breaking news
Jangaon District Latest News
-
అక్రమ నిర్మాణాల తొలగింపు
జనగామ: రహదారి, ఫుట్పాత్ ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపట్టారన్న ఫిర్యాదుల మేరకు జనగామ మున్సిపల్ అధికారులు బుధవారం చర్యలు చేపట్టారు. హైదరాబాద్ రోడ్డులోని శ్రీ లైఫ్కేర్ హాస్పిటల్కు సంబంధించిన పలు నిర్మాణాలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. రోడ్డు వైపున ఏర్పాటు చేసిన మెట్లు, జనరేటర్, ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన నిర్మాణాలు రాకపోకలకు ఇబ్బందికరంగా మారుతున్నాయన్న ఫిర్యాదులు అధికారుల దృష్టికి వెళ్లగా, మున్సిపల్ సిబ్బంది యంత్రాలతో అక్కడికి చేరుకుని ఆక్రమణగా గుర్తించిన నిర్మాణాలను తొలగించారు. ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించే విధంగా ప్రభుత్వ, మున్సిపల్ స్థలాలు, రహదారులు, ఫుట్పాత్లను ఆక్రమించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. కాగా పట్టణంలో రహదారులు, ఫుట్పాత్లు, ప్రభుత్వ, మున్సిపల్ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి హెచ్చరించారు. -
వైద్య కళాశాలలో కేంద్ర బృందం పరిశీలన
జనగామ: జనగామ వైద్య కళాశాలకు పీజీ సీట్ల కేటాయింపునకు సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) బృందం బుధవారం మరోసారి కళాశాలను సందర్శించి వసతి, వైద్య సౌకర్యాలను పరిశీలించింది. గుజరాత్కు చెందిన అనస్తీషియా విభాగం ఇన్స్పెక్టర్, ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన గైనకాలజీ విభాగం ప్రతినిధులు పరిశీలనలో పాల్గొన్నారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమణి, జనగామ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్తో కలిసి ఎన్ఎంసీ బృందం పీజీ సీట్ల కేటాయింపునకు అవసరమైన మౌలిక వసతులు, బోధనా సిబ్బంది, వైద్య పరికరాలు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. చంపక్హిల్స్లోని ప్రస్తుత మెడికల్ కళాశాలతో పాటు నూతనంగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కళాశాల భవనాన్ని బృందం పరిశీలించింది. 11 పీజీ సీట్లకు సంబంధించి తాజా పరిశీలన పూర్తయింది. జనగామ మెడికల్ కళాశాలకు వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 50 పీజీ సీట్లు కేటాయించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ఫ్యాకల్టీ, బోధన, వైద్య పరికరాలు, మౌలిక వసతులు, వసతి సౌకర్యాల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ఎన్న్ఎంసీకి అధికారులు ఇప్పటికే ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. కేంద్ర బృందం పరిశీలన అనంతరం పీజీ సీట్ల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
మట్టి గణపతులను పూజించాలి
జనగామ రూరల్: మట్టి గణపతులను పూజించి ప్రతిఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్లతో కలిసి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ముస్లిం శాంతి కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం కార్యక్రమాలపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 770 చెరువులు ఉన్నాయని, దాదాపుగా జిల్లాలో 2వేల గణేష్ ప్రతిమల నిమజ్జనం జరుగుతుందన్నారు. గణేష్ మండపాల వద్ద రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను స్పష్టంగా గుర్తించే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వీధి లైటింగ్ పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలని డీపీఓకు ఆదేశించారు. నిమజ్జన ఘాట్ల వద్ద భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అన్ని శాఖలతో సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో శోభాయాత్ర సాగే ప్రధాన మార్గాల్లో, నిమజ్జన ఘాట్ల వద్ద పోలీస్ శాఖ పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. డీసీపీ మాట్లాడుతూ వినాయక మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ వెబ్సైట్లో పూర్తి వివరాలను నమోదు చేసి, అనుమతి పొందాలన్నారు. అనంతరం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్ర మంలో ఆర్డీఓలు గోపీరాం, కిరణ్ ప్రకాష్, వర్ధన్నపేట ఏసీపీలు భీం శర్మ, నర్సయ్య, మున్సిపల్ కమిషనర్లు రాజశేఖర్ రెడ్డి, రాధాకృష్ణ, డీపీఓ వెంకట్ రెడ్డి, మత్స్య శాఖ అధికారి రాణా ప్రతాప్, ఎస్ఈ ఎన్పీడీసీఎల్ సంపత్ రెడ్డి, డీఎంహెచ్ఓ వాణి శ్రీ, ఆర్టీఓ శిల్ప తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
సాగు సవాల్
జనగామ: జిల్లాలో పంటల సాగు సవాల్గా మారింది. పొలంలో పంట ఉన్నా, కీలక దశలో తగినంత తేమ అందకపోవడంతో పంటలపై వాతావరణ ఒత్తిడి పెరుగుతోంది. ఎల్నినో పరిస్థితులతో పాటు వర్షాల అసమాన పంపిణీ, పొడి విరామాలు జిల్లాలో సాగుకు సవాల్గా మారాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలలు పంటల పెరుగుదల, పూత, కాయ, గింజ అభివృద్ధి దశలకు కీలకం కావడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించి జనగామ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి.రమ్య వెల్లడించారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి సెప్టెంబర్ 2 వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 517.9 మి.మీ. కాగా 291.5 మి.మీ. మాత్రమే నమోదై 43.7 శాతం లోటు కనిపించింది. జిల్లాకు నైరుతి రుతుపవనాల సాధారణ వర్షపాతం 670.1 మి.మీ.గా ఉంది. జిల్లాలో 3.26 లక్షల ఎకరాల్లో సాగు వర్షాభావ పరిస్థితుల మధ్య కూడా జిల్లాలో సాగు గణనీయంగానే కొనసాగింది. సెప్టెంబర్ 2 నాటికి 3,26,548 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సాధారణ సాగు విస్తీర్ణం 3,59,281 ఎకరాలు కాగా 91 శాతం సాగు పూర్తయింది. గతేడాది ఇదే సమయానికి 3,24,013 ఎకరాల్లో సాగు నమోదవగా, ఈ ఏడాది స్వల్పంగా పెరిగింది. పెరిగిన పత్తి సాగు.. పంటల సాగు నమూనాలో స్వప్ప మార్పు కనిపిస్తోంది. గతేడాది 1,80,898 ఎకరాల్లో ఉన్న వరి ఈ ఏడాది 1,54,404 ఎకరాలకు తగ్గింది. మరోవైపు ప త్తి 1,20,016 నుంచి 1,38,325 ఎకరాలకు పెరిగింది. మొక్కజొన్న 7,976 నుంచి 8,508 ఎకరాలకు, నిఘా తప్పనిసరి.. వర్షాల మధ్య పొడి విరామాలు పెరిగితే పంటల్లో తేమ ఒత్తిడి, పోషక లోపాలు, పురుగు, తెగుళ్ల సమస్యలు ఉధృతమయ్యే అవకాశం ఉంది. రైతులు వారానికి కనీసం రెండుసార్లు పొలాన్ని పరిశీలించి ఆకుల రంగు మారడం, వాడిపోవడం, పెరుగుదల మందగించడం, పురుగుల ఉనికి, కాయలు, బోళ్లకు నష్టం వంటి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించాలి. వరిలో ఆకు ముడత, కాండం తొలుచు పురుగులను గమనించాలి. పత్తిలో తామర పురుగులు, పేనుబంక, తెల్లదోమతో పాటు గులాబీ రంగు పు రుగు ఉనికిని పరిశీలించాలి. పసుపు, నీలం జిగురు ఉచ్చులతో పురుగులను పర్యవేక్షించవచ్చు. మొక్కజొన్న, కంది, పెసర, మినుము పంటల్లోనూ తేమ, పోషకాలు,పురుగుల నియంత్రణపై శ్రద్ధ అవసరం. వర్షం పడిన వెంటనే.. వర్షం పడిన వెంటనే పురుగు మందులు పిచికారీ చేయకూడదు. పంట దశ, పురుగు లేదా తెగులు తీవ్రత, నేల తేమ, వాతావరణ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే శాసీ్త్రయ సిఫారసు మేరకు మందులు వినియోగించాలి. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ, పంటను కాపాడేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి. పత్తిలో తామర పురుగులు, పేనుబంక, తెల్లదోమ నివారణకు వేపనూనె 1,500 పీపీఎం 5 మి.లీ, అసిఫేట్ 1.5 గ్రా. లేదా ఫ్లోనికామిడ్ 0.3 గ్రా.లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. గులాబీరంగు పురుగు కోసం పువ్వులు, కాయలను పరిశీలించాలి. విత్తిన 45 రోజుల నుంచి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలి. పురుగు ఉధృతి కనిపిస్తే ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలు, 4 కార్డుల త్రికోగ్రామా వదిలి, అవసరమైతే ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రా., స్పినెటోరామ్ 0.9 మి.లీ. లేదా థయోడికార్బ్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో నీటి ఎద్దడి ఉంటే యూరియా 2 శాతం ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వర్షాల తర్వాత ఎకరాకు 25 కిలోల యూరియా అదనంగా వేయవచ్చు. కత్తెర పురుగు నివారణకు అజాదిరాక్టిన్ 1,500 పీపీఎం 5 మి.లీ., ఎమా మెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 మి.లీ. లీటరు నీ టికి కలిపి పిచికారీ చేయాలి. కందిలో అధిక తేమతో కాండం ముడత, తెగులు వచ్చే అవకాశం ఉన్నందున పంటను గమనించాలి. బెట్ట పరిస్థితుల్లో పే నుబంక నివారణకు 20 గ్రా. యూరియా లేదా 10 గ్రా. మల్టీ–కే లేదా పాలీఫీడ్ను లీ టరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పెసర, మినుములో బెట్ట పరిస్థితుల్లో పొటాషియం నైట్రేట్ 0.5 శాతం లేదా 19:19:19 0.5 శాతం ద్రావణాన్ని పిచికారీ చేయాలి. తెల్ల దోమకు అసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా డైఫెన్థయురాన్ 1.25 గ్రా. లీటరు నీటికి పిచికారీ చేయాలి. పంటలను కాపాడుకునేందుకు రైతుల పోరాటం జిల్లాలో 43.7 శాతం లోటు వర్షపాతం 3.26 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు పురుగు ఉధృతి ఆధారంగానే పిచికారీ జనగామ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి.రమ్యపంట 2025 2026 వరి 1,80,898 1,54,404 పత్తి 1,20,016 1,38,325 మొక్కజొన్న 7,976 8,508 కంది 3,477 7,475 పెసర 1,247 3,411 వేరుశనగ 75 1,912 మొత్తం 3,24,013 3,26,548 -
కాళోజీ ఆశయాలను అనుసరించాలి
జనగామ రూరల్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు తెలంగాణ ఆత్మను, ప్రజల జీవనాన్ని తన కవిత్వంలో ప్రతిబింబించిన మహోన్నత వ్యక్తి అని, ఆయన ఆశయాలను ప్రతిఒక్కరూ అనుసరించాల ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవా రం జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ప్రజాకవి కాళోజీ నారాయణరావు 112వ జయంతిని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్కుమార్ ఝా కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాళోజీ తెలుగు మాత్రమే కాకుండా ఉర్దూ, హిందీ, మరాఠీ, ఆంగ్లం తదితర భాషల్లో కవితలు రచించిన బహుభాషా కోవిదుడిగా నిలిచారన్నారు. కాళోజీ ఆశయాలు, మానవతా దృక్పథం, సామాజిక న్యాయం కోసం చూపిన మార్గాన్ని ప్రతిఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు. అలాగే కాళోజీ జయంతి సందర్భంగా జనగామ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ కడకంచి బాలమణి, కమిషనర్ రాజశేఖర్రెడ్డి నారాయణరావు చి త్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా -
సర్పంచ్ల హక్కులను పరిరక్షించాలి
జనగామ: గ్రామ పంచాయతీలకు అవసరమైన నిధులు విడుదల చేయడంతో పాటు సర్పంచుల హక్కులను పరిరక్షించాలని కోరుతూ జిల్లా సర్పంచుల ఫో రం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచులు కలిసి తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు అత్యంత చేరువగా పనిచేసే ప్రజాప్రతినిధులు సర్పంచులేనని, గ్రామంలో ఏ సమస్య తలెత్తినా ప్రజలు తొలుత సర్పంచులను ఆశ్రయిస్తారన్నారు. అయితే గ్రామాల అభివృద్ధికి బాధ్యత వహిస్తున్న సర్పంచులకు తగిన అధికారాలు, నిధులు, విధుల్లో ప్రాధాన్యం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పెండింగ్ నిధులను విడుదల చేసి, సర్పంచ్లకు రావాల్సిన హక్కులు కల్పించాలన్నారు. తమ వినతిపై ప్రభుత్వం, జిల్లా అధికారులు సానుకూలంగా స్పందించి సమస్యలను త్వరగా పరిష్కరిస్తారని సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కలెక్టర్కు జిల్లా సర్పంచ్ల ఫోరం వినతి -
రాజీమార్గంతోనే సమస్యల పరిష్కారం
జనగామ రూరల్: రాజీమార్గంతోనే కక్షిదారుల సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, న్యూ ఢిల్లీ తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 12న శనివారం జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించుతున్నట్లు తెలిపారు. ఇందులో రాజీకి పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, కుటుంబ తగాదా కేసులు, డబ్బు రికవరీకి సంబంధించిన కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, చిట్ ఫండ్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, చెక్కుబౌన్స్ కేసులు పరిష్కరించబడుతాయన్నారు. లోక్ అదాలత్ను కక్షిదారులు, న్యాయవాదులు సద్వినియోగించుకోవాలన్నారు. జెడ్పీసీఈఓగా బాధ్యతల స్వీకరణజనగామ రూరల్: జెడ్పీసీఈఓగా పి.బలరాం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పని చేసిన రంగారావు పదవీ విరమణ పొందగా ఆయన స్థానంలో జీహెచ్ఎంసీలో పనిచేసిన బలరాం బదిలీపై జనగామ జెడ్పీసీఈఓగా బాధ్యతలు చేపట్టారు. 16న ప్రత్యేక అవసరాల పిల్లల గుర్తింపు శిబిరం జనగామ రూరల్: ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు వైద్య పరికరాల గుర్తింపు శిబిరాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ సందీప్కుమార్ ఝా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్ర శిక్ష భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈనె 16న (బుధవారం) ఉదయం 10 గంటల నుంచి జనగామ కోర్టు సమీపంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ప్రత్యేక అవసరాలు గల పిల్లల వైద్య పరిశీలన, ఉచిత పరికరాల గుర్తింపు శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. సదరం సర్టిఫికెట్ యూడీఐడీ కార్డ్, ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజు ఫొటోలతో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు పాల్గొనాలన్నారు. విద్యార్థుల వైకల్య శాతాన్ని పరిశీలించి అవసరమైన వినికిడి యంత్రాలు, వీల్ చైర్లు, కాలీపర్స్, ట్రై సైకిళ్లు, ఇతర సహాయక పరికరాలను అంచనా వేసి ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్ఎస్యూఐ ఆరు జిల్లాల అధ్యక్షుల నియామకం సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యూఐ బలోపేతంపై అధి ష్టానం దృష్టిపెట్టింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలకు నూతన జిల్లా అధ్యక్షులను నియమించారు. సంఘం జాతీయ అధ్యక్షుడు వినోద్ ఝాకర్ ఆమోదంతో రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి బుధవారం ఈ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండకు వేణుచారి, వరంగల్–బొల్లం నితిన్కుమార్, జనగామ–దేశగాని హరగోపాల్గౌడ్, జయశంకర్ భూపాలపల్లి–పురుషోత్తం అనూప్, మహబూబా బాద్ – బి.చంటి, ములుగు–ఎం.నవనీత్ను నియమించారు. కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో విద్యార్థుల సమస్యలను గుర్తించి పోరాటాలు చేపట్టడంతోపాటు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఎన్ఎస్యూఐ కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఉంది. అమృత్ భారత్ పనుల తనిఖీ కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లో జరుగుతున్న అమృత్ భారత్ నిర్మాణ పనులను బుధవారం సికింద్రాబాద్ రైల్వే డీఈఎన్ సెంట్రల్ అధికారి ప్రంజల్ కేశర్వాణి తనిఖీ చేశారు. కాజీపేట అమృత్ భారత్ పనులు, స్టేషన్ ఎదుట ఉన్న సర్క్యులేటింగ్ ఏరియాలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన తనిఖీ చేసి అభివృద్ధి పనుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్థానిక అధికారులకు, కాంట్రాక్టర్లకు పలు సూచనలిచ్చారు. ఈతనిఖీలో కాజీపేట ఐఓడబ్ల్యూ శ్రీనివాస్, స్థానిక రైల్వే సూపర్వైజర్లు, వర్క్ సూపర్వైజర్ పి.శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్టీసీ తాత్కాలిక బస్టాప్ కాజీపేట రైల్వేస్టేషన్లో అమృత్భారత్ అభివృద్ధి పనుల నేపథ్యంలో స్టేషన్ ముందున్న ఆర్టీసీ లోకల్ బస్టాప్ను రైల్వే అధికారులు కాజీపేట రైల్వే స్టేడియానికి బుధవారం తరలించారు. పనులు పూర్తయ్యేవరకు ఇక్కడి నుంచే ప్రయాణికులు రాకపోకలు సాగించాల్సి ఉంటుందని హనుమకొండ లోకల్ బస్ ఆర్టీసీ డిపో మేనేజర్ ధరంసింగ్ తెలిపారు. -
సేవల్లో జాప్యం
జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ కార్యాలయాల్లో పౌరులకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘సిటిజన్ చార్ట్’ సేవల్లో జాప్యం జరుగుతోంది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పింఛన్ సేవలు, ఇంటి నిర్మాణ అనుమతులు, నల్లా పన్ను, టౌన్ ప్లానింగ్ తదితర సేవల కోసం పట్టణ ప్రజలు మున్సిపల్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. బుధవారం జిల్లాలోని రెండు మున్సిపాలిటీ సేవలు, సిటిజన్ చార్ట్ అమలుపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. –జనగామజనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో ఆలస్యం జనగామ మున్సిపాలిటీలో సిటిజన్ చార్ట్ అమలు, సేవల విషయంలో కొంత మెరుగుదల కనిపిస్తున్నా.. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పింఛన్ సేవల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ తదితర విభాగాల్లో సేవలు సజావుగా అందుతున్నాయి. ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు 30 ఇళ్ల నిర్మాణ అనుమతులు మంజూరు చేయగా.. రెండు దరఖాస్తులు స్వల్ప సవరణ కోసం హోల్డ్లో ఉంచి, వాటిని పూర్తి చేయాలని యజమానులకు సూచించారు. అయితే జనన, మరణ ధ్రువపత్రాల కోసం వచ్చిన వారికి సంబంధిత అధికారి అందుబాటులో లేకపోవడం, సరైన సమాచారం అందకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇక పింఛన్ కోసం వచ్చే వారికి ఎవరిని సంప్రదించాలో స్పష్టత లేకపోవడంతో ఆవేదన వ్యక్తమవుతోంది. కమిషనర్ రాజశేఖర్రెడ్డి, చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టర్ కూడా పురపాలిక సేవలపై ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. పేరుకే మున్సిపాలిటీ.. కనిపించని సిటిజన్ చార్ట్ బోర్డు స్టేషన్ఘన్పూర్: డివిజన్ కేంద్రమైన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీగా ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు గడిచి పోతున్నా ప్రధాన శాఖల అధికారులందరూ ఇన్చార్జ్లు గానే ఉండడంతో పురపాలికలో పూర్తిస్థాయిలో సేవలు అందడం లేవు. మున్సిపాలిటీ కార్యాలయంలో ఉండాల్సిన సిటిజన్ చార్ట్ కార్యాలయ మాడిఫికేషన్లో భాగంగా పదిరోజుల క్రితం తొలగించారు. ప్రస్తుతం సిటిజన్ చార్ట్ కనిపించడం లేదు. సిటిజన్ చార్ట్లో పేర్కొన్న విధంగా ఏ ఒక్క పని జరగడం లేదు. టౌన్ ప్లానింగ్ అధికారి ఇన్చార్జ్ కావడం, ప్రతీ వారం శుక్ర, శనివారాల్లో మాత్రమే రావడంతో ఇంటి నిర్మాణాల అనుమతుల కోసం వచ్చే ప్రజలు రోజుల తరబడి తిరగాల్సి వస్తుంది. మున్సిపల్ కమిషనర్, మేనేజర్, ఏఈ, సీనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్ మినహా అందరూ ఇన్చార్జ్లే ఉన్నారు. వివిధ సర్టిఫికెట్ల కోసం మున్సిపాలిటీకి వస్తున్న ప్రజలు రోజుల తరబడి తిరగాల్సి వస్తుంది. సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం ఇబ్బందుల్లో పట్టణ వాసులు ‘సాక్షి’ విజిట్లో పలు విషయాలు వెలుగులోకి.. -
వీఆర్ విద్యార్థికి కాళోజీ పురస్కారం
● ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ● నేడు హైదరాబాద్లో పురస్కారం ప్రదానం ● హర్షం వ్యక్తం చేసిన అంపశయ్య నవీన్, కవులుహన్మకొండ కల్చరల్ : వరంగల్కు చెందిన ప్రముఖ కవి, కాళోజీ ఫౌండేషన్ కార్యదర్శి వీఆర్ విద్యార్థికి ప్రజాకవి కాళోజీ–2026 పురస్కారం వరించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 9న (బుధవారం) కాళోజీ జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో జరగనున్న ఆయన జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల చేతులమీదుగా వీఆర్ విద్యార్థి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. విద్యార్థి చిన్నప్పటినుంచి కాళోజీకి వ్యక్తిగతంగా దగ్గరివాడిగా, ఆయన అభిమానిగా, మిత్రమండలి సభ్యుడి గా, వరవరరావులాంటి ఉగ్రమూర్తుల మిత్రుడిగా ఉన్నారు. కాళోజీ బడిలోనే కవిత్వం ఓనమాలు దిద్దుకున్నారు. యుద్ధంనుంచి శాంతిప్రవాహంలా సాగిన ఆయన కవితాయాత్రలో అలలు, పలకరింత, ఘర్మసముద్రం, మంచుమైదానం, ఖండాం తర, యుద్ధం, తుపాకీ శాంతి, తదితర కవితా సంకలనాలు వెలువరించారు. విద్యార్థి గురించి.. వీఆర్ విద్యార్థి అసలు పేరు రాములు. పుట్టిన ఊరు వరంగల్లోని గవిచర్ల. భారతవైమానిక దళంలో పనిచేస్తున్న క్రమంలో రెండుసార్లు యుద్ధాల్లో పాల్గొన్నారు. అంతకన్నముందు కవిత్వంతో పెనవేసుకుపోతూ విద్యార్థి కలం పేరుతో తన జీవి తాన్ని సాహిత్యంలోకి మలుచుకునే క్రమంలో వీఆర్ విద్యార్థిగా మారారు. ఐదు దశాబ్దాలనుంచి తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేస్తున్నారు. పలువురి హర్షం.. విద్యార్థికి అవార్డు రావడంపై కేంద్ర సాహిత్య అవార్డు గ్రహిత డాక్టర్ అంపశయ్య నవీన్, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ళ రామశాస్త్రి, విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య, కవులు పొట్లపల్లి శ్రీనివాసరావు, బిల్ల మహేందర్, వల్లంపట్ల నాగేశ్వరరావు, నెల్లుట్ల రమాదేవి, నిధి, రామా చంద్రమౌళి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. పురస్కారం రావడం సంతోషంగా ఉంది ప్రభుత్వం కాళోజీ పురస్కారం ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఇది కాళోజీ ఫౌండేషన్కు వచ్చినట్లుగా భావిస్తున్నా. కాళోజీ ప్రజలగురించి ప్రజల భాషలో కవిత్వం రాశారు. నగీషిల కవితలు రాయలేదు. పెద్ద ఉపన్యాసాన్ని సైతం కవిత్వంలా మల్చ గలగడం కాళోజీ ప్రత్యేకత. వేమనలా నిజాల్ని కవితలలో పొందుపరిచారు. ఆయన జీవితమే ఉద్యమం. – వీఆర్ విద్యార్థి, కవి -
ధిక్కార స్వరం ‘కాళోజీ’
7తన భావాలకే కాదు శరీరానికీ మరణం లేదని నిరూపించిన వ్యక్తి కాళోజీ. నిజాం పాలన వ్యతిరేక ఉద్యమం, తదనంతరం తొలి, మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించిన అక్షర యోధుడు. ప్రజల భాషలో ఉండే ఆయన కవితలు.. పూర్తిగా తెలంగాణ మాండలికంతో సాగే రచనలు జనాల గుండెలను అలల తాకేవి. నేడు ఆయన జయంతి. తెలంగాణ భాషా దినోత్సవం కూడా.విపత్తు నివారణకు ప్రణాళికజనగామ రూరల్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్, కేజీబీవీ, మోడల్, రెసిడెన్షియల్ తదితర పాఠశాలల్లో స్కూల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ రూపొందించి, విద్యార్థులకు అవగాహనతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నారు. ఈమేరకు ఇటీవల జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ చైర్మన్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. పీజీఐడీలో జిల్లా రాష్ట్రంలో 600కు 383 స్కోర్తో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలువగా, స్కూల్ సేఫ్టీ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ అంశంలో మరింత మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈనెల 12 వరకు రోజువారీగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మిషన్ శిఖరం (పీజీఐడీ 2.0) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 771 పాఠశాలల్లో ఈనెల 12వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు 100 శాతం ఎస్డీఎంపీ ప్రక్రియ పూర్తి చేసేలా కృషి చేస్తున్నారు. పాఠశాలలో చేపట్టాల్సిన చర్యలు ప్రతీ పాఠశాలలో స్కూల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు అవగాహన, హెచ్చరికలు, తరలింపు, సెర్చ్ అండ్ రెస్క్యూ, ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్, ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ, సైట్ సెక్యూరిటీకి సంబంధించిన ఏడు టాస్క్ఫోర్సులు ఏర్పాటు చేయనున్నారు. ఉపాధ్యాయులు, సీనియర్ విద్యార్థులతో కలిసి తరగతి గదులు, కారిడార్లు, మెట్లు, వంటగది, మరుగుదొడ్లు, ఆటస్థలం, ప్రహరీ, గేట్లు తదితర ప్రాంతాల్లో నాన్–స్ట్రక్చరల్ హజార్డ్ హంట్ నిర్వహించి, ప్రమాదకర అంశాలను వెంటనే తొలగించడం మరమ్మతుల కోసం నమోదు చేపట్టనున్నారు. భద్రతపై ప్రత్యేక దృష్టి పాఠశాల భవనాలు, ప్రహరీల్లో పగుళ్లు, పైకప్పు వంగడం, తేమ, ఇనుప రాడ్లు బయటకు కనిపించడం, గోడలు వాలడం వంటి నిర్మాణపరమైన లోపాలు గుర్తించిన వెంటనే అదే రోజు ఎంఈఓకు నివేదించనున్నారు. ప్రతీ పాఠశాలలో ఎవాక్యుయేషన్ మ్యాప్, అసెంబ్లీ పాయింట్, అత్యవసర ఫోన్ నంబర్లను స్పష్టంగా ప్రదర్శించాలి. ఎంఈఓలకు ప్రత్యేక బాధ్యతలు ప్రతీ ఎంఈఓ రోజుకు కనీసం ఐదు పాఠశాలలను, అందులో ప్రైవేట్, రెసిడెన్షియల్ పాఠశాలలను కూ డా సందర్శించి అమలును పరిశీలించాలి. విపత్తు నిర్వహణ చట్టం–2005లోని సెక్షన్ 30(2)(వీ), ప్రకారం సంబంధిత శాఖలకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు. ప్రతీ పాఠశాలలో పోలీస్ స్టేషన్, బీట్ అధికారుల ఫోన్ నంబర్లు ప్రదర్శించేలా, అగ్నిమాపక శాఖ అధికారులు ప్రతీ స్కూల్ కాంప్లెక్స్లో కనీసం ఒక మాక్ డ్రిల్ నిర్వహించి, ఫైర్ ఎక్స్టింగ్విషర్ల తనిఖీతో పాటు వంటశాలలు, హాస్టళ్లలో అగ్ని భద్రతపై సూచనలు ఇవ్వాలి.నాగారం గ్రామానికి చెందిన రైతు ఆలేటి మోహన్న్రెడ్డి తనకున్న తొమ్మిది ఎకరాల్లో మూడు ఎకరాల్లో కత్తెర, ఆరు ఎకరాల్లో వానాకాలం వరి సాగు చేస్తున్నారు. మే 24న నాట్లు వేసిన కత్తెర పంటకు ప్రస్తుతం నీటి వసతి బాగుంది. కాలువ, చెరువు నీటితో పాటు రెండు బోర్లను వినియోగిస్తున్నారు. ఇబ్బందులు ఎదురైనా పైపుల ద్వారా నీరందిస్తున్నారు. మూడు ఎకరాల్లో సుమారు 120 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా. రెండు రోజుల క్రితం క్వింటాల్కు రూ.2,321 ధరకు మార్కెట్లో విక్రయించారు. మొత్తం రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. 50 ఏళ్లుగా కత్తెర సాగు చేస్తున్న మోహన్రెడ్డి, ఏప్రిల్ చివరి వారంలో సాగు పనులు ప్రారంభిస్తారు. వానాకాలం వరి కోతలు ప్రారంభమయ్యేలోపే కత్తెర పంటను విక్రయించుకుంటామని తెలిపారు. ఉద్యమాలతో ముడిపడిన జీవితం నిరంతరం పోరాటాల బాటే.. నేడు ప్రజాకవి జయంతి పాఠశాలల భద్రతకు అత్యంత ప్రాధాన్యం 100 శాతం రక్షణ ఉండేలా కార్యాచరణ 12 వరకు కార్యక్రమాలు ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 8న టాస్క్ఫోర్సుల ఏర్పాటు, హజార్డ్ హంట్ ప్రారంభం 9న హజార్డ్ హంట్ పూర్తి 10న అవగాహన కార్యక్రమాలు, మాక్ డ్రిల్స్ 11న చేపట్టాల్సిన కార్యక్రమాలకు ఎస్ఎంసీ ఆమోదం, ఎంఈఓ పరిశీలన 12 అన్ని పాఠశాలల హార్డ్ కాపీల సమర్పణ యూడైస్లో నమోదు ప్రకృతి విపత్తులపై విద్యార్థులకు తప్పనిసరిగా అవగాహన ఉండేలా అన్ని ఽశాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలి. నిర్ధేశించిన లక్ష్యాలు గడువులోగా పూర్తి చేసి 100 శాతం కార్యక్రమాలు చేపట్టాలి. స్కూల్ సేఫ్టీ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ అంశంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలి. –సందీప్ కుమార్ ఝా, కలెక్టర్ -
కౌన్సిల్లో రగడ
● చైర్పర్సన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ కౌన్సిలర్ల నిరసన ● బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్ ● వచ్చే సమావేశానికి బీఆర్ఎస్ కౌన్సిలర్ సుగుణాకర్ సస్పెన్షన్జనగామ: పురపాలిక సాధారణ సమావేశం మంగళవారం రసాభాసగా మారింది. మున్సిపల్ చైర్పర్సన్న్ కడకంచి బాలమణిశ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కాన్ఫరెన్స్ హాల్లో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే 18వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ గోపగోని సుగుణాకర్ గౌడ్ డ్రెయినేజీ నిర్మాణం విషయంలో గతంలో మున్సిపల్ కౌన్సిలర్ల వాట్సాప్ గ్రూపులో చైర్పర్సన్న్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా చైర్పర్సన్న్కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు పోడియం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు 14 మంది తమ సభ్యుడు ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొంటూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఫ్లకార్డులతో నిరసన చేపట్టి చైర్పర్సన్న్కు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా సుగుణాకర్ మాట్లాడుతూ..18వ వార్డులో డ్రెయినేజీ నిర్మాణం రోడ్డుకు ఎత్తుగా చేపట్టడంతో ఓ వృద్ధురాలు కిందపడ్డారని, సమస్యపై అధికారులు పట్టించుకోవడం లేదనే ఉద్దేశంతోనే వాట్సాప్ గ్రూపులో ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. 44 ఎజెండా అంశాలను కౌన్సిల్ దృష్టికి తీసుకు వెళ్లగా, 43 అంశాలను ఆమోదించారు. అభివృద్ధి పనులపై కౌన్సిలర్ల ప్రస్తావన మూడో వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి ఏసీ రెడ్డినగర్ డబుల్ బెడ్రూమ్ కాలనీకి వెళ్లే మార్గంలో లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. డ్రెయినేజీల శుభ్రత, చెత్త సేకరణ కోసం తోపుడు బండ్లు సమయానికి తిరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల డ్రా జాబితాలో అనర్హులు, ఇళ్లు ఉన్నవారు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పేర్లు ఉన్నాయన్న ఆరోపణలపై పరిశీలన చేయాలని కోరారు. ఎస్డీఎఫ్ నిధుల కింద 2023లో డ్రెయినేజీ కోసం మంజూరైన రూ.5 లక్షల నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పూర్తయిన తర్వాత ప్రశ్నించడం ఏంటి? 18వ వార్డులో డ్రెయినేజీ నిర్మాణం జరుగుతున్న సమయంలో కౌన్సిలర్గా సుగుణాకర్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని చైర్పర్సన్న్ కడకంచి బాలమణి ప్రశ్నించారు. డ్రెయినేజీ ఎత్తుగా నిర్మిస్తున్న సమయంలో అడ్డుకోవాల్సిన కౌన్సిలర్ నిర్మాణం పూర్తయిన తర్వాత రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. మహిళా చైర్పర్సన్న్ను ఉద్దేశించి అర్ధరాత్రి వాట్సాప్ గ్రూపులో ఇష్టానుసారంగా సందేశాలు పెట్టడం అవమానకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యపై కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించినట్లు తెలిపారు. సమావేశంలో తనతో పాటు కమిషనర్పై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన సుగుణాకర్ను వచ్చే అక్టోబర్లో జరిగే కౌన్సిల్ సమావేశానికి హాజరుకాకుండా సస్పెండ్ చేసినట్లు చైర్పర్సన్న్ ప్రకటించారు. మున్సిపల్ కమిషనర్ సీహెచ్.రాజశేఖర్రెడ్డితో పాటు పట్టణంలోని 30 వార్డుల కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు కలిపి సుమారు 60 మంది పాల్గొన్నారు. -
హైస్కూల్ విద్యార్థులకు ఉప్రయోగం!
విద్యారణ్యపురి: ప్రభుత్వ ఉన్నత పాఠశాలు, పలు కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో సైన్స్ ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రయోగాత్మక బోధనకు శ్రీకారం చుట్టనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ, ములుగు మహబూబాబాద్ జిల్లాల్లో ఎంపిక చేసిన 26 ఉన్నత పాఠశాలల(కేజీబీవీలతో కలిపి)కు రూ.6.76 కోట్లు సమగ్రశిక్ష నుంచి మంజూరు లభించింది. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్, రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ (సమగ్ర శ్రిక్ష) నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.26లక్షలు ఒక్కో పాఠశాలకు రూ.26లక్షల చొప్పున కేటాయించారు. ఈ నిధులతో సైన్స్ ల్యాబొరేటరీ గదుల నిర్మాణం, పరికరాల సేకరణ, సరఫరా, ఇన్స్టాలేషన్ టెస్టింగ్ కమిషనింగ్కు పరిపాలనా అనుమతి ఇచ్చారు. ల్యాబ్ గది నిర్మాణానికి రూ.25లక్షలు, పరికరాలకు రూ.లక్ష కేటాయించారు. పనులను రాష్ట్ర విద్యామౌలిక సదుపాయాల సంస్థ (టీజీఈ డబ్లూ ఐడీసీ – హైదరాబాద్)కి అప్పగించారు. ఇ– ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. జిల్లాల వారీగా పాఠశాలలు, నిధుల వివరాలు.. హనుమకొండ జిల్లాలో హైస్కూళ్లు, కేజీబీవీలు కలిపి తొమ్మిదింటికి రూ.2.34 కోట్లు మంజూరయ్యాయి. హసన్పర్తి, ధర్మసాగర్, ఆత్మకూరు, ఎల్కతుర్తి కేజీబీవీలు, తరాలపల్లి, కడిపికొండ, వంగపహాడ్ జెడ్పీహెచ్ఎస్లు, శాయంపేట జాగీర్, వడ్డేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ● వరంగల్ జిల్లాలో మూడు పాఠశాలలకు రూ.78లక్షలు మంజూరయ్యాయి. సంగెం కేజీబీవీ, చార్బౌలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పైడిపల్లి జెడ్పీహెచ్ఎస్ ఉన్నాయి. ● జనగామ జిల్లాలో నాలుగు పాఠశాలలకు రూ.1.04కోట్లు వచ్చాయి. కొడకండ్ల, నర్మెట, రఘునాథపల్లి కేజీబీవీలు, చెన్నూరు జెడ్పీహెచ్ఎస్ ఉన్నాయి. ● ములుగు జిల్లా మంగపేట జెడ్పీహెచ్ఎస్కు రూ.26లక్షలు మంజూరయ్యాయి. ● మహబూబాబాద్ జిల్లాలో 9 పాఠశాలలకు రూ.2.34కోట్లు మంజూరయ్యాయి. చిన్నగూడూరు, పెద్దగూడూరు, మరిపెడ, వంగర కేజీబీవీలు, దాట్ల, హరిపిరాల, జమాండ్లపల్లి, ఆలేర్, పెనుగొండ జెడ్పీహెచ్ఎస్లున్నాయి. ● జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఈ దశలో నిధులు విడుదల కాలేదు ఈ నిబంధనలు పాటించాల్సిందే.. సైన్స్ లేబొరేటరీలు నిర్మాణం పూర్తయ్యాక వర్క్స్టేషన్లు, పరికరాలు టీజీఈడబ్లూ ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి సంయుక్తంగా తనిఖీ చేసి నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ధ్రువీకరించాలి. ఆ తరువాత వాటిని ఆయా పాఠశాలల హెచ్ఎంలకు అప్పగించాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల్లో సైన్స్ ప్రయోగశాలలు ఐదు జిల్లాల్లో 26 ఉన్నత పాఠశాలలకు రూ.6.76 కోట్లు మంజూరు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు కేటాయించని నిధులు -
క్రయ, విక్రయాల నమోదు తప్పనిసరి
బచ్చన్నపేట : ఎరువుల దుకాణాల్లో క్రయ, విక్రయాల నమోదు తప్పనిసరి అని, కొనుగోలు చేసిన రైతులకు తప్పకుండా బిల్లులు ఇవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారి అంబికాసోనీ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేసి స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అలాగే మండలంలోని చిన్నరామన్చర్ల గ్రామంలో జరుగుతున్న డిజిటల్ క్రాప్ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు చేసిన 7 రకాల సన్నరకాలను ఆన్లైన్ చేసుకోవాలని దీనికి ఈ నెల 10 చివరి గడువు అన్నారు. ఆయా గ్రామాల్లో వలంటీర్లు డిజిటల్ క్రాప్ సర్వేను కచ్చితత్వంతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ బజ్జూరి దివ్య, ఏఈఓ రాకేష్, అజయ్, రైతులు పాల్గొన్నారు. 13న జిల్లాస్థాయి కబడ్డీ ఎంపికలు జనగామ రూరల్: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాల, బాలికలు సబ్–జూనియర్ బాలికల జిల్లా స్థాయి కబడ్డీ జట్ల ఎంపికలు ఈ నెల 13న (ఆదివారం) ఉదయం 09:00 గంటలకు జిల్లా కేంద్రంలోని మైనార్టీ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ (గీతాంజలి స్కూల్ పక్కన) నిర్వహించనున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా చైర్మన్ పోగుల సారంగపాణి, జిల్లా అధ్యక్షుడు వై.కుమార్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికై న జూనియర్ బాలురు, సబ్–జూనియర్ బాలికలు ఈ నెల 26నుంచి 29వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో నిర్వహించే అంతర్ జిల్లా కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. అలాగే జూనియర్ బాలికల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో వచ్చే నెల 9 నుంచి 11వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, 10వ తరగతి మెమో జిరాక్స్ కాపీలతో రావాలని కోరారు. మరిన్ని వివరాలకు రాజు– 8179650006, సుధాకర్ 9391549744, కుమార్ 8328211430, రాజన్న – 9494130323 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. విద్యుత్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గం జనగామ: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ కార్యవర్గ 327 ఎన్నికలు రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం ఐలేష్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా బి.వీరాంజనేయులు, కార్యదర్శిగా చెట్టిపల్లి నరేందర్రెడ్డి, సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బి.రాజ్కుమార్ ఎన్నికయ్యారు. ఎన్నికలను సంఘం సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ పర్యవేక్షించగా, ఎన్నికల అధికారులుగా పి.మహిందర్రెడ్డి, కె.శ్రీనివాసరావు వ్యవహరించారు. జనగామ డివిజన్ అధ్యక్షుడిగా మూల మహేందర్, కార్యదర్శిగా కోతి విజయకుమార్, స్టేషన్ఘన్పూర్ డివిజన్ అధ్యక్షుడిగా బి.శ్రీధర్, కార్యదర్శిగా ఫయాజ్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. బతుకమ్మ ఆడి నిరసనస్టేషన్ఘన్పూర్: పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే జీఓ 97ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఘన్పూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు మంగళవారం కళాశాల ఆవరణలో బతుకమ్మ ఆట ఆడి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని, జీఓ 97తో పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను శక్తి ఫ్రేమ్వర్క్ కింద విలీనం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పునఃపరిశీలించాలని, విద్యార్థులు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
కత్తెర కోతలు షురూ!
జనగామ: రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఏడాదికి మూడు పంటలు సాగు చేసే ప్రత్యేకత జిల్లాకు ఉంది. ఇందులో భాగంగా వానాకాలం పంటల నాట్లు పూర్తయిన కొద్ది రోజులకే కత్తెర పంట కోతలు ప్రారంభం కావడం రైతుల వ్యవసాయ ప్రణాళికలో మరో విశేషంగా నిలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో పలు ప్రాంతాల్లో కత్తెర పంట కోతలు ప్రారంభమై, ధాన్యం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు చేరుతోంది. జిల్లాలో కత్తెర సాగు దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయంగా ఉంది. వందేళ్లుగా ఈ విధానంలో పంటలు సాగు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. యాసంగి పంట కోతలు పూర్తయిన మడులను వెంటనే దున్ని కత్తెర సాగుకు సిద్ధం చేస్తారు. సాధారణంగా ఏప్రిల్ చివరి వారం నుంచే కత్తెర పంట సాగు పనులు ప్రారంభమై, మే రెండో వారం నుంచి మూడో వారంలోపు నాట్లు పూర్తి చేస్తారు. అనంతరం పంట కాలం ముగియగానే కోతలు చేపడతారు. 30 నుంచి 35 వేల ఎకరాల్లో సాగు ప్రస్తుత వానాకాలం సీజన్లో జిల్లాలో సాధారణ వరి సాగు విస్తీర్ణం సుమారు 2.08 లక్షల ఎకరాలు కాగా, సుమారు 1.74 లక్షల ఎకరాల్లో సాగైనట్లు అంచనా. ఇందులో 30 నుంచి 35 వేల ఎకరాల వరకు కత్తెర పంట సాగయ్యే అవకాశం ఉంది. లింగాలఘణపురం, రఘునాథపల్లి, పాలకుర్తి, జనగామ తదితర మండలాల్లో కత్తెర సాగు విస్తారంగా కనిపిస్తోంది. భూగర్భ జలాలే ప్రధాన ఆధారం కత్తెర పంట సాగు సమయంలో జిల్లా వ్యాప్తంగా వానాకాలం వ్యవసాయ పనులు కొనసాగుతుండటంతో ఒకేసారి భారీగా సాగునీటి వినియోగం ఉండదు. దీంతో భూగర్భ జలాలపై ఒత్తిడి పెద్దగా ఉండకపోవడంతో బోర్లు, బావుల ద్వారా కత్తెర పంటకు అవసరమైన నీటిని అందించుకునే అవకాశం రైతులకు ఉంటుంది. నీటి లభ్యతతో పాటు పంటల సాగు సమయం కూడా అనుకూలంగా ఉండటంతో చీడపీడల ప్రభావం తగ్గి దిగుబడులు పెరిగే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. మార్కెట్లో క్వింటాకు రూ.2,321 కత్తెర ధాన్యం కోతలు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు పంటను వ్యవసాయ మార్కెట్కు తీసుకొస్తున్నారు. రెండు రోజుల క్రితం మార్కెట్లో కత్తెర ధాన్యం క్వింటాకు గరిష్టంగా రూ.2,321 ధర పలికింది. ప్రస్తుతం మార్కెట్కు కత్తెర ధాన్యం పరిమితంగా వస్తుండటంతో, రానున్న రోజుల్లో నాణ్యమైన ధాన్యానికి మరింత ధర లభించే అవకాశాలపై రైతుల్లో ఆశలు నెలకొన్నాయి. 30 నుంచి 35 వేల ఎకరాల్లో సాగు ఏడాదికి మూడు పంటలు జిల్లా ప్రత్యేకత మార్కెట్కు చేరుతున్న ధాన్యం క్వింటాకు రూ.2,321 ధరజిల్లా వ్యవసాయ మార్కెట్కు ప్రస్తుతం కత్తెర ధాన్యం భారీగా వస్తోంది. రైతులు తీసుకొచ్చిన ధాన్యానికి నాణ్యతను బట్టి సరైన ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. కొనుగోలు సమయంలో రైతులకు నష్టం జరగకుండా మార్కెట్ సిబ్బంది పర్యవేక్షణ చేస్తున్నారు. నాణ్యతను నిర్ధారించి, పోటీ ధర వచ్చేలా వ్యాపారులతో సమన్వయం చేస్తున్నాం. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా మార్కెట్కు ధాన్యం తీసుకురావాలి. –బనుక శివరాజ్ యాదవ్, చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ -
భూములు..ఇళ్లు..పింఛన్లు
ప్రజావాణికి వచ్చే అర్జీల్లో ఈ సమస్యలే ఎక్కువ జనగామ రూరల్: ప్రజా సమస్యలకు పరిష్కార వేదిక ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు ఏళ్ల తరబడిగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు తమ గోడును వెల్లబోస్తున్నారు. ప్రజల నుంచి అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి 422 దరఖాస్తులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులను తీసుకుంటూ వారి సమస్యల తక్షణ పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాసమస్యలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని, సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ భాస్కర్, సీపీఓ చినకోట్యా నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రజావాణిలోనూ, మండల కేంద్రాల్లో జరిగిన ప్రజావాణిలోనూ పరిశీలన చేయగా.. ఫిర్యాదుల్లో ఎక్కువగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. దరఖాస్తుల్లో కొన్ని ఇలా.. ● బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన కర్ర రాంరెడ్డి, తాను దివ్యాంగురాలినని, పింఛన్ రావడం లేదని, సదరం సర్టిఫికెట్ ఉంద ని, పింఛను మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. ● స్టేషన్ ఘన్పూర్ మండలం ఇంద్ర నగర్కు చెందిన చింత అనూష.. తనది నిరుపేద కుటుంబమని, కూలి పనిచేసుకొని జీవనం సాగిస్తున్నానని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరింది. ● జనగామ మండలంలోని చౌడారం గ్రామానికి చెందిన ఎర్రోజు ఆగాచారి 47 ఏళ్ల నుంచి కారోబార్గా విధులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండా రెండు నెలల క్రితం పన్ను వసూలు బుక్కులను గ్రామ ప్రజాప్రతినిధి తీసుకున్నారని నేటికీ ఇవ్వకుండా, విధులకు రానివ్వకుండా గ్రామానికి చెందిన మరోవ్యక్తికి అప్పజెప్పారని కార్యదర్శికి వివరించినా పట్టించుకోవడం లేదని కలెక్టర్ విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని కోరారు. ● పట్టణంలోని 16వ వార్డు సంజయ్నగర్లో 15 ఏళ్ల నుంచి అద్దె భవనంలో ఉంటూ కాలం వెల్లదీస్తున్నానని, ఇంటి అద్దె భారమవుతోందని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని జాముఖన్నామ్ షాయిదా వినతి పత్రం అందించారు. ● పాలకుర్తి మండలం తిరుమలగిరిలో సర్వే నెంబర్ 74ఏలో ఎకరం 20 గుంటల భూమిని కొనుగోలు చేయగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని స్టేషన ఘన్పూర్ మండలం చాగల్కు చెందిన పోగుల సారంగపాణి అన్నా రు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద కాంట్రాక్టర్ తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కాలువ పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, భూసేకరణ చేయకుండా నష్టపరిహరం చెల్లించకుండా పనుల చేస్తున్నారని విచారణ జరిపించి న్యాయం చేయాలని వినతి పత్రం అందించారు. నెలల తరబడిగా ఆఫీసుల చుట్టూ తప్పని ప్రదక్షిణలు కలెక్టరేట్ గ్రీవెన్స్కు పోటెత్తిన అర్జీదారులు ప్రజల నుంచి 422 దరఖాస్తుల స్వీకరణ సత్వరమే పరిష్కరించాలంటూ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు -
తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు నిధులు
విద్యారణ్యపురి: కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను ఏర్పాటుచేసి విద్యనందించనుంది. నియోజకవర్గానికి ఒక స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం కొంతకాలం క్రితమే అనుమతినిచ్చింది. తొలుతగా కొన్నింటికి పరిపాలనా అనుమతులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిధులు మంజూరు చేసింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులు వినియోగించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 పబ్లిక్స్కూళ్లు ఏర్పాటుకానున్నాయి. ఈ నిధులతో ఆయా స్కూళ్ల రూపురేఖలు మారనున్నాయి. ఇవి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లుగా కొనసాగనున్నాయి. ఇక్కడ ప్రీ ప్రైమరీనుంచి ఇంటర్ వరకు ఉచితంగా విద్యనందించనున్నారు. జిల్లా వారీగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు పాఠశాల ఎంపిక.. నిధుల కేటాయింపు.. ● హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి జెడ్పీహెచ్ఎస్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ 9.90కోట్లు, వర్ధన్నపేట నియోజకవర్గ పరిధి హసన్పర్తిలోని ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్కు రూ 6.80కోట్లు మంజూరు చేశారు. ● వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం శంభునిపేట ప్రభుత్వ హైస్కూల్కు రూ 8.30కోట్లు, నర్సంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అండ్ ప్రభుత్వ హైస్కూల్కు రూ.9.99కోట్లు. ● జనగామ జిల్లా నర్మెట మోడల్ స్కూల్కు రూ 10.70కోట్లు. ● మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు ప్రభుత్వ హైస్కూల్కు రూ.7.50కోట్లు, డోర్నకల్ నియోజకవర్గ పరిధి నర్సింహులపేట జిల్లా పరిషత్ హైస్కూల్కు రూ 11.20కోట్లు. ● ములుగు జిల్లా బండారుపల్లిలోని టీజీఎంఎస్కు రూ.9.20కోట్లు. ● జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగె జెడ్పీహెచ్ఎస్కు రూ.11.50కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 9 పాఠశాలలు ఎంపిక ప్రతిపాదిత ప్రభుత్వ, జిల్లాపరిషత్, మోడల్ స్కూళ్లలోనే ఏర్పాటు ప్రీ ప్రైమరీనుంచి ఇంటర్మీడియట్ వరకు సెమీ రెసిడెన్షియల్గా విద్యతోపాటు క్రీడలు వసతులు, మెరుగైన విద్య రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఒక మోడల్గా నిర్మించారు. సీఎం రేవంత్రెడ్డి ఆ స్కూల్ను ప్రారంభించి ఆయన ఆదేశం మేరకు ఆ తరువాత వివిధ జిల్లాలనుంచి ప్రతిపాదనలు తీసుకుని పరిపాలనపరమైన అనుమతులు, నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం ఉన్నత స్కూళ్ల భవనాలు, తరగతి గదులు ఉంచి అదనంగా గదులు సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన ల్యాబ్స్, క్రీడామైదానం, లైబ్రరీ, మోడల్ కిచెన్, డైనింగ్హాల్, డ్యాన్స్ హాల్ నిర్మిస్తారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుంది. సుమారు నాలుగు ఎకరాల వరకు విస్తీర్ణం ఉన్న హైస్కూళ్లనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ఎంపిక చేశారు. -
‘చిట్టి చిలుకమ్మ..’ బళ్ల సరస్వతికి అరుదైన గౌరవం
బచ్చన్నపేట: మండలం కట్కూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయురాలు, చిట్టి చిలుకమ్మా..గేయరచయిత బళ్ల సరస్వతి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని న్యూజెర్సీ ఎన్ఏపీఏ (నార్త్ అమెరికన్ పద్మశాలి అసోసియేషన్) సంస్థ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. ఈసందర్భంగా ఆమె కుమారులు బళ్ల శ్రీనివాస్, కట్కూర్ సర్పంచ్ బళ్ల రవీంద్రనాథ్ సోమవారం మాట్లాడుతూ.. ఈ నెల 12న అవార్డు అందించనున్నట్లు చెప్పారు. కాగా, శ్రీచిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా..శ్రీ అనే గేయం ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశంగా ముద్రితమైన సంగతి తెలిసిందే. -
కామర్స్ యూజీ విభాగాధిపతిగా కనకయ్య
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కామర్స్ అండ్ బిజినెస్మేనేజ్మెంట్ విభాగాధిపతిగా ఆ విభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కనకయ్య నియమితులయ్యారు. సోమవారం ఈమేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఒక సంవత్సరంపాటు విధులు నిర్వర్తించనున్నారు. ప్రిన్సిపాల్ ఉత్తర్వుల కాపీని కనకయ్యకు అందించారు. కార్యక్రమంలో ఆ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రెహమాన్, ఫ్యాకల్టీ క్లబ్ చైర్మన్ డాక్టర్ డి.భిక్షపతి, వర్కింగ్ చైర్మన్ డాక్టర్ ఫిరోజ్పాషా, అధ్యాపకులు కనకయ్యను అభినందించారు. -
వైభవంగా శ్రీ మహంకాళమ్మ జాతర
● ఆకట్టుకున్న పలారం బండి ఊరేగింపు ● కోలాటాలు.. డప్పు చప్పుళ్లతో సందడిజనగామ: పవిత్ర శ్రావణమాసం సోమవారం సందర్భంగా పట్టణంలోని శ్రీ మహంకాళి అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించారు. 25వ వార్డు కౌన్సిలర్ పాముకుంట్ల ప్రసాద్, నిర్వాహక బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన పలారం బండి కార్యక్రమానికి పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారికి సమర్పణగా పొట్టేళ్లతో పలారం బండిని అలంకరించి నిర్వహించిన ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఉత్సవమూర్తులను పలారం బండి వద్దకు తీసుకువచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమైన పలారం బండి ఊరేగింపు ఆర్టీసీ చౌరస్తా, నెహ్రూ పార్కు, బొడ్రాయి మీదుగా సాగి తిరిగి అర్థరాత్రి ఆలయానికి చేరుకుంది. సీఐ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై నర్సయ్య, పోలీసు సిబ్బంది పకడ్బందీ బందోబస్తు నిర్వహించారు. వేద పండితులు వారణాసి పవన్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజు యాదవ్, నాయకులు కంచె రాములు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు, మేడ శ్రీనివాస్, నిమ్మతి మహేందర్రెడ్డి పాల్గొన్నారు. -
మహిళా ఎమ్మెల్యేలను అవమానిస్తారా?
జనగామ: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీలు, తదితరులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ జిల్లాకేంద్రంలోని చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పెద్దఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించా రు. మహిళా ఎమ్మెల్యేలను అవమానించేలా వ్యవహరించారని ఆరోపిస్తూ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్దె సిద్ధిలింగం, ఇర్రి రమణారెడ్డి, ఎనగందుల కృష్ణ, మల్లిగారి రాజు, ఉడుగుల కిష్టయ్య, సువార్త, బిజ్జాల నవీన్, సమ్మర్, ధర్మపురి శ్రీనివాస్, ఉల్లెంగుల సందీప్, సుగుణాకర్ గౌడ్, సువార్త అనిల్, గునిగంటి రామకృష్ణ, సజ్జ దుర్గాప్రసాద్, ప్రమోద్ రెడ్డి, ఎల్లయ్య, ప్రతాప్రెడ్డి, నర్సింగ్, యాదగిరి గౌడ్ తదితరుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు చౌరస్తాలో బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచి పోయింది. సీఐ సత్యనారా యణరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు భరత్, చెన్నకేశవులు, రతీష్ తదితరులతో పాటు పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టు చేశారు. బలవంతంగా బస్సులు, పోలీసు వాహనాల్లో ఎక్కించి పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో వాహనాలను శ్రేణులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అరెస్టు కాని కార్యకర్తలు పోలీసులు తీసుకెళ్తున్న వాహనాల వెంట స్టేషన్ వరకు పరుగులు తీసి అక్కడా బైఠాయించారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినదించారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అరైస్టెన వారి పేర్లు నమోదు చేసుకుని సొంత పూచీకత్తుపై విడుదల చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం జిల్లాకేంద్రంలో ధర్నా, రాస్తారోకో స్వల్ప ఉద్రిక్తత, నాయకుల అరెస్ట్, అడ్డగింత -
తాతా మధును సస్పెండ్ చేయాలి
● స్పీకర్పై వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ ధర్నా ● కేసీఆర్ దిష్టిబొమ్మ దహనంజనగామ: స్పీకర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వరంగల్–హైదరాబాద్ హైవేపై ధర్నా నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్ను అవమానించడం అంటే రాజ్యాంగాన్ని, శాసనసభ గౌరవాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను అ వమానించడమేనని అన్నారు. తాతా మధుపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, ఆయనను వెంటనే సస్పెండ్ చేసి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ దళితుడు కావడం వల్లే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని ఆరోపించారు. వైటీడీఏ సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో దళితులకు తగిన న్యాయం జరగలేదని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వేమళ్ల సత్యనారాయణరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కంచ రాములు, జనగామ పట్టణ అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వేముల మల్లేష్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బడికె ఇందిర, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మాజిద్ అప్సర్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్, కళ్యాణం చంద్రమౌళి, డీసీసీ స్పోక్స్పర్సన్న్ నరేందర్ పవార్, జనరల్ సెక్రటరీ భాస్కర్ పాల్గొన్నారు. -
ఈవీఎం గోదాం పరిశీలన
జనగామ రూరల్: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, త్రైమాసిక తనిఖీలో భాగంగా కలెక్టర్ కార్యాలయాల భవన సముదాయంలోని ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, మంటల నియంత్రణ పద్ధతులను పర్యవేక్షించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి రవి, బీజేపీ ప్రతినిధి జగదీష్, తదితరులు పాల్గొన్నారు. కౌరవసభలా అసెంబ్లీ జనగామ: తెలంగాణ అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకోవడం అత్యంత అప్రజాస్వామిక చర్య అని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. సోమవారం పల్లా మాట్లాడుతూ.. గౌరవసభ కాస్త కౌరవసభలా మారిందని, ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమన్నారు. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో పాటు ఇతర మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన అనుచిత, దురుసు ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధ్యులపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సహా పలువురు ప్రజా ప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని, అరెస్టులు, ఆంక్షలకు భయపడేది లేదన్నారు. చేయూత పింఛన్లపై హెల్ప్డెస్క్ జనగామ రూరల్: జిల్లాలో చేయూత సామాజిక భద్రత పింఛన్లకు సంబంధించి అర్హత ఉన్న లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా కలెక్టరేట్లోని డీఆర్డీఏ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన చేయూత పింఛన్ల దరఖాస్తులకు ఈ నెల 15న చివరి తేదీ అని స్పష్టం చేశారు. చేయూత పింఛన్లకు సంబంధించిన సమాచారం కోసం ప్రజలు అధికారిక మార్గాలనే ఆశ్రయించి, మధ్యవర్తులను నమ్మకుండా, తమ సందేహాలను నేరుగా ఫోన్ నంబర్ 9000019677 ద్వారా డీఆర్డీఏ కార్యాలయంలో నివృత్తి చేసుకోవాలని కోరారు. కార్యాలయ పని దినాల్లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు హెల్ప్ డెస్క్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. నేడు పురపాలిక సాధారణ సమావేశం జనగామ: జనగామ పురపాలిక 7వ కౌన్సిల్ సాధారణ సమావేశం ఈనెల 8న (మంగళవారం) ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన మొత్తం 25 ఎజెండా అంశాలను కౌన్సిల్ ముందుకు తీసుకురానున్నారు. ఆయా అంశాలపై చర్చించి, కౌన్సిల్ ఆమోదం అనంతరం పనులు ప్రారంభించనున్నారు. ప్రధానంగా పురపాలిక పరిధిలో రోడ్ల ప్యాచ్ వర్కులకు రూ.40 లక్షలు కేటాయించే అంశాన్ని చర్చించనున్నారు. అలాగే పురపాలికకు అప్పగించిన ఆయా వార్డుల పరిధిలో సుమారు 11 వెంచర్లలో 10 శాతం గ్రీన్ల్యాండ్ స్థలాలను పరిరక్షించడంతో పాటు, పురపాలిక ఆధీనంలోని భూములకు రక్షణ కల్పించేందుకు రూ.10 లక్షలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి జియో ట్యాగింగ్ చేయాలని ప్రతిపాదించారు. ఇక పట్టణంలోని రంగప్ప చెరువు పరిసరాలను రూ.5 లక్షలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. గత కౌన్సిల్ సమావేశాల్లో వాటర్, లైటింగ్, పందులు, కోతుల నియంత్రణ తదితర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వగా, ఈసారి పట్టణ అభివృద్ధికి కీలకమైన 25 అంశాలను ఎజెండాలో చేర్చారు. -
ఇళ్లకు పట్టాలివ్వండి..
కొడకండ్ల: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023లో సర్పంచ్ అధ్యక్షతన మండల కేంద్రంలోని జీపీ వద్ద తహసీల్దార్ ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో గ్రామసభ నిర్వహించి 50 డబుల్బెడ్రూం ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి రూం, ఇంటి నెంబర్లు కేటాయించి తీర్మానం చేశారు. తామంతా ఆ ఇళ్లలో నివసిస్తున్నందున పట్టాలిచ్చి న్యాయం చేయాలని బాధితులు కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో మండల కేంద్రంలోని డబుల్బెడ్రూం ఇళ్లలో నివసిస్తున్న వారు ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు. తమకు కేటాయించిన ఇళ్లలోకి వెళ్లి అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులను అప్పు చేసి మరి ఒక్కొ ఇంటికి రూ.3 నుంచి 5 లక్షల వరకు సొంతంగా వెచ్చించామని, మూడేళ్ల నుంచి నివసిస్తున్నామని వాపోయారు. ఈ సమయంలో కలెక్టరేట్లో ఇటీవల డ్రా పద్ధతిలో వేరే వారికి డబుల్బెడ్రూం ఇళ్లు కేటాయిస్తున్నారని తెలిసి తామంతా ఆందోళన చెందుతున్నామన్నారు. పేదలమైన తమకే డబుల్బెడ్రూం ఇళ్లను కేటాయించి పట్టాలిచ్చి ఆదుకోవాలని కోరారు. -
జీఓ 97ను వెంటనే రద్దు చేయాలి
స్టేషన్ఘన్పూర్: పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే జీఓ 97ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని టీపీ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ యాదయ్య డిమాండ్ చేశారు. జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ఘన్పూర్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు వినూత్నరీతిలో చేతిలో గడ్డపార, పార, తట్టలను పట్టుకుని సోమవారం నిరసన తెలిపారు. అదేవిధంగా పాలిటెక్నిక్ విద్యార్థులు కళాశాల నుంచి శివునిపల్లి–జఫర్గఢ్ బీటీ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్య సాంకేతిక విద్య అని, కార్మిక విద్య కాదని, అందుకే గడ్డపార, తట్ట, పారలతో నిరసన తెలిపామన్నారు. విద్యార్థుల భవిష్యత్తో చెలగాటం ఆడవద్దని, దశాబ్దాలుగా రాష్ట్రంలో సాంకేతిక నిపుణులను తయారు చేస్తున్న పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను మరోశాఖ పరిధిలోకి తీసుకెళ్లడంతో విద్యార్థుల భవిష్యత్పై అనిశ్చితి ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు టి.అశోక్, సుదర్శన్రెడ్డి, సంపత్కుమార్, అనీల్కుమార్, ధనుంజయ్, శ్రీకర్, రాజు, సుకన్య, శ్రీధర్రెడ్డి, జావేద్పాషా, నరేష్, ప్రశాంత్, రామనర్సయ్య, సిద్దులు, విద్యార్థులు పాల్గొన్నారు. గడ్డపార, తట్ట చేతబట్టి పాలిటెక్నిక్ అధ్యాపకులు వినూత్న నిరసన -
కాంగ్రెస్ హామీల అమలుపై నేడు బీఆర్ఎస్ వినతులు
జనగామ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈనెల 7న కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్లో వినతి పత్రాలు సమర్పించనున్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై అధికారులకు వినతులు అందించనున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, 13 గ్యారంటీలు, ఆరు సూత్రాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని బీఆర్ఎస్ కోరనుంది. ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కోరనున్నారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి ఎన్నికల హామీల ప్రకారం ప్రయోజనాలు అందించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేయనున్నారు. ‘బొగత’లో సందడి వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతం వద్ద ఆదివారం సందర్శకులు సందడి నెలకొంది. జలపాతం అందాలను వీక్షించిన పర్యాటకులు తమ సెల్ఫోన్లలో సెల్ఫీలు, ఫొటోలు తీసుకున్నారు. సమీప కొలనులో స్నానాలు చేసి సేదదీరారు. హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండల పరిధిలోని హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వందల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ క్షేత్రం కోలాహలంగా మారింది. శ్రావణమాసం ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వంటి ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ఆటోలు, తదితర వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్నారు. ఆలయ సమీపంలో పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు రాజశేఖర్శర్మ, పవన్కుమార్, ఈశ్వర్చంద్శర్మ, అనిపెద్ది రాజీవ్ శర్మ స్వామివారికి నిర్వహించిన తిలతైలాభిషేకం పూజలో పాల్గొని భక్తులు మానవ శరీరాన్ని పోలి ఉండే లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకుని పులకించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు నాభిచందన ప్రసాదాన్ని పంపిణీ చేశారు. భద్రకాళిలో ‘ప్రణవనాదం’హన్మకొండ కల్చరల్: రాష్ట్ర సేవికా సమితికి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్ భద్రకాళి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం ‘ప్రణవ నాదం’ పేరుతో నిర్వహించిన సామూహిక ఘోష్ (వివిధ రకాల వాయిద్యాల) ప్రదర్శన ఆకట్టుకుంది. 90 మంది సేవికలు ఆనక్ (డ్రమ్), వంశీ, ఝల్లరి, శంఖం తదితర వాయిద్యాలతో భారతీయ సంప్రదాయ వేషధారణలో మహిళలు, యువతులు, బాలికలు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారి సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తిరసంతో పాటు దేశభక్తి, జాతీయ భావనను చాటి చెప్పింది. మహిళల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, పెంపొందించడమే కార్యక్రమ ఉద్దేశమని రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ ప్రొద్దుటూరి రూప తెలిపారు. ధర్మ, సమాజ, సంస్కృతి పరిరక్షణలో మహిళల పాత్ర కీలకమన్నారు. ప్రాచీనయుద్ధ విద్యలు, వాద్యకళలు భారతీయ సంస్కృతిలో భాగమని, వాటిని భావితరాలకు అందించడమే తయ ధ్యేయమని పేర్కొన్నారు. సమయపాలన, క్రమశిక్షణ ప్రతిరోజు అందించే శిక్షణకు ఘోష్ ప్రదర్శన నిదర్శనమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువత, బాలికల్లో ధైర్యం, సన్మార్గం పెంపొందిస్తాయని తెలిపారు. -
చేయూతకు వెల్లువలా
● కొత్త పింఛన్లకు భారీసంఖ్యలో దరఖాస్తులు ● ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా వచ్చినవి 10,115 ● 15వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ● ప్రతీ మండలానికి 5 లాగిన్లు ● ఆన్లైన్కు సర్టిఫికేషన్ తప్పనిసరి కాదుజనగామ రూరల్: ఏళ్ల తరబడి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితరుల అవస్థలు తీరనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందించే పింఛన్ల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఈనేపథ్యంలో కొత్త పింఛన్ కోసం ఆశావహులు పెద్దసంఖ్యలో దరఖాస్తు చేస్తున్నారు. ఆసరా కోసం ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 10,115 దరఖాస్తులు అందాయి. ఈ నెల 15న అర్జీల స్వీకరణ అవకాశం ఉండడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. గ్రామాలు, పట్టణాల్లో అర్హుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. వచ్చిన వాటిని రోజువారీగా ఎంపీడీఓ కార్యాలయాల్లో ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అర్హతలను పరిశీలించిన తర్వాత తదుపరి ప్రక్రియ చేపడుతున్నారు. కాగా, ఆన్లైన్ దరఖాస్తు చేసుకొనేవారు సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే పింఛన్లకు ఎంపికై తే సంబంధిత సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. జిల్లాలో శనివారం నాటికి 10,115 మంది చేయూత కింద దరఖాస్తు చేసుకుంటే అందులో నియోజకవర్గాల వారీగా చూస్తే స్టేషన్ ఘన్పూర్లో అత్యధికంగా 4,562, జనగామ నియోజకవర్గంలో 2929, పాలకుర్తిలో 2622 దరఖాస్తులు వచ్చాయి. మండలానికి 5 లాగిన్లు అర్హులైన వారు చేయూత పెన్షన్ పొందడానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుండగా ప్రతీ మండలానికి ఎంపీడీఓ లాగిన్లో అధికారికంగా 5 లాగిన్లు ప్రభుత్వం కల్పించింది. అలాగే మున్సి పాలిటీకి 5 ఇచ్చారు. వచ్చిన ప్రతీ దరఖాస్తు వివరాలు మండలాల్లో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, మున్సిపాలిటీలో సంబంధిత అధికారులతో ఆన్లైన్ ప్రక్రియ చేపడుతున్నారు. అయితే గతంలో ఆన్లైన్ నమోదుకు తప్పనిసరిగా సర్టిఫికేషన్ ఉండగా ప్రస్తుతం ఆ విధానాన్ని సడలించారు. ప్రాథమిక సమాచారంతో నమోదు చేసుకోని అభ్యర్థుల ఎంపిక సమయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్లో చూపించే అవకాశం కల్పించారు. అలాగే లబ్ధిదారులు తాము ఆన్లైన్ చేసిన వివరాలు చూసుకోవడానికి కామన్ లాగిన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో దరఖాస్తులో తప్పులు దొర్లే అవకాశం ఉండదు. ఈనెల 15 వరకు గడువు ఉండడంతో అధికారులు గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు వివరిస్తున్నారు. లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలు ● వితంతువులు: 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. భర్త మరణ ధ్రువీకరణ పత్రం ఉండాలి. ● ఒంటరి మహిళలు: వివాహిత మహిళలకు 18 ఏళ్లు నిండి ఉండాలి. భర్త నుంచి విడిపోయి లేదా భర్త వదిలేసిన పరిస్థితిలో ఉండాలి. విడిపోయిన కాలం ఏడాదికిపైగా ఉండాలి. అవివాహిత మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో 30, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్లు నిండి ఉండాలి. పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు అధికారి ధ్రువీకరణ అవసరం. ● గీత కార్మికులు: 50 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. బాడీ ట్యాపర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యత్వం, ఎకై ్సజ్ శాఖ ధ్రువీకరణ పత్రం అవసరం, ● చేనేత కార్మికులు : 50 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖ ధ్రువీకరణ తప్పనిసరి. ● దివ్యాంగులు: వయసుతో సంబంధం లేదు. కనీసం 40 శాతం అంగవైకల్యం ఉండాలి. వినికిడి లోపం ఉన్నవారికి 51 శాతం అంగవైకల్యం అవసరం. యూడీఐడీ లేదా సదరం ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. ● ఫైలేరియా బాధితులు: వయసుతో సంబంధం లేదు. గ్రేడ్–2, గ్రేడ్–3 బాధితులు అర్హులు. డీఎంహెచ్ఓ ధ్రువీకరణ ఆవసరం. ● డయాలసిస్ రోగులు: వయసుతో సంబంధం లేదు. దయాలసిస్ చికిత్స పొందుతున్నవారు అర్హులు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా నమోదు, ధ్రువీకరణ అవపరం.మండలాల వారీగా ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు 12191080903849829819777735635613స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ574తరిగొప్పులరఘునాథపల్లి437జనగామ మున్సిపాలిటీలింగాల ఘణపురంస్టేషన్ ఘన్పూర్బచ్చన్నపేటదేవరుప్పుల పాలకుర్తిజనగామ చిల్పూర్కొడకండ్లజఫర్గఢ్నర్మెట320325సద్వినియోగం చేసుకోవాలి చేయూత పింఛన్కు దరఖాస్తు చేసుకునేవారు ఈనెల 15వ తేదీలోగా ఆన్లైన్లో వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ ఉంటుంది. లబ్ధిదారులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు అదుబాటులో ఉంచుకోవాలి. –సతీష్, డీపీఎం -
చల్లంగా చూడు..పోచమ్మతల్లీ
● జిల్లా వ్యాప్తంగా వైభవంగా బోనాల పండుగ ● చివరి ఆదివారం ఆలయాలకు పోటెత్తిన భక్తులుజిల్లా కేంద్రంలోని పోచమ్మ అమ్మవారికి పూజలు, బోనాలతో ఆలయానికి వచ్చిన భక్తులుజనగామ: పవిత్ర శ్రావణమాసం చివరి ఆదివారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలు, పట్టణాల్లో అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని పోచమ్మ, మహంకాళ మ్మ, ఇరికి మైసమ్మ ఆలయాల్లో బోనాల పండుగను పెద్ద ఎత్తున నిర్వహించారు. బోనాలతో పెద్ద ఎత్తున నిర్వహించిన ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎడ్లబండ్లు, కోలాటాలు, కళాకారుల విన్యాసాలు భక్తులను అలరించాయి. డప్పుల మోతలు, భక్తిగీతాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. పలువురు శివసత్తులు పూనకాలతో భక్తులను ఆకట్టుకున్నారు. -
గురువులే సమాజ నిర్మాణశిల్పులు
● ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలి: కడియం శ్రీహరి ● 25 మంది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం జనగామ: గురువులే సమాజ భవిష్యత్తును నిర్మించే శిల్పులని, ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఆదివారం జిల్లా సమీకృత కలెక్టరేట్ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో గురుపూజోత్స వం, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదా నోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కడియం శ్రీహరితో పాటు కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి సందీప్ కుమార్ ఝా, మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, స్టేషన్ఘనపూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ తమ బోధనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగల గొప్పశక్తి ఉపాధ్యాయుడికి ఉందని కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి సందీప్కుమార్ ఝా అన్నారు. మిషన్ శిఖరం కింద తెలంగాణలో జిల్లా మొదటి స్థానంలో నిలవడం, పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో 600కు 383 మార్కులు సాధించడం ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమని కలెక్టర్ అభినందించారు. జీసీడీఓ గౌసియా బేగం, సీఎంఓ నాగరాజు, ఏఎస్సీ శ్రీకాంత్రెడ్డి, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జిల్లాలో విశిష్ట సేవలు అందించిన 25 మంది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. శాలువాలు కప్పి, జ్ఞాపికలు, ప్రశంస పత్రాలు అందజేశారు. సన్మానగ్రహీతలు వీరే.. ఎం.శోభారాణి, జీహెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్ మీడికొండ, ఎన్.నాగులరాజు, జీహెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్ కడవెండి, ఎ.భానుప్రసాద్, ప్రిన్సిపాల్, పీఎంఎస్హెచ్ఆర్ఐ టీజీఎంఎస్ కొడకండ్ల, డి.రవీందర్, ఎస్ఏ, జెడ్పీహెచ్ఎస్ మండలగూడెం, బి.శంకర్, ఎస్ఏ, పీఎంఎస్హెచ్ఆర్ఐ జెడ్పీహెచ్ఎస్ కొలనుకొండ, ఎ.రాజానరేశ్, ఎస్ఏ, యూపీఎస్ బొంతగట్టు నాగారం, ఎ.అశోక్కుమార్,ఎస్ఏ, జెడ్పీహెచ్ఎస్ చీటూరు, ఎ.సుమలత, ఎస్ఏ, ,ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జనగామ, టి.పద్మజ, పీఎస్హెచ్ఎం, ఎంపీపీఎస్ శ్రీపతిపల్లి, జి.శంకరయ్య, పీఎస్హెచ్ఎం, ఎంపీపీఎస్ కొలనుకొండ, కె.గణేశ్, పీజీటీ, టీజీఎంఎస్ వెల్ది, డి.సూర్యప్రకాశ్, ఎస్జీటీ, ఎంపీపీఎస్ దర్దెపల్లి, వి.రజిత, ఎస్జీటీ, ఎంపీపీఎస్ హక్యాతండా, జి.శ్రీనివాసరెడ్డి, ఎస్జీటీ, ఎంపీపీఎస్ పోచన్నపేట, బి.రజిత, ఎస్జీటీ, ఎంపీపీఎస్, ఖిలాషాపూర్, డి.రామానుజం, ఎస్జీటీ, ఎంపీపీఎస్ తిమ్మంపేట, టి.సునీత, ఎస్జీటీ, ఎంపీపీఎస్ కంచనపల్లి, జ్యోతి, ఎస్జీటీ, ఎంపీపీఎస్, మచ్చుపహాడ్, టి.ఆరోగ్యమేరీ, ఎస్జీటీ, యూపీఎస్, యశ్వంత్పూర్, కె.జయశ్రీ,ఎస్జీటీ, యూపీఎస్, రాఘవాపూర్ , బి.నవీన, స్పెషల్ ఆఫీసర్, కేజీబీవీ, జఫర్గఢ్, బి.సరిత, పీజీసీఆర్టీ, కేజీబీవీ పాలకుర్తి, వి.సుగుణ, సీఆర్టీ, కేజీబీవీ కొడకండ్ల, పి.శ్రీదేవి, సీఆర్టీ, కేజీబీవీ, స్టేషన్ఘన్పూర్ టి.మహాలక్ష్మి, పీఈటీ, కేజీబీవీ, జఫర్గఢ్. -
పండ్లతోటలను సాగు చేయాలి
● వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవాలి ● మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు బచ్చన్నపేట : ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్నదాతలు పండ్ల తోటలను సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సూచించారు. ఆదివారం మండలంలోని పోచన్నపేట శివారు గ్రామమైన కాశీనగర్ వద్ద జరిగిన ప్రైవేట్ హనుమాన్ విగ్రహ ప్రతిష్థ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తక్కువ వర్షపాతం నమోదైందని, దీంతో దినదినం భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని అన్నారు. ఈ ప్రాంతంలో అన్నదాతలు కేవలం వరి పంటలను మాత్రమే సాగు చేస్తున్నారని తక్కువ నీటితో పండే ఉధ్యానవన పంటలను సాగు చేయాలని తెలిపారు. పామాయిల్ తోటలను సాగు చేసి మూడు సంవత్సరాల తరువాత అన్నదాతలు నికర ఆదాయం పొందవచ్చునన్నారు. రానున్న రోజుల్లో వర్షాలు కురియక 200 ఏళ్ల క్రితం కరువు మళ్లీ గుర్తుకు వస్తోందని, దానిని త్వరలోనే చూస్తారని తెలిపారు. కార్యక్రమంలో చౌదరి, పలువురు పాల్గొన్నారు. -
తాత్కాలిక ఉద్యోగాల రాత పరీక్ష
● హాజరైన 110 మంది అభ్యర్థులు జనగామ: మున్సిపాలిటీలో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. అన్న్స్కిల్డ్ శానిటేషన్ వర్కర్లు, ఎలక్ట్రీషియన్లు, హెవీ వెహికల్ డ్రైవర్ల పోస్టుల భర్తీ కోసం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో పరీక్ష నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షణలో అధికారులు పరీక్ష ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించారు. మున్సిపాలిటీలో 30 అన్స్కిల్డ్ శానిటేషన్ వర్కర్ పోస్టుల భర్తీకి మొత్తం 45 దరఖాస్తులు అందాయి. వీరిలో 34 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరయ్యారు. అదేవిధంగా 4 ఎలక్ట్రీషియన్ పోస్టులకు 34 దరఖాస్తులు రాగా, 32 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. అలాగే మున్సిపాలిటీలో 20 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టుల భర్తీకి 47 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో 44 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరయ్యారు. మూడు విభాగాలకు సంబంధించి మొత్తం 54 పోస్టులకు 126 దరఖాస్తులు అందగా, 110 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి, ఉపాధి శాఖ అధికారి కుమారస్వామి తదితరులు ఉన్నారు. -
భక్తిశ్రద్ధలతో పలారం బండి శోభాయాత్ర
జనగామ: జిల్లా కేంద్రంలోని బీరప్పగడ్డ నుంచి అమ్మవారి పలారం బండి శోభాయాత్రను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గొర్రె పొట్టలతో అలంకరించిన పలారం బండిపై అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి నిర్వహించిన ఈ శోభాయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. శోభాయాత్ర సందర్భంగా దేవతామూర్తుల వేషధారణలు, శివశక్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా కాళికామాత వేషధారణ భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమానికి జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సై చెన్నకేశవులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. -
ఉద్యానశాఖ.. ఉద్యోగుల్లేక!
30 ఏళ్లుగా పదోన్నతులు కరువు..ఉద్యాన శాఖలో పనిచేస్తున్న హెచ్ఓలకు 30 ఏళ్లుగా పదోన్నతులు లేకపోవడం మరో సమస్యగా మారింది. దీంతో చాలా మంది పదోన్నతి పొందకుండానే రిటైర్డ్ అవుతున్నారని పలువురు హెచ్ఓలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర శాఖల్లో రెగ్యులర్గా పదోన్నతి కల్పిస్తున్న ప్రభుత్వం తమకు మాత్రం ఆ అవకాశం లేదంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అర్హత కలిగిన హెచ్ఓలకు పదోన్నతి కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఉద్యాన అధికారులు, రైతులు కోరుతున్నారు. హన్మకొండ: ఉద్యానశాఖను ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాల పునర్విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా హనుమకొండ, ములుగు జిల్లాలకు జిల్లా ఉద్యాన అధికారి పోస్టులు మంజూరు కాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 78 మండలాలకు కేవలం 17 మంది ఉద్యాన అధికారులు (హెచ్ఓలు) మాత్రమే ఉన్నారు. దీంతో రైతులకు సరైన సమయంలో అవసరమైన సలహాలు ఇచ్చే వారు కరువయ్యారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉద్యాన శాఖ, సూక్ష్మ సేద్యపు ప్రాజెక్టులు వేర్వేరుగా కొనసాగాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ రెండింటినీ ఉద్యాన శాఖ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. జిల్లాల పునర్విభజన తర్వాత పట్టు పరిశ్రమ శాఖను ఉద్యానశాఖలో విలీనం చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్ మినహా కొత్తగా నియామకాలు లేవు. 89,161 ఎకరాల్లో ఉద్యాన పంటలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 89,161 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో వరికి ప్రత్యమ్నాయంగా ఉద్యానపంటల సాగు విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో ఉన్న ఉద్యాన అధికారులపై మరింత పనిభారం పెరుగుతోంది. ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా వివిధ పంటలకు రాయితీ అందిస్తోంది. ఈ రాయితీ పొందడానికి ప్రతి రైతు వివరాలను క్షేత్రస్థాయికి వెళ్లి సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలి. జిల్లా ఉద్యాన అధికారుల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయలేదు. రాష్ట్రంలో ములుగు, హనుమకొండ, నారాయణపేట జిల్లాకు జిల్లా ఉద్యానశాఖాధికారి పోస్టు మంజూరు కాలేదు. ఖమ్మం జిల్లాకు చెందిన హార్టికల్చర్ ఏడీ ములుగు జిల్లా అధికారిగా, వరంగల్ జిల్లా సూక్ష్మ సేద్య ప్రాజెక్టు అసిస్టెంట్ డైరెక్టర్ హనుమకొండ జిల్లా ఉద్యాన అధికారిగా కొనసాగుతున్నారు. రెగ్యులర్ హెచ్ఓల కొరత.. ఉద్యాన పంటల సాగు విస్తరిస్తున్నప్పటికీ అందుకు అనుగుణంగా అధికారులు, సిబ్బందిని నియమించడం లేదు. దీంతో ఉన్న వారి పైనే అదనపు భారం పడుతోంది. ఒక్కో ఉద్యాన అధికారికి 3 నుంచి 6 మండలాల బాధ్యతలు అప్పగించారు. వీరు విధులతో పాటు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సి వస్తోంది. దీంతో రైతులకు అందుబాటులో లేకుండా పోతున్నారు. ములుగు జిల్లాలో 10 మండలాలుండగా డిప్యుటేషన్పై ఇద్దరు మాత్రమే ఉద్యాన శాఖాధికారులున్నారు. ఇక్కడ రెగ్యులర్ హెచ్ఓలు లేరు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 11 మండలాలకు ఇద్దరు ఉద్యాన అధికారులు మాత్రమే ఉన్నారు. ఇందులో ఒక్క ఉద్యాన అధికారి.. జిల్లా ఉద్యాన అధికారిగా అదనపు పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఈ జిల్లాలోని రైతులకు సరైన సేవలు అందడం లేదనే ఆరోపణలున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 18 మండలాలకు ముగ్గురు ఉద్యాన శాఖాధికారులున్నారు. ఇందులో ఒక్కరు డిప్యుటేషన్పై పని చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో 14 మండలాలకు ఇద్దరు, వరంగల్ జిల్లాలో 13 మండలాలకు ఐదుగురు ఉద్యాన శాఖ అధికారులున్నారు. సిబ్బంది కొరతతో రైతులకు సలహాలిచ్చేవారు కరువు హనుమకొండ, ములుగుకు మంజూరుకాని జిల్లా అధికారి పోస్టు 3 నుంచి 6 మండలాలకు ఒక్కరికే అదనపు బాధ్యతలు ఉమ్మడి జిల్లాలో 78 మండలాలకు 17 మంది హెచ్ఓలు మాత్రమే -
‘కుడా’ చైర్పర్సన్గా బాధ్యతల స్వీకరణ
నయీంనగర్: కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్పర్సన్గా గుండు సుధారాణి శనివారం హనుమకొండ ‘కుడా’ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. వరంగల్ పశ్చిమ, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, హనుమకొండ కలెక్టర్, ‘కుడా’ వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్పాయ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, తదితరుల సమక్షంలో గుండు సుధారాణి బాధ్యతలు స్వీకరించారు. -
చిట్టిముత్యాలు..కళాఖండాలు
● ఎగుమతి కేంద్రంగా జిల్లా ● బియ్యం, పెంబర్తి కళాఖండాలకు మార్కెటింగ్కు చర్యలు ● హస్తకళకు కొత్త గుర్తింపు, కేంద్రం అండ ● సుగంధ బియ్యంతో జనగామకు ప్రత్యేక బ్రాండ్ ● భవిష్యత్లో పెరగనున్న ఉపాధి అవకాశాలు జనగామ: జిల్లా ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు కల్పించే దిశగా.. ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగవుతున్నా యి. జనగామ బియ్యం (సుగంధ/చిట్టి ముత్యాలు) ప్రత్యేక బ్రాండ్గా తీర్చిదిద్దడంతో పాటు ప్రా సెసింగ్, బ్రాండింగ్పై దృష్టి సారించనున్నారు. పెంబర్తి కళాఖండాలు, హస్తకళలకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించే చర్యలు ఊపందుకోనున్నాయి. ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’ ద్వారా రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలు, కళాకారులకు విస్తృత గిరాకీ లభించనుండగా, భవిష్యత్లో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ‘సుగంధ బియ్యం’ ప్రత్యేక గుర్తింపు.. జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’ (ఓడీఓపీ) పథకంలో సుగంధ బియ్యం ‘చిట్టిముత్యాలు’ లేదా ఇతర బ్రాండ్ ఆధారిత ఉత్పత్తులను ప్రత్యేక ఉత్పత్తిగా గుర్తించింది. ఇందుకు సంబంధించిన రకానికి క్లారిటీ రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ జాబితాలో జనగామను ‘రైస్ బేస్డ్ ప్రొడక్టస్’ (సెంటెడ్ రైస్–చిట్టిముత్యాలు) కేటగిరీలో చేర్చారు. పథకం ఉద్దేశం ఒక జిల్లాలో ప్రత్యేకత కలిగిన ఉత్పత్తికి విలువ జోడింపు, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్ వంటి అంశాలను ప్రోత్సహించడం. వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాసెసింగ్ సదుపాయాలు, వృథాను తగ్గించడం, సరైన నిల్వ, మార్కెటింగ్ వ్యవస్థలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించనున్నారు. జిల్లాకు చిట్టిముత్యాలు బియ్యం ప్రత్యేక గుర్తింపు రావడంతో స్థానికంగా ఉత్పత్తి అయ్యే ధాన్యాన్ని కేవలం ముడి సరుకుగా విక్రయించకుండా బియ్యం, పిండి, ఇతర ఆహార ఉత్పత్తులుగా విలువ జోడించి మార్కెట్లోకి తీసుకెళ్లే అవకాశం ఏర్పడుతుంది. రైతులతో పాటు మహిళా సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సూక్ష్మ ఆహార పరిశ్రమలకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. జనగామకు చిట్టిముత్యాలు బియ్యం ఓడీఓపీ గుర్తింపు రావడం కేవలం పేరుకే పరిమితం కాకుండా, రైతు పండించిన ధాన్యానికి అదనపు విలువ కల్పించడం, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం, విస్తృత మార్కెట్కు తీసుకెళ్లడం జరిగితే జిల్లాలో వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఎగుమతి కేంద్రంగా.. జిల్లాల ప్రత్యేక ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానించి ఎగుమతులను ప్రోత్సహించాలనే కేంద్రం నిర్ణయంలో భాగంగా జిల్లాలోని పెంబర్తి లోహ కళాఖండాలకు మరోసారి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇందులో భాగంగా స్థానిక ఉత్పత్తులకు బ్రాండ్ గుర్తింపు కల్పించి అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానించనున్నారు. పెంబర్తి హస్తకళలకు గతంలోనే పర్యాటక కేంద్రంగా గుర్తింపు లభించగా, ప్రస్తుతం ఎగుమతుల ద్వారా మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఏర్పడింది. బిందెలు, కొప్పర్లు తయారు చేయడంతో ప్రారంభమైన ఈ కళ 1968లో విశ్వకర్మ సహకార సంఘం ఏర్పాటుతో మరింత విస్తరించింది. కాకతీయ కళా తోరణం తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చోటు దక్కడంతో పెంబర్తి కళకు మరింత ఖ్యాతి వచ్చింది. ఎ గుమతులు పెరిగితే కళాకారులకు ఉపాధి, ఆదా యం పెరగడంతో పాటు స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. -
‘డబుల్’ ఇళ్ల కేటాయింపునకు డ్రా
● 957 ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక జనగామ: జిల్లాలోని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించే ప్రక్రియలో భాగంగా శని వారం లబ్ధిదారుల ఎంపికకు డ్రా నిర్వహించారు. జనగామ, పాలకుర్తి, బచ్చన్నపేట, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో మొత్తం 957 ఇళ్లకు అర్హుల ను ఎంపిక చేపట్టారు. కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో ప్రక్రియ కొనసాగింది. రెండు దశల్లో ఎంపిక అర్హుల జాబితా తయారీలో ఇందిరమ్మ ఇళ్ల ఎల్–2 జాబితా, గ్రీవెన్స్లో దరఖాస్తు చేసుకున్న వారు, ప్రజాప్రతినిధులు లిఖితపూర్వకంగా అందించిన పేర్లను పరిశీలించారు. అర్హులైన కుటుంబాలందరీ పేర్లను ఒకే జాబితాలో చేర్చి డ్రా నిర్వహించారు. తొలుత అర్హులైన కుటుంబాలను ఎంపిక చేసి, అనంతరం ఎంపికై న వారికి ఇళ్లను కేటాయించేందుకు రెండో దశలో డ్రా తీశారు. పూర్తి పారదర్శకతతో ప్రక్రియ నిబంధనల మేరకు పారదర్శకంగా డ్రా నిర్వహించడంతో పాటు మొత్తం ప్రక్రియను వీడియో రికార్డు చేశారు. జిల్లా స్థాయి కమిటీ సమక్షంలో డ్రా నిర్వహించారు. కార్యాలయ ప్రాంగణంలో భారీ తెరపై ప్రత్యక్ష ప్రసారం చేయడంతో లబ్ధిదారులు ప్రక్రియను వీక్షించారు. తొలుత తాత్కాలిక ఉత్తర్వులు డ్రాలో ఎంపికై న వారికి తొలుత తాత్కాలిక కేటా యింపు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అనంత రం మండలస్థాయి బృందాలు క్షేత్రస్థాయిలో అర్హతలను పరిశీలిస్తాయి. ధ్రువీకరణ పూర్తయిన తర్వాత తుది కేటాయింపు ఉత్తర్వులతో పాటు ఇళ్ల స్వాధీ నం అప్పగించనున్నారు. కాగా ఎంపికై న లబ్ధిదారులు, వెయింటింగ్ జాబితాలను జీపీలు, మున్సిపల్, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షా లోమ్, మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి, బీఆర్ఎస్ తరుఫున బాల్దె సిద్ధిలింగం, డీసీపీ రాజ మహేంద్రనాయక్, ఆర్డీఓ గోపిరాం, కమిషనర్ రా జశేఖర్రెడ్డి,తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. -
జనగామలో హైటెన్షన్
ఆదివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026జనగామ: ఒకేరోజు ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టడంతో జనగామలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. 420 హామీలు, ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ‘బాకీకార్డు’ పేరుతో నిరసన చేపట్టగా... కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన విజయవంతమైందని ప్రచారం చేస్తూ జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి, డీసీసీ ధన్వంతిలక్ష్మీనారాయన నాయక్ నేతృత్వంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. రెండు పార్టీల ర్యాలీలు ఒకే మార్గంలోకి చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఒకవైపు నిరసన.. మరోవైపు విజయోత్సవం.. కాంగ్రెస్ ర్యాలీ ఆర్టీసీ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైంది. బీఆర్ఎస్ శ్రేణులు రైల్వేస్టేషన్ ప్రాంగణం నుంచి వేలాది మందితో ర్యాలీగా బయలు దేరారు. రెండు ర్యాలీలు గాంధీ విగ్రహం సమీపానికి చేరుకునే సమయంలో ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. జెండాలతో ఒకరికొకరు ఎదురెదురుగా నిలవడంతో కార్యకర్తల మధ్య ఉద్రిక్తత పెరిగింది. పోలీసుల ముందస్తు వ్యూహం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు ముందుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీసీపీ (ఐపీఎస్) రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఏసీపీలు భీంశర్మ, నర్సయ్య, పట్టణ సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు, ఆర్ముడ్, సివిల్ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. నెహ్రూ పార్క్ నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు భారీ గేట్లు ఏర్పాటు చేసి, డివైడర్కు ఇరువైపులా రోప్ పార్టీలను ఏర్పాటు చేశారు. ఇరువర్గాలు పరస్పరం దాటి వెళ్లకుండా పోలీసులు నిరంతరం నిఘా పెట్టారు. అలాగే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కార్యకర్తలను సముదాయిస్తూ ముందుకు వెళ్లగా, కాంగ్రెస్ తరఫున యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ కార్యకర్తల వద్దకు వచ్చి శాంతింపజేశారు. మరోవైపు ప్రధాన రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. విద్యార్థుల రాస్తారోకోతో మరింత ఒత్తిడి ఇదే సమయంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి ఐక్యవేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. దీంతో పోలీసులకు అదనపు భద్రతా బాధ్యతలు ఏర్పడ్డాయి. రాజకీయ పోరులో పోలీసులకు పరీక్ష బీఆర్ఎస్, కాంగ్రెస్ ర్యాలీలు జెండాలతో పోటీ.. నినాదాల హోరు గాంధీ విగ్రహం వద్ద ఉద్రిక్తత ఒకే మార్గంలో ఎదురెదురుగా ఇరు పార్టీల ర్యాలీలు అరగంట పాటు టెన్షన్.. పోలీసుల సమయస్ఫూర్తిజెండాల ఏర్పాటుపై ఘర్షణ ఆర్టీసీ చౌరస్తాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ జెండాల ఏర్పాటుపై ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓ దశలో కొట్టుకునే పరిస్థితి ఏర్పడటంతో పోలీసులు, ఇరుపార్టీల ప్రతినిధులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఏదిఏమైన కాంగ్రెస్, బీఆర్ఎస్ ర్యాలీలు రాజకీయంగా పోటాపోటీగా సాగినా చివరకు ఘర్షణకు దారితీయకుండా ముగిశాయి. పోలీసుల ముందస్తు ప్రణాళిక, భారీ బందోబస్తు కీలకంగా నిలిచింది. -
చారిత్రక వైభవం
స్మారక చిహ్నం.. యునెస్కో గుర్తింపుతో రామప్ప కళ నలుదిశలా పరివ్యాప్తి చెందింది. ఇక్కడ కట్టడాలను చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. అదే తరహాలో గత నెలలో రామప్ప సమీపంలోని గొల్లాల గుడిని, జూలైలో శివ తారకేశ్వరాలయాన్ని జాతీయ స్మారక చిహ్నంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈనేపథ్యంలో రామప్పకు మరింత పర్యాటక శోభ సంతరించుకోనుంది. ఈ ప్రాంతం సైతం అభివృద్ధి చెందనుంది. ఈనేపథ్యంలో పురావస్తు శాఖ పరిధిలోకి వెళ్లిన ఈ రెండు ఆలయాల ప్రత్యేకతలే సాక్షి సండే స్పెషల్.. – ములుగు -
పదేళ్లు దోచుకున్నారు..
జనగామను వీడే ప్రసక్తే లేదు.. ● ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్న.. ● జన్మభూమి స్టేషన్ఘన్పూర్.. కర్మభూమి జనగామ ● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిజనగామ: నేను పుట్టిన జన్మభూమి స్టేషన్ఘన్పూర్, నా కర్మభూమి జనగామ, రాజకీయాల్లో అవకాశం ఉన్నంతకాలం ఇక్కడే ఉంటా, ఇల్లు కూడా కట్టుకుంటున్నా, నేను చస్తేనే వదులుతా తప్ప అప్పటి వరకు వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. శనివారం జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్ నుంచి స్థానిక బస్టాండ్ వరకు ఎమ్మెల్యే పల్లా ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా మొండివైఖరితో వ్యవహరిస్తోందని నిరసిస్తూ మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్, పింఛన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రైతు బీమా పథకాన్ని రేవంత్రెడ్డి సర్కారు గాలిలో కలిపేసిందన్నారు. పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేయడం సరికాదన్నా రు. కార్యక్రమంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలున్నారు.● బీఆర్ఎస్ నాయకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ● జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి ● పట్టణంలో భారీ ర్యాలీ, 1000 రోజుల సంబురాలు జనగామ: రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దోచుకోవడం తప్ప, అభివృద్ధి లేదని కాంగ్రెస్ పార్టీ జనగామ ని యోజకవర్గ ఇన్చా ర్జ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రె డ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన పూర్తైన సందర్భంగా శనివారం జిల్లాకేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి కొమ్మూరి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతిలక్ష్మీనారాయణ నాయక్ పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం నెహ్రూపార్కు, ఆర్అండ్బీ అతిథి గృహం మీదుగా సిద్దిపేట రోడ్డులోని గాయత్రి గార్డెన్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదింట్లో వెలుగులు నింపుతున్నారన్నారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరుగుతున్న సమయంలో పల్లా రాజేశ్వర్రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సార య్య, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్, లింగం యాదవ్, గజ్జి భాస్కర్, కడకంచి బాల మణిశ్రీనివాస్, వెంకటేశ్వర్లు, నాయకులు పాల్గొన్నారు. -
జాతీయ సంపదైన రామప్ప రెండు ఉప ఆలయాలు
● ఆలయాల చుట్టూ ఉన్న భూమి పరిధి పూర్తిగా కేంద్ర రక్షిత ప్రాంతంగా మారిపోతుంది. ● ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి, భద్రతా బాధ్యతలను ఇకపై ఏఎస్ఐనే స్వయంగా చూసుకోనుంది. ● చారిత్రక కట్టడాల పరిరక్షణలో భాగంగా ఆలయ పరిసరాల్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా కఠిన నిబంధనలు అమలుచేస్తారు. ● వీటి ప్రాశస్త్యాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. కాకతీయుల రాజ్య వైభవానికి, నాటి ఆలయ నిర్మాణాల నైపుణ్యానికి సజీవ సాక్ష్యం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో గల రామప్పలోని కట్టడాలు. రామప్ప ఆలయానికి 2021 జూలై 25న యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా లభించింది. ఈ ఆలయ పరిధిలోని ఒక ఉప ఆలయం గొల్లాల గుడి. రామప్ప ఆలయానికి నైరుతి దిశలో ఉన్న ఈ గొల్లాల గుడి మూడు గర్భగుడులతో కూడిన త్రికూటాలయం. తూర్పు ముఖంగా ఉన్న మండపం, మూడు గర్భాలయాలు, సున్నితంగా చెక్కిన ద్వారబంధాలు, హంసల వరుసలు, దేవతామూర్తుల శిల్పాలు నాటి శిల్పుల కళా నైపుణ్యాన్ని కళ్లకు కడతాయి. శతాబ్దాలుగా శిల్ప వైభవాన్ని కాపాడుకుంటూ వచ్చిన ఈ చారిత్రక కట్టడాన్ని తాజాగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటించింది. దీంతో ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్పకు గొల్లల గుడి మరో మణిహారంగా నిలవనుంది. వైభవానికి ప్రతీక త్రికూటాలయం రామప్ప పరిసరాల్లోని మరో అపురూప చారిత్రక కట్టడం గొల్లాల గుడి జాతీయ పురావస్తు సంరక్షణ పరిధిలోకి చేరింది. తూర్పు ముఖంగా ఉన్న మండపం చుట్టూ మూడు గర్భగుడులు ఉండేలా ఆలయ నిర్మాణం కొనసాగింది. ఆలయ ద్వారబంధాలు, ద్వారాలపై చెక్కిన హంసల వరుసలు, ద్వారపాలకుల శిల్పాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. గుడి గోడలపై ఉన్న శిల్పాలు కాకతీయుల కళా వైభవానికి అద్దం పడుతున్నాయి. ఆలయానికి విష్ణు, లక్ష్మీ, గణేశ్, మహిషాసురమర్ధిని తదితర దేవతామూర్తులను అందంగా చెక్కారు. ఆలయ పీఠభాగంలో జంతువుల ప్రతిమలు, పుష్పాల ఆకృతులు కనిపిస్తాయి. ఎత్తయిన పీఠంపై నిర్మించిన ఈ ఆలయంలోని ప్రతీ నిర్మాణ భాగం నాటి శిల్పుల ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. తొలి స్మారక చిహ్నంగా శివ తారకేశ్వరస్వామి ఆలయం శివ తారకేశ్వరస్వామి(శివాలయం) ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నంగా గుర్తిసూ గత జూలై 6న భారత పురావస్తు సర్వేక్షణ (ఎఎస్ఐ) సంస్కృతి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఇందులోనూ కాకతీయ కట్టడాల నిర్మాణశైలి ఉంటుంది. కాగా, ప్రస్తుతం ఈ ఆలయంలో కొంతభాగం కూలిపోగా, ఇనుపస్తంభాలు పెట్టి నిలబెట్టారు. కాకతీయ కాలపు నిర్మాణ చాతుర్యాన్ని ప్రదర్శించే రామప్పలోని 10 ఉప ఆలయాలను కూడా జాతీయ సంపదగా గుర్తించాలని పర్యాటకులు కోరుతున్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేయాలి..జాతీయ స్మారక చిహ్నంగా గుర్తింపు పొందిన గొల్లాల గుడిని కేంద్ర పురావస్తుశాఖ అధికారులు అభివృద్ధిలోకి తీసుకురావాలి. త్రికూటాలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. ఆలయంలో నిత్యపూజలు జరిగేలా అధికారులు చొరవ తీసుకోవాలి. రామప్ప పరిసర ప్రాంతాల్లోని ఉప ఆలయాలను సైతం వినియోగంలోకి తీసుకొస్తే రామప్ప పర్యాటకకేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుంది. – కోమల్లపల్లి హరీశ్శర్మ, రామప్ప ఆలయ ప్రధాన పూజారి భారత పురావస్తు శాఖ పరిధిలోకి గొల్లాల గుడి, శివ తారకేశ్వరస్వామి ఆలయాలు నాటి త్రికూటాలయమే నేటి గొల్లాల గుడి నిర్మాణంలో కాకతీయుల శిల్పకళప్రయోజనాలు.. -
‘ఆట’ ఆరంభం!
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీ ఓరుగల్లు రాజకీయాల్లో ఆట మొదలైంది. ఒకవైపు కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తుపై చర్చ.. మరోవైపు వరంగల్ తూర్పులో అంతర్గత సమీకరణాలపై ఆసక్తి.. వెరసి ‘కొండా’ దంపతులకు ‘అక్కడ సెగ.. ఇక్కడ పొగ..’ అన్నట్టుగా పరిస్థితి మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో సురేఖ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారానికి ఆమె స్వయంగా తెరదించారు. కాంగ్రెస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. దీంతో తక్షణ రాజకీయ సంక్షోభంపై కొంత స్పష్టత వచ్చింది. వరంగల్ తూర్పుపై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ‘కుడా’ చైర్ పర్సన్ గుండు సుధారాణి పట్టు బిగిస్తుండటం.. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా దంపతుల వ్యూహం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో తూర్పులో కొండా కుటుంబానికి భిన్నంగా వేగమందుకున్న కాంగ్రెస్ నేతల కదలికలపై చర్చ మొదలైంది. కాంగ్రెస్లోనే.. సురేఖ స్పష్టత.. పార్టీ మారతారనే ప్రచారం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే చర్చ మధ్య సురేఖ తన వైఖరిని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి కాంగ్రెస్లోనే కొనసాగుతానని ప్రకటించారు. దీంతో వెంటనే పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా వంటి అంశాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్టయింది. ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్లోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. మంత్రి పదవి లేకుండా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో.. పార్టీలో తన రాజకీయ ప్రాధాన్యాన్ని ఎలా కొనసాగిస్తారు? స్థానికంగా తన వర్గాన్ని ఎలా సమన్వయం చేసుకుంటారు? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. పెరుగుతున్న వ్యతిరేక స్వరం వరంగల్ తూర్పు కాంగ్రెస్లో కొండా సురేఖకు భిన్నమైన రాజకీయ వర్గాలు గతంలోనూ ఉన్నాయి. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ మేయర్ గుండు సుధారాణి వంటి నేతలు వరంగల్ తూర్పు రాజకీయాల్లో తమదైన ప్రాధాన్యం కలిగిన నాయకులు. గత రాజకీయ పరిణామాల్లో కొండా కుటుంబంతో వీరికి భిన్నాభిప్రాయాలు కనిపించిన సందర్భాలున్నాయి. తాజాగా శుక్రవారం మీడియాతో మాట్లాడిన గుండు సుధారాణి.. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల చేస్తే ఊరుకునేది లేదని గట్టిగానే హెచ్చరించారు. దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్ పోటీ చేయాలని, తాను సైతం ఇండిపెండెంట్గా బరిలో ఉంటానని బస్వరాజు సారయ్య.. సురేఖకు సవాల్ విసిరారు. ఈ పరిస్థితుల్లో వీరి రాజకీయ వైఖరి ఎలా ఉంటుంది? కొండా సురేఖతో పార్టీ అంతర్గతంగా సమన్వయం జరుగుతుందా? లేక కాంగ్రెస్లో వేర్వేరు రాజకీయ శక్తులుగా కొనసాగుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక్కటవుతున్న ‘కొండా’ వ్యతిరేక వర్గీయులు సైలెంట్ మోడ్లో సురేఖ అనుచరవర్గం పార్టీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయబోనని స్పష్టత ‘తూర్పు’ రాజకీయాల్లో వేగం పెరిగిన పరిణామాలు కొండా దంపతుల భవిష్యత్ వ్యూహం ఏమిటి? ‘కొండా’ అనుచరవర్గంలో మౌనం తాజా పరిణామాల తర్వాత కొండా సురేఖకు మద్దతుగా ఉండే నాయకులు, కార్యకర్తల నుంచి పెద్దగా బహిరంగ ప్రకటనలు కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. దీనిని మొత్తం అనుచరవర్గం మౌనంగా ఉందని చెప్పడం కంటే.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆచితూచి వ్యవహరిస్తున్న వాతావరణంగా చూడాల్సి ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. కొండా సురేఖ కాంగ్రెస్లోనే కొనసాగుతానని స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆమె అనుచరుల రాజకీయ వైఖరి కూడా పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే ఉండే అవకాశముంది. భవిష్యత్తులో ఏదైనా కీలక రాజకీయ నిర్ణయం వస్తే.. స్థానికంగా ఆమె వెంట ఎవరెవరు నిలుస్తారన్నది అప్పుడే స్పష్టం కానుంది. దీంతోపాటు కాంగ్రెస్లో కొనసాగుతున్న కొండా సురేఖకు ఇప్పుడు ప్రధాన సవాలు పార్టీ బయట కంటే సొంత పార్టీలోనే తన రాజకీయ స్థానాన్ని నిలబెట్టుకోవడమే. కాంగ్రెస్లోనే ఉంటూ రాజకీయ బలాన్ని పునర్నిర్మించుకోవడమా? పార్టీలోని విభేదాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడమా? వరంగల్ తూర్పులో తన కేడర్ను మరింత బలోపేతం చేసుకోవడమా? వీటిలో ఏ మార్గాన్ని ఎంచుకుంటారన్నది వారి తదుపరి రాజకీయ చర్యలతోనే స్పష్టం కానుంది. -
ఆమెకు భరోసా
● బీసీ మహిళలకు 100శాతం సబ్సిడీతో కుట్టుమిషన్లు ● ఉపాధితో పాటు అర్థిక ఎదుగుదలే లక్ష్యం ● వితంతు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ● ఈనెల 15 వరకు దరఖాస్తులకు గడువు జనగామ రూరల్: కుటుంబంలోని మహిళలకు ఉపాధి, ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకాన్ని ప్రకటించింది. మహిళా సాధికార త, ఆర్థికాభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి ద్వారా సంక్షేమ పథకాలు, అవకాశాలు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా 100 శాతం సబ్సిడీతో ఉచితంగా కుట్టు మిషన్ పథకాన్ని తీసుకొచ్చింది. అర్హులైన మహిళలకు రూ.12 వేల విలువైన కుట్ట మిషన్ల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. చాలా మంది మెప్మా, సెర్ప్ ద్వారా కుట్టు మిషన్లలో శిక్షణ పొంది జీవనోపాధి పొందుతున్నారు. ప్రతీ నియోజకవర్గానికి వెయ్యి కుట్టు మిషన్లు అందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అభ్యర్థుల అర్హతలు దరఖాస్తుదారులు బీసీ వర్గానికి చెందిన నిరుద్యోగ మహిళై ఉండాలి. నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, మేర/మేరు కమ్యూనిటీ మహిళలకు మొదటగా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదా యం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి ఆదాయ ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉంటుంది. కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు కన్వీనర్లుగా ఉండగా, దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హుల జాబితా జిల్లా స్థాయి కమిటీ ఆమోదం పొందిన అనంతరం మిషన్లు పంపిణీ చేస్తారు. సద్వినియోగం చేసుకోవాలి బీసీ మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఉచిత ఆటోమెటిక్ కుట్టుమిషన్లు అందించనుంది. అర్హులైన బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆన్లైన్లో ఈనెల 15 లోపు దరఖాస్తులు చేసుకోవాలి. అప్లికేషన్లు ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయాలి. – ఎన్ఎల్ నర్సింహరావు, బీసీ సంక్షేమాధికారి -
‘డబుల్’ ఇళ్ల కేటాయింపునకు నేడు లక్కీడ్రా
జనగామ రూరల్: మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న 5,081 మంది లబ్ధిదారులలో 174 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపునకు శనివారం డ్రా నిర్వహించనున్న ట్లు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి తెలిపారు. శుక్రవారం సంబంధిత లబ్ధిదారుల జాబితాను మున్సిపల్ కార్యాలయ నోటీస్ బోర్డుపై ప్రదర్శించారు. ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయ నోటీస్ బోర్డులో తమ పేరును పరిశీలించుకోవాలని కోరారు. శనివారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్లో లక్కీ డ్రా ఉంటుందని తెలిపారు. లబ్ధిదారులు నిర్ణీత సమయానికి హాజరై డ్రా ప్రక్రియలో పాల్గొనాలని కోరారు. -
నడక నేర్పే నాన్న.. నడవడిక నేర్పే చదువు.. పలుకు నేర్పే అమ్మ. పలుకుబడినిచ్చే సమాజం. అజ్ఞానంనుంచి అందరూ కీర్తించేలా మార్చే దిక్సూచి.. నాలుగు గోడల నడుమ భవిష్యత్ను తీర్చిదిద్దే నిర్మాత.. చాక్పీస్ ముక్కలతో తలరాతను మార్చే ఆధునిక బ్రహ్మ అన్నీ ఉపాధ్యాయుడే. ఉమ్మ
విద్యార్థులతో ప్రయోగం చేయిస్తున్న ఉపాధ్యాయుడు రామ సంతోశ్ కుమార్ విద్యార్థులు తయారు చేసిన కృత్యాధార చిత్రాలతో ఉపాధ్యాయుడు రవి కృత్యాధార బోధన.. సామర్థ్యాల సాధనమహబూబాబాద్ రూరల్: విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి పాఠ్యాంశంలోని విషయాలను అర్థం చేసుకుని సామర్థ్యాలను సాధించేలా విద్యా బోధన చేస్తున్నారు మహబూబాబాద్ మండలం కంబాలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఆవునూరి రవి. 14 ఏళ్లుగా ప్రయోగాత్మక కృత్యాధార బోధన చేస్తున్నారు. కృత్యాధార బోధనతో విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై ఇష్టం పెంచుతున్నారు. నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం జెడ్పీఎస్ఎస్లో స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న రామ సంతోశ్ కుమార్ బోధనలో వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఆయన నిత్యం ఉదయం 5 గంటలకే జూమ్ తరగతులు నిర్వహిస్తున్నారు. యూట్యూబ్ చానల్ ప్రారంభించి ఇప్పటి వరకు దాదాపు 50 పాఠ్యంశాల వీడియోలు అప్లోడ్ చేశారు. రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్, సైన్స్ఫేర్ గైడ్ టీచర్గా పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు ఇస్రో శాస్త్రవేత్తలతో అతిథి ఉపన్యాసాలు నిర్వహించారు. ఎన్సీఈఆర్టీ నిర్వహించే ఆన్లైన్ పోర్టల్ కోసం ఈ–కంటెంట్ రూపొందించి 40కి పైగా వీడియోలు అందించారు. మన టీవీలో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా పాఠ్యాంశాలు బోధించారు.ఏటూరునాగారం: ములుగు మండలం జంగాలపల్లి క్రాస్కు చెందిన పోతు రాజశేఖర్ ఏటూరునాగారం నార్త్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఆ పాఠశాలలో చేరినప్పుడు విద్యార్థుల సంఖ్య 90 మాత్రమే. ప్రస్తుతం 170 మందికి చేరింది. దాతల సహకారంతో పాఠశాలలో నూతనంగా కంప్యూటర్ ల్యాబ్, రేకుల షెడ్డు, ప్రొజెక్టర్, టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టారు. పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేసి పుస్తక పఠనంపై మక్కువ పెంచుతున్నారు. ఇప్పటికీ ఏ విద్యార్థి బడికి రాకపోయినా ఇంటికి వెళ్లి బండిమీద పాఠశాలకు తీసుకొస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పలువురు ఉపాధ్యాయుల అంకితభావం విద్యార్థుల నమోదు పెంపు.. అకుంఠిత దీక్షతో విధులు ఆదర్శంగా నిలుస్తూ బడులను కాపాడుతున్న టీచర్లు నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం -
శ్రీ కృష్ణుడి బోధనలు తెలుసుకోవాలి
జనగామ: శ్రీ కృష్ణుడి బోధనలు, భగవద్గీత సందేశాలను పిల్లలు తెలుసుకుని, సన్మార్గంలో నడవాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని గీతాశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ కృష్ణాష్టమి వే డుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణుడి వేషధారణలో వచ్చిన చిన్నారులతో ఎమ్మెల్యే ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం మాట్లాడుతూ.. గీతాశ్రమం ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కొడిపాక ప్రభాకర్, బాలరాజు, నాగరాజు, కౌన్సిలర్లు గునిగంటి వెన్నెల రామక్రిష్ణ, బుక్కా బాలభరధ్వాజ్, కిషోర్, నవీన్, శ్రీనివాస్ ఉన్నారు. ఎకై ్సజ్ శాఖలో బదిలీలు కాజీపేట అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లో బదిలీలు చేపట్టి ఎకై ్సజ్, రిజిస్ట్రేషన్ శాఖలో ఎప్పుడు బదిలీలు అంటూ జరుగుతున్న చర్చకు ముగింపు పడింది. ఎట్టకేలకు ఎకై ్సజ్ శాఖలో బదిలీల ప్రక్రియ చోటు చేసుకుంది. తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలో బదిలీలు జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎకై ్సజ్శాఖలో రెండు రోజుల క్రితం బదిలీల ఉత్తర్వులు రాగా, హనుమకొండ జిల్లాలో నూతనంగా ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లు బాధ్యతలను స్వీకరించారు. ఎకై ్సజ్ సీఐలు ఇలా.. ఏఎంఎల్ డిపోకు – ఎల్.రామకృష్ణ, హనుమకొండ – ఎం.శ్రీనివాస్, వరంగల్ అర్బన్ – పి.స్వప్న, ఖిలా వరంగల్ – ఎల్.అచ్చారావు, కాజీపేట – ఆర్.రాజు, హసన్పర్తి – ఎం.ప్రసాద్, డీటీఎఫ్ – గంగారెడ్డి. తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలో.. రెండేళ్ల క్రితం జూలై 25న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అటెండర్ స్థాయి నుంచి డీఐజీ స్థాయి వరకు బదిలీలు జరిగాయి. రెండేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకుని నెలన్నర గడుస్తున్నా రిజిస్ట్రేషన్ శాఖలో బదిలీల పర్వం ప్రారంభం కాకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు 5 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పూర్తి స్థాయి సబ్ రిజిస్ట్రార్లు మిగతా 8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇన్చార్జ్ల పాలన కొనసాగుతోంది. ఎకై ్సజ్ శాఖలో బదిలీలు ప్రారంభం కాగా తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలో ఉంటాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఘనంగా స్మార్త కృష్ణాష్టమి పూజలు హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో కాళీ జయంతి స్మార్త కృష్ణాష్టమి పూజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుడిగా రుద్రేశ్వర స్వామిని అలంకరించి పూజించారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ ధరణికోట అనిల్కుమార్ పర్యవేక్షించారు. కృష్ణాలంకరణలో భద్రకాళి అమ్మవారు హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి ఘనంగా నిర్వహించారు. శ్రావణ శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులు, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ శ్వేత అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి అమ్మవారికి కృష్ణాలంకారం జరిపారు. అనంతరం రాత్రి 10గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. తెల్లవారుజాము వరకు భక్తులు జాగరణ చేశారు. -
హోరెత్తిన శ్రీకృష్ణనామం
జనగామ: శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం జిల్లా కేంద్రంలో కన్నులపండువగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కృష్ణాష్టమి ఉత్సవ కమిటీ అధ్యక్షు డు కానుగంటి ముత్తయ్య ఆధ్వర్యంలో ప్రారంభమైన రథయాత్ర.. కళాకారుల డప్పు చప్పుళ్లు, కో లాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, డీజే సౌండ్ల మధ్య భక్తుల కృష్ణ నామస్మరణతో ర్యాలీ నెహ్రూపా ర్క్ చౌరస్తా మీదుగా బతుకమ్మకుంటకు చేరుకుంది. బతుకమ్మ కుంట వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమం, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం శ్రీ కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీ అంజనన్ కుమార్ యాదవ్, గొర్రెలు, మేకల మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, జనగామ ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, కౌన్సిలర్ మారబోయిన పాండు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి టెంపుల్ మెంబర్ ఈశ్వరమ్మ, మారబోయిన సంతోష్ యాదవ్, సలేంద్ర మల్లేష్ యాదవ్, వారాల రమేశ్, శ్రీధర్ యాదవ్, బూస రమేశ్ తదితరులు ఉన్నారు. యాదవులకు న్యాయమైన ప్రాతినిథ్యం కల్పించాలి.. యాదవులు ఈర్ష్య, ద్వేషాలను పక్కనపెట్టి ఐక్యంగా ముందుకొచ్చి తమ హక్కులు, సమస్యల సాధన కోసం పోరాడాలని మాజీ ఎంపీ అంజన్న్కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యఅతి థిగా పాల్గొని మాట్లాడారు.. యాదవులకు రాజకీయంగా న్యాయమైన ప్రాతినిథ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో అనేక కులాలు, వర్గాలకు ప్రాతినిథ్యం లభిస్తున్న నేపథ్యంలో యాదవులకు కేబినెట్లో తగిన ప్రాతినిథ్యం ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. యాదవుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హైదరాబాద్కు తరలిరావాలని కోరారు. లక్ష మంది యాదవులు ఒకే వేదికపైకి వచ్చి తమ డిమాండ్లను ముఖ్యమంత్రికి వినిపిస్తే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. శ్రీ కృష్ణుడి బోధనలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని అన్నారు.పట్టణంలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో ఉట్టి కొడుతున్న శ్రీ కృష్ణ వేషధారణ చిన్నారులు యాదవుల ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా రథయాత్ర, బతుకమ్మకుంట వద్ద ఉట్టికొట్టే కార్యక్రమం హాజరైన యాదవ ప్రముఖులు తలసాని, అంజన్కుమార్ యాదవ్ఉత్సాహంగా ఉట్లు కొట్టి.. జిల్లా వ్యాప్తంగా శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని పూర్ణిమా కాలనీ, గీతాశ్రమం, మూలబావి శ్రీ ఆంజనేయస్వామి ఆలయాల్లో ఉట్టికొట్టే కార్యక్రమాలతో సందడి నెలకొంది. జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైభవంగా వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతి థి విభాగ్ సంఘటన మంత్రి శివరాములు హాజరు కాగా, జిల్లా అధ్యక్షుడు ఎనగందుల భిక్షపతి, కార్యదర్శి మోహనకృష్ణ భార్గవ, నాయకులు పాశం శ్రీశైలం, బాలనా రాయణ, కుందారపు బైరునాథ్ పాల్గొన్నారు. -
రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝాజనగామ రూరల్: ఉమ్మడి వరంగల్లోనే జిల్లా రీసర్వే ప్రక్రియలో ముందంజలో ఉందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. భూ రికార్డులను మరింత పకడ్బందీగా, పారదర్శకంగా రూపొందించేందుకు చేపట్టిన రీసర్వే ప్రక్రియలో భాగంగా పెంటాక్స్ కంపెనీ ఐదు డీజీపీఎస్ రోవర్ను గురువారం కలెక్టర్ కార్యాలయంలో ల్యాండ్స్ అండ్ సర్వే అధికారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అందుబాటులోకి వచ్చిన డీజీపీఎస్ రోవర్స్ను సమర్థవంతంగా వినియోగిస్తూ క్షేత్రస్థాయిలో సర్వే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 82 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ల్యాండ్స్ అండ్ సర్వే ఏడీ మన్యంకొండ, డిప్యూటీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
హామీలు అమలు చేయలేదని పిండప్రదానం
జఫర్గఢ్: మండలంలోని ఉప్పుగల్లు రిజర్వాయర్ ద్వారా నీరందిస్తామని సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నాగుర్ల వెంకటేశ్వర్లు గురువారం రిజర్వాయర్లో పిండప్రదానం చేసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా నిరసన ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అనంతరం పిండాలను రిజర్వాయర్ నీటిలో వదిలారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలతో పాటు అనేక హామీలు ఇచ్చి విస్మరించిన రేవంత్రెడ్డి ప్రభుత్వం, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్లో చేరి ప్రజలను మోసం చేయడంతో పాటు ఉప్పుగల్లు రిజర్వాయర్ ద్వారా ఒక్క ఎకరాకు సాగునీరు అందించకపోవడం, ఎంపీగా ఎన్నికైన కడియం కావ్య ఇప్పటివరకు పైసా నిధులు కేటాయించకడపోవడాన్ని నిరసిస్తూ ఈ ముగ్గురికి పిండ ప్రదానం చేసినట్లు తెలిపారు. ఇప్పటికై నా ఉప్పుగల్లు రిజర్వాయర్ ద్వారా పంటలకు సాగునీరు అందించడంతో పాటు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల న్నీంటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
నాణ్యమైన విద్య అందించాలి
జనగామ రూరల్: విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించి, వారి బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని తెలంగాణ ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ (ఎస్సీడీడీ) కార్యదర్శి, జిల్లా ఎస్ఐఆర్ అబ్జర్వర్ విజయేందిర బోయి ఆదేశించారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి హనుమకొండ రోడ్డులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యా బోధన, విద్యార్థుల హాజరు, వసతులు, భోజన నాణ్యత, పరిశుభ్రత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్ఐఆర్ అబ్జర్వర్ విద్యార్థులతో మాట్లాడి, వారి లక్ష్యాలు, అభిరుచులు, చదువుపై ఆసక్తి గురించి తెలుసుకున్నారు. కేవలం పాఠ్యాంశాలు చెప్పడమే కాకుండా ప్రతీ విద్యార్థికి అర్థమయ్యే విధంగా బోధన సాగాలని, చదువుపై ఆసక్తి పెంచే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. తనిఖీలో భాగంగా మరుగుదొడ్లు, డైనింగ్ హాల్, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, ఆర్ట్ గ్యాలరీ, జిమ్ గది, స్టాక్ రూమ్లను పరిశీలించారు. స్టాక్ రూమ్లో బియ్యం, ఇతర ఆహార నిల్వల నాణ్యతను తనిఖీ చేసి, మెనూ ప్రకారం సమయానికి పోషకాహారం అందించాలని ఆదేశించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చి, విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరామ్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి విక్రమ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీ లత, జోనల్ అధికారి ఎస్. విద్యారాణి, డీసీఓ పి.మాన్విచంద్, ప్రిన్సిపాల్ ఎ.నరసింహులు తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీగా ఎస్ఐఆర్ నోటీసుల పరిష్కార ప్రక్రియ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నోటీసుల హియరింగ్, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియను నిబంధనల మేరకు పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ (ఎస్సీడీడీ) కార్యదర్శి జిల్లా అబ్జర్వర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మండలంలోని శామీర్పేట్, జనగామ మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ హియరింగ్ కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి పరిశీలించారు. జిల్లాలో జరుగుతున్న హియరింగ్ ప్రక్రియ ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎలాంటి లోపాలకు తావు లేకుండా నిర్వహించాలని ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలకు సూచించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ హియరింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా అబ్జర్వర్, కలెక్టర్ పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు, విచారణ ప్రస్తుత స్థితి, అభ్యంతరాల పరిష్కార పురోగతిని సమీక్షించారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరామ్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, బీఎల్ఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలి రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ (ఎస్సీడీడీ) కార్యదర్శి విజయేందిర బోయి -
పీజీ సీట్లపై ఎన్ఎంసీ బృందం పరిశీలన
● మెడికల్ కళాశాలలో వసతుల తనిఖీ ● జనరల్ సర్జరీకి ఆరు సీట్లపై ప్రత్యేక దృష్టి జనగామ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పీజీ వైద్య విద్య సీట్ల మంజూరుకు మార్గం సుగమం కానుంది. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బృందం గురువారం కళాశాలను సందర్శించి పీజీ విద్యార్థులకు అవసరమైన బోధన, వైద్య, మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించింది. కళాశాల ప్రిన్సిపాల్ నాగమణి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎ.శంకర్.. ఎన్ఎంసీ బృందానికి కళాశాల సౌకర్యాలు వివరించారు. జనగామ మెడికల్ కళాశాలలోని 12 విభాగాల్లో మొత్తం 50 పీజీ సీట్లు మంజూరు చేయాలని కళాశాల అధికారులు ప్రతిపాదించారు. ఇందులో జనరల్ మెడిసిన్ 5, జనరల్ సర్జరీ 6, అనస్థీషియా 4, ఆర్థోపెడిక్స్ 4, సైకియాట్రీ 3, మైక్రోబయాలజీ 2, పీడియాట్రిక్స్ 4, గైనకాలజీ 6, అనాటమీ 4, ఫిజియాలజీ 4, ఫార్మకాలజీ 4, పాథాలజీ 4 సీట్లు అవసరమున్నట్లు వారి దృష్టికి తీసుకుకెళ్లారు. జనరల్ సర్జరీపై ప్రత్యేక పరిశీలన.. తొలిదశలో జనరల్ సర్జరీ విభాగానికి ఆరు పీజీ సీట్ల మంజూరు అంశంపై ఎన్ఎంసీ బృందం ప్రత్యేకంగా పరిశీలించింది. మెడికల్ కళాశాలలో ప్రస్తుతం ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నట్లు అధికారులు వివరించారు. ఎంఆర్ఐ సహా మౌలిక వసతులపై ఆరా.. పీజీ సీట్ల మంజూరులో భాగంగా కళాశాల భవనం, ఓపీ సేవలు, ల్యాబొరేటరీలు, బోధన సౌకర్యాలు, లైబ్రరీ, ఆస్పత్రిలోని వైద్య సేవలు తదితర అంశాలను బృందం తనిఖీ చేసింది. ముఖ్యంగా ఎంఆర్ఐ సౌకర్యం అందుబాటులో లేకపోవడంపై అధికారులు వివరించారు. ఎంఆర్ఐ ఏర్పాటుకు ఇప్పటికే ప్రతి పాదనలు పంపినట్లు తెలిపారు. ఎన్ఎంసీ బృందం నుంచి సానుకూల నివేదిక వస్తే అక్టోబర్లో జనరల్ సర్జరీ విభాగానికి ఆరు పీజీ సీట్లు మంజూరయ్యే అవకాశం ఉందని కళాశాల వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే జనగామ మెడికల్ కళాశాలలో పీజీ వైద్య విద్యకు తొలి అడుగు పడినట్లవుతుంది. డీసీపీకి అభినందనలుజనగామ: డీసీపీ రాజామహేంద్రనాయక్ ఐపీఎస్ క్యాడర్కు పదోన్నతి పొందిన సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు ఆయన్ను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఎస్ఈ సంపత్రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు డీసీపీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజా మహేంద్రనాయక్ భవిష్యత్ సేవా ప్రస్థానం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఈ ఎం.లక్ష్మీనారాయణరెడ్డి, ఏడీఈ డి.వేణుగోపాల్, ఏఈ బి.సౌమ్య తదితరులు ఉన్నారు. -
కొండా సురేఖ ఎపిసోడ్కు బర్తరఫ్తో ఎండ్ కార్డు
సాక్షి ప్రతినిధి, వరంగల్: మంత్రి పదవినుంచి బర్తరఫ్తో సుమారు 18 రోజుల కొండా సురేఖ ఎపిసోడ్కు గురువారం ఎండ్ కార్డు పడింది. పరకాల వేదికగా మొదలైన రాజకీయ వివాదం.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను దాటి ఢిల్లీకి చేరింది. అక్కడ కాంగ్రెస్ అధిష్టానం స్థాయిలో జరిగిన చర్చలు.. మంత్రివర్గం నుంచి బయటకు పంపే స్థాయికి చేరాయి. కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం.. ఆ తర్వాత వరుస ఫిర్యాదులు, ఎమ్మెల్యేల నివేదికలు, క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్, ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం.. హైకమాండ్ను ఆగ్రహానికి గురి చేశాయి. చివరకు సురేఖను కేబినెట్ నుంచి తప్పించారు. ఆగస్టు 16 తర్వాత మొదలైన పరిణామాలు గురువారం నాటి కొండా సురేఖ బర్తరఫ్ వరకు జరిగిన తంతు ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కూతురు మాటలనుంచి కేబినెట్ వేటు దాకా.. ఆగస్టు 16న సీఎం రేవంత్రెడ్డి పరకాల పర్యటన తర్వాత చోటుచేసుకున్న పలు ఘటనలు కొండా సురేఖ రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మలుపునకు నాంది పలికాయి. సురేఖ జన్మదినం సందర్భంగా ఆగస్టు 19న ఆమె కుమార్తె సుస్మిత.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. అధిష్టానం సీరియస్గా తీసుకుంది. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తాను బాధ్యురాలిని కాదని, వాటితో తనకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. పార్టీ వర్గాల్లో మాత్రం సురేఖ వైఖరిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సురేఖపై ఈ ఒక్క అంశమే కాకుండా.. మరికొన్నింటితో కూడిన ఫిర్యాదుల ఫైల్ అధిష్టానం ముందుకు వెళ్లినట్లు ప్రచారం. కూతురు చేసిన వ్యాఖ్యల వివాదంపై రంగంలోకి దిగిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సైతం సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయడం ఈ వ్యవహారంలో కీలక మలుపుగా మారింది. ఇదే సమయంలో సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్పై నమోదైన కేసు, అందులో వెలుగులోకి వచ్చిన ఆరోపణలు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు చెబుతున్నారు. వీటన్నింటిపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత సురేఖ స్వచ్ఛందంగా తప్పుకునే పరిస్థితి లేదని భావించి బర్తరఫ్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇప్పటికై తే ఇంతే.. ఎమ్మెల్యేగా సురేఖ మంత్రి పదవి పోయినా.. సురేఖ రాజకీయ ప్రస్థానం ముగి సినట్లు కాదు. ఇప్పటికే ఈ విషయమై మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. తానేమీ తప్పు చేయలేదని, పదవిపోతే బాధ పడాల్సిన అవసరం లేదన్న ఆమె.. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యేగా కొనసాగుతానన్నా రు. కేబినెట్ నుంచి బర్తరఫ్ అయినప్పటికీ సోనియా, రాహు ల్, ప్రియాంకా గాంధీలంటే ఇష్టమన్న ఆమె.. ఎమ్మెల్యేగా తన తదుపరి అడుగులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే చెప్పలేమనడం ఆసక్తికరంగా మారాయి. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలపై ఈ పరిణామాలు భవిష్యత్లో ఎలాంటి ప్రభావం చూపుతాయన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. ‘పరకాల’నుంచి మొదలైన మాటల దాడి.. ఎమ్మెల్యేల నివేదికలతో ముదిరిన పంచాయితీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుతో కీలక మలుపు ఉత్కంఠ రేపిన ఢిల్లీ మంతనాలు.. చివరకు కేబినెట్నుంచి వేటు 18రోజులపాటు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో రాజకీయ ప్రకంపనలు -
మేయర్ తర్వాత.. ‘కుడా’ చైర్!
సాక్షిప్రతినిధి, వరంగల్ : పదవులు రావడం.. పోవడం రాజకీయాల్లో సహజమే. కానీ కొందరిని మాత్రం అదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. వరంగల్ రాజకీయాల్లో గుండు సుధారాణి పరిస్థితి ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తోంది. ఇటీవల గ్రేటర్ వరంగల్ మేయర్ పదవినుంచి మాజీ అయిన ఆమెకు.. కొద్ది రోజుల వ్యవధిలోనే మరో కీలక పదవి దక్కింది. సామాజిక సమీకరణల్లో భాగంగా ‘కుడా’ (కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ పదవి ఆమెను వరించింది. టీడీపీలో రాజ్యసభ సభ్యురాలిగా, బీఆర్ఎస్ హయాంలో మేయర్గా ఎన్నికై ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇప్పుడు ‘కుడా’ చైర్పర్సన్ పదవి వరించింది. కాగా, ప్రస్తుతం ఈ పదవిలో హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి కొనసాగుతున్నారు. ఆయనను తప్పించి సుధారాణికి బాధ్యతలు అప్పగించారు. సురేఖ బర్తరఫ్.. సమీకరణాల్లో మార్పు కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గంనుంచి తప్పించడంతో ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో సామాజిక, ప్రాంతీయ సమీకరణలపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పద్మశాలి సామాజికవర్గానికి చెందిన గుండు సుధారాణికి కుడా చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి రాజకీయ ప్రాధాన్యం కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న గుండు సుధారాణికి రాజకీయంగా కీలక పదవులు కొత్తేమీ కాదు. గ్రేటర్ వరంగల్ మేయర్గా పనిచేసిన ఆమె.. ఇటీవల మేయర్ పదవీకాలం ముగియడంతో ఆ పదవికి వీడ్కోలు పలికారు. దీంతో ఇక ఆమె రాజకీయ భవిష్యత్ ఏమిటన్న చర్చ జరుగుతున్న సమయంలోనే మరో కీలక బాధ్యత దక్కడం విశేషం. వరంగల్ రాజకీయాల్లో గుండు సుధారాణికి ‘ఒక పదవి పోతే.. మరో పదవి వెతుక్కుంటూ వచ్చిన’ పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రస్తుతం వరంగల్ రాజకీయ వర్గాల్లో ఆమెకు ‘అదృష్టం మరోసారి వరించింది’ అన్న చర్చ సాగుతోంది. ఇంటివద్ద సంబురాలు వరంగల్ చౌరస్తా : కుడా చైర్పర్సన్గా గుండు సుధారాణి నియామకం పట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. గురువారం సాయంత్రం రామన్నపేటలోని సుధారాణి ఇంటి ఎదుట బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. గుండు సుధారాణికి మరో కీలక పదవి.. ‘కుడా’ చైర్పర్సన్గా నియామకం సురేఖ బర్తరఫ్తో మారిన సామాజిక సమీకరణలు పద్మశాలి వర్గానికి మళ్లీ ప్రాధాన్యం.. సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు.. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్పర్సన్గా పదవి ఇచ్చి నాపై సీఎం రేవంత్రెడ్డి ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా. ఆయనకు కృతజ్ఞతలు. బీసీల అభ్యున్నతి, మహిళా సాధికారతకు కృషి చేస్తా. నా నియామకానికి సహకరించిన ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఏఐసీసీ, టీపీసీసీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు. – గుండు సుధారాణి -
స్వచ్ఛ గ్రామాలే లక్ష్యం
జనగామ: గ్రామాలను సంపూర్ణ పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బీఎం) ఆధ్వర్యంలో జిల్లాలో పారిశుధ్య కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నారు. 280 గ్రా మ పంచాయతీల పరిధిలో సోక్పిట్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, సామూహిక పారిశుధ్య సముదా యాలు తదితర పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామాల అవసరాలను బట్టి పనులు చేపట్టే వెసులుబాటు కల్పించడంతో స్వచ్ఛత కార్యక్రమాలు మరింత వేగం పుంజుకోనున్నాయి. మురుగు నీటికి సోక్పిట్లే పరిష్కారం.. గ్రామాల్లో ఇళ్ల నుంచి వెలువడే మురుగునీరు రోడ్లపైకి చేరకుండా భూమిలోకి ఇంకిపోయేలా సోక్పిట్ల నిర్మాణం చేపడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే 300 సోక్పిట్లకు మంజూరు ఇవ్వగా 20 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఒక్కో సోక్పిట్కు రూ.92,747 వ్య యం అవుతుంది. ఇందులో రూ.64,923 స్వచ్ఛ భారత్ మిషన్న్ నుంచి, రూ.27,824 గ్రామ పంచా యతీ వాటాగా సమకూరుతాయి. ఒక్క గ్రామానికి ఒక్కటే అనే పరిమితి లేకుండా అవసరాన్ని బట్టి ఎన్ని సోక్పిట్లైనా నిర్మించుకునే అవకాశం కల్పించారు. సోక్పిట్ల ద్వారా మురుగు నీరు బహిరంగ ప్రదేశాల్లో నిల్వ ఉండకుండా చేయడంతో దోమలు, ఈగలు, దుర్వాసన తగ్గి పరిసరాలు పరిశుభ్రంగా మారే అవకాశం ఉంటుంది. నీరు నేలలోకి ఇంకడం వల్ల భూగర్భ జలాల రీచార్జ్కు కూడా కొంతమేర దోహదపడుతుంది. అందువల్ల గ్రామీణ పారిశు ద్ధ్యంలో సోక్పిట్లు కీలకంగా మారుతున్నాయి. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జనకు అడ్డుకట్ట వేసేందుకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికీ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక్కో వ్యక్తిగత మరుగుదొడ్డికి రూ.12 వేల ప్రోత్సాహక నగదు అందించే విధానం ఉంది. అర్హత కలిగిన బీపీఎల్ కుటుంబాలు, ఉపాధి హామీ జాబ్కార్డు కలిగిన కుటుంబాలు, వ్యక్తిగత బ్యాంకు ఖాతా ఉన్న వారు గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం ప్రజలకు అవసరమైన చోట సామూహిక పారిశుద్ధ్య సముదాయాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నారు. ఒక్కో యూనిట్కు రూ.3 లక్షల వరకు వ్యయం చేయగా, ఇందులో రూ.2.10 లక్షలు స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి, రూ.90 వేల వరకు గ్రామ పంచాయతీ వాటా ఉంటుంది. సుమారు 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేపడుతున్నారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాల కోసం భవనాలు, అంగన్వాడీ కేంద్రాల్లో పారిశుధ్య సదుపాయాలు వంటి పనులకు కూడా నిధులు అందిస్తున్నారు. ఈ పనులన్నీ పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. సోక్పిట్ నుంచి వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్ల వరకు ప్రతి ఇంటికీ, ప్రతి గ్రామానికి పారి శుధ్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ‘స్వచ్ఛ గ్రామం–ఆరోగ్య గ్రామం’ లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి నిర్ణీత నమూనాలో దరఖాస్తు ధ్రువీకరణ పత్రం, గ్రామసభ తీర్మానం కాపీని జతపరిచి ఎంపీడీఓ కార్యాలయాల్లో అందించాలి. ఎస్బీఎం పర్యవేక్షణలో పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో ఎస్ట్మేషన్, కొలతలు తదితర పనులకు సంబంధించి ఉపాధిహామీ విభాగం చూస్తుంది. సోక్పిట్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు పల్లె పరిశుభ్రతకు ‘సోక్పిట్’ బలం మురుగు నీటికి మంగళం -
వైఎస్ఆర్ సేవలు చిరస్మరణీయం
జనగామ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ధన్వంతి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మహానేత అని కొనియాడారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలతో పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశారన్నారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ట్రస్ట్బోర్డు సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, వేముల మల్లేశం, చింతకింది మల్లేశం, మల్లేశం, సమ్మయ్య పాల్గొన్నారు. -
పాల ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతం
జనగామ: పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, సంఘాల స్థాయిలో ఆర్థిక నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు విజయ డెయిరీ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఎన్.గోపాల్సింగ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో విజయ డెయిరీ ఆధ్వర్యంలో బుధవారం డీసీసీబీ జనరల్ మేనేజర్, నాబార్డు, ఎల్డీఎం, కాకతీయ కో–ఆపరేటివ్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్, స్పెషల్ క్యాడర్ ఎస్సీడీఆర్, జిల్లా పశుసంవర్ధక శాఖ ప్రతినిధులు, డీసీఓ, పాల ఉత్పత్తిదారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..సహకార సంఘా ల స్థాయిలో ఆర్థిక లావాదేవీలను సులభతరం చేయడంతో పాటు, పారదర్శకతను పెంపొందించేందుకు మైక్రోఏటీఎంలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అనంతరం మైక్రో ఏటీఎంలను పంపిణీ చేశారు. సమావేశంలో జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కాశరపు ధర్మా రెడ్డి, ఉపాధ్యక్షుడు దామెర నాగరాజు, ఎల్డీఎం ప్రతిభ, నాబార్డు ఏజీఎం విజయ్ కుమార్, కాకతీ య సహకార సంఘాల శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ యాకూబ్ నాయక్, డీసీసీబీ జనరల్ మేనేజర్ శిరీ ష, డీసీసీబీ మేనేజర్ సంతోషిణి, విజయ డెయిరీ మేనేజర్ డాక్టర్ నరేష్, లింగారెడ్డి, పాల సంఘాల అధ్యక్షులు సాదం రమేశ్, సోమి రెడ్డి, శ్రీనివాస్, భద్రారెడ్డి, సూపర్వైజర్లు పాల్గొన్నారు. విజయ డెయిరీ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఎన్.గోపాల్సింగ్ -
నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించాలి
హన్మకొండ: గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులకు సూచించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు, నిర్వహణపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ.. ఉత్సవ నిర్వాహకులు పోలీస్, అధికారుల సూచనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో, స్నేహపూర్వక వాతావరణంలో వేడుకలు నిర్వహించాలన్నారు. కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద, డీసీపీలు దార కవిత, అంకిత్కుమార్, రాజమహేంద్ర నాయక్, జనగామ అదనపు కలెక్టర్ బెన్ షాలోం పాల్గొన్నారు.సైబర్ నేరాలపై అవగాహన ఉండాలిజనగామ రూరల్: విద్యార్థులకు మత్తు పదార్థాలు అలాగే సైబర్ నేరాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. బుధవారం మండలంలోని చౌడారం పీఎంశ్రీ మోడల్ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వై.శ్రీహరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తుకు బానిస కాకుండా ఉండాలని, ఉన్నత చదువులు చదివి ఎదగాలని తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని అన్నారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యాయులు ఉస్మాన్, సుధీర్, నరసయ్య, స్రవంతి, అనుపమ, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సాంస్కృతిక పోటీలుజనగామ: విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా ని ర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వీహెచ్పీ జిల్లా కార్యదర్శి మోహనకృష్ణ భార్గవ తెలిపా రు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు.. ఈ నెల 4వ తేదీన ఉదయం 10 గంటలకు హన్మకొండ రోడ్లోని శ్రీరాంనగర్ కాలనీ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జన్మాష్టమి సందర్భంగా సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని, తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని మోహనకృష్ణ భార్గవ కోరారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: పల్లాజనగామ: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ కార్డు ఇప్పుడు బాకీ కార్డుగా మారిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని తెలిపారు. సమావేశంలో కౌన్సిలర్లు, నాయకులు ఇర్రి రమణారెడ్డి, బాల్దె సిద్దిలింగం, గాడిపల్లి ప్రేమలతారెడ్డి, పోకల జమున, తాళ్ల సురేష్రెడ్డి, ముస్త్యాల దయాకర్, గోపగోని సుగుణాకర్ గౌడ్, సజ్జ దుర్గాప్రసాద్, ఎనగందుల కృష్ణ, సేవెల్లి మధు, పెద్ది రాజిరెడ్డి, అనిత, పేర్ని స్వరూప, సువార్త, మంజుల పాల్గొన్నారు. చంద్రబాబుకు సీఎం రేవంత్ దాసోహంతెలంగాణ నీటి ప్రయోజనాలను పక్కనపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సీఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి.. చంద్రబాబు నాయుడుకు దాసోహమయ్యారని విమర్శించారు. గోదావరి, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. -
బీఆర్ఎస్, బీజేపీ విషప్రచారాన్ని తిప్పికొట్టాలి
రఘునాథపల్లి: అధికారం కోల్పోయామని బీఆర్ఎస్,, అధికారం కోసం బీజేపీ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాయని, వాటిని పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాదె మహేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నూతన గ్రామ కమిటీ అధ్యక్షుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా కడియం మాట్లాడు తూ.. బీఆర్ఎస్ ఖాతాలోని రూ.1,400 కోట్లు ఉద్యమకారుల కుటుంబాలకు పంచాలన్న కవిత వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. గ్రూపులకు దూరంగా ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పని చేయాలన్నారు. డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, జగదీష్చందర్రెడ్డి, ఇందిర పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య -
ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలి
నర్మెట: ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మండలంలోని మచ్చుపహాడ్ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. విద్యాబోధన, మౌలిక వసతులు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజనం, తరగతి గదులు, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్, గ్రంథాలయం వంటశాలను పరిశీలించి విద్యార్థులకు సైన్స్ పాఠాలను బోధించారు. అనంతరం బొమ్మకూర్లో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ సవరణల కార్యక్రమాన్ని పరీశీలించి తహసీల్దార్ కలకుంట్ల వెంకటరామానుజాచార్యులును వివరాలు అడిగి తెలసుకుని పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్ఐ సింగారపు సాయిబాబా, హెచ్ఎం గోపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అశ్విని తదితరులు ఉన్నారు. పారదర్శకంగా ‘డబుల్’ ఇళ్లు.. జనగామ రూరల్: జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు నిర్వహించి, అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాను ఖరారు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్న్స్ హాల్లో ఇళ్ల కేటాయింపునకు సంబంధించిన లబ్ధిదారుల తుది జాబితా ఖరారుపై డీసీపీ రాజమహేంద్రనాయక్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
ఎఫెక్ట్..
కదిలిన యంత్రాంగం ● డ్రెయినేజీల దుస్థితిపై మున్సిపల్ చైర్మన్, అధికారుల దృష్టి ● కబ్జాలు, అక్రమ నిర్మాణాల తొలగింపునకు కార్యాచరణ..?జనగామ: పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తాలోని నాలుగు కూడళ్ల పరిధిలో డ్రెయినేజీల దుస్థితిపై ము న్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. హనుమకొండ, సూర్యాపేట, హైదరాబాద్, సిద్దిపేట రహదారుల వెంట డ్రెయినేజీలు కబ్జాలకు గురికావడం, మురుగునీరు సాఫీగా ముందుకు వెళ్లకపోవడం, డ్రెయినేజీలపై టాయిలెట్లు, వ్యాపార సంబంధిత నిర్మాణాలు చేపట్టడంతో ఏర్పడుతున్న సమస్యలను గురువారం మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, కమిషనర్ రాజశేఖర్రెడ్డి, కౌన్సిలర్లు చెంచారపు కరుణాకర్రెడ్డి, దోర్నాల అనిత, అండాలు తదితరులు గురువారం పరిశీలించారు. హనుమకొండ రోడ్డులో పలుచోట్ల డ్రెయినేజీలు ధ్వంసం చేసి వాటిపై నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. డ్రెయినేజీలు మట్టి పేరుకపోవడంతో మురుగునీరు ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. సిద్దిపేట రోడ్డులోనూ డ్రెయినేజీలపై వ్యాపార సంస్థల నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. చౌరస్తా ప్రధాన మలుపు వద్ద హోటళ్ల నిర్వాహకులు డ్రెయినేజీలపై టాయిలెట్లు, ఇతర నిర్మాణాలు చేపట్టిన విషయాన్ని పరిశీలించారు. వర్షాలతో నీరు నిలిచిపోవడంతో పాటు మురుగు నీరు రోడ్లపైకి చేరి ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని అధి కారులు గమనించారు. డ్రెయినేజీలపై ఉన్న నిర్మాణాలు, కబ్జాలను పూర్తిస్థాయిలో తొలగించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. దోమల నివారణకు చర్యలు మూడో వార్డుతో పాటు పట్టణంలోని ఆయా వార్డుల్లో దోమల నివారణకు స్ప్రేయింగ్ చేపడుతూ పారిశుద్ధ్యంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఈ నెల 2న ‘స్వచ్ఛతకు సవాల్’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. -
‘ఓవర్’ లోడ్.. భారీ మూల్యం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఇసుక లారీల్లో ఓవర్లోడ్కు ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే. ఇసుక రవాణాలో నిర్ణీత సామర్థ్యానికి మించి తరలించే ప్రతీ మెట్రిక్ టన్ను ఇసుకకు రూ.2 వేల చొప్పున జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఒకే వాహనం రెండు సార్లకు మించి ఓవర్లోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే సాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్లో ఆ వాహనాన్ని తదుపరి బుకింగ్లకు బ్లాక్ చేయనున్నారు. మైన్స్ సర్వేలెన్స్ సిస్టం ద్వారా ఓవర్లోడ్ను గుర్తించి జరిమానాను ఆన్లైన్లో వసూలు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 28లో స్పష్టం చేసింది.ఈ నిబంధనలతో ఉమ్మడి జిల్లాలోని రీచ్లనుంచి అదనపు ఇసుక తరలించే వందలాది లారీలకు చెక్పడనుంది. కొన్ని రీచ్ల్లో నేరుగా భారీ వాహనాల్లో ఇసుక లోడ్ కాకుండా రీచ్ నుంచి స్టాక్యార్డుకు ట్రాక్టర్లు/చిన్న వాహనాల ద్వారా తరలించి, అక్కడినుంచి లారీల్లోకి రీలోడ్ చేసే విధానం ఉంది. తాడిచెర్ల తాజా టెండర్లలోనూ రీచ్ నుంచి స్టాక్యార్డుకు ఇసుక తరలించి, తిరిగి లారీల్లోకి లోడ్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. అందువల్ల కొత్త నిబంధన కేవలం లారీ డ్రైవర్పైనే కాకుండా రీచ్–స్టాక్యార్డు–లోడింగ్–రవాణా మొత్తం వ్యవస్థపై జాగ్రత్త పెంచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఓవర్లోడ్ పూర్తిగా నియంత్రితమైతే ఒక్క ట్రిప్పులో తరలించే ఇసుక పరిమాణం తగ్గుతుంది. మరోవైపు రోడ్లపై ఒత్తిడి, రోడ్డు నష్టం, ప్రమాదాల ముప్పు తగ్గే అవకాశం ఉంది. కొత్త జీఓతో అసలు సమస్య ఓవర్లోడ్ చేసే లారీలకే. ఒక లారీలో నిర్ణీత పరిమితికి మించి టన్ను ఇసుక ఉంటే రూ.2వేల జరిమానా. 3 టన్నులు అదనంగా ఉంటే రూ.6వేలు, ఐదు టన్నులు అయితే రూ.10వేలు.. అంటే ఒక్క ట్రిప్పులో ఎక్కువ ఇసుక వేసుకుని అదనపు ఆదాయం పొందాలనుకునే ప్రయత్నం జరిమానాతో పోలిస్తే నష్టదాయకంగా మారే అవకాశం ఉంది. జీఓ ప్రకారం జరిమానా అదనంగా తరలించిన ఇసుక పరిమాణంపై విధించనున్నారు. లారీ యజమానులకు ఇది మరింత కీలకమైన నిబంధన. రెండుకంటే ఎక్కువ ఓవర్లోడ్ ఉల్లంఘనలు గుర్తించిన వాహనాన్ని సాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్లో తదుపరి బుకింగ్ల నుంచి బ్లాక్ చేయనున్నారు. రెండు కంటే ఎక్కువ ఓవర్లోడ్ ఉల్లంఘనలు నమోదైతే ఆ వాహనంతో టీజీఎండీసీ ఇసుకను బుక్ చేసుకునే అవకాశమే కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. గోదావరి పరీవాహక ప్రాంతం కారణంగా ఉమ్మడి వరంగల్లోని ముఖ్యంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇసుక తవ్వకాలు, రవాణా కార్యకలాపాలు సాగుతున్నాయి. టీజీఎండీసీ వివరాల ప్రకారం.. ములుగు జిల్లాలో టీజీఎండీసీ రికార్డుల్లో మారికాల, సూరవీడు, ముత్తారం, కొండాపురం, కొరకల్లు వంటి ఇసుక రీచ్ల వివరాలు ఉన్నాయి. ఉదాహరణకు మారికాల రీచ్కు1,59,680 మెట్రిక్ టన్నులు, కొరకల్లు రీచ్కు 99,948 క్యూబిక్ మీటర్ల పరిమాణం కేటాయించారు. సూరవీడు రీచ్కు 70 వేల క్యూబిక్ మీటర్లు, ముత్తారం రీచ్కు 99,400 క్యూబిక్ మీటర్ల ఇసుక తరలింపునకు అనుమతి ఉంది. జేఎస్ భూపాలపల్లి జిల్లాలో ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో ఇసుక డీ–సిల్టేషన్ పనులకు టీజీఎండీసీ టెండర్లు పిలిచింది. తాడిచెర్ల–1, తాడిచెర్ల–2 రీచ్లలో సుమారు 14 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక డీ–సిల్టేషన్కు సంబంధించిన టెండర్ అయ్యింది. ఆయా రీచ్ల నుంచి ఇసుక తరలించే లారీలకు శ్రీఓవర్లోడ్శ్రీ నిబంధన ప్రభావం పడనుంది. దీంతో ఇసుక వ్యాపారుల, లారీ ఓనర్ల లెక్కలు తారుమారు కానున్నాయి. రెండుసార్లు ఓవర్.. మూడోసారికి బుకింగ్ కట్ రీచ్ నుంచి స్టాక్యార్డు.. అక్కడినుంచి లారీ వరకు నిఘా కొత్త నిబంధనలు విధించిన రాష్ట్ర ప్రభుత్వం తారుమారు కానున్న వ్యాపారుల లెక్కలు -
కవిత ఆరోపణలపై సమాధానం చెప్పండి
● బీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్యే కడియం డిమాండ్జఫర్గఢ్: లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అక్రమంగా సంపాందించిన డబ్బును ఇంకా లెక్కపెడుతున్నారని కల్వకుంట్ల కవిత చేసిన అరోపణలకు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని తిమ్మంపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పార్టీ మండల, గ్రామ, అనుబంధ కమిటీల పరి చయ కార్యక్రమంతో పాటు మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. అధికారం కోల్పోయామనే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు అరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల హక్కులు, సామాజిక న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుందన్నారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. దొరల గడిల పాలన నుంచి ప్రజాప్రభుత్వం వచ్చిందన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు నూకల ఐలయ్య, సింగిల్ విండో చైర్మన్ తీగల కర్ణాకర్రా వు, డీసీసీ ప్రధాన కార్యదర్శులు అన్నెబోయిన భిక్షపతి, ఇల్లందుల బేబి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంచాల ఎల్లయ్య, జిల్లా నాయకులు అన్నం బ్రహ్మారెడ్డి, కట్టా మనోజ్రెడ్డి, గుజ్జరి రాజు, రడపాక సుదర్శన్, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కై ్లమాక్స్కు ‘కొండా’ ఎపిసోడ్!
● అధిష్టానం నుంచి పిలుపు.. హుటాహుటిన ఢిల్లీకి మంత్రి సురేఖ ● కొనసాగిస్తారా? లేక తప్పిస్తారా..? ● ఓరుగల్లు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠసాక్షి ప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్లో కొంతకాలంగా కొనసాగుతున్న మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ ఇప్పుడు క్లైమాక్స్కు చేరినట్లే కనిపిస్తోంది. పార్టీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆమె మంగళవారం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరడం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోపాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆమె కలిసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో సురేఖకు అధిష్టానంనుంచి వచ్చిన పిలుపు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అసలు ఏం జరుగుతోంది? మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో వివాదం ముదిరిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సురేఖకు నోటీసు జారీ చేసి వివరణ కోరింది. అనంతరం కమిటీ నివేదికను అధిష్టానానికి పంపినట్లు కూడా పీసీసీ ప్రకటించిన విషయం విధితమే. ఇదే సమయంలో మంత్రి సురేఖ, ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య ఉన్న విభేదాలు కూడా పార్టీ పెద్దల దృష్టికి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలపై క్రమశిక్షణ కమిటీ పరిశీలన జరిపినట్లు సమాచారం. దీంతో ఈ వివాదానికి రాష్ట్రస్థాయిలో కాకుండా ఢిల్లీ స్థాయిలోనే ముగింపు పలికేందుకు అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. మూడింట్లో ఏది..! రాష్ట్రానికి చెందిన పలువురు ముఖ్య నేతలు కూడా ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో అధిష్టానం సమక్షంలో సురేఖ అంశంపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అధిష్టానం ఈ వ్యవహారాన్ని ఇక నాన్చే ఉద్దేశంలో లేదన్న అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకులనుంచి వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా అధిష్టానం ముందున్న ప్రధానంగా మూడు అవకాశాలపై వరంగల్ కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సురేఖతో నేరుగా మా ట్లాడి వివాదానికి ముగింపు పలికి, ఇకపై పార్టీ క్రమశిక్షణకు లోబడి పనిచేయాలని స్పష్టమైన హెచ్చరిక చేసే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి, కొండా సురేఖ కుటుంబం మధ్య నెలకొన్న విభేదాలకు రాజకీయ పరిష్కారం చూపి, సురేఖను మంత్రిగా కొనసాగించే ప్రయత్నం జరగవచ్చన్న చర్చ కూడా ఉంది. లేదంటే క్రమశిక్షణ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరడం, లేదా కేబినెట్ మార్పుల్లో భాగంగా ఆమెను తప్పించడం వంటి కఠిన నిర్ణయం తీసుకునే అవకాశంపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓరుగల్లులో హీటెక్కిన రాజకీయాలు.. సురేఖకు ఢిల్లీ పిలుపు రావడంతో ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. పార్టీ నేతలు, కార్యకర్తలు తాజా పరిణామాలపై ఆరా తీస్తున్నారు. సురేఖకు ఏం జరుగుతుంది? అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? మంత్రి పదవిలో కొనసాగుతారా? అన్నదే ప్రధాన చర్చగా మారింది. కొండా కుటుంబానికి ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అధిష్టానం తీసుకునే నిర్ణయం స్థానిక రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని పార్టీ వర్గాలు అ ంచనా వేస్తున్నాయి. ఢిల్లీ నుంచి వెలువడే నిర్ణయంతోనే ఈ రాజకీయ ఉత్కంఠకు తెరపడనుంది. -
నిరంతరం పని చేస్తున్నాం
పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపర్చేందుకు నిరంతరం చర్యలు చేపడుతున్నాం. కలెక్టర్ ఆదేశాల మేర కు అదనంగా 54 మంది కార్మికులను విధుల్లోకి తీసుకురానున్నాం. మరో 16 శానిటేషన్ వాహనాలను కొనుగోలు చేయబోతున్నాం. కమర్షియల్ వార్డుల్లో రోజుకు రెండు సార్లు చెత్త సేకరణ, జీవీ పాయింట్ల వద్ద 24 గంటల్లో చెత్త తొలగింపు, ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తున్నాం. దోమల నివారణకు ఐదు ఫాగింగ్ మిషన్లతో రెండు వారాలకు ఒకసారి, లార్వా నివారణకు వారానికోసారి స్ప్రే చేస్తున్నాం. –రాజశేఖర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్● -
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతాం
జనగామ: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వారం రోజులపాటు విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాజీ మున్సిపల్ చైర్మన్లు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, పోకల జమున, పార్టీ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 2 నుంచి 8వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. 5న నిర్వహించనున్న మహిళా, రైతుల ధర్నా కార్యక్రమాలకు మహిళలు, రైతులు భారీసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుపై ప్రశ్నించేందుకు ప్రజలంతా ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. కౌన్సిలర్లు సువార్త, మంజుల, అనూష, వెన్నెల, హాఫీజ్ ఫాతిమా, మాజీ కౌన్సిలర్ అనిత, నాయకులు అనిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు. రూ.5 కోట్ల ప్రచార హక్కులకు ఓపెన్ టెండర్లు జనగామ: మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రచార స్థలాలపై ప్రకటన హక్కుల కేటాయింపునకు మున్సిపాలిటీ ఓపెన్ టెండర్లను ఆహ్వానించినట్లు కమిషనర్ రాజశేఖర్రెడ్డి మంగళవారం తెలిపారు. రూ.5 కోట్ల అంచనా కాంట్రాక్ట్ విలువతో ఈ టెండర్ ప్రక్రియ చేపట్టినట్లు స్పష్టం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో 12 టీ–పోల్స్, 14 బిల్డింగ్ సైట్ హోర్డింగ్స్, 8 బస్షెల్టర్లు, 166 లాలీపాప్ హోర్డింగ్స్ తదితర ప్రకటన స్థలాలపై హక్కుల ను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా మున్సిపాలిటీ పరిధిలో ప్రకటనల ఏర్పా టు, నిర్వహణకు సంబంధించిన హక్కులను టెండర్ ద్వారా కేటాయించనున్నారు. టెండరు కోసం బిడ్ల సమర్పణ ఈ నెల 1న ఉదయం 11 గంటలకు ప్రారంభమై 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముగియనున్నట్లు పేర్కొన్నారు. అర్హ త కలిగిన సంస్థలు, ఏజెన్సీలు, వ్యక్తులు తెలంగాణ ఈ–ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా టెండర్లో పాల్గొనవచ్చని తెలిపారు. టెండర్కు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హత ప్రమాణా లు, నిబంధనలు ఈ–ప్రొ క్యూర్మెంట్ పోర్టల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అర్హతగల వారు నిర్ణీత గడువులోగా బిడ్లను సమర్పించి ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు. పుష్పాలంకరణలో రేణుకా ఎల్లమ్మ జనగామ: శ్రావణమాసం మూడో మంగళవారం సందర్భంగా పట్టణంలోని 3వ వార్డు బాలాజీనగర్ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో పూజారి మారుపాక శ్యాం ప్రసాద్ ఆధ్వర్యంలో అమ్మవారిని రంగురంగుల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం పోసి బోనం సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం కుంకుమ పూజ నిర్వహించారు. కార్యక్రమంలో దూడల శోభారాణి, లగిశెట్టి పద్మావతి, మారుపాక విజయ, గోరిగె సత్తెమ్మ, ఎనగం దుల రేణుక, చెరుకూరి మౌనిక, బండోజు సరళ, అయిత కళావతి, కల్పన, పొత్కనూరి మౌనిక, చెంచారపు మంజుల తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్ కార్యాలయాన్ని జిల్లాకేంద్రానికి మార్చాలి పాలకుర్తి టౌన్: ఇరిగేషన్ డివిజన్ నంబర్–6 ప్రధాన కార్యాలయాన్ని హనుమకొండ నుంచి జిల్లా కేంద్రానికి మార్చాలని నియోజకవర్గ రైతులు ప్రభుత్వాన్ని కోరారు. 2021లో పాలకుర్తి కేంద్రంగా ఏర్పాటు చేసిన ఇరిగేషన్ డివిజన్ కార్యాలయం అనువైన ప్రభుత్వ భవనాల లేమితో 2026 మార్చిలో హనుమకొండకు తరలించారన్నారు. ప్రస్తుతం జనగామ ఇరిగేషన్ క్యాంపులో అనువైన ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పాలకుర్తి నుంచి హనుమకొండ దూరం ఎక్కువగా ఉండటంతో రైతులు నీటిపారుదల సమస్యల పరిష్కారానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యాలయాన్ని జిల్లాకేంద్రానికి మార్చితే పరిపాలన, క్షేత్రస్థాయి పర్యవేక్షణ, సమస్యల పరిష్కారం వేగవంతమవుతుందని చెప్పారు. -
ఆయిల్పామ్ సాగులో మెళకువలు పాటించాలి
● రైతు విజ్ఞాన కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రమ్య స్టేషన్ఘన్పూర్: ఆయిల్పామ్ సాగులో రైతులు శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు సరైన మెళకువలను పాటించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రమ్య అన్నారు. మంగళవారం ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులో, మండలంలోని రాఘవాపూర్లో ఆయిల్పామ్ పంటలను మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్.కరుణాకర్తో కలిసి ఆమె పరిశీలించారు. అనంతరం ఆయిల్పామ్లో ముక్కు పురుగు ఉధృతిని అరికట్టేందుకు రైతులకు లింగాకర్షక బుట్టలు, మెటారైజియం బయో పురుగుల మందులను రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఎస్ ఆయిల్ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ సురేష్, ఏఈఓ అనిత, రైతులు ఆకుల రమేశ్, కుమార్, ప్రదీప్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాగు లేకుండా బడికి!
● ఏడాదిలో పది రోజులు పుస్తకాల బరువుకు సెలవు ● ఆటలు, పాటలు, ప్రయోగాలతో చదువులు ● ఐదు రోజుల షెడ్యూల్ ప్రకటించిన విద్యాశాఖజనగామ: విద్యార్థులపై చదువు ఒత్తిడిని తగ్గిస్తూ, తరగతి గది అభ్యసనాన్ని మరింత ఆసక్తికరంగా, ఆనందదాయకంగా మార్చేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని పాఠశాలల్లో 10 ‘బ్యాగ్లెస్ డేస్’ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష తెలంగాణ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ మార్గదర్శకాలు జారీ చేశారు. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాలో పీఎస్లు 341(ఇందులో జీరో స్కూల్ ఉన్నాయి), ప్రాథమి కోన్నత 64, ఉన్నత 103 పాఠశాలల పరిధిలో 30వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మూడో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం మూడో శనివారం బ్యాగ్లెస్ డే కార్యకలాపాలు నిర్వహించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ రోజుల్లో సాధారణ బోధనకు భిన్నంగా కార్యాచరణ ఆధారిత అభ్యసనానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విద్యార్థుల వయస్సు, తరగతి స్థాయి, ఆసక్తులు, స్థానిక పరిస్థితులు, పాఠశాలలో అందుబాటులో ఉన్న వనరులను పరిగణనలోకి తీసుకుని కార్యక్రమాలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను పాఠశాలలకు కల్పించారు. క్విజ్, బాలసభ, క్షేత్ర పర్యటనలు, సర్వేలు, నాటికలు, ప్రయోగాలు, సబ్జెక్ట్ కార్నర్లు వంటి కార్యక్రమాలను నిర్వహించవచ్చు. స్థానిక పరిజ్ఞానానికి పెద్దపీట బ్యాగ్లెస్ డేస్లో భాగంగా విద్యార్థులను చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లడం ద్వారా స్థానిక చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించవచ్చు. అలాగే స్థానిక కళాకారులు, చేతి వృత్తిదారులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో విద్యార్థులకు పరస్పర కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. త ద్వారా పాఠ్యపుస్తకాల్లో చదివే అంశాలకు స్థానిక జీ వన విధానాన్ని అనుసంధానం చేయవచ్చు. తోటల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, కళలు, క్రీడలు తదితర అంశాలపైనా కార్యకలాపాలు చేపట్టవచ్చు. వృత్తి పరిచయంతో భవిష్యత్ నైపుణ్యాలు ఇందులో వృత్తి పరిచయానికి కూడా ప్రాధాన్యం ఇవ్వడం ప్రత్యేకతగా నిలుస్తోంది. స్థానికంగా ఉన్న చేతివృత్తిదారులు, నిపుణులు తమ పనితీరును విద్యార్థులకు వివరించడం, చిన్నచిన్న ప్రదర్శనలు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా వివిధ వృత్తులపై అవగాహన కల్పించవచ్చు. ఉపాధ్యాయులదే కీలకపాత్ర బ్యాగ్లెస్ డేను కేవలం వినోద కార్యక్రమంగా కాకుండా అభ్యసన ప్రక్రియలో భాగంగా నిర్వహించాల్సిన బాధ్యత పాఠశాలలపై ఉంది. ప్రధానోపాధ్యాయుడు కార్యక్రమాన్ని సమన్వయం చేయడంతో పాటు విద్యార్థుల భద్రతను పర్యవేక్షించాలి. ఒత్తిడి లేని అభ్యసనకు దోహదం పుస్తకాలకే పరిమితమైన విద్యకు బదులుగా అనుభవం ద్వారా నేర్చుకునే విధానం విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యం, బృందంగా పనిచేసే నైపుణ్యం, కమ్యూనికేషన్, పరిశీలన, ప్రశ్నించే తత్వం పెంపొందించేందుకు దోహదపడనుంది. ఒకే అంశాన్ని చదవడం కంటే దాన్ని ప్రత్యక్షంగా చూడటం, పరిశీలించడం, ప్రయోగించడం ద్వారా విద్యార్థులు ఎక్కువగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా బ్యాగ్లెస్ డేస్ కార్యక్రమం విద్యార్థులకు పుస్తకాల నుంచి విరామం కల్పించడం మాత్రమే కాకుండా, పుస్తక జ్ఞానాన్ని జీవిత నైపుణ్యాలతో కలిపే వేదికగా ఉపయోగపడనుంది. బ్యాగ్లెస్ డే.. ప్రకటించిన కార్యక్రమ తేదీలు ప్రస్తుతం జారీ చేసిన సమాచారంలో పేర్కొన్న తేదీ ల ప్రకారం సెప్టెంబర్ 19, నవంబర్ 21, డిసెంబర్ 19, ఫిబ్రవరి 20, మార్చి 20 తేదీల్లో బ్యాగ్లెస్ డే కార్యకలాపాలు నిర్వహించనున్నారు. మిగిలిన కార్యక్రమ తేదీలను ప్రకటించనున్నారు. -
స్వచ్ఛతకు సవాల్
జిల్లాలోని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య సమస్యలు జిల్లాలోని మున్సిపాలిటీలకు పారిశుద్ధ్య సమస్య సవాల్గా మారింది. జనగామ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణపై చర్యలు తీసుకుంటున్నా పలు కాలనీల్లో చెత్త పేరుకపోయి దుర్గంధం వెదజల్లుతూనే ఉంది. స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీగా మారినా పారిశుద్ధ్య నిర్వహణ లేమి కనిపిస్తోంది. జనగామ: పురపాలక పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ గతంతో పోలిస్తే మెరుగుపడినా.. పలు ప్రాంతాల్లో చెత్త, మురుగునీరు, డ్రెయినేజీ సమస్యలు పట్టణ స్వచ్ఛతకు సవాల్గా మారుతున్నా యి. 30 వార్డులు, సుమారు 75 వేల జనా భా ఉన్న పట్టణంలో రోజూ సుమారు 10 టన్నుల చెత్త సేకరిస్తున్నారు. ఇందుకోసం అన్ని విభా గాలు కలిపి 154 మంది పారి శుధ్య కార్మి కులు, 33 ఆటోలు, ట్రాక్టర్లు, డంపర్లు పనిచేస్తున్నాయి. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సమస్యలు కొనసాగుతున్నాయి. సమస్యలు ఇలా.. భవానీనగర్ బస్డిపో వెనుక రోడ్డుపై నిత్యం చెత్త పేరుకుపోతుండటంతో పందులు వీరవిహారం చేస్తున్నాయి. స్వర్ణకళామందిర్ రోడ్డులోనూ చెత్త దుర్గంధం వెదజల్లుతోంది. హైదరాబాద్ రోడ్డులోని ప్రధాన నాలా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవడంతో మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి దోమల సమస్య పెరుగుతోంది. ఆయుష్మాన్ ఆస్పత్రి వెను క డ్రెయినేజీ సక్రమంగా లేక మురుగునీరు రోడ్డు పైకి చేరుతోంది. దయానిలయం, బాలాజీనగర్, కెనరా బ్యాంకు గల్లీ, బాణాపురం హౌసింగ్ బోర్డు కాలనీ, ఇందిరమ్మనగర్, గ్రేయిన్ మార్కెట్ ప్రాంతం, బీరప్పగడ్డ పరిసరాల్లోనూ పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడాల్సిన అవసరం ఉంది. జీఎంఆర్, జ్యోతినగర్ కాలనీలో పలు ప్రాంతాల్లో నూతన డ్రెయినేజీలు నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం తాత్కాలిక మట్టి కాలువల ద్వారా మురుగునీటిని తరలిస్తుండటంతో దుర్గంధం నెలకొంటోంది. డ్రెయినేజీలు, నాలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో మురుగునీరు ముందుకెళ్లడం లేదు. చెత్త తొలగిస్తున్నా.. మురుగు సమస్య నాలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు.. రోడ్లపై మురుగునీరు పట్టణ పారిశుద్ధ్యానికి ‘డ్రెయినేజీ’ గండం రోగాలు ప్రబలే అవకాశం ఉందని ప్రజల ఆవేదనస్టేషన్ఘన్పూర్: రెవెన్యూ డివిజన్, నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీగా మారి ఏడాదిన్నర గడుస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపులేనితనంతో పారిశుద్ధ్యం పడకేసింది. మున్సిపాలిటీ పరిధిలో 18 వార్డులకు గాను 30,528 జనాభా ఉండగా 7,400 గృహాలు ఉన్నాయి. 18 వార్డులకు రెగ్యులర్గా ఒకరే వార్డు ఆఫీసర్ ఉండగా మిగిలిన పదిహేడు వార్డులకు జూనియర్ అసిస్టెంట్లను ఇన్చార్జులుగా నియమించారు. అయితే మున్సిపాలిటీకి నూతనంగా ప్రత్యేకమైన సిబ్బందిని నియమించకపోవడంతో గతంలో పనిచేసిన పారిశుద్ధ్య సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది కొరతతో ఏ వార్డులో చూసినా డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా ఉండి కాలనీలు కంపుకొడుతున్నాయి. ప్రధానంగా ఘన్పూర్ ఎస్సీ కాలనీ, ముదిరాజ్ కాలనీ, శివునిపల్లి ఎస్సీ కాలనీలో పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రస్తుత వర్షాకాలంలో పారిశుద్ధ్య లోపంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తూతూమంత్రంగా పారిశుద్ధ్య పనులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. డ్రెయినేజీలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో కాలనీలు కంపుకొడుతున్నాయి. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండగా రోడ్లపై మురుగునీరు పారుతోంది. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. – మునిగెల రాజు, స్టేషన్ఘన్పూర్ -
5లోగా తుదిజాబితా ప్రకటించాలి
● ‘డబుల్’ లబ్ధిదారుల ఎంపికపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్షజనగామ రూరల్: జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించి, ఈనెల 5వ తేదీలోగా తుది జాబితాను ఖరారు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదా రుల తుది జాబితా ఖరారుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు మొత్తం 1,137 రెండు పడక గదుల ఇళ్లు కేటాయించగా అర్హుల ఎంపికలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ముందుగా ఎల్–3, ఎల్–2 ప్రాధాన్య క్రమంగా జాబితాలను పూర్తిగా పరిశీలించి, అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాను సిద్ధం చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక అనంతరం లక్కీ డ్రా విధానం ద్వారా ఇళ్ల కేటాయింపు నిర్వహించాలన్నారు. ప్రణాళికాబద్ధంగా భూసర్వే పనులు ఉమ్మడి జిల్లాలో భూ సర్వేలో జనగామ ముందంజలో ఉందని, ఇదే వేగంతో మరింత సమర్థవంతంగా, నాణ్యతతో పనులను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాకు ప్రభుత్వం నిర్దేశించిన భూ సర్వే లక్ష్యాన్ని నవంబర్ 30వ తేదీ నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విధులకు హాజరుకాని సర్వేయర్లకు నోటీసులు జారీ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో సర్వే అండ్ ల్యాండ్స్ ఏడీ మన్యంకొండ, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ మాధవీ లత, సర్వేయర్లు పాల్గొన్నారు. భవన నిర్మాణాలు పూర్తి చేయాలి జిల్లాలో వీబీజీ రామ్ జీలో భాగంగా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా, నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. వీఓ, జీపీ, అంగన్వాడీ భవన నిర్మాణ, తదితర పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓబులకేశ్వాపూర్లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్ నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేయాలన్నారు. నర్మెట మండలంలో పైలట్ ప్రాజెక్టుగా మష్రూమ్ కల్చర్ను ప్రారంభించి, మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డీఆర్డీఓ భాస్కర్, ఈఈ (పీఆర్) రవీందర్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
● కలెక్టరేట్ ఎదుట నిరసనలో టీజీఈ జేఏసీ నేతలు జనగామ రూరల్: ఉద్యోగులు, ఉపాధ్యాయుల భవిష్యత్ సామాజిక భద్రతను దెబ్బతీసే పెన్షన్ విధానాలను వ్యతిరేకిస్తూ, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీజీఈ జేఏసీ సెక్రటరీ కొర్నేలి యస్ అన్నారు. మంగళవారం పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా కో–చైర్మన్ చంద్రశేఖర్రావు అధ్యక్షతన కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ సమస్యపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా పోరాడుతున్నాయని, ప్రభుత్వం స్పందించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి పెండేల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈనెల 10వ తేదీన హైదరాబాద్లో జరిగే మహా ధర్నాకు వేలాది తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. నిరసనలో ఖాజా షరీఫ్, లక్ష్మణమూర్తి, మాడూ రి వెంకటేష్, రామస్వామి, రాజయ్య, మనోజ్, కృష్ణమూర్తి, రాంనర్సయ్య, జ్యోతి, సంపత్ కుమార్, రాజా నర్స య్య, రాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
లంచం అడిగితే ఫోన్ చేయండి
నర్మెట(తరిగొప్పుల): రైతుల సాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యమని, సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారులను ఎవరైనా లంచం అడిగితే తనకు నేరుగా ఫోన్ చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సూచించారు. మండలంలోని బొంతగట్టు నాగారం, బొత్తలపర్రె, జాలుబాయితండా, బోజ్య తండా, కొత్తతండా, వాచ్యతండా, అంకుషాపూర్, షోలీపూర్, అక్కరాజుపల్లిలలో వీఓ భవనాల నిర్మాణ పనులకు సోమవారం భూమి పూజలు నిర్వహించిన ఆయన మాట్లాడారు.. ఎత్తైన ప్రాంతాలకు పైపులైను ద్వారా నీరందించేందుకు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులను దసరా నాటికి పూర్తిచేసి నీరు అందిస్తామని తెలిపారు. సర్పంచ్లు కుర్రె మల్లయ్య, భూక్య రవి, సుగుణ, సభావత్ అలుపతి, నర్సయ్య, మంచినీళ్ళ రాజు, బైకాని రమ, దండెం శ్రీనివాస్, పింగిళి జగన్మోహన్రెడ్డి, లింగం, వెంకట్రెడ్డి, రాజేశ్వర్, జుంలాల్, యాదగిరి, ప్రభుదాస్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
హనుమకొండ uవరంగల్ uజనగామ uములుగు uమహబూబాబాద్ uభూపాలపల్లి uఆరు జిల్లాల్లోని పాఠశాలలకు రూ.643.20 లక్షల నిధులు ● జీరో నుంచి 10 మంది విద్యార్థులుంటే కేటాయింపుల్లేవువిద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లకు గిరిజన సంక్షేమశాఖ పాఠశాలలకు 2026–27 సంవత్సరానికి కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ మంజూరు చేస్తూ ఇటీవల రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులు జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలకు, పీఎంశ్రీ పాఠశాలలకు, జీరో నుంచి 10 మధ్య విద్యార్థుల నమోదు ఉన్న పాఠశాలలకు ఈ నిధులు మంజూరు చేయలేదు. పాఠశాలల వారీగా నిధులు ఒకటినుంచి 30 మంది విద్యార్థులున్న పాఠశాలలకు రూ.10 వేల చొప్పున, 31 నుంచి 100 మంది విద్యార్థులుంటే రూ.25 వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.50 వేలు, 251 నుంచి 1,000 మంది విద్యార్థులుంటే రూ.75 వేలు, 1,000పైన విద్యార్థులుంటే రూ.లక్ష చొప్పున నిధులు కేటాయించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలకు మొత్తం రూ.643.20 లక్షలు గ్రాంటు నిధులు మంజూరు చేశారు. ఈనిధులు వీటికి వినియోగించుకోవాలి.. ● పాఠశాలలకు అవసరమైన స్టేషనరీ చాక్పీస్లు, వైట్ పేపర్లు, రిజిస్టర్లు తదితరాలు సమకూర్చుకోవడం పరీక్షల నిర్వహణకు వినియోగించుకోవడం. ● స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగల నిర్వహణకు వినియోగించుకోవచ్చు. ● పాఠశాలలో ఇంటర్నెట్ చార్జీలకు వినియోగించుకోవాలి.. ● కంప్యూటర్లు, ప్రొజెక్టర్ కే–యాన్ టీవీ, తదితర పరికరాల మరమ్మతులకు వినియోగించుకోవాలి, ● తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ వంటి చిన్న చిన్న మరమ్మతులకు వినియోగించుకోవచ్చు. ● తాగునీటి సదుపాయం కల్పించుకునేందుకు కూడా ఈగ్రాంట్లో 10 శాతం మొత్తాన్ని స్వచ్ఛత, యాక్షన్ప్లాన్లో భాగంగా చేతులు కడుక్కునేందుకు లిక్విడ్ సోప్, టాయిలెట్ శుభ్రపర్చే సామగ్రి తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ● దివ్యాంగ విద్యార్థులున్న పాఠశాలల్లో, పాఠశాల ఆవరణలో సురక్షితమైన అవరోధాలు లేని ప్రవేశం కోసం రెయిలింగ్ ఇతర చిన్న సదుపాయాల కోసం గ్రాంటు నుంచి నిధులు వినియోగించుకోవచ్చు. ● పాఠశాలల్లో ఆవరణను క్రమం తప్పకుండా శుభ్రపర్చాలి. శానిటైజ్ చేయాలి. తగిన వెంటిలేషన్లో డిస్ ఇన్స్పెక్ట్ చేయాలి. ● సబ్బు, హ్యాండ్ శానిటైజర్, క్లోరిన్ సొల్యూషన్ ఇతర శుభ్రపర్చే సామగ్రిని ఎల్లప్పుడూ నిల్వ ఉంచాలి. ● గ్రాంట్ వినియోగానికి సంబంధించి పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (ఏఏపీసీ) తీర్మానం చేసి రికార్డుల్లో పేర్కొనాలి. ● గ్రాంటును మార్గదర్శకాలకు అనుగుణంగా సక్రమంగా వినియోగించే బాధ్యత హెచ్ఎం/ప్రిన్సిపాళ్లదే. మొత్తం పాఠశాలలుమొత్తం గ్రాంటు (లక్షల్లో) -
విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వ చెలగాటం
జనగామ రూరల్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయక వారి జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆరోపించారు. సోమవారం పార్టీ, యువ మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని జిల్లా కేంద్రంలో ఒక రోజు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఫీజు బకాయిలు విడుదల చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎల్లబోయిన హరీష్, రాష్ట్ర నాయకులు రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమారాణి, కొంతం శ్రీనివాస్, అంజిరెడ్డి, కుమార్ పాల్గొన్నారు. -
వడివడిగా భూ సర్వే
సాక్షి, మహబూబాబాద్ : ‘ఏ గ్రామంలో చూసినా భూ సమస్య కనిపిస్తోంది. భూమి ఒకరికి, హక్కు మరొకరికి అన్నట్లు ఉంది. వీటన్నింటికి పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిన భూ సర్వేను వడివడిగా చేయాలి. ఈ ప్రక్రియను తహసీల్దార్లనుంచి కలెక్టర్ల వరకు పర్యవేక్షించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా వారిపై వేటు తప్పదు’ అని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెవెన్యూ, రీ–సర్వే, రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై మహబూబాబాద్ ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం ఆయన మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, గహ నిర్మాణ శాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. భూ సర్వేలో నిర్లక్ష్యం వద్దు.. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ప్రతీ జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను లక్ష్యంగా ఎంపిక చేసి మొదటి విడత భూ సర్వేను నవంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతీ అంగుళం భూమిని వ్యవసాయ, వ్యవసాయేతర, ఆబాదీ ఆస్తుల వారీగా శాసీ్త్రయంగా సర్వే చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 31 నాన్–కెడస్ట్రల్ గ్రామాలకుగాను 18 గ్రామాల్లో రీ–సర్వే పనులు ప్రారంభమయ్యాయని, వీటిలో ఐదు గ్రామాల్లో సర్వే పూర్తయిందని, మరో 13 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన 13 గ్రామాల్లో, భూపాలపల్లి జిల్లాలో 8, జనగామ జిల్లాలో 5 గ్రామాల్లో సర్వే పనులను తక్షణమే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. సర్వే గ్రామాలకు తహసీల్దార్లు ప్రతీరోజు, నెలలో ఐదు రోజులు ఆర్డీఓలు, మూడు సార్లు కలెక్టర్లు పరిశీలించాలని, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని చెప్పారు. క్షేత్రస్థాయికి వెళ్లకుండా సర్టిఫికెట్లు జారీ చేయడం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి చర్యలను ఏమాత్రమూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల నిర్మాణాలు పూర్తిచేయాలి జూలై 7న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నర్సంపేట, పరకాల, ములుగు, జనగామ, భూపాలపల్లి ప్రాంతాల్లో ఐదు సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాలు, వరంగల్లో ఒక డీఐజీ కార్యాలయం మంజూరైనట్లు అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లా పలివేల్పులలో డీఐజీ కార్యాలయం కోసం ఎకరం 20 గుంటల ఎస్సారెస్పీ స్థలాన్ని కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. పరకాలలో నూతన భవన నిర్మాణం 7 శాతం పూర్తయిందని తెలిపారు. భీమదేవరపల్లి, పరకాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు హౌసింగ్ శాఖకు అప్పగించాలని నిర్ణయించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం వద్దు జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పురోగతి ఆశించిన స్థాయిలో లేదని మంత్రి పొంగులేటి అసంతృప్తి వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లాలో 4,600 ఇళ్లు మంజూరు కాగా 3,946 ఇళ్లకు ప్రాసెస్ పూర్తయినప్పటికీ ఇప్పటివరకు 854 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. ములుగు జిల్లాలో కూడా ఇళ్ల పూర్తిశాతం 50 శాతానికిలోపే ఉందని పేర్కొన్నారు. పెండింగ్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి సెప్టెంబర్ 15నాటికి గరిష్ట సంఖ్యలో పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశించారు. రెండో విడతలో ప్రతీ నియోజకవర్గానికి 2వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. గుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, మురళీనాయక్, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, యశస్వినిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్లు, వెన్నం శ్రీకాంత్ రెడ్డి, మీసాల ప్రకాశ్, లాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ లోకేష్ కుమార్, రెవెన్యూ, రిజిస్టేషన్, స్టాంప్స్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్గాంధీ హన్మంతు, భూ భారతి డైరెక్టర్, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి గౌతమ్, కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద, చాహత్ బాజ్పాయ్, సందీప్కుమార్ ఝా, భోర్ఖడే హేమంత్ సహదేవరావు, రాహుల్ శర్మ, అన్ని జిల్లాల అధికారులు పాల్గొన్నారు. తహసీల్దార్ల నుంచి కలెక్టర్ల వరకు పర్యవేక్షించాలి ప్రతీ అంగుళం శాసీ్త్రయంగా ఉండాలి నిర్లక్ష్యం చేసే అధికారులపై వేటు తప్పదు నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లలో మొదటి ప్రాధాన్యం ఉమ్మడి జిల్లా సమీక్షలో రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హాజరైన మంత్రి సీతక్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు22–ఏ భూముల విషయంలో జాగ్రత్త.. ప్రతీ జిల్లాలో 22–ఏ కింద ఉన్న భూములు ఏవీ? వాటిలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ఎన్ని? ఇతర వివరాలు ఏమిటి అనే అంశాలను నాలుగు కాలమ్స్తో కూడిన సమగ్ర నివేదికగా సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. సర్వేనంబర్ల వారీగా పూర్తి వివరాలను రెండు రోజుల్లో అధికారులకు సమర్పించాలని స్పష్టం చేశారు. 22–ఏ జాబితాలో పొరపాటున చేరిన రైతుల భూముల వివరాలను పరిశీలించి, అర్హత ఉన్న భూములను జాబితా నుంచి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దు వివాదాలను శాశ్వతంగా పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా సమావేశమై, శాసీ్త్రయ పద్ధతుల్లో భూముల కొలతలు చేపట్టి సరిహద్దులు నిర్ధారించాలని సూచించారు. -
స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పిదాలు
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల్లో పలు తప్పిదాలు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా లబ్ధిదారుల ఇంటి పేర్లు, తండ్రి పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, చిరునామాలు, పిన్్కోడ్ నంబర్లలో అక్షర దోషాలు, తప్పుల ముద్రణ కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఒక గ్రామం పేరుకు బదులుగా మరో గ్రామం పేరు ముద్రించగా, మరికొన్ని కార్డుల్లో లబ్ధిదారుడి పూర్తి పేరు లేకుండా కేవలం ఇంటిపేరు మాత్రమే నమోదైంది. మరణించిన వారి పేర్లతోనూ స్మార్ట్ రేషన్్ కార్డులు రావడం అధికారుల దృష్టికి వచ్చింది. అన్ని మండలాల్లోనూ.. జిల్లాలో 1,87,756 రేషన్ కార్డులు ఉండగా, ఇందులో 1,87,214 స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరయ్యాయి. మండలాలు, గ్రామాల వారీగా కార్డుల పంపిణీ కొనసాగుతోంది. స్టేషన్ ఘన్పూర్ మండలానికి 18,502 కార్డులు మంజూరు కాగా ఇప్పటి వరకు 10,544 కార్డులు పంపిణీ చేశారు. ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రేషన్ షాపు నంబర్ 16కు వచ్చిన 540 కార్డుల్లో చిరునా మాలో ‘శివునిపల్లి’కి బదులుగా ‘సముద్రాల’గా ముద్రణతో పాటు పిన్కోడ్ కూడా తప్పుగా నమోదైంది. ఇంటి యజమానులు మరణించినప్పటికీ వారి పేర్లతో వచ్చిన కార్డులను అధికారులు పంపిణీ చేయకుండా తమ వద్దే ఉంచుకున్నారు. బచ్చన్నపేట మండలంలోని వీఎస్సార్ నగర్, కట్కూరు, లక్ష్మాపూర్, బండనాగారం గ్రామాల్లో 506224 పిన్కోడ్కు బదులుగా 506221గా తప్పుగా ముద్రించారు. చిల్పూర్ మండలంలో 14,345 కార్డులు ఉండగా ఐదు గ్రామాల్లో పిన్కోడ్ తప్పిదాలు నమోదయ్యాయి. కొన్ని కార్డుల్లో లబ్ధిదారుల పేర్లకు బదులుగా కేవలం ఇంటి పేర్లు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. జఫర్గఢ్ మండలానికి 14,766 కార్డులు రాగా, ఒక రేషన్ షాపునకు సంబంధించి సుమారు 25 కార్డులు మరణించిన వారి పేర్లతో వచ్చినట్లు అధికారులు గుర్తించారు. నర్మెట మండలంలో 8,767 కార్డులు రాగా 5,023 పంపిణీ చేశారు. కన్నెబోయినగూడెంలోని 472 కార్డుల్లో గ్రామం పేరుకు బదులుగా వెల్దండగా ముద్రితమైంది. లింగాలఘణపురం మండలానికి 13,803 కార్డులు రాగా ఇప్పటి వరకు 1,207 మాత్రమే పంపిణీ చేశారు. పాలకుర్తి మండలంలోనూ ఇంటి పేర్లు, పిన్కోడ్లలో తప్పులు వెలుగుచూశాయి. కొడకండ్ల మండలానికి 10,823 కార్డులు రాగా సుమారు 1,300 కార్డులు పంపిణీ చేశారు. జనగామ రూరల్ ప్రాంతంలోనూ పేర్లు, ఇంటిపేర్లు, కుటుంబ సభ్యుల వివరాలు, పిన్ కోడ్లలో తప్పులు నమోదయ్యాయి. అధికారుల ప్రకారం, తప్పుగా నమోదైన వివరాలను మీ–సేవ కేంద్రాల ద్వారా ఆన్్లైన్లో సవరించుకునే అవకాశం ఉంది. ఇంటిపేర్లు..చిరునామాలు.. పిన్్కోడ్లలో పొరపాట్లు కొందరి పేర్లే లేవు.. మరణించిన వారికీ కార్డులు కార్డు చేతికొచ్చినా.. వివరాల్లో గందరగోళం తప్పులను సరిదిద్దేందుకు గైడ్లైన్స్ కోసం ఎదురుచూపులు ప్రభుత్వం నుంచి స్మార్ట్ రేషన్్ కార్డుల సవరణలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి గైడ్లైన్స్ రాలేదు. కార్డుల్లో పేర్ల నమోదు, పిన్్కోడ్, కుటుంబ సభ్యుల వివరాల్లో వచ్చిన తప్పులను ఎలా సరిచేయాలనే అంశంపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత స్పష్టత వస్తుంది. అప్పటి వరకు లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – సురేష్రెడ్డి, డీసీఎస్ఓ, జనగామ -
అడ్రస్ తప్పుగా పడింది..
వారం రోజుల క్రితం స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్నాను. కార్డులో శివునిపల్లి చిరునామాకు బదులుగా సముద్రాల అని నమోదైంది. ఈ విషయంపై అధికారులను అడిగినా సరైన సమాధానం లభించలేదు. – చిలగాని పారిజాతం, శివునిపల్లి, స్టేషన్ఘన్పూర్ మా ఇంటిపేరు ముస్కు. కానీ స్మార్ట్ రేషన్ కార్డులో మా తల్లిదండ్రుల ఇంటి పేరు చెంచుగా నమోదైంది. తప్పుగా ఉన్న ఇంటిపేరును సరిచేసి కొత్త కార్డు ఇవ్వాలి. – ముస్కు మానస, రాఘవపురం, పాలకుర్తి స్మార్ట్ రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల వివరాలు నమోదయ్యాయి. అయితే నా భార్యకు అత్తవారింటి ఇంటిపేరు రావాల్సి ఉండగా తల్లి ఇంటిపేరు నమోదైంది. ఈ వివరాలను వెంటనే సవరించాలి. – వ్యాసారపు కర్ణాకర్, చౌడారం, జనగామ స్మార్ట్ రేషన్ కార్డులో ఇంటిపేరు తప్ప.. అసలు పేరు రాలేదు. భార్య లక్ష్మి పేరుతో స్మార్ట్కార్డు రాగా, యజమాని పేరు లేకుండా కేవలం ఇంటి పేరుతో రావడంతో ఆందోళనగా ఉంది. – రాజారపు రామస్వామి, చిల్పూరు ● -
రాహుల్పై ఎఫ్ఐఆర్ ఉపసంహరించుకోవాలి
జనగామ: సామాజిక న్యాయం కోసం ప్రశ్నించిన రాహుల్ గాంఽధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి మండిపడ్డారు. హల్ద్వానీలో జరిగిన కులతత్వ ఘటనకు వ్యతిరేకంగా, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం గళమెత్తిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ధన్వంతి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఘటనకు బాధ్యులైన బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైటీడీ మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ మాట్లాడుతూ.. కుల వివక్ష, సామాజిక అన్యాయంపై ప్రశ్నించడం నేరం కాదని అన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వేమల్ల సత్యనారాయణరెడ్డి, ఓ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు లోకుంట్ల ప్రవీణ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వేముల మల్లేష్, చింతకింది మల్లేష్, ఎదునూరి రవీందర్, డీసీసీ సహాయ కార్యదర్శి లింగాల రాజేందర్రెడ్డి, జాయ మల్లేష్, కళ్యాణం సమ్మయ్య, దండు శ్రీనివాస్, గార్లపాటి మహిపాల్రెడ్డి, వార్డు అధ్యక్షులు జనార్దన్, కొండా మల్లేష్, దామోదర్ రెడ్డి, నోముల సోమయ్య, నోముల హరీష్, రామగాళ్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ శ్రేణుల నిరసన -
నాన్ టీచింగ్ పోస్టుల ఎంపిక పరీక్ష
జనగామ రూరల్: జిల్లాలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, తెలంగాణ ఆదర్శ పాఠశాలల బాలికల వసతి గృహాలలో ఖాళీగా ఉన్న నాన్–టీచింగ్ పోస్టుల ఎంపిక పరీక్షను ఆదివారం కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. కేజీబీవీల్లో మొత్తం 9 నాన్టీచింగ్ పోస్టులు, అలాగే ఆదర్శ పాఠశాలల బాలికల వసతి గృహాలలో అసిస్టెంట్ కుక్ 1, బచ్చన్నపేట, వాచ్ఉమెన్ 1, రఘునాథపల్లిలతో కలిపి మొత్తం 2 నాన్–టీచింగ్ పోస్టులు భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించగా, మొత్తం 32 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 30 మంది అభ్యర్థులు ఎంపిక పరీక్షకు హాజరయ్యారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. ‘మాచన’కు ఏయిమ్స్ ఆహ్వానం జనగామ: పొగాకు నియంత్రణలో విశేష కృషి చేస్తూ అంతర్జాతీయ గుర్తింపు పొందిన పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్కు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఏయిమ్స్) నుంచి మరోసారి ఆహ్వానం అందింది. వచ్చే నెల 5న ఏయిమ్స్లో నిర్వహించనున్న సదస్సుకు హాజరు కావాలని డాక్టర్ దత్తా కోరినట్లు రఘునందన్ ఆదివారం జిల్లా కేంద్రంలో తెలిపారు. ఈ సందర్భంగా పొగాకు నియంత్రణకు సంబంధించి దేశ వ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజల్లో అవగాహన పెంచే అంశాలపై చర్చించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇటీవల స్ట్రాటజిక్ ఇన్న్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ (సైఫర్) సంస్థ టుబాకో కంట్రోల్ ‘ీహీరో’ అవార్డుకు తనను ఎంపిక చేసిన విషయాన్ని రఘునందన్ గుర్తు చేశారు. పొగాకు రహిత సమాజ నిర్మాణం కోసం భవిష్యత్తులో మరింత విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. చిల్పూరుగుట్టపై ఎలుగుబంట్ల సంచారం చిల్పూరు: మండల కేంద్రంలోని చిల్పూరుగుట్టపై పిల్లలతో ఉన్న ఎలుగుబంటి కనిపించడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. ఆదివారం వాగు సమీపంనుంచి గుట్టపైకి ఎక్కుతుండగా రైతులు మూల నాగరాజు, గాదె రాజయ్య చూసి ఇతర రైతులను అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎలుగుబంటి తన రెండు పిల్ల ఎలుగుబంట్లతో తిరుగుతోందని, అటవీ శాఖ అధికారులు అప్రమత్తం కావాలని స్థానికులు కోరారు. సబ్స్టేషన్లలో ఆకస్మిక తనిఖీ జనగామ రూరల్: డివిజన్ పరిధిలోని జనగామ టౌన్–2 పెంబర్తి గేట్వే సబ్స్టేషన్లను వరంగల్ ఆపరేషన్స్ డైరెక్టర్ మధుసూదన్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించి, సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలన్నారు. అలాగే అడవి కేశపూర్ సబ్స్టేషన్లో ఉన్న 5.0 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను 8.0 సామర్థ్యం గల పవర్ ట్రాన్స్ఫార్మర్గా చార్జీ చేశారు. సామర్థ్యంపెంపుదల వల్ల సబ్స్టేషన్ పరిధిలోని వినియోగదారులకు లో–ఓల్టేజ్ సమస్యలు తగ్గడంతో పాటు, రైతులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సరఫరా అందించేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ డివిజనల్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ రెడ్డి, ఏడీఈ వేణుగోపాల్, ఏఈ మధు, శ్రీ కుమార్ పాల్గొన్నారు. ‘బొగత’ అదుర్స్ వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దీంతో ఆదివారం సెలవు రోజు కావడంతో పర్యాటకులు భారీగా తరలివచ్చారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
జనగామ రూరల్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ కోరారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు అందించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 31న జిల్లా కేంద్రం చౌరస్తాలో ఒక రోజు దీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. రీయింబర్స్మెంట్ అందించే వరకు బీజేపీ ఆధ్వర్యంలో యువ మోర్చా పోరాటం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పిడుగుల రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి, జిల్లా సెక్రెటరీ సతీష్, జగదీష్, చందర్ తదితరులు పాల్గొన్నారు. -
తమ్ముడిని కాపాడబోయి అన్న ..
ములుగు మున్సిపాలిటీ పరిధి గణేశ్లాల్పల్లిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని మొండి కుంటలో పడి మాలోతు వినయ్ (15), రాజేశ్ (12) అన్నదమ్ములు మృతి చెందారు. మంగపేట మండలం కమలాపురానికి చెందిన వీరు రాఖీ పౌర్ణమి సందర్భంగా తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వచ్చారు. ఆదివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు కుంటలో పడిపోయారు. ఇద్దరూ నీటిలో మునిగిపోవడంతో స్థానికులు బయటకు తీసి ములుగు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ములుగు జిల్లా గణేశ్లాల్పల్లి మొండికుంటలో మునిగి మృతిచెందిన అన్నదమ్ములు వినయ్, రాజేశ్ (ఫైల్) -
పోచమ్మతల్లికి బోనం..ఊరంతా సంబురం
జనగామ: పవిత్ర శ్రావణ ఆదివారం సందర్భంగా జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు మహిళలు భారీసంఖ్యలో తరలిరావడంతో ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. జిల్లా కేంద్రంలోని ధర్మకంచ, మహంకాళీ స్ట్రీట్, కుర్మవాడ, బాలాజీనగర్, సంజయ్నగర్, పాతబీటు బజార్ తదితర ప్రాంతాల నుంచి గణేష్ స్ట్రీట్పోచమ్మ ఆలయానికి పట్టణంలోని నలుమూలల నుంచి మహిళలు బోనాలతో తరలివచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం అమ్మవారికి బోనంలోని నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం ఓడి బియ్యం పోసి, పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఆయా దేవాలయాల్లోనూ భక్తులు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ వెలుగులు
● 517 కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డిజనగామ: చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఎన్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు చేపడుతోందని జనగామ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సంపత్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో 517 అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించినట్లు వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు ప్రీ–స్కూల్ కార్యకలాపాలు, ఆటలు, అభ్యసన కార్యక్రమాలు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలను సజావుగా నిర్వహించేందుకు విద్యుత్ సౌకర్యం ఎంతో దోహదపడుతుందని ఎస్ఈ పేర్కొన్నారు. విద్యుత్ కనెక్షన్లు అందుబాటులోకి రావడంతో కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు, తాగు నీటి మోటార్లు, ఇతర విద్యుత్ పరికరాలను సక్రమంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడిందన్నారు. -
కొనాలంటే షాక్
సోమవారం శ్రీ 31 శ్రీ ఆగస్టు శ్రీ 2026విద్యుత్ సామగ్రిజనగామ: విద్యుత్ సామగ్రి ధరలు సామాన్యులు, రైతులకు గట్టి షాక్ ఇస్తున్నాయి. గృహ అవసరాలకు వినియోగించే ఎలక్ట్రికల్ పరికరాల ధరలు సగటున 20 నుంచి 30 శాతం వరకు పెరగగా, వ్యవసాయ బోరు మోటార్లకు వినియోగించే వైండింగ్ వైరు, కేబుల్ వైరు, స్టార్టర్లు, బుష్లు తదితర సామగ్రి ధరలు 50 శాతానికి పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇంటి నిర్మాణ ఖర్చుతో పాటు వ్యవసాయ మోటార్ల మరమ్మతులు, కొత్త మోటార్ల కొనుగోలు రైతులకు అదనపు భారంగా మారుతున్నాయి. ఇంటి వైరింగ్కూ అదనపు భారం విద్యుత్ సామగ్రి ధరల పెరుగుదల ప్రభావం ఇళ్ల నిర్మాణంపైనా పడుతోంది. గతంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు సింగిల్ బెడ్రూమ్ ఇంటికి సంబంధించి పూర్తి స్థాయి ఎలక్ట్రికల్ వైరింగ్ సుమారు తక్కువలో తక్కువ రూ.45 వేల బడ్జెట్లో పూర్తయ్యేది. ప్రస్తుతం అదే పనికి రూ.65 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు అవుతున్న పరిస్థితి నెలకొంది. అంటే కనీసం రూ.20 వేల నుంచి రూ.25వేల అదనపు వ్యయం, సుమారు 44 నుంచి 55 శాతం వరకు పెరిగిన భారం కుటుంబాలపై పడుతోంది. రైతులపై రెట్టింపు ప్రభావం వ్యవసాయానికి అవసరమైన మోటార్లు, కేబుల్ వైర్లు, వైండింగ్ వైర్లు, స్టార్టర్లు, బుష్లు తదితర సామగ్రి ధరలు పెరగడంతో రైతులకు కొత్త మోటారు కొనుగోలు చేసినా, పాత మోటారుకు మరమ్మతులు చేయించినా ఖర్చు తప్పడం లేదు. దీనికి తోడు మోటారు వైండింగ్, మరమ్మతులకు మెకానిక్ చార్జీలు సైతం పెరగడంతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ఇప్పటికే సాగు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ సామగ్రి ధరల పెరుగుదల రైతుల ఆర్థిక పరిస్థితిని మరింత ప్రభావితం చేస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలను నియంత్రించాలి.. మాకున్న ఆరు ఎకరాల వ్యవసాయ పొలంలో పంటల సాగు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం బోర్ మోటార్ రిపేర్ కోసం రూ.5వేల వరకు ఖర్చవుతుంది. ఈసారి మోటార్స్ సంబంధించిన సామగ్రి కాపర్ వైర్, బుష్, తదితర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఆర్థిక భారం పెరిగిపోయింది. వ్యవసాయ మోటార్లకు సంబంధించిన సామగ్రి ధరలను ప్రభుత్వం నియం త్రించాలి. –గట్టు శ్రీనివాస్,రైతు,స్టేషన్ ఘన్పూర్ రూ.70 వేల ఖర్చు చేశా.. నూతనంగా ఇల్లు నిర్మిస్తున్నాం. స్లాబ్ వేసే సమయంలో పైపులు, వైరింగ్, స్విఛ్ బోర్డులకు రూ.70 వేల ఖర్చు అయింది. స్విఛ్ బోర్డులకే రూ.25వేలు అయ్యాయి. ఇంకా లేబర్ చార్జీలు మరో రూ.30 వేలకు పైగానే అయ్యేటట్లు ఉన్నాయి. రెండు బెడ్రూంలో ఒక హాల్లోనే లక్షకు పైగా ఖర్చు వచ్చింది. విపరీతంగా పెరిగిన విద్యుత్ మెటీరియల్తో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇల్లు నిర్మించుకోవాలంటేనే చాలా భయంగా ఉంది. –కుంటి మహేందర్, లింగాలఘణపురంమూల్యాంకనం..ఇక ఎమ్మార్సీలోరైతులు, సామాన్యులపై పెరిగిన ధరల భారం ఆకాశాన్నంటిన మోటార్లు, వైర్లు, స్టార్టర్ల ధరలు నాలుగు నెలల్లోనే భారీ పెరుగుదల వైండింగ్ వైరు నుంచి బోరు మోటార్ వరకు ధరల మోత వ్యవసాయ మోటారు సామగ్రిపై 50 శాతానికి పైగా భారం ఇంటి వైరింగ్ బడ్జెట్ రూ.45 వేల నుంచి రూ.65 వేలకు పెరుగుదలసామగ్రి పాత ధర ప్రస్తుత ధర మోటారు వైండింగ్ వైరు(కిలో) 1,000 1,400 కంపెనీ స్టార్టర్ 2,200 3,000 2.5 గేజ్ కేబుల్(మీటర్) 80 125 5 హెచ్పీ బోరు మోటారు 22,000 26,000 7 హెచ్పీ బోరు మోటారు 24,000 32,000 4.0 వైరు(90 మీ.బండిల్) 4,800 6,600 2.5 వైరు (90 మీ.బండిల్) 3,700 4,850 1.0 వైరు (90 మీ.బండిల్) 1,350 2,100 2.5 అంగుళాల పీవీసీ పైపు 450 600 3 పిన్ సాకెట్ 160 250 మోటారు బుష్లు (కిలో) 750 1,250 ఫ్యాన్ రెగ్యులేటర్ 220 350 స్టీల్ నల్లా 300 500 -
ప్రయాణికుల వసతులపై దృష్టి
కాజీపేట రూరల్/ఖిలా వరంగల్: కాజీపేట రూరల్ : సికింద్రాబాద్–కాజీపేట మధ్య శుక్రవారం రాత్రినుంచి శనివారం తెల్లవారుజాము వరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీ వాస్తవ సికింద్రాబాద్ నుంచి మణుగూర్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్లో ప్రయాణిస్తూ నైట్ పుట్ప్లేట్ తనిఖీ నిర్వహించారు. కాజీపేట వరకు రైలు ఇంజన్లో తనిఖీలో భాగంగా రైల్వే జీఎం సిగ్నల్స్, వాటి స్పష్టత, ఓవర్హెడ్ ట్రాక్షన్ ట్రాక్ పరిస్థితి, వేగ పరిమితి, హెచ్చరికలు, వేగాలు తదితర వాటిని సమీక్షించారు. రైలు నడుపుతున్న లోకోపైలెట్లు, ట్రైన్ మేనేజర్ల పని విధానం, సిగ్నల్స్ మార్పిడి చేయడంలో మాస్టర్స్ పాయింట్స్మెన్, గేట్మెన్ వంటి మార్గమధ్య సిబ్బంది అప్రమత్తతను గమనించారు. కాజీపేటలో దిగిన ఆయన రోడ్డు మార్గంలో నేరుగా వరంగల్ రైల్వేస్టేషన్కు వెళ్లారు. డీఆర్ఎం గోపాల కృష్ణన్తో కలిసి ఆయన స్టేషన్లోని ప్లాట్ఫారాలు, ప్రాంగణం, వెయిటింగ్ హాళ్లు పరిశీలించారు. స్టేషన్లో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రయాణికుల సౌకర్యాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అమృత్ బారత్స్టేషన్ పథకంలో భాగంగా రూ.25.41 కోట్ల వ్యయంతో చేపట్టిన పనుల్లో పుట్ఓవర్ బ్రిడ్జి, అధునిక ప్రవేశ ద్వారం, వెయిటింగ్ హాళ్లు, ప్లాట్పామ్స్ షెల్టర్లు, లిప్టులు,ఎస్కలేటర్లను పరిశీలించి..వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మేనేజర్లు ఆగ్గి రవీందర్, వి.సుదర్శన్రావు, డీఓఎం నరేందర్ వర్మ, ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ -
40వేల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యం
● మిల్క్షెడ్ డిప్యూటీ డైరెక్టర్ గోపాల్సింగ్లింగాలఘణపురం: జిల్లాలో రోజుకు 40వేల లీటర్ల పాల ఉత్పత్తిని సాధించడమే లక్ష్యంగా నిర్ణయించుకొని 2వేల మందికి పాడి పశువులకు రుణాలు ఇచ్చేందుకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు జనగామ మిల్క్షెడ్ డీడీ గోపాల్సింగ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బీసీయూ పరిధిలోని చైర్మన్లు, కార్యదర్శులతో పాటు బ్యాంక్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ డెయిరీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఒక్కొక్క రైతుకు మొదటగా రూ.2 లక్షల వరకు రుణాలను ఇప్పించి రూ.లక్ష ఒక గేదెకు, మరో రూ.లక్ష ఆరు నెలల తర్వాత రెండో గేదెకు రుణం ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు వెయ్యి మంది నుంచి దరఖాస్తులు స్వీకరించామని, తక్కువ వడ్డీతో ఇచ్చే రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో బ్యాంక్ ఫీల్డ్ అఫీసర్ జత్రామ్, పాలకేంద్రాల చైర్మన్లు తిరుమలయ్య, దయాకర్రెడ్డి, రాధమ్మ, బాలరాజు, యాదగిరి, సూపర్వైజర్లు వెంకట్రెడ్డి, జయసింహరెడ్డి, కార్యదర్శులు శ్రీశైలం, మల్లారెడ్డి,రేణుక తదితరులు పాల్గొన్నారు. -
సాగు విధానాలు మార్చుకోవాలి
● వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ రమ్య, గోన్యనాయక్ జఫర్గఢ్: మారుతున్న పరిస్థితులకనుగుణంగా రైతులు పంటల సాగు విధానాన్ని మార్చుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు జిల్లా రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ వి.రమ్య, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం వరంగల్ శాస్త్రవేత్త డాక్టర్ పి.గోన్యనాయక్ కోరారు. జిల్లాలోని జఫర్గఢ్, స్టేషన్ఘన్పూర్ మండలాల్లోని తీగారం, సూ రారం, చాగల్లు, రాఘవపూర్ గ్రామాల్లో పర్యటించి వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, కందులతో పాటు వివిధ రకాల కూరగాయల పంటలను క్షేత్రస్థాయిలో శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి పంటల సాగు విధానంపై పలు సూచనలు చేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తలు ఇచ్చే సూచనలను రైతులు తప్పనిసరిగా పాటించి నష్టాలను తగ్గించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి చంద్రణ్కుమార్తో పాటు ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
జీఓ 97ను రద్దు చేయాలి
స్టేషన్ఘన్పూర్: పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్కు భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి జీఓ 97ను రద్దు చేయాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. డివిజన్ కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఓ 97 విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే స్పందించారు. మాజీ విద్యాశాఖ మంత్రిగా జీఓ 97ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎంను ప్రత్యేకంగా కోరుతున్నానన్నారు. పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ను ఇంజనీరింగ్ విద్యతోనే ఉంచాలని, పాలిటెక్నిక్ విద్యార్థులను లేబర్ ఎంప్లాయింట్మెంట్ కిందికి తీసుకురావద్దన్నారు. తద్వారా విద్యార్థుల్లో లేని అపోహలు వస్తున్నాయని, ఇంజనీరింగ్ చదివేవాళ్లం లేబర్ డిపార్ట్మెంట్కు పోతామనే ఒక లేని అపోహ విద్యార్థుల మనస్సులో ఉందన్నారు. కాగా, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీ వేసిందని, కమిటీ అన్నింటినీ అధ్యయనం చేస్తోందన్నారు. మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, వైస్చైర్మన్ నీల రాజమ్మ గట్టయ్య, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీ ష్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అంబటి కిషన్రాజ్, నాయకులు బెలిదె వెంకన్న, బూర్ల శంకర్, పోశాల కృష్ణ, గట్టు రమేశ్, బొల్లు లక్ష్మీ, సింగపురం వెంకటయ్య, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ఈ సస్పెన్స్ కొద్దిరోజులే... ఢిల్లీ నిర్ణయమే కీలకం..
సీఎంతో భేటీ ఆధారంగా పార్టీ వివాదం సమసిపోయిందని చెప్పలేని పరిస్థితి. సుస్మిత వ్యాఖ్యలతో సంబంధం లేదన్న మంత్రి సురేఖ పేర్కొనగా.. కొండా మురళీధర్రావు ‘సుస్మితకు ప్లాన్–ఎ అది.. ప్లాన్–బీ ఏముందో చెప్పలేం కదా’ అని చేసిన వ్యాఖ్యలపై కూడా వారి వ్యతిరేకవర్గంలో చర్చ జరుగుతోంది. అమెరికా పర్యటనలో ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తిరిగొచ్చిన తర్వాతే హైకమాండ్ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ వివాదానికి ఎప్పుడు తెరపడుతుంది? సురేఖపై చర్యలు ఉంటాయా? ఉంటే ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది? ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ వర్గాల్లో ఇదే హాట్టాపిక్గా మారింది. -
ఆర్టీసీ చార్జీల బాదుడు
● రాఖీ పండుగ వేళ జనగామ నుంచి హనుమకొండకు రూ.160 ● డీలక్స్ బస్సులో ఏకంగా రూ.40పెంపుజనగామ: రాఖీ పండుగ వేళ ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారం పడింది. జనగామ నుంచి హనుమకొండకు వెళ్లే డీలక్స్ బస్సు టికెట్ ధర గతంలో రూ.120 ఉండగా శుక్రవారం నుంచి రూ.160కు పెంచారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఒక్కసారిగా రూ.40 పెంచడంతో బస్సుల్లో ప్రయాణికులు కండక్టర్లను ప్రశ్నించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామనే పేరుతో ఇతర ప్రయాణికులపై అదనపు భారం మోపడం సరికాదని ఆరోపిస్తున్నారు. జనగామకు చెందిన మహమ్మద్ రియాజ్ జనగామ నుంచి హనుమకొండకు ప్రయాణిస్తుండగా రూ.160 టికెట్ ఇవ్వడంపై కండక్టర్ను ప్రశ్నించా రు. అయితే చార్జీ పెరిగిందని, అంతే చెల్లించాల్సి ఉంటుందని సమాధానం వచ్చినట్లు తెలిపారు. కాగా, పండుగను పురస్కరించుకుని ఈ నెల 28, 31 తేదీల్లో రెండు రోజులు మాత్రమే టికెట్ ధరలు పెంచుతున్నట్లు జనగామ డిపో మేనేజర్ ఉషా తెలిపారు. కిక్కిరిసిన ప్రయాణికులు పండుగ ముగించుకుని స్వస్థలాలకు తిరుగు ప్రయాణం కావడంతో బస్టాండ్లలో మరింత రద్దీ కనిపించింది. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా అదనపు బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఒక్కో సర్వీసులో 80 నుంచి 90 మంది వరకు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
కూరగాయల సాగుతో అధిక ఆదాయం
● కలెక్టర్ సందీప్కుమార్ఝా స్టేషన్ఘన్పూర్: రైతులు కూరగాయల సాగులో ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ ప్రభుత్వ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకుని అధిక ఆదాయం పొందాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో రైతు పిట్టల రాజుకు చెందిన వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. పిట్టల రాజు చేస్తున్న దొండ, సొరకాయ, పొట్లకాయ సాగును పరిశీలించారు. పందిళ్ల విధానంలో ఏర్పాటు చేసిన తోటను పరిశీలించి తోట నిర్వహణ తీరు, పంట పెరుగుదల, నీటి వినియోగం, దిగుబడి తదితర వివరాలను రైతును స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా తోటను బాగా నిర్వహిస్తున్నారని రైతును అభినందించారు. అనంతరం పొలంలో ఉన్న పత్తి పంటను పరిశీలించి పంట ఆరోగ్యం, నీటి యాజమాన్యం, తెగుళ్ల నివారణ చర్యలపై పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఉద్యానశాఖ అధికారి సందీప్ తదితరులు ఉన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత పింఛన్లు.. జనగామ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని తన చాంబర్లో చేయూత పింఛన్ల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పింఛన్లపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు మొదటి విడతలో సుమారు 7,500 దరఖాస్తులు ఆన్లైన్లో వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తు ఫారాలను చేయూ త వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓ కార్యాలయాల్లో, పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు, మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ నూరుద్దీన్, డీపీఎం సతీష్, అడ్మిన్ అసిస్టెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
డీజీపీ, సీఎస్లను కలిసిన డీసీపీ రాజమహేంద్రనాయక్
జనగామ: ఐపీఎస్గా పదోన్నతి పొందిన సందర్భంగా డీసీపీ రాజమహేంద్రనాయక్ డీజీపీ సీవీ ఆనంద్ను, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జూజును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఐపీఎస్గా పదోన్నతి పొందిన రాజమహేంద్ర నాయక్ను డీజీపీ, సీఎస్ అభినందించి భవిష్యత్లో మరింత సమర్థవంతగా విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు. అనంతరం రాజమహేంద్ర నాయక్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. రైస్మిల్లుల్లో అక్రమాలకు పాల్పడితే కేసులు పాలకుర్తి టౌన్: రైస్మిల్లుల్లో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. కొందరు మిల్లర్లు తనిఖీల సమయంలో అందుబాటులో ఉండడకుండా, మిల్లులకు సంబంఽధించిన రికార్డులను అధికారులకు చూపకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై కేసులు నమోదు చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. మండలంలోని వావి లాల గ్రామంలోని అన్నపూర్ణ రైస్ ఇండస్ట్రీస్లో ధాన్యాన్ని సక్రమంగా నిల్వ చేయకపోవడంతో కొంత ధాన్యం మిల్లింగ్కు పనికిరాకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా జితేందర్నాయక్ రఘునాథపల్లి: షెడ్యూల్డ్ ట్రైబర్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని గిద్దబండతండా గ్రామానికి చెందిన బానోతు జితేందర్నాయక్ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు దేవదాస్నాయక్ నునావత్ నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం జితేందర్నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, హక్కుల పరిరక్షణ, విద్య, ఉపాధి, సంక్షేమ పథకాలు అమలు వంటి అంశాలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రాసెస్ విధానంతో రైతుల ఆర్థికాభివృద్ధి జఫర్గఢ్: రైతులు పండించిన పంటలను ప్రాసెస్ చేసి అమ్ముకున్నట్లయితే ఆర్థికంగా అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుందని నాబార్డ్ ఏజీఎం విజయ్కుమార్ సూచించారు. మండలంలోని హిమ్మత్నగర్ గ్రామంలో నాబార్డ్ సహకారంతో శుక్రవారం స్పందన సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు.. పంటలు పండించడంతో పాటు బిజినెస్ విధానాన్ని పాటించాలన్నారు. స్పంద న సర్వీస్ సొసైటీ కార్యదర్శి సోమయ్య మాట్లాడుతూ.. సంఘం ద్వారా ఇప్పటికే డ్రోన్తో సేవలందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీఈఓ టి.రజిత, సంఘం సభ్యులు ఎర్ర సతీష్, మెరుగు రమేశ్, ఓరుగంటి రాజు, నాగరాజు, డ్రోన్ అపరేటర్ ఓరుగంటి రమేశ్తో పాటు రైతులు పాల్గొన్నారు. వృద్ధురాలి మృతి.. గ్రామంలో ఉద్రిక్తతలింగాలఘణపురం: మండల కేంద్రానికి చెందిన బెజ్జం అండాలు (75) అనే వృద్ధురాలు హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందింది. కాగా, మృతదేహాన్ని ఆమె మృతికి కారకులయ్యారని ఆరోపిస్తూ దేశ్ముఖ్ల ఇంటి ముందు వేసేందుకు ప్రయత్నించారు. దీంతో లింగాలఘణపురం ఎస్సై శ్రావణ్కుమార్, రఘునాథపల్లి ఎస్సై నరేశ్, జనగామ ఎస్సైలు రంగ ప్రవేశం చేసి అడ్డుకున్నారు. దీంతో మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. వారం రోజుల క్రితం దేశ్ముఖ్లతో భూవివాదం నేపథ్యంలో మృతురాలు కోడలు బెజ్జం స్వప్న మందు గోలీ లు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆందోళనకు గురైన వృద్ధురాలు అండాలు అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలై చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషయంపై ఎస్సై శ్రావణ్కుమార్ను వివరణ కోరగా బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని, ఎలాంటి ఫిర్యాదు అందలేదని అన్నారు. -
వెల్లివిరిసిన ఆత్మీయత
● జిల్లాలో ఘనంగా రాఖీ వేడుకలు ● ఆడపడుచులతో ఊరూవాడ సందడిజనగామ: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. సోదరులకు రాఖీలు కట్టిన అక్కాచెల్లెళ్లు తమ ఆప్యాయతను చాటుకున్నారు. దేశ రక్షణలో సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సోదరులను ప్రత్యక్షంగా కలుసుకోలేని అక్కాచెల్లెళ్లు జిల్లాలోని అనేక గ్రామాల నుంచి పోస్టల్ ద్వారా రాఖీలు పంపించి తమ ప్రేమను చాటుకున్నారు. ఆడపడుచులు, పిల్లలతో గ్రామాలన్నీ కళకళలాడాయి. రాఖీ పండుగ సందర్భంగా స్వీట్షాపులు, బట్టల షాపుల్లో వ్యాపారం జోరుగా సాగింది.ఎఫ్ఎల్ఎన్పై అవగాహన కల్పించడానికి పట్టణంలోని ఉపాధ్యాయులు వినూత్నంగా తయారుచేసిన రాఖీ -
భవితకు వెలుగు
ఆలోచనకు పదను..జనగామ రూరల్: విద్యార్థుల ఆలోచనలకు పదను పెడుతూ వారి సృజనాత్మక, పరిశోధన దృక్పథాన్ని వెలుగులోకి తీసుకొచ్చి, వారిని భావిశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఏటా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఇన్స్పైర్ మనక్ కార్యక్రమం నిర్వహిస్తోంది. 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్ర సాంకేతిక ప్రతిభను వెలికితీయడానికి ఇది చక్కటి వేదికగా దోహదపడుతోంది. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇన్స్పైర్ మనక్ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా జిల్లాలో ఇప్పటి వరకు 50 వరకు నామినేషన్లు కాగా వచ్చే నెల వరకు గడువు ఉండడంతో మరిన్ని దరఖాస్తులు రానున్నాయి. గతేడాది 997 నామినేషన్లు వచ్చాయి. విద్యార్థులకు బహుమతులు విద్యార్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రతినిధులు పరిశీలిస్తారు. దేశవ్యాప్తంగా లక్ష ప్రాజెక్టులను ఎంపిక చేసి ఒక్కో ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి, విద్యార్థులను మరింతగా శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రోత్సహించడానికి రూ.10వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. తద్వారా ప్రాజెక్టును రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు తీసుకెళ్లే అవకాశం కలుగుతుంది. గతేడాది జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సుమారు 997 వరకు ప్రాజెక్టులు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల నుంచే వచ్చాయి. ఇందులో ఒకటి జాతీయ స్థాయికి ఎంపికైంది. విద్యార్ధికి రూ.10వేల చొప్పున బ్యాంక్ అకౌంట్లో జమ చేశారు. ఇందులో రూ.5 వేలు ప్రాజెక్టు తయారీకి, మిగిలినవి ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు వినియోగించాలి. జాతీయ స్థాయిలో పేటెంట్కు ఎంపికై న విద్యార్థులకు జాతీయ, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలలో రిజర్వేషన్ కూడా ఉంటుంది. విద్యార్థులకు వివరించాలి విద్యార్థులను ఇన్స్పైర్ మనక్ కార్యక్రమంలో పాల్గొనేలా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. తల్లిదండ్రుల్లో చాలా మందికి అవగాహన ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్య కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులే చొరవ తీసుకోవాలి. తమ విద్యార్థులను ప్రోత్సహించి వారి ఆవిష్కరణలను రిజిస్ట్రేషన్ చేయిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. తమ ప్రాజెక్టులను సెప్టెంబర్ 15లోపు www.inspireawards. dst.gov.in వెబ్సైట్లో నమోదు చేయించాలి.బైక్ స్టాండ్ అడ్జెస్ట్మెంట్ ప్రాజెక్ట్ నూతన అవిష్కరణలకు నాంది ప్రాజెక్టు ఎంపికై తే విద్యార్థికి రూ.10వేల ప్రోత్సాహకం సెప్టెంబర్ 15 వరకు ప్రాజెక్ట్ నామినేషన్కు అవకాశం జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు 50 ఈఫొటోలో కనిపిస్తున్న విద్యార్థిని పేరు జి.అక్షిత. జనగామ మండలంలోని చౌడారం కేజీబీవీలో 9వ తరగతి చదువుతోంది. గతేడాది ఇన్స్పైర్ మనక్లో జిల్లా నుంచి ఉత్తమ ప్రాజెక్ట్తో జాతీయ స్థాయికి ఎంపికై ంది. బైక్ స్టాండ్ అడ్జెస్ట్మెంట్ ప్రాజెక్ట్లో ద్విచక్ర వాహనదారులు సైడ్ స్టాండ్ భూమి ఎగువ దిగువ ఉన్న చోట కింద పడకుండా దానంతట అదే భూమిని అడ్జెస్ట్ చేసుకొనే ఆటోమెటిక్ స్టాండ్ను అమర్చింది.వందశాతం నామినేషన్లకు చర్యలు తీసుకోవాలి ఇన్స్పైర్ మనకు వినూత్న ఆవిష్కరణలను గుర్తించి గడువులోగా జిల్లా వ్యాప్తంగా వందశాతం నామినేషన్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన ప్రాజెక్టులను పరిశీలించి ఉత్తమ ప్రాజెక్టుల ఎంపికకు అవసరమైన సూచనలు చేస్తాం – సందీప్ కుమార్ ఝా, కలెక్టర్ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి సైన్స్ ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులను ప్రోత్సహిస్తే నూతన ఆవిష్కరణలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలి. ఇన్స్పైర్ మనక్ రిజిస్ట్రేషన్లు ఊపందుకునేలా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి. – ఉపేందర్, జిల్లా సైన్స్ అధికారి -
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కొడకండ్ల: గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా తీజ్ వేడుకలు నిలుస్తాయని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. శుక్రవారం మైదంచెరువుతండా, శ్రీరాంతండా, గిర్నితండాలు సంయుక్తంగా నిర్వహించిన తీజ్ వేడుకలకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు.. సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురేష్నాయక్, రాజేష్నాయక్, సర్పంచ్లు సుధీర్నాయక్, సోనియానరేష్నాయక్ పాల్గొన్నారు. -
‘మినరల్స్’ ఎక్కడో.. పోస్టింగ్ అక్కడే!
● పొలిటికల్ అండ, ఉన్నతాధికారుల సపోర్టు ● ఒక్కొక్కరికీ రెండేసి జిల్లాలు.. ఏడీలకు డీడీ బాధ్యతలు ● ఆదాయానికి మించిన ఆస్తులు.. అక్రమ వ్యాపారులతో చెట్టాపట్టాల్ ● ఏసీబీ సోదాలతో మళ్లీ చర్చకు వచ్చిన పోస్టింగ్ల దందా సాక్షి ప్రతినిధి, వరంగల్: మైనింగ్ అంటేనే కోట్లాది రూపాయల విలువైన ఖనిజ సంపద. ఇసుక, క్వారీలు, గ్రానైట్, బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్.. ఇలా ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చిపెట్టేవి. వీటికి అనుమతులు ఇవ్వడం, లీజులను పర్యవేక్షించడం, రాయల్టీ వసూలు చేయడం, అక్రమ మైనింగ్, అక్రమ రవాణాను అడ్డుకోవడం మైన్స్ అండ్ జియాలజీ శాఖ పరిధిలోని కీలక బాధ్యతలు. అలాంటి శాఖలో జిల్లాస్థాయి అధికారుల పోస్టింగులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వనరులు, ఆదాయం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం పైరవీలు, రాజకీయ పలుకుబడి, లావాదేవీలు జరుగుతున్నాయన్న ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ బొజ్జ జయరాజ్కు సంబంధించిన వ్యవహారంలో ఏసీబీ సోదాలు జరగడం ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్.. 12 జిల్లాల పర్యవేక్షణకు ఇన్చార్జ్.. భూపాలపల్లి మైన్స్ ఏడీగా పనిచేసి గురువారం ఏసీబీ దాడులకు గురైన బొజ్జ జయరాజు ములుగు జిల్లా మైన్స్ బాధ్యతల్లోనూ కొద్ది రోజులు ఇన్ చార్జ్గా ఉన్నారు. 2024 మార్చి 15న భూపాలపల్లి ఏడీగా వచ్చిన ఆయన 2025 అక్టోబర్ 8న వరంగల్ రీజియన్ (ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం)కు డిప్యూటీ డైరెక్టర్గా ఇన్చార్జ్ బాధ్యతల్లోకి వచ్చారు. రాజకీయ పలుకుబడి, ఉన్నతాధికారుల అండదండలతోనే ఈ అదనపు బాధ్యతలు దక్కాయన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. దీంతో ఏడీతోపాటు పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మంలకు చెందిన 12 జిల్లాల మైనింగ్ పర్యవేక్షణ బాధ్యతలు కూడా డీడీగా ఈయనకే. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్లో ఏడీలకు వరంగల్, హనుమకొండలకు చాలాకాలం ఒక్కరే ఏడీగా బాధ్యతలు నిర్వహించారు. భూపాలపల్లి, ములుగులకు కూడా ఒక్కరే ఉన్నారు. ఇటీవల హనుమకొండకు పూర్తి కాలపు ఏడీ రాగా, మిగతా చోట్ల హెడ్ ఆఫీసు కనుసన్నల్లో ఉండే ఏజీలను ఏడీలుగా నియమించారంటే గనులశాఖలో పోస్టింగ్ల తీరును అర్థం చేసుకోవచ్చు. ‘మినరల్స్’ ఉన్న చోటే ఎందుకీ ఆసక్తి? ఉమ్మడి వరంగల్లోని అన్ని జిల్లాల్లో ఖనిజ వనరులు ఒకే రకంగా లేవు. భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో గోదావరి పరీవాహక ప్రాంతం కారణంగా ఇసుక కార్యకలాపాలకు ప్రాధాన్యం ఉండగా.. ఇతర జిల్లాల్లో గ్రానైట్, బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్, లేటరైట్, ఇతర ఖనిజాల తవ్వకాలు జరుగుతున్నాయి. మహబూబాబాద్లో ఇనుప ఖనిజం, లేటరైట్తోపాటు బ్లాక్, కలర్ గ్రానైట్, బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్, ఎర్త్, గ్రావెల్ వంటి ఖనిజాలు ఉన్నట్లు అధికారిక మైన్స్ శాఖ వివరాలు చెబుతున్నాయి. అక్కడ 168 బ్లాక్ గ్రానైట్ మైనర్ మినరల్ లీజులు నమోదై ఉండగా.. 66 పనిచేస్తున్నట్లు జిల్లా శాఖ వివరాలు పేర్కొంటోంది. అందుకే ఖనిజ వనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మైన్స్ అధి కారుల పోస్టింగులు సహజంగానే ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఈ నేపథ్యంలోనే మినరల్స్ బాగా ఉన్న ‘మంచి పోస్టింగ్’ల కోసం పైరవీలు చేసుకుని వస్తున్నట్లు ప్రచారం ఉంది. వారికి రాజకీయ పలుకుబడి, ఉన్నతస్థాయి అండదండలు పుష్కలంగా ఉంటాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మీడియాకు కూడా శాఖాపరమైన సమాచారం ఇవ్వకుండా ‘టూర్’ల పేరిట తప్పుకున్న సంధర్భాలు పలుసార్లు విమర్శలకు దారి తీశాయి. ఇటీవల ఏసీబీ దాడులు, కేసులు వెలుగులోకి వస్తుండటంతో మైనింగ్ శాఖలో అధికారుల పోస్టింగులు, పనితీరుపై చర్చ మొదలైంది. ఆగస్టు 2026లో ఆయా జిల్లాల అధికారిక వెబ్సైట్లలో కనిపిస్తున్న వివరాలను పరిశీలిస్తే ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో మూడు చోట్ల ఇన్చార్జ్ వ్యవస్థ కనిపిస్తోంది. హనుమకొండలో ఏడీ బాధ్యతలు ఇన్చార్జ్కి ఉండగా రెగ్యులర్ ఏడీని నియమించారు. వరంగల్లో రెగ్యులర్ ఏడీ ఉన్నట్లు జిల్లా వెబ్సైట్ పేర్కొంటోంది. జనగామలో జిల్లా వెబ్సైట్, కేంద్ర మైన్స్ శాఖ డేటాలో అధికారి హోదాకు సంబంధించి వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక్కడ కూడా అసిస్టెంట్ జియోలజిస్టు(ఏజీ)నే ఇన్చార్జ్ ఏడీగా నియమించినట్లు తెలిసింది. మహబూబాబాద్లో రెగ్యులర్ ఏడీ ఉన్నారు. భూపాలపల్లిలో డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి ఇన్చార్జి ఏడీగా ఉన్నారు. ఆయన (బి.జయరాజు) గురువారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కారు. ఇందులో కొన్ని చోట్ల అసిస్టెంట్ జియాలజిస్ట్లు ఇన్చార్జ్ అసిస్టెంట్ డైరక్టర్లుగా పోస్టింగ్లు తెచ్చుకున్నారు. ములుగులో ఇన్చార్జ్ ఏడీగా ఉన్న అసిస్టెంట్ జియోలజిస్ట్ భద్రాద్రి కొత్తగూడెం ఇన్చార్జ్ ఏడీగా కూడా వ్యవహరిస్తున్నారు. -
బోర్డర్లో తమ్ముడికి పోస్టులో రాఖీ
బచ్చన్నపేట: మండల కేంద్రానికి చెందిన చిట్టి నర్సిరెడ్డి బీఎస్ఎఫ్లో పనిచేస్తున్నారు. ప్రతీ సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తుంటారు. ప్రస్తుతం గుజరాత్లోని భుజ్లో పనిచేస్తున్నారు. నర్సిరెడ్డి అక్క వంగ రమ్య ప్రతీ సంవత్సరం పండుగకు రాఖీలను నేరుగాకట్టే అవకాశం లేకపోవడంతో పోస్టులో పది రోజుల ముందుగానే పంపిస్తుంది. రాఖీ అందగానే తమ్ముడు నర్సిరెడ్డి ఫోన్ చేసి తెలుపుతాడు. రాఖీ పౌర్ణమి పండుగ రోజున ఫోన్లో వీడియో కాల్ చేసి రాఖీని తమ్ముడు నర్సిరెడ్డి కట్టుకుంటాడు. ప్రతి రాఖీ పౌర్ణమికి రాఖీలను తప్పకుండా పంపిస్తానని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. -
గోమాతకు ‘రక్షా’బంధన్
పాలకుర్తి టౌన్: సాధారణంగా సోదరీసోదరుల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పండగను ఓ కుటుంబం గోమాతలతో జరుపుకుంటోంది. గోసంరక్షణే ధ్యేయంగా గోమాతలను కుటుంబ సభ్యులుగా భావిస్తూ పూజించి, వాటి నూదిటిపై తిలకం దిద్ది, వాటి రక్షణను కోరుతూ రాఖీ కట్టి వేడుకలను నిర్వహిస్తారు. గురువారం మండల కేంద్రానికి చెందిన దేవగిరి భార్గవి కుటుంబసభ్యులతో కలిసి గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుల వేదమంత్రాల మధ్య గోవులకు తిలకం దిద్ది రాఖీలు కట్టారు. అరటిపండ్లు, ఆకుకూరలతో గోవులకు విందు ఏర్పాటు చేశారు. -
విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలి
జనగామ: వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సేవలు అందించడంతో పాటు విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్స్ టి.మధుసూదన్ సూచించారు. గురువారం జనగామ సర్కిల్ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను వేగంగా గుర్తించి పునరుద్ధరించేందుకు రియల్ టైమ్ ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా సబ్స్టేషన్ల పని తీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పెండింగ్ వర్క్ ఆర్డర్లను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయాలన్నారు. సమీక్షలో చీఫ్ ఇంజనీర్ కె.గౌతమ్రెడ్డి, జనగామ సూపరింటెండింగ్ ఇంజనీర్ చెరుకు సంపత్రెడ్డి, జనగామ, స్టేషన్ఘన్పూర్ ఆపరేషన్ డీఈ లక్ష్మీనారాయణ రెడ్డి, డీఈ సారయ్య, డీఈ ఎంఆర్టీ విజయ్ కుమార్, ఎస్ఏఓ శంకర్, ఏడీఈ లు, ఏఈలు పాల్గొన్నారు. అంగన్వాడీల కొత్త యాప్ రద్దు చేయాలిజనగామ రూరల్: జిల్లాలో ఐసీడీఎస్లో కొత్త రకమైన శిశు మహిళా సమృద్ధి యాప్ను రద్దు చేయకపోతే పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి డిమాండ్ చేశారు. గురువారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ బెన్షాలోమ్కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా యాప్ విషయంలో యూనియన్ నాయకులకు, అధికారులకు మధ్య గంట పాటు చర్చలు జరిగాయి. అనంతరం యూని యన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి మాట్లాడుతూ.. కొత్త యాప్తో అంగన్వాడీలకు పనిభారం పెరుగుతుందన్నారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా కొత్త యాప్ తీసుకురావడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీలు కోమల, ఎల్లమ్మ, రేణుక, స్వరూప, గౌరవ అధ్యక్షుడు సుంచు విజేందర్, బైరగోని అంజూమ్, కొమ్ము మంగ, అమరావతి, ఎర్రబెల్లి సంతోష, వినోద గంధమల్ల, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. జాతీయ కబడ్డీ న్యాయనిర్ణీత పరీక్షలో ప్రతిభజనగామ రూరల్: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జూన్ 6, 7, 8 తేదీల్లో నిర్వహించిన ఏకేఎఫ్ఐ జాతీయ కబడ్డీ న్యాయనిర్ణీత పరీక్షలో జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు చింతకింది సుధాకర్, నూకల రాజన్న, జెనిగల రాజు ఉత్తీర్ణత సాధించి జాతీయ స్థాయి కబడ్డీ అఫీషియల్స్గా అర్హత సాధించారు. ఈసందర్భంగా వారికి పలువురు అభినందనలు తెలుపుతూ భవిష్యత్లో మరిన్ని జాతీయ స్థాయి పోటీల్లో సేవలందించాలని ఆకాంక్షించారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు సహకరించిన తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేశం, ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్ రెడ్డి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పోగుల సారంగపాణి, అధ్యక్షుడు వై.కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. -
గిరాఖీ ఫుల్
బస్టాండులో బస్సు కోసం నిరీక్షణ పట్టణంలో రాఖీలను కొనుగోలు చేస్తున్న మహిళలు, యువతులుఅన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగకు జిల్లా సిద్ధమైంది. అన్నదమ్ముళ్లకు రాఖీ కట్టేందుకు అక్కాచెల్లెళ్లు వివిధ ప్రాంతాల నుంచి తరలిరావడంతో పట్టణం రద్దీగా మారింది. రైల్వేస్టేషన్, నెహ్రూ పార్కు, సిద్దిపేటరోడ్డు, స్వర్ణ కళామందిర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రాఖీ దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. మరోవైపు ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు పెరిగి ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ఉదయం 10 గంటల నుంచే ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసింది. స్వీట్ల దుకాణాల్లోనూ పండుగ వాతావరణం కనిపిస్తూ వ్యాపారం ఊపందుకుంది. – జనగామ -
సీపీఎస్ను రద్దు చేయాలి
జనగామ రూరల్: ఉద్యోగ, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షనర్ల దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్ ఖాజా షరీఫ్ డిమాండ్ చేశారు. రాష్ట్రశాఖ పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని చౌరస్తా వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయులు మహా ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఖాజా షరీఫ్ మాట్లాడుతూ.. కాలపరిమితి దాటి 3 ఏళ్లు దాటినా న్యాయంగా ఉద్యోగులకు రావాల్సిన పీ ఆర్సీ అమలు చేయకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. 6 డీఏలు ఇవ్వకపోవడం, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా సీపీఎస్ రద్దు విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం సరికాదన్నారు. వెంటనే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యూనియన్ సెక్రటరీ కొర్నేలియస్ మాట్లాడుతూ.. ఉద్యోగుల పోరాటంతో ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేదంటే సెప్టెంబర్ 10వ తేదీన పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి ధర్నా నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర బాధ్యులు రంజిత్ కుమార్, శ్రీనివాస్, కళావతి హాజరై మాట్లాడుతూ.. సమష్టి పోరాటాల ద్వారా మాత్రమే ఫలితాలు వస్తాయని, రైతుల ఉద్యమం, విద్యార్థుల ఉద్యమం ఫలితాలను ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని కోరారు. సమావేశంలో జిల్లా బాధ్యులు మహిపాల్ రెడ్డి, చంద్రశేఖర్రావు, పెండెల శ్రీనివాస్, రాజు, లక్ష్మణ మూర్తి, షరీఫ్, రామస్వామి, శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, హఫీజ్, లావణ్య, అరుణ, యశో ద, లక్ష్మి, శారదా, భాగ్య తదితరులు పాల్గొన్నారు. పీఆర్సీ, డీఏలను వెంటనే ప్రకటించాలి ఉద్యోగ, ఉపాధ్యాయుల మహాధర్నాలో వక్తలు -
అసెంబ్లీలో మా సమస్యలను ప్రస్తావించండి
జనగామ: అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలను ప్రస్తావించాలని జిల్లా లైసెన్స్డ్ సర్వేయర్లు గురువా రం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని కోరారు. భూ భారతి చట్టంలో లేని రీసర్వే పనులను తమకు అప్పగించి, సర్వేకు ఎకరాకు రూ.500 చెల్లించాల్సి ఉండగా రూ.60 చొప్పున ఇద్దరు సర్వేయర్లతో పని చేయించాలని ప్రభుత్వం నిర్ణయించడం సరికాద న్నారు. కనీసం రూ.30వేల గౌరవ వేతనం కల్పించాలని, లేదంటే లైసెన్స్ ని బంధనల ప్రకారం ఎకరాకు రూ.500 చెల్లించి పనులు అప్పగించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే పల్లాను కలిసి సమస్యలను వివరించగా, ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని హామీ ఇచ్చినట్లు సర్వేయర్లు చెప్పారు. సర్వేయర్ల జిల్లా అధ్యక్షుడు శివశంకర్, ఉపాధ్యక్షుడు రాజేంద్రప్రసా ద్, సామ్రాట్, పలువురు సర్వేయర్లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పల్లాకు సర్వేయర్ల వినతి -
నోటీసులు..లక్షన్నర!
జనగామ: జిల్లాలో ఓటర్ల జాబితా పరిశీలనలో భాగంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో నియోజకవర్గాల వారీగా భారీ సంఖ్యలో అసాధారణతలు గుర్తించారు. జనగామ నియోజకవర్గంలో 55,974 నోటీసులు, ఘన్పూర్ నియోజకవర్గంలో 37,963, పాలకుర్తి నియోజకవర్గంలో 69,954 నోటీసులు జారీ చేయాల్సి ఉంది. మూడు నియోజకవర్గాలను కలిపి 1,63,891 నోటీసులు జారీ చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే పాలకుర్తిలో అత్యధికంగా, ఘన్పూర్లో అత్యల్పంగా నోటీసులు జారీ కానున్నాయి. జనగామ నియోజకవర్గంలో.. జనగామ నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాల్లో 21,939 మంది ఏఎస్డీ జాబితాలో ఉన్నట్లు వెల్లడైంది. ధూల్మిట్టలో 1,051, నర్మెటలో 1,574, చేర్యాలలో 4,963, మద్దూరులో 1,707, బచ్చన్నపేటలో 5,049, కొమురవెల్లిలో 1,328, జనగామలో 5,049, తరిగొప్పులలో 1,218 మంది ఉన్నారు. వీరిలో అత్యధికంగా బచ్చన్నపేట, జనగామలో 5,049 మంది చొప్పున ఉండగా, అత్యల్పంగా ధూల్మిట్టలో 1,051 మంది ఉన్నారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా మండలాల వారీగా 31,217 అనామలీస్లు నమోదయ్యాయి. 294 పోలింగ్ కేంద్రాల పరిధిలో 37,963 నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, ఇందులో 37,964 నోటీసులు జనరేట్ కాగా, 737 మాత్రమే పంపిణీ చేశారు. ఇంకా 37,227 నోటీసులు పంపిణీకి పెండింగ్లో ఉన్నాయి. ఘన్పూర్లో అత్యధికంగా 6,710, రఘునాథపల్లిలో 6,043, ధర్మసాగర్లో 5,380 అనామలీస్లు నమోదయ్యాయి. మొత్తం 6,746 మ్యాపింగ్ కాని కేసులు గుర్తించారు. విచారణలు, డీఈఓ స్థాయి పరిశీలన, తుది ప్రచురణకు పెండింగ్ కేసులు లేవు. ఇతర కారణాలతో 213 కేసులు పెండింగ్లో ఉన్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఓటర్ల జాబితా పరిశీలనలో భాగంగా 2,41,462 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేశారు. ఇందులో 19,779 మంది ఏఎస్ డీ, 1,977 మంది డీఎస్ఈ కేటగిరీలో ఉన్నాయి. మండలాల వారీగా పాలకుర్తిలో 49,782 ఓటర్లు ఉండగా డిజిటలైజ్ 3,758 ఏఎస్డీ 338 డీఎస్ఈ, దేవరుప్పులలో 34,973 ఓటర్లు ఉండగా డిజి టలైజ్ 2,615, ఏఎస్డీ 250, కొడకండ్లలో 26,011 ఓటర్లు ఉండగా డిజిటలైజ్ 2,829, ఏఎస్డీ 249, రాయపర్తిలో 43,914 ఓటర్లు ఉండగా డిజిటలైజ్ 2,165, ఏఎస్డీ 300, పెద్దవంగరలో 23,135 ఓటర్లు ఉండగా 2,518, ఏఎస్డీ192, తొర్రూరులో 63,647 ఓటర్లు ఉండగా డిజిటలైజ్ 5,894, ఏఎస్డీ 648గా నమోదయ్యాయి. మూడు విభాగా ల్లోనూ తొర్రూరు మండలంలో అత్యధిక సంఖ్య నమోదైంది. వార్డుసభను పరిశీలించిన డీసీసీ అధ్యక్షురాలు పట్టణంలోని 19వ వార్డులో నిర్వహించిన వార్డు సభను డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్ఓ, బీఎల్ఏ–2 లతో మాట్లాడి వార్డు సభ నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితాలోని గైర్హాజరు, శాశ్వతంగా తరలిపోయిన, డూప్లికేట్, మృతి చెందిన ఓట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి గుర్తించాలని సూచించారు. బీఎల్ఓలు, బీఎల్ఏ–2 లు సమన్వయంతో పని చేస్తూ ఓటరు జాబితాను పరిశీ లించాలని సూచించారు. అభ్యంతరాలు, సూచనలను స్వీకరించి పరి ష్కరించాలని తెలిపారు. పాలకుర్తిలో అత్యధికంగా 69,954 మందికి.. ముసాయిదా జాబితాపై గ్రామసభల్లో వెలుగులోకి తప్పులు ఓటరు జాబితాలో ఫొటో, పేర్లలో తప్పులు పకడ్బందీగా చేపట్టినా తప్పని తప్పులు జిల్లాలోని అన్ని గ్రామాల్లో ముసాయిదా ఓటరు జాబితాపై నిర్వహించిన గ్రామసభల్లో పలు లోపాలు వెలుగు చూశాయి. ఓటర్ల వయస్సు, ఇంటిపేరు, చిరునామా, తండ్రి పేరు, పిల్లల వయస్సు వంటి వివరాల్లో తప్పులు ఉన్నట్లు గుర్తించారు. కొందరికి ఇతరుల ఇంటి నంబర్లపై ఓటు హక్కు నమోదైనట్లు తేలింది. మరోవైపు 30 ఏళ్లుగా ఓటు వేస్తున్నప్పటికీ ప్రస్తుత ముసాయిదా జాబితాలో పేరు గల్లంతైన ఘటనలు బయటపడ్డాయి. ఒకే ఓటరు ఒక బూత్తో పాటు మరో నియోజకవర్గంలోనూ నమోదైనట్లు, మరికొందరు ఒకే నియోజకవర్గంలోని పక్కపక్క బూత్లలో రెండుసార్లు నమోదైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో రాజకీయ పార్టీలు వివరాలను సేకరించి, అర్హులైన వారి ఓట్లు గల్లంతుకాకుండా, డూప్లికేట్ ఓట్లు తొలగించేలా సవరణలకు ప్రయత్నాలు చేస్తున్నాయి. -
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
పాలకుర్తి టౌన్: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు క్రీడలు, విలువలు, క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మండల కేంద్రంలోని పీఎంశ్రీ పాఠశాలను గురువారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, వంటశాల, పరిసరాల ను పరిశీలించారు. విద్యార్ధులతో మాట్లాడి హిందీ, ఇంగ్లిష్, గణితం, సాంఘిక శాస్త్రం వంటి సబ్జెక్టుల్లో వారి అభ్యాస సామర్థ్యాన్ని పరీక్షించారు. గణితం, సాంఘిక శాస్త్ర అంశాలను స్వయంగా బోధించారు. ఎంపీడీఓ వేదవతి, ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, సర్పంచ్ కమ్మగాని విజయ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
బీఆర్ఎస్ పాలనలో వెనకబాటు
జఫర్గఢ్ : తెలంగాణ వెనుకబాటుకు బీఆర్ఎస్ పదేళ్ల పాలనే ప్రధాన కారణమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. గురువారం మండలంలోని సాగరం గ్రామంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయడంతో పాట శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభకు సర్పంచ్ మమత చైతన్యకుమార్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ..బీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడింది తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐల య్య, డీఈ బి.సారయ్య, ఏడీఈ రణఽధీర్ రెడ్డి, ఏఈ కరుణాకర్, మాజీ సర్పంచ్లు వట్టి ఇన్నారెడ్డి, భిక్షపతి, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ప్రతీ ఒక్కరు విలువలతో జీవించాలి
జనగామ రూరల్: ప్రతీ ఒక్కరు విలువలతో జీవించాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం తెలంగాణ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ జిల్లా శాఖ, హమ్ సాత్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జనగామ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని, మహ్మద్ ప్రవక్త బోధించిన మానవత, ప్రేమ, దయ, సేవా భావం, సోదరభావం వంటి గొప్ప విలువలను ప్రతీ ఒక్కరు ఆచరించాలని సూచించారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని, ఆరోగ్యవంతులైన వారు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్మీసా జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అంకుషావలి, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎన్ఎన్.రాజు, హమ్ సాత్ ఫౌండేషన్ అధ్యక్షుడు మహ్మద్ యాకూబ్ పాషా, మహ్మద్ తహసీన్, ఖలీల్, మోహసిన్, జమాల్ షరీఫ్, షకీల్, మసీ ఉర్ రెహ్మాన్, సాజిద్, సలీం, అజారుద్దీన్, నూరుద్దీన్, ఖాళీం, అజీమ్, సయ్యద్ జహంగీర్ హుస్సేన్, ఇస్మాయిల్, ఎజాజ్, అజారుద్దీన్ పాల్గొన్నారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ -
ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగం
నిట్ వరంగల్లోని ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనలకు సప్తగాన్ ఏషియా వాహన పనితీరు తోడ్పడుతుంది. మెరుగైన రహదారులు, రవాణా సౌకర్యం నిర్మాణానికి ఆయా ప్రదేశాల డేటా అవసరం. అలాంటి డేటాను సప్తగాన్ అందజేస్తుంది. నేషనల్ హైవేలో నిర్మించే రహదారులపై అవసరమైన సూచనలు, పరిశీలన వివరాలను భారత ప్రభుత్వం.. నిట్ వరంగల్నుంచి కోరుతోంది. అలాంటి పరిశీలనలకు సప్తగాన్ ఏషియాతో ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుంది. – శంకర్, సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, సప్తగాన్ ఏషియా కో–ఆర్డినేటర్ ● -
జాఫర్గూడెంలో సంపూర్ణ మద్యనిషేధం
రఘునాథపల్లి: మండలంలోని జాఫర్గూడెంలో మద్యం విక్రయాలను నిషేధిస్తున్నట్లు గ్రామసభలో తీర్మానం చేశారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విచ్చలవిడిగా బెల్ట్షాపుల నిర్వహణతో కుటుంబాలు చిద్రమవుతున్నాయని మహిళలు, యువకులు.. పంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ నెల 25 నుంచి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నట్లు సర్పంచ్ శాగ సురేష్ బుధవారం తెలిపారు. గ్రామంలో మద్య నిషేధం అమలుకు సహకరించాలని పోలీసులు, ఎకై ్సజ్ అధికారులకు వినతి పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా గ్రామంలో మద్యం విక్రయిస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పథకాలు నిలిపివేయనున్నట్లు ఆయ న పేర్కొన్నారు. గ్రామంలో మద్య నిషేధం అమలు చేయడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కావ టి రవి, పంచాయతీ కార్యదర్శి బండ మధు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఏఐటీయూసీ మహాసభను జయప్రదం చేయాలి జనగామ రూరల్: ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభ జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సీహెచ్ రాజారెడ్డి అన్నారు. పట్టణంలోని గబ్బెట గోపాల్ రెడ్డి భవనంలో మోటే శ్రీశైలం అధ్యక్షతన బుధవారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో పాలకులు అవలంభిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు, లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులపై తీవ్రమైన దాడికి గురి చేస్తున్నాయన్నారు. ఐక్యతతో లేబర్ కోడ్స్పై దేశవ్యాప్తంగా ప్రతిఘించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మహాసభల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల శ్రీనివాస్, ఆదిసాయన్న, చొప్పరి సోమయ్య, యాకూబ్, సదానందం, నాగరాజు, సుశీల, పోచమ్మ, ఐలయ్య, సిద్దిరాములు, యాకయ్య, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ కార్డుల్లో పలు తప్పులురఘునాథపల్లి: స్మార్ట్ రేషన్ కార్డులు తప్పుల తడకగా ఉన్నాయి. లబ్ధిదారుల పేర్లు మొదలు, గ్రామం, పిన్కోడ్ ఇలా చాలా తప్పులు దొర్లాయి. మండల కేంద్రంలో ఈ నెల 21న ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించిన ఈ కార్డుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇందులోని మెజారిటీ కార్డులో అక్షర దోషాలు ఉంటున్నాయి. రఘునాథపల్లి మండలంలోని పలు గ్రామాల పేర్లు తప్పుగా ముద్రించారు. కంచనపల్లి, రఘునాథపల్లి తదితర గ్రామాల పేరు చివరన పల్లికి బదులు.. పల్లె అని ఉంది. పిన్కోడ్ 506244 బదులు.. 506143 గా ముద్రించారు. కార్డుపై పేరుతోపాటు ఆన్లైన్లో కుటుంబ సభ్యుల పేర్లలోనూ తప్పులు ఉన్నాయి. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉండడంతో కార్డులపై ముద్రించిన వివరాలు తప్పుగా ఉండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై వివరణ కోరేందుకు తహసీల్దార్ రాజేష్రెడ్డిని ఫోన్లో ప్రయత్నించగా.. స్పందించలేదు. అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు జరగనున్న 12వ రాష్ట్ర స్థాయి జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈపోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 33 జిల్లాలు, 4 అకాడమీలు, 3 క్రీడా పాఠశాలల నుంచి 1,600 మంది అథ్లెట్లు పాల్గొన్నట్లు నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. అండర్–14, 16, 18, 20 బాలబాలికలకు రెండు రోజుల పాటు 120 ఈవెంట్లలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన అథ్లెట్లను సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో పాండిచ్చేరీలో జరగనున్న సౌత్జోన్ జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ వరదరాజేశ్వర్రావు ముఖ్య అతిథిగా హాజరై పోటీలు ప్రారంభించారు. -
ప్రతీ మహిళ సంఘమిత్రగా మారాలి
జనగామ: మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషించాలని, ప్రతీ మహిళ తన కుటుంబంతోపాటు గ్రామాలు, పట్టణాలను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడే ‘సంఘమిత్ర’గా మారాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత పిలుపునిచ్చారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు సంఘమిత్ర–మాదకద్రవ్యాల నిర్మూలనపై కలెక్టరేట్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి కమిషనర్ శ్వేత.. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీపీ శ్వేత మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో మహిళా సంఘాలు కీలకంగా పనిచేస్తున్నాయని, అదే స్ఫూర్తితో మాదకద్రవ్యాల నిర్మూలనకు సహకరించాలని కోరారు. పోలీసుల సంఖ్య పరిమితంగా ఉన్నందున మహిళా సంఘాల సహకారంతో అవగాహన కల్పించవచ్చన్నారు. గంజాయి విక్రయాలు, రవా ణా, వినియోగంపై సమాచారాన్ని 112కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, అవసరమైతే బహుమతులు అందిస్తామని తెలిపారు. డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుదాం జిల్లాలో సుమారు 1.25 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు ఉన్నారని, వారి ద్వారా డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వల్ల కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, గృహహింస, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. జనగామను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ.. డ్రగ్స్ మొదట సరదాగా ప్రారంభమై ప్రాణాంతక వ్యసనంగా మారుతుందని తెలిపారు. పిల్లల ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు, ఆలస్యంగా ఇంటికి రావడం, కొత్త స్నేహాలు వంటి లక్షణాలను తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. ఎన్డీపీఎస్ చట్టం–1985 ప్రకారం మాదకద్రవ్యాల విక్రయం, రవాణా, వినియోగం, నిల్వపై కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, చికిత్స, పునరావాసంపై సైకాలజిస్ట్ డాక్టర్ విజయక్రాంతి అవగాహన కల్పించారు. విద్యార్థులు నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని అందించారు. అనంతరం డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఏసీపీలు భీం శర్మ, నర్సయ్య, ఏపీడీ నూరుద్దీన్, చాకలి ఐలమ్మ సమాఖ్య నాయకురాలు మమత తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చుదాం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
సంక్షేమ పథకాలకు స్మార్ట్ కార్డులే కీలకం
లింగాలఘణపురం: భవిష్యత్లో సంక్షేమ పథకాలన్నింటికీ స్మార్ట్ కార్డులే కీలకం కానున్నాయని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని చీటూరులో రూ.45 లక్షలతో సీసీ రోడ్డు, రూ.10 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ.34.80 లక్షలతో పాఠశాల గదులు, ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన బుధవారం చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రేషన్ బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా, ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకొనే విధంగా, ప్రతీ ప్రభుత్వ పథకానికి ఐడీ కార్డులా స్మార్ట్ రేషన్కార్డు పని చేస్తుందని అన్నారు. మండలంలో 13,803 స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తుండగా అందులో 2,228 కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోనే స్టేషన్ఘన్పూర్ అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలోనే సామాజిక న్యాయం జరుగుతుందని, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. సమావేశాల్లో తహసీల్దార్ అండాలు, ఎంపీఓ సుమన్, సర్పంచ్లు బర్ల గణేష్, ఎడ్ల లావణ్యరాజు, మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు విజయ్మనోహర్, మార్కెట్ డైరెక్టర్ మోహన్, కాంగ్రెస్ జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు వంశీధర్రెడ్డి, దిలీప్రెడ్డి, సర్పంచ్లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
కొత్త పింఛన్లకు కసరత్తు
జనగామ: ప్రభుత్వం అర్హులైన కొత్తవారికి చేయూత పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఒంటరి మహిళలు, వితంతులు, గీత, చేనేత కార్మికులు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులతో పాటు దివ్యాంగులు, తలసే మియా, సికిల్సెల్, హీమోఫీలియా బాధితులకు చోటు కల్పించారు. ఈ నెల 31న దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం అర్హుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. హైదరాబాద్లోని సంబంధిత సాంకేతిక విభాగం సమాచారం. అనంతరం గెజిటెడ్ అధికారి పర్యవేక్షణలో క్షేత్రస్థాయి అధికారులతో కలిసి థర్డ్పార్టీ విచారణ చేపట్టే అవకాశం ఉంది. అర్హతల పరిశీలనలో కుటుంబ ఆర్థిక పరిస్థితి, భూమి, వాహనాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐదు ఎకరాలకు మించి భూమి కలిగి ఉండటం వంటి నిబంధనలు ఉన్నట్లు సమాచారం. అయితే అర్హతలు, అనర్హతలకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు ప్రభుత్వం నుంచి అధికారికంగా వెలువడాల్సి ఉంది. పరిశీలన, విచారణ ప్రక్రియ పూర్తయిన అనంతరం వచ్చే నెల చివరి వారంలో కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అర్హుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతోంది. జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలతోపాటు గ్రామ పంచాయతీల పరిధిలోని దరఖాస్తులను ఎంపీడీఓ కార్యాలయాల్లో నమోదు చేస్తున్నారు. వృద్ధాప్యంతోపాటు ఇతర కేటగిరీల్లో పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. అదే సమయంలో మరణించిన లబ్ధిదారుల పేర్లను ప్రత్యేకంగా కేటాయించిన లాగిన్ ద్వారా తొలగించే ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్లు తెలిసింది.కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు అర్హులైన వారికి దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఆశావహుల ఇళ్లకు వెళ్లి దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియపై అవగా హన కల్పించడంతోపాటు అవసరమైన సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెలలో కొత్త పింఛన్లు మంజూరయ్యే అవకాశం ఉండటంతో రాజకీయ నా యకులు ఈ అంశంపై దృష్టి పెట్టారు. అర్హులైన వా రి వద్దకు వెళ్లి దరఖాస్తులు చేయించేందుకు ఆయా పార్టీలకు చెందిన నాయకులు పోటీ పడుతున్నారు. భవిష్యత్లో పింఛన్ మంజూరైతే తమ చొరవతోనే వచ్చిందని చెప్పుకుని ఓట్లు అభ్యర్థించే పరిస్థితి ఉంటుందనే చర్చ జరుగుతోంది. నాయకులు ఇళ్లకు వెళ్లిన సందర్భంలో వృద్ధాప్య అర్హత ఉన్న తమకు పింఛన్ ఎందుకు రాలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో నాయకులు వారికి సర్దిచెబుతూ అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి అవకాశం కల్పించేలా ప్రయత్నిస్తామని హామీ ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 27 వేలకు పైగా అర్జీలు వచ్చే నెలలో అర్హులకు పింఛన్లు మంజూరయ్యే అవకాశంగ్రేడ్– 2, గ్రేడ్– 3 పైలేరియా బాధితులు, ఆరోగ్యశ్రీలో డయాలసిస్ చికిత్స పొందుతున్న వారికి వయోపరిమితి లేకుండా పింఛన్ మంజూరు చేయనున్నారు. వీరిని సంబంధిత వైద్య, ఆరోగ్యశ్రీ విభాగాలు ధ్రువీకరించాల్సి ఉంటుంది. అర్హులు పంచాయతీ కార్యదర్శి, వార్డు అధికారి లేదా ఎంపీడీఓ కార్యాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నాలుగేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు త్వరలో శుభవార్త అందే అవకాశం ఉంది. జిల్లాలో ప్రస్తుతం 73,829 మంది లబ్ధిదారులకు ప్రతీ నెల రూ.18.32 కోట్ల మేర ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం ఇప్పటివరకు సుమారు 27వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. దరఖాస్తు ప్రక్రియ ఈనెల 31వ తేదీ వరకు కొనసాగనుంది. -
నిట్తో ఎంఓయూ..
కాజీపేట అర్బన్ : ‘నా దారి రహదారి.. బెటర్ డోంట్ కమిన్ టు మై వే’ అనే సినిమా డైలాగ్ను తలపిస్తూ ‘మెరుగైన రహదారుల నిర్మాణానికి అవసరమైన డేటా అందించడమే నా దారి’ అంటూ ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన సప్తగాన్ వాహనం ఇటీవల నిట్ వరంగల్కు చేరుకుంది. భారతదేశంలోనే తొలిసారిగా హరియాణా, గురుగ్రామ్లో అడ్వాన్స్ టెక్నాలజీ, రూ.30 కోట్ల వ్యయంతో దీన్ని రూపొందించారు. ఆధునిక టెక్నాలజీతో రూపకల్పన మెరుగైన రహదారుల నిర్మాణంలో కీలకం నిట్ వరంగల్తో ఎంఓయూ.. ఇటీవల పనితీరును పరిశీలించిన విద్యార్థులు ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనకు ఉపయుక్తంమెరుగైన రవాణా సౌకర్యం, రహదారుల నిర్మాణాల్లో లోపాన్ని పసిగట్టడం, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ పరిశోధనలకు దేశవ్యాప్తంగా ఈ సప్తగాన్ ప్రయాణం చేస్తోంది. ఇందులో మన ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు ఇటీవల సప్తగాన్ ఏషియా సంస్థ నిర్వాహకులు, నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. భారత ప్రభుత్వం వికసిత్ భారత్, మేక్ ఇన్ ఇండియా విజన్లో భాగంగా ఈ వాహనాన్ని ఇక్కడికి తీసుకురాగా, వాహన పనితీరును విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. వాహన పనితీరుపై పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పర్చుకున్నారు. -
పీపీఈటీఏ నూతన కమిటీ ఏర్పాటు
జనగామ: ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ (పీపీఈటీఏ) జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం తెలిపారు. జిల్లాలోని ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల సమస్యల పరిష్కారం, సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధే లక్ష్యంగా కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతోపాటు పాఠశాలల్లో శారీరక విద్యకు మరింత ప్రాధాన్యత కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. నూతన కమిటీ ఇలా.. చైర్మన్గా జంగిడి గుణవర్ధన్, అధ్యక్షుడిగా మునిగే సురేష్, ఉపాధ్యక్షులుగా టి.రంజిత్, సుధాకర్, ప్ర ధాన కార్యదర్శిగా బి.రమేష్, కోశాధికారిగా కె.మనోజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్.సురేందర్, పబ్లిక్ రిలేషన్స్గా పి.శ్రవణ్, స్పోక్స్ పర్సన్గా వి.వినోద్ కుమార్, అంజి, మీడియా సెక్రటరీగా ఏ.సాయిరాం ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా నరసింహ, స్వాతి, పి.రవి, జి.మధు, టి.మహేష్, మండల ప్రతినిధులుగా రవి, జె.సురేష్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా తిరుమలేష్, రాజు, సరిత, బాలస్వామి, శ్రీధర్, మనీషా, ప్రశాంత్, అశ్విని, సత్య నిరంజన్, చందర్, ప్రదీప్, రాజశేఖర్, శ్రీనివాస్, అజయ్, రణదీప్, హేమలతను నియమించారు. -
మళ్లీ ‘లేఖల’ లొల్లి?
సాక్షిప్రతినిధి, వరంగల్ : పోలీస్శాఖలో ఇన్స్పెక్టర్ల బదిలీలు మరోసారి రాజకీయ సిఫారసుల చర్చకు తెరలేపాయి. మల్టీజోన్–1 పరిధిలో తొమ్మిది మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అధికారికంగా పరిపాలనా కారణాలతోనే బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ.. కొందరు ఇన్స్పెక్టర్లు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో తమకు అనుకూలమైన పోస్టింగుల కోసం ప్రయత్నించారన్న ఆరోపణలు పోలీస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. భూపాలపల్లిలో కీలక మార్పులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్బీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న చెన్నూరి శ్రీనివాస్ను జయశంకర్ భూపాలపల్లి ఎస్హెచ్ఓగా నియమించారు. అక్కడ చిట్యాల సర్కిల్లో పనిచేస్తున్న దగ్గు మల్లేశ్ను మల్టీజోన్–1, హైదరాబాద్కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో యడ్లపల్లి సతీష్ చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియమించారు. ఇదే జోన్ పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ముగ్గురు ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. వరంగల్కు ముగ్గురు.. ఒకరు బయటకు.. వరంగల్ కమిషనరేట్కు తాజా బదిలీల్లో ముగ్గురు ఇన్స్పెక్టర్లు వచ్చారు. రామగుండం కమిషనరేట్ టాస్క్ఫోర్స్లో పనిచేస్తున్న తెల్లబోయిన కిరణ్, రామగుండం కమిషనరేట్ లీగల్ సెల్లో పనిచేస్తూ మల్టీజోన్–1 కంట్రోల్ రూమ్కు అటాచ్ అయి ఉన్న అనుముల శ్రీనివాస్ను కూడా వరంగల్ కమిషనరేట్కు పంపారు. హైదరాబాద్ టీజీఐసీసీసీ ఇన్స్పెక్టర్ భరత్ సుమన్ను కూడా కమిషనరేట్లో రిపోర్టు చేయాలన్నారు. మరోవైపు వరంగల్ కమిషనరేట్ సీఎస్బీలో పనిచేస్తున్న యడ్లపల్లి సతీష్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సర్కిల్కు బదిలీ చేశారు. అధికారికంగా మాత్రం ‘అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్’... మల్టీజోన్–1 పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ తొమ్మిది మంది బదిలీలను ‘ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్’గా పేర్కొంది. దీంతో అధికారిక ఉత్తర్వుల్లో పరిపాలనా కారణాలే కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం రాజకీయ సిఫారసులపై చర్చ సాగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఎవరి సిఫారసు పనిచేసింది? ఎవరి పోస్టింగ్ మారింది? అన్నదానిపై పోలీస్ శాఖలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. భవిష్యత్లో జరగనున్న బదిలీలు, పోస్టింగ్ల ఉత్తర్వులు వెలువడితే గాని మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగిన ప్రతీసారి రాజకీయ సిఫారసుల అంశం తెరపైకి వస్తుండటం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా తమకు అనుకూలమైన సర్కిల్, కమిషనరేట్ లేదా కీలక విభాగంలో పోస్టింగ్ కోసం ప్రజాప్రతినిధుల సిఫారసులు తీసుకొస్తున్నారన్న ఆరోపణలు గతంలోనూ వినిపించాయి. తాజాగా మల్టిజోన్–1 పరిధి లోని 9 మందికి బదిలీ కాగా.. తమకు అనుకూలమైన పోస్టింగ్ల కోసం మరికొందరు ఇన్స్పెక్టర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం. త్వరలోనే వరంగల్ కమిషనరేట్, జేఎస్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన కొందరికి బదిలీలు ఉంటాయంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి కరీంనగర్ల నుంచి కొందరు వరంగల్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం ఉంది. పోలీస్ పోస్టింగుల్లో తీవ్ర చర్చ మల్టీజోన్–1లో 9 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ వరంగల్ కమిషనరేట్కు ముగ్గురు.. ఇక్కడినుంచి ఒకరు బయటకు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో పోస్టింగులంటూ ఆరోపణలు.. గతంలోనూ ఇదే తరహా వివాదాలు -
నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలి
జనగామ రూరల్: ప్రజల భాగస్వామ్యంతో విరివి గా మొక్కలు నాటడంతో పాటు నాటిన ప్రతీ మొ క్కను సంరక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని చౌడారం గ్రామంలోని వన మహోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంబించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన మహోత్సవ లక్ష్యాలను ప్రజలందరి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ భాస్కర్, అటవీ శాఖ ఎఫ్ఆర్ఓ భాస్కర్, డీఏఓ అంబికా సోనీ, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఎంపీడీఓ మహేష్ నాయక్, సర్పంచ్ కె. పద్మ, ఉప సర్పంచ్ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. మెరుగైన దిగుబడులు సాధించాలి పంటల వైవిధ్యీకరణ, సహజ వ్యవసాయంతో రైతులు మెరుగైన దిగుబడులు సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. చౌడారం గ్రామంలో కలెక్టర్ రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి, పంటల సాగు, సహజ వ్యవసాయం, ఉద్యానవన పథకాల అమలు తీరును పరిశీలించారు. రైతు రామ్ దయాకర్రెడ్డి తన మూడు ఎకరాల భూమిలో సాగు చేస్తున్న కంది, సోర, బీర, దొండతో పాటు ఇతర కూరగాయల పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఏఓ అంబికా సోనీ, ఉద్యానవన అధికారి నర్సయ్య, సర్పంచ్ పద్మ, ఏఓ శరత్, ఏఈవో అనిల్, హెచ్ఈవో అరవింద్, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా -
ఆరోగ్య పుష్టి
జనగామ రూరల్: రైతుల ఆదాయం పెరగాలంటే సంప్రదాయ పంటలతో పాటు ఆరోగ్య సిరి కలిగిన ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. డ్రాగన్ ఫ్రూట్ వంటి అధిక విలువైన ఉద్యాన పంటలు రైతులకు ప్రత్యామ్నాయ ఆదా య మార్గంగా నిలుస్తున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ పంటను జిల్లా వ్యాప్తంగా 52 ఎకరాల్లో 20 మంది రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలోని నర్మెట మండలంలోని గుంటూరుపల్లి గ్రామ రైతులు సంప్రదా య వరి సాగుకు భిన్నంగా ఆలోచిస్తూ, అధిక నీటి అవసరం ఉన్న పంటలకు దూరంగా ఉంటూ పంటల వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తున్నారు. గ్రామంలో రైతులు సమష్టిగా డ్రాగన్ ఫ్రూట్, పత్తి, కందులు, కూరగాయలు, తదితర పంటలను సాగు చేస్తూ ఆదాయ మార్గాలను చూసుకుంటున్నారు. అలాగే రఘునాథపల్లి మండలంలోని గోవర్ధనగిరి వద్ద ఓ రైతు 5 ఎకరాల్లో 4 ఏళ్ల నుంచి సాగు చేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. సాగు ఇలా.. డ్రాగన్ ఫ్రూట్ సాగులో నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు డ్రిప్ ఇరిగేషన్ వంటి సూక్ష్మనీటిపారుదల పద్ధతులు ఉపయోగించుకోవా లి. తోట ఏర్పాటుకు అవసరమైన పందిరి నిర్మాణ ఏర్పాటుకు ఎకరాకు సుమారు రూ.1.35లక్షలు, మొక్కలకు రూ.45వేలు, డ్రిప్ ఇరిగేషన్న్కు రూ.35 వేలు, భూమి తయారీకి రూ.40–50వేలు, బేసల్ అప్లికేషన్కు సుమారు రూ.20 వేల వరకు వ్యయం అవుతుంది. రెండో సంవత్సరం నుంచి ఎకరాకు సుమారు రూ.73 వేల వరకు నిర్వహణ వ్యయం ఉండగా, సరైన నీటి యాజమాన్యం, పోషకాల వినియోగం, కలుపు నియంత్రణ, తెగుళ్ల నివారణ వంటి శాసీ్త్రయ పద్ధతులను పాటిస్తూ స్థిరమైన దిగుబడులు సాధించవచ్చు. అంతర పంటలతో ఆదాయం డ్రాగన్ ఫ్రూట్తో పాటు వివిధ రకాల కూరగాయ పంటలు కూడా రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తాయి. టమాట, వంకాయ, మిరప, బెండ, బీరకాయ, సోరకాయ, కాకరకాయ, ఫ్రెంచ్ బీనన్స్ వంటి పంటలను మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా సాగు చేయడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. టమాటకు ఎకరాకు సుమారు రూ. 96,996 వ్యయం కాగా, సుమారు రూ.4.80 లక్షల స్థూల ఆదాయం, రూ.3.83 లక్షల వరకు నికర రాబడి లభిస్తోంది. అదే విధంగా వంకాయకు రూ. 81,131 వ్యయం కాగా, రూ.3.60 లక్షల స్థూ ల ఆదాయం, రూ.2.79 లక్షల వరకు నిక ర రాబడి వస్తోంది. మిరపలో ఎకరాకు రూ. 76,741 వ్యయంతో రూ.3 లక్షల స్థూల ఆదాయం, రూ.2.23 లక్షల వరకు నికర రాబడి పొందుతున్నారు. సాగుకు ప్రోత్సాహకాలు ఉద్యాన సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సబ్సిడీలు, సాంకేతిక సహాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్, నాణ్యమైన మొక్కలు, తోటల ఏర్పాటు, యాజమాన్య పద్ధతులపై సంబంధిత శాఖల నుంచి మార్గదర్శకాలను పొందాలి. -
రాజామహేంద్ర నాయక్కు ఐపీఎస్ హోదా
జనగామ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ వెస్ట్జోన్ (జనగామ) డీసీపీ బి.రాజామహేంద్ర నాయక్కు ఐపీఎస్ హోదా లభించింది. కేంద్ర హోంశాఖ ఈ మేరకు 24న నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ క్యాడర్లో ఖాళీగా ఉన్న తొమ్మిది ఐపీఎస్ పోస్టుల భర్తీకి 2025 సెలెక్ట్ లిస్ట్ను కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక కమిటీ ఆమోదించినట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ సర్వీస్ నుంచి ఐపీఎస్కు పదోన్నతి పొందిన అధికారుల్లో బి.రాజామహేంద్ర నాయక్ ఒకరు. రాజామహేంద్ర నాయక్ ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్ పరిధిలోని వెస్ట్జోన్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా పని చేసిన ఆయన్ను 2024లో జనగామ డీసీపీగా నియమించారు. కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ ప్రకారం ఐపీఎస్ హోదా పొందిన అధికారులపై నిబంధనల ప్రకారం తదుపరి ప్రక్రియ కొనసాగనుంది. 2010 బ్యాచ్ డీఎస్పీగా.. పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన బి. రాజామహేంద్ర నాయక్ 2010 బ్యాచ్ డీఎస్పీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందారు. కరీంనగర్లో రీజినల్ ఇంటెలిజెన్స్ ఆఫీ సర్గా ఎస్పీ హోదాలో పని చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అదనపు ఎస్పీగా, మహబూ బాబాద్, ములుగు ప్రాంతాల్లో ఎస్డీపీఓగా బాధ్యతలు నిర్వర్తించారు. వరంగల్ అర్బన్లో డీఎస్పీ (క్రైమ్స్)గా కూడా సేవలందించారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎస్డీపీఓగా బాధ్యతలు నిర్వహించారు. వివిధ జిల్లాలు, విభాగాల్లో పనిచేస్తూ పోలీసింగ్లో అనుభవాన్ని సంపాదించిన ఆయనకు తాజాగా ఐపీఎస్ హోదా లభించడంతో సహచరులు, పోలీస్ శాఖ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. డీసీపీకి సీపీ అభినందనలు ఐపీఎస్ హోదా పొందిన డీసీపీ రాజామహేంద్ర నాయక్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత(ఐపీఎస్)ను మర్యాదపూర్వకంగా కలుసుకొని మొక్క అందజేశారు. ఈ సందర్భంగా రాజామహేంద్రనాయక్ను పోలీస్ కమిషనర్ అభినందించారు. పోలీస్ శాఖ వర్గాల్లో హర్షం -
సర్కార్ బడుల్లో శాస్త్ర విజ్ఞానం
జనగామ: పాఠశాల విద్యార్థుల్లో వైజ్ఞానిక దృక్పథాన్ని, పరిశోధనాత్మక ఆలోచనలను పెంపొందించేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రభుత్వ బడుల్లో శాస్త్ర విజ్ఞానంపై ప్రాయోగిక అవగాహన కల్పించేందుకు సైన్స్ ల్యాబొరేటరీలు ఏర్పాటు చేయనుంది. సమగ్ర శిక్ష తెలంగాణ 2026–27 వార్షిక కార్యాచరణ, బడ్జెట్లో భాగంగా జిల్లాలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలలకు సైన్స్ ల్యాబొరేటరీలను మంజూరు చేసింది. ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలల్లో ల్యాబ్ల ఏర్పాటుకు పరి పాలనా అనుమతులు ఇవ్వగా, ఒక్కో ల్యాబ్కు రూ.26 లక్షల చొప్పున జిల్లాకు మొత్తం రూ.1.04 కోట్ల నిధులు కేటాయించారు. మంజూరు చేసిన నిధులతో కేవలం ల్యాబ్ గదుల నిర్మాణమే కాకుండా వర్క్స్టేషన్లు, ఫర్నిచర్, సైన్స్ ల్యాబ్ పరికరాల కొనుగోలు, సరఫరా, ఏర్పాటు, పరీక్షలు, వినియోగానికి సిద్ధం చేయడం, అంతర్గత విద్యుదీకరణ, అనుబంధ పనులు చేపట్టనున్నారు. పనులను టర్న్కీ విధానంలో తెలంగాణ విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు నిర్వహించి చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. టెండర్లు ఖరారైన 15 రోజుల్లో పనుల కోసం 2025–26 షెడ్యూల్ ఆఫ్ రేట్స్ను, సివిల్ పనులకు 5 శాతం కాంట్రాక్టర్ లాభా న్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. టెండర్లు ఖరారైన 15 రోజుల్లో సంబంధిత సంస్థతో ఒప్పందాలు పూర్తి చేసి, అనంతరం పనులను వెంటనే ప్రారంభించాలి. విద్యార్థులు, ఉపాధ్యాయుల వినియోగానికి అవసరమైన ప్రదర్శన, శిక్షణ, నిర్వహణ పుస్తకాలు, వారంటీ, నిర్వహణ సదుపాయాలను కూడా కల్పించాలి. పనులు పూర్తయిన అనంతరం తెలంగాణ విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్యనిర్వహణ ఇంజినీర్, జిల్లా విద్యాశాఖాధికారి సంయుక్తంగా పరిశీలించి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ధ్రువీకరించిన తర్వాత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ల్యాబ్లను అప్పగించనున్నారు. బాలికల విద్యకు పెద్దపీట జిల్లాలో ఎంపికై న 4 పాఠశాలల్లో 3 పాఠశాలలు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ, రఘునాథపల్లి, నర్మెట, కొడకండ్ల) కావడం విశేషం. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద, వెనకబడిన వర్గాల బాలికలకు సైన్స్ పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రయోగాల ద్వారా నేర్చుకునే అవకాశం లభిస్తుంది. జిల్లాలోని రఘునాథపల్లి, పాలకుర్తి, నర్మెట, కొడకండ్ల మండలాల్లో రూ.1.04 కోట్ల వ్యయంతో సిద్ధం కానున్న ఈ ప్రయోగశాలలు విద్యార్థులలో సైన్స్పై ఆసక్తిని పెంచి, భవిష్యత్తులో వారు పోటీ పరీక్షల్లో రాణించడానికి, ఉన్నత విద్యా అవకాశాలను అందుకోవడానికి ఎంతగానో దోహదపడనున్నాయి. సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణం–వర్క్ స్టేషన్ ఫర్నిచర్ రూ.25 లక్షలు కేటాయించగా, ఇందులో ప్రయోగశాల పరికరాల కొనుగోలు, తదితర వాటి కోసం రూ. లక్ష ఖర్చు చేయనున్నారు. జిల్లాలోని నాలుగు పాఠశాలలకు సైన్స్ ల్యాబ్లు రూ.1.04 కోట్లతో నిర్మాణం ఒక్కో పాఠశాలకు రూ.26 లక్షలు ప్రయోగాత్మక విద్యకు ప్రభుత్వ ప్రోత్సాహంమండలం పాఠశాల యూనిట్లు వ్యయం రఘునాథపల్లి కేజీబీవీ 01 రూ.26 లక్షలు పాలకుర్తి చెన్నూరు 01 రూ.26 లక్షలు హైస్కూల్ నర్మెట కేజీబీవీ 01 రూ.26 లక్షలు కొడకండ్ల కేజీబీవీ 01 రూ.26 లక్షలు మొత్తం పాఠశాలలు 04 రూ.1.04 కోట్లు -
5 ఎకరాల్లో సాగు.. 14లక్షల ఆదాయం
నాలుగేళ్లుగా 5 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నా. యజమాని సాగుకు రెండు లక్షల వరకు పెట్టుబడి పెడుతాడు. ఏటా 40 ట్రిప్పుల పండ్లు మార్కెట్కు తరలిస్తాం. పెట్టుబడి నిర్వహణ ఖర్చులు పోగా రూ.7 లక్షల వరకు మిగులు ఉంటుంది. అంతర పంటలుగా కీరదోస, టమాట పంటలు వేస్తాం. సాగులో ఆర్గానిక్గా గోమూత్రం, ఆవుపెంట వేస్తాం. –బోయిని శ్రీనివాస్, తోట నిర్వాహకుడు, గోవర్ధనగిరి డ్రాగన్ ఫ్రూట్ సాగులో శాసీ్త్రయ పద్ధతులు పాటించడం, సరైన నీటి యాజమాన్యం, పోషకాల వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టా. మొదటి ఏడాది తోట ఏర్పా టు కోసం పెట్టుబడి కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ, తోట ఏర్పాటైన తర్వాత నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. సరైన యాజమాన్య పద్ధతులతో సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నా. – వెలంగన్ రెడ్డి, రైతు, గుంటూరుపల్లి, నర్మెట రైతులు సంప్రదాయ పంటలతో పాటు అధిక విలువ, అధిక ఆదాయం అందించే ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలి. డ్రాగన్ ఫ్రూట్ వంటి అధిక విలువైన పంటలను శాసీ్త్రయ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా రైతులు మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉంది. పంటల వైవిధ్యాన్ని పాటిస్తూ భూమి స్వభావం, నీటి లభ్యత, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కూరగాయలు, ఉద్యాన పంటలు, పత్తి, కంది వంటి పంటలను ఎంపిక చేసుకోవాలి. – సందీప్ కుమార్ ఝా, కలెక్టర్ -
యూనిఫామ్ కొలతల్లో తేడాలు సరిచేయాలి
● జూమ్ మీటింగ్లో డీఆర్డీఓ ఆదేశాలు జనగామ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్కారు అందజేస్తున్న ఉచిత యూనిఫామ్లలో అంగీలు పొడవుగా, నిక్కర్లు పొట్టిగా ఉండటంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘యూనిఫామ్.. వేస్తే తంటా–పొడగు అంగీ, పొట్టి నిక్కర్లతో విద్యార్థుల ఇబ్బందులు’ శీర్షికన సాక్షిలో ఈ నెల 25న ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా దేశాల మేరకు డీఆర్డీఓ భాస్కర్ మంగళవారం సంబంధిత ఏపీఎంలతో సమీక్ష నిర్వహించి సమస్యపై ఆరా తీశారు. యూని ఫామ్ల కొలతల్లో హెచ్చుతగ్గులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు, చెక్కర, మేకర్తో మరోసారి కొలతలను పరిశీలించి, విద్యార్థుల కు సరిపడే విధంగా సరిచేయాలని ఆదేశించా రు. డీఆర్డీఓ భాస్కర్ లింగాలఘణపురం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. డ్రెస్ కటింగ్లో తేడాలు రావడం వల్లే కొన్ని యూనిఫామ్లు విద్యార్థులకు సరిపోని పరిస్థితి ఏర్పడిందని ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. -
నియోజకవర్గాల అభివృద్ధికి సహకరించండి
స్టేషన్ఘన్పూర్: ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డిని వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సోమవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం, స్టేషన్ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎంతో చర్చించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిఽఽధిలో చేపట్టాల్సిన కీలక అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన, పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం, ప్రజలకు అవసరమైన వివిధ అభివృద్ధి పనులకు నిధుల మంజూరు తదితర అంశాలను ఎంపీ కావ్య సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఘన్పూర్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజల అవసరాలు, పెండింగ్ సమస్యలు, వివిధ ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై ఎమ్మెల్యే కడియం ముఖ్యమంత్రితో చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని కోరారు. కాగా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారని వారు తెలిపారు. సీఎంను కలిసిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం -
వినతులకు సత్వర పరిష్కారం
● ప్రజావాణిలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● 186 దరఖాస్తుల స్వీకరణజనగామ రూరల్: తమ సమస్యల పరిష్కారానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజల సమస్యలను కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆలకించి పరిస్కారానికి మార్గం చూపుతున్నారు. ప్రతీ వినతిపై అధికారులు నిర్లక్ష్యం లేకుండా స్పందించి, నిర్ణీత గడువులో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 189 దరఖాస్తులను స్వీకరించారు. కలెక్టర్ వచ్చిన అర్జీలను పరిశీలిస్తూ ఆర్జీదారుల సమస్యలను పూర్తిగా తెలుసుకొని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ ఎన్పీడీసీఎల్ సంపత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, డీపీఓ వెంకట్ రెడ్డి, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదులు ఇలా ఉన్నాయి.. జఫర్గఢ్ మండలం తీగవరం గ్రామానికి చెందిన వై.రాజు, తాను 6 ఎకరాల 21 గుంటల వ్యవసాయ భూమిని కొనుగోలు చేయగా, ఆ భూమి రిజిస్ట్రేషన్ జరగకుండా సంఘం సభ్యులు ఆపారని, ఆ భూమి రిజిస్ట్రేషన్ తన పేరు మీదకు చేసేలా చర్యలు తీసుకోవాలని దరఖాస్తు చేసుకున్నారు. చిల్పూర్ మండలం రాజవరం గ్రామానికి చెందిన ఇమ్మడి నర్తకి, తన 2.27 గుంటల భూమిని అమ్ముకునేందుకు అడ్డుపడుతున్నారని, ఆ భూమిని అమ్ముకునేందుకు తన బావ నుంచి రక్షణ కల్పించి, న్యాయం చేయాలని వినతి అందజేశారు. పాలకుర్తి మండలం మేకలతండా గ్రామానికి చెందిన ఎల్.స్వర్ణ, తమ గ్రామానికి సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని, కానీ స్థలం లేదని స్థలం కేటాయించాలని మనవి చేస్తూ వినతిపత్రం సమర్పించారు. జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్కు చెందిన ఎం.సరిత, తన కుమారుడు ఎం.మణిదీప్కు దివ్యాంగుల పింఛన్ రెండు నెలలుగా నిలిపివేయడం జరిగిందని, ఆధార్ కార్డులో వివరాల సవరణ చేయాలని, ఈ మేరకు నిలిచిన పింఛన్ వెంటనే పునరుద్ధరించాలన్నారు. మండల కేంద్రంలోని బొడ్రాయి సమీపంలో ఇంటి యజమానుల నుంచి అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న ఇండస్ సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేసేలా చర్యలు తీసు కోవాలని పాలకుర్తి మండల కేంద్రంలోని మహిళలు వినతి పత్రం అందించారు. పక్కనే మహిళా సంఘం కార్యాలయం, అంగన్వాడీ కేంద్రం, పిల్లలకు వైద్యసేవలు అందించే హెల్త్ సెంటర్ ఉన్నాయని, భద్రత, ఆరోగ్య కారణాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.అరగంటలోనే పరిష్కారంజిల్లా కేంద్రంలోని బాణాపురం కాలనీకి చెందిన మహమ్మద్ రఫత్ తన ఒక సంవత్సరం వయసు గల కుమార్తె మహమ్మద్ అల్ఫియనూర్ ఆరోగ్యశ్రీ కార్డులో పేరు నమోదు కాకపోవడంతో చికిత్సకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రజావాణిలో కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రఫత్ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. చిన్నారి అల్ఫియనూర్ కంటి సమస్యతో బాధపడుతుండగా, హైదరాబాద్లో శస్త్రచికిత్స చేయించాల్సి ఉందని వైద్యులు తెలిపారని, ఆపరేషన్కు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు అవుతుందని, ఆరోగ్యశ్రీ కార్డులో చిన్నారి పేరు నమోదు లేకపోవడంతో చేర్చాలని కలెక్టర్కు విన్నవించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించి, అరగంట వ్యవధిలోనే చిన్నారి పేరు ఆరోగ్యశ్రీ కార్డులో నమోదు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. -
నామిలేట్ పదవులు
47 రోజులు గడిచినా నామినేటెడ్ పోస్టులపై నాన్చివేత ధోరణిసాక్షిప్రతినిధి, వరంగల్: నామినేటెడ్ పదవులపై మరోసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పలువురు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం జూలై 8న ముగిసింది. వారి స్థానంలో కొత్తవారిని నియమించడమా? లేక పాతవారినే మరో సారి కొనసాగిస్తారా? అనే దానిపై వెంటనే నిర్ణయం వస్తుందని భావించారు. ఆ పదవుల కాలం ముగిసి 47 రోజులు గడిచినా ఆ ప్రస్తావనే లేదు. దీంతో ఇటు తాజా మాజీలు.. అటు ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీకి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే పదవులు ముగిసిన వారిలో కొందరు మరోసారి కొనసాగేందుకు అధిష్టానం పెద్దలను కలుస్తుండగా.. గత ఎన్నికల్లో టికెట్లు ఆశించి అవకాశం దక్కని వారు, ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నాయకులు, దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లు పదవుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశావహుల్లో ఉత్కంఠ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే దశల వారీగా నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. 2024 జూలై 8న ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా 37 మంది చైర్మన్లను ప్రభుత్వం నియమించగా.. ఉమ్మడి వరంగల్ నుంచి ఆరుగురికి అవకాశం లభించింది. పాలకుర్తి, వరంగల్ పశ్చిమ టికెట్లను ఆశించి తప్పుకున్న జంగా రాఘవరెడ్డికి ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి, పరకాల నుంచి పోటీకి వైదొలిగిన ఇనగాల వెంకట్రామిరెడ్డికి ‘కుడా’ చైర్మన్ పదవి లభించాయి. మహబూబాబాద్ నుంచి బెల్లయ్య నాయక్కు ట్రైబల్ కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, భూపాలపల్లి నుంచి అయిత ప్రకాశ్రెడ్డికి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎండీ రియాజ్కు గ్రంథాలయ పరిషత్ వంటి కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు అప్పగించారు. జూలై 8న వారి పదవీకాలం పూర్తయ్యింది. కాగా, జిల్లాలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు తొలుత నామినేటెడ్ పోస్టు (రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్) పదవి కట్టబెట్టిన అధిష్టానం.. ఆయన పదవీకాలం ముగిసిన వెంటనే మరో రెండేళ్లు పొడిగించింది. మిగతా ఆరు పోస్టులపై మాత్రం కొనసాగుతున్న సస్పెన్స్ తాజా మాజీలు, ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. మా పేర్లు పరిశీలించండి.. ఓవైపు తాజా మాజీలు కొనసాగింపు కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు కొత్తగా పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్, ఎమ్మెల్సీ తదితర నామినేటెడ్ పదవుల కోసం పోటీలో ఉన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ, జిల్లా స్థాయిల్లో పార్టీకి సేవలందించిన దొమ్మాటి సాంబయ్య, శనిగరపు ఇందిర, హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, కె.రవళి, నమిండ్ల శ్రీనివాస్, ఈవీ శ్రీనివాసరావు, పింగిళి వెంకట రాంనర్సింహరెడ్డి, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, బొమ్మనపల్లి అశోక్రెడ్డి, గాజర్ల అశోక్తో పాటు పలువురు నేతలు పదవుల రేసులో ఉన్నారు. వెన్నం శ్రీకాంత్రెడ్డి, భరత్ చంద్రారెడ్డి, గొల్లపల్లి రాజేందర్, మార్క విజయ్కుమార్, అబూబక్కర్, పోలెపల్లి రంజిత్రావు, మరికొందరు సీనియర్లు కూడా తమ పేర్లను పరిశీలించాలని అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నట్లు కూడా పార్టీ వర్గాల సమాచారం. మరింత సమయం పట్టే అవకాశం రెన్యూవల్ చేస్తారా.. కొత్తవారికి ఇస్తారా? అని సందిగ్ధం ఎటూ తేల్చని అధిష్టానం.. తాజా మాజీల్లో టెన్షన్ రోజురోజుకూ పెరుగుతున్న ఆశావహులుసీఎం, పీసీసీ చీఫ్, మంత్రులదే తుది నిర్ణయం ఈసారి నామినేటెడ్ పదవుల భర్తీలో అధిష్టానం ఎలాంటి ఫార్ములాను అనుసరిస్తుందన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారా? ఇప్పటికే పదవులు అనుభవించిన వారికి మరో అవకాశం కల్పిస్తారా? సామాజిక సమీకరణా లు, ప్రాంతీయ సమతుల్యతకు పెద్దపీట వేస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరు జిల్లాల మధ్య సమతుల్యతతో పాటు ఆయా సామాజికవర్గాలకు ప్రాతినిథ్యం కల్పించడం కూడా కీలకంగా మారనుంది. ఒకరికి పదవి ఇస్తే మరో సామాజికవర్గం నుంచి వచ్చే డిమాండ్ను ఎలా సమన్వయం చేయాలన్నది అధిష్టానానికి సవాలుగా మారే అవకాశముంది. ఇదిలా ఉండగా.. నామినేటెడ్ పోస్టుల భర్తీకి మరికొంత సమయం పట్టవచ్చని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్), ఇటీవలి రాజ కీయ పరిణామాల నేపథ్యంలో మరింత ఆలస్యం కావొచ్చన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా, ఈసారి కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీలో సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్తో పాటు ఆయా జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులే కీలకంగా మారనున్నాయ న్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో నడుస్తోంది. -
27న గ్రామసభలు, వార్డుసభలు నిర్వహించాలి
జనగామ రూరల్: ఈనెల 27న రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధా న ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. సోమవారం, ఎస్ఐఆర్ కార్యక్రమంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత గ్రామ పంచాయతీ భవనంలో, పట్టణ ప్రాంతాల్లో సంబంధిత పోలింగ్ కేంద్రంలో సభలు నిర్వహించాలని తెలిపారు. సభల వద్ద ఫారం–6, ఫారం–7, ఫారం–8, తదితర అవసరమైన ఫారాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ప్రతీ నోటీసులో విచారణ తేదీ, విచారణ జరిగే ప్రదే శం, సమయాన్ని స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసుల జనరేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఆర్డీఓలు గోపీరాం, కిరణ్ ప్రకాష్, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్ పాల్గొన్నారు. అధ్యాపక పోస్టుల భర్తీకి ఎంపిక పరీక్ష జనగామ రూరల్: జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఎంపిక పరీక్షను నిర్వహించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ – 6, అసోసియేట్ ప్రొఫెసర్ – 12, అసిస్టెంట్ ప్రొఫెసర్ – 7 పోస్టులు కలిపి మొత్తం 25 ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా, మొ త్తం 13 దరఖాస్తులు రాగా 10 మంది అభ్యర్థులు ఎంపిక పరీక్ష రాశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరీక్ష ప్రక్రియను పర్యవేక్షించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా.నాగమణి, జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆర్.కుమారస్వామి పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలిజనగామ రూరల్: ఫీజు రీయింబర్స్మెంట్ అందించి విద్యార్థులను ఆదుకోవాలని బీజేపీ జిల్లా అద్యక్షుడు సౌడ రమేశ్ డిమాండ్ చేశారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో ఎస్ఐఆర్ కమిటీ జిల్లా కన్వీనర్ బొజ్జపల్లి సుభాష్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ అందక చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేస్తున్న దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విడుదల రమేశ్, బల్ల శ్రీనివాస్,ఐలోని అంజిరెడ్డి, పెరుమళ్ళ అమరేందర్ రెడ్డి, దుర్గాప్రసాద్, సట్ల వెంకటరమణ, బైరుపాక కుమార్, పుప్పాల వేణు, గంటే ఉపేందర్, జగదీష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతిచిల్పూరు: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని నిద్రలోనే గుండెపోటుతో చనిపోయింది. ఈ ఘటన మండలంలోని వంగాలపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన గుగులోతు వసంత–రమేశ్ల కూతురు పల్లవి(16) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. మంగళవారం గ్రామంలో ఓ విందు కార్యక్రమంతోపాటు రాఖీ పండగ కోసం పల్లవిని వారం రోజుల సెలవుతో తండ్రి రమేశ్ ఆదివారం సాయంత్రం ఇంటికి తీసుకొచ్చాడు. రాత్రి 10 గంటల వరకు కుటుంబ సభ్యులతో గడిపిన పల్లవి నిద్రపోయింది. సోమవారం ఉదయం 8 అవుతున్నా నిద్రలేవకపోవడంతో తల్లి వసంత లేపే ప్రయత్నం చేయగా కదలిక లేకపోవడంతో అనుమానంతో చుట్టుపక్కల వారిని పిలవడంతోపాటు 108కి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరీక్షించగా అప్పటికే మృతిచెందిందని తెలిపారు. గుండెపోటుతో చనిపోయి ఉంటుందని సిబ్బంది చెప్పినట్లు కుటుంబ సభ్యులు రోదిస్తూ చెప్పారు. వారం రోజులు ఇంట్లో అందరితో కలిసి సంతోషంగా ఉంటుందనుకున్న కూతురు తమను శోకసముద్రంలో ఉంచి వెళ్లిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
చిన్నవి..పెద్దవి చేయడం ఎలా?
జనగామ: జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత యూనిఫామ్లు ఇబ్బందులకు కారణమవుతున్నాయి. జిల్లాలో సుమారు 500 ప్రభుత్వ విద్యాసంస్థల్లో 30వేల మందికి పైగా విద్యార్థులు చదువుతుండగా, ఇప్పటి వరకు ఒక్కో జత యూనిఫాం మాత్రమే అందింది. రెండో జత యూనిఫాంలను సిద్ధం చేస్తున్నారు. అయితే మొద టి జత దుస్తుల్లో విద్యార్థుల కొలతలకు సరిపోని షర్ట్, నిక్కర్లు, పొడవు, పొట్టి, లూజు, టైట్ సమస్యలు తలెత్తడంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. కొలతలు తీసుకోకుండానే కుట్టించారా..? కొన్ని ప్రాంతాల్లో విద్యార్థుల కొలతలు అరకొరగా తీసుకుని యూనిఫాంలు కుట్టించినట్లు తెలుస్తోంది. దీంతో ఒకరికి షర్టు పెద్దగా, మరొకరికి చిన్నగా, కొందరికి నిక్కర్లు పొట్టిగా, మరికొందరికి పొడవుగా వచ్చాయి. గుండీలు, భుజాల వద్ద కొలతలు కూడా సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గుర్తించిన అధికారులు ఇద్దరు మాస్టర్లను ఏర్పాటు చేసి, పాఠశాలల నుంచి వచ్చిన సమాచారంతో దుస్తుల కొలతలను సరిచేసి ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. సైజు తేడాతో.. బచ్చన్నపేట మండలంలో 12 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఐదు ప్రాథమికోన్నత, 27 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. కేజీబీవీ, మోడల్ స్కూల్ను కలుపుకొని 3,045 మంది విద్యార్థులు ఉన్నారు. కొన్నిచోట్ల యూనిఫాంలు తక్కువగా రావడంతో అదనంగా వచ్చిన పాఠశాలల నుంచి తెప్పించి పంపిణీ చేశారు. అయితే సైజులు సరిపోక కొందరు విద్యార్థులు పిన్నీసులు, టక్కులు వేసుకొని షర్ట్ను సర్దుకుంటున్నారు. జఫర్గఢ్ మండలంలో 30 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 2,542 మంది విద్యార్థులకు గాను ఇప్పటి వరకు 1,900 మందికి మాత్రమే ఒక్క జత యూనిఫాం అందించారు. ముందుగా కొలతలు తీసుకోకపోవడంతో షర్ట్, నిక్కర్లు లూజుగా ఉండటంతో పాటు సైజులు తేడాగా వచ్చాయి. నిక్కర్లు బెల్టు, మొల్దారాలు పెట్టినా జారిపోతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. పంపిణీలోనూ జాప్యం స్టేషన్ ఘన్పూర్ మండలంలో 33 ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు 861 మందికే అందాయి. అవి కూడా ఒక్కొక్క జత మాత్రమే. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో యూనిఫాంలు అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాలకుర్తి, కొడకండ్ల మండలాల్లోనూ ఒక్క జత యూనిఫాం మాత్రమే అందిన పాఠశాలలు ఉన్నాయి. కొడకండ్లలో 2,853 మంది విద్యార్థులకు మొదటి జత అందగా, కొలతలు సరిపోక పలువురు సొంతంగా సరిచేయించుకున్నారు. లింగాలఘణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో 95 మంది విద్యార్థులు ఉన్నారు. కొందరికి పొట్టి షర్ట్లు, నిక్కర్లు, మరికొందరికి పొడవైన దుస్తులు అందాయి. చిన్నవిగా వచ్చిన దుస్తులను ఎలా పెద్దగా చేస్తారంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. నర్మెట మండలంలోని పాఠశాలల్లో మొదటి జత పంపిణీ పూర్తి చేశారు. కొన్ని పాఠశాలల్లో నాణ్యత లేని వస్త్రం, అనుభవం లేని దర్జీలతో కుట్టించడం వల్ల కుట్లు సరిగా లేకపోవడం, జేబులు అస్తవ్యస్తంగా ఉండటం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. జనగామ మండలం, అర్బనన్్ పరిధిలోని 55 పాఠశాలల్లో 4,140 మంది విద్యార్థులకు యూనిఫాంలు అందించారు. అయితే కొలతలు సరిపోకపోవడంతో పలువురు తల్లిదండ్రులు సొంత ఖర్చుతో దుస్తులను సరిచేయించారు.పొడుగు అంగీ..పొట్టి నిక్కర్లతో విద్యార్థుల ఇబ్బందులు పిన్నీసులు, బెల్ట్లతో సర్దుబాటు ఒక్కో విద్యార్థికి ఒక్కో సైజు బట్ట ఇచ్చారు..సైజులో నిర్లక్ష్యం ప్రదర్శించారు ఇంకా పలుచోట్ల కానరాని దుస్తుల పంపిణీ -
రాష్ట్రస్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక..
రఘునాథపల్లి: మండలంలోని అశ్వరావుపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్ఎం శోభన్బాబు, పీఈటీ మచ్చ రాజేందర్ సోమవారం తెలిపారు. హనుమకొండ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 23న ఉమ్మడి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ప్యారాల కావ్యశ్రీ, శివరాత్రి అక్షయ, పొన్నగంటి సంపత్ అద్భుత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంిపికయ్యారన్నారు. ఈ నెల 28,29,30 తేదీల్లో హైదరాబాద్ బీహెచ్ఈఎల్లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈసందర్భంగా ఎంపికై న విద్యార్థులను సర్పంచ్ చైతన్య రాజు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రేణుక, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు అభినందించారు. కూనూరు విద్యార్థులు.. జఫర్గఢ్: మండలంలోని కూనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు బుల్లె అమూల్య, పెద్దపెల్లి భానుశ్రీ, కొలిపాక రిషి వరుణ్, చెవనబోయిన పూజశ్రీ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎండీ పర్వేజ్ ఒక ప్రకటనలో తెలి పారు. ఎంపికై న విద్యార్థులను పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఆకుల సాయికుమార్తోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. -
స్వచ్ఛతే లక్ష్యం
సోమవారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 202 11100705కొత్త ఆటోలు పాత ఆటోలు ట్రాక్టర్లుప్రైవేట్ ఆటోలుపురపాలికలో వాహనాలు, రోజువారీ చెత్త సేకరణ సమాచారంజనగామ: పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపాలిటీ మరో కీలక అడుగు వేసింది. పట్టణంలో చెత్త సేకరణకు 11 పెద్ద సైజు ఆటోలను కొత్తగా కొనుగోలు చేసింది. ఒక్కో ఆటోకు రూ.10.50 లక్షల చొప్పున వ్యయం చేసినట్లు సమాచారం. కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, కమిషనర్ రాజశేఖర్రెడ్డి పర్యవేక్షణలో స్వచ్ఛత కార్యక్రమాలను మరింత పటిష్టం చేస్తున్నారు. 11 కొత్త ఆటోలు జనగామ మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం ఉన్న వాహనాల ద్వారా రోజుకు సుమారు 10 టన్నుల చెత్తను సేకరిస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో చెత్త సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్య ప్రాంతాలు, రద్దీగా ఉండే వార్డుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ 11 కొత్త ఆటోలను కొనుగోలు చేసింది. కొత్త వాహనాలు ఇప్పటికే మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నాయి. వీటి నిర్వహణ కోసం తాత్కాలిక ప్రాతిపదికన మరో ఐదుగురు డ్రైవర్లను తీసుకున్నట్లు సమాచారం. కొత్త ఆటోలను ఎప్పటి నుంచి వినియోగంలోకి తీసుకురావాలనే విషయంపై చైర్పర్సన్, కమిషనర్ చర్చించిన అనంతరం అధికారికంగా వెల్లడించనున్నారు. ఒక్కో ఆటోకు తగ్గిన రూ.3లక్షల వ్యయం కొత్త వాహనాలు అందుబాటులోకి రావడంతో పాత వాహనాలకు అదనంగా వీటిని వినియోగించి వాణిజ్య ప్రాంతాలు, ముఖ్యమైన వార్డుల్లో రోజుకు రెండుసార్లు చెత్త సేకరించే అవకాశం ఉంది. చైర్పర్సన్, కమిషనర్ ప్రత్యేక కృషితో ఒక్కో ఆటోపై సుమారు రూ.3 లక్షల వరకు వ్యయం తగ్గింది. జనగామ స్వచ్ఛతే లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమాలకు పట్టణ ప్రజలు కూడా సంపూర్ణ సహకారం అందించాలని మున్సిపల్ అధికారులు కోరుతున్నారు. స్వచ్ఛతపై పురపాలిక కఠిన చర్యలు..! పట్టణాన్ని పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పురపాలిక మరింత కఠినంగా ముందుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. బహిరంగ ప్రదేశాల్లో ఇష్టానుసారంగా చెత్త వేస్తే జరిమానాలు విధించడంతో పాటు ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించనున్నట్లు సమాచారం. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధానాన్ని కచ్చితంగా అమలు చేయనున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులు రోజువారీ చెత్తను ప్రత్యేక డబ్బాల్లో వేసేలా పట్టణ ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకుండా చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛత కార్యక్రమాలకు సహకరించాలని పురపాలిక అధికారులు కోరుతున్నారు. మొత్తం వాహనాలు33 పురపాలికకు 11 కొత్త ఆటోలు పట్టణంలో ఇక చెత్త కష్టాలకు చెక్ ఉదయం, సాయంత్రం సేకరణకు సన్నాహాలు పాత వాహనాలకు తోడు కొత్తవి కొనుగోలు పట్టణ పారిశుద్ధ్యంపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టిరోజు చెత్త సేకరణ 10టన్నులు -
రామప్పలో సండే సందడి
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయంలో ఆదివారం సెలవు రోజు కావడంతో పర్యాటకులు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది. ఈ మేరకు హైదరాబాద్లోని అటవీశాఖలో శిక్షణ పొందుతున్న బీట్ ఆఫీసర్లు దేవాలయానికి చేరుకుని రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా శిల్పకళ సంపద అద్భుతంగా ఉందని వారు కొనియాడారు. అలాగే ఇంగ్లండ్ దేశానికి చెందిన హోవార్డ్, రేక్ చోంగ్లు రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్రను టూరిజం గైడ్ విజయ్కుమార్ వారికి వివరించారు. -
పంటలకు కాసింత ఊపిరి
జనగామ: జిల్లాలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కురిసిన ముసురు రైతుల్లో ఆశలు నింపింది. భూగర్భ జలాలు అడుగంటడంతో వానాకాలంలో సాగు చేసిన మొక్కజొన్న, పత్తి తదితర పంటలకు సాగునీరు అందక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆదివారం కురిసిన చిరు జల్లులు పత్తి, వరి పంటలకు కొంత ఊరటనిచ్చాయి. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు బచ్చన్నపేట మండలం పడమటికేశ్వాపూర్లో అత్యధికంగా 15.3 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. వడ్లకొండలో 9.0, బచ్చన్నపేట, జనగామలో 7.5, లింగాలఘణపురంలో 6.0, దేవరుప్పులలో 5.3, పాలకుర్తి, కొడకండ్లలో 5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జఫర్గఢ్లో 1.5, గూడూరు, మల్కాపూర్లో 1 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముసురు ఇలాగే కొనసాగితే పంటలకు మరింత ప్రయోజనం ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
పంచరాయి గుట్టలను రక్షించాలి
స్టేషన్ఘన్పూర్: మండలంలోని సముద్రాల గ్రామంలో ప్రకృతి సంపద అయిన పంచరాయి గుట్టలను అక్రమార్కుల నుంచి రక్షించాలని గ్రామానికి చెందిన గొర్రెల, మేకల పెంపకందార్లు, యాదవ సంఘం జిల్లా నాయకులు తాటికొండ యాదగిరి, కత్తుల రాజు డిమాండ్ చేశారు. గ్రామ శివారులో ఏదులబోడు వద్ద గొర్రెల, మేకల పెంపకందారులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ శివారులో 189 సర్వేనంబర్లో పంచరాయి భూములు, గుట్టల్లో తమ తాతల కాలం నుంచి గొర్రెలు, మేకలను మేపుతూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఇటీవల కొందరు గుర్తు తెలియని అక్రమార్కులు ఆయా పంచరాయిగుట్టలపై ఉన్న చెట్లను తొలగించారని, అక్రమంగా మొరంను కొల్లగొట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఈ విషయమై కలెక్టర్, రెవెన్యూ అఽధికారులు తక్షణమే స్పందించాలని, అక్రమార్కుల నుంచి సముద్రాల పంచరాయి గుట్టలను రక్షించాలని కోరారు. కార్యక్రమంలో గొర్రెలు, మేకల పెంపకందారులు బండి అశోక్, మేకల కొమురయ్య, ఎల్.ఎల్లయ్య, బండి రాములు, తాటికొండ నాగరాజు, కన్నెబోయిన అంజయ్య, కత్తుల మల్లయ్య, అశోక్, నాంపల్లి తదితరులు పాల్గొన్నారు. -
పాపన్న స్ఫూర్తితో హక్కులను సాధించుకుందాం
పాలకుర్తి టౌన్ (దేవరుప్పుల): సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితోనే గీత కార్మికుల హక్కులను సాధించుకుందామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ పిలుపునిచ్చారు. ఆదివారం దేవరుప్పుల మండలం చిన్నమడూరు గ్రామంలో మాజీ సర్పంచ్ వంగ పద్మ వెంకటేశ్వర్లు దాతృత్వంతో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా చిన్నమడూర్ టీసీఎస్ అధ్యక్షుడు ముసిగుంపుల నరేష్ అధ్యక్షత జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ట్యాంక్ బండ్పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రతిష్టించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పాపన్న స్ఫూర్తితో శ్రామిక రాజ్య స్థాపన కోసం కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చెట్ల పెంపకానికి సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. సమావేశంలో సుప్రజ హాస్పిటల్ ఎండీ విజయ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాల్నే వెంకట మల్లయ్య, వి. వెంకటనరసయ్య, రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి, బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యులు పరిధిల భాస్కర్, మండల కార్యదర్శి ఉడుగుల ప్రభాకర్, సర్పంచ్లు జోగేశ్వర్, పెద్ది కృష్ణమూర్తి, ధనలక్ష్మీ, వంగ అర్జున్, పరశురాములు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారుకేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ -
పారాత్రోబాల్ చాంపియన్షిప్గా రాష్ట్ర మహిళల జట్టు
స్టేషన్ఘన్పూర్: ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు తమిళనాడు కోయంబత్తూర్లో జరిగిన ఐదవ సౌత్ జోన్ పారా త్రోబాల్ చాంపియన్షిప్–2026 పోటీల్లో తెలంగాణ మహిళల జట్టు విజేతగా నిలువగా జట్టు కెప్టెన్ స్టేషన్ఘన్పూర్ మండలంలోని విశ్వనాథపురం గ్రామానికి చెందిన పారాత్రోబాల్ క్రీడాకారిణి ఉత్తమ ప్రతిభ కనబర్చింది. ఈ మేరకు ఉత్తమ ప్రతిభతో చాంపియన్షిప్గా నిలిచి బంగారు పతకం సాధించిన తెలంగాణ మహిళల జట్టుకు, ప్రత్యేకంగా కెప్టెన్ మాచర్ల కృష్ణవేణికి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు, జట్టు కోచ్ సింగారపు బాబు, మేనేజర్ తాళ్ల శ్రీనివాస్రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కాగా రాష్ట్ర మహిళల జట్టు కెప్టెన్గా రాణించిన కృష్ణవేణిని విశ్వనాథపురం గ్రామస్తులతో పాటు మండలంలోని పలువురు క్రీడాభిమానులు అభినందించారు. -
ముగిసిన ‘టోసా–ఓయాసిస్కా’
హన్మకొండ అర్బన్: హనుమకొండలో మూడు రోజులపాటు నిర్వహించిన టోసా–ఓయాసిస్కాన్(తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్–ఆర్థోపెడిక్ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్)–2026 ఆదివారం ముగిసింది. దేశవ్యాప్తంగా ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు పాల్గొని ఆధునిక చికిత్సా విధానాలు, శస్త్రచికిత్సలపై తమ అనుభవాలు పంచుకున్నారు. రోబోటిక్ సర్జరీ, కృత్రిమ మేధ, కీళ్ల మార్పిడి, వెన్నెముక శస్త్రచికిత్సలపై సదస్సులో చర్చించారు. ప్రత్యక్ష ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాల ద్వారా వైద్యులకు ఆచరణాత్మక అవగాహన కల్పించారు. సీనియర్ వైద్యుడు వేదుల సత్యనారాయణమూర్తి స్మారక ఉపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓయాసిస్ అధ్యక్షుడు డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి, కార్యదర్శి డాక్టర్ కె.రాంకుమార్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హైదరాబాద్కు చెందిన డాక్టర్ అల్వాల్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు పాల్గొన్నారు. -
ఫుట్పాత్ ఆక్రమణలపై చర్యలు
జనగామ: పట్టణంలో రైల్వేస్టేషన్ నుంచి ఆర్టీసీ చౌరస్తా జంక్షన్ వరకు ఫుట్పాత్లపై వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాల నివారణకు పోలీసులు శాఖ పరమైన చర్యలు చేపట్టారు. ఫుట్పాత్లు, రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని ట్రాఫిక్ పోలీసులు వెనక్కి జరుపుతున్నారు. సీఐ సత్యనారాయణరెడ్డి పర్యవేక్షణలో హెడ్కానిస్టేబుల్ హిదాయత్ అలీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు రోజువారీగా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఫుట్పాత్లపై వ్యాపారాలు నిర్వహించడంతో వాహనదారులతో పాటు పాదాచారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వ్యాపారులు తమ దుకాణాలను వెనక్కి జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. పాదాచారులు సురక్షితంగా రాకపోకలు సాగించేలా ఫుట్పాత్లను అందుబాటులో ఉంచడంతో పాటు వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ఈ చర్యలను నిరంతరం కొనసాగిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. -
పాఠశాల విద్య పరిస్థితి దయనీయం
జనగామ రూరల్: దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాల విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుందని, రాష్ట్రంలో పాఠశాలలను మూసివేసే కుట్ర జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు విమర్శించారు. ఆదివారం జిల్లాలో రాష్ట్రస్థాయి పాఠశాల విద్యార్థుల రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సింది పోయి పాఠశాలల మూసివేత, విలీనాలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తోందన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణాలతో పాఠశాలలను మూసివేయడం ద్వారా గ్రామీణ, పేద, కార్మిక, దళిత, ఆదివాసీ కుటుంబాల పిల్లలకు విద్యను దూరం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరుస్తూ ప్రైవేట్ విద్యను ప్రోత్సహించే విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతతో పాటు ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శనిగారపు రజనీకాంత్, ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి, దామెర కిరణ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మమత, జిల్లా కార్యదర్శి దాసగాని సుమ, కార్తీక్, రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్, విఘ్నేష్, జిల్లా అధ్యక్షుడు పొదల లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఐక్యతకు నిదర్శనం ‘తీజ్’
జనగామ: బంజారా సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే తీజ్ పండుగ నిమజ్జన కార్యక్రమం జనగామ పట్టణంలో ఆదివారం భక్తి, భావోద్వేగం, ఐక్యతల నడుమ ఘనంగా ముగిసింది. సంత్ సేవాలాల్ మహారాజ్, మెరామయాడి ఆశీస్సులతో తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన తీజ్ ఉత్సవాలకు ముగింపు సందర్భంగా బతుకమ్మకుంట వద్ద నిర్వహించిన నిమజ్జన కార్యక్రమానికి సుమారు 500 మంది బంజారా, గిరిజనులు హాజరయ్యారు. లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి వాంకుడోతు అనిత ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తీజ్ పండుగ బంజారాలకు కేవలం ఆచారం, ఉత్సవం మాత్రమే కాదని, అది వారి ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. తొమ్మిది రోజుల పాటు బంజారా మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తులు, ప్రత్యేక ఆభరణాలతో అలంకరించుకొని తీజ్ను భక్తిశ్రద్ధలతో పూజించారు. చివరి రోజు బతుకమ్మ కుంట వద్ద నిర్వహించిన నిమజ్జన కార్యక్రమంలో మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో బాలునాయక్, భిక్కునాయక్, లాల్మా నాయక్, దేవి, విజయ, మంజుల, రాధ, లలిత తదితరులు పాల్గొన్నారు. -
కూరగాయల సాగు బహుబాగు
జనగామ రూరల్: జిల్లాలో కూరగాయల సాగు ప్రోత్సాహానికి ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేసి మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా కేంద్ర వంటశాలలకు సరఫరా చేసేందుకు జిల్లాలో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈనెల 20వ తేదీ వరకు జిల్లా బృందాలు క్షేత్రస్థాయి పర్యటనలు పూర్తి చేశారు. హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్, అక్షయ పాత్ర ఫౌండేషన్, మన్నా ట్రస్ట్ ఆధ్వర్యంలో కేంద్ర వంటశాలలకు కూరగాయల సరఫరా ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఆరోగ్యకరమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందించడంతో పాటు రైతులకు స్థిరమైన మార్కెట్ కల్పించడం, పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించడం, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పించడం కార్యక్రమం ప్రధాన లక్ష్యం క్షేత్రస్థాయి పర్యటనలు జిల్లాలో ఇప్పటికే కూరగాయలు సాగు చేస్తున్న రైతులను గుర్తించడంతో పాటు, సాగునీటి వసతి, మార్కెట్ అనుసంధానం ఉన్న గ్రామాల్లో కొత్తగా కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు జిల్లా స్థాయి బృందం క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జనగామ, రఘునాథపల్లి, బచ్చన్నపేట, లింగాలఘణపురం, చిల్పూరు, జఫర్గఢ్, స్టేషన్ఘన్పూర్, నర్మెట్ట, తరిగొప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో రైతులతో సమావేశాలు పూర్తి కాగా మరో మారు ఈనెల 27, 28 తేదీల్లో గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించనున్నారు. స్థిరమైన మార్కెట్, మెరుగైన ధరలు కేంద్ర వంటశాలలకు అవసరమైన కూరగాయలను మహిళా స్వయం సహాయక సంఘాల సేకరణ కేంద్రాల ద్వారా రైతుల నుంచి నేరుగా సేకరించి సరఫరా చేయనున్నారు. మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించి, రైతులకు మెరుగైన ధరలు లభించేలా చర్యలు తీసుకోనున్నారు. రైతులు కూరగాయలు సరఫరా చేసిన 2–3 రోజుల్లోనే సత్వరం చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వ పథకాల అనుసంధానం కూరగాయల సాగుకు ముందుకు వచ్చే ప్రతీ రైతు వివరాలను సేకరించి, వారికి అవసరమైన విత్తనాలు, నారు, డ్రిప్, స్ప్రింక్లర్లు, శాశ్వత పందిళ్లు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు, మల్చింగ్, ప్లాస్టిక్ క్రేట్లు, వర్మీ బెడ్లు, జీవ ఎరువులు, జీవ పురుగుమందులు తదితర అవసరాలను నమోదు చేయనున్నారు. ఎంఐడీహెచ్, ఆర్కేవీవై, పీఎండీసీ, ర్యాడ్, పథకాలను ఉద్యానవన శాఖ పథకాలతో అనుసంధానం చేసి, అందుబాటులో ఉన్న సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలను ప్రాధాన్యంతో కల్పించేందుకు చర్యలు తీసుకుంటారు. మహిళా సంఘాలకు బాధ్యతలు కూరగాయల సేకరణ, గ్రేడింగ్, సార్టింగ్, రవాణా వంటి పోస్ట్ హార్వెస్ట్ కార్యకలాపాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషించనున్నాయి. కేంద్ర వంటశాలలకు అవసరమైన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కూరగాయలను నిర్వహించేలా మహిళా సంఘాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రైతుల నుంచి సేకరణ కేంద్రాలకు, అక్కడి నుంచి కేంద్ర వంటశాలలకు కూరగాయల రవాణా కోసం వాహనాల మ్యాపింగ్ను కూడా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం అమలుకు జిల్లా స్థాయి బృందాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి చైర్మన్గా, జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమల శాఖ అధికారి కన్వీనర్గా వ్యవహరించనున్నారు. అదనపు కలెక్టర్ పర్యవేక్షణలో పనిచేస్తుంది. ప్రభుత్వ పథకాలతో అనుసంధానం రైతులకు స్థిరమైన ఆదాయం, సత్వర చెల్లింపులు మహిళా సంఘాల ద్వారా కేంద్ర వంటశాలలకు సరఫరా జిల్లాస్థాయి బృందం ఏర్పాటు కొనసాగుతున్న క్షేత్రస్థాయి పర్యటనలు -
వనభోజనాలకు వెళ్లి.. అనంతలోకాలకు..
జనగామ/చిల్పూరు : కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలకు వెళ్లిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మల్లన్న గండి రిజర్వాయర్లో ఈతకు దిగి ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాడు. అతడిని కాపాడేందుకు యత్నించిన ఇద్దరు బంధువులు సైతం ప్రమాదంలో చిక్కుకున్నప్పటికీ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. జిల్లాలోని చిల్పూరు మండలం గార్లగడ్డ జీపీ శివారు మల్లన్న గండి(రిజర్వాయర్) వద్ద శనివారం చోటు చేసుకున్న ఈ విషాద ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. జిల్లాలోని దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఎండీ ఖలీల్, పర్వీన్దంపతులకు కుమార్తె, కుమారుడు నజీర్ (22) ఉన్నారు. ఖలీల్ జనగామలోని సెయింట్ పాల్స్ ప్రైవేట్ పాఠశాలలో హిందీ పండిట్గా పని చేస్తున్నారు. కుమారుడు నజీర్ హైదరాబాద్ ఘట్కేసర్లోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. నజీర్ అక్క కుటుంబం జనగామ మండలం శామీర్పేటలో నివసిస్తోంది. అక్క కూతురు పుట్టిన రోజు వేడుక కోసం ఈ నెల 21న నజీర్ తన బంధువులతో కలిసి శామీర్పేటకు వచ్చాడు. పుట్టిన రోజు వేడుకలు ముగిసిన అనంతరం శనివారం కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి సుమారు 20 మంది వనభోజనాల కోసం చిల్పూరు మండలం గార్లగడ్డ శివారు మల్లన్న గండి రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. కుటుంబ సభ్యులంతా సరదాగా గడుపుతున్న సమయంలో సుమారు ఎనిమిది మంది నీటిలో ఈతకు దిగారు. అదే సమయంలో నజీర్, అతడి బావ యాకూబ్ పాషా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. నజీర్ను గమనించిన బంధువు, హైదరాబాద్ అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న సమీర్ వెంటనే అతడిని కాపాడేందుకు ప్రయత్నించాడు. అయితే నీటి ప్రవాహం తీవ్రంగా ఉండడంతో చేయి పట్టు జారిపోయింది. దీంతో నజీర్ నీటిలో కొట్టుకుపోవడంతో సమీర్ కూడా అతడిని కాపాడేందుకు నీటిలోకి దూకాడు. అయితే ప్రవాహం ఉధృతంగా ఉండటంతో సమీర్ కూడా అదుపుతప్పి కొట్టుకు పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మధ్యలో ఉన్న ఓ ఇనుప రాడ్డును చాకచక్యంగా పట్టుకుని సమీర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మరోవైపు యాకూబ్ పాషా(హైదరాబాద్లో చెఫ్) కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా సమీపంలో ఉన్న బంధువు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన ఎండీ అబ్బు అతడిని అతికష్టం మీద కాపాడాడు. దీంతో యాకూబ్ పాషా, సమీర్ ఇద్దరూ ప్రాణాలతో బయటపడగా నజీర్ మాత్రం నీటిలో గల్లంతయ్యాడు. నజీర్ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు సుమారు అరగంట పాటు గాలించారు. చివరకు నీటిలో అతడి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసుకొచ్చారు. వెంటనే సీపీఆర్ చేసి ప్రాణం కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అనంతరం నజీర్ను జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కళ్లముందే బావమరిది మృతి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన యాకూబ్ పాషా కళ్లముందే బా వమరిది నజీర్ నీటిలో కొట్టుకుపోయి మృతి చెందడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. నజీర్ను కాపాడే ప్రయత్నంలో తాను సైతం ప్రమాదంలో చిక్కుకున్న సమీర్ ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందాడు. కుటుంబ సభ్యులు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు.మల్లన్నగండిలో మునిగి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి ఇద్దరికి త్రుటిలో తప్పిన ప్రమాదం బావమరిది నజీర్ను కాపాడేందుకు బావ సాహసం యాకూబ్పాషాను కాపాడిన అబ్బు అరగంట గాలింపు.. చివరికి మృతదేహం లభ్యంఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు కోడలు పుట్టినరోజు వేడుకలకు వచ్చి కుటుంబీకులతో ఆనందంగా గడిపిన నజీర్ తిరిగి ఇంటికి చేరకుండానే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు ఖలీల్, పర్వీన్దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ప్రమాదకర జలాశయాల్లో అప్రమత్తత అవసరంమల్లన్న గండి వంటి నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలకు విహారయాత్రలు, వన భోజనాల కోసం వెళ్లే సమయంలో ఈతకు దిగకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. నీటి లోతు, ప్రవాహ తీవ్రత తెలియని ప్రాంతాల్లో సరదా కోసం నీటిలోకి దిగడం ప్రాణాలకే ముప్పుగా మారే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. -
గిరిజన తండాల్లో యువతుల సందడే సందడి
●సాక్షి, మహబూబాబాద్: బంజారా యువతులు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్. తీజ్ అంటే గోధుమ నారు. ప్రకృతి శ్రావణంలో వర్షాలు కురిసి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఈ సీజన్లో కనిపించే ఎర్రని వర్ణం గల ఆరుద్ర పురుగులను కూడా తీజ్ అని పిలుస్తారు. అంతటి అందమైన పురుగులను దేవుడు మనకోసమే కిందికి పంపిస్తాడని, ఈ పురుగులు కనిపించినప్పుడు యువతులు మనస్సులో కోరుకున్న కోరిక ఫలిస్తుందనేది గిరిజనుల నమ్మకం. ఈనేపథ్యంలో గోధుమలు బుట్టల్లో అలికి రోజూ నీళ్లు పోస్తే ఆరుద్ర పురుగులాంటి అందం, మంచి నడవడిక, బుద్ధి, సంపదలతో కూడిన వరుడు దొరుకుతాడని గిరిజనులు నమ్ముతారు. ఈనమ్మకం వందల ఏళ్ల కిందట మొదలై రోజురోజుకూ ఆధునిక హంగులు అద్దుకుంటోంది. తొమ్మిది రోజుల తంతు పెళ్లీడుకు వచ్చిన యువతి తనకు కావాల్సిన పెళ్లికొడుకు కోసం చేసే ఈ పండుగలో ముందుగా తల్లిదండ్రులు, తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. ముఖ్యంగా తండా పెద్ద నాయక్ అనుమతి పొందిన తర్వాత పండుగ తంతు మొదలు పెడతారు. తీజ్ (గోధుమ మొలకలు) ఏపుగా పెరిగేందుకు ఆడపిల్లలు అడవికి వెళ్లి దుస్సేరు (ఫిలోణీర్ వేళ్లీ) తెస్తారు. ఈ తీగలతో అందమైన బుట్టలను అల్లుతారు. లంబాడీల ఆరాధ్య దైవం తుల్జా భవానీ, సేవాలాల్ మహరాజ్, సీత్లాభవానీలకు పూజలు చేసి స్నానాలు ఆచరించి పవిత్రతతో పుట్టమట్టిని తెస్తారు. లంబాడీ భాషలో బోరడీ ఝుష్కేరో అంటే రేగుముళ్లు గుచ్చడం. గోధుమబుట్టల్లోని నారుకు నీరు పోస్తున్న యువతి గోధుమ నారు పెంచి.. కోరుకున్న వరుడి కోసం పూజలు ఉమ్మడి జిల్లాలో బంజారాల సంబురం నూతన అలంకరణలతో ఉత్సవం -
రౌడీషీటర్లపై నిరంతర నిఘా
వరంగల్ క్రైం: పోలీస్ స్టేషన్ పరిధి రౌడీషీటర్ల వ్యవహార శైలిపై అధికారులు నిరంతరం నిఘా పెట్టాలని పోలీస్ కమిషనర్ శ్వేత ఆదేశించారు. నెలవారీ నేర సమీక్ష కమిషనరేట్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ శ్వేత మాట్లాడారు. నేర నియంత్రణలో భాగంగా ప్రతీ పోలీస్ అధికారి నిరంతరం శ్రమించాల్సి ఉంటోందని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడంతో పాటు వారి సమస్యలపై తక్షణమే స్పందించాలని చెప్పారు. అనంతరం పెండింగ్ కేసులకు సంబంధించి నిందితుల అరెస్ట్లు, కేసుల దర్యాప్తు, కోర్టులో ఉన్న కేసుల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీసీపీలు అంకిత్కుమార్, దారా కవిత, రాజమహేంద్ర నాయక్, కిషన్సింగ్, అదనపు డీసీపీలు సురేశ్ కుమార్, బాలస్వామితో పాటు ఏసీపీలు, పోలీస్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. కుసుంబాయితండాలో సంపూర్ణ మద్య నిషేధం రఘునాథపల్లి: మండలంలోని కుసుంబాయితండాను మద్యరహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడ్డాయి. శనివారం సర్పంచ్ కొర్ర స్వరూపరాజేందర్నాయక్ అధ్యక్షతన జరిగిన గ్రామ పంచాయతీ సమావేశంలో గ్రామంలో గుడుంబా, మద్యం విక్రయాలను నిషేధిస్తున్నట్లు పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎవరైనా గ్రామంలో గుడుంబా, మద్యం విక్రయిస్తే రూ.10 వేల జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా జేఏసీ నూతన కార్యవర్గం ఏర్పాటు జనగామ: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ జేఏసీ జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు తొట్ల రాఘవేంద్ర ముదిరాజ్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా బోగా రామ్దయాకర్, ఉపాధ్యక్షులుగా మచ్చ బాలనరసయ్య, కడకంచి మధుసూదన్, పాముకుంట్ల కృష్ణమూర్తి, తుపాకుల బాలనారాయణ, ప్రధాన కార్యదర్శిగా పన్నీరు సత్యం, సహాయ కార్యదర్శులుగా దుర్గం సందీప్కుమార్, మిద్యపాక రాజు, కోశాధికారిగా కోలపూరి రవి, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా బత్తిని నరసింహులు, గాడిపెళ్లి కిషోర్ కుమార్, చింతల చంద్రమోహన్ను నియమించారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులు జనగామ రూరల్: జిల్లాలో 2026 విద్యాసంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి గల ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. తమ దరఖాస్తులను సంబంధిత మండల విద్యాధికారి, ప్రధానోపాధ్యాయుడి ధ్రువీకరణ పత్రంతో పాటు సంబంధిత సర్టిఫికెట్లతో ఈనెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు కలెక్టరేట్లోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. నాన్టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి జనగామ రూరల్: జిల్లాలోని ఆదర్శ పాఠశాల బాలిక వసతి గృహాల్లో రెండు నాన్టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బచ్చన్నపేట మండలంలో 1 అసిస్టెంట్ కుక్ పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణ ఉండాలని, నెలకు రూ.6500 వేతనం ఉంటుందన్నారు. రఘునాథపల్లి ఆద ర్శ పాఠశాలలో ఒక వాచ్ఉమెన్ పోస్టు ఖాళీ ఉందని, టెన్త్ ఉత్తీర్ణత ఉండాలన్నారు. నెలకు రూ.8,710 వేతనం ఉంటుందన్నారు. దరఖాస్తులు ఈనెల 24నుంచి 27 వరకు అందించాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికకు 30న కలెక్టరేట్లో పరీక్ష ఉంటుందన్నారు. కేజీబీవీల్లో 9 పోస్టులు.. జిల్లాలోని కస్తూర్బా విద్యాలయాల్లో 9 నాన్–టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. నెల వేతనం రూ.9,750 ఉంటుందని హెడ్ కుక్, అటెండర్కు 10వ తరగతి, అసిస్టెంట్ కుక్, స్వీపర్కు 7వ తరగతి. స్థానిక మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. 24నుంచి 27సాయంత్రం వరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, 30న ఉదయం 10.30 పరీక్ష ఉంటుదన్నారు. చిల్పూర్లో ఒక స్వీపర్ పోస్టు, నర్మెట లో రెండు స్వీపర్, పాలకుర్తిలో 1 హెడ్ కుక్, కొడకండ్లలో 1 అటెండర్, జనగామలో 1 హెడ్ కుక్, 1అసిస్టెంట్ కుక్, 1 స్వీపర్ పోస్టు, బచ్చన్నపేటలో అసిస్టెంట్ కుక్ ఖాళీగా ఉన్నాయన్నారు. -
మణికంఠ రైస్మిల్లులో రూ.7కోట్ల అక్రమాలు
● పోలీసు ఫిర్యాదుకు సివిల్ సప్లయ్ అధికారుల సిద్ధం లింగాలఘణపురం: మండలంలోని నెల్లుట్ల పరిధిలో గల మణికంఠ ఆగ్రో ఇండస్ట్రీస్లో సుమారు రూ.7 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. రెండేళ్లుగా సాగుతున్న మిల్లర్ల అక్రమాలపై ప్రభుత్వ సీరియస్గా ఉండడం, సీఎం రేవంత్రెడ్డి సీఎంఆర్ ధాన్యంలో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయడంతో సివిల్ సప్లయ్ అధికారులు చర్యలు తీసుకొనేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మణికంఠ రైస్ మిల్లులో 2022–2023లోనే 1,526.970 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా అక్రమాలకు పాల్పడగా 2025లో అడిషనల్ కలెక్టర్ నోటిసులు జారీ చేశారు. తిరిగి 2023–2024లో కూడా మళ్లీ సివిల్ సప్లయ్ అధికారులు సీఎంఆర్ ధాన్యం అదే మిల్లుకు కేటాయించడం, మళ్లీ ప్రభుత్వానికి బి య్యం అప్పగించకుండా ప్రైవేట్కు విక్రయించుకొ ని అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. దీంతో రూ.7 కోట్లకు పైగా దందా జరిగినట్లు సివిల్ సప్లయ్ అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమా చా రం. ఈ విషయంపై సివిల్ సప్లయ్ డీఎం హతీ రామ్ను వివరణ కోరగా ఇంకా లెక్కలు తేలలేదని, రూ.7 కోట్ల వరకు ఉంటుందని, పూర్తిగా పరిశీలించిన అనంతరం ఫిర్యాదు చేస్తామని వివరించారు. -
ఉద్యోగుల ఐక్యతకు టీఎన్జీఓస్ జెండా ప్రతీక
జనగామ: ఉద్యోగుల ఐక్యత, హక్కుల సాధనకు టీఎన్జీఓస్ జెండా ప్రతీకగా నిలుస్తుందని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు కాజా షరీఫ్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓస్ భవన్లో సంఘం అధికారిక జెండా, కండువా, ‘ఉద్యోగ గొంతుక’ మాసపత్రికను రాష్ట్ర నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు కాజా షరీఫ్ మాట్లాడుతూ.. ఉద్యోగుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఉద్యోగ గొంతుక మాసపత్రిక కీలక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పెండల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేర్వారం ప్రభాకర్తో పాటు హఫీజ్ చందర్, రమేష్, రాజేశ్, మహేష్, రామనర్సయ్య, నాగార్జున, యశోద, స్టెల్లా, సంపూర్ణ, లక్ష్మి, లావణ్య, అరుణ, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. -
కమ్ముకొచ్చిన శ్రావణ మేఘాలు.. ఆకాశం అక్షింతలు వేసినట్లుగా రాలే చినుకులు.. పచ్చని పైర్లు.. చల్లని గాలులు.. నేలమ్మ కొప్పులో ఎర్రని మందారాలు పెట్టినట్లుగా అగుపించే ఆరుద్ర పురుగులు.. ఇవన్నీ బంజారా యువతుల మనస్సులోని కోర్కెలు నెరవేర్చే ప్రకృతి సూచకాలు. వీటన్నింట
తీజ్ వేడుకల్లో నిర్వహించే ప్రతీ ఘట్టం ఆకట్టుకుంటుంది. వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనిగలకు యువతలు రేగుముళ్లు గుచ్చుతారు. ఎంతో నిష్టతో చేసే ఈ ప్రక్రియను బావ వరుస ఉన్న వారు కన్నెపిల్ల మనస్సు చెదిరేలా కదిలి స్తూ ఉంటారు. అప్పుడు రేగుముళ్లు శనిగలకు కాకుండా వారి చేతికి కూడా గుచ్చుకుంటాయి. దీన్ని భరిస్తూ రేగుముళ్లు శనిగలకు గుచ్చడం ఈ తంతు ప్రత్యేకత. ఏడోరోజు ఢమోళీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఢమోళీ చుర్మో (రొట్టెలు, బెల్లం కలిపిన ముద్ద)ను మేరామా భవానీకి నైవేధ్యం పెడతారు. ఎనిమిదో రోజు మట్టితో బంజారా ఆరాధ్య దైవాల ప్రతిరూపాలు తయారు చేస్తారు. అబ్బాయి (డోక్రా), అమ్మాయి (డోక్రీ)లుగా పేర్లు పెడతారు. వీటికి గిరిజన సంప్రదాయాల ప్రకారం పూజ చేస్తారు. తొమ్మిదో రోజు డప్పుచప్పుళ్లు, గిరిజన నృత్యాలతో అంద రూ బుట్టలవద్దకు వెళ్తారు. అక్కడికి తండా నాయక్ వచ్చి యువతులకు బుట్టలిస్తారు. ఈసందర్భంగా అన్నదమ్ములు, అక్కాచెళ్లెళ్ల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకుంటారు.భోగ్ వద్ద తీజ్ బుట్టలతో యువతులు -
పంటకు పొడి ముప్పు
జనగామ: ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా జూలై, ఆగస్టు నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో రైతులు పంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జనగామ రైతు విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ వి.రమ్య సూచించారు. ప్రస్తుత వర్షభావ పరిస్థితుల్లో ఆమె రైతులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 247.4 మి.మీ. వర్షపాతం నమోదై, సాధారణ వర్షపాతంతో పోలిస్తే 43.2 శాతం లోటు ఉన్నట్లు తెలిపారు. పొడి వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తేమ సంరక్షణ, సమతుల్య పోషక యాజమాన్యం, కలుపు, చీడపీడల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వరి నార్లు పోయని రైతులు ప్రస్తుతం వెదజల్లే లేదా డ్రమ్సీడర్ పద్ధతిలో వరి సాగు చేసుకోవచ్చన్నారు. ముదురు నారు నాటాల్సి వస్తే మొక్కల మధ్య దూరాన్ని తగ్గించి దగ్గరగా నాట్లు వేయాలని తెలిపారు. వర్షాధారంగా సాగు చేస్తున్న మొక్కజొన్నలో నీటి కొరతతో ఆకులు ముడుచుకోవడం, మొక్క ఎదుగుదల తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే సకాలంలో నీరు అందించాలన్నారు. నీటి ఎద్దడి ఉన్నప్పుడు యూరియా 2 శాతం ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా బెట్ట పరిస్థితులను కొంతవరకు తట్టుకోవచ్చని తెలిపారు. వర్షాభావం తర్వాత వర్షాలు కురిసినప్పుడు ఎకరాకు 25 కిలోల యూరియాను అదనంగా వేయడం ద్వారా పంట దిగుబడిని పెంచుకోవచ్చన్నారు. కందిపంట ప్రస్తుతం 20 నుంచి 40 రోజుల దశలో ఉందని, తొలి 60 రోజులు కలుపు లేకుండా చూసుకోవడం కీలకమన్నారు. పెసర, మినుము పంటల్లో చిన్న దశలోనే కలుపు నివారణకు అంతరకృషి చేపట్టాలని, పూత దశలో బెట్ట పరిస్థితులు ఏర్పడితే పొటాషియం నైట్రేట్ లేదా 19:19:19 ద్రావణాన్ని ఆకులపై పిచికారీ చేయాలని తెలిపారు. రైతులు పంటలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులను మార్చుకోవాలని సూచించారు. జిల్లాలో 43.2 శాతం వర్షపాతం లోటు పంటల రక్షించుకోవడంలో రైతుల అప్రమత్తంగా ఉండాలి రైతు విజ్ఞాన కేంద్రంకోఆర్డినేటర్ డాక్టర్ వి.రమ్య -
ఓవర్ టు ఢిల్లీ..!
● సురేఖ వివరణపై సంతృప్తి చెందని పీసీసీ.. ఏఐసీసీకి ‘క్రమశిక్షణ’ నివేదిక ● సీఎల్పీలో అత్యవసరంగా భేటీ అయిన ఉమ్మడి వరంగల్ నేతలు ● మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల డిమాండ్ ● అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠసాక్షి ప్రతినిధి, వరంగల్ : పరకాల రాజకీయంతో ఓరుగల్లు కాంగ్రెస్లో మొదలైన విభేదాలు.. మంత్రి కొండా సురేఖ కుటుంబం, సీఎం రేవంత్రెడ్డి మధ్య బహిరంగ విమర్శలకు దారితీసి.. ఇప్పుడు ఏఐసీసీ పరిశీలనకు చేరాయి. సురేఖ కుమార్తె సుస్మిత.. సీఎం రేవంత్రెడ్డి, ఆయన కుటుంబం, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిపై చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి ఆమె ఇచ్చిన వివరణపై కమిటీ సంతృప్తి చెందకపోవడంతో పరిస్థితిని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో సీఎల్పీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సమావేశమై సురేఖపై చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. కూతురు వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. ఈ నెల 19న గీసుకొండలో జరిగిన మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్లో చర్చనీయాంశమయ్యాయి. అభ్యర్థిత్వాలను నిర్ణయించేది పార్టీ అధిష్టానమే అయినప్పుడు పరకాల సభలో సీఎం.. రేవూరి ప్రకాశ్రెడ్డిని ఎలా ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు. గతంలో రేవంత్రెడ్డి తమ కుటుంబానికి ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారి తీశాయి. ముఖ్యమంత్రి, సొంత పార్టీ ఎమ్మెల్యేపై బహిరంగ వేదికనుంచి ఈ స్థాయిలో విమర్శలు రావడాన్ని పీసీసీ నాయకత్వం తీవ్రంగా పరిగణించి నోటీసు జారీ చేసింది. మంత్రి వివరణపై సంతృప్తి చెందని కమిటీ.. చల్లారని పంచాయితీ సుస్మిత వ్యాఖ్యలకు మంత్రి సురేఖను బాధ్యురాలిగా పరిగణించిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ.. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంత్రి ఇచ్చిన సమాధానంతో సమస్యకు తెరపడలేదు. కూతురు వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సముచితం కాదని పేర్కొంటూ.. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని కోరడం మరింత వివాదానికి దారి తీసింది. ఈ తంతు కొనసాగుతుండగానే హైదరాబాద్లోని సీఎల్పీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ సారయ్య తదితరులు సురేఖ కుటుంబ రాజకీయ వ్యవహారశైలిని తప్పుబట్టారు. సదరు నేతలు వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణకే పరిమితం చేయకుండా.. మంత్రి పదవి అంశాన్ని కూడా ముందుకుతెచ్చి సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించడంతోపాటు పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీకి నష్టం కలిగించే వ్యవహారాలపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ తలెత్తే అవకాశం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ అంశంపై ఆరా తీసినట్లు పార్టీ వర్గాల సమాచారం. హైకమాండ్ వద్దకు ‘హస్తం’ పేచీ.. ఇప్పటికే షోకాజ్ నోటీసు, మంత్రి వివరణ, సీఎల్పీలో నేతల సమావేశం, చర్యలకు డిమాండ్.. ఇలా వరుస పరిణామాలు చోటుచేసుకోవడంతో బంతి ఇప్పుడు అధిష్టానం కోర్టులోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో మంత్రి సురేఖపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటారా? మంత్రి పదవినుంచి తొలగించాలన్న డిమాండ్పై హైకమాండ్ ఎలా స్పందిస్తుంది? పరకాల టికెట్ విషయంలో రేవూరి ప్రకాశ్రెడ్డి అభ్యర్థిత్వంపై సీఎం చేసిన ప్రకటనకు అధిష్టానం మద్దతిస్తుందా? కొండా కుటుంబంతో రాష్ట్ర నాయకత్వం భవిష్యత్తులో ఏ విధంగా వ్యవహరిస్తుంది? అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. మొత్తానికి ఓరుగల్లు నుంచి కాంగ్రెస్లో మొదలైన పంచాయితీ.. సీఎల్పీకి చేరి.. అక్కడినుంచి టీపీసీసీ దాటి ఏఐసీసీ గడప తొక్కింది. ఇక ఈ వివాదానికి ముగింపు ఎలా పలుకుతారన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠగా మారింది. త్వరలో మీడియా ముందుకు సురేఖ? ఇదిలా ఉండగా.. శుక్రవారం హైదరాబాద్లో తనను కలిసిన మీడియాతో కొండా సురేఖ చిట్చాట్ చేశారు. ‘తన ఇంట్లో ప్రత్యేక పూజ జరుగుతున్నందున బిజీగా ఉన్నాను. చెప్పాల్సినవి గురువారమే చెప్పాను. త్వరలోనే మీడియాతో మాట్లాడుతాను’ అని పేర్కొన్నారు. దీంతో ఒకటి, రెండు రోజుల్లో సురేఖ మీడియా ముందుకు వచ్చి తాజా వివాదంపై పూర్తిస్థాయిలో స్పందించే అవకాశం ఉందని తన అనుచరవర్గాలు తెలుపుతున్నాయి.ఏఐసీసీకి చేరిన ఓరుగల్లు కాంగ్రెస్ పంచాయితీ -
ఘాటెక్కిన ఉల్లి.. చేదెక్కిన చక్కెర
● ఉల్లిగడ్డ కిలో రూ.60.. చక్కెర కిలో రూ.70 ● ధరల మంటతో సామాన్యుల బెంబేలుజనగామ: సామాన్యులపై నిత్యావసర సరుకుల ధరల భారం మరింత పెరుగుతోంది. నిత్యం వినియోగించే చక్కెర, ఉల్లిగడ్డ ధరలు ఒక్కసారిగా పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో ఉల్లిగడ్డ ధర కిలోకు రూ.25 నుంచి రూ.60కు చేరగా, చక్కెర ధర రూ.40 నుంచి రూ.70కు పెరిగింది. దీంతో ఉల్లిగడ్డపై రూ.35, చక్కెరపై రూ.30 మేర భారం పడింది. ఇటీవల కొద్ది రోజుల వ్యవధిలోనే ధరలు వేగంగా పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఉదయం ఒక రేటు...సాయంత్రం మరో ధర మార్కెట్లో ఉదయం ఉన్న ధర సాయంత్రానికి మారుతున్న పరిస్థితి నెలకొందని వ్యాపారులు చెబు తున్నారు. గతంలో కిలోకు కొద్దిపాటి పెరుగుదల కనిపించేది. ప్రస్తుతం ఒకేసారి రూ.10, రూ.20 చొప్పున ధరలు పెరుగుతుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఒక్కసారిగా పెరుగుతున్న నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు హోల్సేల్, రిటైల్ మార్కెట్లలో తనిఖీలు నిర్వహించి నిల్వలు, కొనుగోలు ధరలు, విక్రయ ధరలను పరిశీలించాలని వినియోగదారులు కోరుతున్నారు. కాగా చక్కెరను సబ్సిడీతో రేషన్ దుకాణాల్లో తెల్లకార్డుల లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. గానుగుపహడ్లో మద్యపాన నిషేధంజనగామ రూరల్: మండలంలోని గానుగుపహడ్ గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసేందుకు తీర్మానించినట్లు సర్పంచ్ శానబోయిన అనూష మహిపాల్ తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ..వచ్చే నెల 10వ తేదీలోగా గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తూ తీర్మానం చేశామని, గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ.50వేల జరిమానాతో పాటు పథకాలు రద్దు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఉపసర్పంచ్ కొర్ర శంకర్, వార్డు సభ్యుడు కాల్రాం తదితరులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమంలో కీలక పథకం..
రాష్ట్రంలో రైతు బీమా పథకానికి 2018 ఆగస్టు 15న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతు కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి అకాల మరణానికి గురైతే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడకుండా తక్షణ సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించే విధంగా పథకాన్ని అమలు చేశారు. బీమా పరిధిలో ఉన్న రైతు సహజ లేదా ప్రమాదవశాత్తు మరణించినప్పుడు నామినీకి రూ.5 లక్షల పరిహారం అందుతుంది. పథకం ప్రారంభమైన నాటి నుంచి ఏటా రెన్యువల్ చేస్తూ అమలు చేస్తున్నారు. రైతు కుటుంబాలకు అత్యవసర సమయంలో ఆర్థిక భరోసా కల్పించడంతో రైతు బీమా రాష్ట్రంలోని కీలక సంక్షేమ పథకాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కీంకు సంబంధించి రెన్యువల్ విషయంలో తాత్సారం చేస్తుండడంపై సందిగ్ధత నెలకొంది.జనగామ: రైతు కుటుంబాలకు అండగా నిలిచే రైతు బీమా పథకం రెన్యువల్పై స్పష్టత లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ నెల 13తో రైతు బీమా రెన్యువల్ గడువు ముగిసినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రెన్యువల్ ప్రక్రియపై స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. దీంతో పథకం కొనసాగుతుందా.. రెన్యువల్ ఎప్పుడు చేస్తారు.. ప్రస్తుత కాలంలో రైతు అకాల మరణానికి గురైతే బీమా వర్తిస్తుందా? అనే సందేహాలు రైతు కుటుంబాలను వేధిస్తున్నాయి. వారం దాటుతున్నా.. రైతు బీమా రెన్యువల్ గడువు ముగిసి వారం రోజులు దాటుతున్నా ప్రభుత్వం నుంచి ప్రక్రియపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రెన్యువల్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పథకం అమలుపై స్పష్టత ఉంటుంది. అయితే ఈసారి గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోవడంతో అయోమయం నెలకొంది. అకాల మరణం జరిగితే పరిహారం ఎలా? రెన్యువల్ పూర్తికాకముందే ఏదైనా అనుకోని ఘట నలో రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే అంశంపై వివిధ రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. రైతు బీమా కొనసాగింపుపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. రైతు బీమా రెన్యువల్ చేస్తామని ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన హామీ లేదా ప్రకటన రాకపోవడంతో పథకం భవిష్యత్తుపైనా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం వెంటనే రెన్యువల్ ప్రక్రియపై నిర్ణయం ప్రకటించి రైతులు, వారి కుటుంబాల్లో నెలకొన్న అనిశ్చితికి తెరదించాలని వారు కోరుతున్నారు. గడువు ముగిసి వారం దాటుతున్నా స్పష్టత కరువు 1.85 లక్షల మంది రైతుల ఎదురుచూపులు బీమా రెన్యువల్ కాకుంటే పరిహారం ఎలా? అని ఆందోళనసంవత్సరం జారీచేసిన మరణాలు చెల్లింపులు ఎల్ఐసీఐడీలు (కోట్లలో) 2018 85,755 378 రూ.18.90 2019 84,777 457 రూ.22.80 2020 89,896 690 రూ.34.50 2021 98,106 554 రూ.27.70 2022 1,03,422 581 రూ.29.05 2023 1,11,815 610 రూ.30.50 2024 1,16,036 641 రూ.32.00 2025 1,16,017 560 రూ.28.00 మొత్తం 8,05,824 4,471 రూ.223 -
భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి
జనగామ రూరల్: రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల పనులు సజావుగా కొనసాగేందుకు ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్ భూసేకరణ కోసం ప్రభుత్వం వెంటనే రూ.2,800 కోట్లు విడుదల చేసిందని, ఇందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.కొత్త ఆయకట్టు సృష్టించేందుకు వీలుగా పెండింగ్ భూసేకరణ, పునరావాస పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. వీసీలో నీటిపారుదల శాఖ ఎస్ఈ సీతారాం పాల్గొన్నారు. వీసీలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి -
విద్యార్థుల నిరసన ర్యాలీ
జనగామ: నల్లగొండలో పాఠశాల విద్యార్థుల చేతిలో హత్యకు గురైన ప్రైవేట్ పాఠశాల ప్రి న్సిపాల్ రూపారెడ్డికి సంఘీభావంగా జిల్లా కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు(ట్రస్మా) ఆద్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు పప్పు వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. నెహ్రూపార్కు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నల్లబ్యాడ్జీలు ధరించి, ఫ్లకార్డులు, బ్యానర్లతో ర్యాలీ నిర్వహించారు. ‘సేవ్ టీచర్స్–సే వ్ ఎడ్యుకేషన్’ అంటూ నినదించారు. కార్యక్రమంలో ఏకశిల పబ్లిక్ స్కూల్ సెక్రెటరీ చిర్ర ఉపేందర్రెడ్డి, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పోస్టల్ పెన్షనర్లకు పెన్షన్ అదాలత్ జనగామ: పోస్టల్ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి 9వ ప్రాంతీయ పోస్టల్ పెన్షన్ అదాలత్ నిర్వహించనున్నట్లు హనుమకొండ పోస్టల్ శాఖ డివిజన్ సూపరింటెండెంట్ కె.శివాజీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెన్షన్, కుటుంబ పెన్షన్, పెన్షన్ బకాయిలు, ఇతర సంబంధిత సమస్యలపై పెన్షనర్లు తమ ఫిర్యాదులను అదాలత్లో పరిష్కరించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన 9వ ప్రాంతీయ పోస్టల్ పెన్షన్న్ అదాలత్ను సెప్టెంబర్ 22న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గూగుల్ మీట్ వేదికగా జరిగే ఈ అదాలత్లో పెన్షనర్లు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చన్నారు. ఫిర్యాదులను స్వీకరించేందుకు సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 5.45 గంటల వరకు గడువు విధించినట్లు చెప్పారు. పెన్షనర్లు తమ ఫిర్యాదులను హైదరాబాద్లోని అబిడ్స్ డాక్ సదన్న్ ఐదో అంతస్తులో ఉన్న తెలంగాణ సర్కిల్, హైదరాబాద్ రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్ కార్యాలయంలోని సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (ఐఎఫ్ఏ)కు పంపించాలి. కవర్పై పోస్టల్ పెన్షన్ అడల్ట్ ఆఫ్ హైదరాబాద్ రీజి యన్ అని పేర్కొనాలని సూచించారు. అలాగే aoifa.hydera bad@indiapost.gov.in ఈమెయిల్ అడ్రస్కు కూడా సెప్టెంబర్ 7లోపు ఫిర్యాదులు పంపవచ్చని తెలిపారు.జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు జనగామ రూరల్: పట్టణంలోని స్థానిక మినీ స్టేడియంలో శుక్రవారం జిల్లా స్థాయి 14, 16, 18 20 ఏళ్ల బాలబాలికల అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించారు. దాదాపు 700 మంది క్రీడాకారులు పాల్గొన్నారు, ఎంపికై న క్రీడాకారులు ఈనెల 26, 27 తేదీలలో స్థానిక జేఎన్ స్టేడియం హనుమకొండలో జరిగే 12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్ తెలియజేశారు. 700 మంది క్రీడాకారులు పాల్గొనడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి గంగిశెట్టి మనోజ్ కుమార్, కోశాధికారి ఆవుల అశోక్, కార్యదర్శి వంచా చంద్రశేఖర్ రెడ్డి, అసోసియేషన్ బాధ్యులు రంజిత్ రవీంద్ర ప్రసాద్ సుధారాణి, దిలీప్ కుమార్, అశోక్ పాల్గొన్నారు. నీటి సంరక్షణ పనుల పరిశీలన స్టేషన్ఘన్పూర్: మండలంలోని రాఘవాపూర్, నమిలిగొండ, విశ్వనాధఫురం, ఇప్పగూడెం, సముద్రాల గ్రామాల్లో చేపట్టిన నీటి సంరక్షణ పనులను సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ సైంటిస్ట్ డాక్టర్ సర్తాజ్బాషా ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో చేపట్టిన చెక్డ్యామ్, ఇంకుడుగుంత, తక్కువ ధరతో చేపట్టిన సోప్కిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సైంటిస్ట్ మాట్లాడుతూ.. జల సంచాయ్ జల భాగ్యధారి పథకం కోసం జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి 30వేలకు పైచిలుకు ఫొటోలు అప్లోడ్ చేయగా అందులో ఒక్క శాతం పనులను రాండమ్గా పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా డీఆర్డీఓ కార్యాలయ నోడల్ అధికారి శ్రీనివాస్రెడ్డి, ఎంపీఓ శ్రీనాధ్రెడ్డి, ఏపీఎం ప్రేమయ్య, సర్పంచ్లు పురమాని కోమల ఐలోని, గుర్రం యాదమ్మఎల్లయ్య, మందపురం రాణిఅనీల్గౌడ్, బి.యాదగిరి, ఫీల్డ్ అసిస్టెంట్ మందపురం కవితఎల్లగౌడ్, పంచాయతీ కార్యదర్శులు పవన్, యుగేందర్, వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్ కార్డులతో సజావుగా రేషన్
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి రఘునాథపల్లి: రేషన్ బియ్యం సరఫరాలో ఎలాంటి అవకతవకలకు అస్కారం లేకుండా అత్యంత భద్రతా ప్రమాణాలతో స్మార్ట్కార్డులు రూపొందించినట్లు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. శుక్రవారం ఆయన శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు ఆయన డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధిని జీర్ణించుకోలేక బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, తహసీల్దార్ రాజేష్రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్చందర్రెడ్డి, సర్పంచ్లు బొమ్మ వీరస్వామి, గైని శ్రీనివాస్, రాంచందర్, రాజశేఖర్, మోతిలాల్, కాంగ్రెస్ నాయకులు గాదె మహేందర్రెడ్డి, భాస్కర్రెడ్డి, గొరిగ రవి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు.. జఫర్గఢ్: బీఆర్ఎస్ నాయకులు పనిగట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అరోపించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో స్మార్ట్ రేషన్కార్డులను ఎమ్మెల్యే శ్రీహరి లబ్ధిదారులకు అందించారు. తహసీల్ధార్ శ్రీనివాస్, ఎంపీడీఓ దయాకర్, సర్పంచ్ కుల్లా మోహన్రావు, సింగిల్ విండో చైర్మన్ తీగల కర్ణాకర్రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, ఆర్ఐ దేవేందర్, సర్పంచ్లు, మార్కెట్ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
సాగునీటి కల్పనలో ప్రభుత్వం విఫలం
పాలకుర్తి టౌన్ (దేవరుప్పుల): సాగునీటి కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. గురువారం దేవరుప్పుల మండలంలోని ధరావత్ తండా నుంచి బంజార గ్రామం వరకు నవాబుపేట రిజర్వాయర్ నుంచి మండలానికి వచ్చే కాలువను సుమారు 10 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ పంటల సాగు దుిస్థితిపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సింగరాజుపల్లి గ్రామంలో సాగునీరు విడుదల చేయాలని డిమాండ్తో ధర్నా చేపట్టారు. ఎర్రబెల్లిని పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించే క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అయినా ధర్నా నిర్వహిస్తూ ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు.. వారం రోజుల క్రితం స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబుపేట రిజర్వాయర్ వరకు సాగునీరు విడుదల చేశామని కొందరు నాయకులు గొప్పగా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు సుందర్రామిరెడ్డి, దయాకర్, బస్వ మల్లేశం తదితరులను అరెస్టు చేసిన పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దయాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్సింగ్, దేవరుప్పుల, కొడకండ్ల, గుండాల మండలాల రైతులు, నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు -
సిద్ధేశ్వరాలయ హుండీ ఆదాయం రూ.5,11,472
బచ్చన్నపేట: మండలంలోని కొడవటూర్ గ్రామంలోని స్వయంభూ శ్రీసిద్ధేశ్వరాలయ హుండీ ఆదాయం రూ. 5,11,472 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి చిందం వంశీ తెలిపారు. గురువారం హుండీ లెక్కించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం మార్చి 24 నుంచి ఆగస్టు 20 వరకు భక్తులు హుండీలో వేసిన కానుకల రూపేణా ఈ ఆదాయం వచ్చిందన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ నల్లగొండ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్రావు పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు చేశామన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఈదులకంటి వెంకట్రెడ్డి, ప్రధాన పూజారి ఓంనమశివాయ, సిబ్బంది నూకల లక్ష్మికాంత్రెడ్డి, బండారి శ్రీనివాస్, భానుప్రకాష్రెడ్డి, అర్చకులు, శ్రీలక్ష్మీవెంకటేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంజనగామ: ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాల నిరోధక చట్టం అమలును పర్యవేక్షించే జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీలో అధికారేతర సభ్యుల నియామకానికి అర్హులైన జిల్లా వాసుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి విక్రమ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీలో ఎస్సీ కులాలకు చెందిన ఐదుగురు సభ్యులు, ఎస్టీ వర్గం నుంచి ఇద్దరు సభ్యుల్లో కనీసం ఒకరు మహిళ ఉండాలన్నారు. ఇతర వర్గాలకు చెందిన ముగ్గురిని కూడా సభ్యులుగా నియమించే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలు, నిర్ణీత దరఖాస్తు నమూనా జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో, జిల్లా వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందన్నారు. సెప్టెంబరు 5వతేదీ సాయంత్రం 5 గంటల్లోపు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందించాలన్నారు. ఎస్ఐఆర్పై ఈఆర్ఓలకు శిక్షణజనగామ: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ముసాయిదా విడుదల అనంతరం సాంకేతిక, పరిపాలనాపరమైన చర్యలను వేగవంతం చేసేందుకు జిల్లా స్థాయిలో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, అధికారులకు గురువారం కలెక్టరేట్లో మాస్టర్ ట్రేనర్లు సాఫ్ట్వేర్ విధానాలపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో ఓటర్ల వివరాల్లోని తప్పులను సరి దిద్దడం, బాధ్యులైన ఓటర్లకు నోటీసులు ఇవ్వ డం, దరఖాస్తుల విచారణ, తుది జాబితా రూపకల్పనపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. కాగా, మండలాల వారీగా బీఎల్ఓలకు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణలో రెవెన్యూ ఏసీ బెన్షాలోమ్, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ శ్రీధర్, ఆర్డీఓ గోపీరామ్, తహసీల్దార్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పీజీ సెమిస్టర్ పరీక్షలు షురూ కేయూ క్యాంపస్: కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో పీజీ కోర్సు ల (నాన్ ప్రొఫెషనల్) రెండో సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని పలు పరీక్ష కేంద్రాలను పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్ష ల నియంత్రణాధికారులు పరిశీలించారు. -
● రోడ్ల పక్కన మృత్యుబావులు
జనగామ: జిల్లాలో పలు మండలాల్లో రోడ్ల పక్కన రక్షణ గోడలు లేని బావులు, ప్రమాదకర మూలమలుపులు, గుంతలమయమైన కల్వర్టులు వాహనదా రులకు ముప్పుగా మారాయి. హెచ్చరిక బోర్డులు, రెయిలింగ్లు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమా దం ముంచుకొస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రహదారులపై పొంచి ఉన్న ప్రమాదంపై సాక్షి ‘గ్రౌండ్ రిపోర్టు’తో ప్రత్యేక కథనం. బావులు.. బెంబేలెత్తిస్తున్నాయి నర్మెట మండలం అమ్మాపురం చౌరస్తా వద్ద రోడ్డు పక్కనే వినియోగంలో లేని పాత బావి చెట్ల పొదలతో కప్పుకుపోయింది. నర్మెట, వెల్దండ, అమ్మాపు రం, పోతారం గ్రామాలకు వెళ్లే ఈ చౌరస్తాలో హె చ్చరిక బోర్డులు లేకపోవడంతో పక్కదారుల నుంచి వచ్చే వాహనాలు గుర్తించలేక ద్విచక్ర వాహనదారులు పలుమార్లు ప్రమాదాలకు గురయ్యారు. బావి చుట్టూ రక్షణ చర్యలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. జఫర్గఢ్ మండలం హిమ్మత్నగర్ సమీ పంలో ప్రధాన రహదారికి సుమారు మూడు మీట ర్ల దూరంలోనే వ్యవసాయ బావి ఉంది. సుమారు తొమ్మిది గజాల లోతున్న ఈ బావిలో నీరు ఉండటంతో పాటు మూలమలుపులో ఉండడం ప్రమాదాన్ని పెంచుతోంది. గతంలో ట్రాక్టర్తో సహా బా విలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కూడా జ రిగింది. ప్రస్తుతం అక్కడక్కడ రాళ్లు పెట్టినా పూర్తి స్థాయి రక్షణ లేదు. ఇదే రహదారిలో మరో రెండు బావులు కూడా ప్రమాదకరంగా ఉన్నాయి. చిల్పూ ర్ మండలం దేశాయితండా నుంచి పల్లగుట్టకు వెళ్లే మార్గంలో లోలెవల్ కల్వర్టు పక్కనే పాడుబడిన వ్యవసాయ బావి ఉంది. రాత్రింబవళ్లు వాహనాలు తిరిగే ఈ మార్గం ఇప్పటికే గుంతలమయమైంది. బావి వద్ద రెయిలింగ్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని రైతు సాధం రాములు కోరుతున్నారు. బచ్చన్నపేట మండల కేంద్రం నుంచి చేర్యాలకు వెళ్లే రహదారిలో రాజన్న బావి చుట్టూ ప్రహరీ, హె చ్చరిక బోర్డులు లేవు. పడమటికేశవాపూర్, కొన్నె గ్రామాల సమీపంలోని బావులు కూడా వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. రాత్రివేళ అదుపుతప్పిన వాహనాలు బావుల్లో పడే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ లేక పొంచి ఉన్న ముప్పు పలు రోడ్లపై ప్రమాదకర మలుపులు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం రెయిలింగ్లు, హెచ్చరిక బోర్డులు కాగితాలకే పరిమితం చర్యలు తీసుకోవాలంటున్న వాహనదారులు


