Jangaon District News
-
పూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధి
జనగామ: మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పూలేకు పుష్పాంజలి ఘటించి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు సమర్పించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఎన్ఎల్ నరసింహరావు, ఏబీసీడీఓ రవీందర్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సిద్దయ్యగౌడ్, హరీశ్, వీరస్వామి, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల బాలరాజు, యాదవ సంఘం జనరల్ సెక్రటరీ మేకల సమ్మ య్య, ఉపేందర్ యాదవ్, సేవాదళ్ టౌన్ ప్రెసిడెంట్ బిర్రు సత్యనారాయణ, విశ్వబ్రాహ్మణ సంఘం జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి, కురుమ సంఘం సెక్రటరీ మల్లేష్, రెడ్క్రాస్ అధ్యక్షుడు కన్నా పరశురాములు, విశ్వకర్మ సంఘం జిల్లా ప్రెసిడెంట్ రామేశ్వరాచారి పాల్గొన్నారు.నివాళులర్పిస్తున్న కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఏసీ, డీసీపీ మరిన్ని ఫొటోలు 9లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి -
ఆరోగ్యవంత సమాజ నిర్మాణమే లక్ష్యం
జనగామ రూరల్: ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జనగామ యూపీహెచ్ఎస్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనురాధ జాదవ్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పట్టణలోని మూడో వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఈసందర్భంగా కౌన్సిల ర్ జ్యోతి మాట్లాడుతూ..మహిళలకు, గర్భిణులకు ప్రత్యేక చికిత్స పరీక్షలు నిర్వహిస్తున్నారని, అలాగే చిన్నపిల్లలకు అన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కసాబ్, అనిల్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, మచ్చ ప్రవీణ్, రవీందర్, గుండు శశిరేఖ దాసరి సరిత, కవిత తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
● శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. థ్రెడ్డింగ్, హెయిర్ కట్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ – సెల్ఫ్ గ్రూమింగ్, ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈనెల 13వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 14 నుంచి మే 12వ తేదీ వరకు ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఉంటుంది. ● రిజిస్ట్రేషన్, శిక్షణ కోసం శ్రీ శైలీ బ్యూటీపార్లర్, ఓల్డ్ బస్డిపో దగ్గర, సర్క్యూట్ హౌస్ రోడ్డు, హనుమకొండలో సంప్రదించాలి. ● మరిన్ని వివరాల కోసం 95055 14424, 94901 55215 నంబర్లలో సంప్రదించవచ్చు. -
ఫెన్సింగ్తో ఉజ్వల భవిష్యత్
ఫెన్సింగ్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. తల్లిదండ్రులు రొటీన్ క్రీడల్లో కాకుండా అత్యంత అరుదైన ఫెన్సింగ్లో శిక్షణ అందించేందుకు చొరవ చూపాలి. అంతంత మాత్రంగానే ఉన్న ఫెన్సింగ్ క్రీడాభివృద్ధికి, వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేయాలి. నేటి యువతలో ఫెన్సింగ్ నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంది, సదుపాయాలు లేకపోవడంతో వెనుకంజ వేస్తున్నారు. – దుబ్బ రాము, కార్యదర్శి, జిల్లా ఫెన్సింగ్ సంఘం గ్రామీణ యువతను ప్రోత్సహించేందుకు చర్యలు ఆదరణ కోల్పోతున్న ఫెన్సింగ్ క్రీడలో శిక్షణ ఇచ్చేందుకు గ్రామీణ యువతను ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించేందుకు కృషి చేస్తాం. అందుకు వేసవి సెలవుల్లో మండల కేంద్రాల్లో ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. – తాళ్లపెల్లి ప్రవీణ్గౌడ్, ఉపాధ్యక్షుడు, జిల్లా ఫెన్సింగ్ సంఘం -
ప్రజారోగ్య రక్షణలో ఫార్మసీలు కీలకం
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝాజనగామ: ప్రజల ఆరోగ్య రక్షణలో ఫార్మసీల బాధ్యత కీలకమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో చివరి రోజున డ్రగ్స్ కంట్రోల్ అండ్ రెగ్యులేటరీ డేను కలెక్టరేట్ సమావేశం హాల్లో శనివారం నిర్వహించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్లతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం ప్రతీ మెడికల్ షాప్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్, లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. మున్సిపల్ నిబంధనల విషయానికొస్తే, మెడికల్ షాపులు నివాస భవనాల్లో కాకుండా వాణిజ్య భవనాల్లోనే నడపాలని సూచించారు. ఔషధాల విక్రయంలో జాగ్రత్తలు పాటించాలని, ప్రిస్క్రిప్షన్ మందులు వైద్యుల చీటి లేకుండా ఇవ్వకూడదని, అదే విధంగా జిరాక్స్ కాపీలు, వాట్సాప్ ద్వారా వచ్చిన ప్రిస్క్రిప్షన్ల ఆధారంగా మందులు ఇవ్వరాదని, ఒరిజినల్ ప్రిస్క్రిప్షన్ మాత్రమే పరిగణించాలన్నారు. డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన ర్యాలీ డ్రగ్స్ మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో కలెక్టర్ పాల్గొని ప్రారంభించారు. నెహ్రూపార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. డ్రగ్స్ దుర్వినియోగంపై అప్రమత్తత అవసరమన్నారు. ఎక్కడైనా డ్రగ్స్ దుర్వినియోగం కనిపించినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1800 599 6969కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. అనంతరం ఫార్మసీ విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రశంస పత్రాలు అందించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. -
పచ్చడి పిరమాయే!
జనగామ: పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతల ప్రభావం దేశీయ మార్కెట్లపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా వంటనూనెల ధరలు విపరీతంగా పెరగడంతో పాటు పచ్చడి తయారీలో ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు మామిడి పచ్చడి తయారీ 50శాతం అదనపు భారంగా మారిపోయింది. ధరలు ఇలా.. ఇటీవల కాలంలో కారంపొడి ధరలు గణనీయంగా పెరిగాయి. గతంలో కిలో రూ.680 వరకు లభించిన కారంపొడి ప్రస్తుతం రూ.780కి పైగా చేరింది. అదే సమయంలో వెల్లుల్లి ధరలు కూడా కిలో రూ.100 నుంచి రూ.170 వరకు భారీగా పెరగడంతో పచ్చడి తయారీ ఖర్చు మరింత పెరిగింది. వంటనూనెల ధరల పెరుగుదల ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. నెల రోజుల క్రితం లీటరు నూనె ధర రూ.130 ఉండగా, అది రూ.155కు చేరి ప్రస్తుతం రూ.150 వద్ద నిలిచింది. ఐదు లీటర్ల నూనె ధర గతంలో రూ.700 ఉండగా, రూ.750కు పెరిగి ప్రస్తుతం రూ.920లకు రిటేయిల్ మార్కెట్లో అమ్ముతున్నారు. అలాగే 15 లీటర్ల టిన్ ధర రూ.2,300 నుంచి రూ.2,450కు, ప్రస్తుతం రూ.2,670 వరకు పెరిగింది. తగ్గిన మామిడి దిగుబడి జిల్లాలో సుమారు 8 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నప్పటికీ, ఈ ఏడాది దిగుబడి తీవ్రంగా తగ్గింది. వాతావరణ మార్పులు, తక్కువ పంట ఉత్పత్తి కారణంగా మార్కెట్లో పచ్చడి కాయలకు తీవ్రమైన కొరత ఏర్పడింది. గతేడాది రూ.100కు 15 నుంచి 20 మామిడికాయలు లభించగా, ప్రస్తుతం అదే ధరకు కేవలం 5 కాయలే వస్తున్నాయి. చిన్న సైజు కాయలకు సైతం అధిక ధరలు పలుకుతుండగా, పెద్ద సైజు కాయలకు మరింత డిమాండ్ పెరిగింది. 2 కిలోలపై రూ.460 అదనపు భారం పచ్చడి మామిడికాయల ధరలు అమాంతం పెరగడంతో ఈ సీజన్లో మామిడి పచ్చడి తయారీ సాధారణ ప్రజలకు భారంగా మారుతోంది. ప్రస్తుతం 10 మామిడికాయలు (సుమారు 2 కిలోల ముక్కలు)తో పచ్చడి తయారీకి సుమారు రూ.460 ఖర్చవుతుండగా, తాజా ధరల పెరుగుదలతో అదనంగా రూ.90 వరకు భారం పడుతోంది. ఇదే లెక్కన 100 కాయలతో పచ్చడి చేసే వారికి మొత్తం ఖర్చు రూ.4,560కు చేరుకోగా, అదనపు భారం సుమారు రూ.1000 వరకూ పెరుగుతుంది. మామి డికాయల సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. మరోవైపు వంటనూనె, వెల్లుల్లి, కారం వంటి అవసరమైన పదార్థాల ధరలు కూడా పెరుగుతుండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. ఈ వారం రోజుల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ధరల పెరుగుదలతో ఒక్కో కుటుంబంపై పచ్చడి తయారీకి సుమారు 50 శాతం అదనపు భారం పడుతోంది. ఇంట్లో ఇతర వంటకాలు లేకపోయినా పచ్చడితో రేషన్ బియ్యం కలిపి భోజనం చేసే పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో సర్వసాధారణం. మార్కెట్లో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పచ్చడి తయారీకి అవసరమైన పదార్థాల ధరలు కూడా పెరగడం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో పచ్చడి వంటి సాధారణ ఆహార పదార్థాలు కూడా సామాన్యులకు అందని వాటిగా మారే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా పెరిగిన మామిడికాయలు, కారం, నూనె ధరలు తగ్గిన మామిడి దిగుబడి..రూ.వందకు ఐదు కాయలు వెల్లుల్లి, ఇతర సరుకుల ధరలు అదేతీరు 50శాతం అదనపు ఖర్చు పచ్చడి మెతుకులకు కష్టకాలమే అంటున్న సామాన్యులు -
డీ–అడిక్షన్ సెంటర్లో కౌన్సెలింగ్ ఇవ్వాలి
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎంలోని డీ–అడిక్షన్ సెంటర్లో బాధితులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం డీ–అడిక్షన్ సెంటర్ను పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్, వరంగల్ కలెక్టర్ సత్యశారద, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సెంటర్లో బాధితులకు అందిస్తున్న వైద్యసేవలు, సౌకర్యాలు, పునరావాసంపై అధికారులతో సమీక్షించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ వ్యసనాల నుంచి బయటపడేందుకు, మానసిక దృఢత్వం కోసం కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని ఆయన సూచించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ ఎంజీంఎలోని డీ–అడిక్షన్ సెంటర్ సేవలను మరింత మెరుగుపరచాలన్నారు. బాధితులకు సమగ్ర సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, ఇటీవల నిర్వహించిన పలు పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి, హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి, సైకియాట్రిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ అశ్విన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్ల పంపిణీపాలకుర్తి టౌన్: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అంగన్వాడీ టీచర్ల పాత్ర కీలకమని, రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను ఆధునీకరించేదిశగా చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ఫోన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్మార్ట్ఫోన్ ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వివరాలను సమయానుకులంగా నమోదు చేయగడం, పోషణ ఆరోగ్య సంబంధిత సేవలను అందించడం సులభమవుతుందన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ కోదండరాములు, మార్కెట్ చైర్పర్సన్ మంజుల, సీడీపీఓ సత్యవతి, సూపర్వైజర్లు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి సేవిస్తున్న యువకుడి అరెస్ట్జనగామ రూరల్: మండలంలోని చీటకోడూరు రోడ్డులో గంజాయి సేవిస్తున్న యువకుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ సత్యనారాయణరెడ్డి శనివారం తెలిపారు. శుక్రవారం చీటకోడూర్ రోడ్డులో గంజాయి సేవిస్తున్నారని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎస్సై భరత్ సిబ్బందితో వెళ్లి అక్కడ చూడగా ఇద్దరు వ్యక్తులు గంజాయి సేవిస్తున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి ఆక్కడ నుంచి పారిపోయాడు. నిందితుల నుంచి 60 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని ఎస్సై నర్సయ్య కేసు రిజిస్టర్ చేసి, దర్యాఫ్తు ప్రారంభించి నిందితున్ని రిమాండ్ తరలించారు.బుచ్చిబాబు జీవితం సాహిత్యం పుస్తకావిష్కరణవిద్యారణ్యపురి: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ రచించిన బుచ్చిబాబు జీవితం–సాహిత్యం పుస్తకావిష్కరణ కార్యక్రమం శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగింది. విశ్వనాథ సాహిత్యపీఠం వ్యవస్థాపకుడు వెలిశాల కొండల్రావు ముఖ్యఅతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. రచయిత అంపశయ్య నవీన్, తెలుగుభాషా సాంస్కృతికశాఖ అధ్యక్షుడు ఏనుగు నర్సింహారెడ్డి, రచయితలు దర్శశయనం శ్రీనివాసచార్య, అశోక్కుమార్, నెల్లుట్ల రమాదేవి శశికిరణ్ పాల్గొన్నారు. -
ఫెన్సింగ్ క్రీడలో రాణిస్తున్న ఓరుగల్లు యువతులు
జాతీయస్థాయి పోటీల్లో తలపడుతున్న స్కావెస్లావరంగల్ స్పోర్ట్స్: రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి. వారి తెగువ, ఆయుధ విద్యను ఇప్పటికీ ఓరుగల్లు ఆడబిడ్డలు వారసత్వంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కత్తిసాము(ఫెన్సింగ్) క్రీడ ఉనికి పదిలంగానే ఉంది. ప్రపంచ ప్రఖ్యాత క్రీడల్లో ఫెన్సింగ్ మూడో స్థానంలో నిలుస్తోంది. అభివృద్ది చెందిన నగరాలు, దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ గేమ్లో రాణిస్తున్నారు ఉమ్మడి వరంగల్కు చెందిన ఆడబిడ్డలు. రాణి రుద్రమదేవీలా కత్తి దూస్తున్న ఆ ఇద్దరి నేపథ్యమే ఈ వారం ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. అంతర్జాతీయ వేదికపై ప్రదర్శన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటకు చెందిన గొర్రె శ్రీజ డిగ్రీ చదువుతూ మహారాష్ట్ర సాయ్ అకాడమీలో ఫెన్సింగ్లో శిక్షణ పొందుతోంది. 4వ తరగతిలో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో చేరిన శ్రీజ 9వ తరగతి వరకు అక్కడే చదువుతూ ఫెన్సింగ్లో శిక్షణ పొందింది. అనంతరం ఎన్ఐఎస్ పంజాబ్లో సీటు సాధించి కత్తి యుద్ధంలో ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇప్పటి వరకు 20కిపైగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో బల్గేరియా, ఇటలీలో జరిగిన చాంపియన్షిప్లో తనదైన ప్రతిభ చాటింది. ఎప్పటికై నా భారత్ తరఫున ఒలింపిక్స్లో పాల్గొని పతకం సాధించడమే తన లక్ష్యమని శ్రీజ చెబుతోంది. పది పోటీల్లో ప్రతిభ హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన కడార్ల స్కావెస్లా స్పోర్ట్స్ కోటాలో ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. పదో తరగతిలో ఫెన్సింగ్లో శిక్షణ ప్రారంభించిన స్కావెస్లా కేవలం ఐదేళ్లలో పదికి పైగా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. మరింత మెరుగైన శిక్షణ అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి వరంగల్ జిల్లాకు పేరు తీసుకొస్తానని స్కావెస్లా చెబుతోంది. ● జాతీయ స్థాయిలో పతకాలు ● ప్రోత్సహిస్తే ఒలింపిక్స్లో రాణించే అవకాశం -
ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు
జనగామ: మండలంలోని ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే విషయంలో సర్పంచ్, ఉ ప సర్పంచ్లు పూర్తి సహకారం అందించాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. శనివారం రాత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్న్, సీఐ సత్యనారాయణరెడ్డితో కలిసి మండలంలోని సర్పంచ్, ఉప సర్పంచ్లతో సమావేశం ని ర్వహించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఊరికి భద్రతగా నిలుస్తాయన్నారు. నేరా ల నియంత్రణకు ఉపయోగపడుతాయన్నారు. త్వ రలోనే గ్రామాల్లో సీసీటీవీ వ్యవస్థను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చోరీల నియంత్రణజఫర్గఢ్ : ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే దొంగతనాలను నియంత్రించవచ్చని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య సూచించారు. స్థానిక పోలీస్స్టేషన్లో సర్పంచ్లతో సీసీ కెమెరాల ఏర్పాటుపై సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఎస్సై రామారావుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. సర్పంచ్,ఉప సర్పంచ్లతో డీసీపీ సమావేశం -
‘అరైవ్–అలైవ్’తో ప్రతీ ప్రాణం కాపాడాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ● మూడు జిల్లాల అధికారులతో సమీక్షహన్మకొండ అర్బన్ : ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న ‘అరైవ్ అలైవ్’కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో విజయవంతం చేసి ప్రతీ ప్రాణం కాపాడే ప్రయత్నం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో సీపీ అధ్యక్షతన హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల అధికారులతో ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశంలో కార్యక్రమ అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు, రెవెన్యూ, రవాణా, ఆర్అండ్బీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్స్ను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా హసన్పర్తి ప్రాంతంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ జిల్లా, మున్సిపల్, గ్రామస్థాయిలో రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించేలా పర్యవేక్షణ పెంచాలన్నారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ బ్లాక్ స్పాట్స్పై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ నేషనల్ హైవేపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు అవసరమని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు, అదనపు కలెక్టర్లు, ఆర్అండ్బీ, రవాణా, రెవెన్యూ, విద్యుత్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలతో రైతేరాజు
● స్టేషన్ ఘన్ఫూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రఘునాథపల్లి: తెలంగాణలో రైతును రాజుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రెండేళ్ల కాలంలో దేవాదుల కాలువలకు మరమ్మతులు, పూడికతీత తీయించి ప్రతీ గ్రామానికి గోదావరి జలాలు రావడంతో నియోజకవర్గంలో పంటల దిగుబడి, పంట నాణ్యత పెరిగిందన్నారు. శుక్రవారం మండలంలోని కంచనపల్లిలో 25 లక్షల సీసీ రోడ్డు, నిర్మాణాలు పూర్తయిన నాలుగు ఇందిరమ్మ ఇళ్లు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.. నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు మండల కేంద్రంలోని రైతు వేదికలో 37 మందికి రూ.12 లక్షల 52 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, డీసీఓ కోదండరాములు, తహసీల్దార్ రాజేష్రెడ్డి, సొసైటీ ఇన్చార్జ్ వేణుగోపాల్, సీఈఓ ప్రశాంత్, సర్పంచ్ గొంగళ్ల అబ్రహం, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్చందర్రెడ్డి, నాయకులు లోనే రవి, రాపోలు రామ్మూర్తి, పర్ష సిద్దేష్, జయరాములు, విజయమేరి, హరినాథ్, రాజు, కోళ్ల రవి, రవి, రంగోజు ఈశ్వరయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. సెంటినరీ బాప్టిస్టు చర్చి వార్షికోత్సవంలో .. కంచనపల్లి సెంటినరీ బాప్టిస్టు చర్చి వార్షికోత్సంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కేఎం జాన్, జయమణి, దేవదానం, దైద ప్రభుదాసు, గడ్డం సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి
జనగామ: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశం హాల్లో సామాజిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని నేడు(శనివారం) నిర్వహించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎన్ఎల్ నరసింహరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, వెనుకబడిన తరగతుల కుల సంఘం నాయకులు, ప్రతినిధులు, ఇతర కుల సంఘాల నాయకులు హాజరు కావాలని కోరారు. మార్క్ఫెడ్, ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేయాలిజనగామ రూరల్: జనగామ వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్, ఐకేపీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మొక్కజొన్న, ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. మార్కెట్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం కనకారెడ్డి మాట్లాడుతూ.. మార్క్ఫెడ్, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తుండడంతో రైతులకు మద్దతు ధర రావడం లేదన్నారు. ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సాంబరాజు యాదగిరి, ఇర్రి అహల్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చందు నాయక్, సుంచు విజేందర్ బూడిద గోపి, ఉపేందర్, బోడ నరేందర్, మహేందర్ తదితులు ఉన్నారు. అంతకుముందు మార్కెట్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శికి పలు డిమాండ్లతో వినతి పత్రం అందించారు. హెచ్పీవీ టీకాతో సర్వైకల్ క్యాన్సర్ నివారణ జనగామ: జిల్లాలో సర్వైకల్ క్యాన్సర్ నివారణలో భాగంగా హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోందని డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్ రావు తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డీఎల్సీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు.. జిల్లాకు ఇప్పటివరకు 625 మందికి టీకాలు వేసినట్లు తెలి పారు. ఈ కార్యక్రమం ద్వారా బాలికల్లో ఆరో గ్య అవగాహన పెంచడంతో పాటు భవిష్యత్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను నివారించడం లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో డీసీ హెచ్ఎస్ డాక్టర్ నరేంద్ర శర్మ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం, డీడబ్ల్యూఓ కోదండరాములు, విద్యా శాఖ ఏడీ సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. యోగాతో ఆరోగ్యం జనగామ: ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హోమియోపతి, ఆయుష్ దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం పట్టణంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో యోగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు యోగా సాధన చేయించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్రావు మాట్లాడుతూ.. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో యోగా సాధనను అలవాటు చేసుకోవాలని సూచించారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం, విద్యా శాఖ ఏడీ సత్యనారాయణ మూర్తి, ఆయుష్, ఇతర సంబంధిత వైద్యాధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. అదృశ్యమైన వ్యక్తి అప్పగింత రఘునాథపల్లి: మండల కేంద్రానికి చెందిన గుంటల ప్రభాస్ మతిస్థిమితం కోల్పోయి గత నెల 29న కనిపించకుండా పోయాడు. ఈ మేరకు అతడి తల్లి గుంటల పవిత్ర ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఛత్తీస్గఢ్లోని రెంజల్ పోలీస్స్టేషన్ పరిధి లో ప్రభాస్ను గుర్తించారు. 13 రోజుల లోపే అతన్ని సురక్షితంగా తీసుకొచ్చి తల్లికి అప్పగించినట్లు ఎస్సై నరేష్ శుక్రవారం తెలిపారు. కేసు విచారణలో చురుకుగా వ్యవహరించిన హెడ్కానిస్టేబుల్ పోతుల శ్రీనివాస్, కానిస్టేబుల్ రాజకుమార్ను అధికారులు అభినందించారు. -
ఇంటింటి గణనకు సిద్ధం
● ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు కీలక బాధ్యతలు ● సెల్ఫ్ ఎన్యుమరేషన్కు ముఖ్యమైన నిబంధనలు జనగామ: జిల్లాలో ఇంటింటి గణన ప్రక్రియ సర్వేకు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 280 గ్రామపంచాయతీల పరిధిలో మే 11 నుంచి జూన్ 9 వరకు జనగణనలో భాగంగా ఇంటింటి గణన చేపట్టనున్నారు. ఇందుకోసం జిల్లా పరిపాలన మొత్తం అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని 10శాతం రిజర్వుతో కలుపుకొని 994 మంది ఎన్యుమరేటర్లను ఎంపిక చేశారు. అలాగే పర్యవేక్షణ కోసం 174 మంది సూపర్వైజర్లను నియమించారు. ప్రతి సూపర్వైజర్కు ఆరుగురు ఎన్యుమరేటర్లతో కూడిన యూనిట్ను ఏర్పాటు చేస్తారు. ఎన్యుమరేటర్లు ఒక్కొక్కరికీ సుమారు 300 ఇళ్ల (దాదాపు 800 జనాభా) గణన బాధ్యతను అప్పగిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అదనపు ఎన్యుమరేటర్లను నియమించేందుకు కూడా అధికార యంత్రాంగం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే ఏడాది అధికారిక జనగణన ప్రారంభం కానుండగా, ఈ ప్రాథమిక గణన పనులను జిల్లా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇంటింటి గణన నేపథ్యంలో ఈ నెల18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఎన్యుమరేటర్ల బాధ్యతలు ఇంటింటి గణనను కచ్చితంగా, పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు ఎన్యుమరేటర్లు అనుసరించాల్సిన పలు ముఖ్యమైన సూచనలు వెల్లడించారు. గణనకు ముందు ట్రైనింగ్లో పాల్గొని, యూజర్స్ మాన్యువల్ను అధ్యయనం చేయడం, అలాగే హెచ్ఎల్ఓ మొబైల్ యాప్పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ (హెచ్ఎల్బీ)లోని ప్రతి భవనం, ప్రతి కుటుంబం, ప్రతి గృహాన్ని సందర్శించి వివరాలు సేకరించాలి. నెంబర్ లేని భవనాలకు నెంబర్లు కేటాయించి, యాప్లో ఉన్న మ్యాప్ ద్వారా హెచ్ఎల్బీ లే అవుట్ మ్యాప్ సిద్ధం చేయాలి. హెచ్ఎల్ఓ యాప్ ద్వారా హౌస్ లిస్టింగ్ వివరాలు నమోదు చేసి, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీఈలు ధ్రువీకరించి, వివరాలను నిరంతరం సింక్ చేయాలి. కేటాయించిన ప్రాంతంలో పూర్తి కవరేజ్ చేయడంతో పాటు వివరాలను అప్లోడ్ చేసి, బ్లాక్ పూర్తయిందని సూపర్వైజర్కు తెలియజేయాలి. సూపర్వైజర్ల బాధ్యతలు ఎన్యుమరేటర్ల పనితీరును పర్యవేక్షిస్తూ, గణన ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేసేందుకు సూపర్ వైజర్లకు పలు బాధ్యతలు అప్పగించారు. భూ భాగంలో హెచ్ఎల్బీ సరిహద్దులు, గుర్తింపు సూచనలు పరిశీలించి అవసరమైన మార్పులను సంబంధిత అధికారికి తెలియజేయాలి. మొత్తం సూపర్ వైజర్ సర్కిల్ను కవర్ చేసేలా లేఅవుట్ మ్యాప్ సిద్ధం చేయాలి. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తూ, సూపర్వైజర్ యాప్ ద్వారా ఎన్యుమరేటర్ల నమోదు చేసిన డేటాను మానిటర్ చేయాలి. హెచ్ఎల్బీ విభజనలో ఎక్కడా గ్యాప్లు లేకుండా, పూర్తిగా కవరేజ్ అయ్యేలా పర్యవేక్షించాలి. పేపర్ మోడ్లో వచ్చిన డేటాను సమయానుసారం వెబ్ పోర్టల్లో నమోదు చేయాలి. సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఎలా 2027 జనగణనలో ప్రజలు ఆన్లైన్లో స్వతహాగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ గైడ్లైన్స్ జారీ చేశారు. కేంద్రం అధికారిక పోర్టల్ ద్వారా 16 భాషల్లో దీనిని అందుబాటులో ఉంచింది. సెల్ఫ్ ఎన్యుమరేషన్ ముఖ్యమైన నిబంధనలు అధికారిక se.census.gov.in పోర్టల్లో మొబైల్ నెంబర్, ఓటీపీ ద్వారా నమోదు చేసుకోవాలి. ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చే తేదీకి 15 రోజుల ముందుగా వివరాలు పూర్తి చేయాలి. కుటుంబ పెద్ద పేరు (మార్చడానికి వీలుండదు). అలాగే కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామా కచ్చితంగా నమోదు చేయా లి. ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నెంబర్ ఉపయోగించాలి. ఎస్ఈఐడీ వివరాలు సమర్పించిన తర్వాత వచ్చే సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐటీ (ఎస్ఈ ఐడీ)ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆన్లైన్లో వివరాలను నింపినప్పటికీ, ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఎస్ఈ ఐడీని చూపించి ఫామ్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఈ విధానం జనాభా లెక్కల ప్రక్రియను వేగవంతం, సులభతరం చేస్తుంది. ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చి సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు. -
ప్రజల భద్రతే ప్రభుత్వ ధ్యేయం
● ఈనెల 13 నుంచి 18 వరకు అరైవ్ అలైవ్ కార్యక్రమం ● సమీక్షలో కలెక్టర్ సందీప్కుమార్ ఝాజనగామ రూరల్: ప్రజల భద్రతే ప్రభుత్వ ధ్యేయమని, ప్రాణ రక్షణే ప్రథమ కర్తవ్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్–అలైవ్ కార్యక్రమం అమలుపై తన చాంబర్లో కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 13 నుంచి 18 వరకు చేపట్టనున్న అరైవ్–అలైవ్ కార్యక్రమాలను జిల్లాలో విస్తృత స్థాయిలో నిర్వహించాలన్నారు. 13న అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. పోలీస్, రవాణా, వైద్యారోగ్య, విద్యా, మిగతా అన్ని శాఖలు సమన్వయంతో గ్రామాలతో పాటు మున్సిపాలిటీల్లో ప్రజలను భాగస్వాములను చేస్తూ, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు, వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్ పోటీలను విద్యా శాఖ నిర్వహించాలని సూచించారు. సమీక్ష సమావేశంలో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, ఆర్డీఓ వెంకన్న, ఆయా శాఖల ఉన్నతాధికారులు శ్రీనివాస్, సత్యనారాయణ మూర్తి, అనిత, ఆర్టీఏ సభ్యులు అభిగౌడ్ సంబంధిత అధికారులు ఉన్నారు. ఎరువుల యాప్ను వినియోగించుకోవాలి.. వానాకాలం పంటల సాగు కోసం రైతులకు అందుబాటులో ఉన్న ఎరువుల బుకింగ్ యాప్ సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకునే దిశగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టబోతున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎరువుల బుకింగ్ యాప్లో రైతుల మొబైల్ నంబర్ మార్పుచేర్పుల కోసం గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రత్యేక షెడ్యూల్ రూపొందించాలన్నారు. జిల్లాలోని ప్రతీ గ్రామానికి నిర్ణీత తేదీలు కేటాయించబడిన ఈ షెడ్యూల్ ప్రకారం, ఆయా గ్రామాల్లో మొబైల్ నెంబర్ సవరణ కార్యక్రమం నిర్వహించాలన్నారు. అలాగే ప్రభుత్వ పథకాల వివరాలు సమయానుకూలంగా రైతులకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. -
లింగనిర్ధారణ సూత్రధారులు ఎవరు?
జనగామ: చంపక్హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో శిశువు అపహరణ కేసులో అరైస్టెన మహిళపై విచారణలో లింగనిర్ధారణ పరీక్షలు వెలుగులోకి వచ్చాయి. ఆమె గర్భిణిగా ఉన్నప్పుడు లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకొందన్న అనుమానాలు పోలీసు విచారణలో వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది. లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధించి కఠిన శిక్షలు విధించే చట్టం అమలులో ఉన్నప్పటికీ, కొన్ని స్కానింగ్ సెంటర్లు ఇంకా ఈ దందాను కొనసాగిస్తున్నాయన్న అనుమానాలకు ఈ ఘటన బలం చేకూర్చింది. స్కానింగ్ తీసింది ఎక్కడ..? ఎంసీహెచ్లో శిశువు అపహరణ కేసులో అరైస్టెన మహిళను పోలీసులు 24 గంటలకంటే ఎక్కువగా కస్టడీలో ఉంచుకోలేకపోవడంతో, ఈ నెల 9న రిమాండ్ పంపిన సంగతి తెలిసిందే. అయితే లింగ నిర్ధారణకు సంబంధించి కీలక సమాచారం బయటపట్టేందుకు ఆమెను మరోసారి పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. మహిళ కస్టడీలోకి తిరిగి వస్తే, స్కానింగ్ ఎవరు చేశారు? ఎక్కడ చేశారు? అన్న వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని విచారణ అధికారులు భావిస్తున్నారు. జనగామలోనే పరీక్ష జరిగిందా లేదా మరెక్కడైనా లింగ నిర్ధారణ చేయించుకున్నారా అనే ప్రశ్నలకు కూడా సమాధానాలు దొరకొచ్చని అంచనా వేసుకుంటున్నారు. లింగ నిర్ధారణ మాఫియాలో ఎవరెవరున్నారు, సూత్రధారులు ఎవరు, కమీషన్ ఏజెంట్లు ఎలా పనిచేస్తున్నారు వంటి కీలక ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మహిళ మరోసారి పోలీస్ కస్టడీకి వస్తే ఈ దందా వెనుక ఉన్న నెట్వర్క్ బయటపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. లింగనిర్ధారణ చేస్తే కఠిన చర్యలు.. శిశువును అపహరించిన మహిళ గర్భిణి అయినప్పటికీ ఆరోగ్యశాఖ సూచించిన నమోదు చేయించుకోకుండా, ప్రైవేట్గా పరీక్షలు, చికిత్స పొందినట్టు తెలిసింది. లింగనిర్ధారణ, అబార్షన్ ఎవరు నిర్వహించారో పోలీసులు నిర్ధారించిన తర్వాత చర్యలు ఉంటాయని డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు తెలిపారు. స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. స్కానింగ్ తీసింది ఎక్కడ? బిడ్డను ఎత్తుకెళ్లిన ఘటనతో వెలుగులోకి చీకటి దందా పోలీసుల కస్టడీకి మహిళ వస్తే మరిన్ని విషయాలు బహిర్గతం -
పాడిపరిశ్రమకు ప్రభుత్వ ప్రోత్సాహం
● విజయ డెయిరీ పురోగతికి రూ.100 కోట్ల కేటాయింపు ● టీజీడీడీసీఎఫ్ రాష్ట్ర చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డిదేవరుప్పుల: పాడిపరిశ్రమను విస్మరిస్తే భవిష్యత్తు తరాలకు అనారోగ్యం తప్పదని తెలంగాణ పాడిపరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్(టీజీడీడీసీఎఫ్) గుత్తా అమిత్రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఎస్డీఎఫ్ నిధుల కింద రూ.8లక్షలతో నిర్మించిన పాల ఉత్పత్తిదారుల సంఘ భవనం(విజయ డెయిరీ)ను వారిద్దరు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి విజయ డెయిరీ జిల్లా చైర్మన్ కాసారపు ధర్మారెడ్డి అధ్యక్షత వహించారు. అమిత్ రెడ్డి, యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి పాడిపరిశ్రమ పురోగతి కోసం వంద కోట్ల నిధులను విజయ డెయిరీ ఫెడరేషన్కు కేటాయించడం శుభపరిణాణమన్నారు. త్వరలోనే పాడిపరిశ్రమను ప్రోత్సహించే దిశలో ఆసక్తి ఉన్న మహిళలకు రాయితీతో కూడిన పాడిగేదెల పథకం వర్తింపజేస్తామన్నారు. స్థానిక సర్పంచ్ కృష్ణమూర్తి గౌడ్తో పాటు డెయిరీ ప్రతినిధుల విజ్ఢప్తి మేరకు రెండు పాల ఉత్పత్తి భవనాలతోపాటు మండల సమాఖ్య భవన నిర్మాణ పనుల పూర్తి కోసం నిధులు కేటాయిస్తాననీ హామీ ఇచ్చారు. అనంతరం కామారెడ్డిగూడెం పాలశీతలీకరణ కేంద్రాన్ని అమిత్రెడ్డి బృందం సందర్శించి పాడిరైతులతో ముఖాముఖి నిర్వహించింది. విజయ డెయిరీ జనగామ డీడీ ఎన్ గోపాల్సింగ్, మేనేజర్ లక్ష్మీ, కామారెడ్డిగూడెం డెయిరీ చైర్మన్ గులాం రసూల్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పాండు, మండల అధ్యక్షుడు శ్రీరామ్, ఉప్పలయ్య, యాకస్వామి, గంగరాజు, పుల్లయ్య పాల్గొన్నారు. -
ఎంసీహెచ్లో భద్రతపై ఫోకస్
జనగామ: జనగామ మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్)లో శిశువుల భద్రత ఆందోళన కలిగిస్తుండగా, మరోసారి పునరావృతం కాకుండా నిఘాను కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రతిరోజూ వందలాది మంది ఓపీ, అడ్మిట్ పేషెంట్లతో పాటు పదుల సంఖ్యలో గర్భిణులు, బాలింతలు, శిశువులు సేవలు పొందే ఈ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయన్న ప్రశ్నకు ఈ సంఘటన సాక్ష్యంగా నిలిచింది. ఎస్ఎన్సీయూ వార్డులో కఠిన నిఘా ఎంసీహెచ్లోని ప్రత్యేక శిశు సంరక్షణ విభాగం ఎస్ఎన్సీయూలో నలుగురు స్టాఫ్ నర్సులు, ఒక డ్యూటీ డాక్టర్, ఒక హెడ్ నర్స్, మరో స్టాఫ్ నర్స్తో పాటు సెక్యూరిటీ గార్డు పర్యవేక్షణ ఉంటుంది. రోజుకు మూడు షిఫ్టుల్లో వీరు పర్యవేక్షణ చేస్తారు. అయితే ఈ వ్యవస్థలన్నింటి కళ్లుగప్పి ఈ నెల 8వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో ఓ మహిళ 8 రో జుల శిశువును ఎవరికీ అనుమానం కలగకుండా తీసుకెళ్లడం ఆశ్చర్యానికి గురి చేసింది. బిడ్డ కోసం ఎస్ఎన్సీయూకు చేరుకున్న తల్లి(బాలింత) కీర్తన బాక్స్లో తన బాబు కనిపించకుండా ఉండడాన్ని గమనించి వెంటనే అలర్ట్ సిబ్బందిని చేసింది. అప్పటివరకూ అక్కడ ఉన్న వైద్య సిబ్బంది, నర్సులు, సెక్యూరిటీ గార్డు ఎవరికీ శిశువు లేడన్న విషయం తెలియకపోవడం అత్యంత నిర్లక్ష్యంగా భావిస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది కొరత.. రాత్రిపూట కేవలం ముగ్గురు సెక్యూరిటీ గార్డులు మాత్రమే పనిచేస్తున్నట్లు డాక్టర్ మధుసూదన్రెడ్డి తెలిపారు. శిశువుల వార్డుల్లో కనీసం ఆరుగురు సిబ్బంది అవసరమని, అందులో ఒకరు మహిళా సెక్యూరిటీ తప్పనిసరి అని సూచించారు. సెక్యూరిటీ మరింత బలోపేతం శిశువు అపహరణ ప్రయత్నం తర్వాత అలర్ట్ ముగ్గురు సిస్టర్లు, సెక్యూరిటీ గార్డులకు మెమోలు సూపరింటెండెంట్, డీసీపీ విచారణఎంసీహెచ్లో ఇక ముందు నుంచి భద్రతను బలోపేతం చేస్తూ కొత్త నియమాలు అమలు చేయనున్నారు. శిశువు జన్మించిన వెంటనే వేసే ట్యాగ్తో పాటు తల్లికి కూడా ప్రత్యేక ట్యాగ్ వేయనున్నారు. ఈ రెండు ట్యాగులు ఒక్కటిగా ఉన్నట్లు నిర్ధారించిన తర్వాతనే శిశువును తల్లిదండ్రులకు లేదా బంధువులకు చూపే అవకాశం ఇస్తారు. అవుట్సైడ్ బంధువులు ఆసుపత్రికి వచ్చి బాలింతలను చూడడం గురించి కఠిన నియమాలు అమలు చేయనున్నారు. శిశువు అపహరణ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణరెడ్డితో కలిసి డీసీపీ రాజమహేహేంద్ర నాయక్ వేర్వేరుగా విచారణలు చేపట్టారు. అందులో ముగ్గురు సిస్టర్లు, ఒక సెక్యూరిటీ గార్డుపై నిర్లక్ష్యం ఉన్నట్లు స్పష్టత రావడంతో వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. పోలీసులు శిశువును ఎత్తుకెళ్లిన మహిళపై లోతైన విచారణ చేస్తున్నారు. ఆమె ఎందుకు ఇలాంటి చర్యకు పాల్పడింది, ముందుగా ప్లాన్ చేసి వచ్చిందా, ఎవరి సహకారం ఉంది అన్న దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎంసీహెచ్లో సీసీ కెమెరాల పనితీరు పూర్తిస్థాయిలో పని చేయడం లేదు. ఆస్పత్రిలోని ప్రధాన వార్డులను కవర్ చేస్తూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పనిచేయక పోవడంతో సాంకేతిక లోపాలు, కోతులు వైర్లను తెంపేయడం వంటి సమస్యలు తరచూ ఎదురవుతున్నాయి. కానీ దీనికి శాశ్వత పరిష్కారం తీసుకురావడంలో అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రైతులను ఇబ్బందులు పెట్టొద్దు
జనగామ రూరల్/నర్మెట/నర్మెట(తరిగొప్పుల): రైతులను మిల్లర్లు ఇబ్బందులు పెట్టొద్దని, సజావుగా కొనుగోళ్లు చేపట్టాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం జనగామ మండలంలోని పెంబర్తి, వడ్లకొండ, ఎర్రగొల్లపహడ్, అడవీకేశావాపూర్, నర్మెట మండలం మచ్చుపహాడ్, వెల్దండ, తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి, సోలిపురం, అంకుషాపురం గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జనగామ మండలంలో జరిగిన ప్రారంభోత్సవాల్లో పెంబర్తి సర్పంచ్ రేఖ రాజు, ఎర్రగొల్లపహడ్ సర్పంచ్ చిర్ర సత్యనారాయణరెడ్డి, అడవీకేశావాపూర్ సర్పంచ్ భూరెడ్డి చైతన్య ప్రమోద్, ఏఎంసీ చైర్మన్ శివరాజ్, సీఈఓ భాస్కర్రెడ్డి, నర్మెటలో చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లనాగుల శ్వేత, సర్పంచ్లు లింగాల హైమ రమేశ్, కంతి అంజనేయులు, మౌడ్ మౌనిక లక్పతి, బానోతు శంకర్ నాయక్, బానోతు బాలాజీ, ఏఓ అక్కిరెడ్డి కర్ణాకర్, ఇన్చార్జ్ ఎంపీడీఓ ఆకుల వెంకట మల్లికార్జున్, ఏపీఎం ప్రమీల, ఏఈఓలు సుంకరి జగదీష్, భూక్య అనిత, గోనెల కన్నయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గద్దల నర్సింగరావు, మండల శాఖ అధ్యక్షుడు చింతకింది సురేశ్, ఉమ్మడి మండలాల కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, మాజీ అధ్యక్షుడు నీరటి సుధాకర్, ఎండీ గౌస్, తరిగొప్పుల మండలంలో సర్పంచ్లు మంచినీళ్ల రాజు, దండెం శ్రీనివాస్, బైకాని రమ బాలరాజు, కుర్రె మల్లయ్య, తహసీల్దార్ ఎండీ మొహసిన్ ముజ్తాబ, ఏపీఓ కొత్తపల్లి నాగేశ్వర్ రావు, చేర్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అర్జుల పోషిరెడ్డి, ధరావత్ లక్ష్మి, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్ రెడ్డి, అధికార ప్రతినిధి చిలువేరు లింగం తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పలు మండలాల్లో ధాన్యం కేంద్రాల ప్రారంభం -
‘ఆసరా’ ఇంకెప్పుడు?
జనగామ రూరల్: ఆసరా కొత్త పింఛన్ల కోసం అర్హులైన దరఖాస్తుదారులు ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకున్న వారు వేలల్లో ఉన్నారు. ఆసరా పింఛన్ల కోసం నిత్యం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలో రాగానే ఆసరా పింఛన్లు పొందేందుకు అర్హత వయస్సు సడలించింది. 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. మీసేవా సెంటర్లలో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది. ప్రభుత్వ సూచనల మేరకు గ్రామాల్లో దరఖాస్తుదారులు వేలల్లో పెరిగారు. మొత్తం 15,974 మంది పింఛన్కు దరఖాస్తు పెట్టుకున్నారు. కొత్త పింఛన్ల మంజూరు కోసం ప్రతీ రోజు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం 99 రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు. ఈ సభల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను చదివి వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్త పింఛన్ల కోసం ఆయా గ్రామాల్లోని అర్హులైన వారు భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఒక్కో గ్రామానికి కనీసం యాభై నుంచి వంద వరకు పింఛన్ల దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. పెద్ద గ్రామ పంచాయతీల్లో ఏకంగా 100పైగా దరఖాస్తులు చేసుకున్నారని చెబుతున్నారు. అయితే కొత్త పింఛన్లు మంజూరు కాక చాలా సంవత్సరాలు గడుస్తోంది. చివరిసారిగా 2022 ఆగస్టు 31న పింఛన్లు మంజూరయ్యాయి. దాదాపు నాలుగు సంవత్సరాలుగా పింఛన్ల దరఖాస్తులకు మోక్షం కలగడం లేదు. దీంతో చాలా మంది అర్హులైన వారికి పింఛన్లు రావడం లేదు. దీనికితోడు 57 సంవత్సరాలు నిండిన వారు కూడా కొత్తగా ఈ పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఆన్లైన్లో దరఖాస్తుకు సంబంధించిన విధివిధానాలపై స్పష్టత రాకపోవడంతో ఆసరా పెన్షన్దారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, నరకయాతన పడుతూ నిత్యం కార్యాలయాల చుట్టు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. అధికార వర్గాలు కూడా దీనిపై కచ్చితమైన సమాచారం చెప్పకపోడంతో ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్ కోసం చేసిన దరఖాస్తులు గ్రామ కార్యదర్శికి ఇవ్వాలా? ఎంపీడీఓ కార్యాలయాల్లో సమర్పించాలా? అనేది తెలియకపోవడంతో మద్యలోనే ఆగిపోతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే వరకు వేచిచూడాల్సి వస్తోంది. గతంలో వచ్చిన దరఖాస్తులు 15వేలు ప్రగతి ప్రణాళికలో మరిన్ని దరఖాస్తులు ఒక్కో గ్రామంలో కనీసం 50కిపైగా అప్లికేషన్లు నాలుగేళ్లుగా నిలిచిపోయిన మంజూరు ఏళ్ల తరబడిగా నిరీక్షణవృద్ధులు : 30,031 వితంతువులు : 25,414 దివ్యాంగులు : 10,225 బీడీ కార్మికులు : 2,052 గీత కార్మికులు : 2,792 హెచ్ఐవీ : 730 ఫైలేరియా : 706 ఒంటరి మహిళ : 1,475 ఇతరులు : 1,568 మొత్తం పింఛన్ దారులు : 74,993 -
ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు
బచ్చన్నపేట: మండల కేంద్రంలోని అప్గ్రేడెడ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్సీ) ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు లభించిందని మండల వైద్యాధికారి డాక్టర్ సృజన తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో 14 రకాల జాతీయ ఆరోగ్య సేవా కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టామన్నారు. రిజిస్ట్రేషన్, డెలివరీ, ఇమ్యునైజేషన్, ఎన్సీడీ, సీడీ, టీబీ, ఫ్యామిలీ ప్లానింగ్, ఎమర్జెన్సీ హెల్త్కేర్ తదితర కార్యక్రమాలను సకాలంలో చేశామన్నారు. మలేరియా, డెంగ్యూ జ్వరాలు ప్రబలకుండా గ్రామాల్లో ముందస్తు శానిటేషన్ పనులను చేయించడానికి ఆయా గ్రామాల సర్పంచ్లను ప్రోత్సహించామన్నారు. రాష్ట్రంలోని అన్ని పీహెచ్సీ ఆసుపత్రుల కంటే మెరుగ్గా పనిచేసి వైద్యసేవలను అందించినందుకు గానూ ఆసుపత్రికి రాష్ట్ర స్థాయి ఉత్తమ సేవా పురస్కారం దక్కిందన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా మెమొంటో, సర్టిఫికెట్ను స్వీకరించినట్లు చెప్పారు. అవార్డు రావడానికి కృషి చేసిన డాక్టర్లు, వైద్య సిబ్బందిని ఆమె అభినందించారు. కార్యక్రమంలో వైద్యులు లక్ష్మిప్రసన్నకృష్ణ, సిద్దిసుదర్శన్రెడ్డి, స్టెల్లా, సీహెచ్ఓ జంగమ్మ, హెచ్సీ జాస్మిన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ సేవా పురస్కారం -
బాధ్యతల స్వీకరణ
జనగామ రూరల్: జెడ్పీ సీఈఓగా బి.రంగారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంతకుముందు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు. జనగామ డిప్యూటీ సీఈఓగా పనిచేసిన డి.సరిత ఫైనాన్స్ అడ్వైజరీ ఎస్ఆర్డీఎస్ కమిషనర్ హైదరాబాద్కు బదిలీ అయ్యారు. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సంజయ్కుమార్ ఉత్తర్వులు జారీ చేయగా రంగారావు బాధ్యతలు చేపట్టారు. కేయూ క్యాంపస్: రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డిని తెలంగాణ రాష్ట్ర కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్టు (టీజీసీపీజీఈటీ) కన్వీనర్ కె.రాజేందర్ గురువారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. టెస్ట్ నిర్వహణపై కొద్దిసేపు చర్చించారు. సీపీజీఈటీని పకడ్బందీగా నిర్వహించాలని బాలకిష్టారెడ్డి పలు సూచనలు చేసినట్లు తెలిసింది. కేయూలో సీపీజీఈటీ అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్వహించాక త్వరలోనే పీజీ కోర్సుల్లో ప్రవేశపరీక్షకు దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు రాజేందర్ గురువారం తెలిపారు. నేడు మెగా రక్తదాన శిబిరం జనగామ రూరల్: కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ నెల 10న(శుక్రవారం) మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జున్రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు అందించడం జరుగుతుందన్నారు. కావున జిల్లా అధికారులు, అన్ని శాఖల ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్లొద్దు పాలకుర్తిటౌన్: ఆన్లైన్, గేమింగ్, బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్లవద్దని సీఐ జానకీరాంరెడ్డి సూచించారు. బెట్టింగ్ యాప్లతో నష్టాలపై పోలీస్శాఖ ఆధ్వర్యంలో మండలంలోని దర్దెపల్లి గ్రామంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ కొన్ని ముఠాలు యువతను బెట్టింగ్ ఊబిలోకి దించుతున్నాయని, ఇరువర్గాల్లో ఎవరు ఓడినా, గెలిచినా ముఠాలకు కమీషన్ వచ్చిపడుతుందన్నారు. ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సై దూలం పవన్కుమార్, పోలీసులు, యువత పాల్గొన్నారు. నయీంనగర్: ప్రజల అభీష్టం మేరకు హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో విలీనం చేసి ఈ మహా నగరాన్ని రెండో అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దాలని పౌర సంఘాలు, మేధావులు, నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండ ప్రెస్క్లబ్లో పౌర సంఘాలు, మేధావులు, నాయకులు నిర్వహించిన సదస్సుకు విశ్రాంత ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అధ్యక్షత వహించారు. వక్తలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సాధిస్తే రాజధానితోపాటు ఉమ్మడి జిల్లాల కేంద్రాలు అభివృద్ధి చోదక కేంద్రాలుగా ఎదుగుతాయని ఆశించిన రాష్ట్ర ప్రజలకు తీవ్ర నిరాశే మిగిలిందన్నారు. హైదరాబాద్ మాదిరి అన్ని జిల్లాలతో కలిపి మూడు కోట్ల అరవై లక్షల ప్రజల అభివృద్ధి కావాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద నగరంగా ఎదుగుతున్న వరంగల్ నగరాన్ని ముక్కలు చేసి, పార్క్ల భూములు కబ్జా చేసి, వరంగల్ జైలు భూమిని తాకట్టు పెట్టి అభివృద్ధిని విచ్ఛిన్నం చేశారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా రెండు జిల్లాలను కలపడంలో, వరంగల్ మహానగర పునర్నిర్మాణం చేయడంలో తాత్సారం చేస్తోందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో ఫోరం ఫర్ బెటర్ వరంగల్ చైర్మన్ కె.సుధాకర్, మాజీ మేయర్ టి.రాజేశ్వర్ రావు, సీపీఎం నాయకుడు చుక్కయ్య, వెంకటరాజం, దాసరి కృష్ణారెడ్డి, ప్రొ.వి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
తీరనున్న ఎక్స్రే కష్టాలు
● ఘన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏళ్ల తరబడి ఎక్స్రే సౌకర్యాలు లేకపోవడంతో పేరుకే పెద్దాసుపత్రిగా మారింది. వివిధ సమస్యలతో ఆసుపత్రికి వచ్చేవారు ఎక్స్రే కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించేవారు. ఇటీవల ఘన్పూర్ సీహెచ్సీని సందర్శించిన కలెక్టర్ ఆసుపత్రిలో ఎక్స్రే సేవలు అందించాలని ఆదేశించారు. గతంలో ఉన్న ఎక్స్రే మిషన్ మూలకుపడడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆసుపత్రిలో నూతన ఎక్స్రే మిషన్ను గురువారం ఏర్పాటు చేశారు. త్వరలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు సీహెచ్సీ వైద్యాధికారి సంధ్య తెలిపారు. -
రైతుల మేలుకే కొనుగోలు కేంద్రాలు
లింగాలఘణపురం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తగిన మౌలిక వసతులు కల్పించాలని, రైతుల మేలు కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం మండలంలోని కుందారంలో మొక్కజొన్న, నెల్లుట్లలో ధాన్యం, పటేల్గూడెంలో వాటర్ప్లాంట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.. మొక్కజొన్న రైతుల దళారుల చేతుల్లో మోసపోతున్నారని గుర్తించి అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు వివరించారు. పటేల్గూడెంలో ఎస్డీఎఫ్ నిధులు రూ.2 లక్షలతో చేపట్టిన వాటర్ప్లాంట్, నెల్లుట్లలో రూ.16లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డును ప్రారంభించారు. రూ.5లక్షల 8వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు కూకట్ల రాజు, పొన్నాల బుచ్చయ్య, నర్సింగ రామకృష్ణ, మార్కెట్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శివకుమార్, మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డి, నాయకులు నాగరాజు, బాలరాజు, ప్రవీణ్, తహసీల్దార్ అండాలు, ఏఓ మమత, మహిళ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ
జనగామ రూరల్: హెచ్ఐవీ, ఎయిడ్స్పై అవగాహనతోనే నివారణ సాధ్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య వారోత్సవాల్లో నాలుగో రోజు ఎయిడ్స్పై అవగాహన నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం రెడ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ రెడ్ రన్ వాకథాన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక బస్టాండ్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ఎయిడ్స్ నివారణపై తెలంగాణ సాంస్కృతిక కళాకారులచే కళాజాత ద్వారా పాటలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనగామ, స్టేషన్ ఘనపూర్లలో ఐసీటీసీ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు, వైద్యులు అశోక్, కమల్హాసన్, శ్రీతేజ, ఏఆర్టీ సెంటర్ వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కాగా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సబ్ జైలులో క్షయ, కంటి, ఎక్స్రే పరీక్షలను, జనరల్ మెడిసిన్, చర్మ సంబంధ సమస్యలపై 23 మంది ఖైదీలకు పరీక్షలు నిర్వహించారు. ధన్ధాన్య పథకాన్ని సమర్థంగా అమలుచేయాలి ప్రధానమంత్రి ధన్ధాన్య యోజన పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన పథకం అమలుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ, ఉద్యాన శాఖ అధికారి రవికాంత్, పశుసంవర్ధక శాఖ అధికారి మురళీధర్ రావు, మత్స్య శాఖ అధికారి రాణా ప్రతాప్, మార్కెటింగ్ శాఖ అధికారి రామకృష్ణ, సహకార శాఖ అధికారి కోదండరాములు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి వసంత, లీడ్ బ్యాంక్ మేనేజర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి అంగన్వాడీ సేవలను చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్లో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..అంగన్వాడీ కేంద్రాల కోసం ప్రభుత్వ భవనాల వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రైవేట్ భవనాల వినియోగాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని, వారంలోగా అందుకు సంబంధించిన అంచనాల నివేదికను సమర్పించాలని సూచించారు. అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, డీడబ్ల్యూఓ కోదండరాములు, మిషన్ శక్తి కో ఆర్డినేటర్ శారద, టీచర్లు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
డిజిటల్ వాడీలు
జనగామ: అంగన్వాడీ సేవల ఆధునికీకరణలో ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రీ–స్కూల్ విద్య, గర్భిణులు, శిశుపోషణ సేవలను మరింత సమర్థంగా అందించేందుకు అంగన్వాడీ టీచర్లకు సరికొత్త స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది. సేవల నాణ్యతను పెంచడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఈ డిజిటల్ సేవలకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్, కొడకండ్ల మూడు క్లస్టర్ల పరిధిలో 695 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, 666 మంది టీచర్లు పని చేస్తున్నారు. 2,156 గర్భిణులు, 1,666 బాలింతలు, ఆరు నెలల ను ంచి మూడేళ్ల లోపు చిన్నారులు 10,906, మూడేళ్ల నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలు 10,364 మంది ఉన్నారు. 692 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేశారు. సేవలన్నీ ఫోన్ ద్వారానే స్మార్ట్ఫోన్ అందుకున్న వెంటనే అంగన్వాడీ టీచర్లు రోజువారీ కార్యకలాపాలను యాప్ల ద్వారా నమోదు చేయడం ప్రారంభించారు. పిల్లల హాజరు, పోషకాహార పంపిణీ, గర్భిణుల ఆరోగ్య పరిశీలన వంటి సమాచారాన్ని ఇకపై క్షణాల్లోనే ప్రభుత్వం డేటాబేస్కు పంపిస్తారు. దీనివల్ల డేటా నమోదు లోపాలు తగ్గడంతో పాటు మరింత పారదర్శకత పెరుగుతుంది. విధుల్లో వేగం.. గతంలో రికార్డుల్లో రాయాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక ఫొటో, ఒక క్లిక్తోనే రిపోర్ట్ పంపగలిగే అవకాశం కలుగుతుంది. స్మార్ట్ ఫోన్తో పిల్లల అభ్యాసానికి సంబంధించిన చిన్న వీడియోలు, పాటలు, కథలు చూపుతూ బోధన పద్ధతి కూడా మరింత ఆకర్షణీయంగా మారనుంది. అంతేకాకుండా ఫీల్డ్ స్థాయి పరిశీలనను వేగవంతం చేయడంతో పాటు, తల్లులు, బిడ్డల ఆరోగ్య సూచనలు కూడా వాట్సప్ గ్రూపుల ద్వారా త్వరితగతిన చేరుతాయి. అత్యవసర సందర్భాల్లో అధికారులను సత్వరమే సంప్రదించే వెసులుబాటు కలుగుతుంది. డిజిటల్ పరికరాల ద్వారా అంగన్వాడీ వ్యవస్థను పారదర్శకంగా మార్చడమే ప్రభుత్వ అసలు ఉద్దేశం. గ్రామీణ శిశు పోషణ, ప్రాథమిక విద్య రంగాల్లో ఇది ఒక పెద్ద మార్పునకు నాందిగా భావిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ గర్భిణులు, శిశుపోషణ సేవల్లో వినూత్న అడుగు యాప్ ద్వారా రోజువారీ కార్యకలపాలు జిల్లాకు 692 ఫోన్లు అందజేత -
తల్లి ఆరోగ్యంతోనే ప్రజారోగ్య పురోగతి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ: తల్లి ఆరోగ్యం ప్రజారోగ్య పురోగతికి అద్దం పడుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య వారోత్సవాల్లో మూడో రోజు బుధవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో సురక్షిత మాతృత్వ దినోత్సవ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. హైరిస్క్ గర్భిణులను ప్రారంభదశలోనే గుర్తించడం, సమయానికి నాణ్యమైన సేవలు అందించడంలో ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ సిబ్బంది కీలకపాత్ర పోషించాలన్నారు. జిల్లాలో సాధారణ ప్రసవాల శాతం పెంచేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జునరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ నరేందర్ శర్మ, జీజీహెచ్ఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం, డీడబ్ల్యూఓకోదండరాములు, ప్రోగ్రామింగ్ అధికారి డాక్టర్ శ్రీహర్ష, గైనకాలజిస్టులు సునీత, అపర్ణ, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలనజనగామ రూరల్: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నెలవారీ తనిఖీలో భాగంగా బుధవారం కలెక్టరేట్లోని ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, మంటల నియంత్రణ పద్ధతులను పర్యవేక్షించారు. పరిశీలనలో జనగామ ఆర్డీఓ గోపీరాం, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. -
అంగన్వాడీలతోనే ఆరోగ్యవంత సమాజం
స్టేషన్ఘన్పూర్: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అంగన్వాడీ టీచర్ల పాత్ర కీలకమని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఘన్పూర్ నియోజకవర్గంలోని అంగన్వాడీ టీచర్లకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్మార్ట్ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్ణణ కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను ఆధునీకరించేదిశగా తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ..నియోజకవర్గంలో ఎలాంటి సదుపాయం లేని అంగన్వాడీ కేంద్రాలకు నెలరోజుల్లో సొంత భవనాలు మంజూరు చేయించి ఏడాదిలోపు నిర్మాణాలు పూర్తి చేయిస్తానన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, ఘన్పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, జనగామ, హన్మకొండ జిల్లాల డీడబ్ల్యూఓలు కోదండరాం, విశ్వజ, తహసీల్దార్ స్వప్న, ఎంపీడీఓ విజయశ్రీ, ఐసీడీఎస్ ఘన్పూర్ సీడీపీఓ సరస్వతి, సూపర్వైజర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎంపీ కడియం కావ్య అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్ల పంపిణీ -
తల్లుల ఆరోగ్యానికి ప్రభుత్వం కృషి
జనగామ: అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ అన్నారు. బుధవారం పట్టణంలోని సాయినగర్ అంగన్వాడీ కేంద్రంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తల్లుల ఆరోగ్యం, పౌష్టికాహారం గురించి వివరించారు. అనంతరం గర్భిణులు, మహిళలకు శ్రీమంతాలు, ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన చేశారు. కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ అనురాధ, ఐసీడీఎస్ సూపర్ వైజర్ బి.పూర్ణిమ పాల్గొన్నారు. మత్తుమందుల దుర్వినియోగంపై అవగాహనజనగామ: డ్రగ్స్ దుర్వినియోగంపై యువతలో అవగాహన పెంచడం లక్ష్యంగా, ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా డైరెక్టర్ జనరల్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ షేహనవాజ్ ఖాసీం, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో డ్రగ్స్ కంట్రోల్ అండ్ రెగ్యులేటరీ స్ట్రెంగ్తెనింగ్ డే నిర్వహించారు. బుధవారం జనగామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్, వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలల్లో జిల్లా ఔషధ తనిఖీ అధికారి ఏలే బాలకృష్ణ ఆధ్వర్యంలో డ్రగ్ అబ్యూస్ అండ్ మిస్యూస్ ఆఫ్ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ (అలవాటు, మత్తు కలిగించే మందుల దుర్వినియోగం, ప్రభావాలు, పరిణామాలు) అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి పోటీల్లో ఈ నెల 11న కలెక్టరేట్ సమావేశం హాల్లో నిర్వహించనున్న కార్యక్రమంలో కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని బాలకృష్ణ తెలిపారు. 15న వల్మిడి హుండీ లెక్కింపు పాలకుర్తి టౌన్: మండలంలోని వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఈనెల 15న బుధవారం ఉదయం 10 గంటలకు హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో దేవాలయంలో హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రేషన్ బియ్యం క్రయవిక్రయాలు జరపొద్దుదేవరుప్పుల: ప్రభుత్వం నిరుపేదలకు అందించే రేషన్ బియ్యం క్రయవిక్రయాలు ఎవరూ జరిపినా చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని డీటీసీఎస్ ఎన్ లచ్చునాయక్ హెచ్చరించారు. బుధవారం రాత్రి మండలంలోని ధారావత్తండాలో ధారావత్ రాజేశ్ అనే వ్యక్తి ఇదే తండాలో భూక్య రాములు ఇంట్లో పోలీసులతో కలిసి అక్రమంగా నిల్వచేసిన 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకొని స్థానిక డీలర్ కునుసోతు లక్ష్మికి అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ బియ్యం కార్డు లబ్ధిదారులు డీలర్ వద్ద తీసుకున్న బియ్యం అమ్మినట్టు నిర్ధారణయితే సదరు కార్డు రద్దు చేస్తామని హెచ్చరించారు. డీటీసీఎస్ ఇట్టబోయిన శ్రీనివాస్, ఎస్సై ఊర సృజన్కుమార్, పోలీసు సిబ్బంది యాకేష్, ప్రవీణ్ ఉన్నారు. స్వయం ఉపాధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలిజనగామ రూరల్: జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రివైజ్డ్ ఎస్సీ వార్షిక ప్రణాళిక 2025–26 గాను జిల్లాకు 260 యూనిట్లు కేటాయించినట్లు, సబ్సిడీ 361.82 లక్షలు లక్ష్యంగా షెడ్యూల్డ్ విడుదల చేశారని ఆయన పేర్కొన్నారు. అర్హత కలిగిన నిరుద్యోగులు అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. tgobmms.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆఖరి తేదీ ఈనెల 16వరకు పొడిగించినట్లు తెలిపారు. తుది ఎంపిక కలెక్టర్ అధ్యక్షతన నియమించబడిన జిల్లా కమిటీ ద్వారా ఇన్చార్జ్ మంత్రి ఆమోదంతో జరుగనుంది. -
కాశగూడెంలో ఉద్రిక్తత
స్టేషన్ఘన్పూర్: మండలంలోని పాంనూర్ గ్రామ శివారు కాశగూడెంలో సర్వేనంబర్ 194లో పలువురు అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లు, గుడిసెలను తొలగించేందుకు బుధవారం రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు తహసీల్దార్ స్వప్న ఆధ్వర్యంలో ఆర్ఐలు సతీష్, శ్రీకాంత్, ఎస్ఐ వినయ్కుమార్, పోలీసు సిబ్బందితో కాశగూడెం చేరుకుని అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన బాధితులు ఇమామ్బీ, ఎండీ షఫీర్, జైన్బీ, షేక్ లకూమ్, ఇమామ్బీ, ఖాసీమ్ తదితరులు అడ్డుకున్నారు. తాము బండ కొట్టుకుంటూ రాళ్లు అమ్ముకుని జీవనం సాగించే నిరుపేదలమని, చాలా ఏళ్లుగా ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నామన్నారు. హుటాహుటిన వచ్చి తమ ఇళ్లను, గుడిసెలను తొలగిస్తామంటే సహించేది లేదంటూ రెవెన్యూ, పోలీసు అధికారులతో వాగ్వాదం చేశారు. సాయంత్రం వరకు నచ్చజెప్పినా వినకపోవడంతో బలవంతంగా పొక్లెయినర్తో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నించగా ఇమామ్బీ అనే మహిళ పొక్లెయినర్కు అడ్డునిల్చుని తీవ్రంగా ప్రతిఘటించింది. ఒంటిపై పెట్రోల్ పోసుకున్న వ్యక్తి ప్రభుత్వ భూమిలో అక్రమంగా బాత్రూమ్ నిర్మాణం చేసుకున్నాడని దానిని కూల్చివేసేందుకు అధికారులు, పోలీసు సిబ్బంది యత్నించగా ఆ ఇంటి యజమాని అయిన షఫిర్ వారిని అడ్డుకున్నారు. తమ బాత్రూమ్ను ధ్వంసం చేయవద్దని, చేస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. కాగా పక్కనే ఉన్న వ్యక్తులు అతడి చేతిలో నుంచి సీసాను లాగేసి పక్కకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులకు, నిర్మాణాలు చేసుకున్న బాధితులకు వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్రమ నిర్మాణాలు వద్దుఽ: స్వప్న, తహసీల్దార్ ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తే సహించేది లేదు. ఇష్టారాజ్యంగా వందల గజాల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేసుకున్నారు. మూడు రోజులు గడువు ఇస్తున్నాం. ఆలోగా అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించాలి. లేని యెడల నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలను తొలగించేందుకు అధికారుల యత్నం అడ్డుకున్న బాధితులు.. అధికారులతో వాగ్వాదం స్వచ్ఛందంగా తొలగించుకునేందుకు మూడు రోజుల సమయం -
పక్కాగా మస్టర్
ఉపాధి కూలీలకు ‘ఫొటో క్యాప్చరింగ్’ అటెండెన్స్ఫొటోతో హాజరు..● మరింత పారదర్శకత, భద్రతతో కూడిన నమోదు ● వేతన చెల్లింపుల్లో ఆలస్యానికి ఇక చెక్ ● జిల్లాలోని 1.14 లక్షల యాక్టివ్ కూలీలకు ప్రయోజనంజనగామ: ఉపాధి హామీ పథకం(వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవక మిషన్(గ్రామీణ్)– వీబీ జీ రామ్ జీ)లో కూలీల హాజరును మరింత పారదర్శకంగా, భద్రతతో కూడిన విధంగా నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం(ఎన్ఎంఎంఎస్) గత నెల 30 నుంచి జిల్లాలో పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. దీనికి ముందు 15 రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించి సాంకేతిక ఇబ్బందులను గుర్తించి పరిష్కరించారు. ఎన్ఎంఎంఎస్ అమల్లోకి రావడంతో కాగితపు మస్టర్ల ఆధారిత హాజరు పద్ధతికి స్వస్తి పలుకగా, మొబైల్ ఆధారిత ఫేస్ క్యాప్చరింగ్ విధానం తప్పనిసరి అయింది. ఉపాధి కూలీల హాజరు నమోదు, పరిశీలన, ఆమోద ప్రక్రియలో వేగం పెరగడంతో పాటు, వేతన చెల్లింపుల్లో ఆలస్యానికి చెక్ పెట్టనున్నారు. ఆధార్ ఆధారిత ఈ–కేవైసీతో అనుసంధానం కూలీల వ్యక్తిగత వివరాలు, జాబ్ కార్డు సమాచారం, హాజరు ఫొటోలు నేరుగా ఆధార్ ఆధారిత ఈ–కేవైసీతో అనుసంధానం చేయబడతాయి. ఫొటో తీసిన తర్వాత సమాచారం సర్వర్కు అప్లోడ్ అవుతుంది. దీని ద్వారా హాజరు నమోదులో తప్పిదాలు, ఇతరుల పేర్లపై నమోదు వంటి సమస్యలకు ఫుల్స్టాప్ పడనుంది. రోజుకు రెండుసార్లు కూలీల హాజరును రోజుకు రెండుసార్లు నమోదు చేయాలి. మొదటి ఫొటో పని ప్రదేశానికి చేరుకున్న వెంటనే, రెండో ఫొటో నాలుగు గంటల తర్వాత మాత్రమే క్యాప్చర్ అయ్యే విధంగా సాఫ్ట్వేర్ రూపొందించారు. ఈ రెండో ఫొటో తీసే సమయంలో నాలుగు గంటలు పూర్తి కాకపోతే యాప్ దానిని తీసుకోదు. దీని వల్ల కూలీ వాస్తవంగా పని ప్రదేశంలో ఉన్నాడా లేదా అన్నది నిర్ధారించడానికి ఉద్దేశించబడింది. అదేవిధంగా రెండో ఫొటోను గ్రూప్గా తీయవచ్చు. పది మంది కూలీలను ఒకే ఫొటోలో నిలబెట్టి తీసుకోవచ్చు. సాంకేతిక సమస్యలైతే.. ఫేస్ క్యాప్చరింగ్ సమయంలో యాప్ పనిచేయకపోవడం, నెట్ సిగ్నల్ సమస్యలు రావడం, కూలీ ముఖం గుర్తుపట్టకపోవడం వంటి సాంకేతిక ఇబ్బందులు వచ్చినప్పుడు ‘జెన్న్నరేగా’ యాప్ను ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. ఈ విధానం కారణంగా హాజరు శాతంలో చిన్నపాటి లోపాలను సైతం అధిగమించే అవకాశం ఉంటుంది. నెట్వర్క్ సమస్యలు అధిగమించేలా.. గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలు ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ముఖ్య సూచనలు జారీ చేశారు. సిగ్నల్ లేక ఫొటో అప్లోడ్ కాని సమయంలో ఇంటికి వెళ్లి లేదా సిగ్నల్ లభించే ప్రాంతంలో తర్వాత అప్లోడ్ చేసుకోవచ్చు. 50 మందికి పైగా కూలీలు ఉన్నచోట.. పని ప్రదేశంలో 50 మందికి పైగా కూలీలు ఉన్నచోట ఒక కూలీని ప్రత్యేకంగా ఫొటోలు తీసే బాధ్యత కోసం ఎంపిక చేసుకోవచ్చు. అతడికి ఆ రోజు వేతనం పూర్తిగా చెల్లిస్తారు. దీనివల్ల పని ఆగకుండా, ఒకరు ఫొటోలను తీసుకుంటూ, మిగతా కూలీలు పనిని కొనసాగించవచ్చు.జిల్లాలో ఉపాధి హామీ సమాచారం1.16లక్షల జాబ్ కార్డులుజిల్లాలో 1.16లక్షల జాబ్కార్డులు ఉండగా, ఇందులో 2.24 లక్షల మంది కూలీలు ఉన్నారు. వీరిలో 76,727 జాబ్ కార్డులు యాక్టివ్గా ఉండగా, 1.14లక్షల మంది కూలీలు యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఈ నెల 7న ఒక్కరోజే 6,511 కూలీలు పనికి హాజరయ్యారు. ఫేస్ క్యాప్చరింగ్ విధానం విజయవంతంగా అమలవుతోంది. జిల్లాలో రోజువారీ హాజరు 99 శాతానికి పైగా ఫేస్ క్యాప్చరింగ్ హాజరు నమోదవుతోంది. కొన్ని గ్రామాల్లో సిగ్నల్ సమస్యలు ఉన్నా, ప్రత్యామ్నాయ చర్యల వల్ల హాజరు నమోదు లోపాలు లేకుండా కొనసాగుతోంది. ఉపాధి కూలీల అసలు హాజరు, వాస్తవ పనిని నిర్ధారించే అత్యంత సమర్థవంతమైన పద్ధతిగా ఎన్ఎంఎంఎస్ నిలుస్తోంది. -
‘అంబేడ్కర్ జ్ఞానయాత్రకు తరలిరండి’
జనగామ రూరల్: ఈనెల 13న సాయంత్రం జిల్లా కేంద్రంలో నిర్వహించే అంబేడ్కర్ జ్ఞానయాత్రకు అంబేద్కర్ వాదులు, అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గద్దల కిషోర్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక విజయ ఫంక్షన్ హాల్లో బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..11న మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని, 12న పట్టణంలో భారీ బైక్ ర్యాలీ, 13న సాయంత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీఅంబేడ్కర్ జ్ఞానయాత్రశ్రీ, 14న అధికారికంగా అంబేడ్కర్ జయంతి ఉత్సవ సభ ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉడుగుల సాగర్, జేరిపోతుల పరశురాములు, రాగళ్ల ఉపేందర్, పార్నంది వెంకటస్వామి, కౌన్సిలర్ సువార్త, మల్లిగారి రాజు, కన్నారపు ఉపేందర్, కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
నిలిచిన మక్కల కొనుగోళ్లు
స్టేషన్ఘన్పూర్: డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రంలో బుధవారం మక్కల కొనుగోళ్లు నిలిపివేశారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున మక్కలు వస్తుండడం, తేమ ఫంగస్ పేరుతో మార్క్ఫెడ్ నిర్వాహకులు పలువురు రైతుల మక్కలను నిరాకరించడం, రైతులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు నిరసనలు, ఆందోళనలు చేస్తుండగా ఏమి చేయలేక సెంటర్ నిర్వాహకులు చేతులెత్తేశారు. మంగళవారం ప్రతిపక్షపార్టీల నాయకులు, రైతులు ధర్నాలు చేయడంతో నిబంధనల మేరకే కొనుగోళ్లు చేస్తామని, గొడవలతో ఇబ్బందులకు గురిచేస్తే ఏమి చేయలేమంటూ నిర్వాహకులు కొనుగోళ్లను బంద్చేశారు. దీంతో చేసేదేమి లేక సెంటర్కు మక్కలు తెచ్చిన పలువురు రైతులు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఆశ్రయించారు. తాము మక్కలు తెచ్చి నాలుగైదు రోజులైందని తేమ, ఫంగస్ అంటూ ఇబ్బందులు పెడుతున్నారని, ఈరోజు మొత్తమే కొనుగోళ్లు బంద్ చేశారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ వెంటనే మార్క్ఫెడ్ డీఎం రంజిత్రెడ్డికి ఫోన్ చేశారు. రైతుల పక్షపాతిగా ఘన్పూర్లో మార్క్ఫెడ్ సెంటర్ను ఏర్పాటు చేశామని, మక్కల కొనుగోళ్లు చేపట్టాలని, ఏమైనా సమస్యలుంటే పోలీసు బందోబస్తుతో కొనుగోలు చేయాలని ఆయన్ను ఆదేశించారు. రైతులు సంయమనం పాటించాలి రైతులు ఎవరో చెప్పిన మాటలు విని తొందరపడవద్దని, సంయమనం పాటించాలని ఎమ్మెల్యే కడియం సూచించారు. జిల్లా కేంద్రంలో సైతం సెంటర్ లేదని, సీఎంతో మాట్లాడి నియోజకవర్గ రైతుల కోసం ఇక్కడ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే ఒకటే సెంటర్ ఉండడంతో మక్కలు విపరీతంగా వస్తున్నాయని, దాంతో నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారన్నారు. దీంతో పాటు జఫర్గఢ్, ధర్మసాగర్, వేలేరు, కంచనపల్లి, కుందారం తదితర ప్రాంతాల్లోనూ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, రైతులు గమనించి సహకరించాలన్నారు. కాగా ఎమ్మెల్యే ఆదేశాలతో మధ్యాహ్నం తర్వాత సెంటర్లో కొనుగోళ్లు ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్రెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి మునిగెల రమేశ్, రైతులు అశోక్, ఎల్లయ్య, సోమయ్య, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియంను ఆశ్రయించిన రైతులు ఎమ్మెల్యే ఆదేశాలతో మార్క్ఫెడ్ సెంటర్లో కొనుగోళ్లు పునఃప్రారంభం -
అ‘పూర్వ’ సమ్మేళనం
జనగామ: జిల్లాకేంద్రంలోని వైష్ణవి బ్యాంకెట్ హాల్ మంగళవారం చిరునవ్వులు, ఆనందోత్సవాలు, పా త జ్ఞాపకాలతో కళకళలాడింది. 1971–72 విద్యా సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం నిర్వహించుకుని, దాదాపు 55 ఏళ్ల అనంతరం ఒకే వేదికపై కలుసుకున్నారు. చిన్ననాటి మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. చా లాకాలం తర్వాత ఇలా అందరూ ఒకచోట కలవడ ంతో పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఇ లాంటి సమ్మేళనాలు ప్రతీ సంవత్సరం నిర్వహించుకోవాలని నిర్ణయించారు. ఆత్మీయ సమ్మేళనం వారికి పాత జ్ఞాపకాలను మాత్రమే కాదు.. తరతరా ల పాటు నిలిచే అనుబంధాన్ని పునరుద్ధరించింది. 55 సంవత్సరాల అనంతరం కలుసుకున్న పూర్వ విద్యార్థులు -
గర్భిణుల ఆరోగ్యమే లక్ష్యం
జనగామ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణుల ఆరోగ్య సంక్షేమమే లక్ష్యంగా వైద్యులు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం జనగామ చంపక్హిల్స్లోని మాతా శిశు ఆస్పత్రిని (ఎంసీహెచ్) ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ విభాగాన్ని తనిఖీ చేసి, సేవలను మరింతగా మెరుగుపరచాలని సూచించారు. ఆస్పత్రిలోని ప్రతీ వార్డును సందర్శించి, అక్కడ అందుతున్న వైద్యసేవలు, సదుపాయాలను స్వయంగా పరిశీలించి, గర్భిణులకు చేయించే వ్యాయామం సరిగా నిర్వహించాలన్నారు. వైద్యులు బాధ్యతగా పని చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఎంసీహెచ్ సూపరింటెండెంట్ రాజలింగం, వైద్యాధికారులు, సిబ్బంది ఉన్నారు. రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుదాం రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ వైద్య కళాశాల, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మెడికోస్ బ్లడ్ డోనర్స్ క్లబ్ సహకారంతో మంగళవారం చంపక్హిల్స్ ప్రభుత్వ వైద్య కళాశాలలోని లెక్చర్ గ్యాలరీలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం చేయడం గొప్ప కార్యక్రమమని, యువత ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమణి, పాథాలజీ విభాగాధిపతి డాక్టర్ మొహమ్మద్ అన్వర్, డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు, రాజలింగం, నాగమణి, కోటాచలం, అన్వర్ పాల్గొన్నారు. భూ భారతి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి భూ భారతిలో వివిధ మాడ్యూల్స్లోని పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ల్లో భూ భారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలన్నారు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ–ఆఫీసు విధానాన్ని అమలు చేయాలన్నారు. ఈ సమీక్షలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, తహసీల్దార్లు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎంసీహెచ్ ఆకస్మిక తనిఖీ -
రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్/జఫర్గఢ్: రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు జరగాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం స్టేషన్ఘన్పూర్, జఫర్గఢ్ రైతువేదికలో కల్యాణలక్ష్మీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా సర్పంచ్లు లబ్ధిదారులను చైతన్యం చేయాలన్నారు. త్వరలో వరి కోతలు ప్రారంభం కానుండడంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సుమన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. మహనీయుల జయంతిని విజయవంతం చేయాలి జనగామ: రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గద్దల కిషోర్ కు మార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే యశస్విరెడ్డి, పాలకుర్తి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, పాలకుర్తి నియోజకవర్గం ఇన్చార్జ్ హనుమాన్ల ఝాన్సీరెడ్డిని కలిసి జయంతి ఉత్సవాలకు ఆహ్వానించా రు. అనంతనం జిల్లాకేంద్రంలో మాట్లాడుతూ ఏప్రిల్ 14న అంబేడ్కర్ 135వ జయంతి పురస్కరిచుకుని 13న జిల్లా కేంద్రంలో జ్ఞాన యా త్ర నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ బాధ్యులు బొట్ల శేఖర్, మేడ శ్రీనివాస్, పార్నంది వెంకటస్వామి, గిరిమల్లె రాజు, రాగళ్ల ఉపేందర్, జెరిపోతుల పరుశరాములు, జేరిపోతుల కుమార్, మల్లిగారి రాజు, తదితరులు పాల్గొన్నారు. పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యంజనగామ రూరల్: పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని, ప్రజలు ఆరోగ్య సూత్రాలు పాటించాలని జనగామ కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.శశి అన్నారు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ జనగామ కోర్టు ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయాలన్నారు. వైద్యారోగ్య శాఖ పరంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అనురాధ, రేవతి, ప్రైమరీ హెల్త్ సెంటర్ స్టాఫ్, ఆశవర్కర్లు, లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ ఎం.రవీంద్ర, పారా లీగల్ వలంటీర్స్ సుందరయ్య, అమృత తదితరులు పాల్గొన్నారు. రైతులకు న్యాయం చేయాలని ధర్నా స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన మార్క్ఫెడ్ సెంటర్లో మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ జిల్లా యువజన నాయకుడు కేశిరెడ్డి రాకేష్రెడ్డి డిమాండ్ చేశారు. ఘన్పూర్ మార్క్ఫెడ్ సెంటర్లో మొక్కజొన్న కొనుగోలులో తీవ్ర జాప్యంతో పాటు సెంటర్ నిర్వాహకులు, ట్రేడర్లు కుమ్మకై ్క జీరో దందా చేస్తున్నారని రైతులు చేస్తున్న ఆరోపణల మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం మార్క్ఫెడ్ సెంటర్ను సందర్శించారు. ముందుగా సెంటర్లో ఉన్న మొక్కజొన్న రైతులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సెంటర్ నిర్వాహకులతో మాట్లాడగా సరైన సమాధానం రా కపోవడంతో రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు మార్కెట్యార్డు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, మార్క్ఫెడ్ నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా బీఆర్ఎస్ నాయకులు, రైతులు ధర్నా చేస్తున్నారనే సమాచారం మేరకు మార్కెట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బూర్ల రాజేశ్వర్, చల్లా రమ్యరఘురెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
భానుడి భగభగ
ఇళ్లకే పరిమితమవుతున్న ప్రజలునిర్మానుష్యంగా వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి జనసంచారం లేక మంగళవారం మధ్యాహ్నం 1గంటకు నిర్మానుష్యంగా పాతబీటు బజారుజనగామ: జిల్లాలో వేసవి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. ఉదయం తొమ్మిది గంటలు దాటేసరికి ఎండలు మండిపోతుండగా, గడప దాటి బయటకు రావాలంటే వెనకడుగు వేస్తున్నారు. ఒంటిగంట దాటితే పట్టణాలు, గ్రామాలు నిర్మానుష్య ప్రాంతాలుగా మారిపోతున్నాయి. ప్రధాన కూడళ్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. డీ హైడ్రేషన్కు గురి కాకుండా.. తీవ్రమైన ఎండల కారణంగా ప్రజల్లో నీరసం, డీహైడ్రేషన్ సమస్యలు పెరుగుతుండడంతో దాహం తీర్చుకునే పదార్థాలపై డిమాండ్ విపరీతంగా పెరిగింది. కొబ్బరిబొండాలు, గ్లూకోజ్ నీళ్లు, పుచ్చకాయ, మజ్జిగ వంటి పానీయాలకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపధ్యంలో మట్టి రంజన్లకు గిరాకీ పెరుగుతుంది. పేదవాడి ఫ్రిడ్జిగా పిలిచే రంజన్లలో చల్లబడిన నీటితో దాహం తీర్చుకోవడమే కాకుండా, శరీరాన్ని చల్ల బరచడానికి సహకరిస్తుంది. ఫ్రిడ్జి వాటర్ కంటే రంజన్ వాటర్ ఆరోగ్యకరమని ప్రజలు భావిస్తూ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఏసీ, కూలర్లకు పెరుగుతున్న గిరాకీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇళ్లలోని టెంపరేచర్ కూడా భరించలేని స్థాయికి చేరుకుంది. దీంతో ఏసీలు, ఎయిర్ కూలర్లు, టేబుల్ ఫ్యాన్లు, సీలింగ్ ఫ్యాన్ల కొనుగోలు విపరీతంగా పెరిగిపోయింది. విద్యుత్ వినియోగం అకస్మాత్తుగా పెరగడంతో లోడ్ మోసే సామర్థ్యం దాటిపోకుండా పవర్ శాఖ అదనపు ఏర్పాట్లు చేస్తోంది. అత్యవసర పనుల కోసం బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు చెమటలు పట్టే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కొంతమంది ప్రయాణికులు మధ్యాహ్నం సమయాల్లో ప్రయాణాన్ని పూర్తిగా మానేశారు. అయితే, ఉద్యోగాలు, పనిమీద వెళ్లాల్సిన వారికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. పాఠశాలల్లో ఒంటిపూట బడికొనసాగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12.30 గంటలు దాటితే విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చే తల్లిదండ్రులు పిల్లలకు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి టోపీలు, కూలింగ్ కాపులు, నీటి సీసాలు తప్పనిసరి చేశారు. నిర్మానుష్యంగా జాతీయ రహదారులు వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి మధ్యాహ్న సమయంలో పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోతుంది. వందలాది వాహనాలు వెళ్లే రహదారి ఒంటిగంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ భరించలేక మానవరహితంగా కనిపిస్తుంది. అవసరం లేకుండా వాహనదారులు ఈ సమయాల్లో రోడ్లపైకి రావడం మానేశారు. రాబోయే రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వేసవి ఉక్కపోత జిల్లాలో జీవన విధానాన్ని పూర్తిగా అతలాకుతలం చేస్తుండగా, ప్రజలు ఎండను తట్టుకునే ప్రయత్నంలో రోజువారీ జీవితాన్ని జాగ్రత్తలతో కొనసాగిస్తున్నారు. రక్షణ చర్యలు పాటించాలి:వైద్యులు రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో బయటకు వెళ్లడం తగ్గించాలని, అత్యవసర సమయంలో తల, ముఖం, చేతులను కప్పుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తరచూ నీరు తాగడం, మజ్జిగ, దోసకాయ, నిమ్మరసం వంటి దాహం తీర్చే పదార్థాలను తీసుకోవాలని చెబుతున్నారు. ఉదయం 9 నుంచే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పేదోడి ఫ్రిడ్జి రంజన్లకు గిరాకీ ఏసీ, ఫ్యాన్లు, కూలర్లకు డిమాండ్ శీతల పానీయాలతో సేదదీరుతున్న జనం మధ్యాహ్నం నిర్మానుష్యంగా ప్రధాన కూడళ్లు -
వివాదాస్పదంగా జీపీ నిధుల డ్రా
దేవరుప్పుల: ప్రత్యేక పాలనలో అప్పులు తెచ్చి ఖర్చుచేసిన తరుణంలో ఇటీవల జీపీలకు నిధులు రావడంతో గ్రామ కార్యదర్శులు సదరు బిల్లులు ఎత్తుకునే క్రమంలో కడవెండి జీపీ నిధుల విడుదలలో లోపించిన తీరుపై వివాదాస్పదంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని కడవెండి జీపీకి ఇటీవల రెండు విడతల్లో రూ.20 లక్షలు విడుదలయ్యాయి. కడవెండి గ్రామ పంచాయతీ కార్యదర్శి పాండు ఆధ్వర్యంలో రెండేళ్లుగా నిర్వహణ ఖ ర్చులు, జీపీ జీతభత్యాలు కలిపి మార్చి 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మొత్తం రూ.12,04,414 డ్రా చేశారు. అయితే నిబంధనల మేరకు ఎంబీ రికార్డు చేసి సంబంధిత బిల్లులు అప్పులు ఇచ్చిన యజమానులకు చెల్లించాల్సి ఉండగా గ్రామంలోని కొందరి అకౌంట్లోకి జమచేయడంతో పలు ఆరోపణలు, అనుమానాలకు తావిచ్చింది. దీంతో గ్రామస్తులు జీపీ నిధుల గోల్మాల్ విషయమై పలు రకాలుగా పేర్కొంటూ పాత కార్యదర్శి రాత్రివేళల్లో వచ్చి రికార్డులు సవరణ చేస్తున్నారనే విషయమై సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయమై స్పందించిన సర్పంచ్ భాషిపాక రాములు మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించగా ప్రస్తుత కార్యదర్శి స్వప్న, ఉపసర్పంచ్ రేణుక, వార్డు సభ్యుల సమక్షంలో బదిలీపై వెళ్లిన పాత కార్యదర్శి పాండు హాజరై రెండు సంవత్సరాల పైచిలుకు గ్రామ ప్రజల మౌలిక వసతులు, పరిపాలన వ్యవహారాలకు ఖర్చు చేసిన వివరాలు వివరించారు. పంచాయతీ నిర్వహణకు అప్పులు ఇచ్చిన వారికి నేరుగా అకౌంట్లోకి వేశానని, తాను ఎలాంటి తప్పిదాలు చేయలేదని స్పష్టం చేశారు. కాగా గ్రామంలో ఎక్కడ అభివృద్ధి పనులు కనిపించకపోగా జీపీ సిబ్బంది జీతాలు పోను మిగతా ఖర్చులపై గ్రామస్తుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత మండల అధికారులు నిమ్మకు నీరెత్తడంతో కడవెండి నిధుల గోల్మాల్ పేరిట వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడం కొసమెరుపు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూడనున్నాయి. ‘కడవెండి’లో నిధుల గోల్మాల్పై సోషల్మీడియాలో వైరల్ -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026● శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్న 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. థ్రెడింగ్, హెయిర్ కట్స్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ – సెల్ప్ గ్రూమింగ్, ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈనెల 8వ తేదీ నుంచి 13 తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 14 నుంచి మే 12వ తేదీ వరకు ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఉంటుంది. ● రిజిస్ట్రేషన్, శిక్షణ కోసం శ్రీ శైలీ బ్యూటీపార్లర్, ఓల్డ్ బస్డిపో దగ్గర, సర్క్యూట్ హౌజ్ రోడ్డు, హనుమకొండలో సంప్రదించాలి. ● మరిన్ని వివరాల కోసం 95055 14424, 94901 55215 నంబర్లలో సంప్రదించాలి. -
‘బూత్ లెవెల్’ కసరత్తు!
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏ) నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్ర దేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతీ బూత్కు ప్రత్యేక ఏజెంట్లను ఎంపిక చేస్తూనే.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జ్లను నియమిస్తూ కేడర్ను యాక్టివ్ చేయడంపై దృష్టి సారించింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీ కేడర్ ప్రజల్లోకి వెళ్లేలా బూత్స్థాయి కమిటీలను ఆచితూచి నియమిస్తోంది. ఇందుకోసం.. ఇతర జిల్లాలకు చెందిన సీనియర్లను ఉమ్మడి వరంగల్లోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్చార్జ్లుగా నియమించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న సీనియర్లకు ఇతర జిల్లాల ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. కీలకంగా బీఎల్ఏలు.. రాబోయే ఎన్నికల్లో బూత్ లెవెల్ ఏజెంట్లు కీలకంగా వ్యవహరించేలా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జ్లు కమిటీలు వేయాల్సి ఉంది. ప్రతీ బూత్కు 10–15 మంది యాక్టివ్ టీమ్తో బూత్ లెవెల్ ఏజెంట్లను ఎంపిక చేయాలనేది పార్టీ అధిష్టానం ఆదేశాలు. ఎంపికై న బీఎల్ఏలు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేలా చూడాలి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రతీ బూత్ను టార్గెట్గా తీసుకుని పనిచేస్తోంది. స్థానికంగా ప్రభావం ఉన్న యువకులు, సీనియర్ కార్యకర్తలను ఎంపిక చేసి.. ఓటర్లతో నేరుగా సంబంధాలు పెంచేలా బాధ్యతలు అప్పగించనున్నారు. ఓటర్ లిస్ట్లో లోపాల గుర్తింపు, సరిదిద్దే పనితో పాటు ‘బూత్ గెలిస్తేనే సీటు గెలుస్తాం’ అనే స్ట్రాటజీతో ముందుకెళ్లాలన్న పార్టీ అధిష్టానం సూచనల మేరకు అసెంబ్లీ ఇన్చార్జ్లు కేడర్కు మార్గనిర్దేశనం చేస్తున్నారు. బీఎల్ఏలు ప్రభుత్వ పథకాలు, పార్టీ హామీలపై అవగాహన, అసంతృప్త వర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు కేడర్కు సంకేతాలిచ్చారు. ఈనేపథ్యంలో బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం కూడా పోటీ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.12 సెగ్మెంట్లకు ఇన్చార్జ్లు వీరే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, మహబూబాబాద్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి 12 సెగ్మెంట్లకు ఇన్చార్జ్లను నియమించారు. జనగామకు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తికి దుద్దిళ్ల శ్రీనివాస్, పరకాల, వరంగల్ పశ్చిమకు పల్లె శ్రీనివాస్గౌడ్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేటకు మోతుకూరి ధర్మారావు, భూపాలపల్లి, ఎండీజావేద్ (ఆర్జీపీఆర్ఎస్), డోర్నకల్, మహబూబాబాద్కు ఎండీ.అవేజ్, నర్సంపేట, ములుగుకు నాగ సీతారాములును అసెంబ్లీ ఇన్చార్జ్లుగా నియమించారు. అదేవిధంగా జిల్లాకు చెందిన నాయకులు జంగా రాఘవరెడ్డికి నల్లగొండ, ఈవీ.శ్రీనివాస్రావుకు భువనగిరి, గాజర్ల అశోక్కు భద్రాచలం, కూచన రవళిరెడ్డికి పినపాక, ఇల్లందు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. ‘సంస్థాగత’ంపై కాంగ్రెస్ ఫోకస్ బూత్ స్థాయి కమిటీలపై గురి 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్చార్జ్లు ఇతర జిల్లాలకు పార్టీ సీనియర్లు నియామక ఉత్తర్వులు జారీ చేసిన టీపీసీసీ చీఫ్ -
గ్రీవెన్స్..డబుల్ సెంచరీ
జనగామ: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వచ్చిన తర్వాత ప్రజావాణికి అర్జీలు పోటెత్తుతున్నాయి. ఫిబ్రవరి 26న జిల్లా కలెక్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన పనితీరుపై జిల్లా ప్రజల్లో విశేష విశ్వాసాన్ని పెంచింది. ప్రతీ సోమవారం కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్కు గతంలో 60 నుంచి 80 వినతులు మాత్రమే వచ్చేవి. ఎప్పుడో ఒకప్పుడు 100 దాటేది. అయితే కొత్త కలెక్టర్ వచ్చిన తర్వాత గ్రీవెన్స్కు 200 నుంచి 250కి పైగా వినతులు రావడం జిల్లా చరిత్రలోనే రికార్డు. ప్రజలు కలెక్టర్ను కలిస్తే తప్పకుండా పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో తరలివస్తున్నారు. వినతులు విన్న వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆదేశాలు ఇవ్వడం, సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్లే వేగం పాటిస్తున్నారు. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి.. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 30 పడకల ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ లోపాలను సరిదిద్దుతున్నారు. పాఠశాలల్లోకి వెళ్లి బ్లాక్ బోర్డు మీద చాక్ తీసుకొని స్వయంగా పాఠాలు చెప్పడం ద్వారా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి, ధైర్యాన్ని పెంచుతున్నారు. వైద్య రంగంలో ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేస్తున్నారు. సమయపాలన, విధుల్లో అంకితభావం తప్పనిసరి అని తన తనిఖీల ద్వారా బలంగా తెలియజేస్తున్నారు. ఈ రెండు శాఖలతో పాటు రెవెన్యూ, పంచాయతీ, మున్సిపాలిటీలు, రోడ్లు, భవనాలు, జిల్లా గ్రామీణాభివృద్ధి, వైద్యారోగ్యశాఖ ఇలా ప్రతీశాఖపై ఫోకస్ సారిస్తున్నారు. ఏదో చూశాములే అనుకోకుండా ఆయా శాఖలకు సంబంధించి ప్రతీ ఫైల్ను క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. దీంతో ఆ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగుల్లో అంకితభావం పెరగడంతో పాటు చిన్న పొరపాటు కూడా జరగకుండా ముందు జాగ్రత్త పడుతున్నారు. తనిఖీలకు కొత్త నిర్వచనం ఎక్కడికి ఎప్పుడు వెళ్తారో ఎవరికి తెలియకుండా అత్యంత గోప్యంగా పనితీరును నిర్వహిస్తూ శాఖలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రతీ ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలించడం, అనుమతుల విషయంలో పారదర్శకతను పాటించడం ఆయన పరిపాలనా బలం. జిల్లా శాఖలు ఇప్పుడంతా అలర్ట్ మోడ్లోకి వెళ్లాయి. ఎప్పుడైనా కలెక్టర్ వస్తారనే భయం కాదు...వస్తే చెప్పాల్సిందే అన్న బాధ్యత భావం పెరిగింది. సాధారణ ప్రజలకు అందుబాటులో ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలెక్టరేట్లోని తన చాంబర్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. సాధారణ వ్యక్తి నుంచి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధి వరకు ఎవరికైనా ఒకే రీతిగా సమయం కేటాయిస్తున్నారు. ప్రజలు చెప్పే ప్రతి చిన్న సమస్యను సైతం ఓర్పుతో విని, వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. అనతికాలంలోనే తనదైన ముద్ర కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కేవలం కొద్ది రోజుల్లోనే సందీప్ కుమార్ ఝా పరిపాలన జిల్లా ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించింది. అంకితభావం, అందుబాటు, వేగవంతమైన స్పందన, పారదర్శక పరిపాలన ఈ నాలుగు మూలాలతో సందీప్కుమార్ ఝా తనదైన శైలిలో జిల్లా పరిపాలనను మరింత బలోపేతం చేస్తున్నారు. కలెక్టర్ తీసుకున్న ప్రతీ నిర్ణయం, చేసిన ప్రతీ తనిఖీ ప్రజల్లో విశ్వాసాన్ని మరింతగా పెంచుతోంది.286 దరఖాస్తులు..జనగామ రూరల్: పలు సమస్యలతో సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణికి ప్రజలు తరలివచ్చారు. కలెక్టర్ సమస్యల గురించి తెలుసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అత్యధికంగా (286) దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. అదనపు కలెక్టర్ బెన్ షోలోమ్ , ఆర్డీఓ వెంకన్న, డీఆర్డీఓ వసంత, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. దరఖాస్తుల్లో కొన్ని ఇలా.. పట్టణంలోని గిర్నిగడ్డకు చెందిన దైద స్వప్న నిరుపేదరాలినని, భర్త మరణించగా గుడిసెలో జీవనం కొనసాగిస్తున్నామని, ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేయగలరని కోరుతూ దరఖాస్తు చేసుకుంది. లింగాల ఘణపురం మండలం గుమ్మడవెల్లి గ్రామ రైతులు పీఏసీఎస్ ద్వారానే గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. బచ్చన్నపేట మండలం సాల్వాపూర్ గ్రామానికి చెందిన గీత పోచమ్మ తన భర్త మృతి చెందగా పెద్ద కుమారుడు చూసుకుంటున్నాడని, చిన్న కొడుకు చూసుకోకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఎకరం పొలం అతడే సాగు చేసుకుంటున్నాడని, న్యాయం చేయాలని కలెక్టర్కు విన్నవించింది. పట్టణానికి చెందిన కన్నారపు ఉపేందర్ పక్షవాతంతో నడవలేని పరిస్థితిలో ఉన్నానని, కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉందని ఎస్సీ కార్పొరేషన్ ద్వా రా ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించాలని వేడుకున్నాడు. కలెక్టరేట్ ప్రజావాణికి పోటెత్తుతున్న అర్జీలు కలెక్టర్ వద్దకు వస్తే పరిష్కారం ఖాయమన్న నమ్మకం ప్రతీ వినతిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సందీప్కుమార్ ఝా ఉదయం నుంచి సాయంత్రం వరకు కలెక్టరేట్లోనే -
మట్టి తరలించొద్దని నిరసన
స్టేషన్ఘన్పూర్: మండలంలోని ఇప్పగూడెం శివారు సింగారపు ఏనె గుట్ట నుంచి మట్టిని తరలించవద్దంటూ డిమాండ్ చేస్తూ గ్రామానికి చెందిన పలువురు రైతులు సోమవారం సాయంత్రం నిరసన వ్యక్తం చేశారు. రైతులు మందపురం అనీల్, మంద చంద్రమౌళి, మునిగెల నర్సింహులు, ఎండీ యాకూబ్పాషా, సట్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సింగారపు ఏనె క్వారీ నుంచి అక్రమంగా ఇష్టారాజ్యంగా భారీ టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారన్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఓవర్లోడ్తో వాహనాలు నడుస్తుండగా రోడ్లు ధ్వంసం అవుతున్నాయన్నారు. రోడ్డు వెంట పంటలపై విపరీతంగా దుమ్ము, ధూళి పడి పంటలు నష్టపోతున్నామన్నారు. మట్టిని తరలిస్తున్న రోడ్డులో ఉన్న కుంట మత్తడి ధ్వంసమైందని, దీంతో పంటపొలాలకు సాగునీరు అందడం లేదన్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా చర్యలు తీసుకోవడం లేదని, మట్టి రవాణాను అడ్డుకునేలా కుంట మత్తడి ఉన్న వద్ద రోడ్డుపై పోసిన మట్టిని తొలగించి నిరసన చేపట్టినట్లు తెలిపారు. పరిశీలించిన ట్రెయినీ ఐపీఎస్ మట్టిని తరలిస్తున్న రోడ్డుపై టిప్పర్లు వెళ్లకుండా రోడ్డును ధ్వంసం చేశారని క్వారీ నిర్వాహకులు అందించిన ఫిర్యాదు మేరకు ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్రా, సీఐ జి.వేణు అక్కడకు చేరుకుని రైతులతో, క్వారీ నిర్వాహకులతో మాట్లాడారు. రైతులు తమ సమస్యను విన్నవించగా రోడ్డును ధ్వంసం చేయడం సరికాదని, మట్టి తరలింపు విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే రెవెన్యూ అధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు సట్ల వెంకటరమణగౌడ్, సీపీఎం మండల కార్యదర్శి మునిగెల రమేశ్, నాయకులు ఎన్.అజయ్రెడ్డి, లింగనబోయిన శ్రీను, పల్లె రవీందర్, యాదగిరి, మైబుపాషా, రవి, షాబుద్దీన్, సోమయ్య పాల్గొన్నారు. -
సిలిండర్లు నిల్వచేస్తే కఠిన చర్యలు
● డీటీసీఎస్ లచ్చునాయక్ దేవరుప్పుల : అక్రమంగా వంటగ్యాస్ సిలిండర్లు నిల్వచేయడమేగాక నిబంధనలు విస్మరించి వ్యాపారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ నాయబ్ తహసీల్దార్ లచ్చునాయక్ హెచ్చరించారు. సోమవారం కోలుకొండ, సింగరాజుపల్లిలో 23 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకొని మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో అప్పగించారు. ఈ విషయమై ఫిర్యాదు మేరకు ఎస్సై ఊర సృజన్కుమార్ సంబంధిత వ్యక్తులపై 6ఏ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లచ్చునాయక్ మాట్లాడుతూ.. గృహాలకు వాడాల్సిన వంట గ్యాస్ను హోటళ్లు, టీస్టాల్ వంటి వ్యాపార దుకాణాల్లో వినియోగించుకున్నా కేసులు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఆర్ఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆహార భద్రతపై అవగాహన తప్పనిసరి
● డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు జనగామ రూరల్: ఆహార భద్రతపై అవగాహన తప్పనిసరి అని డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రతపై ప్రత్యేక దినోత్సవం సందర్భంగా పాఠశాల వసతి గృహాల వార్డెన్లు, వంటశాల సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ వినీల్ కుమార్, ఏబీసీడీఓ రవీందర్, ట్రైనర్ వేణుగోపాల కృష్ణ, కుక్ లు, వార్డెన్లు, వంటశాల సిబ్బంది పాల్గొన్నారు. -
సమతావాది..జగ్జీవన్
జనగామ/ స్టేషన్ ఘన్పూర్: మాజీ ఉప ప్రధాని, దళిత వర్గాల ఆశాజ్యోతి, సమతావాది డాక్టర్ బా బు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఆది వారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహం ఆవరణలోని మహనీయుని విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, డీసీపీ రాజమహేంద్ర నాయ క్, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్లతో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం ఏసీపీ పండరి చేతన్ నితిన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవిలత, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, ఇతర అధికారులు, షెడ్యూల్డ్ కులాల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు, ఎస్సీ సంక్షేమ శాఖ సిబ్బంది జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. దళితుల సమగ్ర అభివృద్ధిలో అంబేద్కర్, జగ్జీవన్రామ్.. దళితుల సమగ్ర అభివృద్ధిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్రామ్ రెండు కళ్లలాంటివారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్ డివిజన్కేంద్రంలో బాబూ జగ్జీవన్రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్డీఓ డీఎస్ వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశానికి గొప్ప రాజ్యాంగం అందించిన మహనీయుడు అంబేడ్కర్ అయితే ఆ రాజ్యాంగ అమలుకు విశేషంగా కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్రామ్ అని కొనియాడారు. ఘన్పూర్లో ప్రస్తుతం ఉన్న జగ్జీవన్రామ్ విగ్రహం శిథిలావస్థలో ఉందని, దాని స్థానంలో వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీవరకు కొత్త కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని, అదేవిధంగా అంబేద్కర్, జగ్జీవన్రామ్ల పేరిట రూ.2కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో భవనాన్ని నిర్మిస్తానని హామీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ మారుడోజు రాంబాబు, ఏఎంసీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్రెడ్డి, తహసీల్దార్ స్వప్న, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. మరిన్ని ఫొటోలు 9లో దేశ స్వాతంత్య్రం, దళితుల సాధికారత కోసం చేసిన పోరాటం గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్రామ్ అని డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు, డీసీసీ కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు మాజీ ఉపప్రధానికి ఘన నివాళి -
నేడు ఫుడ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా
జనగామ: తెలంగాణ రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు) కోసం నేడు(సోమవారం) ఎఫ్ఎస్ఎస్ఏఐ(ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నట్లు ఆహార భద్రత అధికారి సీహెచ్.వినీల్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం రూమ్ నెంబర్ జీ2లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. ఆహార వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ రిజిస్ట్రేషన్లు పొందడం లేదా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం ఆహార భద్రత అధికారి:7306335795, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ :9985820544 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.గేట్లో మెరిసిన ఆకాంక్ష● జాతీయ స్థాయిలో 542వ ర్యాంక్ బచ్చన్నపేట: మండలంలోని చిన్నరామన్చర్ల శివారు గ్రామమైన మొండికుంటకు చెందిన పుర్మ ఆకాంక్ష ఇటీవల వెలువడిన గేట్ 2026 ఫలితాల్లో ఆల్ ఇండియా 542వ ర్యాంక్ సాధించింది. పాఠశాల, కళాశాల విద్యలోనూ ఆకాంక్ష అద్భుత ప్రతిభ చూపించింది. 2023లో ఈసెట్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆమె తల్లిదండ్రులు పుర్మ లలిత, రాంరెడ్డిలది సాధారణ రైతు కుటుంబం. కాగా, గేట్ ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించిన ఆకాంక్షను గ్రామస్తులు అభినందించారు.జిల్లా మహాసభకు ఎమ్మెల్సీ విజయశాంతికి ఆహ్వానంరఘునాథపల్లి: ఈ నెల 7న జిల్లా కేంద్రంలో 14 కార్మిక సంఘాలతో కలిసి టీబీఎస్ఆర్కేఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జిల్లా మహాసభకు ఆదివారం ఎమ్మెల్సీ విజయశాంతిని సంఘం నాయకులు కలిసి ఆహ్వానించారు. తమ ఆహ్వానం మేరకు ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో టీబీఎస్ఆర్కేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గిన్నారపు మహేంద్ర, రాసమల్ల కొమురయ్య, నల్ల సామన్న, తూడి అంజయ్య, గిన్నారపు రవి తదితరులు ఉన్నారు. సంకటహరచతుర్థి పూజలుహన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం సాయంత్రం సంకటహరచతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్, శ్రవణ్ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఉత్తిష్టగణపతికి అభిషేకాలు చేశారు. మహాహారతి, మంత్రపుష్పం చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. ముగిసిన టెన్నిస్ ఇంటర్ క్లబ్ పోటీలువరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఎన్ఎస్లో మూడు రోజులపాటు నిర్వహించిన ఇంటర్ క్లబ్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. టి.సాత్విక్–రడం శ్రీనివాస్ ప్రథమ స్థానం, ఎరగ్రట్టు స్వామి–ఎం.శివరాజ్ ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. హనుమకొండ ఏసీపీ నరసింహారావు, టెన్నిస్ అసోసియేషన్ హనుమకొండ అధ్యక్షుడు నల్ల సురేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోటీలు నిర్వహించడానికి సహకరించిన హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎరగ్రట్టుస్వామి, తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్ సభ్యుడు బాబురెడ్డి, ప్రతినిధులు రవిచంద్ర, సుదర్శన్, వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య పనుల్లో వార్డు సభ్యులు
నర్మెట: సిబ్బంది కొరతతో మండల కేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణ కుంటుపడిందని సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్, వార్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వాడవాడలా మురికి కాల్వలలో చెత్త పేరుకుపోవడం, కాలనీల్లో పెరిగిన పిచ్చిమొక్కలతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, చేసేది లేక ఆదివారం తామే స్వయంగా చెత్తను తొలగించాల్సి వచ్చిందన్నారు. నర్మెట గ్రామ పంచాయతీ పరిధిలో 14 వార్డులు, 4,157 ఓటర్లు, 8,371 జనాభా ఉండగా కేవలం 12 మంది పారిశుద్ధ్య సిబ్బంది మాత్రమే ఉన్నారని, 18 అవసరమన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సిబ్బంది నియామకానికి తోడ్పాటు అందించాలని వార్డు సభ్యురాలు పులి రేణుక కనకయ్య కోరారు. చెత్త తొలగించిన సభ్యులను కాలనీ వాసులు ఈసందర్భంగా అభినందించారు. సిబ్బంది కొరతతో స్వయంగా చెత్త తొలగింపు -
టెస్కోతోనే చేనేత వస్త్రాల ఖరీదుకు కృషి
● మంత్రి తుమ్మలకు సంఘాల ప్రతినిధుల వినతికాశిబుగ్గ: చేనేత వస్త్రాలను టెండర్ ద్వారా కాకుండా టెస్కో ద్వారానే ఖరీదు చేయడానికి కృషి చేస్తానని రాష్ట్ర జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హామీ ఇచ్చారు. ఆదివారం కొత్తవాడకు చెందిన చేనేత సొసైటీ ప్రతినిధుల బృందం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో మంత్రి తుమ్మలను కలిసి చేనేత సమస్యలు విన్నవించారు. గతంలో మాదిరిగానే బెడ్ షీట్లు, కార్పెట్లు ప్రభుత్వరంగ సంస్థ అయిన టెస్కో ద్వారానే కొనాలని, చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈసందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. చేనేత పరిశ్రమకు సంబంధించిన బెడ్ షీట్లు, కార్పెట్లు, ఇతర వాటిని టెండర్ ద్వారా కాకుండా, నేరుగా సొసైటీల నుంచి కొనేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై నేత కార్మికులు అధైర్యపడకూడదని, కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈవిషయాన్ని సీఎం దృష్టికి తీసుకవస్తానని హామీ ఇచ్చారు. -
ఉన్నతవిద్యకు ‘ఉపకారం’
జనగామ రూరల్: గ్రామీణ ప్రాంత విద్యార్థినులు ఆర్థిక స్థోమత లేక ఉన్నత చదువులు మధ్యలోనే ఆపేస్తున్నారు. ప్రతిభ ఉండి భవిష్యత్లో గొప్ప అవకాశాలు అందుకుని భవిష్యత్లో ఉన్నతంగా స్థిరపడడానికి అజీమ్ ప్రేమజీ స్కాలర్షిప్ పేద విద్యార్థులకు భరోసా ఇస్తోంది. కేవలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదువుకునే వారికి ఈ అవకాశం లభిస్తోంది. ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె. శ్రీనివాసరావు చొరవతో కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థినులు ప్రఖ్యాతిగాంచిన అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్కు ఎంపికయ్యారు. జె. శ్రీజ, ధనలక్ష్మి, ఐ.దివ్య, బి. మమత, బి. కీర్తి, జి.ప్రవళికకు మొదటి సంవత్సరానికి గాను రూ.30 వేల చొప్పున వారి అకౌంట్లో నగదు జమ అయ్యింది. కళాశాల నుంచి మొత్తం 36 మంది విద్యార్థినులు అప్లై చేయగా ఆరుగురు ఎంపికయ్యారు. ఇందులో మొదటి సంవత్సరానికి గాను రూ.30 వేలు వరకు జమ అయ్యాయి. వీరికి సెకండియర్, ఫైనల్ ఇయర్లో కూడా ఏడాదికి రూ.30వేలు జమకానున్నాయి. మిగతా విద్యార్థులు కూడా త్వరలో రెండో విడత స్కాలర్షిప్ లభించవచ్చని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు మెరిట్ ఆధారంగా మూడేళ్లకు రూ.90వేలు అజీమ్ ప్రేమ్ జీ సంస్థ స్కాలర్షిప్ ఇవ్వనుంది. దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులకు సహాయం చేసిన ఎం.శ్రీనివాస్, టి.కరుణాకర్తో పాటు మిగతా అధ్యాపకులను కళాశాల ప్రిన్సిపాల్ అభినందించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులకు మాత్రమే అవకాశం ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆరుగురు విద్యార్థినుల ఎంపిక ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.30వేలు -
పరుగు పోటీలతో ఆరోగ్య చైతన్యం
జనగామ: జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట ఆవరణలో తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో ప్రోమో రన్ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ ప్రోమో రన్ను ప్రారంభించారు. తెలంగాణ రన్నర్స్ సభ్యులు హ రీష్రెడ్డి, పురుషోత్తంరెడ్డి, శ్రీనివాస్, అవంతి కన్స్స్ట్రక్షన్ శ్రీనివాస్రెడ్డి, ఎస్పీఆర్ స్కూల్ కరస్పాండెంట్ కీర్తి వీరేందర్, తాజా టిపిన్ ఎండీ తమ్మిశెట్టి సతీష్, జగన్, రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రన్నర్స్ పాల్గొన్నారు. బతుకమ్మకుంట నుంచి నెహ్రూపార్క్, ఆర్అండ్బీ అతిథిగృహం, వడ్లకొండ జంక్షన్ మార్గంలో 2కే, 5కే, 10కే మూడు కేటగిరీలలో రన్నర్లు పరుగు పందెం పూర్తి చేసి తమ ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ.. ఇలాంటి రన్నింగ్ ఈవెంట్లు యువతలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందిస్తాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి, సీఐ సత్యనారాయణ, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, పలు స్వచ్ఛంద సంస్థలు, కౌన్సిలర్ బాల భరద్వాజ్, పాముకుంట్ల ప్రసాద్, ఎస్ఐ భరత్, నాయకులు కేవీఎల్ఎన్రెడ్డి, నారోజు రామేశ్వరచారి, మంగ ళంపల్లి రాజు, పిట్టల సురేష్, బుర్రా రమేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఉత్సాహంగా తెలంగాణ రన్నర్స్ ప్రోమో రన్ -
ఆకర్షిస్తోన్న ఆయిల్పామ్
స్థిరమైన ఆదాయం వచ్చే పంట వైపు రైతుల మొగ్గుజనగామ: జిల్లాలో ఆయిల్పామ్ సాగు వేగంగా విస్తరిస్తోంది. నూనెలకు భారీ డిమాండ్ ఉండడం, పంటకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, కంపెనీల ద్వారా బై బ్యాక్ హామీలు రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. దీనివల్ల సాధారణ పంటల కంటే దీర్ఘకాలికంగా లాభాలు వచ్చే ఆయిల్పామ్ సాగు వైపు రైతుల మొగ్గు గణనీయంగా పెరుగుతోంది. జిల్లాలో ఆయిల్పామ్ సాగు మొదటగా 2021–22 సంవత్సరంలో 73 మంది రైతులు 425.36 ఎకరాల్లో ప్రారంభించారు. అయితే సరైన మార్గదర్శకాలు, సబ్సిడీలు, అవగాహన కార్యక్రమాల వల్ల ప్రతీ ఏడాది సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. 2025–26 నాటికి మొత్తం 2.310 మంది రైతులు 8,333.10 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు నమోదైంది. 2026–27 కొత్త ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో ఆయిల్పామ్ సాగు ఎంత విస్తరించాలన్న దానిపై ప్రస్తుతం హర్టికల్చర్ అధికారులు పరిశీలిస్తున్నారు. భూభాగం, నీటి వనరులు, రైతుల ఆసక్తి ఆధారంగా త్వరలోనే జిల్లాకు ప్రత్యేక లక్ష్యాన్ని ప్రభుత్వం ఖరారు చేయనుంది. ఇప్పటికే గ్రామాల్లో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆయిల్ పామ్ సాగు విధానం, నీటి వసతి, సబ్సిడీల వివరాలు రైతులకు తెలియజేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 135 మంది రైతుల క్షేత్రాల్లో సాగుచేసిన 1,368 ఎకరాల్లో ఆయిల్పామ్ తోటలు దిగుబడి ఇవ్వడం ప్రారంభించాయి. సరైన నిర్వహణ ఉంటే ఆయిల్పామ్ తోటలు 15–30 సంవత్సరాల పాటు నిరంతరంగా ఫలాలు ఇస్తాయి. ఒక ఎకరాలో సాధారణంగా 55 నుంచి 60 ఆయిల్పామ్ మొక్కలు నాటుతారు. మొక్కలు పెద్దగా పెరిగే కారణంగా విస్తారమైన ప్రదేశం అవసరం. నీటి వసతిలో డ్రిప్ కీలక పాత్ర పోషిస్తుంది. వారం రోజులకోసారి తగినంత నీరు అందించాల్సి ఉంటుంది. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో పంట మంచి ఫలితాలు ఇస్తుంది. రైతులకు ప్రభుత్వ డ్రిప్ ద్వారా సబ్సిడీ అందిస్తోంది. దిగుబడి 3వ ఏడాదిలో మొదటి ఫలాలు రానుండగా, 5వ సంవత్సరం నుంచే పూర్తి స్థాయి దిగుబడి మొదలవుతుంది. ఆ తర్వాత 15–30 సంవత్సరాలు వరకూ స్థిరమైన దిగుబడి సాధిస్తారు. ప్రతీ మొక్క నుంచి ఏడాదికి 80 నుంచి 120 కిలోల వరకు ఫలాలు వస్తాయి. రైతులు నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చేస్తే దిగుబడి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఆయిల్పామ్ పంటకు మార్కెటింగ్ సమస్య ఉండదు. ఆయిల్పామ్ ప్రాసెసింగ్ కంపెనీలతో ప్రభుత్వం ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకుంటుండడంతో అమ్మకం సమయంలో ఇబ్బందులు ఉండవు. సంవత్సరానికి కనీసం రూ.1.2 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం (ఎకరాకు సగటుగా) వస్తుంది. స్థిరమైన ఆదాయం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, తక్కువ మానవ వనరుల అవసరం. దీర్ఘకాలిక దిగుబడి లాంటి అంశాలు రైతులను ఆయిల్పామ్ సాగువైపు ఆకర్షిస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో జిల్లాలో ఈ పంట విస్తీర్ణం మరింత పెరగనుందని హార్టికల్చర్ శాఖ భావిస్తోంది. సాగుకు కేంద్రబిందువుగా మారుతున్న జిల్లా 2021 నుంచి 2026 వరకు రికార్డు స్థాయిలో పెరుగుదల 135 మంది రైతుల క్షేత్రాల్లో దిగుబడి ప్రారంభం రైతులకు అవగాహన కల్పిస్తున్న హార్టికల్చర్ శాఖ ఏడాది రైతులు ఎకరాల్లో సాగు 2021–22 73 425.36 2022–23 915 3,203.71 2023–24 713 2.160.70 2024–25 384 1,713.33 2025–26 225 770.00 మొత్తం 2,310 8,333.10జిల్లాలో 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్పామ్ సాగు టార్గెట్ ఎంత అనే సమాచారం త్వరలోనే వస్తుంది. జిల్లాలో ప్రస్తుతం 8,333 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు ఉండగా, 135 మంది రైతుల క్షేత్రాల్లో 1,368 ఎకరాల్లో దిగుబడి మొదలైంది. రైతులు దీర్ఘకాలిక భవిష్యత్ను ఆలోచించి ఆయిల్పామ్ సాగు వైపు రావాలి. – డాక్టర్ జె.రవికాంత్, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ -
పీఎస్ హెచ్ఎంలకు సూపర్వైజర్ బాధ్యతలు ఇవ్వాలి
● కలెక్టర్కు ప్రధానోపాధ్యాయుల సంఘం వినతి జనగామ: జనాభా గణన–2026 కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూపర్వైజర్ బాధ్యతలు అప్పగించాలని కోరుతూ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బుర్రా రమేష్, జిల్లా అధ్యక్షుడు చంద్రం ఆదివారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్కు సైతం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనాభా గణన వంటి కీలక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి అనుభవజ్ఞులైన పీఎస్ హెచ్ఎంల సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఎన్యుమరేటర్ల నియామకాన్ని సీనియారిటీ ఆధారంగా చేపడితే పారదర్శకత పెరుగుతుందని, విధుల నిర్వహణలో సమర్థత సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. వినతిపత్రంపై అధికారులు సానుకూలంగా స్పందించినట్లు సంఘ ప్రతినిధులు వెల్లడించారు. -
కాంగ్రెస్ గూండాల దాడి హేయం
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ: సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే అది ప్రభుత్వ ఆస్తి అని, ఇలా చేయడం నేరంగా పరిగణించాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక వారి నుంచి దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మీద ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇక సామాన్యులకు రక్షణ ఎలా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు దాడికి పాల్పడిన దుండగులను గుర్తించి, కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
కో ఆప్షన్.. కసరత్తు
జనగామ: మున్సిపల్ శాఖ రెండో సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా సహ సభ్యుల (కో–ఆప్షన్ మెంబర్స్) ఎంపికపై మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం కమిషనర్, డైరెక్టర్ టీకే శ్రీదేవి సర్క్యులర్ జారీ చేశారు. జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో కో–ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ జరుగనుండగా, ఆశావహులు ఇప్పటినుంచే పదవి కోసం పైరవీలను మొదలుపెట్టారు. ప్రభుత్వ కీలక నిర్ణయాలు.. 2020లో జారీ చేసిన రెండు కీలక జీఓల ప్రకారం ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు, మైనారిటీ వర్గాలకు చెందిన వారిని సహ సభ్యులుగా తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో ఈ సూచనలను తక్షణం అమలు చేయాలని ఆదేశించారు. దరఖాస్తు ప్రక్రియ.. తొలి కౌన్సిల్ మీటింగ్ తేదీ నుంచి 60 రోజుల్లో నోటిఫికేషన్న్ విడుదల చేసి దరఖాస్తులు ఆహ్వానించాలి. పత్రాల పరిశీలనతో సహా మొత్తం ప్రక్రియను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని సర్క్యులర్లో ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ ముగిసిన 15 రోజుల్లో కౌన్సిల్ సమావేశం జరపాలి. కౌన్సిల్లో ఇద్దరు కో–ఆప్షన్ సభ్యులను ఎంపిక చేయగా, ఇందులో ఒక మహిళ ఉండేలా చేసుకోవాలి. కోఆప్షన్ ఎన్నిక కోసం సభ్యులు సగం మంది హాజరైతేనే కోరం ఉన్నట్టుగా పరిగణిస్తారు. నిర్ణీత సమయానికి కోరం లేకపోతే సమావేశం వాయిదా వేస్తారు. రెండు, మూడు సమావేశాల్లో ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉంటాయి. రెండూ వాయిదాలు పడితే, మూడో సమావేశంలో కోరం లేకున్నా కో–ఆప్షన్ సభ్యులను ఎన్నుకునే విధంగా సర్క్యులర్ జారీ చేశారు. దరఖాస్తుల సంఖ్య ఎక్కువ, తక్కువగా ఉన్న సమయంలో ఎక్కువైతే వాయిస్ ఓటుతో అవసరమైన సంఖ్యలో ఎంపిక చేయాలి. సరిపడా దరఖాస్తులు రాకపోతే కొత్త నోటిఫికేషన్ జారీ చేసి, పాత దరఖాస్తులతో పాటు కొత్త వాటిని పరిగణలోకి తీసుకోవాలి. నిబంధనలు ఇలా రాజీనామాలు, అర్హత కోల్పోవడం వంటి సందర్భాల్లో ఎన్నికైన సభ్యులపై వర్తించే నిబంధనలు అదే విధంగా అమలు చేయాలి. ఖాళీ అయిన స్థానాన్ని మూడు నెలల్లోగా భర్తీ చేయాలి. పదవీకాలం ముగిసే మూడు నెలల్లో ఖాళీ అయితే భర్తీ అవసరం లేదు. ఎన్నికై న కో ఆప్షన్ సభ్యుల వివరాలతో కమిషనర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తారు. వీటిని కలెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్కు పంపిస్తారు. అలాగే మున్సిపాలిటీ నోటిస్ బోర్డులో ప్రదర్శిస్తారు. మైనారిటీ కో ఆప్షన్ సభ్యుల ఎంపికకు ప్రత్యేక నియమాలను (2020) జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు వర్తింపు చేసే విధంగా సర్క్యులర్లో పేర్కొన్నారు. కో ఆప్షన్ కోసం మైనారిటీ వర్గాల్లో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు ఉండగా, ఇద్దరు మైనారిటీ సభ్యుల కో–ఆప్షన్ ఎంపికలో ఒక మహిళకు ప్రాధాన్యం ఇవ్వాలి. సర్క్యులర్ వచ్చిన తర్వాత 60 రోజుల్లో నోటిఫికేషన్, 7 రోజుల్లో దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఈ విషయమై జనగామ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 6వ తేదీన ఇందుకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేస్తామని తెలిపారు.ఎంపికకు అవసరమైన అర్హతలు అభ్యర్థి కనీసం 21 సంవత్సరాల పైబడినవారు అయి ఉండాలి. అదే మున్సిపాలిటీలో ఓటర్గా నమోదై ఉండాలి. కనీసం 5 సంవత్సరాలు చైర్పర్సన్, మేయర్, వార్డు మెంబర్గా పనిచేసి ఉండాలి. లేదా 3 సంవత్సరాలు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేసిన న్యాయవాది అయి ఉండాలి. లేదా ప్రభుత్వ, స్థానిక సంస్థల్లో గెజిటెడ్ ఉద్యోగిగా రిటైర్డ్ అయి మున్సిపల్ పరిపాలనలో అనుభవం ఉండాలి. ఇందులో ఒక మహిళను తప్పనిసరిగా సహ సభ్యురాలిగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. సర్క్యులర్ జారీ చేసిన మున్సిపల్ శాఖ అర్హత, అనుభవంపై స్పష్టమైన మార్గదర్శకాలు 60 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని సూచన -
బడి బాగుంది.. బోధన ఇంకా బాగుండాలి!
లింగాలఘణపురం: ‘పాఠశాల పరిసరాలు బాగున్నాయి..ఆవరణ అంతా శుభ్రంగా ఉంది..విద్యార్థులకు బోధన కూడా బాగా చేయాలి’ అని ఉపాధ్యాయులకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. మండలంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం వంటశాలను సందర్శించి వంట సామగ్రి, గుడ్లు, కూరగాయలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన సూచనలు చేశారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ముఖ్యంగా గణితంపై తగిన ప్రశ్నలు బోర్డుపై రాసి సమాధానాలు అడిగారు. కంప్యూటర్ గదిని, స్టాఫ్ రూమ్ను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో హైమాస్ట్ లైట్లు రావడంలేదని తెలియడంతో మరమ్మతులు చేయించాలని చెప్పారు. గణితంపై విద్యార్థులకు తగిన విధంగా బోధన చేయాలని స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణకు సూచించారు. కస్తూర్బా విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ -
‘సర్’ను పారదర్శకంగా నిర్వహించాలి
జనగామ: తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎలక్ట్రోరల్ అధికారి సి.సుదర్శన్రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్, ఎన్నికల అధికారి సందీప్ కుమార్ ఝా ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి హాజరయ్యారు. రాష్ట్ర ఎలక్ట్రోరల్ అధికారి మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్పై అవగాహన కలిగి ఉండాలని, బీఎల్ఓలకు ఏ సందేహం ఉన్నా నివృత్తి చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని సూ చించారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలు, మ్యాపింగ్, ఫామ్ 6, 7, 8 దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమీక్షలో స్టేషన్ఘన్పూర్ ఆర్డీఓ వెంకన్న, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. వీసీలో రాష్ట్ర ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్రెడ్డి -
కొనుగోళ్లకు సన్నద్ధం
2.97లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంజనగామ రూరల్: యాసంగి సీజన్ 2025–26 ధాన్యం కొనుగోళ్లకు జిల్లా వ్యవసాయ, ఇతర శాఖల అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 2.05 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుకాగా సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇందులో సుమారుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సుమారు 3 లక్షల టన్నుల వరకు ధాన్యం సేకరణ చేపట్టాలని సంబంధిత అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే వరి కోతలు ప్రారంభం కావడంతో ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలెక్టరేట్లో అధికారులతో రెండు సార్లు సమీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ రెండో వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయి. యాసంగిలో వరి పండించిన ఏరియా దిగుబడి అంచనా మేరకు మొత్తం 319 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇందులో 105 కేంద్రాల ద్వారా సన్నరకం సేకరించాలని నిర్ణయించారు. వానాకాలం మాదిరిగానే సన్నరకం వడ్లకు ప్రభుత్వం మద్దతు ధరకు అదనంగా క్వింటాల్ రూ.500లు బోనస్ అందజేయనుంది. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్కు రూ.2,369, సాధారణ రకం రూ.2,389 రైతులకు మద్దతు ధర లభించనుంది. ఇప్పుడిప్పుడే వరి కోతలు ప్రారంభించగా అడపాదడపా ఆకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ధాన్యం కొనుగోలులో రవాణా ప్రక్రియ సజావుగా నిర్వహించాల్సి ఉంది. గోదాముల కేటాయింపు, వాహనాల కొరత లేకుండా చూడాల్సింది. అలాగే జిల్లాకు 50 లక్షల గన్నీలు అవసరం ఉండగా 30 లక్షలకు పైగా అందుబాటులో ఉండగా మరిన్ని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ధాన్యం ఎక్కువగా వస్తుందన్న అంచనాతో మిల్లర్ల గోదాములతో పాటు వర్షాలకు పంట దెబ్బతినకుండా అదనపు గోదాములు నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాంతాలను అన్వేషిస్తున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. గతంలో ఏప్రిల్ చివరి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ధాన్యం కేంద్రాలకు వెల్లువలా వచ్చేది. దీంతో రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు సరిపడా స్థలాలు లభ్యం కాకపోవడంతో రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఎక్కడి ధాన్యం అక్కడే పేరుకుపోవడంతో ధాన్యం కొనుగోలు అస్తవ్యస్తంగా మారేది. గతేడాది కంటే అధికారులు ఈ సంవత్సరం 15 రోజుల ముందుగానే కార్యాచరణ, సన్నాహాలు చేస్తుండటంతో ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. గత యాసంగిలో కొనుగోలు కేంద్రాల నిర్వహణలో తలెత్తిన అనుభవాల నేపథ్యంలో ఈ ఏడాది జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. సెర్ప్, మార్కెట్, పీఏసీఎస్, డీసీఎంఎస్ల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత యాసంగిలో వర్షాల నేపథ్యంలో బ్యాగుకు 1.2కేజీల తరుగు తీయగా కొనుగోలు చేశాక రైస్మిల్లర్లు ఐదు నుంచి ఏడు కేజీల తరుగు తీస్తేనే తీసుకుంటామని మెలిక పెట్టారు.దీంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. 319 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సిద్ధం సన్నరకం కొనుగోలు కేంద్రాలు 105 సజావుగా కొనుగోళ్లు నిర్వహించాలని కలెక్టర్ అదేశంకొనుగోలు కేంద్రాలు మొత్తం: 319 దొడ్డు ధాన్యం: 214 సన్నరకం: 105 కొనుగోళ్ల లక్ష్యం: 2.97 లక్షల మెట్రిక్ టన్నులుగత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్లో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తాలు, తరుగు, తేమ, మట్టి పెల్లల శాతం ఎంత ఉండాలనే విషయంలో ముందుగానే శిక్షణ తరగతులు నిర్వహించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతులు ముందుగా తాలు మొత్తం తూర్పార పట్టి తేమ అవసరమైన మోతాదుకు వచ్చే వరకు ఆరబెట్టుకుని తీసుకురావాలి. – హాతీరామ్, డీఎం, సివిల్ సప్లై -
సబ్సిడీ సిలిండర్ల స్వాధీనం
కొడకండ్ల: మండలకేంద్రంలో అక్రమంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల వాడకంపై శనివారం ఎన్ఫోర్స్మెంట్ డీటీ లక్ష్మణ్నాయక్, ఎస్సై చింత రాజు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మండలకేంద్రంలోని హోటళ్లు, చికెన్ సెంటర్లు, బేకరీల్లో వారు తనిఖీలు నిర్వహించి వ్యాపార అవసరాల కోసం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను వాడకుండా సబ్సిడీ సిలిండర్లను వాడుతున్నట్లు గుర్తించి 20 సిలిండర్లను స్వాధీనం చేసుకొని 15 మంది వ్యాపార యాజమానులపై ఈసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీటీ, ఎస్సైలు మాట్లాడుతూ.. సబ్సిడీ సిలిండర్లను దుర్వి నియోగం చేసే వారితో పాటు బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై నిరంతరం నిఘా పెడుతూ చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్సై కత్తి రమేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 7న విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల మహా ధర్నాహన్మకొండ: సమస్యల పరిష్కారానికి ఈనెల 7న హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట జరిగే ధర్నాను ఆర్టిజన్ ఉద్యోగులు, ఆన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, పీస్ రేట్ వర్కర్లు విజయవంతం చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ట్రాన్స్ కో రాష్ట్ర కన్వీనర్ కందికొండ వెంకటేశ్ పిలుపునిచ్చారు. ఈలోగా ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు జేఏసీతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని లేకపోతే ఈ నెల 8వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఆయన శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చట్టవిరుద్ధ చర్యలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. దీని కోసం కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టంగా చట్టాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గర్భంలోని శిశువు లింగాన్ని తెలుసుకోవడం, తెలియజేయడం ద్వారా ఆడ శిశువుల సంఖ్య తగ్గుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధి అన్ని అల్టాసౌండ్ స్కానింగ్ సెంటర్లు చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్తోనే పనిచేయాలని, నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ జరిగినట్లు గమనిస్తే పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100, ఎస్.బీ 87126 85257 కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో టెండర్లకు ఆహ్వానంకాశిబుగ్గ: వరంగల్లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో ఇన్పేషెంట్లు, డ్యూటీ డాక్టర్ల ఆహారం సరఫరా కోసం ఇ–టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కాంతిప్రకాశ్ ఒక ప్రకటనలో తెలిపారు. టెండర్ దరఖాస్తులను ఈ నెల 15 సాయంత్రం 4 గంటల వరకు సమర్పించవచ్చ ని సూచించారు. అదేవిధంగా ఈఎస్ఐ ఆస్పత్రి వరంగల్ నుంచి వివిధ డిస్పెన్సరీలకు మందులు, వైద్య వినియోగ వస్తువుల రవాణా కోసం అద్దె వాహనానికి ఇ.టెండర్ ప్రకటిస్తున్నట్లు, ఈ నెల 15 సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. -
పకడ్బందీగా ఏర్పాట్లు
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో యాసంగి సీజన్లో పకడ్బందీగా కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తామని ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అన్నారు. శనివారం చైర్మన్ ఆధ్వర్యంలో మార్కెట్ కార్యాలయంలో రైస్ మిల్లర్స్, ఎగుమతిదారులు, అడ్తి వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజన్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సమావేశంలో రైతు సంఘం నేతలు చందూ నాయక్, సొప్పరి సోమయ్య, రైస్ మిల్లర్స్ పజ్జూరి జయహరి, ముత్తయ్య యాదవ్, మాశెట్టి అశోక్, అడ్తి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు మాశెట్టి వెంకన్న, వ్యాపారులు కృష్ణారెడ్డి, నరసింహులు, రవి, శ్రీనివాస్, ఉపేందర్, ఏఎంసీ సూపర్వైజర్ శ్రీనివాస్ ఉన్నారు. -
ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దు
పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం గుట్ట భూమి సర్వే నెంబర్లో 542, 543లో అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆల య ఈఓ భాగం లక్ష్మీప్రసన్న హెచ్చరించారు. శని వారం శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయ భూమిలో అక్రమ ఇంటి నిర్మాణాలను దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది అడ్డుకొని కూల్చివేశారు. ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకట య్య, సిబ్బంది ముంజ రాములు, అమేడ రమేశ్, ఓం ప్రకాష్, నవీన్, అశోక్, నిరంజన్, సత్యనారా యణ,దేశబోయిన అంజనేయులు పాల్గొన్నారు. ధర్మపురంలో.. దేవరుప్పుల: వల్మిడి పరిధి ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని సోమేశ్వర ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న హెచ్చరించారు. శనివారం మండలంలోని ధర్మపురంలో వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భూమి సర్వే నంబర్ 449లో రాజన్న గుడిబండపై సంగీ రవి, రేణుక దంపతులు నిర్మిస్తున్న అక్రమ ఇంటి నిర్మాణ పనులను ఆలయ ధర్మకర్తలు, సిబ్బంది అడ్డుకున్నారు. రాజకీయ కక్షతో అడ్డుకుంటున్నారని వారు వాగ్వాదానికి దిగడంతో నిర్మాణ పనుల విషయమై నివేదిక ఇస్తామని సిబ్బంది తెలిపారు. కాగా ఈ విషయమై ఈఓ లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ.. ధర్మపురంలో సర్వే నెంబర్లు 395,396,397,398, 446,447,448,449 భూముల్లో వల్మిడి ఆలయ పరిధి సంబంధించి 34 ఎకరాల 34 గుంటల భూమి ఉందన్నారు. ఈ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే దేవాదాయ చట్టం 30/1987 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకట య్య, ఆలయ ధర్మకర్తలు పాలెపు సత్తయ్య, ముంజ రాములు, రమేశ్, ఓం ప్రకాష్ పాల్గొన్నారు. సోమేశ్వర ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న పాలకుర్తి, ధర్మపురంలో అక్రమ నిర్మాణాల అడ్డగింత -
సాయుధపోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య గొప్ప పోరాటయోధుడని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూమి, భుక్తి, విముక్తి కోసం అనే నినాధంతో పోరాటం చేసి ప్రజల్లో స్ఫూర్తి నింపారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు లక్ష్మీనర్సింహరావు, రవీందర్, డి.మల్లికాంబ, జె.మల్లేష్, కె.రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తిపన్నుపై 5శాతం రాయితీ
జనగామ: మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూళ్లను పెంపొందించేందుకు పురపాలక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రస్తుత ఆస్తిపన్నుపై 5 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పురపాలక కమిషనర్లకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ టీకే శ్రీదేవి సర్క్యులర్ జారీ చేశారు. 1 నుంచి అందుబాటులోకి.. 2026 ఏప్రిల్ 1 నుంచి ఇదే నెల 30 వరకు ఆస్తి పన్ను చెల్లించే యజమానులకు 5శాతం రాయితీ వర్తిస్తుంది. సమయానికి పన్ను చెల్లింపులను ప్రోత్సహించడం, ఆదాయ వసూళ్లను పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ రాయితీని అమల్లోకి తీసుకొచ్చింది. దీనిపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. రాయితీ ప్రయోజనాలు ప్రజలకు చేరేలా ప్రతి మున్సిపాలిటీలోనూ పన్ను మేళాలను నిర్వహించాలని పేర్కొన్నారు. పన్ను చెల్లింపులను మెరుగుపరచేందుకు కమిషనర్లు నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. జనగామలో 15,847 అసెస్మెంట్లు జనగామ మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం మిక్స్డ్, నాన్–రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ కలిపి మొత్తం 15,847 అసెస్మెంట్లు ఉన్నాయి. రాబోయే 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.3.80 కోట్ల మేర డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ ఆస్తిపన్ను చెల్లించేందుకు ఉత్సాహంగా ఉన్న యజమానులకు ప్రభుత్వం ప్రకటించిన 5శాతం రాయితీ శుభవార్తగా మారింది. పన్ను వసూళ్లలో పెరుగుదల సాధించడంతో పాటు రెవెన్యూ పరంగా మరింత బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య అభివృద్ధికి ముందడుగుగా భావిస్తున్నారు. ప్రతీ సంవత్సరం వసూళ్లు 100శాతం లక్ష్యానికి చేరుకోవడంలో ఇలాంటి స్కీంలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ప్రభుత్వ ఉద్దేశ్యం. స్టేషన్లో రూ.1.13కోట్ల డిమాండ్ జిల్లాలోని స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 6,452 అసెస్మెంట్లు ఉండగా, 2026–27 డిమాండ్ రూ.1.13కోట్ల మేర ఉంది. ప్రభుత్వం ప్రకటించిన 5శాతం రాయితీని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా పురపాలిక అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో అవకాశం ముందస్తు చెల్లింపుదారులకు ప్రయోజనం జనగామ మున్సిపాలిటీ డిమాండ్ రూ.3.80కోట్లు 15,847 అసెస్మెంట్లు.. స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో రూ.1.13కోట్ల డిమాండ్ -
ఉచితం..అపూర్వం
జనగామ ఆర్టీసీ డిపో సమాచారం:బస్సులు: 125రోజువారీ రూట్లు: 53రోజువారీ ప్రయాణికులు: 58వేలు రోజువారీ కిలో మీటర్లు: 47వేలు 29 నెలల కాలంలో మహిళా ప్రయాణికుల సంఖ్య: 3.24కోట్లు జీరో టికెట్ కలెక్షన్లు: రూ.160కోట్లు అత్యధిక ఆదాయం వచ్చే రూట్లు: 4జనగామ: రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం జిల్లాలో విశేష ఫలితాలను ఇస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 9వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం మహిళల రవాణా సమస్యలను గణనీయంగా తగ్గించడమే కాకుండా, వారి ఉద్యోగ, విద్య, ఆరోగ్య, రోజువారీ అవసరాలకు మరింత సౌలభ్యం కల్పించింది. ముఖ్యంగా జనగామ ఆర్టీసీ డిపో పరిధిలో ఈ పథకం ప్రభావం అత్యధికంగా కనిపిస్తోంది. రూ.3.24 కోట్ల మహిళా ప్రయాణికులు ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించిన 29 నెలల్లో 3.24 కోట్ల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా రు. ఈ ప్రయాణాల ద్వారా ప్రభుత్వం నుంచి ఆ ర్టీసీకి రూ.160 కోట్ల మేర ఆదాయం సమకూరింది. మహిళల ప్రయాణ భద్రత, సౌలభ్యం పెరగడంతో ప్రయాణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. డిపోలో 125 బస్సులు ఉండగా, 13 డీలక్స్, 32 ఎక్స్ప్రెస్, 80 పల్లె వెలుగు బస్సులు ఉన్నా యి. రోజు వారీగా 53 రూట్లలో 47వేల కిలో మీటర్లు ప్రయాణం చేస్తున్నాయి. ఇందులో డిపో మొత్తం కార్యకలాపాల్లో మహిళల ఉచిత ప్రయాణ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి రోజూ ప్రయాణికుల్లో 65శాతం మహిళలు(సుమారు 38వేల మంది), 35 శాతం పురుషులు ఉన్నారు. అత్యధికంగా కలెక్షన్లు వచ్చే రూట్లు జనగామ డిపో పరిధిలో అత్యధికంగా నాలుగు రూట్లలో మహిళా ప్రయాణికులు ప్రయాణం సాగిస్తున్నారు. ఉప్పల్–హనుమకొండ, జగద్గిరిగుట్ట, సిద్దిపేట–సూర్యాపేట రూట్లలో బస్సు సర్వీసులు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. ఈ మార్గాల్లో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా ఉండటంతో ఆదాయం కూడా పెరుగుతోంది. 10 వేలకు పైగా.. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేసిన తర్వాత రోజువారీగా 10 వేలకుపైగా మహిళలు అదనంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. ఉచిత ప్రయాణంతో మహిళలు ఉద్యోగాలకు, విద్యాసంస్థలకు, ఆసుపత్రులకు, మార్కెట్లకు వెళ్లడంలో భయపడకుండా ఆర్టీసీ సేవలను ఉపయోగించుకుంటున్నారు. జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలకు ప్రయాణ రక్షణ ఇవ్వడమే కాకుండా, వారి ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తోంది. దీంతో మహిళల సామాజిక, ఆర్థిక స్థితిలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. మహిళా ఉద్యోగులకు వరం జిల్లాలో పనిచేస్తున్న పలువురు మహిళా ఉద్యోగులు నిత్యం అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. హన్మకొండ, ఉప్పల్, కూకట్పల్లి, హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఉచిత సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణానికి విశేష స్పందన 29 నెలల్లో రూ.3.24 కోట్ల మహిళా ప్రయాణికులు రూ.160 కోట్లకు పైగా ఆదాయం రోజువారీగా 10 వేల అదనపు మహిళా ప్రయాణికులు సేవల విస్తరణపై అధికారుల దృష్టి -
బండికి.. దండిగా!
జనగామఓరుగల్లు రైల్వేకు నిధుల వరద 7మాజీ మావోలు బూర్జువా పార్టీలతో కలవొద్దు మాజీ మావోయిస్టులు బూర్జువా పార్టీలతో కలవొద్దని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ అన్నారు.ఆన్లైన్ మూల్యాంకనం కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ పరీక్షల జవాబుపత్రాలను ఇక నుంచి ఆన్లైన్లోనే వాల్యుయేషన్ చేయనున్నారు. శనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026 సాక్షిప్రతినిధి, వరంగల్: దక్షిణ మధ్య రైల్వే పరిధి ఉమ్మడి వరంగల్ జిల్లాకు భారీగా నిధులు కేటాయించారు. 2026–27 రైల్వే బడ్జెట్ (పింక్ బుక్)లో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ ప్రాంతాలకు భారీగా నిధులు, ప్రాజెక్టులు కేటాయించారు. ముఖ్యంగా రైల్వే మౌలిక సదుపాయాల కల్పన, క్వాడ్రప్లింగ్ (నాలుగు లైన్లు), సర్వేలు, నిర్మాణంలో ఉన్న మూడో లైన్ పూర్తి, స్టేషన్ల ఆధునికీకరణకు ఈ బడ్జెట్ పెద్దపీట వేసింది. దక్షిణ మధ్య రైల్వేశాఖ కేటాయింపులతో కూడిన పింక్బుక్ శుక్రవారం విడుదల కాగా, అధిక నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తమవుతోంది. కొత్త లైన్లు, డబ్లింగ్ పనులు.. భారీగా నిధులు ఉమ్మడి వరంగల్ మీదుగా వెళ్లే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నిధుల కేటాయింపు జరిగింది. కొత్త లైన్లు, డబ్లింగ్, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. ● కాజీపేట–విజయవాడ మధ్య 219.64 కి.మీ.పొడవైన మూడో లైన్, విద్యుద్దీకరణ పనుల కోసం రూ.1,955.27 కోట్లు మంజూరు చేశారు. ● కాజీపేట–బల్లార్షా వరకు 201.04 కి.మీ. పొడవైన మూడో లైన్ పనులకు రూ.2,063.03 కోట్లు ఇచ్చారు. ● నష్కల్ (పెండ్యాల్) – హసన్పర్తి నడుమ 24.55 కి.మీ. బైపాస్ లైన్ నిర్మాణానికి రూ.465.29 కోట్లు మంజూరయ్యాయి. ● భద్రాచలం రోడ్ – డోర్నకల్ వరకు 54.65 కి.మీ సెక్షన్ పనుల కోసం రూ.770.12 కోట్లు కేటాయించారు. ● కాజీపేట – బల్లార్షా మెయిన్ లైన్ను పెద్దపల్లి–కరీంనగర్ లైన్తో అనుసంధానించే 2.169 కి.మీ. బైపాస్ లైన్ కోసం రూ.36.99 కోట్లు కేటాయించారు. ● ఘన్పూర్–సూర్యాపేట (పాలకుర్తి మీదుగా) 170 కి.మీ. కొత్త లైన్ సర్వేకు నిధులిచ్చారు. ● బీజాపూర్–వరంగల్కు 288 కి.మీ.ల కొత్త లైన్ కోసం సర్వేకు కూడా అనుమతి ఇచ్చారు. ● క్వాడ్రప్లింగ్ (నాలుగు లైన్ల) సర్వేలకు కూడా నిధులు ఇచ్చారు. రైల్వేస్టేషన్లకు ‘అమృత్ భారత్’ హంగులు ‘అమత్ భారత్ స్టేషన్ స్కీమ్’ కింద ప్రధాన స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా.. వరంగల్ స్టేషన్ తూర్పు వైపు ఎంట్రీ అభివృద్ధి, బుకింగ్ ఏరియా, కాన్ కోర్స్ మెరుగుదల కోసం రూ.4.50 కోట్లిచ్చారు. వరంగల్ స్టేషన్లో 12 మీటర్ల వెడల్పు గల కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (ఎఫ్ఓబీ) కోసం రూ. 13.24 కోట్లు, కాజీపేట స్టేషన్ ఆధునికీకరణకు రూ.18.73 కోట్లు (జనగామ, యాదాద్రితో కలిపి) కేటాయించారు. కాజీపేటలో 12 మీటర్ల వెడల్పు గల ఎఫ్ఓబీ కోసం రూ.9.78 కోట్లు, ప్లాట్ఫామ్ 4–5 వరకు ఎఫ్ఓబీ విస్తరణ, లిఫ్టులు, ఎస్కలేటర్ల కోసం రూ.13.93 కోట్లు మంజూరు చేసినట్లు పింక్బుక్లో పేర్కొన్నారు. మహబూబాబాద్ – జనగామ స్టేషన్లలో 12 మీటర్ల వెడల్పు గల ఎఫ్ఓబీలు, రాంప్ల నిర్మాణం కోసం రూ.44.34 కోట్లు, జనగామ గూడ్స్ షెడ్ సౌకర్యాల మెరుగుదలకు రూ. 6.24 కోట్లు ఇచ్చారు. అలాగే భద్రత పనుల కింద వరంగల్ – చింతలపల్లి లెవల్ క్రాసింగ్ 63 ఏ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.25.58 కోట్లు, కాజీపేట – వరంగల్ ఎల్సీ 61 వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి కోసం రూ. 24.65 కోట్లు, రఘునాథపల్లి – ఇప్పగూడ ఎల్సీ 44 వద్ద 2–లేన్ రైల్వే ఓవర్ బ్రిడ్జి, సబ్వే కోసం రూ.12.83 కోట్లు, డోర్నకల్ – మణుగూరు మార్గంలో కారేపల్లి – సింగరేణి కొలీరీస్ మధ్య వివిధ లెవల్ క్రాసింగ్ల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టనున్నట్లు పింక్బుక్లో పేర్కొన్నారు. కాజీపేట పీఓహెచ్కు రూ.521 కోట్లు రైల్వే బడ్జెట్ (పింక్ బుక్)లో కాజీపేటను కీలక మెయింటెనెన్స్ హబ్గా మార్చేందుకు పెద్దపీట వేశారు. కాజీపేట పీరియాడికల్ ఓవరాలింగ్ (పీఓహెచ్) వర్క్ షాప్ కోసం రూ. 521.36 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కాజీపేటలో 24–కోచ్ల నిడివి గల క్యాంటెక్ డిజైన్ పిట్ లైన్ల కోసం రూ.17.81 కోట్లు ఇచ్చారు. కాజీపేట డీజిల్ లోకో షెడ్ సామర్థ్యం పెంపు (ఎలక్ట్రిక్ లోకోలను ఉంచేందుకు) కోసం రూ.30.95 కోట్లు, ఎలక్ట్రిక్ లోకో షెడ్ సామర్థ్యం పెంపు (125 నుంచి 175 లోకోలకు) రూ. 21.68 కోట్లు, ఎలక్ట్రిక్ లోకో షెడ్ విస్తరణ (175 నుంచి 300 లోకోలకు)కు రూ. 22.56 కోట్లు చొప్పున కేటాయించారు. లైన్ కి.మీ నిధులు భూపాలపల్లి–కాజీపేట (హసన్పర్తి) 64 1.60 హసన్పర్తి–కరీంనగర్ 62 1.55 డోర్నకల్–గద్వాల (సూర్యాపేట, నల్లగొండ మీదుగా) 296 7.40 కాజీపేట–సికింద్రాబాద్ 120 2.40 కాజీపేట–విజయవాడ 220 4.40 కాజీపేట–బల్లార్షా 234 4.68 వరంగల్–సికింద్రాబాద్ 38 0.75 కాజీపేట–విజయవాడ మూడో లైన్కు రూ.1,955 కోట్లు కాజీపేట–బల్లార్షాకు రూ.2,063 కోట్లు నష్కల్–హసన్పర్తికి రూ.465.29 కోట్లు క్వాడ్రప్లింగ్, కొత్త రైల్వే సర్వేల కోసం కేటాయింపులు కాజీపేట జంక్షన్ నుంచే పలు మార్గాలు పీఓహెచ్కు రూ.521.36 కోట్లు.. ‘అమృత్ భారత్’ కింద స్టేషన్లకు కొత్త హంగులు 2026–27 రైల్వే బడ్జెట్ (పింక్బుక్)లో భారీగా నిధులు -
‘మత్తు’ దిగాల్సిందే!
జనగామ: జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణ, అక్రమ రవాణా నివారణ కోసం జిల్లా ఎన్సీఓఆర్డీ కమిటీ సమావేశం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన ఇటీవల జరిగింది. ఈ మేరకు కలెక్టర్ పలు కీలక సూచనలు ఇచ్చారు. శాఖల వారీగా నిఘా నార్కోటిక్ డ్రగ్స్, అంఫెటమిన్స్, ఇతర సింథటిక్ పదార్థాలపై నిఘా ఉంచేందుకు ఎకై ్సజ్ శాఖకు బాధ్యతలు అప్పగించారు. రోజుకు కనీసం 5 కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పబ్లిక్ ప్రదేశాల్లో సర్వైలెన్స్ పర్యవేక్షణను పెంచడంతో పాటు యూరిన్ డ్రగ్ టెస్టింగ్ కిట్ల అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సందేహాస్పద ప్రదేశాల్లో తరచూ పరీక్షలు చేస్తూనే, టాడీ నాణ్యతను నిర్ధారించేందుకు సమయానుకూల తనిఖీలు ఉండాలని ఆదేశించారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులు పొడి (స్నఫ్), పట్టు, గుట్కా వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పనిచేయాలని వైద్యారోగ్య శాఖకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రుల్లో ప్రత్యేక తనిఖీలు ఉండాలని సూచనలు చేశారు. విద్యార్థుల్లో డ్రగ్ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు, చిత్ర లేఖనం, ప్రచార కార్యక్రమాల ద్వారా విద్యాసంస్థల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో చైతన్యం కలిగించాల్సి ఉంటుంది. జిల్లాలో హేమ్ వంటి నిషేధిత పంటల అక్రమ సాగును గుర్తించి చర్యలు తీసుకునే విధంగా ఇతర శాఖలతో వ్యవసాయ శాఖ సమన్వయం చేసుకోవాలి. కార్మికులు ఎక్కువగా ఉండే రైస్ మిల్లులు, తదితర ప్రాంతాల్లో డ్రగ్ వాడకంపై నిఘా ఉంచాలి. ఇందుకు సంబంధించిన ప్రతి నివేదికను ఆలస్యం చేయకుండా కలెక్టర్కు పంపించాలి. మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లో తనిఖీలు రైల్వేస్టేషన్తో పాటు పలు పాన్షాపులు, ఇతర దుకాణాల్లో సహాయ కార్మిక అధికారి కుమారస్వామి, టీం సభ్యులతో కలిసి గురువారం తనిఖీలు నిర్వహించారు. ఎన్సీఓఆర్డీ, డ్రగ్ ట్రాఫికింగ్ విషయంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయా శాఖల అధికారులతో కలిసి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు రైల్వే స్టేషన్తో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశామన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణపై కలెక్టర్ దృష్టి ప్రత్యేక టీంల ఏర్పాటు.. నిఘా పెంచేందుకు ఎకై ్సజ్ శాఖకు బాధ్యతలు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచన కేసుల నమోదు, కఠిన చర్యలకు ఆదేశం -
లాభసాటి వ్యవసాయం వైపు అడుగులు వేయాలి
● డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అనిత జనగామ రూరల్: లాభసాటి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ జి.అనిత అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం చిటుకోడూర్ గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ గిరి రాజు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్ కూకట్ల యాదగిరి అధ్యక్షతన రైతులను అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అగ్రికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ అనిత మాట్లాడుతూ..గ్రామాల్లో నేల స్వభావాన్ని బట్టి పంటల మార్పిడి చేయాలన్నారు. ఉద్యానవన పంటలతో తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి కిరణ్, రైతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మహనీయుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, సంఘ సంస్కరణల కోసం కృషి చేసిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం కలెక్టరేట్లో బాబు జగ్జీవన్రామ్ జయంతి, అంబేడ్కర్ జయంతి వేడుకల ఏర్పాట్లపై డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలిసి వివిధ కుల సంఘాల ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, అలాగే 14వ తేదీన బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా బాధ్యతా యుతంగా పని చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్సీ సంక్షేమ అధికారి విక్రమ్, ఆర్డీఓ గోపీరాం, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, కుల సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు
● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డిదేవరుప్పుల: జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు దశలవారీగా చర్యలు చేపడుతున్నట్టు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని ధర్మాపురం 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్న్లో ఆదనంగా 5.0 పవర్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం పెంపుదలకు మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యుత్ సంబంధిత సమస్యల కోసం సమీపంలోని విద్యుత్ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని లేదా టోల్–ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేయాలని సూచించారు. డీఈలు ఎం.లక్ష్మీనారాయణరెడ్డి, వి. విజ య్కుమార్, ఏడీఈలు అనిల్కుమార్, శ్రీధర్, ఏఈ లు నర్సింహ్మరెడ్డి, కుమారస్వామి పాల్గొన్నారు. -
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా
● మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ జనగామ: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ అన్నారు. గురువారం ప్రజాపాలనలో భాగంగా 22వ వార్డులో నిర్వహించిన సభలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.. సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేరుస్తున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు వారికి ఇంకా ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకొని అర్జీలు స్వీకరించేందుకు వార్డు స్థాయి సభలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, పలు శాఖల అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. మెడికల్ షాపు అనుమతుల తాత్కాలిక రద్దు జనగామ: పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్లో ఉన్న మెడ్ప్లస్ ఫార్మసీ నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నట్లు జిల్లా డ్రగ్ అధికారి బాలకృష్ణ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల మెడ్ప్లస్ పార్మసీని తనిఖీ చేసినట్లు చెప్పారు. తమ పరిశీలనలో ఔషధాలు, సౌందర్య సాధనాల చట్టం–1940 ప్రకారం ఉన్న నిబంధన 65ను ఫార్మసీ పలుమార్లు ఉల్లంఘించినట్లు స్పష్టం చేశారు. కొనుగోలు బిల్లుల నిర్వహణ, రికార్డుల నిర్వహణలో లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీ నివేదికను ఔషధ నియంత్రణ విభాగం సహాయ సంచాలకులు, వరంగల్ వారికి పంపించగా, అక్కడ పరిశీలించి మెడ్ప్లస్ ఫార్మసీ ఔషధ విక్రయ అనుమతులను తాత్కాలికంగా సస్పెండ్ చేసే నిర్ణయం తీసుకున్నారన్నారు. గంగాపూర్లో మద్యపాన నిషేధంబచ్చన్నపేట : మండలంలోని గంగాపూర్ గ్రామంలో ఈనెల 10 నుంచి మద్యపాన నిషేధం అమలు చేస్తున్నట్లు సర్పంచ్ జిల్లెల్ల భాస్కర్ రెడ్డి ప్రకటించారు. గురువారం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో మెజార్టీ ప్రజల ఆమోదం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో మద్యం విక్రయించిన వారికి పంచాయతీ ఆధ్వర్యంలో రూ.50 వేల జరిమానా, మ ద్యం విక్రయిస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తే రూ.5వేల నజరాన అందిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ జిలుకర కుమారస్వామి, వార్డు సభ్యులు అనసూయ, రాధిక,, రవళిక, మమత, కవిత, భారతమ్మ, తిరుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమేష్ రెడ్డి పాల్గొన్నారు. మొక్కజొన్న కోసే యంత్రంలో పడి రైతుకు తీవ్రగాయాలు పాలకుర్తి టౌన్: మొక్కజొన్న కోసే యంత్రంలో పడి గురువారం ఓ రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని తీగారం గ్రామానికి చెందిన రైతు చెన్నూరి చంద్రమౌళికి మొక్కజొన్న కోస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం హన్మకొండలోని ఆసుపత్రికి తరలించారు. -
జిల్లాస్థాయి ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఎంపికలు
జనగామ రూరల్: జిల్లా స్థాయి ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఎంపికలు పట్టణంలోని మినీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలబాలికలు, మెన్, ఉమెన్లలో అథ్లెటిక్స్ ఎంపికలు జరుగుతాయని, ఇందులో ఎంపికై న క్రీడాకారులు 11,12తేదీల్లో హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మెమోతో మినీ స్టేడియంలో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు గంగిశెట్టి మనోజ్ కుమార్ 9885046437, ఆవుల అశోక్ 9912453220, వంచ చంద్రశేఖర్ రెడ్డి 7799552233, తూడి రంజిత్ 99852 23047 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. జాతీయస్థాయి సబ్ జూనియర్ క్రీడాపోటీలకు విద్యార్థినుల ఎంపిక పాలకుర్తి టౌన్: మహారాష్టలోని పుణేలో ఈనెల 3 నుంచి 6 వరకు జరగనున్న 35వ జాతీయస్థాయి సబ్ జూనియర్ క్రీడాపోటీలకు తెలంగాణ కబడ్డీ జట్టులో పాలకుర్తి మండలం తొర్రూరు(జె) ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని పసులాది నవ్య, చెన్నూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని అంజలి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ చిట్ల ఉపేందర్రెడ్డి, మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకుడు గంట రవీందర్, ఎంఈఓ పోతుగంటి నర్సయ్య, మాచర్ల భిక్షపతి, కొయ్యాడ మల్లేష్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు గార్ల మల్లికార్జున్, ఉపాధ్యక్షులు కుటింకటి శ్రీనివాస్, కొడిశాల అశోక్, గ్రామస్థులు, ఉపాధ్యాయులు విద్యార్థినులను అభినందించారు. డిగ్రీ రీవాల్యూయేషన్ ఫలితాల విడుదల కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, ఒకేషనల్, బీకామ్ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల రీవాల్యూయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు గురువారం కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. డిగ్రీ కోర్సుల మొదటి సెమిస్టర్ రీవాల్యూయేషన్కు 4,899మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 658మంది (13.43శాతం) విద్యార్థులు బెనిఫిట్స్ పొందినట్లు సమాచారం. మూడో సెమిస్టర్లో 4,616 మంది రీవాల్యూయేషన్కు దరఖాస్తు చేసుకోగా.. 606 మంది (13.13శాతం) బెనిఫిట్స్ పొందారు. ఐదో సెమిస్టర్కు 3,918 రీవాల్యూయేషన్కు దరఖాస్తులు రాగా. 704 మంది (17.97శాతం)బెనిఫిట్స్ పొందినట్లు రాజేందర్ తెలిపారు. రీవాల్యూయేషన్ ఫలితాలు కాకతీయ యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు ఆయన స్పష్టం చేశారు. -
పుట్టెడు దుఃఖంతో పది పరీక్షకు హాజరు
స్టేషన్ఘన్పూర్: కన్నతండ్రి మృతిచెందిన బాధను దిగమింగుకొని ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన దేవరాయ సాంబయ్య (47), సంధ్య దంపతులకు కుమారుడు చరణ్, కుమార్తె పావని ఉన్నారు. చరణ్ స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, పావని తొమ్మిదో తరగతి చదువుతున్నారు. చరణ్ పదో తరగతి వార్షిక పరీక్షలను మండలంలోని నమిలిగొండ శివారు మాడల్స్కూల్ సెంటర్లో రాస్తున్నాడు. అయితే అనారోగ్యంతో బాధపడుతూ చరణ్ తండ్రి సాంబయ్య బుధవారం మృతిచెందాడు. చరణ్ దుఃఖాన్ని దిగమింగుకుని గురువారం జరిగిన భౌతికశాస్త్రం పరీక్షకు హాజరయ్యాడు. అనంతరం స్వగ్రామం తాటికొండకు వెళ్లి తండ్రి అంత్యక్రియలు చేశాడు. ఇంటి వద్ద తండ్రి మృతదేహం ఉన్నా బాధను దిగమింగుకుని పరీక్ష రాసిన చరణ్ను పలువురు ఓదార్చారు. ప్రియుడి మృతి తట్టుకోలేక యువతి ఆత్మహత్య నర్మెట: ప్రేమించిన యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపానికి గురైన యువతి సైతం బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాలకు చెందిన తరిగొప్పుల హారిక (22) అదే గ్రామానికి చెందిన అనుముల రాకేష్ రెడ్డి ప్రేమించుకుని ఏడాదికాలంగా హైదరాబాద్లో నివాసముంటూ మూడు నెలల క్రితం గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో విషయం తల్లిదండ్రులకు చెప్పడంతోపాటు తాము పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. కొద్దిరోజులు దూరంగా ఉండాలని, అనంతరం పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు సూచించడంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. ఈక్రమంలో గత నెల 28న రాకేష్ రెడ్డి (25) గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ 30న మృతి చెందాడు. దీంతో యువతిని తల్లిదండ్రులు నర్మెటలోని అమ్మమ్మ కొన్నె లక్ష్మి వద్ద వదిలి వెళ్లారు. కాగా, అప్పటికే ప్రియుడు మృతిచెందడంతో మనస్తాపంతో ఉన్న యువతి గురువారం మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి కవిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నగేష్ తెలిపారు. -
సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి
● ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మిజనగామ రూరల్: ప్రపంచంలో వస్తున్న మార్పులను విద్యార్థులు గమనించి సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల కార్యదర్శి కె.సీతాలక్ష్మి అన్నారు. గురువారం పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ బాలికల కళాశాలలో నిర్వహించిన ప్రజ్ఞాన్ సైన్స్ ఫెస్ట్కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.. ఏఐ, క్వాంటమ్ శాటిలైట్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జి.సంధ్యారాణి, డిప్యూటీ సెక్రటరీస్ డీఎస్ వెంకన్న, కె.వేణుగోపాల్, ఓఎస్డీఎస్ సతీష్ గౌడ్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
దూరవిద్య అడ్మిషన్లకు గడువు పెంపు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి లోని దూరవిద్య సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యూకేషన్(సీడీఓఈ)లో డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 10వరకు గడువు పొడిగించినట్లు సీడీఓఈ డైరెక్టర్ ఆచార్య సురేష్లాల్ గురువారం తెలిపారు. డిగ్రీ బీఏ, బీకాం జనరల్, బీకాం కంప్యూటర్స్, బీబీఏ, బీఎల్ఐఎస్సీ, బీఎస్సీ కోర్సులు, పీజీఎంఏ, ఎంకామ్, ఎ మ్మెస్సీ, ఎంఎల్ఐఎస్సీ, ఎంసీఏ, డిప్లోమా కోర్సుల్లో డిప్లోమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, డిప్లోమా ఇన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాస్, డిప్లోమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, డిప్లోమా ఇన్ యోగా, ఎన్విరాన్మెంటల్ అండ్ అక్యుపేషనల్ హెల్త్, రూరల్ డెవలప్మెంట్, హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. ఆన్లైన్, ఆఫ్ లైన్లో అడ్మిషన్లు పొందే అవకాశం ఉందని తెలిపారు. దరఖాస్తులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్డీఎల్సీఈకేయూ.కో.ఇన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. -
పాపన్న త్యాగస్ఫూర్తి యువతకు ఆదర్శం
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: సామాజిక సమానత్వం, న్యాయం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న త్యాగస్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎన్.ఎల్.నరసింహరావు, ఏబీసీడీఓ రవీందర్, డీఎల్పీఓ వెంకట్ రెడ్డి, దిశ కమిటీ సభ్యులు బక్క శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు జాయా మల్లేష్, వైద్యుడు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి నర్మెట (తరిగొప్పుల): ప్రభుత్వ సంక్షేమ పథకాలను అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా తరిగొప్పుల గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. అనంతరం నూతన పథకాలైన ముఖ్యమంత్రి అల్పాహారం, ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, విభిన్న ప్రతిభా వంతులైన ఇంటర్ విద్యార్థులకు మోటారు వాహనాలు, పంట ల వైవిధ్యం, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. తహసీల్దార్ మొహసిన్ ముజ్తాబ, మండల ప్రత్యేక అధికారి రాణా ప్రతాప్, సర్పంచ్ అర్జుల జ్యోతి, కార్యదర్శి భాగ్యలక్ష్మి, కార్యదర్శి భాగ్యలక్ష్మి,అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. -
ఆటలాడుకున్న అరుగే సమాధి!
చెన్నారావుపేట: ఆటలాడుకున్న ఇంటి అరుగే ఆ చిన్నారులకు సమాధిగా మారింది. ఈ హృదయ విదారక సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్యం తండాలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బోడమాణిక్యం తండాకు చెందిన బోడ స్రవంతి, ప్రవీణ్ దంపతులు హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి కుమారులు కార్తీక్, కౌశిక్ ఉన్నారు. రాఘవేంద్ర కాలనీలో స్రవంతితోపాటు ఇద్దరు పిల్లలు మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వగ్రామం బోడమాణిక్యం తండాకు తీసుకొచ్చారు. ముగ్గురి మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు బంధువులు ప్రవీణ్ ఇంటి ఎదుట గుంతలు తీశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారి కళ్లలో కారం చల్లి ఇద్దరు పిల్లల మృతదేహాలను ఈ గుంతలో పూడ్చిపెట్టారు. అనంతరం స్రవంతి మృతదేహాన్ని సమీపంలోని వారి పత్తిచేనులో దహనం చేశారు. ప్రవీణ్ ఇంటి ఎదుట సమాధి చేసిన చిన్నారుల మృతదేహాలు మళ్లీ తీసే ప్రసక్తే లేదని తండావాసులు తెగేసి చెబుతున్నారు. కాగా, మూడు రోజులుగా కొనసాగిన ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఇదిలా ఉండగా.. స్థానిక సర్పంచ్ ఉమామోహన్ గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. బోడమాణిక్యం తండాలో పిల్లల మృతదేహాల పూడ్చివేత -
ఏడాదిలోపు పాంనూర్ బంజరుకాల్వ పూర్తి
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: ఏడాది లోపు మండలంలోని పాంనూర్లో బంజరుమాటు, పర్రె కాల్వ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభల్లో భాగంగా మండలంలోని పాంనూర్లో గురువారం నిర్వహించిన గ్రామసభకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. పాంనూర్ నుంచి నమిలిగొండ వరకు బీటీ రోడ్డు పనులు చేయిస్తానని హామీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పోలెపల్లి సంపత్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సునీల్, ఉపసర్పంచ్ తాళ్లపెల్లి జయశివకుమార్, మండల ప్రత్యేక అధికారి విక్రమ్, తహసీల్దార్ స్వప్న, ఎంపీడీఓ విజయశ్రీ, ఎంపీఓ నర్సింగరావు, హౌసింగ్ డీఈ చంద్రశేఖర్, ఏఓ చంద్రన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు జఫర్గఢ్: రాష్ట్రంలోని ఇంటింటికీ ఉపయోగపడే సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఉప్పుగల్లులో జరిగిన సభకు సర్పంచ్ కొడారి సాంబ రాజు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీహరి హాజరై మాట్లాడారు.. గ్రామంలో ఉన్న రిజర్వాయర్కు ఉప్పుగల్లు రిజర్వాయర్గా పేరు పెట్టించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి విజయ్కుమార్, ఎంపీడీఓ సుమన్, తహసీల్దార్ శ్రీనివాస్, ఏఓ నర్సింగరావు, ఏపీఎం కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జాతర చూసేందుకు వెళ్లి..
చిల్పూరు: జాతర చూసేందుకు వెళ్లి వాగులో పడి ఇద్దరు బాలురు మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా చిల్పూరు మండలం నష్కల్ గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, ఎస్సై సిరిపురం నవీన్కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని వంగాలపల్లి గ్రామానికి చెందిన గూటం ప్రవీణ్–హరిత దంపతుల కుమారుడు అఖిలానంద (14) ఎనిమిదో తరగతి, నూనె సదానందం–స్వప్న దంపతుల కుమారుడు మనోజ్కుమార్ (13) స్థానికంగా ఏడో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ స్నేహితులు. ఒంటిపూట బడులు కావడంతో మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నష్కల్ గ్రామంలోని రామాలయం దగ్గర జరుగుతున్న జాతరను చూసేందుకు సాయంత్రం ఇద్దరు కలిసి సైకిల్పై వెళ్లారు. అనంతరం రామాలయం వెనుక ఉన్న ఆకేరు వాగు వద్దకు వెళ్లారు. అక్కడ సైకిల్ కడుగుతున్న సమయంలో రైతులు వాగు దాటేందుకు ఏర్పాటు చేసుకున్న తెడ్డు కనిపించింది. దానిపై సైకిల్ పెట్టి ఇద్దరు కూర్చుని కొద్ది దూరం వెళ్లారు. అదిఒక పక్కకు ఒరగడంతో సైకిల్తో పాటు ఇద్దరు నీటిలో పడిపోయారు. ఆసమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇద్దరు ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకుని నీటిలో మునిగి మృతి చెందారు. కొద్దిసేపటికి కొందరు రైతులు అటుగా వెళ్తుండగా వాగు ఒడ్డుకు చెప్పులు కనిపించాయి. అనుమానంతో వాగులో గాలించగా నీటిలో మునిగిన సైకిల్తోపాటు బాలుర మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మనోజ్కుమార్(ఫైల్) , అఖిలానంద (ఫైల్) ఆకేరు వాగులో పడి ఇద్దరు బాలుర మృతి వంగాలపల్లిలో విషాదం -
ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తిచేయాలి
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గురువారం కలెక్టర్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై మండలాల వారీగా గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. మే 31 డెడ్లైన్గా పెట్టుకొని మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో పీడీ మాతృ నాయక్, ఆయా మండలాల ఏఈలు, తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవలో నిబద్ధత, పారదర్శకతకు ప్రాధాన్యం ప్రజా సేవలో నిబద్ధత, పారదర్శకతే ప్రాధాన్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ ట్రెయినీ గ్రూప్–1 అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఆర్డీఓ వసంత, అడిషనల్ డీఆర్డీఓ నూరుద్దీన్, డీపీఎంలు పాల్గొన్నారు. -
ప్రజాపాలన..ప్రగతి సభలు
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుతో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన స్కీంలను ప్రజలకు వివరించేందుకు అధికారుల గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల బాట పడుతున్నారు. ప్రజా పాలనను మరింత బలోపేతం చేయడానికి చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేడు(గురువారం) జిల్లాలోని అన్ని గ్రామాల్లో గ్రామసభలు, మున్సిపాలిటీల్లో వార్డుసభలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ సమావేశాల్లో ప్రభుత్వ పథకాల పురోగతిని గ్రామ, వార్డు స్థాయికి చేరువ చేయడం, కొత్తగా ప్రవేశపెట్టిన సంక్షేమ చర్యలను ప్రజలకు వివరించడం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని 281 జీపీలు, జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీల్లోని 48 వార్డుల్లో పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. సభల్లో ఇలా.. గృహ నిర్మాణ, సంబంధిత పథకాలతో పాటు అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తారు. దీంతో పాటు పెండింగ్ అప్లికేషన్ల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తూ ఇళ్ల నిర్మాణ నాణ్యత, దశల వారీ సహాయాల విడుదలకు సంబంధించి లబ్ధిదారులకు పథకం గురించి వివరిస్తారు. రైతులకు సంబంధించిన పథకాలు సాగు సౌకర్యాలు, పంటల కొనుగోలు, నీటి పారుదల సమస్యల పరిష్కారం, యాసంగి సీజన్ సన్నాహక చర్యలపై అవగాహన కల్పిస్తారు. సామాజిక సంక్షేమ పథకాల అమలు తీరు ఎలా ఉందనే దానిపై ఆయా శాఖల అధికారులు నివేదిక వినిపిస్తారు. పింఛన్ల మంజూరు, పెరుగుదల, పెండింగ్ కేసుల విచారణ, అభ్యర్థుల ధ్రువీకరణ ప్రక్రియ, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రత్యేక సేవలపై గ్రామసభలో తెలియ జేయనున్నారు. విద్య, ఆరోగ్య సేవల్లో.. పాఠశాలల అభివృద్ధి, బడిబాట కార్యక్రమాలు, గ్రామ, పట్టణ ఆరోగ్య కేంద్రాల సేవలు, వైద్య శిబిరాలు, గర్భిణులు, చిన్నారులకు పోషకాహార పథకాలపై ప్రసంగం ఉంటుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలకు సంబంధించి సభల్లో ప్రజెంటేషన్ చేయడంతో పాటు ప్రజల నుంచి నేరుగా సూచనలు, ఫిర్యాదులు స్వీకరిస్తారు. పథకాలపై అవగాహన రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రూ.500లకు గ్యాస్ సిలిండర్, సన్నరకం ధాన్యం కొనుగోలుపై బోనస్, చేయూత పింఛన్లు, గృహజ్యోతి(2వందల యూనిట్లకు ఉచిత విద్యుత్), కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కొత్త రేషన్ కార్డు మంజూరుపై అవగాహన కల్పిస్తారు. గత 99 రోజుల్లో ప్రజాపాలనలో చేపట్టిన చర్యల వివరాలు గ్రామ, పట్టణ వార్డు స్థాయిలో అమలవుతున్న సంక్షేమ పథకాల సమీక్ష కొత్తగా ప్రవేశపెట్టిన పథకాల పరిచయం లబ్ధిదారుల ఎంపిక విధానం, అర్హతలు గ్రామ, వార్డు అభివృద్ధి పనులు, నిధుల వినియోగం ప్రజల సమస్యలు, ఫిర్యాదులు స్వీకరణ ప్రభుత్వ పథకాల వివరాలు వివరిస్తారు.2024–25 సంవత్సరానికి కొడకండ్ల మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి విస్త్రతంగా వ్యవసాయ క్షేత్రాల్లో మట్టి నమూనాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల పరిధిలోని 4,250 మంది రైతుల వ్యవసాయ భూముల నుంచి మట్టి నమూనాలు సేకరించి, వాటికి సంబంధించిన పరీక్ష ఫలితాలను సిద్ధం చేశారు. ఈ మట్టి నమూనాల రిపోర్టులను జరిగే గ్రామసభల్లో సంబంధిత రైతులకు అందజేయనున్నారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 176 రెవెన్యూ గ్రామాల పరిధిలో, గ్రామానికి 10 చొప్పున మొత్తం 1,760 మట్టి నమూనాలు సేకరణ పూర్తి చేశారు. ఈ నమూనాలను పరీక్షల కోసం రాజేంద్రనగర్ మట్టి నమూనా పరీక్ష కేంద్రానికి పంపించారు. వీటి ఆధారంగా సర్టిఫికెట్లు త్వరలో విడుదల కానున్నాయి. నేడు గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో నిర్వహించనున్న ప్రభుత్వం సంక్షేమ పథకాల పురోగతిపై సమీక్ష కొత్త స్కీంలపై అవగాహన కొడకండ్ల రైతులకు మట్టి నమూనా సర్టిఫికెట్లు -
ఇప్పగూడెం అభివృద్ధికి కృషి
● పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: ఇప్పగూడెం గ్రామ అభివృద్దికి ప్రత్యేక చొరవతో పనిచేస్తానని, శ్రీ పెద్దమ్మతల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆకాంక్షించారు. మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో ముదిరాజ్ కులస్థుల ఆరాధ్యదైవమైన పెద్దమ్మతల్లి దేవస్థాన ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉత్సవాలకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై పెద్దమ్మతల్లికి, ఎల్లమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముదిరాజ్ కులస్థుల కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నెలరోజుల్లో రూ.10లక్షలు మంజూరు చేస్తానన్నారు. అక్కపెల్లిగూడెం క్రాస్ నుంచి సత్రంకుంట వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మందపురం రాణిఅనీల్గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్రెడ్డి, పార్టీ జిల్లా నాయకులు నాగరబోయిన శ్రీరాములు, పురమాని రజాక్యాదవ్, ఉపసర్పంచ్ రాజు, దేవస్థాన చైర్మన్ పిట్టల శ్రీనివాస్, ముదిరాజ్ సొసైటీ అధ్యక్షుడు లింగనబోయిన అశోక్, దేవస్థాన వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి అన్నెపు యాకయ్య పాల్గొన్నారు. -
మళ్లీ పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధరలు
జనగామ: కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర మరోసారి పెరగడంతో చిన్న, మధ్య తరహా వ్యాపారులపై భారం మరింత పెరిగింది. 15 రోజుల క్రితం రూ.60లు పెరిగిన ధరను మరోసారి రూ.215 మేర బాదడంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,327కు చేరింది. కేవలం రెండు వారాల్లోనే రూ.275 పెరుగుదల నమోదవడంతో టీ స్టాల్స్, చిన్న హోటల్స్, చిరు వ్యాపారులపై అదనపు భారం కానుంది. జిల్లాలో అన్ని కేటగిరీలను కలుపుకుని 800 నుంచి 1,500 వరకు హోటల్స్, ఫుడ్ అవుట్లెట్లు ఉన్నప్పటికీ కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు 30 శాతం కూడా లేవు. బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేసే వారు కొందరైతే, అత్యధిక సంఖ్యలో సబ్సిడీ సిలిండర్లతో వ్యాపారం చేస్తున్నారు. దీనిపై సివిల్ సప్లయీస్ అధికారులు నిరంతరం దాడులు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ ప్రభావం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు రేట్లు పెరగడం కారణంగానే కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచుతూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. సప్లై ప్రారంభం 15 రోజులుగా సరఫరా నిలిచిన కమర్షియల్ సిలిండర్లు ఒకటి, రెండు రోజులుగా తిరిగి అందుబాటులోకి రావడంతో ఏజెన్సీలు కొత్త ధరలకే సరఫరా చేస్తున్నారు. ఇదే సమయంలో గతంలో హోటల్ నిర్వాహకులు రోజూ ఎన్ని సిలిండర్లు కొనుగోలు చేశారనే లెక్కపై సుమారు 60 శాతం మేరకు మాత్రమే ఇప్పుడు విక్రయాలు జరుపుతున్నట్లు ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి. వ్యాపారం తగ్గిన పరిస్థితుల్లో మరింత భారం మోసే పరిస్థితి ఎదురవుతుందనే ఆందోళన హోటల్ వ్యాపారుల్లో నెలకొంది. కాగా, కమర్షియల్ గ్యాస్ సప్లై పునఃప్రారంభం కావడంతో బడా హోటల్ యజమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.● హోటల్ వ్యాపారులపై పెను భారం సిలిండర్పై రూ.215 పెంపు -
సజావుగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలి
జనగామ రూరల్: యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సజావుగా కొనుగోళ్లు నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి ఆయన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జరగాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. తూకం యంత్రాలు, తడి కొలిచే పరికరాలు, గోదాముల సదుపాయం, టార్పాలిన్లు, గన్నీ సంచులు, తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. సమావేశంలో డీఎంసీఎస్ హాథీరామ్, ఆర్టీఓ శ్రీనివాస్ గౌడ్, డీఏఓ అంబి కా సోనీ, డీఆర్డీఓ వసంత, డీసీఎస్ఓ పావని, డీసీఓ కోదండరాములు, డీఎంఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను అమలుచేయాలి 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 6 నుంచి 11 వరకు జిల్లా వైద్య శాఖ ద్వారా చేపట్టే కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్లో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రగతి ప్రణాళిక అమలుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు, డీసీహెచ్ఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. పారాక్వాట్ మందుపై తాత్కాలిక నిషేధం పారాక్వాట్ మందుపై 60 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. పారాక్వాట్ మందును ఎవరూ కొనుగోలు చేయకూడదని, నిల్వ ఉంచరాదని, వ్యవసాయ డీలర్ దుకాణాలు ఈ మందును అమ్మకూడదన్నారు. పీహెచ్సీ, గురుకులంలో తనిఖీలు.. జఫర్గఢ్: వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ సూచించారు. మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రంతో పాటు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ బుధవారం అకస్మిక తనిఖీలు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆసుపత్రికి సంబంధించిన పలు విభా గాలను పరిశీలించారు. డెంటల్ విభాగం స్కానింగ్ సెంటర్, మందుల నిల్వలను పరిశీలించడంతో పాటు డయాలసిస్ తీసుకుంటున్న రోగులతో మాట్లాడారు. విధుల్లో నిర్లక్ష్యం చేసిన సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థినులకు పోషకాహారం అందించాలి స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ వంటశాలను తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందించే భోజనం పరిశుభ్రంగా ఉండడంతో పాటు పోషకాహారంతో అందించాలని సూచించారు. అనంతరం పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడి రాబోయే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ విషయంలో పలు సూచనలు చేశారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
దావత్కు వెళ్లొస్తూ.. తిరిగిరాని లోకాలకు
● అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు ● ఇద్దరు అన్నదమ్ముళ్ల దుర్మరణం.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు ● మృతులు, క్షతగాత్రులది తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామంధర్మసాగర్/జనగామ: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామశివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ముళ్లు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఏనుగుల రాజయ్య, రాజవ్వలకు ముగ్గురు కుమారులు. వీరిలో లోకేష్(26) వ్యవసాయం చేస్తుండగా ఈ ఏడాది క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం ఆయన భార్య ఐదు నెలల గర్భవతి, మరో కుమారుడు అశోక్ (24). ఇతడు యశ్వంతపూర్ క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వీరిద్దరితో పాటు అదే గ్రామానికి చెందిన మరో ఐదుగురు హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తికి ఓ దావత్ కార్యక్రమానికి బంధువులకు చెందిన కారులో వెళ్లారు. తిరిగి నర్సాపూర్కు వస్తున్న క్రమంలో ముప్పారం శివారులోకి రాగానే కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొనగా లోకేష్, అశోక్ అక్కడికక్కడే మృతిచెందగా ఇరుకుల ప్రశాంత్, అజయ్, వినయ్ ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరుకుల వెంకటేష్, నవీన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఎంజీఎంకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీధర్రావు తెలిపారు. -
అసంపూర్తి హాస్టల్ భవనానికి మోక్షం
లింగాలఘణపురం: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో అసంపూర్తిగా ఉన్న బాలికల హాస్టల్ భవనం పనులు ఎట్టకేలకు పునఃప్రారంభమయ్యాయి. జిల్లాలో ఏౖకైక మోడల్ స్కూల్ హాస్టల్ భవనం సుమారు 12 ఏళ్లుగా అసంపూర్తిగా ఉంది. దీంతో అనేకసార్లు అనేక గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులకు విన్నవించిన నేపథ్యంలో ఇటీవల రూ.1.44 కోట్లతో టెండర్లు నిర్వహించారు. దీంతో ఓ కాంట్రాక్టర్ పనులు దక్కించుకొని పనులు మొదలుపెట్టారు. అసంపూర్తి భవనం చుట్టూ ఉన్న చెట్లను తొలగించి పనులు ప్రారంభించారు. ఈ హాస్టల్ భవనం పూర్తయితే వంద మంది పేద బాలికలకు హాస్టల్ సౌకర్యం కల్పించడబడుతుంది. త్వరగా పూర్తిస్థాయిలో పనులు చేపట్టి వేసవిలో పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం భవనం అందుబాటులోనికి తేవాలని మండలంలోని విద్యార్థినుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు. ● రూ.1.44 కోట్లతో పనులు పునఃప్రారంభం -
బార్ అసోసియేషన్ కమిటీ బాధ్యతల స్వీకరణ
జనగామ రూరల్: కొత్తగా ఎన్నికై న జనగామ బార్ అసోసియేషన్ కమిటీ బుధవారం బాధ్యతలు స్వీకరించింది. బార్ అధ్యక్షుడిగా బండ దయాకర్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి రాజయ్య, జనరల్ సెక్రెటరీ మన్నే సత్తయ్య, ట్రెజరర్ నేతి శ్రీమాన్, జాయింట్ సెక్రెటరీ గుండెల్లీ రాజశేఖర్, కల్చరల్ స్పోర్ట్స్ సెక్రటరీ ఆలే బాలరాజు, లైబ్రరీ సెక్రెటరీ బద్రీనాథ్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు వినయ్, పుష్ప, స్వాతి, శ్రీనివాస్, దయామని వంశీకృష్ణ, శ్రీహరి బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా అధ్యక్షుడు దయాకర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి చట్టం పరిధిలో జరగాల్సిన పనులు చేపడుతామని, న్యాయబద్ధంగా వ్యవహరి స్తామన్నారు. ఏఎంసీ అవినీతిపై విచారణ జరిపించాలి● తెలంగాణ రైతు సంఘం వినతి జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం వ్యవసాయ మార్కెట్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి రంజిత్ రావుకు వినతి చేశారు. ఈ సందర్భంగా భూక్య చందు నాయక్ మాట్లాడుతూ.. గతంలో పల్లికాయ కొనుగోలులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేసి, చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది పల్లికాయ, చింతపండు కొనుగోళ్లలో జీరో వ్యాపారం నడుస్తోందన్నారు. మార్కెట్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ప్రతీ ఉత్పత్తిని ఈ నామ్ ద్వారా కొనుగోలు చేయాలన్నారు. ఆయన వెంట రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మంగ బీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
రూ.32.15 కోట్లు
అంచనా బడ్జెట్జనగామ: జనగామ మున్సిపాలిటీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనా బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. బడ్జెట్లో సాధారణ ఆదాయం, వ్య యం, ప్రారంభం, ముగింపు నిల్వలతో పాటు క్యాపిటల్, వ్యయాలు ఎంత అనే దానిపై వివరించారు. మంగళవారం పురపాలిక కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ అధ్యక్షతన అంచనా బడ్జెట్ సమావేశం జరిగింది. అంచనా బడ్జెట్ను సీపీఎం కౌన్సిలర్ బూడిద జ్యోతి ప్రతిపాదిస్తూ, పలు సూచనలు ఇచ్చారు. అధికారులు, కౌన్సిలర్లు బడ్జెట్ కాపీలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మహేశ్వర్రెడ్డి, కౌన్సి లర్లు మారబోయిన పాండు, బుక్క బాలభరద్వాజ్, రామగళ్ల విజయ్, లోకమంతరెడ్డి, మంత్రి సుమలతశ్రీశైలం, బూడిద జ్యోతి, పాముకుంట్ల ప్రసాద్, రజని, అండాలు, అనిత, ఉమ, భాస్కర్ ఉన్నారు. నిధులు పెంచాలి: బూడిద జ్యోతి పట్టణంలో కోతులు, కుక్కలు, పందుల సమస్య పరిష్కారం కోసం బడ్జెట్లో ప్రతిపాదించిన నిధులు నామమాత్రంగా ఉన్నాయని, ఇందుకు సంబంధించి రూ.15లక్షలకు పెంచాలని కౌన్సిల్ జ్యోతి కోరారు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో దోమల సమస్య ఇబ్బందిగా మారిపోయిందని, నివారణ చర్యలు చేపట్టాలన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ శ్మశానవాటికల అభివృద్ధి కోసం నిధులు తక్కువగా ఉన్నాయని, వీటి శాతం పెంచాలని డిమాండ్ చేశారు. చీటకోడూరు రిజర్వాయర్ ఆధునీకరణ, మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించడం కోసం బడ్జెట్ ప్రతిపాదనలో నిధుల శాతం పెంచాల్సి ఉందన్నారు. పార్కుల నిర్వహణ కోసం రూ.20 లక్షల వరకు నిధులు కావాలని, జనరల్ ఫండ్ పెంచుకోవడానికి ఆదాయ మార్గాలను శాసీ్త్రయంగా అన్వేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్ ఇలా.. 2026–27 అంచనా బడ్జెట్ రూ.32.15కోట్లకు కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. టాక్స్, నాన్టాక్స్ ఆదాయాలతో పాటు గ్రాంట్ల విభాగంలో కూడా గణనీయమైన పెరుగుదల మున్సిపాలిటీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసేలా ఉంది. 2025–26లో మొత్తం బడ్జెట్ రూ.18కోట్ల39లక్షలతో పోలిస్తే ఈసారి అంచనా బడ్జెట్లో రూ.13.49 కోట్లు పెరుగుదల కనిపిస్తోంది. కాగా..31.03.2026 నాటికి అంచనా ముగింపు రూ.8కోట్ల53లక్షలు ఉంది.2026–27 ఆర్థిక సంవత్సర అంచనాలు టాక్స్ వనరుల అంచనా (ఆస్తి పన్ను, అసైన్డ్ రెవెన్యూ) జనగామ మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం గత ఆర్థిక సంవత్సరం కంటే పెరిగిన అంచనా రూ.13.49 కోట్లు పట్టణ అభివృద్ధే లక్ష్యం: చైర్పర్సన్ కడకంచి బాలమణిఆదాయ వివరాలు: 2026–27: రెమ్యునరేటివ్, ఎంటర్ప్రైజెస్, రెంటల్: రూ.1.60కోట్లు ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం: రూ.45.45లక్షలు పట్టణ ప్రణాళిక: రూ.4.02కోట్లు ఇంజనీరింగ్: రూ.88.4లక్షలు మొత్తం నాన్ టాక్స్ ఆదాయం: రూ.6.42కోట్లుడిపాజిట్లు–అడ్వాన్సులు: 2026–27లో: రూ.1.70 కోట్లు టాక్స్, నాన్టాక్స్ కలిపి మొత్తం ఆదాయం: 2026–27: రూ.13.48కోట్లు నాన్ప్లాన్ గ్రాంట్లు: 2026–27: 1.50కోట్లు ప్లాన్ గ్రాంట్లు: రూ.1.58కోట్లు ఇతర గ్రాంట్లు: రూ.6.01 కోట్లు మొత్తం గ్రాంట్లు:రూ.9.09 కోట్లు31.03.2026 నాటికి మిగులు బడ్జెట్ : రూ.8.53కోట్లు 01.04.2027 నాటి ప్రారంభ నిల్వ, 2026–27 సాధారణ ఆదాయం కలుపుకుని: రూ.22.02 కోట్లు 2026–27 సాధారణ వ్యయం: రూ.13.48 కోట్లు 31.03.2027 నాటికి అంచనా ముగింపు బడ్జెట్:రూ..853.80 లక్షలు 2026–27 క్యాపిటల్ ఆదాయ, వ్యయాలు: రూ.16.96కోట్లుటాక్స్, నాన్ టాక్స్ వనరులు, క్యాపిటల్ ప్రాజెక్ట్ ఫండ్ ద్వారా వచ్చే గ్రాంట్లను విభాగాల వారీగా అంచనా బడ్జెట్లో పొందుపరిచారు. అధికారులు చేపట్టిన అంచనాల ప్రకారం ప్రతీ విభాగంలో ఆదాయం సంవత్సరానికొకసారి పెరుగుతూ ఉండటం గమనార్హం. పట్టణ అభివృద్ధే లక్ష్యం..పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. అంచనా బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చాం. అందరి సహకారంతో ప్రభుత్వం నుంచి నిధులను తీసుకురావడంతో పాటు వార్డుల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం. పట్టణాన్ని మిగతా ప్రాంతాలకు రోల్మోడల్గా తీర్చిదిద్దుతాం. ప్రజలకు అందుబాటులో ఉంటూ, పరిపాలనను మరింత చేరువ చేసే విధంగా ముందుకెళ్తాం. ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటాం. – కడకంచి బాలమణి, చైర్పర్సన్ ఏడాది ఆస్తిపన్ను అసైన్డ్ రెవెన్యూ మొత్తం 2024–25 రూ.2.96కోట్లు రూ.9.05కోట్లు రూ.12.02కోట్లు 2025–26 రూ.4.20కోట్లు – రూ.4.20కోట్లు 2026–27 రూ.7.06కోట్లు – రూ.7.06కోట్లు -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
● వీసీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, సీఎస్ రామకృష్ణరావు జనగామ రూరల్: 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 2వ తేదీన జరగనున్న గ్రామసభలను విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మంగళవారం, హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో 99 రోజుల ప్రజాపాలనపై వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమావేశానికి హాజరయ్యారు. ఈసందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. 2న నిర్వహించే గ్రామ సభల్లో ప్రతీ అంశం స్పష్టంగా తెలపాలని, ముఖ్యంగా ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి, వారిచే సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గ్రామ సభలను నిర్వహించి, సంక్షేమ పథకాలను వివరిస్తామన్నారు. ఈ మేరకు 2న జరిగే గ్రామ సభల ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, జెడ్పీ సీఈఓ మాధురి షా, డీపీఓ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అదనపు డీటీఆర్ల కోసం డబ్బులు ఇవ్వొద్దు
● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి జనగామ: జిల్లా పరిధిలో అదనపు డీటీఆర్ల మంజూరు కోసం రైతులు ఎవరూ కూడా డబ్బులు ఇవ్వొద్దని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అదనపు డీటీఆర్లు ఏర్పాటు చేయడం పూర్తిగా తమ శాఖ పరిధిలోనే ఉంటుందన్నారు. దీనికి సంబంధించి రైతులు, వినియోగదారులు మధ్యవర్తులు, సిబ్బందికి డబ్బులు ఇవ్వరాదని, డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. రైతులు, వినియోగదారులు ఎదుర్కొనే ఏ సమస్యలకై నా సంబంధిత సెక్షన్న్ అధికారులను నేరుగా సంప్రదించాలన్నారు. అలాగే 1912 హెల్ప్లైన్న్ ద్వారా కూడా సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. రైతులు, వినియోగదారులు ఎవరికి డబ్బులు ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని, సమస్యలు ఉంటే 1912 టోల్ ఫ్రీ నెంబర్ లేదా సంబంధిత సెక్షన్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలన్నారు. వీధి వ్యాపారులకు గుర్తింపుకార్డుల అందజేత స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వం వీధి వ్యాపారులకు అందించే గుర్తింపు కార్డులను సద్వినియోగం చేసుకోవాలని స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్ అన్నారు. ఘన్పూర్ మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా టీఎంసీ వాణిశ్రీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ వినయ్ కుమార్ మాట్లాడారు. వీధి వ్యాపారులకు మొదటగా రూ.12వేలు బ్యాంకు రుణాలు అందిస్తారని, సకాలంలో చెల్లించిన వారికి అనంతరం రూ.20వేలు, రూ.50వేలు రుణాలను వారి వ్యాపారాల కోసం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 8 వరకు రుణ దరఖాస్తుల గడువు పొడిగింపు జనగామ: జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్, జనగామ ఆధ్వర్యంలో ఉపాధి కోసం అందించే రుణాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 8 వరకు పొడిగించినట్లు ఆ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధవీలత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈవీ వీలర్, ఈవీ త్రీ వీలర్, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ వంటి పథకాలతో పాటు, ఈ సంవత్సరం కొత్తగా పాడి గేదెల పెంపకం పథకాన్ని కూడా చేర్చినట్లు వెల్లడించారు. అర్హులైన షెడ్యూల్డ్ కులం యువకులు, మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఇంటర్వర్సిటీ ఖోఖో టోర్నమెంట్కు కేయూ ఉమెన్ జట్టు కేయూ క్యాంపస్: కర్నాటకలోని దేవనగరి యూనివర్సిటీలో ఏప్రిల్ 1 నుంచి 4వతేదీ వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఖోఖో టోర్నమెంట్లో కాకతీయ యూనివర్సిటీ ఉమెన్ జట్టు పాల్గొననున్నట్లు స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య మంగళవారం తెలిపారు. ఈ జట్టులో జి. అఖిల, పి. శిరీష్మా, జి. పూజారాణి, కె. కావ్య,టి రజిత, ఇ. సమత, ఎం. నవ్య, బి. శైలజ, ఇ. శ్రీజ, ఎ. నందు, కె. సుమతి, కె నిష్మితా, కె. ఉషారాణి, ఎం. శిరీషా ఉన్నారని వెంకయ్య తెలిపారు. ఈజట్టుకు వరంగల్ ఎల్బీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ ఎ. రాజు కోచ్గా, ఖమ్మం డీజీటీడబ్ల్యూ ఆర్డీసీ ఫిజికల్ డైరెక్టర్ బి. రమ్య మేనేజర్గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య తెలిపారు. -
ప్రొటోకాల్ రగడ
● వేదికపై వైస్ చైర్మన్కు చోటు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్ల నిరసన ● పోడియం వద్ద బైఠాయించి.. చివరకు వాకౌట్జనగామ: మున్సిపల్లో నూతన పాలక మండలి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్వహించిన రెండో సాధారణ బడ్జెట్ సమావేశంలో ప్రొటోకాల్ వివాదం చెలరేగింది. మంగళవారం చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ అంశంపై నిరసన మొదలైంది. సమావేశ వేదికపై తమ పార్టీకి చెందిన వైస్ చైర్మన్కు చోటు ఇవ్వాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్ వేదికపై కూర్చోవడం పరిపాటి అని, అదే ప్రొటో కాల్ను కొనసాగించాలని వారు పట్టుబట్టారు. ఈ విషయంపై కమిషనర్ మహేశ్వర్రెడ్డి స్పందిస్తూ ప్రస్తుత నిబంధనల ప్రకారం వైస్ చైర్మన్ వేదికపై కూర్చునే అధికారం లేదని, అందుకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. కమిషనర్ సమాధానంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొంతసేపు సమావేశాన్ని నిలిపివేశారు. పోడియం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా, కమిషనర్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో వారు చివరకు వాకౌట్ చేశారు. అవమానకర చర్య.. ప్రజలు ఎన్నుకున్న వైస్ చైర్మన్కు వేదికపైన చోటు నిరాకరించడం అవమానకర చర్య అని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉడుగుల కిష్టయ్య, హఫీజ్ ఫాతిమా, గోపగోని సుగుణాకర్ గౌడ్, సేవెల్లి మధుసూదన్, గునిగంటి వెన్నెల, మంజుల, సువార్త, మామిడాల రజిత, ఎనగందుల అనూష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘర్షణాత్మక పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌన్సిల్ సమావేశం పూర్తయ్యే వరకు పోలీసులు అక్కడే మోహరించారు. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, పరిస్థితులు అదుపులోకి రావడంతో సమావేశం తదుపరి కార్యక్రమాలు కొనసాగాయి. మున్సిపల్ బడ్జెట్ సమావేశం ము ఖ్యమైన రోజే ప్రొటోకాల్ వివాదం కేంద్రబిందువుగా మారి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. -
‘అకాల’ గోస
● భారీ వర్షంతో తడిసిన మక్కలు ● జనగామ మార్కెట్లో వరదకు కొట్టుకుపోయిన గింజలు ● కన్నీటి పర్యంతమైన రైతులుజనగామ: దంచికొడుతున్న ఎండలకు తోడు..అకాల వర్షాలు రైతులను ఆగం చేస్తున్నాయి. వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి మద్దతు ధరకు మక్కలు అమ్ముకుందామని మార్కెట్కు వస్తే అరిగోస పడుతున్నారు. మార్క్ఫెడ్ శాఖ నిర్లక్ష్యం మూలంగా సకాలంలో కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయకపోవడంతో.. తక్కువ ధరకు ప్రైవేటులో అమ్ముకోవాల్సి వస్తోంది. మంచి ధర కోసం ఎదురుచూస్తున్న సమయంలో అకాల వర్షాలు పెట్టుబడులు సైతం రాకుండా చేస్తున్నాయి. మంగళవారం ఉదయం కురిసిన వర్షంతో జనగామ వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వందలాది బస్తాల మక్కలు తడసి ముద్దయిపోయాయి. ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదతో పలువురు రైతులకు చెందిన సుమారు 5 బస్తాల వరకు గింజలు కొట్టుకుపోవడంతో నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మక్కలు తడిసి, గింజలు కొట్టుకు పోతున్న సమయంలో వా టిని ఒడిసి పట్టుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. వర్షసూచన ఉండే అవకాశం ఉందని వాతా వరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మక్కలను ఒక్కచోటకు చేర్చి టార్పాలిన్ కవర్లను కప్పడంతో.. అప్పటికే తడిసి ఉండడంతో మొలకెత్తే ప్రమాదం ఉంది. వెంటనే మార్క్ఫెడ్ కేంద్రాన్ని ప్రారంభించి తడిసిన మక్కలను సైతం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. -
నేటి నుంచి ‘టెన్త్’ మూల్యాంకనం
విద్యారణ్యపురి: టెన్త్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టుల పరీక్షలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలోని కాజీపేటలోని ఫాతిమా హైస్కూల్లో స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను ఏప్రిల్ 1వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఈ సారి మూడు దశల్లో వాల్యుయేషన్ నిర్వహించనున్నారు. ఈ క్యాంపునకు విద్యాశాఖ ఉన్నతాధికారులు అన్ని సబ్జెక్టులు కలిపి 2లక్షల 40వేల 100 జవాబుపత్రాలు కేటా యించారు. ప్రస్తుతం తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్ జవాబుపత్రాలు రాగా కోడింగ్ డీకోడింగ్ ప్రక్రియ కూడా పూర్తికావొచ్చింది. ఈ క్యాంపు ఆఫీ సర్గా హనుమకొండ డీఈఓ గిరిరాజ్గౌడ్ వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లుగా ఏసీజీఈ భువనేశ్వరి, ఎంఈఓ హనుమంతురావు వ్యవహరిస్తున్నారు. నేటి నుంచి మొదటి దశలో స్పాట్ ప్రక్రియ ఫాతిమా హైస్కూల్ స్పాట్ కేంద్రంలో బుధవారం నుంచి 9వతేదీవరకు తెలుగు, హిందీ,ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టుల పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించనున్నారు. ఇందుకు 600 మంది ఉపాధ్యాయులను ఏఈలుగా, సీఈలు,స్పెషల్ అసిస్టెంట్లుగా నియమించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, ములుగు,జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాలోని సీనియరీటీ ప్రకారం ఆయా టీచర్లను స్పాట్ విధులకు కేటాయించారు. వీరు ఉదయం 8.30గంటలకు క్యాంపులో తప్పనిసరిగా రిపోర్టు చేయాల్సింటుది. లేనిపక్షంలో శాఖపరమైన చర్యలు ఉంటాయని సంబంధిత అధికారులు తెలిపారు. అన్ని సబ్జెక్టులు కలిపి మొత్తంగా 1,250మంది ఉపాధ్యాయుల వరకు నియామక ఉత్తర్వులు అందజేశారు. రెండోదశలో 10నుంచి 17వరకు టెన్త్ మూల్యంకనం రెండోదశలో ఏప్రిల్ 10 నుంచి 17వరకు కొనసాగనుంది. ఇందులో ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ సబ్జెక్టుల పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం చేపట్టనున్నారు. మూడో దశలో 15 నుంచి 23 వరకు మూడో దశలో టెన్త్ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనంలో సోషల్ స్టడీస్, ఒకేషనల్ కోర్సుల సబ్జెక్టులు ఉంటాయి. నియామకమైన ఉపాధ్యాయులందరూ మూల్యాంకన విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. మూల్యాంకన విధులు సక్రమంగా నిర్వర్తించాలి టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకన విధులు సక్రమంగా నిర్వర్తించాలని క్యాంపు ఆఫీసర్, హనుమకొండ జిల్లా డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ కోరారు. ఈ మేరకు మంగళవారం కాజీపేట ఫాతిమాహైస్కూల్ స్పాట్ కేంద్రంలో సంబంధిత డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లు, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లుతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ఈసారి మూడు దశల్లో వాల్యుయేషన్ ప్రక్రియ 2లక్షల 40 వేల 100 జవాబు పత్రాలు కేటాయింపు 1, 250 మంది వరకు టీచర్లకు విధులు ఫాతిమా హైస్కూల్లో స్పాట్ కేంద్రం -
మూడు నెలల రేషన్ ఒకేసారి!
జనగామ: జిల్లాలో తెల్ల రేషన్, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డు లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీకి ఈనెల 1న (బుధవారం) శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సంబంధిత రేషన్ దుకాణాలకు అవసరమైన బియ్యం సరఫరా చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 2026 వరకు మూడు నెలల బియ్యం లబ్ధిదారులకు అందించేందుకు సర్వం సిద్ధం చేశారు. 5.64లక్షల యూనిట్లు..10.752 మెట్రిక్ టన్నులు జిల్లాలో 355 రేషన్ దుకాణాలు ఉండగా, 1,87,002 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో అంత్యోదయ కార్డులు 10,823కు గాను 30,461మంది లబ్ధిదారులు (యూనిట్లు) ఉన్నారు. వీరికి 1,136.415 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరముంది. తెల్లరేషన్ కార్డులు 1,76,094 (5,34,105 యూనిట్లు) ఉండగా 9,613.890 మెట్రిక్ టన్నుల భారీ మొత్తంలో బియ్యం పంపిణీ చేయనున్నారు. 85 అన్నపూర్ణ కార్డుల పరిధిలో 91 మంది యూనిట్లకు 2.550 మెట్రిక్ టన్నుల బియ్యం మంజూరు చేశారు. మూడు కేటగిరీల కార్డులు 1,87,002 కార్డులు ఉండగా, 5,64,657మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రభుత్వం వారందరికీ 10,752.855 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించింది. మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో, ఈ భారీ పరిమాణంలో బియ్యం రేషన్ దుకాణాలకు తరలించారు. కార్డుదారులు వచ్చి తీసుకునే విధంగా దుకాణాల వద్ద అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు సంబంధిత శాఖల అధికారులు స్పష్టం చేశారు. రవాణా ఇబ్బందులు లేకుండా.. సాధారణంగా నెల నెలా పంపిణీ జరిగే బియ్యాన్ని ఈసారి ఒకేసారి మూడు నెలలకు ఇచ్చే విధానం వల్ల, లబ్ధిదారులు రవాణా ఇబ్బందులు లేకుండా ముందుగానే నిల్వ చేసుకునే అవకాశం కలగనుంది. ముఖ్యంగా పేద కుటుంబాలకు ఈ నిర్ణయం ఉపయోగకరంగా మారనుంది. జిల్లాలో మొత్తం పంపిణీ ప్రక్రియను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. మూడు నెలల బియ్యం పంపిణీకి జిల్లాలో అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో, ఏప్రిల్ 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు సులభతరంగా పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాలో రేషన్ సమాచారం నేటి నుంచి బియ్యం పంపిణీకి శ్రీకారం సర్వం సిద్ధం చేసిన అధికారులు జిల్లాలో 1,87,002 రేషన్కార్డులు.. 10.752 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయింపుపేరు రేషన్కార్డులు లబ్ధిదారులు బియ్యం అలాట్మెంట్ (మెట్రిక్ టన్నులు)అంత్యోదయ 10,823 30,461 1136.415 తెల్ల రేషన్ కార్డులు 1,76,094 5,34,105 9613.890 అన్నపూర్ణ 85 91 2.550 మొత్తం 1,87,002 5,64,657 10,752.855 -
జనగామ
బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026గుముడెల్లి రేణుకకు ఘన నివాళి7● కడవెండిలో విప్లవ రచయిత మిడ్కో మొదటి వర్ధంతి సభ ● హాజరైన ప్రజాసంఘాలు, విరసం, మాజీ మావోలు దేవరుప్పుల : ఏడాది క్రితం కగార్ ఆపరేషన్లో నేలకొరిగిన మావోయిస్టు అనుబంధ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు, విప్లవ రచయిత గుముడెల్లి రేణుక అలియాస్ మిడ్కో అమరత్వ స్మరణతో ఉద్యమాల ఖిల్లా కడవెండి మరోసారి ఎరుపెక్కింది. మంగళవారం మండలంలోని కడవెండిలో గుముడెల్లి రేణుక అలియాస్ మిడ్కో ప్రథమ వర్ధంతి తల్లిదండ్రులు సోమయ్య, జయమ్మ సమక్షంలో నిర్వహించారు. ఈ వర్ధంతికి అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు పద్మకుమారి అధ్యక్షత వహిచంగా పలువురు స్మారక స్తూపం వద్ద ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, అరుణోదయ గాయకురాలు విమలక్క, విరసం నేత పాణి మాట్లాడుతూ.. రేణుక ఉన్నత జీవితం వదిలి ప్రజాసమస్యల పరిష్కారానికి పుస్తకాల్లో మిరుగుడుపూవు(మిడ్కో)గా అటవీబాట పట్టి వెనుకంజవేయలేదన్నారు. ఓ మహిళగా అనేక పోరాట రూపాల్లో సమాజ స్థాపన కోసం పాటుపడుతుంటే కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ పేరిట పొట్టన బెట్టుకుందన్నారు. రేణుక భౌతికంగా మనలో లేకున్నా ఆమె రచనలు దేశ విప్లవోద్యమానికి వేగుచుక్కగా మారిందన్నారు. అనంతరం పద్మకుమారి మాట్లాడుతూ నక్సల్ ఉద్యమంలో నేటికి ఇరవై వేల మంది నేలకొరగగా ఆ కుటుంబాలకు బాసటగా నిలుస్తామన్నా లొంగుబాటు నేతల భరోసా తమకు అవసరం లేదన్నారు. అమరుల ఆశయాల సాధనకు వారి వైఖరి వెలిబుచ్చాలన్నారు. ఈ సందర్భంగా పలువురు కవులు, గాయకులు మిడ్కో త్యాగాన్ని గుర్తు చేసేలా కవితలు, పాటలు ఆలోచింపజేశాయి. విరసం ప్రతినిధి పాణి, సామాజిక ఉద్యమకార్యకర్త సజయ్, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య, సీనియర్ జర్నలిస్టులు భరద్వాజ్, రమాసుందరి, కుటుంబ సభ్యులు జీవీకే ప్రసాద్, రాజశేఖర్ పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్య అందించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం మండలంలోని అడవికేశ్వాపూర్ గ్రామ పరిధిలో గల ప్రాథమిక పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం అమలు వంటి అంశాలను పర్యవేక్షించారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని, నాణ్యతగా ఉండాలన్నారు. విద్యార్థులతో మాట్లాడి పాఠ్యాంశాలపై అవగాహన గురించి పలు ప్రశ్నలు వేసి పరిశీలించారు. అలాగే గ్రామ పంచాయతీలో గల అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. నిర్వహించారు. చిన్నారుల ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో ముఖ్యమని సిబ్బంది బాధ్యతగా పనిచేయాలన్నారు. అనంతరం వడ్లకొండ రోడ్డులోని సఖి కేంద్రాన్ని తనిఖీ చేశారు. చదువుతోపాటు సామాజిక అవగాహన ఉండాలి● ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్ర స్టేషన్ఘన్పూర్: విద్యార్థులు చదువుతో పాటు సామాజిక అవగాహన కల్గి ఉండాలని ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్ర సూచించారు. ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలోని సెయింట్ థామస్ హైస్కూల్లో విద్యార్థులకు ట్రాఫిక్ ఎడ్యుకేషన్పై పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కేసీ జాన్బన్నీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ట్రెయినీ ఐపీఎస్ మాట్లాడారు.. విద్యార్ధి దశలోనే భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. దీనికి ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ట్రాఫిక్ ఎడ్యుకేషన్ పై విద్యార్థులు వేసిన పెయింటింగ్లు బాగున్నాయని అభినందించారు. కార్యక్రమంలో సీఐ జి.వేణు, ఎస్ఐ రాజేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గడ్డిమందును నిషేధించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి
● అసెంబ్లీ సమావేశాల్లో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: దేశవ్యాప్తంగా పారాక్వాట్ గడ్డిమందును నిషేధించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం పారాక్వాట్ గడ్డి మందు నిషేధంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశపెట్టిన తీర్మానంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన పారాక్వాట్ గడ్డి మందు నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి తీర్మానం ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు. రైతులు పంటపొలాల్లో కలుపు మొక్కల నివారణకు, పొలం గట్లపై గడ్డి పెరగకుండా ఉండేందుకు పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డిమందును ఎక్కువగా వినియోగిస్తారన్నారు. అనేక రైతు కుటుంబాల్లో, పేద కుటుంబాల్లో అప్పులబాధతో, కుటుంబ కలహాలతో, ఇతర సమస్యలతో క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించేవారు ఎక్కువగా ఈ గడ్డిమందును వాడుతున్నారన్నారు. ఈ మందుకు విరుగుడు లేకపోవడంతో బతకాలనే ఆశ ఉన్నప్పటికీ బతకలేని దుర్భర పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు. ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ పారాక్వాట్ గడ్డిమందును తక్షణమే నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈనెల 27న ఎంపీ కడియం కావ్య పారాక్వాట్ గడ్డిమందును నిషేధించాలని పార్లమెంట్లో లేవనెత్తారన్నారు. గడ్డిమందు నిషేధంపై తెలంగాణ రాష్ట్రం దేశానికి మార్గదర్శకంగా, దిక్సూచిగా ఉండాలని పేర్కొన్నారు. హోటళ్లపై అధికారుల దాడులుజనగామ: పట్టణంలోని వివిధ హోటల్స్, టీ స్టాల్స్పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సివిల్ సప్లయీస్ డీటీలు శ్రీనివాసు, లచ్చు నాయక్ ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీల్లో 10 సబ్సిడీ సిలిండర్లను సీజ్ చేసి, 10 మంది టీస్టాల్స్ యజమానులపై 6ఏ కేసులు నమోదు చేసినట్లు వారు తెలిపారు. హోటళ్లలో కమర్షియల్ సిలిండర్లు మినహా, ఇంట్లో ఉపయోగించే సబ్సిడీ సిలిండర్లను వాడితే కేసులు తప్పవని హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న సిలిండర్లను భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు అప్పగించారు. -
నేడు మున్సిపల్ బడ్జెట్
● రూ.31.15కోట్లుగా అంచనాలు విడుదల ● గతేడాదితో పోలిస్తే రూ.13.49 కోట్లు ెపెంపుజనగామ: జనగామ మున్సిపాలిటీ 2025–26, 2026–27 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్ అంచనాలు విడుదల చేసింది. బడ్జెట్లో సాధారణ ఆదాయం, వ్యయం, ప్రారంభం, ముగింపు నిల్వలతో పాటు క్యాపిటల్, వ్యయాలు ఎంత అనే దానిపై వివరించారు. రెండేళ్ల ఆర్థిక సంవత్సరాలను బేరీజు వేస్తూ ఆదాయం, వ్యయాలను సమతుల్యంగా నిర్వహిస్తూ, ముగింపు నిల్వలను స్థిరంగా ఉంచే దిశగా బడ్జెట్ రూపొందించారు. సాధారణ ఆదాయం, వ్యయాలతో పాటు క్యాపిటల్ వ్యయాలకు కూడా గణనీయమైన నిధులను కేటాయిం చారు. ఈనెల 31న(మంగళవారం) పురపాలిక కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ అధ్యక్షతన బడ్జెట్ సమావేశం జరుగనుంది. సమావేశంలో బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం పొందనున్నారు. పెరుగుతూ.. 2024–25లో ఆదాయం అత్యధికంగా రూ.25.33కోట్లు రాగా, 2025–26లో కొంత తగ్గి రూ.18.66కోట్లకు పడిపోయింది. ప్రస్తుత అంచనా బడ్జెట్ 2026–27లో తిరిగి రూ.32.15కోట్లకు పెరిగింది. టాక్స్, నాన్టాక్స్ ఆదాయాలతో పాటు గ్రాంట్ల విభాగంలో కూడా గణనీయమైన పెరుగుదల మున్సిపాలిటీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసేలా ఉంది. 2025–26తో పోలిస్తే ఈసారి అంచనా బడ్జెట్లో రూ.13.49 కోట్లు పెరుగుదల కనిపిస్తోంది. -
కేయూ అంచనా బడ్జెట్
రూ. 396.69 కోట్లుకేయూ క్యాంపస్ : 2026–2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాకతీయ యూనివర్సిటీ అంచనా బడ్జెట్ రూ 396.69 కోట్లుగా ప్రవేశపెట్టారు. ఈసారి లోటు రూ 27.13కోట్లుగా చూపారు. సోమవారం కేయూ పరిపాలన భవనంలోని సెనెట్హాల్లో వీసీ కె.ప్రతాప్రెడ్డి అధ్యక్షత వహించగా ఎకనామిక్స్ విభాగం అధిపతి, పాలకమండలి సభ్యుడు బి. సురేశ్లాల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, విరమణ బెనిఫిట్స్, నిర్వహణ వ్యయాలు, పరీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు వివిధ ఇతర ఖర్చులకు కలిపి మొత్తం రూ. 355.90 కోట్లు కేటాయించారు.మొత్తం బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ఎయిడ్గా రూ. 205.47కోట్లు రానుండగా ఇతర వనరుల నుంచి రూ 126.52 కోట్ల రాబడి వస్తుంద ని అంచనా వేశారు. ఈ బడ్జెట్ను ప్లానింగ్, నాన్ప్లానింగ్ రూపంలో రాబడులు, ఖర్చులు మొత్తం 8 అంశాలను చూపారు. వీటిలో ఉన్నత విద్యా మండలి నుంచి రూ. 10లక్షలు, ఇతరాల నుంచి రూ.15.50లక్షలు, అకడమిక్, ట్యూషన్ ఫీజుల రూపంలో రూ. 8.33 కోట్లు, అంతర్గత వనరుల ద్వారా రూ. 41.41కోట్లు, ఇతర పద్దుల ద్వారా రూ.21.56 కోట్లు, పరీక్షల విభాగం నుంచి రూ. 49.54 కోట్లు ఉన్నట్లు చూపారు. ఈ అకడమిక్ సెనెట్ బడ్జెట్ ఆమోదంతోపాటు స్టాండింగ్కమిటీ వార్షిక నివేదకను కూడా ఆమోదించింది. రిజిస్ట్రార్ వి. రామచంద్రం, విద్యా కళాశాల డీన్ రాంనాథ్కిషన్, అకడమిక్ ఆడిట్ విభాగం రిజిస్ట్రార్ కోల శంకర్, కేయూ ఫైనాన్స్ ఆఫీసర్ హబీబుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వల్లాల పృథ్వీరాజ్, ప్రిన్సిపాళ్లు, పరీక్షల విభాగం అధికారులు, డీన్లు, అకడమిక్, అకౌంట్స్ విభాగాల ఉద్యోగులు, సెనెట్ సభ్యులు పాల్గొన్నారు. కాగా, తొలుత కేయూ మాజీ వీసీ లింగమూర్తి మృతికి సంతాపంగా నివాళులర్పిస్తూ సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించారు. అకడమిక్ సెనెట్లో ఆమోదం కె. ప్రతాప్రెడ్డి, వీసీ దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో కేయూ కూడా ఒకటి. ప్రస్తుతం కేయూ అభివృద్ధి పథంలో ముందుకెళ్తోంది. అకడమిక్, పరిశోధనల పరంగా అభివృద్ధిలో పయనిస్తోంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా యూజీ, పీజీ కోర్సుల్లోనూ సిలబస్ కూడా మారుతోంది. విద్యార్థులకు స్కిల్, జాబ్ ఓరియెంటేడ్ కోర్సులు లక్ష్యంగా సిలబస్ రూపల్పన చేపడుతున్నాం. కృత్రిమ మేధా క్వాంటం టెక్నాలజీ పొందుపరుస్తున్నాం. త్వరలోనే విద్యార్థులకు కూడా ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని తీసుకురాబోతున్నాం. రూసానిధులతో ఐ రీసెర్చ్సెంటర్లు, 42 మంది అధ్యాపకులు వ్యక్తిగత ప్రాజెక్టులు,74 మంది ప్రాజెక్ట్ ఫెల్లోలుగా నియామకాలు చేశాం. కెహబ్లోనే త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. యూనివర్సిటీలో పరీ క్షల విభాగం మూల్యాంకనం ఆన్లైన్లో డిజిట లీకరణ, క్యాంపస్లో సీసీ కెమెరాలు, యూనివర్సిటీలో వసతుల కల్పనకు డిటైల్డ్ ప్రాజెక్టు రూపకల్పన చేసి సుమారు రూ. 400 కోట్ల మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. -
కాలువల్లోకి గోదావరి జలాలు
● ఎండిపోయే దశలో ఉన్న వరి పంటకు ఊపిరిలింగాలఘణపురం: అశ్వరావుపల్లి రిజర్వాయర్ నుంచి ఇటీవల ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేయడంతో తిరిగి మళ్లీ కాలువల్లోకి నీరు చేరింది. దీంతో పొట్టకొచ్చి ఎండిపోయే దశలో ఉన్న వరికి జీవం పోసినట్లైంది. ఈ నెల 27న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పొట్టకొచ్చిన పంట ఎండిపోతుంది సారూ’.. అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. అంతేకాకుండా వ్యవసాయశాఖ అధికారులు పంటలను పరిశీలించి ఏప్రిల్ రెండో వారం వరకు నీటిని విడుదల చేయాలని నివేదిక అందించారు. ఎమ్మెల్యే కడియం సంబంధిత నీటిపారుదల శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేసి ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేయడంతో 16 ఎల్ నుంచి నీరు నెల్లుట్ల, పటేల్గూడెం, లింగాలఘణపురం రైతుల పొలాలకు చేరుతోంది. దీంతో సుమారు వంద నుంచి 150 ఎకరాల పంటకు మేలు చేకూరనుంది. నీటి విడుదలకు సహకరించి పంటలు కాపాడేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే కడియంకు, ఏఈ కిషోర్కు రైతులు ధన్యవాదాలు తెలిపారు. -
సత్వరమే పరిష్కరించాలి
● అధికారులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశం ● ప్రజావాణిలో 232 దరఖాస్తుల స్వీకరణ జనగామ రూరల్: ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్తో కలిసి కలెక్టర్ వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలతో కలెక్టరేట్కు వచ్చిన ప్రజల నుంచి 232 అర్జీలు తీసుకున్నారు. సంబంధిత శాఖల అధికారులు వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తమ పరిధిలో ఉన్నవి గుర్తించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తులు కొన్ని ఇలా.. ● సంజయ్ నగర్కు చెందిన ఆర్.సరిత, 16వ వార్డులో పది సంవత్సరాలుగా కిరాయికి ఉంటున్నారని, తమకు ఎటువంటి ఇల్లు లేదని, ఖాళీ స్థలం ఉందని, ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో భాగంగా ఇంటికి వచ్చి ధ్రువీకరించారని, ఎల్1 జాబితాలో ఉండగా తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరారు. ● స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రానికి చెందిన గీతాదేవి రాథోడ్, 2019వ సంవత్సరంలో 623.25 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేయగా, ఇప్పుడు తమ కుటుంబ అవసరాల నిమిత్తం అమ్మకానికి చూడగా హౌస్ సైట్స్ అని చూపిస్తోందని, రిజిస్ట్రేషన్ కావడం లేదని విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలని వినతిపత్రం అందించారు. ● జఫర్గఢ్ మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన రంగు సారంగపాణి, కల్లుగీత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నానని, రాష్ట్ర ప్రభుత్వం 50 ఏళ్లు పైబడిన అందిస్తున్న రూ.2000 పింఛన్కు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని, పింఛన్ అందించి ఆదుకోవాలని కోరారు. ● నర్మెటలో మూడు సంవత్సరాలుగా గ్రామ కార్యదర్శిగా శ్రీధర్ అనే వ్యక్తి సొంతూరులోనే విధులు నిర్వహిస్తున్నారని, పంచాయతీరాజ్ శాఖ నిబంధనల ప్రకారం అది సరికాదని, ఉన్నతాధికారులు విచారణ జరిపి ఆయనపై చర్యలు తీసుకోవాలని నర్మెటకు చెందిన పులి రేణుక వినతి పత్రం అందించింది. -
రోడ్డు భద్రతా మార్గదర్శకాలను పాటించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: రోడ్డు భద్రత ప్రమాణాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి రహదారి భద్రతపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేషనల్ హైవేపై ఐఆర్సీ(ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్) నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. హైవేపై అనుమతి లేని హోర్డింగ్లు ఉండకూడదన్నారు. పట్టణంలో రోడ్లకు ఇరువైపులా ఎలాంటి అమ్మకాలు జరగకుండా, ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తకుండా, సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులు త్వరగా పూర్తి చేసి, అందులో అమ్మకాలు నిర్వహించుకునేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, ఆర్ ఆండ్బీ ఈఈ స్వరూప, ఆర్టీఓ శ్రీనివాస్ గౌడ్, ఎకై ్సజ్ అధికారి అనిత, ఈఈ పీఆర్ శ్రీనివాస రావు, డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు, ఆర్టీఏ మెంబర్ అభి గౌడ్, మున్సిపల్ కమిషనర్లు మహేశ్వర్ రెడ్డి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాల నియంత్రణపై విద్యా, వ్యవసాయ, ఎకై ్సజ్, పోలీసు, వైద్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణపై ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. -
అంబరాన్నంటిన ‘టెక్నోజిల్’ సంబురాలు
జనగామ: మండలంలోని యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం టెక్నోజిల్–2026 సంబురాలు అంబరాన్నంటాయి. టెక్నికల్ ఈవెంట్స్ ప్రాజెక్టు ఎక్స్పోలో పీపీటీ ప్రజెంటేషన్ను కళాశాల డైరెక్టర్ డాక్టర్ విజయ్పాల్రెడ్డి, ప్రిన్సిపాల్ చంద్రశేశేఖర్రెడ్డి వేడుకలను ప్రారంభించారు. డైరెక్టర్ విజయ్పాల్రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను కనుగొనే విధంగా గొప్ప ఆలోచనలు చేయాలన్నారు. ప్రిన్సిపాల్ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ చదువుకు తగిన ఫలితం దక్కేలా కష్టపడాలన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు టెక్నోజిల్లో భాగంగా ఫ్యాషన్ షో, నృత్యపోటీలతో సభికులను అలరించారు. గాయకులు ఎండీ హైమత్, మేఘనా నాయుడు ఆలపించిన పాటలు విద్యార్థుల్లో ఉత్తేజాన్ని నింపాయి. ప్రోగ్రాం కన్వీనర్ పీయూ అనిత, వంశీకృష్ణ, అమరేందర్, స్వప్న ఉన్నారు. -
ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి
● డీఈ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా స్టేషన్ఘన్పూర్: విద్యుత్ ఆర్టిజన్, అన్మ్యాన్డ్, పీస్రేట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ డివిజన్ జేఏసీ ఆధ్వర్యంలో ఘన్పూర్లోని ట్రాన్స్కో డీఈ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. జేఏసీ డివిజన్ చైర్మన్ పాశం రాజు, కోకన్వీనర్లు చెరిపెల్లి సురేష్, బదావత్ లక్ష్మణ్, ఉబ్బని వెంకన్న మాట్లాడారు.. ఏళ్ల తరబడి విద్యుత్ సంస్థలో ఆర్టిజన్, అన్మ్యాన్డ్ కార్మికులు శ్రమదోపిడీకి గురవుతూ దుర్భర జీవితాలు గడుపుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, యాజమాన్యం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్టిజన్ కార్మికుల సంఘం నాయకులు సురేష్, సరిత, డాన్ సురేష్, రమ్య, లత , షేక్ బాబా, రాజేందర్, సోమన్న, కృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
వందేమాతరం గీతాలాపన
జనగామ రూరల్: జాతీయ శక్తిని తెలియజేసిన గీతం వందేమాతరం అని ఏబీవీపీ ఆల్ స్టేట్ యూనివర్సిటీస్ ప్రముఖ్ అంబాల కిరణ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏకశిల డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో వందేమాతర గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ వందేమాతరం 150వ చారిత్రక ఘట్టానికి మనం సాక్షులుగా నిలిచామన్నారు. ఏబీవీపీ వరంగల్ విభాగ్ సంఘటన్ కార్యదర్శి పృథ్వీరాజ్, రిటైర్డ్ కల్నల్ భిక్షపతి, కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, హృతిక్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రైవింగ్లో అప్రమత్తత అవసరం
● ఉచిత కంటి పరీక్ష శిబిరంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్జనగామ: డ్రైవింగ్ చేసే సమయంలో డ్రైవర్లకు అప్రమత్తత, జాగ్రత్త అవసరమని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. పట్టణంలోని విజయ ఫంక్షన్ హాల్లో ‘అరైవ్–అలైవ్’(క్షేమంగా ఇంటికి చేరుకోండి) ప్రోగ్రాంలో భాగంగా శ్రీ సరోజినీ కంటి హాస్పిటల్, పోలీసు శాఖ సంయుక్తంగా ఆటో, క్యాబ్, బస్సు డ్రైవర్లకు నిర్వహించిన ఫాకో, లేజర్ సెంటర్ ఉచిత కంటి వైద్య శిబిరంలో డీసీపీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.. 40 ఏళ్లు దాటిన ప్రతీ డ్రైవర్ క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేసుకోవాలన్నారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ సీహెచ్ సృజన్ కుమార్ ఆధ్వర్యంలో వంద మందికి పైగా కంటి పరీక్షలు చేయగా, అవసరమైన వారికి ఉచితంగా కళ్ల అద్దాలను డీసీపీ చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు భరత్, చెన్నకేశవులు ఉన్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి స్టేషన్ఘన్పూర్: ప్రతీ ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రమాదాల నివారణకు పాటుపడాలని జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. స్టేషన్ఘన్పూర్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా సస్ట్రో ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ద్విచక్రవాహనదారులకు ఉచితంగా హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఘన్పూర్ సీఐ జి.వేణు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో డీసీపీ చేతుల మీదుగా 200 మందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిధిగా హాజరైన డీసీపీ మాట్లాడుతూ.. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు ఇతర ఫోర్వీలర్లలో వెళ్లేవారు సీటుబెల్టు ధరించాలని సూచించారు. అనంతరం పట్టణ కేంద్రంలో బైక్ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్ ఏసీపీ భీమ్శర్మ, ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్రా, సీఐ జి.వేణు, ఎస్ఐలు వినయ్కుమార్, రాజేష్, మనీషా, సస్ట్రో సంస్థ ప్రతినిధి సుబ్బారెడ్డి, పోలీసుసిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. 30జెజిఎన్052: 30ఎస్టీజీ052– జనగామలో శిబిరాన్ని ప్రారంభిస్తున్న డీసీపీ రాజమహేంద్ర నాయక్స్టేషన్ ఘన్ఫూర్లో బైక్ ర్యాలీలో డీసీపీ, ఏసీపీ, ట్రెయినీ ఐపీఎస్ తదితరులు -
అథ్లెటిక్స్ పోటీల క్యాలెండర్ సిద్ధం
● టీ అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి సారంగపాణి వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణలో 2026–27 సంవత్సరంలో నిర్వహించనున్న రాష్ట్ర, జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల క్యాలెండర్ను రూపొందించినట్లు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె సారంగపాణి పేర్కొన్నారు. హనుమకొండలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు స్టాన్లీజోన్స్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ..ప్రతిభ గల అథ్లెట్లను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అందించేందుకు తమ అసోసియేషన్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందన్నారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు మహిపాల్, మహిధర్, రత్నాకర్, నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కిషన్, చైర్మన్ గట్టు మహేష్బాబు, చీఫ్ కోచ్ ఎండీ గౌస్, సభ్యులు మనోజ్, సోమశేఖర్, ఆయా జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. రామప్పలో ఆస్ట్రియా దేశస్తుడు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆదివారం ఆస్ట్రియాకు చెందిన హరల్డ్ సీబాచర్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద అద్భుతంగా ఉందని కొనియాడారు. -
మిగిలింది ఒక్కరోజే..
ఆస్తి పన్ను చెల్లింపునకు రేపటి వరకు గడువుజనగామ: జనగామ మున్సిపాలిటీ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లను వందశాతం సాధించేందుకు అధికారులు వేగం పెంచారు. కలెక్టర్ సందీప్ సుకుమార్ ఝా ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో అన్ని విభాగాలు పన్నుల వేటలో నిమగ్నమయ్యాయి. తాజా డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం మొత్తం 15,847 అసెస్మెంట్లపై ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.6కోట్ల13లక్షల డిమాండ్ నమోదైంది. ఇందులో ప్రస్తుత డిమాండ్ రూ.3 కోట్ల70లక్షలు, పాత బకాయిల డిమాండ్ రూ.కోటి 35లక్షలు, పెనాల్టీలతో కలిపి వసూలు చేయాల్సిన మొత్తం భారీగానే ఉంది. పన్నుల కలెక్షన్ల కోసం ఇంకా ఒక్క రోజే మాత్రమే మిగిలి ఉంది. రూ.3.71 కోట్ల వసూళ్లు పురపాలికలో రూ.3 కోట్ల71లక్షల వసూళ్లు సాధించగా, ఇంకా రూ.2కోట్ల 42 లక్షల బ్యాలెన్స్ ఉంది. ఇప్పటి వరకు 60.47శాతం కలెక్షన్లు సాధించారు. ముఖ్యంగా రెసిడెన్షియల్ విభాగంలో 53.12శాతం, నాన్రెసిడెన్షియల్లో 64.87 శాతం, మిక్స్డ్ విభాగంలో 74.28శాతం కలెక్షన్ పూర్తి చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు వసూళ్ల వేట కమిషనర్ మహేశ్వర్రెడ్డి సూచనలతో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది పన్నుల వసూళ్ల కోసం ఇంటింటికీ పరుగులు పెడుతున్నారు. కమర్షియల్, డొమెస్టిక్ రెండు విభాగాల్లోనూ ప్రత్యేక దృష్టి సారించి ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమిస్తూ 100శాతం వసూళ్ల లక్ష్యంతో పనిచేస్తున్నారు. ప్రతి వార్డులో పెండింగ్ ఉన్న ప్రాపర్టీల జాబితా తయారు చేసి, డోర్ టు డోర్ వసూలు, నోటీసుల ఇష్యూ, డీఫాల్టర్లను గుర్తించే చర్యలు వేగవంతం చేశారు. ప్రభుత్వ శాఖలపై ప్రత్యేక దృష్టి అత్యంత కీలక అంశం గత కొన్నేళ్లుగా ప్రభుత్వ శాఖల పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ పెద్ద మొత్తంలో పెండింగ్లో ఉంది. ఈ శాఖలు చెల్లింపులు ఆలస్యం చేయడం వల్ల వసూళ్లపై గణనీయమైన ప్ర భావం పడుతోంది. దీనిని ప్రాధాన్యంగా తీసుకున్న కమిషనర్ మహేశ్వర్రెడ్డి స్వయంగా శాఖ లను సంప్రదిస్తూ, పెండింగ్ వివరాలను వివరిస్తూ వెంటనే చెల్లింపులు జరిపించాలని ఆదేశిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ట్యాక్స్ వసూలు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయగా, ఆ శాఖల ఉన్నతాధికారులను సంప్రదించి త్వరగా బకాయిలు క్లియర్ చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ శాఖల బకాయిలు మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, వసతి గృహాలు, పోలీస్ క్వార్టర్లు, విద్యుత్, అటవీ తదితర శాఖలు చెల్లించాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో అధికారులు ముందుకెళ్తున్నారు. మొత్తం రూ.88లక్షల27వేలు బకాయిలు ఉంది. ఆరోగ్య శాఖ, సివిల్ హాస్పిటల్ పరిధిలో ఆస్తులపై భారీ బకాయిలు రావాల్సి ఉండగా, పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్తోపాటు క్వార్టర్స్పై బకాయిలు ఉన్నాయి. విద్యుత్శాఖకు చెందిన క్వార్టర్స్పై పన్నులు పెండింగ్లో ఉన్నాయి. విద్యు త్, వ్యవసాయ మార్కెట్, సంబంధిత శాఖలు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్, ఫారెస్ట్ ఆఫీస్, నర్సరీ వంటి కార్యాలయాలు, పాల కేంద్రాలు, మిల్క్ చిల్లింగ్ సెంటర్, పోస్టాఫీస్ కలుపుకుని మొత్తం 81 ప్రభుత్వ శాఖలకు సంబంధించి పెండింగ్ బకాయిలు రావాల్సి ఉంది. మున్సిపల్ అధికారులు ఇప్పటికే సంబంధిత శాఖలకు ఎంత బకాయి ఉందనే సమాచారం ఇచ్చారు. సకాలంలో పన్నులు చెల్లించండి ప్రాపర్టీ ట్యాక్స్ మున్సిపాలిటీలో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో ప్రధాన ఆదాయ వనరు. ప్రతీ ఇంటి యజమాని, వ్యాపారవేత్త చెల్లించాల్సిందే. పెనాల్టీలు పెరగక ముందే పెండింగ్ క్లియర్ చేసుకోవాలి. వసూళ్ల డ్రైవ్ కొనసాగుతున్నందున రాబోయే రోజుల్లో కలెక్షన్ శాతం పెరుగుతుందనే నమ్మకం ఉంది. – మహేశ్వర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, జనగామ -
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి స్టేషన్ఘన్పూర్ : ప్రజలకు నిరంతరంగా నాణ్యమై న విద్యుత్ను అందించడమే లక్ష్యంగా విద్యుత్శా ఖ పనిచేస్తుందని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి అన్నారు. డివిజన్పరిధిలోని ఘన్పూర్ టౌన్ సెక్షన్లో ఉన్న మీదికొండ 33/11 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు 5 ఎంవీఏ పవన్ ట్రాన్స్ఫార్మర్ పీటీఆర్ను ఎస్ఈ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అమలు చేస్తున్న వేసవి వేసవి యాక్షన్ ప్లాన్ కింద మీదికొండ విద్యుత్ సబ్స్టేషన్లో అదనపు 5 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ పీటీఆర్ను విజయవంతంగా ఛార్జ్ చేసినట్లు తెలిపా రు. కొత్త ట్రాన్స్ఫార్మర్ చార్జింగ్ వల్ల లోడ్ పంపిణీ మెరుగుపడుతుందని, వేసవిలోనూ నిర్విఘ్నంగా నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమవుతుందన్నారు. వినియోగదారులు విద్యుత్ పరమైన సమస్యల కోసం సమీపంలోని విద్యుత్శాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు. టోల్ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయవచ్చని ఆయన సూచించారు. కార్యక్రమంలో డీఈ సారయ్య, ఏడీఈ రణధీర్రెడ్డి, ఏఈలు పి.శంకర్, కుమారస్వామి, ఫోర్మన్ రామాచారి, లైన్మన్ అల్లం సదన్, కాంట్రాక్టర్ అమరేందర్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణకు హెల్మెట్ తప్పనిసరి
● డీసీపీ రాజమహేంద్రనాయక్ బచ్చన్నపేట: ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయంలో హెల్మెట్ను తప్పకుండా ధరించాలని డీసీపీ రాజమహేంద్రనాయ క్, ఏఎస్పీ పండేరి నితిన్చేతన్లు అన్నారు. శనివారం రోడ్డు భద్రతా మా సోత్సవాల సందర్భంగా మండలకేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహ ప్రాంగణంలో సర్పంచ్ అల్వాల నర్సింగరావు అధ్యక్షతన వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరి ధరించాలని, కార్లలో ప్రయాణం చేసే సమయంలో విధిగా సీటు బెల్టు ధరించాలన్నా రు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులకు శిక్ష పడుతుందన్నారు. అనంతరం 100 మందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఐ అబ్బయ్య, ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్, ఎ స్సై నైనాల నరేష్, బాలకిషన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్ పరీక్షలను సజావుగా నిర్వహించాలి
కలెక్టర్ సందీప్కుమార్ ఝా స్టేషన్ఘన్పూర్: పదోతరగతి వార్షిక పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పరీక్షలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని స్టేషన్ఘన్పూర్, చాగల్లు జెడ్పీఎస్ఎస్లో నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలను శనివారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా సెంటర్లలో పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షల నిర్వహణ ఎలా ఉందని, ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారని,తదితర వివరాలను సంబంధిత అఽధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. -
జనగామ
రాజీమార్గమే రాజమార్గంIఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ జనగామ రూరల్: రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ అన్నా రు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం జిల్లా కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించారు. నాలు గు బెంచ్ల ద్వారా సమస్యలు పరిష్కరింగా మొదటి బెంచ్కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ, సభ్యులుగా సునీతరాణి వ్యవహరించారు. మొత్తం 1,508 కేసులు పరిష్కరించారు. కార్యక్రమంలో సివిల్ జడ్జిలు సుచరిత, శశి, సందీప్, తదితరులు పాల్గొన్నారు. -
మక్కల కొనుగోలు కేంద్రం సందర్శన
స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్లో మక్కలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులు పడుతున్న ఇబ్బందులు, తేమ, ఫంగస్ సాకుతో నిర్వాహకులు పెడుతున్న కొర్రీలపై ‘అమ్మబోతే కొర్రీ’ అనే శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనానికి మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ రంజిత్రెడ్డి స్పందించారు. ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డితో కలిసి మక్కల కొనుగో లు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్లో రాశులుగా ఉన్న మక్కలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడు తూ నిబంధనల మేరకు తేమశాతం తప్పనిసరిగా ఉండాలన్నా రు. అనంతరం మక్కల కొనుగోళ్లను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్య, మార్కెట్ సెక్రటరీ జన్ను భాస్కర్, కాంగ్రెస్ మండల పార్టీ అఽ ద్యక్షుడు జూలుకుంట్ల శిరీష్రెడ్డి, సెంటర్ నిర్వాహకుడు ఐత సంతోష్, రైతులు పాల్గొన్నారు. ఏఎంసీ కార్యదర్శిగా అంజిత్రావుజనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ ప్రత్యేక గ్రేడ్ కార్యదర్శిగా డి.అంజిత్రావును నియమిస్తూ వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ కె.సురేంద్ర మోహన్ (ఐఏఎస్) శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వరంగల్ ఏఎంసీ గ్రేడ్–2 కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనకు జనగామలో పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే ఖమ్మం డీఎంఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న కె.రామకృష్ణకు తాత్కాలిక బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మురుగు నీరు రిజర్వాయర్లోకి రావొద్దు
లింగాలఘణపురం: రిజర్వాయర్లోకి మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కాలువలను ఎక్కడపడితే అక్కడ తొలగించి నిబంధనలకు విరుద్ధంగా సాగునీటిని వాడుకోవద్దని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాలో పర్యటించిన సందర్భంగా మండలంలోని నవాబు పేట రిజర్వాయర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ సదానందం, పలువురు రైతులు మాట్లాడుతూ.. జనగామ పట్టణంలోని మురికి నీరంతా నెల్లుట్ల చెరువులోకి చేరుతోందని, అక్కడి నుంచి రిజర్వాయర్లోకి వదులుతున్నారని ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో వెంటనే ఆయన స్పందించి మురికి నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్కు సూచించారు. రిజర్వాయర్లతో సాగు విస్తీర్ణం ఎలా పెరిగింది..ప్రయోజనం పొందుతున్నారా..? అంటూ అడిగి తెలుసుకున్నారు. తూము వద్ద ధ్వంసమైన కాలువ మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఆయనతో పాటు కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఈఎన్సీ రమేశ్ బాబు, ఎస్ఈ సీతారాం, వరంగల్ సీఈ సుధీర్, ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్ అండాలు, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నీటిని వాడొద్దు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు -
మండుటెండల్లో చల్లటి ఉపశమనం
జనగామ: వేసవిలో దంచికొడుతున్న ఎండలు.. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రజల ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తీవ్రమైన వేడిలో ఉపశమనం కోసం ప్రజలు పుచ్చకాయలను కొనుగోలు చేస్తుండడంతో వాటికి డిమాండ్ పెరిగింది. జిల్లా కేంద్రంలోని పాతబీటు బజారు, హైదరాబాద్ రోడ్, ప్రధాన కూడళ్లలో పుచ్చ పండ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. డీ హైడ్రేషన్ దూరం.. ఒక్కో పుచ్చకాయ రూ.30 నుంచి రూ.40 వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ ప్రభావం పెరిగే కొద్దీ పుచ్చకాయల కొనుగోలు కూడా పెరుగుతోంది. వేడిలో దాహార్తిని తగ్గించడం, శరీరానికి తక్షణ శక్తినివ్వడంలో పుచ్చకాయలకు మించింది లేదు. తక్కువ ధర, ఎక్కువ నీటి శాతం కలిగి ఉండడంతో ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. వేసవిలో పుచ్చకాయలు సహజంగా డీహైడ్రేషన్ తగ్గిస్తాయి. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్, విటమిన్ ఏ, సీ, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని చ ల్లబరచడంతో పాటు డీహైడ్రేషన్ తగ్గిస్తాయి. పుచ్చకాయల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని తోటల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నా రు. పుచ్చకాయల విక్రయం ద్వారా వేసవిలో రైతులు, అమ్మకం దారులకు మంచి ఉపాధి లభిస్తోంది. పుచ్చకాయలకు ఫుల్ గిరాకీ డీహైడ్రేషన్ తగ్గించే సహజ ఫలం రైతులు, అమ్మకం దారులకు ఉపాధి -
పరిశ్రమలకు ఇంక్యుబేషన్.. నిట్ వరంగల్
కాజీపేట అర్బన్: పరిశ్రమలకు నూతన ఆవిష్కరణలు, ఆలోచనలను అందజేసేందుకు ఇంక్యుబేషన్లా నిట్ వరంగల్ నిలుస్తుందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో శుక్రవారం ఐఏఐసీ–26 (ఇండస్ట్రీ అకాడమీ ఇన్నోవేషన్ కాన్క్లేవ్) రీసెర్చ్ అండ్ ఇండస్ట్రీయల్ కన్సల్టెన్సీ, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సౌజన్యంతో నిర్వహించారు. ఐఏఐసీ–26 సమావేశానికి ముఖ్య అతిథిగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడుతూ నిట్ వరంగల్ ఇన్నోవేషన్ సెంటర్ వేదికగా నిలుస్తోందన్నారు. కాగా, ఐఏఐసీ–26 సమావేశంలో టెక్నాలజీ స్టాల్స్, ఇన్నోవేషన్, ఏఐ ఎగ్జిబిట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఫిలిప్స్ టౌన్సెండ్ అసోసియేషన్, ఎల్అండ్టీ అడ్వైజర్ వినాయక్ మరాఠే, ఎఎన్ఆర్ఎఫ్ సీఈఓ శివకుమార్, ఐఏఐసీ ప్రతినిధులు, నిట్ ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ఐఏఐసీ–26 సమావేశం ప్రారంభం -
మెరుగైన వైద్యం అందించాలి
పాలకుర్తి టౌన్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రతీ వైద్యుడి బాధ్యత అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని మందుల గది, ల్యాబ్, ఇన్పేషెంట్ విభాగం, స్టాక్ రిజిస్టర్, సిబ్బంది హాజరు రిజిష్టర్ను పరిశీలించారు. గ్యాస్ కొరతతో ఆసుపత్రికి వచ్చే రోగులకు అందించే భోజనం కట్టెల పొ య్యిపై చేయడాన్ని చూసిన కలెక్టర్ వెంటనే గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలని ఆధికారులను అదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన చికిత్స అందించాలని, నిర్లక్ష్యం అసలు సహించబోమని హెచ్చరించారు. చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు ప్రజలకు నమ్మకమైన సేవా కేంద్రాలుగా నిలవాలని సూచించారు. కలెక్టర్ వెంట డాక్టర్ శ్వేత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు నమ్మకమైన సేవా కేంద్రాలుగా నిలవాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి, గురుకులంలో తనిఖీమండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలోని వంటశాల, భోజనశాలను పరిశీలించారు. బియ్యం, పప్పులు, ఉల్లిగడ్డలు తదితర సరుకుల నాణ్యతను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు పోషకాహారం రుచిగా, సమయానికి అందించాలని సూచించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి పరీక్షలకు సన్నద్ధతపై ఆరా తీశారు. పాఠశాల ప్రిన్సిపాల్ స్వరూప, సిబ్బంది ఉన్నారు. -
అలరించిన సమ్మక్క–సారలమ్మ పద్యనాటకం
● ఘనంగా ప్రపంచ రంగస్థల దినోత్సవం హన్మకొండ కల్చరల్: ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకతీయ నాటక కళాపరిషత్ వరంగల్ వారి ఆధ్వర్యంలో అభినవ ఆంజనేయ బిరుదాంకితులు జమ్మలమడక కృష్ణమూర్తి స్మారకంగా నిర్వహించిన సమ్మక్క–సారలమ్మ పద్యనాటక ప్రదర్శన అలరించింది. ఈమేరకు శుక్రవారం పోతన పీఠంలో జరిగిన ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకలను యూత్కాంగ్రెస్ నాయకులు విష్ణురెడ్డి, వరంగల్ జిల్లా బీజేపీ నాయకులు గంటా రవికుమార్, సీనియర్ కళాకారులు తడకమల్ల రామచంద్రరావు, ఆకుల సదానందం, జేఎన్ శర్మ, నెరేళ్ల శోభావతి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రదర్శించిన సమ్మక్క సారలమ్మ పద్యనాటకం ప్రేక్షకులను అలరించింది. అనంతరం యోగా సాధకులు మినుపూరి సంధ్య, రాణి పాల్గొన్నారు. -
అమ్మబోతే కొర్రీ
స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఓడీసీఎంఎస్ ద్వారా ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రంలో సెంటర్ నిర్వాహకులు వివిధ కారణాలతో కొనుగోళ్లలో కొర్రీలు పెడుతుండగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ప్రస్తుత సీజన్కు గాను జిల్లాలో మొదటగా స్టేషన్ఘన్పూర్లో ఈనెల 23న మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. అయితే రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయవద్దని ప్రారంభోత్సవ సమావేశంలో స్వయంగా ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేసినప్పటికీ నిర్వాహకులు పెడచెవిన పెడుతున్నారు. రైతులు తీసుకొచ్చిన మక్కలకు నిబంధనల మేరకు తేమశాతం ఉన్నప్పటికీ ఫంగస్ ఉందని, నాణ్యత లేదంటూ పొంతన లేని కొర్రీలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇతర మండలాల నుంచి.. నియోజకవర్గంలోని వివిధ మండలాలతో పాటు పాలకుర్తి మండలం నుంచి సైతం రైతులు మక్కలు ఇక్కడి మార్కెట్కు తీసుకొస్తున్నారు. అయితే మక్కలు తీసుకొచ్చిన మూడు, నాలుగు రోజుల వరకూ కొనుగోళ్లు చేయకుండా తిరిగి తీసుకెళ్లాలంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. పేరుకే మార్క్ఫెడ్ అంటున్నారని, తీరా చూస్తే అంతా దోపిడీయే ఉందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం అని వస్తే పట్టించుకునేవారు లేరన్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా స్థానిక ఎమ్మెల్యే, అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఘన్పూర్ మార్క్ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యం తేమ, ఫంగస్ సాకుతో తిప్పి పంపిస్తున్నారు.. మూడు, నాలుగు రోజులైనా కొనకపోవడంతో రైతుల ఇక్కట్లు ప్రభుత్వ కేంద్రమని వస్తే ఇష్టారాజ్యం వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని అన్నదాతల డిమాండ్మాది పాలకుర్తి మండలం తీగారం గ్రామం. నాలుగు రోజుల క్రితం ముప్పై క్వింటాళ్ల మక్కలను మార్క్ఫెడ్ సెంటర్కు తీసుకువచ్చా. అయితే ఒకసారి తేమశాతం లేదని, మరోసారి ఫంగస్ అంటూ పొంతన లేని కొర్రీలతో ఇంతవరకూ కొనుగోలు చేయలేదు. తీరా ఇక్కడికి వస్తే బాగాలేవంటూ ఇంటికి తీసుకెళ్లమంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి న్యాయం చేయాలి. -
ఆలయాభివృద్ధికి రూ.2 లక్షల విరాళం
రఘునాథపల్లి: మండలంలోని శ్రీమన్నారాయణపురం గ్రామంలోని శ్రీమన్నారాయణమూర్తి ఆలయ పునఃనిర్మాణానికి వంశీ ఫౌండేషన్ చైర్మన్ కంచరకుంట్ల వంశీరెడ్డి శుక్రవారం రూ.2 లక్షల విరాళం అందజేశారు. గ్రామంలో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, సర్పంచ్ తూడి వెంకటేష్తో కలిసి పాల్గొని రూ.2 లక్షల చెక్కు అందజేశారు. ఆలయ పునః నిర్మాణానికి నిధులు సమకూర్చిన వంశీరెడ్డిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, సర్పంచ్తో పాటు గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గజ్జెల నాగేష్, కొమురాజి,వేణుమాధవ్, భిక్షపతి, యాదగిరి, అంజయ్య, మల్లయ్య, వీరస్వామి, జనార్దన్రెడ్డి పాల్గొన్నారు.అదుపుతప్పి.. దాణా లారీ బోల్తాజనగామ రూరల్: జనగామ–సిద్దిపేట రహదారి శామీర్పేట క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం ఓ దాణా లారీ బోల్తా పడి డ్రైవర్కు గాయాలయ్యాయి. షోలాపూర్ నుంచి ఏపీలోని రాజ మండ్రికి సోయాబిన్ పౌడర్ లోడ్తో వెళ్తున్న లారీ శామీర్పేట క్రాస్ వద్ద అదుపుతప్పి బో ల్తాపడింది. డ్రైవర్కు గాయాలు కాగా జనరల్ ఆసుపత్రికి తరలించారు. లారీలో రూ.5 లక్షలకు పైగా విలువ చేసే సరుకు ఉంది. నిత్యం ప్రమాదాలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే హైవే అధికారులు పట్టించుకోవాలని, ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. లారీ బోల్తా పడిన ప్రదేశాన్ని వారు పరిశీలించారు. మండల కార్యదర్శి బోడ నరేందర్, తాండ్ర ఆనందం, మల్లేష్, యాదగిరి, ప్రసాద్ తదితరులు ఉన్నారు. 176 స్లాట్లు.. 8:30 వరకు రిజిస్ట్రేషన్లుకాజీపేట అర్బన్: కాజీపేట వంద ఫీట్ల రోడ్డులోని వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శనివారం 176 స్లాట్ రిజిస్ట్రేషన్లను రాత్రి 8.30 నిమిషాల వరకు సబ్ రిజిస్ట్రార్లు పూర్తి చేయనున్నారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో శనివారం, సోమవారం, మంగళవారం మూడురోజుల పాటు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని పెంచేందుకు సబ్ రిజిస్ట్రార్ల పని వేళలు మారుస్తూ 11 గంటల పాటు రిజిస్ట్రేషన్లు కొనసాగేలా మార్పు చేసింది. ఇందులో భాగంగా.. సాధారణంగా ఉదయం 10.30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల పని వేళలను మారుస్తూ ఉదయం 9:30 నిమిషాల నుంచి రాత్రి 8.30 నిమిషాల వరకు నిర్ణయించింది. పస్తుతం మార్చిన స్లాట్స్లో భాగంగా 176 స్లాట్లకు అవకాశం కల్పించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదే తరహాగా పని వేళలు, స్లాట్ బుకింగ్లు కొనసాగనున్నాయి. 27హెచ్ఎమ్కెడి 306 – -
శ్రీభద్రకాళికి గులాబీపూలతో పుష్పార్చన
● ముగిసిన వసంత నవరాత్రోత్సవాలు హన్మకొండ కల్చరల్ : వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న వసంతనవరాత్రోత్సవాలు శుక్రవారం ముగిశాయి. చివరిరోజు అమ్మవారికి గులాబీపూలతో పుష్పార్చన నిర్వహించారు. ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అర్చకులు, వేదపాఠశాల విద్యార్థులు గులాబీపూలకు సంప్రోక్షణ జరిపి అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చనలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, వ్యవసాయ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని సందర్శించే భక్తులు ఎండతాకిడితో ఇబ్బంది పడకుండా శాశ్వత ప్రాతిపదికన జర్మన్ పెండల్స్ టెంట్లు వేయించాలని అందుకు ఆయ్యే ఖర్చు రూ.10లక్షలు విరాళంగా ఇస్తానని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. దీంతో ఆలయ ధర్మకర్తలు పది రోజుల్లో పనిపూర్తి చేయిస్తామని హామీ ఇవ్వడంతో టెంట్లు ఏర్పాటు పనులను పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. వరంగల్కు చెందిన బాకరాజు చంద్రశేఖర్రావు, రాజశ్రీ దంపతులు భక్తులు స్వయంగా కుంకుమార్చన జరుపుకోవడానికి వీలుగా పంచలోహలతో తయారుచేసిన అమ్మవారి పాదుకలను ఆలయానికి సమర్పించారు. రాత్రి దేవాలయంలో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. -
బీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ : బీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్.. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని ఆదేశించారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో బీసీ కమిషన్ విచారణ జరిపింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్పీడీసీఎల్లో చేపట్టిన నియామకాలు, రిజర్వేషన్ల అమలు, అభ్యర్థుల ఎంపికపై చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి విచారణ చేపట్టారు. ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా బీసీ సెల్ ఏర్పాటు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ముందుగా హెచ్ఆర్డీ డైరెక్టర్ సి.ప్రభాకర్, ఎన్పీడీసీఎల్లో అమలు చేస్తున్న రోస్టర్ పాయింట్, రిక్రూట్మెంట్, బ్యాక్ లాగ్ వెకెన్సీపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పని చేసే ఆన్ మ్యానన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ల గురించి సంస్థ ఆలోచించి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు వినూత్న సేవలు అందిస్తున్నామని, సాంకేతికతను అందిపుచ్చుకొని విద్యుత్ భద్రతాప్రమాణాలు పాటిస్తున్నామన్నారు. చీఫ్ ఇంజనీర్లు టి.తిరుమల్ రావు, మాధవరావు, జాయింట్ సెక్రటరీ కె.రమేశ్, జీఎంలు శ్రీనివాసరావు, ఎం.హేమంత్ కుమార్, బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడెపాక కుమార స్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు జి.బ్రహ్మేంద్రరావు, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు ఎన్.సదానందం, కార్యదర్శి నీలారపు రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఐలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా, తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ను నక్కలగుట్టలోని విద్యుత్ అతిథి గృహంలో హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. టీజీ ఎన్పీడీసీఎల్లో బీసీ సెల్ ఏర్పాటు చేయాలి తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ -
ఆర్టీసీ వరంగల్ ఆర్ఎంగా భవాని ప్రసాద్
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్గా ఎస్.భవాని ప్రసాద్ బదిలీపై వస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న దర్శనం విజయభానును అదిలాబాద్ రీజినల్ మేనేజర్గా బదిలీ చేయగా, ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్గా పనిచేస్తున్న భవాని ప్రసాద్ను వరంగల్ రీజినల్ మేనేజర్గా నియమిస్తూ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయభానుపై పలు ఆరోపణలు రావడంతో బదిలీ జరిగిందనే ప్రచారం ఆర్టీసీ వర్గాల్లో సాగుతోంది. యువతిని మోసం చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు వరంగల్ లీగల్ : ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన కేసులో నేరం రుజువుకావడంతో చెన్నారావుపేట మండలం జోజిపేటకు చెందిన నెలకంటి జోసెఫ్ తంబికి పదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ వరంగల్ జిల్లా మొదటి అదనపు కోర్టు జడ్జి జి.ప్రేమలతారెడ్డి గురువారం తీర్పు వెలువరించారు..ఖానాపురం మండలం మంగళవారిపేట గ్రామానికి చెందిన ఓ యువతి నర్సంపేటలోని సిద్ధార్థ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తన సోదరి ఊరైన చెన్నారావుపేట మండలం జోజిపేట గ్రామానికి వెళ్లిన వస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన జోసెఫ్ తంబితో పరిచయం ఏర్పడింది. నాలుగేళ్లు కొనసాగిన వారి స్నేహం ఆసరా చేసుకొని తనను ప్రేమిస్తున్నానని.. పెళ్లిచేసుకుంటానని నమ్మించిన జోసెఫ్ తంబి పలుమార్లు యువతిని లోబర్చుకున్నాడు. యువతి వివాహ విషయమై పలుమార్లు అడగగా జోసెఫ్ తంబి ఏదో కారణం చెప్పి తప్పించుకున్నాడు. ఖానాపురం పీఎస్లో సదరు యువతి ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. విచారణ లో నేరం రుజువైంది. -
కల్యాణం చూతము రారండి!
జనగామ: జిల్లా వ్యాప్తంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవాలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో అలంకరించిన ఆలయాలు, పుష్పాలతో మండపాలు, భక్తుల కోలాహలంతో జిల్లా పండగ వాతావరణంలో మునిగిపోయింది. లింగాల ఘణపురం మండలం జీడికల్ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, పాలకుర్తి మండలం వల్మిడి రామాలయం, చిల్పూరు మండలంలోని బుగులోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు జనగామ పట్టణంలోని పాతబీటు బజారు, బాణాపురం, ఆర్టీసీ బస్టాండు, గుండ్లగడ్డ శ్రీ ఉమామహేశ్వరస్వామి, శ్రీనగర్ కాలనీలోని సాయిరాం కన్వెన్షన్ హాల్లో ర ఘునాథపల్లి, స్టేషన్ఘన్పూర్, బచ్చన్నపేట, జఫర్గఢ్, నర్మెట, జనగామ మండలాల్లో ఏర్పాట్లు పూర్త య్యాయి. నేటి(శుక్రవారం)మధ్యాహ్నం 12 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా సీతారాముల కల్యాణం జరగనుంది. ఆధ్యాత్మిక ఉత్సాహం.. సీతారాముల కల్యాణ మహోత్సవం ప్రారంభ ఘట్టం భక్తులను ఆధ్యాత్మిక ఉత్సాహంతో నింపనుంది. రామయ్య కల్యాణం కనులారా వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. శాస్త్రోక్త పద్ధతుల్లో ఎదుర్కొళ్లు, మంగళాస్త్రం, తలాంబ్రాలు వంటి సంప్రదాయ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయాల కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. వల్మిడిలో వైభవంగా.. పాలకుర్తి టౌన్: వాల్మికి మహాముని నడియాడిన నేల, తెలంగాణలో రెండో భద్రాద్రిగా వెలుగొందుతున్న పాలకుర్తి మండలంలోని వల్మిడిలో శ్రీరామ నవమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించేందుకు దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. రాముని గుట్ట(క్షేత్రం)పై నిర్వహించే సీతారాములు కల్యాణానికి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. సీతారాముల కల్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు తెలిపారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి హాజరవుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు పాలకుర్తిలోని శ్రీసోమేశ్వర ఆలయం, పాటిమీద ఆంజనేయస్వామి ఆలయం, విస్నూరులో సీతారామచంద్రస్వామి కల్యాణానికి ఏర్పాటు చేశారు. శ్రీసీతారాముల వివాహ మహోత్సవానికి ఆలయాల ముస్తాబు ఆధ్యాత్మిక వైభవంగా కల్యాణ ఘట్టం జీడికల్, వల్మిడి, నవాబుపేట తదితర ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తిలింగాలఘణపురం: మండలంలోని పలు గ్రామాల్లో శ్రీరామనవమి ఉత్సవాలకు ఏర్పాట్లను సిద్ధం చేశారు. ముఖ్యంగా నవాబుపేట కోదండరామస్వామి, జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాలకు ఆలయాలను ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణం, కల్యాణ మండపాల్లో చలువపందిళ్లు ఏర్పాటు చేశారు. నవాబుపేట కోదండరామస్వామి ఆలయంలో ఈ నెల 19న బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం గరుడముద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గరుడముద్ద ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఈఓ లక్ష్మిప్రసన్న, సర్పంచ్ సదా నందం, వేదపండితులు లక్ష్మినర్సింహ్మచార్యులు, కృష్ణమూర్తి, భద్రినాథ్, విష్ణువర్ధన్, ఆలయ సిబ్బంది రాజేందర్రెడ్డి, అశోక్, రవితేజ, వసంత, రమేశ్,, ఎల్లగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వల్మిడి దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్గా పాలేపు సత్తయ్య
పాలకుర్తి టౌన్: మండలంలోని వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఉత్సవ కమిటీని నియమిస్తు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు గురువారం ఉత్వర్వులు జారీ చేశారు. జాతర బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు కమిటీ చైర్మన్గా పాలేపు సత్తయ్య, కమిటీ సభ్యులుగా వీరమల్ల రామకృష్ణ, నిమ్మల మంజుల, పిట్టల యాకయ్య, దండెంపల్లి నాగరాజు నియమితులయ్యారు. ఉత్సవ కమిటీ నియామకానికి కృషి చేసిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. జనగామ నుంచి వల్మిడికి ప్రత్యేక బస్సులుపాలకుర్తి టౌన్: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా మండలంలోని వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే కల్యాణ మహోత్సవానికి హాజరయ్యే భక్తుల కోసం శుక్రవారం జనగామ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ 30 నిమిషాలకు ఒక్క బస్సు సర్వీసు ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఈఓ కోరారు.జనగామ: హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక టీకా శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జునరావు తెలిపారు. గురువారం వైద్య ఆరోగ్యశాఖ, హజ్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన శిబిరంలో జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్లనున్న యాత్రికులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మా ట్లాడుతూ.. హజ్ యాత్ర సందర్భంగా భారీ జనసమ్మర్థం ఉండే నేపథ్యంలో సంక్రమణ వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు అవసరమైన జాగ్రత్తలను పాటించాలని సూచించారు. ప్రైవేట్ హాస్పిటళ్లపై విచారణ జరిపించాలిజనగామ: పట్టణంలో హన్మకొండ రోడ్డులోని లోటస్ హాస్పిటల్ భవనంతో పాటు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అనుమతులపై విచారణ చేయాలని 15వ వార్డు కౌన్సిలర్ మారబోయిన పాండు అగ్నిమాపక శాఖ జిల్లా అధికారికి గురువారం ఫిర్యాదు చేశారు. అగ్నిమాపక అనుమతులు, ఎమర్జెన్సీ ఎగ్జిట్, భవన అనుమతులపై పూర్తి సమాచారం ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు. అలాగే మెడికల్ కళాశాల, అనుబంధంగా ఉన్న ఎంసీహెచ్, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పనిచేస్తున్న వైద్యులు, ఫ్రొఫెసర్ల సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదని కోరుతూ వైద్యారో గ్య శాఖ మంత్రితో పాటు డీఎంఈకి ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల వచ్చిన తర్వాత, పట్టణంలో ప్రైవేటు హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయన్నారు. చిన్న పిల్లలకు పూర్తి స్థాయిలో వైద్యం అందించకుండా, హైదరాబాద్లాంటి కార్పోరేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారని మంత్రికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. -
బస్సుల కొరతతో ప్రజల ఇబ్బందులు
జనగామ: జనగామ నియోజకవర్గంలో నెలకొన్న రవాణా సమస్యలపై తక్షణం స్పందించి ప్రజలు పడుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. హైదరాబాద్లో మంత్రిని కలిసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో బస్సుల కొరతతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. చేర్యాల నుంచి జనగామకు వెళ్లే బస్సు సర్వీసు గతంలో బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి, కొన్నె మీదుగా నడిపించారన్నారు. ప్రస్తుతం రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో ఆ బస్సును నిలిపివేశారన్నారు. కొన్నె నుంచి వీరన్నపేట వయా నాగిరెడ్డిపల్లి వరకు బీటీ రోడ్ నిర్మాణం చేసి, బస్సు సర్వీసును పునరుద్ధరించాలని కోరినట్లు చెప్పారు. నాగిరెడ్డిపల్లి ప్రాంత విద్యార్థులు సిద్దిపేట జిల్లా చుంచునకోట హైస్కూల్కు వెళ్లి చదువు కోవడంతో లోకల్ నాన్ లోకల్ సమస్యలు ఎదుర్కొంటూ భవిష్యత్తులో విద్యా, ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్ నుంచి బచ్చన్నపేట వరకు మాత్రమే నడుస్తున్న బస్సును వట్టిపల్లి, సాల్వాపూర్, లింగంపల్లి, కొన్నె, ఇటికాలపల్లి, ప్రజ్ఞాపూర్ మీదుగా హైదరాబాద్ వరకు విస్తరించాలని సూచించినట్లు తెలిపారు. జగద్గిరిగుట్ట నుంచి బచ్చన్నపేట వరకు నడుస్తున్న బస్సును ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇటికాలపల్లి, రామచంద్రగూడెం, కొన్నె, లింగంపల్లి, సాల్వాపూర్, రాజపేట, యాదగిరిగుట్ట మార్గంగా విస్తరించా లని కోరినట్లు స్పష్టం చేశారు. బస్సు సర్వీసు సేవలకు సంబంధించి తక్షణమే చర్యలు తీసుకుంటా మని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్కు ఎమ్మెల్యే పల్లా వినతి -
పంచరాయి తండాకు ఉచిత విద్యుత్
జనగామ: ధర్తీ అభ జెన్ జాతీయ గ్రామీణ ఉత్కర్ష అభియాన్ (డీఏజేజీఏయూఏ) పథకం క్రింద జిల్లాలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వేగవంతమవుతోందని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని బోజ్యతండా గ్రామపంచాయతీ పరిధిలోని పంచరాయి తండా పాఠశాల ఏరియాలో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి, పాఠశాలకు ఉచిత విద్యుత్ మీట ర్ను అమర్చారు. డీఏ జేజీఏయూఏ పథకం ద్వారా జిల్లాలోని ఎస్టీ తండాల్లోని 800 కుటుంబాలకు ఉచిత విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 366 అంగన్వాడీ సెంటర్లకు గాను 50 కేంద్రాలకు ఇప్పటికే ఉచిత కనెక్షన్లు అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సుగుణభీమా, ఉపసర్పంచ్ కొముర, పాఠశాల చైర్మన్ రుక్కమ్మ, ప్రధానోపాధ్యాయురాలు సుమిత్ర, ఉపాధ్యాయుడు రాజేందర్, మాజీ ఎంపీటీసీ జుమీలాల్, వార్డ్మెంబర్లు, గ్రామస్థులతో పాటు విద్యుత్ శాఖ అధికారులు డివిజనల్ ఇంజనీర్ (టెక్నికల్) గడ్డం గణేష్, డివిజనల్ ఇంజనీర్ విజయ్ కుమార్, ఏడీఈ ఆకిటి స్వామిరెడ్డి, ఏడీఈ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మినీ టెక్స్టైల్ పార్క్కు నిధులు మంజూరు చేయండి
కొడకండ్ల: మండల కేంద్రంలో మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి చేనేత కార్మికుల సంక్షేమానికి బాసటగా నిలువాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి కోరారు. గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యే మినీ టెక్స్టైల్ పార్క్ అంశంపై మాట్లాడారు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిపాలన అనుమతులు లేకుండానే ఎన్నికల ముందు హడావిడిగా శంకుస్థాపన చేశారన్నారు. నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ఎంతో మంది చేనేత కార్మికులు ఉపాధి కోసం సూరత్కు వెళ్తారని, కొడకండ్ల, దేవరుప్పులలో ఎంతో మంది పద్మశాలీలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని మినీ టెక్స్టైల్ పార్క్తో స్థానికంగా ఉపాధి పొందే అవకాశం ఉంటుందన్నారు. ఇందుకుగాను మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు పరిపాలన అనుమతులు ఇచ్చి రూ.63 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
సైన్స్ విభాగాల్లో పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్
కేయూ క్యాంపస్ : కేయూలో సైన్స్ విభాగాల్లో 2026–2027 జనవరి సెషన్లో పీహెచ్డీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీచేసినట్లు సైన్స్ విభాగాల డీన్ జి. హనుమంతు గురువారం తెలిపారు. ఫెల్లోషిప్ అభ్యర్థులు యూజీసీ జేఆర్ఎఫ్, /సీఎస్ఐఆర్/ సీడ్/డీఈటీ/ ఎన్ఎఫ్పీడబ్ల్యూ డీ, డీఎస్టీ–ఇన్స్పైర్ లేదా ఫిప్, క్విప్ టీచర్ ఫెల్లోషిప్స్, అలాగే నెట్, గేట్, జిప్యాట్ కలిగిన అభ్యర్థులు ఈ పీహెచ్డీలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఏప్రిల్ 10వ తేదీ వరకు సైన్స్విభాగాల డీన్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాల్సింటుంది. వెకెన్సీలు ఇలా ఉన్నాయి. బయోకెమిస్ట్రీ 3, బ యోటెక్నాలజీ 4, బాటనీ 4, కెమిస్ట్రీ 4, కంప్యూటర్ సైన్స్ 5, జియాలజీ 1, మ్యాథ్మెటిక్స్ 9, మైక్రోబయాలజీ 6, ఫిజిక్స్ 6, జువాలజీ 13 సీట్లు వెకెన్సీలుగా ఉన్నాయని తెలిపారు. రేపటి నుంచి క్రీస్తుజ్యోతిలో టెక్నోజిల్జనగామ: మండలం యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 28వ తేదీ నుంచి టెక్నోజిల్–2026 వేడుకలు నిర్వహించనున్నట్లు క ళాశాల డైరెక్టర్ డి.విజయపాల్రెడ్డి తెలిపారు. గురువారం టెక్నోజిల్ పోస్టర్ను ఆవిష్కరించిన అనంత రం ఆయన మాట్లాడారు.. నాలుగు రోజులు పాటు జరిగే టెక్నోజిల్ వేడుకల్లో సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రిన్సిపాల్ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. చివరి రోజు 30వ తేదీ నిర్వహించే మెగా ఈవెంట్ లైవ్ మ్యూజిక్, ఫ్యాషన్ షో, ఇతర కళాశాలల ఆధ్వర్యంలో సాంస్కృతిక కా ర్యక్రమాలు ఉంటాయన్నారు. ఇందులో కార్యక్రమ కన్వీనర్ అనిత, కో కన్వీ నర్ అమరేందర్, వంశీక్రిష్ణ తదితరులు ఉన్నారు. -
క్రమశిక్షణతో చదివితే లక్ష్యానికి చేరువ
హన్మకొండ కల్చరల్ : విద్యార్థులు ప్రణాళికాప్రకారం క్రమశిక్షణతో చదివితే లక్ష్యానికి చేరుకుంటారని, చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేలా విషయ సేకరణ చేసి భద్రపరచాలని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ వెలుదండ నిత్యానందరావు అన్నారు. గురువారం వరంగల్ హంటర్ రోడ్డులోని జానపద గిరిజన విజ్ఞాన పీఠాన్ని సందర్శించారు. అనంతరం జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశానికి వీసీ నిత్యానందరావు, కేయూ విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ నిత్యానందరావు మాట్లాడుతూ గతంలో పీఠంలో జరిగిన పరిశోధనలు, పొందుపరిచిన పరిశోధనాంశాలను డిజిటలైజేషన్ చేయాలని, అందుకు సహకరిస్తానన్నారు. అనంతరం ఆచార్య అయిలయ్య.. విద్యార్థులకు భాషా ప్రావీణ్యంపై, సాహిత్యంపై అవగాహన కల్పించారు. పీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న మాట్లాడుతూ.. వీసీ నిత్యానందరావు విద్యార్థుల కోరిక మేరకు పీఠంలో తగిన సదుపాయాలు కల్పించారన్నారు. జూనియర్ అసిస్టెంట్ అమేర్ అలీఖాన్, పీఠం అసిస్టెంట్ ప్రాఫెసర్లు శ్రీమంతుల దామోదర్, బాసాని సురేశ్, చూరేపల్లి రవికుమార్, అబ్బు గోపాల్రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ గంపా సతీశ్, సిద్దోజు సునంద, గెస్ట్ లెక్చరర్ నోముల రాజు, సిబ్బంది ఆంజనేయులు, అశోక్ , సులోచన, కస్తూరి బాయి, పరిశోధకులు సోనబోయిన సతీశ్, శాంతి తదితరులు పాల్గొన్నారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వీసీ నిత్యానందరావు వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం సందర్శన -
రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలి..
లింగాలఘణపురం: రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండి ప్రయాణించాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ సూచించారు. గురువారం మండలంలోని వడిచర్లలో రోడ్డు భద్రతలో మూడో విడత కార్యక్రమంలో భాగంగా ఎస్సై శ్రావణ్కుమార్ ఆధ్వర్యంలో దాతల సహాయంతో వందకు పైగా హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ ముఖ్యఅతిథిగా పాల్గొని హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దన్నారు. అంతకు ముందు గ్రామంలో హెల్మెట్లు ధరించిన వాహనదారులతో భారీ ర్యాలీ తీశారు. కార్యక్రమంలో సర్పంచ్ కార్తీక్, వార్డు సభ్యులు, దాతలు పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి స్టేషన్ఘన్పూర్: ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు పాటుపడాలని ట్రెయినీ ఐపీఎస్ మనీషా నెహ్ర అన్నారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులో జాతీయ రహదారి పక్కన రోడ్డు ప్రమాదాల నివారణకు స్టేషన్ఘన్పూర్ పోలీసుశాఖ వారిచే హెచ్చరిక సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సీఐ జి.వేణు, ఎస్ఐ రాజేష్, కౌన్సిలర్లు పొన్న రాజేష్, బాలగాని అనీల్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ ఉచితంగా హెల్మెట్ల పంపిణీ -
గుండ్లగడ్డలో భారీ చోరీ
జనగామ: పట్టణంలోని గుండ్లగడ్డ కృష్ణబావి ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి జరిగిన భారీ చోరీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బంధువుల ఇంటికి వెళ్లిన కుటుంబాన్ని టార్గెట్గా చేసుకుని దొంగలు ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఘటన గురువారం వెలుగు చూసింది. సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లగడ్డకు చెందిన ఇంటి యజమాని వెంకటసాయిలు, ఆయన భార్య రమ ఈ నెల 25వ తేదీన మహబూబాబాద్ జిల్లా మేఘరాజుపల్లిలో బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమానికి వెళ్లారు. అదే రాత్రి సుమారు 2.30 గంటల సమయంలో సీసీ కెమెరా ఫుటేజ్లో కనిపించిన గుర్తు తెలియని వ్యక్తి ఇంటి ప్రధాన ద్వారం తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. అనంతరం బీరువాను ధ్వంసం చేసి అందులోని సుమారు 6 తులాల బంగారం, 10 తులాల వెండి, అలాగే రూ.25 వేల నగదు దొంగిలించి పరారయ్యాడు. గురువారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో కాలనీవాసులు అనుమానంతో వెంకటసాయిలుకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని చూసేసరికి బీరువాలోని ఆభరణాలు, నగదు కనిపించక పోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై భరత్తో కలిసి ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వేలిముద్ర నిపుణులు వచ్చి కీలక ఆధారాలను సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై భరత్ తెలిపారు. 6 తులాల బంగారం, 10 తులాల వెండి, నగదు అపహరణ తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం -
పొట్టకొచ్చిన పంట ఎండిపోతోంది సారూ..
లింగాలఘణపురం: ‘‘సారూ.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు.. పొట్టకొచ్చిన వరికి సాగునీరందించి ప్రాణం పోయండి.. చేతికొచ్చే దశలో ఉన్న వరి ఎండిపోతోంది..’’అని నెల్లుట్ల, పటేల్గూడెం రైతులు వేడుకుంటున్నారు. యాసంగిలో పొట్టదశలో ఉన్న వరికి కొన్ని గ్రామాల్లో సాగునీరు అందక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. 15 రోజులుగా అశ్వరావుపల్లి రిజర్వాయర్ 16 ఎల్ కాల్వ నుంచి వస్తున్న నీటితో నెల్లుట్ల, లింగాలఘణపురం, పటేల్గూడెం గ్రామాల్లోని రైతులకు మేలు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే మళ్లీ కాల్వ నీరు తగ్గడంతో పొట్టకొచ్చి ఈనె దశలో ఉన్న వరి ఎండిపోయే ప్రమాదం నెలకొంది. దీంతో నెల్లుట్ల, పటేల్గూడెం గ్రామాల పరిధిలో సుమారు వంద ఎకరాలకు పైగా ఎండిపోతోందని, సాగునీరు అందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. -
7 మెడికల్ షాపుల డ్రగ్ లైసెన్స్ల సస్పెన్షన్
జనగామ: జిల్లా వ్యాప్తంగా ఔషధ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న మెడికల్ షాపులపై అధికారుల తనిఖీలు వేగం పెరిగాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లా ఔషధ తనిఖీ అధికారి బాలకృష్ణ జిల్లాలోని పలు మండలాల్లో మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అపరిచిత వ్యక్తుల ద్వారా మత్తు అలవాటు కలిగించే మందుల అమ్మకాలు నిర్వహించగా, నియమాలు ఉల్లంఘించిన మెడికల్ దుకాణాలను సీజ్ చేశారు. అనంతరం సంబంధిత నివేదికలను వరంగల్ ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకులకు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా మత్తు పదార్థాలు అమ్మకాలు చేసిన ఔషధ వ్యాపారులకు నోటీసులు జారీ చేసి మెడికల్ దుకాణాల డ్రగ్ లైసెన్స్లను జనగామ అధికారి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. డ్రగ్ లైసెన్స్ రద్దు చేసిన సస్పెండ్ అయిన మెడికల్ దుకాణాలు ఆక్సిజన్ మెడికల్ స్టోర్స్, రఘునాథపల్లి(7 రోజులు), సాయితేజ మెడికల్ స్టోర్స్, రఘునాథపల్లి(7రోజులు), వాసవి మెడికల్ స్టోర్స్, రఘునాథపల్లి(7రోజులు) ఏ టు జెడ్ మెడికల్ స్టోర్స్, జనగామ(7రోజులు), సుమన మెడికల్ స్టోర్స్, జనగామ(7రోజులు), మారుతి మెడికల్ స్టోర్స్, లింగాలఘణపురం(5 రోజులు), శ్రీ మల్లికార్జున మెడికల్ ఏజెన్సీస్, జనగామ(2రోజులు) సీజ్ చేశారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని బాలకృష్ణ హెచ్చరించారు. 30న ఫుడ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా జనగామ రూరల్: రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ(ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా ఈనెల 30న కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు ఆహార భద్రత అధికారి సీహెచ్ వినీల్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆహార వ్యాపార నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రెన్యువల్ చేసుకోవాలని కోరారు. ఆహార భద్రత అధికారి: 7306335795.– గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్: 9985820544 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. -
తెలంగాణ రన్ పోస్టర్ ఆవిష్కరణ
జనగామ: తెలంగాణ రన్లో భాగంగా జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 5వ తేదీ ఉదయం 6 గంటలకు బతుకమ్మకుంట వద్ద నిర్వహించనున్న 2 కేఎం, 5 కేఎం, 10 కేఎం రన్ కార్యక్రమ పోస్టర్ను మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బా లమణి శ్రీనివాస్ గురువారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల్లో ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రోత్సహించేందుకు ఇలాంటి రన్లు ఎంతో ఉపయోగకరమని, భారీసంఖ్యలో ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కౌన్సిలర్ పాముకుంట్ల ప్రసాద్గౌడ్, రన్రేస్ డైరెక్టర్ వంగాల పురుషోత్తంరెడ్డి, వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు నారోజు రామేశ్వరచారి, పోచయ్య, కుమారస్వామి, నరేష్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
వేసవిలో జాగ్రత్తలు పాటించాలి
జనగామ రూరల్: వేసవి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. గురువారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. వడదెబ్బకు ఎలాంటి నష్టాలు కలగకుండా శాఖల వారీగా వారి పరిధిలో తీసుకోనున్న యాక్షన్ ప్లాన్ అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..విద్యార్థులకు, గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు, వడదెబ్బకు సంబంధించిన మందులను పంపిణీ చేయాలన్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్ల అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో కలిసి వాల్పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, ఏసీపీ పండరి చేతన్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి మలికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ‘సర్’ ప్రక్రియకు సహకారం అందించాలి.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) మ్యాపింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. మినీ కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమర్థవంతంగా డిజిటల్ పాలన.. జిల్లాలో డిజిటల్ పాలనను మరింత సమర్థమంతంగా అమలు చేసేందుకు గాను జిల్లా స్థాయి ఐటీ మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ఎన్ఐసీ హాల్లో జిల్లా స్థాయి ఐటీ మానిటరింగ్ సెల్ను అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి ప్రారంభించారు. ప్రధానంగా గ్యాస్ సరఫరా, ఇసుక తరలింపు, తాగునీటి సమస్యలపై వెంటనే స్పందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. సమస్యల పరిష్కారం కోసం 1800 425 6605 టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఫణి కుమార్, ఈడీఎం గౌతమ్, ఇతర సంబంధిత అధికారులు, ఐటీ సిబ్బంది పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడాలి.. మహిళలు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోని ఆర్థికంగా బలపడాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. మండలంలోని మరిగడి గ్రామంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలు లో మహిళలకు డ్రోన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నూరుద్దీన్, జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, డీపీఎం నలిని, నారాయణ, వ్యవసాయ అధికారులు శరత్ చంద్ర, విజయ రెడ్డి, మనోహిత్, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వైద్యులు అందుబాటులో ఉండాలి బచ్చన్నపేట: వైద్యులు అందుబాటులో ఉంటూ రోగులకు మనో ధైర్యం కల్పించాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీల సంఖ్యను పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి, తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది రిజిస్టర్, ఓపి రిజిస్టర్, పిల్లల వార్డు, ఇన్ పెషేంట్ వార్డులను, మందుల నిల్వలను పరిశీలించారు. అనంతరం మన్సాన్పల్లి, లింగంపల్లి, కొన్నె, రామచంద్రాపురం, ఇటికాలపల్లి గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, నాణ్యతాప్రమాణాలను తప్పకుండా పాటించాలని అధికారులకు సూచించారు. కొన్నె గ్రామంలో అక్రమంగా నడుస్తున్న హిటాచీని సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ మాతృనాయక్, సర్పంచ్లు కోడూరి స్వర్ణలత, గీస సందీప్, అల్వాల నర్సింగారావు , వైద్యులు, అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలి
స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ పథకంలో భాగంగా లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని గృహనిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్ అన్నారు. మండలంలోని ఇప్పగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ మందపురం రాణిఅనీల్గౌడ్ అధ్యక్షతన ఇందిరమ్మ లబ్ధిదారులతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పీడీ మాట్లాడారు.. లబ్ధిదారులుగా ఎంపికై ఇంతవరకూ పనులు ప్రారంభించని వారు వెంటనే పనులను చేపట్టాలన్నారు. లేనిపక్షంలో ఇళ్ల మంజూరు రద్దయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో హౌజింగ్ డీఈ చంద్రశేఖర్, ఏఈ అఖిల, ఉపసర్పంచ్ లింగనబోయిన రాజు పాల్గొన్నారు. హౌజింగ్ పీడీ మాతృనాయక్ -
పారదర్శకంగా ‘సర్’ ప్రక్రియ
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో తహసీల్దార్లకు, ట్రైనర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీఓలు గోపిరాం, వెంకన్న, తహసీల్దార్లు, ఎలక్షన్ డీటీ పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి.. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం పట్టణంలోని మైనారిటీ సంక్షేమ గురుకులాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. స్టాఫ్ రూమ్ను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు. అనంతరం శామీర్పేట్లోని ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. కార్యక్రమంలో విక్రమ్, హౌజింగ్ పీడీ మాతృ నాయక్ పాల్గొన్నారు.అసంపూర్తి ఇళ్ల నిర్మాణానికి నిధులివ్వండి● అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ: పట్టణంలోని అసంపూర్తి డబుల్ బెడ్రూం ఇళ్ల సమస్యపై బుధవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అసెంబ్లీలో గళం వినిపించారు. గతంలో నిర్మాణం ప్రారంభమైన ఇళ్లను పూర్తి చేయకుండా వదిలేయడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. పట్టణంలో నిర్మాణంలో ఉన్న 800 డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేసేందుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్లాబ్ దశలో నిలిచిపోయిన ఇళ్లను వెంటనే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎల్1, ఎల్3 జాబితాలపై స్పష్టత ఇవ్వాలన్నారు. అలాగే ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. బచ్చన్నపేట మండలం కేశిరెడ్డిపల్లి గ్రామంలో కొంతమంది ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉందని, ఎన్నికల ముందు ఇళ్ల పూర్తి కోసం ప్రక్రియ ప్రారంభమైనా మధ్యలోనే నిలిచిపోయిందన్నారు. లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి జనగామ రూరల్: లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ, న్యూఢిల్లీ తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు 28న(శనివారం) జిల్లా కోర్టులో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్లో కేసు దాఖలు చేసినప్పుడు కోర్టు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న కేసులు లోక్ అదాలత్లో పరిష్కరించబడినట్లయితే, వాస్తవానికి కోర్టులో చెల్లించిన కోర్టు రుసుం కూడా పార్టీలకు తిరిగి చెల్లించనున్నట్లు తెలిపారు. జనగామ: జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో దళిత నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎస్సీ కార్పొరేషన్ రాయితీపై అందిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంప్ కంట్రోల్ యూనిట్లకు భారీ స్పందన వచ్చిందని ఈడీ మాధవీ లత బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025–26 వార్షిక ప్రణాళికలో భాగంగా ఓబీఎంఎంఎస్ పోర్టల్ tgobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తుల స్వీకరణ వచ్చే నెల ఏప్రిల్ 2వ తేదీ వరకు పొడిగించడం జరిగిం దన్నారు. ఇప్పటివరకు ఈబీ టూ వీలర్లకు 299, గైడ్స్ కోసం 145, ప్యాసింజర్ 407, సోలార్ పంప్ కంట్రోల్ యూనిట్లు 33, మొత్తంగా 884 దరఖాస్తులు వచ్చినట్లు స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ఆన్న్లైన్లో సమర్పించిన తమ అప్లికేషన్కు సంబంధించిన అవసరమైన పత్రాలను కలెక్టరేట్లోని ఎఫ్–25 రూం నంబర్లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలన్నారు. సిద్ధేశ్వరాలయ హుండీ ఆదాయం రూ.3.59లక్షలుబచ్చన్నపేట: మండలంలోని కొడవటూర్ స్వయంభు శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 3,59,197లు వచ్చినట్లు ఆలయ ఈఓ చిందం వంశీ తెలిపారు. బుధవారం హుండీ లెక్కింపు అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2026 జనవరి 4 నుంచి మార్చి 24వరకు భక్తులు హుండీలో సమర్పించిన 80 రోజుల కానుకల ఆదాయాన్ని ఆలయ మండపంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భువనగిరి ఇన్స్పెక్టర్ నిఖిల్ పర్యవేక్షణలో లెక్కించామన్నారు. ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని కోరారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి ఓం నమశివాయ, సర్పంచ్ నీల కవితమురళి, ఉప సర్పంచ్ గంగం దయాకర్ రెడ్డి, మాజీ డైరెక్టర్ నిమ్మ కరుణాకర్రెడ్డి, అర్చకులు, ఆలయ సిబ్బంది, మహబూబాబాద్ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
డబ్బులు దోచేసినోళ్లను పట్టుకోండి
జనగామ: గ్రామైఖ్య సంఘాల ద్వారా బ్యాంకు నుంచి రుణం తీసుకుని వాయిదాల పద్ధతిలో చెల్లించినా నోటీసులు తప్పడం లేదని జనగామ మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన 30 గ్రూపులకు చెందిన సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రుణం చెల్లించాలని బ్యాంకు నుంచి వచ్చిన నోటీసులతో బుధవారం పురపాలిక కార్యాలయ ఆవరణలో ఉన్న ఎస్బీఐకి వచ్చి మోసపోయిన విషయం అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు విలేకరులతో మాట్లాడారు.. సారూ.. సీఏ ద్వారా మినీ బ్యాంకు నిర్వాహకులకు రుణం డబ్బులు చెల్లిస్తే.. బ్యాంకులో జమ చేయలేదని వాపోయారు. సాయిబాబా గ్రామైఖ్య సంఘంలో 36 గ్రూపులు ఉండగా, ఇందులో 30 గ్రూపులకు సంబంధించి రుణం రూ.86లక్షలు ఉండగా, 95శాతం మేర 2022 ఫిబ్రవరిలో క్లోజ్ చేసినట్లు చెప్పారు. సీఏ ద్వారా మినీ బ్యాంకు నిర్వాహకురాలు కలిసి తమ డబ్బులు బ్యాంకులో జమ చేయలేదన్నారు. దీంతో 2023లో రుణం డబ్బులు కట్టాలని బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో ఇద్దరి కుంభకోణం వెలుగు చూసిందన్నారు. అప్పటి ఉంచి నేటి వరకు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామన్నారు. 2026 మార్చి చివరి అవకాశం నేపథ్యంలో రుణం డబ్బులు చెల్లించాలని మరోసారి నోటీసులు ఇచ్చారని గ్రామైఖ్య సంఘం కార్యదర్శి నూనెముంతల వనితతో పాటు వందలాదిగా వచ్చిన మహిళా సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మినీ బ్యాంకులో డబ్బులు చెల్లించే సమమంలో తమకు ఇచ్చిన కౌంటర్ ఫైల్లో కనీసం స్టాంపు కూడా లేదని, దీనిపై విచారణ చేయాలని గత ఐదేళ్లుగా తిరుగుతున్నామన్నారు. కొత్త వచ్చిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు సైతం వినతి చేశామన్నారు. మహిళా సంఘాలను మోసం చేసి, తాము ఇచ్చిన డబ్బులను బ్యాంకులో జమ చేయకుండా పరారీలో ఉన్న ఇద్దరు వ్యక్తుల ఆస్తులను అటాచ్ చేసి, తమకు ఈ బాధ నుంచి విముక్తి కలిగించాలని వేడుకున్నారు. బ్యాంకు నుంచి నోటీసులు ఇస్తున్నారు.. 2022 నుంచి మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదు.. వెంకిర్యాల మహిళా సంఘాల సభ్యుల నిరసన -
మహిళా చేనేత కార్మికులకు నైపుణ్య శిక్షణ
జనగామ: మహిళా సాధికారతకు, చేనేత రంగానికి నూతన ఉత్సాహం నింపాలనే లక్ష్యంతో, జెన్పాక్ట్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) మద్దతుతో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహిస్తున్న జి–సఖీ ఇక్కత్ వీవర్స్ ప్రాజెక్ట్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రాంతీయ మహిళలకు కొన్ని నెలలుగా ప్రీ–లూమ్, లూమ్ విభాగాలలో నైపుణ్య శిక్షణ అందించగా, ఇప్పటి వరకు 70 మంది మహిళలు శిక్షణ పూర్తి చేశారు. అదనంగా, 30 మంది మహిళలకు ఆధునిక మోదా పెడల్ లిఫ్టింగ్ యంత్రాలను పంపిణీ చేశారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో పల్లె సృజన ఫౌండర్ బ్రిగేడియర్ గణేశం మాట్లాడుతూ.. చిన్న ఆలోచనకు సరైన మద్దతు లభిస్తే ప్రజలకు అవసరపడే సేవాత్మక ప్రాజెక్ట్గా రూపుదిద్దుకుంటుందో జి–సఖీ కార్యక్రమం నిరూపించిందన్నారు. ప్రఖ్యాత చేనేత నిపుణుడు చింతకింది మల్లేశం మాట్లాడుతూ.. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా మహిళలకు లభిస్తున్న ప్రయోజనాలు జీవితంలో అవసరపడుతాయన్నారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మోదా యంత్రం రూపకర్త శివకుమార్, జనగామ చేనేత, జౌళీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చౌడేశ్వరి, జెన్పాక్ట్ లీడర్షిప్ టీమ్ సభ్యులు లతీష్, అపర్ణ పాథక్, అజిత్ చౌహాన్, రాధాకృష్ణ, సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
భయంతోనే బారులు!
అవసరానికి మించి పెట్రోల్ కొనుగోళ్లు జనగామ: జిల్లా వ్యాప్తంగా పెట్రోలు బంకుల్లో పెరుగుతున్న రద్దీతో వినియోగదారుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితులు భారత ఇంధన సరఫరాపై ప్రభావం చూపవచ్చనే వార్తలు బయటకు రావడంతో, సాధారణంగా రోజువారీ అవసరం మేరకు ఇంధనం నింపుకునే వాహనదారులు ఇప్పుడు ముందస్తు భయంతో అడ్వాన్స్గా పెట్రోలు కొనుగోలు చేస్తున్నారు. రవాణా రంగంతో పాటు వ్యక్తిగత వాహన యజమానులు కూడా అవసరానికి మించి పెట్రోల్ కొనుగోలు చేయడం వల్ల జిల్లాలోని పలు బంకుల్లో స్టాక్ తగ్గిపోయి, కొన్నిచోట్ల తాత్కాలికంగా బంకులు మూతపడే పరిస్థితి ఏర్పడింది. అదనంగా కొనుగోలు.. సాధారణంగా రోజుకు ఒకసారి మాత్రమే ఇంధనం తీసుకునే వినియోగదారులు ఇప్పుడు రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా పెట్రోలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో బంకుల్లో ఉన్న రెగ్యులర్ స్టాక్ గంటల వ్యవధిలోనే కొనుగోలు పేరిట ఆవిరైపోతోంది. జిల్లా వ్యాప్తంగా ఇండియన్, భారత్, హెచ్పీ ఎస్ఆర్.. తదితర కంపెనీలకు చెందిన 97 బంకులు ఉన్నాయి. వీటిల్లో సాధారణంగా రోజువారీగా లక్ష లీటర్లకు పైగా పెట్రోల్ అమ్మకం జరుగుతుంది. అయితే ప్రస్తుతం డిమాండ్ 20 నుంచి 30 శాతం వరకు పెరిగినట్లు అధికారులు బంకు నిర్వాహకులు చెబుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లోని బంకుల్లో అధిక రద్దీ కనిపిస్తోంది. ఉదయం మొదలైన క్యూలైన్లు రాత్రి 10 నుంచి 11 గంటల వరకూ కొనసాగుతోంది. రద్దీ భయంతో మెజార్టీ కస్టమర్లు ముందస్తుగా పెట్రోలు నింపుకోవడానికి బంకుల వద్ద నిరీక్షిస్తున్నారు. మండలాల వారీగా.. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో 11 పెట్రోల్ బంకులు ఉండగా, తాటికొండ, ఇప్పగూడెంలోని మూడు బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. బచ్చన్నపేట మండలంలో ఐదు పెట్రోల్ బంకుల్లో రెండింట్లో పెట్రోల్ క్లోజ్ అయింది. జఫర్గఢ్ మండలంలో మూడు బంకులకు గాను రెండు బంకుల పరిధిలో నో స్టాక్ బోర్డు పెట్టారు. నర్మెట మండలంలోని మూడు బంకుల్లో నిల్వలు క్లోజ్ కావడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. దేవరుప్పుల మండలంలో ఆరు బంకులకుగాను రెండింట్లో పెట్రోలు లేకపోవడంతో మూసివేశారు. పాలకుర్తి లో ఒకే ఒక్క బంకులో నోస్టాక్ ఉంది. ఇంధన సరఫరాపై ప్రభావం పడొచ్చనే ఆందోళనే కారణం.. కొరత లేదు.. ఆందోళన వద్దు: ప్రభుత్వం అడ్వాన్స్ కొనుగోళ్లతో కొరత: బంకుల యజమానులు ఇంధన సరఫరాలో అంతరాయం లేదని చమురు కంపెనీలు కూడా స్పష్టం చేస్తున్నాయి. అడ్వాన్స్ కొనుగోళ్లతో కొరత ఏర్పడిందే తప్ప, పెట్రోల్ కొరత లేదని ప్రభు త్వం, అధికారులు చెబుతున్నారు. అవసరానికి మించిన కొనుగోళ్లు చేయకుండా ప్రజలు సహకరిస్తే జిల్లా వ్యాప్తంగా పరిస్థితి యథాస్థితికి చేరుకుంటుందని అంటున్నారు. ప్రస్తుతం బంకుల్లో కనిపిస్తున్న రద్దీ పూర్తిగా ప్రజల ఆందోళనతోనే పెరిగిందని, సరఫరా వ్యవస్థ సాధారణంగా కొనసాగుతోందని సంబంధిత శాఖలు చెబుతున్నాయి. -
పొట్టకొట్టిన..బండ కొరత!
జనగామ: జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా 13 రోజులుగా నిలిచిపోవడంతో హోటల్ రంగం పూర్తిగా కుదేలైపోతోంది. జిల్లాలోని టిఫిన్ సెంటర్లు, భోజనశాలలు, బిర్యానీ సెంటర్లు, డాబా, టీకొట్లు, ఫాస్ట్ఫుడ్ పాయింట్లు తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. గ్యాస్ లేక 10 నుంచి 25 హోటళ్లు పూర్తిగా మూతపడగా, మరో 70 హోటళ్లు సగం పూట మాత్రమే నడుస్తున్నాయి. వందలాది మంది వలస కార్మికుల్లో సగంమేర ఇప్పటికే ఉపాధి కోల్పోయి కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కట్టెల ధరలు క్వింటాల్కు రూ.600 నుంచి రూ.800లకు పెరిగి, మరికొన్ని రోజుల్లో రూ.వేయి దాటనున్నాయని హోటల్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా కమర్షియల్ గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో హోటళ్ల ఆధారంగా జీవనం సాగించే వందలాది కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. 450 హోటల్స్కు పైగా.. జిల్లాలో సుమారు 450 వరకు టిఫిన్ సెంటర్లు, భోజనశాలలు, బిర్యానీ సెంటర్లు, టీషాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు, మద్యం సిట్టింగ్లతో పాటు ఇతర తినుబండారాల హోటళ్లు ఉన్నాయి. వీటిలో బీహర్, ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ నిలిపివేతతో వీరి జీవనోపాధి దెబ్బతింది. ఫుడ్ ఐటెంలలో కోత.. సగం పూట నడుస్తున్న హోటళ్లలో దోశ, వడ, ఇడ్లీ, బోండా వంటి నిత్యాహార వంటకాలపై కూడా సగం కోత విధించారు. మిగతా ఐటమ్స్ను కొందరు కట్టెల పొయ్యిలతో, మరికొందరు ఇళ్లలో తాత్కాలిక ఏర్పాట్లతో చేసి విక్రయిస్తున్నారు. అయినప్పటికీ నష్టాలు భారీగానే ఉంటున్నాయని హోటల్ యజమానులు చెబుతున్నారు. గ్యాస్ కొరత ప్రభావంతో కట్టెల ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం క్వింటాల్కు రూ.600కు లభించే కట్టెలు రూ.800కు అమ్ముతున్నారు. ఇదే పరిస్థితి ఇలానే కొనసాగితే క్వింటాల్ కట్టెల ధర రూ.1,000 దాటడం ఖాయమని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొన్నిచోట్ల తాత్కాలికంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్లతో హోటళ్లు నడిపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, పెద్దగా ప్రయోజనం లేకపోతోంది. యుద్ధ ప్రభావంతో హోటళ్లపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న వందలాది కుటుంబాలు ఆర్థిక సంక్షోభం దిశగా సాగుతున్నాయి. గ్యాస్ అందుబాటులోకి రాకపోతే తమ ఆర్థిక పరిస్థితులు మరింత క్షీణించి పోతాయని హోటల్ యజమానులు వాపోతున్నారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరాలేక సంక్షోభంలో హోటల్ రంగం మూతబడుతున్న టీ, టిఫిన్ సెంటర్లు దోశ, వడ, ఇడ్లీ, బోండా వంటి ఐటెమ్లలో సగం కోత వందలాది కార్మికుల ఉపాధిపై దెబ్బ.. స్వరాష్ట్రాలకు పయనం కొన్నిచోట్ల కట్టెల పొయ్యితో వంటకాల తయారీమూతబడ్డ హోటల్స్ కమర్షియల్ గ్యాస్ సప్లై నిలిచిపోవడంతో జిల్లా కేంద్రంలో 10 నుంచి 25 హోటళ్లు పూర్తిగా మూతపడగా, మరో 70 హోటళ్లు కేవలం సగం పూట మాత్రమే నడుస్తున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 250 మంది కార్మికులతో పాటు స్థానికంగా పనిచేస్తున్న పలువురు ప్రత్యామ్నాయంగా రోజువారీ కూలీ పనులకు వెళ్లే పరిస్థితికి నెలకొంది. హోటల్స్ ప్రభావం కిరాణా, ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసులు, వాటర్ప్లాంట్లు, కూరగాయల వ్యాపారాలపై సైతం దీని ప్రభావం ఎక్కువగానే పడుతోంది.సగంపూటే నడిపిస్తున్నారు..పక్క ఫొటోలో కనిపిస్తున్న హోటల్ యజమాని పేరు బొబ్బిశెట్టి రాజశేఖర్. జనగామ పట్టణం రైల్వేస్టేషన్ రోడ్డులో ఎస్ఆర్ టిఫిన్ సెంటర్ నడిపిస్తున్నాడు. నిత్యం తెల్లవారుజాము 6 గంటలకు తెరుచుకుని రాత్రి 11 గంటలకు నడిపేవారు. ఇందులో కుటుంబ సభ్యులతో పాటు ఆరుగురు ఇతర రాష్ట్రాలు, జిల్లా కేంద్రానికి చెందిన ఆరుగురు కార్మికులు పనిచేస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడడంతో సగంపూట హోటల్ మాత్రమే నడిపిస్తున్నారు. దీంతో ముగ్గురు జార్ఖండ్కు చెందిన కార్మికులు వెళ్లిపోగా, ఉన్న వారికి సగం వేతనం మాత్రమే ఇస్తున్నారు. -
సర్కారు దవాఖానాలో కంటి శస్త్రచికిత్సలు
● సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో సేవల పునరుద్ధరణ జనగామ: ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కంటి శుక్లాల ఉచిత శస్త్ర చికిత్సలు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మళ్లీ ప్రారంభమయ్యాయి. మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్, కంటి వైద్య నిపుణులు రాజలింగం ఆధ్వర్యంలో ఈ విభాగం యాక్టివ్గా పనిచేసేందుకు శ్రీకారం చుట్టారు. జిల్లా ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ను ఆధునికీకరించడం, అవసరమైన పరికరాలను కొత్తగా సమకూర్చడం, శుభ్రత, సురక్షిత ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయడం వంటి చర్యలను చేపట్టారు. ఈ నేపథ్యంలో డాక్టర్ రాజలింగం బృందం స్వయంగా మూడు కంటి శుక్లాల శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాల ప్రయోజనంగా ఉచితంగా అందిస్తున్న ఈ శస్త్ర చికిత్సలు ప్రతీ మంగళవారం, శుక్రవారం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఆసుపత్రి అందిస్తున్న నాణ్యమైన కంటి సేవలతో ప్రయోజనం పొందాలని కోరారు. -
రైతులు ఇబ్బందులు పడొద్దు
జనగామ రూరల్: యాసంగి సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు నిర్వహణ ప్రక్రియ సజావుగా జరగాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై వ్యవసాయ, మార్కెట్, రవాణా, గ్రామీణాభివృద్ధి, కో–ఆపరేటివ్, తదితర శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాలకు వచ్చే ధాన్యం కొనుగోళ్లు పక్కాగా జరగాలన్నారు. ఏ రోజు వచ్చే ధాన్యం అదే రోజు కొనుగోలు చేసి ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. టార్పాలిన్లు, ధాన్యం శుద్ధి చేసే యంత్రాలు, గన్నీ సంచులు, వెయింగ్ మెషీన్లు తదితర పరికరాలు అన్నీ కొనుగోలు కేంద్రాల్లో సరిపడా అందుబాటులో ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఓ వసంత, జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ, డీఎం సీఎస్ హతీరాం, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జనాభా లెక్కింపు ప్రక్రియపై అవగాహన ఉండాలి జనాభా లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. జనగణన 2027 ఫేజ్ 1 గృహాల జాబితా, గృహ గణన నిర్వహణలో భాగంగా నూతనంగా ఎంపికై న టెక్నికల్ అసిస్టెంట్లు, జనాభా లెక్కల ఛార్జ్ క్లర్క్లకు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఓ చినకోట్యా నాయక్, జేడీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టిదేవరుప్పుల: విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మంగళవారం మండలంలోని పెద్దమడ్డూర్ హైస్కూల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు, మధ్యాహ్న భోజన సరుకుల నిల్వ రిజిస్టర్లు, అకౌంట్ రికార్డులతోపాటు గదుల్లో ఉన్న సామగ్రిని పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతీ రోజు విద్యా ర్థుల కు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించాల న్నారు. విద్యార్థులతో రాగి జావ ఎలా ఉంది? అని అడగ్గా విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. పరిశీలనలో హెచ్ఎం అశోక్, ఉపాధ్యాయులు ఉన్నారు. -
ఫోన్ పోతే పోర్టల్లో నమోదు చేసుకోవాలి
● డీసీపీ రాజమహేంద్ర నాయక్ జనగామ రూరల్: సెల్ఫోన్ పోతే పోర్టల్లో నమోదు చేసుకోవాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో క్రైం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలో మొబైల్ ఫోన్లు కోల్పోయిన బాధితులకు అందజేశారు. సీఈఐఆర్ పోర్టల్ను వినియోగించి, పోయిన, దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను సమర్థవంతంగా ట్రేస్ చేసి అందించవచ్చన్నారు. ఈ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లను ట్రాక్ చేయడం సులభమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో వివిధ మండలాల ఎస్ఐలు, పొలీసు అధికారులు పాల్గొన్నారు. -
జనగామ
బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 20267బ్రహ్మోత్సవాలకు ముస్తాబు పాలకుర్తి టౌన్: మండలంలోని వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయం ఈనెల 27న జరగనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.పక్కాగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలి ● సమీక్షలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
పునర్విభజనలో మరో తొమ్మిది!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్లీ చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభనకు సోమవారం కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన బిల్లు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. మహిళలకు రిజర్వేషన్లు, డీలిమిటేషన్ చట్టాలకు సవరణ చేయనుందని ప్రకటించారు. ఆ వెనువెంటనే డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేసి సీట్ల పెంపు కార్యక్రమాన్ని పూర్తి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్లో పెరిగే కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలపై చర్చ జరుగుతోంది. పునర్విభజన జరిగితే ఉమ్మడి వరంగల్లో కొత్తగా దాదాపుగా 9 నియోజకవర్గాలు ఏర్పడనునున్నాయి. దీంతో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 21కి చేరనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నిబంధనల ప్రకారం 2021లో జరగాల్సి ఉండగా.. జనగణన ఆలస్యం కారణంగా నిలిచిపోయింది. కేంద్రం మళ్లీ జనగణనకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అది పూర్తికాగానే నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. కొత్తగా తొమ్మిది పెరిగే అవకాశం.. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం 2008 చివరలో నియోజక వర్గాలను పునర్ వ్యవస్థీకరించారు. అంతకు ముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 నియోజకవర్గాలు ఉండేవి. 2008 పునర్విభజన తర్వాత ఒక్కటి పెరిగి ఆ సంఖ్య 12 నియోజకవర్గాలకు చేరింది. ప్రస్తుతం హనుమకొండ జిల్లాలో రెండు (వరంగల్ పశ్చిమ, పరకాల), వరంగల్లో మూడు (వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట), జనగామలో మూడు (జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి), మ హబూబాబాద్లో రెండు (మహబూబాబాద్, డోర్నకల్), జేఎస్ భూపాపల్లిలో ఒకటి (భూపాలపల్లి), ములుగులో ఒకటి (ములుగు)లు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో దాదాపు 35.12 లక్షలున్న జనాభా.. ప్రస్తుతం అది 41.50 లక్షలు దాటి ఉంటుందని అంచనా. జనగణన పూర్తయితే 2027 జనాభా ప్రకారం పునర్విభజనలో ఉమ్మడి జిల్లాలో దాదాపు తొమ్మిది కొత్త నియోజకవర్గాలు రానున్నాయి. దాంతో మొత్తం నియోజకవర్గాల సంఖ్య 21కి పెరిగే అవకాశం ఉంది. ‘ఓరుగల్లు’లో 21కి పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు హనుమకొండలో ఆరు, వరంగల్లో ఐదు... మానుకోటలో నాలుగు... జేఎస్ భూపాలపల్లిలో రెండు.. జనగామ, ములుగులో యథాతథం ఆరు జిల్లాల పరిధిలోనే మొత్తం 21 నియోజకవర్గాలు 2027 జనాభా లెక్కల ఆధారంగా చేసే అవకాశం... ఆ ప్రకారమే 2029 ఎన్నికలు.. కేంద్రం కసరత్తు నేపథ్యంలో చర్చనీయాంశంగా పునర్విభజనజిల్లా నియోజకవర్గాలు మొత్తం ప్రస్తుతం పెరగనున్నవి జనాభా నియోజక వర్గాలు హనుమకొండ 02 04 10,80,858 06 వరంగల్ 03 02 8,90,651 05 జేఎస్ భూపాలపల్లి 01 01 4,16,763 02 జనగామ 03 00 5,66,376 03 మహబూబాబాద్ 02 02 77,45,49 04 ములుగు 01 00 25,77,44 01 12 09 39,87,241 21 -
పునర్విభజనలో మరో తొమ్మిది!
‘ఓరుగల్లు’లో 21కి పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు హనుమకొండలో ఆరు, వరంగల్లో ఐదు..మానుకోటలో నాలుగు... జేఎస్ భూపాలపల్లిలో రెండు.. జనగామ, ములుగులో యథాతథం ఆరు జిల్లాల పరిధిలోనే మొత్తం 21 నియోజకవర్గాలు 2027 జనాభా లెక్కల ఆధారంగా చేసే అవకాశం.. ఆ ప్రకారమే 2029 ఎన్నికలు... కేంద్రం కసరత్తు నేపథ్యంలో చర్చనీయాంశంగా పునర్విభజన – సాక్షిప్రతినిధి, వరంగల్ -
ఫిన్లాండ్ పర్యటనకు జిల్లా ఉపాధ్యాయురాలి ఎంపిక
● ప్రపంచ ఉత్తమ విద్యా విధానంపై అధ్యయనం జనగామ: పాఠశాల విద్యాశాఖ ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల కోసం రూపొందించిన టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ చేంజ్ ప్రోగ్రాం (ఉపాధ్యాయుల క్షేత్ర పర్యటన, విద్యా మార్పిడి)కు రాష్ట్రవ్యాప్తంగా 28 మంది ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు ఎంపిక కాగా, ఇందులో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం ఉన్నత పాఠశాలకు చెందిన స్కూల్ అసిస్టెంట్ తౌటం నిహారిక ఉన్నారు. ఫిన్లాండ్లో నిర్వహించనున్న ఈ ప్రత్యేక పర్యటనకు సంబంధించిన వివరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు టీచర్లు ఫిన్లాండ్, సింగపూర్, వియత్నాం, జపాన్ దేశాలను సందర్శించనున్నారు. ఫిన్లాండ్ పర్యటన నేపథ్యంలో ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాల అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ పాఠశాల విద్యా విధానాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. వచ్చే నెల 20 నుంచి 24 వరకు ఈ పర్యటన ఉండనుంది. విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి జనగామ రూరల్: బడ్జెట్లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు న్యాయవాది సాదిక్ అలీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా అధ్యక్షుడు ఎన్ఎన్రాజు అధ్యక్షత టీపీటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ సందీప్కుమార్ ఝాకు అందజేశారు. టీపీటీఎఫ్ పూర్వ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మయ్య, కుర్రముల యాదగిరి, జిల్లా బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. బాలికను లోబర్చుకున్న యువకుడి అరెస్ట్ మహబూబాబాద్ రూరల్ : పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బాలికను లోబరుచుకుని, గర్భవతిని చేసిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం పీఎస్లో వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్లోని కంకరబోర్డు ప్రాంతానికి చెందిన ఎండీ మౌలానా అనే యువకుడు స్థానిక ఓ ఫొటో స్టూడియోలో పనిచేస్తున్నాడు. ఓ బాలిక ఫొటో దిగేందుకు స్టూడియోకు రాగా ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నారు. ఈ క్రమంలో ఆ బాలికలో మార్పును గమనించిన తల్లిదండ్రులు నిలదీయడంతో విషయం చెప్పింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా గర్భవతిగా తేలింది. దీంతో తల్లిదండ్రులు తమ బిడ్డకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. మౌలానాపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని టౌన్ సీఐ తెలిపారు. టౌన్ ఎస్సై మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు. -
15
శ్రీసోమేశ్వరుడి హుండీ ఆదాయంలక్షలురూ.పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం హుండీ ఆదాయం రూ.15,32,767 సమకూరినట్లు ఈఓ భాగం లక్ష్మీప్రసన్న తెలిపారు. 2026 జనవరి 2 నుంచి మార్చి 24 వరకు భక్తులు హుండీలో సమర్పించిన 80 రోజుల కానుకల ఆదాయాన్ని మంగళవారం ఆలయ కల్యాణ మండపంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భువనగిరి ఇన్స్పెక్టర్ నిఖిల్ పర్యవేక్షణలో లెక్కించారు. 2 గ్రాముల 111మిల్లీ గ్రాముల మిశ్రమ బంగారం, 500 గ్రాముల మిశ్రమ వెండి, యూఎస్ డాలర్–1, ఇంగ్లాండ్ –1(10ఫౌండ్స్) వచ్చినట్లు తెలిపారు. హుండీ లెక్కింపులో సర్పంచ్ కమ్మగాని విజయ, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ప్రధాన అర్చకుడు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్శర్మ, దేవగిరి అనిల్కుమార్, ఆలయ సిబ్బంది, శ్రీసోమేశ్వర, రాజరాజేశ్వరి సేవా ట్రస్ట్ సభ్యులు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. -
క్షయవ్యాధి నిర్మూలనకు అవగాహన తప్పనిసరి
జనగామ రూరల్: క్షయవ్యాధి నిర్మూలనకు అవగాహన తప్పనిసరిగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కె.మల్లికార్జునరావు అన్నారు. మంగళవారం ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా పట్టణంలోని నెహ్రూ పార్క్ నుంచి బస్స్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షయవ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి పూర్తి చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ అశోక్ కుమార్, టీబీ ప్రోగ్రాం ఆఫసర్, వైద్యులు శ్రీ హర్ష, శ్యామ్ కుమార్, కమల్హాసన్, ప్రభాకర్, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. టీబీ రహిత జిల్లా చేయాలి.. రఘునాథపల్లి: జిల్లాను టీబీ రహితంగా చేసేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జున్రావు పిలుపునిచ్చారు. మండలంలోని ఖిలాషాపూర్ ఆరోగ్య ఉప కేంద్రంలో మంగళవారం టీబీ డేను పురస్కరించుకుని టీబీ ముక్త్ హారత్ అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శిబరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ శాగ కవితఅశోక్, స్థానిక డాక్టర్ స్రవంతి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుధీర్, అశోక్, కమల్హాసన్, సీహెచ్ఓ రామకిషన్, సుజనారజని, మానస, మధు, జిల్లా టీబీ కంట్రోల్ సూపర్వైజర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, అంజుకుమార్, సుమన్, ఖలీల్ పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె.మల్లికార్జునరావు -
కేయూలో త్వరలోనే జీవ విజ్ఞాన కేంద్రం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో త్వరలోనే జీవవిజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయబోతున్నామని, విద్యార్థులు సృజనాత్మక ఆలోచలను పెంపొందించుకోవాలని కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి వెల్లడించారు. కాకతీయ యూనివర్సిటీ జూవాలజీ విభాగం ఆధ్వర్యంలో సెమినార్హాల్లో ‘అడ్వాన్స్సెస్ ఇన్లైఫ్ సైన్స్సెస్ ప్రజెంట్ ఫ్యూచర్’ అనేఅంశంపై మంగళవారం నిర్వహించిన జాతీయ సదస్సు ప్రారంభ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జీవ విజ్ఞాన కేంద్రం, ఔషధ శాస్త్ర కేంద్రం అనుబంధశాస్త్రాల కేంద్రం స్థాపనకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అనుమతులు రాగానే ఉన్నతస్ధాయి పరిశోధనలకు వేదికగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కేంద్రం ద్వారా విద్యార్థులు, పరిశోధకులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రయోగశాలల్లో పనిచేసే అవకాశాలు పొందుతారన్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కర్నాటి రాయ్.. మెదడు కణజాలంలో ఏర్పడే గ్లియోమావ్యాధిలో కనిపించే ఒక ముఖ్యమైన జీవరసాయన మార్పు గురించి వివరించారు. ఈ సదస్సు నిర్వాహక కార్యదర్శి, జూవాలజీ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, ఆ విభాగం అధిపతి వై. వెంకయ్య, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్, ఆ విభాగం ప్రొఫెసర్ షిమిత, ప్రొఫెసర్ ఈసం నారాయణ, మైక్రోబయాలజీ విభాగం అఽధిపతి సుజాత, బి వెంకటగోపినాఽథ్, తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు వివిధ యూనివర్సిటీల నుంచి 150 పరిశోధన పత్రాలు వచ్చాయి. కాగా, పరిశోధన పత్రాల అబ్స్ట్రాక్ట్ సావనీర్ను వీసీ ప్రతాప్రెడ్డి అతిథులు ఆవిష్కరించారు. ‘ప్రజాపాలన ప్రగతి’ని విజయవంతం చేద్దాం.. తెలంగాణ రాష్ట్ర 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను విజయవంతం చేద్దామని కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం యూనివర్సిటీలోని పరిపాలన భవనంలోని అకడమిక్ కమిటీ హాల్లో అన్ని విభాగాల అఽధిపతులు, ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో విశ్వవిద్యాలయాల అధ్యాపకులుగా కేరీర్పై వ్యక్తిత్వ వికాసం, ఉన్నత విద్య అవకాశాలపై విద్యార్థులకు తెలపాలన్నారు. కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం విభాగాల అధిపతులు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. వీసీ కె. ప్రతాప్రెడ్డి -
ఇండక్షన్ స్టవ్
● గ్యాస్ కొరతతో భారీ డిమాండ్ ● డిస్ట్రిబ్యూటర్ల వద్ద నో స్టాక్ ● ఆర్డర్ ఇచ్చి 15 రోజులు గడుస్తున్నా దొరకట్లే ● 12 రోజులుగా సరఫరా నిలిచిన కమర్షియల్ సిలిండర్లుజనగామ: జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో గ్యాస్ మార్కెట్లో తీవ్రమైన అనిశ్చితి నెలకొంది. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ స్థాయిలో గ్యాస్ ధరలు, సరఫరాలో ఊహించని మార్పులు చోటుచేసుకోవడంతో జిల్లా ప్రజలు ముందస్తు జాగ్రత్తల పేరుతో గ్యాస్ బుకింగ్లను భారీగా పెంచుతున్నారు. సబ్సిడీ సిలిండర్లకు పెద్దగా కొరత లేకున్నా.. గ్యాస్ ఏజెన్సీల వద్ద బుకింగులు పెరగడంతో డెలివరీలపై భారం ఎక్కువవుతోంది. జిల్లాలో 1.60లక్షల కనెక్షన్లు.. జిల్లాలో మొత్తం 12 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా సబ్సిడీ సిలిండర్ల సంఖ్య 1,60, 016గా ఉంది. పట్టణంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ పరిధిలో ప్రస్తుతం నాలుగు వేల పైచిలుకు బుకింగ్లు పెండింగ్లో ఉండగా, ఇతర మండలాల పరిధిలో ఒక్కో ఏజెన్సీకి 400 నుంచి 500 వరకు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. జిల్లాకు కమర్షియల్ సిలిండర్ల సరఫరా 12 రోజులుగా నిలిచిపోయినప్పటికీ, హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లలో ఇంకా కనిపించడం సందేహాలను రేకెత్తిస్తోంది. సరఫరా నిలిచిపోయిన పరిస్థితుల్లో ఈ సిలిండర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సబ్సిడీ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేసి పెద్ద సిలిండర్లలోకి మిషన్ల సాయంతో నింపుతున్నారన్న ప్రచారం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం పట్టణంలోని పలు హోటళ్లలో వంటకు కమర్షియల్ సిలిండర్లతో పాటు కట్టెల పొయ్యిలను కూడా వినియోగిస్తున్నారు. కమర్షియల్ గ్యాస్, ఎలక్ట్రిక్ స్టవ్ల కొరత, ధరల పెరుగుదల అన్నీ కలిసి జిల్లాలో ఇంధన పరిస్థితిపై ఊహించని ఒత్తిడిని పెంచుతున్నాయి. గృహ వినియోగ సబ్సిడీ సిలిండర్ల కొరత లేకున్నప్పటికీ, కొరత వస్తుందనే ఆందోళన, భయంతో ప్రజలు ముందస్తు చర్యలతో గ్యాస్ మార్కెట్ను మరింత అతలాకుతలం చేస్తోంది.


