Jangaon District Latest News
-
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా ● ప్రజావాణిలో 224 దరఖాస్తులుజనగామ రూరల్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో ప్రజల నుంచి అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులతో పాటు పెండింగ్ వినతులను సంబంధిత అధికారులు త్వరగా పరిష్కరించాలన్నారు. మొత్తం 224 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, ఆర్టీఓ శ్రీనివాస్గౌడ్, డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎన్.ఎల్. నరసింహ రావు, ఎకై ్సజ్ ఎస్పీ అనిత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తులు కొన్ని ఇలా.. ● స్టేషన్ఘనపూర్ మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన వసంత, కోమళ్లకు చెందిన జయలక్ష్మి, జిల్లా కేంద్రానికి చెందిన కల్యాణికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విన్నవించారు. ● దేవరుప్పుల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన జీడ్డి నాగమ్మ 2010లో 346 గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేయగా ఆ భూమిని నాలాగా మార్చుకోవాలని విక్రయదారుడు ప్రయత్నిస్తుండని నాలాను రద్దు చేసి, ఆ వ్యక్తులపై చర్య తీసుకోవాలని దరఖాస్తు చేసింది. ● స్టేషన్ఘనపూర్ మండలం నమిలిగొండ గ్రామానికి చెందిన గుంటి గట్టయ్య, తనకు 21 గుంటల వారసత్వ భూమి ఉందని తన పేరు మీదకు భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని విన్నవించింది. ● వెంకిర్యాల గ్రామంలో మహిళా సంఘాల సభ్యులు చెల్లించిన డబ్బులు బ్యాంక్లో చెల్లించకుండా అక్రమాలకు పాల్పడారని, బ్యాక్ మిత్ర, సీఏలపై విచారణ చేపట్టాలని రికవరీ చేయాలని వెంకిర్యాల మహిళా సంఘం సభ్యులు కోరారు. ● ఇప్పగూడెం గ్రామ పరిధిలోని సింగారపు ఏనె గుట్టలో కొంతమంది అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఇప్పగూడెం గ్రామస్తులు కోరారు. పట్టా భూమిని బ్లాక్ లిస్టులో పెట్టారు ఏడునూతల గ్రామంలో సర్వే నంబర్ 112ఏ2లో ఆరు ఎకరాల భూమి ఉంది. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నాం. పట్టా పాస్ బుక్ కూడా ఉంది. కొడకండ్ల బ్యాంక్లో రూ.2లక్షల రుణం తీసుకుని చెల్లించా. తహసీల్దార్ పీఓబీ బ్లాక్ లిస్టులో పెట్టారు. విచారణ చేపట్టి పట్టా భూమిని బ్లాక్ లిస్టు నుంచి తొలగించాలి. – ముత్తినేని వెంకటయ్య, ఏడునూతల, కొడకండ్ల -
రేపు పట్టణంలో నీటి సరఫరా బంద్
మంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026కాళేశ్వరాలయ పునరుద్ధరణ భూమి పూజలో సీఎం రేవంత్రెడ్డి, చిత్రంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి, పొన్నం, తదితరులు, మేడిగడ్డలో జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు పరిశీలిస్తున్న సీఎం రేవంత్, సభకు హాజరైన జనంధాన్యం కొనుగోళ్లలో వేగవంతం స్టేషన్ఘన్పూర్/ దేవరుప్పు ల: జిల్లాలోని పలు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యం, సెంటర్లు ఏర్పాటు చేసిన చోట కాంటాలు వేయడంలో ఆలస్యం, అకాల వర్షాల భయంతో అన్నదాతలు పడుతున్న ఇబ్బందులపై ‘కల్లాల్లో కుప్పలు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ఈనెల 18న ప్రచురితమైన కథనానికి కలెక్టర్ సందీప్కుమార్ ఝా స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు పలు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో పాటు ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి పావని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొందరు రైతులు ఒకేసారి పెద్ద మొత్తంలో ధాన్యం కేంద్రాలకు తీసుకురావడంతో తాత్కాలిక నిల్వ సమస్యలు ఎదురవుతున్నాయని, అయితే వాటి పరిష్కారా నికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. కొనుగోళ్లలో ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించేలా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని, రైతులు ఏమైనా సమస్యలుంటే స్థానిక అధికారులను సంప్రదించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై కళాజాతా జనగామ: ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికను పురస్కరించుకుని జనగామ పోలీసు ఆధ్వర్యంలో ఆరైవ్, అలైవ్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షణలో సోమవారం ఆర్టీసీ బస్టాండ్లో వరంగల్ కళాబృందం సభ్యులు రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలు, మద్యం సేవించి వాహనం నడపడం వంటి అంశాలపై పాటల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించడం, కారులో సీట్ బెల్ట్ ధరించడం, వేగ పరిమితులను పాటించడం వంటి భద్రతా నియమాలను పాటించాలనే సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడిగా రవి జనగామ: జనగామ మున్సిపల్ డ్రైవర్స్ యూని యన్ అధ్యక్షుడిగా మునిగె రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం పట్టణ ంలోని ఓ గార్డెన్లో జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా మసి రాజు, కోశాధికారిగా భూషపాక ప్రేమ్, గౌరవ అధ్యక్షుడిగా మల్లిగారి రాజుతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. మక్కల కొనుగోళ్లు వెంటనే చేపట్టాలిపాలకుర్తి టౌన్: పాలకుర్తి చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్కు 15 రోజులుగా రైతులు తీసుకొచ్చిన మక్కలు కొనుగోళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని సోమవారం మండలకేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఎండను సైతం లెక్క చేయకుండా రైతులు, బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. గంట పాటు పాలకుర్తి, సేష్టన్ఘన్పూర్, జనగామ, తొర్రూరు రహదారిలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు లేగ రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి వ్యవసాయంపై అవగాహన లేదన్నారు. తక్షణమే మక్కలు, ధాన్యం కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని, లేదంటే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు దుంపల సంపత్, నిరంజన్రెడ్డి, నవీన్రెడ్డి, పులిగిల్ల ఉపేందర్, గడ్డం నరేందర్, రాజేష్, నవీన్, గణేష్, నూకల నవీన్, చిక్కుడు అశోక్, వంశీ, సాయి తదితరులు పాల్గొన్నారు.సాక్షిప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల బృందం జేఎస్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం సుడిగాలి పర్యటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై సమీక్ష, రెండో విడత రైతు భరోసా విడుదల తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా కాళేశ్వరాలయ పునరుద్ధరణ పూజల్లో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు అనంతరం మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్లారు. పియర్స్ వద్ద శాంపిళ్లను పరి శీలించారు. కుంగిన ఏడో బ్లాక్ వద్ద డ్రిల్లింగ్ పనులు చూసిన సీఎంకు బ్యారేజీ వద్ద చేస్తున్న పరీ క్షలను అధికారులు వివరించారు. సీఎంతో పాటు ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్జైన్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. జియో టెక్నికల్, జియో ఫిజికల్, జీపీఆర్ శాంపిళ్లు ఎలా తీస్తున్నారో చూశారు. ప్రభుత్వం మొత్తం 520 శాంపిళ్లు సేకరించి సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూఆర్పీఎస్)కు పంపనుంది. ల్యాబ్లో పరీక్షల తర్వాత మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై పూర్తి అవగాహన వస్తుందని ఈ సందర్భంగా డ్రోన్ బేస్డ్ జీపీఆర్ టెస్ట్కు సంబంధించి అధికారులు సీఎంకు వివరించారు. ప్యార్లర్ క్రాస్ హోల్ సెస్మిక్ టెస్ట్ వివరాలను వివరించారు. సుమారు గంటపాటు అధికారులతో సమీక్ష.. మూడు బ్యారేజీల పరిస్థితిపై అధ్యయనం చేసిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి కాళేశ్వరం వద్ద ఎల్ అండ్ టీ గెస్ట్హౌస్లో అధికారులతో సమీక్ష జరిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లోపాలపై ఎలా ముందుకెళ్లాలో చర్చించారు. ఇటీవల నియమించిన స్టీరింగ్ కమిటీ చైర్మన్ కల్నల్ పరిచిత్ మెహ్రా బృందంతో కూడా సీఎం చర్చించి పలు సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరంలో అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదలమని, అలాగే రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టును కూడా గాలికి వదలమని, నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్న సీఎం రేవంత్రెడ్డి.. అధికారులు పూర్తిగా సహకరించాలని, ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని కోరారు. ప్రతిపక్షాలపై నిప్పులు.. అభివృద్ధి, సంక్షేమానికి హామీ.. కాటారం మండలం నస్తూర్పల్లిలో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తుమ్మిడిహెట్టిప్రాజెక్టును యథాతథంగా కొనసాగిస్తే లాభం ఉండదని భావించిన కేసీఆర్ పేరు మార్చి, అంచనాలు మార్చి అవినీతికి తెరతీశారని, రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.50 లక్షల కోట్లకు పెంచారని అన్నారు. తనకు రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని భావించారని, ఆనాడు గవర్నర్ నరసింహన్ను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పించారన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు ఉన్నాయని 2020లోనే ఇంజనీర్లు చెప్పారని గుర్తు చేశారు. ఇంజనీర్ల లేఖలను సీఎం, ఎల్అండ్టీ సంస్థ పట్టించుకోలేదని, ఫలితంగా 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలి పోయిందని ఆరోపించారు. అన్ని దాచిపెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నించినా, ప్రకృతి మరొకటి తలచి అది పూర్తిగాకుంగిపోవడంతో ప్రపంచానికి అసలు విషయం తెలిసిందన్నారు. సీబీఐ విచారణకు అప్పగించి 9 నెలలు అవుతున్నా కేంద్రం నుంచి స్పందన లేదని, కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరంపై ఇప్పటికీ సీబీఐ విచారణకు ఆదేశించలేదని, 2019 నుంచి ఈ ప్రాజెక్టు ద్వారా 162 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశామని తెలిపారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును వృథాగా పోనీయలేమని, మరమ్మతులు పూర్తి చేసి ప్రాజెక్టును ఉపయోగంలోకి తెస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క, తుమ్మల, గడ్డం వివేక్, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేమ్సాగర్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. నస్తూర్పల్లి బహిరంగ సభలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‘రైతు ఉత్సవాలు’ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి భూపాలపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానానికి రూ.200 కోట్లు నిధులు ఇచ్చామని, ఆలయ పునర్నిర్మాణ పనులు, ఇతర కట్టడాలు చేపట్టి అంగరంగ సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి వెల్లడించారు. ప్రజాపాలనలో భాగంగా.. కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామ సమీపంలో సోమవారం ‘రైతు ఉత్సవాలు’ బహిరంగ సభ నిర్వహించారు. సభాస్థలి సమీపంలో రూ.203 కోట్లతో ఆరెంద–దామెరకుంట గ్రామాల మధ్య ఉన్న మానేరు వాగుపై రూ.203 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే సత్యనారాయణరావు కోరిన ప్రతీసారి అభివృద్ధి పనులకు సరిపడా నిధులు ఇస్తున్నామన్నారు. సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించుకున్నామని, త్వరలోనే జరుగనున్న అంత్య పుష్కరాలకు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామన్నారు. కాళేశ్వరం దేవస్థానం, ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులకు అవసరమైన నిధులిస్తామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు.ముందుగా మేడిగడ్డను సందర్శించిన సీఎం, మంత్రులు, నిపుణులు ఎన్డీఎస్ఏ, స్టీరింగ్ కమిటీ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష 3 బ్యారేజీల మరమ్మతులకు నిర్ణయం బహిరంగసభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన సీఎం రూ.407 కోట్లతో పథకాలకు శంకుస్థాపన జనగామ: జనగామ పట్టణానికి తాగునీరు అందించే చీటకొడూరు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద మరమ్మతు కారణంగా రేపు (బుధవారం) నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని కమిషనర్ మహేశ్వర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరమ్మతు నేపథ్యంలో రోజువారీగా సరఫరా అయ్యే నీటిని కేవలం నిత్యావసరాలకు మా త్రమే ఉపయోగించుకోవాలని, 20 రోజుల పాటు ఎవరూ కూడా తాగొద్దన్నారు. పట్టణ ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. -
విద్యాభివృద్ధికి సమష్టి కృషి
● సమీక్షలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ: జిల్లాలో విద్యాభివృద్ధికి సమష్టి కృషి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో విద్యా ప్రమాణాల పెంపు, కొత్త విద్యార్థుల నమోదుకు సంబంధించి ఎంఈఓలు, సీహెచ్ఎంలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలబాలికలు పాఠశాలకు వచ్చే విధంగా చూడాలన్నారు. ఈ నెల 21, 22వ తేదీల్లో చేపట్టే ‘బడిబాట‘ ప్రత్యేక నమోదు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో గరిష్ట నమోదు సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఈ నెల 23వ తేదీన జిల్లాలోని అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశాలు (పీటీఎం) నిర్వహించాలని, ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, ప్రవర్తన, ఆరోగ్యం, నియమశీలత వంటి అంశాలపై చర్చించాలన్నారు. ఈ సమావేశంలో ఏఎంఓ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియాబేగం, ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావాలని కలెక్టర్ సందీప్ కుమా ర్ ఝా స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సోమవారం ఐకేపీ, మెప్మా, సిబ్బందితో వీ డియో కాన్ఫెరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. కొ నుగోలు కేంద్రం నిర్వాహకుల వద్ద టోకెన్ పద్ధతి ఉంటుందని, దానికి అమలు చేయాలన్నారు. మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడు జనగామ రూరల్/పాలకుర్తి టౌన్: అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బసవేశ్వర జయంతి నిర్వహించారు. అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఎన్. ఎల్. నరసింహ రావు, ఏబీసీడీఓ రవీందర్, నాయకులు బి. సిద్దయ్య, జిలకర కుమార స్వామి, తదితరులు పాల్గొన్నారు. అలాగే పాలకుర్తిలో శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం, సోమనాథ కళాపీఠం ఆధ్వర్యంలో మహాకవి సోమనాథ స్మృతి వనంలో బసవేశ్వరుడి జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ ఎఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్రాజా, ఓబీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ పులి గణేష్గౌడ్, సాంబయ్య, భుజేందర్, తదితరులు పాల్గొన్నారు. -
హిందూ ధర్మ రక్షణకు ఐక్యంగా ఉండాలి
రఘునాథపల్లి: హిందూ ధర్మరక్షణకు అందరూ ఐక్యంగా ఉండాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ సునీత రామ్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. రఘునాథపల్లి మండలం నిడిగొండలో ఆదివారం హిందూ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఫతేషాపూర్, భాంజీపేట, లక్ష్మితండా, రామచంద్రగూడెం, ఇబ్రహీంపూర్, శ్రీమన్నారాయణపురం, రఘునాథపల్లి, కన్నాయపల్లి, గబ్బెట గ్రామాలకు చెందిన దాదాపు 300 మంది హిందూ బంధువులు సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీతరామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ హిందూ సంప్రదాయాలను నేటి తరానికి చేరవేయడం అవసరమన్నారు. అంతకుముందు శ్రీలక్ష్మినృసింహ ఆలయం నుంచి అంజనేయస్వామి విగ్రహంతో భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించారు. సర్పంచ్ బొమ్మ వీరస్వామిగౌడ్, కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మిల్కూరి రేణుక, గైని శ్రీనివాస్గౌడ్, ఎలపాటి రాంరెడ్డి, కోశాధికారి కాట మహేష్, బొంగు శ్రీధర్, కొంగరి నర్సింగరావు, పెసరు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలను నిరోధించాలి జనగామ రూరల్: బాల్య వివాహాలను నిరోధించడం ప్రతీఒక్కరి బాధ్యతని స్పందన కల్చరల్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ (స్కోప్) డైరెక్టర్ బండి సాయన్న అన్నారు. ఆదివారం పట్టణంలో స్కోప్ సంస్థ విజిలెన్స్డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నివారణకు కృషి చేయాలన్నారు. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం బాల్య వివాహాల్లో పాల్గొనే వారికి కూడా శిక్ష విధించబడతాయన్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రమాణాలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఆశలు, అంగన్వాడీ కార్యకర్తలు, సంస్థ ప్రతనిధితులు పాల్గొన్నారు. న్యూశాయంపేట: విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, ఆర్ట్, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించి నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థ(టెమ్రిస్) రీజినల్ కో–ఆ ర్డినేటర్ జంగా సతీశ్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మైనార్టీ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న (5 నుంచి 8వ తరగతి) విద్యార్థులకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణలో భాగంగా పదిరోజుల పాటు నిర్వహించే సమ్మర్ క్యాంప్ను ఆదివారం వరంగల్ శంభునిపేట, వరంగల్(జి2) గురుకులంలో ప్రారంభించారు. ప్రిన్సిపాల్ తాళ్ల నీలిమాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జంగా సతీశ్ మాట్లాడుతూ.. సమ్మర్క్యాంపునకు బాలికలకు, శంభునిపేట గురుకులంలో, బాలురకు జక్కలొద్ది గురుకులంలో సౌకర్యాలు కల్పించి పదిరోజుల పాటు క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 400 మంది విద్యార్థులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్ అధికారులు సయ్యద్ అక్బర్, మక్బూల్పాషాతో పాటు, పీఈటీలు, ఆర్ట్స్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. 22 నుంచి సమ్మెకు సిద్ధం నయీంనగర్: సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ బస్టాండ్ ఆవరణలోని వరంగల్–1 డిపో ఎదుట రీజియన్ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, లేకపోతే ఈ నెల 22వ తేదీ నుంచి కార్మికులమంతా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. నాయకులు ఎం.శ్రీనివాస్, యాకస్వామి, టి.శ్రీనివాస్, జీఎస్.పాణి, కార్మికులు పాల్గొన్నారు. -
దాహం తీర్చాలని తల్లికోతి తపన
ఎండలు మండుతున్నాయి. మనుషులతోపాటు మూగజీవాలు కూడా అల్లాడుతున్నాయి. దాహం తీర్చుకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి సమయంలో జనగామ రైల్వేస్టేషన్ ప్లాట్ఫాంపై ఆదివారం కనిపించిన ఒక చిన్న దృశ్యం పెద్ద సందేశాన్ని అందిస్తోంది. నల్లా వద్దకు వచ్చి నీళ్ల కోసం అల్లాడుతున్న ఒక తల్లికోతి.. ఒడిలో తన చంటిపాపను గట్టిగా హత్తుకుని మనుషుల్లాగే జాగ్రత్తగా నల్లా తిప్పి నీళ్లు తాగించింది. దీనిని చూసిన ప్రయాణికులు ఒక్క క్షణం అలాగే ఆగిపోయారు. బిడ్డకు నీరు అందించాలని తల్లికోతి పడిన తపన, ప్రేమ, పట్టుదల అక్కడున్న అందరిని కదిలించింది. మనుషులకే కాదు.. ప్రకృతిలోని ప్రతి జీవికి నీరు ఎంత విలువైందో ఈ దృశ్యం మరోసారి గుర్తు చేసింది. – జనగామ -
నేటినుంచి ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షలు
జనగామ: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో నేటి నుంచి (ఆదివారం) 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్ ఇంటర్, పదవ తరగతి (ఎస్సెస్సీ) పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు జరిగే పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రోజుకు రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఇంటర్, పది తరగతులు కలుపుకుని 2,874 మంది విద్యార్థు లు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో ఇంటర్లో 2,041, పదవ తరగతి కోసం 833 మంది ఉన్నారు. పరీక్ష సెంటర్లు ఇవే.. ఇంటర్, పది ఓపెన్ పరీక్షల కోసం 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షల కోసం స్టేషన్ఘన్పూర్ ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల (ఏ/సెంటర్), స్టేషన్ఘన్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల (ఏ/సెంటర్), జనగామ ధర్మకంచ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ధర్మకంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలో (ఏ/బీ రెండు సెంటర్లు), జనగామ హన్మకొండ రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ గురుకులం(ఏ/బీ రెండు సెంటర్లు), స్టేషన్ఘన్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల (బీ సెంటర్), స్టేషన్ఘన్పూర్ బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బీ సెంటర్), పదవ తరగతి పరీక్షల కోసం జనగామ ప్రభుత్వ హైస్కూల్, వడ్లకొండ, శివునిపల్లి, చాగల్ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు (తెలంగాణఓపెన్స్కూల్.ఓఆర్జీ)వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకుని సూచించిన పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలని, సమయపాలన ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు. హాజరుకానున్న 2,874 మంది విద్యార్థులు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
సమాజ ఉన్నతికి పాటుపడే నిస్వార్థపరులు కళాకారులు
జనగామ రూరల్: సమాజ ఉన్నతికి పాటుపడే నిస్వార్ధపరులు కవులు కళాకారులని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి అన్నారు. కవులు కళాకారుల ఐక్యవేదిక ఏడవ వార్షికోత్సవం పట్టణంలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. కవులు కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు జి.కృష్ణ అధ్యక్షత ముఖ్యఅతిథిగా పద్మశ్రీ గడ్డం సమ్మయ్య, ప్రముఖ కవయిత్రి నెల్లుట్ల రమాదేవి, తెలంగాణ అసెంబ్లీ సహాయ కార్యదర్శి బేతి వీరారెడ్డి పాల్గొన్నారు. తొలుత ఐక్యవేదిక ఏడవ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను నామోజు బాలాచారి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కవులు కళాకారుల కలయిక అనేది ఒక అపూర్వ ఘట్టమని, వీరిని ఏకతాటికి తీసుకొని కార్యక్రమాలు నిర్వహించడం మంచి విషయమన్నారు. కాగా మినీ కవితల పోటీల్లో గెలుపొందిన ఐదుగురు విజేతలకు నగదు పారితోషకం, ప్రశంస పత్రం, మెమొంటో శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కళాకారుల ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి పెట్లోజు సోమేశ్వరాచారి, కల్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి, సాదిక్ అలీ, దేవేందర్, డాక్టర్ లింగంపల్లి రామచంద్ర, నెల్లుట్ల రవీందర్ రావు, రేణుకట్ల మురళి, అంకాల సోమయ్య, తదితరులు పాల్గొన్నారు. -
టోకెన్ విధానం తప్పనిసరి
నర్మెట: ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగాలని, టోకెన్ విధానంలోనే ధాన్యం సేకరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మండలంలోని హ న్మంతాపురం, తరిగొప్పుల మండలకేంద్రంలో ఆది వారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా తేమ శాతా న్ని, రికార్డులను పరిశీలించిన ఆయన రైతులకు క ల్పించిన మౌలిక వసతులపై, గన్నీబ్యాగులు, టా ర్ఫాలిన్ నిల్వలపై ఆరా తీశారు. రైతలకు వేచి ఉండే సమయాన్ని తగ్గించాలని, ఎప్పటికప్పుడు ధా న్యాన్ని మిల్లులకు తరలించాని, ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఏఈఓ సుంకరి జగదీష్, వీఓఏ రేణుక, ఓం సాయిబాబా గ్రామైఖ్య సంఘం మమత, ఉపేంద్ర, సుధ, లచ్చమ్మ, శ్రీలత, రైతులు ఉన్నారు. కేజీబీవీ సందర్శన చిల్పూరు: మండలంలోని రాజవరం గ్రామ సమీ పంలోని కేజీబీవీని ఆదివారం కలెక్టర్ సందీప్కుమార్ ఝా సందర్శించారు. మొదట భవనంలోని అన్ని గదులను పరిశీలించారు. వంట గదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్కుమార్, ఎంపీడీఓ రఘురామకృష్ణ తదితరులు ఉన్నారు. నేటి నుంచి ‘సంక్షేమ వారోత్సవాలు’ జనగామ రూరల్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి 26వ తేదీ వరకు ‘సంక్షేమ వా రోత్సవాల’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. కార్యక్రమం విజయవంతంగా సాగేందుకు జిల్లావ్యాప్తంగా 81 మందిని ప్రత్యేక అధికారులుగా నియమించామన్నారు. విద్యాసంస్థల అభివృద్ధి, వి ద్యార్థుల సంక్షేమం, మౌలిక సదుపాయాల బలోపేతమే ప్రధాన ధ్యేయమన్నారు. 20వ తేదీన వంట గదులు, వసతి గృహాలు, పాఠశాలల తనికీ నిర్వహించి పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి. 21న క్విజ్, చిత్రలేఖనం, నుక్కడ్నాటకాలు నిర్వహించాలి. 22న పాఠశాలలు, వసతి గృహాల్లో అవసరమైన మరమ్మతులను గుర్తించి అంచనాలు సిద్ధం చేయాలి. 23న తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సమావేశాలు నిర్వహించడం. 24న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించడం. 25న క్రీడలు, కళలు, సంగీతం, డిజిటల్ అక్షరాస్యతపై వేసవి శిబిరాలు నిర్వహించడ. 26న బడిబాట ద్వారా ప్రవేశాల డ్రైవ్ నిర్వహించి నమోదు శాతం పెంచడం. ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
రసాయన ఎరువులతో అనర్థాలు!
జనగామ: యూరియా, డీఏపీ ఎరువుల అధిక వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో నేల ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలు కలుగకుండా కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖ అత్యవసర చర్యలు చేపట్టింది. ఈ మేరకు కృషి విజ్ఞాన్ కేంద్రాలు, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్లకు విస్తృత అవగాహన కార్యక్రమాలు ప్రారంభించాలని ఆదేశించారు. కొన్నేళ్లుగా దేశంలోని ఆయా జిల్లాల్లో యూరియా, డీఏపీ వినియోగం ఎక్కువగా నమోదైందని గుర్తించారు. దీంతో నేలలో పోషక లోపాలు ఏర్పడటం, దీర్ఘకాలికంగా భూమి సారవంతం తగ్గిపోవడం వంటి లక్షణాలను నిర్ధారించారు. ప్రత్యేకంగా వరి ఆధారిత పద్ధతుల్లో నేలల్లో పాస్పరస్ నిల్వలు ఎక్కువగా ఉండటం, అదే భూమిలో తిరిగి వరి పంట వేసే సమయంలో శ్రీపాస్పరస్ అప్లికేషన్శ్రీ నిలిపివేయాలని శాసీ్త్రయ సిఫార్సులున్నాయని జీఓలో స్పష్టం చేసింది. కృషి విజ్ఞాన్ కేంద్రాలు, ఆత్మ ప్రాజెక్టు ద్వారా రైతులకు కాంప్లెక్సులు, ఎస్ఎస్పీ వాడకాన్ని ప్రోత్సహిస్తూ, యూరియా, డీఏపీపై ఆధారపడకుండా శాసీ్త్రయ సూచనల ప్రకారం ఎరువులు ఎంచుకోవాల్సిందిగా రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. బయో ఫర్టిలైజర్స్, ఆర్గానిక్, మైక్రోన్యూట్రి ఝెంట్స్ వినియోగంపై ప్రదర్శనలు, డెమోలను నిర్వహిస్తారు. రైతు శిక్షణ కార్యక్రమాలు, గ్రూప్ మీటింగ్స్, యూరియా, డీఏపీ అధిక వినియోగంతో కలిగే నష్టాలు, సమతుల్య ఎరువుల లాభాలు ఎలా వస్తాయనే దానిపై తెలియజేస్తారు. మట్టి పరీక్షల కార్డు సిఫార్సుల మేరకు ఎరువుల ఎంపికపై సూచనలు ఇస్తారు. అవగాహన సదస్సుల్లో వ్యవసాయం సాగుపై పురోగతి సాధిస్తున్న రైతులు, ఎఫ్పీఓలు, ఇన్పుట్ డీలర్లు వంటి వర్గాలను భాగస్వామ్యం చేస్తారు. జిల్లాలో రాబోయే వానాకాలం (ఖరీఫ్) సీజన్లో పంటల సాగు సమయంలో యూరియా సమర్థవంతమైన వినియోగంపై రైతులకు విస్త్రృత అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యవసాయ శాఖ సర్వం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 176 రెవెన్యూ గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు), ఆత్మ సిబ్బంది, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు కలిసి రైతులకు మార్గనిర్దేశం చేయనున్నారు. యూరియాను అధికంగా వాడటంతో నేల నాణ్యత తగ్గిపోవడం, పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండటం వంటి అంశాలపై రైతులకు వివరించనున్నారు. సమతుల్య ఎరువుల వినియోగం, నేల పరీక్షల ప్రాముఖ్యత, నానో యూరియా వినియోగం వంటి విషయాలపై కూడా అవగాహన కల్పిస్తారు. జిల్లాలోని 12 మండలాల్లో నేటి నుంచి 29 వరకు గ్రామాల వారీగా కార్యక్రమాల తేదీలను ఖరారు చేశారు. ప్రతీ గ్రామంలో నిర్వహించే ఈ సదస్సుల్లో రైతులతో నేరుగా చర్చలు జరిపి, వారి సందేహాలకు సమాధానాలు ఇస్తారు. యూరియా వినియోగంలో నియంత్రణ పాటిస్తే ఖర్చులు తగ్గి, పంటల దిగుబడి పెరుగుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా రైతుల్లో శాసీ్త్రయ వ్యవసాయంపై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది. సమతుల్య ఎరువుల వాడకంపై అవగాహన నేటి నుంచి జిల్లావ్యాప్తంగా సదస్సులు మట్టి పరీక్షల ఆధారంగా ఎరువులు ఎంపిక నానో యూరియా ప్రాముఖ్యతపై శిక్షణఅధిక యూరియా, డీఏపీ వినియోగం ఉన్న గ్రామాలు, బ్లాకుల కోసం జిల్లా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి, రాబోయే పంట సీజన్ ప్రారంభానికి ముందు అమలు చేయాల్సింటుంది. రైతులకు అధిక యూరియా, డీఏపీ వాడకం నేలను దెబ్బతీస్తుందని, అయితే ఎస్ఎస్పీ వాడటంతో నేల ఆరోగ్యం, పోషక సమతుల్యత, పంట దిగుబడులు మెరుగవుతాయని స్పష్టంగా తెలియజేయాలని పేర్కొంది. -
నేడు ముఖ్యమంత్రి కాళేశ్వరం టూర్
భూపాలపల్లి/కాళేశ్వరం: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం పర్యటనకు సోమవారం (నేడు) రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం హెలిపాడ్కు చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా కాళేశ్వరం దేవస్థానం చేరుకుని ముందుగా శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకుంటారు. తర్వాత కాళేశ్వరం దేవస్థానంలోని తూర్పు ఈశాన్య స్థలంలో రూ.200 కోట్ల వ్యయంతో రాతి నిర్మాణ పనుల భూమిపూజలో పాల్గొంటారు. కాళేశ్వరాలయం గర్భాలయం, శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయాల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. మేడిగడ్డలో జియో ఫిజికల్, టెక్నికల్ పరీక్షల పరిశీలన.. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్లో 19, 20వ పియర్లు, వంతెన కుంగిన విషయం తెలిసిందే. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కూడా సీపేజీ లీకేజీలు ఏర్పాడ్డాయి. అప్పటి నుంచి ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యాంసేఫ్టీ అథారిటీ) సూచనల మేరకు నీటిని నిల్వ చేయడం లేదు. దీంతో ప్రభుత్వం మరమ్మతులు చేసి నీటిని ప్రజలకు అందించడానికి ముందుకు రావడంతో సీఎం పర్యటన ఖరారు చేసినట్లు తెలిసింది. దీంతో 3.45 గంటలకు హెలికాప్టర్లో మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటారు. మేడిగడ్డ బ్యారేజీలో జరుగుతున్న జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు, బోర్హోల్స్ పనులను పరిశీలిస్తారు. అక్కడ ఇరిగేషన్శాఖ ఇంజనీర్లతో సమీక్షిస్తారు. సాయంత్రం 6 గంటలకు రోడ్డు మార్గం ద్వార నస్తుర్పల్లికి చేరుకుంటారు. 6.30 గంటలకు రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం ప్రారంభిస్తారు. ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. రాత్రి 7.45 గంటల అనంతరం రోడ్డు మార్గం ద్వార వెళ్తారని అధికారులు తెలిపారు. మూడు చోట్ల హెలిపాడ్ల ఏర్పాటు.. సీఎం పర్యటన నేపథ్యంలో కాళేశ్వరం దేవస్థానం, మేడిగడ్డ, నస్తుర్పల్లిలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మూడు చోట్ల హెలిపాడ్లు సిద్ధం చేశారు. కాళేశ్వరం దేవస్థానంలో పూలతో డెకెరేషన్స్ చేశారు. పూజా కార్యక్రమాలు, భూమిపూజ కోసం దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మేడిగడ్డలో సమీక్ష నిర్వహిస్తుడండంతో అంబట్పల్లిలోని గెస్ట్హౌస్లో ఏర్పాట్లు చేశారు. నస్తుర్పల్లిలో సుమారు 40 ఎకరాల్లో సభాప్రాంగణం, విద్యుత్ లైట్లు, ఇతర ఏర్పాట్లు చేశారు. 20 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు, హెలిపాడ్ సిద్దం చేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, డీఎస్పీ సూర్యనారాయణతో పాటు జిల్లా అధికారుల పనులు పూర్తి చేశారు. జనసమీకరణ.. కాటారం సబ్డివిజన్తో పాటు పక్క జిల్లాల నుంచి భారీ ఎత్తున సభకు ప్రజలు, రైతులు తరలి రావడానికి నాయకులు జన సమీకరణ చేపట్టారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు, ఆహార పదార్థాలు సమకూర్చనున్నారు. భారీగా ప్రజలను సభకు తీసుకురావాలని సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులకు మంత్రి శ్రీధర్బాబు సూచించారు. రూ.200 కోట్లతో కాళేశ్వరాలయం రాతి నిర్మాణ పనులకు భూమి పూజ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ సందర్శన కాటారం మండలం నస్తుర్పల్లిలో రైతు భరోసా నిధుల విడుదల ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
భూపాలపల్లి అర్బన్: ముఖ్యమంత్రి నేడు (సోమవారం) కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామానికి రానున్న నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. పరకాల నుంచి మహదేవపూర్ వరకు ఉన్న ఎన్హెచ్ 353–సీ రహదారిపై బొగ్గు, ఇసుక లారీలు, ట్రాక్టర్లు, ఇతర భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు స్థానిక సీఐ నరేష్శ్మార్ ప్రకటనలో తెలిపారు. రహదారి ఇరువైపులా వాహనాల పార్కింగ్కు అనుమతి లేదని స్పష్టం చేశారు. మంజూర్నగర్ నుంచి బాంబులగడ్డ వరకు ఈ నిబంధనలు కఠినంగా అమలులో ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయి కాటారం వైపు ప్రయాణించనున్నందున ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియంత్రణకు సహకరించి, పోలీసుల సూచనలు పాటించాలని ఆయన కోరారు. -
పట్టుగూళ్ల ధరల తగ్గింపుపై ఆగ్రహం
జనగామ: పట్టుగూళ్ల ధరలు తగ్గించడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని పట్టు పరిశ్రమల శాఖ కార్యాలయం వద్ద రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు చెందిన రైతులు శనివారం వరంగల్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. సిద్దిపేట, వరంగల్, సూర్యాపేట, కరీంనగర్, ఖమ్మం, పెద్దపల్లి తదితర జిల్లాల నుంచి వచ్చిన సుమారు 30 మంది రైతులు తమ పట్టుగూళ్లను విక్రయించేందుకు జనగామ మార్కెట్కు వచ్చారు. అనంతరం వారు మాట్లాడారు.. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందూపూర్ మార్కెట్లో కిలో పట్టుగూళ్ల ధర సగటున రూ.670 వరకు ఉండగా, జనగామలో వ్యాపారులు రూ.550 మాత్రమే ఇస్తామని చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలోకు రూ.120 తక్కువ ధర ఎలా నిర్ణయిస్తారని రైతులు వ్యాపారులను ప్రశ్నిస్తూ వాగ్వాదానికి దిగారు. రెండు ఎకరాల్లో పట్టు సాగు చేయడానికి నెలకు సుమారు రూ.50 వేల వరకు ఖర్చవుతుందని, కానీ దిగుబడి సుమారు 100 కిలోలకే పరిమితమవుతుందని ఆవేదన వెలిబుచ్చారు. ఈ పరిస్థితుల్లో మార్కెట్లో ధరలు తగ్గించడం వల్ల పెట్టుబడులు కూడా తిరిగి రాకుండా పోతున్నాయని రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి వచ్చిన రైతులు పన్యాల దుర్గారెడ్డి, ఐలయ్య, శ్రీనివాస్, రామస్వామి, రమేశ్ శంకర్, శ్రీనివాస్రెడ్డి, వెంకట్ రెడ్డి, గోవిందరాజు, అశోక్, పుల్లయ్య వాపోయారు. ధరలను తగ్గించడంతో నెల రోజుల పాటు కష్టం చేసినా లాభం లేకపోవడం బాధాకరమన్నారు. ధరల తగ్గింపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హైవేపై ధర్నా రైతులు తీసుకొచ్చిన పట్టుగూళ్లతో రహదారిపైకి దిగడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వ్యాపారులు కిలోకు రూ.30 పెంచుతామని సూచించగా, రైతులు కనీసం రూ.50 పెంచితేనే విక్రయిస్తామని పట్టుబట్టారు. ఈ వివాదం పరిష్కారం కాకపోవడంతో రైతులు సుమారు గంట పాటు ఎండలోనే రహదారిపై ధర్నా కొనసాగించారు. వరంగల్–హైదరాబాద్ హైవేపై రైతుల ధర్నా కిలోకు రూ.120 ఎలా తగ్గిస్తారంటూ ఆవేదన -
టోకెన్లతో చకచకా
జనగామ: యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను నివారించేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈసారి ధాన్యం కొనుగోలుకు ముందుగా ‘రైతు టోకెన్ స్లిప్పు’ అనే నూతన విధానాన్ని కలెక్టర్ ప్రవేశపెట్టారు. జిల్లాలో 236 ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తుండగా, ఇందులో ఐకేపీ 169, పీఏసీఎస్ 67 ఉన్నాయి. ఇంతకుముందు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత తేమ శాతం పరిశీలించి టోకెన్ ఇవ్వడం వల్ల ఆలస్యం, రద్దీ వంటి సమస్యలు ఎదురయ్యేవి. ఈ సమస్యలను అధిగమించేందుకు ఇప్పుడు టోకెన్ విధానాన్ని మూడు దశలకు విస్తరించారు. గతంలో ఒకే స్లిప్ ఉండగా, ప్రస్తుతం ఒకే స్లిప్లో మూడు టోకెన్లను ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి రైతుకు, మరొకటి ఏఈఓకు, ఇంకొకటి కొనుగోలు కేంద్రం నిర్వాహకుల వద్ద ఉంటుంది. ఈ టోకెన్లలో ధాన్యం రకం, కోత తేదీ, అంచనా దిగుబడి (క్వింటాళ్లలో), కొనుగోలు కేంద్రం, మండలం, ధాన్యం తీసుకు రావాల్సిన తేదీ వంటి వివరాలు నమోదు చేయాలి. ఏఈఓలు ప్రతీ గ్రామానికి వెళ్లి రైతులు ఎప్పుడు కోతలు కోస్తున్నారో తెలుసుకొని, కోత అనంతరం ధాన్యాన్ని సెంటర్కు ఎప్పుడు తీసుకురావాలో టోకెన్లో నమోదు చేసి రైతులకు అందజేస్తున్నారు. ఇప్పటికే సెంటర్లో ఉన్న ధాన్యానికి సంబంధించిన రైతులకు కూడా అక్కడికే వెళ్లి టోకెన్లు ఇస్తున్నారు. రైతులు టోకెన్లో పొందుపరిచిన తేదీ రోజున సెంటర్కు ధాన్యం తీసుకురావాలి. అక్కడ నిర్వాహకులు కేటాయించిన క్రమసంఖ్య ప్రకారం మాత్రమే కొనుగోలు జరుగుతుంది. తేమశాతం నిబంధనలకు అనుగుణంగా ఉంటే రైతులకు ఆలస్యం లేకుండా కొనుగోలు పూర్తవుతుంది. ధాన్యం విక్రయ సమయంలో రైతులు పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, అమల్లో ఉన్న బ్యాంకు పాస్బుక్ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. రైతులు ముందుగానే సెంటర్కు వచ్చిరోజుల తరబడి వేచి ఉండకుండా, సమయ పాలనతో ధాన్యం విక్రయం జరిగేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. వినూత్న టోకెన్ విధానాన్ని నిర్వాహకులు సమర్థంగా అమలు చేస్తే యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఏఈఓలు ఊరూరా తిరిగి రైతుల వివరాలు నమోదు చేస్తూ రశీదులు అందజేస్తున్నారు. మూడు దశల టోకెన్ విధానం ఒకే స్లిప్లో మూడు టోకెన్లు టోకెన్ ఇచ్చే బాధ్యత ఏఈఓలదే.. రాష్ట్రంలోనే కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తొలి ప్రయత్నం జిల్లాలో 236 ధాన్యం కొనుగోలు సెంటర్లు -
మత్స్యయూనిట్లకు లబ్ధిదారుల ఎంపిక
జనగామ రూరల్: ఇందిరా మహిళా శక్తి పథకం కింద మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్ ఐస్బాక్స్తో కూడిన త్రిచక్ర వాహన యూనిట్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను శనివారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, జిల్లా స్థాయి కమిటీ అధ్యక్షతన అర్హులైన లబ్ధిదారులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లాకు 40 శాతం సబ్సిడీ కింద కేటాయించిన ఒక మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్, రెండు ఐస్ బాక్స్తో కూడిన త్రిచక్ర వాహనం యూనిట్లకు గాను మొత్తం (21) దరఖాస్తులు రాగా, వాటిలో ముగ్గురు లబ్ధిదారులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారి రాణా ప్రతాప్, డీఎల్సీ కమిటీ సభ్యులు, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుల, స్వయం సహాయక సంఘాలు, మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు. సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా అమలుచేయాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులతో సంక్షేమ వారం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జిల్లాలోని అన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో, వసతి గృహాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. డీఏఓ అంబికా సోనీ, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎన్.ఎల్. నరసింహరావు, ఏబీసీడీఓ రవీందర్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవి లత, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, ఇన్చార్జ్ డీఆర్డీఓ నూరుద్దీన్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
ముగిసిన ఎస్ఏ–2 పరీక్షలు
జనగామ: జిల్లాలో ఎస్ఏ–2 వార్షిక పరీక్షలు ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం కాగా, శనివారంతో ముగిశాయి. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. విద్యాశాఖ సూచనల మేరకు ఈ పరీక్షల మూల్యాంకనం ఈ నెల 22వ తేదీ లోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం 23వ తేదీన విద్యార్థులకు మార్కుల షీట్లు, ప్రోగ్రెస్ కార్డులు అందజేయనున్నారు. అలాగే అదేరోజు పాఠశాలల్లో పేరెంట్, టీచర్ సమావేశాలు నిర్వహించి విద్యార్థుల ప్రతిభ, పురోగతి గురించి తల్లిదండ్రులకు వివరించాలని పేర్కొన్నారు. వేసవి సెలవుల సమయంలో పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని కూడా విద్యాశాఖ సూచించింది. జిల్లాలో 341 ప్రాథమిక పాఠశాలలు, 64 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉండగా, సుమారు 28 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. టెక్నికల్ సమస్యలను అధిగమిస్తాంజనగామ: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో టెక్నిక్ సమస్యలు పరిష్కారమైన వెంటనే పూర్తి స్థాయి ఇ–నామ్ సాఫ్ట్వేర్ ద్వారా పూర్తిస్థాయి లావాదేవీలను కొనసాగిస్తామని మార్కెట్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి అంజిత్ రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఇ–నామ్ మొరాయింపు’ శీర్షికన ఈ నెల 16న సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఇ–నామ్ సాఫ్ట్వేర్ 1.0ను అప్డేట్ తర్వాత 2.0 వెర్షన్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ అప్డేషన్ కారణంగా కొన్ని టెక్నికల్ సమస్యలు ఎదురవుతున్నాయని, వాటి కారణంగా సాఫ్ట్వేర్ ద్వారా పూర్తిస్థాయి వ్యాపార లావాదేవీలు నిర్వహించలేకపోతున్నామని తెలిపారు. అయితే రైతులు మార్కెట్ యార్డ్కు తీసుకొచ్చే ప్రతీ పంటకుప్పకు ఇ–నామ్ ద్వారానే లాట్ ఐడీలు జారీ చేస్తున్నామని స్పష్టం చేశారు. సాఫ్ట్వేర్లో టెక్నికల్ లోపాల వల్ల ఈ లాట్ ఐడీలు ట్రేడర్ల లాగిన్లో కనిపించకపోవడంతో, తాత్కాలికంగా మాన్యువల్, సీక్రెట్ బిడ్డింగ్ విధానాన్ని అనుసరించడం తప్పనిసరి పరిస్థితిగా మారిందని పేర్కొన్నారు. లాట్ ఐడీల ఆధారంగా యార్డ్లో క్లోజ్డ్ టెండర్ విధానంలో అత్యధిక రేటు చెప్పిన ట్రేడర్కి పంట ఉత్పత్తిని కేటాయిస్తున్నామని, రైతులకు ఈ ప్రక్రియను పూర్తిగా వివరించడం జరుగుతుందని తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్లకు సన్మానంజనగామ రూరల్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం సుదీర్ఘ కాలం యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్లుగా రికార్డు కలిగిన ఇద్దరు డ్రైవర్లు ఎ.కిషన్, డి.పాల్ను జనగామ డిపోలో వరంగల్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ కె. భానుకిరణ్ సన్మానించారు. అలాగే డిపోలో పనిచేస్తున్న మహిళా కండక్టర్ పి.ఉమామహేశ్వరి కుమార్తె ఎస్. జెస్సికా ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో 985/1000 మార్కులు సాధించగా ఆమెను, తల్లిదండ్రులను సన్మానించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఎస్. స్వా తి, సూపర్ వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. ముగిసిన ఉప్పల మల్లన్న జాతరదేవరుప్పుల: మండల కేంద్రంలోని ఉప్పల మల్లన్న జాతర వసంతోత్సవంతో ఘనంగా ముగిసింది. శనివారం తెల్లవారుజామున వాగులో పద్మశాలీలు దోపోత్సవం నిర్వహించి ఆటపట్టు నిర్వహించారు. అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో పూజారి పెద్దాపురం వెంకటేశ్వరశర్మ, అగ్నిగుండాల నిర్వహుకులు బిట్ల కొండయ్య, సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తిగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండాలను హరహర మహాదేవా...శివనామస్మరణంతో భక్తులు దాటి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం దేవతమూర్తుల పల్లకీ మోసిన చేనేత కార్మికులు రంగులు చల్లుకుంటూ ప్రజలతో వసంతోత్సవం నిర్వహించారు. ఏకాంత సేవలు, రుత్విక్ సన్మానంతో జాతర ముగింపు పూజలు చేశారు. -
ట్రాన్స్ఫార్మర్ వైఫల్యాలు తగ్గించాలి
జనగామ: జిల్లాలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ తగ్గించడం, ప్రమాదాలు నివారించడం వంటి అంశాలపై దృష్టి సారించాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్స్ మధుసూదన్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని సంస్థ సర్కిల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులకు అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించాలన్నారు. ప్రమాదాలు జరగకుండా ముందుగానే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సమయానికి చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఎల్సీలు తప్పనిసరిగా మొబైల్ యాప్ ద్వారా తీసుకుని రిటర్న్ చేయాలని, ఇది ఫీల్డ్లో ప్రమాదాలు నివారించడానికి అత్యంత కీలకమని తెలిపారు. సమీక్షలో ఎస్ఈ సంపత్ రెడ్డి, జనగామ, స్టేషన్ఘన్పూర్ డివిజనల్ ఇంజనీర్లు లక్ష్మీనారాయణరెడ్డి, సారయ్య, డీఈ టెక్నికల్ గణేశ్, ఎంఆర్టీ డీఈ విజయ్ కుమార్, ఎస్ఏఓ రాజేందర్తో పాటు ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. విద్యుత్ సేవలపై ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్ సమీక్ష -
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు టోకెన్ జారీ
ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత కోసం కలెక్టర్ కార్యాలయం మార్గదర్శకత్వంలో రైతులకు ప్రత్యేక టోకెన్లు జారీ చేస్తున్నారు. రైతు విక్రయానికి సంబంధించిన ప్రతీ వివరాలను నమోదు చేయడానికి ఈ టోకెన్ ఉపయోగపడుతుంది. టోకెన్పై రైతు నుంచి తీసుకునే ధాన్యం, వ్యక్తిగత సమాచారం, భూసంబంధిత వివరాలు, ధాన్యం రకాలు, తూకం వివరాలు అన్నీ స్పష్టంగా చేయాల్సి ఉంటుంది. టోకెన్లో బుక్ నెంబర్, జారీ చేసిన తేదీ, రైతు, తండ్రి లేదా భర్త పేరు, గ్రామం, పట్టాదార్ పాస్బుక్ నెంబర్, ఆధార్ చివరి నాలుగు అంకెలు, సర్వే నెంబర్ లేదా ఖాతా నెంబర్, భూమి స్వభావం, పంట రకం (ధాన్యం/సన్న/దొడ్డు) వంటి అంశాలు నమోదు చేయాలని అందులో పేర్కొన్నారు. అలాగే రైతు విక్రయించే ధాన్యం మొత్తాన్ని తూకం చేసిన తర్వాత వచ్చిన మొత్తం బరువు, కేంద్ర కోడ్, మండలం, తదితర వివరాలు కూడా స్పష్టంగా నమోదు చేసి రైతుకు అందజేయాలి. ప్రభుత్వం నిర్ణయించిన విధానంలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తేవడంలో ఈ టోకెన్ తప్పనిసరి అని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. టోకెన్లోని ఈ వివరాల ఆధారంగానే ధా న్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. -
‘పరిషత్‘ ఎన్నికలకు పచ్చజెండా!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వేళయ్యింది. ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని శనివారం జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెలలోనే ‘పరిషత్’ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహించిన ప్రభుత్వం.. ‘పరిషత్’ ఎన్నికలకు పచ్చజెండా ఊపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రక్రియ పూర్తయితే వచ్చే నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 23వ తేదీలోపే ఓటర్ల జాబితా... 2025, జూలై 10 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం నవీకరించిన జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని కలెక్టర్లకు జారీ చేసిన అదేశాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ జాబితాలో నియోజకవర్గాల్లోని అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించి, వాటిని సంబంధిత పంచాయతీ, పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలకు జత చేయాలని ఆదేశించింది. వీటి ఆధారంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీల పరిధిలోని గ్రామ పంచాయతీలు, పోలింగ్ స్టేషన్ల వారీగా కొత్త జాబితాలను రూపొందించాలని తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ జాబితాలను జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) ధ్రువీకరణ అనంతరం, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) యూజర్ మాన్యువల్ సూచనల ప్రకారం పోలింగ్ సెంటర్లకు అనుసంధానించాలని పేర్కొంది. ఆ డేటాలో ఏవైనా తేడాలున్నట్లు గమనిస్తే, వాటిని ఈ నెల 23వ తేదీలోపు ఎన్నికల సంఘానికి నివేదించాలని సూచించింది. ఈ మేరకు ఈ నెల 23వ లోపు ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. 23 తర్వాత అభ్యంతరాలు, సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని తుది జాబితాను విడుదల చేసి, ఆ తర్వాత పోలింగ్ సెంటర్లు, బ్యాలెట్ బాక్స్లు, ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించనున్నారు. ‘పరిషత్’లో ‘ఆమె’కే ప్రాధాన్యం... ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో మొత్తం 30,43,540 మంది ఓటర్లు ఉంటే, అందులో పురుషులు 14,89,606 కాగా, మహిళ ఓటర్లు 15,51,289 మంది ఉన్నారు. ఇతరులు(థర్డ్జెండర్) 504 కాగా, సర్వీసు ఓటర్లు 2141. ఆరు జిల్లా ప్రజా పరిషత్లు ఉండగా ములుగు ఎస్టీ మహిళ, హనుమకొండ, జనగామలు ఎస్సీ మహిళకు కేటాయించారు. అదే విధంగా 75 జెడ్పీటీసీలకు గాను 38, 39 ఎంపీపీ స్థానాలను మహిళలకు దక్కనున్నాయి. అలాగే 778 ఎంపీటీసీ స్థానాల్లో 399 చోట్ల మహిళలకే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనాలు చెబుతున్నాయి. ప్రయత్నాలు మొదలెట్టిన ఆశావహులు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో ‘పరిషత్’ సందడి మొదలైంది. వాస్తవానికి 2025 సెప్టెంబర్లో ఈ ఎన్నికలు జరుగుతాయని భావించినా రిజర్వేషన్లు, కోర్టు కేసుల కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలతో ఆశావహులు కొందరు సరిపెట్టుకోగా.. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులపై కన్నేసిన మరికొందరు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. తాజాగా ఓటర్ల ముసాయిదా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశావహుల్లో సందడి మొదలైంది. మేలో ఎన్నికలు ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ప్రధాన పార్టీల టికెట్లపై పోటీ చేసేందుకు ఆశావహులు ఆయా పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలను కలిసే పనిలో పడ్డారు.మేలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందడి ఈ నెల 23లోపు ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశం ముసాయిదా జాబితాపై అధికారుల కసరత్తు రాజకీయ పార్టీల్లో మొదలైన సందడి... మహిళలకు భారీగా అవకాశాలుమొత్తం జిల్లాలు 06జెడ్పీటీసీలు 75జెడ్పీపీపీలు 06ఎంపీపీలు 75ఎంపీటీసీ స్థానాలు 778జిల్లా జెడ్పీపీపీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు హనుమకొండ 1 12 12 129 వరంగల్ 1 11 11 130 జేఎస్భూపాలపల్లి 1 12 12 109 మహబూబాబాద్ 1 18 18 193 ములుగు 1 10 10 83 జనగామ 1 12 12 134 -
హెల్మెట్ ధరిస్తే..యముడు దరిచేరడు
జనగామ: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు శాఖ చేపట్టిన రోడ్డు భద్రతా అవగాహనపై వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. ఆర్టీసీ చౌరస్తా పోలీస్ కంట్రోల్ రూం పరిసరాల్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్ మార్గదర్శకత్వంలో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణరెడ్డి పర్యవేక్షణలో నెల్లుట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో యమధర్మరాజు, చిత్రగుప్తుల పాత్రలతో నాటక ప్రదర్శన జరిగింది. హెల్మెట్, సీట్బెల్ట్, డ్రంకెన్ డ్రైవ్ వంటి ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యాన్ని ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా నాటక ప్రదర్శన చేశారు. నాటక సారాంశాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్ వివరిస్తూ.. ‘హెల్మెట్ పెట్టుకుంటే యముడు మన దగ్గరకు రాలేడు.. ఇదే మా కాన్సెప్ట్’ అని అన్నారు. రోడ్డు ప్రమాదాలు లేకుండా, మరణాలు తగ్గిన జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు భరత్, చెన్నకేశవులు, నర్సయ్య, రతీష్, నెల్లుట్ల ఫౌండేషన ప్రతినిధి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై వినూత్న అవగాహన యముడు, చిత్రగుప్తుడు, భటులతో నాటక ప్రదర్శన -
సాక్షిప్రతినిధి, వరంగల్ :
..ఇలా కొందరు పోలీసుల వ్యవహారశైలి ఆ శాఖను అభాసుపాలు చేస్తోంది. కొందరు యువ ఎస్ఐలు క్రమశిక్షణ గీత దాటి వేటుకు గురవుతుండటం ఆ శాఖలో చర్చనీయాంశమవుతోంది. వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి సన్ప్రీత్సింగ్.. కట్టుతప్పి అక్రమాలకు పాల్పడే పోలీసు అధికారులను హెచ్చరికలు చేస్తూ నే ఉన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని మందలించినా ఫలితం లేకపోవడంతో చర్యలు తీసుకుంటున్నారు. గ్రేటర్ వరంగల్లోని ఇన్స్పెక్టర్(ఎస్హెచ్ఓ)లు, ఎస్ఐలపైన ఉన్న ఫిర్యాదులపై విచారణ జరుగుతోంది. పలువురిపై చర్యలు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ కొందరు పోలీసు అధికారులు తీరు మారడం లేదు. దీనికి కారణం వారికి రాజకీయ అండే కారణమన్న విమర్శలు లేకపోలేదు. వరుస ఘటనలతో కలకలం... క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన పోలీసులు అవినీతికి పాల్పడటం, సివిల్ సెటిల్మెంట్లలో తలదూర్చడాన్ని వరంగల్ కమిషనర్ సీరియస్గా తీసుకుంటున్నారు. సుమారు 20 రోజుల వ్యవధిలో నలుగురిపై చర్యలు తీసుకున్నారు. మిల్స్ కాలనీలో ఎస్సైగా పనిచేస్తున్న సురేష్ను సస్పెండ్ చేసిన సీపీ.. ఆ ఠాణా పరిధిలోని కొన్ని ఘటనలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆత్మకూరు ఎస్సై సతీష్ సస్పెన్షన్పైన చర్చ జరుగుతోంది. ఇదివరకే బచ్చన్నపేట ఎస్సై హమీద్ను పోలీసు హెడ్క్వార్టర్స్కు అటాచ్డ్ చేయగా, తాజాగా ఎల్కతుర్తి ఎస్ఐ ప్రవీణ్కుమార్ను ఏఆర్కు అటాచ్డ్ చేశారు. కాగా వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మరికొందరిపైనా విచారణ జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో ఆ జాబితాలో ఎవరున్నారు? అన్న చర్చ మొదలైంది. సీరియస్గా ‘లేఖల’ పంచాయితీ.. గతేడాది డిసెంబర్లో వరంగల్ పోలీస్ డివిజన్లో ఏసీపీ, ఇన్స్పెక్టర్, ఎస్సైలపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి, ముగ్గురిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో మరికొందరిపై త్వరలోనే బదిలీ లేదా సస్పెన్షన్ వేటు పడవచ్చన్న ప్రచారం పోలీసుశాఖలో జరుగుతోంది. గ్రేటర్ వరంగల్ పరిధి లోని నలుగురు ఇన్స్పెక్టర్ల తీరుపై ఇప్పటికే విచారణ జరుగుతున్నట్లు సమాచారం. అవినీతి అక్రమాలు, కేసులు కట్టడంలో నిర్లక్ష్యం, తప్పుడు కేసులు కట్టడం లాంటి ఆరోపణలు ప్రధానంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ఇద్దరు ఎస్హెచ్ఓలు పొరుగు నియోజకవర్గాలకు బదిలీ చేయించుకునేందుకు ‘లేఖ’లు పొందడం కూడా వివాదాస్పదంగా మారినట్లు సమాచారం. విచారణ అనంతరం తీవ్రతను బట్టి వారిని సస్పెండ్ చేయడమా? వీఆర్కు పంపడమా? లేదా ఇతర జిల్లాలకు బదిలీ చేయడమా? అన్నది త్వరలోనే తేలనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే వారం, పది రోజుల్లో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు ఉంటాయన్న ప్రచారం జరుగుతుండగా.. సుమారు 10 మందికి పైగా సీఐలు వరంగల్ నగరంలోని ఆరు కీలక ఠాణాలకు లేఖలు పొంది ఒత్తిడి తీసుకువస్తున్నట్లు పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. ● యువ ఎస్ఐల అత్యుత్సాహం.. అడ్డంగా బుక్కవుతున్న వైనం ● అత్యాచారం, వేధింపుల కేసుల్లో వారే.. ● వరుస సంఘటనలతో పోలీసుశాఖలో కలకలం ● పలువురిపై సస్పెన్షన్, బదిలీ వేటు ● ఇన్స్పెక్టర్లపైనా ఆరోపణలు.. విచారణ స్థాయిలో ఫిర్యాదులు ● చర్చనీయాంశంగా కొందరు పోలీసుల తీరు -
అయ్యో ఏమైంది? ఎలా ఉన్నారు?
లింగాలఘణపురం: ‘అయ్యో ఏమైంది ఇక్కడ..? ప్రమాదం ఎలా జరిగింది..ఎవరికై నా ఏమన్నా అయ్యిందా..?’ అంటూ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులంతా ఆగి ప్రశ్నించడం మొదలుపెట్టారు. జనగామ– సూర్యాపేట జాతీయ రహదారి నెల్లుట్ల వద్ద కారును బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రగాయాలై రక్తపు మడుగులో పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న డమ్మీ దృశ్యాన్ని పోలీసులు సృష్టించి ఒక్కసారిగా వాహనదారుల్లో ఆందోళన కలిగించారు. ఇదంతా ఎందుకు చేశారంటే.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రతా వారోత్సవాల్లో అరైవ్..అలైవ్ కార్యక్రమంలో ప్రయాణికులను చైతన్యం చేసేందుకేనని తెలపడంతో ఒక్కసారిగా జనాలు ఊపిరిపీల్చుకున్నారు. ఈమేరకు పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ.. ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం అందించే రూ.1.50 లక్షల నగదు రహిత చికిత్స పీఎం రాహత్ స్కీంను వివరించారు. అదేవిధంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి అందించే రూ.25వేల ప్రోత్సాహక బహుమతిపై డీసీపీ వివరించారు. క్రార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, జనగామ ఏసీపీ, రఘునాథపల్లి సీఐ శ్రీనివాసురెడ్డి, లింగాలఘణపురం ఎస్సై శ్రాణ్కుమార్, నెల్లుట్ల సర్పంచ్ రామకృష్ణ, మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్, డాక్టర్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట హైవేపై టెన్షన్..టెన్షన్ డమ్మీ యాక్సిడెంట్ సీన్ క్రియేట్ చేసిన పోలీసులు అరైవ్..అలైవ్ కార్యక్రమంలో భాగంగా అవగాహన -
సమరం ప్రారంభం!
● ఎమ్మెల్యే పల్లా పిలుపుతో ‘బెల్ట్’ తీసేందుకు ముందుకొచ్చిన కాలనీ ● 11వ వార్డులో ఏకగ్రీవ తీర్మానం.. ఫ్లెక్సీల ప్రదర్శనజనగామ: పట్టణంలోని 11వ వార్డులో బెల్ట్ షాపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు, మహిళలు అనధికార మద్య దుకాణాలను మూసివేయాలని శుక్రవారం ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. వార్డు కౌన్సిలర్ ఎనగందుల అనూషకృష్ణ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు, స్థానిక ప్రజలు కలిసి సమస్యపై చర్చించి తక్షణ చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇళ్ల మధ్యలో ఉన్న బెల్ట్ షాపుల వల్ల రోజువారీగా కుటుంబాలకు సమస్యలు, గొడవలు, అసౌకర్యాలు పెరుగుతున్నాయని తమలోని ఆవేదన వెల్లగక్కారు. యువత మద్యానికి బానిసవుతుండటం, కుటుంబాలు చిన్నాభిన్నం కావడం సామాజికంగా తీవ్ర ప్రభావం చూపుతుందన్న కారణంతో బెల్ట్ దుకాణాల మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. వాడవాడలా ఫ్లెక్సీలు వార్డు ప్రజల్లో బెల్ట్ దుకాణాలపై అవగాహన కల్పిస్తూ, మహిళా సంఘాలు మద్యపానం వద్దు.. కుటుంబ బాధ్యత ముద్దు నినాదంతో కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయని ప్రజలు నమ్ముతున్నారు. కౌన్సిలర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ముందడుగు జిల్లాకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వార్డులో ఉన్న బెల్ట్ దుకాణాలను మూసివేయగా, వాటిపై నిరంతరం నిఘా ఉంచారు. ఇదే స్ఫూర్తితో ముందుకు..ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని మహిళా సంఘాలతో కలిసి 11వ వార్డులో బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకున్నాం. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపుతో బెల్ట్ షాపుల మూసి వేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నాం. –ఎనగందుల అనూషకృష్ణ, కౌన్సిలర్,11వ వార్డు -
తెలంగాణ ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలి
● కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై ఎమ్మెల్యే పల్లా ఆగ్రహంజనగామ: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఖండించకుండా మౌనం వహించడం సిగ్గుచేటని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీజపీ నేతలు తెలంగాణపై పదేపదే విషం చిమ్ముతున్నారన్నారు. ఇద్దరు కేంద్రమంత్రులు, బీజేపీ ప్రజాప్రతినిధులు తెలంగాణపై జరుగుతున్న అన్యాయాలపై ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. తెలంగాణ ప్రజలపై కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్న బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. -
‘గోల్డెన్ అవర్’లో ప్రాణాలు కాపాడొచ్చు
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: గోల్డెన్ అవర్లో ప్రాణాలను కాపాడవచ్చని, రోడ్డు ప్రమాదాల సమయంలో డ్రైవర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని క్షతగాత్రులకు అవసరమైన చికిత్స అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ’అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ‘గోల్డెన్ అవర్‘ అంశంపై డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోకుండా, బాధితులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు సీపీఆర్ చేసే విధానాన్ని వైద్యాఽధికారులు రవి కృష్ణ, సరిత, అలాగే 108 సేవలపై 108 ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రాము, అదే విధంగా రాహవీర్ పథకం, పీఎం రాహత్ పథకాలపై ఐఆర్ఏడీ డీఎం టీ శివప్రసాద్ డ్రైవర్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చి, పూర్తి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీ పండేరీ చేతన్ నితిన్, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జున రావు, ఆర్టీఏ మెంబర్ అభిగౌడ్, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. సుస్థిర పద్ధతులపై దృష్టి సారించాలి సుస్థిర వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేకదృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మినీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన పథకం అమలుపై టాస్క్ ఫోర్స్ కమిటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ, ఉద్యానశాఖ అధికారి రవికాంత్, పశుసంవర్ధక శాఖ అధికారి మురళీధర్ రావు, మత్స్య శాఖ అధికారి రాణా ప్రతాప్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మూర్తి, కేవీకే మామ్నూర్ శాస్త్రవేత్త, నాబార్డ్ ఏజీఎం అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ఆసుపత్రిలో ‘వేసవి’ చర్యలు
● తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు ఏర్పాట్లుజనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరాపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీల వరకు నమోదవుతుండడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో రెండు ఆర్ఓ మినరల్ వాటర్ప్లాంట్లను ఏర్పాటు చేసి తాగునీటిని శుద్ధి చేసి అందిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లోని జనరల్ ఓపీ, ఎమర్జెన్సీ తదితర విభాగాలకు అనుసంధానంగా కూలింగ్ ఫ్రిజ్తో కూడిన వాటర్ ట్యాప్ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మొదటి, రెండో అంతస్తుల్లో కూడా ప్రత్యేకంగా తాగునీటి సదుపాయాలను కల్పించారు. ఈ చర్యలతో ప్రతి విభాగంలో ఉన్న రోగులకు సులభంగా నీరు అందేలా చేస్తున్నారు. ప్రైవేట్ వాటర్ కొనుగోళ్లకు చెక్ ఆసుపత్రిలో అందిస్తున్న తాగునీరు నాణ్యతతో ఉండటంతో, రోగులు బయట నుంచి నీటిని కొనుగో లు చేసే పరిస్థితి లేకుండా మారింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజలింగం పర్యవేక్షణ చేస్తూ సిబ్బందికి అవసరమైన సూచనలు ఇస్తున్నారు. -
పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
జనగామ రూరల్: తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యోగుల దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద సంఘం బాధ్యులు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. 2వ పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెల శ్రీనివాస్, కన్వీనర్ కోర్నిలియస్, కో చైర్మన్ చంద్రశేఖర్ రావు, టీపీటీఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ , మహిపాల్ రెడ్డి, రామస్వామి పాల్గొన్నారు. -
కల్లాల్లో కుప్పలు
స్టేషన్ఘన్పూర్/ దేవరుప్పుల: అమ్మబోతే అడవి.. అన్నట్లుగా తయారైంది ధాన్యం రైతుల పరిస్థితి. జిల్లాలోని పలు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో జాప్యం, వైపు.. కొనుగోలు కేంద్రాలు ఉన్నచోటా కాంటాలు వేయక ఆలస్యం..ఓ వైపు, అకాల వర్షాల భయం మరోవైపు..ఇలా అన్నదాతలు అరిగోస పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలేవి? నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్ఘన్పూర్ మండల పరిధిలో అదును దాటుతున్నా ఇప్పటివరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. దీంతో వరిపంటలు కోతలు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండల పరిధిలో ఇప్పటికే దాదాపు 40 శాతానికి పైగా వరికోతలు పూర్తయ్యాయి. వరికోతలు చేసిన రైతులు ధాన్యాన్ని తమ వ్యవసాయ క్షేత్రాల్లో, ఐకేపీ సెంటర్లలోని కల్లాల్లో కుప్పలుగా పోసుకున్నారు. అయితే ప్రతీరోజు ఉదయం, సాయంత్రం ఈదురుగాలులతో మబ్బులు ఊరిస్తుండగా వర్షం కురుస్తుందనే గుబులుతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొద్దంతా ధాన్యాన్ని ఆరబోసి సాయంత్రం కాగానే కుప్పగా చేసి పరదాలు కప్పుకుంటున్నారు. అయితే ఎంతగా పరదాలు కప్పినా పెద్దవాన వస్తే రైతులకు తిప్పలు తప్పవు. అయితే గత యాసంగి సీజన్లో ఇప్పటికే సెంటర్లు ప్రారంభించగా ఈ సారి జాప్యం చేస్తుండగా రైతులు అరిగోస పడుతున్నారు. సెంటర్లలో కుప్పలుగా.. మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ముందుగానే ధాన్యం రాశులుగా పోసుకున్నారు. ప్రధానంగా నమిలిగొండ, శివునిపల్లి, ఇప్పగూడెం, పాంనూర్, తానేదార్పల్లి, విశ్వనాథపురం, సముద్రాల తదితర గ్రామాల్లో మెజార్టీ రైతులు ఇప్పటికే వరికోతలు కోసి ధాన్యాన్ని సెంటర్ల వద్దకు తరలించారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. సర్కార్ జాప్యం..ధాన్యం రైతులకు కష్టం స్టేషన్ ఘన్పూర్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఇంకెప్పుడు? దేవరుప్పులలో కాంటాలు వేయక పేరుకుపోయిన వడ్లు కొనుగోళ్ల సమస్యలు పరిష్కరించాలని అన్నదాతల వేడుకోలు -
వెంకిర్యాలలో మహిళా సంఘం సభ్యుల ఆందోళన
జనగామ రూరల్: రుణ బకాయిలు చెల్లించాలని మండలంలోని వెంకిర్యాల గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులకు కోర్టు నుంచి నోటీసులు రాగా, వారు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి..నాలుగున్నర ఏళ్ల క్రితం గ్రామంలో మహిళా సంఘాల సభ్యులు రుణాలు తీసుకోని నెలవారీగా చెల్లిస్తుండగా సీఏ, బ్యాంక్ మిత్ర సుమారు రూ.1.20కోట్లలను బ్యాంక్లో జమ చేయకుండా అక్రమాలకు పాల్పడ్డారు. ఈ విషయం మహిళలు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదు. ఇటీవల గ్రామస్తులు తమ బకాయిలు చెల్లించాలని పట్టుపట్టగా దశల వారీగా చెల్లిస్తానని అధ్యక్షురాలు రెండు గడువులు కోరింది. అయినప్పటికీ పట్టించుకోకపోవడంతో మహిళలు బ్యాంక్మిత్ర ఇంటికి తాళం వేశారు. బాధితురాలిని శుక్రవారం గ్రామ పంచాయతీకి తీసుకొచ్చి డబ్బులు చెల్లించాలని అడగ్గా కోర్టులో తెల్చుకుంటామని తెలుపడంతో మహిళలు అందోళన చేపట్టారు. విషయం తెలిసిన ఎస్ఐ సతీష్ గ్రామానికి చేరుకోని మహిళతో మాట్లాడారు.. సంబంధిత విషయంపై బ్యాంక్మిత్ర కుటుంబ సభ్యుడు భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని తమ సమస్యను పరిష్కరించాలని మహిళలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. -
కాంటాకు కొర్రీలు..
దేవరుప్పుల మండలంలో ఐకేపీ కింద 14 కొనుగోలు కేంద్రాలు, సహకార వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో ఏడు కేంద్రాలను వారం కిందట కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కొనుగోలు నిర్వహకులు ఆయా కేంద్రాల వద్ద ఽకాంటాలు, తేమశాతం మిషన్, బస్తాలు సిద్ధంగా ఉంచినప్పటికీ ప్రభుత్వం రైస్ మిల్లర్ల కు అలాట్మెంటు ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో కాంటాలు పెట్టడం ప్రారంభించలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో 20వేల క్వింటాళ్ల ధాన్యం పేరుకపోయాయి. జాప్యంతో తీరని నష్టం గిట్టుబాటు ధర వస్తుందన్న రైతులకు కాంటాలు జాప్యం చేయడంతో తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. వాస్తవానికి ఈసారి మండుటెండల ప్రభావంతో వరికోసే సమయానికి దాదాపు కావాల్సిన తేమశాతానికి చేరుకునే పరిస్థితులు ఉన్నాయి. అయితే తాలు, చెత్తచెదారం కోసం ప్రత్యేక మిషన్ల ద్వార వడబోసిన రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వారం నుంచి ఆరబెట్టుకుంటున్నారు. ప్రభుత్వం సత్వరమే కాంటాలు పెట్టకుంటే ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని రైతుల వాపోతున్నారు. కాగా నిర్వాహకులు ముందస్తు తాము కాంటా పెడితే మరింత తగ్గితే మిల్లర్ల కాంటా మేరకు తాము నష్టపోతామని పేర్కొనడం గమనార్హం. కొబ్బరికాయలు కొడితే సరిపోదు కొనుగోలు కేంద్రాల్లో కొబ్బరికాయలు కొడితే సరిపోదు. ధాన్యం కాంటా పెట్టినపుడే మాకు న్యాయం జరుగుతుంది. వారం నుంచి ఎదిరి చూస్తున్నాం. వడ్లు కాస్త రాళ్లలగా ఎండినయ్. ఆలస్యం చేసి జోకితే మాకే నష్టం. –కాసర్ల మల్లారెడ్డి, రైతు నీర్మాల -
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బదిలీ
వరంగల్ లీగల్: వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎం.సాయికుమార్ను హైదరాబాద్ ఏడో చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్గా బదిలీ చేస్తూ.. హైకోర్టు రిజిస్టార్ జనరల్ (విజిలెన్స్) గురువారం ఉత్తర్వులు జారీ చేశా రు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సీనియర్ సివిల్ జడ్జిల బదిలీల్లో భాగంగా భూపాలపల్లి సినియ ర్ సివిల్ జడ్జి ఎ.నాగరాజు గద్వాల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీకాగా.. జనగామ సినియర్ సివిల్ జడ్జి ఇ.సుచరితను రంగారెడ్డి జిల్లా రాజేందర్నగర్లోని ప్రిన్సిపల్ సీనియర్ జడ్జిగా బదిలీ చేశారు. బదిలీ అయిన న్యాయమూర్తులు ఈనెల 20వ వరకు చార్జ్ అప్పగించి 25వ తేదీలోపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో రిజిస్ట్రార్ జనరల్ ఆదేశించారు.పోలీస్ స్టేషన్లో డీసీపీ ఆకస్మిక తనిఖీరఘునాథపల్లి: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను డీసీపీ రాజమహేంద్రనాయక్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నమోదైన కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించి, చార్జ్షీ ట్లను సమయానికి దాఖలు చేయాలని ఎస్సై నరేష్ను ఆదేశించారు. పనితీరును మరింత మెరుగుపరుచుకొని చేపట్టాల్సిన విధి విధానాలపై పలు సూచనలు చేశారు. పోలీస్స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో డీసీపీ మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. టీబీ నివారణకు ప్రత్యేక కృషిబచ్చన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం టీబీ నివారణకు ప్రత్యేక చొరవ తీసుకుంటోందని జిల్లా వైద్యాధికారి మల్లికార్జున రావు అన్నారు. టీబీ ముక్తభారత్ అభియాన్ ఫేజ్– 2లో భాగంగా గురువారం మండల కేంద్రంలోని సీహెచ్ సీని ఆయన సందర్శించి ఆసుపత్రిలోని పలు వార్డులను, రికార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ లగిశెట్టి అశోక్ కుమార్, కమల్హాసన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, మండల వైద్యాధికారి సృజన, వైద్యులు సిద్ధి సుదర్శన్ రెడ్డి, ప్రసన్న కృష్ణ, స్టాఫ్నర్సులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. టైర్లు అంటుకుని మంటలుజనగామ: జిల్లాకేంద్రంలోని హన్మకొండ రోడ్డు దయా నిలయం ఏరియాలో ప్రైవేటు బస్సులు పార్కింగ్ చేసే ప్రదేశంలో గురువారం వాహనాల పాత టైర్లకు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. టైర్ల నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెంది, దట్టమైన పొగ ఇళ్లలోకి చేరడంతో సమీప వాసులు ఒక్కసారిగా ఆందోళనకు గురై, బయటకు పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు అగ్నిమాపక శాఖను అలర్టు చే శారు. ఫైరింజన్ అక్కడకు వచ్చేసరికి సుమారు 20 టైర్లు కాలిపోగా, మంటలు మరింత వ్యాప్తి చెందకుండా అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకోగా, బహిరంగ ప్రదేశాల్లో మంటలకు కారణమయ్యే వస్తువులను ఉంచకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. వరంగల్ స్పోర్ట్స్: కమల్కింగ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 19న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి చదరంగ పోటీలను నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ జి.రాంప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ రాంనగర్లోని మాంటిస్సోరి స్కూల్ ఆవరణలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అండర్ –07, 09, 11, 13, 15 విభాగాల్లో నిర్వహించే ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న క్రీడాకారులు పేర్లు నమోదు కోసం 96760 56744 మొబైల్ నంబర్లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
తండ్లాట లేకుండా తాగునీరు!
జనగామ: జిల్లాలో వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరాపై అధికారులు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. సిద్దిపేట జిల్లా మంగోలు నీటి శుద్ధి కేంద్రం, ధర్మసాగర్ వనరులను వినియోగిస్తూ మిషన్ భగీరథ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు నిరంతర నీటి సరఫరా కొనసాగుతోంది. వేసవి కాలంలో తాగునీటి కొరత తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. 1,28,39 ట్యాప్ కనెక్షన్లు.. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 1,28,39 ట్యాప్ కనెక్షన్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రతీ ఇంటికి తాగునీరు అందిస్తున్నారు. మంగోలు ట్రీట్మెంట్ ప్లాంట్(డబ్ల్యూటీపీ) నుంచి రోజుకు 54.16 ఎంఎల్డీ నీటిని 827 ఓవర్హెడ్ ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇందులో 11 మండలాలకు మంగోలు వాటర్ ట్రీట్మెంటు ప్లాంటు నుంచి తాగునీరు చేరుతుండగా, జఫర్గఢ్ మండలానికి మాత్రం ధర్మసాగర్ నుంచి రోజుకు 25 ఎంఎల్డీ నీటిని పంపిస్తున్నారు. ఈ విధంగా రెండు ప్రధాన వనరులను సమన్వయంతో వినియోగించడం వల్ల సరఫరా వ్యవస్థలో స్థిరత్వం కొనసాగుతోంది. మిషన్ భగీరథకు తోడుగా గ్రామీణ ప్రాంతాల్లో 1,030 త్రీఫేజ్ బోర్లు, 830 సింగిల్ ఫేజ్ బోర్లు, 64 ఓపెన్ బోర్వెల్స్, 638 చేతిపంపులు కూడా పనిచేస్తూ గ్రామాల్లో ప్రత్యామ్నాయ నీటి వనరులుగా నిలుస్తున్నాయి. వేసవిలో ముందస్తు అంచనా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ భూగర్భ జలాల స్థాయి పడిపోవడం సహజమే. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ఏప్రిల్తో పాటు మే, జూన్ నెలల్లో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న 52 ప్రాంతాలను అధికారులు ముందుగానే గుర్తించారు. చిల్పూరు, స్టేషన్ఘన్పూర్, రఘునాథపల్లి, జఫర్గఢ్, బచ్చన్నపేట, జనగామ, నర్మెట, తరిగొప్పుల, దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాల్లోని ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా తరిగొప్పుల, దేవరుప్పుల, కొడకండ్ల, జనగామ మండలాల్లో అధిక సంఖ్యలో సమస్యాత్మక గ్రామాలు ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం వేసవి ఎద్దడి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు మిషన్ భగీరథ ఇంట్రా విభాగం అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. అదనపు బోర్లను అద్దెకు తీసుకోవడం, అందుబాటులో ఉన్న వనరులను మరమ్మతులు చేయడం వంటి చర్యలు తీసుకునేలా ప్రణాళిక సిద్ధమవుతోంది. గ్రామాల వారీగా రోజువారీ నీటి సరఫరాను అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు. పైప్లైన్ లీకేజీలు, మోటార్ల సమస్యలు వంటి అంశాలను గుర్తించి సర్పంచులతో కలిసి వెంటనే పరిష్కరిస్తున్నారు. ఇక మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికే కాకుండా జనగామ చంపక్హిల్స్ మాత శిశు సంరక్షణ కేంద్రం, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు కూడా నీరు సరఫరా చేయడం ప్రజారోగ్య పరిరక్షణకు దోహదం చేస్తోంది. ముందస్తు ప్రణాళిక, సమన్వయంతో పనిచేస్తున్న అధికారులు ఈ వేసవిలో తాగునీటి సమస్యలను గణనీయంగా తగ్గించగలరని ఆశాభావం వ్యక్తమవుతోంది. జనగామకు 1 ఎంఎల్డీ.. జనగామ పురపాలిక పరిధిలోని 30 వార్డులకు చీటకోడూరు రిజర్వాయర్ నుంచి రోజువారీగా తాగునీటి సరఫరా జరుగుతోంది. మిషన్ భగీరథ నుంచి 1 ఎంఎల్డీ తాగునీటిని ఇందులో కలిపి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీకి 4 ఎంఎల్డీ వాటర్ సప్లై చేస్తున్నారు. ప్రస్తుతం రెండు మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి ఎద్దడి లేకున్నప్పటికీ, భవిష్యత్లో ఎలాంటి సమస్య తలెత్తకుండా అధికార యంత్రాంగం ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికలను తయారు చేసుకున్నారు. మండలం గ్రామాలు చిల్పూరు 4 స్టేషన్ఘన్పూర్ 1 రఘునాథపల్లి 2 జఫర్గఢ్ 2 బచ్చన్నపేట 1 జనగామ 7 నర్మెట 3 తరిగొప్పుల 13 దేవరుప్పుల 8 కొడకండ్ల 8 పాలకుర్తి 3 జిల్లాలో కొరత ఏర్పడకుండా అధికారుల సన్నద్ధత మంగోలు, ధర్మసాగర్ డబ్ల్యూటీపీ నుంచి సరఫరా జిల్లాలో 1.28లక్షల ట్యాపులు ప్రతీరోజు 54.16 ఎంఎల్డీ వాటర్ సప్లై సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు -
భావితరాలకు బాసటగా నిలుద్దాం
దేవరుప్పుల: గ్రామాల్లో నెలకొన్న అపరిష్కృత సమస్యలను ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తూ భావితరాలకు బాసటగా నిలుద్దామని ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగానికి జెడ్పీ సీఈఓ రంగారావు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజాపాలన ప్రగతి– ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశానికి మండల ప్రత్యేకాధికారి శివకృష్ణ ఠాగూర్ ఽఅధ్యక్షత వహించగా జెడ్పీ సీఇఓ హాజరై మాట్లాడారు.. కార్యక్రమంలో తహసీల్దార్ ఆస్పక్యు అహ్మద్, ఇన్చార్జ్ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంఇఓ కళావతి, స్థానిక సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తిగౌడ్, సూపరింటెండెంట్ పుష్పలత, ఏఓ దివ్య, మండల వైద్యాధికారి పూజ, పశువైద్యాధికారులు స్వర్ణశిల్ప, సింధుప్రియ, ఎస్సై సృజన్కుమార్, ఏఈలు మానస, నర్సింహరెడ్డి, నర్సింహులు, ఐకేపీ ఎపీఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. లింగాలఘణపురంలో.. లింగాలఘణపురం: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ కార్యాల యం ఆవరణలో మండల సభ నిర్వహించారు. సభలో జెడ్పీ సీఈఓ రంగారావు, ఆర్డీఓ గోపీరామ్, తహసీల్దార్ అండాలు, ఎంపీడీఓ సీతారామనాయు డు, స్థానిక సర్పంచ్ లావణ్యరాజు, మార్కెట్ డైరెక్ట ర్లు మోహన్, శ్రీలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ రంగారావు -
కల్యాణం.. కమనీయం
● ఘనంగా ఉప్పల మల్లన్న జాతరదేవరుప్పుల: మండల కేంద్రంలో ఉప్పల మల్లన్న జాతరను పురస్కరించుకొని గురువారం రాత్రి శివపార్వతుల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. సాయంత్రం శివపార్వతుల శావలను పద్మశాలీలు మంగళ వాయిద్యాలు, భక్తగీతాలతో ఇంటింటా హారతులు స్వీకరిస్తూ పురవీధుల గుండా ఊరేగింపు చేశారు. ఐదురాళ్ల వద్ద ఎదురుకోళ్లు నిర్వహించారు. అనంతరం శివాలయం పూజారి పెద్దాపురం వెంకటేశ్వరశర్మ పర్యవేక్షణలో వేద బ్రహ్మణుడు శానగొండ శివకరణ్శర్మ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తిగౌడ్, ఉపసర్పంచ్ నర్ర కోమలత, ఉత్సవ కమిటీ ప్రతినిధులు బూత్కూరి రాంమోహన్రెడ్డి, బెలిదే నర్సయ్య, కాసారపు సోమిరెడ్డి, పద్మశాలి శావ బృంద ప్రతినిధులు బిట్ల కొండయ్య, ఎల పాపయ్య, సోమనారాయణ, పాము యాకస్వామి, బిట్ల సుదర్శన్రాజు, కొంగ సోమయ్య, చిలుకూరి ఉమేష్, అంకాల యాదగిరి, నగేష్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలే ఎక్కువ
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జనాభా 36,88,217 మంది అని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వే నివేదిక తేల్చి చెప్పింది. అదే సమయంలో 12,32,892 ఇళ్లు ఉన్నట్లు ఉన్నాయని వెల్లడించింది. జనాభా పరంగా చూసుకుంటే 18,37,374 మంది బీసీలు తొలిస్థానంలో ఉంటే, 1,74,440 మందితో బీసీ ముస్లిం మైనారిటీలు చివరి స్థానంలో ఉన్నారు. ఇల్లు ఉన్నవారి విషయానికొస్తే ఓసీలు 35.35 శాతంతో తొలిస్థానంలో ఉండగా, 30.60 శాతం బీసీ ముస్లిం మైనారిటీలు చివరి స్థానంలో ఉన్నారు. అదేవిధంగా ఎస్టీలు అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 3,22,361 మంది ఉంటే...అత్యల్పంగా హనుమకొండలో 29,139 మంది ఉన్నారు. ఓసీలు అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 89,410 మంది ఉంటే అత్యల్పంగా ములుగులో 20,684 మంది ఉన్నారని వెల్లడించింది. ఇక ఎస్సీలు అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 1,83,984 మంది ఉంటే ములుగు జిల్లాలో అతి తక్కువగా 49,746 మంది ఉన్నారని తెలిపింది. బీసీలు అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 4,50,150 మంది ఉంటే అతి తక్కువగా ములుగు జిల్లాలో 1,18,254 మంది ఉన్నారని పేర్కొంది. జనాభాలో వరంగల్ జిల్లా ముందు...ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల మొత్తం జనాభా 36,88,217 ఉంటే వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా 8,36,811 మంది ఉన్నట్టు సర్వే తేల్చింది. ఆ తర్వాత 8,04,515మందితో మహబూబాబాద్, 7,99,448మందితో హనుమకొండ, 5,45,449మందితో జనగాం, 4,07,896మందితో జయశంకర్ భూపాలపల్లిలు ఉండగా, చిట్టచివరగా 2,94,098 జనాభాతో ములుగు జిల్లా ఉంది. చివరి స్థానంలో బీసీ ముస్లిం, మైనారిటీలు మొత్తం 12,32,892 ఇళ్లు ఉన్నట్టు నిర్ధారణ తెలంగాణ సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వేలో వెల్లడి -
నీటి ఎద్దడి లేదు..
జిల్లాలో తాగునీటి ఎద్దడి ఎక్కడా లేదు. సిద్దిపేట జిల్లా మంగోలు వాటర్ ట్రీట్మెంటు ప్లాంటు, ధర్మసాగర్ రెండు ప్రాంతాల నుంచి 12 మండలాలకు తాగునీటి సరఫరా అవుతోంది. జిల్లాలో 1,28,309 ట్యాప్ కలెక్షన్లు ఉండగా, 827 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోంది. రోజువారీగా మంగోలు నుంచి 54.16 ఎంఎల్డీ, ధర్మసాగర్ నుంచి 25 ఎంఎల్డీ నీరు తీసుకుంటున్నాం. నీటి ఎద్దడి ఉండవచ్చనే ముందస్తు ప్రణాళికతో 52 ప్రాంతాలను గుర్తించి, కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు సిద్థం చేశాం. – వి.శ్రీకాంత్, ఈఈ, మిషన్ భగీరథ -
సమర్థంగా సంక్షేమ పథకాల అమలు
రఘునాథపల్లి: ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం రఘునాథపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన మండల సభలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకాన్ని, ప్రతీ గడపకు అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా రాష్ట్రస్థాయిలో టాప్–2 లో నిలవడం గర్వకారణమన్నారు. రేషన్ కార్డుల దరఖాస్తు, మంజూరు నిరంతర ప్రక్రియ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకున్నారు. సభలో జిల్లా గ్రంథాలయ సంస్థ మారుజోడు రాంబాబు, గృహ నిర్మాణ పీడీ మాతృనాయక్, మండల ప్రత్యేకాధికారి కోదండరాం, తహసీల్దార్ రాజేష్రెడ్డి, ఇన్చార్జ్ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, మండల వైద్యాధికారులు స్రవంతి, పద్మ, ఏపీఎం వినీల, సర్పంచ్లు బొల్లం ఉమారాణి, శాగ కవిత, బొమ్మ వీరస్వామి, పోకల శ్రీనివాస్, సదానందం, అబ్రహం, పయ్యావుల రవి, వల్లాల అశోక్, సింగిరెడ్డి సునిత, రాంచందర్ తదితరులు ఉన్నారు. సురక్షిత ప్రయాణానికి కంటిచూపు ప్రధానం జనగామ రూరల్: సురక్షిత ప్రయాణానికి కంటిచూపు ప్రధానమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా నిర్వహిస్తున్న అరైవ్ –అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని గ్రేయిన్ మార్కెట్ పరిధిలో యార్డు డ్రైవర్లకు, ఇతర వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలెక్టర్ ముఖ్యఅఽతిథిగా హాజరై మాట్లాడారు.. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యలను గుర్తించి, ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలన్నారు. డీసీపీ మాట్లాడుతూ.. వాహనదారులు హెల్మెట్ వినియో గం, సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి అన్నారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జున రావు, కౌన్సిలర్ రజని, తదితరులు పాల్గొన్నారు. మండల సభలో కలెక్టర్ సందీప్కుమార్ఝా -
భగ్గుమంటున్న భానుడు
జనగామ: జిల్లాలో ఎండలు మండుతున్నాయి. గురువారం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు పలు మండలాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా బచ్చన్నపేట, చిల్పూర్, జనగామ, కొడకండ్ల మండలాల్లో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవడంతో ప్రజలు ఉక్కపోతతో సతమతమయ్యారు. 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు బచ్చన్నపేటలో 42.7డిగ్రీలు, చిల్పూర్లో 42.5 డిగ్రీలు, జనగామ పట్టణంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అదే విధంగా కొడకండ్లలో 41.5 డిగ్రీలు, రఘునాథపల్లి, తరిగొప్పుల, వడ్లకొండ, దేవరుప్పుల ప్రాంతాల్లో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 29 నుంచి 33 డిగ్రీల మధ్య ఉండడం గమనార్హం. జిల్లాలో వడగాలులకు తోడు పగటిపూట తీవ్ర ఎండ కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కరవుతున్నారు. పాదచారులు, రోజువారీ కార్మికులు, ఫుట్పాత్ వ్యాపారులు, చిరు ఉద్యోగులు, ధాన్యం, మక్కలు, ఇతర పంట ఉత్పత్తులు అమ్ముకునేందుకు వస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం సమయంలో జనం, వాహనాల రద్దీ లేక రోడ్లు వెలవెలబోతున్నాయి. వేడిగాలులు తీవ్రమవడంతో వృద్ధులు, పిల్లల ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసర పనులు తప్ప ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. గ్రామం ఉష్ణోగ్రతలు (గరిష్టం) స్టే.ఘన్పూర్ 41.0 పాలకుర్తి 40.8 లింగాలఘణపురం 40.8 జఫర్గఢ్ 40.6 తరిగొప్పుల 40.5 నర్మెట 40.8 రఘునాథపల్లి 41.1 దేవరుప్పుల 40.2 కొడకండ్ల 41.5 42 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు నిర్మానుష్యంగా మారిన రహదారులు వడగాలులు, ఉక్కపోతతో ప్రజల ఉక్కిరిబిక్కిరి -
ఉప్పల మల్లన్న జాతర ప్రారంభం
దేవరుప్పుల: గ్రామ నామకరణకు ప్రతీకగా ఏటా శివపార్వతుల కల్యాణోత్సవం పురస్కరించుకొని జరిగే ఉప్పల మల్లన్న జాతర బుధవారం మండల కేంద్రంలో వైభవంగా ప్రారంభమైంది. శివపార్వతుల కల్యాణోత్సవం పురస్కరించుకొని బుధవారం గణపతి పూజలతో మొదలై సాయంత్రం కొత్తవాడలో శావ, ఆలయం వద్ద బసవ ముద్దతో జాతర జోరందుకుంది. నేడు(గురువారం) స్వామి ఊరేగింపు, ఎదురుకోళ్లతో రాత్రి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్టు ఆలయ పూజారి పెద్దాపురం వెంకటేశ్వరశర్మ వివరించారు. 17న పూర్ణాహుతి, సదస్యం, తీర్దప్రసాద వినియోగంతో బండ్లు తిరుగుట ప్రదర్శన, 18న తెల్లవా రు జామున దోపోత్సవం, అగ్నిగుండాలు ఉంటాయన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి తెలిపారు.● నేడు శివపార్వతుల కల్యాణోత్సవం -
ఈ–నామ్ మొరాయింపు
జనగామ: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఈ–నామ్ 2.0 వెర్షన్ అమలు ప్రారంభ దశలోనే సాంకేతిక సమస్య తలనొప్పిగా మారింది. రైతులు, ట్రేడర్లకు పారదర్శకత, సమయపాలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ–నామ్ సేవలను పూర్తిస్థాయిలో 2.0 వెర్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. గతనెలలో నిర్వహించిన ట్రయల్ రన్లో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, ఈ నెల ప్రారంభం నుంచి సేవలు పూర్తిస్థాయిలో అమలవడంతో అసలు సమస్యలు బయటపడుతున్నాయి. యాప్ ఓపెన్ కాక ట్రేడర్లకు ఇబ్బందులు వ్యవసాయ మార్కెట్లో 37 మంది అడ్తి వ్యాపారులు, 54 మంది ట్రేడర్లు ఉన్నారు. ఇందులో ప్రస్తుతం ధాన్యం కొనుగోలు చేసేందుకు రోజువారీగా ఐదుగురు, మక్కల కొనుగోలు కోసం నలుగురు ట్రేడర్లు మాత్రమే వస్తున్నారు. ప్రతీరోజు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల వరకు బిడ్డింగ్ జరుగుతోంది. ట్రేడర్లు సరుకులకు ధరలు వేసే సమయంలో మాన్యువల్ పద్ధతిలో టెండర్ బాక్స్లో వేస్తుండడంతో అరగంట ఆలస్యమవుతోంది. పంట ఉత్పత్తుల లాట్ నెంబర్ సెలక్షన్ సమయంలో యాప్ సేవలు బాగున్నప్పటికీ, ట్రేడర్ల మొబైల్ ఫోన్లలో యాప్ ఓపెన్ కాకపోవడం వంటి సాంకేతిక లోపాలు వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేశాయి. దీంతో ట్రేడర్లు అధికారికంగా ధరలు నమోదు చేయలేని పరిస్థితి. డిజిటల్ కొనుగోలు నడిచే ఈ–నామ్ వ్యవస్థలో ఈ లోపం మార్కెట్ కార్యకలాపాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. ధరల గోప్యత కోసం టెండర్ బాక్స్ అధికారులు మార్కెట్లో సరుకు నాణ్యతను పరిశీలించి ఈ–నామ్లో అప్లోడ్ చేస్తున్నప్పటికీ, ధరల ఎంట్రీ వద్ద ట్రేడర్ల మొబైల్ ఫోన్లో యాప్ ఓపెన్ కాకపోవడంతో ప్రత్యామ్నాయంగా తాత్కాలికంగా టెండర్ బాక్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ట్రేడర్లు తమ ధరల వివరాలను రహస్యంగా కాగితంపై రాసి ఈ బాక్స్లో వేస్తున్నారు. తర్వాత అధికారులు వాటిని సేకరించి కంప్యూటర్ల ద్వారా తమ కంప్యూటర్ల ద్వారా ఈ–నామ్ పోర్టల్లో మాన్యువల్గా నమోదు చేస్తున్నారు. డిజిటల్ వ్యవస్థకు బదులుగా మళ్లీ పాత పద్ధతి అ మలవుతుండడంతో కొంత ఇబ్బంది తప్పడం లేదు. యాసంగి కోతలతో భారీ రాక యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో మార్కెట్ రోజుకు 6 వేల నుంచి 8 వేల బస్తాల వరకు ధాన్యం వస్తోంది. అదే స్థాయిలో మక్కలతో పాటు ఇతర పంట ఉత్పత్తులు సైతం వస్తున్నాయి. మార్కెట్కు సరుకులు పోటెత్తుతున్న సమయంలో ఈ–నామ్ సమస్యలు మరింతగా ఇబ్బందులు పెడుతున్నాయి. కొనుగోలు ప్రక్రియలో ఆలస్యం, ధరల నిర్ణయంలో అయోమయం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. మార్కెట్కు బుధవారం ఒక్కరోజే 117 మంది రైతుల వద్ద 4,540 బ్యాగుల ధాన్యం, 2,320 బస్తాల మక్కలను కొనుగోలు చేశారు. స్థానిక అధికారులు ప్రతిరోజూ సాంకేతిక సమస్యల వివరాలను ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. అయితే 15 రోజులుగా స మస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు, ట్రేడర్లకు ఇబ్బంది తప్పడం లేదు. ఈ–నా మ్ 2.0 వల్ల పారదర్శకత పెరుగుతుంది.. కానీ ప్రస్తుతం చిన్న సాంకేతిక సమస్యపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు పంపిస్తున్నామని మార్కెట్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి అంజిత్రావు తెలిపారు. త్వరలోనే ఈ సమస్యను అధికమించి వందశాతం ఈ–నామ్ దిశగా ముందుకెళ్తామన్నారు. 15 రోజులుగా పనిచేయని ట్రేడర్ల యాప్ ధరల గోప్యత కోసం ప్రత్యేకంగా టెండర్ బాక్స్ సాంకేతిక సమస్యలపై ఉన్నతాధికారులకు సమాచారం -
గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
జఫర్గఢ్: తెలంగాణ సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో 2026–27విద్యా సంవత్సరానికి కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశం పొందేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్.వరలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. అర్హత కలిగిన విద్యార్థులు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ నెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష మే 15న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించబడుతుందన్నారు. పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, నాణ్యమైన విద్య అందించనున్నట్లు తెలిపారు. జనగామ రూరల్: పట్టణంలోని ఏబీవీ ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో ఉన్నత విద్యాశాఖ ఆదేశానుసారం దోస్త్ డిగ్రీ అడ్మిషన్ సెంటర్ను ఏర్పా టు చేశామని కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్ తెలిపారు. మూడు దశలలో ప్రవేశాల ప్రక్రియ ఉంటుందని ఈనెల 15 నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. సీట్ల కేటాయింపు జూన్ 20 వరకు, సెల్ఫ్ రిపోర్టింగ్ జూన్ 20 నుంచి 25 వరకు ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు కో ఆర్డినేటర్ ఎ.రవీంద్ర నాయక్, టెక్నికల్ అసిస్టెంట్ కరుణాకర్ 9701046411, 9912437032 ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించాలన్నారు. స్టేషన్ఘన్పూర్: అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని ఘన్పూర్ మున్సిపాలిటీ 4, 5వ వార్డు కౌన్సిలర్లు బూర్ల రాజేశ్వర్ముదిరాజ్, చల్లా రమ్యరఘురెడ్డి అన్నారు. ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలోని అంగన్వాడీ సెంటర్లను వారు బుధవారం సందర్శించారు. శివునిపల్లిలోని ఆరు అంగన్వాడీ సెంటర్లలో ఒక సెంటర్ ప్రైమరీ స్కూల్లో నడుస్తుండగా మిగిలిన ఐదు సెంటర్లు అద్దె భవనాల్లో నడిపిస్తున్నట్లు వారు గమనించారు. ఈ సందర్భంగా శివునిపల్లి బొడ్రా యి సమీపాన ఉన్న ప్రభుత్వ స్థలంతో పాటు పలు ప్రభుత్వ స్థలాలను వారు పరిశీలించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బూర్ల విష్ణు, అంగన్వాడీలు ఎం.అరుణ, జి.ఉపేంద్ర, వి.శోభారాణి, సరోజన, స్వరూప పాల్గొన్నారు. జనగామ రూరల్: రైతులు మద్దతు ధర కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మాత్రమే విక్రయించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అన్నారు. బుధవారం జనగామ మండలం పెద్దపహాడ్, గోపరాజుపల్లి, వెంకిర్యాల, గానుగపహాడ్, మరిగడి గ్రామాల్లో ఏకేపీ, పీఎసీఎస్ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు కర్రె పర్శరాములు, తోటపల్లి రాజేశ్వరి, గద్ద చంద్రశేఖర్, శానబోయిన అనూ ష మహిపాల్, ఈర్ల అలేఖ్య నవీన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
20న కాళేశ్వరానికి సీఎం
కాళేశ్వరం: ఈనెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఈనేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భద్రత, ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. 20న సీఎంతో పాటు మంత్రులు రానున్న సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నారు. సుమారు 40 ఎకరాల్లో సభాస్థలి, ఇతర ఏర్పాట్లు చేయనున్నారు. కాళేశ్వరం కీలక మేడిగడ్డ బ్యారేజీలో 2023 అక్టోబర్ 21న 7వ బ్లాక్లోని 20వ పియర్(పిల్లర్) కుంగిపోగా, వంతెన కుంగి పగుళ్లు తేలిన విషయం తెలిసిందే. అదే సమయంలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలు ఏర్పడ్డాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం లేదు. వాటికి మరమ్మతులు చేసి పునరుద్ధరిస్తామని ఇటీవల సీఎం ఇచ్చిన హామీ మేరకు పర్యటన ఖరారైందని రైతాంగం ఆశిస్తోంది. ఇప్పటికే పుణేకు చెందిన సీడబ్ల్యూపీఆర్ఎస్ బృందం సైంటిస్టులు బ్యారేజీలో పలమార్లు జియోఫిజికల్, జియోటెక్నికల్తో పాటు పలు రకాల పరీక్షలు చేపట్టారు. ఆ పరీక్షలను సీఎం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించనున్నారు. ఇరిగేషన్శాఖ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టింది. నస్తూర్పల్లిలో సభ సీఎంతో పాటు ఇతర మంత్రుల మేడిగడ్డ పర్యటన తర్వాత బహిరంగ సభలో పాల్గొని మాట్లాడనున్నారు. ఈ సభా వేదిక నిర్వహణను 40 ఎకరాల్లో కాటారం మండలం నస్తూర్పల్లిలో సభా వేదిక, వాహనాల పార్కింగ్ సదుపాయాలు, హెలిపాడ్, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు మౌలిక సదుపాయాలను అధికారులతో కలిసి కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులు పరిశీలించారు. కాగా, కాళేశ్వరం, కుదురుపల్లిలో సభాస్థలి కోసం పరిశీలనలు చేసినప్పటికీ అనువుగా ఉండే నస్తూర్పల్లిలో ఏర్పాట్లకు అధికారులు సుముఖం తెలిపారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయండి.. 20న సీఎం పర్యటనను పురస్కరించుకొని ఽకాటారం మండలం ధన్వాడలోని ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి శ్రీధర్బాబు తన నివాసంలో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్తో కలిసి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మేడిగడ్డకు చేరుకుని ప్రాజెక్టును పరిశీలిస్తారని, అనంతరం అంత్య పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి, తర్వాత జరిగే సభలో పాల్గొంటారని వివరించారు. సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డి, ఉపాధి హామీ పథకం రాష్ట్ర సభ్యులు దండు రమేశ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు పాల్గొన్నారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాటారం మండలం నస్తూర్పల్లిలో సభాస్థలి, పార్కింగ్ స్థలాలు ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ ధన్వాడలో అధికారులతో మంత్రి శ్రీధర్బాబు సమీక్ష -
ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి
జనగామ రూరల్: ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం జిల్లాలో ఇసుక గ్రావెల్ తరలింపు ప్రక్రియపై డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి మైనింగ్, రవాణా, ఇంజనీరింగ్, నీటిపారుదల శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీపీఓ వెంకట్ రెడ్డి, ఏడీ మైన్స్ విజయ్ కుమార్, ఆర్టీఓ శ్రీనివాస్ గౌడ్, నీటి పారుదల శాఖ అధికారి ప్రవీ ణ్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కొనుగోళ్ల కేంద్రాలను సజావుగా నిర్వహించాలి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఎం సీఎస్ హథీరాం, ఆర్టీఓ శ్రీనివాస్ గౌడ్, డీఏఓ అంబికా సోనీ, డీసీఎస్ఓ పావని, అడిషనల్ డీఆర్డీఓ నూరుద్దీన్, డీసీఓ కోదండరాములు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఓబీ భూసేకరణ వేగవంతం చేయాలి రైల్వే ఆర్ఓబీ భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. పెంబర్తిలో నిర్మించనున్న ఆర్ఓబీ కింద భూ సేకరణ ప్రక్రియ, ఇసుక తరలింపుపై రైల్వే, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఆర్డీఓ గోపిరామ్, రైల్వే అధికారులు శేషా చారి, సామ్రాట్ రాయ్, ఆర్అండ్బీ ఈఈ సరితా రాణి, జీ సెక్షన్ సూపరింటెండెంట్ చంద్ర మోహన్, పాల్గొన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికే మండల సభలు కొడకండ్ల: మండల స్థాయిలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకే మండల సభలు వేదికగా నిలుస్తాయని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని తహసీల్దార్, సబ్ట్రెజరీ, ఎంపీడీఓ కార్యాలయాలను తనిఖీ చేసి రికార్డుల నిర్వహణ, అన్లైన్ సేవల అమలును కలెక్టర్ పరిశీలించారు. గురువారం నిర్వహించే మండల సభ నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గృహ నిర్మాణ పీడీ మాతృనాయక్, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎన్.ఎల్. నరసింహరావు, తహసీల్దార్ ఉత్తలూరి అనీల్బాబు, ఎంపీడీఓ నాగశేషాద్రిసూరి తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు వేగంగా పూర్తిచేయాలి దేవరుప్పుల: నిలువ నీడలేని పేదలు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లు సత్వరమే పూర్తి చేసేలా సంబంధిత యంత్రాంగం తోడ్పాటు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మండల కేంద్రంలో నిర్మితమవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పురోగతి పనులను ఆయన పరిశీలించారు. పరిశీలనలో గృహా నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తిగౌడ్, సిబ్బంది ఉన్నారు. సమీక్ష సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
రిజర్వేషన్లపై కుట్రలను అడ్డుకోవాలి
● అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరిస్టేషన్ఘన్పూర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుల, మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తోందని, రాజ్యాంగంపై, దళితుల రిజర్వేషన్లపై జరుగుతున్న కుట్రలను అడ్డుకోవాలంటే సంఘటిత పోరాటం ఒక్కటే మార్గమని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ముందుగా స్థానిక పాత గాంధీ చౌరస్తా నుంచి శివునిపల్లి అంబేద్కర్సెంటర్ వరకు, అక్కడ నుంచి ఘన్పూర్ బస్టాండ్ వరకు చేపట్టిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే కడియం పాల్గొన్నారు. శివునిపల్లి అంబేద్కర్ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి, స్థానిక బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ కేంద్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి అంబేడ్కర్ సచివాలయంగా నామకరణం చేస్తానన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ డీఎస్ వెంకన్న, ఘన్పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. రోడ్డు భద్రత నియమాలు పాటించాలి ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు భద్రతానియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు పాటుపడాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్థానిక బస్టాండ్ వద్ద అంబేడ్కర్ సెంటర్ వద్ద పోలీసుశాఖ, రవాణాశాఖ సంయుక్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్రా, సీఐ జి.వేణు, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, ఎస్ఐ వినయ్కుమార్, ఏఎంవీ శ్వేత పాల్గొన్నారు. ఆ పెద్ద మనిషి తిని, తాగి ఎంజాయ్ చేసిండు రఘునాథపల్లి: 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ పెద్ద మనిషి అభివృద్ధి మరిచి తాగి, తిని ఎంజాయ్ చేశాడని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యనుద్దేశించి ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు. మండలంలోని కుర్చపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం, 25 లక్షల సీసీ రోడ్డు, నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించి, అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.. గత రెండేళ్లలో ‘మా నియోజకవర్గం, మా ఎమ్మెల్యే..’ అని గల్లా ఎగరేసి చెప్పేలా పనిచేస్తున్నానన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, సర్పంచ్ బైకాని రాజు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్చందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో ఏసీపీ భీంశర్మ, సీఐ ఎడవెల్లి శ్రీనివాస్రెడ్డి, అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు ప్రేమ్కుమార్ పాల్గొన్నారు. -
సెలవుల్లో బడి భద్రత!
జనగామ: వేసవి నేపథ్యంలో ఈ నెల 23న పాఠశాలలు విద్యా సంవత్సరం ముగుస్తుండగా, 24వ తేదీ నుంచి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పాఠశాలల మౌలిక వసతులు, రికార్డులు, భద్రతా వ్యవస్థలను కాపాడేందుకు సమగ్ర శిక్ష, తెలంగాణ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ కఠిన మార్గదర్శకాలను జారీ చేశారు. డీఈఓలు, హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ అధికారులకు పంపించిన ఆదేశాల్లో పాఠశాలల సెలవుల్లో సురక్షితంగా ఉండేలా 20 విభాగాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పీఎంశ్రీ, సమగ్ర శిక్ష నిధుల ద్వారా పాఠశాలలకు కంప్యూటర్లు, ప్రింటర్లు, సంగీత పరికరాలు, బ్యాండ్ సామగ్రి, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, క్రీడా పరికరాలు, లైబ్రరీ వసతులు, ఒకేషనల్ సాధనాలు, మధ్యాహ్న భోజన వంటగదుల సదుపాయాలు, ఫర్నిచర్ వంటి అనేక వసతులు కల్పించారు. వీటి రక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డీఈఓలకు సూచించారు. స్కూల్ ప్రాపర్టీ, రికార్డులు, మౌలిక వసతులు ఏ విధమైన ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. జిల్లాలో విద్యాసంస్థలు జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, మోడల్, కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్, మైనార్టీ, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ తదితర విద్యాసంస్థలు సుమారు 543 ఉండగా, 40వేల మంది పిల్లలకు పైగా చదువుకుంటున్నారు. ఇందులో పీఎంశ్రీ స్కూల్స్ 15 ఉండగా, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్ని పాఠశాలలకు విలువైన పరికరాలు, ఇతర వస్తువులు మంజూరు చేశారు. అలర్టు పాఠశాలల సమగ్ర భద్రతలో భాగంగా స్కూల్ గేట్లు, తరగతి గదులు, ల్యాబ్లు పూర్తిగా లాక్ చేయడం, స్థానిక పోలీసుల పర్యవేక్షణ, పూర్వ విద్యార్థులు, యువత, ఎన్జీఓల సహకారం తీసుకోవాలని సూచించారు. విలువైన పరికరాలను లాకబుల్ రూముల్లో భద్రపరచడం, ఆస్తుల ఇన్వెంటరీని అప్డేట్ చేయడం, అనధికారుల ప్రవేశాన్ని నియంత్రించడం తప్పనిసరి చేయాలన్నారు. విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు పరికరాలు, మెయిన్ పవర్ స్విఛ్ఆఫ్ చేయడం, లోపాలున్న వైరింగ్ను ముందుగానే సరిచేయాలని పేర్కొన్నారు. నీరు, శుభ్రత, హైజీన్ పరంగా టాయిలెట్లు, నీటి ట్యాంకులు శుభ్రపరచడం, లీకేజీలు లేకుండా చూడడం, దోమల పెరుగుదలకు మార్గం లేకుండా నీటి నిల్వలను తొలగించాలని చెప్పారు. క్యాంపస్ పరిశుభ్రత, చెత్త నిర్వహణ, రికార్డులను లాకర్లలో భద్రపరచడం, డిజిటలైజేషన్ ప్రోత్సహించడం వంటి అంశాలను కూడా సూచించారు. సెలవుల్లో కూడా హెడ్మాస్టర్లు స్కూల్ను పర్యవేక్షిస్తూ వాచ్మన్న్ లాగ్బుక్ నిర్వహించాలని తెలిపారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీతో సమన్వయం కొనసాగిస్తూ, బడి మూసివేత విషయాన్ని స్థానికులకు తెలియజేయాలని సూచించారు. అత్యవసర సమయంలో ఫోన్ నెంబర్లు అత్యవసర పరిస్థితిలో స్పందించేలా పోలీసు, ఫైర్, విద్యుత్ శాఖల కాంటాక్ట్ నెంబర్లను స్కూల్ ఆవరణలో ప్రదర్శించాల్సి ఉంటుంది. డిజిటల్ సెక్యూరిటీ కోసం పరికరాలను ఆఫ్ చేసి కవర్ చేయడం, ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేయడం, సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన వంటశాలలు శుభ్రపరచడం, ధాన్యాలను సురక్షితంగా నిల్వ చేయడం, ఎల్పీజీ సిలిండర్లు ఆఫ్ చేసి సెక్యూర్ చేయడం కూడా తప్పనిసరి చేశారు. వర్షాలు, గాలివానల వంటి విపత్తులకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సెలవుల్లో విధులు నిర్వహించే సిబ్బందిని నియమించి, వారి కాంటాక్ట్ వివరాలను ఉన్నతాధికారులకు తెలియజేయాలని చెప్పారు. డీఈఓలు, హెడ్మాస్టర్లకు సమగ్రశిక్ష కీలక ఆదేశాలు ఈ నెల 24నుంచి పాఠశాలలకు సెలవులు పరికరాలు, వస్తువుల రక్షణపై సూచనలు విద్యుత్, అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు సీసీటీవీ, డిజిటల్ భద్రతపై కఠిన సూచనలుతెరుచుకునే లోపే జూన్లో పాఠశాలలు తిరిగి తెరవడానికి ముందు పరిశుభ్రత, తాగునీరు, శానిటేషన్, భద్రతా అంశాలపై పూర్తి తనిఖీ చేసి, రెడీనెస్ రిపోర్ట్ను సమర్పించాలని ఆదేశించారు. ఏదైనా నష్టం, దొంగతనం, అవాంఛనీయ ఘటన జరిగితే వెంటనే నివేదించాలని, ఫిర్యాదుల రిపోర్ట్ సెలవుల ముందు, తర్వాత ఇవ్వాలని పేర్కొన్నారు. పాఠశాల ఆస్తుల సంరక్షణలో నిర్లక్ష్యం కనబరిస్తే హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాళ్లు బాధ్యులని స్పష్టం చేస్తూ, డీఈఓలు ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశించారు. -
పోరాటగడ్డపై ‘రాజ్యాంగం’ అమలుకావట్లే
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ: జనగామలో భారత రాజ్యాంగం అమలుకావడం లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రం ఆర్టీసీ చౌరస్తాలో అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గద్దల కిషోర్ అధ్యక్షతన ష్యెడూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ 135వ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏఎస్పీ పండేరీ చేతన్ నితిన్, డాక్టర్లు సుగుణాకర్రాజు, రాజమౌళి, మాచర్ల భిక్షపతి, కృష్ణ, రంజిత్, తదితరులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జనగామలో కలెక్టర్, పోలీసుల విషయానికి వస్తే రాజ్యాంగం అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోరాట యోధులు పుట్టిన గడ్డలో రాజ్యాంగం అమలుకాకపోవడం దురదృష్టకరమన్నారు. ఒక దళిత మహిళ కలెక్టర్ కార్యాలయం పక్కన టీ స్టాల్ ఏర్పాటు చేసినప్పటికీ, ప్రస్తుత కలెక్టర్ దానిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటి సందర్భాల్లో దళిత సంఘాలు స్పందించకపోవడం విచారకరమన్నారు. జనగామలో వైన్స్ సిండికేట్ ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని బెల్ట్ షాపులను మూసివేయాలని పోలీసులను కోరారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవిలత, మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, షెడ్యూల్డ్ కులాల సంఘాల రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు బొట్ల శేఖర్, గద్దల నర్సింగరావు, మేడ శ్రీనివాస్, పార్నంది వెంకటస్వామి, అడ్వకేట్ సాదిక్ అలీ, అనిత, రాములు, మల్లిగారి రాజు, మధు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా అంబేడ్కర్ జయంతి
జనగామ: బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడిచి సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. మంగళవారం బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల సందర్భంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ చౌరస్తాలో మహనీయుని విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీ నివాస్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూలమాల వేసి, ఘనంగా నివాళులు సమర్పించారు. నెహ్రూపార్కు ఏరియాలో.. జనగామ పట్టణం నెహ్రూపార్కు ఏరియాలో బాబాసాహెబ్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను మంగళవారం కీర్తి వీరేందర్, నీలం స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 9వ వార్డు కౌన్సిలర్ గుడిగంటి వెన్నెల రామకృష్ణ, రాష్ట్ర మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ తాటి కుమార్, టీఏపీఎస్ జిల్లా బాధ్యులు చల్లా తిరుపతిరెడ్డి, మనోజ్ కుమార్, కోటి, బాల నారాయణ, సాయిరాం, రజనీకాంత్, అరుణ్ కుమార్ పాల్గొని మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. -
బంజరుకాల్వకు మరమ్మతేది?
● సాగునీటికి రైతుల అవస్థలు ● పునరుద్ధరణ పనులు చేపడితే వెయ్యి ఎకరాలకు సాగునీరు ● పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులుస్టేషన్ఘన్పూర్: మండలంలో పాంనూర్ గ్రామంలోని బంజరుకాల్వకు దశాబ్దాలుగా మరమ్మతులు చేయకపోవడంతో సాగునీటి కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతోంది. పాంనూర్ గ్రామ శివారులోని బంజరుకాల్వ పూడుకుపోయింది. కాల్వ శిథిలం కావడంతో పాటు విపరీతంగా పిచ్చిమొక్కలు పెరిగాయి. దాంతో కాల్వ పూర్తిగా పూడుకుపోయి బంజరుకాల్వ ద్వారా నీరు ముందుకు వెళ్లడం లేదు. ఘన్పూర్ రిజర్వాయర్ పూర్తయి అక్కడి నుంచి దాదాపు 17ఏళ్లుగా సాగునీరు వస్తున్నా బంజరుకాల్వ శిథిలమై పూడుకుపోవడంతో రైతులకు సాగునీరు రావడం లేదు. బంజరుకాల్వను మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకువస్తే మొత్తంగా వెయ్యి ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇందులో 550 ఎకరాలు పాంనూర్, 250 ఎకరాలు చిల్పూరు మండలం నష్కల్, 250 ఎకరాలు జఫర్గడ్ మండలం ఉప్పుగల్లు గ్రామాలకు సాగునీరు అందుతోంది. కాల్వకు పలుచోట్ల గండ్లు దాదాపు 80 ఏళ్ల క్రితం గ్రామంలో నిర్మాణం చేపట్టిన బంజరుకాల్వకు పలు చోట్ల గండ్లు పడడం, తుమ్మచెట్లు, పిచ్చిచెట్లు పెరిగి కాల్వ పూర్తిగా పూడ్చుకుపోవడంతో రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విపరీతంగా పిచ్చిమొక్కలు పెరగడంతో ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి తూము ద్వారా వచ్చే నీళ్లు వాగుపాలు అవుతున్నాయి. కాల్వ పునరుద్ధరణ పనులు చేపట్టాలని పలుమార్లు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. 80 ఏళ్ల క్రితం బంజరుకాల్వ నిర్మాణం గ్రామానికి చెందిన బాబుదొర అనే సాంకేతిక నిపుణుడు దాదాపు 80 ఏళ్ల క్రితం వరద ప్రవాహం ద్వారా వచ్చే నీళ్లను ఎలాగైనా ఆపి గ్రామ రైతాంగానికి రెండు పంటలకు సాగునీరు అందించే సంకల్పంతో ఆరోజుల్లో బంజరుకాల్వ, పర్రె కాల్వల నిర్మాణం చేశారని రైతులు చెపుతున్నారు. గతంలో పాంనూర్ గ్రామ రైతాంగానికి సాగునీరు సమృద్ధిగా ఉండటంతో పాటు ఇక్కడ నుంచి దిగువన ఉన్న జఫర్గడ్ మండలం ఉప్పుగల్లుకు సాగునీరు వెళ్లేవి. కాలక్రమంలో బంజరుకాల్వ, పర్రెకాల్వలకు పలు చోట్ల గండిపడటం, కాల్వలలో పిచ్చిచెట్లు ఏపుగా పెరిగి నీళ్లు దిగువ ప్రాంతానికి అందడం లేదు. తలాపున గోదావరిలా ఘన్పూర్ రిజర్వాయర్లో సమృద్ధిగా నీరు ఉన్నా బంజరుకాల్వ, పర్రెకాల్వకు గండ్లు ఏర్పడి, పిచ్చి మొక్కలు పెరిగి నీరందక పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొంది. గ్రామసభలో ఎమ్మెల్యే ఎదుట ప్రస్తావించిన గ్రామస్తులు ఇటీవల గ్రామంలో జరిగిన ప్రజాపాలన ప్రగతిప్రణాళిక కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరుకాగా పలువురు బంజరుకాల్వ సమస్యపై సభ దృష్టికి తీసుకెళ్లారు. ఏళ్ల తరబడి సమస్య పెండింగ్లో ఉందని, సమస్యను పరిష్కరించి రైతాంగాన్ని ఆదుకోవాలని పలువురు కోరారు. శాశ్వత మరమ్మతు చేయాలి బంజరుకాల్వకు శాశ్వత మరమ్మతు చేపట్టాలి. ఈవిషయమై పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటిౖకైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కాల్వకు శాశ్వత మరమ్మతు చేస్తే వందలాది ఎకరాలకు ప్రయోజనంగా ఉంటుంది. –ఒగ్గు రాజు, రైతు ఏడాదిలోపు సమస్య పరిష్కరిస్తాబంజరుకాల్వ సమస్య నా దృష్టికి వచ్చింది. పదిహేను సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న వారు సమస్యను పట్టించుకోలేదు. సమస్యపై పూర్తిఅవగాహన ఉంది. బంజరుకాల్వ సమస్యను ఏడాదిలోపు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేలా కృషి చేస్తా. –కడియం శ్రీహరి, ఎమ్మెల్యే -
గుంతల రోడ్డుకు మరమ్మతు
జనగామ: ప్రజాపాలన–ప్రగతి పాలనలో భాగంగా సిద్దిపేట ప్రధాన రహదారి చంపక్హిల్స్ సమీపంలో ఎంసీహెచ్ ఆవరణలో గుంతలమయంగా మారిన రోడ్డుకు మంగళవారం మరమ్మతు చేపట్టారు. ఏఎస్పీ పండేరీ చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు భరత్, రతీశ్, చెన్నకేశవులుతో కలిసి డీసీపీ రాజ మహేంద్ర నాయక్ రోడ్డును సందర్శించారు. రోడ్డు గుంతలను పూడ్చివేసి వాహన దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. రోడ్డు భద్రతపై అవగాహనజనగామ: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం రవాణా, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ చౌరస్తా అంబేడ్కర్ విగ్రహం వద్ద వాహనదారులతో రోడ్డు భద్రత అవగాహన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పట్టణంలోని ప్రమాదాలకు ఆస్కారంగా ఉన్న బ్లాక్ స్పాట్స్ గుర్తించి నివారణకు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్, డీటీఓ జీవీఎస్ గౌడ్, సీఐ సత్య నారాయణరెడ్డి, ఎస్సైలు చెన్నకేశవులు, భరత్ ఉన్నారు. గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం పాలకుర్తి టౌన్: తెలంగాణ సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో 2026–27 విద్యాసంవత్సరానికి ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాలకుర్తి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.స్వరూప మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్ సిలబస్తో పాటు ఫైన్ ఆర్ట్స్ కోర్సుల్లో విద్యనభ్యసించే అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన విద్యార్థులు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఆర్ఈసీఈటీ) ఆధికారిక వైబ్సెట్ ద్వారా ఈనెల 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకో వాలని సూచించారు. ప్రవేశ పరీక్ష మే 15న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ పరీక్ష ధ్వారా ఎంపికై న విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, నాణ్యమైన విద్య అందించబడుతుందన్నారు. వివరాలకు సమీప గురుకుల జూనియర్ కాలేజీలను సంప్రదించాలన్నారు. నేడు వరంగల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనహన్మకొండ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు నేడు (బుధవారం) వరంగల్ మహానగరంలో పర్యటించనున్నారు. పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..మధ్యాహ్నం 2గంటలకు వరంగల్ ఓ సిటీలోని వీధి వ్యాపారులను సన్మానించి వారికి టీ స్టాళ్లు పంపిణీ చేయనున్నారు. 3 గంటలకు గ్రాండ్ గాయత్రి హోటల్లో మీడియా సమావేశంలో, సాయంత్రం 4 గంటలకు 44వ డివిజన్లో పారిశుద్ధ్య కార్మికుల సన్మాన కార్యక్రమంలో రాంచందర్ రావు పాల్గొంటారు. సాయంత్రం 5:30 గంటలకు వేయిస్తంభాల దేవాలయం నుంచి నారీశక్తి వందన్ అథినియం కార్యక్రమంలో భాగంగా మహిళా మోర్చా బైక్ ర్యాలీని ప్రారంభించి, ర్యాలీలో పాల్గొంటారు. సాయంత్రం 7:30 గంటలకు హన్మకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ద్విచక్ర వాహన ర్యాలీ ముగింపు కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. గాజుల లారీలో మంటలు జనగామ: మండలంలోని యశ్వంతాపూర్ వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి సత్యసాయి కన్వెన్షన్ ఫంక్షన్ హల్ ఎదురుగా ఓ గాజుల లారీలో మంటలు వ్యాప్తి చెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. వరంగల్ నుంచి యాదాద్రి జిల్లా ఆలే రు హెడ్ క్వార్టర్కు గాజుల లోడుతో వెళ్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ సంజయ్ వెంటనే ప్రమాదాన్ని గమనించి 100కు డయల్ చేశారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఫైర్ డిపార్టుమెంటుకు సమాచారం అందించగా, వారు అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో లారీలోని లోడ్ కాలిపోగా, డ్రైవర్ సంజయ్, కో డ్రైవర్ చంబీమాథ్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. -
జాతర అభివృద్ధి పనుల్లో అవినీతి
● సర్పంచ్పై కలెక్టర్కు ఫిర్యాదు చిల్పూరు: ఇటీవల జరిగిన శ్రీపతిపల్లి–కొండాపూర్ గ్రామాల సరిహద్దులో ఉన్న సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా అభివృద్ధి పనులు మంజూరు కాగా శ్రీపతిపల్లి సర్పంచ్ కరుణాకర్ కాంట్రాక్టర్ అవతారం ఎత్తి భారీ అవినీతికి పాల్పడ్డారని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నాణ్యతతో కూడిన పనులు చేయించాలని బీఆర్ఎస్ మండల కన్వీనర్ రంగు హరీష్ అధికారులను కోరారు. పనుల విషయంలో అవినీతికి సర్పంచ్ పాల్పడినట్లు కలెక్టర్కు ఫిర్యాదు చేసి వచ్చిన ఆయన జాతర ప్రదేశంలో మాట్లాడుతూ.. జాతర అబివృద్ధి కోసం ఎమ్మెల్యే శ్రీహరి ప్రత్యేక నిధులు మంజూరు చేయగా పనులు చేపట్టిన సర్పంచ్ రూ.8 లక్షల విలువైన పనులు చేయకుండానే పంచాయతీరాజ్ డీఈ అండదండలతో ఎంబీ రికార్డు పూర్తి చేయించుకుని నిధులు దుర్వినియోగం చేయడానికి కుట్రపన్నారని అన్నారు. ఈవిషయంలో ఎమ్మెల్యే కడియం అధికారులతో విచారణ చేయించి చర్యలు తీసుకోవాలని కోరారు. గాలి ప్రవీణ్, తరుణ్, రాజయ్య, పిట్టల రాజు, చొక్కం రాజు పాల్గొన్నారు. -
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి
● డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి కాళోజీ సెంటర్: ప్రభుత్వం చెల్లింవాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం టీడీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం డి.మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులను మంజూరు చేయాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిలను ఏకమొత్తంలో చెల్లించాలన్నారు. -
జూలైలో గండి రామారం ఎత్తిపోతల పథకం ప్రారంభం
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి హసన్పర్తి: జూన్ 30వ తేదీ వరకు గండిరామారం ఎత్తిపోతల పథకం–1 పనులు పూర్తి చేసుకుని జూలై మొదటి వారంలో ప్రారంభించాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. చింతగట్టు క్యాంప్లోని నీటిపారుదలశాఖ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో సోమవారం ఆ ఎత్తిపోతల పథకం పనులపై నీటిపారుదలశాఖ అధికారులు, కాంట్రాక్టర్లతోపాటు నియోజకవర్గ పరిధిలోని వేలేరు, చిల్పూరు మండలాల సర్పంచ్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రారంభోత్సవానికి ఇచ్చిన డెడ్లైన్లో ఎలాంటి మార్పూ ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పనులపై ఆరాతీశారు. ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అని కాంట్రా క్టర్లు, అధికారులనుఅడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం వరకు వేలేరు, చిల్పూరు మండలాల రైతులకు సాగునీరు అందించే విధంగా పనులు చేపట్టాలన్నారు.లిఫ్ట్–1పైన వేలేరు, చిల్పూరు మండలాలరైతుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అదనపు చెరువులు నింపేందుకు రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. వారానికి రెండు సార్లు అధికారులు క్షేత్రస్థాయి పనులు పర్యవేక్షించాలని సూచించారు. చీఫ్ ఇంజనీర్ సుధీర్, ఎస్ఐలు సీతారాం నాయక్, డీఈఈలు, తదితరులు పాల్గొన్నారు. -
అంబులెన్స్ ప్రారంభం
జనగామ: జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాల సమయంలో గాయపడిన వారికి తక్షణమే వైద్యసేవలు అందించేందుకు 108 అంబులెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న అరైవ్–అలైవ్ ప్రోగ్రాంలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా నేషనల్ హైవేస్ యాదాద్రి–వరంగల్ ఎన్హెచ్ 163 ఆధ్వర్యంలో ఆధునిక సదుపాయాలతో కూడిన నూతన అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. సోమవారం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో చేపట్టిన కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, జిల్లా ట్రాన్స్పోర్టు అధికారి జీవీఎస్గౌడ్తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎన్హెచ్ఏఐ పీడీ భరద్వాజ్, ఆర్టీఏ సభ్యులు చిలువేరు అభిగౌడ్, ఎస్ఐ మహేష్గౌడ్, కానిస్టేబుళ్లు వెంకటేశ్, సమ్మద్, అధికారులు పాల్గొన్నారు. ముగిసిన టెన్త్ పరీక్షలుజనగామ రూరల్: గత నెలలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. ప్రైవేట్ హాస్టల్స్, ప్రభుత్వ గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు పరీక్షలు ముగియడంతో తమ ఇళ్లకు ఉత్సాహంగా పయనమయ్యారు. రైతు సంక్షేమమే ధ్యేయంజనగామ రూరల్: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజు అన్నారు. సోమవారం మండలంలోని శామీర్పేట, వెంకిర్యాల, గానుగపహాడ్, ఓబుల్కేశవాపూర్ తదితర గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నాణ్యమైన ధాన్యాన్ని విక్రయించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు శానబోయిన అనూష మహిపాల్, ఈర్ల అలేఖ్య నవీన్, గణిపాక వనిత మహేందర్, జెన్నేపల్లి జనార్ధన్ రెడ్డి, వంగాల మల్లేశం, సుధాకర్, తోటపల్లి రాజేశ్వరి, గద్ద చంద్రశేఖర్, డైరెక్టర్ నామాల శ్రీనివాస్, మండల అధ్యక్షులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. రామప్పలో టీజీఎఫ్డీసీ జీఎం వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ(టీజీఎఫ్డీసీ) జనరల్ మేనేజర్ జి. స్కైలాబ్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమా శంకర్లు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయకుమార్ వారికి వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా డివిజనల్ మేనేజర్ శైలజ, భూపాలపల్లి జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ బి.కరుణాకర్ రావు ఉన్నారు. హేమాచలక్షేత్రంలో జాతర వేలం పాటలు మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈ నెల 27 నుంచి మే 6వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల(జాతర) సందర్భంగా క ల్యాణ మండపంలో ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారి వీరస్వామి ఆధ్వర్యంలో జాతర వేలం పాటలను సోమవారం నిర్వహించారు. హన్మకొండ మెట్టు రామలింగేశ్వరస్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో నెల రోజుల పా టు వివిధ రకాల షాపుల ఏర్పాటు, విక్రయాలకు అనుమతులు పొందేందుకు షీల్డ్, బహిరంగ వేలం పాటలను నిర్వహించారు. -
సాదాబైనామా చిక్కులకు చెక్!
సాదాబైనామాల క్రమబద్ధీకరణకు భూ క్రయ,విక్రయదారుల ‘అఫిడవిట్’ల నిబంధన చిక్కులు తొలగాయి. ఆర్డీఓలే విచారణాధికారులగా దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నిబంధనల పేరిట ముందుకు సాగని సాదాబైనామాల క్రమబద్ధీకరణ ఇకపై ఫాస్ట్ట్రాక్లో జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2020 నవంబర్ 10 నుంచి పెండింగ్లో ఉన్న సుమారు 1.90 లక్షల దరఖాస్తులకు పరిష్కారం దొరకనుంది. రైతులకు ఊరట కలగనుంది. సాక్షిప్రతినిధి, వరంగల్ : ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సాదా బైనామా ఫైళ్లకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్కు సిద్ధమవుతూ, జిల్లాల వారీగా పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయడానికి చర్యలు ప్రారంభించింది. దీనివల్ల వేలాది మంది రైతులు, పేదలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన 112జీఓ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకురావడంతో పాటు ఆ జీఓపై వచ్చిన అభ్యంతరాలు, సాదా బైనామాల పరిష్కారంపై విధివిధానాలను హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. దీంతో హైకోర్టు తన ముందు ఉన్న పిల్ను కొట్టివేసింది. ప్రభుత్వం సాదా బైనామాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు ఆదేశాలు ఇచ్చినా.. భూక్రయ, విక్రయదారులు ఇద్దరి అఫిడవిట్లు, తదితర నిబంధనల కారణంగా ముందుకు సాగలేదు. తాజాగా అఫిడవిట్ల నిబంధనలను సడలించడంతోపాటు దరఖాస్తుల పరిశీలించే పరిష్కరించే అధికారాలు పూర్తిగా ఆర్డీఓలకు ఇవ్వడంతో ఆ ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది. ఐదున్నరేళ్లుగా పెండింగ్లో.. సాదాబైనాల క్రమబద్ధీకరణ కోసం జీఓలు ఎన్ని తెచ్చినా దరఖాస్తులు పెండింగ్లోనే ఉంటున్నాయి. 2016లో జీఓనం.153, 2020లో జీఓ 112లను తీసుకువచ్చారు. 2014 జూన్ 2కు ముందు సాదాబైనామాలు కలిగిన భూములను క్రమబద్ధీకరించడం.. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేసే ఉద్దేశంతో రెండు పర్యాయాలు, ఈ రెండు జీఓలు తెచ్చారు. జీఓ నం.112పై ‘పిల్’ దాఖలు కావడంతో దానిని అమలు కాకుండా నిలిపివేశారు. ఆ తర్వాత రెవెన్యూ సదస్సుల ద్వారా దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం వాటి పరిష్కారం మంత్రివర్గ ఉపసంఘం వేసింది. గతేడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రెవెన్యూ గ్రామ సదస్సులను నిర్వహించింది. ఈ సదస్సుల్లో అత్యధికంగా సాదాబైనామాలపైనే దరఖాస్తులు వచ్చాయి. గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులు మరోసారి భూభారతి సదస్సులో దరఖాస్తులు చేశారు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు, అంతకు ముందున్న మొత్తం దరఖాస్తుల సంఖ్య 1,89,739లకు చేరింది. దీంతో ప్రభుత్వం హైకోర్టును అశ్రయించి, సాదాబైనామాలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరింది. విచారణ అనంతరం సాదాబైనామాలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వగా, క్షేత్రస్థాయి పరిశీలన పేరిట తాత్సారం జరుగుతూ వచ్చింది. నిబంధనల సడలింపు, ఆర్డీఓల క్షేత్రస్థాయి పరిశీలన ఉత్తర్వుల నేపథ్యంలో రైతుల దరఖాస్తులను పరిశీలించి, అర్హత కలిగిన వాటిని పరిష్కరించనున్నారు. ‘అఫిడవిట్’నిబంధనలు సడలింపు.. ‘రెవెన్యూ’కు ఆదేశాలు ఫాస్ట్ట్రాక్లో పెండింగ్ ఫైళ్ల పరిష్కారం ఉమ్మడి వరంగల్లో 1.90 లక్షల దరఖాస్తులు 2020 నుంచి వెయిటింగ్.. ఆర్డీఓలకు కీలక అధికారాలు త్వరలోనే సాదాబైనామాలకు పరిష్కారం.. జిల్లా పెండింగ్ హనుమకొండ 27,057 వరంగల్ 26,630 ములుగు 20,150 జేఎస్ భూపాలపల్లి 51,347 జనగామ 33,305 మహబూబాబాద్ 31,250 మొత్తం 1,89,739 -
అప్రమత్తతతోనే ప్రాణాలకు భద్రత
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా లింగాలఘణపురం: ప్రయాణికుల అప్రమత్తతతోనే ప్రాణాలకు భద్రత ఉంటుందని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం రోడ్డు భద్రత వారోత్సవాల్లో మండలంలోని నెల్లుట్లలో సర్పంచ్ నర్సింగ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో డీసీపీ రాజమహేంద్రనాయక్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతీ ఒక్కరి బాధ్యతన్నారు. ద్విచక్ర వాహనదారులు మద్యం సేవించిడం, అతివేగం, అజాగ్రత్త, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపొద్దన్నారు. జీపీల్లో రోడ్డు భద్రత కమిటీలు జిల్లాలోని 280 గ్రామ పంచాయతీల్లో రోడ్డు భద్రత వారోత్సవాల్లో అరైవ్–అలైవ్ కార్యక్రమంలో రోడ్డు భద్రతపై గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లు డీసీపీ రాజమహేంద్రనాయక్ వివరించారు. ప్రజల ప్రాణ రక్షణే ధ్యేయంగా పని చేస్తున్న పోలీసుల సూచనలు ప్రతీ ఒక్కరు పాటించాలన్నారు. నవాబుపేటలో జరిగిన గ్రామసభలో డీసీపీ పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్లను అందించారు. ఈ కార్యక్రమాల్లో అడిషనల్ డీఆర్డీఓ నూరుద్ధీన్, సర్పంచ్ సదానందం, తహసీల్దార్ అండాలు, పంచాయితీ కార్యదర్శి శ్రీనివాసురెడ్డి, ఆయా గ్రామాల పాలక మండలి పాల్గొన్నారు. దేవరుప్పులలో.. దేవరుప్పుల: రోడ్డు భద్రత నియమాలు పాటించ డం ప్రతిఒక్కరి బాధ్యతని డీసీపీ రాజమహేందర్ నాయక్ అన్నారు. సోమవారం మండలంలోని సింగరాజుపల్లి గ్రామ పంచాయతీ వద్ద ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రత వారో త్సవాలు సర్పంచ్ కొండ ఊర్మిళమల్లారెడ్డి అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ ముఖ్యఅ తిథిగా హాజరై మాట్లాడారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించేలా విస్తృత అవగాహన క ల్పించాలన్నారు. ఎస్సై ఊర సృజన్కుమార్, హెచ్ఎం సుచిత్ర, ఉపసర్పంచ్ అనిల్, కార్యదర్శి వెంక న్న, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టిజన్ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
స్టేషన్ఘన్పూర్: విద్యుత్ ఆర్టిజన్, అన్మ్యాన్డ్, పీస్రేట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ డివిజన్ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట చేపడుతున్న సమ్మె సోమవారం ఆరవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి, విద్యుత్ సంస్థ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు బొజ్జపల్లి సుభాష్ పార్టీ నాయకులతో కలిసి సమ్మె శిబిరాన్ని సందర్శించారు. కార్మికులు ఆరురోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో జేఏసీ డివిజన్ చైర్మన్ పాశం రాజు, కన్వీనర్ వీరగోని లక్ష్మణ్, కోకన్వీనర్లు చెరిపెల్లి సురేష్, బదావత్ లక్ష్మణ్, నాయకులు రాంరెడ్డి, ఉబ్బని వెంకన్న, సురేష్, సరిత, డాన్ సురేష్, రమ్య, తదితరులు పాల్గొన్నారు. -
వినతులు స్వీకరించి..
మంగళవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026● ప్రజావాణిలో 258 అర్జీలు ● దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలి ● కలెక్టర్ సందీప్కుమార్ ఝాజనగామ రూరల్: ఇందిరమ్మ ఇల్లును తండ్రి పేరున మార్చాలని, నడవలేని స్థితిలో ఉన్న మూడుచక్రాల బండి ఇప్పించాలని, భూ సమస్యలు పరిష్కరించాలని..ఇలా పలు సమస్యలతో ప్రజలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్కుమార్ ఝా వారి వినతులు స్వీకరించి.. తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రీవెన్స్లో మొత్తం 258 వినతులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రజావాణి దరఖాస్తు పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, ఆర్డీఓ గోపీరాం, వెంకన్న, డీడబ్ల్యూఓ కోదండ రాములు, డీఏఓ అంబికా సోనీ, వివిధ శాఖల సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. పక్షవాతం బాధితుడికి తక్షణమే సాయం లింగాలఘణపురం మండలం జీడికల్ గ్రామానికి చెందిన మాధవి తన భర్తకు హార్ట్ స్ట్రోక్ కారణంగా పక్షవాతం రాగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుని మెరుగైన వైద్యం అందించి తమను ఆదుకోవాలని విన్నవించారు. దీంతో తక్షణమే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి మందులు ఇప్పించారు. దీంతో బాధితులు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. దరఖాస్తులు కొన్ని ఇలా ● సహారా ఇండియా సంస్థపై ఎంక్వయిరీ చేసి ప్రజలు కట్టిన డబ్బులు ఇప్పించాలని ఓబుల్ కేశవాపూర్కు చెందిన బడికే కిష్టయ్య కలెక్టర్ను కోరారు. ● అంబేడ్కర్ భవన నిర్మాణానికి పట్టణంలో ఎకరం స్థలం కేటాయించాలని సాధిక్ ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది సాధిక్ అలీ విన్నవించారు. ● బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన నర్సింగ శైలజ, తమ ఇల్లు పూర్తిగా కూలిపోయిందని, ప్రస్తుతం అద్దెకు ఉంటున్నారని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ● తరిగొప్పుల మండలం బొత్తలపర్రె గ్రామానికి చెందిన భూక్య లక్ష్మీ, తనకు బొంతగట్టు నాగారం గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న 20 గుంటల భూమికి పట్టా పాస్బుక్కు ఇవ్వాలని కోరారు. ● దేవరుప్పుల మండలకేంద్రానికి చెందిన ఆకల యాదగిరి, తనకు 2022లో జరిగిన ప్రమాదంలో రెండు కాళ్లు పనిచేయడం లేవని, రేషన్ బియ్యం ఇప్పించాలని విన్నవించారు. ● జనగామ మండలం పెంబర్తి గ్రామానికి చెందిన చిన్నం మల్లయ్య (65)కు వృద్ధాప్య పింఛన్ అందించి ఆదుకోవాలని వినతిపత్రం అందించారు. -
హెల్త్ సెంటర్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి
చిల్పూరు మండలం కిష్టాజీగూడెం గ్రామంలో 2009లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇచ్చిన సర్వే నంబర్ 398, 399 భూ మిలో హెల్త్ సెంటర్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి. గ్రామ ప్రజల కోరిక మేరకు సర్పంచ్, వార్డు సభ్యుల అంగీకారం కూడా తెలిపారు. వెంటనే సంబంధి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. – కిష్టాజీగూడెం గ్రామస్తులుఇంటి పేరు మార్చాలి గ్రామంలో అద్దె ఇంటిలో ఉంటున్నామని ప్రభుత్వం తమకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేసింది. తన తల్లి పేరుతో ఇల్లు రాగా ఇటీవల తన తల్లి గానబోయిన లక్ష్మీ మృతి చెందింది. తల్లి పేరుమీద ఉన్న ఇందిరమ్మ ఇంటిని తన తండ్రి కిష్టయ్య పేరు మీదకు మార్చాలి. – గానబోయిన అనిత, అంకుషాపూర్ -
‘టెట్’ పరీక్షకు మరో 600 మంది టీచర్లు
జనగామ: తెలంగాణ టెట్ 2026కు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి సిలబస్లో ఎలాంటి మార్పులు లేకుండా గత విధానమే కొనసాగించనుంది. గణితం, సైన్స్ అభ్యర్థులకు మునుపటిలాగే ఒకే టెట్ పేపర్ ఉంటుంది. ఇన్ సర్వీస్ టీచర్లకు బీఎడ్, డీఎడ్తో సంబంధం లేకుండా ప్రస్తుతం ఎస్జీటీలు, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్లు టెట్ పేపర్–1కు అర్హులుగా నిర్ణయించారు. జిల్లాలో సుమారు 600 మంది ఇన్సర్వీస్ టీచర్లు ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. ఇప్పటికే పేపర్–1 ఉత్తీర్ణత సాధించిన వారు మళ్లీ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. అయితే నిరుద్యోగులు డీఎస్సీ వెయిటేజ్ కోసం ఎన్నిసార్లు అయినా టెట్ రాసుకునే అవకాశం ఉంది. అర్హతలు ఇలా ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో ఉన్న.. టెట్ లేని వారు పేపర్–2 తప్పనిసరిగా రాయాలి. ఎస్జీటీలు పేపర్–1 రాయాల్సి ఉండగా, భవిష్యత్లో పదో న్నతుల కోసం బీఎడ్ ఉన్న వారు పేపర్–2 కూడా రాయవచ్చు. సబ్జెక్టు ఆధారంగా మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ అభ్యర్థులు సంబంధిత పేపర్–2, సోషల్ సబ్జెక్టుకు సంబంధించిన వారు సోషల్ పేపర్–2 రాయాల్సి ఉంటుంది. నిరుద్యోగుల విషయంలో పేపర్–1 రాయాలంటే తప్పనిసరిగా డీఎడ్ అర్హ త ఉండాలి. బీఎడ్ ఉన్న వారికి పేపర్–1 అవకాశం లేదు. ఆ అభ్యర్థులు పేపర్–2 మాత్రమే రాయాలి. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు ఈనెల 15 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 15 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించి, జూలై చివరి వారంలో ఫలితాలు వెల్లడించనున్నారు. జనరల్, బీసీ అభ్యర్థులకు ఒక పేపర్కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, ిపీహెచ్సీ అభ్యర్థులకు రాయితీగా ఒక్క పేపర్కు రూ.700, రెండు పేపర్ల కు రూ.950గా నిర్ణయించారు. అర్హత మార్కులు ఓసీ/ఈడబ్ల్యూఎస్కు 90 మార్కులు (60శాతం), బీసీలకు 75 మార్కులు(50శాతం), ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీలకు 60 మార్కులు (40శాతం) ఉన్నాయి. జిల్లాలో భారీ స్పందన జిల్లాలో టెట్కు భారీ స్పందన కనిపిస్తోంది. పేపర్–1 కోసం సుమారు 1,000 మంది డీఎడ్ నిరుద్యోగులు, పేపర్–2 కోసం సుమారు 8 వేల మంది అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. వీరిలో ఇప్పటికే 70 శాతం మంది టెట్ అర్హత సాధించి డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యంపై నిరుద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పది సార్లు టెట్ నిర్వహించగా, డీఎస్సీ మాత్రం రెండు సార్లే జరిగింది. జిల్లాలో 2010కు ముందు నియమితులైన 2,115 మంది ఉపాధ్యాయుల్లో ఇప్పటికే 1,000 మంది టెట్ పాస్ కాగా, మరో 500 మంది రిటైర్మెంట్కు దగ్గరలో ఉండటంతో మినహాయింపు పొందనున్నారు. ఇంకా 600 మంది టెట్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. దీంతో జిల్లాలో టెట్కు ప్రాధాన్యం మరింత పెరిగింది. నోటిఫికేషన్ విడుదల సిలబస్ యథాతథం నిరుద్యోగుల్లోనూ భారీ స్పందన పేపర్–1 కోసం 1,000, పేపర్–2కు 8వేల మంది అభ్యర్థులు సిద్ధం టెట్ షెడ్యూల్ ఇలా ఏప్రిల్ 15: ఇన్ఫర్మేషన్ బులిటిన్, డిటైల్ నోటిఫికేషన్ అందుబాటులోకి రానుంది. దరఖాస్తులు: ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు (https://schooledu.telangana.gov.in) ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లించవచ్చు. హెల్ప్డెస్క్: హెల్ప్డెస్క్ సేవలు ఏప్రిల్ 15 నుంచి ఫలితాల ప్రకటన వరకు అందుబాటులో ఉంటాయి. హాల్టికెట్లు: జూన్ 9వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలు: జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య నిర్వహిస్తారు. -
‘షైన్’ విద్యార్థుల ప్రభంజనం
కాజీపేట అర్బన్ : ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఎంపీసీ, బైపీసీల్లో మొదటి ర్యాంకు సాధించి షైన్ ప్రభంజనం సృష్టించిందని షైన్ విద్యా సంస్థల చైర్మన్ మూగుల కుమార్యాదవ్, డైరెక్టర్లు మూగుల రమ, అరూరి కవిత, ఐఐటీ కోఆర్డినేటర్ మూగుల రమేష్యాదవ్ తెలిపారు. ఆదివారం వెలువడిన ఇంటర్ ఫలితాలలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో బి. లిఖితారెడ్డి 468 ,ఎ.శైలజ 467, ఒ.అర్చన 467, డి.దీక్షనందిని 467, ఎం.అక్షిత 467, జె.కావ్య 467తో పాటు 8 మంది 466 మార్కులు , బైపీసీ విభాగంలో కె.వైష్ణవి 437, పి.ఆసిని 436,జి.హర్షిణి 433, ముగ్గురు విద్యార్థులు 431 మార్కులు సాధించారని తెలిపారు. సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగంలో ఎం.దీక్షిత 995,కె.నిశాంత్ 995,ఎం.తేజస్వి 994,పి.శ్రీ సౌమ్య 991, సీహెచ్ విజయ్కుమార్ 991, ఆర్.అక్షయ 990, బైపీసీ విభాగంలో కీర్తన 992, ఎండీ అఖిబ్అలీ 989, ఎండీ.సాదుద్దీన్ 987 మార్కులు సాధించగా 25 మంది బైపీసీలో 970 మార్కులు 20 మంది విద్యార్థులు, ఎంపీసీలో 460 పైగా మార్కులు 45 మంది విద్యార్థులు, 15 మందికిపైగా 430 మార్కులు సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో షైన్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ మారబోయిన రాజుగౌడ్, పి.శ్రీనివాస్, జి.ప్రశాంత్, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి దుర్మరణం
● అనుమానాస్పద మృతిగా కేసు నమోదుదేవరుప్పుల : హార్వెస్టర్ మరమ్మతులు చేసే క్రమంలో విద్యుదాఘాతంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. ఎస్సై ఊర సృజన్కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింత శ్రవణ్కుమార్, ఎనగందుల వినయ్, చింత పవన్.. దండు రాజు (28)ను ఉదయం 10 గంటలకు గ్రామ శివారులో వరి చేను కోసే పని ఉందని తీసుకెళ్లారు. మధ్యాహ్నం సమయంలో హార్వెస్టర్ మరమ్మతుకు గురవడంతో బేరింగ్ కట్ చేసేందుకు పక్కనే గల 11 కేవీ ఎల్టీ లైన్కు విద్యుత్ వైరు కలిపారు. ఈ క్రమంలోనే హార్వెస్టర్ పట్టుకుని ఉన్న రాజుకు విద్యుత్ షాక్ కొట్టిందని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే రాజును జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికి త్స పొందుతూ మృతి చెందారు. కాగా, తన భర్త మృతిపై అనుమానం ఉందనే భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. -
ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ‘ప్రెస్టెన్’ విద్యార్థులు
జనగామ రూరల్: ఇంటర్ ఫలితాల్లో పట్టణంలోని ప్రెస్టెన్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించి మరోసారి తమ ప్రతిభను నిరూపించుకున్నారని కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కె.ఎం. జయమని జాన్ తెలిపారు. ఎంపీహెచ్డబ్ల్యూ ఫస్టియర్, సెకండియర్ సీఈసీలో వందశాతం, ఎంపీసీ, బైపీసీలో 80 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఎంపీహెచ్ డబ్ల్యూ ఒకేషనల్లో 1,000 మార్కులకు దైవానీ 972, వి.దీపిక971, సహారా 971, ఫస్టియర్లో 500లకు కె.హిందు 443 మార్కులు సాధించారని తెలిపారు. అన్ని గ్రూపుల్లోనూ అద్భుతమైన ఫలితాలను సాధించి విద్యా ప్రమాణాల్లో ముందంజలో ప్రెస్టెన్ సంస్థ నిలిచిందన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ డాక్టర్ కె.ఎం.జయమని జాన్, పాల్ విగ్, క్యారలిన్ విగ్, ప్రిన్సిపల్ ఎజ్రా అభినందించారు. -
మహనీయుల ఆశయాలు సాధించాలి
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి నర్మెట: మహనీయుల ఆశయ సాధనలో యువత ముందుండాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, విశారదన్ మహారాజ్ అన్నారు. మండలంలోని కన్నెబోయిన గూడెంలో విగ్రహ స్థాపన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆదివారం రాత్రి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడారు. సర్పంచ్ రమేశ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గద్దల నర్సింగరావు, వెల్దండ సర్పంచ్ కంతి అంజనేయులు, విగ్రహదాత మాజీ సర్పంచ్ కంతి హేమలత రాజలింగం, ఎండీ గౌస్ పాల్గొన్నారు. -
రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కుట్ర
● అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే కడియం శ్రీహరిరఘునాథపల్లి: ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు ఎత్తివేయాలని, రాజ్యాంగాన్ని మొత్తంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. మండలంలోని భాంజీపేటలో అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత, క్రిస్టియన్లకు రిజర్వేషన్లు వర్తించవని ఇటీవల ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పునఃసమీక్షించుకోవాలని కోరారు. కుల వ్యవస్థ ఉన్నన్ని రోజులు రిజర్వేషన్లు ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, సర్పంచ్ గైని శ్రీనివాస్గౌడ్, గొరిగ రవి, గంగాధర రామేశ్వర్రావు, చాట్ల యాదగిరి, బైరపాక యాదగిరి, మోత్కూరి రామేశ్వర్, శాడ మల్లేష్, అంజనేయులు, చాట్ల మైసయ్య, అంతగల్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు. పేదల సొంతింటి కల సాకారం స్టేషన్ఘన్పూర్: రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో పేదలు సొంతింటి కలను సాకారం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని తానేదార్పల్లి గ్రామంలో నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను, రూ.35లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..మే 31లోగా నిర్మాణాలు పూర్తిచేసి గృహ ప్రవేశాలు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు బెలిదె వెంకన్న, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, సర్పంచ్ మంతెన హరితఇంద్రసేనారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు దుంపల పద్మారెడ్డి, మాచర్ల కుమారస్వామి, నాయకులు పాల్గొన్నారు. -
ఏబీవీ కళాశాల విజయవిహారం
జనగామ రూరల్: ఇంటర్ ఫలితాల్లో జనగామ పట్టణలోని ఏబీవీ జూనియర్ కళాశాల రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిందని ఆ కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపల్ కనకరాజు అన్నారు. ఆదివారం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో చిరుచునగండ్ల వర్షిత, సిరికొండ వెంకటేష్ 466/470 మార్కులతో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంక్ సాధించారన్నారు. దొంతుల హాసిని 465/470, దేవరబోయిన సాత్విక్, కావటి సిద్దు 464/470, బైరగోని మధురిమ, సందెనబోయిన సాహితీ, బాలింగల హర్షవర్ధన్ 463/470 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో బానోత్ తేజస్వి 436/440, మారపాక అఖిల 435/440, సీఈసీ విభాగంలో అయేషా సాధియా 481/500, ఒకేషనల్ విభాగంలో యాంగల్ల సిరి 461/500 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో మీసాల సాయి నిఖిల్ 991/1000, మోటికే మౌన్యశ్రీ 990/1000, బైపీసీ విభాగంలో బానోత్ ఆశ 984/1000, రాపాక అర్చన 982/1000 సీఈసీ విభాగంలో తూర్పాటి చరణ్ 965/1000, ఒకేషనల్ విభాగంలో భారతాల చంటి శ్రీశాంత్ 983/1000 మార్కులతో ప్రభంజనం సృష్టించారు. ఈసందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపల్ కనకరాజు, శ్రీనివాస్, అధ్యాపకుల బృందం అభినందించారు. -
ఇంటర్ సెకండియర్లో ‘ఎస్ఆర్’ విజయభేరి
విద్యారణ్యపురి: ఇంటర్మీ డియట్ సెకండియర్ పరీక్షల ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థులు విజయభేరి మోగించారని ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి తెలిపారు. ఎంపీసీ విభాగంలో కె. రోహిని 1000 మార్కులకుగాను 996మార్కులు, సీహెచ్ ఫ్లోరెన్స్రూథ్ 996మార్కులు, బీపీసీ విభాగంలో ఎన్. సాయికిరణ్ 995 మార్కులు, జోబియా ఫాతిమా 994మార్కులు, ఎంఈసీ విభాగంలో పి. వికాస్కుమార్శెట్టి 992 మార్కులు సాధించారని వారు తెలిపారు. భవిష్యత్లో మరింతగా అత్యుత్తమ మార్కులు సాధించేలా తీర్చిదిద్దుతామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీ ఏడాది రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారన్నారు. ఇంటర్లోనూ విశిష్టమైన మార్కులు సాధించారని, ఈ ఫలితాలు విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. -
‘శివాని’కళాశాల విశ్వరూపం
హసన్పర్తి: ఇంటర్ పరీక్ష ఫలితల్లో శివాని కళాశాల విద్యార్థులు విజయదుందుభి మోగించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో కళాశాల విద్యార్థి నేరెళ్ల రిషిత 995మార్కులు, లాకుంట్ల చక్రిక 994 మార్కులు, అలకుంట్ల నవ్య 994 మార్కులు, బక్క సంధ్య 994 మార్కులు, కనకం రంజిత్ 994 మార్కులు, సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో పి. సహస్ర శ్రీ 995 మార్కులు, జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో మేకల శ్రావ్య 468 మార్కులు, బీణవేణి అఖిలేష్యాదవ్ 467 మార్కులు, పాక రక్షిత 466 మార్కులు, కేసరి రితిక 466 మార్కులు సాధించారని శివాని విద్యాసంస్థల కరస్పాండెంట్ తాళ్లపల్లి స్వామి తెలిపారు. జూనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో తాళ్లపల్లి వర్షిత 437 మార్కులు, బుద్దె వైష్ణవి 436 మార్కులు, మాలోత్ గాయత్రి 436 మార్కులు, సీఈసీ విభాగంలో జి. అజయ్ 485 మార్కులు సాధించారని తాళ్లపల్లి స్వామి తెలిపారు. ఈసందర్భగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ స్వామి, ప్రిన్సిపాళ్లు జి. సురేందర్రెడ్డి, చంద్రమోహన్, డైరెక్టర్లు టి.రాజు, ఎన్. రమేశ్, ఎ. మురళీధర్, వి. సురేశ్, ఎస్. సంతోష్రెడ్డి అభినందించారు. -
భర్త ఇంటి ఎదుట భార్య బైఠాయింపు
● న్యాయం చేయాలని డిమాండ్ బచ్చన్నపేట : భర్త తనను వద్దంటున్నాడని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ భార్య.. భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. ఈ ఘటన ఆదివారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం జాల గ్రామానికి చెందిన కాకల్ల వెంకటమ్మ, కనకయ్య దంపతుల కుమార్తె సౌమ్యకు మండలంలోని నాగిరెడ్డిపల్లికి చెందిన కన్నె మల్లమ్మ, యాదయ్య దంపతుల రెండో కుమారుడు శివతో 2021లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 2.50 లక్షల నగదు, ఆరు తులాల బంగారం కట్నకానుకలుగా అందజేశారు. వివాహం జరిగిన మొదటి ఏడాది వీరి సంసారం సాఫీగానే సాగింది. అయితే నాలుగు సంవత్సరాలుగా భర్త శివ తనను ఇంటికి తీసుకువెళ్లకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని సౌమ్య ఆవేదన వ్యక్తం చేసింది. భర్త, బావ వైఖరితో విసిగిపోయిన బాధితురాలు, చివరకు న్యాయం కోసం భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. అధికారులు స్పందించి తనను తన భర్తతో కలిపి జీవించేలా న్యాయం చేయాలని కోరింది. కాగా, సౌమ్యకు జాల, నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు మద్దతు తెలిపారు. రామనరసింహారావుపై సస్పెన్షన్ వేటు కాజీపేట అర్బన్ : వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జాయింట్– 1 సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వర్తిస్తూ ఈనెల 2వ తేదీన ఏసీబీ విచారణ ఎదుర్కొన్న రామనరసింహారావును రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఐజీ శుక్రవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా శని,ఆదివారాలు సెలవు దినాలు కావడంతో సస్పెన్షన్ ఉత్తర్వుల విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాయింట్–2 ఆనంద్ను డీఐజీ సుభాషిణి ఈనెల 4వ తేదీన ఏసీబీ అధికారుల నివేదిక ఆధారంగా సస్పెండ్ చేయగా, వారం రోజుల తర్వాత ఐజీ జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ రామనరసింహారావును సస్పెండ్ చేశారు. -
ముగిసిన టెన్నిస్ టోర్నమెంట్
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ సుబేదారిలోని వరంగల్ క్లబ్లో నిర్వహించిన అంతర్ జిల్లాల ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ముగింపు వేడుకలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలను అందజేశారు. అండర్–35 విభాగంలో ఖమ్మం జిల్లా లాలా, స్వప్నిల్ జోడి అత్యంత ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. రన్నరప్గా కొత్తగూడెం జిల్లాకు చెందిన సతీష్, కృష్ణారావు జోడీ నిలిచింది. 35 ప్లస్ విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సతీష్, కబీర్ జోడి విజేతగా నిలిచి ట్రోఫీని అందుకోగా, ఖమ్మం జిల్లా జోడీ హర్ష, వెంకటేశ్వర్లు రన్నరప్గాగా నిలిచారు. -
బాలికలదే హవా
జనగామ రూరల్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికల హవా సాగించారు. ఆదివారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో బాలికలు పైచేయిగా నిలిచారు. గతంలో మాదిరిగా అన్ని కేటగిరిల్లో బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది. ఫస్టియర్ జనరల్ విభాగంలో బాలురు 1,346 మందికి గాను 670 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 1,849 మందికి గాను 1,236 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 3,195 మందికి గాను 1,906 మంది ఉత్తీర్ణత సాధించి 59.66 శాతంగా ఉంది. ఫస్టియర్ ఒకేషనల్లో మొత్తం 1,016 మందికి గాను 529 మంది ఉత్తీర్ణత సాధించి 52.07 శాతంగా ఉంది. సెకండియర్లో బాలురు 1,254 మందికి గాను 755 మంది ఉత్తీర్ణత సాధించి 60.21 శాతంగా ఉంది. బాలికలు 1,773 మందికి గాను 1,432 మంది ఉత్తీర్ణత సాధించగా 72.25 శాతంగా ఉన్నారు. ఒకేషనల్లో మొత్తం 916 మంది విద్యార్థులకు 589 మంది ఉత్తీర్ణత సాధించి 63.97 శాతంగా ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా ఫస్టియర్లో 22వ స్థానం, సెకండియర్లో 18వ స్థానంలో నిలిచింది. కాగా గత మూడేళ్ల నుంచి వరుసగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో టాపర్గా నిలిచింది. సత్తా చాటిన కేజిబీవీలు ఇంటర్ ఫలితాల్లో మరోసారి కేజీబీవీ విద్యార్థులు సత్తా చాటారు. జిల్లాలో మొత్తం 12 కేజీబీవీలు ఉండగా ఫస్టియర్లో 550 మందికి 408 మంది ఉత్తీర్ణత సాధించి, 74 శాతం నమోదైంది. సెకండియర్లో 314 మందికి 277 మంది ఉత్తీర్ణత సాధించి, 88.22 శాతంగా ఉంది. ఫస్టియర్లో కొడకండ్ల, తరిగొప్పుల వంద శాతం ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్లో పాలకుర్తి కేజీబీవీ వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. ఎంజేపీల్లో.. ఇంటర్ ఫలితాల్లో ఎంజేపీ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. జిల్లాలో నాలుగు కళాశాలలు ఉండగా ఫస్టియర్లో 78.5 శాతం, సెకండియర్లో 85.5శాతం ఉత్తీర్ణత సాధించారు. మైనార్టీల కళాశాలల్లో.. జిల్లాలో రెండు మైనార్టీ గురుకుల కళాశాలు ఉన్నాయి. జనగామ బాలురు మైనార్టీ విద్యార్థులు ఫస్టియర్లో 76 శాతం, సెకండియర్లో 87.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. సోషల్ వెల్ఫేర్లో.. సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. జిల్లాలో మొత్తం 5 కళాశాలలు ఉండగా ఇందులో ఫస్టియర్లో 243 మంది విద్యార్థులకు 150మంది ఉత్తీర్ణత సాధించి 61.70 శాతం ఉండగా, సెకండ్ ఇయర్లో 255 మందికి గాను 203 మంది ఉత్తీర్ణత సాధించి 80 శాతం ఉన్నారు. జూనియర్ కళాశాలల్లో జిల్లా వ్యాప్తంగా 7 జూనియర్ కళాశాలలు ఉండగా మొత్తం 868 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 454 మంది ఉత్తీర్ణత సాధించి 52.30 శాతంగా ఉంది. ఇందులో జనరల్లో 566 మందికి 264 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్లో 302 మందికి 190 మంది ఉత్తీర్ణత సాధించి 62.91 శాతంగా ఉంది. ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటిన విద్యార్థినులు గతం కంటే పెరిగిన ఉత్తీర్ణతా శాతం ఫస్టియర్లో ఫలితాల్లో 59.66శాతం ఉత్తీర్ణత సెకండియర్లో 72.25శాతం ఉత్తీర్ణత మొత్తం ఉత్తీర్ణతా శాతం 68.11 రాష్ట్రస్థాయిలో ఫస్టియర్లో జిల్లాది 22వ స్థానం సెకండియర్లో 18వ స్థానంఇంటర్ ఫలితాలు (శాతంలో) 2022 77.93 2023 63.70 2024 62.44 2025 64.60 2026 68.11 -
ఇంటర్ ఫలితాల్లో ఇన్స్పైర్ స్టేట్ ఫస్ట్
హసన్పర్తి: ఎర్రగట్టు క్రాస్లోని ఇన్స్పైర్ జూనియర్ కళాశాల విద్యార్థిని తీగల శ్రేష్టిత ఎంపీసీలో 997 మార్కులతో రాష్ట్రస్థాయి ఫస్ట్ ర్యాంకు సాధించినట్లు చైర్మన్ తీగల భరత్గౌడ్ తెలిపారు.అలాగే, సాయిప్రియ 987 మార్కులు సాధించినట్లు చెప్పారు. ఎంపీసీ ఫస్టియర్లో పోతరవేని అమూల్య 467 మార్కులు, తంగళ్లపల్లి భవ్య 462 మార్కులు, బైపీసీ ఫస్టియర్లో అర్చన 427 మార్కులు, షన్మయి 426 మార్కులు సాధించారని వివరించారు. సీఈసీ ఫస్టియర్లో కస్తూరి వైశాలి 483 మార్కులు, శ్రీజ 483 మార్కులు సాధించారని చెప్పారు. శిక్షణ విధానాలు, వ్యక్తిగత మార్గదర్శకత్వం, విద్యార్థినుల అంకితభావంతో అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు భరత్గౌడ్ వివరించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల ప్రధాన రహదారిపై బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. స్వీట్లు పంపిణీ చేశారు. విద్యార్థులను కళాశాల యాజమాన్య వర్గసభ్యులు సుంకరి శ్రీరాంరెడ్డి, తీగల రాజ్కుమార్, కోటి చింతల మమత, లాడే శివ అభినందించారు. కాగా, సివిల్ సర్వీస్ సాధించి ప్రజలకు సేవచేయడమే తన లక్ష్యమని స్టేట్ఫస్ట్ ర్యాంకు విద్యార్థిని తీగల శ్రేష్టిత తెలిపింది. -
ఇంటర్సిటీ రైలు బోగీలో పొగలు
● భయాందోళనకు గురైన ప్రయాణికులు ● స్టేషన్ఘన్పూర్ సమీపంలో ఘటనస్టేషన్ఘన్పూర్: గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలుబోగీలో ఆదివారం రాత్రి పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు నుంచి వస్తున్న ఇంటర్సిటీ రైలు స్టేషన్ఘన్పూర్ సమీపానికి చేరుకోగానే రైల్వేస్టేషన్ దాదాపు కిలోమీటరు దూరంలోని డీ–8 బోగీలో పొగలు వ్యాపించాయి. గమనించిన ప్రయాణికులు చైన్లాగి రైలును ఆపారు. దీంతో రైల్వేగార్డు విషయం గమనించి బ్రేక్లు జామ్కావడంతో పొగలు వ్యాపించాయని, ప్రమాదం లేదని తెలిపారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకుని ఎక్కడంతో రైలు బయలుదేరింది. కాగా, స్టేషన్ఘన్పూర్లో స్టాప్ ఉండడంతో అప్పటికే సమాచారం అందుకున్న స్థానిక ఫైర్ స్టేషన్ సిబ్బంది అగ్నిమాపక వాహనంతో అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో వారు తిరిగివెళ్లారు. ఏది ఏమైనా బ్రేక్ల జామ్తో రైలు బోగీలో పొగలు రావడంతో ఘన్పూర్లో మొత్తం 20 నిమిషాలను రైలును నిలపాల్సి వచ్చింది. బోగీ నుంచి పొగలు వ్యాపించడంతో రైల్వేస్టేషన్ వద్ద అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. -
ఫెన్సింగ్తో ఉజ్వల భవిష్యత్
ఫెన్సింగ్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. తల్లిదండ్రులు రొటీన్ క్రీడల్లో కాకుండా అత్యంత అరుదైన ఫెన్సింగ్లో శిక్షణ అందించేందుకు చొరవ చూపాలి. అంతంత మాత్రంగానే ఉన్న ఫెన్సింగ్ క్రీడాభివృద్ధికి, వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేయాలి. నేటి యువతలో ఫెన్సింగ్ నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంది, సదుపాయాలు లేకపోవడంతో వెనుకంజ వేస్తున్నారు. – దుబ్బ రాము, కార్యదర్శి, జిల్లా ఫెన్సింగ్ సంఘం గ్రామీణ యువతను ప్రోత్సహించేందుకు చర్యలు ఆదరణ కోల్పోతున్న ఫెన్సింగ్ క్రీడలో శిక్షణ ఇచ్చేందుకు గ్రామీణ యువతను ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించేందుకు కృషి చేస్తాం. అందుకు వేసవి సెలవుల్లో మండల కేంద్రాల్లో ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. – తాళ్లపెల్లి ప్రవీణ్గౌడ్, ఉపాధ్యక్షుడు, జిల్లా ఫెన్సింగ్ సంఘం -
ఫెన్సింగ్ క్రీడలో రాణిస్తున్న ఓరుగల్లు యువతులు
జాతీయస్థాయి పోటీల్లో తలపడుతున్న స్కావెస్లావరంగల్ స్పోర్ట్స్: రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి. వారి తెగువ, ఆయుధ విద్యను ఇప్పటికీ ఓరుగల్లు ఆడబిడ్డలు వారసత్వంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కత్తిసాము(ఫెన్సింగ్) క్రీడ ఉనికి పదిలంగానే ఉంది. ప్రపంచ ప్రఖ్యాత క్రీడల్లో ఫెన్సింగ్ మూడో స్థానంలో నిలుస్తోంది. అభివృద్ది చెందిన నగరాలు, దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ గేమ్లో రాణిస్తున్నారు ఉమ్మడి వరంగల్కు చెందిన ఆడబిడ్డలు. రాణి రుద్రమదేవీలా కత్తి దూస్తున్న ఆ ఇద్దరి నేపథ్యమే ఈ వారం ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. అంతర్జాతీయ వేదికపై ప్రదర్శన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటకు చెందిన గొర్రె శ్రీజ డిగ్రీ చదువుతూ మహారాష్ట్ర సాయ్ అకాడమీలో ఫెన్సింగ్లో శిక్షణ పొందుతోంది. 4వ తరగతిలో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో చేరిన శ్రీజ 9వ తరగతి వరకు అక్కడే చదువుతూ ఫెన్సింగ్లో శిక్షణ పొందింది. అనంతరం ఎన్ఐఎస్ పంజాబ్లో సీటు సాధించి కత్తి యుద్ధంలో ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇప్పటి వరకు 20కిపైగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో బల్గేరియా, ఇటలీలో జరిగిన చాంపియన్షిప్లో తనదైన ప్రతిభ చాటింది. ఎప్పటికై నా భారత్ తరఫున ఒలింపిక్స్లో పాల్గొని పతకం సాధించడమే తన లక్ష్యమని శ్రీజ చెబుతోంది. పది పోటీల్లో ప్రతిభ హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన కడార్ల స్కావెస్లా స్పోర్ట్స్ కోటాలో ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. పదో తరగతిలో ఫెన్సింగ్లో శిక్షణ ప్రారంభించిన స్కావెస్లా కేవలం ఐదేళ్లలో పదికి పైగా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. మరింత మెరుగైన శిక్షణ అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి వరంగల్ జిల్లాకు పేరు తీసుకొస్తానని స్కావెస్లా చెబుతోంది. ● జాతీయ స్థాయిలో పతకాలు ● ప్రోత్సహిస్తే ఒలింపిక్స్లో రాణించే అవకాశం -
ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు
జనగామ: మండలంలోని ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే విషయంలో సర్పంచ్, ఉ ప సర్పంచ్లు పూర్తి సహకారం అందించాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. శనివారం రాత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్న్, సీఐ సత్యనారాయణరెడ్డితో కలిసి మండలంలోని సర్పంచ్, ఉప సర్పంచ్లతో సమావేశం ని ర్వహించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఊరికి భద్రతగా నిలుస్తాయన్నారు. నేరా ల నియంత్రణకు ఉపయోగపడుతాయన్నారు. త్వ రలోనే గ్రామాల్లో సీసీటీవీ వ్యవస్థను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చోరీల నియంత్రణజఫర్గఢ్ : ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే దొంగతనాలను నియంత్రించవచ్చని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య సూచించారు. స్థానిక పోలీస్స్టేషన్లో సర్పంచ్లతో సీసీ కెమెరాల ఏర్పాటుపై సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఎస్సై రామారావుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. సర్పంచ్,ఉప సర్పంచ్లతో డీసీపీ సమావేశం -
పచ్చడి పిరమాయే!
జనగామ: పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతల ప్రభావం దేశీయ మార్కెట్లపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా వంటనూనెల ధరలు విపరీతంగా పెరగడంతో పాటు పచ్చడి తయారీలో ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు మామిడి పచ్చడి తయారీ 50శాతం అదనపు భారంగా మారిపోయింది. ధరలు ఇలా.. ఇటీవల కాలంలో కారంపొడి ధరలు గణనీయంగా పెరిగాయి. గతంలో కిలో రూ.680 వరకు లభించిన కారంపొడి ప్రస్తుతం రూ.780కి పైగా చేరింది. అదే సమయంలో వెల్లుల్లి ధరలు కూడా కిలో రూ.100 నుంచి రూ.170 వరకు భారీగా పెరగడంతో పచ్చడి తయారీ ఖర్చు మరింత పెరిగింది. వంటనూనెల ధరల పెరుగుదల ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. నెల రోజుల క్రితం లీటరు నూనె ధర రూ.130 ఉండగా, అది రూ.155కు చేరి ప్రస్తుతం రూ.150 వద్ద నిలిచింది. ఐదు లీటర్ల నూనె ధర గతంలో రూ.700 ఉండగా, రూ.750కు పెరిగి ప్రస్తుతం రూ.920లకు రిటేయిల్ మార్కెట్లో అమ్ముతున్నారు. అలాగే 15 లీటర్ల టిన్ ధర రూ.2,300 నుంచి రూ.2,450కు, ప్రస్తుతం రూ.2,670 వరకు పెరిగింది. తగ్గిన మామిడి దిగుబడి జిల్లాలో సుమారు 8 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నప్పటికీ, ఈ ఏడాది దిగుబడి తీవ్రంగా తగ్గింది. వాతావరణ మార్పులు, తక్కువ పంట ఉత్పత్తి కారణంగా మార్కెట్లో పచ్చడి కాయలకు తీవ్రమైన కొరత ఏర్పడింది. గతేడాది రూ.100కు 15 నుంచి 20 మామిడికాయలు లభించగా, ప్రస్తుతం అదే ధరకు కేవలం 5 కాయలే వస్తున్నాయి. చిన్న సైజు కాయలకు సైతం అధిక ధరలు పలుకుతుండగా, పెద్ద సైజు కాయలకు మరింత డిమాండ్ పెరిగింది. 2 కిలోలపై రూ.460 అదనపు భారం పచ్చడి మామిడికాయల ధరలు అమాంతం పెరగడంతో ఈ సీజన్లో మామిడి పచ్చడి తయారీ సాధారణ ప్రజలకు భారంగా మారుతోంది. ప్రస్తుతం 10 మామిడికాయలు (సుమారు 2 కిలోల ముక్కలు)తో పచ్చడి తయారీకి సుమారు రూ.460 ఖర్చవుతుండగా, తాజా ధరల పెరుగుదలతో అదనంగా రూ.90 వరకు భారం పడుతోంది. ఇదే లెక్కన 100 కాయలతో పచ్చడి చేసే వారికి మొత్తం ఖర్చు రూ.4,560కు చేరుకోగా, అదనపు భారం సుమారు రూ.1000 వరకూ పెరుగుతుంది. మామి డికాయల సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. మరోవైపు వంటనూనె, వెల్లుల్లి, కారం వంటి అవసరమైన పదార్థాల ధరలు కూడా పెరుగుతుండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. ఈ వారం రోజుల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ధరల పెరుగుదలతో ఒక్కో కుటుంబంపై పచ్చడి తయారీకి సుమారు 50 శాతం అదనపు భారం పడుతోంది. ఇంట్లో ఇతర వంటకాలు లేకపోయినా పచ్చడితో రేషన్ బియ్యం కలిపి భోజనం చేసే పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో సర్వసాధారణం. మార్కెట్లో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పచ్చడి తయారీకి అవసరమైన పదార్థాల ధరలు కూడా పెరగడం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో పచ్చడి వంటి సాధారణ ఆహార పదార్థాలు కూడా సామాన్యులకు అందని వాటిగా మారే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా పెరిగిన మామిడికాయలు, కారం, నూనె ధరలు తగ్గిన మామిడి దిగుబడి..రూ.వందకు ఐదు కాయలు వెల్లుల్లి, ఇతర సరుకుల ధరలు అదేతీరు 50శాతం అదనపు ఖర్చు పచ్చడి మెతుకులకు కష్టకాలమే అంటున్న సామాన్యులు -
ప్రజారోగ్య రక్షణలో ఫార్మసీలు కీలకం
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝాజనగామ: ప్రజల ఆరోగ్య రక్షణలో ఫార్మసీల బాధ్యత కీలకమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో చివరి రోజున డ్రగ్స్ కంట్రోల్ అండ్ రెగ్యులేటరీ డేను కలెక్టరేట్ సమావేశం హాల్లో శనివారం నిర్వహించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్లతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం ప్రతీ మెడికల్ షాప్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్, లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. మున్సిపల్ నిబంధనల విషయానికొస్తే, మెడికల్ షాపులు నివాస భవనాల్లో కాకుండా వాణిజ్య భవనాల్లోనే నడపాలని సూచించారు. ఔషధాల విక్రయంలో జాగ్రత్తలు పాటించాలని, ప్రిస్క్రిప్షన్ మందులు వైద్యుల చీటి లేకుండా ఇవ్వకూడదని, అదే విధంగా జిరాక్స్ కాపీలు, వాట్సాప్ ద్వారా వచ్చిన ప్రిస్క్రిప్షన్ల ఆధారంగా మందులు ఇవ్వరాదని, ఒరిజినల్ ప్రిస్క్రిప్షన్ మాత్రమే పరిగణించాలన్నారు. డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన ర్యాలీ డ్రగ్స్ మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో కలెక్టర్ పాల్గొని ప్రారంభించారు. నెహ్రూపార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. డ్రగ్స్ దుర్వినియోగంపై అప్రమత్తత అవసరమన్నారు. ఎక్కడైనా డ్రగ్స్ దుర్వినియోగం కనిపించినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1800 599 6969కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. అనంతరం ఫార్మసీ విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రశంస పత్రాలు అందించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. -
పూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధి
జనగామ: మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పూలేకు పుష్పాంజలి ఘటించి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు సమర్పించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఎన్ఎల్ నరసింహరావు, ఏబీసీడీఓ రవీందర్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సిద్దయ్యగౌడ్, హరీశ్, వీరస్వామి, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల బాలరాజు, యాదవ సంఘం జనరల్ సెక్రటరీ మేకల సమ్మ య్య, ఉపేందర్ యాదవ్, సేవాదళ్ టౌన్ ప్రెసిడెంట్ బిర్రు సత్యనారాయణ, విశ్వబ్రాహ్మణ సంఘం జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి, కురుమ సంఘం సెక్రటరీ మల్లేష్, రెడ్క్రాస్ అధ్యక్షుడు కన్నా పరశురాములు, విశ్వకర్మ సంఘం జిల్లా ప్రెసిడెంట్ రామేశ్వరాచారి పాల్గొన్నారు.నివాళులర్పిస్తున్న కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఏసీ, డీసీపీ మరిన్ని ఫొటోలు 9లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
● శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. థ్రెడ్డింగ్, హెయిర్ కట్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ – సెల్ఫ్ గ్రూమింగ్, ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈనెల 13వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 14 నుంచి మే 12వ తేదీ వరకు ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఉంటుంది. ● రిజిస్ట్రేషన్, శిక్షణ కోసం శ్రీ శైలీ బ్యూటీపార్లర్, ఓల్డ్ బస్డిపో దగ్గర, సర్క్యూట్ హౌస్ రోడ్డు, హనుమకొండలో సంప్రదించాలి. ● మరిన్ని వివరాల కోసం 95055 14424, 94901 55215 నంబర్లలో సంప్రదించవచ్చు. -
డీ–అడిక్షన్ సెంటర్లో కౌన్సెలింగ్ ఇవ్వాలి
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎంలోని డీ–అడిక్షన్ సెంటర్లో బాధితులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం డీ–అడిక్షన్ సెంటర్ను పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్, వరంగల్ కలెక్టర్ సత్యశారద, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సెంటర్లో బాధితులకు అందిస్తున్న వైద్యసేవలు, సౌకర్యాలు, పునరావాసంపై అధికారులతో సమీక్షించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ వ్యసనాల నుంచి బయటపడేందుకు, మానసిక దృఢత్వం కోసం కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని ఆయన సూచించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ ఎంజీంఎలోని డీ–అడిక్షన్ సెంటర్ సేవలను మరింత మెరుగుపరచాలన్నారు. బాధితులకు సమగ్ర సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, ఇటీవల నిర్వహించిన పలు పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి, హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి, సైకియాట్రిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ అశ్విన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్ల పంపిణీపాలకుర్తి టౌన్: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అంగన్వాడీ టీచర్ల పాత్ర కీలకమని, రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను ఆధునీకరించేదిశగా చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ఫోన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్మార్ట్ఫోన్ ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వివరాలను సమయానుకులంగా నమోదు చేయగడం, పోషణ ఆరోగ్య సంబంధిత సేవలను అందించడం సులభమవుతుందన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ కోదండరాములు, మార్కెట్ చైర్పర్సన్ మంజుల, సీడీపీఓ సత్యవతి, సూపర్వైజర్లు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి సేవిస్తున్న యువకుడి అరెస్ట్జనగామ రూరల్: మండలంలోని చీటకోడూరు రోడ్డులో గంజాయి సేవిస్తున్న యువకుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ సత్యనారాయణరెడ్డి శనివారం తెలిపారు. శుక్రవారం చీటకోడూర్ రోడ్డులో గంజాయి సేవిస్తున్నారని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎస్సై భరత్ సిబ్బందితో వెళ్లి అక్కడ చూడగా ఇద్దరు వ్యక్తులు గంజాయి సేవిస్తున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి ఆక్కడ నుంచి పారిపోయాడు. నిందితుల నుంచి 60 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని ఎస్సై నర్సయ్య కేసు రిజిస్టర్ చేసి, దర్యాఫ్తు ప్రారంభించి నిందితున్ని రిమాండ్ తరలించారు.బుచ్చిబాబు జీవితం సాహిత్యం పుస్తకావిష్కరణవిద్యారణ్యపురి: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ రచించిన బుచ్చిబాబు జీవితం–సాహిత్యం పుస్తకావిష్కరణ కార్యక్రమం శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగింది. విశ్వనాథ సాహిత్యపీఠం వ్యవస్థాపకుడు వెలిశాల కొండల్రావు ముఖ్యఅతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. రచయిత అంపశయ్య నవీన్, తెలుగుభాషా సాంస్కృతికశాఖ అధ్యక్షుడు ఏనుగు నర్సింహారెడ్డి, రచయితలు దర్శశయనం శ్రీనివాసచార్య, అశోక్కుమార్, నెల్లుట్ల రమాదేవి శశికిరణ్ పాల్గొన్నారు. -
ఆరోగ్యవంత సమాజ నిర్మాణమే లక్ష్యం
జనగామ రూరల్: ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జనగామ యూపీహెచ్ఎస్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనురాధ జాదవ్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పట్టణలోని మూడో వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఈసందర్భంగా కౌన్సిల ర్ జ్యోతి మాట్లాడుతూ..మహిళలకు, గర్భిణులకు ప్రత్యేక చికిత్స పరీక్షలు నిర్వహిస్తున్నారని, అలాగే చిన్నపిల్లలకు అన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కసాబ్, అనిల్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, మచ్చ ప్రవీణ్, రవీందర్, గుండు శశిరేఖ దాసరి సరిత, కవిత తదితరులు పాల్గొన్నారు. -
ఇంటింటి గణనకు సిద్ధం
● ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు కీలక బాధ్యతలు ● సెల్ఫ్ ఎన్యుమరేషన్కు ముఖ్యమైన నిబంధనలు జనగామ: జిల్లాలో ఇంటింటి గణన ప్రక్రియ సర్వేకు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 280 గ్రామపంచాయతీల పరిధిలో మే 11 నుంచి జూన్ 9 వరకు జనగణనలో భాగంగా ఇంటింటి గణన చేపట్టనున్నారు. ఇందుకోసం జిల్లా పరిపాలన మొత్తం అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని 10శాతం రిజర్వుతో కలుపుకొని 994 మంది ఎన్యుమరేటర్లను ఎంపిక చేశారు. అలాగే పర్యవేక్షణ కోసం 174 మంది సూపర్వైజర్లను నియమించారు. ప్రతి సూపర్వైజర్కు ఆరుగురు ఎన్యుమరేటర్లతో కూడిన యూనిట్ను ఏర్పాటు చేస్తారు. ఎన్యుమరేటర్లు ఒక్కొక్కరికీ సుమారు 300 ఇళ్ల (దాదాపు 800 జనాభా) గణన బాధ్యతను అప్పగిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అదనపు ఎన్యుమరేటర్లను నియమించేందుకు కూడా అధికార యంత్రాంగం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే ఏడాది అధికారిక జనగణన ప్రారంభం కానుండగా, ఈ ప్రాథమిక గణన పనులను జిల్లా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇంటింటి గణన నేపథ్యంలో ఈ నెల18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఎన్యుమరేటర్ల బాధ్యతలు ఇంటింటి గణనను కచ్చితంగా, పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు ఎన్యుమరేటర్లు అనుసరించాల్సిన పలు ముఖ్యమైన సూచనలు వెల్లడించారు. గణనకు ముందు ట్రైనింగ్లో పాల్గొని, యూజర్స్ మాన్యువల్ను అధ్యయనం చేయడం, అలాగే హెచ్ఎల్ఓ మొబైల్ యాప్పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ (హెచ్ఎల్బీ)లోని ప్రతి భవనం, ప్రతి కుటుంబం, ప్రతి గృహాన్ని సందర్శించి వివరాలు సేకరించాలి. నెంబర్ లేని భవనాలకు నెంబర్లు కేటాయించి, యాప్లో ఉన్న మ్యాప్ ద్వారా హెచ్ఎల్బీ లే అవుట్ మ్యాప్ సిద్ధం చేయాలి. హెచ్ఎల్ఓ యాప్ ద్వారా హౌస్ లిస్టింగ్ వివరాలు నమోదు చేసి, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీఈలు ధ్రువీకరించి, వివరాలను నిరంతరం సింక్ చేయాలి. కేటాయించిన ప్రాంతంలో పూర్తి కవరేజ్ చేయడంతో పాటు వివరాలను అప్లోడ్ చేసి, బ్లాక్ పూర్తయిందని సూపర్వైజర్కు తెలియజేయాలి. సూపర్వైజర్ల బాధ్యతలు ఎన్యుమరేటర్ల పనితీరును పర్యవేక్షిస్తూ, గణన ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేసేందుకు సూపర్ వైజర్లకు పలు బాధ్యతలు అప్పగించారు. భూ భాగంలో హెచ్ఎల్బీ సరిహద్దులు, గుర్తింపు సూచనలు పరిశీలించి అవసరమైన మార్పులను సంబంధిత అధికారికి తెలియజేయాలి. మొత్తం సూపర్ వైజర్ సర్కిల్ను కవర్ చేసేలా లేఅవుట్ మ్యాప్ సిద్ధం చేయాలి. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తూ, సూపర్వైజర్ యాప్ ద్వారా ఎన్యుమరేటర్ల నమోదు చేసిన డేటాను మానిటర్ చేయాలి. హెచ్ఎల్బీ విభజనలో ఎక్కడా గ్యాప్లు లేకుండా, పూర్తిగా కవరేజ్ అయ్యేలా పర్యవేక్షించాలి. పేపర్ మోడ్లో వచ్చిన డేటాను సమయానుసారం వెబ్ పోర్టల్లో నమోదు చేయాలి. సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఎలా 2027 జనగణనలో ప్రజలు ఆన్లైన్లో స్వతహాగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ గైడ్లైన్స్ జారీ చేశారు. కేంద్రం అధికారిక పోర్టల్ ద్వారా 16 భాషల్లో దీనిని అందుబాటులో ఉంచింది. సెల్ఫ్ ఎన్యుమరేషన్ ముఖ్యమైన నిబంధనలు అధికారిక se.census.gov.in పోర్టల్లో మొబైల్ నెంబర్, ఓటీపీ ద్వారా నమోదు చేసుకోవాలి. ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చే తేదీకి 15 రోజుల ముందుగా వివరాలు పూర్తి చేయాలి. కుటుంబ పెద్ద పేరు (మార్చడానికి వీలుండదు). అలాగే కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామా కచ్చితంగా నమోదు చేయా లి. ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నెంబర్ ఉపయోగించాలి. ఎస్ఈఐడీ వివరాలు సమర్పించిన తర్వాత వచ్చే సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐటీ (ఎస్ఈ ఐడీ)ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆన్లైన్లో వివరాలను నింపినప్పటికీ, ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఎస్ఈ ఐడీని చూపించి ఫామ్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఈ విధానం జనాభా లెక్కల ప్రక్రియను వేగవంతం, సులభతరం చేస్తుంది. ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చి సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు. -
నేడు మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి
జనగామ: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశం హాల్లో సామాజిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని నేడు(శనివారం) నిర్వహించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎన్ఎల్ నరసింహరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, వెనుకబడిన తరగతుల కుల సంఘం నాయకులు, ప్రతినిధులు, ఇతర కుల సంఘాల నాయకులు హాజరు కావాలని కోరారు. మార్క్ఫెడ్, ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేయాలిజనగామ రూరల్: జనగామ వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్, ఐకేపీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మొక్కజొన్న, ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. మార్కెట్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం కనకారెడ్డి మాట్లాడుతూ.. మార్క్ఫెడ్, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తుండడంతో రైతులకు మద్దతు ధర రావడం లేదన్నారు. ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సాంబరాజు యాదగిరి, ఇర్రి అహల్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చందు నాయక్, సుంచు విజేందర్ బూడిద గోపి, ఉపేందర్, బోడ నరేందర్, మహేందర్ తదితులు ఉన్నారు. అంతకుముందు మార్కెట్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శికి పలు డిమాండ్లతో వినతి పత్రం అందించారు. హెచ్పీవీ టీకాతో సర్వైకల్ క్యాన్సర్ నివారణ జనగామ: జిల్లాలో సర్వైకల్ క్యాన్సర్ నివారణలో భాగంగా హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోందని డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్ రావు తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డీఎల్సీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు.. జిల్లాకు ఇప్పటివరకు 625 మందికి టీకాలు వేసినట్లు తెలి పారు. ఈ కార్యక్రమం ద్వారా బాలికల్లో ఆరో గ్య అవగాహన పెంచడంతో పాటు భవిష్యత్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను నివారించడం లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో డీసీ హెచ్ఎస్ డాక్టర్ నరేంద్ర శర్మ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం, డీడబ్ల్యూఓ కోదండరాములు, విద్యా శాఖ ఏడీ సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. యోగాతో ఆరోగ్యం జనగామ: ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హోమియోపతి, ఆయుష్ దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం పట్టణంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో యోగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు యోగా సాధన చేయించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్రావు మాట్లాడుతూ.. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో యోగా సాధనను అలవాటు చేసుకోవాలని సూచించారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం, విద్యా శాఖ ఏడీ సత్యనారాయణ మూర్తి, ఆయుష్, ఇతర సంబంధిత వైద్యాధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. అదృశ్యమైన వ్యక్తి అప్పగింత రఘునాథపల్లి: మండల కేంద్రానికి చెందిన గుంటల ప్రభాస్ మతిస్థిమితం కోల్పోయి గత నెల 29న కనిపించకుండా పోయాడు. ఈ మేరకు అతడి తల్లి గుంటల పవిత్ర ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఛత్తీస్గఢ్లోని రెంజల్ పోలీస్స్టేషన్ పరిధి లో ప్రభాస్ను గుర్తించారు. 13 రోజుల లోపే అతన్ని సురక్షితంగా తీసుకొచ్చి తల్లికి అప్పగించినట్లు ఎస్సై నరేష్ శుక్రవారం తెలిపారు. కేసు విచారణలో చురుకుగా వ్యవహరించిన హెడ్కానిస్టేబుల్ పోతుల శ్రీనివాస్, కానిస్టేబుల్ రాజకుమార్ను అధికారులు అభినందించారు. -
సంక్షేమ పథకాలతో రైతేరాజు
● స్టేషన్ ఘన్ఫూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రఘునాథపల్లి: తెలంగాణలో రైతును రాజుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రెండేళ్ల కాలంలో దేవాదుల కాలువలకు మరమ్మతులు, పూడికతీత తీయించి ప్రతీ గ్రామానికి గోదావరి జలాలు రావడంతో నియోజకవర్గంలో పంటల దిగుబడి, పంట నాణ్యత పెరిగిందన్నారు. శుక్రవారం మండలంలోని కంచనపల్లిలో 25 లక్షల సీసీ రోడ్డు, నిర్మాణాలు పూర్తయిన నాలుగు ఇందిరమ్మ ఇళ్లు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.. నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు మండల కేంద్రంలోని రైతు వేదికలో 37 మందికి రూ.12 లక్షల 52 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, డీసీఓ కోదండరాములు, తహసీల్దార్ రాజేష్రెడ్డి, సొసైటీ ఇన్చార్జ్ వేణుగోపాల్, సీఈఓ ప్రశాంత్, సర్పంచ్ గొంగళ్ల అబ్రహం, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్చందర్రెడ్డి, నాయకులు లోనే రవి, రాపోలు రామ్మూర్తి, పర్ష సిద్దేష్, జయరాములు, విజయమేరి, హరినాథ్, రాజు, కోళ్ల రవి, రవి, రంగోజు ఈశ్వరయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. సెంటినరీ బాప్టిస్టు చర్చి వార్షికోత్సవంలో .. కంచనపల్లి సెంటినరీ బాప్టిస్టు చర్చి వార్షికోత్సంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కేఎం జాన్, జయమణి, దేవదానం, దైద ప్రభుదాసు, గడ్డం సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల భద్రతే ప్రభుత్వ ధ్యేయం
● ఈనెల 13 నుంచి 18 వరకు అరైవ్ అలైవ్ కార్యక్రమం ● సమీక్షలో కలెక్టర్ సందీప్కుమార్ ఝాజనగామ రూరల్: ప్రజల భద్రతే ప్రభుత్వ ధ్యేయమని, ప్రాణ రక్షణే ప్రథమ కర్తవ్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్–అలైవ్ కార్యక్రమం అమలుపై తన చాంబర్లో కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 13 నుంచి 18 వరకు చేపట్టనున్న అరైవ్–అలైవ్ కార్యక్రమాలను జిల్లాలో విస్తృత స్థాయిలో నిర్వహించాలన్నారు. 13న అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. పోలీస్, రవాణా, వైద్యారోగ్య, విద్యా, మిగతా అన్ని శాఖలు సమన్వయంతో గ్రామాలతో పాటు మున్సిపాలిటీల్లో ప్రజలను భాగస్వాములను చేస్తూ, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు, వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్ పోటీలను విద్యా శాఖ నిర్వహించాలని సూచించారు. సమీక్ష సమావేశంలో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, ఆర్డీఓ వెంకన్న, ఆయా శాఖల ఉన్నతాధికారులు శ్రీనివాస్, సత్యనారాయణ మూర్తి, అనిత, ఆర్టీఏ సభ్యులు అభిగౌడ్ సంబంధిత అధికారులు ఉన్నారు. ఎరువుల యాప్ను వినియోగించుకోవాలి.. వానాకాలం పంటల సాగు కోసం రైతులకు అందుబాటులో ఉన్న ఎరువుల బుకింగ్ యాప్ సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకునే దిశగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టబోతున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎరువుల బుకింగ్ యాప్లో రైతుల మొబైల్ నంబర్ మార్పుచేర్పుల కోసం గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రత్యేక షెడ్యూల్ రూపొందించాలన్నారు. జిల్లాలోని ప్రతీ గ్రామానికి నిర్ణీత తేదీలు కేటాయించబడిన ఈ షెడ్యూల్ ప్రకారం, ఆయా గ్రామాల్లో మొబైల్ నెంబర్ సవరణ కార్యక్రమం నిర్వహించాలన్నారు. అలాగే ప్రభుత్వ పథకాల వివరాలు సమయానుకూలంగా రైతులకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. -
‘అరైవ్–అలైవ్’తో ప్రతీ ప్రాణం కాపాడాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ● మూడు జిల్లాల అధికారులతో సమీక్షహన్మకొండ అర్బన్ : ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న ‘అరైవ్ అలైవ్’కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో విజయవంతం చేసి ప్రతీ ప్రాణం కాపాడే ప్రయత్నం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో సీపీ అధ్యక్షతన హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల అధికారులతో ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశంలో కార్యక్రమ అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు, రెవెన్యూ, రవాణా, ఆర్అండ్బీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్స్ను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా హసన్పర్తి ప్రాంతంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ జిల్లా, మున్సిపల్, గ్రామస్థాయిలో రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించేలా పర్యవేక్షణ పెంచాలన్నారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ బ్లాక్ స్పాట్స్పై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ నేషనల్ హైవేపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు అవసరమని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు, అదనపు కలెక్టర్లు, ఆర్అండ్బీ, రవాణా, రెవెన్యూ, విద్యుత్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
లింగనిర్ధారణ సూత్రధారులు ఎవరు?
జనగామ: చంపక్హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో శిశువు అపహరణ కేసులో అరైస్టెన మహిళపై విచారణలో లింగనిర్ధారణ పరీక్షలు వెలుగులోకి వచ్చాయి. ఆమె గర్భిణిగా ఉన్నప్పుడు లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకొందన్న అనుమానాలు పోలీసు విచారణలో వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది. లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధించి కఠిన శిక్షలు విధించే చట్టం అమలులో ఉన్నప్పటికీ, కొన్ని స్కానింగ్ సెంటర్లు ఇంకా ఈ దందాను కొనసాగిస్తున్నాయన్న అనుమానాలకు ఈ ఘటన బలం చేకూర్చింది. స్కానింగ్ తీసింది ఎక్కడ..? ఎంసీహెచ్లో శిశువు అపహరణ కేసులో అరైస్టెన మహిళను పోలీసులు 24 గంటలకంటే ఎక్కువగా కస్టడీలో ఉంచుకోలేకపోవడంతో, ఈ నెల 9న రిమాండ్ పంపిన సంగతి తెలిసిందే. అయితే లింగ నిర్ధారణకు సంబంధించి కీలక సమాచారం బయటపట్టేందుకు ఆమెను మరోసారి పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. మహిళ కస్టడీలోకి తిరిగి వస్తే, స్కానింగ్ ఎవరు చేశారు? ఎక్కడ చేశారు? అన్న వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని విచారణ అధికారులు భావిస్తున్నారు. జనగామలోనే పరీక్ష జరిగిందా లేదా మరెక్కడైనా లింగ నిర్ధారణ చేయించుకున్నారా అనే ప్రశ్నలకు కూడా సమాధానాలు దొరకొచ్చని అంచనా వేసుకుంటున్నారు. లింగ నిర్ధారణ మాఫియాలో ఎవరెవరున్నారు, సూత్రధారులు ఎవరు, కమీషన్ ఏజెంట్లు ఎలా పనిచేస్తున్నారు వంటి కీలక ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మహిళ మరోసారి పోలీస్ కస్టడీకి వస్తే ఈ దందా వెనుక ఉన్న నెట్వర్క్ బయటపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. లింగనిర్ధారణ చేస్తే కఠిన చర్యలు.. శిశువును అపహరించిన మహిళ గర్భిణి అయినప్పటికీ ఆరోగ్యశాఖ సూచించిన నమోదు చేయించుకోకుండా, ప్రైవేట్గా పరీక్షలు, చికిత్స పొందినట్టు తెలిసింది. లింగనిర్ధారణ, అబార్షన్ ఎవరు నిర్వహించారో పోలీసులు నిర్ధారించిన తర్వాత చర్యలు ఉంటాయని డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు తెలిపారు. స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. స్కానింగ్ తీసింది ఎక్కడ? బిడ్డను ఎత్తుకెళ్లిన ఘటనతో వెలుగులోకి చీకటి దందా పోలీసుల కస్టడీకి మహిళ వస్తే మరిన్ని విషయాలు బహిర్గతం -
పాడిపరిశ్రమకు ప్రభుత్వ ప్రోత్సాహం
● విజయ డెయిరీ పురోగతికి రూ.100 కోట్ల కేటాయింపు ● టీజీడీడీసీఎఫ్ రాష్ట్ర చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డిదేవరుప్పుల: పాడిపరిశ్రమను విస్మరిస్తే భవిష్యత్తు తరాలకు అనారోగ్యం తప్పదని తెలంగాణ పాడిపరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్(టీజీడీడీసీఎఫ్) గుత్తా అమిత్రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఎస్డీఎఫ్ నిధుల కింద రూ.8లక్షలతో నిర్మించిన పాల ఉత్పత్తిదారుల సంఘ భవనం(విజయ డెయిరీ)ను వారిద్దరు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి విజయ డెయిరీ జిల్లా చైర్మన్ కాసారపు ధర్మారెడ్డి అధ్యక్షత వహించారు. అమిత్ రెడ్డి, యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి పాడిపరిశ్రమ పురోగతి కోసం వంద కోట్ల నిధులను విజయ డెయిరీ ఫెడరేషన్కు కేటాయించడం శుభపరిణాణమన్నారు. త్వరలోనే పాడిపరిశ్రమను ప్రోత్సహించే దిశలో ఆసక్తి ఉన్న మహిళలకు రాయితీతో కూడిన పాడిగేదెల పథకం వర్తింపజేస్తామన్నారు. స్థానిక సర్పంచ్ కృష్ణమూర్తి గౌడ్తో పాటు డెయిరీ ప్రతినిధుల విజ్ఢప్తి మేరకు రెండు పాల ఉత్పత్తి భవనాలతోపాటు మండల సమాఖ్య భవన నిర్మాణ పనుల పూర్తి కోసం నిధులు కేటాయిస్తాననీ హామీ ఇచ్చారు. అనంతరం కామారెడ్డిగూడెం పాలశీతలీకరణ కేంద్రాన్ని అమిత్రెడ్డి బృందం సందర్శించి పాడిరైతులతో ముఖాముఖి నిర్వహించింది. విజయ డెయిరీ జనగామ డీడీ ఎన్ గోపాల్సింగ్, మేనేజర్ లక్ష్మీ, కామారెడ్డిగూడెం డెయిరీ చైర్మన్ గులాం రసూల్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పాండు, మండల అధ్యక్షుడు శ్రీరామ్, ఉప్పలయ్య, యాకస్వామి, గంగరాజు, పుల్లయ్య పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు
బచ్చన్నపేట: మండల కేంద్రంలోని అప్గ్రేడెడ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్సీ) ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు లభించిందని మండల వైద్యాధికారి డాక్టర్ సృజన తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో 14 రకాల జాతీయ ఆరోగ్య సేవా కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టామన్నారు. రిజిస్ట్రేషన్, డెలివరీ, ఇమ్యునైజేషన్, ఎన్సీడీ, సీడీ, టీబీ, ఫ్యామిలీ ప్లానింగ్, ఎమర్జెన్సీ హెల్త్కేర్ తదితర కార్యక్రమాలను సకాలంలో చేశామన్నారు. మలేరియా, డెంగ్యూ జ్వరాలు ప్రబలకుండా గ్రామాల్లో ముందస్తు శానిటేషన్ పనులను చేయించడానికి ఆయా గ్రామాల సర్పంచ్లను ప్రోత్సహించామన్నారు. రాష్ట్రంలోని అన్ని పీహెచ్సీ ఆసుపత్రుల కంటే మెరుగ్గా పనిచేసి వైద్యసేవలను అందించినందుకు గానూ ఆసుపత్రికి రాష్ట్ర స్థాయి ఉత్తమ సేవా పురస్కారం దక్కిందన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా మెమొంటో, సర్టిఫికెట్ను స్వీకరించినట్లు చెప్పారు. అవార్డు రావడానికి కృషి చేసిన డాక్టర్లు, వైద్య సిబ్బందిని ఆమె అభినందించారు. కార్యక్రమంలో వైద్యులు లక్ష్మిప్రసన్నకృష్ణ, సిద్దిసుదర్శన్రెడ్డి, స్టెల్లా, సీహెచ్ఓ జంగమ్మ, హెచ్సీ జాస్మిన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ సేవా పురస్కారం -
‘ఆసరా’ ఇంకెప్పుడు?
జనగామ రూరల్: ఆసరా కొత్త పింఛన్ల కోసం అర్హులైన దరఖాస్తుదారులు ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకున్న వారు వేలల్లో ఉన్నారు. ఆసరా పింఛన్ల కోసం నిత్యం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలో రాగానే ఆసరా పింఛన్లు పొందేందుకు అర్హత వయస్సు సడలించింది. 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. మీసేవా సెంటర్లలో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది. ప్రభుత్వ సూచనల మేరకు గ్రామాల్లో దరఖాస్తుదారులు వేలల్లో పెరిగారు. మొత్తం 15,974 మంది పింఛన్కు దరఖాస్తు పెట్టుకున్నారు. కొత్త పింఛన్ల మంజూరు కోసం ప్రతీ రోజు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం 99 రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు. ఈ సభల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను చదివి వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్త పింఛన్ల కోసం ఆయా గ్రామాల్లోని అర్హులైన వారు భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఒక్కో గ్రామానికి కనీసం యాభై నుంచి వంద వరకు పింఛన్ల దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. పెద్ద గ్రామ పంచాయతీల్లో ఏకంగా 100పైగా దరఖాస్తులు చేసుకున్నారని చెబుతున్నారు. అయితే కొత్త పింఛన్లు మంజూరు కాక చాలా సంవత్సరాలు గడుస్తోంది. చివరిసారిగా 2022 ఆగస్టు 31న పింఛన్లు మంజూరయ్యాయి. దాదాపు నాలుగు సంవత్సరాలుగా పింఛన్ల దరఖాస్తులకు మోక్షం కలగడం లేదు. దీంతో చాలా మంది అర్హులైన వారికి పింఛన్లు రావడం లేదు. దీనికితోడు 57 సంవత్సరాలు నిండిన వారు కూడా కొత్తగా ఈ పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఆన్లైన్లో దరఖాస్తుకు సంబంధించిన విధివిధానాలపై స్పష్టత రాకపోవడంతో ఆసరా పెన్షన్దారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, నరకయాతన పడుతూ నిత్యం కార్యాలయాల చుట్టు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. అధికార వర్గాలు కూడా దీనిపై కచ్చితమైన సమాచారం చెప్పకపోడంతో ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్ కోసం చేసిన దరఖాస్తులు గ్రామ కార్యదర్శికి ఇవ్వాలా? ఎంపీడీఓ కార్యాలయాల్లో సమర్పించాలా? అనేది తెలియకపోవడంతో మద్యలోనే ఆగిపోతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే వరకు వేచిచూడాల్సి వస్తోంది. గతంలో వచ్చిన దరఖాస్తులు 15వేలు ప్రగతి ప్రణాళికలో మరిన్ని దరఖాస్తులు ఒక్కో గ్రామంలో కనీసం 50కిపైగా అప్లికేషన్లు నాలుగేళ్లుగా నిలిచిపోయిన మంజూరు ఏళ్ల తరబడిగా నిరీక్షణవృద్ధులు : 30,031 వితంతువులు : 25,414 దివ్యాంగులు : 10,225 బీడీ కార్మికులు : 2,052 గీత కార్మికులు : 2,792 హెచ్ఐవీ : 730 ఫైలేరియా : 706 ఒంటరి మహిళ : 1,475 ఇతరులు : 1,568 మొత్తం పింఛన్ దారులు : 74,993 -
ఎంసీహెచ్లో భద్రతపై ఫోకస్
జనగామ: జనగామ మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్)లో శిశువుల భద్రత ఆందోళన కలిగిస్తుండగా, మరోసారి పునరావృతం కాకుండా నిఘాను కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రతిరోజూ వందలాది మంది ఓపీ, అడ్మిట్ పేషెంట్లతో పాటు పదుల సంఖ్యలో గర్భిణులు, బాలింతలు, శిశువులు సేవలు పొందే ఈ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయన్న ప్రశ్నకు ఈ సంఘటన సాక్ష్యంగా నిలిచింది. ఎస్ఎన్సీయూ వార్డులో కఠిన నిఘా ఎంసీహెచ్లోని ప్రత్యేక శిశు సంరక్షణ విభాగం ఎస్ఎన్సీయూలో నలుగురు స్టాఫ్ నర్సులు, ఒక డ్యూటీ డాక్టర్, ఒక హెడ్ నర్స్, మరో స్టాఫ్ నర్స్తో పాటు సెక్యూరిటీ గార్డు పర్యవేక్షణ ఉంటుంది. రోజుకు మూడు షిఫ్టుల్లో వీరు పర్యవేక్షణ చేస్తారు. అయితే ఈ వ్యవస్థలన్నింటి కళ్లుగప్పి ఈ నెల 8వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో ఓ మహిళ 8 రో జుల శిశువును ఎవరికీ అనుమానం కలగకుండా తీసుకెళ్లడం ఆశ్చర్యానికి గురి చేసింది. బిడ్డ కోసం ఎస్ఎన్సీయూకు చేరుకున్న తల్లి(బాలింత) కీర్తన బాక్స్లో తన బాబు కనిపించకుండా ఉండడాన్ని గమనించి వెంటనే అలర్ట్ సిబ్బందిని చేసింది. అప్పటివరకూ అక్కడ ఉన్న వైద్య సిబ్బంది, నర్సులు, సెక్యూరిటీ గార్డు ఎవరికీ శిశువు లేడన్న విషయం తెలియకపోవడం అత్యంత నిర్లక్ష్యంగా భావిస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది కొరత.. రాత్రిపూట కేవలం ముగ్గురు సెక్యూరిటీ గార్డులు మాత్రమే పనిచేస్తున్నట్లు డాక్టర్ మధుసూదన్రెడ్డి తెలిపారు. శిశువుల వార్డుల్లో కనీసం ఆరుగురు సిబ్బంది అవసరమని, అందులో ఒకరు మహిళా సెక్యూరిటీ తప్పనిసరి అని సూచించారు. సెక్యూరిటీ మరింత బలోపేతం శిశువు అపహరణ ప్రయత్నం తర్వాత అలర్ట్ ముగ్గురు సిస్టర్లు, సెక్యూరిటీ గార్డులకు మెమోలు సూపరింటెండెంట్, డీసీపీ విచారణఎంసీహెచ్లో ఇక ముందు నుంచి భద్రతను బలోపేతం చేస్తూ కొత్త నియమాలు అమలు చేయనున్నారు. శిశువు జన్మించిన వెంటనే వేసే ట్యాగ్తో పాటు తల్లికి కూడా ప్రత్యేక ట్యాగ్ వేయనున్నారు. ఈ రెండు ట్యాగులు ఒక్కటిగా ఉన్నట్లు నిర్ధారించిన తర్వాతనే శిశువును తల్లిదండ్రులకు లేదా బంధువులకు చూపే అవకాశం ఇస్తారు. అవుట్సైడ్ బంధువులు ఆసుపత్రికి వచ్చి బాలింతలను చూడడం గురించి కఠిన నియమాలు అమలు చేయనున్నారు. శిశువు అపహరణ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణరెడ్డితో కలిసి డీసీపీ రాజమహేహేంద్ర నాయక్ వేర్వేరుగా విచారణలు చేపట్టారు. అందులో ముగ్గురు సిస్టర్లు, ఒక సెక్యూరిటీ గార్డుపై నిర్లక్ష్యం ఉన్నట్లు స్పష్టత రావడంతో వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. పోలీసులు శిశువును ఎత్తుకెళ్లిన మహిళపై లోతైన విచారణ చేస్తున్నారు. ఆమె ఎందుకు ఇలాంటి చర్యకు పాల్పడింది, ముందుగా ప్లాన్ చేసి వచ్చిందా, ఎవరి సహకారం ఉంది అన్న దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎంసీహెచ్లో సీసీ కెమెరాల పనితీరు పూర్తిస్థాయిలో పని చేయడం లేదు. ఆస్పత్రిలోని ప్రధాన వార్డులను కవర్ చేస్తూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పనిచేయక పోవడంతో సాంకేతిక లోపాలు, కోతులు వైర్లను తెంపేయడం వంటి సమస్యలు తరచూ ఎదురవుతున్నాయి. కానీ దీనికి శాశ్వత పరిష్కారం తీసుకురావడంలో అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
తీరనున్న ఎక్స్రే కష్టాలు
● ఘన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏళ్ల తరబడి ఎక్స్రే సౌకర్యాలు లేకపోవడంతో పేరుకే పెద్దాసుపత్రిగా మారింది. వివిధ సమస్యలతో ఆసుపత్రికి వచ్చేవారు ఎక్స్రే కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించేవారు. ఇటీవల ఘన్పూర్ సీహెచ్సీని సందర్శించిన కలెక్టర్ ఆసుపత్రిలో ఎక్స్రే సేవలు అందించాలని ఆదేశించారు. గతంలో ఉన్న ఎక్స్రే మిషన్ మూలకుపడడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆసుపత్రిలో నూతన ఎక్స్రే మిషన్ను గురువారం ఏర్పాటు చేశారు. త్వరలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు సీహెచ్సీ వైద్యాధికారి సంధ్య తెలిపారు. -
రైతుల మేలుకే కొనుగోలు కేంద్రాలు
లింగాలఘణపురం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తగిన మౌలిక వసతులు కల్పించాలని, రైతుల మేలు కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం మండలంలోని కుందారంలో మొక్కజొన్న, నెల్లుట్లలో ధాన్యం, పటేల్గూడెంలో వాటర్ప్లాంట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.. మొక్కజొన్న రైతుల దళారుల చేతుల్లో మోసపోతున్నారని గుర్తించి అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు వివరించారు. పటేల్గూడెంలో ఎస్డీఎఫ్ నిధులు రూ.2 లక్షలతో చేపట్టిన వాటర్ప్లాంట్, నెల్లుట్లలో రూ.16లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డును ప్రారంభించారు. రూ.5లక్షల 8వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు కూకట్ల రాజు, పొన్నాల బుచ్చయ్య, నర్సింగ రామకృష్ణ, మార్కెట్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శివకుమార్, మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డి, నాయకులు నాగరాజు, బాలరాజు, ప్రవీణ్, తహసీల్దార్ అండాలు, ఏఓ మమత, మహిళ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
బాధ్యతల స్వీకరణ
జనగామ రూరల్: జెడ్పీ సీఈఓగా బి.రంగారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంతకుముందు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు. జనగామ డిప్యూటీ సీఈఓగా పనిచేసిన డి.సరిత ఫైనాన్స్ అడ్వైజరీ ఎస్ఆర్డీఎస్ కమిషనర్ హైదరాబాద్కు బదిలీ అయ్యారు. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సంజయ్కుమార్ ఉత్తర్వులు జారీ చేయగా రంగారావు బాధ్యతలు చేపట్టారు. కేయూ క్యాంపస్: రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డిని తెలంగాణ రాష్ట్ర కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్టు (టీజీసీపీజీఈటీ) కన్వీనర్ కె.రాజేందర్ గురువారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. టెస్ట్ నిర్వహణపై కొద్దిసేపు చర్చించారు. సీపీజీఈటీని పకడ్బందీగా నిర్వహించాలని బాలకిష్టారెడ్డి పలు సూచనలు చేసినట్లు తెలిసింది. కేయూలో సీపీజీఈటీ అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్వహించాక త్వరలోనే పీజీ కోర్సుల్లో ప్రవేశపరీక్షకు దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు రాజేందర్ గురువారం తెలిపారు. నేడు మెగా రక్తదాన శిబిరం జనగామ రూరల్: కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ నెల 10న(శుక్రవారం) మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జున్రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు అందించడం జరుగుతుందన్నారు. కావున జిల్లా అధికారులు, అన్ని శాఖల ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్లొద్దు పాలకుర్తిటౌన్: ఆన్లైన్, గేమింగ్, బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్లవద్దని సీఐ జానకీరాంరెడ్డి సూచించారు. బెట్టింగ్ యాప్లతో నష్టాలపై పోలీస్శాఖ ఆధ్వర్యంలో మండలంలోని దర్దెపల్లి గ్రామంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ కొన్ని ముఠాలు యువతను బెట్టింగ్ ఊబిలోకి దించుతున్నాయని, ఇరువర్గాల్లో ఎవరు ఓడినా, గెలిచినా ముఠాలకు కమీషన్ వచ్చిపడుతుందన్నారు. ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సై దూలం పవన్కుమార్, పోలీసులు, యువత పాల్గొన్నారు. నయీంనగర్: ప్రజల అభీష్టం మేరకు హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో విలీనం చేసి ఈ మహా నగరాన్ని రెండో అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దాలని పౌర సంఘాలు, మేధావులు, నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండ ప్రెస్క్లబ్లో పౌర సంఘాలు, మేధావులు, నాయకులు నిర్వహించిన సదస్సుకు విశ్రాంత ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అధ్యక్షత వహించారు. వక్తలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సాధిస్తే రాజధానితోపాటు ఉమ్మడి జిల్లాల కేంద్రాలు అభివృద్ధి చోదక కేంద్రాలుగా ఎదుగుతాయని ఆశించిన రాష్ట్ర ప్రజలకు తీవ్ర నిరాశే మిగిలిందన్నారు. హైదరాబాద్ మాదిరి అన్ని జిల్లాలతో కలిపి మూడు కోట్ల అరవై లక్షల ప్రజల అభివృద్ధి కావాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద నగరంగా ఎదుగుతున్న వరంగల్ నగరాన్ని ముక్కలు చేసి, పార్క్ల భూములు కబ్జా చేసి, వరంగల్ జైలు భూమిని తాకట్టు పెట్టి అభివృద్ధిని విచ్ఛిన్నం చేశారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా రెండు జిల్లాలను కలపడంలో, వరంగల్ మహానగర పునర్నిర్మాణం చేయడంలో తాత్సారం చేస్తోందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో ఫోరం ఫర్ బెటర్ వరంగల్ చైర్మన్ కె.సుధాకర్, మాజీ మేయర్ టి.రాజేశ్వర్ రావు, సీపీఎం నాయకుడు చుక్కయ్య, వెంకటరాజం, దాసరి కృష్ణారెడ్డి, ప్రొ.వి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను ఇబ్బందులు పెట్టొద్దు
జనగామ రూరల్/నర్మెట/నర్మెట(తరిగొప్పుల): రైతులను మిల్లర్లు ఇబ్బందులు పెట్టొద్దని, సజావుగా కొనుగోళ్లు చేపట్టాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం జనగామ మండలంలోని పెంబర్తి, వడ్లకొండ, ఎర్రగొల్లపహడ్, అడవీకేశావాపూర్, నర్మెట మండలం మచ్చుపహాడ్, వెల్దండ, తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి, సోలిపురం, అంకుషాపురం గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జనగామ మండలంలో జరిగిన ప్రారంభోత్సవాల్లో పెంబర్తి సర్పంచ్ రేఖ రాజు, ఎర్రగొల్లపహడ్ సర్పంచ్ చిర్ర సత్యనారాయణరెడ్డి, అడవీకేశావాపూర్ సర్పంచ్ భూరెడ్డి చైతన్య ప్రమోద్, ఏఎంసీ చైర్మన్ శివరాజ్, సీఈఓ భాస్కర్రెడ్డి, నర్మెటలో చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లనాగుల శ్వేత, సర్పంచ్లు లింగాల హైమ రమేశ్, కంతి అంజనేయులు, మౌడ్ మౌనిక లక్పతి, బానోతు శంకర్ నాయక్, బానోతు బాలాజీ, ఏఓ అక్కిరెడ్డి కర్ణాకర్, ఇన్చార్జ్ ఎంపీడీఓ ఆకుల వెంకట మల్లికార్జున్, ఏపీఎం ప్రమీల, ఏఈఓలు సుంకరి జగదీష్, భూక్య అనిత, గోనెల కన్నయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గద్దల నర్సింగరావు, మండల శాఖ అధ్యక్షుడు చింతకింది సురేశ్, ఉమ్మడి మండలాల కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, మాజీ అధ్యక్షుడు నీరటి సుధాకర్, ఎండీ గౌస్, తరిగొప్పుల మండలంలో సర్పంచ్లు మంచినీళ్ల రాజు, దండెం శ్రీనివాస్, బైకాని రమ బాలరాజు, కుర్రె మల్లయ్య, తహసీల్దార్ ఎండీ మొహసిన్ ముజ్తాబ, ఏపీఓ కొత్తపల్లి నాగేశ్వర్ రావు, చేర్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అర్జుల పోషిరెడ్డి, ధరావత్ లక్ష్మి, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్ రెడ్డి, అధికార ప్రతినిధి చిలువేరు లింగం తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పలు మండలాల్లో ధాన్యం కేంద్రాల ప్రారంభం -
అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ
జనగామ రూరల్: హెచ్ఐవీ, ఎయిడ్స్పై అవగాహనతోనే నివారణ సాధ్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య వారోత్సవాల్లో నాలుగో రోజు ఎయిడ్స్పై అవగాహన నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం రెడ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ రెడ్ రన్ వాకథాన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక బస్టాండ్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ఎయిడ్స్ నివారణపై తెలంగాణ సాంస్కృతిక కళాకారులచే కళాజాత ద్వారా పాటలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనగామ, స్టేషన్ ఘనపూర్లలో ఐసీటీసీ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు, వైద్యులు అశోక్, కమల్హాసన్, శ్రీతేజ, ఏఆర్టీ సెంటర్ వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కాగా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సబ్ జైలులో క్షయ, కంటి, ఎక్స్రే పరీక్షలను, జనరల్ మెడిసిన్, చర్మ సంబంధ సమస్యలపై 23 మంది ఖైదీలకు పరీక్షలు నిర్వహించారు. ధన్ధాన్య పథకాన్ని సమర్థంగా అమలుచేయాలి ప్రధానమంత్రి ధన్ధాన్య యోజన పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన పథకం అమలుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ, ఉద్యాన శాఖ అధికారి రవికాంత్, పశుసంవర్ధక శాఖ అధికారి మురళీధర్ రావు, మత్స్య శాఖ అధికారి రాణా ప్రతాప్, మార్కెటింగ్ శాఖ అధికారి రామకృష్ణ, సహకార శాఖ అధికారి కోదండరాములు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి వసంత, లీడ్ బ్యాంక్ మేనేజర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి అంగన్వాడీ సేవలను చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్లో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..అంగన్వాడీ కేంద్రాల కోసం ప్రభుత్వ భవనాల వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రైవేట్ భవనాల వినియోగాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని, వారంలోగా అందుకు సంబంధించిన అంచనాల నివేదికను సమర్పించాలని సూచించారు. అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, డీడబ్ల్యూఓ కోదండరాములు, మిషన్ శక్తి కో ఆర్డినేటర్ శారద, టీచర్లు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
కాశగూడెంలో ఉద్రిక్తత
స్టేషన్ఘన్పూర్: మండలంలోని పాంనూర్ గ్రామ శివారు కాశగూడెంలో సర్వేనంబర్ 194లో పలువురు అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లు, గుడిసెలను తొలగించేందుకు బుధవారం రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు తహసీల్దార్ స్వప్న ఆధ్వర్యంలో ఆర్ఐలు సతీష్, శ్రీకాంత్, ఎస్ఐ వినయ్కుమార్, పోలీసు సిబ్బందితో కాశగూడెం చేరుకుని అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన బాధితులు ఇమామ్బీ, ఎండీ షఫీర్, జైన్బీ, షేక్ లకూమ్, ఇమామ్బీ, ఖాసీమ్ తదితరులు అడ్డుకున్నారు. తాము బండ కొట్టుకుంటూ రాళ్లు అమ్ముకుని జీవనం సాగించే నిరుపేదలమని, చాలా ఏళ్లుగా ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నామన్నారు. హుటాహుటిన వచ్చి తమ ఇళ్లను, గుడిసెలను తొలగిస్తామంటే సహించేది లేదంటూ రెవెన్యూ, పోలీసు అధికారులతో వాగ్వాదం చేశారు. సాయంత్రం వరకు నచ్చజెప్పినా వినకపోవడంతో బలవంతంగా పొక్లెయినర్తో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నించగా ఇమామ్బీ అనే మహిళ పొక్లెయినర్కు అడ్డునిల్చుని తీవ్రంగా ప్రతిఘటించింది. ఒంటిపై పెట్రోల్ పోసుకున్న వ్యక్తి ప్రభుత్వ భూమిలో అక్రమంగా బాత్రూమ్ నిర్మాణం చేసుకున్నాడని దానిని కూల్చివేసేందుకు అధికారులు, పోలీసు సిబ్బంది యత్నించగా ఆ ఇంటి యజమాని అయిన షఫిర్ వారిని అడ్డుకున్నారు. తమ బాత్రూమ్ను ధ్వంసం చేయవద్దని, చేస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. కాగా పక్కనే ఉన్న వ్యక్తులు అతడి చేతిలో నుంచి సీసాను లాగేసి పక్కకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులకు, నిర్మాణాలు చేసుకున్న బాధితులకు వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్రమ నిర్మాణాలు వద్దుఽ: స్వప్న, తహసీల్దార్ ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తే సహించేది లేదు. ఇష్టారాజ్యంగా వందల గజాల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేసుకున్నారు. మూడు రోజులు గడువు ఇస్తున్నాం. ఆలోగా అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించాలి. లేని యెడల నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలను తొలగించేందుకు అధికారుల యత్నం అడ్డుకున్న బాధితులు.. అధికారులతో వాగ్వాదం స్వచ్ఛందంగా తొలగించుకునేందుకు మూడు రోజుల సమయం -
అంగన్వాడీలతోనే ఆరోగ్యవంత సమాజం
స్టేషన్ఘన్పూర్: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అంగన్వాడీ టీచర్ల పాత్ర కీలకమని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఘన్పూర్ నియోజకవర్గంలోని అంగన్వాడీ టీచర్లకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్మార్ట్ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్ణణ కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను ఆధునీకరించేదిశగా తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ..నియోజకవర్గంలో ఎలాంటి సదుపాయం లేని అంగన్వాడీ కేంద్రాలకు నెలరోజుల్లో సొంత భవనాలు మంజూరు చేయించి ఏడాదిలోపు నిర్మాణాలు పూర్తి చేయిస్తానన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, ఘన్పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, జనగామ, హన్మకొండ జిల్లాల డీడబ్ల్యూఓలు కోదండరాం, విశ్వజ, తహసీల్దార్ స్వప్న, ఎంపీడీఓ విజయశ్రీ, ఐసీడీఎస్ ఘన్పూర్ సీడీపీఓ సరస్వతి, సూపర్వైజర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎంపీ కడియం కావ్య అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్ల పంపిణీ -
డిజిటల్ వాడీలు
జనగామ: అంగన్వాడీ సేవల ఆధునికీకరణలో ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రీ–స్కూల్ విద్య, గర్భిణులు, శిశుపోషణ సేవలను మరింత సమర్థంగా అందించేందుకు అంగన్వాడీ టీచర్లకు సరికొత్త స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది. సేవల నాణ్యతను పెంచడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఈ డిజిటల్ సేవలకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్, కొడకండ్ల మూడు క్లస్టర్ల పరిధిలో 695 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, 666 మంది టీచర్లు పని చేస్తున్నారు. 2,156 గర్భిణులు, 1,666 బాలింతలు, ఆరు నెలల ను ంచి మూడేళ్ల లోపు చిన్నారులు 10,906, మూడేళ్ల నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలు 10,364 మంది ఉన్నారు. 692 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేశారు. సేవలన్నీ ఫోన్ ద్వారానే స్మార్ట్ఫోన్ అందుకున్న వెంటనే అంగన్వాడీ టీచర్లు రోజువారీ కార్యకలాపాలను యాప్ల ద్వారా నమోదు చేయడం ప్రారంభించారు. పిల్లల హాజరు, పోషకాహార పంపిణీ, గర్భిణుల ఆరోగ్య పరిశీలన వంటి సమాచారాన్ని ఇకపై క్షణాల్లోనే ప్రభుత్వం డేటాబేస్కు పంపిస్తారు. దీనివల్ల డేటా నమోదు లోపాలు తగ్గడంతో పాటు మరింత పారదర్శకత పెరుగుతుంది. విధుల్లో వేగం.. గతంలో రికార్డుల్లో రాయాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక ఫొటో, ఒక క్లిక్తోనే రిపోర్ట్ పంపగలిగే అవకాశం కలుగుతుంది. స్మార్ట్ ఫోన్తో పిల్లల అభ్యాసానికి సంబంధించిన చిన్న వీడియోలు, పాటలు, కథలు చూపుతూ బోధన పద్ధతి కూడా మరింత ఆకర్షణీయంగా మారనుంది. అంతేకాకుండా ఫీల్డ్ స్థాయి పరిశీలనను వేగవంతం చేయడంతో పాటు, తల్లులు, బిడ్డల ఆరోగ్య సూచనలు కూడా వాట్సప్ గ్రూపుల ద్వారా త్వరితగతిన చేరుతాయి. అత్యవసర సందర్భాల్లో అధికారులను సత్వరమే సంప్రదించే వెసులుబాటు కలుగుతుంది. డిజిటల్ పరికరాల ద్వారా అంగన్వాడీ వ్యవస్థను పారదర్శకంగా మార్చడమే ప్రభుత్వ అసలు ఉద్దేశం. గ్రామీణ శిశు పోషణ, ప్రాథమిక విద్య రంగాల్లో ఇది ఒక పెద్ద మార్పునకు నాందిగా భావిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ గర్భిణులు, శిశుపోషణ సేవల్లో వినూత్న అడుగు యాప్ ద్వారా రోజువారీ కార్యకలపాలు జిల్లాకు 692 ఫోన్లు అందజేత -
‘అంబేడ్కర్ జ్ఞానయాత్రకు తరలిరండి’
జనగామ రూరల్: ఈనెల 13న సాయంత్రం జిల్లా కేంద్రంలో నిర్వహించే అంబేడ్కర్ జ్ఞానయాత్రకు అంబేద్కర్ వాదులు, అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గద్దల కిషోర్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక విజయ ఫంక్షన్ హాల్లో బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..11న మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని, 12న పట్టణంలో భారీ బైక్ ర్యాలీ, 13న సాయంత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీఅంబేడ్కర్ జ్ఞానయాత్రశ్రీ, 14న అధికారికంగా అంబేడ్కర్ జయంతి ఉత్సవ సభ ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉడుగుల సాగర్, జేరిపోతుల పరశురాములు, రాగళ్ల ఉపేందర్, పార్నంది వెంకటస్వామి, కౌన్సిలర్ సువార్త, మల్లిగారి రాజు, కన్నారపు ఉపేందర్, కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
నిలిచిన మక్కల కొనుగోళ్లు
స్టేషన్ఘన్పూర్: డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రంలో బుధవారం మక్కల కొనుగోళ్లు నిలిపివేశారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున మక్కలు వస్తుండడం, తేమ ఫంగస్ పేరుతో మార్క్ఫెడ్ నిర్వాహకులు పలువురు రైతుల మక్కలను నిరాకరించడం, రైతులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు నిరసనలు, ఆందోళనలు చేస్తుండగా ఏమి చేయలేక సెంటర్ నిర్వాహకులు చేతులెత్తేశారు. మంగళవారం ప్రతిపక్షపార్టీల నాయకులు, రైతులు ధర్నాలు చేయడంతో నిబంధనల మేరకే కొనుగోళ్లు చేస్తామని, గొడవలతో ఇబ్బందులకు గురిచేస్తే ఏమి చేయలేమంటూ నిర్వాహకులు కొనుగోళ్లను బంద్చేశారు. దీంతో చేసేదేమి లేక సెంటర్కు మక్కలు తెచ్చిన పలువురు రైతులు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఆశ్రయించారు. తాము మక్కలు తెచ్చి నాలుగైదు రోజులైందని తేమ, ఫంగస్ అంటూ ఇబ్బందులు పెడుతున్నారని, ఈరోజు మొత్తమే కొనుగోళ్లు బంద్ చేశారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ వెంటనే మార్క్ఫెడ్ డీఎం రంజిత్రెడ్డికి ఫోన్ చేశారు. రైతుల పక్షపాతిగా ఘన్పూర్లో మార్క్ఫెడ్ సెంటర్ను ఏర్పాటు చేశామని, మక్కల కొనుగోళ్లు చేపట్టాలని, ఏమైనా సమస్యలుంటే పోలీసు బందోబస్తుతో కొనుగోలు చేయాలని ఆయన్ను ఆదేశించారు. రైతులు సంయమనం పాటించాలి రైతులు ఎవరో చెప్పిన మాటలు విని తొందరపడవద్దని, సంయమనం పాటించాలని ఎమ్మెల్యే కడియం సూచించారు. జిల్లా కేంద్రంలో సైతం సెంటర్ లేదని, సీఎంతో మాట్లాడి నియోజకవర్గ రైతుల కోసం ఇక్కడ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే ఒకటే సెంటర్ ఉండడంతో మక్కలు విపరీతంగా వస్తున్నాయని, దాంతో నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారన్నారు. దీంతో పాటు జఫర్గఢ్, ధర్మసాగర్, వేలేరు, కంచనపల్లి, కుందారం తదితర ప్రాంతాల్లోనూ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, రైతులు గమనించి సహకరించాలన్నారు. కాగా ఎమ్మెల్యే ఆదేశాలతో మధ్యాహ్నం తర్వాత సెంటర్లో కొనుగోళ్లు ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్రెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి మునిగెల రమేశ్, రైతులు అశోక్, ఎల్లయ్య, సోమయ్య, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియంను ఆశ్రయించిన రైతులు ఎమ్మెల్యే ఆదేశాలతో మార్క్ఫెడ్ సెంటర్లో కొనుగోళ్లు పునఃప్రారంభం -
తల్లుల ఆరోగ్యానికి ప్రభుత్వం కృషి
జనగామ: అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ అన్నారు. బుధవారం పట్టణంలోని సాయినగర్ అంగన్వాడీ కేంద్రంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తల్లుల ఆరోగ్యం, పౌష్టికాహారం గురించి వివరించారు. అనంతరం గర్భిణులు, మహిళలకు శ్రీమంతాలు, ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన చేశారు. కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ అనురాధ, ఐసీడీఎస్ సూపర్ వైజర్ బి.పూర్ణిమ పాల్గొన్నారు. మత్తుమందుల దుర్వినియోగంపై అవగాహనజనగామ: డ్రగ్స్ దుర్వినియోగంపై యువతలో అవగాహన పెంచడం లక్ష్యంగా, ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా డైరెక్టర్ జనరల్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ షేహనవాజ్ ఖాసీం, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో డ్రగ్స్ కంట్రోల్ అండ్ రెగ్యులేటరీ స్ట్రెంగ్తెనింగ్ డే నిర్వహించారు. బుధవారం జనగామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్, వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలల్లో జిల్లా ఔషధ తనిఖీ అధికారి ఏలే బాలకృష్ణ ఆధ్వర్యంలో డ్రగ్ అబ్యూస్ అండ్ మిస్యూస్ ఆఫ్ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ (అలవాటు, మత్తు కలిగించే మందుల దుర్వినియోగం, ప్రభావాలు, పరిణామాలు) అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి పోటీల్లో ఈ నెల 11న కలెక్టరేట్ సమావేశం హాల్లో నిర్వహించనున్న కార్యక్రమంలో కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని బాలకృష్ణ తెలిపారు. 15న వల్మిడి హుండీ లెక్కింపు పాలకుర్తి టౌన్: మండలంలోని వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఈనెల 15న బుధవారం ఉదయం 10 గంటలకు హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో దేవాలయంలో హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రేషన్ బియ్యం క్రయవిక్రయాలు జరపొద్దుదేవరుప్పుల: ప్రభుత్వం నిరుపేదలకు అందించే రేషన్ బియ్యం క్రయవిక్రయాలు ఎవరూ జరిపినా చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని డీటీసీఎస్ ఎన్ లచ్చునాయక్ హెచ్చరించారు. బుధవారం రాత్రి మండలంలోని ధారావత్తండాలో ధారావత్ రాజేశ్ అనే వ్యక్తి ఇదే తండాలో భూక్య రాములు ఇంట్లో పోలీసులతో కలిసి అక్రమంగా నిల్వచేసిన 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకొని స్థానిక డీలర్ కునుసోతు లక్ష్మికి అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ బియ్యం కార్డు లబ్ధిదారులు డీలర్ వద్ద తీసుకున్న బియ్యం అమ్మినట్టు నిర్ధారణయితే సదరు కార్డు రద్దు చేస్తామని హెచ్చరించారు. డీటీసీఎస్ ఇట్టబోయిన శ్రీనివాస్, ఎస్సై ఊర సృజన్కుమార్, పోలీసు సిబ్బంది యాకేష్, ప్రవీణ్ ఉన్నారు. స్వయం ఉపాధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలిజనగామ రూరల్: జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రివైజ్డ్ ఎస్సీ వార్షిక ప్రణాళిక 2025–26 గాను జిల్లాకు 260 యూనిట్లు కేటాయించినట్లు, సబ్సిడీ 361.82 లక్షలు లక్ష్యంగా షెడ్యూల్డ్ విడుదల చేశారని ఆయన పేర్కొన్నారు. అర్హత కలిగిన నిరుద్యోగులు అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. tgobmms.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆఖరి తేదీ ఈనెల 16వరకు పొడిగించినట్లు తెలిపారు. తుది ఎంపిక కలెక్టర్ అధ్యక్షతన నియమించబడిన జిల్లా కమిటీ ద్వారా ఇన్చార్జ్ మంత్రి ఆమోదంతో జరుగనుంది. -
తల్లి ఆరోగ్యంతోనే ప్రజారోగ్య పురోగతి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ: తల్లి ఆరోగ్యం ప్రజారోగ్య పురోగతికి అద్దం పడుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య వారోత్సవాల్లో మూడో రోజు బుధవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో సురక్షిత మాతృత్వ దినోత్సవ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. హైరిస్క్ గర్భిణులను ప్రారంభదశలోనే గుర్తించడం, సమయానికి నాణ్యమైన సేవలు అందించడంలో ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ సిబ్బంది కీలకపాత్ర పోషించాలన్నారు. జిల్లాలో సాధారణ ప్రసవాల శాతం పెంచేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జునరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ నరేందర్ శర్మ, జీజీహెచ్ఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం, డీడబ్ల్యూఓకోదండరాములు, ప్రోగ్రామింగ్ అధికారి డాక్టర్ శ్రీహర్ష, గైనకాలజిస్టులు సునీత, అపర్ణ, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలనజనగామ రూరల్: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నెలవారీ తనిఖీలో భాగంగా బుధవారం కలెక్టరేట్లోని ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, మంటల నియంత్రణ పద్ధతులను పర్యవేక్షించారు. పరిశీలనలో జనగామ ఆర్డీఓ గోపీరాం, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. -
పక్కాగా మస్టర్
ఉపాధి కూలీలకు ‘ఫొటో క్యాప్చరింగ్’ అటెండెన్స్ఫొటోతో హాజరు..● మరింత పారదర్శకత, భద్రతతో కూడిన నమోదు ● వేతన చెల్లింపుల్లో ఆలస్యానికి ఇక చెక్ ● జిల్లాలోని 1.14 లక్షల యాక్టివ్ కూలీలకు ప్రయోజనంజనగామ: ఉపాధి హామీ పథకం(వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవక మిషన్(గ్రామీణ్)– వీబీ జీ రామ్ జీ)లో కూలీల హాజరును మరింత పారదర్శకంగా, భద్రతతో కూడిన విధంగా నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం(ఎన్ఎంఎంఎస్) గత నెల 30 నుంచి జిల్లాలో పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. దీనికి ముందు 15 రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించి సాంకేతిక ఇబ్బందులను గుర్తించి పరిష్కరించారు. ఎన్ఎంఎంఎస్ అమల్లోకి రావడంతో కాగితపు మస్టర్ల ఆధారిత హాజరు పద్ధతికి స్వస్తి పలుకగా, మొబైల్ ఆధారిత ఫేస్ క్యాప్చరింగ్ విధానం తప్పనిసరి అయింది. ఉపాధి కూలీల హాజరు నమోదు, పరిశీలన, ఆమోద ప్రక్రియలో వేగం పెరగడంతో పాటు, వేతన చెల్లింపుల్లో ఆలస్యానికి చెక్ పెట్టనున్నారు. ఆధార్ ఆధారిత ఈ–కేవైసీతో అనుసంధానం కూలీల వ్యక్తిగత వివరాలు, జాబ్ కార్డు సమాచారం, హాజరు ఫొటోలు నేరుగా ఆధార్ ఆధారిత ఈ–కేవైసీతో అనుసంధానం చేయబడతాయి. ఫొటో తీసిన తర్వాత సమాచారం సర్వర్కు అప్లోడ్ అవుతుంది. దీని ద్వారా హాజరు నమోదులో తప్పిదాలు, ఇతరుల పేర్లపై నమోదు వంటి సమస్యలకు ఫుల్స్టాప్ పడనుంది. రోజుకు రెండుసార్లు కూలీల హాజరును రోజుకు రెండుసార్లు నమోదు చేయాలి. మొదటి ఫొటో పని ప్రదేశానికి చేరుకున్న వెంటనే, రెండో ఫొటో నాలుగు గంటల తర్వాత మాత్రమే క్యాప్చర్ అయ్యే విధంగా సాఫ్ట్వేర్ రూపొందించారు. ఈ రెండో ఫొటో తీసే సమయంలో నాలుగు గంటలు పూర్తి కాకపోతే యాప్ దానిని తీసుకోదు. దీని వల్ల కూలీ వాస్తవంగా పని ప్రదేశంలో ఉన్నాడా లేదా అన్నది నిర్ధారించడానికి ఉద్దేశించబడింది. అదేవిధంగా రెండో ఫొటోను గ్రూప్గా తీయవచ్చు. పది మంది కూలీలను ఒకే ఫొటోలో నిలబెట్టి తీసుకోవచ్చు. సాంకేతిక సమస్యలైతే.. ఫేస్ క్యాప్చరింగ్ సమయంలో యాప్ పనిచేయకపోవడం, నెట్ సిగ్నల్ సమస్యలు రావడం, కూలీ ముఖం గుర్తుపట్టకపోవడం వంటి సాంకేతిక ఇబ్బందులు వచ్చినప్పుడు ‘జెన్న్నరేగా’ యాప్ను ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. ఈ విధానం కారణంగా హాజరు శాతంలో చిన్నపాటి లోపాలను సైతం అధిగమించే అవకాశం ఉంటుంది. నెట్వర్క్ సమస్యలు అధిగమించేలా.. గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలు ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ముఖ్య సూచనలు జారీ చేశారు. సిగ్నల్ లేక ఫొటో అప్లోడ్ కాని సమయంలో ఇంటికి వెళ్లి లేదా సిగ్నల్ లభించే ప్రాంతంలో తర్వాత అప్లోడ్ చేసుకోవచ్చు. 50 మందికి పైగా కూలీలు ఉన్నచోట.. పని ప్రదేశంలో 50 మందికి పైగా కూలీలు ఉన్నచోట ఒక కూలీని ప్రత్యేకంగా ఫొటోలు తీసే బాధ్యత కోసం ఎంపిక చేసుకోవచ్చు. అతడికి ఆ రోజు వేతనం పూర్తిగా చెల్లిస్తారు. దీనివల్ల పని ఆగకుండా, ఒకరు ఫొటోలను తీసుకుంటూ, మిగతా కూలీలు పనిని కొనసాగించవచ్చు.జిల్లాలో ఉపాధి హామీ సమాచారం1.16లక్షల జాబ్ కార్డులుజిల్లాలో 1.16లక్షల జాబ్కార్డులు ఉండగా, ఇందులో 2.24 లక్షల మంది కూలీలు ఉన్నారు. వీరిలో 76,727 జాబ్ కార్డులు యాక్టివ్గా ఉండగా, 1.14లక్షల మంది కూలీలు యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఈ నెల 7న ఒక్కరోజే 6,511 కూలీలు పనికి హాజరయ్యారు. ఫేస్ క్యాప్చరింగ్ విధానం విజయవంతంగా అమలవుతోంది. జిల్లాలో రోజువారీ హాజరు 99 శాతానికి పైగా ఫేస్ క్యాప్చరింగ్ హాజరు నమోదవుతోంది. కొన్ని గ్రామాల్లో సిగ్నల్ సమస్యలు ఉన్నా, ప్రత్యామ్నాయ చర్యల వల్ల హాజరు నమోదు లోపాలు లేకుండా కొనసాగుతోంది. ఉపాధి కూలీల అసలు హాజరు, వాస్తవ పనిని నిర్ధారించే అత్యంత సమర్థవంతమైన పద్ధతిగా ఎన్ఎంఎంఎస్ నిలుస్తోంది. -
అ‘పూర్వ’ సమ్మేళనం
జనగామ: జిల్లాకేంద్రంలోని వైష్ణవి బ్యాంకెట్ హాల్ మంగళవారం చిరునవ్వులు, ఆనందోత్సవాలు, పా త జ్ఞాపకాలతో కళకళలాడింది. 1971–72 విద్యా సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం నిర్వహించుకుని, దాదాపు 55 ఏళ్ల అనంతరం ఒకే వేదికపై కలుసుకున్నారు. చిన్ననాటి మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. చా లాకాలం తర్వాత ఇలా అందరూ ఒకచోట కలవడ ంతో పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఇ లాంటి సమ్మేళనాలు ప్రతీ సంవత్సరం నిర్వహించుకోవాలని నిర్ణయించారు. ఆత్మీయ సమ్మేళనం వారికి పాత జ్ఞాపకాలను మాత్రమే కాదు.. తరతరా ల పాటు నిలిచే అనుబంధాన్ని పునరుద్ధరించింది. 55 సంవత్సరాల అనంతరం కలుసుకున్న పూర్వ విద్యార్థులు -
రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్/జఫర్గఢ్: రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు జరగాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం స్టేషన్ఘన్పూర్, జఫర్గఢ్ రైతువేదికలో కల్యాణలక్ష్మీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా సర్పంచ్లు లబ్ధిదారులను చైతన్యం చేయాలన్నారు. త్వరలో వరి కోతలు ప్రారంభం కానుండడంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సుమన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. మహనీయుల జయంతిని విజయవంతం చేయాలి జనగామ: రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గద్దల కిషోర్ కు మార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే యశస్విరెడ్డి, పాలకుర్తి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, పాలకుర్తి నియోజకవర్గం ఇన్చార్జ్ హనుమాన్ల ఝాన్సీరెడ్డిని కలిసి జయంతి ఉత్సవాలకు ఆహ్వానించా రు. అనంతనం జిల్లాకేంద్రంలో మాట్లాడుతూ ఏప్రిల్ 14న అంబేడ్కర్ 135వ జయంతి పురస్కరిచుకుని 13న జిల్లా కేంద్రంలో జ్ఞాన యా త్ర నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ బాధ్యులు బొట్ల శేఖర్, మేడ శ్రీనివాస్, పార్నంది వెంకటస్వామి, గిరిమల్లె రాజు, రాగళ్ల ఉపేందర్, జెరిపోతుల పరుశరాములు, జేరిపోతుల కుమార్, మల్లిగారి రాజు, తదితరులు పాల్గొన్నారు. పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యంజనగామ రూరల్: పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని, ప్రజలు ఆరోగ్య సూత్రాలు పాటించాలని జనగామ కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.శశి అన్నారు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ జనగామ కోర్టు ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయాలన్నారు. వైద్యారోగ్య శాఖ పరంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అనురాధ, రేవతి, ప్రైమరీ హెల్త్ సెంటర్ స్టాఫ్, ఆశవర్కర్లు, లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ ఎం.రవీంద్ర, పారా లీగల్ వలంటీర్స్ సుందరయ్య, అమృత తదితరులు పాల్గొన్నారు. రైతులకు న్యాయం చేయాలని ధర్నా స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన మార్క్ఫెడ్ సెంటర్లో మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ జిల్లా యువజన నాయకుడు కేశిరెడ్డి రాకేష్రెడ్డి డిమాండ్ చేశారు. ఘన్పూర్ మార్క్ఫెడ్ సెంటర్లో మొక్కజొన్న కొనుగోలులో తీవ్ర జాప్యంతో పాటు సెంటర్ నిర్వాహకులు, ట్రేడర్లు కుమ్మకై ్క జీరో దందా చేస్తున్నారని రైతులు చేస్తున్న ఆరోపణల మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం మార్క్ఫెడ్ సెంటర్ను సందర్శించారు. ముందుగా సెంటర్లో ఉన్న మొక్కజొన్న రైతులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సెంటర్ నిర్వాహకులతో మాట్లాడగా సరైన సమాధానం రా కపోవడంతో రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు మార్కెట్యార్డు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, మార్క్ఫెడ్ నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా బీఆర్ఎస్ నాయకులు, రైతులు ధర్నా చేస్తున్నారనే సమాచారం మేరకు మార్కెట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బూర్ల రాజేశ్వర్, చల్లా రమ్యరఘురెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
భానుడి భగభగ
ఇళ్లకే పరిమితమవుతున్న ప్రజలునిర్మానుష్యంగా వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి జనసంచారం లేక మంగళవారం మధ్యాహ్నం 1గంటకు నిర్మానుష్యంగా పాతబీటు బజారుజనగామ: జిల్లాలో వేసవి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. ఉదయం తొమ్మిది గంటలు దాటేసరికి ఎండలు మండిపోతుండగా, గడప దాటి బయటకు రావాలంటే వెనకడుగు వేస్తున్నారు. ఒంటిగంట దాటితే పట్టణాలు, గ్రామాలు నిర్మానుష్య ప్రాంతాలుగా మారిపోతున్నాయి. ప్రధాన కూడళ్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. డీ హైడ్రేషన్కు గురి కాకుండా.. తీవ్రమైన ఎండల కారణంగా ప్రజల్లో నీరసం, డీహైడ్రేషన్ సమస్యలు పెరుగుతుండడంతో దాహం తీర్చుకునే పదార్థాలపై డిమాండ్ విపరీతంగా పెరిగింది. కొబ్బరిబొండాలు, గ్లూకోజ్ నీళ్లు, పుచ్చకాయ, మజ్జిగ వంటి పానీయాలకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపధ్యంలో మట్టి రంజన్లకు గిరాకీ పెరుగుతుంది. పేదవాడి ఫ్రిడ్జిగా పిలిచే రంజన్లలో చల్లబడిన నీటితో దాహం తీర్చుకోవడమే కాకుండా, శరీరాన్ని చల్ల బరచడానికి సహకరిస్తుంది. ఫ్రిడ్జి వాటర్ కంటే రంజన్ వాటర్ ఆరోగ్యకరమని ప్రజలు భావిస్తూ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఏసీ, కూలర్లకు పెరుగుతున్న గిరాకీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇళ్లలోని టెంపరేచర్ కూడా భరించలేని స్థాయికి చేరుకుంది. దీంతో ఏసీలు, ఎయిర్ కూలర్లు, టేబుల్ ఫ్యాన్లు, సీలింగ్ ఫ్యాన్ల కొనుగోలు విపరీతంగా పెరిగిపోయింది. విద్యుత్ వినియోగం అకస్మాత్తుగా పెరగడంతో లోడ్ మోసే సామర్థ్యం దాటిపోకుండా పవర్ శాఖ అదనపు ఏర్పాట్లు చేస్తోంది. అత్యవసర పనుల కోసం బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు చెమటలు పట్టే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కొంతమంది ప్రయాణికులు మధ్యాహ్నం సమయాల్లో ప్రయాణాన్ని పూర్తిగా మానేశారు. అయితే, ఉద్యోగాలు, పనిమీద వెళ్లాల్సిన వారికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. పాఠశాలల్లో ఒంటిపూట బడికొనసాగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12.30 గంటలు దాటితే విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చే తల్లిదండ్రులు పిల్లలకు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి టోపీలు, కూలింగ్ కాపులు, నీటి సీసాలు తప్పనిసరి చేశారు. నిర్మానుష్యంగా జాతీయ రహదారులు వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి మధ్యాహ్న సమయంలో పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోతుంది. వందలాది వాహనాలు వెళ్లే రహదారి ఒంటిగంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ భరించలేక మానవరహితంగా కనిపిస్తుంది. అవసరం లేకుండా వాహనదారులు ఈ సమయాల్లో రోడ్లపైకి రావడం మానేశారు. రాబోయే రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వేసవి ఉక్కపోత జిల్లాలో జీవన విధానాన్ని పూర్తిగా అతలాకుతలం చేస్తుండగా, ప్రజలు ఎండను తట్టుకునే ప్రయత్నంలో రోజువారీ జీవితాన్ని జాగ్రత్తలతో కొనసాగిస్తున్నారు. రక్షణ చర్యలు పాటించాలి:వైద్యులు రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో బయటకు వెళ్లడం తగ్గించాలని, అత్యవసర సమయంలో తల, ముఖం, చేతులను కప్పుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తరచూ నీరు తాగడం, మజ్జిగ, దోసకాయ, నిమ్మరసం వంటి దాహం తీర్చే పదార్థాలను తీసుకోవాలని చెబుతున్నారు. ఉదయం 9 నుంచే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పేదోడి ఫ్రిడ్జి రంజన్లకు గిరాకీ ఏసీ, ఫ్యాన్లు, కూలర్లకు డిమాండ్ శీతల పానీయాలతో సేదదీరుతున్న జనం మధ్యాహ్నం నిర్మానుష్యంగా ప్రధాన కూడళ్లు -
వివాదాస్పదంగా జీపీ నిధుల డ్రా
దేవరుప్పుల: ప్రత్యేక పాలనలో అప్పులు తెచ్చి ఖర్చుచేసిన తరుణంలో ఇటీవల జీపీలకు నిధులు రావడంతో గ్రామ కార్యదర్శులు సదరు బిల్లులు ఎత్తుకునే క్రమంలో కడవెండి జీపీ నిధుల విడుదలలో లోపించిన తీరుపై వివాదాస్పదంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని కడవెండి జీపీకి ఇటీవల రెండు విడతల్లో రూ.20 లక్షలు విడుదలయ్యాయి. కడవెండి గ్రామ పంచాయతీ కార్యదర్శి పాండు ఆధ్వర్యంలో రెండేళ్లుగా నిర్వహణ ఖ ర్చులు, జీపీ జీతభత్యాలు కలిపి మార్చి 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మొత్తం రూ.12,04,414 డ్రా చేశారు. అయితే నిబంధనల మేరకు ఎంబీ రికార్డు చేసి సంబంధిత బిల్లులు అప్పులు ఇచ్చిన యజమానులకు చెల్లించాల్సి ఉండగా గ్రామంలోని కొందరి అకౌంట్లోకి జమచేయడంతో పలు ఆరోపణలు, అనుమానాలకు తావిచ్చింది. దీంతో గ్రామస్తులు జీపీ నిధుల గోల్మాల్ విషయమై పలు రకాలుగా పేర్కొంటూ పాత కార్యదర్శి రాత్రివేళల్లో వచ్చి రికార్డులు సవరణ చేస్తున్నారనే విషయమై సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయమై స్పందించిన సర్పంచ్ భాషిపాక రాములు మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించగా ప్రస్తుత కార్యదర్శి స్వప్న, ఉపసర్పంచ్ రేణుక, వార్డు సభ్యుల సమక్షంలో బదిలీపై వెళ్లిన పాత కార్యదర్శి పాండు హాజరై రెండు సంవత్సరాల పైచిలుకు గ్రామ ప్రజల మౌలిక వసతులు, పరిపాలన వ్యవహారాలకు ఖర్చు చేసిన వివరాలు వివరించారు. పంచాయతీ నిర్వహణకు అప్పులు ఇచ్చిన వారికి నేరుగా అకౌంట్లోకి వేశానని, తాను ఎలాంటి తప్పిదాలు చేయలేదని స్పష్టం చేశారు. కాగా గ్రామంలో ఎక్కడ అభివృద్ధి పనులు కనిపించకపోగా జీపీ సిబ్బంది జీతాలు పోను మిగతా ఖర్చులపై గ్రామస్తుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత మండల అధికారులు నిమ్మకు నీరెత్తడంతో కడవెండి నిధుల గోల్మాల్ పేరిట వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడం కొసమెరుపు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూడనున్నాయి. ‘కడవెండి’లో నిధుల గోల్మాల్పై సోషల్మీడియాలో వైరల్ -
‘బూత్ లెవెల్’ కసరత్తు!
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏ) నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్ర దేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతీ బూత్కు ప్రత్యేక ఏజెంట్లను ఎంపిక చేస్తూనే.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జ్లను నియమిస్తూ కేడర్ను యాక్టివ్ చేయడంపై దృష్టి సారించింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీ కేడర్ ప్రజల్లోకి వెళ్లేలా బూత్స్థాయి కమిటీలను ఆచితూచి నియమిస్తోంది. ఇందుకోసం.. ఇతర జిల్లాలకు చెందిన సీనియర్లను ఉమ్మడి వరంగల్లోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్చార్జ్లుగా నియమించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న సీనియర్లకు ఇతర జిల్లాల ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. కీలకంగా బీఎల్ఏలు.. రాబోయే ఎన్నికల్లో బూత్ లెవెల్ ఏజెంట్లు కీలకంగా వ్యవహరించేలా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జ్లు కమిటీలు వేయాల్సి ఉంది. ప్రతీ బూత్కు 10–15 మంది యాక్టివ్ టీమ్తో బూత్ లెవెల్ ఏజెంట్లను ఎంపిక చేయాలనేది పార్టీ అధిష్టానం ఆదేశాలు. ఎంపికై న బీఎల్ఏలు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేలా చూడాలి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రతీ బూత్ను టార్గెట్గా తీసుకుని పనిచేస్తోంది. స్థానికంగా ప్రభావం ఉన్న యువకులు, సీనియర్ కార్యకర్తలను ఎంపిక చేసి.. ఓటర్లతో నేరుగా సంబంధాలు పెంచేలా బాధ్యతలు అప్పగించనున్నారు. ఓటర్ లిస్ట్లో లోపాల గుర్తింపు, సరిదిద్దే పనితో పాటు ‘బూత్ గెలిస్తేనే సీటు గెలుస్తాం’ అనే స్ట్రాటజీతో ముందుకెళ్లాలన్న పార్టీ అధిష్టానం సూచనల మేరకు అసెంబ్లీ ఇన్చార్జ్లు కేడర్కు మార్గనిర్దేశనం చేస్తున్నారు. బీఎల్ఏలు ప్రభుత్వ పథకాలు, పార్టీ హామీలపై అవగాహన, అసంతృప్త వర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు కేడర్కు సంకేతాలిచ్చారు. ఈనేపథ్యంలో బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం కూడా పోటీ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.12 సెగ్మెంట్లకు ఇన్చార్జ్లు వీరే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, మహబూబాబాద్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి 12 సెగ్మెంట్లకు ఇన్చార్జ్లను నియమించారు. జనగామకు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తికి దుద్దిళ్ల శ్రీనివాస్, పరకాల, వరంగల్ పశ్చిమకు పల్లె శ్రీనివాస్గౌడ్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేటకు మోతుకూరి ధర్మారావు, భూపాలపల్లి, ఎండీజావేద్ (ఆర్జీపీఆర్ఎస్), డోర్నకల్, మహబూబాబాద్కు ఎండీ.అవేజ్, నర్సంపేట, ములుగుకు నాగ సీతారాములును అసెంబ్లీ ఇన్చార్జ్లుగా నియమించారు. అదేవిధంగా జిల్లాకు చెందిన నాయకులు జంగా రాఘవరెడ్డికి నల్లగొండ, ఈవీ.శ్రీనివాస్రావుకు భువనగిరి, గాజర్ల అశోక్కు భద్రాచలం, కూచన రవళిరెడ్డికి పినపాక, ఇల్లందు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. ‘సంస్థాగత’ంపై కాంగ్రెస్ ఫోకస్ బూత్ స్థాయి కమిటీలపై గురి 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్చార్జ్లు ఇతర జిల్లాలకు పార్టీ సీనియర్లు నియామక ఉత్తర్వులు జారీ చేసిన టీపీసీసీ చీఫ్ -
గర్భిణుల ఆరోగ్యమే లక్ష్యం
జనగామ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణుల ఆరోగ్య సంక్షేమమే లక్ష్యంగా వైద్యులు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం జనగామ చంపక్హిల్స్లోని మాతా శిశు ఆస్పత్రిని (ఎంసీహెచ్) ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ విభాగాన్ని తనిఖీ చేసి, సేవలను మరింతగా మెరుగుపరచాలని సూచించారు. ఆస్పత్రిలోని ప్రతీ వార్డును సందర్శించి, అక్కడ అందుతున్న వైద్యసేవలు, సదుపాయాలను స్వయంగా పరిశీలించి, గర్భిణులకు చేయించే వ్యాయామం సరిగా నిర్వహించాలన్నారు. వైద్యులు బాధ్యతగా పని చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఎంసీహెచ్ సూపరింటెండెంట్ రాజలింగం, వైద్యాధికారులు, సిబ్బంది ఉన్నారు. రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుదాం రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ వైద్య కళాశాల, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మెడికోస్ బ్లడ్ డోనర్స్ క్లబ్ సహకారంతో మంగళవారం చంపక్హిల్స్ ప్రభుత్వ వైద్య కళాశాలలోని లెక్చర్ గ్యాలరీలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం చేయడం గొప్ప కార్యక్రమమని, యువత ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమణి, పాథాలజీ విభాగాధిపతి డాక్టర్ మొహమ్మద్ అన్వర్, డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు, రాజలింగం, నాగమణి, కోటాచలం, అన్వర్ పాల్గొన్నారు. భూ భారతి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి భూ భారతిలో వివిధ మాడ్యూల్స్లోని పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ల్లో భూ భారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలన్నారు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ–ఆఫీసు విధానాన్ని అమలు చేయాలన్నారు. ఈ సమీక్షలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, తహసీల్దార్లు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎంసీహెచ్ ఆకస్మిక తనిఖీ -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026● శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్న 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. థ్రెడింగ్, హెయిర్ కట్స్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ – సెల్ప్ గ్రూమింగ్, ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈనెల 8వ తేదీ నుంచి 13 తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 14 నుంచి మే 12వ తేదీ వరకు ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఉంటుంది. ● రిజిస్ట్రేషన్, శిక్షణ కోసం శ్రీ శైలీ బ్యూటీపార్లర్, ఓల్డ్ బస్డిపో దగ్గర, సర్క్యూట్ హౌజ్ రోడ్డు, హనుమకొండలో సంప్రదించాలి. ● మరిన్ని వివరాల కోసం 95055 14424, 94901 55215 నంబర్లలో సంప్రదించాలి. -
గ్రీవెన్స్..డబుల్ సెంచరీ
జనగామ: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వచ్చిన తర్వాత ప్రజావాణికి అర్జీలు పోటెత్తుతున్నాయి. ఫిబ్రవరి 26న జిల్లా కలెక్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన పనితీరుపై జిల్లా ప్రజల్లో విశేష విశ్వాసాన్ని పెంచింది. ప్రతీ సోమవారం కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్కు గతంలో 60 నుంచి 80 వినతులు మాత్రమే వచ్చేవి. ఎప్పుడో ఒకప్పుడు 100 దాటేది. అయితే కొత్త కలెక్టర్ వచ్చిన తర్వాత గ్రీవెన్స్కు 200 నుంచి 250కి పైగా వినతులు రావడం జిల్లా చరిత్రలోనే రికార్డు. ప్రజలు కలెక్టర్ను కలిస్తే తప్పకుండా పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో తరలివస్తున్నారు. వినతులు విన్న వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆదేశాలు ఇవ్వడం, సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్లే వేగం పాటిస్తున్నారు. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి.. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 30 పడకల ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ లోపాలను సరిదిద్దుతున్నారు. పాఠశాలల్లోకి వెళ్లి బ్లాక్ బోర్డు మీద చాక్ తీసుకొని స్వయంగా పాఠాలు చెప్పడం ద్వారా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి, ధైర్యాన్ని పెంచుతున్నారు. వైద్య రంగంలో ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేస్తున్నారు. సమయపాలన, విధుల్లో అంకితభావం తప్పనిసరి అని తన తనిఖీల ద్వారా బలంగా తెలియజేస్తున్నారు. ఈ రెండు శాఖలతో పాటు రెవెన్యూ, పంచాయతీ, మున్సిపాలిటీలు, రోడ్లు, భవనాలు, జిల్లా గ్రామీణాభివృద్ధి, వైద్యారోగ్యశాఖ ఇలా ప్రతీశాఖపై ఫోకస్ సారిస్తున్నారు. ఏదో చూశాములే అనుకోకుండా ఆయా శాఖలకు సంబంధించి ప్రతీ ఫైల్ను క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. దీంతో ఆ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగుల్లో అంకితభావం పెరగడంతో పాటు చిన్న పొరపాటు కూడా జరగకుండా ముందు జాగ్రత్త పడుతున్నారు. తనిఖీలకు కొత్త నిర్వచనం ఎక్కడికి ఎప్పుడు వెళ్తారో ఎవరికి తెలియకుండా అత్యంత గోప్యంగా పనితీరును నిర్వహిస్తూ శాఖలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రతీ ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలించడం, అనుమతుల విషయంలో పారదర్శకతను పాటించడం ఆయన పరిపాలనా బలం. జిల్లా శాఖలు ఇప్పుడంతా అలర్ట్ మోడ్లోకి వెళ్లాయి. ఎప్పుడైనా కలెక్టర్ వస్తారనే భయం కాదు...వస్తే చెప్పాల్సిందే అన్న బాధ్యత భావం పెరిగింది. సాధారణ ప్రజలకు అందుబాటులో ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలెక్టరేట్లోని తన చాంబర్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. సాధారణ వ్యక్తి నుంచి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధి వరకు ఎవరికైనా ఒకే రీతిగా సమయం కేటాయిస్తున్నారు. ప్రజలు చెప్పే ప్రతి చిన్న సమస్యను సైతం ఓర్పుతో విని, వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. అనతికాలంలోనే తనదైన ముద్ర కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కేవలం కొద్ది రోజుల్లోనే సందీప్ కుమార్ ఝా పరిపాలన జిల్లా ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించింది. అంకితభావం, అందుబాటు, వేగవంతమైన స్పందన, పారదర్శక పరిపాలన ఈ నాలుగు మూలాలతో సందీప్కుమార్ ఝా తనదైన శైలిలో జిల్లా పరిపాలనను మరింత బలోపేతం చేస్తున్నారు. కలెక్టర్ తీసుకున్న ప్రతీ నిర్ణయం, చేసిన ప్రతీ తనిఖీ ప్రజల్లో విశ్వాసాన్ని మరింతగా పెంచుతోంది.286 దరఖాస్తులు..జనగామ రూరల్: పలు సమస్యలతో సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణికి ప్రజలు తరలివచ్చారు. కలెక్టర్ సమస్యల గురించి తెలుసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అత్యధికంగా (286) దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. అదనపు కలెక్టర్ బెన్ షోలోమ్ , ఆర్డీఓ వెంకన్న, డీఆర్డీఓ వసంత, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. దరఖాస్తుల్లో కొన్ని ఇలా.. పట్టణంలోని గిర్నిగడ్డకు చెందిన దైద స్వప్న నిరుపేదరాలినని, భర్త మరణించగా గుడిసెలో జీవనం కొనసాగిస్తున్నామని, ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేయగలరని కోరుతూ దరఖాస్తు చేసుకుంది. లింగాల ఘణపురం మండలం గుమ్మడవెల్లి గ్రామ రైతులు పీఏసీఎస్ ద్వారానే గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. బచ్చన్నపేట మండలం సాల్వాపూర్ గ్రామానికి చెందిన గీత పోచమ్మ తన భర్త మృతి చెందగా పెద్ద కుమారుడు చూసుకుంటున్నాడని, చిన్న కొడుకు చూసుకోకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఎకరం పొలం అతడే సాగు చేసుకుంటున్నాడని, న్యాయం చేయాలని కలెక్టర్కు విన్నవించింది. పట్టణానికి చెందిన కన్నారపు ఉపేందర్ పక్షవాతంతో నడవలేని పరిస్థితిలో ఉన్నానని, కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉందని ఎస్సీ కార్పొరేషన్ ద్వా రా ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించాలని వేడుకున్నాడు. కలెక్టరేట్ ప్రజావాణికి పోటెత్తుతున్న అర్జీలు కలెక్టర్ వద్దకు వస్తే పరిష్కారం ఖాయమన్న నమ్మకం ప్రతీ వినతిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సందీప్కుమార్ ఝా ఉదయం నుంచి సాయంత్రం వరకు కలెక్టరేట్లోనే -
ఆహార భద్రతపై అవగాహన తప్పనిసరి
● డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు జనగామ రూరల్: ఆహార భద్రతపై అవగాహన తప్పనిసరి అని డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రతపై ప్రత్యేక దినోత్సవం సందర్భంగా పాఠశాల వసతి గృహాల వార్డెన్లు, వంటశాల సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ వినీల్ కుమార్, ఏబీసీడీఓ రవీందర్, ట్రైనర్ వేణుగోపాల కృష్ణ, కుక్ లు, వార్డెన్లు, వంటశాల సిబ్బంది పాల్గొన్నారు. -
సిలిండర్లు నిల్వచేస్తే కఠిన చర్యలు
● డీటీసీఎస్ లచ్చునాయక్ దేవరుప్పుల : అక్రమంగా వంటగ్యాస్ సిలిండర్లు నిల్వచేయడమేగాక నిబంధనలు విస్మరించి వ్యాపారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ నాయబ్ తహసీల్దార్ లచ్చునాయక్ హెచ్చరించారు. సోమవారం కోలుకొండ, సింగరాజుపల్లిలో 23 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకొని మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో అప్పగించారు. ఈ విషయమై ఫిర్యాదు మేరకు ఎస్సై ఊర సృజన్కుమార్ సంబంధిత వ్యక్తులపై 6ఏ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లచ్చునాయక్ మాట్లాడుతూ.. గృహాలకు వాడాల్సిన వంట గ్యాస్ను హోటళ్లు, టీస్టాల్ వంటి వ్యాపార దుకాణాల్లో వినియోగించుకున్నా కేసులు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఆర్ఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
మట్టి తరలించొద్దని నిరసన
స్టేషన్ఘన్పూర్: మండలంలోని ఇప్పగూడెం శివారు సింగారపు ఏనె గుట్ట నుంచి మట్టిని తరలించవద్దంటూ డిమాండ్ చేస్తూ గ్రామానికి చెందిన పలువురు రైతులు సోమవారం సాయంత్రం నిరసన వ్యక్తం చేశారు. రైతులు మందపురం అనీల్, మంద చంద్రమౌళి, మునిగెల నర్సింహులు, ఎండీ యాకూబ్పాషా, సట్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సింగారపు ఏనె క్వారీ నుంచి అక్రమంగా ఇష్టారాజ్యంగా భారీ టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారన్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఓవర్లోడ్తో వాహనాలు నడుస్తుండగా రోడ్లు ధ్వంసం అవుతున్నాయన్నారు. రోడ్డు వెంట పంటలపై విపరీతంగా దుమ్ము, ధూళి పడి పంటలు నష్టపోతున్నామన్నారు. మట్టిని తరలిస్తున్న రోడ్డులో ఉన్న కుంట మత్తడి ధ్వంసమైందని, దీంతో పంటపొలాలకు సాగునీరు అందడం లేదన్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా చర్యలు తీసుకోవడం లేదని, మట్టి రవాణాను అడ్డుకునేలా కుంట మత్తడి ఉన్న వద్ద రోడ్డుపై పోసిన మట్టిని తొలగించి నిరసన చేపట్టినట్లు తెలిపారు. పరిశీలించిన ట్రెయినీ ఐపీఎస్ మట్టిని తరలిస్తున్న రోడ్డుపై టిప్పర్లు వెళ్లకుండా రోడ్డును ధ్వంసం చేశారని క్వారీ నిర్వాహకులు అందించిన ఫిర్యాదు మేరకు ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్రా, సీఐ జి.వేణు అక్కడకు చేరుకుని రైతులతో, క్వారీ నిర్వాహకులతో మాట్లాడారు. రైతులు తమ సమస్యను విన్నవించగా రోడ్డును ధ్వంసం చేయడం సరికాదని, మట్టి తరలింపు విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే రెవెన్యూ అధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు సట్ల వెంకటరమణగౌడ్, సీపీఎం మండల కార్యదర్శి మునిగెల రమేశ్, నాయకులు ఎన్.అజయ్రెడ్డి, లింగనబోయిన శ్రీను, పల్లె రవీందర్, యాదగిరి, మైబుపాషా, రవి, షాబుద్దీన్, సోమయ్య పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య పనుల్లో వార్డు సభ్యులు
నర్మెట: సిబ్బంది కొరతతో మండల కేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణ కుంటుపడిందని సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్, వార్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వాడవాడలా మురికి కాల్వలలో చెత్త పేరుకుపోవడం, కాలనీల్లో పెరిగిన పిచ్చిమొక్కలతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, చేసేది లేక ఆదివారం తామే స్వయంగా చెత్తను తొలగించాల్సి వచ్చిందన్నారు. నర్మెట గ్రామ పంచాయతీ పరిధిలో 14 వార్డులు, 4,157 ఓటర్లు, 8,371 జనాభా ఉండగా కేవలం 12 మంది పారిశుద్ధ్య సిబ్బంది మాత్రమే ఉన్నారని, 18 అవసరమన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సిబ్బంది నియామకానికి తోడ్పాటు అందించాలని వార్డు సభ్యురాలు పులి రేణుక కనకయ్య కోరారు. చెత్త తొలగించిన సభ్యులను కాలనీ వాసులు ఈసందర్భంగా అభినందించారు. సిబ్బంది కొరతతో స్వయంగా చెత్త తొలగింపు -
నేడు ఫుడ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా
జనగామ: తెలంగాణ రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు) కోసం నేడు(సోమవారం) ఎఫ్ఎస్ఎస్ఏఐ(ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నట్లు ఆహార భద్రత అధికారి సీహెచ్.వినీల్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం రూమ్ నెంబర్ జీ2లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. ఆహార వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ రిజిస్ట్రేషన్లు పొందడం లేదా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం ఆహార భద్రత అధికారి:7306335795, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ :9985820544 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.గేట్లో మెరిసిన ఆకాంక్ష● జాతీయ స్థాయిలో 542వ ర్యాంక్ బచ్చన్నపేట: మండలంలోని చిన్నరామన్చర్ల శివారు గ్రామమైన మొండికుంటకు చెందిన పుర్మ ఆకాంక్ష ఇటీవల వెలువడిన గేట్ 2026 ఫలితాల్లో ఆల్ ఇండియా 542వ ర్యాంక్ సాధించింది. పాఠశాల, కళాశాల విద్యలోనూ ఆకాంక్ష అద్భుత ప్రతిభ చూపించింది. 2023లో ఈసెట్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆమె తల్లిదండ్రులు పుర్మ లలిత, రాంరెడ్డిలది సాధారణ రైతు కుటుంబం. కాగా, గేట్ ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించిన ఆకాంక్షను గ్రామస్తులు అభినందించారు.జిల్లా మహాసభకు ఎమ్మెల్సీ విజయశాంతికి ఆహ్వానంరఘునాథపల్లి: ఈ నెల 7న జిల్లా కేంద్రంలో 14 కార్మిక సంఘాలతో కలిసి టీబీఎస్ఆర్కేఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జిల్లా మహాసభకు ఆదివారం ఎమ్మెల్సీ విజయశాంతిని సంఘం నాయకులు కలిసి ఆహ్వానించారు. తమ ఆహ్వానం మేరకు ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో టీబీఎస్ఆర్కేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గిన్నారపు మహేంద్ర, రాసమల్ల కొమురయ్య, నల్ల సామన్న, తూడి అంజయ్య, గిన్నారపు రవి తదితరులు ఉన్నారు. సంకటహరచతుర్థి పూజలుహన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం సాయంత్రం సంకటహరచతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్, శ్రవణ్ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఉత్తిష్టగణపతికి అభిషేకాలు చేశారు. మహాహారతి, మంత్రపుష్పం చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. ముగిసిన టెన్నిస్ ఇంటర్ క్లబ్ పోటీలువరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఎన్ఎస్లో మూడు రోజులపాటు నిర్వహించిన ఇంటర్ క్లబ్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. టి.సాత్విక్–రడం శ్రీనివాస్ ప్రథమ స్థానం, ఎరగ్రట్టు స్వామి–ఎం.శివరాజ్ ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. హనుమకొండ ఏసీపీ నరసింహారావు, టెన్నిస్ అసోసియేషన్ హనుమకొండ అధ్యక్షుడు నల్ల సురేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోటీలు నిర్వహించడానికి సహకరించిన హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎరగ్రట్టుస్వామి, తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్ సభ్యుడు బాబురెడ్డి, ప్రతినిధులు రవిచంద్ర, సుదర్శన్, వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సమతావాది..జగ్జీవన్
జనగామ/ స్టేషన్ ఘన్పూర్: మాజీ ఉప ప్రధాని, దళిత వర్గాల ఆశాజ్యోతి, సమతావాది డాక్టర్ బా బు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఆది వారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహం ఆవరణలోని మహనీయుని విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, డీసీపీ రాజమహేంద్ర నాయ క్, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్లతో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం ఏసీపీ పండరి చేతన్ నితిన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవిలత, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, ఇతర అధికారులు, షెడ్యూల్డ్ కులాల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు, ఎస్సీ సంక్షేమ శాఖ సిబ్బంది జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. దళితుల సమగ్ర అభివృద్ధిలో అంబేద్కర్, జగ్జీవన్రామ్.. దళితుల సమగ్ర అభివృద్ధిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్రామ్ రెండు కళ్లలాంటివారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్ డివిజన్కేంద్రంలో బాబూ జగ్జీవన్రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్డీఓ డీఎస్ వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశానికి గొప్ప రాజ్యాంగం అందించిన మహనీయుడు అంబేడ్కర్ అయితే ఆ రాజ్యాంగ అమలుకు విశేషంగా కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్రామ్ అని కొనియాడారు. ఘన్పూర్లో ప్రస్తుతం ఉన్న జగ్జీవన్రామ్ విగ్రహం శిథిలావస్థలో ఉందని, దాని స్థానంలో వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీవరకు కొత్త కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని, అదేవిధంగా అంబేద్కర్, జగ్జీవన్రామ్ల పేరిట రూ.2కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో భవనాన్ని నిర్మిస్తానని హామీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ మారుడోజు రాంబాబు, ఏఎంసీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్రెడ్డి, తహసీల్దార్ స్వప్న, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. మరిన్ని ఫొటోలు 9లో దేశ స్వాతంత్య్రం, దళితుల సాధికారత కోసం చేసిన పోరాటం గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్రామ్ అని డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు, డీసీసీ కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు మాజీ ఉపప్రధానికి ఘన నివాళి -
పరుగు పోటీలతో ఆరోగ్య చైతన్యం
జనగామ: జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట ఆవరణలో తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో ప్రోమో రన్ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ ప్రోమో రన్ను ప్రారంభించారు. తెలంగాణ రన్నర్స్ సభ్యులు హ రీష్రెడ్డి, పురుషోత్తంరెడ్డి, శ్రీనివాస్, అవంతి కన్స్స్ట్రక్షన్ శ్రీనివాస్రెడ్డి, ఎస్పీఆర్ స్కూల్ కరస్పాండెంట్ కీర్తి వీరేందర్, తాజా టిపిన్ ఎండీ తమ్మిశెట్టి సతీష్, జగన్, రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రన్నర్స్ పాల్గొన్నారు. బతుకమ్మకుంట నుంచి నెహ్రూపార్క్, ఆర్అండ్బీ అతిథిగృహం, వడ్లకొండ జంక్షన్ మార్గంలో 2కే, 5కే, 10కే మూడు కేటగిరీలలో రన్నర్లు పరుగు పందెం పూర్తి చేసి తమ ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ.. ఇలాంటి రన్నింగ్ ఈవెంట్లు యువతలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందిస్తాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి, సీఐ సత్యనారాయణ, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, పలు స్వచ్ఛంద సంస్థలు, కౌన్సిలర్ బాల భరద్వాజ్, పాముకుంట్ల ప్రసాద్, ఎస్ఐ భరత్, నాయకులు కేవీఎల్ఎన్రెడ్డి, నారోజు రామేశ్వరచారి, మంగ ళంపల్లి రాజు, పిట్టల సురేష్, బుర్రా రమేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఉత్సాహంగా తెలంగాణ రన్నర్స్ ప్రోమో రన్ -
ఉన్నతవిద్యకు ‘ఉపకారం’
జనగామ రూరల్: గ్రామీణ ప్రాంత విద్యార్థినులు ఆర్థిక స్థోమత లేక ఉన్నత చదువులు మధ్యలోనే ఆపేస్తున్నారు. ప్రతిభ ఉండి భవిష్యత్లో గొప్ప అవకాశాలు అందుకుని భవిష్యత్లో ఉన్నతంగా స్థిరపడడానికి అజీమ్ ప్రేమజీ స్కాలర్షిప్ పేద విద్యార్థులకు భరోసా ఇస్తోంది. కేవలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదువుకునే వారికి ఈ అవకాశం లభిస్తోంది. ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె. శ్రీనివాసరావు చొరవతో కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థినులు ప్రఖ్యాతిగాంచిన అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్కు ఎంపికయ్యారు. జె. శ్రీజ, ధనలక్ష్మి, ఐ.దివ్య, బి. మమత, బి. కీర్తి, జి.ప్రవళికకు మొదటి సంవత్సరానికి గాను రూ.30 వేల చొప్పున వారి అకౌంట్లో నగదు జమ అయ్యింది. కళాశాల నుంచి మొత్తం 36 మంది విద్యార్థినులు అప్లై చేయగా ఆరుగురు ఎంపికయ్యారు. ఇందులో మొదటి సంవత్సరానికి గాను రూ.30 వేలు వరకు జమ అయ్యాయి. వీరికి సెకండియర్, ఫైనల్ ఇయర్లో కూడా ఏడాదికి రూ.30వేలు జమకానున్నాయి. మిగతా విద్యార్థులు కూడా త్వరలో రెండో విడత స్కాలర్షిప్ లభించవచ్చని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు మెరిట్ ఆధారంగా మూడేళ్లకు రూ.90వేలు అజీమ్ ప్రేమ్ జీ సంస్థ స్కాలర్షిప్ ఇవ్వనుంది. దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులకు సహాయం చేసిన ఎం.శ్రీనివాస్, టి.కరుణాకర్తో పాటు మిగతా అధ్యాపకులను కళాశాల ప్రిన్సిపాల్ అభినందించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులకు మాత్రమే అవకాశం ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆరుగురు విద్యార్థినుల ఎంపిక ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.30వేలు -
పీఎస్ హెచ్ఎంలకు సూపర్వైజర్ బాధ్యతలు ఇవ్వాలి
● కలెక్టర్కు ప్రధానోపాధ్యాయుల సంఘం వినతి జనగామ: జనాభా గణన–2026 కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూపర్వైజర్ బాధ్యతలు అప్పగించాలని కోరుతూ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బుర్రా రమేష్, జిల్లా అధ్యక్షుడు చంద్రం ఆదివారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్కు సైతం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనాభా గణన వంటి కీలక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి అనుభవజ్ఞులైన పీఎస్ హెచ్ఎంల సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఎన్యుమరేటర్ల నియామకాన్ని సీనియారిటీ ఆధారంగా చేపడితే పారదర్శకత పెరుగుతుందని, విధుల నిర్వహణలో సమర్థత సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. వినతిపత్రంపై అధికారులు సానుకూలంగా స్పందించినట్లు సంఘ ప్రతినిధులు వెల్లడించారు. -
ఆకర్షిస్తోన్న ఆయిల్పామ్
స్థిరమైన ఆదాయం వచ్చే పంట వైపు రైతుల మొగ్గుజనగామ: జిల్లాలో ఆయిల్పామ్ సాగు వేగంగా విస్తరిస్తోంది. నూనెలకు భారీ డిమాండ్ ఉండడం, పంటకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, కంపెనీల ద్వారా బై బ్యాక్ హామీలు రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. దీనివల్ల సాధారణ పంటల కంటే దీర్ఘకాలికంగా లాభాలు వచ్చే ఆయిల్పామ్ సాగు వైపు రైతుల మొగ్గు గణనీయంగా పెరుగుతోంది. జిల్లాలో ఆయిల్పామ్ సాగు మొదటగా 2021–22 సంవత్సరంలో 73 మంది రైతులు 425.36 ఎకరాల్లో ప్రారంభించారు. అయితే సరైన మార్గదర్శకాలు, సబ్సిడీలు, అవగాహన కార్యక్రమాల వల్ల ప్రతీ ఏడాది సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. 2025–26 నాటికి మొత్తం 2.310 మంది రైతులు 8,333.10 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు నమోదైంది. 2026–27 కొత్త ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో ఆయిల్పామ్ సాగు ఎంత విస్తరించాలన్న దానిపై ప్రస్తుతం హర్టికల్చర్ అధికారులు పరిశీలిస్తున్నారు. భూభాగం, నీటి వనరులు, రైతుల ఆసక్తి ఆధారంగా త్వరలోనే జిల్లాకు ప్రత్యేక లక్ష్యాన్ని ప్రభుత్వం ఖరారు చేయనుంది. ఇప్పటికే గ్రామాల్లో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆయిల్ పామ్ సాగు విధానం, నీటి వసతి, సబ్సిడీల వివరాలు రైతులకు తెలియజేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 135 మంది రైతుల క్షేత్రాల్లో సాగుచేసిన 1,368 ఎకరాల్లో ఆయిల్పామ్ తోటలు దిగుబడి ఇవ్వడం ప్రారంభించాయి. సరైన నిర్వహణ ఉంటే ఆయిల్పామ్ తోటలు 15–30 సంవత్సరాల పాటు నిరంతరంగా ఫలాలు ఇస్తాయి. ఒక ఎకరాలో సాధారణంగా 55 నుంచి 60 ఆయిల్పామ్ మొక్కలు నాటుతారు. మొక్కలు పెద్దగా పెరిగే కారణంగా విస్తారమైన ప్రదేశం అవసరం. నీటి వసతిలో డ్రిప్ కీలక పాత్ర పోషిస్తుంది. వారం రోజులకోసారి తగినంత నీరు అందించాల్సి ఉంటుంది. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో పంట మంచి ఫలితాలు ఇస్తుంది. రైతులకు ప్రభుత్వ డ్రిప్ ద్వారా సబ్సిడీ అందిస్తోంది. దిగుబడి 3వ ఏడాదిలో మొదటి ఫలాలు రానుండగా, 5వ సంవత్సరం నుంచే పూర్తి స్థాయి దిగుబడి మొదలవుతుంది. ఆ తర్వాత 15–30 సంవత్సరాలు వరకూ స్థిరమైన దిగుబడి సాధిస్తారు. ప్రతీ మొక్క నుంచి ఏడాదికి 80 నుంచి 120 కిలోల వరకు ఫలాలు వస్తాయి. రైతులు నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చేస్తే దిగుబడి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఆయిల్పామ్ పంటకు మార్కెటింగ్ సమస్య ఉండదు. ఆయిల్పామ్ ప్రాసెసింగ్ కంపెనీలతో ప్రభుత్వం ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకుంటుండడంతో అమ్మకం సమయంలో ఇబ్బందులు ఉండవు. సంవత్సరానికి కనీసం రూ.1.2 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం (ఎకరాకు సగటుగా) వస్తుంది. స్థిరమైన ఆదాయం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, తక్కువ మానవ వనరుల అవసరం. దీర్ఘకాలిక దిగుబడి లాంటి అంశాలు రైతులను ఆయిల్పామ్ సాగువైపు ఆకర్షిస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో జిల్లాలో ఈ పంట విస్తీర్ణం మరింత పెరగనుందని హార్టికల్చర్ శాఖ భావిస్తోంది. సాగుకు కేంద్రబిందువుగా మారుతున్న జిల్లా 2021 నుంచి 2026 వరకు రికార్డు స్థాయిలో పెరుగుదల 135 మంది రైతుల క్షేత్రాల్లో దిగుబడి ప్రారంభం రైతులకు అవగాహన కల్పిస్తున్న హార్టికల్చర్ శాఖ ఏడాది రైతులు ఎకరాల్లో సాగు 2021–22 73 425.36 2022–23 915 3,203.71 2023–24 713 2.160.70 2024–25 384 1,713.33 2025–26 225 770.00 మొత్తం 2,310 8,333.10జిల్లాలో 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్పామ్ సాగు టార్గెట్ ఎంత అనే సమాచారం త్వరలోనే వస్తుంది. జిల్లాలో ప్రస్తుతం 8,333 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు ఉండగా, 135 మంది రైతుల క్షేత్రాల్లో 1,368 ఎకరాల్లో దిగుబడి మొదలైంది. రైతులు దీర్ఘకాలిక భవిష్యత్ను ఆలోచించి ఆయిల్పామ్ సాగు వైపు రావాలి. – డాక్టర్ జె.రవికాంత్, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ -
టెస్కోతోనే చేనేత వస్త్రాల ఖరీదుకు కృషి
● మంత్రి తుమ్మలకు సంఘాల ప్రతినిధుల వినతికాశిబుగ్గ: చేనేత వస్త్రాలను టెండర్ ద్వారా కాకుండా టెస్కో ద్వారానే ఖరీదు చేయడానికి కృషి చేస్తానని రాష్ట్ర జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హామీ ఇచ్చారు. ఆదివారం కొత్తవాడకు చెందిన చేనేత సొసైటీ ప్రతినిధుల బృందం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో మంత్రి తుమ్మలను కలిసి చేనేత సమస్యలు విన్నవించారు. గతంలో మాదిరిగానే బెడ్ షీట్లు, కార్పెట్లు ప్రభుత్వరంగ సంస్థ అయిన టెస్కో ద్వారానే కొనాలని, చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈసందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. చేనేత పరిశ్రమకు సంబంధించిన బెడ్ షీట్లు, కార్పెట్లు, ఇతర వాటిని టెండర్ ద్వారా కాకుండా, నేరుగా సొసైటీల నుంచి కొనేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై నేత కార్మికులు అధైర్యపడకూడదని, కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈవిషయాన్ని సీఎం దృష్టికి తీసుకవస్తానని హామీ ఇచ్చారు. -
‘సర్’ను పారదర్శకంగా నిర్వహించాలి
జనగామ: తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎలక్ట్రోరల్ అధికారి సి.సుదర్శన్రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్, ఎన్నికల అధికారి సందీప్ కుమార్ ఝా ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి హాజరయ్యారు. రాష్ట్ర ఎలక్ట్రోరల్ అధికారి మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్పై అవగాహన కలిగి ఉండాలని, బీఎల్ఓలకు ఏ సందేహం ఉన్నా నివృత్తి చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని సూ చించారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలు, మ్యాపింగ్, ఫామ్ 6, 7, 8 దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమీక్షలో స్టేషన్ఘన్పూర్ ఆర్డీఓ వెంకన్న, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. వీసీలో రాష్ట్ర ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్రెడ్డి -
కో ఆప్షన్.. కసరత్తు
జనగామ: మున్సిపల్ శాఖ రెండో సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా సహ సభ్యుల (కో–ఆప్షన్ మెంబర్స్) ఎంపికపై మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం కమిషనర్, డైరెక్టర్ టీకే శ్రీదేవి సర్క్యులర్ జారీ చేశారు. జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో కో–ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ జరుగనుండగా, ఆశావహులు ఇప్పటినుంచే పదవి కోసం పైరవీలను మొదలుపెట్టారు. ప్రభుత్వ కీలక నిర్ణయాలు.. 2020లో జారీ చేసిన రెండు కీలక జీఓల ప్రకారం ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు, మైనారిటీ వర్గాలకు చెందిన వారిని సహ సభ్యులుగా తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో ఈ సూచనలను తక్షణం అమలు చేయాలని ఆదేశించారు. దరఖాస్తు ప్రక్రియ.. తొలి కౌన్సిల్ మీటింగ్ తేదీ నుంచి 60 రోజుల్లో నోటిఫికేషన్న్ విడుదల చేసి దరఖాస్తులు ఆహ్వానించాలి. పత్రాల పరిశీలనతో సహా మొత్తం ప్రక్రియను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని సర్క్యులర్లో ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ ముగిసిన 15 రోజుల్లో కౌన్సిల్ సమావేశం జరపాలి. కౌన్సిల్లో ఇద్దరు కో–ఆప్షన్ సభ్యులను ఎంపిక చేయగా, ఇందులో ఒక మహిళ ఉండేలా చేసుకోవాలి. కోఆప్షన్ ఎన్నిక కోసం సభ్యులు సగం మంది హాజరైతేనే కోరం ఉన్నట్టుగా పరిగణిస్తారు. నిర్ణీత సమయానికి కోరం లేకపోతే సమావేశం వాయిదా వేస్తారు. రెండు, మూడు సమావేశాల్లో ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉంటాయి. రెండూ వాయిదాలు పడితే, మూడో సమావేశంలో కోరం లేకున్నా కో–ఆప్షన్ సభ్యులను ఎన్నుకునే విధంగా సర్క్యులర్ జారీ చేశారు. దరఖాస్తుల సంఖ్య ఎక్కువ, తక్కువగా ఉన్న సమయంలో ఎక్కువైతే వాయిస్ ఓటుతో అవసరమైన సంఖ్యలో ఎంపిక చేయాలి. సరిపడా దరఖాస్తులు రాకపోతే కొత్త నోటిఫికేషన్ జారీ చేసి, పాత దరఖాస్తులతో పాటు కొత్త వాటిని పరిగణలోకి తీసుకోవాలి. నిబంధనలు ఇలా రాజీనామాలు, అర్హత కోల్పోవడం వంటి సందర్భాల్లో ఎన్నికైన సభ్యులపై వర్తించే నిబంధనలు అదే విధంగా అమలు చేయాలి. ఖాళీ అయిన స్థానాన్ని మూడు నెలల్లోగా భర్తీ చేయాలి. పదవీకాలం ముగిసే మూడు నెలల్లో ఖాళీ అయితే భర్తీ అవసరం లేదు. ఎన్నికై న కో ఆప్షన్ సభ్యుల వివరాలతో కమిషనర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తారు. వీటిని కలెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్కు పంపిస్తారు. అలాగే మున్సిపాలిటీ నోటిస్ బోర్డులో ప్రదర్శిస్తారు. మైనారిటీ కో ఆప్షన్ సభ్యుల ఎంపికకు ప్రత్యేక నియమాలను (2020) జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు వర్తింపు చేసే విధంగా సర్క్యులర్లో పేర్కొన్నారు. కో ఆప్షన్ కోసం మైనారిటీ వర్గాల్లో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు ఉండగా, ఇద్దరు మైనారిటీ సభ్యుల కో–ఆప్షన్ ఎంపికలో ఒక మహిళకు ప్రాధాన్యం ఇవ్వాలి. సర్క్యులర్ వచ్చిన తర్వాత 60 రోజుల్లో నోటిఫికేషన్, 7 రోజుల్లో దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఈ విషయమై జనగామ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 6వ తేదీన ఇందుకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేస్తామని తెలిపారు.ఎంపికకు అవసరమైన అర్హతలు అభ్యర్థి కనీసం 21 సంవత్సరాల పైబడినవారు అయి ఉండాలి. అదే మున్సిపాలిటీలో ఓటర్గా నమోదై ఉండాలి. కనీసం 5 సంవత్సరాలు చైర్పర్సన్, మేయర్, వార్డు మెంబర్గా పనిచేసి ఉండాలి. లేదా 3 సంవత్సరాలు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేసిన న్యాయవాది అయి ఉండాలి. లేదా ప్రభుత్వ, స్థానిక సంస్థల్లో గెజిటెడ్ ఉద్యోగిగా రిటైర్డ్ అయి మున్సిపల్ పరిపాలనలో అనుభవం ఉండాలి. ఇందులో ఒక మహిళను తప్పనిసరిగా సహ సభ్యురాలిగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. సర్క్యులర్ జారీ చేసిన మున్సిపల్ శాఖ అర్హత, అనుభవంపై స్పష్టమైన మార్గదర్శకాలు 60 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని సూచన -
సబ్సిడీ సిలిండర్ల స్వాధీనం
కొడకండ్ల: మండలకేంద్రంలో అక్రమంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల వాడకంపై శనివారం ఎన్ఫోర్స్మెంట్ డీటీ లక్ష్మణ్నాయక్, ఎస్సై చింత రాజు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మండలకేంద్రంలోని హోటళ్లు, చికెన్ సెంటర్లు, బేకరీల్లో వారు తనిఖీలు నిర్వహించి వ్యాపార అవసరాల కోసం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను వాడకుండా సబ్సిడీ సిలిండర్లను వాడుతున్నట్లు గుర్తించి 20 సిలిండర్లను స్వాధీనం చేసుకొని 15 మంది వ్యాపార యాజమానులపై ఈసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీటీ, ఎస్సైలు మాట్లాడుతూ.. సబ్సిడీ సిలిండర్లను దుర్వి నియోగం చేసే వారితో పాటు బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై నిరంతరం నిఘా పెడుతూ చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్సై కత్తి రమేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 7న విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల మహా ధర్నాహన్మకొండ: సమస్యల పరిష్కారానికి ఈనెల 7న హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట జరిగే ధర్నాను ఆర్టిజన్ ఉద్యోగులు, ఆన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, పీస్ రేట్ వర్కర్లు విజయవంతం చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ట్రాన్స్ కో రాష్ట్ర కన్వీనర్ కందికొండ వెంకటేశ్ పిలుపునిచ్చారు. ఈలోగా ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు జేఏసీతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని లేకపోతే ఈ నెల 8వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఆయన శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చట్టవిరుద్ధ చర్యలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. దీని కోసం కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టంగా చట్టాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గర్భంలోని శిశువు లింగాన్ని తెలుసుకోవడం, తెలియజేయడం ద్వారా ఆడ శిశువుల సంఖ్య తగ్గుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధి అన్ని అల్టాసౌండ్ స్కానింగ్ సెంటర్లు చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్తోనే పనిచేయాలని, నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ జరిగినట్లు గమనిస్తే పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100, ఎస్.బీ 87126 85257 కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో టెండర్లకు ఆహ్వానంకాశిబుగ్గ: వరంగల్లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో ఇన్పేషెంట్లు, డ్యూటీ డాక్టర్ల ఆహారం సరఫరా కోసం ఇ–టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కాంతిప్రకాశ్ ఒక ప్రకటనలో తెలిపారు. టెండర్ దరఖాస్తులను ఈ నెల 15 సాయంత్రం 4 గంటల వరకు సమర్పించవచ్చ ని సూచించారు. అదేవిధంగా ఈఎస్ఐ ఆస్పత్రి వరంగల్ నుంచి వివిధ డిస్పెన్సరీలకు మందులు, వైద్య వినియోగ వస్తువుల రవాణా కోసం అద్దె వాహనానికి ఇ.టెండర్ ప్రకటిస్తున్నట్లు, ఈ నెల 15 సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ గూండాల దాడి హేయం
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ: సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే అది ప్రభుత్వ ఆస్తి అని, ఇలా చేయడం నేరంగా పరిగణించాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక వారి నుంచి దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మీద ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇక సామాన్యులకు రక్షణ ఎలా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు దాడికి పాల్పడిన దుండగులను గుర్తించి, కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
బడి బాగుంది.. బోధన ఇంకా బాగుండాలి!
లింగాలఘణపురం: ‘పాఠశాల పరిసరాలు బాగున్నాయి..ఆవరణ అంతా శుభ్రంగా ఉంది..విద్యార్థులకు బోధన కూడా బాగా చేయాలి’ అని ఉపాధ్యాయులకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. మండలంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం వంటశాలను సందర్శించి వంట సామగ్రి, గుడ్లు, కూరగాయలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన సూచనలు చేశారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ముఖ్యంగా గణితంపై తగిన ప్రశ్నలు బోర్డుపై రాసి సమాధానాలు అడిగారు. కంప్యూటర్ గదిని, స్టాఫ్ రూమ్ను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో హైమాస్ట్ లైట్లు రావడంలేదని తెలియడంతో మరమ్మతులు చేయించాలని చెప్పారు. గణితంపై విద్యార్థులకు తగిన విధంగా బోధన చేయాలని స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణకు సూచించారు. కస్తూర్బా విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ -
పకడ్బందీగా ఏర్పాట్లు
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో యాసంగి సీజన్లో పకడ్బందీగా కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తామని ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అన్నారు. శనివారం చైర్మన్ ఆధ్వర్యంలో మార్కెట్ కార్యాలయంలో రైస్ మిల్లర్స్, ఎగుమతిదారులు, అడ్తి వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజన్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సమావేశంలో రైతు సంఘం నేతలు చందూ నాయక్, సొప్పరి సోమయ్య, రైస్ మిల్లర్స్ పజ్జూరి జయహరి, ముత్తయ్య యాదవ్, మాశెట్టి అశోక్, అడ్తి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు మాశెట్టి వెంకన్న, వ్యాపారులు కృష్ణారెడ్డి, నరసింహులు, రవి, శ్రీనివాస్, ఉపేందర్, ఏఎంసీ సూపర్వైజర్ శ్రీనివాస్ ఉన్నారు. -
ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దు
పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం గుట్ట భూమి సర్వే నెంబర్లో 542, 543లో అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆల య ఈఓ భాగం లక్ష్మీప్రసన్న హెచ్చరించారు. శని వారం శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయ భూమిలో అక్రమ ఇంటి నిర్మాణాలను దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది అడ్డుకొని కూల్చివేశారు. ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకట య్య, సిబ్బంది ముంజ రాములు, అమేడ రమేశ్, ఓం ప్రకాష్, నవీన్, అశోక్, నిరంజన్, సత్యనారా యణ,దేశబోయిన అంజనేయులు పాల్గొన్నారు. ధర్మపురంలో.. దేవరుప్పుల: వల్మిడి పరిధి ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని సోమేశ్వర ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న హెచ్చరించారు. శనివారం మండలంలోని ధర్మపురంలో వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భూమి సర్వే నంబర్ 449లో రాజన్న గుడిబండపై సంగీ రవి, రేణుక దంపతులు నిర్మిస్తున్న అక్రమ ఇంటి నిర్మాణ పనులను ఆలయ ధర్మకర్తలు, సిబ్బంది అడ్డుకున్నారు. రాజకీయ కక్షతో అడ్డుకుంటున్నారని వారు వాగ్వాదానికి దిగడంతో నిర్మాణ పనుల విషయమై నివేదిక ఇస్తామని సిబ్బంది తెలిపారు. కాగా ఈ విషయమై ఈఓ లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ.. ధర్మపురంలో సర్వే నెంబర్లు 395,396,397,398, 446,447,448,449 భూముల్లో వల్మిడి ఆలయ పరిధి సంబంధించి 34 ఎకరాల 34 గుంటల భూమి ఉందన్నారు. ఈ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే దేవాదాయ చట్టం 30/1987 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకట య్య, ఆలయ ధర్మకర్తలు పాలెపు సత్తయ్య, ముంజ రాములు, రమేశ్, ఓం ప్రకాష్ పాల్గొన్నారు. సోమేశ్వర ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న పాలకుర్తి, ధర్మపురంలో అక్రమ నిర్మాణాల అడ్డగింత -
కొనుగోళ్లకు సన్నద్ధం
2.97లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంజనగామ రూరల్: యాసంగి సీజన్ 2025–26 ధాన్యం కొనుగోళ్లకు జిల్లా వ్యవసాయ, ఇతర శాఖల అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 2.05 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుకాగా సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇందులో సుమారుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సుమారు 3 లక్షల టన్నుల వరకు ధాన్యం సేకరణ చేపట్టాలని సంబంధిత అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే వరి కోతలు ప్రారంభం కావడంతో ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలెక్టరేట్లో అధికారులతో రెండు సార్లు సమీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ రెండో వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయి. యాసంగిలో వరి పండించిన ఏరియా దిగుబడి అంచనా మేరకు మొత్తం 319 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇందులో 105 కేంద్రాల ద్వారా సన్నరకం సేకరించాలని నిర్ణయించారు. వానాకాలం మాదిరిగానే సన్నరకం వడ్లకు ప్రభుత్వం మద్దతు ధరకు అదనంగా క్వింటాల్ రూ.500లు బోనస్ అందజేయనుంది. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్కు రూ.2,369, సాధారణ రకం రూ.2,389 రైతులకు మద్దతు ధర లభించనుంది. ఇప్పుడిప్పుడే వరి కోతలు ప్రారంభించగా అడపాదడపా ఆకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ధాన్యం కొనుగోలులో రవాణా ప్రక్రియ సజావుగా నిర్వహించాల్సి ఉంది. గోదాముల కేటాయింపు, వాహనాల కొరత లేకుండా చూడాల్సింది. అలాగే జిల్లాకు 50 లక్షల గన్నీలు అవసరం ఉండగా 30 లక్షలకు పైగా అందుబాటులో ఉండగా మరిన్ని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ధాన్యం ఎక్కువగా వస్తుందన్న అంచనాతో మిల్లర్ల గోదాములతో పాటు వర్షాలకు పంట దెబ్బతినకుండా అదనపు గోదాములు నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాంతాలను అన్వేషిస్తున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. గతంలో ఏప్రిల్ చివరి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ధాన్యం కేంద్రాలకు వెల్లువలా వచ్చేది. దీంతో రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు సరిపడా స్థలాలు లభ్యం కాకపోవడంతో రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఎక్కడి ధాన్యం అక్కడే పేరుకుపోవడంతో ధాన్యం కొనుగోలు అస్తవ్యస్తంగా మారేది. గతేడాది కంటే అధికారులు ఈ సంవత్సరం 15 రోజుల ముందుగానే కార్యాచరణ, సన్నాహాలు చేస్తుండటంతో ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. గత యాసంగిలో కొనుగోలు కేంద్రాల నిర్వహణలో తలెత్తిన అనుభవాల నేపథ్యంలో ఈ ఏడాది జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. సెర్ప్, మార్కెట్, పీఏసీఎస్, డీసీఎంఎస్ల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత యాసంగిలో వర్షాల నేపథ్యంలో బ్యాగుకు 1.2కేజీల తరుగు తీయగా కొనుగోలు చేశాక రైస్మిల్లర్లు ఐదు నుంచి ఏడు కేజీల తరుగు తీస్తేనే తీసుకుంటామని మెలిక పెట్టారు.దీంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. 319 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సిద్ధం సన్నరకం కొనుగోలు కేంద్రాలు 105 సజావుగా కొనుగోళ్లు నిర్వహించాలని కలెక్టర్ అదేశంకొనుగోలు కేంద్రాలు మొత్తం: 319 దొడ్డు ధాన్యం: 214 సన్నరకం: 105 కొనుగోళ్ల లక్ష్యం: 2.97 లక్షల మెట్రిక్ టన్నులుగత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్లో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తాలు, తరుగు, తేమ, మట్టి పెల్లల శాతం ఎంత ఉండాలనే విషయంలో ముందుగానే శిక్షణ తరగతులు నిర్వహించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతులు ముందుగా తాలు మొత్తం తూర్పార పట్టి తేమ అవసరమైన మోతాదుకు వచ్చే వరకు ఆరబెట్టుకుని తీసుకురావాలి. – హాతీరామ్, డీఎం, సివిల్ సప్లై -
బండికి.. దండిగా!
జనగామఓరుగల్లు రైల్వేకు నిధుల వరద 7మాజీ మావోలు బూర్జువా పార్టీలతో కలవొద్దు మాజీ మావోయిస్టులు బూర్జువా పార్టీలతో కలవొద్దని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ అన్నారు.ఆన్లైన్ మూల్యాంకనం కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ పరీక్షల జవాబుపత్రాలను ఇక నుంచి ఆన్లైన్లోనే వాల్యుయేషన్ చేయనున్నారు. శనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026 సాక్షిప్రతినిధి, వరంగల్: దక్షిణ మధ్య రైల్వే పరిధి ఉమ్మడి వరంగల్ జిల్లాకు భారీగా నిధులు కేటాయించారు. 2026–27 రైల్వే బడ్జెట్ (పింక్ బుక్)లో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ ప్రాంతాలకు భారీగా నిధులు, ప్రాజెక్టులు కేటాయించారు. ముఖ్యంగా రైల్వే మౌలిక సదుపాయాల కల్పన, క్వాడ్రప్లింగ్ (నాలుగు లైన్లు), సర్వేలు, నిర్మాణంలో ఉన్న మూడో లైన్ పూర్తి, స్టేషన్ల ఆధునికీకరణకు ఈ బడ్జెట్ పెద్దపీట వేసింది. దక్షిణ మధ్య రైల్వేశాఖ కేటాయింపులతో కూడిన పింక్బుక్ శుక్రవారం విడుదల కాగా, అధిక నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తమవుతోంది. కొత్త లైన్లు, డబ్లింగ్ పనులు.. భారీగా నిధులు ఉమ్మడి వరంగల్ మీదుగా వెళ్లే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నిధుల కేటాయింపు జరిగింది. కొత్త లైన్లు, డబ్లింగ్, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. ● కాజీపేట–విజయవాడ మధ్య 219.64 కి.మీ.పొడవైన మూడో లైన్, విద్యుద్దీకరణ పనుల కోసం రూ.1,955.27 కోట్లు మంజూరు చేశారు. ● కాజీపేట–బల్లార్షా వరకు 201.04 కి.మీ. పొడవైన మూడో లైన్ పనులకు రూ.2,063.03 కోట్లు ఇచ్చారు. ● నష్కల్ (పెండ్యాల్) – హసన్పర్తి నడుమ 24.55 కి.మీ. బైపాస్ లైన్ నిర్మాణానికి రూ.465.29 కోట్లు మంజూరయ్యాయి. ● భద్రాచలం రోడ్ – డోర్నకల్ వరకు 54.65 కి.మీ సెక్షన్ పనుల కోసం రూ.770.12 కోట్లు కేటాయించారు. ● కాజీపేట – బల్లార్షా మెయిన్ లైన్ను పెద్దపల్లి–కరీంనగర్ లైన్తో అనుసంధానించే 2.169 కి.మీ. బైపాస్ లైన్ కోసం రూ.36.99 కోట్లు కేటాయించారు. ● ఘన్పూర్–సూర్యాపేట (పాలకుర్తి మీదుగా) 170 కి.మీ. కొత్త లైన్ సర్వేకు నిధులిచ్చారు. ● బీజాపూర్–వరంగల్కు 288 కి.మీ.ల కొత్త లైన్ కోసం సర్వేకు కూడా అనుమతి ఇచ్చారు. ● క్వాడ్రప్లింగ్ (నాలుగు లైన్ల) సర్వేలకు కూడా నిధులు ఇచ్చారు. రైల్వేస్టేషన్లకు ‘అమృత్ భారత్’ హంగులు ‘అమత్ భారత్ స్టేషన్ స్కీమ్’ కింద ప్రధాన స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా.. వరంగల్ స్టేషన్ తూర్పు వైపు ఎంట్రీ అభివృద్ధి, బుకింగ్ ఏరియా, కాన్ కోర్స్ మెరుగుదల కోసం రూ.4.50 కోట్లిచ్చారు. వరంగల్ స్టేషన్లో 12 మీటర్ల వెడల్పు గల కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (ఎఫ్ఓబీ) కోసం రూ. 13.24 కోట్లు, కాజీపేట స్టేషన్ ఆధునికీకరణకు రూ.18.73 కోట్లు (జనగామ, యాదాద్రితో కలిపి) కేటాయించారు. కాజీపేటలో 12 మీటర్ల వెడల్పు గల ఎఫ్ఓబీ కోసం రూ.9.78 కోట్లు, ప్లాట్ఫామ్ 4–5 వరకు ఎఫ్ఓబీ విస్తరణ, లిఫ్టులు, ఎస్కలేటర్ల కోసం రూ.13.93 కోట్లు మంజూరు చేసినట్లు పింక్బుక్లో పేర్కొన్నారు. మహబూబాబాద్ – జనగామ స్టేషన్లలో 12 మీటర్ల వెడల్పు గల ఎఫ్ఓబీలు, రాంప్ల నిర్మాణం కోసం రూ.44.34 కోట్లు, జనగామ గూడ్స్ షెడ్ సౌకర్యాల మెరుగుదలకు రూ. 6.24 కోట్లు ఇచ్చారు. అలాగే భద్రత పనుల కింద వరంగల్ – చింతలపల్లి లెవల్ క్రాసింగ్ 63 ఏ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.25.58 కోట్లు, కాజీపేట – వరంగల్ ఎల్సీ 61 వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి కోసం రూ. 24.65 కోట్లు, రఘునాథపల్లి – ఇప్పగూడ ఎల్సీ 44 వద్ద 2–లేన్ రైల్వే ఓవర్ బ్రిడ్జి, సబ్వే కోసం రూ.12.83 కోట్లు, డోర్నకల్ – మణుగూరు మార్గంలో కారేపల్లి – సింగరేణి కొలీరీస్ మధ్య వివిధ లెవల్ క్రాసింగ్ల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టనున్నట్లు పింక్బుక్లో పేర్కొన్నారు. కాజీపేట పీఓహెచ్కు రూ.521 కోట్లు రైల్వే బడ్జెట్ (పింక్ బుక్)లో కాజీపేటను కీలక మెయింటెనెన్స్ హబ్గా మార్చేందుకు పెద్దపీట వేశారు. కాజీపేట పీరియాడికల్ ఓవరాలింగ్ (పీఓహెచ్) వర్క్ షాప్ కోసం రూ. 521.36 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కాజీపేటలో 24–కోచ్ల నిడివి గల క్యాంటెక్ డిజైన్ పిట్ లైన్ల కోసం రూ.17.81 కోట్లు ఇచ్చారు. కాజీపేట డీజిల్ లోకో షెడ్ సామర్థ్యం పెంపు (ఎలక్ట్రిక్ లోకోలను ఉంచేందుకు) కోసం రూ.30.95 కోట్లు, ఎలక్ట్రిక్ లోకో షెడ్ సామర్థ్యం పెంపు (125 నుంచి 175 లోకోలకు) రూ. 21.68 కోట్లు, ఎలక్ట్రిక్ లోకో షెడ్ విస్తరణ (175 నుంచి 300 లోకోలకు)కు రూ. 22.56 కోట్లు చొప్పున కేటాయించారు. లైన్ కి.మీ నిధులు భూపాలపల్లి–కాజీపేట (హసన్పర్తి) 64 1.60 హసన్పర్తి–కరీంనగర్ 62 1.55 డోర్నకల్–గద్వాల (సూర్యాపేట, నల్లగొండ మీదుగా) 296 7.40 కాజీపేట–సికింద్రాబాద్ 120 2.40 కాజీపేట–విజయవాడ 220 4.40 కాజీపేట–బల్లార్షా 234 4.68 వరంగల్–సికింద్రాబాద్ 38 0.75 కాజీపేట–విజయవాడ మూడో లైన్కు రూ.1,955 కోట్లు కాజీపేట–బల్లార్షాకు రూ.2,063 కోట్లు నష్కల్–హసన్పర్తికి రూ.465.29 కోట్లు క్వాడ్రప్లింగ్, కొత్త రైల్వే సర్వేల కోసం కేటాయింపులు కాజీపేట జంక్షన్ నుంచే పలు మార్గాలు పీఓహెచ్కు రూ.521.36 కోట్లు.. ‘అమృత్ భారత్’ కింద స్టేషన్లకు కొత్త హంగులు 2026–27 రైల్వే బడ్జెట్ (పింక్బుక్)లో భారీగా నిధులు -
ఉచితం..అపూర్వం
జనగామ ఆర్టీసీ డిపో సమాచారం:బస్సులు: 125రోజువారీ రూట్లు: 53రోజువారీ ప్రయాణికులు: 58వేలు రోజువారీ కిలో మీటర్లు: 47వేలు 29 నెలల కాలంలో మహిళా ప్రయాణికుల సంఖ్య: 3.24కోట్లు జీరో టికెట్ కలెక్షన్లు: రూ.160కోట్లు అత్యధిక ఆదాయం వచ్చే రూట్లు: 4జనగామ: రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం జిల్లాలో విశేష ఫలితాలను ఇస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 9వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం మహిళల రవాణా సమస్యలను గణనీయంగా తగ్గించడమే కాకుండా, వారి ఉద్యోగ, విద్య, ఆరోగ్య, రోజువారీ అవసరాలకు మరింత సౌలభ్యం కల్పించింది. ముఖ్యంగా జనగామ ఆర్టీసీ డిపో పరిధిలో ఈ పథకం ప్రభావం అత్యధికంగా కనిపిస్తోంది. రూ.3.24 కోట్ల మహిళా ప్రయాణికులు ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించిన 29 నెలల్లో 3.24 కోట్ల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా రు. ఈ ప్రయాణాల ద్వారా ప్రభుత్వం నుంచి ఆ ర్టీసీకి రూ.160 కోట్ల మేర ఆదాయం సమకూరింది. మహిళల ప్రయాణ భద్రత, సౌలభ్యం పెరగడంతో ప్రయాణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. డిపోలో 125 బస్సులు ఉండగా, 13 డీలక్స్, 32 ఎక్స్ప్రెస్, 80 పల్లె వెలుగు బస్సులు ఉన్నా యి. రోజు వారీగా 53 రూట్లలో 47వేల కిలో మీటర్లు ప్రయాణం చేస్తున్నాయి. ఇందులో డిపో మొత్తం కార్యకలాపాల్లో మహిళల ఉచిత ప్రయాణ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి రోజూ ప్రయాణికుల్లో 65శాతం మహిళలు(సుమారు 38వేల మంది), 35 శాతం పురుషులు ఉన్నారు. అత్యధికంగా కలెక్షన్లు వచ్చే రూట్లు జనగామ డిపో పరిధిలో అత్యధికంగా నాలుగు రూట్లలో మహిళా ప్రయాణికులు ప్రయాణం సాగిస్తున్నారు. ఉప్పల్–హనుమకొండ, జగద్గిరిగుట్ట, సిద్దిపేట–సూర్యాపేట రూట్లలో బస్సు సర్వీసులు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. ఈ మార్గాల్లో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా ఉండటంతో ఆదాయం కూడా పెరుగుతోంది. 10 వేలకు పైగా.. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేసిన తర్వాత రోజువారీగా 10 వేలకుపైగా మహిళలు అదనంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. ఉచిత ప్రయాణంతో మహిళలు ఉద్యోగాలకు, విద్యాసంస్థలకు, ఆసుపత్రులకు, మార్కెట్లకు వెళ్లడంలో భయపడకుండా ఆర్టీసీ సేవలను ఉపయోగించుకుంటున్నారు. జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలకు ప్రయాణ రక్షణ ఇవ్వడమే కాకుండా, వారి ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తోంది. దీంతో మహిళల సామాజిక, ఆర్థిక స్థితిలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. మహిళా ఉద్యోగులకు వరం జిల్లాలో పనిచేస్తున్న పలువురు మహిళా ఉద్యోగులు నిత్యం అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. హన్మకొండ, ఉప్పల్, కూకట్పల్లి, హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఉచిత సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణానికి విశేష స్పందన 29 నెలల్లో రూ.3.24 కోట్ల మహిళా ప్రయాణికులు రూ.160 కోట్లకు పైగా ఆదాయం రోజువారీగా 10 వేల అదనపు మహిళా ప్రయాణికులు సేవల విస్తరణపై అధికారుల దృష్టి -
సాయుధపోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య గొప్ప పోరాటయోధుడని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూమి, భుక్తి, విముక్తి కోసం అనే నినాధంతో పోరాటం చేసి ప్రజల్లో స్ఫూర్తి నింపారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు లక్ష్మీనర్సింహరావు, రవీందర్, డి.మల్లికాంబ, జె.మల్లేష్, కె.రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తిపన్నుపై 5శాతం రాయితీ
జనగామ: మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూళ్లను పెంపొందించేందుకు పురపాలక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రస్తుత ఆస్తిపన్నుపై 5 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పురపాలక కమిషనర్లకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ టీకే శ్రీదేవి సర్క్యులర్ జారీ చేశారు. 1 నుంచి అందుబాటులోకి.. 2026 ఏప్రిల్ 1 నుంచి ఇదే నెల 30 వరకు ఆస్తి పన్ను చెల్లించే యజమానులకు 5శాతం రాయితీ వర్తిస్తుంది. సమయానికి పన్ను చెల్లింపులను ప్రోత్సహించడం, ఆదాయ వసూళ్లను పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ రాయితీని అమల్లోకి తీసుకొచ్చింది. దీనిపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. రాయితీ ప్రయోజనాలు ప్రజలకు చేరేలా ప్రతి మున్సిపాలిటీలోనూ పన్ను మేళాలను నిర్వహించాలని పేర్కొన్నారు. పన్ను చెల్లింపులను మెరుగుపరచేందుకు కమిషనర్లు నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. జనగామలో 15,847 అసెస్మెంట్లు జనగామ మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం మిక్స్డ్, నాన్–రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ కలిపి మొత్తం 15,847 అసెస్మెంట్లు ఉన్నాయి. రాబోయే 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.3.80 కోట్ల మేర డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ ఆస్తిపన్ను చెల్లించేందుకు ఉత్సాహంగా ఉన్న యజమానులకు ప్రభుత్వం ప్రకటించిన 5శాతం రాయితీ శుభవార్తగా మారింది. పన్ను వసూళ్లలో పెరుగుదల సాధించడంతో పాటు రెవెన్యూ పరంగా మరింత బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య అభివృద్ధికి ముందడుగుగా భావిస్తున్నారు. ప్రతీ సంవత్సరం వసూళ్లు 100శాతం లక్ష్యానికి చేరుకోవడంలో ఇలాంటి స్కీంలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ప్రభుత్వ ఉద్దేశ్యం. స్టేషన్లో రూ.1.13కోట్ల డిమాండ్ జిల్లాలోని స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 6,452 అసెస్మెంట్లు ఉండగా, 2026–27 డిమాండ్ రూ.1.13కోట్ల మేర ఉంది. ప్రభుత్వం ప్రకటించిన 5శాతం రాయితీని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా పురపాలిక అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో అవకాశం ముందస్తు చెల్లింపుదారులకు ప్రయోజనం జనగామ మున్సిపాలిటీ డిమాండ్ రూ.3.80కోట్లు 15,847 అసెస్మెంట్లు.. స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో రూ.1.13కోట్ల డిమాండ్ -
లాభసాటి వ్యవసాయం వైపు అడుగులు వేయాలి
● డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అనిత జనగామ రూరల్: లాభసాటి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ జి.అనిత అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం చిటుకోడూర్ గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ గిరి రాజు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్ కూకట్ల యాదగిరి అధ్యక్షతన రైతులను అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అగ్రికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ అనిత మాట్లాడుతూ..గ్రామాల్లో నేల స్వభావాన్ని బట్టి పంటల మార్పిడి చేయాలన్నారు. ఉద్యానవన పంటలతో తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి కిరణ్, రైతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘మత్తు’ దిగాల్సిందే!
జనగామ: జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణ, అక్రమ రవాణా నివారణ కోసం జిల్లా ఎన్సీఓఆర్డీ కమిటీ సమావేశం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన ఇటీవల జరిగింది. ఈ మేరకు కలెక్టర్ పలు కీలక సూచనలు ఇచ్చారు. శాఖల వారీగా నిఘా నార్కోటిక్ డ్రగ్స్, అంఫెటమిన్స్, ఇతర సింథటిక్ పదార్థాలపై నిఘా ఉంచేందుకు ఎకై ్సజ్ శాఖకు బాధ్యతలు అప్పగించారు. రోజుకు కనీసం 5 కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పబ్లిక్ ప్రదేశాల్లో సర్వైలెన్స్ పర్యవేక్షణను పెంచడంతో పాటు యూరిన్ డ్రగ్ టెస్టింగ్ కిట్ల అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సందేహాస్పద ప్రదేశాల్లో తరచూ పరీక్షలు చేస్తూనే, టాడీ నాణ్యతను నిర్ధారించేందుకు సమయానుకూల తనిఖీలు ఉండాలని ఆదేశించారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులు పొడి (స్నఫ్), పట్టు, గుట్కా వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పనిచేయాలని వైద్యారోగ్య శాఖకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రుల్లో ప్రత్యేక తనిఖీలు ఉండాలని సూచనలు చేశారు. విద్యార్థుల్లో డ్రగ్ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు, చిత్ర లేఖనం, ప్రచార కార్యక్రమాల ద్వారా విద్యాసంస్థల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో చైతన్యం కలిగించాల్సి ఉంటుంది. జిల్లాలో హేమ్ వంటి నిషేధిత పంటల అక్రమ సాగును గుర్తించి చర్యలు తీసుకునే విధంగా ఇతర శాఖలతో వ్యవసాయ శాఖ సమన్వయం చేసుకోవాలి. కార్మికులు ఎక్కువగా ఉండే రైస్ మిల్లులు, తదితర ప్రాంతాల్లో డ్రగ్ వాడకంపై నిఘా ఉంచాలి. ఇందుకు సంబంధించిన ప్రతి నివేదికను ఆలస్యం చేయకుండా కలెక్టర్కు పంపించాలి. మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లో తనిఖీలు రైల్వేస్టేషన్తో పాటు పలు పాన్షాపులు, ఇతర దుకాణాల్లో సహాయ కార్మిక అధికారి కుమారస్వామి, టీం సభ్యులతో కలిసి గురువారం తనిఖీలు నిర్వహించారు. ఎన్సీఓఆర్డీ, డ్రగ్ ట్రాఫికింగ్ విషయంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయా శాఖల అధికారులతో కలిసి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు రైల్వే స్టేషన్తో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశామన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణపై కలెక్టర్ దృష్టి ప్రత్యేక టీంల ఏర్పాటు.. నిఘా పెంచేందుకు ఎకై ్సజ్ శాఖకు బాధ్యతలు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచన కేసుల నమోదు, కఠిన చర్యలకు ఆదేశం -
మహనీయుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, సంఘ సంస్కరణల కోసం కృషి చేసిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం కలెక్టరేట్లో బాబు జగ్జీవన్రామ్ జయంతి, అంబేడ్కర్ జయంతి వేడుకల ఏర్పాట్లపై డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలిసి వివిధ కుల సంఘాల ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, అలాగే 14వ తేదీన బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా బాధ్యతా యుతంగా పని చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్సీ సంక్షేమ అధికారి విక్రమ్, ఆర్డీఓ గోపీరాం, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, కుల సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి
● ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మిజనగామ రూరల్: ప్రపంచంలో వస్తున్న మార్పులను విద్యార్థులు గమనించి సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల కార్యదర్శి కె.సీతాలక్ష్మి అన్నారు. గురువారం పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ బాలికల కళాశాలలో నిర్వహించిన ప్రజ్ఞాన్ సైన్స్ ఫెస్ట్కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.. ఏఐ, క్వాంటమ్ శాటిలైట్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జి.సంధ్యారాణి, డిప్యూటీ సెక్రటరీస్ డీఎస్ వెంకన్న, కె.వేణుగోపాల్, ఓఎస్డీఎస్ సతీష్ గౌడ్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
పాపన్న త్యాగస్ఫూర్తి యువతకు ఆదర్శం
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: సామాజిక సమానత్వం, న్యాయం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న త్యాగస్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎన్.ఎల్.నరసింహరావు, ఏబీసీడీఓ రవీందర్, డీఎల్పీఓ వెంకట్ రెడ్డి, దిశ కమిటీ సభ్యులు బక్క శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు జాయా మల్లేష్, వైద్యుడు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి నర్మెట (తరిగొప్పుల): ప్రభుత్వ సంక్షేమ పథకాలను అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా తరిగొప్పుల గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. అనంతరం నూతన పథకాలైన ముఖ్యమంత్రి అల్పాహారం, ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, విభిన్న ప్రతిభా వంతులైన ఇంటర్ విద్యార్థులకు మోటారు వాహనాలు, పంట ల వైవిధ్యం, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. తహసీల్దార్ మొహసిన్ ముజ్తాబ, మండల ప్రత్యేక అధికారి రాణా ప్రతాప్, సర్పంచ్ అర్జుల జ్యోతి, కార్యదర్శి భాగ్యలక్ష్మి, కార్యదర్శి భాగ్యలక్ష్మి,అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. -
పుట్టెడు దుఃఖంతో పది పరీక్షకు హాజరు
స్టేషన్ఘన్పూర్: కన్నతండ్రి మృతిచెందిన బాధను దిగమింగుకొని ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన దేవరాయ సాంబయ్య (47), సంధ్య దంపతులకు కుమారుడు చరణ్, కుమార్తె పావని ఉన్నారు. చరణ్ స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, పావని తొమ్మిదో తరగతి చదువుతున్నారు. చరణ్ పదో తరగతి వార్షిక పరీక్షలను మండలంలోని నమిలిగొండ శివారు మాడల్స్కూల్ సెంటర్లో రాస్తున్నాడు. అయితే అనారోగ్యంతో బాధపడుతూ చరణ్ తండ్రి సాంబయ్య బుధవారం మృతిచెందాడు. చరణ్ దుఃఖాన్ని దిగమింగుకుని గురువారం జరిగిన భౌతికశాస్త్రం పరీక్షకు హాజరయ్యాడు. అనంతరం స్వగ్రామం తాటికొండకు వెళ్లి తండ్రి అంత్యక్రియలు చేశాడు. ఇంటి వద్ద తండ్రి మృతదేహం ఉన్నా బాధను దిగమింగుకుని పరీక్ష రాసిన చరణ్ను పలువురు ఓదార్చారు. ప్రియుడి మృతి తట్టుకోలేక యువతి ఆత్మహత్య నర్మెట: ప్రేమించిన యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపానికి గురైన యువతి సైతం బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాలకు చెందిన తరిగొప్పుల హారిక (22) అదే గ్రామానికి చెందిన అనుముల రాకేష్ రెడ్డి ప్రేమించుకుని ఏడాదికాలంగా హైదరాబాద్లో నివాసముంటూ మూడు నెలల క్రితం గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో విషయం తల్లిదండ్రులకు చెప్పడంతోపాటు తాము పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. కొద్దిరోజులు దూరంగా ఉండాలని, అనంతరం పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు సూచించడంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. ఈక్రమంలో గత నెల 28న రాకేష్ రెడ్డి (25) గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ 30న మృతి చెందాడు. దీంతో యువతిని తల్లిదండ్రులు నర్మెటలోని అమ్మమ్మ కొన్నె లక్ష్మి వద్ద వదిలి వెళ్లారు. కాగా, అప్పటికే ప్రియుడు మృతిచెందడంతో మనస్తాపంతో ఉన్న యువతి గురువారం మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి కవిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నగేష్ తెలిపారు. -
జిల్లాస్థాయి ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఎంపికలు
జనగామ రూరల్: జిల్లా స్థాయి ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఎంపికలు పట్టణంలోని మినీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలబాలికలు, మెన్, ఉమెన్లలో అథ్లెటిక్స్ ఎంపికలు జరుగుతాయని, ఇందులో ఎంపికై న క్రీడాకారులు 11,12తేదీల్లో హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మెమోతో మినీ స్టేడియంలో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు గంగిశెట్టి మనోజ్ కుమార్ 9885046437, ఆవుల అశోక్ 9912453220, వంచ చంద్రశేఖర్ రెడ్డి 7799552233, తూడి రంజిత్ 99852 23047 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. జాతీయస్థాయి సబ్ జూనియర్ క్రీడాపోటీలకు విద్యార్థినుల ఎంపిక పాలకుర్తి టౌన్: మహారాష్టలోని పుణేలో ఈనెల 3 నుంచి 6 వరకు జరగనున్న 35వ జాతీయస్థాయి సబ్ జూనియర్ క్రీడాపోటీలకు తెలంగాణ కబడ్డీ జట్టులో పాలకుర్తి మండలం తొర్రూరు(జె) ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని పసులాది నవ్య, చెన్నూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని అంజలి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ చిట్ల ఉపేందర్రెడ్డి, మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకుడు గంట రవీందర్, ఎంఈఓ పోతుగంటి నర్సయ్య, మాచర్ల భిక్షపతి, కొయ్యాడ మల్లేష్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు గార్ల మల్లికార్జున్, ఉపాధ్యక్షులు కుటింకటి శ్రీనివాస్, కొడిశాల అశోక్, గ్రామస్థులు, ఉపాధ్యాయులు విద్యార్థినులను అభినందించారు. డిగ్రీ రీవాల్యూయేషన్ ఫలితాల విడుదల కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, ఒకేషనల్, బీకామ్ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల రీవాల్యూయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు గురువారం కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. డిగ్రీ కోర్సుల మొదటి సెమిస్టర్ రీవాల్యూయేషన్కు 4,899మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 658మంది (13.43శాతం) విద్యార్థులు బెనిఫిట్స్ పొందినట్లు సమాచారం. మూడో సెమిస్టర్లో 4,616 మంది రీవాల్యూయేషన్కు దరఖాస్తు చేసుకోగా.. 606 మంది (13.13శాతం) బెనిఫిట్స్ పొందారు. ఐదో సెమిస్టర్కు 3,918 రీవాల్యూయేషన్కు దరఖాస్తులు రాగా. 704 మంది (17.97శాతం)బెనిఫిట్స్ పొందినట్లు రాజేందర్ తెలిపారు. రీవాల్యూయేషన్ ఫలితాలు కాకతీయ యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు ఆయన స్పష్టం చేశారు. -
మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు
● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డిదేవరుప్పుల: జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు దశలవారీగా చర్యలు చేపడుతున్నట్టు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని ధర్మాపురం 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్న్లో ఆదనంగా 5.0 పవర్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం పెంపుదలకు మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యుత్ సంబంధిత సమస్యల కోసం సమీపంలోని విద్యుత్ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని లేదా టోల్–ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేయాలని సూచించారు. డీఈలు ఎం.లక్ష్మీనారాయణరెడ్డి, వి. విజ య్కుమార్, ఏడీఈలు అనిల్కుమార్, శ్రీధర్, ఏఈ లు నర్సింహ్మరెడ్డి, కుమారస్వామి పాల్గొన్నారు. -
దూరవిద్య అడ్మిషన్లకు గడువు పెంపు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి లోని దూరవిద్య సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యూకేషన్(సీడీఓఈ)లో డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 10వరకు గడువు పొడిగించినట్లు సీడీఓఈ డైరెక్టర్ ఆచార్య సురేష్లాల్ గురువారం తెలిపారు. డిగ్రీ బీఏ, బీకాం జనరల్, బీకాం కంప్యూటర్స్, బీబీఏ, బీఎల్ఐఎస్సీ, బీఎస్సీ కోర్సులు, పీజీఎంఏ, ఎంకామ్, ఎ మ్మెస్సీ, ఎంఎల్ఐఎస్సీ, ఎంసీఏ, డిప్లోమా కోర్సుల్లో డిప్లోమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, డిప్లోమా ఇన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాస్, డిప్లోమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, డిప్లోమా ఇన్ యోగా, ఎన్విరాన్మెంటల్ అండ్ అక్యుపేషనల్ హెల్త్, రూరల్ డెవలప్మెంట్, హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. ఆన్లైన్, ఆఫ్ లైన్లో అడ్మిషన్లు పొందే అవకాశం ఉందని తెలిపారు. దరఖాస్తులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్డీఎల్సీఈకేయూ.కో.ఇన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. -
ఆటలాడుకున్న అరుగే సమాధి!
చెన్నారావుపేట: ఆటలాడుకున్న ఇంటి అరుగే ఆ చిన్నారులకు సమాధిగా మారింది. ఈ హృదయ విదారక సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్యం తండాలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బోడమాణిక్యం తండాకు చెందిన బోడ స్రవంతి, ప్రవీణ్ దంపతులు హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి కుమారులు కార్తీక్, కౌశిక్ ఉన్నారు. రాఘవేంద్ర కాలనీలో స్రవంతితోపాటు ఇద్దరు పిల్లలు మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వగ్రామం బోడమాణిక్యం తండాకు తీసుకొచ్చారు. ముగ్గురి మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు బంధువులు ప్రవీణ్ ఇంటి ఎదుట గుంతలు తీశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారి కళ్లలో కారం చల్లి ఇద్దరు పిల్లల మృతదేహాలను ఈ గుంతలో పూడ్చిపెట్టారు. అనంతరం స్రవంతి మృతదేహాన్ని సమీపంలోని వారి పత్తిచేనులో దహనం చేశారు. ప్రవీణ్ ఇంటి ఎదుట సమాధి చేసిన చిన్నారుల మృతదేహాలు మళ్లీ తీసే ప్రసక్తే లేదని తండావాసులు తెగేసి చెబుతున్నారు. కాగా, మూడు రోజులుగా కొనసాగిన ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఇదిలా ఉండగా.. స్థానిక సర్పంచ్ ఉమామోహన్ గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. బోడమాణిక్యం తండాలో పిల్లల మృతదేహాల పూడ్చివేత -
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా
● మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ జనగామ: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ అన్నారు. గురువారం ప్రజాపాలనలో భాగంగా 22వ వార్డులో నిర్వహించిన సభలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.. సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేరుస్తున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు వారికి ఇంకా ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకొని అర్జీలు స్వీకరించేందుకు వార్డు స్థాయి సభలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, పలు శాఖల అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. మెడికల్ షాపు అనుమతుల తాత్కాలిక రద్దు జనగామ: పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్లో ఉన్న మెడ్ప్లస్ ఫార్మసీ నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నట్లు జిల్లా డ్రగ్ అధికారి బాలకృష్ణ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల మెడ్ప్లస్ పార్మసీని తనిఖీ చేసినట్లు చెప్పారు. తమ పరిశీలనలో ఔషధాలు, సౌందర్య సాధనాల చట్టం–1940 ప్రకారం ఉన్న నిబంధన 65ను ఫార్మసీ పలుమార్లు ఉల్లంఘించినట్లు స్పష్టం చేశారు. కొనుగోలు బిల్లుల నిర్వహణ, రికార్డుల నిర్వహణలో లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీ నివేదికను ఔషధ నియంత్రణ విభాగం సహాయ సంచాలకులు, వరంగల్ వారికి పంపించగా, అక్కడ పరిశీలించి మెడ్ప్లస్ ఫార్మసీ ఔషధ విక్రయ అనుమతులను తాత్కాలికంగా సస్పెండ్ చేసే నిర్ణయం తీసుకున్నారన్నారు. గంగాపూర్లో మద్యపాన నిషేధంబచ్చన్నపేట : మండలంలోని గంగాపూర్ గ్రామంలో ఈనెల 10 నుంచి మద్యపాన నిషేధం అమలు చేస్తున్నట్లు సర్పంచ్ జిల్లెల్ల భాస్కర్ రెడ్డి ప్రకటించారు. గురువారం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో మెజార్టీ ప్రజల ఆమోదం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో మద్యం విక్రయించిన వారికి పంచాయతీ ఆధ్వర్యంలో రూ.50 వేల జరిమానా, మ ద్యం విక్రయిస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తే రూ.5వేల నజరాన అందిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ జిలుకర కుమారస్వామి, వార్డు సభ్యులు అనసూయ, రాధిక,, రవళిక, మమత, కవిత, భారతమ్మ, తిరుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమేష్ రెడ్డి పాల్గొన్నారు. మొక్కజొన్న కోసే యంత్రంలో పడి రైతుకు తీవ్రగాయాలు పాలకుర్తి టౌన్: మొక్కజొన్న కోసే యంత్రంలో పడి గురువారం ఓ రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని తీగారం గ్రామానికి చెందిన రైతు చెన్నూరి చంద్రమౌళికి మొక్కజొన్న కోస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం హన్మకొండలోని ఆసుపత్రికి తరలించారు. -
ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తిచేయాలి
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గురువారం కలెక్టర్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై మండలాల వారీగా గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. మే 31 డెడ్లైన్గా పెట్టుకొని మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో పీడీ మాతృ నాయక్, ఆయా మండలాల ఏఈలు, తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవలో నిబద్ధత, పారదర్శకతకు ప్రాధాన్యం ప్రజా సేవలో నిబద్ధత, పారదర్శకతే ప్రాధాన్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ ట్రెయినీ గ్రూప్–1 అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఆర్డీఓ వసంత, అడిషనల్ డీఆర్డీఓ నూరుద్దీన్, డీపీఎంలు పాల్గొన్నారు. -
ఏడాదిలోపు పాంనూర్ బంజరుకాల్వ పూర్తి
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: ఏడాది లోపు మండలంలోని పాంనూర్లో బంజరుమాటు, పర్రె కాల్వ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభల్లో భాగంగా మండలంలోని పాంనూర్లో గురువారం నిర్వహించిన గ్రామసభకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. పాంనూర్ నుంచి నమిలిగొండ వరకు బీటీ రోడ్డు పనులు చేయిస్తానని హామీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పోలెపల్లి సంపత్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సునీల్, ఉపసర్పంచ్ తాళ్లపెల్లి జయశివకుమార్, మండల ప్రత్యేక అధికారి విక్రమ్, తహసీల్దార్ స్వప్న, ఎంపీడీఓ విజయశ్రీ, ఎంపీఓ నర్సింగరావు, హౌసింగ్ డీఈ చంద్రశేఖర్, ఏఓ చంద్రన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు జఫర్గఢ్: రాష్ట్రంలోని ఇంటింటికీ ఉపయోగపడే సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఉప్పుగల్లులో జరిగిన సభకు సర్పంచ్ కొడారి సాంబ రాజు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీహరి హాజరై మాట్లాడారు.. గ్రామంలో ఉన్న రిజర్వాయర్కు ఉప్పుగల్లు రిజర్వాయర్గా పేరు పెట్టించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి విజయ్కుమార్, ఎంపీడీఓ సుమన్, తహసీల్దార్ శ్రీనివాస్, ఏఓ నర్సింగరావు, ఏపీఎం కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జాతర చూసేందుకు వెళ్లి..
చిల్పూరు: జాతర చూసేందుకు వెళ్లి వాగులో పడి ఇద్దరు బాలురు మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా చిల్పూరు మండలం నష్కల్ గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, ఎస్సై సిరిపురం నవీన్కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని వంగాలపల్లి గ్రామానికి చెందిన గూటం ప్రవీణ్–హరిత దంపతుల కుమారుడు అఖిలానంద (14) ఎనిమిదో తరగతి, నూనె సదానందం–స్వప్న దంపతుల కుమారుడు మనోజ్కుమార్ (13) స్థానికంగా ఏడో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ స్నేహితులు. ఒంటిపూట బడులు కావడంతో మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నష్కల్ గ్రామంలోని రామాలయం దగ్గర జరుగుతున్న జాతరను చూసేందుకు సాయంత్రం ఇద్దరు కలిసి సైకిల్పై వెళ్లారు. అనంతరం రామాలయం వెనుక ఉన్న ఆకేరు వాగు వద్దకు వెళ్లారు. అక్కడ సైకిల్ కడుగుతున్న సమయంలో రైతులు వాగు దాటేందుకు ఏర్పాటు చేసుకున్న తెడ్డు కనిపించింది. దానిపై సైకిల్ పెట్టి ఇద్దరు కూర్చుని కొద్ది దూరం వెళ్లారు. అదిఒక పక్కకు ఒరగడంతో సైకిల్తో పాటు ఇద్దరు నీటిలో పడిపోయారు. ఆసమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇద్దరు ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకుని నీటిలో మునిగి మృతి చెందారు. కొద్దిసేపటికి కొందరు రైతులు అటుగా వెళ్తుండగా వాగు ఒడ్డుకు చెప్పులు కనిపించాయి. అనుమానంతో వాగులో గాలించగా నీటిలో మునిగిన సైకిల్తోపాటు బాలుర మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మనోజ్కుమార్(ఫైల్) , అఖిలానంద (ఫైల్) ఆకేరు వాగులో పడి ఇద్దరు బాలుర మృతి వంగాలపల్లిలో విషాదం -
మళ్లీ పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధరలు
జనగామ: కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర మరోసారి పెరగడంతో చిన్న, మధ్య తరహా వ్యాపారులపై భారం మరింత పెరిగింది. 15 రోజుల క్రితం రూ.60లు పెరిగిన ధరను మరోసారి రూ.215 మేర బాదడంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,327కు చేరింది. కేవలం రెండు వారాల్లోనే రూ.275 పెరుగుదల నమోదవడంతో టీ స్టాల్స్, చిన్న హోటల్స్, చిరు వ్యాపారులపై అదనపు భారం కానుంది. జిల్లాలో అన్ని కేటగిరీలను కలుపుకుని 800 నుంచి 1,500 వరకు హోటల్స్, ఫుడ్ అవుట్లెట్లు ఉన్నప్పటికీ కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు 30 శాతం కూడా లేవు. బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేసే వారు కొందరైతే, అత్యధిక సంఖ్యలో సబ్సిడీ సిలిండర్లతో వ్యాపారం చేస్తున్నారు. దీనిపై సివిల్ సప్లయీస్ అధికారులు నిరంతరం దాడులు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ ప్రభావం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు రేట్లు పెరగడం కారణంగానే కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచుతూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. సప్లై ప్రారంభం 15 రోజులుగా సరఫరా నిలిచిన కమర్షియల్ సిలిండర్లు ఒకటి, రెండు రోజులుగా తిరిగి అందుబాటులోకి రావడంతో ఏజెన్సీలు కొత్త ధరలకే సరఫరా చేస్తున్నారు. ఇదే సమయంలో గతంలో హోటల్ నిర్వాహకులు రోజూ ఎన్ని సిలిండర్లు కొనుగోలు చేశారనే లెక్కపై సుమారు 60 శాతం మేరకు మాత్రమే ఇప్పుడు విక్రయాలు జరుపుతున్నట్లు ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి. వ్యాపారం తగ్గిన పరిస్థితుల్లో మరింత భారం మోసే పరిస్థితి ఎదురవుతుందనే ఆందోళన హోటల్ వ్యాపారుల్లో నెలకొంది. కాగా, కమర్షియల్ గ్యాస్ సప్లై పునఃప్రారంభం కావడంతో బడా హోటల్ యజమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.● హోటల్ వ్యాపారులపై పెను భారం సిలిండర్పై రూ.215 పెంపు -
దావత్కు వెళ్లొస్తూ.. తిరిగిరాని లోకాలకు
● అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు ● ఇద్దరు అన్నదమ్ముళ్ల దుర్మరణం.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు ● మృతులు, క్షతగాత్రులది తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామంధర్మసాగర్/జనగామ: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామశివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ముళ్లు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఏనుగుల రాజయ్య, రాజవ్వలకు ముగ్గురు కుమారులు. వీరిలో లోకేష్(26) వ్యవసాయం చేస్తుండగా ఈ ఏడాది క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం ఆయన భార్య ఐదు నెలల గర్భవతి, మరో కుమారుడు అశోక్ (24). ఇతడు యశ్వంతపూర్ క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వీరిద్దరితో పాటు అదే గ్రామానికి చెందిన మరో ఐదుగురు హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తికి ఓ దావత్ కార్యక్రమానికి బంధువులకు చెందిన కారులో వెళ్లారు. తిరిగి నర్సాపూర్కు వస్తున్న క్రమంలో ముప్పారం శివారులోకి రాగానే కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొనగా లోకేష్, అశోక్ అక్కడికక్కడే మృతిచెందగా ఇరుకుల ప్రశాంత్, అజయ్, వినయ్ ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరుకుల వెంకటేష్, నవీన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఎంజీఎంకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీధర్రావు తెలిపారు.


