breaking news
Jangaon District News
-
వైజ్ఞానిక పండుగకు వేళాయె
జనగామ రూరల్: విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక అంశాలపై ఆసక్తి పెంపొందించి నూతన ఆవిష్కరణలను గుర్తించేందుకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈనెల 27 నుంచి రిజిస్ట్రేషనప్రక్రియ ప్రారంభించనున్నారు. జిల్లా స్థాయి సైన్స్ఫెయిర్తో పాటు ఇన్స్పైర్ మనక్ ఎగ్జిబిషన్ నిర్వహణకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి పాఠశాల నుంచి 5 ప్రాజెక్టులు జిల్లా సైన్న్స్ ఎగ్జిబిషన్కు ప్రదర్శన థీమ్ ‘వికసిత్, ఆత్మనిర్బర్ భారత్ కోసం..’ అనే ప్రధాన అంశంలో భాగంగా స్వయం సమృద్ధి భారత దేశం కోసం శాస్త్ర సాంకేతిక రంగాలైన సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం ప్రధాన అంశంగా ఎంపిక చేశారు. ఇందులో ఏడు ఉప అంశాలైన సుస్థిర వ్యవసాయం, వ్యర్థపదార్థాల నిర్వహణ ప్రత్యామ్నాయ ప్లాస్టిక్, హరితశక్తి(పునరుత్పాదక శక్తి), అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వినోదభరితమైన గణిత నమూనాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి సంరక్షణ నిర్వహణపై విద్యార్థులు ప్రాజెక్టుల ప్రదర్శనలు ఉంటాయి. రెండు రోజుల పాటు ప్రదర్శనలు ఎగ్జిబిషన్కు 27న సాయంత్రం 5 గంటల వరకు ప్రాజెక్టులు, పాఠశాల పేర్లను రిజిస్ట్రేషన్ చేస్తారు. రెండో రోజు ప్రదర్శనలు ప్రారంభంతో పాటు ప్రాజెక్టుల ప్రదర్శనతో పాటు సాయంత్రం ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం అనే అంశంపై ప్రత్యేక సెమినార్ నిర్వహించనున్నారు. 28 తేదీల్లో జనగామ, లింగాల ఘణపురం, రఘునాథపల్లి, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల విద్యార్థులు ప్రదర్శనలు తిలకిస్తారు. 29న స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, చిల్పూర్ మండలాలు ఉంటాయి. నిబంధనలు ఇలా.. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల నుంచి సైన్స్ ఎగ్జిబిషన్ను 333 ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. ఎగ్జిబిషన్లో జూనియర్ విభాగంలో 6 నుంచి 8వ తరగతి వరకు, సీనియర్ విభాగంలో 9 నుంచి 12వ తరగతి వరకు ప్రతి ఉప అంశానికి ఒకరు చొప్పున ప్రాజెక్టులను ప్రదర్శించాలి. ఒక పాఠశాల నుంచి 5 మాత్రమే ప్రదర్శనకు అవకాశం ఉంటుంది. పాఠశాల నుంచి ఒక గైడ్ టీచర్ పాల్గొనాలి. జిల్లా ఇన్స్పైర్ మనక్ ప్రదర్శనలు జిల్లా స్థాయి ఇన్స్పైర్ ప్రదర్శన (2024–25)ను కూడా జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్(2025–26)తో పాటు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇన్స్పైర్ (2024–25)లో జిల్లాస్థాయికి ఎంపికై న 77 ( ప్రాజెక్టులు) మంది విద్యార్థులు సైతం ఇందులో పాల్గొననున్నారు. ఎంపికై న విద్యార్థుల ఖాతాల్లో రూ.పదివేల చొప్పున డబ్బులు జమ చేస్తారు. ప్రధాన అంశంతో పాటు ఏడు ఉప అంశాల్లో 333 ప్రదర్శనలు ఇన్స్పైర్ మనక్ ఎగ్జిబిట్స్ 77 జిల్లా కేంద్రంలోని సాన్ మారియా పాఠశాలలో ఏర్పాట్లు పూర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించే జిల్లా సైన్స్ ఫెయిర్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అధికారుల సమన్వయంతో 333 అవిష్కరణలు ప్రదర్శించనున్నారు. వీటితో పాటు 77 మనక్ ఇన్స్పైర్ ప్రాజెక్ట్లు ఉంటాయి. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. నూతన అవిష్కరణలకు చక్కటి అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. – పింకేశ్ కుమార్, అదనపు కలెక్టర్, డీఈఓనూతన అవిష్కరణకు విద్యార్థుల్లో దాగిఉన్న నైపుణ్యాలను వెలికి తీసే గొప్ప అవకాశం. ప్రతీ ఒక్కరు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి పాఠశాల నుంచి 5 ఎగ్జిబిట్లు ప్రదర్శించేలా ఉపాధ్యాయులు శ్రద్ధ చూపించాలి. – శ్రీనివాస్రావు, ఏఎంఓ -
మొదటి విడతకు రెడీ
● 5 మండలాల్లో పకడ్బందీ ఏర్పాట్లు ● 30 క్లస్టర్లుగా విభజన.. ● 110జీపీలు, 1,024 వార్డులకు ఎన్నికలుజనగామ: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈనెల 27 (గురువారం) నుంచి అధికారికంగా ప్రారంభం కానుండగా, జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 12 మండలాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. జిల్లా పరిధిలో 4,01,496 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,98,715, మహిళలు 2,02,963, ఇతరులు 8 మంది ఉన్నారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని చిల్పూరు, స్టేషన్ఘన్పూర్, రఘునాథపల్లి, జఫర్గఢ్, లింగాలఘణపురం మండలాల పరిధిలోని 110 గ్రామపంచాయతీలు, 1,024 వార్డుల్లో మొదటి విడత నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అభ్యర్థుల సౌకర్యార్థంతో పాటు దూరభారాన్ని తగ్గించేందుకు మూడు నుంచి నాలుగు గ్రామాలను కలిపి మండలంలో క్లస్టర్లుగా విభజించి, ఒక్కో కేంద్రాల్లో స్టేజ్–1 ఆర్ఓ(ఏఆర్ఓతో కలిసి) నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణ పూర్తయిన తర్వాత స్టేజ్–2 ఆర్ఓల పర్యవేక్షణలో ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రక్రియ జరుగనుంది. లింగాలఘణపురంలో (6క్లస్టర్లు), స్టేషన్ఘన్పూర్లో (6), చిల్పూరులో (4), రఘునాథపల్లి(7), జఫర్గఢ్(7) మొత్తంగా 30 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. మొదటి విడత నామినేషన్లను పురస్కరించుకుని బ్యాలెట్ బాక్స్, మెటీరియల్ను కలెక్టరేట్ స్ట్రాంగ్రూం నుంచి తరలించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా జరిగేందుకు అధికారులు విస్తృతమైన ప్రణాళిక రూపొందించారు. పోలింగ్ స్టేషన్లకు అదనపు సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు కూడా నియమించనున్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆదేశాల మేరకు ఏఎస్పీ పండేరీ చేతన్ నితిన్, ఏసీపీ భీంశర్మ ఆధ్వర్యంలో సీఐ, ఎస్సైల ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టనున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 2,534 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 100 ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 757, 101–200 ఓటర్లు–1,089, 201–400 ఓటర్లు– 659, 401–650 ఓటర్లు–29, కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, సమర్థత కోసం ప్రతి విభాగానికి 13 మంది ప్రత్యేక నోడల్ అధికారులను కేటాయించారు. వారిలో పింకేశ్ కుమార్ (డీఈఓ, అదనపు కలెక్టర్), టి.వెంకట్రెడ్డి(డీఎల్పీఓ), జి.వి.ఎస్.గౌడ్ (డీటీఓ), మాధురి కృష్ణచంద్ర షా (జెడ్పీ సీఈఓ), ఎన్. రాణాప్రతాప్(ఫిషరీష్ ఆఫీసర్), పి.చిన్ని కోట్యా నాయక్ (సీపీఓ), కె.కోదండరాములు (డీసీఓ), బి.మాత్రునాయిక్ (హౌజింగ్ పీడీ), ఎ.నవీన్ (డీపీఓ), బి.పల్లవి (డీపీఆర్ఓ), ఒ.గౌతమ్రెడ్డి (ఈడీఎం), బి.నరేంద్ర (డీఎం), డి.సరిత (డిప్యూటీ సీఈఓ) ఉన్నారు.కలెక్టరేట్ స్ట్రాంగ్ రూంలో జీపీ ఎన్నికల మెటీరియల్, బ్యాలెట్ బాక్స్ల తరలింపు స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం: మండలం జీపీ వార్డులు పురుష మహిళా ఇతరులు మొత్తం పోలింగ్ ఓటర్లు ఓటర్లు కేంద్రాలు చిల్పూరు 17 168 16,473 16,853 1 33,327 168 స్టేషన్ఘన్పూర్ 15 146 13,177 13,387 – 26,564 146 రఘునాథపల్లి 36 320 22,279 22,729 2 45,010 320 జఫర్గఢ్ 21 194 16,928 17,320 1 34,249 194 లిం.ఘణపురం 21 196 16,323 17,033 – 33,356 196 మొత్తం 110 1,024 85,180 87,322 4 1,72,506 1,024 జనగామ నియోజకవర్గం: జనగామ 21 198 16,892 17,092 – 33,984 198 నర్మెట 17 148 10,121 10,396 – 20,517 148 తరిగొప్పుల 15 126 8,009 8,079 – 16,088 126 బచ్చన్నపేట 26 238 19,322 20,208 1 39,531 238 మొత్తం 79 710 54,344 55,775 1 1,10,120 710 పాలకుర్తి నియోజకవర్గం: దేవరుప్పుల 32 274 18,610 18,723 – 37,333 274 పాలకుర్తి 38 336 26,189 26,675 1 52,865 336 కొడకండ్ల 21 190 14,202 14,468 2 28,672 190 మొత్తం 91 800 59,001 59,866 3 1,18,870 800 -
ఇద్దరు కాదు..ముగ్గురున్నా ఓకే
జనగామ: తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ చట్టం–2018లో కీలక నిబంధనను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ పంచాయతీ ఎన్నికల్లో కీలకం కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో 1994లో ఏపీ పంచాయతీ రాజ్ చట్టం నుంచి తీసుకున్న ఇద్దరు పిల్లల నిబంధన అమలులోకి వచ్చింది. మూడు దశాబ్దాల్లో రాష్ట్రంలో సమాజంలో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. ఆరోగ్య సేవల అభివృద్ధి, మహిళల్లో విద్యావకాశాలు పెరగడం, కుటుంబ నియంత్రణపై అవగాహన పెరగడం, ఆర్థిక స్థిరత్వం పెరగడం వంటివి జననాల రేటును గణనీయంగా తగ్గించాయి. జననరేటు ఇలాగే కొనసాగితే భవిష్యత్లో రాష్ట్ర జనాభా తగ్గుదలతో కార్మిక శక్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేసింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఎలక్షన్లలో పోటీ చేసే అవకాశం కల్నించాలనే ఉద్దేశంతో పంచాయతీ రాజ్ చట్టం–2018 లోని సెక్షన్ 21(3) ఇద్దరు పిల్లల నిబంధనను పూర్తిగా తొలగించారు. పంచాయతీ రాజ్ ఎన్నికల్లో ఇంతకాలం అర్హత కోల్పోయిన వేల మందికి తిరిగి పోటీ చేసే అవకాశం వచ్చేసింది. పంచాయతీచట్టంలో కీలకమార్పు..ఇద్దరు పిల్లల నిబంధన రద్దు మూడు దశాబ్దాల తర్వాత ముగ్గురు పిల్లల ఆశావహులకు వరం -
నిబంధన ఎత్తివేత హర్షణీయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడం హర్షణీయం. గత 30 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్నప్పటికీ ముగ్గురు సంతానం ఉండడంతో నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. మూడు దశాబ్దాలుగా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాం. – ఇల్లందుల సుదర్శన్, దళిత సంఘాల రాష్ట్ర నాయకుడుసర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ నిబంధన రద్దు కావడంతో నేటి నుంచి జరుగబోయే సర్పంచ్ ఎన్నికల్లో అందరికీ పోటీ చేసే అవకాశం ఉంటుంది. – రిజ్వాన్ బాషా షేక్, కలెక్టర్ -
ప్రతీ కార్యకర్త కథానాయకుడే
జనగామ: పంచాయతీ ఎన్నికల సమయంలో కేసీఆర్లాంటి నాయకున్ని ఇబ్బంది పెట్టకుండా ప్రతీ కార్యకర్త కథానాయకుడు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 29న కేసీఆర్ దీక్షా దివస్ సందర్భంగా బుధవారం వరంగల్ పర్యటనను పురస్కరించుకుని జనగామ య శ్వంతాపూర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి కేటీఆర్ మాట్లాడారు.. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ త్యాగం 16 ఏళ్ల పిల్లలకు తెలిసేలా దీక్షా దివస్ నిర్వహించాలన్నారు. జిల్లాలో దయాకర్రావు, పల్లా రాజేశ్వర్రెడ్డి, తాటికొండ రాజయ్యలాంటి మాస్ నాయకత్వం ఉందని, ముగ్గురు లీడర్ల పోరాట పటిమ గొప్పదన్నారు. కార్యకర్తల జోష్ చూస్తుంటే జనగామలో ఊరు, మునిసిపల్, సర్పంచ్, వార్డులు, జెడ్పీ, ఎంపీటీసీ స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమనే కాన్ఫిడెన్స్ తనకు ఉందన్నారు. స్టేషన్ఘన్పూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చిన పార్టీ మారిన కడియం శ్రీహరికి అక్కడి ఓటర్లు కర్రు కాల్చివాత పెట్టేందుకు ఎదురుచూస్తున్నారన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీలోకి రావాలని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, తన చివరి రక్తం బొట్టు వరకు కేసీఆర్తో ఉంటానని, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ తన విధేయతను చాటి చెప్పడం ఆయన నిజాయితీకి నిదర్శనమన్నారు. సీఎం రేవంత్రెడ్డి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినట్టే ఇచ్చి, మగవారికి మాత్రం జేబులు గుల్లచేస్తున్నాడని ఆరోపించారు. చీరల పేరిట రూ.300 చీరను రూ.1200గా చూపించి, సీఎం రేవంత్రెడ్డి వాటిపై రూ.450కోట్ల రుణం తీసుకున్నారన్నారు. బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం చేసిన నాటకాలు బయటపడ్డాయన్నారు. కేసీఆర్ చేపట్టిన సమగ్ర సర్వేలో బీసీలు 51శాతం ఉన్నారని తేలిస్తే, రేవంత్రెడ్డి కులగణనతో రేవంత్రెడ్డి 46 శాతానికి తగ్గించారన్నారు. ప్రభుత్వంలో మంత్రులు ప్రజాసమస్యలను గాలికి వదిలేయడంతోనే జనగామలో బ్రిడ్జి నిర్మాణం కోసం ఐదుగురు యువకులు గాడిదలకు వినతి పత్రం ఇచ్చి తమ నిరసననను ప్రజాస్వామ్యబద్ధంగా తెలిపితే జైలులో పెట్టడం సిగ్గుచేటన్నారు. నేటితరం పిల్లలకు కేసీఆర్ పోరాటం గురించి చెప్పాలి ‘స్టేషన్’లో కడియంకు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఊసరవెల్లికి మారుపేరు కడియం శ్రీహరి:ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి గులాబీ జెండా నీడన ఎమ్మెల్యేగా విజయం సాధించిన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఊసరవెల్లికి మారుపేరని, కాంగ్రెస్లో చేరి ద్రోహిగా మిగిలిపోయారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. ఉప ఎన్నికలు వస్తే కడియంను చిత్తుగా ఓడించేందుకు ఆ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జూబ్లీహిల్స్ లాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు: ఎర్రబెల్లి జూబ్లీహిల్స్లాంటి ఉప ఎన్నికలను తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ఓడిపోతే ముఖ్యమంత్రి సీటు పోతుందనే భయంతో వందల కోట్లు ఖర్చుపెట్టి చావుతప్పి, కన్నులొట్టపోయిన చందంగా గెలిచారన్నారు. కడియంకు సీఎం చివాట్లు: పోచంపల్లి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగానే, రాజీనామా చేస్తా అంటూ కడియం సీఎం వద్దకు వెళితే చివాట్లు పెట్టి పంపించారని ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి ఎద్దేవా చేశారు. ‘దొంగ ఓట్లతో గెలిచాం.. మరో సారి ఉపఎన్నికంటూ వెళితే ఓటమి తప్పదు..’అని సీఎం హెచ్చరించడంతో రాజీనామా చేసేది లేదంటూ కడియం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్నారు. -
పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు
జనగామ: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదిని ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో ఆమె బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 11, 14, 17న మూడు విడతల్లో పంచాయతీ ఎలక్షన పోలింగ్ ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల జియో లోకేషన్ వివరాలు టి–పోల్ వెబ్సైట్లో పొందుపరచాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పీళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా చేపట్టాలన్నారు. అనంతరం కాన్ఫరెన్న్స్ హాల్లో జరిగిన శిక్షణలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్తో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొని మాట్లాడారు..ఎన్నికల నిర్వహణలో ప్రతీ అధికారి పాత్ర కీలకమైందని, విధులు నిర్వహించే అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. సమావేశంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరీ చేతన్ నితిన్, జెడ్పీ సీఈఓ మాధురి షా, డీఆర్డీఓ వసంత, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. వీసీలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదిని -
వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం
పాలకుర్తి టౌన్: శ్రీచండికా సమేత సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుకొని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పంచామృత విశేష అభిషేకం, వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, అర్చకులు డీవీఆర్ శర్మ, దేవగిరి అనిల్కుమార్, మత్తగజం నాగరాజు, భక్తులు పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అబ్జర్వర్గా ఐఏఎస్ నిఖిలజనగామ: గ్రామపంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ కోసం జనగామ జిల్లా ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్గా డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్్స్టిట్యూట్ జాయింట్ డైరెక్టర్ జనరల్, ఐఏఎస్ అధికారి కె.నిఖిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిఖిలకు లింగాలఘణపురం తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జి.భగత్ను లైజన్ ఆఫీసర్గా నియమించారు. రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన ఉండాలిజనగామ రూరల్: విద్యార్థులకు రాజ్యాంగంపై తప్పనిసరిగా అవగాహాన ఉండాలని సీనియర్ సివిల్ జెడ్జి ఈ. సుచరిత అన్నారు. బుధవారం జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ లా సంవిధాన్ డే సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ ఎం.రవీంద్ర, ప్రధానో పాధ్యాయుడు శేఖర్రెడ్డి పాల్గొన్నారు. అంతర్జాతీయ సమ్మేళనానికి నర్మెట విద్యార్థులునర్మెట: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులు బాలసాహిత్యభేరి పేరుతో అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనం కార్యక్రమానికి ఎంపికై నట్లు ఆ పాఠశాల హెచ్ఎం నీలం వేణు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. తానా ప్రపంచ సాహిత్య వేదిక నవంబర్ 30న నిర్వహిస్తున్న సమ్మేళనానికి పాఠశాల 8వ తరగతి విద్యార్థిని ఎం.అభినిష, పదో తరగతి విద్యార్థిని ఎం.శ్రుతి ఎంపికై నట్లు పేర్కొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం కావాలి
స్టేషన్ఘన్పూర్: ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) బెన్ షాలోమ్ అన్నారు. మండలంలోని విశ్వనాథపురం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడుతూ.. కొనుగోళ్ల తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ఐలు శ్రీకాంత్, సతీశ్, ఏపీఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ -
‘నజరానా’ నారాజ్!
● ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10లక్షలు ఒట్టిదేనా? ● ఇప్పటికీ ఒక్క రూపాయీ ఇవ్వలేదంటూ ప్రజల చర్చ లింగాలఘణపురం: సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం గత ఎన్ని కల సమయంలో రూ.10లక్షల నజరానా ప్రకటించి నేటికీ ఏ ఒక్క పంచాయతీకి కూడా అందజేయలేదు. ఎన్నోసార్లు ఆయా గ్రామాల ఏకగ్రీవ సర్పంచ్లు అధికారులకు, మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో మళ్లీ ఎన్నికలొచ్చేసరికి గ్రామాల్లో చర్చమొదలైంది. ‘గప్పుడే చెప్పిండ్రు..అంతా ఒట్టిదే అయ్యింది.. ఇంతవరకు ఏ ఒక్క పంచాయతీకి ఒక్కపైసా రాలే..గట్లనే అంటరు ఏం ఇయ్యరు..’అంటూ చ ర్చించుకుంటున్నారు. మండలంలో 21 పంచాయతీలకు గాను సిరిపురం, ఏనెబావి, మంథోనిగూడెం, నేలపోగుల ఏకగ్రీవం కావడంతో ఎంతో ఉత్సాహంతో సర్పంచ్లు గ్రామాభివృద్ధికి పాటు పడగా నజరానా రాకపోవడంతో నిరాశలో పడ్డారు. -
ప్రజల్లో చైతన్యం రగిలించిన వందేమాతరం
స్టేషన్ఘన్పూర్: దేశస్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతర గేయం ప్రజల్లో ఉత్తేజాన్ని, చైతన్యాన్ని నింపిందని వందేమాతరం గేయాలాపన ప్రోగ్రాం రాష్ట్ర కన్వీనర్ నాగపురి రాజమౌళిగౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ అన్నారు. వందేమాతరం గేయాన్ని బంకించంద్రఛటర్జీ రచించి 150 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో వందేమాతరం సామూహిక గేయాలాపన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. స్థానిక ప్రభు త్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులతో కలిసి జాతీ య జెండాలను చేతబూని వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక శివాజీ చౌక్ వద్ద సామూహికంగా వందేమాతరం ఆలపించారు. మండల అధ్యక్షుడు సట్ల వెంకటరమణగౌడ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పార్లమెంట్ కోకన్వీనర్ ఇనుగాల యుగేందర్రెడ్డి, నాయకులు ఐలోని అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వందేమాతరం గేయాలాపన ప్రోగ్రాం రాష్ట్ర కన్వీనర్ నాగపురి రాజమౌళిగౌడ్ -
మహిళా సాధికారతకు పెద్దపీట
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి, సాధికారతకు సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన 8,178 మహిళా సంఘాలకు రూ.17.36 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల వడ్డీ రాయితీ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చీరలు పట్టు చీరలలాగా ఎంతో బాగున్నాయని..‘ఎంపీ అయిన మా కావ్యకు కూడా ఒక చీర ఇవ్వాలి’ అని కలెక్టర్ను కోరారు. ‘తాను ఊరికే అనడం లేదని, ఇకపై మహిళలకు సంబంధించిన సమావేశాలకు ఆ చీరను ధరించి రావాలని, మహిళా సంఘాలకు చెందిన పాటను పాడుతూ వారితో కలిసి ఆడిపాడాలి..’అని కావ్యకు ఎమ్మెల్యే కడియం సూచించగా కలెక్టర్, ఎంపీతో పాటు సభికులందరి ముఖాల్లో నవ్వుల పూలుపూయించారు. కార్యక్రమంలో ఎంపీ కావ్య, కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీఆర్డీఓ వసంత, డీపీఎం సతీష్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరి నర్సింహులు, ఘన్పూర్ మండల సమాఖ్య అధ్యక్షురాలు బేతి మంజుల, కోశాధికారి వి.లక్ష్మి, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు. -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి జనగామ రూరల్: విద్యాహక్కు చట్టం అమలుకు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..టెట్పై సుప్రీంకోర్టు తీర్పు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రివ్యూ పిటిషన్ వేయలేదని, కనీసం డిసెంబర్ 1 నుంచి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనైనా చట్టాన్ని సవరించి సీనియర్ ఉపాధ్యాయుల ఉద్యోగాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మడూరి వెంకటేష్, ఆకుల శ్రీనివాసరావు, కోశాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సాధారణ ప్రసవాలు పెంచాలి
జనగామ: ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలను పెంచడంతో పాటు రెగ్యులర్ డెలివరీల సంఖ్య పెరగాలని వరంగల్ ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ కడియం కావ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలులో ఎంపీ కడియం కావ్య అధ్యక్షతన దిశ (జిల్లా అభివృద్ధి సహకార మానిటరింగ్ కమిటీ) సమావేశం జరిగింది. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్ షాలోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ పాల్గొనగా, జిల్లా గ్రామీణభివృద్ధిశాఖ, విద్య, వైద్యం, ఆరోగ్యం, జాతీయ రహదారుల విభాగం, రోడ్లు భవనాలు, తదితర శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల పురోగతిపై సమీక్షించారు. ఈసందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ.. పేదలకు సేవ చేయడమే మనందరి లక్ష్యమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా నేతృత్వంలో జిల్లా యంత్రాంగం కృషితో అభివృద్ధి, అవార్డులు, పథకాల్లో జనగామ కేంద్ర, రాష్ట్ర స్థాయిలో దూసుకుపోతోందని కితాబిచ్చారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. 12 మండలాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఒక సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని తెలిపారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ.. విద్యాశాఖను బలోపేతం చేసేందుకు చేపట్టిన వివిధ కార్యక్రమాలతో మంచి సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. సాధారణ ప్రసవాలపై ఎంపీ అసంతృప్తి జిల్లాలోని ఎంసీహెచ్, సీహెచ్సీల్లో వచ్చే మూడు నెలల కాలంలో 70శాతానికి పైగా సాధారణ ప్రసవాలు పెంచాలని ఎంపీ కడియం కావ్య సూచించగా.. జిల్లావె వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్రావు, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం డెలివరీ ప్రగతిని వివరించారు. 40 శాతం సాధారణ, 60 శాతం ఆపరేషన్లు జరిగినట్టు వివరించగా ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాన్పు సమయంలో సదరు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి, సాధారణ డెలివరీకి డాక్టర్లు ప్రయత్నం చేయాలన్నారు. వచ్చే దిశ సమావేశంలో అపరేషన్ చేసిన ప్రతి డెలివరీకి సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. సంస్థాగత డెలివరీలతో పాటు సాధారణ ప్రసవాలను పెంచేలా దృష్టి సారించాలని ఆదేశించారు. గర్భిణులు మొదటి చెకప్ నుంచి చివరి వరకు ఆశాలు, ఏఎన్ఎం, అంగన్వాడీల పర్యవేక్షణ ఉండాలన్నారు. వచ్చే సమీక్షలో ప్రతీ సిజేరియన్కు వైద్యులు సమాధానం చెప్పాలి జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది దిశ సమీక్షలో వరంగల్ ఎంపీ, కమిటీ చైర్మన్ కడియం కావ్య రహదారులపై చర్చ జిల్లాలోని జనగామ–దుద్దెడ, వరంగల్–హైదరాబాద్ హైవేలపై చర్చ జరిగింది. పెంబర్తి నుంచి కరుణాపురం 45 కిలోమీటర్ల పరిధిలోని నిడిగొండ, ఛాగల్, చిన్నపెండ్యాల, స్టేషన్ఘన్పూర్, కరుణాపురం ఐదు లొకేషన్ల పరిధిలో రోడ్డు మరమ్మతుల కోసం రూ.5.3కోట్లు మంజూరు కాగా, పనులు ప్రారంభం కావాల్సి ఉన్నట్లు అధికారులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు సేఫ్టీ కోసం 20 లొకేషన్ల పరిధిలో సోలార్ సిస్టం, ఇతర ప్రమాద నివారణ చర్యలు తీసుకునేందుకు మరో రూ.4కోట్లు మంజూరు అయినట్లు వివరించారు. మలుపులు, యూటర్న్, హైవేపై వీధి దీపాలు, ఇతర ప్రమాద ఘటనలకు సంబంధించి చర్యలు శూన్యమని ఎంపీ కావ్య అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. నేషనల్ హైవేపై సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశించారు. బచ్చన్నపేట రోడ్డు నిర్మాణానికి సంబంధించి కోర్టు ప్రాసెస్ ముగిసిన వెంటనే పనులు మొదలవుతాయని ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. రహదారుల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లేకుండా తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని దిశ కమిటీ మెంబర్ బక్క శ్రీనివాస్ అన్నారు. సమావేశంలో డీఆర్డీఓ వసంత, దిశా కమిటీ సభ్యులు మాధవి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2025
జనగామ: రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను మంగళవారం విడుదల చేసింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల జాబితా, పోలింగ్ తేదీలు, ఓట్ల లెక్కింపు తదితర కార్యక్రమాల తేదీలు అధికారికంగా ప్రకటించారు. ఈసీ ప్రకటనతో గ్రామాలన్నీ ఎలక్షన్ మూడ్లోకి వెళ్లిపోయాయి. జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అభివృద్ధి పనులకు బ్రేక్ పడనుంది. మూడు దశల్లో పోలింగ్.. జిల్లాలో ఎలక్షన్లు మూడు దశల్లో జరగనున్నాయి. జిల్లాలోని 12 మండలాలు, 280 గ్రామ పంచాయతీలు, 2,534 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 11వ తేదీన తొలి విడత, 14వ తేదీన రెండో విడత, 17వ తేదీన మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి ఫేజ్ నామినేషన్ నవంబర్ 27, రెండో ఫేజ్ నామినేషన్ నవంబర్ 30, మూడో విడత నామినేషన్ డిసెంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికల ఒక దశ మరొక దశకు మధ్య 2 రోజుల వ్యవధి ఉండనుంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సమయం నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. బాధ్యతల కేటాయింపు.. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని ఆర్ఓలు, ఏఆర్ఓలు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఏిపీఓలు, ఓపీఓలకు బాధ్యతలు కేటాయించారు. పోలింగ్ సెంటర్లు, సీసీ కెమెరాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, మోడల్ కోడ్ పర్యవేక్షణ బృందాలు ఇక రంగంలోకి దిగనున్నాయి. పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డబ్బులు, బహుమతుల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలను అరికట్టేందుకు ప్రత్యేక స్క్వాడ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రతీ పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలతో పకడ్బందీ పర్యవేక్షణ ఉండనుంది. జిల్లాలో మూడు విడతల్లో ఎలక్షన్లు 280గ్రామ పంచాయతీలు, 2,534 వార్డులు.. అమలులోకి మోడల్ కోడ్ అభివృద్ధి పనులకు బ్రేక్మూడు విడతల్లో ఎన్నికలు జరిగే మండలాల సమాచారంఫేజ్ మండలాలు జీపీలు వార్డులు ఫేజ్–1 చిల్పూరు, స్టేషన్ఘన్పూర్, 110 1,024 రఘునాథపల్లి, జఫర్గడ్, లింగాలఘణపురం ఫేజ్–2 జనగామ, నర్మెట, తరిగొప్పుల, బచ్చన్నపేట 79 710ఫేజ్–3 దేవరుప్పుల, పాలకుర్తి, 91 800 కొడకండ్ల -
వడ్డీలేని రుణాలు విడుదల
జనగామ: జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి 2025 జూలై వరకు స్వయం సహాయ సంఘాలకు భారీగా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు అనుబంధంగా ఉన్న సెర్ప్ ద్వారా సంఘాలకు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, ఎంపీలు కావ్య, చామల కిరణ్కుమార్రెడ్డి, ఇతర ప్రజాప్రతిధుల చేతుల మీదుగా పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా నాలుగు విడతల్లో జిల్లాకు 9,216 సంఘాలకు రూ.30.53 కోట్లు విడుదల చేశారు. నియోజకవర్గాల వారీగా.. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో 4,248 సంఘాలకు రూ.14.91 కోట్లు విడుదలయ్యాయి. చిల్పూర్, స్టేషన్ఘన్పూర్, లింగాలఘణపురం, రఘునాథపల్లి, జఫర్గఢ్ మండలాల స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నారు. జనగామ నియోజకవర్గంలో 2,558 సంఘాలకు రూ.8.89 కోట్లు మంజూరు చేశారు. రుణాలకు సంబంధించిన నిధులను బచ్చన్నపేట, జనగామ, నర్మెట, తరిగొప్పుల మండలాలకు కేటాయించారు. పాలకుర్తి పరిధిలో 2,410 సంఘాలకు రూ.6.73 కోట్లు రుణాలు మంజూరు కాగా, దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాల పరిధిలోని సంఘాలు లబ్ధి పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సంఘాల ఆర్థిక స్థిరీకరణ కోసం ప్రభుత్వం వడ్డీలేని రుణాలను అందజేస్తోందని అధికారులు చెప్పారు. జిల్లాలోని 9,216 సంఘాలకు రూ.30.53కోట్లు పండగలా సాగుతున్న పంపిణీ -
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ రూరల్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో జనగామ పట్టణం, జనగామ, నర్మెట, తరిగొప్పుల, బచ్చన్నపేట మండలాలకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాలకు డీఆర్డీఏ ఆధ్వర్యంలో వడ్డిలేని రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. వడ్డీలేని రుణాల పథకం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, డీఆర్డీఏ వసంత, మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
అనాథ పిల్లలకు చేయూత
జనగామ: జనగామ పట్టణం నెహ్రూ పార్క్ ఏరియాలోని సెయింట్పాల్స్ స్కూల్ యాజమాన్యంతో పాటు విద్యార్థులు సోమవా రం అనాథ పిల్లలకు భారీ విరాళం అందజేశారు. పాఠశాలలో నిర్వహించిన బాలల దినో త్సవం, ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా సేకరించిన రూ.1,12,217లను కరుణాలయం ఆశ్రమంలో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియ జోసఫ్ ఆధ్వర్యంలో ఫాదర్ అలెక్స్కు విరాళంగా అందించారు. అనంతరం మరియ జోసఫ్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. సెయింట్పాల్స్ విద్యార్థులు చదువుతో పాటు సేవాపరంగా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారన్నారు. కొమురవెల్లి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుడిగా నర్సింహారెడ్డినర్మెట: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి దేవస్థాన ఉత్సవ కమిటీ సభ్యుడిగా మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, డీసీసీ ఉపాధ్యక్షుడు గంగం నర్సింహారెడ్డి ఎంపికయ్యారు. ఈపదవిలో డిశంబర్ 10 నుంచి 2026 మార్చి 21 వరకు ఆయన కొనసాగనున్నట్లు దేవాదాయ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి సుధాకర్రెడ్డి, గడ్డం వివేక్, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, మాజీ శాసన సభ్యుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి తదితర నాయకులకు ఈసందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ నిర్మాణానికి రూ.50వేల విరాళంబచ్చన్నపేట: మండలంలోని రామచంద్రాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ శివసీతారామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి దాతలు ఆర్థిక సహాయాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. గ్రామానికి ఎండీ షర్పద్దీన్ తన నానమ్మ, తాత ఎండీ సకినాబి, బాస్మియా, తండ్రి మునిరుద్దీన్ జ్ఞాపకార్థం రూ.50,116లను విరాళంగా అందించారు. ముస్లిం అయి ఉండి కూడా హిందూ దేవాలయానికి ఆర్థిక సహాయం అందించిన షర్పద్దీన్ను గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో సిద్దేశ్వరాలయ కమిటీ చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, నాయకులు సుంకె కనుకయ్య, నాచగోని సిద్దులు, బండపల్లి శంకరయ్య, బక్కెర సిద్దయ్య, నర్మెట చంద్రమౌళి, అంజనేయులు, జయరాం, మోహన్రెడ్డి పాల్గొన్నారు. ‘టీచర్ల తనిఖీ బృందం’లో చోటు కోసం పైరవీలు? జనగామ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన, ఉపాధ్యాయుల పనితీరు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తదితర వాటి పర్యవేక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీచర్ల తనిఖీ ప్రోగ్రాంలో పైరవీలకు పెద్దపీట వేస్తున్నారనే సమాచాం వినిపిస్తోంది. జిల్లాలో టీచర్ల తనిఖీ బృందాలకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో తుది జాబితా విడుదల కానుంది. ఈనేపథ్యంలో తనిఖీ బృందాల్లో తాము సైతం ఉండబోతున్నామనే కొందరి ప్రచారంతో ఉపాధ్యాయ సంఘాల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. తనిఖీల కోసం దరఖాస్తు చేసుకున్న టీచర్లు పని చేసే బడుల్లో గత ఏడాది, ప్రస్తుతం పరిశీలిస్తే విద్యార్థుల సంఖ్య తగ్గినట్టు తెలుస్తోంది. బడుల్లో పిల్లల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా.. పట్టింపుల్లేకుండా వ్యవహరించే పలువురు టీచర్లు తనిఖీ అధికారిగా బాధ్యతలు వచ్చేస్తున్నాయని ముందస్తుగా తమ సహచర టీచర్లతో మాట్లాడుకోవడం విద్యాశాఖలో చర్చకు దారి తీస్తోంది. తనిఖీ బృందానికి సంబంధించి అత్యంత సీక్రెట్గా జాబితా తయారు చేస్తున్నప్పటికీ, ముందస్తు లీకేజీలు ఏంటనే ప్రశ్న విద్యాశాఖ పనితీరును ఎండగడుతుంది. క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలికేయూ క్యాంపస్ : చదువుతోపాటు క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలని కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య సూచించారు. మంగళవారం కేయూలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో స్పోర్ట్స్డే సందర్భంగా వివిధ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భిక్షాలు మాట్లాడుతూ.. కళాశాలలో ప్రతి ఏటా విద్యార్థినులకు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. -
మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి
● ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాలకుర్తి టౌన్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో మండలంలోని స్వయం సహాయక సంఘాలకు రూ.6.73 కోట్లు వడ్డీరహిత రుణాల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అలాగే ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం, రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకుసాగుతాయన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిర మహిళా శక్తి టీ పాయింట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వసంత, ఏపీడీ నూరుద్దీన్, తహసీల్దార్ సరస్వతి, ఎండీపీఓ వేదావతి తదితరులు పాల్గొన్నారు. -
భక్తుల సౌకర్యార్థం రేకుల షెడ్డు నిర్మాణం
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఘాట్ రోడ్డు మార్గంలో భక్తుల సౌకర్యార్థం ఓ భక్తుడు రూ.5లక్షల వ్యయంతో సోమవారం నిర్మాణ పనులు ప్రారంభించినట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న తెలిపారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి గ్రామానికి చెందిన భక్తుడు వంగ సోమిరెడ్డి, ప్రభాకర్రెడ్డి కుటుంబ సభ్యులు ఘాట్ రోడ్డు మార్గంలో ప్రయాణించే భక్తులకు ఎండా కాలం, వర్షాకాలం ఇబ్బందులు కలగకుండా ఘాట్ రోడ్డు మార్గంలో రూ. 5 లక్షల వ్యయంతో రేకుల షెడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, సిబ్బంది పాల్గొన్నారు. మాతృమరణాలు జరగకుండా చూసుకోవాలిజనగామ రూరల్: మాతృ మరణాలు జరగకుండా చూసుకోవాలని డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు అన్నారు. సోమవారం పట్టణంలోని ఎంసీహెచ్లో ఇప్పగూడెం, నర్మెట, తరిగొప్పుల పలు పీహెచ్సీల్లో మాతృ మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..మాతృ మరణాల ఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అంతేకాక నాణ్యమైన గర్భధారణ పూర్వసేవలు అందించడం, హైరిస్క్ ప్రెగ్నెన్సీలను ముందస్తుగా గుర్తించాలన్నారు. అనంతరం పట్టణంలోని ఏఎన్ఎంలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు కమల్ హాసన్, శ్రీతేజ, అనురాధ జాదవ్, శ్రీదేవి,అశోక్, మనస్విని, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు సింధురఘునాథపల్లి: మండలంలోని కుర్చపల్లి గ్రామానికి చెందిన తోకల సింధు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటి జాతీయ స్థాయి జట్టుకు ఎంపికై నట్లు మండలంలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఎన్ఐహెచ్ కబడ్డీ కోచ్ తోటకూరి గట్టయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ మియాపూర్ బాచుపల్లిలో సోమవారం జరిగిన అండర్–16 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో సింధు ప్రతిభ చాటి జాతీయ స్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణజనగామ రూరల్: విద్యార్థులకు నైతిక విలువలు, పాజిటివ్ లెర్నింగ్, వ్యక్తిత్వ వికాసం, సామాజి కాభివృద్ధి, ఆరోగ్యం, రక్షణ, నాయకత్వ ప్రస్థానం, సేవా దృక్పథం తదితర బోధనాంశాలపై ఉపాధ్యాయులు పట్టు సాధించాలని లయన్స్ క్వెస్ట్ మాస్టర్ ట్రైనర్ లయన్ కొండపల్లి రేణుక, కానుగంటి సుభాశ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏకశిల బీఈడీ కళాశాలలో రెండు రోజుల పాటు ఉపాధ్యాయ శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ లయన్ రామిని శ్రీనివాసులు, కారంపూడి సత్య నారాయణ, సుదగాని ప్రవీణ్, కె.రాజశేఖర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ మర్రెడ్డి పాల్గొన్నారు. -
సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైతే రూ.25లక్షలు
స్టేషన్ఘన్పూర్: పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే నజరానాగా రూ.10 లక్షలు, సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేస్తే రూ.25 లక్షలు నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాన్ని ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కడియం మాట్లాడారు.. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక గ్రామ కమిటీలు, మండల కమిటీలదేనని అన్నారు. ఈనెల 26వ తేదీవరకు ప్రతీ గ్రామం నుంచి ఇద్దరు, ముగ్గురు పేర్లతో అభ్యర్థుల ప్రతిపాదనలు అందించాలని గ్రామ కమిటీలు, మండల కమిటీలను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుడోజు రాంబాబు, ఏఎంసీ చైర్మన్ లావణ్యశిరీష్రెడ్డి, చిల్పూరు దేవస్థాన చైర్మన్ శ్రీధర్రావు, నాయకులు బెలిదె వెంకన్న, నూకల ఐలయ్య, కట్టా మనోజ్రెడ్డి, అన్నం బ్రహ్మారెడ్డి, క్రాంతి, కొలిపాక సతీష్, వెంకటేశ్వర్రెడ్డి, బూర్ల శంకర్, వెంకటయ్య, ఇంద్రారెడ్డి, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
బాయికాడ బందోబస్తు
నిఘానీడలో వ్యవసాయ క్షేత్రాలు, డెయిరీ ఫామ్స్లింగాలఘణపురం/పాలకుర్తిటౌన్: టెక్నాలజీ సులభతరమై సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాలు, డెయిరీ ఫామ్లు సైతం నిరంతరం నిఘా నీడలో ఉంటున్నాయి. తక్కువ ఖర్చుతో అన్నదాతలు తమ వ్యవసాయ బావుల వద్ద ఏం జరుగుతుందనే విషయాలను తెలుసుకుంటూ ప్రశాంతంగా ఉంటున్నారు. బావుల వద్ద దొంగల బెడద, పాడిపశువులు, వ్యవసాయ పరికరాల చోరీ, లేగదూడలపై కుక్కల దాడి, పశువులు ఈనె సమయంలో రాత్రింబవళ్లు అక్కడే ఉండకుండా ఫోన్లో చూసుకుంటూ, ఏదైనా అనుకోని ఘటనతో జరిగితే తక్షణమే బావు ల వద్దకు వెళ్లి సమస్య పరిష్కారం చేసుకుంటు న్నారు. అలాగే జీతగాళ్లు వ్యవసాయ బావుల వద్ద ఉన్నారా లేదా.. రాత్రివేళల్లో ఎవరు వస్తున్నారు.. ఎటుపోతున్నారనే విషయాలను తెలుసుకొనేందుకు సోలార్ సీసీ కెమెరాలను ఏర్పా టు చేసుకొని ఫోన్లో చూసుకుంటూ పర్యవేక్షించుకుంటున్నారు. నిరక్షరాస్యులు సైతం ఆపరేట్ చేసేలా.. నిరక్షరాస్యులు సైతం తక్కువ ఖర్చుతో సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని ఆపరేట్ చేసుకొనే అవకాశం వచ్చింది. ఉన్నచోటు నుంచి బావి వద్ద ఉన్న సీసీ కెమెరాలో అక్కడి వ్యక్తితో మాట్లాడుకోవచ్చు. ఇలా రూ.6,700ల నుంచి స్థోమతను బట్టి రైతులు బావుల వద్ద సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవచ్చు. గతంలో మాది రిగా సీసీ కెమెరాలకు కేబుల్ అవసరం లేకుండా ఆన్లైన్లోనే ఫోన్ మాదిరిగా పని చేస్తుంది. ఆయా ప్రాంతాల్లో నెట్వర్క్ను బట్టి సిమ్ను ఉపయోగించుకొని రీచార్జ్ చేసుకుంటే సరిపోతుంది. బావులు, డెయిరీ ఫామ్ల వద్దకు ఎవరైనా వస్తే వెంటనే ఫోన్కు అలెర్ట్ మెసేజ్ వస్తుంది. దీంతో రైతు ఎక్కడున్న ఫోన్లోనే చూసుకొని స్పందించవచ్చు. దొంగలు వచ్చిన, పశువులు ఈనినా, కోళ్ల దొంగతనం జరిగినా ఇలా ఏ విషయంలోనైనా చర్యలు తీసుకొని రైతులు హాయిగా ఉంటున్నారు. కెమెరాకు సంబంధించిన యాప్ను డౌన్లోడ్ చేసుకొని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకుంటే రెండు, మూడు ఫోన్లకు లింక్ చేసుకోవచ్చు. మెమొరీ కార్డు ర్యామ్ను బట్టి వారం నుంచి నెల రో జుల పాటు రికార్డింగ్ అందుబాటులో ఉంటుంది. పలు గ్రామాల్లో సొలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చీమ చిటుక్కుమన్నా ఫోన్లో అలెర్ట్ రైతన్నకూ చేరువైన అధునాతన టెక్నాలజీ -
ఆన్లైన్లో బుక్ చేసుకున్నా..
వ్యవసాయ బావుల వద్ద తరుచుగా జరుగుతున్న చిన్నచిన్న దొంగతనాలను ఎలా అరికట్టాలని ఆన్లైన్లో చూసి యూట్యూబ్లో అగ్రికల్చర్ సీసీ కెమెరా గురించి తెలుసుకున్నా.. రూ.8,500లకు సోలార్ సీసీ కెమెరాను కొనుగోలు చేశా. డెయిరీ ఫామ్లో రేకులపై సోలార్ ప్యానల్ ఏర్పాటు చేశా.. కెమెరా దొడ్లో పెట్టా. ఎవరొచ్చినా సుమారు 15 నుంచి 30 మీటర్ల దూరంలో ఉండగానే నేను ఎక్కడున్న ఫోన్కు మెసేజ్ వచ్చి అలెర్ట్ చేస్తుంది. దీంతో ఫోన్ చూసుకొని ఏం జరుగుతుందనే విషయాలను ఫోన్లోనే చూసుకుంటున్నా.. – బోయిని సంతోష్, పాడి రైతు, లింగాలఘణపురం -
పాడిపశువును కాపాడుకున్నా..
బావి వద్ద డెయిరీఫామ్, గొర్రెల ను పెంచుకుంటున్నా. రూ. 6,700లతో ఆన్లైన్లో సోలార్ సీసీ కెమెరాలను ఏర్పా టు చేసుకున్నా.. నెలకు రూ.300లు రీచార్జ్ చేసుకొని అక్కడ జరిగే ప్రతి అంశం ఫోన్లో రికార్డు అవుతుండగా చూసుకుంటున్నా.. ఒక రోజు పాడి ఆవు దాణా కోసం కట్టేసిన చోటు నుంచి ముందుకు వచ్చి ఎటూ వెళ్లలేక ఇబ్బంది పడుతుండగా ఫోన్లో చూసుకొని వెంటనే వచ్చి కాపాడుకున్నా. గొర్రెల దొడ్డి చుట్టూ రాత్రివేళల్లో కుక్కల మంద తిరుగుతుండగా చూసుకొని ఇంట్లోనే ఉండి వెంటనే ఫోన్లో అరవగా కుక్కలు పారిపోయాయి. – నకీర్త మల్లేశం, పాడి రైతు, కళ్లెం -
దొంగల బెడద తప్పింది
గతంలో పొలం పనుల చేసి అలసిపోయి వ్యవసాయ పరికరాలు బావి దగ్గరే వదిలేసి ఇంటికి వెళ్లేవాళ్లం. అయితే దొంగలు మోటార్లు, స్టార్టర్లు, పశువులు, గొర్రెలు, కోళ్లను ఎత్తుకెళ్లేవారు. పంట పొలంలో ఉన్న ట్రాన్స్పార్మర్లోని కాపర్ వైరు ఎత్తుకెళ్లారు. దీంతో పలువురం రైతులం వ్యవసాయ భూమి హద్దులకు నాలుగు దిక్కుల నాలుగు సీసీ కెమెరాలను కర్రల సహాయంతో ఏర్పాటు చేసుకున్నాం. సీసీ కెమెరాల సాయంతో నా పొలం చుట్టు ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నా ఫోన్ లోనే చూసుకుంటున్నా. – నారబోయిన పవన్కుమార్, రైతు, వావిలాల, పాలకుర్తి మండలం -
దేశాన్ని ఐక్యం చేసింది వందేమాతరమే
● బీజేపీ రాష్ట్ర నాయకుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిజనగామ రూరల్: దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతర గీతం ప్రజలను ఐక్యం చేసిందని బీజేపీ రాష్ట్ర నాయకుడు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అన్నారు. వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ పార్క్ నుంచి రైల్వే స్టేషన్ వరకు పెద్దఎత్తున జాతీయ జెండాలు చేత పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గుజ్జుల ప్రేమేందర్రెడ్డి మాట్లాడుతూ.. స్వతంత్ర సంగ్రామంలో వందేమాతర గేయం భారతీయులను ఉత్తేజపర్చిందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఆరుట్ల దశమంతరెడ్డి, కేవీఎల్ రెడ్డి, బుడుగుల రమేశ్, మహంకాళి హరిశ్చంద్రగుప్తా, డాక్టర్ భిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి భాగాల నవీన్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బొమ్మకంటి అనిల్, సీనియర్ నాయకులు అంకుగారి శశిధర్రెడ్డి, బీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు శివకృష్ణ, హరి ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఘనంగా కొత్తపల్లి ఉర్సు
స్టేషన్ఘన్పూర్: మండలంలోని కొత్తపల్లి గ్రామంలో దర్గా హజరత్ సయ్యద్ మీరా మొహియుద్దీన్షా ఖాద్రి రహమతుల్లా అలై ఉర్సు ఉత్సవాలను గ్రామ దర్గా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు ఉత్సవాలను ప్రారంభించగా ఏసీపీ భీమ్శర్మ, సీఐ జి.వేణు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉర్సు ప్రార్థనల్లో అనంతరం సందల్ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో ఎస్.రాజేశ్, మాజీ సర్పంచ్ బూరు నరేందర్, దర్గా కమిటీ బాధ్యులు షౌకత్, అజ్జు, అన్వర్బేగ్, అమ్జద్, ఇమ్రాన్, రహీమ్, రహమాన్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్తరిగొప్పుల: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, కొనుగోళ్లలో రైతుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. మండలంలోని నర్సాపూర్, అబ్దుల్నాగారంలో సోమవారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీని పరిశీలించారు. అనంతరం అబ్దుల్నాగారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేశారు. ప్రతీ మహిళకు చీర అందాలని సూచించారు. ధాన్యాన్ని తేమ శాతం రాగానే కొనాలని, ఎక్కువ రోజులు కొనకుండా ఉంచి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేజీబీవీని తనిఖీ చేసిన కలెక్టర్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. దిక్సూచిలో భాగంగా నిర్వహించిన హెల్త్ క్యాంపులో అందరికీ హెల్త్కార్డులు అందించారా, లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మొగుళ్ల మహిపాల్రెడ్డి, ఎంపీడీఓ బోజనపల్లి లావణ్య, ఎంపీఓ కృష్ణకుమారి, ఆర్ఐ ఆంఽధ్రయ్య, మాజీ ఎంపీటీసీ తాళ్లపల్లి అనితారాజేశ్వర్గౌడ్, పంచాయతీ కార్యదర్శులు రవీందర్, శేఖర్ పాల్గొన్నారు. -
రిజర్వేషన్ల వారీగా వార్డు స్థానాలు
మండలం వార్డులు 100 శాతం ఎస్టీ ఎస్సీ బీసీ జనరల్ ఎస్టీ బచ్చన్నపేట 238 – 01 44 74 119 చిల్పూరు 168 06 19 30 32 81 దేవరుప్పుల 274 40 36 40 41 117 స్టేషన్ఘన్పూర్ 146 18 – 38 26 64 జనగామ 198 06 13 39 44 96 కొడకండ్ల 190 56 21 29 17 67 లింగాలఘణపురం 196 – 06 42 50 98 నర్మెట 148 40 16 22 16 54 పాలకుర్తి 336 60 33 49 56 138 రఘునాథపల్లి 320 24 22 65 58 151 తరిగొప్పుల 126 30 09 21 33 48 జఫర్గఢ్ 194 20 11 37 39 87 మొత్తం 2,534 300 187 456 471 1,120 -
ఎంపీడీఓ సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
జనగామ రూరల్: తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం జిల్లా ఎన్నికలు సోమవారం జరిగాయి. ఎన్నికల అధికారిగా జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య నిర్వహణాధికారి మాధురి కిరణ్ చంద్ర షా వ్యవహరించారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా కొడకండ్ల ఎంపీడీఓ పి.ఎం.ఎస్.సూరి, ప్రధాన కార్యదర్శిగా జి.మమత(ఎంపీడీఓ బచ్చన్నపేట), ట్రెజరర్గా వేదవతి (ఎంపీడీఓ, పాలకుర్తి), వైస్ ప్రెసిడెంట్ జి.శ్రీనివాసులు (ఎంపీడీఓ, రఘునాథపల్లి), ఆర్గనైజింగ్ సెక్రెటరీ బి.మహేశ్నాయక్ (ఎంపీడీఓ, జనగామ), అసోసియేట్ ప్రెసిడెంట్ శివశంకర్రెడ్డి (ఎంపీడీఓ లింగాల ఘనపూర్), కార్యనిర్వాహక సభ్యులుగా శంకర్ నాయక్ (ఎంపీడీఓ చిల్పూర్), కావ్య శ్రీనివాస్ ఎంపీడీఓ నర్మెట లావణ్య (ఎంపీడీఓ తరిగొప్పుల), మేనక (ఎంపీడీవో దేవరుప్పుల) ఎన్నికయ్యారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ను, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ను మర్యాద పూర్వకంగా కలిశారు. -
కలం గళమై చైతన్యం రగిలించిన అందెశ్రీ
● తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర కార్యదర్శి జోగు అంజయ్య జనగామ రూరల్: తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో కలం గళంతో ప్రజల్లో చైతన్యం రగిలించిన తెలంగాణ నిప్పుల వాగై ఉప్పొంగిన లోక కవి అందెశ్రీ అని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర కార్యదర్శి జోగు అంజయ్య కొనియాడారు. ఆదివారం పట్టణంలోని గబ్బెట గోపాల్రెడ్డి భవన్లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ అందెశ్రీ సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంజయ్య పాల్గొని అందెశ్రీకి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పశువుల కాపరి నుంచి జీవితాన్ని ప్రారంభించి స్వయం కృషితో కలాన్ని చేతబట్టి గళాన్ని విప్పిన గొప్ప వాగ్గేయకారుడు అందెశ్రీ అన్నారు. అందెశ్రీ మరణం సాహితి ప్రపంచానికి తీరని లోటని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సాహితి సాంబరాజు యాదగిరి, కవులు కళాకారుల ఐక్యవేదిక, జి.వై.గిరి ఫౌండేషన్ జి.కృష్ణ, జనగామ రచయితల సంఘం నక్క సురేష్, కవి హృదయం సాహిత్య వేదిక పెట్లోజు సోమేశ్వరాచారి, అభినందన కల్చరల్ సొసైటీ అయిలా సోమనర్సింహచారి, పోతన సాహిత్య వేదిక మాన్యపు భుజేందర్, కవులు కొలిపాక బాలయ్య, మసురం రాజేంద్రప్రసాద్, వసంత, అంకాల సోమయ్య, కానుగంటి వెంకటేశం, చీటూరు నర్సింహులు, గాదరి సుధాకర్, గూటం రమేష్, చాపల మహేందర్, మామిండ్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదమని తెలిసి..పట్టాలు దాటి..
● నెలరోజులుగా స్టేషన్ఘన్పూర్ ఎఫ్ఓబీ మూసివేత ● ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులుస్టేషన్ఘన్పూర్: డివిజన్ కేంద్రమైన స్టేషన్ఘన్పూర్ రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్ఓబీ) శిథిలావస్థకు చేరి పాక్షికంగా కుంగిపోవడంతో రైల్వే అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. నెలరోజులు గడుస్తున్నా ఇంతవరకూ మరమ్మతు పనులు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం.. ఫుట్ ఓవర్ బ్రిడ్జి మరమ్మతు విషయంలో రైల్వేశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు శాపంగా మారింది. రైల్వేస్టేషన్ నుంచి రెండో ప్లాట్ఫారం పైకి వెళ్లే ప్రయాణికులు, రెండో ప్లాట్ఫారం నుంచి రైల్వేస్టేషన్కు, ఒకటో ప్లాట్ఫారానికి వచ్చే ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రమాదమని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు దాటి వెళ్లాల్సి వస్తోంది. ప్రతీరోజూ వివిధ పనులపై వందలసంఖ్యలో ప్రజలు సికింద్రాబాద్, వరంగల్, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే రెండో ప్లాట్ఫారంపైకి వచ్చే రైళ్లు ఎక్కడానికి ప్రయాణికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి మూసివేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పట్టాలపై నుంచి వెళ్తున్నారు. ఇప్పటికై నా రైల్వే అధికారులు స్పందించి ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. -
వందేళ్ల ఉత్సవాన్ని విజయవంతం చేయాలి
● సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్.రాజారెడ్డిలింగాలఘణపురం: సీపీఐ వందేళ్ల శత వార్షికోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే ఉత్సవాలను విజయవంతం చేయాలని సీపీఐ జనగామ జిల్లా కార్యదర్శి సీహెచ్.రాజారెడ్డి కోరారు. సీపీఐ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 15న మొదలైన శత ఉత్సవాల ప్రచార జాత ఆదివారం మండలంలోని నెల్లుట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా మండల కార్యదర్శి సదానందం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ.. 1925లో దేశంలో ఏర్పాటైన సీపీఐ స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర పోషించిందన్నారు. ప్రచార జాతలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లాఖాద్రి, జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ, నాయకులు నరేంద్ర ప్రసాద్, ఉప్పలయ్య, సాయ్య, సోమయ్య, సుగుణమ్మ, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాలే ఏకై క మార్గం.. దేవరుప్పుల: ప్రజాసమస్యల పరిష్కారం కోసం పాలకులపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాలే ఏకై క మార్గమని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి అన్నారు. సీపీఐ మండల కార్యదర్శి జీడీ ఎల్లయ్య ఆధ్వర్యంలో ప్రచార జాతా కడవెండి దొడ్డి కొమురయ్య, కామారెడ్డిగూడెం షెక్ బందగీ, దేవరుప్పులలో అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకోగా అమరులకు ఘన నివాళులు అర్పించారు. -
ఇక పోషణ్వాడీ!
లింగాలఘణపురం: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, బాలింతలకు ఇప్పటికే అనేక రకాలుగా పౌష్టికాహార లోపం లేకుండా చేపట్టిన కార్యక్రమాలకు తోడుగా మరింత పటిష్టంగా కేంద్ర ప్రభుత్వం సాక్షం అంగన్వాడీ 2.0 పేరుతో పోషణ్ వాటికలను ఏర్పాటు చేయనుంది. అందుకు జిల్లాలోని మూడు ఐసీడీఎస్ పరిధిలో 695 అంగన్వాడీ కేంద్రాల్లో 227 కేంద్రాలను ఎంపిక చేసి ఒక్కొక్క కేంద్రానికి ఐదేళ్లకు గాను రూ.10వేల చొప్పున జిల్లాలో రూ.22.70 లక్షలు విడుదల చేసింది. అందులో చేపట్టాల్సిన పనులు.. అంగన్వాడీ కేంద్రాల ఆవరణలో 10+10 అడుగుల చదరపు విస్తీర్ణంలో మొక్కలు, మూలికల చెట్లు పెంచేందుకు స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందులో 6 రకాల విత్తనాలు ఉద్యానవనశాఖ ఎంపిక చేసిన పాలకూర, తోటకూర, మెంతికూర, టమాట, వంకాయ, మిరపకాయ విత్తనాలను అదేవిధంగా ఔషధ, పండ్ల మొక్కలు మునగ, బొప్పాయి, కరివేపాకు, నిమ్మ, ఉసిరి, దానిమ్మ, అంతేకాకుండా లెమన్గ్రాస్, తిప్పతీగ, శతావరి వంటి మొక్కలను నాటి వాటి నుంచి వచ్చే ఫలాలను చిన్నారులకు, బాలింతలకు అందజేయాలని నిర్ణయించింది. ఖర్చు నిబంధనలు.. పోషణ్ వాటికల ఏర్పాటుకు ఐదేళ్లకు గాను విత్తనా లకు రూ.3వేలు, రవాణా ఖర్చు రూ.వెయ్యి, బెడ్ల తయారీకి రూ.వెయ్యి కాగా ఐదేళ్ల నిర్వహణ సాగునీటి ఖర్చు మరో రూ.5వేలుగా నిర్ణయించింది. అంగన్వాడీల్లో పోషణ్ వాటికల ఏర్పాటు జిల్లాలో 227 కేంద్రాల ఎంపిక ఐదేళ్లకు రూ.22.70లక్షలు విడుదల ఇక అంగన్వాడీల వద్దనే పౌష్టిక ఆహార పంటల సాగు227 కేంద్రాల ఎంపిక జిల్లాలోని 695 అంగన్వాడీ కేంద్రాలకుగానూ సొంత భవనాలు, వసతులు కలిగిన 227 కేంద్రాలను ఎంపిక చేసింది. అందులో జనగామ ఐసీడీఎస్ పరిధిలో 257 కేంద్రాలకు 80, కొడకండ్ల పరిధిలోని 183 కేంద్రాలకు 66, స్టేషన్ఘన్పూర్లోని 255 కేంద్రాలకు 81 కేంద్రాలను ఎంపిక చేసి ఒక్కొక్కదానికి రూ.10వేలు విడుదల చేసింది. అందులో విత్తనాలకు సంబంధించిన డబ్బులను మినహాయించి మిగిలిన డబ్బులు ఆయా అంగన్వాడీ కేంద్రాల ఖాతాలో జమ అయ్యాయి. జిల్లాలో పోషణ్ వాటిక కింద ఎంపికై న అంగన్వాడీ కేంద్రాల్లో అక్కడక్కడ పనులు మొదలయ్యాయి. విత్తనాల డబ్బులు మినహా మిగతా డబ్బులు ఆయా కేంద్రాల ఖాతాలో జమ అయ్యాయి. ఈ పథకంతో మరింత పౌష్టిక ఆహారం అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. – కోదండరామ్, ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ, జనగామ -
మహిళా సంక్షేమానికి పెద్దపీట
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి ● ఘన్పూర్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీస్టేషన్ఘన్పూర్: సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొనియాడారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో నియోజకవర్గంలోని జనగామ జిల్లాలోని ఐదు మండలాలకు చెందిన మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఆర్డీఓ డీఎస్ వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడారు.. కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరీలో, నిర్మాణంలో జనగామ జిల్లాలో ఘన్పూర్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని, ప్రజలందరి ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ది చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన చీరలు దిష్టిబొమ్మలకు కట్టారు: ఎంపీ కావ్య గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చిన చీరలు నాణ్యత లేకుండా ఉండేవని, పొలాల్లో దిష్టిబొమ్మలకు కట్టేవారని ఎంపీ కడియం కావ్య ఆరోపించారు. కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ రాంబాబు, డీఆర్డీఓ వసంత, డీపీఎం సతీశ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బెలిదె వెంకన్న, ఏఏంసీ చైర్పర్సన్ లావణ్యశిరీష్రెడ్డి, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, ఏపీఎంలు ప్రసాద్, పిట్టల నరేందర్, కె.కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
నేటి ప్రజావాణి రద్దు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ రూరల్: ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధ ప్రక్రియతో పాటు స్వయం సహాయక సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు విధి నిర్వహణలో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్టు కలెక్టర్ చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి కలెక్టరేట్కు ఎవరూ రాకూడదని, సహకరించాలని కలెక్టర్ కోరారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక లింగాలఘణపురం: మండలంలోని వనపర్తి ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని కాళీ మౌనిక రాష్ట్రస్థాయి జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు ఎంఈఓ విష్ణుమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం హన్మకొండలో జేఎన్ఎస్లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ చాంపియన్షిప్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో మౌనిక ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యేలా తీర్చిదిద్దిన వ్యాయామ ఉపాధ్యాయుడు పూజారి కుమార్ను, ఎంపికై న విద్యార్థిని మౌనికను ఉపాధ్యా య బృందం, గ్రామస్తులు అభినందించారు. రాష్ట్రస్థాయిలో ఉజ్వలకు ప్రథమ బహుమతి లింగాలఘణపురం: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ పదో తరగతి విద్యార్థిని బి.ఉజ్వలకు వచన కవితల విభాగంలో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి లభించినట్లు ఎంఈఓ విష్ణుమూర్తి, ప్రిన్సిపాల్ సునిత తెలిపారు. ఈ నెల 14న జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ వారు నిర్వహించిన వచన కవిత విభాగంలో బహుమతులు పొందిన వారికి ఆదివారం హైదరాబాద్లో బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతా బయోటెక్, శాంతా వసంత్ ట్రస్టు సంయుక్తంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కె.ఐ.వరప్రసాద్, మాజీ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి చేతుల మీదుగా రూ.2వేల నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం అందుకుంది. ఈ సందర్భంగా విద్యార్థిని ఉజ్వలను ఉపాధ్యాయులు అభినందించారు. ఎన్ఎంఎంఎస్ పరీక్షకు 14 మంది గైర్హాజరు జనగామ రూరల్: జాతీయస్థాయి ఎన్ఎంఎంఎస్(నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీం) ప్రవేశ పరీక్షకు 14 మంది గైర్హాజరయ్యారని ప్రభుత్వ పరీక్షల సహాయ సంచాలకుడు టి. రవికుమార్ తెలిపారు. ఆదివారం ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ఎలాంటి సమస్యలు లేకుండా ముగిసిందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 4 పరీక్షా కేంద్రాల్లో 728 మంది విద్యార్థులకు గానూ 714 మంది హాజరు కాగా 14 మంది పరీక్షకు గైర్హాజరయ్యారని, 98.08 శాతంగా హాజరు నమోదైందని తెలిపారు. వనదేవతలకు మొక్కులు ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం వేలాదిగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జంపన్నవాగులో స్నానాలు ఆచరించి వనదేవతల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్య, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల వద్ద పూజలు నిర్వహించారు. మొక్కుల అనంతరం మేడారం పరిసరాల ప్రాంతాల్లో వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేసి సందడి చేశారు. -
ఒకేచోట మక్కలు, వడ్లు
● మార్కెట్లో స్థలం లేక రైతుల ఇబ్బందులు ● కొనుగోళ్లలో జాప్యంతో పడిగాపులుపాలకుర్తి టౌన్: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని, రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మడానికే మొగ్గుచూపుతున్నారు. మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుసేవా సహకార సంఘం ఆధ్వర్యంలో జిల్లా మొత్తం ఒకే మక్కల కొనుగోలు కేంద్రం ఇక్కడే ఏర్పాటు చేశారు. మార్కెట్లో మక్కలు, వడ్లు ఒకేచోట పోయడంతో సరిపోను స్థలం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏఈఓలు టోకెన్ ఇస్తేనే కాంటా పెడతామని సొసైటీ అధికారులు అంటున్నారని రైతులు వాపోతున్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో తీవ్రమైన జాప్యంతో ధాన్యం కుప్పల వద్ద కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందంటున్నారు. పగలంతా ఎండలో, రాత్రి తీవ్రమైన చలితో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. సొసైటీ సిబ్బంది కొనుగోలు వేగవంతం చేయడం లేదని, అధికారులు స్పందించి వెంటవెంటనే ధాన్యం కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.. ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. రైతులు తీసుకొచ్చిన ధాన్యం, మక్కలను వరుస క్రమంలో ఏఈఓలు ఇచ్నిన టోకెన్ ప్రకారమే కొనుగోలు చేస్తున్నాం. జిల్లా మొత్తంమీద పాలకుర్తిలోనే మక్కల కొనుగోలు కేంద్రం ఉండడంతో ఇప్పటి వరకు 2,500 క్వింటాల్ మక్కలు కొనుగోలు చేశాం. –సత్యనారాయణరెడ్డి, ఎండీ, రైతు సేవా సహకార సొసైటీ, పాలకుర్తి -
వాట్సాప్లో ‘మీసేవ’
● పౌరసేవలు మరింత సులభం ● మొబైల్ ద్వారా సర్టిఫికెట్లు పొందే అవకాశంపాలకుర్తి టౌన్: పౌరసేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా అన్ని రకాల అవసరాల కోసం వివిధ సర్టిఫికెట్లు పొందడానికి ఇక ప్రభుత్వ కార్యాలయాలు, మీసేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే చేతిలో మొబైల్ ద్వారా సేవలను పొందవచ్చు. ప్రజలకు అవసరమైన సేవలు, సర్టిఫికెట్లను త్వరగా, సులభంగా అందించాలనే లక్ష్యంతో మీ సేవను ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా అందుబాటులోకి తెచ్చింది. సేవలు ఎలా పొందవచ్చంటే.. ● స్మార్ట్ ఫోన్ ఉపయోగించి వాట్సాప్ ద్వారా సేవలు పొందవచ్చు. ● మందుగా మొబైల్లో మీ సేవ నంబర్ 8096958096ను సేవ్ చేసుకోవాలి. ● వాట్సాప్ నంబర్కు హెచ్ఐ లేదా ఎంఈఎన్యూ(మెనూ) అని టైప్ చేసి సెండ్ చేయాలి. ● మీసేవలో ప్రసత్తుం అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవల జాబితా వస్తుంది. ● ఆధార్ ప్రక్రియ పూర్తి చేసి, అవసరమైన సేవను ఎంపిక చేసుకోవాలి. ● దరఖాస్తు ఫారమ్ను ఇంటర్ఫేజ్ ద్వారా నింపవచ్చు. ● దరఖాస్తు చేసే సేవకు అవసరమైన డాక్యుమెంట్లు స్కాన్ చేసి వాట్సాప్లో అప్లోడ్ చేయాలి. ● సేవ ఆధారంగా నిర్ణయించిన ఫీజును ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా చెల్లించచ్చు ● దరఖాస్తు స్టేటస్, అప్డేట్స్ వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం పొందవచ్చు ● సర్టిఫికెట్, డాక్యుమెంట్ అప్రూవ్ అయితే, దాని డౌన్లోడ్ లింక్ వాట్సాప్కు వస్తుంది ● అనంతరం దానిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మొబైల్ వాట్సాప్ సేవలను ఎక్కడ నుంచి అయిన పొందవచ్చు. 580 సేవలు.. మీ సేవ ప్లాట్ఫామ్ ద్వారా అందుబాటులో ఉన్న 580 సేవలు, ఇక వాట్సాప్ చానల్ కిందకు తీసుకొస్తారు. ప్రస్తుతానికి సర్టిఫికెట్లు పొందడానికి అవకాశం ఉంది. వీటిని దశల వారీగా పెంచుకుంటూ పూర్తి సేవలు వాట్సాప్ ద్వారా పొందే అవకాశం కల్పించనున్నారు. ఆదాయం, కులం, నివాస, జనన, మరణ, మార్కెట్ విలువ, వివాహ రిజిస్ట్రేషన్ తదితర సర్టిఫికెట్ల కోసం వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రెవెన్యూ, పోలీస్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పంచాయతీరాజ్, విద్యుత్, నీటి, ఆస్తి పన్ను, ఆలయాలు, పౌర సరఫరాల సేవలు పొందవచ్చు. -
లెక్కలు తలకిందులు
సోమవారం శ్రీ 24 శ్రీ నవంబర్ శ్రీ 2025జనగామ: జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ ఆదివారం పూర్తికావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వేడి మొదలైంది. రిజర్వేషన్ల ప్రకటనతో రాజకీయ సమీకరణాలలో మార్పులు చోటుచేసుకున్నాయి. గత రిజర్వేషన్లతో పోలిస్తే ఈసారి జనరల్ కేటగిరీ పెరగడం, బీసీ స్థానాలు తగ్గడం, ఎస్టీ కేటగిరీ పెరగడం రాజకీయ నాయకుల లెక్కలను తలకిందులు చేసింది. జనగామ, స్టేషన్ఘన్పూర్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో రాజకీయ పార్టీల సమక్షంలో ఆర్డీఓలు గోపిరామ్, వెంకన్న ఆధ్వర్యంలో లాటరీ విధానంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. పంచాయతీరాజ్ చట్టం నిబంధనల మేరకు మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయింపులు పారదర్శకంగా పూర్తయ్యాయి. జిల్లాలో 12 మండలాల పరిధిలో 280 గ్రామపంచాయతీల పరిధిలో 2,534 వార్డులకు సంబంధించి ఎంపీడీఓలు రిజర్వేషన్లు ఖరారు చేశారు. పార్టీల వ్యూహాలు–స్వతంత్రుల కసరత్తు తాజా రిజర్వేషన్లలో లెక్కలు మారడంతో పలువురు ఆశావహులకు నిరాశకు లోనయ్యారు. ఆయా గ్రామాల్లో మహిళలకు ఉన్న స్థానాలు జనరల్గా మారడం ఉత్సాహాన్ని పెంచింది. అధికార పార్టీతో పాటు బీజేపీ, వామపక్ష పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు కూడా ముందస్తుగా ప్రజల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. పల్లెల్లో ఎన్నికల వాతావరణం.. పల్లెల్లో టీ దుకాణాలు, సెలూన్లు, కిరణా దుకాణాలు, ప్రధాన కూడళ్ల వద్ద సమావేశాలతో ఎక్కడ చూసినా సర్పంచ్ రిజర్వేషన్ గురించే చర్చ జరుగుతోంది. గ్రామం ఏ కేటగిరీలో పడింది, ఈసారి ఎవరికి అవకాశం వంటి ప్రశ్నలతో ప్రజలు స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు, వారి అనుచరులు వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. జిల్లా రిజర్వేషన్ల తీరు ఇలా.. జిల్లా వ్యాప్తంగా 280 జీపీల వారీగా కేటాయించిన రిజర్వేషన్లలో ప్రతీ సామాజిక వర్గానికి జీవో నిబంధనలను అనుసరించి కేటాయింపులు చేశారు. జిల్లాలో ప్రస్తుతం సామాజిక వర్గాల వారీగా కేటాయింపులు జరిగిన రిజర్వేషన్ల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జనరల్ కేటగిరీల్లో 23.21శాతం, జనరల్ మహిళ విభాగంలో 20.71 శాతంతో మొత్తం జనరల్ వర్గం వాటా 43.92 శాతం ఉంది. బీసీ జనరల్లో 8.93, బీసీ మహిళ కేటగిరీలో 7.14 శాతం కలుపుకుని మొత్తం బీసీ వర్గం వాటాగా 16.07 శాతంగా లెక్కించారు. ఎస్సీ జనరల్లో 11.07 శాతం, ఎస్సీ మహిళా విభాగంలో 8.21 శాతం కలుపుకుని మొత్తంగా ఎస్సీ వర్గం వాటా 19.28 శాతం ఉంది. ఎస్టీ వర్గం 100 శాతం గ్రామాలు కలుపుకొని ఎస్టీ జనరల్ 12.14 శాతం, ఎస్టీ మహిళ 8.57 శాతంతో మొత్తంగా ఎస్టీ వర్గం వాటా 20.71 శాతం కేటాయించారు. జిల్లా మొత్తం రిజర్వేషన్లలో సామాజిక వర్గం మొత్తంగా పరిశీలన చేస్తే జనరల్ 43.92 శాతం, బీసీ 16.07 శాతం, ఎస్సీ 19.28 శాతం, ఎస్టీ 20.71 శాతంగా ఉంది. ప్రతీ వర్గంలో మహిళలకు గణనీయమైన స్థాయిలో అవకాశాలు రావడం ప్రత్యేకతగా నిలిచింది. రిజర్వేషన్ పంపిణీ జిల్లాలో సామాజిక న్యాయాన్ని ప్రతిబింబిస్తూ, అన్ని వర్గాలకు న్యాయమైన అవకాశాలు లభించేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ముగిసిన సర్పంచ్ రిజర్వేషన్ల ప్రక్రియ జనరల్ కేటగిరీలో సీట్లలో పెరుగుదల బీసీ సీట్లలో తగ్గుదల తాజా రిజర్వేషన్లతో ఆశ..నిరాశ అభ్యర్థుల వేటలో రాజకీయ పార్టీలుఅధికార–పోలీసుల ఏర్పాట్లు వేగవంతం ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం, రెవెన్యూ, పంచాయతీరాజ్ విభాగాలు ముందస్తు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. పోలీసు శాఖ సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి బందోబస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అదనపు బలగాలు, రాత్రి పర్యవేక్షణ, సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ తదితర వాటికి సంబంధించి దృష్టిసారిస్తున్నారు. -
వేటు పడింది
జనగామ: బచ్చన్నపేట పంచాయతీ కార్యదర్శులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎంపీఓ వెంకట మల్లికార్జున్ను తాత్కాలికంగా నర్మెట మండలానికి డిప్యుటేషన్పై పోస్టింగ్ ఇస్తూ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘దందా ఎంపీఓ’లు.. ‘వేటా? బదిలా?’ శీర్షికలతో సాక్షిలో ప్రచురితమైన వరుస కథనాలకు కలెక్టర్ స్పందించారు. బచ్చన్నపేట ఎంపీఓ పంచాయతీ సెక్రెటరీలను ఇబ్బందులకు గురిచేస్తూ వసూళ్ల దందాపై ఈ నెల10వ తేదీన కలెక్టర్కు ఫిర్యాదు అందగా, 12వ తేదీన విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఫిర్యాదు చేసిన సెక్రెటరీల వాంగ్మూలం తీసుకుని నివేదికను కలెక్టర్కు అందించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం విచారణ పెండింగ్ దశలో ఉండగా, ఆరోపణలను పరిగణలోకి తీసుకుని ఎంపీఓను నర్మెటకు బదిలీ చేశారు. విచారణ పూర్తయ్యేవరకు ఎంపీఓ వెంకట మల్లికార్జున్ నర్మెట మండలంలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు బచ్చన్నపేట ఎంపీడీఓ కార్యాలయం సూపరింటెండెంట్ కె.శ్రీనాథ్రెడ్డికి అదనపు చార్జి అప్పగించడంతో పాటు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. చక్రం తిప్పింది ఎవరు..? ఎంపీఓ మల్లికార్జున్ను సస్పెన్షన్కు గురికాకుండా కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు రంగంలోకి దిగి గండం నుంచి గట్టెక్కించిన్నట్లు చర్చ జరుగుతోంది. ఎంపీఓపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు రాగా, మరో ఎంపీఓ సైతం ఇన్సూరెన్స్ పాలసీలు, వేధింపులకు సంబంధించి ఆరోణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీనిపై ఎలాంటి విచారణ లేకపోవడం గమనార్హం. బచ్చన్నపేట ఎంపీఓ బదిలీ కొనసాగుతున్న విచారణ నర్మెటకు పోస్టింగ్ -
ఎక్కడ..!?
బడే దామోదర్ ● మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న దామోదర్ ● ఆయన స్వస్థలం ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ● లొంగుబాటు ప్రయత్నాలపైనా సోషల్ మీడియాలో వైరల్ ● ఆయన పేరిట నాయకులు, వ్యాపారులకు ఫోన్ కాల్స్?సాక్షిప్రతినిధి, వరంగల్ : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, ఉమ్మడి వరంగల్కు చెందిన బడే దామోదర్ అలియాస్ చొక్కారావు ఎక్కడ? ఇటీవల సాగుతున్న వరుస లొంగుబాట్లు, ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఆయన వ్యూహం ఏమిటీ? ఓ వైపు ఛత్తీస్గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నాడంటుండగా.. మరోవైపు లొంగుబాటు ప్రయత్నం చేస్తున్నాడని వైరల్ అవుతోంది? ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్, సౌత్బస్తర్, ఏఓబీలలో కీలకమైన బడే దామోదర్ ఎక్కడున్నాడు? ఏం జరుగుతోంది? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇటీవల ములుగు జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులకు ఆయన పేరిట ఫోన్ కాల్స్ రావడం, ఓ రాజకీయ నేతను కలవాలని సూచించడం కూడా కలకలం రేపుతోంది. దామోదర్ వ్యూహం ఏమిటో... ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన బడే దామోదర్ది సీపీఐ (మావోయిస్టు) పార్టీ ఉద్యమ చరిత్రలో ఓ అధ్యాయం. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ 2021 జూన్ 21న కోవిడ్ బారిన పడి మృతిచెందగా.. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన బాధ్యతలను దామోదర్కు పార్టీ అప్పగించింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో కీలకంగా మారిన ఈయన ఈ ఏడాది జనవరిలో పూజారి కాంకేర్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వైరలైంది. ఐదారు రోజుల వ్యవధిలో దామోదర్ బతికే ఉన్నట్లు మావోయిస్టు పార్టీ నాయకత్వం ప్రకటించింది. ఈ 11 నెలల వ్యవధిలో మావోయిస్టు పార్టీ నాయకత్వం ఎన్నో ఉత్థానపతనాలను చూసింది. అగ్రనేతలు ఎన్కౌంటర్లకు గురికావడం.. కేంద్ర కమిటీ స్థాయి నాయకులు, పెద్ద సంఖ్యలో దళసభ్యులు ఆయుధాలతో లొంగిపోవడం లాంటి సంఘటనలు జరిగాయి. ఇదే క్రమంలో ఏఓబీ సరిహద్దు మారేడుమిల్లి ఏరియాలో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో హిడ్మా సహా 13మంది మృతిచెందడం... పదుల సంఖ్యలో ముఖ్య నేతలను విజయవాడలో అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించడం ఆ పార్టీ మనుగడకు సవాల్గా పరిణమించింది. ఇదే సమయంలో బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ తదితరులు సైతం లొంగిపోతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎటునుంచి ప్రకటన వెలువడలేదు.కాల్వపల్లికి చెందిన మావోయిస్టు అగ్రనేత బడే దామోదర్ పేరిట కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులకు ఫోన్ కాల్స్ వస్తుండటం కలకలంగా మారింది. తాను దామోదర్ను అంటూ ఫోన్ చేస్తున్న సదరు వ్యక్తి.. జిల్లా అటవీ ప్రాంతానికి చెందిన ఓ నాయకుడిని కలిసి డబ్బులు ఇవ్వాలని సూచించడం వివాదాస్పదమవుతోంది. ఇటీవల ఇద్దరు అధికార పార్టీ నాయకులు, ముగ్గురు ఇసుక వ్యాపారులకు దామోదర్ పేరిట ఫోన్లు రావడం.. ఆ ఫోన్లో మాట్లాడిన పలు విషయాలను బహిరంగంగానే మాట్లాడుకుంటుండటం గమనార్హం. నిత్యనిర్బంధంమధ్య దామోదర్ ఎక్కడున్నాడు.. ఎలా ఉన్నాడు.. అన్న చర్చ జరుగుతున్న తరుణంలో దామోదర్ వాయిస్తో ఫోన్లో చేస్తున్నదెవరు? ఒకవేళ దామోదరే అయితే ఎవరిని కలవమన్నారు? అనే అంశాలు ఇప్పుడు హాట్టాపిక్గా మారాయి. -
భక్తిశ్రద్ధలతో పోలిపాడ్యమి దీపారాధన
జనగామ: కార్తీక మాసం ముగింపు సందర్భంగా జిల్లావ్యాప్తంగా పోలిస్వర్గం పాడ్యమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ నగేశ్వర వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలతో పాటు దీపోత్సవం,నందీశ్వర అభిషేకం, అర్ధ నారీశ్వరీ అన్నపూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పజ్జూరి గోపయ్య బుద్దా రమేశ్, మహంకాళి హరిశ్చంద్ర గుప్తా, పుల్లూరు శ్రీనివాస్, గంగిశెట్టి మంజునాథ్, గోపిశెట్టి శ్రీనివాస్, లగిశెట్టి వీరలింగం, వంగపల్లి చంద్రశేఖర్, నంగునురి లక్ష్మీనారాయణ, గోపిశెట్టి నాగరాజు పాల్గొన్నారు. బాలాజీనగర్ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో నీటికొలను ఏర్పాటు చేసి వాటిలో అరటి దొప్పల్లో దీపాలను వదిలి భక్తిని చాటుకున్నారు. -
ప్రతిభావంతులకు భరోసా
జనగామ రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా పేద విద్యార్థులు మధ్యలోనే చదువులను మానేస్తున్నారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం వల్ల ప్రతిభ ఉండి చదువుకు దూరమయ్యే విద్యార్థులకు ఉన్నత చదువులు చదివే అవకాశం ఉంది. ఈనెల 23న జిల్లావ్యాప్తంగా పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షకు మెరిట్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. అర్హత సాధిస్తే 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి 12 వేలు కేంద్రం అందిస్తుంది. గత ఏడాది జిల్లా నుంచి 35మంది విద్యార్థులు అర్హత సాధించారు. అవగాహన తప్పనిసరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చాలామంది పేద, మధ్య తరగతివారే ఎక్కువగా ఉంటారు. తల్లిదండ్రులు అంతగా చదువులేనివారు కావడంతో ఇలాంటి పరీక్షల వల్ల అవగాహన ఉండదు. ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులే చొరవ తీసుకుని పిల్లలచే పరీక్షలు రాయిస్తే వారిని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు మంచి భవిష్యత్ ఉంటుంది. పరీక్ష విధానం.. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి. మెంటల్ ఎబిలిటీ (ఎంఏటీ), స్కాలస్టిక్ ఎబిలిటీ (ఎస్ఏటీ), ఏడు, ఎనిమిదో తరగతికి సంబంధించిన గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 180 మార్కులకు పరీక్ష ఉండగా ప్రశ్నపత్రం రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్– ఏలో మానసిక సామర్థ్య పరీక్ష 90 మార్కులకు 90 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ, సంఖ్యాశాస్త్రం, పదాల భిన్న పరీక్ష, నంబర్ అనాలజీ, ఆల్ఫాబెట్ అనాలజీ, కోడింగ్, డీకోడింగ్, లాజికల్ ప్రశ్నలు, వెన్ చిత్రాలు, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ సంబంధించిన అంశాలు ఉంటాయి. పార్ట్–బీలో ఏడు, 8వ తరగతికి సంబంధించి 30 ప్రశ్నలకు 30 మార్కులు కేటాయించారు. వాటిలో గణితం 20, సామాన్య శాస్త్రం 35, సాంఘిక శాస్త్రం 35మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. హాజరుకానున్న 729 మంది విద్యార్థులు ఈనెల 23న ఎన్ఎంఎంఎస్ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 729 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పట్టణంలోని జెడ్పీఎస్ఎస్ ధర్మకంచ పాఠశాల, ప్రభుత్వ హైస్కూల్ జనగామ, సోషల్ వెల్ఫేర్, జెడ్పీఎస్ఎస్ బాలికల పాఠశాల స్టేషన్ ఘన్పూర్ మొత్తం నాలుగు సెంటర్లు సిద్ధం చేశారు. డీవోలు, ఎస్వోలను నియమించారు. ఉదయం 9.30 నుంచి 12.30 వరకు మూడు గంటల పరీక్ష ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 103 ఉన్నత పాఠశాల్లో 8వ తరగతి చదువుతున్న వారు 729 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే హాల్టికెట్లు విడుదల కాగా పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. –టి.రవికుమార్, సహాయ సంచాలకుడు, ప్రభుత్వ పరీక్షల విభాగం రేపు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్ష 4 సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి అర్హత సాధిస్తే ఏడాదికి రూ.12 వేలు జిల్లావ్యాప్తంగా 729 మంది విద్యార్థులు -
‘కడియం’ మరోసారి
● స్పీకర్ ప్రసాద్ కుమార్ను కలిసిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే ● వివరణకు మరింత సమయం కోరిన కడియం శ్రీహరి ● పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై ఏం తేలనుంది..? ● హాట్టాపిక్గా మారిన ‘అనర్హత పిటిషన్’ల విచారణసాక్షిప్రతినిధి, వరంగల్ : మాజీ మంత్రి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్.. సుప్రీం ఆదేశాలతో ఊపందుకున్న విచారణ ఉమ్మడి వరంగల్లో హాట్టాపిక్గా మారింది. సుప్రీంకోర్టు డైరక్షన్ మేరకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. పార్టీ ఫిరాయింపుల (బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిక) అభియోగం ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి, వివరణలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం ఈ నెల 23న హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు గురువారమే స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులు కూడా ఇచ్చారు. అయితే రెండు రోజుల ముందే శుక్రవారం స్పీకర్ను కలిసిన కడియం శ్రీహరి వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కోరారు. ఆయన అభ్యర్థన మేరకు స్పీకర్ సమయం ఇస్తారా? లేదా?.. సమయం ఇస్తే ఎన్ని రోజులు ఇస్తారు? అన్న సస్పెన్స్ కొనసాగుతుండగా, ఈ ఎపిసోడ్లో కడియం శ్రీహరి వ్యూహం ఏమిటనేది పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరగుతోంది. స్పీకర్ నిర్ణయం కోసం వెయిటింగ్.. కేడర్తో సమాలోచనలు.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి శాసనసభ స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేయడంతో కడియం శ్రీహరి శిబిరంలో అలజడి మొదలైంది. జూలై నుంచి మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాల్సి ఉండగా ఆలస్యమైంది. సుప్రీంకోర్డు ఆగ్రహించి నాలుగు వారాల గడువు ఇవ్వగా.. స్పీకర్ ఇటీవల విచారణకు సంబంధించిన ప్రక్రియలో వేగం పెంచారు. ఈ నేపథ్యంలోనే నోటీసు అందుకున్న శ్రీహరి హైదరాబాద్లో మకాం వేసి నిపుణులతో చర్చించి అభిప్రాయాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. స్పీకర్ నోటీసుపై వివరణ ఇచ్చేందుకు మరోసారి గడువు కోరినట్లు సమాచారం. ఆయన అభ్యర్థనను స్పీకర్ ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారు? ఎన్ని రోజులు సమయం ఇస్తారు? అనే దానిపై శ్రీహరి నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉంటే నోటీసులు తీసుకున్నప్పటినుంచి శ్రీహరి.. భవిష్యత్ కార్యాచరణపై తనకున్న ముఖ్య నేతలు, కేడర్ సమాలోచనల్లో పడ్డారని అనుచరవర్గాల సమాచారం. స్పీకర్ను కలిశా.. సమయం కోరా.. శాసనసభాపతి గురువారం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో శుక్రవారం వారిని కలిశాను. వాస్తవానికి నాపై నమోదైన పిటిషన్పై 23న వివరణ ఇవ్వాల్సి ఉంది. వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరేందుకు స్పీకర్ను కలిశా. నా అభ్యర్థన లేఖపై స్పీకర్ స్పందించి ఇచ్చే గడువు ప్రకారం వివరణ ఇస్తా. – కడియం శ్రీహరి, ఎమ్మెల్యే -
పథకాల అమలులో మీడియాది ప్రధానపాత్ర
జనగామ రూరల్: ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రతీ నిరుపేదకు అందించే ప్రక్రియలో మీడియా రంగానిది ప్రధాన పాత్ర అని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కొనియాడారు. వివిధ అంశాల్లో కేంద్ర, రాష్ట్ర స్థాయిలో అవార్డులు వచ్చిన నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫ రెన్స్ హాల్లో మీడియా ప్రతినిధులకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జల సంచయ్ జన భగీదారి కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయిలో జిల్లాకు అవార్డు వచ్చిన సందర్బంగా క్షేత్రస్థాయిలో కృషి చేసిన వివిధ శాఖల అధికారులకు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజామహేంద్ర నాయక్, ఆర్డీఓ వెంకన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని తదితరులు పాల్గొన్నారు. జనగామ: మొబైల్ ఫోన్ల రికవరీలో జిల్లా పోలీసుల సేవలు భేషుగ్గా ఉన్నాయని వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ కితాబిచ్చారు. శుక్రవారం జనగామ ఏసీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి డీసీపీ అప్పగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలన్నారు. జనగామ పోలీస్ స్టేషన్ పరిధిలో 20, నర్మెట 1, బచ్చన్నపేట 2, తరిగొప్పుల 2, స్టేషన్ఘన్పూర్ 2, చిల్పూరు 4, రఘునాథపల్లి 1, వర్ధన్నపేట 5, రాయపర్తి 3, పాలకుర్తి 2, కొడకండ్ల 4, దేవరుప్పుల 4 ఫోన్లు ఉండగా, డీసీపీ చేతుల మీదుగా యజమానులకు అందించారు. ఏసీపీ భీంశర్మ, సీఐలు సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు. జనగామ రూరల్: నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్లో ఖాళీగా ఉన్న (7) ఎంఎల్హెచ్సీ(మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్) పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి కె.మల్లికార్జున రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. అభ్యర్థులు https:// jangaon. telangana. gov. in వెబ్సై ట్ నుంచి దరఖాస్తు పత్రాలను డౌన్ లోడ్ చేసుకోవాలన్నా రు. ఎంబీబీఎస్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యముంటుందన్నారు. -
జిల్లాలో మూడు విడతలుగా జరిగే మండలాలు
జనగామ: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. ప్రభుత్వం తాజా మార్గదర్శకాల మేరకు ఈసారి ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో రెండు విడతల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తికాగా, ఇప్పుడు కొత్త గైడ్లైన్స్ కారణంగా ఒక విడతను అదనంగా జోడించారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి కేంద్రీకరిస్తోంది. జిల్లా పరి ధిలో 12 మండలాలు ఉండగా, ప్రతీ విడతలో నాలుగు మండలాల చొప్పున పోలింగ్ చేపట్టేందుకు పంచాయతీ శాఖపై కసరత్తు మొదలుపెట్టింది. రాబోయే నాలుగైదు రోజుల్లో అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో ఎన్నికల వేడి రాజుకోనుంది. డ్రాఫ్ట్ రూపంలో రిజర్వేషన్ల తయారు.. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల విషయానికి వస్తే, జిల్లా అధికారులు ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు 50 శాతం, మిగతా జనరల్ కేటగిరీ, మహిళలకు సంబంధించిన రిజర్వేషన్లను డ్రాఫ్ట్ రూపంలో సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అధికారిక గెజిట్ విడుదలైన వెంటనే ఫైనల్ రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. జిల్లాలో 4,11,000 మంది ఓటర్లు ఉండగా, ఇందులో తమ పేర్లు ఓటర్ జాబితాలో ఉన్నాయో తెలుసుకునేందుకు 23వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఇప్పటికే గ్రామ సచివాలయాల వద్ద ఓటర్ నమోదు, మొబైల్ నెంబర్ లింక్, తప్పుల సవరణ ప్రక్రియలతో బిజీబిజీగా మారిపోయింది. మూడో విడత పోటీదారులకు పెరగనున్న ఖర్చు మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండడంతో అభ్యర్థుల ఖర్చు కూడా పెరగనుంది. జిల్లాలో 280 గ్రామ పంచాయతీలు ఉండగా, 2,534 వార్డులు ఉన్నాయి. ఇందులో 4 మండలాల చొప్పున విభజించి మూడు విడతల్లో ఎలక్షన్లను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడతలో 74 జీపీలు, 668 వార్డులు, రెండో విడతలో 117 జీపీలు, 1,038 వార్డులు, మూడో విడతలో 89 జీపీలు, 828 వార్డుల పరిధిలో ఎన్నికలను నిర్వహించనున్నారు. ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం మూడు విడతల షెడ్యూల్ను తయారు చేస్తుండగా, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొదటి విడత అభ్యర్థులకు ఖర్చులు కొంత తగ్గే అవకాశం ఉండగా, రెండో విడతలో 30 శాతం వరకు అదనపు భారం పడనుంది. ఇక మూడో విడత అభ్యర్థులకు మాత్రం ఖర్చు భారీగా పెరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ మొదటి విడత అభ్యర్థులు స్వల్పకాలం ప్రచారంతోనే సరిపెట్టుకునే అవకాశం ఉంది.ఫేజ్ మండలాలు జీపీ వార్డులు ఫేజ్–1 జనగామ, లింగాలఘణపురం, నర్మెట, తరిగొప్పుల 74 668 ఫేజ్–2 బచ్చన్నపేట, దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల 117 1,038 ఫేజ్–3 చిల్పూరు, స్టేషన్ఘన్పూర్, రఘునాథపల్లి, జఫర్గఢ్ 89 828 ఓటరు జాబితా పరిశీలనకు 23 వరకు అవకాశం 12 మండలాలు.. మూడు విడతలుగా విభజన మూడో విడత ఎన్నికల పోటీదారులకు పెరగనున్న ఖర్చు -
అంతరాయమొస్తే అలెర్ట్ చేస్తుంది!
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన చోటు గుర్తించి తక్షణమే మరమ్మతులు చేసేందుకు సహాయపడే యంత్రాన్ని(సిస్టమ్)ను పైలట్ ప్రాజెక్ట్గా మండలంలోని నర్సాపూర్ గ్రామంలో విద్యుత్శాఖ ఇటీవల ఏర్పాటు చేసింది. గ్రామంలో ఒక విద్యుత్ పోల్కు సోలార్ విద్యుత్ ద్వారా నడిచే ఈ పవర్ ఇంట్రప్షన్ పరికరాన్ని ఏర్పాటు చేసి గ్రామానికి విద్యుత్ సరఫరా అయ్యే కేబుల్స్కు మూడు పరికరాలను అమర్చారు. దీంతో ఏఏ ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందనేది గుర్తించే వీలుంటుంది. తద్వారా తక్షణ మరమ్మతులు చేసే అవకాశం ఉంటుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. – తరిగొప్పుల -
చదువుతోనే సమాజంలో గుర్తింపు
కొడకండ్ల: విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని, విద్యాభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో రూ.94 లక్షలతో నిర్మించే అదనపు గదుల నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి రూ.5 లక్షలతో పూర్తి చేసిన 7వ అంగన్వాడీ కేంద్ర నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఓ జ్యోతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మౌలిక వసతులు కల్పించే బాధ్యత తనదని, శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకునే బాధ్యత విద్యార్థులదని సూచించారు. వెనుకబడిన కొడకండ్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ఇంటిగ్రేటేడ్ స్కూల్తో కొడకండ్ల ఎడ్యూకేషనల్ హాబ్గా మారనుందని అన్నారు. తరగతి గదిలోకి వెళ్లి మాస్టారులా మారిన ఎమ్మెల్యే ప్రతి విద్యాద్ధి తమ భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదువుకోవాలని సూచించారు. పాఠ్యాంశాలకు సంబంధించిన సందేహాలను వెంటనే నివృత్తి చేసుకొవాలని విద్యార్థులకు చెప్పారు. అదనంగా ఐదు బాత్రూంలు, గీజర్ వైరింగ్, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయిస్తానని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ సాయికృష్ణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్, మండల అధికారులు, నాయకులు, మార్కెట్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. కస్తూరిబా పాఠశాలలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి విద్యార్థుల వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చారు. విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
ప్రతీ మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలి
జనగామ రూరల్: ప్రతీ మహిళ పారిశ్రామిక వేత్తగా ఎదగాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకంపైన ఏపీఎం, సీసీ, మండల సమాఖ్య సభ్యులకు గురువారం కలెక్టరేట్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానికంగా తయారు చే సిన నిత్యం ప్రజలకు అవసరమైన వస్తువులు మహిళా సంఘాల సభ్యుల నుంచి వస్తే ప్రజలకు ఎక్కువ నమ్మకం ఉంటుందన్నారు. ఆహార ఉత్పత్తి ప్రాసెస్లో మహిళలకు పరికరాల కొనుగోలుకు సహకా రం అందించనున్నట్లు తెలిపారు. 200 వరకు వ్యక్తిగత ఆహార పరిశ్రమల లక్ష్యం ఉందని నాణ్యమైన ఉత్పత్తులు చేస్తే మార్కెటింగ్ కల్పిస్తామన్నారు. పరిశ్రమలు వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకుంటే ప్రాజెక్ట్ వ్యయంలో 35 శాతం సబ్సిడీ, రూ.10 లక్షల వరకు ప్రాజెక్ట్ వ్యయంపై రుణ అనుసంధాన రాయితీ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వసంత, నూరుద్దీన్, జిల్లా అధికారులు ఉమాపతి, శ్రీరామ్, నవీన్, ఇక్రిశాట్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. కేంద్రం నుంచి జల పురస్కారం అవార్డు అందుకున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు కలెక్టర్, అదనపు కలెక్టర్లు, డీఆర్డీఓను సన్మానించారు. పక్కాగా విజయోస్తు 2.0 అమలు చేయాలి విజయోస్తు 2.0 కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పింకేష్ కుమార్తో కలిసి మండల విద్యాశాఖ అధికారులు, వివిధ విద్యాసంస్థల యజ మాన్యాలతో గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు విద్యార్థులకు 100 శాతం ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ఉండాలన్నారు. యూడైస్ ప్లస్ పోర్టల్లో పాఠశాల వసతులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సమాచారాన్ని నమోదు చేయాలన్నారు. అపార్ ఐడీలు 100 శాతం పూర్తయ్యేలా చూడలన్నా రు. అధికారులు తప్పనిసరిగా పాఠశాలలను విజి ట్ చేసి ఎస్ఏ వన్ పరీక్ష ఫలితాలను పరిశీలించాలన్నారు. పదో తరగతి పరీక్షల ప్రణాళికల ప్రకారం ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు పాటించా లని సూచించారు. న్యాస్ మాదిరిగానే ఈఏడాది మూడో తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి నెలలో నిర్వహించబోతున్న ఫౌండేషనల్ లెర్నింగ్ సర్వే (ఎఫ్ఎల్ఎస్) కోసం మూడో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో ఏఈ సత్యప్రసాద్, ఏఎంఓ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియా బేగం, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా ఆదర్శంగా నిలవాలి ప్రధాన్ మంత్రి ధన్, ధాన్య కృషి యోజన పథకాన్ని సమన్వయంతో అమలు చేసి రైతులకు గరిష్టలాభం చేకూరేలా పని చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. పథకం అమలు పైన గురువారం కలెక్టరెట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రణాళిక రూపకల్పన, భవిష్యత్ లక్ష్యాల ఖరారుపై వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్, సహకార విభాగం, భూగర్భ జలాలు, పౌర సరఫరాల శాఖల అధికారులకు సూచనలు చేశారు. శాఖలవారీగా ప్రాజెక్టులను సిద్ధం చేసి రెండు రోజుల్లో సమర్పించాలన్నారు. నైపుణ్యాలు పెంపొందించుకోవాలి దిక్సూచిలో భాగంగా విల్ 2 కాన్ సంస్థ సహకారంతో ఉపాధ్యాయులకు కొనసాగుతున్న 30 రోజుల స్పోకెన్ ఇంగ్లిష్, డ్రాఫ్టింగ్ నైపుణ్య శిక్షణను గురువారం కలెక్టర్ పరిశీలించారు. టెక్నాలజీకి అనుగుణంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలన్నారు. ప్రతి రోజు అన్ని పాఠశాలల్లో 30 నిమిషాల ప్రత్యేక దిక్సూచి పీరియడ్ నిర్వహించి విద్యార్థుల నైపుణ్యా లు పెంచాలన్నారు. ఉపాధ్యాయుల నైపుణ్యాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ రామేశ్వరం గౌడ్ సహకారంతో ఆన్లైన్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 1,500 మంది ఉపాధ్యాయులతో కలెక్టర్ వర్చువల్గా మాట్లాడారు. శ్రీనివాస్, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి జనగామ: స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధికారులకు సూ చించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి, ఎన్నికల సంఘం అధికారులతో కలిసి గురువారం ఆమె హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో స్థానిక ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ల ప్రక్రియ, శాంతిభద్రతల అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుల జాబితా సమర్పించాలని ఆదేశించారు. మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు కార్యచరణ రూపొందించాలన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
కోతులకు ఆహారంగా ఏకుడుపేలాలు, అన్నం..
జఫర్గఢ్ : జఫర్గఢ్ మండలంలోని ఉప్పుగల్లు గ్రామానికి చెందిన ఓ రైతు తన పంటను కోతుల బారినుంచి కాపాడేందుకు వినూత్న ప్రయోగం చేపట్టారు. గ్రామానికి చెందిన గడ్డం కొమురయ్య తన పదెకరాల భూమిలో వరి సాగు చేశాడు. ప్రస్తుతం చేను బిర్రుపొట్ట దశకు రావడంతో కోతులు పంట చేను మీద పడి నాశనం చేస్తున్నాయి. వీటి బారినుంచి పంటను కాపాడేందుకు సదరు రైతు కొమురయ్య వినూత్న ఆలోచన చేశారు. ప్రతీరోజు ఇంటినుంచి ఎక్కువగా ఏకుడుపేలాలు, అన్నం, కొద్ది మొత్తంలో పల్లీలు తీసుకువచ్చి తన పంట పొలం వద్ద ఉన్న రోడ్డుపై చల్లుతున్నారు. దీంతో కోతులు పంట చేనును వదిలి రోడ్డుపైకి వచ్చి వీటిని తింటున్నాయి. కోతులన్నీ గుంపుగా ఒక చోటుకు చేరగానే వాటిని అక్కడి నుంచి తరిమేస్తున్నారు. దీంతో కోతులు పంట చేను వైపు రావడం లేదంటూ రైతు కొమురయ్య తెలిపాడు. ఈ విధానాన్ని గత కొద్ది రోజులనుంచి పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, కోతులు తనను చూడగానే తన మాటలను గుర్తించి దగ్గరకు వస్తున్నాయని, తనపై ఎలాంటి దాడులు కూడా చేయడం లేదని రైతు కొమురయ్య తెలిపారు. ఈ ప్రయోగాన్ని గమనించిన తోటి రైతులతోపాటు రోడ్డు మీదుగా వెళ్లే ప్రయాణికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వాటిబారి నుంచి పంటను కాపాడేందుకు ఓ రైతు వినూత్న యత్నం -
పుస్తక పఠనంతో వ్యక్తిత్వ వికాసం
జనగామ: పుస్తక పఠనం మనసును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా, నిర్ణయశక్తి, ఆత్మ విశ్వాసం, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తుందని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. 58వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం జిల్లా గ్రంథాలయ ఆవరణలో సంస్థ చైర్మన్ మారడోజు రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీసీపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బొల్లం అజయ్తో కలిసి డీసీపీ జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడారు. గ్రంథాలయాలు భవిష్యత్ నిర్మాణంలో ఉత్తమ మార్గదర్శకాలని పేర్కొన్నారు. యువత పుస్తక పఠనం వైపు మొగ్గు చూపాలని సూచించారు. పుస్తకం చదివిన వ్యక్తి ఆలోచనలు, ప్రవర్తన, జీవన విధానం సానుకూలంగా మారుతాయని డీసీపీ సూచించారు. ప్రతి ఇంట్లోనూ పఠన సంస్కృతి పెరగాలంటే గ్రంథాలయాల వినియోగం తప్పనిసరి అన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, యువత తప్పనిసరిగా గ్రంథాలయాలను సందర్శించి పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారజోడు రాంబాబు మాట్లాడుతూ.. నెట్ ప్రపంచంలో గూగుల్ ద్వారా సమాచారాన్ని వెతకడం కాకుండా నేరుగా గ్రంథాలయాల్లో పుస్తక పఠనం చేసి జ్ఞానాన్ని పెంపొందించుకున్నప్పుడే సమాజానికి దిక్చూచిగా నిలబడతారని అన్నారు. పుస్తక పఠనం ద్వారా ఒకేచోట నుంచే ప్రపంచాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు. అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు, కళాకారులు,కవులు, రచయితలు లింగాజీ, సాంబరాజు యాదగిరి, జి.కృష్ణ, ఐల సోమాచారి, జోగు అంజయ్య, గ్రంథాలయ సెక్రెటరీ సుధీర్, జయరాం, బాష్మియా, తోటకూర రమేష్, బండ కుమార్, పర్ష సిద్దేశ్వర్, క్రాంతి, శ్రవణ్, పృథ్వీ, నరేందర్, ప్రవీణ్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ -
శాస్త్రీయ పద్ధతుల్లో పాడిపరిశ్రమతో అభివృద్ధి
లింగాలఘణపురం: గ్రామీణ ప్రాంత ప్రజలు శాస్త్రీయ పద్ధతుల్లో పాడిపరిశ్రమను చేపడితే అభివృద్ధి సాధ్యమవుతుందని పశువైద్య విశ్వవిద్యాలయం రిటైర్డ్ రిజిస్ట్రార్ కె.కొండల్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని సిరిపురం రైతు వేదికలో వి.వి.నర్సింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా శాసీ్త్రయ పద్ధతుల్లో డెయిరీ, పాల ఉత్పత్తుల జోడింపుపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.శశికుమార్, ప్రొఫెసర్ సాహిత్యారాణి, సేవాస్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ జి.రత్నాకర్, ఏఓ మమత, గిరిబాబు, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు తప్పనిసరి రశీదులు ఇవ్వాలి
రఘునాథపల్లి: విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరి రశీదులు ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారి అంబికాసోని వ్యాపారులను ఆదేశించారు. రఘునాథపల్లి, ఫతేషాపూర్, నిడిగొండలోని పలు విత్తనాలు, ఎరువుల షాపులను గురువారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయా షాపుల్లో ఎరువుల నిల్వలు, లైసెన్స్, స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్స్, ఈ పాస్ మిషన్ బ్యాలెన్స్, స్టాక్ బోర్డు పరిశీలించారు. రైతులకు నకిలీ విత్తనాలు అంటగడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.ఐక్యతే ఉద్యోగుల శక్తిపాలకుర్తి టౌన్: ఉద్యోగులు ఐక్యంగా ఉంటే ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చని టీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు ఖాజా షరీఫ్ అన్నారు. పాలకుర్తి, దేవరుప్పల, కొడకండ్ల మండలాల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ సంఘం పాలకుర్తి యూనిట్ అధ్యక్షుడు బక్క మహేష్యాదవ్ అధ్యక్షతన జిల్లా అధ్యక్షుడు ఖాజా షరీఫ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి టీఎన్జీఓ ఎల్ల ప్పుడు ముందుంటుందని తెలిపారు. జిల్లా కార్యదర్శి పెండెల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్, హఫీజ్, వెంకటాచారి, శ్రీధర్, శివప్రసాద్, కాసర్ల రాజు పాల్గొన్నారు.నేటి నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలుజనగామ: జిల్లాలో నేటి(శుక్రవారం) నుంచి నిర్వహించే స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణకు గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి (ఐఏఎస్) పింకేస్ కుమార్ ప్రాథమిక, సెకండరీ స్థాయి స్కూల్ కాంప్లెక్స్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 21, 22వ తేదీల్లో ప్రాథమిక స్థాయి (పీఎస్, యూపీఎస్)కి సంబంధించి రెండు విడతలుగా సమావేశాలు నిర్వహించనున్నారు. జిల్లాలో 35 స్కూల్ కాంప్లెక్స్లు ఉండగా, విద్యార్థుల బోధనకు ఎలాంటి ఆటంకం కలుగకుండా సమావేశాలకు రోజుకు 50 శాతం మంది టీచర్లు హాజరు కావాలని తెలిపారు. ఇందులో ఎస్ఏ–1 ఫలితాల సమీక్ష, పీఆర్ఎస్–2024 రిపోర్ట్ విశ్లేషణ, ఎఫ్ఎల్ఎన్ పాఠాల అమలు, 5 ప్లస్ 1 విధానం, డిజిటల్ టూల్స్ ఉపయోగం, బోధనా వ్యూహాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. అలాగే ఉన్నత, ప్రాథమికోన్నత స్థాయిలో 24వ తేదీన తెలుగు, హిందీ, ఇంగ్లిష్, 25న సామాజిక శాస్త్రం, గణితం, బయాలజీ, 26న ఫిజికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ మూడు రోజులపాటు సమావేశాలను నిర్వహించేలా ప్రణాళిక రూపొదించారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల సమయంలో వందశాతం హాజరు కావాలని విద్యాశాఖ నిబంధనలు విధించింది. అత్యవసర పరిస్థితులు మినహా, ఏ ఒక్క టీచర్కు కూడా సెలవు అనుమతి ఉండదని జీఓ లో పేర్కొన్నారు. ఎంఈఓ, హెచ్ఎం, సీఆర్పీలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు హాజరు ఉండాలనే ఖచ్ఛితమైన నిబంధన విధించారు. కాంప్లెక్స్ సమావేశాలకు హాజరయ్యే ఉపాధ్యాయుల సమాచారం, రిపోర్టులను యాప్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాంవరంగల్ క్రైం : డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ కంట్రోల్ టీం ఆధ్వర్యంలో ‘సే నో టు డ్రగ్స్’ అనే నినాదంతో రూపొందించిన వాల్పోస్టర్ను సీపీ గురువారం అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల నియంత్రణలో ప్రజలు సైతం సహకరించాలని సూచించారు. ఎవరైన మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగాలకు పాల్ప డితే వెంటనే 87125 84473, 87126 85299 నంబర్లకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచనున్నట్లు సీపీ తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి, ఆర్ఐ శివకేశవులు, ఇన్స్పెక్టర్ సతీష్, ఆర్ఎస్సైలు పూర్ణచందర్ రెడ్డి, మనోజ్ రెడ్డి, నాగరాజు, ర్యాపిడో సంస్థ ప్రతినిధులు దుర్గారావు, సందీప్ పాల్గొన్నారు. -
హీటెక్కుతున్న రాజకీయం
పల్లెల్లో మళ్లీ మొదలైన పంచాయతీ ఎన్నికల సందడి జనగామ: పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. గ్రామపంచాయతీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించిన వేళ రాజకీయ పార్టీల కదలికల్లో వే గం పుంజుకుంది. ప్రభుత్వం మొదటగా గ్రామపంచాయతీ ఎన్నికలకు సుముఖత వ్యక్తం చేయడంతో ఆశావహులు తెరపైకి వచ్చారు. దీంతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశం స్పష్టమవడంతో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన నేతలతోపాటు కొత్త వారు తమ అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. నాయకులు ఇప్పటికే పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేపనిలో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా 280 గ్రామపంచాయతీలు, 12 జెడ్పీటీసీలు, 134 ఎంపీటీసీలు, 2,534 వార్డులు, గత ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన వివరాల ప్రకారం 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి పోలింగ్ శాతం మరింత పెరగడానికి అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ప్రతి ఓటరు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తపరుచనున్నారు. ఇక ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించింది. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది నియామకం, ఓటర్ల జాబితా, తదితర కార్యక్రమాల్లో వేగం పెంచారు. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పారదర్శక పోలింగ్ నిర్వహణకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్థానిక సమరం జరుగనున్న నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ వాతావరణం హీటెక్కింది. కొందరు సర్పంచ్ ఆశావహులు గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తుండగా, మరోవైపు కొత్త అభ్యర్థులు మార్పు అవసరాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు. ప్రజల్లో మంచి పట్టున్న వారి నుంచి యువ అభ్యర్థుల వరకు అందరూ ప్రజా మద్ధతు కోసం సేవా కార్యక్రమాలు చేస్తూ గత కొన్నిరోజులుగా ఇంటింటికీ తిరుగుతున్నారు. గ్రామ పెద్దలు, సంఘాలు, ప్రభావవంతమైన కుటుంబాలు కూడా ఈ దశలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. చలి చంపుతున్న వేళ రాజకీయ వేడి మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ప్రతి సమావేశం, ప్రతి చర్చ ఎన్నికల చుట్టూ తిరుగుతోంది. అధికార పార్టీలతోపాటు ప్రతిపక్షాలు కూడా తమ బృందాలను గ్రామాల్లోకి దింపి వ్యూహరచనలకు శ్రీకారం చుట్టాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార ప్రణాళికల వరకూ పార్టీలు దశలవారీగా సిద్ధమవుతున్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో పల్లెల్లో ఎన్నికల జోష్ కనిసిస్తుంది. పాత రిజర్వేషన్లతో కొత్త సమీకరణలు ఎలా రూపుదిద్దుకుంటాయన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓటర్ల నమోదు ప్రక్రియకు మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సంఖ్య మరింత పెరగనుంది. తెరపైకి ఆశావహులు ఎన్నికల బిజీలో అధికారులు, సిబ్బంది పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎంపికపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ కరసత్తు ప్రారంభించాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్లో అభ్యర్థుల ఎంపిక పెద్ద సవాల్గా మారనుంది. రెండు పార్టీల్లో మెజార్టీ గ్రామాల్లో ఇద్ద రి నుంచి ముగ్గురు పోటీలో ఉండడంతో అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆయాపార్టీలు రహస్య సర్వేలు సైతం చేపట్టి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా పాత రిజర్వేషన్ల ప్రకారం ఎలక్షన్లు నిర్వహిస్తారనే ప్రచారం నేపథ్యంలో అవకాశం కలిసి వచ్చే వారు సేవా కార్యక్రమాలతో దూసుకుపోగా, బీసీ రిజర్వేషన్లతో నెల రోజులు గ్యాబ్ రాగా, ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగారు. -
ముగిసిన కార్తీక మాసోత్సవం
జనగామ: ముప్పై రోజుల పాటు భక్తి శ్రద్ధలతో సాగిన కార్తీక మాసం గురువారంతో ముగిసింది. రోజు వారీగా ప్రత్యేక పూజలు, అభిషేకా లు, అర్చనలు, నంది అభిషేకాలు, దీపోత్సవం, రాత్రివేళ ఆకాశజ్యోతి దర్శనంతో భక్తులు శివయ్య అనుగ్రహాన్ని అందుకున్నారు. దేశంలోని పంచారామాలయాలతో సహా వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లి నదీ స్నానాలు, ప్రత్యేక అర్చనలు చేపట్టిన భక్తులు కఠిన నియమాలతో 30 రోజులపాటు పూజలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. చివరి రోజున ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు చేసిన అనంతరం ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించారు. దీపాల వెలుగుల్లో శివనామ స్మరణ గురువారం జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రతి ఇల్లు, దేవా లయాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. శివ నామస్మరణ, దీపారాధన, ఉపవాస దీక్షలు, మహాన్యాస పూర్వ క అభిషేకాలు నిర్వహించిన భక్తులు కార్తీక మాస ఉపవాస దీక్షలను ము గించారు. భక్తులకు ఆకాశజ్యోతి దర్శన భాగ్యం కల్పించగా, ఉసిరి చెట్టు కింద దీపారాధన చేశారు. పోలీ స్వర్గానికి ఏర్పాట్లు కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజు నేడు(శుక్రవారం) పోలీ స్వర్గం పర్వదినాన్ని భక్తులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. తెల్లవారు జామునే నదీ ప్రవాహంలో దీపాలను వదలడం ఆనవాయితీ.. వీలు కాని భక్తులు ఆలయాల్లో వెలిగిస్తారు. నెల రోజులపాటు నియమాలు పాటించకపోయినా పోలీ పాడ్యమి రోజున కనీసం 30 వత్తులు వెలిగిస్తే విశేష పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కార్తీక పర్వదినంతో ప్రారంభమైన భక్తి దీపార్చన పోలీ స్వర్గం రోజున మరింత భక్తి శ్రద్ధలతో సాగుతుంది. ముప్పై రోజులపాటు భక్తి శ్రద్ధలతో పూజలు నేడు పోలి స్వర్గం -
ఆరోగ్య జనగామ లక్ష్యం
జనగామ: ఆరోగ్య జనగామగా చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నియోజకవర్గంలోని జనగామ అర్బన్, జనగామ మండలం, నర్మెట, తరిగొప్పుల, బచ్చన్నపేట మండలాలకు చెందిన 79 మంది లబ్ధిదారులకు రూ.23 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. ఇచ్చిన మాట ప్రకారం రెండు సంవత్సరాలుగా తన నీలిమా హాస్పిటల్లో నియోజకవర్గ ప్రజలందరికీ ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ గరిష్టంగా రూ.60వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 60శాతం డబ్బులను లబ్ధిదారులకు అందించామన్నారు. కార్యక్రమంలో ఇర్రి రమణారెడ్డి, పోకల జమున, బాల్దె సిద్ధిలింగం, మేకల కళింగరాజు, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ఆయా మండలాల నాయకులు ఉన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి
జనగామ రూరల్: విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర పరిశీలకురాలు, సీట్ అడిషనల్ డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పింకేశ్కుమార్ ఆధ్వర్యంలో మండల విద్యాధికారుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న స్కూల్ ఆండ్ క్లిన్ స్పెషల్ క్యాంపెయిన్ 5.0పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలు శుభ్రంగా ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు. విద్యాశాఖాధికారి పింకేశ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యాశాఖ ప్రతి మాసం విజయోస్తు కార్యక్రమం ద్వారా అన్ని అంశాలపై సమీక్ష చేస్తున్నామన్నారు. వెల్దండ పాఠశాల సందర్శన.. నర్మెట: పాఠశాలలో తరగతి గదులను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు విద్యార్థులకు మానసికోల్లాసం కలిగించే విధంగా ఆహ్లాదకరంగా, పచ్చదనంతో ఉండాలని రాష్ట్ర పరిశీలకురాలు, సీట్ అడిషనల్ డైరెక్టర్ విజయలక్ష్మి సూచించారు. మండలంలోని వెల్దండ పాఠశాలను సందర్శించిన ఆమె ఎంఈఓ మడిపల్లి ఐలయ్యతో పాటు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఎంఓ నాగరాజు, ఉపాధ్యాయులు అంజిరెడ్డి, శామ్యూల్ ఆనంద్, తిరుమల్రెడ్డి, రమేష్, కృష్ణమూర్తి, బాలసిద్దులు, మాధవి, కల్పన పాల్గొన్నారు. రాష్ట్ర పరిశీలకురాలు, సీట్ అడిషనల్ డైరెక్టర్ విజయలక్ష్మి -
చీరల పంపిణీకి ఇన్చార్జులు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ రూరల్: జిల్లాలో ఉన్న 11,237 స్వయం సహాయక సంఘాలలో 1,36,747 మంది సభ్యులు ఉన్నారని 1,15,143 మందికి ఇప్పటివరకు ఇందిరమ్మ చీరలు వచ్చాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ప్రతీ గ్రామంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను, ఇన్చార్జ్లను చార్జిలను పెట్టాలన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంపై బుధవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో సీఎం రేవంత్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీసీలో అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్ షాలోమ్ పాల్గొన్నారు. వృద్ధులతో స్నేహపూర్వకంగా ఉండాలి.. వృద్ధులతో స్నేహపూర్వకంగా ఉండి ప్రేమను పంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా పిలుపునిచ్చారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 1న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని శామీర్ పేటలోని రుద్రమదేవి ఓల్డ్ హోమ్ సేవ సొసైటీలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె.కోదండరాములు, డీఆర్డీఏ జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ సతీష్, కన్న పర్శరాములు,హేమలత, క్యాథరిన్, వెంకట మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్కు హెచ్ఎంల సంఘం సత్కారం జనగామ: జల సంరక్షణలో జిల్లా జాతీయ స్థాయి సౌత్జోన్లో ద్వితీయ స్థానంలో నిలిచి కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాను హెచ్ఎంల సంఘం సత్కరించింది. ప్రధానోపాధ్యాయుల రాష్ట్ర కార్యదర్శి బుర్ర రమేశ్, హెచ్ఎంల బృందం లక్ష్మణ్గౌడ్, బీమా నాయక్, కిరణ్ కుమార్, అంజయ్య, ఈర్యా, కొండ శ్రీనివాస్ ఉన్నారు. -
రామలింగేశ్వరుడికి అన్నపూజ
జనగామ: పట్టణంలోని పాతబీటు బజారు శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని బుధవారం అన్నపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు స్వామికి అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ రామిని రాజేశ్వర్, ఉపాధ్యక్షుడు మహంకాళి హరిశ్చంద్రగుప్తా, ప్రధాన కార్యదర్శి కోకల మల్లేశం, కోశాధికారి అయిత శ్రీనివాసులు, సభ్యులు బాలాచారి, మారం శ్రీనివాస్, నాళ్ల మధు, పెద్ది శ్రీనివాస్, దారం సోమయ్య, వంగపల్లి చంద్రశేఖర్, ఆలయ అర్చకులు శివరాజ్ శర్మ పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు జశ్వంత్ రఘునాథపల్లి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహించిన జిల్లాస్థాయి వాలీబాల్ పోటీల్లో మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థి కె.జశ్వంత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం ఉపేందర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–14 విభాగంలో జశ్వంత్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంపై జశ్వంత్ను బుధవారం పాఠశాలలో ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో పీఈటీ కుమార్, నాగభూష ణం, సురేందర్, రాములు, రవీందర్, లావణ్య, శ్రీలత, రేణుక, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఆకాశ జ్యోతి దర్శనంజనగామ: కార్తీకమాసం పురస్కరించుకుని పట్టణంలోని గుండ్లగడ్డ శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో బుధవారం భక్తులు ఆకాశ జ్యోతి దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు గంగు సాంబమూర్తిశర్మ ఆధ్వర్యంలో శివయ్యకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు ఉమ, రమ, హైమ, రాణి, పద్మ, ప్రమీల, సరిత, విజయ, వాణి, నాగమణి, ప్రకాశ్, రమేశ్, ప్రభాకర్, రాజు, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేయూ బీపీఈడీ కళాశాల ప్రిన్సిపాల్గా భాస్కర్కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్గా ఆ విభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.భాస్కర్ను నియమిస్తూ రిజిస్ట్రార్ రామచంద్రం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళా శాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహించగా.. ఆయన స్ధానంలో భాస్కర్ను నియమించారు. వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులను భాస్కర్కు అందజేశారు. తొర్రూరు పీఏసీఎస్ పాలకవర్గం కొనసాగింపుతొర్రూరు: తొర్రూరు పీఏసీఎస్ పాలకవర్గాన్ని తాత్కాలికంగా కొనసాగిస్తూ జిల్లా సహకార శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం డీసీఓ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. రద్దు చేసిన పీఏసీఎస్ చైర్మన్, ఇతర డైరెక్టర్లు కొనసాగనున్నారు. రుణాల రికవరీలో నిర్లక్ష్యం, డైరెక్టర్లు రుణాలు తీసుకుని చెల్లించకపోవడం, ధాన్యం తరలింపు, గన్నీ సంచుల కొనుగోళ్లలో అవకతవకలు, బడ్జెట్ రూపకల్పనలో నిర్లక్ష్యం నేపథ్యంలో తొర్రూరు సొసైటీ పాలకవర్గాన్ని రద్దు చేస్తూ సెప్టెంబర్లో సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. -
రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు
జనగామ: అన్నదాతల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం 21వ నిధులు బుధవారం విడుదలయ్యా యి. తమిళనాడులోని కోయంబత్తూర్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీఎం కిసాన్ ద్వారా ఏడాదికి మూడు విడతల్లో రూ.6వేల పెట్టుబడి సాయం రైతులకు అందుతోంది. జనగామ జిల్లాలో 1, 80వేల మంది రైతులు ఉండగా, పీఎం కిసాన్ నిబంధనల మేరకు 20వ విడత వరకు 51, 346 మంది రైతుల ఖాతాల్లో నిధులు జమయ్యాయి. మొదటి విడతలో 1,06,274 మంది రైతులకు నిధులు అందగా ఎనిమిదో విడత నుంచి రైతుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. తాజాగా 21వ విడత నగదు జమతో కొత్తగా అర్హత పొందిన వారి సంఖ్య మొత్తం పరిశీలన పూర్తయిన తర్వాత వెల్లడికానుంది. పెట్టుబడి సాయం అందింది.. ఏటా మూడు సార్లు పీఎం కిసాన్ డబ్బులు నా ఖాతాలో జమ అవుతున్నాయి. నాలుగు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. యాసంగి, వానాకాలం సీజన్లో పంటల సాగు సమయంలో పీఎం కిసాన్ సాయం ఎంతగానో అక్కరకు వస్తోంది. – వెంకట్రాం కనకయ్య, వీఎస్ఆర్ నగర్, బచ్చన్నపేట -
నవాబుపేట అంగడి వేలం ఆదాయం రూ.72.50 లక్షలు
లింగాలఘణపురం: మండలంలోని నవాబుపేట కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రతీ శుక్రవారం జరిగే పశువుల సంతలో రహదారుల వేలం పాట ఆదాయం రూ.72.50 లక్షలు వచ్చినట్లు ఈఓ లక్ష్మిప్రసన్న తెలిపారు. బుధవారం హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన వేలం పాటలో నవాబుపేటకు చెందిన బూడిద సదానందం వేలం దక్కించున్నారని చెప్పారు. పలుమార్లు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వేలం నిర్వహించగా తగిన ఆదాయం రాకపోవడంతో చివరిగా హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో ఇన్స్పెక్టర్ నిఖిల్ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించామన్నారు. వేలం పాటలో రాజు, మహేందర్, నర్సింహులు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మినహాయింపు కొందరికే
జనగామ రూరల్: పదో తరగతి విద్యార్థుల వార్షిక పరీక్ష ఫీజు మినహాయింపు కొందరికే వర్తిస్తోంది. ఏటా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం నోటిఫికేషన్లో వెనకబడిన కుటుంబాల విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు మినహాయింపును చేర్పుతూనే వస్తోంది. అయితే అది ఏ ఒక్కరికీ ఉపయోగపడడం లేదు. ప్రభుత్వం ప్రకటించడానికి, అధికారులు చెప్పుకోడానికే పరిమితమైందనే ఆరోపణలున్నాయి. పొంతనలేని వార్షిక ఆదాయం కారణంగా ప్రతి ఒక్కరూ ఫీజుల చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. జిల్లావ్యాప్తంగా 103 ఉన్నత పాఠశాలల్లో 6,695 మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలు రాసేందుకు యూడైస్ ప్లస్లో నమోదు చేసుకున్నారు. అయితే, ఏటా అక్టోబర్లోనే పరీక్ష ఫీజు షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అయితే రెగ్యులర్ విద్యార్థులు రూ.125 చెల్లించాల్సి ఉండగా సప్లిమెంటరీ విద్యార్థులు 3 సబ్జెక్టులోపునకు రూ.110, మూడుదాటితే రూ.125 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు రూ.185 కట్టాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లింపు 20 నవంబర్ వరకు ఉంది. అదేవిధంగా రూ.50 ఫైన్, రూ.200, రూ.500 అపరాధ రుసుం చెల్లించే గడువు సైతం ఇచ్చారు. రెండేళ్ల క్రితం వరకు తత్కాల్ పేరుతో రూ.వెయ్యి ఫైన్తో పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇవ్వగా ఈసారి నోటిఫికేషన్లో అలాంటి అవకాశం ఇవ్వలేదు. మారని నిబంధనలతో ఇబ్బందులు అన్నిరకాల యాజమాన్య పాఠశాలల్లో వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వార్షిక ఫీజు మినహాయింపు సౌకర్యాన్ని ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఆయా పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లో ఆర్థికంగా వెనకబడినవారికి ఈ అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఫీజు చెల్లింపుతో పాటు విద్యార్థి వారి కుటుంబ ఆదాయ ధ్రువపత్రం అందించాల్సి ఉంటుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రూ.20 వేలు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.24వేల లోపు వార్షిక ఆదాయం నిబంధన విధించడంతో ఏ ఒక్కరికీ ఈ ప్రయోజనం చేకూరడంలేదు. రాష్ట్రంలో ఏ పథకమైన దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ప్రభుత్వం వర్తింపజేస్తుంది. ఇందుకు గరిష్ట ఆదాయం రూ.లక్షకు పైగానే ఉంటుంది. కానీ టెన్త్ విద్యార్థులకు వచ్చేసరికి ఇంత తక్కువగా కేటాయించారు. 30 ఏళ్లుగా ఇదే డిజిట్ కొనసాగిస్తున్నారని, 2015 నుంచి మార్చాలని ఎస్ఎస్సీ బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసిన మార్పు జరగడం లేదని తెలుస్తోంది. దీంతో చాలా మంది వెనుకబడిన కులాల విద్యార్థులకు ప్రయోజనం లేకుండాపోతోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే.. ప్రభుత్వం సూచించిన ఆదేశాల ప్రకారం ఎస్సెస్సీ బోర్డు ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం జిల్లాలోని అన్ని పాఠశాలల హెచ్ఎంలకు ప్రతిని అందించాం. నిబంధనల ప్రకా రం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు పరీక్ష ఫీజు మినహాయింపు పొందాలంటే వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల కుటుంబానికి రూ.20 వేలు, పట్టణాల్లో రూ.24 వేలు దాటకూడదు. – టి. రవికుమార్, అసిస్టెంట్ కమిషనర్ , ప్రభుత్వ పరీక్షల విభాగం వసతిగృహాల విద్యార్థులకు అవకాశం ప్రభుత్వ వసతిగృహాల్లో ఉండి చదువుతున్న బీసీ విద్యార్థులకు ఆ శాఖ కమిషనర్ ఏటా ఇచ్చే ప్రత్యేక ఆదేశాల మేరకు కొందరు ఫీజు రాయితీ పొందగలుగుతున్నారు. అదేవిధంగా కేజీబీవీల్లో చదువుతున్న మొత్తం బాలికలకు ఫీజు రాయితీ వర్తిస్తోంది. ఎస్సీ ఎస్టీ, బీసీ వెల్ఫేర్ గురుకులాలతో పాటు కేజీబీవీ విద్యార్థులు మాత్రమే ఈ రాయితీ నేరుగా పొందుతుండగా, మిగతా విద్యార్థులకు ఈ అవకాశం లభించడంలేదు. వార్షిక ఆదాయ నిబంధన సవరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజులో పాత నిబంధనలు ఏళ్లతరబడిగా మార్పులేని కుటుంబ ఆదాయపరిమితి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో చేకూరని లబ్ధి గురుకులాలు, కేజీబీవీ విద్యార్థులకు అవకాశం -
విద్యారంగంలో రోల్మోడల్ తెలంగాణ
● స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోందని, విద్యారంగంలో తెలంగాణ దేశానికే రోల్మోడల్గా నిలుస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్ మండలంలోని నమిలిగొండ శివారు మోడల్స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం ఎంపీ కడియం కావ్యతో కలిసి ఎమ్మెల్యే కడియం శంకుస్థాపన చేశారు. అనంతరం కేజీబీవీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.. నియోజకవర్గంలోని ఏడు కస్తూర్బా పాఠశాలలకు వసతుల కల్పనకు రూ.6 కోట్లు మంజూరయ్యాయని, ఘన్పూర్ కస్తూర్బా, మోడల్ స్కూల్కు రూ.28 లక్షలతో సీసీ రోడ్డు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సమాజంలో మహిళలు అభివృద్ధి చెందినప్పుడే దేశ ప్రగతి సాధ్యమని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. జిల్లా జీసీడీఓ ఎండీ గౌసియాబేగం, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మోడల్స్కూల్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్రెడ్డి, కేజీబీవీ ఎస్ఓ రజిత, హెచ్ఎం సంపత్ పాల్గొన్నారు. జఫర్గఢ్లో.. జఫర్గఢ్: మండల కేంద్రంలోని కస్తూర్బా, మోడల్ స్కూల్ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కడి యం శ్రీహరి ఎంపీ కావ్యతో కలసి శంకుస్థాపన చేశారు. కస్తూర్బాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రిన్సిపాల్ సీహెచ్ స్వప్న అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథులుగా హాజరైన ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ.. కోనాయిచలంలో రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావణ్యశిరీష్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కర్ణాకర్రావు, వైస్ చైర్మన్ ఐలయ్య, తహసీల్దార్ రాజేష్రెడ్డి, ఎంపీడీఓ సుమన్ పాల్గొన్నారు. -
సాగుకు యంత్రసాయం
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని ఆధునికీకరించేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తూ యాంత్రీకరణకు పెద్దపీట వేస్తోంది. రైతులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రేవంత్రెడ్డి సర్కార్ సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను అందిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా సబ్సిడీ యంత్రాల సరఫరా నిలిచిపోగా, ఇప్పుడు రైతులకు ఉత్సాహాన్నిచ్చే విధంగా వ్యవసాయ శాఖకు భారీ మొత్తంలో యంత్రాలను విడుదల చేసింది. జిల్లాకు 3,370 యంత్ర పరికరాలకు ప్రభుత్వం ఆమోదం తెలపగా, వాటి పంపిణీ కోసం రూ.2.73 కోట్ల నిధులు కేటాయించింది. పలు కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోవడంతో, ప్రతీ పరికరం ఏ కంపెనీ ద్వారా అందుబాటులో ఉంటుందో రైతులకు వివరాలు కూడా ప్రకటించారు. రైతుకు అవసరమైన యంత్రంపై సంబంధిత కంపెనీ పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) తీసి మండల అగ్రికల్చర్ ఆఫీసర్కు అందజేస్తే సరిపోతుంది. మార్పిడి చేసుకునే అవకాశం జిల్లాలో యంత్రాల అవసరానికి సంబంధించి డిమాండ్ను పరిశీలించి, అవసరమైతే ఇతర పరికరాలకు కేటాయించిన నిధుల నుంచి కన్వర్షనన్ చేసి రైతులు అత్యధికంగా కోరిన వాటిని అందించే అవకాశం కూడా కల్పించారు. సబ్సిడీ పరికరాలను అందించడంతో పాటు జిల్లాలో డిమాండ్ ఆధారంగా యంత్రాల మార్పిడి ద్వారా కూడా వారికి అవసరమైన వాటిని అందించే వెసులుబాటు ఈ స్కీంలో కల్పించారు. అర్హత కలిగిన ప్రతీ రైతుకు సబ్సిడీ వ్యవసాయ యంత్రాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, అక్కడి నుంచి రాష్ట్రస్థాయికి దరఖాస్తుల పరిశీలన జరగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు యంత్రాల పంపిణీని 100శాతం పూర్తి చేయాలనే లక్ష్యంగా వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతులు తమకు అవసరమైన యంత్రాలను త్వరగా ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసు కోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. రైతులకు ప్రయోజనం ప్రభుత్వం నుంచి సబ్సిడీ యంత్రాల సరఫరా లేని సమయంలో రైతులు ప్రైవేటుగా 100శాతం ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. సీఎం రేవంత్రెడ్డి సర్కారు సబ్సిడీపై యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకురావడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యంత్రపరికరాల కొనుగోలుపై ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్న కారు, మహిళ రైతులకు 50శాతం, జనరల్, పెద్ద రైతులకు 40శాతం సబ్సిడీ అందిస్తున్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని త్వరితగతిన దరఖాస్తు చేసుకుంటే, జిల్లాలో ఏ యంత్రానికి డిమాండ్ ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు సబ్సిడీ యంత్రాల పంపిణీ ప్రక్రియ ముగించనున్నారు. రైతులకు రేవంత్ సర్కార్ గుడ్న్యూస్ సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలు అందజేత అన్నదాతపై తగ్గనున్న ఆర్థిక భారం పవర్ టిల్లర్ నుంచి రోటోవేటర్ వరకు జిల్లాకు 3,370 పరికరాలు.. రూ.2.73కోట్ల బడ్జెట్జిల్లాకు కేటాయించిన యంత్ర పరికరాల వివరాలు యంత్రం సంఖ్య మొత్తం (లక్షల్లో/రూ.) పవర్ వీడర్స్ 17 5.95 బ్రష్ కట్టర్లు 33 11.55 పవర్ టిల్లర్లు 25 25.00 స్ట్రా బేలర్స్ 19 38.00 స్ప్రేయర్లు 2456 24.56 (బ్యాటరీ/మాన్యువల్) పవర్ స్ప్రేయర్లు 444 44.40 రోటోవేటర్లు 154 77.00 సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ 25 7.50 డిస్క్ హారో/ఎంబీ ప్లౌ/ కేజ్ వీల్స్/రోటో పడ్లర్ 169 33.80 బండు ఫార్మర్ 6 0.90 పవర్ బండ్ ఫార్మర్ 3 4.50 మొత్తం 3,370 2.73 కోట్లురైతులు సద్వినియోగం చేసుకోండి ప్రభుత్వం వ్యవసాయ యంత్ర పరికరాలను సబ్సిడీపై అందిస్తోంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యంత్ర పరికరాలకు సంబంధించి సర్కారు నుంచి కేటగిరీ వారీగా గైడ్లైన్స్ వచ్చాయి. రైతుల డిమాండ్ ఆధారంగా మన వద్ద డిమాండ్ లేని యంత్ర పరికరాలకు కేటాయించిన బడ్జెట్ నుంచి, అన్నదాతలకు ఉపయోగపడే విధంగా అందించే అవకాశం ఉంది. దీనిని రైతులు సద్వినియోగం చేసుకుని, వ్యవసాయ అవసరాలు ఉపయోగించుకోవాలి. యంత్ర పరికరాలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. యంత్ర పరికరం అవసరమైన రైతులు సంబంధిత కంపెనీపై డీడీ తీసి ఇవ్వాల్సి ఉంటుంది. – అంబికా సోని, జిల్లా వ్యవసాయాధికారి -
‘జల్ సంచాయ్..’లో జిల్లా ద్వితీయ స్థానం
జనగామ రూరల్: జిల్లాలో జల సంరక్షణ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ సంచాయ్ జన్ భాగీధారీ కార్యక్రమంలో సౌత్ జోన్లో జిల్లా ద్వితీయ స్థానం సాధించింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుతో పాటు రూ.కోటి నగదు ప్రోత్సాహాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ సెప్టెంబర్ 26న సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది. కాగా మంగళవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్న్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖమంత్రి సీఆర్ పాటిల్ చేతుల మీదుగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అవార్డు అందుకున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జల్ సంచాయి జన భాగీధారి 2.0 కింద కలెక్టర్ రిజ్వాన్ బాషా జిల్లాలో ‘మన జిల్లా.. మన నీరు’ అనే నినాదంతో కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో తక్కువ ఖర్చుతో వర్షపు నీటి ఇంకుడు గుంత నిర్మాణాన్ని ప్రారంభించి జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులకు తగు సూచనలు చేస్తూ జిల్లాలోని ప్రతీ గ్రామ మండల, జిల్లా, స్థాయి అధికారులకు టార్గెట్ ఇచ్చారు. తక్కువ ఖర్చుతో వర్షపు నీటి సంరక్షణ గుంతలు ఇప్పటి వరకు 7,350 నిర్మాణం పూర్తి కాగా వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు సుమారు 50,000 వర్షపు నీటి సంరక్షణ గుంతలు నిర్మిచాలని కలెక్టర్ జిల్లాలోని అధికారులకు, సామాజిక సంస్థలకు, ప్రజలకు తెలిపారు. జిల్లాకు లభించిన ఈ జాతీయ స్థాయి గుర్తింపుపై అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైభవంగా శ్రీసోమేశ్వర స్వామి మాస కల్యాణం పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మాస శివరాత్రి సందర్శంగా చండిక అమ్మవారి ఆలయంలో మంగళవారం చండికాసమేత శ్రీసోమేశ్వర స్వామివారి మాస కళ్యాణం మేళతాళాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛరణల మధ్య వైభవోపేతంగా జరిగింది. భక్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొని కనులారా తిలకించి తరలించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రధాన అర్చకుడు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్ శర్మ,దేవగిరి అనిల్కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శివపార్వతుల కల్యాణం .. జనగామ: కార్తీకమాసం పర్వదినం పురస్కరించుకుని జనగామ పట్టణంలోని గుండ్లగడ్డ శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో మంగళవారం శివపార్వతుల కల్యాణం, లక్షవత్తుల జ్యోతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆగమశాస్త్రం ప్రకారం అర్చకులు గంగు సాంబమూర్తి, వేదపండితుల వేదఘోషతో ప్రారంభమైన పుణ్యాహవాచనం, స్వస్తి వాచ నం, మహాగణపతి పూజ అనంతరం కంకణధారణ, ప్రత్యేక మంగళ స్నానాలు నిర్వహించారు. కార్యక్రమంలో రామిని శ్రీనివాస్, అనురాధ, రమా, ఉమా తదితరులు పాల్గొన్నారు. నశాముక్త్ భారత్ అభియాన్ పోస్టర్ ఆవిష్కరణ జనగామ రూరల్: మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నశాముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం పురస్కరించుకుని కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, బెన్షాలోమ్ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆఫీసు సిబ్బందితో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేసి అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో ప్రతిఒక్కరూ క్రియాశీల భాగస్వామి కావాలని డ్రగ్స్ రహిత జీవన శైలికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె. కోదండరాములు తదితరులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 19 శ్రీ నవంబర్ శ్రీ 2025
జనగామ వాగుల్లో ఇసుక దోపిడీజనగామ రూరల్: మండలంలోని యశ్వంతాపూర్, చీటకోడూరు వాగులు ఇటీవల కురిసిన వర్షాలతో ఇసుకతో నిండుకుండలా కనిపిస్తున్నాయి. వడ్లకొండ, గానుగుపహాడ్, ఎర్రగొల్లపహాడ్ తదితన ప్రాంతాల సరిహద్దుల్లో ఇసుక డంప్ చేస్తూ, ప్రైవేటుగా విక్రయాలు చేస్తున్నారు. యశ్వంతపూర్ వాగు నుంచి ఇందిరమ్మ ఇళ్లకు అనుమతి ఇవ్వగా, ఒక్క చీటికి నాలుగు ఇసుక ట్రాక్టర్లను అక్రమంగా అమ్ముకుంటున్నారు. మైనింగ్, రెవెన్యూ అధికారులు పట్టించుకుని భూగర్భ జలాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.తనిఖీలు చేస్తున్నా.. ఆగని దందా -
వేతన వెతలు
ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న కాంటిజెన్సీ వర్కర్లకు పెండింగ్లో ఉన్న 9 నెలల వేతనాన్ని వెంటనే అందించాలి. నెలల తరబడి జీతాలు రాక అప్పులు చేయాల్సి వస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. – కొలనుపాక హరిప్రసాద్, కాంటిజెన్సీ కార్మికుల రాష్ట్ర అధ్యక్షుడు, స్టేషన్ఘన్పూర్ స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వ ఆసుపత్రులలో కాంటిజెన్సీ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికులకు తొమ్మిది నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. అరకొర వేతనాలతో ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న కార్మికులు జీతాలు సకాలంలో అందక కుటుంబ పోషణ కోసం అప్పులు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో దాదాపు 600 మందికి పైగా, జనగామ జిల్లాలో 30 మంది వరకు కాంటిజెన్సీ వర్కర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పరిసరాలు, వాష్రూమ్లు శుభ్రం చేయడం, వార్డులలో బెడ్ షీట్లను మార్చడం, వార్డులను క్లీనింగ్ చేయడం తదితర పనులను కాంటిజెన్సీ వర్కర్లు చేస్తుంటారు. ఆసుపత్రులకు ప్రధానమైన పరిశుభ్రత పనిని చేసే కాంటిజెన్సీ వర్కర్లు వేతనాల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ఉదయం వైద్య సిబ్బంది కన్నా ముందు ఆసుపత్రికి వచ్చి సాయంత్రం వరకు పనిచేసే కార్మికుల వెతలు పాలకులకు పట్టడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రులలో పేషెంట్లు ఉండే వార్డులతో పాటు వైద్యుల ఉండే గదులను ప్రతీరోజూ ఎప్పటికప్పుడు శుభ్రం చేసే కాంటిజెన్సీ వర్కర్లపై ప్రభుత్వం కరుణ చూపడం లేదు. సమ్మె చేసినా.. కాంటిజెన్సీ వర్కర్లకు నెలకు కేవలం రూ.5,200 వేతనమే అందిస్తారు. ఈ వేతనాన్ని కూడా తొమ్మిది నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం విచారకరమని వర్కర్లు వాపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పరిశుభ్రతలో కీలకంగా పనిచేసే కార్మికుల వేతనాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమంటున్నారు. గతంలో వేతనాలు అందించాలని, తమను రెగ్యులరైజ్ చేయాలని కార్మికులు సమ్మె చేసినా పాలకులు స్పందించడం లేదు. సమ్మె సమయంలో హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో కార్మిక సంఘం నాయకులు వినతిపత్రాలు అందించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కాంటిజెన్సీ వర్కర్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వడంతో పాటు రెగ్యులరైజ్ చేయాలని కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంటిజెన్సీ వర్కర్ల ఇబ్బందులు 9 నెలలుగా వేతనాలు రాకపోవడంతో అప్పులు సకాలంలో వేతనాలు ఇవ్వడంతో పాటు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ ఏళ్లతరబడి ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న కాంటిజెన్సీ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలి. ఆసుపత్రుల పరిశుభ్రత కోసం అహర్నిశలు పనిచేసే కార్మికులకు అందించే అరకొర వేతనాలు నెలల తరబడి అందించకపోవడం బాధాకరం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలి. – కె.అంజయ్య, సంఘం జిల్లా అధ్యక్షుడు, బచ్చన్నపేట -
కాసులు కురిపిస్తున్న ఇసుక
రఘునాథపల్లి మండలంలో ఇసుకాసురుల తవ్వకాలతో వాగు పరిస్థితిరఘునాథపల్లి: ఇందరమ్మ ఇళ్ల పథకం పేరిట ఇసుక దందా కొంతమంది నాయకులు, ట్రాక్టర్ యజమానులకు కాసులు కురిపిస్తున్నాయి. లబ్ధిదారుల కూపన్లతో ఒకటికి నాలుగు ట్రిప్పుల ఇసుక మాయం చేస్తున్నారు. ఇబ్రహీంపూర్, ఫతేషాపూర్, లక్ష్మీతండా, మాదారం, సోమయ్యకుంట తండా, రఘునాథపల్లి, దాసన్నగూడెం, ఖిలాషాపూర్, కంచనపల్లి, మేకలగట్టు గ్రామాల్లో ఒక్కో ట్రాక్టర్ రూ.4,500 నుంచి రూ.5వేల వరకు ప్రైవేటుగా విక్రయిస్తున్నారు. -
దందా ఆగేదెలా?
ఆకేరు వాగుజఫర్గడ్: ఆకేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఈ విషయంలో అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. కూనూరు, తిడుగు, ఉప్పుగల్లు గ్రామాల మీదుగా ఉన్న ఆకేరు వాగును గుల్లచేస్తున్నారు. ఇక్కడ నుంచి హన్మకొండ, కాజీపేట, మడికొండ పట్టణ ప్రాంతాలతో పాటు ఆయా గ్రామాలకు ఇసుకను తరలించి రూ.5వేల నుంచి రూ.7వేలు వసూలు చేస్తున్నారు. జనగామ: జిల్లాలో వాల్టా, మైనింగ్, ఇరిగేషన్ చట్టాలు కళ్లముందే ఉల్లంఘిస్తున్నా, ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. ఇసుక అక్రమ రవాణా గత కొద్దికాలంగా పది రెట్లు పెరిగింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం తక్కువ ధరకే ఇసుక అందించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని మాఫి యా స్వర్గధామంగా మార్చుకుంది. కొంతమంది చీకటి ఒప్పందాలతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇసుక దోపిడీ కొనసాగుతోంది. కొన్ని గ్రామాల్లో బలమైన నాయకుల ఆశీస్సులతో సిండికేట్గా ఇసుక వ్యాపారానికి తెరలేపినట్లు ప్రచారం ఉంది. సామాజిక కార్యకర్తలు, ప్రజలు అడ్డుకుంటున్నా ఇసుక అక్రమ వ్యాపారాన్ని సంబంధిత అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇసుక తరలింపునకు నెలనెలా మాముళ్లు ఎవరికనే అంశం జిల్లాలో పెద్ద చర్చకు దారితీస్తోంది. బచ్చన్నపేట, జనగామ–యశ్వంతాపూర్, రఘునాథపల్లి, దేవరుప్పుల, స్టేషన్ఘన్పూర్ వాగుల పరిధిలో గుంతలు బావులను తలపించే విధంగా మారిపోయాయి. ఇందిరమ్మ ఇళ్ల పేరిట..దేవరుప్పుల: ఇందిరమ్మ ఇళ్లకు ఉచితం పేరిట కలెక్టర్ స్థానిక అవసరాలకు తహసీల్దార్లకు ఇచ్చిన ఇసుక అనుమతులు మాఫియాకు ఊతం ఇచ్చినట్టవుతుంది. దాదాసాహెబ్కాలనీ నుంచి పాలకుర్తి, కొడకండ్ల మండలాల్లోని ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక అనుమతులు తీసుకుని, ఇతర ప్రాంతాల్లో డంప్లు చేసి వ్యాపారం సాగిస్తున్నారు. ట్రాక్టర్కు రూ.4వేల నుంచి రూ.5వేల వరకూ అమ్ముకుంటున్నారు. అంతా ప్రైవేటుకే లింగాలఘణపురం: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అధిక ధరకు ఇసుక విక్రయించి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల అనుమతి ఉన్న వారికి ట్రాక్టర్కు రూ.3,500 ట్రిప్పు ఇస్తుండగా, ఇదే అ నుమతితో అక్రమంగా ఇసుక తరలించి రూ.5వేలకు విక్రయిస్తున్నారు. జోరుగా రవాణా పాలకుర్తిటౌన్: మండలానికి అవసరమైన ఇసుకను ముత్తారం, దేవరుప్పుల, జఫర్గడ్ కూనూరు, కోణాచలం, తిడుగు, వర్ధన్నపేట మండలం ఇల్లందు నుంచి అక్రమంగా పాలకుర్తి మండలానికి తరలిస్తున్నారు. ట్రాక్టర్కు రూ.5,000నుంచి రూ.8వేల వరకు విక్రయిస్తున్నారు. మోతమోగుతున్న చప్పుళ్లు స్టేషన్ఘన్పూర్: తాటికొండ గ్రామంలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇసుక ట్రాక్టర్ల మోతతో ఊరి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. తాటికొండ, కొత్తపల్లిలోని వాగుల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు.బచ్చన్నపేట: పోచన్నపేట వాగు నుంచి ఇసుక తరలింపు ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక దోపిడీ అధికారుల మౌనం.. మాఫియాకు వరం..? అదుపుతప్పిన చీకటి వ్యాపారం నెలనెలా మాముళ్లు.. వాల్టాచట్టానికి తూట్లు ఒక్కో ట్రాక్టర్ రూ.4వేల నుంచి రూ.8వేల వరకు వసూలురాత్రికి రాత్రే బచ్చన్నపేట: మండలంలోని పోచన్నపేట, నక్కవానిగూడెం, కాశీనగర్ ఏరియా లోని వాగుల నుంచి ఇసుకను రాత్రికి రాత్రే సరిహద్దులను దాటించేస్తున్నారు. తరలించిన ఇసుకను రహస్య ప్రాంతాల్లో డంప్ చేసి, బయటికి గ్రామాలకు విక్రయిస్తున్నారు. ఒక్క కూపన్ చూపించి నాలుగు ట్రాక్టర్ల ఇసుకను అమ్ముకుంటున్నారు. -
రేవంత్ మాటలు ఘనం.. చేతలు శూన్యం
వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆయన చెప్పే మాటలు ఘనంగా ఉంటున్నాయని, చేతలు మాత్రం శూన్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు. మక్కలు, పత్తి యార్డుల్లోని రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో రైతుల పక్షపాతి ఒక్క కేసీఆర్ మాత్రమే అని, ఆయన మొట్టమొదటిసారిగా రైతుబంధు తెచ్చి రైతులను ఆదుకున్నారని అన్నారు. రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారన్నారు. సీసీఐ అడ్డమైన ఆంక్షలు పెట్టి ఆగమాగం చేస్తున్నా రేవంత్రెడ్డి లేఖలు రాస్తూ పట్టించుకోవడం లేదన్నారు. పంటలకు బోనస్ ఇస్తామని అనడమే కానీ, ఇచ్చింది లేదన్నారు. ఎల్1, ఎల్2, కపాస్ యాప్, తేమశాతం లాంటి తుగ్లక్ నిర్ణయాలతో రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచిన రేవంత్రెడ్డి పత్తి రైతులకు కనీస మద్దతు ధర అందించలేకపోతున్నారని ఆరోపించారు. మక్క రైతులతో మాటామంతి.. అంతకుముందు అపరాల యార్డుకు వెళ్లిన హరీశ్రావు మక్కలను పరిశీలించారు. అమ్మడానికి వచ్చిన ములుగు జిల్లాకు చెందిన రైతులు వెంకటేశ్వర్లు, లక్ష్మయ్యతో ముచ్చటించారు. మక్కలను ఎంతకు అమ్మారు అని ప్రశ్నించగా రూ.1,825లకు అని సమాధానం చెప్పారు. మద్దతు ధర క్వింటాల్కు రూ.2,400లు ఉంది కదా అని అంటే.. వారు ట్రేడర్కు అమ్మామని, ఆయన వెంటనే డబ్బులు ఇవ్వడమే కాకుండా పంట వేసేందుకు ముందుగా పెట్టుబడి పెడుతున్నందున విక్రయించామని చెప్పారు. కేంద్రాల్లో కొనుగోలు చేసిన మక్కలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల మార్క్ఫెడ్ రైతులకు డబ్బులు చెల్లించలేక పోతోందని హరీశ్రావు అన్నారు. అందువల్ల క్వింటాల్కు రైతులు రూ.575లు నష్టపోతున్నా ట్రేడర్లకే అమ్ముకుంటున్నారని వాపోయారు. కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ టి.రవీందర్రావు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు దా స్యం వినయ్భాస్కర్, తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఒడితల సతీష్కుమార్, నన్నపునేని నరేందర్, సరోగసి కమిటీ మాజీ సభ్యురాలు డాక్టర్ హరి రమాదేవి, ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కా కులమర్రి లక్ష్మణ్బాబు, నాయకులు పాల్గొన్నారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ సందర్శన కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ను తన్నీరు హరీశ్రావు సందర్శించి, రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, బోనస్ రాక, మరోవైపు యూరియా, రైతుబంధు,రైతు బీమా అందకపోవడంతో గోసపడుతున్న రైతులంతా రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం రేవంత్రెడ్డిపై శాపనార్దాలు పెడుతున్నారని విమర్శించారు. కేసముద్రం మార్కెట్లో కనీస సౌకర్యాలు లేవని, పందులు, మేకలు తిరుగుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్న సీఎం కాంగ్రెస్ పాలనలో కరెంటు నుంచి కాంటా దాకా సమస్యలే మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు వరంగల్ ఏనుమాముల మార్కెట్ సందర్శన.. రైతులతో ముచ్చటించి సమస్యలు తెలుసుకున్న మాజీ మంత్రి -
కాంట్రాక్టర్లకు చేపల పెంపకం అప్పగించొద్దు
● స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రఘునాథపల్లి: చెరువులు, రిజర్వాయర్లలో చేపలు పట్టి విక్రయించే బాధ్యతలు కాంట్రాక్టర్లకు అప్పగించి నష్ఠపోవద్దని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. మంగళవారం మండలంలోని అశ్వరావుపల్లి రిజర్వాయర్లో ఆయన చేపపిల్లలను వదిలారు. ఈ సందర్బంగా జిల్లా మత్య్స పారిశ్రామిక సొసైటీ జిల్లా అధ్యక్షుడు నీల రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. చేపల పెంపకం, విక్రయ బాధ్యతలు కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల మత్య్సకారులు ఆర్దికంగా నష్టపోతారన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, ఆర్డీఓ గోపిరాం, డీఎఫ్ఓ రాణాప్రతాప్ పాల్గొన్నారు. పెద్ద సైజు చేపపిల్లలు వేయాలి లింగాలఘణపురం: రిజర్వాయర్లలో పెద్ద సైజు చేపపిల్లలు వేయాలని, అప్పుడే మత్స్యకారులకు ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని నవాబుపేట రిజర్వాయర్లో చేప పిల్లలను విడుదల వేశారు. శ్రీరామనవమి వరకు పనులు పూర్తిచేయాలి రాబోయే శ్రీరామనవమి వరకు నవాబుపేట కోదండరామస్వామి ఆలయంలో కల్యాణ మండపం, సీసీ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కడియం సూచించారు. డీపీఓ నవీన్, డీఎఫ్ఓ రాణాప్రతాప్, ఆర్డీఓ గోపిరామ్, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ శివశంకర్రెడ్డి పాల్గొన్నారు. -
మహిళా గ్రూపుల పనితీరుపై పరిశీలన
లింగాలఘణపురం: మండల కేంద్రంలోని శుభాంజలి మండల సమాఖ్య, సరస్వతి గ్రామైక్య సంఘాల్లోని గ్రూపు సభ్యుల పనితీరుపై మంగళవారం ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్లు తేజశ్వని, వెంకటరమణ పరిశీలించారు. సరస్వతి గ్రామైక్య సంఘం సమావేశానికి హాజరై సంఘంలోని సభ్యులు తీసుకున్న రుణాలు, వాటితో ఉపాధి పొందుతున్న విధానం, తిరిగి రుణాలు చెల్లిస్తున్న తీరు, భవిష్యత్తులో మరింత ఉన్నతంగా అభివృద్ధి సాధించేందుకు తీసుకుంటున్న చర్యలపై సంఘ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు అదనపు డీఆర్డీఓ నూరుద్ధీన్, మండల సమాఖ్య అధ్యక్షురాలు కాటం రవ్య, ఉమ, పద్మ, రేణుక తదితరులు ఉన్నారు. -
నేటినుంచి సీసీఐ కొనుగోళ్లు ప్రారంభం
● పత్తి మిల్లర్ల చర్చలు సఫలం ● ఊపిరిపీల్చుకుంటున్న రైతులుజనగామ: రాష్ట్రవ్యాప్తంగా పత్తి మిల్లులు, అనుబంధంగా ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాలు ఈనెల 19న(బుధవారం) తెరుచుకోనున్నాయి. ఎల్–1, ఎల్2, ఎల్3 కేటగిరీల వారీగా సీసీఐ సెంటర్ల ప్రారంభం, ఎకరాకు 12క్వింటాళ్ల నుంచి 7 క్వింటాళ్లకు కుదింపు, జిల్లా పరిధి నిబంధన తదితర సమస్యలపై నిరసిస్తూ తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈనెల 17 నుంచి పత్తి మిల్లులు బంద్ పాటిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సీసీఐ సీఎండీతో జరిపిన చర్చలు సఫలం కావడం, కాటన్ అసోసియేషన్ ప్రతినిధులను ఒప్పించి బంద్ను విరమింపజేశారు. జిల్లాలో 15 పత్తి మిల్లులు ఉండగా, ఇందులో 14 చోట్ల సీసీఐ సెంటర్లను ప్రారంభించిన అధికారులు, మ రో చోట పెండింగ్ ఉంచారు. ఇప్పటివరకు 3,427 మంది రైతుల వద్ద 48.750 క్వింటాళ్ల తెల్ల బంగారం కొనుగోలు చేయగా, ఇందుకు సంబంధించి రూ.28.08 కోట్లకు గాను రూ.25కోట్ల మేర వారి ఖాతాలో జమ చేశారు. రైతులు తమ పత్తిని బుధవారం నుంచి సీసీఐ కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధరకు అమ్ముకోవచ్చని జిల్లా కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మోహన్ తెలిపారు. పత్తి మిల్లర్లు సమ్మె విరమించుకోవడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సమ్మె విరమించారు నేటి నుంచి యథావిధిగా సీసీఐ సెంటర్లలో మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సీసీఐ సీఎండీతో చర్చలు జరిపి, జిన్నింగ్ మిల్లర్ల సమ్మెను విరమింపజేశారు. -
ముగిసిన జీడికల్ జాతర
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో ఈనెల 4న మొదలైన జాతర సోమవారంతో ముగిసింది. చివరిరోజు వేదపండితులు ఆలయంలో అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. 108 కలశాలతో మహాసంప్రోక్షణ చేశారు. అనంతరం పండితోపన్యాసం, మహాదాశీర్వచనంతో ఉత్సవం పరిసమాప్తి జరిగింది. కార్యక్రమంలో వేదపండితులు గట్టు శ్రీనివాసాచార్యులు, విజయసారథి, భార్గవాచార్యులు, రాఘవాచార్యులు, మురళీధరాచార్యులు, బుచ్చయ్యశర్మ, దేవస్థాన చైర్మన్ మూర్తి, ఈఓ వంశీ, దేవస్థాన డైరెక్టర్లు, రిటైర్డ్ ఈఓ కేకే రాములు, సిబ్బంది భరత్, మల్లేశం, రమేష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
అధిక సాంద్రత పత్తి సాగు లాభదాయకం
రఘునాథపల్లి: అధిక సాంద్రత పత్తి సాగు లాభదాయకమని రాష్ట్ర రైతు విజ్ఞాన కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త, సమన్వయ కర్త డాక్టర్ శ్రీలత అన్నారు. సోమవారం మండలంలోని కన్నాయపల్లిలో యాదాద్రి భువనగిరి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అధిక సాంద్రత పత్తి సాగు విధానంపై శేరి సోమిరెడ్డి పత్తి చేనులో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీలత మాట్లాడుతూ ఎకరాకు 9 నుంచి 13 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఎకరాకు రూ.5 వేలు రైతుల ఖాతాలో జమ చేస్తుందన్నారు. అనంతరం గ్రామంలోని 50 మంది రైతులకు షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికలో భాగంగా ఉచితంగా డీహెచ్ఎం 117 రకం మొక్కజొన్న విత్తనాలు పంపణీ చేశారు. కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి. మల్లయ్య, సుశీల, ఏఓ కాకి శ్రీనివాస్రెడ్డి, ఆర్ఈసీ సభ్యుడు మంతపురి యాదగిరి, ఏఈఓ కల్పన, వేణు, రూప, రాజేష్, బానుచందర్, రెతులు పాల్గొన్నారు. -
చాళుక్యుల దీపస్తంభానికి దీపారాధన
రఘునాథపల్లి: మండలంలోని నిడిగొండ శివాలయం సమీపంలోని కల్యాణి చాళుక్యుల కాలం నాటి జైనమాన దీప స్తంభానికి కార్తీక మాసం సందర్భంగా సోమవారం రాత్రి గ్రామస్తులు దీపారాధన చేశారు. యువకులు, మహిళలు, చిన్నారులు, భక్తులు కలిసి ఎత్తైన స్తంభానికి దీపారాధన చేయడంతో నాటి వైభవం విరాజిల్లింది. పాఠశాల ఆకస్మిక తనిఖీస్టేషన్ఘన్పూర్: మండలంలోని రాఘవాపూర్ ప్రభుత్వ పాథమికోన్నత పాఠశాలను స్పెషల్ క్యాంపెయిన్ 5.0 రాష్ట్ర పరిశీలకులు, ఎన్ఈఆర్టీ డైరెక్టర్ విజయలక్ష్మి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్పెషల్ క్యాంపెయిన్ 5.0లో భాగంగా పాఠశాల ఆవరణ, తరగతి గదులు, వంటగది, మూత్రశాలలు, పరిశుభ్రత, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ప్రభుత్వం, విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపడతుఉన్న స్పెషల్ క్యాంపెయిన్ కార్యక్రమాలను సజావుగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంఓ నాగరాజు, ఎంఈఓ కొమురయ్య, హెచ్ఎం అనిల్, ఎమ్మార్సీ సిబ్బంది గిరి, లవన్, రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పెన్షన్లు.. భూ సమస్యలు
● జనగామ పట్టణం స్వర్ణ కళామందిర్ పక్కన గల తన స్థలాన్ని కొందరు కూరగాయల వ్యాపారులు దౌర్జన్యంగా ఆక్రమించి వ్యాపారం నిర్వహిస్తున్నారని శ్రీహరి అనే వ్యక్తి విన్నవించారు. ● రాజీవ్నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మోతే సంధ్య అద్దె ఇంట్లో ఇబ్బందులు పడుతున్నామని ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి ఆదుకోవలని దరఖాస్తు చేసుకుంది. ● ఇందిరమ్మ ఇల్లు తన భార్య రాజేశ్వరీ పేరు మీద మార్చాలని జఫర్గఢ్ మండలం రేగడి తండాకు చెందిన భూక్య రవి వేడుకున్నారు. ● వితంతు పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని చీటకోడూరుకు చెందిన తుక్కపల్లి ఎల్లమ్మ విన్నవించింది.ఈ ఫొటోలోని దివ్యాంగుడు చాగల్లు గ్రామానికి చెందిన తాటికాయల కుమార్. పుట్టుకతోనే కుడి చేయి పడిపోయింది. ఎలాంటి పనులు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఐదేళ్ల క్రితం సదరం సర్టిఫికెట్ వచ్చింది. దివ్యాంగ పెన్షన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసినా.. రావడం లేదని, పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని గ్రీవెన్స్లో విన్నవించారు. ●జనగామ రూరల్: సదరం సర్టిఫికెట్ ఉన్నా.. దివ్యాంగ పింఛన్ రావడం లేదని, సాగు భూమి ఒక గ్రామానికి బదులు మరొక గ్రామంలో ఉందని, కళాకారుల పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని, ధాన్యం కొనుగోలు చేయడం లేదని.. ఇలా పలు సమస్యలతో సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో వినతులు సమర్పించారు. అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, బెన్షాలోమ్లు అర్జీలను స్వీకరించి ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీఓ గోపిరామ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ గ్రీవెన్స్లో 39 అర్జీలు -
పత్తి ధర ఢమాల్!
జనగామ: పత్తి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. సీసీఐ ద్వారా మద్దతు ధర లభిస్తుందనుకున్న రైతులకు నిరాశ మిగిలింది. తుఫాను ప్రభావంతో ఇప్పటికే దిగుబడి తగ్గి పంట నష్టపోయిన రైతులను ఇప్పుడు మార్కెట్ బంద్ వెంటాడుతోంది. పైగా చిల్లర కాంటా వ్యాపారంలో క్వింటాకు రూ.1,800 తక్కువగా చెబుతుండడం, అత్యవసర ఆర్థిక ఒత్తిడికి తట్టుకోలేని రైతులు నష్టపోయినా అమ్మేయాల్సిన దుస్థితి నెలకొంది. కాటన్ కార్పొరేషన్ అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ సంబంధిత మిల్లులు బంద్లోకి వెళ్లడంతో పత్తి కొనుగోళ్లు ఎక్కడికక్కడ స్తంభించి పోయాయి. మిల్లుల వద్ద పడిగాపులు సీసీఐ, పత్తి మిల్లులు బంద్ చేశారని తెలియక సెంటర్ల వద్దకు వచ్చిన రైతులు పడిగాపులు కాస్తున్నారు. పత్తి మిల్లులకు అనుసంధానంగా ఉన్న సీసీఐ సెంటర్ల వద్ద దేవరుప్పుల, పాలకుర్తి, రఘునాథపల్లి, స్టేషన్ఘన్పూర్, చిల్పూరు, జనగామ పలు మండలాలకు చెందిన రైతులు పత్తిని అమ్ముకునేందుకు వచ్చి నిరీక్షిస్తున్నారు. బంద్ చేపట్టారని తమకు ఎవరూ చెప్ప లేదని అంటున్నారు. బంద్ నేపధ్యంలో సీసీఐ సెంటర్లను సాక్షి పరిశీలన చేయగా, రైతుల కష్టాలు వెలుగు చూశాయి. నిబంధనల్లో కఠినతరం వానాకాలం సీజన్లో సీసీఐ అమలు చేస్తున్న నిబంధనలు రైతులకు ఆశని పాతంలా మారిపోయింది. గతంలో రైతు వారిగా ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసిన సెంటర్లు, ఇప్పుడు 7 క్వింటాళ్లకు తగ్గించారు. అంతే కాకుండా ఎల్–1, ఎల్–2, ఎల్–3 పేరిట పత్తి మిల్లుల పరిధిలో సీసీఐ కేంద్రాలను ప్రారంభించే కొత్త నిబంధన తీసుకువచ్చారు. ఈ మార్పులతో రైతులకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిల్లర కాంటా దోపిడీ సీసీఐ కొనుగోళ్లు నిలిచిపోవడంతో, ఇంటింటా తిరిగి తీసుకెళ్లడం, రవాణా ఖర్చులు, అవసరాలు, రుణ బకాయిల చెల్లింపులు, ఎరువుల కొనుగోళ్లు వంటి కారణాలతో రైతులు అంతగా ఇష్టపడకపోయినా చిల్లర కాంటాలో ప్రైవేట్ వ్యాపారులకే పత్తిని అమ్మక తప్పడం లేదు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని వ్యాపారులు క్వింటాలుకు రూ.1,000 నుంచి రూ.1,800 వరకు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. జనగామ పట్టణం, నెల్లుట్ల, తరిగొప్పుల, నర్మెట, రఘునాథపల్లి, పాలకుర్తి, స్టేషన్న్ఘన్పూర్ తదితర మండలాల్లో చిల్లర కాంటా జోరు స్పష్టంగా కనిపిస్తోంది. పాలక ప్రభుత్వాలు సీసీఐ మిల్లుల బంద్ను వీలైనంత త్వరగా ఎత్తివేసి కొనుగోళ్లు పునఃప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. గ్రామాల్లో జోరుగా చిల్లర వ్యాపారుల దందా ఆర్థిక పరిస్థితులు, యాసంగి పెట్టుబడి కోసం అమ్ముకుంటున్న రైతులు క్వింటాకు రూ.1,800 తగ్గించి కొనుగోలు చేస్తున్న వైనంసీసీఐ సెంటర్లలో మాతృ జిల్లాకు సంబంధించిన పత్తి మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధన విధించింది. దీంతో సరిహద్దు గ్రామాల రైతులకు ఇది పెద్ద సమస్యగా మారింది. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాలు, రెవెన్యూ పరిధి జనగామ జిల్లాకు పక్కనే ఉంటుంది. ఇతర జిల్లాల రైతులకు సీసీఐ సెంటర్లు సమీపంలో ఉన్నప్పటికీ ఇక్కడ పత్తి అమ్ముకునే వీలు లేకుండా పోతుంది. సొంత జిల్లాలో అమ్ముకుందామంటే రవాణా చార్జీలు పెరిగి పోతున్నాయి. దీంతో రైతులు పలుమార్లు ప్రయాణించాల్సి రావడంతో రవాణా వ్యయాలే భారం మారుతున్నాయి. రైతుల కష్టాలు, మిల్లర్ల వినతులను దృష్టిలో ఉంచుకుని సమీప జిల్లాల పత్తిని సైతం కొనుగోలు చేయాలని తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తోంది. -
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
జనగామ: యువత, నిరుద్యోగులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఆడిట్ అధికారి రెహమాన్ అన్నారు. సోమవారం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జిల్లా గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలుగా ఉపయోగపడుతున్నాయన్నారు. ఇక్కడ పెంపొందించుకున్న జ్ఞానం భవిష్యత్లో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాంబాబు, నాయకులు లింగాల జగదీష్, చందర్రెడ్డి, తోటకూరి రమేష్, బంద కుమార్, సంస్థ కార్యదర్శి సుధీర్, పుల్లయ్య, కళా నిలయం వ్యవస్థాపకుడు రాజేంద్ర ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు. స్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య సమస్యపై ప్రత్యేక చొరవతో పనిచేస్తున్నామని, అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ఘన్పూర్ ఎస్సీ కాలనీ 16వ వార్డులో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న డ్రెయినేజీ సమస్యను పరిష్కరించారని కాలనీవాసులు కమిషనర్కు కృతజ్ఞతలు తెలిపారు.కమిషనర్ స్పందిస్తూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాల మేరకు కలెక్టర్ రిజ్వాన్బాషా, అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ సూచనలతో పనిచేయడం జరిగిందన్నారు. అభివృద్దికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మోటం శ్రీనివాస్, పొదల రవి తదితరులు పాల్గొన్నారు. జనగామ రూరల్: వృద్ధులతో ప్రతిఒక్కరూ ఆప్యాయంగా, ప్రేమగా ఉండాలని ఇన్చార్జ్ జిల్లా సంక్షేమాధికారి కోదండ రాములు అన్నారు. సోమవారం మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా పట్టణంలోని ర్రుమదేవి వృద్ధ ఆశ్రమంలో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు క్యాథరిన్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సిద్ది మల్లయ్య, మల్లారెడ్డి, రామస్వామి, రాజయ్య, భిక్షపతి, రామచంద్రం సీడీపీఓ సత్యవతి, స్వాతి, రాజు, తదితరులు పాల్గొన్నారు. జనగామ: భాగ్యనగర్ టీఎన్జీఓ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీలో ఉద్యోగులకు స్థలాలను కేటాయించాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఖాజా షరీఫ్ కోరారు. సోమవారం హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన నిరసన దీక్షలకు జిల్లా నుంచి టీఎన్జీఓ నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. అనంతనం ఖాజా మా ట్లాడుతూ హౌసింగ్ సొసైటీ కేటాయించిన 140 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు నెలలక్రితం 20 ఎకరాలు కబ్జా చేసినట్లు తెలిపారు. ఈ విషయమై తామంతా 125 రోజులుగా నిరసన చేస్తున్నామన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 48 రోజుల పాటు సకల జనుల సమ్మెతో ఉద్యోగులు ముఖ్యభూమిక పోషించారన్నారు. స్థలాన్ని కబ్జా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఉన్నారు. -
భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవం
రఘునాథపల్లి: మండలంలోని నిడిగొండలో శిథి లావస్థలో ఉన్న ముప్పేశ్వర త్రికూటాలయంలో ఆదివారం కార్తీక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామస్తులు తరలివచ్చి కార్తీ క దీపాలను వెలిగించి దైవభక్తిని చాటుకున్నారు. కుంకుమార్చన.. కార్తీక మాసం సందర్భంగా మండలంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో పండితులు అభిషేకాలు, కుంకుమార్చన పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీవాసవీ మాతా సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ లగిశెట్టి భిక్షపతి–రాజమణి దంపతులను ఘనంగా సత్కరించారు. ప్రతినిఽధి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. శివాలయంలో.. దేవరుప్పుల: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో పూజారి పెద్దాపురం వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకం, పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు శివలింగానికి క్షీరాభిషేకం చేసి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. -
దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగిస్తాం
బచ్చన్నపేట: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగిస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం మండలంలోని చిన్నరామన్చర్ల గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేశంతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. దొరల పెత్తందారీ వ్యవస్థకు ఎదురొడ్డిన దొడ్డి కొమురయ్య అమరుడయ్యాడన్నారు. ఆ స్పూర్తితోనే అనేక పోరాటాలను చేశారని, ప్రపంచ చరిత్రలో సాయుధ పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై పెట్టాలని సీఎంతో మాట్లాడానని, ఆయన జయంతి, వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా సీఎం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో విగ్రహ దాత కేమిడి రాజు, కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెవెళ్ల సంపత్, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి, కళాకారుల సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ఒగ్గు రవి, మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నింటి కావ్యశ్రీరెడ్డి, నాయకులు బాల్నె సిద్దిలింగం, కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, బేజాడి బీరప్ప, బండి వీరస్వామి, నర్సింహులు, సిద్దులు, కిష్టయ్య, రమణారెడ్డి, మల్లేశం పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య -
జీడికల్లో ఘనంగా చక్రస్నానం
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం ఘనంగా చక్రస్నానం కార్యక్రమం జరిగింది. సీతారాముల కల్యాణోత్సవ అనంతరం జరిగే తంతులో భాగంగా వేదపండితులు శ్రీనివాచార్యులు వేదమంత్రోచ్ఛరణలతో ఉత్సవ విగ్రహాలను జీడిగుండం, పాలగుండాల్లో చక్రస్నానం చేయించారు. కార్యక్రమంలో వేదపండితులు భార్గవాచార్యులు, మురళీధరాచార్యులు, దేవస్థాన చైర్మన్ మూర్తి, డైరెక్టర్లు, దేవస్థాన సిబ్బంది భరత్, మల్లేశం, రమేశ్, రి టైర్డ్ ఈఓ కేకే రాములు, భక్తులు పాల్గొన్నారు. ఘనంగా శ్రీసరస్వతి యజ్ఞంపాలకుర్తి టౌన్ : ప్రముఖ చండీత సమేత సో మేశ్వర లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రం ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సత్రంలో 511వ శ్రీసరస్వతి యజ్ఞం నిర్వహించారు. 33 ఏళ్లుగా నెలకొక యజ్ఞం చొప్పున అనేక ప్రాంతాల్లో 510 సరస్వతి యజ్ఞాలు పూర్తి చేసుకుంది. కార్యక్రమంలో అష్టకాల విద్యా మనోహర శర్మ, భక్తులు పాల్గొన్నారు.ముగిసిన పవిత్రోత్సవాలుస్టేషన్ఘన్పూర్ : డివిజన్ కేంద్రంలోని తిరుమలనాథస్వామి ఆలయంలో పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు ఆదివారం ముగిశాయి. మూడ్రోజులుగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల చివరి రోజు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కలకోట రంగాచార్యులు, ప్రధాన అర్చకులు రామానుజచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారికి 108 కలశాలతో విశేష అభిషేకం చేశారు. మధ్యాహ్నం మహాపూర్ణాహుతి, ఆలయశుద్ధి, వేద పండితుల సన్మానం, భక్తులకు ఆశీర్వచనం కార్యక్రమాలను చేపట్టారు. కార్యక్రమంలో పూజారులు రఘునాథచార్యులు, విష్ణువర్ధనాచార్యులు, గోపాలకృష్ణమా చార్యులు, శ్రీవత్సవాజీవణా చార్యులు, భక్తులు పాల్గొన్నారు. పత్తి కొనుగోలుకు ఆంక్షలు సరికాదుజఫర్గఢ్ : ఎలాంటి ఆంక్షలు లేకుండా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆ పార్టీ శాఖ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి చిర్ర కుమారస్వామి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సోమయ్య హాజరై మాట్లాడారు. పత్తి కొనుగోళ్లలో సీసీఐ ఆంక్షలు విధించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ టౌన్ కార్యదర్శి కాట సుధాకర్, నాయకులు సాకి నర్సింగం, వెంకటేష్, అప్సర్, కుమారస్వామి, ఖాదర్, సుధాకర్, బాషబోయిన అనిల్, నల్లతీగల శ్రీను పాల్గొన్నారు. 21 నుంచి స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ తరగతులుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ (సెల్ట్) ఆధ్వర్యంలో 40 రోజులపాటు స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సు తరగతులు ఈనెల 21 నుంచి నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ మేఘనరావు తెలిపారు. ఈతరగతులు ఇంగ్లిష్ విభాగంలోని సెల్ట్ కార్యాలయంలో సాయంత్రం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్యాంపస్ విద్యార్థులు రూ.200, ఉద్యోగులు, నిరుద్యోగులు, గృహిణులు రూ.1,500లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రిన్సిపాల్ కార్యాలయంలో నాన్ యూనివర్సిటీ ఫండ్ అకౌంట్లో ఈనెల 20లోపు చెల్లించి కోర్సులో చేరవచ్చని పేర్కొన్నారు. ఈనెల 21 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
రక్షణలేని చెరువులు
స్టేషన్ఘన్పూర్: చెరువుల అభివృద్ధి నిర్వహణ, నీటిసరఫరా కోసం పనిచేసే సాగునీటి సంఘాలు లేక జిల్లా వ్యాప్తంగా చెరువుల పర్యవేక్షణ కొరవడింది. గత పదిహేడు ఏళ్లుగా సాగునీటి సంఘాలు లేక పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునేవారు లేరు. జిల్లా వ్యాప్తంగా 770 చెరువులు ఉండగా 153 చెరువులకు గతంలో సాగునీటి సంఘాలు ఉండేవి. మొత్తం చెరువులలో వంద ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువులకు మాత్రమే సాగునీటి సంఘాలు ఉంటాయి. సాగునీటి సంఘాల ఎన్నికలకు ఆయా చెరువుల కింద వ్యవసాయభూములు ఉండి పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న రైతులు ఓటర్లుగా ఉంటారు. ఒక సాగునీటి సంఘానికి ఆరుగురు డైరెక్టర్లు, ఒక చైర్మన్ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయగానే ఎన్నికలు నిర్వహించేవారు. ఆయా చెరువుల ఆయకట్టు రైతులు చైర్మన్తో పాటు డైరెక్టర్లను ఎన్నుకునేవారు. చైర్మన్, పాలకవర్గ సభ్యులు చెరువుల నిర్వహణతో పాటు నీటిని పంటపొలాలకు సీజన్ల వారీగా విడుదల చేసుకుని పొదుపుగా వాడుకునేవారు. అదేవిధంగా రైతులను సమన్వయం చేసుకుంటూ పలు అభివృద్ధి పనులు నిర్వహించేవారు. జాడలేని నీటిసంఘాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2006 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన చెరువులకు సాగునీటి సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించింది. వాటి పదవీకాలం 2008తో ముగియగా అప్పటి నుంచి సాగునీటి సంఘాల ఊసేలేదు. గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల అభివృద్ధి అంటూ మిషన్ కాకతీయ పనులతో చెరువులు, కుంటల పునరుద్ధరణ పనులు చేపట్టిందేగాని సాగునీటి సంఘాలను ఏర్పాటు చేయలేదు. నీటి సంఘాలు లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా తూతూమంత్రంగా పనులు చేపట్టారు. పలుచోట్ల చెరువుల భూములు అన్యాక్రాంతమైన సంఘటనలు సైతం ఉన్నాయి. 2014 నుంచి 2024 వరకు పదేళ్ల పాలించిన బీఆర్ఎస్ పాలకులు సాగునీటి సంఘాల మాటే ఎత్తలేదు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తయిన నీటి సంఘాల ఎన్నికలు తిరిగి పదేళ్లకు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం సాగునీటి సంఘాలకు ఎన్నికలను నిర్వహించి చెరువులను రక్షించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. సాగునీటి సంఘాలు లేక పర్యవేక్షణ కరువు బాధ్యులు లేకపోవడంతో ఆక్రమణలు నీటి నిర్వహణ అస్తవ్యస్తం 17ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించని ప్రభుత్వాలు -
మళ్లీ కసరత్తు!
సాక్షిప్రతినిధి, వరంగల్: అర్ధంతరంగా ఆగిపోయిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియపై టీపీసీసీ మళ్లీ దృష్టి సారించింది. త్వరలోనే డీసీసీ రథసారథులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఒక్కో జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, సీనియర్ల నుంచి తుది అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. వాస్తవానికి ఈ నెల మొదటి వారంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అక్టోబర్లో కార్యాచరణ చేపట్టారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మార్గదర్శకాల మేరకు అక్టోబర్ 11 నుంచి 18 వరకు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు జిల్లాల్లో పర్యటించి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఉమ్మడి వరంగల్లో ఆరు జిల్లాల నుంచి 161 మంది డీసీసీ అధ్యక్ష పదవుల కోసం పోటీ పడ్డారు. ఏఐసీసీ, టీపీసీసీ మార్గదర్శకాల మేరకు ఒక్కో జిల్లా నుంచి నాలుగు పేర్లను తీసుకుని సీఎం, టీపీసీసీ చీఫ్కు అందజేశారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటికేషన్ రావడం, హైకోర్టు స్టేతో రద్దు కావడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కారణంగా డీసీసీల ఎంపిక ప్రక్రియ ఆగిపోయింది. జూబ్లీహిల్స్ ఎన్నిక ముగియగా.. స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం సిద్ధం కావాలని పార్టీ భావిస్తోంది. ఈనేపథ్యంలోనే డీసీసీలను పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం భావించి మళ్లీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ‘పారామీటర్’లు పక్కానా? ఎంతవరకీ ని‘బంధనాలు’.. కాంగ్రెస్ దాదాపు పదేళ్లు అధికారంలో లేదు.. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. అధిష్టానం సంస్థాగత పదవులను కీలకంగా చూస్తోంది. వారికి తగిన ప్రాధాన్యం ఇస్తామని కూడా చెప్తోంది. దీంతో డీసీసీ అధ్యక్షుడు జిల్లాస్థాయిలో కీలకం కానున్నారన్న ప్రచారం ఉంది. ఈనేపథ్యంలో ఇటీవల దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ఆశావహులు పోటీపడ్డారు. పార్టీ నిబంధనల ప్రకారం.. డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తు చేసుకునేవారు కనీసం ఐదేళ్లపాటు క్రమశిక్షణతో, నిరంతరం పార్టీ కోసం పనిచేసిన వారై ఉండాలి. అలా... లేని దరఖాస్తులు ఏఐసీసీ పరిశీలకులు తొలగిస్తారని స్పష్టం చేశారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా పని చేస్తున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ రెండోసారి అవకాశం ఉండబోదన్నారు. పార్టీ నుంచి ప్రజాప్రతినిధిగా ఎంపికై న వారిని డీసీసీ పీఠానికి పరిగణనలోకి తీసుకోరని, అలాగే పార్టీ ప్రజాప్రతినిధుల దగ్గరి బంధువులకు కూడా అవకాశం కల్పించడం లేదని తేల్చిచెప్పారు. డీసీసీ అధ్యక్ష నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా నాయకులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఏఐసీసీ సూచించిన ఈ పారామీటర్లను పరిగణనలోకి తీసుకుంటే చాలా జిల్లాల్లో డీసీసీ పదవులకు సమర్థులను ఎంపిక చేయడం కష్టమేనన్న అభిప్రాయం పరిశీలకుల్లో వచ్చింది. ఐదేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన నాయకులు చాలామందే దరఖాస్తుదారుల్లో ఉన్నా.. అందులో నుంచి ఎంపికై న వారు పార్టీని సమర్థంగా నడిపించగలరా? అనేది ప్రశ్నగా ఉంది. దీంతో ఏఐసీసీ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుంటారా? లేక జిల్లా ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకు డీసీసీలను ఎంపిక చేస్తారా? ఏఐసీసీ గైడ్లైన్స్ సడలించి స్థానిక అవసరాలు, ప్రాథమ్యాలను గమనించి నియమిస్తారా? అసలేం జరగనుంది? అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.పార్టీ హైకమాండ్ కార్యాచరణతో డీసీసీ ఎన్నికల కసరత్తుకు రంగంలోకి దిగిన పరిశీలకులకు పోటీపోటీగా ఆశావహుల నుంచి దరఖాస్తులు అందాయి. ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షులు మార్పు తథ్యమన్న ప్రచారం నేపథ్యంలో.. కొత్తగా హనుమకొండ జిల్లా నుంచి ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జంగా రాఘవరెడ్డి, ఈవీ శ్రీనివాస్రావు, బట్టి శ్రీనివాస్, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డి, బొమ్మనపల్లి అశోక్రెడ్డి, కట్ల శ్రీనివాస్తో పాటు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్ నుంచి ప్రస్తుత డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నమిండ్ల శ్రీనివాస్, ఎంపీ ఆనంద్, బొంపెల్లి దేవేందర్రావు, గోపాల నవీన్రాజ్, నల్గొండ రమేశ్, నర్సంపేట మాజీ ఎంపీపీ టి.రవీందర్రావు, పిన్నింటి అనిల్రావు తదితరులు పోటీపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి డీసీసీ కోసం మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధుతో పాటు 18 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పరిశీలకులు ప్రకటించారు. జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి స్థానంలో హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, బండ శంకర్, లకావత్ ధన్వంతి, కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, మాసాన్పల్లి లింగాజీ తదితరులు రేసులో ఉన్నారు. ములుగు జిల్లాకు పైడాకుల అశోక్, కుంజ సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్గౌడ్, బాదం ప్రవీణ్ తదితరులు దరఖాస్తు చేసుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం. మహబూబాబాద్ నుంచి జె.భరత్చంద్రారెడ్డి, వెన్నం శ్రీకాంత్రెడ్డి, అంజయ్యతో పాటు 20 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం ఉంది. అయితే మొత్తంగా ఉమ్మడి జిల్లా నుంచి ఆరు డీసీసీల కోసం 161 దరఖాస్తులు రాగా.. ఒక్కో జిల్లా నుంచి నాలుగు పేర్ల చొప్పున 24 మంది పేర్లను ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలనకు పంపారు. ఇందులో నుంచి ఎంపిక చేసేందుకు తాజాగా టీపీసీసీ ముఖ్యనేతల నుంచి తుది అభిప్రాయ సేకరణ చేస్తుండడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ.. ఒక్కో జిల్లా నుంచి పరిశీలనలో నాలుగు పేర్లు ‘స్థానిక’, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో తాత్కాలికంగా బ్రేక్ నియామకంపై నేటి కేబినెట్లో చర్చించే అవకాశం -
హైవేపై జీరో సేఫ్టీ
లారీని బస్సు ఢీకొట్టిన ఘటనలో రోడ్డు భద్రత నిర్వహణ లోపం జనగామ: హైవేపై ‘జీరో సేఫ్టీ’ మరోసారి మృత్యుఘంట మోగించింది. నిడిగొండ ఫ్లైఓవర్కు 10 మీటర్ల దూరంలో బ్రేక్డౌన్ అయిన ఇసుక లారీ గంటసేపు రోడ్డుపైనే నిలిచిపోయింది. నేషనల్ హైవే అథారిటీ హెల్ప్లైన్ నెంబర్–1033కు డ్రైవర్ పలుమార్లు కాల్ చేసినా స్పందన రాలేదు. ఇదే సమయంలో హన్మకొండ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ రాజధాని బస్సు నేషనల్ హైవే రోడుపై నిలిచిన లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్ 100కు కాల్ చేసి ఉంటే ప్రమాదం తప్పేదని పోలీసులు భావిస్తున్నారు. ఎన్హెచ్ నిర్వహణ, లైటింగ్ లోపాలు, హెల్ప్లైన్ అలసత్వం అమాయక ప్రాణాలను పొట్టనబెట్టుకుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లారీని ఢీకొట్టే సమయంలో బస్సు వేగం 55 కిలోమీటర్లు మాత్రమే ఉన్నట్లు జనగామ డిపో మేనేజర్ స్వాతి తెలిపారు. ప్రమాదంలో ప్రమేయం ఉన్న లారీ వాహన పత్రాలు సక్రమంగానే ఉన్నాయని జిల్లా రవాణా అధికారి జీవీఎస్ గౌడ్ తెలిపారు. అయితే ఓవర్లోడ్ ఉందా లేదా అనే విషయం తూకం వేసిన తర్వాత నిర్ధారణ జరుగుతుందన్నారు. ఇసుక లారీ ఫ్లైఓవర్ దిగిన వెంటనే బ్రేక్డౌన్తో ఆగిపోవడంతో ఎన్హెచ్ హెల్ప్లైన్ నెంబర్కు డ్రైవర్ ఫోన్ చేసినా, అక్కడ నుంచి రెస్పాన్స్ రాలేదని చెప్పినట్లు స్పష్టం చేశారు. నేషనల్ హైవేపై వాహనాలు ఆగిన వెంటనే హెల్ప్లైన్ సెంటర్లు స్పందించాల్సి ఉంటుంది. కానీ వరంగల్–హైదరాబాద్ హైవేపై అలాంటి చర్యలు కనిపించడం లేదు. రిపేరు, బ్రేక్డౌన్, తదితర కారణాలతో వాహనాలు రోడ్డుపై నిలిచిన సమయంలో తొలగించే టీంలు కనిపించడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. చిన్న పెండ్యాల నుంచి జనగామ పెంబర్తి వరకు అనేక చోట్ల ఫ్లడ్లైట్లు వెలగడం లేదు.ఇటీవల కాలంలో బస్సుల ప్రమాదాలు పెరిగిపోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. అన్ని ప్రమాదాలకూ రహదారి భద్రతా లోపాలే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రఘునాథపల్లి శివారు టిఫిన్ సెంటర్లోకి బస్సు దూసుకొచ్చిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మండల కేంద్రం శివారు పెట్రోలు బంకు వద్ద కారు–బస్సు ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డారు. ఖిలాషాపూర్ రోడ్డు సమీపంలో స్కూల్ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో త్రుటిలో ప్రమాదం తప్పింది. జనగామ శివారు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం సమీపంలో బెంగుళూరు నుంచి వచ్చే ట్రావెల్ బస్సు టైరు పేలి అదుపుతప్పి పల్టీకొట్టిన ఘటనలో 20మందికి పైగా గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బస్సు, లారీ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇప్పటివరకు 22 మందికి పైగా చనిపోయారు. నిడిగొండ శివారులో లారీ–రాజధాని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటన హైవే భద్రతలో ఉన్న లోపాలను మరోసారి బట్టబయలు చేసింది. హైవే అథారిటీ నిర్లక్ష్యం, హెల్ప్లైన్ స్పందన లేకపోవడం, లైటింగ్ సౌకర్యాల లేమి ఇవన్నీ ప్రమాదానికి కారణాలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఫ్లైఓవర్ కిందకు దిగగానే అర్ధరాత్రి 12 గంటల సమయంలో లారీ బ్రేక్డౌన్ కావడంతో రోడ్డు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో డ్రైవర్ మల్లేశం వెంటనే నేషనల్ హైవే హెల్ప్ లైన్కు పలుమార్లు కాల్ చేసినా రెస్పాన్స్ రాలేదు. గంటసేపు ఎలాంటి సహాయం అందకపోవడంతో లారీ రహదారి పైనే నిలిచిపోయింది. ఇదేక్రమంలో రాత్రి 1.05 గంటలకు బస్సు రావడం, ఢీకొట్టడం జరిగింది. మలుపుగా ఉన్న ఫ్లైఓవర్ దిగే సమయంలో లారీ అగిఉన్న విషయం బస్సు డ్రైవర్ ఎందుకు గమనించలేదనే విషయంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ 50 మీటర్ల దూరంలో పసిగట్టి బ్రేక్లు వేసినా సడెన్గా అపలేకపోయారా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఫ్లైఓవర్ సమీపంలో బ్రేక్డౌన్తో లారీ అగిపోయిన సమయంలో సదరు డ్రైవర్ కనీస ప్రమాద హెచ్చరిక ప్రికాషన్ తీసుకోకపోవడం సైతం తప్పిదంగానే భావిస్తున్నారు. హెల్ప్లైన్ స్పందించకపోవడమే విషాదానికి కారణంగా ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. 1033 హెల్ప్లైన్ స్పందన లేకపోవడమే ప్రమాదానికి కారణం 100కు కాల్ చేస్తే ప్రమాదం తప్పేదంటున్న అధికారులు ఢీకొట్టే సమయంలో బస్సు స్పీడ్ 55 కిలోమీటర్లు ఎన్హెచ్ నిర్వహణపై సర్వత్రా విమర్శలుప్రమాదం జరిగిన ప్రాంతంలోని యూటర్న్ దగ్గర సిగ్నల్ లైట్ ఒక వైపుకు తిరిగి ఉండడంతో డ్రైవర్లకు స్పష్టంగా కనిపించే పరిస్థితి లేకుండాపోయింది. హైవేపై చాలాచోట్ల స్ట్రీట్ లైట్లు వెలగకపోవడం, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోకపోవడం, రాత్రివేళ రక్షణ చర్యలు శూన్యంగా మారాయి. -
కుక్కపిల్లలంటే ఆమెకు ప్రాణం
మానుకోట మున్సిపాలిటీ పరిధి ఈదులపూసలపల్లికి చెందిన మ్యారేజ్ ఈవెంట్స్ ఆర్గనైజర్ పింగిలి దీపికకు కుక్కపిల్లలంటే ప్రాణం. దీపిక బాల్యంలో ఆమె నాన్న చిన్న కుక్క పిల్లను ఇంటికి తీసుకొచ్చాడు. ఆ కుక్కపిల్లను ఆమె అల్లారుముద్దుగా చూసుకునేవారు. అప్పటి నుంచే ఆమెకు కుక్కపిల్లలపై ప్రేమ పెరిగింది. కుక్కలకు సొంత డబ్బుతో వైద్యం, నాన్న పెన్షన్ డబ్బులతో స్నాక్స్, భోజనం అందిస్తున్నారు. ఆమె పెంచుతున్న వీధి కుక్కల్లో చాలావరకు గుండె, లివర్, క్యాన్సర్, ఫిట్స్ వంటి రోగాల బారిన పడి ఉన్నాయి. వైద్యం కోసం హైదరాబాద్లోని ఆస్పత్రికి కారులో తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె 3 వేల కుక్కలను దత్తత ఇచ్చారు. అదేవిధంగా ఆమె ఇంటి వద్ద ప్రస్తుతం 36 కుక్కలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రత్యేకంగా కుక్కల కోసం యూట్యూబ్ చానల్ ప్రారంభించారు. కుక్కలను ఎవరైనా దత్తత తీసుకోవాలంటే 73962 82837 నంబర్లో సంప్రదించాలని దీపిక కోరుతున్నారు. -
వైభవంగా కార్తీక దీపారాధన
పాలకుర్తి టౌన్: కార్తీక మాసోత్సవంలో భాగంగా శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం రాత్రి కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. చండికా అమ్మవారి ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించారు. మహిళలకు తాంబూలం, ప్రసాదం వాయినంగా అర్చకులు మత్తగజం నాగరాజు అందజేశారు.నేడు ‘తెలంగాణ రాష్ట్రం– విద్యావ్యవస్థ’ అంశంపై చర్చజనగామ: రాష్ట్రంలోని విద్యారంగ పరిస్థితిపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించేందుకు తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్(టీజేటీఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 16న (ఆదివారం) ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్లోని డ్రీమ్ స్కేప్ హోటల్లోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ కాన్ఫరెన్స్ హాల్లో ‘తెలంగాణ రాష్ట్రం –విద్యావ్యవస్థ’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్ర రమేశ్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోరం వీరభద్రరావు, జాడి శ్రీనివాస్ శని వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సదస్సుకు జాగృతి అధ్యక్షురాలు కల్వ కుంట్ల కవిత ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణాలకు స్థలపరిశీలనచిల్పూరు: మండలంలోని లింగంపల్లి, నష్కల్ గ్రామాల్లో నూతనంగా నిర్మించబోయే 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణాలకు శనివా రం స్టేషన్ఘన్పూర్ ట్రాన్స్కో డీఈ వై.రాంబాబు స్థల పరిశీలన చేశారు. ఈసందర్భంగా చిల్పూరు ఏఈ లక్ష్మినారాయణ, సివిల్ ఏడీ హుస్సేన్, సివిల్ ఏఈ రాజ్కుమార్తో కలిసి మాట్లాడుతూ.. గ్రామాల్లో లో ఓల్టేజీ నివారణ కోసం సబ్స్టేషన్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం కొండాపూర్ గ్రామంలో చేపట్టిన నిర్మాణ పనులు త్వరలో పూర్తి అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ నీలం ఐలేష్, లైన్మన్ కృష్ణంరాజు, అసిస్టెంట్ లైన్మెన్ అశోక్, కట్టర్ సురేష్, నాయకులు గొడుగు రవి, ఏదునూరి రవీందర్, కంకటి రాజన్న, కండ్లకోలు శ్రీనివాస్, తుత్తురు రాజు, కర్ణకంటి వెంకటేష్ పాల్గొన్నారు. జిల్లాస్ధాయి కబడ్డీ పోటీల్లో ద్వితీయ స్థానంపాలకుర్తి టౌన్: బాలల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో వాస్మిక్ ఫౌండేషన్ నిర్వహించన అండర్–17 జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్ధాయిలో ద్వితీయ స్థానంలో నిలిచినట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మామిండ్ల సోంమల్లు శనివారం తెలిపా రు. కబడ్డీ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ బహుమతి ప్రదానం చేసినట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పాయం శోభారా ణి, ఉపాధ్యాయులు ఓరుగంటి రమేశ్, గుగులోతు బలరాం, బైకాని వెంకన్న, రవి, సుమత, శోభ, మాలతి విద్యార్థులను అభినందించారు. జనగామ రూరల్: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పాదయాత్ర అధికారుల నిర్లక్ష్యంతో అస్తవ్యస్తంగా నిర్వహించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆరోపించారు. శనివారం అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పెద్దఎత్తున చేపట్టాల్సిన పాదయాత్రను కనీసం రెండు కిలోమీటర్లు కూడా నిర్వహించలేకపోయారని, అధికారులు చివరివరకు ఉండక తూతూ మంత్రంగా జరిపించారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్రకార్యవర్గ సభ్యులు లేగ రామ్మోహన్రెడ్డి, ఉడుగుల రమేశ్, కన్వీనర్ అంకుగారి శశిధర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు తోకల ఉమారాణి, భాగాల నవీన్రెడ్డి, అంజి రెడ్డి, ఉపాధ్యక్షులు దేవర ఎల్లయ్య, కోకన్వీనర్ రమేశ్, వడ్లకొండ రవి తదితరులు పాల్గొన్నారు. -
రాజీపడితేనే కేసుల పరిష్కారం
జనగామ రూరల్: పంతాలకు పోకుండా రాజీపడితేనే కేసులు పరిష్కారమవుతాయని, రాజీమార్గమే రాజా మార్గం అని కక్షిదారులు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. శనివారం జిల్లా కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ మాట్లాడుతూ..ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా రాజీ పడి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. డీసీపీ రాజా మహేంద్ర నాయక్ మాట్లాడుతూ.. ఇరుపక్షాలు పోట్లాడుకోకుండా పరిష్కరించుకుంటే ప్రశాంతంగా ఉంటారన్నారు. ఈసందర్భంగా మొత్తం 330 కేసులు పరిష్కరించగా ఇందులో సివిల్ కేసులు 11, క్రిమినల్ కేసులు 319, యాక్సిడెంట్ కేసులు 6..పరిష్కరించి వివిధ పెనాల్టీల ద్వారా రూ.35 లక్షలకుపైగా వసూలు చేసినట్లు కోర్టు అధికారులు తెలి పారు. సీనియర్ సివిల్ జడ్జి ఇ. సుచరిత, జూని యర్ సివిల్ జడ్జీలు కుమారి జి.శశి, కె. సందీప, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డి. వెంకట్రామ్ నరసయ్య, న్యాయవాదులు కె.సునీతారాణి, బి.స్వప్న, టి.భవాని, ఎన్.కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ -
పక్షులకు ఆవాసం.. ప్రకృతితో సహవాసం
హనుమకొండ ప్రకాశ్రెడ్డి పేటకు చెందిన ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల ఓనర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె స్వరూప్రెడ్డికి పక్షులంటే అమితమైన ప్రేమ. ఇంటి ఆవరణలో ప్రత్యేక షెడ్డు వేసి పక్షులను పెంచుతున్నారు. అంతేకాకుండా నిత్యం పిచ్చుకలు, రామ చిలుకలు, పలు జాతులకు చెందిన పక్షులు ఇక్కడికి వచ్చి ఆహారం తిని వెళ్తుంటాయి. వాటి కోసం డబ్బాలను ఏర్పాటు చేసి ధాన్యం గింజలు పోస్తున్నారు. ధాన్యపు గుత్తులు వేలాడదీస్తున్నారు. గిన్నెల్లో నీళ్లు పోసి వాటి దప్పిక తీరుస్తున్నారు. కొంత సమయం పక్షుల మధ్య గడిపితే ఆ రోజంతా మనసు ఉల్లాసంగా ఉంటుందని స్వరూప్రెడ్డి చెబుతున్నారు. -
ఆలస్యంగా చెరువుల్లోకి చేప
నత్తనడకన సాగుతున్న చేపపిల్లల పంపిణీజనగామ రూరల్: మత్య్స కారుల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వం రాయితీతో చేపపిల్లల పంపిణీకి సిద్ధమైంది. గతేడాది కంటే ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ ఆలస్యమైనా ఎట్టకేలకు చెరువుల్లోకి చేప పిల్లలు చేరుతున్నాయి. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న వంద శాతం రాయితీపై ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని వానాకాలం మొదట్లో ప్రారంభించాల్సి ఉండగా నవంబర్లో చెరువుల్లో చేపలు విడుదల చేసే కార్యక్రమాన్ని మత్స్యశాఖ అధికారులు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 736 చెరువులు, ప్రాజెక్టులు, కుంటల్లో రెండున్నర కోట్ల చేప పిల్లలు విడుదల చేయాలని కార్యాచరణ రూపొందించి 10 రోజుల క్రితం స్టేషన్ ఘన్పూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఇప్పటివరకు 4లక్షల చేప పిల్లలను చెరువుల్లో వదిలారు. మత్స్యశాఖ అధికారుల పర్యవేక్షణలో కొర్రలు, బంగారు తీగ వంటి పలు రకాల చేపపిల్లల పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈసారి చేపపిల్లలు ఆలస్యంగా రావడం వల్ల మత్స్యకారుల్లో కాస్త ఆందోళన నెలకొన్నప్పటికీ చేప పిల్లల పంపిణీ మొదలుకావడంతో వారిలో ఆశలు చిగురించాయి. చేపపిల్లల పంపిణీపై మే నెలలో కాంట్రాక్టర్లను పిలిచి టెండర్లు పూర్తి చేసి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో చేపల పంపిణీకి సిద్ధం కావాలి. గతేడాది 50 శాతం మాత్రమే లక్ష్యం చేరారు. ఈఏడాది కూడా చేపల పంపిణీపై సందిగ్ధం ఉండగా నవంబర్ నెలలో చేపల పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. దీంతో చేపల సైజు తక్కువగా ఉండి.. ఈ నెలలో వేస్తే సరిగా ఎదుగుదల ఉండదని మత్స్యకారులు వాపోతున్నారు. జిల్లాలో స్టేషన్ ఘన్పూర్లో మాత్రమే చేపల పంపిణీ ప్రారంభించగా పాలకుర్తి నియోజకవర్గంలో ఇంకా ప్రారంభం కాలేదు. చెరువుల్లో చేపపిల్లలను విడుదల చేయడం వల్ల మత్స్యకారులకు ఊరట లభించింది. గతేడాది అరకొర చేప పిల్లలతో లక్ష్యం చేరకుండా ఆర్థికంగా నష్టపోయారు. ఈసారి అయిన చేతిలో ఉంటుందని ఆశపడుతున్నారు. చేపల పంపిణీ వల్ల అదనంగా వృత్తిపై ఆధారపడి జీవించేవారికి ఉపాధి లభించనుంది. చెరువుల్లో జీవన సంపద మెరుగుపడి నీటి నాణ్యత కూడా నిలకడగా ఉంటుంది. జిల్లాలో మత్స్యకారులతోపాటు మహిళలు కూడా చేపల అమ్మకాలపై దృష్టి పెట్టనున్నారు. సొసైటీల డైరెక్టర్లు, సభ్యులు చేపల పంపిణీలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది సమృద్ధిగా నీరు ఉండడంతో ఎక్కువ మొత్తంలో చేపల ఉత్పత్తి జరగనుంది. జిల్లాలో మత్స్యసొసైటీల సంఖ్య –190 మత్స్యకారుల సంఖ్య –18,577 జిల్లాలో చెరువులు సంఖ్య–727 రిజర్వాయర్ల సంఖ్య –9 మొత్తం చేపపిల్లల సంఖ్య–272.27 లక్షలు ఇప్పటి వరకు వదిలిన చేపపిల్లల సంఖ్య 4 లక్షలు మొత్తం బడ్జెట్ రూ.3.25 కోట్లు కేటాయింపు రిజర్వాయర్లకు రూ.1.44 కోట్లు కేటాయింపు చెరువులకు రూ.1.29 కోట్లు కేటాయింపు 736 రిజర్వాయర్, చెరువుల్లోకి 272.27 లక్షల చేపపిల్లలు ఇప్పటివరకు 4 లక్షలు పంపిణీ వచ్చే నెల చివరి నాటికి పూర్తయ్యేలా చర్యలు పాలకుర్తిలో ఇంకా ప్రారంభంకాని పంపిణీ -
రేపటి నుంచి పత్తి మిల్లుల బంద్
జనగామ: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అమలు చేస్తున్న ఎల్1, ఎల్2, ఎల్3 కొనుగోలు, 12 క్వింటాళ్ల నుంచి 7 క్వింటాళ్లకు తగ్గించడం, కపాస్ కిసాన్న్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ సిస్టం, తదితర నిబంధనలను నిరసిస్తూ తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ నెల17వ తేదీ నుంచి జిల్లాలో పత్తి మిల్లులు, సీసీఐ సెంటర్లు సేవలు(బంద్) నిలిచిపోనున్నాయి. ఈ మేరకు జిల్లా మార్కెట్ అధికారి నరేంద్ర శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 15 పత్తి మిల్లులకు గాను, 14 చోట్ల సీసీఐ కేంద్రాలను ప్రా రంభించారు. ఇప్పటివరకు స్లాట్ బుకింగ్ ద్వారా జనగామ, కొడకండ్ల, స్టేషన్ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో 3,427 మంది రైతుల వద్ద 48,375 క్వింటాళ్ల పత్తి మద్దతు ధరకు కొనుగోలు చేశారు. పత్తి కొనుగోలుకు సంబంధించి రూ.28.82కోట్ల చెల్లింపులకు గాను రూ.18.57 కోట్ల నగదును రైతుల ఖాతాలో జమ చేశారు. ఇంకా రూ.10.25 కోట్ల బ్యాలెన్స్ ఉంది. సీసీఐ కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవద్దు తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ నెల 17వ తేదీ నుంచి బంద్ పాటిస్తున్న నేపథ్యంలో రైతులు ఎవరూ కూడా కపాస్ యాప్లో సీసీఐలో పత్తి అమ్మకం కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవద్దని డీఎం నరేంద్ర తెలిపారు. అలాగే పత్తిని ప్రైవేటుగా అమ్ముకునేందుకు జిన్నింగ్ మిల్లులకు సైతం తీసుకు రావద్దని చెప్పారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని, తదుపరి ప్రకటన చేసే వరకు సీసీఐ సెంటర్లు, పత్తి మిల్లుల వద్దకు వచ్చి ఇబ్బంది పడొద్దన్నారు. సీసీఐ కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవద్దు నిబంధనలు మార్చాలంటున్న వ్యాపారులు -
నవభారత నిర్మాణ ప్రదాత పటేల్
జనగామ రూరల్: నవభారత నిర్మాణం కోసం నిరంతరం కృషి చేసిన మహా వ్యక్తి సర్దార్ వల్ల భాయ్ పటేల్ అని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడువాలని కలెక్టర్ రిజ్వన్ బాషా షేక్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ ఆవరణంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్ వరంగల్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్..డీసీపీతో పాల్గొని పటేల్, భరతమాత చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఐక్యతా పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలో స్వేచ్ఛ కోసం పటేల్ పరితపించేవారని, ఎన్ని భాషలు మాట్లాడిన ఎన్ని ప్రాంతాలు ఉన్న మనమందరం ఒకటేనని చాటి చెప్పేవారని అన్నారు. దేశాన్ని స్వయం సమృద్ధిగా మా ర్చడానికి ప్రతీ పౌరుడు దేశీయ ఉత్పత్తులను ఉపయోగించు కోవాలని దేశానికి సహకరించాలని ఈ సందర్భంగా ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మేరా యువభారత్ వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ మాట్లాడుతూ.. యూనిటీ మార్చ్ 2025 అనేది దేశ ఐక్యతను చాటిచెబుతుందని అన్నారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, ఆర్డీవో, గోపిరామ్, తహసీల్దార్ హుస్సేన్, వలంటీర్ హరీశ్, రమేశ్ అంజిరెడ్డి, శశిధర్రెడ్డి, దేవిలాల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఐక్యతా పాదయాత్రను ప్రారంభించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా -
– హన్మకొండ/ఖిలావరంగల్/హసన్పర్తి/ మహబూబాబాద్ అర్బన్
కదిలే ప్రతీ జీవికి ఈ భూమ్మీద జీవించే హక్కు ఉంది. అవన్నీ మనగలిగితేనే మానవాళి ముందుకు సాగుతుంది. ఆ విషయాన్ని గుర్తించిన కొందరు తమ వంతుగా వాటికి సాయం చేస్తున్నారు. పిచ్చుక గూళ్లను పంపిణీ చేస్తూ పంటల రక్షణకు తోడ్పడుతున్నారు. పక్షులకు ఆహారం అందిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నారు. చీమలకు ఆహారమందిస్తూ మట్టిని సారవంతం చేసేందుకు ఉపయోగపడుతున్నారు. కుక్కలను పెంచుతూ ఆనందం, ఆహ్లాదాన్ని పొందుతున్నారు. జీవ వైవిధ్యంలో తమవంతు పాత్ర పోషిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జీవచరాల బంధువులపై ‘సాక్షి’ సండే స్పెషల్ కథనం. ‘చీమా.. చీమా ఎక్కడున్నావమ్మా’ అంటూ వెతికి మరీ వాటి కడుపు నింపుతున్నారు వాకర్స్. హనుమకొండకు చెందిన శివకుమార్, గోయల్ వాకింగ్ కోసం ప్రతీ రోజు పబ్లిక్ గార్డెన్కు వస్తుంటారు. నడక మొదలు పెట్టే ముందే.. చీమలు ఎక్కడున్నాయా.. అని వెతికి మరీ వెంట తెచ్చుకున్న గోధుమ పిండి, చక్కెర చల్లుతారు. సనాతన ధర్మం, రుగ్వేదంలో జీవుల పట్ల దయ కలిగి ఉండాలని, ఆహారాన్ని వృథా చేయకుండా ప్రాణులకు అందించాలని ఉందని వారు చెబుతున్నారు. కాగా, నిత్యం చపాతీలు చేసిన అనంతరం కింద పడిన, మిగిలిన పిండిలో చక్కెర కలిపి చీమలకు వేస్తున్నట్లు చెబుతున్నారు.హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో చీమలకు చక్కెర కలిపిన పిండిని ఆహారంగా వేస్తున్న శివకుమార్హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో చీమలకు ఆహారం వేస్తున్న గోయల్హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టులోని మహర్షి గోశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా పిచ్చుక గూళ్లు, వరికంకులు పంపిణీ చేస్తున్నారు. ఎస్ఆర్ఎం ఫౌండేషన్ సహకారంతో ‘జీవులపై దయ చూపి జీవ వైవిధ్యం కాపాడుదాం’ నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. మహర్షి గోశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో తమిళనాడు నుంచి పక్షి గూళ్లను కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వరి కంకులను ఇక్కడే అల్లుతున్నారు. ఇప్పటి వరకు ఆరునెలల్లో 2 వేలకుపైగా పిచ్చుక గూళ్లు పంపిణీ చేసినట్లు మహర్షి గోశాల ట్రస్ట్ నిర్వాహకుడు డాక్టర్ ఎస్.రమేశ్ తెలిపారు. జీవవైవిధ్యానికి తోడ్పడుతున్న ఉమ్మడి వరంగల్వాసులు వాటి ఆకలిదప్పికలు తీరుస్తూ ఆదర్శం సొంత డబ్బులతో ప్రకృతి సేవ పర్యావరణ సమతుల్యతకు దోహదం -
వాటాల కోసమే బయటకు వచ్చిన కవిత
స్టేషన్ఘన్పూర్: గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎమ్మెల్యే నుంచి సీఎం వరకు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని, కల్వకుంట్ల కుటుంబంలో వాటాల కోసమే కవిత పార్టీ నుంచి వచ్చిందని మాజీ మంత్రి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన 198 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోటి విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ గత పదేళ్లలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకుందని, ఇప్పుడు వారి ఆస్తులెంతో వారికే తెలియదని, ఇది తాను అంటున్నది కాదని, కవిత చేసిన ఆరోపణలనే చెబుతున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం కాదని, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ముందుగా కవిత చేస్తున్న ఆరోపణలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్లో నిర్మించే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రూ.1,100 కోట్లు మంజూరు చేస్తే సరిపోవని అంచనాలను రూ.1,700 కోట్లకు పెంచి రూ.500 కోట్లు అప్పటి మంత్రి హరీశ్రావు దోచుకున్నాడని కవిత చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనితీరుకు జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పే నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, నాయకులు శ్రీధర్రావు, లింగాజీ, నూకల ఐలయ్య, తెల్లాకుల రామక్రిష్ణ, వంశీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
మాతృశ్రీ క్లినిక్ సీజ్
కొడకండ్ల: మండలకేంద్రంలోని మాతృశ్రీ ప్రథమ చికిత్సాలయాన్ని శుక్రవారం డీఎంహెచ్ఓ మల్లి కా ర్జునరావు సీజ్ చేశారు. లైసెన్స్ లేకుండా స్థాయికి మించి వైద్యం చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు సీజ్ చేసినట్లు డీ ఎంహెచ్ఓ తెలిపారు. కార్యక్రమంలో పీఓ డాక్టర్ కమల్, వైద్యాధికారి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా నిత్యం అందుబాటులో ఉంటూ గ్రామస్తులకు సేవలందిస్తున్న మాతృశ్రీ క్లినిక్ను సీజ్ చేయొద్దంటూ స్థానికులు క్లినిక్కు చేరుకుని సంఘీభావం తెలిపారు. డయాబెటిస్ను అదుపులో ఉంచుకోవాలి కొడకండ్ల: డయాబెటిస్ వ్యాధిపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, డయాబెటిస్ను అదుపులో ఉంచుకోవడం ముఖ్యమని డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు సూచించారు. శుక్రవారం ప్రపంచ డయాబెటిస్డేను పురస్కరించుకొని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో మండలకేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ పాల్గొని మాట్లాడుతూ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం ద్వారా అనర్థాలు రాకుండా జాగ్రత్త పడొవచ్చని, డయాబెటిస్ రోగులు ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం, వ్యాయామం చేయడంతో పాటు రెగ్యులర్గా పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఓ డాక్టర్ కమల్, డాక్టర్లు హరికృష్ణ, భారతి, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. నిబంధనలు విస్మరిస్తే చర్యలు దేవరుప్పుల: గ్రామీణ వైద్యులు నిబంధనలు విస్మరిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ మల్లిఖార్జున్ హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని ఓ ప్రైవేట్ క్లినిక్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రథమ చికిత్సకు మించి వైద్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండిపడుతున్న స్థానికులు -
పత్తి రైతులను ఆదుకోవాలి
జనగామ రూరల్: సీసీఐ నిబంధనలు సడలించి పత్తి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో పత్తి దిగుబడి తగ్గిందని, చేతికొచ్చిన కొద్దిపాటి పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే అధికారులు నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం అఖిలపక్షాలను కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చి సమస్యలు పరిష్కరించాలని కోరారు. బొట్ల శేఖర్, బూడిద గోపి, జోగు ప్రకాష్, మంగ బీరయ్య, తదితరులు ఉన్నారు. -
యువత సామాజిక సేవలో ముందుండాలి
జనగామ: యువత సామాజిక సేవలో ముందుండాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనా రాయణ పిలుపునిచ్చారు. సూర్యాపేటరోడ్డులోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం వాస్విక్ ఫౌండేషన్ 6వ వార్షికోత్సవం జరుగగా, కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీసీపీ రాజమహేందర్ నాయక్తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి, సేవ చేయడంలో ఉన్న సంతృప్తి ఎక్కడా దొరకదన్నారు. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అ లవాటు చేసుకుని, చదువుతో పాటు సేవా మార్గం వైపు ముందుకు వెళ్లాలని యువతకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ నరేష్ కు మార్, నూకల భాస్కర్రెడ్డి తదితరులు ఉన్నారు. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ -
బాబోయ్..చలి
జిల్లాలో రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలుచలి మంట కాచుకుంటున్న యువకులుజనగామ: జిల్లాలో చలితీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కూర్చున్న చోటనే ప్రజలను గజగజ వణికిస్తోంది. పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల వరకు పడిపోగా, సాయంత్రం ఐదు గంటలకే గడ్డకంటే చలి చంపేస్తోంది. రాత్రి 7 గంటల నుంచే వీధులు నిర్మానుష్యంగా మారిపోయే పరిస్థితి నెలకొంది. రోజువారీ జీవనం స్తంభించి పోతుంది. కూలీలు, కులవృత్తుల వారి పరిస్థితి దారుణం జనగామ మార్కెట్ యార్డు, పీఏసీఎస్, ఐకేపీ కేంద్రాల్లో రాత్రిపూట పని చేసే హమాలీలు చలికి వణికిపోతూ భారమైన బస్తాలను మోసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బచ్చన్నపేట, లింగాలఘణపురం, రఘునాథపల్లి, బచ్చన్నపేట, దేవరుప్పు ల, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ తదితర ప్రాంతాల్లో తెల్లవారు జాము నుంచి పొగమంచు కమ్ముకోవడంతో కూలీలు పని స్థలాలకు చేరుకునేంతవరకు చలితో ప్రయాణం చేస్తున్నారు. జనగామ ఆర్టీసీ బ స్టాండ్, రైల్వేస్టేషన్ వద్ద రాత్రి వేళలో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు చలిలో వణుకుతూనే వెళ్తున్నారు. చలి మంటలతో పడిపోతున్న ఉష్ణోగ్రతలను తట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేకువ జామున పేపర్ బాయ్లు, పాడి రైతులు, పూలు, పాల వ్యాపారులు చలిని లెక్కచేయకుండా తమ పనులను చేస్తుండటం కష్టసాధ్యమైపోయింది. వణికించే చలిలో విద్యార్థులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చలి తీవ్రతతో గదుల్లోనే ఉండిపోతున్నారు. రాబోయే 10, ఇంటర్, డిగ్రీ పరీక్షలతో పాటు టెట్, ఇతర పోటీ ఎంట్రెన్స్లకు సిద్ధమవుతున్న విద్యార్థులు రాత్రి, ఉదయం ఉన్ని దుస్తులతో చదువుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చలి తీవ్రత పెరగడంతో పట్టణంలోని బస్టాండ్ సెంటర్, రైల్వేస్టేషన్, సిద్దిపేట, నెహ్రూపార్కు, సూర్యాపేట, హైదరాబాద్, హనుమకొండ తదితర ప్రాంతాల రహదారులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో జిల్లాలో ఉన్ని దుస్తుల వ్యాపారం ఊహించని విధంగా పెరిగింది. తేదీ కనిష్టం గరిష్టం 8 13 26 9 14 27 10 14 26 11 15 27 12 16 28 13 15 28 14 15 30 హాస్టళ్లలో విద్యార్థుల పరిస్థితి దారుణం నిర్మానుష్యంగా రహదారులు పగటిపూట వదలని చలి -
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
జనగామ రూరల్: జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి కావాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్పై అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, ఆర్డీఓలు, హౌసింగ్ పీడీ, ఎంపీడీఓల, ఇంజనీరింగ్ అధికారులతో గూగుల్ మీటింగ్ ద్వారా శుక్రవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మంజూరైన ప్రతీ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఇంకా నిర్మాణం ఇందిరమ్మ లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు ఉంటే తెలుసుకోవాలని సూచించారు. ఎస్హెజ్సీ గ్రూప్ల ద్వారా లబ్ధిదారులకు రుణాలు చేసి నిర్మాణాలు ప్రారంభించే విధంగా సహకరించాలన్నారు. సూర్యాపేట నుంచి వస్తున్న ఇసుకను త్వరగా సరఫరా చేసి లబ్ధిదారులకు అందించే విధంగా మైనింగ్ అధికారిని ఆదేశించారు. పీఎం ఆవాజ్ యోజన పథకానికి సంబందించిన లబ్ధిదారుల వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
టెట్కు వేళాయె..
జనగామ: జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రిపరేషన్ సందడి మొదలైంది. ఖాళీల సంఖ్య, రాబోయే పదవీ విరమణలు, టెట్ అర్హత అవసరం కారణంగా ఉపాధ్యాయ వర్గాల్లో కొంత మేర టెన్షన్ నెలకొనగా, నిరుద్యోగులు నూతన ఉత్సాహంతో సాధన ప్రారంభించారు. ఈ నెల 15 నుంచి 29వ తేదీ వరకు టెట్ దరఖాస్తులను స్వీకరించనుండగా, వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 400 మంది మాత్రమే అర్హత.. జిల్లాలో ఎస్జీటీ, స్కూల్అసిస్టెంట్, ఇరత కేట గిరీ ల్లో ఉన్న 483 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా యి. ఈ ఖాళీల భర్తీకి రానున్న టెట్ ముఖ్య భూమి క పోషించనుంది. జిల్లాలో పీఎస్, యూపీఎస్, ఉ న్నత పాఠశాలల పరిధిలో 2,115 మంది టీచర్లు పని చేస్తున్నారు. ఇందులో జిల్లాలో 2010కు ముందు చేరిన 1,307 మంది ఉపాధ్యాయులకు టెట్ రా యడం తప్పనిసరి. వీరిలో ఇప్పటి వరకు సుమారు 400 మంది మాత్రమే టెట్ అర్హత సాధించారు. మిగతా 900 మంది అర్హత పరీక్ష ద్వారా తమ భ విష్యత్ను పరీక్షించుకోనున్నారు. అయితే 474 మంది టీచర్లు 5ఏళ్ల లోపు పదవీవిరమణ దశలో ఉండటంతో వారికి టెట్ మినహాయింపు ఉంటుంది. కోచింగ్ సెంటర్లకు డిమాండ్.. జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు నిరుద్యోగులు భారీ సంఖ్యలో టెట్కు సిద్ధమవుతున్నారు. ఈసారి జిల్లాలో సుమారు 4వేల మంది అభ్యర్థులు పేపర్–1, పేపర్–2లకు హాజరుకానున్నారు. జిల్లా గ్రంథాలయంతో పాటు ప్రైవేట్, ఆన్లైన్ కోచింగ్ సెంటర్లు తదితర మార్గాల ద్వారా శిక్షణ తీసుకుంటున్నారు. ఖాళీల భర్తీ ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని భావిస్తున్నందున టెట్ అర్హత అత్యంత కీలకమైంది.కేటగిరీ ఖాళీలు ఎస్జీటీ 307 పీఎస్ హెచ్ఎం 6 స్కూల్ అసిస్టెంట్లు.. మ్యాథ్స్ 9 ఫిజిక్స్ 12 బయోసైన్స్ 17 సోషల్ స్టడీస్ 30 తెలుగు 20 హిందీ 12 ఇంగ్లిష్ 8 ఉర్దూ 1 ఫిజికల్ డైరెక్టర్లు 5 లాంగ్వేజ్ పండిట్స్ 6 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 24 టీచర్ల భవిష్యత్కు పరీక్ష జిల్లాలో రాయనున్న 9,00 మంది ఉపాధ్యాయులు, 4వేల మంది నిరుద్యోగులు ఈనెల 29 వరకు దరఖాస్తుల స్వీకరణసెప్టెంబర్ 1వ తేదీన వెలువడిన సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 5 సంవత్సరాల పైబడి సర్వీస్ ఉన్న టీచర్లు, పదోన్నతి అవసరమనుకుంటే రాబో యే రెండేళ్లలో టెట్ తప్పనిసరి పాస్ కావాలని, లేదంటే ఉద్యోగాలు కోల్పోతారని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై విద్యాహక్కు చట్టం అమలులోకి రాకముందు ఉన్న టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. కానీ సుప్రీం కోర్టు రివ్యూ పిటిషన్పై తీర్పు ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో ప్రస్తుత సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన టెట్లో ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. కోర్టు ఆదేశాల మేరకు టెట్ తప్పనిసరిగా ఇన్ సర్వీస్ టీచర్లు రాయాలని చెబుతూ, కొన్ని ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. టెట్ పరీక్షపై కొత్తగా రాసే అభ్యర్థులు, ఇన్ సర్వీస్ టీచర్లలో ఆందోళన కనిపిస్తున్నప్పటికీ ఉత్తీర్ణత సాధించడం చాలా సులభం. ప్రణాళికబద్ధంగా చదివితే ఎవరైనా మంచి మార్కులు సాధించగలరు. పేపర్–1లో 3 నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలపై పట్టు పెంచుకోవడం కీలకం. పేపర్–2లో తెలుగు, సైకాలజీ, సోషల్ విభాగాల్లో మార్కులు రాబట్టడం సులభం. మ్యాథ్, సైన్స్ విభాగాల్లో కూడా ఇన్ సర్వీస్ టీచర్లు కొద్దిగా ప్రిపేర్ అయితే సులభంగా పాస్ అవుతారు. – రావుల రామ్మోహన్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు -
హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
జనగామ రూరల్: హమాలీ కార్మికుల సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయాలని ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ భవనంలో ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా 2వ మహాసభ చిట్యాల సోమన్న, బైరగోని బాల్ రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభను ఉద్దేశించి రాములు మాట్లాడుతూ అన్ని రకాల సరుకుల ఎగుమతి దిగుమతిలో కీలక పాత్ర పోషించే హమాలీ కార్మికుల శ్రమను పాలకులు దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, లేదంటే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. 27న జనగామ పట్టణంలో జరిగే ఆల్ హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్, అన్నెబోయిన రాజు, పొదల నాగరాజు, కోడెపాక యాకయ్య, బోరెల్లి సోమయ్య, యాదగిరి, నరసయ్య, పెంటయ్య, రామచందర్, భాస్కర్, హమాలీ కార్మికులు పాల్గొన్నారు. ‘బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ జనగామ: రుద్రమదేవి మహిళా మాక్స్ సొసైటీలో సభ్యుల పొదుపు, అప్పులు, లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వం పర్యవేక్షణలో అన్ని వ్యవహారాలు సజావుగా కొనసాగుతున్నాయని స్పెషల్ అఫీషియల్ ఇన్చార్జ్ అధికారి దివ్య తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ సొసైటీ భూముల కొనుగోలు వ్యవహారాల్లో జరిగిన అవకతవకలపై విచారణ ప్రారంభించామని, కోర్టు ఆదేశాల మేరకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సంఘానికి చెందిన ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా రక్షించటం ప్రభుత్వ బాధ్యతఅన్నారు. ప్రస్తుతం రుద్రమదేవి మహిళా మాక్స్ సొసైటీ ప్రభుత్వ ఆదీనంలో కొనసాగుతుందని, ఉద్యోగులకు, సభ్యులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలిజనగామ రూరల్: యువత, విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని విజ్ఞానవంతులుగా ఎదగాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డాక్టర్ యస్.ఆర్ రంగనాథన్, చాచా నెహ్రూ చిత్ర పటాలకు పూలమాల వేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన గనులని, గ్రంథాలయంలో విజ్ఞానాన్ని పెంపొందించుకొని సద్విని యోగం చేసుకోవాలన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుర్రం భూ లక్ష్మీ నాగరాజు, ప్రిన్సిపాల్ కృష్ణవేణి, కార్యదర్శి ఎం.సుధీర్, లుంబానాయక్, లైబ్రేరియన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలీలకు సముచితస్థానం కల్పించాలిచిల్పూరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పద్మశాలీలకు సముచితస్థానం కల్పిస్తూ అత్యధిక సీట్లను కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజ్కుమార్ అన్నారు. మండలంలోని చిన్నపెండ్యాలలో మాట్లాడుతూ రాష్ట్రంలో పద్మశాలీలకు జనాభా ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలు సముచిత స్థానం కల్పించాలన్నారు. పద్మశాలీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మరింత ముందుకు వెళ్లాలన్నారు. హక్కుల సాధనకు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలన్నారు. అంతకుముందు మండల అధ్యక్షుడు గజ్జల దామోదర్తో పాటు కుటుంబ సభ్యులను కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర మీడియా ఇన్చార్జ్ చింతకింది కృష్ణమూర్తి, ఘన్పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ గజ్జల దామోదర్, పేరాల నాగభూషణం, వెంకటేశ్వర్లు, గజ్జల రాజేష్, మధు, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
16 నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు
హన్మకొండ: సమ్మక్క–సారలమ్మ జాతరను పురస్కరించుకుని ఈనెల 16 నుంచి మేడారానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను ఒక ప్రకటనలో తెలిపారు. 2026 జనవరి 28 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు జాతర జరుగుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ముందుగా వనదేవతలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. హనుమకొండ బస్టాండ్ నుంచి మేడారానికి ప్రతిరోజు ఉదయం 6.10, 7.00, 8.00, 9.00, మధ్యాహ్నం 12.10, 1.00, 1.40, 14.30; రాత్రి 8.20 గంటలకు బస్సులు బయలుదేరుతాయని వివరించారు. అదేవిధంగా మేడారం నుంచి హనుమకొండకు ఉదయం 5.45, 9.45, 10.15, 11.15, మధ్యాహ్నం 1.10, సాయంత్రం 4.00, 5.00, 5.30, 6.00 గంటలకు బస్సులు బయలుదేరుతాయని చెప్పారు. పల్లెవెలుగు బస్సు చార్జీలు పెద్దలకు రూ.130, పిల్లలకు రూ.80, ఎక్స్ప్రెస్ బస్సు చార్జీలు పెద్దలకు రూ.180, పిల్లలకు రూ.110గా నిర్ణయించినట్లు తెలిపారు. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా, సుఖవంతంగా ప్రయాణించి వనదేవతలను దర్శించుకోవాలని ఆర్ఎం విజయభాను కోరారు. ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం డి.విజయభాను -
ధాన్యం డబ్బుల చెల్లింపులో జిల్లా ఫస్ట్
జనగామ రూరల్: వానాకాలం సీజన్కు సంబంధించి ధాన్యం డబ్బుల చెల్లింపులో రాష్ట్రస్థాయిలో జనగామ జిల్లా మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. ధాన్యం కొనుగోలు పురో గతి మీద వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులతో గురువారం కలెక్టరేట్లో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 7,657 మంది రైతుల నుంచి 3,70,99.52 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.61కోట్లు చెల్లించామన్నారు. అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు. ఆయిల్పామ్పై అవగాహన కల్పించండి జిల్లాలో ఆయిల్పామ్ సాగు అయ్యేలా క్షేత్రస్థాయిలో అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయిల్పామ్ పంట విస్తరణ పై ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..3,500 మొక్కల లక్ష్యానికి గాను ఇప్పటివరకు 1,200 మొక్కలకు మంజూరు పూర్తి అయ్యిందన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంబికా సోని, జిల్లా కోఆపరేటివ్ శాఖ అధికారి కోదండరాములు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీధర్, ఆయిల్ ఫెడ్ జిల్లా ఇన్చార్జ్ శంకర్ పాల్గొన్నారు. ఆరోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ఆరోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరెట్ ఉద్యోగులకు, జర్నలిస్టులకు కలెక్టరేట్లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా క్యాంపును పరిశీలించి కలెక్టర్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ కె.మల్లికార్జునరావు, ప్రోగ్రాం అధికారులు, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. జనగామ: ప్రభుత్వం అర్హత పరీక్ష ద్వారా రిక్రూట్ చేసిన లైసెన్స్డ్ ల్యాండ్ సర్వేయర్లకు కమీషన్ ఆధారంగా కాకుండా, గౌరవ వేతనంతో ఉపాధి కల్పించాలని కోరుతూ లైసెన్స్డ్ సర్వేయర్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా, రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, ల్యాండ్ సర్వే ఏడీ మన్యంకొండకు వినతి చేశారు. అనం తరం సర్వేయర్లు బి.గణేష్కుమార్, బి.రాజు, రాజేంద్రప్రసాద్, శోభ, రంజిత్ మాట్లాడుతూ.. లైసెన్డ్ సర్వే విభాగంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
గుట్టుగా ‘గుట్కా’ దందా..!
● ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా మళ్లీ జోరందుకున్న వ్యాపారం ● నిషేధం.. నిబంధనలు హుష్కాకి ● రూ.లక్షల్లో లావాదేవీలు.. నామమాత్రంగా కేసులు ● వరంగల్ కేంద్రంగా ఇతర ప్రాంతాలకు సరఫరాసాక్షిప్రతినిధి, వరంగల్: నామమాత్రపు పెట్టుబడి.. పది రెట్ల లాభాలు.. అవసరమైతే ముడుపులు.. రకరకాల పేర్లు.. ఆకర్షణీయ ప్యాకింగులు... అమ్మకాల్లో ఇష్టారాజ్యం..పల్లె పట్టణం ప్రాంతమేదైనా చాపకిందనీరులా నిషేధిత గుట్కాల వ్యాపారం నానాటికీ పెరుగుతోంది. ఇటీవల ఉమ్మడి జిల్లాలో తరచూ పట్టుబడుతున్న వ్యాపారులు సహా పెరుగుతున్న కేసుల తీవ్రత గుట్కా దందా సాగుతున్న తీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పట్టుబడినా, కేసు పెట్టినా షరా‘మామూలే’.. పట్టుబడటం, కేసులు పెట్టుకోవడం షరామాములే..! అనేలా కొందరు వ్యాపారుల తీరు మారిపోయింది. హైదరాబాద్ బేగంబజార్కు చెందిన ఓ వ్యాపారి వరంగల్ నగరంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ఈ దందా సాగిస్తున్నట్లు పోలీసువర్గాల సమాచారం. వరంగల్ నుంచి మంచిర్యాల, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాలకు కూడా తరలిస్తున్నట్లు తెలిసింది. మహబూబాబాద్కు చెందిన ఓ డీలర్ ఆర్ఆర్ ఖైనితోపాటు చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు పోలీసులు ఇటీవల ఆరా తీశారు. బెల్లం, గుడుంబా తయారీపై 50కి పైగా కేసులున్న మరొకరు గుట్కా దందా సాగిస్తున్నట్లు తెలిసింది. భూపాలపల్లిలో నిషేధానికి ముందు అంబర్, ఆర్ఆర్ అనార్లు విక్రయించే ఓ వ్యాపారి ఇప్పుడు గుట్కా దందా సాగించడం, కేసులు పెట్టినా లైట్గా తీసుకుంటుండడంపై చర్చ జరుగుతోంది. ఇదే వ్యాపారి మరొకరితో కలిసి ఛత్తీస్గఢ్ నుంచి గుట్కాలు తెప్పించి విక్రయిస్తున్నాడు. జనగామ, పరకాల, నర్సంపేట, హుజూరాబాద్, ఎల్కతుర్తి, వర్ధన్నపేటలపై పూర్తి ఆధిపత్యం సాధించిన వరంగల్ పిన్నవారివీధికి చెందిన ఓ వ్యాపారి పెద్ద ఎత్తున ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్నారు. గతంలో కేసులు కూడా అయ్యాయి. ఇలా చాలామంది వరంగల్ను కేంద్రంగా చేసుకుని ఇక్కడ వ్యాపారం చేయడంతోపాటు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. రూ.4లది రూ.12–రూ.15లకు.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు కాకుండా గ్రామాల్లోని చిన్నదుకాణాల్లో సైతం గుట్కాలను అమ్ముతున్నారు. ఒక్కో ప్యాకెట్ను రూ.4లకు కొనుగోలు చేసిన దుకాణదారు రూ.12–15 వరకు ఆయా బ్రాండ్ వారీగా విక్రయిస్తున్నాడు. ఇలా రోజు మొత్తంలో 20 ప్యాకెట్లను అమ్మితే సుమారు రూ.150–200 వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. ఇందులో రాటుదేలిన వ్యాపారులకు ఈ దందా వల్ల ఒక్క రోజులోనే లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్న సందర్భాలున్నాయి. హోల్సేల్గా 20 ప్యాకెట్లు, 80 ప్యాకెట్లు ఉన్న గుట్కాలను స్థానిక వ్యాపారులకు ఒక్కసారిగా పెద్దమొత్తంలో అందిస్తుండటం వల్ల గంటల వ్యవధిలోనే పెద్ద వ్యాపారులు జేబుల్లో ఊహించని సొమ్మును నింపుకుంటున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో మూడు రోజుల కిందట (11 తేదీన) పెద్ద మొత్తంలో నిషేధిత అంబర్, గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. పాలకుర్తి నుంచి వరంగల్కు కారులో తరలిస్తున్నారన్న సమాచారం మేరకు అలర్టయిన పోలీసులు రూ.6.70 లక్షల విలువైన 13 బస్తాల అంబర్, గుట్కా ప్యాట్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. -
వేటా? బదిలా?
జనగామ/బచ్చన్నపేట: పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తెచ్చి డబ్బులు వసూళ్లు చేస్తున్న ఎంపీఓల వ్యవహారంపై కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సీరియస్ అయ్యారు. ‘దందా ఎంపీవోలు’ శీర్షికన ఈ నెల 13న సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందిస్తూ విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం బచ్చన్నపేట మండల కేంద్రంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(డీఆర్ఓ) సుహాసిని, డీపీఓ నవీన్, డీఎ ల్పీఓ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో రెండున్నర గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిపారు. ఎంపీఓ వెంకట మల్లికార్జున్పై ఫిర్యాదు చేసిన పంచాయతీ కార్యదర్శులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీఓతో వేర్వేరుగా మాట్లాడారు. డబ్బుల వసూళ్లపై ఆరా తీసి, లిఖిత పూర్వకంగా వాంగ్మూలాన్ని తీసుకున్నారు. దీంతో పాటు కార్యదర్శుఽలపై ఒత్తిడి తెస్తూ, బలవంతంగా బీమా పాలసీలను చేయిస్తున్న ఆ ఎంపీఓ ఎవరనే దానిపై కూపీలాగుతున్నారు. కుటుంబ సభ్యుల పేరిట ఏజెంట్ల వ్యవహారం ఓ ఎంపీఓ తమ కుటుంబ సభ్యుల పేరిట ఉన్న బీమా ఏజెంట్లకు పాలసీలు చేయాలని పంచాయతీ కార్యదర్శులను బలవంతం చేస్తున్నారనే ఆరోపణలు పంచాయతీ శాఖలో పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై సాక్షిలో ప్రచురితమైన కథనంతో పాలసీల ముచ్చట పక్కనబెట్టి.. గప్చుప్ అయ్యారు. వేలకు వేలు వేతనాలు తీసుకుంటూ, పరిపాలన చక్కదిద్దాల్సిన అధికారులు, కిందిస్థాయిలో పనిచేస్తున్న వారిని వేధిస్తూ అనేక రూపాల్లో వసూళ్లకు పాల్పడుతుండ డం.. జిల్లాకు చెడ్డ పేరు తెచ్చేలా మారింది. ఈ వ్యవహారం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లడంతో, వారు సీరియస్గా పరిగణించినట్లు సమాచారం. పంచాయతీ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ఈ రకమైన దందాపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని, దోషులను వదలొద్దని ప్రజలు కోరుతున్నారు. వసూళ్లు ఇలా.. బచ్చన్నపేట మండల కేంద్రంలో ఎంపీఓగా పనిచేస్తున్న వెంకటమల్లికార్జున్పై 18 గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మూడు రోజుల క్రితం కలెక్టరేట్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సదరు ఎంపీఓ బచ్చన్నపేట ఎంపీడీఓగా ఏడాది పాటు ఇన్చార్జ్గా పనిచేశారు. కార్యదర్శుల సర్వీస్ బుక్కులో సంతకం, కార్యదర్శులకు సెలవు మంజూరు, రికార్డులు వెరిఫికేషన్, పలు యాప్లను ఆన్లైన్ చేసేందుకు జీపీ స్థాయిని బట్టి ఒక్కో పంచాయతీ కార్యదర్శి నుంచి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు తీసుకున్నట్లు వారు కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతోపాటు కార్యదర్శుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ దూషించేవారని ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఎంపీఓ గ్రామానికి వచ్చిన సమయంలో తన వాహనంలో డీజిల్ కోసం డ్రైవర్కు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే. ప్రత్యక్ష ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీఓపై వేటు వేస్తారా లేదా బదిలీతో సరిపెడుతారా? అనేది వేచిచూడాలి. 13జెజిఎన్051: 13జెజిఎన్052:ఎంపీఓ దందాలపై సాక్షిలో ప్రచురితమైన కథనంవిచారణలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఎంపీఓ, ఆయన డ్రైవర్కు పంపిన డబ్బుల స్క్రీన్షాట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాలతో తుది నివేదికను సిద్ధం చేసి కలెక్టర్కు సమర్పించనున్నారు. జిల్లావ్యాప్తంగా ఎంపీఓల వసూళ్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మరో ఇద్దరు ఎంపీఓలు కూడా ఈ దందాలో భాగస్వామ్యులయ్యారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కలెక్టర్ ఆ వైపు దృష్టి సారించినట్లు సమాచారం. వారికి సంబంధించిన వివరాలు సేకరించడానికి అధికారులు ఆరా తీస్తున్నారు. అధికారి వ్యవహారంపై కలెక్టర్ సీరియస్ బచ్నన్నపేటలో రెండున్నర గంటల పాటు విచారణ ఇరువురి వాంగ్మూలం సేకరణ బీమా పాలసీలు చేసిన ఎంపీఓ ఎవరని ఆరా ‘దందా ఎంపీఓలు’ కథనానికి స్పందన -
ఉపాధి..పద్ధతిగా
జనగామ రూరల్: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు తావులేకుండా కేంద్రప్రభుత్వం ఎప్పటికప్పుడు నూతన నిబంధనలు, సంస్కరణలు తీసుకొస్తోంది. అయినా ఎక్కడో ఒక చోట అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేసి, పథకం మరింత పారదర్శకంగా అమలు జరిగేలా ఈకేవైసీ విధానం తీసుకొచ్చింది. ఉపాధి హామీ పథకంలోనూ కూలీలకు ముఖగుర్తింపు హాజరును పకడ్బందీగా అమలుచేస్తున్నారు. ఇప్పటికే ‘నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం’ (ఎన్ఎంఎంఎస్) హాజరు నమోదును ఫీల్డ్ అసిస్టెంట్లు అప్లోడ్ చేస్తుండగా..ఇక నుంచి మరింత పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈకేవైసీ చేయించుకోని కూలీలు ఉపాధిహామీ పథకానికి దూరం కానున్నారు. జిల్లాలో 1,27,274 మంది ఉపాధి హామీ పథకంలో కూలీలుగా పనిచేస్తున్నారు. కూలీలు పనికి రాకున్నా కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు.. నకిలీ, పాత ఫొటోలను యాప్లో అప్లోడ్ చేస్తూ నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. ఒకరి పేరుతో మరొకరు పనులకు వెళ్లి హాజరు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సామాజిక తనిఖీలో అక్రమాలు బయటపడుతున్నాయి. నిధులు పక్కదారి పడుతున్నట్లు తేలినా రికవరీ అంతంతమాత్రంగానే ఉంటోంది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు ఈ–కేవైసీ తప్పనిసరి చేసింది. జిల్లాలో ఇప్పటివరకు 1,07,997 మంది కూలీలు ఈ–కేవైసీ చేయించారు. పనులు పారదర్శకంగా చేపట్టేలా ఉపాధిలో కొత్త విధి విధానాలు రూపొందించారు. పనుల్లో చాలాచోట్ల జాబ్కార్డులు ఉన్న ఇంట్లో ఒకరి పేరు మీద జాబ్కార్డు ఉంటే వారి బదులు మరొకరు హాజరవుతున్నారు. దీంతో ఉపాధిహామీ పనుల్లో పారదర్శకత పెంచడానికే కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కూలీలు పనిస్థలాల్లో పని చేస్తేనే కూలి చెల్లింపులు జరుగుతాయి. జాబ్కార్డు కలిగిన కూలీలే పనులకు హాజరుకావాలి. వారికే వేతనం లభిస్తుంది. వేతనాల చెల్లింపుతోపాటు పని ప్రదేశంలో ఎవరికై నా ప్రమాదం జరిగితే పరిహారం చెల్లించడం సమస్యగా మారుతోంది. ఈక్రమంలో తప్పనిసరిగా జాబ్కార్డు ఉండి పనికి హాజరైన కూలీల వివరాలను ఆధార్ అనుసంధానం చేస్తూ ఈకేవైసీ చేస్తున్నారు. ఫొటో తీయగానే ఆధార్ నమోదై ఉన్న బయోమెట్రిక్తో ఎవరు హాజరయ్యారో తెలిసిపోతుంది. వీటితోపాటు జియోట్యాగింగ్ ప్రదేశంలో జియో ఫెన్సింగ్ అప్డేట్ చేస్తూ పనిప్రదేశాలను సైతం గుర్తించే వీలు కలుగనుంది. పాత చోట్ల మళ్లీ పనులు చేయకుండా చర్యలు తీసుకోవచ్చు. సిగ్నల్ సాంకేతిక సమస్యలు ఉంటే జిల్లా కోఆర్డినేటర్ పరిష్కరించనున్నారు. కాగా, ఈ అంశాలపై సంబంధిత సిబ్బందికి అవగాహన కల్పించారు. ముఖగుర్తింపుతో పనుల్లో పారదర్శకత కూలీలు పనికి వచ్చినప్పుడు, వెళ్లేటప్పుడు ఫొటోలు రెండు ఫొటోలు సరిపోలితేనే హాజరు ఈ–కేవైసీతో నకిలీలకు అడ్డుకట్ట ఉపాధి హామీ పథకంలో నూతన విధానంతో అక్రమాలకు చెక్కూలీలు పనికి రాగానే ఒకసారి, పనులు పూర్తయిన తర్వాత ఇళ్లకు వెళ్లేటప్పుడు మరోసారి ముఖ ఫొటో తీస్తారు. ఆ తర్వాత ఫొటోలను జీపీఎస్ మొబైల్ మానిటరింగ్ యాప్లో అప్లోడ్ చేస్తారు. కూలీల వివరాలు యాప్లో నమోదు కానిపక్షంలో వారు పనులకు వెళ్లినా హాజరువేయలేరు. పనిప్రదేశంలో కాకుండా ఇతర ప్రాంతంలో తీసిన ఫొటోను అప్లోడ్ చేస్తే జీపీఎస్ సిస్టం వెంటనే గుర్తిస్తుంది. తప్పడు హాజరుగా నిర్ధారించబడుతుంది. ఈ–కేవైసీ వందశాతం పూర్తయితే ఈజీఎస్లో అవకతవకలను నియంత్రించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. -
సోమేశ్వరాలయ అభివృద్ధికి కృషి
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి చెప్పారు. గురువారం సోమేశ్వరాలయంలో ఎ మ్మెల్యే యశస్వినిరెడ్డి స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం గుట్ట శిఖరం, పరిసరాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో హైమాస్ట్ లైట్లు, అఖండజ్యోతి నిర్మాణం, మెట్ల ఏర్పాటు, పంచగూళ్ల ఆలయం దగ్గర నుంచి గుట్టపైకి ఘాట్రోడ్డు నిర్మాణం, ఇతర పెండింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, అయా శాఖల ఇంజనీరింగ్ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే.. దేవరుప్పుల: ప్రజల భాగస్వామ్యంతోనే శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు సాధ్యమని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నా రు. మండలంలోని చిన్నమడూ రు రెవె న్యూ పరిధి రంబోజీగూడెం గ్రామ పంచాయతీ పరిధి తలపెట్టిన మెగా విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం సేకరించిన 27 మంది భూనిర్వాసితులకు క్యాంపు కార్యాలయంలో రూ.80 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. జనగామ ఆర్టీఓ గోపిరామ్, తహసీల్దార్ ఆడెపు అండాలు, కాంగ్రెస్ నాయకులు శ్రీరామ్, వెంకన్న, పరీదుల భాస్కర్, పెండ్లి సోమిరెడ్డి, రామచంద్రునాయక్ పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
మత్తుపదార్థాలు, ర్యాగింగ్కు దూరంగా ఉండాలి
జనగామ: విద్యార్థులు మత్తు పదార్థాలు, ర్యాగింగ్కు దూరంగా ఉండాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు. గురువారం జనగామ మెడికల్ కళాశాలలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్, యాంటీ ర్యాగింగ్పై అవగాహన కార్యక్రమం జరిగింది. డీసీపీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం అత్యంత ప్రమాదకరమన్నారు. ర్యాగింగ్ చట్టపరంగా శిక్షార్హమైన నేరమన్నారు. ర్యాగింగ్ ఘటనలకు సంబంధించి కదలికలు మొదలవగానే అధికారులతో పాటు విద్యార్థులు కూడా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అనంతరం విద్యార్థులచే యాంటీడ్రగ్స్, యాంటీ ర్యాగింగ్ ప్రతిజ్ఞ చేశారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమణి, సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్ఐ చెన్నకేశవులు, అధ్యాపకులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మెడికల్ కళాశాల సదస్సులో డీసీపీ రాజమహేంద్ర నాయక్ -
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని టీఎన్జీఓ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖాజా షరీఫ్ కోరారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని సంఘ భవనంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసి, డీఏలను విడుదల చేయాలన్నారు. అలాగే 2026 సంవత్సరానికి సంబంధించి సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలు పెట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, కోశాధికారి హాఫిజ్, అసోసియేట్ అధ్యక్షుడు రాజనర్సయ్య, ఉపాధ్యక్షులు సంపత్ కుమార్, రాంనర్సయ్య, ఉప్పలయ్య, స్టెల్లా, నాగార్జున, శ్రీధర్ బాబు, యాకుబ్ పాషా పాల్గొన్నారు. -
ప్రజాసేవలోనే నిజమైన ఆనందం
పాలకుర్తి టౌన్: ప్రజాసేవలోనే నిజమైన ఆనందం ఉందని, హెచ్ఆర్జేఆర్ ట్రస్ట్ ఆరోగ్య సేవల్లో మందంజలో ఉంటుందని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని బషారత్ గార్డెన్స్లో శంకర కంటి ఆస్పత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి రాజేందర్రెడ్డి చారిటబుల్ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డితో కలిసి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ..పాలకుర్తి ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి శిబిరాలు తరుచుగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ ఎల్. మంజుల, మండల వైద్యాధికారి సిద్ధార్థరెడ్డి, శంకర్ ఆస్పత్రి వైద్యురాలు మనోజ్ఞ, హెచ్ఈఓ రమణమ్మ, ఏఓ భూక్య బాలజీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గిరిగాని కుమారస్వామి, పెద్దగాని సోమయ్య తదితరులు పాల్గొన్నారు. ఉచిత కంటి వైద్యశిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
ఘనంగా పూర్ణాహుతి
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో బుధవారం ఘనంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవంలో భాగంగా జరిగే తంతులో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేదపండితులు విజయసారథి, శ్రీనివాసారాచార్యులు, భార్గవాచార్యులు, మురళీధరాచార్యులు వేదమంత్రచ్ఛరణలో నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్ మూర్తి, డైరెక్టర్లు శ్రీధర్రెడ్డి, లక్ష్మి, వెంకటేశ్వర్లు, వెంకన్న, బుచ్చిరెడ్డి, సిబ్బంది భరత్, మల్లేశం, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. జనగామ: జనగామ మెడికల్ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరంలో పారా మెడికల్ డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్న్ విడుదలైందని కళాశాల ప్రిన్సిపాల్ నాగమణి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్న్(రెండేళ్లు), డిప్లొమా ఇన్ ఆప్తాలమిక్ అసిస్టెంట్(రెండేళ్లు) కోర్సులకు దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. ఇందుకుగాను ఈ కోర్సుల్లో చేరదలిచిన అభ్యర్థులు ఇంటర్మీడియట్ బైపీసీ లేదా ఎంపీసీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఆ కోర్సుల విద్యార్థులు అందుబాటులో లేకుంటే ఇతర ఇంటర్మీడియట్ కోర్సులు ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులు సమర్పించడానికి గడువు ఈ నెల 27వ తేదీ అన్నారు. ఆసక్తి గల విద్యార్థులు జనగామ మెడికల్ కళాశాలలో దరఖాస్తులను అందించాలన్నారు. నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు కళాశాల వెబ్సైట్ www.gmcjanga on.org లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ బిల్లుల ఆన్లైన్ చెల్లింపులు సులభంజనగామ: విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎన్పీడీసీఎల్) ఆధునిక ఆన్లైన్ చెల్లింపు వ్యవస్థలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చిందని ఎస్ఈ టి.వేణుమాధవ్ తెలిపారు. బుధవారం ఆయన సర్కిల్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం దాదాపు 10శాతం వినియోగదారులు తమ నెలవారీ బిల్లులను టీజీఎన్పీడీసీఎల్ యాప్, టీ వాలెట్, గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి డిజిటల్ సేవల ద్వారా చెల్లిస్తున్నట్లు తెలిపారు. 2024 సంవత్సరంలో 3,65,494 మంది వినియోగదారులు ఆన్లైన్ ద్వారా చెల్లించగా, ఈ ఏడాది 2025 నవంబర్ 11 వరకు 3,08,869 మంది డిజిటల్ పేమెంట్లు చేసినట్లు చెప్పారు. వినియోగదారులకు మరింత నాణ్యమైన, సులభతర సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. జూడో టోర్నమెంట్కు కేయూ జట్టుకేయూ క్యాంపస్: భోపాల్లోని సెజ్ యూనివర్సిటీలో ఈనెల 13, 14 తేదీల్లో జరగబోయే సౌత్ వెస్ట్ జోన్ జూడో టోర్నమెంట్కు కేయూ జూడో పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు బుధవారం కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వెంకయ్య తెలిపారు. ఈజట్టులో ఎల్.లక్ష్మణ్, ఎం.ధీరజ్ (కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హనుమకొండ), పి.శివాజీ (వాగ్దేవి డిగ్రీ కళాశాల, హనుమకొండ), బి.జయదీప్ (సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, వరంగల్), ఎం.సాయికిరణ్ నాయక్ (యూసీపీఈ.కేయూ, వరంగల్), ఎం.దర్శిత్నాయక్ (ఎల్బీకాలేజీ, వరంగల్) ఉన్నారు. ఈజట్టుకు హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ పి.కిషన్ కోచ్కమ్ మేనేజర్గా వ్యవహరిస్తారని ప్రొఫెసర్ వెంకయ్య తెలిపారు. క్యాస్ ఇంటర్వ్యూలకు 10 మంది అధ్యాపకులుకేయూ క్యాంపస్: కేయూలో కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం (క్యాస్) కింద అధ్యాపకుల పదోన్నతికి ఇంటర్వ్యూలు కొనసాగుతున్నా యి. ఈమేరకు బుధవారం నిర్వహించిన వివిధ విభాగాల్లో పదోన్నతుల కోసం 10 మంది అధ్యాపకులు హాజరయ్యారు. ఇందులో సోషియాలజీ విభాగంలో ఇద్దరు, లైబ్రరీ సైన్స్ విభాగంలో ఒకరు, ఇంగ్లిష్ విభాగంలో ఒకరు, ఇంజనీరింగ్ సీఎస్ఈ విభాగంలో ఐదుగురు హాజరయ్యారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగాను, అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగాను పదోన్నతి కల్పించనున్నారు. ఇంటర్వ్యూల ప్రక్రియలో వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం.. ఆయా విభాగాల సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, డీన్లు పాల్గొన్నారు. ఈనెల 13న ఇంజనీరింగ్ విభాగాల్లో ఈసీఈ, ఎంఈ, ఈఈఈ, యూనివర్సిటీ లా కాలేజీలోని అధ్యాపకుల పదోన్నతుల ఇంటర్వ్యూలతో ఈ ప్రక్రియ ముగియనుంది. -
లక్షలు పోసింది.. పార్కింగ్ కోసమా?
మార్కెట్ యార్డులో పార్కింగ్ స్థలంగా మారిన కవర్షెడ్జనగామ వ్యవసాయ మార్కెట్లో రైతులు తమ సరుకులను అమ్ముకునేందుకు లక్షలు ఖర్చుచేసి నిర్మించిన కవర్షెడ్ను పార్కింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. కవర్షెడ్లో సీసీ నిర్మాణం చేయకుండా ఏళ్ల తరబడి కాలయాపన చేస్తూ గాలికి వదిలేశారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ధాన్యం, మక్కలు, తదితర సరుకుల విక్రయానికి అవసరపడే కవర్షెడ్ ప్రైవేటు వాహనాల పార్కింగ్ స్థలంగా మారిపోయింది. నేటికీ ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడం గమనార్హం. – జనగామ -
విద్యార్థులతో పనులు చేయిస్తున్నారు..
రఘునాథపల్లి: రఘునాథపల్లి స్టేషన్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో బిల్డింగ్ ఎక్కించి చీపుర్లతో వెట్టిచాకిరి పనులు చేయించారని అదే గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ఠాకూర్ గణేశ్సింగ్ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఫొటోలు, వీడియోలతో సహా ఫిర్యాదు చేశారు. పిల్లలకు చదువు చెప్పకుండా విద్యార్థులను పని మనుషులుగా పనులు చేయించడం సమంజసం కాదని, ఈ విషయంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలోనూ విద్యార్థులతో ఇటుకలు మోయించడం లాంటి పనులు చేయించారని, రెండుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఉపాధ్యాయుల తీరు మారలేదని పేర్కొన్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే పాఠశాలల్లో విద్యార్థులను బానిసల్లా మారుస్తున్నారన్నారు. కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వగా సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ఉపాధ్యాయులపై కలెక్టర్కు ఫిర్యాదు -
బ్రిడ్జి మాకొద్దు
స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులో ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయవద్దంటూ గ్రామస్తులు బుధవారం పనులను అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఛాగల్లులో జాతీయ రహదారిపై ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు ఇటీవల నిధులు మంజూరు కాగా నిర్మాణ పనులను చేసేందుకు సంబంధిత అఽధికారులు, కాంట్రాక్టర్ వర్కర్లతో ఈనెల 1న ఛాగల్లుకు రాగా అడ్డుకున్న విషయం విదితమే. అప్పుడు నాలుగు రోజులు గడువు అడుగగా పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా బుధవారం సదరు పనులను చేపట్టేందుకు సంబంధిత కాంట్రాక్టర్, అధికారులు పొక్లెయినర్తో అక్కడికి చేరుకోగా పలువురు గ్రామస్తులు అడ్డుకున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జితో ఎలాంటి ప్రయోజనం లేదని, పైగా తాము నష్టపోతామని అక్కడ ఇళ్లు, స్థలాలు ఉన్న వారు అధికారులతో వాగ్వాదం చేశారు. అధికారులు మొదట సూచించిన ప్రదేశంలో కాకుండా మరో చోట నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రయత్నించడంలో ఆంతర్యమేమిటంటూ అధికారులను నిలదీశారు. కాగా విషయం తెలుసుకున్న స్థానిక ఏసీపీ భీమ్శర్మ, సీఐ జి.వేణు, ఎస్ఐలు వినయ్కుమార్, రాజేశ్, మనీషా ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. ఈ దశలో పోలీసులకు, బాఽధితులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు పనిచేస్తారని, అడ్డుకోవడం సమంజసం కాదని, ఏమైనా సమస్య ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని సీఐ ప్రజలకు సూచించారు. కాగా మరో రెండు రోజులు గడువు ఇవ్వాలని బాఽధితులు కోరగా తాత్కాలికంగా పనులను నిలిపివేశారు. గ్రామస్తులు బాలగాని అనిల్గౌడ్, సయ్యద్ రహీమ్, సర్వర్, సాజిద్, రవి, కుమార్, అన్నెపు అనిల్, రాజేష్, అశోక్ పాల్గొన్నారు. ఛాగల్లులో ఫుట్ఓవర్ బ్రిడ్జి పనులను అడ్డుకున్న గ్రామస్తులు అధికారులు, పోలీసులతో వాగ్వాదం.. తాత్కాలికంగా పనుల నిలిపివేత -
దందా ఎంపీఓలు!
● మరో రెండు మండలాల ఎంపీఓలపై ఫిర్యాదుకు సిద్ధం..? ● మధ్యవర్తుల జోక్యంతో బ్రేక్! ● ఎంపీఓల డబ్బుల డిమాండ్ వెనక మర్మమేంటి ● బచ్చన్నపేట ఎంపీఓ సస్పెన్షన్ కాకుండా ఓ సంఘం మంతనాలుజనగామ: జిల్లాలో ఎంపీఓ(మండల పంచాయతీ అధికారి)ల బ్లాక్మెయిల్ దందా మరోసారి చర్చకు దారితీసింది. పంచాయతీ కార్యదర్శులపై నిరంతరం ఒత్తిడి, వసూళ్ల ఆరోపణలతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. తాజాగా బచ్చన్నపేట మండల ఎంపీఓపై కార్యదర్శులు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఘటనతో ఈ వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. అయితే ఫిర్యాదులు మరింతగా వెల్లువెత్తకముందే జిల్లాలోని మరో రెండు మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. జిల్లాలోని మరో రెండు మండలాల ఎంపీఓలపై అక్కడి పంచాయతీ కార్యదర్శులు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సెక్రటరీల నుంచి ఫిర్యాదులు కలెక్టర్ వరకు చేరకుండా కొందరు మధ్యవర్తులు అడ్డుకున్నారనే ప్రచారం హాట్టాపిక్గా మారింది. బచ్చన్నపేట ఎంపీఓపై సస్పెన్షన్ డిమాండ్ చేసిన కార్యదర్శులపై ఒత్తిడి తెచ్చి కేసును నీరుగార్చేందుకు ఓ సంఘం రంగంలోకి దిగి గట్టిగానే ప్రయత్నిస్తోందని వినికిడి. సస్పెన్షన్ వేటుపడకుండా, బదిలీతో సరిపెట్టాలనే సంఘ పెద్దలు ఉన్నత స్థాయి అధికారులను సైతం బుజ్జగించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇంక్రిమెంట్లు, రాడిఫికేషన్, ప్రొహిబిషన్లో ఉన్న సమయం నుంచి రెగ్యులర్గా మారే సమయంలో సంబంధిత కార్యదర్శులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ కొలువు చేస్తున్నామనే కనీస భయం లేకుండా, కార్యదర్శుల నుంచి నేరుగా ఆన్లైన్ పేమెంట్ చేయించుకోవడం వెనక ధైర్యం ఎవరిదనే చర్చ నడుస్తోంది. సర్కారు పథకాలు సమర్థవంతంగా అమలు కావాల్సి న చోట అవినీతిక్రమంగా వ్యవస్థలా మారిపోతోందని ప్రజలు బాహాటంగానే మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. జిల్లాలో మూడు మండలాల ఎంపీఓలు..పంచాయతీ కార్యదర్శుల నుంచి వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల పరిధిలో పంచాయతీ కార్యదర్శుల పనితీరు, అభివృద్ధి పనులు, నిధుల ఖర్చు తదితర వాటిపై పర్యవేక్షణ చేస్తూ..తప్పులను సరిదిద్దాల్సిన పలువురు ఎంపీఓలు..డబ్బులు డిమాండ్ చేస్తూ వాటిని ప్రోత్సహిస్తున్నారు. అసలు బచ్చన్నపేట పంచాయతీ కార్యదర్శులు ఎంపీఓకు ఇచ్చిన డబ్బులు ఎక్కడివనే విషయం నిగ్గుతేలాల్సి ఉంది. గ్రామాల్లో పాలక మండలి పదవీకాలం ముగిసి, స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతున్న సమయంలో పరిపాలన బాధ్యత మొత్తం సెక్రటరీలపై పడింది. నల్లా రిపేరు నుంచి లైసెన్స్ జారీ వరకు పంచాయతీ కార్యదర్శిపైనే ఆధారపడి ఉంది. ఇందులో జరిగే చిన్న చిన్న తప్పులను ఎత్తిచూపిస్తూ..వాటిని సవరించాల్సిన పలువురు ఎంపీఓలు తమ చేతివాటం ప్రదర్శించడంపై దుమారం రేగుతోంది. బచ్చన్నపేట ఎంపీఓపై ఫిర్యాదు చేసి మూడు రోజులు గడిచిపోతున్నా, విచారణ లేకపోవడం గమనార్హం. జిల్లాలో ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా ఏమీ కాదులే అన్న భరోసా కొంతమంది అధికారుల్లో ఉన్నట్టు ఈ విషయాన్ని బట్టి తెలుస్తోంది.జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న ఓ మండల ఎంపీఓ పంచాయతీ కార్యదర్శులను తన సొంత పనులకు టార్గెట్ చేసినట్లు చర్చ జరుగుతోంది. బీమా పాలసీల పేరుతో ఒత్తిడి తెస్తున్నారని, అంగీకరించని వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఈ అంశంపై పంచాయతీ ఉ న్నతాధికారులు అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీయాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. ఈ ఎంపీఓ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న బచ్చన్నపేట అధికారికి మద్దతుగా నిలిచినట్లు సమాచారం. బచ్చన్నపేట ఎంపీఓ బదిలీ అయిన తర్వాత, కొత్తగా అధికారి బాధ్యతలు తీసుకున్న వెంటనే సెక్రటరీల పనిపడుతామన్నట్లు సదరు ఎంపీఓ శపథం పూనినట్లు జిల్లా పంచాయతీ శాఖలో చర్చకు దారితీసింది. ఈ అధికారిపై కలెక్టర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు అక్కడి సెక్రటరీలు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఒకరిద్దరి ఒత్తిడితో వెనక్కి తగ్గినట్లు తెలిసింది. -
జాతర పనుల నిర్లక్ష్యంపై గరంగరం
సాలహారం రాయి గురించి మంత్రులు పొంగులేటి, సీతక్క, సురేఖ, లక్ష్మణ్లకు వివరిస్తున్న అధికారి మేడారం మహాజాతర అభివృద్ధి పనులను బుధవారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. అనంతరం మేడారం హరిత హోటల్లో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి సమీక్షించారు. ముఖ్యంగా ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖల పనుల్లో నిర్లక్ష్యం జరుగుతోందని గరంగరమయ్యారు. – ములుగు/ఎస్ఎస్తాడ్వాయి అధికారులకు చురకలంటించిన మంత్రి పొంగులేటి మేడారంలో మహాజాతర అభివృద్ధి పనులపై సమీక్ష -
పండుటాకులను గౌరవిద్దాం
జనగామ రూరల్: మన జీవితంలో తల్లిదండ్రుల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. వయసు మీద పడి బలహీనంగా మారినా, వారి అనుభవం మాత్రం అచంచలమైన మార్గదర్శకం. అక్టోబర్ 1న జరుపుకునే అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం వారిపై మన కర్తవ్యాలను గుర్తుచేస్తుంది. ఈ రోజు వృద్ధుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, హక్కులను రక్షించడం, సమాజంలో గౌరవంగా నిలిపేలా చైతన్యం కల్పించడం అందరి ప్రధాన లక్ష్యం. వృద్ధులు ఒంటరితనంతో బాధపడకుండా వారితో సమయాన్ని గడపడం, చిన్నపాటి మాటతోనైనా సాంత్వన ఇవ్వడం వారికి కొత్త జీవం ఇచ్చిన వారమవుతాం. ఈ ఏడాది అక్టోబర్ 1న రాష్ట్రంలో ఎన్నికల కోడ్తో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం జరుపుకోలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 13 నుంచి 19వరకు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహించనున్నారు. వృద్ధుల హక్కులివి.. వృద్ధులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి. వృద్ధాప్య పింఛను పథకం ద్వారా నెల నెలా ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. ఆరోగ్య పరిరక్షణ కోసం ఆరోగ్యశ్రీ, వృద్ధాశ్రమాలు, డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజన్ హెల్ప్లైన్ 14567 ద్వారా వృద్ధుల భద్రత, సేవలపై ఫిర్యాదులు స్వీకరించే సౌకర్యం కల్పించారు. అలాగే పోషణ చట్టం–2007 ద్వారా పిల్లలు తమ తల్లిదండ్రుల సంరక్షణ చేయడం చట్టబద్ధ బాధ్యతగా నిర్దేశించారు. ఈ చట్టం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి పోషణకు న్యాయబద్ధమైన హక్కు పొందవచ్చు. వృద్ధుల జ్ఞానం..సమాజానికి వెలుగు దీపం తల్లిదండ్రుల సంరక్షణతోనే సుస్థిర సమాజం నేటినుంచి వయోవృద్ధుల వారోత్సవాలు పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ వృద్ధులను గౌరవించడం మన సంస్కృతికి ప్రతీక అని, వారి అనుభవం సమాజానికి మార్గదర్శకం అవుతుందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టరేట్లో శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 1న జరుపుకునే అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వృద్ధులు సమాజంలో గౌరవంగా, భద్రతగా జీవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని గురువారం నుంచి 19 వరకు వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాల నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె.కోదండరాములు, జిల్లాస్థాయి కమిటీ సభ్యులు కన్నా పరుశురాములు, హరిబాబు, క్యాథరిన్, సీనియర్ సిటిజన్న్ అసోసియేషన్ ప్రతినిధులు సిద్ది మల్లయ్య, మల్లారెడ్డి, రామస్వామి, ఫీల్డ్ రెస్పాన్న్స్ ఆఫీసర్ రాజు, సఖి సెంటర్ ప్రతినిధి రేణుక, డీసీపీఓ రవికాంత్, డీఎంసీ శారద ఉన్నారు.13వ తేదీ: వృద్ధాశ్రమాల్లో ఆటల పోటీలు, వినోద కార్యక్రమాలు 14: వయోవృద్ధులకు ఉచిత ఆరోగ్య శిబిరాలు 15: సీనియర్ సిటిజన్ల హక్కులపై అవగాహన ర్యాలీ 17:ఆరోగ్యం, చురుకై న వృద్ధాప్యంపై అవగాహన కార్యక్రమం 18:గ్రామ స్థాయిలో సర్పంచులు, ప్రజాప్రతినిధులతో అవగాహన సమావేశాలు 19:జిల్లాస్థాయిలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ సంబురాలు -
అబుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలి
● అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ జనగామ రూరల్: దేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ పింకేశ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్షాలోమ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ పి.అనిల్బాబు అధ్యక్షుతన ఏర్పాటు చేసి న సమావేశానికి అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి డాక్టర్ కుమార్ బి.విక్రమ్ కుమార్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ హాజరై మాట్లాడారు. పాఠశాల ప్రిన్సిపాల్ కె.కుమారస్వామి, జమాల్ షరీఫ్, అజీమ్, అజహారుద్దీన్, అన్వర్, ఏజాజ్ పాల్గొన్నారు. ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో.. స్థానిక ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారతీయ విద్యా విధానంలో అబుల్ కలాం చేసిన సంస్కరణల కృషిని కొనియాడారు. -
‘రుద్రమదేవి’ సొసైటీలో భారీ అవకతవకలు
జనగామ: పట్టణంలోని రుద్రమదేవి మహిళా మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్లో జరిగిన భారీ ఆర్థిక అవకతవకలపై జిల్లా సహకార సొసైటీ అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. రూ.7.09 కోట్ల నిధులను చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేసినట్లు వరంగల్ కో ఆపరేటివ్ ట్రిబ్యునల్ ఇటీవల తేల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోఆపరేటివ్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ మేరకు మంగళవారం జిల్లా సహకార అధికారి, జిల్లా రిజిస్ట్రార్ కె.కోదండరాములు పట్టణ పోలీస్ స్టేషన్ స్టేషన్లో సీఐ సత్యనారాయణరెడ్డికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. జిల్లా రిజిస్ట్రార్ కోదండరాములు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. 2018–2020 సంవత్సరాల్లో రుద్రమదేవి మహిళా మాక్స్ లిమిటెడ్ మేనేజింగ్ కమిటీ, ఉద్యోగులు జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో 38.21 ఎకరాల భూమిని చట్ట వి రుద్ధంగా కొనుగోలు చేసి సొసైటీ నిధులను భారీగా దుర్వినియోగం చేసినట్లు తేల్చారు. ఈ భూమి కొనుగోలు జనరల్ బాడీ ఆమోదం లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ట్రిబ్యునల్ తీర్పులో పేర్కొంది. యాజమాన్యం నిర్ధారణ లేకుండా భూమి కొనుగోలు చేయడంతో పాటు మధ్యవర్తులకు కమీషన్ పేరిట రూ.1.42 కోట్లు చెల్లించగా, ఇందులో రూ.90 లక్షలు నగదు రూపంలో నేరుగా చెల్లింపులు జరిగాయన్నారు. రికార్డులు తారుమారు చేసి, తప్పుడు నగదు పుస్తకాలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో 22 మంది అధికారులు, డైరెక్టర్లు, ఉద్యోగులు ప్రధాన నిందితులుగా పేర్కొనబడ్డారు. వీరిలో సీఈఓ పి.కవిత, అధ్యక్షురాలు బండి విజయలక్ష్మి, సెక్రటరీ గడ్డం విజయలక్ష్మి, మాజీ సెక్రటరీ ఎం.పద్మ, క్లర్కులు గుండెల్లి శ్రీనివాస్, సుంకరి దేవేందర్, సలహాదారు తల్క లక్ష్మణ్, చిర్ర సుగుణమ్మ, మరో 14 మంది ఉన్నారు. వీరంతా మోసం, ఫోర్జరీ, కుట్ర, ఖాతాల తారుమారులో ప్రమేయం ఉన్నట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. సదరు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జిల్లా అధికారి సీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలని సీఐని కోరారు. అంతకుముందుగానే శాఖ పరంగా సొసైటీ రికార్డులు, బ్యాంకు, అమ్మకపు పత్రాలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. ఏడాదికి 12 శాతం వడ్డీతో కలుపుకొని రూ.7.09 కోట్ల నిధుల రికవరీ కోసం వారి ఆస్తులను అటాచ్ చేసినట్లు చెప్పారు. సీఐతో పాటు డీసీపీకి సైతం ఫిర్యాదు కాపీలను పంపించినట్లు తెలిపారు. సహకార నిధుల దుర్వినియోగం కేసుల్లో ఇది అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. రూ.7కోట్లు దుర్వినియోగమైనట్లు తేల్చిన ట్రిబ్యునల్ పోలీస్ స్టేషన్లో జిల్లా సహకార అధికారి ఫిర్యాదు -
మనుషుల వెంటే పరుగెత్తుతూ..
ప్రతిరోజూ ఉదయం బయటికి వెళ్లాలంటే భయం వేస్తోంది. మా కాలనీలో 50కి పైగా కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయి. పిల్లలు స్కూల్కు వెళ్లేటప్పుడు వారి వెనకాలే పరిగెత్తుతూ భయపెడుతున్నాయి. ప్రజల భద్రతను కాపాడేలా పురపాలిక అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి. – మల్లిగారి రాజు, 13వార్డు అధికారులు పట్టించుకోవడం లేదు.. రాత్రివేళ ఇంటికి వెళ్లే సమయంలో కుక్కలు దాడి చేస్తున్నాయి. బైక్ మీద వెళ్తే వెనకే పరుగెత్తుకుంటూ వెంబడిస్తాయి. చాలా మందిని కరిచాయి. ప్రతి వీధి మూలలో పది పన్నెండు కుక్కలు కాచుకుని చూస్తున్నా యి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. – హరికృష్ణ, బాలాజీనగర్ ఎవరైనా భయపడాల్సిందే రోడ్డుపై వెళ్లే క్రమంలో కుక్కలు పరుగెత్తిస్తున్నాయి. చాలా భ యంగా ఉంది. కొందరు పిల్లలకు గాయాలు అయినా కూడా ఎవ రూ పట్టించుకోవడం లేదు. మా రక్షణ కోసం కనీసం కుక్కలను పట్టుకునే బృందం తరచుగా రావాలి. చిన్నపిల్లలకు ఇది చాలా ప్రమాదకరం – బొమ్మకంటి అనిల్ గౌడ్, రెడ్డి స్ట్రీట్, జనగామయుద్ధం చేయాల్సి వస్తోంది.. నిత్యం ఉదయం ఇంటి బయటకు వస్తుంటేనే పది నుంచి 20 కుక్కలు కనిపిస్తాయి. రోజు కుక్కలతో యుద్ధం చేయాల్సి వస్తోంది. చెత్త దగ్గరే ఎక్కువగా ఉంటా యి. మున్సిపాలిటీ చెత్త సకాలంలో తొలగిస్తే కొంతవరకు సమస్య తగ్గుతుంది. కుక్కల వల్ల బాటసారులు, వృద్ధులు, పిల్లలు భయంతో ఇబ్బంది పడుతున్నారు. – జాయ శ్రీశైలం, కుర్మవాడ, 20వ వార్డు ● -
మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి
● వ్యాపారులతో సమావేశంలో కమిషనర్ రాధాకృష్ణ స్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ సహకరించాలని కమిషనర్ రాధాకృష్ణ అన్నారు. ట్రేడ్ లైసెన్స్లకు సంబంధించి స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో వివిధ రంగాల వ్యాపారులతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఉన్న గ్రామ పంచాయతీకి, ప్రస్తుత మున్సిపాలిటీకి ట్రేడ్ లైసెన్స్ల విషయంలో తేడా ఉంటుందని వ్యాపారులు గుర్తించాలన్నారు. మున్సిపాలిటీ సిబ్బంది వేతనాలు రెట్టింపు అయ్యాయని, ఆ దిశగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రేడ్ లైసెన్స్ ఫీజులను నిర్ణయించినట్లు తెలిపారు. సింగిల్లేన్లో ఉన్న షాపులకు చదరపు అడుగుకు రూ.3, డబుల్లేన్లో ఉన్న వాటికి రూ.6, మల్టిపుల్ లేన్కు రూ.9, స్టార్ హోట ళ్ళు, కార్పోరేట్ హాస్పిటళ్లకు రూ.11 చొప్పున నిర్ణయించినట్లు తెలిపారు. కాగా, వ్యాపారులకు ఏడాది పాటు అవకాశం ఇవ్వాలని, లైసెన్స్ ఫీజుల ను ఏడాదికి రూ.10వేలు మించకుండా పరిమితంగా ఉంచాలని వ్యాపారులు, మిల్లర్లు జొన్నల రాజేశ్వరరావు, గోలి రాజశేఖర్, యంజాల ప్రభాకర్ ఈసందర్భంగా కోరారు. జనగామ, వర్ధన్నపేట తదితర మున్సిపాలిటీలలోనూ ఇంతగా ఫీజులు లేవని, అఽధికారులు వ్యాపారుల పక్షాన సానుకూలంగా స్పందించాలన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే శ్రీహరిని కలిసి తమ సమస్యల్ని విన్నవిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు శ్రీనివాస్, సుమలత, మిల్లర్లు, ఫంక్షన్హాల్లు, పెట్రోల్బంక్ల యజమానులు తదితరులు పాల్గొన్నారు. -
భోజనం..మరింత రుచిగా
జనగామ రూరల్: చాలీచాలని ధరలతో వంట సరుకులను తెస్తూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న కార్మికుల అవస్థలు తీరడం లేదు. దీంతో ఎట్టకేలకు సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజనం వంట ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలను అమలుచేయాలని కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు సూచించింది. ధరలు పెరగడం వంట ఏజెన్సీ నిర్వాహకులకు కొంతమేర ఊరటనిచ్చింది. జిల్లావ్యాప్తంగా 503 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 35వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. పెరిగిన ధరల ప్రకా రం విద్యార్థులకు మెరుగైన భోజనం అందించేందుకు అనుకూలంగా ఉంటుందని పలువురు వంట కార్మికులు తెలిపారు. అయితే వీటిని గతేడాది డిసెంబరు నుంచి అమలు చేయాల్సి ఉన్నందున అప్పటి నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో విద్యార్థికయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చెల్లిస్తుంది. ఈ మేరకు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, ఆహార నాణ్యత తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రకటన ఏజెన్సీలకు కొంతమేర కలిసివచ్చింది. వారంలో మూడు రోజులు విద్యార్థులకు కోడిగుడ్లు అందిస్తుండడంతో..వీటి పెంచిన ధరను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. కాగా, జిల్లా వ్యాప్తంగా 1091 మంది వంట కార్మికులు ఉన్నారు. రేషన్షాపుల ద్వారా బియ్యం.. మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వం ప్రజాపంపిణీ ద్వారా బియ్యం అందజేస్తుండగా మిగతా సరకులు ఏజెన్సీలు ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నాయి. వాటిని ప్రతి నెలా బిల్లుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. పలుమార్లు వీటి చెల్లింపుల్లో నెలల తరబడి జాప్యం జరగడంతో బకాయిలు పేరుకుపోయాయి. దీని ప్రభావం భోజనం నాణ్యతపై పడుతోంది. ప్రస్తుతం పెరిగిన చార్జీలను దృష్టిలో ఉంచుకుని అధికారులు పకడ్బందీగా పర్యవేక్షించి, పిల్లలకు మంచి భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పెరిగిన గుడ్డు ధర ,కూరగాయల రేట్లు సకాలంలో బిల్లులు రావడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. అప్పులు తెచ్చి వంటలు చేస్తున్నామని బిల్లులు మాత్రం సకాలంలో రావడం లేదని ఇలా అయితే తమ కుటుంబాలు గడిచేదేలా అని వారు వాపోతున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతి రోజు కాయకూరలు తప్పనిసరి వండిపెట్టాలి. అయితే ప్రస్తుతం కూరగాయలు, పప్పు, చింతపండు, కారం, ఇతర సామగ్రితో పాటు, వంట గ్యాస్ ధర విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం చెల్లించే డబ్బులు సరిపోవడం లేదు. కాగా వారానికి మూడుసార్లు గుడ్డు పెట్టాల్సి ఉంది. ప్రస్తుతం మార్కెట్లో గుడ్డు ధర విపరీతంగా పెరగగంతో ఆర్థికంగా భారం పడుతోందని చెబుతున్నారు. రూ.12వేల వేతనం అందించాలి..ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపాలి. నెలకు రూ.12,000లు చెల్లించి ఆర్థికంగా ఆదుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. బిల్లులు సకాలంలో అందించాలి. గ్యాస్ సిలిండర్లను పూర్తి రాయితీపై పంపిణీ చేయాలి. – రాపర్తి రాజు, జిల్లా అధ్యక్షుడు, సీఐటీయూ 11.79ఉన్నత పాఠశాలలు (9–10)ప్రాథమికోన్నత పాఠశాలలు (6–8)ప్రాథమిక పాఠశాలలు (1–5)మధ్యాహ్న భోజనం రేట్లను పెంచిన ప్రభుత్వం వంట ఏజెన్సీ నిర్వాహకులకు ఊరట సకాలంలో బిల్లులు అందించాలని వినతి జిల్లా వ్యాప్తంగా 503 పాఠశాలల్లో 35 వేలకుపైగా విద్యార్థులు -
ఎంసీహెచ్ అడ్డాగా..
జనగామ: పట్టణ వీధుల్లో కుక్కలదే రాజ్యం.. గుంపులుగా తిరుగుతూ బాటసారులు, ద్విచక్ర వాహనదారులపై విరుచుకు పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వృద్ధులు, చిన్నారులు వీటి బారిన పడి గాయపడ్డ ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సర్కారు సూచనల మేరకు పట్టణ పురపాలిక అధికారులు నియంత్రణ చర్యలు మొదలుపెట్టారు. పట్టణంలోని చంపక్ హిల్స్ డంపింగ్ యార్డ్లో ఏర్పాటు చేసిన ఏబీసీ (ఎనిమల్ బర్త్ కంట్రోల్) సెంటర్లో త్వరలోనే కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెలలో ఇప్పటివరకే 113 మందికి పైగా కుక్క కాటుకు గురయ్యారు. ఈ చర్యల ద్వారా వీధి కుక్కల జనన సంఖ్యను తగ్గించి ప్రజల్లో భయాన్ని తగ్గించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జనగామ పట్టణంలో దాదాపు 1,480 కుక్కలు ఉండగా, మునిపిపల్, పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా కుక్కలను పట్టుకుని కు.ని. ఆపరేషన్ చేసేందుకు సన్నద్ధమవు తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షి పరిశీలన కథనం.. ‘రండి ఎవరెవస్తారో చూస్తాం.. మమ్మల్ని దాటి వెళ్లగలిగే దమ్ము ఉందా...ఒక్క అరుపు చేస్తే గుండె దడతో ఆగిపోతారు..’ అన్నట్టుగా జనగామ చంపక్హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లోనికి వెళ్లే ప్రధాన దారిలో కుక్కలు కూర్చున్నాయి. ఈ ఆస్పత్రికి ప్రసూతికి కాన్పులతో పాటు వైద్య పరీక్షల కోసం పిల్లలను ఇక్కడకు తీసుకొస్తారు. అలాగే వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు ఏరియా, చిన్నగేటు ప్రాంతం స్వర్ణకళామందిర్ ఏరియా జంక్షన్లో కుక్కలకు అడ్డాగా మారాయి. గల్లీ నుంచి బయటకు వెళ్లాలంటే కాలనీ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే. లేని పక్షంలో చేతిలో కర్ర లేదా, రాయి పట్టుకుంటే తప్ప..వాటిని దాటి వెళ్లలేని పరిస్థితి. రెండు రోజుల్లో కు.ని ఆపరేషన్లు జనగామ చంపక్హిల్స్ డంపింగ్ యార్డు ఏరియాలోని ఏబీసీ (ఎనిమల్ బర్త్ కంట్రోల్) సెంటర్లో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. రెండ్రోజుల్లో ప్రక్రియ మొదలవుతుంది. పట్టణంలో 1,480 కుక్కలు ఉన్నట్లు లెక్కల ద్వారా నిర్ధారించాం. కు.ని. ఆపరేషన్ల కోసం రూ.5లక్షల బడ్జెట్ అవనసరమున్నట్లు అంచనా వేశాం. సర్జరీ మెటీరియల్, రిఫ్రిజిరేటర్, స్టోరేజీ పాయింట్, ఆపరేషన్ థియేటర్ సిద్ధం చేశాం. పశుసంవర్ధక శాఖ వైద్యుల సహకారంతో ముందుకెళ్తాం. కుక్కలు పట్టుకునే వారిని సైతం పిలిపించాం. జీపీఎస్ లొకేషన్ ఆధారంగా కుక్కలు పట్టుకుని ఆపరేషన్ చేసిన వారం తర్వాత తిరిగి అక్కడే వదిలేస్తాం. – సత్యనారాయణరెడ్డి, మునిసిపల్ కమిషనర్ -
సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి వెండి శక్తిఆయుధం
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి మిశ్రమ వెండితో తయారుచేసిన శక్తిఆయుధాన్ని భక్తుడు సమర్పించినట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్కు చెందిన భక్తుడు గంగిశెట్టి రాజ్కుమార్, కళా రాణి దంపతుల కుమారుడు గణేష్కు ఉద్యోగం రావడంతో మొదటి నెల వేతనంతో ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి రూ.70వేల విలువైన 458 గ్రాముల మిశ్రమ వెండితో తయారుచేయించిన శక్తి ఆయుధం ఆలయానికి అందజేసినట్లు ఈఓ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్ శర్మ, దేవగిరి అనిల్కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. ఘనంగా రథోత్సవంలింగాలఘణపురం: మండలంలో జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి ఘనంగా సీతారాముల రథోత్సవం జరిగింది. ఈనెల 10న కల్యాణం జరిగిన సీతారాముల విగ్రహాలను రథంపై ఊరేగించారు. రథాన్ని రంగురంగుల విద్యుత్ లైట్లు, పూలతో అలంకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య భక్తులు రథాన్ని రామనామ స్మరణ చేసుకుంటూ భక్తిశ్రద్ధలతో లాగుతూ వెళ్లారు. చేస్తూ లాగుకుంటూ వెళుతుండగా రథోత్సవాన్ని నిర్వహించారు. వేదపండితులు విజయసారథి, శ్రీనివాసాచార్యులు, భార్గవాచార్యులు, మురళీధరాచార్యులు, ఈఓ వంశీ, దేవస్థాన చైర్మన్ మూర్తి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పెన్షన్దారుల సమస్యలు పరిష్కరించాలిజనగామ రూరల్: పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎర్రోజు రామస్వామి కోరారు. మంగళవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష నిర్వహించి కలెక్టరేట్ ఏవో శ్రీకాంత్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్చి1, 2024 తర్వాత రిటైర్డ్ అయిన పెన్షనర్లకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, పెండింగ్లో ఉన్న 5 డీఏలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సవరించిన అన్ని సదుపాయాలతో ఉద్యోగులకు, పెన్షనర్లకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్లో నగదు రహిత ఆరోగ్య ప్రయోజనాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి రాజయ్య, కోశాధికారి కొత్తూరి సంపత్ కుమార్, ఉపాధ్యాయులు క్యాథరిన్, సాల్మన్ రాజు, దస్తగిరి, రమేశ్, ఇంద్రసేనారెడ్డి, కొమురెల్లి తదితరులు పాల్గొన్నారు. తెలుపు నంబర్ప్లేట్లతో ట్యాక్సీ మోసంజనగామ రూరల్: పసుపు నంబర్ ప్లేట్లకు బదులు తెలుపు నంబర్ ప్లేట్లతో ట్యాక్సీ మోసం జరుగుతోందని ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం తెలుపు నంబర్ ప్లేట్ల వాడటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని తెలంగాణ ప్రైవేట్ అండ్ పబ్లిక్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు విజేందర్ ఆరోపించారు. మంగళవారం పట్టణలోని సంఘం కార్యాలయంలో బూడిద ప్రశాంత్ అద్యక్షతన రవాణా రంగ కార్మికుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ..జిల్లాలో తెలుపు నంబర్ ప్లేట్లు కలిగిన సొంత వాహనాల్లో ప్రయాణికులను హైదరాబాద్, సూర్యాపేట, హన్మకొండ, లాంటి పట్టణాలకు ప్రయాణికులను తీసుకెళ్తున్నారని, ప్రమాదాలు జరిగితే బీమా పరిహారం అందకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. శివరాత్రి రాజు, చీర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 11జెజిఎన్ 154:సమావేశంలో మాట్లాడుతున్న సంచు విజేందర్ -
సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్కు వీడ్కోలు
జనగామ రూరల్: సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహించిన సి.విక్రమ్ ప్రమోషన్లో బదిలీ అయ్యారు. ఏడీజేగా హైదరాబాద్ ఫ్యామిలీ కోర్టుకు బదిలీ కాగా బార్ అసోసియేషన్ హాల్లో మంగళవారం న్యాయవాదులు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దండే బోయిన హరిప్రసాద్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా జడ్జి ప్రతిమ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. సబ్ కోర్టు జడ్జిగా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శిగా అత్యుత్తమమైన సేవలను అందించారని కొనియాడారు. సమావేశంలో సీనియర్, జూనియర్ కోర్టుల జడ్జిలు సుచరిత, సందీప, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, న్యాయవాదులు శ్రీరామ్ శ్రీనివాస్, మహీధర్రావు, పానుగంటి శ్రీనివాస్, ఎ.భిక్షపతి, ఎలగందుల చంద్రఋషి, డిఫెన్స్ కౌన్సిల్ మంచాల రవీందర్, ఉప్పలయ్య, సునీత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికచిల్పూరు: ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ అథ్లెటిక్స్ మీట్లో నిర్వహించిన 600 మీటర్ల జూనియర్ బాలికల విభాగంలో మండలంలోని పల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన జీడి ప్రీతి మొదటి స్థానంలో నిలిచి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం ఎల్లభట్ల విజయ్కుమార్, పీఈటీ దేవ్సింగ్ మంగళవారం పేర్కొన్నారు. ఈనెల 14న రంగారెడ్డి జిల్లా జింఖానా గ్రౌండ్స్లో నిర్వహించే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. -
ఓరుగల్లు శోకసంద్రం
అందెశ్రీ అస్తమయం.. ఉమ్మడి జిల్లాతో విడదీయలేని అనుబంధం‘జన జాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి. జంఝా మారుత జన నినాదమై జే గంటలు మోగించాలి. ఒకటే జననం.. ఓహోహో.. ఒకటే మరణం ఆహాహా.. జీవితమంతా ఓహోహో.. జనమే మననం.. ఆహాహా.. కష్టాల్ నష్టాల్ ఎన్నెదురైనా కార్యదీక్షతో తెలంగాణ.. జై బోలో తెలంగాణ.. గళ గర్జనల జడివాన’ అంటూ పాటల రూపంలో తెలంగాణ వాదాన్ని ఇంటింటికీ చేర్చిన అందెశ్రీ మరణ వార్తతో ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఆయనతో ఓరుగల్లుకున్న విడదీయలేని అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. – జనగామ/కేయూ క్యాంపస్/మహబూబాబాద్ రూరల్పాత ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో జన్మించిన అందెశ్రీ (అందె ఎల్ల య్య) చదువుకోలేకపోయినా జీవితానుభవాలే పాఠ్యగ్రంథాలుగా మార్చుకున్నారు. యువతలో ఆత్మవిశ్వాసాన్ని, కష్టజీవుల్లో పోరాటస్ఫూర్తిని రగిలించే పాటలతో ఆయన ప్రజాకవిగా వెలు గొందారు. 1985–90 మధ్యకాలంలో జనగామ అంబేడ్కర్ నగర్లోని అభ్యుదయ కవి జీవై గిరి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డితో సాహిత్య, సామాజిక చర్చలు సాగించిన అందెశ్రీ, జనగామ కవులు, కళాకారులతో ఎంతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు. కవులు, కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సాంబరాజు యాదగిరి రచించిన ‘స్వేచ్ఛా గీతం’ పుస్తకావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. ప్రకృతిలోని అనుభవమే ఆయన పాటలు.. అందెశ్రీ పాఠశా ల స్థాయి విద్య కూడా చదవలే దు. పల్లె ప్రకృతి తో గొర్రెల కాపరి గా బాల్యం గడిచింది. ప్రకృతిలోని అనుభవమే ఆయన పాటలు, కవిత్వం సహజసిద్ధమైన ఆశువు కవిత్వంగా మారింది. ఆయన కవిత్వా ప్రతిభను గుర్తించి కాకతీయ యూనివర్సిటీ 2008, జనవరి 31న నిర్వహించిన 18వ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ను అప్పటి వీసీ ఆచార్య ఎన్.లింగమూర్తి చేతులమీదుగా అందించింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ కేంద్రబిందువుగా కొనసాగిన పోరాట సమయంలోనూ యూనివర్సిటీని సందర్శించారు. తెలుగు విభాగంలో నిర్వహించిన సెమినార్లో పాల్గొన్నారు. ఆయన చేసిన సాహిత్య కృషికి కాళోజీ ఫౌండేషన్,ప్రజాకవి కాళోజీ స్మారక పురస్కారాన్నిఅందించింది. అప్పట్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవా ర్డు గ్రహీత అంపశయ్య నవీన్, నాగిళ్ల రామశాస్త్రి, పొట్లపెల్లి శ్రీనివాస్రావు తదితర రచయితల చేతులమీదుగా అందెశ్రీ అవార్డు అందుకున్నారు. మానుకోటకు రెండు సార్లు.. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో సమైక్య విద్యాసంస్థల్లో 2008, 2009 సంవత్సరాల్లో జరిగిన విద్యార్థుల స్వాగత, వీడ్కోలు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంచి భవిష్యత్ ఏర్పడే అంశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఆ సమయంలోనే కురవి శ్రీవీరభద్రస్వామిని దర్శించుకున్నారు. చిన్నగూడూరులోని దాశరథి కృష్ణమాచార్యుల విగ్రహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన స్వస్థలం పాత ఉమ్మడి జిల్లాలోని రేబర్తి.. తెలంగాణ యాసతో తన పాటలు విశ్వవ్యాప్తం గౌరవ డాక్టరేట్ అందించిన కాకతీయ యూనివర్సిటీ.. కాళోజీ స్మారక పురస్కారం అందుకున్న ప్రకృతి కవి ఓ సాహిత్య గ్రంథాన్ని కోల్పోయామని జిల్లావాసుల ఆవేదన తాపీమేసీ్త్ర నుంచి ప్రజాకవి వరకు జీవనోపాధి కోసం తాపీమేస్త్రీగా పని చేసిన అందెశ్రీ, భవన నిర్మాణ రంగంలో చెరగని ముద్ర వేశారు. బచ్చన్నపేట మండలంలో ఆయన నిర్మించిన ఇళ్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. భుజానికి సంచి, అందులో తాపీ దారం– అది ఆయన సాధారణ జీవనానికి ప్రతీక. కష్టాల మధ్యే కళను పుట్టించిన ఆ కవి, తన పాటలతో సమాజాన్ని మేల్కొలిపారు. చదువులేకపోయినా ఆయన నోటి నుంచి జాలువారిన పాటలు పల్లె నుంచి పట్టణం వరకు మార్మోగాయి. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన ‘జై బోలో తెలంగాణ’ పాటతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. ఆయన పాటల్లో కేవలం పదాలే కాదు ప్రజల బాధ, ఆశ, ఆత్మగౌరవం ప్రతిధ్వనించాయి.నిప్పుల వాగుతో విశిష్టత అందెశ్రీ సంపాదకత్వంలో వెలువడిన ‘నిప్పుల వాగు’ పాటల సంకలనంలో జనగామ కవుల రచనలకు విశిష్ట స్థానం కల్పించారు. ఆ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్లో జనగామ కవులు జి.కృష్ణ, అయిలా సోమనర్సింహాచారి, పెట్లోజు సోమేశ్వరాచారి, చిలుమోజు సాయికిరణ్ పాల్గొని ఆయనను ఘనంగా సన్మానించారు. బాణాపురం అయ్యప్ప దేవాలయంలో జరిగిన సాహిత్య కార్యక్రమానికి కూడా ఆయన హాజరయ్యారు. ప్రజా సాహిత్యం, సామాజిక మార్పుపై ఆయనకున్న తపన, జనగామ కళాకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. -
జోనల్ చాంపియన్ ఘన్పూర్
స్టేషన్ఘన్పూర్: ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో జరిగిన సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల జోనల్ స్థాయి క్రీడాపోటీల్లో స్టేషన్ఘన్పూర్ సోషల్ వెల్ఫేర్ పాఠశాల, కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభతో అండర్ 14, 17, 19 విభాగాల్లో ఓవరాల్ చాంపియన్లుగా నిలిచారని ప్రిన్సిపాల్ బి.రఘుపతి, క్రీడల సమన్వయకర్త, పీడీ జి.శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు క్రీడాపోటీల్లో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి ఓవరాల్ చాంపియన్లుగా నిలిచిన విద్యార్థులను స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అండర్ 14 విభాగంలో ఖోఖో, టెన్నికాయిట్లో ప్రథమస్థానంలో, అండర్ 17 విభాగంలో టెన్నికాయిట్లో ప్రథమ, హ్యాండ్బాల్, ఖోఖోలో ద్వితీయ స్థానం, అండర్ 19లో చెస్, టెన్నికాయిట్లో ప్రథమ, హ్యాండ్బాల్లో ద్వితీయ స్థానం సాధించారన్నారు. అథ్లెటిక్స్లో 19 ఇయర్స్ విభాగంలో సీహెచ్.పవన్ 100మీ, 200మీ, 400 మీటర్ల పరుగు పందెంలో ప్రథమస్థానం, ఎల్.చరణ్ 1500 మీటర్లు, 5000 మీటర్ల పరుగుపందెంలో ద్వితీయ స్థానం, అండర్ 17లో కె.విఘ్నేష్ 800మీ, 1500 మీటర్ల పరుగుపందెంలో ద్వితీయ, ఎం.మహేశ్ 100, 200, 400 మీటర్ల పరుగుపందెంలో ద్వితీయస్థానంలో నిలువగా అరవింద్ షాట్ఫుట్, డిస్కస్త్రోలలో ద్వితీయ స్థానంలో నిలిచారన్నారు. అదేవిధంగా అండర్ 14లో వెంకటదుర్గ 200, 400 మీటర్ల పరుగుపందెంలో ద్వితీయ, భానుతేజ డిస్కస్త్రోలో ద్వితీయ, జీవన్ షాట్ఫుట్లో ద్వితీయ స్థానంలో నిలిచారన్నారు. పీఈటీ లక్ష్మన్, కోచ్ ప్రవీణ్, కళాశాల సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ రవీందర్, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ జయేందర్ పాల్గొన్నారు. సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాల పోటీల్లో మన విద్యార్థుల సత్తా -
భక్తిశ్రద్ధలతో ‘కార్తీక’ పూజలు
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో సోమవారం కార్తీక మాసం సందర్భంగా భక్తులు పోటెత్తారు. చండిక అమ్మవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రానికి చెంది న భక్తురాలు పెద్ది కుసుమ గర్భగుడికి ఎదురుగా గీసిన శివుడి తపస్సు చిత్రం ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రస న్న, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్శర్మ, దేవగిరి అనిల్కుమార్, మత్తగజం నాగరాజు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆలయానికి రూ.1,00,000 విరాళం శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి భక్తుడు రూ.1,00,000 విరాళం అందజేసినట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన కీసర వెంకట్రెడ్డి, విజయశ్రీ దంపతులు ఆలయానికి కార్తీక మాసం పురస్కరించుకొని మొక్కుగా విరాళం అందజేసినట్లు పేర్కొన్నారు. అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలిరఘునాథపల్లి: అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యులైన మహిళలందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని జిల్లా వయోజన విద్యాశాఖాధికారి ఆవుల విజయ్కుమార్రెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని ఓబీలు, వీఓఏలకు నిర్వహించిన ఉల్లాస్ శిక్షణలో ఆయన పాల్గొని మాట్లాడారు.. ఇప్పటికే జిల్లాలోని నిరక్షరాస్యులను గుర్తించి ఉల్లాస్ యాప్లో నమోదు చేసినట్లు, వారిని వలంటీర్ల ద్వారా అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ నూరొద్దిన్, డీపీఎం ప్రకాష్, ఉల్లాస్ టాస్ ఇన్చార్జ్ మురాల శంకర్రావు, ఏపీఎం ముసిపట్ల ఎల్లస్వామి, ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ కవిత, సునిత, మండల సమాఖ్య అధ్యక్షురాలు వసంత, కార్యదర్శి హైమావతి, కోశాధికారి శ్యామల తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి నిలయంలో రాఘవాపూర్ విద్యార్థులు స్టేషన్ఘన్పూర్: మండలంలోని రాఘవాపూర్ ఎంపీయూపీఎస్కు చెందిన 30 మంది విద్యార్థులు హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా హెచ్ఎం అనీల్ మాట్లాడుతూ.. 150 సంవత్సరాల వందేమాతరం గీతం ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులు గేయం ఆలపించారని తెలిపారు. రాష్ట్రపతి నిలయం సందర్శించే అవకాశం రావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేసినట్లు చెప్పారు. బాలవక్త పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికచిల్పూరు: పల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గొడుగు అర్పిత బాలవక్త పోటీల్లో జిల్లా స్థాయిలో మొదటి స్థానం పొంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు సోమవారం హెచ్ఎం ఎల్లంభట్ల విజయ్కుమార్, పీఈటీ దేవ్సింగ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో టీశాట్ నెట్వర్క్, టీఎస్జీహెచ్ఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలవక్త పోటీల్లో అర్పిత రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ంది. జిల్లా విద్యాశాఖ ఏసీజీఈ రవికుమార్, డీసీఈబీ సెక్రటరీ చంద్రబాను అర్పితకు మెమోంటో, సర్టిఫికెట్ అందజేశారు. పాఠశాల ఆవరణలో అర్పితను చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్రావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ పేరాల సుధాకర్, ఉపాధ్యాయులు అభినందించారు. నేడు ఉచిత స్వర్ణప్రాశన శిబిరంజనగామ: వేద ఆయుర్వేదిక్ పంచకర్మ వెల్నెస్ సెంటర్ హాస్పిటల్లో ఈనెల 11న (మంగళవారం) ఉచిత స్వర్ణప్రాశన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు డాక్టర్ అంజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రతీనెల పుష్యమి నక్షత్రం రోజున స్వర్ణప్రాశన ఇవ్వడం జరుగుతుందని, 6 నెలల నుంచి 16 సంవత్సరాల వయస్సు వారికి అందించడం జరుగుతుందన్నారు. పిల్లల్లో కండరాలు, ఎముకల పటిష్టతతో పాటు మేథాశక్తి, జీర్ణశక్తి పెంపొందుతుందన్నారు. వివరాల కోసం 9000097686 నంబరులో సంప్రదించాలని సూచించారు. -
బాలికల సంరక్షణకు చట్టాలు దోహదం
● లీగల్ అడ్వయిజర్ జి.దయామణి దేవరుప్పుల: బాలికల హక్కుల సంరక్షణకు చట్టాలు దోహదపడుతాయని జనగామ కోర్టు లీగల్ అడ్వయిజర్ జి.దయామణి సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో జిల్లా న్యాయసేవాధికారి సంస్థ, భరోసా ఆధ్వర్యంలో లీగల్ సర్వీస్డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీనేజ్ పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు వివరిస్తూ పరిష్కార మార్గాలను సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ జి.కళావతి, భరోసా రిసోర్స్ పర్సన్ బి.స్వాతి, పీఎల్వీ శేఖర్, డీఎల్ఎస్ సూపరింటెండెంట్ సీతారామరాజు, గురుకుల ప్రత్యేకాధికారి సుకన్య, ఏఎస్సై సదానందం, కానిస్టేబుళ్లు సమత, యాకేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కొడుకు పట్టించుకోవడం లేదు..
ఈ ఫొటోలోని వృద్ధుడి పేరు బండ లక్ష్మయ్య. జనగామ పట్టణంలోని జ్యోతి నగర్ నివాసి. తనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. అందరికీ వివాహం అయ్యింది. తన కుమారుడికి 300 గజాల ఇంటి స్థలంలో 200 గజాలు రాసి ఇచ్చాడు. ఇటీవల కింద పడగా కాలుకు గాయం కాగా అవస్థలు పడుతున్నాడు. భార్య అనారోగ్యంతో ఉంది. కుమారుడు తమను చూసుకోవడం లేదని కనీసం గంజి కూడా పోయడం లేదని వాపోతున్నాడు. తమ బాగోగులు చూసేవారు కరువయ్యారని కలెక్టర్ చొరవ తీసుకోని తమను ఆదుకోవాలని కోరుతున్నాడు. – బండ లక్ష్మయ్య, జనగామ పట్టణం● -
రంగుల సొబగులు
రెక్కలు విప్పినఇండియన్ జెజెబెల్కెమెరాలో సీతాకోక చిలుకను బంధిస్తున్న అధ్యయన బృందంబారోనెట్టానీ రాజు రకం 80 రకాల జాతులు గుర్తించాం.. ములుగు జిల్లా అడవుల్లో జరిగిన సర్వేలో 80 రకాల సీతాకోక చిలుకల జాతులను గుర్తించాం. అత్యాధునిక కెమెరాల సాయంతో వాటి సంఖ్య, అరుదైన జాతులను గుర్తించాం. వీటితోపాటు రాత్రి పూట సంచరించే చిమ్మటలు (మాత్) గుర్తించడం, వాటికి కావాల్సిన నివాసం, రక్షణ చర్యలపై అటవీశాఖ అధికారులకు వివరించాం.ములుగు జిల్లాలో 80 నూతన జాతుల గుర్తింపు ● లక్నవరం, మేడారం, తాడ్వాయి అడవుల్లో మూడు రోజులు సర్వే ● సెలయేర్ల చాటున దాగి ఉన్న సీతాకోక చిలుకలు ● తెలంగాణలో మొట్టమొదటి అధ్యయనం భవిష్యత్ తరాల కోసమే.. భవిష్యత్ తరాలకు జీవరాశులు, కీటకాల గురించి తెలియజేసేందుకే తెలంగాణలో మొదటిసారి అధ్యయనం చేశాం. ప్రకృతితో మమేకమై మా పరిశోధన జరిగింది. ఈ అధ్యయనం మర్చిపోలేని అనుభూతిని మిగిల్చింది. – చిత్రశంకర్, సైంటిస్ట్,ఎంటమాలజిస్ట్ఏటూరునాగారం: పూల గనిపై మధుబనిని పీల్చుకునే సప్తవర్ణాల సొగసులు. పట్టుకునేలోపే జారిపోయే పగడాల జీవులు.. ఇంద్రధనస్సు ఇలపై విహరిస్తోందా అన్నట్లుండే సీతాకోక చిలుకలు. పచ్చని వనాల నడుమ మకరందాలు ఆరగిస్తుండగా.. ప్రకృతితో మమేకమైన పరిశోధకులు కెమెరాల్లో క్లిక్మనిపించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ములుగు జిల్లా లక్నవరం, మేడారం, తాడ్వాయి అడవుల్లో చేసిన అధ్యయనం ఆదివారంతో ముగిసింది. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, వరల్డ్ వైల్డ్ ఫండ్ ఫర్ నేచర్తోపాటు మరికొంత మంది అధ్యయన బృందం సభ్యులు శుక్రవారం నుంచి ఆదివారం వరకు సర్వే చేశారు. 80 రకాల నూతన జాతుల సీతాకోక చిలుకలు ఉన్నట్లు ములుగు జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్కు నివేదిక అందజేశారు. సీతాకోక చిలుకలు మనుగడ కొనసాగించేందుకు పూల మొక్కలు సైతం పెంచాల్సిన అవసరం ఉందని నివేదికలో పేర్కొన్నారు. – ఇందారం నాగేశ్వర్రావు, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు -
రాబట్టరు.. రాబందులు!
సాక్షిప్రతినిధి, వరంగల్: కీలక శాఖల్లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న కొందరి కక్కుర్తి సర్కారు ఖజానాకు గండి పెడుతోంది. అవినీతికి మరిగిన కొందరు అధికారులు ప్రభుత్వ సొమ్మును అక్రమమార్గం పట్టిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ తరచూ దాడులు నిర్వహిస్తున్నా వారి వైఖరి మారడం లేదు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారుల వైఖరి ప్రభుత్వ సొమ్మును వ్యాపారులకు ధారాదత్తం చేస్తోంది. రైతులను నుంచి సేకరించిన రూ.కోట్ల విలువ చేసే ధాన్యాన్ని రైస్మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద సరఫరా చేస్తూ.. తిరిగి రాబట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సర్కారు ధాన్యాన్ని బయట అమ్ముకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్న కొందరు మిల్లర్ల నుంచి ఏసీకే (290 క్వింటాళ్లకు ఒక ఏసీకే)కు రూ.25 వేల వరకు వసూలు చేస్తూ మిన్నకుంటున్నారు. ఇదే క్రమంలో ఇటీవలే కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మూడు ఏసీకేల బియ్యం ఎగవేసిన ఓ వ్యాపారి నుంచి రూ.75 వేల లంచం తీసుకుంటూ సివిల్ సప్లయీస్ డీఎం జీవీ నర్సింహారావు ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతోంది. ఏళ్లు గడుస్తున్నా ఉదాసీనతే.. ఏళ్లు గడుస్తున్నా సీఎంఆర్ రాబట్టడంలో కొందరు పౌరసరఫరాల శాఖ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. సీఎంఆర్ దందాపై పత్రికల్లో వచ్చినప్పుడో.. లేదా ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు వెళ్లినప్పుడో స్పందిస్తున్న పౌరసరఫరాల శాఖ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఇదే క్రమంలో సీఎంఆర్ ఇవ్వని మిల్లుల్లో ఉండే ధాన్యానికి 2022–23లో టెండర్లు నిర్వహించారు. అలా ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లోని మిల్లుల్లో 2,92,585 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు 1,83,985 మెట్రిక్ టన్నులు రాబట్టారు. ఇదే సమయంలో ఇంకా రూ.217 కోట్ల విలువ చేసే ధాన్యం 31 మంది రైస్మిల్లర్ల వద్ద ఉందని పౌరసరఫరాలశాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చినప్పటికీ ఇప్పటికీ రాబట్టడం లేదు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో సరిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏసీకేల వారీగా వసూళ్లు.. 31 మంది రైస్మిల్లర్ల నుంచి రూ.217 కోట్ల సీఎంఆర్ ధాన్యం రాబట్టాల్సిన అధికారులు.. వాటి జోలికెళ్లడం లేదు. గత సీజన్లో అక్కడక్కడా ఆ డిఫాల్టర్లకే మళ్లీ సీఎంఆర్ ఇచ్చినట్లు ఫిర్యాదులున్నాయి. పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్లకు వరకూ వెళ్లినా విచారణ స్థాయి దాటలేదు. దీంతో సీఎంఆర్ పాత బకాయిల మాట పక్కన పెడితే.. కొత్తగా తీసుకునే వాళ్లు సైతం చాలా వరకు మొండికేస్తున్నారు. 2022–23లోని సీఎంఆర్ గడువు దాటినా.. హనుమకొండ, వరంగల్, ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల నుంచి బియ్యం ప్రభుత్వానికి చేరలేదు. ఇదిలా ఉంటే బకాయిదారుల నుంచి బియ్యం, ధాన్యం రాబట్టాల్సిన ఉన్నతాధికారులు.. ధాన్యం ఎగవేతదారులతో సంప్రదింపులు జరిపి ఏసీకేకు రూ.25 వేల చొప్పున కొందరి వద్ద ఇటీవల వసూలు చేసినట్లు తెలిసింది. వరంగల్కు చెందిన ఇద్దరు రైస్మిల్లర్ల లావాదేవీలు నిలిపివేసి పిలిపించిన పౌరసరఫరాల శాఖ అధికారి ఒకరు.. వారం రోజులకే మిల్లును తెరిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో మూడు రైసుమిల్లులకు నోటీసులు ఇచ్చి.. ఐదు రోజుల వ్యవధిలోనే లావాదేవీలకు అనుమతి ఇవ్వడం అప్పట్లో ఆ శాఖలోనే చర్చనీయాంశమైంది. ఈ సీఎంఆర్ దందాలో హస్తలాఘవం చూపుతున్న ఇద్దరు డీఎంలు, ముగ్గురు డీఎస్ఓలపై ఏసీబీ అడిషనల్ డీజీపీ, పౌరసరఫరాల శాఖ కమిషనర్కు తాజాగా ఫిర్యాదులు వెళ్లడం కలకలం రేపుతోంది. పౌరసరఫరాల శాఖలో వివాదాస్పదంగా ఇద్దరు డీఎంలు, ఇద్దరు డీఎస్ఓల తీరు సీఎంఆర్ రాబట్టడంలో మీనమేషాలు.. మిల్లర్లను వెనకేసుకొస్తూ భారీగా నజరానాలు రంగంలోకి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్.. అక్రమార్కులపై ఏసీబీ ఆరా -
సండే సందడి.. పర్యాటకుల కోలాహలం
వెంకటాపురం(ఎం)/ఎస్ఎస్తాడ్వాయి/వాజేడు: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు ఆదివారం వచ్చిందంటే కోలాహలంగా మారిపోతున్నాయి. ఆదివారం సెలవు కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు వ్యాపారులు పిల్లాపాపలతో తరలివచ్చి ఆనందంగా గడుపుతున్నారు. వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని రామప్ప, మేడారంలోని వనదేవతల దర్శనం, మంగపేటలోని మల్లూరులో గల హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. అలాగే వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో గల బొగత జలపాతానికి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చి కొలనులో స్నానాలు చేస్తూ సందడిగా గడుపుతున్నారు. అమ్మవార్లకు మొక్కులు తాడ్వాయి మండలంలోని మేడారంలో గల సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీర, సారె, పూలు, పండ్లు, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. మొక్కుల అనంతరం మేడారం పరిసర ప్రాంతాల్లోని చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు. బొగతలో ఆనందంగా.. వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో గల బొగత జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సెలవు దినం కావడంతో పర్యాటకులు జలపాతానికి తరలివచ్చారు. ప్రకృతి అందాలను వీక్షించి సందడి చేశారు. జిప్లైన్పై ఆటలాడుకుని సరదాగా గడిపారు. సమీప కొలనులో స్నానాలు చేసి కేరింతలు కొడుతూ ఆనందంగా గడిపారు. -
నేడు సీతారాముల కల్యాణం
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో 10న జరిగే సీతారాముల కల్యాణోత్సవంలో దేవతల ఆహ్వానం (ధ్వజారోహణం, గరుడముద్ద), ఎదురుకోళ్ల తంతు ఆదివారం రాత్రి పూర్తయింది. వేదపండితులు విజయసారథి, శ్రీనివాసాచార్యులు, భార్గవాచార్యులు, రాఘవాచార్యులు, మురళీధరాచార్యులు రామచంద్రుడు, సీతమ్మవారి పక్షాన పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. వేదమంత్రోచ్ఛరణలు, డోలు వాయిద్యాలతో ఎదురుకోళ్ల తంతును పూర్తి చేసి 10న జరిగే కల్యాణోత్సవానికి సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ వెలుగులతో జిలేల్మంటోంది. భక్తుల కోసం తగిన సౌకర్యాలను పూర్తి చేశారు. కల్యాణోత్సవం తిలకించేందుకు ఆదివారం నుంచి భక్తులు విచ్చేస్తున్నారు. కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ మూర్తి, ఈఓ వంశీ, దేవస్థాన కమిటీ డైరెక్టర్లు, రిటైర్డ్ ఈఓ కేకే రాములు, సిబ్బంది భరత్, మల్లేశం, రమేశ్ తదితరులు తమ సేవలు అందిస్తున్నారు. పూర్తయిన ఎదురుకోళ్ల తంతు భక్తులతో కిటకిటలాడుతున్న జీడికల్ -
భగభగ..గజగజ
జనగామ: వాతావరణం తారుమారైపోయింది. ఇటీవలే తుపాను విరుచుకుపడి తీవ్ర నష్టం చేకూర్చిన విషయం తెలిసిందే. తెల్లవారుజాము మబ్బులు, చల్లని గాలులతో చలి కాలం మొదలైందనిపిస్తే, మధ్యాహ్నం వరకు వేసవి కాలం తలపించే ఎండ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. కాళ్ల కింద ఎండ వేడెక్కి పోతుండగా, తలపై సూరీడు మంటలు చిమ్ముతున్నాడు. వారం రోజుల క్రితం కురిసిన వర్షం ఆవిరైపోగా, గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో ఉదయం సమయంలో వేడి పెరుగుతోంది. పగలంతా చెమటలు కక్కిస్తుంటే, రాత్రి సమయంలో గజగజ వణికించేస్తోంది. జిల్లాలో వాతావరణం ఓ వింతగా మారిపోయింది. భారీ వర్షాలకు ప్రజలు వణికిపోగా, ఆ వర్షం ఆగిన కొద్ది గంటల్లోనే ఎండ తాకిడి మళ్లీ దంచికొడుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేసవికాలాన్ని తలపించే విధంగా మండుతున్న ఎండ, సాయంత్రం మొదలై రాత్రి వేళల్లో చలిగా మారిపోవడం ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పగటిపూట బయటకు వెళ్లాలంటే సూర్యరశ్మి నుంచి రక్షణకు గొడుగులు, చేతి రుమాలు, తప్పనిసరిగా మారగా, రాత్రి వేళల్లో ఉన్నిదుస్తులు లేకుండా బయటికి రావడం కష్టమైపో తోంది. ఒక్క రోజులోనే ఎండా, చలి అనిపించే ఈ వాతావరణం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం సముద్రంలో ఏర్పడిన గాలి వానల ప్రభావం తగ్గడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగగా, ఉత్తర దిశల నుంచి వీస్తున్న చల్లని గాలుల కారణంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయని చెబుతున్నారు. వాతావరణంలో ఈ మార్పులు ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం కేసులు ఆసుపత్రుల్లో పెరుగుతున్నాయి. ప్రస్తుత కాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పగటిపూట ఎక్కువ సేపు ఎండలో తిరగకుండా ఉండటం, నీరు ఎక్కువగా తాగడం, రాత్రివేళల్లో చలినుంచి రక్షణ చర్యలు తీసుకోవడం అవసరమని సూచిస్తున్నారు. చలికాలంలో శీతల పానీయాలు, ఐస్క్రీం, లస్సీకి గిరాకీ తగ్గడం లేదు. జనగామ పట్టణంలోని హన్మకొండ, సిద్దిపేట, సూర్యాపేట రోడ్డు వైపు కూల్ కూల్ దుకాణాల్లో వ్యాపారం జోరుగా సాగుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వివిధ పనుల్లో బిజీబిజీగా ఉంటూ, ఎండ వేడిమికి అలసిపోతున్న జనం, శీతల పానీయాలతో సేద తీరుతున్నారు. అంతే కాకుండా మూడు రోజులుగా జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు పెద్దగా ట్రాఫిక్ లేకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండాకాలా న్నీ తలపించే మినీ కాలం, వింతగా ఉన్నా.. మరో వైపు ప్రజలను భయపెడుతోంది.స్వెట్టర్, మంకీ క్యాప్ ధరించిన ప్రజలుఎండకు జాగ్రత్తలు తీసుకుంటూ ట్రాక్టర్పై ప్రయాణంరాత్రి 7 గంటలు దాటకముందే చలి పెరిగిపోతుండడంతో ఉన్ని దుస్తులు, స్వెట్టర్లు, జర్కిన్లు ధరించడం ప్రజలకు తప్పనిసరి అయింది. మరోవైపు మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉండడంతో రోడ్లపై నడుస్తున్నవారు ముఖం, చేతులు కప్పుకుని రాకపోకలు సాగిస్తున్నారు. వర్షం, ఎండ, చలి మూడు ఒక్కసారిగా వింత వింతగా ప్రజలపై ప్రభావం చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వాతావరణ మార్పులు ఎన్ని రోజులు కొనసాగుతాయో చెప్పడం కష్టమే. అయితే, చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. దీంతో ప్రజలు ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణంలో వింత మార్పులు పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం మండలం కనిష్టం గరిష్టం బచ్చన్నపేట 16.9 31.8 పాలకుర్తి 17.4 31.9 చిల్పూరు 18.4 31.8 దేవరుప్పుల 18.4 31.2 స్టే.ఘన్పూర్ 18.5 31.3 రఘునాథపల్లి 18.7 31.2 తరిగొప్పుల 18.8 31.1 నర్మెట 18.9 30.5 జనగామ 19.3 30.4 లింగాలఘణపురం 19.9 30.7 కొడకండ్ల 20.0 31.8 జఫర్గఢ్ 20.4 32.7 -
కార్తీక వనభోజనం.. ఆత్మీయ సమ్మేళనం
ప్రకృతితో విడదీయలేని బంధం మానవాళిది. కార్తీక మాసంలో ఒక రోజు పచ్చని చెట్ల నడుమ స్వచ్ఛమైన గాలి పీల్చుతున్నారు. కష్టసుఖాలు పంచుకుని సామూహిక భోజనాలు చేసి ఆడిపాడుతున్నారు. వనసమారాధన చేసి దైవ చింతనలో లీనమవుతున్నారు. అనాదిగా వస్తున్న వన భోజనాల సంప్రదాయాన్ని గ్రామాల్లో అయితే సమష్టిగా జరుపుకునేవారు. పట్టణాల్లో ప్రస్తుతం అది రూపాంతరం చెందింది. కుల సంఘాలు, కాలనీల వారీగా వన భోజనాలకు వెళ్తున్నారు. జీవిత బంధాల్ని బలోపేతం చేసే ఈ వేడుకపై ‘సాక్షి’ సండే స్పెషల్. – కాజీపేటకార్తీక మాసంలో దేవతలు వనాల్లో విహరిస్తూ చెట్లపై కొలువుదీరుతారని ప్రజల నమ్మకం. ఎన్నో ఔషధ గుణాలున్న ఉసిరి చెట్టును శ్రీమహావిష్ణువుగా భావించి దానికింద భోజనం చేస్తే పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. అడవులు అంతరించి పోతున్న నేపథ్యంలో ఏదో ఒక చెట్టు కింద వన భోజనాలు చేసి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు కార్తీక మాసం ఉండడంతో వచ్చే రెండు వారాంతాల్లో పెద్ద ఎత్తున వనభోజనాలకు ప్లాన్ చేసుకున్నారు. ఆధ్యాత్మిక చింతన.. కార్తీక మాసంలో అనాదిగా వస్తున్న వన భోజనాల సంప్రదాయం ఆధ్యాత్మిక చింతనతోపాటు హైందవ ధర్మాన్ని చాటి చెబుతోంది. వనసమారాధన వల్ల ఆయుర్వేదంలో వృక్ష జాతికున్న విశిష్టత అందరికీ తెలుస్తోంది. వండిన ఆహారాన్ని మహావిష్ణువుకు ప్రీతికరమైన ఉసిరి చెట్టు కింద తింటే మంచి ప్రతిఫలం ఉంటుంది. దీక్షలు తీసుకున్న స్వాములు భక్తి భావంతో వనభోజనాలకు వెళ్తుండడం పరిపాటిగా మారింది. కాగా.. ప్రస్తుతం వనభోజనాలకు బదులు కొందరు ఉద్యానవనాల్లో పిక్నిక్లకు, నదులు, సముద్రతీరాల్లో భోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మామిడి తోటలు అందుబాటులో ఉన్న ప్రాంతాల వారు ఆయా ప్రదేశాల్లో వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. నేడు (ఆదివారం) హనుమ కొండ జిల్లా పరిధిలోని పద్మశాలీలు హసన్పర్తి ఎర్రగట్టు వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. వచ్చే ఆదివారం విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ కులస్తులు దూపకుంటలో వనభోజనా లకు వెళ్తున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో వారాంతాల్లో వనభోజనాలకు వెళ్తున్నారు. అనాదిగా సంప్రదాయం ఒకప్పుడు గ్రామాల్లో వన భోజనాలకు వెళ్లేవారు. వన సమారాధన చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొనేవారు. ఎక్కాహం, సప్తాహం పేరిట భజనలు, భక్తిభావంలో మునిగిపోయేవారు. పచ్చటి వనాల నడుమ కమ్మటి భోజనాన్ని ఆరగించేవారు. కష్టసుఖాలు పంచుకునేవారు. ఆధునిక యుగంలో ఎవరి బిజీ వారిది. అయినా కార్తీక మాసంలో ఈ సంప్రదాయాన్ని కులసంఘాలు, కాలనీల పెద్దలు భుజాన వేసుకుంటున్నారు. అడవులు అంతరించి పోతుండడంతో దగ్గరలోని వనాల నడుమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆడిపాడి సందడి చేస్తున్నారు.ఉసిరి చెట్టుకు పూజలు చేస్తున్న భక్తులు (ఫైల్) పవిత్ర మాసంలో ఇది సత్సంప్రదాయం.. కుల సంఘాల వారీగా వన భోజనాలు అనుబంధాలు, బంధుత్వాలు పటిష్టం ఆచారాన్ని కొనసాగిస్తున్న ఉమ్మడిజిల్లావాసులు పెళ్లి చూపుల వేదికగా... ప్రస్తుతం వన భోజనాలు పెళ్లి చూపులకు వేదికలుగా కూడా మారుతున్నాయి. తమ పిల్లలకు మంచి సంబంధాలు వెతకాలంటే వనభోజ నాలకు హాజరై ఇరు కుటుంబాల వారు మాట, మంచి పంచుకుంటున్నారు. ఆయా కుటుంబాలు కలిసి మాట్లాడుకోవడం, ఒకరి నొకరు చూసుకునే తతంగమంతా వనభోజనాల్లోనే పూర్తవుతోంది. నచ్చితే ఆ తర్వాత కొనసాగింపు ఉంటుంది. -
నేడు చుక్కా సత్తయ్య వర్ధంతి
లింగాలఘణపురం: మండలంలోని మాణిక్యాపురంకు చెందిన ఒగ్గు కథ పితామహుడు డాక్టర్ చుక్కా సత్తయ్య 8వ వర్థంతి నేడు (ఆదివారం) నిర్వహించనున్నారు. జానపద కళారూపమైన ఒగ్గు కథకు ఆయన ప్రాణం పోశాడు. తండ్రి ఆగయ్య నుంచి నేర్చుకొని 14 ఏళ్లకే ఒగ్గుకథ చెప్పడం ప్రారంభించి దేశ విదేశాల్లో 12,000 ప్రదర్శనలు ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో పాటు అనేక మందితో అవార్డులు అందుకొని కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును రాష్ట్రపతి అబ్దుల్కలాం చేతుల మీదుగా తీసుకున్నారు. ఒగ్గుకథకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన గొప్ప కళాకారుడు చుక్క సత్తయ్య. నేడు విగ్రహ ప్రతిష్ఠాపన జనగామ: ఒగ్గుకళా సామ్రాట్, కేంద్ర సంగీత నాట క అకాడమీ పురస్కార గ్రహీత సత్తయ్య 8వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రం కళ్లెం రోడ్డులో నేడు(ఆదివారం) విగ్రహం ప్రతిష్ఠించనున్నట్లు జిల్లా ఒగ్గుబీర్ల కళాకారుల సంక్షేమ సంఘం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఒగ్గుబీర్ల పూజారులు, కళాకారులు, అన్ని వర్గాల వారు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. -
సంప్రదాయ కళారూపాలను ఆధునీకరించాలి
● ఆచార్య జయదీర్ తిరుమలరావు జనగామ: ప్రాచీన కళా సంస్కృతి పునాదిపై ఆధునిక దేశీయ కళ అభివృద్ధి చెందాలని ఆచార్య జయదీర్ తిరుమలరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయంలో జరిగిన చెక్క బొమ్మలు, యక్ష గాన ప్రదర్శన, డాక్యుమెంటేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్మెట మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన కళాకారులు చెక్క బొమ్మల ప్రదర్శనకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. వేషధారణ, మేకప్, సంగీతం, దేశీయ నృత్యరీతులతో చెంచిత కథను సీ్త్ర, పురుషులు సమష్టిగా ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళా కళాకారుల బృందం దేశంలోనే తొలిసారిగా చెక్క బొమ్మల ప్రదర్శనకు ముందుకు రావడం విశేషమని వక్తలు కొనియాడారు. అనంతరం జయదీర్ తిరుమలరావుతో పాటు వక్తలు మాట్లాడుతూ కళారూపాలపై విద్యార్థులు చూపించిన ఆసక్తి ప్రశంసనీయమని, సంప్రదాయ కళలను బతికించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, ఆచార్య గూడూరు మనోజ్, మెట్టు వెంకటనారాయణ, మోతె కనకయ్య, మీనయ్య తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్ అభివృద్ధికి కృషి
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి పాలకవర్గం నిరంతరం కృషి చేస్తుందని ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అన్నారు. శనివా రం మార్కెట్ కార్యాలయ చాంబర్లో పాలకవర్గం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మా ట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో మార్కెట్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. మార్కెట్ యా ర్డులో నూతన 5వేల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మా ణం, సోలార్ లైటింగ్తో పాటు లింగాలఘణ పూర్, రఘునాథపల్లి మండలాల్లోని 5వేల మెట్రిక్ టన్ను ల నాబార్డ్ గోదాములకు రోడ్డు నిర్మాణం చే పట్టనున్నారు. పెండింగ్లో ఉన్న ఆయా అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేస్తామన్నారు. మార్కెట్ యార్డులో పని చేస్తున్న కార్మికుల సౌకర్యార్థం నూ తన భవన నిర్మాణం చేపట్టాలని సంఘ నాయకులు చైర్మన్కు వినతి చేశారు. ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీవన్ కుమార్, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఏఎంసీ చైర్మన్ శివరాజ్యాదవ్ -
సీతారాముల కల్యాణం చూతము రారండి
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయం సీతారా ముల కల్యాణోత్సవానికి ముస్తాబైంది. ఆలయ ప్రాంగణం, కల్యాణ వేదిక, చలువ పందిళ్లు, విద్యుత్ వెలుగులతో విరాల్లుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల వివాహతంతు గరుడముద్ద (పెళ్లికి దేవతలను ఆహ్వానించే వేడుక) నేడు (ఆదివారం) ప్రారంభం కానుంది. రాత్రి సీతమ్మవారిని తీసుకొచ్చే ఎదుర్కోలు తంతును పూర్తి చేసి ఈ నెల 10న కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా జీడికల్లో ప్రతీ ఇంటిలో రాముడి పేరుతో ఇంట్లో ఒకరి పేరు పెట్టుకోవడం భక్తుల కోర్కెలు తీర్చే వీరాచల రామచంద్రస్వామికి నిదర్శనం. శ్రీరామ నవమితో పాటు కార్తీక మాసంలో సీతారాముల కల్యాణం జరగడం ఇక్కడి విశేషం. ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో.. సీతారామలక్ష్మణులు వనవాసం చేస్తున్న సమయంలో పర్ణశాలలో సీతాదేవి కుటీరంలో ఉండగా మారీచుడు బంగారు లేడి రూపంలో ఆమె కంటపడుతుంది. ఆ బంగారు లేడి కావాలని సీత రాముడిని కోరగా వెంబడించుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడే మాయలేడి సంహారం చేసి మారీచుడికి పాప విముక్తి కలిగించాడని..అదే లేడిబండగా పేరు గాంచింది. విద్యుత్ వెలుగులతో విరాజిల్లుతున్న జీడికల్ ఆలయం నేడు గరుడముద్ద.. ఎదుర్కోలు రేపు సీతారాముల కల్యాణం -
‘అనుచిత వ్యాఖ్యలు సరికాదు’
జనగామ:స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన (ఐఏఎస్)పై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు చేసిన అనుచిత వ్యాఖ్యలను టీఎన్జీఓ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఖాజా షరీఫ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవసేనపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతీఒక్కరికి ఉంటుందని, ఇలా మాట్లాడడం సరికాదన్నారు. ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ప్రజలకు సేవ చేసే క్రమంలో తమ విధులను నిర్వహిస్తున్నారన్నారు. సమస్య వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలే తప్ప, అధికారులను అకారణంగా నిందించడం సరికాదని మండిపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి సెక్రటరీ జనరల్ కొర్నేలియస్, జిల్లా కార్యదర్శి పెండెల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పేర్వారం ప్రభాకర్, అసోసియేట్ అధ్యక్షుడు రాజా నర్సయ్య, కోశాధికారి ఎండీ అఫీజ, సంపత్ కుమార్, రామనర్సయ్య ఉప్పలయ్య, నాగార్జున, విష్ణు, అరుణ తదితరులు ఉన్నారు. జనగామ రూరల్: జిల్లాలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేసి యువతకు జీవనోపాధి కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ డిమాండ్ చేశారు. శనివారం పాము శ్రీకాంత్ అధ్యక్షతన పట్టణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఉపాధి లేక హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని, జిల్లా కేంద్రంలోనే ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలన్నారు. ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, జోగు ప్రకాష్, బూడిద గోపి, బాల్నే వెంకట మల్లయ్య, కల్యాణం లింగం, బొట్ల శ్రావణ్, మంగ బీరయ్య, పందిళ్ల కల్యాణి తదితరులు పాల్గొన్నారు. ‘కపాస్ కిసాన్’ యాప్ను అమలు చేయొద్దు’ జఫర్గఢ్: పత్తి కొనుగోలులో అమలు చేస్తున్న కాపాస్ కిసాన్ యాప్ విధానాన్ని అమలు చేయొద్దని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం విలేకర్లతో మాట్లాడుతూ యాప్ విధానంతో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు పండించిన పత్తి పంటను ఎక్కడైన స్వేచ్ఛగా విక్రయించే అవకాశం కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తిపై 11 శాతం సుంకాన్ని ఎత్తివేయాడాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. సీసీఐ ఆధ్వర్యంలో గతంలో మాదిరిగా ప్రతీ ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఎకరాకు రూ.475 రూపాయలు బోనస్ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు రాయపురం భిక్షపతి, నక్క యాకయ్య, పెద్ద రాములు, యాతం సమ్మయ్య తదితరులు ఉన్నారు. సీఐటీయూ జిల్లా కమిటీ ఎన్నికజనగామ రూరల్: జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా 4వ మహాసభలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ రమ, రాష్ట్ర కార్యదర్శులు పుప్పాల శ్రీకాంత్, బి. మధు, యాటల సోమన్న ఆధ్వర్యంలో జిల్లా కమిటీ, ఆఫీస్ బేరర్స్ ఎన్నిక శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా రాపర్తి రాజు, సుంచు విజేందర్, కోశాధికారిగా అన్నెబోయిన రాజు, ఉపాధ్యక్షులుగా చిట్యాల సోమన్న, కోడెపాక యాకయ్య, పొదల నాగరాజు, సహాయ కార్యదర్శులుగా బస్వ రామచంద్రం, బూడిద ప్రశాంత్, అంజుమ్లతో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు నిర్వహిస్తామని అధ్యక్షకార్యదర్శులు పేర్కొన్నారు. -
జోనల్ స్పోర్ట్ ్స మీట్లో ప్రతిభ
పాలకుర్తి టౌన్: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలకేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మూడు రోజులపాటు కొనసాగిన జోనల్ స్థాయి క్రీడాపోటీల్లో పాలకుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. అండర్ 14 విభాగంలో పాలకుర్తి 30 పాయింట్లు, అండర్ 17 విభాగంలో జఫర్గఢ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల 30 పాయింట్లతో విజేతగా నిలిచింది. వ్యక్తిగత చాంపియన్గా అండర్ 14 విభాగంలో నాగ పూజిత విజేతగా నిలిచారు. మూడు విభాగాల్లో అఽత్యధిక పాయింట్లు సాధించి జోనల్ స్థాయి చాంపియన్గా పాలకుర్తి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు నిలిచారు. ఈ మేరకు శనివారం రాత్రి ముగింపు వేడుకల్లో నల్లగొండ డీసీఓ శోభారాణి చేతులమీదుగా ట్రోఫీ అందుకున్నారు. జోనల్ స్పోర్ట్స్ మీట్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులను ప్రిన్సిపాల్ స్వరూప అభినందించారు. -
జనగామ మార్కెట్కు మినీ ప్యాడీ డ్రయర్
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్లో రూ.13.50 లక్షల వ్యయంతో కొత్త మినీ ప్యాడీ డ్రయర్ (ధాన్యం ఆరబెట్టే యంత్రం)ను ఏర్పాటు చేశారు. వారంరోజుల క్రితమే ఈ యంత్రం మార్కెట్ యార్డుకు చేరుకున్నప్పటికీ, నేటికీ ప్రారంభం కాని పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లయీస్ శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు జరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ బడ్జెట్ నుంచి డ్రయర్ నిర్వహణకు కావాల్సిన డబ్బులు సమకూర్చాలనే ఆలోచనపై అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండున్నర టన్నులు.. గంటన్నర సమయం రెండున్నర టన్నుల సామర్థ్యం కలిగిన ఈ మినీ ప్యాడీ డ్రయర్ సుమారు 30 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని 17 శాతానికి తగ్గించడానికి గంటన్నర సమయం తీసుకుంటుంది. దీనికి సుమారు 11 లీటర్ల డీజిల్ అవసరం అవుతుంది. ఈ ఖర్చును రైతులే భరించాలన్న నిర్ణయం రైతాంగంలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది. ప్యాడీ డ్రయర్ను మార్కెట్ కమిటీ ఖర్చులతో నడపాలా? లేక రైతులపై భారం వేయాలా? అనే ప్రశ్నలు తలెత్తుతుండగా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లయీస్ శాఖ ఆధ్వర్యంలో మినీ ప్యాడీ డ్రయర్లను కొనుగోలు చేసి వ్యవసాయ మార్కెట్లకు పంపించారు. మార్కెట్ బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన సివిల్ సప్లయీస్ శాఖ, డ్రయర్ సేవల సమయంలో డీజిల్ ఖర్చు ఎవరు భరించాలనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆ భారమంతా రైతులపై పడే అవకాశం ఉంది. 11 లీటర్లకు సుమారు రూ.1,100 వరకు ఖర్చు చేసే సమయంలో రైతులు ముందుకు వస్తారా...లేదా.. అనే సందిగ్ధం నేపధ్యంలో డ్రయర్ సేవలు ఎలా ముందుకు అనే విషయమై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. సివిల్ సప్లయీస్ శాఖ నుంచి మినీ ప్యాడీ డ్రయర్ కొనుగోలు చేసి తమకు పంపించారు. డబ్బులు మార్కెట్ నుంచి చెల్లించాలని చెప్పారు. రెండున్నర టన్నుల ధాన్యం సామర్థ్యం కలిగిన ఈ యంత్రం గంటన్నర సమయంలో 30 శాతం ఉన్న సరుకు నుంచి 17 శాతానికి తీసుకువస్తుంది. ఇందుకు 11 లీటర్ల వరకు డీజిల్ ఖర్చు అవుతుందని ప్రాథమిక సమాచారం. డీజిల్ డబ్బులు ఎవరు భరించాలనే ఆదేశాలు ప్రభుత్వం నుంచి రావాలి. ప్రస్తుతం రైతులే భరించుకోవాలి. – జీవన్ కుమార్, మార్కెట్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి నిర్వహణ ఖర్చులపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం ఏఎంసీ భరిస్తుందా.. రైతులు భరించాలా! అయోమయంలో అన్నదాతలు నేటికీ ప్రారంభం కాని సేవలు -
రూ.కోటిన్నర వృథా..?
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2016లో రూ.1.50 కోట్ల వ్యయంతో 10 టన్నుల సామర్థ్యం కలిగిన భారీ ప్యాడీ డ్రయర్ను ఏర్పాటు చేశారు. ఈ యంత్రం పని చేసే సమయంలో గంటకు 11 లీటర్ల డీజిల్ ఖర్చు చేయడంతో పాటు కరెంటు సైతం ఉపయోగించాలి. రిబ్బన్ కటింగ్ చేశారే తప్ప.. ఒక్కసారిగా కూడా ఆన్ చేయలేదు. ఇప్పుడు అదే అనుభవం మళ్లీ పునరావృతం కాకూడదని రైతులు కోరుకుంటున్నారు. గతంలో మెయింటనెన్స్ ఖర్చులు భరించలేని పరిస్థితిలో నాటి మార్కెట్ కమిటీ చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మినీ ప్యాడీ డ్రయర్కు అదే పరిస్థితి రాకూడదనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి కృషి
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్ డివిజన్కేంద్రంలోని రిజర్వాయర్లో చేపల ఉత్పత్తిని పెంచేందుకు ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేషన్ఘన్పూర్ మత్స్యసొసైటీ చైర్మన్ నీల సోమన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మత్స్యకారుల ఆదాయం పెరిగేలా చేపలను పెంచడంతో పాటు మార్కెటింగ్, రవాణా సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ డీఎస్ వెంకన్న, డీఎఫ్ఓ రాణాప్రతాప్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీల గట్ట య్య, ఘన్పూర్ సొసైటీ అధ్యక్షుడు నీల సోమన్న, డైరెక్టర్లు గోనెల ఐలోని, మునిగెల ఐలోని, నీల సాంబరాజు, తదితరులు పాల్గొన్నారు. పంపుహౌస్ పనుల పరిశీలన చిల్పూరు/నర్మెట: మండలంలోని గార్లగడ్డతండా పంచాయతీ పరిధిలోని గండి రామారం పంపుహౌస్ను శుక్రవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి సందర్శించి ఎత్తిపోతల పనుల పురోగతిని సమీక్షించారు. అక్కడే పనిచేస్తున్న ఇంజనీర్లు, అధికారులతో మాట్లాడి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎత్తిపోతల పథకం ద్వారా వేల ఎకరాల భూమికి సాగునీటి సదుపాయం లభించనుందనన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు నిర్ణీత సమయానికి పూర్తి చేసి వ్యవసాయ రంగం అభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు. అనంతరం మల్లన్నగండి రిజర్వాయర్లో ముదిరాజ్లతో కలిసి చేపపిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో చిల్పూరు ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, ఎడవెళ్లి మల్లారెడ్డి, నీల రాజు, రంగు రమేశ్, పోలేపల్లి రంజిత్రెడ్డి, బొమ్మిశెట్టి బాలరాజు, పేరాల సుధాకర్ తదితరులు ఉన్నారు. అలాగే నర్మెట మండలంలో దేవాదుల ఫేస్ 2 పనుల్లో భాగంగా మల్లన్నగండి రిజర్వాయర్ నుంచి మండలంలోని బొత్తలపర్రె మిని రిజర్వాయర్ వరకు చేపట్టిన పైపులైన్ పనులను నర్సాపూర్ శివారులో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులతో కలిసి పరిశీలించారు. -
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
జనగామ రూరల్: ఐక్య పోరాటాలతోనే కార్మికుల జీవితాల్లో మార్పు వస్తుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ రమ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో సీఐటీయూ జిల్లా 4వ మహాసభల ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం జెండాను జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు ఆవిష్కరించారు. అనంతరం బొట్ల శ్రీనివాస్ చిత్రపటానికి యూనియన్ రాష్ట్ర, జిల్లా నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో కోట్లాది మంది శ్రామికులు ఉపాధిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా లేబర్ కోడులను తీసుకొచ్చారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు బి.మధు, పి.శ్రీకాంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, కోడిపాక యాకయ్య, బి.అంజుమ్, సింగారపు రమేశ్, భూక్య చందు, అన్నేబోయిన రాజు, చిట్యాల సోమన్న, పొదల నాగరాజు, బస్వ రామచంద్రం, ప్రతినిధులు పాల్గొన్నారు.సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ రమ -
అన్నదాతలను ఇబ్బంది పెట్టొద్దు
● కలెక్టర్ రిజ్వాన్బాషా రఘునాథపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలను ఇబ్బంది పెట్టొద్దని కలెక్టర్ రిజ్వాన్బాషా అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆరబోసిన ధాన్యం మాయిశ్చర్ పరిశీలించారు. వర్షాల నేపథ్యంలో కేంద్రాల్లో నిర్లక్ష్యం వహించకుండా ధాన్యం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని ఆదేశించారు. ధాన్యం తడువకుండా రైతులకు టార్పాలిన్లు ఇచ్చి సహకరించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ ఫణికిషోర్ తదితరులు ఉన్నారు. -
సమాజ సేవలో ఎన్ఎస్ఎస్ భాగం కావాలి
చిల్పూరు: సమాజ సేవలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు భాగం కావాలని జిల్లా అడిషనల్ కలెక్టర్, విద్యాశాఖ అధికారి పింకేష్కుమార్ పిలుపునిచ్చారు. మండలంలోని రాజవరం గ్రామ సమీపంలోని కస్తూర్భా బాలికల విద్యాలయంలో ఎస్ఓ ప్రశాంతి అధ్యతక్షణ ఏర్పాటు చేసిన ఏడు రోజుల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థినులు మీసేవ సెంటర్లను సందర్శించి కులం, ఆదాయం తదితర సర్టిఫికెట్లు ఎలా దరఖాస్తు చేయాలో నేర్చుకోవాలని, మన విద్యాసంస్థల పరిశుభ్రత సమాజ సేవకు ముందుడేలా పనిచేయడం, ఆలయ పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేయడం, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలు తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, జీసీడీ గౌసియాబేగం, ఏఎంఓ శ్రీనివాస్, ఎంఈఓ దాసరి గోవర్ధన్, అట్ల రాజు, దివ్య, కార్యదర్శి తిరుమలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్, విద్యాశాఖ అధికారి పింకేష్కుమార్ -
నాణ్యమైన భోజనం అందించాలి
స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని స్టేషన్ఘన్పూర్ ఆర్డీఓ డీఎస్ వెంకన్న అన్నారు. శుక్రవారం ఘన్పూర్ డివిజన్కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మధ్యా హ్న భోజన నిర్వాహకులు, హెచ్ఎంతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. వంట సామగ్రి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, హెచ్ఎం సంపత్ తదితరులు ఉన్నారు. -
సత్తయ్య విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ
జనగామ: జిల్లా కురుమ సంఘం, ఒగ్గు బీర్ల సంఘం ఆధ్వర్యంలో ఒగ్గుకళా సామ్రాట్, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, డాక్టర్ చుక్క సత్తయ్య విగ్రహ ప్రతిష్ఠాపనకు శుక్రవారం పట్టణంలోని కళ్లెం రోడ్డు కమాన్ సమీపంలో భూమి పూజ నిర్వహించారు. ఈ నెల 9న చుక్కా సత్తయ్య 8వ వర్ధంతిని పురస్కరించుకుని విగ్రహావిష్కరణకు పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు కంచె రాములు, సంపత్, జాయ మల్లేష్, బాల్దె మల్లేశం, జూకంటి శ్రీశైలం, కడకంచి మధు, ఎండ్రు వైకుంఠం, కేమిడి ఉపేందర్, చంద్రమౌళి, వీరస్వామి, జంగిడి సిద్దులు, రోషయ్య, సత్తయ్య, ప్రవీణ్, ఆంజనేయులు, అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. నేడు చెక్క బొమ్మలాట కళారూపాల ప్రదర్శనజనగామ: జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నేడు (శనివారం) నర్మెట మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన అపురూపమైన చెక్క బొమ్మలాట, యక్షగానం కళారూపాల ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్, పరిశోధకులు జయధీర్ తిరుమలరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ గూడూరు మనోజ, శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ మెట్టు వెంకటనారాయణ తదితరులు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. సీనియర్ సివిల్ జడ్జి బదిలీజనగామ రూరల్: జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సి. విక్రమ్ బదిలీ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు ఆఫ్ తెలంగాణ జరరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మేడ్చల్ మల్కాజిగిరి ఫ్యామిలీ కోర్టుకు అడిషనల్ జడ్జిగా పదోన్నతి కల్పించి బదిలీ చేశారు. జిల్లాలో పౌరసేవలు, సామాజిక కార్యక్రమాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యం లింగాలఘణపురం: మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే తమ సంస్థ లక్ష్యమని గ్రామ స్వరాజ్య సంస్థ జిల్లా కోఆర్డినేటర్ సుజాత అన్నారు. శుక్రవారం మండలంలోని వనపర్తిలో ఉచిత కుట్టు శిక్షణ కోసం 20 మందిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ మహిళల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచడం కోసం నిరంతరం సేవ చేసేందుకు సంస్థ కోఆర్డినేటర్ డాక్టర్ సేలేంద్ర కుమార్, స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ పప్పుల సుధాకర్, స్టేట్ మేనేజర్ మాధవి ఆధ్వర్యంలో జిల్లాలో కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. కుట్టు శిక్షణ అనంతరం సబ్సిడీపై కుట్టు మిషన్లు, భవిష్యత్లో కంప్యూటర్ ట్రైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం డిజైనింగ్ తదితర శిక్షణ కార్యక్రమాలు చేపడుతామని సుజాత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇన్చార్జ్ సంధ్య, మహిళలు పాల్గొన్నారు. ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మల గద్దెల ప్రాంగణం సాలహారం(ప్రహరీ) నిర్మాణం పనులు సాగుతున్నాయి. రాతి కట్ట డాలతో సాలహారం నిర్మించనున్నారు. ప్రస్తుతం సాలహారం నిర్మాణానికి పిలర్లపై బీమ్లను నిర్మిస్తున్నారు. 90 రోజుల్లో ప్రహరీ నిర్మాణం పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యం మేరకు సంబంధిత కాంట్రాక్టర్లు ఆదిశగా పనులు చేపడుతున్నారు. నేటి నుంచి బీమ్లపై రాళ్లను(స్టోన్స్) ఏర్పాటు చేసేందుకు లారీల్లో మేడారానికి తీసుకొచ్చారు. గుంటూ రు, ఒంగోలు, నంద్యాల ప్రాంతాల్లో సాలహా రం నిర్మాణం రాళ్లను సిద్ధం చేస్తున్నట్లు అధికా రులు తెలిపారు. నేటి నుంచి స్టోన్స్ ఏర్పాట్ల పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. -
బాల్యవివాహాలు.. తగ్గుముఖం
శుక్రవారం శ్రీ 7 శ్రీ నవంబర్ శ్రీ 2025● ఐదేళ్లుగా తగ్గుతున్న కేసులు ● అధికారుల నిరంతర పర్యవేక్షణ ● కఠిన చర్యలపై గ్రామాల్లో అవగాహనజనగామ రూరల్: జిల్లాలో బాల్యవివాహాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఐసీపీఎస్(సమీకృత బాలల సంరక్షణ పథకం) అధికారులు, స్వచ్ఛంద సంస్థలు మారుమూల ప్రాంతాల్లో సైతం గ్రామ పెద్దలకు, ప్రజలకు అవగాహన కల్పించి బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. చదువుకోవాల్సిన పిల్లలకు పెళ్లిళ్లు చేసి బాధ్యత తీరిపోయింది అన్నట్టుగా కాకుండా బాలికలపై ప్రత్యేక శ్రద్ధ చూపి వారిని ఉన్నత శిఖరాలకు చేరేలా తల్లిదండ్రులు కృషి చేయాలని అధికారులు సదస్సులు ఏర్పాటు చేసి చైతన్యం చేస్తున్నారు. తమ పిల్లలు ప్రేమ వివాహాల వైపు ఎక్కడ ఆకర్షితులవుతారోనని కొందరు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేక తొందరగా వివాహం చేసి బరువు దించుకోవాలని భావనలో మరికొందరు తల్లిదండ్రులు ఉంటారు. ఇలాంటి వారికి బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలపై అధికారులు నిత్యం విడమరిచి చెబుతున్నారు. ఈనేపథ్యంలో జిల్లాలో గత ఐదు సంవత్సరాల్లో కేసులు గణనీయంగా తగ్గాయి. 2021లో 47, ఈ ఏడాది 29 బాల్యవివాహాలను అడ్డుకున్నారు. ఇందులో స్టేషన్ఘన్పూర్, దేవరుప్పుల, నర్మెట, బచ్చన్నపేటలో 4 బాల్య వివాహాల చొప్పున నిలుపుదల చేశారు. గతంలో వివాహాలు చేసిన నలుగురిపై కేసులు నమోదు చేశారు. బాల్య వివాహం చేస్తే కఠినశిక్ష.. బాల్య వివాహాన్ని ప్రోత్సహించేవారు, చేసేవారు కఠిన కారాగార శిక్షకు గురవుతారని అధికారులు చెబుతున్నారు. ఈ నేరానికి రెండేళ్ల వరకు జైలుశిక్ష, రూ.లక్ష వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. బాల్యవివాహం చేసిన తర్వాత మైనర్ను అక్రమ రవాణా చేయడం, దాచేయడానికి ప్రయత్నించడం చట్టరిత్యా నేరం. బాల్య వివాహాలు నిషేధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయవచ్చు. అలాగే చట్టం కింద నమోదు అయ్యే కేసుల్లో మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా పోలీసులు బాల్య వివాహాలు నిలిపివేయవచ్చు. ఈచట్టం కింద నేరస్తులకు బెయిల్ లేని శిక్ష విధిస్తారు. అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలనే నిబంధన భారత చట్టంలో ఉంది. చిన్న వయస్సులో గర్భం దాల్చడంతో అనారోగ్య సమస్యలు, శిశు మరణాలు, గర్భస్రావం, రక్తపోటు, పోషకాహార లోపం, రక్తహీనత తదితర ఇబ్బందులు ఎదురవుతాయి. జిల్లాలో తండాలు, పాఠశాలలు, మారుమూల పల్లెలకు సైతం ఐసీపీఎస్ అధ్వర్యంలో వెళ్లి ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. బాల్య వివాహాలపై ప్రదర్శనలు చేసి గ్రామంలో సదస్సులు ఏర్పాటు చేసి చట్టాలు తెలియజేస్తున్నాం. దీంతో ప్రజల్లో చైతన్యం కలుగుతోంది. – లకుట్ల రవికాంత్, జిల్లా ఐసీపీఎస్ అధికారిబాల్య వివాహం జరగుతుందని తెలిస్తే వెంటనే నిలుపుదల చేయాలని సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తున్నాం. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలాగే ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. – కోదండరాం, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ అధికారి● గ్రామాల్లో పేదలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడం ప్రభుత్వ పథకాలు షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల లబ్ధికోసం.. బాలికలు తమ హక్కులను వినియోగించుకోవడంలో వెనకబడిన ప్రాంతాలను ఎంపిక చేసుకొని బాల్యవివాహాల నిర్మూలన, బడిబయటి పిల్లలను పాఠశాలలో చేర్పించి అక్షరాస్యులుగా చేయడం కమిటీలు, స్వచ్ఛంద సంస్థల కృషి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం బాల్యవివాహాలు చేసిన వ్యక్తులపై కేసులు, కఠిన చర్యలు


