breaking news
Jangaon District News
-
‘బాలభారతం’ నాటక వాల్పోస్టర్ ఆవిష్కరణ
జనగామ: నెల్లుట్ల ఫౌండేషన్ అనసూయమ్మ లక్ష్మారావు కళాపీఠం, జనగామ గౌతమ్ మోడల్ స్కూల్ సంయుక్త నిర్వహణలో ఈనెల 12న(సోమవారం) హైదరాబాద్ త్యాగరాయ గానసభలో నిర్వహించే రంగస్థల పౌరాణిక పద్య నాటకం బాలభారతం వాల్పోస్టర్లను డీసీపీ రాజామహేంద్ర నాయక్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నెల్లుట్ల ఫౌండేషన్ కళాపీఠం వ్యవస్థాపకుడు నెల్లుట్ల రవీందర్రావు, స్కూల్ కరస్పాండెంట్ మోతె సురేందర్రెడ్డి, సీఐ సత్యనారాయణరెడ్డి, దోర్నాల మనోహర్, రావుల వెంకటేశ్వర్లు, మూర్తి తదితరులు పాల్గొన్నారు.ఉమ్మడి జిల్లాస్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు షురూస్టేషన్ఘన్పూర్: రాష్ట్ర, జాతీయ క్రీడాపోటీల్లో రాణించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని స్టేషన్ఘన్పూర్ ఎస్ఐలు వినయ్కుమార్, రాజేశ్ అన్నారు. మండలంలోని ఛాగల్లు గ్రామంలో స్వాగత్యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ ఖమ్మం జిల్లాల స్థాయి కబడ్డీ క్రీడాపోటీలు ఆదివారం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్ఐలు క్రీడాపోటీలు ప్రారంభించారు. అనంతరం కబడ్డీ అసోసియేషన్ జిల్లా చైర్మన్, యూత్ గౌరవ అధ్యక్షుడు పోగుల సారంగపాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో సమావేశంలో వారు మాట్లాడారు. యువకులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో స్వాగత్యూత్ అధ్యక్షుడు కూన రాజు, సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సీసీఆర్బీని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని సీసీఆర్బీ కార్యాలయాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆదివారం సాయంత్రం తనిఖీ చేశారు. సెక్షన్ల వారీగా పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు, వారు నిర్వహిస్తున్న రికార్డులు, అందులో నమోదు చేసిన వివరాలను సంబంధిత సెక్షన్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నేరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తనిఖీల్లో అదనపు డీసీపీ రవి, ఏసీపీలు డేవిడ్ రాజు, జనార్దన్రెడ్డి, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, సంజీవ్, మల్లయ్య, ప్రవీణ్ కుమార్, శ్రీని వాస్రావు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు. అలరించిన ‘కూచిపూడి’హన్మకొండ అర్బన్: బాలసముద్రం కాళోజీ కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన నృత్య స్రవంతి కూచిపూడి కళాక్షేత్రం 35వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నృత్యస్రవంతి విద్యర్థుల ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లయనన్స్ జిల్లా గవర్నర్ కె.చంద్రశేఖర్ ప్రసంగించారు. కూచిపూడికి ఉన్న సంప్రదాయం, సాధన విలువను ఆయన వివరించారు. అనంతరం శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. -
మేడారంలో భక్తుల సందడి
ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తల్లులకు ఎత్తు బంగారం సమర్పించారు. చీర, సారె సమర్పించి తల్లులకు మొక్కులు చెల్లించారు. భక్తజనంతో మేడారం పరిసరాలు కిక్కిరిసి కనిపించాయి. కాగా, ఆదివారం ఒక్క రోజే సుమారు 5 లక్షల మంది తల్లులను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. – ఎస్ఎస్ తాడ్వాయి -
సంప్రదాయ సిరుల సంక్రాంతి
జనగామ: దేశంలో జరుపుకునే పండగలన్నీ ఆరోగ్య సూత్రాలతో మిళితమై ఉన్నాయి. వేల సంవత్సరాల క్రితమే ఖగోళ శాస్త్రాన్ని ఔపోసన పట్టిన పండితులు, సూర్య, చంద్ర, నక్షత్రాల గ్రహ సంచార ఆధారంగా పండగలను ఏర్పాటు చేశారు. ఆ పండగల్లో ఉపయోగించే పద్ధతులు, పిండి వంటకాలు కూడా అక్కడి(మన) వాతావరణ విశేషాలను బట్టి నిర్ణయించారు. అలాంటిదే సంక్రాంతి పండగ. సంక్రాంతి విశేషాలను గమనిస్తే మనకు ఎన్నో విషయాలు ప్రస్ఫుటంగా తెలుస్తాయి. సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశిలో సంక్రమించే రోజునే సంక్రాంతి పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పండగ విశేషాల్లో బియ్యం, రేగుపళ్లు, ఆవుపేడ, నువ్వులు, బెల్లం, చెరుకు గడ వంటి వస్తువులను ఉపయోగిస్తాం. వీటిని పరిశీలిస్తే నువ్వులు, బెల్లం, ఐరన్ శక్తిని అందిస్తాయి. అందుకే బెల్లంతో తయారు చేసిన వంటకాలను ఎక్కువగా చేస్తారు. రేగుపళ్లలో సీ విటమిన్ ఉంటుంది. ఎంతో శక్తివంతమైన ఆవుపేడతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించిన పూర్వీకులు ఇంటి ముందు కళ్లాపి చల్లి, గొబ్బెమ్మలను తయారు చేసి అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది. వ్యవసా య ఆధారిత ప్రధాన దేశం కావడంతో ఈ సీజన్లో రైతన్న పండించిన పంటలను ఇంటికి చేర్చుకుంటాడు. భోగి రోజు చిన్నారులకు భోగి పండ్లు, సంక్రాంతి రోజున నోములు, కనుమరోజు పసుపు, పేరంటం చేసి ముత్తైదువలకు వాయినాలను ఇచ్చిపుచ్చుకుంటారు. ఘుమఘుమలాడే పిండివంటలు పెద్ద పండగ అంటే ఇంటికి, నోటికి సందడే. సంప్రదాయ చకినాలు, గారెలు, మురుకులు, అరిసెలు, లడ్డూలు, నువ్వుల ముద్దలు, రకరకాల పిండి వంటలు సంక్రాంతికి స్పెషల్గా నిలుస్తాయి. రుచిలో వేటికవే సాటి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ సంప్రదాయ పిండివంటలదే పైచేయిగా నిలుస్తోంది. కొత్త ధాన్యాలు, పల్లె పడతుల గొబ్బిళ్లు, డూడూ బసవన్నల ప్రదర్శనలతో ఊరంతా పేరంటమే అన్నట్లు సంక్రాంతి సంబురాలు రానే వచ్చాయి. మొదలైన పండగ సందడి మూడు రోజుల వేడుకకు సొంతూళ్లకు -
విద్యారంగానికి పెద్దపీట
స్టేషన్ఘన్పూర్: నియోజకవర్గంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని కేజీబీవీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రూ.7.91 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఆయా పనులకు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారంభించి ఆరు నెలల్లో కేజీబీవీలలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించనున్నట్లు తెలిపారు. లింగాలఘణపురం మండలం మోడల్ స్కూల్కు సంబంధించిన బాలికల హాస్టల్ అసంపూర్తిగా ఉందని, త్వరలో సమస్యను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో చింతకుంట్ల నరేందర్రెడ్డి, జూలుకుంట్ల శిరీష్రెడ్డి, బూర్ల శంకర్, అంబటి కిషన్రాజ్, నీల గట్టయ్య, కృష్ణమూర్తి, సారంగపాణి, నర్సింహులు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా త్వరలో జరుగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని వార్డులలో విజయకేతనం ఎగురవేయాలని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆదివారం ప్రత్యేక సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. అన్ని వార్డులలో 100 శాతం గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం
జనగామ: క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం వీవర్స్ కాలనీ 11,12 వార్డుల యువకులకు స్థానిక 12వ వార్డు మాజీ కౌన్సిలర్ గుర్రం భూలక్ష్మీనాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలకు ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ 11,12వ వార్డుల అధ్యక్షులు ఎనగందుల కృష్ణ, చిదురాల గణేష్, యూత్ అధ్యక్షుడు గుర్రం ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాలన్నీ గులాబీమయం కావాలి నర్మెట (తరిగొప్పుల): రానున్న ఎన్నికల్లో గ్రామాలన్నీ గులాబీమయం కావాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో మండలకేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు 150 మంది పార్టీలో చేరారు. అనంతరం బొత్తలపర్రె సమ్మక్క–సారలమ్మ జాతర వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో తరిగొప్పుల సర్పంచ్గా ఓటమి పాలైన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి దామెర ఽథామస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామెర మైఖేల్ 80 మందితో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గద్దల నర్సింగారావు, బొంతగట్టు నాగారం సర్పంచ్ కుర్రె మల్లయ్య , చిలువేరు లింగం, భూక్య జుంలాల్, సుంకరి రాజయ్య, భూక్య రవి, పోచయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
‘వివేక’ంతో పాలిస్తాం!
నేను బీటెక్ ఈసీఈ చదివాను. గ్రామాభివృద్ధికి ప్రజలతో మమేకమై సామాజిక కార్యక్రమాల చేస్తుండడంతో గ్రామంలో సర్పంచ్ నాకు అవకాశం కల్పించారు. నా భర్త మహిపాల్ బీజేపీ నాయకుడు. గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. గ్రామాభివృద్ధి కోసం స్పష్టమైన ప్రణాళిక ఉంది. భాష నగర్ తండా వెళ్లే రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తా. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా అందిస్తా. గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తా..వివేకానందుడి స్ఫూర్తితో యువతలో ఆత్మస్థైర్యం పెంపొందించే కార్యక్రమాలు చేపడుతా.. – దాసరి అనూషమహిపాల్, సర్పంచ్, గానుగపహడ్, జనగామ మండలంస్వామి వివేకానంద స్ఫూర్తితో గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని ఇటీవల సర్పంచ్లుగా గెలిచిన యువ సర్పంచ్లు చెబుతున్నారు. గ్రామంలోని యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతామని, యువశక్తి సహకారంతో గ్రామాన్ని ప్రగతిపథాన నిలుపుతామని ఆకాంక్షిస్తున్నారు. ఈనెల 12న (సోమవారం) స్వామి వివేకానంద 163వ జయంతి (యువజన దినోత్సవం) సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం– సాక్షి, నెట్వర్క్నేను బీఫార్మసీ పూర్తి చేశా. చదువుతోపాటు గ్రామసేవ చేయాలనే తపన నన్ను 25 ఏళ్లకే రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. గ్రామస్తుల నమ్మకం, యువత మద్దతుతోనే సర్పంచ్గా ఎన్నికయ్యా. గ్రామంలో పోతన స్మారక మందిరం, ఆలేటి ఎల్లవ్వ ఆలయ అభివృద్ధి, గ్రామ అభివృద్ధి, మౌలిక వసతుల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నా. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా పారదర్శకంగా అమలు చేస్తా. వివేకానందుడిని స్ఫూర్తిగా యువత చదువుతోపాటు గ్రామాభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేస్తా. –జిట్టబోయిన రమ్య, సర్పంచ్, బమ్మెర, పాలకుర్తినేను ఇంటర్ వరకు చదివాను. తండా వాసుల సహకారంతో సర్పంచ్గా ఎన్నికల్లో నిలిచి గెలిచాను. గ్రామ సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తా. ప్రజల భాగస్వామ్యం, సహకారంతో గ్రామంలో డ్రైనేజీలు, రోడ్లు, వీధిదీపాలు తదితర సమస్యల్ని పరిష్కరించేలా కృషి చేస్తా. పదేళ్ల క్రితం ఏర్పడిన మా గ్రామపంచాయతీకి సొంత భవనం లేదు. త్వరలో నిర్మించేలా స్థానిక ఎమ్మెల్యే, గ్రామస్తుల సహకారంతో కృషి చేస్తా. యువత ఉపాధి కోసం కార్యక్రమాలు చేపడుతా. –భూక్య అరుణారాంసింగ్, సర్పంచ్, చంద్రుతండా, స్టేషన్ఘన్పూర్నేను డాక్టర్ కావాలనే సంకల్పంతో నా తల్లిదండ్రులు బైపీసీ చదివిస్తే పరిస్థితులు అనుకూలించకపోవడంతో బీఎస్సీ డిగ్రీ చదివాను. కరోనా అనంతరం వ్యవసాయం చేస్తూ గ్రామంలోనే ఉంటున్నా. కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో పని చేసే క్రమంలోనే తండావాసుల ఆశీర్వాదంతో ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికయ్యా. జీపీకార్యాలయం తదితర మౌలిక వసతులకు కావాల్సిన ప్రభుత్వ భూమి లేనందున నా సొంత ఖర్చులతో త్వరలో భూమి సేకరించి విరాళంగా ఇచ్చేందుకు కృషి చేస్తున్నా. వివేకానందుడి స్ఫూర్తితో గ్రామ యువశక్తిని గ్రామాభివృద్ధిలో వినియోగించుకుంటా. –జాటోతు నవీన్నాయక్, సర్పంచ్, పడమటితండా(డీ), దేవరుప్పులడిగ్రీ చదువును మధ్యలో మానేశా. 11 సంవత్సరాలుగా ఫొటోగ్రాఫర్గా పనిచేశా. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా ఐదేళ్లుగా పనిచేస్తున్నా. తాజా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లంతా అక్కున చేర్చుకొని ఆదరించడంతో సర్పంచ్గా ఎన్నికయ్యా. వారి నమ్మకాలను వమ్ము చేయకుండా గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా. యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతా. గ్రామాభివృద్ధిలో వారి సహకారాన్ని తీసుకుంటా. –ధరావత్ సుధీర్ నాయక్, సర్పంచ్, గిర్నితండా, కొడకండ్ల -
ఒకేసారి 8వేల మంది భక్తుల దర్శనం
ములుగు/ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో ఒకేసారి 8వేల మంది భక్తులు దర్శనం చేసుకునేలా మాస్టర్ప్లాన్ రూపొందించినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జాతర పనుల పురోగతిపై ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలోని హరిత హోటల్లో ఆదివారం ఆయన అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కలెక్టర్ దివాకర టీఎస్ తొలుత జాతర పనుల వివరాలను మంత్రులకు వివరించారు. ఈ నెల 15వ తేదీలోపు పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు. స్వల్పంగా ఉన్న ఆర్అండ్బీ శాఖ పనులు గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈనెల 18న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మేడారానికి రానున్నారని, ఇక్కడే కేబినెట్ సమావేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారానికి ఆదివారం ప్రతి గంటకు సగటున వెయ్యి వాహనాలు చేరుకున్నాయని తెలిపారు. దాదాపు ఐదు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని వెల్లడించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ జాతర సమయంలో తొక్కిసలాట వంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్ని శాఖల అధికారులతో పనుల పురోగతిని విడివిడిగా అడిగి తెలుసుకున్నారు. జాతర క్యూలైన్లకు సంబంధించిన పనుల పురోగతిని పంచాయతీ రాజ్ ఈఈ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ల్యాండ్ స్కేపింగ్ పనుల గురించి జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ వివరించారు. రవాణా ఏర్పాట్లపై ఆర్టీసీ డీఎం వివరాలు అందజేశారు. జాతర కోసం మొత్తం 3,600 బస్సులను 51 పాయింట్ల నుంచి నడుపుతున్నామని ఆయన తెలిపారు. గద్దెల సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేశామని డీఎంహెచ్ఓ వివరించారు. జాతర విధులకు మొత్తం 13 వేల మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ వెల్లడించారు. మంత్రి సురేఖ, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఫైనాన్ ్స సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయ శాఖ కమిషనర్ హరీశ్, ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్రావు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేశ్ పాల్గొన్నారు. 18న మేడారానికి సీఎం రేవంత్రెడ్డి రాక.. కేబినెట్ సమావేశం అధికారుల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క -
గుణాత్మక విద్యను అందించాలి
జనగామ రూరల్: విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. ప్రాంక్లిన్ ట్రాంప్లింగ్ సంస్థ రౌండ్ టేబుల్ ఇండియా సహకారంతో అసంపూర్తి భవనాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి విద్యాభివృద్ధికి తోడ్పడటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు నాగలక్ష్మి, సునీల్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ సత్యమూర్తి, అఖిల్, మాధవ రెడ్డి, కార్తిక్, సహాయ కార్యదర్శి మెరుగు రామరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
విద్యకు ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం
జఫర్గఢ్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యమిస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని కోనాయిచలం రెవెన్యూ గ్రామంలోని దుర్గ్యానాయక్తండా గ్రామ పంచాయతీ పరిధిలో రూ.200 కోట్లతో నూతనంగా నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శనివారం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, రాష్ట్ర ఈడబ్య్లూ ఐడీసీ ఎండీ గణపతిరెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆర్డీఓ డీఎస్ వెంకన్న అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే తెలంగాణలో అత్యధిక గురుకుల పాఠశాలలు ఉన్నాయని, ఇవి తాను విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఏర్పాటు కావడం గర్వంగా ఉందన్నారు. జిల్లాలోనే మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్రెడ్డి స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మంజూరు ఇవ్వడం జరిగిందన్నారు. 18 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయించి నియోజకవర్గ ప్రజలకు అంకితం ఇస్తానన్నారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో ఓ చీడపురుగు ఉందని, చెత్త మాటలు మాట్లాడుడే తప్పా.. నియోజకవర్గానికి ఆయన చేసింది ఏమీ లేదంటూ రాజయ్యను ఉద్దేశించి విమర్శించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గానికి సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్గా నిలవబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, అధికారులు, సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ రిజ్వాన్బాషాతో కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూమిపూజ -
ఊరికెళ్తున్నారా.. ఇల్లు భద్రం
వరంగల్ క్రైం: సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు తరలివెళ్లే ప్రజలతో పాటు మేడారం సమక్క,సారలమ్మ జాతరకు వెళ్లే ప్రజలు ఇళ్లల్లో చోరీలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ఈమేరకు శనివారం వరంగల్ సీపీ కార్యాలయంలో సీసీఎస్ పోలీసులు రూపొందించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. చోరీలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, క్రైమ్స్ అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీలు సదయ్య, మధుసూదన్, ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. కొన్ని సూచనలు ● సెలవుల్లో బయటికి వెళ్తున్నప్పుడు సెక్యురిటీ అలారం, మోషన్ సెన్సార్లు ఏర్పాటు చేసుకోవాలి. ● ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ కానీ, డిజిటల్ లాకింగ్ సిస్టమ్ కానీ అమర్చుకోవాలి. బీరువా తాళాలు ఇంట్లో బెడ్ కింద, బట్టల కింద పెట్టకుండా వెంట తీసుకెళ్లాలి. ● తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు, బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. లేదా వెంట తీసుకెళ్లాలి. ● ఊరికి వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి లేదా తెలిసిన వారికి ఇచ్చి మోసపోవద్దు. ● వాహనాలు ఇంటి ఆవరణలోనే పార్క్ చేసుకోవాలి. చైన్తో లాక్ చేయడం మంచిది. ● ఇంటి గేటుకు తాళం వేయొద్దు. తాళం వేస్తే ఇంట్లో ఎవరూ లేరని దొంగలు గుర్తిస్తారు. ● స్వీయ రక్షణకు 15 రోజుల స్టోరేజ్ కలిగి ఉన్న రక్షణ సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. ● ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలి. ● ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి. ● పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి. ● ఇంటి ఎదుట చెత్తాచెదారం, న్యూస్ పేపర్లు పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడాలి. ● అనుమానాస్పద ఎవరైనా కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలి. ● ఇంటి తాళాల్ని తలుపుల దగ్గర, పూల కుండీల్లో లేదా మ్యాట్స్ కింద దాచిపెట్టొద్దు. ● ఇంట్లో పనిచేసే వారి వివరాలు పోలీస్ స్టేషన్లో వెరిఫికేషన్ చేయించుకోవాలి. వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ కరపత్రం ఆవిష్కరణ -
‘భూభారతి’పై విచారణ జరిపించాలి
జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న భూ భారతి కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం ముందుచూపుతో ధరణి పోర్టల్ను ప్రారంభించి సమర్థవంతంగా అమలు చేసిందన్నారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉన్న ధరణి స్థానంలో లొసుగులతో కూడిన భూభారతి పోర్టల్ను ప్రారంభించి, అభాసు పాలవుతున్నారన్నారు. కొందరు కాంగ్రెస్ నాయకుల అండదండలతోనే అక్రమాలకు తెరలేపినట్లు ఆరోపించారు. పోర్టల్ లోప భూయిష్టంగా తయారు చేసినట్లు మండిపడ్డారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
ఖాకీల కారుణ్యం!
● ఇటీవల మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు డయల్ 100కు కాల్ వచ్చింది. మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఉస్మాన్, కానిస్టేబుల్ నరేశ్ వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి ప్రాణాలు కాపాడారు. ● ఇటీవల నర్సంపేటకు చెందిన ఓ యువతి ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. బస్టాండ్ వద్ద అనుమానం వచ్చి ఆ విషయాన్ని పసిగట్టిన బ్లూకోల్ట్స్ సిబ్బంది ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన కౌన్సెలింగ్ ఇచ్చి జీవితం గొప్పదనాన్ని తెలిపి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ● రాయికల్కు చెందిన ఓ యువతిని సైతం బ్లూకోల్ట్స్ సిబ్బంది కాపాడి కౌన్సెలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. ● కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధి వడ్డేపల్లి చెరువు కట్టపై ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు సకాలంలో స్పందించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ● అదేవిధంగా తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురైన ఓ యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లోంచి వెళ్లి ఆత్మహత్యకు యత్నిస్తుండగా హనుమకొండ పోలీసులు కాపాడారు. ● ధర్మసాగర్కు చెందిన పల్లెపు శ్రీనివాస్ మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయోధ్యపురం రైల్వే ట్రాక్పై పడుకుని ఆత్మహత్యకు యత్నించాడు. రైల్వే కీమెన్ వేణు, సహకారంతో పోలీసులు అతడి ప్రాణాలు కాపాడారు. ● ఈనెల 5న (గత సోమవారం) గౌసియాబేగం అనే మహిళ తన మూడేళ్ల పాపతో మండిబజార్ ఏరియాలో నడిచి వెళ్తుండగా లోబీపీతో పడిపోయింది. అక్కడే విధుల్లో ఉన్న ఇంతేజార్గంజ్ ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి మహిళను పోలీస్ వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.ప్రకృతి వైపరీత్యాలైనా. సభలు, సమావేశాలైనా.. పండుగైనా పబ్బమైనా మీ రక్షణ కోసమే మేమున్నాం అంటున్నారు పోలీసులు. ఆపత్కాలంలో ముందు వరుసలో నిలబడి సేవలందిస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నడవ లేని వృద్ధులను ఎత్తుకొని పోలింగ్ బూత్లకు తీసుకొచ్చారు. ఉమ్మడి జిల్లాలో భారీగా కురిసిన వర్షాలకు వరదలు ముంచెత్తి ఇళ్లలో చిక్కుకున్న వృద్ధులను, పిల్లలను కాపాడారు. విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది.. ఆత్మహత్య వైపు అడుగులు వేస్తున్న ఎంతో మందిని కాపాడి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. పోలీస్ వాహనంలో తరలించి.. ప్రాణాలు నిలబెట్టి మడికొండ పోలీస్ స్టేషన్ ఎదుట డివైడర్ను బైక్ ఢీకొట్టిన ఘటనలో యువకులు సాయిరాం, ఆకుల శశాంక్కు తీవ్ర రక్తస్రావమైంది. రోడ్డుపై పడి కొట్టుకుంటుండగా ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ తన వాహనంలో బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకులను చూసి స్థానికులెవ్వరూ ముందుకు రాలేదు. పోలీసులు చేసిన ఆ సేవ సోషల్ మీడియాలో వైరలైంది. ఆత్మహత్యలను అడ్డుకుంటూ.. ప్రాణాలను నిలబెడుతూమిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయకుడి నిమజ్జనం సమయంలో ఉర్సుగుట్టకు నిమజ్జనానికి వచ్చిన ఓ యువకుడు ట్రాక్టర్లో చేతులు కాళ్లు కొట్టుకుంటూ నురుగులు కక్కాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై శ్రవణ్, కానిస్టేబుల్ చందు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగింత విపత్తులు, ప్రమాదాల సమయంలోనూ మేమున్నామంటూ.. ఆపద్బాంధవులుగా.. ఓరుగల్లు పోలీసులు వీరి సేవలకు సలాం అంటున్న ప్రజలు పసిగట్టి.. ప్రాణాలు కాపాడి -
సంక్రాంతి రద్దీ
జనగామ: సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 10 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జనగామ బస్టాండ్లో ప్రయాణికులు, విద్యార్థులతో రద్దీగా మారింది. రద్దీకి అనుగుణంగా జనగామ ఆర్టీసీ డిపో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ ఉప్పల్కు రోజుకు 15 స్పెషల్ బస్సులను 45 ట్రిప్పులుగా నడుపుతోంది. అవసరాన్ని బట్టి మరిన్ని బస్సులు పెంచే అవకాశం ఉందని డిపో మేనేజర్ వెల్లడించారు. సాధారణంగా రోజు వారీగా 46 వేల కిలోమీటర్లు తిరిగే బస్సులు రూ.24 లక్షల పైచిలుకు కలెక్షన్ రావాలని అంచనా వేసింది. పండుగ సమయంలో ఈ కలెక్షన్ 20 నుంచి 30శాతం పెరిగే అవకాశం ఉండనుంది. ప్రస్త్తుం 58 వేల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలు వినియోగించుకుంటుండగా పండుగ సమీపిస్తున్న కొద్దీ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా. స్వగ్రామాలకు కుటుంబాలు పండుగ సెలవుల నేపథ్యంలో ప్రభుత్వ విద్యాసంస్థలు జనవరి 10 నుంచి సెలవులు ఇవ్వడంతో సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన కుటుంబాలు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో జనగామ ఆర్టీసీ బస్టాండ్లో రద్దీ పెరిగిపోయింది. ప్లాట్ ఫాంలు ప్రయాణికులతో నిండిపోతున్నాయి. రద్దీ సమయంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా డీఎం నేతృత్వంలో ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున నిఘా ఏర్పాటు చేశారు. అదనపు చార్జీలు.. పండుగ కారణంగా స్పెషల్ బస్సుల టికెట్లపై 50శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తుండడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఇవి కేవలం పండుగ రోజులకు మాత్రమే వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. రద్దీ కారణంగా జనగామ నుంచి ఉప్పల్, సిద్దిపేట, బచ్చన్నపేట, హనుమకొండ, వరంగల్ వంటి ప్రధాన మార్గాల్లో ప్రయాణికులు ఒంటికాలు మీద ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్టాండ్కు చేరుకున్న విద్యార్థులు ఆర్టీసీకి టికెట్ కలెక్షన్లు కిక్కిరిసిన జనగామ బస్టాండ్ ఉప్పల్కు అదనంగా 15 బస్సులు, 45 ట్రిప్పులు -
పేదల సంక్షేమమే ధ్యేయం
పాలకుర్తి టౌన్/కొడకండ్ల: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో ప్రతీ ఇంటా సంక్షేమం అందించడమే ధ్యేయమని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. శనివారం పాలకుర్తి, కొడకండ్ల మండల కేంద్రాల్లో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికీ అందేలా పూర్తి పారదర్శకతతో ఆర్థిక సహాయం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్ధార్లు సుత్రం సరస్వతి, చంద్రమోహన్, మా ర్కెట్ చైర్పర్సన్ లావుడ్యి మంజుల, మండల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి, సురేష్ నాయక్, సర్పంచ్లు పాల్గొన్నారు.సీనియర్ సిటిజన్స్కు ప్రత్యేక హక్కులు కల్పించాలిదేవరుప్పుల: సీనియర్ సిటిజన్స్కు ప్రత్యేక హ క్కులను కల్పించాలని ఆల్ ఇండియా సీని యర్ సిటిజన్స్ అసోసియేషన్ (ఏఐఎస్సీఏ) జిల్లా అధ్యక్షుడు తీగల సిద్దిమల్ల య్య డిమాండ్ చేశారు. శనివారం మండలకేంద్రంలో అక్షర గార్డెన్లో సీనియర్ సిటిజన్స్ ప్ర త్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిష్కృత సమస్య ల పరిష్కారానికి ప్రభుత్వాలు చొరవ చూపాలన్నారు. అనంతరం అడహాక్ కమిటీ కన్వీనర్గా ఉప్పల రమేశ్తో పాటు మరికొంతమందిని ఎన్నుకున్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి అల్లాడి ప్రభాకర్రావు, కోశాధికారి వనమాల రమేష్, మహమ్మద్ ఆజాంఅలీ, పెద్దాపురం వెంకటేశ్వర శర్మ, బుక్క రామయ్య పాల్గొన్నారు. పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం హైకోర్టు రిజిస్ట్రార్ డి.రవీంద్రశర్మ, సురేఖ దంపతులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు రిజిస్టర్ దంపతులకు అర్చకులు స్వామి వారి శేషవస్తాలతో సన్మానించి స్వామి వారి ప్రసాదాన్ని అందించారు. అలాగే జనగామ ఆర్డీఓ గోపిరామ్ దంపతులు స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ఆ లయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీ ఆర్శర్మ, తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ప్రమాదాలకు దూరంగా ఉండండిజనగామ: సంక్రాంతి పండుగ వేళ విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఎన్పీడీసీఎల్ జనగామ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) చెరుకు సంపత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గాలిపటాలు ఎగురవేయ డం ఆనవాయితీ అయినప్పటికీ, విద్యుత్ లైన్ల సమీపంలో నిర్లక్ష్యం ప్రాణాంతకమయ్యే అవకాశముందన్నారు. విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్ల సమీపంలో పతంగులు ఎగురవేయవద్దన్నారు. చైనా మాంజా వాడకాన్ని పూర్తిగా నివారించాలన్నారు. గాలిపటం విద్యుత్ తీగలకు చిక్కితే కర్రలు, ఇనుప పైపులు ఉపయోగించి తీసే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించారు. వైర్లు తెగిపోయి కింద పడితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1912కు స మాచారం ఇవ్వాలని సూచించారు. నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలన్నారు. పాలకుర్తి టౌన్: మండలంలోని బమ్మెర శివారులోని ఆలేటి ఎల్లవ్వ జాతర వేలం ఆదాయం రూ.1,03,000 వచ్చినట్లు సర్పంచ్ జిట్టబోయి న రమ్య తెలిపారు. శనివారం గ్రామ పంచాయతీ ఆవరణలో వేలం పాటలు నిర్వహించారు. ఇందులో కొబ్బరికాయల విక్రయానికి రూ.70వేలు, వాహనాల పార్కింగ్కు రూ.18వేలు, దుకాణాలు రూ.7వేలు, లడ్డూ, పులిహోర ప్రసాదానికి రూ.3,500ల ఆదాయం వచ్చి నట్లు సర్పంచ్ తెలిపారు. -
ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుందాం
జనగామ: పేదల వలసలు ఆపేందుకు నాటి యూ పీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకువస్తే, బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కు ట్ర లు పన్నుతుందని డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధ న్వంతి అన్నారు. జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం పేరు మార్పు పేరుతో ఎత్తివేసే కుట్రకు పాల్పడుతోందన్నారు. రాష్ట్రానికి రావాల్సి న ఈజీఎస్ నిధులను కేంద్ర ప్రభుత్వం కావాలనే నిలిపివేసి, లక్షలాది మంది గ్రామీణ కూలీల జీవనాధారాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. టీపీసీసీ పిలుపు మేరకు ఈ నెల 26వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఖండిస్తూ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సమావేశంలో పీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, ఎర్రమల్ల సుధాకర్, సత్యనారాయణరెడ్డి, రాజమౌళి, కల్యాణి, శ్రీనివాస్రెడ్డి, ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
సీఎం కప్ క్రీడలను విజయవంతం చేయాలి
జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతున్న సీఎం కప్ 2025ను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం సీఎం కప్ క్రీడాజ్యోతిని ప్రారంభించారు. పట్టణంలోని నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎక్కువ మంది క్రీడాకారులు క్రీడా పోటీల్లో పాల్గొనాలని సూచించారు. క్రీడలతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని చదువుతో పాటు క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి కె.కోదండరాములు, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ పండారి చేతన్ నితిన్, క్రీడాకారులు, యువత, క్రీడా సంఘాల సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేడు ఆలేటి ఎల్లవ్వ జాతర వేలంపాట పాలకుర్తి టౌన్: మండలంలోని బమ్మెర గ్రామంలో ఈనెల 16న నిర్వహించే ఆలేటి ఎల్లవ్వ జాతరలో వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ జిట్టబోయిన రమ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొబ్బరికాయలు అమ్ముకొనేందుకు, వాహనాల పార్కింగ్, దుకాణాలు, స్పెషల్ దర్శనం టికెట్, అమ్మవారి ప్రసాదం కోసం శనివారం ఉదయం 10 గంటలకు గ్రామ పంచాయతీ ఆవరణంలో వేలం పాట నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రూ.4లక్షల విలువచేసే దుస్తుల పంపిణీ జనగామ: పట్టణంలోని రైల్వేస్టేషన్ ఏరియా ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలోని 250 మంది విద్యార్థినులకు ప్రముఖ వ్యాపారి గజ్జి మధు రూ.4లక్షల విలువ చేసే దుస్తులను పంపిణీ చేశారు. శుక్రవారం కళాశాలలో సీడీసీ చైర్మన్ గట్టు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వ్యాపారి మధు పాల్గొన్నారు. గట్టు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పది సంవత్సరాలుగా ఏటా సంక్రాంతి పండగను పురస్కరించుకుని అత్యంత విలువైన దుస్తులను పిల్లలకు అందిస్తున్నారని కొనియాడారు. అనంతరం వ్యాపారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీడీసీ కమిటీ సభ్యులు పజ్జురి గోపయ్య, బెలిదె శ్రీధర్, వెంకటరమణ, కృష్ణ జీవన్బజాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి నేడు భూమిపూజ జఫర్గఢ్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈనెల 10న (శనివారం) భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని హంగులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ను నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 28 మంజూరు చేయగా ఇందులో స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని జఫర్గఢ్ మండలంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం ఆక్టోబర్ 10, 2024న జారీ చేసింది. సుమారు రూ.200 కోట్లతో 21 ఎకరాల ప్రభుత్వ స్థలంలో స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని గతంలో స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో సీఎం రేవంత్రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. ఈ నిర్మాణ పనులకు ప్రభుత్వం టెండర్లు ఖరారు చేయడంతో నిర్మాణ పనులు చేపట్టేందుకు సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మండలంలోని కోనాయిచలం రెవెన్యూ పరిధిలోని ప్రధాన రహదారిని అనుకొని ఉన్న ప్రభుత్వ స్థలంలో స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరగనున్నాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే సంబంధిత అధికారులు సిద్ధం చేశారు. -
హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలి
● జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్గౌడ్ పాలకుర్తి టౌన్: హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలో రాజీవ్ చౌరస్తాలో వివిధ పాఠశాలల విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో రీజినల్ ట్రాన్స్పోర్టు అథారిటీ సభ్యులు చిలువేరు అభిగౌడ్, సీఐ జానకిరామ్రెడ్డి, ఎస్సై దూలం పవన్కుమార్, ఏఎంవీఐ మహేశ్ గౌడ్, సర్పంచ్ విజయ, ఎంఈఓ నర్సయ్య పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ఎడ్యూటాక్ పోటీలకు 8 మంది ఎంపిక
లింగాలఘణపురం: జిల్లాలోని నెల్లుట్ల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎల్టా ఆధ్వర్యంలో జరిగిన ఒలంపియాడ్, ఎడ్యూటాక్ పోటీలకు జిల్లా నుంచి 8 మంది విద్యార్థులు ఎంపికై నట్లు ఎల్టా (ఇంగ్లిష్ లాగ్వేజ్ టీచర్స్ అసొసియేషన్) జిల్లా అధ్యక్షుడు రావుల వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం నెల్లుట్ల ఉన్నత పాఠశాలలో ఎల్టా ఆధ్వర్యంలో ఒలంపియాడ్ (ఇంగ్లిష్ లాంగ్వేజ్లో కాంపిటీషన్), ఎడ్యూటాక్ (ఏదైన టాపిక్పై విద్యార్థుల ప్రసంగం) జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్టా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ నెల 24న రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో జనగామ జిల్లా నుంచి ఎంపికై న సీనియర్, జూనియర్ విద్యార్థులు డి.రిత్విక్ (మాదాపూర్), కె.వైష్ణవి (చీటూరు), ఎస్.సంకీర్తణ (ఖిలాషాపూర్), జి.అర్షిత (పల్లగుట్ట), సాత్విక్వర్ధన్, ఉజ్వల (లింగాలఘణపురం), అశ్విత (చిల్పూరు), హర్షిణి (స్టేషన్ఘన్పూర్) ఎంపికై నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఎల్టా రాష్ట్ర , కోశాధికారి శ్రీనివాసురెడ్డి, జిల్లా కార్యదర్శి ఆనంద్, రాష్ట్ర సభ్యుడు శ్రీనివాసు, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో ముందస్తు సంక్రాంతి
● ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ముగ్గుల పోటీలు ● కుటుంబ సభ్యులతో హాజరైన కలెక్టర్, డీసీపీజనగామ రూరల్: ఉత్సాహంతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం టీఎన్జీఓ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వివిధ శాఖలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ సతీమణులు స్వయంగా ప్రతీ ముగ్గుని తిలకించి సంబంధిత శాఖ వారు తీసుకున్న అంశాలను వివరిస్తూ వేసిన రంగవళ్లులు వేసిన ఉద్యోగులను అభినందించారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ..జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం రంగవళ్లుల పోటీలో ప్రథమ బహుమతి విద్యుత్, పంచాయతీ రాజ్, మెడికల్ అండ్ హెల్త్ శాఖ, ద్వితీయ బహుమతి వ్యవసాయ శాఖ, పోలీస్, జనగామ ప్రభుత్వ ఆసుపత్రి, తృతీయ బహుమతి పొందిన జిల్లా రవాణా శాఖ, బీసీ వెల్ఫేర్ ఉద్యోగులకు బహుమతి ప్రదానం చేశారు. స్పెషల్ బహుమతిగా కలెక్టరేట్ శానిటేషన్ సిబ్బంది ఉద్యోగులకు అందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, కలెక్టర్ సతీమణి డాక్టర్ సయ్యద్ ఆమ్రిన్, డీసీపీ సతీమణి సరిత, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఉజ్వలతో బాలికల భవితకు భరోసా ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి పోష్ చట్టం ఎంతగానో దోహద పడుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కాన్ఫెరెన్న్స్ హల్లో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013 పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ పండరి చేతన్, ఇన్చార్జ్ డీడబ్ల్యూవో కోదండరాములు, డీఆర్డీవో వసంత పాల్గొన్నారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నేరం జనగామ: లింగ ఆధారిత గర్భస్థ శిశు లింగ నిర్ధారణను అరికట్టేందుకు చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో పీసీ, పీఏ డీటీ చట్టం–1994 పై జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, డీఎంహెచ్వో డాక్టర్ మల్లికార్జున్రావు, సిబ్బంది పాల్గొన్నారు. -
వేతనాల్లేవ్..పండుగెట్లా?
● వేతనాలు లేక ఈ–పంచాయతీ ఆపరేటర్ల ఇక్కట్లు ● పెరిగిన ధరలు.. కుటుంబ పోషణకు కుస్తీ ● అదనపు కలెక్టర్, డీపీఓలకు వినతిజనగామ: సంక్రాంతి పండుగ వేళ ఈ–పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల జీవితం పస్తులుండే పరిస్థితికి చేరింది. నాలుగు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో నిరాశలో మునిగిపోయారు. 280 పంచాయతీలు..32 మంది ఆపరేటర్లు జిల్లాలోని 280 పంచాయతీల పరిధిలో 32 మంది ఈ–పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.22,750 వేతనం అందిస్తున్నారు. నాలుగు నెలలుగా వేతనాలు పెండింగ్లో పడిపోవడంతో.. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో బతుకే భారమైందని వాపోతున్నారు. గ్రామపంచాయతీల రిపోర్టులు, ఎన్నికలకు సంబంధించిన డేటా ఎంట్రీ, ఓటర్ లిస్టుల సిద్ధం, జనన, మరణ ధ్రువపత్రాల జారీ వంటి కీలక పనులన్నీ ఈ పంచాయతీ ఆపరేటర్లే చేయాల్సి ఉంటుంది. జీపీ పరిపాలనలో ముఖ్యభూమిక పోషిస్తున్న వీరికి నెలనెల వేతనాలు చెల్లించడంతో మాత్రం జాప్యం చేస్తున్నారు. వేతనాల విషయమై కమిషనర్ కార్యాలయానికి జిల్లా అధికారులు సరైన సమాచారాన్ని పంపకపోవడమే ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఆపరేటర్లు తమ సమస్యలను వివరిస్తూ స్థానిక సంస్థల తరపు కలెక్టర్ పింకేశ్ కుమార్, ఇనన్చార్జ్ డీపీఓ వసంతకు శుక్రవారం అందించారు. వేతనాలు తక్షణమే బ్యాంకు ఖాతాల్లో జమ చేసి తమ జీవితాల్లో వెలుగు నింపాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. -
రిజర్వేషన్.. టెన్షన్
● అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలో పెరుగుతున్న పోటీ ● ముదురుతున్న అంతర్గత పోటీ ● సీటు తమదేనని ఆశావహుల ప్రచారంమున్సిపల్ వార్డుల రిజర్వేషన్లపై అంతా ఆసక్తిజనగామ: పురపాలక ఎన్నికల ప్రక్రియలో వేగం పుంజుకుంది. ఈనెల 12న తుది ఓటర్ జాబితా విడుదల కానుండటంతో రాజకీయ పార్టీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. మున్సిపాలిటీలు, వా ర్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారుపై త్వరలోనే ప్రభుత్వం మార్గదర్శకాలు వెల్లడించనుంది. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. పోటీ పెరిగే అవకాశం అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఏ వార్డులో ఏ కేటగిరీ రిజర్వేషన్ కలిసి వస్తుందో అనేదాని ఆధారంగా పోటీ ప్రణాళికలు రూపొందించుకునేందుకు నాయకులు ముందుగానే ప్రజలతో మమేకమవుతున్నారు. వార్డుల వారీగా ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతుండటంతో పార్టీల్లో పోటీ పెరిగే అవకాశం లేకపోలేదు. రెండు పురపాలికల్లో.. జనగామ మున్సిపల్ పరిధిలో 30, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో 18 రెండింట్లో కలుపుకుని 48 వార్డులు ఉన్నాయి. ఈ రెండు పట్టణాల్లోనూ పార్టీల కార్యకర్తలు, ఆశావాహులు ఎవరు ఏ వార్డులో పోటీ చేస్తారనే దానిపై అంతర్గత చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలో కొంత మంది ఆశావాహులు తమకు సీటు ఖరారైందన్న నమ్మకంతోనే ప్రజలతో ప్రచారం ప్రారంభించారు. అయితే అదే వార్డుల్లో మరికొంత మంది పోటీకి రెడీ అవుతుండటంతో స్థానిక రాజకీయాల్లో ఉత్కంఠ పెరిగింది. రిజర్వేషన్లు పంచాయతీ ఎన్నికలను అనుసరించే అవకాశం ఉందని ఆశావాహులు భావిస్తున్నప్పటికీ, అధికారిక ప్రకటన వచ్చేవరకు అనిశ్చితి ఉంటుందని భావిస్తున్నారు. కలెక్టర్లు వార్డుల వారీ రిజర్వేషన్లు ఖరారు చేయనుండగా, మున్సిపల్ చైర్మన్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించనుంది. ప్రభుత్వం విడుదల చేసే షెడ్యూల్ ఆధారంగానే ఎన్నికల కమిషన్ తుది ఎన్నికల గెజిట్ ప్రకటించే అవకాశముంది. అధికారులు సిద్ధం రాబోయే ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. పోలింగ్ కేంద్రాల ఎంపిక, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, సిబ్బంది నియామకం వంటి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఫీల్డ్ స్థాయిలో మున్సిపాలిటీ సిబ్బందికి అవసరమైన సరంజామా సిద్ధం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. రిజర్వేషన్ల ప్రకటన వెలువడిన వెంటనే రాజకీయ సమీకరణాలు, పోటీ సర్దుబాట్లు భారీగా మారే అవకాశం ఉండటంతో ప్రస్తుతం అన్ని పార్టీల్లో నూ ఊహాగానాలు, లెక్కలు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. 12న తుది ఓటరు జాబితా ముసాయిదా ఓటరు జాబితాలో అభ్యంతరాల స్వీకరణపై గడువు పెంచడంతో ఈ నెల12న తుది ఓటరు జాబితా వెలువరించనున్నారు. జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ పరిధిలో ఓటరు జాబితాపై పెద్దఎత్తున అభ్యంతరాలు వస్తున్న సంగతి తెలిసిందే. వార్డుల మార్పు, చనిపోయిన వ్యక్తులు, ఓట్లు మిస్సింగ్, వందల సంఖ్యలో అదనంగా కలవడం తదితర అభ్యంతరాలు పెద్ద ఎత్తున రాగా, వారిని సరిచేయాల్సి ఉంది. ఈనెల 10న(శనివారం)తో అభ్యంతరాల స్వీకరణ ముగియనుండగా, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఓటు జాబితాలో ఓట్లు మిస్సైన వారు ఆందోళన చెందుతున్నారు. -
తిరుమలనాథస్వామి ఆలయ అభివృద్ధికి కృషి
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి ● ఆలయ నూతన పాలక మండలి ప్రమాణం స్టేషన్ఘన్పూర్: నియోజకవర్గ కేంద్రంలోని పురాతన శ్రీతిరుమలనాథ స్వామి దేవాలయ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శ్రీతిరుమలనాథ స్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శుక్రవారం నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. దేవస్థాన ఈఓ వంశీచే ఆలయ కమిటీ చైర్మన్గా నీల నర్సింహులు, డైరెక్టర్లుగా తాటికొండ యాదగిరి, గట్టు ప్రశాంత్, మునిగెల కుమారస్వామి, గుగులోతు లత, సభ్యులుగా పూజారి రామానుజచార్యులుచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన పాలక మండలి చైర్మన్, డైరెక్టర్లను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన వసతి, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసేలా కమిటీ కృషి చేయాలన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూలకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, నాయకులు బెలిదె వెంక న్న, శ్రీధర్రావు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
లింగంపల్లి జాతర పనుల ప్రారంభం
చిల్పూరు: మినీ మేడారంగా పేరున్న మండలంలోని లింగంపల్లి గ్రామంలోని సమ్మక్క–సారలమ్మ జాతరకోసం శుక్రవారం అభివృద్ధి పనులను సర్పంచ్ భూక్య సునితలాలు ప్రారంభించారు. సాక్షి దినపత్రికలో ‘మినీ జాతరలు.. మొదలుకాని ఏర్పాట్లు’ అనే కథనం ప్రచురితం కాగా..జాతర ఈఓ చిందం వంశీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులతో పాటు, టెండర్ల ప్రచార రథాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉమ్మగోని రాజు, కండ్లకోలు శ్రీనివాస్, చంద్రమౌళి, ఏదునూరి రవీందర్, కండ్లకోలు బాలరాజు, తుత్తురు రాజు, ఊరడి రాజు, సందోజు రవీంద్రచారి, అపరాదపు రాజు, మంద సిద్ధు, రజాక్, స్వప్న, సతీష్ తదితరులు పాల్గొన్నారు. 12న దుకాణాల ఏర్పాటుకు వేలం పాటలు ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు మండలంలోని లింగంపల్లి గ్రామంలోని సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా 12వ తేదీన జాతరలో దుకాణాల ఏర్పాటుకు వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు ఈఓ చిందం వంశీ తెలిపారు. శుక్రవారం జాతర ప్రాంగణంలో కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. బంగారం(బెల్లం), మొక్కుబడి వెంట్రుకలు, కొబ్బరి కాయలు, కోళ్లు, పెదతీర్థం, కొబ్బరికాయ చిట్టీలు, కొబ్బరి చిప్పలు, తదితర వాటికి వేలం పాటలు ఉన్నందున ఆసక్తిగల వారు 83309 49032, 99483 69761 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. -
జాతర టెండర్లు రసాభాస!
స్టేషన్ఘన్పూర్: మండలంలోని ఇప్పగూడెం, రంగరాయగూడెం, కోమటిగూడెం, అక్కపెల్లిగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని చింతగట్టు శ్రీసమ్మక్క–సారలమ్మ జాతర టెండర్లు రసాభాస మధ్య జరిగాయి. జాతర ప్రాంగణం వద్ద దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నాలుగు గ్రామాల సర్పంచ్ల సమక్షంలో చేపట్టిన వేలం పాటలు శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి ఏడు గంటల వరకు కొనసాగాయి. అయితే గత జాతరకు సంబంధించిన లెక్కల విషయమై, జాతరలో టెండర్లలో నిబంధనల విషయమై పలుమార్లు వాగ్వాదాలు కాగా టెండర్లు రసాభాసగా సాగాయి. ఒక గ్రామం వారు మరో గ్రామంలో టెండర్లలో పాల్గొనడంపై వాగ్వాదాలు జరిగాయి. అయితే ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసుబందోబస్తు మధ్య ఎట్టకేలకు టెండర్లు ముగిశాయి. టెండర్ల ఆదాయం రూ.17.60లక్షలు మొత్తంగా టెండర్ల ద్వారా జాతర ఆదాయం రూ.17.60లక్షలు వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 10 నుంచి నెలరోజుల పాటు ఉండే టెండర్ల విషయమై కొబ్బరికాయలు– బెల్లం(బంగారం), కోళ్లు, మద్యం(కూల్డ్రింక్స్) విక్రయించేందుకు నాలుగు గ్రామాల వారీగా, జాతర ప్రాంగణంలో విక్రయించేందుకు వేర్వేరుగా టెండర్లు నిర్వహించారు. జాతర ప్రాంగణంలో మద్యం విక్రయించేందుకు రమణారెడ్డి రూ.4.12లక్షలతో, కోళ్లు విక్రయించేందుకు ఐత రమేష్ రూ.2 లక్షలు, కొబ్బరికాయలు, బెల్లం విక్రయించేందుకు మొలుగూరి కిషన్ రూ.2.01లక్షలతో టెండర్లు దక్కించుకున్నారు. అదేవిధంగా ఇప్పగూడెం, కోమటిగూడెం, రంగరాయగూడెం, అక్కపెల్లిగూడెం గ్రామాల్లో విక్రయాల కోసం టెండర్లను నిర్వహించారు. మొత్తంగా టెండర్ల ఆదాయం రూ.17.60 లక్షలు వచ్చాయని ఈఓ లక్ష్మీప్రసన్న తెలిపారు. గత జాతర ఆదాయం రూ.9.73లక్షలు కాగా ప్రస్తుతం రూ.17.60లక్షలు కావడం విశేషం. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అఽధికారులు, సిబ్బంది మోహన్, వెంకటయ్య, వీరన్న, సర్పంచ్లు జూలుకుంట్ల శిరీష్రెడ్డి, మందపురం రాణి, సోమేశ్వర్, లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ బందోబస్తు మధ్య ఇప్పగూడెం జాతర టెండర్లు పోలీసులు వారించడంతో ముగిసిన వాగ్వాదాలు మొత్తం టెండర్ల ఆదాయం రూ.17.60 లక్షలు -
యూరియా కొరత లేదు
బచ్చన్నపేట: మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో రైతులకు సరిపడా యూరియా స్టాక్ ఉందని, కొరత లేదని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం మండలంలో పర్యటించి, యాసంగి సీజన్లో రైతులకు యూరియా ఎరువుల సరఫరా, పంపిణీ పరిస్థితులు, యూరియా బుకింగ్ యాప్ అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హాకా, పీఏసీఎస్, ఎంజీసీ కేంద్రాలను సందర్శించి అక్కడి నిల్వలు, అమ్మకాలు, బుకింగ్ విధానం, రైతులకు అందుతున్న సేవలపై సమగ్రంగా సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీఏసీఎస్ లో 1067 బ్యాగులు, ఎంజీసీలో 333 బ్యాగులు, హాకాలో 444 బ్యాగులు నిల్వలుగా ఉన్నాయని తెలిపారు. కోతుల బెడద కారణంగా వేరుశనగ, చిరుధాన్యాలు వంటి ఇతర పంటలను సాగు చేయలేకపోతున్నామని రైతులు తెలపడంతో సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వారికి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, తహసీల్దార్ రామానుజాచారి, సీఈఓ కాశ బాలస్వామి పాల్గొన్నారు.భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలిజనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరా మహిళా శక్తి’ పథకంలో భాగంగా మహిళా సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన భూమి బదలాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సెర్ప్ సీఈఓ డి.దివ్య అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి ఆమె అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సోలార్ ప్లాంట్ల పురోగతి, స్థలాల కేటాయింపుపై సమీక్ష జరిపారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భూములను గుర్తించి, నిబంధనల ప్రకారం వెంటనే బదలాయింపు ప్రక్రియ చేపట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ తదితరులు పాల్గొన్నారు.సీఆర్పీ కుటుంబానికి ఆర్థిక సాయంపాలకుర్తి టౌన్: మండలంలోని ముత్తారం స్కూల్ కాంప్లెక్స్ పరిఽధిలో కాంట్రాక్టు ప్రాతిపదికన క్లస్టర్ రిసోర్స్ పర్సన్గా విధులు నిర్వహిస్తూ గత నెల 21న గుండెపోటుతో మృతిచెందిన కొంతం సాంబయ్య కుటుంబానికి గురువారం ఎంఈఓ పోతుగంటి నర్సయ్య ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు. మండలంలోని ఎమ్మార్సీ సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కలిసి రూ.1,04,600 ఆర్ధిక సాయాన్ని మృతుడి కుటుంబానికి అందించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు భూసారి అంజయ్య, ఓరుగంటి రమేశ్, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు బైకాని వెంకటయ్య, దాసు వెంకటేశ్వర్లు, ఇమ్మడి అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
‘పీఎంశ్రీ’ నిధులు దుర్వినియోగం చేయొద్దు
● సీట్ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి జనగామ రూరల్: పీఎంశ్రీ పాఠశాలల నిధులు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీట్(స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ) జాయింట్ డైరెక్టర్ ఎస్.విజయలక్ష్మి అన్నారు. గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖ జిల్లా స్థాయి సమావేశంతో పాటు పీఎంశ్రీ పాఠశాలల నిధుల వినియోగంపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రస్థాయి కోఆర్డినేటర్ శ్రీఅర్జున్, రాష్ట్ర క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనాథ్, రాష్ట్ర పీఎం పోషణ్ కోఆర్డినేటర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అపార్, ఎంబీయూ ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా, భౌతిక వసతులు, విద్యుత్ సౌకర్యం, నిర్మాణాలు వంటి వివిధ అంశాల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా గత నెలతో పోలిస్తే జిల్లా పురోగతి సాధించిందని మరింత ముందుకుసాగాలని అన్నారు. వచ్చే రెండు నెలల్లో ఎఫ్ఎల్ఎన్ సర్వే, పదో తరగతి పరీక్షలు ఉన్నాయని, అన్ని పనులు ఈనెలలోనే పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీ సత్యనారాయణమూర్తి, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
ఈ–ఎక్స్ప్రెస్..బ్రేక్డౌన్!
బ్రేక్డౌన్ కారణంగా జేబీఎం కంపెనీకి చెందిన రెండు ఈ–ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సులు జాతీయ రహదారిపై వేర్వేరుగా నిలిచిపోయిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వరంగల్ –2 డిపోకు చెందిన ఈ –ఎక్స్ప్రెస్ బస్సులు హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో హన్మకొండకు వస్తున్నాయి. ఈ–ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఒకటి రఘునాథపల్లి బ్రిడ్జి వద్దకు రాగానే బ్రేక్డౌన్తో ముందుకు కదలక నిలిచిపోయింది. మరో బస్సు కోమళ్ల వద్ద ఆకస్మాత్తుగా ఆగిపోయింది. సాఫ్ట్వేర్, టెక్నికల్ లోపాలతో బ్రేక్డౌన్ కావడంతో అరగంటకు పైగా బస్సులు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు రోడ్డుపైనే నిరీక్షించాల్సి వచ్చింది. డ్రైవర్లు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో విషయాన్ని అధికారులకు తెలపగా.. ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి పంపాలని ఆదేశించారు. చివరకు అయా కండక్టర్లు ప్రయాణికులను ఇతర బస్సులో ఎక్కించి గమ్యస్థానాలకు పంపించారు. రఘునాథపల్లిలో మరో బస్సు కోసం అరగంటకు పైగా ప్రయాణికులు రోడ్డుపై కూర్చొని పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. – రఘునాథపల్లి -
మొదలుకాని ఏర్పాట్లు
మినీ జాతరలు..అమ్మాపురంలో అమ్మవారి గద్దెలుజనగామ రూరల్: తెలంగాణ వనదేవతలు శ్రీ సమ్మక్క–సారలమ్మ మేడారం జాతర మరో మూడు వారాల్లో ప్రారంభం కానుండగా, జిల్లాలోనూ పలు చిన్న జాతరలు(మినీ మేడారాలు) నిర్వహించనున్నారు. ఈ జాతరలకు సైతం భక్తులు వందలు, వేలు, లక్షల్లో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. జిల్లాలో 5 మండలాల పరిధిలో చిన్నజాతరలు జరుగుతాయి. భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా.. చిన్న జాతరల పనులపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహిస్తున్న జాతర ఏర్పాట్లు, సమస్యలు, వసతుల కల్పనపై ‘సాక్షి’ ప్రత్యేక ఫోకస్.. స్టేషన్ ఘన్పూర్ మండల పరిధిలో ఇప్పగూడెం, రంగరాయగూడెం, అక్కపెళ్లిగూడెం, కోమటిగూడెం గ్రామ పంచాయతీల పరిధిలో శ్రీ చింతగట్టు సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మండలంలోని తాటికొండ, జిట్టగూడం గ్రామపంచాయతీల పరిధిలో మల్లన్నగండి వద్ద జాతర కూడా జరుగుతుంది. ఇందులో ఇప్పగూడెం జాతర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, తాటికొండను జాతర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 20 రోజుల్లో జాతర ప్రారంభం కానుండగా ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. తాటికొండ జాతరకు ఇప్పటికే టెండర్లు పూర్తికాగా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. అయితే ఇప్పగూడెం జాతరలో ఇంతవరకూ టెండర్లు సైతం కాలేదు. జాతరకు వచ్చే భక్తులకు రోడ్లు, తాగునీరు చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలు తదితర సౌకర్యాలు చేపట్టాల్సి ఉంది. రెండు జాతరాలకు వెళ్లే రోడ్లు గుంతలమయంగా అధ్వానంగా ఉన్నాయి. రోడ్లకు ఇరువైపులా పిచ్చిచెట్లు, కంపచెట్లు ఏపుగా పెరిగి మూలమలుపుల వాహనాలు కనిపించకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పగూడెం జాతరకు దాదాపు రెండు లక్షల వరకు భక్తులు తరలిరానుండగా, తాటికొండ జాతరకు లక్షకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. నర్మెట మండలం అమ్మాపురంలోని సమ్మక్క సారలమ్మ జాతర గద్దెల ప్రాంగణానికి వెళ్లే రోడ్డు ఇబ్బంది కరంగా ఉంది. జాతర స మయంలో వందలాది మందికి పైగా హాజరై మొక్కులు చెల్లించు కుంటారు. ఇక్కడ ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అలాగే బచ్చన్నపేట మండలంలోని మనసాన్పెల్లి గ్రామంలో సమ్మక్క సారల మ్మ గద్దెల వద్ద ఎలాంటి పనులు చేపట్టలేదు. పిచ్చి మొక్కలతో నిండి రహదారి అధ్వానంగా ఉంది. జఫర్ఘడ్ మండల కేంద్రంలో సమ్మక్క బండపై వెలసిన సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు దారి సౌకర్యం లేదు. పూర్వంలో ఇదే బండ వద్ద సమ్మక్క సారలమ్మ జాతర జరిగినప్పటికీ ఆ తర్వాత నిర్లక్ష్యానికి గురైంది. రెండేళ్ల నుంచి భక్తులు వనదేవతలను పునప్రతిష్టించడంతో పాటు చుట్టూ గద్దెను నిర్మించారు. అయితే గద్దెల వద్దకు వెళ్లేందుకు దారి సౌకర్యం లేదు. దారి సౌకర్యంతో పాటు విద్యుత్ దీపాలు, నీటి వసతి, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయడంతోపాటు భక్తుల సౌకర్యార్థం గద్దెల ముందు బండపై సీసీ నిర్మాణం చేపట్టాలని భక్తులు, గ్రామస్తులు కోరుతున్నారు. జిల్లాలో 5 మండలాల్లో చిన్నజాతరలు ఇప్పటికీ ఎక్కడా ప్రారంభం కాని ఏర్పాట్లు లింగంపల్లి, ఇప్పగూడెం జాతరలకు రెండు లక్షలకుపైగా భక్తులు వసతులపై అధికారులు దృష్టిసారించాలంటున్న భక్తులు -
భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు
మినీ మేడారం జాతరగా పేరున్న లింగంపల్లి జాతరకు గతేడాది మూడు లక్షల పైచిలుకు భక్తులు వచ్చారు. ఈసారి మరింత పెరిగే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. – చిందం వంశీ, ఈఓ, లింగంపల్లి సమ్మక్క సారలమ్మ జాతర ఇప్పగూడెం చింతగట్టు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు సుమారు మూడు లక్షలకు పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. గత జాతర సౌకర్యాలు మోస్తరుగా ఉన్నా చివరి రెండు రోజులు భక్తులు ఇబ్బందులు పడ్డారు. గతానుభవాల దృష్ట్యా అధికారులు ఈసారి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. మంచినీరు, మరుగుదొడ్లు, రవాణా సౌకర్యాలు వంటి మౌలిక వసతులు కల్పించాలి. – ఆరూరి జయప్రకాశ్, ఇప్పగూడెంమినీ మేడారంగా పిలువబడుతున్న లింగంపల్లి జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి తాగునీరు, ఉండడానికి వసతులు ఏర్పాటు చేయాలి. మేడారంలో మాదిరి గద్దెల వద్ద శాశ్వత పనులు చేపట్టాలి. రోడ్డు ఇబ్బందులు కలుగకుండా గుంతలు లేకుండా చూడాలి. – సందోజు రవీంద్రచారి, లింగంపల్లి ● -
ప్రతీ గ్రామానికి సాగునీరు
● స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిజఫరగఢ్ : దేవాదుల ద్వారా ప్రతీ గ్రామానికి రెండు పంటలకు సాగునీరు అందించాలన్నదే తన ఏకై క లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. మండలంలోని సాగరం గ్రామ శివారులో దేవాదుల ప్రాజెక్ట్ ఫేజ్ 3 ప్యాకేజీ ద్వారా 6 పనులను అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫేజ్ 3 కింద ప్యాకేజీ 6 పనులను 2027 నాటికి పూర్తి చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ సీఈ సుధీర్, ఎస్ఈ సీతారం, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక రైతు వేదిక భవనంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు సిగ్గుచేటు స్టేషన్ఘన్పూర్: రెండు రోజుల క్రితం జనగామలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఆధారాలు లేకుండా చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. మండలానికి సంబంధించిన 66 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, పార్టీ జిల్లా నాయకులు మంతెన ఇంద్రారెడ్డి, బూర్ల శంకర్, రజాక్యాదవ్, కొలిపాక సతీష్, సింగపురం వెంకటయ్య పాల్గొన్నారు. స్టేషన్ఘన్పూర్: మున్సిపాలిటీ ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగేలా అందరూ బాధ్యతగా పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ అన్నారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జెడ్పీహెచ్ఎస్లో పోలింగ్స్టేషన్లను, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్లను పరిశీలించారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు, కమిషనర్ బి.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రూ.2వేల కోట్లతో వరంగల్ అభివృద్ధి
ఖిలా వరంగల్/హన్మకొండ/హన్మకొండ కల్చరల్: రూ.2వేల కోట్లతో వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అన్నారు. సంక్షేమాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్.రాంచందర్ రావు రెండు రోజులపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టారు. దీనిలో భాగంగా గురువారం హనుమకొండకు వచ్చిన ఆయనకు కాజిపేటలోని కడిపికొండ బ్రిడ్జి వద్ద పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా వరంగల్లోని భద్రకాళి ఆలయానికి చేరుకున్నారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడినుంచి బయలుదేరి హనుమకొండ హంటర్రోడ్ నందిహిల్స్ వద్దకు చేరుకుని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వేద బాంక్వెట్హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇక్కడే మధ్యాహ్న భోజనం చేసిన తరువాత వరంగల్కు ర్యాలీగా బయలుదేరారు. అనంతరం శాంతినగర్లోని రాజశ్రీ గార్డెన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాజీపేట కోచ్ఫ్యాక్టరీ నిర్మాణం, మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ పనులు మోదీ ఆధ్వర్యంలో పూర్తవుతాయని చెప్పారు. హెల్త్ యూనివర్సిటీ కూడా కేంద్ర ప్రభుత్వ చొరవతో ఏర్పడిందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సిందేనని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ఆయన కోరారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎం.గౌతం రావు, తూళ్ల వీరేందర్ గౌడ్, వేముల అశోక్, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, కొండేటి శ్రీధర్, ఎం.ధర్మారావు, వన్నాల శ్రీరాములు, డాక్టర్ రాజేశ్వర్రావు, మాజీ ఎంపీ సీతారాంనాయక్, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, కుసుమ సతీశ్, తిరుపతిరెడ్డి, రఘునాఽరెడ్డి, డాక్టర్ వన్నాల వెంకటరమణ, ఎన్.వి.సుభాష్, డా.కాళీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు నాయకులు, కార్యకర్తల ఘనస్వాగతం -
లక్షల్లో భక్తులు..ఇప్పుడిప్పుడే పనులు
చిల్పూర్ మండలంలో మూడు చిన్న జాతరలు నిర్వహిస్తున్నారు. లింగంపల్లి జాతరను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ జాతర ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో మినీ మేడారంగా పేరొందింది. గతేడాది మూడు లక్షల పైగా భక్తులు హాజరయ్యారు. శ్రీపతిపల్లి, కొండాపూర్ రెండు గ్రామాల సరిహద్దులో ఉన్న జాతరకు దాదాపు రెండు లక్షల వరకు భక్తులు హాజరవుతారు. ప్రస్తుతం నూతన కమిటీ ద్వారా ఇప్పుడిప్పుడే పనులు మొదలుపెట్టారు. గార్లగడ్డ తండాలో ఏర్పాటు చేసిన జాతర గిరిజనులకు ఆరాధ్య దైవంగా ఉంది. ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు లేవు. జాతరకు కనీసం దారి సౌకర్యం కూడా లేదు. -
ధాటిగా ఆడి..మేటిగా నిలిచి!
రాష్ట్రస్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీలకు అశ్వరావుపల్లి విద్యార్థినులు రఘునాథపల్లి: మండలంలోని అశ్వరావుపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు ప్యారాల కావ్యశ్రీ, శివరాత్రి అక్షయ, వరికుప్పుల మానస రాష్ట్రస్థాయి జూనియర్ బాల్బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్ఎం శోభన్బాబు, పీఈటీ రాజేందర్ గురువారం తెలిపారు. హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని అద్బుత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ నెల 9,10,11 తేదీల్లో నిజామాబాద్ ఆర్మూర్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు లింగాలఘణపురం: ఈనెల 18న ఆదిలాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు మండలంలోని వనపర్తి ఉన్నత పాఠశాలలోని 7వ తరగతి విద్యార్థిని సుంచు దీక్షత ఎంపికై నట్లు ఎంఈఓ విష్ణుమూర్తి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో దీక్షిత షార్ట్పుట్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. విద్యార్థిని దీక్షితను ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు అభినందించారు. పల్లగుట్ట విద్యార్థులు..చిల్పూరు: 11వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు పల్లగుట్ట గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎంపికై నట్లు హెచ్ఎం విజయ్కుమార్, వ్యాయామ విద్యా దర్శకులు దేవ్సింగ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన 12, 14 సంవత్సరాల బాలబాలికల త్రియతలాన్ పోటీల్లో 6వ తరగతి చదువుతున్న కుంచాల వికాస్, 9వ తరగతి చదువే జీడి ప్రీతి ప్రథమ స్థానంలో నిలిచి అథ్లెటిక్స్ చాంపియన్ షిప్కు ఎంపికయ్యారన్నారు. 18న ఆదిలాబాద్లో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికపాలకుర్తి టౌన్: జాతీయస్ధాయి సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలకు మండలంలోని చెన్నూరు గ్రామానికి చెందిన బాలబోయిన స్మైలిక ఎంపికై ంది. గత నెల 21, 22, 23 తేదీల్లో మెదక్ జిల్లాలోని తెలంగాణ క్రీడా ప్రాంగణం మనోహరాబాద్లో జరిగిన తెలంగాణ స్థాయి బాలికల సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ చాంపియన్ షిప్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికై ంది. ఈనెల 9,10,11న హరియానాలో జరిగే జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ చాంపియన్ షిప్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. జిల్లా విద్యార్థులు ఆటల్లో ప్రతిభ చాటుతున్నారు. పలు క్రీడాంశాల్లో వివిధ స్థాయిల్లో సత్తా చాటి రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయికి ఎంపికవుతున్నారు. ఈనేపథ్యంలో గురువారం పలువురు విద్యార్థులు వివిధ స్థాయిలకు ఎంపికయ్యారు. కావ్యశ్రీ, అక్షయ, మానస -
సీజేఐటీలో ఐసీటీ అకాడమీ ప్రోగ్రాం
జనగామ: మండలంలోని యశ్వంతాపూర్ క్రీస్తుజోతి ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ఐబీఎం ప్రోత్సాహంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా ఎనలిటిక్స్ సీఎస్ఆర్ ప్రోగ్రాం నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ విజయపాల్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మల్లికార్జున్ అప్పని, ఎండీ జీవన్, ఫారూఖ్ నేతృత్వంలో 65 మంది విద్యార్థులకు ఏఐపై తర్ఫీదు ఇస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులు మరింత విజ్ఞానం, కోర్సులో మెరుగులు దిద్దుకునే అవకాశం ఉంటుందని డైరెక్టర్ తెలిపారు. 9వ తేదీతో శిక్షణ పూర్తవుతుందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిత్రగుప్త ఆలయానికి రూ.2లక్షల విరాళంజనగామ: పట్టణానికి చెందిన ప్రొఫెసర్ జయశంకర్ సర్ సేవా సమితి చైర్మన్ కొత్తపల్లి సతీశ్ కుమార్ చంద్రాయణగుట్ట చిత్రగుప్త దేవాలయానికి రూ.2,00,116 విరాళంగా అందించారు. బుధవారం కుటుంబ సమేతంగా ఆలయంలో దేవతామూర్తులను దర్శించుకున్నా రు. అనంతరం దేవాలయ అధికారులు, పూజా రులు సతీశ్ కుమార్ దంపతులకు ఆశీర్వచనం అందించారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయానికి ధ్వజస్తంభం నిర్మణానికి తనవంతు సహకారం అందించినట్లు సతీష్ తెలిపారు. పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో అభిషేకం పూజసామగ్రి సప్లై చేసేందుకు వేసిన టెండర్ డ్రా ద్వారా రూ.3,38,000ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న తెలిపారు. బుధవారం ఆలయంలోని కల్యాణ మండపంలో సీల్డ్ టెండర్ డ్రా ద్వారా నిర్వహించారు. ఆలయంలో అభిషేకం పూజసామగ్రి సప్లై చేసేందుకు 38 మంది షెడ్యూల్ కొనుగోలు చేయగా నల్లగొండ దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిసెంట్ కమిషనర్ కె.భాస్కర్ డ్రా తీశారు. పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన సింగ శ్రీలత అభిషేకం సామగ్రి సప్లై చేసేందుకు డ్రాలో ఎంపికయ్యారు. ఎంపీడీఓ వి.వేదావతి, సర్పంచ్ కమ్మగాని విజయ, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ అర్చకులు, సిబ్బంది, టెండర్దారులు పాల్గొన్నారు. బచ్చన్నపేట: జిల్లాలోని బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన గ్రామ సర్పంచ్ అల్వాల నర్సింగరావు పుణె సదస్సుకు ఎంపికయ్యారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. పుణెలో జరిగే మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ జాతీయ శిక్షణకు ఎంపిక చేసినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో 8 మంది సర్పంచ్లు, 4గురు ఎంపీడీఓలు, 3 పంచాయతీ కార్యదర్శులను ఎంపిక చేసినట్లు తెలిపారు. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తనతోపాటు మరో ఇద్దరు సర్పంచ్లను ఎంపిక చేశారన్నారు. శిక్షణ ఈ నెల 8, 9న ఉంటుందన్నారు. గ్రామ పంచాయ తీ నిర్మాణం, పాలనలో మహిళా భాగస్వామ్యం, నూతన నమూనా, గ్రామ నిర్వహణ విషయాలపై శిక్షణ పొందనున్నామని తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థిజఫర్గఢ్ : మండల కేంద్రంలోని మోడల్ స్కూల్కు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి డి.రితిక జాతీయస్థాయి షూటింగ్బాల్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కె.శ్రీకాంత్ తెలిపారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల పర్వతగిరి మండలంలోని పల్లవి స్కూల్లో జరిగిన 44వ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో రితిక ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైందన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో 44వ జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొనున్నట్లు తెలిపారు. -
5 గంటలు..15 అంశాలు
ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సుదీర్ఘ సమీక్షసాక్షిప్రతినిధి, వరంగల్/హన్మకొండ అర్బన్ : ఉమ్మడి జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి మంత్రి ధనసరి సీతక్కతో కలిసి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బుధవారం హనుమకొండలోని కలెక్టరేట్(ఐడీఓసీ)లోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. సుమారు ఐదు గంటలకుపైగా జరిగిన సమావేశంలో సీఎం సలహాదారు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఆరు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ప్రధానంగా మామునూరు ఎయిర్పోర్టు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, వరద నీటి కాల్వల వ్యవస్థ, పారిశుద్ధ్యం, ఇన్నర్ రింగ్ రోడ్డు, భద్రకాళి మాడవీధులు, భద్రకాళి చెరువు పూడికతీత పనులు, రెండు పడక గదుల ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, యూరియా, వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియ, యాసంగి సంసిద్ధత ఇలా మొత్తం 15అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇళ్ల సమస్యకు 15 రోజుల్లో పరిష్కారం.. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పెండింగ్లో ఉన్న సమస్యలను ఎండీ రోజుల్లో పరిష్కరించాలని గృహ నిర్మాణశాఖ పీడీ వి.పి.గౌతమ్ను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టిన గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, అలాగే వాటికి చెల్లింపులు చేయాలన్నారు. ఏప్రిల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారని, రెండు పడకల గదుల ఇళ్ల (2– బీహెచ్కే) ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలన్నారు. ఈనెల 20వ తేదీలోగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి మౌలిక సదుపాయాల పనులు పూర్తిచేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రెండు పడకల గదులకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈనెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ స్థాయిలో నగర అభివృద్ధి వరంగల్ను హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క(అనసూయ) అన్నారు. ఆదివాసీ లకే కాకుండా కోట్లాదిమంది గిరిజనేతరులకు ఇలవేల్పులైన మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెలతో పాటు ఆలయ ప్రాంగణం పునరుద్ధరణకు సీఎం ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మురళీనాయక్, గండ్ర సత్యనారాయణరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, హౌసింగ్ ఎండీ వీపీ గౌతమ్, కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్య శారద, రాహుల్, రిజ్వాన్ బాషా షేక్, అద్వైత్ కుమార్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మాడవీధుల పనుల పరిశీలన హన్మకొండ కల్చరల్: నగరంలోని భద్రకాళి దేవాలయంలో కొనసాగుతున్న మాడవీధుల నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి మంత్రి పొంగులేటి పరిశీలించారు. మాడ వీధుల మ్యాప్ను చూసి త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. దేవాలయం మీద రాజకీయం చేస్తున్న వారికి ఒకటే చెబుతున్నామని, అభివృద్ధి కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్న విషయాన్ని గమనించాలని హితవు పలికారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు. మాడవీధులకు ఖర్చు చేసే ప్రతీ పైసాకు లెక్క చెప్పాలని అధికారులను ఆదేశించారు. పాల్గొన్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, మామునూరు ఎయిర్పోర్టుపై స్పష్టత అభివృద్ధి, సంక్షేమ పథకాలు పరుగులు పెట్టాలని అధికారులకు ఆదేశం నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరికపెండింగ్ పనులను పరుగులు పెట్టించాలని మంత్రి పొంగులేటి.. కలెక్టర్లు, అధికారులకు సూచించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రెండో దశ పనుల కోసం రూ.305 కోట్లతో చేపట్టే భూసేకరణ త్వరగా జరిగేలా చూడాలని ఆదేశించారు. రూ.30కోట్లతో భద్రకాళి మాడవీధుల పనులు జరుగుతున్నాయని, పూజారుల నివాస గదులు, సత్రం పనులు కొనసాగుతున్నాయన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అన్ని పనులు మార్చి 31 నాటికి పూర్తిచేయాలని, సీఎం రేవంత్రెడ్డి ఆసుపత్రిని ప్రారంభిస్తారన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మామునూరు ఎయిర్పోర్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశామని మంత్రి పొంగులేటి తెలిపారుఉమ్మడి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమంపై సాగిన సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి పలువురిని మందలించారు. బాగా పనిచేసిన అధికారులను ప్రశంసించారు. మామునూరు ఎయిర్పోర్టుకు నిర్ణీత సమయంలో భూసేకరణ పూర్తి చేసినందుకు వరంగల్ కలెక్టర్ సత్యశారద, రెవెన్యూ అధికారులను అభినందించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రంలో జనగామ ముందంజలో ఉందని ఆ జిల్లా కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్, సంబంధిత అధికారులను ప్రశంసించారు. ఐఅండ్పీఆర్ శాఖ, పౌరసంబంధాలశాఖ డీఈఈ పనితీరు బాగా లేదన్నారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, అధికారుల పనితీరు బాగా లేకపోవడం వల్లే నిత్యం ఆ జిల్లా పతాక శీర్షికలకు ఎక్కుతుందని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ను ఉద్దేశించి అన్నారు. -
నేటి నుంచి క్రితి 2.0
● కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య ఎంజీఎం: కాకతీయ మెడికల్ కళాశాలలో ఈ నెల 8, 9 తేదీల్లో క్రితి 3.0 (కాకతీయ రిసెర్చ్ ఇన్షియేటివ్ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇనోవేషన్స్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, కేఎంసీ ఎన్ఆర్ఐ సభ్యులు డాక్టర్ వేణు బత్తిని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థుల్లో పరిశోధన, నవీన ఆలోచనలు ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. బుధవారం కళాశాలలో వారు మాట్లాడుతూ.. ఈ ఏడాది నిర్వహిస్తున్న క్రితిలో దేశవ్యాప్తంగా వివిధ వైద్య కళాశాలల నుంచి 1100కుపైగా విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. -
పోలింగ్ కేంద్రాల ప్రకటన తేదీలో మార్పు
జనగామ: మున్సిపాలిటీ ఎలక్షన్ల సందర్భంగా పోలింగ్ స్టేషన్ల ప్రచురణ షెడ్యూల్లో మార్పులు చేస్తూ బుధవారం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ స్టేషన్ల ప్రచురణకు కొత్త తేదీలను నిర్ణయించారు. ఈ నెల 12వ తేదీన వా ర్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా (ఫైనల్ పబ్లికేషన్) ప్రచురణ చేయనున్నారు. 13వ తేదీన పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా (డ్రాఫ్ట్) విడుదల, అలాగే టీపోల్ సిస్టంలో అప్లోడ్ చేయడానికి నిర్ణ యం తీసుకున్నారు. 16వ తేదీన తుది పోలింగ్ కేంద్రాల జాబితా, పోలింగ్ స్టేషన్ వారీగా ఫొటో ఓట ర్ల జాబితాను ప్రచురణ చేయనున్నారు. వీటిని కలెక్టర్, డీఈఏఎస్, మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, తహ సీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. ఓటరు జాబితా తేదీల గడువు పెంచడంతో ఈ నెల10వ తేదీ వరకు జనగామ, స్టేషన్ఘన్పూర్ మునిసిపల్ పరిధిలో ముసాయిదా జాబితాపై అ భ్యంతరాలను స్వీకరించనున్నారు. వార్డుల వారీగా ఓటర్ల మిస్సింగ్, అదనంగా కలువడం, ఓట్ల షిఫ్టింగ్ తదితర వాటిపై రెండు పురపాలికల పరిధిలో ఇప్పటి వరకు భారీగానే దరఖాస్తులు వచ్చాయి. 12వ తేదీన మున్సిపల్ వార్డుల వారీగా ఫొటో ఓటరు జాబితా 16న పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల -
సమస్య ఎక్కడొచ్చినా స్పందిస్తున్నాం..
జనగామ: జిల్లా విద్యాశాఖను రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ విభాగంగా తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రణాళికలతో ముందుకుసాగుతున్నామని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఇన్చార్జ్ డీఈఓ పింకేశ్ కుమార్ బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలిపారు. ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తున్నామన్నారు. అప్పుడప్పుడూ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాటిని భవిష్యత్తులో రాకుండా సరిదిద్దుతున్నామని ఆయన చెప్పారు. విద్యా వ్యవస్థలో ఎలాంటి చిన్న సమస్య వచ్చినా స్వయంగా పర్యటించి పరిశీలించడం, కాంప్లెక్స్ మీటింగులు నిర్వహించడం, ఉపాధ్యాయులతో నేరుగా మమేకమవుతూ వర్క్ అడ్జస్ట్మెంట్లు, హెడ్మాస్టర్లతో సమన్వయం, బోధన నాణ్యతపై దృష్టిసారిస్తున్నామని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలు వివిధ అంశాలపై ఇచ్చే రిప్రజెంటేషన్లను వెంటనే పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. బడుల్లో మౌలిక వసతుల అభివృద్ధి, బోధనా ప్రమాణాల మెరుగుదలకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని 15 ప్రీ–ప్రైమరీ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక ఫోకస్ పెట్టామని, కేజీబీవీల్లో సివిల్ వర్క్స్, తాగునీరు, గీజర్లు వంటి మౌలిక సదుపాయాలను విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. విద్యాశాఖలో పనిచేస్తున్న నలుగురు కోఆర్డినేటర్ల ఫీల్డ్ కార్యకలాపాలపై కూడా తనవైపు నుంచి నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, చిన్న సమస్యలను కూడా అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏ ఉపాధ్యాయ సంఘం అయినా తమ సమస్యలను లిఖితపూర్వకంగా ఇవ్వవచ్చని, వాటిని సత్వరం పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని పింకేశ్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా విద్యాశాఖను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నాం వేగవంతంగా ఉపాధ్యాయ సంఘాల వినతుల పరిశీలన సమస్య ఉంటే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు ‘సాక్షి’తో అదనపు కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ పింకేశ్ కుమార్ -
వాతావరణం
జిల్లాలో ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండ మామూలుగా ఉంటుంది. రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి ● వీసీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదినిజనగామ: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన, నామినేషన్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు, పోలింగ్, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకమైన జరిగేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్న్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ కమిషనర్లు, మహేశ్వర్రెడ్డి, రాధాకృష్ణ ఆయా శాఖల అధికారులు ఉన్నారు. ‘విద్యుత్ సరఫరాలో భద్రతే కీలకం’జనగామ: విద్యుత్ సరఫరాలో భద్రతను మరింత పటిష్టం చేసి ప్రమాదాల నివారణకు చెక్ పెట్టేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి అన్నారు. జనగామ పట్టణం పెంబర్తి సమీపంలోని ఎన్ఎస్ఆర్ భవన్లో బుధవారం ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి ఆదేశాల మేరకు ఆర్ఈసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పవర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ భాగస్వామ్యంతో మూడు రోజుల భద్రతపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుణే, నాగపూర్కు చెందిన ఇద్దరు అనుభవజ్ఞులైన ఇంజనీర్ల పర్యవేక్షణలో జిల్లాలో ఏఈ, సబ్ ఇంజనీర్లు, ఏడీఈ, ఇతర 35 మంది ఇంజనీర్లకు ప్రమాదాలకు ఏం చేయాలనే దానిపై అవగాహన కల్పించనున్నారు. అనంతరం ఎస్ఈ మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో విద్యుత్ మరమ్మతు, కొత్త లైన్లు, ఇతర మెయింటెనెన్స్ ఇలా ప్రతి పనిలో ఒక్క ప్రమాదం కూడా జరుగకుండా ఉండేలా ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. శిక్షణ శిబిరంలో టెక్నికల్ డివిజనల్ ఇంజనీర్ గణేష్, జనగామ, స్టేషన్ఘన్పూర్ డివిజనల్ ఇంజనీర్లు లక్ష్మీనారాయణరెడ్డి, సారయ్య, ఆర్ఈసీ ప్రతినిధులు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
బతికుండగానే రికార్డుల్లో చంపేశారు
స్టేషన్ఘన్పూర్: మండలంలోని ఇప్పగూడెం గ్రామానికి చెందిన అన్నెపు వెంకటయ్య అనే వృద్ధుడికి ఽఅధికారుల నిర్లక్ష్యంతో 8 నెలలుగా పింఛన్ నిలిచిపోయింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వెంకటయ్యకు 2022 నుంచి 2025 వరకు మూడేళ్ల పాటు వృద్ధాప్య పింఛన్ వచ్చింది. అయితే అధికారుల తప్పిదంతో గత 8నెలలుగా అతడికి పింఛన్ రావడం లేదు. ఈ విషయమై బాధిత వృద్ధుడు గ్రామ పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయంతో పాటు పలుమార్లు కలెక్టరేట్కు వెళ్లినా ఫలితం లేదు. దాంతో బాధితుడు మంగళవారం తనగోడు మీడియాతో వెళ్లబోసుకున్నాడు. అధికారుల నిర్లక్ష్యంతో పింఛన్ రావడం లేదన్నారు. ఈ విషయమై అధికారులను సంప్రదిస్తే రికార్డులో తాను చనిపోయినట్లు ఉందని చెపుతున్నారని వాపోయాడు. తాము ఏమి చేయలేమని, హైదరాబాద్కు వెళ్లాలని చెపుతున్నారని తెలిపారు. ఈ విషయమై ఇన్చార్జ ఎంపీడీఓ నర్సింగరావును వివరణ కోరగా విచారణ చేపట్టి బాధితుడికి న్యాయం చేస్తామని తెలిపారు. ఎనిమిది నెలలుగా బాధితుడికి అందని వృద్ధాప్య పింఛన్ -
టీచర్ల శిక్షణ నిధుల ఖర్చుపై ఇంటెలిజెన్స్ ఆరా
జనగామ: జిల్లాలో గత వేసవిలో ఉపాధ్యాయులకు ఇచ్చిన శిక్షణకు సంబంధించి నిధుల ఖర్చుపై స్టేట్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి. శిక్షణ నిధుల ఖర్చులో అవకతవతకలు జరిగాయని టీచర్ల సంఘాల బాధ్యుల అభిప్రాయాలతో సాక్షి దినపత్రికలో వచ్చిన వరుస కథనాలతో ఇంటెలిజెన్స్ టీమ్ వివరాలను సేకరిస్తు న్నట్లు విశ్వసనీయ సమాచారం. శిక్షణ సమయంలో టీచర్లకు అందించిన భోజనం, స్నాక్స్ క్వాలిటీ, వాటికి చేసిన ఖర్చు నిబంధనల మేరకు ఉందా లేదా అనే కోణంలో ఆరా తీసినట్లు తెలుస్తోంది. అలాగే టీచర్లకు ఇవ్వాల్సిన డబ్బులను ఎలా చెల్లించారు.. ఎంత ఇచ్చా రు.. అనే విషయాలను ఆయా టీచర్ల సంఘాల బాధ్యులకు సైతం ఫోన్ చేసి సమాచారం కోరినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా గతేడాది మొత్తంగా జరిగిన శిక్షణలు ఎన్ని, ప్రభుత్వం నుంచి వచ్చిన బడ్జెట్ ఎంత అనే దానిపై స్టేట్ ఇంటెలిజెన్స్ వర్గాలు వివరాలను సేకరిస్తున్నారనే సమాచారం ఉపాధ్యాయ సంఘాలు, వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. సీఎం కప్ క్రీడాపోటీలకు దరఖాస్తు చేసుకోవాలి జనగామ రూరల్: సీఎం కప్–2025 (2వ ఎడిషన్) కు సంబంధించి గ్రామస్థాయి ఎంపికల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి కోదండరాములు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలోని ఆసక్తి గల క్రీడాకారులు అధికారిక వెబ్సైట్లో తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం 9182552593 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. -
నిబంధనల ప్రకారమే దత్తత
జనగామ రూరల్: నిబంధనల ప్రకారమే పిల్లలను దత్తత తీసుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ చెప్పారు. బుధవారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ చాంబర్లో రక్తసంబంధ దత్తత ప్రక్రియను చట్టబద్ధంగా పూర్తి చేశారు. జిల్లాకు చెందిన తల్లి తన సొంత అక్క కుమార్తెను చట్టప్రకారం దత్తత తీసుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అధికారికంగా దత్తత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు పిల్లల విద్య, ఆరోగ్యం, భద్రతపై పూర్తి బాధ్యత వహించి, మంచి భవిష్యత్ను అందించాలని సూచించారు. అలాగే పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకోవాలనుకుంటే తప్పనిసరిగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా మాత్రమే చట్టబద్ధంగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె.కోదండరాములు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రవికాంత్, సంబంధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పారదర్శకంగా యూరియా సరఫరా రైతులకు యూరియా సరఫరాలో పారదర్శకత, సౌ లభ్యం, సమయపాలన లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ ద్వారా జిల్లాలో పంపిణీ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని బుధవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. యూరియా బుకింగ్ యాప్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 1,40,737 యూరియా సంచులు బుక్ చేయబడగా, వాటిలో 1,15,633 సంచులను రైతులు కేవలం 15 రోజుల వ్యవధిలోనే కొనుగోలు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 28,914 యూరియా సంచులు అందుబాటులో ఉన్నాయని మార్క్ఫెడ్కు 20,666 యూరియా సంచులకు ఇండెంట్ ఇవ్వడం జరిగిందని, ఇవి రాబోయే రెండు రోజుల్లో జిల్లాకు చేరనున్నాయన్నారు. పిల్లలు లేనివారు చట్టబద్ధంగా దరఖాస్తు చేసుకోవాలి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన చేపట్టాలి
స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరితగతిన చేపట్టాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతమ్ సూచించారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడారు.. సంబంధిత బిల్లుల కోసం ఎవ్వరూ ఎవరికీ ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, నిబంధనల మేరకు లబ్ధిదారులకు బిల్లులు వస్తాయన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని, త్వరలో లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు వస్తాయన్నారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ మాతృనాయక్, డీఈ చంద్రశేఖర్, ఏఈ అఖిల, మున్సిపల్ కమిషనర్ బి.రాధాకృష్ణ, మున్సిపల్ అధికారులు సత్యనారాయణ, సందీప్, లింగయ్య, శ్రీనివాస్, నాయకులు పోగుల సారంగపాణి ఉన్నారు. హౌసింగ్ ఎండీ వీపీ గౌతమ్ -
ఆర్డీఓ కార్యాలయ ఫర్నిచర్ జప్తు చేయండి
● భూ పరిహారం కేసులో కోర్టు ఆదేశం ● కార్యాలయానికి చేరుకున్న భూయజమానులు ● ఆర్డీఓ లేకపోవడంతో వెనక్కి..జనగామ: పట్టణంలో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాల కోసం వినియోగిస్తున్న 18 ఎకరాల భూమికి ఇప్పటికీ పరిహారం అందలేదని ఆరోపిస్తూ, భూమి యజమానులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన జనగామ సీనియర్ సివిల్ కోర్టు, పరిహారం చెల్లించకపోవడంతో ఆర్డీఓ కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర వస్తువులను జప్తు చేయవచ్చని ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం కోర్టు ఉత్తర్వులతో భూమి యజమానులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. పట్టణంలోని సిద్దిపేటరోడ్డును ఆనుకుని 18 ఎకరాల స్థలం చెంచారపు కరుణాకర్రెడ్డి, దీప్తి, మధుసూదనరెడ్డి, శకుంతల, రామచంద్రారెడ్డి, రాజనరేందర్రెడ్డి, దివ్య, శోభ, సుభాషిణిలకు చెందిన 18 ఎకరాల భూమిని 1981లో గృహ నిర్మాణ శాఖ ఇళ్ల నిర్మాణం కోసం భూసేకరణలో తీసుకుకున్నారు. 1996లో ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ, భూ యజమానులు తక్కువ పరిహారం ఇచ్చేందుకు ప్రయత్నించబడిందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణల్లో భూ యజమానులకు రూ.9.07 కోట్లు పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు పరిహారం చెల్లించకపోవడంతో వ్యవహారం మళ్లీ జనగామ సీనియర్ సివిల్ కోర్టుకు చేరింది. తాజాగా ఈ ఏడాది అక్టోబర్ 23న సీనియర్ సివిల్ జడ్జి సుచరిత, భూ యజమానులకు రూ.9.7కోట్లు పరిహారం చెల్లించాలని ఆర్డీఓను ఆదేశించగా, చెల్లింపునకు ఒక నెల గడువు ఇచ్చినా, అధికారులు స్పందించకపోవడంతో ఆర్డీఓ కార్యాలయంలోని వస్తువులను జప్తు చేయడానికి కోర్టు అనుమతి ఇవ్వగా, అడ్వకేట్తో కలిసి వారు వచ్చారు. ఈ సమయంలో ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో బాధిత భూమి యజమానులు బుధవారం విచారణ ఉన్న నేపథ్యంలో, కోర్టు ఇచ్చే తదుపరి ఆదేశాలను అనుసరించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
బుగులు వెంకన్న హుండీ ఆదాయం రూ.7.77లక్షలు
చిల్పూరు: చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానం హుండీ ఆదాయం రూ.7.77.265 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ శ్రీధర్రావు తెలిపారు. మంగళవారం ఉదయం 105 రోజులకు సంబంధించిన హుండీలను భువనగిరి దేవాదాయ శాఖ అధికారి నిఖిల్ సమక్షంలో మల్కాపూర్ ఇండియన్ బ్యాంకు అధికారులు, శ్రీరాజరాజేశ్వర సేవాసమితి బాధ్యులు, సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. ఆదాయంతో పాటు అమెరికాకు చెందిన రెండు డాలర్లు, ఆస్ట్రేలియాకు చెందిన ఒక డాలరు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ మోహన్, వీరన్న, మల్లికార్జున్, కృష్ణ, హరిశంకర్, వసంత తదితరులు పాల్గొన్నారు. పాఠశాల భవనం పనుల పరిశీలనజనగామ రూరల్: కోర్టు సమీపంలో నిర్మాణంలో ఉన్న జిల్లా పరిషత్ బాలికల పాఠశాల భవన నిర్మాణ పనులను మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ నాణ్యత, తరగతి గదుల ఏర్పాటు, భద్రతా ప్రమాణాలు, తాగునీరు–శానిటేషన్ సదుపాయాలు, విద్యుత్ వసతులు తదితర అంశాలను ఆయన సమీక్షించారు. మిగిలిన పనులను నిర్దేశిత గడువులో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ రజిత, ఎంపీడీఓ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాంజనగామ: ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్న సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్(ఎస్ఈ) సీహెచ్.సంపత్రెడ్డి సూచించారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పెంబర్తి సెక్షన్ సిబ్బందితో కలసి మంగళవారం ప్రజాబాట కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులతో కలసి ఆయన పాల్గొని స్థానికులతో మాట్లాడి విద్యుత్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఓవర్ లోడ్ ట్రాన్స్ఫార్మర్లు, తుప్పుపట్టిన పాత స్తంభాల స్థానంలో కొత్తవి వేసి లోఓల్టేజ్ సమస్య లేకుండా పరిష్కారిస్తామన్నారు. నూతన గృహ అవసరాలకు లైన్లు వేసుకుని ఎస్టిమేట్లకు డబ్బులు చెల్లించాలని సూచనలు చేశారు. కార్యక్రమంలో సెక్షన్ ఏఈ కనకయ్య, లైన్ ఇన్స్పెక్టర్ రవీంద్రచారి, లైన్మెన్ జయరాజు, భాస్కర్, కమలాకర్, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. నేడు జిల్లా మంత్రుల సమీక్ష హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హనుమకొండ కలెక్టరేట్లో బుధవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా మంత్రులు సీతక్క, కొండా సురేఖలతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు. -
పరిధిదాటి పనిచేస్తున్నారు
డీఈఓ కార్యాలయంలో పూర్తిస్థాయి డీఈఓ లేకపోవడంతో కొందరు పరిధి దాటి పనిచేస్తున్నారు. దీంతో ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎవరి పరిధిలో వారు పని చేస్తేనే విద్యాశాఖ గౌరవ ప్రతిష్టలు దెబ్బతినకుండా ఉ ంటాయి. ఉపాధ్యాయుల సర్ధుబాటులో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి. అవి మా దృష్టికి కూడా వచ్చాయి. మేము కూడా డీఈఓతో మాట్లాడినం. – కొల్ల మహిపాల్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూసమన్వయలోపాన్ని ఎత్తి చూపిస్తోంది జిల్లా విద్యాశాఖలో ఇటీవల జరుగుతున్న సంఘటనలు అధికారుల సమన్వయ లోపాన్ని తెలియజేస్తున్నాయి. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా సంఘ బాధ్యులు, ఇతర అధికారులతో సమన్వయపరుచుకొని నిబంధనల ప్రకారం నడుచుకో వలసిన అవసరం ఉంది. విద్యాశాఖకు సంబంధించిన పూర్తిస్థాయి జిల్లా విద్యాశాఖ అధికారిని నియమించాలి. తద్వారా సమస్యలు పరిష్కారమవుతాయి. – సలాది సత్తయ్య, జిల్లా అధ్యక్షుడు, ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సాక్షి కథనాలపై పూర్తి విచారణ చేపట్టాలి జిల్లా విద్యాశాఖ పగ్గాలు ఐఏఎస్ చేతికి వెళ్లడంతో చాలా మార్పులు జరుగుతాయని భావించాం. దానికి భిన్నంగా అనేక బాధ్యతలు ఉండడం వల్ల పూర్తిస్థాయిలో దృష్టిపెట్టకపోవడాన్ని ఆసరా చేసుకుని కొద్దిమంది మేం ఏది చెబితే అదే నడుస్తుంది అన్నట్టుగా వ్యవరించడం సరికాదు. మొన్న జరిగిన సావిత్రిబాయి ఫూలే వేడుకలు ఎవరికి సమాచారం లేకుండా, కొద్దీ మంది సమక్షంలో, ఎంపిక ప్రక్రియ కూడా తెలుపకుండా చేశారంటే చేశారన్నట్టుగా చేశారు. డీఈఓ కార్యాలయంపై సాక్షిలో వరుసగా వస్తున్న కథనాలపై దృష్టి పెట్టి సరిచేయాల్సిన అవసరం ఉంది. – పి.చంద్రశేఖర్రావు, జిల్లా అధ్యక్షుడు, టీఎస్యూటీఎఫ్ -
ఓటర్ల జాబితాలో సవరణకు దరఖాస్తు చేసుకోండి
● స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ స్టేషన్ఘన్పూర్: ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, సవరణలకు ఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బి.రాధాకృష్ణ సూచించారు. మున్సిపాలిటీ ఓటర్ల ముసాయిదా జాబితాపై ఈనెల 5వరకు మున్సిపల్ కార్యాలయంలో అభ్యంతరాలు స్వీకరించామని, 15 అభ్యంతరాలు రాగా ఒకే ఇంటి నంబర్ ఉండి ఇతర వార్డుల్లో పడిన ఓట్ల విషయమై తమ పరిధిలోని ఐదింటిని పరిష్కరించామని, మిగిలిన అభ్యంతరాలను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అదేవిధంగా ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి ఓట్లు తొలగింపు, పేర్లు, తండ్రి పేర్ల తప్పులు తదితర అంశాలపై ఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. రెండు రోజుల్లో దరఖాస్తులు చేసుకోవాలని, ఈనెల 10న తుది ఓటర్ల జాబితా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్లు నితిన్కుమార్, సందీప్, చుక్క లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలి
● సీనియర్ సివిల్ జడ్జి సుచరిత జనగామ రూరల్: రోడ్డు భద్రతపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి ఇ.సుచరిత అన్నారు. మంగళవారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ అదేశాల ప్రకారం ఆన్ రోడ్ సురక్ష అభియాన్ స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈసందర్భంగా కోర్టు నుంచి చౌరస్తా వరకు విద్యార్థులు, పోలీసులు, న్యాయవాదులు, పారాలీగల్ వలంటరీలు, వాహనదారులు ర్యాలీ చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ రూపొందించిన ప్రమాణ పత్రాన్ని చదివి వారితో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి జి.శశి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె.సందీప, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్సై చెన్నకేశవులు, ఎంఈఓ శంకర్రెడ్డి , లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ ఎం.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
విద్యాశాఖను కలుషితం చేస్తున్న షాడో శక్తులు
జిల్లా విద్యాశాఖలో తవ్విన కొద్దీ అవకతవకలు వెలుగు చూసే అవకాశం ఉంది. సాక్షిలో వస్తున్న వరుస కథనాలతో జిల్లా యంత్రాంగంలో గుబులు మొదలైంది. జిల్లా విద్యాశాఖలో కొంతకాలంగా కొనసాగుతున్న షాడో శక్తుల పాత్రపై గత రెండు రోజులుగా చర్చ జరుగుతోంది. గత వేసవిలో అభ్యసనాభివృద్ధి కాార్యక్రమంలో భాగంగా మే నెలలో ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయుల వరకు ఉపాధ్యాయులకు రెండు విడతలు ఐదు రోజుల చొప్పున శిక్షణా తరగతులు నిర్వహించారు. నిబంధనల ప్రకారం ప్రతీ ఉపాధ్యాయుడికి వర్కింగ్ లంచ్ కోసం రోజుకు రూ.200 కేటా యించగా, వాస్తవానికి రూ.100 మాత్రమే ఖర్చుచేసి మిగిలిన మొత్తాన్ని అధికారులు నొక్కేశారన్న ప్రచారం టీచర్లలో ఉంది. ఈ విధంగా దాదాపు రూ.25 నుంచి రూ.30 లక్షల వరకు నిధుల దుర్వినియోగం జరిగిందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – బుర్ర రమేశ్, రాష్ట్ర కార్యదర్శి, ప్రధానోపాధ్యాయ సంఘం -
షాడోలతోనే అప్రతిష్ట
● విద్యావ్యవస్థలో కలకలం రేపుతున్న ‘సాక్షి’ కథనాలు ● శిక్షణల ఖర్చులపై విచారణకు ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ ● కొందరు అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి ● మితిమీరిన జోక్యం, సమన్వయ లోపంపై అసహనంజనగామ: జిల్లాలో విద్యాశాఖ వ్యవహారశైలిపై ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆ శాఖలో పెరుగుతున్న కొందరి పెత్తనం కారణంగా ఉపాధ్యాయుల శిక్షణలు, ఇతర ట్రైనింగ్లకు సంబంధించిన నిధుల వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ పెరుగుతోంది. డీఈఓ ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ, విద్యాశాఖలో జరుగుతున్న తప్పిదాలపై నిఘా పెంచాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమాల్లో ఉత్తముల ఎంపికలో ఉపాధ్యాయ సంఘాలను విస్మరించడంపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి. శిక్షణా తరగతులు, ఎన్నికల బాధ్యతలు, ఆర్పీ నియామకాలు పదేపదే కొంతమందికే కేటాయించడం పరిపాటిగా మారిందన్న ఆరోపణలు ఉపాధ్యాయుల్లో అసహనాన్ని పెంచుతోంది. ఇటీవల పెంబర్తి ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణపై ఆర్జేడీకి ఫిర్యాదు వెళ్లడంతో, కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ కమిటీ వేసినట్లు సమాచారం. మండలస్థాయి ఉన్నతాధికారిని కమిటీలో చేర్చినప్పుడు, తాము ఊహించిన ‘పదవి ప్రాధాన్యం’ రాలేదనే ఆగ్రహంతో స్వయంగా డీఈఓ కార్యాలయంలో ఫైల్ను విసిరేసిన ఘటన విద్యాశాఖలో నెలకొన్న పెత్తన ధోరణికి ఉదాహరణగా ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. విద్యాశాఖలో జరుగుతున్న అసమానతలు, షాడోలుగా వ్యవహరించే వ్యక్తుల జోక్యం, అధికారుల మధ్య సమన్వయ లోపం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాక్షిలో వరుసగా వెలువడుతున్న కథనాలు, ఆరోపణల నేపథ్యంలో సంబంధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ భారీగా పెరుగుతోంది. -
మెరుగైన వైద్యం అందించాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ● ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలన జనగామ రూరల్: వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించి వారి మన్ననలు పొందాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం స్ధానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించి, ఆసుపత్రిలోని ల్యాబ్లను, సీటీ స్కానింగ్ గదిని, ప్రత్యేక వైకల్య గుర్తింపు, కార్డు కేంద్రం, ప్రత్యేక సామర్థ్యాల మూల్యాంకన కేంద్రం, డయాలసిస్ యూనిట్, జనరల్ వార్డును నిర్మాణంలో ఉన్న ఆడిటోరియం పనులను కలెక్టర్ పరిశీలించారు. పేషెంట్ల ఆరోగ్య స్థితిని పరిశీలించి, వారికి అందిస్తున్న వైద్య సేవలను వసతులను తెలుసుకున్నారు. ఇటీవల ప్రారంభించిన సీటీ స్కాన్ యంత్రాన్ని పరిశీలించి, దాని పనితీరు, ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులకు స్కాన్లు నిర్వహించారనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలుబు, ముక్కు దిబ్బడ సమస్యతో బాధపడుతున్నందున ఈఎన్న్టీ వైద్యుల సూచన మేరకు కలెక్టర్ స్వయంగా ప్యారానాసల్ సైనసెస్కు సీటీ స్కాన్ చేయించుకున్నారు. కార్యక్రమంలో డీఎంఈ డాక్టర్ వి.రాజలింగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జునరావు, ఆర్ఎంఓ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కోర్టు భవన పనులు పరిశీలన చంపక్ హిల్స్లో నిర్మాణం జరుగుతున్న జిల్లా కోర్టు భవన పురోగతిని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన పనులను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను అడిగి పలు సూచనలు ఇచ్చి నిర్దేశిత గడువులోగా పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరామ్, డీఆర్డీఓ వసంత, ఆర్అండ్బీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నేల సంపదను కాపాడుకోవాలి.. నేల ఆరోగ్యం, పోషక స్థితి అంచనాతో జీవవైవిధ్యం మెరుగు అవుతుందని, నేల మన సంపద కాపాడుకోవడమే మన భవిష్యత్తు భద్రత అని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. నేల ఆరోగ్య పరిరక్షణ, పంట దిగుబడుల పెంపు, భవిష్యత్ తరాలకు సారవంతమైన నేలను అందించాలనే లక్ష్యంతో చౌడారం మోడల్ పాఠశాలలో స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికా రి అంబికా సోని, సహాయ జిల్లా విద్యాశాఖ అధి కారి సత్యమూర్తి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్లు వెంకటరమణ, తేజస్వి, మండల వ్యవసాయ అధికారి విజయ్ రెడ్డి, ప్రిన్సిపాల్ సుధీర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు రాజేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఎఫ్డీఎఫ్ పథకం ఉపయోగకరం ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలతో పాటు అనుకోకుండా మరణించిన ఉపాధ్యాయ కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించే ఎఫ్డీఎఫ్ పథకం ఉపయోగకరమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో యూటీఎఫ్ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ను కలెక్టర్, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ అవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు చంద్రశేఖర్రావు, మదూరి వెంకటేష్, కోశాధికారి చిక్కుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎగిరేది
జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల అభినందన సభ జరిగింది. సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై గర్జించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ పట్టుదలతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. – జనగామ● బీఆర్ఎస్ సర్పంచ్ల అభినందన సభలో కేటీఆర్గులాబీ జెండేకేసీఆర్ను మళ్లీ సీఎం చేయాలన్నదే ప్రజల ఆకాంక్ష -
ఎమ్మెల్యే పల్లాకు ఓసీ జేఏసీ ఆహ్వానం
జనగామ: ఈ నెల 11న వరంగల్ నగరంలో నిర్వహించనున్న ఓసీ జేఏసీ మహా గర్జన కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆహ్వానిస్తూ అధికారికంగా ఆహ్వాన పత్రికను సోమవారం అందించారు. ఈ సందర్భంగా ఓసీ వర్గాల హక్కులు, సమస్యలు, ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే లక్ష్యంతో నిర్వహించనున్న ఈ మహా గర్జన కార్యక్రమానికి పల్లా రాజేశ్వర్రెడ్డి హాజరు కావడం మరింత బలం చేకూరుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్రెడ్డి, కార్యదర్శి దుబ్బ శ్రీనివాస్, కోశాధికారి నడిపెల్లి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిశెట్టి ప్రమోద్ కుమార్, రాష్ట్ర సలహాదారుడు, రావుల నరసింహరెడ్డి, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు, మార్వాడీ సంఘం నాయకులు కృష్ణ, జీవన్ బజాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన అభ్యంతరాల స్వీకరణ
● లిఖితపూర్వకంగా 15 అభ్యంతరాలు స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో చేపట్టనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ సోమవారం సాయంత్రంతో ముగిసింది. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు సోమవారం చివరితేదీ కావడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. పలువురు ఓటర్ల జాబితాలో తమ పేర్లు, వార్డులు చూసుకోవడానికి, అభ్యంతరాలపై దరఖాస్తులు చేసేందుకు రావడంతో సందడిగా కనిపించింది. ప్రధానంగా తమ ఓట్లు ఇతర వార్డులలో చేర్చారని, ఒకే కుటుంబంలోని వారి ఓట్లు రెండు వార్డుల్లో ఉండటం, ఓటర్ల జాబితాలో తండ్రి పేరు తప్పుగా పడటం లాంటి సమస్యలు కనిపించాయి. మున్సిపాలిటీ ఏర్పాటు సమయంలో ముందుగా ప్రకటించిన విధంగా వార్డుల వారీగా ఓట్లు ఉండాలని, పలువురి ఓట్లు వార్డులు మారాయని, ఈ విషయమై చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. కాగా ముసాయిదా ఓటర్ల జాబితాపై శనివారం సాయంత్రం వరకు 8 దరఖాస్తులు రాగా సోమవారం 7 దరఖాస్తులు వచ్చాయని కమిషనర్ బి.రాధాకృష్ణ తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు గడువు ముగిసిందని, ఓటర్ల తుదిజాబితా ఈనెల 10న ప్రకటిస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. -
జాబితా సవరించాల్సిందే..
● అఖిలపక్ష పార్టీల సమావేశంలో బీఆర్ఎస్ నాయకుల డిమాండ్ స్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీకి సంబంఽధించి ముసాయిదా ఓటర్ల జాబితాలో సవరణలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు కనకం గణేశ్, తాటికొండ సురేశ్ డిమాండ్ చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ హాజరుకాగా ముందుగా వివిధ పార్టీల నాయకులు మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. వార్డులను ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేశారని, 1వ వార్డు ఘన్పూర్లో, 2,3,4,5 శివునిపల్లిలో, 6,7,8,9 ఛాగల్లులో, తిరిగి 10 నుంచి 18 వరకు వార్డులు ఘన్పూర్లో ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేశారన్నారు. ఘన్పూర్ ఎస్సీ కాలనీకి చెందిన 12, 13వ వార్డులకు అటుఇటుగా చేశారని ఆరోపించారు. ఎస్సీ కాలనీలో మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య ఓటు ఉన్న వార్డులోనే ఓట్లను ఇతర వార్డులలో వేశారని, అధికారులు నిర్లక్ష్యంగా పనిచేశారని ఆరోపించారు. అదేవిధంగా గతంలో శివునిపల్లిలోని ఎస్సీ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థుల పేర్లను జనాభా లెక్కల్లో అధికారులు తప్పుగా రాయడంతో గతంలో శివునిపల్లి సర్పంచ్ ఎస్టీ రిజర్వేషన్ వచ్చిందని, అలాంటి తప్పిదాలు ఈసారి జరుగకుండా చూడాలని కోరారు. ఇందుకు కమిషనర్ స్పందిస్తూ 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన టౌన్ ప్లానింగ్, మాస్టర్ప్లాన్, ఇంటి నంబర్ల ప్రాతిపదికన ఉన్నతాఽధికారుల ఆదేశాల మేరకు వార్డులు, ఓటర్లు విభజన చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ఎ.సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్లు నితిన్, సందీప్, లింగయ్య, రాజకీయ పార్టీల నాయకులు జూలుకుంట్ల శిరీష్రెడ్డి, మాచర్ల గణేష్, అంబటి కిషన్రాజ్, తెల్లాకుల రామకృష్ణ, పెసరు సారయ్య, పృథ్వీ, గుండె మల్లేష్, కుంభం కుమార్, అమ్జద్పాషా, తోట రమేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ముసాయిదాపై గుస్సా!
ఓటర్లు పెరిగితే.. రిజర్వేషన్లు మారవా..?జనగామ: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముసాయిదా(డ్రాఫ్ట్) ఓటరు జాబితాపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ మున్సిపల్ కార్యాలయ సమావేశం హాలులో సోమవారం కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ముసాయిదా ఓటరు జాబితాపై రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. పార్టీల వారీగా ఓటరు జాబితా అందించకపోవడంపై ముక్తకంఠంతో అధికారులను నిలదీశారు. వార్డుల వారీగా ఓట్లు పెరగడం, మిస్సింగ్ తదితర తప్పులపై నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ముసాయిదా జాబితాలో ఫొటో ఐడీతో ఎందుకు ప్రచురణ చేయలేదని ప్రశ్నించారు. ఇతర వార్డుల నుంచి ఓట్లు మరో వార్డుకు ఎందుకు క్లబ్ అయ్యాయని అడిగారు. ఒకటో వార్డుకు చెందిన శ్రీరాంపూర్, బెత్లెహోమ్ సంబంధించిన ఓట్లను 3వ వార్డులో కలిపారని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే జనగామ మండలం గానుగుపహడ్, పెంబర్తి, యశ్వంతాపూర్, వడ్లకొండ, మరిగడి, దేవరుప్పుల, మన్పహాడ్ ఓట్లు జనగామ ఓటరు జాబితాలో కలవడం దేనికి నిదర్శనమన్నారు. కాగా వెంకన్నకుంట, రెడ్డి కాలనీకి సంబంధించిన ఓట్లు మూడో వార్డులోకి రాగా, 20వ వార్డు నుంచి 21 వార్డులో 150 ఓట్లు పెంచారని మండిపడ్డారు. ఆ ఓట్లు పెరగడంతో రిజర్వేషన్ ప్రక్రియలో తమకు అవకాశం రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 3వ, 27వార్డుల్లో ఇతర వార్డుల ఓటర్లు.. మూడో వార్డులో గతంలో 1,450 ఓట్లు ఉంటే, ప్రస్తుతం 1,750కి పెరిగాయన్నారు. ఇందులో 17వ వార్డు వెంకన్నకుంట, 19వ, 1వ, 2వ, 4వ, 5వ వార్డుల ఓటర్లు ఉన్నట్లు కమిషనర్కు తెలిపారు. 27వ వార్డులో మరిగడి, గిర్నిగడ్డ, లక్ష్మీబాయి కుంట, 14వ వార్డు ఓట్లను ఎందుకు కలిపినట్లో అధికారులు సమాధానం చెప్పాలని, తుది ఓటరు జాబితాలో ఒక్క తప్పు కూడా ఉండకుండా చూడాలన్నారు. వార్డుల్లో మిస్సింగ్, ఇ తర గ్రామాలు, వార్డుల నుంచి కలిసిన ఓట్లతో రిజర్వేషన్లు మారితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. కమిషనర్ మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ పార్టీ నాయకుల సమావేశంలో తమ దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు ముసాయిదా ఓటరు జాబితాను ఇస్తామని, 8వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. ఆయా పార్టీల నాయకులు వంగాల మల్లారెడ్డి, చెంచారపు బుచ్చిరెడ్డి, బూడిద గోపి, మహంకాళి హరిశ్చంద్రగుప్త, జమాల్షరీఫ్, కడారు ప్రవీణ్, బొమ్మగాని అనిల్గౌడ్, సువార్త, మామిడాల రాజు, వారనాసి పవన్శర్మ, జోగు ప్రకాష్, కొత్తపల్లి సమ్మయ్య, మంగ రామ క్రిష్ణ, సిద్దులు, సంపత్, గుజ్జుల నారాయణ, పెద్దోజు జగదీష్ తదితరులు ఉన్నారు. మున్సిపల్ ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల నిరసన సమీప గ్రామాల ఓటర్లు పట్టణంలో ఎలా కలుపుతారని నిలదీత -
తీరని వ్యథలు
జనగామ రూరల్: ఏళ్ల తరబడి తిరుగుతున్నా తమ వ్యథలు తీరడం లేదని, దూరప్రాంతాల నుంచి వచ్చి దరఖాస్తులు ఇవ్వడమే తప్పా సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్లో పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్ షాలోమ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 69 దరఖాస్తులను స్వీకరించారు. ఏళ్ల తరబడి తిరుగుతున్నా సమస్యల పరిష్కారమేది? గ్రీవెన్స్లో ప్రజల ఆవేదన 69 అర్జీల స్వీకరించిన అధికారులు -
మితిమీరిన పెత్తనం !
జనగామ: జిల్లా విద్యాశాఖలో ఇద్దరు అధికారులు ‘షాడో డీఈఓలు’గా వ్యవహరిస్తూ పెత్తనం చెలాయిస్తున్నారనే ‘సాక్షి’ కథనం వెలుగులోకి రావడంతో ఆ శాఖలో కలకలం రేగింది. ఈ విషయం ఉపాధ్యాయ వర్గాలు, సంఘాల్లో పెద్దఎత్తున చర్చకు దారితీస్తుండగా, అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై ఇంటెలిజిన్స్ విభాగం నివేదికలు సేకరిస్తుండగా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్్ నికోలస్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సైతం దీనిపై సీరియస్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. ‘షాడోస్’కు అసిస్టెంట్లు బడులను ప్రత్యక్షంగా సందర్శించాల్సిన బాధ్యత ఉన్న అధికారుల స్థానంలో, వారి కింద ఉన్న అసిస్టెంట్లుగా పేర్కొనబడే కొంతమంది టీచర్లను పంపించి వివరాలు సేకరించడం, ఆ రిపోర్టులను ఉన్నతాధికారులకు పంపించడం తరచూ జరుగుతోందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. షాడో డీఈఓలుగా పేరుపొందిన ఇద్దరు అధికారులు కలెక్టర్కు దగ్గర అనే భయంతో టీచర్లు, సిబ్బంది ఎవరూ కూడా నేరుగా ఫిర్యాదు చేయడానికి సాహసం చేయడంలేదని ప్రచారం నడుస్తోంది. అధికార హోదా దుర్వినియోగం అందరూ వినియోగించాల్సిన కారును ఇద్దరు షాడో డీఈఓలే నిరంతరం వాడుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. మిగతా అధికారులు ఇద్ద రు షాడోలను కారు కావాలని అడిగే ధైర్యం లేకుండా పోయింది. ప్రతీ నెల ప్రభుత్వం నుంచి చెల్లించే కారు అద్దెకు ఇద్దరు ఉపయోగించుకోవడం ఏంటనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో మిగతా అధి కారులు తమ సొంత వాహనాలపైనే వెళ్తుండడం గమనార్హం. కొద్ది నెలల క్రితం డీఈఓ కార్యాలయం వాహనం రఘునాథపల్లి సమీపంలోని ఓ డాబాకు వెళ్లిన ఘటన కూడా టీచర్లలో తీవ్ర చర్చనీయాంశమైంది. అధికారిక వాహనంలో అసలు డాబాకు ఎవరెవరు, ఎందుకు వెళ్లారనే దానిపై విచారణ జరిపితే మరిన్ని విషయాలు బయటపడతాయని ఉపాధ్యాయవర్గాలు చెబుతున్నాయి. శిక్షణ నిధుల్లో అనుమానాస్పద లావాదేవీలు జిల్లాలో గతేడాది సమ్మర్ శిక్షణ సమయంలో సుమారు 2వేల మంది ఉపాధ్యాయులకు ఐదు రోజుల ట్రైనింగ్ నిర్వహించగా, రూ.65 నుంచి రూ.70 లక్షల వరకు టీఏ, డీఏ నిధులు మంజూరయ్యాయి. వీటిలో ఎంత శాతం టీచర్లు హాజరయ్యారు.. నిధుల విడుదలలో పారదర్శకత పాటించారా.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉపాధ్యాయుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయకుండా, కొంతమంది అధికారుల ఫోన్పే ఐడీల ద్వారా చెల్లింపులు జరిగినట్లు సమాచారం. భోజనం సరఫరాకు ముందస్తు టెండర్లు పిలిచారా? హోటల్ బిల్లులు ఏ ఆధారంగా చెల్లించారు..? అన్న అంశాలలో స్పష్టత లేకపోవడం అనుమానాలకు మ రింత బలం చేకూరుస్తుంది. గతేడాది మొత్తంగా శిక్షణ పేరిట రూ.కోటి మేర నిధులు మంజూరయ్యాయని తెలుస్తుంది. అధికారులే పట్టించుకోని పరిస్థితి క్వాలిటీ అధికారులుగా పనిచేయాల్సిన సిబ్బంది గ్రీన్ పెన్ను ధరించి అధికార హోదాలో తిరుగుతుండటం, శాఖలో ఉన్న నిజమైన అధికారులను లెక్కచేయని పరిస్థితి అసంతృప్తికి దారితీస్తోంది. షాడో డీఈఓలు డీఈఓ హాదాతో అధికారం వినియోగించుకోవడం వల్లే ఈ పెత్తనం మరింత పెరిగిందని ఆ రోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా విద్యాశాఖను కుదిపేస్తున్న సాక్షి ‘షాడో డీఈఓలు’ కథనం నవీన్ నికోలస్, ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా కలెక్టర్ సీరియస్..! సమ్మర్ శిక్షణ నిధులపై విచారణ ఉంటుందా..!ఏడీని కూడా అవహేళన చేసిన సంఘటన..? పాలకుర్తి–తొర్రూరు పాఠశాల షిఫ్టింగ్ సమయంలో ఏడీ, కొంతమంది అధికారులు ఆఫీసు కారులో వెళ్లగా, షాడో అధికారుల్లో ఒకరు డ్రైవర్కు ఫోన్ చేసి అర్జెంట్గా జనగామకు రావాలని ఆదేశించిన ఘటన చర్చనీయాంశమవుతోంది. ‘ఏడీ ఉన్నారు కదా..’ అని సదరు డ్రైవర్ చెప్పగా, ‘నాకేం చెప్పేది..? కలెక్టర్ తనిఖీ చేయమన్నారు..’ అంటూ ఏడీని అవహేళన చేసినట్లు ఉపాధ్యాయ సంఘాల్లో చర్చకు దారితీసింది. -
నేడు కేటీఆర్ రాక
జనగామ: పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సత్కరించేందుకు ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 6న (మంగళవారం) జిల్లా కేంద్రానికి రానున్నారు. సూర్యాపేట రోడ్డు భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో జరుపతలపెట్టిన సర్పంచ్ల అభినందన సభలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు పెంబర్తి కాకతీయ కళాతోరణం వద్ద కేటీఆర్కు స్వాగతం పలికి, అక్కడ నుంచి భారీ ర్యాలీగా జనగామ ఆర్టీసీ చౌరస్తాకు చేరుకుంటారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, నెహ్రూపార్కు మీదుగా భ్రమరాంబ కన్వెన్షన్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి మూడు నియోజకవర్గాల నుంచి తరలివచ్చే సర్పంచ్లను కేటీఆర్ను సత్కరిస్తారు. ఈనేపథ్యంలో అభినందన సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరిశీలించారు. అభినందన సభకు గులాబీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. నూతన సర్పంచ్లకు అభినందన సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే పల్లా, మాజీమంత్రి ఎర్రబెల్లి -
డీసీసీ కార్యాలయానికి భూమి కేటాయించండి
జనగామ: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం రెండు ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతూ డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి, టీపీసీసీ సభ్యుడు లక్ష్మినారాయణనాయక్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని సోమవారం కలెక్టర్ను ఆయన చాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పార్టీ నిర్మాణం కోసం స్థల కేటాయింపు విషయమై కలెక్టర్ సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు. అలాగే మున్సిపల్ ఓటర్ తుది జాబితాను పారదర్శకంగా ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వేమళ్ల సత్యనారాయణరెడ్డి, ఉడత రవి, గాదెపాక రాంచందర్, జక్కుల అనితవేణు, మూడావత్ సంపత్, పింగిలి ఇంద్రారెడ్డి, కోటా నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్ధాయి మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్కు ఎంపికపాలకుర్తి టౌన్: మండలంలోని చెన్నూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి పి. దుర్గాప్రసాద్ రాష్ట్రస్ధాయి మ్యాథ్య్ టాలెంట్ టెస్ట్కు ఎంపికైనట్లు చెన్నూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం పూస్కూరి రమేశ్రావు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 6న సిద్దిపేట గజ్వేల్లో జరిగే రాష్ట్రపోటీల్లో దుర్గాప్రసాద్ పాల్గొంటారని తెలిపారు. ఈసందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యా కమిటీ, గ్రామస్తులు విద్యార్థి దుర్గాప్రసాద్ను అభినందించారు. 1912 టోల్ఫ్రీతో మెరుగైన విద్యుత్ సేవలుజనగామ: జనగామ సర్కిల్లో విద్యుత్ వినియోగదారులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించేందుకు టీజీఎన్పీ డీసీఎల్్ 1912 టోల్ఫ్రీ సేవలను మరింత బలోపేతం చేసినట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్(ఎస్ఈ) సంపత్రెడ్డి తెలిపారు. సోమవారం సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.. 24 గంటలు అందుబాటులో ఉన్న టోల్ఫ్రీ నెంబర్ ద్వారా 16 సర్కిళ్ల వినియోగదారులు తమ ఫిర్యాదులను నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు 1912 ద్వారా 859 ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. యూడీఐడీ సదరం క్యాంపునకు హాజరుకావాలిజనగామ రూరల్: మీ సేవలో స్లాట్ బుకింగ్ చేసుకున్న దివ్యాంగులు యూడీఐడీ సదరం క్యాంపునకు హాజరుకావాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వసంత సోమవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలోని వివిధ రకాల దివ్యాంగులు కొత్తవారు, రెన్యూవల్ వారు మీ సేవలో యూడీఐడీ వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ చేసుకున్న వారు రశీదులో ఉన్న ఫోన్ నెంబర్కు మెసేజ్ వచ్చిన తేదీలలో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సదరం శిబిరానికి హాజరుకావాలన్నారు. ఈనెల 7, 9, 19, 20, 21, 22, 28వ తేదీల్లో ఆర్థో, దృష్టి, వినికిడి లోపం, మానసిక, తలసేమియా, క్రానిక్ న్యూరాలజీ సంబంధిత దివ్యాంగులు క్యాంపు ఉంటుందని కొత్తవి 136ఉండగా, రెన్యూవల్ 109 ఉన్నాయని మొత్తంగా 245 మందికి అవకాశం ఉన్నదన్నారు. మరిన్ని వివరాలకు 8008202287 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. పంటల ఉత్పాదకత లక్ష్యాలు సాధించాలిజనగామ రూరల్: పంటల ఉత్పాదకత లక్ష్యాలు సాధించేలా ప్రణాళిక బద్ధంగా అధికారులు ముందుకెళ్లాలని సెంట్రల్ నోడల్ ఆఫీసర్ పురుషార్థ అన్నారు. సోమవారం ప్రధానమంత్రి ధన్ధాన్య యోజన అమలుపై కేంద్ర ప్రభుత్వం నియమించిన సెంట్రల్ నోడల్ ఆఫీసర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. గతంలో రూపొందించిన 6 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక, మండల స్థాయిలో లక్ష్యాల సాధనపై సమీక్ష జరిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పథకం అమలులో ఆదర్శవంతమైన జిల్లాగా నిలబెట్టేలా ప్రతీశాఖ సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్, సహకార విభాగం, భూగర్భ జలాలు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నీట్ పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీగా వసతులు
జనగామ: జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే నీట్ పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్న్స్ హాల్లో నీట్ పరీక్షలు–2026 నిర్వహణపై డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి కలెక్టర్ పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది మేలో నీట్ కోసం జిల్లాలో ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు మహాత్మా గాంధీ జ్యోతిరావు ఫూలే రెసిడెన్షియల్ స్కూల్లో రెండు సెంటర్లు కేటాయించామన్నారు. 650 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు చెప్పా రు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి సమస్యలు, ఆటంకాలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీనివాస్, విద్యాశాఖ అధికారులు సత్యమూర్తి, శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టివిద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణలో దిక్సూచి కార్యక్రమం ముఖ్యభూమిక పోషిస్తోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్ సమావేశం హాల్లో విద్యార్థుల ఆరోగ్య సమగ్రాభివృద్ధి కోసం అమలు చేస్తున్న దిక్సూచి కార్యక్రమ అమలుపై కలెక్టర్ సమీక్ష చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 12వ తేదీలోపు విద్యార్థులందరికీ హెల్త్ కార్డులను తప్పనిసరిగా జారీ చేయాలని ఆదేశించారు. విద్యాసంస్థల్లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 15 నిమిషాల పాటు అనీమియా పీరియడ్ నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు, ఇతర ఆరోగ్య, సంక్షేమ అధికారులు, వైద్యులు, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు పాల్గొన్నారు. సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ -
టీపీసీసీ మార్గదర్శకాల మేరకే పదవులు
జనగామ: ఏఐసీసీ, టీపీసీసీ మార్గదర్శకాలను అనుసరించి డీసీసీలో పదవుల కేటాయింపు ఉంటుందని అబ్జర్వర్స్, రాష్ట్ర విత్తన అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ కిసాన్సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి అధ్యక్షతన ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు డీసీసీ కమిటీలో పదువుల కేటాయింపునకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి బైకాని లింగంయాదవ్, డీసీసీ అధ్యక్షురాలితో కలిసి ఆయన మాట్లాడారు.. జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల నుంచి డీసీసీలో ఉపాధ్యక్షులు, ప్ర ధాన కార్యదర్శి, కోశాధికారి, కార్యదర్శులు, జిల్లా అధికార ప్రతినిధి, కార్యవర్గ సభ్యుల పదవుల కోసం జిల్లాలోని అన్ని మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ నేపథ్యం, అనుభవం, సీనియారిటీ ఆధారంగా దరఖాస్తులు అందజేశారన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు లక్ష్మీనారాయణ నాయక్ , వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల కళ్యాణి, కావ్యశ్రీ, బడికె ఇందిర, లోకుంట్ల ప్రవీణ్, ఓసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గనిపాక మహేందర్, జాఫర్ షరీఫ్, జమాల్ షరీఫ్, పిన్నింటి నారాయణ, మేకల సమ్మయ్య, చెంచారపు బుచ్చి రెడ్డి, కొల్లూరి శివ, రాపాక సత్యనారాయణ, నల్ల శ్రీరాములు, సురేష్ నాయక్, గిరగాని కుమారస్వామి, లింగాల నర్సిరెడ్డి, వగలబోయిన యాదగిరి గౌడ్, మేడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అబ్జర్వర్ అన్వేష్రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ -
కిక్కిరిసిన మేడారం
భక్తజనంతో మేడారం పరిసరాలు కిక్కిరిశాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించారు. తల్లులకు ఎదుర్కోళ్లు, యాటపోతులు, ఎత్తు బంగారం, పసుపు కుంకుమ, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ సమ్మక్క గద్దె వద్ద భక్తులు..మొక్కులు చెల్లించేందుకు గద్దెల వద్ద బారులుదీరిన భక్తులుకిక్కిరిసిన జనంతో సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణం -
రెగ్యులర్ డీఈఓ ఉండాలి
జిల్లాకు రెగ్యులర్ డీఈఓ లేకపోవడంతో జిల్లా విద్యాశాఖలో కొందరు అధికారుల ఇష్టారాజ్యం సాగుతోంది. పూర్తిస్థాయి సమయం కేటాయించే రెగ్యులర్ జిల్లా విద్యాధికారి లేకపోవడం వల్ల సమస్యల పరిష్కారంలో జా ప్యం జరుగుతోంది. జిల్లాల్లో అక్టోబర్లో ఇచ్చిన వర్క్ అడ్జస్ట్మెంట్లో మండల విద్యాధికారులు చేతి వాటాన్ని ప్రదర్శిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రతిపాదనలు పంపి అవకతవకలకు పాల్పడ్డారు. ఎలాంటి ఉత్తర్వులు లేకుండా జిల్లాలో కొన్ని అక్రమ డిప్యుటేషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే వాటిని రద్దు చేసి అందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. డి. శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీపీటీఎఫ్ -
ప్రక్షాళన చేయాలి
జిల్లా విద్యాశాఖలో ఒకరిద్దరు వ్యక్తులకు వారి బాధ్యతలు మినహా, ఎలాంటి అధికారిక హోదాలు లేకపోయినా, షాడోలుగా వ్యవహరిస్తూ విద్యాశాఖను పూర్తిగా కలుషితం చేస్తున్నారు. అడిషనల్ కలెక్టర్ డీఈఓగా ఉన్న కారణంగా, గ్రౌండ్ లెవెల్లో ప్రత్యక్ష పరిశీలనకు అవకాశం పరిమితంగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని, డీఈఓ తరువాత అంతటి బాధ్యత కలిగిన ఏడీ అధికారాన్ని కూడా లెక్కచేయకుండా, తామే జిల్లా విద్యాశాఖకు బాసుల్లా వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇలాంటి పరిణామాలతో జిల్లా విద్యాశాఖ ప్రతిష్ట దెబ్బతింటోంది. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ తక్షణమే ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి, విద్యాశాఖను ప్రక్షాళన చేయాలి. బుర్ర రమేశ్, రాష్ట్ర కార్యదర్శి, ప్రధానోపాధ్యాయుల సంఘం -
శ్రీసోమేశ్వర ఆలయంలో టెండర్లకు ఆహ్వానం
పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని శ్రీసోమేశశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 7న (బుధవారం) 2026 సంవత్సరానికి వివిధ సామగ్రి సప్లై చేసేందుకు సీల్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న ఒక ప్రకటనలో తెలిపారు. సీల్డ్ టెండర్లలో పాల్గొనదలచిన వారు ఈనెల 6 (మంగళవారం) సాయంత్రం 5 గంటల వరకు దేవస్థానం కార్యాలయంలో స్వామివారి పేరుతో గల జూట్ బ్యాగ్తో అభిషేకం పూజా సామగ్రిని సప్లై చేసేందుకు రూ. 10 వేలు, తడకలు పందిర్లు, క్యూలైన్ ఏర్పాటు చేసేందుకు, మహాశివరాత్రి ఇతర పర్వదినాల్లో పూల అలంకరణ, లైటింగ్ డెకరేషన్, టికెట్, బుక్స్ ఇతర ప్రింటింగ్ పనులు, రంగులు, సున్నం సప్లై చేసేందుకు, రంగులు, సున్నాలు వేసేందుకు మొదలగు వాటికి రూ.1,000 చెల్లించి షెడ్యూలు పొందాలని ఈఓ పేర్కొన్నారు. జనగామ రూరల్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 5(సోమవారం) వరకు పొడిగించారని ఓపెన్ స్కూల్ డైరెక్టర్ పీవీ శ్రీహరి ఉత్తర్వులు ఇచ్చారని జిల్లా విద్యాశాఖ అధికారి పింకేశ్ కుమార్ తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల పరీక్ష ఫీజును ఆలస్య రుసుం లేకుండా 5వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు. రూ.25 ఆలస్య రుసుంతో 6 నుంచి 12 వరకు, రూ.50 ఆలస్య రుసుంతో 13 నుంచి 16 వరకు, తత్కాల్ కింద 17 నుంచి 19 వరకు చెల్లించవచ్చన్నారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు రాసే వారు సకాలంలో ఫీజు చెల్లించాలని సూచించారు. మరిన్ని వివరాలకు సమన్వయకర్త యం.శంకర్ రావు 8919606868 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరారు. ఆశ్రమ పాఠశాలను ప్రారంభించాలికొడకండ్ల: మండల కేంద్రంలో గిరిజన ఆశ్రమ పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్నాయక్ ఆదేశించారు. ఆది వారం మండలకేంద్రంలోని ఎస్టీ హాస్టల్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ పరిసరాలను, సౌకర్యాలను పరిశీలించి విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఆశ్రమ పాఠశాలను మూసివేసి కేవలం వసతి గృహాన్ని నిర్వహిస్తున్న దానిపై కారణా లను అడిగారు. అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీటీడీఓ ప్రేమకళ, ఏటీడీఓ హసీనా, డీఎస్ సీడీఓ విక్రం, ఆర్డీఓ వెంకన్న పాల్గొన్నారు. అనాథ శరణాలయం అభివృద్ధికి తోడ్పాటు దేవరుప్పుల: అనాథ వృద్ధులకు బాసటగా నిలుస్తున్న శరణాలయం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్నాయక్ అన్నారు. మండలంలోని సీతారాంపురం ప్రేమసదనం అనాథ వృద్ధ శరణాలయాన్ని ఆయన సందర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్, మండల అధ్యక్షుడు బస్వ భాస్కర్గౌడ్, మాజీ అధ్యక్షుడు బాగాల నవీన్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చింత సృజన్కుమారి, తహసీల్దార్ ఆస్పక్యు అహ్మద్ పాల్గొన్నారు. -
ఓటర్ల మిస్సింగ్పై కదిలిన యంత్రాంగం
జనగామ: జనగామ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో 240కి పైగా ఓటర్ల మిస్సింగ్, 13వ వార్డులో అదనంగా కలిసిన ఓటరు జాబితాను సవరించేందుకు అధికార యంత్రాంగం కదిలింది. తప్పుల తడకగా ముసాయిదా ఓటరు జాబితా శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందన వచ్చింది. విలీన సమయంలో శామీర్పేట పంచాయతీ పరిధిలోని మున్సిపల్ 8వ వార్డులో రెండు కలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాలో ఈ వార్డు పరిధిలోని సుమారు 240 మంది ఓటర్లు మిస్సైయ్యారు. దీనిపై వార్డు ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు 13వ వార్డులో అదనంగా కలిసిన ఓటర్లపై వచ్చిన ఫిర్యాదు మేరకు అధికార యంత్రాం గం స్పందించి సరిచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలాఉండగా 17, 30వ వార్డులో అస్పష్టంగా ఉన్న ఓటరు జాబితాను సైతం సరిచేయాలని కోరుతూ వార్డు నాయకులు కొత్తపల్లి సమ్మయ్య, జేరిపోతుల కుమార్ మున్సిపల్ మేనేజర్కు వినతి చేశారు. ప్రస్తుత కలెక్టరేట్ నిర్మాణానికి ముందు ఆ ప్రాంతంలో ఏసిరెడ్డినగర్ కాలనీ ఉంది. కలెక్టరేట్కు ఆ స్థలం కేటాయించడంతో ఏసి రెడ్డినగర్ కాలనీ ప్రజలు అక్కడ నుంచి ఇందిరమ్మ కాలనీ, తదితర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రస్తుత ఓటరు జాబితాలో ఏసిరెడ్డినగర్ పేరిట సుమారు 150 ఓట్లు రాగా, పలువురు కాంగ్రెస్ నాయకులు కమిషనర్ మహేశ్వర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ముసాయిదా ఓటరు జాబితా తమకు వచ్చిన ఆధారంగానే అభ్యంతరాలను స్వీకరిస్తున్నామని, ఇందులో తాము చేసేది ఏమీ లేదని కమిషనర్ చెప్పారు. 13వ వార్డులో ఓటరు జాబితాను సరిచేస్తున్న అధికారులు -
విద్యాశాఖ తీరు ఆక్షేపనీయం
జనగామ: సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం అధి కారికంగా నిర్వహించాలని ప్రజాప్రతినిధులు, ఉ పాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయుల ను ఆహ్వానించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, జిల్లా విద్యాశాఖ వాటిని పూ ర్తిగా విస్మరించిందని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్ ఆరోపించారు. ఆదివారం పట్టణంలో జరిగిన టీఎస్యూటీఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు.. జిల్లాలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఉత్తమ మహిళా ఉపాధ్యాయుల జాబితాను ప్రకటించకుండా, కేవలం ఆఫీస్ సిబ్బందితోనే కార్యక్రమం నిర్వహించడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని విద్యాశాఖ వెల్లడించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.చంద్రశేఖర్ రావు, మడూరి వెంకటేశ్ ఎఫ్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర డైరెక్టర్ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మంగు జయప్రకాశ్, హేమలత, కోశాధికారి చిక్కుడు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు శ్రీనివాస్, యాదవరెడ్డి, కృష్ణమూర్తి, నిరంజని, వెంకటేశ్వర్లు, జి.కృష్ణ, వసంత నాయక్, శ్రీనివాస్, చైతన్య పాల్గొన్నారు. -
షాడో డీఈఓలు!
జనగామ: జిల్లాలో విద్యాశాఖ కార్యకలాపాలపై ఆ రోపణలు వెల్లువెత్తుతున్నాయి. డీఈఓగా ఐఏఎస్ అధికారి ఇన్చార్జ్గా, ఆ తర్వాత స్థానంలో ఏడీ వి ధుల్లో ఉన్నప్పటికీ, అసలు వ్యవహారం మాత్రం ఇ ద్దరి చేతుల్లోకి వెళ్లిపోయిందని ఉపాధ్యాయ సంఘా ల నుంచి విమర్శలు వినపడుతున్నాయి. ‘షాడో డీఈఓలు’గా వ్యవహరిస్తున్న ఈ ఇద్దరు అధికారులు, ఉన్నతాధికారులను తప్పుదారి పట్టిస్తూ విద్యాశాఖ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపణలు విని పిస్తున్నాయి. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వ్యక్తిగత చొరవ, టీచర్ల కృషితో పదో తరగతిలో రాష్ట్రస్థాయిలో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించినా, కార్యాలయానికి వచ్చేసరికి మొత్తం వ్యవస్థను కుంగదీస్తున్న షాడో వ్యవహారం రాష్ట్రస్థాయి వరకు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. కొంతమేర ఉపాధ్యాయ సంఘాలు నిలదీస్తున్నా, పూర్తిస్థాయిలో తెరపైకి రావడంలో నిశితంగా పరిశీలన చేస్తున్నారని తెలుస్తోంది. ఏడీ పరిధిలో చేయాల్సిన అనేక పనుల్లోనూ ఈ ఇద్దరి జోక్యం అధికమవుతుండడంపై అంతర్గతంగా చర్చలు ముదురి పాకానపడుతున్నాయి. సావిత్రిబాయి ఫూలే అవార్డుల ఎంపికలోనూ ఇదే కథ. జిల్లా స్థాయిలో అధికారికంగా కనీసం పది మందిని ఎంపిక చేయాల్సిన నిబంధన ఉన్నప్పటికీ, ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘానికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇష్టానుసారంగా అవార్డులు ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియలో షాడోల పెద్దనందే పైచేయిగా నిలిచిందనే ఆరోపణలు ఉన్నాయి. డీఈఓ, ఏడీ ఉన్నా ఇద్దరు షాడో డీఈఓల ప్రభావం ఎందుకు తగ్గించడం లేదంటూ ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. అవార్డుల విషయం, నియామకాల్లోనూ ఇదే విధమైన ఆరోపణలు వస్తుండడంతో జనగామ విద్యాశాఖలో చీకట్లు కమ్ముకుంటున్నాయని ఉపాధ్యాయ వర్గం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏడీ అంతటి స్థాయిని పక్కన బెట్టి ఇద్దరు ఉన్నతాధికారుల్లా వ్యవహరిస్తున్న పరిస్థితిపై కలెక్టర్ రంగంలోకి దిగి చక్కదిద్దకపోతే టీచర్ల సంఘాలు ప్రత్యక్ష నిరసనకు దిగే సమయంలో విద్యాశాఖ గౌరవం తగ్గిపోయే ప్రమాదం ఉందని మేధావి వర్గం హెచ్చరిస్తోంది.డీఈఓ కార్యాలయంలో ఈ ఇద్దరి పెత్తనం బాగా పెరిగిందనే టాక్ నడుస్తోంది. ఏడీ తీసుకెళ్లాల్సిన ప్రతి ఫైల్ కూడా మొదట వీరి చేతుల్లోకి వెళ్తోందట..? డీఈఓగా ఉన్న ఐఏఎస్ అధికారి వద్ద ఇది ఎలా సాధ్యమవుతోంది? అనే ప్రశ్నలు ఉపాధ్యాయుల్లో చర్చనీయాంశంగా మారాయి. రెగ్యులర్ డీఈఓ ఉన్నప్పుడు సుమారు 16 గంటల పాటు ప నులు సాగేవని, ఇప్పుడు ఐఏఎస్ ఇన్చార్జ్గా ఉన్న సమయంలో రోజుకు గంటన్నరకు కార్యాలయ సమయం తగ్గిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 16 గంటలు పట్టే పని గంటన్నరలో ఎలా సాధ్యం అవుతుంది? అనే ప్రశ్నను పలువురు టీచర్లు బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. విద్యాకార్యక్రమాల అమలు, కొత్త స్కీములు, ఎఫ్ఎల్ఎన్, కాంప్లెక్స్ మీటింగ్లు వంటి ముఖ్య కార్యక్రమాలను చూడాల్సిన అధికారులు, విద్యా ఫైళ్ల వ్యవహారంలో మునిగిపోయారనే ఆరోపణలు బలపడుతున్నాయి. వర్క్ అడ్జస్ట్మెంట్ సమయంలో ఇప్పటివరకు జాయినింగ్ కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి కనీసం షోకాజ్ కూడా ఇవ్వకుండా వ్యవహరించడం, సంఘాల అభ్యంతరాలకు సమాధానం లేకపోవడం వంటి అంశాలపై డీఈఓ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.డీఈఓ కార్యాలయంలో ఈ ఇద్దరి పెత్తనం బాగా పెరిగిందనే టాక్ నడుస్తోంది. ఏడీ తీసుకెళ్లాల్సిన ప్రతి ఫైల్ కూడా మొదట వీరి చేతుల్లోకి వెళ్తోందట..? డీఈఓగా ఉన్న ఐఏఎస్ అధికారి వద్ద ఇది ఎలా సాధ్యమవుతోంది? అనే ప్రశ్నలు ఉపాధ్యాయుల్లో చర్చనీయాంశంగా మారాయి. రెగ్యులర్ డీఈఓ ఉన్నప్పుడు సుమారు 16 గంటల పాటు ప నులు సాగేవని, ఇప్పుడు ఐఏఎస్ ఇన్చార్జ్గా ఉన్న సమయంలో రోజుకు గంటన్నరకు కార్యాలయ సమయం తగ్గిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 16 గంటలు పట్టే పని గంటన్నరలో ఎలా సాధ్యం అవుతుంది? అనే ప్రశ్నను పలువురు టీచర్లు బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. విద్యాకార్యక్రమాల అమలు, కొత్త స్కీములు, ఎఫ్ఎల్ఎన్, కాంప్లెక్స్ మీటింగ్లు వంటి ముఖ్య కార్యక్రమాలను చూడాల్సిన అధికారులు, విద్యా ఫైళ్ల వ్యవహారంలో మునిగిపోయారనే ఆరోపణలు బలపడుతున్నాయి. వర్క్ అడ్జస్ట్మెంట్ సమయంలో ఇప్పటివరకు జాయినింగ్ కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి కనీసం షోకాజ్ కూడా ఇవ్వకుండా వ్యవహరించడం, సంఘాల అభ్యంతరాలకు సమాధానం లేకపోవడం వంటి అంశాలపై డీఈఓ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఏడీ ఉన్నా నిర్ణయాల్లో ఇద్దరిదే కీలకం కలెక్టర్, టీచర్ల కృషి, పదిలో ఉత్తమ ఫలితాలు కార్యాలయం మాత్రం షాడోల చేతిలో అవార్డుల నుంచి ఫైల్స్ వరకు వీరి కనుసన్నల్లోనే విద్యాశాఖ ప్రతిష్టకు భంగం? -
పన్నులు చెల్లించం..
ఆరు సంవత్సరాల క్రితమే మమ్ములను మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఇంటి నంబర్ ఇవ్వలేదు. ఓటు కూడా ఇవ్వలేదంటే మున్సిపల్ పన్నులు ఎందుకు చెల్లించాలి. ముసాయిదా ఓటరు జాబితా తయారు చేసే సమయంలో ఒకటికి, రెండుసార్లు సరి చూసుకోవాలి. ఓటరు హక్కు కల్పించకపోతే పన్నులు చెల్లించం. – తొట్టె కృష్ణ, 8వ వార్డు, జనగామఅసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశా. ఇప్పుడు మున్సిపల్ జాబితాలో నా పేరు కనిపించడం లేదు. అధికారులు స్పందించి ఓటు హక్కు కల్పించాలి. లేదంటే మమ్ములను మళ్లీ శామీర్పేటలో కలపాలి. – ఆర్.సతీష్, 8వ వార్డు, జనగామ● -
మోడల్ మార్కెట్ పనులు త్వరగా పూర్తి చేయాలి
జనగామ రూరల్: పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణం చేస్తున్న మోడల్ మార్కెట్ చివరి దశ పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. శనివారం నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ భవన నిర్మాణ నాణ్యత, అంతర్గత వసతులు, షాపుల ఏర్పాటు, పారిశుద్ధ్య సదుపాయాలు, తాగునీటి వసతి, డ్రెయినేజీ వ్యవస్థ, విద్యుత్ సదుపాయాలు, వ్యర్థాల నిర్వహణ. ప్రజలకు సౌకర్యవంతంగా వినియోగించేలా చేపట్టాలన్నారు. మోడ ల్ వెజ్ నాన్వెజ్ మార్కెట్ పట్టణ ప్రజలకు అవసరమైన శుభ్రత, పారిశుద్ధ్యం నాణ్యతపై ఎలాంటి రాజీ లేకుండా తుది పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ -
డీసీసీ నియామకానికి దరఖాస్తుల స్వీకరణ
జనగామ: జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు నేడు (ఆదివారం) పట్టణంలోని సూర్యాపేటరోడ్డు ఎన్ఎంఆర్ గార్డెన్లో టీపీసీసీ అబ్జర్వర్ ఆధ్వర్యంలో డీసీసీ కమిటీకి సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తారన్నారు. ఇందులో మహిళలకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పార్టీలో గడిచిన ఐదేళ్లుగా అంకితభావంతో పని చేస్తూ, క్రమశిక్షణ, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం, పార్టీని ప్రజల వద్దకు తీసుకు వెళ్లగలిగే నాయకులు దరఖాస్తులు చేసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు, బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు హాజరై పార్టీ పునర్నిర్మాణ ప్రక్రియకు సహకరించాలని కోరారు. ఆరోగ్య డ్రైవ్ విజయవంతం● డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు జనగామ: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 18 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో కుష్టువ్యాధి నివారణ, బాధితుల గుర్తింపు కోసం ఇంటింట పర్యటించి వివరాలు తెలుసుకున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,30,337 నివాస గృహాలు ఉండగా, 1,30,019 కుటుంబాలను సందర్శించారు. ఈ సర్వేలో 5,33,508 మందిలో 5,28,237 మందికి పరీక్షలు నిర్వహించగా 2,465 మందిని అనుమానితులను ఆరోగ్య సిబ్బంది గుర్తించారన్నారు. 1 నుంచి 5 ఏళ్ల లోపు స్పర్శ లేని మచ్చలు పీబీ, 5 ఏళ్ల పైబడిన శరీరంపై స్పర్శ లేని మచ్చలు ఉన్న సమయంలో ఎంబీ కేసులుగా పరిగణించారు. ప్రస్తుతం జనగామ జిల్లాలో పీబీ కేసులు–2, ఎంబీ కేసులు 34 ఉన్నట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. పాలకుర్తి టౌన్: జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ డీఆర్డీఏ సెర్ప్ ఎల్ 1, ఎల్ 2 ఎంఎస్, సీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఐకేపీ సీసీ కారుపోతుల వెంకటేశ్వర్లు గౌడ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన సంఘ సమావేశంలో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా నంగునూరు సదానందం, కోశాధికారిగా రమాదేవి, ఉపాధ్యక్షులుగా తూముకుంట్ల కవిత, ఉమాదేవి, సహదేవు, సహాయ కార్యదర్శిగా నర్ర శ్రీకాంత్రెడ్డి, గోర శంకర్, అంకాల సోమనారాయణ, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని అడిషనల్ డీఆర్డీఓ నూరుద్దీన్ అభినందనలు తెలిపారు. దేవరుప్పుల: నేడు (ఆదివారం) సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయంలో నిర్వహించ తలపెట్టిన ఉద్యాన్ ఉత్సవ్లో పాల్గొనేందుకు అప్పిరెడ్డిపల్లెకు చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సోమరాజు బృందానికి శనివారం రాత్రి ఆహ్వానం అందింది. ఈయనతోపాటు రాసాల ప్రభాకర్, గడ్డం రజితాద్రి, సారంగపాణి, మురళి కృష్ణ, వెంకటాద్రి, కుమార్ స్పందన, చెరువు లక్ష్మయ్య, పిల్లిట్ల మహేశ్వర్ తదితరులు పాల్గొననున్నారు. కిడ్నాప్ కలకలం!జనగామ: జనగామ పట్టణంలో ఓ విద్యార్థిని కిడ్నాప్ చేశారనే కలకలం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 2న (శుక్రవారం) విద్యార్థి ఇంటి నుంచి కాలినడకన పాఠశాలకు వచ్చే క్రమంలో కిడ్నాప్ జరిగినట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రెడ్డి స్ట్రీట్ ఏరియాలో ఓ స్కూల్ వ్యాన్ మాదిరిగా ఉన్న వాహనంలో గుర్తుతెలియని వ్యక్తులు సదరు విద్యార్థిని బలవంతంగా ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. మహానగరంలోని ఓ పు ణ్యక్షేత్రం సమీపంలో వ్యాన్ నిలుపగా, విద్యార్థి టాయిలెట్ కోసం అంటూ కిందకు దిగి వారి కళ్లు గప్పి తప్పించుకుని, సమీపంలోని ఓ దుకాణం వద్దకు చేరుకుని తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి జరిగిన సంగతి వివరించినట్లు సమాచారం. వెంటనే హైదరాబాద్లో ఉన్న మ రో బంధువు అక్కడకు చేరుకుని బాబును తీసు కు వెళ్లగా, స్వల్ప గాయం కూడా అయినట్లు పట్టణంలో జరుగుతున్న చర్చను బట్టి తెలిసింది. సదరు వాహనంలో మరో 10 మంది వరకు పిల్లలు ఉన్నారని కిడ్నాప్కు గురైన బాబు ఇంటికి వచ్చిన తర్వాత వివరించినట్లు తెలిసింది. ఈ విషయమై సీఐ సత్యనారాయణరెడ్డిని అడుగగా తమకు ఎలాంటి పిటిషన్ రాలేదని, అయినప్పటికీ అలర్టుగా ఉన్నామన్నారు. -
ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణంపై సమీక్ష
జఫర్గఢ్: జఫర్గఢ్ మండలంలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాల నిర్మాణంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంబంధిత ఉన్నతాధికారులతో హైదరాబాద్లోని రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డిజైన్, మౌలిక వసతులు, పనుల పురోగతి, పూర్తి చేసే గడువు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ నెల 10వ తేదీన పాఠశాల నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించడంతో పాటు ఏమైన ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకరావాలని సూచించారు. ఈ సమావేశంలో సంస్థ ఎండీ గణపతిరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ఒగ్గు పదం.. డోలు పాదం
పాటకు ఆట తోడైంది. జానపద సాహిత్యం మరో మలుపు తిరిగింది. తెలుగు కీర్తి విశ్వవ్యాప్తం చేసేందుకు పల్లె నుంచి ఆ ప్రయాణం మొదలైంది. వీనుల విందైన ఒగ్గు కథకు డోలు విన్యాసాలు దృశ్యరూపకాలవుతున్నాయి. ఈ నెల 26న గణతంత్ర వేడుకల సందర్భంగా ఢిల్లీ పరేడ్లో జనగామ జిల్లా లింగాలఘణపురం కళాకారులు పదం పలుకుతూ పాదం లయబద్ధంగా కదుపుతూ ఒగ్గుడోలు ప్రదర్శన ఇవ్వనున్నారు. వారి ఆధునిక అడుగుల సవ్వడిపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. – లింగాలఘణపురంజనగామ జిల్లా లింగాలఘణపురం మండలం మాణిక్యాపురానికి చెందిన ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ పురస్కార గ్రహీత డాక్టర్ ఒగ్గు రవి బృందం ఈ నెల26న ఢిల్లీ పరేడ్లో ప్రదర్శన ఇవ్వనుంది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నుంచి వీరికి ఆహ్వానం అందింది. ఈనెల 8న ఢిల్లీ వెళ్లి అక్కడే 25 వరకు రిహార్సల్స్ చేసి 26న ఢిల్లీ కర్తవ్యపథ్ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ప్రదర్శన ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతంలో మొదలైన వీరి ఒగ్గుడోలు విన్యాసం తొలిసారి ఢిల్లీ పరేడ్లో ఆకట్టుకోనుంది. చుక్కా సత్తయ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. మండలంలోని మాణిక్యాపురానికి చెందిన ఒగ్గు కథ పితామహుడు చుక్కా సత్తయ్య కథకు డోలు విన్యాసం తోడై అనేక ప్రదర్శనలతో దేశవిదేశాల్లో ఎన్నోసార్లు కళాకారులు డోలు విన్యాసాన్ని ప్రదర్శించారు. చుక్కా సత్తయ్య వారసత్వాన్ని అదే గ్రామానికి చెందిన చౌదరిపల్లి రవికుమార్ అలియాస్ ఒగ్గు రవి పుణికి పుచ్చుకుని ప్రదర్శనలు ఇస్తున్నారు. డోలు విన్యాసంలో ఓంకారం, సమ్మెట, పాంచ్పటాకా, తాండవం, శిఖరం, కోలాటం ఇలా అనేక రకాల డోలు విన్యాసాలతో పాటు దశావతారాలు, పోతరాజులు, శివసత్తులు, విష్ణురూపం, శివశక్తుల విన్యాసం వంటి అనేక ప్రదర్శనల్లో దాదాపు 5 వేల మంది యువకళాకారులకు శిక్షణ ఇచ్చారు. దేశవిదేశాల్లో 26 ఏళ్లుగా ప్రదర్శనలు.. ఒగ్గు రవి, బృందం సుమారు 26 ఏళ్లుగా దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చింది. తెలంగాణ సంగీత నాటక అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్, తాజ్ ఉత్సవాలు, అంతర్జాతీయ వేదికలతో దేశంలోని పలు రాష్ట్రాల్లో తమ ప్రదర్శనలిచ్చారు. అంతేకాకుండా స్పెయిన్, మలేషియా, న్యూజిలాండ్, సింగపూర్, దోహ వంటి తదితర 12 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. కాగా, ఢిల్లీ పరేడ్లో ఒగ్గుడోలు విన్యాసాల ప్రదర్శనకు తెలంగాణ నుంచి 30 మంది కళాకారుల బృందం వెళ్తుండగా.. జనగామ జిల్లా నుంచి చౌదరిపల్లి రవికుమార్, మరికుక్కల అశోక్, గువ్వల మధు ఉన్నారు.విన్యాస శిక్షణకు న్యాయం జరిగింది.. ఎన్నో ఏళ్లుగా ఒగ్గుడోలు ప్రదర్శనలో ఉస్తాద్ ఒగ్గు రవి ఇచ్చిన శిక్షణకు న్యాయం జరిగింది. ఇంతటి అవకాశం కల్పించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా మా గురువైన ఒగ్గు రవి కష్టానికి తగిన ఫలితం దక్కింది. మేమంతా అక్కడ విన్యాసాలు చేయనుండడం ఎంతో ఆనందాన్నిస్తోంది.ఆనందంగా ఉంది.. ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు విన్యాసాల ప్రదర్శనకు అవకాశం రావడం ఆనందంగా ఉంది. దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చాం. కానీ, ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎదుట ప్రదర్శనలు ఇచ్చే అవకాశం రావడం సంతోషంగా ఉంది. భారత ప్రభుత్వానికి, తెలంగాణకు రుణపడి ఉన్నాం. ఉపరాష్ట్రపతితో ఒగ్గుడోలు కళాకారులు (ఫైల్)అస్సలు ఊహించలే.. గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు విన్యాసానికి అవకాశం దక్కుతుందని అస్సలు ఊహించలే. ఎన్నో చోట్ల ప్రదర్శనలు ఇచ్చాం. ఇలాంటి అవకాశం రావడం సంతోషం. భవిష్యత్లో మరెన్నో అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాం. – మరికుక్కల అశోక్, మాణిక్యాపురం, ఒగ్గుడోలు కళాకారుడు ●ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన– ఒగ్గు, రవికుమార్, మాణిక్యాపురం (ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ జాతీయ పురస్కార గ్రహీత) గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు ప్రదర్శనకు ఓరుగల్లు కళాకారులు మాణిక్యాపురం కళాకారుడు ఒగ్గు రవి బృందానికి అందిన ఆహ్వానం జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపునకు అవకాశం 8న ఢిల్లీకి వెళ్లనున్న కళాకారుల బృందం.. 25 వరకు రిహార్సల్స్ -
తప్పుల తడక!
జనగామ: పురపాలిక ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని, వందలాది ఓట్లు మిస్సింగ్పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఓటరు జాబి తాను ప్రామాణికంగా తీసుకుని మున్సిపల్ ఎన్ని కల కోసం వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం చేసే సమయంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనగామ మున్సిపల్లో విలీనమైన శివారు ప్రాంతాల ఓటరు జాబితాలో తమ పేర్లు కనిపించకపోవడంతో ఆ ప్రాంత ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అంతా ఆగమాగం! ఆరు సంవత్సరాల క్రితమే జనగామ పురపాలిక పరిధిలో శామీర్పేట పరిధిలోని వికాస్నగర్, అరవింద్నగర్కు చెందిన 0.79 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలోని 125, 127, 128, 131, 132, 141, 142, 143, 144, 145, 146, 147, 148, 149, 179, యశ్వంతాపూర్ శివారులో 0.53 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో 191, 192, 193/ఏ, 193/బీ, 194, 195, 198/1, 199/2, 200/2, 201, చీటకోడూరు శివారు రాజీవ్నగర్ పరిధిలోని 0.19 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో 88/ఏ, 88/బీ, 89/ఏ, 89/బీ, 90, 91 ఇంటి నంబర్ల పరిధిలో 318 మంది జనగామ మున్సిపల్లో విలీనం చేశారు. ఇందులో విలీనమైన శామీర్పేట శివారు గ్రామాలకు చెందిన ప్రజలు ప్రస్తుత మున్సిపల్ ముసాయిదా జాబితాలో తమ పేర్లు కనిపించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన వీరు, పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామాల్లో ఓటు కోల్పోయి, ఇప్పుడు మున్సిపల్ ముసాయిదా జాబితాలో కూడా కనిపించకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. శామీర్పేట గ్రామస్తులు డీలిమిటేషన్ తర్వాత జనగామ మున్సిపల్ పరిధిలోకి వచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఇంటి నంబర్ల కేటాయింపు జరగలేదు. ఫలితంగా పంచాయతీకి చెందిన పాత ఇంటి నంబర్లే కొనసాగుతుండగా, వికాస్ కాలనీ, అరవింద కాలనీ వంటి కొత్త కాలనీల్లో 100కు పైగా ఓట్లు ముసాయిదా జాబితాలో కనిపించకపోవడం స్థానికులను కలవరపరుస్తోంది. స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ పరిధిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలో ఓటర్ల పేర్లు లేకపోవడం, వార్డుల వారీగా భారీగా మిస్సింగ్ నమోదు కావడం అక్కడి ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. ప్రతీ పౌరుడికి ఓటు హక్కు కల్పించే బాధ్యత అధికారులదేనని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా 13వ వార్డులో సైతం 250 ఓట్ల వరకు అదనంగా కలపడంపై ఫిర్యాదు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 8వ వార్డుకు చెందిన ఓటర్ల మిస్సింగ్పై బీజేపీ నాయకులు శివరాజ్యాదవ్, మహంకాళి హరిశ్చంద్రగుప్త ఆధ్వర్యంలో కమిషనర్కు వినతి చేశారు. జనగామ శివారు ప్రాంతాల వాసుల ఆందోళన పురపాలికలో ఓట్లు లేకుండా పన్నులు ఎలా తీసుకుంటారు? ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ముసాయిదా ఓటరు జాబితాపై ప్రస్తుతం అధికారులు అభ్యంతరాలను స్వీకరిస్తున్నప్పటికీ చివరి వరకు మిస్సింగ్ ఓటర్లు, వార్డు మార్పులు వంటి అన్ని వినతులకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. జనగామ కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున తమ వివరాలు చెక్ చేసుకోవటం కొనసాగిస్తున్నారు. -
నాణ్యమైన బియ్యం అందించాలి
స్టేషన్ఘన్పూర్: కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్ చేసి ప్రభుత్వం నిర్ధేశించిన గడుపులోగా సివిల్ సప్లయీస్ కార్పొరేషన్కు మిల్లర్లు నాణ్యమైన సీఎంఆర్ బియ్యాన్ని అందించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ బెన్షాలోమ్ అన్నారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిఽధిలోని శివునిపల్లిలోని ఏఎంసీ గోదాంలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) సేకరణ కేంద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి సీఎంఆర్ సేకరణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. బియ్యం సేకరణలో మిల్లర్లు బాధ్యతగా వ్యవహరించాలని, ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యమైన బియ్యాన్ని సివిల్ సప్లయీస్ కార్పొరేషన్కు అందించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని జా ప్యం లేకుండా వెంటనే మిల్లింగ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ డీఎస్ వెంకన్న, త హసీల్దార్ వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయీస్ డీఎం హ తీరాం, ఎస్డబ్ల్యూసీ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ జె.లావణ్యశిరీష్రెడ్డి, బెలిదె వెంకన్న, బెలిదె సతీష్, డీటీలు, మిల్లర్లు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ బెన్షాలోమ్ -
పూలేను ఆదర్శంగా తీసుకోవాలి
జనగామ రూరల్: భారత తొలి మహిళా గురువు సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం, పూలే జయంతి సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాటి సామాజిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటీకీ బాలికల విద్య కోసం పాఠశాలలు నడపడం సావిత్రిబాయి అపారమైన సాహసాన్ని, ధైర్యాన్ని సూచిస్తుందన్నారు. అనంతరం ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు ధ్రువపత్రాలు, మెమోంటోలు ప్రదానం చేశారు. లింగాలఘణపురం విద్యార్థుల కథా సంకలన పుస్తకం ఆవి ష్కరించారు. కార్యక్రమంలో ఏడీ సత్యనారాయణ మూర్తి, చంద్రభాను, ఏఎంఓ శ్రీనివాస్, గౌసియా బేగం, నాగరాజు, ఉపేందర్ పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన కలెక్టరేట్లోని ఈవీఎం గోదాంను సాధారణ పరిశీలనలో భాగంగా శనివారం కలెక్టర్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రపరిచిన ఈవీఎం యూనిట్లు, వీవీప్యాట్లు, కంట్రోల్ యూనిట్లు, బాలట్ యూనిట్ల స్థితిగతులు, సీలింగ్ విధానం, రిజిస్టర్ల నిర్వహణ, సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేయాలి జనగామ: ఓటర్ల మ్యాపింగ్కు సంబంధించి నిర్ధేశించిన లక్ష్యం పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి ఆదేశించారు. శనివారం ఓటర్ల మ్యా పింగ్ ప్రక్రియపై జిల్లా కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాబోయే 12 రోజు ల్లోగా నిర్ధేశించిన లక్ష్యం మేరకు ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. వీసీలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, ఆర్డీఓ గోపీరామ్ పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
జనగామ రూరల్: మహిళల ఆర్థిక ప్రగతికి ఇందిరా మహిళా శక్తి ఎంతో దోహదపడుతోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అవరణలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వనిత టీ స్టాళ్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు బ్యాంకు లింకేజీ ద్వారా సీ్త్ర నిధి నుంచి పొందిన రుణాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద రూ.1.25లక్షల పెట్టుబడితో వారాహి మహిళా పొదుపు సంఘం సభ్యురాలిచే వనిత టీ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వసంత, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ హర్షవర్ధన్, స్వయం సహాయక సభ్యులు పాల్గొన్నారు. యువతకు ఉచిత స్కిల్ ట్రైనింగ్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఉచిత స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం నిర్వహించిన డ్రైవ్లో ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా లాజిస్టిక్స్ రంగానికి చెందిన వివిధ విభాగాల్లో నైపుణ్య శిక్షణ అందించి శిక్షణ పూర్తయిన అనంతరం 100 శాతం ప్లేస్మెంట్తో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జ రుగుతుందన్నారు. శిక్షణ సందర్భంగా స్కిల్ ఇండి యా సర్టిఫికేషన్ కలిగి ఉండడంతో పాటు భోజనం, వసతి సౌకర్యాలు కూడా ఉంటాయన్నారు. కాగా ఈ డ్రైవ్లో 40 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వసంత, ఏపీడీ నూరో ద్దిన్, మౌనిక, లాజిస్టిక్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా అండర్ స్కిల్ ఇండియా సభ్యులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
అధైర్యపడకండి.. అండగా ఉంటా
చిల్పూరు: ‘అధైర్య పడకండి..అండగా నేనుంటా..’అని జర్మనీలోని అపార్ట్మెంట్లో జరిగిన ఓ ప్రమాదంలో ఇటీవల మృతిచెందిన హృతిక్రెడ్డి తల్లిదండ్రులను మండలంలోని మల్కాపూర్ గ్రామంలో ఎంపీ కడియం కావ్య శుక్రవారం పరామర్శించారు. మృతుడి తల్లిదండ్రులు తోకల సంపత్రెడ్డి– కరుణలను ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం ఎంబసీకి సెలవులు ఉండడంతో మృతదేహం తీసుకరావడానికి కొంత సమయం పడుతుందని, సెలవులు ముగియగానే తీసుకొచ్చే విధంగా తాను కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎడవెళ్లి లావణ్యమల్లారెడ్డి, ఉపసర్పంచ్ పశుల వెంకటేష్, నాయకులు యశ్వంతరెడ్డి, జంగం రవి, పుల్యాల నారాయణరెడ్డి, నాగిడి సంపత్రెడ్డి, బండారి ప్రభాకర్, బోగి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. హృతిక్రెడ్డి తల్లిదండ్రులకు ఎంపీ కావ్య ఓదార్పు -
మంచుకురిసే.. మనసు మురిసే
పాలకుర్తి శ్రీసోమేశ్వరాలయం ముందు కమ్ముకున్న పొగమంచుజిల్లాలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి మంచు దట్టంగా కమ్ముకుంది. ఉదయం 11 గంటలు దాటినా మంచు వీడకపోవడంతో వరంగల్–హైదరాబాద్, విజయవాడ–దుద్దెడ ప్రధాన హైవేలతో పాటు నర్మెట, కళ్లెం తదితర ప్రాంతాలకు వెళ్లే రహదారుల మంచులో దిగ్బంధమైపోయాయి. వాహనదారులు ఫ్లడ్లైట్ల వెలుతురుతోనే రాకపోకలు సాగించాల్సి వచ్చింది. రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ కార్మికులు మంచు తెరలను చీల్చుకుని పొలాలకు వెళ్లారు. స్టేషన్ఘన్పూర్లో ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనదారులు పొగమంచుతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వాతావరణం ఆహ్లాదకరంగా మారడం ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. కాగా, రోడ్లపై వెళ్లే వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. –జనగామ/ స్టేషన్ఘన్పూర్/పాలకుర్తి టౌన్స్టేషన్ ఘన్పూర్ వివేకానంద చౌరస్తా వద్ద పొగమంచు -
సీఎంను కలిసిన డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి
జనగామ: నూతన సంవత్సరం పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ను డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి శుక్రవారం హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పార్టీ కార్యక్రమాలపై వారికి వివరించారు. జఫర్గఢ్ : మండల కేంద్రంలోని మోడల్ స్కూ ల్కు చెందిన టి.విజయ్, టి.చరణ్, సాయితేజ అనే ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ కె. శ్రీకాంత్ తెలిపారు. మండల కేంద్రంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీస్టేడియంలో జరిగిన కంట్రీ అథ్లెటిక్స్ సెలక్షన్ పోటీల్లో ముగ్గురు విద్యార్థులు ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ నెల 3, 4 తేదీల్లో హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నట్లు తెలిపారు. విద్యార్థులతో పాటు పీఈటీలు బి.రాజు, శ్రీనాథ్లను ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు. రఘునాథపల్లి: మండలంలోని వెల్ది ఆదర్శ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు కందగట్ల గణేశ్ను విద్యారత్న అవార్డు వరించింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన గణేశ్ మూడు దశాబ్దాలుగా ఆంగ్ల విద్యా బోధన చేస్తూ విద్యార్థుల ఉన్నతికి చేస్తున్న కృషిని గుర్తించి ఉత్తరప్రదేశ్లోని విజన్ వెల్నెస్ ఫౌండేషన్ అవార్డు, ప్రశంసపత్రం పంపించింది. శుక్రవారం ప్రిన్సిపాల్ పాలకుర్తి శ్రీధర్ పాఠశాలలో గణేశ్కు అవార్డు ప్రదానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత గణేశ్ మాట్లాడుతూ అవార్డు మరింత బాధ్యతను పెంచిందన్నారు. ‘పింగిళి’లో కథా సర్టిఫికెట్ కోర్సు షురూవిద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో ‘సృజనాత్మక రచన, కథ’ అంశంపై సర్టిఫికెట్ కోర్సును ముఖ్య అతిథిగా హైదరాబాద్ ప్రెస్ బ్యూరో డైరెక్టర్ కోటేశ్వర్రావు శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కథలు మానవ జీవితాన్ని ప్రతిబింబింపజేస్తాయన్నారు. కార్యక్రమంలో ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య చంద్రమౌళి, తెలుగు విభాగాధిపతి ఎస్.మధు, అధ్యాపకులు లక్ష్మీకాంతం, రామారత్నమాల, సునీత, రామాకృష్ణారెడ్డి, మాధవి, యుగేంధర్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధరైతులకు ఆర్థిక భరోసా
పాలకుర్తి టౌన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా చిన్న, సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కలుగనుంది. 60 ఏళ్లు నిండిన సన్న, చిన్నకారు రైతులకు ఆర్థిక భద్రతను కల్పించాలాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. రైతులకు ప్రత్యేకంగా పెన్షన్ను అందించాలనేది ఈ పథకం ముఖ్యఉద్దేశం. అర్హులెవరంటే.. ఐదెకరాల వ్యవసాయ భూమి కలిగి ఉండి 18 నుంచి 40 సంవత్సరాల వయసున్న రైతులు ఈ పథకానికి అర్హులు. భూ రికార్డుల్లో వారిపేరు ఉండాలి. నిర్ణీత ప్రీమియం చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు, సామాజిక భద్రత పథకాలను అందుకుంటున్న వారు అనర్హులు. దరఖాస్తు చేసుకోండిలా.. అర్హులైన రైతులు తమకు దగ్గరలోని సీఎస్సీ కేంద్రాలు, సీఎం కిసాన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ నెంబర్, నామినీ, బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయగానే పెన్షన్ కార్డు జారీ అవుతుంది. ప్రతి నెల ప్రీమియం ఖాతా నుంచి నేరుగా డెబిట్ అవుతుంది. వయసు ఆధారంగా ప్రతి నెలా రూ.55 నుంచి రూ.200 వరకు ప్రీమియం చెల్లించాలి. 60ఏళ్లు నిండగానే ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్ వస్తుంది. ఒకవేళ రైతు చనిపోతే నామినికి నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందుతుంది. కిసాన్ మానధన్ యోజనతో మేలు -
సందేహాల ‘జాబితా’
జనగామ: మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓట రు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల పరిధిలో శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. ప్రజలు సులభంగా అభ్యంతరాలు తెలపడానికి పురపాలక కా ర్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయం, కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. వార్డుల వారీగా మార్పులు, చేర్పులు, చనిపోయిన వారి పేర్ల తొలగింపు, పొరబడిన ఎంట్రీలకు సంబంధించి ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు రాకపోవడంతో ప్రజల నుంచి వచ్చే సందేహాలను నివృత్తి చేయడంలో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనగామ పట్టణం 13వ వార్డులో ప్రస్తుతం 1,930 ఓట్లు నమోదై ఉండగా, అందులో సుమారు 250కి పైగా ఓట్లు సమీప వార్డులతో పాటు మరణించిన వ్యక్తుల పేర్లు కూడా ఉన్నట్లు పార్టీ నాయకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పానుగంటి సువార్తతో సహా స్థానిక నేతలు కమిషనర్ మహేశ్వర్రెడ్డిని కలిసి లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తెలియజేశారు. 13వ వార్డుతో సంబంధం లేని ఓట్లను వెంటనే జాబితా నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఓటరు జాబితా పూర్తిస్థాయి పారదర్శకతతో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్ని పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాయి. ముఖ్యంగా చనిపోయిన వారి పేర్లను కచ్చితంగా తొలగించడం, వార్డుల మార్పులు, చేర్పులకు అవకాశం ఇవ్వడం అవసరమని అభిప్రాయపడుతున్నాయి. యంత్రాంగానికి ఇంకా సమయం ఉండడంతో తుది జాబితా పారదర్శకంగా ఉండాలనే ప్రజలు కోరుతున్నారు. 2025 స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా జనగామ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల వార్డుల వారీగా రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరు(ఏఆర్ఓ) నియామక జాబితాను విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు ఈ నియామకాలు చేపట్టినట్లు కలెక్టర్ జారీ చేసిన ఆర్డర్లో పేర్కొన్నారు. మున్సిపాలిటీల వార్డు కౌన్సిలర్ పదవుల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.జనగామ మున్సిపాలిటీకి చెందిన 30 వార్డులు, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీకి చెందిన 18 వార్డులకు కలిపి మొత్తం పీజీ హెచ్ఎంలను 26 ఆర్ఓలు, 26 ఏఆర్ఓలు నియమించగా, అదనంగా 10 మంది రిజర్వులో ఉంటారు. ఇందులో జనగామలో 20 మంది ఆర్ఓ, 20 మంది ఏఆర్ఓ, స్టేషన్ ఘన్పూర్లో ముగ్గురు ఆర్ఓ, ముగ్గురు ఏఆర్ఓలు ఉన్నారు. ప్రతి అధికారి మూడు వార్డుల చొప్పున క్లస్టర్ ఆధారంగా బాధ్యతలు స్వీకరించ నున్నారు. జాబితాలో ఉన్న ప్రతి ఆర్ఓ, ఏఆర్ఓలు తమకు కేటాయించిన జాబ్ చార్ట్ను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఏ తప్పిదం జరిగినా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జనగామ 13వ వార్డులో సంబంధం లేని ఓట్లు ఎన్నికల మార్గదర్శకాలు లేక గందరగోళం అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు -
పాత నేరస్తులపై నిఘా పెట్టండి
● సీపీ సన్ప్రీత్ సింగ్రామన్నపేట: గతంలో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలపై నిఘా ఉంచాలని సీసీఎస్ పోలీసులను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా.. శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ సిటీ క్రైమ్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. సీసీఎస్కు చేరుకున్న సీపీకి అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. చోరీ కేసుల్లో జైలుకి వెళ్లి తిరిగి విడుదలైన నిందితుల సమాచారం సేకరించాలని, ఇతర రాష్ట్రాల్లో చోరీ కేసుల్లో పట్టుబడిన నిందితుల వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఉత్తమ పరిశోధనలకు పారితోషికంకేయూ క్యాంపస్: ఉత్తమ పరిశోధనలను ప్రోత్సహించేందుకు పరిశోధనాపత్రం, ఉత్తమ ప్రాజెక్టు ఉత్తమ ప్రచురణలకు నగదు పారితోషికం అందజేయనున్నట్లు కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం శుక్రవారం తెలిపారు. అధ్యాపకులు, పరిశోధక విద్యార్ధులు అవార్డులకు అర్హులని పేర్కొన్నారు. మొదటి బహుమతి కింద రూ.15,000, ద్వితీయ బహుమతి రూ.10 వేలు, తృతీయ బహుమతి రూ.5వేలు గణతంత్ర దినోత్సవం రోజున అందజేయనున్నట్లు పేర్కొన్నారు. 10లోపు అకడమిక్ బ్రాంచ్లో ఆధారాలతోపాటు దరఖాస్తుల సమర్పించాలన్నారు. -
తాగేశారు
జనగామ: నూతన సంవత్సరం వేడుకలను పురస్కరించుకొని జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. సాధారణంగా డిసెంబర్ 31, జనవరి 1న మాత్రమే ఎక్కువగా అమ్మకాలు నమోదవుతుంటాయి. ఈసారి వేడుకలకు మూడు రోజుల ముందే ప్రారంభించిన యువత, మద్యం ప్రియులు భారీగా మద్యం కొనుగోలు చేయడంతో ఎకై ్సజ్ శాఖ ఖజానా గణనీయంగా పెరిగింది. మూడు రోజుల్లో 2025 డిసెంబర్ 30, 31, 2026 జనవరి 1 తేదీల్లో రూ.18.61 కోట్ల విలువైన బీర్, లిక్కర్పై విక్రయాలు జరగడం జిల్లాలో ఇంత వరకు లేని రికార్డుగా నిలిచింది. జిల్లాలో 27,997 బీర్ కేసులు, లిక్కర్ కాటన్లు అమ్ముడుపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 50 వైన్స్, 5 బార్ల యజమానులకు ఈసారి నూతన సంవత్సరం, ముందుగానే అంచనా వేసిన దానికంటే ఎక్కువ లాభాలను అందించింది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలు, ఇప్పుడు నూతన సంవత్సరం వేడుకలు, రాబోయే సంక్రాంతి పండగ కొత్తగా లైసెన్స్ పొందిన షాపుల యజమానులకు ఊరటనిచ్చే పరిణామంగా చెప్పుకోవచ్చు. కొత్త సంవత్సరం పురస్కరించుకుని ప్రభుత్వం డిసెంబర్ 31 రాత్రి ప్రత్యేక అనుమతిగా వైన్స్ షాపులకు రాత్రి 12గంటల వరకు, బార్లకు అర్ధరాత్రి 1 గంట వరకు అమ్ముకునే అవకాశం ఇవ్వడంతో కొనుగోళ్లు మరింత పెరిగాయి. సమూహాలుగా చేరి పార్టీలు, ఫ్రెండ్స్ గ్యాదరింగ్, కుటుంబ వేడుకలు అన్నీ కలిపి మద్యం సేల్స్ పెరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు. గతేడాది ఇదే సమయంలో రూ.10.43 కోట్లు మాత్రమే అమ్మకాలు జరగగా, ఈసారి రూ.8కోట్ల మేర పెరిగి రూ.18.61 కోట్ల సేల్స్ నమోదవడం గ మనార్హం. మండల కేంద్రాల్లోని ప్రభుత్వ దుకాణాలతో పాటు పలుచోట్ల గ్రామాల్లో బెల్ట్షాపులు కూడా జోరు మీద వ్యాపారం సాగించాయి. ఈ భారీ అమ్మకాలు ఎకై ్సజ్ శాఖకు ఊహించని ఆదాయాన్ని అందించాయి. ఇదిలా ఉండగా, మద్యం తాగి వాహనాలు నడపరాదని పోలీస్ శాఖ ముందుగానే హెచ్చరించినప్పటికీ 80 మంది డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డారు. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే వేడుకల్లో మద్యం వినియోగం భారీగా పెరిగినప్పటికీ, అధికారులు భద్రతపరమైన అంశాలపై ప్రజలు మరింత శ్రద్ధ చూపాలని సూచించడంతో రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గాయి. జిల్లా మద్యం సేల్స్లో వచ్చిన ఈ పెరుగుదల రాబోయే సంక్రాంతి పండుగ సమయంలో మరింత బిజినెస్కు దారి తీయవచ్చని వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే రూ.8కోట్లు పెరుగుదల కలిసి వచ్చిన ప్రత్యేక సమయం అనుమతులు మూడు రోజుల్లో 27,997 కాటన్లు ఖాళీ! డిసెంబర్ 30 నుంచి జనవరి 1వ తేదీ వరకు మద్యం అమ్మకాలు(కాటన్లలో) తేదీ ఐఎంఎల్ బీర్లు మొత్తం సేల్ 30, 01 17,211 10,786 27,997 రూ.18.61కోట్లు -
సోమన్న హుండీ ఆదాయం రూ.18లక్షలు
పాలకుర్తి టౌన్ : శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం హుండీ ఆదాయం రూ.18,04,055లు వ చ్చినట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న తెలిపా రు. 2025 అక్టోబర్ 9 నుంచి 2026 జనవరి 1 వరకు భక్తులు హుండీలో సమర్పించిన 85 రోజుల కానుకల ఆదాయన్ని శుక్రవారం ఆలయ కల్యాణ మండపంలో కొడవటూర్ శ్రీసిద్దేశ్వర ఆలయ ఈఓ చిందం వంశీ పర్యవేక్షణలో లెక్కించారు. అమెరికా కరెన్సీ నోట్లు 13 (88 డాలర్లు) వచ్చిన్నట్లు తెలిపారు. హుండీ లెక్కింపులో సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ప్రధాన అర్చకుడు దేవగిరి లక్ష్మన్న, ఆలయ సిబ్బంది, శ్రీసోమేశ్వర, రాజరాజేశ్వర సేవా ట్రస్టుల సభ్యులు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లా అభివృద్ధిపథంలో ముందుకెళ్లాలి
● నూతన సంవత్సర వేడుకల్లో కలెక్టర్ రిజ్వాన్ బాషాజనగామ: జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు సహకారం అందిస్తున్నారని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఈసందర్భంగా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల సందర్భంగా కలెక్టర్ పిలుపు మేరకు..ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చినవారు పేద విద్యార్థులకు అవసరమైన దుప్పట్లు, బ్లాంకెట్లు, నోట్బుక్స్, పెన్నులు వంటి వస్తువులను అందజేశారు. కలెక్టర్ను కలిసిన వారిలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, జెడ్పీ డిప్యూటీ సీఈఓసరిత, డీసీఓ కోదండరాములు, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, తహసీల్దార్లు హుస్సేన్, రవీందర్, మోసిన్ తదితర ఉన్నతాధికారులు, ప్రభుత్వ సిబ్బంది ఉన్నారు. భద్రతా మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ కలెక్టరేట్లో జిల్లా రవాణాశాఖ అధికారి జీవీఎస్ గౌడ్తో కలిసి కలెక్టర్ భద్రతా మాసోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు అన్ని పాఠశాలల్లో రోడ్డు సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. టీఎన్జీఓ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ జనగామ టీఎన్జీఓ యూనియన్ 2026 క్యాలెండర్ను జిల్లా యూనియన్ అధ్యక్షుడు చైర్మన్ ఖాజా షరీఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పెండెల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పేరవరం ప్రభాకర్, అసోసియేట్అధ్యక్షులు రాజనర్స య్య, కోశాధికారి హాఫిజ్ తదితరులు పాల్గొన్నారు. -
అజ్మీరా తండాలో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
జనగామ: మండలంలోని ఎర్రగొల్లపహాడ్ అజ్మీరా తండాలో ఎన్పీడీసీఎల్ అధికారులు కొత్త ట్రాన్స్ఫార్మర్ బిగించి విద్యుత్ పునరుద్ధరించారు. అజ్మీరాతండాలో తన పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి 15 రోజులు గడిచిపోతున్నా పట్టించుకోవడం లేదని గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన బాధిత రైతు రవి.. కలెక్టర్ కాళ్లుమొక్కిన సంగతి తెలిసిందే. రైతు దీనగాఽథను ‘ట్రాన్స్ ఫార్మర్ ఇప్పించండి..’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్పీడీసీఎల్ అధికారులు తండాలో నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయడంతో సమస్యకు పరిష్కారం లభించింది. -
స్మారకం..విస్మరించి!
పాలకుర్తి టౌన్: తెలుగు భాషకు అజరామరమైన కీర్తితెచ్చిన మహాకవి బమ్మెర పోతన జన్మించిన బమ్మెరలో ఆయన పేరుతో చేపట్టిన ‘పోతన స్మారక నిర్మాణం’ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో ఆ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. గతంలో ప్రారంభసమయంలో వేగంగా కొనసాగిన పనులు అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. దీనిపై సాహితీవేత్తలు, కవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం బమ్మెర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు టూరిజం ప్యాకేజీలో భాగంగా రూ.7.50 కోట్లు కేటాయించింది. 2018 మే 28న అప్పటీ సీఎం కేసీఆర్ స్వయంగా బమ్మెరకు వచ్చి పనులకు శంకుస్థాపన చేశారు. బమ్మెరకు ప్రత్యేక చరిత్ర ఉండడంతో ప్రాధాన్యరీత్యా పనులు చేస్తూ వచ్చారు. కాంట్రాక్టర్ చొరవ చూపి పనులు పూర్తయ్యేందుకు చర్యలు చేపట్టారు. అయితే బడ్జెట్ సరిపోకపోవడంతో పనులు చేయలేనని చేతులేత్తేశారు. ప్రస్తుతం మరో రూ.6.50 కోట్లు మంజూరు చేసినా కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు మరో కాంట్రాక్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. పోతన స్మారక మందిరంలో నిర్మించిన భవనాలు పూర్తయ్యాయి. కానీ, చేయాల్సిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. గతేడాది మార్చిలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బమ్మెరరలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనాటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి పనులు చేపట్టిన దాఖాలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. గత రెండేళ్ల నుంచి పర్యాటక పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో పోతన స్మారక అభివృద్ధి పనుల్లో పిచ్చి, తుమ్మచెట్లు పెరగడంతో అసాంఘిక కార్యాకపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.పగలు, రాత్రి తేడాలేకుండా మందుబాబులకు అడ్డాగా మారిందని కవులు, రచయితలు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని పోతన ఊరిలో చేస్తున్న పర్యాటక అబివృద్ధి పనుల్లో పోతన సమాధి, పోతన మోటతోలిన బావి, అక్కమాంబ వాగు, విద్యుత్, టైల్స్ పనులు, ప్లాస్టింగ్, పార్కింగ్, ఆర్చి గేట్లు, పోతన కాంస్య విగ్రహం, ఆర్ట్ క్రాప్ట్ భవనాలు పూర్తి చేయాల్సి ఉంది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా చారిత్రక ప్రదేశం పర్యాటకాభివృద్ధిపై నీలినీడలు బడ్జెట్ సరిపోక చేతులెత్తేసిన కాంట్రాక్టర్ కొత్త కాంట్రాక్టర్కు పనులు అప్పగించాలని స్థానికుల డిమాండ్ -
సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ ఆదర్శం
● డీటీఓ జీవీఎస్గౌడ్జనగామ: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడంలో ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డు భద్రతా ని యమావళిని పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి జీవీఎస్గౌడ్ సూచించారు. జనగామ ఆర్టీసీ డిపోలో గురువారం రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మేనేజర్ స్వాతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డీటీఓ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ ఆదర్శంగా నిలుస్తోందని, డ్రైవర్లు సైతం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో డిపో సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
నూతనోత్సాహం
కొత్త సంవత్సరానికి జిల్లావాసుల ఘన స్వాగతం ● సప్తవర్ణ ముగ్గులతో శోభితమైన లోగిళ్లు ● ఆలయాలకు పోటెత్తిన భక్తులు ● కేక్ కటింగ్, దావత్లతో పండగ వాతావరణంజనగామ: జిల్లాలో నూతన సంవత్సరం వేడుకలు అంబరాన్నంటాయి. జిల్లా ప్రజలు కోటి ఆశలతో గురువారం తెల్లవారుజాము వరకు కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. ఇళ్ల ముందు లోగిళ్లు రంగురంగుల ముగ్గులతో సప్తవర్ణ శోభితంగా అలంకరించగా, యువతీ యువకులు హోరెత్తించారు. డీసీపీ కార్యాలయంలో డీసీపీ,ఏఎస్పీ, ఏసీపీ, సీఐల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కొత్త సంవత్సరం పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. బచ్చన్నపేట మండలం సిద్దేశ్వరాలయం, చిల్పూరు శ్రీ బుగులు వెంకటేశ్వర, జనగామ చెన్నకేశ్వర, బాణాపురం శ్రీ వెంకటేశ్వరాలయం, శ్రీ ఆంజనేయస్వామి, యశ్వంతాపూర్ శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి, బతుకమ్మకుంట శ్రీ విజయదుర్గామాత, సాయిబాబా, పాలకుర్తి శ్రీసోమేశ్వరాలయం, జీడికల్లోని శ్రీ సీతారామచంద్రస్వామి తదితర ఆలయాలకు వందలాది మంది భక్తులు తరలివచ్చారు. క్రైస్తవులు చర్చిలకు పెద్దఎత్తున తరలివెళ్లి ప్రార్థనలు నిర్వహించారు. -
సీఎంకు కొమ్మూరి శుభాకాంక్షలు
జనగామ: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి గురువారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. సీఎంను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కలిసి సత్కరించి, కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. సాక్షిప్రతినిధి, వరంగల్: వాణిజ్యపన్నులశాఖ వరంగల్ జాయింట్ కమిషనర్ రావులు శ్రీధరాచారి బదిలీ అయ్యారు. సుమారు రెండున్నర సంవత్సరాలకు పైగా పనిచేసిన ఆయనను కమిషనర్ కమర్షియల్ టాక్స్ (సీసీటీ) కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్లో జేసీగా ఉన్న తాళ్లపల్లి శ్రీనివాస్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎం.రఘునందన్రావు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలు, నియామకాల్లో భాగంగా కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్న ఉన్నతాధికారులు మొదటగా జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులను బదిలీ చేసినట్లు తెలిసింది. త్వరలోనే దీర్ఘకాలికంగా ఒకేచోట పని చేస్తున్న సీటీఓలు, డీసీటీఓలు, ఏసీటీఓలను కదిలించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉన్నతాధికారులు బదిలీల జాబితాలో ఉన్న వివిధ కేడర్లకు చెందిన అధికారులు, ఉద్యోగులనుంచి ఆప్షన్లు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. నెలరోజుల్లో రూ.11లక్షల మొండి బకాయిల వసూలుపాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి రావాల్సిన వివిధ టెండర్ల మొండిబకాయిదారుల నుంచి రూ.10 లక్షల డీడీలను ఆలయ ఈఓ జప్తు చేశారు. గతంలో ఆలయానికి బకాయి ఉన్న టెండర్దారులు బినామీ పేర్లతో వేలంపాటలో పాల్గొన్నారు. బినామీ టెండర్దారులకు బకాయిదారుల పేరుమీదా తీసిన రెండు 5 లక్షల డీడీలను ఈవో జప్తు చేయడం ఆలయ చరిత్రలోనే సంచలనంగా మారింది. నెల రోజుల్లోనే రూ.11 లక్షల పాత మొండిబకాయిలను ఈఓ లక్ష్మీప్రసన్న రికవరీ చేయడంతో పాటు, మొండిబకాయిదారుల వివరాలతో గ్రామంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనిపై భక్తులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సౌత్జోన్ టోర్నమెంట్కు కేయూ జట్టుకేయూ క్యాంపస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో ఉన్న కోనేరు లక్ష్మయ్య ఫౌండేషన్స్లో ఈనెల 3 నుంచి 6 వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ పురుషుల జట్టు ఎంపికైందని స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య గురువారం తెలిపారు. జట్టులో జి.మోహన్దాస్, వి.శివరామ్, బి.వెంకటేశ్, కె. విశాల్ ఆదిత్య, కె.శ్రితిన్, జె.అనిరుధ్, కె.తులసినాఽథ్ ఉన్నారు. ఈ జట్టుకు హనుమకొండ వాగ్దేవి కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఎ.నాగరాజు కోచ్ కం మేనేజర్గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు. -
ముసాయిదా ఓటరు జాబితా విడుదల
జనగామ: జిల్లాలోని జనగామ మున్సిపాలిటీ, కొత్తగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు గురువారం అధికారికంగా ప్రకటించారు. రెండు మున్సిపాలిటీల్లో కమిషనర్లు మహేశ్వర్రెడ్డి, రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఈ ఓటరు జాబితాను అన్ని వార్డుల్లో ప్ర జలకు అందుబాటులో ఉంచారు. రెండు పురపాలికల్లో 48 వార్డుల పరిధిలో 62,382 మంది ఓటర్లు ఉన్నారు. తుది ఓటర్ల జాబితాను ఈనెల 10వ తేదీన విడుదల చేయనుండగా, ఆ దిశగా కీలక కార్యాచరణ ప్రారంభమైంది. ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియ కొనసాగుతోంది. చేర్పులు, తొలగింపుల విషయంలో ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు ఎన్నికల సంఘం నుంచి రాలేదు. ప్రస్తుతం ఒక కుటుంబం ఓట్లు రెండు వేర్వేరు వార్డుల్లో పడిన సందర్భాల్లో, అదే వార్డులో కలిపే అంశంగానే అభ్యంతరాలు స్వీక రిస్తారనే సమాచారం ఉంది. డిలీషన్ లేదా కొత్త చేర్పులపై ఇంకా స్పష్టత లేకపోవడంతో ప్రజలు, స్థానిక పార్టీల నాయకులు సందిగ్ధంలో ఉన్నారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునే అవకాశంపై కూడా ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం వెలువడలేదు. ముసాయిదా జాబితాను ప్రతి వార్డులో ప్రచురించడంతో ప్రజలు తమ ఓటు ఉన్నదా లేదా అన్నదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తమ పేర్లు వేరే వార్డులకు మారాయా అనే అనుమానాలతో అనేక మంది ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటూ, అభ్యంతరాల ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 5న మున్సిపల్ స్థాయిలో, 6న జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా 9వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి, 10న తుది ఓటరు జాబితాను వెలువరించనున్నారు. ముసాయిదా జాబితా వెలువడడంతో రెండు మున్సిపాలిటీలలో రాజకీయం వేడెక్కింది. తుది జాబితా విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో, పార్టీలు తమ వ్యూహాలను పునర్నిర్మాణం చేసుకుంటున్నాయి. కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాల పరిష్కారం వంటి అంశాలపై స్పష్టత వచ్చాక రాజకీయంగా మరింత కదలికలు కనిపించే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అభ్యంతరాలు, తొలగింపు, చేర్పులపై కరువైన స్పష్టత 10న తుది ఓటరు జాబితాజనగామ మున్సిపల్లో 30 వార్డులు ఉండగా, మొత్తం 43,832 ఓటర్లు ఉన్నట్లు ముసాయిదా ఓటరు జాబితాలో చూపించారు. ఇందులో పురుషులు 21, 247, మహిళలు 22,576, ఇతరులు 9 మంది ఉన్నారు. అత్యధికంగా 13వ వార్డులో 1,930, 5వ వార్డులో 1,800, 4వ వార్డులో 1,749, 3వ వార్డులో 1,655, అతి తక్కువగా 20వ వార్డులో 1,156, 21వ వార్డులో 1,197 ఓటర్లు, 22వ వార్డులో 1,198, 24వ వార్డులో 1,256, 7వ వార్డులో 1,297 మంది ఓటర్లు ఉన్నారు.స్టేషన్ఘన్పూర్ మున్సిపల్లో 18 వార్డుల పరిధిలో 18,550 ఓటర్లు నమోదు కాగా, పురుషులు 8,913, మహిళలు 9,636, ఇతరులు ఒక్కరు ఉన్నారు. అత్యధిక ఓటర్లు 10వ వార్డులో 1,210 ఓటర్లు, 11వ వార్డులో 1,152 ఓటర్లు, 12వ వార్డులో 1,013 ఓటర్లు, అతితక్కువ ఓటర్లు 13వ వార్డులో 912, 15వ వార్డులో 933, 16వ వార్డులో 955 మంది ఓటర్లు ఉన్నారు. రెండు పురపాలికల్లో కూడా ఓటర్ల ధ్రువీకరణ చివరి దశకు చేరుకుంది. అంకెలు పరిశీలనలో ఎలాంటి లోపాలు లేకుండా డేటా నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. -
ఒకటే గమనం.. ఒకటే గమ్యం!
గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026పరీక్షల కాలం.. కొత్త సంవత్సరం ప్రారంభమైన రెండో నెలలో ఇంటర్, మార్చిలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఉంటాయి. జిల్లానుంచి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకుంటారు. సిలబస్ పూర్తయి రివిజన్లు చేసుకోవాలి. పరీక్షలకు కొంత సమయమే ఉంది కాబట్టి మరోసారి రివిజన్లు చేసుకుంటూ షార్ట్ నోట్స్ రాసి పెట్టుకోవాలి. అప్పుడే చదివింది గుర్తుండి పరీక్షలకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. అప్రమత్తతే రక్ష ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక మంది యువత ఆన్లైన్లో పెట్టుబడులు పెడుతూ మోసపోతున్నారు. ఆన్లైన్ ఆర్థిక నేరాల్లో మోసపోతున్న వారు అత్యధికంగా యువకులు, ఉన్నత విద్యావంతులు. అధికారులే. సోషల్ మీడియాలో తెలియని లింకులు ఓపెన్ చేస్తూ.. ఇష్టారీతిన ఆన్లైన్లో పెట్టుబడులు పెడుతున్నారు. డిజిటల్ యుగంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నింటినీ సమన్వయం చేసుకుంటే అద్భుత విజయం కాలంతో పోటీ.. లక్ష్య సాధనలో మేటి కొత్త సంవత్సరం.. సరికొత్త ఆశయాలు.. ఉమ్మడి వరంగల్ జిల్లా యువతలో ఉత్సాహం -
సోమన్న ఆలయ వేలంపాటల ఆదాయం రూ.26లక్షలు
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో 2026 సంవత్సరంలో కొబ్బరికాయలు పూజా ద్రవ్యాలు అమ్ముకునే హక్కు, దేవస్థానానికి వాహనం పూజా సామగ్రి సప్లై చేయు లైసెన్స్ కోసం నిర్వహించిన బహిరంగ వేలం పాట ద్వారా రూ.26,20,000ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న తెలిపారు. బుధవారం ఆలయం కళ్యాణ మండపంలో వేలం పాట నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన నెమురుగొమ్ముల శ్రీనివాస్రావు రూ.26,20,000లు పాట పాడి కొబ్బరికాయలు, పూజాద్రవ్యాలు అమ్ముకునే హక్కు దక్కించుకున్నారు. సరైన పాట రాకపోవడంతో తలనీలాల వేలం వాయిదా వేసినట్ల ఈఓ తెలిపారు. అలాగే ఆలయానికి రావాల్సిన వివిధ టెండర్ల మొండి బకాయిదారుల నుంచి రూ.10 లక్షల డీడీలను జప్తు చేసినట్లు ఈఓ లక్ష్మీప్రసన్న తెలిపారు. -
లక్ష్యాన్ని ఛేదించాలి..
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నన్ను కలిసేందుకు వచ్చేవారు బొకేలు, శాలువాలకు బదులుగా పేద విద్యార్థుల కోసం నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, దుప్పట్లు తీసుకురావాలి. ప్రజల ద్వారా వచ్చే నోటుపుస్తకాలు తదితర మెటీరియల్ను విద్యార్థులకు పంపిణీ చేస్తాం. – జనగామయువత లక్ష్యం వైపు గురి పెట్టాలి. రాష్ట్రంలో త్వరలో పోలీస్ కానిస్టేబుల్, ఇతరత్రా ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాల సాధించాలన్న లక్ష్యం ఏర్పరుచుకుని ఇప్పటినుంచే నిరంతరం ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. పట్టుదలతో చదివి ఉద్యోగాలను సృష్టించుకోవాలి. మరికొందరికి ఉద్యోగాల్ని కల్పించేలా ఎదగాలి. ఏఐ వచ్చాక ఉద్యోగాల తీరు మారిపోయింది.ఇలాంటి సమయంలో ఉద్యోగాలు ఎవరివ్వాలి. అలా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి.వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం ప్రతి కుటుంబానికీ ఆనందం, ఆరోగ్యం, అభివృద్ధి నిండిన సంవత్సరంగా మారాలి. ప్రజల సహకారంతో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో మరింత మెరుగైన సేవలు అందిస్తాం. – జనగామ -
పురపోరుకు కౌంట్డౌన్
జనగామ: రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగియడంతో, ప్రభుత్వం మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. ఈనేపథ్యంలో ఎన్నికల కమిషన్ మున్సిపాలిటీల ఓటరు జాబితా ప్రకటన విడుదల చేసింది. ఈనెల 1న (గురువారం) కొత్త సంవత్సరం తొలి రోజు వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రజల ముందుకు తీసుకురానున్నారు. అదే రోజు నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. జనవరి 5న రాజకీయ పార్టీ ప్రతినిధులు, 6న ఎన్నికల అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నారు. 10న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకమే ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్ రెండు మున్సిపాలిటీల పరిధిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సుదీర్ఘ విరామం తర్వాత జరగనున్న మున్సిపాలిటీల ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. అభ్యర్థుల అంచనాల ప్రకారం రిజర్వేషన్ల లెక్కలు వేసుకుంటూ, వార్డుల వారీగా తమ బలం, బలహీనతలను పరిశీలిస్తుండగా, ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష, ఇతర పార్టీలు సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకొని గెలుపు గుర్రాలను ఎంపిక చేసే ప్రక్రియలో నిమగ్నమయ్యాయి. నేడు డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల మున్సిపాలిటీలకు అసెంబ్లీ ఓటరు జాబితా ఆధారంగా బ్లాక్వైజ్ ఉన్న ఓటర్ల సమాచారాన్ని వార్డుల వారీగా విభజిస్తున్నారు. ఈ ప్రక్రియను జిల్లా హెడ్క్వార్టర్ మునిసిపల్లో రెండు పురపాలికలకు సంబంధించి బుధవారం వార్డుల వారీగా విభజన ప్రక్రియ చేపట్టారు. గురువారం డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రజల ముందుంచనున్నారు. తుది జాబితా కోసం ఇంకో పదిరోజుల సమయం ఉండడంతో జనవరి మూడో వారంలో లేదా నాలుగో వారంలోనే పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సమాచారం. జనవరి చివరివారం లేదా ఫిబ్రవరి రెండోవారంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి ఎలక్షన్ కమిషన్ సన్నద్ధమవుతోంది. రెండు మున్సిపాలిటీల్లో ఓటర్ల వివరాలు జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో తాజా జనాభా, ఓటర్ల గణాంకాలను అధికారిక వర్గాలు వెల్లడించాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జనగామ మున్సిపాలిటీకి 30 వార్డులు ఉండగా, జనాభా 52,408గా నమోదైంది. ఇందులో 1,694మంది ఎస్టీ, 8,385 మంది ఎస్సీ వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నట్లు వివరాలు చెబుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో మొత్తంగా 43,903 మంది ఓటర్లు నమోదయ్యారు. స్టేషన్న్ ఘన్న్పూర్ మున్సిపాలిటీ పరిధి లో 18 వార్డుల పరిధిలో జనాభా 23,483గా నమోదైంది. ఇందులో 962 మంది ఎస్టీ, 6,663 మంది ఎస్సీ వర్గాలకు చెందినవారు ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం ఓటర్ల సంఖ్య 18,549 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వార్డుల వారీగా ఓటర్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ జనగామ పురపాలికలో స్టేషన్ఘన్పూర్ కలుపుకుని వార్డుల వారీగా ఓటర్ల విభజన జరుగుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డితో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. వార్డుల వారీగా ఓటర్లు, పోలింగ్ స్టేషన్ మ్యాపింగ్ పనుల పురోగతిని సమీక్షించారు. ఓటర్ల జాబితాలో అధికారులు ఒక్క పొరపాటు కూడా ఉండకుండా చూడాలన్నారు. ప్రతి వార్డుకు సంబంధించిన డేటా తప్పులు లేకుండా మ్యాప్ చేయడం ఎన్నికల క్రమశిక్షణలో అత్యంత కీలకమని గుర్తు చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ స్టేషన్ స్థాయి డేటాను తిరిగి వార్డుల వారీగా కేటాయించే పనిలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. జనగామ, స్టేషన్ ఘన్పూర్లో హీటెక్కుతున్న రాజకీయాలు మొదలైన రిజర్వేషన్ల లెక్కలు రెండు మునిసిపాలిటీల్లో 62,556 ఓట్లు -
పారదర్శకంగా యూరియా పంపిణీ
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్టేషన్ఘన్పూర్: యూరియా బుకింగ్ యాప్ ద్వారా రైతులకు సులభంగా, పారదర్శకంగా, అవసరానికి అనుగుణంగా యూరియా బస్తాల పంపిణీ జరుగుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. యాప్ ద్వారా జరుగుతున్న యూరియా అమ్మకాలను స్వయంగా పరిశీలించేందుకు స్టేషన్ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని పీఏసీఎస్ను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. రాష్ట్రంలో యూరి యా బుకింగ్యాప్లో జిల్లా ముందంజలో ఉంద న్నారు. ఆయన వెంట డీసీపీ రాజమహేంద్రనాయ క్, జిల్లా వ్యవసాయ అధికారి అంబికాసోని, ఆర్డీ ఓ డీఎస్ వెంకన్న, సీఐ జి.వేణు, ఎస్ఐలు వినయ్ కుమార్, రాజేష్, డీటీ సంఽధ్యారాణి, ఏఓ చంద్రన్కుమార్, పీఏసీఎస్ సీఈఓ మగ్ధుంఅలీ పాల్గొన్నారు. చదువుతోపాటు క్రీడలు ముఖ్యమే జనగామ రూరల్: విద్యార్ధులకు కేవలం చదువు మాత్రమే కాకుండా క్రీడలు కూడా ముఖ్యమేనని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని ధర్మకంచ మినీ స్టేడియంలో జిల్లాస్థాయి పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థుల క్రీడాపోటీలను కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ఈఈ సత్యనారాయణమూర్తి, సీఎంఓ నాగరాజు, సెక్రటరీ గొర్సింగ్, ఉపాధ్యాయ నాయకులు పాల్గొన్నారు. పీఎంశ్రీ క్రీడాపోటీల్లో వివిధ క్రీడల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ బహుమతులు అందజేశారు. మీ చేతుల్లోనే మీ భవిష్యత్.. మీ చేతుల్లోనే మీ భవిష్యత్ ఉందని, ప్రాణాలు అతి ముఖ్యమని రోడ్డు భద్రత నియమాలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. పట్టణంలోని ఎన్మ్ఆర్ గార్డెన్లో రోడ్డు భద్రత ప్రమాద నివారణపై ఆర్టీఏ సభ్యుడు అభి గౌడ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, రవాణా శాఖ అధికారి శ్రీని వాస్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నేడు డయల్ యువర్ డీఎం
హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు. ఈనెల 31న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు హనుమకొండలోని వరంగల్–1 డిపో నుంచి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో వివరించారు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్కు ఫోన్ చేసి విలువైన సలహాలు, సూచనలు అందించాలని కోరారు. వీరాచల రాముడికి రూ.1,00,116ల విరాళం లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయానికి మంగళవారం కొండ ప్రమోద్రాజాపద్మిని దంపతులు(యూఎస్ఏ) రూ.1,00,116ల విరాళ ం అందజేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం వీరాచల రామచంద్రున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారి భార్గవాచార్యులు, ఆలయ సిబ్బంది భరత్, మల్లేశంలకు అందజేశారు. లింగంపల్లి జాతర ప్రదేశం పరిశీలన చిల్పూరు: మండలంలోని లింగంపల్లి సమ్మక్క–సారలమ్మ జాతర నిర్వహించే ప్రదేశాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్ మంగళవారం పరిశీలించారు. ముందుగా తల్లుల గద్దెల వద్ద సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్సై సిరిపురం నవీన్కుమార్లతో కలిసి పూజలు చేశారు. ఈసందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. జనవరి 28నుంచి 30 తేదీ వరకు నిర్వహించే జాతరకు పెద్ద మొత్తంలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయిలో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు గడ్డమీది సురేశ్, కండ్లకోలు బాలరాజు, ఏదునూరి రవీందర్, తుత్తురు రాజు తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు జనగామ రూరల్: తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కల్పన శిక్షణ శాఖ, జనగామ జిల్లా ఆధ్వర్యంలో జర్మనీలో నర్సులకు ఉచిత జర్మన్ భాషా శిక్షణ ఉద్యోగ నియామక సహాయం టామ్కామ్ ద్వారా అందిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి సాహితి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ లిమిటెడ్ కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం నమోదు పొందిన రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా అర్హత కలిగిన నర్సులకు ఉచిత జర్మన్ భాషా శిక్షణ అందించి, జర్మనీలో పేరొందిన ఆసుపత్రుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. 22 నుంచి 38 ఏళ్లు ఉండి బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం పూర్తి చేసి 1 నుంచి 3 సంవత్సరాల క్లినికల్ అనుభవం ఉండాలన్నారు. జర్మన్ భాషా శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత జర్మనీలో స్టాఫ్నర్స్గా నియమితులైన వారికి నెలకు సుమారు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆకర్షణీయమైన వేతనం ఉంటుందని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాలు, నమోదు కోసం 9440051581 నంబర్లో సంప్రదించాలని సూచించారు. రోబోటిక్స్పై వర్క్షాపు రఘునాథపల్లి: మండలంలోని వెల్ది మోడల్ స్కూల్లో మంగళవారం రోబోటిక్స్ ఐదో స్థాయి డైమండ్ చాలెంజ్ వర్క్షాపు జరిగింది. వర్క్షాపును ఇన్స్ట్రక్టర్ నడిగోటి సుహాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల రోబోటిక్స్ ఇన్చార్జ్ ఉపాధ్యాయులు ద్యావత సౌజన్యప్రియ, పోరిక పార్వతి మాట్లాడుతూ.. జిల్లాలోని మూడు పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు జరుగుతుండగా అందులో వెల్ది పాఠశాల ఉందన్నారు. విద్యార్థులు రోబోటిక్స్ సాధన చేసి వైఫై రోబోట్, రోటరీ ఎన్ కోడర్ కంట్రోల్డ్ లెడ్ సర్వో అండ్ బజర్, ఆటోమెటిక్ లైటింగ్ అండ్ విసిటింగ్ కౌంటర్ అనే మూడు యాక్టివిటీస్ చేశారని చెప్పారు. పాఠశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ కందగట్ల గణేష్ వర్క్షాపును సందర్శించి విద్యార్థులను అభినందించారు. -
గుడ్ వర్కింగ్ సొసైటీగా నర్మెట పీఏసీఎస్
నర్మెట: గుడ్ వర్కింగ్ సొసైటీగా నర్మెట పీఏసీఎస్ ఎంపికై ంది. వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్కు అనుబంధంగా ఉన్న నర్మెట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మూడేళ్లుగా రైతులకు అందజేసిన స్పల్ప, దీర్ఘకాలిక రుణాలను సకాలంలో వసూలు చేయడంతో ప్రభుత్వం అందించే 3 శాతం రాయితీకి అర్హత సాధించింది. దీంతో రైతుల ఖాతాల్లో రాయితీ సొమ్ము జమ అయ్యింది. సొసైటీ ఎలాంటి ఇన్బ్యాలెన్స్, నష్టాలు లేకపోవడం అవార్డుకు ఎంపికై ంది. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర సహకార, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేతుల మీదుగా సొసైటీ సీఈఓ కొన్నె వెంకటయ్య అవార్డు అందుకున్నారు. గణతంత్ర వేడుకలకు ఒగ్గు రవి బృందం ఎంపిక లింగాలఘణపురం: ఢిల్లీలోని కర్తవ్యపఽథ్ వేదికగా 2026 జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఒగ్గుడోలు విన్యాస కళాప్రదర్శనను ఎంపిక చేశారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంట్రల్ నుంచి జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం మాణిక్యాపురానికి చెందిన ఒగ్గు కళాకారుడు ఒగ్గు రవికి ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. 26న రాష్ట్రపతి, ప్రధానమంత్రి సమక్షంలో ప్రదర్శన ఇవ్వనున్నామని, రాష్ట్రం నుంచి ఒగ్గుడోలు ప్రదర్శన ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. -
100 రోజులు.. 41.28 టీఎంసీలు
సాక్షిప్రతినిధి, వరంగల్ : యాసంగి పంటలకు ఈనెల 31 (బుధవారం) నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందనుంది. ఈ మేరకు నీటిపారుదలశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్లో 9,48,114 ఎకరాల ఆయకట్టుకుగాను ఈ యాసంగిలో 5,29,726 ఎకరాలకు నీరివ్వాలని ఈ నెల 3న జరిగిన రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు 41.28 టీఎంసీల నీరు అవసరం ఉండగా.. వారబందీ (వారం రోజులు విడుదల, వారం రోజులు నిలుపుదల) పద్ధతిన స్థిరీకరించిన ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. వారం రోజులనుంచే హనుమకొండ, జనగామ, ములుగు, నర్సంపేట తదితర డివిజన్లలో అధికారులు నీటి విడుదల, నిర్వహణపై సమావేశాలు నిర్వహించారు. కొన్నిచోట్ల ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అతిథులుగా పాల్గొని పలు సూచనలు చేశారు. నేటి ఉదయం 11 గంటలకు.. ఉమ్మడి వరంగల్లో నీటి లభ్యత ఉన్న జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల, ఎస్సారెస్పీ కాకతీయ కాలువ (దిగువ మానేరు), ఎస్సారెస్పీ స్టేజ్ – 2 ప్రాజెక్టులతో పాటు పాకాల, రామప్ప చెరువులు, లక్నవరం, మల్లూరువాగు, పాలెంవాగు ప్రాజెక్టుల నుంచి ఈ స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ నుంచి కాకతీయ కాల్వల ద్వారా ఉమ్మడి వరంగల్లోని ఎస్సారెస్పీ ఆయకట్టుకు విడుదల చేయనున్నారు. ‘స్కివం’ షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి నీటి విడుదలఈ నెల 3న హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) మీటింగ్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం యాసంగి ఆయకట్టు సాగునీరు విడుదల చేస్తాం. ఎల్ఎండీ నుంచి బుధవారం ఉదయం 11 గంటలకు జోన్–1, జోన్–2లలో స్థిరీకరించిన ఆయకట్టుకు వారబందీ పద్ధతిన నీటి సరఫరా జరుగుతుంది. సాగునీరు వృథా కాకుండా పొదుపుగా వాడుకొని సహకరించాలని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. – పి.రమేశ్, ఎస్ఈ, ఇరిగేషన్ సర్కిల్–2, కరీంనగర్ నేటినుంచి యాసంగి పంటలకు సాగునీరు ఎల్ఎండీ నుంచి సరఫరాకు ఇరిగేషన్ శాఖ సన్నద్ధం వారబందీ పద్ధతి అమలు -
న్యూఇయర్ జోష్ షురూ!
● విందులు, వినోదాలకు యూత్ రెడీ ● జోరుగా కేక్లు, గిఫ్టుల అమ్మకాలుజనగామ: పాత జ్ఞాపకాలను గుర్తుకుచేసుకుంటూ 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాది 2026కు స్వాగతం చెప్పేందుకు జిల్లా ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈనెల 31 (బుధవారం) అర్ధరాత్రి వేడుకలకు రెస్టారెంట్లు, హోటళ్లు, ఈవెంట్ వేదికలు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. యువత నుంచి కుటుంబాల వరకు అందరూ విందు, వినోదాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. వ్యాపారులు ఆకర్షణీయమైన ఆఫర్లతో కస్టమర్లను రప్పించేందుకు పోటీపడుతున్నారు. బొకేలు, గిఫ్ట్ ఐటమ్స్, కేకుల అమ్మకాలు భారీగా పెరిగి పండగ మార్కెట్ను తలపిస్తున్నాయి. కేకుల పండగ కొత్త సంవత్సర వేడుకల కోసం ఒక్కో బేకరీలో వందల సంఖ్యలో కేక్లను తయారు చేస్తున్నారు. చూడగానే తినేయాలనిపించే విధంగా కేకులు ఆకర్షిస్తున్నాయి. అరకిలో నుంచి 20 కిలోల వరకు కేకులు అందించేందుకు దుకాణా యజమానులు ఆర్డర్లను బట్టి తయారు చేస్తున్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు. -
నేడు వైకుంఠ ఏకాదశి
జనగామ: ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకునే శుభపర్వాన్ని వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసం శుక్ల పక్ష పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఈ పర్వదినం. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన తర్వాత మకర సంక్రాంతి వరకు జరిగే కాలంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈరోజు వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి చిల్పూరు బుగులు శ్రీ వెంకటేశ్వరస్వామి, జిల్లా కేంద్రంలోని బాణాపురం వెంకటేశ్వరస్వామి, పాతబీటు బజారులోని శ్రీ చెన్నకేశ్వరస్వామి, జీడికల్లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి విద్యుత్కాంతుల్లో వైష్ణవాలయాలు -
అమ్మానాన్నా.. మిమ్మల్నీ అమెరికా తీసుకెళ్తాం
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025గార్ల: ‘మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలు చేశారు. మా కలలకు రెక్కలు తొడిగి అమెరికా పంపించారు. అమ్మా నాన్నా.. మిమ్మల్ని త్వరలో ఇక్కడికి(అమెరికా) తీసుకొస్తాం. ఇక్కడ చూడదగిన ప్రదేశాలను తిప్పి చూపిస్తాం. మీక్కావాల్సినవన్నీ కొనిపెడతాం’ అని ఫోన్లో ఆ బిడ్డలు అంటే తల్లిదండ్రులు మురిసిపోయారు. చుట్టు పక్కల వాళ్లకు చెప్పి సంబురపడ్డారు. కానీ, ఆ సంబురం ఎక్కువ రోజులు నిలవలేదు. విదేశాలకు తీసుకెళ్తామని చెప్పిన ఆ ఆడబిడ్డలు విగతజీవులుగా ఇంటికి తిరిగి వస్తుండడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. స్వగ్రామాల్లో విషాదం.. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసమని ఆమెరికా పయనమయ్యారు. బాగా స్థిరపడ్డాక ఉన్న ఊరి కోసం, కన్నవారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. అంతలోనే వారిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. బాల్య స్నేహితులైన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరుకు చెందిన కడియాల భావన(24), గార్లకు చెందిన పుల్లఖండం మేఘనరాణి (24)అమెరికాలోని ఒహాయో రాష్ట్రం డేటాన్ నగరంలో ఉంటూ ఇటీవల ఎంఎస్ పట్టా పొందారు. ఉద్యోగాల వేటలో మునిగిపోయిన వారిరువురు.. ఆదివారం ఆహ్లాదం కోసం రెండు కార్లలో 8 మంది స్నేహితులతో కలిసి కాలిఫోర్నియా సమీపంలోని అలబామ హిల్స్ చూసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు లోయలో పడిపోవంతో భావన, మేఘనరాణి అక్కడికక్కడే మృతిచెందారు. సోమవారం తెల్ల వారుజామున మీ అమ్మాయిలు మృతిచెందారని అమెరికా నుంచి ఫోన్ రావడంతో మృతుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గార్ల, ముల్కనూరు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మృతదేహాలు ఇండియాకు రావాలంటే వారం లేదా పది రోజులు పట్టే అవకాశం ఉందని మృతుల బంధువులు పేర్కొన్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత గార్ల, ముల్కనూరు గ్రామాల్లోని మృతుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు.కూతుళ్ల మాటలతో ఉప్పొంగిన తల్లిదండ్రులు.. కానీ వక్రించిన విధి.. కూలిన తల్లిదండ్రుల ఆశల సౌధాలు రోడ్డు ప్రమాదంలో విగతజీవులైన కూతుళ్లు గార్ల, ముల్కనూరులో విషాదఛాయలు -
సమస్యలకు పరిష్కారమేది?
జనగామ రూరల్: వృద్ధాప్యంలో అవసరాలు తీరక ఇబ్బందులు పడుతున్నామని పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని వృద్ధురాలు, తనకు తల్లిదండ్రులు లేరని ఉండడానికి సొంత ఇల్లు లేదని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని యువతి..ఇలా పలు సమస్యలతో సోమవారం గ్రీవెన్స్కు ప్రజలు తరలివచ్చారు. ఏళ్ల తరబడి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నామని దూరప్రాంతాల నుంచి ఖర్చు పెట్టుకోని వచ్చి దరఖాస్తులు ఇవ్వడమే అవుతోందని, సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ లు పింకేశ్ కుమార్, బెన్షాలోమ్ ప్రజల నుంచి 31 దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులు కొన్ని ఇలా..● జనగామ పట్టణానికి చెందిన మేకల ప్రశాంత్ అనే వ్యక్తి, తన భూమి విషయంలో జరిగిన అక్రమ పేరు నమోదుపై ఫిర్యాదు చేశారు. డాక్యుమెంట్లను పరిశీలించి, అక్రమంగా నమోదైన వారి పేర్లను రెవెన్యూ రికార్డుల నుండి తొలగించాలని వినతి పత్రం అందజేశారు. ● పట్టణంలోని అంబేడ్కర్ నగర్కు చెందిన బక్క కవిత అనే మహిళ తమకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించమని దరఖాస్తు చేసుకుంది. ● బచ్చన్నపేట మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన చిమ్మ అండమ్మ తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని, పెద్ద కుమారుడు తన బాగోగులు చూస్తుండగా చిన్న కుమారుడు చూడడం లేదని వినతిపత్రం అందించింది. ● రఘునాథపల్లి మండలం గోవర్థనగిరి గ్రామానికి చెందిన శివరాత్రి కల్పన అనే మహిళ ఇటీవల తన భర్త మృతి చెందాడని భర్త పేరు మీద ఉన్న భూమి తన పేరుమీద పట్టా చేయాలని వినతి పత్రం అందించింది. ● నర్మెట మండలం బొమ్మకూర్ గ్రామానికి చెందిన మాలోతు కవిత తన తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతిచెందారని, ఉండడానికి ఇల్లు లేకపోవడంతో తన నానమ్మతో కలిసి ఉంటున్నానని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరింది. ● జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో చెట్లు ఏపుగా పెరిగి రాత్రివేళల్లో పాములు, క్రిమికిటకాలు ఇండ్లులోకి వస్తున్నాయని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు హరీశ్, మహేందర్ వినతి పత్రం అందజేశారు. కలెక్టరేట్ చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నాం.. గ్రీవెన్స్లో ప్రజల ఆవేదన -
అభివృద్ధిలో వెనకడుగు
నత్తనడకన సుందరీకరణ, రహదారులు, రిజర్వాయర్ల పనులుజనగామ: జిల్లా అభివృద్ధిలో ఆశించిన పురోగతి సాధ్యం కాలేదు. కొన్ని రంగాల్లో ముందడుగు పడినా, కీలకమైన ప్రాజెక్టులు నిలిచిపోవడం వల్ల ప్రజాసమస్యలు మాత్రం యథాతథంగానే కొనసాగుతున్నాయి.జిల్లా కేంద్రంలో సుందరీకరణ పనులు ఆశించినంత వేగం అందుకోలేదు. బతుకమ్మకుంటను రూ.1.50 కోట్లతో అభివృద్ధి చేసినప్పటికీ, ప్రజా భాగస్వామ్యం కనిపించలేదు. నగర అభివృద్ధికి కీలకమైన కళావేదిక, శాశ్వత మరుగుదొడ్లు ఇప్పటికీ అమలు దిశలోకి రాలేదు. జిల్లా ప్రధాన వనరులలో ఒకటైన రంగప్పచెరువు సుందరీకరణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. జనగామ–హైదరాబాద్ మెయిన్ రోడ్ పనులు సగంలోనే ఆగిపోవడంతో రహదారి సగం బ్లాక్టాప్, సగం కంకర రోడ్డుగా మారి నాలుగేళ్లుగా ప్రజలకు తీవ్ర ఇబ్బం దులు ఎదురవుతున్నాయి. పెంబర్తి–మడికొండ ఇండస్ట్రియల్ కారిడార్కు పురోగతి కనిపించలేదు. జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ సేవలు ప్రారంభమయ్యాయి. చంపక్ హిల్స్లో రూ.100 కోట్లతో జిల్లా కోర్టుల నిర్మాణం మొదలైంది. అదే ప్రాంతంలో ట్రామా సెంటర్ భవనం సిద్ధమైంది. విద్యారంగంలో 3,5,6 తరగతుల న్యాస్ పరీక్షల్లో జనగామ దేశవ్యాప్తంగా 782 జిల్లాల్లో 50లో చోటు దక్కించుకొని ప్రతిభ చాటుకుంది. వార్షిక పరీక్షల్లో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. ఇంకుడు గుంతల నిర్మాణంలో జిల్లా దేశవ్యాప్తంగా ఉత్తమంగా నిలిచింది. పాలిటెక్నిక్ కళాశాల మాత్రం కాగితాలకే పరిమితమై పోయింది. అభివృద్ధి పనులు కనిపించినా, కీలకమైన రహదారులు, రిజర్వాయర్లు, ప్రభుత్వ భవనాల పనులు నిలిచిపోవడంతో జిల్లా అభివృద్ధి రెండు అడుగులు ముందుకు వేస్తే మూడు అడుగులు వెనక్కిపడిన పరిస్థితి కనిపిస్తోంది. స్టేషన్ ఘన్పూర్లో నెమ్మదిగా 100 పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులురంగప్ప చెరువు, కళావేదిక అభివృద్ధి జాడలేదు పాలకుర్తి–చెన్నూరు రిజర్వాయర్లకు నిధులున్నా పురోగతి లేదు వడ్లకొండ, చీటకోడూరు బ్రిడ్జిల నిర్మాణం గాలికి.. విద్యారంగంలో కాస్త ముందుకు..మండలాల వారీగా జనగామ మండలం: నర్మెట హైవే, వడ్లకొండ, చీటకోడూరు రహదారులపై కల్వర్టులు, బ్రిడ్జిలు కొట్టుకుపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినా పనులు నిలిచిపోయాయి. రూ.5 కోట్ల మంజూరు ఉన్నప్పటికీ బిల్లులు రాక పనులు ఆగిపోయాయి. లింగాలఘణపురం: వరంగల్–హైదరాబాద్ హైవే నెల్లుట్ల వద్ద ప్రమాదాలకు కారణమవుతున్న పాత బ్రిడ్జిని తొలగించి కొత్త బ్రిడ్జి నిర్మాణంలో అధికారులు అలసత్వం ప్రాణానికి ముప్పు తెస్తోంది. రూ.8 కోట్లతో ప్రారంభించిన కళ్లెం రోడ్డు కూడా ఇంకా పూర్తి కాలేదు. స్టేషన్ ఘన్పూర్: రూ.45 కోట్ల ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి, రూ.26 కోట్ల కార్యాలయాల సముదాయం, రూ.1 కోటి డీఈ కార్యాలయ నిర్మాణం, మల్లన్నగండి రహదారి, జాతీయ రహదారి సర్వీస్ రోడ్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రిజర్వాయర్ పర్యాటక ప్రాజెక్టుల పనులు పెండింగ్లోనే ఉండిపోయాయి. రూ.146 కోట్లతో తలపెట్టిన స్టేషన్న్ ఘనన్పూర్–నవాబుపేట ప్రధాన కాల్వ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. లెదర్ ఫ్యాక్టరీ సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. జఫర్గఢ్ : కోనాయచలంలోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం ఇప్పటికీ మొదలుకాలేదు. చిల్పూరు : మల్లన్నగండి రిజర్వాయర్ నుంచి లింగంపల్లి–శ్రీపతిపల్లి–కొడాపూర్ గ్రామాలకు నీటి సరఫరా కోసం రూ.104 కోట్లతో చేపట్టిన పైప్లైన్ పనులు పూర్తయినా, గేట్ వాల్వ్లు నిలిచిపోవడంతో నీటి తరలింపు ప్రారంభం కాలేదు. తరిగొప్పుల: రూ.1.43 లక్షలతో తలపెట్టిన పీహెచ్సీ భవనానికి సంబంధించి స్థల కేటాయింపు పనులు నిలిచిపోయాయి. బచ్చన్నపేట: రూ.8.30 కోట్ల మంజూరు ఉన్నా, మట్టి–బీటీ రోడ్ల పనులకు టెండర్లకు నోచుకోవడం లేదు. కొడకండ్ల: రూ.9 కోట్లతో రెండు చెక్డ్యాంలు, రూ.94 లక్షలతో కస్తూర్బా పాఠశాల అదనపు గదుల నిర్మాణం పూర్తయింది. పాలకుర్తి: శ్రీ సోమేశ్వర–లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, సోమనాథ స్మృతివనం, కల్యాణ మండపం ఆధునికీకరణకు రూ.94.84 లక్షలు మంజూరయ్యాయి. అయితే ఒక్క పని కూడా మొదలుకాలేదు. పాలకుర్తి–చెన్నూరు రిజర్వాయర్ పనులకు రూ.1000 కోట్ల రీ–ఎస్టిమేట్ నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు నత్తనడకన సాగుతుండగా, చెన్నూరు రిజర్వాయర్ పనులు ప్రారంభం కాలేదు. -
చలికి జాగ్రత్తలే రక్ష
జనగామ: చలి తీవ్రతతో అనారోగ్య సమస్యలు అధికమవుతున్నాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్రావు అన్నారు. సాధారణ జలుబు, ఫ్లూ (ఇన్ఫ్లుయెంజా), అస్తమా, బ్రాంకైటిస్, న్యూమోనియా వంటి ఇన్ఫెక్షన్లు చలికాలంలో వైరస్లు ఎక్కువసేపు జీవించడం, మూసివేసిన గదుల్లో వేగంగా వ్యాపించగలగడం వల్ల విస్తరిస్తాయన్నారు. శ్వాససమస్యలతో పాటు చలి ప్రభావం చర్మం, కీళ్లనొప్పులపై ప్రభావం ఉంటుందన్నారు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారిలో కూడా ప్రమాదం అధికమవుతుందన్నారు. చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నివారణ చర్యలే ప్రధానమని సూచించారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ‘సాక్షి ఫోన్ ఇన్’లో డీఎంహెచ్ఓ సూచించారు. అలాగే జిల్లా ఆస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంజీవరావు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అశోక్ కుమార్, పల్మనాలజిస్టు డాక్టర్ దివ్య ప్రజలకు ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించారు. ప్రశ్న: జిల్లా ఆస్పత్రిలో పిల్లల ఓపీ ప్రారంభించాలి. కుక్క, కోతి కాటుకు ఇక్కడే వ్యాక్సిన్ ఇవ్వాలి.. – సుంచు శ్రీకాంత్, గుండ్లగడ్డ, జనగామడీఎంహెచ్ఓ: కుక్క, కోతి కాటుతో పిల్లలు తీవ్రంగా అనారోగ్యానికి గురైన సమయంలో పీడీయాట్రిక్ వైద్యులు మాత్రమే వ్యాక్సినేషన్ ఇవ్వాలి ఉంటుంది. ఈ సేవలు ఎంసీహెచ్లోనే ఉన్నాయి. ప్రశ్న: సీజనల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. తుమ్ములు ఆగడం లేదు, షుగర్ ఉన్నవారు ఏం చర్యలు తీసుకోవాలి? – పార్సి రంగారావు,శివునిపల్లి, సాయి మనోజ్ కుమార్, కొడకండ్ల, ఈగ కృష్ణమూర్తి, కూనూరు, జఫర్గఢ్, టి.రామకృష్ణ, స్టేషన్ఘన్పూర్, ఏదునూరి వీరన్న, లింగాలఘణపురం, మంతపురి యాదగిరి, కన్నాయపల్లి, ఆరూరి జయప్రకాష్, ఇప్పగూడెం, స్టేషన్ఘన్పూర్ రఘునాథపల్లిడీఎంహెచ్ఓ: చలికాలంలో ఊపిరితిత్తులు, గుండె జబ్బులు, అస్తమా తిరగబెట్టడం, న్యూమోనియా వంటి కేసులు వస్తాయి. వీరు చలికి ఎక్స్పోజ్ కావద్దు. ముఖానికి మాస్క్, ఉన్ని దుస్తులు ధరించాలి. తుమ్ములు సైనస్కు కారణం కావచ్చు. జిల్లా ఆస్పత్రిలో పల్మనాలజిస్టు, ఈఎన్టీ స్పెషలిస్టులు సైతం అందుబాటులో ఉంటారు. అక్కడ పరీక్ష చేయించుకోండి. షుగర్, బీపీ పేషెంట్లు మందులను కంటిన్యూ చేయాలి. ప్రశ్న: నా భార్యకు ఊపిరితిత్తుల నుంచి నీరు తొలగించిన తర్వాత గ్యాస్ ఫాం అవుతోంది? ఏం చేయాలి? – శివానందమూర్తి, ఇప్పగూడెండీఎంహెచ్ఓ: నీరు తొలగించే సమయంలో యాంటీబయోటిక్స్ ఇవ్వడంతో కొంతమేర గ్యాస్ సమస్య ఉంటుంది. తినలేకపోతారు. వాంతులు కావడం సహజమే. పులుపు, కారం, తినకూడదు. ప్రశ్న: మరిగడిలో హెల్త్ క్యాంపులు నిర్వహించండి– ఎడ్ల శ్రీనివాస్, అడ్వకేట్, మరిగడి, జనగామడీఎంహెచ్ఓ: మరిగడి (ఎం) తండాలో ఎంబీబీఎస్ డాక్టర్ పర్యవేక్షణలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తాం. ప్రశ్న: 24 గంటల పాటు డాక్టర్లు అందుబాటులో ఉండాలి..ఊరిలో పదిలో ఇద్దరికి జ్వరాలు ఉన్నాయి.. – శివరాజ్, జఫర్గఢ్డీఎంహెచ్ఓ: జఫర్గఢ్ హాస్పిటల్లో 24 గంటలు సేవలు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. ఇంకా ఎక్కువగా దృష్టి సారిస్తాం. ఇంటింటా ఫీవర్ సర్వే చేయిస్తాం. మందులు సరిపడా ఉన్నాయి. ప్రశ్న: డీహెచ్, ఎంసీహెచ్లో తాగునీరు ఏర్పాటు చేయండి, కుక్క తీవ్రంగా కరిస్తే ఎంజీఎంకు రెఫర్ చేశారు.. – మంతెన మణి, అమ్మఫౌండేషన్, జనగామడీఎంహెచ్ఓ: జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్తో మాట్లాడి రెండు చోట్ల తాగునీరు వసతి కల్పించే విధంగా చూస్తాం. కుక్క తీవ్రంగా కరిచిన సమయంలో ఇచ్చే వ్యాక్సిన్ ఎంజీఎంలో అందుబాటులో ఉండడంతోనే అక్కడకు పంపించారు. ప్రశ్న: బచ్చన్నపేటలో పిల్లల డాక్టర్ ఉండడం లేదు.. జనగామకు తీసుకెళ్తున్నాం.. – రాంరెడ్డి, ఇటికాలపల్లి, రమేశ్, బచ్చన్నపేటడీఎంహెచ్ఓ: బచ్చన్నపేట సీహెచ్సీ సూపరింటెండెంట్ శ్రీనివాస్ చిన్న పిల్లల వైద్యులు. నిత్యం అందుబాటులో ఉండే విధంగా చూస్తాం. ప్రశ్న: చర్మవ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి – పులి ధనుంజయ్గౌడ్, ఉప్పుగల్లు, జఫర్గఢ్డీఎంహెచ్ఓ: చలితీవ్రతతో చర్మం పొడిగా మారి పగుళ్లు బారుతుంది. కొబ్బరి నూనె, వ్యాస్లేన్ ఉపయోగిస్తే సరిపోతుంది. ప్రశ్న: ఎక్స్రే టెక్నీషియన్, ఈసీజీ, 2–డీ ఎకో సేవలు కావాలి – నగేష్, కూనూరుడీఎంహెచ్ఓ: జఫర్గఢ్ సీహెచ్సీలో ఎక్స్రే మిషన్ ఉంది. టెక్నీషియన్ లేడు. ప్రపోజల్ పంపించాం.. రెండు,మూడు నెలల్లో రావొచ్చు. చలి తీవ్రత దృష్ట్యా ఉన్నిదుస్తులు, మాస్క్ ధరించాలి శ్వాస, చర్మ, కీళ్లు, గుండె జబ్బులు ఉన్నవారిపై ప్రభావం ఎక్కువ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నీ సౌకర్యాలు కల్పిస్తున్నాం.. ‘సాక్షి ఫోన్ ఇన్’లో జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్రావు -
గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష పోస్టర్ ఆవిష్కరణ
జనగామ రూరల్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2025–26 విద్యా సంవత్సరానికిగాను ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం, 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగిలిపోయిన ఖాళీల్లో ప్రవేశాల కోసం ఆసక్తి కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ తెలిపారు. సోమవారం ప్రవేశ పరీక్ష వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, డీఎస్ఈ డీఓ డా.విక్రమ్, ఏ బీసీడీఓ రవీందర్, డీసీఓ ఎ.శ్రీనివాస్, గురుకులాల డీసీఓ పి.శ్రీనివాసరావు, అజ య్ పాల్గొన్నారు. అలాగే ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పాలకుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సి పాల్ ఎస్.స్వరూప ఒక ప్రకటనలో తెలిపారు. -
నాది రెడ్ సారీ.. మీది పింక్ సారీ
● వేదికపై మంత్రి సీతక్క చలోక్తులు జనగామ రూరల్: టీఎస్యుటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సులో మంత్రి సీతక్క చేసిన చలోక్తులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేదికపై ఆసీనులైన వెంటనే ‘నేను రెడ్ సారీ కట్టుకుని వస్తే.. మీరేమో(మహిళా టీచర్లు) పింక్ సారీతో వచ్చారా..’ అంటూ మంత్రి నవ్వుతూ పలకరించారు. డ్రెస్కోడ్ కాదు, ఉపాధ్యాయుల ఐక్యతే ఇవాళ వేదికను మెరిపించిందంటూ వ్యాఖ్యానించారు. ప్రతి సదస్సులో డ్రెస్కోడ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఈసందర్భంగా మంత్రికి చెప్పారు. ఉపాధ్యాయుల ఐక్యత, క్రమశిక్షణ పట్ల మంత్రి ప్రశంసలు కురిపించారు. క్రీడలతో మానసికోల్లాసంజనగామ: క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం కూడా పెరుగుతుందని జిల్లా ఫొటోగ్రాఫర్ యూనియన్ అధ్యక్షుడు కాముని రాము అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తమ యూనియన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించగా 7 మండలాలు పాల్గొన్నాయన్నారు. అందుల ఫైనల్లో మొదటి బహుమతి దేవరుప్పుల మండలానికి వచ్చిందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు వేణుమాధవ్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, దేవరుప్పుల మండల అధ్యక్షుడు ఇనుముల నాగరాజు ఆధ్వర్యంలో కెప్టెన్ ధరావత్ సుధీర్ నాయక్ టీమ్ మెంబర్స్ రెడ్డిరాజుల శ్రీకాంత్, అక్కనేపల్లి చారి, గుగులోతు నరేందర్, బషీపాక ఉపేందర్, పన్నీరు శ్రీకాంత్, బానోత్ రాజేందర్, బషీపాక నాగరాజు, అంబాదాసు, ప్రమోద్, సీనియర్ నాయకులు అమతం ఆంజనేయులు. గుమ్మడవెల్లి సోమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
జనగామ రూరల్: కేంద్రం అక్రమంగా తీసుకొచ్చిన కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి డిమాండ్ చేశారు. ఆదివారం సంఘం కార్యాలయంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా కాసు మాధవి మాట్లాడుతూ.. కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా మార్చే కుట్రలో భాగంగానే నాలుగు లేబర్ కోడ్ అమలు కోసం నవంబర్ 21న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని విమర్శించారు. జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్, రాజు, ప్రశాంత్, నాగరాజు, సుమతి తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి -
‘హేమాచలం’లో సందడి
మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి క్షేత్రం ఆదివారం మేడారం భక్తులతో సందడిగా మారింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. జాతరను తలపించేలా.. మేడారం మహాజాతర సమీపిస్తుండటంతో వనదేవతలను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు హేమచలుడిని కూడా దర్శించుకుంటున్నారు. దీంతో ఉదయం ఆరు గంటల నుంచే చింతామణి జలపాతం వద్ద భక్తుల సందడి నెలకొంది. భక్తి శ్రద్ధలతో పూజలు ఆలయ అర్చకులు రాజశేఖర్శర్మ, కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు, స్వామివారికి నువ్వుల నూనెతో తిల తైలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపించి నూతన పట్టు వస్త్రాలతో అలంకరించారు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. -
నేడు సాక్షి ఫోన్ ఇన్..
జనగామ: చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దగ్గు, జలుబు, జ్వరపీడితులకు ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యం, మందులు తదితర అంశాలపై జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ మల్లికార్జున్రావుతో ఈనెల 29న(సోమవారం) సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజలు తమ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం డాక్టర్తో మాట్లాడవచ్చు. తేదీ 29–12–2025, సోమవారం సమయం ఉదయం 11నుంచి 12గంటల వరకు.. ఫోన్ చేయాల్సిన నంబర్ 9705346396 -
వైకుంఠ దర్శనానికి ఏర్పాట్లు పూర్తి
చిల్పూరు: రెండో తిరుపతిగా పిలుచుకునే శ్రీ బుగులు వెంకన్న ఆలయానికి ఈనెల 30న (మంగళవారం) వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈనెల నెల 16 నుంచి జనవరి 14వరకు దేవాలయంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా అతి ముఖ్యమైనది వైకుంఠ ద్వార దర్శనం. దీనికి భక్తులు, దాతలు, వీఐపీలు అధికంగా వచ్చే వీలున్నందున ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేపట్టారు. చిల్పూరుగుట్ట వద్ద వసతులు అందుబాటులో ఉన్నాయి. దేవాలయానికి చెందిన సత్రాలే కాకుండా ప్రైవేట్ గదులు అందుబాటులో ఉంటాయి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమైనది వైకుంఠ ద్వార దర్శనం. అందుకు ఆలయానికి వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతీ రోజు తీర్థ,ప్రసాదాలు ఉంటాయి. – భాగం లక్ష్మిప్రసన్న, ఈఓముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం ద్వారా విష్ణుమూర్తిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శనం చేసుకున్నట్లు. ఈ పుణ్యఫలం భక్తులు వినియోగించుకోవాలి. – రవీందర్శర్మ, ఆలయ ప్రధాన అర్చకుడుధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయానికి దర్శనం కోసం వచ్చే భక్తులకు ధర్మకర్తలతో కలిసి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. గదులు కూడా అందుబాటు ధరల్లో ఉంచాం. అందరి సహకారంతో దిగ్విజయం చేస్తాం. – పొట్లపల్లి శ్రీధర్రావు, చైర్మన్● రేపు ఉత్తర ద్వార దర్శనం అన్ని వసతులు అందుబాటులో.. -
పేదల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం
జనగామ: దేశ స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి వరకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, పేదల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న ఏకై క పార్టీ కాంగ్రెస్ అని ఆ పార్టీ అబ్జర్వర్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి అన్నారు. కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన వేడుకల్లో టీపీసీసీ అధికార ప్రతినిధి బైకని లింగం యాదవ్తో కలిసి వారు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 141 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు గర్వకారణం అన్నారు. అబ్జర్వర్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి -
బీఆర్ఎస్ను ఓడించే శక్తి లేదు
జనగామ: నియోజకవర్గంలో బీఆర్ఎస్ను ఓడించే శక్తి కాంగ్రెస్కు లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతన సర్పంచ్లు, పాలక మండళ్లకు సత్కార కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు.. 8 మండలాల్లో బీఆర్ఎస్ దూకుడుతో కాంగ్రెస్ చతికిలబడి పోయిందన్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి సొంతూరు నర్సాయపల్లిలో పోలీసులను అడ్డం పెట్టుకున్నా బీఆర్ఎస్ అభ్యర్థి 400 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, వారు తలదించుకోక తప్పలేదన్నారు. అలాగే ఆయన అత్తగారి ఊరు గంగాపురంలో కాంగ్రెస్కు భంగపాటు తప్పలేదని ఎద్దేవా చేశారు. సర్పంచ్ ఎ న్నికల్లో బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థులే గెలుపొందారని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నోటి వెంట సైతం జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకే ప్రజాభిమానముందని చెప్పిన విషయం గు ర్తుంచుకోవాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కో సం తాను నిధులు తీసుకు వస్తే, కొమ్మూరి వాటిని రద్దు చేయించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 8 జెడ్పీటీసీలు, రెండు ము న్సిపాలిటీలు బీఆర్ఎస్ గెలుచుకోబోతుందన్నారు. గులాబీ కార్యకర్తలు అమ్ముడుపోయే వారు కాదని, మంత్రులను కలిసి అభివృద్ధి కోసం నిధులు తీసుకు రాబోతున్నానని స్పష్టం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్రెడ్డి, ఇర్రి రమణారెడ్డి, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, బాల్దె సిద్ధిలింగం, బాల్నర్సయ్య, బద్దిపడగ క్రిష్ణారెడ్డి, కాయితాపురం రామ్మోహన్రెడ్డి, భైరగోపి యాదగిరిగౌడ్, మసిఉర్ రెహామన్ తదితరులు ఉన్నారు. 8 జెడ్పీటీసీలు, రెండు మున్సిపల్ సైతం మావే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
కలిసిరాని కాలం
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్లో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, వేరుశనగ, కందులు తదితర పంటలను విరివిగా పండిస్తారు. ప్రభుత్వం ఆధునికీకరణ, సాగునీటి సౌకర్యాల కల్పన, రైతులకు సాంకేతిక సాయం అందిస్తూ పంటల ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేస్తోంది. అయితే, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తరచూ నష్టపోతున్నారు. సాగు సమయంలో వర్షాలు.. గోదావరి జలాల కోసం ఎదురుచూశారు. వానాకాలం, యాసంగిలో ఎరువుల కొరత వెంటాడింది. రోజుల తరబడి ఎరువుల దుకాణాల ఎదుట ‘క్యూ’ కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పంటలు చేతికందే సమయంలో ‘మోంథా’ తుపాను కాటేసింది. పంటలు వేసే సమయంలో భరోసా దొరకని రైతులకు దెబ్బతిన్న పంటలపై ధీ(బీ)మా దొరకలేదు. కాస్త చేతికందిన పంటలకు మార్కెట్లో ‘మద్దతు’ దొరకలేదు. ఫలితంగా 2025లో రైతులు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఎరువుల కోసం తండ్లాట! సాగు సమయంలో పంటలకు సరిపడా ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. సాగు విస్తీర్ణం పెరగడంతో ఆ మేరకు లభించక రైతులు రోజుల తరబడి దుకాణాల చుట్టూ ఎరువుల కోసం తిరిగారు. ఎన్నో ఇబ్బందులు పడి ఎరువులు దక్కించుకుని తెగుళ్లు, కలుపు భారం నుంచి బయటపడ్డ రైతులను పంట చేతికందే సమయంలో ‘మోంథా’ ముంచేసింది. కల్లాలకు తరలించిన ధాన్యం కొట్టుకుపోయింది. ఇలా మొత్తం ఉమ్మడి జిల్లాలో 2.16 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కాగా, వారికి ఎలాంటి బీమా దక్కకపోగా, ఆ మేరకు పరిహారం అందలేదని పలు సందర్భాల్లో రైతులు వెల్లడించారు. రైతులకు చేరువైన సాంకేతికత, పథకాలు.. రైతులు సాంకేతికతను, మార్కెట్ పోకడలను అందిపుచ్చుకునేలా ప్రభుత్వం పలు పథకాలను అందుబాటులోకి తెచ్చింది. నేల ఆరోగ్యం, సమీకృత వ్యవసాయం, సూక్ష్మ నీటిపారుదల, సేంద్రియ వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ వంటి పథకాల ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (ఆర్ఎఆర్ఎస్) కొత్త వరి వంగడాలను (ఉదాహరణకు, వరంగల్–1119 వంటివి) విడుదల చేసింది. ఇవి స్థానిక వాతావరణానికి అనుకూలంగా ఉండి, అధిక దిగుబడినిచ్చే సన్న, దొడ్డు గింజ రకాలను రైతులకు అందుబాటులో ఉంచారు. హార్టికల్చర్ ద్వారా హైబ్రిడ్ కూరగాయల విత్తన సబ్సిడీలు, పర్మనెంట్ పాండల్స్, మల్చింగ్ వంటి ప్రోత్సాహకాలు ఇచ్చారు. జూలై వరకు లోటు వర్షపాతం... ఉమ్మడి వరంగల్లో జూలై మాసాంతం నాటికి 52 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. 23 మండలాల్లోనే సాధారణ వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లాలో 75 మండలాలకు ఒక్క వర్ధన్నపేట మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 398.5 మిల్లీమీటర్లకు 662.10 మిల్లీమీటర్లు (66 శాతం) అధికంగా కురిసింది. 25 మండలాల్లో సాధారణం కంటే 2 శాతం నుంచి 59 శాతం అధిక వర్షం కురవగా, 48 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ములుగు, జేఎస్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో వాగులు పొంగిపొర్లినా ఆ జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. దీంతో రైతులు చాలా ఆందోళనకు గురయ్యారు. తగ్గిన పప్పుధాన్యాల సాగు ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా పప్పు దినుసుల సాగు గణనీయంగా తగ్గింది. గతేడాది 49,876 ఎకరాల్లో పెసర, కంది, వేరుశనగ తదితర పంటలు వేశారు. ఈసారి వానాకాలంలో 31 వేల ఎకరాలకు తగ్గినట్లు అధికారుల గణాంకాలు వెల్లడించాయి. అలాగే, సన్ఫ్లవర్, గ్రౌండ్ నట్, ఆముదం తదితర ఆయిల్ సీడ్స్ పంటలు 19,210 ఎకరాల నుంచి 5,429 ఎకరాలకు పడిపోయినట్లు వ్యవసాయశాఖ రికార్డులు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో వానాకాలం సాగు ఇలా (ఎకరాల్లో)..పత్తి సాగు అంచనా(ఎకరాల్లో) వరి అంచనా8,15 లక్షలు8,58,376 రైతులను వెంటాడిన ప్రకృతి వైపరీత్యాలు తుపానుతో దెబ్బతిన్న వరి, పత్తి పంటలు ధీమా ఇవ్వని ‘బీమా’.. ఇంకా చేతికందని పరిహారం పెరిగిన వాణిజ్య పంటల సాగు... వరి, పత్తి తర్వాతే పప్పు దినుసులు రైతులకు తప్పని ఎరువుల కొరత.. వరి, పత్తికి దక్కని మద్దతు ధర ఒడిదుడుకుల మధ్య సాగిన వ్యవసాయం -
వేలం ఆదాయం రూ.2.46లక్షలు
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఏడాది పాటు కొబ్బరికాయల విక్రయానికి వేలం నిర్వహించగా రూ.2.46 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ తెలిపారు. శనివారం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ నిఖిల్ ఆధ్వర్యంలో వేలం నిర్వహించగా నలుగురు వేలం పాటలో పాల్గొన్నారు. ఇందులో జీడికల్కు చెందిన కొండబోయిన లక్ష్మి రూ.2.46 లక్షలకు దక్కించుకుంది. గతంలో రూ.2.10 లక్షలు ఉండగా ఈసారి మరో రూ.36వేలు అధికంగా వచ్చింది. వేలంలో సర్పంచ్ కొండబోయిన మమత, ఈఓ వంశీ, సిబ్బంది భరత్, మల్లేశం, గ్రామస్తులు పాల్గొన్నారు. నేడు పట్టణంలో విద్యుత్ అంతరాయం జనగామ: పట్టణంలో సాయినగర్ 11కేవీ లైన్ పరిధిలో ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నేడు (ఆదివారం) విత్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఎన్పీడీసీఎల్ ఏఈ సౌమ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాయినగర్, శ్రీనగర్ కాలనీ, సాయిబాబా టెంపుల్, హౌసింగ్ బోర్డు, ఇందిరమ్మ కాలనీ ఏరియాలలో 11 కేవీ లైన్ పను ల నేపధ్యంలో ఈ అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికస్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి జెడ్పీఎస్ఎస్కు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి 12వ సబ్జూనియర్ (బాలుర) సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం కుసుమ రమేశ్, పీడీ కొండ రవి తెలిపారు. ఈ మేరకు శనివారం పాఠశాలలో విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుగులోతు మధుసూదన్, సుంకరి రుత్విక్, గండికోట రాంచరణ్, గుర్రం నాని, మోటం మహేష్లు ఇటీవల ని ర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతి భ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు మెదక్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. షార్ట్సర్క్యూట్తో సామగ్రి దగ్ధంరఘునాథపల్లి: షార్ట్ సర్క్యూట్తో ఓ షాపులో ని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల కథ నం ప్రకారం.. మండలకేంద్రంలోని ఖిలా షాపూర్లోని రోడ్డులో మునిగడప విజయేందర్ స్థలం అద్దెకు తీసుకుని ఫాస్ట్ఫుడ్ సెంటర్, కిరాణం నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. శనివారం ఉదయం షాపులో అకస్మాత్తుగా షా పులో మంటలు చెలరేగాయి. షాపు నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు విజ యేందర్కు సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకుని స్థానికులతో కలిసి మంటలు ఆర్పే ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకునే సరికే షాపులోని సరుకులు, సామగ్రి బూడిదయ్యాయి. సుమారు రూ.2.50లక్షలు నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని తహసీల్దార్ ఫణికిశోర్కు వినతిపత్రం అందించారు. -
కొత్త వెర్షన్ 1.0.3
యూరియా బుకింగ్కు నూతన వెర్షన్ యాప్ జనగామ: జిల్లాలో యూరియా పంపిణీ వ్యవస్థను పారదర్శకం, సులభతరంగా మార్చేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ను పైలెట్ ప్రాజెక్ట్గా ఐదు జిల్లాల్లో అమలు చేయగా, వాటిలో జనగామ జిల్లా ఒకటి. జిల్లాలో రైతుల సౌకర్యార్థం కొత్త వెర్షన్ 1.0.3ను అందుబాటులోకి తీసుకు వచ్చి పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 265 ఎరువుల పంపిణీ కేంద్రాలు ఉ న్నాయి. వీటిలో 23 ఆగ్రో సేవా కేంద్రాలు, 14 పీఏ సీఎస్, 29 హాకా కేంద్రాలు, 9 ఎఫ్ిపీఓలు, మార్క్ ఫెడ్ పరిధిలో 88 సొసైటీలు, 191 ప్రైవేట్ డీలర్లు రైతులకు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో వరి సాగు 1.30 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 15,846 ఎకరాల్లో సాగుతో పాటు ఇతర పంటలతో కలిపి మొత్తం 2.09 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ సా గుకు మొత్తం 26,980 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని గుర్తించిన అధికారులు, ఇప్పటి వరకు 12,985 మెట్రిక్ టన్నులను జిల్లాకు రవాణా చేశారు. అందులో రైతులు యాప్ ద్వారా 8,100 మెట్రిక్ టన్నుల యూరియాను కొనుగోలు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 36,200 యూరియా బస్తాల స్టాక్ అందుబాటులో ఉంది. పంటల వారీగా పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. వరికి ఎకరాకు 2.5 బస్తాలు, మొక్కజొన్నకు 3.5 బస్తాలు, మిర్చికి 5 బస్తాలు, ఇతర పంటలకు 2 బస్తాలు ఇవ్వనున్నారు. పంపిణీ వ్యవస్థలో చిన్న రైతులకు ఒకేసారి అవసరమైన యూరియాను అందిస్తుండగా, పెద్ద రైతులకు మాత్రం 15 రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు విడతల్లో పంపిణీ చేసేలా ప్రణాళికలను రూపొందించారు. ఒకసారి యూరియా తీసుకున్న తర్వాత తదుపరి బుకింగ్ కోసం 15 రోజుల విరామాన్ని పాటించాలి. యాప్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా బుక్ చేసుకుని, 12 మండలాల్లో ఏ కేంద్రంలోనైనా కొనుగోలు చేసే సౌకర్యం కల్పించారు. యూరియా పంపిణీపై కలెక్టర్ రిజ్వాన్బాషా ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి అంబికా సోని పర్యవేక్షణలో ఏఓలు కె.విజయ్, ఆర్.శరత్ చంద్ర ఆధ్వర్యంలో ఏఈఓలు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. వీరికి పంచాయతీ సెక్రటరీలు, జీపీఓలు సైతం సహకారం అందిస్తున్నారు. యాప్లో బుకింగ్ చేసిన రైతులు 24 గంటల వ్యవధిలో బస్తాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే బుకింగ్ రద్దవుతుంది. పంటల వారీగా, ఎక్కడి నుంచి అయినా బుక్ చేసుకునే అవకాశం 24 గంటల్లో యూరియా తీసుకోకుంటే రద్దు జిల్లాలో 26,985 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం -
బందగీ పోరాటం చిరస్మరణీయం
దేవరుప్పుల: తెలంగాణ రైతాంగ సాయుధ విమోచనోద్యమంలో నిజాం సర్కార్ అంతర్భాగమైన దేశ్ముఖ్ ఆగడాలకు వ్యతిరేకంగా చేపట్టిన షేక్ బందగీ భూసమస్యపై పోరాటం చిరస్మరణీయమని సీపీఐ అనుబంధ ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరెల్ల రవి, రైతు సంఘం జిల్లా నాయకుడు బిల్లా తిరుపతిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కామారెడ్డిగూడెం బస్స్టేజీ వద్ద బందగీ 86వ వర్ధంతి పురస్కరించుకొని ఆయన స్మారక స్తూపం వద్ద సీపీఐ, సమాధి వద్ద ముస్లింలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా బందగీ న్యాయపోరాటం ఆదర్శనీయమన్నారు. బందగీ జీవిత పోరాటం తెలిపే ప్రజానాట్యమండలి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో బందగీ వారసులు సాబీర్, ఖుద్దూస్, వాజీద్, జాకీర్హుస్సేన్, రబ్బానీ, మాజీ ఎంపీటీసీ జాకీర్, మౌలానా, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి -
రేపు సాక్షి ఫోన్ ఇన్..
జనగామ: చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దగ్గు, జలుబు, జ్వరపీడితులకు ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యం, మందులు తదితర అంశాలపై జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ మల్లికార్జున్రావుతో రేపు సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజలు తమ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం డాక్టర్తో మాట్లాడవచ్చు. తేదీ 29–12–2025, సోమవారం సమయం ఉదయం 11నుంచి 12గంటల వరకు.. ఫోన్ చేయాల్సిన నంబర్లు 9705346396 -
సెర్ప్ సిబ్బంది డిమాండ్లను పరిష్కరించాలి
జనగామ: సెర్ప్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ సెర్ప్ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్డీఏ పీడీ వసంతకు శనివారం వినతిపత్రం అందించారు. జేఏసీ ప్రతినిధులు యాదారపు రవి, సంపత్, శంకరయ్య, నరేందర్, నాగేశ్వరావు, జ్యోతి, ఎల్లస్వామి, సదానందం, యాదగిరి, ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ సెర్ప్ సిబ్బంది గత రెండు దశాబ్ధాల కాలం నుంచి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ లేకుండా బ్యాంకు లింకేజీ ద్వారా మహిళా సంఘాలకు వేల కోట్ల రూపాయల రుణాలను అందించడంలో ముఖ్య పాత్ర పోషించామన్నారు. పీఆర్ఆర్డీ శాఖ సర్వీస్ రూల్స్ను వందశాతం వర్తింప జేయడంతో పాటు జీఓ నంబర్ 11 ప్రకారం ప్రస్తుత క్యాడర్లపై మరో రెండు క్యాడర్లు పెంచి అమలు చేయాలన్నారు. సెర్ప్ సిబ్బంది చాలా మంది 50 ఏళ్ల వయస్సు దాటుతున్నా, తగిన బెనిఫిట్లు అందకపోవడం, అధిక పని ఒత్తిడి కారణంగా మరణాల శాతం కూడా పెరుగుతోందని జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. -
సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండాలి
జనగామ: సమాచార హక్కు చట్టంపై అధికారులకు అవగాహన ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని స మావేశం హాలులో మర్రి చెన్నారెడ్డి మానవ వనరు ల అభివృద్ధి సంస్థ వరంగల్, రీజినల్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ శాఖల అధికారులకు ఆర్టీఐ చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కుచట్టం పౌరులకు ప్రభుత్వ సంస్థల నుంచి సమాచారం పొందే హ క్కును కలిగి ఉందన్నారు. ప్రతీ కార్యాలయంలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అప్పీలేట్ అథారిటీలు ద రఖాస్తులను సకాలంలో పరిష్కరించాలన్నారు. రీ జినల్ ట్రైనింగ్ మేనేజర్ మార్గం కుమారస్వామి, ట్రైనర్ మోహన క్రిష్ణ, జిల్లా కో ఆర్డినేటర్లు ఆర్టీఐపై అవగాహన కలిగించారు. అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ -
బడి గదిలో.. పంచాయతీ!
పాలకుర్తి టౌన్: మండలంలోని భీక్యానాయక్ పెద్దతండా..గ్రామ పంచాయతీగా ఏర్పడి ఏడు సంవత్సరాలు దాటింది. అయినా ప్రభుత్వం ఇప్పటివరకు పక్కా భవనాన్ని నిర్మించలేదు. దీంతో గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే పంచాయతీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. పాఠశాలలో ఉన్నవే రెండు గదులు, ఓ గదిలో అంగన్వాడి కేంద్రం నిర్వహిస్తుంటే..మరో గదిని గ్రామ పంచాయతీకి వినియోగిస్తున్నారు. ఇందులో నిర్వహిస్తున్న పాఠశాలను విద్యార్థులు తక్కువగా ఉండడంతో సర్దుబాటులో భాగంగా ఎత్తివేశారు. దీంతో పాఠశాల భవనంలోనే అంగన్వాడీ, గ్రామపంచాయతీని నిర్వహిస్తున్నారు. ఒకటే గది కావడంతో గ్రామపంచాయతీ నిర్వహణకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కొత్త పాలకవర్గాలు ఎన్నికై న సందర్భంగా ప్రభుత్వాలు సొంత భవనాలు లేని గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ముందంజ
● జిల్లాలో 5,026 ఇళ్లలో పనుల కొనసాగింపు ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్జనగామ రూరల్: నిరుపేదలకు నిలువ నీడ కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా జిల్లాలో లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల నిర్మాణం వేగవంతం కావడంతో పాటు, మంజూరైన ప్రతీ ఇల్లు నిర్మాణంలో వివిధ దశల్లో కొనసాగుతున్నాయన్నారు. త్వరగా గ్రౌండింగ్ చేస్తూ రాష్ట్రస్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇందుకు అధికారుల కృషి, సమన్వయం ఎంతో ఉందన్నారు. జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ జరగని వాటికి సంబంధించి పలుమార్లు రివ్యూలు చేయడంతో పాటు లబ్ధిదారులచే పనులు ప్రారంభించేలా కృషి చేయడం వల్ల రాష్ట్రస్థాయిలో గ్రౌండింగ్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలబడిందన్నారు. జిల్లాల్లో..రెండు విడతల్లో..5,834 ఇల్లు మంజూరు కాగా ఇప్పటివరకు 5,206 ఇళ్లు నిర్మాణ దశ లో ఉండగా.. 33 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. -
2న శ్రీసోమేశ్వర ఆలయ హుండీ లెక్కింపు
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో జనవరి 2న(శుక్రవారం) ఉద యం 10 గంటలకు హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవా దాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఆలయంలోని కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపు నిర్వహిచనున్నట్లు ఈఓ పేర్కొన్నారు. గంగదేవిపల్లిని సందర్శించిన ప్రతినిధులు గీసుకొండ: మండలంలోని జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిని జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. రేగొండ మండలం జూబ్లీనగర్ సర్పంచ్, ఉపసర్పంచ్లు మూలగుండ్ల లావణ్యశ్రీనివాస్రెడ్డి, బత్తుల శ్రీధర్, యువకులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, రఘునాథఽపల్లి మండలం ఖిలాషాపురం సర్పంచ్ శాగ కవిత, అశోక్, వార్డు సభ్యులు సందర్శించి అభివృద్ధి తీరుతెన్నులను పరిశీలించారు. ప్రజల భాగస్వామ్యంతో పలు కమిటీల ద్వారా ఆదర్శంగా నిలిచి దేశవిదేశీ ప్రముఖుల ప్రశంసలు పొందిన తీరును గురించి జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి వివరించారు. సర్పంచ్ కూసం స్వరూప, కాంగ్రెస్ నాయకుడు కూసం రమేశ్, అభివృద్ధి కమిటీల ప్రతినిఽధి కూసం లింగయ్య, డీటీఎం కరుణాకర్ పాల్గొన్నారు. కార్మికుల హక్కుల కోసం పోరాడేది ఎర్రజెండానేజనగామ రూరల్: కార్మికుల హక్కుల కోసం శ్రమజీవుల బాధల నుంచి విముక్తి చేసేది ఎర్రజెండా మాత్రమేనని సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో చామకూరి యాకూబ్, ఆది సాయిన్న, ఆకుల శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి చొప్పరి సోమయ్య, గుగులోతు సఖి తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్తో విద్యార్థుల్లో సేవాభావం జఫర్గఢ్: ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్థుల్లో సేవాభావం, నాయకత్వ లక్షణాలు, సమాజంపై బాధ్యత పెరుగుతాయని ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ జానీనాయక్ పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా విద్యార్థినులచే ఏర్పాటు చేసిన ఏడు రోజుల ప్రత్యేక ఎన్ఎస్ఎస్ శిబిరం ముగింపు కార్యక్రమాన్ని పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సీహెచ్ స్వప్న, ఎన్ఎస్ఎస్ పోగ్రాం అఫీసర్ లక్ష్మి, కాకతీయ యూనివర్సిటీ అడ్వైజర్ కమిటీ సభ్యులు అట్ల రాజు, విద్యార్థినులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
తల్లులకు ‘ఈ– కానుక’
ఏటూరునాగారం: గతంలో భక్తులు హుండీల్లో నగదు వేసేవారు. అయితే కంప్యూటర్ యుగానికి అనుగుణంగా సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ఈ– కానుకల సర్వీసులను మొదలు పెట్టారు. గతంలో కేవలం జాతర సమయంలో ఎక్కువగా ఈ –కానుకులు చెల్లించేది. ఇప్పుడు సాధారణ సమయంలో కూడా భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో డిజిటల్ పేమెంట్లను కానుకల రూపంలో అమ్మవారికి చెల్లించే విధంగా ఈ–కానుక స్కానర్లను ఏర్పాటు చేశారు. దీంతో పలువురు భక్తులు కానుకలు హుండీలో వేస్తుండగా మరికొందరు నగదు రహితంగా డిజిటల్ పేమెంట్లు చేసి అమ్మవారికి కానుకలు చెల్లిస్తున్నారు. -
భక్తులకు ఇబ్బంది లేకుండా గ్రౌటింగ్
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణంలో నూతనంగా గ్రానెట్తో ఫ్లోర్ నిర్మాణం పనులు చేపట్టారు. జాతర సమయంలో భక్తులు బంగారం(బెల్లం), కొబ్బరి, నీళ్లతో జారీ పడే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రానెట్పై గ్రౌటింగ్ చేయించే పనులను మొదలు పెట్టారు. దీనివల్ల కాలుకు గ్రిప్ లభించి కిందపడకుండా ఉంటారు. వృద్ధులు, చిన్నారులకు సైతం ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. జాతరలో మొబైల్ మరుగుదొడ్లు ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతరలో భక్తుల సౌకర్యార్థం ఈ సారి మొబైల్ మరుగుదొడ్లను సిద్ధం చేస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో జాతరలో భక్తులు రద్దీగా ఉండే ప్రదేశాలైన ఆర్టీసీ బస్టాండ్, జంపన్నవాగు, స్నానఘట్టాల రోడ్డు, చిలకలగుట్ట ప్రాంతంలో ప్లాస్టిక్తో కూడిన మొబైల్ మరుగుదొడ్లను ఏర్పాటు చేయనున్నారు. జాతరలో మొత్తం 1,020 మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
మీ పంచాయతీ సమాచారం...మీ చేతిలోనే!
● ‘మేరి పంచాయతీ’యాప్ ద్వారా సమాచారంపాలకుర్తి టౌన్: పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక గ్రామ పాలన బాధ్యత సర్పంచ్లు, వార్డు సభ్యులదే. పల్లెలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రూపాల్లో నిధులు మంజూరు చేస్తుంటాయి. వాటిని వేటికి ఖర్చు పెట్టాలి?.. ఏ అభివృద్ధి పనులు చేపట్టాలి.. తదితర వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఇక పాలకులదే. పలుచోట్ల నిధుల విషయంలో అక్రమాలు చోటు చేసుకునే అవకాశముంది. దీనికి అడ్డుకట్ట వేయడంతో పాటు పాలన పారదర్శకంగా సాగుతుందా? లేదా? అని తెలుసుకునేందకు కేంద్ర ప్రభుత్వం మేరి పంచాయత్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్లో ఏం ఉంటాయంటే.. స్మార్ట్ ఫోన్లోని ప్లేస్టోర్ ద్వారా మేరి పంచాయత్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. పేరు, ఫోన్ నంబర్ వివరాలతో లాగిన్ కావాలి. రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ వివరాలు నమోదు చేయాలి, వాటిని ఎంపిక చేసుకున్న తర్వాత క్లిక్ చేస్తే ఆ గ్రామానికి సంబంధించిన నిధుల వివరాలు, వార్డు వారీగా ఖర్చులు, చేపట్టిన పనుల ఫొటోలు కనిపిస్తాయి. గ్రామపంచాయతీకి మంజూరైన నిధులు, వాటితో చేపట్టిన పనుల వివరాలను ఫొటోలతో సహా అధికారులు విధిగా అప్లోడ్ చేస్తారు. ఆస్తులు, ఆదాయ వివరాలు, పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి, అధికారుల వివరాలు జియోట్యాగింగ్ ద్వారా నిక్షిప్తమై ఉంటాయి. ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేపట్టారనేది తెలుసుకోవచ్చు. ఫిర్యాదులు..సలహాలు ఆర్థిక సంఘం ఎన్ని నిధులు విడుదల చేసింది. ఇంకా రావాల్సినవి ఎన్ని తదితర వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దీంతో పాలకవర్గాలు పొరపాట్లకు తావివ్వకుండా ప్రతీ పైసా లెక్క ప్రకారం ఖర్చు చేసే అవకాశముంది. తప్పుడు లెక్కలు చూపితే పౌరులు ప్రశ్నించి సమాచారాన్ని రాబట్టి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. మరో వైపు గ్రామాభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు అందించే అవకాశం ఈ యాప్ ద్వారా పౌరులకు లభిస్తుంది. -
మరింత వేగంగా కేసుల పరిష్కారం
● వార్షిక తనిఖీలో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్జనగామ: కేసుల పరిష్కారంలో మరింత వేగం పెరగాలని ఏఏస్పీ పండేరి చేతన్ నితిన్ (ఐపీఎస్) అన్నారు. వార్షిక తనిఖీ–2025 ల్లో భాగంగా శుక్రవారం ఏఎస్పీ పట్టణ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. పోలీస్ స్టేషన్ కార్యకలాపాలు, సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి సంబంధించిన కిట్ మెయింటెనెన్స్, స్వచ్ఛత, క్రమశిక్షణ, వృత్తిపరమైన నైపుణ్యాలు వంటి అంశాలను వ్యక్తిగతంగా తనిఖీ చేశారు. అదే విధంగా స్టేషన్కు సంబంధించిన రికార్డులు, కేసు డైరీలు, సీడీ ఫైళ్లు, వివిధ రిజిష్టర్లు, అధికారిక దస్తావేజులు అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే కేసుల నమోదు ప్రక్రియ, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నవీకరణ విధానం, స్టేషన్ పరిశుభ్రత, ప్రజలకు అందిస్తున్న సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫిర్యాదుదారులకు సమయానుసారంగా న్యాయం అందించాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, శాంతి భద్రతల.. అంశాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్స్టేషన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరింత ప్రొఫెషనల్గా, బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీస్ శాఖ ప్రతిష్టను ఇనుమడింపజేయాలన్నారు. -
ముగిసిన సమ్మక్క–సారలమ్మ జాతర వేలంపాటలు
స్టేషన్ఘన్పూర్: మండలంలోని తాటికొండ, జిట్టెగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని మల్లన్నగండి సమ్మక్క–సారలమ్మ జాతర వేలంపాటలను తాటికొండ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించారు. జాతర కమిటీ గౌరవ అధ్యక్షుడు, మాజీ వైస్ ఎంపీపీ చల్లా సుధీర్రెడ్డి, తాటికొండ సర్పంచ్ మారపాక సుజనశ్రీను, జిట్టెగూడెం సర్పంచ్ బాలునాయక్, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సమక్షంలో వేలం పాటలు నిర్వహించారు. జాతరను పురస్కరించుకుని తాటికొండ, జిట్టెగూడెం గ్రామాల పరిధిలో, జాతర వద్ద కొబ్బరికాయలు, బెల్లం, కోల్లు, పెద్దతీర్థం(మద్యం) అమ్మకాల కోసం పోటాపోటీగా వేలంపాటలు జరిగాయి. కోళ్ల అమ్మకానికి రూ.3.90 లక్షలు, బెల్లం(బంగారం) అమ్మకానికి రూ.91వేలు, కొబ్బరికాయల టెండర్ రూ.1.22లక్షలు, పెద్దతీర్థం(మద్యం) టెండర్కు రూ.8.46లక్షలకు పలికాయి. -
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
వరుస సెలవులు రావడంతో నగరంలోని ప్రముఖ చారిత్రక దేవాలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి. గురు, శుక్రవారాలు వేలాది మంది భక్తులు శ్రీభద్రకాళి, వేయిస్తంభాల దేవాలయాలను సందర్శించారు. అమ్మవారు, స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ములుగు జిల్లా ఎస్ఎస్తాడ్వాయి మండలంలోని మేడారానికి వేలాదిమంది భ క్తులు తరలివెళ్లారు. జంపన్నవాగులోని బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద స్నానాలు చేసి సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. – హన్మకొండ కల్చరల్/ఎస్ఎస్తాడ్వాయి -
మల్లన్న ఆలయంలో జాతర ఏర్పాట్ల పరిశీలన
ఐనవోలు: ప్రముఖ శైవక్షేత్రమైన ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతరకు ఏర్పాట్లను గురువారం ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. పార్కింగ్ స్థలాలు, క్యూలైన్లు, స్నానఘట్టాలు, తాగునీరు, లైటింగ్, సీసీ కెమెరాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం చైర్మన్ కార్యాలయంలో సమావేశమై జాతరలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని శాఖల అధికారులు సహకరించాలని చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, ఆలయ ఈఓ కందుల సుధాకర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నర్మద, ఏసీపీ వెంకటేశ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంట్రా ఏఈ రవి కుమార్, విద్యుత్ శాఖ ఏఈ సురేశ్కుమార్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్హెచ్ఓ పస్తం శ్రీనివాస్, ధర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. -
వ్యవసాయ సంక్షోభంతోనే రైతుల ఆత్మహత్యలు
● మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్యజఫర్గఢ్: వ్యవసాయరంగ సంక్షోభానికి రైతుల ఆత్మహత్యలే నిదర్శనమని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య అన్నారు. గురువారం మండలంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను మానవ హక్కుల వేదిక బృందం కలిసి వివరాలు సేకరించింది. ఈసందర్భంగా తిడుగు గ్రామానికి చెందిన బొబ్బల రాజు, హిమ్మత్నగర్ గ్రామానికి చెందిన మందపురి రవి గౌడ్, మండల కేంద్రానికి చెందిన కాలువ రాజు కుటుంబాలను బృందం పరామర్శించి, వివరాలు నమోదు చేసుకుంది. ఈసందర్భంగా తిరుపతయ్య మాట్లాడుతూ..ఈ రైతులందరూ మూడు సంవత్సరాలుగా ఆశించిన పంట దిగుబడి రాక ఏటికేడు నష్టాల పాలై కుటుంబ పోషణ భారమై ఆత్మహత్య చేసుకున్నారన్నారు. మృతి చెందిన రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. బృందంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు బదావత్ రాజు, రాష్ట్ర కార్యదర్శి టి.హరికృష్ణ, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు అద్దునూరి యాదగిరి, ప్రధాన కార్యదర్శి దిలీప్ తదితరులు పాల్గొన్నారు. -
అవే బారులు..తప్పని తిప్పలు
స్టేషన్ ఘన్పూర్: అన్నదాతలకు యూరియా కష్టాల నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు పలు కార్యక్రమాలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఫర్టిలైజర్స్ యాప్లో బుక్ చేసుకున్నా రైతులకు అవే కష్టాలు కొనసాగుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలోని కృష్ణ ఫర్టిలైజర్స్ షాపు ఎదుట రైతులు యూరియా కోసం గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో నిల్చున్నారు. ఫర్టిలైజర్స్ యాప్లో బుధవారం సాయంత్రం స్టేషన్ఘన్పూర్తో పాటు చుట్టుపక్కల మండలాల రైతులు యూరియా బస్తాల కోసం కృష్ణ ఫర్టిలైజర్స్లో బుక్ చేసుకున్నారు. తెల్లారి ఉదయం 8 గంటల ప్రాంతంలో వివిధ గ్రామాల నుంచి రైతులు షాపు వద్దకు చేరుకోగా ఇప్పుడు ఇవ్వడం లేదని, మధ్యాహ్నం ఇస్తామని యజమాని తెలుపడంతో రైతులు వెనుదిరిగారు. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు వస్తే మరో రెండు గంటలు ఆగాలని చెప్పడంతో షాపు యజమానితో రైతులు వాగ్వాదానికి దిగారు. తీరా మధ్యాహ్నం 3 గంటల నుంచి యూరియా బస్తాలు పంపిణీ చేయగా లైన్లలో రైతుల మధ్య తోపులాట జరిగింది. బుక్ చేసుకున్న 24 గంటలలోపు తీసుకోవాలని, లేనిపక్షంలో బస్తాలు రావనే ఉద్దేశ్యంతో రైతులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో రైతుల ఽమధ్య తోపులాటలు జరిగాయి. లింక్ పెట్టడంపై రైతుల ఆవేదన యూరియా బస్తాలకు డీఏపీ, పొటాష్, నానో యూరియా లింక్ పెట్టడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒక రైతుకు మూడు బస్తాలు యూరియా ఇస్తే తప్పనిసరిగా ఒకటి, రెండు బాటిళ్ల నానో యూరియా తీసుకోవాలని లింక్ పెడుతున్నారని రైతులు ఆరోపించారు. యూరియా బస్తాకు రూ.266 బిల్లు రాస్తూ ఒక్కొక్క బస్తాకు రూ.300 తీసుకుంటున్నారని వాపోయారు. స్థానిక కృష్ణ ఫర్టిలైజర్స్ షాపు వద్ద యూరియా కోసం రైతుల తోపులాటలు, వాగ్వాదాలతో ఉద్రిక్తత నెలకొన్నా పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు ఎవ్వరూ పట్టించుకోకపోవడం విడ్డూరం. యూరియాకు లింక్ పెట్టడం సరికాదు యూరియా బస్తాల కోసం వచ్చిన రైతులకు పొటాష్, డీఏపీ, నానో యూరియా లింక్ పెట్టడం సరైంది కాదు. రైతుల యూరియా కష్టాలు తీర్చేందుకు ఫర్టిలైజర్స్ యాప్ పెట్టిన ప్రభుత్వం, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ చేపట్టాలి. –ఈదులకంటి రాజు, రైతు సాయంత్రం వరకు లైన్లోనే ఉన్నా.. మాది జఫర్గడ్ మండలం తిమ్మంపేట గ్రామం. శివునిపల్లిలోని ఫర్టిలైజర్స్ షాపు వద్ద మూడు బస్తాల యూరియా కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నా. ఉదయం వస్తే మధ్యాహ్నం ఇస్తామన్నారు. మధ్యాహ్నం వచ్చేసరికి రైతులు లైన్లలో ఉండటంతో సాయంత్రం వరకు ఉండాల్సి వచ్చింది. –మంద రాములు, రైతు ఫర్టిలైజర్ యాప్లో బుక్ చేసుకున్నా తీరని యూరియా కష్టాలు పొటాష్, డీఏపీ లింక్ పెడుతున్న ఫర్టిలైజర్ షాపుల వ్యాపారులు పట్టించుకోని అధికారులు -
వరుస సెలవులు.. కిక్కిరిసిన బస్సులు
జనగామ: క్రిస్మస్ పర్వదినం, బాక్సింగ్ డే సందర్భంగా వరుసగా సెలవులు రావడంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి క్రిస్మస్ పండుగ కోసం స్వగ్రామాలకు వచ్చిన ప్రజలతో పాటు విహారయాత్రల కోసం వెళ్లే ప్రయాణికులతో జనగామ ఆర్టీసీ బస్టాండు వందలాది మందితో కిటకిటలాడింది. ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్లాట్ఫామ్స్ నిండిపోయి..స్థలం లేక ప్రయాణికులు బస్టాండు ప్రాంగణంలో నిలబడిపోయారు. ఒక్కో బస్సులో 80 నుంచి 100 మంది వరకు ప్రయాణం చేశారు. అమ్మవార్లకు సామూహిక ఒడిబియ్యాలుదేవరుప్పుల: ఆధ్యాత్మికత చింతన కోసమే ప్రతీనెల వివిధ ప్రాంతాల్లో అమ్మవార్లకు ఒడిబియ్యాలు సమర్పిసున్నట్టు శివశక్తి గ్రూపు ప్రతినిధులు దుద్దెళ్ల అంజమ్మ, బుక్క స్వాతి అన్నారు. గురువారం మండల కేంద్రంలో బుక్కా భాగ్యలక్ష్మీలక్ష్మయ్య దంపతుల ఆధ్వర్యంలో శ్రీ శైవ క్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ తెలంగాణ రాష్ట్రం విభాగం పిలుపు మేరకు తిరుమలగిరి తొండ–2 గ్రూపు ప్రతినిధులు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని శ్రీ రామాలయంలోని అమ్మవార్లకు పలు రకలా ఒడిబియ్యాలతో ఆర్యవైశ్య మహిళలు పెద్దఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులు వ్యాపారానికే పరిమితం కాకుండా ఆధ్యాత్మికత, సామాజిక సేవలో భాగంగా ప్రతీ నెల సామూహిక ఒడిబియ్యాలు, అమావాస్య రోజున సామూహిక అన్నదానాలు చేస్తున్నట్టు పేర్కోన్నారు. కార్యక్రమంలో బుక్క భవాణి, వనమాల ఉమ, బుక్క జ్యోతి, జయశ్రీ, వనమాల విజయ, లత, యామ మణి, శ్రీరంగం తులసీ గ్రూపు బండారి విజయ, స్వాతమ్మ పాల్గొన్నారు. పొలంబాటలో విద్యుత్ సమస్యల పరిష్కారంస్టేషన్ఘన్పూర్: విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు పొలంబాట కార్యక్రమాలతో పలు విద్యుత్పరమైన సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ట్రాన్స్కో స్టేషన్ఘన్పూర్, శివునిపల్లి సెక్షన్ ఏఈలు పి.శంకర్, శివకుమార్ అన్నారు. ఘన్పూర్ సెక్షన్ పరిధిలోని మీదికొండ గ్రామంలో, శివునిపల్లి సెక్షన్ పరిధిలోని ఇప్పగూడెంలో గురువారం విద్యుత్శాఖ ఆధ్వర్యంలో రైతు పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈలు మాట్లాడుతూ.. మీదికొండలో ఇప్పటివరకు బ్రేక్డౌన్ల సత్వర పరిష్కారానికి 11 కేవీ లైన్లో 14 ఏబీ స్విచ్లను అమర్చగలిగామన్నారు. ఇప్పగూడెంలో వదులుగా ఉన్న విద్యుత్ లైన్లను గుర్తించి మధ్యలో 50 స్తంభాలను ఏర్పాటుచేశామని, ఒక 63 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లైన్ ఇన్స్పెక్టర్లు రామాచారి, ఒడ్డెపల్లి యాదగిరి, కాలురామ్, లైన్మన్లు పాల్గొన్నారు. -
భక్తులకు అసౌకర్యం కలిగించొద్దు
● పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కఎస్ఎస్తాడ్వాయి: ముందస్తుగా మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించొద్దని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. మేడారంలోని ఐటీడీఏ గెస్ట్హౌస్లో అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో మంత్రి సీతక్క మాట్లాడారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తునందున్న స్నాన ఘట్టాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కొంగలమడుగు నుంచి జంపన్నవాగు వరకు రోడ్ల మరమ్మతులు వెంటనే చేయాలని అధికారులను ఆదేశించారు. మేడారానికి భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్నందున్న రోడ్ల విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గద్దెల ప్రాంగణం అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలన్నారు. అదనంగా కార్మికుల సంఖ్య పెంచి షిఫ్టుల వారీగా 24 గంటలు పనులు చేపట్టాలని అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, పీఓ చిత్రామిశ్రా, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి పాల్గొన్నారు. జంపన్నవాగు, రోడ్డు నిర్మాణ పనులు.. సమీక్ష కంటే ముందుగా మంత్రి సీతక్క జంపన్నవాగులో ఏర్పాట్లు, వీవీఐపీ రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించారు. శివరాంసాగర్ చెరువును పరిశీలించి జాతర సమయంలో చెరువులో స్నానాలు చేసే విధంగా నీటిని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. గద్దెల ప్రాంగణంలో ప్రాకారం పనులను కూడా సీతక్క పరిశీలించారు. -
జనగామ
శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025క్రీస్తునామం..భక్తిపారవశ్యంజిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు..పాస్టర్ల శాంతి సందేశాలుప్రార్థనలు.. సంబురాలు.. 7జనగామ: జిల్లావ్యాప్తంగా గురువారం క్రిస్మస్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రేమ, శాంతి, సౌబ్రాతృత్వానికి ప్రతీకగా భావించే యేసు క్రీస్తు జననాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదరులు చర్చిలకు తెల్లవారుజాము నుంచే తరలివచ్చారు. ఒకవైపు భక్తిగీతాలు, మరోవైపు పాస్టర్ల శాంతి సందేశాలు మారుమోగగా, లోకరక్షకుడు యేసుక్రీస్తు జన్మించిన పవిత్ర క్షణాలను భక్తులు భక్తిశ్రద్ధలతో స్మరించుకున్నారు. జిల్లా కేంద్రం సహా అన్ని మండలాల్లో క్రిస్మస్ సంబురాలు అంబరాన్నంటాయి. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సెంటినరీ ఉండ్రుపుర బాప్టిస్టు చర్చితో పాటు స్టేషన్ఘన్పూర్, దేవరుప్పుల, నర్మెట, బచ్చన్నపేట, రఘునాథపల్లి ఆయా మండలాల్లోని చర్చిల్లో నిర్వహించిన వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చారు. క్రైస్తవులు కుటుంబాలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.హనుమకొండ రోడ్డులోని సెయింట్పాల్స్ అండ్ పీటర్స్ రోమన్ క్యాథలిక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గ్రేయిన్ మార్కెట్లోని రూథర్ఫోర్డ్ చర్చి, హైదరాబాద్ రోడ్డులోని అబన్డెంట్ లైఫ్ చర్చి, ధర్మకంచలోని బేతులే బాప్టిస్టు చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ ప్రత్యేక ఆరాధనల్లో పాస్టర్లు దైవసందేశాన్ని అందజేశారు. రాజీవ్నగర్, వీవర్స్ కాలనీ, గిర్నిగడ్డ తదితర ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోని చర్చిల్లో నిర్వహించిన వేడుకల్లో ప్రార్థనలు చేసిన అనంతరం కేక్లను కటింగ్ చేశారు. – మరిన్ని ఫొటోలు 9లోu -
కొరత తీరుస్తున్న
‘పొరుగు’ కూలీలు!బచ్చన్నపేట: యాసంగి వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ సీజన్లో స్థానిక ఎన్నికలు రావడంతో అన్నదాతలు ఆలస్యంగా నార్లు పోశారు. స్థానిక ఎన్నికల తర్వాత అందరూ ఒకేసారి వరినాట్లు చేపట్టంతో కూలీల కొరత నెలకొంది. కూలీలకు ప్ర స్తుతం ఒకరికి రూ.500ల వరకు చెల్లించినా దొరక డం లేదు. ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి కొందరు మిషన్ నాటుకు నార్లు పోశారు. వరి నాట్లు నారు పోసిన 30 రోజుల్లో నాటు వేస్తేనే సరైన పంట దిగుబడి వస్తుంది...లేకుంటే దిగుబడి తగ్గుతుందనే ఆందోళనతో రైతులు నాటు కోసం నానా పా ట్లు పడుతున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో బిహార్, మహారాష్ట్ర, నెల్లూరు నుంచి కూలీలను రప్పించి వరినాట్లు వేయిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు ఒక ఎకరానికి రూ. 5,500 నుంచి రూ.6000ల వరకు తీసుకుంటున్నారు. కూలీలను వేరే గ్రామాలకు తీసుకెళ్లడానికి రైతులు ఆటోచార్జీలను కూడా భరిస్తున్నారు. ఈ కూలీలు కనీసం 20 నుంచి 30 మంది చొప్పున బ్యాచ్లుగా ఉండి ఒక రోజు కనీసం 5 ఎకరాలకు తగ్గకుండా వరినాట్లు వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు రాకపోతే నాటు వేయడం మరింత కష్టంగా మారేదని పలువురు అన్నదాతలు అంటున్నారు.నారుమడిలో నారు తీస్తున్న బిహార్ కూలీలుబచ్చన్నపేటలో వరి నాట్లు వేస్తున్న మహారాష్ట్ర కూలీలునాకున్న ఐదు ఎకరాల వ్యవసాయ భూమిలో వరి పంటను సాగు చేస్తాను. అన్నదాతలు అందరూ ఒకేసారి నాట్లు వేస్తుండడంతో గ్రామంలో ఉన్న కూలీ లు సరిపోవడం లేదు. పరాయి రాష్ట్రాల నుంచి కూలీలు రావడంతో సకాలంలో వరి నాట్లు పడుతున్నాయి. కూలీల కొరత తీరుతుంది. – శేఖర్రెడ్డి, రైతు, బసిరెడ్డిపల్లిమా రాష్ట్రంలో సరిపడా పనులు లేక తెలంగాణకు ఉపాధి కోసం భార్యభర్తలం వచ్చాం. ఇక్కడ ఉదయం 5 గంటల నుంచి సా యంత్రం 6 గంటలకు వరకు ప ని చేస్తే మాకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలకు తగ్గకుండా గిట్టుబాటు అవుతుంది. నెల రోజుల పాటు ఒక్కడ ఉంటాం. తర్వాత మా రాష్ట్రం వెళ్లిపోతాం. – ప్రవీణ్, కూలీ, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఒకేసారి అన్నదాతల వరినాట్లు స్థానికంగా కూలీలు దొరక్క ఇబ్బందులు మహారాష్ట్ర, బిహార్, ఏపీ రాష్ట్రాల నుంచి కూలీల రాక చకచకా నాట్లు పడుతుండడంతో ఊపిరి పీల్చుకుంటున్న రైతులు -
నర్మెట విద్యార్థికి సాహిత్య అకాడమీ ఆహ్వానం
నర్మెట: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని ఎం.అభినిషకు తెలంగాణ సాహిత్య అకాడమీ ఆహ్వానం అందినట్లు పీజిహెచ్ఎం నీలం వేణు బుధవారం తెలిపారు. నవంబర్లో బాలల దినోత్సవం సందర్భంగా అకాడమీ చిన్నారులకు కథా రచన పోటీలను నిర్వహించగా అభినిష ప్రత్యేక బహుమతి పొందింది. కాగా, రాష్ట్రస్థాయిలో ఎంపికై న బాలల కథలను ‘బాలల ప్రపంచం’ పేరుతో అకాడమీ ముద్రించిన పుస్తకాన్ని ఈ నెల 27న రవీంద్రభారతిలో ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించనున్నారు. ఈసందర్భంగా అభినిషకు బహుమతి అందజేస్తారని తెలిపారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినిషను అభినందించారు. కొడకండ్ల: మండలంలోని ఏడునూతుల ఉన్నత పాఠశాలకు చెందిన సీహెచ్.అనీల్ ఉమ్మడి జిల్లా ఖోఖో టీమ్కు ఎంపికై నట్లు పీడీ సంధ్య తెలిపారు. తొమ్మిదో తరగతి చదువుతున్న అనీల్ ఖోఖోలో ప్రతిభను చాటుకొని ఈ నెల 30న వికారాబాద్ తాండూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో ఉమ్మడి వరంగల్ తరఫున పాల్గొననున్నట్లు పీడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనీల్ను హెచ్ఎం యాక య్య, ఉపాధ్యాయులు అభినందించారు. జనగామ: రాష్ట్ర ఐఎంఏ యాక్షన్ కమిటీ, ఆంటీ క్వాక (ఇల్లీగల్ మెడికల్ ప్రాక్టీస్ వ్యతిరేక) కమిటీ కన్వీనర్గా జనగామకు చెందిన డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణనాయక్ నియమితులయ్యారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రం నుంచి తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా అమలుచేస్తానన్నారు. ఈ మేరకు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కిషన్, అశోక్, స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ దయాల్ సింగ్కు కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగుడి నిజాయితీజనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఆసుపత్రికి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి బంగారం, నగదు ఉన్న పర్సును ఓపీ కౌంటర్ వద్ద పోగొట్టుకున్న సంఘటన బుధవారం జరిగింది. ఈ సమయంలో బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు మట్టి కిషన్, తన భార్యకు వైద్య పరీక్షలు చేయించేందుకు హాస్పిటల్కు రాగా, ఓపీ కౌంటర్ వద్ద పర్సు ఉన్న విషయాన్ని గుర్తించారు. వెంటనే ఎమర్జెన్సీ విభాగంలో పని చేస్తున్న డాక్టర్ కల్నల్ భిక్షపతి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగంకు అందజేశారు. పర్సు పోగొట్టుకున్న బాధితులు అప్రమత్తం కాకపోవడంతో ఈ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ చేశారు. బంగారు ఆభరణాలు, నగదు పోగొట్టుకున్న బాధితులు ఆస్పత్రికి వస్తే పూర్తి వివరాలు సేకరించి, నిజానిజాలు తెలుసుకున్న తర్వాత అప్పగిస్తామని సూపరింటెండెంట్ డాక్టర రాజలింగం తెలిపారు. పర్సులో సుమారు 10 గ్రాముల బంగారం ఆభరణాలతో పాటు రూ.2వేల నగదు ఉంది. -
ప్రొటోకాల్పై నిలదీత
లింగాలఘణపురం: మండల కేంద్రంలో బుధవారం జరిగిన కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ చెక్కుల పంపిణీ అనంతరం తహసీల్దార్ రవీందర్ను ప్రొటోకాల్పై బీఆర్ఎస్ సర్పంచ్లు నిలదీశారు. మండల కేంద్రంలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ను వేదికపై పిలువలేదని, నామినేటెడ్ పోస్టులైన మార్కెట్ వైస్ చైర్మన్, డైరెక్టర్లను ఏ విధంగా పిలుస్తారని స్థానిక సర్పంచ్ ఎడ్ల లావణ్య, అదేవిధంగా సమావేశానికి ఆహ్వానించి చెక్కుల పంపిణీ సయమంలో కనీసం తమ పేర్లను కూడా పిలువలేదని వడిచర్ల సర్పంచ్ కార్తీక్, నాగారం సర్పంచ్ గొరిగె ఉప్పలమ్మ, కొత్తపల్లి సర్పంచ్ విష్ణు తహసీల్దార్ తీరుపై మండిపడ్డారు. మరోసారి పునరావృతమైతే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎడ్ల రాజు, గొరిగె అనిల్, బండ చంద్రమౌళి, వీరయ్య, భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. తహసీల్దార్ తమను అవమానించారని బీఆర్ఎస్ సర్పంచ్ల ఆందోళన -
దండిగా ధాన్యసిరులు
జనగామ: ధాన్యం కొనుగోలు ప్రక్రియ అనేది సవాళ్లతో నిండిన వ్యవస్థ. తేమ శాతం నుంచి తూకం, నిల్వ నుంచి చెల్లింపుల వరకూ అనేక దశల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయినా జిల్లాలో ఈ మొత్తం ప్రక్రియ సాఫీగా, సజావుగా, వేగవంతంగా సాగుతోంది. దీనికి ప్రధాన కారణం జిల్లా యంత్రాంగం చేపట్టిన సమగ్ర పర్యవేక్షణ, ఆధునిక సౌకర్యాల వినియోగం, సమస్యలను వెంటనే పరిష్కరించడమనే చెప్పవచ్చు. ఈ సారి ధాన్యం కొనుగోళ్లలో జిల్లాకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. సెంటర్ల వారీగా ధాన్యం ఏ రోజు కొనుగోలు చేశారో అదేరోజు తూకం వేయించడం, వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయించడం, రైతుల ఖాతాల్లో డబ్బులను త్వరగా జమచేయడం వంటి చర్యలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుంచి మిల్లులకు ధాన్యాన్ని వెంటనే ట్యాగ్ చేసి పంపించడం, సంబంధిత వివరాలను ప్రతిరోజూ ఆన్లైన్లో నమోదు చేయడం కూడా చెల్లింపుల వేగాన్ని పెంచింది. దీంతో రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా తమ ధాన్యానికి సమయానుకూలంగా నగదు అందుకుంటున్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు ప్రతిరోజూ కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. స్థానిక ఇబ్బందులను పరిష్కరించి, ప్రక్రియ ఎటువంటి ఆటంకం లేకుండా సాగేలా కృషి చేస్తున్నారు. ఈ సమష్టి శ్రమతో ధాన్యం కొనుగోళ్లు జిల్లాలో ఆదర్శంగా నిలుస్తోంది. జిల్లాలో ప్రస్తుత వానాకాలం 2025–26 సీజన్న్లో ఇప్పటివరకు 37,101 మంది రైతుల నుంచి 14,73,608 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి, రూ. 329.74 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశా రు. ఇది గత ఖరీఫ్ 2024–25 కంటే గణనీయంగా ఉంది. గత సీజన్న్లో 9,10,431 క్వింటాళ్లు కొనుగోలు చేసి మొత్తం రూ.211.21 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ వెల్లడించారు. అంతేకాక ఈ సీజన్న్లో సన్న ధాన్యం అమ్మిన రైతులకు అందించాల్సిన బోనస్ రూపంలో రూ.12.01 కోట్లు ఇప్పటికే జమ కాగా, పారదర్శకత, వేగం, అధికారుల సమీక్షలతో జిల్లా ప్రస్తుత ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర స్థాయిలో ప్రథ మ స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో కొనుగోళ్లు దాదాపు 5.63 లక్షల క్వింటాళ్ల మేర పెరిగింది. – రిజ్వాన్ బాషా షేక్, కలెక్టర్, జనగామ ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో జిల్లాకు ప్రథమ స్థానం రైతన్నలకు అండగా జిల్లా యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ...గత రికార్డులకు బ్రేక్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ నేతృత్వంలో ప్రత్యేక గుర్తింపురైతులు : 37,101 కొనుగోలు చేసిన ధాన్యం : 14,73,608 (క్వింటాళ్లలో ) జమ చేసిన నగదు : రూ.329.74 కోట్లు సన్న ధాన్యం బోనస్ జమ : రూ.12.01 కోట్లు ప్రస్తుత సీజన్లో సన్న ధాన్యం అమ్మిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ మొత్తంగా రూ.12.01 కోట్లు జమ చేశాం. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో జిల్లా తొలి స్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. కొనుగోళ్ల సమయంలో జాప్యం లేకుండా, రోజువారీ అప్డేట్లు, వేగవంతమైన చెల్లింపులు అన్నీ కలసే ఈ సక్సెస్. ఇతర జిల్లాలు కూడా జనగామ నమూనాను అనుసరించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అధికారులు, సిబ్బంది, మిల్లర్లు సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. రైతులు తమ ధాన్యానికి సమయానుకూలంగా, పారదర్శకంగా చెల్లింపులు అందుకోవడంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
ముగిసిన పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు
స్టేషన్ఘన్పూర్: మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లాస్థాయి పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా సాయంత్రం ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో వివిధ పోటీలలో విజేతలైన కళాశాలల జట్లకు బహుమతులు అందించారు. ముఖ్య అతిఽథి, కళాశాల ప్రిన్సిపాల్ పోచయ్య మాట్లాడుతూ.. ఓటమిచెందిన వారు నిరాశచెందకుండా వారిలోని క్రీడాప్రతిభను మరింతగా మెరుగుపర్చుకోవాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి 540 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. ఓవరాల్ చాంపియన్గా బాలుర, బాలికలలో వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిలిచిందన్నారు. అదేవిధంగా వ్యక్తిగతంగా బాలుర ఓవరాల్ చాంపియన్గా ఘన్పూర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి బి.అశోక్, బాలికల విభాగంలో వరంగల్ జీపీటీ విద్యార్థిని జి.నీల నిలిచారన్నారు. కార్యక్రమంలో వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్, పీడీ రాజుతో పాటు పీడీలు, పీఈటీలు, అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
జిల్లాలో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదుల నియామకం
సుధీర్రంజన్ను సత్కరిస్తున్న మంచాల రవీందర్, గుండెల్లి రాజశేఖర్, ఉడుత ఉపేందర్, కోటా శంకర్ జనగామ: కేంద్ర న్యాయశాఖ ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించిన స్టాండింగ్ గవర్నమెంట్, అడిషినల్ స్టాండింగ్ గవర్నమెంట్ కౌన్సిళ్ల తాజా నియామక ఉత్తర్వు బుధవారం వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కోర్టు వ్యవహారాలను పర్యవేక్షించేందుకు జిల్లాకు చెందిన నలుగురు సీనియర్ న్యాయవాదులను కీలక పదవుల్లో నియమిస్తూ భారత ప్రభుత్వ న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్కు సీనియర్ న్యాయవాది చిలువేరు సుధీర్రంజన్ నియమితులు కాగా, అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్కు మరో ముగ్గురు న్యాయవాదులు కోటా శంకర్, ఉడుత ఉపేందర్ యాదవ్, గుండెల్లి రాజశేఖర్కు అవకాశం కల్పించారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్లో ఉన్న కోర్టు కేసులను పరిష్కరించడంలో వీరు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఈ నియామకాలు మూడు సంవత్సరాల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అమలులో ఉంటాయని న్యాయ మంత్రిత్వశాఖ సెక్రెటరీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాకు చెందిన న్యాయవాదులకు ఒకేసారి నలుగురికి బాధ్యతలు దక్కడంపై జిల్లా న్యాయవాదుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా చిలువేరు సుధీర్రంజన్ను జిల్లా చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ మంచాల రవీందర్ ఘనంగా సన్మానించి, మిగతా ముగ్గురు న్యాయవాదులకు శుభాకాంక్షలు తెలిపారు. స్టాండింగ్ గవర్నమెంట్ కౌన్సిల్కు నలుగురు -
కులం పేరుతో దూషిస్తే కఠిన చర్యలు
బచ్చన్నపేట: కులం పేరుతో ఎవరినీ దూషించొద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ హెచ్చరించారు. బుధవారం మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై విచారణ జరిపారు. అలాగే సాల్వాపూర్లో అత్తింటి వరకట్న వేధింపులకు వివాహిత ఆత్మహత్య చేసుకోగా ఆ అత్తింటి వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. గ్రామంలో మాజీ సర్పంచ్ భర్త తాతిరెడ్డి శశిధర్రెడ్డి అదే గ్రామానికి చెందిన దళితులను ఈ నెల 16న తిట్టారని పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో విచారణ చేసి వివరాలను నమోదు చేసుకున్నామని వాటిని పైఅధికారులకు తెలియజేస్తామని తెలిపారు. అలాగే సాల్వాపూర్లో అనుశ్రీ అనే వివాహిత వరకట్న వేధింపులకు ఆత్మహత్య చేసుకోగా అందుకు కారణమైన అత్త, మామ, భర్త, మరొకరు మొత్తం నలుగురిని అరెస్టు చేశామన్నారు. గ్రామాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ -
యేసయ్య ఆరాధనలో..
క్రిస్మస్ పండుగకు ఏర్పాట్లు పూర్తి● అర్ధరాత్రి యేసురాకను స్వాగతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు ● విద్యుత్ వెలుగుల్లో చర్చిలు, క్రైస్తవుల ఇళ్లుజనగామ: జిల్లాలో క్రిస్మస్ పండుగ వాతావరణం నెలకొంది. ఈనెల 25న (గురువారం) జరగనున్న క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రైస్తవ సోదరులు సంబురాల్లో మునిగిపోయారు. ప్రధాన కూడళ్లలో ఆకర్షణీయమైన నక్షత్రాలతో వెలుగుల హరివిల్లు కట్టారు. చర్చి ప్రాంగణాల్లో యేసు జననాన్ని ప్రతిబింబించే పశువులపాక నమూనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి యేసురాకను స్వాగతిస్తూ క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు ఆలపించారు. క్రైస్తవ యువత ఆనందోత్సాహాల నడుమ వేడుకల్లో భాగస్వామ్యులయ్యారు. మానవాళి కోసం శిలువపై ప్రాణత్యాగం చేసిన యేసు ప్రభువు ప్రేమ, కరుణను స్మరించుకుంటూ భక్తులు ప్రార్థనల్లో నిమగ్నమయ్యారు. క్రిస్మస్ ట్రీ ప్రత్యేకత క్రిస్మస్ ట్రీని మొదటిసారిగా 1510లో క్రిస్మస్ రోజు జర్మనీలో లాటివియా అనే ప్రాంతంలోని ‘దిగా’ అనే గ్రామంలో తొలిసారిగా ఏర్పాటు చేసినట్టు చరిత్ర చెబుతోంది. వీటి కోసం తొలత ‘కీనిఫిర్లు పైన్, ఫిర్ స్రూసీ’ తదితర జాతుల చెట్లను అప్పట్లో వినియోగించేవారు. మధ్యయుగంనాటి నాటికల్లో క్రిస్మస్ ట్రీ స్వర్గం నుంచి వచ్చిందని పేర్కొంటూ ‘ట్రీ ఆఫ్ ప్యారడైజ్’గా అభివర్ణించారు. ఆరు లేదా ఏడడుగుల మొక్కలను క్రిస్మస్ ట్రీకి ఉపయోగించడం ఆనవాయితీ. 1782లో థామస్ అల్వా ఎడిసన్ సహాయకుడు ఎడ్వర్డు జాన్సన్ తొలిసారిగా క్రిస్మస్ ట్రీని విద్యుత్ దీపాలతో అలంకరించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. యేసు ప్రభువు రాకకోసం క్రీస్తును నమ్మిన వారికి ఇదొక శుభదినం. ప్రభువు రాకకోసం క్రిస్మస్కు నెల ముందు నుంచే క్రీస్తు విశ్వాసులు సమాయత్తం అవుతారు. రక్షకుడిగా, మానవాళి పాప విమోచకుడిగా, మరణాన్ని గెలిచిన మహరాజుగా ఈ లోకంలో జన్మించిన యేసుక్రీస్తు జన్మదినాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకునేందుకు ముందు నుంచే ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రిస్మస్ అన్ని వర్గాల వారికి శాంతి, సమాధానం, ప్రేమ పంచాలి. ఒక్కరోజు ముందుగానే అన్ని చర్చిల్లో పండుగ వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన చర్చిలతో పాటు ఆయా కాలనీల్లో అర్థరాత్రి యేసు ప్రభువు రాకను పురస్కరించుకుని ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు. గురువారం ఉదయం వందలాది మంది సేవకులు ప్రార్థనా మందిరాలకు చేరుకుని దేవున్ని ఆరాధిస్తారు. పట్టణంలోని ధర్మకంచ బేతెల్ బాప్టిస్టు చర్చిలో కేక్ కట్ చేస్తున్న క్రైస్తవులు -
రెండోపంటకు సాగునీరు
జనగామ రూరల్: జిల్లాలో రెండో పంటకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని, ఒక్క ఎకరం కూడా పంట ఎండిపోకూడదని, అలాగే రోడ్డు భద్రత ప్రమాణాలను మెరుగుపర్చాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగవారం కలెక్టరేట్లో నీటి పారుదల, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..చివరి ఆయకట్టు వరకు సాగునీరు వెళ్లే విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారి 163 డిజైన్ గాని, నిర్మాణం గాని భద్రత ప్రమాణాలను మెరుగుపర్చాలన్నారు. బాధ్యతాయుతంగా పనిచేయాలి ప్రతీ గర్భిణి, శిశువు ఆరోగ్యంపై వైద్యాధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. కలెక్టరేట్లో మాతృ మరణాల సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె.మల్లికార్జునరావు, అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయం మేలు.. రఘునాథపల్లి: ౖసేంద్రియ వ్యవసాయం వైపు రైతులను మళ్లించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి శాస్త్రవేత్తలకు సూచించారు. మండలంలోని నిడిగొండలో జయశంకర్ విశ్వవిద్యాలయం, రైతు విజ్ఙాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళా కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలిసి పాల్గొన్నారు. కో ఆర్డినేటర్ శ్రీలత, విస్తరణ సంచాలకులు యాకాద్రి, సర్పంచ్ వీరస్వామి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాంబాబు పాల్గొన్నారు. సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కడియం, కలెక్టర్ రిజ్వాన్ బాషా -
మేడారం.. ముమ్మరం
మేడారంలో గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం, పలు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. గద్దెల చుట్టు, ప్రాకారం చుట్టు రాతి స్తంభాల ఏర్పాటుతోపాటు వాటిపై డిజైన్లు, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునరుద్ధరణతోపాటు అమ్మవార్ల గద్దెల విస్తరణలో భాగంగా రాతి నిర్మాణ పనులు ఒక రూపునకు వచ్చాయి. గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ రాయి పరుస్తున్నారు. అదేవిధంగా జంపన్నవాగు వద్ద స్నానఘట్టాలు, జల్లు స్నానాలకు తగిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. – ఎస్ఎస్తాడ్వాయి ఆలోగా మేడారం పనులు పూర్తి కావాలి మంత్రులు పొంగులేటి, సీతక్క ఆదేశం గద్దెల విస్తరణ, ప్రాంగణ పనుల పరిశీలన -
జనగామ
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025జాతీయస్థాయి టెన్నిస్ వాలీబాల్ పోటీలకు ఎంపిక7జనగామ రూరల్: జాతీయ స్థాయి టెన్నిస్ వాలీబాల్ పోటీలకు తెలంగాణ బృందం తరఫున ధర్మకంచ విద్యార్థులు ఎంపిక కావడం గర్వకారణమని పాఠశాల హెచ్ఎం కనకయ్య అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఝార్ఖండ్ రాష్ట్రంలో జరిగే టెన్నిస్ వాలీబాల్ పోటీలకు ఇటీవల 4 రోజులపాటు ధర్మ కంచ పాఠశాలలో శిక్షణా శిబిరం ఏర్పాటు చేయగా ఈ శిక్షణా శిబిరంలో తమ విద్యార్థులు ప్రతిభ కనబర్చి ఎంపికయ్యారన్నారు. సీనియర్ నేషనల్ క్రీడాకారులు బాలికలు సంధ్య, నవీక , బాలురు ఎం.గణేష్, విజయ్ జాతీయ స్థాయి క్రీడాకారులు, బాలికలు అశ్విత, మేఘన శ్రీ, బాలురు మధు, రమేశ్, మినీ నేషనల్ క్రీడాకారులు బాలికలు సాత్విక, ఐశ్వర్య, బాలురలో హరిచరణ్, శ్రీశాంత్, వర్షిత్ ఎంపికయ్యారన్నారు. -
పంచాయతీ కార్యదర్శుల జిల్లా కమిటీ ఎన్నిక
జనగామ: పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా రొండ్ల శ్రీనివాస్రెడ్డి ఎన్నికయ్యారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ కార్యాలయంలో బొట్ల శంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథులుగా జిల్లా టీఎన్జీఓ యూనియన్ కార్యదర్శి పెండెల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పేర్వారం ప్రభాకర్, జిల్లా కోశాధికారి ఎండీ హఫీజ్ హాజరయ్యారు. సంఘ ఉపాధ్యక్షుడిగా సతీష్, స్పోర్ట్స్ సెక్రటరీ సంతోష్, కల్చరల్ సెక్రటరీ మధుకర్, జాయింట్ సెక్రటరీ సంపత్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
చిన్నారి ‘అన్నదాతలు’
జనగామ: కిసాన్ దివస్ను పురస్కరించుకుని ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో మంగళవారం ఘనంగా వేడుకలను జరుపుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో రైతుల ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక ప్రదర్శనలు, కార్యక్రమాలు నిర్వహించగా, రైతు వేషధారణలో పాల్గొన్న విద్యార్థులు కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల చైర్మన్ విపల్ శ్రీపతిరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రైతుల శ్రమను గౌరవించాలని, ఆ భావన చిన్నప్పటి నుంచే పిల్లల్లో పెంపొందాలని సూచించారు. పిల్లల ప్రతిభను ఉపాధ్యాయులు అభినందించారు. పాఠశాల కరస్పాండెంట్ కీర్తి వీరేందర్, ప్రిన్సిపల్ ప్రభాకర్, ఉపాధ్యాయులు శోభ, అరుణ్, సాయిరామ్, శరత్ తదితరులు పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు.ఎస్పీఆర్ స్కూల్లో కిసాన్ దివస్ వేడుకల్లో రైతుల వేషధారణలో చిన్నారులు


