 15 నుంచి కుటుంబాలకు కొత్త కార్డులు పేదలకు సంక్షేమ ప్రయోజనాలు మరింత సులభతరం రేషన్ కార్డులకు ఈ–కేవైసీ తప్పనిసరి -
‘సర్’లో మనమే ముందుండాలి
రఘునాథపల్లి: ఓటర్ జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ మొదటి దశలో నియోజకవర్గం రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచిందని, నాయకులు, కార్యకర్తల కృషి వల్లే ఇది సాధ్యమైందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం మండలంలోని నిడిగొండ సమీపంలోని ఓ ఫంక్షన్హాల్లో ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జ్ లింగాల జగదీష్చందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ విస్లృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.. ముసాయిదా జాబితా ప్రకటన అనంతరం అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ, అవసరమైన వారి నుంచి గుర్తింపు కార్డులు, ధ్రువపత్రాల సమర్పణలోనూ కీలకంగా వ్యవహరించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచేలా చూడాలని సూచించారు. అర్హులైన ఏ ఒక్కరి పేరు జాబితా నంచి తొలగించకుండా చూడాలన్నారు. నియోజకవర్గంలోని 291 బూత్లకు ఒక్కో బూత్కు 10 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని, 10 రోజుల్లో అర్హులైన వారి లబ్ధిదారుల జాబితా సర్పంచ్లు, అధ్యక్షులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్నాయక్, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ దన్వంతి, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డి, మండల అధ్యక్షుడు గాదె మహేందర్రెడ్డి, కోళ్ల రవిగౌడ్, లింగాజీ, మేకల నరేందర్, కావటి భాస్కర్యాదవ్, లోనె శ్రవణ్కుమార్, గొరిగ రవి, ఈశ్వరయ్య, సర్పంచ్లు, బీఎల్ఏలు, నాయకులు పాల్గొన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ప్రభుత్వ భూమి స్వాధీనం
లింగాలఘణపురం: మండలంలోని జనగామ – సూర్యాపేట రోడ్డులోని సర్వే నంబర్ 431లో గల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాగా కలెక్టర్ సందీప్కుమార్ ఝా విచారణ చేసి స్వాధీ నం చేసుకొని బోర్డును ఏర్పాటు చేశారు. సర్వే నంబర్ 431లో మొత్తం 16.02 ఎకరాలు ఉండగా అందులో 2.20 గుంటలు తనకు రావాలని నెల్లుట్లకు చెందిన పసుల లక్ష్మి ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. దీంతో పూర్తిస్థాయిలో విచారణ జరిపిన కలెక్టర్ సంబంధిత రికార్డులను పరిశీలించి ప్రభు త్వ భూమిగా గుర్తించి హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఆ సర్వే నంబర్లో గతంలో కొంతమందికి ప్రభుత్వం అసైన్డ్ చేసినట్లు సమాచారం. అందులో కేవలం 5 ఎకరాల భూమికి సంబంధించి వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఆక్రమణకు గురైన కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ప్రభుత్వానికి స్వాధీనం చేయడం గమనార్హం. -
వైద్యం మరింత మెరుగు
జనగామ: ఆరోగ్యశ్రీ సేవల ద్వారా జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి సమకూరిన 10 శాతం రివాల్వింగ్ ఫండ్ నుంచి రూ.2,44,49,600లను ఆస్పత్రి అవసరాలకు వినియోగించనున్నారు. ఈ నిధులతో ఏయే పరికరాలు కొనుగోలు చేయాలి.. ఎన్ని సంఖ్యలో అవసరం.. ఎంత మొత్తాన్ని కేటాయించాలనే దానిపై వైద్య విద్యాశాఖ (డీఎంఈ) నుంచి అధికారికంగా జాబితా అందింది. ఇందులో సర్జికల్ ఎక్విప్మెంట్, ఎన్ఎంసీ నిబంధనలకు అవసరమైన పరికరాలు, సర్జికల్ ఇంప్లాంట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. నిధుల్లో రూ.1,61,25,000లను సర్జికల్ ఎక్విప్మెంట్కు కేటాయించారు. ఆర్థోపెడిక్స్ విభాగానికి ఒక పాలీట్రామా సెట్, రెండు ఆర్థోపెడిక్ సెట్లు కొనుగో లు చేయనున్నారు. ఒక్కో ఆర్థోపెడిక్ సెట్లో 16 ప రికరాలు ఉంటాయి. ఆప్తాల్మాలజీ విభాగానికి రెండు ఆప్తాల్మిక్ సెట్లు, ఒక్కో సెట్లో 17 పరికరాలు, అలాగే ఒక క్యాటరాక్ట్ సెట్ సమకూర్చనున్నారు. సర్జరీ విభాగానికి అన్ని సర్జికల్ బ్రాంచ్లలో సాధారణంగా ఉపయోగించే 67 పరికరాలతో కూడిన రెండు సెట్లు కొనుగోలు చేయనున్నారు. ప్రసూతి, సీ్త్రల వైద్య విభాగానికి రెండు ఓబీజీ సెట్లు అందనున్నాయి. ఒక్కో సెట్లో 25 పరికరాలు ఉంటాయి. ఈఎన్టీ విభాగానికి 11 పరికరాలతో కూడిన రెండు సెట్లు, అనస్థీషియా విభాగానికి 23 పరికరాలతో ఒక సెట్, బేసిక్ డెంటల్ విభాగానికి 16 పరికరాలతో రెండు సెట్లు కొనుగోలు జాబితాలో ఉన్నాయి. ఆస్పత్రిలో జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) ప్రమాణాలకు అవసరమైన పరికరాల కోసం రూ.82లక్షలు కేటాయించారు. రేడియాలజీ విభాగానికి ఒక సీఆర్ సిస్టమ్, జీజీహెచ్ ఫర్నిచర్ విభాగానికి ఒక ఈటీఓ స్టెరిలైజర్, అనస్థీషియాకు సీ–ఆర్మ్కు అనుకూలమైన ఒక ఓటీ టేబుల్ కొనుగోలు చేయనున్నారు. సైకియాట్రీ విభాగానికి ఈసీజీ, ఈఈజీ మానిటరింగ్తో కూడిన ఒక ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ (ఈసీటీ) మెషీన్, ప్రసూతి విభాగానికి రెండు ఎన్ఎస్టీ మెషీన్లు, అనస్థీషియాకు రెండు ఈసీజీ మెషీన్లు సమకూర్చనున్నారు. సెంట్రల్ క్యాజువాల్టీ విభాగా నికి ఒక ఆటోక్లేవ్, ఒక మొబైల్ 100 ఎంఏ ఎక్స్రే, ఒక ఆపరేషన్ థియేటర్ టేబుల్, రెండు ఓటీ సీలింగ్ లైట్లు, ఒక ఎలక్ట్రో సర్జికల్ కాటరీ యూనిట్ కొనుగోలు చేయనున్నారు. జనరల్ మెడిసిన్ విభాగానికి రెండు పెడెస్టల్ లైట్లు, ఒక ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనలైజర్, రెండు సీపాప్ మెషీన్లు, రెండు డీఫిబ్రిలేటర్లు, రెండు ఫొటోథెరపీ యూనిట్లు, రెండు ఆప్తాల్మోస్కోపులు, రెండు పల్స్ ఆక్సీమీటర్లు, రెండు లారింగోస్కోపులు సమకూర్చనున్నారు. ఈ పరికరాలు అత్యవసర, సాధారణ వైద్య సేవల్లో ఉపయోగపడనున్నాయి. ఈఎన్టీకి రెండు టాన్సిలెక్టమీ–అడినాయి డెక్టమీ సెట్లు, ఆర్థోపెడిక్స్కు ఒక కాటరీ మెషీన్న్ కూడా జాబితాలో ఉన్నాయి. సర్జికల్ ఇంప్లాంట్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం రూ.1,24,600 కేటాయించారు. దీంతో సర్జికల్ పరికరాలకు రూ.1,61,25,000, ఎన్ఎంసీ కంప్లయన్స్ పరికరాలకు రూ.82లక్షలు, పెండింగ్ బిల్లులకు రూ.1,24, 600 కలిపి రూ.2,44,49,600 ఖర్చుతో పరికరాలు కొనుగోలు చేయనున్నారు. డీఎంఈ నుంచి వచ్చిన అధికారిక జాబితా ఆధారంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ అవసరాల వివరాలను కలెక్టర్కు సమర్పించనున్నారు. అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఎంపికై న సంస్థల నుంచి పరికరాలు కొనుగోలు చేయనున్నారు. రూ.2.44 కోట్ల రివాల్వింగ్ ఫండ్ సర్జరీల నుంచి అత్యవసర సేవల వరకు సర్జికల్ పరికరాలు, ఎన్ఎంసీ ప్రమాణాల సామగ్రి కొనుగోలుకు ప్రతిపాదనలు కలెక్టర్ ఆదేశాలతో టెండర్ల ప్రక్రియ -
పీహెచ్సీలో పరిశుభ్రత ఏది..?
రఘునాథపల్లి: మండలంలోని కోమల్ల ఆరోగ్య కేంద్రం పరిసరాలు, వార్డు, రోగులు వేచి ఉండే ప్రదేశాలు, ఇతర గదుల్లో అపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు చికిత్స అందించే ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎక్క డా, చెత్త, దుమ్ము, అపరిశుభ్రత కనిపించకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శి యాకుబ్ను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కోమల్ల ఆరోగ్య కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్యసేవలు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, పారిశుద్ధ్యం, నీటి సరఫరా తదితర అంశాలను పరిశీలించారు. ముందుగా ఇన్పెషెంట్ వార్డుతో పాటు ఓపీ రిజిస్టర్ను తనిఖీ చేసి న కలెక్టర్..విధులకు హాజరైన, గైర్హాజరైన సిబ్బంది వివరాలపై ఆరా తీశారు. పీహెచ్సీలో నీటి ఎద్దడిపై స్పందించిన కలెక్టర్ వచ్చే శనివారం నాటికి ఆరోగ్య కేంద్రంలో పూర్తిస్థాయిలో నీటి సరఫరా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ వల్లాల అశోక్, పీహెచ్సీ వైద్యులు ఇంజమాన్, సిబ్బంది పాల్గొన్నారు. విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక శ్రద్ధ జనగామ రూరల్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపు ఉండేలా వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియను చేపట్టాలని సూచించారు. ‘మిషన్ శిఖరం’ కార్యక్రమం కింద జిల్లాలోని ప్రతీ పాఠశాల పరిస్థితిపై స్పష్టమైన నివేదిక వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా పకడ్బందీగా రూపొందించాలని ఆదేశించారు. అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ‘ఫాస్ట్ మ్యాథ్స్’ పుస్తకాలను విద్యార్థులతో నిరంతరం సాధన చేయించాలని సూచించారు. సమీక్షలో విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అధికారులపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆగ్రహం కోమల్ల ఆరోగ్య కేంద్రం, పాఠశాలలో ఆకస్మిక తనిఖీ -
ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి
స్టేషన్ఘన్పూర్: అధిక నీరు అవసరమయ్యే వరి తదితర పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగ య్యే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని డీఆర్డీఓ భాస్కర్ సూచించారు. డివిజన్ కేంద్రంతో పాటు మండలంలోని చంద్రుతండా, తాటికొండ, విశ్వనాధపురం, ఇప్పగూడెం, కోమటిగూడెం గ్రామాల్లో వ్యవసాయశాఖ వారి ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా తాటికొండలో సమావేశానికి ముఖ్య అతిథిగా డీఆర్డీఓ హాజరై మాట్లాడారు.. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, సాగునీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు. రైతులు పొలాల వద్ద ఫాంపౌండ్లను ఏర్పాటు చేసుకోవాలని, ఇళ్ల వద్ద ఇంకుడుగుంతల నిర్మాణం చేసుకోవాలని సూచించారు. ఆయా సమావేశాల్లో ఏడీఏ అపర్ణ, మండల వ్యవసాయ అధికారి కరుణాకర్, సర్పంచ్లు భూక్య అరుణరాంసింగ్, మందపురం రాణిఅనీల్, మారపాక సుజనశ్రీను, గుర్రపు యాదమ్మఎల్లయ్య, కార్యదర్శులు యుగేందర్, రమేష్, మాధవ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. డీఆర్డీఓ భాస్కర్ -
నేడు డయల్ యువర్ డీఎం
జనగామ రూరల్: ఈనెల 12న (బుధవారం) డయల్ యువర్ డీఎం కార్యక్రమం ఉంటుంద ని జనగామ డీఎం ఎం.ఉష మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉదయం 11గంటల నుంచి 12గంటల వరకు ఉంటుందని, 9959226050 ఫోన్ నంబర్కు కాల్ చేయాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలపై ముగిసిన గ్రామసభలుజనగామ రూరల్: ప్రత్యామ్నాయ పంటలు, పంట కుంటల ఆవశ్యకత, పండ్ల తోటల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన మూడు రోజుల గ్రామసభలు విజయవంతంగా ముగిశాయని వ్యవసాయ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పండ్ల తోటల ఏర్పాటుకు రైతులు గ్రామసభలో దరఖాస్తు చేశారని, ఆసక్తి ఉన్న రైతులు వ్యవసాయ విస్తరణ అధికారులకు సంబంధిత వివరాలు అందజేయాలని కోరారు. ఈ నెల 20 నుంచి ఫ్రేంవర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ అనే యాప్ జిల్లాలో అమలు జరుగుతుందన్నారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలిజనగామ రూరల్: ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆటో యూనియన్ రాష్ట్ర అ ధ్యక్షుడు మంద రవికుమార్ డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు జేరిపోతుల కుమార్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో మంగళవారం ఆటోలతో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరే ట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓలా, ఉబర్, రాపిడోను నిషేధించి ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన డ్రైవర్లకు ఏడాదికి రూ.12,000 మెయింటనెన్స్ ఇవ్వాలన్నారు. నిరసనలో బూడిద ప్రశాంత్, నల్ల మల్లయ్య అడ్డూరి శ్రీనివాస్, కొల్లూరు మల్లయ్య, బోయిని లింగమూర్తి, ఉస్మాన్, గోపగాని రవి, చీర కుమార్, కందుల రాజు, నోముల శ్రీని వాస్, మంగ శ్రీనివాస్, కంత్రి రాజు, రాజు, నామాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాలివరంగల్ క్రైం: రాజ్యాంగం కల్పించిన హక్కులతోపాటు పౌరులు బాధ్యతలను కూడా తెలుసులకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘హర్ ఘర్ తిరంగా’పై రెండు రోజుల ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అండ్ ఔట్రీచ్ ప్రోగ్రాం, ఫొటో ఎగ్జిబిషన్ను సీపీ, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మంగళవారం ప్రా రంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ స్వేచ్ఛ, ప్రజా స్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడడంతోపాటు దేశ అభివృద్ధిలో యువత క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని కోరారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శ్రీనివాస్, వైస్ ప్రిన్సి పాల్ రజినీలత, ప్రోగ్రాం ఇన్చార్జ్ సమత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వరంగల్ లీగల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) విద్యార్థిని ప్రీతి హత్య కేసు విచారణ హనుమకొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ప్రారంభమైంది. కేసు విచారణ షెడ్యూల్ మంగళవారం నుంచి ఐదు మాసాల వరకు నిర్ణయించారు. మొత్తం 99మంది సాక్షులను విచారించనున్నారు. మొదటి రోజు మృతురాలి తండ్రిని విచారించారు. 2023లో మృతి చెందిన మెడికో ప్రీతి హత్య విషయమై నాడు పీజీ విద్యార్థి అయిన మహ్మద్ షఫీని నిందితుడిగా భావించి కాలేజీ నుంచి తొలగించిన విషయం విదితమే. విచారణను ఎస్సీ, ఎస్టీ కోర్డు జడ్జి పద్మజ బుధవారానికి వాయిదా వేశారు. -
కాంగ్రెస్ మండల కన్వీనర్ల నియామకం
జనగామ: జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసేందుకు మండలాల వారీగా కన్వీనర్లను నియమించినట్లు కాంగ్రెస్ జిల్లా కమిటీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మీనారా యణ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.. కొడకండ్ల, దేవరుప్పుల మండలాలకు ఉడుత రవిని కన్వీనర్గా నియమించినట్లు తెలిపారు. జఫర్గఢ్, తరిగొ ప్పుల మండలాలకు కీసర దిలీప్రెడ్డి, పాలకుర్తి, చిల్పూర్ మండలాలకు గుడి వంశీధర్రెడ్డి, రఘునాథపల్లి, లింగాలఘన్పూర్ మండలాల బాధ్యతలను కొత్త కరుణాకర్రెడ్డికి అప్పగించినట్లు తెలిపా రు. స్టేషన్ఘన్పూర్ మండలం, టౌన్కు నూకల బాల్రెడ్డి, జనగామ మండలం, టౌన్కు ఉప్పల సురేష్ బాబును కన్వీనర్గా కేటాయించినట్లు చెప్పారు. నర్మెట, బచ్చన్నపేట మండలాల బాధ్యతలను లింగాల జగదీశ్ చందర్రెడ్డికి అప్పగించడం జరిగిందన్నారు. మండలాల వారీగా కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆయా మండలాల్లో పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయాలని డీసీసీ అధ్యక్షురాలు సూచించారు. -
పెద్ది జ్ఞాపకాలతో..కన్నీటి పర్యంతం
నల్లబెల్లి: ఓవైపు విషాదం..మరోవైపు ఉద్యమ జ్ఞాపకం.. ఇంకోవైపు అభిమానుల ఆప్యాయత..ఇలా పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ భావోద్వేగ వేదికగా మారింది. సోమవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు గులాబీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పెద్దితో ఉన్న అనుబంధాన్ని, ఉద్యమ కాలం నాటి రోజులను గుర్తుచేసుకుంటూ నేతలు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు.. సంస్మరణ సభలో తమ ఉద్యమ సహచరుడు పెద్దితో తనకున్న అనుబంధాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగంలో తెలియజేస్తూ.. ‘ఎంత కాలం బతికామన్నది కాదు..ఎట్లా బతికామన్నదే ముఖ్యం..సమాజంకోసం, ప్రజల కోసం జీవించిన వ్యక్తి ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..’ అని కొనియాడారు. పెద్ది అంతి మయాత్ర, దశదినకర్మ, సంస్మరణ సభకు ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలిరావడం ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనమని, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గంటల తరబడి ప్రజలు నిలబడి కడసారి చూపుకోసం ఎదురుచూసిన తీరు ఆయనకున్న ప్రజాదరణను తెలియజేస్తుందన్నారు. నర్సంపేటలో నిర్మించిన మెడికల్ కాలేజీకి సుదర్శన్రెడ్డి పేరు పెడుతామని కేటీఆర్ చేసిన కీలక ప్రకటనతో పెద్ది అభిమానుల్లో భావోద్వేగాన్ని నింపింది. పెద్ది లేని నర్సంపేట.. నర్సంపేటలో పెద్ది సుదర్శన్రెడ్డిలేని మీటింగ్లో పాల్గొంటామని కలలో కూడా ఊహించలేదంటూ మాజీ మంత్రి హరీశ్రావు తన ప్రసంగంలో కంటతడి పెట్టుకుంటున్నారు. సభలో పెద్ది కుటుంబ సభ్యులు, అభిమానుల కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు అందరినీ కలచివేశాయి. పెద్ది సుదర్శన్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పలువురు అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. సంస్మరణ సభలో మాజీమంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, డీఎస్ రెడ్యానాయక్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్కుమార్, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, శంకర్నాయక్ నాయకులు గండ్ర జ్యోతి, సతీష్రెడ్డి ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పించి ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో నేతలు, అభిమానుల కన్నీరు భారీగా తరలివచ్చిన గులాబీ నాయకులు, శ్రేణులు ఉద్యమ సహచరుడిని తలుచుకుని కేటీఆర్, హరీశ్రావు భావోద్వేగం -
డిగ్రీ పాస్ అంతంతే!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒకప్పుడు వార్షిక పరీక్షలు ఉండేవి. సంవత్సరం మొత్తం పాఠాల బోధన, అనంతరం పరీక్షలు నిర్వహించేవారు. అందులో ఉత్తీర్ణత తక్కువగా ఉండేది. ఈ విధానాన్ని రద్దుచేసి సెమిస్టర్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. అయినా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించలేకపోతున్నారు. సెమిస్టర్ విధానంలో ఒక సబ్జెక్టుకు 100 మార్కులు ఉంటే అందులో 20 మార్కులు ఇంటర్నల్, 80 మార్కులకు సెమిస్టర్ పరీక్ష ఉంటుంది. ఇందులో వచ్చినవి ఇంటర్నల్ మార్కులతో కలిపి ఉత్తీర్ణత ప్రకటిస్తున్నారు. అయినా పాస్ మార్కులు రావడం లేదు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, గురుకులాల్లో డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో నిర్వహించిన డిగ్రీ మొదటి, రెండో, మూడవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఇటీవల అధికారులు విడుదల చేసిన విషయి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణతశాతం అంతంత మాత్రంగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకిలా..? డిగ్రీకోర్సుల్ల సెమిస్టర్ సిస్టమ్లోనూ మెరుగైన ఫలితాలు సాధించలేకపోవటానికి పలు కారణాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ● విద్యార్థులు సక్రమంగా తరగతులకు హాజరుకాకపోవటం. వాస్తవంగా 75శాతం హాజరు ఉండాలనే నిబంధన ఉంది. కానీ, ఏ కళాశాలలోనూ అమలుచేయడం లేదు. ● ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో ఎక్కువమంది పేదవారే ఉంటున్నారు. కొందరు కళాశాలలకు అప్పుడప్పుడు వస్తూ కుటుంబ పరిస్థితులను బట్టి ప్రైవేట్గా ఉపాధి పొందుతుంటారని తెలుస్తోంది. ● ప్రైవేట్ కళాశాలల్లోనూ విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించేలా యాజమాన్యాలు సరిపడా బోధనా సిబ్బందిని నియమించుకోవడం లేదు. ● కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో రాకపోవటంతో కొన్ని ప్రేవేట్ కళాశాలలైతే వి ద్యార్థులకు సరిగా ప్రాక్టికల్స్ నిర్వహించడం లేదు. మరోవైపు సెల్ఫోన్ ప్రభావం కూడా వారి చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న వాదన వినిపిస్తోంది. డిగ్రీ కళాశాలలపై ఉన్నతా ధికారుల పర్యవేక్షణ కొరవడిందనేది మరో కారణంగా భావిస్తున్నారు. విద్యార్థులు సక్రమంగా క్లాస్లకు హాజరయ్యేలా, కళాశాలల్లో నాణ్యమైన బోధన అందేలా చర్యలు చేపడితేనే పరీక్షల్లో ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేయూ పరిధిలో సెమిస్టర్ సిస్టమ్లోనూ మెరుగుపడని ఫలితాలుబాలికలదే పై చేయినాలుగు సెమిస్టర్ పరీక్షల్లో బాయ్కంటే బాలికలే అధిక ఉత్తీర్ణత సాధించారు. మొదటి సెమిస్టర్లో బాలికలు 11,295 మందికిగాను 3,776 మంది (33.43శాతం) ఉత్తీర్ణత సా ఽధించారు. బాయ్స్ 14,166మందికిగాను 3,336 మంది (23.55శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాయ్స్కంటే బాలికదే పైచేయిగానే ఉంది. రెండో సెమిస్టర్లో బాలికలు 25,603మందికిగాను 10,742మంది ఉత్తీర్ణత (41.96శాతం) సాధించగా, బాయ్స్24,689మంది కిగాను 5,644మంది (22.86శాతం) పాసదయ్యారు ఉత్తీర్ణత సాధించారు. మూడవ సెమిస్టర్లో బాలికలు 7,834మందికిగాను 3,591మంది (45.83శాతం), బాయ్స్ 10,452మందికిగాను 3,400 (32.53శాతం) ఉత్తీర్ణత సాధించారు. 4వ సెమిస్టర్లో బాలికలు 19,947మందికిగాను 9,587మంది ఉత్తీర్ణత (48.06శాతం), బాయ్స్18,086 మంది కిగాను 5,032 మంది (27.82శాతమే )ఉత్తీర్ణత సాధించారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో తేటతెల్లం నాలుగు సెమిస్టర్లలో బాలికలదే హవా -
సర్..సమాప్తి
మంగళవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2026అన్కలెక్టబుల్ ఫారాలు54,317జనగామ: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జిల్లా 90.31శాతం డిజిటైజేషన్ పూర్తి చేసింది. జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో 7,67,484 మంది ఓటర్లు ఉండగా, వీరికి సంబంధించిన ఎలక్టర్స్ ఫారాల డౌన్న్లోడ్, ముద్రణ, పంపిణీ ప్రక్రియ 100 శాతం పూర్తయింది. ఇందులో 6,93,101 ఫారాలు డిజిటైజ్ కాగా, మరో 20,066 ఫారాలు డిజిటైజ్ కావాల్సి ఉంది. నియోజకవర్గాల వారీగా చూస్తే స్టేషన్ ఘన్ పూర్లో 2,56,806 మంది ఓటర్లకు సంబంధించి 2,36,826 ఫారాలు (92.22 శాతం) డిజిటైజేషన్ పూర్తి చేశారు. పాలకుర్తిలో 2,61,241 మంది ఓటర్లకు గాను 2,41,590 (92.48 శాతం) ఫారాలు, జనగామలో 2,49,437 మంది ఓటర్లకు గాను 2,14,685 (86.07 శాతం) ఫారాలను డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. పాలకుర్తి 92.48 శాతంతో డిజిటైజేషన్లో మొదటి స్థానంలో ఉండగా, స్టేషన్ఘన్పూర్ 92.22 శాతంతో తర్వాతి స్థానంలో ఉంది. జనగామ 86.07 శాతంతో మూడో స్థానంలో ఉంది. అన్కలెక్టబుల్ ఫారాలు..54,317 ఎస్ఐఆర్లో కీలకంగా కనిపిస్తున్న అంశం అన్కలెక్టబుల్ ఫారాలు. జిల్లాలో మొత్తం 54,317 ఫారాలు (7.08 శాతం) అన్కలెక్టబుల్గా నమోదయ్యాయి. జనగామలో 19,656 (7.88 శాతం), ఘన్పూర్లో 15,567 (6.06 శాతం), పాలకుర్తిలో 19,094 (7.31 శాతం) ఉన్నాయి. జిల్లాలో మొత్తంగా 1,50,902 అనామలీస్ (19.66 శాతం)గా రిపోర్టులో నమోదయ్యాయి. ఇందులో సైతం అభ్యంతరాల మేరకు ఫారాలను మరోసారి పరిశీలన చేస్తారు. అన్కలెక్టబుల్ అంటే? ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో అన్కలెక్టబుల్ అనే పదం కీలకంగా మారింది. ఓటర్ల జాబితా ధ్రువీకరణ కోసం బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఫారాలు సేకరిస్తారు. ఈ క్రమంలో మూడుసార్లు వెళ్లినా ఓటరు ఇంట్లో లేకపోవడం, ఇల్లు తాళం వేసి ఉండటం, తప్పుడు చిరునామా లేదా ఆ వ్యక్తి వేరే ప్రాంతానికి వలస వెళ్లడం వంటి కారణాల వల్ల సమాచారం సేకరించలేకపోతే వారిని అన్కలెక్టబుల్ కేటగిరీలో నమోదు చేస్తారు. అనంతరం అధికారులు సంబంధిత ఓటరుకు నోటీసు పంపి, స్వయంగా కార్యాలయానికి వచ్చి అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించాలని సూచిస్తారు. అనామలీస్ అంటే? ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సరిచేసే ప్రక్రియ. ఎస్ఐఆర్ సమయంలో బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి డేటా సేకరించే సమయంలో కనిపించే తప్పులు లేదా అనుమానాస్పద విషయాలను అనామలీస్ అంటారు. ఒకే పేరు 2 చోట్ల ఉండ డం, చనిపోయిన వారి పేర్లు జాబితాలో రావడం, అడ్రస్ మారినా పేరు పాత చోటే నమోదై కనిపించడం, 18 ఏళ్లు నిండని వారి పేరు ఉండడం, ఫొటో, డాక్యుమెంట్ మ్యాచ్ కాకపోవడం, ఒకే ఇంట్లో పదిమందికి పైగా అనుమానాస్పద కుటుంబ సభ్యులు కనిపిస్తే బీఎల్ఓ దాన్ని అనామలీస్ ఫ్లాగ్ చేస్తారు. తర్వాత ఈఆర్ఓ విచారణ జరిపి, సరైన డాక్యుమెంట్స్ అడిగి, అవసరమైతే పేరును తొలగిస్తారు లేదా సరిచేస్తారు.6,93,1011,50,902 ఫారాల డిజిటైజ్ అనామలీస్ ఫారాలుతప్పుల సవరణకు అవకాశం మామునూరు: వరంగల్ మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరోతరగతి ప్రవేశానికి నిర్వహించననున్న పరీక్ష ఆన్లైన్ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులుంటే మంగళ, బుధవారం (11, 12) తేదీల్లో సరిచేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు నవోదయ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ప్రవీణ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసే మీడియంతోపాటు కులం, లింగం, ప్రాంతం, దివ్యాంగత్వం ఆన్లైన్లో దిద్దుబాటుకు విండో (కరెక్షన్) అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు. కర్రెగుట్టల్లో డీజీపీ ఆనంద్ పర్యటన జిల్లాలో ఎస్ఐఆర్ డిజిటైజేషన్ 90.31 శాతం మొత్తం 6.93 లక్షల ఫారాల డిజిటైజ్ మొదటి స్థానంలో పాలకుర్తి నియోజకవర్గం అన్కలెక్టబుల్ ఫారాలు 54,317, అనామలీస్ ఫారాలు 1,50,902నియోజకవర్గం ఓటర్లు డిజిటైజ్ శాతం అన్కలెక్టబుల్ అనామలీస్ జనగామ 2,49,437 2,14,685 86.07 19,656 48,641 స్టేషన్ ఘన్పూర్ 2,56,806 2,36,826 92.22 15,567 46,556 పాలకుర్తి 2,61,241 2,41,590 92.48 19,094 55,705 మొత్తం 7,67,484 6,93,101 90.31 54,317 1,50,902 -
లేబర్ కోడ్ల రద్దుకు ఉద్యమించాలి
● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి ● ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకోజనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో లేబర్ కోడ్ల రద్దుకు ఉద్యమాలకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మోకు కనకారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం దేశవ్యాప్త పిలుపులో భాగంగా పట్టణంలోని నెహ్రూ పార్క్ వద్ద జైలుభరో కార్యక్రమంలో భాగంగా రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని, ఈ నాలుగు లేబర్ కోడ్లు అమలయితే 12 గంటల పని విధానం వస్తుందని, ఉద్యోగులకు సామాజిక భద్రత లేకుండా పోతుందన్నారు. ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోవడంతో సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సై చెన్నకేశవులు నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాస్తారోకోలో విజేందర్, పి. ఉపేందర్, బొట్ల శేఖ ర్, జోగు ప్రకాష్, మీట్య నాయక్ కుమార్, బూడిద ప్రశాంత్, అజారుద్దీన్, వెంకటేష్, మల్లేశ్ రాజ్, కల్యాణి, భవాని, లలిత, వరలక్ష్మీ పాల్గొన్నారు. -
గీతన్నలకు ఇచ్చిన హామీలు ఏమాయే?
జనగామ రూరల్: ఎన్నికలకు ముందు కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని కల్లుగీత వృత్తిని ఆధునీకరించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం ఇచ్చిన హామీలను విస్మరించడమేనని తక్షణం కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర సోమవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈసందర్భంగా గీత కార్మికులు యాత్ర బృందానికి స్వాగతం పలికారు. సూర్యాపేట రోడ్డు నెల్లుట్ల శివారు నుంచి పట్టణంలోని ఓం సాయి గార్డెన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్య అధ్యక్షతన బహిరంగ సభలో జాన్ వెస్లీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తాటిచెట్ల మీద నుంచి పడి మరణించినవారికి, వికలాంగులైన వారికి ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా బకాయిలు రూ.20 కోట్లు ఉన్నాయన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మొదటి వరుసలో ఉంటున్నామని ముఖ్యమంత్రి గొప్పలుచెబుతున్నారని, గీత కార్మికుల ఎక్స్గ్రేషియా బకాయిలకు నిధులు లేవా? అని ప్రశ్నించారు. నీరా ప్రాజెక్టుకు నిధులు కేటాయించి ఖర్చు చేయకపోవడం అణగారిన వర్గాలను చిన్నచూపు చూడడమే అని అన్నారు. సర్వాయి పాపన్న స్ఫూర్తితో కల్లుగీత కార్మికులు శ్రామిక వర్గ రాజ్య స్థాపన కోసం జరిగే పోరాటంలో భాగస్వాములు కావాలని అన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. వి.రమణ మాట్లాడుతూ.. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, సర్వాయి పాపన్న నిర్మించి న కోటలను పరిరక్షించి పర్యాటక కేంద్రాలుగా గుర్తించి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, విజయ్ కుమార్, హైకోర్టు న్యాయవాది నలుమాసు కృష్ణ, జిల్లా అధ్యక్షుడు బూడిది గోపి, ఉషగొని వెంకట నరసయ్య, గైని వెంకన్న, చౌగోని సీతారాములు, గైని సాంబయ్య, భీమగోని చంద్రయ్య, పాముకుంట్ల ప్రసాద్, గోపగోని సుగుణాకర్, బూడిది జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఎక్స్గ్రేషియా బకాయిలకు నిధులు లేవా? సర్వాయి పాపన్న కోటలను పరిరక్షించాలి గీతన్నల చైతన్య యాత్రలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ -
పెద్ది కుటుంబానికి కేసీఆర్ ఓదార్పు
సాక్షి, వరంగల్/నల్లబెల్లి: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆత్మీయ ఓదార్పునిచ్చారు. పెద్ది సుదర్శన్రెడ్డి దశదినకర్మ సందర్భంగా ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని పెద్ది స్వగృహానికి కేసీఆర్ వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విషాదంలో ఉన్న పెద్ది సతీమణి స్వప్నను ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబానికి బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరో సా కల్పించారు. ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన కేసీఆర్ మధ్యాహ్నం 3.50 గంటలకు నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్రెడ్డి నివాసానికి చేరుకున్నారు. తొలుత సుదర్శన్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేసీఆర్ను చూడగానే స్వప్న భావోద్వేగానికి గురై బోరున విలపించారు. సుదర్శన్రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కేసీఆర్ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం కుమారుడు నిదర్శన్రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠకు రూ.కోటి చొప్పున, సుదర్శన్రెడ్డి తల్లి అమృతమ్మకు రూ.25 లక్షల చొప్పున చెక్కులు అందించారు. మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించారు. కుటుంబ సభ్యులతో 45 నిమిషాల పాటు ముచ్చటించిన కేసీఆర్.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 4.35 గంటలకు న ల్లబెల్లి నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. అంతకుముందు నల్లబెల్లికి వచ్చే క్రమంలో గూడెప్పాడ్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్త వనకర్ రెడ్డి ఇంటి వద్ద కొద్దిసేపు ఆగి వెళ్లారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు కేసీఆర్ నల్లబెల్లికి వస్తున్నారనే సమాచారంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. ‘పెద్ది’ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కేసీఆర్ మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తలతో కలి సి పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఎర్రవెల్లి నివాసానికి తిరుగు ప్రయాణమయ్యారు. కేసీఆర్ వెంట జీవన్రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ముఖ్యులు జి.జగదీశ్వర్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్రెడ్డి, అనిల్జాదవ్, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ సంతోశ్కుమార్, ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. సంతాప సభ ఏర్పాట్లపై ఆరా నల్లబెల్లిలో సోమవారం నిర్వహించనున్న పెద్ది సంతాప సభ ఏర్పాట్లపై నాయకులతో కేసీఆర్ మాట్లాడారు. సభకు హాజరయ్యే అభిమానులందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి దశదినకర్మకు మాజీ సీఎం హాజరు పెద్ది స్వప్నను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా రూ.2.25 కోట్ల చెక్కులను కుటుంబ సభ్యులకు అందించిన బీఆర్ఎస్ అధినేతప్రముఖుల పరామర్శ..మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, సిరికొండ మధుసూదనాచారి, జీవన్రెడ్డి, తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ నాయకులు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బోయినపల్లి వినోద్కుమార్, వినయ్భాస్కర్, అరూరి రమేశ్, బండా ప్రకాశ్, డీఎస్ రెడ్యానాయక్, మాలోత్ కవిత, శంకర్నాయక్, నన్నపునేని నరేందర్, గండ్ర జ్యోతి, ఎర్రోళ్ల శ్రీనివాస్, హరిరమాదేవి, సాంబారి సమ్మారావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
సోమవారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 2026
శాకంబరీ అలంకరణలో శ్రీఉప్పలమ్మ మాతజనగామ: ఆషాఢ మాసం చివరి ఆదివారం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఏరియా అమ్మబావి వద్ద గల శ్రీ ఉప్పలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని శాకంబరీ అలంకరణలో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన పూజారి వారణాసి పవన్శర్మ మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ మోహన్ గౌడ్, దేవాదాయ శాఖ ఉద్యోగి రాజేందర్రెడ్డితో పాటు ఆలయ సిబ్బంది, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నేటి ప్రజావాణి రద్దుజనగామ రూరల్: ఈనెల 10న(సోమవారం) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో రద్దు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, రేపు ప్రజావాణి కార్యక్రమం కోసం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయానికి దరఖాస్తులతో రావొద్దని కోరారు. యోగా, స్వీయ రక్షణ బోధకుల ఎంపిక పరీక్షజనగామ రూరల్: జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల్లో యోగా, స్వీయ రక్షణ శిక్షణ అందించేందుకు బోధకుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆదివారం కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో పరీక్షలు, డెమో నిర్వహించారు. పీఎంశ్రీ పాఠశాలల్లో 15 యోగా టీచర్ పోస్టులకు గాను 22 మంది అభ్యర్థులు పరీక్ష అలాగే డెమోకు హాజరయ్యారు. అలాగే 15 స్వీయ రక్షణ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు గాను 37 మంది అభ్యర్థులకు పరీక్ష, డెమో నిర్వహించారు. అలాగే అంతర్జాతీయ ఎక్స్పోజర్ విజిట్ కోసం ఎంపిక ప్రక్రియ కూడా నిర్వహించారు. ఇందుకోసం జిల్లాకు చెందిన 10 మంది ఉపాధ్యాయులు పరీక్షకు హాజరయ్యారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. నేడు జిల్లాకు గీతన్నల చైతన్యయాత్ర జనగామ రూరల్: తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర సోమవారం జనగామకు చేరుకోనుంద ని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాల్నె వెంకట మల్లయ్య, బూడిది గోపి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 9:30 గంటలకు యాత్ర జనగామకు చేరుకుంటుందని, సూర్యాపేట రోడ్డు పెట్రోల్ పంపు నుంచి యాత్ర బృందానికి స్వాగతం పలికి బైక్ ర్యాలీ ఉంటుందన్నారు. అనంతరం సిద్దిపేట రోడ్డులోని ఓం సాయి గార్డెన్లో బహిరంగ సభ ఉంటుందన్నా రు. ఈ బస్సుయాత్రల్లో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు. జనగామ: జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, పరిమితంగా ఉన్న సాగునీటి వనరులను దృష్టిలో ఉంచుకుని ఈసారి పంటల సాగులో మార్పులు తీసుకురావడంపై అధికారులు దృష్టి సారించారు. నీటి లభ్యతను అంచనా వేయకుండా అధిక నీటి అవసరమున్న వరిసాగు చేపడితే మధ్యలో నీటి కొరత ఏర్పడి రైతులు నష్టపోయే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని సూచిస్తున్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఈ నెల 8, 9, 10వ తేదీల్లో జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రామాల వారీగా అవగాహన సదస్సులు, గ్రామసభలు నిర్వహిస్తున్నారు. నీటి లభ్యతే ప్రాతిపదికగా వర్షాలు సమృద్ధిగా కురిసిన సమయంలో వరి సాగుకు రైతులు ప్రాధాన్యం ఇస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చెరువులు, కుంటలు, కాలువల్లో నీటి నిల్వలు, బావులు, బోర్లలో భూగర్భజలాల లభ్యతను ముందుగా అంచనా వేసి పంటను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. నీరు అందుబాటులో ఉండే ఆయకట్టు ప్రాంతాల్లోనూ నీటిని పొదుపుగా వినియోగించాలని, నీటి లభ్యత పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో వరి సాగుకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి వరి సాగుకు బదులుగా జొన్న, మొక్కజొన్న, కందులు, పెసలు, అలసందలు, పత్తి, నూనె గింజలు, చిరుధాన్యాలు, పశుగ్రాస పంటలు, ఉద్యానవన పంటలు, ఆయిల్పామ్ వంటి పంటలను సాగు చేసుకోవాలని రైతులకు వివరిస్తున్నారు. ఆయా పంటలకు అవసరమయ్యే నీటి పరిమాణం, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ అవకాశాలను పరిగణనలోకి తీసుకుని పంట ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. వర్షం కోసం ఎదురుచూస్తే వర్షాధార ప్రాంతాల్లో వానలపై ఆధారపడి పంటను సాగు చేసే పరిస్థితి ఉంటే రైతులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. పంట మధ్యలో నీటి అవసరం పెరిగే సమయంలో వర్షాలు సహకరించకపోతే పెట్టుబడి మొత్తం నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ముందుగానే నీటి లభ్యతను అంచనా వేసి తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవడం ద్వారా నష్టాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చని వివరిస్తున్నారు. అవసరమైన చోట డ్రిప్, సూక్ష్మ సాగునీటి పద్ధతులను వినియోగించడం ద్వారా నీటి వృథా తగ్గించవచ్చని చెబుతున్నారు. శాఖల సమన్వయంతో.. గ్రామసభల్లో వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి అధికారులు పాల్గొంటున్నారు. ఎంఏఓలు, ఏఈఓలు, ఉద్యానవన శాఖ అధికారులు, నీటిపారుదల శాఖ ఏఈ లు, ఎంపీడీఓలు, పశుసంవర్ధక శాఖ వైద్యులు, ఉపాధి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు రైతులకు శాఖల వారీగా సూచనలు అందిస్తున్నారు. చెరువులు, కాలువల్లో నీటినిల్వలు, ఆయకట్టు పరిస్థితి, సాగునీటి విడుదల తదితర అంశాలపై వివరాలు అందిస్తున్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ప్రాధాన్య క్రమంలో సాగునీరు అందించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఆగస్టు 15 నుంచి మొదటి విడత, 25 నుంచి రెండో విడతలో నీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో సుమారు 1.5 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, నీటి ల భ్యతను బట్టి ఆయకట్టు ప్రాంతాలకు నీటిని అందించనున్నారు. ఒకే పంటపై ఆధారపడకుండా పరిస్థితులకు అనుగుణంగా పంట మార్పిడి చేపట్టడం వల్ల నీటి ఒత్తిడిని తగ్గించడంతో పాటు భూమి ఉత్పాదకతను కాపాడుకోవచ్చని వివరిస్తున్నారు. రైతులు తమ భూమి స్వభావం, నీటి వనరు, పెట్టుబడి సామర్థ్యం, మార్కెట్ డిమాండ్ను పరిశీలించి పంటను ఎంచుకోవా లని సూచిస్తున్నారు. సాగు ప్రారంభించే ముందు నీటిలభ్యతను లెక్కించుకోవడం అత్యంత కీలకమని అధికారులు పేర్కొంటున్నారు. కేవలం సాగునీరు వస్తుందనే అంచనాతో అధిక నీటి అవసరమున్న వరిసాగు చేపట్టి చివరిలో ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఈ నెల 8 నుంచి 10 వరకు జరుగుతున్న గ్రామసభల ద్వారా రైతుల స్థాయిలోనే నీటి పొదుపు, పంటల ఎంపికపై అవగాహన కల్పించడం ద్వారా ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో సాగు నష్టాలను తగ్గించడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. సుమారు 13 ఏళ్ల తర్వాత పోలీస్ అధికారుల సంఘానికి ఎన్నికలు 110 మంది ప్రతినిధుల ఎంపిక పూర్తి 13 పోస్టులకు 13న ప్రత్యక్ష ఎన్నిక పోటాపోటీగా ప్రచారం -
పోలీసింగ్లో వరంగల్ భేష్
సాక్షిప్రతినిధి, వరంగల్/వరంగల్ క్రైం: రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే వరంగల్ జిల్లా పోలీసింగ్ బాగుందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఆదివారం వరంగల్కు వచ్చిన ఆయన వరంగల్ నిట్లో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ ఆయన పలు విషయాలను వెల్లడించారు. ప్రజల భద్రతను బలోపేతం చేయాలి.. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని నేరాలపై సమీక్ష జరిపిన డీజీపీ సీవీ ఆనంద్.. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. దోపిడీ కేసులు 29కు పెరగగా, సైబర్ మోసాల కేసులు 25 నుంచి 59కు, 2026 జనవరి–జూలైలోనే 119 కేసులుగా నమోదయ్యాయి. ఉద్యోగాల పేరుతో మోసాల కేసులు 40 నమోదు కాగా, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు సంబంధించిన 117 కేసులు నమోదు అయినట్లు డీజీపీకి అధికారులు వివరించారు. సాంకేతిక ఆధారిత పోలీసింగ్ను మరింత విస్తరించి ప్రజల భద్రతను బలోపేతం చేయాలని డీజీపీ అధికారులను ఆదేశించారు. చోరీలు చేస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామని కమిషనర్ శ్వేత వివరించగా.. వారిపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని డీజీపీ సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు చేపట్టిన ‘నేను సైతం’ కార్యక్రమాన్ని డీజీపీ అభినందించారు. డ్రగ్స్, సైబర్ మోసాలపై పీపీటీ.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) టీ–స్పార్క్, సీఐడీ అధికారులు సైబర్ నేరాల ధోరణులు, దర్యాప్తు విధానాలు, నూతన సాంకేతిక వ్యవస్థలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సీపీ ఎన్.శ్వేత కమిషనరేట్ పరిధిలో పోలీసింగ్ పనితీరు, నేరాల పరిస్థితి, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, మహిళల భద్రత, ఆర్థిక నేరాల ధోరణులు తదితర అంశాలపై పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా డీజీపీకి వివరించారు. సైబర్ నేరాల ఛేదనలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, అయితే ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు. డ్రగ్ పెడ్లర్లు చిన్న పిల్లలను సైతం మత్తుకు బానిసలుగా మార్చుతున్నారని డీజీపీ హెచ్చరించారు. మారుతున్న నేరాల స్వభావానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను మార్చుతున్నామని తెలిపారు. బేసిక్ పోలీసింగ్కు ప్రాధాన్యం... సాంకేతికత పోలీసింగ్కు తోడ్పాటే కానీ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కరించాలని, దర్యాప్తులు, కోర్టు కేసుల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సీసీటీఎన్, టీ ఈగల్ఫోర్స్, సీఐడీ ఎస్పీలు రూపేశ్, సాయిశ్రీ, గిరిధర్, శ్రీనివాస్రెడ్డి, అడిషనల్ డీసీపీలు, డీసీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు. వరంగల్తో అనుబంధం తన ఐపీఎస్ ఉద్యోగ జీవితం వరంగల్లో జిల్లా శిక్షణతో ప్రారంభమైందని, అనంతరం వరంగల్ రూరల్ ఎస్పీగా పనిచేసిన రోజులు మరువలేనివని డీజీపీ సీవీ ఆనంద్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. హనుమకొండ హంటర్రోడ్డులో నివాసం ఉన్నానన్న ఆయన నక్సలిజం తీవ్రంగా ఉన్న రోజుల్లో ప్రతి రోజు ప్రమాదకరంగా ఉండేదని చెప్పారు. ఇంటినుంచి బయటకు వెళ్తే తిరిగి ఇంటికి వెళ్తామా.. లేదా? అన్న ఆందోళనకర పరిస్థితులు అప్పట్లో ఉండేవన్నారు. ప్రస్తుతం మావోయిజం పూర్తిగా అంతరించిపోవడం సంతోషకరమన్నారు. సమీక్ష సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ వరంగల్తో అనుబంధం విడదీయరానిది.. ఐపీఎస్గా ఇక్కడి నుంచే ప్రస్థానం నిట్ మీడియా సమావేశంలో గతాన్ని గుర్తుచేసుకున్న పోలీస్ బాస్పోలీస్ అమరుల త్యాగాలతోనే నేడు శాంతి : డీజీపీ -
పోలీస్ శాఖలో ఎన్నికల సందడి
సాక్షి ప్రతినిధి, వరంగల్: పోలీస్ శాఖలో ఎన్నికల సందడి పెరిగింది. సుమారు పదమూడేళ్ల తర్వాత పోలీస్ అధికారుల సంఘానికి ఎన్నికలు జరగలేదు. తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీపీఓఏ) కొత్త కార్యవర్గాల ఎన్నికల నిర్వహణకు ఇటీవలే డీజీపీ సీవీ.ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈమేరకు జిల్లాలు, కమిషనరేట్లు, బెటాలియన్లు, వివిధ యూని ట్లలో ఎన్నికల ప్రక్రియకు తెరలేచింది. ఇందులో భాగంగా.. వరంగల్ పోలీస్ కమిషనరేట్లోనూ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఎన్నికల అధికారిగా అడిషనల్ డీసీపీ (అడ్మిన్) ఆర్.ప్రభాకర్రావు వ్యవహరిస్తుండగా.. మూడు జిల్లాల్లో 110 మంది ప్రతినిధుల ఎంపిక పూర్తయ్యింది. వీరంతా కార్యవర్గ సభ్యుడి నుంచి అధ్యక్షుడి వరకు 13 మంది ఆఫీ్ బేరర్లను ఎన్నుకోవాల్సి ఉంది. 13 ఏళ్ల తర్వాత.. 13న ఎన్నికలు టీజీపీఓఏకు మూడేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కొన్నేళ్లుగా ఎన్నికలు జరగలేదు. దీంతో సుమారు 13 ఏళ్లుగా పోలీస్ అధికారుల సంఘానికి ఎన్నికలు లేకుండాపోయాయి. డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టిన అనంతరం సంఘం ఎన్నికలపై దృష్టి సారించారు. డీజీపీ ఉత్తర్వుల ప్రకారం.. జిల్లాలు, కమిషనరేట్ల యూనిట్ కమిటీల్లో అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ఆర్గనైజింగ్ కార్యదర్శి, కోశాధికారి, ఆరుగురు కార్యవర్గ సభ్యుల పదవులకు ఈ ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్ష పదవిని సివిల్ లేదా ఆర్ముడ్ వింగ్కు చెందిన కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు చేపట్టవచ్చు. ఎస్ఐ/ఇన్స్పెక్టర్ ఎన్నికై తే ఇద్దరు ఉపాధ్యక్షుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్ లేదా కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉండాలి. అదే హెడ్ కానిస్టేబుల్ లేదా కానిస్టేబుల్ అధ్యక్షుడైతే ఇద్దరు ఉపాధ్యక్షులు ఎస్ఐ/ఇన్స్పెక్టర్ స్థాయికి చెందిన వారై ఉండాలి. సివిల్ పోలీస్ కోటాలో ఒక స్థానాన్ని మహిళా పోలీసులకు రిజర్వ్ చేసినట్లు పోలీసువర్గాల సమాచారం. కాగా, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నుంచి అధ్యక్షుడి వరకు 13 పోస్టులకు 13న ఎన్నికలు జరగనున్నాయి. ‘పొలిటికల్’ను తలపిస్తూ.. కమిషనరేట్ పరిధి అన్ని సర్కిళ్ల వారీగా 50 మందికి ఒకరు చొప్పున మొత్తం 110 మంది ప్రతినిధులను ఇప్పటికే ఎన్నుకున్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో అందులో నుంచి 13 మందిని ఆఫీస్ బేరర్లుగా ఎన్నుకున్న తర్వాత మరో ఇద్దరు సభ్యులను నామినేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈనేపథ్యంలో సంఘం ద్వారా పోలీస్ అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమం, సేవా పరిస్థితులు, ఇతర అంశాలపై తమ గళాన్ని వినిపించే అవకాశం ఉండడంతో ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎన్నో ఏళ్ల తర్వాత పోలీస్ అధికారుల సంఘానికి ఎన్నికలు జరుగుతుండడంతో వరంగల్ కమిషనరేట్లోనూ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది తమకు అనుకూలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు సిద్ధమయ్యారు. కార్యవర్గ సభ్యుడు మొదలుకొని అధ్యక్ష పదవి కోసం అర్హులైన పలువురు పోటీ పడుతున్నారు. ఇందులో కొందరు ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులు తమ అనుయాయులను ఎన్నికల బరిలోకి దింపుతున్నట్లు ప్రచారం. అభ్యర్థులుగా బరిలోకి దిగే కొందరు మద్యం, డబ్బుల పంపిణీకి శ్రీకారం చుట్టారన్న ప్రచారం కూడా జరుగుతోంది. పొలిటికల్ పార్టీలను తలపించే రీతిలో మరికొందరు ప్రచారం నిర్వహిస్తుండడం పోలీస్శాఖలో చర్చనీయాంశమవుతోంది. -
నీట్ యూజీ ఏఐక్యూలో 15 సీట్లు
జనగామ: జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జాతీయ స్థాయి కోటా కింద 15 ఎంబీబీఎస్ సీట్లు దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్ యూజీ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ కానున్నాయి. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఆధ్వర్యంలో నీట్ 15 శాతం ఆల్ ఇండియా కోటా (ఏఐక్యూ) కింద 2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ తదితర కోర్సులకు ఆన్లైన్ సీట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగనుంది. దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదల చేశారు. నాలుగు విడతల్లో.. ఏఐక్యూ కౌన్సెలింగ్ను మూడు సాధారణ రౌండ్లు, ఒక ఆనన్లైన్న్ స్ట్రే వేకెన్సీ రౌండ్గా నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్ వివరాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. మొదటి రౌండ్కు సంబంధించిన తాత్కాలిక సీట్ల వివరాలను ఈ నెల 4న పాల్గొనే కళాశాలలు పరిశీలించాయి. అనంతరం 5 నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుంది. రిజిస్ట్రేషన్ 12న మధ్యాహ్నం 3 గంటల వరకు, ఫీజు చెల్లింపు సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈనెల 24 నుంచి రెండో రౌండ్, మూడో రౌండ్ సెప్టెంబర్ 10నుంచి ప్రారంభం కానుంది. మూడు రౌండ్ల అనంతరం మిగిలిన సీట్ల భర్తీకి ఆన్లైన్ స్ట్రే వేకెన్సీ రౌండ్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 27న సీట్ల మ్యాట్రిక్స్ ధ్రువీకరణ ఉంటుంది. జిల్లాలో అందుబాటులో సీట్లు ఏఐక్యూ కౌన్సెలింగ్ ద్వారా జనగామ మెడికల్ కళాశాలలో 15 సీట్లు దేశవ్యాప్తంగా నీట్లో అర్హత సాధించిన విద్యార్థులకు అందుబాటులోకి రాను న్నాయి. రాష్ట్ర కోటా సీట్లతో పాటు ఏఐక్యూ సీట్లకు కూడా విద్యార్థులు పోటీ పడనుండటంతో జనగా మ మెడికల్ కళాశాల జాతీయ స్థాయి కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగం కానుంది. కౌన్సెలింగ్లో ప్రతి దశలోనూ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, చాయిస్ ఫిల్లింగ్, ఎంపిక లాకింగ్, సీట్ల కేటాయింపు, రిపోర్టింగ్ వంటి దశలు కీలకం. నిర్ణీత గడువులో ఎంపిక లాకింగ్ చేయకపోతే విద్యార్థుల సీటు కేటాయింపు ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున షెడ్యూల్ను జాగ్రత్తగా అనుసరించాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్కు షెడ్యూల్ ఖరారు నాలుగు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ -
ఆన్లైన్ చేస్తేనే బోనస్
● సన్నరకం వరిపంట సాగుచేసే రైతులకు అధికారుల సూచనబచ్చన్నపేట: అన్నదాతలు సాగుచేసే సన్న రకాల వరిపంటకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ అదనంగా చెల్లిస్తున్న విషయం తెలిసిందే. దీంతో రైతులు ఎక్కువగా సన్నరకం పంటలు సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కేఎన్ఎం–1638, బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్–15048, కేఎన్ఎం– 7715, జైశ్రీరాం, హెచ్ఎంటీ– సోనా, వరంగల్– 44 (సిద్ది) రకాలకు మాత్రమే ప్రభుత్వం బోనస్ డబ్బులను ఇస్తామని ప్రకటించింది. అయితే సన్నరకాలను సాగుచేసిన అన్నదాతలు తప్పకుండా ఆన్లైన్లో ఆయా గ్రామాల క్లస్టర్ ఏఈఓల వద్ద లేదా విత్తనాలు కొనుగోలు చేసిన సీడ్ డీలర్ల వద్దనైనా ఆన్లైన్ చేసుకోవాలని లేకుంటే రైతులు బోనస్ నష్టపోతారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మండలంలోని 26 గ్రామాల్లో సన్నరకం వరి పంటలను సాగు చేసిన అన్నదాతలను గుర్తించి ఏఈఓలు అవగాహన కలిగిస్తున్నారని మండల వ్యవసాయాధికారి శరత్చంద్ర తెలిపారు. ఇంకా ఎవరైనా ఆన్లైన్ చేయని వారు ఏఈఓల వద్ద ఆన్లైన్ చేసుకోవాలన్నారు. -
నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలి
● గ్రూపు రాజకీయాలకు తావులేకుండా ఉండాలి ● ఎంపీ కావ్య, ఎమ్మెల్యే యశస్విని, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతిజనగామ: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా, క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నా యకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి పిలుపుని చ్చారు. జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హా ల్లో డీసీసీ సమీక్ష సమావేశం, నూతన జిల్లా, మండల, టౌన్ కాంగ్రెస్ కమిటీల సన్మానం, ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ శ్రేణులు గ్రూపు రాజకీయాలకు దూ రంగా ఉండాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. జనగామలో కాంగ్రెస్ జెండా బలంగా ఎగరాలంటే నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో కాంగ్రెస్ను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి అన్నారు. వ్యక్తిగత విభేదాలు, గ్రూపు రాజకీయాలకు తావులేకుండా సమన్వయంతో పని చేయాలని సూచించారు. నాయకుల మధ్య సమస్యలు ఉంటే పరస్పరం పరిష్కరించుకుని పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రజలతో నిరంతరం మమేకమై సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట బోర్డు మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, జనగామ మున్సిప ల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, నాయకులు రాంబాబు, తాటికొండ వినయ్, లావణ్య శిరీష్రెడ్డి, వేమల్ల సత్యనారాయణ రెడ్డి, కంచ రా ములు, డాక్టర్ రాజమౌళి, లింగాల జగదీష్ చంద్రరెడ్డి, కొత్త కరుణాకర్రెడ్డి, గుడి వంశీధర్ రెడ్డి, నూకల బాల్రెడ్డి, మేడ శ్రీనివాస్, ఎండీ అన్వర్, ఎండీ మదార్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులు అంకిత భావంతో పనిచేయాలి
● పర్యావరణాన్ని బాధ్యతగా పరిరక్షించాలి ● డీజీపీ సీవీ ఆనంద్ ● మామునూరు బెటాలియన్లో స్వాగతంమామునూరు: స్పెషల్ పోలీసులు రాష్ట్ర అంతర్గత భద్రతను పరిరక్షిస్తూ అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, ఎస్డీఆర్ఎఫ్ సామర్థ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలని డీజీపీ పేర్కొన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం మామునూరు టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్ను అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్ జైన్తో కలిసి డీజీపీ సందర్శించారు. బెటాలియన్ ప్రధాన గేట్ వద్దకు చేరుకున్న ఆయనకు కమాండెంట్ డి.శివప్రసాద్రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం పోలీసుల నుంచి డీజీపీ గౌరవందనం స్వీకరించి, విధులు, సంక్షేమం, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో ముఖాముఖి బెటాలియన్ ఆడిటోరియంలో జరిగిన అధికారులు, సిబ్బందితో ముఖాముఖి కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలందించాలని, బెటాలియన్లో మరిన్ని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. పోలీసింగ్ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వృత్తి నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞాన, సమన్వయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అంతకు ముందు బెటాలియన్లో మొక్కలు నాటారు. తర్వాత ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ పరికరాలను పరిశీలించి, నైపుణ్యాన్ని డీజీపీ అభినందించారు. కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్లు బాలయ్య, వీరన్న, రాజేందర్, ఆర్ఐలు కార్తీక్, విజయ్, రవి, పురుషోత్తంరెడ్డి, వెంకటేశ్వర్లు, రాజ్కుమార్, కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలి
● రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు రవీందర్నాయక్జనగామ రూరల్: సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్నాయక్ అన్నారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై శనివారం సమీ క్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి వాణిశ్రీ, జిల్లా స్థాయి అధికారులు సిద్ధార్థ రెడ్డి, హరికృష్ణ, శ్రావ్య, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్యశాఖలో రేషనలైజేషన్ లింగాలఘణపురం: రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశాఖలో రేషనలైజేషన్ జరగనుందని రాష్ట్ర సంచాలకులు రవీందర్నాయక్ తెలిపారు. శనివారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ వాణిశ్రీతో కలిసి సందర్శించారు. పీహెచ్సీలోని వసతులతో పాటు సిబ్బంది రిజిస్టర్ను పరిశీలించి పలు సూచనలు చేశారు. -
14న పంటలకు సాగునీరు అందిస్తాం
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెంచి అందుబాటులో ఉన్న నీటితో రైతులకు సాగునీరు అందించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్ రిజర్వాయర్ కుడికాల్వను నీటిపారుదలశాఖ, మున్సిపల్ అఽధికారులు, ప్రజాప్రతినిఽధులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఘన్పూర్ మున్సిపాలిటీ ఎస్సీ కాలనీ నుంచి వెళ్తున్న పంట కాల్వను, తూము వద్ద కాల్వను పరిశీలించారు. పంటల కాల్వకు రెండువైపులా వాల్స్ నిర్మాణం చేసి చివరివరకు సాగునీరు వెళ్లే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. అనంతరం ఘన్పూర్లో మాజీ ఎంపీటీసీ డాక్టర్ అంబటి జైహింద్రాజ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 14న రిజర్వాయర్ల ద్వారా సాగునీరు ఆన్ అండ్ ఆఫ్ పద్దతిలో అందిస్తామని, 15 రోజుల పాటు నీటి విడుదల జరుగుతుందని, మరో 15రోజుల పాటు రిజర్వాయర్లలో నీటిని నింపుతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంబటి కిషన్రాజ్, నీటిపారుదల శాఖ ఎస్ఈ సీతారాం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు బెలిదె వెంకన్న, గట్టు రమేష్, పెసరు సారయ్య, గన్ను నర్సింహులు, సింగపురం దయాకర్, వెంకటయ్య, తెల్లాకుల రామకృష్ణ, చింత ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
నాలుగేళ్ల నిరీక్షణకు మోక్షం
జనగామ: సామాజిక భద్రత పింఛన్ల పథకం ‘చేయూత’లో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నాలుగేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు తాజా నిర్ణయం ఊరటనివ్వనుంది. వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు, వికలాంగులు, రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి కొత్త పింఛన్లలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో అర్హులైన పేద కుటుంబాలకు నెలవారీ ఆర్థిక భరోసా లభించనుంది. పాత లెక్కలపై ఆరా జిల్లాలో కొత్త సామాజిక భద్రత పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించడంతో అధికార యంత్రాంగం పాత పింఛన్ల లెక్కలను సైతం సరిచూస్తోంది. ప్రస్తుతం జిల్లాలో అన్ని కేటగిరీలకు కలిపి 73,829 మందికి ప్రతీ నెల రూ.18.32 కోట్ల మేర పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. 2022 ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ నిలిచిపోవడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ కేటగిరీల్లో సుమారు 25,256 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓల ద్వారా, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఎంపీడీఓ స్థాయిలో మరోసారి పరిశీలించి జిల్లా కేంద్రానికి పంపిస్తారు. అక్కడ కూడా ఎంక్వయిరీ పూర్తి చేసి కలెక్టర్ ఆమోదానికి నివేదిక సమర్పించనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ నిరంతరంగా పేర్కొంటున్నారు. మరణించిన వారి పేర్ల తొలగింపు కొత్త పింఛన్ల మంజూరుకు మండలాలు, మున్సిపాలిటీలకు ప్రత్యేక లాగిన్లు కేటాయించడంతో ప్రక్రియ వేగవంతం కానుంది. ఇదే సమయంలో డూప్లికేట్ పింఛన్లు, మరణించిన లబ్ధిదారుల వివరాలపైనా అధికారులు దృష్టిసారించారు. జిల్లాలో సుమారు 550 మంది పింఛన్దారులు మృతి చెందినట్లు గుర్తించి ప్రత్యేక నివేదిక రూపొందించారు. వీరిలో 80 శాతం మంది రెండు నెలల క్రితం, మరో 20 శాతం మంది ఆరు నెలల క్రితం మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటికే ఆయా ఖాతాలను ఫ్రీజ్ చేసిన అధికారులు, మరణించిన వారి పేరుతో జమ అయిన పింఛనన్ మొత్తాన్ని పూర్తి స్థాయిలో రికవరీ చేసేందు కు చర్యలు చేపట్టనున్నారు. పింఛన్ ఇలా వితంతువులకు నెలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.4,016 చొప్పున పింఛన్ అందించనున్నారు. గీత, చేనేత కార్మికులకు రూ.2,016 చొప్పున మంజూరు చేయనున్నారు. ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు వయోపరిమితి లేకుండా నిర్దేశిత నిబంధనల మేరకు పింఛనన్ కల్పించనున్నారు. ఆయా కేటగిరీలకు సంబంధించి వయసు, వైకల్యం, వైద్య పరిస్థితి, శాఖల ధ్రువీకరణ పత్రాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. అదే సమయంలో అనర్హుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. నిర్దేశిత పరిమితికి మించి వ్యవసాయ భూమి, అధిక ఆదాయం ఉన్న కుటుంబాలు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగులు ఉన్న కుటుంబాలు, వైద్యులు, కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు, పెద్ద వ్యాపార సంస్థల యజమానులు, నాలుగు చక్రాల లేదా భారీ వాహనాల యజమానులు పింఛన్కు అనర్హులుగా పరిగణించనున్నారు. దశలవారీగా పరిశీలన కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా స్వీకరించి చేయూత పోర్టల్లో నమోదు చేయనున్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, 360 డిగ్రీల డేటాబేస్ ఆధారంగా వివరాలను పరిశీలిస్తారు. అర్హుల జాబితాకు కలెక్టర్ ఆమోదం అనంతరం మంజూరు ఉత్తర్వులు జారీ చేస్తారు. వృద్ధుల సంగతేంటి? కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి మార్గదర్శకాలు వెలువడినా వృద్ధాప్య పింఛన్పై స్పష్టత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొత్తగా అ ర్హత పొందే వృద్ధులకు వయోపరిమితి ఎంత అనే అంశాలపై మార్గదర్శకాల్లో వివరాలు లేకపోవడంతో అయోమయం నెలకొంది. కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. చేనేత కార్మికులు 306గీత కార్మికులు 852దివ్యాంగులు 3,426బీడీ కార్మికులు 142ఒంటరి మహిళలు 336వితంతువులు 3,491వృద్ధాప్య పింఛన్లు 6,332ఇతరులు 8దరఖాస్తులు ఇలా.. జిల్లాలో కొత్త పింఛన్లకు శ్రీకారం వృద్ధాప్య పింఛన్పై వీడని సందిగ్ధత జిల్లాలో వచ్చిన దరఖాస్తులు 25,256 ప్రతీనెల 73,829 మందికి రూ.18.32కోట్ల పంపిణీ -
నేడు నల్లబెల్లికి కేసీఆర్ రాక
నర్సంపేట: బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఇంటికి రానున్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. కష్టకాలంలో ఉన్న వారికి భరోసా ఇవ్వనున్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు కేసీఆర్ ఇప్పటికే ఆర్థిక సాయం ప్రకటించిన విషయం విదితమే. ఈవీఎం గోదాం పరిశీలన జనగామ రూరల్: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, నెలవారీ తనిఖీలో భాగంగా శనివారం కలెక్టర్ కార్యాలయంలోని ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పని తీరు, మంటల నియంత్రణ పద్ధతులను పర్యవేక్షించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ పర్యటనకు నేడు అర్హత పరీక్ష జనగామ: అంతర్జాతీయ విద్యా విధానాలపై అవగాహన పెంపొందించేందుకు రాష్ట్ర విద్యాశాఖ, ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీచర్ ఎక్స్పోజర్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రాం ఫేజ్–2కు జిల్లా నుంచి ఐదుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేయనున్నారు. ఇందు కోసం జిల్లాలోని అర్హులైన ఉపాధ్యాయుల నుంచి తొమ్మిది దరఖాస్తులు రాగా వీరిలో అర్హత, ప్రతిభ ఆధారంగా ఐదుగురిని ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోందని విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్ తెలిపారు. ఇందులో భాగంగా నేడు (ఆదివారం) జనగామ సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అభ్యర్థులకు ఉదయం 11గంటలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, ప్రతిభావంతులైన ఐదుగురు ఉపాధ్యాయులను అంతర్జాతీయ విద్యా పర్యటనకు ఎంపిక చేయనున్నారు. హామీలు నెరవేర్చాలి జనగామ రూరల్: ఎన్నికల హామీలు నెరవేర్చాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక డిమాండ్ చేశారు. శనివారం జిల్లాకేంద్రంలో జిల్లా అధ్యక్షుడు ఏదునూరి నరేష్ అధ్యక్షతన ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సాంబరాజు కుమార్, మామిడాల ప్రభాకర్, గట్టికొప్పుల సత్యనారాయణ, ఉల్లెంగుల వెంకటేశ్వర్లు, మిన్నలపురం జలంధర్, ఏదునూరి వీరన్న, రాములు, తదితరులు పాల్గొన్నారు. తొలి తెలుగు విప్లవ కవి సోమనాథుడు పాలకుర్తి టౌన్: తెలంగాణ ఆది కవి, తొలి తెలుగు విప్లవ కవి పాల్కురికి సోమనాథుడు నడియాడిన పాలకుర్తి ప్రాంతం సాహిత్య, సామాజిక పోరాట చరిత్రక ప్రతీకగా నిలిచిందని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పొలిట్బ్యూరో సభ్యుడు, ఏఐసీసీటీయూ జాతీయ అధ్యక్షుడు కామ్రెడ్ వి.శంకర్ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని పాల్కురికి సోమనాథుడు స్మారక స్మృతి కేంద్రాన్ని సందర్శించి సోమనాథుడి శిలా విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల్కురికి సోమనాథుడి సాహిత్యం తెలుగు భాషలోనే కాకుండా సమాజ ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ కేంద్ర కమిటీ సభ్యులు ఎన్.మూర్తి, రాష్ట్ర కార్యదర్శి కవి, రచయిత మామిండ్ల రమేష్రాజా, గుమ్మడిరాజు సాంబయ్య, అనంతోజు రజిత పాల్గొన్నారు. -
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
జనగామ రూరల్: పీఆర్సీని ప్రకటించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కొల్ల మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల శాఖ అధ్యక్షుడు బొగ్గారపు శ్రీనివాసు అ ధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా చెబుతున్న సీఎం రేవంత్రెడ్డి వెంటనే పీఆర్సీని ప్రకటించాలన్నారు. అలాగే అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో హెల్త్ కార్డులు అమలు అయ్యేలా చూడాలన్నారు. విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతీ ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడు ఐదుగురు టీచర్స్ ఉండే విధంగా చూడాలన్నారు. అనంతరం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అయిత నరసింహులు ఆధ్వర్యంలో నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బొగ్గారపు శ్రీనివాసు, ప్రధాన కార్యదర్శిగా ఎండీ జలీల్తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. -
ఖిలాషాపూర్ పాఠశాలల్లో పీజీఐ బృందం తనిఖీ
రఘునాథపల్లి: మండలంలోని ఖిలాషాపూర్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్(పీజీఐ) రాష్ట్ర పరిశీలన బృందం శుక్రవారం ఆకస్మికంగా సందర్శించింది. ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి (అడిషనల్ కలెక్టర్) సదానందం నేతృత్వంలోని పాఠశాలల్లో విద్యా కార్యక్రమాల అమలు, పురోగతి అంశాలపై తనిఖీ చేశారు. రెండేళ్లుగా విద్యార్థుల నమోదు, పెరుగుదల, ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీ కార్యక్రమాల అమలు, తెలుగు– ఆంగ్లం చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలు, ఫాస్ట్ మ్యాథ్స్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, మధ్యాహ్న భోజనం, డిజిటల్ బోధన, ప్రాజెక్టు ఆధారిత బోధన తదితర అంశాలను పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర బృందం సభ్యులు ఏఎంఓ ప్రభాకర్రెడ్డి, ఎంఈఓ చలపతి, డీఆర్పీ ప్రవీణ్, రఘునాథపల్లి ఎంఈఓ రఘునందన్రెడ్డి, హెచ్ఎంలు భారత రవీందర్, ఎం.యాదవరెడ్డి, సీఆర్పీ శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘బోధకుల’ రాతపరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
జనగామ: జిల్లాలోని 15 పీఎంశ్రీ పాఠశాలల్లో విద్యార్థులకు యోగా, సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ అందించేందుకు తాత్కాలిక పద్ధతిలో మాస్టర్ల నియామకా నికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 9వ తేదీ ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లో అభ్యర్థులకు రాతపరీక్ష, డెమో, ఆ తర్వాత ఇంట ర్వ్యూలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ఏడీ శ్రీని వాస్ తెలిపారు. మూడు దశల్లో అభ్యర్థుల ప్రతిభ ను అంచనావేసి తుది ఎంపిక చేపట్టనున్నారు. 30 మంది నియామకం జిల్లాలోని 15 పీఎంశ్రీ పాఠశాలల కోసం 15 మంది యోగా మాస్టర్లు, 15 మంది సెల్ఫ్ డిఫెన్స్ మాస్టర్లను నియమించనున్నారు. ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానించగా యోగా మాస్టర్ పోస్టులకు 27 మంది, సెల్ఫ్ డిఫెన్స్ మాస్టర్ పోస్టులకు 38 మంది దరఖాస్తు చేశారు. అందుబాటులో ఉన్న పోస్టులతో పోలిస్తే పోటీ నెలకొనడంతో ఎంపిక ప్రక్రియను పూర్తిగా ప్రతిభ ఆధారంగా నిర్వ హిస్తున్నారు. ఎంపికై న యోగా మాస్టర్లకు 10 నెలల పాటు నెలకు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తారు. వీరు సంబంధిత పీఎంశ్రీ పాఠశాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహిస్తూ అన్ని తరగతుల విద్యార్థులకు యోగా శిక్షణ అందించాల్సి ఉంటుంది. సెల్ఫ్ డిఫెన్స్ మాస్టర్లు మార్షల్ ఆర్ట్స్, కరాటే, కుంగ్ఫూ, జూడో, తైక్వాండో, కలరిపయట్టు వంటి విద్యల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఏడాది కాలంలో 72 సెషన్లు నిర్వహించాల్సి ఉండగా, ఇందుకు మొత్తం రూ.30 వేల గౌరవ వేతనం అందజేయనున్నారు. బాలికల్లో ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. రేపు యోగా, సెల్ఫ్ డిఫెన్స్ మాస్టర్ల నియామక పరీక్షలు 15 పీఎంశ్రీ పాఠశాలలకు 30 తాత్కాలిక పోస్టులు -
కొండా లక్ష్మణ్ అవార్డు అందుకున్న రాజేశ్వరి
బచ్చన్నపేట : చేనేత రంగంలో విశేష నైపుణ్యం కనబర్చిన మండలంలోని గోపాల్నగర్ గ్రామానికి చెందిన నేత కళాకారిణి సకినాల రాజేశ్వరి.. కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత అవార్డును అందుకున్నారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో పీపుల్స్ ప్లాజాలో చేనేత జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ.. జిల్లాలో కేవలం ఒక మహిళా చేనేత కార్మికురాలిగా ఎంపికయ్యానని సంతోషం వ్యక్తం చేశారు. చేనేతలో సంప్రదాయ పద్ధతులను అవలంబిస్తూ టై అండ్ డై చీరలను నేశానన్నారు. ఆమె వెంట భర్త రాజు పలువురు ఉన్నారు. తెగుళ్ల నివారణకు సకాలంలో చర్యలు తీసుకోవాలి పాలకుర్తి టౌన్: పంటల్లో పురుగులు, తెగుళ్ల నివారణకు సకాలంలో చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ వి.రమ్య, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంబికా సోని సూచించారు. శుక్రవారం మండలంలోని గూడూరులో వరి, పత్తి, మొక్కజొన్న, పశుగ్రాస జొన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటల ఎదుగుదలకు రెండు శాతం యూరియా ద్రావణం లేదా 19:19:19 ఎరువు ద్రావణంతో పాటు నానో డీఏపీ, నానో యూరియా పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఏఈలు సువర్ణ, దీపక్ పాల్గొన్నారు. చేనేత కార్మికులు ఐక్యంగా ఉండాలి జనగామ: చేనేత కార్మికులంతా పార్టీలకతీతంగా ఐక్యంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చేనేత సంఘ ప్రతినిధి బల్ల శ్రీనివాస్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని బాణా పురం కాలనీలో మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చేనేత కళా కారుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత రంగ పరిరక్షణతో పాటు కళాకారుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా చేనేత రంగానికి విశిష్ట సేవలు అందించిన పలువురు ప్రజాప్రతినిధులు, కళా కారులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు దోర్నాల వెంకన్నఅనిత, ఎనగందుల కృష్ణఅనూష, కట్కూరు సర్పంచ్ బల్ల రవీంద్ర, ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, ఘణపురం కార్తీక్, వల్లాల ఉపేందర్, బిజ్జా రమేశ్ తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్గా ఉజ్వల్రెడ్డి జనగామ: మండలంలోని చౌడారం గ్రామానికి చెందిన కర్ల ఉజ్వల్రెడ్డికి టీపీసీసీ కమిటీ సోషల్ మీడియా విభాగంలో రాష్ట్ర కన్వీనర్గా కీలక బాధ్యతలు దక్కాయి. ఈ మేరకు ఆయన్ను రాష్ట్ర కన్వీనర్గా నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ నియామక ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉజ్వల్రెడ్డి మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించిన పార్టీ జాతీయ నాయకత్వానికి, సహకరించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా పార్టీ కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజలకు చేరవేసేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. -
ఎఫ్పీఓలతో రైతులకు మరింత ప్రయోజనం కలగాలి
● నాబార్డు జిల్లా అబివృద్ధి మేనేజర్ (డీడీఎం)విజయ్కుమార్ చిల్పూరు: రైతులకు మరింత ప్రయోజనం కల్పించేలా ఎఫ్పీఓ(ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) పనిచేయాలని నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్(డీడీఎం)విజయ్కుమార్ అన్నారు. మండలంలోని రాజవరం గ్రామంలో నాబార్డు సహకారంతో జనవికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజవరం రైతు ఉత్పత్తి దారుల సంస్థను శుక్రవారం సాయంత్రం డీడీఎం సందర్శించారు. ఈసందర్భంగా ఎఫ్పీఓ చైర్మన్ కాల్వ కృష్ణారెడ్డితో సమావేశమై రైతులకు అందిస్తున్న సేవలు, భాగస్వామ్యం, భవిష్యత్తు కార్యకలాపాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాబార్డు ఇంటర్న్షిప్లో భాగంగా కావ్య స్వశక్తి మహిళా సంఘాల సభ్యులతో సమావేశమై వారి ఆర్థిక స్థితిగతులపై బేస్లైన్ సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో జేవీఆర్డీఎస్ సీఈఓ సంపత్కుమార్, రైతులు పాల్గొన్నారు. -
చేనేత కళాకారుల సంక్షేమానికి పెద్దపీట
● ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● పాలకుర్తి మండలంలో అభివృద్ధి పనుల పరిశీలనజనగామ: చేనేత కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత రంగం ప్రతీక అని పే ర్కొన్నారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో నేతన్న బీమా పథకం కింద మంజూరైన చెక్కులను చేనేత లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ ఏడీ బాబు, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, చేనేత కార్మికులు, లబ్ధిదారులు దోర్నాల వెంకన్న, వేముల బాలరాజు, గుర్రం బాలరాజు, ఎనగందుల కృష్ణ, సర్పంచ్ బల్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండాలి.. పాలకుర్తి టౌన్: అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. శుక్రవారం మండలంలోని గూడూరులో డబుల్ బెడ్రూం లేఅవుట్లో నిర్మించిన సీసీరోడ్ల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నాణ్యతలో రాజీ పడవద్దని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందేలా పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ తనిఖీల్లో గృహనిర్మాణ శాఖ పీఈ మాతృనాయక్, ఈఈ ప్రవీణ్కుమార్, డీఈ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సమీకృత వ్యవసాయ క్షేత్రం పరిశీలన.. గూడూరు గ్రామంలో సంపత్ అనే రైతు నిర్వహిస్తున్న సమీకృత వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ సందర్శించి పంటలు, పౌల్ట్రీ యూనిట్ను పరిశీలించారు. ఈసందర్భంగా జొన్న, పత్తి, బెండ సాగు వివరాలు, విస్తీర్ణం, దిగుబడిపై రైతును అడిగి తెలుసుకున్నారు. పౌల్ట్రీ యూనిట్లో సుమారు 6 వేల కోళ్లు ఉన్నట్లు రైతు వివరించగా, కోళ్ల పెంపకానికి పట్టే కాలం, దాణా ఖర్చు, విద్యుత్ వినియోగం, మార్కెట్ ధరలు, విక్రయ విధానం వంటి అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. వ్యవసాయాన్ని విభిన్నీకరించడం ద్వారా ఆదాయం వనరులు పెరుగుతాయని మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో డీఏఓ అంబికా సోనీ, కేవీకే శాస్త్రవేత్త రమ్య, వ్యవసాయ అఽధికారులు, రైతులు పాల్గొన్నారు. -
విద్యారంగ సమస్యల పరిష్కారంలో విఫలం
● టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంజిత్కుమార్ స్టేషన్ఘన్పూర్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.రంజిత్కుమార్ ఆరోపించారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామసమయంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు అంజిరెడ్డి, రాజేంద్రప్రసాద్, వెంకటేశ్వర్లు, లలితాకుమారి, శాంతి, శ్రీనివాస్, సోమరాజు, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్కు సీఎం రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఈ నెల 16న ఉమ్మడి వరంగల్లో పర్యటించనున్నారు. ములుగు, హనుమకొండ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ‘ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్’ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం గట్టమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసే పైలాన్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు, కీలక ప్రజాప్రతినిధులకు సీఎంఓ నుంచి శుక్రవారం అధికారిక సమాచారం అందినట్లు తెలిసింది. అక్కడినుంచి పరకాలకు చేరుకోనున్న సీఎం రేవంత్.. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. వంద పడకల సివిల్ ఆస్పత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలను ప్రారంభిస్తారు. చివరగా పరకాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, భవిష్యత్లో చేపట్టనున్న పనులపై సీఎం రేవంత్ మాట్లాడే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఏర్పాట్ల పరిశీలన.. పరకాల: ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పరకాలలో చేపడుతున్నట్లు ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక పశువుల సంతలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభాస్థలిని సందర్శించారు. వేదిక, సభా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. 16న ఉమ్మడి వరంగల్లో పర్యటన ములుగు కలెక్టరేట్ ప్రారంభం.. గట్టమ్మ వద్ద పైలాన్ ఆవిష్కరణ పరకాలలో ‘యంగ్ ఇండియా’కు శంకుస్థాపన.. అనంతరం బహిరంగ సభ -
సంప్రదాయిక వైభవం..గోరింటాకు సంబురం
జనగామ: ఆషాఢ మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన ఆదేశాల మేరకు శుక్రవారం గోరింటాకు సంబరాలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ మహిళా నాయకులు, మహిళా కౌన్సిలర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది మహిళలు పాల్గొన్నారు. గోరింటాకును అక్కడికక్కడే తయారు చేసుకుని ఒకరికొకరు పెట్టుకుంటూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణలోని పండుగలు, సంప్రదాయాలకు గత పదేళ్లలో పూర్వ వైభవం తీసుకురావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని కొనియాడారు. -
ఓరుగల్లుకు పోలీస్ బాస్
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఉమ్మడి వరంగల్లో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. శనివారం నుంచి సోమవారం వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్తోపాటు ఉమ్మడి వరంగల్లోని జిల్లాల పోలీస్ అధికారులతో ఆయన వరుసగా సమీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. తెలంగాణ పోలీసింగ్లో కొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్న ఆయన జిల్లాల వారీగా శాంతిభద్రతలు, నేర నియంత్రణ, పెండింగ్ కేసులు, దర్యాప్తు తీరుతెన్నులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై చర్చించి తగు సూచనలు చేయనున్నారని తెలిసింది. మొదట ఈ పర్యటన జూలై 30, 31 తేదీల్లో ఉన్నట్లు ప్రకటించినప్పటికీ వర్షాల కారణంగా వాయిదా పడింది. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీవీ ఆనంద్ మొదటి సారి ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో శనివారం నుంచి పర్యటిస్తున్నారు. మూడు రోజులు.. మూడు దశల్లో సమీక్షలు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న డీజీపీ సీవీ ఆనంద్ నేరుగా మామునూరు బెటాలియన్కు చేరుకుంటారని తెలిసింది. అక్కడ వివిధ స్థాయిల అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం హనుమకొండ సిటీకి చేరుకుని నక్కలగుట్టలోని హరిత కాకతీయలో రాత్రి బస చేయనున్నట్లు సమాచారం. 9న ఉదయం వరంగల్ కమిషనరేట్ కార్యాలయం సందర్శన అనంతరం సీపీ, అడిషనల్ డీసీపీలు, డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులతో సమావేశం అవుతారు. సాయంత్రం వరంగల్ నుంచి బయలుదేరి ములుగు జిల్లాకు వెళ్తారని సమాచారం. సమీక్షలో భాగంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల అధికారులతో సమావేశం కానుండగా, ఆయా జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని పోలీసింగ్ పనితీరుపై వివరాలు అందించనున్నారని తెలిసింది. నేటినుంచి మూడు రోజులపాటు వరుస సమీక్షలు ఎస్పీలు, పోలీస్ అధికారులతో నేరుగా భేటీ నేర నియంత్రణ, సాంకేతికతలపై ఫోకస్ డీజీపీగా జిల్లాకు తొలిసారి వస్తున్న సీవీ ఆనంద్ -
పనుల నాణ్యతలో రాజీ పడొద్దు
జనగామ: జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సుందరీకరణ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంతో పాటు నాణ్యత విషయంలో రాజీ పడొద్దని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ (ఏడీఆర్ఎం) ముత్యాల నాయుడు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జనగామ రైల్వే స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో కొనసాగుతున్న సుందరీకరణ, పునరుద్ధరణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. స్టేషన్లోని మొదటి ప్లాట్ఫామ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, లిఫ్ట్లు, ఏసీ వెయిటింగ్ హాల్స్, ప్రయాణికుల విశ్రాంతి గదులు, ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద చేపడుతున్న సుందరీకరణ పనులు, పార్కింగ్ ప్రాంతం, లైటింగ్ ఏర్పాట్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. కాగా, పంద్రాగస్టు నాటికి రీమోడలింగ్, సుందరీకరణ పనులను పూర్తిచేసి నూతన రూపులో రైల్వే స్టేషన్ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మైనార్టీ నాయకుడు అజహరొద్దీన్ ఏడీఆర్ఎం ముత్యాల నాయుడిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. 10న ఆటోల బంద్ జనగామ రూరల్: ఈనెల 10వ తేదీన జిల్లాలో ఆటోల బంద్ చేపట్టనున్నట్లు ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు జేరుపోతుల కుమార్ తెలిపారు. గురువారం పట్టణ ఆటో యూనియన్ అధ్యక్షుడు బాల్దే శ్రీశైలం అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ వద్ద ఆటోల బంద్ వాల్పోస్టల్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12,000 ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదన్నారు. సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయలేదని, ముఖ్యంగా ఓలా, ఉబర్, ర్యాపిడో లాంటి సంస్థలను అధికారికంగా నిషేధించాలన్నా రు. ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. మండల అధ్యక్షులు నామాల నరసింహులు గౌడ్, తాళ్లపల్లి వెంకటయ్య, బిధాని మల్లేష్, మైముద్, మంగ శ్రీను, గణిపాక రవి, కర్రె శీను, సత్యనారాయణ, యాకుబ్ పాషా, సలీం తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి జనగామ రూరల్: రాష్ట్రంలోని ఆటో, క్యాబ్, లారీ, బస్సు తదితర వాహనాల డ్రైవర్ల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ పబ్లిక్–ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా కార్యాలయంలో ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు బూడిద ప్రశాంత్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా పుప్పాల శ్రీకాంత్ మాట్లాడుతూ.. డ్రైవర్లకు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పెన్షన్ వంటి సామాజిక భద్రతా పథకాలను అమలు చేయాలని కోరారు. ఈనెల 23 అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని రవాణా రంగ కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు విజేందర్,ఽ ధరావత్ మహేందర్, శివరాత్రి రాజు, చీర శ్రీనివాస్ బూడిద సంపత్, ఆత్కూరి ఎల్లయ్య, కాగితాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ జనగామ: జిల్లాలోని ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 2026–27 విద్యా సంవత్సరానికి 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) జిల్లా శాఖ తరపున సెక్రటరీ సురిగెల భిక్షపతి విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నారు. జర్నలిస్టులు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులను పరిశీలించి ఫీజు రాయితీ అమలు చేసి, నివేదిక సమర్పించాలని పాఠశాలల యాజమాన్యాలను కలెక్టర్ ఆదేశించినట్లు భిక్షపతి తెలిపారు. -
నేతలో నైపుణ్యం..దక్కిన పురస్కారం
బచ్చన్నపేట: మండలంలోని గోపాల్నగర్ గ్రామానికి చెందిన చేనేత కళాకారిణి సకినాల రాజేశ్వరి రాష్ట్ర ప్రభుత్వ కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత అవార్డుకు ఎంపికయ్యారు. ఈనెల 7న (శుక్రవా రం) జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొ ని హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో రాష్ట్ర చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వేడుకల్లో చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఇతర రాష్ట్ర అధికారుల చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. సంస్థల శిక్షణతో ప్రోత్సాహం.. మండల కేంద్రంలో పెర్నోడ్ రికార్డ్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వారు సీఎస్ఆర్ ఆర్థిక సహాయంతో యూనైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, వారి క్నౌలెడ్జ్ పార్టనర్ పల్లె సృజన సంస్థలు నిర్వహించించిన ప్రీ హ్యాండ్లూమ్ డిజైనింగ్ శిక్షణ కార్యక్రమానికి సకినాల రాజేశ్వరి ఎంపికై అందులో నైపుణ్యం సాధించారు. మండల కేంద్రంలో టెక్నికల్ శిక్షకుడు చింతకింది మల్లేశం నిర్వహించిన 40 రోజుల శిక్షణ కార్యక్రమంలో దాదాపు 50 మంది మహిళలు పాల్గొనగా కేవలం రాజేశ్వరి ఒక్కరే పట్టుదలతో నేతను నేర్చుకున్నారు. ఈసందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని తెలిపారు. పేదరికంలో ఉన్నప్పటికీ శిక్షణకు వెళ్లడానికి, మెలకువలు నేర్చుకోవడానికి భర్త రాజు ప్రోత్సాహం అందించారన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు చేనేత కళాకారిణి రాజేశ్వరి ఎంపిక -
వేధింపుల నివారణతోనే మహిళా భద్రత
జనగామ: లైంగిక, సైబర్ వేధింపుల వంటి నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరిలోనూ అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశం హాలులో జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. లైంగిక, సైబర్ వేధింపులకు గురైన మహిళలు భయపడకుండా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని, సఖి కేంద్రాలు, పోలీసులు, న్యాయ సహాయ సేవలను విని యోగించుకోవాలని సూచించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. యువతులను వెంబడించడం, పదేపదే సందేశాలు పంపడం, కళాశాలలు, కార్యాలయాల వద్ద వేచి ఉండడం, నకిలీ సోషల్ మీడియా ఖాతాలతో వేధించడం వంటి చర్యలు చట్టరీత్యా నేరాలని స్పష్టం చేశారు. సైబర్ వేధింపులు ఎదురైతే స్క్రీన్ షాట్లు భద్రపరచి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, మౌనం వేధింపుదారులకు అవకాశమిస్తుందని హెచ్చరించారు. 100,112,181,1098,1930 సేవలను సద్వియోగం చేసుకోవాలన్నారు. అనంతరం లైంగిక, సైబర్ వేధింపుల నివారణపై రూపొందించిన అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్, డీడబ్ల్యూఓ బెన్షాలోమ్, మహిళా కమిషన్ సెక్రెటరీ పద్మజారమణ, మానసిక వైద్య నిపుణుడు శ్రీధర్ రాజు, మహిళా కమిషన్ సభ్యులు కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళయాదవరెడ్డి, ఎన్.రాధాభాయ్, సదాలక్ష్మి, ఏసీపీ నర్సయ్య, అదనపు డీసీపీ బాలస్వామి, వెంకటరమణ తదితరులు ఉన్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు, మెరుగైన మౌలిక వసతులు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయలక్ష్మి సూచించారు. జిల్లా పర్యటన నేపథ్యంలో పట్టణంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆమె సందర్శించి, వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రతను పరిశీలించారు. మహిళా సర్జికల్, మెడికల్ వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి, వైద్యసేవలు, వైద్యుల పర్యవేక్షణ, డిశ్చార్జ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. భర్త చేతిలో గాయపడి చికిత్స పొందుతున్న మహిళను పరామర్శించి, దాడికి పాల్పడిన ఒక్కరిపై కాకుండా అందరిపై కేసు నమోదు చేయాలని ఏసీపీని ఆదేశించారు. అనంతరం ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ఉన్న బాలసదనాన్ని సందర్శించిన చైర్పర్సన్ అక్కడి చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్, డీడబ్ల్యూఓ బెన్షాలోమ్, కార్యదర్శి బి.పద్మజారమణ, ఏసీపీలు భీంశర్మ, నర్సయ్య, జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజలింగం, డీసీపీఓ రవికాంత్ ఉన్నారు.మరిన్ని వార్తలు 8, 9 పేజీల్లో బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి లైంగిక, సైబర్ వేధింపులపై అవగాహన పెంచుకోవాలి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయలక్ష్మి -
పట్టణాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి
జనగామ: పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో గురువారం చైర్పర్సన్ బాలమణి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఆమె మాట్లాడుతూ..ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన పౌరసేవలు అందించే దిశగా ప్రతీ శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కాగా, మున్సిపాలిటీ పరిధిలో అమలవుతున్న అభివృద్ధి కా ర్యక్రమాలు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల కల్పన, పట్టణాభివృద్ధి పనులు తదితర అంశాలపై కౌన్సిల్ సభ్యులు మాట్లాడారు. సమావేశంలో 49 ఎజెండా అంశాలను కౌన్సిల్ ముందుంచగా, వాటిలో 47 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. మరో రెండు ఎజెండా అంశాలను తదుపరి పరిశీలన కోసం నిలిపివేశారు. పలు అంశాలపై చర్చ.. వార్డుల అభివృద్ధి, మౌలిక వసతులు, బడ్జెట్ కేటాయింపులు తదితర అంశాలపై సభ్యులు చర్చించారు. మెడికల్ కళాశాలతో పాటు ఎంసీహెచ్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి మున్సిపాలిటీ నుంచి రూ.25 లక్షల నిధులు కేటాయించడంపై పలువురు కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేయగా, దీనిపై సమావేశంలో చర్చ జరిగింది. పెంబర్తి–జనగామ బైపాస్ రోడ్డు అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. గత ఐదు సమావేశాలుగా 25వ వార్డుకు సంబంధించిన లైబ్రరీ, మహిళల కమ్యూనిటీ హాల్ నిర్మాణ అంశాలను ఎజెండాలో చేర్చకపోవడంపై 25వ వార్డు కౌన్సిలర్ పాముకుంట్ల ప్రసాద్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటలైజేషన్లో భాగంగా కౌన్సిలర్లకు ట్యాబ్లు అందించాలని, గాంధీ విగ్రహం వద్ద ట్రాఫిక్ సమస్యలను నివారించే చర్యలు చేపట్టాలని పలువురు కోరారు. అలాగే మహంకాళి దేవాలయంలో బోనాల పండుగ నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కమిషనర్ రాజశేఖర్రెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ బాలమణిశ్రీనివాస్ కౌన్సిల్ సమావేశంలో 47 ఎజెండా అంశాలకు ఆమోదం -
పే స్కేల్ వర్తింపజేయాలి
ఎన్నో ఏళ్ల నుంచి వీబీజీ రామ్జీ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఏపీఓలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు తక్షణమే పే స్కేల్ వర్తింపజేయాలి. మూడు నెలల నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలి. సీఎం ఇచ్చిన హామీ మేరకు ప్రతీ నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలి. అర్హత కలిగిన వారికి పదోన్నతులు కల్పించాలి. వేతనాలు పెంచాలి. ఏడు రోజుల నుంచి ఆఫీసు విధులకు హాజరవుతూ నిరసన తెలుపుతున్నాం. అయినా ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించడం లేదు. –రాజ కరుణ, ఏపీఓ, జఫర్గఢ్ -
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి
స్టేషన్ఘన్పూర్: విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు బాధ్యతగా కృషి చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. మండలంలోని నమిలిగొండ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నూతనంగా రూ.2.50లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్, రూ.50వేలతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిధంగా రూ.40లక్షలతో నిర్మాణం చేయనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాఠశాలకు తాను చేసిన హామీలను నెరవేర్చానని, ఇంకా ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు. ఇంగ్లిష్ గ్రామర్ బోధించిన ఎమ్మెల్యే కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే కడియం పాఠశాలలోని 8వ తరగతి గదిని సందర్శించారు. ఆ సమయంలో విద్యార్థులకు టీచర్ ఇంగ్లిష్ బోధిస్తుండగా స్వయంగా లెక్చరర్ అయిన ఎమ్మెల్యే కడియం కాసేపు విద్యార్థులకు ఇంగ్లిష్ గ్రామర్ బోధించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ లావణ్యశిరీషరెడ్డి, నమిలిగొండ సర్పంచ్ పురమాని కోమలఐలోనియాదవ్, కాంగ్రెస్ జిల్లా నాయకులు బెలిదె వెంకన్న, పురమాని రజాక్యాదవ్, పోశాల కృష్ణమూర్తి, పాఠశాల ఎస్ఓ రజిత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శిరీష్రెడ్డి, పట్టణఽ అఽఽధ్యక్షుడు కిషన్రాజు, కౌన్సిలర్లు, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
‘సార్’కు ఘన నివాళి
వాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పలుచోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రాత్రి వర్షం కురుస్తుంది. జనగామ రూరల్: ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను భావితరాలకు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం కలెక్టరేట్లో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి కార్యక్రమాన్ని జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా జయశంకర్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారి ఎన్.ఎల్.నరసింహరావు, వైటీడీఏ సభ్యుడు లక్ష్మీనారాయణ నాయ క్, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి, జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రామేశ్వరచారి, ఆరే కుల క్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షుడు లింగాజి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి హరీష్, బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు గంగ భవాని, కన్నా పరశురాములు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాధనలో ‘సార్’ పాత్ర మరువలేనిది: పల్లా జనగామ: తెలంగాణ సాధనలో జయశంకర్ సార్ పాత్ర మరువలేనిదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా పట్టణంలోని 11వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంత బలాన్ని అందించిన మహనీయుడని కొనియాడారు. పట్టణంలో తన సొంత ఖర్చులతో జయశంకర్ సార్ విగ్రహాన్ని ఏర్పా టు చేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అనూషక్రిష్ణ, రజిత, సేవెల్లి మధు, దుర్గాప్రసాద్, ఉడుగులు కిష్టయ్య, నాయకులు బండ యాదగిరిరెడ్డి, ఎండీ సమ్మ ద్, ముస్త్యాల దయాకర్, మామిడాల రాజు, ఉల్లెంగుల సందీప్, ఉల్లెంగుల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
పీజీఐ–డీలో అగ్రస్థానమే లక్ష్యం
జనగామ: జిల్లాలో విద్యానాణ్యతను మెరుగుపరిచి, పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఫర్ డిస్ట్రిక్ట్స్ (పీజీఐ–డీ)లో జాతీయ స్థాయిలో అగ్రస్థానం సాధించేందు కు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్, విద్యాశాఖ అధికారి సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన మి షన్ శిఖరం సమీక్ష సమావేశంలో ఎంఈఓలు, హెడ్మాస్టర్లు, క్లస్టర్ హెడ్మాస్టర్లతో ఆయన మాట్లాడారు. జనగామ జిల్లా 600 మార్కులకు 383 మా ర్కులు సాధించి తెలంగాణలో ఏకై క ఉత్తమ్–3 గ్రేడ్ జిల్లాగా నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. ముఖ్యంగా లెర్నింగ్ అవుట్ కమ్స్లో 290కి 188 మార్కులతో రాష్ట్రంలో తొలిస్థానం సాధించినందుకు విద్యాశాఖ అధికారులను అభినందించారు. అయితే డిజిటల్ లెర్నింగ్, గవర్నెన్స్, స్కూల్ సేఫ్టీ, చైల్డ్ ప్రొటెక్షన్ అంశాల్లో పురోగతి సాధించాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఐసీ టీ పరికరాలు, ఇంటర్నెట్, దీక్షా వేదిక వినియోగం పెంచాలని, స్కూల్ సేఫ్టీ కమిటీలు, పోక్సో కమిటీలు, ఫిర్యాదు పెట్టెలు, సెల్ఫ్ డిఫన్స్, అగ్నిప్రమాదా లు, విపత్తు నిర్వహణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. యూడైస్ సమాచారం పూర్తిస్థాయిలో నమోదు చేయడం, ఈ– అటెండెన్స్, ఎస్ఎంసీ సమావేశాలు, స్కూల్ డెవలప్ మెంట్ ప్లాన్లు, యూసీలు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని సూచించారు. ప్రతీ పాఠశాలను నెలకోసారి తనిఖీ చేసి, వివరాలను 24 గంటల్లో ఆన్లైన్లో నమోదు చేయాలని, ప్రతీ ఉపాధ్యాయు డు ఏడాదికి కనీసం 50 గంటల సీపీడీ శిక్షణ పూర్తి చేయాలని తెలిపారు. విద్యార్థుల్లో ఫౌండేషనల్ లిట రసీ అండ్ న్యూమరసీ నైపుణ్యాలు, హాజరు శాతం పెంపు, బడిబయట పిల్లలను బడిలో చేర్పించడం, టెన్త్ నుంచి ఇంటర్కు 100 శాతం మార్పిడిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియాబేగం పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు మేలు పాలకుర్తి టౌన్(దేవరుప్పుల): ఎల్నినో పరిస్థితులు, భూగర్భ జలాల పరిరక్షణ దృష్ట్యా రైతులు వరికి బదులుగా తక్కువ నీటితో అధిక లాభాలు వచ్చే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. దేవరుప్పల మండలం నీర్మాల గ్రామంలో ప్రగతిశీల రైతు నరేందర్రెడ్డి వ్యవసాయ సాగును పరిశీలించి రైతుతో మాట్లాడారు. నువ్వులు, కందులు, పెసర్లు, మినుములు, కుసుమ, ఆముదం వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ, డ్రిప్ ఇరిగేషన్, పంటల ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించి రైతులు అధిక ఆదాయం పొందవచ్చని అన్నారు. అనంతరం నీర్మాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. విద్యాప్రమాణాలు, చిన్నారుల పోషణ, పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేశారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం, పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో డీఏఓ అంబికా సోని, ఎంఏఓ మనోహిత్, ఏఈఓ సాయి కిరణ్, సర్పంచ్ సంధ్యారాణి, రైతులు పాల్గొన్నారు. సమీక్షలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
విద్యుత్ భద్రతలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర
జనగామ/జనగామ రూరల్: విద్యార్థుల్లో విద్యుత్ భద్రతపై అవగాహన పెంపొందించి ప్రమాదాలను నివారించడంలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల పాత్ర కీలకమని టీజీఎన్పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్, డీపీఈ అండ్ సీనియర్ ఫ్యాకల్టీ పి.శ్రీకాంత్ అన్నారు. టీజీఎన్పీడీసీఎల్ జనగామ ఎస్ఈ సీహెచ్.సంపత్రెడ్డి ఆధ్వర్యంలో ట్రస్మా జిల్లా శాఖ సహకారంతో బుధవారం జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీస్ హైస్కూల్లో ప్రైవేట్ పాఠశాలల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు నిర్వహించిన విద్యుత్ భద్రత అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యుత్ ప్రమాదాలకు దారితీసే పరిస్థితులు, వాటి నివారణ చర్యలు, పాఠశాలలు, గృహాల్లో పాటించాల్సిన భద్రతా నియమాలు, అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సిన విధానాలు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల పనితీరు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు చేరవేసి విద్యుత్ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు పి.వెంకట్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యుత్ భద్రతా సంస్కృతిని పెంపొందించేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. శిక్షణలో పాల్గొన్న 60 మంది ఉపాధ్యాయులకు ధ్రువపత్రాలు, పాఠశాలల్లో అవగాహన కార్య క్రమాలు నిర్వహించేందుకు విద్యుత్ భద్రతపై పవర్పాయింట్ ప్రజెంటేషన్కు సంబంధించిన సమాచార పత్రాలు అందించారు. కార్యక్రమంలో డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, ట్రస్మా జిల్లా ఉపాధ్యక్షుడు పి.సంజీవ్రెడ్డి, జనగామ డివిజన్ అధ్యక్షుడు రాంరెడ్డి, స్టేషన్ఘన్పూర్ డివిజన్ అధ్యక్షుడు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ డీపీఈ, సీనియర్ ఫ్యాకల్టీ శ్రీకాంత్


