breaking news
Jangaon District Latest News
-
లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025–26 కింద లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టి ఈ నెల 24 లోపు పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో యాక్షన్ ప్లాన్ అమలుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను ఎస్సీ జనాభా ప్రాతిపదికగా మూడు కేటగిరీల వారీగా మండలాలు, మున్సిపాలిటీలకు కేటాయించినట్లు తెలిపారు. రుణాల మంజూరు, బ్యాంకు ఖాతాలు, డాక్యుమెంటేషన్, ఇతర బ్యాంకింగ్ సేవలకు సంబంధించి లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసి ప్రభుత్వ లక్ష్యాల సాధనకు పూర్తి సహకారం అందించాలని బ్యాంకర్లకు సూచించారు. సమావేశంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల శాఖ అధికారులు, కార్యనిర్వాహక సంచాలకులు, ఎంపీడీఓలు, మున్సిపాలిటీల కమిషనర్లు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి● రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్ జనగామ రూరల్: రహదారులపై ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి అదనపు కార్యదర్శితో కలిసి రవాణా, ఆర్ అండ్బీ, కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. దీనికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్ మాట్లాడుతూ..జిల్లాస్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశాలు ప్రతినెలా నిర్వహించాలని తెలిపారు. టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని, రహదారులపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ లను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, రహదారి భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. వాహనదారులు తప్పకుండా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రామానుజుల బోధనలు నేటికీ ఆచరణీయం ● త్రిదండి చినజీయర్ స్వామి జనగామ: వెయ్యి సంవత్సరాల క్రితం సమతామూర్తి భగవత్ రామానుజాచార్యులు బోధించిన విలువలు నేటికీ, భవిష్యత్తులోనూ ఆచరణీయమేనని త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి అన్నారు. పట్టణంలోని బాణాపురం శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న తృతీయ పుష్కర వేడుకల సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.. రామానుజుల వారి జీవితం, బోధనలను కవితా రూపంలో ప్రజలకు చేరవేస్తున్న కవులను అభినందించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, కవులు, కళాకారులను స్వామిజీ సత్కరించారు. ఉదయం శ్రీ సుదర్శన యాగం చినజీయర్ స్వామి సమక్షంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా నిర్వహించారు. వేడుకల సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చిన జీయర్ స్వామి వస్త్రాలను అందించారు. -
విద్యుత్రంగ అభివృద్ధికి సహకారం అందిస్తా..
స్టేషన్ఘన్పూర్: నియోజకవర్గంలో విద్యుత్ పరమైన అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. డివిజన్ పరిధిలోని విద్యుత్శాఖ అధికారులు స్టేషన్ఘన్పూర్ డీఈ బి.సారయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మంగళవారం హనుమకొండ ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. డివిజన్ పరిధిలో ఇటీవల జరిగిన పలు విద్యుత్ అభివృద్ది కార్యక్రమాలతో పాటు వినియోగదారులకు అందించాల్సిన పలు విద్యుత్ సౌకర్యాలపై ఎమ్మెల్యేతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేలా విద్యుత్ అధికారులతో పాటు సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏడీఈ రణధీర్రెడ్డి, జఫర్గఢ్ ఏఏఈ ఎం.కరుణాకర్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంజనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సంబంధిత పీజీ కోర్సుల్లో 55 శాతం మార్కులతో పాసై ఉండాలని (ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం), నెట్,సెట్, పీహెచ్డీ ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 24వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 25వ తేదీ ఉద యం 11:00గంటలకు కళాశాలలో ఇంటర్వ్యూ ఉంటుందని, మరిన్ని వివరాలకు 99591 51051ఫోన్నంబర్లో సంప్రదించాలన్నారు. బీఎఫ్సీ,–1.కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్– 2, ఇంగ్లిష్–2, హెల్త్ కేర్–1 హిస్టరీ–1, పొలిటికల్ సైనన్స్ 1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్–1,తెలుగు–1 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. గ్రామాలాభివృద్ధే ధ్యేయంబచ్చన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, గోపాల్నగర్లో, బచ్చన్నపేటలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతీ ఓటరు తమ వివరాలను ఎన్యుమరేషన్ ఫారంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. నూతనంగా ఎన్నికై న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహమ్మద్ మసూద్ను సన్మానించారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ వెంకట్రెడ్డి, సర్పంచ్లు అల్వాల నర్సింగారావు, ఇజ్జగిరి రాములు, బళ్ల రవీంద్రనాథ్, నాయకులు పిన్నింటి కావ్యశ్రీ, జంగిటి విద్యానాథ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్గాంధీ అరెస్ట్ను ఖండిస్తున్నాంజనగామ: న్యూఢిల్లీలో విద్యార్థుల హక్కుల పరిరక్షణతో పాటు నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తున్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఇతర నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ జిల్లా కమిటీ అధ్యక్షురాలు ధన్వంతిలక్ష్మీనారాయణ తీవ్రంగా ఖండించారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఆమె మాట్లాడుతూ.. దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బ తీసిన నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్య తగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధా న్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ఇతర నాయకుల అరెస్ట్ను వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యార్థుల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం గౌరవించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. -
ఓవైపు వర్షాభావం..
మరోవైపు ఎరువుభారం!జనగామ రూరల్: వానాకాలం సీజన్ ప్రారంభమై యాభై రోజులు దాటినా సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఈనేపథ్యంలో కనీసం తమకున్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుందామంటే ఎరువుల ధరలు భారీగా పెరగడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. యూరియా మినహా మిగతా ఎరువులకు కేంద్రం ఇచ్చే రాయితీ స్థిరంగా ఉంటుంది. ఉత్పత్తి, ఖర్చుల ఆధారంగా ఆయా కంపెనీలు రైతులకు విక్రయించే ఎరువుల ధరలను పెంచుకునేలా కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ముడిసరకులు, దిగుమతి ఖర్చుల పేరిట కంపెనీలు పదేపదే ఎరువుల ధరలు పెంచుతున్నాయి. ప్రభుత్వం రాయితీతో అందజేసే డీఏపీ రూ.1,350, యూరియా రూ.266 ధరలు మినహా మిగతా ఎరువుల ధరలు అన్నింటినీ పెంచారు. ఆర్థిక భారం జిల్లాకు 70,900 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరమవుతాయి. వీటిలో ప్రతీ ఎరువు 50 కిలోల సంచికి రూ.300–400లకు పైగా ధరలు పెరిగాయి. దీంతో పెట్టుబడిలో ఒక్కో రైతు రూ.4వేల వరకు అదనంగా భారం మోయాల్సిన పరిిస్థితి నెలకొంది. డీఏపీ వాడకాన్ని తగ్గించేందుకు రెండు, మూడు డీఏపీ సంచులు తీసుకునే రైతులకు నానో డీఏపీ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే రైతులు నానో డీఏపీ తీసుకోవడానికి మొగ్గు చూపడం లేదు. డీఏపీ బస్తా ధర రూ.1,350లు కాగా.. నానో డీఏపీ బాటిల్ ధర రూ.560లు ఉంది. అయినా కూడా పంట దిగుబడి సరిగ్గా వస్తుందో లేదోనని రైతులు భయపడి నానో డీఏపీ వాడడానికి వెనకంజ వేస్తున్నారు. ధరలు తగ్గించాలి ఎరువుల ధరలు భారీగా పెరగడంతో రైతులు పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎల్నిలో ప్రభావంతో పంట సాగు అంతంత మాత్రమే ఉండగా ప్రత్యామ్నాయ పంట లపై అవగాహన కల్పించడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం ఎరువు భారం తగ్గించాలి. – చందూ నాయక్, జిల్లా కార్యదర్శి, రైతు సంఘం సాగు అంతంత మాత్రమే..ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో వరి సాగు అంతంత మాత్రంగానే ఉంది. మద్దతు ధర నామమాత్రంగా పెంచి ఎరువుల ధరలు మాత్రం భారీగా పెంచారు. ఆరుతడి పంటలను సాగుచేయాలని చెబుతున్నా ప్రభుత్వం విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలి. ఎరువుల ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలి. – ఎడ్ల శ్రీనివాస్, మరిగడి యూరియా డీఏపీ ఎన్పీకే ఎంఓిపీ ఎస్ఎస్పీదిక్కుతోచని స్థితిలో అన్నదాతలు సాగు చేద్దామంటే వానలు లేవు.. వేసిన పంటను దక్కించుకుందామంటే కొండెక్కిన ఎరువులు నానో డీఏపీ తీసుకోవాలంటున్న అధికారులు దిగుబడిపై అనుమానంతో మొగ్గుచూపని రైతులుజిల్లాకు అవసరమయ్యే కాంప్లెక్స్ ఎరువులు (మెట్రిక్ టన్నుల్లో) -
ఎమ్మెల్యేలు ఏమన్నారంటే..
● వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్లో మిషన్ భగీరథ పైప్లైన్ల లీకేజీలతో తాగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. తక్షణం సరిచేయాలని కోరారు. ● స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు తాగునీరు, సాగునీటికి దేవాదుల ప్రాజెక్టే ప్రధాన ఆధారమని అన్నారు. మూడు దశల్లోని 10 మోటార్లను కనీసం 100 రోజులపాటు నిరంతరాయంగా నడిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక లోపాలు తలెత్తితే 48 గంటల్లోపు మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. ● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ హసన్పర్తి మండలంతోపాటు విలీన గ్రామాల్లో తాగునీటి సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. వర్ధన్నపేటలో అమృత్ పథకం పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ● భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ తక్కువ నీటితో అధిక ఆదాయం వచ్చే వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. దేవాదుల ప్రాజెక్టు, భీమ్ఘనపూర్, చలివాగు తదితర నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ ఎరువుల సరఫరాపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ● మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ పట్టణంలో తాగునీటి పంపిణీలో ఇబ్బందులు ఉన్నాయని, ముఖ్యంగా మెడికల్ కాలేజీకి ప్రత్యామ్నాయ వనరుల ద్వారా నీరు అందించాలని కోరారు. డ్రిప్ ఇరిగేషన్పై రైతులకు అవగాహన కల్పించి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. సమీక్షలో పాల్గొన్న ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, నాగరాజు, మురళీనాయక్ -
త్వరగా ప్రాజెక్టు పూర్తికి చర్యలు.. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి ఉమ్మడి జిల్లాలో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అంతా సిద్ధం
హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎల్నినోతో నెలకొన్న కరువు పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలు, రైతుల ప్రయోజనాలు, సాగు, తాగునీటి లభ్యత, పశుసంపద రక్షణ తదితర అంశాలపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెకర్లు, అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. జిల్లాల వారీగా ప్రస్తుత పంటల పరిస్థితులపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఎమ్మెల్యేలు స్థానిక పరిస్థితులను వివరించారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ అధికారి శ్రీదేవసేనను నియమించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఎల్నినో ప్రభావం, వర్షాభావం, వివిధ శాఖల సంసిద్ధతపై సుదీర్ఘ సమీక్ష హాజరైన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు దేవాదుల పూర్తికి ప్రభుత్వం చర్యలు : మంత్రి పొంగులేటి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సాగు, తాగునీటికి ప్రధాన ఆధారమైన దేవాదుల ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పంపింగ్ వ్యవస్థలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. తాగు, సాగునీరు, పశువులకు మేత, ఉపాధి హామీ పనులు, రైతులకు అవసరమైన విత్తనాల సరఫరాపై సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. లెమన్ గ్రాస్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై వచ్చిన సూచనలు పరిశీలిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలిస్తే ప్రభుత్వం స్వాగతిస్తుందని, అవసరమైతే దేవాదులపై ప్రత్యేకంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రైతులకు శాసీ్త్రయ అవగాహన కల్పించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులపై శాస్త్రవేత్తల అంచనాలను గ్రామస్థాయికి తీసుకెళ్లి రైతులకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమన్నారు. ఈ సీజన్లో తీసుకునే నిర్ణయాలు వచ్చే ఏడాది జూన్ వరకు ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. కలెక్టర్ల నేతృత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో రైతులకు శాసీ్త్రయ ఆధారాలతో అవగాహన కల్పించాలని, కరపత్రాలు, ఇతర ప్రచార సాధనాల ద్వారా ప్రత్యామ్నాయ పంటలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. -
ట్రేడ్ లైసెన్స్లు తప్పనిసరిగా తీసుకోవాలి
స్టేషన్ఘన్పూర్: మున్సిపాలిటీ పరిధిలో వాణిజ్య, వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు తమ సముదాయాలకు విధిగా ట్రేడ్ లైసెన్స్లు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది పట్టణ కేంద్రంలోని వైన్స్షాపులతో పాటు పలు వ్యాపార సముదాయాలను మంగళవారం తనిఖీ చేశారు. ట్రేడ్ లైసెన్స్లు తీసుకున్నారా? లేదా? అంటూ పరిశీలించారు. ఈ మేరకు కమిషనర్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఆదాయం కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేస్తున్నామన్నారు. వ్యాపారులు నిబంధనల మేరకు లైసెన్స్ ఫీజులు చెల్లించని పక్షంలో మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో మేనేజర్ సత్యనారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్ మధు, ఆర్ఐ శ్రీను, సిబ్బంది పాల్గొన్నారు. -
తెలంగాణ వనరులను దోచుకున్నారు..
● స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం శాఖలవారీగా పంచుకుని తెలంగాణ వనరులను దోచుకున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులున్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే కరువు వచ్చిందని మాజీ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. మేడిగడ్డ కుంగిపోతే కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయవచ్చు కదా అంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అఽథారిటీ సూచనల మేరకే పనిచేస్తాయని స్పష్టం చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వినయ్కుమార్, వైస్ చైర్మన్ నీల రాజమ్మ, పార్టీ పట్టణ అధ్యక్షుడు అంబటి కిషన్రాజ్, నాయకులు నీల గట్టయ్య, బూర్ల శంకర్, గన్ను నర్సింహులు, గట్టు రమేశ్, గుర్రం రమేశ్, పోశాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సంస్కృతి, సంప్రదాయాలను పాటించండి
జనగామ: సంస్కృతి, సంప్రదాయాలను పాటించడం ప్రతి ఒక్కరికీ శ్రీరామ రక్ష అని త్రిదండి చిన్న జీయర్ స్వామి అన్నారు. పట్టణంలోని బాణాపురం వెంకటేశ్వరస్వామి సన్నిధిలో జరుగుతున్న తృతీయ పుష్కర మహోత్సవాలు, మహా సుదర్శన యాగంలో భాగంగా సోమవారం విశేష సహస్రనా మార్చన, సుదర్శన హవనం, దంపతీ పూజలు, ఉగ్రరథ, భీమరథ, సహస్ర చంద్రదర్శన హవనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ.. నక్షత్రాలు, తిథులు, కాలం అనుకూలంగా ఉండాలంటే పూర్వీకులు అందించిన సంప్రదాయాలను ఆచరించాలని సూచించారు. అనంతరం స్థానిక కవుల ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. రేపు బండగుట్టకు చిన్న జీయర్స్వామి లింగాలఘణపురం: మండలంలోని బండగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి ఈ నెల 22న చిన్నజియర్స్వామి రానున్నారు. 32 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహంతో పాటు శంఖు చక్ర నామాలను ఆవిష్కరించనున్నారని ఉత్సవ నిర్వాహుకులు వంచ మహేశ్వర్రెడ్డి, లింగాల దీపక్రెడ్డి, వంచ రాంరెడ్డి తెలిపారు. జ్యూడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్నిక జనగామ రూరల్: డిస్ట్రిక్ట్ జ్యూడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిభ, నూతన అధ్యక్షుడిగా టి. రాజేందర్ సింగ్, జనరల్ సెక్రటరీగా జి.మహేందర్, వైస్ ప్రెసిడెంట్గా బి.పూల్చంద్, అసోసియేట్ ప్రెసిడెంట్గా ఐశ్వర్య, ట్రెజరీగా సంపత్, జాయింట్ సెక్రటరీగా ఎస్.కీర్తన జ్యోతి, స్పోర్ట్స్ సెక్రటరీగా ఎం. రామును ఎన్నుకున్నారు. శ్రీవెంకటేశ్వర కళాపరిషత్ ఆవిర్భావంజనగామ: జిల్లాలో రంగస్థల కళల అభివృద్ధి, కళాకారుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని శ్రీ వెంకటేశ్వర కళాపరిషత్ జనగామ పేరుతో సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేశారు. ఆదివారం పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో నిర్వహించిన తొలి సర్వసభ్య సమావేశంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల రంగస్థల కళా కారులు, నాటక రంగ ప్రముఖులు పాల్గొని సంస్థ ఏర్పాటుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సమావేశంలో శ్రీ వీరాంజనేయ నాట్యమండలి వ్యవస్థాపకుడు మేళ్లచెరువు వెంకట అప్పయ్య శాస్త్రి, కొండ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కొండ శ్రీనివాస్, స్టేషన్ఘన్పూర్కు చెందిన సింధూరి కొండలరావు (సురభి), నంచర్ల వైకుంఠం, ఈరవెన్ను నాటకరంగ కళాకారులతో పాటు పట్టణా నికి చెందిన ఔత్సాహిక కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాత్కాలిక కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా మోతే సురేందర్రెడ్డి, అధ్యక్షుడిగా మేళ్లచెరువు వెంకట అప్పయ్యశాస్త్రి, ముఖ్య సలహాదారుగా నంచర్ల వైకుంఠం, ఉపాధ్యక్షులుగా మేకల రమణారెడ్డి, పన్నీరు రాజు, ప్రధాన కార్యదర్శిగా గంగు నాగరాజు శర్మ, సహాయ కార్యదర్శిగా ఆంజనేయ శర్మ, కోశాధికారిగా చల్లా రాజనరసింహారెడ్డి, ప్రచార కార్యదర్శిగా కొండ శ్రీనివాస్, సంగీత దర్శకులుగా కొండలరావును నియమించారు. సభ్యులుగా గంగు సాంబమూర్తి, సిద్ధులు, నర్సిరెడ్డి, భాస్కర్రెడ్డి, వెంకటేశ్వర్లు, రామమూర్తిని ఎన్నుకున్నారు. భట్టు రమేశ్కు అభినందన కేయూ క్యాంపస్: హైదరాబాద్లో తెలంగాణ తెలుగు అకాడమీ డైరెక్టర్గా సోమవారం బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ భట్టు రమేశ్ను తెలుగు యూనివర్సిటీ మాజీ వీసీ హనుమాండ్ల భూమయ్య, వరంగల్ గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న, కేయూ దూరవిద్య ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కొట్టె భాస్కర్, పి.రవీందర్ సన్మానించారు. -
అద్వితీయం
మంగళవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2026అత్యుత్తమం..వ్యవసాయ పనితీరులో రాష్ట్రంలో జిల్లాకు రెండో స్థానం జనగామ: రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన జూన్–2026 పారామీటర్ వైజ్ డిస్ట్రిక్ట్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్లో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానం సాధించింది. గతంలో 25వ స్థానంలో ఉన్న జిల్లా.. ప్రస్తుత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం మూడున్నర నెలల్లోనే విశేష పురోగతి సాధించి రాష్ట్రంలో అగ్రశ్రేణి జిల్లాల్లో ఒకటిగా నిలవడం గమనార్హం. రాష్ట్రం రూపొందించిన ఏడు కీలక పనితీరు సూచికల్లో 70 మార్కులకు గాను 49.73 పాయింట్లు సాధించిన జిల్లా, పెద్ద జిల్లాలను మాత్రమే కాకుండా వ్యవసాయ పరంగా ముందంజలో ఉన్న అనేక జిల్లాలను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని దక్కించుకుంది. పెండింగ్ కేసుల పరిష్కారం.. రైతుబీమా, రైతు భరోసా వంటి పథకాల అమలులో అధికారులు దృష్టి సారించి దరఖాస్తులు పెండింగ్లో ఉండకుండా నిరంతర సమీక్షలు నిర్వహించారు. రైతుబీమాకు సంబంధించిన మొత్తం 552 కేసులు ఉండగా ప్రస్తుతం 21కేసులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. కోర్టు వివాదాలు తదితర కారణాలతో నిలిచిపోయిన కేసులతో పాటు ఇటీవల నమోదైన మరో 9 కేసులను కూడా పరిష్కరించి 100 శాతం క్లెయిమ్ క్లియరెన్స్ సాధించే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. ఫార్మర్ రిజిస్ట్రీలో వేగం.. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియలో జిల్లా ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తి చేసింది. రైతుల భూములు, పంటలు, ఆధార్, బ్యాంకు వివరాలను సమగ్రంగా నమోదు చేయడం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల అమలుకు పటిష్టమైన డేటాబేస్ సిద్ధమవుతోంది. ఫర్టిలైజర్స్ విక్రయాలపై పర్యవేక్షణ ఎరువులు, పురుగు మందుల విక్రయాలను పూర్తిగా ఆన్లైన్ విధానంలో పర్యవేక్షించడం, ఫర్టిలైజర్ దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం, స్టాక్లను పరిశీలించడం, బ్లాక్ మార్కెటింగ్కు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవడం, ప్రతీ విక్రయాన్ని ఆన్లైన్లో నమోదు చేయించడం వంటి చర్యలతో జిల్లా మంచి మార్కులు సాధించింది. ఆరుతడి పంటలకు ప్రోత్సాహంలో.. ప్రస్తుత వానాకాలంలో వరిసాగు తగ్గించి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించ డంపై వ్యవసాయ శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో వరి, పత్తి సాగు అంచనాతో పోలిస్తే సుమారు 52 వేల ఎకరాలు తక్కువ నమోదవడంతో రైతులకు కందులు, పెసర్లు, ఇతర పప్పుధాన్యాల సాగుపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో కందుల సాగు లక్ష్యం 3,350 ఎకరాలు కాగా ఇప్పటికే 5,613 ఎకరాలకు పైగా, పెసర సాగు లక్ష్యం 657 ఎకరాలు కాగా 562 ఎకరాల్లో సాగు పూర్తయింది. ఇంకా ఈ నెల చివరి వరకు, వచ్చే నెల తొలి వారంలో 18వేల ఎకరాల్లో కందులు సాగు చేసుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిరోజూ సమీక్షలు.. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవసాయ శాఖ పనితీరుపై నిరంతర సమీక్షలు, మండలాల వారీగా పురోగతిని పరిశీలించడం, వెనకబడిన అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించడం, జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని క్షేత్రస్థాయిలో అధికారులతో సమన్వయం చేస్తూ నిరంతర పర్యటనలు చేయడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు. ఏఈఓలు, ఏఓలు, జిల్లా స్థాయి సిబ్బంది సమష్టి కృషితో జిల్లా రెండో స్థానాన్ని దక్కించుకుని ఆదర్శంగా నిలిచిందని అభిప్రాయపడుతున్నారు. వివిధ విభాగాల్లో జిల్లా సాధించిన మార్కులు రైతుల నమోదు రైతుబీమా మరణాల నమోదు రైతుబీమా పరిహార దరఖాస్తుల పరిష్కారం యూరియా వినియోగ ధ్రువీకరణ నివేదిక క్షేత్రస్థాయి సేవల మొబైల్ వినియోగం ఆన్లైన్ భూసంబంధ సేవల నిర్వహణ వ్యవసాయ విస్తరణ అధికారుల హాజరు గతంలో 25వ స్థానం.. మూడున్నర నెలల్లోనే అద్భుత ప్రగతి 70 మార్కులకు గాను 49.73 పాయింట్లు కలెక్టర్ పర్యవేక్షణలో అధికారుల సమష్టి కృషి -
ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని నిలిపివేయండి
● దుకాణాల యజమానులకు మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ సూచనజనగామ: పట్టణంలో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం వెంటనే నిలిపివేయాలని మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, కమిషనర్ రాజశేఖర్రెడ్డి సూచించారు. సోమవారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు, కిరాణా దుకాణాల యజమానులకు నిషేధిత ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ క్యారీ బ్యాగు తయారీ, అమ్మకం, నిల్వ, పంపిణీ, వినియోగం పూర్తిగా నిషేధించారని స్పష్టం చేశారు. వ్యాపారులు వెంటనే ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగాన్ని నిలిపివేసి, వాటికి బదులుగా గుడ్డ సంచులు, కాగితపు సంచులు, జీవ విచ్ఛిన్నమయ్యే పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగదారులకు అందించాలని సూచించారు. నిషేధిత ప్లాస్టిక్ క్యారీబ్యాగులను వినియోగిస్తున్నట్లు, విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నిబంధనల ప్రకారం జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్లాస్టిక్ నిషేధ అమలులో మున్సిపాలిటీకి పూర్తి సహకారం అందిస్తామని హోటల్, రెస్టారెంట్, కిరాణా దుకాణాల యజమానులు ఈసందర్భంగా హామీ ఇచ్చారు. -
ఆరుతడి పంటలు సాగుచేయాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొడకండ్ల: ప్రస్తుత సీజన్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంటల సాగు విధానాలను మార్చుకొని, ఆరుతడి పంటల సాగును చేయాలని, ఈమేరకు గ్రామాల్లో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దిశానిర్దేశం చేశారు. సోమవారం మొండ్రాయి గ్రామంలో కొమ్ము మహేందర్ కూరగాయల సాగు క్షేత్రాన్ని కలెక్టర్ సందర్శించి సాగుతీరును పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ..ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేయడం వల్ల తక్కువ నీళ్లతో దిగుబడి వచ్చి ఆదాయం సమకూరే అవకాశం ఉందని సూచించారు. గిర్నితండాలోని జ్యోతిబాఫూలే గురుకులాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విద్యా బోధన, మౌలిక వసతులు, విద్యార్థుల అభ్యసనా సామర్థ్యం, పరిశుభ్రత, ఆహార నాణ్యతను పరిశీలించారు. అలాగే గ్రామంలోని అభయ్ పర్టిలైజర్ షాపును కలెక్టర్ తనీఖీ చేసి లైసెన్స్, కొనుగోలు రిజిష్టర్లను పరిశీలించి స్టాక్ నిల్వలను పరిశీలించారు. ఈపాస్ యంత్రంలో నమోదైన కొనుగోలు వివరాలు, నిల్వ ఉన్న యూరియా బస్తాల స్టాక్లో తేడా రావడంతో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని వ్యవసాయాధికారి శ్రీనివాస్రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి రవికాంత్, సర్పంచ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నెలవారీ పరిశుభ్రత మూల్యాంకనం జనగామ రూరల్: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ, తాగునీటి భద్రత, దోమల నివారణ, ఓడీఎఫ్ స్థిరత్వం, ప్రజా ఆరోగ్య ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ‘ఎస్జే–స్కోర్ (స్వచ్ఛ జనగామ పారిశుద్ధ్యం టాస్క్ఫోర్స్) పేరిట నెలవారీ సమగ్ర మూల్యాంకన విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి పారిశుద్ధ్య నిర్వహణపై మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..ప్రతీ గ్రామ పంచాయతీలో ప్రతీ నెల ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఆధారాలతో కూడిన 100 మార్కుల విధానంలో మూల్యాంకనం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గ్రేడ్–ఏ సాధించిన గ్రామ పంచాయతీలకు ప్రత్యేక ప్రశంసపత్రాలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీ పురస్కారాలు అందజేస్తామని, వరుసగా తక్కువ గ్రేడ్లు పొందిన గ్రామ పంచాయతీలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమీక్షలో ఆర్డీఓలు గోపీరామ్, కిరణ్ ప్రకాష్, డీఆర్డీఓ భాస్కర్, పీడీ ఈజీఎస్ సూరి, డీపీఓ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి ఒడిలో జీవన పాఠాలు
జనగామ: పుస్తకాల భారానికి నెలలో ఒకరోజు విరామమిస్తూ, ప్రకృతి, పొలం, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలనే తరగతి నుంచి బయటకు తీసుకెళ్లి విద్యార్థులకు అనుభవాత్మక విద్యను అందిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రతీ నెల మూడో శనివారం నిర్వహిస్తున్న ‘నో బ్యాగ్ డే’ కార్యక్రమం ద్వారా ఆటలు, పా టలు, ప్రత్యక్ష పరిశీలనతో నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తూ విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు, క్రమశిక్షణ, సామాజిక అవగాహన పెంపొందిస్తున్నాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా జీవిత నైపుణ్యాలు, ప్రకృతి పరిజ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నో బ్యాగ్ డే’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. జిల్లాలోని 341 ప్రాథమిక, 64 ఉన్నత ప్రాథమిక, 103 ఉన్నత పాఠశాలలు కలిపి 508 ప్రభుత్వ పాఠశాలల ఉండగా, చాలా పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి, ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం విద్యార్థులను పొలంబడి, ప్రకృతి వనాలు, చారిత్రక ప్రదేశాలు, శిలాశాసనాలు, దేవాలయాలు, స్థానిక వారసత్వ కట్టడాల వద్దకు తీసుకెళ్తున్నారు. కొన్ని పాఠశాలల్లో వరి నాట్లు వేయించడం, పంటల సాగు విధానాలను ప్రత్యక్షంగా చూపించడం ద్వారా వ్యవసాయంపై అవగాహన కల్పిస్తుండగా, మరికొన్ని చోట్ల మొక్కల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం ప్రాధాన్యాన్ని వివరిస్తున్నారు. ఆటలు, పాటలు, నాయకత్వ లక్షణాలు ఆటలు, పాటలు, జానపద కళలు, కథల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. పాఠ్యాంశాలతో పాటు స్థానిక చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై అవగా హన పెరగడంతో విద్యార్థుల్లో పరిశీలనా దృష్టి, సామాజిక బాధ్యతా భావం కూడా పెరుగుతోంది. జిల్లాలోని వందలాది ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ఈ కార్యక్రమం విద్యార్థులను సమగ్ర వ్యక్తిత్వంతో తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తోందని విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. పిల్లల అభ్యాసాన్ని ఆనందదాయకంగా మార్చడంతో పాటు భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించే సామర్థ్యాన్ని పెంపొందించే వినూత్న విద్యా విధానంగా నో బ్యాగ్ డే కార్యక్రమం నిలుస్తోంది. పొలం పాఠాలు గుర్తుండిపోతాయిపొలంబడి కార్యక్రమంలో పాల్గొని వరి నాట్లు ఎలా వేస్తారో ప్రత్యక్షంగా చూశాం. రైతులు పడే కష్టాన్ని అర్థం చేసుకున్నాం. పుస్తకాల్లో చదివిన దానికంటే ప్రత్యక్షంగా నేర్చుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. –ఎం.వర్షిత, 6వ తరగతి, ప్రభుత్వ పాఠశాల, కొడవటూరు సులభంగా నేర్చుకుంటున్నాం..ప్రకృతి ఒడిలో చెట్ల ప్రాముఖ్యం, పర్యావరణ పరిరక్షణ గురించి ఉపాధ్యాయులు వివరించారు. మొక్కలను కాపాడాలనే బాధ్యత పెరిగింది. ఇలాంటి కార్యక్రమాలతో కొత్త విషయాలు సులభంగా నేర్చుకుంటున్నాం. –నీలా దినేష్, 6వ తరగతి, ప్రభుత్వ పాఠశాల, కొడవటూరు, బచ్చన్నపేట ‘నో బ్యాగ్ డే’తో విద్యార్థులకు అనుభవాత్మక విద్య వ్యవసాయం నుంచి చరిత్ర వరకు నేర్చుకునే అవకాశం ప్రతీ మూడో శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో వినూత్న కార్యక్రమం -
వైభవంగా జగన్నాథ రథయాత్ర
జనగామ: పట్టణంలో శ్రీ పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర సోమవారం సాయంత్రం హరేకృష్ణ హరేరామ భక్త బృందం, గీతాశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. బస్టాండ్ చౌరస్తా వద్ద ప్రారంభమైన రథయాత్రను మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ ప్రారంభించారు. వాస్తు గణపతి దేవాలయం మీదుగా పట్టణ ప్రధాన వీధుల గుండా రైల్వేస్టేషన్ వరకు సాగిన ఈ యాత్రలో భక్తులు హరినామ సంకీర్తనలు, భజనలతో పాల్గొని భక్తి పారవశ్యాన్ని నెలకొల్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షణలో ఇద్దరు ఏసీపీలు, సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సైలు, పోలీసు సిబ్బంది విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమంలో ధనుంజయ్ పండిత్ దాస్, మాధవ్ గోవింద దాస్ ప్రభు, శ్రీ సనాతన దాసు, పద్మావతి దేవి దాసి, కృష్ణ భావదేవిదాసి, బాలమణి, వెంకన్న, నాగేందర్, ధర్మపురి శ్రీను, అరుణ్, పరశురాములు, విజయ్, సిద్ధులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
విప్రచిత్తా, మహావజ్రేశ్వరీ క్రమాల్లో అమ్మవారు
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా సోమవారం ఆరవ రోజు అమ్మవారిని విప్రచిత్తా, మహావజ్రేశ్వరీ అలంకరించి పూజలు నిర్వహించారు. అర్చకులు భద్రకాళి శేషు అధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం, క్షీరాన్ననివేదన నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని విప్రచిత్తా క్రమంలో, షోడశీక్రమాన్ని అనుసరించి బోగభేరాన్ని మహావజ్రేశ్వరీ క్రమంలో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ రామల సునీత మాట్లాడుతూ భక్తులు సంప్రదాయమైన దుస్తులు ధరించి రావాలని, దేవాలయం, ప్రాంగణంలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోలు తీయడం, రీల్స్ చేయడం నిషేధమని పేర్కొన్నారు. ఇందుకు భక్తులు సహకరించాలని కోరారు. -
డేంజర్ ఫుడ్
సోమవారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2026జనగామ: జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాల తయారీ, పరిశుభ్రత లోపాలు, నాణ్యతలేని వంటకాల విక్రయంపై వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల ఫుడ్సేఫ్టీ, మున్సిపల్ శాఖలు పలువురు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ కేంద్రాలపై దాడులు నిర్వహించి భారీ జరిమానాలు విధిస్తున్నప్పటికీ పరిస్థితిలో ఆశించిన మార్పు కనిపించడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. నిరంతరం తనిఖీలు చేస్తేనే.. జిల్లా కేంద్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, జ్యూస్ పాయింట్లు, స్వీట్హౌస్లు, టిఫిన్ సెంటర్లు, నాన్న్వెజ్ కేంద్రాలు, చిన్న సమోసా తయారీ యూనిట్లు, స్నాక్స్ తయారీ కేంద్రాలు, వైన్న్స్ పర్మిట్ రూంలు, మీల్స్ హోటల్ విభాగాల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు ఎంత మేరకు పాటిస్తున్నారనే సందేహాలు వినియోగదారుల్లో పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెలుగుచూస్తున్న ఆందోళనకర అంశాల నేపథ్యంలో జిల్లాలో కూడా సమగ్ర తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలు పాటిస్తున్నారా? బేకరీల్లో బ్రెడ్, కేకులు, ఇతర ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించే నీటి నాణ్యత, తయారీ ప్రదేశాల పరిశుభ్రత, నిల్వ విధానాలపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాన్వెజ్ హోటళ్లలో మిగిలిపోయిన ఆహారాన్ని మరుసటి రోజు విక్రయిస్తున్నారా, ఒకే నూనెను పదేపదే ఉపయోగిస్తున్నారా, ప్రమాదకర కృత్రిమ రంగులను కలుపుతున్నారా అనే అంశాలపై కఠిన తనిఖీలు అవసరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఫాస్ట్ఫుడ్ సంగతేంటి.. ఫాస్ట్ఫుడ్ కేంద్రాల్లో ఉదయం తయారు చేసిన నూడుల్స్, ప్రైడ్ రైస్, మంచూరియా వంటి పదార్థాలను రోజంతా బహిరంగంగా ఉంచడం, దుమ్ము, కాలుష్యం నుంచి రక్షించే చర్యలు లేకపోవడం కూడా ఆరోగ్యానికి ముప్పుగా మారుతోందని అంటున్నారు. కేవలం జరిమానాలు విధించడం వరకు మాత్రమే పరిమితం కాకుండా, నిబంధనల అమలు, ఆహార నాణ్యత, పరిశుభ్రత, వినియోగదారుల ఆరోగ్య రక్షణపై ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ శాఖలు నిరంతర తనిఖీలు నిర్వహించి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అనుమతులపై ఆరా తీయాలి హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాలు, గప్చుప్ బండ్లు, బేకరీలు తదితర ఆహార విక్రయ కేంద్రాలకు ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్తో పాటు ఇతర తప్పనిసరి అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై అధికారులు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. పట్టణంలోని పలు ఫాస్ట్ఫుడ్ కేంద్రాలు, టీ దుకాణాలు మురుగు కాలువలపైనే నిర్వహిస్తుండటంతో అక్కడి నుంచి వచ్చే దుర్వాసన ఆహార పదార్థాలపై ప్రభావం చూపుతోందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.శుచి, శుభ్రత ఉట్టిదేనా..! ఆహార తయారీలో వినియోగించే వంటనూనె, పిండి, మసాలాలు, కృత్రిమ రంగులు, నీటి నాణ్యతపై ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించాలని వినియోగదారులు కోరుతున్నారు. అనేక హోటళ్లలో వంటశాలలు, ప్లేట్లు శుభ్రం చేసే ప్రదేశాలు, చేతులు కడుక్కునే ప్రాంతాలు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. టీ గ్లాసులు, ప్లేట్లను రోజంతా అదే నీటితో కడుగుతున్న ఘటనలను గతంలో అధికారులు గుర్తించిన సందర్భాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కొన్ని హోటళ్లు, ఇతర వాటిలో ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్న ప్లేట్లను ఒకేచోట వేయ డం.. రాత్రి శుభ్రం చేసే సమయంలో అప్పటికే ఎలుకలు, ఇతర క్రిమికీటకాలు వాటిపై తిరుగుతూ ప్రమాదాన్ని పెంచుతున్నాయని కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. నాణ్యత ఎక్కడ?.. పరిశుభ్రత ఏదీ? వాడుతున్న నూనె ఏదీ.. కలర్ల మాటేమిటి?... బేకరీల నుంచి బిర్యానీ వరకు ఆహార నాణ్యతపై అనుమానాలు! హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లపై నిఘా పెంచాలంటున్న వినియోగదారులు జరిమానాలే కాదు..నిబంధనలు తప్పనిసరి చేయాలని డిమాండ్ -
బాలికల డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
జనగామ రూరల్: మండలంలోని శామీర్పేట గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ జి.సంధ్యారాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22 నుంచి 24 వరకు ప్రవేశాలు ఉన్నాయని, ఎస్టీ విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనాథలకు, బీసీ, బీసీ–ఈ, ఓసీ, పీహెచ్సీ, ఎన్సీసీ స్పోర్ట్ కోటా కింద ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, లైఫ్సైన్స్, ఎంఎల్టీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన బాలికలు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. మరిన్ని వివరాల కోసం 8309754381, 7382524420 9963276391, 9347819166 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. నేటి గ్రీవెన్స్ రద్దు జనగామ రూరల్: ఈనెల 20వ తేదీన(సోమవారం) జరిగే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం హనుమకొండలో మంత్రుల సమావేశం ఉన్నందున గ్రీవెన్స్ను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయం గమనించాలని కలెక్టరేట్కు రావొద్దని కోరారు. బయటవ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలిజనగామ రూరల్: లాడ్జీలకు వస్తున్న బయట వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు. ఆదివారం సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్ఐ రతీష్, చెన్నకేశవులుతో కలిసి పట్టణంలోని లాడ్జీలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఆస్తినేరాలు, చైన్ స్నాచింగ్ ఘటనల దృష్ట్యా తనిఖీలు చేపట్టామన్నారు. లాడ్జీల నిర్వాహకులు వ్యక్తుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఘనంగా సౌరవృత్త తారావళి పుస్తకావిష్కరణ హన్మకొండ కల్చరల్: సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వరంగల్ ఆధ్వర్యంలో అజో విభో కంధాళం ఫౌండేషన్ అధ్యక్షుడు అప్పాజోస్యుల సత్యనారాయణ రచించిన సౌర వృత్త తారావళి, వ్యాఖ్య పుస్తకాల ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ మేరకు ఆదివారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని పీఆర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో సహృదయ సంస్థ అధ్యక్షులు గన్నమరాజు గిరిజామనోహరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీ వేత్త, కవి విహారి, విశిష్ట అతిథులుగా తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి అనుమాండ్ల భూమయ్య, రచయిత, వ్యాఖ్యాత ఆచార్య తాడేపల్లి పతంజలి, సాహితీవేత్త డాక్టర్ దహగం సాంబమూర్తి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర సాహితీ అవార్డు గ్రహిత డాక్టర్ అంపశయ్య నవీన్, కవి రామచంద్రమౌళి, వీఆర్.విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాసరావు, వనం లక్ష్మీకాంతారావు, మల్యాల మనోహరరావు, కళా రాజేశ్వర్, డాక్టర్ టి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. బోడ కాకర @400 జనగామ : మార్కెట్లో బోడ కాకరకాయ ధర రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం కిలో బోడ కాకర రూ.400 వరకు పలుకుతుండటంతో వినియోగదారులు కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు. వర్షాల ప్రభావంతో దిగుబడి తగ్గడం, మార్కెట్కు సరఫరా లేకపోవడం వల్ల ధరలు ఒక్కసారిగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ధరలు తగ్గాలంటే సరఫరా పెరగాల్సి ఉందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. -
నామినేట్..లేట్ !
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీపై నెలకొన్న ఉత్కంఠకు మరికొంత కాలం తెరపడే అవకాశం కనిపించట్లేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడంతో నామినేటెడ్ పోస్టుల నియామకాల ప్రక్రియను ఆగస్టు 3వ తేదీ తర్వాత చేపట్టే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో పదవీకాలం ముగిసిన నేతలు, కొత్తగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారిలో అయోమయం నెలకొంది. ఇటీవలే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న నేతల పదవీకాలం పూర్తయ్యింది. మరోసారి కొనసాగిస్తారా? లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా? అనే చర్చ కొనసాగుతుండగానే నియామకాలు వాయిదా పడతాయనే సంకేతాలు రావడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. సభ్యత్వ నమోదుపైనే దృష్టిప్రస్తుతం పార్టీకి అత్యంత ప్రాధాన్యమైన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపైనే సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. ఈకార్యక్రమం పూర్తయ్యే వరకు ఎలాంటి నామినేటెడ్ పోస్టుల నియామకాలపై నిర్ణయం తీసుకోకూడదని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆగస్టు 3 తర్వాతే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అధిష్టానం అప్రమత్తంనామినేటెడ్ పదవుల కోసం కొద్ది రోజులుగా ఆశావహులు పెద్దఎత్తున హైదరాబాద్కు వెళ్లి మంత్రులు, ముఖ్యనేతలను కలుస్తున్న నేపథ్యంలో.. పార్టీ అధిష్టానం కూడా అప్రమత్తమైనట్లు సమాచారం. సభ్యత్వ నమోదుపైనే దృష్టి పెట్టాలని, లాబీయింగ్ కోసం హైదరాబాద్కు రావొద్దని ముఖ్యనేతలు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. గాంధీభవన్లో కూడా ప్రస్తుతం నామినేటెడ్ పోస్టుల అంశంపై చర్చలకు పెద్దగా అవకాశం ఇవ్వడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 3 తర్వాతే నామినేటెడ్ పోస్టులకు మోక్షం ‘సర్’పై దృష్టి పెట్టాలన్న సీఎం, టీపీసీసీ చీఫ్ హైదరాబాద్కు రావొద్దని నేతలకు సూచన గాంధీభవన్లో లాబీయింగ్కు ఇక బ్రేక్ ఉమ్మడి వరంగల్లో పలువురి పదవీకాలం ముగింపు ఆశావహుల్లో అంతా అయోమయంఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉండగా, జంగా రాఘవరెడ్డి, ఇనగాల వెంకట్రాంరెడ్డి, బెల్లయ్యనాయక్, అయిత ప్రకాశ్రెడ్డి, పోదెం వీరయ్య, ఎండీ రియాజ్తోపాటు కీలక నామినేటెడ్ బాధ్యతల్లో ఉన్న నాయకుల పదవీకాలం ఇటీవల ముగిసింది. వీరిలో ఎవరిని కొనసాగిస్తారు? ఎవరికి కొత్త బాధ్యతలు అప్పగిస్తారు? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. -
నకిలీ బిల్లులు..జేబుల్లోకి నిధులు
జనగామ: కలెక్టరేట్ నిధుల్లో మరో భారీ ఆర్థిక అక్రమం వెలుగుచూసింది. గతంలో ‘దిక్సూచి’ పుస్తకాల వ్యవహారంలో రూ.46.50 లక్షల ప్రజాధనం దుర్వినియోగం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. ఇప్పుడు కలెక్టరేట్లోని ఖాతా నుంచి రూ.37,85,050 అపహరణ జరిగినట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఈ వ్యవహారంపై జనగామ పట్టణ పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత–2023తో పాటు ఐటీ చట్టం–2000లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి కలెక్టరేట్కు చెందిన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసి శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. నకిలీ బిల్లులతో నిధుల మళ్లింపు జిల్లా యంత్రాంగం నిర్వహించిన అంతర్గత తనిఖీలు, భౌతిక తనిఖీ, రికార్డుల పరిశీలన కమిటీ ఈ నెల 15న సమర్పించిన నివేదికలో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ట్రెజరీ, పీఎఫ్ఎంఎస్ వ్యవస్థలకు వెలుపల ఒక ప్రైవేట్ బ్యాంకులో నిర్వహిస్తున్న కలెక్టరేట్ ఖాతా నుంచి అసలు సరఫరా జరగని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర సామగ్రి కొనుగోలు చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించి, ఒకే వ్యక్తి నియంత్రణలో ఉన్న వేర్వేరు సంస్థల పేరిట 2026 ఫిబ్రవరిలో ఒకే రోజున మొత్తం రూ.37.85 లక్షలు బదిలీ చేసినట్లు గుర్తించారు. అనంతరం నిర్వహి ంచిన ఆకస్మిక భౌతిక తనిఖీలో చెల్లింపులకు సంబంధించిన ఒక్క వస్తువూ లభించకపోగా, ఎలాంటి కొనుగోలు రికార్డులు కూడా లేనట్లు అధికారులు నిర్ధారించారు. పరిపాలనా చర్యలు.. దర్యాప్తు ముమ్మరం ఈ ఘటనపై ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతోపాటు సీసీఏ నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ట్రెజరీ వెలుపల ఉన్న అన్ని ప్రభుత్వ ఖాతాలను మూసివేయడం లేదా ట్రెజరీ విధానంలోకి మార్చడం, బాధ్యతల మార్పు జరిగిన రోజే బ్యాంకు మాండేట్లు రద్దు చేసి కొత్త నమూనా సంతకాలు నమోదు చేయడం, నెలవారీ రీకన్సిలియేషన్ ధ్రువీకరణలను తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. మరిన్ని లావాదేవీలపై విచారణ ఇది ఒక్కటే ఘటన కాదని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. గతంలో పదో తరగతి విద్యార్థుల కోసం ‘దిక్సూచి’ పుస్తకాల పేరిట రూ.46.50 లక్షలు చెల్లించినప్పటికీ ఒక్క పుస్తకం కూడా జిల్లాకు సరఫరా కాలేదని గుర్తించి, ఆ వ్యవహారాన్ని ఇప్పటికే సంబంధిత దర్యాప్తు సంస్థకు అప్పగించారు. అదే ఖాతాలపై లోతైన పరిశీలనలో మరిన్ని అనుమానాస్పద చెల్లింపులు కూడా బయటపడినట్లు వెల్లడించారు. మొత్తంగా కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం బహుళ సంస్థల దర్యాప్తు పరిధిలో ఉందని పేర్కొన్నారు. దర్యాప్తు ప్ర యోజనాల దృష్ట్యా నిందితుల పేర్లు, ఇతర సాక్ష్యాధారాలను ప్రస్తుతం వెల్లడించడం లేదని, వ ్యక్తిగత బాధ్యత న్యాయ విచారణలో తేలుతుందని అధికారులు తెలిపారు. అలాగే ప్రజాధనంలో ప్రతి పైసా తిరిగి రాబట్టి, బాధ్యులు ఎవరైనా, ఏ స్థాయిలో ఉన్నా చట్టంముందు జవాబుదారీ కాక తప్పదని, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. కలెక్టరేట్లో రూ.37.85లక్షల అక్రమం ఫర్నిచర్, కంప్యూటర్ల పేరిట డ్రా కేసు నమోదు..ముగ్గురు కలెక్టరేట్ ఉద్యోగుల సస్పెన్షన్ దుర్వినియోగంపై కొనసాగుతున్న విచారణ బాధ్యులపై చట్టప్రకారం చర్యలు: జిల్లా యంత్రాంతం -
డెంటల్ విభాగంలో ఒకే డాక్టర్!
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని డెంటల్ (దంత వైద్య) విభాగం నామమాత్రంగా నడుస్తోంది. ఇందులో ఒకే వైద్యురాలు అరకొర వసతుల మధ్య వైద్య సేవలు అందిస్తున్నారు. క్లినికల్ వైపు నుంచి ఓ డెంటల్ హైజినిస్టు ఓపీ పేషంట్లకు వైద్య చికిత్స చేస్తున్నారు. అయితే, వైద్య నిపుణుల కొరతతో రోగులకు సరైన సేవలు అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆరోగ్యశ్రీ కింద ఇద్దరు వైద్యులుండగా వీరిని తొలగించి ఇంటర్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్యూలకు నలుగురు వైద్యులు హాజరు కాగా.. ఇద్దరు వైద్యులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఏడాది దాటినా కూడా ఆ ఇద్దరు వైద్యుల నియామకం ఎంతవరకు వచ్చిందో తెలియదు. అలాగే, మరో గవర్నమెంట్ ఔట్సోర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ను సైతం టర్మినేషన్ చేశారు. ముఖ్యంగా డెంటల్ డిపార్ట్మెంట్కు హెచ్ఓడీగా ఉన్న ప్రొఫెసర్ సైతం నర్సంపేటకు బదిలీ అయ్యారు. దీంతో ఈ విభాగం నుంచి నలుగురు వెళ్లినా ఏ ఒక్కరు కూడా రాకపోవడంతో ఇద్దరిపై భారం పడుతోంది. ● ఎంజీఎం ఆస్పత్రిలో పరికరాలు ఉన్నా వేధిస్తున్న సిబ్బంది కొరత ● రోగులకు అరకొరగా వైద్యసేవలు -
బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి
స్టేషన్ఘన్పూర్: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరుతో రాష్ట్రంలో భారీగా ఓట్లను తొలగించే ఉద్దేశ్యంతో ఉందని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసి బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆరోపించారు. పట్టణ కేంద్రంలో ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్)పై నియోజకవర్గ ఎస్ఐఆర్ క్లస్టర్ ఇన్చార్జ్లు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు, సర్పంచ్లతో ఆదివారం ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడారు.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతగా నిర్వహించాలని, అర్హులైన ఒక్క ఓటు కూడా పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఓటరు జాబితా సవరణలో ఘన్పూర్ నియోజకవర్గం రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలువాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఈనెల 25న మరోసారి నియోజకవర్గ స్థాయి సమావేశం ఉంటుందని, ప్రతీ బూత్లో 95 శాతం ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్నాయక్, ఏఐసీసీ పరిశీలకులు అహ్మద్ నాసిర్, టీపీసీసీ నియోజకవర్గ పరిశీలకులు దుద్దిళ్ల శ్రీనుబాబు, మాస్టర్ ట్రైనర్ రాజశేఖర్రెడ్డి, హనుమకొండ, జనగామ డీసీసీ అధ్యక్షులు వెంకట్రాంరెడ్డి, ధన్వంతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుడోజు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్య, పార్టీ మండల, ఘన్పూర్ పట్టణ అధ్యక్షులు శిరీష్రెడ్డి, కిషన్రాజ్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య -
ప్రశాంతంగా అవుట్సోర్సింగ్ పోస్టుల పరీక్ష
జనగామ రూరల్: జిల్లాలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శాఖ యూనిట్లలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో అవుట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేసేందుకు నిర్వహించిన అర్హత రాత పరీక్షలు ప్రశాంతంగా పారదర్శకంగా జరిగాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లో జరిగిన పరీక్ష నిర్వహణ తీరును అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యూనిట్ 1,2 విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్ట్ల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిపై భర్తీ చేసేందుకు, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. కాగా, వివిధ విభాగాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, చైన్న్మెన్, స్వీపర్, ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు మొత్తం 615 మంది అభ్యర్థులు దరఖాస్తులు స్వీకరించగా, 446 మంది అభ్యర్థుల పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణలో జిల్లా ఉపాధి కల్పన అధికారి కుమారస్వామి, జీసీడీఓ గౌసియాబేగం, విద్యాశాఖల సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
కూలిన ప్రహరీ..తప్పిన ప్రమాదం
జనగామ: పట్టణంలోని 21వ వార్డు పరిధిలోని కురుమవాడలో ఆదివారం జరిగిన ప్రహరీ కూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. డీసీపీ కార్యాలయం వెనుక భాగంలో నూతన భవన నిర్మాణ పనులు జరుగుతుండగా, నిర్మాణానికి అవసరమైన ఇసుకను ప్రహరీకి ఆనుకొని ఇసుక డంప్ చేశారు. అనంతరం పొక్లెయినర్తో ఇసుకను తొలగించే సమయంలో గోడపై అధిక ఒత్తిడి పడడంతో సిమెంట్, ఇటుకలతో నిర్మించిన ప్రహరీ ఒక్కసారిగా కురుమవాడ గల్లీ వైపు కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడ పార్క్ చేసిన రెండు కార్లు పూర్తిగా దెబ్బతినగా, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక సైకిల్ కూడా ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే తీవ్ర ప్రాణనష్టం సంభవించే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రహరీ కొంతకాలంగా ప్రమాదకర స్థితిలోనే ఉందని, దీనిపై పలుమార్లు అధికారులకు సమాచారం ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకుండా, ఇసుకను గోడకు డంప్ చేసి జేసీబీతో నిర్లక్ష్యంగా పనులు చేయడమే ప్రమాదానికి కారణమని మండిపడ్డారు. ప్రమాద ఘటన అనంతరం స్థానిక కౌన్సిలర్ మామిడాల రజితరాజుతో కలిసి కాలనీవాసులు డీసీపీ రాజమహేంద్ర నాయక్ను కలిసి జరిగిన ప్రమాదంపై ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, నష్టపోయిన వాహనాల యజమానులకు తగిన నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. నిర్మాణపనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం రెండు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలు ధ్వంసం -
విరోధిని, వహ్నివాసిని క్రమాల్లో అమ్మవారు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శాకంబరీ నవరాత్ర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఆదివారం అమ్మవారిని విరోధిని, వహ్నివాసినిగా అలంకరించి పూజలు చేశారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్ననివేదన, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం కాళీ క్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని విరోధిని క్రమంలో, షోడశీ క్రమాన్ని అనుసరించి బోగభేరాన్ని వహ్నివాసిని క్రమంలో అలంకరించి విశేష పూజలు చేశారు. మహిళలు హాజరై అమ్మవారికి చీర, సారె సమర్పించారు. సెలవు దినం కావడంతో అధికసంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ రామల సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
కురుకుల్లా, భేరుండా క్రమాల్లో భద్రకాళి
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రి మహోత్సవాలు శనివారం నాలుగో రోజుకు చేరాయి. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్ననివేదన, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని కురుకుల్లాక్రమంలో, షోడశీక్రమాన్ని అనుసరించి బోగభేరాన్ని భేరుండా క్రమంలో అలంకరించి నవరాత్ర విశేషపూజలు నిర్వహించారు. సాయంత్రం కార్మిక, ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ అమ్మవారిని దర్శించుకున్నారు. కురుకుల్లా ,భేరుండా క్రమంలో అమ్మవారు -
చిన జీయర్ స్వామికి ఘన స్వాగతం
జనగామ: జిల్లా కేంద్రంలోని బాణాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కా ర్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరు కానున్న చిన జీయర్ స్వామికి పట్టణంలో శనివారం భక్తులు ఘ న స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీపులో శోభా యాత్రగా జనగామ చౌరస్తా నుంచి నెహ్రూపార్కు, ఆర్అండ్బీ అతిథి గృహం మీదుగా బాణాపురం వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకోగా భక్తులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. జూలై 23 వరకు స్వామి వారి పర్యవేక్షణలో మహా సుదర్శనయాగం, ప్రత్యే క పూజలు, వివిధ వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయ అర్చకులు, మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, వైటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు డాక్టర్ లక్ష్మి నా రాయణనాయక్, వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, వి కాస్ తరంగిణి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
నిబంధనలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో ఈఏడాది (2026–27) నుంచి అమలు చేస్తున్న ప్రీప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీ కోసం శనివారం కలెక్టరేట్ సమావేశం హాలులో పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో ప్రభుత్వం 39 ప్రీప్రైమరీ స్కూల్స్ మంజూరీ చేయగా, రాతపరీక్ష ద్వారా అర్హులైన టీచర్లు, ఆయాలను ఎంపిక చేయనున్నారు. ఇన్స్ట్రక్టర్ పోస్టులకు హ్యాబిటేషన్ (స్థానిక) పరిధిలోని అభ్యర్థుల నుంచి మొత్తం 269 దరఖాస్తులు అందగా, వారిలో 254 మంది పరీక్షకు హాజరు కాగా 15 మంది గైర్హారయ్యారు. ఆయా పోస్టులకు 152 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 139 మంది హాజరుకాగా 13 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియాబేగం, ఏసీజీఈ, డీసీఈబీ సెక్రటరీ, కేజీబీవీల అకౌంటెంట్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశారు. ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి జనగామ రూరల్: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులతో వర్షాభావ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యవసాయ ప్రణాళికలు, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వీసీలో పాల్గొన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. శాఖల వారీగా అధికారులు సమగ్ర నివేదికలతో సిద్ధంగా ఉండాలన్నారు. రాజీపడితేనే కేసుల పరిష్కారం ● సీనియర్ సివిల్ జడ్జి శంకర్ శ్రీదేవి జనగామ రూరల్: కక్షిదారులు రాజీ పడితేనే కేసులు పరిష్కారం అవుతాయని సీనియర్ సివిల్ జడ్జి శంకర్ శ్రీదేవి అన్నారు. శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు ప్రత్యేక ఎన్ఐ యాక్ట్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా సివిల్ జడ్జి మాట్లాడుతూ చెక్ బౌనన్స్ కేసులో కోర్టు నుంచి శిక్ష పడకుండా ఉండాలంటే ఇరు పక్షాల వారు రాజీ పడుతూ కేసులను పరిష్కరించుకోవాలన్నారు. స్పెషల్ లోక్ అదాలత్లో చెక్బౌన్స్లో 5 పరిష్కరించగా దీనికి గాను రూ.27.25లక్షలు వసూలు అయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి శశి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె సందీప, బండ దయాకర్ రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. కోర్టు నిర్మాణ పనుల పరిశీలన పట్టణంలోని చంపక్హిల్స్లో ఏర్పాటు చేయనున్న కోర్టు నిర్మాణ పనులను సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి శంకర్ శనివారం పరిశీలించారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
మూడు దశల ప్రణాళిక
జనగామ: ఈ వానాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో రైతులు ఆందోళన చెందకుండా శాసీ్త్రయ పద్ధతులతో సాగు కొనసాగించేలా జిల్లా యంత్రాంగం సమగ్ర సమాచార ప్రసార కార్యాచరణ (మూడు దశల) ప్రణాళికను విడుదల చేసింది. కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ ప్రణాళికలో వర్షపాతం లోటు, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఎరువులు, విత్తనాల లభ్యత, క్షేత్రస్థాయి ప్రచారంపై కలెక్టర్ సందీప్కుమార్ ఝా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. వర్షాభావ లోటును ఎదుర్కొనేలా.. జూలై 8 నాటికి జిల్లాలో సాధారణంగా 177.45 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 141.92 మిల్లీ మీటర్లు మాత్రమే కురవడంతో 20 శాతం లోటు నమోదైంది. 12 మండలాల్లో ఏడు మండలాలు వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొనే విధంగా ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా రఘునాథపల్లి, లింగాలఘణపురం, పాలకుర్తి, బచ్చన్నపేట, చిల్పూరు మండలాల్లో వర్షపాతం లోటు అధికంగా ఉంది. గతేడాది ఇదే సమయానికి 2.27 లక్షల ఎకరాల్లో సాగు జరగగా, ఈ ఏడాది 1.55 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు నమోదైంది. వరి సాగు కొంత వెనుకబడినా పత్తి సాగు సంతృప్తికరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. జూలై 15, 30, ఆగస్టు 15 తేదీలు.. వర్షాలు మరింత ఆలస్యమైతే గ్రామాల వారీగా మూడు దశల్లో ప్రత్యామ్నాయ సాగు ప్రణాళిక అమలు చేయనున్నట్లు వెల్లడించారు. జూలై 15, జూలై 30, ఆగస్టు 15 తేదీలను లక్ష్యంగా పెట్టుకుని కంది, పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న, సజ్జ వంటి స్వల్పకాలిక పంటల సాగును ప్రోత్సహించనున్నారు. అవసరమైన విత్తనాలు రైతు భరోసా కేంద్రాలు, మహిళా శక్తి రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ శాఖ ద్వారా అందుబాటులో ఉంచారు. ఎరువులు అదనపు నిల్వలు జిల్లాలో ఎరువుల కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. 329 ఎరువుల విక్రయ కేంద్రాల్లో అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉండగా, మార్క్ఫెడ్ ద్వారా అదనపు నిల్వలు సిద్ధంగా ఉంచారు. జిల్లా స్థాయిలో 2,700 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ నిల్వ ఏర్పాటు చేయడంతో పాటు యూరియా బుకింగ్ యాప్లో సుమారు 45,900 సంచులు బుకింగ్కు సిద్ధంగా ఉంచినట్లు స్పష్టం చేశారు. ఊరూరా ప్రచారం రైతువేదికలు, గ్రామ సభలు, రైతు భరోసా కేంద్రాలు, వాట్సాప్ గ్రూపులు, ఎస్ఎంఎస్, స్థానిక టీవీలు, పత్రికలు, ఎఫ్ఎం రేడియో, సోషల్ మీడియా వంటి వేదికల ద్వారా విస్త్రృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఎరువులు, విత్తనాల కల్తీపై జిల్లా వ్యవసాయ కంట్రోల్ రూమ్ 8977745512కు రైతులు తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు. వర్షపాతం మి.మీ.జిల్లాలో వర్షపాతం వివరాలుజిల్లాలో సాగు వివరాలు177.45 మి.మీ.141.92 మి.మీ.2.27 లక్షల ఎకరాలు 1.55 లక్షల ఎకరాలు 20 శాతంసాగు విస్తీర్ణం తగ్గుదలగతేడాది సాగు (ఇప్పటి వరకు)నమోదైన వర్షపాతంఈ ఏడాది సాగు (ఇప్పటి వరకు)వాన తక్కువైనా.. వ్యవసాయానికి భరోసా కరువు కాదు.. అప్రమత్తత అవసరం వర్షపాత లోటు ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధం కలెక్టర్ ఆదేశాలు.. ఊరూరా ప్రచారం -
ఆదివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2026
మామునూరు ఎయిర్పోర్ట్ నమూనా (ఏఐ చిత్రం)సాక్షి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మామునూరు విమానాశ్రయం కల సాకారం దిశగా కీలక అడుగు పడింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సుమారు రూ.203.49 కోట్లతో విమానాశ్రయ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచింది. రన్వే ఆధునీకరణ నుంచి టెర్మినల్కు అనుసంధాన రహదారులు, విమానాల పార్కింగ్ అప్రాన్, ట్యాక్సీ వేలు, గ్రౌండ్ సపోర్ట్ సదుపాయాల వరకు అన్ని పనులను 15 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ కూడా విడుదల చేసింది. ఈ ప్లాన్ ప్రకారం విమానాశ్రయానికి ప్రధాన ఎంట్రీ, ఎగ్జిట్ను వరంగల్–సూర్యాపేట జాతీయ రహదారి (ఎన్హెచ్–563) వైపు ప్రతిపాదించారు. అక్కడి నుంచి ప్రత్యేక యాక్సెస్ రోడ్డు ద్వారా టెర్మినల్ భవనానికి చేరుకునేలా డిజైన్ రూపొందించారు. టెర్మినల్ ఎదుట ఒకేసారి మూడు విమానాలు నిలిపే అప్రాన్, లింక్ ట్యాక్సీవే, గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ (జీఎస్ఈ) ప్రాంతం, పెరిమీటర్ రోడ్లు, అత్యవసర యాక్సెస్ రోడ్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. 1930లోనే నిజాం హయాంలోనే మామూనూరు ఎయిర్పోర్టు ఉండగా వివిధ కారణాలతో 1980లో మూతపడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7న ఫైనాన్షియల్ బిడ్... ఈ నెల 23న (గురువారం)ప్రీ–బిడ్ సమావేశాన్ని మామునూరు విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినట్టు టెండర్ నోట్లో పేర్కొన్నారు. జూలై 29 నుంచి ఆగస్టు 12 వరకూ బిడ్ దాఖలకు అవకాశం కల్పించారు. ఆగస్టు 18న బిడ్ ఓపెన్ చేయనున్నారు. సెప్టెంబరు 7న ఫైనాన్షియల్ బిడ్ను తెరవనున్నట్టు టెండర్ నోట్లో పొందుపరిచారు. మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్హాల్, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ సహా మరికొన్ని నిర్మాణాలకు త్వరలో మరో టెండర్ను పిలిచేందుకు ఏఏఐ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. కాకతీయ వైభవం ఉట్టిపడేలా... తెలంగాణకు చారిత్రక వారసత్వంగా నిలిచిన కాకతీయుల కళా సంపదను ప్రతిబింబించేలా మూమునూరు విమానాశ్రయ టెర్మినల్ భవ నం, ప్రవేశ ద్వారాలు, అంతర్గత అలంకరణలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, అందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది టెర్మినల్ ముఖద్వారంలో కాకతీయ కళాతోరణం శైలిని ప్రతిబింబించే నమూనాలు, లోపలి గోడలపై కాకతీయుల చరిత్రను తెలియజేసే చిత్రాలు, శిల్పాల ప్రతిరూపాలు, తెలంగాణ జానపద సంస్కృతిని చాటిచెప్పే అలంకరణలు ఉండేలా ప్రణాళిక రూపొందించే అవకాశ ముంది. దీంతో వరంగల్కు వచ్చే దేశీయ, విదేశీ ప్రయాణికులకు విమానాశ్రయంలోనే కాకతీయుల గొప్పతనం పరిచయం కానుంది. 2,800 మీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పు గల రన్వే నిర్మాణంతో ఎయిర్బస్–320 వంటి పెద్ద ప్రయాణికుల విమానాలు, భారీ కార్గో విమానాలు కూడా దిగే అవకాశం ఉంటుంది. భవిష్యత్లో అంతర్జాతీయ విమానాశ్రయంగా విస్తరించే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని 949.44 ఎకరాల్లో ప్రణాళిక సిద్ధం చేశారు. వెడల్పు : 75 మీటర్లు అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచిన ఏఏఐ టెర్మినల్ ఎదుట ఒకేసారి మూడు విమానాలు నిలిపే అప్రాన్ కాకతీయ కళా వైభవం చాటేలా నిర్మాణాలు ఉండే అవకాశం 2028లో విమానాలు టేకాఫ్ అయ్యేలా కార్యాచరణ ఇక్కడి వ్యాపారవేత్తలు హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు ఒకే రోజులో వెళ్లి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో వ్యాపార సమావేశాలు, పెట్టుబడులు, స్టార్టప్లు, కార్పొరేట్ కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ రంగాలకు వేగవంతమైన రవాణా అందుబాటులోకి వస్తుంది. దేశీయ, విదేశీ కంపెనీలు వరంగల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది. వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు త్వరగా తరలించొచ్చు. దీంతో రైతులకు మెరుగైన మార్కెట్లు లభించడంతోపాటు ఎగుమతులకు కూడా మార్గం సుగమం అవుతుంది. రామప్ప ఆలయం, వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయానికి పర్యాటకుల రాక పెరుగుతుంది. ఎయిర్ అంబులెన్స్, అవయవ మార్పిడి, విపత్తుల సమయంలో సహాయక చర్యలు వేగంగా చేపట్టవచ్చు. రియాల్టీ రంగానికి కూడా రెక్కలు రానున్నాయి. మామునూరు విమానాశ్రయనిర్మాణం నుంచి నిర్వహణ వరకు ప్రత్యక్ష, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. నగరం దేశంలోని ప్రధాన నగరాలతో నేరుగా అనుసంధానమవుతుంది. దీంతో జాతీయస్థాయిలో గుర్తింపు వస్తుంది.రన్వే పొడవు : 2,800 మీటర్లు -
ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంటినంబర్లు కేటాయించాలి
● సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి జనగామ రూరల్: పట్టణంలో మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లకు ఇంటి నంబర్లు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులతో కలిసి సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ ఆధ్వర్యంలో కలె క్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించా రు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ 2012–13 సంవత్సరంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 1,146 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి స్థలం చూపించకపోవడంతో సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిలో గుడిసెలు నిర్మించుకుంటే ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తుందన్నారు. అధికారులు కూడా రీసర్వే పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. మున్సిపల్ ద్వారా ఇంటినంబర్ కేటాయించాలని విన్నవించినా ఫలితం లేదన్నారు. కాగా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులకు లబ్ధిదారులకు మధ్య తోపులాట జరిగింది. అలాగే ఏసీపీ భీమ్ శర్మ పోలీస్స్టేషన్లో నాయకులపై అమర్యాదగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఏసీపీపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొట్ల శేఖర్, సుంచు విజేందర్, మిట్యా నాయక్, కౌన్సిలర్ బూడిద జ్యోతి, కల్యాణ లింగం, పగిడిపల్లి బాలమణి, బూడిద ప్రశాంత్, బొట్ల శ్రావణ్, పాము శ్రీకాంత్, అండాలు నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
అధికారం కోల్పోయిన అక్కసుతోనే ఆరోపణలు
లింగాలఘణపురం: అధికారం కోల్పోయిన అక్కసుతోనే ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. శుక్రవారం మండలంలోని సిరిపురంలో సీసీ రోడ్డు, ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒకవైపు ఎల్నినో ప్రభావంతో నదులు, రిజర్వాయర్లలో నీళ్లు లేవని, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలో గోదావరిలో నీళ్లు ఎత్తిపోసి రైతులకు సాగునీరు ఇవ్వాలని అసత్యపు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. సమావేశంలో తహసీల్దార్ అండాలు, సర్పంచ్లు ఎడ్లలావణ్యరాజు, మల్లారెడ్డి, సంపత్, విష్ణు, బుచ్చయ్య, సదానందం, రాజు, పీఏసీఎస్ చైర్మన్లు ఉపేందర్, శ్రీశైలం, మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్, డైరెక్టర్లు శ్రీలతారెడ్డి, మోహన్, సిరిపురంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయ్మనోహర్, జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏనెబావిలో ‘పాల’ఊట!
లింగాలఘణపురం: ఏనెబావి అంటేనే ఒకప్పుడు సేంద్రియ వ్యవసాయానికి మారుపేరుగా ఉండేది. కాలక్రమంలో ఆ వ్యవసాయ విధానాన్ని వదిలి నేడు పాడి పరిశ్రమకు నిలయంగా మారింది. మండలంలోని పిట్టలోనిగూడెం గ్రామ పంచాయతీ శివారు గ్రామమైన ఏనెబావిలో 45 కుటుంబాలు ఉండగా, సుమారు 200లకు పైగా ఆవులు ఉన్నాయి. వీటితో నేడు రోజుకు 600 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రతి ఇంటికీ ఐదు నుంచి ఆరు పాడి ఆవులు ఉంటాయి. ప్రతీ రైతు పొలం వద్ద తప్పకుండా నేపియర్ గడ్డి ఉంటుంది. ఉదయం, సాయంత్రం పాలను పితికి కొంతమంది ప్రైవేట్ డెయిరీకి పోయగా మరికొంత మంది విజయ డెయిరీకి పోస్తున్నారు. గ్రామంలో కరుణాకర్ అనే రైతు మొదట రెండు పాడి ఆవులను జెర్సీ, హెచ్ఎఫ్ రకాలను కొనుగోలు చేశాడు. దీంతో అతడి ఆదాయం, నిర్వహణ చూసిన గ్రామస్తులు ఒక్కొక్కరు పాడి ఆవులను కొనుగోలు చేసుకోవడం, పాలను ఉత్పత్తిని పెంచడం మొదలుపెట్టారు. ఇలా గ్రామంలో పాడిపరిశ్రమ వారికి పెద్ద ఉపాధిగా మారింది. గ్రామంలో ఇంటింటికీ ఐదారు పాడి ఆవులు.. పాడిపరిశ్రమే గ్రామస్తుల ప్రధాన ఉపాధి 45 కుటుంబాలు.. రోజుకు 600లీటర్ల పాల ఉత్పత్తిరోజుకు 30 లీటర్ల పాలు పోస్తా..రోజుకు 30 లీటర్ల పాలు పోస్తా.. నాకు పది ఆవులు ఉన్నాయి. అందులో కొన్ని ప్రస్తుతం పాలు ఇస్తున్నాయి. మరికొన్ని సూడికి ఉన్నాయి. పాడితో ఉపాధి మంచిగానే ఉంది. దాణా ఖర్చులు బాగా పెరిగాయి. పాల రేటును పెంచితే మరింత బాగుంటుంది. –పొన్నాల శ్రీనివాస్, పాడి రైతు -
వారాహిగా భద్రకాళి అమ్మవారు
● కుల్లా, నిత్యక్లిన్నా క్రమాల్లో పూజలు హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం అమ్మవారికి కుల్లా క్రమంలో, నిత్యక్లిన్నా క్రమంలో పూజలు జరిపి వారాహి అమ్మవారుగా అలంకరించారు. శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఉదయం నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, చతుఃస్థానార్చన, అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరానికి కుల్లా క్రమంలో పూజలు నిర్వహించి వారాహి అమ్మవారుగా అలంకరించారు. షోఢశీక్రమాన్ని అనుసరించి స్నపన మందిరంలోని బోగభేరాన్ని నిత్యక్లిన్నాగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ రాముల సునీత, సిబ్బంది పర్యవేక్షించారు. చిల్పూరు ఆలయానికి రెండు అర్చక పోస్టులు చిల్పూరు: చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి దేవాలయానికి రెండు అర్చక పోస్టులు మంజూరు కాగా శుక్రవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో దేవాదాయ ముఖ్యకార్యదర్శి శైలజారామయ్యర్, కమిషనర్ హనుమంతరావు చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. సముద్రాల కృష్ణమాచార్యులు (అర్చక పాంచరాత్ర ఆగమం), చెరువు ఆదిత్య (అర్చక వేదిక స్మార్త ఆగమం) ఇద్దరు అర్చకులు ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న ఆధ్వర్యంలో అందుకున్నారు. నియామకమైన అర్చకులకు చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు శుభాకాంక్షలు తెలిపారు. సమన్వయంతోనే గ్రామీణాభివృద్ధి రఘునాథపల్లి: ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతులు సమన్వయంతో పనిచేస్తే గ్రామీణాభివృద్ధి మరింత వేగవంతమవుతుందని నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్ పసుల విజయ్కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నాబార్డు 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకొని మహిళా సంఘాలు, రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక నిర్వహణ, పొదుపు, బ్యాంకు రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు, ఉపాధి యూనిట్ల స్థాపనపై అవగాహన కల్పించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డీపీఎం భవాని, పశు సంవర్ధక శాఖ అధికారి మురళీధర్రావు, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణమూర్తి, సర్పంచ్ బొల్లం ఉమారాణి, ఏఓ కరుణాకర్, విజయ డెయిరీ డీడీ గోపాల్సింగ్, బ్యాంకు మేనేజర్లు సంతోష్, సతీష్, నంద కిశోర్, మారి సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంజీఎం సూపరింటెండెంట్గా రాంకుమార్రెడ్డి కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ కాటం రాంకుమార్రెడ్డిని నియమిస్తూ శుక్రవారం కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఉత్తర్వులు జారీ చేశారు. ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెంటెండ్గా డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి హైదరాబాద్కు బదిలీ అయిన తర్వాత కొత్త సూపరింటెండెంట్ కోసం అందరూ ఎదురుచూశారు. పలువురు సీనియర్ వైద్యుల పేర్లు కూడా పరిగణనలోకి వచ్చాయి. దాదాపు 45 రోజుల నుంచి ఆస్పత్రిలో నెలకొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ సత్యశారద.. డాక్టర్ రాంకుమార్రెడ్డి సూపరింటెండెంట్గా (ఎఫ్ఏసీ) అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశాలకు ఎంపికలు వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న క్రీడా అకాడమీలు, ప్రాంతీయ క్రీడా వసతి గృహాల్లో (2026–27) విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఎంపిక ప్రక్రియ చేపడుతున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 97046 69637 మొబైల్ నంబర్లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
కూరగాయల సాగు బాగుంది!
● రైతు శ్రీనివాస్ను అభినందించిన కలెక్టర్లింగాలఘణపురం: ‘కూరగాయల సాగు చాలా బాగుంది..మార్కెటింగ్ ఎలా చేస్తున్నావు..ఎంత లాభం వస్తుంది..’ అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మండలంలోని కళ్లెం గ్రామంలో కూరగాయలు పండిస్తున్న రైతు నకీర్త శ్రీనివాస్ను అభినందించారు. శుక్రవారం శ్రీనివాస్ పండిస్తున్న కూరగాయల పంట క్షేత్రాన్ని డీఏఓ, ఇన్చార్జ్ జిల్లా హార్టికల్చర్ అధికారి అంబికాసోనీతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సోరకాయ, బీరకాయ, కీరదోస, చిక్కుడు కాయగూరల సాగును కలెక్టర్ పరిశీలించారు. సేంద్రియ వ్యవసాయం చేస్తున్నావా..? ఎరువులు వాడుతున్నావా అని ప్రశ్నించగా రెండు కలిపి చేస్తున్నానని, మార్కెటింగ్లో ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించడంతో ఆశించిన లాభాలు రావడంలేదని రైతు చెప్పారు. కాగా, వరి సాగుతో పోల్చితే కూరగాయలు, ఇతర ఆరుతడి పంటలకు నీటి వినియోగంలో ఉన్న వ్యత్యాసాలను నివేదిక సిద్ధం చేయాలని డీఏఓ, ఇతర అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే రైతు శ్రీనివాస్ సాగు విధానంపై కేస్ స్టడీ తయారు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఏఓ నజీరుద్ధీన్, సర్పంచ్ శోభచంద్రమౌళి, ఏఈఓ ప్రత్యూష, రైతులు ఉన్నారు. -
బ్యాంకు సేవలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
జనగామ: జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్లో ఉన్న భవనంలో కొనసాగుతున్న కెనరా, డీసీసీ బ్యాంకు శాఖలు ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ తనిఖీలు నిర్వహించి భవనాన్ని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో రెండు బ్యాంకుల సేవలు తాత్కాలికంగా నిలిచిపోయా యి. ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా కెనరా బ్యాంకు అధికారులు శాఖ ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేసి డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అత్యవసర సేవల కోసం లింగాలఘణపురం మండలం నెల్లుట్ల శాఖను సంప్రదించాలని, వివరాలకు– 701 3203331ను సంప్రదించాలని మేనేజర్ కోరారు. అలాగే డీసీసీ బ్యాంకు ఖాతాదారులు రఘునాథపల్లి, దేవరుప్పుల శాఖలను వినియోగించుకోవాలని, అవసరమైతే–9701361879కు సంప్రదించాలని సూచించింది. ఇదిలా ఉండగా, అత్యవసర నగదు అవసరాల కోసం డీసీసీ బ్యాంకు వద్ద మొబైల్ మినీ ఏటీఎంను ఏర్పాటు చేసి రోజుకు రూ.20 వేల వరకు నగదు డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. -
అడుగంటుతున్న ఆశలు
వానల కోసం వేయికళ్లతో అన్నదాతల ఎదురుచూపుమూడు బోర్లు వేసినా చుక్కనీరు రాలేదు జఫర్గడ్ మండలం రేగడి తండా గ్రామ శివారు టీబీ తండాకు చెందిన రైతు భూక్య రవీందర్ తనకు ఉన్న నాలుగు ఎకరాల్లో 3 ఎకరాల్లో పత్తి, మరో ఎకరంలో వరి సాగు కోసం నారు సిద్ధం చేసి ఉంచాడు. పెట్టుబడులకు రూ.35వేల వరకు ఖర్చు చేశాడు. వర్షాలు లేకపోవడం, ఉన్న ఒక్క బోరు ఒట్టిపోవడంతో పంటల కోసం రూ.2.50లక్షలు ఖర్చు చేసి 5వందల ఫీట్లకు పైగా మూడు బోర్లు వేసినా చుక్క నీరు రాలేదు. జనగామ మండలం గోపిరాజుపల్లిలో బీళ్లుబారిన పొలంలో వరణుడి కోసం ఎదురు చూస్తున్న మహిళా రైతుకౌలు రైతు కష్టాలు తరిగొప్పుల మండలం మరియపురానికి చెందిన కౌలు రైతు రాజబోయిన చిన్ను పత్తి చేనులో గుంటుక తోలుతూ అక్కడక్కడ మొలిసిన పత్తి మొక్కలను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎకరాకు రూ.18 వేల చొప్పున కౌలు చెల్లిస్తూ వ్యవసాయం చేస్తున్నాడు. అడపాదడపా కురిసిన వర్షాలకు తోడు చెరువుకుంటల్లో కొద్దిపాటి నీటి నిల్వలు ఉండడంతో రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాడు.జిల్లాలో పంటల సాగు అంచనా (ఎకరాల్లో)పంట అంచనా ప్రస్తుత సాగు వరి 95,653 68,000 పత్తి 1,38,000 92,500 కందులు 2,305 2,500 మొక్కజొన్న 8,000 3,100 పెసర్లు 562 350 ఇతర పంటలు 1,180 2,090 2,15,700 1,68,540జనగామ: కరువు కబంధ హస్తాల్లో వ్యవసాయం కొట్టుమిట్టాడుతోంది. తక్కువ వర్షపాతం, అడుగంటిన చెరువులు, ఎండిపోతున్న పంటలు, ప్రమాదకర భూగర్భ జలాలతో జిల్లా తీవ్ర కరువు కోరల్లో చిక్కుకుంటోంది. రైతుల ఆశలన్నీ ఇప్పుడు వరణుడి కరుణపైనే నిలిచాయి. జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, కందులు తదితర పంటలు కలిపి ఈ సీజన్లో సుమారు 2.15 లక్షల ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ఇప్పటివరకు సుమారు 1.68 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. ఈ సాగు కూడా నార్లు, విత్తన దశలోనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో వరి నార్లు సిద్ధంగా ఉండగా, మరికొన్ని చోట్ల రైతులు పత్తి విత్తనాలు వేస్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పోవడంతో సాగు పనులు ముం దుకు సాగడం లేదు. వర్షపాతం తక్కువే ఎల్నినో ప్రభావంతో జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడంతో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. దేవాదుల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల లేకపోవడం, చెరువులు అడుగంటిపోవడం, బోర్లలో నీరు తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 770 చెరువులు ఉన్న జిల్లాలో ఏ ఒక్క చెరువులోనూ 25 శాతం నీటి నిల్వలు లేకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. రిజర్వాయర్లలో కూడా నీటి నిల్వలు సగానికి తగ్గిపోయాయి. వరి, పత్తి పంటలకు కరువు ఛాయలు వరి, పత్తి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పంటల కాలం దాటి పోతుండడంతో 10 ఎకరాల్లో సాగు చేయాలనుకున్న రైతులు ఒకటి లేదా రెండు ఎకరాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. వాటికి కూడా సాగునీరు అందక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అనేక ప్రాంతాల్లో బకెట్లు, ట్రాక్టర్లు, పైపులైన్ల ద్వారా మొక్కలకు నీరు అందిస్తూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా, వరికి భారీ పైపు లైన్లను ఏర్పాటు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. ప్రస్తుతం ఐదు నుంచి ఎనిమిది అడుగుల వరకు పెరగాల్సిన పత్తి మొక్కలు అడుగు ఎత్తు కూడా పెరగక వాడిపోతున్నాయి. వందల ఎకరాల్లో రెండోసారి, మూడోసారి విత్తనాలు వేసినా ఆశించిన ఫలితం లేక రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. అయితే రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడం, ఉదయం తరచూ ట్రిప్ అవుతుండడంతో ఉన్న కొద్దిపాటి నీటిని కూడా వినియోగించుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అనేక మంది రైతులు అప్పులు చేసి 500 అడుగుల లోతు వరకు బోర్లు వేస్తున్నా చుక్క నీరు కూడా పడక లక్షల రూపాయలు నష్టపోతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గత ఏడాది ఇదే సమయంలో పచ్చని పంటలతో కళకళలాడిన పొలాలు నేడు పగుళ్లతో కనిపిస్తుండటంతో 1996 కరువు రోజులు గుర్తుకు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. లోటు వర్షపాతం జిల్లాలో ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో ఆశించిన మేర వర్షాలు కురవలేదు. జూన్లో సాధారణంగా 124.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 88.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. దీంతో 29 శాతం లోటు నమోదైంది. జూలైలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. సాధారణంగా 102.7 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉండగా, 47.2 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో 54 శాతం లోటు ఏర్పడింది. ఎల్నినో కోరలు..సాగుపై తీవ్ర ప్రభావం నీరులేక ఎండుతున్న పొలాలు.. బోసిపోతున్న చెరువులు.. వట్టిపోయిన బోర్లు పంటలను బతికించుకునేందుకు రైతుల ప్రయాస -
వరినారు ముదిరిపోయింది
వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాం. నాకున్న ఎకరంతో పాటు మూడు ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న. రెండు నెలల క్రితం పోసిన వరి నారు ముదిరిపోయింది. ఈ సీజన్లో మోస్తరు వర్షం కూడా లేక, దుక్కుల నుంచి కిందికి నీళ్లు జార లేదు. వర్షాలు లేక బోరు, బావిలో నీళ్లు ఇంకిపోయాయి. పంటల దిగుబడి రాకపోయినా కౌలుకు డబ్బులు ఇవ్వాల్సిందే. ఎలా బతకాలో అర్థం కావడం లేదు. –దొరగొల్ల కొండయ్య, రైతు, ఇబ్రహీంపూర్, రఘునాథపల్లి ఎకరమే పారుతోంది.. ఆరు ఎకరాల పొలంలో వరి కోసం నాలుగు ఎకరాలు సిద్ధం చేశాం. పెట్టుబడి కోసం రూ.లక్ష ఖర్చు చేశాం. సాగునీరుతో ఎకరం కూడా పారడం లేదు. మిగతా పంట ఎండి పోయేదశలో ఉంది. దేవాదుల ద్వారా సాగునీరు లేకపోవడం, వర్షాభావ పరిస్థితులతో బోర్లు వట్టిపోతున్నాయి. –భూస భాగ్యమ్మ, మహిళా రైతు, గోపిరాజుపల్లి, జనగామ మండలం -
పార్టీని మరింత బలోపేతం చేయాలి
● ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి ● కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభంజనగామ రూరల్: ప్రభుత్వం అమలు చేస్తున్న్ద అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేయాలని, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సమన్వయంతో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మినారాయణ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని కలెక్టరేట్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు లక్ష్మీనారాయణ నాయక్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ..పార్టీ కార్యకలాపాలకు జిల్లా కార్యాలయం కేంద్రబిందువుగా నిలుస్తుందన్నారు. ప్రతీ ఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి, కౌన్సిలర్లు, రాష్ట్ర కమిటీ నాయకులు, మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మురికినీటి నిర్వహణకు మ్యాజిక్ డ్రెయిన్
● పైలట్ ప్రాజెక్ట్ను పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: మురికినీటి నిర్వహణకు మ్యాజిక్ డ్రెయిన్ విధానం అమలుచేస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. పైలట్ ప్రా జెక్ట్గా మండలంలోని వడ్లకొండ గ్రామంలో చేపడుతున్న మ్యాజిక్ డ్రెయిన్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మ్యాజిక్ డ్రెయిన్ విధానంలో మొత్తం 30 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు వేర్వేరు సోక్ పిట్లు ఏర్పాటు చేసి, నీరు సహజసిద్ధంగా భూమిలోకి ఇంకిపోయేలా తగిన వాలుతో నిర్మా ణం చేపట్టడం జరుగుతుందన్నారు. నీటి ప్రవాహం ఎక్కడా నిలిచిపోకుండా గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా సజావుగా సాగేందుకు ప్రత్యేక డిజైన్ అనుసరిస్తారని తెలిపారు. ఈ పరిశీలనలో డీఆర్డీఓ భాస్కర్, ఈజీఎస్ పీడీ సూరి, ఎంపీడీఓ మహేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
ఏఐతో ప్రజా సమస్యల పరిష్కారం
వివిధ విభాగాల అధికారులకు సమాచారం, ఆదేశాలను త్వరగా చేరవేసేందుకు ఏఐ ఎంతో ఉపయోగపడుతుంది. సాధారణంగా అయితే డ్రాఫ్ట్ రెడీ చేసుకునేందుకు గంటల సమయం తీసుకుంటుంది. అదే ఏఐకి సరైన ప్రాంప్ట్ ఇస్తే సెకన్ల వ్యవధిలోనే డ్రాఫ్ట్ రెడీ అవుతుంది. కోర్టు కేసుల్లోనూ 100 నుంచి 150 పేజీల డాక్యుమెంట్ ఉన్న కాపీలను గూగుల్ క్ల్లౌడ్లో స్కాన్ చేసి ఒక పేజీలో ముఖ్యమైన సారాంశం ఇవ్వాలని సరైన ప్రాంప్ట్ ఇస్తే సెకన్లలో సిద్ధమవుతుంది. అలాగే, అధికారులు కూడా తమ రోజువారీ పనుల్లో ఏఐ వాడితే ప్రజాసమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫైళ్ల కదలికలో వేగం పెరుగుతుంది. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం తగ్గుతుంది. ప్రభుత్వ సేవలు త్వరగా చేరువ అవుతాయి. పారదర్శకత పెరుగుతుంది. – డాక్టర్ సత్యశారద, వరంగల్ కలెక్టర్ -
ఏఐతో ప్రభుత్వ కార్యాలయాల్లో మార్పులు..
అంశం పనిభారం తగ్గే శాతం80%పవర్పాయింట్/రిపోర్టులు ప్రజా ఫిర్యాదులు డేటా విశ్లేషణ తెలుగు అనువాదం మీటింగ్ మినిట్స్ డాక్యుమెంట్ సారాంశం లెటర్ల తయారీ82%85%88%90%92%95%ఏఐతో శాఖల వారీగా ప్రయోజనాలు ఇలా..శాఖ ప్రయోజనాలు రెవెన్యూ భూ రికార్డుల పరిశీలన, ఫైళ్ల సారాంశం, పెండింగ్ దరఖాస్తుల విశ్లేషణ పంచాయతీరాజ్ గ్రామసభ మినిట్స్, అభివృద్ధి పనుల నివేదికలు జీడబ్ల్యూఎంసీ ప్రజా ఫిర్యాదుల వర్గీకరణ, వార్డుల వారీగా సమస్యల విశ్లేషణ కలెక్టరేట్ అధికారిక లేఖలు, సమీక్ష నివేదికలు, సమావేశాల మినిట్స్ ఇతర శాఖలు డేటా విశ్లేషణ, అనువాదం, ప్రజెంటేషన్లు -
ఎరువులు, విత్తనాల కొరత ఉండొద్దు
● సమీక్షలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ: జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులకు యూరియా, విత్తనాలు, ఇతర వ్యవసాయ ఇన్పుట్లు ఎలాంటి కొరత లేకుండా సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎస్హెచ్జీ మహిళా శక్తి రైతు సేవా కేంద్రాల మహిళలతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 62 ఎస్హెచ్జీ మహిళా శక్తి రైతు సేవా కేంద్రాల్లో ప్రస్తుతం 44 కేంద్రాలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, నేడు 15 ఇ–పాస్యంత్రాల పంపిణీతో 59 క్రియాశీల వ్యవసాయ ఇన్పుట్ కేంద్రాలు రైతులకు సేవలు అందించనున్నాయని తెలిపారు. అనంతరం ఎస్ హెచ్జీ మహిళా శక్తి రైతు సేవా కేంద్రాలకు 15 ఇ–పాస్ యంత్రాలను కలెక్టర్ పంపిణీ చేశారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, డీఆర్డీఓ, డీపీఎం, మార్క్ఫెడ్, ఏడీఏ, సీ్త్రనిధి బ్యాంకు ప్రతినిధులు, 62 రైతు సేవా కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. పాడి రైతులకు ఎక్స్గ్రేషియా అందజేత జనగామ రూరల్: ప్రజావాణిలో అందిన ప్రతీ అర్జీని సానుభూతితో పరిశీలించి, అర్హులైన బాధితులకు ప్రభుత్వ సహాయం అందేలా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తగిలి గేదెలు మృతి చెందిన ఇద్దరు పశుపోషక రైతులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఎక్స్గ్రేషియా చెక్కులను కలెక్టర్ తన చాంబర్లో బాధితులకు అందజేశారు. దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన ఉప్పల అంజయ్యకు రూ.1,00,000 ఎక్స్గ్రేషియా, అదే మండలం చిన్నమడూర్ గ్రామానికి చెందిన అనగాని రాజుకు రూ.1,20,000 ఎక్స్గ్రేషియా మంజూరు చేసి కలెక్టర్ వారికి చెక్కులు అందజేశారు. -
చురుగ్గా సర్
● ఇప్పటివరకు 70 శాతానికి పైగా డిజిటైజేషన్ ● ఆగస్టు 3 వరకు గడువు పెంచిన కేంద్రంజనగామ: ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్)లో భాగంగా జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) విస్తృతంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ఓటర్ల వివరాల ధ్రువీకరణ చేపడుతున్నారు. జిల్లాలో 7,67,484 మంది ఓటర్లు ఉండగా, ఒక్కో బీఎల్ఓకు సగటున 887 మంది ఓటర్లు కేటాయించారు. జిల్లాలో మూడు నియోజకవర్గాలు కలిపి ఎస్ఐఆర్ డిజిటైజేషన్ 70.40 శాతంగా నమోదైంది. ఈనెల 24వ తేదీ వరకు ఎస్ఐఆర్ అవకాశం ఉండగా, కేంద్రం వచ్చే నెల 3వ తేదీ అంటే 10 రోజుల పాటు గడువు పెంచింది. నియోజకవర్గాల వారీగా జనగామ నియోజకవర్గంలో 278 మంది బీఎల్ఓలు పనిచేస్తుండగా, 2,49,437 మంది ఓటర్లకు సంబంధించిన ఎస్ఐఆర్ ఫారాలు 100 శాతం డౌన్లోడ్, ముద్రణ, పంపిణీ పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 1,69,281 ఫారాలు (67.87 శాతం) డిజిటైజేషన్ చేయగా, 1,68,494 ఫారాలు (67.55శాతం) బీఎల్ఓల ద్వారా ధ్రువీకరించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో 291 మంది బీఎల్ఓలు 2,56,806 మంది ఓటర్లకు సంబంధించిన ఫారాలను పూర్తిగా పంపిణీ చేశారు. ఇందులో 1,89,723 ఫారాలు (73.88శాతం) డిజిటైజేషన్ కాగా, 1,89,210 ఫారాలు (73.68 శాతం) ధ్రువీకరణ పూర్తి చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో 296 మంది బీఎల్ఓలు 2,61,241 మంది ఓటర్లకు సంబంధించిన ఫారాలను పూర్తిగా పంపిణీ చేశారు. ఇందులో 1,81,341 ఫారాలు (69.42శాతం) డిజిటైజేషన్ చేయగా, 1,80,810 ఫారాలు (69.21 శాతం) బీఎల్ఓలు ధ్రువీకరించారు. జిల్లా వ్యాప్తంగా 5,40,345 ఫారాలు (70.40శాతం) డిజిటైజేషన్ కాగా, 5,38,514 ఫారాలు (70.17శాతం) ధ్రువీకరణ పూర్తి చేశారు. -
శుక్రవారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2026
జనగామ: జిల్లాలో ఉద్యాన పంటల విస్తరణ, ఆధునిక సాగు పద్ధతులకు ప్రోత్సాహం, రైతుల ఆదా యం పెంచే లక్ష్యంతో జిల్లా ఉద్యానవన శాఖ 2026–27 సంవత్సరానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలో మొత్తం 24,334 ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధికి రూ.24,334 లక్షల ప్రణాళిక రూపొందించారు. ఇందులో మామిడి 8,882 ఎకరాలు, ఆయిల్పామ్ 8,283.14 ఎకరాలు ప్రధానంగా సాగవుతున్నాయి. 2,000 ఎకరాల్లో సూక్ష్మ నీటిపారుదల పర్ డ్రాప్ మోర్ క్రాప్ (పీఎండీసీ) పథకం కింద జిల్లాలో 2,000ఎకరాల్లో సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థల ఏర్పాటు కోసం రూ.6.287కోట్ల బడ్జెట్ కేటాయించారు. మండలాలకు లక్ష్యం నిర్దేశించారు. వర్గాల వారీగా.. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, బీసీ, ఎస్ఎఫ్, ఎంఎఫ్ రైతులకు 80 శాతం, ఇతర రైతులకు 70 శాతం వరకు రాయితీ ఇవ్వనుండగా, 12.50 ఎకరాలకు అర్హులు. ఇతర రైతులకు 70శాతం రాయితీతో 12.50 ఎకరాల వరకు లబ్ధి పొందవచ్చు. పోర్టబుల్ స్ప్రింక్లర నీటి పారుదల వ్యవస్థలకు అన్ని వర్గాల రైతులకు 65శాతం రాయితీ కల్పించారు. దరఖాస్తుదారులు సంబంధిత పత్రాలతో టీజీఎంఐపీ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే, క్షేత్ర పరిశీలన అనంతరం పరిపాలన అనుమతులు మంజూరు చేస్తారు. ఎంఐడీహెచ్ కింద.. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడీహెచ్) కింద జిల్లాలో 659.49 హెక్టార్లలో రూ.4.29 కోట్లతో పలు ఉద్యాన పంటల అభివృద్ధికి లక్ష్యాలు నిర్ణయించారు. అరటి, బొప్పాయి, మామిడి, నిమ్మ, జామ, డ్రాగన్ఫ్రూట్, అవకాడో, పూలసాగు, ప్లాస్టిక్ మల్చింగ్, కూరగాయల గ్రాఫ్టులు, వ్యక్తిగత ఫార్మ్ పాండ్లకు 40 నుంచి 75 శాతం వరకు రాయితీలు అందించనున్నారు. డ్రాగన్ఫ్రూట్ సాగుకు ఎకరానికి రూ.2.70లక్షలు, అరటికి రూ.70 వేల వరకు, మామిడి, నిమ్మ, జామ, అవకాడో సాగుకు రూ.50 వేల వరకు అందించనున్నారు. ఆయిల్పామ్ సాగుకు.. ఎన్ఎంఈఓ–ఆయిల్పామ్(ఎన్ఎంఈఓ, ఓపీ) పథ కం కింద జిల్లాలో 2,000 ఎకరాల్లో రూ.2.11 కోట్ల తో ఆయిల్పామ్ సాగు విస్తరణ చేపట్టనున్నారు. దిగుమతి మొక్కలకు మొక్కకు రూ.11,580, నాలు గు సంవత్సరాల నిర్వహణకు రూ.16,800 వరకు, రవాణా ఖర్చు మొక్కకు రూ.20 అందించనున్నారు. శాశ్వత పందిళ్లు, మల్బరీ సాగుకు.. పీఎం–ఆర్కేవీవై కింద 28 హెక్టార్లలో రూ.70 లక్షలతో శాశ్వత పందిళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఒక యూనిట్కు రూ.1 లక్ష వ్యయం ఉండగా, 50 శాతం (గరిష్ఠంగా రూ.50 వేల) రాయితీ అందించనున్నారు. అలాగే మల్బరీ సాగు, మల్బరీ రింగ్ బెడ్లు, టిష్యూ కల్చర్ మొక్కల పెంపకానికి కూడా ప్రత్యేక సబ్సిడీలు కల్పించనున్నారు. సద్వినియోగం చేసుకోవాలిజిల్లాలో 2026–27 సంవత్సరానికి ఉద్యాన పంటల విస్తరణకు ప్రభుత్వం పలు పథకాల కింద రాయితీలు అందిస్తోంది. సూక్ష్మనీటిపారుదల, పండ్ల తోటల ఏర్పాటు, ఆయిల్పామ్, డ్రాగన్ ఫ్రూట్, పూలసాగు, ప్లాస్టిక్ మల్చింగ్, శాశ్వత పందిళ్లు వంటి పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఆసక్తి గల రైతులు ఆధార్, పట్టాదారు పాస్బుక్, బ్యాంకు ఖాతా వివరాలతో సమీప ఉద్యానవన శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. – అంబికాసోని, జిల్లా వ్యవసాయశాఖ, ఇన్చార్జ్ హార్టికల్చర్, సెరికల్చర్ అధికారి 2026–27కు ఉద్యానవన శాఖ సమగ్ర ప్రణాళిక సిద్ధం రైతులకు కోట్ల రూపాయల రాయితీలు 2 వేల ఎకరాల్లో సూక్ష్మ నీటిపారుదల లక్ష్యం అరటి నుంచి డ్రాగన్ఫ్రూట్ వరకు సబ్సిడీ -
ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం
సాక్షి, వరంగల్: జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకొస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రజాహితంగా సమూల మార్పులు తేనుంది. ప్రజా సమస్యలు, ఫైళ్లు, లెటర్ల తయారీ, సమావేశాల నిర్ణయాల అమలులో జాప్యాన్ని నియంత్రించేందుకు ఏఐ ఉపయోగపడనుంది. హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్లలో 250 మంది అధికారులకు ఏఐ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫీషియెన్సీ శిక్షణ ఇచ్చింది. రోజువారీ ప్రభుత్వ పనుల్లో అధికారులు ఏఐ వినియోగాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద కూడా చాలెంజ్గా తీసుకొని అధికారులు ఏఐ వినియోగిస్తే ప్రజల సత్వర సేవలకు మరింత దగ్గరవుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా అధికారిక లేఖల తయారీ, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు సమాధానాలు, ఉన్నతాధికారులకు సమర్పించే నివేదికలు, మీటింగ్ మినిట్స్, జీఓ ఉత్తర్వుల సారాంశం, వివిధ పథకాల అమలుకు ప్రజలకు సులభంగా అర్థమయ్యే సమాచారం రూపొందించడం వంటి పనుల్లో చాట్జీపీటీ, నోట్బుక్ఎల్ఎం, క్లాడ్, భాషిణి వంటి ఏఐ సాధనాలను వినియోగించనున్నారు. ఇలా నెలరోజుల్లో ఏఐ పనితీరుతో జిల్లా పరిపాలనలో వేగం, పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ సాంకేతికతను అమలుచేస్తే ‘మీ పని పూర్తయ్యింది‘ అనే సమాధానం ప్రజలకు చేరనుంది. అదే జరిగితే ప్రభుత్వ కార్యాలయాలపై ప్రజలకు నమ్మకం మరింత బలపడుతుంది. వరంగల్ కలెక్టరేట్లో అధికారులకు ఏఐపై శిక్షణ ఇస్తున్న ట్రైనర్ఏఐ నుంచి కచ్చితమైన, ఉపయోగకరమైన ఫలితాలు పొందాలంటే అధికారులు నాలుగు దశల ప్రాంప్ట్ ఫ్రేమ్వర్క్ పాటించాలి. ముందుగా మీ పాత్రను స్పష్టంగా పేర్కొనాలి. తర్వాత ఏ పనిచేయాలో టాస్క్ రూపంలో వివరించాలి. ఆపై సంబంధిత గణాంకాలు, తేదీలు, అవసరమైన సమాచారం వంటి వివరాలు ఇవ్వాలి. చివరగా సమాధానం ఏ రూపంలో కావాలో ఫార్మాట్ను సూచించాలి. ఈ నాలుగు అంశాలను స్పష్టంగా ఇవ్వడం ద్వారా ఏఐ మరింత కచ్చితమైన, అవసరానికి అనుగుణమైన సమాధానాలు అధికారులకు అందిస్తుంది. – వాసుదేవ నటరాజ్, ఏఐ ట్రైనర్, టీఫైబర్ ఇలా చేస్తేనే ఫలితం.. ఫైళ్ల కదలిక, ప్రజా సమస్యల పరిష్కారంలో పెరగనున్న వేగం విధి నిర్వహణలో యంత్రాంగానికి సమయం ఆదా అయ్యే అవకాశం ఇప్పటికే వివిధ శాఖల అధికారులకు ఏఐ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫీషియెన్సీ శిక్షణ -
తాగునీటి సరఫరాకు ప్రాధాన్యమివ్వాలి
జనగామ రూరల్: తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు సూచించారు. గురువారం తాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నియంత్రణ, విద్యాశాఖ, సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని ప్రాజెక్టుల్లో తాగునీటికి అవసరమైన నీటి మట్టాల ను తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ప్రతీ నీటిబొట్టును సంరక్షించేలా ఇంకుడు గుంతలు, ఇతర నీటి సంరక్షణ పనులను సమర్థవంతంగా చేపట్టాలన్నారు. విద్యార్థులకు అందించాల్సిన ఏకరూప దుస్తుల్లో ఒక జతను ఆగస్టు 15 నాటికి అందజేయాలని ఆదేశించారు. కాగా, జిల్లాలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి రైతుసేవా కేంద్రాలను ఆయన అభినందించారు. వీసీలో డీఏఓ అంబికా సోని, డీఆర్డీఓ భాస్కర్, డీసీఎస్ఓ సురేష్ రెడ్డి, డీఎం సీఎస్ హతిరామ్, డీపీఓ వెంకట్ రెడ్డి, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లాలో మహిళా శక్తి రైతుసేవా కేంద్రాల ఏర్పాటుపై అభినందన -
భూసమస్యలకు చెక్
బచ్చన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో భూ సమస్యలు లేకుండా చేయాలనే లక్ష్యంతో భూభారతి భూ రీసర్వేలను చేపట్టింది. జిల్లాలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా భూముల మ్యాపులు సరిగా లేని 7 గ్రామాలను గుర్తించారు. బచ్చన్నపేట మండలంలో కొడవటూర్, జనగామ మండలంలో మరిగడి, కొడకండ్లలో నర్సింగాపూర్, పాలకుర్తిలో లక్ష్మినారాయణపూర్, తరిగొప్పులలో అక్కరాజుపల్లి, చిల్పూర్లో రాజవరం, దేవరుప్పులలో చౌడూరు గ్రామాలను గుర్తించి మొదటి విడతగా భూభారతి భూరీసర్వేలను చేయాలని ఆయా మండలాల అధికారులను ఆదేశించారు. సర్వే చేస్తారిలా.. గ్రామాల్లో గల భూమి, సర్వే నంబర్లను సర్వేయర్లు తీసుకొని మొదటి విడతగా హద్దులు నిర్ణయించారు. మూడు గ్రామాల ట్రై యాంగిల్ జంక్షన్లను తీసుకొని, 30 మీటర్లకు ఒక హద్దును నిర్ణయించి గ్రామహద్దులను పెట్టారు. రెండో దశలో గ్రామంలోని పట్టా, అసైన్డ్, ప్రభుత్వ భూములను గుర్తించి పట్టా భూములను ఐదు ఖండాలుగా విభజించనున్నారు. అలాగే సాగు భూములకు ఎల్పీఎం (ల్యాండ్ పెంటల్ మ్యాప్), ఎల్పీఎన్ (ల్యాండ్ పెంటల్ నెంబర్) భూదార్ నెంబర్లు మనకు ఆధార్ నంబర్లలాగా ఇస్తారు. పాత హద్దులను గుర్తించడానికి డీజీపీఎస్తో రేఖాంశాలు, అక్షాంశాలను గుర్తించి హద్దులను నిర్ణయిస్తారు. చెరువులు, కుంటలు, బాటలు, రోడ్లకు ప్రతీ 200 మీటర్లకు భూదార్ నంబర్లను రైతులకు సులువుగా ఉండడానికి కేటాయిస్తారు. ఈ భూములను రీసర్వే చేయడానికి తహసీల్దార్, ఎంఆర్ఐ, జీపీఓ, సర్వేయర్, ఐదుగురు లైసెన్స్డ్ సర్వేయర్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దానికి తహసీల్దార్ నేతృత్వం వహిస్తారు. ఈ భూములను కొలతలు వేయడానికి అధికారులు ఏడు డీజీపీఎస్ మిషన్లను ఆయా మండలాల అధికారులకు అందించారు. దీంతో గ్రామంలో ఉన్న భూసమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కానున్నాయి. ప్రతీ రైతుకు రీసర్వేతో న్యాయం చేకూరనుంది. రెండో విడతలో బచ్చన్నపేట మండలంలోని నారాయణపురం, గంగాపూర్, ఇటుకాలపల్లి, రామచంద్రాపూర్, పుల్లగూడ, దబ్బగుంటపల్లి, బండనాగారం, మన్సాన్పల్లి, బసిరెడ్డిపల్లి, లక్ష్మాపూర్ రెవెన్యూ గ్రామాలలో భూ రీసర్వేలను చేపడతారు. కొడవటూర్లో.. గ్రామంలో 364 సర్వే నంబర్లలో 2470–07 ఎకరాల మొత్తం విస్తీర్ణం భూమిలో 1,740 మంది రైతులు ఖాతాలను కలిగిఉన్నారు. 13 సర్వేనంబర్లలో 362–08 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, ఎకరాలు 30–10 గుంటల భూమిని కెనాల్స్ కోసం ప్రభుత్వం కొనుగోలు చేసింది. గ్రామంలో 12రోడ్లు, బాటలు ఉన్నాయి. లక్ష్మాపూర్, బండనాగారం, కేసిరెడ్డిపల్లి, బసిరెడ్డిపల్లి, బచ్చన్నపేట ఐదు గ్రామాల్లో ట్రైజంక్షన్లు ఉన్నాయి. గ్రామంలో ట్రెయినీ అదనపు కలెక్టర్ ఎం.తేజస్విని, ఏడీ మన్నెంకొండ, ఆర్డీఓ గోపీరాంనాయక్, తహసీల్దార్ ఇంద్రవల్లి హుస్సేన్లో పర్యటిస్తూ భూకొలతలను పరిశీలిస్తున్నారు. భూభారతి భూ రీసర్వేలతో పరిష్కారం జిల్లాలో 7 గ్రామాల్లో సర్వేలుసమస్యలు లేకుండా చేస్తాం..గ్రామాల్లో భూభారతి రీసర్వేలతో భూసమస్యలు పరిష్కారం అవుతాయి. రైతు కలిగి ఉంటే మొత్తం భూమికి భూదార్ నంబర్ ఒకటే కేటాయిస్తాం. ప్రస్తుతం రైతులు ఎంత సేద్యపు భూమిలో ఉన్నారో కూడా ప్రామాణికంగా తీసుకుంటాం. రైతులకు సమాచారం అందిస్తూనే పనులు చేస్తూ ముందుకు సాగుతాం. – హస్సేన్, తహసీల్దార్ -
ఇంకుడు గుంతల ఏర్పాటు తప్పనిసరి
● పురపాలిక సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన మున్సిపల్ కమిషనర్జనగామ: ప్రతీ ఇల్లు, విద్యాసంస్థ, ప్రభుత్వ కార్యాలయం, వాణిజ్య సముదాయంలో తప్పనిసరిగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ (ఇంకుడు గుంతలు) వ్యవస్థలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి సూచించారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ‘క్యాచ్ ది రైన్–వర్షపు నీటిని ఒడిసిపట్టండి’ అవగాహన కార్యక్రమాన్ని పురపాలక కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, ప్రతీ ఇంటిలో ఇంకుడు గుంతల ఏర్పాటు, వర్షపు నీటిని వృథా కాకుండా నిల్వ చేసుకోవాల్సిన అవసరంపై అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ‘ప్రతి నీటి బొట్టును సంరక్షిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపట్టి భవిష్యత్ తరాలకు నీటి వనరులను కాపాడుదాం’ అంటూ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక, ఇంజినీరింగ్ విభాగం అధికారులు, శానిటేషన్ సిబ్బంది, ఇతర శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. -
డిజిటలైజేషన్ త్వరితగతిన పూర్తి చేయాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని బాధ్యతగా, సమర్ధవంతంగా చేపట్టాలని, ప్రతీ ఓటరుతో ఎన్యుమరేషన్ ఫారాలు నింపించి త్వరితగతిన డిజిటలైజేషన్ను పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పట్టణ కేంద్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్ఓలు, సంబంధిత అధికారులతో మాట్లాడారు.. ప్రతీ ఓటరును చైతన్యపరిచి ఎన్యుమరేషన్ ఫారాలను తప్పనిసరిగా నింపించాలన్నారు. అనంతరం స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ సమీపాన జాతీయ రహదారిపై నిర్మాణం చేపడుతున్న ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ స్వప్న, మున్సిపల్ కమిషనర్ రాధాక్రిష్ణ తదితరులున్నారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ ప్రతీ ఒక్కరూ విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని, అప్పుడే భవిష్యత్కు మంచి మార్గం ఏర్పడుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మండలంలోని నమిలిగొండ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. వంటగదిలోని ఆర్ఓ ప్లాంట్, వంట సరుకులను, సిద్ధం చేసిన భోజనాన్ని పరిశీలించారు. అరటిపండ్లు నాణ్యతగా లేవని, శుభ్రమైన పండ్లను మాత్రమే విద్యార్థులకు అందించాలన్నారు. కోడిగుడ్ల నాణ్యతను నీళ్లలో వేసి స్వయంగా పరిశీలించారు. అనంతరం పదో తరగతిలో అన్అకాడమీ తరగతులను ప్రారంభించి ఫాస్ట్మ్యాథ్స్, గెట్ ఐటీ రైట్ పుస్తకాల ప్రాధాన్యాన్ని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు యూనిఫాంలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జీసీడీఓ గౌసియాబేగం, ఎస్ఓ రజిత తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’ ప్రక్రియలో భాగస్వాములు కావాలి
● కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డిజనగామ రూరల్: ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో అమూల్యమైందని, ఎస్ఐఆర్ ప్రక్రియలో కార్యకర్తలు భాగస్వాములు కావాలని, దొంగ ఓట్లతో అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి సూచించారు. బుధవారం పట్టణంలోని జాబ్లీ గార్డెన్లో పట్టణ అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన నియోజకవర్గ సమగ్ర ఓటరు సవరణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కొమ్మూరి మాట్లాడుతూ.. చేర్యాల, జనగామ పట్టణాల్లో 15 వేల వరకు బోగస్ ఓట్లు ఉన్నాయని, ఇప్పుడు అవి బయట పడతాయన్నారు. అన్ని గ్రామాల్లో, పట్టణంలో ఎన్యుమరేషన్ వందశాతం పూర్తి చేసేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ మాట్లాడుతూ..పట్టణంలో ప్రతీ రెండు వార్డులకు ఒక హెల్ప్లైన్ డెస్క్ ఏర్పాటు చేసి ఓటు నమోదుకు కృషి చేస్తామని తెలిపారు. కౌన్సిలర్లు, మండలాల అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు. ముమ్మరంగా ‘ఎస్ఐఆర్’ చేపట్టాలిజనగామ రూరల్: నియోజకవర్గంలో ఓటరు సవరణ ప్రక్రియ ముమ్మరంగా చేపట్టాలని ఆర్డీఓ గోపిరామ్ అన్నారు. బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గం–98లోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 15 నుంచి 24వ తేదీ వరకు ఎన్యూమరేషన్ ఫారంల సేకరణ, డిజిటలైజేషన్ పూర్తి చేయాల్సి ఉందన్నారు. 31లోగా ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురించనున్న నేపథ్యంలో సర్వేలో అందరూ భాగస్వాములై సహకరించాలని కోరారు. -
రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు
కాజీపేట అర్బన్: సర్కారుకు ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్న రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మించాలనే సంకల్పంతో ఈనెల 7న జీఓ ఆర్టీ నంబర్ 414ను ప్రభుత్వం విడుదల చేసింది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తే అద్దె మిగులుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎనిమిదితో పాటు డీఐజీ కార్యాలయం కూడా అద్దె భవనాల్లోనే కొనసాగుతుండగా కొడకండ్లలో నిర్మాణంలో ఉంది. కాగా, ఏడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు డీఐజీ కార్యాలయం అద్దెలో కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో పూర్తిస్థాయిలో శాశ్వత భవనాలు నిర్మాణంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు లభించే అవకాశం ఉంటుంది. స్థల సేకరణకు కలెక్టర్లకు వినతులు ఉమ్మడి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నర్సంపేట, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ ఆర్ఓలో డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్ ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలకు భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోమ, మంగళవారాల్లో వినతులు అందజేశారు. ఒక్కో కార్యాలయానికి ఒక్కో ఎకరం భూమి అందుబాటులోకి తెచ్చుకోవాలని, స్థల సేకరణ పూర్తి కాగానే ప్రభుత్వమే స్వయంగా శాశ్వత భవనాలను నిర్మించనున్నట్లు జీఓలో పేర్కొన్నారు. ప్రతీ నెల మిగలనున్న రూ.1,88,852 అద్దె ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని ఎనిమిది కార్యాలయాలు, డీఐజీ కార్యాలయం అద్దె భవనాల్లో కొనసాగుతుండడంతో ప్రతి నెల1,88,852 రూపాయలను అద్దె రూపంలో చెల్లిస్తున్నారు. ప్రభుత్వం శాశ్వత భవనాలను నిర్మిస్తే ఈ మొత్తం నగదు మిగలనుంది. స్థలం సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు కలెక్టర్లకు వినతుల అందజేత అద్దెలకు చెక్.. ఖజానాకు మిగలనున్న ఆదాయం -
సాంకేతికతతో నేరాలు నియంత్రించాలి
వరంగల్ క్రైం: అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నేరాల నియంత్రణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, శాంతిభద్రతల నిర్వహణలో మరింత సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎస్.శ్వేత అధికారులను ఆదేశించారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లోని పోలీస్ కంట్రోల్ రూం, కమాండ్ కంట్రోల్ రూంను సంబంధిత అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా కంట్రోల్ రూం సిబ్బంది పనితీరు, అత్యవసర కాల్స్ స్వీకరణ విధానం, సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ, నగరంలోని వివిధ ప్రాంతాలపై నిఘా, సాంకేతిక వ్యవస్థల పనితీరును కమిషనర్ సమీక్షించారు. సీపీ వెంట అదనపు డీసీపీలు ప్రభాకర్ రావు, శ్రీనివాస్, ఏసీపీ జితేందర్ రెడ్డి, ఆర్ఐ సతీష్, క్లూస్ ఇన్స్పెక్టర్ రాజ్కుమార్, ఎస్సై రోహిత్, ఆర్ఎస్సై శ్రవణ్ కుమార్ ఉన్నారు. సమష్టి కృషితో అధిక లాభాలునర్మెట: మహిళలు అడుగు వేస్తే సాధించలేనిదంటూ ఏమీలేదని, సమష్టి కృషితో అధిక లాభాలు సాధించవచ్చని డీఆర్డీఓ ఆర్.భాస్కర్ అన్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన నర్మెట ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కం.లి. నాలుగు మండలాల(నర్మెట, తరిగొప్పుల, చిల్పూర్, బచ్చన్నపేట) సంఘాల వార్షిక సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.. కల్తీలేని ఆహార పదార్థాలు అందించే దిశగా పంటల మార్పిడి చేపట్టి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, ప్రాసెసింగ్, గ్రేడింగ్ విధానంతో వినియోగదారులకు చేరువకావడంతో పాటు అధిక లాభాలు ఆర్జించవచ్చని అన్నారు. కావలసిన యంత్రాలకు ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. ఈసందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. చైర్మన్గా సుప్రియ, వైస్ చైర్మన్గా లక్క శ్రీలత, కార్యదర్శిగా తప్పెట రజిత ఎన్నికయ్యారు. కార్యక్రమంలో అదనపు డీఆర్డీఓ ఎమ్డీ నూరొద్దీన్, సెర్ప్ పీఎం పి.ఉమాపతి, సీనియర్ మేనేజర్ శ్రీనివాస్, డీపీఎం నళిని నారాయణ, ఐబీ డీపీఎం శ్రీనివాస్, ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్, ఏఓ బుర్రా మమత, సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్, ఏపీఎంలు, సీసీలు, డైరెక్టర్లు, సంఘాల సభ్యులు పాల్గొన్నారు. పోస్టర్ల ఆవిష్కరణ కేయూ క్యాంపస్: కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ వరంగల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈఏడాది ఆగస్టు 22న కేయూలో వికసిత్ భారత్ 2047 అకౌంటింగ్, ఫైనాన్స్ పాత్రపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రంతో కలిసి బుధవారం ఆవిష్కరించారు. -
ఉల్లంఘనులపై ఉక్కుపాదం
పట్టణంలో వివిధ ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా నిబంధనల ఉల్లంఘనలపై బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించాయి. మున్సిపల్ అధికారులు అక్రమ సెల్లార్లు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఓ భారీ భవనాన్ని సీజ్ చేశారు. కమర్షియల్ టాక్స్ అధికారులు ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రొఫెషనల్ టాక్స్ బకాయిల చెల్లింపుపై నోటీసులు జారీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ అనుమతులు లేని ల్యాబ్ను సీజ్ చేయగా, రెవెన్యూ, విద్యుత్, ఫైర్ సేఫ్టీ, ఇంటర్మీడియట్ బోర్డు తదితర శాఖలు కూడా ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఉల్లంఘనలపై చర్యలు ప్రారంభించాయి. జనగామ: పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న భవన యజమానులపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. పార్కింగ్ కోసం నిర్మించిన సెల్లార్లలో వ్యాపార సంస్థలు నిర్వహించడం వల్ల ప్రజలకు పార్కింగ్ ఇబ్బందులు తలెత్తడంతో పాటు రోడ్లపై వాహనాలు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, విద్యుత్, ఇంటర్మీడియట్, అగ్నిమాపక, తదితర శాఖల అధికారులతో కలిసి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. గతనెల 17న ‘సెల్లార్లలో వ్యాపారాలు, రోడ్లపై వాహనాల పార్కింగ్’ సాక్షిలో శీర్షికతో ప్రచురితమైన కథనానికి స్పందించిన కమిషనర్ జిల్లా కేంద్రంలోని స్వర్ణ కళామందిర్ ప్రాంతంలో ఉన్న సెల్లార్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన భవన యజమానులకు ఇప్పటికే మొదటి, రెండో నోటీసులు జారీ చేసి నెల రోజుల గడువు ఇచ్చినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఐదు సెల్లార్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన సెల్లార్ల తాళాలు, సీళ్లను మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు ప్రారంభించారు. కొనసాగనున్న తనిఖీలు పట్టణంలోని హైదరాబాద్ రోడ్, హనుమకొండ రోడ్, సూర్యాపేట రోడ్, సిద్దిపేట రోడ్, కృష్ణ, స్వర్ణ కళామందిర్ ప్రాంతాలతో పాటు ఇతర ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో దశలవారీగా తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న సెల్లార్లపై ఇదే తరహా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. ప్రతీ భవనం మున్సిపల్ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, అనుమతులు పొందిన విధంగానే వినియోగించాలని కమిషనర్ రాజశేఖర్రెడ్డి సూచించారు. తనిఖీల్లో నాని హాస్పిటల్ పరిధిలోని సెల్లార్, ఎస్కే సూపర్ బజార్, బిగ్ బజార్, తుల్జాభవానీ లేడీస్ ఎంపోరియం తదితర వ్యాపార సముదాయాలకు చెందిన సెల్లార్లను సీజ్ చేసి తదుపరి చట్టపరమైన చర్యలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనుమతులు లేని ల్యాబ్ సీజ్ పట్టణంలోని నాని ప్రైవేట్ ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా అవసరమైన రిజిస్ట్రేషన్, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ల్యాబొరేటరీని సంబంధిత అధికారులు సీజ్ చేశారు. తనిఖీల సందర్భంగా ల్యాబ్ నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన అధికారులు వెంటనే సీజ్ చర్యలు చేపట్టారు. ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులు పట్టణంలోని 30 ప్రైవేటు ఆస్పత్రులకు ప్రొఫెషనల్ టాక్స్ బకాయిల చెల్లింపులపై అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రతీ సంవత్సరం సుమారు రూ.2,500వరకు ప్రొఫెషనల్ టాక్స్ చెల్లించాల్సి ఉండగా, పలుచోట్ల బకాయిలు పేరుకుపోయినట్లు గుర్తించారు. నోటీసులు అందిన ఆస్పత్రులు నిర్దేశిత గడువులోపు బకాయిలను చెల్లించాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల వివరాలను కూడా పరిశీలించి, వాటికి సంబంధించిన బకాయిలపై నోటీసులు జారీ చేయనున్నట్లు కమర్షియల్ టాక్స్ అధికారి వీరబాబు తెలిపారు. పట్టణంలో ఐదు అక్రమ సెల్లార్లు సీజ్ సెల్లార్ల దుర్వినియోగంపై మున్సిపల్ కమిషనర్ కఠిన చర్యలు ఒక్కరోజే పలు శాఖల అధికారుల మెరుపు తనిఖీలు నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకులు, కళాశాల నిర్వహణ కలెక్టర్ ఆదేశాలతో భవనం మూసివేత పార్కింగ్ నిబంధనల ఉల్లంఘన, అనుమతి లేని హాస్టళ్లు తనిఖీల్లో బయటపడ్డ అక్రమాలు కెనరా బ్యాంకు ప్రమాదం తర్వాత.. పట్టణంలోని బాలాజీనగర్ ఏరియా కెనరా బ్యాంకు శాఖలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి నేతృత్వంలో ఎనిమిది శాఖల ఉన్నతాధికారులు బుధవారం భవనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బాలాజీ నగర్లో నిమ్మ రామ్మోహన్రెడ్డికి సంబంధించిన భవనంలో అద్దెకు కొనసాగుతున్న కెనరా బ్యాంకుతో పాటు డీసీసీ బ్యాంకు, పై అంతస్తుల్లో అనుమతులు లేకుండా కళాశాల తరగతి గదులు, హాస్టళ్లు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీలో భవన నిర్మాణం, వినియోగంలో పలు నిబంధనల ఉల్లంఘనలు వెలుగు చూశాయి. నివాస గృహ నిర్మాణానికి అనుమతి పొందిన భవనాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించడం, స్టిల్ట్ ఫ్లోర్ను పార్కింగ్కు బదులుగా ఇతర అవసరాలకు ఉపయోగించడం, తప్పనిసరిగా ఉండాల్సిన సెట్బ్యాక్లను పాటించకపోవడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. అలాగే భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే విద్యుత్ కనెక్షన్ పొందినట్లు, విద్యాశాఖ అనుమతులు లేకుండా కళాశాల తరగతులు, హాస్టళ్లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత భవనాన్ని పూర్తిగా సీజ్ చేసినట్లు కమిషనర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. తనిఖీల్లో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి రేమండ్బాబు, విద్యాశాఖ అదనపు డైరెక్టర్ కార్యాలయ ప్రతినిధులు, పట్టణ ప్రణాళిక, పురపాలిక విభాగం అధికారులు పులి శేఖర్, కుమార్, పవన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో ఉన్న రెండు బ్యాంకుల నిర్వహణకు సంబంధించి బ్యాంకింగ్ ఉన్నతాధికారులు నేడు కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను కలవనున్నట్లు సమాచారం. -
డిగ్రీ.. డిమాండ్ డౌన్!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ విద్యాసంవత్సరం 2026–2027లో ప్రవేశాలకు విద్యార్థులు అనాసక్తి చూపుతున్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, గురుకుల, అటానమస్ డిగ్రీ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో ఇంకా 70శాతం సీట్లు ఖాళీగానే ఉన్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్ తదితర కోర్సులతోపాటు ఈసారి కొన్ని కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తంగా 241 డిగ్రీ కళాశాలలుండగా ప్రథమ సంవత్సరంలో 1,00,600 సీట్లు ఉన్నాయి. ఆన్లైన్ దోస్త్ ద్వారా ఇప్పటికే మూడు దశల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. ఇప్పటివరకు 30,071సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. విద్యార్థులు ఎక్కువగా ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులవైపు ఆసక్తి చూపడం వల్లే సీట్లు భర్తీ కావడం లేదని భావిస్తున్నారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో ఇంకా మొదటి దశలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే సీట్లురాని వారు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందనున్నారు. నాల్గవ దశ లేదా స్పెషల్ ఫేజ్పైనే ఆశలు.. కాలేజీల్లో ప్రవేశాలకు నాల్గవ దశ లేదా స్పెషల్ ఫేజ్గా మరోసారి రాష్ట్ర ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించబోతుంది. ఈనెల 20నుంచి 25వ తేదీ మధ్య స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ నోటిఫికేషన్ రానున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ దశలో మిగతా సీట్లలో కొంతమేర భర్తీ అవుతాయనే ధీమాతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఉన్నారు. ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు అడ్మిషన్ల కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పలు కొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టారు. దీంతో గతంకంటే కొన్ని కళాశాలల్లో సీట్లు పెరిగాయి. కానీ, కొన్ని ప్రైవేట్ కళాశాలల్లోనూ వివిధ కోర్సుల్లో ఆశించిన మేర సీట్లు భర్తీ కాకపోవడం ఆందోళన కలిగించే అంశంగా అధ్యాపకులు చెబుతున్నారు. ఈసారి కొత్త కోర్సులు ఇలా.. ఈ విద్యాసంవత్సరంలో డిగ్రీ స్ధాయిలో ప్రభుత్వం ఉపాధి కల్పనకు కోర్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులో అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాం కింద (ఏఈడీపీ), బీకాం బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), బీఎస్సీ హార్టికల్చర్, హెల్త్కేర్ మేనేజ్మెంట్, డెయిరీ అండ్ పౌల్ట్రీ మేనేజ్మెంట్, బీబీఏ రిటైల్ ఆపరేషన్స్, బీఎస్సీ లైఫ్సైన్సెస్ ప్రధానంగా ఉన్నాయి. వీటిద్వారా పలు కళాశాలల్లో కొంత మేర అడ్మిషన్లు అయ్యాయి. మరికొన్నింటిల్లో అంతంత మాత్రమే భర్తీ అయ్యాయి.కేయూ పరిధిలో లక్షకు పైగా సీట్లలో 30,071 మాత్రమే భర్తీ మూడు విడతల ప్రవేశాలు పూర్తయినా ఇంకా 70 శాతం సీట్లు ఖాళీ ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులవైపు విద్యార్థుల మొగ్గు ప్రత్యేక లేదా నాలుగో విడత కౌన్సెలింగ్పైనే కళాశాలల ఆశలు -
తెలంగాణకు మణికిరీటం ‘తాడిచర్ల–2’
● కోల్బ్లాక్ ద్వారా రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ ● కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డిమల్హర్: తాడిచర్ల–2 కోల్బ్లాక్ తెలంగాణకు మణికిరీటంగా నిలుస్తుందని, తాడిచర్ల–2 కోల్బ్లాక్ను సింగరేణికి అప్పగించడం సంతోషకరమైన విషయమని కేంద్రమంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. సింగరేణి భరోసాయాత్రలో భాగంగా మంగళవారం మండల కేంద్రం తాడిచర్లలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు.. తాడిచర్ల–2 నుంచి త్వరలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కానుందన్నారు. ఈ గని ద్వారా సుమారు 2,000 శాశ్వత ఉద్యోగాలు, మరో 5,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ ప్రాంతంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గని కార్యకలాపాలతో వేలాది వాహనాల రాకపోకలు పెరిగి స్థానికంగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ బ్లాక్ద్వారా సుమారు రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ జరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. భారతదేశంలోలోనే అతిపెద్ద కోల్బ్లాక్గా తాడిచర్ల–2 నిలుస్తుందని, ఇది ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న అద్భుత నిర్ణయమని కొనియాడారు. గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు, సింగరేణి సంస్థ, తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అవసరమైన అన్ని అనుమతులు, క్లియరెన్స్లు త్వరగా పొందిన అనంతరం సింగరేణి పనులు ప్రారంభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, రాష్ట్ర నాయకులు సునీల్రెడ్డి, నారాయణరెడ్డి, కీర్తిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నిషిధర్రెడ్డి, మల్క మోహన్రావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
చదువుతోనే సమాజంలో మార్పు
జఫర్గఢ్: చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను మంగళవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు విభా గాలను పరిశీలించారు. వంట గదిని తనిఖీ చేసి విద్యార్థినులకు అందిస్తున్న అహార నాణ్యత డైట్ చార్జీల అమలు, ప్రతీ రోజు వండుతున్న భోజన పదార్థాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోనాయిచలం రెవెన్యూ పరిధిలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన సముదాయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లాలోని ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఫారాల పంపిణీ, స్వీకరణ, డేటా ఎంట్రీ పురోగతిని పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ దేవేందర్, సిబ్బంది పాల్గొన్నారు. కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్ కొడకండ్ల: విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. మండల కేంద్రంలోని బాలికల గురుకులాన్ని కలెక్టర్ సందర్శించి విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన, వసతులు, సదుపాయాలను పరిశీలించారు. జీసీడీఓ గౌసియాభేగం, తహసీల్దార్ అనీల్బాబు, ఎంపీడీఓ రవిందర్, సర్పంచ్ మమతసతీష్గౌడ్, ప్రిన్సిపాల్ దిలీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపార రంగంలో రాణించాలి జనగామ రూరల్: మహిళా సంఘాల సభ్యులు వ్యాపార రంగంలో రాణించాలని, ఆదాయ వనరులను సమకూర్చుకునేలా పెద్ద యూనిట్ల ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్లో సీ్త్రనిధి రుణాలపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ‘మన సీ్త్రనిధి’ మొబైల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా సూపర్మార్ట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. డీఆర్డీఓ పీడీ భాస్కర్, ఏపీడీ నూరుద్దీన్, సీ్త్రనిధి జోనల్ మేనేజర్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు, సీ్త్రనిధి డైరెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ -
చెర వీడి..సర్కార్ చేతికి!
జనగామ: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు రైతుల భూసమస్యల పరిష్కారంపై సమాంతరంగా దృష్టి సారిస్తూ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో ప్రభుత్వ భూములపై జరిగిన ఆక్రమణలను గుర్తించి వాటిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ చర్యల ఫలితంగా ఇప్పటి వరకు సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమి రక్షించబడినట్లు సమాచారం. బచ్చన్నపేట మండలం సాల్వాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 147లో ఉన్న సుమారు 163 ఎకరాల ప్రభుత్వ భూమిని పూర్తిగా ప్రభుత్వానికి పునరుద్ధరించారు. ఇందులో ప్రధానంగా ఆక్రమణలో ఉన్న సుమారు 84 ఎకరాల భూమిని అధికారుల సమక్షంలో వివరణాత్మక పంచనామా నిర్వహించి భౌతికంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి మూలాధార సెటిల్మెంట్ రికార్డుల్లో ‘గెరాన్’గా నమోదై ఉండటంతో పాటు నిషేధిత ఆస్తుల జాబితాలో రక్షణ పొందిన భూమిగా గుర్తించబడింది. అయినప్పటికీ హక్కులు లేని వ్యక్తులు రిజిస్టర్డ్ అమ్మకపు దస్తావేజుల ద్వారా భూమిని స్వాధీనం చేసుకున్నట్లు విచారణలో వెలుగుచూసింది. అదే విధంగా చిల్పూరు మండల కేంద్రంలో ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలో ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా విముక్తి చేసి ప్రభుత్వానికి అప్పగించారు. మరోవైపు జనగామ మండలం శామీర్పేటలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రైతు భూమి సమస్యకు పరిష్కారం చూపిన కలెక్టర్, బచ్చన్నపేట మండలం బండనాగారం గ్రామంలో దాదాపు 60 ఏళ్లుగా కొనసాగుతున్న వ్యవసాయ పావుల వద్ద పానాది వివాదాన్ని కూడా పరిష్కరి ంచి రైతులకు ఉపశమనం కల్పించారు. జిల్లాలో ప్రభుత్వ భూములు ప్రైవేటు పట్టాలుగా ఎలా మారాయి? అప్పటి రెవెన్యూ నిబంధనలు ఎందుకు అమలు కాలేదు? మాన్యువల్ రికార్డుల్లో ఎలాంటి మార్పులు జరిగాయి? దశాబ్దాలుగా ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు ఎలా అనుభవించారనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారుల పాత్రపైనా సమగ్ర విచారణ జరపాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఈ భూములకు రైతుబంధు నిధులు విడుదలయ్యాయా, విడుదలై ఉంటే ఎంత మొత్తం చెల్లించారో విచారించి, అక్రమంగా పొందిన సొమ్మును తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. కబ్జాలు, అక్రమ పట్టాలపై దర్యాప్తు ఆక్రమణల గుట్టు విప్పుతున్న రెవెన్యూ యంత్రాంగం సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం మరో వెయ్యి ఎకరాలపై విచారణ? -
ప్రజల భద్రతే పోలీస్ శాఖ లక్ష్యం
హసన్పర్తి: ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. కిట్స్ కళాశాల సమావేశపు మందిరంలో పోలీస్ అధికారుల నెలవారీ నేర సమీక్ష మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో పెండింగ్ కేసులు, వివిధ నేరాల దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతల పరిస్థితి, మహిళలు, చిన్నారులపై దాడులు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలపై సీపీ సమీక్షించారు. అనంతరం కమిషనర్ శ్వేత మాట్లాడుతూ ప్రతి కేసును పారదర్శకంగా దర్యాప్తు చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డయల్ 100 ద్వారా వచ్చే ప్రతికాల్పై తక్షణమే స్పందించి బాధితులకు సకాలంలో సేవలు అందించాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని, అవసరమైతే రౌడీషీట్ తెరవాలని పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన, పోగొట్టుకున్న సుమారు రూ.50 లక్షల విలువైన 352 సెల్ఫోన్లను సీపీ బాధితులకు అందజేశారు. సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, దారా కవిత, రాజమహేంద్రనాయక్, కిశోర్సింగ్, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. నెలవారీ నేర సమీక్షలో వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత -
వరుస తడి.. పారేనా మడి
నర్మెట శివారు మరియాపురంలో మిర్చితోటకు నీరుపారిస్తున్న వృద్ధ రైతు కిష్టయ్యరోహిణి, మృగశిర, ఆరుద్ర కార్తెలు పోయి పుష్యమి వచ్చినా వర్షాలు కురువకపోవడంతో రైతన్న మబ్బుల వంక ఆశగా చూస్తున్నాడు. అడపాదడపా కురిసిన వర్షాలకు పత్తి విత్తనాలు పెట్టడంతో పాటు మిర్చి, వరి నార్లు పోశారు. తీరా వరణుడు ముఖం చాటేసి..నడి వేసవిని తలపించేలా భానుడు భగభగలాడుతుండడంతో అన్నదాత అల్లాడిపోతున్నాడు. బావులు, బోరు బావులు కలిగిన రైతులు వరినారును, పత్తి, మిర్చి మొలకలను దక్కించుకునే ప్రయత్నంలో వరుస తడులుగా నీరందిస్తూ కరుణించు వానదేవుడా అని వేడుకుంటున్నారు.– నర్మెట -
కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవాలి
జనగామ రూరల్: కక్షిదారులు సామరస్యంగా కేసులను పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి శంకర్ శ్రీదేవి అన్నారు. మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 18 నిర్వహించే ఎన్ఐ యాక్ట్(నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్)పై ప్రత్యేక లోక్ అదాల త్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిట్ఫండ్స్, బ్యాంకుల్లో పెండింగ్లో ఉన్న ఎన్ఐ యాక్ట్ కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో జూనియర్ సివిల్ జడ్జి జి.శశి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.సందీప, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండ దయాకర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంజనగామ: అర్హులైన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు సకాలంలో అందించడమే తన లక్ష్యమని, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడకుండా పెండింగ్లో ఉన్న కల్యాణలక్ష్మి దరఖాస్తులను పరిష్కరించి చెక్కులను అందజేస్తున్నామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం జనగామ తహసీల్దార్ కార్యాలయంలో పట్టణం, మండలానికి చెందిన కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి 39 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొంతకాలంగా కల్యాణలక్ష్మి చెక్కులు పెండింగ్లో ఉండటాన్ని గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.నేటి పరీక్ష వాయిదాజనగామ: స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ఎస్డీసీ) విభాగంలోని యూనిట్ 1, యూనిట్ 2కు సంబంధించి జిల్లాలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల కోసం ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఎంపిక కోసం నేడు(బుధవారం)రోజున నిర్వహించాల్సిన పరీక్షను అనివార్య కారణాల వల్ల ఈనెల 19వ తేదీన నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి కుమారస్వామి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మరిన్ని వివరాలకు–79954 30401 నంబర్ను సంప్రదించాలన్నారు. నేటి నుంచి భద్రకాళి శాకంబరీ ఉత్సవాలు హన్మకొండ కల్చరల్: వరంగల్ భద్రకాళి దేవాలయంలో బుధవారం శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం భద్రకాళి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు సహస్ర కలశాభిషేకంలో ఉపయోగించే వేయి మృత్తికా ఘటాలకు సూత్ర వేష్ఠనం (కుండలకు దారాలు చుట్టడం) జరిపారు. రాత్రి 7 గంటలకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులలో సర్వాంగసుందరంగా మండల రచన చేశారు. చంద్రోదయం అనంతరం రాత్రి అంకురార్పణ జరిపారు. -
హోటళ్లు, బార్లలో ఆకస్మిక తనిఖీలు
జనగామ: మున్సిపాలిటీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఆహార విక్రయ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత ప్రమాణాలు పాటించని యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయడంతో పాటు సంబంధిత నిబంధనల ప్రకారం మొత్తం రూ.85 వేల జరిమానా విధించారు. అమృత బార్ అండ్ రెస్టారెంట్కు రూ.20 వేలు, భువన బార్కు రూ.10 వేలు, వినాయక బార్కు రూ.30 వేలు, బాలాజీ బార్కు రూ.10 వేలు, బాలాజీ స్వీట్ హౌస్కు రూ.5వేలు, అగర్వాల్ స్వీట్ హౌజ్కు రూ.10 వేల చొప్పున జ రిమానాలు విధించారు. తనిఖీల్లో మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ అధికారులు గొర్రె కుమార్, పులి శేఖర్, నిఖిల్ పాల్గొన్నారు. -
వన మహోత్సవానికి సిద్ధం
జనగామ రూరల్: గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు, అటవీ విస్తీర్ణం పెంచి సమతుల్య వాతావరణానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా వన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 25,92,100 లక్షల మొక్కలను నాటాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా వివిధ శాఖలకు లక్ష్యాలు కేటాయించారు. అత్యధికంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ 18 లక్షల20 వేలు లక్ష్యం నిర్దేశించారు. ఉపాధి పథకం కింద గుంతలతీత పనులను పదిహేను రోజుల క్రితం ప్రారంభించారు. ఇప్పటికే 7 లక్షలకు పైగా గుంతలను తీసి సిద్ధంగా ఉంచారు. ఈవారంలో అధికారికంగా వన మహోత్సవానికి శ్రీకారం చుట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా 281 గ్రామ పంచాయతీలకు గాను ప్రతీ గ్రామానికి నర్సరీని ఏర్పాటు చేయగా ఈ నర్సరీల్లో మొత్తం 25 లక్షల మొక్కల పెంపకం సంరక్షణ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులు చేపడుతున్నారు. నీడ, పండ్ల మొక్కలే ఎక్కువ వన మహోత్సవంలో నీడనిచ్చే చెట్లతో పాటు పండ్ల చెట్లను అధికంగా నాటేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసుకుంది. రహదారులు, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో నీడనిచ్చే మొక్కలను నాటనున్నారు. గ్రామ పంచాయతీల్లో ప్రతీ ఇంటికి రెండు మొక్కల చొప్పున పండ్లు, పూల మొక్కలు అందించనున్నారు. రైతులు తమ పొలం గట్లపై నాటుకునేలా పండ్ల మొక్కలను ఇవ్వనున్నారు. అలాగే రహదారుల వెంట నేరేడు పండ్ల మొక్కలను నాటితే కోతులు పంట పొలాల వైపు రాకుండా ఉంటాయని ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేశారు. వర్షాభావంతో ఆలస్యం ఏటా ఆగస్టులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అంతటా మొక్కలు నాటడం పూర్త య్యే సరికి వర్షాలు తగ్గిపోయి నాటిన మొక్కలు చనిపోతున్నాయి. ఈ క్రమంలో రుతుపవనాలు వచ్చిన మొదట్లోనే నర్సరీల నుంచి మొక్కలను తెచ్చి నాటితే బాగుంటుందని భావించి ఈ ఏడాది ముందుగానే మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. ఉపాధి హామీ పథకం కింద రహదారులకు ఇరువైపులా, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో కూలీలతో గుంతలను తీస్తున్నారు. అయితే వర్షాభావ పరిస్థితి కారణంగా మొక్కలు నాటే కార్యక్రమం కొంత ఆలస్యమవుతోంది. నాటాల్సిన మొక్కల లక్ష్యం 25.92 లక్షలు శాఖలవారీగా లక్ష్య నిర్దేశం 7 లక్షలకుపైగా గుంతలతీత పనులువన మహోత్సవంలో మొక్కలు నాటేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడితే మొక్కలు నాటేందుకు అనుకూలంగా ఉంటుంది. గుంతలు తీసే ప్రక్రియ ఇప్పటికే చేపట్టాం. ఒకటి రెండు పెద్ద వానలు పడితే నెల చివరి కల్లా పూర్తి చేసే అవకాశం ఉంది. – భాస్కర్, డీఆర్డీఓ -
నేడు డయల్ యువర్ డీఎం
జనగామ: ప్రయాణికుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జనగామ డిపోలో నేడు(మంగళవారం) డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీఎం ఉష సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిపో పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. బస్సు సర్వీసులు, సౌకర్యాలు, ఇతర ఫిర్యాదులపై ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు. తైక్వాండో పారా నేషనల్ చాంపియన్షిప్లో ప్రతిభస్టేషన్ఘన్పూర్: మండలంలోని విశ్వనాధ పురం గ్రామానికి చెందిన మాచర్ల కృష్ణవేణి అనే క్రీడాకారిణి ఐదో ఇండియన్ తైక్వాండో పారా ఓపెన్ నేషనల్ చాంపియన్ 2026–27 పోటీలలో ఉత్తమ ప్రతిభతో ద్వితీయ స్థానంలో నిలిచి రజక పతకం సాధించింది. మహారాష్ట్రలోని పూణెలోని శ్రీశివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈనెల 10, 11వ తేదీల్లో జరిగిన పోటీల్లో రాష్ట్రం నుంచి పాల్గొన్న కృష్ణవేణి ఉత్తమ ప్రతిభతో ద్వితీయ స్థానంలో నిలిచింది. ప్రతిభ కనబరిచిన కృష్ణవేణిని గ్రామస్థులతో పాటు క్రీడాకారులు అభినందిస్తున్నారు. దరఖాస్తుల ఆహ్వానంజనగామ: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి 10వ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆదేశాల మేరకు ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని, ప్రాస్పెక్టస్–కమ్–దరఖాస్తు పత్రాలు ఈ నెల 29 నుంచి ఆగస్టు 29 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు మీసేవా, టీజీఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటురఘునాథపల్లి: మండల కేంద్రానికి చెందిన పసునూరి సురేష్–రమ్య దంపతుల కుమారుడు రాజా ఏకాంబరం ఆన్లైన్ క్విజ్ పోటీల్లో అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (పంజాబ్) వారు నిర్వహించిన ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్లో అత్యున్నత ప్రతిభ చాటడంతో సంస్థ అతడిని సూపర్ టాలెంటెడ్ కిడ్గా గుర్తిస్తూ రికార్డులో చోటు కల్పించింది. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చేతుల మీదుగా రాజా ఏకాంబరం తన తండ్రితో కలిసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ అందుకున్నాడు. ఈ సందర్భంగా బాలుడిని కలెక్టర్ అభినందించారు. రాజా ఏకాంబరం మండల కేంద్రంలోని సెయింట్ మేరీస్ హైస్కూల్లో 4వతరగతి చదువుతున్నాడు. ఘనంగా పోతన సాహితీ పద్యనాటకోత్సవాలుపాలకుర్తి టౌన్: బమ్మెర పోతన సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు చేరవేయాలనే లక్ష్యంతో నెల్లుట్ల ఫౌండేషన్ కవులు, కళాకారుల ఐక్యవేదిక జనగామ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో సోమవారం మండలంలోని బమ్మెర పోతన స్మృతివనంలో పోతన సాహితీ పద్యనాటకోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నెల్లుట రవీందర్రావు మాట్లాడుతూ.. తెలంగాణలోని 33 జిల్లాల్లో పోతన జీవితంపై పద్యనాటక ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. అనంత రం పోతన సమాధి వద్ద నివాళులర్పించి, కవులు, కళాకారులను సత్కరించారు. సర్పంచ్ రమ్యప్రశాంత్, ప్రముఖ వైద్యుడు మాచర్ల భిక్షపతి, వీణావాణి శర్మ, రాపోలు సత్యనారాయణ, జి.కృష్ణ, పెట్లోజు సోమేశ్వరాచారి, రాపాక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సందర్శన.. సమీక్ష
ములుగు/కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని గుట్టగంగారంలో ఉన్న దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల పథకాన్ని సోమవారం రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. మంత్రులు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద ఉన్న హెలిపాడ్ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. వారికి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ రామ్నాథ్ కేకన్, పీఓ లెనిన్ వత్సల్ టొప్పో పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అక్కడినుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా మంత్రులు సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. బ్యారేజీని పరిశీలించారు. నీటి స్టోరేజీ, సామర్థ్యం, గేట్ల పనితీరు, ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడినుంచి గట్టలగంగారం పరిధిలోని దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల వద్దకు చేరుకొని పంపింగ్ స్టార్టింగ్ పాయింట్ను పరిశీలించారు. మోటార్ల పనితీరు, మూడు ఫేజ్లలో ఎన్ని మోటార్లు ఉన్నాయి.. ప్రస్తుతం ఎన్నింటి ద్వారా నీటిని దిగువకు ఎత్తిపోస్తున్నారని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవాదుల వద్ద ఏర్పాటు చేసిన సమావేశం వద్దకు చేరుకొని ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అధికారులు వారికి ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి మాట్లాడారు. దేవాదుల వద్ద ఉన్న పది మోటార్లు నిరంతరం పంపింగ్ చేయాలని ఆదేశించారు. దీని పరిధిలోని 22 రిజర్వాయర్లను నింపుతామన్నారు. ఈ నీటితో రైతులకు సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రాజెక్టును సందర్శించి, ఏడాది వ్యవధిలోనే పూర్తిచేయాలని స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారని తెలిపారు. లక్ష్య సాధన కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. మధ్యాహ్నం 1.31గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరిగివెళ్లిపోయారు. ఎస్పీ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీస్ భద్రత వలయంలో మంత్రుల పర్యటన సాగింది. కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్, వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, అదనపు కలెక్టర్లు మహేందర్ జి.సంపత్రావు, ములుగు డీఎస్పీ రవీందర్, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ బట్టు, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఈఎన్సీ జనరల్ రమేశ్ బాబు, ఇంజనీరింగ్ అధికారులు ధర్మ, మోహన్రావు, శరత్బాబు, ప్రవీణ్ కుమార్, స్థానిక తహసీల్దార్ సయ్యద్ సర్వర్ తదితరులు పాల్గొన్నారు.దేవాదుల నీటితో 22 రిజర్వాయర్లను పూర్తిగా నింపుతాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి సమ్మక్క సాగర్ బ్యారేజీ, దేవాదుల ప్రాజెక్టు పరిశీలన అధికారులతో సమీక్ష, నీటి సామర్థ్యం, మోటార్ల పనితీరుపై ఆరా సాగునీరందిస్తామని రైతులకు హామీ -
మంగళవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 2026
జనగామ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల (అటానమస్) ఈ విద్యా సంవత్సరంలో రికార్డు స్థాయిలో అడ్మిషన్లతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త కోర్సులు, మెరుగైన విద్యా ప్రమాణాలు, ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టడంతో విద్యార్థులు భారీ సంఖ్యలో కళాశాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టిన ఏఈడీపీ (అప్రెంటిషిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాం) కింద ప్రారంభమైన బీకాం (బీఎఫ్ఎస్ఐ), బీఎస్సీ హెల్త్ కేర్ కోర్సులకు అనూహ్య స్పందన లభించింది. అందుబాటులో కోర్సులు ప్రస్తుతం బీఏ (ఇంగ్లిష్, తెలుగు మీడియం), బీకాం సీఏ, బీఎస్సీ లైఫ్ సైన్స్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బీఎస్సీ హెల్త్ కేర్, బీఎఫ్ఎస్ఐ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏఈడీపీ కింద ప్రారంభమైన బీఎఫ్ఎస్ఐ కోర్సు ద్వారా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాలకు అవసరమైన నైపుణ్యాలను, బీఎస్సీ హెల్త్ కేర్ ద్వారా ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు, ఆరోగ్య రంగానికి అవసరమైన శిక్షణను విద్యార్థులకు అందించేలా రూపొందించారు. బీఎఫ్ఎస్ఐ కోర్సుకు అధిక డిమాండ్ ఉండడంతో మరో 60 సీట్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఏఈడీపీలో రాష్ట్రంలో మొదటి స్థానం రాష్ట్ర వ్యాప్తంగా 90 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మాత్రమే ఈ ఏఈడీపీ కోర్సులను అమలు చేస్తుండగా, అడ్మిషన్ల పరంగా ఏబీవీ డిగ్రీ కళాశాల రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటికే దోస్త్ మూడు దశల కౌన్సెలింగ్ పూర్తికాగా, స్లైడింగ్ ఆప్షన్లు కూడా ముగిశాయి. పూర్వ వైభవం ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న పాత విద్యార్థులు 350 మంది ఉండగా, ఈ ఏడాది కొత్తగా ఇప్పటికే 487 మంది అడ్మిషన్లు పొందారు. దీంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 837కు చేరుకుంది. స్పెషల్ ఫేజ్, స్పాట్ అడ్మిషన్ల అనంతరం మరో 150 నుంచి 200 మంది వరకు చేరే అవకాశముందని కళాశాల వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో విద్యార్థుల సంఖ్య 1000 మార్కును దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. జిల్లాతో పాటు మంచిర్యాల, ఖమ్మం తదితర జిల్లాల నుంచి కూడా విద్యార్థులు ఈ కళాశాలను ఎంపిక చేసుకోవడం గమనార్హం. అధ్యాపకులను పెంచాల్సిందే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అధ్యాపకుల కొరత సవాలే. కళాశాలకు 30 రెగ్యులర్ పోస్టులు మంజూరై ఉండగా ప్రస్తుతం కేవలం 9 మంది రెగ్యులర్ అధ్యాపకులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు ఇద్దరు కాంట్రాక్ట్, 11 మంది గెస్ట్ లెక్చరర్లు కలిపి మొత్తం 22 మంది బోధన అందిస్తున్నారు. మరో 7 నుంచి 8 మంది అధ్యాపకులు అవసరమని కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యార్థుల నుంచి విశేష ఆదరణప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి ఆధారిత కొత్త కోర్సులకు విద్యార్థులు విశేష ఆదరణ చూపుతున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఎస్సీ, బీసీ తదితర ప్రభుత్వ వసతి గృహాల్లో సీట్లు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ కె.శ్రీనివాస్, ప్రిన్సిపాల్, డిగ్రీ కళాశాల58బీఎస్సీహెల్త్ కేర్అందుబాటులో ఉన్న కోర్సులు: బీఏ(తెలుగు/ఇంగ్లిష్ మీడియం) బీకాం(సీఏ) బీకాం(బీఎఫ్ఎస్ఐ) బీఎస్సీ లైఫ్ సైన్స్ బీఎస్సీ ఫిజికల్ సైన్స్ బీఎస్సీ హెల్త్ కేర్మొత్తంసీట్లు అడ్మిషన్లు భర్తీ శాతం60 55కొత్త కోర్సులకు విద్యార్థుల నుంచి ఫుల్ డిమాండ్ ఏఈడీపీలో రికార్డు స్థాయిలో అడ్మిషన్లు సీట్ల భర్తీలో రాష్ట్రంలోనే తొలి స్థానం ఇతర జిల్లాల నుంచి సైతం చేరుతున్న విద్యార్థులు -
ప్రజల్లో నమ్మకం కలిగించాలి
ఈఫొటోలో కనిపిస్తున్న దివ్యాంగ బాలుడి పేరు ఎండీ జాఫర్. చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామం. గ్రామానికి చెందిన ఎండీ జామీరుద్దీన్, యాకూబీ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె. బాబు జాఫర్ పుట్టకతోనే రెండు చేతులు కాళ్లు సరిగా లేక స్పైనల్ సమస్యతో పుట్టాడు. నాటి నుంచి తల్లిదండ్రులు ఆస్పత్రుల చుట్టూ తిరిగి రూ.6 లక్షలకు పైగా ఖర్చు చేశాడు. తండ్రి కూలి పనితో జీవనం కొనసాగిస్తున్నా, వారికి ఎలాంటి ఆధారం లేదు. నెలకు రూ.4 వేల వరకు మందులకు, ఇతర అవసరాలకు ఖర్చు చేయాల్సి వస్తోంది. కనీసం దివ్యాంగ పెన్షన్ అయిన వస్తే మందులకు అవుతాయని సదరం సర్టిఫికెట్ ఇచ్చి పింఛన్ మంజూరు చేయాలని తల్లిదండ్రులు వేడుకున్నారు. జనగామ రూరల్: ప్రజలకు తమ సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకాన్ని ప్రతీ శాఖ అధికారులు కలిగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి 335 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ భాస్కర్, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల్లో కొన్ని ఇలా.. ● లింగాల ఘణపురం మండలం వేలేరు గ్రామానికి చెందిన పల్లా వెంకటలక్ష్మి, తన తల్లిదండ్రులు పసుపు కుంకుమ కింద ఇచ్చిన భూమిని తన అన్నదమ్ములు తెలియకుండా వారి పేరు మీద పట్టా చేసుకున్నారని, విచారణ చేపట్టి ఆ భూమిని తన పేరు మీదకు పట్టా చేయాలని వినతి అందజేశారు. ● స్టేషన్ ఘన్పూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు డిప్యుటేషన్లో జనగామ మండలం పసరమడ్ల బాలుర ఆశ్రమ పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మూడేళ్లుగా అక్కడే ఉండి అధికారుల అండదండలతో స్థానచలనం లేకుండా ఉంటున్నారని, డిప్యుటేషన్ రద్దు చేసి పీడీగా పంపించాలని స్టేషన్ ఘన్పూర్ మండలానికి చెందిన లకావత్ చిరంజీవి వినతిపత్రం అందించారు. ● బచ్చన్నపేట మండలం అలింపూర్ గ్రామానికి చెందిన పాకాల నాగయ్య పోచన్నపేట గ్రామంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్నాడని, కొన్ని నెలల క్రితం బచ్చన్నపేట ఎస్పీఎం కొత్తపల్లి రాజేశ్ అనే వ్యక్తికి పెన్షన్ డబ్బులు రూ.5లక్షలు ఇచ్చి పంపిస్తున్నామని చెప్పి, డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని అలింపూర్కు చెందిన పాకాల ప్రమీల అర్జీ అందించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తన భర్త నాగయ్య అనారోగ్యానికి గురయ్యాడని కలెక్టర్తో వాపోయింది. విచారణ చేపట్టి పోస్టల్ అధికారి డబ్బులతో పరారైన వ్యక్తిపై చర్యలు తీసుకోని డబ్బులు ఇప్పించాలని వేడుకుంది. ● పట్టణంలోని 15 వార్డు జూనియర్ కళాశాల పరిసర ప్రాంతంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారని, రాత్రి వేళల్లో మహిళలు, పిల్లలు బయటికి వెళ్లలేకపోతున్నారని దిగోజు సాంబయ్యచారి వినతి అందజేశారు. తక్షణం బెల్ట్ షాపును ఎత్తివేయాలని కోరారు. వేగంగా ప్రజల సమస్యలు పరిష్కరించాలి కలెక్టరేట్ గ్రీవెన్స్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
ఆరోగ్యంపై దృష్టి సారించాలి
జనగామ రూరల్: విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఆరోగ్యం, ప్రాథమిక విద్యా నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సోమవారం మండలంలోని చౌడారం మోడల్ పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా ఆల్బెండజోల్ మాత్రలను అందించారు. అనంతరం కలెక్టర్ పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న అన్అకాడమీ తరగతుల బోధనా విధానాన్ని కలెక్టర్ పర్యవేక్షించారు. కలెక్టర్ స్వయంగా రూపొందించిన ‘గెట్ ఐటీ వ్రైట్ ’ ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ‘ఫాస్ట్ మ్యాథ్స్’ పుస్తకంలోని ప్రతీ అంశాన్ని రోజూ విద్యార్థులకు బోధించాలని సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. యూనిఫాంలను త్వరగా పంపిణీ చేయాలి రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలల విద్యార్థినులకు ఎట్టిపరిస్థితుల్లోనూ 15వ తేదీలోపు యూనిఫాంలను పంపిణీ చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సోమవారం యూనిఫాంల పంపిణీ ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డీఆర్డీఓ భాస్కర్, ఏపీడీ నూరుద్దీన్, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
పోలీస్ క్రీడాకారులు స్ఫూర్తిగా నిలవాలి
వరంగల్ క్రైం: ఆరోగ్య పరిరక్షణలో పోలీస్ క్రీడాకారులు తోటి సిబ్బందికి స్ఫూర్తిగా నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు. ఇటీవల మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లో జరిగిన ఐదో రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ మొదటి క్లస్టర్లో మొత్తం 61 పతాకాలు సాధించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రీడాకారులకు సోమవారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఈసభకు వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు సురేశ్కుమార్, శ్రీనివాస్, బాలస్వామి, ప్రభాకర్రావు, ఏసీపీ నాగయ్య, ఆర్ఐ స్పర్జన్రాజ్తో ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బాధితులకు సత్వర న్యాయం చేయాలి భరోసా కేంద్రానికి వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. సోమవారం వరంగల్ భరోసా కేంద్రాన్ని సందర్శించిన సీపీ బాధితులకు అందిస్తున్న కౌన్సెలింగ్, న్యాయ సహాయం, వైద్య సేవలు, మానసిక పరామర్శ, పునరావాస చర్యలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. సీపీతో పాటు క్రైమ్ అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీ సదయ్య, భరోసా కేంద్రం ఇన్స్పెక్టర్ సువర్ణ, మహిళా పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ సూర్యప్రసాద్, భరోసా ఎస్సై కిరణ్మయి, కౌన్సెలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత -
టెట్లో ఉత్తీర్ణత శాతం 31.25
జిల్లాలో టెట్ ఫలితాల వివరాలు● పేపర్–1లో మెరుగు.. పేపర్–2లో నిరాశ జనగామ: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు సోమవారం విడుదల కాగా, జిల్లాలో పేపర్–1తో పోలిస్తే పేపర్–2లో అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం తక్కువగా నమోదైంది. ముఖ్యంగా గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ విభాగాల్లో అర్హత సాధించిన వారి సంఖ్య ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం. ఓవరాల్గా రెండు పేపర్లలో 1,565 మంది పరీక్షలు రాయగా, కేవలం 489 మాత్రమే అర్హత సాధించడంతో 31.25శాతం పాస్ శాతం నమోదైంది. రాబోయే ఉపాధ్యాయ నియామకాల దృష్ట్యా అభ్యర్థులు సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు టెట్ విధానంపై మరింత అవగాహన పెంచుకొని ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ అయితే ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఉత్తీర్ణత శాతం పరీక్షరాసినవారు ఉత్తీర్ణులు4891,565355207675535172110పేపర్–2 (మ్యాథ్స్,సైన్స్)పేపర్–2 (సోషల్)మొత్తంపేపర్–1 -
విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత పటిష్టం
● ట్రాన్స్కో సూపరింటెండింగ్ ఇంజనీర్ సంపత్రెడ్డి బచ్చన్నపేట : విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి జిల్లాలో విద్యుత్ సరఫరాలో మరో ముందడుగు వేశామని ట్రాన్స్కో సూపరింటెండింగ్ ఇంజనీర్ చెరుకు సంపత్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని రామచంద్రాపూర్ ట్యాపింగ్ పాయింట్ నుంచి పడమటి కేశ్వాపూర్ 33/11 కేవీ సబ్స్టేషన్ వరకు సుమారు 6 కిలోమీటర్ల పొడవున 33 కేవీ లింక్ లైన్ నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు. ఈ కొత్త 33 కేవీ లింక్ లైన్ ద్వారా పడమటి కేశ్వాపూర్ సబ్స్టేషన్న్కు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా మార్గం అందుబాటులోకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఆపరేషన్స్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి , డీఈ ఎం.సీ. విజయ్, జనగామ ఏడీఈ వేణుగోపాల్, కన్స్ట్రక్షన్ ఏడీఈ స్వామిరెడ్డి, ఏఈ సతీష్, కన్స్ట్రక్షన్ ఏఈ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సర్లో ఘన్పూర్ స్పీడ్
జనగామ: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ వేగంగా సాగుతోంది. జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో ఫారాల పంపిణీ దాదాపు పూర్తికాగా, ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు నమోదైన గణాంకాల ప్రకారం 7.67 లక్షల ఓటర్లలో 47శాతం ఫారాలు ఇప్పటికే డిజిటైజేషన్ అయ్యాయి. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం డిజిటైజేషన్లో జిల్లాలో ముందంజలో ఉండగా, మిగిలిన ప్రక్రియను అధికారులు యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో 865 మంది బీఎల్ఓలు విధులు నిర్వహిస్తున్నారు. ఎస్ఐఆర్ ఇలా... జిల్లాలో ఇప్పటి వరకు 3,66,628 ఫారాలు (47.77 శాతం) డిజిటైజ్ చేయగా, 3,95,329 ఫారాలు (51.28 శాతం) ఇంకా మిగిలి ఉన్నాయి. ఓటర్లే స్వయంగా సమర్పించిన లేదా బీఎల్ఓలు ధ్రువీకరించిన ఫారాల సంఖ్య 1,859 (0.24 శాతం)గా నమోదైంది. అలాగే బీఎల్ఓల ద్వారా 3,64,327 ఫారాల(47.47 శాతం)ను ధ్రువీకరించగా, 1,89,198 మంది (24.65 శాతం) తమ వివరాలను స్వయంగా మ్యాప్ చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ద్వారా 1,69,820 మంది(22.13 శాతం) వివరాలు మ్యాప్ చేయించుకున్నారు. ఇంకా 5, 311(0.69 శాతం) ఫారాలకు మ్యాపింగ్ జరగాల్సి ఉండగా, మొత్తం 73,838 ఫారాల్లో లోపాలు ఉన్నట్లు(9.62 శాతం) గుర్తించారు. ‘స్టేషన్’ ముందజ సర్ ఫారాల డిజిటైజేషన్లో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ముందంజలో ఉంది. జనగామ, పాలకుర్తి నియోజకవర్గాల్లో కూడా అధికారులు క్షేత్రస్థాయిలో ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. జనగామలో ప్రోజెనీ(వారసత్వ) మ్యాపింగ్ 53,983 (21.64 శాతం)గా నమోదైంది. 23,645 లోపాలు (9.48 శాతం) గుర్తించారు. ఘన్పూర్లో ప్రోజెనీ(వారసత్వ)మ్యాపింగ్ 61,724 (24.04 శాతం)గా నమోదైంది. 25,570 లోపాలు(9.96 శాతం)గా ఉన్నాయి. పాలకుర్తిలో ప్రోజెనీ (వారసత్వ) మ్యాపింగ్ 54,113 (20.71 శాతం)గా నమోదైంది. 24,623 లోపాలు (9.43 శాతం)గా గుర్తించారు. వేగంగా డిజిటైజేషన్ జిల్లాలో ఫారాల ప్రక్రియ 100 శాతం పూర్తవడం ఎన్నికల నిర్వహణలో కీలక ముందడుగుగా నిలిచింది. అయితే డిజిటైజేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. మిగిలిన ఫారాల నమోదు, లోపాల పరిష్కారం, మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తే ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్దేశిత గడువులో పూర్తి చేసే అవకాశం ఉంది. ఫారాల భర్తీకి ప్రత్యేక శిబిరాలు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఫారాల భర్తీలో ఓటర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బీఎల్ఓలతో పాటు వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువకులు, విద్యార్థులు కలిసి గ్రామపంచాయతీలు, కాలనీలు, వార్డులు, ప్రధాన కూడళ్లలో ప్రత్యేక సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో ఓటర్లకు ఫారాల నింపడం, అవసరమైన పత్రాల పరిశీలన, వివరాల నమోదు, సందేహాల నివృత్తిలో సహకారం అందిస్తున్నారు. నిర్ణీత గడువులో ప్రతీ అర్హత కలిగిన ఓటరు ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసుకునేలా అధికారులు విస్తృత అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.జిల్లాలో వేగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ 7.67 లక్షల ఓటర్లలో 47శాతం ఫారాలు పూర్తి కొనసాగుతున్న లోపాల గుర్తింపు ఊరూరా జీపీలు, స్వచ్ఛంద సంస్థల సహకారం మూడు నియోజకవర్గాల వారీగా ఎస్ఐఆర్ పురోగతి నియోజకవర్గం ఓటర్లు డిజిటైజేషన్ బీఎల్ఓ స్వీయ ధ్రువీకరణ మ్యాపింగ్ జనగామ 2,49,437 1,11,797 1,10,999 55,108 స్టే.ఘన్పూర్ 2,56,806 1,37,052 1,36,199 73,156 పాలకుర్తి 2,61,241 1,17,779 1,17,129 60,934 -
‘నులి’పేద్దాం
జనగామ రూరల్: పిల్లలు నులిపురుగుల బారిన పడకుండా వైద్యారోగ్యశాఖ నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 13న ముందుగా గుర్తించిన సెంటర్ల వద్ద, ఈనెల 20న మాప్– అప్డే సందర్భంగా మిగిలిపోయిన పిల్లల కు రెండు విడతల్లో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. జిల్లాలోని 1నుంచి 19 ఏళ్ల వయసు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇటీవల డీఎంహెచ్ఓ ఇతర శాఖల అధికారులతో కలిసి జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. మొత్తం 1,14,055 మంది పిల్లలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రైమరీ హెల్త్కేర్ సెంటర్లు, వసతి గృహాలు, నర్సింగ్ కళాశాల, జూనియర్ కళాశాలల్లో మొత్తం 1,14,055 మందికి ఆల్బెండజోల్ మాత్రలు అందించనున్నారు. మొత్తం వేయికి పైగా కేంద్రాలు ఏర్పాట్లు చేసి మాత్రలు పంపిణీ చేయనున్నారు. ఒక సంవత్సరం నుంచి రెండేళ్లలోపు మాత్రను, రెండు నుంచి మూడేళ్ల లోపు వారికి ఒక మాత్రను క్రష్ చేసి, మూడేళ్ల నుంచి 19ఏళ్ల పిల్లలకు ఒక మాత్రను చప్పరించి నమిలి మింగాలి. జిల్లాలో ఏ ఒక్కరూ మిగిలి పోకుండా అర్హులైన బాలబాలికలపై ప్రత్యేకార్యచరణ ప్రణాళిక రూపోందించారు. విద్యార్థులకు ఎదుగుదలకు నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, శారీరక, మానసిక ఎదుగుదల మందగించడం, చదువులో ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని అధికారులు కోరుతున్నారు.మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి1నుంచి 19ఏళ్ల లోపు ఉన్న విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా నులిపురుగుల నివారణకు తప్పని సరిగా అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి. తల్లిదండ్రులు బాధ్యతగా సమీప సెంటర్కు వెళ్లి వేయించాలి. ఆశాలు సంబంధిత కార్యకర్తలను సంప్రదించి తగు సూచనలు తీసుకోవాలి. –మల్లికార్జున రావు, డీఎంహెచ్ఓ నేటి నుంచి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ 1 నుంచి 19ఏళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరి నులిపురుగుల నివారణకు వైద్యారోగ్య శాఖ చర్యలు -
యువత క్రీడా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
జనగామ రూరల్: యువత చదువుతో పాటు క్రీడా నైపుణ్యాలు పెంపోందించుకోవాలని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఉప సంచాలకుడు రవీందర్ పిలుపునిచ్చారు. తెలంగాణ స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎంజేపీ బాలుర పాఠశాలలో నిర్వహించారు. ఈసందర్భంగా క్రీడాకారులకు ఆధునిక శిక్షణ విధానాలు, ఫిట్నెస్ స్పోర్ట్స్ అండ్ సైన్స్, పోషకాహారం గాయాల నివారణ, క్రీడల్లో ఉన్నత ప్రతిభ సాధనకు అవసరమైన అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి నరసింహరావు, అంతర్జాతీయ కోచ్ రామకృష్ణ, స్కేటింగ్ కోచ్ విజయ భాస్కర్, స్విమ్మింగ్ కోచ్ శశాంక్, ఫిజియోథెరపీ నిపుణులు, గోకుల్ పాలిటెక్నిక్ క్రీడాకారులు, శారీరక విద్య ఉపాధ్యాయులు, కోచ్లు హాజరయ్యారు. భూసమస్యల పరిష్కారానికే రీసర్వేకొడకండ్ల: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంతో పాటు భూ భారతి చట్టాన్ని సమర్థవంతంగా అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూ రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని అదనపు కలెక్టర్(రెవెన్యూ) బెన్షాలోమ్ అన్నారు. ఆదివారం నర్సింగాపురం గ్రామంలో నిర్వహించిన భూ భారతి–భూ సర్వే అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతతో భూముల సరిహద్దులను కచ్చితంగా నిర్ధారించి భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం రీసర్వేను నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉత్తలూరి అనీల్బాబు, ఎంపీడీఓ రవిందర్, జీపీఓ భిక్షపతి పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధికి నిధులు తీసుకొస్తాఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జనగామ: పట్టణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులను తీసుకురావడానికి కృషి చేస్తానని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 23వ వార్డు శ్రీమల్లన్న దేవాలయం వద్ద చేపట్టనున్న ప్రహారీ, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఎంపీ కిరణ్ కుమార్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మల్లన్న స్వామిని దర్శించుకుని విలేకరులతో మాట్లాడారు.. అర్బన్ చాలెంజ్ ఫండ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరిన్ని నిధులు సమకూరేలా ప్రయత్నిస్తానని చెప్పారు. పట్టణానికి అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతిలక్ష్మినారాయణనాయక్, మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ‘కస్తూర్బా’లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం చిల్పూరు: మండలంలోని రాజవరం గ్రామ సమీపంలో ఉన్న కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీలో–15, బైపీసీలో 5 సీట్లు ఖాళీలు ఉన్నట్లు ఎస్ఓ స్వప్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో 10వ తరగతి పూర్తి చేసిన అమ్మాయిలు ఈ అవకాశాన్ని సధ్వినియోగం చేసుకోవాలన్నారు. ఈనెల 14 లోపు సర్టిఫికెట్లతో కేజీబీవీలో సంప్రదించాలని కోరారు. ఖిలాషాపూర్లో.. రఘునాథపల్లి: మండలంలోని ఖిలాషాపూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఎంఎల్టీ ఫస్టియర్ కోర్సులో 20 సీట్లు ఖాళీగా ఉన్నట్లు స్పెషల్ ఆఫీసర్ జి.హేమలత తెలిపారు. వివరాల కోసం 9666940586 నెంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. దేవరుప్పులలో.. పాలకుర్తి టౌన్ (దేవరుప్పుల): దేవరుప్పుల మండలంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఉన్నట్టు ప్రత్యేక అధికారి రజిత తెలిపారు. ప్రస్తుతం 6వ తరగతిలో 10సీట్లు, 7వ తరగతిలో 20, ఇంటర్ బైపీసీలో 20, ఎంపీసీలో 20 ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
అక్రమ వధశాలలపై ఉక్కుపాదం
జనగామ: పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న మటన్ దుకాణాలు, అక్రమ వధశాలలపై మున్సిపల్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. కమిషనర్ సీహెచ్.రాజశేఖర్రెడ్డి నేతృత్వంలో ఆదివారం చేపట్టిన తనిఖీల్లో మున్సి పల్ అనుమతులు లేకుండా మేకలు, గొర్రెలను అక్రమంగా నిల్వ ఉంచి వధ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ ఉన్న సుమారు 20 కిలోల నాసిరకం, అపరిశుభ్ర పరిస్థితుల్లో నిల్వ ఉంచిన మాంసాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ నిబంధనలు పాటించకుండా వ్యాపారం కొనసాగించడంతో సంబంధిత నిర్వాహకుడు కరన్లాల్కు రూ.లక్ష జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం గుర్తించిన, అనుమతి పొందిన స్లాటర్ హౌస్లలో మాత్రమే జంతువులను వధించాలని, అక్కడి నుంచి పరిశుభ్రమైన, నాణ్యమైన మాంసాన్నే వినియోగదారులకు విక్రయించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.లక్ష జరిమానా, నాసిరకం మాంసం స్వాధీనం ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యం: మున్సిపల్ కమిషనర్ -
ఆప్షన్ ఉద్యోగుల్లో ఆశలు
హన్మకొండ: రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న మూడో డిస్కం తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్పీడీసీఎల్)కు వెళ్లేందుకు ముందుకు వచ్చిన విద్యుత్ ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. మేలో పూర్తి కావాల్సిన బదిలీ నియామక ప్రక్రియ వివిధ కారణాలతో నిలిచిపోయింది. పలు అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో.. టీజీ ఆర్పీడీసీఎల్కు లైసెన్స్ మంజూరు తర్వాతనే బదిలీ నియామక ప్రక్రియ చేపట్టాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అయితే, బహిరంగ విచారణ నిర్వహించిన తెలంగాణ ఈఆర్సీ వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, ప్రభుత్వానికి పలు కండీషన్లు పెట్టి ఎట్టకేలకు ఈనెల 10వ తేదీతో లైసెన్స్ జారీ చేసింది. మూడో డిస్కంలోకి ప్రస్తుతమున్న టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కో, టీజీ ఎస్పీపీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి ఆసక్తి కనబర్చే అధికారులు, ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు నాలుగు విద్యుత్ సంస్థల నుంచి ఆసక్తి కనబర్చే ఉద్యోగులు, అధికారుల నుంచి ఆప్షన్లు అడిగారు. పదోన్నతి కల్పిస్తామనడంతో వెళ్లేందుకు పోటీ.. ముందుగా కొత్త డిస్కం ఎలా ఉంటుంది.. వెళ్లాలా వద్దా? అని మల్లగుల్లాలు పడిన ఇంజనీర్లు, ఇతర అధికారులు, ఉద్యోగులు చివరకు పెద్ద ఎత్తున స్పందించారు. పదోన్నతి కల్పిస్తామని జీఓలో పేర్కొనడంతో.. ప్రస్తుతం పనిచేస్తున్న డిస్కంలో ఇప్పట్లో పదోన్నతి రాదు అని భావించిన అధికారులు, ఉద్యోగులు, ఆర్టిజన్లు ఆర్పీడీసీఎల్కు వెళ్లేందుకు పోటీపడ్డారు. ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు ఆసక్తి కలిగిన అధికారులు, ఉద్యోగుల నుంచి సమ్మతి కోరింది. టీజీ ఆర్పీడీసీఎల్కు మొత్తం 2,000 మంది అధికారులు, ఉద్యోగులు అవసరమని జీఓలో పేర్కొంది. రాష్ట్రంలోని టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కో, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్కు చెందిన ఉద్యోగుల నుంచి ఆప్షన్లు కోరారు. దీంతో ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది ఆప్షన్లు ఇచ్చారు. ఇతర డిస్కంల్లోను ఇదే పోటీ నెలకొందని విద్యుత్ ఉద్యోగులు తెలిపారు. ఆప్షన్లో పొందుపరిచిన వివరాలు... వాస్తవ వివరాలు సరి చూసి జాబితాను మూడో డిస్కంకు పంపారు. మేలోనే బదిలీ నియామక ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూల్ ప్రకటించిన టీజీ ఆర్పీడీసీఎల్ తర్వాత వెనక్కి తగ్గింది. మే 13 నుంచి 19 వరకు బదిలీ ఉత్తర్వులు, జాయినింగ్, పోస్టింగ్ పూర్తి అయ్యేలా ఖరారు చేసినా చివరకు ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం ఈఆర్సీ లైసెన్స్ మంజూరు చేసి తర్వాతే బదిలీ నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రచారం జరిగింది. బదిలీల కోసం ఎదురుచూపులు.. టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి మొత్తం 1,252 మంది ఆర్పీడీఎల్కు వెళ్లేందుకు ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో జూనియర్ లైన్మెన్లు 16 మంది, అసిస్టెంట్ లైన్మెన్లు 271 మంది, లైన్మెన్లు 116, లైన్ ఇన్స్పెక్టర్లు 31, సీనియర్ ఇన్స్పెక్టర్లు 4, ఫోర్మెన్లు 2, అసిస్టెంట్ ఇంజనీర్స్ 115, అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్లు 61, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు 59, డివిజనల్ ఇంజనీర్లు 28, సూపరింటెండెంట్ ఇంజనీర్లు 4, ఒక చీఫ్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్స్ 265, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ 66, ఆసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్ 10, అకౌంట్స్ ఆఫీసర్స్ 5, సీనియర్ అసిస్టెంట్లు 50, జూనియర్ అసిస్టెంట్లు 20, జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్ 15, పర్సనల్ ఆఫీసర్స్ 2, ఆర్టిజన్ గ్రేడ్కు చెందిన వారు 5, ఆర్టిజన్ గ్రేడ్–3కి చెందిన వారు ఆరుగురు, ఒక్కరు ఆర్టిజన్ గ్రేడ్– 4, ఒక్క రికార్డు అసిస్టెంట్, ఒక్క సివిల్ ఈఈ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. టీజీ ఆర్పీడీసీఎల్కు లైసెన్స్ రావడంతో మరోసారి ఆప్షన్లు ఇచ్చిన వారు పదోన్నతి లభిస్తుందనే సంతోషంలో ఉన్నారు. బదిలీ నియామక ప్రక్రియ ఎప్పుడు చేపడతారోనని అధికారులు, ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. టీజీఆర్పీడీసీఎల్కు కావాల్సిన ఉద్యోగులు 2,000 ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి 1252 మంది దరఖాస్తు మేలో బదిలీ ఉత్తర్వులు వెలువడాల్సి ఉండగా నిలిచిన ప్రక్రియ ఎట్టకేలకు డిస్కంకు లైసెన్స్ జారీ.. బదిలీలకు ఎదురుచూపులు -
సోమవారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2026
ఎస్.జానకి మృతికి జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు జడల శివ ఆధ్వర్యంలో వరంగల్ కళాకారులు నివాళులు అర్పించారు. ఈమేరకు వరంగల్ గోపాలస్వామి గుడి కొత్తవాడ జంక్షన్లో జానకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జానకి పాడిన పాటను ఆలపించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జనగాం రాము, రమేశ్, శ్రీధరస్వామి, రాంనర్సింహస్వామి, భుజంగరావు, ఇమ్యానియల్ రంగనాఽథ్, చంద్రశేఖర్, సృజన్రావు, నజీర్, యాకూబ్, అనిల్, చందన, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. నందీశ్వరుడితో ఎస్.జానకి (ఫైల్)ప్రజాకవి కాళోజీ నారాయణరావు, గాయని ఎస్.జానకి వాళ్ల మామ మంచి మిత్రులు. 1995లో కాళోజీ వారిని కలవడానికి చైన్నెలోని జానకి నివాసానికి వెళ్లారు. వారితో పాటు నేను వెళ్లాను. ఈ సందర్భంగా ఆమెతో ఫొటో తీసుకున్నాను. జానకమ్మ తనకు లభించిన అవార్డులను, బహుమతులను, షీల్డులను చూపించారు. అలాగే ఆమె భర్త రామప్రసాద్, మామ రామన్, కాళోజీ, కాళోజీ కుమారుడు రవికుమార్ కలిసి గ్రూప్ ఫొటో తీసుకున్నాం. అందరితో ఆప్యాయంగా మాట్లాడే జానకమ్మ మృతి బాధను కలిగిస్తోంది. – మట్టెవాడ అజయ్, మైక్రోఆర్టిస్ట్, గిర్మాజీపేట వరంగల్గాయని జానకమ్మ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు.. ఆమె 2014లో రుద్రేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వరంగల్కు వచ్చారు. దాదాపు గంట పాటు ఆమె రుద్రేశ్వరుడి సన్నిధిలో గడిపారు, ఆలయ పరిక్రమ చుట్టూ తిరుగుతూ శిల్పకళను, నందీశ్వరుడిపై చెక్కిన అలంకరణను పరిశీలించారు. – గంగు ఉపేంద్రశర్మ, వేయిస్తంభాల ఆలయ ప్రధానార్చకుడు, హనుమకొండహన్మకొండ కల్చరల్: ప్రముఖ సినీ నేపథ్యగాయని, గాన కోకిల ఎస్.జానకి మరణంతో ఓరుగల్లు సంగీతకారులు, ఆమె అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు ఓరుగల్లుతో విడదీయలేని అనుబంధం ఉంది. శివభక్తురాలైన జానకి 2014 మార్చి 20న వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించారు. రుద్రేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రత్యేకంగా ఆమె వరంగల్కు రావడం విశేషం. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. 2014లో రుద్రేశ్వరుడిని దర్శించుకునేందుకు వరంగల్కు వచ్చిన గాయని జానకి ఆమె మృతితో ఉమ్మడి జిల్లావాసుల దిగ్భ్రాంతి నివాళులర్పించిన అభిమానులు -
ఆయుర్వేద వైద్యశిబిరానికి స్పందన
జనగామ: పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు ఏకశిల బీఈడీ కళాశాల ఎదురుగా ఉన్న వేద ఆయుర్వేద పంచకర్మ వెల్నెస్ ఆస్పత్రిలో శనివారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఆస్పత్రి డాక్టర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ఆయుర్వేద వైద్యులతో పాటు హైకోర్టు న్యాయవాది, బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామ సర్పంచ్ బల్ల రవీంద్రనాథ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. శిబిరంలో జనగామలో తొలిసారి ఆయుర్వేద మల ద్వారా శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ చెన్నా అభిలాష్ నేతృత్వంలో అర్షమొలలు తదితర పగుళ్ల సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ బి.శివ ఆధ్వర్యంలో చెవి ముక్కు, కన్ను, గొంతు సంబంధిత సమస్యలను పరిశీలించగా, కంటి వైద్య నిపుణుడు డాక్టర్ అక్షయ్, డాక్టర్ హర్ష రోగులను పరీక్షించారు. మొత్తం 220 మందికి అన్ని రకాల పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మౌనిక, తనుజ, అర్పిత, వెంకటేష్, శివ, సాయి, ఉదయ్, రజిత, రమ్య, యేలేంద్ర, శ్రీలత, వంశీ, సిబ్బంది పాల్గొన్నారు. 220 మందికి వైద్యసేవలు, మందుల పంపిణీ -
15 నుంచి శాకంబరీ ఉత్సవాలు
హన్మకొండ కల్చరల్: శాకంబరీ నవరాత్రోత్సవాలను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ అమ్మవారి అనుగ్రహం పొందాలని భద్రకాళి దేవా లయ ఈఓ, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత అన్నారు. ఆలయ ప్రాంగణంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామల సునీత, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, సిబ్బంది పాల్గొని శాకంబరీ ఉత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం రామల సునీత మా ట్లాడుతూ.. ఈ నెల 15 బుధవారం నుంచి జూలై 29 బుధవారం వరకు 15రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు, అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ.. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం అమ్మవారికి ఒక్కో క్రమాలలో పూజలు నిర్వహించనున్నట్లు, జూలై 29న మహా శాకంబరీగా అమ్మవారు దర్శనమిస్తారని తెలిపారు. కార్యక్రమంలో నాగరాజుశర్మ, హరినాఽథ్లు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026
ఉమ్మడి జిల్లాలో ఇలా..● అన్నాఅక్క మెంటార్షిప్ కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ఈనెల 1న ప్రారంభం కాగా, సెప్టెంబర్ వరకు కొనసాగనుంది. ● ఈ మెంటార్షిప్ వారానికి రెండు మూడు రోజుల పాటు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకా రం 30 గంటల మేర బోధించనున్నారు. ● ఉమ్మడి జిల్లాలో 14 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నా యి. అందులో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఐదో సెమి స్టర్ చదువుతున్న విద్యార్థులకు అన్నాఅక్క మెంటార్షిప్ టీచింగ్ లెర్నింగ్ ఇంటర్నెషిప్నకు అవకాశం కల్పించారు.సాంకేతిక విద్యనందించాలని.. ప్రభుత్వ యూపీఎస్, హైస్కూల్ విద్యార్థులకు సాంకేతక విద్యను అందించాలని ‘అన్నాఅక్క మెంటార్షిప్, టీచింగ్ ఇంటర్న్షిప్’ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఐదో సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలల్లోని 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్, కంప్యూటింగ్, కోడింగ్, ఫైథాన్, జావా, గేమ్ డిజైన్ వంటి అనేక అంశాలపై బోధిస్తున్నారు.● మెంటార్లుగా డిగ్రీ విద్యార్థులు.. వీరికి ప్రత్యేక శిక్షణ ● అభ్యాసకులు ప్రభుత్వ యూపీఎస్, హైస్కూళ్ల పిల్లలు ● కృత్రిమ మేథ, డిజిటల్ లెర్నింగ్, కోడింగ్ అంశాలపై అవగాహన ● పిల్లల్లో స్నేహపూర్వక వాతావరణం పెంపొందించేలా చర్యలు డిగ్రీ విద్యార్థులకు క్రెడిట్ డిగ్రీ విద్యార్థులు మెంటార్లుగా తెలంగాణ కోడ్మిత్ర పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సర్టిఫికెట్ పొందారు. వీరికి శిక్షణ ఇచ్చారు. బోధన వల్ల వీరికి కమ్యూనికేషన్, టీచింగ్ స్కిల్స్ ఇంప్రూవ్తోపాటు మెంటార్షిప్ 30 గంటల పూర్తి చేసిన విద్యార్థులకు ఐదో సెమిస్టర్ ఫలితాల్లో ఒకటి లేదా రెండు క్రెడిట్ పాయింట్స్ కేటాయిస్తారు. ఇది వారికి ఒక ప్రాజెక్టుగా భావిస్తున్నారు. స్నేహపూర్వక వాతావరణం.. చాలామంది విద్యార్థులు భయం, బెరుకు, స్పీకింగ్ ఫియర్ వల్ల క్లాస్రూమ్లో టీచర్ను సందేహాలు అడగకుండానే ఉండిపోతారు. అన్నాఅక్క మెంటార్షిప్లో భాగంగా విద్యార్థులకు, మెంటార్లకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. భయంలేకుండా సందేహాలు అడగడానికి అవకాశం ఏర్పడుతుంది. త్వరగా అర్థమయ్యే అవకాశం ఉంది. భవిష్యత్ మొత్తం ఏఐదే కాబట్టి బేసిక్ లెవెల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుందని అంచనా. ఇదొక అద్భుత అవకాశం నేను హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్నాను. నేను డిగ్రీ చదువుతూ ఇలా హైస్కూల్ విద్యార్థులకు బోధించే అవకాశం రావడం అద్భుత అవకాశంగా భావిస్తున్నా. నాలో బోధన నైపుణ్యాలు పెంచుకునే అవకాశం కలిగింది. – బి.భార్గవి, బీసీఏ, ఫైనల్ ఇయర్, కేడీసీ హనుమకొండడిజిటల్ లెర్నింగ్ పుస్తకం చదువుతున్న విద్యార్థులుసాంకేతిక అంశాలు నేర్చుకుంటున్నాం.. అన్నాఅక్క మెంటార్షిప్లో భాగంగా ఏఐ, డిజిటల్ లెర్నింగ్, కోడింగ్ ఫైథాన్, జావా వంటి పలు అంశాలు చెబుతున్నారు. డిజిటల్ లెర్నింగ్కు సంబంధించిన పుస్తకాలు కూడా ఇచ్చారు. వీడియోలను ప్రదర్శిస్తూ బోధిస్తుండడంతో మాకు ఈజీగా అర్థమవుతోంది. – ఎస్ ధనలక్ష్మి, తొమ్మిదో తరగతి, మర్కజీ హైస్కూల్, హనుమకొండ నేర్చుకుంటూ బోధిస్తున్నా.. ఏఐ, డిజిటల్ లెర్నింగ్ తదితర అంశాలను నేను నేర్చుకుంటూ పైడిపెల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్నా. ఐపీఎఫ్ బోర్డు ద్వారా ఆయా సాంకేతిక అంశాలను వీడియోలో రూపంలో బోధిస్తుంటే విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు. – ఎస్.రాజ్కుమార్, బీఏ, కాకతీయ డిగ్రీ కళాశాల, హనుమకొండడిగ్రీ కళాశాల వారీగా ఎంపికైన మెంటార్లు, స్కూళ్లు ఇలా.. మెంటార్లు స్కూళ్లుభవిష్యత్లో ఎంతో ఉపయోగం.. హనుమకొండపరకాల ప్రభుత్వమహబూబాబాద్ ప్రభుత్వజనగామ ఏబీవీపింగిళి మహిళానర్సంపేట ప్రభుత్వకాకతీయ -
దరఖాస్తుల ఆహ్వానం
జనగామ: మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు టౌన్ లెవల్ ఫెడరేషన్ (టీఎల్ఎఫ్) ద్వారా 30 మంది పారిశుద్ధ్య కార్మికులను రోజువారీ వేతన ప్రాతిపదికన నియమించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ అర్హులైన అభ్యర్థుల నుంచి ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల ను స్వీకరిస్తామన్నారు. దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలని, పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికై న వారికి రోజుకు రూ.400 వేతనం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. నియామకాలు పూర్తిగా తాత్కాలికమైనవని, భవిష్యత్లో శాశ్వత ఉద్యోగంపై ఎ లాంటి హక్కు ఉండదన్నారు. దరఖాస్తు ఫారాలు జనగామ మెప్మా కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయన్నారు. -
నార్లు పోయండి.. నీళ్లిచ్చే బాధ్యత నాది
● ఎమ్మెల్యే కడియం శ్రీహరిరఘునాథపల్లి: కరువు ఉన్నా.. నీళ్లు ఇచ్చే బాధ్యత నాది.. మీరు (రైతులు) నార్లు పోసి నాటు వేయండి.. అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శని వారం మండలంలోని మండలగూడెంలో రూ.15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించి, రూ.10 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మించుకున్న లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ డ్యాగల రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి జలాలను తరలించి బొమ్మకూరు రిజర్వాయర్ నింపి అక్కడి నుంచి మండలగూడెం, ఇతర చెరువులను నింపి పంటలకు సాగు నీరు అందిస్తామన్నా రు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దోచుకోవడమే తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్చందర్రెడ్డి, మండల అధ్యక్షుడు గాదె మహేందర్రెడ్డి, బొనాసి క్రాంతికుమార్, లింగాజి, బొనాసి కొమురయ్య, నామాల బుచ్చయ్య, కోళ్ల రవిగౌడ్, గొరిగ రవి, తదితరులు పాల్గొన్నారు. -
అక్రమాలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు
జిల్లాలో ప్రజాధనం వినియోగంలో పూర్తి పారదర్శకత ఉండాలి. ప్రజలకు మేలు చేసే పనులనే అమలు చేస్తున్నాం. మాకు ఎలాంటి భయం లేదు. తప్పు చేయడం లేదనే నమ్మకం ఉంది. ప్రతీ ఉద్యోగి అంకితభావంతో పని చేయాలి. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే శాఖాపరమైన చర్యలతో పాటు అవసరమైతే నేరుగా ఏసీబీకి కూడా రాస్తాం. ఖాతాలను ప్రైవేట్ బ్యాంకుల నుంచి ప్రభుత్వ బ్యాంకులకు మార్పించాం. కలెక్టర్ కార్యాలయ ఖాతాలకు సంబంధించి రూ.1.50 కోట్ల నిధుల ఖర్చుపై ఆరా తీస్తాం. ఆడిట్ జరిగిందా లేదా అనే కోణంలో పరిశీలన చేస్తాం. – సందీప్కుమార్ ఝా, కలెక్టర్ -
రూ.1.50 కోట్లపై ఆరా!
జనగామ: జనగామ కలెక్టరేట్లో అప్పటి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మరో కీలక అంశం తెరపైకి వచ్చినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే దిక్సూచి పుస్తకాల ముద్రణ పేరిట సుమారు రూ.40 లక్షల వ్యయానికి సంబంధించిన అవకతవకలపై ప్రస్తుత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక దృష్టి సారించగా, అప్పటి కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్పై పోలీస్స్టేషన్లో కేసు నమోదు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యవహారం ఇంకా విచారణలో ఉండగానే కలెక్టరేట్ కా ర్యాలయ ఖాతాల్లోని మరో రూ.1.50 కోట్ల నిధుల వినియోగంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏ ఏ కార్యక్రమాలకు ఖర్చు చేశారు? గతంలో కలెక్టర్ కార్యాలయ ఖాతాల్లో ఉన్న ఈ నిధులు ఏ ఏ కార్యక్రమాలకు ఖర్చు చేశారు, సంబంధిత పరిపాలన అనుమతులు ఉన్నాయా, వ్యయానికి సంబంధించిన పూర్తి లెక్కలు, ఓచర్లు, ఆడిట్ రికార్డులు అందుబాటులో ఉన్నాయా? అనే అంశాలపై పరిశీలన జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ నిధులపై క్రమబద్ధమైన ఆడిట్ జరిగిందా? లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కలెక్టరేట్ పరిధిలోని ఖాతాల్లోని నిధులను ప్రభుత్వ బ్యాంకుల్లోనే నిర్వహించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, గతంలో రెండు ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్లు సమాచారం. ఈ అంశంపై వెంటనే స్పందించిన ప్రస్తుత కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ఖాతాలను ప్రభుత్వ రంగ బ్యాంకులకు మార్చారు. ఈ మార్పు వెనుక ఆర్థిక పారదర్శకత, ప్రభుత్వ నిబంధనల అమలే ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. ఇక మరో ఆసక్తికర అంశంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఫిబ్రవరి 26న బాధ్యతలు స్వీకరించినప్పటికీ, ఆయన డిజిటల్ సంతకం ఆన్లైన్ వ్యవస్థలో వారం నుంచి ఎనిమిది రోజుల తర్వాత మాత్రమే నమోదు అయినట్లు సమాచారం. ఈ ఆలస్యానికి గల కారణాలపై కూడా అంతర్గతంగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఆ సమయంలో ఎలాంటి పరిపాలనా లేదా ఆర్థిక లావాదేవీలు జరిగాయా అనే కోణంలో పరిశీలన కొనసాగుతున్నట్లు సమాచారం. దిక్సూచి వ్యవహారం తర్వాత ఇప్పుడు రూ.1.50 కోట్ల నిధుల వినియోగంపై కూడా కలెక్టరేట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆరోపణలపై అధికారిక విచారణ పూర్తయిన తర్వాతనే పూర్తి వివరాలు బయటకు వస్తాయని తెలుస్తుంది. ప్రైవేట్ బ్యాంకుల నుంచి ప్రభుత్వ బ్యాంకులకు మార్పు డిజిటల్ సంతకం ఆలస్యంపైనా నిఘా అక్రమాలపై కఠిన చర్యలకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంకేతాలు -
ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ చేసి..
వరంగల్: ఉమ్మడి జిల్లా జనగామలో అర్ధరాత్రి వేళ నిలిపి ఉంచిన బస్సును ఓ వ్యక్తి దొంగతనం చేసిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. విధులు ముగించుకున్న ఆర్టీసీ డ్రైవర్లు జనగామ బస్టాండ్లో రాత్రి అక్కడే బస్సును నిలిపిఉంచారు.అయితే, పాలకుర్తికి చెందిన వెంకన్న అనే వ్యక్తి బస్టాండ్ సిబ్బంది నిద్రిస్తున్నవేళ ఆర్టీసీ అద్దె బస్సును స్టార్ట్ చేసి తీసుకెళ్లాడు. సూర్యాపేట వైపు సుమారు 21 కిలోమీటర్ల దూరం నడిపాడు. అలా.. సింగరాజుపల్లి టోల్ గేట్ వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి సిమెంట్ దిమ్మెను బలంగా ఢీకొట్టడంతో అక్కడే ఆగిపోయింది. బస్సును ఎత్తుకెళ్లిన నిందితుడు మద్యం సేవించి ఉండటంతో, ఆ మత్తులోనే ఇదంతా జరిగినట్లుగా తెలుస్తోంది. నిందితుడు వెంకన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు. మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన వ్యక్తిజనగామ బస్టాండులో నిలిపి ఉన్న అద్దె ఆర్టీసీ బస్సును మద్యం మత్తులో ఎత్తుకెళ్లిన పాలకుర్తికి చెందిన వెంకన్న అనే వ్యక్తిజనగామ నుండి సూర్యాపేట వైపు దాదాపు 21 కిలోమీటర్లు బస్సు తీసుకెళ్లిన క్రమంలో, సింగరాజుపల్లి టోల్ ప్లాజా వద్ద… pic.twitter.com/lo0Ho21wyf— Telugu Scribe (@TeluguScribe) July 10, 2026 -
బస్సుల కొరత..ప్రయాణికుల అవస్థ
జనగామ: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో శుక్రవా రం బస్సుల కొరతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద యం నుంచి రాత్రి వరకు పలు మార్గాల్లో బస్సులు సకాలంలో రాకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు నుంచి మూడు గంటల పాటు ఒక టి, రెండు బస్సులు మినహా మిగతా సర్వీసులు లేకపోవడంతో ప్లాట్ఫారాలు ప్రయాణికులతో కిక్కిరిశాయి. సిద్దిపేట, నర్మెట, సూర్యాపేట, రఘునాథపల్లి, పాలకుర్తి, హనుమకొండ, ఉప్పల్, జగద్గిరిగుట్ట, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు 60 నుంచి70 శాతం తగ్గడంతో ఇబ్బందులు మరింత పెరిగాయి. వచ్చిన కొద్దిపాటి బస్సుల్లో సీట్లు దక్కించుకునేందుకు ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. ఖమ్మంలో సీఎం సభకు బస్సులు తరలించడంతోనే ఈ సమస్య తలెత్తినట్లు పలువురు ప్రయాణికులు అభిప్రాయపడ్డారు. -
ప్రశాంతంగా చేనేత ఎన్నికలు
జనగామ: జిల్లా వ్యాప్తంగా చేనేత సహకార సంఘాల ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో మొత్తం 12 చేనేత సహకార సంఘాలు ఉండగా, వాటిలో 9 సంఘాలు ముందుగానే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన మూడు సంఘాలైన జిల్లా కేంద్రంలోని భారత్ టీసీ జెడ్ బీహెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్, జనగామ సంజయ్నగర్ ప్రాజెక్టు హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్, పాలకుర్తి మండలం గూడూరు హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్లలో ఎన్నికలు నిర్వహించారు. గూడూరు సంఘంలో ఇద్దరు మహిళా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన ఏడుగురు పురుష సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. జనగామలో ఎన్నికల ప్రచారం, పోలింగ్ పంచాయతీ ఎన్నికలను తలపించేలా సాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించగా, అనంతరం గంటపాటు భోజన విరామం ఇచ్చి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపి రి పీల్చుకున్నారు. ఎన్నికై న పాలకవర్గ సభ్యులు మూడు రోజుల్లోగా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితో పాటు పాలకమండలిని ఎన్నుకోనున్నారు. -
ఈవీఎం గోదాం పరిశీలన
జనగామ రూరల్: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, త్రైమాసిక తనిఖీలో భాగంగా శుక్రవారం సమీకృత కార్యాలయాల భవన సముదాయంలోని ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, మంటల నియంత్రణ పద్ధతులను పర్యవేక్షించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. పరిశీలనలో జనగామ ఆర్డీఓ గోపీరాం, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. జీడికల్ ఆలయానికి రూ.2 లక్షల విరాళం లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో దివ్యవిమాన రథోత్సవానికి సంపంగి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం రూ.2లక్షల విరాళం అందజేశారు. గతంలో కార్పెంటర్ శంకరాచారికి అడ్వాన్స్గా రూ.1,16,000 ఇవ్వగా మొత్తం రూ.3,16,000లు రథం తయారీకి అందజేశారు. కార్యక్రమంలో ఈఓ వంశీ, దేవస్థాన చైర్మన్ మూర్తి, సిబ్బంది భరత్, అర్చకులు భార్గవాచార్యులు తదితరులు ఉన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి జనగామ రూరల్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న డిజిటలైజ్ ప్రక్రియను వేగవంతం చేయాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీ నుంచి కార్యదర్శి నవీన్ కుమార్తో కలిసి వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ.. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేసి ఈ నెల 24 తేదీ నాటికి డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ..ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ 99.6 శాతం, డిజిటలైజేషన్ ప్రక్రియ 21.94 శాతం పూర్తయిందన్నారు. రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య బాధాకరం జనగామ రూరల్: ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బకాయిలు అందక మానసిక వేధనతో విశ్రాంత ఉపాధ్యాయుడు మల్లయ్య ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని, ఆయన ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పూర్ణిమ కాలనీలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు పగిడిపల్లి మల్లయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మల్లయ్య కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సొసైటీ పెట్రోల్ బంక్ సీజ్ కొడకండ్ల: మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం పెట్రోల్ బంక్ను శుక్రవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్టేషన్ఘన్పూర్ ఆర్డీఓ కిరణ్ప్రకాశ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ అనీల్బాబు బంక్ను సీజ్ చేయడంతో పాటు సేల్స్కు సంబంధించిన ‘బీ’ లైసెన్స్ను కూడా రద్దు చేశారు. సొసైటీ భూమికి సంబంధించిన పత్రాలు సరిగా లేనందునే బంక్ను సీజ్ చేసి లైసెన్స్ను రద్దు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ భూమికి సంబంధించిన ఆధారాలు, రికార్డులను అందజేయాలని జూన్ 27న రెవెన్యూ అధికారులు సొసైటీకి నోటీసులు అందజేయగా గడువు కోరారు. 30వ తేదీ న బంక్లో సేల్స్ను నిలిపివేస్తూ జూలై 7 వరకు రికార్డులు సమర్పించేందుకు రెవెన్యూ అధికారులు సొసైటీకి గడువిచ్చారు. నిర్దేశించిన గడువులోగా భూమికి సంబంధించిన రికార్డులను కలెక్టర్కు అందజేసినట్లు ఎండీ నరేష్ తెలిపారు. షోకాజ్ నోటీస్పై సొసైటీ పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. -
కుట్టేదెప్పుడు? ఇచ్చేదెప్పుడు?
జనగామ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఉచితంగా అందించే రెండు జతల యూనిఫాం పంపిణీ ప్రక్రియ ఈసారి అస్తవ్యస్తంగా మారింది. పాఠ్యపుస్తకాలతో పాటు ఇవ్వాల్సి ఉండగా పాఠశాలలు ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా ఇప్పటివరకు యూనిఫాం కోసం అవసరమైన క్లాత్(వస్త్రం) జిల్లాలకు పూర్తిస్థాయిలో చేరలేదు. అయితే వచ్చిన వస్త్రంతో కుట్టు పనులు ప్రారంభమైనా నత్తనడకన సాగుతోంది. దీంతో పిల్లలు పాత యూనిఫాంలతో లేదా రంగు దుస్తులతోనే తరగతులకు హాజరవుతున్నారు. నత్తనడకన కుట్టు పనులు సాధారణంగా ఏటా మార్చిలోనే విద్యార్థుల కొలతలు సేకరించి, ఏప్రిల్, మే నెలల్లో క్లాత్ను మండల కేంద్రాల ద్వారా మహిళా సంఘాలకు అందిస్తారు. వారు దుస్తులు కుట్టి పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు ప్రధానోపాధ్యాయులకు అప్పగిస్తారు. కానీ వస్త్రం ఆలస్యంగా వచ్చింది. ఒక్కో డ్రెస్ కుట్టినందుకు రూ.100 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇప్పటి వరకు 6వేల దుస్తులను 399 మంది మహిళా సంఘాల ద్వారా సిద్ధం చేసినట్లు, ఈనెల చివరికల్లా అందేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. స్పష్టత రాని ఎడ్యుకేషన్ కిట్ ఈ ఏడాది నుంచి యూనిఫాంలతో పాటు 24 వస్తువులతో కూడిన ‘ఎడ్యుకేషన్ కిట్’ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 15 నాటికి అన్ని పాఠశాలలకు కిట్లు చేరుస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు వాటి పంపిణీ కూడా ప్రారంభం కాలేదు. అధికారులు తక్షణమే యూనిఫాంలు, కిట్ పంపిణీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థులకు నీలం రంగు దుస్తులు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలం విద్యార్థులకు ప్రభుత్వం యూనిఫాం కలర్ మార్చింది. గతేడాది రెడ్ అండ్ యాష్ కలర్లో ఉంది. ఈ సారి లేత నీలం రంగుగా మార్చారు. బాలురకు నీలం రంగు చొక్కా, లేత నీలంరంగు నిక్కర్ లేదా ప్యాంటు, బాలికలకు లాంగ్ ఫ్రాక్, షర్ట్, స్కర్ట్ తరగతుల వారీగా అందించనుంది. తక్షణం యూనిఫాంలు, కిట్ అందించాలి పాఠశాలలు ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా.. నేటికీ విద్యార్థులకు యూనిఫాం అందకపోవడం బాధాకరం. యూనిఫాంలతో పాటు ఎడ్యుకేషన్ కిట్ను తక్షణమే అందించాలి. లేకపోతే విద్యార్థులతో కలిసి ఆందోళనలు చేపడతాం. –పోదల లవకుమార్, జిల్లా అధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐ స్కూళ్ల ప్రారంభం రోజే యూనిఫాంలు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు 6వేల వరకే యూనిఫాంలు సిద్ధం నత్తనడకన సాగుతున్న కుట్టుపనులు జిల్లా వ్యాప్తంగా 27 వేలకుపైగా విద్యార్థులు స్పష్టత లేని ఎడ్యుకేషన్ కిట్ పంపిణీమొత్తం విద్యార్థులు: 27,768 మంది యూనిఫాంల అవసరం: 55 వేలు యూడైస్ ప్రకారం మొత్తం పాఠశాలలు: 503ఎస్హెచ్జీ మహిళలు: 399 మంది ఇప్పటివరకు సిద్ధమైన యూనిఫాంలు: 6000 -
ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ షురూ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లోని మేథమెటిక్స్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ‘సైంటిఫిక్ కంప్యూటింగ్ అండ్ విజువలైజేషన్’ అంశంపై మూడు రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను నిట్లోని రామన్హాల్లో అట్టహాసంగా ప్రారంభించారు. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఇండీస్, సేయింట్ ఆగస్టీన్ ప్రొఫెసర్, హెడ్ శ్రీధరరావు గునకాల ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను ప్రారంభించి, కాన్ఫరెన్స్ సావనీర్ను విడుదల చేశారు. కాన్ఫరెన్స్లో భాగంగా శుక్రవారం ఉద్యోగ విరమణ పొందిన నిట్ ప్రొఫెసర్లు కేఎన్ఎస్, కాశీవిశ్వనాథన్, జేవీ రమణమూర్తిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఐఐటీ ఖరగ్పూర్ ప్రొఫెసర్ పీవీఎస్ఎన్ మూర్తి, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ వైవీఎస్ఎస్ సన్యాసిరాజు, నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్, ప్రొఫెసర్ ఎన్వీ.ఉమామహేశ్, సీహెచ్.రామ్రెడ్డి పాల్గొన్నారు. -
డీఏపీ నో స్టాక్
● నాట్లు ఎలా వేయాలని రైతుల ఆందోళన ● ఎరువుల కోసం పడిగాపులురఘునాథపల్లి: వానాకాలం పంటల సాగు ఊపందుకుంటున్న వేళ డీఏపీ ఎరువుల కొరత రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఎరువుల దుకాణాల వద్ద డీఏపీ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండడంతో రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సాగు కు అత్యంత కీలకమైన డీఏపీ అందుబాటులో లేకపోవడంతో రైతులు ప్రత్నామ్నాయంగా అధిక ధర కలిగిన కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేస్తూ అదనపు ఆర్థిక భారం మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఏపీ 50 కేజీల బస్తా ధర రూ.1,350 మాత్రమే ఉండటంతో రైతులు ప్రధానంగా ఈ ఎరువునే వినియోగిస్తుంటారు. డీఏపీ కొరతను మండలంలోని కొందరు వ్యాపారులు అవకాశంగా మలుచుకొని ఒక్కో బస్తాను రూ.1,500 నుంచి రూ.1,600 వరకు విక్రయించారని రైతులు ఆరోపిస్తున్నారు. ●రైతులకు అత్యంత అవసరమైన డీఏపీ ఎరువును ప్రభుత్వం వెంటనే అందుబాటులో ఉంచాలి. వరినాట్లు, పత్తి పంట ప్రారంభ దశలో డీఏసీ అత్యవసరం. ముందస్తుగా ఎరువుల నిల్వలు ఏర్పాటు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులకు డీఏపీ దొరకని పరిస్థితి నెలకొంది. – మంతపురి యాదగిరి, కన్నాయపల్లిడీఏపీ కొరత రాష్ట్రవ్యాప్తంగా ఉంది. మహిళా సంఘా ల షాపులకు ఇప్పటికే ఇండెంట్ పంపించాం. త్వరలో వచ్చే అవకాశముంది. డీఏపీలా పనిచేసే రూ.750 ధర గల భాస్వరం, కాల్షియం, సల్ఫర్తో కూడిన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బస్తా కూడా బాగా పని చేస్తుంది. ఒక డీఏసీ బస్తాకు బదులు రెండు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బస్తాలు వేస్తే సరిపోతుంది. – కరుణాకర్, మండల వ్యవసాయాధికారి -
ఆదాయం మస్తు
అక్రమాలకు చెక్..జనగామ: ఆన్లైన్ పారదర్శక విధానంతో ఇసుక, మొరం, మట్టి అక్రమ రవాణాకు కళ్లెం పడగా, తక్కువ వ్యవధిలోనే ప్రభుత్వ ఖజానాకు రూ.5.5కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. జిల్లా కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇసుక, మొరం తరలింపులో తీసుకొచ్చిన పారదర్శక విధానాలు ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచాయి. కేవలం నాలుగున్నర నెలల కాలంలో ఇసుక తరలింపు ఫీజుల రూపంలో జిల్లాకు కోట్ల మేర ఆదాయం సమకూరింది. నాడు అక్రమ రవాణా.. నేడు ఆదాయమార్గంగా గతంలో జిల్లాలోని బచ్చన్నపేట, కోమళ్ల, దేవరుప్పుల, చిల్పూరు, ఇప్పగూడెం, వడ్లకొండ, చీటకోడూరు, యశ్వంతాపూర్, జఫర్గఢ్, లింగాలఘణపురం తదితర ప్రాంతాల నుంచి ప్రతిరోజూ లక్షల రూపాయల విలువైన ఇసుక, మొరం, మట్టి అక్రమంగా తరలించారు. తనిఖీలు జరిగినా అవి నామమాత్రంగానే ఉండేవి. అక్రమ రవాణా పేరిట భారీ స్థాయిలో మామూళ్లు చేతులు మారేవన్న ఆరోపణలు లేకపోలేదు. అయితే కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇసుక, మొరం, మట్టి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారు. కఠిన నిబంధనలు అమలు చేయడంతో పాటు అక్రమంగా తరలించే వాహనాలపై కేసులు నమోదు చేసి భారీ జరిమానాలు విధించడంతో కొద్దిరోజుల వ్యవధిలోనే అక్రమ రవాణా అరికట్టగలిగారు. అదే సమయంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఇసుక, మొరం తరలింపునకు ఆన్లైన్ అనుమతి వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానం వల్ల అనుమతుల జారీ ప్రక్రియ పారదర్శకంగా మారడంతో పాటు ప్రభుత్వానికి రావాల్సిన ఫీజులు నేరుగా ఖజానాకు చేరుతున్నాయి. పదేళ్ల ఆదాయం ఎవరి జేబుల్లోకి..? జిల్లా ఏర్పడిన పదేళ్లలో ఇసుక అక్రమ రవాణా పేరిట చేసిన వసూళ్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయనే చర్చ సాగుతోంది. అలాంటి పరిస్థితుల్లో కేవలం 136 రోజుల్లోనే ప్రస్తుత కలెక్టర్ అక్రమ రవాణాను కట్టడి చేసి రూ.5.5 కోట్లకుపైగా ప్రభుత్వ ఆదాయం సమకూర్చగలిగారు. ఇదే వేగం కొనసాగితే జిల్లా ఖజానాకు మ రింత ఆదాయం వచ్చే అవకాశముంది. క్యూబిక్ మీటర్ ధరలు ఇసుకకు క్యూబిక్ మీటర్కు రూ.450, సొంత పొలం నుంచి మొరం లేదా మట్టి తరలించాలంటే రూ.324, ఇతర ప్రాంతాల నుంచి మట్టి లేదా మొరం తరలించాలంటే రూ.428 చెల్లించాలి. ఇటుకల తయారీ మట్టికి క్యూబిక్ మీటర్కు రూ.19,828 చలాన్న్ తీసుకోవాలి. ములుగు నుంచి తీసుకొచ్చే గోదావరి ఇసుకను డంప్ యార్డు నుంచి ట్రాక్టర్లలో తరలించేందుకు అదనంగా రూ.45 అడ్మినిస్ట్రేటివ్ చార్జీ వసూలు చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతి ఉంటుంది. స్లాట్ బుక్ చేసిన వెంటనే సంబంధిత జీపీఓకు సమాచారం వెళ్తుంది. రెండు ట్రిప్పులు అవసరమైతే ప్రయాణ సమయాన్ని అంచనా వేసుకుని వేర్వేరుగా స్లాట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కూపన్ జనరేట్ అయిన వెంటనే జీపీఓకు సమాచారం వెళ్తుంది. ఇసుక కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వాగు వద్ద కూపన్ను స్కాన్ చేసిన తర్వాత అదే కూపన్ను మళ్లీ వినియోగించేందుకు ప్రయత్నిస్తే జీపీఓ, ఎస్సై, తహసీల్దార్, కలెక్టరేట్కు వెంటనే అలర్ట్ వెళ్తుంది. గతంలో ఇసుక అనుమతుల విషయంలో మధ్యవర్తులు, అక్రమ రవాణా, రెవెన్యూ నష్టం వంటి ఆరోపణలు ఉండేవి. ప్రస్తుతం స్లాట్ బుకింగ్తో మధ్యవర్తుల జోక్యం తగ్గి పారదర్శకత పెరిగింది. ఇసుక బుకింగ్ చేసుకునే పోర్టల్ ఆన్లైన్ విధానంతో ఇసుక, మొరం రవాణాలో పారదర్శకత 136 రోజుల్లో ప్రభుత్వ ఖజానాలోకి రూ.5.5 కోట్లు గతంలో ఇసుక మాఫియా దందాలు కలెక్టర్ కఠినంగా వ్యవహరిస్తుండడంతో తగ్గిన అక్రమాలుఆన్లైన్ స్లాట్ బుకింగ్తో.. జిల్లాలో ఇసుక తదితర రవాణాను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. ప్రజలు మీ సేవా పోర్టల్ లేదా సిటిజన్ యాప్ ద్వారా esandjangoan.telangana.gov.in వెబ్సైట్లో ముందురోజే స్లాట్ బుక్ చేసుకుని అనుమతులు పొందాలి. -
పేదల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి జఫర్గఢ్: పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. మండల కేంద్రంలో శుక్రవా రం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కడియం శ్రీ హరి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జఫర్గఢ్ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనంటూ పేర్కొన్నారు. స్టేషన్ఘన్పూర్ నుంచి జఫర్గఢ్ మీదుగా వర్ధన్నపేట వరకు రూ.40 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డు, సెంట్రల్ లైటింగ్ మంజూరు కావడం జరిగిందని, త్వరలో ఈ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వేల్పుగొండ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుల్లా మోహన్రావు, సింగిల్ విండో చైర్మన్ తీగల కర్ణాకర్రావు, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, పార్టీ జిల్లా నాయకులు అన్నెబోయిన భిక్షపతి, ఇల్లందుల బేబి శ్రీనివాస్, మంచాల ఎల్లయ్య, మనోజ్రెడి పాల్గొన్నారు. -
ఎల్నినోపై రైతులకు అవగాహన కల్పించాలి
జనగామ రూరల్: సూపర్ ఎల్నినోపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని, సాగునీటి లభ్యత లేని ప్రాంతాల్లో వరి సాగు చేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వ్యవసాయం, సాగునీరు, వర్షపాతం పరిస్థితులపై కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లో వీసీ హాల్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, ఇరిగేషన్ శాఖ సీతారామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఈనెల 15 తర్వాత నీటి నిల్వల ఆధారంగా పంటలపై రైతులకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.మోడల్ పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం జనగామ రూరల్: మండలంలోని చౌడారం గ్రామంలోని పీఎంశ్రీ మోడల్ పాఠశాలలో ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీహరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మిగిలిపోయిన సీట్లకు, ఇంటర్ ఫస్టియర్ సీట్లకు స్పాట్ అడ్మిషన్ ఉందని శనివారం ఉదయం సంబంధిత సర్టిఫికెట్లతో పాఠశాల, కళాశాలకు హాజరు కావాలని కోరారు. విద్యార్థుల నమోదు పెరగాలి కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా.. ప్రభుత్వ ప్రభు త్వపాఠశాలల్లో అత్యాధునిక సౌకర్యాలు, విద్యా ర్థులకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ఝా అన్నారు. విద్యా కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత విద్యా సంవత్సరానికి 9,000 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు కృషిచేయాలని ఆదేశించారు. ఆర్టీసీ అద్దె బస్సు అపహరణ జనగామ: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపం హనుమకొండ రోడ్డులోని ఓ పెట్రోల్ బంక్ వద్ద పార్క్ చేసిన ఆర్టీసీ అద్దె బస్సును దుండగుడు అపహరించాడు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్గేట్ సమీపంలో బస్సును స్వాధీనం చేసుకున్నారు. జనగామ కురుమవాడకు చెందిన గంట గోపీ కృష్ణారెడ్డికి చెందిన టీఎస్ 27టీ7231 నంబర్ గల ఆర్టీసీ అద్దె బస్సు రోజు వారీ విధులు ముగించుకున్న అనంతరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద పార్క్ చేశారు. గురువారం తెల్లవారుజామున డ్రైవర్ విధులకు రావడంతో బస్సు కనిపించలేదు. దీంతో వెంటనే యజమాని గోపీకృష్ణారెడ్డికి సమాచారం ఇచ్చాడు. అనంతరం 100 డయల్కు సమాచారం అందడంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో సూర్యాపేట ప్రధాన రహదారి దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్గేట్ సమీపంలో రోడ్డు పక్కనున్న డివైడర్ను ఢీకొని నిలిచి ఉన్న బస్సును పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న దేవరుప్పుల ఎస్సై సృజన్ అక్కడికి చేరుకుని బస్సును స్వాధీనం చేసుకుని జనగామకు తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సును తీసుకెళ్లిన వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని అనుమానిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై బస్సు యజమాని గంట గోపీకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జనగామ సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు. భారత బ్యాడ్మింటన్ జట్టుకు శ్రీచేతన్శౌర్య ఎంపిక కొడకండ్ల: మండలంలోని లక్ష్మక్కపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ కుమారుడు సామల శ్రీచేతన్ శౌర్య అండర్ –15 బాలుర బ్యాడ్మింటన్ భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్నాడు. గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందిన శ్రీచేతనశౌర్య బెంగళూరులో జరిగిన అఖిల భారత సబ్ జూని యర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ చాటి అండర్– 15 బాలుర డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకం, సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించాడు. దీంతో సెప్టెంబర్లో చైనాలో జరిగే ఏషియన్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీల్లో భారత జట్టుకు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ప్రాతినిథ్యం వహించనున్నారు. ఈ సందర్భగా ఎంఈఓ గ్రేస్కేజియారాణి, హెచ్ఎం రమేశ్శర్మ, ఉపాధ్యాయులు.. శ్రీచేతన్శౌర్యకు శుభాకాంక్షలు తెలిపారు. -
ఆపద కాలంలో అండగా..
లింగాలఘణపురం: కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబానికి చేయూతగా ప్రభుత్వం నేరుగా రూ.20వేలు బ్యాంక్లో జమచేసే పథకమే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం–ఎన్ఎఫ్బీఎస్). ఈ పథకం 2023లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్లో భాగంగా ప్రారంభించగా రాష్ట్ర ప్రభుత్వం 2024 నుంచి ఎన్ఎఫ్బీఎస్గా అమలవుతోంది. ఇందులో కుటుంబ యజమాని అంటే కుటుంబాన్ని పోషించే వ్యక్తి..అనగా తల్లి, తండ్రి, ఇంటికి పెద్ద కుమారుడు, కూతురు..ఇలా ఒక కుటుంబం వీరిపై ఆధారపడి ఉంటే ఈ పథకం వర్తిస్తుంది. దరఖాస్తు చేసుకున్న వారం పది రోజుల్లోనే నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. ఈ పథకంలో గతంలో తహసీల్దార్ల పరిధిలో నుంచి ఆర్డీఓలకు అక్కడి నుంచి కలెక్టర్ అప్రూవల్ తీసుకొని డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యేది. దీంతో జాప్యం జరుగుతుందని ప్రస్తుతం ఎంపీడీఓలకు అప్పగించారు. ఎంపీడీఓల నుంచి డీఆర్డీఓ, కలెక్టర్ అప్రూవల్తో సెర్ప్ నుంచి డబ్బులు జమ అవుతాయి. జిల్లాలో జనగామ మండలంలో ఎక్కువగా 30 మంది దరఖాస్తు చేసుకోగా నర్మెటలో కేవలం ఒక్కరే దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకంపై ఇంకా గ్రామాల్లో విస్త్రృత ప్రచారం చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 196 దరఖాస్తులు జిల్లాలో ఇప్పటి వరకు 196 దరఖాస్తులు రాగా అందులో 5 డీఆర్డీఓ రిజెక్ట్ చేశారు. మిగిలినవి ఆయా అధికారుల లాగిన్లలో ఉండగా 13 మంది లబ్ధిదారులకు మాత్రమే బ్యాంక్ల్లో రూ.20వేల చొప్పున జమ అయ్యాయి. మండలాల వారీగా దరఖాస్తుల వివరాలు.. బచ్చన్నపేట–8, చిల్పూరు–22, దేవరుప్పుల–23, స్టేషన్ఘన్పూర్–6, జనగామ టౌన్–8, జనగామ –30, కొడకండ్ల 24, లింగాలఘణపురం 10, నర్మెట–1, పాలకుర్తి –22, రఘునాథపల్లి –13, స్టేషన్ఘన్పూర్ మండలం 10, తరిగొప్పుల –6, జఫర్గఢ్–13 ఉన్నాయి. ఇందులో ఎంపీడీఓలు 60 అప్రూవ్ చేయగా 136 పెండింగ్లో ఉన్నాయి. డీఆర్డీఓ పరిధిలో 55 అప్రూవ్ కాగా 5 రిజెక్ట్ చేశారు. సెర్ప్లో 13 అప్రూవ్ కాగా 42 పెండింగ్లో ఉండి. 13 మందికి బ్యాంక్ల్లో జమ అయ్యాయి. అందులో రఘునాథపల్లిలో 6, కొడకండ్లలో 4, దేవరుప్పులలో 3 ఉన్నాయి. అవసరమైన సర్టిఫికెట్లు మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్కార్డ్, రేషన్కార్డు, బ్యాంక్ పాసు బుక్, రెవెన్యూ అధికారి ధ్రువీకరించిన కుటుంబ సభ్యుల సర్టిఫికెట్తో పాటు ఒక ఫొటోను జతపరచాలి. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొని మండల కేంద్రాల్లోనైతే ఎంపీడీఓలకు, మున్సిపాల్ పరిధిలో కమిషనర్లకు దరఖాస్తు ఫారాలను అందజేయాలి. అక్కడి నుంచి వారి లాగిన్లో ఒకే చేస్తే డీఆర్డీఓకు, అక్కడి నుంచి కలెక్టర్కు, ఆ తరువాత సెర్ప్ నుంచి నేరుగా లబ్ధిదారుల జాబితాలో జమ అవుతాయి. కుటుంబ యజమాని చనిపోతే రూ.20వేలు పథకం అమలు బాధ్యతలు ఎంపీడీఓలకుపథకానికి అర్హులు ఎవరంటే..? చనిపోయిన కుటుంబం బీపీఎల్ (పేద కుటుంబం) జాబితాలో ఉండాలి. 18 నుంచి 59 ఏళ్ల వయసు కలిగిన వారై ఉండి ఆ కుటుంబబం మొత్తం వారి ఆదాయంపై ఆధారపడి జీవనం సాగించాలి. మహిళలైన, పురుషులైన అర్హులే అవుతారు. గతంలో ఏఏబీవై, జేబీవై, ఆపద్బాంధు పథకం తీసుకుంటే మాత్రం అనర్హులు అవుతారు. అంతేకాకుండా ప్రమాదవశాత్తు మరణించినా, సహజ మరణమైన ఈ పథకం వర్తిస్తుంది. -
అవగాహనతో ప్రమాదాల నివారణ
లింగాలఘణపురం: ప్రజలు విద్యుత్పై అవగాహన ఉంటే ప్రమాదాలను నివారించవచ్చని వరంగల్ సూపరింటెండెంట్ ఇంజనీర్, జనగామ సర్కిల్ నోడల్ ఆఫీసర్ శ్రీకాంత్ అన్నారు. గురువారం మండలంలోని నెల్లుట్ల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు జరుగుతున్న ఇంటర్నల్ ఓరియెంటేషన్ శిక్షణలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ భద్రత, ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్ఈ సంపత్రెడ్డి, డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, ఏడీ వేణుగోపాల్, హెచ్ఎం రవీందర్తో పాటు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
పథకాలు అర్హులకు చేరాలి
● గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ● అధికారులతో సమీక్ష హన్మకొండ అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రయోజనాలు చివరి లబ్ధి దారుడి వరకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూచించారు. హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. టీబీ నిర్మూలన, పల్స్పోలియో, ఇందిరమ్మ ఇళ్లు, వైద్య సేవలు, వ్యవసాయం, మౌలిక వసతుల అమలుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాలనలో నాణ్యత, పారదర్శకత, సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలని, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలను బలోపేతం చేయాలని సూచించారు. రైతులను విలువ ఆధారిత పంటల సాగు వైపు ప్రోత్సహించాలని సూచించారు. హాస్టళ్ల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ: మంత్రి అడ్లూరి వర్షాకాలంలో సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అధికారులను ఆదేశించారు. అత్యవసర మరమ్మతుల కోసం ప్రతీ జిల్లాకు రూ.కోటి వరకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామన్నారు. ఆరోగ్య పరీక్షలు, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద, పోలీస్ కమిషనర్ శ్వేత, అదనపు కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. మహిళల కృషిని ప్రశంసించిన గవర్నర్ హనుమకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గురువారం సందర్శించి మహిళల కృషిని అభినందించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, వ్యవసాయ, ఉద్యాన శాఖల స్టాళ్లలో ప్రదర్శించిన ఉత్పత్తులను పరిశీలించి తయారీ విధానం, నాణ్యత, మార్కెటింగ్ అవకాశాలపై మహిళలతో మాట్లాడారు. వరంగల్ దరీ స్టాల్ను సందర్శించి దరీల ప్రత్యేకత, మార్కెట్ అవకాశాలపై వివరాలు తెలుసుకుని వాటిని కొన్నారు. అనంతరం మహిళలను ప్రోత్సహిస్తూ పలు స్టాళ్లలోని ఉత్పత్తులను కొన్నారు. -
ఆత్మగౌరవం కోసం ఐక్యపోరాటం
జనగామ: సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడంతో పాటు గ్రామ పంచాయతీల హక్కులు, ఆర్థిక స్వయం ప్రతిపత్తి కోసం సర్పంచులంతా ఐక్యంగా పోరాడాలని జిల్లా సర్పంచుల సంఘం కన్వీనర్ గోపగోని శ్రీధర్ గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో గురువారం జిల్లా సర్పంచుల చైతన్య సదస్సు నిర్వహించారు. సర్పంచుల ఫోరం జిల్లా కన్వీనర్ గోపగోని శ్రీధర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, మైనర్ గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షల ప్రత్యేక నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ప్రభుత్వం వసూలు చేస్తున్న మైనింగ్ ఆదాయం, స్టాంప్ డ్యూటీ తదితర పన్నులను గ్రామ పంచాయతీలకే బదిలీ చేయాలని, ఉప సర్పంచ్లకు కల్పించిన చెక్పవర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సదస్సులో పంచాయతీరాజ్ మాజీ అధ్యక్షుడు మెట్టుపల్లి పురుషోత్తంరెడ్డి, పంచాయతీరాజ్ ఉపాధ్యక్షుడు అశోక్రావు, రాష్ట్ర మాజీ ఎంపీపీల సంఘం అధ్యక్షుడు శ్రీశైలం, పంచాయతీ రాజ్ చాంబర్ ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ, రాష్ట్ర కార్యదర్శి వెంకట్, జిల్లా అధ్యక్షుడు రాకేష్రెడ్డి, సంపత్ నాయక్, సర్పంచులు పాల్గొన్నారు. సర్పంచ్ల చైతన్య సదస్సులో జిల్లా కన్వీనర్ శ్రీధర్గౌడ్ -
రిటైర్డ్ టీచర్ది ప్రభుత్వ హత్యే
● మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్జనగామ: ఉద్యోగ విరమణ పొందిన 21 నెలలు గడిచినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకున్న రిటైర్డ్ టీచర్ పగిడిపల్లి మల్లయ్య మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న జిల్లా కేంద్రంలోని పూర్ణిమా కాలనీకి చెందిన మృతుడు మల్లయ్య కుటుంబాన్ని గురువారం టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్, టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డితో కలిసి మాజీమంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మల్లయ్య రాసిన 33 పేజీల సూసైడ్ నోట్లో కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.10.78 లక్షల జీపీఎఫ్ బకాయిలు అందక తీవ్ర మనోవేదనకు గురయ్యానని స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల ఆర్థిక సహాయానికి అదనంగా రూ.1 కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ..రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సిన సొంత డబ్బుల కోసం హైకోర్టును ఆశ్రయించి, ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి మాట్లాడుతూ.. మల్లయ్య మృతికి కారణమైన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, టీఎన్జీఓ ప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
చేనేత ఎన్నికలకు సర్వం సిద్ధం
● నేడు మూడు సొసైటీల్లో పోలింగ్ ● ఇప్పటికే 9 సొసైటీలు ఏకగ్రీవం జనగామ: జిల్లా చేనేత సహకార సంఘాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జిల్లాలోని 12 చేనేత సహకార సంఘాల్లో తొమ్మిది సంఘాలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా, మిగిలిన మూడు సంఘాల్లో నేడు(శుక్రవారం) ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బ్యాలె ట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించి, అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. మూడు సొసైటీల్లో పోలింగ్... తొమ్మిది ఏకగ్రీవం జిల్లాలో జనగామ వీవర్స్ కాలనీలోని భారత్ టీసీ జెడ్బీ హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్, జనగామ సంజయ్నగర్ ప్రాజెక్టు హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్, పాలకుర్తి మండలం గూడూరు హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ సంఘాల్లో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన బచ్చన్నపేట మార్కండేయ, స్టేష న్ఘన్పూర్ హెచ్డబ్ల్యూసీఎస్, కొత్తపల్లి శ్రీ వెంకటేశ్వర, బచ్చన్నపేట శ్రీ సిద్ధేశ్వర, సీతారాంపురం శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర, నీర్మాల శ్రీ భావన ఋషి, కంచనపల్లి హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్, శ్రీ పద్మావతి కొడకండ్ల, శ్రీనివాస పవర్ లూం తదితర సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మెజారిటీ స్పష్టంగా ఉంటే.. ప్రతీ సహకార సంఘంలో తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకోనుండగా, అందులో ఇద్దరు మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. ఎన్నికైన డైరెక్టర్లలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి తదితర పదవులను ఎంపిక చేస్తారు. ఫలితాల అనంతరం ఐదుగురు డైరెక్టర్ల మెజారిటీ స్పష్టంగా ఉంటే వెంటనే పాలక వర్గాన్ని ప్రకటిస్తారు. ఒకవేళ మెజారిటీపై స్పష్టత లేకుంటే మూడు రోజుల గడు వు ఇచ్చి పాలకవర్గ ఎన్నికను నిర్వహించనున్నారు. రాజకీయ రంగు చేనేత సహకార సంఘాల ఎన్నికలకు ఈసారి రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఏకగ్రీవం కాని మూడు సంఘాల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు తెర వెనుక చురుకుగా వ్యవహరించడంతో ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలను తలపించే స్థాయికి చేరుకున్నాయి. -
సైలెన్సర్లలో మార్పులు చేస్తే కఠిన చర్యలు
జనగామ: సైలెన్సర్లలో అనధికారిక మార్పులు చేయించుకోవద్దని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ రాజమహేంద్ర నాయక్ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా మోడిఫైడ్ సైలెన్సర్లను అమర్చుకుని అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలిగి స్తున్న ద్విచక్ర వాహనాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 40 బైకులను సీజ్ చేసి, వాహ న యజమానులపై మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేశారు. అనంతరం ఆయా వాహనాలకు అమర్చిన మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగించారు. బుధవారం సీపీ శ్వేతారెడ్డి ఆదేశాల మేరకు డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షణలో సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్ఐల ఆధ్వర్యంలో పోలీస్ కంట్రోల్ రూం ఆవరణలో స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లను రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు. బాల కార్మిక నిర్మూలనకు కృషి చేయాలి బాల కార్మిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం స్కోప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సి పాల్ సంధ్యారాణి అధ్యక్షతన బాల కార్మిక నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ రోడ్డు రోలర్తో 40 సైలెన్సర్లు ధ్వంసం -
పేదల హృదయాల్లో వైఎస్ఆర్
స్టేషన్ఘన్పూర్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో పేదల సంక్షేమం కోసం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపట్టి పేదల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొనియాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిఽథులుగా హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇటీవల రైతు భరోసా నిధులు సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే, ఎంపీ పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. కాగా, స్థానిక అభ్యుదయ యువజన సంఘం అధ్యక్షుడు, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర నాయకుడు పోశాల క్రిష్ణమూర్తి ఆధ్వర్యంలో మహానేత వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ హరినాఽథ్ తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం నివాళి -
కుటుంబానికి అండగా ఉండాలని..
పాఠశాల స్థాయి నుంచే ఎన్సీసీ ట్రైనింగ్ పొందినా. నాటి నుంచి పోలీసు అంటే నాకు మక్కువ ఎక్కువ. ఆరేళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం శ్రమిస్తున్నా. పోలీసు ఉద్యోగం సాఽధించి కుటుంబానికి అండగా ఉండాలనే లక్ష్యంతో రోజూ క్రీడామైదానంలో నాలుగు గంటలు పరుగు, ఫిట్నెస్ అంశంలో సాధన చేస్తున్నా. – పూజ నాగరాజు, కరీమాబాద్ వరంగల్కానిస్టేబుల్ ఉద్యోగమే లక్ష్యండిగ్రీ పూర్తయ్యింది. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలన్నదే నాలక్ష్యంగా పెట్టుకున్నా. ఫిట్నెస్ కోసం హనుమకొండ జేఎన్ స్టేడియంలో ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంటి వద్ద ఉంటూ సంబంధిత సబ్జెక్ట్లు చదువుతున్నా. ఇటీవల ఆర్మీ ఉద్యోగం పరీక్ష రాశాను. ఇంకా ఫలితాలు ప్రకటించలేదు. మొదటి ప్రయత్నంలోనే కానిస్టేబుల్ ఉద్యోగం సాధించలన్నదే నా కల. ఇందుకు కోచింగ్ సెంటర్లో తీవ్రంగా శ్రమిస్తున్నా. – పిట్టల సాయి, కాశికుంట వరంగల్ -
పోలీస్ శాఖలో కొలువుల జాతర
సాక్షిప్రతినిధి, వరంగల్: పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖలో సుమారు ఏడు వేల వరకు పోస్టుల భర్తీ తక్షణ అవసరంగా గుర్తించింది. ఈ మేరకు 5,000 ఖాళీలను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు జీఓలో స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత కొంతకాలంగా నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురించాయి. వేలాది మంది నిరుద్యోగ యువత పోలీసు ఉద్యోగాల కోసం పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలకు ముందు నుంచే పోలీస్ అకాడమీ, కోచింగ్ సెంటర్లలో సందడి మొదలైంది. ఉమ్మడి జిల్లాకు గణనీయమైన పోస్టులు హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో పోలీసు ఉద్యోగాలు ఆశిస్తున్న వారికి నిజంగా ఇది శుభవార్తే. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ కోసం ఉమ్మడి జిల్లా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. స్థానికత (లోకల్ కేడర్) ప్రకారం ఖాళీల వివరాలను సంబంధిత శాఖలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఇప్పటికే పంపినట్లు అధికారులు ప్రకటించారు. స్థానిక కేడర్ ఆధారంగా పోస్టుల పంపిణీ జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు కూడా గణనీయమైన పోస్టులు వచ్చే అవకాశాలున్నాయని నిరుద్యోగులు భావిస్తున్నారు. రిక్రూట్మెంట్ బోర్డుకు కీలక బాధ్యత.. స్థానిక కేడర్ వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, అర్హతల వివరాలను సంబంధిత శాఖలు అందించిన వెంటనే తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పూర్తి షెడ్యూల్తో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి నియామకంలో పోలీసు ఉద్యోగాలకు వేలాది మంది పోటీ పడుతుంటారు. ఈసారి కూడా భారీ సంఖ్యలో అభ్యర్థులు సిద్ధమవుతుండగా, పోలీసు శాఖలో కొలువుల జాతర ప్రారంభమైనట్టేనని నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక కేడర్లో ఎక్కువ పోస్టులు దక్కితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వందలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, ఖాకీ డ్రెస్ కల నెరవేరే అవకాశం ఉంది. భర్తీ చేయనున్న పోస్టులు ఇవే... ఎస్ఐ (సివిల్) 148 ఎస్ఐ (ఏఆర్) 14 రిజర్వ్ ఎస్ఐ (టీజీఎస్పీ) 12 ఎస్ఐ (ఎస్ఏఆర్ సీపీఎల్) 3 అసిస్టెంట్ ఎస్ఐ (ఎఫ్పీబీ) 23 కానిస్టేబుల్ (సివిల్) 3,697 కానిస్టేబుల్ (ఏఆర్) 1,052 కానిస్టేబుల్ (ఎస్ఏఆర్ సీపీఎల్) 24 కానిస్టేబుల్ (డ్రైవర్) 20 కానిస్టేబుల్ (మెకానిక్) 7 మొత్తం పోస్టులు 5,000ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2,138 పోస్టులు ఖాళీ త్వరలో నోటిఫికేషన్.. నిరుద్యోగుల్లో కొత్త ఆశలు కోచింగ్ సెంటర్లలో మొదలైన సందడికమిషనరేట్ / మంజూరైన పనిచేస్తున్న మొత్తం ఖాళీల జిల్లా పోస్టులు వారు ఖాళీలు శాతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ 8,828 7,181 1,647 18.66 మహబూబాబాద్ 2,132 1,983 149 6.99 ములుగు 1,562 1,375 187 11.97 జయశంకర్ భూపాలపల్లి 1,605 1,450 155 9.66 మొత్తం 14,127 11,989 2,138 15.13 -
ప్రజల్లో నమ్మకం కలిగించాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ● స్టేషన్ఘన్పూర్ పోలీసుస్టేషన్ సందర్శనస్టేషన్ఘన్పూర్: వివిధ సమస్యలపై పోలీస్స్టేషన్కు వచ్చే ప్రజలకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని, భరోసాను కలిగించేలా పోలీసులు పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. స్టేషన్ఘన్పూర్ పోలీస్స్టేషన్ను వరంగల్ సీపీ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు డీసీపీ రాజమహేంద్రనాయక్ స్వాగతం పలికారు. అనంతరం సీపీ పోలీస్స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకున్నారు. పోలీస్స్టేషన్ పరిధిలో తరచుగా అధిక సంఖ్యలో జరిగే నేరాలు, స్టేషన్పరిధిలోని గ్రామాలు, ప్రస్తుతం గ్రామాల్లో స్థితిగతులు, స్టేషన్ నిర్వహణ తదితర అంశాలను సీఐ జి.వేణును అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. రాత్రి సమయాల్లో వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. సీపీ వెంట డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ భీమ్శర్మ, సీఐ జి.వేణు, ఎస్ఐ మనీషా తదితరులున్నారు. -
గురువారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2026
జనగామ: జనగామ మున్సిపల్ పరిధిలో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద ప్రభుత్వం కల్పించిన 25 శాతం ఫీజు రాయితీ ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ గడువులోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి రాయితీని పొందాలని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది మే 1 నుంచి 25 శాతం రిబేట్ ప్రకటించినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో గడువును జూలై 31 వరకు పొడిగించింది. మూడు దశల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన మూడు దశల్లో జరుగుతుంది. మొదటి దశ (ఎల్–1)లో ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తారు. అనంతరం రెండో దశ (ఎల్–2)లో మరోసారి వివరాలను ధ్రువీకరించి ఆన్న్లైన్న్లో నమోదు చేస్తారు. చివరి దశ (ఎల్–3)లో అన్ని వివరాలు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత మున్సిపల్ కమిషనర్ తుది ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. పెద్ద ఎత్తున ప్రచారం 25 శాతం రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మున్సిపాలిటీ విస్తృత ప్రచారం చేపట్టింది. వార్డు స్థాయిలో సమాచారం అందించడంతో పాటు అర్హులైన వారిని నేరుగా సంప్రదిస్తూ దరఖాస్తులు పూర్తి చేయించే చర్యలు కొనసాగుతున్నా యి. గడువు ముగిసిన తర్వాత రాయితీ వర్తించకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అందువల్ల ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆర్థికంగా లబ్ధి పొందాలని మున్సిపాలిటీ సూచిస్తోంది. ఎల్ఆర్ఎస్కు దూరం మున్సిపల్ పరిధిలో ఎల్ఆర్ఎస్ పరిధిలోకి వచ్చిన 18,065 మందిలో ఇప్పటివరకు 13,607 మందికే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు సమాచారం అందించారు. మిగిలిన సుమారు 4,500 మంది ప్లాట్లు విక్రయించడం, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం, పూర్తి స్థాయి చిరునామాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో సమాచారం చేరడం లేదు. దీంతో వారిని గుర్తించి ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడానికి మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి పర్యవేక్షణలో పట్టణ ప్రణాళిక అధికారులు అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలిస్తూ లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నారు. 100 శాతం ఎల్ఆర్ఎస్ పూర్తి చేయడంతో పాటు మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యాచరణ కొనసాగుతోంది. చివరి అవకాశం సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు 18 వేల మందికి ఎల్ఆర్ఎస్ అవకాశం ఇంకా చాలామంది పెండింగ్ మున్సిపాలిటీ విస్తృత ప్రచారంఅంశం వివరాలు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు 18,065 సమాచారం అందుకున్నవారు 13,607 2020లో రూ.1,000 ఫీజు 2,945 చెల్లించినవారు 2020లో ప్రొసీడింగ్స్ 1,996 పొందినవారు 2020 తర్వాత ప్రొసీడింగ్స్ 49 పొందినవారు 25 శాతం రిబేట్ గడువు జూలై 31 ఎల్ఆర్ఎస్ పరిశీలన దశలు ఎల్–1, ఎల్–2, ఎల్–3 -
విద్యలో మనదే అగ్రస్థానం
జనగామ: దేశంలో పాఠశాల విద్యా నాణ్యతను మరింత మెరుగుపరిచే దిశగా కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్–డిస్ట్రిక్ట్ (పీజీఐ–డీ) 2025–26 నివేదిక ఫలితాలను వెల్లడించింది. జిల్లాల వారీగా విద్యా ప్రమాణాలు, బోధన నాణ్యత, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల హక్కులు, పాఠశాల భద్రత, డిజిటల్ లెర్నింగ్, పరిపాలన వంటి ఆరు ప్రధాన అంశాలను పరిశీలించి ఈ ర్యాంకింగ్ను రూపొందించారు. 2024–25లో 357 మార్కులతో రాష్ట్రంలో అగ్రస్థానంతో పాటు దేశ వ్యాప్తంగా 96వ ర్యాంకు సాధించిన జనగామ జిల్లా 2025–26లోనూ స్టేట్లో నంబర్వన్ పొజిషియన్ను నిలబెట్టుకుని, దేశ స్థాయిలో మరింత మెరుగైన ర్యాంకు దిశగా దూసుకెళ్లింది. విద్యా వ్యవస్థలో లోపాలను గుర్తించి, ఉత్తమ పద్ధతులను విస్తరించి, జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడమే ఈ నివేదిక ప్రధాన ఉద్దేశమని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. రాష్ట్రంలో జిల్లాదే తొలి స్థానం కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన జిల్లాల పనితీరు గ్రేడింగ్ సూచీ (పీజీఐ–డీ) జిల్లాల పనితీరు గ్రేడింగ్ సూచిక) 2025–26లో జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 383 మార్కులు సాధించిన జిల్లా స్టేట్లో నంబర్వన్గా నిలిచి ఉత్తమ్–3 గ్రేడ్ను దక్కించుకుంది. విద్యార్థుల అభ్యాస ఫలితాలు, తరగతి గది బోధన, మౌలిక సదుపాయాలు, డిజిటల్ విద్య, పాఠశాల పాలన వంటి కీలక విభాగాల్లో జిల్లా మెరుగైన పనితీరు కనబరిచింది. రాష్ట్రంలో వరుసగా రెండోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, దేశ వ్యాప్త ర్యాంకింగ్లో 64 స్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. విద్యాభివృద్ధికి నిదర్శనం జిల్లాలో విద్యా ప్రమాణాలు ఏడాదికేడాది మెరుగుపడుతున్నాయి. ఉన్నత విద్యా స్థాయిల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇస్తూ కార్పోరేట్ స్థాయి మౌలిక సదుపాయాలు, డిజిటల్ బోధన, ఆధునిక తరగతి గదులు, భద్రతా చర్యలు కల్పిస్తున్నాయి. ఈ చర్యలు విద్యార్థుల నైపు ణ్యాలను పెంపొందించి వారి ఉన్నత భవిష్యత్కు బలమైన పునాది వేస్తుండడంతో దేశంలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వస్తోంది. కేంద్ర విద్యాశాఖ పీజీఐ–డీ నివేదిక వెల్లడి జాతీయ స్థాయిలో 64, రాష్ట్రస్థాయిలో 1వ ర్యాంకు 383 మార్కులతో ఉత్తమ్–3 గ్రేడ్లో చోటుజిల్లా రాష్ట్ర మొత్తం గ్రేడ్ ర్యాంకు మార్కులుజనగామ 01 383 ఉత్తమ్–3 హనుమకొండ 7 334 ప్రచేస్త–1 వరంగల్ 15 323 ప్రచేస్త–2 భూపాలపల్లి 18 317 ప్రచేస్త–2 మహ–బాద్ 25 287 ప్రచేస్త–2 ములుగు 27 284 ప్రచేస్త–2 ఉత్తమ్ (అత్యుత్తమ పనితీరు) ప్రచేస్తా–1 (మంచి మెరుగైన తీరు) ప్రచేస్తా–2 (సగటు కంటే కొంత మెరుగైన స్థాయి) ప్రచేస్తా–3 (ఇంకా మెరుగుదల అవసరం) -
ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణజనగామ రూరల్: గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీలకు అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పనులను వేగ వంతంగా పూర్తి చేయాలన్నారు. తమ పరిధిలో ఉన్న సహజ వనరులు, స్థానిక ఆదాయ మార్గాలను గుర్తించి పంచాయతీ ఆదాయాన్ని పెంచుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని ఆదేశించారు. జీ రామ్ జీ పథకంలో భాగంగా జాబ్ కార్డు కలిగిన ప్రతీ గ్రామీణ పేద కుటుంబానికి 125 రోజుల పని దినాలు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ భాస్కర్, డీపీఓ వెంకట్ రెడ్డి, ఈజేఎస్ పీడీ సూరి, తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు వెన్నుదన్నుగా ప్రభుత్వం
● మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్యాదవ్ జనగామ: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తూ వెన్నుదన్నుగా నిలుస్తోందని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం ఆయన అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న టీజీ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కోసం అధికారులు ఏఎంసీ పరిధిలో స్థలం కోరిన నేపథ్యంలో, పత్తి యార్డులోని ఖాళీ స్థలం లేదా ఏఎంసీకి చెందిన ఇతర ఖాళీ ప్రదేశాన్ని వినియోగించుకోవచ్చని సమావేశంలో తీర్మానించారు. ఏఎంసీలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను సంబంధిత అధికారుల సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని, నూతన ఏఎంసీ కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ కార్యదర్శి శ్రీదేవి, డైరెక్టర్లు ఎండీ బాష్మియా, బొట్ల నర్సింగరావు, బానోత్ బన్సీ నాయక్, నీల మోహన్, తోటకూరి రమేశ్ యాదవ్, శీలం కొండల్రెడ్డి, పర్ష సిద్ధేశ్, నామాల శ్రీనివాస్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
సీపీని కలిసిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పాలకుర్తి టౌన్: వరంగల్ నూతన పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఎన్.శ్వేతారెడ్డిని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నియోజవర్గంలో శాంతభద్రతల పరిరక్షణ, ప్రజాసమస్యల పరిష్కారంలో పోలీసు శాఖ సహకారం కొనసాగాలని కోరారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని కమిషనర్ హామీ ఇచ్చారు.క్రైస్తవ సంక్షేమ పథకాలకు దరఖాస్తుల ఆహ్వానంజనగామ: తెలంగాణ క్రైస్తవ మైనారిటీల ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో అర్హులైన క్రైస్తవ మైనారిటీల నుంచి మూడు సంక్షేమ పథకాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మురళీధర్ మంగళవారం తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద కుట్టుమిషన్లు, చిన్న వ్యాపారాల ప్రారంభానికి రూ.50 వేల ఆర్థిక సహాయం, డ్రైవర్ సాధికారత కార్యక్రమం కింద రూ.1.50 లక్షల విలువైన ఈ–బైక్లు, ఈ–స్కూటీలు, పెట్రోల్ బైక్లు, స్కూటీల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. కుట్టుమిషన్లు, చిన్న వ్యాపార యూనిట్లకు 21 నుంచి 55 ఏళ్ల వయస్సు, డ్రైవర్ సాధికారత పథకానికి 21 నుంచి 50 ఏళ్ల వయస్సు గల క్రైస్తవ మైనారిటీ అభ్యర్థులు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు ఉండాలి. దరఖాస్తుల చివరి తేదీ ఈ నెల18 వరకు పూర్తి వివరాలు సమర్పించి, ఆన్లైన్ దరఖాస్తుల కోసం https//tgobmms. cgg.gov.in వెబ్సైట్లో సందర్శించాలని, సందేహాల నివృత్తి కోసం 040 –29801130, 040–23391067 నంబర్లను సంప్రదించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సూచించారు. పాఠశాలకు రూ.లక్ష విరాళంలింగాలఘణపురం: మండలంలోని కుందారం ప్రాథమిక పాఠశాలకు మంగళవారం ఎన్ఆర్ఐ గంగసాని రాజేశ్వర్రెడ్డి రూ.లక్ష విరాళం అందజేశారు. పాఠశాల అభివృద్ధితో పాటు విద్యావలంటీర్ ఏర్పాటుకు వినియోగించుకోవాలని సూచించారు. సర్పంచ్ కూకట్ల రాజు, హెచ్ఎం మంజుల, ఉన్నత పాఠశాల హెచ్ఎం రవీందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. డిజిటల్ విద్యకు ప్రాధాన్యమివ్వాలిలింగాలఘణపురం: పాఠశాలల్లో డిజిటల్ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. మంగళవారం మండలంలోని నేలపోగుల పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక వసతులు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యం, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనం, పరిసరాల పరిశుభ్రత, క్రీడలు, కంప్యూటర్ లాబ్ తదితర వాటిని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఫాస్ట్మ్యాథ్స్ పుస్తకాన్ని వినియోగిస్తూ ప్రాథమిక సూత్రాలతో పూర్తి అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యం పెరిగే విధంగా ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని కోరారు. ఎన్ఆర్ఐ లక్ష్మినారాయణ, హెడ్మాస్టర్ నవీన్కుమార్తో పాటు ఉపాధ్యాయులు ఉన్నారు. -
భారంగా ‘మధ్యాహ్న’ భోజనం
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలి. పెరిగిన ధలకు అనుగుణంగా విద్యార్థికి రోజుకు 30 రూపాయలు ఇవ్వాలి. లేకుంటే నిత్యావసరాలు, గ్యాస్ ప్రభుత్వమే అందించాలి. కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి. – రాపర్తి రాజు, జిల్లా అధ్యక్షుడు, సీఐటీయూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలంటే మార్కెట్ ధరలకు అనుగుణంగా చార్జీలు చెల్లించాలి. గుడ్డు ధర రూ.7నుంచి 8 వరకు ఎక్కువగా ఉంటోంది. ప్రభుత్వం ఇస్తున్న చార్జీలు సరిపడక మాపై భారం పడుతోంది. అప్పులు చేసి మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. – తాటికాయల రేణుక, భోజన కార్మికురాలు, జఫర్గఢ్జనగామ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలనే అధికారుల ఒత్తిడితో సతమతమవుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు లేకపోవడంతో అప్పులు చేసి భోజనం పెట్టాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరగడంతో చాలా పాఠశాలల్లో విద్యార్థులకు కోడిగుడ్డు వడ్డించడం లేదు. జిల్లావ్యాప్తంగా 504 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో సుమారుగా 30వేల వరకు విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే చార్జీలు పెంచాలని అలాగే కార్మికులకు వేతనాలు పెంచాలని కోరుతున్నారు. పెరిగిన గ్యాస్, గుడ్డు ధరలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే వంట కార్మికులకు ప్రతీ నెల రూ.3వేల చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని అధికారులు చెబుతున్న మార్కెట్ ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించడంలేదు. ఆరు నెలల్లో ఆరు సార్లు గ్యాస్ ధరలు పెరగంతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గత ఏడాది చార్జీలు స్వల్పంగా పెంచినా సరిపోవడం లేదు. ప్రభుత్వం గుడ్డుకు రూ.6 చెల్లిస్తుండగా, మార్కెట్లో గుడ్డు ధర రూ.7నుంచి 8 వరకు ఉంది. దీంతో కార్మికులపై భారం పడుతోంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.6.78 పైసలు 6 నుంచి 8వ తరగతి వరకు రూ.10.17, తొమ్మిది, పదో తరగతికి రూ.13.17పైసల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. కోడిగుడ్డుతో కలిసి రెండు కూరలు మెనూ ప్రకారం అందించాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.25 నుంచి రూ.30లు ఇస్తే మెనూ ప్రకారం వారానికి మూడు కోడిగుడ్లు, అన్ని రకాల కూరగాయలు, ఆకు కూరలతో భోజనం వడ్డించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. లేదంటే నిత్యా వసరాలు, వంట గ్యాస్ ప్రభుత్వమే సమకూర్చాలని కోరుతున్నారు. కొండెక్కిన గుడ్డు ధర అరకొర చార్జీలతో ఏజెన్సీ నిర్వాహకుల ఆవేదన మెనూ అందక విద్యార్థుల ఇబ్బందులు మార్కెట్ ధరలకు అనుగుణంగా చార్జీలు పెంచాలని డిమాండ్ -
గ్రామాల బలోపేతమే లక్ష్యం
జనగామ రూరల్: గ్రామ పంచాయతీలను ఆర్థికంగా, పరిపాలనాపరంగా మరింత బలోపేతం చేసి గ్రామాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ నుంచి 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, గ్రామస్థాయి అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ సందీప్కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై బుధవారం నుంచి మూడు రోజుల పాటు సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులకు సమగ్ర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వీబీ జీ రామ్ జీ చట్టంపై ప్రతీ సర్పంచ్, కార్యదర్శికి అవగాహన కల్పించాలన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాలు స్పష్టంగా నిర్వహించాలని సూచించారు. వీసీలో డీఆర్డీఓ భాస్కర్, డీపీఓ వెంకట్ రెడ్డి, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
జిల్లాకు దేవాదులే జీవనాడి
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ: జిల్లాకు దేవాదుల ప్రాజెక్టు నీరే జీవనాడి అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన జనగామ నియోజకవర్గంలో నెలకొన్న సాగునీటి పరిస్థితిపై మాట్లాడారు.. సమ్మక్క సారక్క ప్రాంతం నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఒక్క చుక్కనీటిని కూడా ఎత్తలేదని ఆరోపించారు. బొమ్మకూరు రిజర్వాయర్లో 198 టీఎంసీల సామర్థ్యానికి 58 టీఎంసీలు, గండిరామారంలో 400 ఎంసీఎఫ్టీలకు 1 88, కన్నెబోయిన రిజర్వాయర్లో 152.8 ఎంసీఎఫ్టీలకు 76.6, వెల్డండలో 150.42 ఎంసీఎఫ్టీలకు 49, తపాస్పల్లి రిజర్వాయర్లో 300 ఎంసీఎఫ్టీలకు 100ఎంసీఎఫ్టీలు మాత్రమే నీరు ఉందన్నారు. బచ్చన్నపేట, చేర్యాల తదితర ప్రాంతాలకు నీరు అందించే రిజర్వాయర్లలో కూడా తగినంత నీరు లేదని, రాష్ట్ర ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు నీటిని సమర్థవంతంగా వినియోగించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. దీనివల్ల జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో రిజర్వాయర్లు అడుగంటుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆమోదం..51అంశాలు
మాట్లాడుతున్న చైర్పర్సన్ బాలమణిశ్రీనివాస్మాట్లాడుతున్న కౌన్సిలర్ గునిగంటి వెన్నెల జనగామ: మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం పురపాలిక కార్యాలయ సమావేశం హాలులో చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. పట్టణ పరిధిలోని పలు వార్డుల అభివృద్ధి పనులు, ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై కౌన్సిల్ సభ్యులు 17శాఖల అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల మరణించిన విద్యుత్ లైన్మన్కు నివాళులర్పించారు. 43 ఎజెండా, 8 టేబుల్ మొత్తం 51 అంశాల కు ఆమోదం లభించింది. కోతుల బెడద నివారణ కోసం రూ.15 లక్షలు కేటాయించారు. వనమహోత్సవంలో 2.50లక్షల మొక్కల పెంపకం, పట్టణంలో విద్యుత్ దీపాల నిర్వహణ కోసం రూ.5 లక్షలు కేటాయింపు, వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్ట డం, ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు నిధులు కేటాయింపు, వీధి కుక్కలు, పందుల నివారణ చర్యలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. జంతు వధశాల నిర్వహణ కోసం రూ.5 లక్షలకు టెండర్లు పిలిచేందుకు ఆమోదం, పట్టణంలో 4 ప్రధాన రహదారులు, ఇతర ప్రాంతాల్లో వ్యాపారస్తులు, షాపుల నుంచి చెత్తను బహిరంగంగా వేయకుండా మున్సిపల్ వాహనాలకే ఇచ్చే విధంగా చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.500 నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధించాలని చైర్పర్సన్, కమిషనర్ ఆదేశించారు. కౌన్సిల్ కీలక చర్చ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పట్టణంలోని ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, బార్, రెస్టారెంట్ల నుంచి ఉత్పత్తయ్యే బల్క్ వేస్ట్ కోసం నెలకు ఒక్కొక్కరి నుంచి రూ.1000 నుంచి రూ.10,000 వరకు ఫీజు విధించేందుకు కౌన్సిల్లో చర్చించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్– 2026 ప్రకారం పట్టణంలోని 30 వార్డుల్లో ఏప్రిల్–1 నుంచి గృహ యజమానుల నుంచి చెత్త తీసుకునే ఆటోలకు యూజర్ఛార్జీలుగా నెలకు ఒక్కొక్క ఇంటికి రూ.100 వసూలు చేసేందుకు ఎజెండా తీసుకు రాగా, పలువురు కౌన్సిలర్లు అంగీకరించలేదు. సమస్యలు ఇలా.. 3వ వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి మాట్లాడుతూ కౌన్సిల్ ఆధునీకరణకు రూ.20 లక్షలకు బదులు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రూ.10 లక్షలతో పూర్తి చేయాలని సూచించారు. చెత్త సేకరణకు రూ.100 వసూలు చేయడం సాధ్యం కాదని, పేద ప్రాంతాలైన ధర్మకంచ, సంజయ్నగర్, గిర్నిగడ్డ, కురుమవాడ తదితర ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. 25వ వార్డు సభ్యులు పాముకుంట్ల ప్రసాద్గౌడ్ మాట్లాడుతూ.. తన వార్డులోని గాంధీ కమ్యూనిటీ హాల్, లైబ్రరీ పనులు అసంపూర్తిగా ఉన్నాయని, వాటి కోసం మూడు నెలల క్రితమే ఎస్టిమేషన్ వేసినప్పటికీ ఇంతవరకు ఎజెండా లో పెట్టకపోవడం సమంజసం కాదన్నారు. వడ్లకొండ ప్రభుత్వ సముదాయాల వద్ద బస్ షెల్టర్ కోసం లయన్స్ క్లబ్ నుంచి 50శాతం నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చారని, మిగతా 50శాతం నిధులు మున్సిపల్ కౌన్సిల్ సహకారం అందించాలన్నారు. నెహ్రూపార్కు, గాంధీ సెంటర్ వద్ద ట్రాఫిక్ రద్దీ నియంత్రించేందుకు సిగ్నల్ ఏర్పాటు చేయాలన్నారు. 9వ వార్డు కౌన్సిలర్ గునిగంటి వెన్నెలరామక్రిష్ణ మాట్లాడుతూ ప్రతి వార్డులో ఎస్ఐఆర్ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి బీఎల్ఓను అందుబాటులో ఉంచి పత్రాలు తప్పులు లేకుండా నింపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 26వ వార్డులో కోతులు, కుక్కలు, పందులతో ఇబ్బందులు పడుతున్నామని కౌన్సిలర్ సేవెల్లి మధు అన్నారు. సమావేశంలో కమిషనర్ రాజశేఖర్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సజావుగా మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం కోతుల బెడద నివారణకు రూ.15 లక్షలు 2.50లక్షల మొక్కలు నాటాలని నిర్ణయం -
జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యంపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరం
● ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఫిర్యాదు ● ఇరువర్గాల మధ్య కుదురుతోందనుకున్న సయోధ్యకు బ్రేక్ ● ఉమ్మడి వరంగల్ జిల్లా హస్తం పార్టీలో తెరపైకి మరోసారి వర్గపోరు సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ మంత్రి కొండా సురేఖ నేరుగా ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాసినట్లు మంగళవారం వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతోందనే సంకేతాలు కనిపించినప్పటికీ, తాజా పరిణామాలతో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సయోధ్య సంకేతాలు.. తాత్కాలికమే! ఇటీవల ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం, పరస్పరం విమర్శలు తగ్గించడం, పార్టీ కార్యక్రమాల్లో కలిసి పాల్గొనడం వంటి పరిణామాలతో విభేదాలు ముగిశాయనే ప్రచారం జరిగింది. కడియం శ్రీహరి ఇటీవల నిర్వహించిన ఓ ఫంక్షన్కు కొండా దంపతులు హాజరు కూడా అయ్యారు. దీంతో జిల్లా కాంగ్రెస్లో కూడా ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, తాజా లేఖ వ్యవహారంతో ఆ సయోధ్య తాత్కాలికమేనని తేలిపోయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నేతలుగా ఉన్న కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య మరోసారి విభేదాలు బయటపడడం పార్టీపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? ఇరువర్గాల మధ్య మరోసారి రాజీ ప్రయత్నాలు జరుగుతాయా? లేదా? అన్నది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తాజా వివాదానికి కారణాలివే.. కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంపై ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలో ఉమ్మడి వరంగల్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సమగ్ర మాస్టర్ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. జిల్లా వ్యవహారాల్లో ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రిని పక్కనబెట్టి కడియం శ్రీహరి అధికారులతో సమీక్షలు నిర్వహించడం, ఆదేశాలివ్వడం సరైన పద్ధతి కాదని ఆమె అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే కడియం శ్రీహరి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాసినట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించడం, ప్రభుత్వ పరి పాలనలో అనవసర జోక్యం చేసుకోవడం వంటి అంశాలను ఆమె లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. కాంగ్రెస్లో చేరిన తర్వాత నుంచే కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నియోజకవర్గాల పరిధి, పార్టీ వ్యవహారాలు, అధికారుల సమావేశాలు, రాజకీయ కార్యక్రమాల విషయంలో ఇద్దరూ పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఈ విభేదాలు రాష్ట్ర నాయకత్వం దృష్టికి వెళ్లడంతో పలుమార్లు సర్దుబాటు ప్రయత్నాలు జరిగాయి. -
ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తిచేయాలి
జనగామ రూరల్: ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత గడువుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు పూర్తయిందని, రేపటిలోగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. తప్పుడు సమాచారం అందిస్తే ఆర్పీ 31 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీసీలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ 97 శాతం పూర్తయ్యిందని, 11.38 శాతం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, ఆర్డీఓ గోపిరామ్, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి -
11న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
జనగామ రూరల్: ఈనెల 11వ తేదీన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు ఉంటాయని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి 14, 16, 18, 20 మెన్–ఉమెన్ విభాగాల్లో అథ్లెటిక్స్ ఎంపికలు స్థానిక మినీ స్టేడియం, ధర్మకంచలో జరుగుతాయని, ఎంపికైన క్రీడాకారులు 18న ఇందిరాగాంధీ స్టేడియం మెదక్లో జరిగే రాష్ట్ర స్థాయి మిడిల్ డిస్టెన్న్స్, లాంగ్ డిస్టెన్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లాస్థాయి ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు 11వ తేదీ ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మెమోతో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు గంగిశెట్టి మనోజ్ కుమార్ 9885046437, ఆవుల అశోక్ 9912453220, వంచ చంద్రశేఖర్ రెడ్డి 7799552233, తూడి రంజిత్ 99852 23047 నంబర్లలో సంప్రదించాలని కోరారు. డిగ్రీ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల జనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) రెండో సెమిస్టర్ ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బి.ఎన్.సురేఖ సోమవారం విడుదల చేశారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ..రెండో సంవత్సరంలో మొత్తం 289 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా ఇందులో 159 మంది ఉత్తీర్ణత సాధించారని, 130 మంది ఫెయిల్ అయ్యారని తెలిపారు. పరీక్షలకు సహకరించిన కాకతీయ విశ్వవిద్యాలయం కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాజేందర్ కట్ల, అడిషినల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరుమలాదేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు భవాని, వందన, నవీన రాణి, లక్ష్మీ అనురాధ, శ్రీదేవి, కళ్యాణి, అనగాని శ్రీనివాస్, నర్సింహులు, రవీందర్ నాయక్, రాజ్కుమార్, సంధ్యారాణి, ప్రశాంత్ పాల్గొన్నారు. కాగా, కళాశాల టాపర్స్గా శివరాత్రి పూజ 9.8, వల్లాల జాహ్నవి 9.8శాతం సాధించారు. బీఏలో మహ్మద్ అబ్దుల్ అజీమ్, సయ్యద్ సమీరా, బీకాంలో టి.షైనీ, వక్కల సాత్విక, లైఫ్సైన్స్లో భవాని, ప్రకాశ్, ఫిజికల్ సైన్స్లో శివరాత్రి పూజ, వల్లాల జాహ్నవి, టి.నివేదిత, సూరజ్ సింగ్, జడల నిఖిత, మహ్మద్ ఆఫ్రిన్ టాపర్లుగా నిలిచారు.ఆర్డీఓ గ్రీవెన్స్కు తొమ్మిది దరఖాస్తులు స్టేషన్ఘన్పూర్: కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమంలో సోమవారం తొమ్మిది దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆర్డీఓ కిరణ్ప్రకాష్ మాట్లాడుతూ.. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లు, భూసమస్యలపైనే దరఖాస్తులు వస్తున్నాయన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, సమస్యలుంటే నేరుగా గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. యాంటీ రేబీస్ టీకాలు వేయించాలి జనగామ రూరల్: పెంపుడు జంతువులకు యాంటీ రేబీస్ టీకాలు వేయించుకోవాలని జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ మురళీధర్ రావు అన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా జనగామ వెటర్నరీ ఆసుపత్రిలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో యాంటీ రేబీస్ టీకా శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా 45 పెంపుడు జంతువులకు యాంటీ రేబీస్ టీకాలు వేశారు. జూనోటిక్ వ్యాధులను గురించి వివరించి, రేబీస్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించేందుకు అవసరమైన టీకాలను అన్ని వెటర్నరీ సంస్థల్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు రణజిత్, దేవేందర్, రవిప్రసాద్ పాల్గొన్నారు. -
సుజలం..సురక్షితం
జనగామ: పట్టణ ప్రజలకు మున్సిపాలిటీ ద్వారా సరఫరా చేస్తున్న తాగునీరు నాణ్యత ప్రమాణాలకు పూర్తిగా అనుగుణంగా ఉందని తాజా ప్రయోగశాల పరీక్షల్లో క్లీన్చీట్ వచ్చింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి వెల్లడించారు. పట్టణ ప్రజలకు సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో మున్సిపాలిటీ నిరంతరం నీటి నాణ్యతను పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహించారు. రోజుకు కోటి 25 లక్షల లీటర్లు.. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 13,806 నల్లా కనెక్షన్లు ఉండగా, చీటకోడూరు ఫిల్టర్ బెడ్ ద్వారా రోజుకు ోటి 15 లక్షల లీటర్లు, మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా మరో 10 లక్షల లీటర్లు కలిపి రోజుకు కోటి 25 లక్షల లీటర్ల నీటిని పట్టణ ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన నీటి నాణ్యత పరీక్షల్లో అన్ని నమూనాలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పట్టణంలో మున్సిపాలిటీ సరఫరా చేసే నీటిని తాగేందుకు చాలామంది ప్రజలు ఆసక్తి చూపకుండా, ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని కొనుగోలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. పట్టణంలో 100కు పైగా నిబంధనలకు విరుద్ధంగా వాటర్ ప్లాంట్లు నడుస్తున్నాయని, వాటి నుంచి సరఫరా అయ్యే నీటిలో అవసరమైన ఖనిజ లవణాలు (మినరల్స్) తగిన మోతాదులో లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాణాలకు అనుగుణంగా.. పట్టణంలో పురపాలిక ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటి నాణ్యతపై నిర్వహించిన తాజా ప్రయోగశాల పరీక్షల్లో అన్ని నీటి నమూనాలు భారతీయ ప్రమాణాల బ్యూరో (ఐఎస్ 10500–2012) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు తేలింది. జిల్లా నీటి నాణ్యత పర్యవేక్షణ ప్రయోగశాల ఈ పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షల కోసం 2026 జూన్ 15న నీటి నమూనాలను సేకరించి ల్యాబ్లో టెస్ట్ చేయించారు. పట్టణంలోని ధర్మకంచ, చమన్, ఆర్డీఓకార్యాలయం, సాయినగర్, హౌసింగ్ బోర్డు, ఈ–సేవ కేంద్రం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వీవర్స్ కాలనీతో పాటు డ్యాం ముడి నీటి నమూనాను కూడా పరీక్షించారు. నివేదిక ఇలా.. నివేదిక ప్రకారం నీటి ఆమ్ల–క్షార స్థాయి 7.86 నుంచి 8.06 మధ్య నమోదు కాగా, డ్యాం ముడి నీటిలో 8.70గా నమోదైంది. మసకదనం 0.1 నుంచి 0.3 మధ్య ఉండి, అనుమతించిన పరిమితిలోనే ఉంది. నీటిలో మొత్తం కరిగిన ఘన పదార్థాలు 304 నుంచి 329 మిల్లీగ్రాములు ప్రతీ లీటరుకు, మొత్తం క్షారత్వం 32 నుంచి 44 మిల్లీగ్రాములు, మొత్తం కాఠిన్యం 120 నుంచి 165 మిల్లీ గ్రాములు, క్లోరైడ్ 85 నుంచి 113 మిల్లీ గ్రాములు, ఫ్లోరైడ్ 0.43 నుంచి 0.68 మిల్లీ గ్రాములు, నైట్రేట్ 4.1 నుంచి 6.2 మిల్లీ గ్రాములు, సల్ఫేట్ 10.45 నుంచి 13.61 మిల్లీ గ్రాములు, ఇనుము 0.05 నుంచి 0.09 మిల్లీ గ్రాముల మధ్య నమోదయ్యాయి. ఇవన్నీ భారతీయ ప్రమాణాల బ్యూరో గరిష్ఠ పరిమితుల కంటే తక్కువగా ఉన్నట్లు కమిషనర్ వెల్లడించారు. మున్సిపల్ నీళ్లు నిర్భయంగా తాగొచ్చు గత నెలలో నీటి నాణ్యత పరీక్షలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణమే: ల్యాబ్ టెస్ట్ నివేదిక అవగాహన కల్పిస్తున్న మున్సిపల్ అధికారులు -
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
● పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత హన్మకొండ చౌరస్తా: పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదుపై తక్షణమే స్పందించి ప్రజలకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అధికారులను ఆదేశించారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమవారం ఆమె మొదటిసారిగా హనుమకొండ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. పోలీస్ స్టేషన్కు చేరుకున్న కమిషనర్ ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను తనిఖీ చేసి, వాటి స్వాధీనానికి కారణాలు, కేసుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసుల నమోదులు, ఇతర పరిపాలన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది వివరాలు తెలుసుకుని, వారి విధి నిర్వహణపై ఆరా తీశారు. ఈసందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. పోలీసులు ప్రజల సేవకులనే భావనతో విధులు నిర్వహించాల్సిన బాధ్యత ఉందన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అందిన ప్రతీ ఫిర్యాదును వెంటనే నమోదు చేసి రశీదు అందజేయాలని సూచించారు. సీపీ శ్వేత వెంట సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, ఏసీపీ లు నర్సింహరావు, సత్యనారాయణ, హనుమకొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
విద్యాప్రమాణాల్లో కలెక్టర్ వినూత్న కార్యాచరణ ప్రభుత్వ పాఠశాలలకు అకడమిక్ ఎక్సలెన్ ్స బ్లూప్రింట్
జనగామ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడంతో పాటు బోధన, మూల్యాంకన విధానాలను ఏకరీతిలో అమలు చేసే దిశగా జిల్లా పరిపాలన కీలక అడుగు వేసింది. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ–2020) లక్ష్యాలకు అనుగుణంగా 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లా అకడమిక్ ఎక్సలెన్స్ ఇనిషియేటివ్ పేరుతో సమగ్ర కార్యాచరణ రూపొందించింది. కలెక్టర్, విద్యాశాఖ అధికారి సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు అవసరమైన అకడమిక్, మూల్యాంకన వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. సామర్థ్య ఆధారిత బోధనకు ప్రాధాన్యం సాంప్రదాయ బోధనకు భిన్నంగా ఉపాధ్యాయుడు ఏమి బోధించాడు.. అనే విధానం నుంచి విద్యార్థి ఏమి నేర్చుకున్నాడు.. అనే అభ్యాస ఫలితాల ఆధారిత విధానానికి ప్రాధాన్యం ఇచ్చారు. నెలవారీ బోధన ప్రణాళికలు, కాన్సెప్ట్ మ్యాప్స్, ప్రయోగశాల కార్యకలాపాలు, ప్రాజెక్టులు, అంచనా, పరిశీలన, వివరణ వంటి ఆధునిక బోధనా పద్ధతులను ఉపాధ్యాయులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఏకరీతి మూల్యాంకన విధానం జిల్లా అసెస్మెంట్ టూల్కిట్ ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సామర్థ్య ఆధారిత ప్రశ్నపత్రాలు, బ్లూప్రింట్లు, రూబ్రిక్స్, స్లిప్ టెస్టులు, యూనిట్ టెస్టులు, నమూనా ప్రశ్నపత్రాలు, ప్రోగ్రెస్ కార్డులు, రిమిడియల్ బోధన వంటి అంశాలతో ఏకరీతి మూల్యాంకన విధానాన్ని అమలు చేయనున్నారు. టీచర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు ప్రతీ పాఠాన్ని నిజజీవిత అనుభవాలతో అనుసంధానం చేయడం, కార్యకలాపాల ఆధారిత బోధన నిర్వహించడం, పరీక్షల అనంతరం రిమిడియల్ తరగతులు చేపట్టడం వంటి అంశాలపై ఉపాధ్యాయులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించారు. ప్రధానోపాధ్యాయులు తరగతి గది పరిశీలనలు, నెలవారీ సమీక్షలు, ప్రయోగశాలల వినియోగం, మూల్యాంకన విశ్లేషణపై దృష్టి సారించనున్నారు. దశలవారీ అమలు.. ఈ కార్యక్రమాన్ని మూడు దశల్లో అమలు చేయనున్నారు. మొదటి దశలో అవగాహన కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయగా, రెండో దశలో బోధన, పరీక్షలు, రిమిడియల్ బోధన కొనసాగుతుంది. మూడో దశలో పర్యవేక్షణ, సమీక్షలు నిర్వహిస్తారు. 2027 ఫిబ్రవరి 28 నాటికి వంద శాతం సిలబస్ పూర్తి చేయడం, ఎఫ్ఏ–ఎస్ఏ మూల్యాంకనాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సామర్థ్య ఆధారిత బోధనను స్థిరీకరించి విద్యార్థుల అభ్యాస ఫలితాలను గణనీయంగా మెరుగుపరచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతాం విద్యార్థులు పాఠాలను కేవలం కంఠస్థం చేయడం కాకుండా, వాటిని అర్థం చేసుకుని నిజజీవితంలో ఉపయోగించే స్థాయికి చేరుకోవాలి. అదే లక్ష్యంతో జిల్లా అకాడమిక్ ఎక్సలెన్స్ ఇనిషియేటివ్ను రూపొందించాం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 2027 ఫిబ్రవరి నాటికి వంద శాతం సిలబస్ పూర్తిచేయడంతో పాటు, విద్యార్థుల అభ్యాస ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల సాధించడమే మా లక్ష్యం. జిల్లాను విద్యా ప్రమాణాల్లో రాష్ట్రానికే ఆదర్శ తీర్చిదిద్దుతాం. – సందీప్ కుమార్ ఝా, కలెక్టర్ ప్రతీ విద్యార్థి అభ్యసన పురోగతిపై ప్రత్యేక దృష్టి 2027 ఫిబ్రవరి నాటికి 100 శాతం సిలబస్ పూర్తి లక్ష్యం మూడు కీలక మార్గదర్శక పత్రాల రూపకల్పనజిల్లా అకాడమిక్–అసెస్మెంట్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్, జిల్లా అకడమిక్ ఫ్రేమ్ వర్క్, జిల్లా అసెస్మెంట్ టూల్కిట్ అనే మూడు సమగ్ర మార్గదర్శక పత్రాలను రూపొందించారు. వీటి ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, అభ్యాసం, మూల్యాంకనం, పర్యవేక్షణ వ్యవస్థలను ఒకే విధానంలో అమలు చేయనున్నారు. విద్యార్థుల్లో భావనాత్మక అవగాహన, సమస్య పరిష్కార నైపుణ్యాలు, శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. -
పలు చేనేత సొసైటీలు ఏకగ్రీవం
స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ చేనేత పారిశ్రామిక సహకార, విక్రయ సంఘం ఎన్నిక ఏకగ్రీవమైంది. సోమవారం నామినేషన్ల పరిశీలన కాగా అధ్యక్షుడితో పాటు డైరెక్టర్లు తొమ్మిది మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం అధ్యక్షుడిగా శివునిపల్లికి చెందిన గుండు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడిగా శివునిపల్లికి చెందిన బిట్ల రంగయ్య, కార్యదర్శిగా ఎక్కలదేవి ఉప్పలయ్య, డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బచ్చన్నపేటలో రెండు.. బచ్చన్నపేట : మండల కేంద్రంలోని శ్రీ సిద్దేశ్వర స్వామి సిల్క్ వీవర్స్ కోపరేటివ్ సొసైటీ, మార్కండేయ హెచ్డబ్ల్యూ సీఎస్ లిమిటెడ్ సొసైటీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు మహేశ్వరం స్వర్ణలత, సీహెచ్. గంగాధర్ తెలిపారు. కంచనపల్లి చేనేత సంఘం.. రఘునాథపల్లి: మండలంలోని కంచనపల్లి చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా రాపోలు ఈశ్వరయ్య, ఉపాధ్యక్షుడిగా అమృతం చంద్రయ్య, కార్యదర్శిగా శ్రీపతి కుమారస్వామి, డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీ శ్రీనివాస పవర్లూమ్ వీవర్స్.. కొడకండ్ల: మండలంలోని శ్రీ శ్రీనివాస పవర్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ ప్రొడక్షన్ సెల్స్ సహకార సంఘం ఎన్నిక ఏకగ్రీవమైంది. కొత్తపల్లి సొసైటీ డైరెక్టర్లు.. లింగాలఘణపురం: మండలంలోని కొత్తపల్లి చేనేత సహకారం సంఘం సొసైటీలోని 9 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి కోర్నేలియస్ ప్రకటించారు. డైరెక్టర్ల ఎన్నిక ఏకగ్రీవం పాలకుర్తి టౌన్ (దేవరుప్పుల): మండలంలోని సీతారాంపురంలో శ్రీ ఉమా చంద్రమౌళీశ్వర చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం లిమిటెడ్ నూతన కార్యవర్గ డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఎన్నికల అధికారి పోలంపల్లి వినోద్ తెలిపారు. -
‘ఎస్ఐఆర్’ను బాధ్యతగా చేపట్టాలి
● అడిషనల్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని బీఎల్ఓలు బాధ్యతగా చేపట్టాలని అడిషనల్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. ఎస్ఐఆర్ 2026లో భాగంగా చేపడుతున్న పనులను ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 118వ పోలింగ్స్టేషన్ను శనివారం ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ బీఎల్ఓలు ఎన్యుమరేషన్ ఫారాలను ఎలా నింపుతున్నారు, డిజిటలైజేషన్ ప్రక్రియ ఏవిధంగా జరుగుతుందో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఎల్ఓలు అప్రమత్తంగా, బాధ్యతగా పనిచేయాలని, ప్రతీ ఇంటికి ఎన్యుమరేషన్ ఫారాలు అందించాలన్నారు. బీఎల్ఓల పనితీరుపై సూపర్వైజర్లు, మండలస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. ఆయన వెంట స్టేషన్ఘన్పూర్ ఆర్డీఓ కిరణ్ ప్రకాష్, తహసీల్దార్ స్వప్న, ఎన్నికల నాయబ్ తహసీల్దార్ సదానందం, ఎంఆర్ఐ శ్రీకాంత్, మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పుట్టిన జిల్లాలో పనిచేసే అవకాశం లభించడం గర్వకారణమన్నారు. అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ మాట్లాడుతూ యువత దొడ్డి కొమురయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యులు చిలువేరు అభిగౌడ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహ రావు, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, వైటీడీఏ సభ్యులు లక్ష్మి నారాయణ నాయక్, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, కంచె రాములు, మల్లేశం, జూకంటి శ్రీశైలం, కానుగంటి ముత్తయ్య, బాలరాజు, ఎదునూరి మాదార్, వెంకట మల్లయ్య పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలి జనగామ రూరల్: పంట మార్పిడి విధానాలు, ఆయిల్ పామ్ పంటల సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి సీఎస్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2026–27 సంవత్సరానికి 85 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించామన్నారు. దీనికి అనుగుణంగా జిల్లాలోని అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు రైతులకు అందించాలన్నారు. ఎరువులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీసీ హాల్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీఏఓ అంబికా సోనీ, సీపీఓ చినకోట్యా నాయక్, మిషన్ భగీరథ ఈఈ శ్రీకాంత్, అధికారులు పాల్గొన్నారు. -
ముగిసిన ‘చేనేత’ నామినేషన్లు
జనగామ: జిల్లాలో చేనేత సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం నామినేషన్ల పర్వం ముగిసింది. 12 సహకార సంఘాల పరిధిలో స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో ఈ నెల 2వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ జరిగింది. నేడు (ఆదివారం) నామినేషన్ల పరిశీలన, 6న ఉపసంహరణ, అదే రోజు తుది అభ్యర్థుల జాబితా విడుదలతో పాటు ఎన్నికల గుర్తుల కేటాయింపు చేపట్టనున్నారు. అనంతరం 10వ తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. ఒక్కో సొసైటీలో చైర్మన్, వైస్ చైర్మన్తో కలుపుకుని 9 మందితో కూడిన పాలక మండలి ఉంటుంది. ఇందులో ఇద్దరు మహిళలకు రిజర్వు చేశారు. నేటి నామినేషన్ల పరిశీలన తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది. బచ్చన్నపేట సిద్ధేశ్వర, స్టేషన్ఘన్పూర్ హెచ్డబ్ల్యూసీఎస్, కొడకండ్ల శ్రీనివాస పవర్లూం, నీర్మాల శ్రీ భావనారుషి హెచ్డబ్ల్యూసీఎస్ సొసైటీలు ఏకగ్రీవం కాగా, 8 సొసైటీల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. ఐదు సొసైటీల పరిధిలో మహిళలు ఏకగ్రీవమయ్యారు. ఏకగ్రీవాలు..ఎన్నికలు జనగామ (వీవర్స్ కాలనీ) భారత్ టీసీ జెడ్బీహెచ్డబ్ల్యూసీఎస్ సొసైటీ–27 నామినేషన్లు రాగా ఎన్నికలు అనివార్యం. జనగామ (సంజయ్నగర్) ప్రాజె క్టు హెచ్డబ్ల్యూసీఎస్ సొసైటీ–19 నామినేష న్లు రాగా మహిళా స్థానాలకు ఇద్దరు మాత్రమే నామినేషన్ వేయడంతో వారు ఏకగ్రీవమయ్యారు. పురుషులకు ఎలక్షన్లు నిర్వహించనున్నారు. బచ్చన్నపేట మండలం మార్కండేయ హెచ్డబ్ల్యూసీఎస్ సొసైటీలో మహిళా స్థానాలు ఏకగ్రీవం, పురుషులకు ఎలక్షన్లు, శ్రీ సిద్ధేశ్వర సిల్క్ డబ్ల్యూసీఎస్ సొసైటీ–9 నామినేషన్లు, పాలకవర్గం ఏకగ్రీవమయ్యారు. పాలకుర్తి మండలం గూడూరు హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ సొసైటీ–16 నామినేషన్లు రాగా ఎన్నికలు నిర్వహించనున్నారు. స్టేషన్ఘన్పూర్ హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ సొసైటీ–9 నామినేషన్లు, పాలకవర్గం ఏకగ్రీవం. లింగాలఘణపురం మండలం కొత్తపల్లి శ్రీ వెంకటేశ్వర హెచ్డబ్ల్యూసీఎస్ సొసైటీలో మహిళా స్థానాలు ఏకగ్రీవం, పురుషులకు ఎలక్షన్లు. దేవరుప్పుల మండలం సీతారాంపురం శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర హెచ్డబ్ల్యూసీఎస్ సొసైటీలో 16 నామినేషన్లు, ఎన్నికలు అనివార్యం కాగా నీర్మాల శ్రీ భావనరుషి హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ సొసైటీలో 9 నామినేషన్లు, పాలకవర్గం ఏకగ్రీవమయ్యారు. రఘునాథపల్లి మండలం కంచనపల్లి శత్రంజి హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ సొసైటీలో మహిళా స్థానాలు ఏకగ్రీవం, పురుషులకు ఎలక్షన్లు. జనగామ మండలం ఎల్లంల శ్రీ పద్మవంశీ జీహెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ సొసైటీలో మహిళా స్థానాలు ఏకగ్రీవం, పురుషులకు ఎలక్షన్లు. కొడకండ్ల మండలం శ్రీ శ్రీనివాస పవర్లూమ్ డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ సొసైటీలో 9 నామినేషన్లు రాగా పాలకవర్గం ఏకగ్రీవమయ్యారు. మొత్తం 163 నామినేషన్లు రాక నాలుగు ఏకగ్రీవం, ఐదు సొసైటీల్లో మహిళలు కూడా.. 8 సొసైటీల్లో ఎన్నికలు నేడు పరిశీలన, అనంతరం అధికారిక ప్రకటన -
వాహన కండీషన్ తప్పనిసరి
బచ్చన్నపేట: వాహనంతో పా టు అంబులెన్స్లోని పరికరాల ను వర్కింగ్ కండీషన్లో ఉంచుకోవాలని 108 జిల్లా మేనేజర్ రాము అన్నారు. శనివారం బచ్చన్నపేట ఆస్పత్రిలోని అంబులెన్స్ను ఆకస్మికంగా తనిఖీ ని ర్వహించి అంబులెన్స్లోని అత్యవసర మందులు, వాటి కాల పరిమితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్టీ చాన ల్ మానిటర్, బీపీ ఆపరేటర్, డిజిటల్ పెర్మామీటర్ సెక్షన్ ఆపరేటర్, పల్స్ ఆక్సి మీటర్ల ప్రాముఖ్యత చాలా ఉంటుందన్నారు. విషపూరిత పాములు, తేలు కరిచినప్పుడు దగ్గరలో ఉ న్న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రజల ప్రా ణానికి ప్రమాదం లేకుండా జాగ్రత్త వహించా లన్నారు. ఈఎంటీ భాస్కర్, పైలట్ సాయికుమార్, జంగిలి శిరీష, తదితరులు ఉన్నారు. యువతకు స్వయం ఉపాధికి అవకాశాలు జనగామ రూరల్: తెలంగాణ క్రైస్తవ, మైనార్టీల ఆర్థిక సంస్థ నుంచి అందించే ఆర్థికసాయానికి అర్హులైన క్రైస్తవులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ అధికారి విక్రమ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కుట్టు మిషన్, చిన్న తరహా వ్యాపార యూనిట్ల కోసం 21 నుంచి 55 ఏళ్ల వయస్సులోపు వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల వారికి రూ.2లక్షలు, గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50లక్షల లోపు ఉండాలన్నారు. ఆసక్తిగల వారు ఈనెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 040–29801130 నంబర్లో సంప్రదించాలని కోరారు. ఇంటర్లో స్పాట్ అడ్మిషన్లకు అవకాశంజనగామ రూరల్: జిల్లాలోని తెలంగాణ గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించిన మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి కె.శారద, డీసీఓ పి. శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత మార్చిలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు ఎస్సెస్సీ మెమోతో పాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు. రేపు (సోమవారం) ఉదయం 9 నుంచి 1 గంట వరకు జిల్లాలోని గురుకుల బాలుర కళాశాలలో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రిల్స్లో ఇరుక్కుపోయిన మహిళ కాలు జనగామ: జనగామ ఆర్డీఓ కార్యాలయం ప్రధాన గేట్ వద్ద ఉన్న ఇనుప గ్రిల్స్లో ఓ మహిళ కాలు ఇరుక్కుపోయింది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ ఉప్పల్కు చెందిన ఎడ్ల రమ్యశ్రీనాథ్ కోర్టు సంబంధిత పనుల కోసం శనివారం ఆర్డీఓ కార్యాలయానికి వచ్చారు. పని ముగించుకుని బయటకు వస్తుండగా ప్రధాన గేట్ వద్ద ఏర్పాటు చేసిన గ్రిల్స్లో ఆమె కాలు ఇరుక్కుపోయింది. దీంతో సమాచారం అందుకున్న స్థానికులు కట్టర మిషన్ సహాయంతో ఇనుప రాడ్డును తొలగించి మహిళ కాలును సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనతో ఆర్డీఓ కార్యాలయం వద్ద కొంతసేపు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తగిన భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించాలి స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించేలా అ ధ్యాపకులు కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్ తెలిపారు. శనివా రం ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. కళాశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించి కళాశాలల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధిస్తేనే గుర్తింపు లభిస్తుందన్నారు. ఆయన వెంట కౌన్సిలర్లు పొన్న రవి, గుర్రం హరినాఽథ్, నాయకులు గట్టు రమేష్, పెసరు సారయ్య, రాజు తదితరులున్నారు. -
రైతు బాంధవుడు సీఎం రేవంత్రెడ్డి
● డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి జనగామ: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి అన్నారు. రైతు భరోసా నిధులను విడుదల చేసిన సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో సీఎం రేవంత్రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో రైతు భరోసా నిధులను విడుదల చేయడం రైతా ంగంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. సీఎం రాజకీయ ప్రస్థానం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు, వైటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి, నాయకులు, కౌన్సిలర్లు ఎర్రమల్ల సుధాకర్, కంచె రాములు, కొత్త కరుణాకర్ రెడ్డి, నూకల బాల్ రెడ్డి, నిమ్మతి మహేందర్రెడ్డి, అభిగౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
గుడిసెలు లేని గ్రామాలే లక్ష్యం
● గృహ నిర్మాణ శాఖ సీఈ చైతన్యకుమార్ స్టేషన్ఘన్పూర్: రాష్ట్రంలో గుడిసెలు లేని గ్రామాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం, గృహ నిర్మాణ శాఖ పని చేస్తుందని హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ చైతన్యకుమార్ అన్నారు. ఘన్పూర్ పట్టణ కేంద్రంతో పాటు శివునిపల్లి, ఇందిరానగర్ తదిత ర ప్రాంతాల్లో గృహ నిర్మాణ శాఖ సీఈ శనివారం ప ర్యటించి గుడిసెలను సందర్శించారు. ఈ సందర్భంగా గుడిసెల్లో నివాసం ఉంటున్న వారితో ‘మీ కు స్వంత ఇంటి స్థలం ఉందా, ఇళ్లు మంజూరీ చేస్తే నిర్మాణం చేసుకుంటారా’? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులనే ఎంపిక చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరీ అవుతున్నాయన్నారు. ఆయన వెంట పీడీ మాతృనాయక్, డీఈ చంద్రశేఖర్, ఏఈ అఖిల, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, కౌన్సిలర్లు పొన్న రవి, పెసరు సారయ్య, అనూషరాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
వాహన కండీషన్ తప్పనిసరి
బచ్చన్నపేట: వాహనంతో పా టు అంబులెన్స్లోని పరికరాల ను వర్కింగ్ కండీషన్లో ఉంచుకోవాలని 108 జిల్లా మేనేజర్ రాము అన్నారు. శనివారం బచ్చన్నపేట ఆస్పత్రిలోని అంబులెన్స్ను ఆకస్మికంగా తనిఖీ ని ర్వహించి అంబులెన్స్లోని అత్యవసర మందులు, వాటి కాల పరిమితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్టీ చాన ల్ మానిటర్, బీపీ ఆపరేటర్, డిజిటల్ పెర్మామీటర్ సెక్షన్ ఆపరేటర్, పల్స్ ఆక్సి మీటర్ల ప్రాముఖ్యత చాలా ఉంటుందన్నారు. విషపూరిత పాములు, తేలు కరిచినప్పుడు దగ్గరలో ఉ న్న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రజల ప్రా ణానికి ప్రమాదం లేకుండా జాగ్రత్త వహించా లన్నారు. ఈఎంటీ భాస్కర్, పైలట్ సాయికుమార్, జంగిలి శిరీష, తదితరులు ఉన్నారు. యువతకు స్వయం ఉపాధికి అవకాశాలు జనగామ రూరల్: తెలంగాణ క్రైస్తవ, మైనార్టీల ఆర్థిక సంస్థ నుంచి అందించే ఆర్థికసాయానికి అర్హులైన క్రైస్తవులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ అధికారి విక్రమ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కుట్టు మిషన్, చిన్న తరహా వ్యాపార యూనిట్ల కోసం 21 నుంచి 55 ఏళ్ల వయస్సులోపు వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల వారికి రూ.2లక్షలు, గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50లక్షల లోపు ఉండాలన్నారు. ఆసక్తిగల వారు ఈనెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 040–29801130 నంబర్లో సంప్రదించాలని కోరారు. ఇంటర్లో స్పాట్ అడ్మిషన్లకు అవకాశంజనగామ రూరల్: జిల్లాలోని తెలంగాణ గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించిన మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి కె.శారద, డీసీఓ పి. శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత మార్చిలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు ఎస్సెస్సీ మెమోతో పాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు. రేపు (సోమవారం) ఉదయం 9 నుంచి 1 గంట వరకు జిల్లాలోని గురుకుల బాలుర కళాశాలలో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రిల్స్లో ఇరుక్కుపోయిన మహిళ కాలు జనగామ: జనగామ ఆర్డీఓ కార్యాలయం ప్రధాన గేట్ వద్ద ఉన్న ఇనుప గ్రిల్స్లో ఓ మహిళ కాలు ఇరుక్కుపోయింది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ ఉప్పల్కు చెందిన ఎడ్ల రమ్యశ్రీనాథ్ కోర్టు సంబంధిత పనుల కోసం శనివారం ఆర్డీఓ కార్యాలయానికి వచ్చారు. పని ముగించుకుని బయటకు వస్తుండగా ప్రధాన గేట్ వద్ద ఏర్పాటు చేసిన గ్రిల్స్లో ఆమె కాలు ఇరుక్కుపోయింది. దీంతో సమాచారం అందుకున్న స్థానికులు కట్టర మిషన్ సహాయంతో ఇనుప రాడ్డును తొలగించి మహిళ కాలును సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనతో ఆర్డీఓ కార్యాలయం వద్ద కొంతసేపు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తగిన భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించాలి స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించేలా అ ధ్యాపకులు కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్ తెలిపారు. శనివా రం ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. కళాశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించి కళాశాలల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధిస్తేనే గుర్తింపు లభిస్తుందన్నారు. ఆయన వెంట కౌన్సిలర్లు పొన్న రవి, గుర్రం హరినాఽథ్, నాయకులు గట్టు రమేష్, పెసరు సారయ్య, రాజు తదితరులున్నారు. -
నేడు కన్నెపల్లికి కేటీఆర్
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన లక్ష్మీపంప్హౌస్(కన్నెపల్లి)ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు (ఆదివారం) సందర్శించనున్నారు. ఉదయం 8గంటలకు హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరుతారు. వరంగల్, పరకాల, భూపాలపల్లి, కాటారం మీదుగా మహదేవపూర్ మండలం కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లికి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేరుకుంటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనవెంట పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు రానున్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, మేడిగడ్డ బరాజ్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కన్నెపల్లి వద్ద గోదావరికి అడ్డంగా కట్ట నిర్మాణం చేసి నీటిని నిలిపి పంపులు ద్వారా ఎత్తిపోయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ బృందంతో కలిసి కేటీఆర్ టూర్ ప్లాన్ చేసినట్లు చేశారని పార్టీనాయకులు పేర్కొంటున్నారు. కాగా, శనివారం కన్నెపల్లి పంపుహౌస్, పరిసరాలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సందర్శించి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. పెంబర్తిలో ఘన స్వాగతం జనగామ: కన్నెపల్లిలో నిర్వహించే సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు జనగామ మండలం పెంబర్తి వద్ద ఘన స్వాగతం పలకనున్నట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9.30 గంటలకు పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెంబర్తి గ్రామానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఆయనతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మీపంప్హౌస్ పంపులు లిఫ్ట్ చేయాలనే లక్ష్యంతో పర్యటన -
ఒకే దరఖాస్తు.. బహుళ కనెక్షన్లు
జనగామ: విద్యుత్ వినియోగదారులకు మరింత వేగవంతమైన, సులభమైన, పారదర్శక సేవలను అందించేందుకు టీజీఎన్పీడీసీఎల్ ‘బల్క్/మల్టిపుల్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్’ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్లకు అవసరమైన బహుళ విద్యుత్ కనెక్షన్లను ఒకే దరఖాస్తుతో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఇప్పటివరకు ప్రతీ విద్యుత్ కనెక్షన్కు విడివిడిగా దరఖాస్తు చేయాల్సి ఉండగా, కొత్త విధానంలో ఒకే దరఖాస్తుతో అన్ని కనెక్షన్ల ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో బిల్డర్లు, డెవలపర్లు, భవన యజమానులు, వాణిజ్య సముదాయాల నిర్వాహకులు తక్కువ సమయంలోనే విద్యుత్ కనెక్షన్లు పొందే వీలుంటుంది. కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో పాటు, దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే సౌకర్యం కూడా కల్పించారు. అపార్ట్మెంట్లు, మల్టీ స్టోర్డ్ భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్లకు అవసరమైన ఎల్టీ కేటగిరీ–1, కేటగిరీ–2 విద్యుత్ కనెక్షన్లకు ఈ విధానం వర్తిస్తుంది. మొత్తం కాంట్రాక్ట్ లోడ్ ఆధారంగా చార్జీలు నిర్ణయించబడతాయి. 20 కిలోవాట్ల వరకు డెవలప్మెంట్ చార్జీలు, సర్వీస్ లైన్ చార్జీలు వర్తించగా, 20 కిలోవాట్లకు మించి కేవలం సర్వీస్ లైన్ చార్జీలు మాత్రమే వసూలు చేస్తారు. ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న విద్యుదీకరణ నెట్వర్క్ నుంచి ఓవర్ హెడ్ లైన్లకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. అవసరమైన ట్రాన్స్ఫార్మర్ను డిస్కం అదనపు వ్యయం లేకుండానే ఏర్పాటు చేయనుంది. అప్లికేషన్ నమోదు సమయంలోనే సర్వీస్ లైన్చార్జీలను పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన పూర్తైన వెంటనే కనెక్షన్ల మంజూరు ప్రక్రియను వేగంగా పూర్తి చేయనున్నారు. వినియోగదారులు టీజీఎన్పీ డీసీఎల్ అధికారిక పోర్టల్ ద్వారా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 1912 లేదా 1800–425–0028 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని విద్యుత్ శాఖ సూచించింది.బల్క్/మల్టిపుల్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ విధానంతో అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్ లకు విద్యుత్ కనెక్షన్ల మంజూరు మరింత వేగవంతం అవుతుంది. వినియోగదారులు ఈ ఆన్లైన్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని ఒకే దరఖాస్తుతో బహుళ కనెక్షన్లు పొందాలని కోరుతున్నాం. –సంపత్రెడ్డి, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్ విద్యుత్ సేవలు మరింత సులభతరం అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్సులకు శుభవార్త -
ఏఎంసీలో స్వచ్ఛత పనులు
జనగామ: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) యార్డులోని ఐకేపీ పత్తి కొనుగోలు కేంద్రాల్లో పేరుకపోయిన చెత్తను తొలగించే కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో ఏఎంసీ సిబ్బంది శుభ్రత పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు విస్తృతంగా సేవలు అందించామని, మార్కెట్ యార్డులో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి జిల్లాలో అత్యధికంగా వరి కొనుగోళ్లు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ సిబ్బంది ఆయిలయ్య, వెంకటేష్, రమేశ్, కృష్ణ, కుమారస్వామి, ప్రవీ ణ్, ఉమా మహేశ్వరి, కోమలత పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంజనగామ రూరల్: ఐదో తరగతి ఉత్తీర్ణులైన బా లికలకు జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)లో ఏర్పాటు చేసిన ఐఓఈ(ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్) సెంటర్లలో 6వ తరగతి నుంచే ప్రత్యేక కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు కేజీవీబీ జిల్లా స్పెషల్ ఆఫీ సర్ అన్నపూర్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పే ర్కొన్నారు. ఐవోఈ సెంటర్లలో అనుభవజ్ఞులై న ఉపాధ్యాయులచే బోధన అందించడంతో పాటు, జేఈఈ, నీట్, క్లాట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ కోసం నిపుణులైన అధ్యాపకులతో తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నా రు. జిల్లాలోని చౌడారం, పాలకుర్తి, ఘన్పూర్ స్టేషన్ కేజీవీబీ ఐఓఈ సెంటర్లలో ప్రవేశాల కోసం 5వ తరగతి ఉత్తీర్ణులైన బాలికలు మాత్ర మే అర్హులని స్పష్టం చేశారు. ఆసక్తి గల విద్యార్థినులు జూలై 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోపు సంబంధిత కేజీవీబీల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ప్రవేశ పరీక్షను జూలై 12న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కేజీబీవీలో విద్యార్థినులకు అవగాహనచిల్పూరు: వసతి గృహాల్లో ఉంటూ చదివే విద్యార్థినులు ఏదైనా సమస్య ఏర్పడితే వెంటనే 100కు డయల్ చేయాలని వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేందర్నాయక్ సూచించారు. మండలంలోని రాజవరం గ్రామ పంచాయతీ పరిధిలోని కేజీబీవీలో శుక్రవారం ఎస్సై నవీన్కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించగా డీసీపీ హాజరయ్యారు. ఈసందర్భంగా భద్రత, పలువిషయాలపై విద్యార్థినులకు అర్ధం అయ్యే రీతిలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్వో స్వప్న, 200 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. కాగా, చిల్పూరు పోలీస్ స్టేషన్ను డీసీపీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. 5న విరసం ఆవిర్భావ సభజనగామ రూరల్: దేశంలో ప్రజా ఉద్యమాలపై అమలవుతున్న ఫాసిస్ట్ నిర్బంధం, అణిచివేతకు వ్యతిరేకంగా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో పోరాటం కొనసాగింపుగా జూలై 5న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విప్లవ రచయితల సంఘం ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా విర సం కన్వీనర్ కోడం కుమారస్వామి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ..దేశంలో ఫాసిజం ప్రత్యేకతలు, అంశంపై కవి రివేరా, ‘బుల్డోజర్ రాజకీయాలు మతమైనారిటీల అస్తిత్వంపై దాడ్ఙి, గురించి ఎడిటర్ ఎన్.వేణుగోపాల్, ‘తెలుగు సాహిత్యంలో ఇటీవల ధోరణులు – మార్క్సిస్ట్ దృక్పథం’ అనే అంశం ప్రొఫెసర్ చింతకింది కాశీం ఉపన్యాసాలు ఉంటాయని తెలిపారు. సభలకు కవులు, రచయితలు, మేధావులు, విద్యార్థులు భారీసంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. గంజాయి, గుడుంబా నిర్మూలనకు నిరంతర నిఘాజనగామ: జిల్లాలో గంజాయి, గుడుంబా నిర్మూలనకు నిరంతరం నిఘా, ఆకస్మిక దాడులు కొనసాగుతాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి (డీపీఈఓ) నంద్యాల అంజిరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని మూడు ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధిలో ప్రత్యేక బృందాలతో నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి రవాణా, విక్రయాలు, గుడుంబా తయారీ, కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రజలు కూడా గంజాయి విక్రయాలపై అప్రమత్తంగా ఉండి సంబంధిత సమాచారం ఎకై ్సజ్ శాఖకు అందించాలని కోరారు. -
‘ఎస్ఐఆర్’ను పారదర్శకంగా నిర్వహించాలి
జనగామ రూరల్: ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సీఈఓ కార్యాలయ ప్రత్యేక బృందం ప్రతినిధి పద్మావతి సూచించారు. శుక్రవారం జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 254, 259, 270 పోలింగ్ స్టేషన్ బూత్ల్లో జరుగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, ఇంటింటి సర్వే, బీఎల్ఓలు నిర్వహిస్తున్న విధులు, ఓటర్లకు అందిస్తున్న అవగాహన పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫారాలను సక్రమంగా నింపేలా అవసరమైన అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఓటర్ల వివరాలను నమోదు చేసే క్రమంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సంబంధిత ఆధారాలతో ధ్రువీకరించి నమోదు చేయాలని బీఎల్ఓలకు సూచించారు. కార్యక్రమంలో జనగామ ఈఆర్ఓ, ఆర్డీఓ గోపీరాం, ఏఈఆర్ఓ తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఘనపూర్ ఈఆర్ఓ, ఆర్డీఓ కిరణ్ ప్రకాష్, ఏఈఆర్ఓ స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ను పరిశీలించిన అబ్జర్వర్ స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో నియోజకవర్గ పరిశీలకురాలు పద్మావతి శుక్రవారం పరిశీలించారు. ఘన్పూర్లోని 111, 116వ పోలింగ్బూత్లలో నిర్వహిస్తున్న సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్ఓలతో పరిశీలకురాలు మాట్లాడుతూ.. ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తిస్థాయిలో అందించారా, ఎన్ని ఫారాలు కలెక్షన్ చేసి ఆన్లైన్ చేశారని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఆర్డీఓ కిరణ్ప్రకాశ్, తహసీల్దార్ స్వప్న, ఆర్ఐ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. సీఈఓ కార్యాలయ ప్రత్యేక బృందం ప్రతినిధి పద్మావతి -
అవుట్సోర్సింగ్ నియామక పరీక్షలు
జనగామ: జిల్లా స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న పోస్టుల నియామక పరీక్షలను పూర్తి పారదర్శకతతో, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించినట్లు కలెక్టర్, జిల్లా అవుట్సోర్సింగ్ కమిటీ చైర్మన్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. అర్హులైన ప్రతీ అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించేలా పరీక్షల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశం హాలులో నిర్వహించిన నియామక పరీక్షలను శుక్రవారం రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. జూలై 2న వ్యవసాయ శాఖలో వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) పోస్టుల భర్తీకి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. అలాగే 3న వైద్యశాఖలో ల్యాబ్ టెక్నీషియన్, ఎస్టీఎల్ఎస్ పోస్టులకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. అనంతరం సోషల్ వెల్ఫేర్ విద్యా సంస్థలలో పార్ట్టైమ్ టీచర్ పోస్టుల భర్తీ కోసం మధ్యాహ్నం 1 గంట నుంచి 2.30 గంటల వరకు పరీక్ష నిర్వహించినట్లు వివరి ంచారు. పరీక్షలకు మంచి స్పందన లభించిందని, వ్యవసాయ శాఖ ఏఈఓ పోస్టులకు 111 మంది దరఖాస్తు చేయగా 94 మంది హాజరయ్యారని తెలిపారు. వైద్యశాఖలో ల్యాబ్ టెక్నీషియన్, ఎస్టీఎల్ఎస్ పోస్టులకు 100 మంది దరఖాస్తు చేయగా 75 మంది పరీక్ష రాశారని చెప్పారు. సోషల్ వెల్ఫేర్ విద్యాసంస్థల పార్ట్టైమ్ టీచర్ పోస్టులకు 100 మంది దరఖాస్తు చేయగా 82 మంది హాజరైనట్లు వెల్లడించారు. అన్ని పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలి జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన నిరుపేదలకు పక్కా ఇళ్లు అందేలా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని సందీప్ కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెండో విడతకు సంబంధించి గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు తొలి ప్రాధాన్యమిస్తూ అర్హులను ఎంపిక చేయాలని తెలిపారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
సమస్యలున్నయ్ ‘సర్’
జనగామ: జిల్లాలో ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం వేగంగా కొనసాగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ప్రక్రియను ప్రభావితం చేస్తున్నాయి. బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఫారాలు పంపిణీ చేస్తున్నా, వాటిని ఎలా నింపాలి? ఏ వివరాలు నమోదు చేయాలి? అనే విషయంపై ఓటర్లకు పూర్తి అవగాహన లేకపోవడంతో నిరక్షరాస్యులు, వృద్ధులు, గిరిజన తండాల ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. ఫారాలు అందించిన తర్వాత వాటిని నింపే విధానంపై సరైన సూచనలు ఇచ్చేవారు లేరు. బీఎల్ఓలే స్వయంగా ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తుండగా, రైతులు, వ్యవసాయ కూలీలు ఖరీఫ్ పనుల్లో నిమగ్నమై ఉండడంతో ఫారాలు తిరిగి ఇవ్వడంలో జాప్యం కనిపిస్తోంది. వలస వెళ్లిన వారు, అందుబాటులో లేని ఓటర్ల కారణంగా సేకరణ ఆలస్యమవుతోంది. కష్టంగా వివరాల నమోదు అన్ని మండలాల్లోనూ ప్రధానంగా 2002 నాటి ఓటరు జాబితా వివరాలు నమోదు చేయడమే పెద్ద సమస్యగా మారింది. పాత ఓటరు జాబితాలు అందుబాటులో లేకపోవడం, ఎన్వీఎస్పీ యాప్లో కొందరి పేర్లు కనిపించకపోవడం, అప్పటి నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం వివరాలు గుర్తించడం కష్టంగా మారింది. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం ఎంపికలో కూడా చాలామంది అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు బీఎల్ఓలు రోజంతా వందలాది ఫోన్కాల్స్కు సమాధానాలు చెప్పాల్సి రావడం అదే సమయంలో ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాల్సి రావడంతో పనిభారం పెరిగింది. అధికారులు లక్ష్యాలు పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకురావడంతో బీఎల్ఓలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. కొన్ని మండలాల్లో బీఎల్ఓలే స్వయంగా ఫారాలు నింపి నిరక్షరాస్యులకు సహకరిస్తుండగా, చదువుకున్న యువకులు, విద్యార్థులు, రాజకీయ పార్టీలు కూడా తెలియని ఓటర్లకు అండగా నిలుస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగాలంటే విస్త్రృత అవగాహన కార్యక్రమాలు, పాత ఓటరు జాబితాల సులభ లభ్యత, సాంకేతిక సమస్యల పరిష్కారం అవసరం. ఎస్ఐఆర్ ప్రక్రియకు క్షేత్రస్థాయిలో పరీక్ష ఫారం నింపడంలో ఇబ్బందులు నిరక్షరాస్యులు, వృద్ధులు, గ్రామీణులకు కష్టమే బీఎల్ఓలనే ఫారం నింపాలంటూ వేడుకోలు ఫారంల పంపిణీ, ఆన్లైన్ పనులతో బీఎల్ఓల సతమతంజిల్లాలో ఓటర్ల మ్యాపింగ్, ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్నియోజకవర్గం మ్యాపింగ్ డిజిటలైజేషన్ ఫారాలు పంపిణీ జనగామ 92.24 2,836 2,49,437 2,20,588స్టే.ఘన్పూర్ 93.81 5,661 2,56,806 2,39,396పాలకుర్తి 94.18 9,681 2,61,241 2,17,710 పిట్టలోనిగూడెంలో 80 మందికి పైగా ఇదే పరిస్థితి -
మాకు దిక్కెవరు?
‘అమ్మానాన్న.. మమ్మల్ని స్కూల్కు ఎవరు పంపిస్తారు? కొసరి.. కొసరి గోరుముద్దలెవరు తినిపిస్తారు? తమ్ముడిని, నన్ను అనాథల్ని చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు మాకు దిక్కెవరు’ అంటూ రవి, శిరీష దంపతుల కుమారులు సుశాంత్, విద్వాన్ష్ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కాగా, వ్యాపారం కోసం ఇచ్చిన డబ్బులు వసూల్ చేయడానికి పడుతున్న ఇబ్బందుల వల్ల ఇద్దరు భార్యాభర్తలు 20 రోజులుగా ఇంట్లో గొడవ పడుతున్నారని, కనీసం తిండి కూడా సక్రమంగా తినట్లేదని ఇరుగుపొరుగు వారు తెలిపినట్లు మృతుడి బంధువులు చర్చించుకుంటున్నారు. -
ఇలా ఉంటే..బడికి ఎలా వచ్చేది?
జనగామ రూరల్: మండలంలోని ఎల్లంల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల అధ్వానంగా ఉంది. పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెపుతున్నా ఇక్కడ అందుకు విరుద్ధంగా ఉంది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉండగా మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. పాఠశాల మైదానంలో పిచ్చిమొక్కలు పాములు వచ్చే అవకాశం ఉంది. దీంతో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి విద్యార్థులు, తల్లిదండ్రులు తెలియజేసినప్పటికి ఫలితం లేదని, ఇప్పటికై నా అధికారులు స్పందించి పాఠశాల అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నారు.ఇంటర్వ్యూలు షురూ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని పార్ట్టైం అధ్యాపకుల నియమాకాలకు ఇంటర్వ్యూలు శుక్రవారం ప్రారంభించారు. తొలిరోజు లా, సొషియాలజీ, సైకాలజీ, లైబ్రరీ సైన్స్ విభాగాల్లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరిగాయి. డెమోలు నిర్వహించారు. ఈ ప్రక్రియను కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం పర్యవేక్షించారు. ఈ ఇంటర్వ్యూల ప్రక్రియ రోజుకు పలు విభాగాల్లో ఈనెల 8వ తేదీ వరకు కొనసాగనుంది. -
స్నేహం పేరిట నమ్మక ద్రోహం
రవి–శిరీష దంపతులు (ఫైల్)చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన బుడిగె రవి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా పదో తరగతితోనే చదువు ఆపేశాడు. ఉన్నత చదువులకు స్వస్తి చెప్పి హైదరాబాద్కు వెళ్లి రైస్ మిల్లులో గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించాడు. ఆ రంగంలో అనుభవం వచ్చాక హైదరాబాద్లోని హయత్నగర్లో ఒక బియ్యం దుకాణం పెట్టుకున్నాడు. తర్వాత కేసముద్రం మండలం నాయక్పల్లి గ్రామానికి చెందిన శిరీషను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు. హయత్నగర్లో సొంత ఇళ్లు కొనుక్కొని పిల్ల లను చదివిస్తున్నాడు. ఆర్థిక స్వేచ్ఛ సాధించానని సంబరపడుతున్న సమయంలో రవి–శిరీష దంపతులకు కొంత మందితో స్నేహం ఏర్పడింది. అది కాస్త ఫ్యామిలీ ఫ్రెండ్షిప్లా మారింది. ఓ వ్యక్తి, అతడి భార్య.. రవి, శీరిష దంపతులను తమ వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకుంటామని మాటిచ్చారు. లాభాల ఆశజూపి రూ.15 లక్షలు తీసుకున్నారు. ఎన్ని నెలలు గడిచినా భాగస్వామ్యం ఇవ్వకపోగా.. ప్రశ్నించిన రవి దంపతులను బెదిరించారు. దీంతో తాము మోసపోయామని గ్రహించి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఘట్కేసర్ బీబీనగర్ మధ్యలో ద్విచక్ర వాహనాన్ని చెట్ల పొదల్లో పెట్టి, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు వారి బంధువులు చెబుతున్నారు.అమ్మా, నాన్న లేండి.. రవి, శిరీష దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో వారి పిల్లలు తొమ్మిదేళ్ల సుశాంత్, ఆరేళ్ల విద్వాన్ష్ అనాథలయ్యారు. ‘అమ్మా, నాన్న లేండి’ అంటూ చిన్నారులు రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. తల్లిదండ్రుల మృతితో అనాథలయ్యారు. భరించలేక మనస్తాపంతో దంపతుల బలవన్మరణం వ్యాపారం కోసం రూ.15 లక్షలు తీసుకొని మోసం అనాథలైన వారి ఇద్దరు కుమారులు చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో విషాదం -
సమన్వయంతో పనిచేయాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత వరంగల్ క్రైం: లైంగిక దాడులకు గురైన మహిళలు, చిన్నారులకు చట్టబద్ధమైన రక్షణతో పాటు వైద్య, న్యాయ, మానసిక పరామర్శ, పునరావాస సేవలు సకాలంలో అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. కమిషనరేట్ పరిధి వరంగల్, జనగామ జిల్లాలకు చెందిన భరోసా కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలు మరింత సమర్థవంతంగా కొనసాగేందుకు, సంబంధిత ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పోలీస్ కమిషనర్ సీపీ శ్వేత బాధితుల గౌరవం, గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రతీ కేసును సున్నితంగా విచారించాలని సూచించారు. కేసు నమోదు నుంచి దర్యాప్తు, వైద్య పరీక్షలు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, పునరావాసం వరకు ప్రతి దశలో ఎలాంటి జాప్యం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసుల్లో నిర్దేశిత గడువులో దర్యాప్తు పూర్తి చేసి, కోర్టులో బలమైన సాక్ష్యాధారాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో పోలీస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఈవీ బస్సు.. భద్రత తుస్సు
హన్మకొండ: విద్యుత్ బస్సులపై భ్రమలు వీడుతున్నాయి. తరచూ జరుగుతున్న అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు విద్యుత్ బస్సులను మొదటినుంచీ వ్యతిరేకిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణ కోసమంటూ ఈవీ బస్సులను ప్రవేశపెట్టింది. బస్సుల్లో అగ్నిప్రమాదాలు జరుగుతుండడంతో ఆర్టీసీ యాజమాన్యం ఆలోచనలో పడింది. ప్రయాణికుల భద్రతకు భరోసా లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను నిలిపేసింది. ఇటీవల కరీంనగర్లో 15 రోజుల వ్యవధిలో రెండు బస్సుల్లో మంటలు లేచి దగ్ధమయ్యాయి. వరంగల్ రీజియన్లో వరంగల్–2 డిపోనకు 115 బస్సులు కేటాయించగా.. ఈ డిపో ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతోంది. వీటన్నింటి సేవలను నిలిపేసింది. స్పందించని జేబీఎం యాజమాన్యం వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్న జేబీఎం సంస్థకు ప్రయాణికుల భద్రతపై లేఖ రాసినట్లు సమాచారం. ప్రయాణికులకు ఎలాంటి రక్షణ కల్పిస్తారని, తరచూ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని అడిగినట్లు తెలిసింది. ఈ లేఖకు జేబీఎం యాజమాన్యంనుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా 500కు పైగా ఎలక్ట్రిక్ బస్సులు నిలిపేసింది. ఈక్రమంలో వరంగల్ రీజియన్లో 115 బస్సులు డిపోనకే పరిమితమయ్యాయి. -
‘చేనేత’ నామినేషన్లు షురూ
● మొదటిరోజు 55 దాఖలు ● 5 సొసైటీల్లో ప్రారంభంకాని నామినేషన్లు జనగామ: జిల్లాలో చేనేత సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నుంచి 12 సహకార సంఘాల పరిధిలో స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈనెల 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, 5న పరిశీలన, 6న ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా విడుదలతో పాటు ఎన్నికల గుర్తుల కేటాయింపు చేపట్టనున్నారు. అనంతరం 10వ తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. తొలి రోజు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. జిల్లాలోని ఏడు చేనేత సహకార సంఘాల్లో మొత్తం 55 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే మిగిలిన ఐదు సంఘాల పరిధిలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం గమనార్హం. 12 సంఘాలు...55 నామినేషన్లు భారత్ టీసీ జెడ్బీ హెచ్డబ్ల్యూసీఎస్, జనగామలో 2 నామినేషన్లు పడగా, ప్రాజెక్టు హెచ్డబ్ల్యూసీఎస్ జనగామలో–13, శ్రీవెంకటేశ్వర హెచ్డబ్ల్యూసీఎస్, కొత్తపల్లిలో–4, హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ గూడూరులో 15, హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ స్టేషన్ఘన్పూర్లో–9, శత్రంజి హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ కంచనపల్లి–10, శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర హెచ్డబ్ల్యూసీఎస్ సీతారాంపురం–2 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మార్కండేయ హెచ్డబ్ల్యూసీఎస్ బచ్చన్నపేట, శ్రీ సిద్ధేశ్వర సిల్క్ డబ్ల్యూసీఎస్ బచ్చన్నపేట, శ్రీ పద్మవంశీ జీహెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్, ఎల్లంల, శ్రీ శ్రీనివాస పవర్లూం, డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ వీవర్స్, కొడకండ్ల, శ్రీ భావనరుషి హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్, నీర్మాల సొసైటీల పరిధిలో ఐదు చోట్ల మొదటి రోజు ఒక్క నామినేషన్ కూడా రాలేదు. స్థానిక ఎన్నికలను తలపించే పోటీ చేనేత సంఘాల ఎన్నికలు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలను తలపించేలా మారనున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు తమ బలాన్ని నిరూపించుకునేందుకు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ప్యానెళ్ల ఏర్పాటు, అభ్యర్థుల ఎంపిక, మద్దతు కూడగట్టడం వంటి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. చేనేత సహకార సంఘాలు నూలు, ముడిసరుకు పంపిణీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ వంటి కీలక కార్యకలాపాలు నిర్వహిస్తాయి. దీంతో ఈ ఎన్నికలపై చేనేత కార్మికుల్లో ఆసక్తి నెలకొంది. పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు రామన్నపేట: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఖాళీ ఉన్న సీట్ల భర్తీకి నేడు(శుక్రవారం) దరఖాస్తుల స్వీకరణ, 4న అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్ తెలిపారు. జూలై 2 నాటికి సివిల్ ఇంజనీరింగ్లో ఒకటి, సివిల్ ఇంజినీరింగ్ (రియల్ ఎస్టేట్ అండ్ వాల్యుయేషన్)లో 21, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో 2, మెకానికల్ ఇంజినీరింగ్లో 35 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. -
డీఎఫ్ఓ ముకుందరెడ్డి బాధ్యతల స్వీకరణ
న్యూశాయంపేట : హనుమకొండ, జనగామ జిల్లాల అటవీశాఖాధికారిగా జి.ముకుందరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను హనుమకొండ రేంజ్ అధికారులు టి.శ్రీనివాస్, జె.శిరీష, కాకతీయ జూపార్క్ అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి, పరిపాలన అధికారి పి.మంజుల, సిబ్బంది రాజు తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. రూ.13 లక్షలతో తూము, మత్తడి మరమ్మతు రఘునాథపల్లి: మండలంలోని ఇబ్రహీంపూర్ పెద్ద చెరువును నీటి పారుదల శాఖ ఎస్ఈ సీతారాంనాయక్ గురువారం సందర్శించారు. మాజీ జెడ్పీటీసీ, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్చందర్రెడ్డి, సర్పంచ్ పోకల శ్రీనివాస్, రైతులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో చెరువును పరిశీలించారు. తూము వద్ద లికేజీలు ఎక్కడ ఉన్నాయో పరిశీలించారు. తూము మరమ్మతు, మత్తడి వద్ద దెబ్బతిన్న భాగాల పునరుద్ధరణ, కట్టపై చెట్ల తొలగింపు, కట్టలపై గుంతల మరమ్మతు కోసం రూ.13లక్షలు మంజూరైనట్లు త్వరలో పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఆలయానికి రూ.20లక్షల విరాళం బచ్చన్నపేట : మండలంలోని రామచంద్రాపురం గ్రామంలోని శ్రీ శివసీతారామాంజనేయస్వామి దేవాలయ పునర్నిర్మాణానికి గ్రామానికి చెందిన మారోజు సత్యనారాయణ–స్వాతి దంపతులు, వారి కుమార్తెలు హరిప్రియ, గాయత్రితో కలిసి సుమారు రూ.20 లక్షల విలువైన విరాళాన్ని గురువారం అందజేశారు. దేవాలయం కోసం టేకు ద్వారబంధాలు, రాతి ద్వారబంధాలు, టేకు తలుపులు, రాతి శేరేలు, పంచలోహ ఉత్సవ విగ్రహాలు, శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహాలతో పాటు ఆలయానికి అవసరమైన పలు సామగ్రిని సమర్పించారు. బంధుమిత్రుల సహకారంతో ఈ విరాళాన్ని అందించినట్లు దాతలు తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానంజనగామ: జిల్లా తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల (టీఎంఆర్ఎస్) జనగామ బాలుర–1, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల (టీఎంఆర్ఎస్,జేసీ) స్టేషన్ ఘన్పూర్ బాలికల–1లో 2026–27 విద్యా సంవత్సరానికి 5, 6, 8వ తరగతుల్లో ఏర్పడిన ఖాళీ సీట్ల భర్తీకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వర్గాలకు చెందిన మైనారిటీయేతర విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మురళీధర్రావు గురువారం తెలిపారు. ఖాళీలు ఇలా.. గురుకులాల్లో చేరాలనుకునే ఆసక్తి గల విద్యార్థులు కులం, ఆదాయం, విద్యా అర్హత ధ్రువపత్రాల జిరాక్స్ ప్ర తులతో కలిసి ఈనెల 6లోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు. స్టేషన్ ఘన్పూర్ బాలికల–1 గురుకులంలో 5వ తరగతిలో బీసీ–3, ఎస్సీ–3, ఓసీ–2, 6వ తరగతిలో బీసీ–1, 8వ తరగతిలో ఎస్టీ–1, ఓసీ –1 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. జనగామ బాలుర–1 గురుకులంలో 5వ తరగతిలో బీసీ–3, ఓసీ–1, 6వ తరగతిలో ఓసీ–2 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. -
నాటేసిన ఎమ్మెల్యే యశస్విని
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దేవరుప్పుల మండలంలోని మాదాపురం గ్రామంలో మహిళా వ్యవసాయ కూలీలతో కలిసి వరి నాటు వేశారు. గ్రామంలో అధికారిక కార్యక్రమాలు ముగించుకుని తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో పొలంలో మహిళా కూలీలు వరి నాట్లు వేస్తుండడం గమనించిన ఎమ్మెల్యే వెంటనే వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. కొంతసేపు వారితో కలిసి స్వయంగా వరి నాట్లు వేస్తూ వ్యవసాయ పనిలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే తమతో కలిసి పొలంలోకి దిగి నాట్లు వేయడంతో మహిళా కూలీలు ఆనందం వ్యక్తం చేశారు. –పాలకుర్తి టౌన్ (దేవరుప్పుల) -
చదువే భవిష్యత్ కు పునాది
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● పాలకుర్తి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీపాలకుర్తి టౌన్: చదువే భవిష్యత్కు బలమైన పునాది అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా 8వ తరగతికి వెళ్లి ఇంగ్లిష్ పాఠ్యాంశాలను విద్యార్థులతో చదివించి విద్యార్థుల అభ్యాసన సామర్ాధ్యలు పరిశీలించారు. వసతి సౌకర్యాలు, పారిశుద్ధ్యం, మధ్యాహ్న భోజనం, సైన్స్ ల్యాబ్, వైద్య సేవలు, వంటశాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో విధ్యాశాఖ ఏడీ శ్రీనివాస్, తహసీల్దార్ సరస్వతి, ఎంపీడీఓ వేదవతి, ఎంఈఓ పోతుగంటి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ‘సర్’ను పారదర్శకతతో నిర్వహించాలి ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిస్ధాయిలో పారదర్శకతతో, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలో శాంతినగర్లో ఇంటింటి సర్వేను ఆకస్మింగా పరిశీలించిన కలెక్టర్ ఓటర్ల వివరాలను స్వయంగా ఽతెలుసుకున్నారు. బీఎల్ఓలు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పని చేయాలని, అవసరమైన సాంకేతిక శిక్షణ అందించాలని తహసీల్దార్ సరస్వతిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎండీడీఓ వేదవతి, సూపర్వైజర్లు, బీఎల్వోలు పాల్గొన్నారు. -
పంట మారిస్తే ప్రోత్సాహకం
జనగామ: జిల్లాలో వానాకాలం సీజన్లో సాగు చేస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం–నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్) పథకం ద్వారా ఇన్పుట్ సబ్సిడీలు అందనున్నాయి. ఈ పథకం కింద డయాబెటిస్ నియంత్రణకు ఉపయోగపడే వరితో పాటు 7 రకాల చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, మొక్కజొన్న తదితర పంటలను సాగుచేస్తున్న రైతులకు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నారు. ఆత్మనిర్భర్ పప్పు దినుసుల మిషన్.. జిల్లాలో పప్పు దినుసుల ఉత్పత్తి పెంపు లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ పప్పు దినుసుల మిషన్ కింద రైతులకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ పథకం కింద జిల్లాకు మొత్తం 104 యూనిట్లు మంజూరయ్యాయి. కంది పంటల సాగును విస్తరించడంతో పాటు అధిక దిగుబడులు సాధించే లక్ష్యంతో నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించనున్నారు. ఇందులో కంది పంటకు సంబంధించి టీడీఆర్జీ–59, ఎల్ఆర్జీ–52, ఇక్రిసాట్ అభివృద్ధి చేసిన ఆశ వైరెటీ విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఎన్జీజీ 385 రకానికి చెందిన పెసర విత్తనాలను ఉచితంగా అందించారు. ఈ రకాలు తక్కువ కాలంలో పంట కోతకు వచ్చే లక్షణం కలిగి ఉండడంతో పాటు ఎండు పరిస్థితులు, ప్రధాన తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. దీంతో రైతులకు అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం లభించే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఈ విత్తనాలతో సాగు చేయాలనే ఆసక్తి ఉన్న రైతులు సంబంధిత మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పథకం ప్రయోజ నాలు అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పప్పు దినుసుల సాగు విస్తరణతో జిల్లాలో ఉత్పత్తి పెరగడంతో పాటు రైతుల ఆదాయం కూ డా మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ ఎఫ్ఎస్ఎం కింద రైతులకు ఇన్ పుట్ సబ్సిడీలు మొక్కజొన్న, పప్పు, చిరుధాన్యాల సాగుకు ఊతం డయాబెటిక్ నియంత్రణకు ఉపయోగపడే పంటలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సాగు ఖర్చు తగ్గించి దిగుబడి పెంచడమే లక్ష్యంపప్పు ధాన్యాల సాగు పెంచడమే లక్ష్యంగా.. జిల్లాలో వానాకాలం సీజన్లో సుమారు 2.13 లక్షల ఎకరాల్లో వరి, 13వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు ఉంటుందని అంచనా. క్రాప్ డైవర్షన్లో మొక్కజొన్న, పప్పుధాన్యాల సాగును కూడా ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఆర్థిక భారం తగ్గించే విధంగా ఇన్పుట్న సబ్సిడీపై పంపిణీ చేస్తారు. దీంతో సాగు ఖర్చు తగ్గడమే కాకుండా, పంట దిగుబడి, నాణ్యత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ నియంత్రణకు ఉపయోగపడే వరి, చిరుధాన్యాల సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పోషక విలువలు అధికంగా ఉండే ఈ పంటల సాగు పెరగడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించడంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులోకి వస్తుంది. -
చిరుజల్లులు..సాగు ఆశలు
● విత్తనాలు, ఎరువుల కోసం రైతుల దుకాణాల బాటజనగామ: వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ ఆశించిన మేర వర్షాలు కురవక జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర పంటల సాగు కొంత మందగించింది. అయితే ఇటీవల కురుస్తున్న చిరుజల్లులతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. వర్షాలు కొనసాగుతాయనే అంచనాతో రైతులు వ్యవసాయ పనులను వేగవంతం చేస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి రైతులు జిల్లా కేంద్రంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలకు పెద్ద సంఖ్యలో చేరుకుని పత్తి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తదితర వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేస్తు న్నారు. దీంతో కొన్ని రోజులుగా వెలవెలబోయిన దుకాణాలు రైతుల రద్దీతో కళకళలాడుతున్నాయి. -
జర్మనీ వర్సిటీలతో కేయూ ఎంఓయూ
కేయూ క్యాంపస్: ఉన్నత విద్యాశా ఖ అధికారులు, వివిధ యూనివర్సి టీల వీసీలు, ప్రొఫెసర్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళా శాలల లెక్చరర్లు ఎడ్యుకేషన్ స్టడీ టూర్కు జర్మనీ వెళ్లారు. జర్మనీ ప ర్యటనకు వెళ్లిన బృందంలో ఉన్న కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి అక్కడ మూడు యూనివర్సిటీలతో కేయూకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. ఈమేరకు బుధవారం వివరాలను వెల్ల డించారు. ఆయా విశ్వవిద్యాలయాల అంతర్జాతీయ సంబంధాల విభాగాల అఽధిపతులతో వీసీ ప్రతాప్రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, రూసా ప్రాజెక్టు అధికారి సౌందర్యజోసెఫ్, రూసా కేయూ నోడల్ అధికారి ప్రొఫెసర్ ఆర్.మల్లికార్జున్రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎం.కుమార్ చర్చలు జరిపారు. అనంతరం ఎంఓయూ కుదుర్చుకున్నారు. జర్మనీ పర్యటనలో ఆయన ఈనెల 6 వరకు ఉండనున్నారు. -
విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలి
బచ్చన్నపేట: ఉపాధ్యాయులు బాధ్యతతో వ్యవహరించి విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర అబ్జర్వర్ సీహెచ్.వీ.ఎస్. జ నార్దన్ రావు అన్నారు. బుధవారం మండలకేంద్రంలో ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, పా ఠశాల పనితీరు, అడ్మిషన్ ప్రక్రియ, విద్యాబోధన, రికార్డులను పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చదువుకునే విద్యార్థులకు పేదరికం అడ్డుకాకూడదని అనేక రకాల సౌకర్యాలను కల్పింస్తుందన్నారు. ఉపాధ్యాయులు సరి గా పాఠాలు చెప్పకపోయినా, మెనూ ప్రకారం మ ధ్యాహ్న భోజనం లేకపోయినా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లా అబ్జర్వర్ నాగరా జు, ఎంఈఓ ఇర్రి వెంకట్రెడ్డి, ప్రిన్సిపాల్ భారతి దేవి, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యాశాఖ రాష్ట్ర అబ్జర్వర్ వీ.ఎస్. జనార్దన్రావు -
ఐఎంఏ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
జనగామ: జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో జనగామ ఐఎంఏ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఐఎంఏ జనగామ అధ్యక్షుడు డాక్టర్ జె.బాలాజీ, కార్యదర్శి డాక్టర్ ఎ.శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన శిబిరంలో వైద్యులు, సామాజిక సేవకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ వైద్య సేవలతో పాటు సామాజిక బాధ్యతను నిర్వర్తించడం ప్రతీ వైద్యుడి కర్తవ్యమన్నారు. డాక్టర్లు బాలాజీ, శ్రీకాంత్, రంజిత్, స్వప్న రాథోడ్, రజిని, విఘ్నశ్రీ, దివ్య, గోపిచంద్, సృజన్ సహా పలువురు ఐఎంఏ వైద్యులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ వైద్యులు డి.లవకుమార్ రెడ్డి, సీహెచ్ రాజమౌళి, లక్ష్మీనారాయణ నాయక్, కరుణాకర్ రాజు, సామా జిక సేవకులు కన్న పరశురాములు, తదితరులు పాల్గొన్నారు. కాగా శిబిరంలో 25 యూనిట్ల రక్తాన్ని సేకరించి జనగామ ప్రభుత్వ ఆస్పత్రి రక్తనిధికి అందించారు. -
ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తా
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, ఇందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా సన్ప్రీత్సింగ్ నుంచి బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్న నూతన సీపీకి సిబ్బంది సాయుధ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా నూతన సీపీని వరంగల్ పోలీస్ కమిషనరేట్కు చెందిన డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కలు, నోట్బుక్స్ అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత మాట్లాడుతూ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కమిషనరేట్ పరిధిలోని ప్రతీ పోలీసు అధికారి, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించే విధంగా పోలీసింగ్ను సమర్థవంతంగా నిర్వహిస్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు. అమ్మవారికి సీపీ శ్వేత పూజలు హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని బుధవారం వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ శ్వేత సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, అర్చకులు ఆమెను ఘనంగా స్వాగతించారు. సీపీ శ్వేత అమ్మవారిని దర్శించుకుని పూజలు జరుపుకున్నారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. కమిషనర్ వెంట ఏసీపీ సత్యనారాయణ, సీఐ సుజాత ఉన్నారు. శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత కమిషనరేట్లో బాధ్యతల స్వీకరణ -
అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు
● ఇరిగేషన్ డీఈ అరుణ్జ్యోతి రఘునాథపల్లి: మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామ పెద్ద చెరువును ఇరిగేషన్ డీఈ అరుణ్జ్యోతి బుధవారం ఏఈ సింధుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువు పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు అక్రమ నిర్మాణాలపై అగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిటి హాల్, పెద్దమ్మగుడి, కొన్ని నివాస గృహాల నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవని, అవి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయన్నారు. అనంతరం డీఈ మాట్లాడుతూ చెరువు పరిధిలో ఎవరికై న పట్టా భూములు ఉంటే సాగు చేసుకొని జీవనం కొనసాగించాలే తప్ప, శాశ్వత నిర్మాణాలు చేపడితే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా చెరువు మత్తడి, తూము మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.13 లక్షలు మంజూరు చేసిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పోకల శ్రీనివాస్, ఉప సర్పంచ్ చింత నరేష్, కారోబార్ యూసఫ్, పండుగ నవీన్, నూనె మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
రూపు మారిన ‘ఉపాధి’
లింగాలఘణపురం: రాష్ట్రంలో సుధీర్ఘకాలంగా కొనసాగిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రూపు మారింది. దీనిస్థానంలో కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్ జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ –గ్రామీణ్) పేరుతో పథకాన్ని అమలుచేస్తుంది. ఇక నుంచి ఈ పథకంలో చేపట్టే పనులకు కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పని దినాలను కూడా వంద నుంచి 125 రోజులకు పెంచారు. వామపక్ష పార్టీల పోరాటం వృథా యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం (పథకం) నుంచి కేంద్ర ప్రభుత్వం క్రమంగా తప్పుకొనేందుకు పేరు మార్చి భవిష్యత్లో కూలీలకు పనులు కల్పించకుండా పోతుందని వామపక్ష పార్టీలు చేపట్టిన పోరాటం వృథా అయింది. జూలై 1 నుంచి పోర్టల్ మార్పు చేశారు. కూలీల మస్టర్లను కూడా ఆన్లైన్లో నమోదు చేశారు. జిల్లాలో 1,16,639 జాబ్ కార్డులు జిల్లాలో 280 గ్రామ పంచాయతీలు ఉండగా 1,16,639 మంది జాబ్ కార్డు కలిగిన కూలీలు ఉండగా అందులో 2,26,704 మంది కూలీలు ఉన్నారు. రెగ్యులర్గా కూలీ పనికి వెళ్లే వారు 1,18,893 ఉన్నారు. వీరంతా ఇక నుంచి వీబీజీ రామ్ జీ పథకం పేరుతో పని చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా కూలీలకు మాత్రం ఉపాధి హామీ (కరువు పని) అనే తప్ప పేరు మార్చిన విషయంపై ఏమీ తెలియడంలేదు. రోజు తాము పనికి వెళ్లడం, ఫొటోలు దిగడమే తప్ప ఉపాధి హామీ చట్టం మార్పుపై ఏ మాత్రం అవగాహన లేదు. భవిష్యత్లో కూలీ డబ్బుల చెల్లింపు, పనుల కొరత ఏర్పడితే తప్ప తెలిసే పరిస్థితి లేదు. ఉపాధి కూలీల వివరాలు ఇక నుంచి వీబీ జీ రామ్ జీగా అమలు నూతన పోర్టల్లో పనుల ఎంట్రీజాబ్కార్డులు : 1,16,639కూలీల సంఖ్య : 2,26,704యాక్టివ్ కూలీలు : 1,18,893 గ్రామాలు : 280పనికి వెళ్లడం తప్ప.. మాకేం తెల్వదుకరువు పనికి వెళ్లడం తప్ప ఉపాధి హామీ చట్టం, వీబీజీ రామ్ జీ పేరు మాకు తెల్వదు. కూలీ పనికి వెళ్లి ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకొనే ఫొటోలే గాని మాకు కొత్త పేరు.. దాంతో వచ్చే నష్టాలు, లాభాలు ఏమీ తెల్వదు. – బెజ్జం స్వప్న, లింగాలఘణపురం -
తమ్మడపల్లిలో సంపూర్ణ మద్యపాన నిషేధం
బచ్చన్నపేట: మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు సర్పంచ్ బేజాడి సిద్దులు, ఉప సర్పంచ్ గొలన్కొండ నాగారాజులు తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ గ్రామంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తూ గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక నుంచి గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ. 50 వేల జరిమానా విధిస్తామని, సమాచారం అందించిన వారికి రూ.5 వేల ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కనుకరాజు, రాజు, అబ్బసాని వేణు, బొడిగం కవిత, బేజాడి విజయ, లక్ష్మి, మధు, భవాని, నాయకులు శ్రీనివాస్రెడ్డి, రమేష్, బుచ్చిరెడ్డి పలువురు పాల్గొన్నారు. హక్కుల పరిరక్షణకు ముందుకురావాలి జనగామ: బంజారా జాతి మనుగడ, ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణకు ప్రతీ బంజారా ఐక్యంగా ముందుకు రావాలని లంబాడ హక్కుల పోరాట సమితి (ఎల్హెచ్పీఎస్) జిల్లా ఇన్చార్జ్ కొర్ర రాజేందర్ నాయక్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రం ఆర్టీసీ చౌరస్తాలో ఎల్హెచ్పీఎస్ నంగారాభేరి 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీల అమలుపై బంజారా సమాజంలో అసంతృప్తి ఉందని, ప్రజాస్వామ్యబద్ధంగా సంఘటితమై పోరాడాలని సూచించారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు వాంకుడోతు అనిత మాట్లాడుతూ తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఎల్హెచ్పీఎస్ చేసిన ఉద్యమాలు ఫలించాయన్నారు. ఈ కార్యక్రమంలో నర్మెట మండల అధ్యక్షుడు ధరావత్ రాజు, రఘునాథపల్లి మండల ఇన్చార్జ్ సంతోష్, నాయకులు సురేష్, రమేష్, రాజు తదితరులు ఉన్నారు. వైటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా లక్ష్మీనారాయణజనగామ: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి (వైటీడీ) ప్రభుత్వం తొలిసారిగా 18 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసింది. రెండేళ్ల పదవీకాలం ఉన్న ఈ తొలి పాలక మండలిలో జనగామ జిల్లాకు చెందిన టీపీసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్కు చోటు దక్కింది. మండల స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ క్రమంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీకి సేవలందిస్తూ టీపీసీసీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ పట్ల నిబద్ధత, ప్రజా సమస్యలపై చురుకై న వైఖరి, నాయకత్వ లక్షణాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వ ం ఆయనకు ఈ అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి వైటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దేవస్థానం ప్రతిష్టను మరింత పెంచే దిశగా నావంతు బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తానన్నారు. దరఖాస్తుల గడువు పొడిగింపు జనగామ రూరల్: సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తుల గడువు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మురళీధర్రావు బుధవారం ఒకప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అల్ప సంఖ్యాక వర్గాల (ముస్లిం, మైనార్టీ, బౌద్ధులు, సిక్కులు) వారు విదేశాల్లో చదువుకునేందుకు అర్హత గల అభ్యర్థులు ఈనెల 15వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9951933034, 9346951278 నంబర్లలో సంప్రదించవ్చన్నారు. అంబేడ్కర్ ఓవర్సీస్కు.. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద విదేశాల్లో ఉన్నత చదువులకు అందించే ఆర్థిక సాయం కోసం అర్హత, ఆసక్తి గల ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి బి.విక్రమ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా ఎస్సీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.


