వైభవంగా అగ్నిగుండాలు
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మహా శివరాత్రి జాతర బ్రహ్మో త్సవాలు బుధవారం అగ్నిగుండాలు, మహా అన్నపూజ, పూర్ణహుతితో ముగిశాయి. చివరి రోజు ఆలయంలోని మెట్ల ఎదురుగా ఏర్పాటు చేసిన అగ్నిగుండాల్లో ఆలయ ఈఓ బాగం లక్ష్మీప్రసన్న నేతృత్వంలో తెల్లవారుజామున 4,30 గంటలకు స్వామివార్లను పల్లకిలో వాహనకారులు, భక్తులు నిప్పులపై నడిచి భక్తిపారవశ్యానికి లోనయ్యారు. అర్చకుడు దేవగిరి శ్యాంశర్మ, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రధాన అర్చకుడు దేవగిరి లక్ష్మన్న, అర్చకులు డీవీఆర్శర్మ, అనిల్కుమార్, నాగరాజు పాల్గొన్నారు.
పూర్ణహుతితో ముగిసిన సోమన్న జాతర బ్రహ్మోత్సవాలు
వైభవంగా అగ్నిగుండాలు


