breaking news
Jangaon District Latest News
-
పట్టణ రూపురేఖలు మారుస్తాం
జనగామ: పట్టణంలోని 22వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. 22వ వార్డుతో పాటు పట్టణంలోని మిగతా 29 వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 22వ వార్డు కార్యక్రమాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించి వెళ్లారు. అంతకు ముందు ముఖ్యమంత్రి పంపించిన సందేశాన్ని చదివి వినిపించి, ప్రతిజ్ఞ చేశారు. చైర్పర్సన్ బాలమణి మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా పట్టణంలో స్వచ్ఛతను మరింత మెరుగుపరచడం తమ లక్ష్యమని తెలిపారు. పట్టణ రూపురేఖలను మార్చేందుకు స మష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు చెంచారపు కరుణాకర్రెడ్డి, రామగళ్ల విజయ్, దోర్నాల అనితవెంకటేశ్వర్లు, మంత్రి సుమలతశ్రీశైలం, అండాలు, పురపాలిక మేనేజరు రాములు, శానిటరీ ఇన్స్పెక్టర్ గోపయ్య, మల్లిగారి మధు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ 22వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రారంభం -
హారం హాసం
పరిజనగామ రూరల్: గత యాసంగిలో వడగళ్ల బీభత్సం, ఆ తర్వాత అతివృష్టి వర్షాలతో పంటలకు తీరని నష్టం వాటిల్లింది. వర్షాలు, గాలి దుమారంతో వేలాది ఎకరాల్లో చేతికందే దశలో ఉన్న వరి, మొక్కజొన్న, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. గత అక్టోబర్లో మొంథా తుపాను విరుచుకుపడడంతో భారీ వరదలు సంభవించి తీవ్రంగా పంట నష్టం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో కూడా పంట నష్టం జరిగినప్పుడు పరిహారం అందించాలని బాధిత రైతులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. దీనిపై స్పందించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామని చెప్పిన ఆచరణలో జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా రైతుల చేతికి చిల్లిగవ్వ అందలేదు. మోంథా తుఫాన్తో దెబ్బతిన్న పంటలకై నా నష్టపరిహారం ఇవ్వాలని రైతులు, పలు పార్టీల నాయకులు ఆందోళన చేపట్టి వినతి పత్రం కూడా అందజేశారు. పరిహారం అందక ప్రస్తుత ప రిస్థితుల్లో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. 17వేల ఎకరాల్లో పంట నష్టం జిల్లాలో గతేడాదికి సంబంధించిన పంట నష్టపరిహారం 11వేల మందిపైగా రైతులకు చెందిన సుమారు 17వేల ఎకరాల్లోని వరి, మామిడి, మొక్కజొన్నకు తీవ్ర నష్టం వాటిల్లిందని జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు సర్వే నిర్వహించారు. క్లస్టర్లు, గ్రామాల వారీగా ఏఈఓలు పంటల వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించారు. పరిహారం చెల్లింపుల విషయంపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని అడగ్గా నివేదిక పంపామని, తమకు ఏలాంటి సమాచారం అందలేదని తెలిపారు. రైతులకు అందాల్సిన పరిహారం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. వడగళ్లు, మోంథా తుపానుతో చేతికొచ్చిన పంట నేలపాలు జిల్లాలో 17వేల ఎకరాలపైగా పంట నష్టం ప్రభుత్వానికి నివేదిక అందించామంటున్న అధికారులు -
టీపీసీసీ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఎర్రబెల్లి స్వర్ణ తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈమేరకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ మేయర్గా, కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన స్వర్ణ రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ రేసులో ఉన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన స్వర్ణకు ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పారు. -
పోలీస్ స్టేషన్ ఆవరణ శుభ్రం చేసిన డీసీపీ
లింగాలఘణపురం: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శుక్రవారం జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ పరిసరాలను పరిశుభ్రం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పోలీసు సిబ్బందితో కలిసి ఆవరణలో ఉన్న చెత్తాచెదారం తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని కాపాడుకోవాలని డీసీపీ సూచించారు. కార్యక్రమంలో ఎస్సై శ్రావణ్కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలుజనగామ రూరల్: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఇంటర్ విద్యాధికారి కె.జితేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం జరిగిన సెకండియర్ పరీక్షకు 94 మంది విద్యార్థులు గైర్హాజర్ అయ్యారని తెలిపారు. జనరల్లో 2,830 మంది విద్యార్థులకు 2,792 హాజరు కాగా 38 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ 995 విద్యార్థులకు 939 హాజరు కాగా 56 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి స్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య సమస్యపై అధికారులు, సిబ్బంది ప్రత్యేక చొరవతో పనిచేయాలని మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మొదటిరోజైన శుక్రవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, మేనేజర్ సత్యనారాయణ, కౌన్సిలర్లు, మహిళలు పాల్గొన్నారు. స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ కమిషనర్ రాధాకృష్ణ వైఖరిపై పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన–ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. కాగా సమావేశం ప్రారంభంలోనే పొన్న రాజేష్, బస్వగాని అనిల్ తదితర కౌన్సిలర్లు కమిషనర్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం విషయమై కనీసం తమకు సమాచారం లేదని, వార్డుల్లో ఏదైనా సమస్య విషయమై ఫోన్ చేస్తే కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేదని వాగ్వాదం చేయడంతో కాసేపు సభ రసాభాసగా మారింది. కాగా అందరూ సంయమనం పాటించాలని చైర్మన్ సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. వేయిస్తంభాల గుడిలో సంకటహరచతుర్థి పూజలుహన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శుక్రవారం సాయంత్రం సంకటహరచతుర్థి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అధ్వర్యంలో అర్చకులు గంగు మణికంఠశర్మ, సందీప్శర్మ, ప్రణవ్ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సంకటచతుర్థిని పురస్కరించుకుని సాయంత్రం దేవాలయంలోని కాకతీయుల కాలంనాటి ఉత్తిష్టగణపతికి అభిషేకాలు నిర్వహించారు. గణపతికి ఇష్టమైన గరికతో అష్టోత్తరశతనామాలు పఠిస్తూ షోఢశోపచార పూజలు చేశారు. మహాహారతి మంత్రపుష్పం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. -
ఆశించిన దానికంటే ఎక్కువ వచ్చింది
సొంతంగా మూడు చింతచెట్లు ఉన్నాయి. క్వింటాన్నర దిగుబడి రాగా, మరో క్వింటాల్ వరకు చింతపండు వస్తుంది. ప్రస్తుతం 3 అంకాల పండును మార్కెట్కు తీసుకొచ్చా. పండు నాణ్యతగా, కలర్ ఉండడంతో క్వింటాల్ ధర రూ.11,290లు ధర పలుకడం సంతోషంగా ఉంది. –జీడిమెట్ల కరుణాకర్రెడ్డి, గోపరాజుపల్లి,జనగామముగ్గురం కలిసి 34 అంకాల(సుమారు 10 క్వింటాళ్లు) చింతపండు తీసుకొచ్చినం. క్వింటాల్ పండు రూ.8,500, రూ.9,700, రూ.11,000, రూ.10,000 ధరతో వ్యాపారులు చింతపండు కొనుగోలు చేశారు. కోతులతో కొంతమేర దిగుబడి తగ్గింది. – పి.కుమార్ నమిలె, రాజపేట మండలం, యాదాద్రి జిల్లా -
ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం
లింగాలఘణపురం: ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేయడమే ‘ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం’ ప్రథమ లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.. విద్య, వైద్యం, సాగునీరు, పంటల దిగుబడికి నియోజకవర్గంలో ప్రాముఖ్యం కల్పించడం జరుగుతుందని, జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆరోగ్య స్థితిగతులను పరీక్షించి ప్రత్యేక హెల్త్కార్డులను జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో జనగామ, జఫర్గఢ్లో డయాలిసిస్ సెంటర్లు ఉన్నాయని, నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్ఘన్పూర్లో ఏర్పాటు చేయాలని, అదేవిధంగా వంద పడకల ఆసుపత్రి నిర్మాణం డిసెంబర్ వరకు పూర్తి చేయాలన్నారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా డెంగీ, మలేరియా సోకకుండా దోమల నివారణకు ప్రతీ గ్రామంలో పిచికారి చేయడం జరుగుతుందని, ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు మాట్లాడుతూ 99 రోజుల కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలను వివరించారు. సమావేశంలో ప్రోగ్రామ్ ఇన్చార్జ్ రాజేశం, వివిధ విభాగాల డాక్టర్లు ఉమాదేవి, అరుణకుమారి, ప్రదీప్, దీప్తి, క్రాంతిస్వరూప్, అనిల్ వైద్య సేవలు అందించారు. ఆర్డీఓ గోపీరామ్, 108 జిల్లా ఇన్చార్జ్ రాములు, మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ శివశంకర్రెడ్డి, స్థానిక వైద్యాధికారి స్వర్ణలత, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. పంటల దిగుబడిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలి
సాక్షి, మహబూబాబాద్: సంక్షేమ పథకాలు అర్హులకు చేరినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, ఆ దిశగా అధికారులు ముందుకు పోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికపై ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం శుక్రవారం మహబూబాబాద్ కలెక్టరేట్లో జరిగింది. పలు అంశాలపై కలెక్టర్లు ప్రణాళికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనుల్లో నూతన ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని, ఇందుకోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. వేసవి సెలవుల్లో పాఠశాల్లో మరమ్మతులు చేయించాలన్నారు. మండలంలోని అధికారి హాస్టళ్లను దత్తత తీసుకొని వారంలో రెండు రోజులు అక్కడే భోజనం చేసేలా చూడాలని పేర్కొన్నారు. ప్రమాదాలు నివారించేందుకు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే పాఠశాల గుర్తింపు ఇవ్వాలని ఆదేశించారు. బిల్లులు అందించి ఈనెల చివరి వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి పేదలకు అందించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండ్ చేయని లబ్ధిదారుల నుంచి అంగీకారాన్ని తీసుకుని రద్దు చేయాలని తెలిపారు. ప్రజలకు ఏం అవసరమో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. డాక్టర్లు అంకితభావంతో పనిచేయాలి.. రైతుల సమస్యల పరిష్కార మార్గాలను తెలిపేందుకు సీనియర్ రైతులను భాగస్వామ్యులను చేసి చెప్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు అంకిత భావంతో పనిచేస్తే రోగుల సంఖ్య పెరుగుతుందని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే బాధ తప్పుతుందని మంత్రి అన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల మధ్య భూసమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. త్వరలో సాదాబైనామాకు అవకాశం వస్తుందని, అప్పుడు సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి.. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని అధికా రులను ఆదేశించారు. దరఖాస్తుల స్థితిని తెలుసుకుంనేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించాలని, సమాచారాన్ని ప్రజల ఫోన్లకు చేరవేయాలని సూచించారు. ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టే పనులు జాప్యం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ విప్ రాచంద్రునాయక్ మాట్లాడుతూ.. గత కలెక్టర్ హయాంలో ఫైల్స్ పెండింగ్లో ఉండడంతో మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలు నిలిచి పోయాయని వివరించారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యేలు, మురళీనాయక్, నాగరాజు, ప్రకాశ్రెడ్డి, రాజేందర్రెడ్డి, దొంతి మాధవరెడ్డి తమ నియోజకవర్గాల్లో సమస్యలు, 99 రోజుల ప్రణాళికలో చేపట్టే కార్యక్రమాలు వివరించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. కార్యక్రమాలు మొక్కుబడిగా కా కుండా ప్రజల సమస్యలు పరిష్కరించేలా, పథకా లు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడాలన్నారు. సమావేశానికి హాజరు కాని మహబూబాబాద్ ఆస్పత్రి సూపరింటెండెంట్, ములుగు డీఎఫ్ఓకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో ‘కుడా’ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఐదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు, మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు. వార్డు సభ్యుల నుంచి చైర్మన్లు, సర్పంచ్ల వరకు శిక్షణ ఇవ్వండి బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే పాఠశాలకు గుర్తింపు ప్రారంభించిన ప్రతీ ఇందిరమ్మ ఇల్లుకు బిల్లు అందాలి ఫారెస్ట్, రెవెన్యూ మధ్య ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలి ప్రజాపాలన–పల్లెప్రగతి ఉమ్మడి జిల్లా సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
‘చింత’ లేదిక!
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్కు చింతపండు భారీగా వస్తోంది. వారం రోజుల క్రితమే చింతపండు రాక ప్రారంభమై, శుక్రవారం భారీగా మార్కెట్కు చేరింది. ఈ సీజన్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, కోతుల బెడద ఎక్కువగా ఉండటం వల్ల చింతపండు దిగుబడి 30 నుంచి 40 శాతం వరకు తగ్గినట్లు రైతులు చెబుతున్నారు. దీంతో ఆశించినంత దిగుబడి రాకపోయినా, వచ్చిన పంటను విక్రయించేందుకు రైతులు మార్కెట్కు తరలిస్తున్నారు. ప్రస్తుతం జనగామ మార్కెట్తో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ప్రధాన మార్కెట్లో కూడా చింతపండు భారీగా చేరుతోంది. అయితే ధర విష యంలో జనగామ మార్కెట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఇక్కడి మార్కెట్లో ప్రస్తుతం మధ్యరకం చింతపండు క్వింటాల్కు రూ.8,500 వరకు ధర ఉండగా, మోడల్ ధర రూ.9,700గా నమోదైంది. అత్యధికంగా రూ.10,000 వరకు ధర పలికింది. రికార్డు స్థాయిలో జనగామ మార్కెట్లో రికార్డు స్థాయిలో క్వింటాల్ చింతపండు రూ.11,290 వరకు ధర పలకడం రైతులకు ఆనందాన్ని కలిగించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జనగామ మార్కెట్పై వ్యాపారులు, రైతుల దృష్టి మరింతగా పడింది. భువనగిరి మార్కెట్తో పోలిస్తే క్వింటాల్కు సుమారు రూ.1,000పైగా ధర రావడం గమనార్హం. శుక్రవారం మార్కెట్ జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన 17 మంది రైతులు 14.70 క్వింటాళ్లు(49 అంకాలు) తీసుకొచ్చారు. క్వింటాల్ చింతపండుకు రికార్డుగా రూ.11, 290కి ఖరీదుదారుడు శర్విరాల ఉపేందర్ కొనుగోలు చేయగా, మోడల్ ప్రైజ్ రూ.9,700లు వచ్చింది. దీనికి మార్కెట్ అధికారుల పర్యవేక్షణ ప్రధాన కారణమని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా రానున్న రోజుల్లో జనగామ మార్కెట్కు చిం తపండు రాక మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే రాక పెరిగే సమయంలో ధరలు పడిపోకుండా మార్కెట్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. జిల్లా వ్యవసాయ మార్కెట్లో రికార్డుస్థాయిలో ధర క్వింటాల్కు రూ.11,290లు పలికిన చింతపండు అత్యధిక ధరలతో రైతుల ఆనందం -
శుక్రవారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2026
నేటి నుంచి జిల్లాలో ప్రజాపాలన–ప్రగతిప్రణాళికగ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మొదటి రోజు గ్రామసభను నిర్వహించనున్నారు. 90 నిమి షాలపాటు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు సాధించిన విజయాలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు, ప్రజా సమస్యలు వంటి అంశాలపై విస్త్రృతంగా చర్చ నిర్వహిస్తారు. రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తర్వాత వివిధ ప్రభుత్వ శాఖలు సాధించిన విజయాలపై వివరిస్తారు.● 99 రోజుల ప్రోగ్రామ్కు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ● అభివృద్ధి, సంక్షేమంపై అవగాహన.. సమస్యలపై చర్చ ● అధికారులతో కలెక్టర్ సమీక్ష ● ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని ఆదేశంజనగామ: ప్రజాపాలనను సమర్థవంతంగా అమలు చేయడం, పట్టణాల్లో పర్యావరణ పరిశుభ్రతను పెంపొందించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించింది. ఈనెల 6 (శుక్రవారం) నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రజాపాలన–ప్రగతిప్రణాళిక కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామసభలో.. గ్రామసభలో వ్యవసాయం, ఆరోగ్యం, సంక్షేమం, విద్య, మహిళా, శిశు సంరక్షణ, యువజన, క్రీడలు, పర్యావరణం వంటి పలు అంశాలపై చర్చ జరగనుంది. రైతులకు సౌర విద్యుత్ కనెక్షన్ల ప్రయోజనాలు, రైతు భరోసా, రైతుబీమా, సాగునీటి సదుపాయాలు, పీఎం కుసుమ్ పథకం కింద సౌర పంపుల అమలు, అదనపు సౌర విద్యుత్ గ్రిడ్కు అనుసంధానం, వ్యవసాయంపై అవగాహన కల్పిస్తారు. రోడ్డు భద్రత..మహిళల సంరక్షణ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు, కమిటీల ఏర్పాటుపై చర్చిస్తారు. అలాగే హైవేలు, ఔటర్ రింగ్ రోడ్లపై భారీ వాహనాల పార్కింగ్ను నిరోధించడం, సర్వీస్ రోడ్లను చెత్త నిల్వ ప్రదేశాలుగా ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలి. మహిళలు, బాలల రక్షణకు సంబంధించి వేధింపుల నివారణ, బాల్య వివాహాల నిర్మూలన అవగాహన, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, 0–6 సంవత్సరాల పిల్లలు, కిశోర బాలికల పోషణపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. స్వయం సహాయక సంఘాలతో సమావేశాలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, పచ్చదనం పెంపుపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. సంక్షేమంపై ఇలా.. సంక్షేమ రంగంలో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్న బియ్యానికి బోనస్, మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల లబ్ధిదారుల పేర్లను సభలో పరిచయం చేస్తారు. పాఠశాలల్లో చేరికలు, బడిబయట పిల్లలు, నాణ్యమైన విద్య, అమ్మ ఆదర్శ పాఠశాలల అమలు, మధ్యాహ్న భోజనంలో పోషకాహార ప్రమాణాలపై అవగాహన కల్పిస్తారు. ఆరోగ్య రంగంలో తల్లి, శిశు సంరక్షణ, టీకాలు, వ్యాధుల నియంత్రణ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల మెరుగుదల, పీహెచ్సీల నుంచి రిఫరల్ సేవలపై చర్చించనున్నారు. పురపాలికలో.. ఈ నెల 6న మున్సిపాలిటీల్లో శానిటేషన్ డ్రైవ్లు నిర్వహించాలి. 7న ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, స్థానిక ప్రజలతో శుభ్రత కార్యక్రమాలు, 8న కంపోస్ట్ యూనిట్లు, డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ల ఏర్పాటు, చెత్త సేకరణ, 9న 5కే రన్, పార్కుల్లో కంపోస్టింగ్ కేంద్రాల ఏర్పాటు, 10న ప్రధాన కూడళ్లను గుర్తించి వ్యర్థాలతో కళాకృతులు, 11న మరుగుదొడ్ల పరిస్థితి పరిశీలన, హోటళ్లు, రెస్టారెంట్ల తనిఖీలు, 12న ప్రజాప్రతినిధులకు శిక్షణ, 13న నీటి ట్యాంకులు, రిజర్వాయర్ల శుభ్రత, 14న కూడళ్ల అభివృద్ధి, నర్సరీల సందర్శన, మొక్కల నాటడానికి సన్నాహాలు, 15న ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులతో శుభ్రత కార్యక్రమాలు, పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు పంపిణీ చేస్తారు. -
‘మద్దతు’ ఇవ్వని మార్క్ఫెడ్!
సాక్షి ప్రతినిధి, వరంగల్: మొక్కజొన్నల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. మార్క్ఫెడ్ చాలా చోట్ల ఇంకా కొనుగోళ్లను ప్రారంభించలేదు. ఫలితంగా సిండికేట్గా మారిన ప్రైవేట్ వ్యాపారులు మార్కెట్లో ఇష్టారాజ్యంగా మొక్కజొన్నలు కొంటున్నారు. 2025–26 ఖరీఫ్ సీజన్లో కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాకు రూ.2,400 కనీస మద్దత ధర (ఎంఎస్పీ)ని ప్రకటించింది. మొక్కజొన్నల కొనుగోలు విషయంలో మార్క్ఫెడ్, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు దూరంగా ఉన్నాయి. దీంతో ఖరీఫ్లో ఎలాగోలా గండం గట్కెక్కించుకున్న మొక్కజొన్న రైతులకు ఈ యాసంగిలో వ్యాపారులు చుక్కలు చూపెడుతున్నారు. క్వింటాకు రూ.1,850 నుంచి రూ.1,950 మించి ధర ఇవ్వకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. 2.11 లక్షల ఎకరాల్లో సాగు.. ఎంఎస్పీ బహు జాగు 2025–26 యాసంగి సీజన్కు సంబంధించి విత్తనాల వేసే నుంచి ఫిబ్రవరి–మే మధ్య వరకు సాగు నమోదు ఆధారంగా 2,11,500 ఎకరాల్లో మొక్కజొన్న వేసినట్లు వ్యవసాయశాఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ సాగు ఆధారంగానే ఒక్కో ఎకరానికి వాతావరణ పరిస్థితుల ఆధారంగా 28 క్వింటాళ్ల నుంచి 32 వరకు వస్తుందనేది అంచనా. ఈ లెక్కన 5.92 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 6.78 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు దిగుబడి రావొచ్చని భావించి ఆ మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మార్క్ఫెడ్ సహా ఇతర ప్రభుత్వరంగ సంస్థలను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోళ్లను ప్రారంభించకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులే వ్యవసాయ మార్కెట్ కమిటీలతో పాటు నేరుగా గ్రామాలకు వెళ్లి అగ్గువసగ్గువకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ‘లాభాల మాట దేవుడెరుగు కానీ ఇంటిల్లిపాది కష్టపడినప్పటికీ పెట్టుబడులు పోను రెక్కల కష్టం కూడా మిగిలడం లేదు’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి రూ.28,000 నుంచి రూ.40 వేలు ఖర్చు చేస్తే.. ఇప్పుడున్న ధరల ప్రకారం రూ.18.200 నుంచి రూ.23,000 వరకే మిగిలితే అప్పులు, వడ్డీలకే సరిపోతున్నాయని చెబుతున్నారు.2025–26లో జిల్లాల వారీగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం.. దిక్కుతోచని స్థితిలో మొక్కజొన్న రైతులు మొక్కజొన్న వ్యాపారుల ‘సిండికేట్’.. క్వింటాకు రూ.1,950 దాటని పరిస్థితి ఎంఎస్పీ క్వింటాలుకు రూ.2,400.. ‘కనీస మద్దతు’ కోసం ఎదురుచూపులు ఉమ్మడి వరంగల్లో 2.11 లక్షల ఎకరాల్లో సాగు 7.56 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేక అన్నదాతల ఆందోళనఖర్చు అంశం సుమారు ఖర్చు రూ.లు)భూమి దున్నడం, సిద్ధం చేయడం 4,000 – 6,000 విత్తనాలు (హైబ్రిడ్) 3,000 – 4,000 ఎరువులు 5,000 – 7,000 మందులు (కీటక నివారణ) 3,000 – 5,000 కూలీల ఖర్చు 6,000 – 8,000 నీటి ఖర్చు 3,000 – 5,000 కోత – రవాణా 4,000 – 6,000 మొత్తం ఖర్చు 28,000 – 40,000 జిల్లా సాగు విస్తీర్ణం ( ఎకరాల్లో...)హనుమకొండ 58,000 వరంగల్ 46,000 జనగామ 30,150 మహబూబాబాద్ 40,230 ములుగు 20,125 జేఎస్ భూపాలపల్లి 16,995 మొత్తం 2,11,500 -
పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో గురువారం పీజీ కోర్సులు ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ తదితర కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీలోని పలు పరీక్ష కేంద్రాలను హ్యూమనిటీస్ భవనం, మైక్రోబయాలజీ, జియాలజీ, కామర్స్అండ్ బిజినెస్మేనేజ్మెంట్ కళాశాలలను కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, పరీక్షల విభాగం అధికారులతో కలిసి సందర్శంచి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షల నిర్వహణను పరిశీలించిన వారిలో యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య టి.మనోహర్, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి శ్రీనివాస్, వివిధ విభాగాల అధిపతులు ఉన్నారు. సుబేదారిలోని యూనివర్సిటీ మహిళా పీజీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఒకరు కాపీయింగ్ చేస్తూ పట్టుబడి డీబార్ అయినట్లు కేయూ అదనపు పరీక్షల నియంత్రణాధికారి పి.శ్రీనివాస్ తెలిపారు. -
రైతులను ఆదుకోవాలి..
టీజీ మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన మక్కలను ప్రభుత్వ మద్దతు ధరకు కొనాలి. ఎకరానికి రూ.వేలల్లో పెట్టుబడులు పెట్టి చివరకు రెక్కల కష్టం కూడా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి మొక్కజొన్న రైతులను వెంటనే ఆదుకోవాలి. – టి.సారయ్య, ఉపాధ్యక్షుడు, ఎంఏసీఎస్, మాణిక్యాపూర్, భీమదేవరపల్లి దళారులు ఇబ్బంది పెడుతున్నారు..మార్క్ఫెడ్ అధికారులు సరైన విధంగా కొనుగోలు కేంద్రాలు తెరవని కారణంగా దళారులు, ప్రైవేట్ వ్యాపారులు రంగప్రవేశం చేసి తక్కువ ధరకు మక్కలు కొంటున్నారు. ఖరీఫ్లోనూ రైతులకు మక్కలు అమ్ముకునే విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు యాసంగి మొక్కజొన్నల విషయంలో కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించాలి – రామారపు సాంబయ్య, రైతు, మాణిక్యాపూర్, భీమదేవరపల్లి -
సైబర్ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు
జనగామ రూరల్: సైబర్ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. గురువారం పోలీస్ స్టేషన్లో సైబర్ నేరంపై పట్టణానికి చెందిన మహేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లో ఉండి మొబైల్లో బినాన్స్ యాప్ ద్వారా నాలుగు మ్యూల్ అకౌంట్లు సృష్టించి, ఇతరులతో చేతులు కలిపి ఆ అకౌంట్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ సైబర్ నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో బయటపడిందన్నారు. సైబర్ నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితుడు మహేష్ పాత్ర స్పష్టంగా బయటపడినట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ భరత్ పాల్గొన్నారు. -
దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలి
జనగామ రూరల్: దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలని కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ అన్నారు. గురువారం పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ జిల్లా స్థాయి పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కాకతీయ యూనివర్సిటీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ మాట్లాడుతూ..ప్రజాస్వామ్య విలువలు, నా యకత్వ లక్షణాలు విద్యార్థుల్లో పెంపొందించడానికి యూత్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం యూత్ పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. సంధ్యారాణి, డీఎస్ వెంకన్న, కె.వేణుగోపాల్రావు, వి.ప్రసాద్రావు, ప్రోగ్రాం ఆఫీసర్ కె.అరుణ కుమారి పాల్గొన్నారు. రఘునాథపల్లి: మండలంలోని అశ్వరావుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బోడ లాస్య జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డుకు ఎంపిౖకైనట్లు పాఠశాల హెచ్ఎం పి.శోభన్బాబు గురువారం తెలిపారు. భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఎంపిక జాబితాలో 9వ తరగతి విద్యనభ్యసిస్తున్న బోడ లాస్య స్థానం సంపాదించుకుంది. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మతకను, శాసీ్త్రయ దృక్పథాన్ని వెలికిదీసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేస్తోంది. సందర్భంగా లాస్యను సర్పంచ్ చైతన్య, ఏఏపీసీ చైర్మన్ రేణుక, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు. హన్మకొండ: విద్యుత్ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడీ, సర్ చార్జీల ప్రతిపాదనలపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఈ నెల 6న బహిరంగ విచారణ చేపట్టనుంది. ఈ మేరకు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం బహిరంగ విచారణకు ఏర్పాట్లు చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సవరించబడిన ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడీ, సర్ చార్జీల ప్రతిపాదనలపై శుక్రవారం ఉదయం 10:30 గంటలకు హనుమకొండ కలెక్టరేట్లో ఈ విచారణ చేపట్టనున్నట్లు యాజమాన్యం ఒక ప్రకటనలో వివరించింది. ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ డాక్టర్ దేవరాజ్ నాగార్జున్, సభ్యులు రఘు కంజర్ల, సీహెచ్.శ్రీనివాస్రావు పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యుత్ వినియోగదారులు ఈ బహిరంగ విచారణకు హాజరు కావాలని కోరారు. కాజీపేట అర్బన్ : కాజీపేట మండలం మడికొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో(మహిళా ప్రాంగణం)లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య రిటైల్ సేల్స్ అసిస్టెంట్ ఉపాధి నిమిత్తం ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాంగణం జిల్లా అధికారి జయశ్రీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులు ఈనెల 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 76600 22526 లేదా 76600 22525 నంబర్లలో సంప్రదించాలని కోరారు. మహాసభలను జయప్రదం చేయండి జనగామ రూరల్: జీఎంపీఎస్ 3వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి సాదం రమేశ్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా అధ్యక్షుడు మోటే దేవేందర్ ఆధ్యక్షతన జిల్లా కేంద్రంలోని బీరప్ప గుడి ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. అనంతరం మహాసభల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు జీగారి యాదగిరి, సహాయ కార్యదర్శి కన్నెబోయిన బాలరాజు, ఉలిగిల్ల చంద్రయ్య పాల్గొన్నారు. -
హలో.. వైద్యసేవలు బాగున్నాయా?
లింగాలఘణపురం: ‘హలో శ్రావణీ గారా..? మేము లింగాలఘణపురం పీహెచ్సీ నుంచి మాట్లాడుతున్నాం.. వైద్య సేవలు ఎలా ఉన్నాయి..? ఏఎన్ఎంలు మీ వద్దకు వస్తున్నారా..? నెలలో ఎన్నిసార్లు పరీక్షిస్తు్ాన్నరు..? ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకుంటున్నారా..డెలివరీ ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నారు..’అంటూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పీహెచ్సీ సిబ్బంది అందిస్తున్న సేవలపై గర్భిణికి ఫోన్ చేసి తెలుసుకున్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గర్భిణుల రిజిష్ట్రర్ను చూసి అందులో ఒకరిద్దరికి వారి ఫోన్ నంబర్లకు నేరుగా ఫోన్ చేసి ఏఎన్ఎం సేవలపై ఆరా తీశారు. తాను కలెక్టర్ను మాట్లాడుతున్నానని అనకుండా పీహెచ్సీ నుంచి మాట్లాడుతున్నామంటూ గర్భిణులతో మాట్లాడారు. అంతకు ముందు సిబ్బంది అటెండెన్స్ రిజిష్ట్రర్ను పరిశీలించారు. ఓపీ డాక్టర్ గదిలో కాకుండా బయట ఏర్పాటు చేయాలని, ఆర్ఓ ప్లాంటు రోగులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ల్యాబ్, ఫార్మసీ, డెలివరీ గదులను పరిశీలించి తగిన సూచనలు చేశారు. అనంతరం ఏఎన్ఎంలతో మాట్లాడుతూ.. క్యాన్సర్ టీకా ఏ వయసు వారికి వేయాలని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీలు అయ్యే విధంగా గర్భిణులకు అవగాహన కల్పించాలని డాక్టర్ స్వర్ణలతను ఆదేశించారు. గర్భిణులతో ఫోన్లో ఏఎన్ఎం సేవలపై కలెక్టర్ ఆరా..! పీహెచ్సీలో ఆకస్మిక తనిఖీ -
పట్టణంలోని 22వ వార్డులో..
జనగామ: పట్టణంలోని 22వ వార్డులో ఈనెల 6(శుక్రవారం)న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ తెలిపారు. గురువారం తన చాంబర్లో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, డీఈ రాజ్కుమార్, వార్డు కౌన్సిలర్ మారబోయిన పాండు తదితర అధికారులతో కలిసి ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగుతున్న ప్రజా సంక్షేమపాలనలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకా ల పురోగతిని ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ప్రజాప్రతి నిధులు పాల్గొని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పొందాలని ఆమె కోరారు. -
అంకితభావంతోనే సంస్థకు మంచిపేరు
● లైన్మెన్ దినోత్సవంలో ఎస్ఈ సంపత్రెడ్డి జనగామ: ఎన్పీడీసీఎల్ సంస్థలో పనిచేస్తున్న లైన్మెన్ల అంకితభావం, నిబద్ధతతోనే సంస్థకు మంచిపేరు వస్తుందని ఎస్ఈ సంపత్రెడ్డి అన్నారు. లైన్మెన్ దినోత్సవం పురస్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయ ఆవరణలో వేడుకలను నిర్వహించారు. అనంతరం ఎస్ఈ మాట్లాడుతూ.. విద్యుత్ విభాగంలో అహర్నిశలు శ్రమిస్తూ ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించే లైన్మెన్ సేవలు ప్రశంసనీయమన్నారు. లైన్మెన్ల సేవలకు గుర్తింపుగా సత్కరించి, ప్రశంసపత్రాలు, పోల్ కై ్లంబింగ్ క్లాంపులు అందజేసి వారి సేవాభావాన్ని అభినందించారు. డీఈలు గణేష్, లక్ష్మీనారాయణరెడ్డి, సబ్డివిజన్ ఏడీఈ వేణుగోపాల్, ఏఈలు సౌమ్య, చంద్రమోహన్, రూరల్ ఏఈఈ మధు, సబ్ ఇంజనీర్లు మనో హర్, కృప, టౌన్–1, టౌన్–2, రూరల్ సిబ్బందితో పాటు ఎఫ్ఎం, ఎస్ఎల్ఐ, ఎల్ఎం, ఏఎల్ఎం, జేఎల్ఎం, ఆర్టిజన్స్, కట్టర్స్ పాల్గొన్నారు. -
జిల్లాల వారీగా 9వ తరగతి విద్యార్థులు
హనుమకొండ 15,812 వరంగల్ 11,398ములుగు 3,535మహబూబాబాద్ 7,728జేఎస్ భూపాలపల్లి 3,908 జనగామ 6,560 7 కేంద్రాల్లో నిర్వహణ.. ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సుళ్లూరుపేట (ఏపీ), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), షిల్లాంగ్(మేఘాలయ). ఎవరు అర్హులంటే.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. స్పేస్, సైన్స్ క్లబ్లో ఉంటే 5 శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో ఉంటే 5 శాతం, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి 20 శాతం ప్రాధాన్యం ఇస్తారు. ● -
క్రిటిజల్ సమస్య!
జనగామ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి పరిధిలో చంపక్హిల్స్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ విభాగం త్వరలో ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందించడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఆమోదించిన ఈ ప్రత్యేక విభాగం జిల్లా ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన సంరక్షణ అందించడమే ముఖ్య ఉద్దేశం. అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే సేవలను మరింత బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న క్రిటికల్ కేర్ భవనంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ), హైడిపెండెన్సీ యూనిట్ (హెచ్డీయూ), ఐసోలేషన్ వార్డులు, మేజర్ ఆపరేషన్ థియేటర్లు, డయాలిసిస్ యూనిట్, మెటర్నిటీ క్రిటికల్ కేర్, సీటీ స్కాన్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఈఎండీ వార్డు వంటి విభాగాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి అత్యవసర వైద్యసేవలు, ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులకు 24 గంటల పర్యవేక్షణ, అత్యున్నత స్థాయి చికిత్సలు అందించేలా రూపుదిద్దుకుంటున్నాయి. వెంటిలేటర్ సపోర్ట్, కార్డియాక్ మానిటరింగ్, సెప్సిస్ (ఇన్ఫెక్షన్లకు శరీరం చూపే అతి తీవ్రమైన ప్రతిస్పందన), స్ట్రోక్, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి తక్షణ శస్త్రచికిత్స, నిరంతర పర్యవేక్షణ వంటి సేవలు ఈ ఐసీయూలో అందుబాటులో ఉంటాయి. హెచ్డీయూ యూనిట్లో ఐసీయూ నుంచి కోలుకుంటున్న లేదా అత్యవసర పరిస్థితికి దగ్గరలో ఉన్న రోగులకు మధ్యస్థ సంరక్షణను అందించడానికి ఉపయోగపడుతుంది. కాగా ఐసోలేషన్ వార్డులు వైరల్, ఎపిడెమిక్ వ్యాధుల బారినపడిన రోగులను వేరుగా ఉంచి చికిత్స చేయడానికి ముఖ్యపాత్ర పోషిస్తాయి. క్రిటికల్ డెలివరీ కేసులకు మెటర్నిటీ క్రిటికల్ యూనిట్ ఉపయోగకరంగా ఉంటుంది. సీటీస్కాన్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ వంటి ఆధునిక నిర్ధారణ పరికరాలు ఉండటం వల్ల అత్యవసర కేసులను తక్షణమే గుర్తించి చికిత్స ప్రారంభించే అవకాశం కలుగుతుంది. ప్రమాదాలు, గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోక్లు, విషతుల్యత్వం, భారీ రక్తస్రావం వంటి పరిస్థితుల్లో ఈ విభాగం ప్రాణరక్షణకు కీలకంగా నిలుస్తుంది. జిల్లా ప్రజలకు అత్యవసర వైద్య సేవల నాణ్యత పెంచడమే కాకుండా, హనుమకొండ, హైదరాబాద్ వంటి దూరప్రాంతాలకు వెళ్లకుండా జిల్లా కేంద్రంలోనే ఉన్నతస్థాయి చికిత్స అందించడంలో క్రిటికల్ కేర్ విభాగం కీలక పాత్ర పోషించనుంది. ఈ విభాగం పూర్తిస్థాయిలో అందుబాటు లోకి వస్తే జిల్లా ఆరోగ్య వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అనుబంధంగా నిర్మించిన క్రిటికల్ కేర్ భవనం పూర్తై నెల రోజులైనా ప్రారంభానికి నోచుకోవడం లేదు. చంపక్హిల్స్ ప్రాంతం కొండల ప్రదేశం కావడంతో అక్కడ వేసిన బోర్లు వెయ్యి అడుగుల లోతు దాటినా నీరు రాకపోవడం పెద్ద సమస్యగా మారింది. భవనం పూర్తిస్థాయిలో ప్రారంభమైతే నీటి కొరత తీవ్రంగా తలెత్తే అవకాశం ఉండడంతో ఆసుపత్రి వర్గాలు.. కాంట్రాక్టర్ నుంచి భవనాన్ని స్వాధీనం చేసుకోవడం లేదు. క్రిటికల్ కేర్కు నీటి సమస్యపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం ఆధ్వర్యంలో కలెక్టర్కు రిప్రజెంటేషన్ అందించారు. నీటి సమస్య పరిష్కారంపై అధికార యంత్రాంగం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నీటి వనరులపై స్పష్టత రాకపోవడంతో క్రిటికల్ కేర్ భవనం స్వాధీనం చేసుకోవడంలో వాయిదా పడుతోంది. నీటి సమస్యకు పరిష్కారం చూపే వరకు భవనం బాధ్యతలు స్వీకరించేందుకు వారు ముందుకు రావడం లేదు.ఎంసీహెచ్ ఆవరణలో 50 పడకల క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్ నిర్మాణం పూర్తయింది. మొత్తం రూ.23.75 కోట్లు వ్యయంతో నిర్మాణం చేపట్టారు. 22 ఎకరాల విస్తీర్ణంలో రెండు అంతస్థుల నిర్మాణం చేపట్టారు. భవన ప్రదేశం 42,691 చదరపు అడుగులు ఉండగా, ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ 24,541 చదరపు అడుగులు, మొదటి అంతస్థు 18,150 చదరపు అడుగుల వైశాల్యంలో ఉంది. మే 2023లో ప్రారంభమైన క్రిటికల్ కేర్ భవన నిర్మాణం మార్చి 2025లో పూర్తి చేశారు. ఆపరేషన్ థియేటర్లు: 2 ఐసోలేషన్ రూములు: 2 ఎగ్జామినేషన్ రూం డయాలిసిస్ రూం మెటర్నిటీ వార్డు ఎల్డీఆర్ ఈఎండీ వార్డుసీటీ స్కాన్ ఎక్స్–రే అబ్జర్వేషన్ రూమ్ అల్ట్రాసౌండ్ ఫస్ట్ ఫ్లోర్: ఐసోలేషన్ వార్డులు:6 ఐసీయూ హెచ్డీయూ వెయ్యి అడుగుల లోతు బోరు వేసినా కనిపించని చుక్కనీరు నీటివనరులపై రాని స్పష్టత కలెక్టర్కు నివేదించిన జిల్లా వైద్యశాఖ అధికారులు -
‘అసంబద్ధ సిఫార్సులు తొలగించాలి’
జనగామ రూరల్: తెలంగాణ విద్యాకమిషన్ సమర్పించిన విధానపత్రంలోని పలు అసంబద్ధ సిఫార్సులను తక్షణమే తొలిగించాలని ఏపీటీఎఫ్ పూర్వాధ్యక్షుడు ఎ.నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. టీపీటీఎఫ్ జిల్లా సబ్ కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఎన్ఎన్ రాజు అధ్యక్షతన పట్టణంలోని ఉమాపతి భవన్లో జరిగింది. ఈసందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ఉత్తీర్ణత మార్కులను 45 శాతానికి పెంచడమనేది విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసేదిగా ఉందని, ఫలితంగా డ్రాపౌట్లు పెరిగే ప్రమాదముందన్నారు. వివిధ ప్రవేశ పరీక్షల రద్దు అనేది కార్పొరేట్ విద్యాసంస్థలకు ఊతమిచ్చేదిగా ఉందన్నారు. పేద విద్యార్థులకు అందజేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేయాలని అనడం సమంజసం కాదన్నారు. ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువని, జీతం కోతపెట్టాలని సూచించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంకుశావళి, జిల్లా పూర్వ అధ్యక్షుడు బి లక్ష్మయ్య, జిల్లా బాధ్యులు శారద, కవిత, రాజారెడ్డి, లక్ష్మణ్ జి, రాజేందర్, వెంకన్న, శ్రీహరి, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెద్దల సభకు వేం నరేందర్రెడ్డి
● పేరు ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం ● నేడు నామినేషన్ దాఖలు సాక్షి, మహబూబాబాద్: రాజ్యసభ సభ్యుడిగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అత్యంత సన్నిహితుడిగా పేరున్న నరేందర్రెడ్డి ప్రస్తుతం సీఎం ముఖ్య సలహాదారుడిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ సభ్యుల స్థానంలో తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. ఏఐసీసీ కోటాలో అభిషేక్ మనుసింఘ్వీకి మరోమారు అవకాశం కల్పించగా, రాష్ట్ర కోటాలో వేం నరేందర్రెడ్డికి చాన్స్ ఇచ్చారు. ఈ మేరకు ఇరువురు నేడు(గురువారం) అసెంబ్లీ సెక్రటరీకి తమ నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన మరో నాయకుడికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పేరు: వేం నరేందర్రెడ్డి తల్లిదండ్రులు: కృష్ణారెడ్డి, రత్నమ్మ భార్య: విజయ కుమారులు: కృష్ణభార్గవ్, కృష్ణచైతన్య గ్రామం: అర్పనపల్లి, మండలం కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా రాజకీయ అనుభవం: 2004 – 2009 వరకు మహబూబాబాద్ ఎమ్మెల్యే ప్రస్తుతం: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్య సలహాదారుడు -
నాణ్యమైన విద్యకు ‘ఆదర్శం’
జనగామ రూరల్: చదువులో ఆదర్శంగా ఉంటూ బలహీన వర్గాల విద్యార్థులకు గొప్ప అవకాశంగా ఆదర్శ పాఠశాలలు నిలుస్తున్నాయి. ఇటు ఇంగ్లిష్ మీడియం చదువులు..అటు పౌష్టికాహారం అందిస్తూ ఎంతో మంది విద్యార్థుల అభివృద్ధికి తోడ్ప డుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా జిల్లాలో పదో తరగతిలో 98 శాతం, ఇంటర్లో 95 శాతంపైగా ఉత్తీర్ణత సాధిస్తున్నాయి. ప్రస్తుతం 2026–27 సంవత్సరానికి గాను 6వ తరగతిలో 100 సీట్లు, 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలి ఉన్న పరిమిత సీట్లకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోనే అవకాశం కల్పించారు. జిల్లాలో మొత్తం 8 ఆదర్శ పాఠశాలు ఉండగా ఒక్కో పాఠశాలలో 6వ తరగతి ప్రవేశానికి 100 సీట్లు ఉన్నాయి. మిగిలిన తరగతులకు సంబంధించి ఖాళీలు భర్తీ చేయనున్నారు. జిల్లాలో చౌడారం, వెల్ది, బచ్చన్నపేట, కొడకండ్ల, లింగాల ఘణపురం, జఫర్గఢ్, స్టేషన్ ఘన్పూర్, నర్మెట మండలాల్లో పాఠశాలలున్నాయి. వారం ముందు నుంచే హాల్ టికెట్లు ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 10వ తేదీ తర్వాత ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 6 తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్ష కోసం ఓసీ విద్యార్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 ఫీజు చెల్లించాలి.సంవత్సరం ఉత్తీర్ణతా శాతం 2021–22 94.72 2022–23 91.90 2023–24 98.14 2024–25 98.98 గ్రామీణ పేద విద్యార్థులకు గొప్ప అవకాశం ఆరు నుంచి టెన్త్ వరకు ప్రవేశాలు ఈనెల 10 వరకు దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 19న పరీక్ష.. జిల్లా వ్యాప్తంగా 8 పాఠశాలలుఆరో తరగతి ప్రవేశ పరీక్షలో 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. తెలుగు, గణితం, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఆంగ్లం పాఠ్యాంశాల్లో ఒక్కో దాని నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. 7 నుంచి 10వ తరగతి వారికి గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం, ఇంగ్లిష్ నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో దాని నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. 2 గంటల పాటు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. -
ఆలయాల ద్వారబంధనం
పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 8 గంటలకు ఆలయం ద్వారబంధనం చేశారు. శ్రీ సిద్ధేశ్వరాలయం.. బచ్చన్నపేట: మండలంలోని కొడవటూర్ గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వరాలయాన్ని చంద్ర గ్రహణం సందర్భంగా మూసివేసినట్లు ఆలయ ఈఓ చిందం వంశీ, ప్రధాన అర్చకులు ఓం నమశివాయ తెలిపారు. చిల్పూరు ఆలయం.. చిల్పూరు: చిల్పూరుగుట్ట శ్రీబుగులు వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం 9 గంటలకు చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ అర్చకులు ద్వారబంధనం చేశారు. -
అంగన్వాడీలకు వెలుగులు
366 సెంటర్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లుజిల్లాలో అంగన్వాడీ సెంటర్ల వివరాలుఅంగన్వాడీలు : 695 శాశ్వత భవనాలు : 243అద్దెభవనాలు : 178నూతన విద్యుత్ కనెక్షన్లు : 366ఖర్చు (రూ.లక్షలు) : 26.25ప్రైవేటులో అద్దెలేని భవనాలు : 274 గర్భిణులు : 2,419 బాలింతలు : 2,393 7 నెలల నుంచి 3 ఏళ్ల పిల్లలు : 11,7443 నుంచి 6 ఏళ్ల పిల్లలు : 8,818 జనగామ: జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యాన్ని అందించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) చర్యలు చేపట్టింది. చిన్నారుల అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత విద్యుత్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ఆదేశాల మేరకు కనెక్షన్ల ప్రక్రియను వేగవంతంగా చేస్తున్నారు. జిల్లాలో 695 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి పర్యవేక్షణలో ఇందులో 366 చోట్ల శాశ్వత విద్యుత్ కనెక్షన్లను ఏర్పాటు చేస్తున్నారు. కీలకంగా విద్యుత్ వినియోగం ప్రీస్కూల్ పేరుతో కొనసాగుతున్న అంగన్వాడీ సేవలను పొందుతున్న వారి సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతుండడంతో విద్యుత్ సౌకర్యం అత్యంత కీలకంగా మారింది. 329 సెంటర్లకు విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 366 చోట్ల జీపీ, ఇతర భవనాల నుంచి తాత్కాలిక పద్ధతిలో కనెక్షన్లు ఇచ్చి నడిపిస్తున్నారు. పిల్లలకు అందించే ప్రీస్కూల్ కార్యకలాపాలు, పోషక ఆహార పంపిణీ, ఆరోగ్య పరీక్షలు, వేసవి కాలంలో తాగునీటి సౌకర్యం, వెంటిలేషన్ కోసం ఫ్యాన్లు వంటి సేవలకు విద్యుత్ కీలకంగా ఉండడంతో శాశ్వత ప్రాతిపదికన చేపట్టిన ఈ చర్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 366 అంగన్వాడీలకు ఉచిత కనెక్షన్లు జిల్లాలో ఇప్పటివరకు విద్యుత్ కనెక్షన్ల్లు లేని 366 అంగన్వాడీలను గుర్తించి, వీటికి మొత్తం రూ.26.25 లక్షల వ్యయంతో ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ లేని కేంద్రాలన్నింటినీ మ్యాపింగ్ చేసి, దశల వారీగా కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. ముందుగా పాఠశాలలు లేదా ఇతర సంస్థల సౌకర్యాలతో విద్యుత్ ఉపయోగిస్తున్న కేంద్రాలకు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా శాశ్వత సర్వీస్ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా ఎన్పీడీసీఎల్ టీంలు 366 అంగనన్వాడీలకు మీటర్లు బిగించి, సర్వీస్ వైర్లు వేసి కనెక్షన్లు పూర్తిచేశారు. వైరింగ్ పనులు, స్టేఫ్టీ పరికరాలు, తాగునీటి మోటార్లు, లైటింగ్ తదితర పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ మొత్తం ప్రక్రియ పూర్తిగా ఉచితంగా జరుగుతుండటం పేద ప్రాంతాల్లోని అంగన్వాడీలకు పెద్ద ఉపశమనం కలిగించింది. పిల్లల అభ్యాసానికి మెరుగైన వాతావరణంఅంగన్వాడీలకు విద్యుత్ వెలుగులు చేరడంతో చిన్నారులు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్య ను అభ్యసించే అవకాశం ఉంటుంది. వేసవిలో ఫ్యాన్లు, బోరు మోటార్లు పనిచేయడం వల్ల పిల్లలు, గర్భిణులు, బాలింతలు, సేవలు పొందగలుగుతున్నారు. అంగన్వాడీల ఆధునీకరణలో ఎన్పీడీసీఎల్ పాత్ర కీలకంగా ఉంది. జిల్లాలో రూ.26.25 లక్షల బడ్జెట్తో 366 కేంద్రాలకు శాశ్వత ప్రాతిపదికన కనెక్షన్లు ఇవ్వగా, అవసరమైన చోట విద్యుత్ పోల్స్ సైతం ఏర్పాటు చేశాం. – సంపత్రెడ్డి, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్ రూ.26.25లక్షల బడ్జెట్ కేటాయింపులు ప్రీస్కూల్ కార్యక్రమాలకు మెరుగైన వాతావరణం -
ఆకాశంలో అద్భుతం
కనువిందు చేసిన రెడ్ మూన్ ● 3.27 గంటల సేపు చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమైన గ్రహణం సాయంత్రం 6.47 గంటలకు వీడింది. మొత్తం 3.27 గంటల సేపు ఎరుపు వర్ణంలో (రెడ్ మూన్) చంద్రుడు పలు విధాలుగా కనువిందు చేశాడు. వంద సంవత్సరాల తర్వాత రంగుల పండుగ హోలీ రోజున వచ్చిన చంద్రగ్రహణాన్ని ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. – సాక్షి స్టాఫ్ఫొటోగ్రాఫర్, హన్మకొండ 6:56 -
కల్యాణం.. కమనీయం
దేవరుప్పుల : ఏటా హోలీతో ప్రారంభమయ్యే శ్రీ వానకొండ లక్ష్మీనర్సింహ్మస్వామి జాతర పురస్కరించుకొని స్వామివారి కల్యాణమహోత్సవం జరిగింది. మంగళవారం గ్రహణం ఉండడంతో వేదబ్రహ్మణుల సూచనల మేరకు ఉదయం పది గంటలలోపు దేవతమూర్తుల కల్యాణ మహోత్సవం పూర్తి చేసేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలోనే గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో వేసిన కమిటీ సభ్యులు పూర్వపు తంతు మేరకు హనుమాన్ ఆలయం నుంచి స్థానిక సర్పంచ్ భాషిపాక రాములు దంపతులు తలంబ్రాలు తీసుకొని ముందస్తుగానే గుట్టపైకి చేరారు. కాగా గ్రహణంతో నిర్దిష్ట వేళకు కల్యాణం చేయాలనే పూజారుల సంకల్పంతో గుట్ట ముఖద్వారం(ఆర్చి)వద్ద ప్రత్యేక పూజలచే దేవాదాయ శాఖచే నియమించిన తాత్కాలిక ఆలయ కమిటీ చైర్మన్ మాసంపెల్లి భాస్కర్, వైస్ చైర్మన్ కాడవేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో తలంబ్రాలతోపాటు పుస్తెమట్టెలు, జిలుకర బెల్లంతో గుట్టపైకి చేరారు. అలాగే పద్మశాలీలు నల్ల ఉపేందర్, గుడెల్లి శ్రీనివాస్ తదితరులు ఆనవాయితీగా ట్రాక్టర్పై మగ్గంనేస్తూ ఆలయం వరకూ చేరుకొని నూతన వస్త్రాలను అందించారు. కాగా ఆలయ పూజారీ బీట్కూరి సంపత్కుమారచార్యులు వివాదాలకు తావివ్వకుండా ఇరువురు తలంబ్రాలు స్వీకరించి కల్యాణం పూర్తి చేశారు. దేవాదాయ శాఖ తాత్కాలిక కమిటీ చైర్మన్ మాసంపెల్లి భాస్కర్ సహకారంతో పూజారులు అన్నప్రసాద వితరణ చేశారు. వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య నేతృత్వంలో పాలకుర్తి సీఐ జానకిరామిరెడ్డి, స్థానిక ఎస్సై ఊర సృజన్కుమార్ బఽందోబస్తు చేపట్టారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు భాషిపాక రాములు, ధారావత్ సుజాత, లాకావత్ అనిత, టీపీసీసీ సభ్యులు లక్ష్మీనారాయణ నాయక్, విజయ డెయిరీ జిల్లా చైర్మన్ఽ ధర్మారెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వైభవంగా శ్రీవానకొండ లక్ష్మీనర్సింహ్మస్వామి వివాహ మహోత్సవం -
దశాబ్దకాలం లేట్ !
3వలైన్..సాక్షిప్రతినిధి, వరంగల్: ‘మీరు ఎక్కాల్సిన రైలు.. జీవితకాలం లేట్ అన్నట్లు.. కాజీపేట–విజయవాడ రైల్వే మూడోలైన్ పనులు దశాబ్దకాలమైనా పూర్తికావడం లేదు. దక్షిణమధ్య రైల్వే డివిజన్ పరిధిలోని ఈ పనులు ప్రారంభమై సంవత్సరాలు గడిచినా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. సుమారు 219.64 కిలోమీటర్లు నిర్మాణ పనులకు 2012–13లో ప్రతిపాదనలు చేశారు. 2016–17లో అధికారికంగా ఆమోదించి ప్రారంభించారు. హైదరాబాద్–చైన్నె, ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో అత్యంత కీలకమైనదిగా ఈ ప్రాజెక్టును తీసుకున్నారు. అయితే, కాజీపేట–విజయవాడ మూడో లైన్ నిర్మాణ పనులు అప్పటి నుంచి నెమ్మదిగా సాగుతున్నాయి. ఖమ్మం–డోర్నకల్ మధ్య 44.624 కిలోమీటర్ల నిర్మాణం కోసం భూసేకరణ సమస్యగా మారింది. ఇటీవల రైల్వే బడ్జెట్ సందర్భంగా కూడా ఈ మూడోలైన్పై చర్చ జరిగింది. కాగా, రూ.2,063 కోట్లతో జరుగుతున్న ఈ పనులను ఇప్పటికై నా వీలైనంత తొందరగా పూర్తి చేస్తే గూడ్స్, ప్యాసింజర్ రైళ్ల ట్రాఫిక్ సమస్య తగ్గి ప్రాజెక్టుకు మోక్షం కలగనుంది. ముందుకుసాగని 28 హెక్టార్ల భూసేకరణ.. కాజీపేట–విజయవాడ రైల్వే మూడో లైన్కు 2017 లో శంకుస్థాపన జరిగింది. ఇందుకోసం తెలంగాణలో 145, ఆంధ్రప్రదేశ్లో 173 కలిపి మొత్తం 318 హెక్టార్లకు పనులు జరిగిన కొద్దీ 290 హెక్టార్లు సేకరించారు. సుమారు 28 హెక్టార్ల భూసేకరణ ముందుకు సాగని కారణంగా పనులు మందగించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, పనుల ప్రారంభసమయంలో రూ.1,952 కోట్లుండగా.. రోజులు గడిచిన కొద్ది రూ.2,063 కోట్లకు చేరింది. 2023–24 నుంచే వేగం ఈ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగింది. ఈ మూడేళ్లలోనే రూ.1,070 కోట్ల వరకు ఇచ్చారు. 2023–24లో రూ.350 కోట్లు, 2024–25లో రూ.420 కోట్లు, 2025–26లో (చివరి పనుల కోసం) రూ.300 కోట్లు విడుదల చేశారు. 44.624 కిలోమీటర్ల నిర్మాణమే కీలకం.. హైదరాబాద్–చైన్నె, ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో ట్రాఫిక్ను తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక ప్రాజెక్టును తీసుకుంది. ఇందులో బల్లార్షా–కాజీపేట, కాజీపేట–విజయవాడ మధ్యన మూడో లైన్కు శ్రీకారం చుట్టింది. బల్లార్షా–కాజీపేట మధ్యన 202 కిలోమీటర్లకు 183.285 కిమీ పూర్తయి 18.715 కిమీ నిర్మాణం ప్రోగ్రెస్లో ఉన్నట్లు రైల్వే నివేదికలు పేర్కొంటున్నాయి. అదేవిధంగా కాజీపేట–విజయవాడ మధ్యన 219.64 కిమీకు 175.016 కిమీ పూర్తికాగా 44.624 కిమీ మేర బ్యాలెన్స్ ఉంది. ఖమ్మం–డోర్నకల్ మధ్య 19.59 కిమీ, డోర్నకల్–మహబూబాబాద్ మధ్య 25.034 కిమీ మేర రైల్వేలైన్ నిర్మాణం పనులు పూర్తి చేయాల్సి ఉంది. 28 హెక్టార్ల భూసేకరణ పెండింగ్లో ఉండడంతో పనులు నెమ్మదించాయని, ఇటీవలే భూసేకరణ పూర్తయి పనులు ప్రారంభించామని, త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. పదేళ్లయినా అసంపూర్తిగా కాజీపేట–విజయవాడ రైల్వే లైన్ పనులు ఉమ్మడి వరంగల్ నుంచి ఢిల్లీ, చైన్నె మార్గాల్లో వెళ్లడానికి.. ఆ ప్రాంతాలకు వస్తు రవాణా చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో రైళ్ల రద్దీ తగ్గి వేగం పెరగనుంది. ప్రస్తుతం కాజీపేట–విజయవాడ మార్గం రైల్వేకు అధిక ఆదాయాన్ని సమకూర్చే మార్గాల్లో ఒకటి. ప్రస్తుతం ఉన్న రెండు లైన్లు ఈ రద్దీని తట్టుకోలేక తరచూ నిండిపోతున్నాయి. దీని ఫలితంగా ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను నిలిపివేసి ఆదాయం సమకూర్చే గూడ్స్ రైళ్లకు గ్రీన్సిగ్నల్ ఇవ్వాల్సి వస్తోంది. ఈకారణంతో ప్రయాణికుల రైళ్లు ఆలస్యమవుతున్నాయి. మూడోలైన్ అందుబాటులోకి వస్తే రద్దీ నియంత్రించడంలో సాయపడుతుంది.ఈ మార్గంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య 219.64 కిలోమీటర్లు.. రూ.1,952.68 కోట్ల నిధులు 2016–17లో రూ.3,103.99 కోట్లకు అంచనాలు భూసేకరణ, నిధుల కొరతే అసలు సమస్య -
సోమనాథుడికి దీపారాధన
పాలకుర్తి టౌన్: తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుడి 787వ దీపారాధన మంగళవారం పాలకుర్తిలోని సోమనాథ స్మృతివనంలో మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సోమనాథ కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాపోలు సత్యనారాయణ అధ్యక్షత వహించగా పోతన సాహిత్య కళా వేదిక అధ్యక్షుడు మాన్యపు భుజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవస్థాన ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న శివాచార్య సంయోజకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో వీరమనేని వేంకటేశ్వరరావు, మార్గం లక్ష్మీనారాయణ, ఇమ్మడి దామోదర్, బజ్జూరి వేణుగోపాల్, మేరుగు మధుసూదన్, కూరపాటి సుదర్శన్, సింగ మహేందర్ రాజు, గూడూరు నిరంజన్, బెల్లి యాకయ్య, మమత తదితరులు పాల్గొన్నారు. 6న ఉద్యోగ మేళాజనగామ: జిల్లా ఉద్యోగ కల్పన శాఖ, డీఆర్డీఏ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలను అందించేందుకు ప్రైవేట్ జాబ్స్ ప్లేస్మెంట్స్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఈ నెల 6వ తేదీ (శుక్రవారం) ఉదయం 10.30 గంటలకు జనగామ మున్సిపల్ కాంప్లెక్స్ కాన్ఫరెన్స్ హాల్లో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉద్యోగ మేళాలో ప్రముఖ పరిశ్రమ సంస్థ మహీంద్రా, మహీంద్రా లిమిటెడ్ తన జహీరాబాద్ ఆటోమోటివ్ విభాగంలో ఖాళీగా ఉన్న 300 అప్రెంటిస్షిప్ పోస్టులను భర్తీ చేయనుంది. పురుషులు, మహిళలు ఇద్దరూ హాజరుకావచ్చు. అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్, విద్యార్హత సర్టిఫికెట్లు, అవసరమైన ఇతర పత్రాలు తీసుకుని ఇంటర్వ్యూకు హాజరవ్వాలని జిల్లా ఉద్యోగ కల్పనాధికారి పి.సాహితి సూచించారు. ఉద్యోగ మేళా పూర్తిగా ఉచితం కాగా, ఆసక్తిగల యువత ఈ అ వకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. మరింత సమాచారం కోసం 7995430401, 9948695910 నంబర్లలో సంప్రదించాలన్నారు. నిట్తో ఎన్ఐజీఎస్టీ ఎంఓయూకాజీపేట అర్బన్: నిట్ వరంగల్తో ఎన్ఐజీఐఎస్టీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ) సర్వే ఆఫ్ ఇండియా మంగళవారం పరస్పర ఒప్పందం కుదుర్చుకుంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, ఎన్ఐజీఎస్టీ డైరెక్టర్, సీనియర్ అధి కారి బీసీ పరీదా పరస్పరం ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు. కార్యక్రమంలో ఎన్ఐజీఎస్టీ ప్రతినిధులు నిత్యానందం, వెంకయ్యచౌదరి, నిట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. బ్యాంకు పేరిట నకిలీ పత్రాలు సృష్టించిన టీచర్?కాళోజీ సెంటర్: ప్రతీ ఆర్థిక సంవత్సరం ఉద్యోగులు ఆదాయ పన్ను లెక్కలు సమర్పించడం సాధారణ ప్రక్రియ. అయితే ఇందుకు సంబంధించిన ఓ ఉపాధ్యాయుడు ఏకంగా ఓ ప్రముఖ జాతీయ బ్యాంకు పత్రాలను సృష్టించి ఆదాయ పన్ను శాఖ అధికారులను పక్కదోవ పట్టించినట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యారుణంపై భారీ మొత్తంలో వడ్డీ చెల్లించినట్లు చూపుతూ సుమారు రూ.8.10 లక్షల మేర నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించి లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై బ్యాంకు అధికారులు విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపడితే అసలు విషయం వెలుగులోకి రావడమే కాకుండా మరి కొంతమంది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయమై కాంప్లెక్స్ హెచ్ఎంను వివరణ కోరగా ఈ విషయం మా దృష్టికి రాలేదని చెప్పారు. -
సమస్యలకు పరిష్కారం చూ‘పెట్టే’
జఫర్గఢ్: గురుకులాల్లో విద్యార్థులు నిత్యం చిన్నచిన్న సమస్యలతో ఆందోళనకు గురై మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. సమస్యను బైటకు చెప్పుకోలేక లోలోన ఇబ్బందులు పడుతుండడం వల్ల చదువులపై ప్రభావాన్ని చూపుతున్నది. దీన్నించి విద్యార్థులు బైటపడేందుకుగాను ప్రభుత్వం గురుకులాల్లో నూతనంగా ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేవారు. ప్రతీ పాఠశాలలో ప్రతీ శుక్రవారం తెరువాల్సిన విద్యార్థుల ఫిర్యాదుల పెట్టెను జఫర్గఢ్ గురుకుల పాఠశాలలో మాత్రం ప్రతీరోజు తెరిచి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపుతూ ఇతర గురుకులాలకు అదర్శంగా నిలుస్తున్నది. మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్మిడియట్ వరకు 600 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. చదువుల విషయంలోగాని, భోజన నాణ్యతలోగాని, తోటి విద్యార్థుల మధ్య ఏర్పడే సమస్యల పరిష్కారం కోసం వీరు తమ సమస్యలను రాసి ఫిర్యాదు బాక్స్లో వేయాల్సి ఉంటుంది. కాగా ఈ పెట్టెను వారం రోజులకు ఒకసారి తెరిచి బాక్స్లో పడిన ఫిర్యాదులను పరిశీలించి వాటి పరిష్కారానికి మార్గం చూపాలి. కానీ ఈ గురుకుల పాఠశాలలో మాత్రం పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్.వరలక్ష్మి ప్రత్యేకంగా ప్రతీ రోజు ఫిర్యాదుల పెట్టేను తెరిచి సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. జఫర్గఢ్ గురుకుల పాఠశాలలో సరికొత్త ఒరవడి -
ఆవేదన విన్నారు.. ఆరోగ్యపరిస్థితి తెలుసుకున్నారు
మా భూమిలో 60 ఏళ్లుగా మా వంశీకులు చనిపోతే గోరీలు నిర్మించుకుంటూ వస్తున్నాం. అయితే ఇటీవల కొంతమంది వ్యక్తులు వచ్చి భూమి తమదంటూ మా పూర్వీకుల గోరీలను కూలగొట్టి ఆ ప్రదేశాన్ని ఆక్రమించారు. ఈ పరిస్థితిని వివరించేందుకు దరఖాస్తుతో కలెక్టర్ సార్ను కలిసి మా ఆవేదన వ్యక్తం చేయడానికి వచ్చాం. నా మోచేతి వాపును చూసిన కలెక్టర్ నన్ను ఏమైందని అడిగారు. తేలు కరిచిందని, నొప్పితో పాటు జ్వరం కూడా ఉందని చెప్పితే వెంటనే అక్కడున్న సిబ్బందిని పిలిచి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాలని ఆదేశించారు. వారు హాస్పిటల్ తీసుకెళ్లగా డాక్టర్లు పరీక్షలుచేసి, గోలీలు ఇచ్చారు. మా సమస్యను వినడమే కాకుండా మా ఆరోగ్యంపై శ్రద్ధ చూపిన సార్కు కృతజ్ఞతలు. – చెరుకు సోమనరసయ్య, కొడకండ్ల -
ఆయా.. హోలీ
● నేడు రంగులపండుగ ● ఊరూ..వాడా ఉత్సాహంగా కామదహనం జనగామ: హోలీ పండగకు జిల్లా సిద్ధమైంది. హోలీ రంగుల అమ్మకాలకు ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి. యువత, పిల్లలు రంగులను కొనుగోలు చేసి ఆటకు సిద్ధమయ్యారు. హోలీ పండగ(మంగళవారం) రోజు మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణం ఉండడంతో, వేద పండితులు రాష్ట్ర ప్రజలకు ముఖ్య సూచనలు చేస్తున్నారు. గ్రహణం ప్రారంభం కాకముందే పూజలు, హోలీ సంబరాలను పూర్తి చేసుకోవాలని, గ్రహణ కాలంలో ఏ విధమైన శుభకార్యాలు చేయరాదని జనగామ వేద పండితులు స్పష్టం చేస్తున్నారు. గ్రహణం, హోలీ కలిసివచ్చిన ఈ సంవత్సరం, పూజా సంప్రదాయాలకు భంగం కలగకుండా జాగ్రత్తలు పాటిస్తూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని సంతోషీమాత ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ తెలిపారు. కామ దహనాలు.. పట్టణంలో సోమవారం రాత్రి కామదహనం కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లోని వాడవాడల్లో కామ దహనాలు జరిగాయి. -
పట్టణాభివృద్ధిపై కలెక్టర్తో ఎమ్మెల్యే భేటీ
● కౌన్సిలర్లతో కలిసి సమస్యలపై వినతిజనగామ: జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ కుమార్ ఝాను సోమవారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కలెక్టర్తో పలు అభివృద్ధి పనులు, సమస్యలపై భేటీ అయ్యారు. ఈ భేటీకి జనగామ మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్లు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎమ్మెల్యే పల్లా ప్రతి కౌన్సిలర్ను కలెక్టర్కు వ్యక్తిగతంగా పరిచయం చేస్తూ, వార్డు పరిధిలో ఉన్న ముఖ్య సమస్యలను వివరించారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, శానిటేషన్, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరామన్నారు. -
రాహుల్గాంధీని సన్మానించిన ధన్వంతి
జనగామ: వికారాబాద్ జిల్లాలో నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీని జనగామ డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు.. జిల్లాలో అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ పార్టీ బలోపేతం చేయాలని రాహుల్ సూచించినట్లు ధన్వంతి తెలిపారు. ముగిసిన బుగులు వెంకన్న బ్రహ్మోత్సవాలు చిల్పూరు: వారం రోజుల పాటు అంగరంగవైభవంగా నిర్వహించిన చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం స్వామివారి చక్రస్నానంతో ముగిశాయి. ఉదయం అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేదమంత్రాల నడుమ హోమం, బలి హరణం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. 10 గంటలకు స్వామి వారి చక్రస్నానం భక్తుల సమక్షంలో నిర్వహించి ఆశీర్వాదం అందజేశారు. కార్యక్రమంలో ఈఓ లక్ష్మిప్రసన్న–విష్వక్సేన, చైర్మన్ శ్రీధర్రావు, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. సదరం క్యాంపునకు హాజరుకావాలి జనగామ రూరల్: మీ సేవలో స్లాట్ బుకింగ్ చేసుకున్న దివ్యాంగులు యూడీఐడీ సదరం క్యాంపునకు హాజరుకావాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వసంత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రకాల దివ్యాంగులు కొత్త, రెన్యూవల్ వారు మీ సేవలో యూడీఐడీ వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ చేసుకున్న వారు రశీదులో ఉన్న ఫోన్ నంబర్కు మెసేజ్ వచ్చిన తేదీల్లో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సదరం శిబిరానికి హాజరుకావాలని కోరారు. ఈనెల 6వ తేదీ నుంచి కొనసాగే ఈ శిబిరంలో 6,9,11,12,13, 18,24,25,26,30వ తేదీల్లో ఆర్థో, దృష్టి, వినికి డి లోపం, మానసిక, తలసేమియా, క్రానిక్ న్యూరాలజీ, సంబంధిత దివ్యాంగులకు వైద్యులతో క్యాంపులు ఉంటాయన్నారు. కొత్తవి 292 ఉండగా, రెన్యూవల్ 136 ఉన్నాయని మొత్తంగా 428 మందికి అవకాశం ఉన్నదన్నారు. ఫోన్కు మెసేజ్ వచ్చినవారు డాక్టర్ రిపోర్టులతో ఆధార్ కార్డు ఫొటో, మీసేవ రశీదుతో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన శిబిరానికి హాజరు కావాలన్నారు. భలే భలే బార్న్ గుడ్లగూబ జనగామ: వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై అరుదైన జాతికి చెందిన ఒక బార్న్ గుడ్లగూబ(శాసీ్త్రయ నామం టైటో ఆల్బా)ను సోమవారం పట్టుకున్నారు. గుండె ఆకారంలో తెల్లటి ముఖం, బంగారు, తెలుపు రంగుల మిశ్రమంతో కనిపించే ఈ గుడ్లగూబ అరుదుగా కనిపిస్తుంది. దీనిని శ్వేత గుడ్లగూబ అనికూడా పిలుస్తారని అంటున్నారు. దాని శబ్దం చాలా విచిత్రంగా ఉంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన ఎస్బీ కానిస్టేబుల్ సోమలింగయ్య, అతడి స్నేహితులు భిక్షపతి, కుమారస్వామి, శంకర్ కారులో హైదరాబాద్కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో అస్వస్థతతో రోడ్డుపై కనిపించింది. వెంటనే ఓ డబ్బాలో వేసుకుని జనగామ పోలీస్స్టేషన్లోని కానిస్టేబుల్ సోమనారాయణకు అప్పగించారు. ఆయన వెంటనే సీఐ సత్యనారాయణరెడ్డికి సమాచారం అందించగా, అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. సెక్షన్ ఆఫీసర్ రవీందర్ వచ్చి గుడ్లగూబను తీసుకెళ్లారు. బార్న్ గుడ్లగూబను చూసేందుకు పోలీస్టేషన్ సమీప ప్రజలు ఆసక్తి కనబరిచారు. 02జెజిఎన్062:అరుదైన గుడ్లగూబను అటవీశాఖకు అప్పగిస్తున్న పోలీసులు 02జెజిఎన్,64:వింత ఆకారంలో బార్న్ గుడ్లగూబ -
వైభవంగా తిరువీధియాత్ర
స్టేషన్ఘన్పూర్: పట్టణ కేంద్రంలోని శ్రీతిరుమలనాథస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారి తిరువీధియాత్ర, రథోత్సవం, డోపు ఉత్సవం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కలకోట రంగాచార్యులు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఆలయంలో స్వామివారికి ప్రధాన పూజలు చేపట్టారు. అనంతరం స్వామివారిని అశ్వవాహనంపై ఉంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా రథోత్సవం నిర్వహించారు. తిరువీధియాత్రతో పట్టణకేంద్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కార్యక్రమంలో ఘన్పూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, దేవస్థాన చైర్మన్ నీల నర్సింహులు, వైస్ చైర్మన్ తాటికొండ యాదగిరి, డైరెక్టర్ గట్టు ప్రశాంత్, కొలిపాక సతీష్, భక్తులు పాల్గొన్నారు. -
చీకటి వెలుగులు పక్కపక్కనే!
రఘునాథపల్లి: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఓ వైపు వెలుగులు విరజిమ్ముతుంటే, మరోవైపు చిమ్మ చీకట్లోనే వాహనదారులు ప్రయాణించాల్సిన దుస్థితి. మండల కేంద్రంలో ఇరువైపులా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు వారం రోజు లుగా బస్టాండ్ నుంచి జనగా మ వైపు వెళ్లే సర్వీస్ రోడ్డుపై లైట్లు పనిచేయకపోవడంతో ప్రయాణికులు చీకట్లోనే ప్రయాణిస్తున్నారు. ఈ రహదారి గుండా ప లు గ్రామాల ప్రజలు రైల్వే స్టేషన్, ప్రభుత్వ ఆస్పత్రి, స్టేషన్ కాలనీకి వెళ్లి వస్తుంటారు. వెలుతురు లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రమాదాలకు గుర య్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎన్హెచ్ఏఐ అధికారుల నిర్లక్ష్యంతో సర్వీస్ రోడ్డు గుండా చీకట్లోనే ప్రయాణించాల్సి వస్తోందని వాపోతున్నారు. -
పరిష్కారం.. త్వరితగతిన
● ప్రజావాణిలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● వినతులు విని సిబ్బందికి ఆదేశాలు ● ప్రజల నుంచి 86 దరఖాస్తుల స్వీకరణజనగామ రూరల్: కుమారులు పట్టించుకోవడం లేదని, ఇందిరమ్మ ఇల్లు రావడం లేదని, భర్త నుంచి రావల్సిన భూమి ఇవ్వడం లేదని, కుమారుడు భూమి ఆక్రమించుకున్నాడని..ఇలా పలు సమస్యలతో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా వాణికి ప్రజలు పోటెత్తారు. ఈసందర్భంగా కలెక్టర్ సందీప్కుమార్ ఝా వారి వినతులను ఆలకించి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామని భరోసా కల్పించారు. అదనపు కలెక్టర్ బెన్ షాలో మ్తో కలిసి అయన 86 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, డీఆర్డీఓ వసంత, జిల్లా పౌరసరఫరాల అధికారి సరస్వతి, డీఏఓ అంబికా సోనీ, వివిధ శాఖల సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తులు కొన్ని ఇలా.. ● జఫర్గఢ్ మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన లోకిని కిష్టయ్య, తనకు సర్వే నంబర్ 173లో 7 గుంటలు, 324/బీలో 36 గుంటల భూమి కలదని, తన పేరున పట్టా పాస్ బుక్ జారీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ● కొడకండ్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన నలమాస నర్సమ్మ, తన భర్త కల్లు గీత కార్మికుడిగా చేస్తూ అనారోగ్యంతో మరణించాడని, తాను ఒంటరి మహిళ అయినందున పింఛన్ ఇప్పించాలని వేడుకుంది. ● జఫర్గఢ్ మండలం రఘునాథపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల స్వప్న, తనకు ఎకరం 27 గుంటల భూమి కలదని, ఆ భూమిని రికార్డులో తన పేరును నమోదు చేయించాలని వినతిపత్రం అందించింది. ● రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామానికి చెందిన తురిగొండ విమల తన భర్త రాములు మరో వివాహం చేసుకొని తనను ఇబ్బందులు పెడుతున్నాడని వాపోయింది. తన భర్త పేరుమీద ఉన్న 5 ఎకరాల భూమిలో తనకు వాటా ఇవ్వాలని కోర్టులో కేసు నమోదైనా పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరింది.కుమారులు పట్టించుకోవడం లేదు పై ఫొటోని వృద్ధురాలి పేరు గురిజాల బాలమణి. 70 ఏళ్ల వృద్ధురాలు. జనగామ మండలంలోని సిద్దెంకి గ్రామం. ఆమెకు ఇద్దరు కుమారులు. గ్రామంలో ఆమెకు పసుపుకుంకుమ కింద వచ్చిన భూమి 4ఎకరాలు కుమారులకు గిఫ్ట్ రిజస్ట్రేషన్ చేసింది. ఇప్పుడు తన బాగోగులు చూసుకోవడం లేదని దిక్కుతోచని స్థితిలో ఉన్నానని కలెక్టర్ పట్టించుకొని న్యాయం చేయాలని వేడుకుంది. దీంతో కలెక్టర్ తక్షణం స్పందించి వారం రోజుల్లో సమస్య పరిష్కారించాలని ఆర్డీఓను, సంబంధిత అధికారులను ఆదేశించారు. -
రోడ్డు ఇక విశాలం..
జనగామ: పట్టణంలోని కృష్ణ కళామందిర్ గల్లీలో వ్యాపార సంస్థల యజమానులు రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన హోర్డింగ్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. ‘రోడ్డెక్కిన హోర్డింగ్లు’ శీర్షికన సాక్షి దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు మధ్యన ఉన్న మూడు భారీ హోర్డింగ్లతో పాటు చిన్న చిన్న ప్రచార బోర్డులను తీసి వేయించారు. ఈ విషయమై జీఎంఆర్ కాలనీకి చెందిన శివ అనే వ్యక్తి కలెక్టర్కు ఫిర్యాదు చేయగా, అప్పటికే తొలగించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దారిలో రాకపోకలకు ఇబ్బందులు తొలగడంతో బాటసారులు, వాహనా చోదకులు సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు. -
పీహెచ్సీల వారీగా గుర్తించిన బాలికల వివరాలు
జనగామ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 14 ఏళ్ల నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని గత నెల 28 నుంచి చేపట్టింది. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ నుంచి వర్చువల్గా ప్రధానమంత్రి మోదీ, హైదరాబాద్ కింగ్కోఠి ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. ఈ టీకాను గర్భాశయ (సర్వైకల్) క్యాన్సర్కు అడ్డుకట్ట వేయడానికి రూపొందించారు. టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని బాలికల ఆరోగ్య సంరక్షణకు ఇది ముఖ్యమని వైద్యాధికారులు చెబుతున్నారు. టీకా ప్రాముఖ్యం ఇదే.. హెచ్పీవీ అంటువ్యాధి కారణంగా ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ కేసులు వస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ గర్భాశయ కణజాలం సహా ఇతర యోనిరహిత కణజాలాల వద్ద క్యాన్సర్కు అడ్డుకట్ట వేస్తుంది. క్యాన్సర్ను నివారించేందుకు ముందస్తుగా ఈ టీకా వేస్తారు. వ్యాక్సిన్ వైరస్ రాకముందే అందించడం వల్ల అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందుకే కేంద్రం 14 నుంచి15 సంవత్సరాల బాలికలను లక్ష్యంగా చేసుకుంది. రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకాను వేయించుకోవచ్చు. హెచ్పీవీ టీకా పక్కనే క్యాన్సర్ను ప్రథమ దశలోనే కనుక్కునేందుకు చేసే పాప్ స్మెర్ పరీక్షలు వంటి ఇతర నివారణ చర్యలతో మహిళల ఆరోగ్య రక్షణను బలోపేతం చేస్తుంది. కార్యక్రమం విధానం.. ప్రోగ్రాంలో బాలికలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కేవలం ఒకేసారి గార్డాసిల్–4 టీకా తీస్తారు. ఇది హెచ్పీవీ రోగానికి ముఖ్యమైన రకాలైన 16, 18 వంటి రకాలపై రక్షణ ఇస్తుంది. ఈ టీకా కోసం తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి తప్పనిసరి. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ హెచ్పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా ప్రతి సంవత్సరం 14 ఏళ్ల బాలికలను టీకా ద్వారా రక్షించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు సంబంధించిన క్యాన్సర్ రుగ్మతను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. జిల్లాలో 5,674 మంది బాలికలు జిల్లాలో 16 పీహెచ్సీల పరిధిలో 14 ఏళ్లలోపు బాలికలు 5,674 మంది ఉన్నట్లు ఆశా, అంగన్వాడీ, లింక్ వర్కర్ల సర్వేలో వెల్లడైంది. జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో ఇమ్యునైజేషన్ అధికారి పర్యవేక్షణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఇంటింటికీ చేపట్టిన సర్వేలో 14 ఏళ్ల లోపు బాలికల సంఖ్యపై ప్రత్యేక గణన పూర్తయ్యింది. జిల్లాలో ఏఎన్ఎంలు 161, ఆశలు 507, అంగన్వాడీలు 695, లింకు వర్కర్లు 78 మంది ఉన్నారు. జనాభా ఎస్హెచ్జీ లెక్కల ప్రకారం అంచనా వేసిన ఒక శాతంతో 14 ఏళ్లలోపు బాలికలు 5,395 మంది ఉండాలి. అయితే వాస్తవ సర్వేలో అంచనా లెక్కల కంటే ఎక్కువగా బాలికలు 5,674 మంది ఉన్నట్లు గుర్తించారు.పీహెచ్సీ బాలికలు ఓబుల్కేశ్వాపూర్ 139 లిం.ఘణపురం 285 నర్మెట్ట 287 రఘునాథపల్లి 403 దేవరుప్పుల 204 బచ్చన్నపేట 274 జనగామ అర్బన్ పీహెచ్సీ 1,151 పీహెచ్సీ బాలికలు స్టే.ఘన్పూర్ 220 తాటికొండ 65 ఇప్పగూడెం 54 మల్కపూర్ 258 జఫర్గఢ్ 438 కూనూర్ 130 పాలకుర్తి 1,194 కొడకండ్ల 421 కోమల్ల 151 -
వైభవంగా బుగులు వెంకన్న రథోత్సవం
చిల్పూరు: చిల్పూరుగుట్ట శ్రీబుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన ఆదివారం ఉదయం అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేదమంత్రాల నడుమ హోమం బలిహరణం నిర్వహించారు. సాయంత్రం 6.30కి రథోత్సవాన్ని ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ శ్రీధర్రావు ప్రారంభించారు. ఆలయం నుంచి పురవీధుల్లో స్వామివారిని ఊరేగించారు. గ్రామంలో సర్పంచ్ నలిమెల అనితనవీన్, ఉప సర్పంచ్ రాజారపు రంజిత్కుమార్, ధర్మకర్తలు గణగోని రమేశ్ నారాయణరెడ్డి, తదితరులు స్వాగతం పలికారు. చట్టం ప్రకారం నడుచుకోవాలి● జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ జనగామ రూరల్: చట్టం ప్రకారం నడుచుకోవాలని, సమాజంలో అందరు సమానులే అని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. అదివారం జిల్లా కేంద్రానికి రాగా మండలంలోని వెంకిర్యాల గ్రామ సర్పంచ్ గొల్లపల్లి ఆలేఖ్య ఈర్ల నవీన్ కుమార్ తమ సమస్యలను తెలిపారు. అనంతరం జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం మద్యం తాగి న్యూసెన్స్ చేస్తున్నారని గ్రామ ప్రజలు సర్పంచ్ దృష్టికి తీసుకుని రాగా సర్పంచ్ వెళ్లి వారిని అడిగితే.. కులంపేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈవిషయమై జనవరి 15 తేదీన పిటిషన్ ఇచ్చినా సీఐ సత్యనారాయణ రెడ్డి గ్రామస్తులతో కౌన్సిలింగ్ చేశారని, కానీ చట్టపరమైన చర్యల కేసు పెట్టలేదని అన్నారు. కాగా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ నివాసానికి సీఐ రాగా అధికార పార్టీకి వత్తాసు పలుకకుండా వెంటనే విచారణ జరిపి కేసు రిజిష్టర్ చేయాలన్నారు. లేని పక్షంలో చట్టం ప్రకారం బాధ్యులు అవుతారని ఢిల్లీలో జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ వద్దకు రావాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సర్పంచ్ అలేఖ్య సీఐకి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. సమస్యలు పరిష్కరించాలని పాల ఉత్పత్తిదారుల ధర్నాబచ్చన్నపేట: మండలంలోని కొన్నె గ్రామానికి చెందిన పాల ఉత్పత్తిదారులు మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఆదివారం పాల క్యాన్లతో వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తమ గ్రామ పాలను బచ్చన్నపేట మినీ డెయిరీలో కాకుండా జనగామ డెయిరీలో దించితే పలు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. సకాలంలో బిల్లులు రాకపోగా వెన్న శాతం కూడా తక్కువ వస్తుండడంతో డబ్బులు తక్కువ వస్తున్నాయని, బిల్లులు నెలకు ఒకసారి కూడా రావడం లేదన్నారు. తమ గ్రామ పాలను బచ్చన్నపేటలోనే దిగుమతి చేసుకోవాలని భీష్మించుకోగా ధర్నా వద్దకు బీఎంసీ మండల చైర్మన్ పుర్మ జోగిరెడ్డి, సూపర్వైజర్ శ్రీనివాస్రెడ్డి వచ్చి బచ్చన్నపేటలోనే దిగుమతి చేసుకుంటామని హామీ ఇవ్వడంతో పాల ఉత్పత్తిదారులు ధర్నా విరమించారు. నూతన సబ్స్టేషన్ పరిశీలనచిల్పూరు: మండలంలోని కొండాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించి త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 33/11కేవీ ట్రాన్స్కో సబ్స్టేషన్ను ఆదివారం రాత్రి ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మోహన్రావు సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.2.50 కోట్లతో నిర్మిస్తున్న సబ్స్టేషన్లో పనులు పూర్తి అయ్యాయని రెండు వారాల్లో ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు,. ఆయన వెంట ఏడీఈ రణధీర్రెడ్డి, ఏఈ సురేష్, లైన్ ఇన్స్పెక్టర్ ఐలేష్, కృష్ణంరాజు, రాజిరెడ్డి, రవి, సిద్ధయ్య, శ్రీను సర్పంచ్ గుగులోతు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ముప్పిడి ఉద్యమ ప్రస్థానం
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీపీఐ (మావోయిస్టు) పార్టీలో ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ అలియాస్ జంగ్ దాదా ఉద్యమ ప్రస్థానం ముగిసింది. ఆయిడిసి, బాయిడిసి.. నాన్ననిడిసి సాయుధ బాట పట్టిన మావోయిస్టు నేత మళ్లీ జనం మధ్యకు రానున్నారు. పేద, బడుగు బలహీన వర్గాల కోసం తుపాకీ ఎత్తి రాజీలేని ఉద్యమాన్ని సాగించిన ముప్పిడి సాంబయ్య ఆదివారం జనజీవన స్రవంతిలో కలిశారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా, దండకారణ్య డివిజన్ కమిటీ నేతగా ఉన్న ఆయన తన 14 మంది అనుచరులతో కలిసి ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారన్న వార్త చర్చనీయంశంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన సాంబయ్య సుమారు నాలుగు దశాబ్దాల క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరారు. పదో తరగతి చదువుతున్నప్పుడే ఉద్యమం వైపు.. ముప్పిడి సాంబయ్య 1984లో పదో తరగతి చదువుతున్నప్పుడు ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. వరంగల్ ఉద్యమ పితామహుడు, వరంగల్ జిల్లా కార్యదర్శి పులి అంజన్నను స్ఫూర్తిగా తీసుకొని 1984లో పూర్తిస్థాయి కార్యకర్తగా పార్టీలో చేరారు. మొదట పరకాల ఏరియా దళసభ్యుడిగా, కొద్ది రోజులకే బాబన్న పేరుతో పరకాల – చిట్యాల ఏరియా కమాండర్గా వ్యవహరించారు. పరకాల కమాండర్ నుంచి ఖమ్మం జిల్లాకు జిల్లా కమిటీ సభ్యుడిగా బదిలీ అయ్యి 2002 వరకు అక్కడే ఉన్నారు. 2002 తర్వాత 2018 వరకు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, తూర్పు ఇన్చార్జ్గా భాస్కర్ పేరుతో వ్యవహరించారు. 2018లో ఒడిశా స్టేట్ కమిటీ మెంబర్గా వ్యవహరించారు. 2025లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి స్థానంలో ఒడిశా నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికై కొనసాగుతున్నారు. కాగా, 2013లో కమాండర్ స్థాయి అయిన నిమ్మల సారమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు ఉంది. వివాహం జరగగా ప్రస్తుతం ఆమె జనగామలో ఉంటున్నట్లు పోలీసుల సమాచారం. వికాస్, జంగ్ దాదా ఆయనే.. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పనిచేసిన సాంబయ్య.. వికాస్, జంగ్ దాదా పేర్లతో కూడా పనిచేసి పాపులర్ అయ్యారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జిల్లా కమిటీ సభ్యుడు, కార్యదర్శిగా పనిచేసినప్పుడు సుదర్శన్, వికాస్ పేర్లతో వ్యవహరించారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జంగ్ దాదాగా ఆదివాసీ గిరిజనులతో మమేకమయ్యారు. సాహిత్యంలో అనేక రచనలు చేశారు. సాంబయ్య తల్లిదండ్రులు రామస్వామి–భద్రమ్మ కాగా.. ప్రస్తుతం భద్రమ్మ ఉంది. సాంబయ్య కు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉండగా.. ఒక సోదరుడు సదానందం ప్రభుత్వ టీచర్. ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత, అనుచరులు కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన ముప్పిడి సాంబయ్య పులి అంజన్న స్ఫూర్తితో 42 ఏళ్ల క్రితం ఉద్యమ బాట ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశాలో పనిచేసిన సాంబయ్య ఉమ్మడి వరంగల్ నుంచి మిగిలింది నరహరి, పాండునే.. -
గృహహింస కేసుల్లో మహిళలకు ‘భరోసా’
జనగామ: రాష్ట్రంలో 34వ భరోసా సెంటర్ను జిల్లా హెడ్క్వార్టర్లో ప్రారంభించించినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మహిళలకు సంబంధించిన గృహహింస, చైల్డ్ హరాస్మెంట్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు నేరుగా పోలీస్ స్టేషన్ రావడంలో సంకోచించే సందర్భాల్లో భరోసా సెంటర్ సమగ్ర సహాయాన్ని అందిస్తుందన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని హన్మకొండరోడ్డులో ఏసీపీ కార్యాలయం ఏరియాలో నూతనంగా నిర్మించిన భరోసా, షీటీం నూతన భవన సముదాయాలను సీపీ సన్ప్రీత్సింగ్, కలెక్టర్ సందీప్కుమార్ ఝా, డీసీపీలు రాజమహేంద్ర నాయక్, అంకిత్కుమార్, కవితతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. అంతకు ముందు సీపీ, డీసీపీ డీజీపీకి ఘన స్వాగతం పలుకగా, కలెక్టర్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం భరోసా సెంటర్లోని కౌన్సిలింగ్ చాంబర్లను పరిశీలించి, పై అంతస్తులోని షీటీం భవనాన్ని ప్రారంభించారు. తదనంతనం భరోసా సెంటర్ ఆవరణలో డీజీపీ, సీపీ, కలెక్టర్ మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడారు.. హైదరాబాద్లో పదేళ్ల క్రితం ప్రారంభించిన భరోసా సెంటర్ వ్యవస్థ రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు ఇస్తోందని తెలిపారు. భరోసా సెంటర్లో ఇన్చార్జ్ లీగల్ అడ్వైజర్, మెడికల్ సపోర్టర్, ఇద్దరు సపోర్ట్ సిబ్బంది, లాయర్లు, సైకాలజిస్టులు, సోషల్ వర్కర్లు బాధితుల సమస్యలను విని, కేసు నమోదు నుంచి చార్జిషీట్ దాఖలు వరకు పోలీసులకు అవసరమైన సమాచారాన్ని అందజేస్తారని, కోర్టు ట్రయల్ సమయంలో కూడా భరోసా సెంటర్ అండగా నిలుస్తుందని వివరించారు. అంతుకు ముందు షీటీం కార్యాలయంలో సేవలపై డీజీపీ ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్–అలైవ్’ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 8వేల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్ల కనెక్టివిటీ, వాహనాల స్పీడు పెరగడం, డ్రైవర్లలో ప్రాథమిక డ్రైవింగ్ టెక్నిక్స్ లోపం ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు సంప్రదాయ కార్యక్రమంలా మారిపోయిందని, దీనిపై ప్రజల్లో మరింత అవగాహన పెంచే మాదిరిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతినెల చివరి వారం రాష్ట్ర వ్యాప్తంగా ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గతేడాది చేసిన ప్రత్యేక చర్యలతో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గిందని, అయితే ప్రమాదాలు పెరిగాయని, ఇవి రెండూ తగ్గేలా చర్యలు కొనసాగిస్తామని చెప్పారు. జనగామ హెడ్క్వార్టర్లో డీసీపీ నూతన భవనం నిర్మాణం, రూరల్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన ఫైల్ కూడా త్వరలోనే కార్యరూపం దాల్చనున్నట్లు డీజీపీ ప్రకటించారు. కార్యక్రమంలో ఏసీపీలు భీంశర్మ, నర్సయ్య, రవీందర్రెడ్డి, సతీష్బాబు, నర్సింహారావు, ఎస్బీ ఏసీపీలు ఎం.జితేందర్రెడ్డి, జానీ నర్సింహులు, సీఐలు సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, అబ్బయ్య, ఎస్సై, పోలీసులు ఉన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్–అలైవ్’ ప్రోగ్రాం భరోసా సెంటర్, షీటీం నూతన భవనాలు ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి -
వానకొండ.. అభివృద్ధి వెక్కిరింత
దేవరుప్పుల: హోలీ పర్వదినం పురస్కరించుకుని ఉగాది వరకు శ్రీ వానకొండ లక్ష్మీనర్సింహ్మస్వామి జాతర వైభవంగా కొనసాగనుంది. ఈనెల 3 (మంగళవారం) నుంచి జాతర ప్రారంభం కానుంది. జాతరకు ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలకు చెందిన భక్తులు భారీగా తరలివస్తారు. ప్రధానంగా గిరిజనులు కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. గ్రహణంతో ఆర్భాటాలకు స్వస్తి ఈసారి శ్రీ లక్ష్మీనర్సింహ్మస్వామి కల్యాణోత్సవం రోజు గ్రహణం ఉండడంతో వేదబ్రహ్మణుల సూచన మేరకు గుట్ట పూజారి బీట్కూరి సంపత్కుమారచార్యులు ఆర్భాటాలకు తావివ్వకుండా ఉదయం 10 లోపు కల్యాణం ముగిసేలా నిర్ణయించారు. దీంతో కడవెండి నుంచి తలంబ్రాలు, చేనేత వస్త్రాలు నేరుగా గుట్టవద్దకు చేరడంతో ఉత్సవాల ప్రారంభానికి సన్నాహాకాలు చేస్తున్నారు. అభివృద్ధి జాడేది..? నూటయాభై ఏళ్ల నుంచి కొనసాగుతున్న వానకొండ లక్ష్మీనర్సింహ్మస్వామి జాతర అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేదనే విమర్శలు ఉన్నాయి. ఎన్ని పాలకవర్గాలు వచ్చినా అభివృద్ధి అంతంతే. ఐదు దశాబ్దాల కిందట సాదాసీదా వసతులతో కొనసాగిన జాతరకు ఆపై కడవెండి గ్రామస్థుల ప్రత్యేక వసతులపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం పక్షాన తాగునీటి, విద్యుత్ వంటి సౌకర్యాలు ఏర్పర్చారు. భక్తులు కాలినడకన ఇబ్బందులు పడుతున్నారని 12 ఏళ్ల కింద గుట్టపైకి మెట్లు నిర్మించారు. ముఖద్వారం, పైన రేకులషెడ్ల వసతులు వంటివి దాతలు సమకూర్చారు. ఈ నేపథ్యంలోనే 2023 జూలై 7 వ తేదీన అప్పటి పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎంఎంఆర్ గ్రాంట్ కింద రూ.2.50 కోట్లతో గుట్టపైకి ఘాట్రోడ్డు, సీఎం అదనపు నిధుల కింద రూ. కోటితో త్రితల విమాన గోపురం, మండపం నిర్మాణం కోసం శిలాఫలకాలు వేశారు. గత అసెంబ్లీ నాటికి గుట్టపైకి సదరు కాంట్రాక్టర్ ఘాట్ రోడ్డుకోసం చదును చేసి చేతులెత్తేశారు. ప్రస్తుత పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి గతేడాది జాతరకు వచ్చి నిధుల రీమంజూరుతో మిగులు పనులు చేయిస్తానన్న హామీ ఇవ్వగా ఆచరణలోకి రాలేదు. జాతర ఉత్సవ కమిటీ నియామకం శ్రీ వానకొండ లక్ష్మీనర్సింహ్మస్వామి జాతర పురస్కరించుకొని ఉత్సవ నిర్వహణ కోసం దేవాదాయశాఖ పక్షాన తాత్కాలిక ఆలయ కమిటీని నియమించినట్టు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్గా మాసంపెల్లి భాస్కర్, వైస్ చైర్మన్గా కాడవేని శ్రీనివాస్, జనరల్ సెక్రటరీలుగా పాముకుంట్ల చొక్కయ్య, సంపంగి యాకరాజు, కోశాధికారిగా భాషిపాక పరుశరాములు, కార్యవర్గ సభ్యులుగా మూడ నర్సింహ్మ, మైనాల రమేష్, రంపీస శ్రీనివాస్, మేడబోయిన మహేశ్, కాడవేని కుమార్, బోసు కనకయ్య, కొండయ్య, యాదయ్య, యాకయ్యను నియమించినట్టు పేర్కొన్నారు. శిలాఫలకాలతో సరి..కానరాని పురోగతి ఎన్ని పాలకవర్గాలు వచ్చినా అభివృద్ధి శూన్యం రేపటి నుంచి శ్రీ వానకొండ లక్ష్మీనర్సింహ్మస్వామి జాతర -
ఇస్మార్ట్..స్టేషన్
జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్కు కొత్త సొబగులు జనగామ: అమృత్ భారత్ పథకంలో భాగంగా జనగామ రైల్వేస్టేషన్ రూపురేఖలు మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.125 కోట్లతో ఆధునికీకరణ వేగవంతమైంది. తొలి విడతగా విడుదలైన రూ.25 కోట్లతో ఫుట్ఓవర్ బ్రిడ్జ్, ప్లాట్ఫామ్ విస్తరణ, డిజిటల్ సదుపాయాలు, ప్రాంగణ సుందరీకరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉత్తర, దక్షిణ రైల్వే మార్గానికి కీలకంగా ఉన్న ఈ స్టేషన్, అభివృద్ధి పూర్తయ్యాక అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు కొత్త అనుభవాన్ని అందించనుంది. ఈ పథకంలో స్టేషన్ లను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తారు. ప్రయాణికుల అవసరాలు మాత్రమే కా క పెరిగే రద్దీ, వసతుల విస్తరణ, రైల్వే కార్యకలాపాల బలోపేతం వంటి అంశాలకూ ప్రా ధాన్యం ఇస్తారు. ఇదే ప్రక్రియలో భాగంగా జనగామ స్టేషన్ ప్రస్తుతం భారీ మార్పులకు వేదికవుతోంది. మొదటి విడతలో రూ.25కోట్ల ఖర్చు జిల్లా కేంద్రంగా ఉన్న జనగామ రైల్వేస్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ ప్రోగ్రామ్లో భాగంగా ఆధునిక సదుపాయాలతో రూపుదిద్దుకుంటోంది. రైల్వేశాఖ ఈ స్టేషన్ అభివృద్ధికి మొదటి విడతలో సుందరీకరణ, ప్రాథమిక మౌలిక వసతుల పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం స్టేషన్లో కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జి, డిజిటల్ డిస్ప్లే కోచ్, రెండు ప్లాట్ఫామ్ల విస్తరణ, ప్రయాణికులకు అనుగుణంగా టికెట్ కౌంటర్ ఆధునీకరణ, పచ్చదనంతో స్టేషన్ ప్రాంగణం అందుబాటులోకి తేవడం వంటి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నూతన హంగులు, ప్రయాణికులు కూర్చునే సదుపాయాలు, తాగునీటి సదుపాయాలు, ఆధునిక టాయిలెట్లు, సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థ, ఏసీ వెయిటింగ్ హాల్స్, క్రమబద్ధమైన పార్కింగ్ ప్రాంతాలు వంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. దక్షిణ,ఉత్తర రాష్ట్రాలకు కేంద్రంగా దక్షిణ భారతాన్ని ఉత్తర భారతంతో కలిపే కీలక మార్గంలో ఉన్న ఈ స్టేషన్పై ప్రతీ రోజు విజయవాడ, చైన్నె, ఢిల్లీ, హైదరాబాద్, మహారాష్ట్ర వంటి అనేక ప్రాంతాలకు రైళ్లు ప్రయాణిస్తాయి. వ్యాపార వాణిజ్య ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు ఇలా అన్ని వర్గాల వారు పెద్ద సంఖ్యలో ఈ మార్గాన్ని వినియోగిస్తున్నారు. రోజురోజుకూ ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో స్టేషన్ను ఆధునిక ప్రమాణాలకు తగిన విధంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని రైల్వే శాఖ భావించింది. దీంతో జనగామ పట్టణ అభివృద్ధి, వాణిజ్య వృద్ధి, ప్రయాణికుల రద్దీ పెరుగుదలకు కొత్త దిశగా మారుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రెండు ప్లాట్ఫామ్ల విస్తరణ, వాటిపై విశాలమైన రూఫ్ షెల్టర్లు కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం ఆధునిక డిజిటల్ డిస్ప్లే కోచ్ బోర్డు స్టేషన్ భవనం విస్తరణ, రీడిజైన్ కొత్త చార్జింగ్ స్టేషన్లు, ఎనర్జీ ఎఫిషియంట్ లైటింగ్ ఆధునీకరించబడిన టికెట్ కౌంటర్లు, రిజర్వేషన్ హాల్ పచ్చదనం పెంపు, ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ స్థలాల విస్తరణ సుందరీకరణ పనులకు రూ.125 కోట్ల కేటాయింపులు మొదటి విడతలో రూ.25కోట్ల ఖర్చు ప్రారంభానికి సిద్ధం..వడివడిగా పనులు అత్యాధునికంగా ఫుట్ఓవర్ బ్రిడ్జి, ఎస్కలెటర్, డిస్ప్లేకోచ్ -
విభిన్న సెట్టింగులు.. చిన్నారుల ఫొటోలు
ఇదివరకు ఎవరైనా ఇంటికొస్తే కాసేపు మాట్లాడాక ఫొటో ఆల్బమ్ ముందు పెట్టేవాళ్లు. ఫొటోలు చూపిస్తూ సరదాగా గడిపేవాళ్లు. ఇప్పుడు టీవీలు ఆన్ చేస్తున్నారు. ఫొటో షూట్లు, వీడియో ఆల్బమ్లు చూపిస్తున్నారు. డిఫరెంట్ లొకేషన్లలో భారీ సెట్టింగుల్లో దిగిన ఫొటోలు, మంచి మంచి లొకేషన్లలో, ఆకట్టుకునే పాటలతో తయారు చేసిన వీడియోలు ప్లే చేస్తున్నారు. చిన్నారుల జ్ఞాపకాలు చిరకాలం పదిలంగా ఉండేలా ఆల్బమ్లు రూపొందిస్తున్న స్టూడియోలపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.. – ఖిలా వరంగల్ఫొటోలు తీసుకునేందుకు ఒకప్పుడు పార్కులు, నది, సముద్రతీరాలు, చారిత్రక కట్టడాల వంటి ప్రదేశాలకు వెళ్లేవాళ్లు. ఇప్పుడు వాటినే మన ముందుకు తీసుకొచ్చారు ఫొటో స్టూడియోల నిర్వాహకులు. డిఫరెంట్ సెట్లతో బేబీ ఫొటో స్టూడియోలు ఎక్కడికక్కడ ఏర్పాటయ్యాయి. బేబీ ఫొటో షూట్ ట్రెండ్ ఏళ్ల కిందటి నుంచే ఉన్నప్పటికీ ఈ మధ్య ఈ విధానంపై గ్రేటర్ వరంగల్ వాసుల ఆసక్తి మరింత పెరిగింది. అంతేకాకుండా ఇటీవల వచ్చిన ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా సృజనాత్మకతంగా చూపించడంతో అందరి దృష్టి ఫొటో షూట్వైపు పడుతోంది. ప్రస్తుతం ఇదొక ఆనవాయితీగా మారిందని ఫొటో స్టూడియోల నిర్వాహకులు చెబుతున్నారు. అభిరుచికి అనుగుణంగా.. పిల్లల తల్లిదండ్రుల అభిరుచి మేరకు ఏదైనా విభిన్న సెట్ కావాలంటే.. అదనపు ఖర్చుతో నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. చారిత్రక కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ మధ్యకోటలో మనసుదోచేలా ఆహ్లాదం కల్పించేలా భారీ సెట్లతో స్టూడియో ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాలోని చిన్న పిల్లల మనసు దోచేస్తున్నారు. ఇటీవల కాలంలో మధ్యతరగతి వర్గాలు సైతం ఈషూట్లపై ఆసక్తి కనబరుస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సమయాన్ని బట్టి ధరలు.. బేబీ స్టూడియోలు మధ్యకోట, వరంగల్, మహబూబాబాద్, ములుగు, రామప్ప, భూపాలపల్లి, కాళేశ్వరం, జనగామ జిల్లా, మండల కేంద్రాల్లోనూ ఉన్నాయి. ఇవి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో తెరిచి ఉంటాయి. బర్త్ డే ఆల్బమ్ కోసం రూ.10 వేల నుంచి రూ. 25వేల వరకు చార్జ్ చేస్తున్నారు. స్టూడియోలో ఏదైనా ఆట వస్తువులు ఉపయోగించుకుంటే రూ.1500 నుంచి రూ.2,500 వసూలు చేస్తున్నారు. వారాంతాల్లో అయితే వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఫొటోగ్రాఫర్ను ఔత్సాహికులు తెచ్చుకుంటే.. గంటకు రూ.1,500 చార్జ్, అదే నిర్వాహకుల ఫొటోగ్రాఫర్ అయితే గంటకు రూ.2,500 వరకు తీసుకుంటామని చెబుతున్నారు. వీటి ఏర్పాటుకు దాదాపు రూ.8 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఓ స్టూడియో నిర్వాహకుడు పేర్కొన్నారు. బర్త్డేకు ఫొటో షూట్ చేయించాం.. మా బాబు ఫస్ట్ బర్త్డేను ప్రత్యేకమైన రోజుగా చూస్తున్నాం. తీపి గుర్తు కోసం బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నాం. బర్త్డే అంటే స్పెషల్ డేగా గుర్తించి ఆధునిక హంగులతో కూడిన బేబీ స్టూడియోలో ఫొటో షూట్ చేయించాం. తరచూ ఫొటోలు, వీడియోలు చూసి జ్ఞాపకాలు గుర్తు చేస్తూ సంతోషిస్తున్నాం. –అయాన్తో తల్లిదండ్రులు అఖిల, జూహకర్ పిల్లలు మెచ్చేలా.. చిన్నారులు ఇష్టపడే బాహుబలి, పోలీస్ స్టేషన్, విమానం, బేబీ షవర్, జీప్ డ్రైవింగ్, ఉయ్యాల, నది వంతెన, ట్రైన్, బైక్, గార్డెనింగ్, చారిత్రక అందాల సీన్స్ వంటి సెట్లను స్టూడియోల నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. తాజ్మహల్, కొలనులు, స్విమ్మింగ్ పూల్, దేవాలయం, గ్రామీణ నేపథ్యం ఉండే సెట్లు సైతం వీరి వద్ద అందుబాటులో ఉంటున్నాయి. సెట్కు తగిన మేకప్ కిట్లు, దుస్తులు స్టూడియోలోనే అందుబాటులో ఉంచుతున్నారు. కొన్నింటిలో పుట్టిన రోజు వేడుకలు సైతం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఏడాది వయస్సు చిన్నారుల నుంచి ఐదేళ్ల పిల్లల కోసం ప్రత్యేక సెట్లు స్టూడియోల్లో అందుబాటులో ఉన్నాయి. ఆకట్టుకుంటున్న స్టూడియోలు సమయానుగుణంగా ధరలు ఏఐ సాంకేతికతతో మరింత క్రేజ్ -
ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులను అరికట్టాలి
జనగామ: ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్యులు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను తక్షణమే అరికట్టాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జనగామ శాఖ ఆధ్వర్యంలో శనివారం డీసీపీ రాజమహేంద్రనాయక్కు వినతి చేశారు. అనంతరం జిల్లా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జె.బాలాజీ, కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ హైదరాబాద్ బండ్లగూడ జాగీర్, రాజేంద్రనగర్లోని ఆస్పత్రుల్లో చోటుచేసుకున్న దాడులు వైద్యుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయన్నారు. ప్రజలకు నిరంతర వైద్యసేవలు అందించడంలో అంతరాయం కలిగిస్తున్నారన్నారు. ఇలాంటి దాడులు వైద్యుల ప్రాణాలకు ముప్పు కలిగించడమే కాకుండా, అత్య వసర వైద్యసేవలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నారు. వైద్యులు, వైద్య సిబ్బందిపై, మెడికల్ సంస్థలపై దాడుల విషయంలో తెలంగాణ మెడికల్ సర్వీస్ పర్సనల్ అండ్ మెడికల్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, దాడులకు పాల్పడిన నిందితులపై చట్టప్రకారం శిక్ష విధించేలా కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీసు శాఖ హామీ ఇవ్వాలన్నారు. వారి వెంట మాజీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డి.లవకుమార్ రెడ్డి, వైద్యులు లక్ష్మీనారాయణ నాయక్, రంజిత్ కుమార్, స్వప్న రాథోడ్, విఘ్నశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
సేవాలాల్ ఆశయాలు మార్గదర్శకం
జనగామ రూరల్: సంత్ సేవాలాల్ ఆశయాలు మా ర్గదర్శకమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మీనారాయణనాయక్ అన్నారు. శనివారం సేవాలాల్ జయంతి సందర్భంగా పట్టణంలోని నెహ్రూపార్క్ నుంచి గిరిజన మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేశారు. సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ముందుగా నిలిచిన బంజారా సమాజం, నేటి పరిస్థితుల్లో తమ జాతి ప్రయోజనాల కోసం మరింత ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అజ్మీరా స్వామి, ఆర్డీఓ గోపీరామ్, మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, గాంధీ నాయక్, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
3న సోమన్న ఆలయం మూసివేత
పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవాలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా ఈనెల 3 (మంగళవారం)న ఉదయం 8 గంటలకు ఆలయం మూసివేయనున్నట్లు (ద్వారబంధనం) ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ప్రధాన అర్చకుడు దేవగిరి లక్ష్మన్న శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరిగి 4వ తేదీ బుధవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం స్వామివారి దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు, భక్తులు సహకరించాలని కోరారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి జనగామ రూరల్: పాడి పరిశ్రమ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్లో మేనేజింగ్ డైరెక్టర్ కె.చంద్రశేఖర్రెడ్డి, విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.గోపాల్ సింగ్లను జిల్లా నాయకులు శనివారం కలిశారు. ప్రస్తుతం ఉన్న పాల సేకరణ ధరలను పెంచి, ఎస్ఎన్ఎఫ్ తగ్గించాలను తొలగించాలని కోరారు. పాడి రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం చైర్మన్ అమిత్ రెడ్డి మాట్లాడుతూ విజయ డెయిరీ ప్రతీ రోజు మూడు లక్ష్యల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరిస్తున్నామని, త్వరలోనే పాల కొనుగోలు ధరలను పెంచతామన్నారు. డైరెక్టర్ కె.చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ పాడి రైతులు ప్రైవేట్ డెయిరీలను నమ్మి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ మధుసూదన్, పాడి రైతులు పి.జోగారెడ్డి, స్వామి, సాదం రమేష్, శ్రీనివాస్, మేనేజర్ నరేష్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్షణికావేశం.. తొందరపాటు నిర్ణయం● పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య ● రోడ్డుపాలైన కుటుంబం లింగాలఘణపురం: తండ్రి క్షణికావేశం..తొందరపాటు నిర్ణయంతో చిన్నారులు తండ్రిలేని పిల్లలయ్యారు. అల్లారుముద్దుగా అమ్మానాన్నల ఆలనాపాలనలో పెరగాల్సిన చిన్నారులకు తండ్రిలేని లోటు తీర్చేదెవరూ? చనిపోవాలనుకొనే క్షణంలో ఒక్కసారి తన గుండెలపై తన్నుకుంటూ ఆడుకునే ఆ చిన్నారులు గుర్తుకు రాలేదా..అంటూ రోదిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు ప్రతీఒక్కరి కంట కన్నీరు కార్చిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామస్తులు, విశ్వసనీయ సమాచారం మేరకు.. మండలంలోని గుమ్మడవెల్లికి చెందిన వేల్పుల అనిల్కుమార్ (28) అతని భార్య సంతోషి మధ్య ఫిబ్రవరి 26న స్వల్ప గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో అదేరోజున అనిల్కుమార్ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు జనగామకు అక్కడి నుంచి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. అనిల్కుమార్కు నాలుగేళ్ల విఘ్నేష్, రెండున్నరేళ్ల పాప ఉంది. నాన్న..నాన్న అంటూ చిన్నారులు ఏడుస్తున్న తీరు ప్రతీఒక్కరి గుండెను కదిలించింది. తల్లిదండ్రుల గొడవలతో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో అభంశుభం తెలియని పిల్లలు తండ్రిలేని వారయ్యారు. సౌత్జోన్ టోర్నమెంట్కు కేయూ జట్టు కేయూ క్యాంపస్: తమిళనాడులోని తిరుచారపల్లిలోని భారతీదాస్ యూనివర్సిటీలో మార్చి 2, 3 తేదీల్లో నిర్వహించనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ చెస్ టోర్నమెంట్కు కేయూ పురుషుల జట్టు పాల్గొననున్నట్లు శనివారం కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య తెలిపారు. ఈజట్టులో పి.శ్రీచైతన్య , ఎస్.శివసాత్విక్, ఎస్.సంజయ్చంద్ర, బి.రాకేశ్, కె.సచిన్, జె.శివకుమార్తో పాటు మాస్టర్జీ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కె.నరేందర్ కోచ్ కమ్ మేనేజర్గా వ్యవహరించనున్నట్లు వెంకయ్య తెలిపారు. -
సృజనాత్మకతను వెలికి తీయాలి
జనగామ రూరల్: సృజనాత్మకతను వెలికి తీసి శాస్త్రియతను పెంపొందించాలని జిల్లా సైన్స్ అధికారి చింతల ఉపేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైన్స్ అధికారి ఉపేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని సి.వి.రామన్ చిత్రపటానికి పూలమాల వేసి సైన్స్ ఎగ్జిబిట్స్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఇమిడి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి పాఠశాలలో అంతర్గతంగా నిర్వహించే వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని, అబ్దుల్ కలాం చెప్పినట్లు కలలు కనండి.. వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ తుమ్మ శ్రీలతరెడ్డి, ప్రిన్సి పాల్ జైమోన్ థామస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే గౌతమ్ మోడల్ స్కూల్లో నిర్వహించిన సైన్స్ దినోత్సవంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థుల్లో సృజనాత్మకతతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలను మెరుగు పరచుకోవడానికి ఉపయోగపడతాయన్నారు. ఎ.శంకర్ రెడ్డి, భాష్యం విష్ణు చరణ్, ఎండీ మేహరాజ్ అహ్మద్, మోతే సురేందర్ రెడ్డి, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పసరమడ్లలోని ఆశ్రమ పా ఠశాలలో సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఎం జె.లచ్చిరాం,స్టా బి. జయరామ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా సైన్స్ అధికారి ఉపేందర్ ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం -
కమనీయం.. శ్రీనివాసుడి కల్యాణం
చిల్పూరు: చిల్పూరుగుట్ట శ్రీబుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు శనివారం స్వామి వారి కల్యాణ మహోత్సవం అశేష భక్తుల సమక్షంలో గోవింద నామస్మరణల మధ్య కమనీయంగా నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గుట్టపైనున్న ఆలయం నుంచి కోలాటాల నడుమ పల్లకీలో స్వామి వారిని ఊరేగింపుగా మండపానికి తీసుకువచ్చారు. ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ శ్రీధర్రావు, కిరణ్మయి, సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై సరిపురం నవీన్కుమార్, సర్పంచ్ నలిమెల అనిత, శాశ్వత దాత సంగోజు మోహనాచారి, శంకరలక్ష్మి తదితరులు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు, ఆరుట్ల రాకేషాచార్యులు వేద మంత్రాల నడుమ వైభవంగా కల్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కళాకారుల వేషధారణ ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎంపీ కడియం కావ్య -
కోఆప్షన్ ఎవరికో?
జనగామ: జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో నూతన పాలక మండళ్లు బాధ్యతలు స్వీకరించడంతో ఇప్పుడు కోఆప్షన్ సభ్యుల ఎంపికపై రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి. ము న్సిపల్ రాజకీయం కొత్త దశలోకి అడుగుపెట్టగా, రెండు పట్టణాల్లోనూ అభ్యర్థుల పోటీ, పార్టీల వ్యూహాలు, స్థానిక నేతల లాబీయింగ్ మరింత ఊపందుకుంటుంది. స్టేషన్ఘన్పూర్లో పూర్తి మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీకి నాలుగు కో ఆప్షన్ స్థానాలు దక్కనున్నాయి. ఇక్కడ విద్యావేత్తలు, అనుభవం కలిగిన ప్రజాప్రతినిధులు, రెండు మైనార్టీ వర్గాల అభ్యర్థుల మధ్య పోటీ ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆశీస్సులు అందుకునే వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు తమ అర్హతలు, పార్టీకి చేసిన సేవలు, స్థానికంగా ఉన్న ప్రభావాన్ని ప్రస్తావిస్తూ నేతల ప్రసన్నం కోసం పరస్పరం పోటీ పడుతున్నారు. ఇక జనగామ మున్సిపాలిటీలో పరిస్థితి భిన్నంగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఎక్స్ ఆఫీషియో ఓట్లు కలుపుకుని చెరి 16 చొప్పున సమాన బలం కలిగి ఉండటంతో కో ఆప్షన్ ఎన్నికలు ఎలా సాగుతాయన్నదానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే స్పష్టత రావాల్సి ఉంది. కో ఆప్షన్ కేటాయింపులో విద్యావేత్త, అనుభవం ఉన్న మాజీ కౌన్సిలర్, ఇద్దరు మైనార్టీలు, అందులో 50 శాతం మహిళలకు అవకాశం కల్పించాల్సి ఉండటంతో మొత్తం నలుగురు కోఆప్షన్ సభ్యుల ఎంపిక జరుగనుంది. ఈ నాలుగు స్థానాల కోసం ఒక్కో పార్టీ నుంచి 5 నుంచి 10 మంది వరకు బరిలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు సమాన బలం ఉండగా, పోటీకి సై అంటే ఇరు పార్టీల కోఆప్షన్ అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు. ఇప్పటికే కో ఆప్షన్ పదవి కోసం ఆశావహులు పార్టీకి దరఖాస్తు చేసుకుంటుండగా, పోటీ అనివార్యమైతే ఎన్నికకు వెళ్లాల్సి వస్తుంది. రెండు పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాముగా మారగా, పదవి రాని నాయకులను బుజ్జగించేందుకు శక్తికి మించిన భారం పార్టీలపై పడనుంది. కానీ ఎవరికి వారే కో ఆప్షన్ తమకే దక్కనుందని పూర్తి విశ్వాసంతో ఉండగా, ఒక వేళ చేజారి పోతే వారిని ఎలా దారిలో పెట్టాలనే దానిపై అన్ని పార్టీలు ఆలోచన చేస్తున్నాయి. కోఆప్షన్ కాకపోతే ఇతర నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని పలువురు నాయకులకు నచ్చ చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్లో భారీ పోటీ చెరిసగం ఇచ్చుకుంటారా.. లాటరీ పునరావృతం అవుతుందా?సమాన ఓట్లు ఉన్న నేపథ్యంలో చైర్పర్సన్ ఎన్నికల మాదిరిగానే చేతులెత్తే విధానంలో కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై తుది నిర్ణయం నోటిఫికేషన్ వచ్చాకే తెలుస్తుంది. ఇరు పార్టీలు అంతర్గతంగా అభ్యర్థుల ఎంపికపై ఒకే అభిప్రాయానికి రావడానికి ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. పోటీ చేస్తున్న వారిని బుజ్జగించేందుకు నాయకులు లాబీయింగ్ చేస్తున్నారు. వార్డుల వారీగా కౌన్సిలర్లను గెలిపించడంలో తమ పాత్రను ప్రస్తావిస్తూ కొందరు అవకాశాన్ని కోరుతుండగా, మరికొందరు రెండు, మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్నామంటూ హక్కుగా కో ఆప్షన్ కోరుతున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లానే కో ఆప్షన్ ఎన్నికలు కూడా సజావుగా సాగుతాయా లేక లాటరీ పద్ధతికి వెళ్లే పరిస్థితి వస్తుందా అనే చర్చ పట్టణంలో జోరుగా సాగుతోంది. అవసరమైతే కో ఆప్షన్ ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేసే అవకాశం ఉందని సీనియర్ నాయకులు అంటున్నారు. మొత్తం మీద కోఆప్షన్ ఎన్నికలు స్థానిక రాజకీయాల్లో మరో కీలక మలుపుగా నిలవనున్నాయి. -
నేడు బుగులు వెంకన్న కల్యాణం
చిల్పూరు: శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 28న (శనివారం) నిర్వహించే కల్యాణానికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు తెలిపారు. గుట్ట కింద అంగడి ప్రదేశంలోని కల్యాణ మండపంలో నిర్వహించే స్వామివారి కల్యాణ ఏర్పాట్లను శుక్రవారం ఈఓ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. స్వామివారి కల్యాణానికి తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఘనంగా ఎదుర్కోళ్లు బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజైన శుక్రవారం ఉదయం ఆరుట్ల రాకేషచార్యుల సమక్షంలో ఆలయ అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేదమంత్రాల నడుమ నిత్యనిధిహోమం, సాయంత్రం 5 గంటలకు ఎదుర్కోళ్లు కార్యక్రమం నిర్వహించారు. -
పట్టణాభివృద్ధే ముఖ్యం
● నిధుల కోసం ఎక్కడికై నా వెళదాం.. ● మున్సిపల్ మొదటి సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే పల్లాజనగామ: ‘పట్టణ అభివృద్ధి కోసం ఎంత తగ్గాలో అంత తగ్గుతా..నిధుల కోసం ఎక్కడికై నా వెళదాం..నా వంతు సహకారం ఉంటుంది..’అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ సమావేశం హాలులో నూతన పాలక మండలి మొదటి సాధారణ సమావేశం చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి హాజరై మా ట్లాడారు.. పార్టీలకతీతంగా పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని పాలక మండలికి పిలుపునిచ్చారు. సమస్యలు విన్నవించిన సభ్యులు మున్సిపల్ సాధారణ సమావేశంలో సభ్యులు తమ వార్డుల్లో ఉన్న సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. జనగామ అభివృద్ధి సంపూర్ణ సహకారం అందిస్తామని వైస్ చైర్మన్ భూష పర్వతాలు అన్నారు. 30 వార్డుల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ముందుగా గుర్తించి, ప్రియార్టీ ప్రకారం అభివృద్ధి చేసుకుంటే ఐదేళ్లలో జనగామ సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందని సభ్యులు కోరారు. ఓటింగ్ రోజు తప్పు చేశా.. క్షమించు తల్లీ ‘చెర్మన్ ఓటింగ్ రోజు జరిగిన ఎన్నికల్లో పొరపాటు జరిగింది.. మహిళలను గౌరవించడంలో ముందుంటా, తప్పు జరిగింది, పొరపాటుకు చింతిస్తున్నా, నీ కొడుకు లాంటి వాడిని, పెద్ద మనసు చేసుకుని క్షమించాలి’ అని 8వ వార్డు సభ్యురాలు మంజులను 15వ వార్డు సభ్యుడు పాండు కోరారు. సభ్యులకు సత్కారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి చైర్పర్సన్ బాలమణి, వైస్చైర్మన్ పర్వతాలను శాలువాతో సత్కరించి శుబాకాంక్షలు తెలుపగా, మిగతా 28 మంది వార్డు సభ్యులు అభినందలు తెలిపారు. కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఉన్నారు.14, 17, 27, 29 వార్డుల సభ్యులు సాధారణ సమావేశానికి హాజరు కాలేదు. -
కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు
జనగామ రూరల్: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఇంటర్ విద్యాధికారి కె.జితేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం మూడో రోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు 16 పరీక్షల కేంద్రాల్లో జరిగాయన్నారు. జిల్లావ్యాప్తంగా మొదటి సంవత్సరం జనరల్ 3,227 విద్యార్థులకు 3,187 హాజరు కాగా 40 మంది గైర్హజరయ్యారు. ఒకేషనల్లో 1,036 విద్యార్థులకు 956 హాజరు కాగా, 80మంది గైర్హాజరయ్యారు. మొత్తం 97.18 శా తం విద్యార్థులు హాజరయ్యారు. కాగా జిల్లాలో ని పరీక్ష కేంద్రాలను ఆయన సందర్శించారు. డెక్ సభ్యులు సునంద, నర్మెట, దేవరుప్పుల కొడకండ్ల పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. గీతకార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ జనగామ: జిల్లా కేంద్రంలోని వికాస్ ఫార్మసీ కళాశాలలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, రెవె న్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ హాజరయ్యారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ.. శిక్షణ పొందిన ప్రతీ గీత కార్మికుడు విధిగా రక్షణ కిట్లను ఉపయోగించాలన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. కల్లు గీత కార్మికులందరూ రక్షణ కిట్లను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. అనంతరం 419 మంది కల్లుగీత కార్మికులకు కాటమయ్య కిట్లను అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎన్.ఎల్.నరసింహ రావు, డీపీఈఓ అనిత, ఏబీసీడీఓ రవీందర్, కేజీకేఎస్ ప్రధాన కార్యదర్శి వెంకట మల్లయ్య, ఎకై ్సజ్ శాఖ సిబ్బంది, వెనుకబడిన తరగతుల శాఖ సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్, విత్తన చట్టాలతో రైతాంగానికి ముప్పు పాలకుర్తి టౌన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్ సవరణ బిల్లులు, విత్తన చట్టాలు రైతాంగ మనుగడకు ముప్పుగా మారుతున్నాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.జంగారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర ఫంక్షన్హాల్లో జరిగిన జిల్లా మూడో మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయడం వల్ల ఉచిత విద్యుత్ రద్దయ్యే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు మోకు కనకారెడ్డి మాట్లాడుతూ.. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల పనులు వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భుక్య చందనాయక్, నాయకులు సింగారపు రమేశ్, మదార్, మాచర్ల సారయ్య, మిట్యానాయక్, బచ్చు శ్రీలత, చిట్యాల సోమన్న, సోమ సత్యం పాల్గొన్నారు. వచ్చే నెల 25న పోస్టల్ డాక్ అదాలత్ ఖిలా వరంగల్: మార్చి 25న పోస్టల్ సర్వీసులపై, వినియోగదారుల ఫిర్యాదులపై 53వ ప్రాంతీయ స్థాయి డాక్ అదాలత్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు వరంగల్ తపాలా శాఖ డివిజనల్ సూపరింటెండెంట్ రవికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాల పరిధి డివిజన్కు సంబంధించి తపాలా సేవల వినియోగదారులకు ఏవైనా ఫిర్యాదులుంటే పోస్టల్ ఎన్వలప్/కవర్పై 53 డాక్ అదాలత్ అసిస్టెంట్ డైరెక్టర్ (స్టాఫ్ అండ్ విజిలెన్స్) పోస్ట్మాస్టర్ జనరల్, హైదరాబాద్ రీజియన్ హైదరాబాద్–500001కి మార్చి 9లోగా చేరేలా పంపించాలని కోరారు. -
బ్రహ్మోత్సవాలకు ముస్తాబు
స్టేషన్ఘన్పూర్: డివిజన్కేంద్రమైన స్టేషన్ఘన్పూర్ బస్టాండ్ సమీపంలోని పురాతన తిరుమలనాథస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ నెల 23 నుంచి మార్చి 4వ తేదీవరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతీ రోజూ విశేష పూజలను నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని దేవస్థాన కమిటీ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది. 1న(ఆదివారం) ప్రధాన ఘట్టమైన శ్రీతిరుమలనాథస్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రామానుజచార్యులు తెలిపారు. -
ఆరోగ్య భాగ్యం
శనివారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026● హైపర్టెన్షన్, మధుమేహ నియంత్రణకు తొలి అడుగు ● జిల్లాలో మరో కార్యక్రమానికి శ్రీకారం ● 30ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికి పరీక్షలు ● గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ప్రత్యేక కార్యాచరణ● ‘మన చైర్పర్సన్..మన వార్డు సందర్శన’ కార్యక్రమం ● ప్రజా సమస్యలపై స్పెషల్ డ్రైవ్ ● బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ చైర్పర్సన్ బాలమణి జనగామ: జిల్లా వ్యాప్తంగా హైపర్టెన్షన్, మధుమేహం వంటి అసంక్రామ్య వ్యాధుల నియంత్రణ, ముందస్తు గుర్తింపు కోసం శ్రీఆరోగ్య జనగామ–మన ఆరోగ్యం మన చేతుల్లోశ్రీ కార్యక్రమానికి వైద్యారోగ్య శాఖ శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్రావు ఆధ్వర్యంలో ప్రోగ్రాం కొనసాగుతోంది. ఎన్సీడీల పెరుగుతున్న భారంపై ఆందోళన రాష్ట్రంలో అసంక్రామ్య వ్యాధుల (ఎన్సీడీ–నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) నిర్ధారణలో ఆరుగురిలో నాలుగు మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా హృదయ సంబంధిత వ్యాధులు దేశంలో 29 శాతం మరణాలకు దారితీస్తుండగా, హైపర్టెన్షన్ ప్రధాన ప్రమాదకారకంగా నిలుస్తోంది. మధుమేహం 3 శాతం మరణాలకు కారణమవుతోందని ఆరోగ్యశాఖ పేర్కొంది. కార్యక్రమ లక్ష్యాలు.. ఎన్సీడీలపై పెరుగుతున్న భారాన్ని తగ్గించడంతో పాటు నిర్ధారణ కాని హైపర్టెన్షన్, మధుమేహ కేసులను గుర్తించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. ముందస్తు నిర్ధారణతో చికిత్స, జీవనశైలిలో మార్పులు చేసుకునేలా అవగాహన కల్పిస్తారు. స్ట్రోక్, హార్ట్ డిసీజ్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సంక్లిష్టతలను నివారించడ ంలో వైద్యులు, సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుంటారు. ఎవరిని లక్ష్యంగా చేసుకుంటారు.. ఆరోగ్య జనగామ కార్యక్రమంలో 30 ఏళ్లు పైబడిన ప్రతీ వ్యక్తి ఊబకాయం, కుటుంబ చరిత్ర, పొగతాగడం, మద్యపానం చేసే ప్రమాదభరిత వర్గాలను ఎంచుకుంటారు. సబ్సెంటర్లు, పీహెచ్సీలు, సీహెచ్సీలు, జిల్లా ఆసుపత్రిలో స్క్రీనింగ్తో పాటు గ్రామస్థాయిలో ఏఎన్ఎంలు, ఆశలు, ఎంపీడబ్ల్యూలు వైద్య శిబిరాలతో పాటు తలుపుతట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. బీపీ, బ్లడ్ షుగర్ పరీక్షలు చేసి, వైద్యులతో నిర్ధారణ, ఆ తర్వాత చికిత్స ప్రారంభిస్తారు. పరిస్థితి క్రిటికల్ అని నిర్ధారించుకుంటే ఉన్నత కేంద్రాలకు రెఫర్ చేస్తారు. రక్తపోటు, మధుమేహ నియంత్రణ.. 30 ఏళ్లు పైబడిన ప్రతీ వ్యక్తి తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయిం చుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య విభాగం అధికారులు సూచిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయివరకు దశల వారీగా అమలు చేస్తున్నారు. వ్యక్తుల మొబిలైజేషన్ బాధ్యతను ఆశాలకు అప్పగించారు. స్క్రీనింగ్ ప్రక్రియను ఏఎన్ఎం, ఎంఎల్ హెచ్పీలు నిర్వహిస్తారు. నియంత్రణ లో ఉన్న రక్తపోటు, బ్లడ్షుగర్ రోగులకు స్థానిక ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పీలు ఫాలో చేస్తారు. నియంత్రణలో లేని రోగులను జిల్లా ఆసుపత్రిలోని ఎన్సీడీ క్లినిక్కు రెఫర్ చేస్తారు. సబ్సెంటర్ స్థాయిలో కార్యాచరణ సబ్సెంటర్ స్థాయిలో గతంలో ఉన్న హైపర్టెన్షన్, డయాబెటిస్ కేసుల వివరాలను సిద్ధం చేస్తారు. ఎంఎల్హెచ్పీ, సూపర్వైజర్, ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏ (ఎం), ఆశాలతో కూడిన టీం అవగాహన సమావేశాలు నిర్వహిస్తుంది. బీపీ, ఆర్బీఎస్ పరీక్షలు చేసి ఏవైనా అసాధారణ రోగాలు ఉంటే పీహెచ్సీకి పంపిస్తారు. పీహెచ్సీ స్థాయి చర్యలు పీహెచ్సీ స్థాయిలో రెఫర్ అయిన కేసులను మళ్లీ పరిశీలించి అవసరమైతే సీబీపీ, హెచ్బీఏ1సీ, ఎల్ఎఫ్టీ, ఆర్ఎస్బీ వంటి పరీక్షలు చేయిస్తారు. క్లిష్టమైన కేసులను ఉన్నతస్థాయి ఆసుపత్రులకు రిఫర్ చేసి, పేషెంట్లకు చికిత్స, కౌన్సెలింగ్ ఇస్తారు. ఒకరి కంటే ఎక్కువ వైద్యులు ఉన్న పీహెచ్సీల్లో ఓపీ సేవలు, ఫీల్డ్ మానిటరింగ్ (ఆరోగ్య జనగామ) ద్వారా స్క్రీనింగ్ శిబిరాల పర్యవేక్షణ చేస్తారు. ఆరోగ్య శాఖ సందేశం ఆరోగ్య జనగామతో ముందస్తు పరీక్షలు చేయించడం ద్వారా త్వరిత గుర్తింపుతో ప్రాణాలను కాపాడవచ్చు. ఈ ప్రోగ్రాంతో జిల్లా ఆరోగ్యవంతమైన వైద్య పరీక్షల్లో మరో ముందడు గు వేయనుంది. జిల్లాలో హైపర్టెన్షన్, మధుమేహ నియంత్రణను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రస్థాయి షూటింగ్బాల్ పోటీలకు ఎంపిక జిల్లా సమాచారం జిల్లా జనాభా: 5,33,104 30 ఏళ్లు పైబడిన వారు: 1,97,786 ప్రస్తుత మధుమేహ వ్యాధిగ్రస్థులు: 9.76 శాతం(అంచనా 17శాతం) హైపర్టెన్షన్ ఉన్నవారు: 11.76శాతం (అంచనా 30శాతం) నమోదైన ఎన్సీడీ కేసులు: 32,022ఆరోగ్య జనగామగా చేసుకుందాం జిల్లాను మధుమేహం, అధిక రక్తపోటు రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజారోగ్య కార్యక్రమంలో భాగంగా ‘ఆరోగ్య జనగామ’ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టాం. జిల్లాలో 30 ఏళ్లు పైబడిన ప్రతీ వ్యక్తికి హైపర్టెన్షన్, మధుమేహం స్క్రీనింగ్ నిర్వహించి, వ్యాధులను ముందుగానే గుర్తించి సరైన చికిత్స అందించడం అందరి లక్ష్యం. ప్రారంభ దశలో ప్రతీ గ్రామంలో రోజుకు 100 మంది చొప్పున స్క్రీనింగ్ చేస్తున్నాం. వచ్చే నెల 2 నుంచి ఏప్రిల్ 30 వరకు గర్భిణులు, యువతలో స్క్రీనింగ్ పూర్తి చేసి హెల్త్ కార్డులు ఇస్తాం. -
3 నుంచి వార్డుల్లోకి..
జనగామ: పట్టణంలో అభివృద్ధి వేగవంతం చేసేందుకు నూతన చైర్పర్సన్ కడకంచి బాలమణి వచ్చేనెల 3వ తేదీ నుంచి ‘మన చైర్పర్సన్..మన వార్డు’ సందర్శనకు శ్రీకారం చుట్టారు. పట్టణ సమస్యలను ప్రత్యక్షంగా గుర్తించి, తక్షణ పరిష్కారాల కోసం ప్రత్యేక పర్యటన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. మొదటి వార్డు నుంచి 30వ వార్డు వరకు ప్రతీ రోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు కాలనీల్లో పాదయాత్రగా పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్శనల్లో వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, అధికారులు, సీనియర్ నాయకులు పాల్గొంటారు. అభివృద్ధిపై ఫోకస్.. పట్టణ అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి అడుగు వేస్తున్నామని చైర్పర్సన్ ప్రకటించారు. పట్టణంలో పారిశుధ్యం, రోడ్లు, కాలువల శుభ్రత, వీధిదీపాలు, నాణ్యమైన తాగునీటి సరఫరా, పౌర సేవల మెరుగుదల వంటి అన్ని రంగాల్లో సమగ్ర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాపాలన బాటలో పరిపాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. టౌన్ ప్లానింగ్లో సమస్యలు టౌన్ ప్లానింగ్ సమస్యలపై వచ్చే వారం ప్రత్యేక సమీక్ష నిర్వహించవలసిందిగా కమిషనర్ను ఆదేశించినట్లు చెప్పారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ప్రజలు చాలా వరకు ఇబ్బందులకు గురవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇక నుంచి మరింత పారదర్శకత ఉండేలా చూస్తామంటూ హామీ ఇచ్చారు. చైర్పర్సన్ బాధ్యతల స్వీకరణ జనగామ మున్సిపల్ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేసిన కడకంచి బాలమణిశ్రీనివాస్, శుక్రవారం అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. బాణాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు క్రిష్ణమాచారి సిద్ధాంతి మంత్రోచ్ఛరణల మధ్య ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి, యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి సమక్షంలో కుర్చీలో కూర్చుని సంతకం చేశారు. అంతకు ముందు ఎంపీ, కొమ్మూరి, ప్రశాంత్రెడ్డి, టీపీసీసీ సభ్యుడు లక్ష్మినారాయణనాయక్, పార్టీ కేడర్తో కలిసి భారీ ర్యాలీ, మేళతాళాల నడుమ ఊరేగింపుగా మున్సిపల్కు చేరుకున్నారు. పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకునేలా పనిచేయాలని ఎంపీ, కొమ్మూరి ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి చైర్పర్సన్ చాంబర్కు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. -
కల్చర్ఫుల్ ఫెస్ట్..
● నిట్లో ఉత్సాహంగా స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకలు ● ఆకట్టుకున్న స్వయంభు సినిమా యూనిట్ ● సందడి చేసిన హీరోయిన్లు సంయుక్త మీనన్, నభా నటేష్ ● ప్రత్యేక ఆకర్షణగా హీరో నిఖిల్ సిద్ధార్థ, డైరెక్టర్ శైలేష్ ● ఉర్రూతలూగించిన ప్రోషో కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో విద్యార్థులే నిర్వాహకులుగా నిర్వహిస్తున్న సాంస్కృతిక మహోత్సవం కల్చరల్ఫెస్ట్ కలర్పుల్గా సాగింది. ఈ ఫెస్ట్లో దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొని తమతమ సంస్కృతీసంప్రదాయాలను పంచుకున్నారు. తొలిరోజు శుక్రవారం స్ప్రింగ్స్ప్రీ–26లో డైరెక్టర్స్ కట్లో సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను, స్వయంభు మూవీ హీరో నిఖిల్ సిద్ధార్థ్, హీరోయిన్లు సంయుక్త మీనన్, నభా నటేష్, అభినవ్ గోమటమ్, కెమెరామెన్ కేకే సెంథిల్కుమార్, ప్రోషోలో జోనితాగాంధీ తన గానామృతంతో విద్యార్థులను అలరించారు. ఫ్లాష్ షూట్ సీఈఓ స్టార్టప్ రంగాలపై అవగాహన కల్పించారు. చివరి రోజు శనివారం ప్రోషోలో రానినారెడ్డి పాప్ సాంగ్స్తో అలరించనుంది. -
పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు కంటిపరీక్షలు
జనగామ: పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో డీజీపీ ఆదేశాలు, సీపీ ఉత్తర్వుల మేరకు డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆటోడ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు రాత్రి డ్రైవింగ్, దుమ్ము, కాలుష్యం వల్ల వచ్చే కంటి సమస్యలపై డాక్టర్లు అవగాహన కల్పించారు. చూపు సమస్యలు ఉన్న వారికి అద్దాలు పంపిణీ చేశారు. పోలీసుల సేవా కార్యక్రమంపై ఆటో డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేస్తూ ఆ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్ఐలు భరత్, రతీష్, చెన్నకేశవులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
గద్వాల్కు రిజ్వాన్ బాషా
జనగామ: జిల్లా అభివృద్ధికి తనదైన ముద్ర వేసిన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జోగుళాంబ గద్వాల్ జిల్లాకు బదిలీ అయ్యారు. రెండేళ్ల పదవీ కాలంలో విద్య, వైద్యం, సంక్షేమం, నీటి సంరక్షణ, పారదర్శక పరిపాలన రంగాల్లో జిల్లా పేరును రాష్ట్ర, జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన కలెక్టర్గా ఆయన రుజువు చేసుకున్నారు. 2024 ఫిబ్రవరి 24న కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న రిజ్వాన్ బాషా.. సరిగ్గా రెండేళ్ల పాటు ఇక్కడ పని చేశారు. జాతీయ, రాష్ట్రస్థాయిల్లో గుర్తింపు జిల్లాలో చేపట్టిన ‘మన జిల్లా–మన నీరు’ కార్యక్రమానికి 2025లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ చేతుల మీదుగా జల్ సంచాయ్, జన్ భాగీధారీ 1.0 అవార్డు, జల్ ప్రహరీ సమ్మాన్ అందుకున్నారు. ఆర్టీఐ దరఖాస్తులను వేగంగా పరిష్కరించడంలో 2025లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఉత్తమ జిల్లా అవార్డు లభించింది. అలాగే 2026 జనవరిలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్వర్మ చేతుల మీదుగా ఉత్తమ జిల్లా పురస్కారం లభించింది. జాతీయ స్థాయిలో న్యాస్–2024లో 3వ తరగతిలో దేశంలో 16వ స్థానం, 6వ తరగతిలో 35వ స్థానం, 9వ తరగతిలో 33వ స్థానం సాధించడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో జనగామ జిల్లా మాత్రమే జాతీయ ర్యాంకుల్లో స్థానం సంపాదించింది. ఈ విజయానికి గుర్తింపుగా 2025 సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ, గద్వాల్ జిల్లాలోనూ ప్రజాసేవలో అదే ఒరవడిని కొనసాగిస్తానని కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. జిల్లాలో అభివృద్ధి, పారదర్శక పరిపాలనకు ప్రతీకగా నిలిచిన కలెక్టర్ సేవలను గుర్తుచేసుకుంటూ ప్రజలు, అధికారులు అభినందనలు తెలియజేశారు. కాగా కాన్ఫరెన్స్ హాలులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీహరితో పాటు డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఆర్డీఓ వెంకన్న, ఉన్నతాధికారులు బదిలీపై వెళ్లిన కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్లను సత్కరించారు. జనగామ జిల్లాలో అడిషనల్ కలెక్టర్, విద్యాశాఖ అధికారి(లోకల్ బాడీస్) గా బాధ్యతలు నిర్వర్తిస్త్తున్న పింకేష్ కుమార్ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆ దేశాలు జారీ చేసింది. కాగా, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లోని కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా నియమితులయ్యారు. ఇదిలా ఉండగా పింకేశ్ కుమార్ స్థానంలో ఎవరికి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, విద్యాశాఖ అధికారి రెండు పోస్టులు ఖాళీగా మారాయి. ఆయన హయాంలో జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు కలెక్టర్, అదనపు కలెక్టర్లకు ఎమ్మెల్యే కడియంతో సహా పలువురి సత్కారం -
కొత్త కలెక్టరొచ్చారు!
జనగామ: జిల్లా కొత్త కలెక్టర్గా పరిపాలనకు కొత్త దిశ ఇవ్వడానికి ప్రభుత్వం ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝాను నియమించింది. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న ఆయన్ను జిల్లాకు బదిలీ చేసింది. గురువారం జిల్లా కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా బాధ్యతలు చేపట్టారు. సమస్యలకు పరిష్కారం లభించేనా? జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, భూసర్వే, తదితర సమస్యల పరిష్కారంలో వేగవంతమైన అడుగులు పడతాయన్న ఆశాభావం ప్రజలు, అధికారుల్లో కనిపిస్తోంది. జిల్లాలో ఎక్కువగా కనిపించే భూ రికార్డు సవరణలు, సర్వే ఇష్యూలు, పాస్ బుక్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్, రోడ్ల నాణ్యత, కాలువల సమస్యల పరిష్కారంలో వేగం చూపాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య సేవల్లో మెరుగుదల దిశగా కృషి చేయాల్సిన అవసరముంది. జిల్లాలో ఆయా రోగాలు, మధుమేహం, రక్తపోటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ స్థాయిలో స్క్రీనింగ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతం, అవసరమైన సిబ్బంది నియామకం వంటి పనులు ప్రాధాన్యం పొందవచ్చని ఆరోగ్య శాఖ వర్గాలు తెలుపుతున్నాయి. బాధ్యతల స్వీకరణ జిల్లా కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా గురువారం మధ్యాహ్నం బాధ్యతలను స్వీకరించారు. బదిలీపై వెళ్లిన ప్రస్తుత కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆయనకు బాధ్యతలు అప్పగించగా, కొత్త కలెక్టర్ అధికారికంగా సంతకం చేశారు. అనంతరం పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగులు కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన సందీప్ కుమార్ ఝా కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ నుంచి జిల్లాకు.. పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభించాలని జిల్లా వాసుల ఆకాంక్ష -
ప్రాంగణాలపై పట్టింపేది?
స్పోర్ట్ ్స స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంజనగామ రూరల్: జిల్లాలోని గ్రామీణ క్రీడా మైదానాలు(ప్రాంగణాలు) పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో బోర్డులు తొలగించి నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడానికి గత ప్రభుత్వం ఊరూరా క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు సంకల్పించింది. ఇందుకు ఆయా గ్రామీణ ప్రాంతాల్లో స్థలాలు గుర్తించింది. వాటిలో నిర్మాణాలు చేపట్టి బోర్డులను ఏర్పాటు చేసింది. ఆశయం గొప్పదే అయినప్పుటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అమలుకావడం లేదు. వాటిని పూర్తిగా వినియోగంలోకి తీసుకురావడంలో అలసత్వం వల్ల నిరుపయోగంగా మారాయి. జిల్లావ్యాప్తంగా 281 గ్రామ పంచాయతీలు 201 అనుబంధ గ్రామాలు ఉండగా మొత్తం 483 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు గుర్తించి 450 వరకు నిర్మాణాలు పూర్తి చేశారు. ప్రతీ క్రీడా ప్రాంగణానికి రెండు లక్షల చొప్పున వెచ్చించారు. చాలా చోట్ల అనువైన స్థలాలు దొరక్కపోవడంతో అందుబాటులో ఉన్న చోట చదును చేసి బోర్డులు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. ప్రతీ వార్డులో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్నవి పిచ్చిమొక్కలతో నిండిపోయి ఆడుకోవడానికి వీలుకాకుండా తయారయ్యాయి. క్రీడా పరికరాలు ఎక్కడ? లక్ష్యానికి అనుగుణంగా క్రీడాకారుల్లో ఆసక్తిని బట్టి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ పరికరాలు అందజేశారు. జిల్లా అధికారులు వాటిని ఎంపీడీఓ కార్యాలయాలకు పంపించారు. అక్కడ నుంచి గ్రామాలకు చేర్చారు. క్రికెట్ కిట్లు, వాలీబాల్, బాస్కెట్బాల్, డంబెల్స్, రింగ్ బాల్స్, టీషర్టులు వంటి పెద్ద మొత్తంలో ఇచ్చారు. ప్రస్తుతం అవి ఎక్కడా ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. దూరంగా క్రీడా ప్రాంగణాలు.. ప్రతీ పంచాయతీలో ఎకరం స్థలంలో ప్రాంగణం ఏర్పాటు చేయాల్సి ఉండగా కొన్ని గ్రామాలో స్థలం లభించకపోవడంతో అందుబాటులో ఉన్న స్థలంలోనే నిర్మించారు. కొన్ని గ్రామాల్లో ఊరికి దూరంగా ఉండడంతో వాటి నిర్వహణ చూసేవారు కరువయ్యారు. పాఠశాలల్లో, వెంచర్లలో లక్షలు ఖర్చు చేసిన ప్రాంగణాలు పనికి రాకుండా పోతున్నాయి. జనగామ మండల యశ్వాంతాపూర్లో కిలోమీటర్ దూరంలో ఉండగా అందులో మొక్కలు నాటి వదిలేశారు. వడ్లకొండలో స్థలం లేక వెంచర్ భూమి లో నిర్మించారు. ఎల్లంలతో పాటు మరి కొన్ని గ్రామాల్లో నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా గ్రామాలకు దూరంగా అనేక ప్రాంగణాలు ఉన్నాయి. జఫర్గఢ్లో తిమ్మంపేట, బచ్చన్నపేటలో కేసిరెడ్డిపల్లి, స్టేషన్ ఘన్పూర్లో నమిలిగొండ, సముద్రాల, రంగరాయిగూడెంతో పాట పలు గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు వసతుల లేక సమస్యలతో దర్శనమిస్తున్నాయి. పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్న క్రీడా మైదానాలు పరికరాలు లేవు.. వసతులు కరువు నిర్వహణ పట్టించుకోని అధికారులు జిల్లావ్యాప్తంగా 483 గ్రామీణ క్రీడా మైదానాలు లక్షలు ఖర్చు పెట్టినా ప్రయోజనం శూన్యం జనగామ రూరల్: రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి కె.కోదండ రాములు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27 నుంచి వచ్చే నెల 4వ తేదీ లోపు పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు. పేర్లు నమోదుచేసుకున్న వారికి ఆయా మండల కేంద్రంలో ఎంపిక ఉంటుందన్నారు. మండల స్థాయిలో ఎంపికై న వారిని జిల్లాస్థాయిలో 28న మినీ స్టేడియంలో ఎంపిక చేసి ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే ఎంపికకు పంపుతామన్నారు. అర్హులైన వారు tgss telangana.govt.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత ఒరిజినల్స్, జిరాక్స్ కాపీలను తీసుకుని రావాలని సూచించారు. -
క్రీడలతో మానసికోల్లాసం
జనగామ రూరల్: క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక ఉత్సాహం కలుగుతుందని జెడ్పీ సీఈఓ మాధురి షా అన్నారు. కేంద్ర ప్రభుత్వం ‘మేరా యువభారత్ వరంగల్ కేంద్రం’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ను గురువారం పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా సీఈఓ మాట్లాడుతూ..క్రీడలతో ఉన్నత స్థాయిలో నిలబడవచ్చని, ప్రతీ ఒక్కరు క్రీడలపై ఆసక్తి చూపాలని, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలన్నారు. కబడ్డీ, టగ్ ఆఫ్ వార్లో ఏబీవీ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బి.భవాని, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజ్కుమార్, ఫిజికల్ డైరెక్టర్ టి.కల్యాణి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ కె.రాము, క్రీడాకారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ మాధురిషా -
సెకండియర్ పరీక్షలు ప్రారంభం
జనగామ రూరల్: జిల్లా వ్యాప్తంగా 16 సెంటర్లలో గురువారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 98.09 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్ విద్యాధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 3,999మంది విద్యార్థులకు 3,923 మంది విద్యార్థులు హాజరు కాగా 76 మంది గైర్హాజరయ్యారన్నారు. జనరల్లో 3,091 మందికి విద్యార్థులకు 3,055 మంది హాజరుకాగా 36 మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఒకేషనల్లో 908 మంది గాను 868 మంది హాజరు కాగా 40 మంది గైర్హాజరయ్యారన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 98.09శాతం విద్యార్థుల హాజరు ప్రశాంతంగా రెండోరోజు ఇంటర్ పరీక్షలు -
నేడు మున్సిపల్ పాలకమండలి బాధ్యతల స్వీకరణ
జనగామ: జనగామ మున్సిపల్ నూతన పాలక మండలి చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, వైస్ చైర్మన్ భూష పర్వతాలు, 28 మంది కౌన్సిలర్లతో కూడిన మండలి సభ్యుల పరిచయ కార్యక్రమం ఈనెల 27న (శుక్రవారం) నిర్వహించనున్నారు. మున్సిపల్ కాన్ఫరెన్స్ హాలులో ఉదయం 11 గంటలకు నూతన పాలకమండలి పరిచయ కార్యక్రమంతో పాటు చైర్పర్సన్ అధికారికంగా బాధ్యతలను తీసుకోనున్నారు. అనంతరం కొత్తగా కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్ను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్కుమార్రెడ్డి హాజరుకానున్నట్లు కమిషనర్ మహేశ్వర్రెడ్డి తెలిపారు. -
ఇంటర్ పరీక్షలు షురూ..
పరీక్ష కేంద్రం వద్ద గుమిగూడిన విద్యార్థులుక్యూలో విద్యార్థులుజనగామ రూరల్: జిల్లావ్యాప్తంగా 16 సెంటర్లలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఫస్టియర్ విద్యార్థులు 96.94శాతం హాజరయ్యారని ఇంటర్ విద్యాధికారి (డీఐఈఓ) జితేందర్రెడ్డి తెలిపారు. మొత్తం 4,480మంది విద్యార్థులకుగాను 4,343 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 137 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 3,397మందికి 3,350 హాజరు కాగా 47మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్లో 1,083 మందికి 993 మంది హాజరు కాగా 90 మంది గైర్హాజరయ్యారు. పట్టణంలోని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కాకుండా మంచినీటి వసతి, లైటింగ్తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించారు. పరీక్ష కేంద్రాల వద్ద ప్రతి సెంటర్కు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆశ, ఏఎన్ఎంలను నియమించారు. పొరపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలను నిర్వహించేందుకు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జితేందర్ రెడ్డి, సంబంధిత అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టారు. పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఐఈఓ జితేందర్ రెడ్డి, డెక్ సభ్యులు కె.సునంద, కె.శేఖర్ బోర్డు అబ్జర్వర్లు పాలకుర్తి, కొడకండ్ల పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రాలను పరిశీలించిన డీసీపీ ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో పట్టణంలోని ఏబీపీ జూనియర్ కళాశాలను డీసీపీ రాజమహేంద్ర నాయక్ పరిశీలించారు. పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత ప్రాంతాలకు తరలించాలని, ఎటువంటి మాల్ప్రాక్టీస్కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా, పక్కాగా పరీక్షలు జరిగేలా చూడాలని ఆదేశించారు. పరీక్ష గది నంబర్ చూసుకుంటున్న విద్యార్థులు మొదటి రోజు ఫస్టియర్ పరీక్షకు 96.94శాతం మంది హాజరు పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీ పోలీసు బందోబస్తు -
మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దుచేయాలి
జనగామ రూరల్: మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయకుంటే అసెంబ్లీ ముట్టడిస్తామని జీపీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం తమ సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్చార్జ్ డీపీఓ వసంతకు అందజేశారు. అంతకు ముందు జీపీ కార్మికులకు బతుకమ్మకుంట నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బస్వ రామచంద్రం అధ్యక్షత అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో రాపర్తి రాజు మాట్లాడుతూ..ప్రాణాలను తీస్తున్న మల్టీపర్పస్ వర్కర్ విధానం వెంటనే రద్దు చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది గ్రామపంచాయతీ కార్మికులను సమీకరించి అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. గ్రీన్చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని, పెండింగ్లో ఉన్న మూడునెలల వేతనాలు చెల్లించాలన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో జీవో నెంబర్ 51 సవరణ మల్టీపర్పస్ వర్కర్ విధానంపై తీర్మానం చేయాలన్నారు. కార్యక్రమంలో నారోజు రామచంద్రం, పి.మల్లేష్, యు.రాజేశ్, టి.యాకుబ్, సంగీ కరుణాకర్, ఎన్.యాకన్న, జి. రతన్ సింగ్, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట జీపీ వర్కర్స్ యూనియన్ మహాధర్నా -
‘ధన్ధాన్య’ అమలుపై సమీక్ష
జనగామ: ప్రధానమంత్రి ధన్ధాన్య యోజన (పీఎండీడీకేవై) పురోగతిపై బుధవారం కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి చిన్మయ్ పి.గోట్మారే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలు నుంచి ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి.పింకేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ స్కీంలో రూపొందించిన 6 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక అమలు పురోగతి, మండలాల వారీగా లక్ష్య సాధన, డ్యాష్బోర్డ్లో నమోదైన భౌతిక, ఆర్థిక పురోగతిపై ఆరా తీశారు. పంటల ఉత్పాదకత పెంపు, సుస్థిర వ్యవసాయ పద్ధతుల ప్రోత్సాహం, రైతులకు సులభతర రుణ సదుపాయాలు, ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తరణ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధి, సమగ్ర నీటి యాజమాన్యం, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత అమలు వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ మాట్లాడుతూ.. పీఎండీడీకేవే అమలులో జిల్లాను దేశంలో ఆదర్శంగా నిలబెట్టేలా అన్ని శాఖలు సమన్వయంతో, సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. వీసీలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్, సహకార, భూగర్భ జలాలు, పౌర సరఫరాలు, నీటిపారుదల, నాబార్డు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘ఈ–నామ్’.. మొరాయింపు
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్లో కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ–నామ్ 2.0 వెర్షన్ మొదటి రోజు బుధవారం సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంది. దేశవ్యాప్తంగా ఈ–నామ్ కొత్త వెర్షన్ ఈనెల 23 నుంచి ప్రారంభం కాగా, 25వ తేదీ నుంచి మొదలైన రైతుల డేటా నమోదు ప్రక్రియలో అనేక సమస్యలు తలెత్తాయి. రైతులకు సంబంధించిన ఐడెంటిటీ వెరిఫికేషన్లో భాగంగా పేరు, లాస్ట్ నేమ్, సన్నాఫ్, డాటర్ ఆఫ్, భార్య పేరు, మొబైల్ నెంబర్, పుట్టినతేదీ, శాశ్వత చిరునామా, పిన్కోడ్, స్టేట్, సిటీ, తహసీల్, ఏరియా తదితర వివరాలను పూర్తిగా నమోదు చేసిన తర్వాతే తదుపరి దశకు వెళ్లే విధంగా సిస్టమ్ రూపొందించారు.ఈ క్రమంలో సైట్ ఓపెన్ అవ్వడం ఆలస్యం, సర్వర్ మొరాయింపు, లాగిన్ సమస్యలు తీవ్రమయ్యాయి. ఫలితంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క రైతు డేటా కూడా నమోదు చేయలేని పరిస్థితి ఏర్పడింది. రైతులు కందులు, మొక్కజొన్న, చింతపండు వంటి సరుకులు అమ్ముకునేందుకు బుధవారం మార్కెట్కు వచ్చారు. మార్కెట్ అధికారులు రైతులు వచ్చే క్రమంలో ఎంట్రీ చేసి ఈ–నామ్ 2.0లో నమోదు చేసే క్రమంలో పని పూర్తిగా నిలిచిపోయింది. దీంతో సరుకుల కొనుగోలు ఆలస్యం కావడంతో అధికారులు మాన్యువల్ చీటీ విధానం ద్వారా బిడ్డింగ్ చేపట్టింది. మార్కెట్ కమిటీలో పనిచేస్తున్న ముగ్గురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించడంతో, ఇప్పుడు ఈ కీలక పనిని సెక్యూరిటీ గార్డ్ ద్వారా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం వచ్చిన రైతులు సాయంత్రం వరకు క్యూలో నిలబడి ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ–నామ్ కొత్త వెర్షన్పై మార్కెట్ సిబ్బందికి ముందస్తు శిక్షణ, రైతులకు అవసరమైన డాక్యుమెంట్లపై అవగాహన లేకపోవడం సమస్యను మరింత పెంచింది. రైతులు మార్కెట్కు వస్తున్నప్పుడు ఏ వివరాలు తీసుకురావాలో తెలియకపోవ డంతో నమోదు ప్రక్రియకు అడ్డంకిగా మారిపోయింది. మొదటి రోజే ఇలాంటి సవాళ్లు ఎదురవుతుండడంతో ఇదే పరిస్థితి కొనసాగుతుందా లేదా సాంకేతిక లోపాలను అధిగమించి ఈ–నామ్ 2.0 సజావుగా పనిచేస్తుందా లేదా అని రైతులు, వ్యాపారులు, మార్కెట్ అధికారులు ఎదురుచూస్తున్నారు. జనగామ మార్కెట్కు కందులు, మొక్కజొన్న, చింతపండు తదితర సరుకులు రాగా, మాన్యువల్గా చీటీ రాసి ఇచ్చారు. 32 మంది రైతుల వద్ద 104 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేయగా (మూడు రకాలవి క్వింటాల్ ధరలు రూ.7,677, రూ.6,799, రూ.7,229), 9 మంది రైతుల వద్ద 223 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేయగా(రూ.1,721, రూ.1,629, రూ.1,651), రైతులకు మద్దతు ధర కంటే చాలా తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. సెక్యూరిటీ గార్డుతో కంప్యూటర్ సేవలు రైతులకు చీటీలిస్తున్న సిబ్బంది వెరిఫికేషన్ ప్రక్రియలో సంక్లిష్టత డేటా ఎంట్రీ ఆపరేటర్లు లేకపోవడంతో సెక్యూరిటీ గార్డులతో సేవలు లోపాలు సరిచేస్తేనే సజావుగా ‘2.0’ అమలు -
బకాయిల వేట!
ఆస్తి పన్ను వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ జనగామ: ఆస్తి పన్ను (ప్రాపర్టీ ట్యాక్స్) వసూళ్లను వేగవంతం చేసేందుకు మున్సిపల్ శాఖ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారు. జనగామ మున్సిపల్ పరిధిలో 15,818 అసెస్మెంట్లు ఉండగా, ప్రస్తుత, పాత బకాయిలను కలుపుకుని రూ.6.10 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ రావాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.2.86 కోట్లు మాత్రమే వసూలు కాగా, ఇంకా రూ.3.23 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం వసూళ్ల శాతం 47.01శాతంగా నమోదైంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ రూ.3.70 కోట్లు రావాల్సి ఉండగా, దీనిపై రూ.18.61 కోట్లు పెనాల్టీ బకాయి ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న రూ.1.35కోట్ల పన్నులపై రూ.85.36 లక్షల పెనాల్టీ రావాల్సి ఉంది. ప్రస్తుత ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి డిమాండ్లో ఇప్పటి వరకు రూ.2.36 కోట్లు వసూలు కాగా, దీనికి సంబంధించిన పెనాల్టీ రూ.7లక్షలు వసూలు చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పాత బకాయిల్లో రూ.32.68 లక్షలను వసూలు చేయగా, వాటి రూ.10.67 లక్షల పెనాల్టీ రికవరీ చేశారు. ఇంకా కరెంటు డిమాండ్లో రూ.1.34 కోట్లు రావాల్సి ఉండగా, పెనాల్టీగా రూ.11 లక్షలు రావాల్సి ఉంది. పాత బకాయిల్లో రూ.1.02 కోట్లు పెండింగ్ ఉండగా, వాటిపై రూ.74.69 లక్షల పెనాల్టీలు పెండింగ్లో ఉన్నాయి. వచ్చే నెల 31 వరకు వసూళ్లు 100శాతం ప్రాపర్టీ ట్యాక్స్ పూర్తి చేయాలని లక్ష్యంగా బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు రోజూ గృహాలు, వ్యాపార సంస్థలకు వెళ్లి ట్యాక్స్ సేకరణ చేస్తున్నారు. మొండిబకాయిదారుల వల్ల కొంత సమస్యలు వచ్చినప్పటికీ, కమిషనర్ మహేశ్వర్రెడ్డి పర్యవేక్షణలో వసూళ్ల ప్రక్రియ సాగుతోంది. రోజువారీ కలెక్షన్లపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ స్వయంగా వివరాలు సేకరిస్తున్నారు. వచ్చేనెల 31 నాటికి 100 శాతం లక్ష్యం పాతవి, కొత్తవి కలుపుకుని రూ.6.10కోట్లు ప్రస్తుతం 47 శాతం వసూళ్లు ఇంటింటికీ వెళ్తున్న పురపాలక సిబ్బంది -
పాలకుర్తిలో కేంద్ర బృందం పర్యటన
పాలకుర్తి టౌన్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 100 జిల్లాలో జిల్లాకు స్థానం లభించిందని బోస్టన్ కన్సల్టెన్సీ సీనియర్ మేనేజర్ ఆకాశ్ తెలిపారు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రతినిధుల బృందం జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఎస్సీ, మైనారిటీల శాఖ అధికారి విక్రమ్ ఆధ్వర్యంలో బోస్టన్ కన్సల్టెంట్ రాహుల్తో కలిసి మండల కేంద్రంలోని ఇందిర మహిళా శక్తి భవన్లో మహిళలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉపాధి, ఆర్థికాభివృద్ధిపై సమీక్షించారు. అనంతరం ఇందిర మహిళా శక్తి సహకారంతో నిర్వహిస్తున్న మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న దీక్ష కలెక్షన్ కేంద్రాన్ని, శ్రీసోమేశ్వరలక్ష్మీనర్సింహస్వామి ఫంక్షన్ హాల్ను సందర్శించి పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ ఏపీడీ నూరొద్దీన్, క్లస్టర్ పరిశీలకుడు శ్రీనివాస్రెడ్డి, సూపరింటెండెంట్ రవీందర్, ఏపీఎం కారుపోతులు వెంకటేశ్వర్లుగౌడ్, మండల సమైక్య అధ్యక్షురాలు గునిగంటి భాగ్యలక్ష్మి, కార్యదర్శి బేజాడి సుమలత, టెక్నికల్ అసిస్టెంట్ కుమార్, దీక్ష కలెక్షన్ నిర్వహకురాలు వంగ దివ్యమహేందర్, సీఏలు పాల్గొన్నారు. -
విద్యకు 20శాతం నిధులు కేటాయించాలి
జనగామ రూరల్: విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయిస్తేనే విద్యావ్యవస్ధ అబివృద్ధి చెందుతుందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ సంఘం నాయకులు, వక్తలు అభిప్రాయపడ్డారు. జిల్లా అధ్యక్షుడు ఎన్ఎన్ రాజు ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కె.రవిచందర్ మాట్లాడుతూ.. గత 12 ఏళ్లలో ప్రభుత్వాలు విద్యకు బడ్జెట్లో నిధులు తగ్గించడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య 2021–22లో 27 లక్షల ఉంటే ప్రస్తుతం 16 లక్షలకు పడిపోయిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో 15శాతం కేటాయిస్తామని పేర్కొని 7.3 శాతం మాత్రమే కేటాయించడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో ఇప్ప రాంరెడ్డి, బాధ్యులు ఎ.నర్సింహారెడ్డి, రాజా రెడ్డి, కనకారెడ్డి, రాగల్ల ఉపేందర్, అధ్యాపక జ్వాల సంపాదకురాలు ఎ. కళావతి, అడ్వకేట్ సాధిక్ అలీ, చంద్రశేఖర్, రామస్వామి, రామ్మోహన్ రెడ్డి, అంకుషావలి, లక్ష్మయ్య, జగ్గారెడ్డి, శ్రీనివాసులు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ నాయకులు -
ఎథినిక్ నైట్ జోష్..
సంప్రదాయ దుస్తుల్లో విద్యార్ధులునిట్ వరంగల్లో కల్చరల్ ఫెస్ట్ స్ప్రింగ్స్ప్రీ–26 బ్యానర్ను ఎథినిక్ నైట్ పేరిట మంగళవారం రాత్రి ఆకాశంలో ఆవిష్కరించారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కిరణ్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై డ్రోన్సాయంతో ఆకాశంలో బ్యానర్ను ఆవిష్కరించారు. ఈ నెల 27, 28 తేదీల్లో సంస్కృతీసంప్రదాయాలను తెలిపే వేదికగా స్ప్రింగ్స్ప్రీ–26 నిలవనుందని డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. వసంతోత్సవానికి స్వాగతం పలుకుతూ విద్యార్థినులు చీరకట్టు, విద్యార్థులు పంచెకట్టులో అదరగొట్టారు. – కాజీపేట అర్బన్ -
ప్రాణాలకు రక్షణ కవచం హెల్మెట్
● వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ రఘునాథపల్లి: ప్రాణాలకు రక్షణ కవచం హెల్మెట్ అని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరి ధరించాలని వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ ద్విచక్ర వాహనదారులకు సూచించారు. మంగళవారం మండలంలోని కోమళ్ల టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన ఎరైవ్, ఎలైవ్ కార్యక్రమంలో వాహనదారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.. కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్ ఏసీపీ భీంశర్మ, జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్రెడ్డి, ఎస్సై దూదిమెట్ల నరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
పదిశాతం పనులు కూడా చేయలె..
● రెండున్నరేళ్లలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కాంగ్రెస్ చేసిందేమీ లేదు.. ● మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ● వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సందర్శన.. పనుల పరిశీలన – ఎంజీఎంఆస్పత్రి పనులను పరిశీలిస్తున్న మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, చిత్రంలో మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్సీ రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నరేందర్, శంకర్ నాయక్ తదితరులు -
నేతల ప్రసన్నం కోసం..
నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినీరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి తదితరులు తమ తమ లిస్టులను సిద్ధం చేసుకుంటూ హైకమాండ్తో సంప్రదింపులను ముమ్మరం చే స్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతుండడంతో ఇన్నాళ్లు నామినేటెడ్ పోస్టులకు ఎదురుచూసిన వారికి ఇప్పుడు అవకాశం వచ్చిందనే భావన కనిపిస్తోంది. ఏ పదవి అయినా సాధించాలనే పట్టుదలతో నాయకులు తెల్లవారుజామున ప్రారంభమయ్యే లాబీయింగ్ను రాత్రి వరకూ కొనసాగిస్తున్నారు. అవసరమైతే కొంతమంది నాయకులు హైదరాబాద్కు వెళ్లి హైకమాండ్కు తమ సేవలు, పార్టీ కోసం చేసిన కష్టాన్ని వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు. జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలకు చెందిన నాయకులు తాము అర్హులేనని చూపిస్తూ హైకమాండ్ ఎదుట తమబలం, బలగాన్ని చూపించే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. -
ద్రావిడ వేద ప్రబంధ పారాయణం
చిల్పూరు: చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం సాయంత్రం అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు వేదమంత్రాల నడుమ ద్రావిడ వేద ప్రబంధ పారాయణం భక్తులకు వినిపించారు. ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు–కిరణ్మయి, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహ న్, దాత సంగోజు మోహనాచారి– శంకర్లక్ష్మి, వీరన్న, భక్తులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ను కలిసిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిపాలకుర్తి టౌన్: మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొర్రూరు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్రెడ్డిని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించి, గెలుపొందిన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. లెదర్పార్కును సందర్శించిన లిడ్క్యాప్ ఎండీస్టేషన్ఘన్పూర్: మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న మినీ లెదర్పార్కును లిడ్క్యాప్ ఎండీ ప్రశాంత్కుమార్ మంగళవారం సందర్శించారు. కాగా విషయం తెలుసుకున్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చేపూరి వినోద్కుమార్, లెదర్పార్కు మాస్టర్ ట్రైనర్స్ అక్కడికి చేరుకుని సమస్యలను విన్నవించారు. దళితులకు ఉపాధి కల్పన కోసం ఏర్పాటు చేసిన లెదర్పార్కు నిరుపయోగంగా ఉందన్నారు. దీని కోసం పలువురు చైన్నెలో ప్రత్యేక శిక్షణ సైతం తీసుకున్నారని, ఇప్పుడు వారంతా కూలీ పని చేసుకుంటున్నారని వాపోయారు. లెదర్పార్కుకు వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు ఎండీకి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు అనంతపురం చంద్రమౌళి, జీడి యాకయ్య, రాజారపు మల్లేష్, మారపాక శ్రీనివాస్, గాదె ఈశ్వరయ్య, జీడి రాంచందర్, కుమారస్వామి, ఏలియా, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పెంబర్తిని పరిశీలించిన కేంద్ర బృందంజనగామ రూరల్: గ్రామీణ శ్రేయస్సు, స్థితిస్థాపకత కార్యక్రమంలో భాగంగా కేంద్ర బృందం మంగళవారం వివిధ అంశాలవారీగా జిల్లాలోని క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఇందులో భాగంగా మండలంలోని ఎల్లంల ఇక్కత్ చేనేత కళాకారులను, పెంబర్తి హస్త కళాకారులను కలిసి ఆయా వృత్తిలో వారి జీవనోపాధి గురించి, ప్రభుత్వ సహకారాలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వివిధ వర్గాల ప్రజలకు ఇస్తున్న రుణ సదుపాయల గురించి, అలాగే పశువుల పెంపకం యూనిట్, విజయ డెయిరీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో సభ్యులు హర్షద్, సునయ్ కీమ్ అపర్ణ, ఆనంద్ అంకిత్ వివిధ శాఖల అధికారులు విక్రమ్, మూర్తి, శివకృష్ణ, మురళీధర్రావు, గోపాల్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు. -
విజయోస్తు
జనగామ రూరల్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు ఈనెల 25 (బుధవా రం) నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 16 సెంటర్లు కేటాయించగా 8 సెంటర్లు జనగామలో, మిగిలినవి 8 ఆయా మండల కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహణ ఉండగా ఉదయం 8.30 వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. మొత్తం 8,605మంది హాజరు కానుండగా ఇందులో 4,211 ప్రథమ సంవత్సరం, 4,394 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు పరీక్ష కేంద్రాల్లో క్లాక్ రూమ్ సౌకర్యం ఉండాలని, ఎట్టి పరిస్థితిలోనూ మొబైల్ ఫోన్లను లోపలికి తీసుకుపోకుండా పక్కాగా నిఘా పెట్టాలన్నారు. పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హాల్టికెట్పై క్యూర్ కోడ్ ఏర్పాటు చేశారు. కోడ్ను స్కాన్ చేస్తే సంబంధిత పరీక్ష కేంద్రాల వివరాలను లొకేషన్ తెలుపుతుందన్నారు. అలాగే పరీక్షల సమయంలో విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురైతే.. తట్టుకొని ప్రశాంతంగా పరీక్షలు రాసేవిధంగా టెలిమానస్ నం. 14416 కి ఫోన్ చేస్తే నిపుణులు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. విద్యార్థులు సమస్యలను నివృత్తి చేసుకొనేందుకు కంట్రోల్ రూమ్ నంబర్ 9550371371 కు ఫోన్ చేయవచ్చన్నారు. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 8,605 మంది విద్యార్థులు 16 పరీక్ష కేంద్రాలు, క్యూఆర్ కోడ్తో లొకేషన్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు -
సర్వం సిద్ధం
● రేపటి నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● జిల్లా వ్యాప్తంగా 16 పరీక్షకేంద్రాలు ● హాజరుకానున్న 8,605 మంది విద్యార్థులుసజావుగా నిర్వహించాలి ఇంటర్ వార్షిక పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ఆయా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి. పరీక్ష సమయంలో విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా అదనపు ఆర్టీసీ బస్సులు నడిపించాలి. –రిజ్వాన్బాషా, కలెక్టర్ ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటాం.. జిల్లాలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. హాల్టికెట్ల జారీ విషయంలో విద్యార్థులకు ఇబ్బందులకు గురి చేస్తే ఆయా కళాశాలపై ఫిర్యాదు వస్తే కఠిన చర్య తీసుకుంటాం. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. –జితేందర్రెడ్డి, డీఐఈఓజనగామ రూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 25 నుంచి మార్చి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఎలాంటి మాస్ కాపింగ్ పాల్పడకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య, పోలీసులు, రెవెన్యూ, విద్యుత్, ఆర్టీసీ, పురపాలక, తపాలా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్బాషా ఆదేశించారు. జిల్లాలో మొత్తం 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 16 మంది పర్యవేక్షకులు, అదనపు పర్యవేక్షకులు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్స్తో పాటు 300 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షలకు మొత్తం 8,605 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో ఫస్టియర్ జనరల్లో 3,100, ఒకేషనల్లో 1,111, సెకండియర్ జనరల్లో 3,194, ఒకేషనల్లో 1,200 మంది ఉన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నపత్రాలను ఓపెన్ చేయనున్నారు. కాగా ఈసారి పరీక్ష కేంద్రాల గుర్తింపునకు లొకేషన్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రైవేట్ కళాశాలలు హాల్టికెట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టకుండా వెబ్సైట్లో నేరుగా హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. జిల్లాకు చేరిన ప్రశ్నపత్రాలు ఇంటర్ పరీక్ష ప్రశ్నపత్రాలు జిల్లా కేంద్రానికి చేరుకోగా కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఓఎంఆర్ షీట్లు, బుక్లెట్లు నేరుగా జిల్లా పోలీస్స్టేషన్కు చేరుకోగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేశారు. పోలీస్ ఎస్కార్ట్తో ప్రశ్నపత్రాలను ఆయా కేంద్రాలకు తరలించనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. -
సమస్యలు తీరేదెన్నడు?
ఏళ్ల తరబడి కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలుఈ ఫొటోలో కనిపిస్తున్న 70 ఏళ్ల వృద్ధురాలు జనగామ మండలం సిద్దెంకి గ్రామానికి చెందిన గురిజాల బాలమణి. ఇద్దరు కుమారులు ఉన్నారు. తనకున్న 4 ఎకరాల భూమిని 2 ఎకరాల చొప్పున రిజిస్ట్రేషన్ చేసింది. ఇప్పుడు తన బాగోగులు చూసుకోవడం లేదని, దిక్కుతోచని స్థితిలో ఉన్నానని కలెక్టర్ను వేడుకుంది. తన భూమి తనకు ఇప్పించాలని కన్నీటి పర్యంతమైంది. జనగామ రూరల్: కుమారులు చూసుకోవడం లేద ని, ఉద్యోగానికి రానివ్వడం లేదని, అక్రమంగా ప ట్టా చేసిన వారిపై చర్య తీసుకోవాలని, అంత్యోద య కార్డు ఇచ్చి ఆదుకోవాలని.. ఇలా పలు సమస్యలతో ప్రజలు గ్రీవెన్స్ సెల్కు వచ్చారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు ఎక్కువ సంఖ్యలో సోమవారం కలెక్టరేట్కు వచ్చారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ స్టేషన్ఘనన్పూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి డీఎస్. వెంకన్నతో కలిసి 78 దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ప్రజావాణిలో అందించిన అర్జీలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైతే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ దరఖాస్తులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.చద్దన్నం తింటున్న వృద్ధుడు గ్రీవెన్స్లో భూసమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల సమస్యలే అధికం ప్రజావాణిలో 78 అర్జీలు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యం అదనపు కలెక్టర్ బెన్షాలోమ్చద్దన్నంతో కలెక్టరేట్కు.. తమ సమస్యలు, బాధలు కలెక్టర్కు చెప్పుకోవాలని దూరప్రాంతాల నుంచి చద్దన్నంతో పలువురు బాధితులు ప్రజావాణికి వచ్చారు. తమ సమస్యలు విన్నవించిన అనంతరం మధ్యాహ్నం వారు తెచ్చుకున్న చద్దన్నం తిని తిరుగు ప్రయాణమయ్యారు. -
బంజారాల అభ్యున్నతికి కృషి
● ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాలకుర్తి టౌన్: గిరిజనుల ఆరాధ్య దైవం సంత్సేవాలాల్ మహరాజ్ గిరిజన సమాజానికి ఆదర్శమని, ఆయన స్ఫూర్తితోనే ప్రభుత్వం తండాలను అభివృద్ధి చేస్తుందని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని సేవాలాల్ మందిరంలో భోగ్ బండారో కార్యక్రమాన్ని నిర్వహించారు. గిరిజన మహిళలు సాంప్రదాయ దుస్తులతో రాజీవ్ చౌరస్తాలో ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డితో కలిసి నృత్యం చేశారు. అనంతరం గుడివాడ చౌరస్తా నుంచి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఇందిరా మహిళా శక్తి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. సమావేశంలో డీఆర్డీఓ పీడీ వసంత, తహసీల్దార్ సరస్వతి, అజ్మీర కిష్టునాయక్, తిరుపతిరెడ్డి, లావుడ్యి మంజుల, ధరావత్ సురేష్నాయక్, హమ్యనాయక్, రాజేష్నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో భవితను కోల్పోతున్నాం..
వరంగల్ క్రైం: రోడ్డు నిబంధనలు పాటించకపోవడంతో దేశ భవిష్యతైన ఎంతో మంది యువతను రోడ్డు ప్రమాదాల్లో కోల్పోతున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ప్రతీ నెల చివరి వారం నిర్వహించే ‘అరైవ్ అలైవ్’ రెండో విడత కార్యక్రమంలో భాగంగా సోమవారం కమిషనరేట్ ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో నగరంలోని వాగ్డేవి కళాశాలలో విధ్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ప్రతీ వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. తన థ్రిల్ కోసం వాహనదారుడు వాహనం నడపటం చాలా ప్రమాదకమని, కొన్ని సందర్బాల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని, ఇలాంటి చర్యల కారణంగా కుటుంబ సభ్యులు ఎంతో నష్టపోతారని సూచించారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల కారణంగా 7,500 మంది మృత్యువాత పడడం చాలా బాధకరమని, ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిన అవశ్యకతను వివరించాలని సీపీ సూచించారు. అనంతరం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామంటూ విద్యార్థుల చేత ట్రాఫిక్ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సెంట్రల్ డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ఏసీపీ సత్యనారయణ, ఇన్స్పెక్టర్లు వెంకన్న, సీతారెడ్డి, సుజాత, వాగ్దేవి కళాశాల ప్రిన్న్సిపాల్ శేషాచలం, కరస్పాడెంట్ శ్రవణ్ రెడ్డి, హరిచంద్రారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. సీపీ సన్ప్రీత్ సింగ్ -
బాల్యవివాహాల నిర్మూలన అందరి బాధ్యత
జనగామ రూరల్: బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యతని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం మహిళా శిశు సంక్షేమ శాఖ, స్కోప్ స్వచ్ఛంద సంస్థ (సొసైటీ ఫర్ ప్రోగ్రెసివ్ యాక్షన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్) సంస్థల సహకారంతో ‘బాల్య వివాహ ముక్తభారత్’ ప్రచార రథాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. బాల్య వివాహాలు బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్పై తీవ్ర ప్రభావం చూపుతాయని, వాటి నిర్మూలనకు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, సమాజం సమష్టిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా బాల్య వివాహాలు ఎక్కువగా ఉన్న సుమారు 50 గ్రామాలు, హాట్స్పాట్ ప్రాంతాలు ఆస్పత్రి పరిసరాల్లో ప్రజలకు బాలల హక్కులు, బాల్య వివాహ నిరోధక చట్టం, ఇతర చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ (1098)పై విస్తృత ప్రచారం చేయాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి కోదండరాములు మాట్లాడుతూ బాల్య వివాహ నిర్మూలనలో ప్రభుత్వం–స్వచ్ఛంద సంస్థలు–సమాజం కలిసి పని చేస్తేనే శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో లేబర్ అధికారి కుమారస్వామి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రవికాంత్, ప్రతినిధి మనోజ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్లు సంపత్, రాజు, చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ రవికుమార్, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ శేఖర్, సఖి సెంటర్ నిర్వాహకురాలు రేణుక, శారద, సుధ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
అకాల వర్షం
జలమయంగా మారిన జనగామ పట్టణ రోడ్డు ● జనగామలో జలమయమైన రోడ్లు ● విద్యుత్ సరఫరాకు అంతరాయం జనగామ: వేసవి ఉక్కపోత మధ్యలో అకాల వ ర్షం కొంత ఉపశమనం ఇచ్చినా.. సోమవారం సాయంత్రం కురిసిన వర్షంతో పట్టణంలో ప్రజ లు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హనుమకొండ, హైదరాబాద్ రోడ్డుపై డ్రెయినేజీ నాళాలు, పొంగి పొర్లడంతో మురికి నీరు రోడ్డుమీదకు చేరి వ్యాపార సముదాయాల మెట్ల వరకు ప్రవహించింది. రోడ్లు జలమయం కావడంతో వాహనాలు నిలిచిపోయాయి. బయట పనుల కోసం వచ్చిన ప్రజలు సమీప దుకా ణా ల్లో తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. -
వేసవికి విద్యుత్శాఖ సిద్ధం
జనగామ: జిల్లాలో వేసవికాలంలో పెరగనున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఎన్పీడీసీఎల్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆ శాఖ ఎస్ఈ సంపత్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయా సబ్స్టేషన్లను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. గతేడాది మార్చిలో విద్యుత్ డిమాండ్ 5,816 మెగావాట్లు ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరి 21 నాటికి 5,904 మెగావాట్లకు చేరిందన్నారు. జనగామ సర్కిల్లో ఈ నెల 17న గరిష్టంగా డిమాండ్ 368.17 మెగావాట్లుగా నమోదైందని, రాబోయే వేసవిలో అత్యధికంగా డిమాండ్ పెరిగినా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించేందుకు ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. పట్టణాల్లో పెరుగుతున్న లోడ్ను దృష్టిలో ఉంచుకుని 70 అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుతో సామర్థ్యం పెంచినట్లు తెలిపారు. అలాగే అదనంగా 38 కొత్త పంపిణీ ట్రాన్స్ఫార్మర్లు, 14 పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. సర్కిల్ పరిధిలో 6 కొత్త సబ్స్టేష న్ల నిర్మాణం కూడా ప్రారంభమైందని, విద్యుత్ సరఫరా స్థిరత్వం కోసం 30 కొత్త బ్రేకర్లు, నాణ్యత మెరుగుపరిచేందుకు 14 కొత్త 33/11 కేవీ ఇంటర్ లింకింగ్ లైన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వేసవిలో వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తున్నామని ఎస్ఈ తెలిపారు. అంతరాయం లేని సరఫరా కొనసాగేందుకు అన్ని స్థాయిల్లో ముందస్తు చర్యలు సిద్ధంగా ఉన్నాయన్నారు. డిమాండ్కు అనుగుణంగా సరఫరా ఎస్ఈ సంపత్రెడ్డి -
గురు రవిదాస్ బోధనలు మార్గదర్శకం
జనగామ: సంత్ శిరోమణి గురు రవిదాస్ మహరాజ్ బోధించిన సమానత్వం, మానవత్వం, కుల, మత భేదాలకు అతీతమైన సమాజ నిర్మాణం అత్యంత అవసరమని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సూర్యాపేటరోడ్డు ఎస్పీఆర్ స్కూల్లో జరిగిన వేడుకల్లో రవిదాస్ మహారాజ్ 650వ జయంతిని పురస్కరించుకుని ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురు రవిదాస్ జీవితం సామాజిక న్యాయం, సోదరభావం, సేవాభావానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర మోచి కుల సంఘం పట్టణ వైస్ ప్రెసిడెంట్ చంద్రగిరి శ్రీనివాస్, ట్రెజరర్ సల్లా శివకుమార్, టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్, కీర్తి వీరేందర్, శోభ, జీవన్ రెడ్డి, మనోజ్, సాయిరాం, అరుంధతి, చంద్ర కళ పాల్గొన్నారు. శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలిజనగామ రూరల్: విద్యార్థులు పోటీ ప్రపంచంలో ముందుకువెళ్లాలంటే టెక్నాలజీని ఉపయోగించుకుని శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని జిల్లా సైన్స్ అధికారి ఉపేందర్ అన్నారు. సోమవారం ఫిజికల్ సైన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో మండలంలోని శామీర్పేట పాఠశాలలో జిల్లా స్థాయి ఫిజికల్ సైన్స్ పోటీల ముగింపు సమావేశం ఫోరమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండోజు శ్రీనివాసచారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సైన్స్ అధికారి పాల్గొని మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారన్నారు. అనంతరం గెలుపొందిన వీ.పుష్యమి, కే కావే రి, రిత్విక్లకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డీసీడీఓ గౌసియా బేగం, ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి, లక్ష్మణ్ జీ, బాల రాజు, తదితరులు పాల్గొన్నారు. చిల్పూరుగుట్ట బ్రహ్మోత్సవాలు షురూచిల్పూరు: తెలంగాణలో రెండో తిరుపతిగా పేరుగాంచిన చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు తొళక్కమును అడిషనల్ కలెక్టర్ పింకేష్కుమార్ జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. సాయంత్రం అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజల అనంతరం అడిషనల్ కలెక్టర్తో పాటు జిల్లా పరిషత్ సీఈఓ మాధురిషా ఉత్సవాలను ప్రారంభించారు. ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావులు వారిని స్వామి వారి పట్టు వస్త్రాలతో సన్మానించి తీర్థప్రసాదాలను అందించారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, ధాత సంగోజు మోహనాచారి, శంకర్లక్ష్మి, వీరన్న, మల్లికార్జున్, వసంత, లక్ష్మి, కృష్ణ, హరిఽశంకర్ భక్తులు పాల్గొన్నారు. -
ప్రతీ ఎకరాకు నీరు
ములుగు: రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పనులను 2027 డిసెంబర్లోగా పూర్తిచేసి 6 లక్షల ఎకరాల ఆయట్టుకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ, దేవాదుల ఇంటెక్వెల్ మోటార్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటెక్వెల్ వద్ద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.15,500 కోట్లు ఖర్చు చేసినా నిర్మాణం పూర్తి కాలేదన్నారు. ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తాం.. ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని మంత్రివర్గంలో ఆమోదించి నిధులు సమకూర్చి పూర్తిచేస్తామని సీఎం అన్నారు. నిర్మాణం పూర్తయ్యేందుకు నిధుల కొరత, భూసేకరణ సమస్య ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే రూ. 8 లక్షల 11 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వంపై అప్పుల భారం ఉందని వెల్లడించారు. గోదావరి, కృష్ణా జలాలపై అపోహలు వద్దని, తెలంగాణకు రావాల్సిన వాటాను, నీటి హక్కులపై ప్రభుత్వం తరఫున పూర్తిగా పోరాడి కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ప్రతీ ఎకరాకు సాగునీరు, ప్రతీ పౌరుడికి తాగునీరు అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కూడా ప్రాజెక్టులు పూర్తికాలేదన్నారు. నీళ్లు, నిధులు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం లోపాల వల్ల ప్రాజెక్టులు పూర్తికాకుండా పోయాయని విమర్శించారు. జూన్ 2 వరకు భూసేకరణ : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దేవాదుల ప్రాజెక్టులో సొరంగ మార్గంతోపాటు పంపుహౌస్లలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల భూసేకరణ జూన్ 2 వరకు పూర్తిచేస్తామని వివరించారు. ఇందుకు అవసరమైన నిధుల విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించారు. గోదావరి నదిలో చుక్క నీటిని వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే జలాశయాల్లో తెలంగాణ వాటా పరిరక్షణకు చర్యలు మొదలయ్యాయని, ట్రిబ్యునల్, సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర ప్రభుత్వం వద్ద పోరాటం చేస్తున్నది తామేనని ఆయన స్పష్టం చేశారు. కొందరు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, మహబూబాబాద్, వరంగల్ ఎంపీలు బలరాంనాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, గండ్ర సత్యనారాయణరావు, పల్లా రాజేశ్వర్రెడ్డి, ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా పాల్గొన్నారు.రెండేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి దేవాదులకు ఇప్పటి వరకు రూ.15,500 కోట్లు ఖర్చు గోదావరి, కృష్ణా జలాల వాటా, నీటి హక్కులు పూర్తిగా కాపాడుదాం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తుపాకుల గూడెంలో సమ్మక్క బ్యారేజీ, దేవాదుల ఇంటెక్వెల్ పరిశీలన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్కనీరు ఎత్తిపోయలే.. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్షా పది వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినా రెండేళ్లలో చుక్క నీరు కూడా ఎత్తిపోయలేదని సీఎం రేవంత్రెడ్డి రు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టుల నిర్మాణాలు, రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, గోదావరి నది జలా లపై ప్రతిపక్షాలతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గోదావరి, కృష్ణా నది జలాల కోసం పక్క రాష్ట్రాలతోపాటు అవసరమైతే కేంద్రంతో పోరాడుతామని పేర్కొన్నారు. కష్టపడి ప్రాజెక్టులను నిర్మించుకొని ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకుందామన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మంత్రివర్గంతో సమీక్షించనున్నట్లు సీఎం తెలిపారు. మేడారం జాతరను మహా కుంభమేళాగా జరిపించామని, మేడారంలో శాశ్వత సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. -
దేవాదుల సమస్యలు పరిష్కరించండి
జనగామ: జనగామ నియోజకవర్గంలో సాగునీటి అవసరాలను తీర్చడంలో కీలకమైన దేవాదుల ప్రాజెక్ట్ 8వ ఫేజ్ ప్యాకేజీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదివారం నివేదించారు. వివిధ గ్రామాల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రాజెక్టు ఆలస్యానికి సంబంధించిన కారణాలను తెలిపారు. దేవాదుల ప్రాజెక్ట్ 8వ ప్యాకేజీలో అత్యవసరంగా పరిష్కారం చేయాల్సిన అంశాలను ఒక్కొక్కటిగా వివరించారు. నియోజకవర్గంలో సాగునీరు పూర్తిస్థాయిలో అందకపోవడంతో పంటల ఉత్పాదకత తగ్గిపోతోందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్పష్టంచేశారు. దేవాదుల ప్రాజెక్ట్లో భాగంగా ధర్మసాగర్ లింక్ కాలువ గండిరామవరం గ్రామ పరిధిలో నాలుగు నెలలుగా నిలిచిపోయిందని, ఈ పని పూర్తికాకపోతే నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా ఆగిపోతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గండిరామారం నుంచి నుంచి కన్నెబోయినగూడెం, బొమ్మకూరు రిజర్వాయర్కు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ముందుకుసాగకుండా ఉన్నాయని, వెంటనే నిర్మాణ సంస్థలను వేగవంతమైన చర్యలు చేపట్టేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, కన్నెబోయిన గూడెం నుంచి నుంచి లద్నూరు, తపాస్పల్లి వరకు మిగిలిన పైప్లైన్ పనులను తక్షణమే పూర్తి చేయాలని, పైన్ ప్యాకేజీ లో కాలువల నిర్మాణం సరిగా జరగకపోవడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతోందన్నారు. భూసేకరణ, చెల్లింపుల సమస్యలకు పరిష్కారం చూపించడంతో పాటు యథావిధిగా నడపడం వల్ల 80 శాతం నీటిపారుదలకు ఇబ్బందులు ఉండవన్నారు. మిగిలిన 20 శాతం ఆయకట్టు అందుబాటులోకి రావాలంటే 530 ఎకరాల భూమికి సంబంధించిన చెల్లింపులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తరిగొప్పుల మండలంలోని 15 గ్రామాలకు లిఫ్ట్ పైప్ లైన్ పనులు పూర్తికాలేదని, మల్లన్నసాగర్ నుంచి టీఎస్పీఎల్ కాలువ పనులు కూడా నిలిచిపోయిన అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
మేడారంలో భక్తుల రద్దీ
ఎస్ఎస్తాడ్వాయి: మేడారానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో గద్దెల ప్రాంగణం భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క–సారలమ్మకు పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొ క్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ప్రధాన ఆర్చీ ద్వారం నుంచి భక్తులను పోలీసులు క్రమపద్ధతిలో దర్శనాలకు పంపించారు. నార్లాపూ ర్ పోలీస్స్టేషన్ ఎస్సై కమలాకర్ భక్తుల రద్దీని పర్యవేక్షించి ప్రశాంతంగా దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. మేడారం కార్యనిర్వహణాధికారి వీరస్వామి కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకు ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎత్తు బంగారం అమ్మవార్లకు మొక్కుగా సమర్పించారు. సంప్రదా యంగా పూజారులు ఆయనకు డోలివాయిద్యాలతో గద్దెలపైకి స్వాగతం పలికారు. ఆయన వెంట సూపరింటెండెంట్ విజయ్కుమార్, జూనియర్ అసిస్టెంట్లు జగదీశ్వర్, మధు, సిబ్బంది ఉన్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు వనదేవతలకు మొక్కులు -
నేటినుంచి శ్రీతిరుమలనాథ ఆలయ బ్రహ్మోత్సవాలు
స్టేషన్ఘన్పూర్: డివిజన్ కేంద్రమైన స్టేషన్ఘన్పూర్ బస్టాండ్ సమీపంలోని శ్రీతిరుమలనాఽథస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలను ఈనెల 23(సోమవారం) నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు దేవస్థాన చైర్మన్ నీల నర్సింహులుముదిరాజ్, ఆలయ అర్చకులు కలకోట రామానుజచార్యులు తెలిపారు. శ్రీతిరుమలనాఽథస్వామి దేవస్థానంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు.. శ్రీతిరుమలనాథస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు శాస్త్రోయుక్తంగా వేదపండితులచే నిర్వహించన్నట్లు, స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని మార్చి 1న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఆహ్వానం శ్రీతిరుమలనాథస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఆదివారం ఆయన నివాసంలో దేవస్థాన చైర్మన్ నీల నర్సింహులు ఆధ్వర్యంలో ఆహ్వానపత్రం అందించారు. 1న జరిగే స్వామివారి కల్యాణానికి హాజరుకావాలని కోరుతూ ఆహ్వానం పలికారు. మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, దేవస్థాన డైరెక్టర్లు యాదగిరి, ప్రశాంత్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఆహ్వానించిన దేవస్థాన చైర్మన్ -
ఏప్రిల్ 10 నుంచి ఎస్ఏ–2 పరీక్షలు
జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి నుంచి 9వ తరగతుల వరకు నిర్వహించే సమ్మెటివ్ అసెస్మెంటు(ఎస్ఏ)–2 పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యాయి. పరీక్షలను ఏప్రిల్ 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాదేశిక సంయుక్త సంచాలకుడు, జిల్లా, మండల విద్యాశాఖ అధికారులకు పరీక్షల నిర్వహణపై మార్గదర్శకాలు పంపినట్లు అందులో పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలు ముగిసిన వెంటనే మార్కులు ఆన్లెన్ వెబ్సైట్లో నమోదు చేయాలని జిల్లా విద్యాధికారులకు సూచించారు. 23వ తేదీన ప్రకటించనున్న ఫలితాల అనంతరం, అదే రోజు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం తప్పనిసరిగా నిర్వహించాలని కోరారు. పాఠశాలలు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి, నివేదికలు సమర్పించాలని స్పష్టంగా ఆదేశించారు. బుగులు వెంకన్న ఆలయానికి లాకర్ అందజేతచిల్పూరు: చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం స్టేషన్ఘన్పూర్కు చెందిన గూడూరు జగన్నాథం జ్ఞాపకార్థం కుమారుడు నరేందర్–మంజుల దంపతులు రూ.1.10 లక్షల విలువైన లాకర్ అందజేశారు. ఉదయం ఆలయానికి వచ్చిన దాతలు ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ శ్రీధర్రావు సమక్షంలో ఆలయానికి అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్ పాల్గొన్నారు. ‘పీఎం అజయ్ యోజన’ కు కన్నాయిపల్లి ఎంపికరఘునాథపల్లి: మండలంలోని కన్నాయిపల్లి గ్రామం అభివృద్ధిలో మరో ముందడుగు వేసింది. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో పీఎం అజయ్ యోజనకు (పీఎం అనుసుచిత్ జాతి అభ్యుదయ యోజన) జిల్లాలో ఒక్క గ్రామం మాత్రమే ఎంపికై ంది. దీని ద్వారా 15వ ఫైనాన్స్ నిధులతో పాటు రోడ్లు, మౌలిక వసతుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు కానున్నాయి. ఇప్పటికే ఈ గ్రామాన్ని మోడల్ గ్రామంగా ప్రభుత్వం ఎంపిక చేసి వంద శాతం సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. అదనంగా పీఎం అజయ్ యోజన పథకం కింద ఎంపిక చేయడంపై సర్పంచ్ లోనె అంజమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం నుంచి గ్రామంలో ప్రతీ ఇంటికి సర్వే చేయనున్నట్లు అధికారులు చెప్పారు. డీసీసీ అధ్యక్షుల జాతీయస్థాయి శిక్షణలో ధన్వంతి జనగామ: రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల జాతీయ స్థాయి ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆదివారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధన్వంతిలక్ష్మి నారాయణ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పది రోజుల పాటు జరుగుతున్న ఈ శిక్షణలో ప్రజా సమస్యలు, పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై విస్తృత చర్చలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. డీసీసీ పదవి హోదా కాదని, అది ప్రజల పట్ల బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుకు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రెండు మున్సిపాలిటీలను గెలుచుకున్నందుకు సీఎం రేవంరెడ్డి అభినందించినట్లు స్పష్టం చేశారు. -
సకలవిద్యార్థి సమీకృతం!
కుల, మత, వర్గ వివక్ష లేకుండా ఒకేచోట విద్యాబోధన జఫర్గఢ్: కుల, మత, వర్గ వివక్ష లేకుండా ఒకేచోట పేద విద్యార్థులకు బోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రూ.200 కోట్ల వ్య యంతో మండలంలోని ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న కోనాయిచలం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న 161/సీ/2 సర్వే నంబర్లోని 21 ఎకరాల సువిశాల ప్రభుత్వ స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ పనుల నిర్మాణానికి గతేడాది మార్చి 16న సీఎం రేవంత్రెడ్డి స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో వర్చువల్గా శంకుస్థాపన చేయగా, ఈ నెల 10న వరంగల్ ఎంపీ కడియం కావ్యతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఇతర పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యాబోధనతో పాటు ఆధునిక మౌలిక వసతులు కల్పించనున్నారు. ఈ భవన నిర్మాణ పనులు 18 నెలల్లోగా పూర్తి చేసేందుకు గడువు విధించింది. . ప్రత్యేకతలివే.. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఒకే గొడుగు కింద ఏర్పాటు కాబోతున్నాయి. ఒకే చోట 2,560 మంది విద్యను అభ్యసించనున్నారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల సొసైటీలకు చెందిన విద్యార్థులు ఈ సమీకృత భవన ప్రాంగణంలో చదువుకోనున్నారు. ఈ పాఠశాల భవనంలో వివిధ బ్లాకులుగా విద్యాబోధన అందించనున్నారు. ఒక్కో బ్లాక్కు 640 మంది విద్యార్థుల చొప్పున ఉంటారు. భాషకు సంబంధించిన ప్రత్యేక గదులను ఏర్పాటు చేయనున్నారు. ఇండోర్ యాక్టివిటీ జోన్లు, ఓపెన్ ఎయిర్ థియేటర్, విస్తృత క్రీడామైదానాలు, మూడు బ్లాక్లలో 10 (ల్యాబ్లు) ప్రయోగశాలలు, 10 డిజిటల్ కూబికల్స్తో కల్గిన లైబ్రరీలు, విద్యార్థులు పలు అంశాలపై చర్చించుకునేందుకు చర్చా గదులు వీటితో పాటు పునరుత్పాదక శక్తి వ్యవస్థలు, ఉద్యానవనాలు, జిమ్ తదితర సౌకర్యాలు కల్పిస్తారు. ఆధునిక వసతి సదుపాయాలు 5 నుంచి 8వ తరగతి విద్యార్థులకు రెండంచెల బంకర్ పడకలు, 9, 12వ తరగతి విద్యార్థులకు ఒకే అంచె మంచాలు ఏర్పాటు చేయనున్నారు. ఒకేసారి 1,280 మంది విద్యార్థులకు భోజన వసతి కల్పించే ఆధునిక హంగులతో కూడిన భోజనశాల, 8 పడకల సామర్థ్యం కల్గిన అరోగ్య సంరక్షణ కేంద్రంతో పాటు తల్లిదండ్రులు, సందర్శకుల కోసం ప్రత్యేక లాంజ్ను ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక నివాస సముదాయాలు విద్యార్థులతో పాటు విద్యా బోధన అందించేందకు జీ ప్లస్ 2 భవనాలు నిర్మించనున్నారు. ఇందులో పాఠశాలల ప్రిన్సిపాళ్లు, బోధన సిబ్బంది, వసతి గృహ వార్డెన్ల కోసం ప్రత్యేకంగా భవన సముదాయాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సమీకృత పాఠశాల భవనంలో మొత్తంగా 86 మంది సిబ్బందికి వసతులు కల్పించనున్నారు. విద్యా హబ్గా ఘన్పూర్ నియోజకవర్గం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణంతో స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంతో పాటు జఫర్గఢ్ మండలం వి ద్యాహబ్గా మారనుంది. ఘన్పూర్ నుంచి జఫర్గ ఢ్ వచ్చే రహదారిలో చేపడుతుండడంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది. ఆధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కార్పొరేట్కు దీటుగా అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలు కోనాయిచలం రెవెన్యూ పరిధిలో నిర్మాణం కాబోతున్న సమీకృత గురుకులం విద్యాహబ్గా మారనున్న స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం -
రేపు కేంద్ర బృందం పర్యటన
జనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై రేపు (సోమవారం) కేంద్ర బృందం జిల్లా పర్యటించనుందని కలెక్టర్ రిజ్వాన్బాషా తెలిపారు. శనివారం అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి గుగూల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 48 కేంద్ర పథకాల అమలును సమగ్రంగా పరిశీలించేందుకు కేంద్ర బృందం పర్యటించనుందని, ఇప్పటివరకు అందించిన పథకాల పురోగతి, పూర్తి వివరాలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు, రైస్ మిల్లర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులను నేరుగా కలుస్తారన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వసంత, జిల్లా వ్యవసాయ అధికారి అంబిక సోని తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కోదండరాములు ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ట్రాన్స్జెండర్స్కు ఉపాధి పునరావాస పథకం కింద చెక్కులు పంపణీ చేశారు. -
గోదావరి ఇంటెక్ వెల్కు నేడు సీఎం రేవంత్ రెడ్డి
దేవాదుల ప్రాజెక్టు అంశం వివాదం అవుతున్న నేపథ్యంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో ఆ ప్రాజెక్టు ఇంటెక్ వెల్ను సందర్శించనున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న సీఎం.. అక్కడినుంచి ఇంటెక్ వెల్ను సందర్శించి అక్కడే అధికారులతో ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. నీటిపారుదలశాఖ మంత్రి గతంలో 2026 మార్చి వరకు ప్రాజెక్టు పూర్తి చేసి పూర్తి ఆయకట్టుకు నీరందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో నెలరోజులే గడువు ఉండటంతో ప్రాజెక్టు పెండింగ్ భూసేకరణ, మూడో విడత పనులపై సీఎం రేవంత్రెడ్డి అఽధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు అధికారవర్గాల సమాచారం. శనివారం రాత్రి నుంచి పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. -
హాట్టాపిక్గా ‘దేవాదుల’
విహారయాత్రకు ముఖ్యమంత్రి, మంత్రులు..● దేవాదుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కేటాయించని రేవంత్రెడ్డి ● మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటనతో నిద్రలేచిన ప్రభుత్వం ● బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిసాక్షిప్రతినిధి, వరంగల్ : జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల పథకం ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ఉమ్మడి వరంగల్ ఆయకట్టుకు కీలకమైన ప్రాజెక్టులో దేవాదుల పంపుహౌస్ మోటార్లు పనిచేయకపోవడం వివాదాస్పదంగా మారింది. గత యాసంగి సీజన్లో మోటార్లు మొరాయించాయి. ఫలితంగా 60 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందక ఎండిపోయాయని రైతుల పక్షాన ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు దేవన్నపేట పంపుహౌస్ను హుటాహుటీన సందర్శించారు. మోటార్లు రన్ అయ్యే వరకు అక్కడే ఉంటామని ప్రకటించినా ఆ వెంటనే మోటా ర్లు ఆన్ కాలేదు. మోటార్లలో సాంకేతిక కారణాలు తలెత్తాయన్న అధికారులు.. ఆ తర్వాత రెండింటిని ఆన్చేయగా యాసంగి సీజన్ దాటే సమయానికి నీళ్లందాయి. ఈ సీజన్లోనూ దేవన్నపేట పంపుహౌస్లో మోటార్లు ఆన్ చేయకపోవడంతో శుక్రవారం సందర్శించిన మాజీ మంత్రి హరీశ్రావు బృందం... కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం, మంత్రుల తీరుపై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్షగట్టి, గోదావరిలో సరిపడా నీళ్లున్నా దేవాదుల ఎత్తిపోతల ద్వారా లిఫ్ట్ చేయడం లేదని ఆరోపించా రు. ఇదిలా ఉంటే దేవన్నపేట పంపుహౌస్లో నీటిపారుదలశాఖ అధికారులు శనివారం మోటార్ను ఆన్చేశారు. అక్కడి నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించేందుకు పంపు ఆన్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇదీ సీఎం రేవంత్ టూర్ షెడ్యూల్... ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 2.15 గంటలకు మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామానికి చేరుకుంటారు. 2.45 గంటలకు ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. 3 గంటలకు అక్కడినుంచి బయలుదేరి దేవాదుల ప్రాజెక్టుకు 3.30 గంటలకు చేరుకుంటారు. 5 గంటల వరకు ప్రాజెక్టుపై రివ్యూ నిర్వహిస్తారు. అనంతరం నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డితో కలిసి హెలికాప్టర్లో తిరుగు పయనమై హైదరాబాద్ చేరుకుంటారు. ప్రాజెక్టు పంపుహౌస్లకు నేతల తాకిడి నిన్న బీఆర్ఎస్ నేత హరీశ్, మాజీ ఎమ్మెల్యేల బృందం నేడు సీఎం రేవంత్రెడ్డి రాక.. గంగారం వద్ద పనుల పరిశీలన అనంతరం దేవాదుల ప్రాజెక్టుపై సమీక్ష ఎట్టకేలకు ఒక మోటార్ను ఆన్ చేసిన అధికారులుదేవన్నపేట వద్ద నీళ్లు ఎత్తిపోస్తున్నారు -
పామాయిల్ రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించాలి
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలో పామాయిల్ పండించిన రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించి తప్పనిసరిగా అడ్డా ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కనకారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఇండస్ట్రీయల్ రోడ్డుపై విక్రయాలు జరుపుతున్న రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పామాయిల్ పండించే రైతులకు సబ్సిడీలు కల్పించి ప్రోత్సహించడంతోనే జిల్లాలో వందలాది మంది రైతులు పామాయిల్ పండించారన్నారు. పామాయిల్ గెలలను అమ్ముకోవడానికి మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు స్పందించి జిల్లా కేంద్రంలో మార్కెట్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూడిద గోపి, రైతులు వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, ఉపేందర్, అంజిరెడ్డి వెంకటరమణారెడ్డి, రాజు, లక్ష్మారెడ్డి, ప్రభాకర్రెడ్డి, రాంరెడ్డి, భరత్ తదితరులు పాల్గొన్నారు. -
వేగంగా జరుగుతోంది..
జిల్లాలో రైతుల వారీగా యూనిక్ కోడ్ నంబర్ కేటాయింపుల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. సుమారు 60శాతం వరకు యూనిక్ కోడ్ నంబర్లను కేటాయించగా, రోజు వారీగా పనులు జరుగుతున్నాయి. భవిష్యత్లో యూనిక్ కోడ్ ఆధారంగా వ్యవసాయానికి సంబంధించిన ప్రతీ సంక్షేమ కార్యక్రమం దీని ద్వారా జరుగుతుంది. ప్రతీ రైతుకు ఒక యూనిక్ కోడ్ నంబర్ వస్తుంది. – రిజ్వాన్ బాషా, కలెక్టర్ జనగామ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతులందరికీ ఒకే గుర్తింపు, ఒకే నంబర్ నినాదంతో ప్రత్యేక యూనిక్ కోడ్ నంబర్ను కేటాయించే విధానాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా పట్టాదారు పాస్బుక్ ఆధారంగా యూనిక్ కోడ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లాలోని మొత్తం 12 మండలాల్లో రిజిస్ట్రేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పలు మండలాలు 60 శాతానికి పైగా నమోదు పూర్తి చేసి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ మంచి ర్యాంకులు దక్కించుకుంది. దేవరుప్పుల, నర్మెట, చిల్పూరు మండలాలు ముందంజలో ఉండగా, రిజిస్ట్రేషన్ లక్ష్యాన్ని మించిన వేగంతో పనిచేస్తున్నాయి. ప్రతీ రైతుకు యూనిక్ కోడ్ నంబర్ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతులందరికీ ప్రత్యేక యూనిక్ కోడ్ నంబర్ కేటాయించే విధానాన్ని తీసుకురావడంతో భవిష్యత్లో అన్ని వ్యవసాయ కార్యక్రమాలు వ్యవసాయ యాంత్రీకరణ, పంట ప్రోత్సాహకాలు, ఎరువుల సబ్సిడీలు, విత్తనాలు, పంట బీమా, పీఎం కిసాన్, రైతు బీమా, వ్యవసాయ అనుబంధ పథకాలు ఒక్క యూనిక్ కోడ్ నంబర్ ద్వారానే అమలుకానున్నాయి. దీంతో ప్రతీ రైతు వివరాలు సమగ్రంగా ప్రభుత్వ డిజిటల్ డేటాబేస్లో చేరి, పథకాలు పారదర్శకంగా, వేగవంతంగా చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యూనిక్ కోడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతుండగా, జనగామ జిల్లా 12 మండలాల్లో రిజిస్ట్రేషన్ శాతం 63 శాతం దాటగా, ఓవరాల్గా 58.40 శాతం పూర్తయింది. దేవరుప్పుల, నర్మెట, చిల్పూరు, తరిగొప్పుల మండలాలు 60శాతానికి పైగా న మోదు సాధించగా, పాలకుర్తి, రఘునాథపల్లి, బచ్చన్నపేట, జనగామ తదితర మండలాల్లో కూడా మంచి పురోగతి కనిపిస్తోంది. అయితే జిల్లాలో ఇంకా సుమారు 40 శాతానికి పైగా పీపీబీ (పట్టాదారు పాస్బుక్)లకు రిజిస్ట్రేషన్ జరగాల్సి ఉంది. వందశాతం వైపు పరుగులు మండల వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో వ్యవసాయ సిబ్బంది ఇంటింటా పర్యటిస్తూ రైతుల వివరాలను సేకరిస్తున్నారు. ఆధార్, బ్యాంక్ అకౌంట్, భూమి వివరాలు, పంట సాగు సమాచారం వంటి వాటిని ఒకే ప్లాట్ఫామ్లో సమీకరించడంతో రైతుకు భవిష్యత్లో ఎలాంటి పథకమైనా ఈ యూనిక్ కోడ్ ద్వారా నేరుగా అందుబాటులోకి రానుంది. రాబోయే వారాల్లో మిగిలిన పీపీబీల రిజిస్ట్రేషన్లు పూర్తిచేసి జిల్లాను వందశాతం వైపు తీసుకెళ్లాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతుకు ‘ఒకే గుర్తింపు, ఒకే నంబర్’ అనే నినాదంతో యూనిక్ కోడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం గ్రామాల్లో చైతన్యాన్ని పెంచుతోంది. జిల్లాలో 1,98,360 పీపీబీలు జిల్లాలో పట్టాదార్ పాస్ పుస్తకాలు 1,98,360 ఉండగా, ఇప్పటి వరకు 1,15,830 యూనిక్ కోడ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం రిజిస్ట్రేషన్ల శాతం 58.40శాతం పూర్తి కాగా, త్వరలోనే వందశాతం లక్ష్యం చేరుకోనున్నారు. రైతు సంక్షేమానికి కేంద్రం కీలక అడుగు భవిష్యత్ వ్యవసాయ డిజిటలైజేషన్కు మార్గం జిల్లాలో 60 శాతం పూర్తి ఒక్కకోడ్తోనే అన్ని సేవలు మూడు మండలాల్లో ముందంజమండలం పట్టాదారు పూర్తయిన శాతం పాస్పుస్తకాలు రిజిస్ట్రేషన్లు దేవరుప్పుల 18,127 11,491 63.39 నర్మెట 11,198 7,063 63.07 చిల్పూరు 13,920 8,698 62.49 తరిగొప్పుల 8,795 5,432 61.76 కొడకండ్ల 10,609 6,504 61.31 స్టేషన్ఘన్పూర్ 15,443 9,312 60.30 పాలకుర్తి 24,118 14,129 59.79 రఘునాథపల్లి 22,348 13,129 58.75 బచ్చన్నపేట 19,270 10,840 56.25 జఫర్గఢ్ 18,488 9,233 49.93 జనగామ 18,370 10,141 55.20 లింగాలఘణపురం 17,674 9,566 54.12 మొత్తం 1,98,360 1,15,830 58.40 -
రేపటి నుంచి కొమ్మాల బ్రహ్మోత్సవాలు
గీసుకొండ: జిల్లాలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి వచ్చే నెల మార్చి 9 వరకు వైభవంగా జరగనున్నాయి. సోమవారం ఉదయం 8 గంటలకు అధ్యయనోత్సవం ప్రారంభం, 24న సాయంత్రం ప్రబంధ సేవాకాలం, 25న రాత్రి పరమపదోత్సవం, 26న అంకురారోహణం, రక్షాబంధనం, దీక్షావస్త్రధారణ, అగ్ని ప్రతిష్ఠ తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, ఈఓ ప్రసాద్ తెలిపారు. 27న రాత్రి 10 గంటలకు అమ్మవార్లు శ్రీదేవి, భూదేవితో స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. 28 నుంచి మార్చి 2 వరకు ప్రత్యేక పూజలు ఉంటాయని చెప్పారు. మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7.30 వరకు దేవాలయాన్ని మూసి వేస్తామని, రాత్రి 8 గంటల తర్వాత జాతర, బండ్లు తిరగడం, దర్శనాలు ఉంటాయని వివరించారు. మార్చి 7న స్వామివారి రథోత్సవం, ఉగాది వరకు జాతర కొనసాగుతుందని పేర్కొన్నారు. -
సీపీఆర్తో ప్రాణాలు కాపాడొచ్చు
జనగామ రూరల్: సీపీఆర్తో ప్రాణాలు కాపాడుకోగలమని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె.మల్లికార్జున రావు అన్నారు. శనివారం సమగ్ర సీపీఆర్ శిక్షణ ప్రదర్శన కార్యక్రమం కలెక్టరేట్లోని సమావేశ హాలులో నిర్వహించారు. జిల్లాలోని అన్ని ఆర్బీఎస్కే మొబైల్ హెల్త్ టీమ్స్కు డాక్టర్ సాయి ప్రణీత శిక్షణ ఇచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ముఖ్యంగా అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం వంటి అత్యవసర సందర్భాల్లో సమయోచితంగా స్పందించే సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ శిక్షణ ఉద్దేశ్యమన్నారు. గుండె ఆగిన లక్షణాలను తొందరగా గుర్తించడం, స్పందన పరిశీలించడం, అత్యవసర సేవలను సమాచారం ఇవ్వడం, సరైన చెస్ట్ కంప్రెషన్ పద్ధతి ప్రాక్టికల్ డెమో ద్వారా వివరించారు. అధిక నాణ్యత గల సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలను కాపాడగలమన్నారు. శిక్షణలో అన్ని ఆర్బీఎస్కే సభ్యులు పాల్గొని సీపీఆర్ విధానాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్యామ్ కుమార్, కమల్ హాసన్, శ్రీతేజ, శరత్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు -
సొంతింటి కలను సాకారం చేసిన ప్రభుత్వం
చిల్పూరు: నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని శ్రీపతిపల్లి గ్రామంలో రంగు రమేష్, శ్రీవాణిలు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ నియోజకవర్గంలోని 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ప్రస్తుతం 85 శాతం పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేసుకున్నారన్నారు. అనుమతులు లేకుండా బేస్మెంట్ నిర్మాణాలు, స్లాబ్ లెవల్ వరకు పూర్తి చేసుకున్న ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రభుత్వం వెసలుబాటు కల్పించేందుకు జీఓ 96 తీసుకువచ్చిందని, ఈ జీఓ ద్వారా లబ్ధిదారులకు ఇండ్లను పూర్తి చేయించేందుకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్రావు, నాయకులు గడ్డమీది సురేష్, బొమ్మిశెట్టి బాలరాజు, షకీల్, పొలబోయిన నరేష్, హరిబాబు, ఏదునూరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
మోడల్ మున్సిపాలిటీగా ఘన్పూర్
స్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయడమే అందరి లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ మొదటి పాలకవర్గం సర్వసభ్య సమావేశాన్ని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిఽథులుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హాజరయ్యారు. సమావేశంలో పట్టణాభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల అభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలపై ఎక్కువ దృష్టి సారించాలని, 2050 సంవత్సరపు అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాపై డీటేయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును రూపొందించాలని అధికారులకు సూచించారు. మున్సిపాలిటీకి మంజూరైన రూ.50కోట్ల పనులకు సంబంధించి మార్చి మొదటి వారం నాటికి అన్ని అనుమతులు తీసుకుని టెండర్లు పూర్తి చేసి పనులను ప్రారంభించాలని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు రాలేదని తన దృష్టికి వచ్చిందని, ఈనెల 23న(సోమవారం) 3 నెలల వేతనాలు అందిస్తామని, రానున్న రెండు మూడు నెలల్లో కార్మికుల పెండింగ్ వేతనాలు పూర్తిస్థాయిలో వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా అందరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. వార్డులలో ప్రజల అవసరాలను గుర్తించి ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పింకేశ్కుమార్, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, మేనేజర్ సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోందని, రైతులపై ఆర్థిక భారం తగ్గించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. స్టేషన్ఘన్పూర్ పట్టణ కేంద్రంలోని రైతువేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా డీఆర్డీఏ ఆధ్వర్యంలోమహిళా సంఘాలకు సబ్సిడీపై అందించిన చేపల విక్రయ మొబైల్వ్యాన్ను ప్రారంభించారు. ఏఓ చంద్రన్కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథి ఎంపీ కావ్య మాట్లాడారు.. వ్యవసాయ యాంత్రీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయన్నారు. మారుతున్న పరిస్థితులను అనుగుణంగా రైతులు వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతులను పాటించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సబ్సిడీ వ్యవసాయ పరికరాలు జిల్లాకు 3,320 మంజూరు కాగా అందులో అత్యధికంగా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గానికి 1,600 యూనిట్లు మంజూరయ్యాయని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పింకేష్కుమార్, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికాసోని, డీఆర్డీఏ పీడీ వాసంతి, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, చైర్మన్ వినయ్కుమార్, వైస్ చైర్మన్ రాజమ్మగట్టయ్య, మారపాక రాములు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. తొలి పాలకవర్గ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరైన ఎంపీ కావ్య, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
రోడ్డెక్కిన హోర్డింగ్లు!
జనగామ: పట్టణంలో ఎక్కడ చూసినా ఎంక్రోచ్మెంట్లు, ఫుట్పాత్ ఆక్రమణలు, రోడ్లపై ప్రచార హోర్డింగ్లతో దారులన్నీ కుదించుకుపోతుంటే మునిసిల్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. పట్టణంలో కృష్ణకళామందిర్ గల్లీలో షాపింగ్మాల్స్, ఆయా దుకాణాల నిర్వాహకులు రోడ్డుపైనే ప్రచార హోర్డింగ్ల ఏర్పాటు చేశారు. దారిని ఆక్రమించేస్తూ, బాటసారులు, వాహన చోదకులు వెళ్లే పరిస్థితి లేకుండా ఆర్చీలు, మినీ బోర్డులను రోడ్డుపైనే పెట్టేసి దర్జా వెలగబెడుతున్నారు. నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతూ ఇబ్బందులు ఎదురవుతున్నా పురపాలిక అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొట్టకూటి కోసం చిరు వ్యాపారులు రోడ్డుపై అమ్ముకుంటే జబర్దస్త్ చేసే అధికారులు, రోడ్లపైనే హోర్డింగ్లను ఏర్పాటు చేసి దారులన్నీ మూసుకుపోయేలా చేస్తున్న వారిని ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. -
‘పది’లంగా ౖపైపెకి!
రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానమే లక్ష్యంగా ప్రణాళికప్రత్యేక తరగతులను బోధిస్తున్న ఉపాధ్యాయుడుటీశాట్లో పాఠాలు వింటున్న విద్యార్థులు జనగామ రూరల్: టెన్త్లో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కలెక్టర్ విద్యాశాఖ సమన్వయంతో వినూత్న కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. కలెక్టర్ ‘విజయోస్తు’ అనే కార్యక్రమాన్ని చేపట్టడంతో గత సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 98.16 శాతంతో జిల్లా 3వ స్థానంలో నిలిచింది. 2024–25లో 4వ స్థానంలో నిలిచింది. కాగా 2025–26 సంవత్సరంలో వచ్చిన స్థానాన్ని మరింతగా మెరుగుపర్చుకునేందుకు తాజాగా విజయోస్తు 2.0 ,ప్రేరణ, అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి అమలు చేస్తున్నారు. ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులకు బాధ్యతలు కేటాయించి గూగూల్ మీట్ ద్వారా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. దీనికి తోడు టీశాట్ ద్వారా రోజూ ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు ప్రసారమయ్యే కార్యక్రమంలో ప్రత్యేక పాఠాలను విషయనిపుణులతో బోధించారు. ఇప్పటికే భౌతిక, జీవశాస్త్రం, ఇంగ్లిష్, హిందీ, బోధన, గణితం, తెలుగు, సాంఘిక శాస్త్రం, ఉర్దూ భాషలో గణిత, భౌతిక, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రాల పట్టు సాధించారు. జిల్లా వ్యాప్తంగా 183 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో 2025–26విద్యా సంవత్సరానికి పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు 6,442 మంది ఉన్నారు. ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో ముందుకు.. గతేడాది వచ్చిన ఫలితాలను దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ విద్యాశాఖ అఽధికారులు ఈఏడాది యాక్షన్ ప్లాన్ రూపొందించారు. కలెక్టర్ నిత్యం పర్యవేక్షిస్తూ పాఠశాలల్లో అమలవుతున్న కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఎస్ఏ 1 పరీక్షల అనంతరం కలెక్టర్ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఏబీసీడీలుగా విద్యార్ధులను వర్గీకరించి సీ, డీ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సబ్జెక్ట్ వారీగా వారికి వచ్చే సమస్యలు నివృత్తి చేస్తున్నారు. పూర్తిగా వెనుకబడిన విద్యార్థులకు కనీసం ఉత్తీర్ణత సాధించడానికి ప్రశ్నల వారీగా ప్రిపరేషన్ చేస్తున్నారు. అలాగే పరీక్షల సమయంలో మూడు నుంచి నాలుగు రోజులు సమయం వస్తుండడంతో విద్యార్థులు ఉన్న మూడు రోజులు కూడా పాఠశాలకు రావాల్సి ఉంటుంది. వారికి ఎలాంటి అంశాలు బోధించాలనే అంశాలను ఉపాధ్యాయులకు తెలియజేశారు. అలాగే 14 రోజల యాక్షన్ ప్లాన్లో భాగంగా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ప్రధానంగా విద్యావిషయక అంశాలను తెలియజేయడం, పునఃశ్చరణ, సాధనపై దృష్టి పెట్టాలి. గతేడాది జిల్లాకు మూడోస్థానం పక్కాగా విజయోస్తు 2.0, ప్రేరణ పేరుతో కార్యక్రమాలు వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వందశాతం ఉత్తీర్ణత దిశగా అధికారుల కృషి సత్ఫలితాలపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ చొరవప్రస్తుతం నిర్వహించే ప్రత్యేక తరగతుల్లో రెండు నుంచి మూడు ముఖ్యమైన భావనలను వివరించాలి. స్వయంగా చదవడం, రాత సాధన, ఉపాధ్యాయుడి మార్గదర్శకత్వం ఉండాలి. 20 నిమిషాల పాటు సబ్జెక్టు ఉపాధ్యాయులతో భావనలపై పూర్తి వివరణ, 40 నిమిషాల పాటు సాధన ఉండాలి. రెగ్యులర్ తరగతిలో ప్రతిరోజు కనీసం మూడు ప్రశ్నలకు సమాధానం రాసేలా సాధన చేయించాలి. మూడేళ్లుగా పరీక్ష ప్రశ్నపత్రా లను విశ్లేషించాలి. సమాధానాల్లో విద్యార్థుల తప్పులను గుర్తించి వివరించాలి. వార్షిక పరీక్షలకు మధ్య విరామ రోజుల్లో ఏం చేయాలనే కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్నారు. ఆయా రోజుల్లో సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి.సమాధాన పత్రాలను ఆలస్యం చేయకుండా మూల్యాంకనం చేపట్టి విశ్లేషణ చేయాలి. ప్రశ్నల వారీగా అంచనా. సమాధాన పత్రాలను రాసే సరైన విధానం.. విద్యార్థులు సాధారణంగా చేసే తప్పులను వివరించాలి. మూల్యాంకనం చేసిన విద్యార్థుల సమాధాన పత్రాలను వారి తల్లిదండ్రులకు పంపించాలి. విద్యార్థి ప్రగతిపై వారికి అవగాహన కల్పించాలి. అలాగే ప్రీఫైనల్ పరీక్షల అనంతరం ఉత్తీర్ణత కాని, సగటు మార్కులు తెచ్చుకున్న, మంచి ప్రగతిని చూపిన విద్యార్థులకు అనుగుణంగా విద్యా వ్యూహాలను అమలు చేయాలి. -
తనిఖీ బృందాలు వచ్చేస్తున్నాయ్!
జనగామ: జిల్లాలో 2025–26 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ విద్యారంగం పర్యవేక్షణ మరింత బలోపేతం చేస్తూ జిల్లా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత స్థాయిల్లో జిల్లాస్థాయి ఇన్స్పెక్షన్ టీమ్ (తనిఖీ బృందాలు)లను ఏర్పాటు చేస్తూ సర్కారు గతంలోనే ఉత్తర్వులు వెలువరించింది. రాష్ట్ర డైరెక్టర్ ఆదేశాలు, కలెక్టర్ ఆమోదంతో స్క్రూ టినీ కమిటీ పరిశీలన అనంతరం టీచర్ల తుది జాబితా విడుదల చేశారు. జిల్లాలో 103 ఉన్నత, 64 ప్రాథమికోన్నత, 348 ప్రాథమిక పాఠశాలకు టీమ్లు కేటాయించగా, నోడల్ ఆఫీసర్లతో సహా పూర్తిస్థాయి సభ్యులు విధుల్లోకి దిగనున్నారు. రిపోర్టులు, రీ–ఇన్స్పెక్షన్లు తప్పనిసరి చేస్తూ డీఈఓ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను అనుసరించి టీచర్ల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఈ టీంలకు తుది ఆమోదం లభించింది. ఉపాధ్యాయుల అర్హత, అనుభవం, సేవా రికార్డుల పరిశీలన వంటి ప్రమాణాల ఆధారంగా జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తుది జాబితా విడుదల జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలపై నిత్య పర్యవేక్షణ, రీ–ఇన్స్పెక్షన్లు ఫాలోఅప్ల కోసం రూపొందించిన హైస్కూల్, ఉన్నత ప్రాథమిక, ప్రాథమిక స్థాయి టీమ్ల పూర్తి వివరాలు స్పష్టం చేశారు. హైస్కూల్ స్థాయిలో 103 పాఠశాలలకు టీమ్లను ఏర్పాటు చేశారు. నోడల్ ఆఫీసర్ బి.రఘుజీ (ఉన్నత, ఇప్పగూడెం, స్టేషన్ఘన్పూర్), బి.రాంబాబు (ఉన్నత, లింగంపల్లి, చిల్పూర్), ఎం.శ్రీనివాస్ (ఉన్నత, ఇప్పగూడెం, స్టేషన్ఘనపూర్), బి.శ్రీకాంత్ (ఉన్నత, స్టేషన్ఘన్పూర్), ఎస్.సత్తయ్య(ఉన్నత, గానుగుపహాడ్, జనగామ), బి.రాజిత కుమారి (ఉన్నత, దేవరుప్పుల), పి.కిషనన్కుమార్ (ఉన్నత, రాజవరం, చిల్పూర్), డాక్టర్ ఎం. సుభాష్ (ఉన్నత, పెంబర్తి, జనగామ), టి.వెంకటేశ్వర్లు (ఉన్నత,ఛాగల్, స్టేషన్ఘన్పూర్) వీరు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విధులు నిర్వర్తించనున్నారు. ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలల ఇన్స్పెక్షన్ టీమ్ల పరిధిలో 64 యూపీఎస్, 348 పీఎస్లు ఉన్నాయి. ఇందులో నోడల్ ఆఫీసర్ కె.నర్సింహారావు (ఉన్నత, కట్కూరు, బచ్చన్నపేట), సభ్యులు టి.హరిప్రసాద్ (యూపీఎస్, గుమ్మడివెల్లి, లింగాలఘన్పూర్), ఎం.రాఘవులు(యూపీఎస్, నేలపోగుల, లింగాలఘన్పూర్), ప్రాథమిక పాఠశాలల పరిఽధిలో 111 స్కూళ్లకు గాను ఒక టీమ్ ఏర్పాటు చేశారు. ఇందులో నోడల్ ఆఫీసర్గా ఎం.రమేశ్బాబు (పీఎస్, అంబేడ్కర్నగర్, జనగామ), పి.సతీష్బాబు(పీఎస్, రైల్వేస్టేషన్, జనగామ), ప్రాథమిక పాఠశాలల ఇన్స్పెక్షన్ రెండో టీంలో నోడల్ ఆఫీసర్ బి.రమేశ్(పీఎస్, కడవెండి, దేవరుప్పుల), ఎన్.జయపాల్రెడ్డి(పీఎస్, బానాజీపేట, రఘునాథపల్లి)ని ఎంపిక చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పర్యవేక్షణ 2025–26 విద్యా సంవత్సరానికి నియామకం టీచర్ల రిలీవింగ్పై ఎంఈఓ, హెచ్ఎంలకు ఆదేశాలు -
టేబుల్ టెన్నిస్లో సీపీకి కాంస్య పతకం
వరంగల్ క్రైం: సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా నిర్వహిస్తున్న నాలుగో రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో టేబుల్ టెన్నిస్ గెజిటెడ్ అధికారుల విభాగంలో వరంగల్ పోలీ స్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నారు. అదేవిధంగా 55 ఏళ్ల గె జిటెడ్ అధికారుల బ్యాడ్మింటన్ విభాగంలో వ రంగల్ కమిషనరేట్కు చెందిన ఏసీపీలు జితేందర్రెడ్డి, మధుసూదన్ జోడీ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని సాధించారు. కమిషనరేట్ హాకీ జట్టుకు కాంస్య పతకంరామన్నపేట: హైదరాబాద్లో జరుగుతున్న రా ష్ట్ర పోలీసుల తెలంగాణ స్టేట్ నాలుగో మీట్లో కమిషనరేట్కు చెందిన హాకీ జట్టు మూడో స్థానంలో నిలిచినట్లు సీపీ సన్ప్రీత్ సింగ్ తెలి పారు. ఆర్ఐ ఉదయభాస్కర్ నాయకత్వంతో పాల్గొన్న ఈ జట్టు కాంస్య పతకం సాధించినట్లు పేర్కొన్నారు. పలు విభాగాల్లో కమిషనరేట్ పోలీసులు క్రమశిక్షణ, శారీరక దారుఢ్యంతో ముందంజలో ఉన్నట్లు వివరించారు. కలెక్టర్కు ఆహ్వానపత్రికచిల్పూరు: ఈనెల 23 నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించనున్న చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హాజ రుకావాలని శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్కు ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న ఆహ్వాన పత్రిక అందించారు. శుక్రవారం అర్చకులు రవీందర్శర్మ, కృష్ణమాచార్యులు, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్తో కలిసి ఆమె జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు అడిషనల్ కలెక్టర్ పింకేశ్కుమార్కు అనంతరం డీసీపీ రాజమహేంద్రనాయక్కు బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలికారు. ‘ఉద్యం’తో నిరుద్యోగులకు ప్రయోజనాలుదేవరుప్పుల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందేందుకు ఉద్యం నమోదు ప్రక్రియతో నిరుద్యోగులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శివకృష్ణ ఠాగూర్ సూచించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల కేంద్రం– జనగామ, వ్యవస్థాపకత అభివృద్ధి కేంద్రం జనగామ ఆధ్వర్యంలో ఉద్యం రిజిస్ట్రేషన్న్పై ఎంపీడీఓ మేనక పౌడేల్ అధ్యక్షతన ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతీ, యువకులు, మహిళలు వ్యక్తిగతం మొదలుకొని కుటీర పరిశ్రమలు నెలకొల్పాలన్నా ఉద్యం పోర్టల్ నమోదు చేసుకోవాలన్నారు. అప్పుడే రుణమంజూరుతో పాటు రాయితీలు పొందుతారన్నారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు కె.శ్రీనివాస్, ఎస్.మూర్తి, ఈడీసీ మేనేజర్ చీటూరి సతీష్, అసిస్టెంట్ మేనేజర్ వడ్లూరి ఫిలిప్, సూపరింటెండెంట్ పుష్పలత పాల్గొన్నారు. విద్యార్థి దశలో పదో తరగతి కీలకం స్టేషన్ఘన్పూర్: విద్యార్థి దశలో పదో తరగతి అత్యంత కీలకమని, విద్యార్థులు కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించాలని డీసీఈబీ సెక్రెటరీ చంద్రభాను అన్నారు. ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో నిర్వహిస్తున్న పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఆయన వెంట ఏసీజీ రవికుమార్ ఉన్నారు. -
ధర్మం కోసం పోరాటం
● గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చిల్పూరు: పదహారు ఏళ్ల వయసులోనే కత్తి పట్టి సనాతన ధర్మాన్ని కాపాడేందుకు పోరాటం చేసిన మహావ్యక్తి ఛత్రపతి శివాజీ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కొనియాడారు. ముందుగా చిన్నపెండ్యాల గ్రామంలోని ఆర్చిగేట్ నుంచి రాజవరం గ్రామం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నా రు. గ్రామంలో బజరంగ్దళ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పా టు చేసిన శివాజీ విగ్రహాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా భజరంగ్ధళ్ సభ్యులు ఆయనకు కత్తి బహుకరించారు. -
కందుల ధర కిందికి
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్లో కందుల కొనుగోళ్లు జోరుగా జరుగుతున్నప్పటికీ ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాతో పాటు సూర్యాపేట, యాదాద్రి భు వనగిరి, పరిసర ప్రాంతాల నుంచి భారీగా కందులను ఇక్కడి మార్కెట్కు తీసుకొస్తున్నారు. ఇటీవల క్వింటాల్ కందుల ధర రూ.8,200 నుంచి 8,400 వరకు ఉండగా, ప్రస్తుతం ఒక్కసారిగా రూ.7,400 పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. 223 క్వింటాళ్ల కందుల కొనుగోళ్లు మార్కెట్ ఆశించిన మేర ట్రేడర్లు రాకపోవడంతో కొ నుగోళ్ల భారం కేవలం ఇద్దరు, ముగ్గురు వ్యాపారులపైనే పడుతోంది. దీంతో పోటీ తగ్గి ధరలు మరింతగా పడిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. గురువారం మార్కెట్లో 54 మంది రైతుల నుంచి 223 క్వింటాళ్ల (372 బ్యాగులు) కందులు కొనుగోలు చేశారు. రోజువారీ ధరల వివరాల ప్రకారం, అత్యధికంగా క్వింటాకు రూ.7,825, మధ్యరకంగా రూ.7,429, అత్యల్పంగా రూ.7,419 మాత్రమే పలికింది. తగ్గిన ధరలు.. ఇప్పటికే పంట దిగుబడి ఆశించినంతగా రాకపోగా, క్వింటాకు రూ.600 నుంచి రూ.900 మేర ధర తగ్గిపోవడం రైతులకు మరింత నష్టం కలిగిస్తోంది. కందులతో పాటు వేరుశనగ కూడా మార్కెటుకు వస్తున్నప్పటికీ, ధరల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు. కందుల ధర మరింత పడిపోకుండా అధికారులు జోక్యం చేసుకొని కనీసం రూ.8,400 వరకు ధర నిలబెట్టేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్కు వచ్చే ట్రేడర్ల సంఖ్య పెరిగితే ధర కూడా మెరుగయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. సమీప జిల్లాల్లో కందులకు ఎక్కువ ధర పలుకుతున్నప్పటికీ జనగామ మార్కెట్లో మాత్రం తక్కువ ధర రావడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. క్వింటాల్కు ధర రూ.600 నుంచి రూ.900 మేర తగ్గుముఖం ధర అత్యధికం రూ.7,429, అత్యల్పం రూ.7,419 ట్రేడర్లు తక్కువ.. సరుకు రాక ఎక్కువరెండుమూడు రోజుల క్రితం మార్కెట్లో కందులకు రూ.8 వేల వరకు ధర పలికింది. ఇప్పుడేమో క్వింటాల్కు రూ.600 తగ్గించారు. రెండున్నర ఎకరాల్లో కందులు సాగు చేస్తే, రూ.6వేల పెట్టుబడి కాగా, ఏడు క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ధర తక్కువైనా మార్కెట్లోనే అమ్ముకున్నా. – జూకంటి జమాల్, రైతు, కుర్రారం, రాజపేట మండలం, యాదాద్రిఒక ఎకరం 30 గుంటల్లో కందులు సాగు చేసిన. పెట్టుబడి ఖర్చు సుమారు రూ.5వేల వరకు వచ్చింది. 6 క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తుందనుకుంటే 4 క్వింటాళ్ల మాత్రమే వచ్చింది. అమ్ముకునేందుకు జనగామ మార్కెట్కు తీసుకొస్తే క్వింటాల్కు రూ.7,399 మాత్రమే ధర పలికింది. క్వింటాల్కు కనీసం రూ.8వేలు వచ్చినా బాగుండు. – ఐలేని రాములు, రైతు, శాతపురం, పాలకుర్తి -
కడియం ఖబడ్దార్
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ: కేసీఆర్పై స్టేషన్ ఘన్ఫూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమైనవని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఖండించారు. గురువారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. కడియం శ్రీహరి అంటే మోసానికి పర్యాయపదమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో దశాబ్దాలుగా ప్రజలను, నాయకులను మోసం చేస్తూ వస్తున్న వ్యక్తి అని ఆరోపించారు. కాంగ్రెస్ సభలో చేరిన శ్రీహరి గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ వంటి ప్రముఖులను వదిలి తిరుగుతూ రాజకీయ లాభాలు పొందిన ఊసరవెల్లి అంటూ విమర్శించారు. శ్రీహరికి రాజకీయ పునర్జీవనం కల్పించింది కేసీఆర్ అని, ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రి, ఎమ్మెల్యే పదవులు మాత్రమే కాక, ఆయన కుమార్తెకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చి గౌరవించినప్పటికీ, కేసీఆర్పై విమర్శలు చేయడం రాజకీయ నైతికత లేకపోవడమేనని వ్యాఖ్యానించారు. ప్రజలే శ్రీహరి రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతారన్నారు. -
కేసీఆర్ను జాతిపిత అనడం సిగ్గుచేటు
స్టేషన్ఘన్పూర్: మాజీ సీఎం కేసీఆర్ను తెలంగాణ జాతిపిత అనడానికి బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలని, దేశానికై నా, రాష్ట్రానికై నా ఒక్కరే జాతిపిత మహాత్మగాంధీ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటువ్యాఖ్యలు చేశారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో గురువారం వివిధ గ్రామాలకు చెందిన 28 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతులమీదుగా కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదని, సకల జనుల ఉద్యమ ఫలితంగా సిద్ధించిందన్నారు. ఇంకా ఎంత కాలం తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుంటూ రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, ఘన్పూర్ మున్సిపల్ చైర్మన్ వినయ్కుమార్, వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విజయశ్రీ, బెలిదె వెంకన్న, బూర్ల శంకర్, ఉపేందర్, కిషన్రాజ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అభివృద్ధికి పట్టంకట్టారు.. జఫర్గఢ్ : మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. తహసీల్దార్ రాజేష్రెడ్డి, సర్పంచ్ కుల్లా మోహన్రావు, సింగిల్ విండో మాజీ చైర్మన్ తీగల కర్ణాకర్రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంచాల ఎల్లయ్య, అన్నెబోయిన భిక్షపతి పాల్గొన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
భద్రకాళి అమ్మవారికి చీర బహూకరణ
హన్మకొండ కల్చరల్: వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి అమ్మవారికి గురువారం వేదుమ ఫ్యాబ్రిక్ హౌజ్ తయారుచేసిన కస్టమైజ్డ్ ఆర్ట్ డిజైన్ చీరను బహూకరించారు. చీరపై హ్యాండ్ ఆర్ట్తో అమ్మవారి ప్రతిరూపాన్ని అందంగా ప్రతిబింబించారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి సంస్థ యజమానులు ఓరుగంటి కార్తీక్, మోర రవళి అందజేసిన చీరను అమ్మవారికి అలంకరించారు. సేవాలాల్ జయంతి ఉత్సవాలను చేపట్టాలి స్టేషన్ఘన్పూర్: ఈనెల 24న ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో నిర్వహించనున్న గిరిజనుల ఆరాధ్యదైవం సంత్సేవాలాల్ జయంత్యోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఘన్పూర్ ఆర్డీఓ డీఎస్ వెంకన్న సూచించారు. సంత్సేవాలాల్ జయంతి నియోజకవర్గ స్థాయి ఉత్సవాల నిర్వహణపై స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి ఆర్.ప్రేమలత, బంజారా కమిటీ సభ్యులతో గురువారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక పద్మావతి ఫంక్షన్హాల్లో ఉత్సవాలను చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సహాయ గిరిజనాభివృద్ధి అధికారి హసీనాబేగం, ట్రైనీ జిల్లా పంచాయతీ అధికారి ఎ.నవీన్, తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, రవీందర్, సదానందం, విజయ్కుమార్, భిక్షపతినాయక్, స్వామినాయక్, కొమురెల్లినాయక్, హుస్సేన్నాయక్ తదితరులు పాల్గొన్నారు. మద్యపాన నిషేధం కోసం సామూహిక సంతకాలు దేవరుప్పుల: మండలంలోని బంజర గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని గ్రామస్తులు సామూహిక సంతకాలు సేకరించారు. స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు సర్పంచ్ ధరావత్ చిరంజీవి, ఉపసర్పంచ్ జోగు నాగయ్య, వార్డు సభ్యులు కలిసి ఎకై ్సజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్కు పంచాయతీ పాలకవర్గం పక్షాన వినతి పత్రం అందించారు. ఈ విషయమై సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామస్తుల సామూహిక సంతకాల సేకరణతో మద్యపాన నిషేధం కోసం కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. సిబ్బందిని మారిస్తేనే అనుమతుల ప్రక్రియలో వేగంజనగామ: పాఠశాల విద్యాశాఖ నుంచి జిల్లా విద్యాధికారులు ప్రాంతీయ సంయుక్త డైరెక్టర్ల(ఆర్జేడీఎస్ఈ)కు ముఖ్యమైన సూచనలు జారీ చేశారు. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల స్థాపన, గుర్తింపు, పునరుద్ధరణ, సీబీఎసీ, ఐసీఎస్ఈ, ఐబీ తదితర బోర్డులకు అనుబంధం కోసం ఇచ్చే ఎన్ఓసీలను నిర్ణీత సమయంలో ఆన్లైన్ ద్వారా మాత్రమే పరిశీలించి ఫార్వర్డ్ చేయాలని, ఇప్పటికే సూచనలు ఇచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ (ఐఏఎస్) అందులో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు ఉన్నప్పటికీ డీఈఓ, ఆర్జేడీఎస్ఈ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ స్థాయిల్లో ఫైళ్ల పరిశీలనలో అనవసరమైన ఆలస్యం జరుగుతోందని ఆక్షేపించారు. ఒకే సిబ్బంది ప్రైవేట్ పాఠశాలల విభాగాన్ని నిరంతరం ఒక సంవత్సరానికి పైగా చూస్తుండడంతో ఆలస్యం పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల విభాగంలో ఒక సంవత్సరానికి పైగా పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లను వెంటనే మార్పు చేయాలని ఆదేశించారు. -
పోర్టల్లో వివరాల నమోదు..
జనగామ వ్యవసాయ మార్కెట్లో ఈ నెల 23 నుంచి అన్ని వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రభుత్వం ఆధునికీకరించిన ఈ నామ్ 2.0 పోర్టల్ ద్వారా మాత్రమే నిర్వహిస్తారు. ఇప్పటివరకు ఉపయోగించిన ఈ నామ్ 1.0 వ్యవస్థకు బదులుగా కొత్త సౌకర్యాలు, ఆధునిక పద్ధతులు అమల్లోకి రానున్నాయి. రైతులు తప్పనిసరిగా ఈ నామ్ 2.0 పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. నమోదు అనంతరం రైతుకు ఒక ప్రత్యేక యూనిక్ ఐడీ కేటాయిస్తారు. ఈ ప్రత్యేక నంబర్తోనే దేశంలోని ఏ మార్కెట్లోనైనా రైతుల వివరాల ఆధారంగా అమ్మకాలు సాగుతాయి. యూనిక్ ఐడీ పొందిన రైతుల ఉత్పత్తులకే మార్కెట్లో లావాదేవీలకు అనుమతి ఉంటుంది. ఆడ్తి, ఖరీదు వ్యాపారులు ఈ నెల 21వ తేదీ లోపు ఈనామ్ 2.0లో తప్పనిసరిగా వివరాలు నమోదు చేసుకోవాలి. నమోదు సమయంలో లైసెన్స్ వివరాలు, ఫోన్ నంబర్, ఫొటో, నోడ్యూ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి. అప్రూవల్ పొందిన వ్యాపారుల వివరాలు మాత్రమే ఈ–నామ్ 2.0లో కనిపిస్తాయి. వారికే వ్యాపారానికి అనుమతి ఉంటుంది. -
పన్నులు వందశాతం వసూలు చేయాలి
జనగామ: జనగామ పురపాలిక పరిధిలో మార్చి 31వ తేదీ వరకు ఇంటి, నల్లా పన్నులు వందశాతం వసూలు చేయాలని కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఆదేశించారు. గురువారం మున్సిపల్ కమిషనర్ చాంబర్లో అన్ని శాఖలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో 15,818 అసెస్మెంట్లు ఉండగా, రూ.6.10కోట్ల మేర డిమాండ్ ఉందన్నారు. ఇందులో ఇప్పటివరకు రూ.2.70కోట్లు వసూలు కాగా, ఇంకా రూ.3.45 కోట్లు బాకీ ఉందన్నారు. అలాగే 13,806 నల్లా కనెక్షన్లు ఉండగా, డిమాండ్ రూ.2.90కోట్ల మేర వసూలు కావాల్సి ఉందన్నారు. ఇందులో రూ.19.78లక్షల వరకు వసూలు కాగా, ఇంకా రూ.2.70కోట్ల మేర రావాల్సి ఉందన్నారు. సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ వెళ్లి వచ్చే నెల 31వ తేదీలోపు వందశాతం బాకీలు క్లియరెన్స్ చేయాలన్నారు. పట్టణ ప్రజలు సకాలంలో ఇంటి, నల్లా పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలన్నారు. వచ్చే నెల 31 వరకు డెడ్లైన్ సమీక్షలో కమిషనర్ మహేశ్వర్రెడ్డి -
రాష్ట్రస్థాయిలో టాప్లో నిలవాలి
జనగామ రూరల్: రానున్న పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లాలో టాప్లో నిలవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో ప్రధాన సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారి పింకేశ్ కుమార్తో కలిసి ఆయన శ్రీవిజయోస్తు 2.0శ్రీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..విజయోస్తు 2.0లో భాగంగా జిల్లాలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే ప్రతీ విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా పాఠశాల స్థాయిలో సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించి అమలుచేయాలని ఆదేశించారు. ప్రీ ఫైనల్, మాక్ టెస్ట్ల ఫలితాల ఆధారంగా విద్యార్థులను స్థాయివారీగా వర్గీకరించి బోధన నిర్వహించాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక రిమీడియల్ తరగతులు నిర్వహించాలని, ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులను దత్తత చేసుకొని వ్యక్తిగత పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశంలో ఏఎంఓ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలి జిల్లాలో వ్యవసాయరంగ అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాకు కేటాయించిన నిధులను ఈ నెలాఖరులోపు అర్హులైన రైతులకు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమంలో ప్రస్తుతం 60శాతం మాత్రమే పూర్తి అయిందని మిగిలిన రైతులు నమోదు చేసుకోవాలన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ విజయోస్తు 2.0పై సమీక్ష -
సనాతన పరిరక్షకుడు శివాజీ
కనుల పండువగా ఛత్రపతి జయంతి జనగామ: సనాతన ధర్మపరిరక్షకుడు ఛత్రపతి శివాజీ అని వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, బీజేపీ నాయకులు కొనియాడారు. శుక్రవారం రాత్రి పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతిని పురస్కరించుకొని శివాజీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ముక్క కుమారస్వామి, జిల్లా నాయకుడు బానోత్ అర్జున్ పిలుపు మేరకు రైల్వే స్టేషన్ నుంచి కాషాయ జెండాలతో భారీ ర్యాలీ ప్రారంభమైంది. ట్రాక్టర్పై శివాజీ మహారాజ్ విగ్రహం, ఆటోల్లో మైక్ సిస్టమ్తో ఊరేగింపు సాగింది. వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తలతో సహా వందలాది మంది హిందువులు పాల్గొనగా, పట్టణమంతా కాషాయమయంగా మారింది. రైల్వే స్టేషన్ నుంచి నెహ్రూ పార్క్ మీదుగా ఆర్టీసీ చౌరస్తా, అనంతరం సూర్యాపేట రోడ్డులోని శివాజీ విగ్రహం వద్దకు ర్యాలీ చేరింది. సీఐ సత్యనారాయణరెడ్డి పర్యవేక్షణలో ఎస్సైలు చెన్నకేశవులు, భరత్ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఆరుట్ల దశమంతరెడ్డి, దొంతుల శేఖర్, కొంతం శ్రీనివాస్ పాల్గొన్నారు.శివాజీ శోభాయాత్రలో పాల్గొన్న విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, బీజేపీ శ్రేణులుఈ–నామ్ మరింత ఫాస్ట్! -
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
జనగామ రూరల్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలకు పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులకు సూచించారు. బుదవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండారీ చేతన్ నితిన్తో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 25వ తేది నుంచి వచ్చే నెల16వ తేదీ వరకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వార్షిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 8,605 విద్యార్థులు పరీక్షలు హాజరుకానున్నారన్నారు. ఇందులో 4,211 ప్రథమ సంవత్సరం, 4,394 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. విద్యార్థులు సమస్యలను నివృత్తి చేసుకొనేందుకు కంట్రోల్ రూమ్ నెంబర్ 9550371371 కి ఫోన్ చేయవచ్చన్నారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జితేందర్ రెడ్డి , విద్యుత్, విద్యాశాఖ, మెడికల్, సంబంధిత శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు. పేదల అభ్యన్నతికి ప్రభుత్వం కృషి.. పేద మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శ్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ పని తీరు, ఆర్థిక ప్రణాళికలు, బ్యాంకు లింకేజీ రు ణాలపై బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించా రు. ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ వసంత, ఏపీడీ నూరిద్దిన్, జిల్లా సమైఖ్య అధ్యక్షులు, ఓబీ సభ్యులు, సీ్త్ర నిధి రీజినల్ మేనేజర్ ప్రమీల, అసిస్టెంట్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. వరదల సమయంలో జాగ్రత్తలు అకాల వర్షాలు విపత్కర పరిస్థితుల సమయంలో తీసుకోవలిసిన చర్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నా రు. హైదరాబాద్కు చెందిన 10వ బెటాలియన్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో బుధవారం నెల్లుట్ల చెరువు వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, ఆర్డీఓ గోపిరామ్, ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ ముఖేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.రోడ్డు ప్రమాదాల మాదక ద్రవ్యాల వినియోగ నివారణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో రోడ్డు భద్రత, మాదక ద్రవ్యాల వినియోగ నివారణ మీద తీసుకున్న చర్యలపై సంబంధిత అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలిసి సమీక్షించారు. జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
చిన్నవేం కాదు!
సమస్యలుకొత్త పాలకమండలిదే పరిష్కార బాధ్యతజనగామ: పట్టణాభివృద్ధిపై ప్రజల్లో నెలకొన్న ఆశలు నూతన మున్సిపల్ పాలకవర్గం భుజాలపై మరింత బాధ్యతను పెంచుతున్నాయి. ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న శానిటేషన్, చెత్తసేకరణ, రహదారుల దుస్థితి, డ్రెయినేజీ సమస్యలు రోజువారీగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వర్షం పడితే కాలనీలు వాగులను తలపించే పరిస్థితి నేపథ్యంలో కొత్త కమిటీపై పట్టణ ప్రజలు ఆశలు పెట్టుకుంటున్నారు. జ్యోతినగర్, జీఎంఆర్ కాలనీ, బాలాజీ నగర్, హౌసింగ్ బోర్డు, కురుమవాడ, గిర్నిగడ్డ, గోకుల్ నగర్, బాణాపురం, ప్రెస్టన్ ఏరియా శ్రీహర్ష రెసిడెన్సీ, శ్రీ దుర్గా కాలనీ, అమ్మబావి వంటి ప్రాంతాల్లో చెత్త సేకరణ క్రమం తప్పడంతో పారిశుద్ధ్యం పెరిగిపోయింది. మూసుకుపోయిన డ్రెయినేజీలు, నిండిన నాళాలు ప్రజలకు మేలు చేసేదానికి మించి ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. తాగునీటి సరఫరాలో కలుషిత సమస్య కూడా ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతోంది. ఆయా వార్డులకు నీటి సరఫరా సమయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో పారదర్శకత లోపించడం, సేవల్లో ఆలస్యం ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది. పురపాలక వ్యవస్థలో పబ్లిక్ సిటిజన్ సర్వీస్ సెంటర్, ఈ–ఆఫీస్, స్టేషనరీ కొరత వంటి అంశాలు కూడా తక్షణ పరిష్కారం కావాలి. పనిచేయని సిబ్బంది మీద కఠిన చర్యలు తీసుకోవడం, పనిభారాన్ని సమానంగా పంచడం వంటి సంస్కరణలు కొత్త పాలకవర్గం కోసం ఎదురుచూస్తున్నాయి. పట్టణంలో అక్రమ సెల్లార్లు, రోడ్లపై ఎంక్రోచ్మెంట్లు, అక్రమంగా ఏర్పాటు చేసిన ప్రచార బోర్డుల నియంత్రణపై కూడా చర్యలు తప్పనిసరి. మొత్తం మీద, మున్సిపల్ పరిపాలనను గాడిలో పెట్టి ప్రజ లకు మెరుగైన సేవలు అ ందించడంలో నూతన పాలకమండలి ఎదుర్కొనే పరీక్ష చిన్నది కాదు. నెహ్రూపార్కు ప్రాంతంలోని 60 ఫీట్ల రహదారి అభివృద్ధి, అమ్మబావి–గిర్నిగడ్డ చిన్నమోరికి శాశ్వత పరిష్కారం, ధర్మకంచ 14వ వార్డు(అంబేడ్కర్ నగర్)తో పాటు పలు ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి అత్యవసరం. అనేక కాలనీల్లో సీసీ రోడ్లు లేకపోవడంతో వానకాలం వచ్చేసరికి రవాణా కష్టసాధ్యమైపోతోంది. -
కొత్త ఆశలతో ‘ఘన’స్వాగతం
రేపు నూతన పాలకవర్గం ప్రత్యేక సమావేశంఈ ఫొటోలో కనిపిస్తున్నది స్టేషన్ఘన్పూర్ రైల్వేగేటు సమీపాన ఉన్న వివేకానంద చౌరస్తా. ఘన్పూర్లో ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లేకపోవడంతో కూరగాయల వ్యాపారులు స్టేషన్ఘన్పూర్, శివునిపల్లి పట్టణాల్లో రోడ్లపైనే కూరగాయలను విక్రయిస్తున్నారు. దాంతో ట్రాఫిక్కు తీవ్ర సమస్యగా ఉంది. అదేవిధంగా కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చేవారు ఇష్టారాజ్యంగా రోడ్డుపైనే వాహనాలు నిలుపుతుండగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు షాపుల యజమానులు తమ షాపులకు చెందిన బోర్డులు, హోర్డింగ్లు రోడ్డుపైనే పెడుతుండగా రోడ్లు ఇరుగ్గా మారి సమస్య తీవ్రమవుతోంది.● మున్సిపాలిటీ అయినా మారని తీరు ● కంపు కొడుతున్న వార్డులు ● అధ్వానంగా రోడ్లు, డ్రెయినేజీలు ● పట్టణవాసుల ఆకాంక్షలు నెరవేరేనా!స్టేషన్ఘన్పూర్: కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ పాలకవర్గానికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గతేడాది మున్సిపాలిటీగా మారినా పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రెయినేజీలు తదితర సమస్యలు షరా మామూలుగానే ఉన్నాయి. ప్రధానంగా మార్కెట్, రోడ్ల సమస్య తీవ్రంగా ఉంది. ప్రత్యేకమైన సిబ్బందిని నియమించకపోవడంతో గతంలో పనిచేసిన పారిశుద్ధ్య సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. దాంతో ఏ వార్డులో చూసినా డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా ఉండి కాలనీలు కంపుకొడుతున్నాయి. రోడ్లపై మురుగునీరు పారుతుండగా దుర్వాసనతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. పలు కాలనీలు సీసీ రోడ్లకు నోచుకోక మట్టిరోడ్లకే పరిమితమయ్యాయి. మటన్, చికెన్ వ్యాపారులు, కూరగాయలు అమ్ముకునే వారు ఇష్టారాజ్యంగా రోడ్ల పక్కన వ్యర్ధాలు వేస్తుండగా ఆయా ఏరియాలు కంపుకొడుతున్నాయి. ప్రత్యేకమైన మార్కెట్ సౌకర్యం లేక రోడ్లపై కూరగాయల వ్యాపారులు విక్రయాలు జరుపుతుండగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. రోడ్లపై చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో కాలనీలు అస్తవ్యస్తంగా కనిపిస్తుండగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మున్సిపాలిటీలో సమస్యలతో సతమతమవుతున్నామని, కొత్తగా ఏర్పడిన పాలకవర్గం పరిష్కరించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.పారిశుద్ధ్య, ట్రాఫిక్ తదితర సమస్యలపై పలుమార్లు అధికారులు, సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. శివునిపల్లిలో డ్రెయినేజీల సమస్య తీవ్రంగా ఉంది. గతంలో పలువురు విషజ్వరాలతో ఇబ్బందులకు గురయ్యారు. పాలకమండలి మా సమస్యలను పరిష్కరిస్తుందని ఆకాంక్షిస్తున్నాం. – ఎండీ.దస్తగిరి, పట్టణవాసిస్టేషన్ఘన్పూర్ ఎస్సీ కాలనీలో పలు వార్డుల్లో డ్రెయినేజీలు అధ్వానంగా ఉండగా మురుగునీరు ఇండ్ల ముందు నిలుస్తోంది. దాంతో కాలనీల్లో పందులు, దోమల స్వైర విహారంతో దుర్వాసనతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య సమస్యపై నూతన పాలకమండలి చొరవ చూపాలి. – గుండె మల్లేష్, పట్టణవాసి -
వైభవంగా అగ్నిగుండాలు
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మహా శివరాత్రి జాతర బ్రహ్మో త్సవాలు బుధవారం అగ్నిగుండాలు, మహా అన్నపూజ, పూర్ణహుతితో ముగిశాయి. చివరి రోజు ఆలయంలోని మెట్ల ఎదురుగా ఏర్పాటు చేసిన అగ్నిగుండాల్లో ఆలయ ఈఓ బాగం లక్ష్మీప్రసన్న నేతృత్వంలో తెల్లవారుజామున 4,30 గంటలకు స్వామివార్లను పల్లకిలో వాహనకారులు, భక్తులు నిప్పులపై నడిచి భక్తిపారవశ్యానికి లోనయ్యారు. అర్చకుడు దేవగిరి శ్యాంశర్మ, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రధాన అర్చకుడు దేవగిరి లక్ష్మన్న, అర్చకులు డీవీఆర్శర్మ, అనిల్కుమార్, నాగరాజు పాల్గొన్నారు. పూర్ణహుతితో ముగిసిన సోమన్న జాతర బ్రహ్మోత్సవాలు -
ఆర్టీసీకి కొమురవెల్లి ఆదాయం రూ.21లక్షలు
జనగామ రూరల్: మహాశివరాత్రి కొమురవెల్లి జాతర సందర్భంగా జనగామ నుంచి ప్రత్యేక బస్సులు నడిపినందుకు ఆర్టీసీకి రూ.21 లక్షల ఆదాయం లభించిందని ఆర్టీసీ డీఎం స్వాతి తెలిపారు. బుధవారం డిపోలో అధికారులు, సిబ్బందికి అభినందన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 14నుంచి 16 వరకు ప్రత్యేక బస్సులు 522 ట్రిప్పులతో 23,490 కిలోమీటర్లు తిప్పడం జరిగిందన్నారు. 22 వేల మంది ప్రయాణికులను చేరవేయగా ఆర్టీసీకి రూ.21.35 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. దీని కోసం కృషి చేసిన ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలిపారు. చిన్నారుల నైపుణ్య అంచనాకు శిక్షణజనగామ: రెండో తరగతి విద్యార్థుల పునాది నైపుణ్యాల అంచనాకు రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్ఎల్ఎన్(ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) సాంపిల్ స్టడీ నిర్వహించేందుకు ఎస్సీఈఆర్టీ కార్యాలయం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రమేశ్ ఆదేశాలు జారీ చేశారు. తెలుగు, ఉర్దూ, గణితం, ఇంగ్లిష్ విషయాల్లో విద్యార్థుల నేర్చుకునే స్థాయిని గుర్తించేందుకు 2025–26 విద్యాసంవత్సరానికి ఈ స్టడీ చేపడుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల పరిధిలోని పలు స్కూల్స్ను ఎంపిక చేశారు. డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్లకు నేటి(19వ తేదీ) నుంచి 20 తేదీల్లో రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనుండగా, 23, 24తేదీల్లో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ల శిక్షణ, 25, 27 తేదీల్లో నమూనా పాఠశాలల్లో ఫైనల్ అసెస్మెంట్ నిర్వహిచనున్నారు. జనగామ జిల్లాకు అవసరమైన తెలుగు ప్రావీణ్యం కలిగిన 51, ఉర్దూ ప్రావీణ్యం కలిగిన 2 అవసరమున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఎంపిక చేసిన వివరాలను గూగుల్ సీట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులో జిల్లాకు రూ.1.20 లక్షలు నిధులు కేటాయించారు. నేడు విద్యార్థి గర్జన సభజనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలలో ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని కోరుతూ ఈనెల 19న(గురువారం) ఉదయం 11 గంటలకు స్థానిక స్కాలర్స్ పాఠశాల క్రీడా మైదానంలో విద్యార్థి గర్జన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సాదిక్ ఫౌండేషన్ చైర్మన్ సాదిక్ అలీ తెలిపారు. ఈసందర్భంగా పట్టణంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి వాల్పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యా పరిరక్షణ సమితి కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్, ఎ.పి.టి.యఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నర్సింహా రెడ్డి, విద్యా పరిరక్షణ సమితి రాష్ట్ర బాధ్యులు, రాష్ట్ర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. వాటర్ప్లాంట్ ఆటో ఢీకొని చిన్నారి దుర్మరణంస్టేషన్ఘన్పూర్: మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులో ఐజల్ వాటర్ ప్లాంట్కు చెందిన ఆటో ఢీకొని చేపూరి మన్విత(2) అనే చిన్నారి బుధవారం సాయంత్రం మృతిచెందింది. గ్రామానికి చెందిన చేపూరి రమేశ్, అనూష దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. చిన్న కుమార్తె మన్విత. రమేశ్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాయంత్రం ఛాగల్లులోని ఎస్సీ కాలనీలో మినరల్ వాటర్ పోసేందుకు వచ్చిన ఐజల్ వాటర్ ప్లాంట్ ఆటో వాహనం ప్రమాదవశాత్తు ఇంటి ముందు ఆడుకుంటున్న మన్వితను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వినయ్కుమార్ తెలిపారు. -
పెళ్లిసందడి మొదలు..
జనగామ: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెళ్లికళ సంతరించుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత నేటి (గురువారం) నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభమవుతుండడంతో కుటుంబాలు పండుగ జోరులో ఉన్నాయి. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి కార్యాలకోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాయి. జోరుగా వ్యాపారం.. పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో బంగారు, వెండివ్యాపార సంస్థలు, పూల దుకాణాలు, బ్యాండ్ బాజా, సన్నాయి మేళా బృందాలు, మేకప్ ఆర్టిస్టులు, పెళ్లిలతో సంబంధం ఉన్న చిన్నా, చిన్న వ్యాపారాల వరకు గిరాకీ బాగా పెరిగింది. ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్లు ముందుగానే బుక్ అయిపోవడంతో చివరి నిమిషంలో ముహూర్తాలు పెట్టుకున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొందరు పట్టణ పరిధిలో హాళ్లు దొరకకపోవడంతో దూర ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లను ఆశ్రయిస్తున్నారు. బడ్జెట్ ఖర్చుపై ఆలోచనలు.. ఈసారి పెళ్లిళ్లకు బడ్జెట్ మాత్రం కుటుంబాలను బాగా ఆలోచింపజేస్తోంది. బంగారం, వెండి ధరలు అంచనాలకు మించి పెరగడంతో సాధారణ, పేద, మధ్యతరగతి కుటుంబాలు గత ఏడాది వేసుకున్న అంచనాలు పెరిగి పోయాయి. దీంతో ఆభరణాల కొనుగోళ్లు సగానికి తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేటినుంచి శుభముహూర్తాలు రెండు నెలల్లో ముహూర్తాలు లిమిటెడ్ -
కాంగ్రెస్ కౌన్సిలర్లను అరెస్ట్ చేయండి
● అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన జనగామ: పురపాలిక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో 8వ వార్డు దళిత కౌన్సిలర్ను ఓటు వేయకుండా అడ్డుకోవడమే కాకుండా దాడిచేసిన కాంగ్రెస్కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు చెంచారపు కరుణాకర్రెడ్డి, మారబోయిన పాండును వెంటనే అరెస్ట్ చేయాలని దళిత, గిరిజన మున్సిపల్ కౌన్సిలర్లు ఊడుగుల కిష్టయ్య, పానుగంటి సువార్త ప్రవీణ్, సజ్జ దుర్గప్రసాద్ డిమాండ్ చేశారు. దళిత మహిళా కౌన్సిలర్పై దాడికి నిరసనగా బుధవారం అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ చౌరస్తాలో నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతి చేసిన తర్వాత వారు మాట్లాడారు..చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో గూండాల్లాగా వ్యవహరించిన పాండు, కరుణాకర్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా, వెంటనే వారిని అరెస్ట్ చేయాలన్నారు. ఎస్సీ,ఎస్టీ కమిషన్లో సైతం ఫిర్యాదు చేయబోతున్నామన్నారు. కార్యక్రమంలో పసుల ఏబేలు, గద్దల నర్సింగరావు, కన్నారపు పరుశరాములు, మల్లిగారి రాజు, అనిత, తిప్పారపు విజయ్, కన్నారపు శివశంకర్, ఊడుగుల సాగర్, కందుకూరి ప్రభాకర్, తాళ్లపల్లి సురేష్, బొట్ల శంకర్, అనిల్, తోట సునీల్, కొమ్ము రాజు, బక్క సునీల్, గద్ద సాయికుమార్, గుజ్జిక రాజు, ఇరుగు యాకన్నతో పాటు కుల సంఘాలు, ఎమ్మార్పీఎస్, మాలమహానాడు నాయకులు పాల్గొన్నారు. -
ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం
● పట్టణాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతాం ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి జనగామ: ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనని, పట్టణంలోని 30 వార్డుల సమగ్రాభివృద్ధికే తన మొదటి ప్రాధాన్యమని మున్సిపల్ చైర్పర్సన్గా నూతనంగా ఎన్నికై న 22వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ కడకంచి బాలమణి తెలిపారు. మంగళవారం చైర్పర్సన్ ఎన్నిక అనంతరం సాక్షికి ఇచ్చిన ఇంటర్వూ ఆమె మాటల్లోనే.. అన్నివర్గాల అభివృద్ధే మా లక్ష్యం.. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, స్ట్రీట్లైట్లు అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికీ పరిమితం కాదు. ప్రతీ వార్డు సమాన హక్కులతో ముందుకు సాగాలని చూస్తాం. ప్రజలకు అందుబాటులో ఉంటా. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటా. ప్రముఖ నాయకుల మద్దతే బలం సీఎం రేవంత్రెడ్డి ప్రోత్సాహంతో పాటు నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరు ప్రతాపరెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, డీసీసీ, అన్ని వర్గాలు తీసుకువచ్చిన ఐక్యత నా విజయానికి దోహదపడింది. జనగామను రోల్ మోడల్గా చేస్తా.. పట్టణ అభివృద్ధి కోసం తక్షణ, దీర్ఘకాల ప్రణాళికలను తయారు చేస్తాం. చెత్త నిర్వహణలో స్మార్ట్ విధానం, డ్రైనేజీల పునర్నిర్మాణం, ప్రధాన రహదారుల పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెడతా. పచ్చదన పెంపునకు ప్రత్యేక కార్యక్రమాలు, మున్సిపల్ సేవల డిజిటలైజేషన్, పట్టణ ఆర్థిక వనరుల పెంపుకు కొత్త మోడల్ను తయారు చేస్తాం. పౌరసదుపాయాల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచుతాం. జనగామను ఇతర పట్టణాలకు ఆదర్శంగా నిలబెట్టడమే మా లక్ష్యం. అన్ని వర్గాల సహకారం అవసరం రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే. అభివృద్ధి ఐదు సంవత్సరాలు. అందువల్ల ప్రతీ వర్గం, ప్రతి పార్టీలోని ప్రజలూ కలిసి రావాలి. అభివృద్ధి కోసం ఏకాభిప్రాయం అత్యవసరం. చైర్పర్సన్ బయోడేటా: పేరు: కడకంచి బాలమణి వృత్తి: వ్యాపారం భర్త: కడకంచి శ్రీనివాస్ విద్య: గ్రాడ్యుయేషన్ పిల్లలు: కుమారుడు, కూతురు పుట్టిన ఊరు: ఉప్పల్ -
గ్రామ పాలనలో సర్పంచ్ల పాత్ర కీలకం
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ రూరల్: గ్రామ పంచాయతీ పాలనలో సర్పంచ్ల పాత్ర కీలకమని, ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను సర్పంచులు సద్వినియో గం చేసుకుని గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. చిల్పూర్, స్టేషన్ ఘన్పూర్, రఘునాథపల్లి, లింగాల ఘణపురం, జఫర్గఢ్ మండలాలకు చెందిన నూతనంగా ఎన్నికై న సర్పంచ్లకు మంగళవారం మండలంలోని క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు..తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని అంశాలను, విధి విధానాలను సర్పంచ్లు క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులను సక్రమంగా వినియోగించుకొని గ్రామాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ వసంత, ట్రైనీ డీపీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు. రైతు నమోదు తప్పనిసరి.. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా, సమర్థవంతంగా అర్హులైన వారికి నేరుగా చేరేందుకు రైతు నమోదు తప్పనిసరి చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు.వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడుతూ..పది రోజుల పాటు గ్రామాల్లో ప్రణాళిక ద్వారా ఈ ఫార్మర్ రిజిస్ట్రీని పూర్తిచేయాలని ఆదేశించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం లో భాగంగా జిల్లాకు కేటాయించిన రూ.2.73కోట్ల కేటాయింపునకు సంబంధించిన రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే వారికి పరికరాలు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
లక్కీ హ్యాండ్!
బుధవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026జనగామ: జనగామ పురపాలక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు మంగళవారం తీవ్ర ఉద్రిక్తతల మధ్య నాటకీయంగా సాగాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నికల అధికారి, ఆర్డీఓ గోపిరామ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సమావేశం హాలులో ప్రారంభమైన ప్రక్రియలో మొదట చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ సభ్యుల ఓటింగ్లో ఆ పార్టీకి చెందిన 12 మంది, సీపీఐ(ఎం) నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్రులు, ఎక్స్ అఫీషియో ఓటుగా ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి చేతులు ఎత్తడంతో మొత్తం 16 ఓట్లు వచ్చాయి. వెంటనే బీఆర్ఎస్ సభ్యులు ఓటింగ్కు రాగా 13 మంది సభ్యులు, ఇద్దరు స్వతంత్రులు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఎక్స్అఫీషియో ఓటుతో కలిపి వారికి కూడా 16 ఓట్లు రావడంతో టెన్షన్ నెలకొంది. లాటరీ పద్ధతిలో.. ఇరుపక్షాలకు సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారి గోపిరామ్ లాటరీ విధానాన్ని అమలు చేశారు. కాంగ్రెస్ తరఫున 22వ వార్డు కౌన్సిలర్ కడకంచి బాలమణి, బీఆర్ఎస్ తరఫున 18వ వార్డు సభ్యుడు గోపగోని సుగుణాకర్ గౌడ్ పేర్లను ప్రకటించారు. కాంగ్రెస్ తరఫున చైర్మన్ అభ్యర్థిగా బాలమణిని 15 వార్డు సభ్యుడు మారబోయిన పాండు ప్రతిపాదించగా, 25వ వార్డు కౌన్సిలర్ పాముకుంట్ల ప్రసాద్ మద్దతు పలికారు. బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి గోపగోని సుగుణాకర్గౌడ్ను 17వ వార్డు సభ్యుడు ఉడుగులు కిష్టయ్య ప్రతిపాదించగా, 9వ వార్డు సభ్యురాలు గునిగంటి వెన్నెల పద్దతిచ్చారు. అనంతరం ఇద్దరు చైర్మన్ అభ్యర్థుల పేర్లతో ఐదు చొప్పున చీటీలు రాసి డబ్బాలో వేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులు, పోలీసుల సమక్షంలో మొదట తీసిన చీటీలో బాలమణి పేరు రావడంతో ఆమె లక్కీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆర్డీఓ అధికారికంగా ఫలితాన్ని ప్రకటించారు. తర్వాత వైస్ చైర్మన్ పదవికి కూడా ఇదే విధానం పాటించారు. బీఆర్ఎస్ మద్దతు దారుడు 23వ వార్డు కౌన్సిలర్ భూష పర్వతాలు, కాంగ్రెస్ మద్దతుదారుడు 15వ వార్డు సభ్యుడు మారబోయిన పాండు పేర్లతో చీటీలు వేసి తీసిన సమయంలో భూష పర్వతాలు పేరు రావడంతో ఆయన వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఎన్నికై న ఇద్దరికీ ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించి అధికారిక ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఓటింగ్ సమయంలో ఉద్రిక్తత ఎన్నిక జరిగే సమయంలో ఓటింగ్ హాలులో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. సమావేశం ప్రారంభమైన వెంటనే స్వతంత్ర కౌన్సిలర్ మారబోయిన పాండు సీటింగ్ అమరికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. చేతులెత్తే ప్రక్రియలో బీఆర్ఎస్ టర్మ్ వచ్చిన సమయంలో పాండు, కాంగ్రెస్కు చెందిన 27వ వార్డు కౌన్సిలర్ చెంచారపు కరుణాకర్రెడ్డి కలిసి బీఆర్ఎస్కు మద్దతిస్తున్న 8వ వార్డు మహిళా సభ్యురాలు మంజుల చేయిని కిందికి లాగి గుంజేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో పాటు వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి నియంత్రణలోకి వచ్చింది. చివరకు మంజుల బీఆర్ఎస్కు ఓటు వేశారు. ఈ సంఘటనపై అక్కడే ఉన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. దాదాపు 45 నిమిషాల పాటు హాల్లో ఉద్రిక్తత నెలకొనగా భారీగా పోలీసులు మోహరించారు. ఇరు పక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకోగా, ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకో వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కౌన్సిలర్ బాలమణిని వరించిన అదృష్టం వైస్ చైర్మన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ భూష పర్వతాలు ఎన్నిక ప్రక్రియలో తీవ్ర ఉద్రిక్తతఓటెయ్యకుండా అడ్డుకున్నారు.. ఎమ్మెల్యే పల్లా, దళిత కౌన్సిలర్ల ఆరోపణ ఎమ్మెల్యే..సభ్యులను కొనాలని చూశారు ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి లాటరీ పద్ధతిలో జనగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక -
ఒకే సామాజిక వర్గానికి చైర్పర్సన్, వైస్ చైర్మన్
జనగామ: జనగామ మున్సిపాలిటీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 74 ఏళ్ల పురపాలక చరిత్రలో మొదటిసారిగా చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులు ఒకే సామాజిక వర్గానికి దక్కాయి. కురుమ కులానికి చెందిన కడకంచి బాలమణి చైర్పర్సన్గా, భూష పర్వతాలు వైస్ చైర్మన్గా లాటరీ ద్వారా ఎన్నికయ్యారు. ఇద్దరూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించడం విశేషం. ముఖ్యంగా ఇదే వర్గానికి వరుసగా రెండు కీలక పదవులు దక్కడం జనగామలో అరుదైన సంఘటనగా నమోదైంది. ఈ పరిణామంతో కురుమ కులస్తుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆఫర్లు వచ్చినా నో ‘జంప్’ జనగామ: మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో నాలుగు, ఐదు రోజులుగా రెండు ప్రధాన పార్టీల మధ్య అంతర్యుద్ధం ఉధృతంగా కొనసాగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏదీ స్పష్టమైన మెజార్టీ సాధించకపోవడంతో స్వతంత్రులతో పాటు తమ పార్టీల సభ్యులను ఆకర్షించేందుకు ఇరువైపులా విస్తృతంగా ప్రయత్నాలు జరిగాయి. కోట్ల రూపాయల వరకు ఆఫర్లు జరిగినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చలు జరిగినా, ఎవరూ తమ వైఖరిని మార్చకుండా తమ తమ పార్టీ పట్ల నిబద్ధతగా నిలిచారు. స్వతంత్రులు కూడా ఒకే దిశగా నిలవడంతో ఎవరూ జంపు జిలానీ కాలేదు. చివరకు గెలిచింది.. లక్కు చీటీ! జనగామ: మున్సిపల్ ఎన్నికలు ఈసారి నిజంగానే కోట్ల విలువైన లాటరీగా మారి పట్టణ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. స్థానిక నేతలు, కార్యకర్తలు, పర్యవేక్షకుల మాటల్లో ఒక్క ఓటు ధర రూ.2,500 నుంచి రూ.10 వేల వరకు పలికిందని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ, క్యాంపులు, బూచీలు, ఆర్గనైజింగ్ ఇలా అన్ని ఖర్చులు కలిపి మొత్తం 30 వార్డుల మీద రూ.100 కోట్ల పైగా డబ్బు చలామణి అయ్యిందనే ప్రచారం పట్టణంలో గట్టిగా వినిపిస్తోంది. ఇంత భారీ ఎలక్షన్ ఖర్చు అయినా, జనగామ ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. చివరకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను అధికారులు లాట రీ పద్ధతిలో నిర్వహించాల్సి వచ్చింది. కోట్ల ఖర్చు చేసి, క్యాంపులు మార్చి, గడప గడప ప్రజలను ఒప్పించిన పార్టీలకు చివరికి ‘అదృష్టం’నే నమ్ముకోవాల్సి వచ్చింది. కోట్ల ఖర్చు చేసిన పోరులో చివరికి గెలిపించింది లాటరీ చీటీ అని పట్టణవాసులు వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్కు ఎమ్మెల్యే పల్లా శుభాకాంక్షలుజనగామ: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మంగళవారం జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యంగా, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని, ప్రజల కోసం మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. శివుడికి అన్నపూజతో అలంకరణ జనగామ రూరల్: శ్రీ నగేశ్వర వాసవీ కన్యకాపరమేశ్వరి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా పూజా కార్యక్రమాలు ముగిసిన సందర్భంగా మంగళవారం శివుడికి ప్రత్యేక అన్న పూజ నిర్వహించారు. భక్తులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం జనగామ రూరల్: మండలంలోని చౌడారం కేజీబీవీలో ఖాళీగా ఉన్న నైట్ వాచ్ఉమన్, అసిస్టెంట్ కుక్ పోస్టు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్ఓ రాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత కలిగిన మహిళా అభ్యర్థులు ఈనెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు విద్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరా లకు 9010931250, 7569087633, 970527 0551 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
పట్టణం.. పోలీస్ వలయం
జనగామ: జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాతావరణం రెండో రోజూ బయట ప్రశాంతంగా, కౌంటింగ్ హాల్లో ఉద్రిక్తంగా కొనసాగింది. మొదటి రోజు చోటు చేసుకున్న ఉద్రిక్తతలు, ఘర్షణలు దృష్ట్యా పోలీసుశాఖ అప్రమత్తమై భారీ బందోబస్తు చేపట్టింది. డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో అదనపు బలగాలను జిల్లాకు తరలించి ప్రతి కీలక కేంద్రాన్ని పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. మున్సిపల్ కార్యాలయం, ఆర్టీసీ చౌరస్తా, నెహ్రూ పార్కు, ఆర్అండ్బీ అతిథి గృహం, హెడ్ పోస్ట్ఆఫీస్, గ్రీయిన్ మార్కెట్ రోడ్, రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎంట్రెన్సుల వద్ద బారికేడ్లు, అదనపు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రాజకీయ నాయకు లుగా అనుమానం ఉన్న ఎవరినీ కూడా లోపలికి అనుమతించలేదు. ఐడీ కార్డు ఉన్నవారిని మాత్రమే హాల్లోకి పంపేలా కఠిన నిబంధనలు అమల్లోకి అమలు చేశారు. అడుగడుగునా తనిఖీలు ఉదయం బీఆర్ఎస్ తరఫున వచ్చిన బస్సును ఆర్అండ్బీ అతిథి గృహం వద్దే డీసీపీ, ఏఎస్పీ పండేరి చేతన్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. అందులో ఉన్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో పాటు సభ్యుల భర్తలు, ఇతర కుటుంబ సభ్యులు బస్సు నుంచి దిగిన తర్వాతే కౌన్సిలర్లను లోనికి పంపించారు. అనంతరం ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన కాంగ్రెస్ బస్సును కూడా ఇదే తరహాలో తనిఖీ చేసి కేవలం కౌన్సిలర్లను మాత్రమే హాల్లోకి అనుమతించారు. ముందస్తు అరెస్ట్లు మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు పట్టణానికి రాకుండా పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కీలక నేతల్లో కొందరిని ముందుగానే నిర్బంధంలోకి తీసుకోవడంతో ఉద్రిక్తతలు మరింత తగ్గాయి. దీంతో బయట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అదుపులోకి వచ్చాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులపై కఠిన ఆంక్షలు నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణుల ముందస్తు అరెస్ట్ ఓటింగ్ హాల్ తప్ప, అంతటా ప్రశాంతం -
పురన్నాటకం
పోడియం వద్ద బైఠాయించిన కాంగ్రెస్, పలువురు స్వతంత్ర, సీపీఎం సభ్యులు, మద్దతుగా ఎంపీజనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో హైడ్రామాజనగామ: జనగామ పురపాలిక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సోమవారం నాటకీయ పరిణామాల మధ్య వాయిదా పడింది. మూడు రోజులుగా ప్రత్యేక క్యాంపుల్లో బస చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వతంత్ర సభ్యులు ఉదయం 11గంటలకు పోలీస్ ఎస్కార్ట్ నడుమ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం నుంచే ఇరు పార్టీలు రూట్మ్యాప్ మారుస్తూ హైటెన్షన్ పుట్టించారు. ప్రక్రియ మొదలైయింది ఇలా.. భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి ఎక్స్అఫీషియో ఓటు హక్కుతో మొదట మున్సిపల్ కార్యాలయానికి రాగా.. అనంతరం బీఆర్ఎస్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి వెంట నడిచారు. జనగామ పురపాలిక కార్యాలయ సమావేశహాలులో పార్టీలు, స్వతంత్రుల వారీగా అక్షరమాలను అనుసరించి సభ్యులను కూర్చోబెట్టారు. ఓట్ల సమీకరణలో కాంగ్రెస్ పక్షాన ఇద్దరు స్వతంత్రులు, సీపీఎం కలిపి 15 మంది, బీఆర్ఎస్ 13మందితో పాటు మరో ఇద్దరు స్వతంత్రులతో 15 మంది ఉన్నారు. వీరికి ఎంపీ చామల, ఎమ్మెల్యే పల్లా ఎక్స్అఫీషియో ఓట్లు కలవడంతో ఇరువురూ చెరో 16 ఓట్లతో సమాన బలం కలిగివున్నారు. ఈ పరిస్థితులు ఉద్రిక్తతను రెట్టింపు చేశాయి. సభ్యుల ప్రమాణం.. మొదటి ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో ఆర్డీఓ, ఎలక్షన్ అధికారి గోపిరామ్ సభ్యులచే ప్రమాణం చేయించి, మొదటి సంతకం పూర్తి చేయించారు. అనంతరం బీ–ఫామ్ ద్వారా ప్రకటించిన చైర్మన్ అభ్యర్థుల వివరాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ నుంచి 22వ వార్డు సభ్యురాలు కడకంచి బాలమణి శ్రీనివాస్, బీఆర్ఎస్ తరఫున 18వ వార్డు సభ్యుడు గోపగోని సుధాకర్ పోటీలో ఉన్నట్టు ప్రకటించారు. ఈ ప్రక్రియ ఉదయం 11.45కు ముగిసింది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నిక ప్రారంభిస్తున్నట్టు ఆర్డీఓ ప్రకటించగానే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి లేచి బీఆర్ఎస్ సభ్యురాలు హఫీజ్ ఫాతిమా కిడ్నాప్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదై దర్యాప్తు కొనసాగుతోందని, నిజాలు వెలుగుచూడకముందు ఎన్నిక నిర్వహించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. దానిపై అధికారులతో పదేపదే చర్చించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్కు మద్దతిస్తున్న 15వ వార్డు స్వతంత్ర సభ్యుడు మారబోయిన పాండు పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. వెంటనే కాంగ్రెస్ సభ్యులు, సీపీఎం, ఇద్దరు స్వతంత్రులు కలిసి పోడియం ముందు బైఠాయించి నినాదాలు మొదలుపెట్టారు. ఒక్క ఓటే భవిష్యత్తును నిర్ణయిస్తుంది.. నిజాలు బయటకు వచ్చే వరకు ఎన్నిక వాయిదా వేయాలంటూ నిరసన తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి దీనిని ఖండిస్తూ.. ఇది కిడ్నాప్ కాదు.. ఫేక్ కేసు..సభ్యురాలు, ఆమె భర్తతో సహా ఎవరూ కిడ్నాప్ కాలేదని చెబుతున్నారు... అనవసర డ్రామాలు ఆపాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాతిమాకు మద్దతుగా అదే పార్టీకి చెందిన సభ్యులు ఉడుగుల కిష్టయ్య, పానుగంటి సువార్త నిలదీశారు. అయినప్పటికీ పోడియం ముందు కాంగ్రెస్ నినాదాలు ఆగకపోవడంతో, అరగంట పాటు పరిస్థితిని గమనించిన తర్వాత ఎలక్షన్ అధికారి గోపిరామ్ ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నిక కొనసాగించడం సాధ్యం కాదని, నేటి(మంగళవారం)కి వాయిదా వేస్తున్నామని ప్రకటించి హాలు నుంచి వెళ్లిపోయారు. మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను మంగళవారం నిర్వహించనున్నట్లు ప్రిసైడింగ్ అధికారి, ఆర్డీఓ గోపిరామ్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో మధ్యాహ్నం 12.30గంటలకు ఎన్నిక నిర్వహించడం జరుగుతుందన్నారు. వార్డు సభ్యులందరితో పాటు ఎక్స్ఆఫీషియో సభ్యులు కూడా హాజరు కావాలని తెలిపారు. క్యాంపునకు వెళ్లిన ఇరు పార్టీల సభ్యులు, స్వతంత్రులు మళ్లీ రావాల్సి ఉంటుంది. ఎన్నికల హాల్లో సభ్యురాలి కిడ్నాప్ వివాదం కేసు విషయమై ఎంపీ ఆబ్జెక్షన్.. దర్యాప్తునకు డిమాండ్ పోడియం ఎదుట నిరసనకు దిగిన కాంగ్రెస్, స్వతంత్ర సభ్యులు తాను కిడ్నాప్ కాలేదంటూ హఫీజ్ ఫాతిమా స్పష్టీకరణ ‘ఫేక్ కేసు.. నాటకాలు ఆపండి..’: ఎమ్మెల్యే పల్లా గొడవల మధ్య ఎన్నిక నేటికి వాయిదా కీలక మలుపు..కిడ్నాప్ కేసు విత్డ్రా!తన సోదరుడు, మరదలు, కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను ఎమ్మెల్యే కిడ్నాప్ చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లు అక్బర్ సోమవారం డీసీపీ, ఏఎస్పీకు లేఖ పంపించినట్లు సీఐకి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. ఫిర్యాదు వాస్తవాలకు విరుద్ధంగా, బయట వ్యక్తుల ప్రభావంతో, అపోహలతో చేసినట్లుగా చెప్పారు. ఇద్దరు వ్యక్తుల ప్రభావంతో ఇలా చేయాల్సి వచ్చిందని, ఇప్పుడు విషయాలు స్పష్టమవడంతో ఆ ఫిర్యాదును కొనసాగించేందుకు ఆసక్తిగా లేనని తెలిపారు. అపార్థాలు నివృత్తి కావడంతో అపహరణ జరిగినట్లుగా ప్రస్తావించిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. తదుపరి, తన పూర్వ ఫిర్యాదును ఉపసంహరించబడినదిగా పరిగణించి, తగిన విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ విషయమై సీఐ సత్యనారాయణరెడ్డిని అడుగగా ఉపసంహరణ ఫిర్యాదు వచ్చిందని, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత సాధ్యం కాదని, విచారణ చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. -
కాంగ్రెస్ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారు
జనగామ: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా కాంగ్రెస్ వ్యవహరిచిన తీరును ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన తర్వాత తమ పార్టీ సభ్యులతో కలిసి సోమవారం పురపాలిక ఎదుట బైఠాయించి నిరసన, ఆందోళన చేశారు. 28వార్డు సభ్యురాలు ఫాతిమా కిడ్నాప్కు గురైనట్లు ఫేక్ కేసు పెట్టడమే కాకుండా, స్వయంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ వచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. తనను కిడ్నాప్ చేయలేదని ఫాతిమా చెప్పినా, వినిపించుకోకుండా డీసీపీ బస్సులోకి రావడం ఏంటని, దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కొంతమంది కాంగ్రెస్ గుండాలు విర్రవీగుతున్నారని, జనగామ పట్టణాన్ని కబ్జాలకు అడ్డా మార్చే ప్రయత్నంలో ఇలాంటి చేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ దగ్గరుండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయించారన్నారు. ఎంపీ అండ చూసుకుని కొందరు వ్యక్తులు హఫీజ్ ఫాతిమా కిడ్నాప్ అయినట్లు కేసు పెట్టించారన్నారు. డీసీపీ ముస్లిం మహిళను ఇలా అవమానపరిచే విధంగా వ్యవహరించడం ఖండిచదగ్గ విషయమని, దీనిపై స్థాయిలో పిర్యాదు చేస్తామని, అలాగే డీసీపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, తన భార్య హఫీజ్పాతిమాను కిడ్నాప్ చేసినట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు వ్యహరించిన తీరుపై హ్యూమన్ రైట్స్కు వెళతామని ఆమె భర్త సమ్మద్ తెలిపారు.మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే పల్లా ఆందోళన -
హైటెన్షన్
జనగామ: జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో శనివారం తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ సభ్యులను ఎమ్మెల్యే క్యాంపు నుంచి మున్సిపల్ కార్యాలయానికి తరలిస్తుండగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆర్టీసీ చౌరస్తా, నెహ్రూ పార్క్, ఫ్లైఓవర్, ఆర్అండ్బీ అతిథిగృహం, బీఎన్ మెడికల్ స్టోర్, పాతబీటు బజార్ ఇలా ఎక్కడ చూసినా భారీ పోలీస్ బందోబస్తు కనిపించింది. మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో 200 మీటర్ల మేర ఆంక్షలు విధించిన పోలీసులు, బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులను మినహా ఎవరినీ ఆవరణలోకి అనుమతించలేదు. బీఆర్ఎస్ ర్యాలీపై అభ్యంతరం..వాగ్వాదం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సులో బీఆర్ఎస్ సభ్యులను తీసుకుని బయలుదేరారు. ఆర్టీసీ చౌరస్తా నుంచి బీఆర్ఎస్ సభ్యులకు మద్దతుగా గులాబీ శ్రేణులు బైక్ ర్యాలీగా ముందుకు కదిలారు. ఊరేగింపుతో ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. నెహ్రూ పార్క్ వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో ఎమ్మెల్యే అనుచరులు దీనిపై ప్రశ్నించారు. ర్యాలీకి ఎందుకు అనుమతి లేదు, ఈ ఆంక్షలు ఏంటీ అంటూ గులాబీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే కూడా పోలీసుల తీరుపై ఆక్షేపణ వ్యక్తం చేశారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఫాతిమా ‘కిడ్నాప్’ వివాదం.. మరోసారి ఉద్రిక్తత ఆర్అండ్బీ అతిథిగృహం వద్దకు బస్సు చేరుకున్న సమయంలో దాదాపు వెయ్యి మందికి పైగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేస్తూ అక్కడకు చేరుకున్నారు. ఇదే సమయంలో 28వ వార్డు బీఆర్ఎస్ సభ్యురాలు హఫీజ్ ఫాతిమా కిడ్నాప్ అయ్యారని వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆమెను విచారణ కోసం తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఫాతిమా స్వయంగా బస్సులో నుంచి ముందుకు వచ్చి ‘నన్నెవ్వరూ కిడ్నాప్ చేయలేదు.. పాప అస్వస్థతతో హైదరాబాద్కు వెళ్లాను.. తప్పుడు కేసులతో మా ఆత్మాభిమానం దెబ్బతీయొద్దు..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పోలీసులు ఆమెను తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యక్షంగా చెబుతున్న మహిళను తీసుకెళ్లడం ఎందుకు అని డీసీపీని ప్రశ్నించారు. అప్పటికీ పోలీసులు వినకపోవడంతో డీసీపీ, ఎమ్మెల్యే మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగగా, ఎమ్మెల్యే డీజీపీతో పాటు సీపీకి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. దీంతో అక్కడ మరోసారి పరిస్థితులు వేడెక్కాయి. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు మళ్లీ లాఠీచార్జ్ చేయగా, శ్రేణులు చెల్లాచెదురయ్యాయి. కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. అనంతరం బస్సు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరగా, సభ్యులు పోలీసుల రక్షణ వలయంలో లోపలికి వెళ్లారు. క్యాంపు నుంచి జనగామకు.. సభ్యులకు అండగా బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే క్యాంపు నుంచి బయలుదేరిన బస్సుయాత్ర అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు ఫాతిమా కిడ్నాప్ ఆరోపణతో ఉద్రిక్తత రెండు సార్లు లాఠీచార్జ్ -
‘స్టేషన్’ చైర్మన్గా వినయ్కుమార్
స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్, శివునిపల్లి, ఛాగల్లు గ్రామ పంచాయతీలను కలుపుతూ నూతనంగా ఏర్పాటు చేసిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ మొదటి కౌన్సిలర్లుగా ఎన్నికై న వారి ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ప్రశాంతంగా జరిగింది. మొత్తంగా 18 వార్డులకు గాను 13 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, 5 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈమేరకు సోమవారం కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చైర్మన్గా తాటికొండ వినయ్కుమార్(కాంగ్రెస్), వైస్ చైర్మన్గా నీల రాజమ్మ(కాంగ్రెస్) ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు క్యాంపునకు వెళ్లిన 13 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ఉదయం 11 గంటల ప్రాంతంలో మున్సిపాలిటీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే కడియం చివరి నిమిషం వరకు వైస్ చైర్మన్ ఎవరనేది తెలియనీయకుండా సీల్ కవర్లో ప్రతిపాదించిన పేరును కౌన్సిలర్లకు తెలిపి స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. కాగా పోలీసులు కౌన్సిలర్లను తనిఖీ చేసి కార్యాలయంలోకి పంపారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులతో కలిసి నినాదాలు చేస్తూ మున్సిపాలిటీ వద్దకు చేరుకున్నారు. వారిని సైతం తనిఖీ చేసిన పోలీసులు లోపలికి పంపారు. కాగా ఉదయం 11 గంటల అనంతరం నూతన పాలకవర్గ సభ్యులచే ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, ఆర్డీఓ డీఎస్ వెంకన్న నియమనిబంధనలకు అనుగుణంగా ప్రమాణ స్వీకారం చేయించారు. వైస్ చైర్మన్పై ఉత్కంఠ చైర్మన్ అభ్యర్థిని మొదటి నుంచి అందరూ ఊహిస్తున్నప్పటికీ వైస్ చైర్మన్ ఎవరనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా చివరి నిమిషంలో వైస్ చైర్మన్గిరి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నీల రాజమ్మను వరించింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మధ్యాహ్నం 12.30 గంటలకు ఆర్డీఓ డీఎస్ వెంకన్న పర్యవేక్షణలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సభ్యులు ఉండటంతో ఆపార్టీకే రెండు పదవులు దక్కాయి. 13వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన వినయ్కుమార్ చైర్మన్గా ఎన్నికయ్యారు. కాగా వైస్ చైర్మన్గా 11వ వార్డు నుంచి ఎన్నికై న నీల రాజమ్మ(కాంగ్రెస్) ఎన్నికయ్యారు. చైర్మన్గా వినయ్కుమార్ పేరును గుర్రం హరినాధ్ ప్రతిపాదించగా బొల్లు లక్ష్మీ బలపర్చారు. అదేవిధంగా వైస్ చైర్మన్గా నీల రాజమ్మను పొన్న రవి ప్రతిపాదించగా అంగడి రజిత బలపర్చారు. కార్యక్రమంలో కమిషనర్ రాధాకృష్ణ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మేనేజర్ సత్యనారాయణ, కౌన్సిలర్లు తాటికొండ మధు, గుర్రం హరినాధ్, గుర్రం హైమ, బూర్ల రాజేశ్వర్, చల్లా రమ్య, బలగాని అనీల్, అన్నెపు సుమలత, పొన్న రాజేష్, తోకల అనూష, సౌదరపల్లి సంపత్రాజు, గట్టు సంగీత, పెసరు క్రిష్ణవేణి, బొల్లు లక్ష్మీ, అంగడి రజిత, పొన్నం స్వరూప, పొన్న రవి పాల్గొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్థానిక సీఐ జి.వేణు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. వైస్ చైర్మన్గా నీల రాజమ్మ ప్రశాంతంగా ఎన్నిక -
కమనీయం..శివకల్యాణం
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో ఆదివారం రాత్రివేద పండితుడు తాటిపాముల నరసింహమూర్తి శర్మ నేతృత్వంలో శివ పార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలబ్రాలు తీసుకొచ్చారు. 107 జంటలు కల్యాణంలో పాల్గొన్నాయి. ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ఆర్చకులు,భక్తులు పాల్గొన్నారు. సిద్ధులగుట్టలో.. బచ్చన్నపేట: మండలంలోని కొడవటూరు సిద్ధేశ్వరాలయంలో వీరశైవ సాంప్రదాయం ప్రకారం ఆలయ ప్రధాన అర్చకుడు ఓం నమఃశివాయ మంత్రోచ్ఛరణల నడుమ ఆదివారం రాత్రి 9 గంటలకు శివపార్వతుల కల్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు. గ్రామ సర్పంచ్ నీల కవితమురళి, ఈఓ వంశీ స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. కల్యాణ తంతు అనంతరం మహిళలు అమ్మవారికి ఓడిబియ్యం పోసి, కానుకలు సమర్పించుకున్నారు. కొడవటూర్, బచ్చన్నపేట ఒగ్గు కళాకారులు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కల్యాణ మహోత్సవం ముగిసిన అనంతరం శివపార్వతుల దేవతామూర్తులతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నూకల బాల్రెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మల్లారెడ్డి, సర్పంచ్లు ఆరె రవికుమార్, నల్ల సిద్దినర్సమ్మ, ఇ జ్జగిరి రాములు, అర్చకుతు, సిబ్బంది, పలువురు పాల్గొన్నారు. నర్మెట సీఐ అబ్బయ్య పర్యవేక్షణలో ఎస్సై ఎస్కే హమీద్ బందోబస్తు నిర్వహించారు. -
సమాన ఓట్లు వస్తే లాటరీ!
జనగామ: జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఇరు పార్టీలకు సమాన ఓట్లు పడే అవకాశం ఉండడంతో లాటరీ ద్వారా పురపాలిక చైర్మన్న్ ఎన్నుకునే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వెల్లడించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇరు పార్టీల అంగీకారంతో ఈ ప్రక్రియ నిర్వహించబడనుందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సూచించిన చైర్మన్ అభ్యర్థుల పేర్లను ఒక్కొక్కరికి ఐదు చీటీల రూపంలో సిద్ధం చేసి, ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన ఓ డబ్బాలో వేసి, వీడియో సర్వైలెన్స్ పర్యవేక్షణలో అందరి సాక్షిగా లాటరీ తీస్తారు. చీటీలో రెండు పార్టీలు కోరంతో సమావేశానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నందున నేడే లాటరీ జరగవచ్చు. అయితే, ఏదైనా పార్టీ సమావేశానికి రాలేని పక్షంలో కోరం లేని సమయంలో ప్రక్రియ వాయిదా పడే అవకాశం ఉంది. నేటి ప్రజావాణి రద్దు జనగామ రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికతో పాటు ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నందున ప్రజలు గమనించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ‘స్టేషన్’ విప్గా సంపత్రాజ్ స్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ విప్గా 9వ వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నికై న సౌదరపెల్లి సంపత్రాజ్ను నియమించినట్లు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఈ మేరకు హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో సంపత్రాజ్కు విప్గా నియమిస్తూ నియామక పత్రాన్ని అందించారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులోని 9వ వార్డుకు చెందిన సంపత్రాజ్ను విప్గా నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ వర్సిటీ టోర్నమెంట్కు కేయూ జట్టు కేయూ క్యాంపస్: రొహతక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో ఈనెల 15న ప్రారంభమైన ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ క్రాస్క్రంటీ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ క్రాస్కంట్రీ పురుషుల జట్టును స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య ప్రకటించారు. జె.రాఘవ, జె.రిషిక్, ఎం.అఖిల్, జె.అనిల్, జి.శివకుమార్, ఎండీ హబీబుద్దీన్ జట్టులో ఉన్నారని ఆయన తెలిపారు. ఈజట్టుకు కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కె.శ్రీధర్కుమార్ కోచ్ కం మేనేజర్గా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
సంక్షేమ పథకాలు అందరికీ అందాలి
● ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య బచ్చన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికి అందాలన్నదే సీఎం రేవంత్రెడ్డి లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కొడవటూర్ గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినం, బ్రహ్మోత్సవాల సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిద్ధేశ్వరాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ చిందం వంశీ, ఆలయ ప్రదాన పూజారి ఓం నమశివాయ, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, సీపీఐ చేర్యాల మండల కార్యదర్శి జంగిలి యాదగిరి, ఆలయ సిబ్బంది లక్ష్మికాంత్రెడ్డి, శ్రీనివాస్, బానుప్రకాష్రెడ్డి, గుర్రపు బాల్రాజు, జిల్లా సందీప్, జంగిడి సిద్దులు తదితరులు పాల్గొన్నారు. -
16ః16
జనగామ చైర్మన్ పీఠానికి చేరి సగం బలం జనగామ: జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ సమాన బలం, స్వతంత్రుల కీలక మద్దతు, ఎక్స్అఫీషియో ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు అన్నీ కలిసి రాజకీయ సమీకరణాలను మరింత క్లిష్టం చేశాయి. 16ః16 ఓట్ల సమీకరణతో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ కనిపించక చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందనే విషయం పెద్ద ప్రశ్నగా మారింది. స్వతంత్రుల వైఖరి, పార్టీల క్యాంపు రాజకీయాలు 16న జరిగే ఎన్నికలను హాట్టాపిక్గా మార్చాయి. జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై రాజకీయ ఉ త్కంఠ పీక్ స్టేజీకి చేరింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇరు పార్టీలకూ సమాన సీట్లు రావడం, నలుగురు స్వ తంత్రుల్లో ఇద్దరు చొప్పున రెండు పార్టీలకు మద్దతు ఇవ్వడంతో ఎవరు చైర్మన్ పీఠం అధిరోహిస్తారన్న దానిపై అనిశ్చితి నెలకొంది. స్థానిక పురపాలక రాజకీయాల్లో అరుదుగా కనిపించే ఇలాంటి సమీకరణాలు జనగామలో హాట్టాపిక్గా మారాయి. ఇ టీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 12, ఆ పార్టీ మద్దతుతో గెలుపొందిన సీపీఎంకు–1, బీఆర్ఎస్ 13, స్వతంత్రులు 4 స్థానాలు గెలుచుకున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు సాధించాలంటే కనీసం 16 ఓట్లు అవసరం. ఇక్కడే అసలు స స్పెన్స్ మొదలైంది. ఎక్స్అఫీషియో ఓటుగా బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ తరఫున ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి ఓటు హ క్కు వినియోగించనున్నారు. దీంతో ఇరు పార్టీలకూ స్వతంత్రుల మద్దతుతో సమానంగా 16 ఓట్లు చేరుతున్నాయి. ఇదే సమాన బలం ఉండగా, రాబోయే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఎవరి గెలుపునైనా ప్రశ్నార్థకంగా మార్చేయనుంది. నలుగురు స్వతంత్రుల్లో ఇద్దరు బీఆర్ఎస్ క్యాంపులో, మరొకరు కాంగ్రెస్కు పూర్తి మద్దతు ప్రకటించగా, మరో స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్తో చర్చలు కొనసాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇరు పార్టీలకు 16ః16 ఓట్ల సమీకరణంలో ఎవరు చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు దక్కించుకుంటారన్నది ఇప్పుడు జనగామ రాజకీయాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమకు పూర్తి మెజార్టీ వస్తుందని నమ్మినా, ప్రచారంలో స్వతంత్రులతో కలిసి పెద్ద ఎత్తున డబ్బుల లావాదేవీలు జరిగినట్లు ప్రచారం. ఓటర్లు ఇరు పార్టీల నుంచి డబ్బులు తీసుకుని ఎవరి మనసు నొప్పంచకుండా ఓటు షేరింగ్ చేసిన నేపథ్యంలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు వేర్వేరు క్యాంపుల్లో ఉంచగా, 16న జరిగే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఎవరిని భాగ్యం వరిస్తుందన్నది ఆసక్తిగా మారింది. సమాన బలం కొనసాగితే జనగామ మున్సిపల్ చరిత్రలో తొలిసారి టాస్ ద్వారా చైర్మన్ ఎంపిక అయ్యే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్లో ఉత్కంఠ చైర్మన్ ఎన్నికకు 16వ తేదీన ముహూర్తం ఎన్నికపై సస్పెన్స్ పురపాలిక రాజకీయంలో స్వతంత్రుల హాట్టాపిక్ క్యాంపులో ఇరు పార్టీల కౌన్సిలర్లుచైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మొదటిసారి, రెండవసారి కూడా వాయిదా పడే అవకాశం లేకపోలేదు. మూడోసారి మాత్రం సభ్యుల కోరం ఉన్నా.. లేకపోయినా ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాల్సిందే. పరిస్థితి మళ్లీ సమానంగా ఉంటే టాస్ వేసి తుది నిర్ణయం తీసుకునే అ వకాశం అధికార వర్గాల్లో వినిపిస్తుంది. -
బుగులు వేంకటేశ్వరుడికి వారకల్యాణం
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారికి అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ వైభవంగా వార కల్యాణం నిర్వహించారు. ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు ఆధ్వర్యంలో రామోజు వెంకటేశ్వర్లు–విశాల, ఆదిమూలం సునీల్కుమార్–సాగరికలు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో దాత సంగోజు మోహనాచారి– శంకరలక్ష్మి, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, వీరన్న, మల్లికార్జున్, హరిశంకర్, కృష్ణ పాల్గొన్నారు. సోమేశ్వరాలయంలో ధ్వజారోహణంపాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. గుట్టపై మహామండపంలో గణపతి పూజా, పుణ్యాహవచనం, పంచగవ్వం, అంకురాప్పణ, రుత్తిక్వరుణ, ధ్వజారోహణ, వేదస్వస్తి, త్రిశూలపూజ, స్వామివారికి అభిషేకాలు, అఖండ దీపారాధన అర్చకులు నిర్వహించారు. ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ఏసీపీ అంబటి నర్సయ్య, సూపరింటెండెంట్ వెంకటయ్య, ప్రధాన అర్చకుడు దేవగిర లక్ష్మన్న, అర్చకులు డీవీఆర్శర్మ, అనిల్కుమార్, నాగరాజు, భక్తులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి సదస్సుకు ఎంపికజనగామ రూరల్: జనగామ పట్టణానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, పరిశోధకుడు, సీనియర్ తెలుగు అధ్యాపకుడు కోడం కుమారస్వామి జాతీయస్థాయి సదస్సుకు ఎంపికయ్యారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 17, 18 తేదీల్లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సహకారంతో నిర్వహిస్తున్న ఐరన్ మ్యాన్ విజినరీ లీడర్షిప్ – లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్ అనే అంశంపై రెండు రోజుల సదస్సు జరగనుంది. ఈ సదస్సులో కుమారస్వామి కాళోజీ కవిత్వం–నిజాం పాలన వ్యతిరేకత అనే అంశంపై పరిశోధన పత్రం సమర్పించి ప్రసంగించనున్నారు. జాతీయ సదస్సుకు ఎంపికై న కుమారస్వామిని జనగామ రచయితల సంఘం అధ్యక్షుడు నక్క సురేష్, జి.కృష్ణ, సోమేశ్వర్, పానుగంటి రామ్మూర్తి, శ్రీనివాస్ తదితరులు అభినందనలు తెలిపారు. తల్లుల దీవెనలతో ప్రజలకు సేవ చేస్తాంఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మల తల్లుల దీవెనలతో ప్రజలకు మరింత సేవ చేస్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నూతనంగా ఎన్నికై న స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లతో కలిసి ఆయన శనివారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు ఎత్తు బంగారం, చీరసారె, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలకు మరింత సేవ చేయాలని సంకల్పించామని తెలిపారు. ఆలయ సంప్రదాయ ప్రకారం దేవాదాయశాఖ అధికారులు, పూజారులు కడియం శ్రీహరితోపాటు నూతనంగా ఎన్నికై న కౌన్సిలర్లకు డోలి వాయిద్యాలతో స్వాగతం పలికారు. కంప్యూటర్ సైన్స్ బీఓఎస్గా రమేశ్ కేయూ క్యాంపస్: కేయూ లోని కంప్యూటర్ సైన్స్ విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా (బీఓఎస్) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.రమేశ్ను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రా మచంద్రం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓఎస్గా పనిచేసిన డాక్టర్ మంజుల పదవికాలం ముగియడంతో రమేశ్ను ని యమించారు. రమేశ్ ఈ పదవిలో 2 సంవత్సరాలపాటు కొనసాగనున్నారు. -
సోమేశ్వరాలయంలో ఏర్పాట్ల పరిశీలన
సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో జరిగే మహారాత్రి బ్రహ్మోత్సవాలను అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. శనివారం మండలకేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బ్ర హ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్, లడ్డూ ప్రసాదం తయారు చేయు వంట గది, పోలీసు క్యాంపును కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. డీఆర్డీఓ పీడీ వసంత, ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ఏసీపీ నర్సయ్య, విద్యుత్ డీఈ సారయ్య, ఆర్డబ్ల్యూ డీఈ నవీన్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్బాషా జిలాల్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పరోక్ష ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)ను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాలు జారీ చేశారు. శనివారం కలెక్టరేట్ నుంచి అధికారులతో గూగుల్ మీట్లో మాట్లాడారు. ఉదయం 11 గంటలకు సంబంధిత మున్సిపల్ కార్యాలయ సమావేశం హాళ్లలో ప్రారంభమవుతుందన్నారు. ఎన్నికకు 50 శాతం మంది హాజరు కావాలన్నారు. సభ్యులతో 11 గంటలకు ప్రమాణ స్వీకారం నిర్వహించి, మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్, అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తామన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరఫున ఎన్నికై న సభ్యులు పార్టీ విప్ను తప్పనిసరిగా అనుసరించాలన్నారు. ఎన్నిక సమావేశ ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, తహసీల్దార్లు, మాస్టర్ ట్రేనర్లు పాల్గొన్నారు. -
ఉత్తమ ఫలితాలు
ఇష్టంతో చదివితేనేదేవరుప్పుల: విద్యార్థులు భవిష్యత్లో రాణించాలంటే కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఉత్తమ ఫలితాలు వస్తాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. శనివారం మండలకేంద్రంలోని తిరుమల గార్డెన్లో దేవరుప్పుల మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల సన్నద్ధం కోసం మండల స్థాయిలో తలపెట్టిన ప్రేరణ కార్యక్రమం ఎంఈఓ జి.కళావతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి.. జిల్లా ప్రథమ స్థానం సాధించుటకు విద్యార్థులు మరింత శ్రమించి చదవాలన్నారు. పరీక్షలు అంటే భయం లేకుండా నమ్మకంగా ఉండాలని, చదువుతోపాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనన్నారు. గత సంవత్సరం జిల్లాలో టాప్ మార్కులతో నిలిచిన టాపర్లను ఆదర్శంగా తీసుకొని ఉత్తమ మార్కులు సాధించాలన్నారు. అంతకుముందు సబ్జెక్టు ఉపాధ్యాయులు రూపొందించిన ఏడు సబ్జెక్టుల ప్రత్యేక స్టడీ మెటీరియల్ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కర్నూలుకు చెందిన మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి విద్యార్థులకు చదువు, వ్యక్తిత్వము, ఆరోగ్యం, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ఏకాగ్రత, వ్యక్తిత్వ నిర్మాణం గురించి సందేశమందించారు. హైకోర్టు అడ్వకేట్ ఈటూరు శ్రీనివాసరావు బాలికల విద్య ప్రాముఖ్యత, వివిధ కోర్సులు, అవకాశాల గురించి వివరించి, మండల విద్యా విషయాలకు తన వంతు తోడ్పాటును అందిస్తామన్నారు. కార్యకమంలో జనగామ ఏరియా ఆస్పత్రి ఆర్ఎంఓ కోటాచలం, ఏఎంఓ బొమ్మనబోయిన శ్రీనివాస్, దేవరుప్పుల సర్పంచ్ పెద్ది కృష్ణమూర్దిగౌడ్, హెచ్ఎం విష్ణువర్దన్రెడ్డి, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. క్రీడలతో మానసికోల్లాసం జనగామ రూరల్: క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. జిల్లా స్థాయి సీఎం కప్ 2025లో భాగంగా శనివారం మినీస్టేడియం, సోషల్ వెల్ఫేర్లో వాలీబాల్, కబడ్డీ, చెస్, క్యారమ్, యోగా, నెట్బాల్, ఫుట్బాల్ తదితర క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మకంచలోని మినీస్టేడియంలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతోపాటు క్రీడల్లోనూ పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో రాణించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి కోదండరాములు, సెక్రటరీ ఘోర్ సింగ్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 18వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.ఆలయ ఈఓ లక్ష్మి ప్రసన్న, డీఆర్డీఓ వసంత, ఏసీపీ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
చేతికి ‘స్టేషన్’ పగ్గాలు
● పురపోరులో సత్తాచాటిన కాంగ్రెస్ ● 18వార్డులకు 13 స్థానాలు అధికార పార్టీకే ● 5 స్థానాలకే బీఆర్ఎస్ పరిమితంస్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. ఘన్పూర్ శివారు పల్లగుట్ట క్రాస్రోడ్డు సమీపాన ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. మొత్తంగా 18 వార్డులకు గాను 18 టేబుళ్లను ఏర్పాటు చేసి కౌంటింగ్ చేపట్టారు. ఉదయం 8 గంటలకు చేపట్టిన కౌంటింగ్లో మొదట పోస్టల్, సర్వీస్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అందులో మొత్తం 5 ఓట్లు పోల్కాగా రెండు ఓట్లు బీఆర్ఎస్ పార్టీలకు చెందిన అభ్యర్థులకు, మూడు ఓట్లు స్వతంత్రులకు పడ్డాయి. అనంతరం బ్యాలెట్ పేపర్లను కట్టలుగా కట్టి కౌంటింగ్ పూర్తి చేసిన అనంతరం ఉదయం 11.30 గంటల అనంతరం అభ్యర్థుల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. కాగా ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ సెంటర్ సమీపానికి పెద్ద ఎత్తున వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు రాగా సందడి నెలకొంది. మధ్యాహ్నం 12 గంటల అనంతరం పూర్తిస్థాయిలో ఫలితాలు వెలువడ్డాయి. సత్తా చాటిన కాంగ్రెస్ నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలుపొంది సత్తా చాటారు. మొత్తంగా 18 వార్డులకు గాను 13 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకోగా బీఆర్ఎస్ ఐదు స్థానాలతో సరిపెట్టుకుంది. మొత్తంగా స్టేషన్ఘన్పూర్లోని పది వార్డుల్లో తొమ్మిది వార్డులు కాంగ్రెస్ గెలుపొందటం విశేషం. మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో నాలుగు, ఛాగల్లులోని నాలుగు వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ తలా రెండు స్థానాలు దక్కించుకున్నాయి. ఘన్పూర్లోని 1వ వార్డు బీఆర్ఎస్కు రాగా మిగిలిన 10 నుంచి 18 వరకు తొమ్మిదివార్డులు కాంగ్రెస్ కై వసం చేసుకుంది. -
భువనగిరిలో హైడ్రామా!
భువనగిరి : జనగామ మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులు కింగ్ మేకర్స్గా మారారు. 23వ వార్డునుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన భూష పర్వతాలును కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కారులో ఎక్కించుకుని హైదరాబాద్కు బయలుదేరారు. మార్గమధ్యలో భువనగిరి బైపాస్ రోడ్డులోని ఓ హోటల్ వద్ద ఆగగా, ఆ అభ్యర్థి.. బీఆర్ఎస్ నాయకులకు సమాచారం అందడంతో వెంటనే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి.. పార్టీ నాయకులతో కలిసి భువనగిరికి చేరుకున్నారు. తమకు మద్దతు తెలిపే అభ్యర్థిని అప్పగించాలని కాంగ్రెస్ నాయకులను కోరారు. అప్పటికే హోటల్కు వద్దకు చేరుకున్న ఎంపీ కిరణ్కుమార్రెడ్డితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు.. అభ్యర్థితో ఉండడంతో ఎమ్మెల్యే పల్లా స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హోటల్ వద్దకు చేరుకోగా, పల్లా వారితో మాట్లాడి తమకు మద్దతు తెలిపే అభ్యర్థిని బలవంతంగా తీసుకెళ్తున్నారని చెప్పారు. పోలీసులు సదరు అభ్యర్థిని ఎవరికి మద్దతు ఇస్తారని అని అడగ్గా బీఆర్ఎస్కు అని చెప్పడంతో అతన్ని ఎమ్మెల్యే పల్లాకు అప్పగించగా ఆయన వెంటబెట్టుకుని తీసుకెళ్లారు. -
హంగామా!
స్వతంత్రులదేఏకశిల బీఈడీ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ.. జనగామ: జనగామ పురపోరులో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నువ్వా,నేనా అన్నట్టుగా తలపడగా, ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో హంగ్ పరిస్థితి నెలకొంది. మొత్తం 30 వార్డుల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని పోటీ చేసిన సీపీఎం 1, స్వతంత్రులు నలుగురు విజయం సాధించారు. చైర్మన్ పీఠం సాధించేందుకు 16 స్థా నాలు అవసరమైన నేపథ్యంలో రెండు ప్రధాన పా ర్టీలకు స్వతంత్రుల మద్దతు తప్పనిసరి అయ్యింది. కౌంటింగ్ సెంటర్ వద్దే రాజకీయాలు పట్టణంలోని ఏకశిల బీఈడీ కళాశాలలో శుక్రవారం ఉదయం పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కాగా, 10 గంటలకు తొలి ఫలితం విడుదల అయింది. 30 వార్డుల ఫలితాలు మధ్యాహ్నం 2 గంటల వరకు తేలిపోయాయి. ఓట్ల లెక్కింపు సమయంలో ఎన్నికల, కౌంటింగ్ ఏజెంట్లతో పాటు అభ్యర్థులు, ప్రతిపాదికులు కంటిరెప్ప వాల్చకుండా ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించారు. వార్డుల వారీగా ఎలక్షన్ అధికారులు విజేతలను ప్రకటించగా, విక్టరీ చూపిస్తూ అభ్యర్థులు, అనుచర వర్గం ఉరికించే ఉత్సాహంతో బయటకు రాగా, ఓటమి చెందిన వారు మాత్రం తీవ్ర నిరాశతో వెళ్లిపోయారు.మొత్తంగా 48 పోస్టల్ ఓట్లు పోలు కాగా, నోటాకు 119, రిజెక్ట్ అయిన ఓట్లు 259 ఉండగా మొత్తంగా 478 ఓట్లు చెల్లుబాటు కాలేదు. స్వతంత్రుల కోసం.. 8వ వార్డు నుంచి గెలిచిన స్వతంత్ర అభ్యర్థి సందుపట్ల మంజుల, 15వ వార్డు నుంచి విజయం సాధించిన మారబోయిన పాండు, 23వ వార్డు స్వతంత్ర అభ్యర్థి భూష పర్వతాలు, 5వ వార్డులో గెలిచిన ఇండింపెండెంట్ మిద్దెపాక భాస్కర్ చైర్మన్ రేసులో కీలకంగా మారారు. భూష పర్వతాలను తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా, యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్క్వార్టర్ హైవేపై ఉన్న ఓ హోటల్లో హైడ్రామా చోటుచేసుకున్నట్లు సమాచారం. పర్వతాలు బీఆర్ఎస్ వైపు వెళ్లాలని మొండికేయడంతో పాటు కాంగ్రెస్ నాయకుల నుంచి తప్పించుకుని గులాబీ శ్రేణులు వద్దకు చేరుకోగా, ఆయన్ను రహస్య ప్రాంతానికి తరలించినట్టు సమాచారం. మంజుల సైతం బీఆర్ఎస్ గూటికి చేరినట్లు తెలుస్తుండగా, భాస్కర్ మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. అత్యంత కీలక స్థానంలో ఉన్న మారబోయిన పాండు మాత్రం రెండు పార్టీల మధ్య చర్చలు సాగించడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన్ను తీసుకెళ్లేందుకు రెండు పార్టీలు కార్లు సిద్ధం చేయగా, చివరకు తన సన్నిహితుడి కారులో ఇంటికి వెళ్లిపోయారు. పట్టణంలో ఈ నలుగురు స్వతంత్రులకు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ ఆఫర్లు చేసినట్లు చర్చ నడుస్తోంది. తనకు చైర్మన్ పీఠం ఇస్తే ఆ పార్టీకే మద్దతు ఇస్తానని పాండు మీడియాకు వెల్లడించగా, మిగతా ముగ్గురు కూడా తన మాట వింటారని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఎవరు చైర్మన్ పీఠం ఎక్కినా...వైస్ చైర్మన్ పదవి మాత్రం స్వతంత్రుల్లో ఒక్కరికి అవకాశం వస్తుందని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి 23వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన భూష పర్వతాలకు వైస్ చైర్మన్ ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. చైర్మన్ రేసులో పోటీదారులు కాంగ్రెస్ తరఫున 22వ వార్డు నుంచి కడకంచి బాలమణి, బీఆర్ఎస్ నుంచి 29వ వార్డు ముస్తాల మౌనిక దయాకర్, 18వ వార్డు గోపగోని సుగుణాకర్ గౌడ్ బరిలో ఉన్నారు. రెండు పార్టీలు ఎక్స్అఫీషియో ఓట్లతో కూడి చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకోవాలనే వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. కలెక్టర్ పర్యవేక్షణలో.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, ఆర్డీఓలు గోపిరామ్, వెంకన్న, మునిసిపల్ కమిషనర్లు మహేశ్వర్రెడ్డి, రాధాకృష్ణ, డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారుల కంటిమీద కునుకు లేకుండా బందోబస్తు నిర్వహణ చేపట్టారు. కాగా, ప్రజలు తేల్చుకోలేని తీర్పు ఇవ్వడంతో స్వతంత్రులే గేమ్ఛేంజర్లుగా మారి చైర్మన్ పీఠం ఎటు తిరుగుతుందనే ఆసక్తి జిల్లాలో రాజకీయ హీట్ పెంచుతోంది. ‘ఇండింపెండెంట్లే గేమ్ఛేంజర్లు’ అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనం నిజం కావడం గమనార్హం. వారు మద్దతు ఇచ్చినవారికే జనగామ పుర‘పీఠం’ కాంగ్రెస్–12, బీఆర్ఎస్–13, సీపీఎం–1, స్వతంత్రులు–4 బీఆర్ఎస్ కోటలో ఇద్దరు.. కాంగ్రెస్ పక్కన ఒక్కరు రెండు పార్టీలకు టచ్లో మరో అభ్యర్థి.. స్వతంత్ర విజేత కోసం భువనగిరి హోటల్ వద్ద హైడ్రామా స్వతంత్రులకు లక్షల్లో ఆఫర్..! ఓట్ల శాతంలో బీఆర్ఎస్దే పైచేయి జనగామ,స్టేషన్ ఘన్పూర్లో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు -
కాంగ్రెస్ వెంటే ఘన్పూర్ ప్రజలు
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంట, తన వెంట ఉన్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కౌన్సిలర్లుగా గెలుపొందిన పార్టీ అభ్యర్థులతో కలిసి శుక్రవారం ఆయన స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు.. ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులతో కలిసి ఆయన సంబురాల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో జోష్నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ మొట్టమొదటి కౌన్సిలర్లుగా మెజార్టీ స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించిందన్నారు. మున్సిపాలిటీలో 70 శాతానికి పైగా సీట్లను గెల్చుకున్నామని, ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు తమ ఓట్లతో బుద్ధి చెప్పారన్నారు. పనిలేని ప్రతిపక్ష పార్టీల విమర్శలు పట్టించుకోనన్నారు. కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్రెడ్డిపై, ఎమ్మెల్యేగా తనపై ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, అందరూ బాధ్యతగా పనిచేస్తూ మున్సిపాలిటినీ ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయాలన్నారు. విజయం అందించిన ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, జగదీష్చందర్రెడ్డి, సతీష్ పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ేేేజనగామ: జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు శుక్రవారం విజయవంతంగా ముగిసిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. స్టేషన్ఘన్పూర్ 18, జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులకు జరిగిన ఎన్నికలు, కౌంటింగ్ సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జనగామ, స్టేషన్ఘన్పూర్లో ఎన్నికైన వార్డు సభ్యులకు ఈ నెల 16వ తేదీన ఉదయం 11లకు ప్రతిజ్ఞ, ఆ తర్వాత 12.30 గంటల సమయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధిత మున్సిపల్ కార్యాలయాల్లో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సభ్యులు ప్రతి ఒక్కరు హాజరు కావాలన్నారు. -
‘స్వయంభూ’ దర్శనభాగ్యం!
బుగులు వెంకన్న భక్తులకు నెరవేరిన చిరకాల స్వప్నం 650 మెట్లు ఎక్కితే కొండపై గుహలో స్వామి దర్శనంచిల్పూరు: చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరుడి దర్శనానికి వచ్చే భక్తులకు చిరకాల స్వప్నం నెరవేరింది. స్వయం భూవలయుడిగా వెలిసిన ప్రాంతమున్న కొండపైకి చేరుకునేందుకు మెట్ల మార్గం పూర్తయింది. 650 మెట్లు ఎక్కితే కొండ గుహలో వెలిసిన దేవుడిని దర్శనం చేసుకోవచ్చు. ఎత్తైన కొండపై గుహలో వెలిసిన స్వయం భూవలయని దర్శనం కోసం భక్తులు ఒకప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతూ వెళ్లేవారు. పైకి ఎక్కలేని భక్తులు కింది నుంచే దర్శనం చేసుకునేవారు. దీన్ని గమనించిన ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు కొండపైకి మెట్ల మార్గం పూర్తి చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈవిషయాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే, భక్తుల సహకారంతో 650 మెట్లను పూర్తి చేయించారు. దీంతో పాటు లైట్లు, పలు సౌకర్యాలు కల్పించారు. గతంలో ప్రతీ శనివారం అర్చకుడితో పాటు ఒకరికి తోడుగా ఒకరు చేయిపట్టుకుని పైకి ఎక్కి దర్శనం చేసుకునేవారు. ప్రస్తుతం మెట్ల మార్గం పూర్తి కావడంతో భక్తులు ఇక నిత్యం కొండపైకి ఎక్కి స్వయం భూవలయున్ని దర్శించుకోవచ్చు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ, భక్తుల సహకారంతో మెట్ల మార్గం పూర్తి చేయించాను. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎంతో ఉత్సాహంగా కొండపైకి వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. –పొట్లపల్లి శ్రీధర్రావు, చైర్మన్స్వయం భూవలయున్ని దర్శించుకోవాలనే భక్తుల కోరిక మెట్ల మార్గం పూర్తి కావడంతో నెరవేరింది. ప్రస్తుతం మెట్లకు రంగులు, పైవరకు లైట్లు పూర్తి అయ్యాయి. –భాగం లక్ష్మీప్రసన్న, ఈఓ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం మెట్ల మార్గం పూర్తయింది. కొండ గుహలో వెలిసిన దేవుని దర్శన భాగ్యం ప్రతీ ఒక్కరికి కలుగుతుంది. అల్వార్రాజులు, క్షేత్రపాలకులు, ఆంజనేయ స్వామి ఉండడం వల్ల భక్తులు కోర్కెలు నెరవేరుతాయి. – రవీందర్శర్మ, ఆలయ అర్చకులు -
‘మేడారం’ ఆదాయం రూ.13,51,76,275
హన్మకొండ కల్చరల్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగిన సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఆదాయం రూ. 13,51,76,275 వచ్చినట్లు మేడారం జాతర ఈఓ వీరస్వామి తెలిపారు. మహాజాతర సందర్భంగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద దేవాదాయశాఖ ఏర్పాటు చేసిన 780 ఇనుపరేకు హుండీలు, 45 వస్త్ర, 3 ఒడిబాలబియ్యం హుండీలు కలిపి మొత్తం 828 హుండీలను భారీ సెక్యూరిటీతో ఫిబ్రవరి 2వతేదీ సోమవారం హనుమకొండ లష్కర్బజార్లోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలోకి చేర్చారు. హుండీల లెక్కింపు ఫిబ్రవరి 5న గురువారం ప్రారంభమైంది. చివరిరోజు లభించిన ఆదాయం.. ఎనిమిదో రోజు (చివరిరోజు) గురువారం చిల్లరనాణేలను వేరు చేసి తూకం వేసి లెక్కించడంతో మహాజాతర హుండీల లెక్కింపు పూర్తయ్యింది. చివరిరోజు లెక్కింపులో నాణేల ద్వారా లభించిన ఆదాయం రూ.4,56,399, ఈ–హుండీల ద్వారా (క్యూ ఆర్ ద్వారా) రూ. 21,36,607 మొత్తం కలిపి రూ.25,93,006 సమకూరింది. జాతర ఆదాయం రూ.13,51,76,275 మహా జాతర మొత్తం ఆదాయం రూ.13,51,76,275గా నమోదైందని ఈఓ వీరస్వామి తెలిపారు. భక్తులు వివిధ రకాల వస్తువుల రూపంలో వేసిన బంగారం, వెండి సూక్ష్మ కానుకలను సైతం ప్రత్యేక నిపుణుల సహాయంతో, సెన్సార్ల సహాయంతో గుర్తించి లెక్కకట్టారు. ఏటా పెరుగుతున్న ఆదాయం 1946లో జాతర ఆదాయం రూ.17,173 కాగా, 1968లో దేవాదాయశాఖ మొదటిసారిగా నిర్వహించిన జాతరలో రూ.1,20,113గా నమోదైంది. 1980లో మొదటిసారిగా వరంగల్ జిల్లా కలెక్టర్గా పని చేసిన జె.బాపురెడ్డి ఐఏఎస్ పెద్ద ఎత్తున ప్రచారంతో జాతర ఆదాయం రూ. 4,50,000 వచ్చింది. అదేవిధంగా 2002 నుంచి జాతర ఆదాయం కోటి రూపాయలు దాటింది. 2016 జాతర ఆదాయం రూ. 8.90 కోట్లుగా నమోదైంది. ఈవిధంగా ప్రతిఏటా జాతర ఆదాయం కోట్లల్లో పెరుగుతూ వస్తోంది. 2024లో మేడారం జాతర సందర్భంగా గద్దెల ప్రాంగణంలో 518 హుండీలు, తిరుగువారం హుండీలు 22 కలుపుకుని మొత్తం 540 హుండీలకుగాను ఆదాయం రూ.12,71,79,280 సమకూరింది. కాగా, ప్రస్తుతం జాతరలో గద్దెల ప్రాంగణంలో 828 హుండీలను ఏర్పాటు చేయగా.. రూ.13,51,76,275గా నమోదైంది. గతంకంటే 288 హుండీలను అదనంగా ఏర్పాటు చేశారు. గతంతో పోలిస్తే భక్తుల రద్దీ పెరిగినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదు. గత జాతరలో 779 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం, 55 కిలోల 150 గ్రాముల వెండి కానుకలు లభించాయి. ప్రస్తుత జాతరలో 486 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 31కిలోల 700 గ్రా ముల వెండి లభించింది. గతం కంటే తక్కువగా కానుకలు వచ్చాయి. దీనికి బంగారం, వెండి రే ట్లు పెరగడమే కారణంగా చెప్పవచ్చని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా గత జాతర ఆదాయంతో పోలిస్తే ప్రస్తుత జాతర ఆదాయం ఆశించినంత పెరగలేదు. పూర్తయిన మహా జాతర హుండీల లెక్కింపు చివరి రోజు లభించిన ఆదాయం రూ. 4,56,399 ఈ–హుండీల ద్వారా (క్యూ ఆర్ల ద్వారా) రూ. 21,36,607 గత జాతరకంటే అదనంగా 288 హుండీల ఏర్పాటు అయినప్పటికీ పెరగని ఆదాయం, తగ్గిన బంగారు, వెండి కానుకలు -
కదిలింది..కార్మికదండు!
● లేబర్కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల భారీ ప్రదర్శనజనగామ రూరల్: బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక ప్రజావ్యతిరేక విధానాలను ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని, దానిద్వారానే 4 లేబర్కోడ్లను వెనక్కితీసుకొనేలా చేయగలమని ఐఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఽ శ్రీదేవి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్, ఐఎన్టీయూసీ జిల్లా నాయకుడు డాక్టర్ లక్ష్మీనారాయణనాయక్ పిలుపునిచ్చారు. గురువారం దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా సీఐటీయూ, బీఆర్టీయూ, ఐఎన్టీయూసీ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల కేంద్ర కమిటీల పిలుపులో భాగంగా రైల్వే స్టేషన్ నుంచి ప్రెస్టిన్ గ్రౌండ్ వరకు కార్మికులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వేముల నర్సింగం, బైరగోని అంజమ్, రాజమణి, కోమల్ల ఎల్లమ్మ, బూడిద ప్రశాంత్, తోటగోని రాధ, ఎర్రబెల్లి సంతోష తదితరులు పాల్గొన్నారు. కేంద్రం తీసుకోచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ అన్నారు. -
పురాధీశులు ఎవరో?
జనగామ, స్టేషన్ఘన్పూర్లో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధంజనగామ: పురపోరు ప్రజాభిప్రాయ తీర్పుతో గెలుపు ఎవరిదోననే ఉత్కంఠ అభ్యర్థుల్లో నెలకొంది. ఈనెల 13న(శుక్రవారం) ఫలితాలు వెలువడనుండగా, జనగామ, స్టేషన్ఘన్పూర్లో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పురపాలక ఎన్నికల పోలింగ్ ముగియడంతో జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జనగామలోని హైదరాబాద్రోడ్డు ఏకశిల బీఈడీ కళాశాల, ఘన్పూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు కేంద్రాల్లో కూడా అధికారులు, పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జనగామ పురపాలికలో 44,045 మంది ఓటర్లు ఉండగా, 34,281 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ శాతం 79.04గా నమోదైంది. స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో 18,850 ఓట్లలో 15,670 ఓట్లు పోలై 84.47 శాతం ఓటింగ్ జరిగింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. జనగామలోని 30 వార్డులకు 30 టేబుల్స్ ఏర్పాటు చేయగా ఒకే రౌండులో ఓట్ల లెక్కింపు పూర్తిచేయనున్నారు. స్టేషన్ ఘన్పూర్లో 18 వార్డులకు 18 టేబుల్స్పై లెక్కింపు చేపట్టి ఒకే రౌండ్లో ప్రక్రియ పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. జనగామ లెక్కింపు కేంద్రంలో 36 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 72 మంది అసిస్టెంట్ సూపర్వైజర్లు విధుల్లో పాల్గొననున్నారు. స్టేషన్ ఘన్పూర్లో 20 మంది సూపర్వైజర్లు, 40మంది అసిస్టెంట్ సూపర్వైజర్లు కౌంటింగ్ సమయంలో సేవలు అందించనున్నారు. ఆర్ఓలు, సిబ్బందికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం స్నాక్స్ మాత్రమే అందజేస్తారు. లంచ్ సదుపాయం లేకపోవడంతో రిలీవ్ సమయంలో ఇంట్లోనే భోజనం చేయాల్సి ఉంటుంది. కౌంటింగ్ హాళ్లలో ప్రత్యేక పాసు ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించ నున్నారు. జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి గురువారం ఆయా శాఖల ఉన్నతాధికారులతో గూగుల్ మీటింగ్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ఎన్నికల నియమావళిని అనుసరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించాలన్నారు. లెక్కింపు ప్రక్రియలో ప్రతీ దశను స్పష్టంగా అమలు చేసే విధంగా సిబ్బందికి ముందస్తుగా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. లెక్కింపు కేంద్రం వద్ద మూడంచెలుగా భద్రతా ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రక్రియ కొనసాగుతుందని, అభ్యర్థులు, ఏజెంట్లకు గుర్తింపు కార్డుల ఆధారంగా ప్రవేశం కల్పించేలా చూడాలని కలెక్టర్ సూచించారు. జనగామ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏకశిల బీఈడీ కళాశాలలో ఏర్పాట్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ పరిశీలించారు. కౌంటింగ్ హాల్స్ నిర్వహణ, టేబుల్స్ ఏర్పాటు, సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా చర్యలు, తాగునీరు, టాయిలెట్ సదుపాయాలు, విద్యుత్ సరఫరాతో పాటు ఇతర మౌలిక వసతులపై అధికారులతో చర్చించారు. ఏసీ వెంట ఆర్డీఓ గోపీరామ్, కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఉన్నారు. ప్రజాతీర్పుపై అభ్యర్థుల్లో ఉత్కంఠ జనగామలో 30, ఘన్పూర్లో 18 టేబుల్స్ రెండుచోట్ల ఒకే రౌండ్ ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలు మధ్యాహ్నం 2 గంటల వరకే ఫలితాలు భద్రత వలయంలో కౌంటింగ్ కేంద్రాలుడీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 200 మీటర్ల దూరంలో ఆంక్షలు అమలు చేస్తూ అవాంఛనీయ ఘటనలను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు, మైక్రో అబ్జర్వర్ సిస్టం ద్వారా కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు మొబైల్ ఫోన్లతో లోపలికి వెళ్లేందుకు అనుమతించరు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో మొత్తం లెక్కింపు ప్రక్రియ జరుగనుంది. అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు మహేశ్వర్రెడ్డి, రాధాకృష్ణ లెక్కింపును సమీక్షించనున్నారు. -
స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించిన డీసీపీ
స్టేషన్ఘన్పూర్: డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్రూమ్ను డీసీపీ రాజమహేంద్రనాయక్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందితో మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, శాంతిభద్రతలకు విఘాతం కల్గించినా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. డీసీపీ వెంట సీఐ జి.వేణు, ఎస్ఐ వినయ్కుమార్ తదితరులున్నారు. జనగామ రూరల్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పా ట్లు చేసినట్లు ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ తెలి పారు. గురవారం పోలీసులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో తగినంత పోలీసు బలగాల ను మోహరించి, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు, అభ్యర్థులు, పార్టీల నాయకులు సహకరించి ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు● సీపీ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధి జనగామ, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల వద్ద శుక్రవారం నుంచి నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా.. 200 మీటర్ల పరిధిలో బీఎన్ఎస్ఎస్, సీఆర్పీసీ–163 ప్రకారం.. ప్రజలు ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ నిషేధం నేడు (శుక్రవారం) ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఎవరైనా ఈ ఉత్తర్వులు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా చేపట్టాలి● అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ స్టేషన్ఘన్పూర్: ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత కీలకమైందని, సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పారదర్శకంగా, కచ్చితంగా కౌంటింగ్ నిర్వహించాలని అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ సూచించారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఓట్ల లెక్కింపు జరుగనున్న స్థానిక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల కౌంటింగ్ కేంద్రాన్ని గురువారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి అంతరాయం కలుగకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
హనుమకొండ జిల్లా : 80.18 శాతం వరంగల్ జిల్లా : 85.42 శాతం జేఎస్ భూపాలపల్లి : 65.18 శాతం ములుగు జిల్లా : 80.41 శాతం మహబూబాబాద్ జిల్లా : 78.90 శాతం జనగామ జిల్లా : 80.66 శాతం
ఉమ్మడి జిల్లాలో 80.09 శాతం పోలింగ్● గతంతో పోలిస్తే పెరిగిన 13.38 శాతం సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాల్లో 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ల నుంచి 1,073 మంది కౌన్సిలర్ల కోసం పోటీ పడ్డారు. బుధవారం రాత్రి వరకు అధికారుల ప్రకటించిన ప్రకారం ఉమ్మడి జిల్లాలో 80.09 శాతంగా పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లా 12 మున్సిపాలిటీల్లో మొత్తం 3,35,244 మంది ఓటర్లకు 2,58,930 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2020లో జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 9 మున్సిపాలిటీలలో 200 వార్డులుండగా ఏకగ్రీవమైన 18 వార్డులు మినహాయించి 182 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. 2,32,763 మంది ఓటర్లకు ఆ ఎన్నికల్లో 1,77,508 (76.26 శాతం) మంది ఓట్లేశారు. 2020 ఎన్నికలకు ఈసారి ఎన్నికలు పోలిస్తే కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలు పెరిగాయి. పెరిగిన మున్సిపాలిటీలు, ఓటర్లు, పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే గతంతో పోలిస్తే 13.38 శాతం పెరిగింది. -
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ
స్టేషన్ఘన్పూర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్టేషన్ఘన్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, శివునిపల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. పోలింగ్ స్టేషన్ ఇన్చార్జులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ట్రైనీ ఐపీఎస్ మనీషానెహ్రా, డీసీపీ రాజమహేంద్రనాయ క్, ఏసీపీలు భీమ్శర్మ, నర్సయ్య, సీఐలు జి.వేణు, ఎ.శ్రీనివాస్రెడ్డి, ఎస్ఐలు తదితరులున్నారు. -
ప్రత్యర్థులతో స్నేహహస్తం!
జనగామ/ జనగామ రూరల్: ఓవైపు ఓటింగ్..మరోవైపు ఓట్లు ఎవరికి పడుతున్నాయోనని టెన్షన్.. అయినా ఆ అభ్యర్థులు ఏకంగా ప్రత్యర్థులతోనే స్నేహహస్తం చాటారు. జనగామ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యాక ఒకటో వార్డు నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి సజ్జ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ అభ్యర్థి మూడ్ లక్షణ్ నాయక్, బీజేపీ అభ్యర్థి కూరాకుల శ్రీలత ముగ్గురూ కలిసి బయటకు వచ్చి స్నేహపూర్వకంగా చేతులు కలిపి గెలుపు గుర్తులు చూపించారు. అలాగే రెండో వార్డు కౌన్సిల్ ఎన్నికల పోలీంగ్ ప్రెస్టన్ కళాశాల ఆవరణలో కొనసాగుతుండగా కాంగ్రెస్ అభ్యర్థి రామగళ్ల విజయ్, బీఆర్ఎస్ అభ్యర్ది రావెల రవి కలుసుకుని రాజకీయాలు పక్కనబెట్టి గెలుపోటములపై సమాలోచనలు చేశారు. కక్షపూరిత రాజకీయాలు పెట్రేగుతున్న కాలంలో ఇలా స్నేహహస్తం చాటడంపై పలువురు అభినందించారు. రెండో వార్డు అభ్యర్థుల మాటాముచ్చటపోలింగ్ కేంద్రం వద్ద 1వ వార్డు అభ్యర్థులు


