breaking news
Jangaon District News
-
నార్లు పోయండి.. నీళ్లిచ్చే బాధ్యత నాది
● ఎమ్మెల్యే కడియం శ్రీహరిరఘునాథపల్లి: కరువు ఉన్నా.. నీళ్లు ఇచ్చే బాధ్యత నాది.. మీరు (రైతులు) నార్లు పోసి నాటు వేయండి.. అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శని వారం మండలంలోని మండలగూడెంలో రూ.15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించి, రూ.10 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మించుకున్న లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ డ్యాగల రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి జలాలను తరలించి బొమ్మకూరు రిజర్వాయర్ నింపి అక్కడి నుంచి మండలగూడెం, ఇతర చెరువులను నింపి పంటలకు సాగు నీరు అందిస్తామన్నా రు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దోచుకోవడమే తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్చందర్రెడ్డి, మండల అధ్యక్షుడు గాదె మహేందర్రెడ్డి, బొనాసి క్రాంతికుమార్, లింగాజి, బొనాసి కొమురయ్య, నామాల బుచ్చయ్య, కోళ్ల రవిగౌడ్, గొరిగ రవి, తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
జనగామ: మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు టౌన్ లెవల్ ఫెడరేషన్ (టీఎల్ఎఫ్) ద్వారా 30 మంది పారిశుద్ధ్య కార్మికులను రోజువారీ వేతన ప్రాతిపదికన నియమించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ అర్హులైన అభ్యర్థుల నుంచి ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల ను స్వీకరిస్తామన్నారు. దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలని, పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికై న వారికి రోజుకు రూ.400 వేతనం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. నియామకాలు పూర్తిగా తాత్కాలికమైనవని, భవిష్యత్లో శాశ్వత ఉద్యోగంపై ఎ లాంటి హక్కు ఉండదన్నారు. దరఖాస్తు ఫారాలు జనగామ మెప్మా కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయన్నారు. -
15 నుంచి శాకంబరీ ఉత్సవాలు
హన్మకొండ కల్చరల్: శాకంబరీ నవరాత్రోత్సవాలను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ అమ్మవారి అనుగ్రహం పొందాలని భద్రకాళి దేవా లయ ఈఓ, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత అన్నారు. ఆలయ ప్రాంగణంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామల సునీత, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, సిబ్బంది పాల్గొని శాకంబరీ ఉత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం రామల సునీత మా ట్లాడుతూ.. ఈ నెల 15 బుధవారం నుంచి జూలై 29 బుధవారం వరకు 15రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు, అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ.. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం అమ్మవారికి ఒక్కో క్రమాలలో పూజలు నిర్వహించనున్నట్లు, జూలై 29న మహా శాకంబరీగా అమ్మవారు దర్శనమిస్తారని తెలిపారు. కార్యక్రమంలో నాగరాజుశర్మ, హరినాఽథ్లు పాల్గొన్నారు. -
ఆయుర్వేద వైద్యశిబిరానికి స్పందన
జనగామ: పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు ఏకశిల బీఈడీ కళాశాల ఎదురుగా ఉన్న వేద ఆయుర్వేద పంచకర్మ వెల్నెస్ ఆస్పత్రిలో శనివారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఆస్పత్రి డాక్టర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ఆయుర్వేద వైద్యులతో పాటు హైకోర్టు న్యాయవాది, బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామ సర్పంచ్ బల్ల రవీంద్రనాథ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. శిబిరంలో జనగామలో తొలిసారి ఆయుర్వేద మల ద్వారా శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ చెన్నా అభిలాష్ నేతృత్వంలో అర్షమొలలు తదితర పగుళ్ల సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ బి.శివ ఆధ్వర్యంలో చెవి ముక్కు, కన్ను, గొంతు సంబంధిత సమస్యలను పరిశీలించగా, కంటి వైద్య నిపుణుడు డాక్టర్ అక్షయ్, డాక్టర్ హర్ష రోగులను పరీక్షించారు. మొత్తం 220 మందికి అన్ని రకాల పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మౌనిక, తనుజ, అర్పిత, వెంకటేష్, శివ, సాయి, ఉదయ్, రజిత, రమ్య, యేలేంద్ర, శ్రీలత, వంశీ, సిబ్బంది పాల్గొన్నారు. 220 మందికి వైద్యసేవలు, మందుల పంపిణీ -
అక్రమాలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు
జిల్లాలో ప్రజాధనం వినియోగంలో పూర్తి పారదర్శకత ఉండాలి. ప్రజలకు మేలు చేసే పనులనే అమలు చేస్తున్నాం. మాకు ఎలాంటి భయం లేదు. తప్పు చేయడం లేదనే నమ్మకం ఉంది. ప్రతీ ఉద్యోగి అంకితభావంతో పని చేయాలి. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే శాఖాపరమైన చర్యలతో పాటు అవసరమైతే నేరుగా ఏసీబీకి కూడా రాస్తాం. ఖాతాలను ప్రైవేట్ బ్యాంకుల నుంచి ప్రభుత్వ బ్యాంకులకు మార్పించాం. కలెక్టర్ కార్యాలయ ఖాతాలకు సంబంధించి రూ.1.50 కోట్ల నిధుల ఖర్చుపై ఆరా తీస్తాం. ఆడిట్ జరిగిందా లేదా అనే కోణంలో పరిశీలన చేస్తాం. – సందీప్కుమార్ ఝా, కలెక్టర్ -
ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026
ఉమ్మడి జిల్లాలో ఇలా..● అన్నాఅక్క మెంటార్షిప్ కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ఈనెల 1న ప్రారంభం కాగా, సెప్టెంబర్ వరకు కొనసాగనుంది. ● ఈ మెంటార్షిప్ వారానికి రెండు మూడు రోజుల పాటు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకా రం 30 గంటల మేర బోధించనున్నారు. ● ఉమ్మడి జిల్లాలో 14 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నా యి. అందులో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఐదో సెమి స్టర్ చదువుతున్న విద్యార్థులకు అన్నాఅక్క మెంటార్షిప్ టీచింగ్ లెర్నింగ్ ఇంటర్నెషిప్నకు అవకాశం కల్పించారు.సాంకేతిక విద్యనందించాలని.. ప్రభుత్వ యూపీఎస్, హైస్కూల్ విద్యార్థులకు సాంకేతక విద్యను అందించాలని ‘అన్నాఅక్క మెంటార్షిప్, టీచింగ్ ఇంటర్న్షిప్’ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఐదో సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలల్లోని 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్, కంప్యూటింగ్, కోడింగ్, ఫైథాన్, జావా, గేమ్ డిజైన్ వంటి అనేక అంశాలపై బోధిస్తున్నారు.● మెంటార్లుగా డిగ్రీ విద్యార్థులు.. వీరికి ప్రత్యేక శిక్షణ ● అభ్యాసకులు ప్రభుత్వ యూపీఎస్, హైస్కూళ్ల పిల్లలు ● కృత్రిమ మేథ, డిజిటల్ లెర్నింగ్, కోడింగ్ అంశాలపై అవగాహన ● పిల్లల్లో స్నేహపూర్వక వాతావరణం పెంపొందించేలా చర్యలు డిగ్రీ విద్యార్థులకు క్రెడిట్ డిగ్రీ విద్యార్థులు మెంటార్లుగా తెలంగాణ కోడ్మిత్ర పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సర్టిఫికెట్ పొందారు. వీరికి శిక్షణ ఇచ్చారు. బోధన వల్ల వీరికి కమ్యూనికేషన్, టీచింగ్ స్కిల్స్ ఇంప్రూవ్తోపాటు మెంటార్షిప్ 30 గంటల పూర్తి చేసిన విద్యార్థులకు ఐదో సెమిస్టర్ ఫలితాల్లో ఒకటి లేదా రెండు క్రెడిట్ పాయింట్స్ కేటాయిస్తారు. ఇది వారికి ఒక ప్రాజెక్టుగా భావిస్తున్నారు. స్నేహపూర్వక వాతావరణం.. చాలామంది విద్యార్థులు భయం, బెరుకు, స్పీకింగ్ ఫియర్ వల్ల క్లాస్రూమ్లో టీచర్ను సందేహాలు అడగకుండానే ఉండిపోతారు. అన్నాఅక్క మెంటార్షిప్లో భాగంగా విద్యార్థులకు, మెంటార్లకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. భయంలేకుండా సందేహాలు అడగడానికి అవకాశం ఏర్పడుతుంది. త్వరగా అర్థమయ్యే అవకాశం ఉంది. భవిష్యత్ మొత్తం ఏఐదే కాబట్టి బేసిక్ లెవెల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుందని అంచనా. ఇదొక అద్భుత అవకాశం నేను హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్నాను. నేను డిగ్రీ చదువుతూ ఇలా హైస్కూల్ విద్యార్థులకు బోధించే అవకాశం రావడం అద్భుత అవకాశంగా భావిస్తున్నా. నాలో బోధన నైపుణ్యాలు పెంచుకునే అవకాశం కలిగింది. – బి.భార్గవి, బీసీఏ, ఫైనల్ ఇయర్, కేడీసీ హనుమకొండడిజిటల్ లెర్నింగ్ పుస్తకం చదువుతున్న విద్యార్థులుసాంకేతిక అంశాలు నేర్చుకుంటున్నాం.. అన్నాఅక్క మెంటార్షిప్లో భాగంగా ఏఐ, డిజిటల్ లెర్నింగ్, కోడింగ్ ఫైథాన్, జావా వంటి పలు అంశాలు చెబుతున్నారు. డిజిటల్ లెర్నింగ్కు సంబంధించిన పుస్తకాలు కూడా ఇచ్చారు. వీడియోలను ప్రదర్శిస్తూ బోధిస్తుండడంతో మాకు ఈజీగా అర్థమవుతోంది. – ఎస్ ధనలక్ష్మి, తొమ్మిదో తరగతి, మర్కజీ హైస్కూల్, హనుమకొండ నేర్చుకుంటూ బోధిస్తున్నా.. ఏఐ, డిజిటల్ లెర్నింగ్ తదితర అంశాలను నేను నేర్చుకుంటూ పైడిపెల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్నా. ఐపీఎఫ్ బోర్డు ద్వారా ఆయా సాంకేతిక అంశాలను వీడియోలో రూపంలో బోధిస్తుంటే విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు. – ఎస్.రాజ్కుమార్, బీఏ, కాకతీయ డిగ్రీ కళాశాల, హనుమకొండడిగ్రీ కళాశాల వారీగా ఎంపికైన మెంటార్లు, స్కూళ్లు ఇలా.. మెంటార్లు స్కూళ్లుభవిష్యత్లో ఎంతో ఉపయోగం.. హనుమకొండపరకాల ప్రభుత్వమహబూబాబాద్ ప్రభుత్వజనగామ ఏబీవీపింగిళి మహిళానర్సంపేట ప్రభుత్వకాకతీయ -
రూ.1.50 కోట్లపై ఆరా!
జనగామ: జనగామ కలెక్టరేట్లో అప్పటి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మరో కీలక అంశం తెరపైకి వచ్చినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే దిక్సూచి పుస్తకాల ముద్రణ పేరిట సుమారు రూ.40 లక్షల వ్యయానికి సంబంధించిన అవకతవకలపై ప్రస్తుత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక దృష్టి సారించగా, అప్పటి కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్పై పోలీస్స్టేషన్లో కేసు నమోదు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యవహారం ఇంకా విచారణలో ఉండగానే కలెక్టరేట్ కా ర్యాలయ ఖాతాల్లోని మరో రూ.1.50 కోట్ల నిధుల వినియోగంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏ ఏ కార్యక్రమాలకు ఖర్చు చేశారు? గతంలో కలెక్టర్ కార్యాలయ ఖాతాల్లో ఉన్న ఈ నిధులు ఏ ఏ కార్యక్రమాలకు ఖర్చు చేశారు, సంబంధిత పరిపాలన అనుమతులు ఉన్నాయా, వ్యయానికి సంబంధించిన పూర్తి లెక్కలు, ఓచర్లు, ఆడిట్ రికార్డులు అందుబాటులో ఉన్నాయా? అనే అంశాలపై పరిశీలన జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ నిధులపై క్రమబద్ధమైన ఆడిట్ జరిగిందా? లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కలెక్టరేట్ పరిధిలోని ఖాతాల్లోని నిధులను ప్రభుత్వ బ్యాంకుల్లోనే నిర్వహించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, గతంలో రెండు ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్లు సమాచారం. ఈ అంశంపై వెంటనే స్పందించిన ప్రస్తుత కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ఖాతాలను ప్రభుత్వ రంగ బ్యాంకులకు మార్చారు. ఈ మార్పు వెనుక ఆర్థిక పారదర్శకత, ప్రభుత్వ నిబంధనల అమలే ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. ఇక మరో ఆసక్తికర అంశంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఫిబ్రవరి 26న బాధ్యతలు స్వీకరించినప్పటికీ, ఆయన డిజిటల్ సంతకం ఆన్లైన్ వ్యవస్థలో వారం నుంచి ఎనిమిది రోజుల తర్వాత మాత్రమే నమోదు అయినట్లు సమాచారం. ఈ ఆలస్యానికి గల కారణాలపై కూడా అంతర్గతంగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఆ సమయంలో ఎలాంటి పరిపాలనా లేదా ఆర్థిక లావాదేవీలు జరిగాయా అనే కోణంలో పరిశీలన కొనసాగుతున్నట్లు సమాచారం. దిక్సూచి వ్యవహారం తర్వాత ఇప్పుడు రూ.1.50 కోట్ల నిధుల వినియోగంపై కూడా కలెక్టరేట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆరోపణలపై అధికారిక విచారణ పూర్తయిన తర్వాతనే పూర్తి వివరాలు బయటకు వస్తాయని తెలుస్తుంది. ప్రైవేట్ బ్యాంకుల నుంచి ప్రభుత్వ బ్యాంకులకు మార్పు డిజిటల్ సంతకం ఆలస్యంపైనా నిఘా అక్రమాలపై కఠిన చర్యలకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంకేతాలు -
పేదల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి జఫర్గఢ్: పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. మండల కేంద్రంలో శుక్రవా రం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కడియం శ్రీ హరి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జఫర్గఢ్ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనంటూ పేర్కొన్నారు. స్టేషన్ఘన్పూర్ నుంచి జఫర్గఢ్ మీదుగా వర్ధన్నపేట వరకు రూ.40 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డు, సెంట్రల్ లైటింగ్ మంజూరు కావడం జరిగిందని, త్వరలో ఈ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వేల్పుగొండ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుల్లా మోహన్రావు, సింగిల్ విండో చైర్మన్ తీగల కర్ణాకర్రావు, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, పార్టీ జిల్లా నాయకులు అన్నెబోయిన భిక్షపతి, ఇల్లందుల బేబి శ్రీనివాస్, మంచాల ఎల్లయ్య, మనోజ్రెడి పాల్గొన్నారు. -
ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ షురూ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లోని మేథమెటిక్స్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ‘సైంటిఫిక్ కంప్యూటింగ్ అండ్ విజువలైజేషన్’ అంశంపై మూడు రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను నిట్లోని రామన్హాల్లో అట్టహాసంగా ప్రారంభించారు. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఇండీస్, సేయింట్ ఆగస్టీన్ ప్రొఫెసర్, హెడ్ శ్రీధరరావు గునకాల ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను ప్రారంభించి, కాన్ఫరెన్స్ సావనీర్ను విడుదల చేశారు. కాన్ఫరెన్స్లో భాగంగా శుక్రవారం ఉద్యోగ విరమణ పొందిన నిట్ ప్రొఫెసర్లు కేఎన్ఎస్, కాశీవిశ్వనాథన్, జేవీ రమణమూర్తిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఐఐటీ ఖరగ్పూర్ ప్రొఫెసర్ పీవీఎస్ఎన్ మూర్తి, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ వైవీఎస్ఎస్ సన్యాసిరాజు, నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్, ప్రొఫెసర్ ఎన్వీ.ఉమామహేశ్, సీహెచ్.రామ్రెడ్డి పాల్గొన్నారు. -
ఆదాయం మస్తు
అక్రమాలకు చెక్..జనగామ: ఆన్లైన్ పారదర్శక విధానంతో ఇసుక, మొరం, మట్టి అక్రమ రవాణాకు కళ్లెం పడగా, తక్కువ వ్యవధిలోనే ప్రభుత్వ ఖజానాకు రూ.5.5కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. జిల్లా కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇసుక, మొరం తరలింపులో తీసుకొచ్చిన పారదర్శక విధానాలు ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచాయి. కేవలం నాలుగున్నర నెలల కాలంలో ఇసుక తరలింపు ఫీజుల రూపంలో జిల్లాకు కోట్ల మేర ఆదాయం సమకూరింది. నాడు అక్రమ రవాణా.. నేడు ఆదాయమార్గంగా గతంలో జిల్లాలోని బచ్చన్నపేట, కోమళ్ల, దేవరుప్పుల, చిల్పూరు, ఇప్పగూడెం, వడ్లకొండ, చీటకోడూరు, యశ్వంతాపూర్, జఫర్గఢ్, లింగాలఘణపురం తదితర ప్రాంతాల నుంచి ప్రతిరోజూ లక్షల రూపాయల విలువైన ఇసుక, మొరం, మట్టి అక్రమంగా తరలించారు. తనిఖీలు జరిగినా అవి నామమాత్రంగానే ఉండేవి. అక్రమ రవాణా పేరిట భారీ స్థాయిలో మామూళ్లు చేతులు మారేవన్న ఆరోపణలు లేకపోలేదు. అయితే కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇసుక, మొరం, మట్టి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారు. కఠిన నిబంధనలు అమలు చేయడంతో పాటు అక్రమంగా తరలించే వాహనాలపై కేసులు నమోదు చేసి భారీ జరిమానాలు విధించడంతో కొద్దిరోజుల వ్యవధిలోనే అక్రమ రవాణా అరికట్టగలిగారు. అదే సమయంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఇసుక, మొరం తరలింపునకు ఆన్లైన్ అనుమతి వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానం వల్ల అనుమతుల జారీ ప్రక్రియ పారదర్శకంగా మారడంతో పాటు ప్రభుత్వానికి రావాల్సిన ఫీజులు నేరుగా ఖజానాకు చేరుతున్నాయి. పదేళ్ల ఆదాయం ఎవరి జేబుల్లోకి..? జిల్లా ఏర్పడిన పదేళ్లలో ఇసుక అక్రమ రవాణా పేరిట చేసిన వసూళ్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయనే చర్చ సాగుతోంది. అలాంటి పరిస్థితుల్లో కేవలం 136 రోజుల్లోనే ప్రస్తుత కలెక్టర్ అక్రమ రవాణాను కట్టడి చేసి రూ.5.5 కోట్లకుపైగా ప్రభుత్వ ఆదాయం సమకూర్చగలిగారు. ఇదే వేగం కొనసాగితే జిల్లా ఖజానాకు మ రింత ఆదాయం వచ్చే అవకాశముంది. క్యూబిక్ మీటర్ ధరలు ఇసుకకు క్యూబిక్ మీటర్కు రూ.450, సొంత పొలం నుంచి మొరం లేదా మట్టి తరలించాలంటే రూ.324, ఇతర ప్రాంతాల నుంచి మట్టి లేదా మొరం తరలించాలంటే రూ.428 చెల్లించాలి. ఇటుకల తయారీ మట్టికి క్యూబిక్ మీటర్కు రూ.19,828 చలాన్న్ తీసుకోవాలి. ములుగు నుంచి తీసుకొచ్చే గోదావరి ఇసుకను డంప్ యార్డు నుంచి ట్రాక్టర్లలో తరలించేందుకు అదనంగా రూ.45 అడ్మినిస్ట్రేటివ్ చార్జీ వసూలు చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతి ఉంటుంది. స్లాట్ బుక్ చేసిన వెంటనే సంబంధిత జీపీఓకు సమాచారం వెళ్తుంది. రెండు ట్రిప్పులు అవసరమైతే ప్రయాణ సమయాన్ని అంచనా వేసుకుని వేర్వేరుగా స్లాట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కూపన్ జనరేట్ అయిన వెంటనే జీపీఓకు సమాచారం వెళ్తుంది. ఇసుక కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వాగు వద్ద కూపన్ను స్కాన్ చేసిన తర్వాత అదే కూపన్ను మళ్లీ వినియోగించేందుకు ప్రయత్నిస్తే జీపీఓ, ఎస్సై, తహసీల్దార్, కలెక్టరేట్కు వెంటనే అలర్ట్ వెళ్తుంది. గతంలో ఇసుక అనుమతుల విషయంలో మధ్యవర్తులు, అక్రమ రవాణా, రెవెన్యూ నష్టం వంటి ఆరోపణలు ఉండేవి. ప్రస్తుతం స్లాట్ బుకింగ్తో మధ్యవర్తుల జోక్యం తగ్గి పారదర్శకత పెరిగింది. ఇసుక బుకింగ్ చేసుకునే పోర్టల్ ఆన్లైన్ విధానంతో ఇసుక, మొరం రవాణాలో పారదర్శకత 136 రోజుల్లో ప్రభుత్వ ఖజానాలోకి రూ.5.5 కోట్లు గతంలో ఇసుక మాఫియా దందాలు కలెక్టర్ కఠినంగా వ్యవహరిస్తుండడంతో తగ్గిన అక్రమాలుఆన్లైన్ స్లాట్ బుకింగ్తో.. జిల్లాలో ఇసుక తదితర రవాణాను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. ప్రజలు మీ సేవా పోర్టల్ లేదా సిటిజన్ యాప్ ద్వారా esandjangoan.telangana.gov.in వెబ్సైట్లో ముందురోజే స్లాట్ బుక్ చేసుకుని అనుమతులు పొందాలి. -
బస్సుల కొరత..ప్రయాణికుల అవస్థ
జనగామ: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో శుక్రవా రం బస్సుల కొరతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద యం నుంచి రాత్రి వరకు పలు మార్గాల్లో బస్సులు సకాలంలో రాకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు నుంచి మూడు గంటల పాటు ఒక టి, రెండు బస్సులు మినహా మిగతా సర్వీసులు లేకపోవడంతో ప్లాట్ఫారాలు ప్రయాణికులతో కిక్కిరిశాయి. సిద్దిపేట, నర్మెట, సూర్యాపేట, రఘునాథపల్లి, పాలకుర్తి, హనుమకొండ, ఉప్పల్, జగద్గిరిగుట్ట, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు 60 నుంచి70 శాతం తగ్గడంతో ఇబ్బందులు మరింత పెరిగాయి. వచ్చిన కొద్దిపాటి బస్సుల్లో సీట్లు దక్కించుకునేందుకు ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. ఖమ్మంలో సీఎం సభకు బస్సులు తరలించడంతోనే ఈ సమస్య తలెత్తినట్లు పలువురు ప్రయాణికులు అభిప్రాయపడ్డారు. -
డీఏపీ నో స్టాక్
● నాట్లు ఎలా వేయాలని రైతుల ఆందోళన ● ఎరువుల కోసం పడిగాపులురఘునాథపల్లి: వానాకాలం పంటల సాగు ఊపందుకుంటున్న వేళ డీఏపీ ఎరువుల కొరత రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఎరువుల దుకాణాల వద్ద డీఏపీ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండడంతో రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సాగు కు అత్యంత కీలకమైన డీఏపీ అందుబాటులో లేకపోవడంతో రైతులు ప్రత్నామ్నాయంగా అధిక ధర కలిగిన కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేస్తూ అదనపు ఆర్థిక భారం మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఏపీ 50 కేజీల బస్తా ధర రూ.1,350 మాత్రమే ఉండటంతో రైతులు ప్రధానంగా ఈ ఎరువునే వినియోగిస్తుంటారు. డీఏపీ కొరతను మండలంలోని కొందరు వ్యాపారులు అవకాశంగా మలుచుకొని ఒక్కో బస్తాను రూ.1,500 నుంచి రూ.1,600 వరకు విక్రయించారని రైతులు ఆరోపిస్తున్నారు. ●రైతులకు అత్యంత అవసరమైన డీఏపీ ఎరువును ప్రభుత్వం వెంటనే అందుబాటులో ఉంచాలి. వరినాట్లు, పత్తి పంట ప్రారంభ దశలో డీఏసీ అత్యవసరం. ముందస్తుగా ఎరువుల నిల్వలు ఏర్పాటు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులకు డీఏపీ దొరకని పరిస్థితి నెలకొంది. – మంతపురి యాదగిరి, కన్నాయపల్లిడీఏపీ కొరత రాష్ట్రవ్యాప్తంగా ఉంది. మహిళా సంఘా ల షాపులకు ఇప్పటికే ఇండెంట్ పంపించాం. త్వరలో వచ్చే అవకాశముంది. డీఏపీలా పనిచేసే రూ.750 ధర గల భాస్వరం, కాల్షియం, సల్ఫర్తో కూడిన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బస్తా కూడా బాగా పని చేస్తుంది. ఒక డీఏసీ బస్తాకు బదులు రెండు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బస్తాలు వేస్తే సరిపోతుంది. – కరుణాకర్, మండల వ్యవసాయాధికారి -
ఈవీఎం గోదాం పరిశీలన
జనగామ రూరల్: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, త్రైమాసిక తనిఖీలో భాగంగా శుక్రవారం సమీకృత కార్యాలయాల భవన సముదాయంలోని ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, మంటల నియంత్రణ పద్ధతులను పర్యవేక్షించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. పరిశీలనలో జనగామ ఆర్డీఓ గోపీరాం, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. జీడికల్ ఆలయానికి రూ.2 లక్షల విరాళం లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో దివ్యవిమాన రథోత్సవానికి సంపంగి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం రూ.2లక్షల విరాళం అందజేశారు. గతంలో కార్పెంటర్ శంకరాచారికి అడ్వాన్స్గా రూ.1,16,000 ఇవ్వగా మొత్తం రూ.3,16,000లు రథం తయారీకి అందజేశారు. కార్యక్రమంలో ఈఓ వంశీ, దేవస్థాన చైర్మన్ మూర్తి, సిబ్బంది భరత్, అర్చకులు భార్గవాచార్యులు తదితరులు ఉన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి జనగామ రూరల్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న డిజిటలైజ్ ప్రక్రియను వేగవంతం చేయాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీ నుంచి కార్యదర్శి నవీన్ కుమార్తో కలిసి వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ.. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేసి ఈ నెల 24 తేదీ నాటికి డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ..ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ 99.6 శాతం, డిజిటలైజేషన్ ప్రక్రియ 21.94 శాతం పూర్తయిందన్నారు. రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య బాధాకరం జనగామ రూరల్: ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బకాయిలు అందక మానసిక వేధనతో విశ్రాంత ఉపాధ్యాయుడు మల్లయ్య ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని, ఆయన ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పూర్ణిమ కాలనీలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు పగిడిపల్లి మల్లయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మల్లయ్య కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సొసైటీ పెట్రోల్ బంక్ సీజ్ కొడకండ్ల: మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం పెట్రోల్ బంక్ను శుక్రవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్టేషన్ఘన్పూర్ ఆర్డీఓ కిరణ్ప్రకాశ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ అనీల్బాబు బంక్ను సీజ్ చేయడంతో పాటు సేల్స్కు సంబంధించిన ‘బీ’ లైసెన్స్ను కూడా రద్దు చేశారు. సొసైటీ భూమికి సంబంధించిన పత్రాలు సరిగా లేనందునే బంక్ను సీజ్ చేసి లైసెన్స్ను రద్దు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ భూమికి సంబంధించిన ఆధారాలు, రికార్డులను అందజేయాలని జూన్ 27న రెవెన్యూ అధికారులు సొసైటీకి నోటీసులు అందజేయగా గడువు కోరారు. 30వ తేదీ న బంక్లో సేల్స్ను నిలిపివేస్తూ జూలై 7 వరకు రికార్డులు సమర్పించేందుకు రెవెన్యూ అధికారులు సొసైటీకి గడువిచ్చారు. నిర్దేశించిన గడువులోగా భూమికి సంబంధించిన రికార్డులను కలెక్టర్కు అందజేసినట్లు ఎండీ నరేష్ తెలిపారు. షోకాజ్ నోటీస్పై సొసైటీ పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. -
ప్రశాంతంగా చేనేత ఎన్నికలు
జనగామ: జిల్లా వ్యాప్తంగా చేనేత సహకార సంఘాల ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో మొత్తం 12 చేనేత సహకార సంఘాలు ఉండగా, వాటిలో 9 సంఘాలు ముందుగానే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన మూడు సంఘాలైన జిల్లా కేంద్రంలోని భారత్ టీసీ జెడ్ బీహెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్, జనగామ సంజయ్నగర్ ప్రాజెక్టు హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్, పాలకుర్తి మండలం గూడూరు హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్లలో ఎన్నికలు నిర్వహించారు. గూడూరు సంఘంలో ఇద్దరు మహిళా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన ఏడుగురు పురుష సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. జనగామలో ఎన్నికల ప్రచారం, పోలింగ్ పంచాయతీ ఎన్నికలను తలపించేలా సాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించగా, అనంతరం గంటపాటు భోజన విరామం ఇచ్చి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపి రి పీల్చుకున్నారు. ఎన్నికై న పాలకవర్గ సభ్యులు మూడు రోజుల్లోగా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితో పాటు పాలకమండలిని ఎన్నుకోనున్నారు. -
కుట్టేదెప్పుడు? ఇచ్చేదెప్పుడు?
జనగామ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఉచితంగా అందించే రెండు జతల యూనిఫాం పంపిణీ ప్రక్రియ ఈసారి అస్తవ్యస్తంగా మారింది. పాఠ్యపుస్తకాలతో పాటు ఇవ్వాల్సి ఉండగా పాఠశాలలు ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా ఇప్పటివరకు యూనిఫాం కోసం అవసరమైన క్లాత్(వస్త్రం) జిల్లాలకు పూర్తిస్థాయిలో చేరలేదు. అయితే వచ్చిన వస్త్రంతో కుట్టు పనులు ప్రారంభమైనా నత్తనడకన సాగుతోంది. దీంతో పిల్లలు పాత యూనిఫాంలతో లేదా రంగు దుస్తులతోనే తరగతులకు హాజరవుతున్నారు. నత్తనడకన కుట్టు పనులు సాధారణంగా ఏటా మార్చిలోనే విద్యార్థుల కొలతలు సేకరించి, ఏప్రిల్, మే నెలల్లో క్లాత్ను మండల కేంద్రాల ద్వారా మహిళా సంఘాలకు అందిస్తారు. వారు దుస్తులు కుట్టి పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు ప్రధానోపాధ్యాయులకు అప్పగిస్తారు. కానీ వస్త్రం ఆలస్యంగా వచ్చింది. ఒక్కో డ్రెస్ కుట్టినందుకు రూ.100 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇప్పటి వరకు 6వేల దుస్తులను 399 మంది మహిళా సంఘాల ద్వారా సిద్ధం చేసినట్లు, ఈనెల చివరికల్లా అందేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. స్పష్టత రాని ఎడ్యుకేషన్ కిట్ ఈ ఏడాది నుంచి యూనిఫాంలతో పాటు 24 వస్తువులతో కూడిన ‘ఎడ్యుకేషన్ కిట్’ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 15 నాటికి అన్ని పాఠశాలలకు కిట్లు చేరుస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు వాటి పంపిణీ కూడా ప్రారంభం కాలేదు. అధికారులు తక్షణమే యూనిఫాంలు, కిట్ పంపిణీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థులకు నీలం రంగు దుస్తులు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలం విద్యార్థులకు ప్రభుత్వం యూనిఫాం కలర్ మార్చింది. గతేడాది రెడ్ అండ్ యాష్ కలర్లో ఉంది. ఈ సారి లేత నీలం రంగుగా మార్చారు. బాలురకు నీలం రంగు చొక్కా, లేత నీలంరంగు నిక్కర్ లేదా ప్యాంటు, బాలికలకు లాంగ్ ఫ్రాక్, షర్ట్, స్కర్ట్ తరగతుల వారీగా అందించనుంది. తక్షణం యూనిఫాంలు, కిట్ అందించాలి పాఠశాలలు ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా.. నేటికీ విద్యార్థులకు యూనిఫాం అందకపోవడం బాధాకరం. యూనిఫాంలతో పాటు ఎడ్యుకేషన్ కిట్ను తక్షణమే అందించాలి. లేకపోతే విద్యార్థులతో కలిసి ఆందోళనలు చేపడతాం. –పోదల లవకుమార్, జిల్లా అధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐ స్కూళ్ల ప్రారంభం రోజే యూనిఫాంలు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు 6వేల వరకే యూనిఫాంలు సిద్ధం నత్తనడకన సాగుతున్న కుట్టుపనులు జిల్లా వ్యాప్తంగా 27 వేలకుపైగా విద్యార్థులు స్పష్టత లేని ఎడ్యుకేషన్ కిట్ పంపిణీమొత్తం విద్యార్థులు: 27,768 మంది యూనిఫాంల అవసరం: 55 వేలు యూడైస్ ప్రకారం మొత్తం పాఠశాలలు: 503ఎస్హెచ్జీ మహిళలు: 399 మంది ఇప్పటివరకు సిద్ధమైన యూనిఫాంలు: 6000 -
అవగాహనతో ప్రమాదాల నివారణ
లింగాలఘణపురం: ప్రజలు విద్యుత్పై అవగాహన ఉంటే ప్రమాదాలను నివారించవచ్చని వరంగల్ సూపరింటెండెంట్ ఇంజనీర్, జనగామ సర్కిల్ నోడల్ ఆఫీసర్ శ్రీకాంత్ అన్నారు. గురువారం మండలంలోని నెల్లుట్ల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు జరుగుతున్న ఇంటర్నల్ ఓరియెంటేషన్ శిక్షణలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ భద్రత, ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్ఈ సంపత్రెడ్డి, డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, ఏడీ వేణుగోపాల్, హెచ్ఎం రవీందర్తో పాటు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఎల్నినోపై రైతులకు అవగాహన కల్పించాలి
జనగామ రూరల్: సూపర్ ఎల్నినోపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని, సాగునీటి లభ్యత లేని ప్రాంతాల్లో వరి సాగు చేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వ్యవసాయం, సాగునీరు, వర్షపాతం పరిస్థితులపై కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లో వీసీ హాల్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, ఇరిగేషన్ శాఖ సీతారామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఈనెల 15 తర్వాత నీటి నిల్వల ఆధారంగా పంటలపై రైతులకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.మోడల్ పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం జనగామ రూరల్: మండలంలోని చౌడారం గ్రామంలోని పీఎంశ్రీ మోడల్ పాఠశాలలో ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీహరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మిగిలిపోయిన సీట్లకు, ఇంటర్ ఫస్టియర్ సీట్లకు స్పాట్ అడ్మిషన్ ఉందని శనివారం ఉదయం సంబంధిత సర్టిఫికెట్లతో పాఠశాల, కళాశాలకు హాజరు కావాలని కోరారు. విద్యార్థుల నమోదు పెరగాలి కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా.. ప్రభుత్వ ప్రభు త్వపాఠశాలల్లో అత్యాధునిక సౌకర్యాలు, విద్యా ర్థులకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ఝా అన్నారు. విద్యా కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత విద్యా సంవత్సరానికి 9,000 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు కృషిచేయాలని ఆదేశించారు. ఆర్టీసీ అద్దె బస్సు అపహరణ జనగామ: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపం హనుమకొండ రోడ్డులోని ఓ పెట్రోల్ బంక్ వద్ద పార్క్ చేసిన ఆర్టీసీ అద్దె బస్సును దుండగుడు అపహరించాడు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్గేట్ సమీపంలో బస్సును స్వాధీనం చేసుకున్నారు. జనగామ కురుమవాడకు చెందిన గంట గోపీ కృష్ణారెడ్డికి చెందిన టీఎస్ 27టీ7231 నంబర్ గల ఆర్టీసీ అద్దె బస్సు రోజు వారీ విధులు ముగించుకున్న అనంతరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద పార్క్ చేశారు. గురువారం తెల్లవారుజామున డ్రైవర్ విధులకు రావడంతో బస్సు కనిపించలేదు. దీంతో వెంటనే యజమాని గోపీకృష్ణారెడ్డికి సమాచారం ఇచ్చాడు. అనంతరం 100 డయల్కు సమాచారం అందడంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో సూర్యాపేట ప్రధాన రహదారి దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్గేట్ సమీపంలో రోడ్డు పక్కనున్న డివైడర్ను ఢీకొని నిలిచి ఉన్న బస్సును పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న దేవరుప్పుల ఎస్సై సృజన్ అక్కడికి చేరుకుని బస్సును స్వాధీనం చేసుకుని జనగామకు తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సును తీసుకెళ్లిన వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని అనుమానిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై బస్సు యజమాని గంట గోపీకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జనగామ సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు. భారత బ్యాడ్మింటన్ జట్టుకు శ్రీచేతన్శౌర్య ఎంపిక కొడకండ్ల: మండలంలోని లక్ష్మక్కపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ కుమారుడు సామల శ్రీచేతన్ శౌర్య అండర్ –15 బాలుర బ్యాడ్మింటన్ భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్నాడు. గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందిన శ్రీచేతనశౌర్య బెంగళూరులో జరిగిన అఖిల భారత సబ్ జూని యర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ చాటి అండర్– 15 బాలుర డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకం, సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించాడు. దీంతో సెప్టెంబర్లో చైనాలో జరిగే ఏషియన్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీల్లో భారత జట్టుకు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ప్రాతినిథ్యం వహించనున్నారు. ఈ సందర్భగా ఎంఈఓ గ్రేస్కేజియారాణి, హెచ్ఎం రమేశ్శర్మ, ఉపాధ్యాయులు.. శ్రీచేతన్శౌర్యకు శుభాకాంక్షలు తెలిపారు. -
ఆపద కాలంలో అండగా..
లింగాలఘణపురం: కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబానికి చేయూతగా ప్రభుత్వం నేరుగా రూ.20వేలు బ్యాంక్లో జమచేసే పథకమే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం–ఎన్ఎఫ్బీఎస్). ఈ పథకం 2023లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్లో భాగంగా ప్రారంభించగా రాష్ట్ర ప్రభుత్వం 2024 నుంచి ఎన్ఎఫ్బీఎస్గా అమలవుతోంది. ఇందులో కుటుంబ యజమాని అంటే కుటుంబాన్ని పోషించే వ్యక్తి..అనగా తల్లి, తండ్రి, ఇంటికి పెద్ద కుమారుడు, కూతురు..ఇలా ఒక కుటుంబం వీరిపై ఆధారపడి ఉంటే ఈ పథకం వర్తిస్తుంది. దరఖాస్తు చేసుకున్న వారం పది రోజుల్లోనే నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. ఈ పథకంలో గతంలో తహసీల్దార్ల పరిధిలో నుంచి ఆర్డీఓలకు అక్కడి నుంచి కలెక్టర్ అప్రూవల్ తీసుకొని డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యేది. దీంతో జాప్యం జరుగుతుందని ప్రస్తుతం ఎంపీడీఓలకు అప్పగించారు. ఎంపీడీఓల నుంచి డీఆర్డీఓ, కలెక్టర్ అప్రూవల్తో సెర్ప్ నుంచి డబ్బులు జమ అవుతాయి. జిల్లాలో జనగామ మండలంలో ఎక్కువగా 30 మంది దరఖాస్తు చేసుకోగా నర్మెటలో కేవలం ఒక్కరే దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకంపై ఇంకా గ్రామాల్లో విస్త్రృత ప్రచారం చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 196 దరఖాస్తులు జిల్లాలో ఇప్పటి వరకు 196 దరఖాస్తులు రాగా అందులో 5 డీఆర్డీఓ రిజెక్ట్ చేశారు. మిగిలినవి ఆయా అధికారుల లాగిన్లలో ఉండగా 13 మంది లబ్ధిదారులకు మాత్రమే బ్యాంక్ల్లో రూ.20వేల చొప్పున జమ అయ్యాయి. మండలాల వారీగా దరఖాస్తుల వివరాలు.. బచ్చన్నపేట–8, చిల్పూరు–22, దేవరుప్పుల–23, స్టేషన్ఘన్పూర్–6, జనగామ టౌన్–8, జనగామ –30, కొడకండ్ల 24, లింగాలఘణపురం 10, నర్మెట–1, పాలకుర్తి –22, రఘునాథపల్లి –13, స్టేషన్ఘన్పూర్ మండలం 10, తరిగొప్పుల –6, జఫర్గఢ్–13 ఉన్నాయి. ఇందులో ఎంపీడీఓలు 60 అప్రూవ్ చేయగా 136 పెండింగ్లో ఉన్నాయి. డీఆర్డీఓ పరిధిలో 55 అప్రూవ్ కాగా 5 రిజెక్ట్ చేశారు. సెర్ప్లో 13 అప్రూవ్ కాగా 42 పెండింగ్లో ఉండి. 13 మందికి బ్యాంక్ల్లో జమ అయ్యాయి. అందులో రఘునాథపల్లిలో 6, కొడకండ్లలో 4, దేవరుప్పులలో 3 ఉన్నాయి. అవసరమైన సర్టిఫికెట్లు మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్కార్డ్, రేషన్కార్డు, బ్యాంక్ పాసు బుక్, రెవెన్యూ అధికారి ధ్రువీకరించిన కుటుంబ సభ్యుల సర్టిఫికెట్తో పాటు ఒక ఫొటోను జతపరచాలి. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొని మండల కేంద్రాల్లోనైతే ఎంపీడీఓలకు, మున్సిపాల్ పరిధిలో కమిషనర్లకు దరఖాస్తు ఫారాలను అందజేయాలి. అక్కడి నుంచి వారి లాగిన్లో ఒకే చేస్తే డీఆర్డీఓకు, అక్కడి నుంచి కలెక్టర్కు, ఆ తరువాత సెర్ప్ నుంచి నేరుగా లబ్ధిదారుల జాబితాలో జమ అవుతాయి. కుటుంబ యజమాని చనిపోతే రూ.20వేలు పథకం అమలు బాధ్యతలు ఎంపీడీఓలకుపథకానికి అర్హులు ఎవరంటే..? చనిపోయిన కుటుంబం బీపీఎల్ (పేద కుటుంబం) జాబితాలో ఉండాలి. 18 నుంచి 59 ఏళ్ల వయసు కలిగిన వారై ఉండి ఆ కుటుంబబం మొత్తం వారి ఆదాయంపై ఆధారపడి జీవనం సాగించాలి. మహిళలైన, పురుషులైన అర్హులే అవుతారు. గతంలో ఏఏబీవై, జేబీవై, ఆపద్బాంధు పథకం తీసుకుంటే మాత్రం అనర్హులు అవుతారు. అంతేకాకుండా ప్రమాదవశాత్తు మరణించినా, సహజ మరణమైన ఈ పథకం వర్తిస్తుంది. -
చేనేత ఎన్నికలకు సర్వం సిద్ధం
● నేడు మూడు సొసైటీల్లో పోలింగ్ ● ఇప్పటికే 9 సొసైటీలు ఏకగ్రీవం జనగామ: జిల్లా చేనేత సహకార సంఘాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జిల్లాలోని 12 చేనేత సహకార సంఘాల్లో తొమ్మిది సంఘాలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా, మిగిలిన మూడు సంఘాల్లో నేడు(శుక్రవారం) ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బ్యాలె ట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించి, అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. మూడు సొసైటీల్లో పోలింగ్... తొమ్మిది ఏకగ్రీవం జిల్లాలో జనగామ వీవర్స్ కాలనీలోని భారత్ టీసీ జెడ్బీ హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్, జనగామ సంజయ్నగర్ ప్రాజెక్టు హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్, పాలకుర్తి మండలం గూడూరు హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ సంఘాల్లో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన బచ్చన్నపేట మార్కండేయ, స్టేష న్ఘన్పూర్ హెచ్డబ్ల్యూసీఎస్, కొత్తపల్లి శ్రీ వెంకటేశ్వర, బచ్చన్నపేట శ్రీ సిద్ధేశ్వర, సీతారాంపురం శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర, నీర్మాల శ్రీ భావన ఋషి, కంచనపల్లి హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్, శ్రీ పద్మావతి కొడకండ్ల, శ్రీనివాస పవర్ లూం తదితర సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మెజారిటీ స్పష్టంగా ఉంటే.. ప్రతీ సహకార సంఘంలో తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకోనుండగా, అందులో ఇద్దరు మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. ఎన్నికైన డైరెక్టర్లలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి తదితర పదవులను ఎంపిక చేస్తారు. ఫలితాల అనంతరం ఐదుగురు డైరెక్టర్ల మెజారిటీ స్పష్టంగా ఉంటే వెంటనే పాలక వర్గాన్ని ప్రకటిస్తారు. ఒకవేళ మెజారిటీపై స్పష్టత లేకుంటే మూడు రోజుల గడు వు ఇచ్చి పాలకవర్గ ఎన్నికను నిర్వహించనున్నారు. రాజకీయ రంగు చేనేత సహకార సంఘాల ఎన్నికలకు ఈసారి రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఏకగ్రీవం కాని మూడు సంఘాల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు తెర వెనుక చురుకుగా వ్యవహరించడంతో ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలను తలపించే స్థాయికి చేరుకున్నాయి. -
పథకాలు అర్హులకు చేరాలి
● గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ● అధికారులతో సమీక్ష హన్మకొండ అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రయోజనాలు చివరి లబ్ధి దారుడి వరకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూచించారు. హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. టీబీ నిర్మూలన, పల్స్పోలియో, ఇందిరమ్మ ఇళ్లు, వైద్య సేవలు, వ్యవసాయం, మౌలిక వసతుల అమలుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాలనలో నాణ్యత, పారదర్శకత, సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలని, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలను బలోపేతం చేయాలని సూచించారు. రైతులను విలువ ఆధారిత పంటల సాగు వైపు ప్రోత్సహించాలని సూచించారు. హాస్టళ్ల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ: మంత్రి అడ్లూరి వర్షాకాలంలో సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అధికారులను ఆదేశించారు. అత్యవసర మరమ్మతుల కోసం ప్రతీ జిల్లాకు రూ.కోటి వరకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామన్నారు. ఆరోగ్య పరీక్షలు, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద, పోలీస్ కమిషనర్ శ్వేత, అదనపు కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. మహిళల కృషిని ప్రశంసించిన గవర్నర్ హనుమకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గురువారం సందర్శించి మహిళల కృషిని అభినందించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, వ్యవసాయ, ఉద్యాన శాఖల స్టాళ్లలో ప్రదర్శించిన ఉత్పత్తులను పరిశీలించి తయారీ విధానం, నాణ్యత, మార్కెటింగ్ అవకాశాలపై మహిళలతో మాట్లాడారు. వరంగల్ దరీ స్టాల్ను సందర్శించి దరీల ప్రత్యేకత, మార్కెట్ అవకాశాలపై వివరాలు తెలుసుకుని వాటిని కొన్నారు. అనంతరం మహిళలను ప్రోత్సహిస్తూ పలు స్టాళ్లలోని ఉత్పత్తులను కొన్నారు. -
ఆత్మగౌరవం కోసం ఐక్యపోరాటం
జనగామ: సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడంతో పాటు గ్రామ పంచాయతీల హక్కులు, ఆర్థిక స్వయం ప్రతిపత్తి కోసం సర్పంచులంతా ఐక్యంగా పోరాడాలని జిల్లా సర్పంచుల సంఘం కన్వీనర్ గోపగోని శ్రీధర్ గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో గురువారం జిల్లా సర్పంచుల చైతన్య సదస్సు నిర్వహించారు. సర్పంచుల ఫోరం జిల్లా కన్వీనర్ గోపగోని శ్రీధర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, మైనర్ గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షల ప్రత్యేక నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ప్రభుత్వం వసూలు చేస్తున్న మైనింగ్ ఆదాయం, స్టాంప్ డ్యూటీ తదితర పన్నులను గ్రామ పంచాయతీలకే బదిలీ చేయాలని, ఉప సర్పంచ్లకు కల్పించిన చెక్పవర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సదస్సులో పంచాయతీరాజ్ మాజీ అధ్యక్షుడు మెట్టుపల్లి పురుషోత్తంరెడ్డి, పంచాయతీరాజ్ ఉపాధ్యక్షుడు అశోక్రావు, రాష్ట్ర మాజీ ఎంపీపీల సంఘం అధ్యక్షుడు శ్రీశైలం, పంచాయతీ రాజ్ చాంబర్ ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ, రాష్ట్ర కార్యదర్శి వెంకట్, జిల్లా అధ్యక్షుడు రాకేష్రెడ్డి, సంపత్ నాయక్, సర్పంచులు పాల్గొన్నారు. సర్పంచ్ల చైతన్య సదస్సులో జిల్లా కన్వీనర్ శ్రీధర్గౌడ్ -
రిటైర్డ్ టీచర్ది ప్రభుత్వ హత్యే
● మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్జనగామ: ఉద్యోగ విరమణ పొందిన 21 నెలలు గడిచినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకున్న రిటైర్డ్ టీచర్ పగిడిపల్లి మల్లయ్య మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న జిల్లా కేంద్రంలోని పూర్ణిమా కాలనీకి చెందిన మృతుడు మల్లయ్య కుటుంబాన్ని గురువారం టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్, టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డితో కలిసి మాజీమంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మల్లయ్య రాసిన 33 పేజీల సూసైడ్ నోట్లో కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.10.78 లక్షల జీపీఎఫ్ బకాయిలు అందక తీవ్ర మనోవేదనకు గురయ్యానని స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల ఆర్థిక సహాయానికి అదనంగా రూ.1 కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ..రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సిన సొంత డబ్బుల కోసం హైకోర్టును ఆశ్రయించి, ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి మాట్లాడుతూ.. మల్లయ్య మృతికి కారణమైన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, టీఎన్జీఓ ప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
సైలెన్సర్లలో మార్పులు చేస్తే కఠిన చర్యలు
జనగామ: సైలెన్సర్లలో అనధికారిక మార్పులు చేయించుకోవద్దని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ రాజమహేంద్ర నాయక్ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా మోడిఫైడ్ సైలెన్సర్లను అమర్చుకుని అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలిగి స్తున్న ద్విచక్ర వాహనాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 40 బైకులను సీజ్ చేసి, వాహ న యజమానులపై మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేశారు. అనంతరం ఆయా వాహనాలకు అమర్చిన మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగించారు. బుధవారం సీపీ శ్వేతారెడ్డి ఆదేశాల మేరకు డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షణలో సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్ఐల ఆధ్వర్యంలో పోలీస్ కంట్రోల్ రూం ఆవరణలో స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లను రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు. బాల కార్మిక నిర్మూలనకు కృషి చేయాలి బాల కార్మిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం స్కోప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సి పాల్ సంధ్యారాణి అధ్యక్షతన బాల కార్మిక నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ రోడ్డు రోలర్తో 40 సైలెన్సర్లు ధ్వంసం -
పేదల హృదయాల్లో వైఎస్ఆర్
స్టేషన్ఘన్పూర్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో పేదల సంక్షేమం కోసం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపట్టి పేదల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొనియాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిఽథులుగా హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇటీవల రైతు భరోసా నిధులు సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే, ఎంపీ పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. కాగా, స్థానిక అభ్యుదయ యువజన సంఘం అధ్యక్షుడు, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర నాయకుడు పోశాల క్రిష్ణమూర్తి ఆధ్వర్యంలో మహానేత వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ హరినాఽథ్ తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం నివాళి -
ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణజనగామ రూరల్: గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీలకు అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పనులను వేగ వంతంగా పూర్తి చేయాలన్నారు. తమ పరిధిలో ఉన్న సహజ వనరులు, స్థానిక ఆదాయ మార్గాలను గుర్తించి పంచాయతీ ఆదాయాన్ని పెంచుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని ఆదేశించారు. జీ రామ్ జీ పథకంలో భాగంగా జాబ్ కార్డు కలిగిన ప్రతీ గ్రామీణ పేద కుటుంబానికి 125 రోజుల పని దినాలు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ భాస్కర్, డీపీఓ వెంకట్ రెడ్డి, ఈజేఎస్ పీడీ సూరి, తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబానికి అండగా ఉండాలని..
పాఠశాల స్థాయి నుంచే ఎన్సీసీ ట్రైనింగ్ పొందినా. నాటి నుంచి పోలీసు అంటే నాకు మక్కువ ఎక్కువ. ఆరేళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం శ్రమిస్తున్నా. పోలీసు ఉద్యోగం సాఽధించి కుటుంబానికి అండగా ఉండాలనే లక్ష్యంతో రోజూ క్రీడామైదానంలో నాలుగు గంటలు పరుగు, ఫిట్నెస్ అంశంలో సాధన చేస్తున్నా. – పూజ నాగరాజు, కరీమాబాద్ వరంగల్కానిస్టేబుల్ ఉద్యోగమే లక్ష్యండిగ్రీ పూర్తయ్యింది. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలన్నదే నాలక్ష్యంగా పెట్టుకున్నా. ఫిట్నెస్ కోసం హనుమకొండ జేఎన్ స్టేడియంలో ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంటి వద్ద ఉంటూ సంబంధిత సబ్జెక్ట్లు చదువుతున్నా. ఇటీవల ఆర్మీ ఉద్యోగం పరీక్ష రాశాను. ఇంకా ఫలితాలు ప్రకటించలేదు. మొదటి ప్రయత్నంలోనే కానిస్టేబుల్ ఉద్యోగం సాధించలన్నదే నా కల. ఇందుకు కోచింగ్ సెంటర్లో తీవ్రంగా శ్రమిస్తున్నా. – పిట్టల సాయి, కాశికుంట వరంగల్ -
ప్రజల్లో నమ్మకం కలిగించాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ● స్టేషన్ఘన్పూర్ పోలీసుస్టేషన్ సందర్శనస్టేషన్ఘన్పూర్: వివిధ సమస్యలపై పోలీస్స్టేషన్కు వచ్చే ప్రజలకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని, భరోసాను కలిగించేలా పోలీసులు పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. స్టేషన్ఘన్పూర్ పోలీస్స్టేషన్ను వరంగల్ సీపీ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు డీసీపీ రాజమహేంద్రనాయక్ స్వాగతం పలికారు. అనంతరం సీపీ పోలీస్స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకున్నారు. పోలీస్స్టేషన్ పరిధిలో తరచుగా అధిక సంఖ్యలో జరిగే నేరాలు, స్టేషన్పరిధిలోని గ్రామాలు, ప్రస్తుతం గ్రామాల్లో స్థితిగతులు, స్టేషన్ నిర్వహణ తదితర అంశాలను సీఐ జి.వేణును అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. రాత్రి సమయాల్లో వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. సీపీ వెంట డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ భీమ్శర్మ, సీఐ జి.వేణు, ఎస్ఐ మనీషా తదితరులున్నారు. -
విద్యలో మనదే అగ్రస్థానం
జనగామ: దేశంలో పాఠశాల విద్యా నాణ్యతను మరింత మెరుగుపరిచే దిశగా కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్–డిస్ట్రిక్ట్ (పీజీఐ–డీ) 2025–26 నివేదిక ఫలితాలను వెల్లడించింది. జిల్లాల వారీగా విద్యా ప్రమాణాలు, బోధన నాణ్యత, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల హక్కులు, పాఠశాల భద్రత, డిజిటల్ లెర్నింగ్, పరిపాలన వంటి ఆరు ప్రధాన అంశాలను పరిశీలించి ఈ ర్యాంకింగ్ను రూపొందించారు. 2024–25లో 357 మార్కులతో రాష్ట్రంలో అగ్రస్థానంతో పాటు దేశ వ్యాప్తంగా 96వ ర్యాంకు సాధించిన జనగామ జిల్లా 2025–26లోనూ స్టేట్లో నంబర్వన్ పొజిషియన్ను నిలబెట్టుకుని, దేశ స్థాయిలో మరింత మెరుగైన ర్యాంకు దిశగా దూసుకెళ్లింది. విద్యా వ్యవస్థలో లోపాలను గుర్తించి, ఉత్తమ పద్ధతులను విస్తరించి, జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడమే ఈ నివేదిక ప్రధాన ఉద్దేశమని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. రాష్ట్రంలో జిల్లాదే తొలి స్థానం కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన జిల్లాల పనితీరు గ్రేడింగ్ సూచీ (పీజీఐ–డీ) జిల్లాల పనితీరు గ్రేడింగ్ సూచిక) 2025–26లో జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 383 మార్కులు సాధించిన జిల్లా స్టేట్లో నంబర్వన్గా నిలిచి ఉత్తమ్–3 గ్రేడ్ను దక్కించుకుంది. విద్యార్థుల అభ్యాస ఫలితాలు, తరగతి గది బోధన, మౌలిక సదుపాయాలు, డిజిటల్ విద్య, పాఠశాల పాలన వంటి కీలక విభాగాల్లో జిల్లా మెరుగైన పనితీరు కనబరిచింది. రాష్ట్రంలో వరుసగా రెండోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, దేశ వ్యాప్త ర్యాంకింగ్లో 64 స్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. విద్యాభివృద్ధికి నిదర్శనం జిల్లాలో విద్యా ప్రమాణాలు ఏడాదికేడాది మెరుగుపడుతున్నాయి. ఉన్నత విద్యా స్థాయిల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇస్తూ కార్పోరేట్ స్థాయి మౌలిక సదుపాయాలు, డిజిటల్ బోధన, ఆధునిక తరగతి గదులు, భద్రతా చర్యలు కల్పిస్తున్నాయి. ఈ చర్యలు విద్యార్థుల నైపు ణ్యాలను పెంపొందించి వారి ఉన్నత భవిష్యత్కు బలమైన పునాది వేస్తుండడంతో దేశంలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వస్తోంది. కేంద్ర విద్యాశాఖ పీజీఐ–డీ నివేదిక వెల్లడి జాతీయ స్థాయిలో 64, రాష్ట్రస్థాయిలో 1వ ర్యాంకు 383 మార్కులతో ఉత్తమ్–3 గ్రేడ్లో చోటుజిల్లా రాష్ట్ర మొత్తం గ్రేడ్ ర్యాంకు మార్కులుజనగామ 01 383 ఉత్తమ్–3 హనుమకొండ 7 334 ప్రచేస్త–1 వరంగల్ 15 323 ప్రచేస్త–2 భూపాలపల్లి 18 317 ప్రచేస్త–2 మహ–బాద్ 25 287 ప్రచేస్త–2 ములుగు 27 284 ప్రచేస్త–2 ఉత్తమ్ (అత్యుత్తమ పనితీరు) ప్రచేస్తా–1 (మంచి మెరుగైన తీరు) ప్రచేస్తా–2 (సగటు కంటే కొంత మెరుగైన స్థాయి) ప్రచేస్తా–3 (ఇంకా మెరుగుదల అవసరం) -
గురువారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2026
జనగామ: జనగామ మున్సిపల్ పరిధిలో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద ప్రభుత్వం కల్పించిన 25 శాతం ఫీజు రాయితీ ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ గడువులోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి రాయితీని పొందాలని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది మే 1 నుంచి 25 శాతం రిబేట్ ప్రకటించినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో గడువును జూలై 31 వరకు పొడిగించింది. మూడు దశల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన మూడు దశల్లో జరుగుతుంది. మొదటి దశ (ఎల్–1)లో ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తారు. అనంతరం రెండో దశ (ఎల్–2)లో మరోసారి వివరాలను ధ్రువీకరించి ఆన్న్లైన్న్లో నమోదు చేస్తారు. చివరి దశ (ఎల్–3)లో అన్ని వివరాలు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత మున్సిపల్ కమిషనర్ తుది ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. పెద్ద ఎత్తున ప్రచారం 25 శాతం రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మున్సిపాలిటీ విస్తృత ప్రచారం చేపట్టింది. వార్డు స్థాయిలో సమాచారం అందించడంతో పాటు అర్హులైన వారిని నేరుగా సంప్రదిస్తూ దరఖాస్తులు పూర్తి చేయించే చర్యలు కొనసాగుతున్నా యి. గడువు ముగిసిన తర్వాత రాయితీ వర్తించకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అందువల్ల ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆర్థికంగా లబ్ధి పొందాలని మున్సిపాలిటీ సూచిస్తోంది. ఎల్ఆర్ఎస్కు దూరం మున్సిపల్ పరిధిలో ఎల్ఆర్ఎస్ పరిధిలోకి వచ్చిన 18,065 మందిలో ఇప్పటివరకు 13,607 మందికే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు సమాచారం అందించారు. మిగిలిన సుమారు 4,500 మంది ప్లాట్లు విక్రయించడం, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం, పూర్తి స్థాయి చిరునామాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో సమాచారం చేరడం లేదు. దీంతో వారిని గుర్తించి ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడానికి మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి పర్యవేక్షణలో పట్టణ ప్రణాళిక అధికారులు అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలిస్తూ లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నారు. 100 శాతం ఎల్ఆర్ఎస్ పూర్తి చేయడంతో పాటు మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యాచరణ కొనసాగుతోంది. చివరి అవకాశం సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు 18 వేల మందికి ఎల్ఆర్ఎస్ అవకాశం ఇంకా చాలామంది పెండింగ్ మున్సిపాలిటీ విస్తృత ప్రచారంఅంశం వివరాలు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు 18,065 సమాచారం అందుకున్నవారు 13,607 2020లో రూ.1,000 ఫీజు 2,945 చెల్లించినవారు 2020లో ప్రొసీడింగ్స్ 1,996 పొందినవారు 2020 తర్వాత ప్రొసీడింగ్స్ 49 పొందినవారు 25 శాతం రిబేట్ గడువు జూలై 31 ఎల్ఆర్ఎస్ పరిశీలన దశలు ఎల్–1, ఎల్–2, ఎల్–3 -
పోలీస్ శాఖలో కొలువుల జాతర
సాక్షిప్రతినిధి, వరంగల్: పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖలో సుమారు ఏడు వేల వరకు పోస్టుల భర్తీ తక్షణ అవసరంగా గుర్తించింది. ఈ మేరకు 5,000 ఖాళీలను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు జీఓలో స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత కొంతకాలంగా నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురించాయి. వేలాది మంది నిరుద్యోగ యువత పోలీసు ఉద్యోగాల కోసం పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలకు ముందు నుంచే పోలీస్ అకాడమీ, కోచింగ్ సెంటర్లలో సందడి మొదలైంది. ఉమ్మడి జిల్లాకు గణనీయమైన పోస్టులు హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో పోలీసు ఉద్యోగాలు ఆశిస్తున్న వారికి నిజంగా ఇది శుభవార్తే. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ కోసం ఉమ్మడి జిల్లా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. స్థానికత (లోకల్ కేడర్) ప్రకారం ఖాళీల వివరాలను సంబంధిత శాఖలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఇప్పటికే పంపినట్లు అధికారులు ప్రకటించారు. స్థానిక కేడర్ ఆధారంగా పోస్టుల పంపిణీ జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు కూడా గణనీయమైన పోస్టులు వచ్చే అవకాశాలున్నాయని నిరుద్యోగులు భావిస్తున్నారు. రిక్రూట్మెంట్ బోర్డుకు కీలక బాధ్యత.. స్థానిక కేడర్ వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, అర్హతల వివరాలను సంబంధిత శాఖలు అందించిన వెంటనే తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పూర్తి షెడ్యూల్తో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి నియామకంలో పోలీసు ఉద్యోగాలకు వేలాది మంది పోటీ పడుతుంటారు. ఈసారి కూడా భారీ సంఖ్యలో అభ్యర్థులు సిద్ధమవుతుండగా, పోలీసు శాఖలో కొలువుల జాతర ప్రారంభమైనట్టేనని నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక కేడర్లో ఎక్కువ పోస్టులు దక్కితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వందలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, ఖాకీ డ్రెస్ కల నెరవేరే అవకాశం ఉంది. భర్తీ చేయనున్న పోస్టులు ఇవే... ఎస్ఐ (సివిల్) 148 ఎస్ఐ (ఏఆర్) 14 రిజర్వ్ ఎస్ఐ (టీజీఎస్పీ) 12 ఎస్ఐ (ఎస్ఏఆర్ సీపీఎల్) 3 అసిస్టెంట్ ఎస్ఐ (ఎఫ్పీబీ) 23 కానిస్టేబుల్ (సివిల్) 3,697 కానిస్టేబుల్ (ఏఆర్) 1,052 కానిస్టేబుల్ (ఎస్ఏఆర్ సీపీఎల్) 24 కానిస్టేబుల్ (డ్రైవర్) 20 కానిస్టేబుల్ (మెకానిక్) 7 మొత్తం పోస్టులు 5,000ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2,138 పోస్టులు ఖాళీ త్వరలో నోటిఫికేషన్.. నిరుద్యోగుల్లో కొత్త ఆశలు కోచింగ్ సెంటర్లలో మొదలైన సందడికమిషనరేట్ / మంజూరైన పనిచేస్తున్న మొత్తం ఖాళీల జిల్లా పోస్టులు వారు ఖాళీలు శాతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ 8,828 7,181 1,647 18.66 మహబూబాబాద్ 2,132 1,983 149 6.99 ములుగు 1,562 1,375 187 11.97 జయశంకర్ భూపాలపల్లి 1,605 1,450 155 9.66 మొత్తం 14,127 11,989 2,138 15.13 -
సీపీని కలిసిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పాలకుర్తి టౌన్: వరంగల్ నూతన పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఎన్.శ్వేతారెడ్డిని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నియోజవర్గంలో శాంతభద్రతల పరిరక్షణ, ప్రజాసమస్యల పరిష్కారంలో పోలీసు శాఖ సహకారం కొనసాగాలని కోరారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని కమిషనర్ హామీ ఇచ్చారు.క్రైస్తవ సంక్షేమ పథకాలకు దరఖాస్తుల ఆహ్వానంజనగామ: తెలంగాణ క్రైస్తవ మైనారిటీల ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో అర్హులైన క్రైస్తవ మైనారిటీల నుంచి మూడు సంక్షేమ పథకాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మురళీధర్ మంగళవారం తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద కుట్టుమిషన్లు, చిన్న వ్యాపారాల ప్రారంభానికి రూ.50 వేల ఆర్థిక సహాయం, డ్రైవర్ సాధికారత కార్యక్రమం కింద రూ.1.50 లక్షల విలువైన ఈ–బైక్లు, ఈ–స్కూటీలు, పెట్రోల్ బైక్లు, స్కూటీల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. కుట్టుమిషన్లు, చిన్న వ్యాపార యూనిట్లకు 21 నుంచి 55 ఏళ్ల వయస్సు, డ్రైవర్ సాధికారత పథకానికి 21 నుంచి 50 ఏళ్ల వయస్సు గల క్రైస్తవ మైనారిటీ అభ్యర్థులు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు ఉండాలి. దరఖాస్తుల చివరి తేదీ ఈ నెల18 వరకు పూర్తి వివరాలు సమర్పించి, ఆన్లైన్ దరఖాస్తుల కోసం https//tgobmms. cgg.gov.in వెబ్సైట్లో సందర్శించాలని, సందేహాల నివృత్తి కోసం 040 –29801130, 040–23391067 నంబర్లను సంప్రదించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సూచించారు. పాఠశాలకు రూ.లక్ష విరాళంలింగాలఘణపురం: మండలంలోని కుందారం ప్రాథమిక పాఠశాలకు మంగళవారం ఎన్ఆర్ఐ గంగసాని రాజేశ్వర్రెడ్డి రూ.లక్ష విరాళం అందజేశారు. పాఠశాల అభివృద్ధితో పాటు విద్యావలంటీర్ ఏర్పాటుకు వినియోగించుకోవాలని సూచించారు. సర్పంచ్ కూకట్ల రాజు, హెచ్ఎం మంజుల, ఉన్నత పాఠశాల హెచ్ఎం రవీందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. డిజిటల్ విద్యకు ప్రాధాన్యమివ్వాలిలింగాలఘణపురం: పాఠశాలల్లో డిజిటల్ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. మంగళవారం మండలంలోని నేలపోగుల పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక వసతులు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యం, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనం, పరిసరాల పరిశుభ్రత, క్రీడలు, కంప్యూటర్ లాబ్ తదితర వాటిని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఫాస్ట్మ్యాథ్స్ పుస్తకాన్ని వినియోగిస్తూ ప్రాథమిక సూత్రాలతో పూర్తి అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యం పెరిగే విధంగా ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని కోరారు. ఎన్ఆర్ఐ లక్ష్మినారాయణ, హెడ్మాస్టర్ నవీన్కుమార్తో పాటు ఉపాధ్యాయులు ఉన్నారు. -
భారంగా ‘మధ్యాహ్న’ భోజనం
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలి. పెరిగిన ధలకు అనుగుణంగా విద్యార్థికి రోజుకు 30 రూపాయలు ఇవ్వాలి. లేకుంటే నిత్యావసరాలు, గ్యాస్ ప్రభుత్వమే అందించాలి. కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి. – రాపర్తి రాజు, జిల్లా అధ్యక్షుడు, సీఐటీయూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలంటే మార్కెట్ ధరలకు అనుగుణంగా చార్జీలు చెల్లించాలి. గుడ్డు ధర రూ.7నుంచి 8 వరకు ఎక్కువగా ఉంటోంది. ప్రభుత్వం ఇస్తున్న చార్జీలు సరిపడక మాపై భారం పడుతోంది. అప్పులు చేసి మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. – తాటికాయల రేణుక, భోజన కార్మికురాలు, జఫర్గఢ్జనగామ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలనే అధికారుల ఒత్తిడితో సతమతమవుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు లేకపోవడంతో అప్పులు చేసి భోజనం పెట్టాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరగడంతో చాలా పాఠశాలల్లో విద్యార్థులకు కోడిగుడ్డు వడ్డించడం లేదు. జిల్లావ్యాప్తంగా 504 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో సుమారుగా 30వేల వరకు విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే చార్జీలు పెంచాలని అలాగే కార్మికులకు వేతనాలు పెంచాలని కోరుతున్నారు. పెరిగిన గ్యాస్, గుడ్డు ధరలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే వంట కార్మికులకు ప్రతీ నెల రూ.3వేల చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని అధికారులు చెబుతున్న మార్కెట్ ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించడంలేదు. ఆరు నెలల్లో ఆరు సార్లు గ్యాస్ ధరలు పెరగంతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గత ఏడాది చార్జీలు స్వల్పంగా పెంచినా సరిపోవడం లేదు. ప్రభుత్వం గుడ్డుకు రూ.6 చెల్లిస్తుండగా, మార్కెట్లో గుడ్డు ధర రూ.7నుంచి 8 వరకు ఉంది. దీంతో కార్మికులపై భారం పడుతోంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.6.78 పైసలు 6 నుంచి 8వ తరగతి వరకు రూ.10.17, తొమ్మిది, పదో తరగతికి రూ.13.17పైసల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. కోడిగుడ్డుతో కలిసి రెండు కూరలు మెనూ ప్రకారం అందించాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.25 నుంచి రూ.30లు ఇస్తే మెనూ ప్రకారం వారానికి మూడు కోడిగుడ్లు, అన్ని రకాల కూరగాయలు, ఆకు కూరలతో భోజనం వడ్డించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. లేదంటే నిత్యా వసరాలు, వంట గ్యాస్ ప్రభుత్వమే సమకూర్చాలని కోరుతున్నారు. కొండెక్కిన గుడ్డు ధర అరకొర చార్జీలతో ఏజెన్సీ నిర్వాహకుల ఆవేదన మెనూ అందక విద్యార్థుల ఇబ్బందులు మార్కెట్ ధరలకు అనుగుణంగా చార్జీలు పెంచాలని డిమాండ్ -
రైతులకు వెన్నుదన్నుగా ప్రభుత్వం
● మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్యాదవ్ జనగామ: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తూ వెన్నుదన్నుగా నిలుస్తోందని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం ఆయన అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న టీజీ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కోసం అధికారులు ఏఎంసీ పరిధిలో స్థలం కోరిన నేపథ్యంలో, పత్తి యార్డులోని ఖాళీ స్థలం లేదా ఏఎంసీకి చెందిన ఇతర ఖాళీ ప్రదేశాన్ని వినియోగించుకోవచ్చని సమావేశంలో తీర్మానించారు. ఏఎంసీలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను సంబంధిత అధికారుల సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని, నూతన ఏఎంసీ కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ కార్యదర్శి శ్రీదేవి, డైరెక్టర్లు ఎండీ బాష్మియా, బొట్ల నర్సింగరావు, బానోత్ బన్సీ నాయక్, నీల మోహన్, తోటకూరి రమేశ్ యాదవ్, శీలం కొండల్రెడ్డి, పర్ష సిద్ధేశ్, నామాల శ్రీనివాస్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల బలోపేతమే లక్ష్యం
జనగామ రూరల్: గ్రామ పంచాయతీలను ఆర్థికంగా, పరిపాలనాపరంగా మరింత బలోపేతం చేసి గ్రామాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ నుంచి 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, గ్రామస్థాయి అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ సందీప్కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై బుధవారం నుంచి మూడు రోజుల పాటు సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులకు సమగ్ర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వీబీ జీ రామ్ జీ చట్టంపై ప్రతీ సర్పంచ్, కార్యదర్శికి అవగాహన కల్పించాలన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాలు స్పష్టంగా నిర్వహించాలని సూచించారు. వీసీలో డీఆర్డీఓ భాస్కర్, డీపీఓ వెంకట్ రెడ్డి, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
ఆమోదం..51అంశాలు
మాట్లాడుతున్న చైర్పర్సన్ బాలమణిశ్రీనివాస్మాట్లాడుతున్న కౌన్సిలర్ గునిగంటి వెన్నెల జనగామ: మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం పురపాలిక కార్యాలయ సమావేశం హాలులో చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. పట్టణ పరిధిలోని పలు వార్డుల అభివృద్ధి పనులు, ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై కౌన్సిల్ సభ్యులు 17శాఖల అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల మరణించిన విద్యుత్ లైన్మన్కు నివాళులర్పించారు. 43 ఎజెండా, 8 టేబుల్ మొత్తం 51 అంశాల కు ఆమోదం లభించింది. కోతుల బెడద నివారణ కోసం రూ.15 లక్షలు కేటాయించారు. వనమహోత్సవంలో 2.50లక్షల మొక్కల పెంపకం, పట్టణంలో విద్యుత్ దీపాల నిర్వహణ కోసం రూ.5 లక్షలు కేటాయింపు, వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్ట డం, ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు నిధులు కేటాయింపు, వీధి కుక్కలు, పందుల నివారణ చర్యలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. జంతు వధశాల నిర్వహణ కోసం రూ.5 లక్షలకు టెండర్లు పిలిచేందుకు ఆమోదం, పట్టణంలో 4 ప్రధాన రహదారులు, ఇతర ప్రాంతాల్లో వ్యాపారస్తులు, షాపుల నుంచి చెత్తను బహిరంగంగా వేయకుండా మున్సిపల్ వాహనాలకే ఇచ్చే విధంగా చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.500 నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధించాలని చైర్పర్సన్, కమిషనర్ ఆదేశించారు. కౌన్సిల్ కీలక చర్చ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పట్టణంలోని ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, బార్, రెస్టారెంట్ల నుంచి ఉత్పత్తయ్యే బల్క్ వేస్ట్ కోసం నెలకు ఒక్కొక్కరి నుంచి రూ.1000 నుంచి రూ.10,000 వరకు ఫీజు విధించేందుకు కౌన్సిల్లో చర్చించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్– 2026 ప్రకారం పట్టణంలోని 30 వార్డుల్లో ఏప్రిల్–1 నుంచి గృహ యజమానుల నుంచి చెత్త తీసుకునే ఆటోలకు యూజర్ఛార్జీలుగా నెలకు ఒక్కొక్క ఇంటికి రూ.100 వసూలు చేసేందుకు ఎజెండా తీసుకు రాగా, పలువురు కౌన్సిలర్లు అంగీకరించలేదు. సమస్యలు ఇలా.. 3వ వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి మాట్లాడుతూ కౌన్సిల్ ఆధునీకరణకు రూ.20 లక్షలకు బదులు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రూ.10 లక్షలతో పూర్తి చేయాలని సూచించారు. చెత్త సేకరణకు రూ.100 వసూలు చేయడం సాధ్యం కాదని, పేద ప్రాంతాలైన ధర్మకంచ, సంజయ్నగర్, గిర్నిగడ్డ, కురుమవాడ తదితర ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. 25వ వార్డు సభ్యులు పాముకుంట్ల ప్రసాద్గౌడ్ మాట్లాడుతూ.. తన వార్డులోని గాంధీ కమ్యూనిటీ హాల్, లైబ్రరీ పనులు అసంపూర్తిగా ఉన్నాయని, వాటి కోసం మూడు నెలల క్రితమే ఎస్టిమేషన్ వేసినప్పటికీ ఇంతవరకు ఎజెండా లో పెట్టకపోవడం సమంజసం కాదన్నారు. వడ్లకొండ ప్రభుత్వ సముదాయాల వద్ద బస్ షెల్టర్ కోసం లయన్స్ క్లబ్ నుంచి 50శాతం నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చారని, మిగతా 50శాతం నిధులు మున్సిపల్ కౌన్సిల్ సహకారం అందించాలన్నారు. నెహ్రూపార్కు, గాంధీ సెంటర్ వద్ద ట్రాఫిక్ రద్దీ నియంత్రించేందుకు సిగ్నల్ ఏర్పాటు చేయాలన్నారు. 9వ వార్డు కౌన్సిలర్ గునిగంటి వెన్నెలరామక్రిష్ణ మాట్లాడుతూ ప్రతి వార్డులో ఎస్ఐఆర్ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి బీఎల్ఓను అందుబాటులో ఉంచి పత్రాలు తప్పులు లేకుండా నింపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 26వ వార్డులో కోతులు, కుక్కలు, పందులతో ఇబ్బందులు పడుతున్నామని కౌన్సిలర్ సేవెల్లి మధు అన్నారు. సమావేశంలో కమిషనర్ రాజశేఖర్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సజావుగా మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం కోతుల బెడద నివారణకు రూ.15 లక్షలు 2.50లక్షల మొక్కలు నాటాలని నిర్ణయం -
జిల్లాకు దేవాదులే జీవనాడి
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ: జిల్లాకు దేవాదుల ప్రాజెక్టు నీరే జీవనాడి అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన జనగామ నియోజకవర్గంలో నెలకొన్న సాగునీటి పరిస్థితిపై మాట్లాడారు.. సమ్మక్క సారక్క ప్రాంతం నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఒక్క చుక్కనీటిని కూడా ఎత్తలేదని ఆరోపించారు. బొమ్మకూరు రిజర్వాయర్లో 198 టీఎంసీల సామర్థ్యానికి 58 టీఎంసీలు, గండిరామారంలో 400 ఎంసీఎఫ్టీలకు 1 88, కన్నెబోయిన రిజర్వాయర్లో 152.8 ఎంసీఎఫ్టీలకు 76.6, వెల్డండలో 150.42 ఎంసీఎఫ్టీలకు 49, తపాస్పల్లి రిజర్వాయర్లో 300 ఎంసీఎఫ్టీలకు 100ఎంసీఎఫ్టీలు మాత్రమే నీరు ఉందన్నారు. బచ్చన్నపేట, చేర్యాల తదితర ప్రాంతాలకు నీరు అందించే రిజర్వాయర్లలో కూడా తగినంత నీరు లేదని, రాష్ట్ర ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు నీటిని సమర్థవంతంగా వినియోగించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. దీనివల్ల జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో రిజర్వాయర్లు అడుగంటుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యంపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరం
● ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఫిర్యాదు ● ఇరువర్గాల మధ్య కుదురుతోందనుకున్న సయోధ్యకు బ్రేక్ ● ఉమ్మడి వరంగల్ జిల్లా హస్తం పార్టీలో తెరపైకి మరోసారి వర్గపోరు సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ మంత్రి కొండా సురేఖ నేరుగా ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాసినట్లు మంగళవారం వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతోందనే సంకేతాలు కనిపించినప్పటికీ, తాజా పరిణామాలతో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సయోధ్య సంకేతాలు.. తాత్కాలికమే! ఇటీవల ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం, పరస్పరం విమర్శలు తగ్గించడం, పార్టీ కార్యక్రమాల్లో కలిసి పాల్గొనడం వంటి పరిణామాలతో విభేదాలు ముగిశాయనే ప్రచారం జరిగింది. కడియం శ్రీహరి ఇటీవల నిర్వహించిన ఓ ఫంక్షన్కు కొండా దంపతులు హాజరు కూడా అయ్యారు. దీంతో జిల్లా కాంగ్రెస్లో కూడా ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, తాజా లేఖ వ్యవహారంతో ఆ సయోధ్య తాత్కాలికమేనని తేలిపోయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నేతలుగా ఉన్న కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య మరోసారి విభేదాలు బయటపడడం పార్టీపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? ఇరువర్గాల మధ్య మరోసారి రాజీ ప్రయత్నాలు జరుగుతాయా? లేదా? అన్నది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తాజా వివాదానికి కారణాలివే.. కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంపై ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలో ఉమ్మడి వరంగల్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సమగ్ర మాస్టర్ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. జిల్లా వ్యవహారాల్లో ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రిని పక్కనబెట్టి కడియం శ్రీహరి అధికారులతో సమీక్షలు నిర్వహించడం, ఆదేశాలివ్వడం సరైన పద్ధతి కాదని ఆమె అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే కడియం శ్రీహరి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాసినట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించడం, ప్రభుత్వ పరి పాలనలో అనవసర జోక్యం చేసుకోవడం వంటి అంశాలను ఆమె లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. కాంగ్రెస్లో చేరిన తర్వాత నుంచే కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నియోజకవర్గాల పరిధి, పార్టీ వ్యవహారాలు, అధికారుల సమావేశాలు, రాజకీయ కార్యక్రమాల విషయంలో ఇద్దరూ పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఈ విభేదాలు రాష్ట్ర నాయకత్వం దృష్టికి వెళ్లడంతో పలుమార్లు సర్దుబాటు ప్రయత్నాలు జరిగాయి. -
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
● పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత హన్మకొండ చౌరస్తా: పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదుపై తక్షణమే స్పందించి ప్రజలకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అధికారులను ఆదేశించారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమవారం ఆమె మొదటిసారిగా హనుమకొండ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. పోలీస్ స్టేషన్కు చేరుకున్న కమిషనర్ ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను తనిఖీ చేసి, వాటి స్వాధీనానికి కారణాలు, కేసుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసుల నమోదులు, ఇతర పరిపాలన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది వివరాలు తెలుసుకుని, వారి విధి నిర్వహణపై ఆరా తీశారు. ఈసందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. పోలీసులు ప్రజల సేవకులనే భావనతో విధులు నిర్వహించాల్సిన బాధ్యత ఉందన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అందిన ప్రతీ ఫిర్యాదును వెంటనే నమోదు చేసి రశీదు అందజేయాలని సూచించారు. సీపీ శ్వేత వెంట సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, ఏసీపీ లు నర్సింహరావు, సత్యనారాయణ, హనుమకొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తిచేయాలి
జనగామ రూరల్: ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత గడువుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు పూర్తయిందని, రేపటిలోగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. తప్పుడు సమాచారం అందిస్తే ఆర్పీ 31 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీసీలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ 97 శాతం పూర్తయ్యిందని, 11.38 శాతం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, ఆర్డీఓ గోపిరామ్, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి -
సుజలం..సురక్షితం
జనగామ: పట్టణ ప్రజలకు మున్సిపాలిటీ ద్వారా సరఫరా చేస్తున్న తాగునీరు నాణ్యత ప్రమాణాలకు పూర్తిగా అనుగుణంగా ఉందని తాజా ప్రయోగశాల పరీక్షల్లో క్లీన్చీట్ వచ్చింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి వెల్లడించారు. పట్టణ ప్రజలకు సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో మున్సిపాలిటీ నిరంతరం నీటి నాణ్యతను పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహించారు. రోజుకు కోటి 25 లక్షల లీటర్లు.. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 13,806 నల్లా కనెక్షన్లు ఉండగా, చీటకోడూరు ఫిల్టర్ బెడ్ ద్వారా రోజుకు ోటి 15 లక్షల లీటర్లు, మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా మరో 10 లక్షల లీటర్లు కలిపి రోజుకు కోటి 25 లక్షల లీటర్ల నీటిని పట్టణ ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన నీటి నాణ్యత పరీక్షల్లో అన్ని నమూనాలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పట్టణంలో మున్సిపాలిటీ సరఫరా చేసే నీటిని తాగేందుకు చాలామంది ప్రజలు ఆసక్తి చూపకుండా, ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని కొనుగోలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. పట్టణంలో 100కు పైగా నిబంధనలకు విరుద్ధంగా వాటర్ ప్లాంట్లు నడుస్తున్నాయని, వాటి నుంచి సరఫరా అయ్యే నీటిలో అవసరమైన ఖనిజ లవణాలు (మినరల్స్) తగిన మోతాదులో లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాణాలకు అనుగుణంగా.. పట్టణంలో పురపాలిక ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటి నాణ్యతపై నిర్వహించిన తాజా ప్రయోగశాల పరీక్షల్లో అన్ని నీటి నమూనాలు భారతీయ ప్రమాణాల బ్యూరో (ఐఎస్ 10500–2012) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు తేలింది. జిల్లా నీటి నాణ్యత పర్యవేక్షణ ప్రయోగశాల ఈ పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షల కోసం 2026 జూన్ 15న నీటి నమూనాలను సేకరించి ల్యాబ్లో టెస్ట్ చేయించారు. పట్టణంలోని ధర్మకంచ, చమన్, ఆర్డీఓకార్యాలయం, సాయినగర్, హౌసింగ్ బోర్డు, ఈ–సేవ కేంద్రం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వీవర్స్ కాలనీతో పాటు డ్యాం ముడి నీటి నమూనాను కూడా పరీక్షించారు. నివేదిక ఇలా.. నివేదిక ప్రకారం నీటి ఆమ్ల–క్షార స్థాయి 7.86 నుంచి 8.06 మధ్య నమోదు కాగా, డ్యాం ముడి నీటిలో 8.70గా నమోదైంది. మసకదనం 0.1 నుంచి 0.3 మధ్య ఉండి, అనుమతించిన పరిమితిలోనే ఉంది. నీటిలో మొత్తం కరిగిన ఘన పదార్థాలు 304 నుంచి 329 మిల్లీగ్రాములు ప్రతీ లీటరుకు, మొత్తం క్షారత్వం 32 నుంచి 44 మిల్లీగ్రాములు, మొత్తం కాఠిన్యం 120 నుంచి 165 మిల్లీ గ్రాములు, క్లోరైడ్ 85 నుంచి 113 మిల్లీ గ్రాములు, ఫ్లోరైడ్ 0.43 నుంచి 0.68 మిల్లీ గ్రాములు, నైట్రేట్ 4.1 నుంచి 6.2 మిల్లీ గ్రాములు, సల్ఫేట్ 10.45 నుంచి 13.61 మిల్లీ గ్రాములు, ఇనుము 0.05 నుంచి 0.09 మిల్లీ గ్రాముల మధ్య నమోదయ్యాయి. ఇవన్నీ భారతీయ ప్రమాణాల బ్యూరో గరిష్ఠ పరిమితుల కంటే తక్కువగా ఉన్నట్లు కమిషనర్ వెల్లడించారు. మున్సిపల్ నీళ్లు నిర్భయంగా తాగొచ్చు గత నెలలో నీటి నాణ్యత పరీక్షలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణమే: ల్యాబ్ టెస్ట్ నివేదిక అవగాహన కల్పిస్తున్న మున్సిపల్ అధికారులు -
పలు చేనేత సొసైటీలు ఏకగ్రీవం
స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ చేనేత పారిశ్రామిక సహకార, విక్రయ సంఘం ఎన్నిక ఏకగ్రీవమైంది. సోమవారం నామినేషన్ల పరిశీలన కాగా అధ్యక్షుడితో పాటు డైరెక్టర్లు తొమ్మిది మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం అధ్యక్షుడిగా శివునిపల్లికి చెందిన గుండు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడిగా శివునిపల్లికి చెందిన బిట్ల రంగయ్య, కార్యదర్శిగా ఎక్కలదేవి ఉప్పలయ్య, డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బచ్చన్నపేటలో రెండు.. బచ్చన్నపేట : మండల కేంద్రంలోని శ్రీ సిద్దేశ్వర స్వామి సిల్క్ వీవర్స్ కోపరేటివ్ సొసైటీ, మార్కండేయ హెచ్డబ్ల్యూ సీఎస్ లిమిటెడ్ సొసైటీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు మహేశ్వరం స్వర్ణలత, సీహెచ్. గంగాధర్ తెలిపారు. కంచనపల్లి చేనేత సంఘం.. రఘునాథపల్లి: మండలంలోని కంచనపల్లి చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా రాపోలు ఈశ్వరయ్య, ఉపాధ్యక్షుడిగా అమృతం చంద్రయ్య, కార్యదర్శిగా శ్రీపతి కుమారస్వామి, డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీ శ్రీనివాస పవర్లూమ్ వీవర్స్.. కొడకండ్ల: మండలంలోని శ్రీ శ్రీనివాస పవర్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ ప్రొడక్షన్ సెల్స్ సహకార సంఘం ఎన్నిక ఏకగ్రీవమైంది. కొత్తపల్లి సొసైటీ డైరెక్టర్లు.. లింగాలఘణపురం: మండలంలోని కొత్తపల్లి చేనేత సహకారం సంఘం సొసైటీలోని 9 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి కోర్నేలియస్ ప్రకటించారు. డైరెక్టర్ల ఎన్నిక ఏకగ్రీవం పాలకుర్తి టౌన్ (దేవరుప్పుల): మండలంలోని సీతారాంపురంలో శ్రీ ఉమా చంద్రమౌళీశ్వర చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం లిమిటెడ్ నూతన కార్యవర్గ డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఎన్నికల అధికారి పోలంపల్లి వినోద్ తెలిపారు. -
విద్యాప్రమాణాల్లో కలెక్టర్ వినూత్న కార్యాచరణ ప్రభుత్వ పాఠశాలలకు అకడమిక్ ఎక్సలెన్ ్స బ్లూప్రింట్
జనగామ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడంతో పాటు బోధన, మూల్యాంకన విధానాలను ఏకరీతిలో అమలు చేసే దిశగా జిల్లా పరిపాలన కీలక అడుగు వేసింది. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ–2020) లక్ష్యాలకు అనుగుణంగా 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లా అకడమిక్ ఎక్సలెన్స్ ఇనిషియేటివ్ పేరుతో సమగ్ర కార్యాచరణ రూపొందించింది. కలెక్టర్, విద్యాశాఖ అధికారి సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు అవసరమైన అకడమిక్, మూల్యాంకన వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. సామర్థ్య ఆధారిత బోధనకు ప్రాధాన్యం సాంప్రదాయ బోధనకు భిన్నంగా ఉపాధ్యాయుడు ఏమి బోధించాడు.. అనే విధానం నుంచి విద్యార్థి ఏమి నేర్చుకున్నాడు.. అనే అభ్యాస ఫలితాల ఆధారిత విధానానికి ప్రాధాన్యం ఇచ్చారు. నెలవారీ బోధన ప్రణాళికలు, కాన్సెప్ట్ మ్యాప్స్, ప్రయోగశాల కార్యకలాపాలు, ప్రాజెక్టులు, అంచనా, పరిశీలన, వివరణ వంటి ఆధునిక బోధనా పద్ధతులను ఉపాధ్యాయులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఏకరీతి మూల్యాంకన విధానం జిల్లా అసెస్మెంట్ టూల్కిట్ ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సామర్థ్య ఆధారిత ప్రశ్నపత్రాలు, బ్లూప్రింట్లు, రూబ్రిక్స్, స్లిప్ టెస్టులు, యూనిట్ టెస్టులు, నమూనా ప్రశ్నపత్రాలు, ప్రోగ్రెస్ కార్డులు, రిమిడియల్ బోధన వంటి అంశాలతో ఏకరీతి మూల్యాంకన విధానాన్ని అమలు చేయనున్నారు. టీచర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు ప్రతీ పాఠాన్ని నిజజీవిత అనుభవాలతో అనుసంధానం చేయడం, కార్యకలాపాల ఆధారిత బోధన నిర్వహించడం, పరీక్షల అనంతరం రిమిడియల్ తరగతులు చేపట్టడం వంటి అంశాలపై ఉపాధ్యాయులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించారు. ప్రధానోపాధ్యాయులు తరగతి గది పరిశీలనలు, నెలవారీ సమీక్షలు, ప్రయోగశాలల వినియోగం, మూల్యాంకన విశ్లేషణపై దృష్టి సారించనున్నారు. దశలవారీ అమలు.. ఈ కార్యక్రమాన్ని మూడు దశల్లో అమలు చేయనున్నారు. మొదటి దశలో అవగాహన కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయగా, రెండో దశలో బోధన, పరీక్షలు, రిమిడియల్ బోధన కొనసాగుతుంది. మూడో దశలో పర్యవేక్షణ, సమీక్షలు నిర్వహిస్తారు. 2027 ఫిబ్రవరి 28 నాటికి వంద శాతం సిలబస్ పూర్తి చేయడం, ఎఫ్ఏ–ఎస్ఏ మూల్యాంకనాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సామర్థ్య ఆధారిత బోధనను స్థిరీకరించి విద్యార్థుల అభ్యాస ఫలితాలను గణనీయంగా మెరుగుపరచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతాం విద్యార్థులు పాఠాలను కేవలం కంఠస్థం చేయడం కాకుండా, వాటిని అర్థం చేసుకుని నిజజీవితంలో ఉపయోగించే స్థాయికి చేరుకోవాలి. అదే లక్ష్యంతో జిల్లా అకాడమిక్ ఎక్సలెన్స్ ఇనిషియేటివ్ను రూపొందించాం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 2027 ఫిబ్రవరి నాటికి వంద శాతం సిలబస్ పూర్తిచేయడంతో పాటు, విద్యార్థుల అభ్యాస ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల సాధించడమే మా లక్ష్యం. జిల్లాను విద్యా ప్రమాణాల్లో రాష్ట్రానికే ఆదర్శ తీర్చిదిద్దుతాం. – సందీప్ కుమార్ ఝా, కలెక్టర్ ప్రతీ విద్యార్థి అభ్యసన పురోగతిపై ప్రత్యేక దృష్టి 2027 ఫిబ్రవరి నాటికి 100 శాతం సిలబస్ పూర్తి లక్ష్యం మూడు కీలక మార్గదర్శక పత్రాల రూపకల్పనజిల్లా అకాడమిక్–అసెస్మెంట్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్, జిల్లా అకడమిక్ ఫ్రేమ్ వర్క్, జిల్లా అసెస్మెంట్ టూల్కిట్ అనే మూడు సమగ్ర మార్గదర్శక పత్రాలను రూపొందించారు. వీటి ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, అభ్యాసం, మూల్యాంకనం, పర్యవేక్షణ వ్యవస్థలను ఒకే విధానంలో అమలు చేయనున్నారు. విద్యార్థుల్లో భావనాత్మక అవగాహన, సమస్య పరిష్కార నైపుణ్యాలు, శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. -
11న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
జనగామ రూరల్: ఈనెల 11వ తేదీన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు ఉంటాయని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి 14, 16, 18, 20 మెన్–ఉమెన్ విభాగాల్లో అథ్లెటిక్స్ ఎంపికలు స్థానిక మినీ స్టేడియం, ధర్మకంచలో జరుగుతాయని, ఎంపికైన క్రీడాకారులు 18న ఇందిరాగాంధీ స్టేడియం మెదక్లో జరిగే రాష్ట్ర స్థాయి మిడిల్ డిస్టెన్న్స్, లాంగ్ డిస్టెన్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లాస్థాయి ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు 11వ తేదీ ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మెమోతో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు గంగిశెట్టి మనోజ్ కుమార్ 9885046437, ఆవుల అశోక్ 9912453220, వంచ చంద్రశేఖర్ రెడ్డి 7799552233, తూడి రంజిత్ 99852 23047 నంబర్లలో సంప్రదించాలని కోరారు. డిగ్రీ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల జనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) రెండో సెమిస్టర్ ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బి.ఎన్.సురేఖ సోమవారం విడుదల చేశారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ..రెండో సంవత్సరంలో మొత్తం 289 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా ఇందులో 159 మంది ఉత్తీర్ణత సాధించారని, 130 మంది ఫెయిల్ అయ్యారని తెలిపారు. పరీక్షలకు సహకరించిన కాకతీయ విశ్వవిద్యాలయం కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాజేందర్ కట్ల, అడిషినల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరుమలాదేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు భవాని, వందన, నవీన రాణి, లక్ష్మీ అనురాధ, శ్రీదేవి, కళ్యాణి, అనగాని శ్రీనివాస్, నర్సింహులు, రవీందర్ నాయక్, రాజ్కుమార్, సంధ్యారాణి, ప్రశాంత్ పాల్గొన్నారు. కాగా, కళాశాల టాపర్స్గా శివరాత్రి పూజ 9.8, వల్లాల జాహ్నవి 9.8శాతం సాధించారు. బీఏలో మహ్మద్ అబ్దుల్ అజీమ్, సయ్యద్ సమీరా, బీకాంలో టి.షైనీ, వక్కల సాత్విక, లైఫ్సైన్స్లో భవాని, ప్రకాశ్, ఫిజికల్ సైన్స్లో శివరాత్రి పూజ, వల్లాల జాహ్నవి, టి.నివేదిత, సూరజ్ సింగ్, జడల నిఖిత, మహ్మద్ ఆఫ్రిన్ టాపర్లుగా నిలిచారు.ఆర్డీఓ గ్రీవెన్స్కు తొమ్మిది దరఖాస్తులు స్టేషన్ఘన్పూర్: కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమంలో సోమవారం తొమ్మిది దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆర్డీఓ కిరణ్ప్రకాష్ మాట్లాడుతూ.. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లు, భూసమస్యలపైనే దరఖాస్తులు వస్తున్నాయన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, సమస్యలుంటే నేరుగా గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. యాంటీ రేబీస్ టీకాలు వేయించాలి జనగామ రూరల్: పెంపుడు జంతువులకు యాంటీ రేబీస్ టీకాలు వేయించుకోవాలని జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ మురళీధర్ రావు అన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా జనగామ వెటర్నరీ ఆసుపత్రిలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో యాంటీ రేబీస్ టీకా శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా 45 పెంపుడు జంతువులకు యాంటీ రేబీస్ టీకాలు వేశారు. జూనోటిక్ వ్యాధులను గురించి వివరించి, రేబీస్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించేందుకు అవసరమైన టీకాలను అన్ని వెటర్నరీ సంస్థల్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు రణజిత్, దేవేందర్, రవిప్రసాద్ పాల్గొన్నారు. -
‘ఎస్ఐఆర్’ను బాధ్యతగా చేపట్టాలి
● అడిషనల్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని బీఎల్ఓలు బాధ్యతగా చేపట్టాలని అడిషనల్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. ఎస్ఐఆర్ 2026లో భాగంగా చేపడుతున్న పనులను ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 118వ పోలింగ్స్టేషన్ను శనివారం ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ బీఎల్ఓలు ఎన్యుమరేషన్ ఫారాలను ఎలా నింపుతున్నారు, డిజిటలైజేషన్ ప్రక్రియ ఏవిధంగా జరుగుతుందో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఎల్ఓలు అప్రమత్తంగా, బాధ్యతగా పనిచేయాలని, ప్రతీ ఇంటికి ఎన్యుమరేషన్ ఫారాలు అందించాలన్నారు. బీఎల్ఓల పనితీరుపై సూపర్వైజర్లు, మండలస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. ఆయన వెంట స్టేషన్ఘన్పూర్ ఆర్డీఓ కిరణ్ ప్రకాష్, తహసీల్దార్ స్వప్న, ఎన్నికల నాయబ్ తహసీల్దార్ సదానందం, ఎంఆర్ఐ శ్రీకాంత్, మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వాహన కండీషన్ తప్పనిసరి
బచ్చన్నపేట: వాహనంతో పా టు అంబులెన్స్లోని పరికరాల ను వర్కింగ్ కండీషన్లో ఉంచుకోవాలని 108 జిల్లా మేనేజర్ రాము అన్నారు. శనివారం బచ్చన్నపేట ఆస్పత్రిలోని అంబులెన్స్ను ఆకస్మికంగా తనిఖీ ని ర్వహించి అంబులెన్స్లోని అత్యవసర మందులు, వాటి కాల పరిమితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్టీ చాన ల్ మానిటర్, బీపీ ఆపరేటర్, డిజిటల్ పెర్మామీటర్ సెక్షన్ ఆపరేటర్, పల్స్ ఆక్సి మీటర్ల ప్రాముఖ్యత చాలా ఉంటుందన్నారు. విషపూరిత పాములు, తేలు కరిచినప్పుడు దగ్గరలో ఉ న్న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రజల ప్రా ణానికి ప్రమాదం లేకుండా జాగ్రత్త వహించా లన్నారు. ఈఎంటీ భాస్కర్, పైలట్ సాయికుమార్, జంగిలి శిరీష, తదితరులు ఉన్నారు. యువతకు స్వయం ఉపాధికి అవకాశాలు జనగామ రూరల్: తెలంగాణ క్రైస్తవ, మైనార్టీల ఆర్థిక సంస్థ నుంచి అందించే ఆర్థికసాయానికి అర్హులైన క్రైస్తవులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ అధికారి విక్రమ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కుట్టు మిషన్, చిన్న తరహా వ్యాపార యూనిట్ల కోసం 21 నుంచి 55 ఏళ్ల వయస్సులోపు వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల వారికి రూ.2లక్షలు, గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50లక్షల లోపు ఉండాలన్నారు. ఆసక్తిగల వారు ఈనెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 040–29801130 నంబర్లో సంప్రదించాలని కోరారు. ఇంటర్లో స్పాట్ అడ్మిషన్లకు అవకాశంజనగామ రూరల్: జిల్లాలోని తెలంగాణ గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించిన మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి కె.శారద, డీసీఓ పి. శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత మార్చిలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు ఎస్సెస్సీ మెమోతో పాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు. రేపు (సోమవారం) ఉదయం 9 నుంచి 1 గంట వరకు జిల్లాలోని గురుకుల బాలుర కళాశాలలో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రిల్స్లో ఇరుక్కుపోయిన మహిళ కాలు జనగామ: జనగామ ఆర్డీఓ కార్యాలయం ప్రధాన గేట్ వద్ద ఉన్న ఇనుప గ్రిల్స్లో ఓ మహిళ కాలు ఇరుక్కుపోయింది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ ఉప్పల్కు చెందిన ఎడ్ల రమ్యశ్రీనాథ్ కోర్టు సంబంధిత పనుల కోసం శనివారం ఆర్డీఓ కార్యాలయానికి వచ్చారు. పని ముగించుకుని బయటకు వస్తుండగా ప్రధాన గేట్ వద్ద ఏర్పాటు చేసిన గ్రిల్స్లో ఆమె కాలు ఇరుక్కుపోయింది. దీంతో సమాచారం అందుకున్న స్థానికులు కట్టర మిషన్ సహాయంతో ఇనుప రాడ్డును తొలగించి మహిళ కాలును సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనతో ఆర్డీఓ కార్యాలయం వద్ద కొంతసేపు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తగిన భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించాలి స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించేలా అ ధ్యాపకులు కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్ తెలిపారు. శనివా రం ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. కళాశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించి కళాశాలల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధిస్తేనే గుర్తింపు లభిస్తుందన్నారు. ఆయన వెంట కౌన్సిలర్లు పొన్న రవి, గుర్రం హరినాఽథ్, నాయకులు గట్టు రమేష్, పెసరు సారయ్య, రాజు తదితరులున్నారు. -
గుడిసెలు లేని గ్రామాలే లక్ష్యం
● గృహ నిర్మాణ శాఖ సీఈ చైతన్యకుమార్ స్టేషన్ఘన్పూర్: రాష్ట్రంలో గుడిసెలు లేని గ్రామాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం, గృహ నిర్మాణ శాఖ పని చేస్తుందని హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ చైతన్యకుమార్ అన్నారు. ఘన్పూర్ పట్టణ కేంద్రంతో పాటు శివునిపల్లి, ఇందిరానగర్ తదిత ర ప్రాంతాల్లో గృహ నిర్మాణ శాఖ సీఈ శనివారం ప ర్యటించి గుడిసెలను సందర్శించారు. ఈ సందర్భంగా గుడిసెల్లో నివాసం ఉంటున్న వారితో ‘మీ కు స్వంత ఇంటి స్థలం ఉందా, ఇళ్లు మంజూరీ చేస్తే నిర్మాణం చేసుకుంటారా’? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులనే ఎంపిక చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరీ అవుతున్నాయన్నారు. ఆయన వెంట పీడీ మాతృనాయక్, డీఈ చంద్రశేఖర్, ఏఈ అఖిల, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, కౌన్సిలర్లు పొన్న రవి, పెసరు సారయ్య, అనూషరాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు కన్నెపల్లికి కేటీఆర్
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన లక్ష్మీపంప్హౌస్(కన్నెపల్లి)ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు (ఆదివారం) సందర్శించనున్నారు. ఉదయం 8గంటలకు హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరుతారు. వరంగల్, పరకాల, భూపాలపల్లి, కాటారం మీదుగా మహదేవపూర్ మండలం కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లికి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేరుకుంటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనవెంట పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు రానున్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, మేడిగడ్డ బరాజ్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కన్నెపల్లి వద్ద గోదావరికి అడ్డంగా కట్ట నిర్మాణం చేసి నీటిని నిలిపి పంపులు ద్వారా ఎత్తిపోయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ బృందంతో కలిసి కేటీఆర్ టూర్ ప్లాన్ చేసినట్లు చేశారని పార్టీనాయకులు పేర్కొంటున్నారు. కాగా, శనివారం కన్నెపల్లి పంపుహౌస్, పరిసరాలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సందర్శించి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. పెంబర్తిలో ఘన స్వాగతం జనగామ: కన్నెపల్లిలో నిర్వహించే సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు జనగామ మండలం పెంబర్తి వద్ద ఘన స్వాగతం పలకనున్నట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9.30 గంటలకు పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెంబర్తి గ్రామానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఆయనతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మీపంప్హౌస్ పంపులు లిఫ్ట్ చేయాలనే లక్ష్యంతో పర్యటన -
దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పుట్టిన జిల్లాలో పనిచేసే అవకాశం లభించడం గర్వకారణమన్నారు. అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ మాట్లాడుతూ యువత దొడ్డి కొమురయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యులు చిలువేరు అభిగౌడ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహ రావు, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, వైటీడీఏ సభ్యులు లక్ష్మి నారాయణ నాయక్, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, కంచె రాములు, మల్లేశం, జూకంటి శ్రీశైలం, కానుగంటి ముత్తయ్య, బాలరాజు, ఎదునూరి మాదార్, వెంకట మల్లయ్య పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలి జనగామ రూరల్: పంట మార్పిడి విధానాలు, ఆయిల్ పామ్ పంటల సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి సీఎస్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2026–27 సంవత్సరానికి 85 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించామన్నారు. దీనికి అనుగుణంగా జిల్లాలోని అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు రైతులకు అందించాలన్నారు. ఎరువులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీసీ హాల్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీఏఓ అంబికా సోనీ, సీపీఓ చినకోట్యా నాయక్, మిషన్ భగీరథ ఈఈ శ్రీకాంత్, అధికారులు పాల్గొన్నారు. -
వాహన కండీషన్ తప్పనిసరి
బచ్చన్నపేట: వాహనంతో పా టు అంబులెన్స్లోని పరికరాల ను వర్కింగ్ కండీషన్లో ఉంచుకోవాలని 108 జిల్లా మేనేజర్ రాము అన్నారు. శనివారం బచ్చన్నపేట ఆస్పత్రిలోని అంబులెన్స్ను ఆకస్మికంగా తనిఖీ ని ర్వహించి అంబులెన్స్లోని అత్యవసర మందులు, వాటి కాల పరిమితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్టీ చాన ల్ మానిటర్, బీపీ ఆపరేటర్, డిజిటల్ పెర్మామీటర్ సెక్షన్ ఆపరేటర్, పల్స్ ఆక్సి మీటర్ల ప్రాముఖ్యత చాలా ఉంటుందన్నారు. విషపూరిత పాములు, తేలు కరిచినప్పుడు దగ్గరలో ఉ న్న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రజల ప్రా ణానికి ప్రమాదం లేకుండా జాగ్రత్త వహించా లన్నారు. ఈఎంటీ భాస్కర్, పైలట్ సాయికుమార్, జంగిలి శిరీష, తదితరులు ఉన్నారు. యువతకు స్వయం ఉపాధికి అవకాశాలు జనగామ రూరల్: తెలంగాణ క్రైస్తవ, మైనార్టీల ఆర్థిక సంస్థ నుంచి అందించే ఆర్థికసాయానికి అర్హులైన క్రైస్తవులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ అధికారి విక్రమ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కుట్టు మిషన్, చిన్న తరహా వ్యాపార యూనిట్ల కోసం 21 నుంచి 55 ఏళ్ల వయస్సులోపు వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల వారికి రూ.2లక్షలు, గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50లక్షల లోపు ఉండాలన్నారు. ఆసక్తిగల వారు ఈనెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 040–29801130 నంబర్లో సంప్రదించాలని కోరారు. ఇంటర్లో స్పాట్ అడ్మిషన్లకు అవకాశంజనగామ రూరల్: జిల్లాలోని తెలంగాణ గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించిన మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి కె.శారద, డీసీఓ పి. శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత మార్చిలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు ఎస్సెస్సీ మెమోతో పాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు. రేపు (సోమవారం) ఉదయం 9 నుంచి 1 గంట వరకు జిల్లాలోని గురుకుల బాలుర కళాశాలలో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రిల్స్లో ఇరుక్కుపోయిన మహిళ కాలు జనగామ: జనగామ ఆర్డీఓ కార్యాలయం ప్రధాన గేట్ వద్ద ఉన్న ఇనుప గ్రిల్స్లో ఓ మహిళ కాలు ఇరుక్కుపోయింది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ ఉప్పల్కు చెందిన ఎడ్ల రమ్యశ్రీనాథ్ కోర్టు సంబంధిత పనుల కోసం శనివారం ఆర్డీఓ కార్యాలయానికి వచ్చారు. పని ముగించుకుని బయటకు వస్తుండగా ప్రధాన గేట్ వద్ద ఏర్పాటు చేసిన గ్రిల్స్లో ఆమె కాలు ఇరుక్కుపోయింది. దీంతో సమాచారం అందుకున్న స్థానికులు కట్టర మిషన్ సహాయంతో ఇనుప రాడ్డును తొలగించి మహిళ కాలును సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనతో ఆర్డీఓ కార్యాలయం వద్ద కొంతసేపు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తగిన భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించాలి స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించేలా అ ధ్యాపకులు కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్ తెలిపారు. శనివా రం ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. కళాశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించి కళాశాలల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధిస్తేనే గుర్తింపు లభిస్తుందన్నారు. ఆయన వెంట కౌన్సిలర్లు పొన్న రవి, గుర్రం హరినాఽథ్, నాయకులు గట్టు రమేష్, పెసరు సారయ్య, రాజు తదితరులున్నారు. -
రైతు బాంధవుడు సీఎం రేవంత్రెడ్డి
● డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి జనగామ: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి అన్నారు. రైతు భరోసా నిధులను విడుదల చేసిన సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో సీఎం రేవంత్రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో రైతు భరోసా నిధులను విడుదల చేయడం రైతా ంగంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. సీఎం రాజకీయ ప్రస్థానం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు, వైటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి, నాయకులు, కౌన్సిలర్లు ఎర్రమల్ల సుధాకర్, కంచె రాములు, కొత్త కరుణాకర్ రెడ్డి, నూకల బాల్ రెడ్డి, నిమ్మతి మహేందర్రెడ్డి, అభిగౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ‘చేనేత’ నామినేషన్లు
జనగామ: జిల్లాలో చేనేత సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం నామినేషన్ల పర్వం ముగిసింది. 12 సహకార సంఘాల పరిధిలో స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో ఈ నెల 2వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ జరిగింది. నేడు (ఆదివారం) నామినేషన్ల పరిశీలన, 6న ఉపసంహరణ, అదే రోజు తుది అభ్యర్థుల జాబితా విడుదలతో పాటు ఎన్నికల గుర్తుల కేటాయింపు చేపట్టనున్నారు. అనంతరం 10వ తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. ఒక్కో సొసైటీలో చైర్మన్, వైస్ చైర్మన్తో కలుపుకుని 9 మందితో కూడిన పాలక మండలి ఉంటుంది. ఇందులో ఇద్దరు మహిళలకు రిజర్వు చేశారు. నేటి నామినేషన్ల పరిశీలన తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది. బచ్చన్నపేట సిద్ధేశ్వర, స్టేషన్ఘన్పూర్ హెచ్డబ్ల్యూసీఎస్, కొడకండ్ల శ్రీనివాస పవర్లూం, నీర్మాల శ్రీ భావనారుషి హెచ్డబ్ల్యూసీఎస్ సొసైటీలు ఏకగ్రీవం కాగా, 8 సొసైటీల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. ఐదు సొసైటీల పరిధిలో మహిళలు ఏకగ్రీవమయ్యారు. ఏకగ్రీవాలు..ఎన్నికలు జనగామ (వీవర్స్ కాలనీ) భారత్ టీసీ జెడ్బీహెచ్డబ్ల్యూసీఎస్ సొసైటీ–27 నామినేషన్లు రాగా ఎన్నికలు అనివార్యం. జనగామ (సంజయ్నగర్) ప్రాజె క్టు హెచ్డబ్ల్యూసీఎస్ సొసైటీ–19 నామినేష న్లు రాగా మహిళా స్థానాలకు ఇద్దరు మాత్రమే నామినేషన్ వేయడంతో వారు ఏకగ్రీవమయ్యారు. పురుషులకు ఎలక్షన్లు నిర్వహించనున్నారు. బచ్చన్నపేట మండలం మార్కండేయ హెచ్డబ్ల్యూసీఎస్ సొసైటీలో మహిళా స్థానాలు ఏకగ్రీవం, పురుషులకు ఎలక్షన్లు, శ్రీ సిద్ధేశ్వర సిల్క్ డబ్ల్యూసీఎస్ సొసైటీ–9 నామినేషన్లు, పాలకవర్గం ఏకగ్రీవమయ్యారు. పాలకుర్తి మండలం గూడూరు హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ సొసైటీ–16 నామినేషన్లు రాగా ఎన్నికలు నిర్వహించనున్నారు. స్టేషన్ఘన్పూర్ హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ సొసైటీ–9 నామినేషన్లు, పాలకవర్గం ఏకగ్రీవం. లింగాలఘణపురం మండలం కొత్తపల్లి శ్రీ వెంకటేశ్వర హెచ్డబ్ల్యూసీఎస్ సొసైటీలో మహిళా స్థానాలు ఏకగ్రీవం, పురుషులకు ఎలక్షన్లు. దేవరుప్పుల మండలం సీతారాంపురం శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర హెచ్డబ్ల్యూసీఎస్ సొసైటీలో 16 నామినేషన్లు, ఎన్నికలు అనివార్యం కాగా నీర్మాల శ్రీ భావనరుషి హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ సొసైటీలో 9 నామినేషన్లు, పాలకవర్గం ఏకగ్రీవమయ్యారు. రఘునాథపల్లి మండలం కంచనపల్లి శత్రంజి హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ సొసైటీలో మహిళా స్థానాలు ఏకగ్రీవం, పురుషులకు ఎలక్షన్లు. జనగామ మండలం ఎల్లంల శ్రీ పద్మవంశీ జీహెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ సొసైటీలో మహిళా స్థానాలు ఏకగ్రీవం, పురుషులకు ఎలక్షన్లు. కొడకండ్ల మండలం శ్రీ శ్రీనివాస పవర్లూమ్ డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ సొసైటీలో 9 నామినేషన్లు రాగా పాలకవర్గం ఏకగ్రీవమయ్యారు. మొత్తం 163 నామినేషన్లు రాక నాలుగు ఏకగ్రీవం, ఐదు సొసైటీల్లో మహిళలు కూడా.. 8 సొసైటీల్లో ఎన్నికలు నేడు పరిశీలన, అనంతరం అధికారిక ప్రకటన -
అవుట్సోర్సింగ్ నియామక పరీక్షలు
జనగామ: జిల్లా స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న పోస్టుల నియామక పరీక్షలను పూర్తి పారదర్శకతతో, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించినట్లు కలెక్టర్, జిల్లా అవుట్సోర్సింగ్ కమిటీ చైర్మన్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. అర్హులైన ప్రతీ అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించేలా పరీక్షల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశం హాలులో నిర్వహించిన నియామక పరీక్షలను శుక్రవారం రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. జూలై 2న వ్యవసాయ శాఖలో వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) పోస్టుల భర్తీకి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. అలాగే 3న వైద్యశాఖలో ల్యాబ్ టెక్నీషియన్, ఎస్టీఎల్ఎస్ పోస్టులకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. అనంతరం సోషల్ వెల్ఫేర్ విద్యా సంస్థలలో పార్ట్టైమ్ టీచర్ పోస్టుల భర్తీ కోసం మధ్యాహ్నం 1 గంట నుంచి 2.30 గంటల వరకు పరీక్ష నిర్వహించినట్లు వివరి ంచారు. పరీక్షలకు మంచి స్పందన లభించిందని, వ్యవసాయ శాఖ ఏఈఓ పోస్టులకు 111 మంది దరఖాస్తు చేయగా 94 మంది హాజరయ్యారని తెలిపారు. వైద్యశాఖలో ల్యాబ్ టెక్నీషియన్, ఎస్టీఎల్ఎస్ పోస్టులకు 100 మంది దరఖాస్తు చేయగా 75 మంది పరీక్ష రాశారని చెప్పారు. సోషల్ వెల్ఫేర్ విద్యాసంస్థల పార్ట్టైమ్ టీచర్ పోస్టులకు 100 మంది దరఖాస్తు చేయగా 82 మంది హాజరైనట్లు వెల్లడించారు. అన్ని పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలి జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన నిరుపేదలకు పక్కా ఇళ్లు అందేలా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని సందీప్ కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెండో విడతకు సంబంధించి గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు తొలి ప్రాధాన్యమిస్తూ అర్హులను ఎంపిక చేయాలని తెలిపారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
‘ఎస్ఐఆర్’ను పారదర్శకంగా నిర్వహించాలి
జనగామ రూరల్: ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సీఈఓ కార్యాలయ ప్రత్యేక బృందం ప్రతినిధి పద్మావతి సూచించారు. శుక్రవారం జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 254, 259, 270 పోలింగ్ స్టేషన్ బూత్ల్లో జరుగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, ఇంటింటి సర్వే, బీఎల్ఓలు నిర్వహిస్తున్న విధులు, ఓటర్లకు అందిస్తున్న అవగాహన పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫారాలను సక్రమంగా నింపేలా అవసరమైన అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఓటర్ల వివరాలను నమోదు చేసే క్రమంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సంబంధిత ఆధారాలతో ధ్రువీకరించి నమోదు చేయాలని బీఎల్ఓలకు సూచించారు. కార్యక్రమంలో జనగామ ఈఆర్ఓ, ఆర్డీఓ గోపీరాం, ఏఈఆర్ఓ తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఘనపూర్ ఈఆర్ఓ, ఆర్డీఓ కిరణ్ ప్రకాష్, ఏఈఆర్ఓ స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ను పరిశీలించిన అబ్జర్వర్ స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో నియోజకవర్గ పరిశీలకురాలు పద్మావతి శుక్రవారం పరిశీలించారు. ఘన్పూర్లోని 111, 116వ పోలింగ్బూత్లలో నిర్వహిస్తున్న సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్ఓలతో పరిశీలకురాలు మాట్లాడుతూ.. ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తిస్థాయిలో అందించారా, ఎన్ని ఫారాలు కలెక్షన్ చేసి ఆన్లైన్ చేశారని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఆర్డీఓ కిరణ్ప్రకాశ్, తహసీల్దార్ స్వప్న, ఆర్ఐ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. సీఈఓ కార్యాలయ ప్రత్యేక బృందం ప్రతినిధి పద్మావతి -
ఏఎంసీలో స్వచ్ఛత పనులు
జనగామ: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) యార్డులోని ఐకేపీ పత్తి కొనుగోలు కేంద్రాల్లో పేరుకపోయిన చెత్తను తొలగించే కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో ఏఎంసీ సిబ్బంది శుభ్రత పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు విస్తృతంగా సేవలు అందించామని, మార్కెట్ యార్డులో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి జిల్లాలో అత్యధికంగా వరి కొనుగోళ్లు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ సిబ్బంది ఆయిలయ్య, వెంకటేష్, రమేశ్, కృష్ణ, కుమారస్వామి, ప్రవీ ణ్, ఉమా మహేశ్వరి, కోమలత పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంజనగామ రూరల్: ఐదో తరగతి ఉత్తీర్ణులైన బా లికలకు జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)లో ఏర్పాటు చేసిన ఐఓఈ(ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్) సెంటర్లలో 6వ తరగతి నుంచే ప్రత్యేక కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు కేజీవీబీ జిల్లా స్పెషల్ ఆఫీ సర్ అన్నపూర్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పే ర్కొన్నారు. ఐవోఈ సెంటర్లలో అనుభవజ్ఞులై న ఉపాధ్యాయులచే బోధన అందించడంతో పాటు, జేఈఈ, నీట్, క్లాట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ కోసం నిపుణులైన అధ్యాపకులతో తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నా రు. జిల్లాలోని చౌడారం, పాలకుర్తి, ఘన్పూర్ స్టేషన్ కేజీవీబీ ఐఓఈ సెంటర్లలో ప్రవేశాల కోసం 5వ తరగతి ఉత్తీర్ణులైన బాలికలు మాత్ర మే అర్హులని స్పష్టం చేశారు. ఆసక్తి గల విద్యార్థినులు జూలై 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోపు సంబంధిత కేజీవీబీల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ప్రవేశ పరీక్షను జూలై 12న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కేజీబీవీలో విద్యార్థినులకు అవగాహనచిల్పూరు: వసతి గృహాల్లో ఉంటూ చదివే విద్యార్థినులు ఏదైనా సమస్య ఏర్పడితే వెంటనే 100కు డయల్ చేయాలని వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేందర్నాయక్ సూచించారు. మండలంలోని రాజవరం గ్రామ పంచాయతీ పరిధిలోని కేజీబీవీలో శుక్రవారం ఎస్సై నవీన్కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించగా డీసీపీ హాజరయ్యారు. ఈసందర్భంగా భద్రత, పలువిషయాలపై విద్యార్థినులకు అర్ధం అయ్యే రీతిలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్వో స్వప్న, 200 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. కాగా, చిల్పూరు పోలీస్ స్టేషన్ను డీసీపీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. 5న విరసం ఆవిర్భావ సభజనగామ రూరల్: దేశంలో ప్రజా ఉద్యమాలపై అమలవుతున్న ఫాసిస్ట్ నిర్బంధం, అణిచివేతకు వ్యతిరేకంగా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో పోరాటం కొనసాగింపుగా జూలై 5న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విప్లవ రచయితల సంఘం ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా విర సం కన్వీనర్ కోడం కుమారస్వామి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ..దేశంలో ఫాసిజం ప్రత్యేకతలు, అంశంపై కవి రివేరా, ‘బుల్డోజర్ రాజకీయాలు మతమైనారిటీల అస్తిత్వంపై దాడ్ఙి, గురించి ఎడిటర్ ఎన్.వేణుగోపాల్, ‘తెలుగు సాహిత్యంలో ఇటీవల ధోరణులు – మార్క్సిస్ట్ దృక్పథం’ అనే అంశం ప్రొఫెసర్ చింతకింది కాశీం ఉపన్యాసాలు ఉంటాయని తెలిపారు. సభలకు కవులు, రచయితలు, మేధావులు, విద్యార్థులు భారీసంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. గంజాయి, గుడుంబా నిర్మూలనకు నిరంతర నిఘాజనగామ: జిల్లాలో గంజాయి, గుడుంబా నిర్మూలనకు నిరంతరం నిఘా, ఆకస్మిక దాడులు కొనసాగుతాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి (డీపీఈఓ) నంద్యాల అంజిరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని మూడు ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధిలో ప్రత్యేక బృందాలతో నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి రవాణా, విక్రయాలు, గుడుంబా తయారీ, కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రజలు కూడా గంజాయి విక్రయాలపై అప్రమత్తంగా ఉండి సంబంధిత సమాచారం ఎకై ్సజ్ శాఖకు అందించాలని కోరారు. -
ఒకే దరఖాస్తు.. బహుళ కనెక్షన్లు
జనగామ: విద్యుత్ వినియోగదారులకు మరింత వేగవంతమైన, సులభమైన, పారదర్శక సేవలను అందించేందుకు టీజీఎన్పీడీసీఎల్ ‘బల్క్/మల్టిపుల్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్’ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్లకు అవసరమైన బహుళ విద్యుత్ కనెక్షన్లను ఒకే దరఖాస్తుతో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఇప్పటివరకు ప్రతీ విద్యుత్ కనెక్షన్కు విడివిడిగా దరఖాస్తు చేయాల్సి ఉండగా, కొత్త విధానంలో ఒకే దరఖాస్తుతో అన్ని కనెక్షన్ల ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో బిల్డర్లు, డెవలపర్లు, భవన యజమానులు, వాణిజ్య సముదాయాల నిర్వాహకులు తక్కువ సమయంలోనే విద్యుత్ కనెక్షన్లు పొందే వీలుంటుంది. కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో పాటు, దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే సౌకర్యం కూడా కల్పించారు. అపార్ట్మెంట్లు, మల్టీ స్టోర్డ్ భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్లకు అవసరమైన ఎల్టీ కేటగిరీ–1, కేటగిరీ–2 విద్యుత్ కనెక్షన్లకు ఈ విధానం వర్తిస్తుంది. మొత్తం కాంట్రాక్ట్ లోడ్ ఆధారంగా చార్జీలు నిర్ణయించబడతాయి. 20 కిలోవాట్ల వరకు డెవలప్మెంట్ చార్జీలు, సర్వీస్ లైన్ చార్జీలు వర్తించగా, 20 కిలోవాట్లకు మించి కేవలం సర్వీస్ లైన్ చార్జీలు మాత్రమే వసూలు చేస్తారు. ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న విద్యుదీకరణ నెట్వర్క్ నుంచి ఓవర్ హెడ్ లైన్లకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. అవసరమైన ట్రాన్స్ఫార్మర్ను డిస్కం అదనపు వ్యయం లేకుండానే ఏర్పాటు చేయనుంది. అప్లికేషన్ నమోదు సమయంలోనే సర్వీస్ లైన్చార్జీలను పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన పూర్తైన వెంటనే కనెక్షన్ల మంజూరు ప్రక్రియను వేగంగా పూర్తి చేయనున్నారు. వినియోగదారులు టీజీఎన్పీ డీసీఎల్ అధికారిక పోర్టల్ ద్వారా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 1912 లేదా 1800–425–0028 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని విద్యుత్ శాఖ సూచించింది.బల్క్/మల్టిపుల్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ విధానంతో అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్ లకు విద్యుత్ కనెక్షన్ల మంజూరు మరింత వేగవంతం అవుతుంది. వినియోగదారులు ఈ ఆన్లైన్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని ఒకే దరఖాస్తుతో బహుళ కనెక్షన్లు పొందాలని కోరుతున్నాం. –సంపత్రెడ్డి, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్ విద్యుత్ సేవలు మరింత సులభతరం అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్సులకు శుభవార్త -
స్నేహం పేరిట నమ్మక ద్రోహం
రవి–శిరీష దంపతులు (ఫైల్)చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన బుడిగె రవి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా పదో తరగతితోనే చదువు ఆపేశాడు. ఉన్నత చదువులకు స్వస్తి చెప్పి హైదరాబాద్కు వెళ్లి రైస్ మిల్లులో గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించాడు. ఆ రంగంలో అనుభవం వచ్చాక హైదరాబాద్లోని హయత్నగర్లో ఒక బియ్యం దుకాణం పెట్టుకున్నాడు. తర్వాత కేసముద్రం మండలం నాయక్పల్లి గ్రామానికి చెందిన శిరీషను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు. హయత్నగర్లో సొంత ఇళ్లు కొనుక్కొని పిల్ల లను చదివిస్తున్నాడు. ఆర్థిక స్వేచ్ఛ సాధించానని సంబరపడుతున్న సమయంలో రవి–శిరీష దంపతులకు కొంత మందితో స్నేహం ఏర్పడింది. అది కాస్త ఫ్యామిలీ ఫ్రెండ్షిప్లా మారింది. ఓ వ్యక్తి, అతడి భార్య.. రవి, శీరిష దంపతులను తమ వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకుంటామని మాటిచ్చారు. లాభాల ఆశజూపి రూ.15 లక్షలు తీసుకున్నారు. ఎన్ని నెలలు గడిచినా భాగస్వామ్యం ఇవ్వకపోగా.. ప్రశ్నించిన రవి దంపతులను బెదిరించారు. దీంతో తాము మోసపోయామని గ్రహించి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఘట్కేసర్ బీబీనగర్ మధ్యలో ద్విచక్ర వాహనాన్ని చెట్ల పొదల్లో పెట్టి, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు వారి బంధువులు చెబుతున్నారు.అమ్మా, నాన్న లేండి.. రవి, శిరీష దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో వారి పిల్లలు తొమ్మిదేళ్ల సుశాంత్, ఆరేళ్ల విద్వాన్ష్ అనాథలయ్యారు. ‘అమ్మా, నాన్న లేండి’ అంటూ చిన్నారులు రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. తల్లిదండ్రుల మృతితో అనాథలయ్యారు. భరించలేక మనస్తాపంతో దంపతుల బలవన్మరణం వ్యాపారం కోసం రూ.15 లక్షలు తీసుకొని మోసం అనాథలైన వారి ఇద్దరు కుమారులు చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో విషాదం -
ఇలా ఉంటే..బడికి ఎలా వచ్చేది?
జనగామ రూరల్: మండలంలోని ఎల్లంల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల అధ్వానంగా ఉంది. పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెపుతున్నా ఇక్కడ అందుకు విరుద్ధంగా ఉంది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉండగా మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. పాఠశాల మైదానంలో పిచ్చిమొక్కలు పాములు వచ్చే అవకాశం ఉంది. దీంతో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి విద్యార్థులు, తల్లిదండ్రులు తెలియజేసినప్పటికి ఫలితం లేదని, ఇప్పటికై నా అధికారులు స్పందించి పాఠశాల అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నారు.ఇంటర్వ్యూలు షురూ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని పార్ట్టైం అధ్యాపకుల నియమాకాలకు ఇంటర్వ్యూలు శుక్రవారం ప్రారంభించారు. తొలిరోజు లా, సొషియాలజీ, సైకాలజీ, లైబ్రరీ సైన్స్ విభాగాల్లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరిగాయి. డెమోలు నిర్వహించారు. ఈ ప్రక్రియను కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం పర్యవేక్షించారు. ఈ ఇంటర్వ్యూల ప్రక్రియ రోజుకు పలు విభాగాల్లో ఈనెల 8వ తేదీ వరకు కొనసాగనుంది. -
సమస్యలున్నయ్ ‘సర్’
జనగామ: జిల్లాలో ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం వేగంగా కొనసాగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ప్రక్రియను ప్రభావితం చేస్తున్నాయి. బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఫారాలు పంపిణీ చేస్తున్నా, వాటిని ఎలా నింపాలి? ఏ వివరాలు నమోదు చేయాలి? అనే విషయంపై ఓటర్లకు పూర్తి అవగాహన లేకపోవడంతో నిరక్షరాస్యులు, వృద్ధులు, గిరిజన తండాల ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. ఫారాలు అందించిన తర్వాత వాటిని నింపే విధానంపై సరైన సూచనలు ఇచ్చేవారు లేరు. బీఎల్ఓలే స్వయంగా ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తుండగా, రైతులు, వ్యవసాయ కూలీలు ఖరీఫ్ పనుల్లో నిమగ్నమై ఉండడంతో ఫారాలు తిరిగి ఇవ్వడంలో జాప్యం కనిపిస్తోంది. వలస వెళ్లిన వారు, అందుబాటులో లేని ఓటర్ల కారణంగా సేకరణ ఆలస్యమవుతోంది. కష్టంగా వివరాల నమోదు అన్ని మండలాల్లోనూ ప్రధానంగా 2002 నాటి ఓటరు జాబితా వివరాలు నమోదు చేయడమే పెద్ద సమస్యగా మారింది. పాత ఓటరు జాబితాలు అందుబాటులో లేకపోవడం, ఎన్వీఎస్పీ యాప్లో కొందరి పేర్లు కనిపించకపోవడం, అప్పటి నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం వివరాలు గుర్తించడం కష్టంగా మారింది. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం ఎంపికలో కూడా చాలామంది అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు బీఎల్ఓలు రోజంతా వందలాది ఫోన్కాల్స్కు సమాధానాలు చెప్పాల్సి రావడం అదే సమయంలో ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాల్సి రావడంతో పనిభారం పెరిగింది. అధికారులు లక్ష్యాలు పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకురావడంతో బీఎల్ఓలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. కొన్ని మండలాల్లో బీఎల్ఓలే స్వయంగా ఫారాలు నింపి నిరక్షరాస్యులకు సహకరిస్తుండగా, చదువుకున్న యువకులు, విద్యార్థులు, రాజకీయ పార్టీలు కూడా తెలియని ఓటర్లకు అండగా నిలుస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగాలంటే విస్త్రృత అవగాహన కార్యక్రమాలు, పాత ఓటరు జాబితాల సులభ లభ్యత, సాంకేతిక సమస్యల పరిష్కారం అవసరం. ఎస్ఐఆర్ ప్రక్రియకు క్షేత్రస్థాయిలో పరీక్ష ఫారం నింపడంలో ఇబ్బందులు నిరక్షరాస్యులు, వృద్ధులు, గ్రామీణులకు కష్టమే బీఎల్ఓలనే ఫారం నింపాలంటూ వేడుకోలు ఫారంల పంపిణీ, ఆన్లైన్ పనులతో బీఎల్ఓల సతమతంజిల్లాలో ఓటర్ల మ్యాపింగ్, ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్నియోజకవర్గం మ్యాపింగ్ డిజిటలైజేషన్ ఫారాలు పంపిణీ జనగామ 92.24 2,836 2,49,437 2,20,588స్టే.ఘన్పూర్ 93.81 5,661 2,56,806 2,39,396పాలకుర్తి 94.18 9,681 2,61,241 2,17,710 పిట్టలోనిగూడెంలో 80 మందికి పైగా ఇదే పరిస్థితి -
మాకు దిక్కెవరు?
‘అమ్మానాన్న.. మమ్మల్ని స్కూల్కు ఎవరు పంపిస్తారు? కొసరి.. కొసరి గోరుముద్దలెవరు తినిపిస్తారు? తమ్ముడిని, నన్ను అనాథల్ని చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు మాకు దిక్కెవరు’ అంటూ రవి, శిరీష దంపతుల కుమారులు సుశాంత్, విద్వాన్ష్ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కాగా, వ్యాపారం కోసం ఇచ్చిన డబ్బులు వసూల్ చేయడానికి పడుతున్న ఇబ్బందుల వల్ల ఇద్దరు భార్యాభర్తలు 20 రోజులుగా ఇంట్లో గొడవ పడుతున్నారని, కనీసం తిండి కూడా సక్రమంగా తినట్లేదని ఇరుగుపొరుగు వారు తెలిపినట్లు మృతుడి బంధువులు చర్చించుకుంటున్నారు. -
డీఎఫ్ఓ ముకుందరెడ్డి బాధ్యతల స్వీకరణ
న్యూశాయంపేట : హనుమకొండ, జనగామ జిల్లాల అటవీశాఖాధికారిగా జి.ముకుందరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను హనుమకొండ రేంజ్ అధికారులు టి.శ్రీనివాస్, జె.శిరీష, కాకతీయ జూపార్క్ అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి, పరిపాలన అధికారి పి.మంజుల, సిబ్బంది రాజు తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. రూ.13 లక్షలతో తూము, మత్తడి మరమ్మతు రఘునాథపల్లి: మండలంలోని ఇబ్రహీంపూర్ పెద్ద చెరువును నీటి పారుదల శాఖ ఎస్ఈ సీతారాంనాయక్ గురువారం సందర్శించారు. మాజీ జెడ్పీటీసీ, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్చందర్రెడ్డి, సర్పంచ్ పోకల శ్రీనివాస్, రైతులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో చెరువును పరిశీలించారు. తూము వద్ద లికేజీలు ఎక్కడ ఉన్నాయో పరిశీలించారు. తూము మరమ్మతు, మత్తడి వద్ద దెబ్బతిన్న భాగాల పునరుద్ధరణ, కట్టపై చెట్ల తొలగింపు, కట్టలపై గుంతల మరమ్మతు కోసం రూ.13లక్షలు మంజూరైనట్లు త్వరలో పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఆలయానికి రూ.20లక్షల విరాళం బచ్చన్నపేట : మండలంలోని రామచంద్రాపురం గ్రామంలోని శ్రీ శివసీతారామాంజనేయస్వామి దేవాలయ పునర్నిర్మాణానికి గ్రామానికి చెందిన మారోజు సత్యనారాయణ–స్వాతి దంపతులు, వారి కుమార్తెలు హరిప్రియ, గాయత్రితో కలిసి సుమారు రూ.20 లక్షల విలువైన విరాళాన్ని గురువారం అందజేశారు. దేవాలయం కోసం టేకు ద్వారబంధాలు, రాతి ద్వారబంధాలు, టేకు తలుపులు, రాతి శేరేలు, పంచలోహ ఉత్సవ విగ్రహాలు, శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహాలతో పాటు ఆలయానికి అవసరమైన పలు సామగ్రిని సమర్పించారు. బంధుమిత్రుల సహకారంతో ఈ విరాళాన్ని అందించినట్లు దాతలు తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానంజనగామ: జిల్లా తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల (టీఎంఆర్ఎస్) జనగామ బాలుర–1, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల (టీఎంఆర్ఎస్,జేసీ) స్టేషన్ ఘన్పూర్ బాలికల–1లో 2026–27 విద్యా సంవత్సరానికి 5, 6, 8వ తరగతుల్లో ఏర్పడిన ఖాళీ సీట్ల భర్తీకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వర్గాలకు చెందిన మైనారిటీయేతర విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మురళీధర్రావు గురువారం తెలిపారు. ఖాళీలు ఇలా.. గురుకులాల్లో చేరాలనుకునే ఆసక్తి గల విద్యార్థులు కులం, ఆదాయం, విద్యా అర్హత ధ్రువపత్రాల జిరాక్స్ ప్ర తులతో కలిసి ఈనెల 6లోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు. స్టేషన్ ఘన్పూర్ బాలికల–1 గురుకులంలో 5వ తరగతిలో బీసీ–3, ఎస్సీ–3, ఓసీ–2, 6వ తరగతిలో బీసీ–1, 8వ తరగతిలో ఎస్టీ–1, ఓసీ –1 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. జనగామ బాలుర–1 గురుకులంలో 5వ తరగతిలో బీసీ–3, ఓసీ–1, 6వ తరగతిలో ఓసీ–2 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. -
‘చేనేత’ నామినేషన్లు షురూ
● మొదటిరోజు 55 దాఖలు ● 5 సొసైటీల్లో ప్రారంభంకాని నామినేషన్లు జనగామ: జిల్లాలో చేనేత సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నుంచి 12 సహకార సంఘాల పరిధిలో స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈనెల 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, 5న పరిశీలన, 6న ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా విడుదలతో పాటు ఎన్నికల గుర్తుల కేటాయింపు చేపట్టనున్నారు. అనంతరం 10వ తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. తొలి రోజు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. జిల్లాలోని ఏడు చేనేత సహకార సంఘాల్లో మొత్తం 55 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే మిగిలిన ఐదు సంఘాల పరిధిలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం గమనార్హం. 12 సంఘాలు...55 నామినేషన్లు భారత్ టీసీ జెడ్బీ హెచ్డబ్ల్యూసీఎస్, జనగామలో 2 నామినేషన్లు పడగా, ప్రాజెక్టు హెచ్డబ్ల్యూసీఎస్ జనగామలో–13, శ్రీవెంకటేశ్వర హెచ్డబ్ల్యూసీఎస్, కొత్తపల్లిలో–4, హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ గూడూరులో 15, హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ స్టేషన్ఘన్పూర్లో–9, శత్రంజి హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ కంచనపల్లి–10, శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర హెచ్డబ్ల్యూసీఎస్ సీతారాంపురం–2 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మార్కండేయ హెచ్డబ్ల్యూసీఎస్ బచ్చన్నపేట, శ్రీ సిద్ధేశ్వర సిల్క్ డబ్ల్యూసీఎస్ బచ్చన్నపేట, శ్రీ పద్మవంశీ జీహెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్, ఎల్లంల, శ్రీ శ్రీనివాస పవర్లూం, డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ వీవర్స్, కొడకండ్ల, శ్రీ భావనరుషి హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్, నీర్మాల సొసైటీల పరిధిలో ఐదు చోట్ల మొదటి రోజు ఒక్క నామినేషన్ కూడా రాలేదు. స్థానిక ఎన్నికలను తలపించే పోటీ చేనేత సంఘాల ఎన్నికలు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలను తలపించేలా మారనున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు తమ బలాన్ని నిరూపించుకునేందుకు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ప్యానెళ్ల ఏర్పాటు, అభ్యర్థుల ఎంపిక, మద్దతు కూడగట్టడం వంటి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. చేనేత సహకార సంఘాలు నూలు, ముడిసరుకు పంపిణీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ వంటి కీలక కార్యకలాపాలు నిర్వహిస్తాయి. దీంతో ఈ ఎన్నికలపై చేనేత కార్మికుల్లో ఆసక్తి నెలకొంది. పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు రామన్నపేట: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఖాళీ ఉన్న సీట్ల భర్తీకి నేడు(శుక్రవారం) దరఖాస్తుల స్వీకరణ, 4న అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్ తెలిపారు. జూలై 2 నాటికి సివిల్ ఇంజనీరింగ్లో ఒకటి, సివిల్ ఇంజినీరింగ్ (రియల్ ఎస్టేట్ అండ్ వాల్యుయేషన్)లో 21, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో 2, మెకానికల్ ఇంజినీరింగ్లో 35 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. -
ఈవీ బస్సు.. భద్రత తుస్సు
హన్మకొండ: విద్యుత్ బస్సులపై భ్రమలు వీడుతున్నాయి. తరచూ జరుగుతున్న అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు విద్యుత్ బస్సులను మొదటినుంచీ వ్యతిరేకిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణ కోసమంటూ ఈవీ బస్సులను ప్రవేశపెట్టింది. బస్సుల్లో అగ్నిప్రమాదాలు జరుగుతుండడంతో ఆర్టీసీ యాజమాన్యం ఆలోచనలో పడింది. ప్రయాణికుల భద్రతకు భరోసా లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను నిలిపేసింది. ఇటీవల కరీంనగర్లో 15 రోజుల వ్యవధిలో రెండు బస్సుల్లో మంటలు లేచి దగ్ధమయ్యాయి. వరంగల్ రీజియన్లో వరంగల్–2 డిపోనకు 115 బస్సులు కేటాయించగా.. ఈ డిపో ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతోంది. వీటన్నింటి సేవలను నిలిపేసింది. స్పందించని జేబీఎం యాజమాన్యం వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్న జేబీఎం సంస్థకు ప్రయాణికుల భద్రతపై లేఖ రాసినట్లు సమాచారం. ప్రయాణికులకు ఎలాంటి రక్షణ కల్పిస్తారని, తరచూ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని అడిగినట్లు తెలిసింది. ఈ లేఖకు జేబీఎం యాజమాన్యంనుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా 500కు పైగా ఎలక్ట్రిక్ బస్సులు నిలిపేసింది. ఈక్రమంలో వరంగల్ రీజియన్లో 115 బస్సులు డిపోనకే పరిమితమయ్యాయి. -
చిరుజల్లులు..సాగు ఆశలు
● విత్తనాలు, ఎరువుల కోసం రైతుల దుకాణాల బాటజనగామ: వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ ఆశించిన మేర వర్షాలు కురవక జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర పంటల సాగు కొంత మందగించింది. అయితే ఇటీవల కురుస్తున్న చిరుజల్లులతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. వర్షాలు కొనసాగుతాయనే అంచనాతో రైతులు వ్యవసాయ పనులను వేగవంతం చేస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి రైతులు జిల్లా కేంద్రంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలకు పెద్ద సంఖ్యలో చేరుకుని పత్తి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తదితర వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేస్తు న్నారు. దీంతో కొన్ని రోజులుగా వెలవెలబోయిన దుకాణాలు రైతుల రద్దీతో కళకళలాడుతున్నాయి. -
పంట మారిస్తే ప్రోత్సాహకం
జనగామ: జిల్లాలో వానాకాలం సీజన్లో సాగు చేస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం–నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్) పథకం ద్వారా ఇన్పుట్ సబ్సిడీలు అందనున్నాయి. ఈ పథకం కింద డయాబెటిస్ నియంత్రణకు ఉపయోగపడే వరితో పాటు 7 రకాల చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, మొక్కజొన్న తదితర పంటలను సాగుచేస్తున్న రైతులకు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నారు. ఆత్మనిర్భర్ పప్పు దినుసుల మిషన్.. జిల్లాలో పప్పు దినుసుల ఉత్పత్తి పెంపు లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ పప్పు దినుసుల మిషన్ కింద రైతులకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ పథకం కింద జిల్లాకు మొత్తం 104 యూనిట్లు మంజూరయ్యాయి. కంది పంటల సాగును విస్తరించడంతో పాటు అధిక దిగుబడులు సాధించే లక్ష్యంతో నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించనున్నారు. ఇందులో కంది పంటకు సంబంధించి టీడీఆర్జీ–59, ఎల్ఆర్జీ–52, ఇక్రిసాట్ అభివృద్ధి చేసిన ఆశ వైరెటీ విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఎన్జీజీ 385 రకానికి చెందిన పెసర విత్తనాలను ఉచితంగా అందించారు. ఈ రకాలు తక్కువ కాలంలో పంట కోతకు వచ్చే లక్షణం కలిగి ఉండడంతో పాటు ఎండు పరిస్థితులు, ప్రధాన తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. దీంతో రైతులకు అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం లభించే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఈ విత్తనాలతో సాగు చేయాలనే ఆసక్తి ఉన్న రైతులు సంబంధిత మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పథకం ప్రయోజ నాలు అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పప్పు దినుసుల సాగు విస్తరణతో జిల్లాలో ఉత్పత్తి పెరగడంతో పాటు రైతుల ఆదాయం కూ డా మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ ఎఫ్ఎస్ఎం కింద రైతులకు ఇన్ పుట్ సబ్సిడీలు మొక్కజొన్న, పప్పు, చిరుధాన్యాల సాగుకు ఊతం డయాబెటిక్ నియంత్రణకు ఉపయోగపడే పంటలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సాగు ఖర్చు తగ్గించి దిగుబడి పెంచడమే లక్ష్యంపప్పు ధాన్యాల సాగు పెంచడమే లక్ష్యంగా.. జిల్లాలో వానాకాలం సీజన్లో సుమారు 2.13 లక్షల ఎకరాల్లో వరి, 13వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు ఉంటుందని అంచనా. క్రాప్ డైవర్షన్లో మొక్కజొన్న, పప్పుధాన్యాల సాగును కూడా ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఆర్థిక భారం తగ్గించే విధంగా ఇన్పుట్న సబ్సిడీపై పంపిణీ చేస్తారు. దీంతో సాగు ఖర్చు తగ్గడమే కాకుండా, పంట దిగుబడి, నాణ్యత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ నియంత్రణకు ఉపయోగపడే వరి, చిరుధాన్యాల సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పోషక విలువలు అధికంగా ఉండే ఈ పంటల సాగు పెరగడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించడంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులోకి వస్తుంది. -
సమన్వయంతో పనిచేయాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత వరంగల్ క్రైం: లైంగిక దాడులకు గురైన మహిళలు, చిన్నారులకు చట్టబద్ధమైన రక్షణతో పాటు వైద్య, న్యాయ, మానసిక పరామర్శ, పునరావాస సేవలు సకాలంలో అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. కమిషనరేట్ పరిధి వరంగల్, జనగామ జిల్లాలకు చెందిన భరోసా కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలు మరింత సమర్థవంతంగా కొనసాగేందుకు, సంబంధిత ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పోలీస్ కమిషనర్ సీపీ శ్వేత బాధితుల గౌరవం, గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రతీ కేసును సున్నితంగా విచారించాలని సూచించారు. కేసు నమోదు నుంచి దర్యాప్తు, వైద్య పరీక్షలు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, పునరావాసం వరకు ప్రతి దశలో ఎలాంటి జాప్యం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసుల్లో నిర్దేశిత గడువులో దర్యాప్తు పూర్తి చేసి, కోర్టులో బలమైన సాక్ష్యాధారాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో పోలీస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నాటేసిన ఎమ్మెల్యే యశస్విని
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దేవరుప్పుల మండలంలోని మాదాపురం గ్రామంలో మహిళా వ్యవసాయ కూలీలతో కలిసి వరి నాటు వేశారు. గ్రామంలో అధికారిక కార్యక్రమాలు ముగించుకుని తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో పొలంలో మహిళా కూలీలు వరి నాట్లు వేస్తుండడం గమనించిన ఎమ్మెల్యే వెంటనే వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. కొంతసేపు వారితో కలిసి స్వయంగా వరి నాట్లు వేస్తూ వ్యవసాయ పనిలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే తమతో కలిసి పొలంలోకి దిగి నాట్లు వేయడంతో మహిళా కూలీలు ఆనందం వ్యక్తం చేశారు. –పాలకుర్తి టౌన్ (దేవరుప్పుల) -
చదువే భవిష్యత్ కు పునాది
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● పాలకుర్తి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీపాలకుర్తి టౌన్: చదువే భవిష్యత్కు బలమైన పునాది అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా 8వ తరగతికి వెళ్లి ఇంగ్లిష్ పాఠ్యాంశాలను విద్యార్థులతో చదివించి విద్యార్థుల అభ్యాసన సామర్ాధ్యలు పరిశీలించారు. వసతి సౌకర్యాలు, పారిశుద్ధ్యం, మధ్యాహ్న భోజనం, సైన్స్ ల్యాబ్, వైద్య సేవలు, వంటశాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో విధ్యాశాఖ ఏడీ శ్రీనివాస్, తహసీల్దార్ సరస్వతి, ఎంపీడీఓ వేదవతి, ఎంఈఓ పోతుగంటి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ‘సర్’ను పారదర్శకతతో నిర్వహించాలి ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిస్ధాయిలో పారదర్శకతతో, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలో శాంతినగర్లో ఇంటింటి సర్వేను ఆకస్మింగా పరిశీలించిన కలెక్టర్ ఓటర్ల వివరాలను స్వయంగా ఽతెలుసుకున్నారు. బీఎల్ఓలు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పని చేయాలని, అవసరమైన సాంకేతిక శిక్షణ అందించాలని తహసీల్దార్ సరస్వతిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎండీడీఓ వేదవతి, సూపర్వైజర్లు, బీఎల్వోలు పాల్గొన్నారు. -
కలెక్టర్..లెక్కల మాస్టారు
రఘునాథపల్లి: కలెక్టర్ సందీప్కుమార్ ఝా లెక్కల మాస్టారుగా మారి విద్యార్థులకు సులభ పద్ధతిలో లెక్కలు ఎలా చేయాలో నేర్పించారు. బుధవారం మండలంలోని ఖిలాషాపూర్ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం, ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులకు సులభమైన పద్ధతిలో లెక్కలు ఎలా చేయాలో స్వయంగా వివరించారు. పఠన సామర్థ్యం, విద్యార్థులు చదివే నైపుణ్యం తెల్చుకునేందుకు వారితో ముచ్చటించారు. ప్రతీ విద్యార్థిలో ప్రాథమిక అభ్యాసన నైపుణ్యాలు పెంపొందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులు, పరిశీలించి పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం ఉండరాదన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరిశుభ్రమైన, రుచికరమైన భోజనం అందించాలని నిర్వాహకులకు ఆదేశించారు. అనంతరం కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్లను పరిశీలించారు. -
ఐఎంఏ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
జనగామ: జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో జనగామ ఐఎంఏ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఐఎంఏ జనగామ అధ్యక్షుడు డాక్టర్ జె.బాలాజీ, కార్యదర్శి డాక్టర్ ఎ.శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన శిబిరంలో వైద్యులు, సామాజిక సేవకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ వైద్య సేవలతో పాటు సామాజిక బాధ్యతను నిర్వర్తించడం ప్రతీ వైద్యుడి కర్తవ్యమన్నారు. డాక్టర్లు బాలాజీ, శ్రీకాంత్, రంజిత్, స్వప్న రాథోడ్, రజిని, విఘ్నశ్రీ, దివ్య, గోపిచంద్, సృజన్ సహా పలువురు ఐఎంఏ వైద్యులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ వైద్యులు డి.లవకుమార్ రెడ్డి, సీహెచ్ రాజమౌళి, లక్ష్మీనారాయణ నాయక్, కరుణాకర్ రాజు, సామా జిక సేవకులు కన్న పరశురాములు, తదితరులు పాల్గొన్నారు. కాగా శిబిరంలో 25 యూనిట్ల రక్తాన్ని సేకరించి జనగామ ప్రభుత్వ ఆస్పత్రి రక్తనిధికి అందించారు. -
విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలి
బచ్చన్నపేట: ఉపాధ్యాయులు బాధ్యతతో వ్యవహరించి విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర అబ్జర్వర్ సీహెచ్.వీ.ఎస్. జ నార్దన్ రావు అన్నారు. బుధవారం మండలకేంద్రంలో ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, పా ఠశాల పనితీరు, అడ్మిషన్ ప్రక్రియ, విద్యాబోధన, రికార్డులను పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చదువుకునే విద్యార్థులకు పేదరికం అడ్డుకాకూడదని అనేక రకాల సౌకర్యాలను కల్పింస్తుందన్నారు. ఉపాధ్యాయులు సరి గా పాఠాలు చెప్పకపోయినా, మెనూ ప్రకారం మ ధ్యాహ్న భోజనం లేకపోయినా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లా అబ్జర్వర్ నాగరా జు, ఎంఈఓ ఇర్రి వెంకట్రెడ్డి, ప్రిన్సిపాల్ భారతి దేవి, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యాశాఖ రాష్ట్ర అబ్జర్వర్ వీ.ఎస్. జనార్దన్రావు -
ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తా
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, ఇందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా సన్ప్రీత్సింగ్ నుంచి బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్న నూతన సీపీకి సిబ్బంది సాయుధ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా నూతన సీపీని వరంగల్ పోలీస్ కమిషనరేట్కు చెందిన డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కలు, నోట్బుక్స్ అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత మాట్లాడుతూ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కమిషనరేట్ పరిధిలోని ప్రతీ పోలీసు అధికారి, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించే విధంగా పోలీసింగ్ను సమర్థవంతంగా నిర్వహిస్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు. అమ్మవారికి సీపీ శ్వేత పూజలు హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని బుధవారం వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ శ్వేత సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, అర్చకులు ఆమెను ఘనంగా స్వాగతించారు. సీపీ శ్వేత అమ్మవారిని దర్శించుకుని పూజలు జరుపుకున్నారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. కమిషనర్ వెంట ఏసీపీ సత్యనారాయణ, సీఐ సుజాత ఉన్నారు. శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత కమిషనరేట్లో బాధ్యతల స్వీకరణ -
జర్మనీ వర్సిటీలతో కేయూ ఎంఓయూ
కేయూ క్యాంపస్: ఉన్నత విద్యాశా ఖ అధికారులు, వివిధ యూనివర్సి టీల వీసీలు, ప్రొఫెసర్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళా శాలల లెక్చరర్లు ఎడ్యుకేషన్ స్టడీ టూర్కు జర్మనీ వెళ్లారు. జర్మనీ ప ర్యటనకు వెళ్లిన బృందంలో ఉన్న కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి అక్కడ మూడు యూనివర్సిటీలతో కేయూకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. ఈమేరకు బుధవారం వివరాలను వెల్ల డించారు. ఆయా విశ్వవిద్యాలయాల అంతర్జాతీయ సంబంధాల విభాగాల అఽధిపతులతో వీసీ ప్రతాప్రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, రూసా ప్రాజెక్టు అధికారి సౌందర్యజోసెఫ్, రూసా కేయూ నోడల్ అధికారి ప్రొఫెసర్ ఆర్.మల్లికార్జున్రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎం.కుమార్ చర్చలు జరిపారు. అనంతరం ఎంఓయూ కుదుర్చుకున్నారు. జర్మనీ పర్యటనలో ఆయన ఈనెల 6 వరకు ఉండనున్నారు. -
పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
● సీపీఐ జల్లా కార్యదర్శి రాజారెడ్డి జనగామ రూరల్: పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదింటి ప్రజల ఇంటి కల నెరవేరుస్తామన్న తమ హామీని మరచి, ప్రభుత్వ స్థలాల్లోని గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకున్న పేదల ఇళ్లను రాత్రికిరాత్రే తొలగించి ప్రజలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఇల్లు లేని పేదలకు ఇంటిని నిర్మించడం ప్రభుత్వం బాధ్యతన్నారు. రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలో 30 మంది దళితులు డబుల్ బెడ్ రూమ్లో నివసిస్తున్నప్పటికీ, వారికి కరెంటు, మంచినీటి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మౌలిక వసతులు కల్పించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఆది సాయన్న, పట్టణ కార్యదర్శి సొప్పరి సోమయ్య, కావటి యాదగిరి, చెల్లోజు మల్లేశం, రావుల సదానందం, మొటే శ్రీశైలం, ఎండీ యూనస్, కందుకూరి మల్లేశం, పిట్టల కుమార్, ఐలయ్య, దయా నగేష్, మహిళా సంఘం జిల్లా అ ధ్యక్ష కార్యదర్శులు, యాదలక్ష్మి, ఎండీ నూర్నిషా, బిజిగం ఎల్లయ్య, పుప్పాల ఐలయ్య, ఎండీ యా కూబ్ పాషా, సింగరయ్య తదితరులు పాల్గొన్నారు. -
జన జీవనంలోకి జాతీయ పక్షి
జనగామ: జనగామ పట్టణంలోని సంజయ్నగర్లో జనావాసాల మధ్య చిక్కుకున్న జాతీయ పక్షి నె మలిని అటవీశాఖ అధికారులు సురక్షితంగా రక్షించి రఘునాథపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో విడిచిపెట్టారు. జనగామ అమ్మ ఫౌండేషన్ టీం సభ్యుడు ఎండీ అజిత్ నెమలి చిక్కుకున్న విషయాన్ని గుర్తించి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణికుమార్కు తెలిపారు. ఆయన అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో, జనగామ అటవీ క్షేత్రాధికా రి భాస్కర్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి నెమలికి ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా రక్షించి రఘునాథపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో విడిచిపెట్టారు. అడవి జంతువులు, పక్షులు జనావాసాల్లో కనిపించినప్పుడు తమకు సమాచారం అందించాలని అటవీశాఖ అధికారి విజ్ఞప్తి చేశారు. -
తమ్మడపల్లిలో సంపూర్ణ మద్యపాన నిషేధం
బచ్చన్నపేట: మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు సర్పంచ్ బేజాడి సిద్దులు, ఉప సర్పంచ్ గొలన్కొండ నాగారాజులు తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ గ్రామంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తూ గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక నుంచి గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ. 50 వేల జరిమానా విధిస్తామని, సమాచారం అందించిన వారికి రూ.5 వేల ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కనుకరాజు, రాజు, అబ్బసాని వేణు, బొడిగం కవిత, బేజాడి విజయ, లక్ష్మి, మధు, భవాని, నాయకులు శ్రీనివాస్రెడ్డి, రమేష్, బుచ్చిరెడ్డి పలువురు పాల్గొన్నారు. హక్కుల పరిరక్షణకు ముందుకురావాలి జనగామ: బంజారా జాతి మనుగడ, ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణకు ప్రతీ బంజారా ఐక్యంగా ముందుకు రావాలని లంబాడ హక్కుల పోరాట సమితి (ఎల్హెచ్పీఎస్) జిల్లా ఇన్చార్జ్ కొర్ర రాజేందర్ నాయక్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రం ఆర్టీసీ చౌరస్తాలో ఎల్హెచ్పీఎస్ నంగారాభేరి 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీల అమలుపై బంజారా సమాజంలో అసంతృప్తి ఉందని, ప్రజాస్వామ్యబద్ధంగా సంఘటితమై పోరాడాలని సూచించారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు వాంకుడోతు అనిత మాట్లాడుతూ తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఎల్హెచ్పీఎస్ చేసిన ఉద్యమాలు ఫలించాయన్నారు. ఈ కార్యక్రమంలో నర్మెట మండల అధ్యక్షుడు ధరావత్ రాజు, రఘునాథపల్లి మండల ఇన్చార్జ్ సంతోష్, నాయకులు సురేష్, రమేష్, రాజు తదితరులు ఉన్నారు. వైటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా లక్ష్మీనారాయణజనగామ: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి (వైటీడీ) ప్రభుత్వం తొలిసారిగా 18 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసింది. రెండేళ్ల పదవీకాలం ఉన్న ఈ తొలి పాలక మండలిలో జనగామ జిల్లాకు చెందిన టీపీసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్కు చోటు దక్కింది. మండల స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ క్రమంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీకి సేవలందిస్తూ టీపీసీసీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ పట్ల నిబద్ధత, ప్రజా సమస్యలపై చురుకై న వైఖరి, నాయకత్వ లక్షణాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వ ం ఆయనకు ఈ అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి వైటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దేవస్థానం ప్రతిష్టను మరింత పెంచే దిశగా నావంతు బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తానన్నారు. దరఖాస్తుల గడువు పొడిగింపు జనగామ రూరల్: సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తుల గడువు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మురళీధర్రావు బుధవారం ఒకప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అల్ప సంఖ్యాక వర్గాల (ముస్లిం, మైనార్టీ, బౌద్ధులు, సిక్కులు) వారు విదేశాల్లో చదువుకునేందుకు అర్హత గల అభ్యర్థులు ఈనెల 15వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9951933034, 9346951278 నంబర్లలో సంప్రదించవ్చన్నారు. అంబేడ్కర్ ఓవర్సీస్కు.. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద విదేశాల్లో ఉన్నత చదువులకు అందించే ఆర్థిక సాయం కోసం అర్హత, ఆసక్తి గల ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి బి.విక్రమ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా ఎస్సీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
రూపు మారిన ‘ఉపాధి’
లింగాలఘణపురం: రాష్ట్రంలో సుధీర్ఘకాలంగా కొనసాగిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రూపు మారింది. దీనిస్థానంలో కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్ జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ –గ్రామీణ్) పేరుతో పథకాన్ని అమలుచేస్తుంది. ఇక నుంచి ఈ పథకంలో చేపట్టే పనులకు కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పని దినాలను కూడా వంద నుంచి 125 రోజులకు పెంచారు. వామపక్ష పార్టీల పోరాటం వృథా యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం (పథకం) నుంచి కేంద్ర ప్రభుత్వం క్రమంగా తప్పుకొనేందుకు పేరు మార్చి భవిష్యత్లో కూలీలకు పనులు కల్పించకుండా పోతుందని వామపక్ష పార్టీలు చేపట్టిన పోరాటం వృథా అయింది. జూలై 1 నుంచి పోర్టల్ మార్పు చేశారు. కూలీల మస్టర్లను కూడా ఆన్లైన్లో నమోదు చేశారు. జిల్లాలో 1,16,639 జాబ్ కార్డులు జిల్లాలో 280 గ్రామ పంచాయతీలు ఉండగా 1,16,639 మంది జాబ్ కార్డు కలిగిన కూలీలు ఉండగా అందులో 2,26,704 మంది కూలీలు ఉన్నారు. రెగ్యులర్గా కూలీ పనికి వెళ్లే వారు 1,18,893 ఉన్నారు. వీరంతా ఇక నుంచి వీబీజీ రామ్ జీ పథకం పేరుతో పని చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా కూలీలకు మాత్రం ఉపాధి హామీ (కరువు పని) అనే తప్ప పేరు మార్చిన విషయంపై ఏమీ తెలియడంలేదు. రోజు తాము పనికి వెళ్లడం, ఫొటోలు దిగడమే తప్ప ఉపాధి హామీ చట్టం మార్పుపై ఏ మాత్రం అవగాహన లేదు. భవిష్యత్లో కూలీ డబ్బుల చెల్లింపు, పనుల కొరత ఏర్పడితే తప్ప తెలిసే పరిస్థితి లేదు. ఉపాధి కూలీల వివరాలు ఇక నుంచి వీబీ జీ రామ్ జీగా అమలు నూతన పోర్టల్లో పనుల ఎంట్రీజాబ్కార్డులు : 1,16,639కూలీల సంఖ్య : 2,26,704యాక్టివ్ కూలీలు : 1,18,893 గ్రామాలు : 280పనికి వెళ్లడం తప్ప.. మాకేం తెల్వదుకరువు పనికి వెళ్లడం తప్ప ఉపాధి హామీ చట్టం, వీబీజీ రామ్ జీ పేరు మాకు తెల్వదు. కూలీ పనికి వెళ్లి ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకొనే ఫొటోలే గాని మాకు కొత్త పేరు.. దాంతో వచ్చే నష్టాలు, లాభాలు ఏమీ తెల్వదు. – బెజ్జం స్వప్న, లింగాలఘణపురం -
అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు
● ఇరిగేషన్ డీఈ అరుణ్జ్యోతి రఘునాథపల్లి: మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామ పెద్ద చెరువును ఇరిగేషన్ డీఈ అరుణ్జ్యోతి బుధవారం ఏఈ సింధుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువు పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు అక్రమ నిర్మాణాలపై అగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిటి హాల్, పెద్దమ్మగుడి, కొన్ని నివాస గృహాల నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవని, అవి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయన్నారు. అనంతరం డీఈ మాట్లాడుతూ చెరువు పరిధిలో ఎవరికై న పట్టా భూములు ఉంటే సాగు చేసుకొని జీవనం కొనసాగించాలే తప్ప, శాశ్వత నిర్మాణాలు చేపడితే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా చెరువు మత్తడి, తూము మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.13 లక్షలు మంజూరు చేసిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పోకల శ్రీనివాస్, ఉప సర్పంచ్ చింత నరేష్, కారోబార్ యూసఫ్, పండుగ నవీన్, నూనె మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
పాపం పసివాళ్లు!
వరంగల్ క్రైం: కాపాడాల్సిన వారే కాటేస్తున్నారు. కంటికి రెప్పలా ఉండాల్సిన వారే కామాంధులవుతున్నారు. బుడిబుడి అడుగులేస్తున్న వారి నుంచి మొదలు.. స్కూలు, కాలేజీకి వెళ్లే వాళ్లే వారి దాకా అడుగడుగునా లైంగిక వేధింపులు. అఘాయిత్యాలు. చట్టాలు ఎంత కఠినతరం చేసినా చిన్నారులపై పైశాచికత్వం ఆగట్లేదు. ఇలాంటి హృదయ విదారక ఘటనలు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిత్యం వెలుగుచూస్తున్నాయి. కామాంధుల వికృత చేష్టలను తల్లిదండ్రులు, పిల్లలు సైతం గుర్తించలేకపోతున్నారు. పెరుగుతున్న కేసులు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ప్రతియేటా పోక్సో, రేప్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీస్స్టేషన్ వరకు రాని ఘటనలు ఎన్నో ఉన్నాయి. విషయం బయటకు తెలిస్తే అమ్మాయి జీవితం నాశనం అవుతుందని కొందరు తల్లిదండ్రులు.. తండ్రి, తాత, బాబాయ్, ఇలా అయిన వారి నుంచే ప్రమాదం వస్తోందని కుమిలిపోయే చిన్నారులు మరికొందరు. గ్రేటర్ వరంగల్ నగరంలో అనేకం. పోక్సో కేసుల నమోదుపై అవగాహన పెరగడం వల్ల ఫిర్యాదు చేయడానికి తలిదండ్రులు ముందుకు రావడంతో కొంతలో కొంతైన బాధితులకు న్యాయం జరుగుతోంది. భరోసా కేంద్రం బాధితులను అక్కున చేర్చుకోని ఓదార్చుతోంది. ‘భరోసా’ఇస్తూ.. కమిషనరేట్లోని ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో పోక్సో కేసులు వేగంగా నమోదు కావడంతో బాధితులు భరోసా కేంద్రానికి వస్తున్నారు. బాధితులకు కావాల్సిన అన్ని రకాల సేవలను భరోసా కేంద్రం అందిస్తోంది. తక్షణమే వైద్య పరీక్షలు చేయించడంతో పాటు నిందితులకు శిక్ష పడే వరకు అన్ని రకాలా అండగా నిలుస్తోంది. కమిషనరేట్ పరిధిలో 2022 నుంచి ఇప్పటి వరకు 45 మందికి శిక్ష పడింది. ఇందులో ఇద్దరికి జీవిత ఖైదు పడగా.. మరికొంత మంది 20 ఏళ్లు జైలు శిక్ష పడింది. జిల్లా మహిళా సంక్షేమ అధికారి నుంచి 587 మంది బాధితులకు రూ.1.84 కోట్ల ఆర్థికసాయం అందింది. జిల్లా న్యాయ సేవా సంస్థ నుంచి 11 మంది బాధితులకు రూ.19.78 లక్షలు ఆర్థిక సాయం అందింది. విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ కింద 87 మంది బాధితులకు రూ. 5.64 లక్షలు అందాయి. భరోసా కేంద్రంలో సత్వర సాయం అందడం వల్ల బాధితులు కొంత ఉపశమనం పొందుతున్నారు. కమిషనరేట్ పరిధిలో మరికొన్ని ఘటనలు.. ● పక్కింట్లో జామకాయలు తెచ్చుకునేందుకు వెళ్లిన 12 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఎవరికై నా చెబితే చంపుతానంటూ బెదిరించాడు. తండ్రి లేని చిన్నారి భయంతో తనకు జరిగిన అన్యాయాన్ని ఎవ్వరికి చెప్పుకోలేదు. దీన్ని అదనుగా తీసుకుని పలుమార్లు బలవంతంగా ఆత్యాచారానికి పాల్పడడంతో చిన్నారి గర్భం దాల్చింది. అనారోగ్యానికి గురవడంతో వైద్యులు పరీక్షించి తల్లికి విషయం చెప్పా రు. తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది. కోర్టు కామాంధునికి జీవిత ఖైదు విధించింది. ● మానసికంగా బలహీనురాలైన 16 ఏళ్ల బాలికను వరుసకు చిన్నాన్న ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అఘాయిత్యం చేశాడు. ఆటోలో ఎక్కించుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడి వదిలేయడంతో ఎక్కడికెళ్లాలో తెలియక నరకం చూసింది. విషయం తల్లికి తెలియడంతో అతడిని జైల్లో పెట్టారు. ● తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో అక్క ఇంట్లో తలదాచుకున్న 15 ఏళ్ల అమ్మాయిపై బావ తమ్ముడు బెదిరింపులకు పాల్పడి అత్యాచారం చేశాడు. అక్క ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది. నిందితుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కమిషనరేట్లో పోక్సో, రేప్ కేసుల నమోదు ఇలా..పోక్సో కేసులురేప్ కేసులు19613661541086069305220242022202620232024కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న పోక్సో కేసులు అభంశుభం తెలియని చిన్నారులపై పైశాచికత్వం శిక్షలు పడుతున్నా తగ్గని నేరాలు బాధితులకు అండగా భరోసా కేంద్రం కమిషనరేట్ పరిధిలో తాగిన మైకంలో 12 ఏళ్ల బాలికపై కన్నతండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. పలుమార్లు కడుపున పుట్టిన బిడ్డపై అత్యాచారం చేయడం చూసిన తల్లి ఫిర్యాదు మేరకు కామాంధుడిపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. కోర్టు సుమారు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. -
‘సర్’ను పారదర్శకంగా నిర్వహించాలి
పాలకుర్తి టౌన్(దేవరుప్పుల): ఎస్ఐఆర్ (సర్) ప్రక్రియను పారదర్శకంగా, క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. దేవరుప్పుల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను మంగళవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఆయనతో తహసీల్దార్ అహ్మద్, ఇతర సంబంధిత అధికారులు, బూత్ లెవల్ అధికారులు ఉన్నారు. తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలి ఉన్నత ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా విద్యార్థులకు సూచించారు. దేవరుప్పుల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యాబోధన, వసతి, ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలను సమగ్రంగా పరిశీలించారు. పదో తరగతిలో అన్అకాడమీ ఉచిత డిజిటల్ తరగతులను కలెక్టర్ ప్రారంభించి, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతీ విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 6వ, 8వ, 9వ తరగతుల గదులను సందర్శించి, విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. బడిబాట లక్ష్య సాధనకు సమష్టి కృషి చేయాలి జనగామ రూరల్: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల నమోదు శాతాన్ని మరింత పెంచేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్, విద్యాశాఖ అధికారి సందీప్ కుమార్ ఝా సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో బడి బాట, అకడమిక్ ఫ్రేంవర్క్, అసెస్మెంట్ టూల్ కిట్, ఫాస్ట్ మ్యాథ్స్, తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 7,733 మంది విద్యార్థులు కొత్తగా నమోదు కావ డం సంతోషమన్నారు. ఫాస్ట్ మ్యాథ్స్ పుస్తకాలను ఉపాధ్యాయులు చదివి, అవగాహన పెంచుకొని, విద్యార్థులకు సులభంగా బోధించే విధంగా సిద్ధం కావాలని సూచించారు. విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియా బేగం,ఎంఈఓలు, పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధికి సీఈఓ విశిష్ట సేవలు జెడ్పీ సీఈఓ బి.రంగారావు జిల్లా అభివృద్ధికి ప్రజలకు అంకితభావంతో విశిష్ట సేవలు అందించారని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సీఈఓ పదవీ విరమణ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవలో క్రమశిక్షణ, ప్రజల విశ్వాసాన్ని సంపాదించడం ప్రతి ఉద్యోగి జీవితంలో అత్యంత గొప్ప విజయమని తెలిపారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
దివ్యాంగుడి కుటుంబానికి కలెక్టర్ అండ
జనగామ: జీవితంలో కష్టాలు వెంటాడుతున్న ఓ దివ్యాంగుడి కుటుంబానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అండగా నిలిచారు. జీవనోపాధి కోసం సహాయం కోరుతూ వచ్చిన వారి వినతిని సానుకూలంగా పరిశీలించిన కలెక్టర్, కుటుంబానికి శాశ్వత ఉపాధి కల్పించేలా టాటా ఏస్ వాహనాన్ని మంజూరు చేయించారు. ఇందుకోసం రూ.4 లక్షల విలువైన చెక్కును మంగళవారం కలెక్టరేట్లో పర్శ సాయి తల్లిదండ్రులు లక్ష్మి, సాయి మల్లయ్యకు అందజేశారు. పట్టణానికి చెందిన అంగవైకల్యంతో బాధపడుతున్న పర్శ సాయి కుటుంబం తమ ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ జీవనోపాధి కోసం ఇటీవల కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించింది. వారి పరిస్థితిని తెలుసుకున్న కలెక్టర్ ఆలస్యం చేయకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసి టాటా ఏస్ వాహనం మంజూరుకు చర్యలు తీసుకోవడం విశేషం. ఈ సం దర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అసలు లక్ష్యం పేదల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడమేనన్నారు. కలెక్టర్ అందించిన సాయంపై పర్శసాయి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. డీఎఫ్ఓగా ముకుందరెడ్డి జనగామ: ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కార్యాలయంలో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డీఎఫ్ఓ (విజిలెన్న్స్–1)గా విధులు నిర్వహిస్తున్న జి.ముకుందరెడ్డి (ఐఎఫ్ఎస్–2017)కి పదోన్నతి కల్పిస్తూ హనుమకొండ–జనగామ జిల్లా అటవీ అధికారి(డీఎఫ్ఓ)గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు హనుమకొండ–జనగామ డీఎఫ్ఓగా పనిచేస్తున్న లావణ్యను మహబూ బాబాద్ జిల్లా అటవీ అధికారిగా బదిలీ చేశారు. ఆమె స్థానంలో జి.ముకుందరెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. బదిలీలు, పోస్టింగ్లు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. డీడీఎన్ రాష్ట్ర కమిటీలో జిల్లా నుంచి ముగ్గురికి చోటు జనగామ: ధూప దీప నైవేద్య అర్చక సంఘ(డీడీఎన్) రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా జిల్లా నుంచి ముగ్గురికి చోటు దక్కింది. మంగళవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ఎన్నిక ప్రక్రియ జరిగింది. రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ములుగు రాజలింగ ఆరాధ్య, అధికార ప్రతినిధిగా గంగు శ్రవణ్ కుమార్ శర్మ, కార్యవర్గ సభ్యుడిగా పాగాల సంతోష్ కుమార్ ఎన్నికయ్యారు. తక్కువ విస్తీర్ణం నమోదు చేసి ట్రేడ్ లైసెన్స్ జనగామ: పట్టణానికి చెందిన రచ్చ రాజశేఖర్ అనే వ్యాపారి ట్రేడ్ లైసెన్స్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో వ్యాపార సంస్థ విస్తీర్ణాన్ని వాస్తవానికి కంటే తక్కువగా నమోదు చేసి లైసెన్స్ పొందినట్లు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి మంగళవారం తెలిపారు. మున్సిపల్ సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో దరఖాస్తులో నమోదైన వివరాలు, వాస్తవ విస్తీర్ణం మధ్య వ్యత్యాసం ఉన్నట్లు తేలినట్లు స్పష్టం చేశారు. దీంతో ట్రేడ్ లైసెన్స్ పోర్టల్లో తప్పు వివరాలు నమోదు చేసినందుకు నిబంధనల ప్రకారం 25 రెట్లు పెనాల్టీ విధించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ మేరకు సంబంధిత వ్యక్తి నుంచి రూ.63,250 జరిమానా వసూలు చేసినట్లు వెల్లడించారు. ట్రేడ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసే వ్యాపారులు తప్పనిసరిగా సరైన వివరాలనే నమోదు చేయాలని, తప్పుడు సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పురపాలిక షెట్టర్ల అద్దె చెల్లించాలి పురపాలిక షెట్టర్ల అద్దెను బకాయిదారులు వెంటనే చెల్లించాలని కమిషనర్ రాజశేఖర్రెడ్డి సూచించారు. మున్సిపల్ పరిధిలో ఉన్న షెట్టర్లను ఆయన తనిఖీ చేశారు. మున్సిపల్ నిబంధనలను అనుసరించి అద్దెలు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని సూచించారు. -
మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
● జిల్లా ఆస్పత్రి అభివృద్ధికి కొత్త కమిటీ ● నేడు కలెక్టరేట్లో తొలి సమావేశంజనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అభివృద్ధి, వైద్యసేవల నాణ్యత పెంపు, మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ (హెచ్డీఎస్) కమిటీని ఏర్పాటు చేసింది. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చైర్మన్గా వ్యవహరించనున్న ఈ కమిటీ తొలి సమావేశం నేడు(బుధవారం)కలెక్టరేట్ సమావేశం హాల్లో జరగనుంది. కమిటీలో వీరే కమిటీలో జిల్లా పరిషత్ సీఈఓ, వైస్ చైర్మన్గా బి.రంగారావు, వైద్యవిద్య అదనపు సంచాలకుడు డాక్టర్ ఎ.నరేంద్ర కుమార్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మె ల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సభ్యులుగా కొనసాగనున్నారు. అదనంగా మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మల్లికార్జున్రావు, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఆస్పత్రి సీనియర్ వైద్యులు, ప్రొఫెసర్లు, ఇండియన్ మెడిక ల్ అసోసియేషన్ ప్రతినిధులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, కాకతీయ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రతినిధులు కమిటీలో ఉన్నారు. ఆస్పత్రి అదనపు డీఎంఈ, సూపరింటెండెంట్ డాక్టర్ వి.రాజలింగం కమిటీ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తొలి సమావేశం తొలి సమావేశంలో ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవలు, అవసరమైన మందుల లభ్యత, ఆధునిక వైద్య పరికరాల సమీకరణ, అదనపు వైద్య సిబ్బంది అవసరం, పరిశుభ్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, భవనాల నిర్వహణ, అత్యవసర వైద్య సేవల బలోపేతం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
కొనుగోళ్లలో కొత్త చరిత్ర
బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026దండిగా ధాన్యం..జనగామ: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జిల్లా మరోసారి తన ప్రత్యేకత చాటుకుంది. 2025–26 యాసంగి సీజన్న్లో జిల్లాలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా 2లక్షల49మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. మొత్తం 36,056 మంది రైతులు తమ పంటను ప్రభుత్వానికి విక్రయించగా, వారికి రూ.575.36 కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మరో రూ.20.56 కోట్ల చెల్లింపులు త్వరలో విడుదల కానున్నాయి. జిల్లాలో వరి సాగు 2లక్షల విస్తీర్ణం పెరగడం, అనుకూల వాతావర ణం, ఆశించిన దిగుబడులు రావడం, కొనుగోలు కేంద్రాలను ముందుగానే ఏర్పాటు చేయడం వంటి కారణాలతో ఈసారి కొనుగోళ్లు రికార్డు స్థాయికి చేరాయి. కలెక్టర్ ప్రత్యేక చొరవ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు కలెక్టర్ సందీప్ కుమార్ ప్రత్యేక పర్యవేక్షణతో సజావుగా సాగాయి. కొనుగోలు కేంద్రాలను నిత్యం పరిశీలిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకునేలా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షాల సమయంలో ధాన్యం తడిసిపోకుండా తక్షణ చర్యలు చేపట్టడంతో పాటు, తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేసి రైస్మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. రైతులు కేంద్రాల వద్ద ఎక్కువ రోజులు నిరీక్షించకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేశారు. 373 కొనుగోలు కేంద్రాలు ఈ యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా సన్న, దొడ్డురకం కలిపి 373 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో దొడ్డు రకాల ధాన్యం కోసం 234 కేంద్రాలు, సన్న రకాల ధాన్యం కోసం 139 కేంద్రాలు పనిచేశాయి.ప్రతీ సీజన్ లో పెరిగిన కొనుగోళ్లు 2024–25 వానాకాలంలో 21,992 మంది రైతుల నుంచి 91,043.120 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.211.21 కోట్లను చెల్లించారు. అదే ఏడాది యాసంగిలో 29,672 మంది రైతుల నుంచి 1,66,707.760 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.386.66 కోట్లను జమ చేశారు. అనంతరం 2025–26(ప్రస్తుతం) యాసంగిలో కొనుగోళ్లు మరో స్థాయికి చేరుకుని 2.49 లక్షల మెట్రిక్ టన్నుల మార్కును దాటాయి. గత యాసంగితో పోలిస్తే సుమారు 82వేల737 మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం కొనుగోలు కావడం జిల్లాలో వరి ఉత్పత్తి పెరుగుదలకు నిదర్శనంగా నిలిచింది. మూడు సీజన్లలో భారీ కొనుగోళ్లు 2024–25 వానాకాలం నుంచి 2025–26 యాసంగి వరకు జిల్లాలో మొత్తం 5,07,195.850 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 87,720 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇందుకు రూ.1,173.23 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ధాన్యం కొనుగోలు విధానం, కేంద్రాల సమర్థ నిర్వహణ, వేగవంతమైన చెల్లింపులతో జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో నిలిచింది. రికార్డు స్థాయిలో 2.49 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ గత యాసంగితో పోలిస్తే 82,737 మెట్రిక్ టన్నులు అదనం 36,056 మంది రైతుల నుంచి కొనుగోలు రూ.575.36 కోట్ల చెల్లింపులు కలెక్టర్ ప్రత్యేక చొరవ.. పెరిగిన కొనుగోళ్లు -
నేటినుంచి ’జీ రామ్ జీ’
జనగామ రూరల్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారనుంది. దీని స్థానంలో నూతన మార్పులతో వీబీ జీ రామ్ జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్– గ్రామీణ్) పథకాన్ని కేంద్రం అమలు చేయనుంది. జూలై 1వ తేదీ నుంచి ఈ పథకం అధికారికంగా అమలులోకి రానుంది. ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు అందడంతో కేటాయించిన పాత లక్ష్యాన్ని 100 శాతం పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ పనులు సాగాయి. జూన్లో వర్షాలు కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ కూలీలు పనులకు హాజరవుతూనే ఉన్నారు. నూతన మార్పులు ఇలా.. ● నూతన చట్టం ప్రకారం పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. ● గతంలో కేంద్రం 100 శాతం నిధులు కేటాయించేది. ప్రస్తుతం కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులను భరించాల్సి ఉంటుంది. దీనివల్ల రాష్ట్రంపై అదనపు భారం పడనుంది. ● గతంలో 263 రకాల పనులకు మాత్రమే అనుమతి ఉండగా, నూతన పథకంలో ఆ సంఖ్యను 318కి పెంచారు. ● గతంలో నీటిపారుదల శాఖ ఆధీనంలో ఉండే చెరువుల పూడికతీత పనులను ఉపాధి హామీ కింద చేసేవారు. ఇకపై ఆ నిర్వహణ ఖర్చులను నీటిపారుదల శాఖే భరించాల్సి ఉంటుంది. ● గ్రామాల అంతర్గరోడ్డు, వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే రహదారులు, చెట్ల పెంపకం, భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ● భౌతికంగా కనబడే పనులైన అంగన్వాడీ, జీపీ భవనాలు, పాఠశాల ప్రహరీలు, చెక్డ్యాంల నిర్మాణాలు, సీసీ రోడ్లు, మురుగు కాలువల వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. నూతన మార్పులతో అమలు కానున్న ఉపాధి హామీ పనులు 100 రోజుల నుంచి 125లకు పెంపు పనుల సంఖ్య 318కి పెంచిన కేంద్రం జిల్లా వ్యాప్తంగా 1,16,127జాబ్ కార్డులుఅమలుకు సిద్ధం జూలై 1 నుంచి వీబీ జీ రామ్ జీ పథకం అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఉన్నతాధికారులతో పాటు కలెక్టర్ తగిన సూచనలు చేశారు. పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అందుకు అనుగుణంగా సిబ్బందిని సిద్ధంగా ఉంచి గ్రామాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. –భాస్కర్, డీఆర్డీఓ -
నేడు ఘన్పూర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
స్టేషన్ఘన్పూర్: మున్సిపాలిటీ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని నేడు(బుధవారం) నిర్వహించనుండగా పలు అంశాలపై చర్చించేందుకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు సన్నద్ధం అవుతున్నారు. గతంలో జరిగిన జనరల్ బాడీ సమావేశాల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లకు సరైన అవకాశం ఇవ్వకపోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సారి ఎలాగైనా మున్సిపల్ నిధులు, ఖర్చులు, జరుగుతున్న పనులు తదితర అంశాలపై చర్చించాలని బీఆర్ఎస్ శ్రేణులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు సైతం చర్చించుకుంటున్నారు. సమావేశానికి ముఖ్య అతి థిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరు కానున్నారు. సమావేశం ఎజెండా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్ప్లానింగ్, ఎలక్ట్రికల్, అకౌంటెంట్ తదితర విభాగాలపై పలు అంశాలపై ఎజెండాలో చర్చించనున్నారు. శానిటేషన్ విభాగంలో 13వ వార్డులో ఉన్న పాతబావిని పూడ్చుట, మెయిన్ రోడ్డు డ్రెయినేజీలను శుభ్రం చేయుట, కుక్కలు, కోతుల నిర్మూలన, వర్షాకాలం దృష్ట్యా అత్యవసర పనులు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఘన్పూర్ శివాజీ చౌక్ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి పక్కన పబ్లిక్ టాయిలెట్స్ కోసం స్థల సేకరణ తదితర అంశాలను చర్చించనున్నారు. -
నాణ్యమైన విద్య అందించాలి
● స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిల్పూరు: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, ఏమైనా సమస్యలుంటే పరిష్కరించే బాధ్యత తనదేనని ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. మండలంలోని వెంకటేశ్వరపల్లి, తీగలతండా, రాజవరం పంచాయతీ పరిధిలోని కేజీబీవీలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈసందర్భంగా కేజీబీవీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.. మెరుగైన విద్యనందించడంలో అధికారులు, ఉపాధ్యాయులు ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, ఈవిషయంలో తాను ఏమాత్రం క్షమించనని అన్నారు. 35 మందికి సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ కిరణ్ ప్రకాశ్, చిల్పూర్ ఆలయ, మార్కెట్ కమిటీ చైర్మన్లు పొట్లపల్లి శ్రీధర్రావు, లావణ్యశిరీష్రెడ్డి, తహసీల్దార్ విజయ్కుమార్, ఎంపీడీఓ కష్ణప్రసాద్, జీసీడీఓ గౌసియా, ఉపాధి హామీ ఏపీఓ మోహన్రావు, మండల విద్యాశాఖ అధికారి దాసరి గోవర్ధన్, కేజీబీవీ ఎస్వో స్వప్న, సర్పంచ్లు పాల్గొన్నారు. -
ప్రతీ గడపకు సంక్షేమ పథకాలు చేరాలి
● ‘ప్రజాపాలన’ జిల్లా ప్రత్యేక అధికారి కమిషనర్ శ్రీదేవసేన ● 99 రోజుల కార్యాచరణ అమలుపై జిల్లా స్థాయి సమీక్ష జనగామ రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సమగ్ర అభివృద్ధికి దోహదపడిందని, ప్రతీ గడపకు సంక్షేమ పథకాలు చేరాలని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి, కాలేజియేట్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లాలో 99 రోజుల కార్యాచరణ అమలుపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా, మండల, గ్రామ స్థాయిలో వివిధ శాఖలు చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రత్యేక అధికారికి వివరించారు. అనంతరం ప్రత్యేక అధికారి శ్రీదేవసేన మాట్లాడుతూ.. ప్రజాపాలన స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిరంతర ప్రక్రియగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, గ్రామాలు, పట్టణాల్లో తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో నిరుపేద విద్యార్థులకు అందిస్తున్న అన్అకాడమీ తరగతులు పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. పాఠశాల స్థాయి నుంచే కృత్రిమ మేధపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేశామని తెలిపారు. ఫొటోల ప్రదర్శన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయాలను సూచించేలా కలెక్టరేట్లో వివిధ శాఖల అధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ జిల్లా ప్రత్యేక అధికారి దేవసేన తిలకించారు. ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం అభినందనీయమని శ్రీదేవసేన అన్నారు. ప్రజలకు మరింత చేరువ చేసేలా ఇటువంటి ఫొటో ఎగ్జిబిషన్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. -
బాట కోసం కలెక్టరేట్కు పాదయాత్ర
స్టేషన్ఘన్పూర్: వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే బాట నుంచి రైతులను వెళ్లనీయకుండా అడ్డుకుంటున్న రైతుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలంలోని ఇప్పగూడెం గ్రామానికి చెందిన వారాల రాజు అనే రైతు కలెక్టరేట్కు సోమవారం పాదయాత్ర చేపట్టారు. ముందుగా సమస్యపై ఇప్పగూడెం జీపీ కార్యాలయంలో వినతిపత్రం అందించి అక్కడి నుంచి పాదయాత్రగా స్టేషన్ఘన్పూర్ వెళ్లి తహసీల్దార్ కార్యాలయం, ఆర్డీఓ ఆఫీస్లో వినతిపత్రం అందించి కలెక్టరేట్కు బయలుదేరారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. గ్రామంలోని 23, 24 సర్వేనంబర్లలో 80 సంవత్సరాల నుంచి వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేందుకు దారి ఉందని, జిట్టెబోయిన వెంకటయ్య అనే రైతు తన స్వప్రయోజనాల కోసం ఆ దారిని అక్రమంగా మూసివేసి రైతులను వెళ్లకుండా అడ్డుకుంటున్నాడన్నారు. ఈ విషయమై కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వెళ్లి కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని, అప్పటికీ న్యా యం జరగనట్లయితే హైదరాబాద్ సెక్రటేరియట్కు వెళ్తానని స్పష్టం చేశారు. ఆయన వెంట రైతులు తోట రాజు, బక్క రాంచంద్రు, నవీన్, అనీల్, వెంకటయ్య ఉన్నారు. -
ఘన్పూర్ రిజర్వాయర్ పరిశీలన
స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ రిజర్వాయర్ను, పంప్హౌస్ను గోదావరి నదీ యాజమాన్యబోర్డు చైర్మన్ పి.దోర్జీగ్యాంబా ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల బృందం సోమవారం సందర్శించి తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా రిజర్వాయర్లోని నీటి నిల్వ పరిస్థితులు, పంప్హౌస్ పనితీరు, సాగునీటికి సంబంధించిన అంశాలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు నిర్వహణ, నీటి వినియోగం, సాంకేతిక అంశాలపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ప్రధాన ఇంజనీర్ ఆర్.సుధీర్, పర్యవేక్షణ ఇంజనీర్ బి.సీతారాంనాయక్, ఉపకార్యనిర్వహణ ఇంజనీర్ బి.సంపత్కుమార్, సహాయ ఇంజనీర్లు సారా, వినోద్, సాయితేజస్విని తదితరులు పాల్గొన్నారు. 4న చికెన్ వేస్టేజీ కొనుగోలు హక్కులకు టెండర్ జనగామ: మున్సిపాలిటీ పరిధిలో చికెన్ వేస్టేజీ (కోళ్ల వ్యర్థాల) కొనుగోలు హక్కుల కోసం టెండర్ ప్రక్రియను మున్సిపల్ అధికారులు ప్రారంభించారు. గతంలో రూ.5 లక్షలుగా ఉన్న కనీస టెండర్ విలువను ఈసారి రూ.12 లక్షలకు పెంచుతూ వచ్చే నెల 4వ తేదీన జనగామ పురపాలక కార్యాలయంలో బహిరంగ టెండర్ నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి తెలిపారు. టెండర్లో పాల్గొనదలచిన వారు ముందుగా రూ.50 వేల డిపాజిట్ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. టెండర్ దక్కించుకున్న వ్యక్తి మూడు రోజుల్లో రూ.6 లక్షలు చెల్లించాల్సి ఉండగా, మరో మూడు నెలల తర్వాత ఒప్పంద మొత్తంలో 25 శాతం, మిగిలిన మొత్తాన్ని మరో మూడు నెలల్లో పూర్తిగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. గతంలో చికెన్ వేస్టేజీ టెండర్ల నిర్వహణపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు మున్సిపాలిటీ ఆదాయ వనరులను పెంపొందించడంతో పాటు పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదు పాయాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ఈ సారి టెండర్ విలువను గతంతో పోలిస్తే సుమారు 125 శాతం పెంచినట్లు కమిషనర్ తెలిపారు. బతుకమ్మ కుంట సందర్శన టికెట్ టెండర్లకు ఆహ్వానం జనగామ: బతుకమ్మ కుంట సందర్శనకు సంబంధించిన టికెట్ విక్రయాల నిర్వహణ కోసం మున్సిపాలిటీ టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 4వ తేదీన మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ టెండర్ ప్రక్రియ నిర్వహించనున్నారు. టికెట్ విక్రయాల టెండ ర్ విలువను రూ.18 లక్షలుగా నిర్ణయించినట్లు వెల్లడించారు. బతుకమ్మకుంట సందర్శనకు వచ్చే సందర్శకుల కోసం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రవేశ సమయాన్ని నిర్ణయించారు. గతంలో మాదిరిగానే చిల్ట్రన్ పార్కు ఎంట్రెన్స్కు రూ.10, బతుకమ్మకుంటకు రూ.5 ప్రవేశ రుసుం వసూలు చేస్తారు. ఆసక్తి గల వ్యక్తులు, కాంట్రాక్టర్లు నిర్ణీత తేదీన అవసరమైన పత్రాలతో మున్సిపల్ కార్యాల యానికి హాజరై టెండర్లో పాల్గొనాలని కమిషనర్ కోరారు. పోలీసుస్టేషన్లో డీసీపీ ఆకస్మిక తనిఖీ లింగాలఘణపురం: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను డీసీపీ రాజమహేంద్రనాయక్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డుల తనిఖీ, సీసీటీవీ రికార్డుల క్రాస్ చెక్ చేశారు. అనంతరం సిబ్బందికి విధి నిర్వహణ, కేసుల విచారణపై సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఎస్సై శ్రావణ్కుమార్, సిబ్బంది ఉన్నారు. -
సీపీగా ఎన్.శ్వేత
● 2012 బ్యాచ్ అధికారికి వరంగల్ కమిషనరేట్ బాధ్యతలు.. ● భద్రాద్రి జిల్లాకు డీఐజీగా అదనపు బాధ్యతలు● కమిషనరేట్ వస్తున్న తొలి మహిళా అధికారి ● సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్గా సన్ప్రీత్సింగ్ బదిలీ ● క్రైం డీసీపీగా ఎస్పీ(ఎన్సీ) కిషన్ సింగ్ నియామకంసాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్ పోలీసు కమిషనర్గా ఎన్.శ్వేత నియమితులయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్ (లాఅండ్ఆర్డర్)గా ఉన్న ఆమెను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వరంగల్ సీపీగా పనిచేసిన సన్ప్రీత్ సింగ్ను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ విభాగానికి జాయింట్ కమిషనర్గా బదిలీ చేశారు. శ్వేత తెలంగాణ కేడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఎస్పీ, డీసీపీగా పలు విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. సమర్థవంతమైన అఽధికారిగా పేరు తెచ్చుకున్నారు. ప్రధానంగా మహిళల భద్రత, నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెడతారన్న పేరుంది. వరంగల్ సీపీ బాధ్యతలతోపాటు భద్రాద్రి జోన్–4 డీఐజీగా కూడా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. తొలి మహిళా కమిషనర్.. వరంగల్ కమిషనరేట్ ఏర్పాటైనప్పటినుంచి అంతా పురుషులే సీపీగా నియమితులయ్యారు. 2012 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన శ్వేత వరంగల్ కమిషనరేట్కు నియమితులైన తొలి మహిళా కమిషనర్. ఆమె సిద్దిపేట ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత హైదరాబాద్ ఉత్తర మండల డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ)గా పనిచేస్తూ నేర నియంత్రణ, మహిళల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణలో భేష్ అనిపించుకున్నారు. 16 నెలలకే సన్ప్రీత్ సింగ్ బదిలీ.. ఇప్పటివరకు పనిచేసిన సీపీ సన్ప్రీత్ సింగ్ 16 నెలల వ్యవధిలోనే బదిలీ అయ్యారు. 2025, మార్చి 8న ఆయన వరంగల్ కమిషనరేట్కు సీపీగా వచ్చారు. శాంతిభద్రతల విషయంలో ఎక్కడా తగ్గలేదన్న పేరుంది. ఇటీవల ఓ ప్రజాప్రతినిధి చెప్పిన పని చేయలేదని ఫోన్లో పరస్పరం గొడవ పడ్డారన్న ప్రచారం ఉంది. క్రైమ్స్ డీసీపీగా కిషన్ సింగ్... వరంగల్ కమిషనరేట్ క్రైం డీసీపీగా డి.కిషన్ సింగ్ను నియమించారు. ప్రస్తుతం ఆయన టీజీ–ఐసీసీసీ టెక్నికల్ విభాగంలో నాన్ కేడర్ ఎస్పీగా ఉన్నారు. -
సత్వరమే పరిష్కరించాలి
జనగామ రూరల్: కలెక్టరేట్ గ్రీవెన్స్కు సోమవారం అర్జీదారులు పోటెత్తారు. అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 401 దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల్లో ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలే ఉన్నాయి. ప్రజలు అందజేసిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. పెండింగ్ అర్జీలను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రంగారావు, డీఆర్డీఓ భాస్కర్, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల్లో కొన్ని ఇలా.. ● పెంబర్తి గ్రామానికి చెందిన పొన్న హేమలతది పేద కుటుంబం. ఇద్దరు పిల్లలు ఉన్నారు. తమకు సొంత ఇల్లు లేక అద్దె భవనంలో ఉంటున్నామని డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కలెక్టర్కు దరఖాస్తు అందజేశారు. ● చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామానికి చెందిన గాజర్ల అరుణ్ చిన్నప్పుడే పోలియో సోకి శారీరం పనిచేయక మంచంకే పరిమితం అయ్యాడు. సదరం సర్టిఫికెట్లో 90 శాతంగా నిర్ధారించారు. పింఛన్కు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదని పింఛన్ ఇప్పించాలని అరుణ్ తండ్రి మహేందర్ వినతి అందించారు. -
తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి
జనగామ రూరల్: ప్రతీ ఐదేళ్ల లోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. జాతీయ ఆరోగ్య మిషన్ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు కలెక్టర్ పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని పోలియో కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కేంద్రాలకు రాలేని చిన్నారులకు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేసేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు, సంబంధిత వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
నేడు వరంగల్కు నితిన్ నబీన్
హన్మకొండ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా సోమవారం వరంగల్ నగరంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో గిరిజన ప్రతినిధులతో సహపంక్తి భోజనం చేస్తారు. అనంతరం 2 గంటలకు గిరిజన ప్రతినిధులతో జరిగే చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. 3.10 గంటలకు సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి చేరుకుని పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 4.40 గంటలకు హరిత కాకతీయ హోటల్కు చేరుకుంటారు. 4.40 నుంచి 5 గంటల వరకు హోటల్లో ఉంటారు. 5.10కి భద్రకాళి దేవస్థానం చేరుకుని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు సమర్పించుకుంటారు. అనంతరం హైదరాబాద్కు వెళ్తారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం పార్టీ నాయకులు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేలా దిశా నిర్దేశం చేయనున్నారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పార్టీ కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, నాయకులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, చాడా శ్రీనివాస్ రెడ్డి, రావుల కిషన్, డాక్టర్ పెసరు విజయ్చందర్ రెడ్డి, వన్నాల వెంకటరమణ, జలగం రంజిత్, కుసుమ సతీష్, గుజ్జ సత్యనారాయణ రావు, సండ్ర మధు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి గిరిజన ప్రతినిధులతో సహపంక్తి భోజనం.. సమావేశం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలమైదానంలో కార్యకర్తలతో సమావేశం -
రేపు రైతు భరోసా నిధుల విడుదల
జనగామ: జిల్లా రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వానాకాలం రైతు భరోసా పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయనున్నారు. ముఖ్యంగా తొలి విడతలో ఒక ఎకరం, రెండు ఎకరాలు, మూడు, నాలుగు, ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే నగదు జమ చేస్తారా లేక అర్హులైన రై తులకు ఒకేసారి నిధులు విడుదల చేస్తారా అనే అంశంపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత చర్చ సాగుతోంది. ప్రభుత్వం నుంచి దీనిపై ఇంకా అధికారిక స్పష్టత రాకపోవడంతో రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మండలాల వారీగా కేటాయింపులు జిల్లాలో పాలకుర్తి మండలం అత్యధిక లబ్ధిదారులతో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 23,624 మంది రైతులకు రూ.29.56 కోట్లు కేటాయించారు. రఘునాథపల్లి మండలంలో 21,585 మందికి రూ.27.44 కోట్లు, బచ్చన్నపేట మండలంలో 18,718 మందికి రూ.24.50 కోట్లు, దేవరుప్పుల మండలంలో 17,720 మందికి రూ.22.57 కోట్లు, జనగామ మండలంలో 17,041 మందికి రూ.20.59 కోట్లు జమ చేయనున్నారు. స్టేషన్ఘనపూర్, లింగాలఘణపురం, చిల్పూర్, జఫర్గఢ్, నర్మెట, కొడకండ్ల మండలాలకు కూడా అత్యధిక మొత్తంలో నిధులు కేటాయించారు. తరిగొప్పుల మండలంలో అత్య ల్పంగా 8,509 మంది రైతులకు రూ.10.38 కోట్లు విడుదల కానున్నాయి. ఐదు ఎకరాల వరకే మొదటి విడత? రైతుల్లో ప్రస్తుతం ప్రధాన చర్చ ఇదే. గతంలో ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇస్తామని పలుమార్లు ప్రకటించింది. దీంతో తొలి విడతలో ఐదు ఎకరాల లోపు రైతులకే నిధులు జమ చేసే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ ఒకేసారి నిధులు జమ చేస్తారని మిగతా వారు భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలతోనే పూర్తి స్పష్టత రానుంది. వర్షాభావంతో సాగు నెమ్మదింపు జిల్లాలో వానాకాలం ప్రారంభమైనప్పటికీ ఆశించిన మేర వర్షాలు కురవలేదు. దీంతో సాగు పనులు ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. ఇప్పటి వరకు వరి, పత్తి కలిపి సుమారు 10 వేల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. మొక్కజొన్న, పెసర్లు, కందులు తదితర ప్రత్యామ్నాయ పంటలు కూడా పరిమితంగానే సాగవుతున్నాయి. మరోవైపు సుమారు రెండు లక్షల ఎకరాల్లో రైతులు భూములు సిద్ధం చేసి, దుక్కులు దున్ని, నారుమడులు పోసి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పత్తి విత్తిన ప్రాంతాల్లో వర్షాభావం కారణంగా మొలకలు ఎండిపోవడంతో రైతులు రెండోసారి విత్తనాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విత్తనాలు, కూలీల ఖర్చు రెండింతలు అవుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు రూ.233.69కోట్ల కేటాయింపు 1.88 లక్షల మంది రైతులకు లబ్ధి తొలి విడతలో ఎన్ని ఎకరాలకు? వర్షాభావంతో సాగు మందగింపు.. రైతు భరోసాపై ఆశలుజిల్లాలోని 176 రెవెన్యూ గ్రామాల పరిధిలో 1,88,765 మంది అర్హులైన రైతులకు రూ.233.69 కోట్ల రైతు భరోసా కేటాయించారు. మండలాల వారీగా అర్హుల జాబితా, బ్యాంకు ఖాతాల వివరాల పరిశీలన పూర్తి చేశారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం, ఈ–కేవైసీ వంటి ప్రక్రియలు పూర్తి చేసిన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. -
ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలి
లింగాలఘణపురం: పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకొని వంద శాతం పూర్తి చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లాలో 43 వేల మందికి పల్స్ పోలియో వేయడం లక్ష్యంగా ఉందని, మూడు రోజుల్లో వంద శాతం పూర్తి చేస్తామని డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎడ్ల లావణ్యరాజు, మార్కెట్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శివకుమార్, మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డి, దిలీప్రెడ్డి, మల్లారెడ్డి, ప్రవీణ్, స్థానిక వైద్యాధికారి ఉదయ్కిరణ్, డాక్టర్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ప్రజల కష్టాలను తీర్చేలా సాహిత్యం ఉండాలి
జనగామ రూరల్: ప్రజల కష్టాలను తీర్చేలా సాహిత్య సృజనాత్మకత ఉండాలని, యువతను సాహిత్యం వైపు మళ్లించాలని సౌదామని సాహిత్య సంస్థ అధ్యక్షుడు చింత ప్రసాద్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో కవులు, కళాకారుల ఐక్యవేదిక జనగామ అధ్యక్షుడు జి.కృష్ణ అధ్యక్షతన సాహితి సంస్థ ప్రారంభోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. భాషా సంస్కృతీ సంప్రదా యాలను పరిరక్షించడమే ధ్యేయంగా కామారెడ్డిగూడెం కేంద్రంగా పోరాటాల గడ్డపై సౌదా మని సాహిత్య సంస్థ ఆవిర్భవించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అంకాల సోమయ్య, కోశాధికారి జోగు సుదర్శన్, కార్యవర్గ సభ్యుడు జోగు సుధాకర్, మసురం రాజేంద్రప్రసాద్, లగిశెట్టి ప్రభాకర్, పానుగంటి రామమూర్తి, పెట్లోజు సోమేశ్వరాచారి, మామిండ్ల అంజయ్య, ప్రసాద్, యాదగిరి, నరహరి తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలిస్టేషన్ఘన్పూర్: రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా బకాయి పడిన ఐదు విడతల కరువు భత్యాన్ని తక్షణమే విడుదల చేయాలని, పీఆర్సీ వెంటనే అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.రంజిత్కుమార్ డిమాండ్ చేశారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన టీఎస్ యూటీఎఫ్ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా పాత కరువు భత్యాలు తప్ప ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన డీఏలు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. పీఆర్సీ ఈ ఏడాది జూలై వస్తే మూడు సంవత్సరాలు అవుతుందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి డీఏ, పీఆర్సీని అందించాలన్నారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాష్, చిక్కుడు శ్రీనివాస్, కృష్ణ, శ్రీనివాస్, శ్రీహరి, వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి, బాలకృష్ణ, దేవ్సింగ్ పాల్గొన్నారు. వార్డు సభ్యురాలి నిజాయితీచిల్పూరు: మండలంలోని మల్కాపూర్ గ్రామ 7వ వార్డు సభ్యురాలు బోగం షర్మిలకు దొరికిన బంగారు పుస్తెలను బాధితురాలికి అందజేసి నిజాయితీ చాటుకున్నారు. గ్రామానికి చెందిన వార్డు సభ్యురాలు షర్మిల టీ స్టాల్ ఏర్పాటు చేసుకుంది. రెండు రోజుల క్రితం రాజు–రేణుక అనే దంపతులు టీ తాగి వెళ్లిపోయారు. షర్మిళ షాపు శుభ్రం చేస్తుండగా పొట్లం లాంటిది కనిపించింది. విప్పిచూడగా బంగారు పుస్తెలు ఉన్నాయి. టీ తాగిన వారి వివరాలు తెలియకపోవడంతో భర్త బొగం సతీష్తో కలిసి సర్పంచ్ ఎడవెళ్లి లావణ్యమల్లారెడ్డి, ఉప సర్పంచ్ పసుల వెంకటేశ్వర్లుకు విషయం తెలిపారు. ఆదివారం బాధితులు వచ్చి అడుగగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాలక మండలి సభ్యుల సమక్షంలో సర్పంచ్, ఉప సర్పంచ్ బంగారాన్ని అందజేశారు. నేటి నుంచి కేయూ బీఫార్మసీ పరీక్షలుకేయూ క్యాంపస్: కేయూ పరిధిలో బీఫార్మసీ (సీబీసీఎస్) 8వ సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈనెల 29 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆసీం ఇక్బాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు వారు తెలిపారు. -
ఉరుములు, మెరుపులతో వర్షం
జనగామ: జిల్లాలో ఆదివారం మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలో ఈ నెల 26వ తేదీ సాయంత్రం నుంచి 28వ తేదీ రాత్రి 8 గంటల వరకు 32.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఆదివారం జిల్లాలో అత్యధికంగా జఫర్గఢ్లో 74.8 మి.మీ కురిసింది. జనగామ మండల కేంద్రంలో 33.3 మి.మీ, తాటికొండలో 29.5 మి.మీ, స్టేషన్ఘన్పూర్లో 27.0 మి.మీ, దేవరుప్పులలో 25.0 మి.మీ, వడ్లకొండలో 22.5 మి.మీ, వర్షపాతం నమో దైంది. లింగాలఘన్ణపురంలో 8.0 మి.మీ, పాలకుర్తిలో 7.8 మి.మీ, కొడకండ్లలో 3.8 మి.మీ. వర్షం కురిసింది. అక్కడక్కడా పిడుగులు పడ్డాయి. వరి నార్లు, పత్తి, మొక్కజొన్న తదితర పంటల సాగుకు కొంతమేర వర్షాలు ఊరటనిచ్చాయి. జిల్లా కేంద్రంలో 20 నిమి షాల పాటు జోరుగా కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి చేరగా, ఆర్టీసీ చౌరస్తాలో డ్రైనేజీ నీరు పొంగిపొర్లింది. మున్సిపల్ శానిటేషన్ కార్మికులు రోడ్లపైకి వచ్చిన వ్యర్థాలను క్లీన్ చేసే పనులను మొదలు పెట్టారు. -
వ్యాపార రాణులు!
జనగామ రూరల్: బ్యాంకు లింకేజీ రుణాలతో మహిళా సంఘాల సభ్యులు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. ప్రభుత్వం అందించే రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కిరాణా దుకాణాలు, టైలరింగ్, డెయిరీ ఫామ్స్, చేతివృత్తుల ద్వారా సొంతంగా సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మహిళల ఆర్థిక సాధికారత, స్వయం సమృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం ఈ ఏడాది రుణ ప్రణాళికను ఖరారు చేసింది. జనగామ, స్టేషన్ ఘన్పూర్ రెండు మున్సిపాలిటీల పరిధిలోని మహిళా సంఘాలకు ఈ ఏడాది బ్యాంకు లింకేజీ ద్వారా భారీగా రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.474,69,84,000 కోట్ల రుణాలు ఇవ్వాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కాగా ఇప్పటివరకు రూ.71.94 కోట్లు 953 సంఘాల మహిళా సభ్యులకు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 9,796 సంఘాలకు గాను 2026–27 ఏడాది గాను బ్యాంక్ లింకేజీ కింద రూ.474,69,84,000 కోట్ల రుణాలు ఇవ్వాలని అధికారులు నిర్దేశించుకున్నారు. జూన్ నెలకు రూ.71 కోట్లు అందజేయగా నెలల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. గతేడాది 460,34,43000 కోట్లు లక్ష్యం నిర్ధేశించుకోగా 8609 సంఘాలకు 436,74,57,000లు అందజేసి 94.87 శాతం సాధించారు. 12 మండలాల్లో పాలకుర్తిలో ఎక్కువగా 1,132 సంఘాలకు 5,55,63,000 అందజేశారు. చిల్పూర్ 731 సంఘాలకు 4,86,19,000లు అందజేసి అత్యధికంగా 124.17శాతం రుణాలు అందజేశారు. అత్యల్పంగా దేవరుప్పుల మండలం 53.72 శాతం రుణాలను ఇవ్వగా రఘునాథపల్లి, లింగాలఘణపురం, జనగామ మండలాలు వందశాతంపైగా రుణాలు అందజేశారు.మొత్తం సంఘాలు: 9,796 రుణ లక్ష్యం: రూ.474,69,84,000 సంఘంలో 2008 సంవత్సరంలో చేరా. సంఘంలో తీసుకున్న అప్పులను విడతల వారీగా కడుతూ మొదటగా కుట్టుమిషన్ పెట్టుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా చిన్న బట్టల షాపు ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు నెలకు రూ.15వేలు సంపాదిస్తూ పిల్లలను చదివిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నా. – బురుగు లావణ్య, ఖిలాషాపురం ఎస్హెచ్ఎజీలకు ఏటా వివిధ పథకాల కింద ప్రభుత్వం బ్యాంక్ లింకేజీ రుణాలు అందిస్తోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న కొత్త యూనిట్లను, ఉపాధి రంగాలను ఎంపిక చేసుకోవాలి. వాటి ద్వారా లబ్ధి పొంది ఆర్థికంగా ఎదగాలి. – నూరొద్దీన్, అడిషనల్ డీఆర్డీఏ -
నాలుగు మండలాల్లో కొత్త తహసీల్దార్ భవనాలు
జనగామ: ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా నాలుగు మండలాల తహసీల్దార్ కార్యాలయాలకు పక్కా భవనాల నిర్మాణం కోసం పరిపాలనా అనుమతి వచ్చిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించడంతో పాటు, ప్రభుత్వానికి వినతి చేయడంతో తరిగొప్పుల, కొమురవెల్లి, దూల్మిట్ట, మద్దూరు మండల కేంద్రాల్లో నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందన్నారు. ఒక్కో తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మా ణానికి రూ.2.25 కోట్ల చొప్పున మొత్తం రూ.9 కోట్లు కేటాయించిందన్నారు. నూతన భవనాల నిర్మా ణం పూర్తయిన తర్వాత ప్రజలకు సేవలు మరింత వేగంగా అందడంతో పాటు ఉద్యోగులకు కూడా మెరుగైన పని వాతావరణం ఏర్పడనుందన్నారు. నిర్మాణాలకు రూ.9కోట్ల పరిపాలనా అనుమతి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
12న పోతన జయంతి ఉత్సవాలు
పాలకుర్తి టౌన్: మండలంలోని బమ్మెరలో వచ్చే నెల 12న నెల్లుట్ల ఫౌండేషన్ కళాపీఠం, జనగామ కవులు కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోతన జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కవులు, కళాకారుల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు కల్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి, ఉత్సవ కమిటీ కన్వీనర్ నెల్లుట్ల రవీందర్రావు, ప్రోగ్రాం డైరెక్టర్ జి.కృష్ణ తెలిపారు. శనివారం మండలంలోని బమ్మెరలోని పోతన స్మృతి వనంలో సహజ కవి పోతన జయంతి ఉత్సవాలు–2026 పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూలై 12 ఆదివారం బమ్మెరలో సాయంత్రం 4 గంటలకు పోతన సాహిత్య,శ్రీమదాంద్ర భాగవతంపై కవితా గోష్ఠి, అనంతరం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ చింతలపాటి శూలపాణి సారథ్యంలో భక్తపోతన పద్యనాటక ప్రదర్శన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పోతన జయంతి ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, కవులు, కళాకారులు, యువత, సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
యువ రైతు భగీరథ ప్రయత్నం
జఫర్గఢ్ మండలం టీబీ తండా రేగడి తండా శివారుకు చెందిన భూక్య సుమన్కు రెండు చోట్ల 10 ఎకరాల భూమి ఉంది. ఒకచోట ఉన్న బావి ఎండిపోయింది. 5 బోర్లు వేసినా నీరు పడలేదు. మరోచోట వేసిన బోరు సక్సెస్ అయింది. అక్కడి నుంచి కిలోమీటర్ దూరంలోని భూమికి నీరందించేందుకు 300 పైపులు వేశాడు. ఒక్కో పైపు రూ.600 చొప్పున రూ.2.7 లక్షలు, జేసీబీ, డోజర్ ఖర్చులు అదనం. పైప్లైన్ ద్వారా నీటిని ఎండిన బావిలోకి తరలించి, అక్కడి నుంచి మరో మోటర్తో పంటలకు నీరందిస్తున్నాడు. గత యాసంగిలో 5 ఎకరాల మొక్కజొన్న సాగు చేసి మంచి దిగుబడి పొందాడు. ఈ ఖరీఫ్లో 3 ఎకరాల పత్తికి స్ప్రింక్లర్లతో నీరు, 2 ఎకరాల్లో వరి సాగుకు సిద్ధం చేశాడు. ఖరీఫ్ ప్రారంభమై నెలదాటినా సరైన వానలు లేకపోవడంతో పంట చేతికి అందడం కష్టమని అంటున్నాడు. మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకుబచ్చన్నపేట మండలంలోని బోనకొల్లురు గ్రామానికి చెందిన రైతు చేర్యాల నర్సింహులుకు ఆరు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. ఉన్న రెండు బోర్లు ప్రెషర్ తగ్గి, గ్యాప్ ఇస్తుండడంతో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. దీనికి తోడు వర్షాలు లేకపోవడంతో నాలుగు ఎకరాల్లో సాగుచేసిన మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు రోజుకు ఒకతడి చొప్పున మడులకు నీరు పారిస్తూ రెక్కలను గుల్ల చేసుకుంటున్నాడు. -
మొలకెత్తని విత్తు..ఎండుతున్న నార్లు
● వర్షాభావం..విలవిల్లాడుతున్న రైతాంగం ● పత్తి, వరి సాగుపై తీవ్ర ప్రభావం ● వానల కోసం రైతుల ఎదురుచూపులు ● మళ్లీ విత్తనాల భారం, నార్లు ఆలస్యంజనగామ: జిల్లాలో వానాకాలం(ఖరీఫ్) సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. జిల్లాలోని మండలాల్లో వర్షాభావం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సాగునీటి వనరులు ఉన్న రైతులు బోర్లు, డ్రిప్, స్ప్రింక్లర్లతో పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా, వర్షంపై ఆధారపడ్డ రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. మండలాల్లో ఇలా.. జనగామ మండలంలో గతంలో సన్న రకాల వరికి బోనస్ ఆశించిన రైతులు ఈసారి ఎక్కువగా దొడ్డురకం వరిని ఎంచుకున్నారు. అయితే వర్షాలు లేకపోవడంతో నార్లు వేసినా నాట్లు ఆలస్యం కానున్నాయి. బోర్లలో నీరు తగ్గడం, విద్యుత్ సరఫరా అంతరాయం పరిస్థితిని మరింత క్లిష్టం చేశాయి. జఫర్గఢ్ మండలంలో రైతులు ఇంకా వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. బోర్ల కింద సాగు చేసిన పత్తి, మొక్కజొన్న పంటలకు పైపులు, స్ప్రింక్లర్ల ద్వారా నీరు అందిస్తూ ప్రాణం పోస్తున్నారు. నర్మెట, పాలకుర్తి మండలాల్లో 25 నుంచి 30 శాతం వరకు మాత్రమే పత్తి విత్తనాలు విత్తగా, సగానికి పైగా మొలకెత్తలేదు. వరి నార్లు కూడా పరిమితంగానే పోశారు. లింగాలఘణపురంలో మొలక దశలోనే భూమిలో ఉన్న పత్తి గింజలను రైతులు స్ప్రింక్లర్లతో తడిపి కాపాడుతున్నారు. స్టేషన్ఘన్న్పూర్లో జూన్ తొలి వారంలో వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు మళ్లీ విత్తనాలు కొనుగోలు చేసి రెండో సారి విత్తుతున్నారు. దీంతో ఎకరాకు వేల రూపాయల అదన పు భారం పడుతోంది. వరి సాగు విస్తీర్ణం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొడకండ్ల మండలంలో మాత్రం జూన్ రెండో వారంలో పడిన జల్లులతో విత్తిన పత్తి ఎక్కువగా మొలకెత్తగా, తాజాగా కురిసిన వర్షం రైతులకు కొంత ఊరటనిచ్చింది. అయినప్పటికీ జిల్లా మొత్తంగా చూస్తే ఖరీఫ్ సాగు పూర్తిగా వర్షాలపైనే ఆధారపడిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా సమృద్ధిగా వర్షాలు కురియకపోతే నార్లు, విత్తులు మురిగిపోయి, పెట్టుబడులు, దిగుబడుల తగ్గుదలతో రైతుల ఆర్థిక పరిస్థితి మరింత సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో భూగర్భ జలాలు ఈ ఏడాది ఏప్రిల్లో 7.37 మీటర్ల లోతులో ఉన్న నీటి జాడలు, మే నెలకు వచ్చేసరికి 7.78 మీటర్ల మేర పెరిగింది. ప్రస్తుతం వానాకాలం సాగు పనులు మొదలు కావడం, ఆశించిన మేర వర్షాలు లేకపోవడంతో జూన్ మొదటి వారం నుంచి పత్తి విత్తులు, వరి నార్లు, నాట్ల కోసం సాగునీటి వినియోగం పెరగడంతో కొంతమేర తగ్గుముఖం పట్టాయి.జూన్ లోమే లోకురియాల్సింది 31.1 (మి.మీ)కురియాల్సింది 108.9 కురిసింది 53.3కురిసింది 4.2 (మి.మీ)తేడా 51.1 శాతం తేడా 86.5 శాతం వరణుడు కరుణిస్తేనే సాగురెండు ఎకరాల్లో వరి సాగు కోసం 25 రోజుల క్రితం నార్లు పోసిన. పొలాలు దున్నాలంటే మడులు తడిసే పరిస్థితి లేదు. కరెంటు కూడా ఇప్పుడు పది గంటలు కూడా సరిగా ఇవ్వడం లేదు. ఆ ఇచ్చే పది గంటల్లో ఏదో ఒక సాంకేతిక లోపమని రెండు మూడు గంటలు తీసేస్తున్నారు. అటు వర్షాలు లేక ఇటు కరెంటు సరిగా రాక బోర్లు నడవక ఇబ్బంది పడుతున్నాం. ఎప్పుడు వర్షం పడుతుందా, బోర్లలో నీటి మట్టం పెరుగుతుందా అని ఎదురు చూస్తున్నాం. –శంకర్, రైతు, గానుగుపహాడ్, జనగామ వానొస్తేనే పెట్టుబడులు రెండున్నర ఎకరాల్లో పత్తి విత్తనం వేసిన. నెల దాటినా సరైన వాన పడలే. గింజ భూమిలోనే ఉండిపోయింది, మొలక రాలే. ఇక లాభం లేదని స్ప్రింక్లర్లు పెట్టి తడి ఇస్తున్నా. ఎకరాకు వేల రూపాయలు అదనపు ఖర్చు అవుతోంది. వాన దేవుడు కరుణించకపోతే పెట్టుబడి కూడా రాదు. –సోమిరెడ్డి వీరారెడ్డి, రైతు, లింగాలఘణపురంభారీ వర్షం కురిస్తేనే గాని బతుకుతెరువు లేదు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తేనే కానీ బతుకు లేదు. నాకున్న రెండున్నర ఎకరాల్లో పత్తి విత్తనం వేయగా, కొంతమేర మొలకెత్తింది. మిగిలిన పత్తి విత్తుల కోసం బావి నుంచి కాలువలు చేసి సాగునీరు మళ్లిస్తున్నా. ఎకరం మేర పత్తి విత్తులు నేటికీ మొలకెత్తలేదు. –బనక అంజయ్య, రైతు,నర్మెట -
కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ఎన్నిక
వరంగల్ స్పోర్ట్స్: కిక్ బాక్సింగ్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా నూతన కార్యవర్గ సమావేశం శనివారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని రెజ్లింగ్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులుగా తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సి.రామాజంనేయులు, ఒలింపిక్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. కై లాశ్యాదవ్, లీగల్ అడ్వైజర్లు సత్యనారాయణ, తిరుమల, విరందరి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. అసోసియేషన్ ప్రెసిడెంట్గా బండారి సంతోష్, జనరల్ సెక్రటరీగా సిరిగిరి తిరుపతి, కోశాధికారిగా సాదినేని శ్యాంకుమార్, వైస్ ప్రెసిడెంట్గా సీహెచ్ సుప్రియ, జాయింట్ సెక్రటరీగా ఎస్.సాంబశివ, కార్యవర్గ సభ్యులుగా పి.దినేశ్తేజ, పి.గణేశ్తేజ ఎన్నికయ్యారు. హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ హాజరై నూతన కమిటీ కి శుభాకాంక్షలు తెలిపారు. -
బాల్యవివాహాల రహిత దేశంగా ఉండాలి
లింగాలఘణపురం: భారత్ బాల్య వివాహాల రహిత దేశంగా ఉండాలని జనగామ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.శశి అన్నారు. శనివారం మండలంలోని మోడల్ స్కూల్, కస్తూర్బా పాఠశాలల్లో జిల్లా న్యాయసేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సివిల్ జడ్జి మాట్లాడుతూ.. విద్యార్థులు బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని ముఖ్యంగా పాఠశాలల్లో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ రవీందర్, ఎస్సై శ్రావణ్కుమార్, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ కృష్ణవేణి, స్పెషల్ ఆఫీసర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు నర్మెట: దివ్యాంగులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, వారిలో మనోధైర్యాన్ని నింపే బాధ్యత అందరిపై ఉందని అదనపు డీఆర్డీఏ (ఐకేపీ) నూరొద్దీన్ అన్నారు. హెలెన్ కెల్లర్ జయంతిని పురస్కరించుకుని ఎన్హెచ్సీలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.. హెలెన్ కెల్లర్ తనలోని లోపాలను అధిగమించి దివ్యాంగుల కోసం జీవితాన్నే ధారపోశారని కొనియాడారు. మన గ్రామం ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఏరువ విన్సెంట్ రెడ్డి, ఫిజియోథెరపీ టేబుల్ను సెంటర్కు బహుకరించారు. నర్మెట, తరిగొప్పుల, చిల్పూర్ ఏపీఎంలు బొడ్డు ప్రమీల, కె.నాగేశ్వర్రావు, పి.నరేందర్, మండల సమాఖ్యల అధ్యక్షులు మమత, శ్వేతారాణి, మంజుల, సీసీలు కనకరాజు, శంకరయ్య, ఉమ, శ్రీనివాస్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు, సంక్షేమ గురుకుల కళాశాల సందర్శన స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ శివారు పల్లగుట్ట క్రాస్రోడ్డు సమీపంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్, అధ్యాపకులతో మాట్లాడారు.. మరుగుదొడ్ల సమస్య ఉందని మున్సిపల్ చైర్మన్కు ప్రిన్సిపాల్ తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రఘుపతి, పీడీ శ్రీనివాస్, నాయకులు నీల సోమన్న, గాండ్ల రాజు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. 18నుంచి తృతీయ పుష్కర వేడుకలు జనగామ రూరల్: జిల్లా కేంద్రం బాణాపురంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం తృతీయ పుష్కర వేడుకలు జూలై 18 నుంచి 23 వరకు నిర్వహిస్తున్న సందర్భంగా 20వ తేదీన కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు కృష్ణమాచార్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కవులు సమతామూర్తి రామానుజుల గురించి కవితలు రాసి జూలై 15వ తేదీలోగా వేంకటేశ్వర స్వామి ఆలయంలో అందజేయాలని కోరారు. ఉత్తమ కవితలుగా ఎంపికై న ముగ్గురు కవులకు చిన్నజీయర్ స్వామితో ప్రత్యేక పురస్కారం ఉంటుంటున్నారు. ఈ సందర్భంగా జూలై 18 శనివారం సాయంత్రం శ్రీ విష్వక్సేనారాధనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 19న సంతానార్థులకు వివాహ ఆరోగ్యం కోసం శ్రీ వైనతేయయిష్టి శ్రీ స్వామివారిచే మంత్రోపదేశములు, 20న వృద్ధ దంపతి ఆరాధన, సాయంత్రం 6 గంటలకు కవిసమ్మేళనంలో కవులు శ్రీ భగవత్ రామానుజుల వైభవాలపై కవితా గానం చేస్తారన్నారు. 21న సుదర్శనేష్టి, శ్రీ సుదర్శన పెరుమాళ్ల ఆరాధన. సాయంత్రం నరసింహారావు బృందం చే భరతనాట్య ప్రదర్శన ఉంటుందన్నారు. 23న గురువారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన మహా పూర్ణాహుతి, శాంతి కల్యాణం ఉంటుందని వివరించారు. -
సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలి
● సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, సీతక్కసాక్షిప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్, పొట్లాపూర్ ప్రాజెక్టుతో పాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సచివాలయంలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధ్యక్షతన ములుగు నియోజకవర్గ పరిధిలోని నీటిపారుదల శాఖ అభివృద్ధి పనులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పాల్గొన్న ఈ సమావేశంలో రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్కు అవసరమైన భూసేకరణపై అధికారులు సమగ్ర నివేదిక సమర్పించారు. తాజా మార్కెట్ ధరల ప్రకారమే భూసేకరణ.. కాసిందేవిపేట, ఇంచెర్ల, రామచంద్రాపూర్ గ్రామాల్లో ఈ ప్రాజెక్టుకు మొత్తం 244.23 ఎకరాల భూమి అవసరమని, ఇప్పటివరకు 201.03 ఎకరాలకు మాత్రమే అవార్డులు జారీ అయినప్పటికీ భూసేకరణ పూర్తికాలేదని తెలిపారు. 2020–21లో జారీ చేసిన అవార్డుల ప్రకారం ఎకరాకు రూ.2.47 లక్షల నుంచి రూ.8.26 లక్షల వరకు మాత్రమే పరిహారం నిర్ణయించగా, ప్రస్తుతం భూముల మార్కెట్ విలువలు భారీగా పెరగడంతో ఆ ధరలకు రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, మంత్రి సీతక్క 2020–21లో జారీ చేసిన పాత భూసేకరణ అవార్డును ఉపసంహరించి, తాజా మార్కెట్ విలువల ఆధారంగా కొత్త అంచనాలతో వెంటనే భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రెండేళ్లలో రామప్ప–లక్నవరం కెనాల్ పూర్తయ్యేలా.. రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రామప్ప చెరువు నుంచి లక్నవరం చెరువుకు గ్రావిటీ ద్వారా నీటి తరలింపు సాధ్యమై 8,700 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అలాగే మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు లక్నవరం పర్యాటకాభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని వివరించారు. అదేవిధంగా పొట్లాపూర్ ప్రాజెక్టు పనులను మరింత ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించి, వచ్చే వారంలోనే శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. -
నేడు పల్స్ పోలియో
● ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్యారోగ్యశాఖ ● జిల్లా వ్యాప్తంగా 293 సెంటర్లు 16 మొబైల్ బృందాలు జనగామ రూరల్: జిల్లావ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లలందరికీ ఆదివారం పోలియో చుక్కల పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి వైద్యారోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మిగిలి పోయిన చిన్నారులకు 29, 30వ తేదీన సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేస్తారు. పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ సందీప్కుమార్ ఝా సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్ల లోపు వయసు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు 48,493 మంది చిన్నారులు ఉన్నారు. 293 పోలియో బూత్ల 16 మొబైల్ బృందాలు పోలియో కార్యక్రమం నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 293 పోలియో బూత్లు, 16 మొబైల్, 16 ట్రాన్సిట్ బృందాలు ఏర్పాటు చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, బూత్ స్థాయి వలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులు స్వచ్ఛంద సేవకులు తమ పరిధిలోని ప్రతీ ఇంటికి వెళ్లి చిన్నారుల వివరాలు సేకరించనున్నారు. ముఖ్యంగా వలస కూలీలు, ఇటుక బట్టీలు, నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల పిల్లలపై ప్రత్యేక దృష్టి సారి ంచి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రతీ చిన్నారికి పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకో నున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో ట్రాన్సిట్ బృందాల ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు. విజయవంతం చేయాలి జిల్లా వ్యాప్తంగా ఈనెల 28న నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి. వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పనిచేసి ఐదేళ్లలోపు ప్రతీ చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. –సందీప్ కుమార్ ఝా, కలెక్టర్ ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలి బచ్చన్నపేట : ప్రతీ విద్యార్థి ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది విద్యేనని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. మండల కేంద్రంలోని పాఠశాలను శనివారం కలెక్టర్ సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న అన్అకాడమీ తరగతులను ప్రారంభించారు. అలాగే వంటశాల, భోజన నాణ్యత, పారిశుద్ధ్యం, విద్యార్థుల వసతి, తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీ 15 రోజులకు స్లిప్ టెస్ట్, మాక్ టెస్ట్ తప్పనిసరి అని, విద్యా పాఠ్య ప్రణాళిక ప్రకారమే బోధన జరగాలని, ఫాస్ట్ మ్యాథ్స్తో గణితంపై భయాన్ని అధిగమించాలన్నారు. ఎన్యుమరేషన్ ఫారాల పరిశీలన.. మండల కేంద్రంలో జరుగుతున్న ‘సర్’ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. బీఎల్ఓల పని తీరును పర్యవేక్షించి వారికి సూచనలు చేశారు. సందర్శనలో ఆర్డీఓ గోపీరాం, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియా బేగం, కేజీబీవీ ప్రత్యేక అధికారి నారమల్ల గీత, తహసీల్దార్ హుస్సేన్, ఎంఈఓ ఇర్రి వెంకట్రెడ్డి, సర్పంచ్ నర్సింగారావు, ఆర్ఐలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
డ్రగ్స్రహిత సమాజాన్ని నిర్మిద్దాం
జనగామ రూరల్: మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని ఎస్టీ హాస్టల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, వాటి నివారణ చర్యలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండే ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యం గురించి తెలిపారు. అనంతరం ఆసుపత్రిలోని డీ–అడిక్షన్ సెంటర్ను సందర్శించి అక్కడి రోగులకు పండ్లు పంపిణీ చేసి మాదకద్రవ్యాల వ్యసనం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి కౌన్సెలింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజలింగం, సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ -
బంజారా భవన్ పూర్తయ్యేదెన్నడో?
పాలకుర్తి టౌన్: గిరిజనులు, బంజారాలు కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా గత ప్రభుత్వం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో బంజారా భవన్ మంజూరు చేసింది. ఎకరం స్థలం, రూ.2 కోట్లు కూడా కేటాయించింది. 2023 సెప్టెంబర్ 4న అప్పటి మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ఇంద్రకరణ్రెడ్డి భూమి పూజ చేశారు. కొంత మేర పనులు జరిగాయి. భవనం పూర్తి చేయడానికి నిధులు సరిపోకపోవడంతో మధ్యలోనే పనులు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం పనులు పూర్తి చేసి భవనం అందుబాటులోకి తేవాలని గిరిజనులు కోరుతున్నారు. స్లాబ్ లెవల్కే పరిమితమా? గత ప్రభుత్వంలో ఎస్డీఎఫ్ నిధుల నుంచి మంజూరు చేసినా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో బంజారా భవనం పునాది దశలోనే నిలిచిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సదరు కాంట్రాక్టర్ తాను ఈ పని చేయలేనని చేతులేత్తేశాడు. దీంతో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మరో కొత్త కాంట్రాక్టర్ను నియమించారు. ఆ కాంట్రాక్టర్ చేసిన పనులు కూడా నత్తనడక సాగుతున్నాయి. ఇప్పుడు స్లాబ్ లెవల్ వరకు పనులు చేపట్టి వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి. కోట్లు వెచ్చించి వదిలేశారు.. బంజారా భవనం నిర్మాణం కోసం కోట్లు వెచ్చించినప్పటికీ పనులు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆ భవనం పూర్తి కాకపోవడంతో గిరిజనులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భవన్ అర్ధంతరంగా ఆగిపోవడంతో స్ధానిక రైతులు బంజారా భవనాన్ని పశువుల పాకలా వినియోగించుకుంటున్న పరిస్థితి నెలకొంది. కోట్లు వెచ్చించి వదిలేశారు.. రూ.2కోట్లతో ఎకరం స్థలంలో నిర్మాణం స్లాబ్ లెవల్కే పరిమితం పనులు పూర్తి చేయాలని గిరిజనుల డిమాండ్ -
ఫిష్ షెడ్డుకు భూమిపూజ
బచ్చన్నపేట : మండలంలోని మత్స్య కార్మికులకు ఇబ్బంది కలగొద్దని, కులవృత్తిని సాఫీగా నిర్వహించుకోవాలని మత్స్య సహకార సంఘం జిల్లా డైరెక్టర్ వద్ది వెంకటయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ పక్కన నిర్మించ తలపెట్టిన ఫిష్ షెడ్డుకు భూమిపూజ చేసి కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్య సహకార కమిటీ ఆధ్వర్యంలో రూ.10 లక్షల సంఘ వ్యయంతో 8 షెటర్లను వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో బచ్చన్నపేట, గోపాల్నగర్ గ్రామాల సర్పంచ్లు అల్వాల నర్సింగారావు, పేరబోయిన కళ్యాణిపర్షరాములు, ఉప సర్పంచ్లు బైరి రజిత, మల్లేశం, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
పర్యటన విజయవంతం చేయాలి
జనగామ రూరల్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మూడు రోజుల తెలంగాణ పర్యటన చేస్తున్నారని, ఈనెల 29న జనగామ నుంచి హనుమకొండకు చేరుకుంటారని, జనగామ చౌరస్తాలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారన్నారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలకాలన్నారు. కార్యక్రమంలో నాయకులు బల్ల శ్రీనివాస్, బొజ్జపల్లి సుభాష్, తోకల ఉమారాణి, మహిపాల్, గాజుల సంపత్, పెద్దోజు జగదీష్ శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రవీంద్రభారతిలో స్పందన గ్రూపు ప్రతిభ పాలకుర్తిటౌన్ (దేవరుప్పుల): తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రభుత్వ 99వ రోజుల కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో అప్పిరెడ్డిపల్లికి చెందిన చిందు యక్షగాన కళాకారిణి గడ్డం స్పందన మహిళా గ్రూపు శుక్రవారం బోనాల విశిష్టతను తెలిపేలా ప్రతిభ చాటారు. ఆ శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ప్రము ఖ కవి నందిని సిద్ధారెడ్డి తదితరులు గ్రూపు సభ్యులను సత్కరించి అభినందించారు. ‘సాక్షి’ వార్తలతో విద్యార్థులకు ప్రోత్సాహం జనగామ: వేసవి సెలవుల్లో విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేందుకు ‘సాక్షి వేసవి వికాసం’ పేరిట చిత్రలేఖనం, విహారయాత్రల కబుర్లు, అమ్మమ్మ–నానమ్మ ముచ్చట్లు, నేను గీసిన బొమ్మ, మాబడి ఇలా అనేక అంశాలపై విద్యార్థుల ఫొటోలతో కూడిన కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో నర్మెట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘సాక్షి’లో తమ పాఠశాలకు సంబంధించి ప్రచురితమైన కథనాలను ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకంగా ఫ్రేమ్ చేయించి బ్లాక్బోర్డుపై ఏర్పాటు చేశారు. విద్యార్థులను ప్రోత్సహించేలా ప్రదర్శించిన ఈ ఫ్రేమ్ల ద్వారా సాక్షి పత్రిక విద్యార్థులకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని పిల్లలకు వివరించారు. డయాలసిస్కు వస్తే ప్రాణం మీదకొచ్చింది! ● సిబ్బంది నిర్లక్ష్యంతో పేషెంట్కు తీవ్ర రక్తస్రావం ● హనుమకొండకు తరలించిన కుటుంబ సభ్యులు ● ఏరియా ఆసుపత్రిలో ఘటన జనగామ రూరల్: ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో జనగామ మండలం మరిగడి గ్రామానికి చెందిన సాంబరాజు అంజయ్య ప్రాణం మీదకు వచ్చింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. 10 రోజుల క్రితం వరంగల్ కేఎంసీలో డయాలసిస్ చేయించుకోని ఇంటికి వచ్చాడు. డయాలసిస్ గడువు రావడంతో గురువారం సాయంత్రం 6 గంటలకు జిల్లా ఏరియా ఆసుపత్రిలోని సెంటర్కు వెళ్లాడు. డ్యూటీ డాక్టర్ లేకపోవడంతో సెట్ చేసి ఉన్న మిషనరీలతో నర్సులు డయాలసిస్ ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత పేషెంట్కు చెమట రావడంతో ఇంజక్షన్ వేయగా కుదురుకోగా బెడ్షీట్ వేసి డయాలసిస్ మళ్లీ ప్రారంభించారు. కొంత సమయానికి డయాలసిస్ ఊడిపోయి తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు ప్రశ్నించగా డ్యూటీ డాక్టర్ లేరని కేఎంసీకి తీసుకెళ్లాలని చెప్పారు. చేసేది ఏమిలేక అంజయ్యను కుటుంబ సభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రక్తం 7 శాతం ఉండాల్సి ఉండగా 2 శాతం పోయిందని డయాలసిస్ కోసం వస్తే ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందని వాపోయారు. -
ఎంజీఎం ఆసుపత్రికి స్టాఫ్ నర్సులు
కాశిబుగ్గ: ఎట్టకేలకు ఎంజీఎం ఆసుపత్రికి స్టాఫ్ నర్సులొచ్చారు. దవాఖానా నుంచి బదిలీ అయిన వారి స్థానంలో కొత్తగా ఎవరూ జాయిన్ అవకపోవడంతో తొలుత అధికారుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో నర్సింగ్ సూపరింటెండెంట్ దయాశీల, డిప్యూటీ సూపరింటెండెంట్ సుజాత అధికారుల ఆదేశాల మేరకు ఎంజీఎంలో పేషెంట్లకు ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు బీఎస్సీ, జనరల్ నర్సింగ్, పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి నర్సింగ్ స్టాఫ్ను రప్పించారు. స్టాఫ్ నర్సుల స్థానంలో వీరు ప్రత్యామ్నాయంగా సేవలందిస్తున్నారు. ఖాళీగా 284 పోస్టులు ఎంజీఎం దవాఖనాలో రోగులకు సేవలు అందించడానికి 478 మంది స్టాఫ్నర్సులు అవసరం ఉండగా.. కేవలం 194 మందితో వైద్యసేవలు అందిస్తున్నారు. మరో 284 పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. ఈనేపథ్యంలో ఎంజీఎంలో పేషెంట్ల సేవల కోసం స్టాఫ్ నర్సుల (నర్సింగ్ ఆఫీసర్లు) కొరత గుర్తించిన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉన్నతాధికారులు బదిలీ అయిన వారి స్థానంలో 170 మంది నర్సింగ్ ఆఫీసర్లను కేటాయించారు. అలాగే హనుమకొండ ప్రసూతి ఆసుపత్రి, వరంగల్ సీకేఎం ఆసుపత్రికి ఐదుగురు స్టాఫ్ నర్సులను అలాట్ చేసినట్లు తెలుస్తోంది. 2024 సంవత్సరం బ్యాచ్కు సంబంధించిన వీరు రెండు రోజుల నుంచి ఎంజీఎంలో జాయిన్ అవుతున్నారు. ఇప్పటి వరకు 60 మంది స్టాఫ్ నర్సులు జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. మిగతావారు కూడా సోమవారం వరకు జాయిన్ కావొచ్చని నర్సింగ్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఎంజీఎంలోని అత్యవసర చికిత్సలు, పలు వార్డుల్లో నర్సింగ్ సేవలు ఉపయోగించుకునే అవకాశం ఏర్పడింది. 170 మంది కేటాయింపు 60 మంది జాయినింగ్ -
తెలుగు సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటాలి
పాలకుర్తి టౌన్: తెలుగు సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం అమెరికాలోని డల్లాస్ నగరంలో ఎన్ఆర్ఐ సురభి శ్రీనివాస్ నివాసంలో నిర్వహించిన శ్రీనివాస కల్యాణ మహోత్సవంలో దయాకర్రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణలో జిల్లాలోని వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి ఉన్న ప్రత్యేక స్థానాన్ని, ఆలయ చారిత్రక విశిష్టత, ఆధ్యాత్మిక మహిమను తెలుగు ప్రవాసీయులకు వివరించారు. విదేశాల్లో తెలుగు సంస్కృత సనాతన ధర్మం చిరస్ధాయిగా నిలవాలని ఆకాంక్షించారు, కార్యక్రమంలో వేద పండితులు వేదాశీర్వచనాలతో అయనను ఆశీర్వదించారు. మాజీ మంత్రి దయాకర్రావు -
జూనియర్ లెక్చరర్ల ప్రొబేషన్ ప్రకటించాలి
హన్మకొండ అర్బన్/విద్యారణ్యపురి: 2023 బ్యాచ్ జూనియర్ లెక్చరర్లకు వెంటనే ప్రొబేషన్ ప్రకటించి, ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీజేఎల్ఏ–475) రాష్ట్ర కౌన్సిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈమేరకు శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్ ఆవరణలోని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీఓ) భవన్లో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్రావు మాట్లాడుతూ.. సమస్య పరిష్కారంలో జాప్యం కొనసాగితే.. చేపట్టే ప్రతీ ఉద్యమానికి టీజీఓ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. అనంతరం 2023 బ్యాచ్ జూనియర్ లెక్చరర్ల ప్రొబేషన్ ప్రకటన, ఇంక్రిమెంట్ల మంజూరు తదితర డిమాండ్లపై పలు తీర్మానాలను రాష్ట్ర కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది జీవీఎల్ మూర్తి, టీజీఓ నాయకులు ఆసనాల శ్రీనివాస్, డాక్టర్ వసుకుల శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేశ్, డాక్టర్ ప్రవీణ్కుమార్, టీజీజేఎల్ఏ నాయకులు జె.కురుమూర్తి, శోభన్బాబు, నాయిని శ్రీనివాస్, రేమిడి మల్లారెడ్డి, గోస్కుల హరగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
పత్తి సాగు పండుగ!
శనివారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2026జనగామ: దేశంలో పత్తి ఉత్పాదకతను పెంచి రైతుల ఆదాయాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘మిషన్ కాటన్ ప్రాజెక్టు’ అమలు చేయనుంది. అధిక మొక్కల సాంద్రతతో పత్తి సాగును ప్రోత్సహిస్తూ ఎకరాకు దిగుబడి పెంచడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేయగా, జిల్లాల వారీగా అమలుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. 50శాతం సబ్సిడీతో మిషన్ కాటన్ ప్రాజెక్టు పథకంలో భాగంగా రైతులకు 50 శాతం సబ్సిడీతో పత్తి విత్తన ప్యాకెట్లు అందించనున్నారు. రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకంతో సంబంధిత మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారు, ఏ రకం విత్తనం అవసరమో నమోదు చేయించుకోవాలి. రైతుల నుంచి వచ్చిన ఇండెంట్ ఆధారంగానే అవసరమైన విత్తనాల వివరాలను వ్యవసాయ శాఖ సిద్ధం చేసి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నారు. మూడు రకాల సాగు విధానం మిషన్ కాటన్ కింద నార్మల్, క్లోజ్ డెన్సిటీ, హైడెన్సిటీ అనే మూడు సాగు విధానాలను రైతులకు పరిచయం చేయనున్నారు. ఒక ఎకరంలో రెండు, నాలుగు, ఆరు ప్యాకెట్ల విత్తనాలను వినియోగించే విధానాలపై అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా హైడెన్సిటీ విధానంలో చదరపు మీటరుకు ఎక్కువ మొక్కలను నాటే అవకాశం ఉండడంతో ఎకరాకు అధిక దిగుబడి సాధించే అవకాశముందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పద్ధతిలో విత్తనాల ఎంపిక, మొక్కల సాంద్రత, ఎరువుల యాజమాన్యం, నీటి నిర్వహణ, పురుగు నివారణ వంటి అంశాలను శాసీ్త్రయంగా పాటి ంచడం అత్యంత కీలకమని సూచిస్తున్నారు. ఒకేచోట 50హెక్టార్లలో ముఖ్యంగా తండాలు, గ్రామీణ ప్రాంతాల్లో 50 హెక్టార్ల విస్తీర్ణంలో ఒకే ప్రాంతంలో సమీకృతంగా పత్తి సాగు జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనివల్ల సాంకేతిక పర్యవేక్షణ సులభం కావడంతో పాటు అధిక దిగుబడి సాధించే అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు. గ్రామాల వారీగా అవగాహన సదస్సులు, క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి రైతులను ఈ విధానంపై చైతన్యపరచనున్నారు. ప్రాజెక్టు విజయవంతం కోసం జిల్లాకు కూడా మిషన్ కాటన్ కింద ప్రత్యేక లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రస్తుతం జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో సుమారు 1.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇందులో కనీసం సగం విస్తీర్ణంలో మిషన్ కాటన్ ప్రాజెక్టు విధానాలను అమలు చేసి రైతులకు అధిక దిగుబడి, మెరుగైన ఆర్థిక లాభాలు చేకూరేలా చర్యలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక దృష్టి సారించగా, వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారీగా రైతులకు అవగాహన కల్పిస్తూ మిషన్ కాటన్న్ను విజయవంతం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మిషన్ కాటన్కు 14 కంపెనీల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం 2026–27 సంవత్సరానికి అమలు చేయనున్న మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ కార్యక్రమంలో భాగంగా ప్రైవేట్ విత్తన సంస్థలు 14 కంపెనీలకు చెందిన 20 హైబ్రిడ్ పత్తి విత్తన రకాలను ప్రతిపాదించాయి. ఈ రకాలను హైడెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ (హెచ్డీపీఎస్), క్లోజ్ స్పేసింగ్ (సీఎస్), సమగ్ర పంట యాజమాన్యం (ఐసీఎం) విధానాలకు అనుకూలంగా పేర్కొన్నాయి. ఆయా హైబ్రిడ్ రకాల గెజిట్ నోటిఫికేషన్ వివరాలను కూడా జతచేసి, జిల్లాలు రైతుల ఇండెంట్ మేరకు విత్తనాల ప్రతిపాదనలు పంపాలని సూచించా రు. దీంతో రైతులకు శాసీ్త్రయ సాగుకు అనువైన విత్తనాల ఎంపికకు అవకాశం కలగనుంది. మిషన్ కాటన్ ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం అధిక దిగుబడి.. రైతు ఆదాయం పెంపే లక్ష్యం కొత్త విధానాలకు ప్రోత్సాహం 50 శాతం సబ్సిడీతో విత్తనాలు రైతుల ఇండెంట్ మేరకే విత్తనాల సరఫరా గ్రామాల వారీగా అవగాహన సదస్సులకు జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధంమిషన్ కాటన్ ప్రాజెక్టు సమాచారం: అంశం వివరాలు ప్రాజెక్టు పేరు మిషన్ కాటన్ ప్రాజెక్టు అమలు సంస్థ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యవసాయ శాఖల ద్వారా ప్రధాన లక్ష్యం పత్తిలో అధిక దిగుబడి, రైతుల ఆదాయం పెంపు సబ్సిడీ పత్తి విత్తన ప్యాకెట్లపై 50శాతం సబ్సిడీ సాగు విధానాలు నార్మల్, క్లోజ్ డెన్సిటీ, హైడెన్సిటీ విత్తనాల వినియోగం ఎకరానికి 2, 4, 6 ప్యాకెట్ల విధానాలు రైతులు చేయాల్సింది పట్టాదారు పాసుపుస్తకంతో ఏఓను సంప్రదించాలి విత్తనాల కేటాయింపు రైతుల ఇండెంట్గా ప్రభుత్వానికి ప్రతిపాదనలు జిల్లా లక్ష్యం జిల్లాకు ప్రత్యేక టార్గెట్ కేటాయింపు జిల్లాలో పత్తి విస్తీర్ణం వానాకాలం సాగు అంచనా 1.30 లక్షల ఎకరాలు -
ప్రభుత్వ ఉద్యోగులకు బీమా అభినందనీయం
జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కోటి నుంచి కోటిన్నర వరకు నగదు రహిత ప్రమాద బీమాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం గొప్ప విషయమని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఖాజా షరీఫ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నగదు రహిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ 16 బ్యాంకులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం హర్షణీయమన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు జిల్లా ప్రభుత్వ ఉద్యోగులంతా ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు అదనంగా ఒక గంట పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జేఏసీ సెక్రటరీ కొర్నిలియస్, టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పేర్వారం ప్రభాకర్, జిల్లా కోశాధికారి హఫీజ్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’ షురూ
జనగామ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఓటరు నమోదు కార్యక్రమం గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. మొదటి రోజు బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికీ వెళ్లి 2002 సెన్సెస్ ఆధారంగా ఓటర్ల గణన, సవరణ పత్రాలను అందజేశారు. ఒక్కో ఓటరుకు రెండు దరఖాస్తు ఫారాలు ఇస్తుండగా, పూర్తి చేసిన ఒక ఫారం బీఎల్ఓ సంతకంతో ఓటరు వద్దే ఉంచుతారు. మరో ఫారాన్ని బీఎల్ఓలు తీసుకుంటారు. రోజుకు 30 నుంచి 50 ఫారాలు అందజేయనుండగా, ఇంట్లో ఎవరూ లేకపోతే 3 నుంచి 4 రోజులపాటు మళ్లీ వెళ్లి ఇస్తారు. ఫారం ఇచ్చిన వెంటనే యాప్లో పేరు సబ్మిట్ చేస్తే రెడ్ నుంచి ఆరెంజ్ కలర్లోకి మారి, ఎవరికి ఇచ్చామో సులువుగా తెలుస్తుంది. మొదటి రోజే సవాళ్లు జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం మొదటి రోజు ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ, బీఎల్ఓలకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. జిల్లాలో ఇతర జిల్లాల్లో కలిసిన మండలాలను కలుపుకుని మొత్తం 7,67,484 మంది ఓటర్లు ఉండగా, అందులో 7,17,029 మంది ఓటర్లు ఇప్పటికే మ్యాప్ అయ్యారు. ఇంకా 50,455 మంది ఓటర్లు అన్మ్యాప్డ్గా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తున్న బీఎల్ఓలను ఓటర్లు అనేక సందేహాలతో ప్రశ్నించడం కనిపించింది. ఎన్యుమరేషన్ అప్లికేషన్ ఫారంపై సరైన అవగాహన లేకపోవడంతో ఈ ఫారం ఎందుకు, మాకు ఇందిరమ్మ ఇళ్లు వస్తాయా, పెన్షన్లు మంజూరు అవుతాయా అంటూ ప్రజలు బీఎల్ఓలను ఒకటికి రెండుసార్లు ప్రశ్నించారు. దీనికి బీఎల్ఓలు ఇది సంక్షేమ పథకాల కోసం కాదని, కేవలం ఓటరు నమోదు, సవరణ, ధ్రువీకరణ ప్రక్రియ కోసమేనని స్పష్టం చేస్తూ వివరించారు. దీంతో చాలా చోట్ల ఓటర్లకు ప్రత్యేకంగా అవగాహన కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమస్యలు వింటూ ఈ సర్వే కార్యక్రమం కోసం గ్రామాల్లో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లను బీఎల్ఓలుగా నియమించారు. అయితే సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో అనుభవం తక్కువగా ఉండ టం, కొందరు పాతతరం ఉద్యోగులు కావడం వల్ల యాప్ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తాయి. ఫారాలు నింపడం, వాటిని యాప్లో అప్లోడ్ చేయడం వంటి ప్రక్రియల్లో శిక్షణ ఇచ్చినా అమలులో మాత్రం సమస్యలు కనిపించాయి. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్ల వద్ద ఉన్న పాత సెల్ఫోన్లలో స్టోరేజీ నిండిపోవడం, యాప్ సరిగా పనిచేయకపోవడం వంటి సాంకేతిక ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రభుత్వం నుంచి కొత్త ఫోన్లు ఇవ్వాలని పలువురు అంగన్వాడీ టీచర్లు అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఎన్యుమరేషన్ పనిలో సహాయంగా ఒక్కో బృందానికి ఒక అటెండెంట్ను కేటాయిస్తే పని వేగవంతం అవుతుందని బీఎల్ఓలు విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద మొదటి రోజు సర్వే కార్యక్రమం జిల్లాలో ప్రశాంతంగా సాగగా, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిస్థితిని సమీక్షించారు. సర్ ఫారంలోని మూడు కేటగిరీలు.. ఓటర్లకు ఏమిటి అర్థం? ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో ఫారాన్ని మూడు ప్రధాన కేటగిరీలుగా విభజించడం వెనుక ఉద్దేశం ఓటర్ల గుర్తింపును సులభతరం చేయడమే. మొదటి కేటగిరీ 2002 ప్రత్యేక సవరణ జాబితాలోనే పేరు ఉన్న ఓటర్ల కోసం. వీరు 2002 జాబితాలోని అసెంబ్లీ, పార్ట్, సీరియల్ నంబర్లను నమోదు చేస్తే సరిపోతుంది. రెండో కేటగిరీ ప్రస్తుతం ఓటరు జాబితాలో పేరు ఉన్నా, 2002లో ఓటు హక్కు వయస్సు రాని వారు లేదా అప్పటికి కొత్త తరం ఓటర్ల కోసం. వీరు తల్లిదండ్రులు లేదా తాతమ్మల 2002 ఓటరు వివరాలను ఆధారంగా చూపించి తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. మూడో కేటగిరీలో ప్రస్తుతం జాబితాలో పేరు ఉన్నా, 2002 జాబితాలో తమది గానీ, కుటుంబ సభ్యులది గానీ లింక్ దొరకని వారు వస్తారు. వీరికి ఇతర గుర్తింపు పత్రాలు, నివాస ఆధారాలు కీలకం అవుతాయి. మొత్తంగా ఈ మూడు కేటగిరీలు పాత, ప్రస్తుత జాబితా మధ్య లింక్ ఏర్పరచి నకిలీ, డూప్లికేట్, అనుమానాస్పద ఎంట్రీలను గుర్తించడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయి.జిల్లా ఓటర్ల సమాచారం:ఓటర్లు : 7,67,484 మ్యాప్ చేసిన ఓటర్లు : 7,17,029అన్మ్యాప్డ్ ఓటర్లు : 50,455 పోలింగ్ కేంద్రాలు : 865బీఎల్ఓలు : 865 జిల్లాలో ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభం ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసిన బీఎల్ఓలు -
ముగిసిన ఎప్సెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్
జనగామ రూరల్: పట్టణంలోని స్థానిక ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎప్సెట్–2026 సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఈనెల 22 నుంచి 25(గురువారం) వరకు 4 రోజులు వరకు ప్రశాంతంగా ముగిసిందని కళాశాల ప్రిన్సి పాల్ కె.శ్రీనివాస్ తెలిపారు. 980 మందికి పైగా విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టామన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియలో చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ బి.ఎన్.సురేఖ, వెరిఫికేషన్ ఆఫీసర్ రవీందర్ నాయక్, సిస్టం అడ్మినిస్ట్రేషన్, కరుణాకర్, ఎ.కల్పన, కుమారస్వామి, డి.సరోజ, వై.కళావతి, సుజాత పాల్గొన్నారు. వెల్ది మోడల్ స్కూల్, కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు రఘునాథపల్లి: మండలంలోని వెల్ది మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం ఈ నెల 29న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పాలకుర్తి శ్రీధర్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. అర్హులైన విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే పాఠశాలకు అనుబంధంగా ఉన్న బాలికల వసతి గృహంలో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికల కోసం కూడా కొన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ విద్యా సంవత్సరంలో మోడల్ స్కూల్లో కొత్తగా ఏసీఈ గ్రూపును ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. ఇంగ్లిష్ పీజీటీ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం మండలంలోని వెల్ది మోడల్ స్కూల్లో తాత్కాలిక (గంటల ప్రాతిపాదికన) పీజీటీ ఇంగ్లిష్ ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పాలకుర్తి శ్రీధర్ గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు బోధించేందుకు ఈ నియామకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఇంగ్లిష్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలన్నారు. అనుభవం కలిగిన స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నటు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ నెల 29న పాఠశాల ప్రాంగణంలో డెమో క్లాస్, ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల తమను సంప్రదించాలని ఆయన సూచించారు. వన్యప్రాణులపై అవగాహన ఖిలా వరంగల్: మామునూరు టీజీ ఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో వన్యప్రాణుల సంరక్షణ సంస్థ, సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్ (సీడబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో వైల్డ్ సురక్ష పేరుతో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అసిస్టెంట్ కమాండెంట్ బాలయ్య హాజరై మాట్లాడారు. వన్యప్రాణుల ప్రవర్తన, వాటి వల్ల మానవాళికి తలెత్తే సంఘర్షణలు, వన్యప్రాణుల వేట, అక్రమ రవాణా వంటి కీలక అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఏసీ రాజేందర్, ఆర్ఐలు రవి, వెంకటేశ్వర్లు, రాజ్కుమార్, కృష్ణ, సురక్ష త్రివేణి, సిబ్బంది పాల్గొన్నారు. నేడు డయల్ యువర్ డీఎం హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పి.అర్పిత తెలిపారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్కు ఫోన్చేసి సమస్యలు తెలపాలని, సలహాలు, సూచనలు అందించాలని కోరారు. కల్యాణం.. కమనీయం రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం గురువారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మ స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతి నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంతరం కల్యాణాన్ని నిర్వహించారు. ఆరగింపుతో కల్యాణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బుచ్చమచార్యులు, శ్రీనాథచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
హాట్ సీట్ దక్కేదెవరికో?
కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించే ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ పోస్ట్ మళ్లీ ఓ సారి ఖాళీ కానుంది. దీంతో హాట్ సీట్గా పేరుగాంచిన వరంగల్ డీఆర్ పోస్ట్ దక్కేదెవరికో అంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. 2024లో అటెండర్ స్థాయి నుంచి డీఐజీ స్థాయి వరకు జరిగిన బదిలీల్లో భాగంగా జిల్లా రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న హరికోట్ల రవి హైదరాబాద్ ఆడిట్ విభాగంలో చేరగా, హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్న ఫణీందర్ జిల్లా రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించారు. ఏడాదిలోపే డిప్యుటేషన్పై.. హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లా రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించిన ఫణీందర్ ఏడాదిలోపే డిప్యుటేషన్పై హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లా ఎఫ్ఏసీగా బదిలీ అయ్యారు. దీంతో కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్ గతేడాది జూలైలో వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ ఎఫ్ఏసీగా బాధ్యతలను స్వీకరించారు. ఏడాదిలోపే కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్గా, వరంగల్ ఎఫ్ఏసీ జిల్లా రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్కుమార్ ఇటీవల డీఐజీగా పదోన్నతి పొంది ఖాళీగా ఉన్న కరీంనగర్ డీఐజీ పోస్ట్ ఉత్తర్వులు అందుకున్నారు. దీంతో ఏడాదిలోపే మళ్లీ జిల్లా రిజిస్ట్రార్ పోస్ట్ ఖాళీ అయ్యింది. తిరిగి డిప్యుటేషన్పై వెళ్లిన ఫణీందర్ బాధ్యతలు స్వీకరిస్తారా? లేక పూర్తిస్థాయి అధికారిగా హాట్ సీట్ను దక్కించుకుంటారా? అనే చర్చ కొనసాగుతోంది. పైరవీల పరంపర ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ స్థాయి అధికారులు పదోన్నతి రేసులో ఉన్నారు. దీంతో జిల్లా రిజిస్ట్రార్గా వరంగల్లో చేరేందుకు ఇద్దరు జాయింట్ –1 సబ్ రిజిస్ట్రార్లు గురిపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా.. ఖమ్మం జిల్లాకు చెందిన జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్లు సైతం పదోన్నతి లభిస్తే వరంగల్ డీఆర్ పోస్ట్ మాకే కావాలంటూ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునేందుకు పైరవీలు ముమ్మరం చేసినట్లు సమాచారం. వరంగల్ రిజిస్ట్రార్ పోస్ట్ కోసం పైరవీలు ఏడాదిగా ఎఫ్ఏసీ.. ఇటీవల పదోన్నతితో ఖాళీ నియామకంపై సర్వత్రా చర్చ -
దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు
● స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రఘునాథపల్లి: రెండున్నరేళ్లలో నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని, సంక్షేమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్కార్డులు, సన్నబియ్యం తదితర పథకాలు దేశంలో ఎక్కడ లేని విధంగా అందిస్తున్నామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం మండలంలోని గబ్బెట గ్రామంలో రూ.20 లక్షలతో ఆరోగ్య ఉపకేంద్రం, రూ.15లక్షలతో సీసీ రోడ్డు, నూతన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ.. పనిచేసిన నాయకులను, చేయని వారిని ఒకే రకంగా చూడొద్దని కోరారు. గబ్బెట గ్రామంలోనే రూ.1.50 కోట్లతో అభివృద్ది పనులు చేసుకున్నామని చెప్పారు. వచ్చే ఏడాదిలోపు గబ్బెటకు మరో కోటి రూపాయల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో 47 మంది లబ్ధిదారులకు అయా గ్రామాల సర్పంచ్లతో కలిసి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, తహసీల్దార్ రాజేష్రెడ్డి, సర్పంచ్లు కూటిగంటి ఉపేంద్రఅనిల్, బొల్లం ఉమారాణి, బొమ్మ వీరస్వామి, గైని శ్రీనివాస్గౌడ్, ఇల్లందుల రవి, సదానందం, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్చందర్రెడ్డి, పోకల శివకుమార్, నామాల బుచ్చయ్య, కోళ్ల రవిగౌడ్, లింగాజి, గాదె మహేందర్రెడ్డి, గొరిగ రవి, శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయాలిజనగామ రూరల్: డ్రగ్స్ నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జూనియర్ సివిల్ జడ్జి శశి పిలుపునిచ్చారు. గురువారం జనగామ చౌరస్తాలో మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజలకు, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా చౌరస్తాలో విద్యార్థులు మానవహారం చేపట్టి మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జెడ్జి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే 1908 టోల్–ఫ్రీ నంబర్ సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి, సీఐ సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ పాఠశాలలు కళాశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు జూనియర్ సివిల్ జడ్జి శశి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
వీఓ భవన నిర్మాణాలు ప్రారంభించండి
● అదనపు డీఆర్డీఓ నాగ శేషాద్రిసూరి నర్మెట: వీఓ భవన నిర్మాణాలను ఈ నెల 30లోగా ప్రారంభించాలని అదనపు డీఆర్డీఓ నాగ శేషాద్రిసూరి సూచించారు. మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్ అధ్యక్షతన గురువారం ఏర్పాటు చేసిన మండల సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.. జూలై 1 నుంచి ఉపాధి హామీ పథకం పేరు జీరాంజీగా మారుతుందని ఈలోగా భవన నిర్మాణాలు చేపట్టాలని ఒక్కో నిర్మాణానికి రూ.10లక్షలు చెల్లించడం జరుగుతుందన్నారు. మండలానికి 8 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు మంజూరయ్యాయని, ఒక్కో దానికి రూ.3 లక్షలు, సోక్పిట్స్ మండల కేంద్రానికి రెండు, ప్రతీ జీపీకి ఒకటి నిర్మాణాలు చేపట్టాలని ఒక్కో దానికి రూ.92 వేలు చెల్లించబడతాయని, త్వరితగతిన పనులు ప్రారంభించాలని అన్నారు. తాము చేసిన పనులకు బిల్లులు ఇప్పించాలని సర్పంచ్లు గోపగోని శ్రీధర్గౌడ్, పగిడిపాటి రాజు, రమేష్, శంకర్ నాయక్ సభ దృష్టికి తీసుకురాగా పనుల వివరాలను సంబంధిత అధికారులకు అందజేయాలని ఎంపీఓ ఉప్పుగల్ల సంపత్ కుమార్ సూచించారు. డీటీ కురికాల వేణు, ఎంఈఓ మడిపల్లి ఐలయ్య, వైద్యాధికారి సుకన్య ఆయా శాఖల అధికారులు నివేదికలు చదివి వినిపించారు. సర్పంచ్లు బొలగాని రేఖ, బాలాజీ, బుజ్జమ్మ, అరుణ, చిన్నపురెడ్డి, పంచాయతీ కార్యదర్శలు పాల్గొన్నారు. -
ఎకై ్సజ్ శాఖలో భారీ బదిలీలు
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ఎకై ్సజ్ శాఖలో భారీస్థాయిలో బదిలీలు చేపట్టింది. డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారుల (డీపీఈఓ) స్థాయిల్లో జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు అధికారులు ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. అదే సమయంలో ఇతర జిల్లాల నుంచి కొందరు అధికారులు వరంగల్ అర్బ న్ (హనుమకొండ), వరంగల్ రూరల్ (వరంగల్), ఎన్ఫోర్స్మెంట్ విభాగాల్లో పోస్టింగ్ పొందారు. అంజన్రావుకు ప్రమోషన్.. వరంగల్ డిప్యూటీ కమిషనర్ అంజన్రావుకు జాయింట్ కమిషనర్గా ప్రమోషన్ రాగా,, ఇన్చార్జ్ డీసీగా కూడా ఉన్నారు. ఈ బదిలీల్లో డీజీబీసీఎల్ ఆర్ఆర్–1 చీఫ్ మేనేజర్గా ఉన్న హెచ్.దత్తురాజ్గౌడ్ను వరంగల్ డిప్యూటీ కమిషనర్గా నియమించారు. మల్కాజిగిరి డీపీఈఓ కె.నవీన్కుమార్కు వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్గా పోస్టింగ్ లభించింది. హనుమకొండ డీపీఈఓగా పనిచేస్తున్న కె.చంద్రశేఖర్కు ఇటీవల అసిస్టెంట్ కమిషనర్గా పదోన్నతి లభించగా ఆయనను టీజీబీసీఎల్ చీఫ్ మేనేజర్గా నియమించారు. ఆయన స్థానంలో కరీంనగర్ డీపీఈఓ పి.శ్రీనివాస్రావును వరంగల్ అర్బన్ డీపీఈఓగా, వరంగల్ రూరల్ డీపీఈఓ డి.అరుణ్కుమార్ను నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో సంగారెడ్డికి చెందిన ఎం.మణెమ్మను వరంగల్ రూరల్ డీపీఈఓగా నియమించారు. భూపాలపల్లి డీపీఈఓ వి.శ్రీనివాస్ను నిర్మల్కు, ఎన్ఫోర్స్మెంట్ వరంగల్లో పనిచేస్తున్న డి.శ్రీనివాస్రెడ్డిని వికారాబాద్ డీపీఈఓగా పంపించారు. జనగామ డీపీఈఓ కె.అనితకు సూర్యాపేట బాధ్యతలు అప్పగించారు. భూపాలపల్లి (ఏపీఈఎస్) ఎం.లింగాచారి వనపర్తి డీపీఈఓగా బదిలీ చేశారు. ఐదు నెలల నిరీక్షణకు తెర... ఎట్టకేలకు పోస్టింగ్ ఐదు నెలలుగా పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్న అధికారులకు ఎట్టకేలకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జనవరి చివరన పలువురికి ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ (ఏపీఈఎస్)లకు జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ (డీపీఈఓ)లుగా, డీపీఈఓలకు అసిస్టెంట్ కమిషనర్(ఏసీ)లుగా, ఏసీలకు డిప్యూటీ కమిషనర్ (డీసీ)లుగా పదోన్నతి కలిగింది. అయితే, పదోన్నతులు పొందినప్పటికీ ఆ అధికారులు పాతస్థానాల్లోనే ఐదు నెలలుగా కొనసాగుతున్నారు. పదోన్నతుల తర్వాత విధుల కేటాయింపు లేకపోవడంతో పలువురు అధికారులు తాత్కాలిక ఏర్పాట్లతో కొనసాగాల్సి వచ్చింది. జిల్లాలు, విభాగాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ పోస్టింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో అసంతృప్తి వ్యక్తమైంది. అయితే, తాజాగా ప్రభుత్వం ఒకేసారి డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, డీపీఈఓ, ఏపీఈఎస్ స్థాయి అధికారులకు పోస్టింగ్ ఇవ్వడంతో ఐదు నెలలుగా ఎదురుచూస్తున్న వారికి ఊరట లభించింది. డిప్యూటీ కమిషనర్, ఏసీ, డీపీఈఓలకు స్థానచలనం వరంగల్ డీసీగా హెచ్ దత్తురాజ్గౌడ్.. ఏసీగా నవీన్కుమార్ హనుమకొండ డీపీఈఓగా శ్రీనివాస్రావు.. వరంగల్కు మణెమ్మ ఉమ్మడి వరంగల్లో అధికారుల రాకపోకలు.. పలువురికి కొత్త బాధ్యతలు -
నాణ్యతగా, రుచికరంగా!
జనగామ రూరల్: విద్యాహక్కు చట్టం ప్రకారం బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలని, మధ్యలో మానేయకుండా విద్యార్థుల డ్రాపౌట్స్ను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. అయితే ఈ మధ్యాహ్న భోజనం ఈసారి మరింత భద్రంగా అమలు చేయాలని ప్రభుత్వం జిల్లా విద్యాధికారులకు సూచించింది. వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు ప్రారంభం కాగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనంపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మధ్యాహ్న భోజనం అమలులో ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా తగిన చర్యలు చేపట్టాలని పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలస్ డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం ఎలా వండిపెట్టాలో ఇప్పటికే వంట నిర్వాహకులకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 508 వరకు ఉన్నాయి. ప్రత్యేక శిక్షణ.. మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచేందుకు మండల విద్యాధికారులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు గతంలోనే ఒకరోజు శిక్షణ శిబిరం నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతో పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు, పండుగలు వంటి సందర్భాలలో విద్యార్థులకు ప్రత్యేక భోజనం అందించేలా చూడాలి. అలాగే దాతల సహకారంతో నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందించేలా కృషి చేయాలి. వీటితో పాటు ప్రతీ పాఠశాలలో స్కూల్ న్యూట్రిషన్ గార్డెన్లు అభివృద్ధి చేసేందుకు వ్యవసాయ, ఉద్యాన, అటవీశాఖ సహకారంతో పాఠశాలలో అందుబాటులో ఉన్న స్థలం వినియోగించి ఆకుకూరలు, కూరగాయలు పండించి వాటిని మధ్యాహ్న భోజనానికి వినియోగించుకునేలా అవగాహన కల్పించారు. పాఠశాలలో చేయాల్సిన పనులు జాతీయ ఆహార భద్రతా చట్టం 2013, పీఎం పోషణ్ నియమాలను అనుసరించి పరిశుభ్రమైన, నాణ్యమైన, పోషక విలువలు గల ఆహారం విద్యార్థులకు అందించాలి. ఇందుకుగాను మధ్యాహ్న భోజన వంటశాలలో ఎప్పటికప్పుడు దుమ్ము ధూళి తొలగించి, నీటి ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్తో శుభ్రం చేయాలి. మధ్యాహ్న భోజనానికి వినియోగించే వంట పాత్రలను వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. పాఠశాల ఆవరణలో ప్రతీ రోజు పూర్తిగా పరిశుభ్రం చేయాలి. వంటచేసే సమయంలో శుభ్రమైన దుస్తులు ఆప్రాన్, తలవెంట్రుకలు ఆహార పదార్థాలలో పడకుండా తలకు క్యాపు ధరించాలి. చేతులకు గ్లౌజ్, మూతికి మాస్క్ ధరించాలి. ఇబ్బందులు తలెత్తకుండా సురక్షితమైన వంటశాల, నాణ్యమైన ఆహారం, శుభ్రమైన పరిసరాలు, స్వచ్ఛమైన తాగునీరు ఈ నాలుగు అంశాలను తప్పకుండా పాటించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా జిల్లా విద్యాధికారులకు, ఎంఈఓలకు, ప్రధానోపాధ్యాయులకు, ప్రత్యేకాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కలెక్టర్ నిత్యం పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మరింత భద్రం జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాధికారులకు ప్రభుత్వ ఆదేశాలు వంట సిబ్బందికి, ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ జిల్లా వ్యాప్తంగా 508 పాఠశాలల్లో అమలు పాఠశాలల వివరాలుమొత్తం పాఠశాలలు – 508ప్రాథమిక పాఠశాలలు – 341ప్రాథమికోన్నత పాఠశాలలు – 64ఉన్నత పాఠశాలలు – 103మధ్యాహ్న భోజనం మెనూ...సోమవారం : కిచిడి, కోడిగుడ్డు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ మంగళవారం : అన్నం, సాంబార్, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, రాగిజావ బుధవారం : అన్నం, పప్పు, ఆకుకూర, కోడిగుడ్డు వెజిటేబుల్ కర్రీ గురువారం : వెజ్ బిర్యానీ, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, రాగిజావ శుక్రవారం : అన్నం, సాంబార్, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, కోడిగుడ్డు శనివారం : అన్నం, పప్పు, ఆకుకూర, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, రాగిజావ -
మత్తు పదార్థాలకు బానిస కావొద్దు
● జూనియర్ సివిల్ జెడ్జి సందీప జనగామ రూరల్: విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కావొద్దని జూనియర్ సివిల్ జడ్జి సందీప సూచించారు. బుధవారం పట్టణంలో పసరమడ్ల స్టేజీ వద్ద ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ఎవరైనా డ్రగ్స్ విక్రయించడం, వాడడం గమనిస్తే 100 లేదా 1933 నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఒ.లచ్చిరామ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
జఫర్గఢ్ ఆసుపత్రిలో తొలి ప్రసూతి ఆపరేషన్
జఫర్గఢ్: మండల కేంద్రంలోని సామాజిక అరోగ్య కేంద్రం చరిత్రలోనే తొలిసారిగా ఆపరేషన్ ద్వారా డెలివరీ(ప్రసూతి) చేశారు. బుధవారం డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చిన మండలంలోని వడ్డెగూడెం నివాసి మంచాల రమ్యకు డాక్టర్ సునిత నేతృత్వంలో వైద్యులు ఆపరేషన్ ద్వారా డెలివరీ చేశారు. దీంతో తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఆసుపత్రి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆపరేషన్ ద్వారా వైద్యులు డెలివరీ చేయడం గమనార్హం. ఈ ఆపరేషన్లో ఆస్పత్రి సూపరింటెండెంట్ అబ్దుల్ రావూఫ్, వైద్యులు శోభ, సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సూపరింటెండెంట్ అబ్దుల్ రావూఫ్ మాట్లాడుతూ.. ఆసుపత్రిలో సాధారణ కాన్పులతో పాటు అవసరమనుకుంటే శస్త్రచికిత్సల ద్వారా కాన్పులు చేసేందుకు సంబంధిత వైద్యులతో పాటు వైద్య పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. -
ఫీల్డ్ స్టాఫ్ @ ఆపరేటర్లు
లింగాల ఘణపురం: జిల్లాలో విద్యుత్ సబ్స్టేషన్లలో ఆపరేటర్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఫీల్డ్ స్టాఫే సబ్స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్నారు. ఫోర్మెన్ మొదలుకొని జేఎల్ఎం వరకు తమ ఫీల్డ్ విధులతో పాటు ఆపరేటర్ల డ్యూటీలు కూడా చేయాల్సి వస్తోంది. దీంతో వారు పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. ప్రతి ఏటా పెరుగుతున్న కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటుకు అనుగుణంగా ఆపరేటర్లను నియమించకపోవడంతో సిబ్బంది కొరత వేధిస్తోంది. కాగా క్షేత్రస్థాయిలో ఏదైన విద్యుత్ లైన్లలో, ట్రాన్స్ఫార్మర్లలో మరమ్మతులు ఏర్పడితే గంటల కొద్ది ఆలస్యం కావడం, ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయించుకోవడం, కొన్ని సందర్భాల్లో రైతులే స్వయంగా ట్రాన్స్ఫార్మర్ ఫీజులు వేసుకుంటున్నారు. దీంతో కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా సెలవులు లేక, షిఫ్టుల వారీగా చేయాల్సిన డ్యూటీలు రోజుల తరబడి చేస్తున్న ఆర్టిజెన్స్ సిబ్బంది బాధలు వర్ణనాతీతం. ఫోర్మెన్ మొదలుకొని జేఎల్ఎం వరకు.. సబ్స్టేషన్ పరిధిలో పనిచేసే ఫోర్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, లైన్మెన్ కోఆర్డినేషన్తో విద్యుత్ లైన్ ఎస్టిమేట్ చేయడం, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, బిల్లులు వసూలు చేయడం వంటి విధులు నిర్వహించే వారికి కూడా ఆపరేటర్ల డ్యూటీలు వేస్తున్నారు. ఏడేళ్లుగా నియామకాలు శూన్యం.. సబ్స్టేషన్ ఆపరేటర్ల నియామకం ఏడేళ్లుగా చేపట్టడం లేదు. 2017 కంటే ముందు కాంట్రాక్టర్ పరిధిలో పని చేసే ఆపరేటర్లు ఆ తర్వాత ఆర్టిజెన్ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు ఎన్పీడీసీఎల్ చెల్లిస్తుంది. 2019 నుంచి ఇప్పటివరకు ఉద్యోగుల నియామకం చేపట్టంలేదు. జిల్లా పరిధిలో జనగామ, స్టేషన్ఘన్పూర్ రెండు డివిజన్లు ఉండగా జనగామ పరిధిలో 48, స్టేషన్ఘన్పూర్ పరిధిలో 33 సబ్స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 81 ఉండగా కేవలం 120 మంది మాత్రమే ఆర్టిజెన్స్ ఉన్నారు. ఇంకా 205 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏడేళ్లుగా ఆపరేటర్ల నియామకాలు లేక ఫీల్డ్ స్టాఫ్కు పనిఒత్తిడి ఫోర్మెన్ మొదలుకొని జేఎల్ఎం వరకు సబ్స్టేషన్ డ్యూటీలు ఆర్టిజెన్స్ సిబ్బందికి రోజుల తరబడి డ్యూటీలు -
గ్రామాల అభివృద్ధే ధ్యేయం
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బచ్చన్నపేట : గ్రామాల అభివృద్ధే ప్రధాన ధ్యేయమని, అందుకు తగిన నిధులను మంజూరు చేయిస్తున్నామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని లింగంపల్లి గ్రామంలో రూ.12 లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీ గ్రామానికి బీటీ, సీసీ రోడ్ల సౌకర్యం కల్పించి, మౌలిక వసతులను మెరుగుపర్చి ఈజీఎస్ నిధులను వినియోగం చేసుకుంటామన్నారు. రైతుబంధు సమితి జిల్లా మాజీ కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, సర్పంచ్లు మద్దికుంట రాధ, పోతుల వెంకటేష్, ఆరె రవికుమార్, నాయకులు చల్ల శ్రీనివాస్రెడ్డి, కోడూరి శివకుమార్గౌడ్, మహేష్కుమార్, హరీష్, నూకల రాజిరెడ్డి పాల్గొన్నారు. 29న జిల్లాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ జనగామ రూరల్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈనెల 29న జిల్లాకు రానున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని నితిన్ నబీన్కు ఘనస్వాగతం పలకాలన్నారు. రాష్ట్రంలో బీజే పీ బలోపేతం చేయడం లక్ష్యంగా నితిన్ పర్యటన ఉంటుందని తెలిపారు. సమావేశంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, విద్యాసాగర్ రెడ్డి, ఉడుగుల రమేశ్, లేగ రామ్మోహన్ రెడ్డి, శివరాజ్ యాదవ్, కొంతం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి భాగాల నవీన్ రెడ్డి, దేవర ఎల్లయ్య, మహిపాల్, వివిధ మండలాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నేడు ‘ప్రగతి ప్రణాళిక’ ప్రత్యేక అధికారి రాక జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించేందుకు ప్రత్యేక అధికారి దేవసేన ఈనెల 25న జిల్లాకు రానున్నారు. ఉదయం 10:30 గంటలకు జనగామ రాగానే 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జిల్లా అధికారులతో ప్రత్యేక పనులపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 గంటల వరకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. నిట్ క్యాంపస్ సెలక్షన్స్కు కంపెనీల క్యూ కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లో క్యాంపస్ సెలక్షన్స్కు కంపెనీలు క్యూ కడుతున్నాయని డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరంలో 93.75 శాతం యూటీ విద్యార్థులు, 78.72 శాతం పీజీ విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాలు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. 2024–25లో 290 కంపెనీలు రాగా.. 2025–26లో 360 కంపెనీలు పోటీపడ్డాయని తెలిపారు. కౌన్సెలింగ్ కేంద్రానికి స్థల పరిశీలన వరంగల్ క్రైం: సుబేదారి పోలీస్స్టేషన్ ఆవరణలోని మహిళా పోలీస్స్టేషన్–1ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ బుధవారం సందర్శించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రానికి సంబంధించిన స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రం నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు, కార్యాచరణ తదితర అంశాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ వరంగల్ రంగంపేటలోని మహిళా పోలీస్స్టేషన్–2లో కొనసాగుతున్న ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రం నిర్వహణ విధానం, కేసుల పరిష్కార ప్రక్రియ అడిగి తెలుసుకున్నారు. 24హెచ్ఎంకెడి 276 : పోలీస్ అధికారులకు సూచనలు చేస్తున్న సీపీ సన్ప్రీత్ సింగ్ -
ఇళ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తిచేయాలి
జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పారదర్శకత, నాణ్యత, వేగం ఉండేలా అధికారులు కృషి చేయాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ అన్నారు. బుధవారం జనగామ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నంబర్ 2, 10లో, వీవర్స్ కాలనీల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను అలాగే బాణపురంలోని ఇళ్లను కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణ ఖర్చు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత (ఫేజ్–2) మంజూరు ప్రక్రియ చేపట్టే నాటికి మొదటి విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలని స్పష్టం చేశారు. బాణాపురంలోని రెండు పడక గదుల ఇళ్లకు తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రహదారులు, విద్యుత్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేసి, అర్హులైన లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అదే విధంగా గుడిసెల్లో నివసిస్తూ కట్టెల పొయ్యిలపై వంట చేస్తున్న కుటుంబాలను గుర్తించిన కలెక్టర్, వారికి తక్షణమే గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను ఆదేశించారు. పర్యటనలో మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్ పాల్గొన్నారు. ఖర్చు ఎంతయ్యింది? బిల్లు ఎంతొచ్చింది? లింగాలఘణపురం: ‘ఇల్లు పూర్తి చేసుకొని గృహప్రవేశం చేశావా..ఎంత ఖర్చు అయ్యింది..బిల్లు ఎంత వచ్చింది’ అంటూ గృహ నిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతమ్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ప్రశ్నించారు. మండలంలోని నెల్లుట్ల బుండిగజంగాల కాలనీలో కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఇళ్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారు కడమంచి అబ్బమ్మ ఇళ్లలోకి వెళ్లి ఆమెతో మాట్లాడుతూ.. ఎంత ఖర్చు అయ్యింది..ఎంత బిల్లు వచ్చిందని అడగ్గా.. రూ.3.60లక్షలు వచ్చిందని, మిగిలిన రూ.1.40 లక్షలు రావాలని చెప్పగా ఈజీఎస్ అమౌంట్ కూడా పడుతుందా అంటూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా కాలనీలో ఉన్న గుడిసెల్లోనికి వెళ్లి మొదటి విడతలో ఎందుకు రాలేదు..ఇప్పుడు తప్పకుండా వీరికి ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్కు సూచించారు. వీరితో పాటు సర్పంచ్ నర్సింగ రామకృష్ణ, ఉపసర్పంచ్ కావ్యప్రభాకర్, గృహనిర్మాణశాఖ పీడీ మాతృనాయక్, డీఈ చంద్రశేఖర్, తహసీల్దార్ అండాలు, ఎంపీఓ సుమన్ తదితరులు ఉన్నారు. ఫేజ్–2 మంజూరుకు ముందే మొదటి విడత పూర్తవ్వాలి గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన -
‘ఈ–బాక్స్’ అభయం!
పాలకుర్తి టౌన్: అభం, శుభం తెలియని చిన్నారులపై ఇటీవల కాలంలో అఘాయిత్యాలు పెరిగి పోతున్నాయి. చట్టాలు ఎన్ని ఉన్నా.. మార్పు రావడం లేదు. కొందరు నిందితులకు భయపడి, మరికొందరు పరువు పోతుందని మౌనం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేరగాళ్లను శిక్షించడంతో పాటు ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచేందుకు ప్రత్యేక యాప్ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు, లైంగిక దాడులు,అశ్లీల కంటెంట్ వంటి నేరాలపై తక్షణ ఫిర్యాదు స్వీకరించేందుకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) ఆధ్వర్యంలో పోక్సో ఈ–బాక్స్ యాప్ అందుబాటులో ఉంది. ఈ వేదిక ద్వారా పిల్లలు లేదా వారి తరపున తల్లిదండ్రులు, సంక్షరక్షకులు ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. యాప్ పనిచేసేది ఇలా.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘పోక్సో ఈ–బాక్స్’ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎన్సీపీసీఆర్. జీవీఓ,ఇన్ వైబ్సైట్లో ఽఫిర్యాదు చేయొచ్చు. యాప్ ఓపెన్ కాగానే ‘పోక్సో ఈ బాక్స్’ కనిపిస్తుంది. ఫిర్యాదు ఇచ్చేందుకు క్లిక్ చేస్తే చిన్నారులకు ఎదురయ్యే ఆరు రకాల హింసలకు సంబంధించిన చిత్రాలు కనిపిప్తాయి. హింస స్వభావాన్ని గమనించి దానిపై క్లిక్ చేయాలి. అనంతరం ఫిర్యాదు పేజిలో బాధితులు, ఘటన వివరాలను నమోదు చేసి సబ్మిట్ కొట్టాలి, కేంద్ర ప్రభుత్వం బాలికలకు భరోసా కల్పించేందుకు ఢిల్లీ కేంద్రంగా దీన్ని ప్రారంభించారు. బాధితులు చేసిన ఫిర్యాదులను సంబంఽధిత అధికారులు సీ్త్ర,శిశు సంక్షేమాధికారి రాష్ట్ర కార్యాలయానికి, జిల్లా కేంద్రానికి పంపిస్తారు. బాలల సంరక్షణ సిబ్బంది సహకరించి వెంటనే విచారణ చేపడతారు. క్షేత్రస్ధాయిలో విచారించే అధికారులకు ఫిర్యాదు ఎవరు చేశారన్న సమాచారం తెలియదు. వంద శాతం పారదర్శకతతో విచారణ జరిపి పోలీసుల సహకారంతో కేసు నమోదు చేస్తారు. ఎప్పటికప్పుడు కేసు పురోగతి వివరాలు కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. ఫిర్యాదుదారులకు రక్షణ, నేరానికి పాల్పడిన వారికి శిక్ష పడేలా యంత్రాంగం తోడ్పాటునిస్తుంది. శిక్షలు ఇలా.. పోక్సో చట్టం–2012 ప్రకారం పిల్లలపై లైంగిక వేధింపులకు 3 సంవత్సరాల వరకు, లైంగిక దాడులకు 5సంవత్సరాల వరకు, తీవ్రమైన లైంగిక దాడి, అత్యాచారం కేసులో 10 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు శిక్షలు విఽధించే అవకాశం ఉంది. ఫిర్యాదుల కోసం 1098 చైల్డ్ హెల్ప్లైన్, సమీప పోలీస్సేష్టన్లో లేదా పోక్సో ఈ–బాక్స్ యాప్ను కూడా వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ–బాక్స్ యాప్తో నేరాలకు అడ్డుకట్ట కేంద్ర ప్రభుత్వం తెచ్చిన యాప్తో నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చు. దీనిపై ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. పౌరులకు జరుగుతున్న అన్యాయాన్ని ఇందులో అప్లోడ్ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చొరవ చూపాలి. నమోదైన వివరాలను పోలీసుశాఖకు పంపిస్తారు. వాటి ఆధారంగా కేసులు నమోదు చేసి నిందితులకు శిక్షలు పడేలా చేస్తాం. – జానకీరామ్రెడ్డి, సీఐ, పాలకుర్తి పిల్లలపై లైంగిక వేధింపులకు ఇక చెక్ పోక్సో కేసుల్లో బాధితులకు భరోసా ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసే అవకాశం గోప్యతకు పెద్దపీట..నేరాలకు అడ్డుకట్ట -
క్రీడలకూ ప్రాధాన్యం ఇవ్వాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝారఘునాథపల్లి: పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని నిడిగొండ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. 6,7 తరగతి విద్యార్థుల పఠన సామర్థ్యాలను స్వయంగా పరీక్షించి, విద్యార్థులు పాఠ్యాంశాలను ఎంత వరకు అర్థం చేసుకుంటున్నారో తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను పరిశీలించి పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం ఉండరాదన్నారు. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్లను పరిశీలించి జీవశాస్త్ర ల్యాబ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఫాస్ట్ మ్యాథ్స్ సద్వినియోగం చేసుకోవాలి జనగామ రూరల్: ప్రతతీ విద్యార్థి గణితంలో విషయావగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రూపొందించిన ‘ఫాస్ట్ మ్యాథ్స్‘ పుస్తకాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆవిష్కరించారు. కలెక్టర్ మా ట్లాడుతూ.. విద్యార్థులు గణితంపై భయాన్ని విడిచిపెట్టి ఆత్మవిశ్వాసంతో అభ్యసించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంఓ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియా బేగం, ప్రధానోపాధ్యాయులు అఫ్సర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘సర్’కు సర్వం సిద్ధం
జనగామ రూరల్: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈనెల 25(గురువారం) నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందుకుగాను జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ కార్యక్రమం ద్వారా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించి, అర్హులైన ప్రతీ పౌరుని పేరు జాబితాలో నమోదు చేయడం, తప్పులను సరిచేయడం, అనర్హుల పేర్లను తొలగించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 765 మంది బీఎల్ఓలను, 88 మంది సూపర్వైజర్లును నియమించారు. కార్యక్రమ షెడ్యూల్: ● ఇంటింటి సర్వే 25–06–2026 నుం,చి 24–07వరకు ● 31 న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ ● క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ: 31–07 నెల నుండి 30–08 నెల వరకు ● 28–09 నెల వరకు అప్పీళ్ల పరిశీలన ● తుది ఓటరు జాబితా ప్రచురణ 01–10నెల ఉంటుంది. నేటి నుంచి ఓటరు గణన ప్రారంభం బీఎల్ఓలకు సామగ్రి అందజేత -
నార్కోటిక్స్ విస్తృత తనిఖీలు
జనగామ రూరల్: పట్టణంలో మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా మంగళవారం ఎస్ఐలు భరత్, రతీష్, చెన్నకేశవులు, నర్సయ్య, పోలీసు సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందం సీఐ ఆకస్మిక నార్కోటిక్స్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనగామ బస్టాండ్తో పాటు పట్టణంలోని అనుమానాస్పద ప్రాంతాలు, అనుమానిత వ్యక్తులను డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు వారు తెలిపారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో మాదకద్రవ్యాలకు సంబంధించిన కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే సమాచారం అందించి సహకరించాలని కోరారు. -
మైనర్లకు వాహనం ఇవ్వొద్దు
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: వాహనదారులు మైనర్లకు వాహనం ఇచ్చి రోడ్డు ప్రమాదాలకు కారణమై చట్టపరమైన చిక్కుల్లో పడొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ పోలీస్ అధికారి నిరంతరం కృషి చేయడంతోపాటు, ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నా రు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాహనదారులకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొంతమంది బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిలో అధికంగా మైనర్ వాహనదారులు ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం పర్వతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వృద్ధులతో పాటు, ఓ బాలుడు మరణించగా, మరో బాలుడు తీవ్ర గాయాలతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు వివరించారు. ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం మైనర్ అతి వేగంగా వాహనం నడపడమేనని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, ముఖ్యంగా మైనర్లకు వాహనం అందజేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఇలాంటి ఘటనల్లో వాహన యజమాని, మైనర్ తల్లిదండ్రులు బాధ్యులుగా చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జైలుకు తరలిస్తామని సీపీ హెచ్చరించారు. -
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
జనగామ రూరల్: పట్టణంలోని హైదరాబాద్ మెయిన్ రోడ్డు నుంచి వెళ్లే వరద నీటి డ్రెయినేజీ పనులను మంగళవారం మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణంలోని ఎగువ ప్రాంతాలైన బాణాపురం, రంగప్ప చెరువు, గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా, కురుమవాడ, రైల్వేస్టేషన్ ప్రాంతాల నుంచి వర్షాలు పడినప్పుడు వచ్చే వరద నీరు వల్ల హైదరాబాద్ మెయిన్ రోడ్ బాలాజీ నగర్, జ్యోతినగర్ వరదలో ముంపునకు గురి అవుతున్న పరిస్థితి ఉందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు. రూ.9.10 కోట్లతో నిర్మించనున్న స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులు ప్రారంభమైయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బూడిది జ్యోతి, మంత్రి సుమలత, పానుగంటి సువార్త, మున్సిపల్ ఏఈ అనిల్, సంబంధిత వర్క్ కాంట్రాక్టర్ దోర్నాల శశికాంత్ పాల్గొన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలి స్టేషన్ఘన్పూర్: రోగులకు మెరుగైన సేవలు అందించేలా వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అఽధికారి డాక్టర్ మల్లికార్జున్రావు సూచించారు. మండలంలోని ఇప్పగూడెం పీహెచ్సీని మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలను, ల్యాబ్ను తనిఖీ చేశారు. అనంతరం ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బందికి చెందిన రిజిష్టర్లను పరిశీలించారు. ప్రతీ రోజూ ఓపీ ఎంత ఉంటుందని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీహెచ్సీలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యురాలు సాయిప్రణీత, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అశోక్, డాక్టర్ కమల్హాసన్, పీహెచ్ఎన్ రమణ, సూపర్వైజర్ సత్యం, ఎంఎల్హెచ్పీలు రమ్యకృష్ణ, రాజేశ్వరి, స్టాఫ్నర్సు లావణ్య, ఏఎన్ఎం రాజ్యలక్ష్మీ, ల్యాబ్ టెక్నీషియన్ సునీల్కుమార్ పాల్గొన్నారు. సమయపాలన పాటించండి ● డిప్యూటీ డీఎంహెచ్ఓ వాణిశ్రీ నర్మెట: సమయ పాలన పాటించి మెరుగైన వైద్యసేవలు అందించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ, పీఓ ఎంసీహెచ్ డాక్టర్ వాణిశ్రీ (స్టే.ఘన్పూర్ డివిజన్) సిబ్బందికి సూచించారు. స్థానిక పీహెచ్సీని మంగళవారం ఆకస్మిక తనిఖీ చేసిన ఆమె రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరిగేలా చూడాలని, మాతా శిశు సంరక్షణపై దృష్టి సారించాలని, గర్భిణులు, బాలింతల వివరాలను వంద శాతం నమోదు చేయాలన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను విధిగా నిర్వహించాలని సూచించారు. ఆమె వెంట వైద్యాఽధికారులు ఎట్టిరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, ముక్కా సుకన్య, మోహి సిద్దిఖి తదితరులు ఉన్నారు. రేపు తెలంగాణ కామర్స్ అసోసియేషన్ సదస్సు కేయూ క్యాంపస్: తెలంగాణ కామర్స్ అసోసియేషన్ 7వ వార్షిక సదస్సును ఈనెల 25న కేయూలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో నిర్వహించనున్నారు. వర్సిటీ కాలేజీ ఆఫ్ కామర్స్, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వికసిత్భారత్–47 న్యూ డైమన్షన్స్ ఇన్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ ది ఎరా ఆఫ్ యాక్ట్’ అంశంపై ఈసదస్సును నిర్వహించనున్నారు. సదస్సులో కృత్రిమ మేధ ప్రభావం, వ్యాపార విశ్లేషణ, ఆర్థిక రంగం, ఫిన్టిక్ స్టార్టప్లు, మార్కెటింగ్పై చర్చలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి, విశిష్ట అతిథిగా కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. ప్రొఫెసర్ హెచ్.వీ స్మారకోపన్యాసం ఉంటుందని కన్వీనర్ ఫణీంద్రకుమార్, కోకన్వీనర్ బి.ప్రగతి తెలిపారు. ముగింపు సభకు రిజిస్ట్రార్ రామచంద్రం, ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఘనశ్యామ్ సోలంకి హాజరవుతారన్నారు. -
సూచించిన వరి రకాలు
జనగామ రూరల్: వానాకాలం సీజన్లో కేవలం 7 రకాల సన్నరకం వడ్లకే బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు నిరాశకు గురి కావాల్సి వస్తోంది. గతేడాది 33 రకాల సన్నాల కు బోనస్ అందజేసి ప్రస్తుతం ఏడింటికే పరిమితం చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి సాగుకు గాను ఈ మేరకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ప్రభుత్వం సన్న ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500లు బోనస్ చెల్లిస్తుంది. దీంతో రైతులు అత్యధికంగా సన్నాలు సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నా గతంతో పోల్చితే వాటి సంఖ్య తగ్గించడం సరైంది కాదని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో ఈ సీజన్లో 2.15 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. గతేడాది 2.9 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈ సీజన్ నుంచి వ్యవసాయశాఖ అధికారులు ఏడు రకాల సన్నాలను ప్రకటించగా వాటిలో అత్యధిక దిగుబడి, చీడపీడలను తట్టుకొనే, తక్కువ వ్యవధిలో పంట చేతికి వచ్చే వరి వంగడాలను ఎంపిక చేసుకోవడంలో సమస్యలు తలెత్తున్నాయి. గతేడాది రైతులకు ఎక్కువ సంఖ్యలో విత్తనాలు అందుబాటులో ఉండడంతో అధిక దిగుబడినిచ్చే విత్తనా లను ఎంపిక చేసుకున్నారు. ఈసారి అలాంటి అవకాశం లేకపోవడంతో దిగుబడిపై ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. అయితే పంట సాగు అధిక దిగుబడిపై గ్రామాల్లో రైతు వేదికల్లో విత్తన మేళాల్లో అవగాహన కల్పిస్తున్నారు. 7రకాలకు పెరిగిన డిమాండ్ ప్రభుత్వం ఏడు రకాల వరి వంగడాలకే బోనస్ ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్లో ఆ విత్తనానికి ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. దీంతో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఆవసరమైన విత్తనాల కన్నా ఎక్కువగానే నిల్వలు చేసింది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఈ సీజన్కు సుమారు 35 వేల మెట్రిక్ టన్నుల విత్తనాలు అవసరం కాగా 10 వేల వరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, డిమాండ్కు సరిపడా నిల్వలు ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వివిధ వ్యాధిగ్రస్తులు వారు ముఖ్యంగా మధుమేహ బాధితులు తెలంగాణ సోనాను ఎంచుకుంటున్నారు. మార్కెట్లో అత్యధిక అదరణ పొందుతున్న సన్న బియ్యం సాంబమసూరి ఉంది. వరిసాగులో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉన్నా ఎక్కువ డిమాండ్ ఉన్న సన్నరకాల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. సన్న ధాన్యం వంగడాల రకాలు ఖరారు చేసిన అధికారులు సూచించిన రకాలే వేయాలని విత్తన మేళాల్లో విస్తృత ప్రచారం రైతులకే ప్రయోజనం అంటున్న అధికారులు అన్ని రకాలకు బోనస్ ఇవ్వాలని రైతుల డిమాండ్ జిల్లాలో 2.15 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనాపంట రకం పంట కాలం(రోజులు) బీపీటీ 52004 140 నుంచి 150 జైశ్రీరాం 130 నుంచి 135 ఆర్ఎన్ఆర్ 15048 120 నుంచి 125 హెచ్ఎంటీ (సోనా) 135 నుంచి 145 కేఎన్ఎం 7715 125 నుంచి 130 (కొత్తతరం సన్నరకం) కేఎస్ఎం1638 120నుంచి 125 డబ్ల్యూజీఎల్ 44 (సిద్ధి) 140 నుంచి 145 ప్రభుత్వం రైతులు సాగు చేసే అన్ని రకాల సన్న ధాన్యానికి బోనస్ అందించాలి. సన్నాల సాగులో అదనపు పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు దిగుబడి తక్కువగా వస్తుంది. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన వాటికే కాకుండా ప్రభుత్వం అన్ని రకాల సన్నాలకు బోనస్ చెల్లించాలి. సూచించిన వాటినే సాగు చేయాలనడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. –ఎడ్ల శ్రీనివాస్, రైతు, మరిగడి రైతులకు ఉపయోగపడే విత్తనాలు, వానాకాలంలో అధిక దిగుబడి వచ్చే సన్నరకం వంగడాలను మాత్రమే ఎంపిక చేశాం. ప్రభుత్వం సూచించిన 7 రకాల వరి విత్తనాలు సాగుచేస్తే అమ్మకాల్లో సమస్యలు లేకుండా బోనస్ పొందే అవకాశం ఉంటుంది. చీడపీడ బాధలు లేకుండా వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ అధిక దిగుబడితో పాటు అధికాదాయం పొందే అవకాశం ఉంది. –అంబికా సోని, డీఏఓ -
పంట మార్పిడిపై దృష్టి పెట్టాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నర్మెట: రైతులు పంట మార్పిడిపై దృష్టి పెట్టాలని, రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన విత్తన మేళాను ప్రారంభించిన ఆయన మాట్లాడారు.. వరి సన్నరకంతో పాటు పప్పు దినుసులు, చిరుధాన్యాలు, జొన్న పంటలను సాగు చేయాలని, కూరగాయలు, పండ్లతోటలతో అదనపు ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను మాత్రమే డీలర్లు విక్రయించాలని, పంటలు చేతికి వచ్చేవరకు విత్తన రశీదులను రైతులు భద్రపరచుకోవాలని తెలిపారు. నర్మెట వారాంతపు సంతలో వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డును మంజూరు చేయాలని సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ కలెక్టర్ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయన వెంట డీఏఓ అంబికా సోని, ఏడీఏ వసంత సుగుణ, ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్, ఎంపీఓ ఉప్పుగళ్ల సంపత్ కుమార్, ఏఓ పి.మురళి బాబు, హెచ్ఓ కె.సందీప్, ఎఫ్ఓ దివ్య, ఏపీఓ రమాదేవి, ఏఈఓలు జగదీష్, అనిత, కన్నయ్య, సర్పంచ్లు, డీలర్లు, రైతులు ఉన్నారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
● విద్యార్థులకు డీసీపీ రాజమహేంద్రనాయక్ స్టేషన్ఘన్పూర్: విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతీ ఒక్కరు పాటుపడాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ సూచించారు. ఘన్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత, ఆటోడ్రైవర్లకు ‘యాంటీ డ్రగ్స్ అవేర్నెస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐ జి.వేణు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ మాట్లాడారు.. విద్యార్థులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ప్రతీ రోజూ యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా మానసికంగా, శారీరకంగా బలంగా ఉంటారన్నారు. డ్రగ్స్కు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే 1908 టోల్ఫ్రీ నంబర్లో సమాచారం అందించాలన్నారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన డ్రాయింగ్, వ్యాసరచన, వాలీబాల్, షటిల్, చెస్, క్యారమ్బోర్డు తదితర పోటీల్లో విజేతలకు డీసీపీ చేతుల మీదుగా బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఏసీపీ భీమ్శర్మ, సీఐ జి.వేణు, ఎస్ఐలు రాజేష్, మనీషా, హెచ్ఎం సంపత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సూచించిన పంటలే వేయాలి
● విత్తన మేళాలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి: ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గి దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. అధికారులు సూచించిన పంటలు, వరి రకాలనే వేయాలని సూచించారు. మంగళవారం రైతు వేదికలో నిర్వహించిన విత్తనమేళా కార్యక్రమంలో ఏడు రకాల వరి విత్తనాలు, కూరగాయలు విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూరగాయలు, వరి పంటలతో రైతులు దిగుబడి పెంచాలన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ అపర్ణ, ఎంపీడీఓ వేదవతి, సర్పంచ్ విజయ, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, మల్లారెడ్డి, పులి గణేష్, ఏఓ టెక్నికల్ నిర్మల్, ఏఓ విద్యాధర్, హార్టికల్చర్ అధికారి సంతోషిణి రాణి, క్లస్టర్ అధికారి లాలు పాల్గొన్నారు. విద్యార్థుల సంక్షేమానికి కృషి పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని తెలంగాణ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో స్టోర్ రూం, భోజనశాల, వంట గది, తరగతి గదులను పరిశీలించారు. -
కార్పొరేట్ హంగులు..డిజిటల్ పాఠాలు
జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు–మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోంది. దీంతో సర్కారు బడుల్లో ప్రైవేట్, కార్పొరేట్కు దీటుగా విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. వేసవి సెలవుల అనంతరం ప్రారంభమైన నేపథ్యంలో స్కూళ్లలో వసతులు, బోధనా పద్ధతులు, ఫలితాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ అడ్మిషన్లు పెంచే దిశగా ఉపాధ్యాయులు బడిబాట నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్నారు. జిల్లాలో 508 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో ప్రాథమిక 341, ప్రాథమికోన్నత 64, ఉన్నత 103, కేజీబీవీలు 12, మోడల్ 8, యూఆర్ఎస్ 1, ఎయిడెడ్ 10, రెసిడెన్షియల్ 19 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో విద్యార్థుల సంఖ్య పెంపునకు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలలు కల్పిస్తున్న సౌకర్యాలు వివరిస్తున్నారు. డిజిటల్ తరగతులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటరాక్టివ్ పార్టీ ప్యానెల్ ద్వారా 8,9,10 తరగతుల వారికి డిజిటల్ తరగతులు నిర్వహిస్తారు. సౌకర్యవంతమైన డెస్క్ బెంచీలు, డిజిటల్, సైన్స్ ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయి. 103 హైస్కూల్స్ ఉండగా వీటిల్లో 6,443మంది విద్యార్థులు గతేడాది టెన్త్ పరీక్షలు రాయగా 6,298 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 97.66గా ఉంది. 60పైగా స్కూళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లా పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచింది. విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచడానికి విద్యాశాఖ అధికా రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు–ప్రత్యేకతలు ● ఉచిత విద్యాబోధన, పాఠ్య, నోట్ పుస్తకాలు ● ఏడాదికి రెండు జతల యూనిఫామ్ల పంపిణీ ● మధ్యాహ్న భోజనం, వారానికి మూడు రోజులు గుడ్లు ● రక్తహీనత రాకుండా వారానికి మూడురోజులు రాగిజావ, బెల్లంతో అనుబంధ ఆహారం ● రాష్ట్రీయ బాల స్వస్థ్ కార్యక్రమం కింద ఆరోగ్య పరీక్షలు, ఐరన్ ఫోలిక్ యాసిడ్, డీవార్మింగ్ మాత్రల పంపిణీ ● పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు, 60రోజుల పాటు స్నాక్స్ ● ఉన్నత విద్యార్హతలు, అనుభవం, సుశిక్షితులైన అధ్యాపకులతో విద్యాబోధన ● ఆత్మరక్షణకు కరాటేతోపాటు వివిధ క్రీడాంశాల్లో ప్రత్యేక శిక్షణ పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు బాసర ట్రిపుల్ ఐటీలో చదివేందుకు ప్రభుత్వ పాఠశాలలో (నాన్ రెసిడెన్షియల్ రూరల్ స్కూల్) చదివిన వారికి 24 మార్కుల వెయిటేజీ ఇస్తారు. ఈసారి జిల్లాకు చెందిన 21 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించారు. 8వ తరగతి విద్యార్థులకు జాతీయస్థాయిలో ఎన్ఎమ్ఎస్ స్కాలర్షిప్ పరీక్ష రాసే అవకాశం ఉండగా ఎంపికై న వారికి ఏడాదికి రూ.12వేల చొప్పున నాలుగేళ్లు ఉపకార వేతనం లభిస్తుంది. 3కి.మీపైగా దూరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నెలకు రూ.600 రవాణా భత్యం, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లభించనుంది. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ బడిలో బోధన డిజిటల్ తరగతులు.. అత్యాధునిక వసతులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు వసతుల కల్పన, విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా ఉపాధ్యాయులు -
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
జనగామ: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఎన్పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సంపత్రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా పరిధిలోని జనగామ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, స్టేషన్ ఘన్పూర్ డీఈ సారయ్య, టెక్నికల్ అండ్ కన్స్ట్రక్షన్ డీఈ విజయ్, ఎస్ఏఓ శంకర్తో పాటు ఏడీఈలు, ఏఈలతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ అవసరాల దృష్ట్యా పెండింగ్లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేసి, కొత్త విద్యుత్ సర్వీసులను ఆలస్యం లేకుండా విడుదల చేయాలని సూచించారు. వర్షాకాలంలో ట్రాన్స్ఫార్మర్లు తరచుగా దెబ్బతినే అవకాశం ఉన్నందున, ఫెయిల్ అయిన వాటిని వెంటనే మార్చాలన్నారు. జిల్లాకు అవసరమైనన్ని ట్రాన్స్ఫార్మర్లు ముందుగానే స్టాక్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడితే తక్షణమే పునరుద్ధరించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఫీల్డ్ స్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతులకు విద్యుత్ కనెక్షన్ల మంజూరులో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోరాదని హెచ్చరించారు. ఎల్సీలు అడగొద్దని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, ఎవరైనా రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ ఎల్సీలు కోరితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు సూచనలు విద్యుత్ సిబ్బందిని ఎల్సీలు అడగవద్దని కోరుతూ, విద్యుత్ తీగలు తెగిపోయి నేలపై పడిన సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ముట్టుకోరాదని, దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ విద్యుత్కు సంబంధించిన పనులను రైతులు స్వయంగా చేయకుండా, విద్యుత్ శాఖ సిబ్బందికే సమాచారం ఇవ్వాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి అత్యవసర సేవలకు 1912కు సమాచారం ఇవ్వండి సమీక్షలో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి -
ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు
రఘునాథపల్లి: సాధారణంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో కనిపించే నో అడ్మిషన్ బోర్డు.. నేడు ఓ ప్రభుత్వ పాఠశాల ముందు కనిపించింది. రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్)లో విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరగడంతో నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో పాఠశాల హెచ్ఎం ఆలేటి యాదవరెడ్డి సోమవారం పాఠశాల ముందు నో అడ్మిషన్ బోర్డును ఏర్పాటు చేశారు. గతేడాది కూడా 185 మంది విద్యార్థుల సంఖ్య పెరగడంతో ‘మా పాఠశాలలో సీట్లు లేవని’ అడ్మిషన్స్ క్లోజ్ అని బోర్డు ఏర్పాటు చేశారు. రెండేళ్లలో అద్భుత ప్రగతి మూడేళ్లుగా పాఠశాల సాధించిన ప్రగతి ప్రైవేట్ పాఠశాలలకు సైతం ఆదర్శంగా నిలిచింది. 2024–25 విద్యా సంవత్సరం కేవలం 52 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా 2025–26 విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుల కృషితో 133 మంది నూతన విద్యార్థులు చేరి, మొత్తం సంఖ్య 185కి చేరడంతో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుత విద్యాసంవత్సరం 23 మంది విద్యార్థులు వెళ్లిపోగా కొత్తగా 53 మంది విద్యార్థులు ప్రవేశం పొందడంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 215 చేరింది. హెచ్ఎం యాదవరెడ్డి మాట్లాడుతూ తరగతిలో 30 మంది విద్యార్థులు ఉంటేనే బోధన సమర్థవంతంగా సాగుతుందని, అందుకే భారమైన మనస్సుతో అడ్మిషన్లు నిలుపుదల చేయాల్సి వచ్చిందన్నారు. ఈ మేరకు సోమవారం ఎంఈఓ రఘునందర్రెడ్డి పాఠశాలను సందర్శించి విద్యార్థుల సంఖ్యను పెంచి హెచ్ఎం, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.ఖిలాషాపూర్ ప్రాథమిక పాఠశాల ఘనత -
ఓట్ల చోరీ కోసమే ‘సర్’
హనుమకొండ హంటర్రోడ్లోని డికన్వెన్షన్హాల్లో సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)’పై బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. – హన్మకొండ చౌరస్తా● అప్రజాస్వామ్యంగా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది ● ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ● బీఆర్ఎస్ దోపిడీని ప్రజలు మరిచిపోరు ● టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ -
కార్యకర్తలకు అండగా ఉంటా..
మడికొండలోని ఓ కన్వెన్షన్లో బీఆర్ఎస్ వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తలకు ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదు, సోషల్ మీడియాపై శిక్షణ కార్యక్రమం జరిగింది. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసి కేసీఆర్ను మరోసారి సీఎం చేద్దామని పిలుపునిచ్చారు. – హన్మకొండ● కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసి కేసీఆర్ను మరోసారి సీఎం చేద్దాం ● ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదులో కార్యకర్తలు క్రియాశీలకంగా పాల్గొనాలి ● బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
సమాజ మార్గదర్శకులుగా ఎదగాలి
● డీసీపీ రాజమహేంద్రనాయక్ జనగామ: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి విద్యార్థులు చదువుపై దృష్టి సారించి సమాజ మార్గదర్శకులుగా ఎదగాలని జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ పిలుపునిచ్చారు. సోమవారం ధర్మకంచ జెడ్పీహెచ్ఎస్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై జరిగిన అవగా హన కార్యక్రమంలో సీఐ సత్యనారాయణరెడ్డితో కలిసి డీసీపీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల విని యోగం యువత భవిష్యత్తు, ఆరోగ్యం, కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, ప్రతీ విద్యార్థి తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో అవగాహన కల్పించి మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
జనగామ రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు అర్హులందరికీ అందించమే లక్ష్యమని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి నియోజకవర్గానికి చెందిన తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇంజినీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని మొదటి విడతలో మంజూరైన 3,500 ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రెండో విడతలో నియోజకవర్గానికి 2,000 ఇళ్లు మంజూరైన నేపథ్యంలో అర్హుల ఎంపికలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్ర క్రియలో అధికారులు సమర్థవంతంగా పని చేసి రాష్ట్రంలో జిల్లాకు మంచి గుర్తింపు తీసుకువచ్చారని ప్రశంసించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు లోనూ పారదర్శకత, జవాబుదారీతనం, వేగం ఉండేలా అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, జెడ్పీ సీఈఓ రంగారావు, హౌసింగ్ పీడీ మాతృనా యక్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
కసర త్తు షురూ
జనగామ:ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించేందుకు ఎన్నికల సంఘం నడుం బిగించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమానికి జిల్లాలో ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్ల జాబితాను సవరించడం, అర్హులైన ప్రతీ ఒక్కరినీ చేర్చడం, డూప్లికేట్, మరణించిన వారితో పాటు వేరే చోటుకు మారిన వారి పేర్లను గుర్తించడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుంచి జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగనుండగా, జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుంది. అభ్యంతరాలు, దరఖాస్తుల పరిశీలన అనంతరం అక్టోబర్ 1న తుది జాబితా వెలువరిస్తారు. జిల్లాలో 7.72 లక్షల ఓటర్లు జిల్లా (ఇతర జిల్లాల పరిధిలో ఉన్న మండలాలను కలుపుకుని)లో మొత్తం 865 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ప్రస్తుత ఓటర్ల సంఖ్య 7,72,766గా నమోదైంది. జిల్లాలో 865 బీఎల్వోలు ఉండగా, 10 మందికి ఒక్కరు చొప్పున 86 మంది సూపర్ వైజర్లు సేవలు అందించనున్నారు. ఇంటింటికి సమాచారం సేకరించిన అనంతరం బీఎల్ఓ యాప్లో వాటిని అప్లోడ్ చేస్తారు. ప్రతీ బీఎల్ఓ తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్ల వివరాలను సరిచూసి, కొత్త ఓట ర్ల నమోదు, మరణించిన వారి తొలగింపు, చిరునామా మార్పులు నమోదు చేయాలని అధికారులు సూచించారు. బీఎల్ఓలకు సమర్పించాల్సిన గుర్తింపు కార్డులు జనన ధృవీకరణ పత్రం, పాస్పోర్టు, విద్యార్హత సర్టిఫికెట్, శాశ్వత నివాస ధృవీకరణ పత్రం, పారెస్ట్ రైట్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లలో ఏదైన ఒకటి బీఎల్ఓలకు అందించాలని అధికారులు సూచించారు. ‘ఎస్ఐఆర్’కు సహకరించాలిప్రత్యేక ఓటరు జాబితా సవరణకు ప్రజలు సహకరించాలి. జూన్ 25 నుంచి జూలై 24వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారా లు పంపిణీ చేస్తారు. అర్హులకు ఓటు హక్కు కల్పించడంతో పాటు అనర్హులను తొలగించడమే కార్యక్రమ ముఖ్య ఉద్ధేశ్యం. పారదర్శక, సమగ్ర ఓటరు జాబితా కోసం ఎన్నిక సంఘం చేపట్టిన ఎస్ఐఆర్–26లో ప్రజలు భాగస్వాములు కావాలి. – సందీప్ కుమార్ ఝా, కలెక్టర్షెడ్యూల్ ఇలా.. 15–06–2026 నుంచి 24–06–2026 వరకు సన్నాహాలు, శిక్షణ, ముద్రణ పనులు పూర్తి. 25–06–2026 నుంచి 24–07–2026 వరకు బూత్ లెవల్ అధికారుల ఇంటింటి సర్వే 24–07–2026 లోపు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి 31–07–2026 ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ 31–07–2026 నుంచి 30–08–2026 వరకు అభ్యంతరాల స్వీకరణ 31–08–2026 నుంచి 28–09–2026 వరకు నోటీసుల జారీ, దావాల పరిష్కారం 01–10–2026న తుది ఓటరు జాబితా ప్రచురణ ఈనెల 25 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఇంటింటికీ బీఎల్ఓలు జిల్లాలో 7.72 లక్షల ఓటర్లు ప్రజలు సహకరించాలి: కలెక్టర్ నియోజకవర్గాల వారీగా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల వివరాలు నియోజకవర్గం నియోజకవర్గం పోలింగ్ మొత్తం కోడ్ కేంద్రాలు ఓటర్లు జనగామ 98 278 2,50,241 స్టేషన్ఘన్పూర్ 99 291 2,60,625 పాలకుర్తి 100 296 2,61,718 మొత్తం 865 7,72,584 -
వినతులు సత్వరమే పరిష్కరించాలి
జనగామ రూరల్: ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీ సుకుంటుందని, దరఖాస్తులు పెండింగ్ లేకుండా త్వరగా పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గ్రీవెన్స్లో మొత్తం 518 వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రంగారావు, డీఆర్డీఓ భాస్కర్, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తులు కొన్ని ఇలా.. ● జిల్లా కేంద్రంలోని 23వ వార్డుకు చెందిన ఆర్.సంతోషిని తమకు ఎటువంటి ప్రభుత్వ పథకం అందడం లేదని ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేస్తే రాలేదని, ఇల్లు ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. ● రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామానికి చెందిన జిట్టే శోభ తన 6.20 ఎకరాల భూమికి గాను పట్టా పాసుబుక్కులో 4.24 ఎకరాలు మాత్రమే నమోదైందని, ఇంకా రెండు ఎకరాల భూమి రికార్డులో నమోదు కాలేదన్నారు. ● బచ్చన్నపేట మండలంలోని కేసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మల్లవరం బుచ్చిరెడ్డి, రెవెన్యూ పరిధిలోని తన సొంత భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నారని, న్యాయం చేయాలని విన్నవించారు. ● లింగాలఘణపురం మండలం చీటూర్ గ్రామానికి చెందిన ఎస్.అనూష తమది నిరుపేద కుటుంబమని, గ్రామంలోని అంగన్వాడీ సెంటర్–1లో ఆయా పోస్టు ఖాళీగా ఉందని, తనకు మంజూరు చేసి ఆదుకోవాలని దరఖాస్తు చేసుకున్నారు. ● జనగామ మండలం పెందరాంచర్ల గ్రామానికి చెందిన బొంకూరి కృపాధానం తను బ్యాంక్లో తీసుకున్న పంట రుణం మాఫీ కాలేదని, న్యాయం చేయాలని వేడుకున్నారు. ● లింగాలఘణపురం మండలం కుందారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం, టిఫిన్ బిల్లులు చెల్లించాలని విన్నవించింది. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజావాణిలో 518 దరఖాస్తులు ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు..మున్సిపల్ శానిటేషన్ విభాగంలో తన భర్త నర్సయ్య లేబర్ కూలీగా పనిచేయగా గతేడాది అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో మున్సిపాలిటీలో పనిచేసే ఓ వ్యక్తి తనకు జవాన్ ఉద్యోగం ఇప్పిస్తామని రూ.1.40లక్షలు తీసుకుని ఉద్యోగం ఇవ్వలేదు. కుటుంబం గడవటం కష్టంగా ఉంది. డబ్బులు ఇప్పించడంతో పాటు ఉపాధి కల్పించాలి. –జేరుపోతుల సుమలత, జనగామభూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారు..నాగిరెడ్డిపల్లెకు చెందిన తన భర్త గుడ్ల నర్సయ్య పేరు మీద గ్రామంలో 265.65 సర్వేనంబర్లో 10 గుంటల భూమి ఉంది. భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. రెండు ఏళ్ల క్రితం తన భర్త పేరు మీద ఉన్న భూమిని పట్టా చేయాలని చూడగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పేరు మీద ఉంది. సర్వే చేసి తన పేరుమీద పట్టా పాస్బుక్కు ఇవ్వాలి. – గుడ్ల ఎల్లమ్మ, నాగిరెడ్డిపల్లె, బచ్చన్నపేట -
ప్రతీ ఇంటికి బీఎల్ఓ..
జిల్లాలోని ప్రతీ ఇంటికీ బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) వెళ్లి ముందు గానే ముద్రించిన ఎన్యుమరేషన్ ఫారాలను అందజేసి, వివరాలు సరిచూసుకుని తిరిగి సేకరించనున్నారు. పాత ఓటరు వివరాలు, కుటుంబ లింకులు, చిరునామా మార్పులు, కొత్తగా 18 ఏళ్లు నిండిన వారి నమోదు వంటి అంశాలు ఈ సర్వేలో కీలకం కానున్నాయి. ఫారం తీసుకుని తిరిగి సమర్పించకపోతే, లేదా వివరాల్లో లోపాలు ఉంటే ముసాయిదా జాబితాలో పేరు కనిపించకపోవచ్చనే ఆందోళన ఉంది. ముఖ్యంగా వలస వెళ్లిన కుటుంబాలు, అద్దె ఇళ్లలో ఉండేవారు, కొత్త ఓటర్లు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి. -
జాతీయస్థాయికి ఎంపిక
చిల్పూరు: మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన అన్వర్–ఫాతిమాల కూతురు అస్మా గతేడాది రాసిన వ్యాసం జాతీయస్థాయికి ఎంపికై నట్లు పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పా ఠశాల హెచ్ఎం శ్రీనివాస్ సోమవారం తెలి పారు. 2025–26 విద్యాసంవత్సరంలో పాఠశాలలో పదో తరగతి చదివే అస్మా టాటా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫైవ్ పాయింట్స్ టు బిల్డ్ ఏ సెల్ఫ్ రిలైంట్ ఇండియా’ అనే అంశంపై రాసిన వ్యాసం జాతీయస్థాయికి ఎంపికై ందన్నారు. దీంతో విద్యార్థి అస్మాను సర్పంచ్ ఎడవెళ్లి లావణ్యమల్లారెడ్డి, ఉపసర్పంచ్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు అభినందించారు. ప్రత్యేక ఏర్పాట్లు చేయాలిజనగామ రూరల్: మొహర్రం పండుగ సందర్భంగా పట్టణంలో లైటింగ్, తాగునీరు తదితర ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత సెక్షన్ అధికారులు పట్టణంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్స్ స్కీం దరఖాస్తులను పరిశీలించాలన్నారు. అన్ని సెక్షన్లలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగా కంప్యూటర్ల కొనుగోలు, జంతువధశాల టెండర్లు, కూరగాయల మార్కెట్ టెండర్ పనులు పూర్తి చేయాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని, ఆర్టీఐ దరఖాస్తులను వారం రోజులలోపు పరిష్కరించి రిపోర్టు అందజేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పేపర్ లీక్లపై శాశ్వతంగా చెక్ పెట్టాలి ● డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి జనగామ: పేపర్ లీక్లకు శాశ్వతంగా చెక్ పెట్టి విద్యార్థుల భవిష్యత్ను కాపాడాలని జనగామ డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఛాత్రోంకీ గూంజ్ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. జేఈఈ, నీట్, ఎస్ఎస్సీ, యూపీఎస్సీ, ఆర్ఆర్బీ వంటి పోటీ పరీక్షల కోసం లక్షలాది మంది యువత సంవత్సరాల తరబడి శ్రమిస్తున్నా, ప్రతి 1000 మందిలో కేవలం 12 మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం లభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ సహా అన్ని జాతీయ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై నిష్పాక్షిక దర్యాప్తు చేయడంతో పాటు పేపర్ లీక్లకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, యువతకు ఉపాధి కోసం పోరాడుతున్నారని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రారంభించిన ఈ ఉద్యమానికి ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి వంగాల కల్యాణి, డీసీసీ ఉపాధ్యక్షులు ఉడుత రవి యాదవ్, డీసీసీ జనరల్ సెక్రటరీ ఎండి అన్వర్, అభిగౌడ్, ప్రవీణ్, మాజీద్ అప్సర్, వేముల మల్లేష్, వంగాల మల్లారెడ్డి, పిట్టల సతీష్ తదితరులు పాల్గొన్నారు. పొలంగట్టే.. బడి‘బాట’ చిల్పూరు: మండలంలోని ఫత్తేపూర్ పంచాయతీ పరిధిలోని భట్వాండతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పొలాల మధ్య ఉంది. ఈ పాఠశాలకు వెళ్లాలంటే పొలంగట్టే దీనికి దారి. పంటల సాగు లేని సమయంలో విద్యార్థులకు ఇబ్బంది లేకున్నా.. సాగు చేస్తే పొలంగట్టు పైనుంచి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఇక ఉపాధ్యాయులు వారి వాహనాలను రోడ్డు పక్కన చెట్ల కింద పెట్టి నడిచి రావాల్సిందే. ప్రస్తుతం ఈ పాఠశాలలో 10 మంది విద్యార్థులుండగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. -
లక్నవరంలో సందడి
గోవిందరావుపేట: జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన లక్నవరం సరస్సు వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. ముఖ్యంగా చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు సరస్సు అందాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదకరంగా గడిపారు. లక్నవరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వేలాడే వంతెనపై నడుస్తూ సందర్శకులు ప్రకృతి సోయగాలను తిలకించారు. సెల్పీలు, ఫొటోలు దిగుతూ కుటుంబ సభ్యులు, యువత ఉత్సాహంగా గడిపారు. సరస్సు చుట్టూ విస్తరించిన పచ్చని వాతావరణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. సరస్సులో బోటింగ్ నిర్వహించేందుకు అవసరమైన స్థాయిలో నీటిమట్టం లేకపోవడంతో అధికారులు బోటింగ్ను నిలిపివేశారు. దీంతో బోటింగ్ కోసం ప్రత్యేకంగా వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు.లక్నవరంలోని వేలాడే వంతెనపై పర్యాటకులు -
సోమవారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2026
‘నీట్’ ప్రశాంతం విద్యార్థులను తనిఖీ చేస్తున్న అధికారులుపరీక్ష కేంద్రంలో హాల్ టికెట్ నంబర్ను చూసుకుంటున్న విద్యార్థులుజనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వైద్య శిబిరం వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ ప్రకారం నిషేధాజ్ఞలు విధించారు. జిల్లాలో మొత్తం రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 588 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 509 మంది పరీక్షకు హాజరు కాగా 79 మంది గైర్హాజరు అయ్యారు. సిద్ధిపేట రోడ్డులోని ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల (అటానమస్), జనగామ మండలం పెంబర్తి లోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఏబీవీ డిగ్రీ కళాశాలలో 396 మందికి గాను 339 మంది పరీక్షకు హాజరు కాగా 57 మంది గైర్హాజర్ అయ్యారు. అలాగే పెంబర్తి ఎంజేపీలో 192 మందికి గాను 170 మంది హాజరు కాగా 22 మంది గైర్హాజరు అయ్యారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ బీంశర్మ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరిగింది. విస్తృత తనిఖీలు నీట్ పరీక్షకు హాజరైయ్యే విద్యార్థులను పోలీసులు, అధికారులు తనిఖీలు చేపట్టిన తర్వాత పరీక్షా హాల్కు అనుమతినిచ్చారు. నీట్ పరీక్ష రెండవ సారి నిర్వహిస్తుండడంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కాగా నిమిషం నిబంధన అమలులో ఉండగా ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్కు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో వెనుదిరిగి వెళ్లారు. అలాగే అశ్విని అనే విద్యార్థిని ఎంజేపీలో పరీక్ష రాయాల్సి ఉండగా ఏబీవీ డిగ్రీ కళాశాలకు వచ్చింది. విధుల్లో ఉన్న ఎస్ఐలు భారత్, సతీష్, చెన్నకేశవులు వెంటనే స్పందించి ఈ విషయాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన డీసీపీ ఆలస్యం చేయకుండా పోలీస్ వాహనంలో ఎంజీపీ సెంటర్కు తరలించాలని ఆదేశించడంతో వారు సకాలంలో పరీక్ష సెంటర్కు చేర్చారు. ఏసీపీ భీమ్శర్మ, ఎస్హెచ్ఓలు సత్యనారాయణరెడ్డి, అబ్బయ్య, పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును పర్యవేక్షించారు. 79 మంది విద్యార్థులు గైర్హాజరు సమయం మించిపోవడంతో వెనుదిరిగిన ముగ్గురు విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు -
ప్లాస్టిక్ రహిత పట్టణాన్ని నిర్మిద్దాం
జనగామ: జనగామ పట్టణాన్ని పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి ప్రత్యక్ష రంగంలోకి దిగారు. ప్లాస్టిక్ వినియోగం వందశాతం నిర్మూలనకు నిరంతర నిఘా ఉంటుందని ప్రకటించారు. పట్టణ సుందరీకరణ, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని జనగామ నుంచి పూర్తిగా తరిమేయడం ప్రతీ పౌరుడి బాధ్యతని తెలిపారు. వ్యాపార వర్గాలకు విజ్ఞప్తి ప్లాస్టిక్ రహిత పట్టణంగా నిర్మించేందుకు అన్ని వ్యాపార, వాణిజ్య సముదాయాలు సహకరించాలని కోరారు. హోటళ్లు, కిరాణషాపులు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్తో పాటు అన్ని దుకాణదారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్ల స్థానంలో నూలు సంచులు, జనపనార బ్యాగులు, కాగితపు కవర్లు వాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రూ.25వేల వరకు జరిమానా ప్లాస్టిక్ హోల్సేల్ షాపుల యజమానులను ఉద్దేశించి కమిషనర్ కీలక హెచ్చరిక జారీ చేశారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను విక్రయిస్తే రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తామని తెలిపారు. అంతేకాకుండా సంబంధిత షాపుల లైసెన్స్లను రద్దు చేసి, 2019 తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలు ముమ్మరం నిషేధిత ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు ము న్సిపల్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బృందా లను ఏర్పాటు చేశామని కమిషనర్ వెల్లడించారు. ఈ బృందాలు రోజూ మార్కెట్, వ్యాపార సముదా యాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. ప్లాస్టిక్ రహిత పట్టణం కోసం ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార వర్గాలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ వాడకంతో కాల్వలు పూడుకుపోవడం, పశువులు చనిపోవడం, భూసారం దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని, భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రజలు, వ్యాపార వర్గాలకు మున్సిపల్ అధికారుల విజ్ఞప్తి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు కమిషనర్ హెచ్చరిక పట్టణంలో ముమ్మరంగా తనిఖీలు


