breaking news
Jangaon District Latest News
-
పట్ణణ అభివృద్ధికి మహర్దశ
● జీఐఎస్ ఆధారితంగా మొదటి మాస్టర్ప్లాన్కు రూపకల్పన ● సమీక్షలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా జనగామ: జనగామ పట్టణ అభివృద్ధిలో మరో అడుగు పడింది. అమృత్ 2.0 పథకం కింద రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక ప్రకారం, పట్టణం (విలీనమైన గ్రామ పంచాయతీలతో సహా) కోసం సవరించిన ముసాయిదా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడం ప్రారంభమైంది. ఈ ప్రణాళిక ‘ఇన్–హౌస్ఙ్’ విధానంలో రూపొందించబడుతోంది. మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసే ప్రక్రియలో భాగంగా, జీఐఎస్ ఆధారిత మొదటి మాస్టర్ ప్లాన్న్ రూపకల్పనకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ వర్క్షాప్లో మాస్టర్ప్లాన్, ప్రణాళిక పరిధితో పాటు పలు కీలక అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. పట్టణ భవిష్యత్ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలిచే ఈ మాస్టర్ప్లాన్ ద్వారా జనగామ సమగ్ర పట్టణ మౌలిక వసతులు, రహదారులు, నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, పచ్చదనం, సామాజిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వబడనుంది. కాగా ఈ ఏడాది జనవరి 14 నుంచి 24వ తేదీ వరకు మాస్టర్ప్లాన్ కోసం డ్రోన్ సర్వే నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ వివరాలు ఇవ్వండి పట్టణన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసుకునేందుకు మాస్టర్ ప్లాన్ అవసరమని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్తో కలిసి మునిసిపల్, పబ్లిక్ హెల్త్, రెవెన్యూ పంచాయతీరాజ్, ఇరిగేషన్, డీఎంహెచ్వో, అగ్రికల్చర్, మార్కెటింగ్, మెప్మా తదితర శాఖల అధికారులతో మాస్టర్ప్లాన్ మొదటి రూపకల్పనపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.. మాస్టర్ ప్లాన్ తయారీ కోసం మున్సిపల్ అధికారులు, 23 శాఖల సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యేక కార్యాచరణతో విజయోస్తు 2.0 వచ్చే పదో తరగతి వార్షిక ఫలితాల్లో జిల్లా స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించేలా ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పింకేశ్ కుమార్తో కలిసి విజయోస్తు 2.0, పదో తరగతి పరీక్షలు, డిజిటల్ లర్నింగ్ కరిక్యులం, లైబ్రరీ, తదితర అంశాలపై హెచ్ఎంలతో సమీక్షించారు. పంటల నమోదు తప్పనిసరి.. జనగామ రూరల్: పంటల నమోదు చేయించడం తప్పనిసరి అని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్మకానికి ఇది తప్పనిసరి ఆధారమని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. -
‘సాక్షి’పై కక్ష సాధింపు తగదు
జనగామ: సాక్షి మీడియాపై ఏపీ ప్రభుత్వ కక్ష సాధింపు తగదని, దాడులను తిప్పికొట్టే సమయం వచ్చిందని జర్నలిస్టులు స్పష్టం చేశారు. సాక్షి దినపత్రికపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రతీ పాత్రికేయుడు ధైర్యంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తా అంబేడ్కర్ విగ్రహం ఎదుట శుక్రవారం సాక్షి మీడియా ప్రతినిధులు కొత్తపల్లి కిరణ్ కుమార్, సురిగెల భిక్షపతి, నేతి ఉపేందర్, గోవర్దనం వేణుగోపాల్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరస న చేపట్టారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న దమనకాండను తీవ్రంగా ఖండిస్తూ పాత్రికేయులు నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఐజేయూ జిల్లా అధ్యక్షుడు ఇర్రి మల్లారెడ్డి, ఐజేయూ రాష్ట్ర ప్రతినిధి పార్నంది వెంకటస్వామి, సీనియర్ జర్నలిస్టు కన్నా పరుశరాములు మాట్లాడుతూ.. నకిలీ మద్యం, అవినీతి, ప్రజాసమస్యలపై వాస్తవాలను వెలుగులోకి తెస్తూ సాక్షి దినపత్రిక ప్రతిరోజూ ప్రజాస్వా మ్య బాధ్యతను నిర్వర్తిస్తోందన్నారు. ఇలాంటి ధైర్యవంతమైన జర్నలిజాన్ని అణచివేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కుట్రపూర్వకంగా కేసులు నమోదు చేస్తోందని మండిపడ్డారు. ఇది కేవలం ఒక పత్రికపై కాదని, మీడియా స్వేచ్ఛపై దాడి అని అన్నారు. సాక్షిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, ఏపీ ప్రభుత్వం ఒత్తిడికిలోనై పనిచేస్తున్న పోలీ సుల తీరును వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రయోజనాల కోసం జర్నలిస్టులు నిజాలను వెలుగులోకి తెచ్చే క్రమంలో కేసులు పెట్టడం ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఏ చర్యనైనా ఎదుర్కొంటామన్నారు. అలాగే సాక్షి పట్ల ఐక్యత ప్రదర్శిస్తూ, ప్రజల కోసం జర్నలిజం కొనసాగుతుందనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శ్రీభాష్యం శేషాద్రి, జమాల్ షరీఫ్, అశోక్ కుమార్, లక్ష్మణ్, ఎండబట్ల భాస్కర్, హింజ మాధవరావు, శేషత్వం ఆనంద్ కుమార్, వంగ శ్రీకాంత్రెడ్డి, కాసాని ఉపేందర్, బండి శ్రీనివాస్ రెడ్డి, చౌదర్పల్లి ఉపేందర్, శివశంకర్, తిప్పారాపు ఉపేందర్, భాను, రమేశ్, భా స్కర్, కేమెడీ ఉపేందర్, ఓరుగంటి సంతోష్, గణే శ్, మణి, వినయ్, యూసుఫ్, కిషోర్, మోహన్, మ ణి, మధు, సలీం, సురేష్, ఆశిష్, సుధాకర్, నరేష్, జయపాల్ రెడ్డి, శంకర్, బాబా, నవీన్ చారీ, రాజు, సుప్రీం, జితేందర్, శ్రీను, ఏజాజుద్దీన్ పాల్గొన్నారు. మీడియా స్వేచ్ఛపై దాడులు సరికాదు జనగామ చౌరస్తా అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన -
ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత వాసుదేవరావు అలియాస్ ఆశన్న
సాక్షిప్రతినిధి, వరంగల్: దండకారణ్యంలో మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతోంది. బుధవారం ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట 61 మంది సహచరులతో ఆయుధాలతో లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మావోయిస్టు పార్టీ మరో కేంద్ర కమిటీ సభ్యుడు, డీకేఎస్జెడ్సీ ప్రతినిధి తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్ శుక్రవారం అనుచరులతో అడవిబాటను వదిలారు. 208 మంది (110 మంది మహిళలు, 98మంది పురుషులు)సహచరులతో కలిసి 153 ఆయు ధాలతో ఆయన జగదల్పూర్లో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఇంద్రావతి ఏరియాను కేంద్రంగా ఏర్పాటు చేసుకుని ఆశన్న కార్యక్రమాలు కొనసాగించారు. ఛత్తీస్గఢ్లోని వివిధ ప్రాంతాల్లో భారీగా మావోయిస్టులు లొంగిపోయినట్లు హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ప్రకటించారు. చర్చల కోసం ప్రయత్నించి.. ఆపరేషన్ కగార్ ఉధృతం కావడం.. చాలామంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. ఈనేపథ్యంలో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామ ని కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట మార్చి 28న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒక దశలో ఒకే అన్నప్పటికీ.. తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా నో చెప్పారు. ఆ తర్వాత మే నెలలో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న చర్చలను ప్రతిపాదిస్తూ ఛత్తీస్గఢ్లోని ఓ మీడియా చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు, ప్రజా సంఘాలు చొర వ చూపాలని కోరారు. అయినప్పటికీ పోలీస్ కూంబింగ్ కొనసాగి కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బస్వరాజ్ సహా పలువురు అగ్రనాయకులు, కేడర్ ఎన్కౌంటర్లలో మృతి చెందారు. చర్చల ప్రతిపాదనలతో ఫలితం లేదనే భావన, పలు కారణాలతో లొంగుబాటును ఎంచుకున్న కేంద్ర నాయకులు మల్లోజుల అలియాస్ అభయ్, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ రూపేశ్ సహచరులు, ఆయుధాలతో సరెండర్ అయ్యారు. మావోయిస్టు నేత తాతతో కలిసి పనిచేసిన ఆశన్న 1993–94లో అన్నసాగర్ ఏరియా డిప్యూటీ కమాండర్గా, కమాండర్గా పనిచేశారు. శేషగిరిరావు అలియాస్ గోపన్నతో కలిసి పనిచేసిన ఆయన నల్లగొండ జిల్లాలోనూ కొంతకాలం దళనేతగా ఉన్నారు. ఆతర్వాత అనతి కాలంలోనే 1999లో పీపుల్స్వార్ పార్టీ నాయకత్వం యాక్షన్ టీంకు ఇన్చార్జ్గా నియమించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు కీలక యాక్షన్లకు ఆశన్న నాయకత్వం వహించినట్లు పోలీసు రికార్డులు నమోదయ్యాయి. 2000 సంవత్సరంలో అప్పటి హోం మంత్రి మాధవరెడ్డి కారును పేల్చి చంపిన ఘటనలో కీలకమని అప్పట్లోనే పోలీసులు ప్రకటించారు. 2003లో అలిపిరిలో చంద్రబాబు కాన్వాయ్ని క్లైమోర్మెన్ పేల్చిన ఘటనతోపాటు హైదరాబాద్ సంజీవరెడ్డినగర్లో ఐపీఎస్ అధికారి ఉమేశ్చంద్రను పట్టపగలే కాల్చిచంపిన ఘటనకు ఈయనే నాయకత్వం వహించినట్లు రికార్డులున్నాయి. ఆ తర్వాత నిర్బంధం పెరగడంతోపాటు ఉద్యమ నిర్మాణంలో భాగంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు, దండకారణ్యంలో వివిధ కేడర్లలో పనిచేసిన ఆశన్న కేంద్ర మిలటరీ కమిషన్కు కూడా కొంతకాలం ఇన్చార్జ్గా పనిచేసినట్లు ప్రచారం ఉంది. కాగా, దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ నేత వరకు ఎదిగి.. ఛత్తీస్గఢ్, సౌత్బస్తర్, మాడ్ డివిజన్లలో కీలకంగా వ్యవహరించిన ఆయన శుక్రవారం ఉద్యమ సహచరులతో కలిసి లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది.తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నది ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) మండలం లక్ష్మీదేవిపేట శివారు పోలోనిపల్లి (నర్సింగాపూర్) స్వగ్రామం. తల్లి సరోజన, తండ్రి భిక్షపతిరావు, తమ్ముడు సహదేవరావు, అక్క సౌమ్య. తండ్రి భిక్షపతిరావు 2012లో గొంతు క్యాన్సర్తో మృతిచెందగా, తమ్ముడు సహదేవరావు రైల్వేశాఖలో డ్రైవర్గా పనిచేస్తూ హనుమకొండలోని గోపాల్పూర్లో స్థిరపడినట్లు బంధువులు తెలిపారు. కాగా, వాసుదేవరావు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. అనంతరం కాజీపేటలోని సెయింట్గ్యాబ్రియల్ స్కూల్లో సెకండరీ విద్యనభ్యసించారు. భువనగిరిలో ఐటీఐ కూడా చేసిన ఆయన, కాకతీయ వర్సిటీలో డిగ్రీ చదువుతూ.. రాడికల్ స్టూడెంట్ యూనియన్కు (ఆర్ఎస్యూ) నాయకత్వం వహించారు. ఆతర్వాత పరిణామాల నేపథ్యంలో 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి వెళ్లారు. 1991 నుంచి ఆర్ఎస్యూలో పని చేసి అజ్ఞాతంలోకి వెళ్లాక దళ సభ్యుడి నుంచి నాలుగున్నర దశాబ్దాల్లో కేంద్ర కమిటీ అగ్రనేత వరకు ఎదిగారు. 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి.. నాలుగున్నర దశాబ్దాలు అడవిలో.. దళసభ్యుడి నుంచి కేంద్ర కమిటీ వరకు ఆశన్న ఉద్యమ ప్రస్థానం -
అక్రమ కేసులను ఎత్తివేయాలి..
ప్రజాసమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తెస్తున్న సాక్షి మీడియాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలు వెలుగులోకి తెస్తున్న సాక్షి పత్రికలపై కేసు పెట్టడం మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒత్తిడి మేరకు పనిచేస్తున్న పోలీసుల పని తీరును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. సాక్షి దినపత్రిక పై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలు చెప్పడం కూడా తప్పేనా. – లకావత్ చిరంజీవి (ఎంఏ,బీఈడీ), స్టేషన్ఘనపూర్● -
కోర్టుల సముదాయ నిర్మాణానికి నేడు శంకుస్థాపన
జనగామ: జిల్లా న్యాయసేవలకు కొత్త దశ ప్రారంభం కానుంది. జనగామ మండలం చంపక్హిల్స్లో 10 ఎకరాల విస్తీర్ణంలో కోర్టుల సముదాయం నిర్మాణానికి ఈనెల 18న (శనివారం) శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, జనగామ పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానుండగా, హైకోర్టు జడ్జిలు నామవరపు రాజేశ్వర్రావు, బీఆర్ మధుసూదన్రావు, సుద్దాల చలపతిరావు పాల్గొననున్నారు. 10 ఎకరాలు..రూ.81కోట్ల నిధులు జనగామ కోర్టు నూతన భవన సముదాయ నిర్మాణం కోసం చంపక్హిల్స్లో 10 ఎకరాల స్థలం కేటాయించగా, రూ.81కోట్ల నిధులు ఖర్చు చేయనున్నారు. ఇందులో 12 కోర్టుల సేవల కోసం డిజైన్ చేశారు. వీటిలో జిల్లా, పోక్సో, సీనియర్ సివిల్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్, అడిషినల్ జూనియర్ సివిల్ సెకెండ్ మెజిస్ట్రేట్ కోర్టులతో పాటు లోక్ అదాలత్, లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ సేవలు అందుతున్నాయి. ఇంకా ఫ్యామిలీ, ఎస్సీ,ఎస్టీ అదనపు సబ్, అడిషినల్ డిస్ట్రిక్, అదనంగా సబ్, మరో రెండు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు రావా ల్సి ఉంది. ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత జిల్లాలోని వివిధ కోర్టులు ఒకేచోట ఉండేలా సదుపా యం కలగనుంది. ప్రస్తుతం సిద్దిపేట రోడ్డు గీతానగర్ ఏరియాలో కోర్టు సేవలు అందుతున్నాయి. రెండేళ్ల లోపు కోర్టు సేవలన్నీ ఒకే సముదాయంలోకి రానుండడంతో ప్రజలు, న్యాయవాదులకు, సిబ్బందికి సేవలు మరింత సౌలభ్యం కానున్నాయి. ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ భవన సముదాయంలో న్యాయమూర్తుల చాంబర్లు, అడ్వకేట్ల హాల్, రికార్డు గదులు, లైబ్రరీ, మీటింగ్ హాల్, వెయిటింగ్ హాల్, పార్కింగ్ స్థలాలు వంటివి ఏర్పా టు చేయనున్నారు. జిల్లా ప్రజలు, న్యాయవాదులు ఈ ప్రాజెక్టుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులు ఒకేచోట ఉండటం వల్ల కేసుల పరిష్కారంలో వేగం పెరుగుతుందని, న్యాయసేవలు మరింత చేరువ అవుతాయని అభిప్రాయపడ్డారు. నేడు శంకుస్థాపన చంపక్హిల్స్ ప్రధాన రోడ్డుకు సమీపంలో కోర్టు సముదాయాలకు కేటాయించిన స్థలంలో నూతన భవన నిర్మాణాల కోసం శనివారం హైకోర్టు జడ్జిల చేతుల మీదుగా ఉదయం 11 గంటలకు పోక్సో, కుటుంబ కోర్టులతో సహా 12 కోర్టుల భవన నిర్మాణాలకు భూమి పూజ చేయనున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.హరిప్రసాద్ యాదవ్ తెలిపారు. డిస్ట్రిక్ సెషన్ జడ్జి బి.ప్రతిమ ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయమూర్తులు స్వాగతం పలుకనున్నట్లు తెలిపారు. శంకుస్థాపన అనంతరం పసరమడ్ల శివారులోని ఉషోదయ ఫంక్షన్హాల్లో మీటింగ్ ఉంటుందన్నారు. కాగా, పోలీసులు కట్టు దిట్టమైన బందోబస్తు చేపట్టనున్నారు. చంపక్హిల్స్ 10 ఎకరాల స్థలం, రూ.81కోట్లు నిధుల కేటాయింపు నలుగురు హైకోర్టు న్యాయమూర్తుల రాక కొత్త, అదనపు కోర్టులు వచ్చే అవకాశం -
బీసీబంద్కు సకలజన మద్దతు
● నేడు రైల్వేస్టేషన్ నుంచి భారీ ర్యాలీ జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 18న(శనివారం) నిర్వహించనున్న బీసీ బంద్కు అన్ని వర్గాల నుంచి అఖండ మద్దతు లభిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ను రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు, అన్ని రాజకీ య పార్టీలు, నాయకులు, విద్యార్థి సంఘాలు, రైతు, కార్మిక సంఘాలు ఒకే వేదికపై గళం కలుపుతున్నాయి. 42 శాతం రిజర్వేషన్లు కల్పించా లనే నినాదంతో ప్రతి బీసీ కుటుంబం ఒక్కటై ఉద్యమాన్ని విజయవంతం చేసేందుకు సిద్ధమవుతోంది. నేడు భారీ ర్యాలీ.. బీసీ బంద్ నేపథ్యంలో పట్టణంలోని రైల్వేస్టేషన్ నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు బీసీ సంఘాలు ప్లాన్ చేశాయి. ప్రైవేటు విద్యా, వ్యాపార, వాణిజ్య, ఇతర సంస్థలు బంద్ పాటించనున్నాయి. ర్యాలీలతో పాటు పెద్దఎత్తున నిరసన తెలుపనున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి నిఘా వేయనున్నారు. -
ప్రజాస్వామ్యానికి ముప్పు..
ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభం. ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే బాధ్యత జర్నలిస్టులది. ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్న వారిపై దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్య విలువలకు పెద్ద దెబ్బ. ఆంధ్రప్రదేశ్ ఇటీవల జర్నలిస్టులపై దాడులు విచారకరం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ విధానాల్లో లోపాలను ప్రజల పక్షాన ప్రశ్నించినపుడు వాటిని ఫీడ్బ్యాక్గా తీసుకొని సమస్యలు పరిష్కరించి మెరుగైన పాలన అందించడం కోసం కృషి చేయాలి. ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణకు కట్టుబడి ఉండాలి. దాడుల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్య తీసుకోవాలి. ప్రతి జర్నలిస్టు నిర్భయంగా పని చేసే వాతావరణం ప్రభుత్వం కల్పించాలి. – డి.శ్రీనివాస్, టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జనగామ -
కొత్తగా ఉపాధి
జనగామ రూరల్: జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పని కల్పించడానికి ఉద్దేశించిన గ్రామసభలు జిల్లాలో ప్రారంభమయ్యాయి. ఈనెల 2వ తేదీ నుంచే చేపట్టాల్సి ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి దృష్ట్యా కొత్త పనులను గుర్తించలేదు. ప్రస్తుతం కోడ్ తొలగిపోవడంతో జిల్లాలో ఈ నెలలో గ్రామసభల ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి పనులు గుర్తించనున్నారు. మట్టి పనులను తగ్గించి ఆర్థికంగా బలోపేతమయ్యే పనులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో ప్రధానంగా బిల్డింగులు ఇతర నిర్మాణాలను చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవనాలు, సీసీ రోడ్లు, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణాలు, కిచెన్షెడ్లు, పాఠశాలలకు ప్రహరీ నిర్మాణం పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి అందరి ఆమోదంతో పనులు గుర్తించాలి. జిల్లా వ్యాప్తంగా 281 గ్రామపంచాయతీలు ఉండగా అన్నింటా గ్రామసభలు నిర్వ హించడానికి ఇదివరకే ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ మేరకు 58 రకాల పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందిస్తున్నారు. వీలైనంత త్వరగా గ్రామసభలు పూర్తిచేసి మండల పరిషత్కు, ఆ తర్వాత జిల్లాకు పంపించి అనుమతులు తీసుకోవాలని అధికారులు తలపోస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ఏడాదికి సంబంధించిన పనులు కొనసాగుతాయి. ఆ తర్వాత ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్తగా గుర్తించిన పనులు ప్రారంభిస్తారు. ఉపాధి పథకంలో ఎక్కువగా చెరువుల్లో పూడికతీత పనులు చేపడుతుంటారు. ఈ పనుల పేరుతో ఏటా రూ.కోట్లలో నిధులు ఖర్చవుతున్నాయి. కానీ ఆశించిన మేరకు ఫలితాలు కనిపించడం లేదు. మరోవైపు ఈ పూడికతీత పనుల్లో అక్రమర్కులకు మరింత లాభం చేకూరేలా ఉంటుంది. ఉపాధి హామీ పనులపై నిర్వహిస్తున్న సోషల్ ఆడిట్లో తరచూ ఇవి బయటపడుతున్నాయి. నిరుపేద కూలీల పేరుతో రూ.లక్షల్లో నిధులు పక్కదారిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మాణం వంటి పనులు చేపడితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకుగాను ఈ పూడికతీత పనుల అంచనాల తయారీని తగ్గించారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కూలీలకు స్థానికంగా పనులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. జిల్లాలో 281 గ్రామాల్లో పనులు నడుస్తున్నాయి. మొత్తం 1,17,806 లక్షల జాబ్కార్డులు ఉన్నాయి. ఈ జాబ్కార్డుల్లో మొత్తం 2.31లక్షల మంది ఉపాధి హామీ కూలీలుగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. యాక్టివ్ జాబ్ కార్డులు 77,788 ఉండగా వారిలో 1,28,436 మంది యాక్టివ్ కూలీలకు12,94,056 పని దినాలు కల్పించారు. జీపీ, అంగన్వాడీ భవనాల నిర్మాణం, ఇసుకమేటల తొలగింపు.. ఇందిరమ్మ ఇళ్లు, పొలంపనుల్లో కూలీల సహాయం కోసం ప్రణాళిక ఆర్థికంగా బలోపేతమయ్యే పనులకే అవకాశం పనుల గుర్తింపునకు గ్రామసభల నిర్వహణ 58 రకాల ఉపాధి హామీ పనులు చేపట్టాలని నిర్ణయంగ్రామసభల్లో సీజన్లకు అనుగుణంగా ఉపాధి పనులు గుర్తిస్తారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ ఏడాది కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో కూలీల సహాయాన్ని తీసుకోనున్నారు. అలాగే పంటపొలాల్లో కూలీలతో ఇసుక మేటలు తొలగించనున్నారు. వ్యవసాయ పనులు మెండుగా ఉండే రోజుల్లో కూలీలు తక్కువ సంఖ్యలో హాజరవుతుంటారు. ఆ పనులు లేని సమయంలో అధిక మందికి పనులు కల్పించేలా ప్రణాళికలు రూపొంది స్తుంటారు. జిల్లాలో కొన్నాళ్లుగా ఎక్కువగా భూగర్భజలాల పెంపునకు సంబంధించిన పనులకే ప్రాధాన్యమిస్తున్నారు. చెరువులు, కాలువలు, కుంటల్లో పూడికతీత, కాలువల్లో పిచ్చిమొక్కలు, నీటి కుంటల నిర్మాణం, కందకాల తవ్వకం, అంతర్గత మట్టి రోడ్ల నిర్మాణం, మొక్కలు, పండ్ల తోటల పెంపకం వంటి పనులు ఎక్కువగా చేస్తున్నారు. -
సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధర
జనగామ: జిల్లా రైతులు సాగుచేసి పండించిన పత్తిని నేరుగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)సెంటర్లలో అమ్ముకుని ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పిలుపునిచ్చారు. సీజన్ ప్రారంభానికి ముందుగా పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, సీసీఐ కార్యకలాపాలపై ఏర్పాట్లను సమీక్షిస్తూ కలెక్టర్ గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్న్స్ హాల్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్తో కలిసి మార్కెటింగ్, వ్యవసాయశాఖ, ఫైర్, వి ద్యుత్త్, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యంతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 15 పత్తి మిల్లుల పరిధిలో సీసీఐ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమీక్షలో జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత, వ్యవసాయశాఖ అధికారి అంబికాసోని, లీగల్ మెట్రాలజీ అధికారి ఝాన్సీ, ఎన్పీడీసీఎల్ డీఈ గణేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవాలి.. ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రజలకు నమ్మకం ఉంటుందని, దాన్ని కాపాడుకునే విధంగా వైద్యాధికారులు సేవలందించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సూచించారు. కలెక్టరేట్లో వైద్యసేవలకు సంబంధించిన వివిధ అంశాలపై జిల్లా వైద్య అధికారి, పీహెచ్సీల మెడికల్ అధికారులు, సూపర్వైజర్లతో కలెక్టర్ సమీక్షించారు. రుణం మంజూరు చేయాలి.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని ఆన్లైన్లో వెంటనే నమోదు చేసి బ్రిక్స్, సిమెంట్, యూనిట్స్ ఏర్పాటుకు స్వయం సహాయక సభ్యులకు రుణ మంజూరు చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో గూగుల్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలాశాఖ ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్రెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, సహాయ ఎన్నికల అధికారులతో సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, ఆర్డీవో లు, తహసీల్దార్లు పాల్గొన్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
‘కొండా’ వివాదం సమసినట్లేనా..?
సాక్షిప్రతినిధి, వరంగల్ : సంచలనంగా మారిన మంత్రి కొండా సురేఖ దంపతులు, ఆమె కూతురు సుస్మిత వ్యాఖ్యల వివాదం సమసినట్లేనా.. ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది.. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని కొండా సురేఖ ఇంటికి టాస్క్ఫోర్స్ పోలీసులు ఎందుకు వెళ్లారు.. ఈ సందర్భంగా సుస్మిత చేసిన వ్యాఖ్యల పర్యవసానం ఏమిటి.. ఇంతకీ వివాదానికి కారణమైన మాజీ ఓఎస్డీ సుమంత్ ఎక్కడ.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టిలను కలిసిన సురేఖ.. కీలకమైన కేబినెట్ మీటింగ్కు ఎందుకు వెళ్లలేదు?.. ఇవన్నీ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్టాపిక్గా మారాయి. 48 గంటలుగా తాజా రాజకీయ పరిణామాలు వరంగల్ను హీటెక్కించాయి. సుమంత్ కోసం పోలీసులు.. కలకలం రేపిన సుస్మిత వ్యాఖ్యలు.. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిల మధ్య విభేదాలు పక్కన పెడితే... మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్ఫోర్స్ పోలీసులు వెళ్లడం.. అక్కడ సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు తన తల్లిదండ్రులపై కుట్ర చేస్తున్నారంటూ సుస్మిత ఘాటైన విమర్శలు చేశారు. కొండా సురేఖ, మురళిలకు ఏం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆమె హెచ్చరించారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో.. అటు అధికారవర్గాల్లో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇదే సమయంలో వరంగల్లో మీడియాతో మాట్లాడిన కొండా మురళీధర్ సీఎం రేవంత్రెడ్డితో తమకు విభేదాలు లేవని, తనకు ఎమ్మెల్సీ కూడా ఇస్తామని చెప్పారన్నారు. సుస్మిత ఎక్కడ.. ఎప్పుడు.. ఏం మాట్లాడింది తనకు తెలియదని కొట్టిపారేశారు. మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్ఫోర్స్ పోలీసులు ఎందుకు వెళ్లారు? ఇంతకీ అతను ఎక్కడ ఉన్నాడు? ప్రభుత్వం తదుపరి ఏం చేయబోతుంది? అనే అంశాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. రెండు రోజులుగా జరుగుతున్న వివాదాల నేపథ్యంలో గురువారం జరిగిన కీలకమైన మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరుకాకపోవడం హాట్టాపిక్గా మారింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసిన కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మితలు.. టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్తో కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కూడ కలిసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మీనాక్షి నటరాజన్, మహేశ్కుమార్లను కలిసిన కొండా సురేఖ.. 48 గంటల్లో జరిగిన పరిణామాలను వివరించినట్లు తెలిసింది. పార్టీపరంగా, కొందరు ప్రజాప్రతినిధుల వల్ల తమకెదురవుతున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా మీడియాతో మాట్లాడిన సురేఖ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. మీనాక్షి నటరాజన్, మహేశ్కుమార్లతో భేటీ అయిన సురేఖ, ఆ తర్వాత జరిగిన కేబినెట్ మీటింగ్కు హాజరుకాకపోవడం కొత్త వివాదానికి తెర తీసింది. అసలు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడిన సురేఖకు వారు ఏమి భరోసా ఇచ్చారు? అక్కడినుంచి కేబినెట్ మీటింగ్కు వెళ్లాల్సిన ఆమె ఎందుకు వెళ్లలేదు? కావాలనే వెళ్లలేదా? లేక ఎవరైనా వద్దని చెప్పారా? ఈ నేపథ్యంలో కొండా దంపతులకు ఏమైన ప్రత్యేక వ్యూహం ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది..? అన్న అంశాలు అన్ని వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. హీటెక్కిన వరంగల్ రాజకీయాలు మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం ‘టాస్క్ఫోర్స్’.. కలకలం రేపిన కొండా సుస్మిత వ్యాఖ్యలు సీఎం రేవంత్రెడ్డితో విభేదాలు లేవన్న కొండా మురళి కేబినెట్ మీటింగ్కు వెళ్లని మంత్రి సురేఖ.. హాట్ టాపిక్గా తాజా పరిణామాలు -
దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలి..
జనగామ రూరల్: దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జనగామ మండలంలోని ఎర్రగొల్లపహాడ్, గానుగుపహాడ్, పెద్దపహాడ్, వడ్లకొండ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, పీఏసీఎస్ సీఈవో భాస్కర్రెడ్డి, బూరెడ్డి ప్రమోద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దళారులను ఆశ్రయించొద్దు.. నర్మెట/తరిగొప్పుల: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సూచించారు. నర్మెట మండలం హన్మంతాపురం, తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
సీపీఆర్పై అవగాహన
జనగామ: జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీపీఆర్ (కార్డియో పల్మోనరీ రీసస్సిటేషన్)పై గురువారం ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమణి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ కళాశాల విద్యార్థులతో పాటు పారా మెడికల్, బోధనా సిబ్బంది కూడా పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ నాగమణి మాట్లాడుతూ.. గుండెపోటు వచ్చిన వ్యక్తులకు సమయానికి సరైన సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి చేతివాటం సాధన చేసే అవకాశం కూడా కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. రేపటి బీసీబంద్కు ‘చాంబర్’ మద్దతుజనగామ రూరల్: స్థానిక సంస్థలలో బీసీలకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టే నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ, బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ కోసం జనగామ జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 18న జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్ సేవెల్లి సంపత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్యను కలిసి, బంద్కు మద్దతు తెలపాలని కోరుతూ మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బంద్కు విద్యా, వ్యాపార సంస్థలు, హోటళ్లు, మద్యం దుకాణాలు సహా సమాజంలోని అన్ని వర్గాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. కాగా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య మాట్లాడుతూ.. చాంబర్ తరఫున బీసీ బంద్కు పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు. దూడల సిద్ధయ్య, జాయ మల్లేష్, పండుగ హరీశ్, మాచర్ల భిక్షపతి, పాశం శ్రీశైలం పాల్గొన్నారు.ప్రజాభిప్రాయాన్ని తెలపాలి..జనగామ: దేశం స్వాతంత్య్రం సాధించి 2047 నాటికి 100 సంవత్సరాలు అవుతుందని దీనిపై రాష్ట్ర ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఆర్టీసీ డిపో మేనేజర్ స్వాతి అన్నారు. గురువారం పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్లో పలువురితో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాసర్వేలో భాగంగా పలు క్యూర్ కోడ్లను ఇచ్చారని దేశ అభివృద్ధి గురించి ఈ యాప్ ద్వారా అభిప్రాయాలను పంపించాలని, తెలంగాణ రైజింగ్–2047లో రాష్ట్ర అభివృద్ధిలో మనం భాగస్వాములు కావొచ్చని, పలు అంశాలపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో ఆర్టీసీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మకుంట పనుల పరిశీలనజనగామ రూరల్: పట్టణంలోని బతుకమ్మకుంటలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన మట్లాడుతూ..తుదిదశకు వచ్చిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ వసంత, మున్సిపల్ కమిషనర్, మెప్మా తదితర శాఖల అధికారులకు ఈ సందర్భంగా పలు సూచనలు జారీ చేశారు. ● ఇప్పటికే రూ.205 కోట్లు మంజూరు చేసిన సర్కార్ సాక్షి, వరంగల్: వరంగల్ మామునూరు విమానాశ్రయం భూసేకరణకు మరో రూ.90 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరిధిలో 696.14 ఎకరాలు ఉండడంతో అదనంగా కావాల్సిన 253 ఎకరాల కోసం ఈ ఏడాది జూలై 25న రూ.205 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు ఇచ్చింది. భూ పరిహారానికి అదనంగా రూ.112 కోట్లు అవసరం ఉండగా, ఇప్పుడు రూ..90 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఇప్పటివరకు భూసేకరణ కోసం రూ.295 కోట్లు మంజూరు చేసినట్లయ్యింది. సాధ్యమైనంత తొందరగా ఏఏఐకు ఆయా కన్సల్టెన్సీ సంస్థలు ఇచ్చే మార్కింగ్ నివేదికతో ఆ తర్వాత నిర్మాణ పనులకు టెండర్లు పిలవనున్నారు. సత్వర న్యాయం అందించాలిహసన్పర్తి: పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందించాలని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. హసన్పర్తి పోలీస్స్టేషన్ను గురువారం సీపీ సందర్శించారు. ఈసందర్భంగా పోలీస్స్టేషన్ ఆవరణను పరిశీలించి స్టేషన్ పరిఽధిలోని సమస్యత్మాక గ్రామాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. -
ఒక్కరోజే 133 మద్యం టెండర్లు
జనగామ: జిల్లా ఎకై ్సజ్ శాఖలో చివరి నిమిషంలో టెండర్ల ప్రక్రియ జోరందుకుంది. రెండు రోజుల వరకు నిశ్శబ్దంగా ఉన్న మద్యం షాపుల టెండర్లకు ఒక్కసారిగా దరఖాస్తుల వెల్లువ కనిపించింది. గురువారం ఒక్క రోజే జిల్లా వ్యాప్తంగా 133 దరఖాస్తులు స్వీకరించడంతో అధికారులు కొంతమేర ఊపరి పీల్చుకున్నారు. ఇప్పటి వరకు పెద్దగా స్పందన కనిపించకపోవడంతో ఎకై ్సజ్ శాఖ ఆందోళన చెందగా, చివరి రోజుల్లో వ్యాపారులు ముందుకు వస్తుండడంతో అధికారుల ముందస్తు అంచనాకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. చివరి రోజులైన శుక్ర, శుక్ర, శనివారాల్లో ఇదే ఉత్సాహం కొనసాగుతుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నా యి. జిల్లాలో ఈ నెల 15వ తేదీ వరకు 92 టెండర్లు రాగా, 16వ తేదీన ఒక్కరోజే 133 దాఖలయ్యాయి. దీంతో మొత్తం దరఖాస్తులు 225కు చేరుకున్నాయి. నేడు, రేపు భారీగా పెరిగే అవకాశం -
రైతుల సంక్షేమమే లక్ష్యం
స్టేషన్ఘన్పూర్: రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, సీఎం రేవంత్రెడ్డి రైతుల పక్షపాతిగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొనియాడారు. గురువారం మండలంలోని నమిలిగొండ గ్రామంలో, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ డీఎస్ వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశాల్లో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడారు.. రైతులు దళారుల వద్ద మోసపోవద్దనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ వసంత, డీఏఓ అంబికాసోని, ఏడీఏ వసంత సుగుణ, డీసీఓ కోదండరాం, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
మిగిలింది మూడు రోజులే!
జనగామ: జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియ ఊహించని విధంగా మందగమనం దిశగా సాగుతోంది. టెండర్ దాఖలు గడువు ముగియడానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నా, ఇప్పటివరకు జిల్లాలో టెండర్ల సంఖ్య నామమాత్రంగానే ఉంది. గత సీజన్న్లో సుమారు 2,500 వరకు టెండర్లు దాఖలైన చోట, ఈసారి 100 దాటలేని పరిస్థితి ఎకై ్సజ్ శాఖ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. టెండర్ ఫీజు పెంపు ప్రభావం టెండర్ ఫీజు రూ.3 లక్షలకు పెంచడం మద్యం వ్యాపారులకు పెద్ద అడ్డంకిగా మారింది. గతంలో ఫీజు తక్కువగా ఉండటంతో చిన్నస్థాయి వ్యాపారులు, స్థానిక పెట్టుబడిదారులు కూడా పోటీలో పాల్గొన్నారు. కానీ ఇప్పుడు భారీ మొత్తంలో డిపాజిట్ పెట్టాల్సి రావడంతో చాలామంది వెనక్కి తగ్గారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిన నేపథ్యంలో లిక్కర్ వ్యాపారంలోనూ పెట్టుబడి పెట్టాలంటే ఆలోచిస్తున్నారు. తగ్గిన వైన్స్ అమ్మకాలు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే, చాలా చోట్ల వైన్స్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 15 నుంచి 20 శాతం వరకు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పెరిగిన ధరలు, వ్యయ నియంత్రణ, ఆర్థిక మందగమనం వంటి అంశాలు అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపించాయి. ఈ పరిస్థితిలో కొత్త లైసెన్సుల కోసం ముందుకు వచ్చే వ్యాపారులు తగ్గిపోవడం సహజమేనంటూ విశ్లేషకులు అంగీకరిస్తున్నారు. టెండర్దారులకు ఫోన్లు చేస్తున్న అధికారులు టెండర్లు దాఖలు చేయడం తగ్గిపోవడంతో ఎకై ్సజ్ శాఖ అధికారులు స్వయంగా పాత టెండర్దారులకు ఫోన్న్లు చేసి దరఖాస్తులు వేయమని అభ్యర్థిస్తున్నట్లు సమాచారం. జిల్లాస్థాయిలో కూడా శాఖ అధి కారులు మద్యం వ్యాపారులతో సమావేశాలు నిర్వహిస్తూ టెండర్లో పాల్గొనే విధంగా అధికారులు క్షేత్రస్థాయిలో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ వ్యాపారుల ఎంట్రీ ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంతమంది టెండర్ దారులు తెలంగాణ మార్కెట్లో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో లైసెన్సింగ్ విధానం కొంత సాఫీగా ఉండటం, కొన్ని పట్టణాల్లో వ్యాపార అవకాశాలు మెరు గ్గా కనిపించడం కారణంతో ఉత్సాహంగా ఉన్నట్లు ప్రచారం జరు గుతుంది. ఏపీలోని బడా వ్యాపారులు ఎంట్రీ అవుతున్నారనే ప్రచారం నేపథ్యంలో స్థానిక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. గత సీజన్ ఉత్సాహం కనిపించడం లేదు గత సీజన్లో మద్యం దుకాణాల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఒక్కో షాపునకు పదికిపైగా టెండర్లు వేశారు. కానీ ఈసారి ఆ ఉత్సాహం కనిపించడం లేదు. వడ్డీరేట్లు పెరగడం, అనేక చోట్ల లిక్కర్ విక్రయాలే తగ్గడం, రియల్ ఎస్టేట్ మందగమనం అనేక కారణాలతో టెండర్లపై ప్రభావం చూపిస్తోందని మాట్లాడుకోవడం గమనార్హం. మున్సిపాలిటీల్లో నిబంధనలు సడలింపు పురపాలిక(మున్సిపల్) పరిధిలో మద్యం దుకాణాలకు సంబంధించిన నిబంధనలకు ఎకై ్సజ్ శాఖ అధికారులు సడలించారు. మున్సిపల్ లిమి ట్స్లో వైన్స్ ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే విధంగా ఆదేశాలు జారీ చేశారు. గతంలో వార్డు నెంబర్ల ఆధారంగా లక్కీ లాటరీలో వచ్చిన విధంగా దుకాణాలు ఏర్పాటు చేసుకునేవారు. నిబంధనల సడలింపు వ్యాపారులకు కొంత ఉపశమనం కలిగించే పరిణామం. ఇదిలా ఉండగా చలాన్లో సైతం జిల్లా పేరు తీసి వేయడంతో ఒక్క చలాన్తో రాష్ట్రంలో ఎక్కడైనా వేసుకునే అవకాశం కల్పించారు.జిల్లాలో 50 మద్యం దుకాణాలకుగాను టెండర్లను స్వీకరిస్తున్నారు. గతనెల 26వ తేదీన ఇందుకు సంబంధించిన నోటిఫికేసన్ విడుదల కాగా, ఈనెల 18వ తేదీతో గడువు ముగియనుంది. 2023–25 సంవత్సరంలో జిల్లాలో 2,492 దరఖాస్తులు రాగా, రూ.50కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఈసారి జరిగే 2025–27 రెండేళ్ల కాలపరిమితిలో టెండర్లలో 3వేలకు పైగా దరఖాస్తులు వస్తాయని ఎకై ్సజ్ శాఖ అంచనాలు వేసుకుంది. టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేసి 20 రోజులు గడిచిపోతున్నా, జిల్లాలో కేవలం 83 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇందులో జనగామ సర్కిల్లో 38, స్టేషన్ఘన్పూర్లో 27, పాలకుర్తిలో 18 మంది టెండర్లు దాఖలు చేశారు. పాలకుర్తి–5, జనగామ–10, స్టేషన్ ఘన్పూర్లో ని–8 దుకాణాలకు ఇంకా బోనీ కాలేదు. టెండరుదారులు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు.మద్యం దుకాణాలకు మూడు రోజులు సమయమే ఉండడంతో చివరి నిమిషాల్లో భారీగా టెండర్లు వచ్చే అవకాశం ఉందని ఎకై ్సజ్ అధికారులు భావిస్తున్నారు. చాలామంది వ్యాపారులకు చివరి రోజుల్లోనే టెండర్లు వేయడం ఆనవాయితీ. గతంలోనూ అలానే జరిగిందని జిల్లా ఎకై ్సజ్ అధికారులు అంటున్నారు. ప్రస్తుత టెండర్ల మందగమనం ప్రభుత్వానికి ఆర్థికంగా పెద్ద సవాలుగా మారింది. మద్యం టెండర్లు ప్రభుత్వం ఆదాయానికి ముఖ్యమైన వనరు కావడంతో, చివరి మూడురోజుల్లో వ్యాపారులు ముందుకు రావాలని అధికారులు ఎదురుచూస్తున్నారు. సర్కిల్ దుకాణాలు టెండర్లు జనగామ 20 38 స్టే.ఘన్పూర్ 16 27 పాలకుర్తి 14 18 మొత్తం 50 83 ఇప్పటివరకూ నామమాత్రంగానే మద్యం టెండర్లు ఎకై ్సజ్ శాఖ అధికారుల్లో టెన్షన్ పాత వ్యాపారులు, ఉత్సాహవంతులకు ఫోన్లు -
ఆలయాల భూములను కాపాడాలి
–10లోuనర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి దొంతి కాంతమ్మకు బుధవారం సీఎం రేవంత్రెడ్డి నివాళులర్పించారు. కాజీపేట ప్రశాంత్ నగర్ సమీపంలోని పీజీఆర్ గార్డెన్లో మాత యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించగా సీఎంతోపాటు మంత్రులు, ఉమ్మడిజిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ముందుగా కాంతమ్మ చిత్రపటం వద్ద పూలు చల్లి మాధవరెడ్డిని పరామర్శించారు. అంతకుముందు సీఎంకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. – సాక్షిప్రతినిధి, వరంగల్ జనగామ రూరల్: ఆలయాల భూములను కాపాడాలని భక్తులకు మెరుగైన సదుపాయాలను కల్పించాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. బుధవారం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన ఆలయాలపై కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, ఎండోమెంట్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావుతో కలిసి దేవస్థానాల చైర్మన్లు, ఈఓ, రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో గల ఆరు దేవస్థానాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. జీడికల్ రామచంద్రస్వామి, చిల్పూర్ బుగులు వెంకటేశ్వరస్వామి, స్టేషన్ ఘన్పూర్ తిరుమలనాథస్వామి, నవాబ్పేట కోదండరామస్వామి, చిన్నపెండ్యాల లక్ష్మీనరసింహస్వామి, జఫర్గడ్ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను పర్యవేక్షించాలన్నారు. నవంబర్ 10వ తేదీన జరిగే జీడికల్ లక్ష్మీ నర్సింహస్వామి కల్యాణాన్ని పురస్కరించుకొని తగు ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులు ఉండేందుకు మౌలిక సదుపాయాలు రూమ్ లను నిర్మించాలన్నారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ.. దేవాలయాల భూములను త్వరగా సర్వే చేిసి ఎండోమెంట్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని హద్దులను ఏర్పాటు చేయాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలి.. జిల్లా కేంద్రంలోని గ్రీన్ మార్కెట్ లోపల పత్తి యార్డు కోసం నిర్మించిన స్థలంలో రెండు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్య చందూనాయక్ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకు బుధవారం వినతిపత్రం అందజేశారు. గతంలో మార్కెట్ యార్డు బయట ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించడం వల్ల రైతుల ధాన్యాన్ని పెద్దఎత్తున దొంగలు ఎత్తుకెళ్లడం జరిగిందన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
జీవాలకు టీకా రక్ష
జనగామ రూరల్: పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం 6 నెలలకు ఒకసారి వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఈ సంవత్సరం ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో పశువైద్య బృందాలు ప్రతీ గ్రామాన్ని సందర్శించి, 3 నెలల వయస్సు దాటిన గేదె జాతి, గోజాతి పశువులకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వనున్నారు. ఏటా చలికాలంలో పశువులకు వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈనేపథ్యంలో పశుసంవర్ధక శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. బుధవారం నుంచి జిల్లావ్యాప్తంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని, పశువులకు టీకాలు వేయించాలని అధికారులు సూచిస్తున్నారు. లక్షణాలు ఇవి..నివారణ ఇలా.. గాలికుంటు వ్యాధిలో గేదెలు, ఆవులకు వైరస్ సోకుతుంది. వ్యాధి సోకిన పశువులు బక్కచిక్కి అల్సర్ బారినపడతాయి. రెండు నుంచి ఆరు రోజుల వరకు జ్వరం ఎక్కువగా ఉంటుంది. నోరు, పెదాలు, నాలుకతో పాటు కాళ్ల గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. మేత, నీళ్లు సరిగా తీసుకోవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి పశువులు, దూడలు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈనేపథ్యంలో వ్యాధి సోకిన పశువులకు ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించాలి. పుండ్లను పొటాషియం పర్మాం గనేట్ లేదా నార్మల్ సైలెన్ వాటర్తో శుభ్రంచేయాలి. రెండోసారి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు యాంటీబయాటిక్స్ మందులు, వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి బీ కాంప్లెక్స్ మందులు వాడాలి. అలాగే గాలికుంటు వ్యాధిపై నిర్లక్ష్యం వహించకుండా పశుసంవర్ధక శాఖ వైద్యుల మేరకు క్రమం తప్పకుండా ఏడాదికి రెండుసార్లు టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన పశువులను ఇతర పశువులతో కలిసి ఒకేచోట ఉంచొద్దు. వారానికి ఒకసారి కొట్టంలో సున్నం చల్లి క్రిమికీటకాల నివారణకు చర్యలు చేపట్టాలి. వ్యాధి సోకిన గేదె, ఆవు నుంచి తీసిన పాలను 100 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేసిన తర్వాతే తాగాలి. ఒకవేళ పశువు చనిపోతే గోతిలో బ్లీచింగ్ పౌడర్ చల్లి పాతిపెట్టాలని పశువైద్యులు సూచిస్తున్నారు. గ్రామాల్లో గాలికుంటు నివారణ టీకాలు నెలరోజులపాటు కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యుల సూచన జిల్లా వ్యాప్తంగా 1,45,000 పశువులుజిల్లాలో నాలుగు ఏరియా పశువైద్యశాలలు ఉండగా 23 ప్రాథమిక పశువైద్యశాలలు ఉన్నాయి. 20 సబ్సెంటర్లు ఉన్నాయి. ఆవులు 73,482, గేదెలు 75,029 ఉన్నాయి. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమతో ఆర్థికంగా బలపడుతున్న రైతులు నష్టపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏటా రెండుసార్లు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. జిల్లాలోని 36 మండల టీంలు, 100 మందికి పైగా సిబ్బంది ఈనెల 15 నుంచి నవంబర్ 14 వరకు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నారు. గ్రామాల వారీగా షెడ్యూల్ ప్రకారం ప్రతీరోజు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు టీకాలు వేస్తారు. రైతులు పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ నెల 15 నుంచి గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 14 వరకు అన్ని గ్రామాల్లోని పశువులకు ఉచితంగా టీకాలు వేస్తాం. మేకలు, గొర్రెలు, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకినా పశువైద్య సిబ్బందికి సమాచారం అందించాలి. – ప్రాంతీయ పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకుడు దేవేందర్ -
నేడు ఆర్టీసీ ‘డయల్ యువర్ డీఎం’
జనగామ: జనగామ ఆర్టీసీ డిపోలో ఈనెల 16న (గురువారం) డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ స్వాతి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బచ్చన్నపేట, దేవరుప్పుల, లింగాలఘణపురం, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, మద్దూర్, పాలకుర్తి మండలాల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు సర్వీస్ సేవలకు సంబంధించి డయల యువర్ డీఎం ద్వారా సమస్యలతో పాటుగా సూచనలు, సలహాలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే డయల్ యువర్ డీఎం ప్రోగ్రాంలో–99592 26050 ఫోన్ నెంబర్ కు కాల్ చేయాలన్నారు. జనగామ: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో ఖాళీగా(మిగిలిన) ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు దరఖాస్తుల చేసుకోవాలని గురుకులాల జిల్లా సమన్వయాధికారి పి.శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. 5వ తరగతిలో ప్రవేశం కోసం కామన్ ఎంట్రెన్స్ వీజీటీ సీఈటీ–2025 రాసిన వారితో పాటు రాయనివారు కూడా అర్హులుగా పేర్కొన్నారు. 6వ తరగతి నుంచి 9వ తరగతుల్లో ప్రవేశం కోసం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బ్యాక్లాగ్ వేకెన్సీ ఎగ్జామ్ బీఎల్వీ సీఈటీ–2025 రాసిన వారితో పాటు రాయని వారు కూడా అర్హులన్నారు. ఎంట్రెన్స్ రాసిన ఎగ్జామ్ హాల్ టికెట్ (పరీక్ష రాసిన వారు), ర్యాంక్ కార్డ్ (పరీక్ష రాసిన వారు), కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు (పరీక్ష రాసిన వారు, రాయని వారు) వీటిని వెంట తెచ్చువాలన్నారు. ఆసక్తి గల వి ద్యార్థులు ఈనెల 16, 17 తేదీల్లో సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తును జనగామ సోషల్ వెల్ఫేర్ గురుకులంలో సమర్పించాలన్నారు. పరీక్ష రాసిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. పరీక్ష రాసిన పిల్లలు అందుబాటులో లేని పక్షంలో పరీక్ష రాయని వారికి కలెక్టర్ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలిజనగామ రూరల్: రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన కమిటీ అధ్యక్షుడు బి.లక్ష్మయ్య డిమాండ్ చేశారు. బుధవారం సాధన కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. 18 నెలల నుంచి బకాయిలు చెల్లించకుండా జాప్యం చేయడం వల్ల రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందిపడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది పెన్షన్దారులు అప్పుల బాధలకు కుంగిపోయి చనిపోయారన్నారు. కార్యక్రమంలో అంబటి రాజయ్య, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి మాదిగలకు ఇవ్వాలిజనగామ: కాంగ్రెస్ జనగామ జిల్లా అధ్యక్ష పదవి ఈసారి మాదిగలకు కేటాయించి సముచితమైన స్థానం కల్పించాలని కోరుతూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్కు జనగామ పట్టణ మాదిగ సంఘం ఆధ్వర్యంలో బుధవారం మెయిల్ ద్వారా వినతి చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పిస్తామని మీనాక్షి నటరాజన్ ప్రకటించడం స్వాగతిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పట్టణ మాదిగ సంఘం అధ్యక్షుడు ఉడుగుల కిష్టయ్య, ప్రధాన కార్యదర్శి గాదెపాక రామచందర్, కోశాధికారి మల్లిగారి మధు, వ్యవసాయక మార్కెట్ డైరెక్టర్ బొట్ల నర్సింగరావు, జేరుపోతుల కుమార్, బొట్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో విద్యార్థికి బంగారు పతకంజనగామ రూరల్: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పట్టణంలోని మైనారిటీ జూనియర్ కళాశాల బాలుర–1లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి కార్తీక్ బంగారు పతకం కై వసం చేసుకున్నాడు. ఈసందర్భంగా బుధవారం కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా విద్యార్థి కార్తీక్ను, పీడీ రాజుకు అభినందనలు తెలిపారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లా కొమ్ములవంచలో నిర్వహించిన రాష్ట్రస్థాయి 69వ ఎస్జీఎఫ్ఐ పోటీల్లో ప్రతిభ కనబర్చి బంగారు పతకం అందుకున్నాడు. అలాగే జిల్లా మైనారిటీ అధికారి విక్రంకుమార్, కళాశాల ప్రిన్సిపల్ అనిల్ బాబు అభినందించారు. -
మరింత అంతరం!
సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికార కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోంది.. మంత్రుల మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయా.. జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ దంపతుల నడుమ అగాధం పెరిగిపోయిందా.. మేడారం టెండర్లపై ఇటీవల కాలంలో కొండా మురళి హైకమాండ్కు ఫిర్యాదు చేశారన్న ప్రచారం మరింత గ్యాప్ను పెంచిందా.. వరంగల్ రాజకీయాలపై పార్టీ, ప్రభుత్వం దృష్టి సారించిందా.. అంటే నిజమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల జరిగిన పరిణామాలే ఇందుకు తాజా ఉదాహరణలుగా చెబుతున్నారు. రోజురోజుకూ చినికి చినికి గాలివానగా మారుతున్న మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య విబేధాలపై ఇటు అధిష్టానం.. అటు ప్రభుత్వం సీరియస్గా స్పందించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రులు, కొందరు ఎమ్మెల్యేల మధ్య రోజురోజుకూ అంతరం పెరుగుతోంది. రాష్ట్ర అటవీ, పర్యాటక, దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు వ్యాఖ్యలు పలుమార్లు వివాదాస్పదంగా మారాయి. కొద్ది రోజుల క్రితం ఓ ఎమ్మెల్యేపై చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు దుమారమే రేపాయి. ఆ తర్వాత తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని కొండా దంపతులపై కొందరు ఎమ్మెల్యేలు అధిష్టానం వరకు వెళ్లారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావులు టీపీసీసీ చీఫ్, సీఎంలకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ అంశంపై టీపీసీసీ క్రమశిక్షణ సంఘం కొండా సురేఖ, కొండా మురళీధర్రావులతో మాట్లాడింది. టీపీసీసీ చీఫ్, సీఎంల జోక్యంతో సద్దుమణిగినట్లే అనిపించినా.. అంతర్గతంగా ఇంకా రగులుతూనే ఉంది. ఇదే సమయంలో మేడారం సమ్మక్క–సారలమ్మల గద్దెల పునరుద్ధరణ, ఇతర అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై కొండా మురళి ఏఐసీసీ, టీపీసీసీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ ప్రచారంపై సంప్రదించిన మీడియా ప్రతినిధులతో ‘నేను ఇంట్లోనే ఉన్నాను.. ఎవరిని కలవలేదు, ఫిర్యాదులు కూడా చేయలేదు’ అని మురళి స్పష్టం చేశారు. ఇవన్ని జరుగుతున్న సమయంలోనే మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్పై ప్రభుత్వం వేటు వేయడం, బుధవారం హనుమకొండకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని ఆమె కలవకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. అధికారుల మితిమీరినతనంపై చర్యల్లో భాగంగా ప్రభుత్వం.. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ పరిధిలోని ఇద్దరు అధికారులపై వేటు వేసింది. వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ తూర్పులో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. నాయకుల బర్త్డే వేడుకలు జరపడం.. ఏ హోదా లేకున్నా ఎస్కార్టు ఇవ్వడంతోపాటు ఇతర కారణాలను చూపుతూ ఆయనపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. నందిరాంనాయక్ స్థానంలో ఐపీఎస్ అధికారి శుభం ప్రకాశ్ నాగర్లేకు ఏసీపీ బాధ్యతలు ఇచ్చారు. తాజాగా మంత్రి సురేఖ పేషీలో ఓఎస్డీగా పనిచేసే సుమంత్ను అ పదవినుంచి ప్రభుత్వం మంగళవారం తప్పించింది. 2023 డిసెంబర్నుంచి ఈ పదవీ బాధ్యతలు చూస్తున్న సుమంత్ అభివృద్ధి పనుల్లో మితిమీరిన జోక్యం.. ఇటీవల మేడారం పనుల వివాదానికి కూడా కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా సీఎం విచారణకు ఆదేశించి.. ఆరోపణలు నిజమేనని తేలడంతో వేటు వేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు ఘటనలు కొండా దంపతులు ప్రమేయం లేకుండా జరిగాయన్న ప్రచారం ఉండగా.. బుధవారం సీఎం పర్యటనకు హాజరు కాకపోవడంపైనా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. చాలా ఏళ్లుగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కొండా దంపతులకున్న రాజకీయ విబేధాలు, వైరం కారణంగానే సీఎం పర్యటనకు సురేఖ దూరంగా ఉన్నారని వారి అనుచరులు చెబుతున్నారు. కాగా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా మంత్రులు, కొందరు ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న అంతర్గత విభేధాలు, కుమ్ములాటలకు చెక్ పెట్టే దిశగా పార్టీ, ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఐదారు రోజుల్లో సమగ్ర నివేదికలు ఇవ్వాలన్న ఆదేశాల మేరకు నిఘావర్గాలు రంగంలోకి దిగి ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఓరుగల్లు కాంగ్రెస్లో తారస్థాయికి మంత్రుల మధ్య విబేధాలు వైరల్గా మారిన మంత్రి పొంగులేటిపై ఫిర్యాదుల ప్రచారం వివాదాస్పదంగా కొండా దంపతుల వ్యాఖ్యలు... సీరియస్గా తీసుకుంటున్న ప్రభుత్వం మొన్న ఏసీపీ, నేడు ఓఎస్డీ.. వేటు వేయడంపై దుమారం ముఖ్యమంత్రి పర్యటనకు దూరంగా కొండా దంపతులు జిల్లా రాజకీయాలపై ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా...? -
ప్రజాప్రభుత్వంలోనే రైతులకు మేలు
● ఏఎంసీలో ఐకేపీ సెంటర్లను ప్రారంభించిన చైర్మన్ శివరాజ్యాదవ్ జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో చీటకోడూరు, శామీర్పేట గ్రామాలకు చెందిన రెండు ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ప్రారంభించారు. ‘ఆరుగాలం వరద పాలు–భారీ వర్షంతో మార్కెట్ యార్డులో కొట్టుకుపోయిన మక్కలు, ధాన్యం’ శీర్షికన సాక్షిలో ప్ర చురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం యార్డులో సెంటర్లను ప్రారంభించిన అనంతరం శివరాజ్ మాట్లాడారు.. వ్యవసాయ మార్కెట్ యార్డులో మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు కోసం రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఏఎంసీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీవన్ కుమార్, ఏడీఈ అపర్ణ, ఏపీఎం శంకరయ్య, ఏఎంసీ డైరెక్టర్లు నామాల శ్రీనివాస్, బొట్ల నర్సింగరావు, రమేశ్ యాదవ్, బండ కుమార్, రవీందర్, పర్ష సిద్దేశ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి, రైతు నాయకులు చందూనాయక్ పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
జనగామ: ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, బోధనా నాణ్యత, విద్యార్థులు నేర్చుకునే స్థాయిని అంచనా వేసేందుకు టీచర్లతో కూడిన కొత్త ప్యానెల్ తనిఖీ బృందాల ఏర్పాటుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు పంపించారు. బోధనా నాణ్య త, రికార్డులు, విద్యార్థుల ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. దీంతో సర్కారు బడుల్లో విద్యా ప్రమాణాల అంచనా, బాధ్యతాయుత బోధనతో విద్య మరింత బలపడే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. కానీ దీనిపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తనిఖీలు ఎలా.. జిల్లాలో ప్రతీ మూడు నెలలకోసారి 150 పాఠశాలలు తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఇందులో 100 ప్రాథమిక, ప్రాథమికోన్నత, 50 ఉన్నత పాఠశాలలను తనిఖీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తనిఖీల్లో బోధన, విద్యార్థుల హాజరు, మౌలిక సదుపాయాలు, విద్యా ఫలితాలు, శుభ్రత, పాఠశాల రికార్డులు, పాఠ్య ప్రణాళిక అమలు, డిజిటల్ క్లాస్ తరగతుల వినియోగం వంటి అంశాలు సమగ్రంగా పరిశీలించాలి. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో టీచర్లతో కూడిన కమిటీలు ఏర్పాటు చేయాలి. ప్రాథమిక పాఠశాలల్లో.. జిల్లాలో 343(పీఎస్), 64(ప్రాథమికోన్నత), 103 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమా రు 29, 500 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ప్రాథమిక పాఠశాలల పరిధిలో ప్రధానోపాధ్యాయుడు(నోడల్ అధికారి), ఇద్దరు ఎస్జీటీలు సభ్యులుగా ఉంటారు. ప్రాథమికోన్నత బడుల్లో స్కూల్ అసిస్టెంట్(నోడల్ అధికారి), ప్రధానోపాధ్యాయుడు, ఒక ఎస్జీటీ సభ్యులుగా ఉంటారు. ఉన్నత పాఠశాలల్లో గెజిటెడ్ హెడ్మాస్టర్(నోడల్ అధికారి), ఏడుగురు సబ్జెక్టు టీచర్లు, ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సభ్యులుగా పర్యవేక్షణ చేయను న్నారు. తనిఖీ అధికారుల పర్యవేక్షణ కోసం షరతులు.. తనిఖీ బృందాల్లో పనిచేసే టీచర్ల అర్హతలపై కఠిన నియమావళి విధించారు. జిల్లా స్థాయిలో ఎంపికయ్యే తనిఖీ అధికారులకు ఈ షరతులు తప్పనిసరి అంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కనీసం 10 ఏళ్ల బోధన అనుభవం కలిగి ఉండడంతో పాటు డిజిటల్ అక్షరాస్యత, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పక ఉండాలి. సదరు టీచర్లపై విధి నిర్వహణలో క్రమశిక్షణా చర్యలు లేని ఉత్తమ వ్యక్తిగా ఉండాలి. బోధనా నాణ్యతపై ఆసక్తి, మానవతా దృక్పథం కలిగి ఉండి, ఆయా శిక్షణా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఉండాలి. పాఠశాల తనిఖీ బృందాల ఎంపికను కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నేతృత్వంలో చేపడతారు. తనిఖీ బృందాలకు ఎంపికై న ఉపాధ్యాయులు పూర్తి సమయం పనిచేయాల్సి ఉంటుంది. కమిటీల ఏర్పాటుతో పాఠశాలల్లో బోధన తరగతులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలి. విద్యా నాణ్యత పెంపునకు పాఠశాల విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు తనిఖీ అధికారులుగా ఉపాధ్యాయులకే బాధ్యతలు అదనపు పనిభారం మోపడం సరికాదంటున్న ఉపాధ్యాయులు బోధనా సమయం తగ్గి విద్యార్థులకు నష్టమని అభ్యంతరం -
సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి
జనగామ: జిల్లాలో సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకుని రైతుల సాగుకు ఊతమిచ్చి పంటల ఉత్పత్తిని పెంచేందుకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు. మంగళవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పలు సమస్యలపై వినతి చేశారు. జనగామ నియోజకవర్గ పరిధిలోని తరిగొప్పుల మినీ లిఫ్ట్–1 పనులకు సంబంధించిన పైప్లైన్ పనులు పూర్తైనప్పటికీ, మరిన్ని చెరువులకు అనుసంధానం చేసే విధంగా పైపులైన్ల నిర్మాణం చేపట్టాలన్నారు. అంతే కాకుండా పంపుహౌస్ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేసి రైతులకు సాగు నీటిని అందించాలని మంత్రిని కోరినట్లు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగలోపు పనులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. దేవాదుల 8వ ప్యాకేజీలో తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి బచ్చన్నపేట, చేర్యాల(మండల పరిధిలో కాలువలు), కన్నెబోయినగూడెం రిజర్వాయర్ నుంచి బచ్చన్నపేట, జనగామ మండలాల్లో అసంపూర్తిగా ఉన్న కాల్వలను పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. జనగామ నియోజకవర్గంలో 12 చెరువులకు అత్యవసర మరమ్మతులు అవసరం పడ్డాయని, వాటి పునరుద్ధరణ పనులు సత్వరమే చేపట్టడానికి నిధులను విడుదల చేయాలని మంత్రిని కోరడం జరిగిందన్నారు. మల్లన్న సాగర్ నుంచి తపాస్పల్లి గ్రావిటీ కాలువ పనులను పునరుద్ధరించాలని వినతిలో పేర్కొన్నట్లు తెలిపారు. తమ వినతికి సంబంధించి అన్ని పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వాగులకు అడ్డంగా చెక్ డ్యాంలతో పాటు చీటకోడూరు రిజర్వాయర్ గేట్లు, పెంబర్తి పెద్ద చెరువు, ఎల్లంల ఏనె చెరువు శాశ్వత పునరుద్ధరణ, జనగామ మండలం పెద్దపహాడ్ పెరుమాండ్ల చెరువు, మరిగడి, తరిగొప్పుల మండలం చింతల చెరువు, అంకుశాపూర్, నాగుల చెరువు, కర్షక కుంట(నర్మెట), బయ్యన్న చెరువు (ఎమర్జెన్సీ రిపేర్) పునరుద్ధరణ పనులకు రూ.7.13 కోట్లు విడుదల చేయాలని ప్రతిపాదన కాపీలను ఎమ్మెల్యే మంత్రికి అందించారు. సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్ను కోరిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.24.30 కోట్లు
పాలకుర్తి టౌన్: పాలకుర్తి నియోజకవర్గంలోని గిరిజన తండాలు, గూడేలలో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.24.30 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కలిసి నియోజకవర్గ గిరిజన ప్రాంతాల అభివృద్ధి అంశాలపై ప్రతిపాదనలు అందజేశారు. బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.24.30 కోట్ల విలువైన ప్రభుత్వ జీఓ ఉత్తర్వులను మంత్రి లక్ష్మణ్ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి అందజేశారు. గతంలో రూ.6కోట్లు కలిపి ఇప్పటివరకు రూ.30.30 కోట్ల నిధులను మంజూరు చేసినందుకు మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి మంజూరు జీఓ అందించిన మంత్రి అడ్లూరి -
వరంగల్కు నేడు సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం వరంగల్ నగరానికి రానున్నారు. కాజీపేటలోని పీజీఆర్ గార్డెన్స్లో జరిగే నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ను విడుదల చేశారు. సీఎం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్లోని తన నివాసంనుంచి డాక్టర్ ఎంసీఆర్హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ హెలిపాడ్కు బయలుదేరుతారు. 12.15 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 1.00 గంటలకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలోని హెలిపాడ్కు చేరుకుంటారు. అక్కడినుంచి 1.05 గంటలకు కాజీపేట ప్రశాంత్నగర్లోని పీజీఆర్ గార్డెన్స్కు చేరుకుంటారు. 1.15 – 1.45 గంటల వరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డిని పరామర్శించి ఆయన తల్లి ‘మాతృయజ్ఞం’ కార్యక్రమంలో పాల్గొంటారు. 1.45 గంటలకు పీజీఆర్ గార్డెన్నుంచి బయలుదేరి 2.00 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి భద్రత కోసం తీసుకో వాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, పీజీఆర్ గార్డెన్స్ ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. సీపీవెంట జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, రెవెన్యూ అధికారి వైవీ గణేష్, ఏసీపీలు పింగిళి ప్రశాంత్రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. మధ్యాహ్నం 1 గంటకు హనుమకొండకు 2 గంటలకు తిరుగు పయనం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పరామర్శించనున్న సీఎం -
డిజిటల్ లిటరసీతో బోధన సులువు
● కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాజనగామ రూరల్: విద్యారంగాన్ని మరింత బలో పేతం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం అవసరమ ని అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు డిజిట ల్ విద్యపై అవగాహన పొందాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న ఏకశిల బీఈడీ కళాశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో డిజిటల్ లిటరసీపై ఫిజిక్స్ ఉపాధ్యాయులకు మూడు రోజులపా టు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.. మారుతున్న సమాజా నికి అనుగుణంగా విద్యా బోధన కూడా మారా ల్సిన అవసరం ఉందన్నారు. డిజిటల్ విద్యకు పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయని, పాఠశాలల్లో ఏ ర్పాటు చేసిన ఐఎఫ్బీ డిజిటల్ ప్యానెల్స్ కూడా విని యోగించుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఏఎమ్ఓ శ్రీనివాస్, మాస్టర్ ట్రైనీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనుల పరిశీలన మండలంలోని పెంబర్తి గ్రామం వద్ద రూ.5కోట్లతో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో కలిసి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..నిర్మాణ పనులు వేగవంతంగా జరగాలని జాప్యం తగదన్నారు. కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రంజిత్ తదితరులు ఉన్నారు. -
మద్దతు ధరకే అమ్ముకోవాలి
● ధాన్యం పండించడంలో పంజాబ్ను మించుతున్న తెలంగాణ ● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బచ్చన్నపేట: వరి ధాన్యం పండించడంలో దేశంలో పంజాబ్ను తెలంగాణ మించుతోందని, ఆరుగాలాలు కష్టించి పనిచేసి పండించిన ధాన్యాన్ని అన్నదాతలు మద్దతు ధరకు అమ్ముకోవాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రంలో ఐకేపీ, మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులను రాజు చేయడమే లక్ష్యంగా గత 9 సంవత్సరాలుగా కృషి చేస్తున్నామన్నారు. గత సంవత్సరంలో విక్రయించిన సన్న ధాన్యానికి ఇంకా బోనస్ డబ్బులను ఇవ్వలేదన్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఎక్కువగా అన్నదాతలు దొడ్డురకం వడ్లనే పండిస్తారని, వాటికి కూడా బోనస్ను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా మాజీ కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, తహసీల్దార్ రామానుజాచారి, ఏపీఎం రవి, సీఈఓ కాశ బాలస్వామి, నాయకులు పూర్ణచందర్, కొండి వెంకట్రెడ్డి, గంగం సతీష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీహబ్ ప్రతినిధులతో జూమ్ మీటింగ్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ నుంచి వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం హైదరాబాద్లోని టీ హాబ్ ప్రతినిధులతో జూమ్మీటింగ్ నిర్వహించారు. టీహబ్, కెహబ్ ఎంఓయూలో భాగంగా పొందుపర్చాల్సిన అంశాలు, ఇరు పక్షాల బాధ్యతలు, విద్యార్థులకు అందించాల్సిన నైపుణ్యాల శిక్షణలు, వాటిలో భాగస్వాములు, వారి బాధ్యతలపై చర్చించారు. -
పరిష్కారమేది?
వచ్చుడు.. ఇచ్చుడేజనగామ రూరల్: ఏళ్ల తరబడి సాగులో ఉండగా అక్రమంగా పట్టా చేసుకున్నారని, సదరం సర్టిఫికెట్ ఉన్న ఏళ్ల తరబడి పెన్షన్కు ఎదురుచూస్తున్నామని, సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు ఇప్పించాలని పలు సమస్యలతో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు ప్రజలు తరలివచ్చారు. వారి నుంచి అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్ షాలోమ్, ఇతర జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ 38 దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో దరఖాస్తులు ఇస్తూ కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని, సమస్యలు పరిష్కారం కావడం లేదని ఈ సందర్భంగా పలువురు వాపోయారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ..గ్రీవెన్స్లో ఇచ్చిన దరఖాస్తులు అధికారులు పరిశీలించి పరిష్కరించాలని అదేశించారు. కార్యక్రమంలో జనగామ, స్టేషన్ ఘన్పూర్ ఆర్డీఓలు గోపిరామ్, డీఎస్ వెంకన్న, డీఆర్డీఓ వసంత, గృహనిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దరఖాస్తులు ఇలా.. ● జనగామ మండలం చౌడారం గ్రామానికి చెందిన ముక్క రాజయ్య తన తండ్రి పేరుతో ఉన్న భూమి సర్వే నెంబర్ 10/ 79 లోని 1.20 ఎకరం మల్ల భూమిని వారసత్వంగా పట్టా మార్పిడి చేసి ఇవ్వాలని కోరారు. ● బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన తాలిరెడ్డి మధుసూదన్రెడ్డి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 202లో పూర్వీకుల నుంచి సంక్రమించిన 1.10 ఎకరంలో భూమికి రైతుభరోసా అందుతోందని, తన భూమి లేదని, భూమికి హద్దులు చూపించి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ● లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన నడిగోటి సోమయ్యకు చెందిన సర్వే నెంబర్ 263 పట్టా భూమిలో 25 ఎకరాల భూమి ఉందని, 1938లో వర్షపు నీరు చెరువుకు వెళ్లేందుకు నీటిపారుదల శాఖ పంట కాల్వ నిర్మించింది. ప్రస్తుతం శివరాత్రి ఐలయ్య అనే వ్యక్తి దౌర్జన్యంగా కనీలు పాతి వర్షపు నీరు చెరువుకు వెళ్లకుండా అడ్డుకొని పంట కాల్వను పూడ్చి వేయడంతో తన భూమిలో నీరు నిలుస్తున్నదని అధికారులు తగు చర్య తీసుకోవాలని కలెక్టర్కు వినతి అందజేశారు. ● బచ్చన్నపేట మండలం కేసిరెడ్డి పల్లె గ్రామం 380 సర్వే నెంబర్లో తాతలు, తండ్రుల నాటి నుంచి వస్తున్న 8 ఎకరాల 18 గంటల భూమి నుండి తమకు ఎటువంటి సమాచారం లేకుండా, సంతకాలు లేకుండా గ్రామానికి చెందిన మరో వ్యక్తి పేరు మీదుగా ఒక ఎకరం రెండు గుంటల భూమిని మార్పిడి చేశారని ఇమ్మడి యాకంరెడ్డి వినతిపత్రం అందించారు. ఈ మార్పిడి ఎలా జరిగిందో అడిన సమాధానం చేప్పడం లేదని విచారణ జరిపించి సంబంధిత అధికారులు వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు. ● స్టేషన్ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామంలో ఎక్కడ సీసీ రోడ్లు లేవని, అభివృద్దికి దూరంగా ఉందని కత్తు రాజు వినతిపత్రం అందించారు. ముఖ్యంగా ముక్తుంకుంట కట్ట కింద ఉన్న 500 మీటర్ల మట్టిదారి పూర్తిగా శిథిలావస్థలో ఉందని అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ● జఫర్గఢ్ మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్సీగా విధులు నిర్వహిస్తున్నానని, కాగా గత మే నెలలతో ఆనారోగ్యంతో నెల రోజులు లీవులో ఉన్నానని, వేతనాలు ఇవ్వాలని సంబంధిత అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదని ఎం. రాజమణి వాపోయింది. 5 నెలల నుంచి వేతనాల రాక కుటుంబం గడవక ఇబ్బందులు పడుతున్నామని, తమకు వేతనాలు వచ్చేలా చూడాలని కలెక్టర్కు వినతి అందజేశారు. కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయాలి జిల్లాలో కేంద్రీయ విద్యాలయానికి పసరవడ్లలో 5 ఎకరాల స్థలం కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర నాలుగు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయగా జిల్లాకు మాత్రం మంజూరు కాలేదు. జిల్లాలోని నిరుపేద విద్యార్థులు ఇతర జిల్లాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి. విద్యాసంస్థలకు కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయాలి. –బిర్రు ఇస్తారి, వ్యవస్థాపక అధ్యక్షుడు, నాగరత్న సేవా సంఘం కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామంటూ దరఖాస్తుదారుల ఆవేదన ప్రజావాణిలో 38 దరఖాస్తులు స్వీకరణ విజ్ఞప్తులను వేగంగా పరిష్కరించాలి: కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
ఘనంగా శ్రీలక్ష్మీనర్సింహస్వామి చక్రతీర్థం
జఫర్గఢ్: మండల కేంద్రంలో పడమర కొండ దిగువన ఉన్న శ్రీలక్ష్మీనర్సింహ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈసందర్భంగా సోమవారం మహాపూర్ణాహుతి, చక్రతీర్థం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నాలుగు రోజుల నుంచి జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వివిధ ప్రాంతాల నుంచి భక్తులతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పూజారులు వెంకటాచార్యులు, కృష్ణమాచార్యులు, శ్రీనివాసచార్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు. కాగా రాత్రి సమయంలో స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించనున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు పర్యవేక్షించాలి ● కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా జనగామ రూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో పలు అభివృద్ధి కార్యక్రమాలుపై అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్ షాలోమ్లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా చూడాలన్నారు. సమీక్షలో ఆర్డీఓలు గోపి రామ్, డీఎస్ వెంకన్న, డీఆర్డీఓ వసంత, అధికారులు పాల్గొన్నారు. సీపీఆర్పై అవగాహన తప్పనిసరి.. కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్)పై అవగాహన తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ హాల్లో జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె. మల్లికార్జున్రావు ఆధ్వర్యంలో మాస్టర్ ట్రైనర్స్తో అవగాహన నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..సీపీఆర్ పద్ధతులపై అవగాహన కల్పించాలన్నారు. ఎలక్ట్రానిక్ కాంటాల పరిశీలన స్టేషన్ఘన్పూర్: ప్రస్తుత వానాకాలం సీజన్కుగానూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అందించనున్న ఎలక్ట్రానిక్ కాంటాలను స్థానిక వ్యవసాయ మార్కెట్లోని గోదాంలో జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి ఝాన్సీ సోమవారం తనిఖీ చేశారు. గోదాంలోని కాంటాలను ఒక్కొక్కటిగా 20 కిలోల బాటు తూకం వేసి చెక్ చేశారు. సరిగ్గా పనిచేయని వాటిని పక్కకు పెడుతూ సరిగ్గా ఉన్నవాటిని మార్కెట్ సిబ్బందిచే సీల్ చేయించారు. జర్నలిజంలో నూతన పాఠ్యప్రణాళికకు ఆమోదం కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్సైన్స్ కాలేజీలోని జర్నలిజం విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీఓఎస్) సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. గూగుల్మీట్లో ఆ విభాగాధిపతి డాక్టర్ ఆదిరెడ్డి అధ్యక్షతన వివిధ యూనివర్సిటీల నుంచి పలువురు ప్రొఫెసర్లు పాల్గొని మాట్లాడారు. ఈసమావేశంలో బీఏ జర్నలిజం మొదటి, ద్వితీయ సంవత్సరం సెమిస్టర్లకు సంబంధించి 2025–26 విద్యాసంవత్సరానికి పాఠ్యప్రణాళికను రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్గదర్శకత్వంలో సరికొత్త సిలబస్ రూపకల్పన చేసి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమకాలీన మీడియా ధోరణులు, కమ్యూనికేషన్ టెక్నాలజీలు, జర్నలిజం రంగంలో వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకుని సిలబస్ రూపొందించినట్లు జర్నలిజం విభాగాధిపతి ఆర్.ఆదిరెడ్డి తెలిపారు. ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతుల ఉత్తర్వులుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో 2010లో నియమితులైన 24మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కెరీర్ అడ్వాన్స్మెంటు స్కీం (క్యాస్ ) పదోన్నతుల (8000 యాన్యువల్ గ్రేడ్ పే) ఉత్తర్వులను సోమవారం రిజిస్ట్రార్ వి.రామచంద్రం జారీచేశారు. త్వరలోనే వీరికి అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించనున్నారు. వీరు కొంతకాలం క్రితమే దరఖాస్తు కూడా చేశారు. -
ఆరుగాలం..వరదపాలు
మంగళవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2025జనగామ: ఊహించకుండా వచ్చిన భారీ వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కల్లాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వేలాది ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. వరద నీరు మార్కెట్ ప్రాంగణంలోకి చేరి ధాన్యం చుట్టూ చేరడంతో పదుల సంఖ్యలో బస్తాలు కొట్టుకుపోయాయి. పైనుంచి వచ్చిన ప్రవాహం పెరగడంతో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయాయి. ప్రభుత్వ ఐకేపీ సెంటర్లను ప్రారంభించడంలో జాప్యం చేయడంతో రైతులకు భారీగా నష్టం తప్పలేదు. మద్దతు ధర కోసం ఆశపడి నిరీక్షిస్తే మొదటికే మోసం వచ్చేలా చేసింది. ఆగమాగం.. జిల్లాలో సోమవారం తెల్లవారుజాము కురిసిన భారీ వర్షం రైతులను కోలుకోలేకుండా చేసింది. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ధాన్యం, మక్కలతో కాటన్ యార్డుతో పాటు కల్లాలు, కవర్ షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. ప్రైవేటు కొనుగోళ్లు యథావిధిగా జరుగుతుండగా, ప్రభుత్వ సెంటర్ల ప్రారంభోత్సవంలో జాప్యం జరుగుతోంది. రైతులు తమ పంట ఉత్పత్తులకు మద్దతు ధర కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. సెంటర్లను ప్రారంభించడంలో జాప్యం చేయడంతో పాటు రైతులకు స్పష్టమైన సమాచారం ఇవ్వడంలో మా ర్కెట్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో తెల్లవారుజాము ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షంతో కాటన్ యార్డులో ఉన్న ధాన్యం, మక్కలు తడిసిపోయాయి. వరదకు పదుల సంఖ్యలో బస్తాలు కొట్టుకుపోగా, వేలాది బస్తాలు తడిసిపోయాయి. మార్కెట్ నుంచి ఇచ్చిన టార్పాలిన్ కవర్లన్నీ చిరిగిపోయి ఉండడంతో రైతులు స్వయంగా ఇంటి నుంచి తెచ్చుకున్న కవర్లను కప్పి కాపాడుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ధాన్యం రాశుల చుట్టూ వరద నీరు చేరడంతో.. నీటిని మళ్లించేందుకు రైతులు గంటల తరబడి కష్టపడ్డారు. పెద్దఎత్తున ధాన్యం బస్తాలు తడిసిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నష్టం అంచనా వేయాలి.. మార్కెట్ కాటన్ యార్డులో కొట్టుకుపోయిన ధాన్యానికి నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 30 బస్తాలకుపైగా కొట్టుకుపోగా, 2 వేల బస్తాలకు పైగా తడిసిపోయాయి. దీంతో నష్టం అంచనా వేయాల్సి ఉంది. నీటిలో తేలియాడే పంటతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తడిసిన సరుకును ఆరబెట్టినా మళ్లీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ అధికారులు దీనిని సీరియస్గా తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. పంట రక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని రైతులు వేడుకుంటున్నారు. భారీ వర్షంతో మార్కెట్ యార్డులో కొట్టుకుపోయిన ధాన్యం, మక్కలు తడిసిన ముద్దయిన వేలాది బస్తాల ధాన్యం వరదలోనే ధాన్యం రాశులు కన్నీరు మున్నీరవుతున్న రైతులు కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యమే కారణమంటూ ఆవేదనవందల బస్తాలు తడిచాయి.. ఆరు రోజుల క్రితం మద్దతు ధరకు అమ్ముకునేందుకు 500 బస్తాల ధాన్యంతో మార్కెట్ కాటన్ యార్డుకు వచ్చాము. 10 బస్తాల ధాన్యం కొట్టుకుపోగా, 400బ్యాగులకు పైగా తడిసిపోయాయి. టార్పాలిన్ ఇంటి నుంచే తెచ్చుకున్నాం. మార్కెట్ సిబ్బంది ఇచ్చిన కవర్లు పనికి రావు. మళ్లీ ఆరబోసుకుంటున్నాం. – గాజుల కట్టయ్య, రైతు, చౌడారంఆరేడు బస్తాలు కొట్టుకుపోయాయి.. ప్రభుత్వ సెంటర్ ప్రారంభిస్తారని చెబితే, 300 బస్తాల ధాన్యం తీసుకుని మార్కెట్ కాటన్ యార్డుకు ఐదు రోజుల క్రితమే వచ్చాము. నేటికీ సెంటర్ ప్రారంభం కాలేదు. అకాల వర్షంతో 60 బస్తాలకు పైగా తడిసిపోగా, ఆరేడు బస్తాలు కొట్టుకుపోయాయి. –కూరాకుల శోభ, మహిళా రైతు, మరిగడిప్రభుత్వం ఆదుకోవాలి..400 బస్తాల ధాన్యం మద్దతు ధరకు అమ్ముకునేందుకు మార్కెట్కు వచ్చా.. ఇందులో 300 బస్తాల వరకు తడిసిపోగా, 10 బస్తాల వరకు కొట్టుకుపోయాయి. ప్రభుత్వం నష్టపరిహారం అందించి మమ్మల్ని ఆదుకోవాలి. –చెరుకూరి రాములు, రైతు, చౌడారం -
మెడికల్ కళాశాలలో మూడో బ్యాచ్ షురూ
జనగామ: జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మూడో బ్యాచ్ మొదటి సంవత్సరం తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమణి ఆధ్వర్యంలో హెచ్ఓడీల పర్యవేక్షణలో తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యార్థుల సమక్షంలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. 97 మంది విద్యార్థులు హాజరు.. మెడికల్ కళాశాలలో 100 సీట్లకు అనుమతి లభించగా, ప్రస్తుతం రాష్ట్ర, జాతీయ కోటాలో 97 మంది విద్యార్థులు కౌన్సెలింగ్ ద్వారా చేరారు. ఇంకా 3 సీట్లు పెండింగ్లో ఉండగా, తదుపరి 3వ విడత కౌన్సెలింగ్లో ఆ స్థానాలు కూడా భర్తీ అయ్యే అవకాశముందని కళాశాల అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీహెచ్, ఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం, హెచ్ఓడీలు, డాక్టర్లు గోపాల్రావు, మధుసూన్రెడ్డి, అన్వర్, విశ్వనాథ్, శంకర్, పద్మిని, శకుంతల తదితరులు ఉన్నారు. -
కష్టపడిన వారికే ‘డీసీసీ’
జనగామ: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఐదేళ్లుగా కష్టపడి పనిచేసిన వారికే మాత్రమే డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తులను స్వీకరించామని ఏఐసీసీ పరిశీలకుడు దేబాసిస్ పట్నాయక్ అన్నా రు. టీపీసీసీ ఆదేశాల మేరకు సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చివరిరోజు సోమవారం జనగామ మండలం పసరమడ్ల శివారు ఉషోదయ కన్వెన్షన్ హాల్లో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభిప్రాయ సేకరణలో టీపీసీసీ పరిశీలకులు ఎండీ అవేజ్, అరుణ్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం దేబాసిస్ పట్నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి, పాలకుర్తి ఇన్చార్జ్ ఝాన్సీరెడ్డితో పాటు మొత్తంగా 30 మందికి దరఖాస్తులు చేసుకున్నారన్నారు. స్టేషన్ఘన్పూర్ ఇన్చార్జ్ సింగపురం ఇందిర మాత్రం తనతో ఫోన్లో మాట్లాడడం జరిగిందన్నారు. డీసీసీ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరితో ముఖాముఖి మాట్లాడడంతో పాటు 1500 మందికి పైగా సూచనలు వినడం జరిగిందన్నారు. మూడు నియోజకవర్గాల పరిధిలో దస్వీకరించిన దరఖాస్తుల్లో ఆరింటిని మాత్రమే ఏఐసీసీకి పంపిస్తామన్నారు. అధినేత రాహుల్గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, సోని యాగాంధీ, సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ నేతృత్వంలో కొత్త డీసీసీని ఎన్నుకుంటారన్నారు. ప్రత్యేక సమావేశం డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్న నాయకులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వ్యక్తిగత అభిప్రాయాలను సేకరించారు. జిల్లా స్థాయిలో పార్టీ నిర్మాణానికి అవసరమైన నాయకత్వ ఎంపికపై పరిశీలకులు సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్, డీసీసీగా అప్లికేషన్ చేసుకున్న వారితో పాటు నాయకులు వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, కంచె రాములు, ఎర్రమల్ల సుధాకర్, డాక్టర్ రాజమౌళి, ఆలేటి సిద్దిరాములు, జమాల్ షరీఫ్, ఉడుత రవి, చింతకింది మల్లేశం, కరుణాకర్రెడ్డి, బడికె ఇందిర, వంగాల కళ్యాణి, చెంచారపు బుచ్చిరెడ్డి, పిన్నంటి నారాయణరెడ్డి, గుండ శ్రీధర్రెడ్డి తదితరులు ఉన్నారు. అధ్యక్ష పదవి కోసం 30మంది దరఖాస్తు దరఖాస్తు చేసుకున్నవారిలో కొమ్మూరి, ఝాన్సీరెడ్డి, ఇందిర ‘సంఘటన్ సృజన్ అభియాన్’లో ఏఐసీసీ పరిశీలకుడు దేబాసిస్ పట్నాయక్ -
సీజేఐపై దాడికి యత్నించిన వ్యక్తిపై చర్య తీసుకోవాలి
● ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాజనగామ రూరల్: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడికి యత్నించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోడ సునీల్ డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రముఖ న్యాయవాది సాదిక్ అలీ, రాగళ్ల శ్రీహరి, గద్దల కిషోర్, సందేన రవీందర్, జేరిపోతుల సుధాకర్, బొట్ల మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణం..కమనీయం
కనులపండువగా శ్రీలక్ష్మీనర్సింహస్వామి వివాహా మహోత్సవం ● వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు ● సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపుజఫర్గఢ్ : మండల కేంద్రంలో శ్రీవేల్పుగొండ శ్రీ లక్ష్మీనర్సింహ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీలక్ష్మీనర్సింహస్వామి కల్యాణమహోత్సవం ఆదివారం కన్నులపండువగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు స్వామివారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలుత వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవ విగ్రహాలను అలంకరించారు. అనంతరం భక్తుల సమక్షంలో స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ కల్యాణమహోత్సవాన్ని భక్తులు కనులార తిలకించి భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. ఈ వేడుకలను తిలకించిన అనంతరం భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి మొక్కులను సమర్పించారు. ఈసందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం సమయంలో గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. మంగళవాయిద్యాలు, ఆటపాటలు, మహిళల కోలాటాల నృత్యాల మధ్య పలు పురవీధుల గుండా స్వామి వారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు వెంకటాచా ర్యులు, శ్రీనివాసచార్యులు, కృష్ణమాచార్యులతో పాటు భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాగా చివరి రోజు శాంతిహోమం, మహాపూర్ణాహుతి, చక్రస్నానం తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. -
కారాఘోరం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ● వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పెండ్యాల సుచరిత (36) సబ్జైలులో రిమాండ్ ఖైదీగా ఉండి మృతి చెందారు. సుబేదారి పోలీస్స్టేషన్లో నమోదైన ఓ కేసులో ఆమెను ఆగస్టు 13న నర్సంపేట సబ్ జైలుకు తరలించారు. సబ్జైలులో అనారోగ్యానికి గురైన ఆమెను నర్సంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆగస్టు 21న మృతి చెందింది.● జనగామ సబ్జైలులో ఆత్మహత్యాయత్నం చేసిన ఓ ఖైదీ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగారాజుపల్లికి చెందిన వరాల మల్లేశ్ (42) హత్యాయత్నం కేసులో జనగామ సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి మల్లేశ్ నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన అధికారులు ఖైదీని వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ...ఖైదీల్లో పరివర్తన తీసుకురావాల్సిన కారాగారాలు సహజ మరణాలు, ఆత్మహత్యలకు వేదికలవుతున్నాయి. నేరాలు, నేరస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. ఓ వైపు జైళ్ల కుదింపు, మరోవైపు విచారణలు, శిక్షలు, విడుదల లేక ఖైదీలతో కారాగారాలు కిటకిటలాడుతున్నాయి. కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అధికారులు సబ్జైళ్లలో రకరకాల పనులు చేయిస్తూ వేధిస్తుండడమే ఖైదీల మృతికి కారణంగా చెబుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే జైళ్లలో ఖైదీలకు ఆత్మహత్యకు కారకాలయ్యే వస్తువులను దూరంగా సిబ్బంది ఉంచాలి. వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఖైదీల ఆత్మహత్యాయత్నం ఘటనలు పునరావృతం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అయితే, జైలులో అంతా నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సామర్థ్యానికి మించి జిల్లా, సబ్జైళ్లలో ఖైదీలను ఉంచి.. ఆ మేరకు బడ్జెట్, సౌకర్యాలు, అధికారులు, సిబ్బంది లేక నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోందన్న చర్చ జరుగుతోంది. సిబ్బంది, ఎస్కార్ట్ కొరతతో నెలల తరబడి విచారణలు వాయిదా పడి జైళ్లనుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఫలితంగా జిల్లా, సబ్జైళ్లలో ఓ వైపు సహజ మరణాలు, మరోవైపు ఆత్మహత్యాయత్నాలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయన్న చర్చ జరుగుతోంది. ఖైదీలు పెరుగుతున్నా.. మారని పరిస్థితులు ఖైదీల సంఖ్య పెరుగుతున్నా.. అందుకు అనుగుణంగా జైళ్ల పరిస్థితి మారడం లేదు. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇటీవల విడుదల చేసిన ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా–2023’లో ఇవే అంశాలను ప్రస్తావించింది. ఈ లెక్కల ప్రకారం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగే అయినప్పటికీ.. రాష్ట్రంలో అన్ని రకాల జైళ్లు కలిపి 50 ఉండగా.. అన్నింట్లో సామర్థ్యాన్ని మించి ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్లో వరంగల్ సెంట్రల్ జైలుతోపాటు పరకాల, జనగామ, మహబూబాబాద్, నర్సంపేట సబ్జైళ్లలో కలిపి సుమారు 680 మంది ఖైదీలు ఉండాలి. వరంగల్ సెంట్రల్ జైలు కూల్చివేసే నాటికి ఒక్క ఆ జైలులోనే వెయ్యి మంది వరకు ఉన్నట్లు రికార్డులున్నాయి. 2021లో సెంట్రల్ జైలు ఎత్తివేయగా.. నర్సంపేట సబ్జైలును కూడా రద్దు చేశారు. వీటి స్థానంలో మామునూరు ఒక ఓపెన్ ఎయిర్ జైలును ప్రతిపాదించారు. నర్సంపేట సబ్జైలు స్థానంలో మహిళల ప్రత్యేక జైలు ఏర్పాటు చేశారు. జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, పరకాలతోపాటు ఓపెన్ ఎయిర్ జైలు కలిపితే.. వాటిలో ఖైదీల సామర్థ్యం 50 నుంచి 80 లోపలే. ఆమేరకు పెట్టుకుని ఇతర ఖైదీలను ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్ జైళ్లకు తరలించాల్సి ఉండగా.. ఉమ్మడి వరంగల్లోని పోలీస్స్టేషన్లలో నమోదైన వివిధ కేసుల్లో విచారణ ఖైదీలు, శిక్షలు పడిన వారు సుమారు 300 మంది జిల్లాల్లోని జైళ్లలోనే ఉంటుండడంతో అవి కిక్కిరిసిపోతున్నాయి. వాంతులు, విరేచనాలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ముందుగా ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు ఖైదీల మరణానికి కారణం కావొచ్చు. జైలులో సరైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోతే చిన్న ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రమై ప్రాణాంతకంగా మారుతాయి. జైలులోని ఒత్తిడితో కూడిన వాతావరణం కూడా ఖైదీల ఆరోగ్య పరిస్థితిని క్షీణింపజేసి మరణానికి దారితీస్తుంది. అయితే, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా ఇవి తేలుతాయి. – డాక్టర్ కేశవులు, మానసిక వైద్య నిపుణుడు సబ్జైలులో సహజ మరణాలకు అనా రోగ్యమే ప్రధాన కారణమని నిపుణులు చెబు తున్నారు. ముందుగా ఉన్న ఆరోగ్య సమస్యలు, జైలులో సరైన వైద్య సంరక్షణ లేకపోవడం, జైలు వాతావరణం వల్ల వచ్చే ఒత్తిడి వంటి కారణాల వల్ల మరణాలు తరచూ సంభవిస్తాయంటున్నారు. జైలు, పోలీసు కస్టడీలో గుండె జబ్బుల వంటివి సాధారణంగా కనిపిస్తాయని వైద్య నిపుణుల అభిప్రాయం. జైళ్ల కుదింపుతో ఇబ్బడిముబ్బడిగా విచారణ ఖైదీలు కరువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ సంచలనంగా జనగామ సబ్జైలు ఖైదీ ఆత్మహత్య -
కొనుగోళ్లకు సిద్ధం
జనగామ రూరల్: వానాకాలం సీజన్కు సంబంధించి వరికోతలు ప్రారంభమయ్యాయి. ముందస్తు సాగు చేసిన వారు వారం నుంచే కోతలు ప్రారంభించారు. ఈనేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. జిల్లా వ్యాప్తంగా 309 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. కాగా ఇప్పటికే కలెక్టర్ ఆదేశాల మేరకు జనగామ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించగా ఈనెల 13 (సోమవారం) నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 2,13,978 ఎకరాల్లో వరి పంట సాగుకాగా.. 5,43,057 టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేస్తున్నారు. 2,05,057 టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సన్న రకానికి మద్దతు ధర రూ.2,389లు, బోనస్గా క్వింటాల్కు రూ.500, అలాగే దొడ్డు రకానికి రూ.2,369 మద్దతు ధర లభించనుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని పంట కొనుగోలుకు సంబంధించి డీఆర్డీఓ, డీసీఓ డీపీఎం, డీటీలు, జిల్లా, మండల, గ్రామ స్థాయి సెర్ప్ సిబ్బంది, కొనుగోలు కేంద్రాల కమిటీ సభ్యులతో ఇప్పటికే కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. కొనుగోలు చేసిన ధాన్యంపై వచ్చే కమీషన్ నుంచి రైతులు తాగడానికి మంచినీరు, టెంట్, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలి. అలాగే ప్యాడీ సెంటర్లను శుభ్రంగా ఉండాలి. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ప్రతీరోజు ట్యాబ్ ఎంట్రీ చేయడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు పంపించేలా ప్రణాళిక రూపొందించారు. ఈమేరకు అవసరాలకు అనుగుణంగా లారీలు, హమాలీలను సిద్ధం చేసుకుంటున్నారు. అదేవిధంగా కొనుగోళ్లకు సంబంధించి ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో వెంటనే జమ అయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గత రెండు సీజన్లలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఈసారి కూడా పక్కా ప్రణాళికతో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరగాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులను అదేశించారు. వానాకాలం పంట కొనుగోలుపై ఆర్డీఓ, సివిల్ సప్ప్లై, డీఆర్డీఓ, మార్కెటింగ్, మార్క్ఫెడ్, జిల్లా, మండల, గ్రామ స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు, ఆర్టీఓ, గన్నీ గోదాం ఇన్చార్జ్లు, రైస్ మిల్లర్ల అసోసియేషన్లు అందరూ సమన్వయంతో పనిచేస్తే కొనుగోళ్లు సజావుగా సాగుతాయి. ప్రతి కేంద్రంలో కొనుగోలుకు సంబంధించిన రిజిస్టర్లు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీన ర్లు, వేయింగ్ యంత్రాలు, టార్ఫాలిన్ మొదలగు వసతులు ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో 309 కేంద్రాల ఏర్పాటు సన్నరకం, దొడ్డు రకం వేర్వేరుగా కొనుగోలు ఇప్పటికే జిల్లాలో ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించేలా ప్రణాళికజిల్లాలో ఏర్పాటు చేస్తున్న 309 కొనుగోలు కేంద్రాల్లో మహిళా సంఘాలకే పెద్దపీట వేశారు. ఐకేపీ, పీఏసీఎస్, రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నారు. కేంద్రాల్లో ఎప్పటికప్పు డు ధాన్యం సేకరణ వివరాలను వ్యవసాయశాఖ సేకరించాలి. ధాన్యం పూర్తి వివరాలు ప్రతీరోజు నమోదు చేయాలి. కొనుగోలు రవాణా, డ్రై మిషన్, ప్యాడీ క్లీనర్స్, వేయింగ్ మిషన్లు, తేమ శాతం, ఆటోమెటిక్ జాలి మిషన్లు, ముందస్తుగా సిద్ధంగా ఉంచుకోవాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు వచ్చాయి. సివిల్ సప్లై శాఖ ద్వారా కేంద్రాల్లో గన్నీసంచులు సిద్ధం చేసుకుంటున్నారు.దొడ్డు రకం కొనుగోలు కేంద్రాలు –198 ఐకేపీ – 116 పీఏసీఎస్లు – 82 సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రాలు – 101 ఐకేపీ – 69 పీఏసీఎస్లు – 42 మొత్తం కేంద్రాలు – 309జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అన్ని చర్యలు చేపట్టాం. జిల్లా వ్యాప్తంగా 309 సెంటర్లను ఎంపిక చేశాం. కేంద్రాల వద్ద టోల్ ఫ్రీ నెంబర్ను ప్రదర్శిస్తాం. అవసరమైన మేర గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. ధాన్యం నాణ్యత ప్రమాణాలపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలి. తేమ శాతం చూసుకొని నాణ్యమైన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి. – అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ -
కార్యకర్తల అభిప్రాయంతోనే డీసీసీ ఎన్నిక
పాలకుర్తి టౌన్: కార్యకర్తల అభిప్రాయ సేకరణతోనే డీసీసీ ఎన్నిక ఉంటుందని ఏఐసీసీ పరిశీలకుడు దేబాసిస్ పట్నాయక్ అన్నారు. డీసీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సంఘటన్ సృజన్ అభియాన్ తెలంగాణ కార్యక్రమం పేరిట ఆదివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ పరిశీలకులు షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య, ఎండీ అఫిజ్, శ్రీకాంత్యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ పరిశీలకుడు దేబాసిస్ పట్నాయక్ మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో స్థానిక నాయకులతోనే నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఆసక్తి గల ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసులో ఉన్న నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతీక అన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మురి ప్రతాప్రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు లకావత్ లక్ష్మీనారాయణనాయక్, కొమ్మురి ప్రశాంత్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, ఎర్రబెల్లి రాఘవరావు, గంగు కృష్ణమూర్తి, కుమారస్వామి, శ్రీరాములు నాయకుల పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి ఝాన్సీరెడ్డి దరఖాస్తు జనగామ డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి దరఖాస్తును నియోజకవర్గ నాయకులు ఏఐసీసీ అబ్జర్వర్ పట్నాయక్, టీపీసీసీ పరిశీలకులకు అందజేశారు. ఏఐసీసీ పరిశీలకుడు దేబాసిస్ పట్నాయక్ -
బీసీలకు 42 శాతం
రిజర్వేషన్ల పేటెంట్ సీఎందేస్టేషన్ఘన్పూర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తప్పక అమలుచేయాల్సిన పరిస్థితి త్వరలోనే వస్తుందని, ఎప్పటికై నా బీసీ రిజర్వేషన్ల పేటెంట్ సీఎం రేవంత్రెడ్డికే దక్కుతుందని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఘన్పూర్ పట్టణ కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం నియోజకవర్గస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి అతిధులుగా హాజరైన ఏఐసీసీ పరిశీలకులు దేబాసిస్ పట్నాయక్, టీపీసీసీ పరిశీలకులు షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య, ఎండీ అఫిజ్, శ్రీకాంత్యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డితో కలిసి ముందుగా మీడియా సమావేశంలో కడియం మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయానికి సీఎం రేవంత్రెడ్డి పెద్దపీట వేస్తున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నాయన్నారు. ఆసక్తి ఉన్నవారు నిర్భయంగా దరఖాస్తు చేసుకోవచ్చు: ఏఐసీసీ పరిశీలకుడు పట్నాయక్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం అర్హత, ఆసక్తి ఉన్నవారందరూ నిర్భయంగా దరఖాస్తు చేసుకోవచ్చని ఏఐసీసీ పరిశీలకులు దేబాసిస్ పట్నాయక్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుడోజు రాంబాబు, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీశ్రెడ్డి, శివరాజ్యాదవ్, నాయకులు బెలిదె వెంకన్న, బేతి జయపాల్రెడ్డి, కనకం గణేశ్, అంబటి కిషన్రాజ్, నాగరబోయిన శ్రీరాములు, రజాక్యాదవ్, కొలిపాక సతీశ్తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
రైతు కుటుంబానికి న్యాయం చేయాలి
స్టేషన్ఘన్పూర్: మండలంలోని పాంనూర్ గ్రామంలో వ్యవసాయ భూమి వద్ద విద్యుదాఘాతంతో శనివారం మృతిచెందిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులు, బంధువులు ఆదివారం ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ఆందోళన, జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. పాంనూర్ గ్రామానికి చెందిన కోట వాసు అనే రైతు వ్యవసాయ పనుల నిమిత్తం శనివారం తన వ్యవసాయభూమి వద్దకు వెళ్లి పొలంలో తెగి పడి ఉన్న విద్యుత్ ఎల్టీ లైన్ తీగతో విద్యుదాఘాతంతో మృతిచెందిన సంగతి తెలిసిందే. కాగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే వాసు మృతిచెందాడని ఆరోపిస్తూ మృతుడి భార్య, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆదివారం స్టేషన్ఘన్పూర్ విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం సబ్స్టేషన్ ఎదుట ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రైతు కుటుంబానికి న్యాయం చేయాలని, విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినదించారు. దాదాపు మూడు గంటల పాటు రాస్తారోకో చేపట్టడంతో జాతీయ రహదారిపై ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. రైతు కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా సంబంధిత అధికారులు రాకపోవడం గమనార్హం. కాగా విషయం తెలుసుకున్న ఏసీపీ భీమ్శర్మ, సీఐ జి.వేణు, ఎస్ఐలు వినయ్కుమార్, రాజేశ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబీకులకు, గ్రామస్తులకు నచ్చజెప్పారు. వారు ససేమిరా వినకపోవడంతో విద్యుత్శాఖ అధికారులతో ఫోన్తో మాట్లాడించారు. మృతిచెందిన రైతు కుటుంబానికి విద్యుత్శాఖ నుంచి న్యాయం చేస్తామని, ఏమైనా ఉంటే వారిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సర్దిచెప్పడంతో ఎట్టకేలకు రాస్తారోకో విరమించారు. ఈ సందర్భంగా రైతు కుటుంబ సభ్యులు, పాంనూర్ గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రైతు వాసు మృతిచెందాడని ఆరోపించారు. గతంలో పలుమార్లు విద్యుత్ తీగల సమస్యపై ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో చేస్తున్న వారితో మాట్లాడుతున్న ఏసీపీ భీమ్శర్మ జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతు బంధువులు, గ్రామస్తులు స్టేషన్ ఘన్పూర్లో కుటుంబసభ్యులు, గ్రామస్తుల రాస్తారోకో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే చనిపోయాడని ఆరోపిస్తూ ఆందోళన -
రోజు వారీ నిర్వహణ ఎలా?
గ్రామాల్లో ప్రజాప్రతినిధి లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి న ఆర్థిక సంఘం నిధులను నిలిపివేసింది. పల్లెల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామ పంచాయతీల అభివృద్ధి జరగడం లేదు. పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేస్తూ అత్యవసర పనులు చేయిస్తున్నారు. సర్కారు నుంచి రూపాయి రావడం లేదు. కనీసం చెత్త తీసుకెళ్లే ట్రాక్టర్లలో డీజిల్ పోసేందుకు కూడా జీపీల్లో డబ్బులు లేవు. – లకావత్ చిరంజీవి, స్టేషన్ఘన్పూర్●నారాయణపురం పంచాయతీకి రెండేళ్లుగా నిధులు రావడం లేదు. ఊరిలో కనీస వసతి సౌకర్యాలకు ఇప్పటి వరకు వీధిలైట్ల నిర్వహణ, డీజిల్, తాగునీటి పైపుల మరమ్మతు, బోరు మోటార్ల రిపేరు తదితర వాటి కోసం రూ.1.50 లక్షల వరకు సొంతంగా ఖర్చు చేశా. – దేవి ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి, బచ్చన్నపేట -
అభివృద్ధి జాడేది?
నిధులు రావు.. అప్పులు పుట్టవుజనగామ: గ్రామపంచాయతీలకు రెండేళ్లుగా నిధులు లేక జేబు ఖర్చుతో నడిపించే దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో గ్రామీణ పరిపాలన క్రమక్రమంగా చతికిల బడిపోతుంది. జీపీ ఖజానాలో చిల్లిగవ్వ లేకపోవడంతో పల్లెల్లో అభివృద్ధి పనుల జాడ లేకుండా పోయింది. 2024 ఫిబ్రవరి 2వ తేదీతో సర్పంచుల పదవీకాలం ముగియడంతో అన్ని పంచాయతీలు స్పెషల్ పాలన కిందకు వెళ్లాయి. ఎన్నికల ప్రక్రియ ఆలస్యమవడం, ఆ తర్వాత హైకోర్టు స్టే రావడంతో గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులు లేకుండా పంచాయతీల పాలనకు స్పీడ్ బ్రేకర్లు పడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, కనీస మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నుంచి వచ్చే 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే ఎస్ఎఫ్సీ (స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్) బడ్జెట్ పంచాయతీలకు ప్రాణాధారం లాంటివి. జిల్లాకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి నెలనెల రూ.65 కోట్లు, ఎస్ఎఫ్సీ ద్వారా ప్రతీ సంవత్సరం రూ.8 కోట్లు రావాల్సి ఉంది. ఇలా రెండేళ్ల కాలానికి రూ.810 కోట్ల మేర నిధులకు గ్రహణం పట్టింది. రెండేళ్లుగా పాలక మండలి లేకపోవడంతో ఈ రెండు వనరులు ఆగిపోయాయి. దీంతో పంచాయతీల పని తీరు పూర్తిగా క్షీణించింది. నిధుల లేమితో మౌలిక వసతుల పనులు ఆగిపోగా, శానిటేషన్, వీధి లైట్లు, నీటి సరఫరా వంటి ప్రాథమిక సేవలు సైతం కష్టసాధ్యమయ్యాయి. జిల్లాలోనే సుమారు 280 గ్రామపంచాయతీలు, 2,534 వార్డులు, సుమారు 5.40 లక్షల జనాభా ఉన్నారు. ఒక మేజర్ పంచాయతీ పరిధిలో రోజు వారీగా కనీసం రూ.3 వేలు, మైనర్ పంచాయతీలకు రూ.15వందల వరకు ఖర్చు అవుతోంది. కానీ ప్రస్తుతం పంచాయతీ ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా మిగిలి ఉండకపోవడంతో నల్లా పన్నులతో పాటు కార్యదర్శులు అప్పులు చేసి తమ సొంత ఖర్చుతో వ్యవహారాలు నెట్టుకువస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా నిధులు రాలేదు, చెత్త సేకరణకు వాహనం డీజిల్ ఖర్చు చేయాలంటే కూడా జేబులోంచి ఖర్చు చేస్తున్నాం, బిల్లులు రాయించుకున్నా చెల్లింపులు లేవు. సర్పంచ్ లేకపోవడంతో నిర్ణయాలు కూడా ఆలస్యం అవుతున్నాయంటూ ఓ పంచాయతీ సెక్రటరీ ఆవేదనకు గురయ్యారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే కారణంగా కొత్త ప్రజాప్రతినిధులు రావడం మరికొంత ఆలస్యం కానుంది. ఈ పరిస్థితుల్లో గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిధుల లేమితో శానిటేషన్ అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రజాప్రతినిధులు లేని పాలనతో గ్రామీణ అభివృద్ధి కేవలం పేపర్పైనే మిగిలిపోయిందనే అభిప్రాయాలను మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు. సర్పంచ్లు లేని పాలనలో సేవలకు ఆటంకం జీపీలకు నిధులు రాక రెండేళ్లు జిల్లాకు రూ.810 కోట్ల మేర పెండింగ్ జీపీలు వార్డులు జనాభా (సుమారు) 280 2,534 5.40లక్షలు -
అంబరాన్నంటిన జిల్లా ఆవిర్భావ వేడుకలు
జనగామ: జిల్లా ఆవిర్భవించి 10 ఏళ్ల వసంతంలోకి అడుగిడుతున్న వేళ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో సోషల్ వాయిస్ ఫౌండేషన్ ప్రతినిధి మంగళ్లపల్లి రాజు అధ్యక్షతన జరిగిన ఆవిర్భావ దినో త్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజ య్య, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పసునూరి రవీందర్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. అంతకు ముందు ఆర్టీసీ చౌరస్తాలో జాతీయ జెండాను ఎగుర వేసి, ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను నెమర వేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రాజ య్య మాట్లాడుతూ జిల్లా కోసం ఘన్పూర్ ప్రజలు గొప్ప పోరాటం చేశారన్నారు. ఉద్యమకారులు డాక్టర్ రాజమౌళి, మేడ శ్రీనివాస్, ధర్మపురి శ్రీనివాస్, రెడ్డి రత్నాకర్రెడ్డి, జి.కృష్ణ, పెట్లోజు సో మేశ్వర్, పిట్టల సురేష్, మాజీద్, ఆలేటి సిద్ధిరాములు తదితరులను సత్కరించారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ సమాజ మనుగడ సంస్కృతికి మూలాధారమన్నారు. జనగామ కవులు రచించిన వంద కవితల సాగుబాటు కవిత్వ సంకలనం ఆవి ష్కరించారు. రచయితలు, కవులు కళాకారులను సత్కరించి, జ్ఞాపికలను అందించారు. జరసం అధ్యక్షుడు నక్క సురేష్, మనోజ్ కుమార్ ఉన్నారు. -
అందరి అభిప్రాయం మేరకు డీసీసీ ఎన్నిక
జనగామ: పార్టీలోని అందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే డీసీసీ ఎన్నిక ఉంటుందని టీపీసీసీ అబ్జర్వర్, షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య అన్నారు. డీసీసీ ఎన్నిక కసరత్తు నేపధ్యంలో శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు కొ మ్మూరి ప్రతాప్రెడ్డి అధ్యక్షతన జరిగిన దరఖాస్తుల స్వీకరణలో ఏఐసీసీ అబ్జర్వర్ దేబాసిస్ పట్నాయక్, టీపీసీసీ అబ్జర్వర్లు శంకరయ్య, ఎండీ ఆవేజ్, శ్రీకాంత్యాదవ్, జువ్వాడి ఇంద్ర ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే శంకరయ్య మాట్లాడుతూ పార్టీకి, కార్యకర్తలకు అందుబాటులో ఉండే వారిని డీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. గతంలో మాదిరిగా కాంగ్రెస్ మండల, జిల్లా అధ్యక్షులను ఎంపిక చేయడం లేదన్నారు. పార్టీలో ఎవరైన డీసీసీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను రహస్యంగా సేకరిస్తామన్నారు. డీసీసీ గా సమర్థులు ఎవరనే తుది నిర్ణయం, స్వేచ్ఛ కార్యకర్తలపైనే ఉంటుందన్నారు. ఏఐసీసీ అబ్జర్వర్ దేబా సిస్ పట్నాయక్ మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త అభిప్రాయం మేరకే డీసీసీ ఎన్నిక ఉంటుందన్నారు. నే టి (ఆదివారం) జిల్లాలోని స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో కార్యకర్తల అభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు. దరఖాస్తుల స్వీకరణ, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత, ఈ నెల 13న సమర్థులను డీసీసీగా ఎన్నుకునేందుకు పీసీసీకి సమగ్ర సమాచారం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యా దవ్, పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రాంబాబు, నాయకులు కరుణాకర్రెడ్డి, వంగాల మల్లారెడ్డి, నల్లగోని బాలకిషన్ గౌడ్, జంగిటి విద్యానాధ్ తదితరులు ఉన్నారు. కాగా అంతకు ముందు డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తన దరఖాస్తును అబ్జర్వర్లకు అందించారు. డీసీసీ అధ్యక్షుడి కోసం దరఖాస్తు జనగామ డీసీసీ అధ్యక్షుడి కోసం ఆ పార్టీ నాయకుడు నాగపురి కిరణ్కుమార్ శనివారం జనగామకు వచ్చిన ఏఐసీసీ అబ్జర్వర్ పట్నాయక్, టీపీసీసీ అబ్జర్వర్, షాద్నగర్ ఎమ్మె ల్యే ఈర్ల శంకర్, శ్రీకాంత్ యాదవ్, హఫీజ్ను కలిసి నాయకులు, కార్యకర్తలతో కలిసి దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ జనగామ డీసీసీ అధ్యక్షుడిగా బీసీ నాయకుడిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. టీపీసీసీ అబ్జర్వర్, షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య -
‘ధన్ ధాన్య కృషి యోజన’తో ఒరిగేదేమి లేదు
జనగామ రూరల్: పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకంతో రైతులకు ఒరిగేదేమిలేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం పీఎం చేతుల మీదుగా వర్చువల్ విధానంలో పథకం ప్రారంభం కాగా ఎమ్మెల్యే వీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ రెండు పథకాలతో రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టం చేశారు. కొత్తగా ఏ పథకం తీసుకురాకుండా ఇప్పటికే ఉన్న పథకాల నిధులను కలిపి చూపిస్తున్నారని విమర్శించారు. కిసాన్ యోజన పేరుతో ఇప్పటివరకు రూ. 3 లక్షల కోట్లను ఇచ్చామని కేంద్రం చెబుతున్నా.. వాస్తవంగా రైతుల జీవితాల్లో మార్పు రాలేదన్నారు. 72 లక్షల మంది రైతులకు రూ.72 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
మున్సిపల్ డ్రైవర్ల ఆందోళన
జనగామ: పురపాలిక శానిటేషన్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ (జూనియర్ అసిస్టెంట్) డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు చేస్తూ ఆటో, ట్రాక్టర్, వా టర్ ట్యాంకర్లు నడిపించే 22 మంది డ్రైవర్లు శని వారం విధులను బహిష్కరించి ఆందోళనకు దిగా రు. సీఐటీయూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పెద్దగళ్ల సుధాకర్, బొట్ల నాగరాజు, మసిరాజు, మునిగె రవి తదితరుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ భూపాలపల్లి నుంచి డిప్యుటేషన్పై ఇక్కడకు వచ్చి పని చేస్తున్న శేఖర్ శానిటేషన్, వాటర్, ఆటో డ్రైవర్లను నెలానెల రూ.వెయ్యి చొప్పున రూ.22 వేలు ఇవ్వాలని వేధిస్తున్నాడన్నారు. అధికారిపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డికి ఫిర్యాదు చేయగా, విచారణ జరిపిస్తామని చెప్పడంతో నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు మల్లిగారి రాజు, తదితరులు ఉన్నారు. ఈ విషయమై పులి శేఖర్ మాట్లాడుతూ శానిటేషన్ విభాగంలో డ్రైవర్లుగా పనిచేస్తున్న వారిని విధులను సక్రమంగా చేయాలని చెప్పడంతోనే తాను డబ్బులు అడిగినట్లు నిందలు వేస్తున్నారన్నారు. డ్రైవర్లను సమయ పాలన పాటించడంతో పాటు విధులను సక్రమంగా నిర్వహించాలని తరచూ చెప్పడంతో కోపం పెంచుకుని, దుష్ఫ్రచారం చేస్తున్నారన్నారు. -
సీఎంఆర్ సేకరణలో వేగం పెంచండి
జనగామ: జిల్లాలో రా రైస్(ముడి ధాన్యం) మిల్లర్లు 2024–25(రబీ)కి సంబంధించిన సీఎంఆర్ బియ్యం వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశం హాల్లో పౌర సరఫరాల శాఖతో కలిసి గత సీఎంఆర్, ప్రస్తుత 2025–26 ఖరీఫ్ సీజన్లో వచ్చే ధాన్యం దిగుమతిపై నిర్వహించిన సమీక్షలో బెన్ షాలోమ్ పాల్గొని మాట్లాడారు.. వానాకాలం సీజన్లో మిల్లర్ల అధ్యక్షులు కోరిక మేరకు ధాన్యం కేటాయింపులు ఉంటాయన్నారు. రా రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ, బ్యాంకు గ్యారంటీలను పౌరసరఫరాల డీఎంకు సమర్పించాలన్నారు. అలాగే మిల్లర్ల అగ్రిమెంట్ సైతం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. సమీక్షలో డీసీఎస్ఓ సరస్వతి, ఏసీఎస్ఓ డీఎం హథీరామ్, మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణగౌడ్, బెల్దే వెంకన్న, మిల్లర్లు ఉన్నారు. మిల్లర్లకు అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ ఆదేశం -
ఇక.. డీసీసీ అధ్యక్షుల ఎంపిక!
‘సంస్థాగత’ ఎన్నికలపై దృష్టి సారించిన కాంగ్రెస్ ● నేడు జిల్లాలకు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు ● ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరణ.. 11 నుంచి 18 వరకు ఈ ప్రక్రియ ● ఆ తర్వాత సీఎం, టీపీసీసీ చీఫ్తో పరిశీలకుల భేటీ ● నవంబర్ మొదటి వారంలో డీసీసీ అధ్యక్షుల జాబితా ? ● పోటాపోటీగా దరఖాస్తులతో సిద్ధమైన ఆశావహులుసాక్షిప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీఓ 9, ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు నిలిచిపోగా.. ఈలోగా ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న జిల్లా కాంగ్రెస్ కమిటీల ఖరారుపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు శనివారం (ఈ నెల 11వ తేదీ) నుంచి 18వ తేదీ వరకు డీసీసీ అధ్యక్షుల రేసులో ఉన్న ఆశావహుల నుంచి జిల్లాల వారీగా దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఢిల్లీ, ఇతర ప్రాంతాలనుంచి శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్న ఏఐసీసీ పరిశీలకులు శనివారం నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వేదికగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలకు నేడు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు.. వాస్తవానికి పార్టీ సంస్థాగత నిర్మాణం, పటిష్టత కోసం మూడు నెలల కిందటే ఏఐసీసీ కమిటీలు వేసింది. ఉమ్మడి వరంగల్కు ముగ్గురు ఏఐసీసీ పరిశీలకులతోపాటు ఒక్కో జిల్లాకు ఇద్దరు నుంచి ముగ్గురు టీపీసీసీ పరిశీలకులను నియమించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ పరిశీలకులతో భేటీ అయి పలు సూచనలు చేశారు. ఏఐసీసీ పరిశీలకులు నబజ్యోతి పట్నాయక్ (హనుమకొండ, వరంగల్), జాన్సన్ అబ్రహం (ములుగు, జేఎస్ భూపాలపల్లి), దేబాసిస్ పట్నాయక్ (జనగామ)లు దరఖాస్తులు, డీసీసీ ఎన్నికలను పరిశీలించనున్నారు. అదేవిధంగా టీపీసీసీ పరిశీలకులుగా హనుమకొండ, వరంగల్ జిల్లాలకు గాలి అనిల్కుమార్, దుర్గం భాస్కర్, మక్సూద్ అహ్మద్, గుంజ రేణుకా నారాయణ, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాలకు జంగా రాఘవరెడ్డి, అఫ్సర్ యూసుఫ్ ఝహి, ఇ.సుబ్బారావు, ఎ.సంజీవ్ ముదిరాజ్, జనగామ, మహబూబాబాద్లకు కె.శంకరయ్య (ఎమ్మెల్యే), ఎండీ అవేజ్, పీసరి మహిపాల్ రెడ్డి, కె.శ్రీకాంత్జాదవ్, జువ్వాడి ఇందిరారావు పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. జిల్లాల వారీగా కార్యాలయాల్లో డీసీసీ ఆశావహులనుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోటాపోటీగా ఆశావహులు.. ● డీసీసీ కోసం పోటీపడే వారి సంఖ్య జిల్లాల్లో చాంతాడులా పెరుగుతోంది. ● ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షులు మార్పు తధ్యమనుకుంటే కొత్తగా హనుమకొండ జిల్లా నుంచి కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, జంగా రాఘవరెడ్డి, ఈవీ శ్రీనివాస్రావు, బట్టి శ్రీనివాస్, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డి, బొమ్మనపల్లి అశోక్రెడ్డి, కట్ల శ్రీనివాస్లతోపాటు మరి కొంతమంది దరఖాస్తు చేసుకుంటారనే ప్రచారం ఉంది. ● వరంగల్ నుంచి ఇప్పుడున్న అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నమిండ్ల శ్రీనివాస్, ఎంపీ ఆనంద్, బొంపెల్లి దేవేందర్రావు, గోపాల నవీన్రాజ్, నల్గొండ రమేశ్, నర్సంపేట మాజీ ఎంపీపీ టి.రవిందర్రావు, పిన్నింటి అనిల్రావు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ● జయశంకర్ భూపాలపల్లి డీసీసీ కోసం మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధుతోపాటు ఎనిమిది మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ● జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి స్థానంలో హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, బండ శంకర్, లకావత్ ధన్వంతి, లక్ష్మీనారాయణతోపాటు పలువురు ఆశావహులు సిద్ధమయ్యారు. ● ములుగు జిల్లాలో ప్రస్తుత అధ్యక్షుడు పైడాకుల అశోక్, సూర్య(మంత్రి సీతక్క కుమారుడు) మధ్య ఇప్పటికే పొసగడం లేదు. ఇక్కడినుంచి సూర్య సీరియస్గానే ఆశిస్తున్నారు. పైడాకుల అశోక్, కుంజ సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బాదం ప్రవీణ్ తదితరులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ● మహబూబాబాద్లో ఇప్పుడున్న జె.భరత్చంద్రారెడ్డి, వెన్నం శ్రీకాంత్రెడ్డి, నునావత్ రాధతో పాటు ఏడెనిమిది మంది పేర్లు వినిపిస్తున్నాయి. ● ఏదేమైనా దరఖాస్తుల ప్రక్రియ 18న ముగియగానే ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు, సీఎం, టీపీసీసీ దృష్టికి జాబితాను తీసుకెళ్లనున్నారని సమాచారం. అనంతరం జిల్లా ఇన్చార్జ్లు, ఇన్చార్జ్ మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్, మహిళ.. ఇలా సామాజిక కోణాలను దృష్టిలో పెట్టుకుని నవంబర్ మొదటి వారంలో అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. నేడు జిల్లాకు పరిశీలకులు..జనగామ: జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక కోసం ఏఐసీసీ పరిశీలకులు, టీపీసీసీ ప్రతినిధి శనివారం జిల్లాకు రానున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశానికి శాసన, పార్లమెంట్ సభ్యులు, మండల, అనుబంధ కమిటీలు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులు, జిల్లా గ్రంథాలయ సంస్థ, మార్కెట్ కమిటీ, పీఏసీఎస్ఎస్, దేవస్థాన కమిటీ చైర్మన్లు, తాజా, మాజీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు హాజరై ఆసక్తి ఉన్న నాయకులు డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ మెంబర్లతో ముఖాముఖి అభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు. ఈ నెల11వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ జిల్లా కార్యాలయంలో జనగామ నియోజకవర్గ నాయకులతో సమావేశం ఉంటుందన్నారు. 12వ తేదీన ఉదయం 11 గంటలకు స్టేషన్ఘన్పూర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆ నియోజకవర్గ నాయకులతో సమావేశం ఉంటుందని తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 2.30గంటలకు పాలకుర్తి పట్టణ కేంద్రంలో ఆ నియోజకవర్గ నాయకులతో సమావేశం ఉంటుందన్నారు. అభిప్రాయ సేకరణలో డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. -
ఉద్యమకారుల డిమాండ్లు:
● స్థానిక యువతకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలి. ● జిల్లా ఉద్యమచరిత్రకు గుర్తుగా ఉద్యమ స్థూపం నిర్మించాలి. ● జనగామ రూరల్, అర్బన్ మండలాలతో కలిపి జిల్లా పరిధిని 16 మండలాలుగా విస్తరించాలి. ● జిల్లాకు ఎస్పీ కార్యాలయం హోదా కల్పించాలి. ● జిల్లా కేంద్ర అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించాలి. ● మ్యూజియం, అంబేడ్కర్ ఆడిటోరియం, ఆధునిక స్టేడియం నిర్మించాలి. ● నిలిచిపోయిన ప్రభుత్వ ఐటీఐ, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నిర్మాణాలు పూర్తి చేయాలి. ● కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలి. ● పాలకుర్తిని మున్సిపాలిటీగా ప్రకటించాలి. ● మహిళల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాపించాలి. ● రంగప్ప చెరువు సుందరీకరణతో పాటు మినీ పార్కులు ఏర్పాటు చేయాలి. ● సర్వాయి పాపన్న గౌడ్ వీరత్వానికి చిహ్నంగా ఖిలాషాపురం కోట పునరుద్ధరించాలి. ● మాణిక్యపురంలో చుక్క సత్తయ్య కళాక్షేత్రం ఏర్పాటు చేయాలి. ● సిద్ధులగుట్ట, జీడికల్, పాలకుర్తి, చీటకోడూర్, బాణాపురం దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి. ● మోడల్ మార్కెట్ను పూర్తి చేయాలి. ● జిల్లా ఆసుపత్రిలో ఎమ్మారై, ఆంజియోగ్రామ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలి. ● చంపక్హిల్స్, చీటకోడూర్ డ్యాంలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలి. ● జనగామ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలి. ● 50 ఏళ్ల చరిత్ర కలిగిన జనగామ ఆర్టీసీ బస్టాండును ఆధునీకరించి జిల్లా స్థాయి బస్టాండ్గా అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ హామీలపై ఉద్యమకారుల ప్రశ్నలివి: ● ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఇంకా ప్రారంభం కాలేదు. ● 2014లో ప్రకటించిన పెంబర్తి–వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ కలగానే మిగిలిపోయింది. ● బీసీస్టడీ సర్కిల్, జిల్లా గ్రంథాలయం, జిల్లా పరిషత్ భవనం నిర్మాణం ఇంకా మొదలు కాలేదు. -
పదేళ్లు
పోరాటాల ఖిల్లాకు నేడు పదో వసంతంలోకి అడుగిడనున్న జిల్లా● ప్రగతిపథంలో పయనిస్తున్న ఉద్యమాల గడ్డ ● ఆనాడు జిల్లా కోసం 500 రోజుల ఉద్యమం ● జైలు జీవితం గడిపిన 55 మంది ఉద్యమకారులు ● సోషల్ వాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేడుకలకు ఏర్పాట్లుజనగామ: పోరాటాల పునాదులపై పురుడు పోసుకున్న జనగామ జిల్లా శనివారం(ఈనెల 11న) తొమ్మిది వసంతాల ప్రయాణం పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనంతరం ఏర్పడిన కొత్త జిల్లాల్లో, జనగామ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. జనగామ జిల్లా ఏర్పాటు చేస్తామని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినా.. జనగామ పేరు పునర్విభజన జిల్లాల జాబితాలో లేకపోవడంతో ఉద్యమ జ్వాల రగిలింది. రెండేళ్ల పాటు నిరంతర పోరాటం జిల్లా సాధన కోసం ప్రజలు ఏడాదికిపైగా నిద్రాహారాలు మానుకుని పోరుబా ట సాగించారు. 500 రోజుల ఉద్య మం సాగగా, 250 రోజుల రీలే దీక్షలు, 200రోజుల పాటు 144 సెక్షన్ నిర్బంధం కొనసాగింది. ఎగిసి పడ్డ ఉద్యమంతో ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. జిల్లా కోసం సాగిన పోరులో పోలీసుల ముందస్తు అరెస్టులు, జైళ్లకు తరలింపులు, నిరసనలు ఇవన్నీ నేటికీ ప్రజల జ్ఞాపకాలలో నిలిచిపోయాయి. అగ్నిగుండంలా మారిన ఉద్యమం నాటి ప్రభుత్వం జనగామను జిల్లాల జాబితాలో చేర్చాలంటూ జరిగిన ఉద్యమం ఒక్కసారిగా అగ్నిగుండంలా మారింది. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రతిరోజూ జరిగే రాస్తారోకోలతో రవాణా వ్యవస్థ స్థంభించి పోయింది. ప్రభుత్వానికి నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు వెల్లువెత్తాయి. 12 గంటల పాటు సాగిన ఓ నిరసనలో ఆర్టీసీ బస్సు దహనం కావడంతో ఆందోళన తీవ్రరూపం దాల్చింది. ఈఘటనలో అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. పోరాట ఫలితం.. జిల్లా అవతరణ సమాజంలోని అన్ని వర్గాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, రైతులంతా జనగామ జిల్లా కావాలనే స్వరం వినిపించారు. చివరకు ప్రజల డిమాండ్ ముందు ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. 2016 అక్టోబర్ 11న అధికారికంగా జనగామ జిల్లా ఆవిర్భావం చెందింది. నాటి ముహూర్తం నుంచి ఈ ప్రాంతం అభివృద్ధిలో వేగంగా అడుగులు వేస్తోంది. అభివృద్ధి పథంలో.. ఇప్పటికే విద్య, వ్యవసాయం, పరిశ్రమలు, తదితర రంగాల్లో జిల్లా సరికొత్త శకం ప్రారంభించింది. జిల్లాకేంద్రం ఆధునిక సౌకర్యాలతో కళకళలాడుతోంది. కొట్లాడి తెచ్చుకున్న జిల్లాగా పేరుపొందిన జనగామ రాష్ట్రంలో అభివృద్ధి ప్రతీకగా నిలుస్తోంది. అయినప్పటికీ గత, ప్రస్తుత ప్రభుత్వ హామీలు అమలు కాకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కోసం పోరాడిన అనేక మంది ఉద్యమకారులు సైతం నేటికీ కోర్టు కేసుల్లో తిరుగుతూ, ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతూ ప్రభుత్వం నుంచి ఆదరణ లేక ఇబ్బందులు పడుతున్నారు. నేడు ఆవిర్భావ దినోత్సవం జిల్లా ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని సోషల్ వాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో జిల్లా 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకోనున్నారు. ఉదయం 10 గంటలకు వేడుకలను ప్రారంభించడం జరుగుతుందని జిల్లా జేఏసీ కన్వీనర్ మంగళ్లపల్లి రాజు తెలిపారు. ప్రజలు, ఉద్యమకారులు, అన్ని వర్గాల ప్రజల సహకారంతో జనగామ మరో మైలురాయిని చేరుకుంటుందన్నారు. జిల్లా ఉద్యమ చరిత్రను గుర్తు చేస్తూ ఉద్యమకారులు పలు డిమాండ్లు విడుదల చేశారు. -
బతుకమ్మకుంటను సిద్ధం చేయాలి
జనగామ రూరల్: బతుకమ్మకుంట అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్తో కలిసి బతుకమ్మకుంటలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కోటి 50 లక్షల రూపాయలతో ప్రారంభించిన బతుకమ్మకుంట అభివృద్ధి పనులు దాదాపు పూర్తయ్యాయని, మిగతా పనులు కూడా త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ప్రజలకు, చిన్నారులకు టీ, కాఫీ, స్నాక్స్లాంటివి అందుబాటులో ఉండేలా ఎస్హెచ్జీ వారితో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, శ్రీధర్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. నేడు ‘పీఎం ధన్–ధాన్య కృషి యోజన’ ప్రారంభంకేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన పథకాన్ని శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. శుక్రవారం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి వ్యవసాయ, గ్రామీణభివృద్ధి, మత్స్య, కో ఆపరేటివ్ తదితర శాఖల అధికారులతో గ్రామ, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ గూగుల్ మీటింగ్ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పేదలు, యువత, రైతులు, మహిళల జీవితాలను మెరుగుపరచడానికి ఈ పథకం దోహదపడుతుందన్నారు. వ్యవసాయం మాత్రమే కాకుండా మత్స్యసంపద, పశుసంవర్ధకం తదితర రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి స్కేల్, టెక్నాలజీ, సంస్థాగత బలాన్ని పెంచి.. తద్వారా సమగ్ర అభివృద్ధి సాధించడం లక్ష్యమన్నారు. ఈపథకం కింద జిల్లా ఎంపికై ందని, 6 సంవత్సరాల వరకు అమలయ్యే ఈ పథకంలో భాగంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపట్టే వివిధ రకాల కార్యకలాపాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నమన్నారు. ప్రారంభోత్సవ వేడుకలు కలెక్టరేట్లో జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, డీఆర్డీఓ వసంత, జిల్లా కోఆపరేటివ్ అధికారి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపర్చాలి అంగన్వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపర్చాలని ముఖ్యంగా గర్భిణులు, పిల్లల హాజరుశాతం పెరగాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశపు హాల్లో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పనితీరుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కందిపప్పు, గుడ్లు, బియ్యం నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలన్నారు. క్లస్టర్ వారీగా సమావేశాలు ఏర్పాటుచేసి అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ తీరు మెరుగుపరిచేందుకు అవగాహన కల్పించాలన్నారు. సమీక్ష సమావేశంలో ఆర్.బి.ఎస్.కె.డాక్టర్ అశోక్, సీడీపీఓలు, సూపర్ వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు. పెండింగ్ పనులు పూర్తిచేయాలి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓలు, తహసీల్దార్లతో రెవెన్యూకు సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షించారు. భూసేకరణకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని అందించాలన్నారు. సంబంధిత రైతుల బ్యాంకు వివరాలను సేకరించేందుకు వచ్చే సోమవారం నుంచి శుక్రవారం వరకు గ్రామ పరిపాలన అధికారులచేత స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. -
చెదిరిన కల
జనగామ: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయడంతో అభ్యర్థిత్వం కోసం సిద్ధమైన నేతల్లో నిరాశ అలుముకుంది. గత కొన్ని వారాలుగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ల హడావిడి అంతా ఇంతా కాదు. రిజర్వేషన్లు అనుకూలంగా రావడంతో సంతోషంగా ఉన్న నాయకులు ఒక్కసారిగా గందరగోళంలో పడ్డారు. ఈసారి రిజర్వేషన్న్అనుకూలంగా వచ్చిందని ఆనందపడ్డ నాయకులు, ఇప్పుడు పాత రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయేమోనని ఆందోళనలో ఉన్నారు. హైకోర్టు ఇచ్చిన స్టేతో ఎన్నికల షెడ్యూల్ నిలిచిపోగా, గ్రామీణ రాజకీయంలో నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. రిజర్వేషన్లు అనుకూలంగా రావడం, అధిష్టానం ఆశీస్సులు ఇస్తుందనే బలమైన నమ్మకంతో గ్రామాల్లో పర్యటనలు చేసి, తమ అనుచర వర్గం మద్దతు కూడగట్టుకున్నారు. ఎన్నికల పోలింగ్ వరకు వెంట నడిచే పార్టీ వర్గాలు చేజారిపోకుండా దసరా పండగ సమయంలో ఎంతోకొంత మొత్తంలో ఖర్చులు పెట్టేశారు. దీంతో అప్పులు చేసి ఖర్చుచేసిన వారికి ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ఎదురుచూపులే.. స్థానిక ఎన్నికలకు సంబంధించి నాలుగు వారాల లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఆశావహులు అప్పటివరకు ఆగాల్సిందే. రిజర్వేషన్లు కలిసి వచ్చి అభ్యర్థిత్వం కోసం ఆశపడ్డ వందలాది మంది నాయకులు ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చే వరకు ఎదురుచూద్దామనే ఆలోచనలో ఉన్నారు. కొత్త రిజర్వేషన్ల ప్రకారం కొందరికి అవకాశం దొరికినా.. తప్పని పరిస్థితుల్లో పాత వాటితో ముందుకు వెళ్తే అవకాశాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మొదటి విడత జరగాల్సిన లింగాలఘనపురం, దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, స్టేషన్ఘన్పూర్, చిల్పూరు మండలాల్లో రాజకీయ హడావిడి గప్చుప్గా మారిపోయింది. ఆరు మండలాల్లో కొత్త రిజర్వేషన్లతో అభ్యర్థులు పోటీకి సన్నద్ధ మవుతున్న సమయంలో కోర్టు తీర్పు సందిగ్ధంలో పడేసింది. రాబోయే రోజుల్లో హైకోర్టు తీర్పు ఆధారంగా ఎన్నికల భవిష్యత్తు నిర్ణయించబడనుంది. మొత్తానికి హైకోర్టు స్టే స్థానిక రాజకీయాలను కుదిపివేస్తుండగా, ఎన్నికల సమీకరణాలు మారే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల్లో ఇదే చర్చ జరుగుతోంది. స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టేతో ఆశావహుల షాక్ మరికొన్ని రోజుల పాటు ఎదురుచూపులే.. -
నామినేషన్ కేంద్రం పరిశీలన
లింగాలఘణపురం: మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల కేంద్రాన్ని గురువారం కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిటర్నింగ్ అధికారులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆర్వో హతీరామ్, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ రఘురామకృష్ణ, ఎస్సై శ్రావణ్కుమార్, ఎంపీటీసీ రిటర్నింగ్ అధికారులు సీహెచ్ ఉపేందర్, జి.నాగరాణి, ఎం.జయప్రకాశ్, ఎండీ ఇబ్రహీం, ఏఆర్ఓలు తదితరులు ఉన్నారు. చిల్పూర్లో.. చిల్పూరు: మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మాధవీలతతో కలిసి గురువారం డీసీపీ రాజమహేందర్నాయక్ పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ విజయ్కుమార్, ఎంపీడీఓ శంకర్నాయక్, ఎంపీఓ మధుసూదన్ పాల్గొన్నారు. -
నూతన భవనంలోకి పాఠశాల తరలింపు
పాలకుర్తి టౌన్: మండలంలోని ఎల్లారాయిని తొర్రూరు ప్రాథమిక పాఠశాలలో హైస్కూల్, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు. సాక్షి దినపత్రికలో ‘ఆరు గదులు..మూడు బడులు’ పేరిట ప్రచురితమైన కథనానికి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా స్పందించి పాఠశాల హెచ్ఎం పెనుగొండ రమేశ్ను నూతన భవనంలోకి తరలించాలని అదేశించారు. అయినప్పటికీ నూతన భవనవంలోకి విద్యార్థులను తరలించకపోవడంతో బుధవారం ప్రధానోపాధ్యాయుడు రమేశ్పై కలెక్టర్ సీరియస్ కావడంతో పాటు విద్యాశాఖ జిల్లా ఏఎస్ఓగా కొనసాగుతున్న ఆయన డిప్యుటేషన్ను రద్దు చేశారు. గురువారం ఉదయం 10గంటల వరకు విద్యార్థులను నూతన భవనంలోకి తరలించకుంటే సస్పెండ్ చేస్తానని ప్రధానోపాధ్యాయుడు రమేశ్ను కలెక్టర్ హెచ్చరించడంతో విద్యార్థులతో పాటు సామగ్రిని తరలించారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ సత్యమూర్తి, ఎంఈఓ పోతుగంటి నర్సయ్య పాఠశాల నూతన భవనంలో ఏర్పాట్లను పరిశీలించారు. గత ప్రభుత్వంలో రూ.50 లక్షలతో గ్రామానికి దూరంగా నూతన పాఠశాల భవనం నిర్మించారు. కాగా ఈ భవనవంలోకి విద్యార్థులను తరలించడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. -
ఆర్టీఏ కేసుల పరిష్కారంపై కలెక్టర్కు అవార్డు
జనగామ రూరల్: ఆర్టీఏ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించినందుకుగానూ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా బెస్ట్ పెర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన సమాచార హక్కు చట్ట వారోత్సవాలు సందర్భంగా గురువారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ డిస్ట్రిక్ట్, బెస్ట్ పీఐవో బెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్డిస్పోజల్ ఆఫ్ ఆర్టీఐ కేసెస్ మొదలగు ఏడు విభాగాల్లో పురస్కారాలను ప్రదానం చేశారు. జిల్లాలో అధికారుల సమన్వయంతో ఆర్టీఐ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పెండింగ్ లేకుండా వ్యవహరించినందుకు కలెక్టర్ ఈ అవార్డు అందుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్కు జిల్లా అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు వివిధ అంశాల్లో వరుసగా అవార్డులు వస్తుండడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం గారూ.. జిల్లా విద్యాశాఖను చక్కబెట్టండి● ‘సాక్షి’ కథనాలతో ఎక్స్లో సీఎంకు ట్యాగ్ జనగామ: జిల్లాలో టీచర్ల సర్దుబాటు జాప్యంతో విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారిపోతోందని, చదువు విషయంలో ఎలాంటి ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనాలతో ‘ఎక్స్’ వేదికగా ట్యాగ్ చేస్తూ సోషల్ వాయిస్ ఫౌండేషన్ ప్రతినిధి మంగళ్లపల్లి రాజు సీఎం రేవంత్రెడ్డితో పాటు తెలంగాణ ఎడ్యుకేషన్ శాఖకు పోస్టు చేశారు. జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు విషయమై నాన్చుడు ధోరణిపై ప్రజాసంఘాలు, విద్యావేత్తలు, ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా వ్యాప్త ఆందోళనకు కార్యాచరణ రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి వెంటనే స్పందించి గాడితప్పిన జిల్లా విద్యాశాఖను చక్కబెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
జ్వరంతో వచ్చా..
తీవ్ర జ్వరంతో బాధపడుతూ జిల్లా ఆసుప్రతిలో మూడు రోజుల క్రితం వచ్చాను.. డాక్టర్లు పరీక్షించి అడ్మిట్ చేశారు. వైద్యం బాగానే అందిస్తున్నారు. జ్వరం తగ్గి కుదుటపడుతోంది. ఒక్కరోజులో డిచార్జి చేస్తామంటున్నారు. – కౌసర్ ఫాతిమా, అంబేడ్కర్నగర్, జనగామవైరల్ ఫీవర్, విపరీతమైన దగ్గుతో ఆరు రోజుల క్రితం ఆస్పత్రికి వచ్చా.. డాక్టర్లు రోజుకూ మూడు సార్లు పరీక్షిస్తున్నారు. వైరల్ ఫీవర్ తగ్గినప్పటికీ, దగ్గు విపరీతంగా ఉంది. వైద్యులు ఏం కాదంటున్నారు. మరో రెండు రోజులు ఇక్కడే ఉండాలని చెప్పారు. – దేవర వెంకటయ్య, సంజయ్నగర్, జనగామవైరల్ ఫీవర్తో రక్తకణాలు తగ్గాయి. నడవలేని పరిస్థితుల్లో రెండు రోజుల క్రితం ఆస్పత్రికి వచ్చాను. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి, వైద్యం అందిస్తున్నారు. ప్రమాదం లేదని చెప్పారు. – భూక్యా దేవేందర్, మచ్చుపహాడ్, నర్మెట -
ఇప్పటికిక ఇంతే...!
జీఓ 9పై హైకోర్టు స్టే.. ‘స్థానిక’ ఎన్నికలకు బ్రేక్సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ విడుదల చేసిన జీఓ 9పై దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు గురువారం స్టే ఇచ్చింది. ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల స్వీకరణ చేపట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. హైకోర్టు తీర్పు తర్వాత ఆ మేరకే వ్యవహరిస్తామని ప్రకటించింది. దీంతో ఆరు వారాలపాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనుండగా.. డిసెంబర్ మొదటి వారం తర్వాత ఈ మధ్యకాలంలో జరిగే పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ 29న ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ మేరకు నవంబర్ మాసాంతానికి ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని అందరూ భావించారు. కానీ, హైకోర్టు స్టేతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతటా కలకలం... రాజకీయ పార్టీల్లో దుమారం... రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్లో భాగంగా ఉమ్మడి వరంగల్లో మూడు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటు వామపక్ష పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సెప్టెంబర్ 29న షెడ్యూల్ విడుదల తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆశావహుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించాయి. రెండు విడతల్లో పరిషత్, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలకు అనుగుణంగా అభ్యర్థులను ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దసరా పండుగకు ముందే రిజర్వేషన్లు ప్రకటించడం.. ఎన్నికల షెడ్యూల్ వెల్లడి కావడంతో ఆశావహుల సందడి పల్లెల్లో జోరందుకుంది. ఎంపీటీసీ, సర్పంచ్ పదవులను ఆశించే వారు పండగ కావడంతో ఖర్చుకు సైతం వెనకాడలేదు. కాగా, ప్రధాన పార్టీలు గురువారం ఉదయం విడుదలైన నోటిఫికేషన్ తర్వాత దశల వారీగా 11వ తేదీ వరకు నామినేషన్లకు ప్లాన్ చేసుకున్నా.. హైకోర్టు తీర్పు తర్వాతే అభ్యర్థులను ప్రకటించేందుకు నిర్ణయించుకున్నారు. నోటిఫికేషన్ వెలువడిన రెండున్నర గంటల్లోనే హైకోర్టు ఎన్నికలకు బ్రేక్ వేసే విధంగా స్టే ఇవ్వడం కలకలం రేపింది. రిజర్వేషన్ల ప్రకటన, ఎన్నికల నోటిఫికేషన్లు ఆశావహులను ఊరించాయి. కొత్తగా ప్రకటించిన రిజర్వేషన్లలో అవకాశం వచ్చిన వారు మురిసిపోయారు. షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో ఉమ్మడి వరంగల్లో 37 జెడ్పీటీసీలు, 393 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ తర్వాత గురువారం ఉదయం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ముహూర్తం ప్రకారం 11వ తేదీలోగా నామినేషన్లు వేసేందుకు ఆశావహులు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతా సజావుగా జరిగితే రెండో విడతకు 13వ తేదీ నుంచి 15వరకు నామినేషన్లు వేసేందుకు కూడా సర్వసన్నద్ధమయ్యారు. ఇదిలా ఉంటే మొదటి విడతలో 37 జెడ్పీటీసీ, 393 ఎంపీటీసీ స్థానాలకు గాను జెడ్పీటీసీలకు మూడు, ఎంపీటీసీలకు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబాబాద్, హసన్పర్తి, సంగెం జెడ్పీటీసీలకు ఒక్కో నామినేషన్ రాగా, మహబూబాబాద్ జిల్లాలో ఎంపీటీసీలకు ఐదు, వరంగల్ జిల్లాలో రెండు (సంగెం, గీసుకొండ), జేఎస్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం బాగిర్తిపేటలో ఒకటి, హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలో ఒకటి చొప్పున దాఖలైనట్లు అధికారులు తెలిపారు. కాగా, నోటిఫికేషన్ను రద్దు చేసిన కారణంగా ఇప్పటివరకు వేసిన నామినేషన్లు కూడా చెల్లుబాటు కావని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. డిసెంబర్ మొదటివారం తర్వాతే... ఆశావహులు అప్పటివరకు ఆగాల్సిందే నోటిఫికేషన్ విడుదలైన రెండున్నర గంటలకు న్యాయస్థానం తీర్పు.. ఉమ్మడి వరంగల్లో జెడ్పీటీసీకి 3, ఎంపీటీసీలకు 9 నామినేషన్లు -
మొదటి విడతకు రెడీ
జనగామ: స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు గురువారానికి వాయిదా వేయగా, ఎలక్షన్ కమిషన్ మాత్రం నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి పనులు చక్క బెడుతోంది. ఇందుకు సంబంధించి బుధవారం రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి కలెక్టర్లతో ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుమిదిని వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్లతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా వీసీలో పాల్గొన్నారు. గురువారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ తర్వాత నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని వీసీలో ఆమె ఆదేశించారు. మొదటి విడతలో 70 ఎంపీటీసీలు, ఆరు జెడ్పీటీసీలు జిల్లాలో మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించి 6 మండలాల పరిధిలో 70 ఎంపీటీసీలు, 6 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి జెడ్పీటీసీ ఆర్ఓలు 15(అదనపు కలుపుకుని), ఎంపీటీసీ ఆర్ఓలు 55 ఆధ్వర్యంలో ఇతర సిబ్బందితో కలిసి నామినేషన్లను స్వీకరిస్తారు. దేవరుప్పుల 12 ఎంపీటీసీలు, పాలకుర్తి 17, కొడకండ్ల 9, లింగాలఘనపురం 11, చిల్పూర్ 12, స్టేషన్ఘన్పూర్ 9 స్థానాలకు పోలింగ్ నిర్వహణకు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి 417 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తు న్నారు. 2.12లక్షల మంది ఓటర్లు ఆరు మండలాల పరిధిలో మొదటి విడతలో జరిగే ఎన్నికల్లో 2, 12, 117 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,04,974 పురుష ఓటర్లు, 1,07,139 మహిళా ఓటర్లు, ఇతరులు 4 ఉన్నారు. పకడ్బందీగా నామినేషన్ల ప్రక్రియ, ఎలక్షన్లు :సమీక్షలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా జిల్లాలో మొదటి విడత ప్రారంభమయ్యే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలకు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రిజర్వేషన్ల కేటాయింపులకు అనుగుణంగా నోటీసు ఇవ్వడంతో పాటు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారి, ఎంపీడీఓ పత్రాలను పక్కాగా చెక్ చేసుకోవాలన్నారు. ఇందులో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమన్నారు. తహసీల్దార్లు రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీఓలకు సహకారం అందించాలన్నారు. కాగా ఎంపీడీవో కార్యాలయంలో ఓటర్ జాబితాను ప్రదర్శించాలని ఆదేశించారు. రోజువారీగా వచ్చిన నామినేషన్ల సమాచారాన్ని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రదర్శించాలన్నారు. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని, సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించడంతో పాటు శిక్షణ కూడా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామపంచాయతీ ఎన్నికల నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాల పరిధిలో(మునిసిపల్ మినహా) మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందన్నారు. నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఇతరులకు ప్రవేశం లేదని, పోలీస్ శాఖ బందోబస్తు ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదుల కోసం హెల్ప్లైన్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని, 24 గంటలపాటు పని చేస్తుందన్నారు. ఫిర్యాదుల కోసం–93908 30087ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీసీలో జెడ్పీ సీఈఓ మాధురీ షా, జడ్పీ డిప్యూ టీ సీఈఓ సరిత, జిల్లా పంచాయతీ అధికారి స్వరూప, కలెక్టర్ కార్యాలయ ఏవో శ్రీకాంత్ తదితర అధికారులు పాల్గొన్నారు.మండలం ఆర్ఓ చిల్పూరు కె.అంబికాసోని కొడకండ్ల ఎన్. లక్ష్మినర్సింహారావు పాలకుర్తి కోదండరాములు స్టేషన్ఘన్పూర్ ఎన్.రాణాప్రతాప్ దేవరుప్పుల బి.శ్రీధర్రావుఆయా మండలాల పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ, 12న నామినేషన్ల పరిశీలన, అదే రోజు సాయంత్రం 5 గంటలకు చెల్లుబాటైన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 13వ తేదీన అప్పీళ్ల స్వీకరణ, 14న చివరి అప్పీళ్ల పరిష్కరణ, 15న అభ్యర్థుల ఉపసంహరణ, అదే రోజు సాయంత్రం 3 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్లు జాబితా వెలువరిస్తారు. 23వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మండలం ఎంపీటీసీలు పోలింగ్ పురుష మహిళ అదర్స్ మొత్తం స్టేషన్లు (ఓటర్లు) దేవరుప్పుల 12 68 18,610 18,723 – 37,333 పాలకుర్తి 17 106 26,189 26,675 1 52,865 కొడకండ్ల 09 61 14,202 14,468 2 28,672 లిం.ఘనపురం 11 64 16,323 17,033 – 33,356 చిల్పూరు 12 62 16,473 16,853 1 33,327 స్టే.ఘన్పూర్ 09 56 13,177 13,387 – 26,564 మొత్తం 70 417 1,04,974 1,07,139 4 2,12,117 జిల్లాలో ఆరు మండలాలు, ఆరు జెడ్పీటీసీలు, 70 ఎంపీటీసీలు ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్లు కలెక్టర్లతో వీసీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని కలెక్టరేట్లో ఫిర్యాదుల కోసం హెల్ప్ డెస్క్–93908 30087 -
రేపు హోమియో ఉచిత వైద్యశిబిరం
జనగామ రూరల్: ఈనెల 10వ తేదీన పట్టణంలోని ధర్మకంచలో ఉన్న యూపీహెచ్సీలో ఉదయం 10 గంటల నుంచి హోమియో ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా నోడల్ అధికారి డాక్టర్ మమత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని రామంతాపూర్ ప్రభుత్వ హోమియో కళాశాల ఆధ్వర్యంలో జిల్లాలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారని చెప్పారు. మోకాళ్ల నొప్పులు, నడుమునొప్పి, మధుమేహం, రక్తపోటు తదితర దీర్ఘకాలిక వ్యాధులకు మందులు అందజేస్తారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.శ్రీసోమేశ్వరాలయం హుండీ ఆదాయం రూ.26,27,977పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వరలక్ష్మీనర్సింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.26,27,977 సమకూరినట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు తెలిపారు. బుధవారం ఆలయ కల్యాణమండలంలో దేవాదాయ, ధర్మదాయ శాఖ భువనగిరి ఇన్స్పెక్టర్ ఎన్.నిఖిల్ పర్యవేక్షణలో హుండీ ఆదాయం లెక్కించారు. ఈ ఏడాది మార్చి 21 నుంచి బుధవారం వరకు హుండీలో భక్తులు సమర్పించిన 201 రోజుల కానుకల ఆదాయాన్ని లెక్కించారు. ఆమెరికా కరెన్సీ నోట్లు 32(317 డాలర్లు), ఉగాండా 1 (5000 సీలింగ్స్), ఇంగ్లాండ్ 1 (5 ఫౌండ్స్), కొరియా ఓన్ 1(1000), యూరోపియన్ 1(10) యూరోలు వచ్చినట్లు ఈఓ తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అలయ ప్రధాన అర్చకుడు దేవగిరి లక్ష్మన్న, సిబ్బంది, శ్రీసోమేశ్వర, రాజరాజేశ్వరి సేవా ట్రస్ట్ సభ్యులు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.లాయర్ కిషోర్దాస్పై కఠినచర్యలు తీసుకోవాలిజనగామ రూరల్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై దాడిచేసిన లాయర్ కిషోర్దాస్పై కఠిన చర్యలు తీసుకొని భారత రాజ్యాంగాన్ని కాపాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని నెహ్రూ పార్కు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, గిరిజనులు, మహిళలు, ఆదివాసులు, మేధావులు, ప్రతిపక్ష ప్రభుత్వాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. దేశంలో ప్రధాన న్యాయమూర్తికి కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో సుంచు విజేందర్, పుత్కనూరి ఉపేందర్, బోడ నరేందర్ , బోట్ల శ్రావణ్, కళ్యాణం లింగం, పాము శ్రీకాంత్, గడ్డం యాదగిరి, సౌందర్య, బైరగొని మల్లేశం తదితరులు పాల్గొన్నారుఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రోద్బలంతోనే..ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రోద్బలంతోనే చీఫ్ జస్టిస్ గవాయ్పై దాడి జరిగిందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల శేఖర్ ఆరోపించారు. బుధవారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో తుటి దేవదానం, బొట్ల శ్రావణ్కుమార్, పొన్నగంటి చిరంజీవి, గండి నాగరాజు పాల్గొన్నారు.పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో ఎంఓయూకేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో ఎంఓయూ చేసుకున్నట్లు బుధవారం ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి తెలిపారు. ఈ ఎంఓయూతో విద్యార్థులకు పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ద్వారా ఇంటర్న్షిప్ పొందే అవకాశం ఏర్పడిందన్నారు. భారత ప్రభుత్వంతో ఆమోదించబడిన ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ హనుమకొండ బ్రాంచ్ ద్వారా ఈట్రైనింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్న్షిప్ సర్టిఫికెట్లు కూడా అందజేస్తారని జ్యోతి వెల్లడించారు. కార్యక్రమంలో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ హనుమకొండ డీహెచ్ఎస్డీ ప్రమోద్ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అధికారి డాక్టర్ ఎల్.జితేందర్, వైస్ ప్రిన్సిపాల్ ఎన్ఎం రెహమాన్, ఫిజిక్స్ విభాగం ఇన్చార్జ్ డాక్టర్ వరలక్ష్మి, అధ్యాపకులు డాక్టర్ ఎ.సరిత, డాక్టర్ బి.సరిత, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ గిరి తదితరులు పాల్గొన్నారు. -
మహాజాతరకు.. 112 రోజులే
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు ఇంకా 112 రోజులే సమయం మిగి లి ఉంది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వర కు మహాజాతర జరగనుంది. వనదేవతల గద్దెల ప్రాంగణం విస్తరించేందుకు అధికార యంత్రాంగం పనుల్లో నిమగ్నమైంది. సీఎం రేవంత్రెడ్డి మేడారంలో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం, అభివృద్ధి పనులకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను ఇటీవల ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అప్ప టి నుంచి మంత్రి సీతక్క ఆలయ ప్రాంగణం సాలహారం (ప్రహరీ)పనులపై దృష్టి సారించారు. వంద రోజులే లక్ష్యంగా.. మేడారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను వంద రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అఽధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. ఆలయ గద్దెల చుట్టూ సాలహారం నిర్మాణ పనులను మాస్టర్ ప్లాన్ డిజైన్ ప్రకారం రాతితో నిర్మించేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. కాగా వేలాది మంది కార్మికులను ఏర్పాటు చేసి రాత్రి, పగలు పనులు చేయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గద్దెల ప్రాంగణ విస్తీర్ణ పనులపై మంత్రి సీతక్క ఎప్పటికప్పడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. సాలహారం నిర్మాణానికి మార్కింగ్ సాలహారం(ప్రహరీ) పనులకు అమ్మవార్ల గద్దెల ప్రాంగణం చుట్టూ ఇంజనీరింగ్ అధికారులు మా ర్కింగ్ చేశారు. సారలమ్మ ఆర్చి ఎగ్జిట్ గేట్ ప్రహరీ నిర్మాణానికి బయట స్థలాన్ని చదును చేశారు. ప్రహరీ నిర్మాణంతో పాటు మీడియా వాచ్ టవర్ల నిర్మాణానికి కూడా మార్కింగ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ దివాకర, రోడ్లు, భవనాలశాఖ ఇంజనీరింగ్ శాఖ ఇన్చీఫ్ మోహన్నాయక్, ఎండోమెంట్ ఎస్ఈ ఓంప్రకాశ్, ఆర్కిటెక్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మేడారం గద్దెల ప్రాంగణంలో చేపట్టనున్న పనులను పరిశీలించారు. ప్రహరీ పనుల మార్కింగ్ను కలెక్టర్ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు చేపట్టాల్సిన పనులపై సూచనలు చేశారు. సాలహారంతో పాటు ఎనిమిది ఆర్చి ద్వారాల నిర్మాణాలతో పాటు అదనంగా మరో ఆర్చి ద్వారం నిర్మాణంపై ఇంజనీరింగ్ అధికారులు డిజైన్ మ్యాప్లను చూపిస్తూ పనుల వివరాలను కలెక్టర్కు వివరించారు. ఈ పనుల్లో ఎక్కడ కూడా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల్లో తేడా రాకుండా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. పనుల్లో అధికారులు నిమగ్నం -
సర్దుబాటుకు బ్రేక్!
● ఎన్నికల కోడ్కు ఎలా ముడిపెడుతారంటున్న ఉపాధ్యాయ సంఘాలు ● గాలిలో దీపంలా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ● విద్యాశాఖ అధికారుల తప్పిదాలతోనే కాలయాపన? ● బోధించేవారు లేక విద్యార్థులకు తీరని నష్టంజనగామ: జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ మరోసారి వివాదాస్పదంగా మారుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో టీచర్ల సర్దుబాటుకు ముడిపెడుతున్నారనే ప్రచారం వినిపిస్తోంది. సర్దుబాటు కోడ్ కిందకు వస్తుందా? అంటూ ఓ ఉన్నతాధికారి అనడంలో ఆంతర్యమేంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖ అధికారులు సైలెంట్గా వ్యవహరిస్తుండడంతో ఉపాధ్యాయ వర్గాల్లో అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పక్కనబెట్టి, కాలయాపన చేస్తున్నారని పలు ఉపాధ్యాయసంఘాలు మండిపడుతున్నాయి. మొదటి విడత సర్దుబాటులో ఎంఈఓలు పలు తప్పిదాలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తగా, ఆ తప్పిదాలను సరిదిద్దడమే రెండో విడతలో ముఖ్య మని భావించారు. అయితే తాజాగా నిర్వహించిన రెండో విడత సర్దుబాటులో కూడా అదే పద్ధతి కొనసాగిందంటూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లా విద్యాశాఖలో ఐఏఎస్ అధికారి డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా గందరగోళ పరిస్థితులపై ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నూతన డీఈఓ రాకతో పారదర్శకత వస్తుందని భావించినప్పటికీ, సిబ్బంది అనుమతులు, బదిలీలు, సర్దుబాట్లలో జాప్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల లీకైన అధికారుల నివేదిక ప్రకారం జిల్లాలో 94 మంది టీచర్లను సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో 70 మంది ఎస్జీటీలు, 20 మంది స్కూల్ అసిస్టెంట్లు, నలుగురు లాంగ్వేజ్ పండిట్లు ఉన్నారు. ఈ ఎంపికల్లో కూడా అక్కడక్కడా లోపాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఇటీవల ఓ ఉపాధ్యాయ సంఘం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మొదటి విడతలో అనేక ఆరో పణలు ఎదుర్కొన్నప్పటికీ, మళ్లీ అదే పునరావృతం కావడంతోనే డీఈఓ సర్దుబాటుకు వెనకాడుతున్నారని సమాచారం. జిల్లాలో ఎంఈఓలు ఎవరి కంట్రోల్లో పనిచేస్తున్నారని పలువురు టీచర్లు బాహాటంగానే మాట్లాడుకోవడం కనిపిస్తోంది. మరోవైపు ఎంఈఓల పరిస్థితి కూడా క్లిష్టంగా ఉందని చెబుతున్నారు. విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకోకుండా, టీచర్ల సర్దుబాటు చేసేందుకు పలువురు ఎంఈఓలు వెనకాడడం లేదనే ఆరోపణలు విద్యాశాఖ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలోని కొడకండ్ల ఎంఈఓ ఓ విచారణ ఎదుర్కొంటుండగా, బచ్చన్నపేట మండలంలోని నక్కవానిగూడెం పీఎస్లో టీచర్ల నియామకం విషయంలో అక్కడి అధికారి నిర్లక్ష్యం విద్యారుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేసినట్లు చెబుతున్నారు. జిల్లా విద్యాశాఖ ఈ అంశంపై స్పష్టమైన వివరణ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక స్పందన లేదు. ఉపాధ్యాయుల సర్దుబాటుపై జరుగుతున్న ఈ అనిశ్చితి, గందరగోళం విద్యారంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
పోలీస్స్టేషన్కు వెళ్తే న్యాయం
పాలకుర్తి టౌన్: పోలీస్ సేష్టన్కు వెళ్తే న్యాయం జరుగుతుందని ప్రజలకు నమ్మకం కలిగేలా అధికారుల చర్యలు ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ చెప్పారు. పాలకుర్తి పోలీస్స్టేషన్ను బుధవారం సీపీ వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించి సిబ్బందికి సూచనలిచ్చారు. పోలీసు సిబ్బంది చేసిన పరేడ్తో పాటు కిట్ ఆర్టికల్ తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. రౌ డీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, మత్తు పదారథాలు, సైబర్ నేరాలపై ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఆర్బీఎఫ్, హెబ్సిబా బాధితులు ఫిర్యాదు చేయండి పాలకుర్తి ప్రాంతంలో ఆర్బీఎఫ్, హెబ్సిబా చైన్ సిస్టంలో డబ్బులు పెట్టి మోసపోయిన బాధితులు పోలీస్సేష్టన్లో ఫిర్యాదు చేయాలని సీపీ సన్ప్రీత్సింగ్ సూచించారు. ఆర్బీఎఫ్, హెబ్సిబాపై నమోదైన కేసు ముగిసిపోలేదని, దర్యాపు కొనసాగుతోందని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. నిందితులకు సహకరించిన ఏజెంట్లను వదిలే ప్రసక్తే లేదన్నారు. న్యాయం చేయాలని బైఠాయింపు మండలంలోని మంచుప్పుల గ్రామానికి చెందిన కాకర్ల రమేశ్ అనే వ్యక్తి తనను రెండేళ్ల క్రితం కులం నుంచి బహిష్కరించారని, అందుకు కారకులపై చర్యలు తీసుకోవాలని సీపీ సన్ప్రీత్సింగ్కు ఫిర్యా దు చేశారు. అదే విధంగా తొర్రూరు గ్రామానికి చెందిన గుర్రం వెంకటమ్మ అనే మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ప్రహరీ నిర్మిస్తుండగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అన్యాయంగా కూల్చారని, తనకు న్యాయం చేయాలని వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్యకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు పోలీస్సేష్టన్ ఎదుట మంచుప్పుల, తొర్రూరు గ్రామాలకు చెందిన బాధితులు కొద్దిసేపు సీపీ సన్ప్రీత్సింగ్ తమకు న్యాయం చేయాలని బైఠాయించారు. సీఐ జానకిరాంరెడ్డి జోక్యం చేసుకొని బాధితులకు న్యాయం చేస్తామని సర్దిచెప్పారు. ఆ దిశగా ప్రజలకు నమ్మకం కలిగించాలి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి పాలకుర్తి పీఎస్లో సీపీ సన్ప్రీత్సింగ్ వార్షిక తనిఖీ -
శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు
రేపటినుంచి వేల్పుగొండ జఫర్గఢ్: మండలకేంద్రంలో వేల్పుగొండ కొండపై వెలిసిన శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 10 నుంచి జరగనున్నాయి. కొండ దిగువన ఉన్న శ్రీలక్ష్మీనర్సింహ సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలిరానున్నారు. స్వామివారిని కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా భక్తులు కొలుస్తుంటారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు పొడిశేటి వెంకటాచార్యులు మాట్లాడుతూ..ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు పేర్కొన్నారు. 10వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రత్యేక పూజ కార్యక్రమాలతో ప్రారంభమవుతాయన్నారు. 11న శ్రీలక్ష్మీనర్సింహా సుదర్శన హోమం, పూర్ణాహుతి, అరగింపు, తీర్థగోష్టి, 12న శ్రీలక్ష్మీనర్సింహస్వామి కల్యాణమహోత్సవం, 13న స్వామివారి చక్రస్నానం, పల్లకీసేవ, సాయంత్రం సమయంలో పుష్పయాగం తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నాలుగు రోజులపాటు వైభవంగా జరగనున్న బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
విద్యుత్చౌర్యం, మొండిబకాయిలపై ప్రత్యేక నిఘా
స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ చౌర్యం, మొండిబకాయిలపై ప్రత్యేక నిఘాతో పనిచేస్తున్నట్లు విద్యుత్శాఖ స్టేషన్ఘన్పూర్ టౌన్ ఏఈ శంకర్ తెలిపారు. ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో విజిలెన్స్ ఆధ్యర్యంలో విద్యుత్శాఖ అధికారులు బుధవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ.. పట్టణ పరిధిలో రూ.1.50 లక్షలు విద్యుత్ బకాయిలు వసూలు అయ్యాయన్నారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్శాఖ సిబ్బందితో సహకరించాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో లైన్మన్ వాసం శ్రీధర్పటేల్, విజిలెన్స్ కానిస్టేబుల్స్ సతీశ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్కో ఘన్పూర్ ఏఈ శంకర్ -
త్వరగా పూర్తి చేయాలి
టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏర్పడిన ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాబ ట్టి ఇప్పుడు తాత్కాలిక ఉపశమనంగా టీచర్ల సర్దుబాటు ప్రక్రియ చేపట్టడం ద్వారా విద్యార్థులకు అందుబాటులో ఉపాధ్యాయులు వస్తారు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో ఉపాద్యాయ సర్దుబాటు ప్రక్రియ చేపట్టడం ద్వారా విద్యార్థుల సంఖ్యను తగ్గకుండా చూడొచ్చు. జిల్లా విద్యాశాఖ త్వరగా టీచర్ల సర్దుబాటు ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలి. – రావుల రామ్మోహన్రెడ్డి, టీచర్, జనగామ●ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ఆలస్యంతో పిల్లల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో విద్యాభ్యాసన ప్రక్రియ కుంటుపడిపోతోంది. ఒక మండలంలో ఉపాధ్యాయులు అదనంగా ఉన్నప్పటికీ వారిని కాదని పక్క మండలం నుంచి సర్దుబాటు చేయడం సరైనది కాదు. దూర ప్రాంత మండలాల నుంచి పట్టణ సమీప మండలాలకు సర్దుబాటు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఉపాధ్యాయులు అదనంగా లేని పాఠశాల నుంచి సర్దుబాటు పేరుతో పట్టణ సమీప ప్రాంతానికి డిప్యూటేషన్ ఇవ్వరాదు. – డి.శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీపీటీఎఫ్ -
హోటళ్లలో ‘ఫుడ్సేఫ్టీ’ తనిఖీలు
జనగామ: జిల్లా కేంద్రంలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు బుధవారం ఫుడ్సేఫ్టీ, మునిసిపల్ అధికారులు సంయుక్తంగా హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటళ్లలో తిననుబండారాల తయారీ, భద్రత తదితర అంశాలకు సంబంధించి పరిశీలించారు. ఆహార పరిశుభ్రతపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి వినీల్ కుమార్ హెచ్చరించారు. నిర్వహణ సిబ్బందికి క్యాప్స్, డ్రెస్ కోడ్తో పాటు చేతులకు గ్లౌజులు తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. 8 ఫాస్ట్ఫుడ్ సెంటర్లకు రూ.13వేల జరిమానా విధించినట్లు తెలిపారు. తనిఖీల్లో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ పులి శేఖర్, శానిటరీ జవాన్లు, సిబ్బంది ఉన్నారు. 8 ఫాస్ట్ఫుడ్ సెంటర్లకు రూ.13వేల జరిమానా -
కండిషన్ వాహనాలనే వాడాలి
● అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ జనగామ రూరల్: మున్సిపాలిటీలో చెత్త సేకరణకు కండిషన్లో ఉన్న వాహనాలనే వినియోగించాలని అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ సూచించారు. మంగళవారం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ సందర్శించి పారిశుద్ధ్య వాహనాల పనితీరును పరిశీలించారు. వాహనాల కండిషన్ ఎలా ఉంది? వాటి నిర్వహణకు చేస్తున్న ఖర్చును అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో ప్రస్తుతం 22 వాహనాలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని మరో 3 ట్రాక్టర్లు, 5 ఆటో ట్రాలీలు ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించకలుగుతామని, మున్సిపల్ కమిషనర్ అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం పనిచేస్తున్న వాహనాల కండిషన్పై ముందుగా నివేదిక ఇవ్వాలని అదనపు కలెక్టర్ రవాణా శాఖ అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, ఆర్టీఓ శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
మునపటి జోరుంటుందా?
జనగామ: దసరా పండుగ ముగియడంతో జిల్లాలో మద్యం టెండర్ల హడావిడి మొదలైంది. జిల్లాలో మొత్తం 50 రిటైల్ లిక్కర్ షాపులకు 2025–27 రెండేళ్లకుగానూ గత నెల 26వ తేదీన నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. సద్దుల బతుకమ్మ, దసరా పండగ నేపథ్యంలో ఆశించిన మేర టెండర్లు రాలేదు. పండుగ సందడి ముగిసిపోవడంతో టెండర్దారుల్లో కదలిక వచ్చింది. జిల్లాలోని మూడు ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధిలో ఇప్పటి వరకు 8 టెండర్లు రాగా, బుధవారం నుంచి దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈసారి దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంచడంతో రియల్టర్లు, వ్యాపారులతో పాటు కొత్త వ్యక్తులు ముందుకొస్తారా లేదా మునపటి జోరు ఉంటుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది. రిజర్వేషన్లు కలిసి రాకుంటే స్థానిక బీసీ రిజర్వేషన్లపై బుధవారం వెలువడనున్న హైకోర్టు తీర్పు మద్యం టెండర్లపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రిజర్వేషన్లు తారుమారైతే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లు ఆశించిన నాయకుల్లో పలువురు మద్యం టెండర్ల వైపు వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఎకై ్సజ్ శాఖకు ఊరట కలిగించే అంశంగా భావిస్తున్నారు. టెండర్లకు దూరంగా రియల్టర్లు,వ్యాపారులు? గతంలో జిల్లాలో సుమారు తొమ్మిది టీములు ఏర్పడి పెద్దఎత్తున టెండర్లు వేసిన విషయం తెలిసిందే. అప్పుడు ఈ గ్రూపులు దాదాపు 1400ల వరకు దరఖాస్తులు సమర్పించగా, ఈసారి సగం తగ్గించే యోచనలో ఉన్నాయని తెలుస్తోంది. భారీ ఖర్చు, టెండరు ఫీజు రూ.3లక్షలకు పెంచడం కారణంగా మునుపటి టెండర్ దారుల్లో మెజార్టీగా ఈసారి దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఎకై ్సజ్ శాఖ దరఖాస్తుల సంఖ్య పెంచాలన్న ఉద్దేశంతో వ్యూహాలకు పదును పెడుతోంది. పాత, కొత్త టెండర్ దారులకు మద్యం సేల్ విధానం, లైసెన్స్ నిబంధనలు, లాభ నష్టాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. మద్యం షాపులపై ఆసక్తి ఉన్నవారు ఆర్థిక సన్నద్ధతతోపాటు చట్టపరమైన అవగాహన కూడా పెంచుకోవాలని ఈ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 2023–2025 రెండేళ్లకు గాను జిల్లాలోని 47 వైన్స్లకు 2,356 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.47.12కోట్ల మేర ఆదాయం(నాన్ రిఫండబుల్) వచ్చింది. ఈ సారి 3 షాపులు పెరగడంతో మద్యం దుకాణాలు 50కి చేరాయి. జిల్లాలో 8 టెండర్లు దాఖలు వచ్చే రెండేళ్ల మద్యం అమ్మకాల కోసం ఎకై ్సజ్ శాఖ గత నెల 26న టెండర్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 18వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. చివరి గడువు దగ్గర పడుతుండడంతో టెండర్దారులు పెద్దఎత్తున డబ్బులు సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. శుభ ముహూర్తం చూసుకుని తమ ఇష్టదైవమైన దేవుళ్లను పూజించి టెండర్ వేసేందుకు పాత, కొత్త వ్యక్తులు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడంతో కోట్లాది రూపాయలు భూములపై ఉండిపోయాయి. దీంతో మునుపటి జోరు ఉంటుందా లేదా అనే సందేహాలు సైతం వినిపిస్తున్నాయి. టెండర్లు పెరగకపోయినా.. గతంలో వచ్చిన సంఖ్య తగ్గకూడదనే సంకల్పంతో ఎకై ్సజ్ శాఖ ముందుకెళ్తోంది. ఇప్పటివరకు 12 రోజుల వ్యవధిలో 8 మంది మాత్రమే టెండర్లు వేశారు. ఇందులో జనగామలో–1, పాలకుర్తి–4,, స్టేషన్ఘన్పూర్ సర్కిల్ పరిధిలో మరో–3 వచ్చాయి. టెండరు దరఖాస్తులు వేసేది ఇక్కడే రిటైల్ లిక్కర్ షాపుల లైసెన్సులు డిసెంబర్ 1, 2025 నుంచి 2027 నవంబర్ 30 వరకు అమల్లో ఉండనున్నాయి. 21 సంవత్సరాలు నిండిన ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి దరఖాస్తుకు రూ.3లక్షలు నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఈ మొత్తం డీపీఈవో, జనగామ, సీపీఈ తెలంగాణ పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపారులు దరఖాస్తులను జిల్లా కేంద్రం వడ్లకొండ రోడ్డు ఇరిగేషన్ క్వార్టర్స్లోని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి కార్యాలయంలో సమర్పించాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని ఏ దుకాణానికి అయినా దరఖాస్తు చేసుకోవాలనుకునే వ్యాపారులు తమ దరఖాస్తులను ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, కమిషనర్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో కూడా ఇవ్వొచ్చని తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తుల సమర్పించాలని, మరిన్ని వివరాల కోసం https://tgbcl.telangana.gov.in/ts/index.php/site/login లో చూసుకోవచ్చన్నారు. -
బలమున్న చోట బరి గీసి..!
● ‘స్థానిక’ ఎన్నికల్లో పొత్తులు.. కాంగ్రెస్తో ‘కామ్రేడ్’లు ముందుకు ● నాలుగు జెడ్పీటీసీ స్థానాలపై గురి... ఎంపీటీసీ, సర్పంచ్లకూ పోటీసాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు కామ్రేడ్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బలమున్న చోట పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనలు చేశారు. ఉమ్మడి వరంగల్లో ఆరు జెడ్పీటీసీ స్థానాల పేర్లను సూచించిన సీపీఐ నేతలు అందులో నాలుగు తప్పకుండా ఇవ్వాలన్న డిమాండ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుపెట్టారు. ఈ మేరకు సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సహాయ కార్యదర్శి తక్కెళ్లపెల్లి శ్రీనివాస్రావు తదితరులు టీపీసీపీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డిలతో మంగళవారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లోనూ పొత్తులతో ముందుకు సాగాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రాష్ట్ర వ్యాప్తంగా తమకు బలమున్న చోట పోటీ చేస్తామని సీపీఐ నేతలు చెప్పినప్పటికీ.. ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్లో జెడ్పీటీసీ సీట్ల కేటాయింపుపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి (ఎస్సీ–జనరల్), వరంగల్లో నల్లబెల్లి (బీసీ–జనరల్)లను ఇవ్వాలని సీపీఐ ప్రతినిధుల బృందం కాంగ్రెస్ నేతలకు ప్రతిపాదించింది. మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ (బీసీ–జనరల్), నెల్లికుదురు (బీసీ–జనరల్)లలో ఏదేని ఒకటి, జనగామ జిల్లాలో రఘునాథపల్లి (బీసీ–మహిళ), జఫర్గఢ్ (బీసీ–జనరల్)లలో ఒకచోట జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఇక ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల విషయంలో సీపీఐ పార్టీకి బలమున్న చోట స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుని అభ్యర్థులను సూచిస్తామని కాంగ్రెస్ నేతలతో స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా బుధవారం ఉమ్మడి వరంగల్కు చెందిన సీపీఎం పార్టీ నేతలు కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, వేంనరేందర్ రెడ్డిలను పొత్తుల విషయంలో కలవనున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. -
క్రైస్తవ మైనారిటీల సంక్షేమానికి కృషి
పాలకుర్తి టౌన్: క్రైస్తవ మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని చర్చిలో నేషనల్ కౌన్సిల్ క్రిస్టియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాస్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్రిస్టియన్లు రాజకీయంగా, సామాజికంగా ప్రగతి సాధించాలన్నదే ప్రభుత్వం ఆకాంక్ష అన్నారు. నిరుపేద పాస్టర్లకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తామన్నారు. కులం సర్టి ఫికెట్ల జారీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. సమావేశంలో నేషనల్ కౌన్సిల్ క్రిస్టియన్ రాష్ట కార్యదర్శి అనంతోజు రక్షిత, బక్క ఏలియా, ఈవీ థామస్, ఎన్సీసీ జనగామ జిల్లా మహిళ అధ్యక్షురాలు డాక్టర్ ప్రీతిదయాల్ తదితరులు పాల్గొన్నారు.బెస్ట్ అవైలబుల్ ఫీజులు చెల్లించండిజనగామ రూరల్: బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు బింగి రమేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడేళ్లుగా నిధులు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టణంలోని శ్రీ అరబిందో హైస్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి నెలకొందని, తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నరసింహ, పరశురాములు, యుగంధర్, వేణుభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.ముత్తిరెడ్డికి పరామర్శజనగామ: జనగామ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సోదరుడు ముత్తిరెడ్డి కృష్ణారెడ్డి మృతి చెందగా, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మంగళవారం ఆయనను పరామర్శించారు. అంతకుముందు కృష్ణారెడ్డి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కలిసి కృష్ణారెడ్డి పాడే మోశారు.ఎప్సెట్ కౌన్సెలింగ్ షురూరామన్నపేట: బీఫార్మసీ, ఫార్మ్డీ, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎప్సెట్ (బైపీసీ) కౌన్సెలింగ్ మంగళవారం వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైనట్లు టీజీ ఎప్సెట్ అడ్మిషన్స్ హెల్ప్లైన్ సెంటర్ కోఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ తెలిపారు. విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని, నిర్దిష్ట సమయానికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకావాలని సూచించారు. తొలిరోజు (మంగళవారం) 313 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం నమోదు చేసుకున్నారని, ఈనెల 9వ తేదీ వరకు ఉంటుందని వివరించారు. అనంతరం ఆప్షన్ ఫ్రీజింగ్, సీట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు http:// tgeapcetb.nic.in వెబ్సైట్ సందర్శించాలని ఆయన కోరారు.పీఓహెచ్ ఏర్పాటుకు నిధులు మంజూరుమహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో వందేభారత్ రైలు మెగా మెయింటనెన్స్ పీఓహెచ్, ఆర్ఓహెచ్ ఫ్రైట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వేశాఖ రూ.908కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి
● డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్రావు రఘునాథపల్లి: గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్రావు మండల వైద్యులు, సిబ్బందికి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆశా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.. గ్రామాల్లో గర్భిణుల (ఏఎన్సీఎస్) సర్వే నిర్వహించి వారికి అవసరమైన సేవలను మెరుగుపరిచి, నిర్దేశిత లక్ష్యాలను సాధించాలన్నారు. గర్భిణులకు యోగా సాధనలపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యవంతమైన గర్భధారణతో పాటు సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ పోగ్రామ్ అధికారి డాక్టర్ కమలహాసన్, వైద్యాధికారి డాక్టర్ స్రవంతి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మల్లికార్జున్, రాంకిషన్, హెచ్ఈఓ ప్రభాకర్, విష్ణువర్ధన్రెడ్డి, ఏఎన్ఎలు, ఆశాలు పాల్గొన్నారు. -
యువవికాసం ఇంకెప్పుడు?
జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువవికాసం దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. నెల రోజుల్లో రుణాలు ఇస్తామని దరఖాస్తులు స్వీకరించి, మండలస్థాయిలో కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ దిశగా అడుగులు వేయలేదని యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నుంచి 29,367 మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వివిధ యూనిట్లకు వేల సంఖ్యలో దరఖాస్తులు రాగా.. అధిక విలువ కలిగిన యూనిట్లతో మెరుగైన స్వయం ఉపాధి పొందవచ్చన్న ఉద్దేశంతో ఎక్కువ మంది కేటగిరీ–4 రుణాలకే మొగ్గుచూపారు.ఆర్బీఐ నిబంధనలుగతంలో పేదలకు ఆయా పథకాల కింద రుణాలు అందించేవారు. అవసరమైతే సబ్సిడీకి మించి రుణాలు తీసుకుంటే ష్యూరిటీ కింద సంతకాలు తీసుకునేవారే తప్ప పెద్దగా బ్యాంకర్లు ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. ప్రస్తుతం మారిన ఆర్బీఐ నిబంధనల ప్రకారం సిబిల్ స్కోర్ ఉంటేనే రుణానికి అర్హత సాధిస్తారు.ప్రభుత్వ నిర్ణయంపైనే ఆశలుస్వయం ఉపాధి ద్వారా నిరుద్యోగులు ఆర్థిక స్వావలంబన పొందేందుకు రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రవేశపెట్టి రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే నెలలు గడుస్తున్న పథకం అమలుపై స్పష్టత కరువైంది. ప్రభుత్వం ఇచ్చే రుణాలతో కుటుంబానికి బాసటగా నిలవడంతో పాటు ఆర్థికంగా ఎదగాలనే గ్రామీణ ప్రాంత యువతకు నిరాశే నిగిలింది. స్థానిక ఎన్నికలు సమీపించడంతో యువవికాసం పథకం అమలుపై సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా సిబిల్ స్కోరును మినహాయిస్తేనే గ్రామీణ ప్రాంతంలోని ఎక్కువ మంది నిరుద్యోగులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.కేటగిరీ దరఖాస్తులు యూనిట్లుఎస్సీ 8,779 3,500ఎస్టీ 3,787 1,809బీసీ 15,425 2,714ఈబీసీ 447 511ముస్లింలు 981 186క్రిస్టియన్లు 48 57షరతులు లేకుండా అందించాలిగ్రామాల్లో ఆర్థిక పరిస్థితి సరిగా లేక యువత ఇబ్బందులు పడుతోంది. ఎలాంటి షరతులు లేకుండా నేరుగా రుణాలు మంజూరు చేయాలి. ప్రభుత్వం నిబంధనలు సడలించి వీలైనంత తొందరగా రుణాలు అందించాలి.–శానబోయిన మహిపాల్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడుయువతను ఆదుకోవాలిరాజీవ్ యువవికాసం పథకం రుణాలను త్వరితగతిన అందించి యువతను ఆదుకోవాలి. అటు ఉపాధి లేక కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోవాలి. సిబిల్ స్కోర్, పాన్కార్డుతో సంబంధం లేకుండా ఇవ్వాలి. అర్హులైన అందరికీ అందించాలి.–యాసారపు కర్నాకర్, చౌడారం గ్రామం -
10నుంచి ధాన్యం కొనుగోళ్లు
● అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్జనగామ రూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని, ఈనెల 10వ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ ఆదేశించారు. వానాకాలం పంట కొనుగోలుకు సంబంధించి డీఆర్డీఓ, డీసీఓ డీపీఎం, డీటీలు, జిల్లా, మండల, గ్రామస్థాయి సెర్ప్ సిబ్బంది, కొనుగోలు కేంద్రాల కమిటీ సభ్యులతో మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫెరెన్స్ హల్లో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కేంద్రంలో కొనుగోలుకు సంబంధించిన రిజిస్టర్లు, ప్యాడి క్లీనర్లు, వేయింగ్ యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. -
మద్యం తాగి వాహనాలు నడపొద్దు
● ఏసీపీ పండేరి చేతన్ నితిన్ బచ్చన్నపేట: మద్యం తాగి వాహనాలు నడుపరాదని, మైనర్లకు వాహనాలను ఇస్తే అందుకు తల్లిదండ్రులదే బాధ్యత అని జనగామ ఏసీపీ పండేరి చేతన్ నితిన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో వాహనాల తనిఖీ, డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాహనాల్లో రూ. 50వేలకు మించి నగదు తీసుకెళ్లరాదని, ఒకవేళ తీసుకెళ్తున్నా సంబంధిత రశీదులను వెంట ఉంచుకోవాలన్నారు. నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
పక్కా ప్రణాళికతో ధాన్యం కొనుగోళ్లు
● జిల్లాలో 309 కేంద్రాలు ● అధికారులతో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సమీక్షజనగామ రూరల్: గత రెండు సీజన్లలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు జరిగిందని..ఈసారి కూడా పక్కా ప్రణాళికతో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వానా కాలం పంట కొనుగోలుపై ఆర్డీఓ, సివిల్ సప్ప్లై, డీఆర్డీఓ, మార్కెటింగ్, మార్క్ఫెడ్, జిల్లా, మండల, గ్రామ స్థాయి వ్యవసాయశాఖ అధికారులు, ఆర్టీఓ, గన్ని గోదాం ఇన్చార్జ్ లు, రైస్ మిల్లర్ల అసోసియేషన్తో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2025–26 ఖరీఫ్కు సంబంధించి జిల్లాలో 2,13,978 ఎకరాల్లో వరి పంటసాగు అయ్యిందని 5,43,057 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా కాగా 2,05,057 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు వస్తుందని అంచనా వేసి అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామన్నారు. సన్నరకం మద్దతు ధర రూ.2389లు కాగా, బోనస్ క్వింటాల్కు రూ.500 చెల్లించడం జరుగుతుందన్నారు. అలాగే దొడ్డు రకానికి రూ.2369ల మద్దతు ధర ఉందన్నారు. దొడ్డురకం ధాన్యం కొనుగోలు కోసం ఐకేపీ 116, పీఏసీఎఎస్ 82 కేంద్రాలను, అలాగే సన్నరకం ఽకొనుగోలుకు 69 ఐకేపీ, 42 పీఏసీఎస్ సెంటర్ లను మొత్తం 309 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నమన్నారు. కోడ్ పక్కాగా అమలుకావాలి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మాడల్ కోడ్ పక్కాగా అమలయ్యేలా అధికారులు విధులను నిర్వహించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సూచించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి పోలీస్, రెవెన్యూ, ఎంపీడీఓ మొదలగు శాఖలకు చెందిన జిల్లా, మండల స్థాయి అధికారులతో తన క్యాంపు కార్యాలయం నుంచి గూగుల్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..క్రిటికల్, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను మరొకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి..రేపటిలోగా నివేదిక ఇవ్వాలన్నారు. స.హ.చట్టంపై అవగాహన అవసరం సమాచార హక్కు చట్టంపై విస్తృత అవగాహన అవసరమని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాచార హక్కు వారోత్సవాలను జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో ఈ నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.ఏఎంసీలో రెండు ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయండి జనగామ: వానాకాలం సీజన్లో ధాన్యం అమ్ముకునేందుకు రైతులకు వెసులుబాటు కల్పించే విధంగా జనగామ వ్యవసాయ మార్కెట్ పరిధిలో చీటకోడూరు, శామీర్పేటకు చెందిన ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్తో కలిసి ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాను సోమవారం కోరారు. అనంతరం శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ.. మార్కెట్లో రెండు సెంటర్లు ప్రారంభించిన సమయంలో తాము నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతీ రైతుకు సేవ చేస్తామన్నారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు. ఆయన వెంట డీఆర్డీవో పీడీ వసంత, ఏఎంసీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీవన్ కుమార్, సూపర్వైజర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
అధికారులు బాధ్యతగా పనిచేయాలి
● అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ స్టేషన్ఘన్పూర్: మున్సిపల్, మండల పరిషత్ అధికారులు బాధ్యతగా పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులు, సిబ్బందితో మాట్లాడుతూ.. సమన్వయంతో పనిచేయాలని, ప్రధానంగా పారిశుద్ధ్యం, డ్రైనేజీల విషయమై శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయశ్రీ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కలాం ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానం
లింగాలఘణపురం: మండలంలోని మోడల్ స్కూల్కు చెందిన 8మంది బాసర ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థులను సోమవారం పాఠశాల ప్రిన్సిపాల్ సునిత అబ్దుల్ కలామ్ ఎక్స్లెన్స్ అవార్డులతో సన్మానించారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించిన విద్యార్థులకు అవార్డులను అందజేస్తున్నారు. ఈ ఏడాది సాయివరుణ్, సందీప్, శివ, రిషిత, కుసుమాంజలి, భవాని, పూజ, సంజన అనే విద్యార్థులు సీట్లు సాధించగా వారిని కలాం ఎక్సలెన్స్ అవార్డులతో సన్మానించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు అధ్యక్షుడు దేవునూరి ఆనంద్, జమ్ముల వీరారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
డీజీపీని కలిసిన మొగుళ్ల
జనగామ: డీజీపీ శశిధర్రెడ్డిని ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హెచ్డబ్ల్యూబ్ల్యూ, ఎస్కేయూ అధ్యక్షుడు మొగుళ్ల రాజి రెడ్డి సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరా బాద్లోని ఆయన నివాసంలో డీజీపీని కలిసి శాలువాతో సత్కరించి బొకే అందించారు.రాష్ట్ర ఉత్తమ ఇన్నోవేటివ్ అవార్డు గ్రహీతకు సన్మానంరఘునాథపల్లి: మండలంలోని వెల్ది మాడల్ స్కూల్ ఆంగ్ల ఉపాధ్యాయుడు కందగట్ల గణేశ్కు హైదరాబాద్కు చెందిన జటాదర ఎడ్యుకేషన్ టెక్నాలజీ వారు రాష్ట్ర ఉత్తమ ఇన్నోవేటివ్ టీచర్ అవార్డుకు ఎంపిక చేసి సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో ఇటీవల ప్రదానం చేశారు. సోమవారం మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ పాలకుర్తి శ్రీధర్, ఉపాధ్యాయులతో కలిసి అవార్డుగ్రహీత గణేశ్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ గడ్డం జయశ్రీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.నక్కవానిగూడెం పీఎస్కు టీచర్!జనగామ: బచ్చన్నపేట మండలం నక్కవానిగూడెం ప్రాథమిక పాఠశాలకు తాత్కాలిక పద్ధతిలో డిప్యుటేషన్పై ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కేటాయించారు. ‘సర్దుబాటుపై జాప్యమెందుకు?’ శీర్షికన ఈ నెల 6న సాక్షిలో ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. నక్కవానిగూడెం పీఎస్లో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లకు పదోన్నతి రావడంతో నెలరోజుల క్రితమే వెళ్లిపోయారు. తాత్కాలికంగా మరో పాఠశాల నుంచి టీచర్ను నియమించాల్సిన ఎంఈవో నిర్లక్ష్యంతో విద్యార్థులు చదువుకు దూరమైపోయారు. ఈ విషయమై విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై సాక్షి కథనంతో కలెక్టర్ ఎంఈవోపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు స మాచారం. వెంటనే స్పందించిన ఎంఈవో అదే మండలంలోని పడమటి కేశ్వాపూర్ పీఎస్లో పనిచేస్తున్న టీచర్ ప్రియాంకను నక్కవాని గూడెం ప్రాథమిక పాఠశాలకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.జాప్యంపై ఇంటెలిజెన్స్ ఆరాజిల్లాలో టీచర్ల సర్దుబాటుకు సంబంధించి సాక్షిలో వచ్చిన కథనం ఆధారంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీసినట్లు సమాచారం. జిల్లా విద్యాశాఖలో ఏం జరుగుతోందనే కోణంలో సమగ్ర సమాచారం తీసుకున్నట్లు తెలిసింది. ఆయా పాఠశాలల పరిధిలో పదోన్నతులతో ఖాళీ అయిన టీచర్ల స్థానంలో గత నెల 4వ తేదీ వరకే సర్దుబాటు చేయాల్సి ఉండగా, నిర్లక్ష్యానికి కారణాలు ఏంటనే దానిపై కూపీలాగినట్లు విద్యాశాఖలో చర్చ జరుగుతోంది.దేవాదుల మొదటి మోటార్ ట్రయల్ రన్ సక్సెస్హసన్పర్తి : దేవాదుల ప్రాజెక్ట్–3వ దశలో భాగంగా నిర్వహించిన ట్రయన్ రన్ విజయవంతమైంది. సోమవారం మొదటి మోటారును రన్ చేశారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటలోని పంప్హౌజ్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేశారు. ఐదు నెలల క్రితం రెండో మోటారు భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రారంభించారు. మూడో మోటారు ట్రయల్ రన్కు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.‘బెస్ట్’ నిధులు విడుదల చేయాలిజనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ పథకం నిధులను వెంటనే విడుదల చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రఘునాథపల్లి మండలం నిడిగొండ సెయింట్ పీటర్ హైస్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కింద విద్యార్థులకు చెల్లిస్తున్న స్కాలర్షిప్స్ 2022 నుంచి 2025 పెండింగ్లో ఉండడంతో తమ పిల్లల చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి నెలకొందని వాపోయారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో 60మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
పెండింగ్ వేతనాలు అందించాలి
జనగామ రూరల్: నాలుగు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, పండుగలకు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొందని, వెంటనే వేతనాలు మంజూరు చేయాలని మోడల్ స్కూల్ సిబ్బంది జిల్లా అధ్యక్షుడు జనార్దన్ కోరారు. సోమవారం తెలంగాణ మోడల్ స్కూల్లో పనిచేస్తున్న సిబ్బంది కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫిజికల్ డైరెక్టర్ కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్స్, నైట్ వాచ్మెన్లు జిల్లాలో 8 మోడల్ స్కూల్లో 32 మంది పనిచేస్తున్నారని అన్నారు. నాలుగు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. నిరసనలో జిల్లా ఉపాధ్యక్షుడు గణేశ్, కోశాధికారి బాలు, రాజేశ్, వెంకటేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్ సిబ్బంది నిరసన -
ప్రభుత్వ బడుల్లో డిజిటల్ లెర్నింగ్
జనగామ: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగంలో మరో కొత్త అడుగు పడనుంది. విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానంలో పరిపూర్ణులను చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ‘ఏ బుక్ ఆఫ్ డిజిటల్ లెర్నింగ్’ అనే కొత్త పాఠ్యాంశాని(పాఠ్య ప్రణాళిక తరగతులు)కి శ్రీకారం చుట్టబోతోంది. 6 నుంచి 9వ తరగతి వరకు చదువుకుంటు న్న పిల్లలకు ఇది ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం సర్క్యులర్ జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష సంయుక్త భాగస్వామ్యంతో డిజిటల్ లెర్నింగ్ బోధన కొనసాగనుంది. ఈ పాఠ్యాంశాలను సమర్థవంతంగా బోధించేందుకు ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో త్వరలో జిల్లాలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఈనెల 8వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఇక్కడి వెసులుబాటును చూసుకుని తేదీలను ప్రకటించనున్నారు. కార్పోరేట్కు దీటుగా ప్రభుత్వ బడులు జిల్లాలో 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఇక నుంచి డిజిటల్గా బోధించనున్నారు. ప్రాథమికోన్నత–64, ఉన్నత పాఠశాలలు 103 ఉండగా, వీటి పరిధిలో సుమారు 12వేల పైచిలు విద్యార్థులు ఉన్నారు. కాగా ప్రభుత్వ, స్థానిక సంస్థలు, టీజీఎంఎస్, కేజీబీవీ, టీఆర్ఈఐఎస్ పాఠశాలలలో పనిచేస్తున్న గణితం, ఇంగ్లిష్, భౌతిక, సాంఘిక శాస్త్రం బోధించే యూపీఎస్, హైస్కూల్ ఉపాధ్యాయులు 800ల వరకు ఉండగా, వీరంతా శిక్షణకు హాజరుకావాల్సి ఉంటుంది. శిక్షణలో కోడింగ్, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై ప్రాక్టికల్ సెషన్లు ఉంటాయి. సకల సౌకర్యాలతో శిక్షణ కోసం ప్రతి జిల్లా లేదా డివిజన్ స్థాయిలో తగిన సదుపాయాలతో కూడిన సెంటర్లను ఎంపిక చేయాలని అందులో పేర్కొన్నారు. శిక్షణ సమయంలో టీచర్లకు కంప్యూటర్లతో కూడిన ప్రయోగశాలలు, అసౌకర్యం లేని ఇంటర్నెట్, ఆడియో విజువల్ పరికరాలు, ప్రొజెక్టర్, సౌండ్ సిస్టమ్, మైక్లు, నిరంతర విద్యుత్, బ్యాకప్ సదుపాయం ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉన్న పాఠశాలలలో శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్లు ల్యాప్టాప్లు, అర్డు వినో కిట్స్తో శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుంది. శిక్షణ కాలంలో టీచర్లు వారికి కేటాయించిన సెంటర్కు ఉదయం 9 గంటలకు చేరుకోనుండగా, తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో వారి అటెండెన్స్ నమోదు చేస్తారు. అలాగే శిక్షణ కాలానికి సంబంధించి సర్టిఫికెట్ ఆన్లైన్ ద్వారా తీసుకోవాలి. అక్టోబర్ 19వ తేదీ లోపు శిక్షణ పూర్తి చేసుకుని etdepttscert@gmail.com వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. బడ్జెట్ కేటాయింపులు డిజిటల్ లెర్నింగ్పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సమయంలో ప్రభుత్వం టీఏ, డీఏ ఇతర అలవెన్స్లను ఇస్తుంది. ఇందుకు సంబంధించి జిల్లా విద్యాధికారులు సంబంధిత డీఐఈటీ ప్రిన్సిపల్స్కు బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించి, కలెక్టర్ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. డీఆర్పీలకు రోజు వారీగా రూ.400 గౌరవ వేతనంతో పాటు టీచర్లకు టీజీటీఏ నిబంధనల మేరకు భత్యాలను చెల్లించనున్నారు. ఉపాధ్యాయుల శిక్షణ కోసం కసరత్తు కోడింగ్, డేటాసైన్స్, ఏఐ..అంశాలపై ప్రాక్టికల్ సెషన్లు విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాల పెంపే లక్ష్యం -
చదువుకు పేదరికం అడ్డుకాదు
స్టేషన్ఘన్పూర్: చదువుకు పేదరికం ఏమాత్రం అడ్డుకాదని, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, దాతలు అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతస్థానాలకు చేరుకోవాలని విద్యాశాఖ జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ సూచించారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లు జెడ్పీఎస్ఎస్కు చెందిన 165 మంది విద్యార్థులకు హన్మకొండ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్లను అందించారు. ఈ మేరకు సోమవారం పాఠశాలలో హెచ్ఎం జి.కొమురయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో హన్మకొండ రోటరీక్లబ్ సెక్రటరీలు ఎంవీ ఇలమురుగు, కేఎం శివకామి, స్కూల్ బ్యాగుల దాతలు ఎన్ఆర్ఐలు శ్రేయ, అభిరామ్, ఘన్పూర్ జెడ్పీఎస్ఎస్ హెచ్ఎం సంపత్, రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ తిరుపతిరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యాశాఖ జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ -
ప్రయాణం ప్రయాసే..
దసరా సెలవులు ముగించుకుని పట్టణ బాట పడుతున్న కుటుంబాలకు ప్రయాణంలో ప్రయాస తప్పడం లేదు. నేటి(సోమవారం) నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. 15 రోజులపాటు స్వగ్రామాల్లో ఎంజాయ్ చేసిన కుటుంబాలు ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో జనగామ ఆర్టీసీ బస్టాండ్లో రికార్డు స్థాయిలో ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసింది. రద్దీకి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులు నడిపించినప్పటికీ, ఒక్కో బస్సులో ఒంటికాలుపై నిలబడి 100 మందికి పైగా వెళ్లాల్సి వచ్చింది. – జనగామజనగామ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ -
నామినేషన్ వేసేందుకు ప్రతిపక్షాలకు భయం
రఘునాథపల్లి: సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు ప్రతిపక్షాల అభ్యర్థులు భ యపడే పరిస్థితి ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం మండలంలోని నిడిగొండ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ కూడా అధికార పార్టీకి చెందిన వారే ఉన్నందున ఇతర పార్టీలను గెలిపిస్తే అభివృద్ధికి ఆ స్కారం ఉండదన్నారు. గెలిచే వారికి పార్టీ అభ్యర్థులుగా అవకాశం కల్పిస్తామన్నారు. వెన్నుపోటుదా రులను ఉపేక్షించేది లేదని, పాత, కొత్త అన్న తేడా లేకుండా పనిచేయాలని సూచించారు. బీసీలకు రిజ ర్వేషన్లు ఇచ్చేందుకు బీజేపీ అడ్డుపడుతుందని, ఆ పార్టీతో ఒరిగేదేం లేదన్నారు. బాకీ కార్డు పేరిట బీఆర్ఎస్ దుష్పచారం చేస్తుందని, కాంగ్రెస్ కూడా కేసీఆర్, కేటీఆర్ల అవినీతి చిట్టాతో ప్రజల్లోకి వెళ్తుందన్నారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. పదేళ్లుగా పాలించిన వారి అవినీతిని వివరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని ఎంపీ పిలుపుని చ్చారు. ఈ సందర్భంగా మండలాల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసి పోటీ చేసే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అ ధ్యక్షుడు కొమ్మూరి ప్రతా ప్రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్లు శివరాజ్యాదవ్, లావణ్య, మాజీ జెడ్పీటీసీలు జగదీష్చందర్రెడ్డి, వంశీధర్రెడ్డి, అజయ్, జిల్లా నాయకులు జయరాములు, లింగాజీ, శివకుమార్, శిరీష్ రెడ్డి, సురేష్, సంపత్, అయిలయ్య, నరేందర్, భాస్కర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు, పదవులు వరంగల్ ఎంపీ కావ్య -
దంచి కొట్టిన వాన
జనగామ: రైతులు కష్టపడి పండించిన పంటను ఆదివారం అకస్మాత్తుగా కురిసిన వర్షం ఆగం చేసింది. వానాకాలం సీజన్ కోతలు మొదలవుతున్న నేపథ్యంలో పంట సరుకులను అమ్ముకునేందుకు రైతులు మార్కెట్ బాటపడుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులకు నష్టం తప్పడంలేదు. జనగామ వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వేల క్వింటాళ్ల ధాన్యం, మక్క గింజలు ఆదివారం అరగంటపాటు కురిసిన భారీ వర్షంతో తడిసి ముద్దయ్యాయి.వరదకు కొట్టుకుపోయిన గింజలుజిల్లాలో వానాకాలం సీజన్ కోతలు మొదలయ్యా యి. ప్రభుత్వ కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చే యకపోవడంతో, జిల్లా నలుమూలల నుంచి పంట ను విక్రయించేందుకు రైతులు జనగామ వ్యవసా య మార్కెట్కు వస్తున్నారు. మక్కలు, ధాన్యంలో తేమ అధికంగా ఉండడంతో రోజుల తరబడి సరుకులను కాటన్ యార్డులో ఆరబోసుకుంటున్నారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదతో కాటన్ యార్డులో ఆరబోసిన ధాన్యం, మక్కలు నీటిలో కొట్టుకుపోయాయి. గింజలను ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకుండాపోయింది. దీంతో 15 బస్తాల వరకు మక్కలు, 18 బస్తాలకు పైగా ధాన్యం కొట్టుకుపోవడంతో రెక్కల కష్టం వరద పాలైందని రైతులు మనోవేదనకు గురవుతున్నారు. ఎండ లేకపోవడంతో తడిసిన ధాన్యం గింజలు మొలకెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏటా ఇదే తంతుమార్కెట్ కాటన్ యార్డులో చుట్టుపక్కల డ్రెయినేజీ సిస్టం, ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేయకపోవడంతో వర్షం కురిసిన ప్రతీసారి రైతులకు నష్టం తప్పడంలేదు. అధికారులు మాత్రం ఇదేమీ పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కాటన్ యార్డులో డ్రెయినేజీ వ్యవస్థను నిర్మించి సీజన్కు 20 రోజుల ముందుగానే అవసరమైన టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.పాలకుర్తి టౌన్: పాలకుర్తి మండలంలో ఆదివారం భారీవర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు పొంగిపోర్లాయి. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలో 35.4 మీల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో మండలంలోని పలు గ్రామాల్లో చేతికొచ్చిన మొక్కజొన్న పంట నేలపాలైంది. మార్కెట్కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన మక్కలు తడవడంతో రైతులు వాపోతున్నారు. ఆరపోసిన మక్కలు వరదలో కొట్టుకుపోయాయి. -
రామప్పలో కోలాహలం
వెంకటాపురం(ఎం): ప్రపంచప్రఖ్యాతి గాంచిన సుప్రసిద్ధ రామప్ప దేవాలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చి రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్లు విజయ్కుమార్, వెంకటేశ్ వివరించారు. వనదేవతలకు మొక్కులుఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కల్యాణకట్టలో పుట్టువెంట్రుకలను సమర్పించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల వద్ద పూజలు చేశారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లోని చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు. -
స్లాట్ బుకింగ్.. స్పాట్ సెల్లింగ్
హన్మకొండ: పంట అమ్ముకునే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి పత్తి రైతులకు ఇక విముక్తి లభించనుంది. కనీస మద్దతు ధర అందించడంతోపాటు దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా పత్తి అమ్ముకునేందుకు, క్రయవిక్రయాలు పారదర్శకంగా జరిగేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ‘కా పాస్ కిసాన్’ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి రైతులు ఈ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని పంటను అమ్ముకోవాలి. ఈ నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ యాప్పై ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన అధికారులు రైతుల మొబైల్ ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేయించి పత్తి బుక్ చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తారు. తద్వారా పత్తి క్రయవిక్రయాలు పూర్తిగా యాప్ ద్వారానే సాగనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి దాదాపు 5,23,848 ఎకరాల్లో సాగు చేశారు. స్లాట్ బుక్ చేసుకుంటేనే అమ్మకం.. రైతులు ‘కా పాస్ కిసాన్’ యాప్లో స్లాట్ బుక్ చేసుకుంటేనే పత్తి అమ్ముకోగలుగుతారు. రైతులు ఏ మిల్లులో అమ్ముకుంటారో తెలుపుతూ స్లాట్ బుక్ చేయగానే తేదీ, సమయాన్ని అధికారులు యాప్ ద్వారా సమాచారం అందిస్తారు. అదే నిర్ణీత రోజు, నిర్ణీత సమయానికి రైతు పత్తిని తీసుకెళ్లి విక్రయించుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకోకపోతే పత్తిని అమ్ముకోలేరు. రైతులు మూడుసార్లు స్లాట్ బుక్ చేసుకుని, స్లాట్ను రద్దు చేసుకోకుండా పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి విక్రయించకపోతే ఆ రైతు పేరు బ్లాక్లిస్టులోకి వెళ్తుంది. బ్లాక్ లిస్టులో నుంచి పేరు తొలగించి, తిరిగి పత్తి అమ్ముకోలాంటే సీసీఐ అధికారులతో ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. పత్తి క్వింటాకు రూ.8,110 మద్దతు ధర.. కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర ప్రకటించింది. ‘కా పాస్ కిసాన్’ యాప్ ద్వారా మద్దతు ధర పొందే అవకాశాన్ని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కల్పించింది. స్మార్ట్ ఫోన్లేని రైతులు ఇతరుల స్మార్ట్ ఫోన్ నుంచి కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రైతు పాస్బుక్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ‘కా పాస్ కిసాన్’ యాప్లో రైతు పట్టాదారు పాస్బుక్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేయగానే పంట ఎంత సాగు చేశారో వివరాలు అందులో వస్తాయి. వ్యవసాయ శాఖ ఇప్పటికే డిజిటల్ క్రాప్ సర్వే చేస్తూ పంట సాగు వివరాలు నమోదు చేస్తోంది. డిజిటల్ క్రాప్ సర్వే దాదాపు పూర్తి కావొచ్చింది. పంట సాగు విస్తీర్ణాన్ని బట్టి దిగుబడి లెక్కిస్తారు. ఈ యాప్ ద్వారా రైతులకు దళారుల నుంచి విముక్తి కలుగుతుంది. రైతులు నిరీక్షించాల్సిన బాధ తప్పుతుంది.‘కా పాస్ కిసాన్’ యాప్ను స్మార్ట్ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాక ముందుగా రైతు పేరు, జండర్, పుట్టిన తేదీ, కులం. చిరునామా, ఆధార్, ఫోన్ నంబర్, కౌలురైతు/సొంతమా అనే వివరాలు నమోదు చేయాలి. పట్టాదారు పాస్ పుస్తకం నంబర్, సర్వే నంబర్, రైతుకు ఉన్న మొత్తం భూమి, ఇందులో పత్తి సాగు విస్తీర్ణం, పంట రకం వివరాలు యాప్లో నిక్షిప్తం చేయాలి. రైతుకు సంబంధించిన ఆధార్ కార్డు, పాస్బుక్, రైతు ఫొటోను యాప్లో అప్లోడ్ చేయాలి. పత్తి విక్రయానికి ఇక ఇబ్బందులుండవ్ ప్రత్యేక యాప్ను రూపొందించిన సీసీఐ ‘కాపాస్ కిసాన్’ యాప్ ద్వారా బుకింగ్ యాప్పై వ్యవసాయ అధికారులు, విస్తరణాధికారులకు శిక్షణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5,23,848 ఎకరాల్లో పత్తి సాగుజిల్లా విస్తీర్ణం (ఎకరాలు) వరంగల్ 1,18,547హనుమకొండ 74,849మహబూబాబాద్ 85,480ములుగు20,593భూపాలపల్లి 98,260జనగామ 1,26,119 -
బీజేపీలో చేరిన హౌసింగ్ రిటైర్డ్ డీఈఈ
జనగామ రూరల్: స్టేషన్ ఘన్పూర్ రిటైర్డ్ డీఈఈ సీతా దుర్గాప్రసాద్ బీజేపీలో చేరారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల విజయానికి కార్యకర్తలు సైనికుల్లాగా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీతా శ్యామల, డాక్టర్ గుండె రాహుల్, అరుణ్ కుమార్, భూపాల రమేష్, పూర్ణచందర్, శోభ రాణి, రాంరెడ్డి, శివకుమార్, శేఖర్ జగదీష్, తదితరులు పాల్గొన్నారు. ‘ఎంపీటీసీ స్థానాల్లో అన్యాయం’ రఘునాథపల్లి: మండలంలోని కంచనపల్లి ఎంపీటీసీ స్థానాల కేటాయింపులో జనాభా ప్రకారం కాకుండా అధికారులు అన్యాయం చేశారని ఆ గ్రామానికి చెందిన రాపోలు రామ్మూర్తి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో రామ్మూర్తి మాట్లాడుతూ ఎంపీటీసీల స్థానాల కేటాయింపులో 2019లో అన్యాయం జరిగిందన్నారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఒక్కో ఎంపీటీసీ స్థానానికి 1,000 నుంచి 2,400 ఓటర్లు కలిగి ఉండాలన్నారు. కంచనపల్లిలో 5,200 ఓటర్లకు కేవలం ఒకే ఎంపీటీసీ స్థానం కేటాయించి అన్యాయం చేశారన్నారు. కంచనపల్లి గ్రామానికి రెండు ఎంపీటీసీ స్థానాలు కేటాయించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో హైకోర్టును అశ్రయించినట్లు తెలిపారు. ఈ విషయమై ఈ నెల 7న హైకోర్టులో విచారణ జరుగనున్నట్లు ఆయన వివరించారు. 9 నుంచి లా సప్లిమెంటరీ పరీక్షలు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఐదేళ్ల లాకోర్సు ఏడో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 9నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిం ఇక్బాల్ తెలిపారు. ఈనెల 9న మొదటి పేపర్, 13న రెండో పేపర్, 15న మూడో పేపర్, 17న నాలుగో పేపర్, 22న ఐదో పేపర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వారు తెలిపారు. -
సర్దుబాటులో జాప్యమెందుకు?
జనగామ: జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో జాప్యంతో విద్యార్థుల భవిష్యత్పై నీలి నీడలు అలుముకుంటున్నాయి. డీఈఓగా ఐఏఎస్ అధికారి బాధ్యతలు చేపట్టినా విద్యాశాఖ పనితీరు మెరుగుపడడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు గత నెల 4వ తేదీన సర్ధుబాటు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, ఆలస్యానికి గల కారణాలు తెలియడం లేదు. ‘సాక్షి’ కథపనాలతో వెనక్కి తగ్గిన విద్యాశాఖ జిల్లాలో జూలై మాసంలో మొదటిసారి టీచర్ల సర్దు బాటు చేపట్టారు. 109 మంది ఉపాధ్యాయులను సర్దుబాటుచేయగా, దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. సర్దుబాటులో పైరవీలు, అవకతవకలపై సాక్షి దినపత్రిక వరుస కథనాలు ప్రచురించింది. స్పందించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా సర్దుబాటుకు తాత్కాలిక బ్రేక్ వేశారు. ఇదే సయయంలో ఆగస్టు 2, 3 వారాల్లో ఎస్జీలు, ఎస్ఏలకు పదోన్నతుల ప్రక్రియను మొదలు పెట్టారు. ప్రమోషన్ల ఖాళీల ఆధారంగా మరోసారి సర్దుబాటు చేయాలని, ఇందుకు సంబంధించి సెప్టెంబరు 4 వరకు పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో 87 మంది ఎస్జీలు, 19 మంది ఎస్ఏలకు పదోన్నతులు రాగా, టీచర్లు ఖాళీ అయిన బడులకు సర్దుబాటు ద్వారా భర్తీ చేయాలి. రెండోసారి చేపట్టిన సర్ధుబాటులో పైరవీలకు ఆస్కారం లేకుండా ఉండాలనే జాగ్రత్త పేద విద్యార్థుల భవిష్యత్ను ఆగం చేస్తుంది. రఘునాథపల్లి మండలం నక్కబొక్కల తండా, పాలకుర్తి మండలం కిష్టాపూర్(సింగిల్ టీచర్), బచ్చన్నపేట మండలం నక్కవానిగూడెం ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు పదోన్నతులపై వెళ్లిపోయారు. దీంతో బడిలో పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ఈ విషయంపై సాక్షి కథనం ప్రచురించగా.. రఘునాథపల్లి, పాలకుర్తి ఎంఈఓలు స్పందించి తాత్కాలికంగా ఆ బడులకు టీచర్లను పంపించారు. బచ్చన్నపేట ఎంఈఓ మాత్రం సీఆర్పీతో నెట్టుకొస్తూ, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్దుబాటు ముసాయిదా ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించి ఎలాంటి అధికారి సంతకాలు, రాజముద్ర లేకుండా ముసాయిదా (డ్రాఫ్ట్) పేరిట ఇటీవల ఓ సర్క్యులర్ బయటకు రాగా, టీచర్ల వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. ఇందులో 94 మంది టీచర్లకు సంబంధించి సర్దుబాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 84 మందిని సొంత మండలంలోనే సర్దుబాటు చేయగా, ఆరుగురిని పక్క మండలాలకు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది నిజమా..? లేక ఇందులో ఏమైనా తప్పులు ఉంటే సరి దిద్దుకునేందుకు లీక్ ఇచ్చారా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆరోపణలు వచ్చిన స్కూల్స్కు సంబంధించి సాక్షి కథనాలతో వాటి జోలికి వెళ్లలేదని ముసాయిదా జాబితాతో తెలుస్తుంది. టీచర్లు వస్తారా.. టీసీలు ఇస్తారా..? టీచర్లకు పదోన్నతులు కల్పించి నెలరోజులు గడిచిపోతున్నా సర్దుబాటు ప్రక్రియ జాప్యంపై తల్లిందండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బచ్చన్నపేట మండలం నక్కవానిగూడెం ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఇద్దరు టీచర్లకు పదోన్నతి వచ్చింది. దీంతో ఇద్దరూ వెళ్లిపోవడంతో సీఆర్పీతో నెట్టుకొస్తున్నారు. మండలంలో ఇతర పాఠశాల నుంచి తాత్కాలికంగా టీచర్లను సర్దుబాటు చేయాల్సి ఉండగా, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టీచర్లను నియమించాలని తల్లిదండ్రులు పలుమార్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులు జంపయ్య, కరుణాకర్, మాధవి, ప్రతాపరెడ్డి, సత్తెమ్మ, కిష్టయ కల్యాణి, భవ్య, ఐలయ్య మాట్లాడుతూ.. ఇద్దరు ఉపాధ్యాయులు పదోన్నతిపై వెళ్తే వారి స్థానంలో మరొకరిని నియమించడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని, లేని పక్షంలో టీసీలు ఇస్తే మరో పాఠశాలలో పిల్లలను చేర్పిస్తామని తల్లిదండ్రులు తేల్చి చెబుతున్నారు. ఈ విషయమంలో విద్యాశాఖ అధికారులు ఏం చేస్తారో వేచి చూడాలి. గడువు ముగిసి నెల రోజులు పదోన్నతులతో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీ సీఆర్పీలకు బాధ్యతలు ఎంఈఓకు పట్టని విద్యార్థుల భవిష్యత్ -
గంగమ్మ ఒడికి దుర్గమ్మ
ఊరేగింపుగా బతుకమ్మకుంట అమ్మవారుబతుకమ్మకుంట అమ్మవారి నిమజ్జనం● జిల్లా వ్యాప్తంగా శోభాయాత్రలు, నిమజ్జనాలు జనగామ: విజయదశమి పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శ్రీ దేవినవరాత్రుల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పది రోజుల పాటు భక్తుల కోలాహలంతో అమ్మవారి మండపాలు భక్తి పారవశ్యంతో నిండిపోయాయి. జనగామ, పాలకుర్తి, స్టేషన్న్ఘన్పూర్ నియోజకవర్గాల పరిధిలో 40కి పైగా అమ్మవార్లు కొలువుదీరగా, ప్రతిరోజూ ప్రత్యేక అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు, మాలలు ధరించిన భవానీమాతాలు నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేపట్టి అమ్మవారికి పూజలు చేశారు. అమ్మవారి శోభాయాత్రలకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. పదిరోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న అమ్మవారు పదకొండో రోజు నిమజ్జనానికి బయలుదేరగా పట్టణంలోని ప్రధాన వీధులన్నీ శోభాయమానంగా మారాయి. పట్టణంలోని శ్రీవిల్లాస్ కాలనీ టీంఎస్బీసీ, అంబేడ్కర్నగర్ 14వ వార్డు ముస్లిం మైనార్టీ కాలనీలోని శ్రీ దేవీ నవరాత్రి నిమజ్జన ఉత్సవం ఘనంగా జరిగింది. వేడుకల్లో జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ చైర్మన్ దూసరి ధనలక్ష్మిశ్రీకాంత్ పాల్గొన్నారు. పాతబీటు బజారు గణేశ్ యూత్ ఫ్రెండ్స్, లక్ష్మిభాయ్కుంట, ఈ సేవా ఏరియాలోని బొడ్రాయి, గిర్నిగడ్డ హనుమాన్ టెంపుల్, ఉప్పలమ్మ ఆలయం, మూలబావి శ్రీ సీతారామచంద్రస్వామి, తదితర ఏరియాలో కొలువు దీరిన అమ్మవార్లను నిమజ్జనం చేశారు. నిమజ్జన ఊరేగింపుల్లో ఇబ్బందులు కలుకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. తహసీల్ కార్యాలయ ఆవరణలోని అమ్మవారిని ఊరేగింపు నిర్వహించి, శ్రీ సంతోషిమాత ఆలయానికి తీసుకొచ్చారు. పట్టణంలోని బొడ్రాయి వద్ద జరిగిన వేడుకల్లో స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య పాల్గొని పూజలు చేశారు. -
దసరా కిక్కు
సర్కిల్ లిక్కర్ బీర్ల అమ్మకాలు కాటన్లు కాటన్లు (రూ.కోట్లలో) జనగామ 4,589 8,806 రూ.5.57 స్టే.ఘన్పూర్ 4,724 7,115 రూ.5.40 పాలకుర్తి 2,922 5,771 రూ.3.41 12,235 21,692 రూ.14.38 జనగామ: దసరా పండుగ సంబురం మద్యం వ్యాపారులకు కిక్కిచ్చింది. జిల్లా వ్యాప్తంగా 47 వైన్స్ షాపులు, ఐదు బార్లలో గత నెల 29వ తేదీ నుంచి ఈనెల 4వ తేదీ వరకు కేవలం ఐదు రోజుల్లోనే 33,927 ఐఎంఎల్, బీర్ కాటన్లు అమ్ముడవగా, రూ.14.38 కోట్ల విలువైన వ్యాపారం జరిగినట్లు ఎకై ్సజ్ శాఖ అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా వైన్స్ షాపులు మూసివేయడంతో, 1వ తేదీన కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయి. చాలా మంది ముందుగానే స్టాక్ చేసుకోవడంతో మద్యం దుకాణాలు ఖాళీ అయ్యాయి. దసరా రోజున మద్యం దుకాణాలు మూసి ఉండడంతో, ప్రజలు 3వ తేదీన ‘పిల్ల దసరా’ ఉత్సవాలు ఘనంగా చేసుకున్నారు. దీంతో, గత ఆరు నెలలుగా అమ్మకాలలో నష్టపోయిన వైన్స్ వ్యాపారులకు ఈసారి దసరా మంచి ఊరట ఇచ్చింది. పండుగల సీజన్ ముగియడానికి ముందే, స్థానిక సంస్థల ఎన్నికల వేడి కూడా మద్యం వ్యాపారానికి ఊతమిచ్చింది. వివిధ రాజకీయ ఆశావహులు పార్టీ కార్యకర్తలకు విందులు ఏర్పాటు చేయడంతో కొనుగోళ్లు మరింత పెరిగాయని ఎకై ్సజ్ వర్గాలు భావిస్తున్నాయి. జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి సర్కిల్ పరిధిలో 12,235 లిక్కర్, 21,692 బీర్ల కాటన్ల అమ్మకాలతో రూ.14.38కోట్ల మేర వ్యాపారం జరిగింది. నెలనెలా మద్యం అమ్మకాల టార్గెట్ చేరుకునేందుకు ఎకై ్సజ్ శాఖ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. దసరా పేరిట రికార్డు కలెక్షన్లు పెరగడంతో ఆ శాఖ సంతోషంలో ఉండగా, వ్యాపారులకు దసరా దీవెనగా భావిస్తున్నారు. సెప్టెంబర్ చివరివారం నుంచి అమ్మకాలు బాగా పెరిగాయి. ఈనెల 1వ తేదీ నుంచి వ్యాపారులు ఊహించని విధంగా అత్యధిక అమ్మకాలు జరిగాయి. పండుగ వాతావరణం, సెలవులు, ఎన్నికల ఉత్సాహం అన్నీ కలిపి మద్యం అమ్మకాలపై ప్రభావం చూపించాయి. ఒక వైపు భక్తి, మరో వైపు మత్తు దసరా వేడుకల్లో రెండూ జిల్లాలో స్పష్టంగా కనిపించాయి. ఐదు రోజులు..రూ.14.38కోట్లకు పైగా వ్యాపారం గాంధీ జయంతితో ముందురోజే భారీ కొనుగోళ్లు మద్యం షాపుల యజమానులకు పండుగ సంబురం దసరా సెలవుల్లో ఈనెల 5 (ఆదివారం) మాత్రమే మిగిలి ఉండడంతో పండుగ సేల్ కొనసాగనుంది. ఐదురోజుల అమ్మకాల్లో సరాసరి రోజువారీగా రూ.3కోట్ల మేర మద్యం వ్యాపారం జరుగగా, ఆదివారం కూడా అదే జోరు కొనసాగుతుందని ఎకై ్సజ్ అధికారులు భావిస్తున్నారు. సెలవులు ముగించుకుని 50 శాతం మేర కుటుంబాలు స్వగ్రామాల నుంచి పట్టణాలకు బయలుదేరగా.. మరో 50శాతం మంది సొంతూరిలోనే ఉన్నారు. దసరా, పిల్ల దసరా ముగియడంతో..మిగిలి ఉన్న ఒక్క రోజు వచ్చే ఏడాది దసరా పండుగ వరకు గుర్తుండేలా దావత్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ వేడుకలు ముగిశాయో లేదో..8వ తేదీన స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి కోర్టు తీర్పు నేపథ్యంలో ఆ రోజు సైతం అమ్మకాలు బాగానే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
– ఎస్ఎస్తాడ్వాయి
కోయల పూర్వ మూలాలు, పడిగ బొమ్మలు, పూర్వ కోయ రాజ్యాల చరిత్ర, గొట్టు గోత్రాలు (పూర్వం ప్రకృతి సమతుల్య సిద్ధాంతంలో భాగంగా ఆదివాసీలు తమ వంశవృక్షాలను 3 నుంచి 7 గొట్లుగా ఏర్పాటు చేసుకుని ప్రకృతిలోని జంతువులు, చెట్లు, పక్షులు, రాజ్య వ్యవస్థ సింబల్ను దైవాలుగా పంచుకున్నారు)... వీటిని మేడారం అమ్మవార్ల గద్దెలు, సాలహారం, నూతన ఆర్చీ ద్వారాలపై తీర్చిదిద్దనున్నారు. ఆలయం మొత్తం కొండ గుహల్లో దొరికిన పూర్వ కోయ రాజ్యాలు నడిచిన క్రమంలో రాసిన తాళపత్ర గ్రంథాల ఆధారంగా వాస్తుప్రకారం రూపుదిద్దుకోనుంది. వెయ్యేళ్లు ఆదివాసీల చరిత్ర నిలిచేలా అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయనున్నారు. మేడారం పునర్నిర్మాణంలో ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.. ఆలయంలో రానున్న ఆర్చీలు, సాలహారంపై ఆదివాసీ చరిత్ర, ప్రకృతితో వారికున్న అనుబంధం తెలిపే బొమ్మల విశేషాలే ఈ వారం సండే స్పెషల్ కథనం. వనదేవతల గద్దెల ప్రాంగణం నమూనా చిత్రంప్రధాన ఆర్చీ ద్వారం 40 ఫీట్ల ఎత్తుతో నిర్మించనున్నారు. దీనిపై బండానీ వంశం సమ్మక్క తల్లి 5వ గొట్టు వంశస్తుల పూజిత జంతువు ఒంటికొమ్ము దుప్పి, అటు ఇటు చివరన అడవిదున్న కొమ్ములు, నెమలి ఈకలు ఏర్పాటుచేస్తారు. ఇవి ఆదివాసీల అస్థిత్వానికి రూపాలు. పక్కన రెండు వైపులా నాగులమ్మ (సమ్మక్క చెల్లెలు) పాము రూపంలో ఉంటుంది. వరుసగా కోయ సమాజంలో 6వ గొట్టు ఏనుగు, 3వ గొట్టు ఎద్దు, 4వ గొట్టు ఖడ్గమృగం, 5వ గొట్టు ఒంటి కొమ్ము దుప్పి, 7వ గొట్టు మనుబోతు, 8వ గొట్టు సమ్మక్క తల్లిని చిలకలగట్టు నుంచి తీసుకువచ్చే సిద్ధబోయిన వారి సింహాలు వరుసగా ఏర్పాటు చేస్తారు. ఇందులో మూర్తి అక్కుమ్ (తూత కొమ్ము) ప్రత్యేకం. దేవత ఈ శబ్దం ద్వారానే వస్తుంది అనేది సంకేతం. కింద పిల్లర్లపై కుడి వైపు 5వ గొట్టు తెలిపేలా 5 నిలువు గీతలు, పూజిత పక్షి పావురం, నెమలి పూజిత వృక్షం వెదురు చెట్టు, బండారి చెట్టు, 4వ గొట్టు సమ్మక్క భర్త మూలం తెలిపే 4 నిలువు గీతలు, పూజిత పక్షి సోనోడి పిట్ట, పాలపిట్ట, వృక్షం బూరుగు చెట్టు, తాబేలు ఏర్పాటు చేయనున్నారు. ఆదివాసీ మూలాలు, సంస్కృతీసంప్రదాయ చిత్రాలతో ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం ఆధునికీకరణకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. మొత్తంగా 8 ఆర్చీలు, గద్దెల ప్రాంగణం చుట్టూ ప్రహరీపై 700 ఆదివాసీ చిత్రాలను ఏర్పాటుచేయనున్నారు. అమ్మవార్ల గద్దెలను కదిలించకుండా కోయ మూలాలతో అభివృద్ధి పనులను చేపట్టారు. వనదేవతల వరుస క్రమంలో సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను ఏర్పాటు చేయనున్నారు. 300 ఫీట్ల వెడల్పు, 1000 ఫీట్ల మేర చుట్టూ ప్రహరీ నిర్మించనున్నారు. ఆదివాసీల గొట్టుగోత్రాల చిత్రాలుతాబేలుపై కోయరాజుల బొమ్మలుఅమ్మవార్ల గద్దెల పక్కన 8 పిల్లర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పిల్లర్లు ఫీటున్నర వెడల్పు, 8 ఫీట్ల పొడవుతో ఏర్పాటు చేస్తారు. వీటిపై 340 బొమ్మలు వేయనున్నారు. పూర్తిగా సమ్మక్క వంశం సిద్ధబోయినవారి పవిత్ర బొమ్మలతోపాటు పూజావిధానం, వారి వంశ వృక్షం ఉంటుంది. సారలమ్మ గద్దె పక్కన పిల్లర్లపై కూడా ఇదే పద్ధతిలో 342 బొమ్మలు వేస్తారు. సారలమ్మ వంశం, 3వ గొట్టు పవిత్ర బొమ్మల చిత్రాలు వేస్తారు. పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై 172 చొప్పున 344 బొమ్మలు, వారి వంశవృక్షం పవిత్ర బొమ్మలు వేస్తారు. పగిడిద్దరాజు – నాగులమ్మ కొడుకు జంపన్న గద్దె జంపన్న వాగు ఒడ్డున ఉంది. అక్కడే ఈ గద్దెను అభివృద్ధి చేయాలని పూజారులు నిర్ణయించారు. జంపన్న తమ్ముడైన ముయాన్న గద్దె ఏర్పాటు, వనం పోతురాజు ఇంకా కాపలాగా ఉండే పొలిమేర దేవతల ఏర్పాటును శాసీ్త్రయబద్ధంగా పూజారులు తీసుకున్నారు. ● ఎడమ వైపు పిల్లర్లపై మూడవ గొట్టు మూలం 3 నిలువు బొట్లు, త్రిభుజం రాజ్య సింబల్, సారలమ్మ కోసం స్వయంవరంలో బాణంతో కాకిని కొట్టి కాక అడమరాజు సారలమ్మను పెళ్లి చేసుకున్న మనిషితో కూడిన బాణం ఉంటుంది. కాకి బొమ్మ, సిద్ధబోయిన వంశస్తుల వడ్డే గోత్రం వృక్షం ఇప్పచెట్టు, చిలకలగట్టునుంచి దేవతను తీసుకొచ్చే సందర్భం బొమ్మలు.. ఇలా ప్రకృతిలోని జంతువులు, పక్షులు, చెట్ల చిత్రాలను ఈ ఆర్చీలో చేర్చి మేడారం జాతర అంటే ప్రకృతి జాతర అనేలా రూపుదిద్దుతారు. ● ఆలయంలోని తూర్పు ఈశాన్యం ద్వారం ద్వారా భక్తులు వెళ్తారు. ప్రధాన ద్వారం పూర్తిగా 5వ గొట్టు మూలం బొమ్మలు 25 రకాలు ఉంటాయి. వారి వంశ వృక్షం ఉంటుంది. పక్కన ద్వారం సిద్ధబోయిన కొక్కెర వారి మూల వంశవృక్షం 25 బొమ్మలతో ఉంటుంది. మరో ద్వారం తూర్పు ఆగ్నేయంలో ఉంటుంది. ఇది పగిడిద్దరాజుది. దీనిలో 4వ గొట్టు మూలం పూర్తిగా 25 బొమ్మలతో ఉంటుంది. తాబేలు బొమ్మపై ఉన్న నలుగురు పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగుల బండడు, ముల్లూరుడిని తెలుపుతుంది. సమ్మక్క భర్త కావడంతో పగిడిద్దరాజు కుడివైపున ఉంటాడు. మధ్యలో వీరి పెళ్లి చేసిన సిద్ధబోయిన వంశం వారు ఉండేలా రూపొందించారు. వెనుక భాగంలో గోవిందరాజు ద్వారం కూడా 4వ గొట్టు మూలాన్ని తెలుపుతుంది. ● ప్రధాన ద్వారం వెనుక వైపు సారలమ్మది. దీనిపై పూర్తిగా 3వ గొట్టు మూలం జంతువులు, పక్షులు వేస్తూ కాక అడమ రాజు, సారలమ్మ మూలం తీసుకున్నారు. సమ్మక్క చెల్లెలు నాగులమ్మకి పుట్ట పోసేందుకు 5 మీటర్ల ఖాళీ స్థలం వదిలేశారు. మిగతా ద్వారాలను సాధారణ కోయ మూలాలతో ఏర్పాటు చేస్తున్నారు. ఇది దేశ పురోగమన చరిత్ర సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ సంస్కృతి సజీవంగా నిలిచేలా ఆదివాసీ మూలాలతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం అభివృద్ధి చేయడం మా అదృష్టం. ఇది దేశ పురోగమన చరిత్ర. ఆలయ ప్రాంగణం విస్తీర్ణంలో ఆదిమ మూలం బొమ్మలు లిఖించే అవకాశం దక్కడం మంత్రి సీతక్క, సమ్మక్క– సారలమ్మ పూజారులకు, ఆదివాసీలకు మరువలేని జ్ఞాపకం. ఆదివాసీల ఆత్మగౌరవానికి అండగా ఉంటామని ప్రకటించడం చాలా సంతోషకరం. – డాక్టర్ మైపతి అరుణ్కుమార్ మేడారం గద్దెలు, సాలహారం, నూతన ఆర్చీ ద్వారాలపై 700 ఆదివాసీ చిత్రాలు 3 నుంచి 7 గొట్ల వంశస్తుల సంస్కృతీ సంప్రదాయం పరిఢవిల్లేలా ఏర్పాటు వెయ్యేళ్లు నిలిచేలా రాతికట్టడాలు, గద్దెల ప్రాంగణం విస్తీర్ణం ఆధునికీకరణ తల్లుల గద్దెలు కదిలించకుండా నిర్మాణం మారనున్న వనదేవతల గద్దెల ప్రాంగణం రూపురేఖలు అమ్మవార్ల గద్దెల పక్కన 8 పిల్లర్లు -
మెరుగైన వైద్యసేవలందించాలి
జఫర్గఢ్: ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యసేవలందించే విషయంలో వైద్యులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.రవీందర్నాయక్ కోరారు. మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలను ఆయన శనివారం అకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడారు.. ఆరోగ్య పరిస్థితి, ఆసుపత్రి ద్వారా అందుతున్న వైద్యసేవలపై వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి పనితీరు, డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈసందర్భంగా వైద్యులు, వైద్య సిబ్బందితో సమీక్షించడంతో పాటు పలు సూచనలు చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యసేవలందించే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ సుధీర్, డాక్టర్ శ్రీదేవి, డీఐఓ స్వర్ణకుమారి, వైద్యులు రాజమల్లు, నరేందర్, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ రవీందర్నాయక్ -
పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు
జనగామ: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. శనివారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ పండేరి చేతన్ నితిన్, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ ఏకశిల బీఈడీ, ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల(అటానమస్)ల్లో పరిశీలించారు. స్ట్రాంగ్ రూం, కౌంటింగ్, జనగామ మండలం డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి సంబంధించి గౌతమ్ మోడల్ స్కూల్ను వారు సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నియమాలకు అనుగుణంగా డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్, స్ట్రాంగ్ రూంలు ఉండాలని అధికారులకు సూచించారు. స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయనున్న వసతి సౌకర్యాల కల్పనకు సంబంధించి పలు సూచనలు ఇచ్చారు. పోలీస్ బందోబస్తు, రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతాపరమైన అంశాలపై కలెక్టర్ అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో జనగామ ఎంపీడీవో, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. మైనార్టీ మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలిజనగామ రూరల్: మైనార్టీ మహిళలు అన్ని రంగాల్లో ఎదిగి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్సీ అమీర్ఖాన్ ఆకాంక్షించారు. శనివారం పట్టణంలోని గిర్నిగడ్డ, గుండ్లగడ్డలో కాంగ్రెస్ మైనార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జమాల్ షరీఫ్ ఆధ్వర్యంలో సీయాసాత్ హబ్ మైనార్టీ వెల్ఫేర్ ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.. ప్రతీ పేద ముస్లిం మహిళల నెలకు రూ.100 చొప్పున మైనార్టీ ఉమెన్ ఎంపవర్మెంట్ పథకంలో 5 ఏళ్లు చెల్లిస్తే 1000 మంది మహిళలతో మొత్తం రూ.60లక్షలు అవుతాయని, సీయాసాత్ హబ్ ద్వారా సంవత్సరానికి 10 లక్షలు జమ చేస్తామన్నారు. కార్యక్రమంలో మౌలానా షకీరా హుస్సేన్, మౌలానా అబ్దుల్ రహమాన్, మౌలానా మసి ఆర్ రెహ్మాన్, రఫ్ మతీన్ అడ్వకేట్, అబ్దుల్ మన్నాన రాజీ పాల్గొన్నారు. రేపు ప్రజావాణి రద్దుజనగామ రూరల్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ, స ర్పంచ్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్టు ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. వీరాచలరాముడి సేవలో రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ చైర్మన్లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామిని శనివారం రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ చైర్మన్, మెంబర్ ఆఫ్ సెక్రటరీ జడ్జి చిలుకమారి పంచాక్షరి, ఆయన సతీమణి కావ్యశ్రీ దర్శించుకున్నారు. వేదపండితులు భార్గవాచార్యులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాశస్త్రాన్ని వేదపండితులు వివరించారు. ఈఓ వంశీ, కమిటీ చైర్మన్ మూర్తి తదితరులు ఉన్నారు. జనగామ: మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు ఉంటాయని ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో శనివారం రాత్రి పోలీసులు విస్త్రతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ స్వయంగా తనిఖీలను పర్యవేక్షించారు. ఏఎస్పీ వెంట ఎస్సైలు రాజన్ బాబు, చెన్నకేశవులు, తదితరులు ఉన్నారు. -
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
● రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్కములుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పిలుపునిచ్చారు. ఇంచర్లలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం సమష్టిగా పనిచేయాలన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్రెడ్డి పనిచేస్తున్నారని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమిలేదని ఆరోపించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. -
శనివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
● పంచాయతీ రిజర్వేషన్లు అమలవుతాయా.. రద్దవుతాయా? ● ఈనెల 8న కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ● ఖర్చు విషయంలో ఆశావహుల ఆచితూచి అడుగులుజనగామ: దసరా పండుగ సందడితో ఊళ్లలో వెలుగులు నిండిపోగా..గ్రామ రాజకీయాల్లో మాత్రం మరోరకం ఉత్కంఠ నెలకొంది. ఎప్పటిలాగే పండగ తర్వాత పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలవుతుందని అందరూ ఊహించినా, ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఈనెల 8వ తేదీన వెలువడనున్న కోర్టు తీర్పు 42 శాతం బీసీ రిజర్వేషన్ల భవిష్యత్తును నిర్ణయించనుంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఖరారు చేసి, 9వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అయితే రిజర్వేషన్ల అమలు ఉండబోతుందా? లేక రద్దవుతాయా? అన్న సందేహాలపై ఆశావహ అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. రిజర్వేషన్ అనుకూలంగా ఉంటే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతారు. లేకుంటే వెనక్కి తగ్గక తప్పదనే నిర్ణయానికి ముందుగానే వచ్చేస్తున్నారు. చర్చంతా దీనిపైనే అభ్యర్థుల ఇళ్లలో పండగ శుభకార్యాల కంటే రాజకీయ లెక్కలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రజల్లోనూ ఉత్కంఠ తక్కువేం కాదు. ఎవరు సర్పంచ్, ఎవరు ఎంపీటీసీ, ఏవర్గం జెడ్పీటీసీని కై వసం చేసుకుంటుందన్న లెక్కలు వేసుకుంటున్నారు. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారం అన్ని పార్టీలు సర్పంచ్, వార్డు, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఖర్చుకు దూరంగా నాయకులు.. ఆశావహులు తెరవెనక రాజకీయాలు నడిపిస్తూనే..రిజర్వేషన్ల ప్రకటన కోర్టు తీర్పుపై ఆధారపడి ఉండడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. డబ్బు ఖర్చు విషయంలో సైతం వెనుకంజ వేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి పండగ సందర్భాల్లో డబ్బులు ఖర్చు చేస్తూ పబ్లిసిటీ చేసుకునేవారు. అయితే అవకాశాలు, రిజర్వేషన్లు మారితే జేబులు ఖాళీ అవుతాయనే ఆలోచనతో ఖర్చుకు దూరంగా ఉన్నారు. అయితే, రిజర్వేషన్ల అమలు కొనసాగి, ఎన్నికలకు గ్రీన్సిగ్నల్ వస్తే క్షేత్ర స్థాయిలో తమ బలాన్ని ఎలా పెంచుకోవాలనే దానిపై రెడీగా ఉన్నారు. రిజర్వేషన్లలో మార్పులు వస్తే గ్రామ రాజకీయ సమీకరణాలన్నీ తారుమారు అవుతాయని నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా బీసీ వర్గాల్లో అసంతృప్తి పెరగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. రిజర్వేషన్లలో గందరగోళం దేవురుప్పుల మండలం గొల్లపల్లిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 200 మంది ఓటర్లు ఉంటారు. ఇక్కడ 8 వార్డులు ఉండగా, సర్పంచ్ జనరల్ కేటగిరీకి ఎంపిక చేసి, ఒక్క వార్డులో కూడా ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించలేదు. నర్మెట మండలంలో సైతం వార్డుల పరిధిలో రిజర్వేషన్లు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. లింగాలఘనపురం మండలం ఏనెబావి పంచాయతీ పరిధిలో 1,2,3 వార్డుల్లో ఎస్టీలు ఉండగా, బీసీలకు రిజర్వు చేశారు. కిష్టగూడెం జీపీ 1,2 వార్డుల్లో ఎస్సీలకు రిజర్వు కాగా, ఇందులో బీసీలు, ఓసీలు మాత్రమే ఉన్నారు. 5,6వార్డుల్లో బీసీలు ఉండగా, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారు. జఫర్గడ్ మండల కేంద్రంలో 9,10 వార్డుల్లో బీసీ ఓటర్లు ఉండగా, ఎస్సీకి రిజర్వు చేశారు. హిమ్మత్నగర్ పంచాయతీ పరిధిలో 1,4,10 వార్డుల్లో బీసీ ఓటర్లు ఉండగా, ఎస్సీకి రిజర్వేషన్ కలిసి వచ్చింది. తిమ్మాపూర్లో 4వ వార్డులో బీసీ ఓటర్లు ఉండగా ఎస్సీకి, తమ్మడపల్లి(ఐ)లో 1, 3 వార్డుల్లో బీసీ ఓటర్లు ఉండగా ఎస్సీకి, కూనూరు పంచాయతీలో 1వ వార్డులో బీసీ, ఓసీ ఓటర్లు ఉండగా, ఇక్కడ కూడా ఎస్సీకి రిజర్వుడు చేశారు. తరిగొప్పుల మండలం పోతా రం 4వ వార్డులో ఎస్సీలు ఉండగా బీసీ, 2వ వార్డులో బీసీలు ఉండగా ఎస్సీ, అక్కరాజు పల్లిలో 2, 4 వార్డుల్లో బీసీలు ఉన్నప్పటికీ ఎస్సీ, 6, 8 వార్డుల్లో ఎస్సీలు ఉండగా బీసీ, అబ్దుల్ నాగారం 8వ వార్డులో ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఉండగా బీసీ, 3వ వార్డులో బీసీలు ఉండగా ఎస్సీ, సోలీపూర్లో 1, 7 వార్డుల పరిధిలో బీసీలు ఉండగా ఎస్సీ, 9, 10 వార్డుల్లో ఎస్సీలు ఉండగా బీసీ రిజర్వేషన్ కల్పించారు.పోషకాహారంతో ఆరోగ్యంఇవేం రిజర్వేషన్లు తరిగొప్పుల మండల పరిధిలో ఎంపీపీ స్థానం ఎస్టీ మహిళా రిజర్వేషన్ కాగా, 6 ఎంపీటీసీల్లో ఒక్క ఎంపీటీసీ స్థానానికి ఎస్టీ మహిళ రిజర్వు కాలేదు. మండలంలోని అంకుషాపూర్ ఎంపీటీసీ స్థానాన్ని ఎస్టీ జనరల్గా కేటాయించారు. దీంతో ఇవేక్కడి రిజర్వేషన్లు అంటూ జనాలు ముక్కున వేలుసుకుంటున్నారు. -
అంగరంగ వైభవంగా..
● జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకలు ● బతుకమ్మకుంటలో ఘనంగా రావణవధ ● వేలాదిగా తరలివచ్చిన ప్రజలు ● చెడుపై విజయమే దసరా: ఎమ్మెల్యే పల్లాజనగామ: జిల్లావ్యాప్తంగా ప్రజలు దసరా పండగను ఘనంగా జరుపుకున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతాల్లో ఆలయాలతో పాటు ఊరికి శివారులో ఉన్న జమ్మిచెట్టు వద్దకు వెళ్లారు. శ్రీశమీ శమియతే పాపం, శమీ శత్రు వినాశనం, అర్జునస్య ధనుద్ధారి, రామస్య ప్రియదర్శనంశ్రీ అంటూ జమ్మిచెట్టు వద్ద పూజలు చేశారు. ఒకరికొకరు జమ్మి ఇచ్చిపుచ్చుకుని, అలైబలై చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు దసరా ఉత్సవాలు అంబరాన్నంటాయి. మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో రాత్రి 7 గంటలకు బతుకమ్మకుంటలో జరిగిన రావణవధ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బతుకమ్మకుంటకట్టపై భారీ పది తలల రావణాసురుడి కటౌట్ ఏర్పాటు చేశారు. అంతకుముందు దుర్గామాత ఆలయంలో ఎమ్మెల్యే పల్లా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జమ్మి చెట్టువద్దకు వెళ్లారు. బతుకమ్మకుంటలో రావణవధ.. బతుకమ్మకుంటలో రావణవధ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో ఏఎస్సీ పండేరి చేతన్ నితిన్ పర్యవేక్షణలో సీఐ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు, పోలీసు సిబ్బంది బందోబస్తు చర్యలు చేపట్టారు. గంటపాటు బాణాసంచా పేల్చగా, జిగేల్మన్న స్టార్స్ కాంతుల్లో బతుకమ్మకుంట దేదీప్యమానంగా వెలుగొందింది. వేలాదిమంది కనులారా వీక్షిస్తుండగా, కుంటకట్టపై ఏర్పాటు చేసిన రావణాసురుడి కటౌట్ను పేల్చగా, ఒక్కో తల పేలిపోతున్న ఉద్విగ్న క్షణాల మధ్య జై శ్రీరామ్ నినాదాలు మారుమోగాయి. కార్యక్రమంలో జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్, బక్క శ్రీనివాస్, నర్సింగారావు తదితరులు పాల్గొన్నారు. మంచి ఆలోచనలు, సంప్రదాయాలు విస్తరించాలి: వేడుకల్లో ఎమ్మెల్యే పల్లా దసరా పండగ చెడుపై మంచిని కోరే సంకేతమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో మంచి ఆలోచనలు, సంప్రదాయాలు విస్తరించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్రెడ్డి, నాయకులు పోకల లింగయ్య, ముస్త్యాల దయాకర్, అనిత, పేర్ని స్వరూప, ఉల్లెంగుల సందీప్ తదితరులు ఉన్నారు. వాడవాడలా... పట్టణంలోని హెడ్పోస్టాఫీసు శ్రీ లక్ష్మిగణపతి దేవాలయం, అమ్మబావి ఉప్పలమ్మ, గుండ్లగడ్డ, పాతబీటు బజార్ శ్రీ రామలింగేశ్వర , బాణాపురం వెంటేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశ్వరస్వామి, మూలబావి శ్రీఆంజేయస్వామి, బాలాజీనగర్ ఎల్లమ్మ, శ్రీ సంతోషిమాత, గణేశ్ స్ట్రీట్ శ్రీ ఆంజనేయ, సరస్వతీ ఆలయాల్లో జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవుళ్లను చల్లంగా ఉండేలా దీవించాలని కోరుకున్నారు. గీతాశ్రమంతో పాటు పాతబీటుబజారు, గీతాశ్రమం, వీవర్స కాలనీ, జనగామ మండలం పెంబర్తిలో రావణవధ కార్యక్రమం నిర్వ హించారు. -
శ్రీసోమేశ్వర ఆలయానికి ‘శంఖదార’ సమర్పణ
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం వెండి శంఖదారను భక్తుడు సమర్పించినట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు తెలిపారు. స్వామివారి పూజాకార్యక్రమాల్లో అభిషేకం నిర్వహించడానికి హైదరాబాద్కు చెందిన భక్తుడు మెతుకు సంతోష్కుమార్, సుధ దంపతులు రూ.60,000ల విలువైన 500 గ్రాముల మిశ్రమ వెండితో శంఖదార తయారుచేయించి అందజేసినట్లు ఈవో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, అర్చకులు డీవీఆర్శర్మ, దేవగిరి అనిల్కుమార్, మత్తగజం నాగరాజు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. దసరా ఉత్సవాల్లో జాతీయ జెండావిష్కరణ లింగాలఘణపురం: మండలంలోని వనపర్తి, నెల్లుట్ల గ్రామాల్లో దసరా పండగ సందర్భంగా గురువారం జాతీయ జెండాలను ఆవిష్కరించారు. విజయానికి సూచికగా జరుపుకొనే దసరా ఉత్సవాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి జరుపుకోవడం ఆయా గ్రామాల్లో ఆనవాయితీగా వస్తోంది. అందులో వనపర్తిలో మాజీ సర్పంచ్ శ్రీధర్, ఎంపీటీసీ రాజిరెడ్డి, నాయకులు శంకరయ్య, కుమారస్వామి, సుదర్శన్రెడ్డి, మహేశ్, శ్రీనివాస్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నెల్లుట్లలో చిట్ల ఉపేందర్రెడ్డి జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. రామప్ప శిల్పకళాసంపద అద్భుతంవెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళాసంపద అద్భుతమని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన సతీమణి వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. గైడ్ తాడబోయిన వెంకటేష్ ఆలయ విశిష్టత గురించి వివరించగా రామప్ప శిల్పాకళాసంపద బాగుందని వారు కొనియాడారు, కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ ములుగు డీఈ నాగేశ్వర్రావు, విద్యుత్ అధికారులు వేణుగోపాల్, రమేష్, సాంబరాజు, సురేష్, కృష్ణాకర్ తదితరులు పాల్గొన్నారు. రుద్రేశ్వరాలయంలో త్రిశూల తీర్థోత్సవంహన్మకొండ కల్చరల్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలోని ప్రాచీన కోనేటిలో త్రిశూల తీర్థోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, సందీప్శర్మ, ప్రణవ్ రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం చేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు చేసి రాజరాజేశ్వరీదేవిగా అలంకరించారు. గంగు ఉపేంద్రశర్మ శ్రీరుద్రేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహం, త్రిశూలం, ఆయుధాలను పూజించిన అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి దేవాలయంలోని ప్రాచీన కోనేరులో శ్రీసూక్తవిధానంతో అవబృధస్నానం, జలాధివాసం నిర్వహించారు. అనంతరం శ్రీరుద్రేశ్వరీదేవి ఉత్సవమూర్తిని తిరిగి నిత్యపూజా కై ంకర్యాల కోసం దేవాలయంలో రుద్రేశ్వరుడిని సన్నిధిలో ప్రతిష్ఠించారు. త్రిశూల స్నానంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు. -
భద్రకాళిభద్రేశ్వరుల కల్యాణోత్సవం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణోత్సవం శుక్రవారం శోభాయమానంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో భాగంగా ఉదయం పూజారులు నిత్నాహికం జరిపి అమ్మవారిని పూలమాలలతో అలంకరించారు. రాత్రి శోభాయమానంగా అలంకరించిన వేదికపై జరిగిన భద్రకాళిభద్రేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని వీక్షించిన వందలాది మంది భక్తులు తన్మయత్వం చెందారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు, గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం తదితర కార్యక్రమాల అనంతరం శతఘటాభిషేకం నిర్వహించారు. వివాహమహోత్సవాన్ని పురస్కరించుకుని భద్రేశ్వరస్వామికి ద్వితీయ స్వర్ణ యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. అనంతరం వరపూజ, మధుపర్కవిధి, కాల్లుకడిగి కన్యాదానం చేయడం, మహాసంకల్పం మంగళాష్టకముల చూర్ణిక తదితర తంతు జరిపారు. వధూవరులకు జీలకర్రబెల్లం పె ట్టడం, మాంగల్యధారణ కార్యక్రమాలు నిర్వహించారు. కల్యాణం అనంతరం పుష్పయాగం చేశారు. ఆలయ ఈఓ సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు.. విజయ దశమితో దేవాలయంలో గురువారం శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఉదయం నిత్యాహ్నికం, కలశోద్వాసన జరిపి అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం, చక్రతీర్థోత్సవం, ధ్వజారోహణం జరిపారు. -
మహాత్ముడికి ఘన నివాళి
జనగామ: గాంధీ జయంతి పురస్కరించుకుని గురువారం జనగామ పట్టణంలోని కృష్ణకళామందిర్ జంక్షన్లోని గాంధీ విగ్రహానికి గురువారం కలెక్టర్ షేక్ రిజ్వాన్న్ బాషా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులతో కలిసి రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ గాంధీ మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, నాయకులు బక్క శ్రీనివాస్, మంత్రి శ్రీశైలం, గాదెపాక రాంచంద్రంతో కలిసి ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్య పట్టణ కార్యదర్శి గట్టు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధి పజ్జూరి జయహరి, బెల్దె శ్రీధర్, శివరామకృష్ణ, గట్టు శ్రీనివాస్, మిరియాల రమేశ్, దేవునూరి వెంకటేశ్వర్లు, దోస పాటి శ్రీనివాస్ తదితరులు బాపూజీకి నివా ళులర్పించారు. పిరమిడ్ స్పిర్చువల్ సీనియర్ మాస్టర్ రాజేందర్, గుంటిపల్లి మల్లికార్జున్ ఆధ్వర్యంలో మనిషి మేలుకో, జీవహింస మానుకో అనే నినాదంతో ప్రచారం, ర్యాలీ చేపట్టారు. -
రావణవధకు సిద్ధం
శమజనగామ: జిల్లాలో దసరా సందడి నెలకొంది. పట్టణంలో వ్యాపారం జోరందుకోవడంతో రహదారులన్నీ కిక్కి రిసిపోయాయి. జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో రావణవధకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రంగు రంగుల లైటింగ్, శబ్దకాంతుల మధ్య 2న(గురువారం) సాయంత్రం శోభాయమానంగా రావణవధ జరుగనుంది. అమ్మవారి నవరాత్రులు, దసరా పండగను పురస్కరించుకుని పలువురు కుటుంబాలు బొమ్మల కొలువును ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీ. జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో విజయదశమి(దసరా) రోజున రాము డు రావణునిపై విజయం సాధించిన రోజుగా భావిస్తారు. రావణవధ ఉత్సవాలకు సంబంధించి పది తలల రావణాసుర విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. మధ్యాహ్నం పాలపిట్ట దర్శనం చేసుకున్న తర్వాత, సాయంత్రం బతుకమ్మకుంటలో నిర్వహించే రావణవధ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది తరలివస్తారు. రావణవధ కోసం భారీ సెట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పది తలల రావణాసురున్ని రెండు గంటల పాటు పేల్చేలా బాణాసంచాను సిద్ధం చేశారు. ఆలయాల ప్రత్యేక శోభ.. పాలకుర్తి సోమేశ్వరస్వామి, జీడికల్ శ్రీ సీతారా ముల ఆలయం, కొడవటూరు సిద్దులగుట్ట, చిల్పూరు బుగులోని శ్రీ వేంకటేశ్వరస్వామి, జనగామలోని బాణాపురం శ్రీ వేంకటేశ్వరాలయం, పాతబీటు బజారు శ్రీ రామ లింగేశ్వరాలయం, చీటకోడూరు పంచకోసు శ్రీరామలింగేశ్వరాలయాలు దసరా పండగకు ముస్తాబయ్యాయి. భక్తుల సౌకర్యార్థం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా పండగను పురస్కరించుకుని ఎలాంటి గొడవలు, రోడ్డు ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆదేశాల మేరకు ఏసీపీ పండేరి చేతన్ నితిన్ ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు పెద్దఎత్తున బందోబస్తు చేపట్టనున్నారు. జిల్లాలో పండుగ సందడి శమీపూజకు ఏర్పాట్లు పూర్తి ఆలయాల ప్రత్యేక శోభ బతుకమ్మకుంటలో వేడుకలకు భారీగా తరలనున్న ప్రజలు రికార్డు స్థాయిలో మద్యం, మాంసం విక్రయాలు ఆర్టీసీకి భారీ ఆదాయం.. దసరా పండగ సందర్భంగా జనగామ ఆర్టీసీకి టికెట్ కలెక్షన్లు పెరిగాయి. సుదూర ప్రాంతాల నుంచి సుమారు లక్ష మందికి పైగా ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల ద్వారా స్వగ్రామాలకు చేరుకున్నారు. పండగతో మార్కెట్లు, బస్టా ండ్లు, పూల మార్కెట్లు, రహదారులు జనంతో సందడిగా కనిపించాయి. దసరా పండగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
● డీసీపీ రాజమహేంద్రనాయక్ జనగామ రూరల్: పండగ వేళల్లో రోడ్లపై రద్దీగా ఉంటుందని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనదారులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ సూచించారు. బుధవారం పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తా జంక్షన్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్– హన్మకొండ, సిద్దిపేట–సూర్యాపేట రోడ్లపై తనిఖీలు నిర్వహించారు. ఆయన వెంట సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సై చెన్నకేశవులు, రాజేశ్ కానిస్టేబుల్ ఉన్నారు. -
నాలుగు కత్తులు కలిస్తేనే దసరా!
గీసుకొండ: ఆ గ్రామంలో నాలుగు కత్తులు ఒక చోట కలిస్తేనే దసరా. ఈ ఆచారం సంవత్సరాలుగా సాగుతోంది. గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలో నాలుగు కుటుంబాలకు చెందిన ఒక్కో కత్తి గ్రామం మధ్యలోని ‘కచ్చీర్’కు తీసుకుని వచ్చి దసరా ఉత్సవాలను నిర్వహించడం ఆచారంగా వస్తోంది. గంగుల వీరయ్య కుటుంబం నుంచి ఒకటి, కొట్టె లక్ష్మయ్య కుటుంబం నుంచి ఒకటి, పోలెబోయిన వారి కుటుంబాల నుంచి రెండు కత్తులకు పూజలు చేసి ఇంటి నుంచి మందీమార్బలంతో అట్టహాసంగా తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత ఆయుధ పూజ చేసి కత్తుల(ఆయుధాల)తో సొరకాయను కట్చేసి కంకణాలు కట్టి దసరా పండుగను జరుపుకుంటారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. -
వినూత్నం.. విజయదశమి
గార్ల: దేశభక్తిని చాటుతూ దసరా రోజు మహబూబాబాద్ జిల్లా గార్లలో జాతీయ జెండాను ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తోంది. పండుగకు ఒకరోజు ముందు స్థానిక మసీదు సెంటర్లోని జెండా గద్దెకు రంగులు వేసి సిద్ధం చేస్తారు. నిజాం కాలంలో ప్రతీ దసరా రోజున నాటి తహసీల్దార్లు నెలవంక జెండాను ఎగురవేసేవారు. 1952లో గార్ల టౌన్ మున్సిపల్ చైర్మన్ మాటేడి కిషన్రావు కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మద్య ఘర్షణలు జరిగాయి. మెజారిటీ కౌన్సిలర్లు కమ్యూనిస్టు పార్టీకి చెందిన వారే ఉండడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు దేశభక్తికి చిహ్నంగా పార్టీలకు అతీతంగా దసరా రోజు జాతీయజెండాను ఎగురవేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో 1958 నుంచి మాటేడి కిషన్రావు జాతీయజెండాను ఎగురవేశారు. కొన్నేళ్ల తర్వాత గార్ల మున్సిపాలిటీని తీసేసి మేజర్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. నాటి నుంచి ప్రథమ పౌరుడైన సర్పంచ్ దసరా పండుగ రోజు జాతీయజెండా ఆవిష్కరిస్తున్నారు. గత ఏడాది సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో గార్ల మేజర్ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ మంగమ్మ జాతీయజెండా ఆవిష్కరించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి (దసరా)ని జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో కొలిచిన అనంతరం ఈరోజు విశిష్ట పూజలు చేస్తారు. అయితే, ఈసారి దసరా, గాంధీ జయంతి (అహింసా దినోత్సవం) ఒకేరోజు రావడంతో ఉమ్మడి జిల్లాలో పలువురు మద్యం, మాంసానికి దూరంగా ఉండాలని తీర్మానించారు. పలు ప్రాంతాల్లో వినూత్నంగా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పులివేషధారణ, కత్తిసాములు, విన్యాసాలు, పిట్టల దొరలు, బొమ్మల కొలువులు ఇలా ఎన్నోరకాలుగా పల్లెలు, పట్టణాల్లో సందడి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో 2న (గురువారం) వినూత్నంగా నిర్వహిస్తున్న దసరా వేడుకలపై సాక్షి ప్రత్యేక కథనం..ప్రత్యేకంగా వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు మద్యం, మాంసాహారానికి పలువురు దూరం ఉమ్మడి జిల్లాలో నేడు దసరా పండుగ -
ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
జనగామ రూరల్: రెండు విడతలుగా నిర్వహించనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సహకరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెనన్స్ హాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికలపై అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పింకేశ్ కుమార్తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో, సంబంధిత నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..జిల్లాలోని 12 మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నందున గ్రామీణ ప్రాంతాల్లోనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందన్నారు. జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండదన్నారు. జెడ్పీటీసీ 12 మండలాలలో 12 స్థానాలు కాగా, ఎంపీటీసీ 134 స్థానాలకు గాను 783 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అఖిలపక్ష పార్టీ ప్రతినిధుల సమావేశంలో ప్రతినిధులు కాంగ్రెస్ నుంచి బి.భాస్కర్, బీఆర్ఎస్ నుంచి రావెల రవి, సీపీఎం జోగు ప్రకాశ్, బీఎస్పీ తాండ్ర అఖిల్, బీజేపీ నుంచి జగదీశ్, జడ్పీ డిప్యూటీ సీఈవో సరిత, జిల్లా పంచాయతీ అధికారి స్వరూప, ఎన్నికల నోడల్ అధికారులు విక్రమ్ కుమార్, చంద్రశేఖర్, వెంకటరెడ్డి, రఘు, కలెక్టర్ కార్యాలయ ఏవో శ్రీకాంత్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు మారనున్న స్టేషన్ఘన్పూర్ రూపురేఖలు స్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు నిధులు మంజూరు చేసిందని, రానున్న రోజుల్లో ఘన్పూర్ మున్సిపాలిటీ రూపురేఖలు మారనున్నాయని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. స్టేషన్ఘన్పూర్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్తో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో బుధవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఘన్పూర్ మున్సిపాలిటీ నూతన కార్యాలయ భవనం, టౌన్హాల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామాలు, జంక్షన్ అభివృద్ధి పనులు, రోడ్డు వెడల్పు తదితర పనులకు నిధులు మంజూరయ్యాయన్నారు. డ్రైనేజీ వ్యవస్థ పునర్నిర్మాణం, తాగునీరు, సెంట్రల్ లైటింగ్ పనులను అంచనా వేసి టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వెజ్, నాన్వెజ్ మార్కెట్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించి పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ఆర్డీఓలు గోపీరామ్, డీఎస్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రెండు విడతలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
2015 నుంచి బంగారం ధరలు(10 గ్రాములు)
24 క్యారెట్లు 22 క్యారెట్లు39,10835,849 31,39150,15128.77529,156 45,972 26,72627,44525,158 24,93122,8532015 2016 2017 2018 2019 2020 2021 2022 2023 2024 2025 -
పాకాలలో పర్యాటకుల సందడి
ఖానాపురం: ఖానాపురం మండలంలోని పాకాలలో పర్యాటకుల సందడి నెలకొంది. పండుగ సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చి పాకాల మత్తడి వద్ద సందడి చేశారు. బోటింగ్ చేయడంతో పాటు లీకేజీ నీటిలో జళకాలాడుతూ ఉత్సాహంగా గడిపారు. దీంతో పాకాలలో సందడి నెలకొంది. పరవళ్లు తొక్కుతున్న పాకాల ధాన్యాగార ప్రాంతానికి ప్రధాన నీటి వనరు పాకాల. ఈ సరస్సు ఆగస్టు 15వ తేదీ నుంచి నేటి వరకు మత్తడి పోస్తోంది. సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టం 30.3 ఫీట్లు కాగా పూర్తిస్థాయిలో నిండుకొని 47 రోజులుగా మత్తడి పోస్తుంది. కురుస్తున్న వర్షాలతో సరస్సులో నిండుకుండలా ఉండటంతో మత్తడి పరవళ్లు కొనసాగుతోంది. -
సాదాబైనామాలను వేగంగా పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ బచ్చన్నపేట: భూభారతి చట్టంలో ఆయా గ్రామాల వారీగా వచ్చిన భూ సమస్యలను, సాదాబైనామాలను వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..జీపీఓలు ఎంఆర్ఐలు గ్రామాల్లో పర్యటించి భూసమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. ఎవరి ప్రలోభాలకు లొంగకూడదని చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామానుజాచారి, డిప్యూటీ తహసీల్దార్ శంకర్, ఎంఆర్ఐలు వంశీకృష్ణ, మున్వర్, సిబ్బంది యాకయ్య, జీపీఓలు పలువురు పాల్గొన్నారు. -
ఆందోళన కలిగిస్తోంది..
మా అమ్మాయి పెళ్లి కోసం బంగారం కొనే ఆలోచనలో ఉన్నాం. కానీ ధరలు తగ్గితే కొనాలని వాయిదా వేసుకున్నాం. అయితే ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడంతో ఇకపై తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. – చింతకింది ఉమ, గృహిణి, పాలకుర్తి బంగారం కొనలేము.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక గ్రాము బంగారం కొనలేము. వారం రోజుల కిందట నా కూతురు వివాహం చేశాను. ఐదు తులాల బంగారం కోసం రూ.5లక్షలు తీసుకుని వెళితే, నాలుగు తులాల మాత్రమే వచ్చింది. మరో 10 గ్రాములు పెండింగ్లో ఉంది. – గంధమాల కిష్టయ్య, బచ్చన్నపేట తయారీ తగ్గింది.. బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో ఆభరణాలు చేయించుకునే వారి సంఖ్య తగ్గింది. గతంలో ప్రతి నెల వంద కుటుంబాలు ఆభరణాలు తయారు చేయించుకుంటే, ప్రస్తుతం పదిమందికి పడిపోయింది. చాలా మంది బంగారం బిస్కెట్లు కొనుగోలు చేసి భద్రపరుచుకుంటున్నారు. దీంతో ఆభరణాల తయారీ కార్మికులకు ఆర్థిక భరోసా దూరమవుతోంది. – నల్లనాగుల శ్రీనివాస్, జ్యువెల్లరీ వ్యాపారి, జనగామ ● -
జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు గురుకుల విద్యార్థి
స్టేషన్ఘన్పూర్: ఎస్జీఎఫ్ అండర్–19 విభాగంలో జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు స్టేషన్ఘన్పూర్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థి మారపాక గిరీశ్వర్ధన్ ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రఘుపతి, పీడీ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు జనగామలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్ 19 ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొన్న స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవతర్సం (ఎంపీసీ) చదువుతున్న విద్యార్థి గిరీశ్వర్ధన్ ఉత్తమ ప్రతిభతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. అక్టోబర్ 5 నుంచి 8వ తేదీ వరకు జమ్ముకశ్మీర్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో మూడో స్థానం..చిల్పూరు: మండలంలోని చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన గుంపుల రామ్మోహన్రెడ్డి–శిరీష కుమారుడు అశ్వతేజ్రెడ్డి జాఈయ స్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని మూడో స్థానంలో నిలినట్లు జిల్లా అధ్యక్షుడు గాదెపాక అయోధ్య, ప్రదాన కార్యదర్శి నీరటి ప్రభాకర్ తెలిపారు. గ్రామానికి చెందిన అశ్వతేజ్రెడ్డి ప్రస్తుతం ఐనవోలు మండల కేంద్రంలోని పాత్ఫైండర్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల జఫర్గఢ్ మండలం కూనూరు గ్రామంలో నిర్వహించిన 44వ సబ్ జూనియర్ బాల్బ్యాడ్మింటన్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. అందులో భాగంగా ఈనెల 25 నుంచి 28 వరకు తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్లో నిర్వహించిన పోటీల్లో తెలంగాణ టీమ్ నుంచి పాల్గొని మూడో స్థానంలో నిలిచినట్లు కోచ్ ముచ్చ సుధాకర్రెడ్డి తెలిపారు. -
ఉత్పాదకతకు ఊతం
జనగామ రూరల్: వ్యవసాయ ఉత్పాదకత పెంచి ఆర్థిక ఎదుగుదలకు కేంద్ర ప్రభుత్వం మరింత భరోసా కల్పించేందుకు ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన పథకం ఉపయోగపడనుంది. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, పంటల వైవిధ్యీకరణ, మెరుగైన నీటిపారుదల, రుణాల సులభతరం లక్ష్యంగా ఈ పథకం వ్యవసాయ రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 100 జిల్లాలను గుర్తించగా ఇందులో తెలంగాణ నుంచి ఎంపికై న 4 జిల్లాల్లో జనగామ జిల్లాకు చోటు లభించింది. ఎంపికై న జిల్లాల్లో రూ.960 కోట్ల వార్షిక వ్యయంతో ఆరేళ్లపాటు ఈ పథకం అమలుకానుంది. వ్యవసాయ ఉత్పాదకత, పంటల మార్పిడి, నీటిపారుదల, నిల్వ, ఉత్పత్తుల విలువ పెంచే విధంగా ప్రాసెసింగ్ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వ్యవసాయ రంగం అభివృద్ధి చెందనుంది. పథకం అమలు విధానం జిల్లాల్లో ఉత్పాదకత, మౌలిక సదుపాయాలు రైతులు ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈపథకం అమలవుతోంది. 36 కేంద్ర, రాష్ట్ర పథకాల సమన్వయం చేస్తూ ఈ పథకం కింద 11 మంత్రిత్వ శాఖలు, విభాగాల కింద అమలుకానున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి ఫసల్ బీమాయోజన, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్, మిషన్ ఆన్, ఆయిల్ పామ్, హార్టికల్చర్ మిషన్, కృషి యోజన ఉన్నాయి. జిల్లా స్థాయి కమిటీలు, రాష్ట్ర స్థాయి స్టీరింగ్ గ్రూపులు, జాతీయస్థాయి పర్యవేక్షణ సంస్థలతో ఈ పథకం మూడు అంచెల ద్వారా అమలవుతోంది. జిల్లా స్థాయిలో, కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ధన్ధాన్య కృషి సమితి ఏర్పాటు కానుంది. ప్రణాళికలు ఇలా.. జిల్లాస్థాయిలో బేస్ లైన్ సర్వే నిర్వహించి ఉత్పాదకత లోపాలు, నీటి వనరులు, మార్కెట్ మౌలిక సదుపాయాలు, కోల్ట్ స్టోరేజ్, రుణాల పరిస్థితి మొదలైన అంశాలను విశ్లేషణ చేసి వాటి ఆధారంగా 5 సంవత్సరాల ఫలితాల ఆధారిత కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. క్షేత్రస్థాయి పర్యవేక్షణను బలోపేతం చేయడానికి, ప్రతి జిల్లాకు కేంద్ర నోడల్ అధికారులను నియమిస్తారు. పురోగతిని పర్యవేక్షించడం, స్థానిక బృందాలతో సమన్వయం చేసుకోనున్నారు. అన్ని కన్వర్జింగ్ పథకాల సమన్వయ అమలుకు మార్గనిర్దేశం చేస్తూ జిల్లా పురోగతిని కేంద్ర పర్యవేక్షణ పనితీరు సూచికలు ఉపయోగించి ట్రాక్ చేస్తూ పనితీరును అంచనా వేయడానికి, అంతరాలను గుర్తించి జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడానికి నెలవారీగా సమీక్షిస్తారు. ఈ పథకం పంటల వ్యవసాయం మాత్రమే కాకుండా పండ్లు, మత్స్య సంపద, తేనెటీగల పెంపకం, పశుసంవర్ధకం, వ్యవసాయ అటవీ రంగాలపై దృష్టి పెడుతుంది. స్కేల్, టెక్నాలజీ, సంస్థాగత బలాన్ని పెంచడం ద్వారా ఈ పథకం గ్రామీణ ఉత్పాదకతలో విశేషమైన మార్పు తీసుకరానుంది. పథకం లక్ష్యాలు.. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించడం సుస్థిర వ్యవసాయ పద్ధతులను విస్తరించడం పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంట కోత అనంతరం నిల్వ సదుపాయాలను బలోపేతం చేయడం మైక్రోఇరిగేషన్ వంటి నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యవసాయ రుణాలను సులభతరం చేయడం.పీఎం ధన్ధాన్య కృషి యోజన పథకానికి జనగామ ఎంపిక పంటల వైవిధ్యీకరణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులకు ప్రోత్సాహం నీటిపారుదల, మౌలిక సదుపాయాల మెరుగు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలకు ప్రాధాన్యంసమగ్ర వ్యవసాయమే లక్ష్యం ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన పథకం కింద జనగామ జిల్లా ఎంపికై ంది. వ్యవసాయంలో అత్యంత నిరంతర నిర్మాణాత్మక సవాళ్లను పరిష్కరిస్తూ ఉత్పాదకతను పెంచడానికి, స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించ డానికి, జీవనోపాధిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. – కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
నేటి రాత్రి 12గంటల వరకే మాంసం అమ్మకాలు
జనగామ: దసరా పండగ రోజు గాంధీ జయంతి రావడంతో ఈనెల 1న (బుధవారం) రాత్రి 12 గంటల వరకు జిల్లా కేంద్రంలో మాంసం విక్రయాలు జరుగుతాయని ఆరె కటిక సంఘం జనగామ అధ్యక్షుడు కె.హరిప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా నిబంధనల ప్రకారం మాంసం దుకాణాలు మూసి ఉంటాయన్నారు. గాంధీ జయంతి రోజు దసరా రావడంతో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మటన్ షాపు నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దసరా పండుగకు ముందు రోజు అర్ధరాత్రి వరకు మాంసం విక్రయిస్తామన్నారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలన్నారు. విద్యుత్ అధికారుల పొలంబాటఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ జనగామ: రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా విద్యుత్ అధికారులు పొలంబాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ టి.వేణుమాధవ్ తెలిపారు. మంగళవారం సర్కిల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. జిల్లాలో ప్రమాదకరంగా ఉన్న 2,083 లూజ్ లైన్లు, 191 వంగిన స్థంభాలు 2,131 మధ్య స్థంభాలను పునరుద్ధరించడం జరిగిందన్నారు. రైతులు విద్యుత్ సమస్యలు ఉత్పన్నమైన సమయంలో టోల్ ఫ్రీ నెంబర్–1912కు కాల్ చేసి పరిష్కారం పొందవచ్చన్నారు. రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఎస్టిమేట్కు సంబంధించిన మెటీరి యల్ వివరాలు, స్కెచ్లు ఇప్పుడు తెలుగులో అందజేస్తున్నామని, రైతులకు వచ్చే ఎస్ఎంహెచ్ లింక్ ద్వారా వీటిని తెలుసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లు అమర్చితే మోటార్ల జీవిత కాలం పెరుగుతు ందని, లో వోల్టేజి సమస్యలు తగ్గుతాయని స్పష్టం చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పక్కాగా అమలు చేయాలిపాలకుర్తి టౌన్: ఎన్నికల ప్రవర్తన నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ను పక్కాగా అమలు చేయాలని జిల్లా సహకార అధికారి, జెడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.కోదండరాములు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలయ్యేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని అన్నారు. కోడ్ను ఉల్లంగిస్తే చర్యలు ఉంటాయన్నారు. సమావేశంలో ఎంపీడీవో రవీందర్, ఏంఈఓ పోతుగంటి నర్సయ్య, ఎంపీవో వేణుమాధవ్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పసునూరి నవీన్, మాచర్ల ఎల్లయ్య, సారయ్య, ఎడవెల్లి సోమయ్య, జీవై సోమయ్య, కత్తి సైదులు తదితరులు పాల్గొన్నారు. ఎంజీఎం: ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) జాతీయ ప్యానెల్లో తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడా) నాయకులు ఘన విజయం సాధించారు. ఫైమా జాతీయ కో–చైర్మన్గా డాక్టర్ దుబ్యాల శ్రీనాథ్, జాతీయ కార్యదర్శిగా డాక్టర్ ఇస్సాక్ న్యూటన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తమపై నమ్మకం ఉంచి మద్దతు ఇచ్చిన సహచర వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిపాలకుర్తి టౌన్: పాలకుర్తి–నాంచారిమడూరు ప్రధాన రహదారిపై సిరిసన్నగూడెం శివారులోని కంబాలకుంట బస్స్టేజీ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని దర్థేపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి వెంకన్న(35) మోటర్ సైకిల్లో పెట్రోల్ పోయించుకునేందుకు మల్లంపల్లి శివారులోని పెట్రోల్ బంకు వద్దకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా వెనుక నుంచి డీసీఎం వ్యాన్ బలంగా ఽఢీకొట్టింది. దీంతో మోటర్ సైకిల్తో పాటు కిందపడ్డ వెంకన్న తలకు తీవ్రగాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వెంకన్న భార్య పది రోజుల క్రితం ప్రసవించగా కుమారుడు జన్మించాడు. మృతుడి తండ్రి కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూలం పవన్కుమార్ తెలిపారు. -
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వర్తించాలి
జనగామ రూరల్: ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని, అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఎన్నికల విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్తో కలిసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల విధులు, బాధ్యతలు, నిబంధనలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు వారికి ఇచ్చిన హ్యాండ్బుక్ను క్షుణ్ణంగా చదివి ప్రతీ అంశంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మాస్టర్ ట్రైనర్లు ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, నిర్వహణ ప్రక్రియలో ఏమైనా సందేహాలు, అపోహలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి బాధ్యత నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారిదేనని, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పోలింగ్ సిబ్బంది నియామకం, వారికి పోలింగ్కు సంబంధించిన సామగ్రి సమకూర్చడం మొదలగు ప్రతి అంశాలను క్షుణ్ణంగా పర్యవేక్షించాలన్నారు. అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ మాట్లాడుతూ..మ్యాన్ పవర్, బ్యాలట్, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, మాడల్ కోడ్ అఫ్ కండక్ట్, బ్యాలెట్ పేపర్ ముద్రణ తదితర ఎన్నికల నిర్వహణ బాధ్యతలను చేపట్టే నోడల్ అధికారులు తమ విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, డీప్యూటీ సీఈవో సరిత, ఎన్నికల నిర్వహణకు వివిధ అంశాలకు కేటాయించిన ఆర్వోలు, ఏఆర్వోలు, మాస్టర్ ట్రైనర్లు రామరాజ్, సురేందర్రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల నియమావళిపై పూర్తి అవగాహన ఉండాలి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
బంగారం కొనుగోలు వినియోగదారులుప్రస్తుతం జనగామ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,22,100ల వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,12,300లు పలుకుతోంది. వెండి ధరలు కూడా అంతే వేగంగా పెరిగి కిలోకు రూ.1,50,000లకు చేరుకుంది. గడిచిన ఆరు నెలలతో పోలిస్తే ఇవి దాదాపు 40 శాతం మేర పెరిగినట్లుగా గణాంకాలు చెబుతు న్నాయి. 2024 దసరా సమయంలో 10 గ్రాముల బంగారం ధర రూ.78 వేలు ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.72వేలు మాత్రమే పలికింది. వెండి కిలో రూ.94 వేల వరకు ధర పలుకగా, ఏడాదిలోపే 10 గ్రాముల బం గారం రూ.44వేలు, వెండి కిలో రూ.56 వేల వరకు పెరగడం గమనార్హం. రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు.. -
పింఛన్లను తక్షణమే పెంచాలి
● ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోడ సునీల్మాదిగస్టేషన్ఘన్పూర్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా సీఎం రేవంత్రెడ్డి దివ్యాంగులకు, వృద్ధులకు, వితంతవులకు తక్షణమే పింఛన్లను పెంచాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జనగామ జిల్లా ఇన్చార్జ బోడ సునీల్మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం ఘన్పూర్ డివిజన్కేంద్రంలో ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్, ఎంఎస్పీ జిల్లాస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.. దివ్యాంగుల పెన్షన్ను రూ.4వేల నుంచి రూ.6వేలకు, వృద్ధులు, వితంతువుల పెన్షన్ను రూ.2016 నుంచి రూ.4వేలకు పెంచుతానని ఎన్నికల సీఎం రేవంత్రెడ్డి చేసిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. లేనిపక్షంలో సీఎం రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 6 నుంచి నవంబర్ 6వ తేదీవరకు నిర్వహించనున్న మహాదీక్షలను ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్, ఎంఎస్పీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బొట్ల మహేశ్, గాదె శ్రీధర్, గుర్రం నవీన్, గుర్రం అశోక్, సంపత్, సోమన్న, శ్రీను, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. -
అవమానించిన చోటే..గౌరవం పొందాలని
● గ్రూప్–2లో కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగం సాధించిన శ్రావణిరఘునాథపల్లి: అవమానించబడ్డ చోటే గౌరవం పొందాలన్న కసి ఆమెను విజయతీరాలకు చేర్చింది. అంకిత భావంతో అహర్నిషలు చదివి అనుకున్నది సాధించింది రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన కౌంసాని శ్రావణి. ఆమెకు మూగ, వినికిడి సమస్యలు ఉండేవి. దీంతో అనేక అవమానాలకు గురైంది. వెక్కిరించిన వారి నోళ్లను మూయించాలంటే చదువే ఆయుధంగా భావించింది. తాజాగా టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూపు–2 ఫలితాల్లో మెరుగైన ర్యాంకు సాధించి కో ఆపరేటివ్ సొసైటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ఉద్యోగం పొందింది. మొదట జేపీఎస్గా, ప్రస్తుతం జిల్లా కేంద్రంలో స్టాంప్ అండ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తోంది. జేపీఎస్గా పనిచేస్తున్న సమయంలో వినికిడి సమస్య కారణంగా అనేక ఇబ్బందులు పడింది. అహర్నిశలు శ్రమించి గ్రూప్–2 ఉద్యోగం సాధించింది. భర్త బాల్రెడ్డి ఎంతో అండగా నిలిచి ప్రోత్సహించారని శ్రావణి తెలిపింది. -
స్థానిక సంగ్రామం
జనగామ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత గ్రామపంచాయతీ ఎలక్షన్లను నిర్వహిస్తామని ప్రకటించింది. ఈసీ ప్రకటనతో పల్లెల్లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం హీ టెక్కింది. జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్ పరిధిలో 12 మండలాలు ఉండగా, 12 జెడ్పీటీసీ స్థానాలు, 134 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొదటి విడత అక్టోబర్ 9, రెండో విడత 27న పోలింగ్ జరుగనుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికార యంత్రాంగం ఎలక్షన్ నిర్వహణపై పూర్తి స్థాయి దృష్టి సారించింది. రెండు దశల్లో పోలింగ్.. జిల్లాలో ఎలక్షన్లు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు సంబంధించి వచ్చే నెల అక్టోబర్ 9వ తేదీన నామినేషన్ల స్వీకరణ మొదలు కానుండగా, 23వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో దశ ఎన్నికలు 13న నామినేషన్లు, 27న పోలింగ్ జరుగనుంది. జిల్లాలోని 12 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 12 జెడ్పీటీసీలు, 134 మంది ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల పరిధిలో 294 పోలింగ్ లొకేషన్లు ఉండగా, 783 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొదటి దశలో 6 మండలాల పరిధిలో 70 ఎంపీటీసీలు, రెండో దశలో 6 మండలాల పరిధిలో 64 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎలక్షన్ అధికారులు, సిబ్బంది సిద్ధం.. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని ఆర్వోలు, ఏఆర్వోలు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఏపీఓలు, ఓపీఓలకు బాధ్యతలు కేటాయించారు. పోలింగ్ సెంటర్లు సిద్ధం చేసి, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దసరా పండుగ–ఓటర్ల ప్రసన్నం.. దసరా పండుగ వాతావరణం ఈ ఎన్నికలకు ప్రత్యేక రుచిని తెచ్చింది. పండుగ వేళను దృష్టిలో ఉంచుకొని ఆశావాహులు ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేసేందుకు సిద్ధమవుతూనే... తమ వర్గాల మద్దతు బలపడేలా ప్రత్యేక వ్యూహాలు రూపొందిస్తున్నారు. కోడ్ అమలులోకి.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా స్థానిక సంస్థల ఎలక్షన్ నేపథ్యంలో జిల్లాలో కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏఎస్పీ చేతన్ పండేరి నితిన్తో కలిసి కలెక్టరేట్ సమావేశం హాల్లో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నిలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయగా, వచ్చే నెల 9వ తేదీన నోటీసు జారీ చేస్తుందన్నారు. మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో 9వ తేదీ (చివరి తేదీ 11), రెండో విడతలో 13వ తేదీ (చివరి తేదీ15) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందన్నారు. మొదటి విడత అభ్యర్థుల ఫైనల్ జాబితా 15న, రెండో విడత 19న ప్రచురించడం జరుగుతుందన్నారు. మొదటి విడతలో 23, రెండో విడత 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీలు, అభ్యర్థులు నియమావళిని పాటించాలన్నారు. జిల్లాలోని మునిసిపాలిటీల పరిధిలో ఎన్నికల కోడ్ ఉండదన్నారు. మోగిన ఎన్నికల నగారా రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జిల్లాలో రెండు విడతల్లోనే సర్పంచ్ ఎన్నికలు 12 జెడ్పీటీసీలు, 134 ఎంపీటీసీలు, 280 గ్రామపంచాయతీలు 4,01,496 మంది ఓటర్లురెండు విడతల్లోనే సర్పంచ్ ఎన్నికలు.. జిల్లాలో 280 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,534 వార్డులు, 30 వందశాతం ఎస్టీ జీపీలు ఉండగా, షెడ్యూల్డ్ ఏరియా జీపీలు 241 ఉన్నాయి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతుండగా, జిల్లాలో మాత్రం రెండో విడత నుంచి నుంచి ప్రారంభంకానున్నాయి. రెండో విడత నవంబర్ 4న, మూడో విడత 8వ తేదీన పోలింగ్ జరుగనుంది. రెండో విడతలో 7 మండలాల పరిధిలో (142 జీపీలు), మూడో విడతలో 5 మండలాల పరిధి(138 జీపీలు)లో పోలింగ్ జరుగనుంది. రెండో విడతలో జరిగే జీపీలు చిల్పూరు మండలం (17 జీపీలు, 168 వార్డులు), స్టేషన్ఘన్పూర్(15/46), జ ఫర్గడ్(21/94), రఘునాథపల్లి (36/320), లింగాలఘణపురం (21/196), నర్మెట(17/48), తరిగొప్పుల (15/126), మూడో విడతలో బచ్చన్నపేట (26/238), జనగామ(21/198), దేవరుప్పుల(32/274), పాలకుర్తి (38/33 6), కొడకండ్ల(21/190) జీపీల పరిధిలో ఎలక్షన్లు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. -
పూలసంబురం
అంబరాన్నంటినజిల్లావ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ ● మహిళలు, చిన్నారులతో కిక్కిరిసిపోయిన బతుకమ్మకుంట ప్రాంగణం ● ఆటాపాటలతో మురిసిన మహిళలు ● గౌరమ్మకు ఘనంగా వీడ్కోలుజనగామ: తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సద్దుల బతుకమ్మ పండుగ సంబురాలు సోమవారం అంబరాన్నంటాయి. తొమ్మిది రోజుల పాటు సంప్రదాయ రీతిలో సాగిన బతుకమ్మ ఉత్సవాలు ముగిశాయి. జిల్లా కేంద్రంతో పాటు పాలకుర్తి, స్టేషన్న్ఘన్పూర్, జనగామ నియోజకవర్గాల పరిధిలోని ప్రతీపల్లె పూలవనంలా మారింది. శ్రీఏమేమీ పువ్వొప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వొప్పునే గౌరమ్మశ్రీ అంటూ తాళాలతో పలికిన పాటలు గగనాన్ని తాకాయి. గ్రామాలన్నీ ఆట, పాటలతో మార్మోగిపోయాయి. చివరగా మహిళలు గౌరమ్మను గంగమ్మ ఒడికి చేరవేస్తూ వచ్చే ఏడాది మళ్లీ రావమ్మా అని ప్రార్థించారు. బతుకమ్మకుంటలో.. పట్టణంలోని బతుకమ్మకుంటలో జరిగిన సద్దుల వేడుకలకు 30 వార్డుల నుంచి మహిళలు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. బతుకమ్మకుంట విద్యుత్తు దీపాల అలంకరణ, రంగురంగుల హరివిల్లులతో దేదీప్యమానంగా వెలుగొందింది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పట్టణ నలుమూలల నుంచి పెద్ద బతుకమ్మలతో మహిళలు ఇక్కడకు చేరుకున్నారు. మహిళల పాటలు, వేలాది చప్పట్లతో బతుకమ్మకుంట భక్తి పారవశ్యంతో ఓలలాడింది. వాడవాడలా అలాగే పట్టణంలోని పాతబీటు బజారు, అంబేడ్కర్, ధర్మకంచ, బాలాజీ నగర్, శ్రీనగర్, తహసీల్ కార్యాలయం, రైల్వేస్టేషన్, జీఎంఆర్, శ్రీ విల్లాస్, హౌజింగ్ బోర్డు, జ్యోతినగర్ కాలనీలు, కుర్మవాడ, గోకుల్నగర్, హెడ్్ పోస్టాఫీసు, శ్రీ సాయిరెసిడెన్సి, చమన్ ఏరియా, గణేశ్ స్ట్రీట్, ధర్మకంచ, గుండ్లగడ్డ తదితర ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ ముగింపు సంబురాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ నిమజ్జనం.. సద్దుల వేడుకలను ఘనంగా నిర్వహించుకున్న మహిళలు నిమజ్జనంతో బతుకమ్మకు వీడ్కోలు పలికారు. ‘ఇస్తినమ్మా వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం..’ అనుకుంటూ మహిళలు అందరూ ఒక చోట చేరి ప్రసాదం ఇచ్చి పుచ్చుకున్నారు. వేడుకల్లో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు రంగు బాలలక్ష్మి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, డీసీపీ రాజమహేంద్రనాయక్, అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్ షాలోమ్, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సతీమణి పల్లా నీలిమ, మునిసిపల్ మాజీ చైర్పర్సన్లు పోకల జమునలింగయ్య, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మహిళా మాజీ కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. డీసీపీ ఆదేశాల మేరకు ఏఎస్పీ ఆద్వర్యంలో సీఐ సత్యనారాయణ రెడ్డి, ఆయా ప్రాంతాల ఏసీపీ, సీఐ, ఎస్సై, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, వేడుకలు ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిఘా వేశారు. -
కమిషనరేట్లో పోలీస్ అధికారుల బదిలీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ కంట్రోల్ రూం ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న డి.విశ్వేశ్వర్ గీసుకొండకు, గీసుకొండ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆకునూరి మహేందర్ పోలీస్ కంట్రోల్ రూంకు బదిలీ అ య్యారు. టాస్క్ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న కె.వంశీకృష్ణ గీసుకొండ పోలీస్ స్టేషన్కు, సంగెంలో పని చేస్తున్న నరేశ్ను మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్కు, బి.రామారావు సుబేదారి నుంచి జఫర్గఢ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలని నిరసన జనగామ రూరల్: తరిగొప్పుల మండలం అంకుశాపూర్ గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ ఎస్సీకి కేటాయించాలని గ్రామంలోని నాయకులు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. 1957 నుంచి అన్ని కులాలకు రిజర్వేషన్ ఇచ్చారని కానీ ఎస్సీ కులానికి ఇప్పటివరకు సర్పంచ్ రిజర్వేషన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ అభ్యర్థులకు రిజర్వేషన్ వచ్చేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో భిక్షపతి, నాగభూషణం కిరణ్కుమార్, పైసా ప్రేమ్కుమార్, జంజాల సంతోష్, మాచర్ల ప్రేమ్కుమార్, చిన్న మూర్తి, ప్రభుదాస్ పాల్గొన్నారు. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపిక జనగామ రూరల్: టీజీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాల్లో పట్టణంలోని వికాస్ నగర్కు చెందిన గుండా అరుణాదేవి ఎంపిక అయ్యారు. గృహిణిగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఆన్లైన్ కోచింగ్ తీసుకొని ఇంటి వద్ద ప్రణాళిక బద్ధంగా పోటీ పరీక్షకు సన్నద్ధమై విజయం సాధించారు. భర్త చంద్రశేఖర్ కృషి, పిల్లల ప్రోత్సాహం ఉందని ఆమె తెలిపారు. జఫర్గఢ్ నూతన ఎస్సైగా రామారావు జఫర్గఢ్: జఫర్గఢ్ నూతన ఎస్సైగా బి.రామారావును నియమిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్గా సన్ ప్రీత్సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్కు గురైన ఎస్సై రామ్చరణ్ స్థానంలో సుబేదారి పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న రామారావును జఫర్గఢ్ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. టీఏపీటీఏ జిల్లా అధ్యక్షుడిగా దిలీప్ కుమార్ పాలకుర్తి టౌన్: తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్(టీఏపీటీఏ) జిల్లా అధ్యక్షుడిగా మండల కేంద్రంలోని సుధా హైస్కూల్ ఉపాధ్యాయడు పోలాస దిలీప్కుమార్ను నియమిస్తు ఆసంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు చందర్లాల్ నాయక్ చౌహన్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈసందర్భంగా దిలీప్కుమార్ మాట్లాడుతూ.. ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కమీషన్ బకాయిలు వెంటనే చెల్లించాలి జనగామ రూరల్: జిల్లాలో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ బకాయిలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర రేషన్ డీలర్ల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళీధర్రావు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లో ఏవో శ్రీకాంత్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తంగా 330 రేషన్ షాపులు ఉన్నాయని, గత ఆరు నెలల కమీషన్ రాక డీలర్లు నానా ఇబ్బందులు పడ్తున్నారన్నారు. బకాయిలు విడుదల చేయకపోతే అక్టోబర్ నుంచి రేషన్ షాపులు బంద్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఊటుకూరు సబ్బానీ శ్రీధర్, దేవసాని గాలయ్య, చెవ్వా శ్రీను, యాదగిరి, జయపాల్రెడ్డి, మల్లయ్య, దయాకర్, రామగల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సీటీఓగా శివశంకర వరప్రసాద్
జనగామ: గ్రూప్–1 ఫలితాల్లో జనగామ పట్టణానికి చెందిన తగరపు నర్సింహులు, పద్మ దంపతుల మూడో కుమారుడు తగరపు శివశంకర వరప్రసాద్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (సీటీఓ)ఎంపికయ్యారు. పట్టణంలోని సెయింట్పాల్స్ హైస్కూల్లో ప్రాథమిక, ఉన్నత విద్యను పూర్తి చేసిన వరప్రసాద్, ఏబీవీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీఈ చేశారు. మొదటి ప్రయత్నంలోనే నిర్వహించిన గ్రూప్–1 పరీక్షల్లో రాష్ట్రంలో 330వ ర్యాంకు సాధించారు. వరప్రసాద్ను తల్లిదండ్రులు, పట్టణప్రజలు అభినందించారు. -
పండగ జరుపుకునేదెలా?
జనగామ: నాలుగు నెలలుగా వేతనాలు లేక పస్తులు పడుతున్న జనగామ చంపక్హిల్స్ మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్) ఆల సర్వీసెస్ కాంట్రాక్టు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సద్దులు, దసరా పండగ సందర్భంగా చేతిలో చిల్లిగవ్వ లేక సంబురాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెల కొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం కార్మికులు ఎంసీహెచ్ ఎదుట తమ ఆవేదన వెలిబుచ్చారు. పండగ సమయంలో ఆర్థిక ఇబ్బందులు రాకుండా, కుటుంబాలతో కలిసి ఆనందంగా గడిపేందుకు వేతనాలు విడుదల చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్, కలెక్టర్ దృష్టికి సైతం తీసుకువెళ్లామ న్నారు. 80 మంది కార్మికులకు సంబంధించి పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంసీహెచ్ ఎదుట కార్మికుల ఆవేదన -
ఎస్సీ మహిళకు జెడ్పీ పీఠం
జనగామ: జిల్లా జెడ్పీ పీఠం ఈసారి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో జిల్లా రాజకీయాల్లో కసరత్తుల ఎంపిక ఉత్కంఠ కలిగిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండు పార్టీలు అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేయనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు కావడంతో సర్వత్రా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. జెడ్పీ రిజర్వేషన్ ఎస్సీ మహిళకు కేటాయించడంతో జిల్లా రాజకీయాలు పరిషత్ చుట్టూనే తిరగడంతో పాటు రాజకీయ సమీకరణాలు సైతం మారిపోయాయి. జిల్లాలో జెడ్పీ పీఠం కోసం అధికార కాంగ్రెస్ ఇప్పటికే వ్యూహరచన మొదలు పెట్టింది. స్టేషన్ఘన్పూర్ కాంగ్రెస్ ఇన్చార్జ్ సింగపురం ఇందిర లింగాలఘణపురం నుంచి జెడ్పీటీసీ బరిలో దిగుతారనే ప్రచారం వినిపిస్తోంది. జిల్లాలో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే చివరకు ఇందిరనే జెడ్పీ చైర్మన్ పదవిని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు ఆ పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ కూడా తమకు బలమైన అభ్యర్థిని నిలబెట్టి పీఠాన్ని దక్కించుకునేందుకు అంతకన్నా రెట్టింపు కసరత్తులు చేస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనగామ మండలం నుంచి కాంగ్రెస్ పార్టీలో డాక్టర్ రాజమౌళి, గనిపాక మహేందర్, బక్క శ్రీనివాస్ పేర్లు వినిపిస్తుండగా, బీఆర్ఎస్ నుంచి పగిడిపాటి సుధసుగుణాకర్రాజు, కొమ్ము రాజు, మరో ఇద్దరు బరిలో నిలిచేందుకు ముందుకొస్తున్నారని పార్టీలో చర్చించుకుంటున్నారు. చిల్పూరు, లింగాలఘణపురం మండలాలలో కాంగ్రెస్ నుంచి ఆ నియోజకవర్గ ఇన్చార్జ్ సింగపురం ఇందిర, గడ్డమీది సురేశ్, పాశం సురేశ్, బీఆర్ఎస్ నుంచి ఎడ్ల మహిపాల్, ఉడుగుల భాగ్యమ్మ టికెట్ రేసులో ఉన్నట్లు సమాచారం. కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలై రిజర్వేషన్లు యథాతధంగా కొనసాగితే, కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు పండగ తర్వాత తమ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. రిజర్వేషన్లు ఖరారు కావడం, వీటిపై పలువురు కోర్టుకు వెళ్లడంతో రెండు పార్టీల్లో రాజకీయ వేడి పెంచుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాలో తొలిసారి జెడ్పీ చైర్మన్గా దివంగత పాగాల సంపత్రెడ్డి (జనరల్ కేటగిరీ) బాధ్యతలు స్వీకరించారు. రెండోసారి జరగనున్న ఈ ఎన్నికల్లో ఎస్సీ మహిళకు పీఠం రిజర్వ్ కావడంతో దళిత మహిళా చైర్మన్ పదవిని ఎవరు వరిస్తారనే చర్చ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. రాబోయే రోజుల్లో పార్టీల అభ్యర్థుల ఎంపికలు, కూటములపై ఆధారపడి జిల్లాలో రాజకీయ సమీకరణలు ఎలా మారతాయనేది ఆసక్తిరేపుతోంది. బీజేపీ సైతం బలమైన జెడ్పీటీసీ అభ్యర్థులను బరిలో దింపేందుకు పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. సీపీఎం, సీపీఐ పార్టీలు తమ ఉనికిని చాటుకునేందుకు పక్కా ప్రణాళికలను వేస్తుండగా, స్వతంత్రులు రాజకీయ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు వ్యూహాలు పన్నుతుండగా..వారి కదలికలను అధికార, ప్రధాన ప్రతిపక్షం ఎప్పటికప్పుడు పసిగడుతున్నట్లు వినికిడి. చిల్పూరు, జనగామ మండలాలు ఎస్సీ జనరల్, లింగాలఘణపురం ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. మూడు మండలాల నుంచి దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళలు జెడ్పీటీసీ ఎన్నికల బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ మూడు మండలాల పకిధిలో జెడ్పీటీసీ టికెట్ పొందిన అభ్యర్థులు జడ్పీ చైర్మన్ రేసులో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. దీంతో రెండు పార్టీల్లోనూ టికెట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొంది. కాగా బచ్చన్నపేట మండలం జనరల్ కేటగిరీ, కొడకండ్ల మండలం జనరల్ మహిళ కేటగిరీగా రిజర్వ్ కావడంతో అక్కడ సైతం దళిత వర్గానికి చెందిన పలువురు నాయకులు కన్నేసినట్లు సమాచారం. అందరి చూపు ఆ మూడు మండలాల వైపు.. కాంగ్రెస్, బీఆర్ఎస్లో అభ్యర్థి ఎంపికపై కసరత్తు తెరపైకి ఆశావహులు -
విశ్రాంత ఉద్యోగుల సంఘం ఎన్నిక
జనగామ: జనగామ యూనిట్ రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సంఘం నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. సంఘ జిల్లా అధ్యక్షుడు ఎన్.మహేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో మాజీ జిల్లా అధ్యక్షుడు రామన్న, మాజీ రాష్ట్ర బాధ్యులు వి.యాదవరెడ్డి, సీనియర్ సభ్యులు టి.మల్లికార్జున్, బి.శంకరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జనగామ యూనిట్ నూతన అధ్యక్షుడిగా కసిరెడ్డి మహబూబ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొక్కొండ జగదీశ్వరాచారి, ఆర్థ్కి కార్యదర్శి హుస్సేన్ రియాజుల్లా, అసోసియేట్ అధ్యక్షుడు వి.విజయ్కుమార్, ఉపాధ్యక్షుడు అజం అలీ, మహిళా ఉపాధ్యక్షురాలు జి.ఉమాదేవి, సంయుక్త కార్యద్శి టి.జ్ఞానేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.లక్ష్మణ్, ప్రచార కార్యదర్శి బి.కృష్ణమూర్తి, జిల్లా కౌన్సిలర్లు జి.రమాదేవి, ఎం.నిరంజన్రెడ్డి, వి.విమలాదేవి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో చాడ వెంకట్రెడ్డి, సీహెచ్ రవీందర్రెడ్డి, కె.బాలయ్య, సీతారామారావు, రాజయ్య, సిద్దిమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు భరోసా కల్పించాలి
వరంగల్ క్రైం: పదోన్నతులతో బాధ్యతలు కూడా పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైలుగా పదోన్నతి పొందిన ఎం.సాంబరెడ్డి, పి.జైపాల్, పి.లక్ష్మారెడ్డి, డి.వెంకటేశ్వర్లు, ఎం.సాంబయ్య, కె.వెంకన్న, డి.సమ్మిరెడ్డి, ఎం.లక్ష్మీనారాయణ, పి.శ్రీనివాస్ రాజు, ఎస్.సదయ్య ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనర్ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై నక్షత్రాలను అలంకరించి అభినందనలు తెలిపారు. అనంతరం సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు పోలీసులు భరోసా, నమ్మకాన్ని కలిగించాలన్నారు.జాతీయస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్కు ఎంపికజనగామ రూరల్: ఈనెల 25 నుంచి 27తేదీ వరకు హైదరాబాద్లో జరిగిన 69వ ఎస్జీఎఫ్ టోర్నమెంట్ చాంపియన్షిప్ పోటీల్లో పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకులం విద్యార్థి పర్వతం విక్రమ్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. జాతీయస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్కు ఎంపిక అయ్యాడని కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ నర్సింహులుగౌడ్ అదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి విక్రమ్ను కోచ్ లింగ్యానాయక్, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎ.కిషన్, పీఈటీ వేణు, అధ్యాపకుడు వేణుమాధవ్ అభినందించారు. వచ్చే నెల 5నుంచి 8వ తేదీ వరకు జమ్మూకశ్మీర్లో జాతీయస్థాయి ఫుట్బాల్ క్రీడల్లో విక్రమ్ పాల్గొననున్నాడు. భగత్సింగ్ స్ఫూర్తితో పోరాటాలుజనగామ రూరల్: భగత్సింగ్ స్ఫూర్తితో విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం యువత పోరాటాలకు సిద్ధం కావాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.తిరుపతి పిలుపునిచ్చారు. అదివారం జిల్లా అధ్యక్షుడు ధర్మబిక్షం అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. అహర్నిశలు కష్టపడి చదువుకున్న చదువుకు ఉపాధి దొరకక యువత చెడు మార్గాలకు, వ్యసనాలకు బానిసలు అవుతున్నారన్నారు. దేశంలో కులమత ప్రాంత రాజకీయాలు పెరిగిపోయాయని, అందుకే స్వచ్ఛమైన రాజకీయాల కోసం ఉద్యమించాలన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా బానోత్ ధర్మబిక్షం, కార్యదర్శిగా బొడ నరేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పంతం సాయిప్రసాద్, ఉపాధ్యక్షులుగా నిరేటి సంపత్, చింతకింది అజయ్, సహాయ కార్యదర్శిగా పోత్కునురి కనకచారి తదితరులు ఎన్నికయ్యారు. -
వలసవాదులం కాదు.. మూలవాసులం
నెహ్రూసెంటర్: లంబాడీలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలసవాదులుగా చిత్రీకరించేందుకు కొందరు పనిగట్టుకుని కుట్రలు చేస్తున్నారని, మేము వలసవాదులం కాదు.. మూలవాసులమని గిరిజన నేతలు పేర్కొన్నారు. లంబాడీ రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆదివారం లంబాడీల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడూ.. ఆదివాసీ, లంబాడీల మధ్య చిచ్చుపెట్టేలా కుట్రలు చేస్తున్నారని ఆదివాసీల భుజాలపై తుపాకీ పెట్టి లంబాడీలను కాల్చేలా పతకం వేస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీ, లంబాడీల హక్కుల కోసం కలిసి పోరాటం చేసేందుకు సిద్ధమన్నారు. కొంత మంది జాతి కోసం పోరాటం చేస్తే ఫలాలు పొందుతున్నాం. లంబాడీలను రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టేలా ఎవరు చేసినా.. కాలగర్భంలో కలిపేలా కలిసికట్టుగా ఉండాలి. రాజకీయ అవకాశాలు వస్తే ఒక్కతాటిపై ఉండి జాతి కోసం నిలబడాలని, ఈ ఉద్యమంలో మీతో ఉంటానని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ మాట్లాడుతూ.. జాతి కోసం జరుగుతున్న పోరాటంలో లంబాడీ ప్రజాప్రతినిధులు కలిసి రావాలన్నారు. రిజర్వేషన్ల కోసం, తండాలను గ్రామ పంచాయతీల కోసం పోరాటాలు చేసి సాధించుకున్నాం. పాలకులు రెచ్చగొట్టి కలిసి ఉన్న ఆదివాసీ, లంబాడీల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారన్నారు. జాతికోసం అందరూ ఐక్యమవుదాం, పార్టీలకు అతీతంగా కలిసివచ్చి రాజ్యాధికార సాధనలో ముందుండాలన్నారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వాలపై పోరాడి హక్కులు సాధించుకోవాలే తప్ప లంబాడీలను రాజకీయం కోసం వాడుకోవాలని చూస్తే వారిని రాజకీయ భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. సేవాలాల్సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్నాయక్ మాట్లాడుతూ.. రాజకీయాలను పక్కనబెట్టి జాతి మనుగడ సాధించేలా, రాజ్యాధికారం కోసం లంబాడీలంతా ఏకం కావాలన్నారు. హక్కులు, చట్టాలు సాధించుకునేలా పోరాటాలు సాగించాలని, రిజర్వేషన్ కాపాడుకునేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ఎస్టీ జా బితా నుంచి తప్పించే కుట్రలను తిప్పికొట్టేలా ప్రతి ఒక్కరూ పోరాటాల్లో కలిసి రావాలని పిలుపుని చ్చా రు. జేఏసీ చైర్మన్ డాక్టర్ జగదీశ్వర్, వైస్ చైర్మన్ గుగులోత్ కిషన్నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో దారావత్ వెంకన్ననాయక్, బోడ లక్ష్మణ్నాయక్, గుగులోత్ భీమానాయక్, బోడ రమేష్నాయక్, డాక్టర్ రాజ్కుమార్జాదవ్, హఠ్యానాయక్, డాక్టర్ వివేక్, హరినాయక్, మంగీలాల్, గుగులోత్ రవి, చందులాల్, సిద్దునాయక్, కర్నావత్ వెంకన్న, మాలోత్ రవీందర్, లింగ్యానాయక్ ఉన్నారు. లంబాడీలు ఐకమత్యంతో రాజ్యాధికారం సాధించాలి ఆదివాసీ, లంబాడీల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రలు లంబాడీల ఆత్మగౌరవ సభలో నేతలు -
గ్రూప్–2లో సత్తాచాటారు..
గ్రూప్–2 ఫలితాల్లో జిల్లా అభ్యర్థులు సత్తాచాటారు. ఆదివారం టీజీపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో పలువురు కొలువులు సాధించారు. సామాన్య కుటుంబాలకు చెందిన అభ్యర్థులు అహర్నిశలు కష్టపడి, పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరడంపై అభినందనలు వెల్లువెత్తాయి. పాలకుర్తి టౌన్: మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన కూటికంటి శివ డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయిలో 25వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం శివ మహబూబాబాద్ టౌన్ పోలీస్స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ విజయం తన తల్లిదండ్రుల కుటికంటి లక్ష్మీ, వెంకన్న ప్రోత్సాహం వల్లే లభించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. జనగామ: మండలంలోని బానాజీపేట గ్రామానికి చెందిన ఆకుల నాగరాజు, కొలుపుల మదన్మోహన్ గ్రూపు –2లో సత్తా చాటారు. ఆకుల నాగరాజు బచ్చన్నపేట మండల ఏఎస్ఓగా విధులు నిర్వహిస్తూ గ్రూపు–2లో అసిస్టెంట్ ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. కొలుపుల మదన్మోహన్ మొదటి ప్రయత్నంలోనే గ్రూపు–2లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ)గా ఎంపికయ్యారు. గ్రామం నుంచి ఇద్దరు గ్రూపు–2లో ఉద్యోగాలు సాధించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు,మదన్ మోహన్ఎకై ్సజ్ ఎస్ఐగా సివిల్ సప్లై ఉద్యోగి.. జనగామ రూరల్: మండలంలోని సిద్దెంకి గ్రా మానికి చెందిన సుంకరి శ్రీనివాస్రెడ్డి, నిర్మల కు మారుడు సుంకరి కేదా రేశ్వర్రెడ్డి ఆదివారం విడుదల చేసిన గ్రూప్– 2 ఫలితాల్లో ఎకై ్సజ్ ఎస్ఐగా ఉద్యోగం సాధించారు. గతంలో గ్రూప్–4లో సివిల్ సప్లైలో ఉద్యోగం సాధించి విధులు నిర్వహిస్తున్నారు. అలాగే గ్రూప్–3లో స్టేట్ 10వ ర్యాంక్ సాధించారు.సింగరేణి ఉద్యోగి.. బీసీ వెల్ఫేర్ అధికారిగా జనగామ: మండలంలోని వడ్లకొండకు చెందిన పన్నీరు లక్ష్మణ్ కుమారుడు అమర్నాథ్ బీసీ వెల్ఫేర్ అధికారిగా ఉద్యోగం సంపాదించారు. గ్రూప్–4లో ఉద్యోగం సంపాదించి సింగరేణిలో పనిచేస్తున్న అమరనాథ్, కష్టపడి చదువుకుని గ్రూప్–2 ఉద్యోగం సాధించారు. పేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు కొడుకుపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడని అమర్నాథ్ను గ్రామస్థులతో పాటు స్నేహితులు అభినందించారు.ఏఆర్ ఎస్సై నుంచి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా జనగామ: రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన పుల్ల రవి–పద్మ దంపతుల చిన్న కుమారుడు పుల్ల సాయిచరణ్గౌడ్ గ్రూపు–2లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్లో ఎస్సై (ఏఆర్)గా విధులు నిర్వహిస్తూ గ్రూపు–2లో ఫలితాల్లో స్టేట్ 92 ర్యాంక్ సాఽధించి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (గెజిటెడ్) ఉద్యోగం సాధించారు. ఆయన సోదరుడు సాయికిరణ్ సైతం మంచిర్యాల బెటాలియన్లో ఎస్సైగా విధులు నిర్వహించడం విశేషం. తన సోదరుడు, తల్లిదండ్రులు, భార్య అక్షిత ప్రోత్సాహం ఎంతో ఉపయోగపడినట్లు సాయి చరణ్గౌడ్ తెలిపారు. -
అన్నదాతలకు అండగా ఉంటాం
డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి బచ్చన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం మండలకేంద్రంలోని శ్రీనివాస గార్డెన్లో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని తక్కువ వర్షపాతం నమోదు కావడంతో చెరువులు కుంటలు నిండలేదన్నారు. ప్రస్తుతం గోదావరి జలాలతో అన్ని చెరువులను నింపుతున్నామన్నారు. త్వరలో జరగబోవు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగిటి విద్యానాథ్, మసూద్, హరిబాబు, పిన్నింటి కావ్యశ్రీ, నారాయణరెడ్డి, శ్రీనివాస్, స్వామి, రాములు, కృష్ణ, రమేష్, ఆగయ్య, పలువురు పాల్గొన్నారు. వ్యాపారులు భద్రత ప్రమాణాలు పాటించాలి జనగామ రూరల్: వ్యాపారులు ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో ప్రధానమంత్రి లోక్ కల్యాణ్ మేళ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా పట్టణ ఆహార పదార్థాలను విక్రయించే వీధి విక్రయదారుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి వ్యాపారులు ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. నిబంధనల ప్రకారం ఆహార పదార్థాల తయారీ, నిల్వ, రవాణా, విక్రయ ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలు గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్ శైలజ, జిల్లా కోఆర్డినేటర్ రమేష్ నాయక్, పట్టణ కోఆర్డినేటర్ వాణిశ్రీ, ఆర్గనైజర్లు తిరుమల, షాహిన్, డేటా ఆపరేటర్ రేణుక, వ్యాపారులు పాల్గొన్నారు. అక్టోబర్ 2న మాంసం అమ్మకాలు నిషేధం జనగామ: అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకుని జనగామ పట్టణంలో మాంసం (మటన్, చికెన్) విక్రయాలను నిషేధించినట్లు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి తెలిపారు. శనివారం కమిషనర్ మాట్లాడుతూ 2వ తేదీన జీవహింస చేయరాదని, చికెన్, మటన్ దుకాణాలను మూసి వేయాలన్నారు. తమ ఆదేశాలను దిక్కరించి అమ్మకాలు చేస్తే 2019 యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముగిసిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ పోటీలు జనగామ: జిల్లా కేంద్రం సోషల్ వెల్ఫేర్ గురుకులంలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ 69వ అండర్ 19 ఫుట్బాల్ టోర్నమెంట్ చాంపియన్ షిప్ పోటీలు శనివారంతో ముగిశాయి. రాష్ట్రంలోని ఆయా జిల్లా నుంచి వచ్చిన టీంలు హోరా హోరీగా తలపడ్డాయి. ఇందులో హైదరాబాద్ (ప్రథమ), మహబూబ్నగర్ (ద్వితీయ), వరంగల్(తృతీయ) స్థానంలో నిలిచి సత్తా చాటుకున్నాయి. వచ్చే నెల 5 నుంచి 10వ తేదీ వరకు జమ్మూ కాశ్మీర్లో జరిగే జాతీయ స్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారని నిర్వాహకులు అజ్మీరా కిషన్ నాయక్ తెలిపారు. గురుకులం ప్రిన్సిపాల్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో కోచ్, నిర్వాహకులు, సహాయకులు మనోజ్ కుమార్, ఏ.కిషన్ తదితరులు ఉన్నారు. తెలంగాణ వసతి గృహ అధికారుల ఫోరం ఎన్నికజనగామ: తెలంగాణ వసతి గృహ అధికారుల ఫోరం ఎన్నికలు శనివారం టీఎన్జీవోస్ కార్యాలయంలో జిల్లా జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ యూ నియన్ అధ్యక్షుడు ఖాజా షరీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఫోరం అధ్యక్షుడిగా చింత రాంనర్సయ్య, కార్యదర్శిగా మల్లు, కోశాధికారిగా ఎండీ మొయిన్, అసోసియేట్ ప్రెసిడెంట్గా దే వేందర్, ఉపాధ్యక్షులుగా యాకయ్య, అనిల్, తి రుమల, జాయింట్ సెక్రటరీలుగా సృజన, అని త, నిర్మల, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మహేందర్, పబ్లిసిటీ సెక్రటరీగా వెంకటేష్తోపాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
కొత్త సమీకరణాలు
జనగామ: జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు కావడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఆయా కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. శనివారం కలెక్టరేట్ సమావేశం హాల్లో ఇన్చార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్, జనగామ, స్టేషన్ఘన్పూర్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్డీఓలు గోపీరామ్, డీఎస్ వెంకన్న ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో లాటరీ పద్ధతిలో పూర్తి చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడడంతో ఆశావహుల్లో సంతోషం వెల్లివిరియగా, చాన్స్ మిస్సైన వారు మాత్రం నిరుత్సాహంలో మునిగిపోయారు. ఇదిలా ఉండగా వార్డుల రిజర్వేషన్లను జిల్లాలోని అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. లాటరీ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఊహించని పరిణామం ఎన్నో ఏళ్లుగా సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ పదవులకు ఎదురుచూస్తున్న ఆశావహులకు రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో తీవ్ర నిరాశ నెలకొంది. కొన్ని చోట్ల రిజర్వేషన్లు మహిళలకు కేటాయించడంతో పురుష అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. సర్పంచ్ పదవి వస్తుందని గత రెండు, మూడేళ్లుగా గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టి, రిజర్వేషన్ల రూపంలో అవకాశం కోల్పోవడంతో, కలిసొచ్చే వాటికి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జిల్లాలో రాజకీయ పటాన్ని మలుపు తిప్పనున్నాయి. రిజర్వేషన్లు కలిసొచ్చిన ఆశావహులు జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ బరిలో అడుగేస్తున్నారు. తమ తమ ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దల ఆశీస్సులతో రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. పల్లెల్లో ఎన్నికల జోష్ స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు కావడంతో పల్లెలు, పట్టణాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. పల్లెల్లో ఎక్కడ చూసినా రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణపైనే చర్చించుకుంటున్నారు. పోటీలోకి దిగబోయే నాయకులు టికెట్ కోసం పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడమే కాకుండా, కేడర్ను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఆయా రాజకీయ పార్టీల్లో వర్గపోరు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సామాన్య ఓటర్లు కూడా రాబోయే ఎన్నికలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గెలుపే లక్ష్యంగా.. స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రాబల్యం ఉన్న గ్రామాలు, మండలాల్లో తమ బలమైన అభ్యర్థులను సిద్ధం చేస్తుండగా, బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో తన ఉనికిని బలంగా చాటుకునే ప్రయత్నంలో ఉంది. గ్రామ స్థాయిలో మంచి పేరు, పలుకుబడి ఉన్న ముఖాలను, యువతను రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నాయి. వామపక్షాలు సైతం గతంలో సహకరించిన పార్టీలను కలుపుకుని అభ్యర్థులను ఎంపిక చేసేందుకు వ్యూహం చేస్తున్నట్లు సమాచారం. సవాల్ విసురుతోన్న స్వతంత్రులు స్థానికంలో స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ అభ్యర్థులకే పోటీగా నిలిచి తమ స్థానిక ప్రభావాన్ని చూపించాలనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ ప్రభావం, సామాజిక వర్గ సమీకరణాలను నమ్ముకుని గెలుపు దిశగా దూసుకెళ్లాలని స్వతంత్రులు ప్లాన్ చేస్తున్నారు. ప్రధాన పార్టీల్లో టికెట్ రాని వారు సైతం ఇండిపెండెంట్గా బరిలో నిలిచేందుకు ముందస్తు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో అభ్యర్థుల ఎంపిక, కూటముల ప్రయత్నాలు, అంతర్గత అసంతృప్తులు ఎలా పరిణమిస్తాయన్నదే ఎన్నికల ఫలితాలను నిర్ణయించనుంది. రిజర్వేషన్ల ప్రకటన రాజ్యాంగ విరుద్ధం ఓటు బ్యాంకు కోసం 2024 సంవత్సరం కులగణన ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించ డం రాజ్యాంగ విరుద్ధం. ఈసారి ఎస్సీ, ఎస్టీలను రాజకీయంగా సమాధి చేసే ప్రయత్నం చేశారు. రిజర్వేషన్లపై సుప్రీం కోర్టుకు వెళ్లి న్యాయం కోసం కొట్లాడుతాం. – బానోతు రాంకోటి, బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడుహీటెక్కుతున్న రాజకీయాలు జిల్లా వ్యాప్తంగా సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీల రిజర్వేషన్ల అంశం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. తాజాగా విడుదలైన రిజర్వేషన్ జాబితాలో ఊహించని మార్పులు చోటుచేసుకోవడంతో రాజకీయ నేతలు మాత్రమే కాకుండా గ్రామ స్థాయిలో ప్రజలంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లతో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవరాయ ఎల్లయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ జనాభా కలిగిన జీపీల్లో జనరల్ రిజర్వేషన్ చేయడం సిగ్గుచేటన్నారు. ‘స్థానిక’ రిజర్వేషన్లపై ఊహించని మార్పులు ఆశావహుల ఆశలను నీరు గార్చిన రిజర్వేషన్లు గ్రామాల్లో ఎన్నికల జోష్ పట్టుకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నాలు సవాల్ విసురుతోన్న స్వతంత్రులు -
పోరాట యోధుడు లక్ష్మణ్ బాపూజీ
● ఇన్చార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్జనగామ రూరల్: తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని వదిలేసి తొలి పోరాటయోధుడిగా గుర్తింపు పొందిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని ఇన్చార్జ్ కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ బెన్ షాలోమ్తో కలిసి బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనటమే కాకుండా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మహనీయుడని, కులవృత్తులను ప్రోత్సహించారని వారి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పొందుపరిచేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల బాలరాజు, పోపా జిల్లా అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ఏలే జనార్దన్, కార్యదర్శి బత్తిని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మదాసు ఎల్లయ్య, డాక్టర్ కల్నల్ మాచర్ల భిక్షపతి, నాయకులు పాల్గొన్నారు. -
సౌత్జోన్ అథ్లెటిక్స్లో ఏబీవీ విద్యార్థికి రజతం
జనగామ రూరల్: గుంటూరు జిల్లాలోని నా గార్జున విశ్వవిద్యాలయంలో ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహించిన 36వ సౌత్ జోన్ అథ్లెటిక్స్లో ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్)కు చెందిన బీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న జి.సునీల్కుమార్ 18 ఏళ్ల షాట్పుట్ వి భాగంలో రజత పతకం సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.కె. శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, ఫిజికల్ డైరెక్టర్ టి.కళ్యాణి, అధ్యాపక బృందం, బోధనేతర సిబ్బంది సునీల్ను ఘనంగా సన్మానించారు. మద్యం దుకాణాల టెండర్లు ప్రారంభంజనగామ: జిల్లాలో 2025–27 నూతన మద్యం పాలసీ నిబంధనల మేరకు దుకాణాల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని ఎకై ్సజ్ శాఖ జిల్లా అధికారి అనిత తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 50 మద్యం దుకాణాలకు టెండర్లకు పిలవడం జరుగుతుందన్నారు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటామన్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3లక్షలు చలాన్ రూపంలో చెల్లించాలన్నారు. దరఖాస్తుల స్వీకరణకు జిల్లా ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అక్టోబర్ 23వ తేదీన ఉదయం 11 గంటలకు మద్యం దుకాణాల కేటాయింపుల కోసం లాటరీ ప్రక్రియను నిర్వహించడం జరుగుతుందన్నారు. సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు–ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రటరీ కంజర్ల వసుంధర జనగామ రూరల్: సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రటరీ కంజర్ల వసుంధర అన్నారు. శుక్రవారం ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ కృష్ణఆదిత్య ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని ధర్మకంచలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ నాముని పావనికుమారి అధ్యక్షతన మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కళాశాలల అభివృద్ధికి కమిషనర్ నిధులు మంజూరు చేశారని, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ ఝెలా శ్రీకాంత్రెడ్డి. స్పోర్ట్స్ ఇన్చార్జ్ మరిపెల్ల రవిప్రసాద్, వేముల శేఖర్, మహమ్మద్ అఫ్జల్, డాక్టర్ వస్కుల శ్రీనివాస్, రజిత తదితరులు పాల్గొన్నారు. పత్తిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలిజనగామ: జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పత్తిపంట సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టి కాపాడుకోవాలని భువనగిరి ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.అనిల్ కుమార్, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ డి.శ్రీలత సూచించారు. శుక్రవారం జనగామలో వారు మాట్లాడుతూ.. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా భూమిలో తేమ అధికమై, పంటలో పూత, కాయలు రాలడం కనిపిస్తున్నట్లు గుర్తించామన్నారు. వర్షాలు ఆగిన వెంటనే పై పాటుగా ఎకరానికి 2 కిలోల 13–0–45తో పాటు 400 గ్రాముల సూక్ష్మ పోషకాల మిశ్రమం కలిపి పిచికారీ చేయాలన్నారు. అధిక తేమతో కాయకుళ్లు తెగులు వ్యాపించే అవకాశం ఉందని, దీని నివారణకు ఎకరానికి 600 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ను 20 గ్రాముల ప్లాంటామైసిన్తో కలిపి పిచికారీ చేస్తే సరిపోతుందన్నారు. ఉధృతిని బట్టి 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 సార్లు ఇలా చేస్తే నష్టం ఉండదన్నారు. ఆకులపై గోధుమ మచ్చల నివారణ కోసం ఎకరానికి 200 మి.లీ. ప్రోపికొనజోల్ పిచికారీ చేసుకోవాలన్నా రు. ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేస్తే సరిపోతుందన్నారు. -
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి..
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి వివిధ కుల సంఘాల నాయకులు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఎన్.ఎల్. నరసింహారావు, సహాయ బీసీ సంక్షేమాధికారి బి.రవీందర్, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మదార్, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షుడు ఎదునూరి నరేశ్, డాక్టర్ కల్నల్ భిక్షపతి, ఏఎంసీ చైర్మన్ శివరాజ్ యాదవ్, దిశ సభ్యులు శ్రీనివాస్, ఆర్టీఏ సభ్యులు అభి గౌడ్ , రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఉపేందర్, లింగాలగణపురం మండల రజక సంఘం అధ్యక్షుడు రాజు, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు వేముల బాలరాజు, గీత కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు వెంకటమల్లయ్య పాల్గొన్నారు. -
నేడు ఏడొద్దుల బతుకమ్మ
దేవరుప్పుల: ఊరుకు అరిష్టం రావడంతో పెద్దమడూరు, ధర్మగడ్డలో సద్దుల బతుకమ్మ కాస్త ఏడొద్దుల బతుకమ్మగా మారింది. నిజాం కాలం కంటే ముందు ఈ రెండు గ్రామాలు నల్లగొండ జిల్లాలో ఉండేవి. సద్దుల బతుకమ్మ రోజు పలు వాడల్లో నిప్పంటుకొని నివాసిత గుడిసెలు కాలిపోయాయి. దీంతో ఊరుకు అరిష్టమని మరుసటి ఏడాది నుంచి ఏడో రోజే సద్దుల బతుకమ్మను ఆడి నిమజ్జనం చేసేలా నిర్ణయించారు. అప్పటి నుంచి ఇదే ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడి కోడళ్లు, ఇంటి ఆడబిడ్డలు కలిసి ఆడడం, 9వ రోజు తిరిగి ఇక్కడి కోడళ్లు పుట్టినిల్లు, ఇక్కడి కూతుర్లు మెట్టినింట్లోకి వెళ్లి అక్కడ సద్దుల బతుకమ్మ ఆడే అరుదైన అవకాశం లభిస్తోంది. ఎడొద్దుల బతుకమ్మ వేడుకలకు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. ధర్మగడ్డ, పెద్దమడూరులో ముందే సద్దులు -
ఊరెళ్తే చెప్పండి!
జనగామ: సద్దుల బతుకమ్మ, దసరా పండగ సమయంలో ఊరెళ్లే సమయంలో స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే నిఘా ఉంటుందని వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు. పండగ సమయంలో ప్రజలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ప్రజల ప్రశ్నలకు డీసీపీ సమాధానం ఇచ్చారు. విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లో పెట్టుకుంటే మంచిదన్నారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరించిన సమయంలో 100కు డయల్ చేసి సమాచారం అందించాలన్నారు. సైబర్లో మోసపోయిన సమయంలో గంట లోపు (గోల్డెన్ అవర్) 1930కి ఫోన్ చేస్తే, మొత్తానికి మొత్తం డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుందన్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన వాటిపై నిత్యం ఫోకస్ ఉంటుందన్నారు. పండగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పోలీసు శాఖ శక్తి వంచన లేకుండా పని చేస్తోందన్నారు. 33 మందికి డీసీపీ సమాధానం చెప్పగా, మరో 60 వరకు మిస్డ్కాల్స్ వచ్చాయి. ప్రశ్న: పండగల వేళ గస్తీ పెంచుతున్నారా..బెల్ట్ షాపులపై చర్యలు తీసుకుంటున్నారా..? – నారోజు రామేశ్వరాచారి, జనగామ, వడ్డెపల్లి యాకంరెడ్డి, బచ్చన్నపేట, యాకస్వామి, రామవరం,కొడకండ్ల, కాట సుధాకర్, జఫర్గడ్, పులి ధనుంజయ్గౌడ్, ఉప్పుగల్, జఫర్గడ్, డీసీపీ: సద్దులు, దసరా పండగ సమయంలో బతుకమ్మకుంట వద్ద నిఘా పకడ్బందీగా ఉంటుంది. ఊరికి వెళ్లే సమయంలో విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లో పెట్టుకుంటే మంచిది. గ్రామాల్లో పోలీసు గస్తీ పెంచుతాం. ఈవ్టీజర్లకు కౌన్సిలింగ్ ఇస్తాం. బెల్ట్ దుకాణాల నిర్వహణపై ఎకై ్సజ్ శాఖకు సమాచారం ఇస్తాం. ప్రశ్న: నవరాత్రుల పేరిట లక్కీ డ్రాతో మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారా..? – రేపాల అశోక్, పాలకుర్తి డీసీపీ: లక్కీ డ్రా పేరిట మోసం చేసే వారిపై ఆరా తీస్తాం. ఈ విషయమై చర్యల కోసం ఎస్సైకి చెబుతాం. ప్రశ్న: నెహ్రూపార్కు వద్ద వేగ నియంత్రణ, సిగ్నల్ ఏర్పాటు చేయాలి, ట్రిపుల్, ర్యాష్ డ్రైవింగ్ న్రియంత్రించాలి..మైనర్ల డ్రైవింగ్పై కుల సంఘాలతో సమావేశం పెడుతారా..? – గట్టు అమర్నాథ్, ఎల్ఐసీ అధికారి, ఎండీ రియాజ్, జనగామ, రవీంద్రచారి, పోచన్నపేట, బచ్చన్నపేట, జంగిటి సిద్దులు, బచ్చన్నపేట, రాపెల్లి వెంకటేశ్, ఎన్జీవో, బచ్చన్నపేటడీసీపీ: నెహ్రూపార్కు వద్ద ప్రస్తుతం ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. ట్రిపుల్, ర్యాష్ డ్రైవింగ్పై నిఘా మరింత పెంచుతాం. మైనర్, యూత్ ర్యాష్ డ్రైవింగ్పై తనిఖీలు పెంచి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తాం.చెరువుల వద్ద భద్రత విషయమై రెవెన్యూ శాఖకు సమాచారం ఇస్తాం. కులసంఘాలతో సమావేశ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటాం. ప్రశ్న: సైబర్లో మోసపోతే ఎలా? – ఈగ కృష్ణమూర్తి కూనూరు, జఫర్గడ్ డీసీపీ: సైబర్లో మోసపోతే గోల్డెన్ అవర్ ఉంటుంది. మోసపోయిన గంటలో 1930కి కాల్ చేసి సమాచారం అందిస్తే, మొత్తానికి మొత్తం డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుంది. దీనిపై అవగాహన కల్పిస్తున్నాం. వాట్సాప్లో వచ్చే ఎపిక్ లింకులను ఓపెన్ చేయొద్దు. ప్రశ్న: బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగేవారిపై చర్యలు తీసుకుంటున్నారా.. ఆటోల్లో సౌండ్ కంట్రోల్ చేయడానికి ఏం చేస్తున్నారు.. దసరా సమయంలో ఉద్యోగులకు డ్రెస్కోడ్ అమలుచేస్తారా?.. – దరావత్ రాజేశ్ నాయక్, మైదం చెరువు తండా, కొడకండ్ల, సారంగపాణి, జఫర్గడ్, తాటికాయల అశోక్, మాజీ సర్పంచ్, ఇమ్మత్నగర్, జఫర్గడ్డీసీపీ: డ్రంకెన్ డ్రైవ్ మరింత పెంచుతాం. దీంతో తిరుమలగిరి, ఈదుల పర్రెతండా పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా అరికడుతాం. ఓపెన్ ఏరి యాలో మద్యం తాగితే కేసులు నమోదు చేస్తాం. డ్రెస్కోడ్ విషయంలో కలెక్టర్కు వివరిస్తాం. అటోల సౌండ్ సిస్టం విషయమై రోడ్డు ట్రాన్స్పోర్టు అధికారులకు సైతం సమాచారం ఇస్తాం. ప్రశ్న: బెల్ట్ షాపుల్లో అమ్మకాలు.. అనాథాశ్రమాలకు డొనేషన్లు నియంత్రణకు ఏం చేస్తారు..?డ్రగ్స్ క్యాంపెయిన్లను నిర్వహిస్తున్నారా..? – బంగ్ల శ్రీనివాస్గౌడ్, స్టేషన్ఘన్పూర్, దుంపల సంపత్, పాలకుర్తి, అన్వర్, జనగామ, విద్యాసాగర్, కొన్నె, బచ్చన్నపేటడీసీపీ: బెల్ట్ షాపుల నిర్వహణపై ఎకై ్సజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అనాథలకు డొనేషన్ పేరిట తిరిగేవారు ముందస్తుగా పోలీస్ స్టేషన్, మునిసిపల్ అనుమతులు తీసుకునేలా చూస్తాం. కలెక్టర్, పోలీసు శాఖ సంయుక్తంగా డ్రగ్స్ నిర్మూలన కోసం అవెర్నెస్ క్యాంపులు, ర్యాలీలు చేపడుతున్నాం. బ్లాక్ టీషర్టు వేసుకుని వచ్చే సమయంలో రహస్యంగా వీడియో తీయండి. పక్కా సమాచారం ఇస్తే పోలీసులు నిఘా ఉంచుతారు. ప్రశ్న: అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెడుతున్నారా? గ్రామాల్లో యువకులతో కమిటీ వేసే ఆలోచన ఉందా? – సందీప్కుమార్, జనగామ, ధర్మకంచ మినీస్టేడియం, ఏదునూరి వీరన్న, లింగాలఘణపురం డీసీపీ: అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే 100కు డయల్ చేయాలి. వీలైతే సీక్రెట్గా వీడియో తీసి మాకు పంపించండి. పోలీసు టూ వీలర్ వెహికిల్కు సైరన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. గ్రామాల పరిధిలో యువకులతో కమిటీలు వేసి నిఘా పెంచే ఆలోచనను పరిగణలోకి తీసుకుంటాం. ప్రశ్న: శ్రీ సోమేశ్వర ఆలయ గుట్ట చుట్టూ మద్యం తాగేవారిపై చర్యలు? – కామారపు సునీల్, పాలకుర్తి డీసీపీ: గుట్టచుట్టూ ఇలాంటి కార్యక్రమాలు జరుగకుండా పోలీసుశాఖ పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. ఎవరైనా మద్యం తాగుతున్నట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఆర్బీఎఫ్ సంస్థకు సంబంధించి ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేసి విచారణ చేస్తాం. ప్రశ్న: పెట్రోలింగ్ పెంచుతారా..బ్యాటరీల చోరీలపై చర్యలు తీసుకుంటున్నారా? – కాసుల శ్రీనివాస్, శ్రీనగర్ కాలనీ, జనగామ, జమాల్షరీఫ్, న్యాయవాది, జనగామ, బోరెం నరేందర్రెడ్డి, పెద్దమడూరు, దేవరుప్పుల డీసీపీ: ప్రతిరోజు నైట్ పెట్రోలింగ్ ఉంటుంది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు కాలనీ పెద్దలు ముందుకు రావాలి. గిర్నిగడ్డ ప్రాంతంలో రాత్రి పెట్రోలింగ్ పెంచుతాం. అనుమానితులు కనిపిస్తే 100కు డయల్ చేయండి. గతంలో చోరీకి గురైన బ్యాటరీల గురించి పీఎస్లో ఫిర్యాదు చేయండి. ప్రశ్న: పండగకు ఊరెళితే ఏం చేయాలి? చైన్స్నాచింగ్లపై చర్యలు తీసుకుంటున్నారా? – శంకర్, కొర్రతండా, గానుగుపహాడ్, జనగామ, అజహరొద్దీన్, జనగామ, రొడ్రిక్ రాజు,జనగామ డీసీపీ: పండగకు ఊరెళ్లే సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సైకి సమాచారం ఇవ్వండి. ఇంటి పరిసర ప్రాంతంలో పోలీసు నిఘా ఉంటుంది. పట్టణంలో 150 కెమెరాల ద్వారా నిఘా ఉంది. విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లో పెట్టుకుంటే మంచింది. పెట్రోలింగ్ రెగ్యులర్గా ఉంటుంది. పట్టణంలో చాలా వరకు చోరీలు, చైన్ స్నాచింగ్లు తగ్గుముఖం పట్టాయి. ప్రతిచోట నిఘా ఉంది. దానిని రెట్టింపు చేస్తాం. విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లో పెట్టుకుంటే మంచిది 100 డయల్ను సద్వినియోగం చేసుకోండి సద్దులు, దసరా పండగ సమయంలో పటిష్ట బందోబస్తు ‘సాక్షి’ ఫోన్ ఇన్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్ -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
జనగామ రూరల్: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని శుక్రవారం కలెక్టరేట్ ఎదుట తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం డీపీఓ సూపరింటెండెంట్ వసంతకు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి నారోజు రామచంద్రం, జిల్లా కోశాధికారి బస్వ రామచంద్రం మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ సిబ్బందికి 3 నెలల బకాయి వేతనాలు చెల్లించాలన్నారు. తక్షణమే చెల్లించకుంటే పండగ సందర్భంగా జిల్లావ్యాప్తంగా గ్రామగ్రామాన ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. జీవో నెం.51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ధర్నాలో యూనియన్ నాయకులు పి.వెంకటేశ్వర్లు ఎస్.కర్ణాకర్, పి.మల్లేశ్, బి.బాల నరసయ్య, కళమ్మ ,సైదమ్మ, రమ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జీపీ కార్మికుల ధర్నా -
నిధుల సమీకరణ..!
మద్యం షాపులకు పెద్దమొత్తంలో దరఖాస్తులకు ప్లాన్సాక్షి ప్రతినిధి, వరంగల్: ● 2023–25 సంవత్సరానికి జరిగిన టెండర్లలో హనుమకొండ చెందిన ఓ మద్యం వ్యాపారి కొందరిని కలుపుకుని ట్రైసిటీతోపాటు భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పలువురి పేర్లపై 600 (రూ. 12 కోట్లు ఖర్చు చేసి) దరఖాస్తులు వేశా రు. మొ త్తంగా ఆ కూటమి.. 32 దుకాణా లను (లక్కీ డ్రా, గుడ్విల్ పద్ధతిన) కై వసం చేసుకుంది. ● జేఎస్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ మద్యం వ్యాపారి గత ఆబ్కారీ సీజన్లో హనుమకొండ, పరకాల, రేగొండ తదితర ప్రాంతాల్లో మొత్తం 70 వైన్షాపుల కోసం దరఖాస్తు చేశారు. ఒక్కో రూ.2 లక్షల చొప్పున రూ.1.40 కోట్లు దరఖాస్తుల ఖర్చు కాగా.. రెండు లక్కీడ్రాలో రాగా, ఒకటి గుడ్విల్ ఇచ్చి సొంతం చేసుకున్నారు. ... ఈసారి కూడా మద్యంషాపుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అమ్ముడు పోతాయని ఆబ్కారీశాఖ భావిస్తోంది. గతేడాది ఉమ్మడి వరంగల్లో 294 వైన్స్ (ఏ–4)షాపులకు 15,926 దరఖాస్తులు దాఖలయ్యాయి. అప్పుడు దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. 15,926 దరఖాస్తులపైన రూ.318.52 కోట్లు నాన్ రిఫండబుల్గా ఆబ్కారీశాఖకు ఆదాయం సమకూరింది. ఈసారి ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ, సింగిల్ విండో, మున్సిపల్ తదితర స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు సమ్మక్క–సారలమ్మల జాతర కూడా ఉంది. ఈ లెక్కన ఈసారి దరఖాస్తుల సంఖ్య 20 వేల వరకు పెరిగే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. ఈ దుకాణాలపైన ప్రత్యేక గురి.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా అత్యధికంగా విక్రయాలు జరిగే వైన్షాపులపై వ్యాపారుల సిండికేట్ గురిపెట్టింది. పాత వ్యాపారులతోపాటు కొత్తగా ఈ దందాలోకి దిగేవారు అధికారులను సంప్రదించి ఓ జాబితా తయారు చేసుకున్నట్లు సిండికేట్ వర్గాల సమాచారం. ఉమ్మడి జిల్లాలో మూడేళ్లుగా ప్రతీ సంవత్సరం రూ.2,250 కోట్ల నుంచి రూ.2,590 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఈ మూడేళ్లలో అత్యధికంగా విక్రయాలు జరిగిన షాపులకు ఈసారి ఎక్కువ దరఖాస్తులు పడే అవకాశం ఉంది. కాగా గతంలో జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని ఓ వైన్స్ ఒక్క ఏడాదిలో రూ.61.04 కోట్లు, హనుమకొండ సిటీ హంటర్రోడ్లోని ఓ వైన్స్ అత్యధికంగా రూ.38.21 కోట్ల మద్యం విక్రయాలు జరిపింది. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా తొర్రూరులోని ఓ వైన్స్ రూ.14.33 కోట్ల మద్యం విక్రయాలు జరిపింది. తొర్రూరులోనే మరో మరో వైన్స్ రూ.6.5 కోట్లు, కమలాపూర్ మండల కేంద్రంలోని ఓ వైన్స్లో రూ.6,39,82,000ల విక్రయాలు జరిగినట్లు రికార్డులు చెప్తున్నాయి. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ వైన్స్ రూ.9.35 కోట్ల మద్యం విక్రయించగా, పాలకుర్తిలోని వైన్స్లో రూ.14.19 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. అలాగే వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీలో మరో ఎనిమిది, భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం, చిట్యాలలతోపాటు ఆరు, ములుగు జిల్లాలో ఏటూరునాగారం, ములుగు, మేడారం, పస్రాలతో పాటు మేడారం రూట్లోని అన్ని షాపులలో విక్రయాలు బాగా జరుగుతాయి. మొత్తం 294 షాపులలో 150 దుకాణాలకు ఎక్కువ దరఖాస్తులు పడుతాయని భావిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. మద్యం దందావైపు ‘రియల్’ వ్యాపారులు.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మద్యం దందావైపు చూస్తున్నారు. మార్కెట్ అప్ అండ్ డౌన్స్ నేపథ్యంలో 2023–25 నుంచే కొందరు లిక్కర్ వ్యాపారంలో అడుగు పెట్టారు. ఈసారి ఇప్పుడున్న వ్యాపారులకు తోడు తాము సైతం అదృష్టం పరీక్షించుకునేందుకు సన్నద్ధం అవుతున్నారు. 2025–27 సంవత్సరానికి శుక్రవారంనుంచి టెండర్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో టెండర్లలో వైన్స్ (ఏ–4)షాపులు అత్యధికంగా దక్కించుకునేందుకు మద్యం వ్యాపారులతో కలిసి ‘సిండికేట్’ అవుతున్నారు. మరోవైపు కొందరు రాజకీయ నాయకుల బినామీలు కూడా ఈసారి పెద్దసంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేసే యోచనలో ఉన్నారు. ఇప్పటికే మద్యం వ్యాపారంలో పేరుగాంచిన వ్యాపారులే మళ్లీ అత్యధిక దుకాణాలు దక్కించుకునేందుకు గ్రూపులుగా ఏర్పడుతున్నారు. నిర్ణీత సమయంలో షెడ్యూల్స్ దాఖలు చేయడంతోపాటు టెండర్ల ద్వారా ‘లక్కీ’ వరిస్తే సరి.. లేదా దుకాణాలు దక్కే కొత్తోళ్లకు రూ.లక్షల గుడ్విల్ ఇచ్చి కై వసం చేసుకునేందుకు ఇప్పటినుంచి నిధులు సమీకరిస్తున్నారు. పాత మద్యం వ్యాపారులు.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. రాజకీయ నేతల బినామీలు.. ఇలా పోటాపోటీగా టెండర్లకు సిద్ధమవుతుండటం వైన్షాపులకు ఈసారి భలే గిరాకీ ఉండబోతుంది. మద్యం దందాలో ‘రియల్‘ వ్యాపారులు రంగంలోకి రాజకీయ నేతల బినామీలు అత్యధికంగా షాపులు దక్కించుకోవడమే లక్ష్యంగా ‘సిండికేట్’ ఉమ్మడి వరంగల్లో 294 షాపులు.. ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ -
మహాకవులకు నిలయం పాలకుర్తి
పాలకుర్తి టౌన్: తెలుగు సాహిత్య చరిత్రలో పాలకుర్తి ఓ మహోన్నత స్ధానాన్ని సంపాదించిందని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కొనియాడారు. శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలోని సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు, సాహితీవేత్త డాక్టర్ రాపోలు సత్యనారాయణ ఇంట్లో మీడియాతో మాట్లాడారు.. పాలకుర్తి నేల నిజమైన మహాకవుల నిలయం అని, ఈ నేలలో పుట్టిన మహనీయులు తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశారని అన్నారు. పాల్కురికి సోమనాథుడు తన బసవపురాణంతో సమాజంలో సమానత్వం సందేశం చాటారని, బమ్మెర పోతన తన ఆధ్యాత్మిక గాఽథలో ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా చిలిచారని, వాల్మీకి తన సృష్టితో ధర్మాన్ని ప్రతిష్టించాడని అన్నారు. స్థానిక యువత ఈ వారసత్వాన్ని ఆదర్శంగా తీసుకొని తమ ప్రతిభను పెంపొందించుకోవాలన్నారు. ఈనేల సాహిత్య వారసత్వాన్ని రక్షించడం కోసం సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ కృషి అభినందనీయం అన్నారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న -
‘బెస్ట్ అవైలబుల్’ బిల్లులు విడుదల చేయాలి
జనగామ రూరల్: బెస్ట్ అవైలబుల్ స్కూల్ పెండింగ్ బిల్లులు విడుదల చేసి తమ పిల్లల చదువులకు సహకరించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరా రు. ఈమేరకు గురువారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి అదనపు కలెక్టర్ బెన్షాలోమ్కు వినతిపత్రం అందజేశారు. దేవరుప్పుల మండలంలోని కడవెండి సెయింట్ జాన్ బ్రిట్టో హైస్కూల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 2017 సంవత్సరం అడ్మిషన్లు ఇచ్చారు. కానీ 2021 నుంచి 2025 ఈరోజు వరకు నిధులు విడుదల కాలేదని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరారు. భూసమస్యల పరిష్కారానికి చర్యలు.. జనగామ రూరల్: భూసమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ అన్నారు. గురువారం స్టేషన్ ఘన్పూర్ మండలం శివునిపల్లిలో చేపడుతున్న సాదాబైనామా, భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను ఆకస్మికంగా సందర్శించి అసైన్డ్ భూములు 22–ఏను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్కు వినతి -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మచ్చుపహాడ్ విద్యార్థి
నర్మెట: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మచ్చుపహాడ్కు చెందిన గజ్జెల్లి జీవన్ ఎంపికయ్యాడు. నిజామాబాద్ ము ప్కాల్లో జరుగుతున్న రాష్ట్రస్థాయి సెలక్షన్స్లో పాల్గొని ఎంపికై న జీవన్ జనగామ ఏకశిలా ఒకేషనల్ జూని యర్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. రెండోసారి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో మచ్చుపహాడ్ స్పోర్ట్స్ అధ్యక్షుడు కాసు కనకరాజు, గ్రామస్థులు గురువారం అభినందించారు. ఈసందర్భంగా జిల్లా కబడ్డీ అసోషియేషన్ కార్యదర్శి గట్టయ్య, మండల అధ్యక్షుడు గుండేటి రాంచందర్, కార్యదర్శి కొంపెల్లి అంబేడ్కర్, సభ్యులు గొల్లపల్లి రాజు, వినోద్ , వేణు హర్షం వ్యక్తం చేశారు. -
క్రీడారంగంలో రాణించాలి
జనగామ: విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలో సైతం రాణించి దేశ ప్రతిష్టను నిలబెట్టే విధంగా కష్టపడాలని ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకులంలో గురువారం 69వ రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్ 19 విభాగంలో జరిగిన ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను ఇన్చార్జ్ కలెక్టర్ ప్రారంభించారు. సోషల్ వెల్ఫేర్ ప్రి న్సిపల్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన క్రీడాపోటీల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, జ్యోతి ప్ర జ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ముని సిపల్ కమిషనర్ మహేశ్వరరెడ్డి, డాక్టర్ కల్నల్ భిక్షపతి, జిల్లా ఫుట్బాల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అజ్మీరా కిషన్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు చిట్ల ఉపేందర్రెడ్డి, కార్యదర్శి రాజయ్య, మహేంద్రవర్మ, టీజీపేట అధ్యక్షుడు కోర్సింగ్, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్, కోచ్లు పాల్గొన్నారు. ప్రతిఒక్కరూ శ్రమదానం చేయాలి.. జనగామ రూరల్: పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ శ్రమదానం చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ అన్నారు. 17వ స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ కార్యక్రమం అమలులో భాగంగా గురువారం మండలంలోని శామీర్పేట్ గ్రామంలో ఏక్ దిన్ ఏ గంట ఏక్ సాత్ అనే కార్యక్రమం పురస్కరించుకొని శ్రమదాన కార్యక్రమం ప్రారంభించి స్వ యంగా పాల్గొన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛ పండాల్ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి స్వరూప, జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ కోఆర్డినేటర్ కరుణాకర్, జిల్లా అదనపు పీడీ చంద్రశేఖర్, ఇన్చార్జ్ ఎంపీడీవో సంపత్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ ఇంటర్ డిస్ట్రిక్ ఫుట్బాల్ పోటీలు ప్రారంభం -
డీసీపీతో నేడు ఫోన్ ఇన్
జనగామ: సాక్షి ఆధ్వర్యంలో నేడు(శుక్రవా రం) వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. ఫోన్ ఇన్లో బతుకమ్మ, దసరా పండుగల వేళ దూరప్రయాణాలు, రాత్రి ప్రయాణాలు, సెన్సిబుల్ డ్రింకింగ్, సొంత ఊళ్లకు వెళ్లేవారు ఇళ్లలో చోరీలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీసీపీతో మాట్లాడవచ్చు. ఈ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ క్రింది ఫోన్ నంబర్ కు కాల్ చేసి మాట్లాడాలి. -
మైనారిటీ మహిళలకు భరోసా
జనగామ రూరల్: మైనారిటీల అభ్యున్నతి కోసం, వారు ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా మైనారిటీ మహిళల ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందించడానికి రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’, ‘రేవంతన్నకా సహారా మిస్కీన్ లే’ పేరుతో వచ్చిన పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబన, అట్టడుగు సముదాయాల సామాజిక ఉద్ధరణకు దోహదపడతాయి. ఈనెల 19న సెక్రటేరియేట్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం రూ.30 కోట్ల బడ్జెట్తో అమలు చేసే ఈ పథకాలకు దరఖాస్తులు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 6 వరకు టీజీవోబీఎమ్ ఎమ్ ఎస్ ఆన్లైన్ ద్వారా స్వీకరించనున్నారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకంతో లబ్ధి ఒంటరి మహిళలకు రూ.50 వేల ఆర్థిక సాయం రేవంతన్న కా సహారా మిస్కీన్ లే కింద రూ.లక్ష గ్రాంట్ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. ఆర్థిక ఎదుగుదలకు ఈ పథకాలు ఉపయోగపడనున్నాయి. జిల్లాలో అర్హులైన మైనారిటీలు దరఖాస్తు చేసుకోవాలి. –జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి బి.విక్రమ్కుమార్ -
జేఎస్జేబీలో జిల్లాకు రూ.కోటి నజరానా
జనగామ: జల సంరక్షణలో సామూహిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ అద్భుత ఫలితాలు సాధించినందుకు గాను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఎంపిక చేయగా, జనగామ జిల్లాకు రూ.కోటి నజరానా ప్రకటించింది. 2024 ఏప్రిల్ నుంచి 2025 మే వరకు నిర్వహించిన జలసంచయ్–జన భాగీదార్(జేఎస్జేబీ 1.0) ప్రోగ్రాంలో జల రీచార్జ్ నిర్మాణాల(సోక్పిట్స్, రూఫ్టాప్ వర్షపు నీరు సేకరణ, బోర్వెల్ రీచార్జ్, చెక్డ్యాంలు, సబ్సర్ఫేస్ డైక్స్, ఫార్మ్ పాండ్స్, ఫర్కోలేషన్ ట్యాంకులు)ను పూర్తి చేసి, వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనివలన వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీచార్జ్ బలోపేతమైనట్లు కేంద్రం గుర్తించి, నీటి సంరక్షణ కోసం కృషి చేసిన వారికి జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చింది. జిల్లాలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు శాఖలు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు భాగస్వామ్యులు కావడంతో 12 మండలాల పరిధిలో 30,569 ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టి, జాతీయ స్థాయిలో నగదు పురస్కారానికి జనగామ ఎంపికై ంది. జిల్లా అవార్డుల్లో జనగామకు రూ.కోటి నజరానా ప్రకటించారు. ప్రజల భాగస్వామ్యంతో సాధించిన ఈ విజయాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ప్రశంసించింది. జాతీయ స్థాయిలో జనగామకు ఉత్తమ బహుమతి రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అభినందించారు కలెక్టర్ చొరవ..30,569 ఇంకుడు గుంతల నిర్మాణం ప్రశంసలు కురిపించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ -
క్రీస్తుజ్యోతిలో బతుకమ్మ సంబురాలు
జనగామ: మండలంలోని యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం బతుకమ్మ సంబురాలను జరుపుకున్నారు. బతుకమ్మల ను తీర్చిదిద్ది కళాశాల ఆవరణలో సాయంత్రం నుంచి రాత్రి వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డి.విజయపాల్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా సంప్రదాయ, ఆచార వ్యవహారాలను సైతం గౌరవించాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, అధ్యాపకులు స్వప్న, సంతోశాకుమారి, స్వర్ణ, సరితా, మాలతి, గీత, విద్యార్థినులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన ఉండాలి
జనగామ రూరల్: విద్యార్థులకు రాజ్యాంగం, చట్టాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు గురువారం పట్టణంలోని ఏకశిలా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని దేశంలోని ప్రతి పౌరుడు తెలుసుకొని అనుసరించాలని, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తే శిక్ష తప్పదు అని అన్నారు. ప్రాథమిక విధులు, బాధ్యతలు గురించి తప్పకుండా తెలుసుకోవాలని అలాగే పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపల్ ఎ. మల్లికార్జునరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ జి.నళిని కుమారి, డైరెక్టర్ బి.నాగరాజు, బి.శేఖర్, పి.జితేంద్ర పాల్గొన్నారు. సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ -
మోదీతోనే దేశ సమగ్ర అభివృద్ధి
స్టేషన్ఘన్పూర్: కేంద్రంలో బీజేపీ పాలనలో ప్రధాని నరేంద్రమోదీ ద్వారానే దేశ సమగ్ర అభివృద్ధి చెందుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిశోర్రెడ్డి అన్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో జీఎస్టీపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅ తిథిగా హాజరైన కిశోర్రెడ్డి మాట్లాడారు.. జీఎస్టీ తగ్గించడం సర్వత్రా హర్షణీయమన్నారు. వెన్నుపోటు రాజకీయాలు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఐకాన్ అని బీజేపీ నేత, మాజీ మంత్రి విజయరామారావు ఆరోపించారు. రాజ్యాంగంపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్, నాయకులు ఇనుగాల యుగేందర్రెడ్డి, సట్ల వెంకటరమణ, బూర్ల విష్ణు, ఆరూరి జయప్రకాశ్, శశిధర్రెడ్డి, గంటె ఉపేందర్, నవీన్, చట్ల సురేశ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అఽధికార ప్రతినిధి కిశోర్రెడ్డి -
నేటినుంచి మద్యం టెండర్లు
జనగామ: జిల్లాలో నూతన మద్యం దుకాణాల టెండరు ప్రక్రియ మొదలుకానుంది. వైన్స్ల కేటాయింపులో రిజర్వేషన్ల ప్రాసెస్ గురువారం పూర్తికాగా, ఈనెల 26 (శుక్రవారం) నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఎకై ్సజ్ శాఖ సన్నద్ధమవుతోంది. ప్రస్తుత దుకాణాల కాలపరిమితి ఈ ఏడాది నవంబర్ చివరి వారంతో ముగియనుండగా, ప్రభుత్వం ముందస్తుగా కొత్త టెండర్లను ఆహ్వానిస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 47 మద్యం దుకాణాలు ఉండగా, ఈసారి మరో మూడు కొత్త దుకాణాలు పెరగడంతో మొత్తం సంఖ్య 50కి చేరింది. వీటిలో ఎస్టీ వర్గానికి 1, ఎస్సీ సామాజిక వర్గానికి 5, గౌడ కులస్థుల కు 13, జనరల్ కేటగిరీ(ఓపెన్) విభాగంలో 31 మ ద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించా రు. దీంతో ప్రస్తుత వైన్స్ యజమానులతో పాటు కొత్త ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న ఆయా వర్గాల వారు టెండర్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. కలెక్టరేట్లో లాటరీ ప్రక్రియ నూతన మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్ల కోసం గురువారం కలెక్టరేట్లో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి అనిత, ఏఈఎస్ ప్రవీణ్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ అధికారులతో కలిసి ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ పర్యవేక్షణలో మద్యం దుకాణాల రిజర్వేషన్ల కోసం లక్కీ లాటరీ నిర్వ హించారు. జిల్లాలో 50 మద్యం షాపులకు గాను 19 షాపులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇందులో గౌడ సామాజిక వర్గానికి–13(15 శాతం), ఎస్సీ సామాజిక వర్గానికి–5(10 శాతం), ఎస్టీ సామాజిక వర్గానికి–1(5శాతం) మద్యం దుకాణాలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. జనరల్కు–31 (74శాతం) కేటాయించారు. గౌడ కేటగిరీలో జిల్లాలోని మునిసిపల్తో పాటు మండలాల వారీగా మద్యం దుకాణాల వారీగా నెంబర్లు కేటాయించగా, ఏరియాలతో సహా గెజిట్లో పొందుపరిచారు. రిటైల్ దుకాణాలకు ఎకై ్సజ్ ట్యాక్స్ జనాభా ప్రాతిపదికన లిక్కర్ దుకాణాలకు ఎకై ్సజ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో రూ.50లక్షలు, రూ.55లక్షలు, రూ.60 లక్షల స్లాబులు ఉన్నాయి. 5వేల జనాభా కలిగిన ఊర్లకు రూ.50లక్షలు, 5వేల నుంచి 50వేల వరకు రూ.55లక్షలు, 50వేల నుంచి లక్ష వరకు రూ.60లక్షలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. 2025–27 రెండేళ్ల కాలపరిమితి సమయంలో ఆరు సమాన వాయిదాలతో ఎకై ్సజ్ పన్ను చెల్లించాలి. మండలం వెన్స్లు జనరల్ గౌడ ఎస్సీ ఎస్టీ జనగామ 11 06 04 01 – మునిసిపల్ పెంబర్తి 01 01 – – – లింగాలఘణపురం, 03 01 01 01 – ( నెల్లుట్ల ) నర్మెట 02 01 01 – – బచ్చన్నపేట 03 02 01 – – చిల్పూరు 01 01 – – – (చిన్న పెండ్యాల) చిల్పూరు 01 – – 01 – (కరుణాపురం) స్టే.ఘన్పూర్ 08 05 02 – 01 తరిగొప్పుల 02 01 01 – – రఘునాథపల్లి 04 02 – 02 – పాలకుర్తి 05 03 02 – – కొడకండ్ల 03 03 – – – జఫర్గడ్ 03 03 – – – దేవరుప్పుల 03 02 01 – – మొత్తం 50 31 13 05 01నూతన మద్యం పాలసీలో లైసెన్స్ అప్లికేషన్ ఫీజు 50శాతం పెంచుతూ రూ.3లక్షలు నిర్ణయించారు. లైసెన్స్ కోసం ఇచ్చే డబ్బులను తిరిగి చెల్లించరు. నూతన లైసెన్స్ కాలపరిమితి 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండేళ్ల పాటు అమలులో ఉంటుంది. జిల్లాలోని జనగామ పట్టణం, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ పరిధిలో మూడు మద్యం దుకాణాలు కొత్తగా పెరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు రికా ర్డు స్థాయిలో పెరగడంతో ఉమ్మడి జిల్లా పరిధిలో మూతబడేందుకు సిద్ధంగా ఉన్న మూడింటిని ఇక్కడకు కేటాయించారు. లాటరీ కార్యక్రమంలో జిల్లా ట్రైబల్ అధికారి ప్రేమకళ, బీసీ వెల్ఫేర్ అధికారి ఎన్.ఎల్. నర్సింహారావు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి బి.విక్రమ్, ఎకై ్సజ్ సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు. వచ్చే నెల 18 వరకు గడువు.. 23న వైన్స్ల కేటాయింపు లైసెన్స్ అప్లికేషన్ ఫీజు రూ.3లక్షలు కలెక్టరేట్లో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తి -
పండగ పూట ఇల్లు జాగ్రత్త!
జనగామ: బతుకమ్మ, దసరా పండగ సమయంలో ఇంటికి తాళాలు వేసి సుదూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని కోరుతూ బుధవారం జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీతో పాటు ఆయా వార్డుల్లో పోలీసులు మైక్ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేశ్, తదితరులు వార్డుల్లోని ప్రధాన కూడళ్లలో జనాన్ని పోగు చేసి జాగ్రత్తలు సూచించారు. ఇంటికి తాళం వేసి వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారం అందించాలని, వార్డులో కొత్త, అనుమానిత వ్యక్తులు సంచరించిన సమయంలో తమకు వెంటనే సమాచారం అందించాలని నరేశ్ కోరారు. -
డీసీపీతో ఫోన్ ఇన్
జనగామ: సాక్షి ఆధ్వర్యంలో రేపు(శుక్రవా రం) వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. ఫోన్ ఇన్లో బతుకమ్మ, దసరా పండుగల వేళ దూరప్రయాణాలు, రాత్రి ప్రయాణాలు, సెన్సిబుల్ డ్రింకింగ్, సొంత ఊళ్లకు వెళ్లేవారు ఇళ్లలో చోరీలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీసీపీతో మాట్లాడవచ్చు. ఈ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ క్రింది ఫోన్ నంబర్ కు కాల్ చేసి మాట్లాడాలి. -
నాణ్యతగా
నిరంతరం..సబ్స్టేషన్ నిర్మాణ పనులకు సంబంధించి చర్చిస్తున్న ఉన్నతాధికారులు● మూడు చోట్ల స్థల కేటాయింపుల్లో జాప్యం● ఫీడర్లపై తగ్గనున్న భారం ● లో ఓల్టేజీ సమస్యలకు పరిష్కారం ● రూ.22.50కోట్లు మంజూరు జనగామ: జిల్లాలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో తొమ్మిది 33/11కేవీ సబ్స్టేషన్లకు మంజూరు ఇచ్చింది. ఇప్పటికే అనేక చోట్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతుండగా, మరికొన్ని చోట్ల స్థల కేటాయింపులు పూర్తి కావాల్సి ఉంది. నూతన సబ్స్టేషన్ల సేవలు ప్రారంభం కాగానే గ్రామాల పరిధిలో తరచూ ఎదురవుతున్న లో ఓల్టేజీ సమస్యకు పరిష్కారం లభించనుంది. దీంతోపాటు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి అవకాశం కలుగుతుంది. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 33/11కేవీ సబ్స్టేషన్లు 78 ఉన్నాయి. 9 సబ్స్టేషన్లు అందుబా టులోకి వస్తే 87కు పెరగనున్నాయి. 132/33 కేవీ –12, 220/132 కేవీ–1, 400 కేవీ–1 సామర్థ్యం కలిగిన సబ్ స్టేషన్లు ఉన్నాయి. గృహ, వాణిజ్య, ఇండస్ట్రియల్, కుటీర పరిశ్రమలు, వ్యవసాయ, స్ట్రీట్, స్కూల్స్, టెంపుల్స్ తదితర కనెక్షన్లు 2, 96, 779 ఉన్నాయి. జిల్లాలో కొత్తగా తొమ్మిది 33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేశారు. జిల్లాలో కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం కోసం రూ.22.50 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులను వినియోగిస్తూ ఆధునిక సాంకేతికతతో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీంతో విద్యు త్ పంపిణీ నాణ్యత మెరుగుపడటమే కాకుండా, వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, గృహాల అవసరాలకు సరిపడే విద్యుత్ అందుబాటులోకి రానుంది. దేవరుప్పుల మండలం చిన్నమడూరు గ్రామంలో 220/132 కేవీ సబ్స్టేషన్ నిర్మాణపనులు కొద్దిరో జుల్లో పట్టాలెక్కనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే 15 ఎకరాల భూమి కేటాయింపు పూర్తికాగా, హద్దులు నిర్ణయించి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. అతి పెద్ద సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి చేసుకుంటే సమీపంలోని మండలాలకు మరింత నాణ్యమైన, కోతలు లేని విద్యుత్ సరఫరా అందించవచ్చు. భారీ లోడ్లను కూడా సులభంగా మోహరించగల సామర్థ్యం ఈ సబ్స్టేషన్కు ఉండబోతోంది. బచ్చన్నపేట మండలంలోని సాల్వాపూర్ గ్రామంలో 33/11కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థల కేటా యింపుల్లో జాప్యం జరుగుతోంది. సబ్స్టేషన్కు భూమి కేటాయింపుపై ఏకాభిప్రాయం రాకపోవడంతో ప్రాజెక్టు ముందుకు వెళ్లడం లేదు. ఈ సమస్యను జఠిలం చేస్తే ఊరికి వచ్చే సబ్స్టేషన్ను మరోచోటకు మళ్లించే అవకాశం ఉందని తెలుస్తోంది. పాలకుర్తి మండలంలోని మల్లంపల్లి, ముత్తారం గ్రామాల్లో సబ్స్టేషన్ల కోసం టెండర్ ప్రక్రియ పూర్తయింది. అయితే నిర్మాణం మొదలయ్యేలోపు కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. స్థల సమీకరణ సమయంలో సమస్య ఉత్పన్నం కావడంతో పనులు ప్రారంభించలేకపోతున్నారు. అధికారులు ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకు తున్నారు. జిల్లాలోని చిల్పూరు మండలం కొండాపూర్, జఫర్గడ్ మండలం సాగరం, రఘునాథపల్లి మండలం కుర్చపల్లి మూడ గ్రామాల్లో 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ పనులు 50శాతం వరకు పూర్తయ్యాయి. కొండాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో కొండాపూర్, శ్రీపతిపల్లి, కొమ్ముగుట్ట, లింగంపల్లి (సగం) ఫీడర్లు బదిలీ కానుండడంతో విద్యుత్తులో మరింత నాణ్యత పెరగనుంది. సాగరం సబ్స్టేషన్కు సాగరం, తిగుడు, కొనాయచలం, కుర్చపల్లి సబ్స్టేషన్కు అనుసంధానంగా ఇప్పగూడెం, రాఘవాపురం, గోవర్ధనగిరి గ్రామాల పరిధిలోని సగం ఫీడర్లు కలువనున్నాయి. లింగంపల్లి, పత్తేషాపూర్ 33 /11కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులకు టెండరు పూర్తి కాగా, జనగామ మండలం వడ్లకొండ సబ్స్టేషన్ పనులకు సంబంధించి టెండరు స్టేజీలో ఉంది. విద్యుత్ సబ్ స్టేషన్లు పూర్తయ్యాక జిల్లాలో విద్యుత్ సరఫరాలో ఓల్టేజీ సమస్యలు తగ్గి, నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి రానుంది. వ్యవసాయం, గృహ వినియోగం, చిన్నతరహా పరిశ్రమలకు ఊరట కలిగించే విషయం. -
‘ప్రీప్రైమరీ’ మరింత బలోపేతం
జనగామ రూరల్: ప్రీప్రైమరీ విద్య మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. జిల్లాలోని 12 మండలాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈనేపథ్యంలో పాఠశాలల్లో బోధకులు, ఆయాలుగా రెండు పోస్టులు మంజూరు చేశారు. అంగన్వాడీలో కేవలం పౌష్టికాహారంతో పాటు ఆటాపాటలతో విద్యాబోధన చేసేవారు. అంగన్వాడీలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి కేంద్రాల్లోని చిన్నారులను ఆకట్టుకునే విధంగా వసతుల కల్పనకు పెద్దపేట వేసింది. ఈ మేరకు కేంద్రాలకు రకరకాల పరికరాలు, రంగురంగుల మ్యాట్లు, టేబుళ్లు పం పిణీ చేసింది. కేంద్రాల్లో ప్రీ స్కూల్ విద్యావిధానాన్ని మెరుగుపరిచే దిశగా మాతా, శిశు సంక్షేమశాఖ కృషి చేస్తోంది. జిల్లాలోని 12 మండలాల్లో మంజూరు అయిన 12 అంగన్వాడీ కేంద్రాలకు బోధకులు, ఆయా పోస్టులు మంజూరు చేసింది. బోధకులు 12, ఆయాలు 12 పోస్టులు మొత్తం 24 పోస్టులు తాత్కాలిక పద్ధతిలో పోస్టులు భర్తీ చేయనుంది. అర్హతలు ఫ్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ పోస్ట్కు కనీస అర్హతగా ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి. బాల్యవిద్య లేదా ప్రాథమిక బోధనలో అర్హతలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుందని, బోధనలో పూర్వ అనుభవం కలవారికి, వితంతువులకు ప్రత్యేక వెయిటేజ్ ఉంటుంది. ఆయా పోస్ట్కు కనీస విద్యార్హత ఏడో తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలని, జిల్లాలోని సంబంధిత మండలానికి చెందిన గ్రామపంచాయతీ పరిధిలో నివాసం కలిగి స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు 18 సంవత్సరం నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలని ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుందన్నారు. నియామకాలు పూర్తిగా తాత్కాలికమని, గౌరవ వేతనంగా ప్రతి విద్యాసంవత్సరానికి 10 నెలలు మాత్రమే చెల్లించడం జరుగుతుందన్నారు. బోధకులకు 8వేలు, ఆయాలకు 6వేలు గౌరవ వేతనం ఉంటుంది. 24 నుంచి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి దరఖాస్తులను అక్టోబర్ 4వ తేదీ వరకు స్వీకరిస్తారు. పాలకుర్తి: ఎంపీపీఎస్ పాలకుర్తి–2 ఎంపీపీఎస్ గూడూర్–2 దేవరుప్పుల: ఎంపీపీఎస్ సింగరాజుపల్లి –2, ఎంపీపీఎస్ కోలుకొండ–2 రఘునాథపల్లి: ఎంపీపీఎస్ కంచనపల్లి –2, ఎంపీపీఎస్ ఖిళాషాపురం–2 జనగామ: ఎంపీయూపీఎస్ యశ్వాంతాపూర్ –2, జనగామ పట్టణంలోని ఎంపీపీఎస్ రాజీ వ్నగర్ కాలనీ–2, ఎంపీపీఎస్ పసరమడ్ల–2 స్టేషన్ ఘన్పూర్: ఎంపీపీఎస్ స్టేషన్ఘన్పూర్ –2 జఫర్ఘడ్ : ఎంపీపీఎస్ తమ్మడపల్లి జీ–2 కోడకండ్ల : ఎంపీపీఎస్ కొడకండ్ల –2. 12 పాఠశాలలకు బోధకులు, ఆయా పోస్టులు మంజూరు తాత్కాలిక పద్ధతిలో నియామకం -
‘స్థానిక’ రిజర్వేషన్లపై ఉత్కంఠ
జనగామ: స్థానిక సంస్థల ఎన్నికల (ఎంపీటీసీ, సర్పంచ్, వార్డుసభ్యులు) ప్రక్రియపై రాజకీయ వర్గాలు, ఆశావహుల దృష్టి కేంద్రీకృతమైంది. ఈసారి రిజర్వేషన్ల అంశం ప్రధాన చర్చగా మారింది. ప్రాథమిక దశ(ప్రిలిమినరీ)లో అధికార యంత్రాంగం రిజర్వేషన్ల కసరత్తును ప్రారంభించగా, అభ్యర్థులలో టెన్షన్ పట్టుకుంది. ప్రభుత్వం ఇప్పటికే 42 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక జీవో విడుదల కావాల్సి ఉంది. అయితే, జీవో వెలువడకపోవడంతో అధికారులు తాత్కాలికంగా సర్వేలు, గణాంకాలను సేకరించడం, గత ఎన్నికల రిజర్వేషన్ల స్థితిని పరిశీలించడం వంటి పనులను చేపట్టారు. ఒకసారి గైడ్లైన్న్స్ విడుదలైతే పూర్తిస్థాయిలో రిజర్వేషన్ల ప్రక్రియ ముందుకు సాగనుంది. ఈసారి రిజర్వేషన్లు రొ టేషన్ పద్ధతిలో అమలుకానున్నాయి. అంటే, గత ఎన్నికల్లో ఒక నిర్దిష్ట వర్గానికి కేటాయించిన స్థానాలు ఈసారి ఇతర వర్గాలకు వెళ్లే పద్ధతి రూపొందించనున్నారు. దీంతో అనేక గ్రామాలు, వార్డుల్లో పోటీ చేయాలని కలలు కంటున్న ఆశావహులు ఏ వర్గానికి రిజర్వేషన్ వస్తుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గతంలో సాధారణంగా ఉన్న సీట్లు ఈసారి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కిందకు వచ్చే అవకాశముంది. అదే విధంగా రిజర్వ్ అయిన స్థానాలు ఈసారి సాధారణ వర్గానికి వెళ్లే పరిస్థితులు ఏర్పడవచ్చు. రిజర్వేషన్లే కీలకం ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో మొదట రిజర్వేషన్ల జాబితా కీలక మలుపు కానుంది. ఎందుకంటే ఎవరి గ్రామంలో, ఎవరి వార్డులో పోటీ చేసే అవకాశం దీనిపైనే ఆధారపడుతుంది. స్థానిక రాజకీయ సమీకరణాలు కూడా రిజర్వేషన్ల ప్రకటనతోనే స్పష్టతకు వస్తాయి. ప్రస్తుతం కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే సమాచారంతో గ్రామాల్లో ఒక్కసారిగా ఎలక్షన్ వాతావరణం నెలకొంది. ప్రతి మండల పరిధిలో గ్రామాలు, వార్డుల జనాభా గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి గైడ్లైన్న్స్ అందిన వెంటనే తుది రిజర్వేషన్ ప్రక్రియ పట్టాలెక్కనుంది. మొత్తానికి, జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా మొదటి అడుగు రిజర్వేషన్ల ప్రక్రియతోనే ప్రారంభ మవుతోంది. ఈ నెల 29వ తేదీ వరకు 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన క్లారిటీ ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 280 జీపీలు..12 మండలాలు జిల్లాలో 12 మండలాల పరిధిలో 280 గ్రామ పంచాయతీలు, రెండు మునిసిపాలిటీలు ఉన్నాయి. 2,534 వార్డులు ఉండగా, 134 మంది ఎంపీటీసీలు ఉన్నాయి. వీటి పరిధిలో 4లక్షల ఓటర్లు ఉన్నారు. 42 శాతం ప్రత్యేక జీవో కోసం ఎదురుచూపులు అధికార యంత్రాంగం కసరత్తు -
ప్రజల సహకారం అవసరం
జిల్లాలో కొత్తగా చేపట్టిన 33/11కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ముఖ్యంగా స్థల కేటాయింపు, లైన్ అనుసంధానం, తదితర అంశాల్లో ప్రజల సహకారం అవసరం. సాల్వాపూర్ గ్రామంలో స్థల కేటాయింపు ఇంకా జరగలేదు. మల్లంపల్లి, ముత్తారంలో టెండరు పూర్తికాగా, స్థల సమస్య వచ్చింది. మిగతా చోట్ల సబ్స్టేషన్ నిర్మాణ పనులు ఆయా దశల్లో ఉన్నాయి. ఈ సేవలు అందుబాటులోకి వస్తే విద్యుత్లో మరింత నాణ్యత పెరుగుతుంది. – టి.వేణుమాధవ్, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్, జనగామ -
సీసీఐ కొనుగోళ్లలో అక్రమాలు అరికట్టాలి
జనగామ రూరల్: జిల్లా పరిధిలోని రైతుల పత్తి పంటను మాత్రమే కొనుగోలు చేయాలని, సీసీఐ, కాటన్ మిల్లుల కొనుగోలు కేంద్రాల్లో అవినీతి, అక్రమాలు అరికట్టాలని తెలంగాణ రైతు సంఘం పట్టణ కార్యదర్శి మంగ బీరయ్య కోరారు. బుధవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఏఓ శ్రీకాంత్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా బీరయ్య మాట్లాడుతూ..జిల్లాలో మొత్తం 16 పత్తి కాటన్ మిల్లులు ఉన్నాయని రెతులు తమ పత్తి విక్రయించడానికి సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో డాటా ఎంట్రీ ఆపరేటర్లను కలెక్టర్ ఆధ్వర్యంలో నియమించాలని, సాఫ్ట్వేర్ కాంట్రాక్టులు పారదర్శకంగా ఉండాలన్నారు. మిల్లర్లు రైతుల నుంచి 2శాతం కమీషన్ వసూలు చేస్తే వెంటనే మిల్లుల లైసెన్స్ రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తాండ్ర ఆనందం, కరే బీరయ్య పాల్గొన్నారు.