Jangaon District News
-
నేలకు జీవం
గురువారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2026వ్యర్థం కాదు..జనగామ: రైతులు పంట కోతల అనంతరం పొలాల్లో మిగిలిపోయే అవశేషాలను తగులబెట్టడం ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కొనసాగుతుండడంపై వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వ్యర్థాలను తగుల బెట్టడం సర్కారు నిషేధించినా, పర్యావరణ చట్టాలు తీవ్రంగా హెచ్చరిస్తున్నా..కొంతమంది రైతులు అవగాహన లేక నిర్లక్ష్యంతో దహనానికి పాల్పడుతున్నారని అధికారులు చెబుతున్నారు. పంట దహనం వల్ల కలిగే నష్టం, చట్టపరమైన శిక్షలు, ప్రత్యామ్నాయాలు వంటి వివరాలతో కూడిన కరపత్రాన్ని వ్యవసాయ శాఖ విడుదల చేసింది. నేల సారవంతం తగ్గుతుంది.. పంట అవశేషాలను తగులబెట్టడం వాయు కాలుష్య నివారణ చట్టం–1981, పర్యావరణ సంరక్షణ చట్టం–1986 ప్రకారం నేరమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పొగలో ఉండే పీఎం–2.5, పీఎం10 సూక్ష్మధూళికణాలు గాలిలో కలిసి మనుషులతో పాటు పశువులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి ఈ పొగ ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అవశేషాలను కాల్చడం వాతావరణా నికే కాదు, రైతు భూమికి సైతం నష్టం కలుగచేస్తుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అవశేషాలతో కలిసి నేలలో ఉండే ప్రయోజనకర సూక్ష్మ జీవులు, పుట్టుగుళ్ళు నశించి నేల సారం తగ్గిస్తోంది. అంతేకాకుండా పంటలు తీసుకునే పోషకాల సమతౌల్యం దెబ్బతిని దిగుబడిపై ప్రభావం చూపిస్తుంది. దహనం వల్ల భూమి ఉపరితలం కాచి, దీర్ఘ కాలంలో నేల పగుళ్లుబారడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని అంటున్నారు. దట్టమైన పొగ సమీప గ్రామాలపై కమ్ముకుని ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కొన్ని సందర్భాల్లో పక్కన పొలాలు, గుడిసెలు, పశువుల పాకల వరకూ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. చట్టపరంగా చర్యలు ఇక చట్టపరంగా చూస్తే పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలు సైతం ఉన్నాయి. పంటలను తగలబెడితే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, సబ్సిడీల నిలుపుదల, బ్యాంకు రుణాలు మంజూరు కాకపోవడం, పునరావృతమైతే క్రిమినల్ విచారణ జరిపిస్తారు. పంట దహనం పూర్తిగా నేరమని, ప్రజారోగ్యానికి ప్రమాదకరమని సూచిస్తున్నారు. పంట అవశేషాలను దహనం చేయకుండా ప్రత్యామ్నాయాలను వినియోగించుకోవాలని కోరుతున్నారు. రోటవేటర్, మల్చింగ్, సూ పర్ సీడర్, బయో–డీకంపోజర్ వంటి పద్ధతులు ఉపయోగిస్తే నేల సారపుష్టి పెరగడమే కాకుండా తదుపరి పంటకు మేలు జరుగుతుందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.సౌర ప్లాంట్ శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపంట అవశేషాల దహనంతో కాలుష్యం నేల సారం తగ్గిపోతుందని నిపుణుల హెచ్చరిక సూక్ష్మజీవులు, పుట్టుగుళ్ల నాశనం భూమి నాణ్యతపై ప్రతికూల ప్రభావం అగ్నిప్రమాదాల ముప్పు దహనం వల్ల కలిగే నష్టం నేలలోని కీటకాలు, సూక్ష్మజీవులు నశించడంతో నేలసారం తగ్గుతుంది. కర్బన ఉద్గారాలు పెరిగి వాతావరణ మార్పులకు దారితీస్తాయి. పొగ వల్ల పశువుల్లో శ్వాససమస్యలు, చర్మవ్యాధులు పెరుగుతాయి. గాలి దిశ మారితే పక్క పొలాలు, ఇళ్లు, గోదాములు కాలిపోవచ్చు. రైతులపై చట్టపరమైన చర్యలు పంట వ్యర్థాలను కాల్చొద్దు.. పంట దహనం రైతు ఆరోగ్యానికి, పర్యావరణానికి, భూమి నాణ్యతకు ముప్పు. ఒక నిమిషం సౌలభ్యం కోసం భవిష్యత్ను ప్రమాదంలో పెట్టొద్దు. సుస్థిర వ్యవసాయం మన భవిష్యత్తు. పంట వ్యర్థాలను కాల్చడం చట్ట రీత్యా నేరం. పర్యావరణానికి హాని కలిగిస్తే చర్యలు తీసుకుంటాం. పంట వ్యర్థాలను కాల్చకుండా రైతులు, ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాం. – అంబికాసోని,జిల్లా వ్యవసాయాధికారి -
ఎక్కువ మందికి ‘ఉపాధి’ కల్పించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: ఉపాధి హామీలో ఎక్కువ మంది కూలీలకు పని కల్పించాలని, అలాగే పెండింగ్లో ఉన్న వీఓ, అంగన్వాడీ, జీపీ భవనాలు పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం కలెక్టరెట్లోని కాన్ఫెరెన్స్ హాల్లో ఉపాధి హామీ కూలీలు, షెల్ఫ్ ఆఫ్ వర్క్, పెండింగ్లో ఉన్న నిర్మాణాలు, చేయూత పెన్షన్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం లో పంచాయతీ రాజ్ శాఖ ఈఈ, డీఈ, ఏఈలు, ఎంపీడీఓ, ఎంపీఓ, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్ వేగవంతం కావాలి ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) మ్యాపింగ్ ప్రక్రియ మరింత వేగవంతం కావాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఓటరు జాబితా అంశంపై ఆర్డీఓ, తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్లు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లల్లో వేగం పెంచి సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సంబంధి అధికారులను ఆదేశించారు. బుధవారం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై సమీక్షించారు. సమావేశంలో డీఆర్డీఓ భాస్కర్, మార్క్ఫెడ్ డీఎం చంద్రశేఖర్, డీసీఓ కోదండరాములు తదితరులు పాల్గొన్నారు. జాప్యానికి తావివ్వొద్దు.. రఘునాథపల్లి: ఽజిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియలను వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం రఘునాథపల్లి మండలం వెల్ది, జాఫర్గూడెం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోళ్లలో ఏమైనా సమస్య వస్తే టోల్ ఫ్రీ నంబర్ 1800–425–6605లో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. -
రెండు రోజుల గడువు ఇస్తున్నాం..
భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వానికి రెండు రోజుల గడువు ఇస్తున్నాం.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తి చేయకపోతే ఆందోళనలు తప్పవని బీజేపీ బృందం హెచ్చరించింది. రైతు గోస–బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా బీజేపీ బృందం బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించింది. గణపురం మండలంలోని చెల్పూరు, కాటారం మండలంలోని కొత్తపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంది. కాటారంలో ధాన్యం దహనం చేసి నిరసన తెలిపి కేసు పాలైన తిరుపతిని బీజేపీ నేతలు పరామర్శించారు. అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎంపీలు రఘునందర్రావు, ఈటల రాజేందర్ మాట్లాడుతూ 40 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని, బీజేపీ బృందం వస్తున్న విషయాన్ని తెలుసుకొని గన్నీ బ్యాగులు, లారీలు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇంకా 70 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉందని పేర్కొన్నారు. కాటారం మండలంలో నిరసన తెలిపిన 9 మంది రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు తాము ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్రెడ్డి, రామారావు పటేల్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర, జిల్లా, స్థానిక నాయకులు చందుపట్ల కీర్తిరెడ్డి, చల్లా నారాయణరెడ్డి, నిషిధర్రెడ్డి, ఎరుకల గణపతి, కన్నం యుగేంధర్, మహిపాల్రెడ్డి, జయశ్రీ, కరివేద మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయకపోతే ఆందోళనలే బీజేపీ నేతలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, రఘునందన్రావు, ఈటల రాజేందర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూరు, కాటారంలో పర్యటన -
పుణ్యప్రదం.. పుష్కర స్నానం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో సరస్వతి నది అంత్యపుష్కరాలు కొనసాగుతున్నాయి. ఏడో రోజు బుధవారం సుమారు 25 వేల మంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్కు చెందిన శ్రీదత్తగిరి మహరాజ్ ఆశ్రమ పీఠాధిపతి, తెలుగు రాష్ట్రాల మహామండలేశ్వర్ శ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహరాజ్, మహామండలేశ్వర్ ఈట సిద్ధేశ్వరానందగిరి మహరాజ్ త్రివేణి సంగమం వద్ద వైభవంగా గంగా హారతి నిర్వహించారు. సాయంత్రం దేవాదాయ శాఖ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. – కాళేశ్వరంపుష్కరఘాట్లో స్నానాలు చేస్తున్న భక్తులు -
ఎకై ్సజ్ కార్యాలయం ఎప్పటికీ పూర్తయ్యేనో?
● ముందుకు సాగని నిర్మాణ పనులు ● చేతులెత్తేసిన కాంట్రాక్టర్ పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలో ఎకై ్సజ్ శాఖ కార్యాలయం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆధికారుల నిర్లక్ష్యం, పాలకుల ఆలసత్వంతో పనులు మందుకు సాగడం లేదు. 2017లో అప్పటి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు ఈరవెన్ను రూట్లో పంచారాయి భూమిలో ఆరు గుంటల భూమి ఎకై ్సజ్ కార్యాలయం కోసం కేటాయించారు. అంతేకాకుండా రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ నిధుల నుంచి రూ.40 లక్షల నిధులు విడుదల చేసి గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే దయాకర్రావు భూమిపూజ చేశారు. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు మంజూరు కాకపోవడంతో పనులు ఆగిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంంలోకి రాగానే కాంట్రాక్టర్ చేతులు ఎత్తేయడంతో కొత్త కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు. భవనం పనులు పూర్తయినా తలుపులు, కిటికీలు, విద్యుత్, టైల్స్, వెంటిలేటర్లు ఇంకా బిగించలేదు. సగం వరకు ఇంకా పనులు చేయాల్సి ఉంది. అర్ధంతరంగా నిలిచిన పనులను వేగవంతం చేయకుండానే నిర్లక్ష్యంగా వదిలేశారు. చర్యలు తీసుకుంటాం..ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎకై ్సజ్ శాఖ కార్యాలయం నిర్మాణ పనులు చేపట్టింది. నిర్మాణ పనులు అగిపోయింది నిజమే, మిగిలిన పనులను త్వరాగా పూర్తి చేసేందుకు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తయేందుకు చర్యలు తీసుకుంటాం. – సంతోష్రెడ్డి, ఎకై ్సజ్ సీఐ, పాలకుర్తి● -
దారికాచి కత్తితో దాడి
● వ్యక్తికి తీవ్రగాయాలు పాలకుర్తి టౌన్: నడిరోడ్డుపై ఓ వ్యక్తిని విచక్షణరహితంగా కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచిన ఘటన బుధవారం రాత్రి మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా జరిగింది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని శాతాపురం గ్రామానికి చెందిన తీగల ధర్మారావు స్టేషన్ ఘన్పూర్లో మినీ బ్యాంకు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో పాలకుర్తిలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. రోజువారీలాగానే పనులు ముగించుకొని పాలకుర్తికి చేరుకున్నాడు. బుధవారం రాత్రి బస్టాండ్ సమీపంలో ఇంటి ముందు నిలుచొని ఉండగా ఓ కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి దారికాచి అకస్మాతుగా కత్తితో కడుపు, వీపు, చేతిపై విచక్షణా రహితంగా పొడిచాడు. ధర్మారావు ప్రతిఘటించడంతో దుండగుడు అదే కారులో పారిపోయాడు. ఎడమ చేతిపై కత్తిని పొడిచి వదిలివెళ్లాడు. తీవ్ర రక్తస్రావంతో కారును కొద్ది దూరం ధర్మారావు వెంబడించాడు. దీంతో ఒక చోట ధర్మారావు కుప్పకూలాడు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఽతీవ్రంగా గాయపడిన ధర్మారావును హుటాహుటినా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు 108లో తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ జానకీరాంరెడ్డి, ఎస్సై దూలం పవన్ కుమార్ సందర్శించి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఽమధ్య ఇల్లు, భూ తగాదాలే ఈ ఘటనకు కారణమని స్థానికులు చెబుతున్నారు. -
ఆర్థికసాయం
జఫర్గఢ్: మండల కేంద్ర శివారు వడ్డెగూడేనికి చెందిన కె. రాజేందర్ ఇటీవల మృతి చెందాడు. కాగా, విషయం తెలుసుకున్న రాజేందర్తో 2010–11లో పదోతరగతి చదివిన పూర్వవిద్యార్థులు స్నేహితుడి కుటుంబానికి బుధవారం రూ.26,500, 50కిలో బియ్యం అందజేశారు. అనంతరం రాజేందర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యకర్తలకు అండగా కాంగ్రెస్ పార్టీ బచ్చన్నపేట: కార్యకర్తల కుటుంబాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని జనగామ మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ అన్నారు. బసిరెడ్డిపల్లి సర్పంచ్ నల్ల సిద్దినర్సమ్మ మల్లయ్యల కుమారుడు వెంకటేష్ ఇటీవల మృతి చెందాడు. కాగా, బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ. 10 వేల సాయం అందజేశారు. మండల ఉపాధ్యక్షుడు గార్లపాటి మహిపాల్రెడ్డి, గ్రామ అధ్యక్షుడు కనకయ్య తదితరులు ఉన్నారు. నిత్యావసర సరుకుల అందజేత జనగామ: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అభిషేక్ జగనీ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని బీరప్ప ఆలయం ఏరియాకు చెందిన ఓ పేద కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను బుధవారం కాసాల సంతోష్ కుమార్ అందజేశారు. అంతకు ముందు సంతోష్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను న్విహించారు. మహాసభ ఏర్పాట్లపై సమావేశం రఘునాథపల్లి: ఎస్టీ రిజర్వేషన్ అమలుకు 50 సంవత్సరాలైన సందర్భంగా జూన్ 18న మండల కేంద్రంలో నిర్వహించనున్న మహాసభ ఏర్పాట్లపై బుధవారం మండల కేంద్రంలో గిరిజన నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువకులతో సమావేశం నిర్వహించి మహాసభ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఎల్హెచ్పీఎస్ సంఘం నాయకులు కొర్ర రాజేందర్నాయక్, బానోత్ భిక్షపతినాయక్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాల మేరకు గిరిజనుల సామాజిక, విద్య, ఆర్థిక అభివృద్ధి కోసం రాజ్యాంగలో ఎస్టీ రిజర్వేషన్లు కల్పించబడినట్లు పేర్కొన్నారు. హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. గుగులోత్ కొమురెల్లి, శ్రీనునాయక్, దేవస్వామి, ఈర్యనాయక్, సోమన్న, సుందర్, భజన్నాయక్, శంకర్నాయక్ తదితరులు ఉన్నారు. 30 నుంచి మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బచ్చన్నపేట: మండలంలోని కొడవటూర్ గ్రామంలో ఈనెల 30వ తేదీ నుంచి మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు గంగం సతీష్రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మండలస్థాయిలో టెన్నిస్ బాల్తో క్రికెట్ పోటీలను సిద్దులగుట్ట ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎంట్రీ ఫీజు రూ.వెయ్యి చెల్లించాలన్నారు. విజేతలకు మొదటి బహుమతి రూ. 20 వేలు, ద్వితీయ బహుమతి రూ. 10వేల నగదు అందిస్తామని తెలిపారు. క్రీడాకారులకు అన్ని వసతులను కల్పిస్తున్నామని, ఆసక్తిగల క్రీడాకారులు టీం పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 7702259398, 9989801582 నంబర్లను సంప్రదించాలని కోరారు. ‘చర్య తీసుకోవాలి’ బచ్చన్నపేట: మండలంలోని పడమటికేశ్వాపూర్ గ్రామంలో దళితుల భూమిని కొందరు వ్యక్తులు అన్యాక్రాంతం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గ్రామానికి చెందిన దళిత రైతు తాడెం నరేందర్కు చెందిన రెండెకరాల భూమిని కొందరు అన్యాకాంతం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వారిపై చర్యతీసుకుని న్యాయం చేయాలన్నారు. డీబీఎఫ్ నాయకులు సతీష్, ఉపసర్పంచ్ తాడేం నరేందర్, గణేష్, చరణ్ పాల్గొన్నారు. -
మహిళల భద్రతే ప్రధాన ధ్యేయం
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా జనగామ రూరల్: మహిళల భద్రతే ప్రధాన ధ్యేయమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా భద్రత, రక్షణ వారోత్సవాలు బుధవారం కలెక్టరెట్లోని కాన్ఫరెన్స్హాల్లో నిర్వహించారు. కాగా, మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి, అదనపు కలెక్టర్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలన్నారు. వివిధ శాఖలమహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. -
స్పందించిన అధికారులు
నర్మెట: సోమవారం సాయంత్రం కురిసిన వర్షం, గాలివాన బీభత్సానికి మండలంలో చెట్లు విరిగి పడటం, ట్రాన్స్ఫార్మర్స్ పడిపోవడం. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవడం, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోవడం సంఘంటనలపై కథనం సాక్షిలో ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. చెత్త తొలగింపు స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ పట్టణ కేంద్రంలోని ఆర్సీఎం చర్చి, వాటర్ట్యాంకు సమీపాన ఇష్టారాజ్యంగా కాలనీవాసులు రోడ్డు పక్కనే చెత్త, వ్యర్ధాలను వేస్తున్న విషయమై చెత్తశుద్ది లేని మున్సిపల్ అధికారులు శీర్షికన సాక్షి దినపత్రికలో ఈనెల 23న ప్రచురితమైన కథనంపై మున్సిపల్ అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్సీఎం చర్చి కాలనీలో రోడ్డు పక్కన చెత్త, వ్యర్ధాలను తొలగించి శుభ్రం చేయించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. -
ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి
స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధి శివునిపల్లిలోని సర్వే నంబర్ 46లో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి పరిరక్షించి శాశ్వతంగా కంచె ఏర్పాటు చేయాలని శివునిపల్లి మాజీ సర్పంచ్ బూర్ల విష్ణు కోరారు. శివునిపల్లిలోని సదరు ప్రభుత్వ భూమి వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై ఈనెల 25న కలెక్టరేట్ గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించి కబ్జాదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
ప్రీ–ప్రైమరీ మరింత బలోపేతం
జనగామ: ప్రభుత్వ, స్థానిక సంస్థల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2026–27 నూతన విద్యా సంవత్సరంలో ప్రీ–ప్రైమరీ బోధన ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కొత్తగా 39 ప్రీ–ప్రైమరీ స్కూల్స్ను ప్రారంభించేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో గతేడాది 16 ప్రీ–ప్రైమరీ బడులు ప్రారంభించగా, కొత్త వాటితో కలుపుకొని 55 కానున్నాయి. దీంతో వచ్చే నెల 12వ తేదీ నుంచి జిల్లాలో కార్పొరేట్కు దీటుగా ప్రీ–ప్రైమరీ విద్య మరింత అందుబాటులోకి రానుంది. ఈ బడుల్లో ఇనన్ ఫ్రాస్ట్రక్చర్, ఫర్నిచర్, ఇండోర్, అవుట్డోర్ ఆట వస్తువులు, పెయింటింగ్స్ వంటి ఏర్పాట్ల కోసం ప్రతీ పాఠశాల కు ప్రత్యేక నిధులు కేటాయించనున్నారు. ఒక్కో బడిలో ఇన్స్ట్రక్టర్..ఒక ఆయా ప్రతి పాఠశాలలో ఒక ఇన్స్ట్రక్టర్తో పాటు ఒక ఆయాను ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించనున్నారు. ఇన్స్ట్రక్టర్కు నెలవారీ గౌరవ వేతనం రూ.8 వేలు, ఆయాకు రూ.6వేలుగా నిర్ణయించారు. నియామకాలకు సంబంధించి ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసి, త్రీమెన్ కమిటీ ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. పాఠశాలల్లో వచ్చే నెల ప్రారంభం కానున్న నూతన విద్యా సంవత్సరం నుంచి ప్రీ–ప్రైమరీ సెక్షన్లు ప్రారంభించాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈఓలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రీ– ప్రైమరీ విద్యకు ఆర్థిక కష్టాలు ఉండకూడదనే ఉద్దేశంతో రూ.లక్ష నిధులను మంజూరు చేస్తోంది. జిల్లాలో ప్రీ–ప్రైమరీకి ఎంపికై న పాఠశాలల జాబితా యూపీఎస్ గణేష్వాడ(జనగామ), పీఎస్(ఏదునూతుల), పీఎస్ (కూనూర్), పీఎస్(వావిలాల), పీఎస్(రఘునాథపల్లి), పీఎస్ (నెల్లుట్ల), పీఎస్(ఉప్పుగల్), పీఎస్ (చాగల్), పీఎస్(పెంబర్తి), పీఎస్(తాటికొండ), పీఎస్(రాజవరం), పీఎస్ (మాధాపురం), యూపీఎస్(నాగిరెడ్డిపల్లి), పీఎస్ (లింగాలఘ న్పూర్), పీఎస్(పెద్దమడూరు), పీఎస్(కడవెండి), పీఎస్(కల్లెం), పీఎస్ (కట్కూరు), పీఎస్(అశ్వరావుపల్లి), పీఎస్(లింగంపల్లి), పీఎస్(పల్లగుట్ట), యూపీఎస్(వెంకటాద్రిపేట), పీఎస్(ఇందిరానగర్), పీఎస్(పడమటి కేశ్వా పూర్), పీఎస్(తిమ్మంపేట), పీఎస్(సాల్వాపూర్), పీఎస్(శామీర్పేట్), పీఎస్ (గోవర్ధనగిరి), పీఎస్(మల్కాపూర్), పీఎస్(ఓబుల్కేశ్వాపూర్), పీఎస్ (వెంకిర్యాల), పీఎస్(భాంజీపేట్), పీఎస్ ఎస్సీ బీసీ కాలనీ(చినపెండ్యాల్), యూపీఎస్(తీగారం), పీఎస్(వడ్లకొండ), పీఎస్(మీదికొండ), యూపీఎస్(గండిరామవరం), పీఎస్(చిల్పూర్), పీఎస్(చిన్నమడూరు) స్కూళ్లు ఉన్నాయి. తొలిదశ బోధనకు సర్కారు బడులు సిద్ధం పిల్లల్లో కొత్త వెలుగులు.. జిల్లాకు 39 ప్రీ ప్రైమరీ స్కూల్స్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కొత్త విద్యావ్యవస్థకు శ్రీకారం -
ఎప్పుడుంటదో.. ఎప్పుడు పోతదో?
కొడకండ్ల: అసలే ఎండలు తీవ్రంగా మండుతూ ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతుండగా మండలకేంద్రంలో కరెంటు ఎప్పుడుంటదో ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితి నెలకొంది. నాలుగు రోజులుగా మండలకేంద్రంలో మాటిమాటికి కరెంట్ ట్రిప్పవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయట ఎండ తీవ్రంగా ఉండటం ఇంట్లో కరెంట్ సరిగా ఉండకపోవడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. విద్యుత్ సరఫరాలో అవాంతరాలు తలెత్తుతున్నా కూడా పట్టించుకొనే నాథుడే కరువయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలానికి రెగ్యులర్ ఏఈ లేకపోవడం ఇన్చార్జ్ విధులతో విద్యుత్ సమస్యలను పట్టించుకొనే వారే కరువయ్యారని, ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్ అంతరాయం కలుగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మాటిమాటికి ట్రిప్పవుతున్న కరెంట్ అల్లాడుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు -
జగన్ను కలిసిన ప్రవీణ్
బచ్చన్నపేట: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మండలంలోని లింగంపల్లికి చెందిన జగన్ వీరాభిమాని బొడ్డు ప్రవీణ్ బుధవారం తాడిపత్రిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండోసారి జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని సైకిల్ యాత్ర చేశానని, 9 నెలల నుంచి మోకాళ్లపై 100 దేవాలయాల మెట్లు ఎక్కి మొక్కులు చెల్లించానని అన్నారు. అలాగే, చర్చిల్లో ప్రార్థన, మసీదుల్లో నమాజ్ చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 10,100 కొబ్బరికాయలు కొట్టానని, భద్రాచలం నుంచి విజయవాడకు పాదయాత్రగా చేరుకుని జగన్మోహన్రెడ్డికి వివరించానని చెప్పారు. తనపై ఉన్న అభిమానంతో నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ ఇకమీదట అన్నివిధాలా అండగా ఉంటానని చెప్పినట్లు ప్రవీణ్ తెలిపారు. మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ నర్మెట: మండల కేంద్రంలోని పలు ప్రదేశాల్లో ఉపాధిహామీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ సహకారంతో ఉప సర్పంచ్ కొలెపాక స్వామి మజ్జిగ ప్యాకెట్లను బుధవారం ఊరచెరువులో పని చేస్తున్న కూలీలకు పంపిణీ చేశారు. విరిగిన చెట్ల తొలగింపు బచ్చన్నపేట: మండల కేంద్రంలో మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు చెట్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. కాగా, విషయం తెలుసుకున్న సర్పంచ్ అల్వాల నర్సింగారావు జేసీబీలతో ఆ చెట్లను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చెట్లను తొలగించినట్లు తెలిపారు. భూసార పరీక్షలు తప్పనిసరి జనగామ రూరల్: రైతులు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి విజయ్రెడ్డి అన్నారు. బుధవారం గానుగపహడ్, కోర్రతండాలో ఇఫ్కో ఆధ్వర్యంలో భూసార పరీక్షలు నిర్వహించారు. రైతులు పాల్గొన్నారు. -
హై టెన్షన్ వైర్లతో ప్రమాదం ఉండదు
● ట్రాన్స్కో ఏడీఈ వేణుగోపాల్ బచ్చన్నపేట: మండల కేంద్రంలోని 33/11 కేవీ సబ్స్టేషన్కు పోచన్నపేట శివారు కాశీనగర్ సోలార్ ప్లాంట్ నుంచి వేస్తున్న హై టెన్షన్ విద్యుత్ లైన్తో గ్రామస్తులకు ఎలాంటి ప్రమాదం ఉండదని ట్రాన్స్కో ఏడీఈ వేణుగోపాల్, నర్మెట సీఐ అబ్బయ్య అన్నారు. బుధవారం పోచన్నపేటలో విద్యుత్ లైన్ వేస్తుండగా అడ్డుకున్న గ్రామస్తులతో వారు మాట్లాడారు. ఒకప్పుడు ఇలా అడ్డుకుంటే రామగుండం నుంచి కరెంటు వచ్చేది కాదని, అందరూ సహకరిస్తేనే విద్యుత్ సరఫరా సాధ్యమన్నారు. లైన్ వేయకుండా అడ్డుకోవడం సరైంది కాదని సర్దిచెప్పడంతో కాంట్రాక్టర్ రాజు పనులు యథావిధిగా చేపట్టారు. ఆర్డీఓ గోపీరామ్, తహసీల్దార్ హుస్సేన్, ఎస్సై శ్రీకాంత్, ఏఈ రాజకుమార్, సర్పంచ్ ఫిరోజోద్దీన్, నాయకులు, గ్రామస్తులు ఉన్నారు. -
చికిత్స పొందుతున్న యువకుడి మృతి
జనగామ రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన యువకుడు చికిత్స పోందుతూ మృతి చెందిన ఘటన బుధవారం పట్టణంలోని ఏసీ రెడ్డినగర్లో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏసీరెడ్డినగర్లో నివాసముంటున్న పండు అనిత పర్షరాములు కుమారుడు చరణ్ కార్తీక్(17) డెకరేషన్ పని చేస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం పని ముగించుకుని బండి కుమార్తో స్కూటీపై ఇంటికి వస్తుండగా జనగామ చౌరస్తా వద్ద లారీ ఢీకొట్టింది. దీంతో చరణ్కార్తీక్కు తీవ్ర గాయాలవ్వగా, కుమార్కు స్వల్పగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం చరణ్కార్తీక్ను హైదరాబాద్లోని నీలిమా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్లోని ఎంజీఎంకు తరలించగా చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆయిల్ పామ్ సాగుకు ‘భగీరథ ప్రయత్నం’
జఫర్గఢ్: వేలాది రూపాయల పెటుబడులు పెట్టి సాగు చేసిన ఆయిల్ పామ్ తోటను కాపాడేందుకు ఓ రైతు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే 5 బోర్లు వేయగా అందులో మూడు ఫెయిల్ అయ్యాయి. మిగిలిన రెండు బోరు బావులల్లో మాత్రం అంతంత మాత్రంగానే నీరు వస్తోంది. వచ్చిన కొద్ది పాటి నీటిని నేరుగా పంటలకు అందించడంతో ఏమాత్రం సరిపోక వినూత్మ పద్ధతిలో పంటలకు సాగునీరందిస్తూ కాపాడుతున్నాడు. మండలంలోని తిమ్మాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని తాటికాయల కుమారస్వామి అనే రైతు తనకున్న 13 ఎకరాల్లో కొన్నేళ్ల క్రితం ఆయిల్పామ్ తోటను సాగు చేశాడు. పంటకు సరిపడా నీటిని అందించేందుకు రూ. 4 లక్షల ఖర్చు చేసి 5 బోర్లు వేశాడు. వాటిలో మూడు బోర్లల్లో చుక్కనీరు పడకపోగా రెండు బోర్లల్లో మాత్రమే కొద్దిపాటి నీరు వచ్చింది. ఆ వచ్చిన కొద్ది పాటి నీరు పంటకు ఏమాత్రం సరిపోకపోవడం వల్ల రూ.లక్షలు వెచ్చించి పొలంలో పెద్ద ఇంకుడు గుంత తవ్వించి పెద్ద ప్లాస్టిక్ కవర్ను చుట్టూ ఏర్పాటు చేసి నీటిని నిల్వ చేస్తున్నాడు. మోటరు సాయంతో స్పింక్లర్ల ద్వారా ఆయిల్ పామ్ మొక్కలకు సరిపడా నీటిని అందిస్తూ పంటను కాపాడుతున్నాడు. అయిల్పామ్ సాగు వల్ల దిగుబడి ఏమో కాని పెట్టుబడులు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 5 బోర్లు వేస్తే మూడు ఫెయిల్ మిగిలిన రెండింటితో వినూత్న పద్ధతిలో తోటకు నీరు -
రేపటినుంచి లక్ష్మీనర్సింహస్వామి జయంతి ఉత్సవాలు
జఫర్గఢ్: మండల కేంద్రంలో పడమర కొండపై వెలసిన లక్ష్మీనర్సింహస్వామి జయంతి ఉత్సవాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతీ ఏటా నిర్వహించే ఉత్సవాలు ఈ సారి కూడా ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు మూడ రోజుల పాటు స్వామి వారి జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. మొదటిరోజు వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కొండపైన స్వామివారి ఆలయంలో 81 కళశాలతో అభిషేకం నిర్వహించనున్నారు. ఈ పూజ కార్యక్రమాల అనంతరం మిగతా రెండు రోజులు కొండ దిగువన ఉన్న సీతారామచంద్ర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. చివరి రోజున స్వామి వారి కల్యాణమహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకుడు పొడిచేటి వెంకటాచార్యులు తెలిపారు. స్వామి వారి జయంతి ఉత్సవాల్లో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయంవంతం చేయాలని ఆయన కోరారు. -
వరి కొయ్యలకు నిప్పు.. పచ్చనిచెట్లకు శాపం
రఘునాథపల్లి: మండలంలోని అశ్వరావుపల్లి శివారులోని గుప్త ప్రసన్న భక్త ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదం భారీ నష్టాన్ని మిగిల్చింది. ఓ రైతు తన పొలంలో వరి కొయ్యలకు నిప్పంటించగా మంటలు ఒక్కసారిగా వ్యాపించి సమీపంలోని పచ్చని చెట్లను చుట్టుముట్టాయి. దీంతో ఆలయ సమీపంలోని వివిధ రకాల వేలాది చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. రహదారి పక్కన హరితహారంలో భాగంగా పెంచిన చెట్లు కాలిపోయాయి. అంతేకాక ఆలయంలోని పామాయిల్ తోటలోని చెట్లు, ఆరువేల సర్వి చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైరింజన్ వచ్చే సరికి అప్పటికై వేలాది చెట్లు కాలిపోయాయి. మంటలు వ్యాప్తి చెందకుండా నిలువరించారు. అగ్ని ప్రమాదంలో రూ.10 లక్షల నష్టం వాటిల్లినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. చెట్ల దగ్ధానికి కారణమైన వ్యక్తిపై చర్య తీసుకోవాలని ఆలయ నిర్వాహకులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయ్యవారిగూడెంలో అగ్నిప్రమాదం అయ్యవారిగూడెంలో విద్యుత్ నిప్పురవ్వలతో మంగళవారం వ్యాపించిన మంటలతో గ్రామానికి చెందిన పారునంది యాదగిరికి చెందిన పశువుల కొట్టం, గడ్డి కట్టల వాము కాలి పూర్తిగా దగ్ధమయ్యాయి. మధ్యాహ్నం ఎల్టీ లైన్ లూజుగా ఉండటంతో గాలి దుమారానికి తీగలు ఆనుకొని నిప్పురవ్వలు చెలరేగి నేలపై పడటంతో మంటలు లేచాయి. గాలి తాకిడికి గడ్డికట్టలతో ఉన్న వాముకు శరవేగంగా చుట్టుముట్టాయి. పక్కనే ఉన్న పశువుల కొట్టంకు అంటుకొని దగ్ధమైంది. ఫైరింజన్కు సమాచారం ఇవ్వగా అందుబాటులో లేక పోవడంతో నష్టం జరిగింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు యాదగిరి కోరారు. లింగాలఘణపురంలో.. లింగాలఘణపురం: మండల కేంద్రంలో మంగళవారం ప్రమాదశాత్తు మంటలు చెలరేగి పొలాల నుంచి ఇళ్ల సమీపం వద్దకు చేరడంతో సర్పంచ్ లావణ్యరాజు సహకారంతో వాటర్ ట్యాంక్లో నీళ్లు తీసుకొచ్చి మంటలను ఆర్పారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రావణ్కుమార్ ఘటనా స్థలికి చేరుకొని పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసి గ్రామస్తుల సహకారంతో మంటలను ఆర్పారు. అశ్వరావుపల్లి శివారులో అగ్నికీలల్లో వేలాది చెట్లు దగ్ధం -
రైతులు ప్రాణాలు కోల్పోతున్నా పట్టింపేది?
జనగామ: రైతు తన పంటను అమ్ముకోలేని పరిస్థితి నెలకొన్నా, కుప్పలపై ప్రాణాలు వదులుతున్న రైతుల దుస్థితిని పట్టించుకునే మనసు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ‘రైతుగోస–బీజేపీ భరోసా’ బస్సు యాత్ర మంగళవారం జిల్లాకు చేరుకుంది. ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యేలు పైడి రాకేష్రెడ్డి, పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి, దన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ సీహెచ్ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆరుట్ల దశమంత్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేశ్తో కలిసి బీజేపీ ఫ్లోర్ లీడర్ ఆలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత బృందం జనగామ మార్కెట్ పరిధిలోని కాటన్ యార్డు ఐకేపీ, మెప్మా ధాన్యం కొనుగోలు సెంటర్లను సందర్శించారు. ధాన్యం రాశుల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడారు.. సెంటర్లలో బస్తా కాంటా 41.600 కిలోల చొప్పున వేస్తుండగా, మిల్లుకు వెళ్లిన తర్వాత మరో రెండు కిలోలు కటింగ్ చేస్తున్నారని జనగామకు చెందిన మహిళా రైతు మాలోతు రాణి బీజేపీ ఫ్లోర్ లీడర్కు చెబుతూ ఆవేదనకు గురయ్యారు. అనంతరం బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో కిలోమీటర్ల కొద్దీ ధాన్యం కుప్పలతో రైతులు 45 రోజులుగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతల నడుమ కాపలా కాస్తున్నా, ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్రెడ్డి మాట్లాడుతూ.. లక్ష టన్నుల ధాన్యం రోడ్లపైనే ఉండిపోయిందని, ఈ పరిస్థితి ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధమైన సమస్యలు ఉంటే, జనగామ జిల్లాలో మరో రకంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్రెడ్డి జిల్లాలో బీజేపీ బస్సు యాత్ర.. ఐకేపీ, మెప్మా సెంటర్లను సందర్శించిన ప్రజాప్రతినిధులు -
అలంకారప్రాయంగా హెల్త్ సబ్సెంటర్
జఫర్గఢ్: గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులో తెచ్చేందుకు గత ప్రభుత్వం ఎంతో అర్భాటంగా చేపట్టిన హెల్త్ సబ్సెంటర్లు నిధుల కొరతతో ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అందుబాటులోకి రావడం లేదు. దీంతో వైద్య సేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలోని తమ్మడపల్లి (ఐ) గ్రామంలో గత ప్రభుత్వ హయంలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) స్కీం ద్వారా రూ.20 లక్షల నిధులతో హెల్త్ సబ్ సెంటర్ను మంజూరు చేసింది. ఆ నిధులతో 2024 సంవత్సరంలో గ్రామంలోని ఉప్పుగల్లు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో భవన నిర్మాణ పనులను చేపట్టారు. దీంతో సదరు కాంట్రాక్టర్ భవన నిర్మాణ పనులు పూర్తిచేశారు. కానీ, ఇంకా అందులో ఫ్లోరింగ్, ప్లబింగ్, నీటి సౌకర్యం, విద్యుత్, తలుపులు, కిటికీలు తదితర పనులు చేపట్టాల్సి ఉండగా నిధుల కొరత మూలంగా ఆ పనులు నిలిచిపోయాయి. భవనం పూర్తయి నెలలు గడుస్తున్నప్పటీకి మిగితా పనులు కాకపోవడంతో హెల్త్ సెంటర్ భవనం అలంకారప్రాయంగానే మిగిలిపోయింది. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. కాగా, భవనంలో మిగతా పనులు చేపట్టేందుకు మరో రూ.3 లక్షలు అవసరం కానుండడంతో దీనికి సంబంధించిన ప్రతిప్రాదనలు సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదించిన్నప్పటికీ మంజూరుకు నోచుకోలేదు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మిగతా పనులు పూర్తి చేయించి హెల్త్ సబ్ సెంటర్ ద్వారా వైద్య సేవలందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. తమ్మడపల్లి (ఐ)లో నూతనంగా నిర్మించిన హెల్త్ సెంటర్ భవనంలో వైద్య సేవలను వెంటనే ప్రారంభించాలి. భవనం పూర్తయి అలంకారప్రాయంగానే ఉంటోంది. ఇప్పటికై నా మిగతా పనులు చేపట్టి వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించాలి. – ఆగబోయిన రాధిక, తమ్మడపల్లి హెల్త్ సెంటర్ భవనం పూర్తయి నెలలు కావస్తున్నా ప్రారంభించడం లేదు. నీటి వసతి, కరెంటు, ఫర్నీచర్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసే విషయంలో ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. వెంటనే చర్యలు తీసుకోవాలి. – రడపాక సునీల్, తమ్మడపల్లి భవనం పూర్తయినా నిధులులేక మిగతా పనులకు నోచుకోని పరిస్థితి తమ్మడపల్లిలో అందుబాటులోకి రాని వైద్య సేవలు -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
స్టేషన్ఘన్పూర్: ప్రస్తుత వేసవికాలంలో జరిగే అగ్నిప్రమాదాలపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని స్టేషన్ఘన్పూర్ ఫైర్స్టేషన్ ఎస్సై ఎన్.దేవేందర్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్టేషన్ఘన్పూర్ అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అగ్నిప్రమాదాల నివారణపై మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, ఫైర్స్టేషన్ జమీందార్ కె.లింగయ్య, సిబ్బంది సతీష్, సాంబయ్య, నరేష్ పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతమవ్వాలి
● పలు కొనుగోలు కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీలు స్టేషన్ఘన్పూర్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. డివిజన్ కేంద్రమైన స్టేషన్ఘన్పూర్లో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రం, మండలంలోని నమిలిగొండ గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఆయనతో పాటు తహసీల్దార్ స్వప్న, అధికారులు, నిర్వాహకులు ఉన్నారు. జఫర్గఢ్లో.. జఫర్గఢ్: రైతులకు ఇబ్బంది కలుగకుండా వేగంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ నిర్వాహకులకు సూచించారు. మండలంలోని కూనూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ దేవేందర్, అధికారులు ఉన్నారు. ఓపీఎంఎస్లో నమోదు చేయాలి జనగామ రూరల్: ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల వివరాలను ఓపీఎంఎస్లో నమోదు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్లో మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో డీఆర్డీఓ భాస్కర్, మార్క్ఫెడ్ డీఎం చంద్రశేఖర్, డీఎంఓ రామకృష్ణ, అదనపు డీఆర్డీఓ నూరుద్దీన్, సివిల్ సప్లై డీఎం హతీరామ్, డీసీఎస్ఓ సురేష్ రెడ్డి, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ పాల్గొన్నారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలి భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్తో కలిసి వివిధ మండలాల తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియపై కలెక్టర్ సమీక్షించి పలు సూచనలు చేశారు. సమావేశంలో ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
ధాన్యం తరలింపులో వేగం పెంచాలి
● అదనపు కలెక్టర్ బెన్షాలోమ్పాలకుర్తి టౌన్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలింపులో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని తొర్రూరు, పాలకుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ రైతుకు గన్నీ బ్యాగులు ఇవ్వాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రఘనాథపల్లి వద్ద ప్రభుత్వ గోదాంల్లోకి ధాన్యాన్ని తరలించేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాలకుర్తిలో వ్యవసాయ మార్కెట్ గోదాంనకు కూడా ధాన్యాన్ని తరలించాలని అధికారులను సూచించారు. తహసీల్దార్ సరస్వతి, పీఏసీఎస్ కార్యదర్శి రణధీర్ పాల్గొన్నారు. స్నేహితుడికి సాయం బచ్చన్నపేట: మండలంలోని ఆలింపూర్ గ్రామానికి చెందిన తేలుకంటి మురళికి బైపాస్ సర్జరీ అయింది. కాగా, బచ్చన్నపేట హైస్కూల్లో మురళితో కలసి 1984–85 బ్యాచ్ టెన్త్ చదివిన పూర్వవిద్యార్థులు మంగళవారం రూ.70వేల సాయం అందజేశారు. మిత్రులు పెరుమాండ్ల యాదగిరి, తేలుకంటి వేణుగోపాల్, తమ్మడి మహేందర్ పాల్గొన్నారు. వైభవంగా అష్టదళ పాదపద్మారాధన పూజ చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ వైభవంగా స్వామి వారికి విశ్వక్సేన ఆరాధన, అష్టోత్తర శత సువర్ణ పుష్పాదులతో అష్టదళ పాదపద్మారాధన పూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు సువర్ణ పుష్పాలను చూపించారు. ఆలయ చైర్మన్ శ్రీధర్రావు, ఈఓ లక్ష్మీప్రసన్న, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, గణగోని రమేష్, గొల్లపల్లి వాసు, దారం రాజన్బాబు, కాండూరి రంగరాజు భక్తులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు బైకు దగ్ధం బచ్చన్నపేట: ప్రమాదవశాత్తు బైక్ నుంచి మంటలు వచ్చి దగ్ధమైంది. ఈ ఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఓ యువకుడు తన బైక్పై జనగామ నుంచి బచ్చన్నపేటకు మధ్యాహ్నం వచ్చి బస్టాండ్ వద్ద చాయ్ తాగడానికి బైక్ను పార్కింగ్ చేసి హోటల్కు వెళ్లాడు. ఎండ వేడికి బైక్ పెట్రోల్ ట్యాంకు అంటుకుని భారీగా మంటలు చెలరేగాయి. గమనించిన చుట్టు పక్కల వారు నీళ్లు పోసి మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో బైక్ చుట్టూ ఉన్న ఇతర వాహనాలను పక్కకు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వాహనాల్లో పెట్రోల్ను ఫుల్గా నింపకూడదని, వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. పరామర్శ బచ్చన్నపేట: మండలంలోని బసిరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ నల్ల సిద్దినర్సమ్మ మల్లయ్య కుమారుడు వెంకటేష్ రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందాడు. కాగా, మంగళవారం పలువురు నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృత దేహంపై పూల మాల వేసి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పరామర్శించిన వారిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్కుమార్గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు బాల్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రాములు తదితరులు ఉన్నారు. నియామకం జనగామ రూరల్: భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా మండలంలోని శామీర్పేట గ్రామానికి చెందిన చింతకింది సంతోష్ మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీజేవైఎం రాష్ట్ర కమిటీలో అధికార ప్రతినిధిగా చురుగ్గా పనిచేస్తుండడంతో మరొకసారి అవకాశం ఇచ్చినట్టు గణేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పజెప్పిన బాధ్యతను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. -
హైకోర్టు న్యాయవాది సాధిక్ అలీ దీక్ష
జనగామ: పట్టణానికి చెందిన హైకోర్టు న్యాయవాది ఎండీ సాధిక్ అలీ మంగళవారం తన ఇంట్లో ఆమరణ దీక్షకు కూర్చున్నారు. ఆమరణ దీక్షకు సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొట్ల శేఖర్, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, బీఆర్ఎస్ పట్టణ నాయకులు ఎండీ సాజిద్ కమర్, యాకూబ్ పాషా, సల్మాన్ హామీర్ మద్దతు ప్రకటించారు. అనంతరం సాధిక్ అలీ మాట్లాడుతూ.. కలెక్టర్కు వ్యతిరేకంగా కత్తుల రాజిరెడ్డి కేసును హైకోర్టులో వాదించడంతో తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారన్నారు. కలెక్టర్ బాధితులకు రక్షణ కమిటీని ఏర్పాటు చేసి, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీల దృష్టికి తీసుకుపోవడంతో తనపై నిషేధాజ్ఞలు విధించారన్నారు. రెవెన్యూ, మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో వచ్చి తన ఇంటిని కొలతలు వేసి, తేడా ఉన్నాయని ఇల్లును కూల్చివేస్తామని చెప్పినట్లు తెలిపారు. దీనిపై విచారణ జరిపించాలని సాధిక్ అలీ కోరారు. -
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత
కొడకండ్ల: బాల్య వివాహాల నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత అని తహసీల్దార్ ఉత్తలూరి అనీల్బాబు అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్ మాట్లాడారు. ఎంపీడీఓ శంకర్, సీడీపీఓ విజయచంద్రిక, సర్పంచ్ దూలం మమతసతీష్గౌడ్, సూపరువైజరు సరళ, రేణుక, ఇందిర పాల్గొన్నారు. బాల్య వివాహాలు చట్ట విరుద్దం నర్మెట: బాల్య వివాహాలు చట్టవిరుద్దమని ఎస్సై నైనాల నగేష్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు శృతి, సునీతా దేవి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాల సందర్భంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నర్మెట గ్రామ పంచాయతీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన బాల్య వివాహాల నిర్మూలన–తెలంగాణ అంశంపై ఏర్పాటు అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేసి కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్, ఎంఈఓ మడిపల్లి ఐలయ్య, ఎంపీఓ ఆకుల వెంకట మల్లికార్జున్, ఏఎన్ఎం కుల్సుం సుల్తానా, సీహెచ్సీడబ్ల్యూ ప్రశాంత్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మనోజ్ కుమార్, కార్యదర్శి ఎండి.ఖాజా నసీరొద్దీన్ పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్ను దెబ్బతీసే బాల్య వివాహాలు చేయొద్ధు చిల్పూరు: పిల్లల భవిష్యత్ను దెబ్బతీసే బాల్యవివాహాలు చేయవద్ధని, అలా చేసినట్లు తెలిస్తే చర్యలు తప్పవని తహసీల్ధార్ విజయ్కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ నలిమెల అనిత ఆధ్వర్యంలో ఐసీడీఎస్ మండల సూపర్ వైజర్ దూలమ్మ అధ్యక్షతన బాల్యం రక్షిద్ధాం.. భవిష్యత్ వెలిగిద్ధాం కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల నిర్యూలన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఎంపీడీఓ రఘురామకృష్ణ, ఉపాధి హామీ ఏపీఓ మోహన్రావు, ఐకేపీ ఏపీయం పిట్టల నరేందర్, పంచాయతీ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, కిరణ్కుమార్ పాల్గొన్నారు. జఫర్గఢ్: బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించాలని ఎంపీడీఓ సుమన్, సర్పంచ్ కుల్లా మోహన్రావు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ శ్రావ్య, కార్యదర్శి నాగరాజు, సూపర్ వైజర్ అనిత, అంగన్వాడీ టీచర్లు అమృత, రాజకళ, సోమలక్ష్మి, ఉమ, నాగమణి పాల్గొన్నారు. బచ్చన్నపేట: బాల్య వివాహాలను నిషేధించాలని నయాబ్ తహసీల్దార్ శంకర్ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సఖీ కేంద్రం సభ్యులు, మహిళలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అంగన్వాడీలు, ఆశాలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అవగాహన పాలకుర్తి టౌన్, పాలకుర్తి టౌన్(దేవరుప్పలు): ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాలను పురస్కరించుకొని పాలకుర్తి జీపీ, దేవరుప్పుల మండల కేంద్రాల్లో బాల్య వివాహాల నిర్మూలన–తెలంగాణ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న బాల్య వివాహ నిరోధక చట్టాలపై ప్రజలక అవగాహన కల్పించి కరప్రతలు పంపిణీ చేశారు. వాల్పోస్టర్లను ప్రదర్శించి ప్రతిజ్ఞ చేయించారు. పాలకుర్తి సర్పంచ్ కమ్మగాని విజయ, ఎంపీఓ శ్రీనాథ్రెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ తాహేరా, మల్లీశ్వరి, దేవర్పుల సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి, కామారెడ్డి గూడెం సర్పంచ్ చింత రవి, మోన్పాడు సర్పంచ్ బాలమ్మ, దేవరుప్పల ఎస్సై సృజన్కుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు సావత్రి, శ్రీదేవి, చైల్డ్ హెల్ప్లైన్ కో ఆర్డినేటర్ రవికుమార్, ప్రణయ్కుమార్, పుష్పలత పాల్గొన్నారు. -
హెచ్టీ సర్వీసులకు ‘సింగిల్ విండో’
జనగామ: జనగామ విద్యుత్ సర్కిల్లో హెచ్టీ విద్యుత్ సేవల మంజూరులో వేగం, పారదర్శకత పెంచేందుకు ‘సింగిల్ విండో’ విధానం అమలులోకి తీసుకొచ్చారు. 11 కేవీ, 33 కేవీతో పాటు అధిక ఓల్టేజ్ హెచ్టీ సర్వీసుల కోసం దరఖాస్తుల పరిశీలన, అనుమతుల ప్రక్రియలను మరింత సరళీకరించేందుకు కార్పొరేట్, సర్కిల్ స్థాయిలో ప్రత్యేక ‘హెచ్టీ మానిటరింగ్ సెల్’ను ఏర్పాటు చేశారు. ఈ సెల్ ద్వారా దరఖాస్తుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించి, సంబంధిత అధికారులకు బాధ్యతలు విభజించి, వినియోగదారులకు నిర్ణీత కాలంలో సేవలు అందేలా చర్యలు చేపట్టారు. కొత్త వ్యవస్థతో వినియోగదారులు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, ఒకే వేదికలో అన్ని అనుమతులు, సేవల మంజూరు వేగంగా జరుగనుంది. హెచ్టీ సేవలపై ప్రజలకు మరింత సులభమైన, సమర్థమైన విధానాన్ని అమలు చేయడం లక్ష్యమని ఎస్ఈ తెలిపారు. ఆన్లైన్ నమోదు–ట్రాకింగ్ విధానం టీజీఐపాస్ పరిధిలోకి రాని హెచ్టీ దరఖాస్తుదారులు టీజీ ఎన్పీడీసీఎల్ అధికారిక పోర్టల్లో అవసరమైన పత్రాలను అప్లోడ్ చేస్తూ ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. దరఖాస్తు పూర్తికాగానే ప్రత్యేక అప్లికేషన్ నెంబర్ (యూఐడీ) కేటాయించబడుతుంది. ఈ దరఖాస్తులు వెంటనే సంబంధిత సర్కిల్ కార్యాలయ డాష్బోర్డ్లో కనిపిస్తాయి. ఏడీఈ (కమర్షియల్) అధికారులు ఈ డాష్బోర్డ్ను ప్రతిరోజూ పర్యవేక్షిస్తారు. పరిశీలన–మంజూరు ప్రక్రియ దరఖాస్తు నమోదైన వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన, ఎస్టిమేట్ల కోసం సంబంధిత అధికారులకు పంపిస్తారు. సర్కిల్ ఏడీఈ (కమర్షియల్) స్వయంగా మౌలిక సదుపాయాల లొకేషన్ను క్షేత్రస్థాయి సిబ్బందితో పరిశీలిస్తారు. 33 కేవీ, అంతకు పైబడి సర్వీసులకు కార్పొరేట్ కార్యాలయ ఉన్నతాధికారుల అనుమతి అవసరం ఉంటుంది. అదే విధంగా 33 కేవీ దరఖాస్తుల ఫీజిబిలిటీ అనుమతులను సీఈ కమర్షియల్, ఆర్ఏసీ, టీజీ ట్రాన్స్కో హైదరాబాద్ కార్యాలయానికి ఆన్న్లైన్ ద్వారా పంపిస్తారు. సమయపాలన–పారదర్శకత దరఖాస్తులు ఫీజిబిలిటీ అనుకూలంగా ఉంటే రెండు రోజుల్లోపే పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. సాంకేతిక సమస్యల వల్ల సాధ్యంకాకపోతే దరఖాస్తుదారునికి ఎస్ఎంఎస్ ద్వారా వెంటనే సమాచారం పంపిస్తారు. 33 కేవీ, ఆపై దరఖాస్తులు నిర్దేశిత సమయపాలన ప్రకారం పరిశీలిస్తారు. అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుతో సర్వీసులు మంజూరు చేస్తారు. ఈ సింగిల్ విండో వ్యవస్థ ప్రవేశ పెట్టడం ద్వారా హెచ్టీ సర్వీసుల మంజూరు మరింత వేగవంతం కాగా, వినియోగదారులకు పూర్తిస్థాయి పారదర్శకత కలుగనుంది. వేగవంతం, పారదర్శకత.. హెచ్టీ 11 కేవీ, 33 కేవీతో పాటు అధిక ఓల్టేజ్ సేవల మంజూరును వేగవంతం చేసి పారదర్శకంగా అందించేందుకు సింగిల్ విండో విధానాన్ని ప్రారంభించాం. దరఖాస్తుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక హెచ్టీ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశాం. వినియోగదారులు ఆలస్యం లేకుండా సేవలు పొందడం మా ప్రధాన లక్ష్యం. సింగిల్ విండో విధానంతో ప్రతి చిన్న పనికి కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇంటి నుంచే తమ దరఖాస్తు స్థితిగతులను ఆన్లైన్ ద్వారా స్టేటస్ చేసుకోవచ్చు. – సంపత్రెడ్డి, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్11 కేవీ ఓల్టేజ్ దరఖాస్తులు సర్కిల్ కార్యాలయంలోని ఏడీఈ (కమర్షియల్) అధికారి పర్యవేక్షిస్తారు. 33 కేవీ, ఆపై ఓల్టేజ్ దరఖాస్తులు కార్పొరేట్ కార్యాలయంలోని ఏడీఈ (కమర్షియల్) పర్యవేక్షణలో ఉంటాయి. విద్యుత్ వినియోగదారులకు వేగవంతంగా సేవలు దరఖాస్తుల పర్యవేక్షణకు ప్రత్యేక హెచ్టీ మానిటరింగ్ సెల్ -
స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు
జనగామ రూరల్: 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి విక్రమ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన ఎస్సీ విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం తెలంగాణ ఈ–పాస్ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తక్షణమే తమ పేర్లను నమోదు చేసుకుని ఉపకార వేతనాలను పొందాలని కోరారు. నేడు మహిళా ఉద్యోగులకు అవగాహన జనగామ రూరల్: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు మహిళా ఉద్యోగులకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మహిళా ఉద్యోగులు హాజరు కావాలని, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం –2013 (నిరోధం, నిషేధం, పరిహారం) గురించి అవగాహన ఉంటుందన్నారు. వడదెబ్బ మృతుడి కుటుంబానికి రూ.5లక్షల అందజేత స్టేషన్ఘన్పూర్: మండలంలోని రంగరాయగూడెం గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడదెబ్బతో సోమవారం మృతిచెందిన రైతు నెలమంచ ఇలేందర్రెడ్డి కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో కలెక్టర్ నిధుల నుంచి మంగళవారం రూ.5లక్షలు అందించారు. ఈ చెక్కును స్థానిక తహసీల్దార్ స్వప్న చేతులమీదుగా మృతుడి భార్యకు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ జూలుకుంట్ల శిరీష్రెడ్డి, ఆర్ఐలు శ్రీకాంత్, సతీష్, నాయకులు తోట వెంకన్న, నెలమంచ అజయ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ను కలిసిన మహిళా కమిషన్ సభ్యురాలు పాలకుర్తి టౌన్: రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన చిట్యాల శ్వేత మంగళవారం హైదరాబాద్లో గవర్నర్ నివాసంలో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తానని శ్వేత పేర్కొన్నారు. మహిళా కమిషన్ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహంచాలని ఈసందర్భంగా గవర్నర్ ఆమెకు సూచించారు. -
శ్రీనివాస్ సేవలు మరువలేనివి
జనగామ రూరల్: ఆర్యవైశ్యలకు అరుగుల శ్రీనివాస్ చేసిన సేవలు మరువలేనివని పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి గట్టు వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణంలోని ఆవోపా భవనంలో మంగళవారం అరుగుల శ్రీనివాస్ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ చేసిన సేవలను కొనియాడారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు పజ్జూరి గోపయ్య, పజ్జూరి జయహరి, బిజ్జాల నవీన్ కుమార్ సంపత్, శర్విరాల ఉపేందర్, తమ్మిశెట్టి మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు. -
సతీష్కు ఉత్తమ పొలిటికల్ లీడర్ అవార్డు
స్టేషన్ఘన్పూర్: నాయిబ్రాహ్మణ జనసంస్థ 9వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని బీసీ సాఽధికారత సంస్థ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రతిభాపురస్కారాలు–2026 కార్యక్రమంలో భాగంగా ఘన్పూర్ పట్టణ కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కొలిపాక సతీష్కు ఉత్తమ పొలిటికల్ లీడర్ అవార్డును ప్రదానం చేశారు. సీపీఎం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ భారత ప్రభుత్వ సభ్యులు డాక్టర్ సారంగపాణి, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎల్.రాంబాబు, రాష్ట్ర సైకాలజిస్టు అసోసియేషన్ కార్యదర్శి సుధాకర్ చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. నాయిబ్రాహ్మణ జనసంస్థ 9వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి అవార్డులను ప్రదానం చేశామని, అందులో భాగంగా 28 సంవత్సరాలుగా ఒకే పార్టీలో ఉంటూ నిస్వార్దంగా రాజకీయాల్లో రాణిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేసిన సతీష్కు అవార్డును అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ ఉత్తమ పొలిటికల్ లీడర్గా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. -
జేఎల్ఎంలకు పదోన్నతి కలేనా..?
హన్మకొండ: ఆకాశంలో వేలాడుతున్న విద్యుత్ తీగలపై అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై యాజమాన్యం కనికరం చూపడం లేదు. ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు పదోన్నతి మీద పదోన్నతి తీసుకుంటూ.. జూనియర్ లైన్మెన్ల చిరుద్యోగుల పదోన్నతి హక్కును కాలరాయడంపై నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని టీజీ ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లో జూనియర్ లైన్మన్లకు ఆ యాజమాన్యాలు ఏఎల్ఎంలుగా పదోన్నతి కల్పించాయి. కానీ, ట్రాన్స్కోలో కల్పించకుండా జూనియర్ లైన్మన్లను గోస పెడుతోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. అన్నీ ఖాళీలే.. టీజీ ట్రాన్స్కోలో జేఎల్ఎం పోస్టులు 1,119 ఉన్నాయి. ఇందులో 892 పోస్టులు భర్తీ అయ్యాయి. అసిస్టెంట్ లైన్మన్ పోస్టులు 378 ఉండగా ఇక్కడ ఆరుగురు మాత్రమే ఉన్నారు. లైన్మన్ పోస్టులు 280 ఉండగా ఏడుగురు మాత్రమే ఉన్నారు. 372 అసిస్టెంట్ లైన్మన్ పోస్టులు ఖాళీగా ఉన్న వాటిని పదోన్నతి ద్వారా భర్తీ చేయకుండా జేఎల్ఎంల సహనానికి పరీక్ష పెడుతున్నారు. 24 గంటలు శ్రమిస్తూ వ్యవస్థను నిలబెడుతున్న తమపై ఇంత వివక్ష యాజమాన్యానికి తగదని మొత్తుకుంటున్నారు. వయస్సు మీరుతున్నా.. జూనియర్ లైన్మన్ పోస్టులు నియమించే క్రమంలో అప్పటికే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఆర్టిజన్లుగా పని చేస్తూ ఈ ఉద్యోగంలోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. రిక్రూట్మెంట్ సమయంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఆర్టిజన్ ఉద్యోగులకు ఇన్ సర్వీస్ వెయిటేజీ ఇవ్వడంతో చాలాది జేఎల్ఎంలుగా ఎంపికయ్యారు. వీరు అప్పటికే 10 నుంచి 15 సంవత్సరాల సర్వీస్ చేసిన వారున్నారు. చాలామంది 50 ఏళ్ల వయస్సుకు వచ్చారు. వయస్సు మీరుతున్నా వీరంతా తమకు ఒక్క పదోన్నతి వచ్చిన చాలు అనే ఆశతో ఉన్నారు. కానీ, వీరి ఆశలను ట్రాన్స్ కో యాజమాన్యం నీరుగారుస్తోంది. ఇంజనీర్లు, అకౌంట్స్, హెచ్ఆర్డీ విభాగంలో అన్ని స్థాయి ఉద్యోగులకు పదోన్నతి కల్పించిన యాజమాన్యం తమకు ఎందుకు కల్పించడం లేదని జూనియర్ లైన్మన్లు ప్రశ్నిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రాణాలను సైతం లెక్క చేయకుడా విధులు నిర్వహిస్తున్న జేఎల్ఎంలపై యాజమాన్యం తక్కువ చేసి చూడడం సమంజసం కాదని ఉద్యోగ సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా జేఎల్ఎంలకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ట్రాన్స్కో యాజమాన్యం తీరుపై విమర్శలు ఏఎల్ఎంలుగా పదోన్నతి కల్పించడంలో జాప్యం ప్రమాదకరంగా విధులు నిర్వర్తిస్తున్నా కనికరం చూపని వైనం -
రౌడీ.. మారకపోతే ‘పీడీ’!
సాక్షిప్రతినిధి, వరంగల్: రౌడీషీటర్ల ఆగడాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మళ్లీ పెరుగుతుండడంతో పోలీసుశాఖ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీస్తో పాటు జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. ఐదారు రోజులుగా వరంగల్ పోలీసు కమిషనరేట్తో పాటు అన్ని జిల్లాల్లో రౌడీషీటర్లను పోలీసుస్టేషన్లకు పిలిచి మళ్లీ కౌన్సెలింగ్ చేస్తున్నారు. ‘స్టేషన్’ల వారీగా సమీక్ష.. కౌన్సెలింగ్లు ఇటీవల ప్రజావాణి కార్యక్రమాలు, కలెక్టరేట్లు, పోలీస్స్టేషన్లు, కమిషనరేట్కు అందుతున్న ఫిర్యాదుల్లో భూవివాదాలు, సెటిల్మెంట్లు, బెదిరింపుల కేసులే అధికంగా ఉండడం పోలీసుశాఖను అప్రమత్తం చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపి కొందరు రౌడీషీటర్లు ఖాళీ స్థలాలు, వివాదాస్పద భూముల విషయంలో జోక్యం చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ రౌడీషీటర్ల లిస్టుపై పోలీస్ స్టేషన్ల వారీగా సమీక్ష చేస్తున్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం సుమారు 752 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. గతంలో నేరాలకు పాల్పడి ప్రస్తుతం సత్ప్రవర్తనతో జీవిస్తున్న వారిని గుర్తించి రౌడీషీట్లు ఎత్తివేయాలనే ఆలోచనతోపాటు.. నేర ప్రవృత్తిని కొనసాగిస్తున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. గతంలో చేపట్టినట్లే ఈసారి కూడా ముందుగా కౌన్సెలింగ్ల ద్వారా మార్పు తీసుకురావాలని పోలీసుశాఖ నిర్ణయించింది. ప్రతీ పోలీస్స్టేషన్లో రౌడీషీటర్లను పిలిపించి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. నేరాలకు దూరంగా ఉండాలని, సాధారణ జీవితం గడపాలని, లేకపోతే కఠిన చట్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఒకటి రెండు సార్లు హెచ్చరించినా మారని వారిపై పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టు ప్రయోగించేందుకు ఫైళ్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ప్రత్యేక నిఘా.. సీక్రెట్ రిపోర్టులు పోలీస్స్టేషన్ల వారీగా ‘హిస్టరీ షీటర్లు’, ‘రౌడీషీటర్లు’, ‘గూండాలు’, ‘సస్పెక్టెడ్ ఆఫెండర్స్’జాబితాలను నవీకరిస్తున్నారు. వీరి కదలికలపై స్పెషల్ బ్రాంచ్, టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు కలిసి నిఘా ఉంచుతున్నారు. సోషల్ మీడియాలో బెదిరింపులు, సెలబ్రేషన్ల పేరుతో మారణాయుధాలను ప్రదర్శించడం, రీల్స్ ద్వారా భయాందోళనలు సష్టించడం వంటి అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. మారితే మంచిది.. లేదంటే కఠిన చర్యలు ప్రజల్లో భద్రతాభావం పెంచడం, ట్రైసిటీస్లో శాంతిభద్రతలు కాపాడడం లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నామని పోలీసు అధి కారులు చెబుతున్నారు. కౌన్సెలింగ్లతో మారిన వారికి సహకరిస్తామని.. కానీ అదే పద్ధతి కొనసాగిస్తే పీడీ యాక్టు, నగర బహిష్కరణ, బైండోవర్, నిరంతర పర్యవేక్షణ తప్పదని స్పష్టం చేస్తున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 752 మంది రౌడీషీటర్లు మళ్లీ మొదలైన కౌన్సెలింగ్ రౌడీల కట్టడికి మరోసారి పోలీసుల ముందస్తు చర్యలు -
ఉపాధి కార్యదర్శుల చేతికి
స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల పర్యవేక్షణ పూర్తి బాధ్యత ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్యను పెంచడంతో పాటు పనులను కల్పించడం, ఎన్ఎంఎంఎస్ ఫేస్ అథెంటికేషన్ హాజరు తదితర ఏడు రకాల రిజిష్టర్ల నిర్వహణ పక్కాగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామాల్లో ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెరగడంతో పాటు పనులు పారదర్శకంగా జరుగుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెబాట పట్టడంతో వారిని పక్కనబెట్టి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మొదటగా కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించింది. దాంతో ఉపాఽధి హామీ పనులను కార్యదర్శులు పర్యవేక్షించారు. టెక్నికల్ అసిస్టెంట్లతో కలిసి అన్ని పనులను వారే నిర్వహించేవారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరిగి ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంది. పలువురు పంచాయతీ కార్యదర్శులు తమ రెగ్యులర్ పనులకు ప్రాధాన్యమిస్తూ ఉపాధి హామీ పనులను విస్మరిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈజీఎస్ పనుల పూర్తిస్థాయి పర్యవేక్షణ పంచాయతీ కార్యదర్శులు చేయాలని తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. డీఆర్డీఓల ద్వారా ఎంపీడీఓ, ఎంపీఓలతో పంచాయతీ కార్యదర్శులకు ఉపాధి పనుల పర్యవేక్షణను ప్రాధాన్యంగా చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈజీఎస్లో కార్యదర్శుల విధులు.. ఉపాధి హామీ పథకంలో కార్యదర్శులు ఏ విధులు నిర్వహించాలో స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఉపాధి హామీ సిబ్బంది సహాయంతో గ్రామాల్లో వందరోజుల పనులు, వన మహోత్సవ కార్యక్రమాలు చేపట్టి పర్యవేక్షించాలి. మేట్లను నియమించడంతో పాటు వారితో కలిసి కూలీల నుంచి పని డిమాండ్ వివరాలను తీసుకోవాలి. కూలీలు మస్టర్లు నమోదు చేసుకునేలా చూడడంతో పాటు వారం చివరలో వాటిపై కౌంటర్ సైన్ చేసి టెక్నికల్ అసిస్టెంట్లకు అప్పగించాలి. ఎన్ఎంఎంఎస్ యాప్లో కూలీల ఫేస్ అథెంటికేషన్ ద్వారా హాజరును అప్లోడ్ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వీటితో జాబ్కార్డుల అప్డేషన్, వారానికోసారి సమావేశాల నిర్వహణ, పని ప్రదేశాల్లో బోర్డును తనిఖీ చేయడం, కూలీలకు అవసరమైన తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం గ్రీన్నెట్ షెడ్లను ఏర్పాటు చేయడం తదితర పనులను పర్యవేక్షించాలి. వీటితో పాటు ప్రధానంగా గ్రామాల్లో సర్పంచ్లతో సమావేశాలు ఏర్పాటు చేసి కూలీల సంఖ్య పెంచేలా శ్రద్ధ వహించాలి. కాగా ఉపాధి పనుల పర్యవేక్షణ పూర్తి బాధ్యత పంచాయతీ కార్యదర్శులకు అప్పగించడంపై గ్రామాల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో కూలీల సంఖ్య పెంపుతో పాటు పనులను పారదర్శకంగా, సమర్థవంతంగా చేపడుతారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర్వులు అందాయిఉపాధి హామీ పనుల పర్యవేక్షణ పంచాయతీ కార్యదర్శులకు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అందాయి. వాటిపై ఇటీవల పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ప్రతీ కార్యదర్శి తప్పనిసరిగా ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్యను పెంచడంతో పాటు పనులు పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించాలి. – నర్సింగం, ఎంపీఓ, స్టేషన్ఘన్పూర్ కూలీల హాజరు నుంచి పనుల పర్యవేక్షణ వరకు.. కూలీల సంఖ్య పెరిగే అవకాశం పారదర్శకంగా పనుల నిర్వహణ ఆదేశాలు జారీ చేసిన గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ -
సనాతన ధర్మం, వేదాలకు నిలయం భారత్
జఫర్గఢ్: సనాతన ధర్మానికి వేదాలకు నిలయం భారత దేశమని శ్రీశ్రీశ్రీ శ్రీధర్ ఆనంద భారతి స్వామి, ప్రముఖ జర్నలిస్టు నవత అన్నారు. ఉప్పుగల్లు గ్రామంలో హిందూ మహా సమ్మేళన కార్యక్రమాన్ని సోమవారం రాత్రి నిర్వహించారు. ముందుగా హనుమాన్ శోభాయాత్రను చేపట్టారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి గడ్డం రాజుగౌడ్ అధ్యక్షత వహించగా వారు మాట్లాడారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. లక్ష్మణ్సుధాకర్జి, సర్పంచ్ కొడారి సాంబరాజు, ఉప సర్పంచ్ మధు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
పాలకుర్తి టౌన్: ప్రభుత్వం వెంటనే రైతులు సమస్యలను పరిష్కరించాలిన బీజేపీ రాష్ట్ర నాయకుడు లేగా రామ్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని తొర్రూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రామ్మోహన్రెడ్డి సందర్శించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గన్ని బ్యాగులు కొరత, తూకాల సమస్యలు, లాల ఆలసస్యం కారణంగా రైతులు నష్టపోతున్నారని తహసీల్దార్ సరస్వతికి వివరించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాగాల నవీన్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రంగు రాములు, పల్లె కుమార్, చింత సృజన్, దుంపల సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలయ భూముల వేలం ఆదాయం రూ.67 వేలు
పాలకుర్తి టౌన్: మండలంలోని వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయ భూముల కౌలు కాస్తుకు వేలం ద్వారా ఆలయానికి రూ.67 వేల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో వల్మిడి ఆలయ భూములు కౌలుకు వేలం నిర్వహించారు. మండలంలోని గూడూరు సర్వే నంబర్ 639లో 1.34 ఎకరాలకు రూ.7,500, వల్మిడిలో సర్వేనంబర్ 499లో 2.13 ఎకరాలకు రూ. 13 వేలు, రాయపర్తి మండలం కేశవాపురం సర్వేనంబర్ 157, 158, 159లో 4.10 ఎకరాలకు రూ. 40వేలు, కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి సర్వే నంబర్ 180సీ, 380ఏ, 380ఏలో 2.35 రూ.6,500 ఆలయ భూముల కౌలు కాస్తుకు వేలం ద్వారా ఆదాయం వచ్చిన్నట్లు ఈఓ తెలిపారు. వేలం పాటలో కౌలు రైతులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
పచ్చిరొట్టతో చేనుకు చేవ
నర్మెట: పచ్చిరొట్టతో భూసారం పెరిగి.. చేనుకు చేవయిస్తుందని మండల వ్యవసాయాధికారి అక్కిరెడ్డి కర్ణాకర్రెడ్డి అన్నారు. స్థానిక పీఏసీఎస్లో మంగళవారం 50 శాతం సబ్సిడీలో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీలో భాగంగా జీలుగ విత్తనాలను సీఈఓ కొన్నె వెంకటయ్యతో కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి రైతులు సేంద్రియ ఎరువులను వాడాలని భూసారం పెరుగడంతో పాటు సాగు వ్యయం తగ్గి నాణ్యమైన దిగుబడులను పొందవచ్చన్నారు. పీఏసీఎస్తో పాటు ఆగ్రోస్ రైతు సేవాకేంద్రంలో విత్తనాలు అందు బాటులో ఉన్నాయని తెలిపారు. ఏఈఓ సుంకరి జగదీష్, సిబ్బంది ఐలేని కేశవరెడ్డి, వేముల శివ ఉన్నారు. ఏఓ కర్ణాకర్ రెడ్డి -
నడక యాతన తప్పింది!
● దివ్యాంగుడికి మూడు చక్రాల స్కూటీ అందజేతజనగామ రూరల్: కలెక్టరేట్ ప్రజావాణిలో ఓ దివ్యాంగుడు చేసిన వినతిని ‘సాక్షి’ ప్రచురించడంతో జిల్లా యంత్రాంగం స్పందించింది. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో సదరు దివ్యాంగుడికి ఉచితంగా మూడు చక్రాల మోటరైజ్డ్ స్కూటీ అందించారు. జిల్లా కేంద్రంలోని సాయినగర్కు చెందిన కంకల రాజమల్లయ్యకు చిన్నతనంలో పోలియో రాగా ప్రమాదంలో కుడి కాలు పోయింది. దీంతో నడవడానికి చాలా ఇబ్బందులు పడేవాడు. అతడి పరిస్థితిపై ‘సాక్షి’ లో ‘మూడు చక్రాల స్కూటీ అందించండి’అనే వార్తను ప్రచురించగా అతడి అర్జీని అధికారులు పరిశీలించి, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజమల్లయ్యకు మూడు చక్రాల మోటరైజ్డ్ స్కూటీని మంజూరు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ కలెక్టరేట్లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో రాజమల్లయ్యకు స్కూటీని అందజేశారు. రాజమల్లయ్య ఆనందం వ్యక్తం చేస్తూ కలెక్టర్, అదనపు కలెక్టర్లతో పాటు సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు. -
మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం
జనగామ రూరల్: మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ సచివాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మహిళా భవనాల నిర్మాణ పనులకు వర్చువల్ విధానంలో బటన్ నొక్కి శంకుస్థాపన చేశారు. ఈ సమావేశానికి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా అధికారులు, జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఒకేసారి 8 వేల మహిళా సంఘ భవనాలకు శంకుస్థాపన చేయడం సంచలనాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. వర్చువల్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, డి. శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహిళా భవనాలకు వర్చువల్గా సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన -
ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి
జనగామ రూరల్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వేడుకల నిర్వహణపై సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను అధికారులు అధికారులు సమన్వయంతో చేయాలని సూచించారు. వివిధ శాఖల తరపున స్టాల్స్ను ఏర్పాటు చేయాలని, ప్రముఖులకు, పుర ప్రముఖులకు, అతిథులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఆహ్వాన పత్రాలను అందజేయాలని, ప్రొటోకాల్ ను అనుసరించాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ గోపీరాం, కలెక్టరేట్ ఏఓ రవికిరణ్, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాకు చేరిన పాఠ్య పుస్తకాలు పాఠశాలలు పునఃప్రారంభమయ్యే మొదటి రోజు ప్రతి విద్యార్థికి అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లా పాఠశాల విద్యా గోదాంలో ఉన్న పాఠ్య పుస్తకాలను ఆయన సందర్శించారు. సోమవారం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..జూన్ 1వ తేదీ లోపు మొత్తం పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అనంతరం జిల్లా లైబ్రరీని కలెక్టర్ సందర్శించి పుస్తకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోటీ పరీక్షలకు కావాల్సిన మరిన్ని పుస్తకాలను అందుబాటులో పెట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జీసీడీఓ గౌసియా బేగం, సీఎంఓ నాగరాజు, విద్యాధికారులు శంకర్రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిబంధనల ప్రకారం బక్రీద్ జరుపుకోవాలి జనగామ రూరల్: నిబంధనలకు అనుగుణంగా బక్రీద్ పండుగను జరుపుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి పశుసంవర్ధక శాఖ అధికారులు, హిందూ, ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధివిధానాలపై కలెక్టర్ సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగను విజయవంతంగా నిర్వహించుకునేలా ప్రతి ఒక్కరూ సహకారం అందించాలన్నారు. డీసీపీ మాట్లాడుతూ.. జంతువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. సమావేశంలో డీవీహెచ్ఓ మురళీధర్ రావు, ఇతర అధికారులు, హిందూ, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
అర్జీలు @ 550
● కలెక్టరేట్ గ్రీవెన్స్లో రికార్డు ● కలెక్టర్ను కలిస్తే పరిష్కారం ఖాయమని పోటెత్తుతున్న ప్రజలు ● ఇందిరమ్మ ఇళ్ల కోసం అత్యధిక వినతులుజనగామ: ప్రజా సమస్యల పరిష్కార విధానంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొత్త పాలనా ప్రమాణాలు సృష్టిస్తున్నారు. ప్రజల అభ్యర్థనలపై స్పందన, వెంటనే చర్యలు, పారదర్శక వ్యవస్థ ఈ మూడు ప్రత్యేకతలతో కలెక్టర్పై ప్రజల్లో విశ్వాసం గణనీయంగా పెరిగింది. ఇదే నమ్మకానికి నిదర్శనంగా సోమవారం జరిగిన కలెక్టరేట్ గ్రీవెన్స్లో జిల్లాలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో 550 దరఖాస్తులు స్వీకరించడం గమనార్హం. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గ్రీవెన్స్లో ఒక్కో అర్జీని శ్రద్ధగా పరిశీలించారు. సమస్య వివరాలు తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, జీవనోపాధి, భూ సంబంధిత సమస్యలు, తదితర అంశాలపై ప్రజలు పెద్దఎత్తున వినతిపత్రాలు సమర్పించగా కలెక్టర్ ప్రతీ దరఖాస్తును వ్యక్తిగతంగా పరిశీలించారు. గ్రీవెన్స్లో జెడ్పీ సీఈఓ రంగారావు, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని ఇలా.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి గూడు కల్పించాలని జనగామ మండలం అడవికేశ్వాపూర్కు చెందిన యానాల అనసూయ, ఎర్రగొల్లపహాడ్కు చెందిన గంపల లక్ష్మి, బచ్చన్నపేట మండలం చిన్నరాంచర్లకు చెందిన ఎం.రమాదేవి, లింగాలఘణపురం మండలం కుందారానికి చెందిన రేసు నరేందర్, పట్టణంలోని 11వ వార్డుకు చెందిన చిట్టిమల్ల మౌనిక విజ్ఞప్తి చేశారు. ● తన కాలు విరిగిందని, కాలి వేళ్లను తొలగించారని, పక్షవాతం వచ్చి నడవలేని స్థితిలో ఉన్నానని పింఛన్ ఇప్పించాలని పట్టణంలోని ధర్మకంచకు చెందిన కె.రవీందర్ వినతి అందించారు. భార్య, కొడుకు, కూతురు కూలికి వెళ్తేనే కుటుంబం గడుస్తోందని వాపోయారు. ● తమకు ఇల్లు లేదని, ఇందిరమ్మ పథకంలో అవకాశం కల్పించాలని కోరుతూ జనగామ మండలం అడవికేశ్వాపూర్, నర్మెట మండలాలకు చెందిన మహిళలు అనసూర్య, బండ మైసమ్మ, పి.విమల, పి.కొమరమ్మ, పోచమ్మ, రాజమణి, ఇంద్ర, రాజమ్మ కలెక్టర్కు వినతి చేశారు. ● ఐకేపీ సెంటర్లో 538 బస్తాల ధాన్యం అమ్ముకున్నానని, ధాన్యాన్ని మిల్లులో అన్లోడ్ చేస్తే, డబ్బులు ఇచ్చే సమయంలో 17 బస్తాలు కటింగ్ వేసి ఇచ్చారని బచ్చన్నపేట మండలం అలీంపూర్ మేక అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందేంటని అడిగితే సెంటర్ నిర్వాహకులు సమాధానం చెప్పడం లేదని, రూ.17వేల వరకు నష్టపోతున్నానని, న్యాయం చేయాలని వినతి పత్రం అందించారు. ● ‘5 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వరి సాగు చేశా.. మొదటి విడత కోత సమయంలో 280 బస్తాల దిగుబడి వస్తే, ఐకేపీ సెంటర్లో అమ్ముకున్నా. 41 కిలోల 2వందల గ్రాములు తూకం వేశారు. నిర్వాహకులు మిల్లుకు పంపించిన తర్వాత 8 బస్తాలు కటింగ్ చేసి డబ్బులు ఇచ్చారు. ఎందుకు కటింగ్ చేశారని అడిగా.. ఎవరూ సమాధానం చెప్పడం లేదు. ఈ విషయమై ఈ నెల 23వ తేదీన తన ధాన్యం కాల్చుకుంటానని చెప్పడంతో పోలీసులు వచ్చి సముదాయించారు. పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేశా’నని బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ గ్రామానికి చెందిన రైతు పామరుపల్లి బాలయ్య వాపోయారు. -
పెంబర్తి టు వరంగల్
విద్యారణ్యపురి: నాలుగేళ్ల క్రితం మహబూబాబాద్, ములుగు జిల్లా కేంద్రాల్లో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశారు. ఆయా కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించగా.. అప్పట్లో ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు కాలేదు. దీంతో ఆతర్వాత మహబూబాబాద్, ములుగులోని ఈరెండు బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలను అదే పేర్లతో కాజీపేటలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఐదేళ్ల లా కోర్సు నడుస్తున్న భవనంలోకి మార్చారు. రెండేళ్లపాటు అరకొర వసతులతో కళాశాలలను కొనసాగించగా.. గతేడాది తమకు వసతులు సరిపోవట్లేదని బీసీ గురుకుల లా విద్యార్థులు ఆందోళన చేశారు. చివరికి మహాత్మాజ్యోతిబాపూలే బీసీ గురుకులాల వెల్ఫేర్ రాష్ట కార్యదర్శి సైదులు ఆదేశాలతో జనగామ జిల్లాలోని పెంబర్తిలో ఇప్పటికే నిర్వహిస్తున్న బీసీ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలకు 2025 డిసెంబర్ 22న షిఫ్ట్ చేశారు. మళ్లీ వరంగల్కే మార్చాలని డిమాండ్ కళాశాలలను మళ్లీ వరంగల్కే మార్చాలనే డిమాండ్ వ్యక్తం కావడంతో గురుకులాల వెల్ఫేర్ రాష్ట్ర కార్యదర్శి ఈఏడాది మార్చిలో ఆయా మహబూబాబాద్, ములుగు బీసీ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలను వరంగల్ రంగశాయిపేటలోని నాయిడు పెట్రోల్ బంక్ సమీపంలోని అద్దె భవనంలోకి మార్చాలని ఆదేశించారు. వివిధ కారణాలతో షిఫ్టింగ్కు కొంత ఆలస్యమై చివరికి సోమవారం పెంబర్తి నుంచి వరంగల్కు మహబూబాబాద్, ములుగు బీసీ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలు షిఫ్టింగ్ చేశారు. ప్రస్తుతం విద్యార్థులకు వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. ఆరెండు కళాశాలలు కలిపి డిగ్రీ సెకండియర్, ఫైనల్ ఇయర్లో 215 మంది విద్యార్థినులు చదువుతున్నారు. జూన్ ఒకటి నుంచి కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలు షిఫ్టింగ్ మహబూబాబాద్, ములుగు జిల్లాలకు సంబంధించిన గురుకుల డిగ్రీ కళాశాల వరంగల్లోని రంగశాయిపేట అద్దె భవనంలోకి..అడ్మిషన్ల ప్రక్రియ షురూ.. వరంగల్ రంగశాయిపేటలోని అద్దె భవనంలోనికి మార్చిన మహబూబాబాద్, ములుగు బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలల్లో (2026–27) విద్యాసంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు, దరఖాస్తులు చేసుకోవాలని ఆకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్వీఎన్ చారి సోమవారం తెలిపారు. బీఏ హెచ్ఈపీ, బీకాం (సీఏ), బీఎస్సీ బీజెడ్సీ, ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్డీఎస్ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు నేరుగా పొందవచ్చని, పూర్తి వివరాలకు 98666 10429, 96768 17038 సంప్రదింవచ్చని సూచించారు. -
ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలి
హసన్పర్తి: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. సోమవారం కమిషనరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను సీపీకి వివరించారు. ఈసందర్భంగా సీపీ వివిధ పోలీస్స్టేషన్ అధికారులకు ఫోన్ద్వారా ఆదేశాలు జారీ చేశారు. బాధితుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహించాన్నారు. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కేసు పురోగతి, భూ సమస్యలు సీపీ దృష్టికి వచ్చాయి. కమిషనరేట్ పరిధిలో ఆసాంఘిక కార్యకలాపాలపై ఎలాంటి సమాచారం ఉన్నా 87126 65257 నంబర్కు వాట్సాప్ద్వారా తెలియజేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఆర్డీఓ కార్యాలయ ప్రజావాణిలో 15 దరఖాస్తులు స్టేషన్ఘన్పూర్: ఆర్డీఓ ఆఫీస్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 15 దరఖాస్తులు వచ్చాయి. ఆర్డీఓ కార్యాలయంలో ప్రతీ సోమవారం ప్రజావాణి ఉంటుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. చౌరస్తాలో నాకాబందీ జనగామ రూరల్: వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలోని చౌరస్తాలో సోమవారం నాకాబందీ కార్యక్రమాన్ని డీసీపీ రాజామహేంద్ర నాయక్, సీఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేపట్టి, అనుమానాస్పద వ్యక్తులు, పత్రాలు లేని వాహనాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్ర మ రవాణా నియంత్రణ, నిషేధిత వస్తువుల గుర్తింపు, శాంతి భద్రతల పరిరక్షణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ రాజమహేంద్రనాయక్ తెలిపారు. తక్కువ ఖర్చుతో పోషకాహారం అందించాలి జనగామ రూరల్: తక్కువ ఖర్చుతో స్థానికంగా లభించే పోషకాహార పదార్థాలను అందించాలని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ సూచించారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా సంక్షేమ వారోత్సవాల సందర్భంగా సోమవారం పట్టణంలోని కల్లెం రోడ్డులో గల మార్కండేయ కమ్యూనిటీ హాల్లో జిల్లా స్థాయి పోషకాహార ప్రదర్శన ఆరోగ్యకరమైన వంటల పోటీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్స్ను ఆయన సందర్శించారు. కార్యక్రమంలో జనగామ సీడీపీఓ మణెమ్మ, కొడకండ్ల సీడీపీఓ విజయ చంద్రిక, సూపర్వైజర్స్, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది, తల్లులు పాల్గొన్నారు. నిందితులను శిక్షించాలి జనగామ రూరల్: న్యాయవాది ఖాజా మహిముద్దీన్ను హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండ దయాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. హత్యకు నిరసనగా సోమవారం జిల్లా కోర్టు సముదాయంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. అనంతరం మౌనం పాటించి మృతుడికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు మెతుకు జాన్ రెడ్డి, తాళ్లపల్లి రాజయ్య, మన్నె సత్తయ్య, రామకృష్ణ, లక్ష్మణ స్వామి, సుధాకర్, శ్రీహరి, మంచాల రవీందర్, జి.రవీందర్, పవన్, రాజశేఖర్, తిరిగి అశోక్, మధుసూదన్, శ్రీనివాస్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆగుతూ.. సాగుతూ
పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లు ఎప్పుడు పూర్తయ్యేనో?పాలకుర్తి టౌన్: గోదావరి జలాలతో పాలకుర్తి నియోజకవర్గ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఇసుక, డీజిల్ కొరతతో కొద్ది రోజులగా పనులు నిలిచిపోయాయి. పాలకుర్తి నియోజకవర్గ రైతుల చిరకాల కోరికై న చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల పనులు 17 ఏళ్లుగా నిధుల కొరత, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో సకాలంలో పూర్తి కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుర్తి, చెన్నూరు ఊర చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా మార్చేందుకు అప్పటి ప్రభుత్వం 2009 ఫిబ్రవరి 27న నాటి నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య శంకుస్థాపన చేశారు. చెన్నూరులో 2015లో అప్పటి నీటిపారుదల శాఖ మంద్ర హరీశ్ రావు పనులు ప్రారంభించారు. పాలకుర్తి రిజ ర్వాయర్ 0.25 టీఎంసీ, చెన్నూరు రిజర్వాయర్ 058 టీఎంసీ సామర్థ్యంతో పనులు చేపట్టారు. వీటి కోసం మొదటి విడత రూ.320 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఆ తర్వాత రూ.370 కోట్లకు పెంచింది. పనులు జాప్యం కావడంతో పాటు రీటెండర్లు పిలవడంతో ఆ మొత్తం రూ.1,010 కోట్లకు చేరుకుంది. రెండు జిల్లాలకు ప్రయోజనం.. పాలకుర్తి రిజర్వాయర్ ఆయకట్టు 7,515 ఎకరాలు కాగా, చెన్నూరు రిజర్వాయర్ ఆయకట్టు 25,165 ఎకరాలు. ఈ రిజర్వాయర్లు పూర్తయితే జనగామ, సూర్యాపేట జిల్లాలకు సాగునీరు అందనుంది. మరో 670 ఎకరాల భూమి సేకరణ.. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల కోసం 2,961 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు 2,289 ఎకరాల భూసేకరణ పూర్తయింది. మరో 670 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ప్రస్తుతం పాలకుర్తి రిజర్వాయర్ కట్ట ఎత్తు పెంపుదల పనులు, గ్రానైట్ రాయి బ్లాస్టింగ్ పనులు కొనసాగుతున్నాయి, చెన్నూరు రిజర్వాయర్ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్షించినా.. స్థానిక ఎమ్మెల్యే యశ్వసినిరెడ్డి గతంలో వరంగల్, హైదరాబాద్, పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో రిజర్వాయర్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ఇటీవల కలెక్టర్ సందీప్కుమార్ ఝా, భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి వీఎల్.కాంతారావు పాలకుర్తి రిజర్వాయర్ పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పాలకుర్తి రిజర్వాయర్ పనులు కొంత మేర జరగాయి. రిజర్వాయర్ పనుల్లో భాగంగా కట్ట కింద కిలోమీటర్లు దూరం తవ్వారు. చెరువు కట్ట నుంచి ఆర్ఆండ్బీ రోడ్డు , స్టేషన్ఘన్పూర్ రోడ్డు వరకు పనులు కొంత వరకు వదిలేశారు. అవి ప్రాథమిక దశలోనే ఉండడంతో ఇప్పట్లో పనులు పూర్తయ్యేనా? అని స్థానిక రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇసుక, డీజిల్ కొరతతో పాలకుర్తి రిజర్వాయర్ పనులు నిలిచిపోయాయని అధికారులు చెబుతున్నారు. రూ.1,010 కోట్ల అంచనా..రీడిజైన్తో పెరిగిన ఎస్టిమేషన్ ప్రస్తుతం ఇసుక, డీజిల్ కొరతతో ఆగిన పనులు కాంట్రాక్టర్లు మారినా అంతులేని జాప్యం ప్రాజెక్టులు పూర్తయితే 32,680 ఎకరాలు సాగులోకి..పనులు పూర్తి చేయిస్తాం..రిజర్వాయర్ల పనులు త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తా. పెండింగ్ పనులపై సీఎం రేవంత్రెడ్డికి నివేదించా. నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. పనుల పురోగతిపై పలుమార్లు అధికారులతో సమీక్ష నిర్వహించా. పాలకుర్తి మండల ప్రజల ఆకాంక్ష మేరకు చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్లను అందుబాటులోకి తీసుకువస్తా. నియోజకవర్గ రైతుల కళ్లలో ఆనందం చూడడమే నా లక్ష్యం. – మామిడాల యశ్వసినిరెడ్డి, ఎమ్మెల్యే, పాలకుర్తి -
పంట అవశేషాల దహనంపై అవగాహన కల్పించాలి
● వీసీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జనగామ రూరల్: పంట అవశేషాల దహనంపై గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆదివారం ధాన్యం కొనుగోళ్లపై ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్ పౌరసరఫరాల సంస్థ కార్యాలయం నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి అనసూయ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాలపై వీడియో కాన్ఫరెన్న్స్లో కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ..రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పంట అవశేషాలపై ప్రతీ గ్రామంలో రాబోయే 15 నుంచి 30 రోజుల పాటు ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అవగాహన కార్యక్రమాల అనంతరం కూడా పంట అవశేషాలను కాల్చితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. ప్రభుత్వ సూచనల మేరకు శాఖల వారీగా వివిధ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, ఈ నెల 25న జిల్లాలో మంజూరైన 211 వీఓ బిల్డింగ్ల మార్కింగ్ పూర్తిచేయాలని ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. డీసీఎస్ఓ సురేష్ రెడ్డి, డీ ఎం సీఎస్ హతీరామ్, అదనపు డీఆర్డీఓ నూరుద్దీన్, డీఎంఓ రామకృష్ణ, డీఏఓ అంబికా సోనీ పాల్గొన్నారు. -
నేటినుంచి పాఠ్యపుస్తకాల పంపిణీ
జనగామ: 2026–27 నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు నోటు పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. జిల్లాలోని అన్ని మండలాల ఎమ్మార్సీ సెంటర్లకు పుస్తకాల సరఫరా దాదాపుగా పూర్తయింది. నేటి నుంచి పంపిణీ మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీ సెంటర్లలో ఉన్న పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందించే ప్రక్రియ ప్రారంభమవుతోంది. ప్రతీ పాఠశాల నుంచి ముందుగానే పంపిన ఇండెంట్ల ప్రకారం పుస్తకాల కేటా యింపు జరగనుంది. ఇప్పటికే గతేడాది డేటాను ఆధారంగా తీసుకొని నోటు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. జిల్లా పరిషత్ పాఠశాలలు, ప్రభు త్వ, పీఎస్, యూపీఎస్, కేజీవీబీ, మోడల్, సోషల్ వెల్ఫేర్, ఆశ్రమ పాఠశాలలు, మహాత్మా జ్యోతి బాఫూలే, సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు 481 ఉన్నా యి. వీటిలో సుమారు 37 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. బడి బాటలో ఈ సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం జిల్లాకు అవసరమైన 2,06,460 పాఠ్యపుస్తకాలకు గాను ఇప్పటి వరకు 1,97,890 పుస్తకాలు చేరుకున్నాయి. మిగిలిన పుస్తకాలు త్వరలో రానున్నాయి. హెడ్మాస్టర్లు తమ పాఠశాలలకు కేటాయించిన సంఖ్య ప్రకారం పాఠ్య, నోటుపుస్తకా లను తీసుకెళ్లనున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభం తర్వాత కొత్తగా చేరే విద్యార్థుల కోసం ప్రభుత్వం మరో విడతలో పంపిణీ చేయనున్నారు. ఈనేపథ్యంలో బడిబాట తర్వాత ఎన్ని అడ్మిషన్లు వచ్చాయనే సమాచారాన్ని జిల్లా నుచి ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపించనున్నారు. జిల్లాకు చేరుకున్న 1.97 పుస్తకాలు 37 వేల మంది విద్యార్థులకు లబ్ధి కొత్త అడ్మిషన్లకు రెండో విడత సరఫరా పాఠ్య, నోటుపుస్తకాల వివరాలు అవసరమైన పాఠ్యపుస్తకాలు : 2,06,460 ఇప్పటికే వచ్చిన పాఠ్యపుస్తకాలు : 1,97,890 ప్రభుత్వ పాఠశాలల సంఖ్య : 481 విద్యార్థుల మొత్తం సంఖ్య : 37వేలు -
పేద విద్యార్థులకు ‘కార్పొరేట్’ విద్య
జనగామ రూరల్: ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి అందించేందుకు ఇంటర్మీడియట్ విద్యను అందించటానికి రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘కార్పొరేట్ విద్య పథకం’ కింద ఉచిత ప్రవేశాలు కల్పిస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికిగాను కార్పొరేట్ ఇంటర్ కళాశాలల్లో ప్రవేశం పొందటానికి ఈ నెల 20 నుంచి వచ్చే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జూన్ 5 తుదిగడువుగా ఉంది. పోటీ పరీక్షలకు కార్పొరేట్ కళాశాలల్లో శిక్షణతో పాటు నూతన విద్య మార్పులకు అనుగుణంగా సాంకేతిక విద్య అందనుంది. గతేడాది జిల్లాలో 6,443 మంది పదో తరగతి పరీక్షలు రాయగా 6,292 మంది ఉత్తీర్ణులయ్యారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రతిభ ఉన్న వారిని జూన్ 10న జిల్లాల వారీగా ఎంపిక చేయనున్నారు. 12న ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు. ఈ పథకం ద్వారా ఎంపికై న విద్యార్థులకు రూ.35 వేల చొప్పున ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది. పాకెట్ మనీగా ఏడాదికి రూ.3 వేల చొప్పున విద్యార్థులకు అందిస్తుంది. ఉచిత వసతి కల్పించడమే కాకుండా మెరుగైన విద్యా బోధన అందుతుంది. అర్హతలు.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, నవోదయ, మోడల్ స్కూల్స్, గురుకులాలు, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదవి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రెండు లక్షలు ఉండాలి. బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు 3లక్షలు మించకూడదు. కుల, ఆదాయ ధ్రువపత్రాలు, 4–10వ తరగతివరకు స్టడీ సర్టిఫికెట్లు, పదో తరగతి మెమో, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్, దివ్యాంగులు అయితే సదరం సంబందిత ధ్రువ పత్రాలు జతపర్చాల్సి ఉంటుంది. పదో తరగతిలో 400 పైగా మార్కులు వచ్చి ఉండాలి. లేదా జీపీఏ 7.0 సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులు. ప్రతిభ ఉన్న విద్యార్థులు మంచి అవకాశం జూన్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రభుత్వం ఉచితంగా ఇంటర్మీడియట్ చదివే అవకాశాన్ని కల్పిస్తోంది. అర్హులైన విద్యార్థులు www. telangana.epass.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు గడువులోగా చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఏ కార్పొరేట్ కళాశాలలోనైనా ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. విద్యార్థులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – సందీప్కుమార్ ఝా, కలెక్టర్ -
సన్నరకాలే మేలు..
వానాకాలంలో రైతులు మంచి లాభాలు, మార్కెటింగ్ అవకా శాలు ఉన్న సన్నరకం వరి సాగు వైపు దృష్టి సారిస్తే మేలు. ఆరు రకాల సన్నరకం సీడ్ను ఆయా రీసెర్చ్ సెంటర్లలో తయారు చేశారు. ప్రస్తుతం అక్కడ మేళాలు కూడా జరుగుతున్నాయి. రైతులు నేరుగా వెళ్లి తెచ్చుకోవచ్చు. లేని పక్షంలో మండల ఏఓలను సంప్రదిస్తే ఎక్కడ దొరుకుతుందనే వివరాలను చెబుతారు. రెండు మూడు రోజుల్లో ఎరువుల దుకాణాల్లో సైతం అందుబాటులో ఉంటాయి. – అంబికాసోని, జిల్లా వ్యవసాయాధికారి -
పాలిటెక్నిక్ కళాశాలలో హెల్ప్లైన్ సెంటర్
స్టేషన్ఘన్పూర్: మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు పాలిసెట్ తదితర పరీక్షలకు కౌన్సెలింగ్ కోసం హెల్ప్లైన్ మంజూరైందని ప్రిన్సిపాల్ జి.గంగారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలిసెట్, ఈసెట్, ఏపీసెట్, ఐసెట్ తదితర పరీక్షల కౌన్సెలింగ్కు ఈ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు. ఈనెల 27న పాలిసెట్ మొదటి విడత అడ్మిషన్ ప్రక్రియతో హెల్ప్లైన్ సెంటర్ ప్రారంభమవుతుందన్నారు. పాలిసెట్ కు అర్హత సాధించిన విద్యార్థులు మొదటి విడ త కౌన్సెలింగ్కు ఈనెల 27 నుంచి 31వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ఆయన సూచించారు. 29 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకుని, జూన్ 3 నుంచి ఆప్షన్స్ ఇచ్చుకోవాలని తెలిపారు. కాగా గతంలో కేవలం జిల్లా కేంద్రమైన జనగామకే పరిమితమైన హెల్ప్లైన్ సెంటర్ స్టేషన్ఘన్పూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు మంజూరు కావడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సభ్యత్వ నమోదులో ప్రథమ స్థానంలో ఉండాలి పాలకుర్తి టౌన్ (దేవరుప్పుల): బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతీ కార్యకర్త భాగస్వామి కావాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పాలకుర్తి నియోజకవర్గం సభ్యత్వ నమోదులో మొదటి స్థానంలో నిలిచిందని, ఈ సారి కూడా ఆదే స్ధాయిలో కృషి చేయాలని కార్యర్తలకు సూచించారు. సమావేశంలో నాయకులు పల్లా సుందర్ రామ్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాంసింగ్, వీరారెడ్డి దామోదర్రెడ్డి, సుందర్, సోమనర్స య్య, కాశీం, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ భూమిలో బోర్డుల ఏర్పాటు మామునూరు: విమానాశ్రయ పునరుద్ధరణలో భాగంగా రన్వే విస్తరణ కోసం నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి గ్రామాల రైతుల నుంచి 230 ఎకరాలు సేకరించారు. ఆ భూమి చుట్టూ ఆదివారం ఫెన్సింగ్, బోర్డుల ఏర్పాటు కు చర్యలు తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ అథా రిటీ అధికారుల పర్యవేక్షణలో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జూన్ మొదటి వారంలో విమానాశ్రయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. 8 నుంచి ఎంసీఏ రెండో సెమిస్టర్ పరీక్షలు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంసీఏ సెకండియర్ రెండో సెమిస్టర్ (సీబీసీఎస్) రెగ్యులర్, ఎక్స్అండ్ ఇంప్రూవ్మెంట్ పరీక్షలు జూన్ 8 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిం ఇక్బాల్ తెలిపారు. జూన్ 8న మొదటి పేపర్, 10న రెండో పేపర్, 12న మూడో పేపర్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు నిర్వహిస్తారని వారు పేర్కొన్నారు. పీఆర్సీ ప్రకటించాలి: డీటీఎఫ్ విద్యారణ్యపురి: ఉద్యోగ సంఘాల జేఏసీకి సీఎం ఇచ్చిన హామీ మేరకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. హనుమకొండలోని డీటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన హనుమకొండ జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అటుకుల శ్రీనివాస్రెడ్డి, అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకుడు డాక్టర్ ఎం.గంగాధర్, డీటీఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు జి.ఉప్పలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, బాధ్యులు బి.అంజనీదేవి, ఎస్.సుమ, ఎం.సారంగపాణి, ఎ.కిషన్, అల్లం మల్లయ్య, రాష్ట్ర కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రశాంతం
కేయూ క్యాంపస్: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష–2026 ఆదివారం రెండు సెషన్లలో ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలోని ట్రైసిటీలో ఏర్పాటు చేసిన పది పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చిన ఆరుగురు అభ్యర్థులను లోనికి అనుమతించలేదు. ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు నిర్వహించిన మొదటి సెషన్ పరీక్షకు మొత్తం అభ్యర్థులు 4,075 మంది అభ్యర్థులగాను 2,762 మంది (67.78 శాతం) హాజరయ్యారు. 1,313 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రెండో సెషన్ను మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించారు. రెండో సెషన్లో 2,749 మంది అభ్యర్థులు(67.49 శాతం) హాజరుకాగా 1,326 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. హనుమకొండ కలెక్టర్ చాహత్బాజ్పాయ్ పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. యూపీఎస్సీ సెంట్రల్ ఇన్స్పెక్షన్ అధికారి శుభం గౌడ్, అబ్జర్వర్ టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి తదితరులు ఉన్నారు. -
సన్నరకం..సాగు లాభం!
జనగామ: జిల్లాలో ఏటా యాసంగి, వానాకాలంలో వరుసగా దొడ్డు రకం వరి సాగు చేస్తున్నారు. ఇది సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీగా మారిపోయింది. అయితే ఒకే రకం ధాన్యం సాగు చేయడం వల్ల మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడం, దిగుబడి పెరిగినా అమ్మకాల్లో ఇబ్బందులు రావడం, ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి పడిపోవడం వంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కేవలం ఒకే రకం ధాన్యం ఉత్పత్తి కావడంతో ప్రభుత్వ స్థాయిలో కూడా కొనుగోలు, నిల్వ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జిల్లాలో గోదాంల సంఖ్య పరిమితంగా ఉండడంతో అధిక ధాన్యం నిల్వ చేయడం కష్టసాధ్యమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు పంటల మార్పు అవసరాన్ని గుర్తించాలని అధికారులు సూచిస్తున్నారు. దేశ, విదేశాల్లో భారీ డిమాండ్ దొడ్డు రకంతో పోలిస్తే సన్నరకం ధాన్యానికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉండడంతో సన్నధాన్యం రైతులకు లాభదాయకమని అధికారులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాఖ సన్నధాన్యం ప్రమోషన్న్పై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్లు అభివృద్ధి చేసిన అధిక దిగుబడి సన్నరకం విత్తనాలను రైతులకు పరిచయం చేస్తున్నారు. జిల్లాలో కూడా వీటి పంపిణీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. రీసెర్చ్ సెంటర్లలో వ్యవసాయ శాస్త్రవేత్తలు తయారుచేసిన సన్నరకం సీడ్తో అధిక దిగుబడి, మంచి మార్కెట్ విలువ కలిగిన రకాలే కావడంతో రైతులు సాగుచేస్తే అమ్మకాల సమస్యలు తగ్గడంతో పాటు మంచి లాభాలు వస్తాయని వ్యవసాయ శాఖ వెల్లడిస్తోంది. ఈ విత్తనాలు జిల్లాలోని అన్ని ఎరువుల దుకాణాలతో పాటు అగ్రికల్చర్ యూనివర్సిటీలు నిర్వహిస్తున్న విత్తన మేళాల్లో దొరుకుతాయి. మండల వ్యవసాయ అధికారులను సంప్రదించి కూడా సీడ్ లభ్యతపై సమాచారం పొందవచ్చు. నూనెగింజలు–పప్పు దినుసులు జిల్లాలో నూనె గింజలు, పప్పు దినుసులు వంటి ప్రత్యామ్నాయ పంటలపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ పంటల సాగు ప్రణాళికను ఖరారు చేసి, క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. జిల్లాలో విస్తీర్ణం జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ప్రతీ సంవత్సరం వానా కాలంలో రెండు లక్షల ఎకరాలు, యాసంగిలో రెండు లక్షల 20 వేలు ఎకరాల్లో వరి సాగవుతోంది. అయితే ఇందులో సన్న రకం వరిసాగు 10 శాతం కూడా లేకపోవడం జిల్లా వ్యవసాయంలో ఉన్న ప్రధాన సమస్యగా అధికారులు పేర్కొంటున్నారు. సన్న రకం సాగు పెరిగితే రైతులకు లాభాలు పెరగడంతో పాటు మార్కెటింగ్ సమస్యలు తగ్గుతాయని, భవిష్య త్తులో ధాన్యం ఎగుమతులకు కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు పేర్కొన్నారు. రీసెర్చ్ సెంటర్లు ఇవే రాష్ట్రంలోని వ్యవసాయ రీసెర్చ్ సెంటర్, అగ్రికల్చ ర్ యూనివర్సిటీల్లో వానాకాలానికి అనువైన సన్నరకం వరివిత్తనాలను పెద్దఎత్తున తయారు చేశారు. ప్రస్తుతం రాజేంద్రనగర్ పీజేటీఎస్ఏయూ, వరంగల్ ఏఆర్ఎస్, జగిత్యాల ఏఆర్ఎస్, భూపాలపల్లి ఏఆర్ఎస్ వంటి కేంద్రాల్లో సీడ్ మేళాలు జరుగుతున్నాయి. ఈ మేళాల్లో ఆర్ఎన్ఆర్, కేఎన్ఎం, బీపీటీ వంటి ఆయా రకాలకు సంబంధించి అధిక దిగుబడి సన్నరకం విత్తనాలు రైతులకు నేరుగా అందించనున్నారు. రైతులు సమీప ప్రాంతాల్లోని ఈ కేంద్రాల్లో విత్తనాలు కొనుగోలు చేసుకోవచ్చు. దొడ్డు రకం ధాన్యం కంటే మేలంటున్న అధికారులు సన్నరకం వరిసాగు పెంపుపై వ్యవసాయ శాఖ దృష్టి వానాకాలంలో సాగు చేయాలని రైతులకు సూచన సరికొత్త సన్నరకాల విత్తనాలపై అవగాహనసన్నరకం విత్తనాల వివరాలు రకం రోజులు ఆర్ఎన్ఆర్ 15048 125 ఆర్ఎన్ఆర్ 10754 120 కేఎన్ఎం 1638 125 బీపీటీ 5204 150 ఆర్ఎన్ఆర్ 11718 140 కేఎన్ఎం 7715 115 -
జనగామ
ఆదివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2026● తమ్ముళ్లను పెంచి ప్రయోజకులను చేసిన అన్నలు.. ● అన్నను చదివించిన తమ్ముడు.. ● నేడు జాతీయ బ్రదర్స్ డే అన్నంటే నాన్నంత పెద్దరికం.. తమ్ముడంటే కొడుకంతటి అనురాగం.. బాల్యంలో ఇల్లంతా గోల చేసే అన్నాదమ్ముళ్లు..పెరిగి పెద్దయ్యాక బాధ్యతల భారం తమపై వేసుకుంటారు. తమ్ముళ్లను ప్రయోజకులను చేయాలనే అన్న తపన..అన్న భారం తగ్గించాలనే తమ్ముడి తాపత్రయం..అలాంటి వారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంతో మంది కనిపించారు. నేడు జాతీయ బ్రదర్స్ డే సందర్భంగా అలాంటివారిపై ప్రత్యేక కథనాలు.. -
పట్టణ అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ: పట్టణ అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదేశించారు. శనివారం ఎమ్మెల్యే పట్టణంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనలో భాగంగా ముందుగా నెహ్రూ పార్క్ సమీపంలోని శ్మశాన వాటికను సందర్శించి అక్కడ జరుగుతున్న సుందరీకరణ పనుల పురోగతిపై మున్సిపల్ కమిషనర్ను ఆరా తీశారు. అలాగే 29వ వార్డులోని శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. ప్రజలకు ఉపయోగపడేలా అక్కడ స్థల లభ్యతను బట్టి పార్కు లేదా ఓపెన్ జిమ్ ఏర్పా టు చేసే అవకాశాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. అనంతరం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. స్టేషన్లో ముఖ్యౖ మెన రైళ్లు ఆగకపోవడం, రైళ్లు సమయానికి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రయాణికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రైళ్ల హాల్టింగ్, సమయపాలనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి రైల్వే జనరల్ మేనేజర్కు వినతిపత్రం అందజేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్ సజ్జ దుర్గా ప్రసాద్, జూకంటి శ్రీశైలం, మామిడాల రాజు, ధర్మపురి శ్రీనివాస్, బిజ్జాల నవీన్, మసిర్ రెహమాన్, ఉల్లెంగుల సందీప్, యాకూబ్ ఉన్నారు. -
పిట్టల్లా రాలుతున్నారు!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు రోజురోజుకూ దంచికొడుతున్నాయి. భానుడు మండిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హనుమకొండ, వరంగల్, మహబూబా బాద్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సగటున 42 నుంచి 45 డిగ్రీలు దాటి నమోదవుతుండడంతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. పెరుగుతున్న వడదెబ్బ కేసులు.. ఉమ్మడి జిల్లాలో వడదెబ్బ, ఎండ తీవ్రత కారణంగా బుధవారం నలుగురు, గురువారం 9, శుక్రవారం 11 మంది, శని వారం ఒక్క రోజే 22 మంది మృతి చెందారు. మొత్తంగా వారం రోజుల్లో 60 మందికిపైగా చని పోయినట్లు తెలుస్తోంది. తీవ్రమైన ఎండలు, వడగాలుల కారణంగా వడదెబ్బ కేసులు భారీగా పెరుగుతున్నాయి. డీహైడ్రేషన్, అలసట, జ్వరం, వాంతులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు, ట్రాఫిక్ పోలీసులు, ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, షుగర్, బీపీ బాధితులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. రోడ్లు వెలవెల.. ప్రభుత్వపరంగా ఏర్పాట్లు అంతంతే ఉదయం 11 గంటల తర్వాత మార్కెట్లు, బస్టాండ్లు, ప్రధాన రహదారులు వెలవెలబోతున్నాయి. ద్విచక్రవాహనదారులు ముఖానికి గుడ్డలు కట్టుకుని ప్రయాణిస్తుండగా.. చల్లని పానీయాలు, కొబ్బరి బోండాలు, మజ్జిగకు డిమాండ్ పెరిగింది. కాగా, ఎండల తీవ్రత పెరుగుతున్నప్పటికీ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చలివేంద్రాలు, తాగునీటి సౌకర్యం తగిన స్థాయిలో లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధి హామీ పనుల ప్రదేశాల్లో నీడ, ఓఆర్ఎస్, తాగునీ లేదని కూలీలు చెబుతున్నారు. మరో నాలుగు రోజులు.. మరో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని చెబుతున్నా వేడి తీవ్రత తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారం రోజుల్లో 60 మందికిపైగా మృత్యువాతకాజీపేటకు చెందిన వి.వెంకటేశ్ (26) ఎండదెబ్బకు గురై రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం కుప్పకూలి చనిపోయాడు. కిరాణం నుంచి సామాను తెస్తానని ఇంటి నుంచి బయలుదేరి ఎండవేడికి తట్టుకోలేక మృతిచెందాడు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి ఆకుదారివాడకు చెందిన దుర్గం సమ్మక్క (50) పశువులకు పచ్చిగడ్డి కోసం శుక్రవారం పొలం వద్దకు వెళ్లింది. పచ్చిగడ్డి ఇంటికి తీసుకొచ్చే సరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. పచ్చిగడ్డి మోపు దింపిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురై మరణించింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని రామచంద్రుని పేటకు చెందిన ఊటుకూరి సోమిరెడ్డి (78) వడదెబ్బతో శనివారం మృతి చెందాడు. పూరేడుపల్లిలోని తన పంట పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా వడదెబ్బకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. 45 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు ఎండలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు రైతులు, కూలీలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం ఉదయం 11 గంటలకే నిర్మానుష్యంగా రహదారులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘటనలు -
ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం, మొక్కజొన్నను వెంటనే మిల్లులకు తరలించాలని కొనుగోళ్ల వివరాలను ఓపీఎంఎస్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ తో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల పనితీరుపై అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ భాస్కర్, మార్క్ఫెడ్ డీఎం చంద్రశేఖర్, డీసీఓ కోదండరాములు, డీఎంఓ రామకృష్ణ, అదనపు డీఆర్డీఓ నూరుద్దీన్, పౌరసరఫరాల సంస్థ డీఎం హతీరామ్, డీసీఎస్ఓ సురేష్ రెడ్డి, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకోవాలి ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రేరణ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వైద్యులు (170 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రేరణ సర్వీస్ సొసైటీ సంస్థ చైర్మన్ చింతల సాయిబాబా, వైద్యులు శ్రీకాంత్, కరుణాకర్, డీజీఓ ప్రీతి, మేనేజర్ దయాకర్, నిర్వాహకులు మల్యాల సురేష్, చింతల గణేష్, వైద్య సిబ్బంది, సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
నిమిషం ఆలస్యమైతే నో ఎంట్రీ
కేయూ క్యాంపస్: ఉమ్మడి జిల్లాలో ఆదివారం జరగనున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష –2026కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్కళాశాలలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేయగా శనివారం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సందర్శించారు. తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు ఎలా ఉన్నాయో పరిశీలించారు. ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతితో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సివిల్స్ పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుందని తెలిపారు. మొదటిసెషన్ ఉదయం 9–30నుంచి 11–30గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2–30నుంచి సాయంత్రం 4–30గంటల వరకు ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తంగా పది సెంటర్లు ఏర్పాటు చేశామని, 4,075మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. నిమిషం నిబంధన.. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి గంటముందే కేంద్రాలకు చేరుకోవాల్సింటుంది. నిర్ధేశించిన సమయానికి అర్ధగంట ముందే కేంద్రాల గేట్ల మూసివేస్తారు. నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోనికి అనుమతి ఉండబోదని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ స్పష్టం చేశారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు మొబైల్ ఫోన్లు, స్మార్ట్వాచ్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని సూచించారు. హాల్టికెట్తోపాటు ప్రభుత్వం జారీచేసిన ఫొటోగుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాల్సింటుంది. కేంద్రాలవద్ద అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోనికి అనుమతించాలని అధికారులను ఆదేశించారు. ఆమెవెంట యూపీఎస్సీ కేంద్ర తనిఖీ అధికారి శుభంగాద్, ఆర్ట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, తహసీల్దార్ రవీందర్రెడ్డి, రూట్ అధికారి భావ్సింగ్ ఉన్నారు. పరీక్ష కేంద్రాలు ఇవే.. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్కాలేజీలో రెండు సెంటర్లు, కాజీపేట ఫాతిమానగర్లోని సేయింట్ గాబ్రియల్ హైస్కూల్, హంటర్రోడ్డులోని న్యూసైన్స్ డిగ్రీ కళాశాల, అడ్వకేట్స్ కాలనీలోని ఎస్ఆర్ నేషనల్ హైస్కూల్, వడ్డెపల్లిలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కళాశాల, ములుగు రోడ్డులోని శ్రీగాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల, వరంగల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎల్బీ కళాశాల, హనుమకొండ అశోక్ జంక్షన్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. నేడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష పది పరీక్ష కేంద్రాలు.. 4,075 మంది అభ్యర్థులు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు : సీపీవరంగల్ క్రైం: ఆదివారం నిర్వహించనున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తునట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలి పారు. సెంటర్ల నుంచి 500మీటర్ల పరిధిలో ఆదివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 163 బీఎన్ఎన్ఎస్ చట్టాన్ని అనుసరించి గుమిగూడడం, ర్యాలీ లు, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని, ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. -
అభివృద్ధిపథం
గిరిజన గ్రామం..జనగామ: గిరిజన గ్రామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జేఏఎన్ఎంఏఎన్), ధర్తి అబా గ్రామ ఉత్కర్ష అభియాన్ (డీఏజేజీ యూఏ) పథకాల అమలు జిల్లాలో ప్రారంభమైంది. గ్రామాల స్థాయి అవసరాలను గుర్తించి, కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి ప్రత్యేక సర్వేతో పాటు వివిధ శాఖలు గ్రామాల్లో ప్రత్యక్షంగా పరిశీలనలు ప్రారంభించాయి. గ్రామాల్లో అభివృద్ధి శాశ్వత మార్పు తెచ్చే దిశగా ఈ పథకాలు పని చేయనున్నాయి. గ్రామాల్లో ప్రత్యక్ష పరిశీలన అవసరాల గణాంకాల సేకరణ మండలాల వారీగా ఎంపికైన తొమ్మిది గిరిజన గ్రామాల్లో అధికారులు ఇంటింటికీ తిరుగుతూ కుటుంబాల స్థితిగతులను నమోదు చేస్తున్నారు. విద్యుత్ కనెక్టివిటీ లోపాలు, తాగునీటి సమస్యలు, రోడ్లస్థితి, ఆరోగ్య సేవల అందుబాటు, అటవీ హక్కుల అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సర్వే బృందాలు గుర్తిస్తున్నాయి. గిరిజన గ్రామాల్లో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల ఈ గణాంకాలను నివేదిక రూపంలో కేంద్రానికి పంపించి, ప్రతీ ఊరుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్య రంగంలో కీలక మార్పులు గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ సికిల్సెల్ ఎనిమియా వ్యాధి ప్రభావం ఉన్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ ప్రత్యేక శిబిరాలు నిర్వహించనుంది. గర్భిణులకు పోషకాహార పరీక్షలు, చిన్నారుల ఆరోగ్య పరీక్షలు, పెద్దల్లో సికిల్సెల్ స్క్రీనింగ్పై అవగాహన కల్పించనున్నారు. గ్రామాల్లో తక్కువగా ఉన్న ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపర్చనున్నారు. విద్య, ఉపాధిలో కొత్త అవకాశాలు గిరిజన యువతలో డిజిటల్ అవగాహన కొరవడిన నేపథ్యంలో పథకాల్లో భాగంగా గ్రామాల్లో డిజిటల్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తారు. పాఠశాలల్లో సదుపాయాల లేమి, హాజరు శాతం తక్కువగా ఉండడంతో విద్యా విభాగం సమగ్ర ప్రణాళిక రూపొందించనుంది. మహిళా సంఘాలకు నైపుణ్య శిక్షణలు, చిన్న వ్యాపారాలకు సహకారం అందించేందుకు ఐటీడీఏ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనుంది. అటవీ హక్కులపై.. గిరిజన కుటుంబాలు ఇప్పటికీ అటవీ భూములపై హక్కుల ధ్రువీకరణ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ స్కీంలో భాగంగా పెండింగ్ దరఖాస్తుల పరిశీలనకు ప్రత్యేక బృందాలు గ్రామాల్లో పర్యటిస్తారు. భూములపై న్యాయబద్ధ హక్కులు లభిస్తే వ్యవసాయం, పంటలపైనా స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. ఆరు మండలాలు..తొమ్మిది గ్రామాలు కేంద్రం ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ పథకాల అమలు కోసం జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో తొమ్మిది గ్రామాలను ఎంపిక చేయగా, వీటి పరిధిలో 17,108 మంది జనాభా ఉన్నారు. తరిగొప్పుల మండలంలోని బొంతగట్టు నాగారం, నర్మెట మండలంలోని బొమ్మకూరు, చిల్పూర్ మండలంలోని మల్కపేట, పాలకుర్తి మండలంలోని ఫతేపూర్, కొండాపూర్, దేవరుప్పుల మండలంలోని మైలారం, మాధవాపురం, కొడకండ్ల మ ండలంలోని ధర్మపురం, మొండ్రాయి గ్రామాలు ఎంపికయ్యాయి. గ్రామాల్లో జరిగిన సర్వే సమయంలో శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ప్రతీ గ్రామంలో కనీసం ఒక అవగాహన శిబిరం నిర్వహించి, ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాల కవరేజ్ను నిర్ధారించాలని ఆదేశించారు. ఈ నెల 19వ తేదీ నుంచి 27వరకు ఈ పథకాలపై ఎంపికై న గ్రామాల్లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. జిల్లాలోని గిరిజన గ్రామాలు అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతాయని ఆకాంక్షిస్తున్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి గిరిజన కుటుంబాల నిజమైన అవసరాలను గుర్తించడం ఈ సర్వేలో ప్రధాన అంశం. ఆరోగ్య, విద్య, ఉపాధి, భూహక్కుల సమస్యలు, పోషకాహారం లోపాలు, మౌలిక వసతుల సమస్యలు వంటి అంశాలను ప్రత్యేక యాప్లో నమోదు చేసి కేంద్రానికి పంపనున్నారు. సమన్వయంతో పనిచేయాలి ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జేఏఎన్ ఎంఏఎన్), ధర్తి అబా గ్రామ ఉత్కర్ష అభియాన్ (డీఏజేజీ యూఏ) పథకాల అమలు కోసం అధికార యంత్రాంగం సమన్వయంతో పని చేయాలి. ‘జన్ భాగీదారి–సర్వే డోర్, సర్వే విలేజ్’ ఐఈసీ అవగాహన కార్యక్రమాలపై గిరిజన గ్రామాల్లో విస్త్రృత అవగాహన కల్పించాలి. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు చేకూరేలా అన్ని శాఖలు కృషి చేయాలి. జిల్లాలోని ఆరు మండలాల్లోని తొమ్మది గ్రామాల్లో 19 నుంచి 27 వరకు సర్వే కొనసాగుతుంది. – సందీప్ కుమార్ ఝా, కలెక్టర్అడవి బిడ్డల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం జీవనోపాధికి ఊతం.. జీవన ప్రమాణాలు మెరుగే లక్ష్యం రైతు కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం విద్య, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ జిల్లాలో ఆరు మండలాల పరిధిలో 9 గ్రామాలు ఎంపికమండలం గ్రామం గిరిజన జనాభా (సుమారు) తరిగొప్పుల బొంతగట్టునాగారం 2,807 నర్మెట బొమ్మకూరు 849 చిల్పూర్ మల్కాపూర్ 1,167 పాలకుర్తి ఫతేపూర్ 1,982 పాలకుర్తి కొండాపూర్ 2,139 దేవరుప్పుల మైలారం 774 దేవరుప్పుల మాధవాపురం 3,515 కొడకండ్ల ధర్మాపురం 3,023 కొడకండ్ల మొండ్రాయి 852 మొత్తం 09 17,108 -
సాగునీరు అందించడమే లక్ష్యం
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నర్మెట (తరిగొప్పుల): ఎత్తైన ప్రాంతాలలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గండిరామారం పంప్హౌజ్ నుంచి తలపెట్టిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పేజ్–1 పనులను పార్టీ శ్రేణులతో కలసి శుక్రవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.. తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలోనే తరిగొప్పుల లిఫ్ట్ ఇరిగేషన్కు రూ.110 కోట్ల అంచనా వ్యయంతో మూడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించారన్నారు. జూలై 15 లోగా ఎత్తైన ప్రాంతాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటానని రైతులకు హామీ ఇచ్చారు. మల్లన్నగండి రిజర్వాయర్ ఆధారంగా రూ.63.80 కోట్లతో చేపట్టిన ఇరిగేషన్ పథకంతో తరిగొప్పుల మండలం సస్యశ్యామలం కానుందని ఆయన అన్నారు. ఆయన వెంట రాష్ట్ర నాయకులు గద్దల నర్సింగరావు, మండల శాఖ అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్రెడ్డి, సర్పంచ్లు కంతి అంజనేయులు, శ్రీను, రవి నాయక్, మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ముద్దసాని పద్మజా వెంకట్రెడ్డి, భూక్య జుంలాల్, జిల్లా నాయకులు చిలువేరు లింగం, దామెర ప్రభుదాస్, అర్జుల రమా సంపత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉచిత వైద్యసేవలు అభినందనీయం నర్మెట: మారుమూల ప్రాంతాల పేద ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మచ్చుపహాడ్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్, హైదరాబాద్ వారు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సర్పంచ్ లింగాల హైమ రమేశ్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. డాక్టర్లు హేమానంద్, ఉత్తేజ్, హిమబిందు, సురేష్, ఉప సర్పంచ్ ఇనుగాల రాజిరెడ్డి, వార్డు సభ్యులు గుండేటి రాంచందర్, కుమారస్వామి, మాధవి, జయమ్మ, సంస్థ ప్రతినిథులు జయరాజ్, సామెల్, స్వామి, ఇమాన్యుయేల్, మారీ సంస్థ సభ్యులు ప్రేమలత పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ‘స్వచ్ఛ తెలంగాణ’
జనగామ: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో శుక్రవారం స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. యువత, క్రీడాకారులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారని జిల్లా యువజన, క్రీడల అధికారి నరసింహారావు తెలిపారు.సాక్షిప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగాన్ని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఎస్సీ విభాగాన్ని మరింత చురుకుగా మార్చేందుకు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఐదు జిల్లాలకు కొత్త చైర్మన్లను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐదు జిల్లాలకు చైర్మన్లు వీరే.. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం హనుమకొండ జిల్లా చైర్మన్గా ఆరూరి సాంబయ్య, వరంగల్ జిల్లాకు చిలువేరు శ్రీనివాస్, జనగామకు చేపూరి వినోద్, మహబూబాబాద్కు తిప్పర్తి శ్రీధర్, ములుగు జిల్లాకు మట్టెవాడ తిరుపతిలను నియమించారు. జాబితాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు నియమించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దరఖాస్తుల ఆహ్వానంజనగామ రూరల్: జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్లోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్(ఏజీపీ) నియామకానికి అర్హులైన న్యాయవాదుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం అనుభవం, అర్హత పత్రాలు, ఇతర వివరాలతో తమ దరఖాస్తులను నిర్ణీత గడువు తేదీ ఈనెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు బార్ కౌన్సిల్ లేదా కలెక్టరేట్ కార్యాలయ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఫ్లై ఓవర్పై పూలకుండీల తొలగింపు జనగామ: జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్ ఫుట్పాత్పై రెండు వైపులా ఏర్పాటు చేసిన పూల కుండీలను మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు పూర్తిగా తొలగించారు. పూల కుండీల ఏర్పాటుతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు తరుచూ ప్రమాదాలు సైతం జరిగాయి. అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. దీనిపై సాక్షి గతంలో రాసిన కథనాలతో వారం రోజుల క్రితమే కుండీల తొలగింపు ప్రక్రియను మొదలు పెట్టారు. కుండీలు తొలగించడంతో ఫుట్పాత్ పూర్తిగా ఖాళీ అయింది. దీంతో కాలినడకన వెళ్లే ప్రజలతో పాటు వాహనదారుల రాకపోకల్లో ఇబ్బందులు తొలగిపోయాయి. కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులుజనగామ రూరల్: 2026–27 విద్యా సంవత్సరంలో కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రభుత్వ, ఎయిడెడ్ సంస్థల్లో చదివిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 20 నుంచి జూన్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్సీ, మైనారిటీ వర్గాల విద్యార్థులు తెలంగాణ ఈ–పాస్ పోర్టల్ https://telanganaepass.cgg.gov.in ద్వారా సంబంధిత ధ్రువపత్రాలతో నమోదు చేసుకోవాలని సూచించారు. మార్చి–2026లో పదో తరగతి ఉత్తీర్ణులై 7.0 జీపీఏ లేదా అంతకంటే ఎక్కువ సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. 10వ తేదీన ఎంపిక జాబితా ఉండగా, 12న ధ్రువపత్రాల పరిశీ లన, అలాట్మెంటు జరుగుతుందన్నారు. -
మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి
● కలెక్టర్కు డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి వినతి జనగామ: జిల్లాలోని దేవరుప్పుల మండలం లకావత్ తండా పంచాయతీ పరిధిలోని వానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి గుట్ట ప్రాంతంలో మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతిలక్ష్మినారాయణ నాయక్ శుక్రవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు వినతి చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మైనింగ్కు అనుమతులు మంజూరు కావడంతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. ఈ నిర్ణయం పర్యావరణానికి మాత్రమే కాకుండా ఆ ప్రాంత ఆధ్యాత్మిక, సామాజిక, వ్యవసాయ ప్రాతిపదికలకు ముప్పు కలుగుతుందని తెలిపారు. మైనింగ్ అనుమతులను తీవ్రంగా వ్యతిరేకి స్తున్నామని, వెంటనే రద్దు చేయాలని కలెక్టర్ను కోరినట్లు చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పరిదుల భాస్కర్, లకావత్ తండా గ్రామ అధ్యక్షుడు బొడా యాకన్న, వార్డు సభ్యురాలు లకావత్ వెన్నెల, పొట్టిగుట్ట తండా సర్పంచ్ అనిత చందులాల్, ధరవతే తండా సర్పంచ్ అనిత రవీందర్, నల్లకుంట తండా పార్టీ అధ్యక్షుడు భాస్కర్, అలాగే ఇతర సర్పంచ్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
నెరవేరిన సొంతింటి కల
జనగామ: నాలుగేళ్లుగా నిలిచిపోయిన ఇంటి నిర్మాణానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చొరవతో వెలుగు దొరికింది. పట్టణంలోని వికాస్నగర్కు చెందిన ఆర్టీసీ కండక్టర్ సతీష్ 2022లో ప్రారంభించిన ఇంటి నిర్మాణం వివిధ సమస్యలతో మధ్యలో ఆగిపోయి కుటుంబానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. పలుమార్లు గ్రీవెన్స్లో వినతులు సమర్పించినప్పటికీ పరిష్కారం లభించలేదు. అయితే ప్రస్తుత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్వహించిన తొలి గ్రీవెన్స్లో సతీష్ తన ఇబ్బందులను కలెక్టర్ వివరించగా, వెంటనే స్పందించి సంబంధిత శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి వీధిలోని కందకాలను పూడ్చి, వీధి దీపాలను ఏర్పాటు చేయగా, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి మూడు విద్యుత్ స్తంభాలు అమర్చి ఇంటికి విద్యుత్ కనెక్షన్ కల్పించారు. సమస్యలు పరిష్కారం కావడంతో సతీష్ కుటుంబంలో ఆనందం నెలకొంది. ఎన్నోసార్లు ప్రయత్నించినా ఫలితం రాలేదు, కానీ ప్రస్తుత కలెక్టర్ స్పందనతో తమ ఇంటికి వెలుగు వచ్చిందని సతీష్ ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో గ్రీవెన్స్ ద్వారా సమస్యలు వేగంగా పరిష్కారం అవుతున్నాయనే దానికి ఉదాహరణగా ఈ ఘటన నిలిచింది. గ్రీవెన్స్లో వినతి..కలెక్టర్ చొరవ ఆనందంలో ఆర్టీసీ కండక్టర్ కుటుంబం -
సమష్టి కృషితోనే జిల్లా అభివృద్ధి
జనగామ: అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సమష్టి కృషితోనే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెనన్స్ హాల్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతితో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కేవలం పరిపాలనా కార్యక్రమం కాదని, ప్రజాస్వామ్యానికి ఆచరణాత్మక రూపమని పేర్కొన్నారు. రైతు భరోసా కింద యాసంగిలో 1,85,504 మంది రైతులకు రూ.152.10 కోట్లు జమ చేశామన్నారు. 1,87,002 రేషన్ కార్డుల ద్వారా 5,64,657 మంది 3584.285 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పొందుతున్నారని, కొత్తగా 25,972 కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. పింఛన్ల కింద 74,993 మందికి నెలకు రూ.18.90 కోట్లు అందిస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్ల మొ దటి విడతలో 5,652 ఇళ్లు మంజూరై 5,339 గ్రౌండింగ్ పూర్తయిందని, రూ.155 కోట్లు జమ చేశామన్నారు. డీసీపీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల నిర్మూలన, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాలకు రూ.58.15 కోట్లు, మహిళా సమాఖ్యలకు రూ.61.36 లక్షల చెక్కులు అందజేశారు. ఈసందర్భంగా వివిధ శాఖల స్టాళ్లను పరిశీలించారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వేగవంతం కావాలి కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాయితీలను పొందడానికి ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి అని, ఈ ప్రక్రియను త్వరతగతిన పూర్తి చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలు జారీ చేశారు. ఫార్మర్ రిజిస్ట్రీ, క్రాప్ బుకింగ్, రైతుబీమా తదితర వాటిపై వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, ఏడీలు, ఎంఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు. ధాన్యం, మొక్కజొన్నను వెంటనే మిల్లులకు తరలించాలి జిల్లాలోని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం, మొక్కజొన్నలను వెంటనే మిల్లులు, గోదాంలకు తరలించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై పౌరసరఫరాల అడిషనల్ డైరెక్టర్ రోహిత్ సింగ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమీక్ష సమావేశంలో డీఆర్డీఓ భాస్కర్, మార్క్ఫెడ్ డీఎం చంద్రశేఖర్, డీసీఓ కోదండరాములు, డీఎంఓ రామకృష్ణ, అదనపు డీఆర్డీఓ నూరుద్దీన్, పౌరసరఫరాల సంస్థ డీఎం హతీరామ్, జిల్లా మార్కెటింగ్ అధికారి రామకృష్ణ, డీసీఎస్ఓ సురేష్ రెడ్డి, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల్లో ప్రజలే కేంద్రబిందువు ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక విజయవంతం జిల్లాస్థాయి సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
తెలంగాణ దళిత ఉద్యమ వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝాజనగామ రూరల్: తెలంగాణ దళిత ఉద్యమ వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గాల సామాజిక, విద్యా, ఆత్మగౌరవ ఉద్యమాలకు భాగ్యరెడ్డి వర్మ తన జీవితం అంకితం చేశారన్నారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు, పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు
● డీసీపీ రాజమహేంద్రనాయక్లింగాలఘణపురం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆన్నారు. గురువారం మండలంలోని నెల్లుట్ల, కుందారం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మహాలక్ష్మి, మహేశ్వర మిల్లుల వద్దకు వెళ్లి ట్రాక్టర్లలో తీసుకొచ్చిన ధాన్యాన్ని మిల్లుర్లు వెంటనే అన్లోడింగ్ చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి లారీలను కేంద్రాలకు వెళ్లే విధంగా చర్య తీసుకోవాలని సూచించారు. సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై శ్రావణ్కుమార్, సర్పంచ్ రాజు , సీసీ శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు. -
అంత్య పుష్కరాలు ఆరంభం
కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుష్కరశోభ వెల్లివిరిసింది. గురువారం తెల్లవారుజామున 5.43 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ సరస్వతినది అంత్యపుష్కరాలు ఆరంభమయ్యాయి. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తొలిపుష్కరస్నానం ఆచరించారు. తొలిరోజు ఎండ తీవ్రతతో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఆయన సతీమణి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు పుష్కరస్నానం ఆచరించారు. – భూపాలపల్లి/ కాళేశ్వరం తొలి పుష్కరస్నానం ఆచరించిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి ఎండతో తొలిరోజు భక్తుల పుష్కరస్నానాలు అంతంతే.. -
నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యం
బచ్చన్నపేట: విద్యుత్ వినియోగదారులకు లో–ఓల్టేజ్ సమస్యలు లేకుండా, నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తోందని టీజీఎన్పీడీసీఎల్ జనగామ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ చెరుకు సంపత్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పడమటి కేశ్వాపూర్ 33/11 కేవీ సబ్స్టేషన్లో ప్రస్తుతం ఉన్న 5.0 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో, అదనంగా ఏర్పాటు చేసిన నూతన 8.0 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఆయన విజయవంతంగా ఛార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ.. ఈ నూతన పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో సబ్స్టేషన్ సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు. దీనివల్ల పడమటి కేశ్వాపూర్, పరిసర ప్రాంతాల వినియోగదారులకు, రైతులకు మెరుగైన ఓల్టేజ్తో కూడిన నాణ్యమైన విద్యుత్ అందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్లు లక్ష్మీనారాయణ రెడ్డి, డి.విజయ్కుమార్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు వేణుగోపాల్, శ్రీధర్, అసిస్టెంట్ ఇంజనీర్లు సతీష్, ఎ.కుమారస్వామి, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. జనగామ సర్కిల్ ఎస్ఈ చెరుకు సంపత్ రెడ్డి -
మున్సిపల్ కౌన్సిల్ ఫోరం జిల్లా చైర్మన్గా పాండు యాదవ్
జనగామ: మున్సిపల్ కౌన్సిల్ ఫోరమ్ జిల్లా చైర్మన్గా 15వ వార్డు కౌన్సిలర్ మారబోయిన పాండు యాదవ్ను నియమిస్తూ మున్సిపల్ కౌన్సిల్ ఫోరం రాష్ట్ర చైర్మన్ భూక్య రామునాయక్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర కమిటీ సూచనల మేరకు బాధ్యతలు అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లతో సమన్వయం కలిగి ఫోరం అభివృద్ధికి పనిచేయాలని పాండు యాదవ్ను ఫోరం ఆదేశిం చింది. కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తున్న పాండు యాదవ్కు రాష్ట్ర ఫోరం శుభాకాంక్షలు తెలుపుతూ.. జిల్లాలో ఫోరమ్ కార్యకలాపాల పురోగతికి కృషి చేయాలంటూ సూచనలు చేసింది. ఏఐ లైఫ్ స్కిల్స్పై ఉచిత శిక్షణ మహబూబాబాద్ అర్బన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) లైఫ్ స్కిల్స్పై ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులతో పాటు డిగ్రీ ఆపైన చదివిన బీసీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ ఇన్చార్జ్ డైరెక్టర్ మాడిశెట్టి నరసింహస్వామి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూన్ 1నుంచి 4వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు. హనుమకొండలోని బీసీ స్టడీ సర్కిల్లో ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 0870– 2571192నంబర్లో సంప్రదించాలన్నారు. -
బీఆర్ఎస్ సభ్యత్వ కార్యాచరణ!
సాక్షిప్రతినిధి, వరంగల్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉమ్మడి వరంగల్లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, సీనియర్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ప్రతీ నియోజకవర్గంలో డిజిటల్ సభ్యత్వ నమోదు శిబిరాలు, ఇంటింటి ప్రచారం, సోషల్ మీడియా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఇన్చార్జ్లకు సూచించినట్లు సమాచారం. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని, రాబోయే రాజకీయ పరిణామాలకు అనుగుణంగా కేడర్ను సిద్ధం చేసే దిశగా ఇది కీలక అడుగుగా పార్టీ నేతలు భావిస్తున్నారు. త్వరలోనే యాప్.. డిజిటల్ ప్ల్లాట్ఫామ్.. ఎమ్మెల్యే, సీనియర్ల సమన్వయంతో సభ్యత్వ నమోదు కార్యక్రమం త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ సభ్యత్వ సేకరణ జనగామ ఇన్చార్జ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ తెలిపారు. కాగా ప్రత్యేక యాప్, డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రారంభం కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా డిజిటల్ సభ్యత్వ నమోదు వేగవంతం, బూత్ స్థాయి కమిటీల బలోపేతం, యువత, మహిళలు, రైతుల చేరికపై ఫోకస్, గ్రామస్థాయిలో పార్టీలో చైతన్యం పెంపు, రాబోయే ఎన్నికల దృష్ట్యా కేడర్ యాక్టివేషన్ అన్న ఐదు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వీటిపైనే తమ ఫోకస్ ఉంటుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ నేతల కీలకభేటీ.. హనుమకొండలోని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంట్లో గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుల కీలక భేటి జరిగింది. సమావేశంలో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, తాటికొండ రాజయ్య, నన్నపునేని నరేందర్, నియోజక వర్గ ఇన్చార్జులు బండ శ్రీని వాస్, డాక్టర్ సుధీర్కుమార్, పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల దుస్థితి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, జిల్లా పార్టీ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ప్రధానంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతీ కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల ఇన్చార్జ్ పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతీ బూత్లో ఇద్దరిని గుర్తించి వారికి సభ్యత్వ నమోదు ప్రక్రియపై శిక్షణ ఇస్తామని తెలిపారు. కేంద్రం జూన్ 25 నుంచి చేపట్టనున్న ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంపై నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హుల ఓట్లు తొలగిపోకూడదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవరెడ్డి, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక ఇన్చార్జ్లు నియమించిన అధినేత కేసీఆర్.. డిజిటల్ డ్రైవ్కు గ్రీన్సిగ్నల్.. బూత్స్థాయినుంచి కేడర్ యాక్టివేషన్కు ప్లాన్ యువత, మహిళలు, రైతుల చేరికపై దృష్టి.. త్వరలో యాప్, డిజిటల్ ప్లాట్ఫామ్ హనుమకొండలోని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంట్లో భేటీ అయిన బీఆర్ఎస్ నేతలుసభ్యత్వ నమోదు ఇన్చార్జ్లు వీరే..సభ్యత్వ నమోదు పర్యవేక్షణకు పార్టీ అధినేత కేసీఆర్ నియోజకవర్గానికి ఒక ఇన్చార్జ్ను నియమించారు. జనగామకు బండ శ్రీనివాస్, స్టేషన్ఘన్పూర్కు నాగుర్ల వెంకన్న, పాలకుర్తికి డాక్టర్ మారెపల్లి సుధీర్కుమార్, డోర్నకల్ (ఎస్టీ)కి మాజీ ఎంపీ మాలోత్ కవితలు ఇన్చార్జ్లుగా వ్యవహరించనున్నారు. అదేవిధంగా మహబూబాబాద్ (ఎస్టీ)కి వై. సతీష్ రెడ్డి, నర్సంపేటకు మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పరకాలకు ఎస్.సమ్మారావు, వరంగల్ పశ్చిమకు కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, వరంగల్ తూర్పునకు మర్రి యాదవరెడ్డి, వర్ధన్నపేట (ఎస్సీ)కు మసూద్, భూపాలపల్లికి రామస్వామి నాయక్, ములుగు (ఎస్టీ)కి గండ్ర జ్యోతిలను నియమించారు. -
వానకొండయ్య గుట్ట మైనింగ్ పర్మిషన్ రద్దుచేయాలి
జనగామ: జిల్లాలోని దేవరుప్పుల మండలం లకావత్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని పుణ్యక్షేత్రం శ్రీవానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి ఆలయం మైనింగ్ మాఫియా చేతిలో పడి ఉనికి కోల్పోతోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన బీఆర్ఎస్ మండల బృందంతో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను కలిసి మెమోరాండం అందజేశారు. అనంతరం దయాకర్రావు మాట్లాడుతూ..గుట్టపై జరుగుతున్న మైనింగ్ పర్మిషన్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎస్కు వివరాలు తెలియజేసి మైనింగ్ పర్మిషన్ రద్దు చేయించడంతో పాటు రూ.2 కోట్లతో దేవస్థానం అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల నిలిచిపోయిన మైనింగ్ చర్యలు మళ్లీ ప్రారంభమయ్యాయని, గుట్ట వద్ద పనులను అడ్డుకునేం దుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి నోటీసులు ఇవ్వడం పూర్తిగా అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్రామిరెడ్డి, శ్రీకాంత్ గౌడ్, బసవ మల్లేశం, పార్టీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, వర్కింగ్ అధ్యక్షుడు రామ్సింగ్, సర్పంచులు జాటోతు ఆనంద్, చందూ లాల్ నాయక్, రాములు, నాయకులు రత్నాకర్ రెడ్డి, మహేష్, ఏల సుందర్, పాము మోహన్, బసవ వెంకన్న, రాజన్న, కృష్ణమూర్తి, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్కు మాజీ మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి -
కొనుగోళ్ల వివరాలు నమోదు చేయాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝాజనగామ రూరల్: ధాన్యం కొనుగోళ్ల వివరాలను ఓపీఎంఎస్లో తప్పనిసరిగా నమోదు చేయాలని, సజావుగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 20,953 రైతుల నుంచి 1,21,063 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, అందులో ఇప్పటికే 1,14,484 మెట్రిక్ టన్నులను మిల్లులకు తరలించారని అలాగే 17,180 మంది రైతుల ఖాతాల్లోకి రూ. 211 కోట్లు జమ చేశామన్నారు. డీఆర్డీఓ భాస్కర్, మార్క్ఫెడ్ డీఎం చంద్రశేఖర్, డీసీఓ కోదండరాములు, అదనపు డీఆర్డీఓ నూరుద్దీన్, పౌరసరఫరాల సంస్థ డీఎం హతీరామ్, జిల్లా మార్కెటింగ్ అధికారి రామకృష్ణ, డీసీఎస్ఓ సురేష్ రెడ్డి, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం కావాలి.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం కావాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించా రు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై అధి కారులతో సమీక్ష నిర్వహించారు. జూన్ 2 వరకు వెయ్యి ఇళ్లు ప్రవేశానికి సిద్ధం చేయాలన్నారు. పీడీ మాతృనాయక్, జెడ్పీ సీఈఓ రంగారావు, డీఈలు, ఎంపీడీఓలు, ఏఈలు పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు జిల్లాలో 2026–2028 సంవత్సరానికి సంబంధించిన మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో అక్రిడిటేషన్ కార్డుల ప్రక్రియపై అక్రిడిటేషన్ కమిటీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత కలిగిన జర్నలిస్టులకే కార్డులు జారీ చేయాలని సూచించారు. సమావేశంలో డీపీఆర్ఓ బండి పల్లవి, డీఎం ఆర్టీసీ స్వాతి, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు ఇ.మల్లారెడ్డి, ఎస్.భిక్షపతి, యు.నరేందర్, కె.కిరణ్ కుమార్, వి.మధు, జాల రమేశ్, యు.మహేష్, నీల నరేష్బాబు, అబిద్ ఫైసల్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు. -
గెస్ట్ టీచర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
కొడకండ్ల: మండల కేంద్రంలో టీజీఆర్ఎస్ జేసీ గురుకుల పాఠశాలలో అతిథి అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తమ్మి దిలీప్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. గురుకులంలో ఇంటర్మీడియట్ స్థాయిలో బోధించేందుకు బోటనీ, జువాలజీ, మ్యాఽథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు పాఠశాల స్థాయిలో తెలుగు, ఇంగ్లిష్, గణితం, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ అధ్యాపకులు, ఉపాధ్యాయులు కావాలని తెలిపారు. కళాశాల స్థాయిలో అభ్యర్థులు సంబంధిత పీజీ, బీఈడీ, పాఠశాల స్థాయిలో డిగ్రీ, బీఈడీ అర్హత కలిగి ఉండాలని, అర్హత కలిగిన వారు ఈ నెల 22 నుంచి 28 వరకు తమ గురుకులంలోని కార్యాలయంలో దరఖాస్తులు చేసుకొని డెమో క్లాస్కు హాజరుకావాల్సి ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 9866559710 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. 26న జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపికలు జనగామ రూరల్: జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ సెలక్షన్స్ కమ్ టోర్నమెంట్ పట్టణంలోని మినీ స్టేడియంలో ఈనెల 26వ తేదీన జరుగుతాయని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోపగోని సుగుణాకర్, సెక్రటరీ కై రిక హనుమంతరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 19 ఏళ్ల లోపు బాలబాలికలు, అలాగే మహిళలు, పురుషులకు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో టోర్నమెంట్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 19 ఏళ్ల లోపు గెలుపొందిన బాలబాలికలకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగే రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లలో పాల్గొంటారని, అదేవిధంగా మహిళలు, పురుషులు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో గెలుపొందిన క్రీడాకారులు హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారని తెలిపారు. వివరాలకు 9951999512 నంబర్లో సంప్రదించాలని కోరారు. బాధ్యతల స్వీకరణ పాలకుర్తి టౌన్: రాష్ట్ర మమిళా కమిషన్ సభ్యురాలిగా మండల కేంద్రానికి చెందిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేత గురువారం హైదరాబాద్లో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. శ్వేతకు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి, పాలకుర్తి మాజీ సర్పంచ్ వీరమానేని యాకాంతరావు, పులి గణేష్ తదితరులు అభినందనలు తెలిపారు. 12 నుంచి నాటక పోటీలు నయీంనగర్: జూన్ 12, 13, 14 తేదీల్లో మూడు రోజుల పాటు జాతీయస్థాయి నాటక పోటీలు స్థానిక కాళోజీ కళాక్షేత్రం హనుమకొండలో నిర్వహించాలని కమిటీ నిర్ణయించినట్టు వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక తెలంగాణ అధ్యక్షుడు కాజీపేట తిరుమలయ్య, ప్రధాన కార్యదర్శి ఎన్ఎస్ఆర్ మూర్తి తెలిపారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఈ పోటీల్లో తెలంగాణనుంచి మూడు, ఆంధ్రప్రదేశ్ మూడు మొత్తం ఆరు నాటకాలు ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. -
గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026
త్రివేణి సంగమం వ్యూకాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతినదికి అంత్య పుష్కరాలు గురువారం (నేడు) ప్రారంభం కానున్నాయి. జూన్ 1 వరకు (12 రోజులు) నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 5.43 గంటలకు నదికి విశేష పూజలతో వేదపండితులు పుష్కరున్ని ఆహ్వానిస్తారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీస్వామి స్నానమాచరించి పుష్కరాలను ప్రారంభిస్తారు. శాస్త్రోక్తంగా జరిగే ఈ పూజలో మంథని ఽశాసనసభ్యుడు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆయన సతీమణి దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్, దేవస్థానం అధికారులు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, సభ్యులు పాల్గొననున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలిరానున్నట్లు అధికారుల అంచనా. ఏర్పాట్లు ఇలా: ఈ పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్టీసీ 3,360 ఆర్టీసీ బస్సులు నడపనుంది. మహిళలకు బస్సు ఉచితం కాగా, పురుషులకు అదనంగా రూ.50 వసూలు చేయనున్నారు. 4.36 ఎకరాల్లో తాత్కాలికంగా బస్టాండ్ ఏర్పాటు చేశారు. పీఠాధిపతుల విడిది కోసం త్రివేణి గెస్ట్హౌస్లో ఏర్పాట్లు చేశారు. 12 రోజులు రోజుకో పీఠాధిపతి పుష్కర స్నానాలు ఆచరించనున్నారు. ప్రతీ రోజు హోమాలు, కాశీ పండితులచే హారతి కార్యక్రమం, తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి. ఈసందర్భంగా ఆలయాన్ని పూలతో అలంకరించారు. నేటి నుంచి వన్వే.. 250 ఎకరాల్లో 23 ప్రాంతాల్లో పోలీస్ శాఖ పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసింది. వరంగల్, కరీంనగర్, మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలకు మూడు వైపులా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం వన్వేను ఏర్పాటు చేశా రు. గురువారం నుంచి జూన్ 1 వరకు ఈ విధానం అమల్లో ఉండనుంది. వరంగల్ వైపు వాహనాలు బస్వాపూర్ మీదుగా కొయ్యూరు, గంగారం ఎక్స్రోడ్డు వయా దామెరకుంట, అన్నారం, మద్దులపల్లి కాళేశ్వరం వస్తాయి. కరీంనగర్ వైపు వాహనాలు గంగారం ఎక్స్రోడ్డు నుంచి దామెరకుంట మీదుగా అన్నారం, మద్దులపల్లి, కాళేశ్వరం వస్తాయి. తిరుగు ప్రయాణంలో కాళేశ్వరం మహదేవపూర్, కాటారం మీదుగా వెళ్లాలి. మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాల కోసం అంతర్రాష్ట్ర వంతెన వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. వాహనాల్లో వచ్చేవారికి ఘాట్ వద్దకు వెళ్లడానికి షటిల్ బస్సులు ఏర్పాటు చేశారు. స్థానిక ఆటోలకు అవకాశం కల్పించారు. కాళేశ్వరంలో నేటినుంచి జూన్ 1 వరకు అంత్య పుష్కరాలు తొలిపుష్కర స్నానం చేయనున్న కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీస్వామి పూజల్లో పాల్గొననున్న మంత్రులు, అధికారులు లక్షలాదిగా తరలిరానున్న భక్తజనం నేడు గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాక.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం హోమాలు, టెంట్ సిటీ, హారతి, తెప్పోత్సవం, పార్కింగ్ స్థలాల ఏర్పాటు నేడు గవర్నర్ రాక అంత్య పుష్కరాల మొదటి రోజు గవర్నర్ శివప్రతాప్ శుక్లా పుష్కర స్నానం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో వీఐపీ ఘాట్లోని హెలిపాడ్లో దిగనున్నారు. అనంతరం సరస్వతీఘాట్ వద్ద పుష్కర స్నానం చేసి శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకోనున్నారు. సరస్వతీ ఘాట్లో జరిగే హారతి, తెప్పోత్సవంలో పాల్గొననున్నట్లు తెలిసింది. రాత్రి కాళేశ్వరంలోనే బస చేయనున్నట్లు అధికారులు తెలిపారు.ఆది పుష్కరానికి ఎంతైతే పుణ్యమో.. అంత్య పుష్కరానికి అంతే పుణ్యం -
నిప్పుల కొలిమి
రెడ్ అలర్ట్ గ్రామాలు (ఉష్ణోగ్రతలు) వడ్లకొండ (జనగామ) 46.3 కూనూర్ (జఫర్గఢ్) 45.9 జనగామ 45.6 బచ్చన్నపేట 45.5 పాలకుర్తి(వావిలాల) 45.6 మల్కాపూర్ (చిల్పూర్) 45.1● జిల్లాలో 46డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు ● ఎండ వేడిమి, వడగాలులతో బయటకు రావాలంటే జంకు ● 5 మండలాలకు రెడ్ అలర్ట్ జారీజనగామ: జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వేడి తీవ్రత భారీగా పెరగడంతో బుధవారం వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటగా, కొన్ని చోట్ల 46 డిగ్రీలు దాటాయి. ప్రజలు వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాల తాజా గణాంకాల ప్రకారం.. జిల్లాలోని ఐదు మండలాల్లో రెడ్ అలర్ట్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నమోదైన డేటా ప్రకారం జిల్లాలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్ నుంచి 46 డిగ్రీలు దాటాయి. రెడ్ అలర్ట్ రఘునాథపల్లి, లింగాలఘణపురం, జఫర్గఢ్, తరిగొప్పుల, నర్మెట, పాలకుర్తి, దేవరుప్పుల, తాటికొండ తదితర ప్రాంతాలలో 43 నుంచి 44.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అధికారులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పౌరులు అత్యవసరమైతేనే బయటకు రావాలని, నీరసం, హీట్స్ట్రోక్ నుంచి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. -
నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు
● ప్రభుత్వ ధరకే విత్తనాలు, ఎరువులు అమ్మాలి ● వానాకాలం–2026 సన్నాహక సమావేశంలో కలెక్టర్జనగామ: జిల్లాలో అనుమతి లేని, నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన వానాకాలం–2026 సన్నాహక సమావేశంలో వ్యవసాయ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో కలెక్టర్ పాల్గొని కీలక సూచనలు జారీ చేశారు. ప్రభుత్వం, కంపెనీలు నిర్ణయించిన ధరలకే విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని ఆదేశించారు. తెల్ల పేపర్పై అమ్మకాలు పూర్తిగా నిషేధమని, ఒరిజినల్ బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని, బిల్లుపై డీలర్, రైతు ఇద్దరి సంతకాలు ఉండాలని సూచించారు. డీలర్లు తమ వద్ద ఉన్న విత్తనాలు, ఎరువుల స్టాక్ను బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలని తెలిపారు. గుర్తింపు పొందిన సంస్థల నుంచే కొనుగోలు చేసి, ఎలాంటి కృత్రిమ ఎరువుల కొరత సృష్టించకుండా, అధిక ధరలకు విక్ర యాలు జరపకుండా డీలర్లు వ్యవహరించాలని పేర్కొన్నారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ.. విత్తనాలు, ఎరువుల సరఫరా సున్నితమైన అంశమని, అనుమానాస్పద విక్రయాలు కనిపించినచోట వెంటనే వ్యవసాయ శాఖ లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, డీఆర్డీఓ పీడీ భాస్కర్, డీలర్లు పాల్గొన్నారు. -
‘భూ భారతి సమస్యలు పరిష్కరించండి’
జనగామ: భూ భారతి చట్టం అమలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా వెనుకబడి ఉందని, అమలులో పలు సమస్యలు ఉన్నాయని వెంటనే పరిష్కరించాలని హైకోర్టు న్యాయవాది, భూచట్ట నిపుణుడు సాధిక్ అలీ బుధవారం బూర్గుల రామకృష్ణారావు భవన్లో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం సాధిక్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో చేసిన సర్వేలో భూ భారతి చట్టం అనుకున్న స్థాయి వరకు అమలు కాలేదని, ముఖ్యంగా సాదాబైనామాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారం చాలా తక్కువగా జరిగిందన్నారు. భూభారతి పోర్టల్లో అప్పీల్ ఆప్షన్ పని చేయకపోవడం వల్ల వేలాది మంది ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. చట్టంలో ఆన్లెన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు చేయాలనే నిబంధన లేకపోయినా అధికారులు వాటినే పరిగణనలోకి తీసుకోవడం అన్యాయమని సర్వే వెల్లడించిందని వివరించారు. -
దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలపై ఉండాలి
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి రఘునాథపల్లి: మండలంలోని మండలగూడెంలో జరుగుతున్న దుర్గమ్మ ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడి యం శ్రీహరి బుధవారం పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై నిండుగా ఉండాలని మొక్కినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మారుజోడు రాంబాబు, సర్పంచ్ రాజశేఖర్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్చందర్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్, ఉత్తెపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని గిద్దబండతండాలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు లకావత్ సీతారాం, ధరావత్ భీమా అనారోగ్యంతో మృతిచెందగా నివాళి అర్పించారు. -
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
● ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి జనగామ: జనగామ పట్టణాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని హన్మకొండ రోడ్డులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ స్కీం లేక్ రీ–జనరేషన్ (చెరువుల పునరుద్ధరణ) పథకంలో భాగంగా రూ.92లక్షలతో చేపట్టిన చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, ఏఎంసీ చైర్పర్సన్ బనుక శివరాజ్ యాదవ్, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణతో కలిసి ఎంపీ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చెరువుల సంరక్షణ, పునరుద్ధరణ అనేది కేవలం అభివృద్ధి పనులు మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించే బాధ్యతగా భావించాలని తెలిపారు. అంతకు ముందు 38 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించారు. పరిశీలన.. పరామర్శలు అనంతరం పట్టణంలోని చిన్నమోరీ అండర్ బ్రిడ్జ్ వద్ద కాలువ ఏర్పాటు పనుల కోసం ఎంపీ రోడ్డు విస్తరణకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో పలు అభివృద్ధి అంశాలపై చర్చించి, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అలాగే బ్రెయిన్ స్ట్రోక్కు గురై చికిత్స పొందుతున్న టీపీసీసీ సభ్యుడు చెంచారపు శ్రీనివాస్రెడ్డిని, మరిగడిలో కమలాకర్ అనే వ్యక్తిని పరామర్శించా రు. డీసీసీ అధ్యక్షురాలి ఆహ్వానం మేరకు పలువురు బీఆర్ఎస్ యువకులు కాంగ్రెస్లో చేరారు. -
జాబ్ క్యాలెండర్ అమలుచేస్తే మరింత ఆనందం
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు పదేళ్ల వయోపరిమితి పెంచడం శుభపరిణామం. జీఓలో ఈ పరిమితి ఒక్క సంవత్సరానికే పరిమితం చేయడం నిరుద్యోగులకు అన్యాయమే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్నూ జారీ చేయలేదు. మరీ ఒక సంవత్సరంలో ఎప్పుడు నోటిఫికేషన్లు వేస్తారు? ఎలా భర్తీ చేస్తారు. జీఓలో వయోపరిమితి కాలాన్ని మరో ఏడాది పెంచడంతో పాటు జాబ్ క్యాలెండర్ను వెంటనే అమలు చేస్తే మరింత ఆనందం. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలి. –శ్రీరామోజు సురేందర్, నిరుద్యోగి, మహబూబాబాద్ -
నోటిఫికేషన్లు ఆలస్యం చేయొద్దు..
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల వయోపరిమితి పెంచడం సంతోషమే. అయితే ఒక ఏడాదికే జీఓను పరిమితం చేయడం సరికాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీల అన్నింటిని గుర్తించి అన్ని నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల పట్టభద్రులు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారి లక్ష్యం నెరవేరాలంటే భారీ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటుతోంది..ఇంకా జాప్యం చేయొద్దు. –మనుబోతుల మల్లయ్య, ఎంఎస్సీ, బీఈడీ, నెక్కొండ -
ప్రమాదకరంగా గ్రిల్స్
జనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రధాన దారిలో కుక్కలు, పందులు లోనికి రాకుండా ఏర్పాటు చేసిన గ్రిల్స్ ప్రమాదకరంగా మారాయి. గ్రిల్స్ మొదట్లో సిమెంటు దిమ్మెలు ఊడి పోవడంతో గ్యాప్ పెరిగిపోవడంతో ఆస్పత్రికి వచ్చే పేషెంట్లు ప్రమాదవశాత్తు అందులో పడిపోతున్నారు. మంగళవారం జనగామకు చెందిన కాసుల శ్రీనివాస్తో పాటు మరో పేషెంట్ కాళ్లు ఇరుక్కు పోవడంతో బలవంగా బయటకు తీశారు. ప్రమాదంగా మారిన గ్రిల్స్ ప్రదేశంలో మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు. నేడు మెడికల్ షాపుల బంద్ కొడకండ్ల: ప్రజల ఆరోగ్య రక్షణ, చిన్న వ్యాపారుల సంక్షేమం, ఫార్మసి వ్యవస్థ పరిరక్షణ కోసం కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈనెల 20న (బుధవారం) మెడికల్ షాపులు స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నట్లు మెడికల్ షాపుల అసోసియేషన్ నాయకులు తెలి పారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్ ఉత్తలూరి అనీల్బాబుతో పాటు పోలీస్స్టేషన్లో వినతిపత్రాలు సమర్పించారు. కృష్ణమూర్తి, సందీప్, కిరణ్ పాల్గొన్నారు. రేపు వేదలో స్వర్ణ ప్రాశన జనగామ: జనగామ పట్టణం హైదరాబాద్ రోడ్డు ఏకశిల బీఈడీ కళాశాల ఎదురుగా ఉన్న వేద ఆయుర్వేద పంచకర్మ వెల్నెస్ సెంటర్లో పుష్యమి నక్షత్రం పురస్కరించుకుని కొడిమల సత్తిరెడ్డి జ్ఞాపకార్థం ఈ నెల21న ఉచిత స్వర్ణ ప్రాశన శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్ అంజిరెడ్డి మంగళవారం తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 6 నెలల నుంచి 16 సంవత్సరాల యువకులకు స్వర్ణ ప్రాశన వేస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అవగాహనతోనే మహిళల ఆర్థికాభివృద్ధి పాలకుర్తి: అవగాహనతోనే మహిళలు ఆర్థికాభివృద్ధి చెందుతారని సెర్ప్ ప్రాజెక్ట్ డైరెక్టర్ స్వర్ణలత అన్నారు. పాలకుర్తిలోని ఇందిరమ్మ మహిళా సంఘం కార్యాలయంలో మహిళా సంఘాల సభ్యులకు ఇస్తున్న శిక్షణ తరగతులు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ ప్రజాపాలనలో ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న అవకాశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఏడీ ఎండీ నూరొద్దీన్, ఏపీఎం వెంకటేశ్వర్లు, మండల మహిళా సంఘం అధ్యక్షులు భాగ్యలక్ష్మి, 61 గ్రామాల మహిళా సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. విద్యార్థినికి సన్మానం జఫర్గఢ్: టెన్త్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చి 562 మార్కులు సాధించిన ఉప్పుగల్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని బుర్ర సంకీర్తనను హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఐ పౌండేషన్ ఆధ్వర్యంలో భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్కుమార్రెడ్డి, విద్యావేత్త ఎమ్మెల్సీ కోదండరామ్ మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బహుమతితో పాటు ప్రశంస పత్రాన్ని అందజేశారు. గుర్తుతెలియని వ్యక్తి మృతి రఘునాథపల్లి: మండలంలోని రఘునాథపల్లి–ఇప్పగూడ రైల్వే ట్రాక్ పక్కన గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 8.20 గంటల సమయంలో కోమళ్ల సమీపంలోని కిలోమీటర్ నంబర్ 292/6–4 వద్ద డౌన్ ట్రాక్ పక్కన గాయాలతో వ్యక్తి పడి ఉండటాన్ని పాయింట్స్మెన్ రాజేంద్రప్రసాద్ గమనించాడు. వెంటనే పై ఽఅధికారులకు సమాచారం అందించడంతో పాటు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చాడు. అంబులెన్స్లో గాయపడిన వ్యక్తిని జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 10.06 గంటలకు మృతి చెందాడని, ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడినట్లుగా బావిస్తున్నట్లు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు, సెల్ ఫోన్ లేదు. అయితే అతడి వద్ద సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు తీసుకున్న జనరల్ టికెట్ లభించింది. మృతుడు సుమారు 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు, చామనచాయ రంగు, కోల ముఖం, గడ్డం పెరిగి ఉండగా, కుడి వైపు మెడపై పుట్టుమచ్చ, లేత అకుపచ్చ గ్రే కలర్ టీ షర్ట్, నీలి రంగు లోయర్ (నైట్ ప్యాంట్) ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతుడి అచూకి తెలిసిన వారు 9712658609, 8712539530 నంబర్లలో సంప్రదించాలని రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు కోరారు. -
రైతుల ఇబ్బందులు తొలగించాలి
జనగామ రూరల్: కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకొచ్చి విక్రయించేందుకు రోజులతరబడి ఎదురు చూస్తున్నారని, వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ కోరారు. ఈ మేరకు మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై కలెక్టర్ సందీప్కుమార్ ఝాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి గింజను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కిసాన్ మోర్చా నాయకుడు సోమిడి వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకుడు సరికొండ విద్యాసాగర్రెడ్డి, బుడుగుల రమేశ్, శివరాజ్, బొజ్జపల్లి సుభాష్, కొంతం శ్రీనివాస్, తోకల ఉమారాణి, దేవర ఎల్లయ్య, కావటి ముత్యాలు, పిట్టల సత్యం పాల్గొన్నారు. -
ఎక్కువ తూకం వేస్తే చర్యలు
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కావాలని 41 కేజీల కంటే ఒక్క గింజ ఎక్కువ తూకం వేసిన చర్యలు తప్పవని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హెచ్చరించారు. మంగళవారం జనగామ మండలం పెద్దపహాడ్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి ఽకొనుగోలు ప్రక్రియ, లోడింగ్, ట్యాబ్ ఎంట్రీని పరిశీలించారు. ఇళ్ల గణన ప్రక్రియ పారదర్శకంగా జరగాలి మొదటి విడతలో భాగంగా ఇళ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జనగామ మండలం పెద్ద పహాడ్, జనగామ మున్సిపాలిటీలోని 13వ వార్డులో జరుగుతున్న ఇళ్ల గణన ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. సర్టిఫికెట్ కోర్సుల పోస్టర్ ఆవిష్కరణ ఆన్ మ్యూజియాలజీ, ఆర్కియాలజీ కోర్సుల పోస్టర్ను కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆవిష్కరించారు. కోర్సులు పూర్తి చేయడం ద్వారా పర్యాటక, పురావస్తు మ్యూజియం రంగాలలో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మరిన్ని వివరాలకు 9849905722, 9849905723 నంబర్లను సంప్రదించాలన్నారు. కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలి జనగామ: జిల్లాలోని ఐకేపీ, పీఏసీఎస్, మార్క్ఫెడ్ కేంద్రా ల నుంచి మొక్కజొన్న, ధా న్యం సరుకును వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో కొనుగోళ్ల ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డీఆర్డీఓ భాస్కర్, మార్క్ఫెడ్ డీఎం చంద్రశేఖర్, డీసీఓ కోదండరాములు, డీఎంఓ రామకృష్ణ, అదనపు డీఆర్డీఓ నూరుద్దీన్, పౌరసరఫరాల సంస్థ డీఎం హతిరామ్, జిల్లా మార్కెటింగ్ అధికారి రామకృష్ణ, డీసీఎస్ఓ సురేష్ రెడ్డి, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ ఉన్నారు. శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలి జిల్లా గిరిజన గ్రామాల్లో ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి జంజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం–జేఏఎన్ఎంఏఎన్), ధర్తీ ఆబజం జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్(డీఏ–జేజీయూఏ) అమలు వేగవంతం చేసి, అర్హులైన ప్రతీ లబ్ధిదారునికి పథకాల ప్రయోజనాలు చేరేలా అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పని చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. -
ఎన్హెచ్–365బీపై ప్రమాద ప్రాంతాల పరిశీలన
పాలకుర్తి టౌన్(దేవరుప్పల): మండలంలోని ఎన్హెచ్–365బీ జాతీయ రహదారిపై ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలు, బ్లాక్ స్పాట్లను ఆధికారులు మంగళవారం పరిశీలించారు. పాలకుర్తి సీఐ జానకీరాంరెడ్డి, డీఈ రాజారాం, ఏడీఈ అశోక్కుమార్, ప్రాజెక్టు మేనేజర్ రామ్కుమార్, జిల్లా ఆర్టీఓ జీవీఎస్ గౌడ్లతో కలిసి ప్రమాద ప్రాంతాలను సందర్శించారు. రహదారిపై తరుచుగా ప్రమాదాలు జరగుతున్న ప్రాంతాలను గుర్తించి, ప్రమాద నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన సదుపాయాలను అధికారులు చర్చించారు. హెచ్చరిక బోర్డులు, రోడ్డు భధ్రత చర్యలు ,ట్రాపిక్ నియంత్రణ చర్యలను మెరగుపరచాలని సూచనలు చేశారు.దేవరుప్పల, లింగాల ఘన్పూర్ ఎస్సైలు సృజన్కుమార్, శ్రవణ్కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇక్కట్లు
రఘునాథపల్లి: మండలంలోని కుసుంబాయితండా ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కేంద్రంలో 51 మంది రైతులకు చెందిన 8వేల ధాన్యం బస్తాలు నింపి వారం రోజులు గడిచినా ఎగుమతి కాక నిల్వ ఉండిపోయాయి. లారీలు రాక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లారీలు రాక పోవడంతో టార్పాలిన్ల అద్దె పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకాల వర్షాలు పడే అవకాశం ఉండటంతో ధాన్యం తడిసిపోతుందేమొన్న భయం రైతులను వెంటాడుతోంది. ధాన్యం విక్రయించి అప్పులు తీర్చుకోవాలని ఎదురు చూస్తున్న రైతులు రవాణా సమస్య కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి లారీలను ఏర్పాటు చేసి ధాన్యం తరలింపునకు చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు యాదగిరి, రఘుపతి, సంపత్, కమలాకర్, అంజయ్య, గట్టుమల్లు, సత్యనారాయణ, వెంకన్న, మల్లేశ్, కొమురెల్లి, సుందర్, దేవస్వామి, బాలు, హరిసింగ్ తదితరులు కోరుతున్నారు. లారీల కొరతతో ఎగుమతి కాని నిల్వలు -
ఘనంగా దుర్గమ్మ ఉత్సవాలు
స్టేషన్ఘన్పూర్: మండలంలోని తానేదార్పల్లి గ్రామంలో కనకదుర్గమ్మ ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఎల్లమ్మ, దుర్గమ్మ బోనాల పండుగను చేపట్టారు. మహిళలు, వివిధ కుల సంఘాల పెద్దలు సామూహికంగా అమ్మవారి గుడివద్దకు వెళ్లి మొక్కులు సమర్పించారు. సర్పంచ్ మంతెన హరిత ఇంద్రారెడ్డి, నాయకులు దుంపల పద్మారెడ్డి, మాచర్ల గణేష్, చల్లా చందర్రెడ్డి, మాచర్ల కుమారస్వామి, ఆకుల కృష్ణంరాజు, మాచర్ల రఘురాములు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఆరురోజులుగా నిర్వహిస్తున్న రేణుకా ఎల్లమ్మతల్లి, వనం ఎల్లమ్మదేవత, కంఠమహేశ్వరస్వామి ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఈ మేరకు సోమవారం రాత్రి ఘనంగా బోనాలను చేపట్టారు. మంగళవారం దేవాలయం వద్ద బలిపూజ నిర్వహించారు. కాగా, ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా సహకరించిన కౌన్సిలర్ పొన్న రాజేష్ను గౌడ కులపెద్దలు సన్మానించారు. కౌన్సిలర్లు పొన్న రాజేష్, బాలగాని అనీల్గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు రంగు ప్రభాకర్, ఉపాధ్యక్షుడు వడ్లకొండ విజయ్, కార్యదర్శి రంగు ఎల్లయ్య, కోశాధికారి నర్సయ్య, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మాచర్ల అశోక్, ఉపాధ్యక్షుడు రంగు అనూప్కుమార్, కార్యదర్శి కోతి అజయ్, అనీల్, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
సంక్షిప్త సమాచారం
పరామర్శ నర్మెట (తరిగొప్పుల): సోలీపురానికి చెందిన రాంచరణ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన విదితమే.. కాగా, ఇదే ప్రమాదంలో తీవ్రగాయాలైన ప్రియాన్షి (3) చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పార్టీ శ్రేణులతో కలసి కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. ఆర్థికసాయం చిల్పూరు: మండలంలోని చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన పోలు జగన్నాథం మంగళవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా, బాధిత కుటుంబానికి శ్రీ మార్కండేయ పద్మశాలీ పరపతి సంఘం సభ్యులు పరామర్శించి సంఘం తరఫున రూ. 25 వేల సాయం అందజేశారు. సంఘం అధ్యక్షుడు గజ్జెల దామోదర్, పేరాల పెద్ధ కుమారస్వామి, రాజన్బాబు, సుధాకర్, నాగభూషణం, కాంతయ్య, వెంకటేశ్వర్లు, వెంకటయ్య పాల్గొన్నారు. పోస్టుమార్టం సౌకర్యం కల్పించాలి పాలకుర్తి టౌన్: నియోజవర్గ కేంద్రంలోని ప్రభ్వు ఆస్పత్రిలో నిర్మించిన పోస్టుమార్టం గదిని వెంటనే ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని సీపీఎం(ఎంఎల్)లిబరేషన్ మండల కార్యదర్శి కొనుకటి కళింగరాజు డిమాండ్ చేశారు. మంంగళవారం పార్టీ నాయకులతో కలిసి పోస్టుమార్టం గదిని ఆయన పరిశీలించి మాట్లాడారు. రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన భవనం చిన్నచిన్న కారణాలతో ఉపయోగింలోకి రాకవపోడం దురదృష్టకరమన్నారు. ఆనతరం ఆస్పత్రి సివిల్ అసిస్టెంట్ సర్జన్ అపర్ణను కలిసి సమస్యలపై చర్చించారు. సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర నాయకుడు సాంబయ్య, సోమయ్య, సారయ్య, శ్రీనివాస్, ఆర్వైఎల్ నాయకులు పాల్గొన్నారు. ఎన్నిక బచ్చన్నపేట: ఆలింపూర్ గ్రామానికి చెందిన దాసారం శ్రీనివాస్ను తెలంగాణ శాలివాహన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర శాలివాహన సంఘం నియమించింది. ఈ మేరకు మంగళవారం శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకారపు మోహన్ చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం శాలివాహన కులస్తులను ఆదుకోవాలని కోరారు. సిద్ధేశ్వరాలయంలో 23న వేలం బచ్చన్నపేట: కొడవటూర్ గ్రామంలో స్వయంభూ సిద్ధేశ్వరాలయంలో పలు హక్కులకు ఈనెల 23వ తేదీన వేలం పాటలను నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వాహణాధికారి చిందం వంశీ, ఆలయ ప్రధాన పూజారి ఓం నమశివాయ తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ టెంకాయలు, పూజా సామగ్రి విక్రయించేందుకు రూ. 2లక్షలు, లడ్డూ, పులిహోర తయారీ, విక్రయించేందుకు రూ. 50 వేలు, తలనీలాలు పోగు చేసుకునేందుకు రూ. 1.50 లక్షలు, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునేందుకు రూ. 50 వేల డీడీలను తీసి సీల్డ్ కవర్లను అందజేయాలన్నారు. వేలం పాటల కాల పరిమితి ఏడాది కాలం ఉంటుందని, ఆసక్తి గల వారు వేలంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు సీల్డ్ కవర్లను టెండరు బాక్స్లో వేసిన వారే వేలంలో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. ఆసక్తిగలవారు ఆలయ ఆవరణలో నిర్వహించే వేలంలో పాల్గొనాలని పేర్కొన్నారు. ఉపసర్పంచ్ల చెక్ పవర్ తొలగిస్తే ఉద్యమమే కొడకండ్ల: గ్రామ పంచాయతీల్లో ఉపసర్పంచ్లుకు ఉన్న ఉమ్మడి చెక్ పవర్ను తొలగించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఈ ఆలోచనను ప్రభుత్వం విరమించుకొకపోతే ఉద్యమిస్తామని మండల ఉపసర్పంచ్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎంపీడీఓ బర్మావత్ శంకర్కు ఉపసర్పంచ్లు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఉపసర్పంచ్లు షన్నా, వెంకటయ్య, రంగయ్య, యాకూబ్పాషా, రహమాన్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి పథకానికి ప్రాధాన్యం జఫర్గఢ్: కేంద్రప్రభుత్వం ఉపాధి పథకానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కూనూర్ గ్రామంలో ఉపాధి పనులను వెంకటేశ్వర్లు పార్టీ బృందంతో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా కూలీలో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధి పథకం ద్వారా ఎంతో మంది కూలీలు ఉపాధి పొందుతున్నారన్నారు. కూలీలకు సకాలంలో డబ్బులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్గౌడ్ తదితరులు ఉన్నారు. బంజారా నాయకుల ముందస్తు అరెస్ట్ పాలకుర్తి టౌన్: బంజారా జాతీ ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించనున్న కార్యక్రమాన్నికి బయలు దేరిన ఎల్హెచ్పీఎస్ నాయకులను మంగళవారం పోలీసులు ముందస్తూ అరెస్టు చేశారు. శాంతియుతంగా సీఎం నివాస ముట్టడికి వెళ్తున్న నాయకులను అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్దమని ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ నాగరాజు నాయక్ అన్నారు. -
పాడి పరిశ్రమతో అదనపు ఆదాయం
నర్మెట: వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకుంటే రైతులకు అదనపు సమకూరుతుందని హెరిటేజ్ జనగామ ప్లాంట్ మేనేజర్ వినోద్ కుమార్ అన్నారు. మండలకేంద్రంలో మంగళవారం చెవుల రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన రైతులకు పలు సూచనలు చేశారు. సమీకృత దానా తయారీ, మినరల్ మిక్చర్, గడ్డి పెంపకం, పాల ఉత్పత్తిని పెంచుకునే దిశగా గేదెలకు ఇవ్వాల్సిన దానా, కాల్షియం సప్లిమెంట్స్పై అవగాహన కల్పించారు. పశువైద్యుడు వెంకటేష్, అసిస్టెంట్ లక్ష్మణ్, రైతులు దన్నారపు వీరారెడ్డి, బండి నవీన్, స్వామి, మల్లేషం తదితరులు ఉన్నారు. -
ఎస్ఐఆర్ మ్యాపింగ్లో జిల్లాకు అగ్రస్థానం
● జిల్లాలో 90.59శాతం మ్యాపింగ్ పూర్తి ● మండలాల వారీగా పురోగతిని సమీక్షించిన కలెక్టర్ జిల్లా ఎస్ఐఆర్ మ్యాపింగ్ సమాచారంజనగామ: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) మ్యాపింగ్ ప్రక్రియలో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 2025 నాటికి జిల్లాలో మొత్తం 7లక్షల73 వేల503 ఓటర్లలో 7లక్షల709 మందికి మ్యాపింగ్ పూర్తి కాగా, 90.59 శాతం నమోదుకు చేరింది. ఇంకా 72,794 మంది ఓటర్ల మ్యాపింగ్ పెండింగ్గా ఉంది. అనామలీస్(పేర్లలో తప్పు ఒప్పులు) సంఖ్య 2,33,757గా, 31.93 శాతంగా ఉంది. అలాగే ఈ నెల18 వ తేదీతో పోలిస్తే జిల్లా మ్యాపింగ్ పురోగతి 3,274 మేర పెరిగినట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ సమీక్ష.. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్ఐఆర్ పురోగతిపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వివిధ మండలాల తహసీల్దార్లు, ఆర్డీఓతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బీఎల్ఓల పనితీరును కచ్చితంగా పర్యవేక్షించి, లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని సూచించారు. జూన్ 24 నుంచి జూలై 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలకు తమ బీఎల్ఓ వివరాలు తెలియజే సేందుకు ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ గోపీరాం, చేర్యాల, ధర్మసాగర్, సిద్దిపేట తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.మొత్తం ఓటర్లు (2025): 7,73,503 మ్యాపింగ్ పూర్తయినవారు: 7,00,709 మ్యాపింగ్ పెండింగ్: 72,794 మ్యాపింగ్ శాతం: 90.59 అనామలీస్ మొత్తం: 2,23,765 అనామలీస్ శాతం: 31.93 -
రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
● సివిల్ సప్లై జిల్లా మేనేజర్ హతిరామ్ లింగాలఘణపురం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీరియల్ ప్రకారం తూకం వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ హతిరామ్ తెలిపారు. మండలంలోని మాణిక్యాపురంలో పొన్నం తిరుమలేశ్ అనే రైతు ధాన్యాన్ని సీరియల్ ప్రకారం తూకం వేయకుండా జాప్యం చేయడంతో మనోవేదనతో ఈ నెల 17న ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయంపై ‘సాక్షి’లో ‘కొనుగోలు కేంద్రంలో రైతు ఆత్మహత్యాయత్నం’, అదేవిధంగా పాలకుర్తిలో ఽ‘ధాన్యం ఽకొనుగోళ్లలో జాప్యం’ అనే శీర్షికలతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి కేంద్రాల వద్దకు వెళ్లి జరిగిన పొరపాటును సరిచేసి రైతు ధాన్యం తూకం వేయడం జరిగిందని వివరించారు. ఏవైనా పొరపాట్లు చేస్తే చర్యలు తీసుకుంటామని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశామని వివరించారు. ఎయిర్పోర్ట్ అభివృద్ధికి టెండర్ల ఆహ్వానం మామునూరు: వరంగల్ మామునూరు విమానాశ్రయం అభివృద్ది పనుల కోసం అధికారులు టెంబర్లను ఆహ్వానించినట్లు తెలిసింది. ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు ఇటీవల పర్యటించిన విషయం తెలిసిందే. భూ నిర్వాసితుల నుంచి సేకరించిన రన్వే స్థలానికి పెన్షింగ్, బోర్డులు ఏర్పాటు, ప్రాంగణంలోని ఏపుగా పెరిగిన ముళ్లపొదలు, ఇతర చెట్ల తొలగింపు, విమానాశ్రయంలో భూసార పరీక్షలకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. 180 రోజుల్లో పర్యావరణ అనుమతులు, భూసార పరీక్షలు నిర్వహించేందుకు టెండర్దారులనుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిసింది. కాగా టెండర్ల దాఖలుకు మంగళవారం సా యంత్రం 4గంటల వరకు చివరి అవకాశం ఉన్న ట్లు సమాచారం. టెండర్లను 20న సాయంత్రం 5 గంటలకు ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. పనులను దక్కించుకునే కాంట్రాక్టర్ 180 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. -
సమస్యలు పరిష్కరించాలి
జనగామ: జిల్లాలో ప్రజల్ని పట్టి పీడిస్తున్న 12 సమస్యలను కలెక్టర్ పరిష్కరించాలని కలెక్టర్ బాధితుల రక్షణ కమిటీ కన్వీనర్ ఎండీ సాదిక్ ఆలీ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు కలెక్టర్తో మాట్లాడి చేయించాలన్నారు. అనేక పనుల నిమిత్తం కలెక్టరేట్కు వచ్చే అన్ని వర్గాలను ఉద్దేశించి నిర్మాణం చేసిన సెల్లార్కు ద్విచక్రవాహనాలతో పాటు కార్లను అనుమతించాలన్నారు. కలెక్టరేట్ ఆవరణలో తొలగించిన వనిత టీ, డెయిరీ స్టాళ్లను అదే స్థలంలో ఏర్పాటు చేయాలన్నారు. ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో పేరుకు పోయిన ధాన్యం నిల్వలను 10 రోజుల లోపు కొనుగోలు చేసి తరలించాలన్నారు. అన్లోడింగ్, ట్రాన్స్ పోర్టు సమస్యను పరిష్కరించే బాధ్యతగా కలెక్టర్ తీసుకోవాలన్నారు. ఇసుక, మట్టి రవాణా సమస్యను పరిష్కరించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కలెక్టరేట్ వద్ద ఇసుక డంప్ చేసి అవసరమైతే ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా సరఫరా చేయాలన్నారు. ఇతర నిర్మాణాలకు నాణ్యమైన ధరకు ఇసుకను అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఉన్న క్యాంటీన్ను తిరిగి అదే స్థలములో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ డిమాండ్లు నెరవేరే వరకు ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తామని సాదిక్ ఆలీ తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ బాధిత రక్షణ కమిటీ కో కన్వీనర్లు, జేఏసీ అధ్యక్షులు మంగళ్లపల్లి రాజు, సాంబరాజు యాదగిరి, బూడిద గోపి, శేఖర్, టీఆర్ఎస్ (కవిత ) పార్టీ నాయకులు ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ కత్తుల రాజిరెడ్డి, న్యాయవాదులు ధర్మభిక్షం, వేణు, పాలమాకుల మంజుల తదితరులు ఉన్నారు. ● కలెక్టర్కు డిమాండ్లు పెట్టిన పోరాట కమిటీ -
భూ భారతిలో జిల్లా ముందంజ
● తహసీల్దార్లకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రశంసలుజనగామ: భూభారతి సేవల అమలులో జిల్లా రాష్ట్రస్థాయిలో ముందంజలో నిలవడం విశేషం. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచిన జిల్లాకు ప్రభుత్వం నుంచి కూడా ప్రశంసలు వస్తున్న వేళ, కలెక్టర్ సందీప్ కుమా ర్ ఝా మంగళవారం జరిగిన భూభారతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో తహసీల్దార్లను అభినందించారు. జిల్లాలో 1,028 పెండింగ్ దరఖాస్తులు జిల్లాలో భూభారతి పెండింగ్ దరఖాస్తులు భారీ సంఖ్యలో ఉన్నప్పటికీ, పరిష్కారం విషయంలో రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చితే మెరుగ్గా ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా నివేదిక మేరకు జిల్లాలో మొత్తం 1,028 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, వాటిలో 509 దరఖాస్తులు 60 రోజులకు లోపు ఉండగా, 519 దరఖాస్తులు రెండు నెలలకుపైగా పెండింగ్లో ఉన్నాయి. కలెక్టర్ సమీక్ష.. సక్సెషన్, మ్యుటేషన్, ఖాతా సమీకరణ, డేటా కరెక్షన్, అర్బన్ ల్యాండ్, జీపీపీ, పీపీబీ, నాలా, కోర్టు కేసులు వంటి ప్రధాన మాడ్యూల్స్లో పెండింగ్స్ను అత్యవసరంగా తగ్గించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. పెండింగ్ దరఖాస్తులను రోజువారీగా ట్రాక్ చేయడంతో పాటు పెండింగ్లకు కారణాలు స్పష్టంగా నమోదు చేసి వెంటనే పరిష్కారం చూపాలన్నారు. సమీక్షలో ఆర్డీఓ కె.గోపీరాం, తహసీలార్లు పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయ విధానాన్ని పాటించాలి -
‘ఒంటరి’ పోరాటం!
జఫర్గఢ్: విధి వెక్కిరించినా వెరవలేదు అతడు..కాలం కలిసి రాకున్నా, నా అన్నవాళ్లు తోడులేకున్నా బతుకు పోరాటం ఆపలేదు అతడు..విద్యుదాఘాతంతో ఒక చేయి కోల్పోయిన ఏమాత్రం అధైర్య పడలేదు..ఒంటిచేత్తో జీవనయాత్ర కొనసాగిస్తున్నాడు.. జిల్లాలోని జఫర్గఢ్ మండలం తిడుగు గ్రామానికి చెందిన ఎండీ మీయాజాని, బీపాష దంపతులకు నాలుగో కుమారుడు ఎండీ రహీం. కుటుంబ అర్థిక పరిస్థితి బాలేకపోవడంతో 7వ తరగతి మధ్యలోనే తన చదువును ఆపేశాడు. వర్ధన్నపేటలోని స్టార్టర్లు, మోటర్లకు సంబంధించిన మెకానిక్ పనినేర్చుకున్నాడు. 30 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వెళ్లి అక్కడే ఏడాది పాటు మోకానిక్గా పనిచేస్తూ జీవనం సాగించాడు. ఈ క్రమంలో మోటర్ వైండింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఎడమ చేయి మణికట్టు పైభాగం వరకు పూర్తిగా చేతిని కోల్పోయాడు. ఒంటిచేత్తో పనిచేసేందుకు ఎవరూ పని ఇవ్వకపోవడం, మరోవైపు మోటార్ వైండింగ్ పనిచేసే అవకాశం లేకపోవడంతో తన స్వగ్రామమైన తిడుగు గ్రామానికి వచ్చాడు. అప్పటికే రహీం తన తండ్రిని కోల్పోవడం, ముగ్గురు సోదరులు కూడా బతుకుదెరువు కోసం పట్టణప్రాంతాల్లో స్థిరపడడంతో తన తల్లి బీపాషతో కలసి ఇంటివద్దనే ఉంటూ చిన్నగా పంక్చర్ కొట్టు పెట్టి సైకిళ్లు, ద్విచక్రవాహనాలకు టైర్ పంక్చర్లను అతుకుతూ వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో తల్లిని పోషిస్తూ జీవనం సాగించాడు. ఈక్రమంలో తల్లి అనారోగ్యంతో పూర్తిగా మంచానికి పరిమితం కావడంతో రహీం తన తల్లికి సేవలు చేస్తూ మరోవైపు తన వృత్తిని కొనసాగిస్తూ వచ్చాడు. ఉపాధి హామీ పనులకు సైతం వెళ్లేవాడు. ఇలా ఉండగా నెలరోజుల క్రితం తల్లి బీపాష అనారోగ్యంతో తనువుచాలించింది. దీంతో ఒంటరి అయిన రహీం తన దుఃఖాన్ని కడుపులో దాచుకుంటూ బతుకుబండిని సాగిస్తున్నాడు. తనకు ప్రభుత్వం నుంచి పింఛను వస్తున్నప్పటికీ ఏమాత్రం సరిపోవడం లేదని పైగా తన పక్కనే మరో పంక్చర్ కొట్టు పడడం వల్ల గిరాకీ కూడా రావడం లేదని దీనివల్ల తన పోషణ కష్టంగా మారిందని తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చేయి కోల్పోయి ఒంటరైన తనకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందించడంతో పాటు మూడు చక్రాల బండిని అందజేసి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. విద్యుదాఘాతంతో చేయికోల్పోయిన రహీం ఒంటిచేత్తోనే పంక్చర్ షాపు నిర్వహణ తల్లిదండ్రుల మరణంతో ఒంటరిగా జీవనం ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకోలు -
బుధవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2026
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల పరిధిలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించే వారికి 5శాతం రిబేట్ ప్రకటించగా, జనగామ మున్సిపాలిటీలో ఈ పథకానికి మంచి స్పందన లభించింది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు నెల రోజుల పాటు ఈ రిబేట్ ఆఫర్ను అమలు చేస్తూ ప్రభుత్వం మున్సిపాలిటీల ఆదాయ వనరులను బలోపేతం చేయడంతో పాటు, సమయానికి పన్నులు చెల్లించే వినియోగదారులకు ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రెగ్యులర్గా వచ్చే ఆస్తి పన్ను వసూళ్లకు సంబంధించి కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం విస్త్రతంగా తిరుగుతున్నారు. పట్టణ అభివృద్ధిలో ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు పన్నుల రూపేణా వచ్చే ఆదాయం సైతం కీలకపాత్ర పోషిస్తుంది. రూ.కోటి రూపాయలకుపైగా ఆదాయం జనగామ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 15,941 అసెస్మెంట్లు ఉండగా, వార్షిక ఆస్తిపన్ను డిమాండ్ రూ. 5 కోట్ల 79 లక్షలుగా నిర్ధారించబడింది. ఇందులో రెగ్యులర్గా పన్నులు చెల్లించే వారి అసెస్మెంట్లను మాత్రమే రిబేట్ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో 11,376 అసెస్మెంట్లు రిబేట్కు అర్హులుగా గుర్తించబడ్డారు. ఈ అర్హులైన అసెస్మెంట్ల నుంచి మొత్తం డిమాండ్ రూ.3కోట్ల 72 లక్షలుగా మున్సిపాలిటీ లెక్కలు వెల్లడించాయి. రిబేట్ సమయ పరిమితి ముగిసేలోపే 3,131 మంది వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వీరు ఆస్తిపన్ను రూ.1,00,20,087లు మున్సిపాలిటీ ఖాతాల్లో జమ చేశారు. ప్రభుత్వ రిబేట్ విధానం ప్రజల్లో మంచి స్పందన రాబట్టడంతో పాటు మున్సిపాలిటీకి ఒకేసారి భారీగా ఆదాయం సమకూరింది. ఈ ఏడాది ప్రారంభంలోనే కోటి రూపాయలకుపైనే సమకూరడం ఆర్థికప్రణాళికల అమలులో పురపాలక సంస్థకు మేలు చేయనుంది. 5శాతం సద్వినియోగం ఆస్తిపన్ను చెల్లింపుల్లో అధిక మొత్తాలు చెల్లించే వినియోగదారుల స్పందన ప్రత్యేకంగా గుర్తించబడింది. ప్రతీ సంవత్సరం లక్ష రూపాయలకు పైగా పన్ను చెల్లించే ఐదుగురు, 50 వేల నుంచి లక్ష రూపాయల మధ్య పన్ను చెల్లించే 26 మంది, అలాగే 25 వేల నుంచి 50 వేల వరకు చెల్లించే 76 మంది వినియోగదారులు రిబేట్ ఆఫర్ను అత్యధికంగా వినియోగించుకున్నారు. పన్ను అధికంగా చెల్లించే ఈ వర్గం ముందస్తు చెల్లింపులు మున్సిపాలిటీ ఆదాయానికి మరింత బలాన్నిచ్చాయి.అసెస్మెంట్లు:15,941ఏటా పన్ను వసూళ్ల డిమాండ్: రూ.5.79కోట్లు రెగ్యులర్గా పన్ను చెల్లించే ఆస్తిపన్ను దారులు: 11,376వారి నుంచి ఆస్తిపన్ను అంచనా: రూ.3.72కోట్లు 5శాతం రిబేట్తో పన్ను వసూళ్లు: రూ.1,00,20,087రెగ్యులర్ ఆస్తి పన్ను కోసం ఏప్రిల్ 30తో రిబేట్ గడువు ముగిసినా, మిగిలిన రెగ్యులర్ పన్నుల వసూళ్ల కోసం మున్సిపాలిటీ యంత్రాంగం రంగంలోకి దిగింది. కమిషనర్ ఆదేశాల మేరకు వార్డు ఆఫీసర్లు, బిల్కలెక్టర్లు, ఇతర విభాగాల సిబ్బంది ప్రతీ ఇంటికి వెళ్లి పన్ను చెల్లింపులపై అవగాహన కల్పిస్తూ వసూళ్లను వేగవంతం చేస్తున్నారు. ప్రతీ ఏడాది సమయానికి పన్నులు చెల్లించే వారికి ప్రోత్సాహకంగా ప్రభుత్వం అందించే ఈ రిబేట్ విధానం, జనగామ మున్సిపాలిటీలో ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహించడమే కాకుండా, పౌరుల్లో పన్నుల పట్ల బాధ్యతా భావాన్ని పెంపొందిస్తున్నది. -
జూలై 31 వరకు లిఫ్ట్–1పనులు పూర్తిచేయాలి
● సబ్స్టేషన్ లేకుండా పంప్హౌజ్ ఎలా పనిచేస్తుంది? ● అధికారులు, కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తంచేసిన ఎమ్మెల్యే కడియం చిల్పూరు: జూలై 31 వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్–1 పనులు పూర్తిచేసి సాగునీరు అందించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంబంధిత అధికారులకు సూచించారు. మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులోని గండి రామారం ఎత్తిపోతల పథకంలోని లిఫ్ట్–1 పంప్హౌస్ నిర్మాణ పనులను మంగళవారం అధికారులు, కాంట్రాక్టర్, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. నామమాత్రంగా జరగుతున్న పనులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సబ్స్టేషన్ లేకుండా పంప్హౌజ్ ఎలా పనిచేస్తుందని నీటిని ఎలా లిఫ్ట్ చేస్తారని, పంప్హౌజ్ పనులు మొదలు పెట్టినప్పుడే సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టాలని తెలియదా? అని అధికారులను ప్రశ్నించా రు. జూలై 31 వరకు పూర్తిచేసి ఈ వర్షాకాలంలోనే చిల్పూరు, వేలేరు మండలాల రైతులకు సాగు నీరు అందించేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. నీటి పారుదల శాఖ ఎస్ఈ సీతారాం, ఈఈ ప్రవీణ్, కాంట్రాక్టర్ వెంకటేశ్వర్రెడ్డి, చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్రావు, రైతులు పాల్గొన్నారు. కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఉండొద్దు.. లిఫ్ట్ పనులను పరిశీలిస్తూ హన్మకొండకు వెళ్తున్న ఎమ్మెల్యే రాజవరం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్న రైతులను సమస్యలను అడిగి తెలుసుకోగా మిల్లుల్లో ఖాళీ లేవని ధాన్యం తీసుకోవడానికి యజమానులు నిరాకరిస్తున్నారన్నారు. దీంతో వెంటనే కలెక్టర్కు ఫోన్ చేసి మిల్లర్లతో సమస్యలు ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మిల్లుల రీ–ట్యాగింగ్ చేసి వీలైనంత తొందర్లో సమస్యలు లేకుండా చూడాలని తెలిపారు. -
నీడ లేక ప్రయాణికుల అవస్థలు
స్టేషన్ఘన్పూర్: గత మేజర్ గ్రామ పంచాయతీ, ఘన్పూర్కు జంటపట్ణణం, ప్రస్తుతం స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి ఏళ్ల తరబడి కనీసం బస్షెల్టర్కు నోచుకోవడం లేదు. శివునిపల్లి నుంచి అనునిత్యం ప్రయాణికులు పాలకుర్తి, జఫర్గడ్, ఐనవోలు, హిమ్మత్నగర్ తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. పాలకుర్తి, జఫర్గడ్, హిమ్మత్నగర్కు ఆర్టీసీ బస్సుల సౌకర్యం ఉంది. అయితే శివునిపల్లిలో ప్రధానంగా వివేకానంద చౌరస్తా, రైల్వేస్టేషన్, అంబేడ్కర్ సెంటర్ వద్ద ప్రయాణికులు బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఎక్కుతుంటారు. అయితే ఏళ్ల తరబడి శివునిపల్లిలో ఒక్క బస్షెల్టర్ కూడా లేదు. ఎంతో ఘన చరిత్ర ఉన్న శివునిపల్లిలో కనీసం బస్షెల్టర్ లేకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుత వేసవికాలంలో ఎండ తీవ్రత అధికంగా ఉండగా శివునిపల్లి నుంచి ఆయా ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లేవారు వాహనాల కోసం మండుటెండలో నిల్చుని ఎదురు చూస్తున్నారు. శివునిపల్లిలోని మూడు సెంటర్ల వద్ద కనీసం నిలువ నీడ లేకపోవడంతో ప్రయాణికులు అరిగోస పడుతున్నారు. ఇప్పటికై నా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి బస్షెల్టర్ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మండుటెండలో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు బస్షెల్టర్కు నోచుకుని శివునిపల్లి -
‘మెడికల్ షాపుల బంద్కు మేం వ్యతిరేకం’
జనగామ: ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై నిరసనగా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపునిచ్చిన బంద్ను వ్యతిరేకిస్తున్నట్లు ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బెజగం అశో క్, ఉపాధ్యక్షుడు మౌర్య నాగరాజు, ప్రధాన కార్యదర్శులు గడెపాక సంపత్, సోం ప్రకాశ్ తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం ఫార్మసిస్ట్ పర్యవేక్షణలోనే మందులు అమ్మాలనే నిబంధన ఉన్నప్పటికీ, జిల్లాలో అనేక మెడికల్ షాపులు ఫార్మసిస్ట్ లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కీలక సమస్య పై చర్యలు తీసుకోకుండా కేవలం ఆన్లెన్ అమ్మకాలపై మాత్రమే నిరసనలు చేయడం అన్యాయమన్నారు. మందుల సరఫరాలో అంతరాయం ఉండదు జనగామ: దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కెమిస్టుల(మెడికల్ సాపులు) బంద్ నేపథ్యంలో జిల్లాలో ప్రజలకు అత్యవసర మందుల సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టినట్లు జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మెడికల్ షాపుల యాజమాన్యాలకు అవసరమైన సూచనలు జారీ చేశారన్నా రు. అత్యవసర పరిస్థితుల్లో మందుల లభ్యతకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ : 1800 425 660, డ్రగ్ ఇన్స్పెక్టర్ 9849634754, 8333925867 నంబర్లలో సంప్రదించాలన్నారు. యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి జనగామ రూరల్: యువత అవకాశాలను అందిపుచ్చుకొని భవిష్యత్లో ఉన్నతంగా స్థిరపడాలని జిల్లా యువజన క్రీడల అధికారి నరసింహారావు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం యువజన క్రీడల వారోత్సవాలలో పట్టణంలోని ధర్మకంచ జిల్లా పరిషత్ హైస్కూల్, ఏకశిలా ఐటీఐ కళాశాలలో టీశాట్ ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణ ఉద్యోగ కల్పన ,క్రీడా యూనివర్సిటీ, భారత సైన్యంలో ఇచ్చే శిక్షణలు, ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు. వారిలో సెట్విన్ జా యింట్ డైరెక్టర్ వేణుగోపాలరావు, ఓఎస్డీ స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి కె.నర్సయ్య, మమతారావు, సునీల్ యాదవ్ ఉన్నారు. ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ షురూ ద్యారణ్యపురి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం సంస్కృతం సబ్జెక్టు జవాబు పత్రాల వాల్యుయేషన్ నిర్వహించారు. చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు (అధ్యాపకులు) 49 మంది వాల్యుయేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఉమ్మడి జిల్లాకు హనుమకొండలోని ప్రభుత్వ జూని యర్ కళాశాల స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంగా ఉంది. అన్ని సబ్జెక్టులు కలిపి ఈ క్యాంపునకు 88,512 జవాబుపత్రాలు కేటాయించారు. మొదటిదశలో ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టుల పేపర్–1, పేపర్–2 పరీక్షల జవాబుపత్రాలు అలాగే మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పేపర్ 2 జవాబు పత్రాల వాల్యుయేషన్ నిర్వహించనున్నట్లు క్యాంప్ ఆఫీసర్, డీఐఈఓ ఎ.గోపాల్, ఏసీఓ జనరల్–1 శ్రీనివాస్రావు తెలిపారు. రెండో దశలో ఫిజిక్స్, ఎకనామిక్స్, బాటనీ, జూ వాలజీ, కెమిస్ట్రీ, కామర్స్, హిస్టరీ సబ్జెక్టుల పేపర్–1, పేపర్–2 జవాబు పత్రాల వాల్యుయేషన్ ఈనెల 24 నుంచి నిర్వహించనున్నారు.ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి ఖిలా వరంగల్: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ఉద్యమకారుల రాష్ట్ర టీజీఏ అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, నాయకులు అచ్చవిద్యాసాగర్, జేఏసీ కన్వీనర్ దిడ్డి నరేందర్ మంగళవారం డిమాండ్ చేశారు. కరీమాబాద్లోని చట్లోళ్ల గడ్డ వద్ద ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరుపల్లి రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. -
సర్పంచ్ ఆదర్శం..!
లింగాలఘణపురం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గి మూతబడే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మండలంలోని నేలపోగుల సర్పంచ్ గుగ్గిళ్ల నవిత తన కూతురు ప్రిన్సికి స్థానిక పాఠశాలలో అడ్మిషన్ తీసుకొని ఆదర్శంగా నిలిచారు. ప్రభు త్వ బడుల్లోనే మెరుగైన, నాణ్యమైన విద్య అందుతుందని, ప్రతీ తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాల ని, ముందుగానే తాను చేర్పించి మిగిలిన వారిలో స్ఫూర్తిని నింపారు. హెడ్మాస్టర్ నవీన్ సమక్షంలో అడ్మిషన్ తీసుకోవడంతో పాఠశాల ఉపాధ్యాయ బృందం సర్పంచ్ నవితకు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్పై కావాలనే విమర్శలుటీపీసీసీ సభ్యులు లక్ష్మీనారాయణ నాయక్ జనగామ: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పనితీరుపై కావాలనే విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ సభ్యుడు లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ అన్నారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడా రు.. ప్రభుత్వ అధికారులు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పారదర్శకంగా పనిచేస్తున్న సమయంలో ఇలాంటి వ్యతిరేక ప్రచారాలు చేయడం మంచిది కాదన్నారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్, మార్కెట్ చైర్మన్ ఎర్రమళ్ల సుధాకర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కంచె రాములు, డీసీసీ ఉపాధ్యక్షులు ఉడత రవి యాదవ్, జనరల్ సెక్రటరీ జిల్లెల్ల సిద్ధారెడ్డి, ఎండీ అన్వర్, జమాల్ షరీఫ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కోతలు విధించే మిల్లులపై చర్యలు
జనగామ రూరల్: తాలు, తరుగు, మట్టి పేరుతో రైతుల సొమ్ములో కోతలు విధించే మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని అవసరమైతే సీజ్ చేయడానికి వెనుకాడబోమని సివిల్ సప్లయీస్ డీఎం హతీరామ్ హెచ్చరించారు. ఇటీవల పెంబర్తిలో జరిగిన ఆందోళన నేపథ్యంలో సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు సోమవారం స్పందించారు. జనగామ మండలం పెంబర్తి కొనుగోలు కేంద్రంలో ఇప్పటికే తూకం వేసిన ధాన్యం బస్తాలను మిల్లుకు కేటాయించామన్నారు. మిల్లు వద్ద అన్లోడింగ్ ప్రక్రియలో కొంత ఆలస్యం జరగడం, లారీల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగిందన్నారు. రవాణా సేవలు పెంచుతున్నాం పాలకుర్తి మండలం దర్దెపల్లి కొనుగోలు కేంద్రంలో రైతు ధాన్యానికి సంబంధించిన తక్పట్టి, ట్రక్ షీట్ ఎంట్రీల వ్యత్యా సం, జనగామ మండలం చీటకోడూరు రైతుల తూకంపై విచారణ అనంతరం చర్యలు ఉంటాయని డీఎం హతీరామ్ తెలిపారు. జిల్లాలోని సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు, రైస్ మిల్లుల్లో దిగుమతుల్లో జాప్యం, తూకంలో కోతలు, తదితర అంశాలపై సాక్షిలో ప్రచురితమైన కథనాలకు అధికారులు స్పందించారు. తరుగు పేరిట రైతులను మోసం చేయవద్దని నిర్వాహకులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్లు చెప్పారు. -
పరిశీలిస్తూ.. పరిష్కరిస్తూ
జనగామ: అర్జీలను చదువుతూ..ప్రజలు చెప్పే సమస్యలను ఓపికగా విన్నారు.. అర్జీలోని అంశాన్ని చదువుతూ వాటి పరిష్కారానికి సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.. ప్రజలు అందించే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి, పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన గ్రీవెన్స్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్తో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీల ను స్వీకరించారు. దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, ప్రజా సమస్యలపై తగి న చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. గ్రీవెన్స్లో జెడ్పీ సీఈఓ రంగారావు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, సీపీఓ చిన కోట్యా నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అర్జీలు ఇలా.. ● జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ నగర్ ఒకటో వార్డుకు చెందిన కె.రేణుక, రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన నరేష్, లింగాల ఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన ఆర్.రమ ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం అర్జీ పెట్టుకున్నారు. ● జిల్లా విజిలెనన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో చోటు కల్పించాలని జనగామ మండలం యశ్వంతాపూర్ గ్రామానికి చెందిన బొట్ల మహేష్ వినతి చేసుకున్నారు. ● జనగామలో గాంఽఽధీ బొమ్మ జంక్షన్ దగ్గర రోడ్డు సమస్యలతో పాటు యూటర్న్ బోర్డులు లేకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మాజీ కౌన్సిలర్ గాదెపాక రాంచందర్ కలెక్టర్కు వినతి చేశారు. ఫ్లైఓవర్ బ్రిడి్జ్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ లేకపోవడంతో రోడ్డు దాటాలంటే కష్టంగా మారిందని, వ్యాపారాల కోసం ఫుట్పాత్లను ఆక్రమించుకోవడంతో ప్రజలకు ఇబ్బందిగా ఉందని, వాటికి ప్రత్యేక స్థలం కేటాయించాలన్నారు. ట్రాఫిక్ హెచ్చరిక బోర్డులతో పాటు స్పీడ్ లిమిట్ బోర్డులను ఏర్పాటు చేయాని కోరారు. ● తనకున్న ఎకరం 25 గుంటలు వ్యవసాయ భూమి ఉందని, రికార్డులో 2021 నుంచి భూమి కనిపించడం లేదని లింగాల ఘణపురం మండలం నెల్లుట్లకు చెందిన పేరబోయిన వీరస్వామి అర్జీలో పేర్కొన్నారు. మీ సేవకు వెళ్తే పహాణీ రావడం లేదని, భూమిని తామే సాగు చేసుకుంటున్నామని, కాల్వ కోసం భూమి పోయిందంటున్నారు. తమకు ఒక్క పైసా రాలేదని, భూమిని రికార్డుల్లోకి ఎక్కించి న్యాయం చేయాలన్నారు. ● ఊరికి 8 ఇందిరమ్మ ఇల్లు వచ్చాయని, అందులో ఒక్కటి మాత్రమే పూర్తయిందని, ఇంకా ఏడు గృహాలు మధ్యలోనే ఆగిపోయాయని దేవరుప్పుల మండలం బంజర సర్పంచ్ ధరావత్ చిరంజీవి దరఖాస్తు చేశారు. ఇసుక తరలింపు ఆగిపోవడంతో సమస్య ఏర్పడిందని, అలాగే అభివృద్ధి పనులు, ఇళ్లకు సంబంధించిన రెనోవేషన్ పనులు చేయాలన్నా తట్టెడు ఇసుక కరువైయిందన్నారు. ప్రజాసమస్యలను ఓపికగా విన్న కలెక్టర్ అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దంటూ అధికారులకు ఆదేశం కలెక్టరేట్ గ్రీవెన్స్కు పోటెత్తిన అర్జీదారులు -
క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: వ్యాయమంతో మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం, ఓర్పు, సహనం పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం యువజన, క్రీడల వారోత్సవాల సందర్భంగా జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి ధర్మకంచ స్టేడియం వరకు 2కే రన్ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, ఆర్డీఓ గోపిరామ్, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు,యువత, క్రీడాకారులు, వాకర్స్ పాల్గొన్నారు. రెడ్క్రాస్ సేవలు పెరగాలి రెడ్క్రాస్ సొసైటీ సేవలు విస్తరించేందుకు సభ్యుల సంఖ్య పెంచాలని కలెక్టర్, రెడ్క్రాస్ సొసైటీ జనగామ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ ఝా సూచించారు. జనగామ రెడ్క్రాస్ సొసైటీ ఉదయం ఏర్పాటు చేసిన కొత్త సభ్యుల చేర్పించే ప్రత్యేక కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ డి.లవకుమార్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జున రావు, కార్యదర్శి కన్న పరశురాములు, సభ్యులు పాల్గొన్నారు. కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలి మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని ఓపీఎంఎస్ ఎంట్రీలను ఎప్పటికప్పుడు తప్పని సరిగా నమోదు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. అలాగే ప్రభుత్వ సౌజన్యంతో, రెడ్ క్రాస్ సొసైటీ జనగామ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రణామ్ సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్ను కలెక్టర్ ప్రారంభించారు. పర్యాటకశాఖ కార్యాచరణ ప్రణాళికలో యువ టూరిజం క్లబ్స్ కార్యచరణ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. -
లక్ష్యం.. 100శాతం
ఫార్మర్ రిజిస్ట్రీలో జిల్లాది 6వ స్థానంజనగామ: జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 12 మండలాల్లో 62 క్లస్టర్లు, 176 రెవెన్యూ గ్రామాల పరిధిలో 1,99,051 మంది రైతులు ఉన్నారు. వీరిలో 1,43,037 మంది రైతుల రిజిస్ట్రీ ఇప్పటివరకు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీలో సోమవారం నాటికి జనగామ జిల్లా ఆరు నుంచి ఏడో స్థానంలో కొనసాగడం విశేషం. జిల్లాలో ఇప్పటివరకు 71.86శాతంగా నమోదైంది. సమస్య ఉన్నా..అధిగమిస్తూ ఇటీవల భూముల కొనుగోలు, మార్పిడి చేసుకొని పట్టాదార్ పుస్తకాలు పొందిన పొందిన రైతుల వివరాలు కూడా ఏఈఓ లాగిన్లకు చేరడంతో రిజిస్ట్రీ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. అయితే రిజిస్ట్రీ విజయవంతంగా కొనసాగుతున్నప్పటికీ కొన్నిచోట్ల సాంకేతిక, నిర్వహణ సంబంధిత సమస్యలు ఏఈఓలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అంతేకాక రిజిస్ట్రీ ప్రక్రియలో రైతులు మూడు సార్లు ఓటీపీ అందించడం తప్పనిసరి కావడంతో, పలువురు రైతులు సహకరించకపోవటం ఆలస్యానికి దారితీస్తోంది. దీంతో పాటు మృతి చెందిన రైతుల పేర్లు కంటిన్యూ కావడం, వలస వెళ్లిన అన్నదాతలు, భూమి అమ్ముకున్న తర్వాత పేరు మార్పిడి చేసుకోలేని పట్టాదార్ పుస్తకాల రిజిస్ట్రీ పెండింగ్లో ఉండగా, దానిని సైతం అధిగమించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఓ ప్రాంతంలో అ ధికారి 80 మంది రైతులకు ఫోన్ చేయగా, ఆ రోజు కేవలం 8 మంది మాత్రమే స్పందించి రిజిస్ట్రీ పూర్తి చేసుకోవడం, వ్యవస్థ ఎంత కష్టతరంగా మారిందో అర్థమవుతోంది. ఈ సమస్యలతో పాటు యాప్ ఓ పెన్ చేసే సమయంలో నెట్వర్క్ సమస్యలు, సర్వర్ మొరాయింపు తరచుగా ఎదురవడం కారణంగా రిజిస్ట్రీ నమోదులో ఆలస్యానికి కారణంగా చెప్పవచ్చు. నిరంతరం సమీక్షలు.. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఫార్మర్ రిజిస్ట్రీని 100 శాతం పూర్తి చేయాలని, ఇందుకోసం ప్రతిరోజు మంత్రి, సీఎస్ జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ పురోగతిని తెలుసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని పలు వ్యవసాయ, వనరుల పంపిణీ స్కీములు ఫార్మర్ రిజిస్ట్రీతో అనుసంధానించే అవకాశం ఉందని తెలుస్తోంది. హార్టికల్చర్ శాఖలో ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉంది. ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తయితే భవిష్యత్లో రైతులకు అందే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు మరింత పారదర్శకంగా, సరళంగా అందుబాటులోకి రానున్నాయి. జిల్లా వ్యవసాయ అధికారులు తక్షణమే మిగిలిన రైతులను సంప్రదించి రిజిస్ట్రీ పూర్తి చేయాలని, రైతులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి కావడంతో భూమి, పంట, తదితర వాటికి సంబంధించిన రైతుల విలువైన డేటాబేస్ ప్రభుత్వం వద్ద సిద్ధం కానుంది. అత్యధిక శాతం..చిల్పూరులో జిల్లాలో అత్యధిక శాతం నమోదు చేసిన మండలం చిల్పూర్ (75.63శాతం) కాగా, ఆ తర్వాత దేవరుప్పుల (74.83శాతం), స్టేషన్ ఘన్పూర్, (74.60 శాతం), నర్మెట (73.98శాతం) మండలాలు ఉన్నాయి. జిల్లాలో అత్యల్పంగా రిజిస్ట్రీ పూర్తయిన మండలం లింగాలఘణపురం (65.10శాతం) ఉండగా, ఇది జిల్లా సగటు కంటే 6.7 శాతం పాయింట్లు తక్కువగా ఉంది. సమస్య ఉన్నా..శ్రమిస్తున్న అధికారులు నమోదులో అత్యధికం చిల్పూరు..అత్యల్పం లింగాలఘణపురం జిల్లాలో 71.86 శాతం రిజిస్ట్రీ పూర్తిజిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ సమాచారం మండలం రైతులు పూర్తయినవి శాతం బచ్చన్నపేట 19,589 14,153 72.25 చిల్పూరు 14,213 10,750 75.63 దేవరుప్పుల 18,453 13,811 74.83 స్టే.ఘన్పూర్ 15,655 11,679 74.60 జనగామ 17,949 12,406 69.12 కొడకండ్ల 10,902 7,962 73.03 లిం.ఘణపురం 18,035 11,741 65.10 నర్మెట 11,473 8,488 73.98 పాలకుర్తి 24,402 17,884 73.29 రఘునాథపల్లి 22,729 16,093 70.80 తరిగొప్పుల 8,984 6,427 71.54 జఫర్గఢ్ 16,664 11,643 69.87 మొత్తం 1,99,051 1,43,037 71.86 -
టైలరింగ్ కోర్సులో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేస్తారుసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు టైలరింగ్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు మెథడ్ ఆఫ్ కట్టింగ్, మెథడ్ ఆఫ్ స్ట్రిచ్చింగ్, జుబ్బా, పెట్టికోట్, సారీ పెట్టికోట్, ప్లాజా, ఫ్రాక్, అంబ్రెల్లా ఫ్రాక్, వీ షేప్ ఫ్రాక్, స్లీవ్లేస్ ఫ్రాక్, అంబ్రెల్లా టాప్, క్రాస్ కట్ బ్లౌజ్, ఫిష్ అంబ్రెల్లా టాప్, కట్స్ టాప్, సాదా బ్లౌజ్, ప్రిన్స్కట్ బ్లౌజ్, కటోరి బ్లౌజ్, నార్మల్ బాటమ్, ఫ్రంట్ కుచ్చుల బాటమ్, సైడ్ కుచ్చుల బాటమ్.రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.2,500/-వర్క్షాపు షెడ్యూల్ తేదీలు: 22–05–2026 నుంచి 21–06–2026 వరకు శిక్షణ సమయం : ఉదయం 10 గం.నుంచి మధ్యాహ్నం 01 గం. వరకు రిజిస్ట్రేషన్, శిక్షణ స్థలం వివరాలు : రేష్మా బోటిక్, ఇంటినంబర్: 10 –10– 34, మైసమ్మ వీధి, గిర్మాజీపేట, వరంగల్. ఫోన్ నంబర్ : 95330 12727, 95055 14424 -
కోతుల కొట్లాట!
రహదారిపై అడ్డంగా ఉన్న వానరాల గుంపు జనగామ: అడవుల్లో ఆహారం, నీటి కొరతతో కోతులు గ్రామాల్లోనే తిష్టవేస్తున్నాయి. పాత, కొత్త గ్యాంగులుగా విడిపోయిన వానరాలు పంచాయతీలు పెట్టుకోవడం పరిపాటిగా మారిపోయింది. తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలన్న ఉద్దేశంతో కోతుల గుంపులు ఒకదానిపై ఒకటి దాడులు చేసుకోవడం.. రక్తికట్టే విధంగా పొట్లాడుకునే ఘటనలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పాత, కొత్త గ్యాంగుల హల్చల్ గత ఐదేళ్లుగా జనావాసాల్లో తిష్టవేసిన పాత కోతుల గుంపులు ‘ఇది మా ప్రాంతం.. ఇది మా ఆహారంం’ అన్నట్టు వ్యవహరిస్తూ ఊర్లలో తిరుగుతున్నాయి. ఇదే సమయంలో అటవీ ప్రాంతాల్లో ఆహారం దొరక్క బాధపడుతున్న కొత్త కోతులు గ్రామాలకు చేరి పాత అడ్డాల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేయడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. పాత గుంపులు కొత్తగా వచ్చిన కోతులను చూసిన వెంటనే ‘ఎవర్రా మా సరిహద్దు దాటేది?’ అన్నట్టు గర్జిస్తూ దాడులు చేస్తున్నాయి. రెండు గుంపుల మధ్య జరిగే పోరాటాలు గ్రామాల్లో నిత్యకృత్యంగా మారాయి. ఇవి ఏకంగా గ్యాంగ్ వార్స్ లా మారిపోవడంతో పల్లెల్లోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఇంటి బయట అల్పాహారం తింటున్నా, చేతిలో కవర్ పట్టుకుని నడుస్తున్నా కోతుల దాడి తప్పదన్న భయం ప్రజలను వెంటాడుతోంది. పాత, కొత్త కోతుల మధ్య గొడవల సమయంలో సమీపంలో ఎవరినైనా ఉన్నా.. వాటిని అదిలించే ప్రయత్నం చేసినా వాటి దాడిలో బలికావాల్సిందే.. అలా కోతుల దాడితో ఇప్పటికే పలువురు ఆస్పత్రిపాలయ్యారంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం ప్రజలకే కాకుండా.. వ్యవసాయ రంగానికీ ఈ కోతుల గ్యాంగ్ వార్స్ నష్టం కలిగిస్తున్నాయి. ముష్టి యుద్ధాల తర్వాత ఆకలితో అల్లాడే ఈ కోతులు పంటలపై దాడులు చేసి మొక్కజొన్న, పల్లీలు, సజ్జలు, జొన్నలు, కూరగాయలు, పండ్ల తోటలను నాశనం చేస్తున్నాయి. కోతుల అడ్డా సమీపంలో ఉన్న పొలాల్లో రైతులు పంటలు వేయాలనే ధైర్యం కూడా చేయలేని పరిస్థితి. ఈ కోతుల పంచాయతీలు బచ్చన్నపేట, స్టేషన్ఘన్పూర్, కొడకండ్ల, రఘునాథపల్లి, నర్మెట, లింగాలగణపురం, జనగామ అర్బన్, జఫర్గఢ్, చిల్పూరు, తదితర మండలాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతీ ప్రాంతంలో తమదైన అడ్డా నిర్మించుకున్న కోతులు ఒక గుంపుపై మరో గుంపు దాడులు చేస్తూ నిత్యం జనాన్ని భయకంపితులను చేస్తున్నాయి. తలనొప్పిగా మారిన కొత్తకోతుల రాక పాత కోతుల వేధింపులతోనే అలసిపోయిన ప్రజలకు ఇప్పుడు కొత్త కోతుల రాక మరో తలనొప్పిగా మారింది. పాత, కొత్త కోతుల యుద్ధం ఎటు దారితీస్తుందోననే భయాందోళన ప్రజల్లో పెరుగుతోంది. ఇప్పుడైనా స్థానిక సంస్థలు, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సర్పంచులు, పురపాలక మండళ్ల ప్రతినిధులు ప్రత్యేక చర్యలు తీసుకుని కోతుల నిర్మూలనపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కోతుల మధ్య కొత్త, పాత లొల్లి గుంపులుగా దాడులు చేసుకుంటున్న కోతులు ఇళ్లు, పంట పొలాలు, రహదార్లు.. ఎక్కడ చూసినా అవే.. బెంబేలెత్తుతున్న ప్రజలు గ్రామాలు, పట్టణాల్లో పెరిగిన వానరాల గుంపులు -
విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవాలి
● జీసీడీఓ గౌసియా బేగం బచ్చన్నపేట: విద్యార్థులు చదువుపై మక్కువ చూపుతూ భవిష్యత్ లక్ష్యాలను ఎంచుకోవాలని జీసీడీఓ గౌసియాబేగం అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో ఇంటర్మీడియట్లో జిల్లా టాపర్స్ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా టాపర్స్ పావని, అభిని సన్మానించి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున నగదు బహుమతిని అందించామన్నారు. ఈ 2026–27 సంవత్సరానికి కళాశాల, పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు తెలిపారు. దీంతోపాటు వివిధ తరగతుల్లో టాప్ విద్యార్థులను సైతం సత్కరించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఇర్రి వెంకట్రెడ్డి, కళాశాల స్పెషలాఫీసర్ నారమల్ల గీత పాల్గొన్నారు. -
నిర్లక్ష్య సీసీలపై కలెక్టర్ కొరడా..
కొడకండ్ల: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అలసత్వం వహించిన కొడకండ్ల మండలంలోని ఇద్దరు సీసీలపై కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కొడకండ్ల మండలంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన చేసి గిర్నితండా, మొండ్రాయి, రామన్నగూడెం, ఏ డునూతుల, పాకాల, రామవరం, చెరువుముందు తండాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏడునూతుల కొనుగోలు కేంద్రంలో ఐదు లారీల ధాన్యం బస్తాల వివరాలు ట్రక్ షీట్లో నమోదు కాకపోవడం.. సంబంధిత సీసీ వెంకటయ్య పట్టించుకోకపోవడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సీసీని సస్పెండ్ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే గిర్నితండా కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగో ళ్లలో నిర్లక్ష్యం వహించిన సీసీ తిరుమలపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి చార్జ్ మోమో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని ఊపేక్షించబోమని, రైతులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట ఏపీడీ నూరోద్దీన్ తదితరులు ఉన్నారు. కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం పాలకుర్తి టౌన్(దేవరుప్పుల): ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో జాప్యం చేస్తూ, ట్రక్ షిట్ నమోదు వివరాలు సక్రమంగా నిర్వహించకపోవడంతో ఐఏపీ సీసీలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాలకుర్తి మండలం తీగారం, చెన్నూరు, వల్మిడి, ముత్తారం, దేవరుప్పల మండలం కామారెడ్డిగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేవగంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. ఎఫ్ఐక్యూ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ఓపీఎంఎస్ నమోదును వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. లారీలతోపాటు ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించిన సీసీలపై చార్జ్ మెమోలు, సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ ఏపీడీ నూరోద్దిన్, ఎంపీఎం కారుపోతుల వెంకటేశ్వర్లుగౌడ్, సర్పంచ్లు కారుపోతుల శ్రీనివాస్గౌడ్, బేతి కుమారస్వామి, నీరటి లక్ష్మి, చింతకింది అనిత, మండల సమాఖ్య అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ఒకరి సస్పెన్షన్.. మరొకరికి షోకాజ్కు ఆదేశం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ -
ధాన్యం త్వరగా తరలించాలి
బచ్చన్నపేట: మండలంలోని అన్ని గ్రామాల కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ అన్నారు. ఆదివారం మండలంలోని కొడవటూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి ట్రాక్టర్లు, డీసీఎంలు పలు వాహనాలను వినియోగించుకోవాలని తెలిపారు. మిల్లుల్లో ఏమైనా సమస్యలు తలెత్తితే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున వర్షాలు రాకముందే ధాన్యం తరలింపు చర్యలు ముమ్మరం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నీల కవితమురళి, ఐకేపీ ఏపీఎం మాదారపు రవి, సీసీలు నర్సింహులు, రఘు, సీఏ గంగం వాణి, నిర్వాహకులు, రైతులు, పలువురు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ -
యువజన క్రీడోత్సవాలకు సిద్ధం
జనగామ: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నేటి(సోమవారం) నుంచి ఈ నెల 23వ తేదీ వరకు జిల్లా, మండల స్థాయిల్లో యువజన క్రీడోత్సవాల కోసం జనగామ సిద్ధమైంది. ఈ మేరకు కలెక్టర్ సందీప్ కుమా ర్ ఝా షెడ్యూల్ విడుదల చేశారు. నేడు(సోమవారం) ఉదయం 6 గంటలకు జిల్లాస్థాయిలో మారథాన్ (వాక్/రన్), శారీరక దృఢత్వం కార్యక్రమాలు కలెక్టరేట్ నుంచి ఆర్టీసీ చౌరస్తా మీదుగా మినీ స్టేడి యం వరకు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 గంటలకు మినీ స్టేడియంలో యోగా. మండల కేంద్రాల్లో ఎంపీడీఓల ఆధ్వర్యంలో కార్యక్రమాలు. 19వ తేదీన మినీ స్టేడియంలో కెరీర్, నైపుణ్యత దినోత్సవం నిర్వహిస్తారు. యువతలో అభిరుచులు, అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. 20వ తేదీన యువ నాయకత్వ సదస్సు, పెయింటింగ్ పో టీలు జనగామ మినీ స్టేడియంలో జరుగుతాయి. నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత వికసించేలా ఈ సదస్సు, పోటీలను ఏర్పాటు చేశారు. 21వ తేదీ న ఉదయం 7 గంటలకు మినీ స్టేడియంలో క్రీడా దినోత్సవం నిర్వహించనున్నారు. వివిధ విభాగాల్లో క్రీడ పోటీలు, ప్రదర్శనలు ఉండనున్నాయి. 22వ తేదీన మినీ స్టేడియంలో జిల్లా స్థాయిలో యువతలో సామాజిక బాధ్యతా భావాన్ని పెంపొందించే సే వా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే మండల స్థాయిలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. 23వ తేదీన ఉదయం 11 గంటలకు మినీ స్టేడియంలో ఉద్యోగ సాధన కార్యక్రమం జరుగనుంది. ఇటీవల మే 8న వరంగల్ జిల్లాలో నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన జిల్లా యువతకు నియామక పత్రాలు అందజేస్తారు. అలాగే సీఎం కప్– 2025 రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో విజేతలైన వారికి మెడల్స్, సర్టిఫికెట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రదానం చేస్తారు. నేటి నుంచి 23 వరకు నిర్వహణ -
కొనుగోలు కేంద్రంలో రైతు ఆత్మహత్యాయత్నం
లింగాలఘణపురం: మండలంలోని మాణిక్యాపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ రైతు ఏనెబావికి చెందిన పొన్నం తిరుమలేశ్ ఆదివారం ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తోటి రైతులు అడ్డుకున్నారు. ఘటనకు సంబంధించి స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలేశ్ నెల రోజుల క్రితం తాను సాగు చేసిన ఎనిమిది ఎకరాల దిగుబడి ధాన్యాన్ని మాణిక్యాపురం ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. నెల రోజులుగా ధాన్యం తూకం వేయడంలో జాప్యం చేస్తున్నారు. కేంద్రంలో తూకం వేసిన ధాన్యాన్ని లారీల్లో సకాలంలో తరలించకపోవడంతో రైతులే స్వంతంగా ట్రాక్టర్లలో మిల్లులకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలేశ్కు ట్రాక్టర్ లేకపోవడంతో నిర్వాహుకులు మరో రైతు ధాన్యాన్ని తూకం వేస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన రైతు తిరుమలేశ్ ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. గమనించిన రైతులు అడ్డుకుని సముదాయించారు. దీంతో ఐకేపీ కేంద్ర నిర్వాహుకులు వెంటనే స్పందించి ఆయన ధాన్యాన్ని తూకం వేశారు. 92 క్వింటాళ్లు వెంటనే తూకం వేసి తగిన రశీదులను అందజేశారు. -
భార్య సర్పంచ్.. భర్తతో ప్రారంభోత్సవం
చిల్పూరు: గ్రామంలో ప్రజా అవసరాల కోసం చేపట్టిన అభివృద్ధి పనులను సర్పంచ్ ప్రారంభించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా సర్పంచ్ భర్త ఆ కార్యక్రమాన్ని చేపట్టడం గమనార్హం. మండలంలోని లింగంపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో బోరు మోటార్ను సర్పంచ్ భూక్య సునిత ప్రారంభించాల్సి ఉండగా ఆదివారం ఆమె భర్త లాలు ప్రారంభించారు. ప్రోటోకాల్ ప్రకారం అడ్డుకోవాల్సిన పంచాయతీ కార్యదర్శి మహేందర్ సైతం స్వయంగా సర్పంచ్ భర్తతో కొబ్బరికాయ కొట్టించి ప్రారంభింపజేయడంపై విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లింగంపల్లి సమ్మక్క సారలమ్మ జాతర మాజీ చైర్మన్ మోతె శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామంలో సర్పంచ్కు బదులు భర్త, కార్యదర్శి కలిసి పెత్తనం చెలాయిస్తున్నారని, ఈవిషయంపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2కే రన్లో అధిక సంఖ్యలో పాల్గొనాలి జనగామ: ప్రజా పాలన –ప్రగతి ప్రణాళికలో భాగంగా స్పోర్ట్స్ అండ్ యూత్ వీక్ నేపథ్యంలో నేడు(సోమవారం)లో ఉదయం 6.30 గంటలకు కలెక్టరేట్ నుంచి మినీ స్టేడియం వరకు జరిగే 2కే రన్ ఉంటుందని జిల్లా యువజన, క్రీడల అధికారి ఎన్.లక్ష్మీనరసింహరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 7 గంటలకు మినీ స్టేడియంలో యోగా నిర్వహించనున్నట్లు తెలిపారు. యువత, క్రీడాకారులు, విద్యార్థులు, వాకర్స్ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. గోదావరిలో ప్రముఖులకు దారి కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వీవీఐపీల కోసం సరస్వతీఘాటు తీరం నుంచి త్రివేణి సంగమంలోని నీటి వరకు వెళ్లడానికి బారికేడ్లు ఏర్పాటు చేసి మధ్యలో మట్టిరోడ్డు వేశారు. దానిపైన మ్యాట్లు రానున్నాయి. అక్కడే కంటెయినర్లు ఏర్పాటు చేస్తున్నారు. బయోటయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. జల్లు స్నానాలకు ఏర్పాటు చేస్తున్నారు. కుడి, ఎడమ వైపున సాధారణ భక్తులు స్నానాలకు వెళ్లేందుకు షమియానాలు, మ్యాట్లు వేయనున్నారు. తీరం నుంచి రెండు ద్వారాల ద్వారా భక్తులు తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేపట్టారు. సరస్వతీనది అంత్యపుష్కరాలకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారనే అధికారుల అంచనాతో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు వివిధ మార్గాల వద్ద 15 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. 21 నుంచి వన్వే అమలులోకి రావడంతో చెక్పోస్టుల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు హోమాలు నిర్వహించడానికి దేవాదాయశాఖ శివ కల్యాణ మండపంలో ఏర్పాట్లు చేస్తుంది. హోమాల కోసం భారీ మంచుకొండల మాదిరిగా డెకరేషన్ సెట్టింగులు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా అచలాపురానికి చెందిన వేదపండితులు హోమాది పూజలు నిర్వహించనున్నారు. -
శిథిలావస్థలో జనగామ మున్సిపల్ పాత భవనం
జనగామ: పట్టణంలో ఏన్నో దశాబ్దాల చరిత్రను మోసుకొస్తున్న పాత పురపాలక భవనం రోజు రోజుకూ శిథిలావస్థకు చేరుకుంటోంది. పురపాలక క్యాంపస్లో కొత్త భవనని ర్మాణం పూర్తయ్యాక మొదటగా కలెక్టరేట్కు కేటాయించారు. అనంతరం సూర్యాపేట రోడ్డులో సమీకృత నూతన కలెక్టరేట్ నిర్మాణం పూర్తవడంతో అక్కడికి కార్యాలయాలు మారాయి. తర్వాత పురపాలిక కూడా పాత భవనం నుంచి కొత్త కార్యాలయానికి మారిపోవడంతో ఈ భవనం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. తగిన సంరక్షణ లేకపోవడంతో గోడలు, పైకప్పులు దెబ్బ తింటూ కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితికి చేరుకుంటుంది. చిన్నపాటి మరమ్మతులు చేసి ప్రభుత్వ శాఖలు లేదా ఇతర అవసరాల కోసం ఉపయోగంలోకి తెస్తే ప్రభుత్వానికి అదనపు ఆదాయం వచ్చే అవకాశముందని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కానీ, భవన పరిరక్షణ బాధ్యత తీసుకునే అధికారులు లేకపోవడంతో భవనం మరింత దెబ్బతింటోంది. ప్రస్తుతం ఈ స్థితిలో వదిలేస్తే భవిష్యత్లో పూర్తిగా పనికిరాని స్థితికి చేరుతుందనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతుంది. వెంటనే అధికారులు స్పందించి పాత పురపాలక భవనానికి అవసరమైన మరమ్మతులు చేసి, కొత్త హంగులతో వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రజల విన్నపం -
కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలి
జనగామ రూరల్: మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని హమాలీలు, లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. గన్నీ బ్యాగుల నిల్వలు, హమాలీల అందుబాటు, గోదాముల సామర్థ్యం, రవాణా, తదితర వివరాల గురించి అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ..రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. రవాణా, గోదాముల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ భాస్కర్, మార్క్ఫెడ్ డీఎం చంద్రశేఖర్, డీసీఓ కోదండరాములు, డీఎంఓ రామకృష్ణ, అదనపు డీఆర్డీవో నూరుద్దీన్, సివిల్ సప్లై డీఎం హతిరామ్, డీసీఎస్ఓ సురేష్ రెడ్డి, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ తదితరులు పాల్గొన్నారు. హమాలీలు, లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
హిందూ ధర్మపరిరక్షణే సమాజ బలం
జనగామ: హిందూ ధర్మపరిరక్షణే సమాజ బలం అని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డు సాయిరాం కన్వెన్షన్ హాల్లో శనివారం రాత్రి హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హిందూ ధర్మ సమ్మేళనం వైభవంగా జరిగింది. ఈ మహాసభకు సిద్ధాశ్రమ చేజర్ల మఠ పీఠాధిపతి, రాష్ట్ర సాధు పరివార అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామీజీ మహారాజ్, అఖిల భారత సమరసత కళావిభాగం కన్వీనర్ అప్పల ప్రసాద్ జీ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామీజీ మహారాజ్ మాట్లాడుతూ.. హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి భక్తుడి కర్తవ్యమని, ధర్మాన్ని నిలబెట్టే మార్గంలో సమాజం ఐక్యత చూపాలన్నారు. అప్పల ప్రసాద్ జీ మాట్లాడుతూ.. సమరసత, సామరస్యంతోనే హిందూ సమాజం మరింత బలపడుతుందన్నారు. కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక కన్వీనర్ సోలంకి రవళి పాటిల్, ఆర్ఎస్ఎస్ జిల్లా సహ కార్యవాహ్ దొంతుల శేఖర్, గౌరవ అధ్యక్షుడు ఫకీర్ యాదగిరిరెడ్డి, ప్రధాన కార్యదర్శి బెలిదె శ్రీధర్ పాల్గొన్నారు. హిందూ ధర్మ సమ్మేళనంలో వక్తలు -
చివరి ఆయకట్టుకు గోదావరి జలాలు అందించాలి
జనగామ: నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు గోదావరి జలాలు అందించే విధంగా ముందుకెళ్లాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు. సచివాలయంలో శనివారం నిర్వహించిన దేవాదుల ప్రాజెక్టు పురోగతి సమీక్షా సమావేశంలో దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతి, పెండింగ్ అంశాలు, రైతులకు నీటి సరఫరా పరిస్థితులపై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డికి సమగ్ర సమాచారంతో వినతి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో సాగునీటి అవసరాలు, భూసేకరణ సమస్యలు, కాలువల నిర్మాణంలో జాప్యం, చివరి ఆయకట్టుకు సాగునీటి సరఫరా అందించడంలో తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. దేవాదుల ప్రాజెక్టు ఫేజ్–3 పరిధిలోని ప్యాకేజీ–8 కింద ఉన్న తపాస్పల్లి, కన్నెబోయినగూడెం రిజర్వాయర్ల పరిధిలో కాలువల నిర్మాణ పనులు చాలా కాలంగా నిలిచిపోయాయని ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. పనులను తక్షణమే పునఃప్రారంభించి నిర్దిష్ట గడువులో పూర్తి చేయా లని అధికారులను కోరారు. బొమ్మకూరు కుడి కాలువ ద్వారా సాగునీరు సక్రమంగా అందడం లేదని, కాలువలో సాంకేతిక లోపాలు, నిర్వహణ సమస్యల కారణంగా రైతులకు నష్టం జరుగుతోందని తెలిపారు. ఈ విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు.జనగామ రూరల్: శాంతియుత వాతావరణంలో బక్రీద్ పండుగను నిర్వహించుకోవాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. శనివారం ముస్లిం నాయకుల సభ్యులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగను శాంతియుతంగా జరుపుకొని సామరస్యాన్ని కాపాడుకోవాలన్నారు. జంతువుల బలి కార్యక్రమాలు సంబంధిత చట్టాలు, నిబంధనల ప్రకారం మాత్రమే నిర్వహించాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు. జంతువుల అక్రమ రవాణా అనుమతించబోమని తెలిపారు. రఘునాథపల్లి: డెంగీపై అప్రమత్తత అవసరమని, ప్రజలు తప్పనిసరి ఇంటి పరిసరాల శుభ్రత పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్రావు సూచించారు. జాతీ య డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని పీహెచ్సీ ఆధ్వర్యంలో డెంగీపై ఏర్పాటు అవగాహన ర్యాలీని డీఎంహెచ్ఓ జెండా ఊపి ప్రారంభించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎల్.అశోక్కుమార్, ప్రొగ్రాం ఆఫీసర్ కమల్హాసన్, స్థానిక వైద్యాధికారి స్రవంతి, సూపర్వైజర్లు, అశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.ప్రజాసమస్యల పరిష్కారానికి హెల్ప్లైన్ ఏర్పాటుజనగామ రూరల్: జిల్లా ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కలెక్టర్ కార్యాలయంలో 24/7టోల్ ఫ్రీ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సహాయ కేంద్రం ద్వారా వరి సేకరణ, తాగునీటి సరఫరా, గ్యాస్ సరఫరా, ఇంధన సరఫరా.. తదితర అంశాలకు సంబంధించిన ఫి ర్యాదులు స్వీకరించి, వెంటనే పరిష్కార చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని జీపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ సిబ్బంది ప్రతీ గ్రామంలో ప్రజలకు ఈ సమాచారం చేరేలా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1800–425–6605 కాల్ చేయాలని సూచించారు. 54 మంది గైర్హాజరుజనగామ రూరల్: ఇంటర్మీడియట్ అడ్వాన్న్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు శనివారం 54 మంది గైర్హాజరైనట్లు ఇంటర్ విద్యాధికారి జితేందర్రెడ్డి తెలిపారు. ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 1,154 గాను 1,134 హాజరు కాగా, 20 గైర్హాజరయ్యారు. ఒకేషనల్లో 183మందికి గాను 162 విద్యార్థులు హాజరు కాగా 21 గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన సెకండియర్ పరీక్షలకు జనరల్లో 330మందికి గాను 326 హాజరు కాగా నలుగురు గైర్హాజరయ్యారు. ఒకేషనల్ 132మందికి 123మంది హాజరయ్యారు. -
ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో
జనగామ రూరల్: నెల రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో నరకయాతన పడుతున్నామని మండలంలోని వడ్లకొండ గ్రామరైతులు జనగామ–హుస్నాబాద్ రోడ్డు వడ్లకొండ వద్ద రోడ్డుపై శనివారం రాస్తారోకో నిర్వహించారు. మొ లకెత్తిన ధాన్యాన్ని చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశా రు. సీఐ కాళ్లు పట్టుకుని బతిమిలాడారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి చీటకోడూర్ రోడ్డులో గల వీరభద్ర రైస్ మిల్లును కేటాయించారన్నారు. అక్కడ లారీలు అన్లోడ్ కావడం లేదని రోజుల తరబడి నిరీక్షిస్తున్నామన్నారు. 160 కుప్పల వరకు(సుమారు 40 లారీల)ధాన్యం ఉండగా వర్షాకాలం సమీపిస్తుండడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోయారు. వీరభద్ర మిల్లు వద్దు అని నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.ఽ అక్కడకు చేరుకున్న సీఐ సత్యనారాయణరెడ్డి.. అడిషినల్ డీఆర్డీఓ నూరొద్దీన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ కొనుగోలు కేంద్రం ధాన్యం వీరభద్ర మిల్లు నుంచి వేరే మిల్లుకు మార్చేలా చూస్తామని, త్వరగా కొనుగోలు చేసి ధాన్యం తరలిస్తామని హామీ రావడంతో రైతులు రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో మహిళా రైతులు దండెబోయిన పద్మ, చాలగొండ వెంకన్న, చెరుకు రాంరెడ్డి, 50 మంది రైతులు పాల్గొన్నారు. వడ్లు మొలకలు వస్తున్నాయని ఆవేదన సీఐ కాళ్లు పట్టుకొని బతిమిలాడిన రైతు -
రవాణా కష్టాలు
తాలు తంటాలు.. పాడైపోయిన ప్యాడీ క్లీనర్ఎర్రగొల్లపహడ్లో కుప్పలుగా ఉన్న ధాన్యం రాశులుజనగామ రూరల్: జిల్లాలో ధాన్యం దిగుమతుల వ్యవహారం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒక వైపు పండించిన ధాన్యాన్ని కల్లాల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు నానా కష్టాలు పడుతుంటే.. మరోవైపు తాలు తొలగించేందుకు కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీక్లినర్స్ లేక రైతులు అవస్థలు పడుతున్నారు. దీంతో పంట పెట్టుబడితో పాటు విక్రయించేందుకు అదనపు భారం పడుతోంది. కాంటా కోసం హమాలీలకు క్వింటాల్కు రూ.40లు చెల్లిస్తుండగా అదనంగా ధాన్యం తాలు తొలగించడానికి ఒక్కొక్క రైతు సుమారుగా 2 వేల నుంచి 6 వేలు అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. అలాగే యాసంగి ధాన్యంలో తాలు ఎక్కువగా ఉందంటూ మిల్లర్లు కొర్రీలు పెడుతుండడంతో లారీలు రోజుల తరబడి మిల్లుల ముందే నిలిచిపోతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కల్లాల వద్ద తూకం వేసి పంపించినా, మిల్లర్లు దిగుమతి చేసుకునేందుకు నిరాకరిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్క కేంద్రంలో ఒక్కోరకంగా తూకం వేస్తున్నారు. ఎర్రగొల్లపహడ్ గ్రామంలో 41 కిలోల 500 గ్రాములు వేస్తుండగా వడ్లకొండలో 41 కిలోల 200 గ్రాములు వేస్తుండడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 231 సెంటర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను 50 రోజుల క్రితం ప్రారంభించారు. ప్రతీ సెంటర్కు ధాన్యంలో తాలు తొలగించేందుకు తూర్పార పట్టే యంత్రం అందజేశారు. అయితే జిల్లాలో 231 కేంద్రాలు ఉండగా 243 యంత్రాలు ఉన్నాయి. ఇందులో 123 పెద్దవి ఉండగా 121 పాత యంత్రాలు ఉన్నాయి. ఇందులో 224 పని చేస్తున్నాయి. మిగతా యంత్రాలు రిపేర్లో ఉన్నాయి. అయా కేంద్రాల్లో ధాన్యం తాలు తొలగించడానికి ప్రైవేట్ యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. గంటకు రూ.1000 నుంచి 1500 వెచ్చిస్తున్నారు. దీంతో వేల రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. సెంటర్కు రెండు చొప్పున యంత్రాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.. తూకం సమయంలోనే అధికారులు, సిబ్బంది బస్తాకు 2 కిలోలపైనే తరుగు పేరుతో అదనంగా తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే భారీగా తరుగు తీసిన తర్వాత కూడా మిల్లుల వద్ద మళ్లీ తాలు పేరుతో ధాన్యాన్ని తిరస్కరించడం లేదా అదనపు కోతలు పెట్టాలని చూడడంపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 కిలోలు తీసుకోవాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా 42 కిలోలు తీస్తున్నారని రైతులు వాపోతున్నారు. దానికి సిద్ధంగా లేని రైతుల ధాన్యం కొనుగోళ్లను ఆలస్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే లారీ డ్రైవర్లు సైతం రైతుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ఉండడంతో 17 శాతం రావల్సిన తేమ శాతం 10 నుంచి 5 శాతం వరకు వస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని నిర్వాహకులు కాంటా వేయడం లేదు. అక్కడి నుంచి లారీలు వస్తేనే కాంటా వేసిన ధాన్యం మిల్లులకు పంపే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీంతో కల్లాల వద్ద రైతులకు పడిగాపులు తప్పడం లేదు. జనగా మ మండలంలోని పలు గ్రామాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రగొల్లపహడ్లో నాలుగు రోజుల నుంచి లారీలు రాకపోవడంతో హమాలీలు కూడా ఖాళీగా ఉంటున్నామని తెలిపారు. ఒక్కొక్క రైతు రూ.2వేల నుంచి 5 వేల వరకు చెల్లింపులు కొనుగోలు కేంద్రాల్లో మందకొడిగా కాంటాలు రవాణా లేక రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న రైతులు కొనుగోళ్లలో ఆలస్యం.. అన్నదాతలకు అదనపు భారం -
పొదుపు.. భవిష్యత్ మదుపు!
ఖిలా వరంగల్: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశంలో విదేశీ మాదకద్రవ్య వినియోగం తగ్గించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దిగుమతి చేసుకున్న బంగారం, ఎరువులు, ఇంధనం, వంట నూనె, ఇతర సరుకుల వాడకం విషయంలో పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ వీటి వినియోగం ఎక్కువగా పెరిగింది. ఇదేపరిస్థితి కొనసాగితే భవిష్యత్లో ఇబ్బందులు తప్పేలా లేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని సూచనను మన ఇంటినుంచే ఆచరిద్దాం. దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనంతో పాటు దేశానికి మేలు జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో ప్రధాన ఖర్చులు.. ఆదాపై ఈ ఆదివారం ‘సాక్షి’ సండే స్పెషల్.. నూనె వాడకమూ ఎక్కువే.. ఇళ్లలో వంటలకు వాడే నూనెకు భారీగా వెచ్చిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంటిలో నెలకు నగటున ఐదు లీటర్లు వాడుతున్నారు. నెల రోజులకు ఇప్పటికీ చూస్తే ఒక్కో ప్యాకెట్కు రూ.25కు పైగా ధరలు పెరిగాయి. అతిగా వంట నూనె వాడితే శరీరానికి విటమిన్లు, మంచి కొవ్వు, కేలరీలు అందవు. హార్మోన్ల అసమతుల్యతతో ఎక్కువ మంది ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల బారినపడుతున్నా వినియోగం తగ్గించడం లేదు. ఉమ్మడి జిల్లాలో సుమారు 38.20 లక్షల కుటుంబాలు ఉండగా నెలకు 1.90 కోట్ల లీటర్ల నూనె వాడుతున్నట్లు అంచనా. ప్రధాని పిలుపు మేరకు అందులో 10 శాతం తగ్గించినా 19 లక్షల లీటర్లు ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. బంగారం చూసుకుని కొందాం.. వివాహాలు, ఇతర శుభకార్యాలకు స్వర్ణాభరణాలు కొనడం అలవాటుగా మారింది. ఈ విషయంలో నియంత్రణ పాటిస్తే కచ్చితంగా ప్రయోజనం కలుగుతుంది. ప్రధానంగా వరంగల్ నగరంలో 210కుపైగా షాపులు, మిగిలిన జిల్లాల్లో మరో 200 షాపులు ఉన్నాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా సగటున రోజుకు 6 కిలోల బంగారు నగల అమ్మకాలు సాగుతున్నట్లు వ్యాపారుల అంచనా. ఈ విషయంలో కొంత పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ధరలు పెరగడంతో 80 శాతం కొనుగోళ్లు తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇంధనం ఆదా చేద్దామా.. పశ్చిమాసియా పరిణామాలు ఇంధన వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు తమ కాన్వాయిలో వాహనాలను తగ్గించుకునేలా తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిగా నిలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 7,82,314 వాహనాలు ఉన్నాయి. దీంతో సగటున నెలకు 19 లక్షల లీటర్ల పెట్రోల్, 7 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. ఒక ద్విచక్రవాహనం ఇంధనం కోసం సగటున నెలకు రూ.మూడు వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఇది ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం.. నెలవారీ నిత్యావసర సరుకుల కొనుగోలుకు సమానంగా ఉంటుంది. ఖరీదైన వాహనాలను విని యోగిస్తే ఇంధన వ్యయం ఎక్కువ. బైక్లపై వెళ్లడం కంటే కాలినడకన, సైకిళ్ల మీద వెళ్తే కొంత ఇంధనాన్ని ఆదా చేసినట్లే. ఎరువుల మోతాదు మించొద్దు.. పంటలకు మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారు. అధికారుల సిఫార్సు మేరకు ఎకరాకు మూడు దశల్లో 75 కిలోల యూరియా వినియోగించాల్సి ఉండగా.. జిల్లాలో 225 కిలోల కంటే ఎక్కువ ఉపయోగిస్తున్నట్లు వ్యవసాయ అధికారులే చెబుతున్నారు. దీంతో నేలసారం తగ్గడమే కాకుండా చీడ పీడలు వ్యాపించి సాగు వ్యయం గణనీయంగా పెరుగుతుంది. ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు సాగువుతుండగా.. నిబంధనల ప్రకారం 41 వేల మెట్రిక్ టన్నుల యూరియా వేయాలి. ఈ ప్రకారం రసాయన ఎరువులు వేస్తే విదేశీమారక ద్రవ్యం వినియోగం తగ్గడంతో పాటు సాగుపరంగా ఎదురయ్యే ఇబ్బందులూ తీరుతాయి. ప్రధాని మోదీ సూచనను మన ఇంటి నుంచే ఆచరిద్దాం..విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడానికి పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. – ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపు వంట నూనెల వాడకం తగ్గిస్తే.. ఇంటి ఖర్చులో అధిక ఆదా అవసరమైతేనే బైక్, కారు.. కాలినడక ఆరోగ్యానికి మంచిది దిగుమతి వస్తువుల వినియోగాన్ని తగ్గిస్తే మేలు -
ఒక్క నిమిషం.. జీవితం భద్రం!
సిబ్బంది భద్రత మా తొలి ప్రాధాన్యం. పనిలోకి దిగేముందు ఒక్క నిమిషం సమయం కేటాయించి భద్రతా ప్రమాణాలను పరిశీలించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు. వన్ మినిట్ రూల్ను ప్రతీ ఉద్యోగి తప్పనిసరిగా పాటించాలి. ఈ చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదాలను నివారించగలదు. – సంపత్రెడ్డి, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్, జనగామజనగామ: జనగామ సర్కిల్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి భద్రతను అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుంటూ టీజీఎన్పీడీసీఎల్ ‘వన్ మిని ట్ రూల్’ పేరుతో ప్రత్యేక భద్రతా విధానాన్ని ప్రా రంభించింది. ఫీల్డ్లో విద్యుత్ పనులు ప్రారంభించే ముందు ప్రతి ఉద్యోగి కేవలం ఒక నిమిషం సమయం తీసుకొని భద్రతా ప్రమాణాలను స్వయంగా పరిశీలించుకోవడం ఈ విధానంలోని ముఖ్య అంశం. ప్రమాదాల నివారణకు కొత్తదారి విద్యుత్ ప్రమాదాలను తగ్గించి సిబ్బంది ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ఈ కొత్త ఆలోచనను ప్రవేశపెట్టగా, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశాలు ఉన్నందున, పని ముందు ఒక నిమిషం జాగ్రత్త తీసుకోవడం ప్రాణాలను కాపాడే కీలక అలవాటుగా అధికారులు చెబుతున్నారు. ‘వన్ మినిట్ రూల్’ లో భాగంగా ఉద్యోగులు పరిశీలించాల్సిన అంశాల్లో లైన్ క్లియర్ (ఎల్సీ) పొందడం, ఇండక్షన్ టెస్టర్తో పవర్ లేకపోవడం నిర్ధారించడం, పీపీఈ ధారణ, ఎర్తింగ్ అమలు, డబుల్ ఫీడింగ్ ప్రమాదాన్ని నివారించడం, పరికరాల స్థితి పరిశీలన వంటి అంశాలు ఉన్నాయి. సురక్షిత విద్యుత్ సరఫరా వ్యవస్థ కోసం జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉద్యోగులు ఈ నియమాన్ని కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ‘ఒక్క నిమిషం ఆలోచన, జీవితాంతం భద్రత’ అనే సందేశంతో టీజీఎన్పీడీసీఎల్ ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోంది. విద్యుత్ శాఖలో ‘వన్ మినిట్ రూల్’ అమలు ప్రమాదాల నివారణకు కొత్తదారి -
బంగారం కొనలేకపోతున్నాం..
ె పెరిగిన ధరల దృష్ట్యా సామాన్య, మధ్య తరగతి మహిళలం బంగారం కొనలేక పోతున్నాం. వివాహ సమయాల్లో పుట్టింటి కానుకగా అందించిన ఆభరణాలతో సరిపెట్టుకుంటున్నాం. ప్రధాని మోదీ హైదరాబాద్లో ప్రకటించిన విధంగా ఏడాది వరకు బంగారాన్ని కొనకుండా వేచిచూస్తాం. దీంతోనైనా దేశానికి మేలు కలగడంతోపాటు ధరలు దిగివస్తాయని ఆశిస్తున్నా. – గోనె లత, కరీమాబాద్ రోడ్డు వరంగల్ అవసరమైతేనే బైక్ తీస్తున్నా.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి. సామాన్యులపై భారం పడింది. ఏ చిన్న పనికి కూడా వాహనంపై వెెళ్లడమే ప్రజలకు అలవాటుగా మారింది. పెరిగిన ధరలను చూస్తే చిన్న పనులకు బైక్, కారు రోడ్డు ఎక్కించడం సామాన్యులకు భారమే. అత్యవసరం అనుకుంటేనే కారు, బైక్ తీయాలని సూచిస్తున్నా. ఇంటి నుంచి ఎక్కడికై నా సైకిల్ మీద లేదా నడిచి వెళ్తున్నా. దీంతో నాకు ఆరోగ్యంతోపాటు డబ్బులు ఆదా అవుతున్నాయి. – మచ్చిక రాజు, వరంగల్ సేంద్రియ పద్ధతి పాటిస్తున్నాం.. సేంద్రియ సాగు విధానాన్ని పాటిస్తున్నాం. తప్పని పరిస్థితుల్లో యూరియాను పంటలకు వాడుతున్నాం. నూతన పద్ధతులు ఎన్ని పాటించినా ఎకరాకు ఒక బస్తా యూరియా వేస్తే పచ్చదనంతోపాటు పంట ఎదుగుదల కనిపిస్తుంది. అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత లేకుండా చూడాలి. – పులి మంజుల, మహిళా రైతు, లింగగిరి -
ధాన్యం బస్తాలకు నిప్పుపెట్టి నిరసన
జనగామ రూరల్: ధాన్యం తరలింపు సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తూ మండలంలోని పెంబర్తి గ్రామ రైతులు శుక్రవారం వరంగల్– హైదరాబాద్ నేషనల్ హైవే 163పై శుక్రవారం ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో సుమారు 1,200 బస్తాలు కాంటావేసినవి ఉన్నాయని, చీటకోడూర్ రోడ్డులో గల వీరభద్ర రైస్ మిల్లుకు కేటాయించగా అక్కడ అన్లోడ్ ఆలస్యం అవుతోందని వాపోయారు. కొనుగోలు కేంద్రాలకు లారీలు రాక ధాన్యం లిఫ్టింగ్ చేయడం లేదని ఆవేదన చెందారు. రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను బుజ్జగించారు. ధాన్యం రవాణాకు లారీలను పంపిస్తామని కొనుగోలు చేసిన బస్తాలను మిల్లులకు తరలించడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రాస్తారోకోలో గ్రామ రైతులు నిడిగొండ ప్రశాంత్, గోయ భాస్కర్, ఆవుల అంజిరెడ్డి, బోయ సంపత్, బుడిగే వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కాంటా అయినా తరలించడం లేదని రాస్తారోకో -
టైలరింగ్ కోర్సులో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేస్తారుసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు టైలరింగ్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు మెథడ్ ఆఫ్ కట్టింగ్, మెథడ్ ఆఫ్ స్ట్రిచ్చింగ్, జుబ్బా, పెట్టికోట్, సారీ పెట్టికోట్, ప్లాజా, ఫ్రాక్, అంబ్రెల్లా ఫ్రాక్, వీ షేప్ ఫ్రాక్, స్లీవ్లేస్ ఫ్రాక్, అంబ్రెల్లా టాప్, క్రాస్ కట్ బ్లౌజ్, ఫిష్ అంబ్రెల్లా టాప్, కట్స్ టాప్, సాదా బ్లౌజ్, ప్రిన్స్కట్ బ్లౌజ్, కటోరి బ్లౌజ్, నార్మల్ బాటమ్, ఫ్రంట్ కుచ్చుల బాటమ్, సైడ్ కుచ్చుల బాటమ్.రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.2,500/-వర్క్షాపు షెడ్యూల్ తేదీలు: 22–05–2026 నుంచి 21–06–2026 వరకు శిక్షణ సమయం : ఉదయం 10 గం.నుంచి మధ్యాహ్నం 01 గం. వరకు రిజిస్ట్రేషన్, శిక్షణ స్థలం వివరాలు : రేష్మా బోటిక్, ఇంటినంబర్: 10 –10– 34, మైసమ్మ వీధి, గిర్మాజీపేట, వరంగల్. ఫోన్ నంబర్ : 95330 12727, 95055 14424 -
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వేగవంతం చేయండి
జనగామ: జనగామ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, నిర్మాణ ప్రగతిని వేగవంతం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి శుక్రవారం హైదరాబాద్లో వినతి చేశారు. ఎల్–2 అర్హత జాబితాలో ఉన్న అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను వెంటనే అప్పగించడంతో పాటు ఇంకా మిగిలిన ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 52,408 ప్రజలు ఉండగా, 1,371 మంది ఎల్–2 స్కీమ్కు అర్హులుగా గుర్తించారన్నారు. వీరిలో ఎమ్మెల్యే కోటాలో కేటాయించిన 200 ఇళ్లలో 188 ఇళ్లు ఇప్పటికే శాంక్షన్ చేసి, లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. మిగిలిన 12 మంది అర్హులకు కూడా సత్వరమే ఇళ్లు మంజూరు చేసి అప్పగించాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో బచ్చన్నపేట, జనగామ మండలం, నర్మెట, తరిగొప్పుల, జనగామ టౌన్ కలిపి 800 ఇళ్లు కేటాయించబడగా, ఇప్పటికే 577 ఇళ్లు మంజూరు చేశారన్నారు. నిర్మాణం పూర్తితో పాటు కొనసాగుతున్న గృహాలు 511 కాగా, వివిధ కారణాలతో 61 ఇళ్లు రద్దు అయినట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. ఇంకా 223 ఇళ్లను ఆమోదించి పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఎమ్మెల్యే పల్లా అభ్యర్థించారు. మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే పల్లా విజ్ఞప్తి -
పెట్రో ఘాతం!
జనగామ: జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అన్ని వర్గాల ప్రజలపై అదనపు భారం మోపుతోంది. రవాణా రంగం, ప్రైవేటు ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి వాహనదారులు ఇలా ప్రతీ ఒక్కరిపై అదనపు భారం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 94 పెట్రోల్ బంకులు ఉండగా, రోజువారీగా సుమారు లక్ష లీటర్ల పెట్రోల్, 2 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. కాగా, జిల్లాలో అన్ని రకాల వాహనాలు కలిపి 1.45లక్షల వరకు ఉన్నాయి. మోయలేని భారం ఇంధన ధరల్లో తాజాగా పెరిగిన పెంపు ప్రజలపై భారం తప్పడం లేదు. లీటరు పెట్రోల్ గతంలో రూ. 107.41ఉండగా ప్రస్తుతం రూ.3.39 పెరిగి రూ.110.80కు చేరింది. అదే విధంగా డీజిల్ ధర లీటరుకు రూ.95.64 నుంచి రూ.3.26 పెరిగి రూ.98.90 కు పెరిగింది. ఈ పెంపు కారణంగా రోజువారీగా పెట్రోల్పై రూ.3.40 లక్షలు, డీజిల్పై రూ.6.52 లక్షలు, మొత్తంగా రూ.9.91 లక్షల వరకు అదనపు భారం వినియోగదారులపై పడుతున్నట్లు అంచనా. 1.45లక్షల వాహనాలు జిల్లాలో గూడ్స్ వాహనాలు, బైక్లు, ఆటోలు, క్యాబ్లు ఇతర ప్రైవేటు వాహనాలు కలిపి 1.45 లక్షల వాహనాలు ఉన్నాయి. ఇందులో పెద్దఎత్తున ద్విచక్ర వాహనాలే ఎక్కువ. పెట్రోల్ ధరల పెంపు కారణంగా వారి రోజువారీ జీవన వ్యయం గణనీయంగా పెరిగింది. అదే విధంగా గూడ్స్ వాహనాలు, ట్రాన్స్పోర్ట్ వాహనాలపై డీజిల్ ధరల పెంపు నేరుగా ప్రభావం చూపుతోంది. సరుకు రవాణా ఖర్చు పెరగడంతో భవిష్యత్తులో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. ఇంధన ధరలు ఈ స్థాయిలో పెరుగుతూనే ఉంటే చిన్న వాహనదారులు, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, కార్యకలాపాలను కొనసాగించడం కష్టమవుతుందని చెప్పారు. ఇదే సమయంలో సాధారణ ప్రజలు కూడా పెరుగుతున్న ఖర్చులతో వారి జీవనాధారంపై ఒత్తిడి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇంధనం పాత కొత పెరిగిన ధర పెట్రోల్ 107.41 110.80 3.39 డీజిల్ 95.64 98.90 3.26 రవాణా, వాణిజ్య రంగాలపై తీవ్ర ప్రభావం నిత్యావసర సరుకుల పెరుగుదల.. సామాన్యుడికి ఇక్కట్లు జిల్లాలో రోజుకు రూ.10లక్షల అదనపు భారం రోజుకు 3 లక్షల లీటర్ల పెట్రోల్, డీజిల్ అమ్మకాలు -
ఓరుగల్లుకు స్వచ్ఛరక్ష
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పట్టణాల్లో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద చేపట్టనున్న మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టులో పరకాల, భూపాలపల్లి, జనగామ, వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీలకు ప్రాధాన్యం లభించింది. ఈ ఐదు పట్టణాల్లో మొత్తం ఆరు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీలు) ఏర్పాటు చేయనున్నారు. వీటి మొత్తం సామర్థ్యం 22.80 ఎంఎల్డీలుగా ఉంటుంది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివద్ధి శాఖ కార్యదర్శి డా.టీకే శ్రీదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్వచ్చ భారత్ మిషన్లో భాగంగా... స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బీఎం) 2.0 కింద రాష్ట్రవ్యాప్తంగా 101 పురపాలక సంఘాల్లో మురుగునీటి నిర్వహణ పనులకు రూ.3,705.75 కోట్ల సవరించిన పరిపాలనా అనుమతులు జారీ చేశారు. అందులో వరంగల్ విభాగానికి కూడా ప్రాధాన్యం లభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టణ పారి శుద్ధ్యానికి ఊరటనిచ్చే ఈ భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వరంగల్ విభాగంలో మొత్తం 6 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీలు) ఏర్పాటు చేయనున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్.. భూసేకరణకు ప్రత్యేక నిధులు.. పనులను వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవనుంది. ఎక్కువ కంపెనీలు టెండర్లలో పాల్గొనేలా చర్యలు తీసుకుంది. టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు 24 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) పద్ధతిలో అమలు చేయనున్నా రు. నిర్మాణ సమయంలో ప్రభుత్వం 50 శాతానికి పైగా వ్యయాన్ని చెల్లించగా, మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా చెల్లించనుంది. నిర్మాణంతోపాటు ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టు సంస్థలదే ఉంటుంది. భూసేకరణ కోసం ప్రత్యేక నిధులు కూడా కేటాయించారు. ఇదిలా ఉండగా పరకాల, భూపాలపల్లి, జనగామ, వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో ప్రస్తుతం మురుగునీరు నేరుగా కాలువలు, చెరువులు, వాగుల్లోకి చేరుతుండటంతో కాలుష్య సమస్య తీవ్రంగా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే పట్టణాల్లో చెరువులు, వాగులు, భూగర్భజలాల్లో కాలుష్యం గణనీయంగా తగ్గి పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడనున్నాయని అధికారులు చెబుతున్నారు. ‘గ్రేటర్’లో ఉన్నా లేనట్లే... తాజాగా ప్రతిపాదనలు... ఇక గ్రేటర్ వరంగల్ నగరంలో ఇప్పటికే స్మార్ట్సిటీ నిధులతో రెడ్డిపురం వద్ద 100 ఎంఎల్డీ, బంధంచెరువు వద్ద 15 ఎంఎల్డీ, ఉర్సుగుట్ట వద్ద 15 ఎంఎల్డీల సామర్థ్యంతో మూడు ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టారు. కొన్ని అందుబాటులోకి రాకపోగా, వచ్చినవి ట్రైసిటీలో పెరుగుతున్న జనాభా, నగర విస్తరణకు సరిపోవడం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 2057 విజన్కు అనుగుణంగా అదనపు ఎస్టీపీల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ప్రభుత్వం రూ.5,257 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) ప్రాజెక్టును ప్రకటించిన నేపథ్యంలో 100 శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేసినట్లు అధికారులు తెలిపారు. ఐదు మున్సిపాలిటీల్లో ఆరు ఎస్టీపీలు... తీరనున్న కాలుష్యం బాధలు పరకాల నుంచి నర్సంపేట వరకు గ్రీన్సిగ్నల్ 22.80 ఎంఎల్డీ సామర్థ్యం మూడు ప్యాకేజీలలో టెండర్లు.. పూర్తి చేసేందుకు గడువు 24 నెలలు రూ.3,705 కోట్ల ప్రాజెక్టులో వరంగల్కు ప్రాధాన్యం -
విద్యారంగాభివృద్ధికి రూ.219 కోట్లు
● ఎమ్మెల్యే కడియం శ్రీహరిలింగాలఘణపురం: రెండున్నర ఏళ్లలోనే నియోజకవర్గంలో విద్యారంగాభివృద్ధికి రూ.219 కోట్లు మంజూరు చేయించానని, కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ అసంపూర్తి హాస్టల్ భవన నిర్మాణానికి రూ.1.44 కోట్లు, కస్తూర్బా గాంధీ పాఠశాలలో అదనపు గదులు, టాయిలెట్ బ్లాక్స్ నిర్మాణానికి రూ.42లక్షలతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కస్తూర్బా, మోడల్ స్కూల్లో రెండు విడతలుగా రూ.8.20 కోట్లు, వేలేరు కస్తూర్బాకు రూ.3.25 కోట్లు, స్టేషన్ ఘన్పూర్లో డిగ్రీ కళాశాలకు రూ.16.10 కోట్లు, జఫర్గఢ్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు రూ.200 కోట్లు ఇలా విద్యారంగానికి నిధులు మంజూరు తీసుకొచ్చానని అన్నారు. ఇతర మౌలిక వసతులకు ఎస్డీఎఫ్, సీడీఎఫ్, ఎంపీ నిధులతో కృషి చేస్తున్నానని తెలిపారు. మోడల్ స్కూల్లో వంటగది, ఇతర మౌలిక వసతులకు ప్రతిపాదనలు పంపాలని డీఈని ఆదేశించారు. సర్పంచ్లు ఎడ్ల లావణ్యరాజు, శైలజ, రామకృష్ణ, సదానందం, సంపత్, బుచ్చయ్య, రాంరెడ్డి, విష్ణు మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్, ప్రిన్సిపాల్ సునిత, ఎంఈఓ విష్ణుమూర్తి, కస్తూర్బా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణ, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు ఉపేందర్, శ్రీశైలం, మార్కెట్ డైరెక్టర్లు మోహన్, శ్రీలతారెడ్డి, నాయకులు మల్లారెడ్డి, దిలీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేస్తాం నెల్లుట్ల ఐకేపీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రైతులు తమ ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలస్యం లేకుండా వేగవంతం చేస్తామని, లోడింగ్ అన్లోడింగ్లో సమస్యలు లేకుండా చూడాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝాకు ఫోన్ చేసి మాట్లాడారు. -
పోరాటాల కోసం కొత్త కమిటీ
జనగామ: కలెక్టర్ వైఖరిని నిరసిస్తూ తలపెట్టిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కలెక్టర్ బాధితుల రక్షణ కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసినట్లు బూడిద గోపి తెలిపారు. బుధవారం ఆయన కొత్త కమిటీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు.. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల సమ్మతితో హైకోర్టు న్యాయవాది సాధిక్ అలీని కమిటీ కన్వీనర్గా నియమించినట్లు పేర్కొన్నారు. కో–కన్వీనర్లుగా సాంబరాజు యాదగిరి, అనంతుల ఆంజనేయులు, కట్ల సదానందం, కన్నారపు పరుశరాములు, రాగల్ల శ్రీహరి, మంగళ ంపల్లి రాజు, పాలమాకుల జితేందర్, మల్లి గారి రాజు, రాపర్తి రాజు, చల్ల అశోక్వర్ధన్రెడ్డి, బొట్ల శేఖర్, బూడిది జ్యోతిని ఎన్నుకున్నట్లు స్పష్టం చేశారు. సభ్యులుగా గడ్డం వెంకన్న, ఆకుల లక్ష్మయ్య, గడ్డం మల్లయ్య, బానోతు ధర్మభిక్షం, ఎండీ అజహర్, కత్తుల రాజిరెడ్డి, తోట సత్యం, ఎండీ దస్తగిర్, ఉమాపతి, సుంచు విజేందర్, బూడిది గోపి, పల్లెర్ల లలిత తదితరులను ఎన్నుకున్నారు. -
అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండాలి
జనగామ: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేవరకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా వెంటనే అన్లోడింగ్, మిల్లులకు తరలింపు చర్యలు చేపట్టాలని సూచించారు. పౌరసరఫరాల సంస్థ డీఎం హతీరామ్, జిల్లా మార్కెటింగ్ అధికారి రామకృష్ణ, ఇన్చార్జ్ డీసీఎస్ఓ సురేష్రెడ్డి పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు నమోదు చేయాలి లింగాలఘణపురం: ధాన్యం కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు ఓపీఎంఎస్ (ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్ సిస్టమ్) నమోదు చేసి రైతుల అకౌంట్లలో డబ్బులు పడేవిధంగా చూడాలని కలె క్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. మండలంలోని కుందారంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలి.. స్టేషన్ఘన్పూర్/పాలకుర్తిటౌన్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లను సక్రమంగా, వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి, పాలకుర్తి మండలంలోని ఈరవెన్ను, అయ్యంగారిపల్లి, గూడూరు, దేవరుప్పల మండలం కోలుకొండ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు.మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు.. జిల్లాలోని మొక్కజొన్న కొనుగోళ్లలో ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దని, అవసరానికి అనుగుణంగా హమాలీల సంఖ్యను పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మొక్కజొన్న కొనుగోలు, ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై వేరు వేరుగా రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్తో కలిసి సమీక్ష నిర్వహించా రు. సమావేశంలో డీఆర్డీఓ భాస్కర్, మార్క్ఫెడ్ డీఎం చంద్రశేఖర్, ఆత్మ డీపీడీ విజయశ్రీ, డీసీఓ కోదండరాములు, డీఎంఓ రామకృష్ణ, అదనపు డీఆర్డీఓ నూరొద్దీన్, ఏఎంవీఐ శ్వేత, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు పడొద్దు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశం -
ముగిసిన హిందూ బాలసంస్కార శిక్షణ
జనగామ: జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో 12 రోజులుగా కొనసాగుతున్న జరిగిన హిందూ బాలసంస్కార శిక్షణ శిబిరం బుధవారం ముగిసింది. ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త మోహన కృష్ణ భార్గవ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో 115 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వహిందూ పరిషత్ విభాగ్ సంఘటన మంత్రి శివరాములు హాజరు కాగా మోహనకృష్ణ భార్గవ మాట్లాడుతూ.. పన్నెండు రోజుల శిక్షణకు అద్భుత స్పందన వచ్చిందన్నారు. శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంస పత్రాలు, హనుమాన్ చాలీసా పుసకాలు, మెటీరియల్, బాక్సులు అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన గౌరవాధ్యక్షుడు గజ్జెల నర్సిరెడ్డి, వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు ఎనగందుల భిక్షపతి, ప్రముఖ వైద్యులు గోపీచంద్, ఆర్టీఏ మెంబర్ అభిగౌడ్ పాల్గొన్నారు. డీఆర్డీఓగా భాస్కర్జనగామ: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ(డీఆర్డీఓ)గా రాపర్తి భాస్కర్ను నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి ఎంపీడీఓగా పనిచేస్తున్న భాస్కర్ డిప్యూటీ సీఈఓగా పదోన్నతి పొందగా, డీఆర్డీఓగా పోస్టింగ్ ఇచ్చారు. ఆయన జనగామ జిల్లా డీఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించారు. జనగామ జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా వి.వెంకయ్య పదోన్నతిపై ఇక్కడకు రాగా, బాధ్యతలను స్వీకరించారు. హైకోర్టు ఆదేశాల మేరకే తొలగింపుజనగామ: ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా కొనసాగిస్తున్న టీస్టాల్పై చేపట్టిన చర్యలను తెలంగాణ హైకోర్టు సమర్థించినట్లు డీపీఆర్వో పల్లవి వెల్లడించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. టీ స్టాల్కు సంబంధించిన తాత్కాలిక ఉత్తర్వులను కోర్టు రద్దు చేసి, వార్డు–17లోని వెజ్–నాన్ వెజ్ మార్కెట్ సమీపంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని తాత్కాలిక లైసెన్సుతో కేటాయించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. వాస్తుపేరుతో తొలగింపు ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేశారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే భూరికార్డుల కార్యాలయంలో ముగ్గురు ప్రైవేటు వ్యక్తులు అధికారుల అనుమతిలేకుండా ల్యాప్టా ప్, ప్రింటర్ ఉపయోగించి భూ రికార్డులు కలర్ ప్రింట్లు తీస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లగా, వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, పరిపాలనా చర్యలు ప్రారంభించగా, క్రిమినల్ చర్యలకు సంబంధించి పరిశీల న కొనసాగుతుందన్నారు. కాగా కలెక్టరేట్ ప్రాంగణంలో సుమారు 80 క్లెయిమ్ చేయని వాహనాలను గుర్తించగా, అగ్ని ప్రమాదం, భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని పోలీసు, ఆర్టీఏ శాఖల సహకారంతో వాటిని తొలగించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యంలో న్యాయబద్ధమై న విమర్శలను స్వాగతిస్తున్నామని, అయితే విమర్శలు వాస్తవాలపై ఆధారపడాలన్నారు. నమోదైన పాలనా చర్యలను నిరంకుశంగా అభివర్ణించడం వాస్తవాలకు విరుద్ధమని, హైకోర్టు ధ్రువీకరణ తమ పారదర్శక చర్యలకు నిదర్శనమని స్పష్టం చేశారు. -
‘పల్లా’కు పెరుగుతున్న ప్రాధాన్యం.. సీనియర్లు నియోజకవర్గాలకే..
బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వద్ద జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి ప్రాధాన్యం పెరిగింది. ఉమ్మడి వరంగల్ పార్టీ సమావేశాలు, సమీక్షలు, కేడర్ సమావేశాలు, వ్యూహాత్మక చర్చల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల హనుమకొండలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన రైతు సంగ్రామ సదస్సుకు పల్లా రాజేశ్వర్రెడ్డి అధ్యక్షత వహించారు. తాజాగా మంగళవారం కేసీఆర్ భేటీ అనంతరం నియమించిన సభ్యత్వ నమోదు ఇన్చార్జ్ల నియామకంలోనూ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్కు పాత ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలు ఇవ్వగా.. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇన్చార్జ్ గా ఉన్న జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యతలను పల్లా రాజేశ్వర్రెడ్డికి అప్పగించారు. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించిన పలువురు సీనియర్లను సభ్యత్వ నమోదు విషయంలో నియోజకవర్గాలకే పరిమితం చేయడం పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువుగా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లాపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రామస్థాయి నుంచి నగర, డివిజన్ల వరకు విస్తృతస్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టి మళ్లీ కేడర్ను కదిలించే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల కిందట ఎర్రవెల్లి ఫామ్హౌజ్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించిన పార్టీ అధినేత కేసీఆర్ సభ్యత్వ సేకరణకు ఇన్చార్జ్ లను నియమించారు. సభ్యత్వ సేకరణకు రంగంలోకి ఇన్చార్జ్లు.. పార్టీ శ్రేణులను మళ్లీ యాక్టివ్ చేయడం, కార్యకర్తల్లో నమ్మకం పెంచడం, స్థానిక నాయకత్వాన్ని సమీకరించడం లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్లో భారీ సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసి రాష్ట్రానికి రాజకీయ సంకేతం ఇవ్వాలనే ఆలోచనతో పార్టీ ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలకు ఇన్చార్జ్లను నియమించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు గతంలోనూ ఇన్చార్జ్గా ఉన్న ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలు అప్పగించారు. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇన్చార్జ్గా ఉన్న జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యతలు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించారు. ఎమ్మెల్సీలు తక్కళ్లపెల్లి రవిందర్రావును ఖమ్మం, కొత్తగూడెం, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డిని మేడ్చల్–మల్కాజిరి, యాదాద్రి, మెట్టు శ్రీనివాస్ను గద్వాల్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఇన్చార్జ్లుగా నియమించారు. గ్రామాల వారీగా లక్ష్యాలు.. సభ్యత్వ సేకరణకు ప్లాన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈసారి కేవలం పేరుకే కాకుండా డేటా ఆధారిత రాజకీయ వ్యూహంగా మలచాలని బీఆర్ఎస్ భావిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్లు, బూత్వారీ బలం, స్థానిక నాయకత్వ ప్రభావం ఆధారంగా గ్రామాల వారీగా సభ్యత్వ లక్ష్యాలను ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ప్రతీ మండలానికి ప్రత్యేక టార్గెట్లు ఇవ్వడంతోపాటు యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు, పాత కార్యకర్తలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు, మండల స్థాయి నాయకులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన రైతు సంగ్రామ సభకు వచ్చిన స్పందనతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో మళ్లీ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసి, భవిష్యత్ ఎన్నికలకు సిద్ధం కావాలనే లక్ష్యంతో పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్లో భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు జరిగితే రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి కొత్త ఊపు వస్తుందనే భావన బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సత్యవతిరాథోడ్పల్లా రాజేశ్వర్రెడ్డి -
సమాజం భాగస్వామ్యం కావాలి
● అప్పుడే ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయి.. ● నియోజకవర్గస్థాయి విద్యావారోత్సవాల్లో ఎంపీ కావ్య స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో సమాజం భాగస్వామ్యం కావాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యావారోత్సవాల్లో భాగంగా ఘన్పూర్ జెడ్పీహెచ్ఎస్లో నియోజకవర్గస్థాయి సర్పంచ్లు, కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు విద్యా అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ఘన్పూర్ ఎంఈఓ కొమురయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడారు.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం సమాజం చేతుల్లోనే ఉందని, ప్రజాప్రతినిధులు గుడిని ఎంత శ్రద్ధగా చూసుకుంటారో బడిని అలాగే చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, ఏఎంసీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, తహసీల్దార్ స్వప్న, ఘన్పూర్, చిల్పూరు, లింగాలఘనపురం, జఫర్గఢ్, రఘునాథపల్లి ఎంఈఓలు కొమురయ్య, గోవర్ధన్, విష్ణుమూర్తి, రఘునందన్రెడ్డి, నాయకులు శంకర్, రజాక్యాదవ్, క్రిష్ణమూర్తి, కిషన్రాజ్, కౌన్సిలర్లు, సర్పంచ్లు పాల్గొన్నారు. జనగామలో.. జనగామ రూరల్ : పాఠశాలల అభివృద్ధిలో సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలర్లు భాగస్వాములు కావాలని అప్పుడే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతాయని మండల విద్యాశాఖ అధికారి గురుజాల శంకర్రెడ్డి అన్నారు. జనగామ నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన విద్యావారోత్సవాల్లో భాగంగా షామీర్పేటలోని రమాదేవి ఫంక్షన్ హాలులో సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల విద్యాశాఖ అధికారులు వెంకట్రెడ్డి, ఐలయ్య, జానకి తదితరులు పాల్గొన్నారు. -
మెజార్టీ సభ్యుల ఆమోదంతోనే తీర్మానం
జనగామ: పురపాలికలో వాయిదా తర్వాత ఇటీవల జరిగిన సాధారణ సమావేశంలో మెజార్టీ సభ్యుల ఆమోదంతోనే ఎజెండా తీర్మానం పొందినట్లు కమిషనర్ మహేశ్వర్రెడ్డి తెలిపారు. ‘మేం రాకముందే ఎజెండా ఎలా ఆమోదించారు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఏప్రిల్ 30వ తేదీన జరిగిన సాధారణ సమావేశం వాయిదా పడగా, తిరిగి మే 6వ తేదీన నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మూడు వంతుల సభ్యులు హాజరవడంతో 54 ఎజెండా అంశాలను చైర్పర్సన్ ముందుంచగా, కాంగ్రెస్కు చెందిన 9 మంది, బీఆర్ఎస్ సభ్యులు ముగ్గురు హాజరయ్యారన్నారు. మూడొంతుల కోరం ఉండడంతో ఎజెండా చదివే సమయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఉడుగుల కిష్టయ్య అభ్యంతరం వ్యక్తం చేయగా, మెజార్టీ కౌన్సిలర్ల అంగీకారంతోనే ఆమోదించడం జరిగిందన్నారు. ఈలోగా ఆలస్యంగా వచ్చిన మరికొంతమంది బీఆర్ఎస్ సభ్యులు తమ రాకముందే ఎజెండా ఆమోదించడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించిన అంశాలను కావాలనే త్వరగా ఆమోదించారని వారు ఆరోపించగా, సమావేశం ఉంటుందని మూడు రోజుల ముందే నోటీసులు ఇచ్చినట్లు చైర్పర్సన్ స్పష్టం చేసినట్లు తెలిపారు. ఎజెండాలో ఎలాంటి దుర్వినియోగం లేదు: మున్సిపల్ కమిషనర్ -
ప్రశాంతంగా పాలిసెట్
జనగామ/స్టేషన్ఘన్పూర్: జిల్లాలో పాలిసెట్–2026 బుధవారం ప్రశాంతంగా ముగిసింది. పరీక్షల జిల్లా కో ఆర్డినేటర్, ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించిన ఈ పరీక్షకు జిల్లాలోని ఆరు కేంద్రాల్లో మొత్తం 1,615 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, వీరిలో 1,527 మంది హాజరయ్యారు. ఇందులో 790 మంది బాలురు, 737 మంది బాలికలు ఉన్నారు. బాలుర హాజరు శాతం 95 శాతం, బాలికల హాజరు శాతం 94శాతం కాగా, జిల్లా వ్యాప్తంగా ఓవరాల్గా హాజరు శాతం 95శాతంగా నమోదైనట్లు శ్రీనివాస్ వెల్లడించారు. ఒక నిమిషం ఆలస్యం క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాల సెంటర్కు ఓ విద్యార్థి కేవలం ఒక నిమిషం ఆలస్యంగా రాగా..అధికారులు లోనికి అనుమతించ లేదు. దీంతో ఆ విద్యార్థి తీవ్ర నిరాశకు గురయ్యాడు. కాగా, విద్యార్థులను వెంట తీసుకొచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరీక్షల సందర్భంగా సీఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు, పోలీసులు అన్ని కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. సెంటర్ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు 1,615 మంది విద్యార్థులకు 1,527 మంది హాజరు -
పేగుబంధం వదులుకుంది..! వైద్యబంధం అల్లుకుంది..!!
ఆడశిశువుకు ‘అమ్మ’ ప్రేమను పంచిన ఎంసీహెచ్తిక్కరపు పద్మ, నరేష్ దంపతులు జిల్లాలోని లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామంలో ఓ వ్యక్తి వద్ద ఇటుక తయారీ పనులు చేస్తున్నారు. నలుగురు పిల్లలు ఉన్న వీరికి మార్చి 23న ఐదో సంతానంగా చంపక్హిల్స్ ఎంసీహెచ్లో ఆడపిల్ల జన్మించింది. పుట్టుక సమయంలో పాప బరువు 1.25 కిలోలు మాత్రమే. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఉండడంతో వైద్యులు తక్షణ చికిత్స ప్రారంభించారు. వారం రోజుల తర్వాత పద్మ కుట్లు విప్పిన వెంటనే పాప ఆడపిల్ల కావడంతో ‘మేము సాకలేం, మీరే చూసుకోండి’ అంటూ డాక్టర్లకు చెప్పి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అసాధారణమైన ఈ ఘటనను గమనించిన డాక్టర్ మధుసూదన్రెడ్డి విషయం వెంటనే చైల్డ్ వెల్ఫేర్శాఖకు తెలియజేశారు. అధికారులు వచ్చి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వగా, పాపను తామే పెంచుకుంటామని వారినుంచి హామీ తీసుకున్నారు. అయితే తల్లిదండ్రులు రెండు రోజులు గడవకముందే ఎవరికీ చెప్పకుండా ఆస్పత్రిలోనే పాపను వదిలేసి వెళ్లిపోయారు. వెంటనే ఆస్పత్రి రికార్డులో ఉన్న ఫోన్నంబర్ ఆధారంగా నరేష్కు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు, మీ ఊరు ఏంటి అని అడిగారు. ఒకసారి రాయలసీమ, మరోసారి ఉత్తరాంధ్ర అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు డాక్టర్లు తెలిపారు. లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామానికి వెళ్లిచూడగా వారు అక్కడినుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. జనగామ: నెలలు నిండకముందే 1.25 కిలోల బరువుతో పుట్టి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాపతో రక్తబంధం వదిలేసుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ, ఆ పసికందును ఈ లోకంలోకి తీసుకువచ్చిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది మాత్రం అక్కున చేర్చుకున్నారు. రోజంతా పర్యవేక్షణ, పాల ఫీడింగ్, ప్రేమతో కూడిన సంరక్షణతో ఆ శిశువులో నెమ్మదిగా మార్పు తీసుకువచ్చారు. తల్లి దూరమైన చోట మానవత్వం వెల్లివిరిసింది. నేడు పాప బరువు 2.3 కిలోలకు చేరి ఆరోగ్యంగా మారింది. జిల్లా కేంద్రంలోని చంపక్ హిల్స్ ఎంసీహెచ్ ఆస్పత్రిలో 50 రోజుల క్రితం చోటుచేసుకున్న ఘటన ఇప్పటికీ అందరినీ కదిలిస్తోంది. పేగుబంధం వదిలి వెళ్లినా.. అక్కున చేర్చుకుని పునర్జన్మనిచ్చిన ఆస్పత్రి, శిశువు కథ ఇది. అమ్మగా మారిన ఎస్ఎన్సీయూ పాపను పేగుబంధం కాదనుకున్నా.. వైద్యులు అక్కున చేర్చుకున్నారు. డాక్టర్ మధుసూదన్రెడ్డి పర్యవేక్షణలో పాపకు ఎస్ఎన్సీయూలో మెరుగైన వైద్యం అందిస్తూ, కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఒక్కో అనారోగ్య సమస్యకు చికిత్స చేసుకుంటూ వచ్చారు. రోజూ పాల డబ్బాతో ఫీడింగ్, అమ్మ ప్రేమ, లాలన అందిస్తూ పసిబిడ్డకు మాతృమూర్తుల్లా డాక్టర్లు, నర్సులు సంరక్షిస్తున్నారు. ఎనిమిది రోజుల వయసులో తల్లి ప్రేమ కోల్పోయిన ఈ పాపకు, ఎస్ఎన్సీయూ సిబ్బందే దేవుడిచ్చిన అమ్మలు అయ్యారు. తక్కువ బరువు నుంచి సంపూర్ణ ఆరోగ్యానికి.. 50 రోజుల చికిత్సతో పాప స్థితి రోజురోజుకూ మెరుగైందని డాక్టర్లు తెలిపారు. పాప పుట్టిన సమయంలో కిలో 250 గ్రాములు ఉండగా, ప్రస్తుత బరువు 2.300 కిలోలతో పూర్తిగా కోలుకుంది. ఎటువంటి అనారోగ్య సమస్య లేదు. బరువు 2.5 కిలోలకు చేరగానే చైల్డ్ వెల్ఫేర్ శాఖ సమన్వయంతో హనుమకొండ శిశుగృహానికి పాపను తరలించనున్నట్లు ఎంసీహెచ్ వైద్యుడు మధుసూదన్రెడ్డి ‘సాక్షి’కి వివరించారు.శిశువుకు అమ్మ ప్రేమను పంచుతున్న డాక్టర్, సిబ్బంది నెలలు నిండక తక్కువ బరువు, అనారోగ్య సమస్యలతో శిశువు జననం సాకలేమని వదిలివెళ్లిన తల్లిదండ్రులు.. అక్కున చేర్చుకున్న ఆస్పత్రి రక్తబంధం వదిలినా.. తల్లి ప్రేమ పంచి అన్నీ తామై చూసుకున్న వైద్యులు, సిబ్బంది 50 రోజుల్లో అద్భుతం.. బరువు పెరగడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యంగా శిశువు -
విద్యాభివృద్ధిపై నేడు సదస్సులు
జనగామ: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లాలోని మూడు నియోజకవర్గ కేంద్రాల్లో నేడు(బుధవారం) సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఒక్కరోజు అవగాహన సదస్సులను నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థుల నమోదు పెంపు, డ్రాపవుట్ తగ్గింపు, బడిబాటలో ప్రజాప్రతినిధుల పాత్ర వంటి ప్రధాన అంశాలపై ఈ సదస్సుల్లో మార్గదర్శకత్వం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓలు, ఉపాధ్యాయులు గ్రామాల వారీగా మంగళవారం సర్పంచ్లు, కౌన్సిలర్లకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. నియోజకవర్గాల వారీగా.. జనగామ నియోజకవర్గానికి సంబంధించిన సదస్సు జిల్లా కేంద్రం సిద్దిపేట రోడ్డులోని శామీర్పేట శివారు రమాదేవి ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొనాలి. స్టేషన్న్ఘన్పూర్ నియోజకవర్గ సదస్సు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. స్టేషన్ ఘన్పూర్, చిల్పూరు, జఫర్గఢ్, రఘునాథపల్లి, లింగాలఘణపురం మండలాల సర్పంచ్లు, కౌన్సిలర్లు హాజరవ్వాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య పాల్గొననున్నారు. పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని సదస్సు దర్థెపల్లి రోడ్డులోని విన్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్నారు. పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల సర్పంచ్లు ఈ అవగా హన సమావేశానికి హాజరు కానున్నారు. విద్యారంగం పురోగతి, బడిబాట పటిష్టం, విద్యార్థుల సంఖ్య పెంపు దిశగా ఈ సదస్సులు కీలకంగా ఉపయోగపడతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. నియోజకవర్గస్థాయిలో సర్పంచ్, కౌన్సిలర్లకు అవగాహన విద్యాప్రగతిలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ‘స్టేషన్’ సదస్సుకు హాజరుకానున్న ఎమ్మెల్యే కడియం, ఎంపీ కావ్య -
కలెక్టర్ వైఖరితో జీవనోపాధిపై ప్రభావితం
జనగామ: కలెక్టర్ వైఖరి ప్రజల జీవనోపాధిఽపై ప్రభావితం చూపిస్తోందని అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహారశైలిపై ఆందోళన వ్యక్తం చేస్తూ మంగళవారం స్థానిక విజయ ఫంక్షన్ హాల్లో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి బొట్ల శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, కౌన్సిలర్లు, కార్మిక, కర్షక సంఘాలు పాల్గొన్నాయి. దళిత మహిళ మంజుల మాట్లాడుతూ.. గత కలెక్టర్ మంజూరు చేసిన తన టీస్టాల్ను ప్రస్తుత కలెక్టర్ ఎటువంటి కనికరంలేకుండా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. సాదిక్ ఫౌండేషన్ చైర్మన్, న్యాయవాది సాదిక్ అలీ మాట్లాడుతూ.. కలెక్టర్ వైఖరి ఆందోళన కలిగిస్తోందని, కాంగ్రెస్ నాయకులు దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రజల్లో నమ్మకం కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 3వ వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి మాట్లాడుతూ.. మహిళా ప్రజాప్రతినిధిగా తాను కలెక్టరేట్కు వెళ్తే సమయం కూడా ఇవ్వలేదన్నారు. సీపీఎం, టీఆర్పీ, జేఎంఐ, టీఆర్ఎస్ (కవిత) వర్గాల నాయకులు మాట్లాడుతూ.. కలెక్టర్ తన వైఖరిని 20 రోజుల లోపు మార్చుకోకపోతే అన్ని పార్టీలు కలిసి ఉద్యమాలు చేపడతామని, రాజకీయాలకు అతీతంగా ఈ తీర్మానాన్ని అమలు చేస్తారని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్ కత్తుల రాజిరెడ్డి, సుంచు విజేందర్, సింగారపు రమేశ్, మల్లిగారి రాజు, ఎండీ దస్తగిరి, న్యాయవాది రాగల్ల శ్రీహరి, ట్రాక్టర్ యజమానుల సంఘం నాయకుడు ఆకుల లక్ష్మయ్య, అజహర్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. అఖిలపక్ష సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం -
ముగిసిన చెస్ శిక్షణ శిబిరం
జనగామ: గుడాల ఫ్యామిలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్ శిక్షణ క్యాంపు మంగళవారంతో విజయవంతంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ సత్యనారాయణరెడ్డి, బీజేపీ స్పోక్స్ పర్సన్ ఆరుట్ల దశమంతరెడ్డి, డాక్టర్ ప్రీతి దయాల్, కాసాల సంతోష్ కుమార్, గుడాల ఫ్యామిలీ ఫౌండే షన్ డైరెక్టర్ రాము, చెస్కోచ్లు పాల్గొన్నారు. 10 రోజుల పాటు నిర్వహించిన చెస్ క్యాంపులో 120 మంది విద్యార్థులు పాల్గొని చెస్కు సంబంధించిన మౌలిక నైపుణ్యాలు, వ్యూహాలు నేర్చుకున్నారు. కార్యక్రమం చివరి రోజు పది మందికి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. అలాగే క్యాంపులో పాల్గొన్న ప్రతీ విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గుడాల ఫ్యామిలీ ఫౌండేషన్ చైర్మన్ గుడాల శ్రీనివాస్, కో–చైర్మన్లు గుడాల వేణు, గుడాల శ్రీధర్కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి
జనగామ: జిల్లావ్యాప్తంగా మంగళవారం హనుమాన్ జయంతి భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా జరిగాయి. భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు చేరుకోగా, అర్చకులు చందన సమర్పణ, 108 తమలపాకులు, వడలతో స్వామి అలంకరణ, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీ మూలభావి శ్రీ హనుమత్ రామనాథ సహిత శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు మోహన్ కృష్ణ భార్గవ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. శ్రీ సంతోషిమాత గణేష్ స్ట్రీట్, గుండ్లగడ్డ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, గీతాశ్రమం, కురుమవాడ, గిర్నిగడ్డ, అంబేద్కర్ నగర్, బాణాపురం సహా పలు ప్రాంతాల ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ, గంగు సాంబమూర్తి శర్మ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల దీక్ష, అరమండల దీక్షలో భాగంగా నియమ నిష్ఠలతో మాల ధరించిన స్వాములు మాలవిరమణ చేశారు. -
పాలిసెట్కు సర్వం సిద్ధం
జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నిర్వహించనున్న పాలిసెట్–2026 ప్రవేశ పరీక్షకు జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రతీ సంవత్సరం నిర్వహించే ఈ పరీక్షకు భారీ సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేయడంతో జిల్లాలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో పర్యవేక్షణ బృందాలు, అవసరమైన సిబ్బందిని నియమించారు. జిల్లాలో ఈ సంవత్సరం 1,615 మంది విద్యార్థులు పాలిసెట్కు హాజరుకానున్నారు. వీరి కోసం అధికారులు ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు సెంటర్లు(ఏ,బీ) ఏర్పాటు చేయగా, ఇక్కడ ఒక్కో కేంద్రంలో 300 మంది చొప్పున మొత్తం 600 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జనగామ మండలంలోని యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో సైతం మరో రెండు సెంటర్లు (ఏ,బీ) ఏర్పాటు చేశారు. సెంటర్– ఏలో 288 మంది, సెంటర్– బీలో 260 మంది విద్యార్థులను కేటాయించారు. స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సెంటర్లో 300 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లో 167 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో తాగునీరు, టెంట్లు, వైద్య సదుపాయం, భద్రతా ఏర్పాట్లు కల్పించడంతో పాటు సీసీ కెమెరాలతో పోలీసులు పకడ్బందీ పర్యవేక్షణ చేయనున్నారు. పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.30 గంటలకు ముగుస్తుంది. విద్యార్థులు ఉదయం 10 గంటల కల్లా గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 11 గంటల తర్వాత గేట్లు క్లోజ్ చేసి నిమిషం ఆలస్యమైనా ఎవరినీ లోపలికి అనుమతించరు. పరీక్షకు సంబంధించి విద్యార్థులు హాల్టికెట్తో పాటు హెచ్బీ బ్లాక్ పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ బాల్పెన్ తప్పనిసరిగా తీసుకురావాలి. మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, స్మార్ట్ డివైస్లు పూర్తిగా నిషేధమని అధికారులు వెల్లడించారు. జిల్లా విద్యాశాఖ, పోలీసు శాఖ కలిసి ప్రత్యేక బృందాలను మోహరించనున్నారు. ట్రాఫిక్ నియంత్రణ నుంచి పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల వరకు అన్ని చర్యలు చేపట్టనున్నారు. విద్యార్థుల కోసం హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసి సందేహాలు నివృత్తి చేయనున్నారు. పాలిసెట్–2026 ఎంట్రెన్స్ను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. హాల్ టికెట్పై విద్యార్థి ఫొటో ముద్రణ జరగకుండా వచ్చినట్లైతే పాస్ఫొటోతో పాటు గుర్తింపుగా ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచనలు చేశారు. జిల్లాలో సెంటర్ల వారీగా వివరాలు: 6 సెంటర్లు..హాజరుకానున్న 1,615 మంది విద్యార్థులు ఉదయం 11 గంటలకు గేట్లు మూసివేత నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్దిపేట రోడ్డు: (సెంటర్– ఏ): 300మంది ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్దిపేట రోడ్డు: (సెంటర్– బీ): 300మంది క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాల(సీజేఐటీ), యశ్వంతాపూర్(సెంటర్– ఏ): 288మంది క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాల(సీజేఐటీ), యశ్వంతాపూర్ (సెంటర్– బీ): 260మంది ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, స్టేషన్ ఘన్పూర్: 300మంది ప్రభుత్వ జూనియర్ కళాశాల, స్టేషన్ ఘన్పూర్: 167మందిపాలిసెట్–2026 కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశాం. 1,615 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్ష 11 గంటలకు ప్రారంభమవుతుంది. విద్యార్థులను ఉదయం 10 గంటల నుంచి లోపలికి అనుమతిస్తాం. సరిగ్గా 11 గంటలకు గేట్లు క్లోజ్ చేసిన తర్వాత, ఎవరినీ కూడా లోనికి అనుమతించం. –శ్రీనివాస్, డిస్ట్రిక్ కో ఆర్డినేటర్, ఏబీవీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ -
కొనుగోళ్లపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
● వీసీలో సీఎం రేవంత్రెడ్డి జనగామ: ధాన్యం, మక్కల కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వీసీ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు.. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటిస్తూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు రాకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రతీ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. టోకెన్ పద్ధతి ప్రకారం తేమ శాతం రాగానే కొనుగోళ్లు చేపట్టి, అదే రోజూ ట్యాగ్ చేసిన మిల్లులకు ధాన్యాన్ని తరలించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఆర్డీఓ రంగారావు, పౌర సరఫరాల సంస్థ డీఎం హతీరాం, సహకార శాఖ అధికారి కోదండరాములు, జిల్లా మార్కెటింగ్ అధికారి రామకృష్ణ, ఇన్చార్జ్ డీసీఎస్ఓ సురేష్ రెడ్డి, ఏపీడీ నూరొద్దీన్, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్గౌడ్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పామాయిల్ తోటలో అగ్నిప్రమాదంరఘునాథపల్లి: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ వెనకాల మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పది ఎకరాల పామాయిల్ తోటలు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో డ్రిప్ పరికరాలు కూడా కాలిపోయాయి. హన్మకొండకు చెందిన అరుకొండ శ్రీధర్ మూడేళ్ల క్రితం ఏడున్నర ఎకరాల్లో పామాయిల్ తోట సాగు చేశారు. తోట కాపునకు వచ్చే తరుణంలో అటు వైపు వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు బీడి తాగి ఆర్పకుండా విసరడంతో తోటలోని గడ్డికి మంటలు అంటుకున్నాయి. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా తోట చుట్టూ పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అదే విధంగా పక్కనే ఉన్న హన్మకొండకు చెందిన వెంకటేశ్వర్లు, ప్రభాకర్కు చెందిన మూడు ఎకరాల పామాయిల్ తోటలకు కూడా మంటలు అంటుకున్నాయి. ముగ్గురికి చెందిన పది ఎకరాల్లో డ్రిప్ పరికరాలు కాలిపోయాయి. మంటలను గుర్తించిన పోలీసులు వెంటనే స్థానికుల సహకారంతో పచ్చని చెట్ల కొమ్మలతో శ్రమించి మంటలను ఆర్పారు. అప్పటికే పామాయిల్ తోటలు దగ్ధమై రైతులకు తీవ్ర నష్టం జరిగినట్లు సమాచారం. ‘బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలి’జనగామ రూరల్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని ప్రజాత్రంత మహిళా సంఘం, డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి ఇర్రి అహల్య, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ నరేందర్ మాట్లాడుతూ.. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బండి భగీరథ్పై పోక్సో కేసు పెట్టి నాలుగు రోజులైనా ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. దీనిపై బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్లు స్పందించాలన్నారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ధర్మభిక్షం, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి మోకు భవాని, ఎర్ర అనిత, కొండ వరలక్ష్మి, మమత, కనకచారి, విప్లవ, సాత్విక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నైపుణ్యాలు పెంచుకోవాలికేయూ క్యాంపస్: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలు పెంచుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. మంగళవారం కేయూలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సెమినార్ హాల్లో ప్లేస్మెంట్ సెల్, మేజిక్ బస్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన జాబ్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచం మొత్తం భారత్వైపు చూస్తోందన్నారు. కేయూ వీసీ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ.. సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా విద్యార్థులు ప్రత్యేక నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు. కేయూ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ చిర్రరాజు మాట్లాడారు. ఈజాబ్ మేళాలో 12 ప్రముఖ సంస్థలు పాల్గొనగా విద్యార్థులు హాజరయ్యారు. -
ధాన్యం దిగుమతిలో జాప్యం చేయొద్దు
జనగామ: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని దిగుమతి చేసుకునేందుకు రైస్మిల్లర్లు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ధాన్యం సేకరణలో భాగంగా మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అవసరమైతే అదనపు హమాలీలను ఏర్పాటు చేసుకొని, దిగుమతిలో వేగం పెంచాలన్నారు. ధాన్యం బస్తాల రవాణా విషయంలో స్పందించని లారీ డ్రైవర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పౌరసరఫరాల సంస్థ డీఎం హతీరామ్, జిల్లా మార్కెటింగ్ అధికారి రామకృష్ణ, ఇన్చార్జ్ డీసీ ఎస్ఓ సురేష్రెడ్డి, ఏపీడీ నూరొద్దీన్, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్పై దృష్టి సారించాలి ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా తాజా ఓటరు జాబితాను ఎస్ఐఆర్ జాబితాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి ఆర్డీఓ, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియలో జిల్లా రాష్ట్ర స్థాయిలో ముందంజలో ఉందని, ఈ మేరకు వారం రోజుల్లోగా 90 శాతానికి చేరుకోవాలన్నారు. ఆర్డీఓ గోపీరాం, జనగామ, చేర్యాల, ధర్మసాగర్, సిద్దిపేట తహసీల్దార్లు పాల్గొన్నారు. పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి భూ భారతిలో వివిధ మాడ్యూల్స్లోని సక్సెషన్, మ్యుటేషన్, ఖాతా సమీకరణ, డేటా కరెక్షన్, అర్బన్ ల్యాండ్, కోర్టు కేసులు, జీపీపీ, పీపీబీ, నాలా తదితర పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. భూ భారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలి రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టడంతో పాటు భద్రత ప్రమాణాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి కలెక్టర్ రహదారి భద్రత, మత్తు పదార్థాల నియంత్రణపై ఎకై ్సజ్, పోలీసు, వైద్య శాఖ అధికారులతో వేర్వేరుగా ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని రెండు నేషనల్ హైవేలపై అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. ప్రధాన రహదారులపై వీధి వ్యాపారాలు లేకుండా వారి కోసం ప్రత్యేక వెండింగ్ జోన్ను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ ఆర్అండ్బీ ఈఈ సరిత, డీటీఓ శ్రీనివాస్గౌడ్, ఎకై ్సజ్ అధికారి అనిత, డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జునరావు, ఆర్టీఏ మెంబర్ అభిగౌడ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, నేషనల్ హైవేస్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణపై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రైతులకు ఇబ్బందులు సృష్టిస్తే కఠిన చర్యలు సమీక్షలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
అజ్ఞాతం వీడిన పసునూరి
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీపీఐ (మావోయిస్ట్) పార్టీ అగ్రనేత పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ అలియాస్ సంతోశ్ ఎట్టకేలకు ఉద్యమ బాట వదిలారు. పార్టీ సాధారణ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ నాయకుడి వరకు ఎదిగిన ఆయన జనజీవన స్రవంతిలో కలిశారు. 1982లో అజ్ఞాతంలోకి వెళ్లారు. సుమారు మూడు దశాబ్దాల పాటు మావోయిస్ట్ పార్టీ ఉద్యమంలో కొనసాగిన ఆయన మంగళవారం అడవిబాటను వదిలి పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. సోమిడి నుంచి జార్ఖండ్ వరకు.. పసునూరి నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లాలోని కాజీపేట మండలం సోమిడి గ్రామం. 1980 నుంచి పీపుల్స్వార్కు అనుబంధంగా ఉన్న రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యూత్ లీగ్లలో ఆయన చురుకై న పాత్ర పోషించారు. పులి అంజయ్య, క్రాంతి రణదేవ్, గోపగాని అయిలన్న అలియాస్ మహేశ్తో కలిసి వరంగల్ నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహించిన నరహరి.. అనతికాలంలోనే పోలీసులకు వాంటెడ్గా మారారు. నిర్బంధం తీవ్రం కావడంతో 1982లో పూర్తికాలపు కార్యకర్తగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి.. ఉత్తర తెలంగాణ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పని చేసిన ఆయన ఆంధ్రా ఒడిశా సరిహద్దుకు బదిలీపై వెళ్లారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఉద్యమ సహచరిని పెళ్లి చేసుకున్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఏఓబీ, ఝార్ఖంఢ్లో మావోయిస్ట్ ఉద్యమ విస్తరణకు కీలకంగా పని చేశారు. నరహరి పలు ఆపరేషన్స్లో కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసు రికార్డులు చెబుతున్నాయి. నాలుగున్నర దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉంటూ క్రమంగా మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. ఉమ్మడి వరంగల్ నుంచి చివరి లొంగుబాటు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్లో భాగంగా పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. దళాలకు దళాలే మృత్యువాత పడగా.. మరికొందరు అగ్రనేతలు, మావోయిస్టుల ఆయుధాలతో సహా లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31 టార్గెట్గా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ పూర్తయిన సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ అగ్రనేతలు ముప్పాల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి, పొలిట్బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రాతో పాటు పసునూరి నరహరి అలియాస్ సంతోశ్ పేరును కూడా కేంద్రం ప్రకటించింది. ఇటీవల కాలంలో పోలీస్ కూంబింగ్లు మరింత ఉధృతంగా సాగుతున్న తరుణంలో కేంద్ర కమిటీ సభ్యుడు, జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగం ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, అలియాస్ సంతోశ్ మంగళవారం భార్యతో కలిసి తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. కాగా, ఉమ్మడి వరంగల్ నుంచి ఇంకా ఐదారుగురు మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నట్లు ప్రచారం ఉన్నా.. పోలీసు రికార్డుల్లో మాత్రం లేరు. దీంతో ఉమ్మడి వరంగల్ నుంచి పోలీసు రికార్డుల్లో కీలక నేతగా ఉన్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, సంతోశ్ లొంగుబాటు చివరిదిగా చెబుతున్నారు. అజ్ఞాత మావోయిస్టుల జాబితాలో ఉన్న నరహరి జనజీవన స్రవంతిలో కలవడంతో నక్సల్స్ రహిత జిల్లాగా మారిందంటున్నారు. జనజీవన స్రవంతిలోకి మావోయిస్ట్ అగ్రనేత నరహరి అలియాస్ విశ్వనాథ్ పార్టీ మెంబర్ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు.. నాలుగున్నర దశాబ్దాలపాటు ఉద్యమంలో పనిచేసిన అనుభవం జార్ఖండ్ ఇన్చార్జ్గా పనిచేసి లొంగిపోయిన నేత -
మా కష్టానికి విలువేది?
జనగామ: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధి కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన ఐకేపీ, మెప్మా ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. వందలాది బస్తాల ధాన్యం తడిసిపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన స్వల్ప వరద ప్రవాహంతో గింజలు కొట్టుకుపోయి నష్టం వాటిల్లింది. ఈ పరిణామాల నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఆర్డీఓ గోపిరాం ఐకేపీ, మెప్మా సెంటర్లను సందర్శించారు. రైతుల వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. నెల రోజుల నుంచి ధాన్యం అమ్ముకోలేక, ఇప్పటికే అమ్మిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆర్డీఓకు ఆవేదన వెళ్లగక్కారు. ఆర్డీఓ వాహనానికి రైతులు అడ్డంగా నిలవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ విఫలమవడంతో పరిశీలన పూర్తిచేసుకుని బయలుదేరే సమయంలో ఆర్డీఓ వాహనాన్ని అడ్డుకున్నారు. సెంటర్ల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆర్డీఓ బైక్పై వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో తేమశాతం ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని మిల్లుకు తీసుకు వెళ్లాలని ఓ లారీ డ్రైవర్ను కోరగా, అందుకు ఆయన నిరాకరించారు. తడిసిన ధాన్యం తీసుకెళ్తే రోజుల తరబడి దిగుమతి కావడం లేదని, దీంతో ఈఎంఐలు కట్టలేకపోతున్నామని లారీ డ్రైవర్ అబ్దుల్ బషీర్ లారీ పైకి ఎక్కి ఉరి వేసుకొనేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓ హమాలీ కార్మికుడు ధైర్యం చేసి డ్రైవర్ను కాపాడారు. తేమ తగ్గి నష్టం పెరిగింది ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ, సెంటర్లలో పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉందని రైతులు వాపోయారు. 15 నుంచి 30 రోజులుగా కొనుగోలు సెంటర్లలో ధాన్యం పేరుకుపోవడంతో తేమ 8 శాతానికి పడిపోయిందని, తేమ తగ్గుదలతో ఒక్కో రైతుకు భారీ నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే పూర్తిగా దిగుబడి తగ్గిపోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తరచుగా వచ్చే గాలివానలు, అడపాదడపా వర్షాలు ధాన్యాన్ని మరింత నష్టపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లుల్లో కోతలు.. సెంటర్ల నుంచి రైస్ మిల్లులకు తరలించిన ధాన్యంపై అన్యాయమైన కోతలు వేస్తున్నారని రైతులు ఆరోపించారు. చీటకోడూరు రూట్లోని సోమేశ్వర రైస్ మిల్లుకు 8శాతంతో ఉన్న ధాన్యం తీసుకెళ్తే తాలు పేరుతో 40 కిలోల వరకు కోత విధించారని రైతు గన్నెబోయిన సారయ్య ఆర్డీఓ ఎదుటే గోడును వెల్లబోసుకున్నాడు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన 10 వేల బస్తాలను తరలించాల్సి ఉండగా, మరో 10 వేల బస్తాలు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయని మెప్మా సెంటర్ ఇన్చార్జ్ రేణుక తెలిపారు. కాంటా వేసిన 2,500 బస్తాలను మిల్లులకు తరలించాల్సి ఉండగా, మరో 15 వేల బస్తాలు కళ్లాల్లోనే పేరుకుపోయాయని ఐకేపీ ఇన్చార్జ్ అనిత తెలిపారు. రైతుల కన్నీటి పర్యంతం రోజువారీ పనులు వదిలి నెల రోజులుగా కొనుగోలు సెంటర్ల వద్దే గడుపుతున్నామని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. వర్షం వస్తే బస్తాలను కిందకు, మీదకు మార్చమని చెప్పి తమను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. అమ్ముకున్న సరుకు మిల్లుకు వెళ్లే వరకు తమనే కాపలా పెడుతున్నారని మండిపడ్డారు. తమ కష్టానికి విలువ లేదని, తేమ పెరిగిందంటూ మిల్లర్లు కోతలు వేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటర్లలో సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ రైతులకు హామీ ఇచ్చినప్పటికీ, రైతుల ఆవేదన మాత్రం తీరలేదు. జనగామ యార్డులో కొనుగోళ్లు సజావుగా సాగేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆర్డీఓ సందర్శన.. వాహనం అడ్డగించిన అన్నదాతలు కళ్లాల్లో పేరుకుపోయిన వేలాది ధాన్యం బస్తాలు మిల్లులకు తరలించడంలో జాప్యంతో ఇక్కట్లు -
ఆలకించి..ఆదేశించి
జనగామ రూరల్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. ఈసందర్భంగా ప్రజల సమస్యలను విని వారి నుంచి 190 దరఖాస్తులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, జెడ్పీ సీఈఓ రంగారావు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, సీపీఓ చినకోట్యానాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ ప్రజల నుంచి 190 దరఖాస్తుల స్వీకరణ -
మైనింగ్కు ఊతం!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వం మైనర్ ఖనిజ బ్లాకుల వేలం విధానంలో కొత్త మార్గదర్శకాలకు శ్రీకారం చుట్టింది. ఖనిజాల తవ్వకాల్లో పారదర్శకత, ఆదాయం పెంపు లక్ష్యంగా హైబ్రిడ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ద్వారా ఖనిజాల లీజులు కేటాయించనున్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎన్.శ్రీధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనింగ్ రంగానికి ఊతమివ్వనున్నాయి. ముఖ్యంగా గ్రానైట్, స్టోన్ మెటల్, బ్లాక్ గ్రానైట్, రోడ్ మెటల్, మట్టి, ఇసుక వంటి ఖనిజాల తవ్వకాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు.. ఉమ్మడి వరంగల్లో ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు ఉన్నాయి. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అధికంగా క్వారీలు ఉన్నాయి. మైన్స్ అండ్ జియాలజీ శాఖ అంచనాల ప్రకారం ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల పరిధిలో ప్రస్తుతం చిన్నా, పెద్దవి కలిపి సుమారు 250కు పైగా మైనింగ్, క్వారీ లీజులు అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అధిక భాగం స్టోన్ మెటల్, రోడ్ మెటల్ యూనిట్లు, గ్రానైట్ తవ్వకాలు, బ్రిక్ ఎర్త్, మట్టి క్వారీలు, ఇసుక రీచ్లు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు అధికంగా ఉండండంతో గ్రానైట్, స్టోన్ మెటల్ క్వారీల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పట్టాదారులకు తీపి కబురు ఇకపై మైనర్ ఖనిజాల వేలం మొత్తం ఆన్లైన్లోనే జరగనుంది. బిడ్డింగ్ నుంచి లీజు కేటాయింపు వరకు ప్రతీ దశ డిజిటల్ విధానంలో ఉండడంతో అక్రమాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కనీసం ముగ్గురు బిడ్డర్లు తప్పనిసరి చేయడం ద్వారా పోటీ పెరిగి ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, పట్టా భూముల్లో ఖనిజ తవ్వకాలకు అంగీకరించిన భూ యజమానులకు ప్రభుత్వం అదనపు సొమ్ము చెల్లించనుంది. గ్రానైట్, మార్బుల్ మినహా ఇతర ఖనిజాలకు సీనియరేజ్ ఫీజులో 10 శాతం, గ్రానైట్, మార్బుల్కు 5 శాతం పెంచనున్నారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని ప్రైవేట్ భూముల్లో కొత్త క్వారీలకు భూ యజమానులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. రాయల్టీ పెరిగే అవకాశం.. కొత్త వేలం విధానం అమలైతే ఉమ్మడి వరంగల్లో ఖనిజ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సుమారుగా ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తుండడంతో రోడ్ మెటల్, స్టోన్ మెటల్, గ్రానైట్కు డిమాండ్ పెరుగుతోంది. కొత్త లీజులు మంజూరైతే ప్రభుత్వానికి రూ.25–30 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని మైనింగ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మైనర్ ఖనిజాల వేలంలో భారీ మార్పులు హైబ్రిడ్ విధానానికి సర్కారు గ్రీన్సిగ్నల్ పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త లీజులు గ్రానైట్, స్టోన్ మెటల్, ఇసుక క్వారీలపై ఫోకస్ 40–60 కొత్త లీజులకు అవకాశం? ఇప్పటి వరకు పర్యావరణ, కాలుష్య నియంత్రణ అనుమతులు లేక వేలం జరగని అనేక ఖనిజ బ్లాకులు కొత్త ‘హైబ్రిడ్ విధానం’ ద్వారా వేలంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్లోనే మరో 40 నుంచి 60 వరకు కొత్త మైనింగ్ లీజులు, క్వారీ బ్లాకులు వేలానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని మైనింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహబూబాబాద్లో బ్లాక్ గ్రాౖ నెట్, భూపాలపల్లిలో రోడ్ మెటల్, ములుగులో స్టోన్ క్వారీలు, వరంగల్, హనుమకొండ పరిసరాల్లో నిర్మాణ రంగానికి అవసరమైన మెటల్ క్వారీలు అధికం. కాగా, ఆయా జిల్లాల్లో కొత్త విధానంతో వేగంగా అనుమతులు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. -
ఈ–ఆఫీసులోనే అన్ని రికార్డులు
జనగామ: జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని డీఈఓ కార్యాలయాన్ని కలెక్టర్, విద్యాశాఖ అధికారి సందీప్ కుమార్ ఝా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని సెక్షన్లను కలెక్టర్ పరిశీలించారు. సిబ్బంది పనితీరు, సెక్షన్న్వారీ ఫైళ్ల నిర్వహణ విధానం, రికార్డు క్రమబద్ధీకరణపై ఆరా తీశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇకపై కార్యాలయంలో భౌతిక (ఫిజికల్) ఫైళ్ల నిర్వహణకు పూర్తిగా స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. అన్ని ఫైళ్లను ఈ–ఆఫీస్లోనే డిజిటల్ విధానంలో నిర్వహించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్కు నాణ్యమైన విద్యే బాట బచ్చన్నపేట: విద్యార్థుల భవిష్యత్కు నాణ్యమైన విద్యే బాట అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 11 నుంచి 17 వరకు చేపట్టిన విద్యా వారోత్సవాల సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని కేజీబీవీలో నిర్వహిస్తోన్న వేసవి శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొన్న బాలికలతో కలెక్టర్ ఆప్యాయంగా ముచ్చటించారు. కార్యక్రమంలో జీసీడీఓ గౌసియా బేగం, స్పెషలాఫీసర్ నారమల్ల గీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. డీఈఓ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
జనగామ రూరల్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాటు పూర్తి చేసినట్లు డీఐఈఓ కె.జి తేందర్ రెడ్డి అన్నారు. సోమవారం డీఐఈఓ ఆధ్వర్యంలో సోమవారం చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ అధికారుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. జిల్లా కేంద్రంలో 5 సెంటర్లు ఉన్నాయని, నర్మెటలో 1, స్టేషన్ ఘన్పూర్లో 2, జఫర్గఢ్లో 1 కొడకండ్లలో 1, దేవరుప్పులలో 1, పాలకుర్తిలో 1 పరీ క్ష కేంద్రాలు ఉన్నాయన్నారు. జిల్లావ్యాప్తంగా మొదటి సంవత్సరంలో జనరల్ విద్యార్థులు 1,966 మంది, ఒకేషనల్ విద్యార్థులు 372మంది, మొత్తం 2,338 మంది ఉన్నారన్నారు. రెండో సంవత్సరం జనరల్ విద్యార్థులు 957 మంది, ఒకేషనల్ విద్యార్థులు 302మంది మొత్తం 1,259మంది పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. సమావేశంలో డెక్ సభ్యురాలు సునంద, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా చిట్యాల శ్వేతపాలకుర్తి టౌన్: రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలిగా మండల కేంద్రానికి చెందిన తెలంగాణ రైతాంగ సాయుఽఽధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనువరాలు చిట్యాల శ్వేతను నియమిస్తున్న సోమవారం ప్రభుత్వం ఉత్తర్యులు జారీ చేసింది. హైదరాబాద్లోని కోఠిలోని మహిళ విశ్వవిద్యాలయానికి తెలంగాణ సాయుఽధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఐలమ్మ మనవరాలు శ్వేతను మహిళ కమిషన్ సభ్యురాలుగా నియమించడంపై అమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ కళాశాలలో విద్యా వారోత్సవాలుస్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ ప్రభుత్వ జూని యర్ కళాశాలలో సోమవారం విద్యావారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం, ఇంటర్ విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కళాశాలకు సంబంధించి ఏ సమస్యలున్నా పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ చేశారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ కమలాకర్, అధ్యాపకులు నరేందర్రావు, లావణ్య, శ్వేత, రాంబాబు, రాజీవ్, సహజ, సంతోష, థామస్, రమేశ్, స్రవంతి, ప్రేమ్, సౌందర్య, నరేష్, ప్రదీప్ పాల్గొన్నారు. రేపటి నుంచి కాకతీయ కళల జాతరనయీంనగర్: కాకతీయ కళల జాతర ఈ నెల 13, 15, 17 తేదీల్లో నిర్వహించనున్నట్లు చేతన కళావేదిక వ్యవస్థాపకుడు, పూర్వ ఫిలిం సెన్సార్బోర్డ్ మెంబర్, రచయిత గాయకుడు ఆకుల నాగేశ్వర్ తెలిపారు. హనుమకొండ ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెయ్యేళ్ల ఘన చరిత్ర కలిగిన కాకతీయ రాజుల పరిపాలన విశిష్టత, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం వంటి అంశాలు, భారతదేశంలో అత్యంత ప్రాచీన నగరమైన ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు, పేరిణి, జానపదాలకు నిలయమన్నారు. కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించనున్న మొదటి రోజు కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, శాసనమండలి ఉపసభాపతి బండ ప్రకాశ్ హాజరవుతారన్నారు. అనంతరం కళల జాతర పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో సహ కార్యనిర్వాహకుడు గోకారపు శ్యాంకుమార్, బూరం ప్రశాంత్, నిర్వాహకులు మచ్చ రాజు, గాయకులు శివ, రాజేశ్, సునీల్ రావు, శ్రీనివాస్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు. ఇంటర్ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదలవిద్యారణ్యపురి: అన్ని యాజమాన్యాల పరిధిలోని జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు సోమవారం ఇంటర్ బోర్డు షెడ్యూల్ను విడుదల చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, వివిధ గురుకులాల్లోనూ ప్రవేశాలు కల్పించనున్నారు. జూన్ 1 నుంచి తరగతులు.. మొదటి దశ ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈనెల 12 నుంచి అడ్మిషన్ల ప్రక్రి య ప్రారంభం కానుంది. జూనియర్ కళాశాలల్లో 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 1 నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియ జూన్ 30 వరకు పూర్తిచేయాల్సి ఉంటుంది. -
నేడు హనుమాన్ జయంతి
జనగామ: జిల్లా వ్యాప్తంగా మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలకు ఆలయాలు సిద్ధమయ్యాయి. జిల్లా కేంద్రంలోని మూలబావి శ్రీ ఆంజనేయస్వామి ఆలయంతో పాటు హౌసింగ్ బోర్డు, గణేష్ స్ట్రీట్, గుండ్లగడ్డ, గిర్నిగడ్డ, గీతానగర్, తది తర ఆలయాల్లో ప్రత్యేక పూజల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. బచ్చన్నపేట, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్, రఘునాథపల్లి, లింగాలఘణపురం, దేవరప్పుల, చిల్పూరు, జఫర్గఢ్, నర్మెట, తరిగొప్పుల, కొడకండ్ల మండలాల్లోని దేవస్థానాల్లో హనుమంతుడి జయంతిని ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో పోలీసు, ఆలయ కమిటీలు, స్థానిక వలంటీర్లు కలిసి చర్యలను తీసుకుంటున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జనగామ పట్టణానికి చెందిన కొత్తపల్లి శ్రీలత బియ్యం గింజలపై హనుమాన్ చాలీసా రాసి భక్తిని చాటుకున్నారు. గణేష్ స్ట్రీట్లోని హనుమాన్ ఆలయంబియ్యం గింజలపై హనుమాన్ చాలీసా -
బండి సంజయ్ రాజీనామా చేయాల్సిందే
జనగామ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలను బీజేపీ నిర్లక్ష్యంగా తీసుకోవడం ఆందోళనకరమని డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మినారాయణనాయక్ అన్నారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు..బండి సంజయ్కి నీతి, నిజాయితీ, ఉంటే ఎంపీ, మంత్రి పదవులకు రాజీనామా చేసి విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. మైనర్ను ఫాంహౌస్కు రప్పించి, కూల్డ్రింక్స్లో మత్తు పదార్థాలు కలిపి భగీరథ లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు చిన్నవేమీ కావన్నారు. దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ బీజేపీ నేతలు నిశ్శబ్దం పాటించడం మహిళల భద్రతపై వారి అసలు వైఖరి బయటపడుతుందని విమర్శించారు. సమావేశంలో మాజీ మున్సిపల్, మార్కెట్ చైర్మన్లు వేమెళ్ల సత్యనా రాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్ తదితరులు ఉన్నారు.డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి -
పాత పెన్షన్ అమలు చేయాలి
జనగామ రూరల్: స్పెషల్ లీవ్ పిటిషన్ వెనక్కి తీసుకొని 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కొల్ల మైపాల్రెడ్డి అధ్యక్షతన పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణులైన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ‘ప్రతిభ అవార్డ్స్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. 2004కు ముందుగా నోటిఫికేషన్ విడుదలై అనంతరం నియమితులైన 2003ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మెమో నంబర్ 57/4, 57/5లను జారీ చేసిందని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆమరణ దీక్ష చేపడతానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి, రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, సుంకరి భిక్షంగౌడ్, నూకల ఎల్లారెడ్డి పాల్గొన్నారు. స్పెషల్ లీవ్ పిటిషన్ వెనక్కి తీసుకోవాలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి -
లేబర్ కోడ్ రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేయాలి
● సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమన్నజనగామ రూరల్: నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని రాష్ట్రంలో లేబర్ కోడ్ రద్దు కోసం అసెంబ్లీ తీర్మానం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు యటాల సోమన్న డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదివారం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ రూల్స్ ప్రతులను జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్ సెంటర్ వద్ద దహనం చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్, కోశాధికారి అన్నబోయిన రాజు, సహా య కార్యదర్శి బూడిద ప్రశాంత్, బండారు శంకర్ ,కొమురయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
జనగామ రూరల్: కొనుగోలు అయిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం జనగామ మండలంలోని వడ్లకొండ రోడ్, నర్మెట మండలంలోని హనుమంతపూర్, అనంతరం తరిగొప్పుల, చిల్పూర్ మండలంలోని శ్రీపతిపల్లి, లింగంపల్లి, వెంకటాద్రిపేట, మల్కాపూర్, చిల్పూర్గుట్టలలో పర్యటించి అక్కడ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని నిర్వహకులకు కలెక్టర్ స్పష్టం చేశారు. మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి జిల్లాలో యాసంగి మార్కెటింగ్ సీజన్ 2025–26లో వరి కొనుగోలు ప్రక్రియ సందర్భంగా రైతులు, రవాణాదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్, మేజిస్ట్రేట్ సందీప్ కుమార్ ఝా సుమోటోగా స్పందించి జిల్లాలోని సీఎంఆర్ కేటాయింపు పొందిన రైస్ మిల్లర్లకు ప్రాథమిక షరతులతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీ మిత్ర ఆగ్రో ఇండస్ట్రీస్, చిన్నరాంచర్ల, బచ్చన్నపేట మండలం, అలాగే సోమేశ్వర ఇండస్ట్రీస్, చీటకోడూరు, జనగామ మండలం, రెండు మిల్లులపై చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. కొనుగోలు ప్రారంభమై 20 రోజులు గడిచినా, కొన్ని రైస్ మిల్లుల వద్ద వరి అన్లోడింగ్ ప్రక్రియ మందగించడంతో కొనుగోలు కేంద్రాల్లో వరి నిల్వలు పెరిగాయన్నారు. తరలింపును వేగవంతం చేయాలి చిల్పూరు: రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లతో పాటు తరలింపును వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. మండలంలోని శ్రీపతిపల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏడీఆర్, డీఓ, ఐకేపీ ఏపీఎం పిట్టల నరేందర్, ఎంఏఓ నజీరుద్ధీన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
ప్రపంచ యవనికపై వరంగల్ ‘5ఎఫ్’
సాక్షి, వరంగల్/గీసుకొండ: కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా 5ఎఫ్ (ఫామ్ టు ఫైబర్.. టు ఫ్యాక్టరీ.. టు ఫ్యాషన్...టు ఫారిన్) దృక్కోణంతో ఓరుగల్లు ఖ్యాతి ప్రపంచానికి తెలిసేలా మరో అడుగు ముందుకు పడింది. పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతుల దాకా ఒకే వేదికపై పూర్తి విలువ వ్యవస్థను కల్పించేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పీఎం మిత్ర (ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్కు) పథకం కింద 2023లో ఎంపిక చేశారు. ఈ మేరకు రూ.200 కోట్లతో కూడిన అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వేదికగా ఆదివారం వర్చువల్గా ప్రారంభించారు. ఇప్పటికే విడుదల చేసిన రూ.30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా, మరో రూ.170 కోట్ల దఫాల వారీగా కేంద్రం రాష్ట్రానికి అందివ్వనుంది. దీంతో పాటు ‘కాంపిటిటివ్ ఇన్సెంటివ్ సపోర్ట్’ కింద రూ.300 కోట్ల వరకు ప్రోత్సాహక మద్దతు ఇవ్వనుండడంతో దేశ, విదేశీ కంపెనీలు ఇక్కడికి క్యూ కట్టే అవకాశం ఉంది. గీసుకొండ, సంగెం మండలాల్లోని శాయంపేట హవేలీలో మొత్తం 1,327 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ పార్కులో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.1695.54 కోట్ల వ్యయం కాగా, వివిధ మార్గాల ద్వారా రూ.6,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ పార్కు ద్వారా 24,400కు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రారంభోత్సవాన్ని వీక్షించిన కలెక్టర్, అధికారులు పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పీఎం మోదీ హైదరాబాద్లో వర్చ్వల్గా ప్రారంభించగా ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా కలెక్టర్ సత్యశారద, అధికారులు పార్కు వద్ద వీక్షించారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ జోన్ మేనేజర్ స్వామినాయక్ మాట్లాడుతూ కేఎంటీపీ నిర్మాణానికి రూ.1,695 కోట్లను అంచనా వేశారని, వాటిలో సుమారు రూ. 800–900 కోట్ల వరకు పలు అభివృద్ధి పనులు, సదుపాయాల పనులతో పాటు భూ సేకరణ పనులకు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతులు ఒకే వేదికపై.. కేఎంటీపీకి పీఎం మిత్ర కింద రూ.200 కోట్లు, సీఐఎస్ కింద రూ.300 కోట్లు వర్చువల్గా హైదరాబాద్ నుంచి ప్రారంభించిన పీఎం నరేంద్రమోదీ


