breaking news
Jangaon District Latest News
-
ఈవీఎంలను పరిశీలించిన కలెక్టర్
జనగామ రూరల్: సాధారణ తనిఖీలో భాగంగా మంగళవారం కలెక్టరేట్లో ఉన్న ఈవీఎం గోదాంను షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ బెన్షలోమ్ సందర్శించారు. ఈ సందర్భంగా భద్రతా పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, అగ్ని నియంత్రణ సదుపాయాలను పరిశీలించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బి.భాస్కర్, బీఆర్ఎస్ నాయకుడు ఆర్.రవి, బీజేపీనుంచి ఎ.విజయభాస్కర్, టీడీపీకి చెందిన అజయ్, బీఎస్పీ చంద్రశేఖర్, ఆర్డీఓ గోపిరామ్, ఎన్నికల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాంకేతిక అక్షరాస్యత అందించాలి.. ఉపాధ్యాయులు సాంకేతిక అక్షరాస్యతను విద్యార్థులకు అందించడానికి కృషి చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. 6 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం డిజిటల్ అక్షరాస్యత బోధనను ప్రారంభించిన నేపథ్యంలో గణితం, ఫిజికల్ సైన్స్ టీచర్లకు సీజేఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో డిజిటల్ కంటెంట్పై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో శిక్షణ సమన్వయకర్త ఏఎంఓ శ్రీనివాస్, డీఎస్ఓ ఉపేందర్, డీఆర్పీలు శ్రీకాంత్, కృష్ణవేణి, కృష్ణయ్య, మాధవరావు పాల్గొన్నారు. -
చిల్పూరు హుండీ ఆదాయం రూ.10.67లక్షలు
చిల్పూరు: చిల్పూరుగుట్ట శ్రీబుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఉదయం అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేదమంత్రాల నడుమ అష్టదళ పాదపద్మారాధన పూజ అనంతరం దేవాదాయశాఖ పరిశీలకులు చిందం వంశీ ఆధ్వర్యంలో ఆలయ ఈవో లక్ష్మీప్రసన్న, చైర్మన పొట్లపల్లి శ్రీధర్రావు, ధర్మకర్తలు గనగోని రమేశ్, పుల్యాల నారాయణరెడ్డి, రత్నాకర్రెడ్డి, గోళి రాజశేఖర్ సమక్షంలో హుండీల లెక్కింపులో స్టేషన్ఘన్పూర్కు చెందిన వాసవీ వనిత క్లబ్ వారు పాల్గొన్నారు. హుండీల ఆదాయం రూ.10,67,650లతో పాటు ఖతర్ దేశానికి చెందిన 10 రియాల్స్ ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. 9, 10 తేదీల్లో ఉద్యోగులకు రాష్ట్రస్థాయి క్రీడలు జనగామ రూరల్: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ 2025–26లో ఉద్యోగులు పాల్గొనాలని జిల్లా యువజన క్రీడల అధికారి బి.వెంకటరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీస్ సెలక్షన్ ట్రయల్స్లో భాగంగా హెదరాబాద్లో వివిధ స్టేడియాలలో ఈ నెల 9, 10 తేదీల్లో రాష్ట్ర స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగా పట్టణంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో ఈనెల 6తేదీ ఉదయం 9 గంటలకు జరిగే సెలక్షన్స్ జరుగనున్నాయి. ఆసక్తిగల ప్రభుత్వ ఉద్యోగులు ఐడీ కార్డు, సర్వీస్ సర్టిఫికెట్ జిరాక్స్లతో హాజరు కావాలని ఆయన తెలిపారు. అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్, చెస్, క్యారమ్స్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, లాన్ టెన్నిస్, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీ బాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బెస్ట్ ఫిజిక్, యోగా, ఖోఖో క్రీడలు నిర్వహిస్తారని చెప్పారు. మరిన్ని వివరాలకు 96521 97323 నెంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. తెలుగు జాతీయ సదస్సుకు కుమారస్వామికి ఆహ్వానం జనగామ: హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ సంస్థ నిర్వహిస్తున్న తెలుగు సాహితీమూర్తుల సమాలోచన జాతీయ సదస్సుకు వరంగల్ ఎల్బీ కళాశాల తెలుగు విభాగంలో సీనియర్ ఆధ్యాపకుడిగా పనిచేస్తున్న కోడం కుమారస్వామికి ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. తెలుగు సాహితీమూర్తులు కాళోజీ నారాయణరావు, దాశరథి సోదరులు కృష్ణమాచార్య, రంగాచార్య, డాక్టర్ సి.నారాయణరెడ్డి శతజయంతిని పురస్కరించుకొని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ డిగ్రీ పీజీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఈనెల 10న ఒకరోజు జాతీయ తెలుగు సాహిత్య సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు.కాళోజీ కవిత్వం, మానవతావాద దృక్పథం అనే అంఽశంపై పత్ర సమర్పణ చేసి ప్రసంగించనున్నట్లు తెలిపారు. జిల్లావాసికి కీర్తి పురస్కారం పాలకుర్తి టౌన్: మండలంలోని తొర్రూరు(జె) గ్రామానికి చెందిన రచయిత, సాక్షి జర్నలిస్టు పడిగిపాల ఆంజనేయులుకు మంగళవారం తెలుగు విశ్వవిద్యాయలం కీర్తి పురస్కారం ప్రదానం చేసింది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో 2023 కీర్తి పురస్కారాన్ని (జీవిత చరిత్ర విభాగం)లో తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఎన్.నిత్యానందరావు చేతుల మీదుగా ఆంజనేయులు అందుకున్నారు. మలేషియా తెలుగు వారి మీద పరిశోధనాత్మక వ్యాసాలు, సామాజిక అంశాల మీద విశ్లేషణాత్మక వ్యాసాలు.. తదితర గ్రంథాలకుగాను కీర్తి పురస్కారం అందుకున్నారు. ఈసందర్భంగా ఆంజనేయులును సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు రాపోలు సత్యనారాయణ, సాహితీవేత్త శంకరమంచి శ్యాంప్రసాద్, మారం లక్ష్మీనారాయణ, మామిండ్ల రమేశ్రాజా, పులి గణేశ్, గుమ్మడిరాజుల సాంబయ్య తదితరులు అభినందించారు. -
సర్కార్ దవాఖానాల్లో మెరుగైన వైద్యసేవలు
● రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ● జిల్లా జనరల్ ఆస్పత్రిలో ిసీటీస్కాన్ సేవలు ప్రారంభంజనగామ: రాష్ట్రంలో సర్కారు దవాఖానాల్లో నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సాక్షిలో వరుస కథనాలతో జిల్లా ఆస్పత్రిలో ిసీటీస్కాన్ యంత్రం వచ్చిన సంగతి తెలిసిందే. జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ సేవలను మంగళవారం కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్షాలోమ్, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి ఇన్చార్జ్ ఝాన్సీరెడ్డి, డీఎంహెచ్ఓ మల్లికార్జున్, ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజలింగం, మెడికల్ కళా శాల ప్రిన్సిపాల్ నాగమణితో కలిసి మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. సీటీ స్కాన్ సేవలను ప్రారంభించిన అనంతరం మంత్రి జనరల్, డయాలసిస్ వార్డులతో పాటు అన్ని విభాగాలను సందర్శించారు. ఆసుపత్రి సేవలపై పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మెడికల్ కళాశాల, నర్సింగ్ కాలేజ్ నిర్మాణ పనులతో పాటు సీజనల్ వ్యాధు ల కట్టడి, తదితర వాటిపై ఆరా తీశారు. పీహెచ్సీ, సీహెచ్సీ, సీఎంఎస్ల పనితీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెడికల్ కళాశాల విద్యార్థుల కోసం నిర్మిస్తున్న హాస్టల్స్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. సమస్యలు పరిష్కరించాలి.. తమ సమస్యలను పరిష్కరించాలని ఆశ వర్కర్లు మంత్రికి వినతి పత్రం అందించారు. గానుగుపహాడ్ బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరుతూ యాసారపు కర్ణాకర్, సందీప్ తదితరులు కోరారు. పెండింగ్ స్కాలర్షిప్స్ వెంటనే రిలీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు మంత్రికి విన్నవించారు. ఎన్హెచ్ఎం కాంట్రాక్టు సిబ్బంది పెండింగ్ వేతనాలు అందించాలని మొరపెట్టుకున్నారు. సత్కారం.. మంత్రి రాజనర్సింహను ఎమ్మెల్యే పల్లా, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ గోపాల్రావు, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్, డీసీపీ రాజమహేంద్రనాయక్, వంగాల మల్లారెడ్డి, నర్సిరెడ్డి, జంగి విద్యానాథ్, నర్సింహరెడ్డి తదితరులు ఉన్నారు. -
మహిళాశక్తి మరింతగా!
● మహిళా సంఘాల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి ● వృద్ధులు, దివ్యాంగులు,కిశోర బాలికలతో గ్రూపుల ఏర్పాటు ● బ్యాంక్ నుంచి లింకేజీ రుణాలు ఇచ్చేలా చర్యలు ● యాక్షన్ ప్లాన్ తయారుచేస్తున్న అధికారులు ● జిల్లావ్యాప్తంగా 1,29,179 మంది సభ్యులుజనగామ రూరల్: మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. మహిళా సంఘాలను బలోపేతం చేసి ఆర్థిక సాధికారత సాధించాలన్న లక్ష్యంతో ఇందిర మహిళాశక్తి పథకాన్ని తీసుకొచ్చారు. ఈనేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగులు, కిశోర బాలికలకు కొత్తగా మహిళ సంఘ గ్రూపులు ఏర్పాటు చేసి అర్హులైన వారందరికీ బ్యాంక్ రుణాలు అందించేలా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లోని వృద్ధులు, బాలికలు, దివ్యాంగులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతంలో మహిళా సంఘాలను ఏర్పాటు చేసినప్పుడు 60 ఏళ్లు దాటితే వారిని గ్రూపులోంచి తొలగించారు. ప్రస్తుతం ఉన్నవారిని అలాగే ఉంచాలని, లేకుంటే వారికి ఒక ప్రత్యేక గ్రూపు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. వృద్ధులు, దివ్యాంగుల ఆనందం.. గతంలో 60 ఏళ్లు దాటాయంటే మహిళలను గ్రూపు నుంచి తొలగించారు. దీంతో వారు పొదుపు చేసుకునే అవకాశం కోల్పోయారు. ప్రభుత్వం అందించే పథకాలు వర్తించేవి కాదు. వృద్ధులు కావడంతో వారికి బ్యాంక్ రుణాలు ఇవ్వలేమని అప్పుడు తిరస్కరించేవారు. తాజాగా ప్రభుత్వం కచ్చితంగా వృద్ధులకు గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు అందించాలని ఆదేశించడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ మహిళాసంఘాల ఆధ్వర్యంలో కొత్తగా ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసి వారికి ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. వీరితోపాటు 15 నుంచి 18 ఏళ్ల వయస్సున్న బాలికలతో కూడా సంఘాలను ఏర్పాటు చేసి వారికీ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. వీరితోపాటు, సామాజిక మాధ్యమాల మోసాలు, అత్యాచారాలు, ఇతరత్రా అంశాలపై వారికి చైతన్యం కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈసారి ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక గ్రామంలో 12 మంది ఉంటే వారికి ఒక గ్రూపు ఏర్పాటు చేయనున్నారు. లేకుంటే వేరే సంఘాల్లో ఉంటారు. వీరందరికీ బ్యాంక్ రుణాలు అందించి వారిని ఆర్థిక సాధికారత సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేక కార్యాచరణతో రుణాల అందజేత ఈనెల 12 నుంచి 14వరకు గ్రామాల వారీగా జాబితా రూపొందించి మహిళా సంఘాల్లో లేని మహిళలు, దివ్యాంగులు, బాలికలను గుర్తిస్తారు. 14 నుంచి 15 వరకు వారికి సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనం గురించి వివరించనున్నారు. బ్యాంక్ రుణాలు అందుతాయని చెప్పి వారిని గ్రూపులో చేర్పించేలా చూస్తారు. 15 నుంచి 30 వరకు సంఘాల్లో చేరిన సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి బ్యాంకుల్లో ఖాతాలను ఓపెన్ చేసి రుణాలు అందిస్తారు. వీరికి సంబంధించిన వివరాలన్నింటినీ సెర్చ్ వెబ్సైట్లో నమోదు చేస్తారు. బ్యాంక్ లింకేజీ, సీ్త్రనిధి రుణాలు సైతం మంజూరు చేయనున్నారు. రీవాల్వింగ్ ఫండ్ను ఖాతాల్లో జమచేస్తారు.మండలం గ్రూపులు మొత్తం సభ్యులు బచ్చన్నపేట 1048 12,182 చిల్పూర్ 906 10,019 దేవరుప్పుల 1030 11,852 ఘన్పూర్(స్టే) 1128 13,067 జనగామ 981 11,402 కొడకండ్ల 694 8,563 లి.ఘణపురం 984 10,943 నర్మెట 566 6,602 పాలకుర్తి 1306 14,335 రఘునాథపల్లి 1275 14,588 తరిగొప్పుల 480 5,539 జఫర్ఘడ్ 857 9,887 మొత్తం 11,255 1,29,179మహిళా సాధికారతే లక్ష్యం మహిళలు సాధికారత సాధించాలన్న ఉద్దేశంతో కొత్తగా మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో నూతనంగా వృద్ధులు, దివ్యాంగులకు, బాలికలతో గ్రూపులు ఏర్పాటు చేయనున్నాం. ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నాం. వీరికి బ్యాంకు నుంచి లింకేజీ రుణాలు అందిస్తాం. – వసంత, డీఆర్డీఓ, జనగామ -
వరద నష్టనివారణ చర్యలు చేపట్టాలి
● వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశం జనగామ రూరల్: వరద నష్టనివారణ చర్యలు చేపట్టాలని, శాఖల పరంగా పనులు గుర్తించి నివేదికలు రూపొందించుకోవాలని, పనులు, కావాల్సిన నిధులను తెలియజేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ధనసరి అనసూయ(సీతక్క) తదితర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో భారీ వర్షాలతో జరిగిన నష్టం, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీ రాజమహేంద్రనాయక్, అదనపు కలెక్టర్లు బెన్షా లోమ్, పింకేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..జిల్లాలో భారీ వర్షాల వల్ల కలిగిన నష్టంపై అంచనాలు రూపొందించి తక్షణమే నివేదికలు అందజేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్న్స్లో డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, జిల్లా అధికారులు, నీటిపారుదల, ఇంజనీరింగ్, వైద్య, విద్యుత్, వ్యవసాయ, ఉద్యాన వన, పంచాయతీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. సర్వేయర్లకు ధ్రువీకరణ పత్రాల పంపిణీ జనగామ రూరల్: జిల్లా వ్యాప్తంగా శిక్షణ పూర్తిచేసుకున్న 48 మంది సర్వేయర్లకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సర్వేయర్గా శిక్షణ పొంది అర్హత సాధించిన సర్వేయర్లకు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఆధ్వర్యంలో ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పనిచేసి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. ఏఓ శ్రీకాంత్, సర్వే శాఖ ఏడీ మన్యం కొండ పాల్గొన్నారు. -
బనకచర్లను బాబుకు కట్టబెట్టేందుకే!
జనగామ: బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ముఖ్యమంత్రి బాబుకు కట్టబెట్టేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయనే బూటకపు మాటలతో సీఎం రేవంత్రెడ్డి సీబీఐని తెరపైకి తీసుకొచ్చాడని ఏఎంసీ మాజీ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం, రైతు సమన్వయ సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, మాజీ ఎంపీపీ మేకల కలింగరాజు ఆరోపించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్రెడ్డి అధ్యక్షతన కాళేశ్వరంపై సీబీఐని వ్యతిరేకిస్తూ, రైతులకు యూరియా అందించాలని కోరుతూ సోమవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బైక్ ర్యాలీగా ఆర్టీసీ చౌరస్తా వద్దకు చేరుకున్నారు. వరంగల్–హైదరాబాద్ ప్రధాన హైవే జంక్షన్లో బైఠాయించి రాస్తారోకో చేశారు. సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు శ్రేణులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అంతకుముందు యూరియా కోసం రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. దేశంలో సీబీఐపై రాహుల్గాంధీ మండిపడుతుంటే, ఇక్కడ మాత్రం రేవంత్కు ప్రేమ పెరిగిందన్నారు. రేవంత్, చంద్రబాబు, ప్రధాని మోదీ కుట్రలను ప్రజలు ఖండించి, గోదావరి జలాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ను ముట్టుకుంటే తెలంగాణ సమాజం భగ్గుమంటుందన్నారు. కార్యక్రమంలో నాయకులు పోకల జమునలింగయ్య, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ముస్త్యాల దయాకర్, గుర్రం భూలక్ష్మినాగరాజు, ఉల్లెంగుల సందీప్, జూకంటి లక్ష్మిశ్రీశైలం, సేవెల్లి మధు, ఉడుగుల కిష్టయ్య, అనిత, శారత, రేఖ, ఉడుగులు నర్సింహులు, మామిడాల రాజు, సువార్త, రాజు, జాయ శ్రీశైలం, యాకూబ్ తదితరులు ఉన్నారు. సీఎం రేవంత్రెడ్డి బూటకపు మాటలతో సీబీఐ తెరపైకి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రాస్తారోకో, ర్యాలీ సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నం -
ఆరు గ్యారంటీలు అమలు చేయాలి
● కలెక్టరేట్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా జనగామ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని, అలాగే ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలపై విచారణ చేపట్టి అర్హులైన పేదలకు ఇళ్లు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. వరికి రూ.500 బోనస్ అని బోగస్ చేశారని, తక్షణమే నిధులు విడుదల చేయాలన్నారు. వర్షాలు, వరదల నష్టాలపై అసెంబ్లీలో మాట్లాడలేదని.. రాజకీయ పబ్బం కోసమే అర్ధరాత్రి వరకు నిర్వహించారని విమర్శించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ చేపట్టి కలెక్టరేట్ వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో మహిళా కానిస్టేబుల్ చేతికి స్వల్పగాయమైంది. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్కు వినతిపత్రం అందజేశారు. మాజీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేవీఎల్ఎన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు శివరాజ్యాదవ్, దుబ్బ రాజశేఖర్, పార్లమెంట్ కో కన్వీనర్ కొంతం శ్రీనివాస్, ఉడుగుల రమేశ్, లేగ రామ్మోహన్రెడ్డి, అంజిరెడ్డి, ఉమారాణి, పట్టణ అధ్యక్షుడు అనిల్ పాల్గొన్నారు. -
హామీ నిలబెట్టుకున్నాం..
జనగామ: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజిర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ హామీని నిలబెట్టుకుని, తన చిత్త శుద్ధిని నిరూపించుకుంటోందని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో టీపీసీసీ అధికార ప్రతినిధులు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, పీవీ శ్రీనివాస్తో కలిసి సోమవారం కొమ్మూరి విలేకరులతో మాట్లాడారు.. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి, గవర్నర్కు పంపడం జరిగిందన్నారు. బీసీలకు ఘోరమైన అవమానం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి నిగ్గుతేల్చేందుకు సీబీఐకి అప్పగించడం స్వాగతిస్తున్నామన్నారు. సమావేశంలో లింగాల నర్సిరెడ్డి, వంగాల మల్లారెడ్డి, ఆలేటి సిద్ధిరాములు, చెంచారపు బుచ్చిరెడ్డి, వంగాల కళ్యాణి, ఇందిర, కరుణాకర్రెడ్డి, గాదెపాక రాంచందర్, అల్వాల ఎల్లయ్య, మల్లేశం, బక్క శ్రీని వాస్ తదితరులు పాల్గొన్నారు.అన్ని వర్గాలకు అండగా జీవిత బీమాజనగామ: అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికంగా అండగా జీవిత బీమా సేవలు కొనసాగుతున్నాయని జీవిత బీమా(ఎల్ఐసీ) బ్రాంచి సీనియర్ మేనేజర్ హరిలాల్ అన్నారు. సోమవారం పట్టణంలో భారతీయ జీవిత బీమా సంస్థ జనగామ శాఖ ఆధ్వర్యంలో 69 ఆవిర్భావ దినోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడారు..30 కోట్ల మంది పాలసీదారులను కలిగి అత్యుత్తమమైన సేవలతో జీవిత బీమా సంస్థ అగ్రగామిగా ఉందన్నారు. జనగామ శాఖ పరిధిలో స్టేషన్ ఘన్పూర్లో శాటిలైట్ ఆఫీస్ ఉందని, త్వరలో పాలకుర్తిలో మైక్రో లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్ ఓపెన్ చేయడానికి సిఫార్సు చేశామన్నారు. కార్యక్రమంలో జనగామ ఐడీబీఐ బ్రాంచ్ మేనేజర్ రాజేశ్, బ్యాంక్ మేనేజర్లు, అధికారులు, ఏజెంట్లు పాల్గొన్నారు.రాష్ట్రస్థాయి కళా ఉత్సవం పోటీలకు ఎంపికజనగామ రూరల్: రాష్ట్రస్థాయి కళా ఉత్సవ పోటీలకు తెలంగాణ మోడల్ స్కూల్ చౌడారం విద్యార్థిని నాంపల్లి అక్షయ ఎంపికై ందని పాఠశాల ప్రిన్సిపాల్ కె.సుధీర్రెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలో జరిగిన జిల్లాస్థాయి కళాఉత్సవ పోటీల్లో సోలో క్లాసికల్ డ్యాన్స్లో పదో తరగతి విద్యార్థిని అక్షయ ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈసందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆమెను అభినందించారు.భాగవతాన్ని అధ్యయనం చేయాలి● సాహితీవేత్త శంకరమంచి శ్యాంప్రసాద్పాలకుర్తి టౌన్: విద్యార్థులు సాంకేతికంగానే కాకుండా సామాజిక విలువల్ని పెంపొందించుకోవటానికి భాగవత పద్యాలను నేర్చుకోవాలని సాహితీవేత్త శంకరమంచి శ్యాం ప్రసాద్ సూచించారు. సోమవారం మండలంలోని బమ్మెర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం రామ్మోహన్రావు అధ్యక్షతన జరిగిన సదస్సులో శంకరమంచి మాట్లాడుతూ.. భక్తితో పాటు సామాజిక విలువల్ని మానవీయ మూలాలను ప్రబోధించిన పోతన భాగవతాన్ని విద్యార్థుల అధ్యయనం చేయాలన్నారు. పోతన పద్యాలను నేర్చుకున్న విద్యార్థులకు పురస్కారాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో చరిత్ర పరిశోధకులు కేవీజీకే ఆచార్యులు శంకరమంచి శ్రీకాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సీపీఎస్ను రద్దు చేయాల్సిందే..
● మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చాలి ● టీఎన్జీవో, జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఖాజా షరీఫ్జనగామ: ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని టీఎన్జీవో, జేఏసీ అధ్యక్షుడు ఖాజా షరీఫ్ డిమాండ్ చేశారు. సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి భారీ ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. కలెక్టరట్ ఆవరణలో రెండు గంటల పాటు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఖాజా షరీఫ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో పాత పెన్షన్ విధానం(ఓపీఎస్) పునరుద్ధరించేందుకు మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఒక్కసారి ఎన్నికై న ఎమ్మెల్యేలు, ఎంపీలకు జీవితాంతం పెన్షన్ లభిస్తోందని, 35 సంవత్సరాలు ప్రజాసేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ ఇవ్వకపోవడం ఎంత అన్యాయమో ఆలోచించాలన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం సీపీఎస్ను రద్దు చేసి, ఓపీఎస్ అమలు చేయాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కొర్నేలియస్, పి.చంద్రశేఖర్రావు, షరీఫ్, లక్ష్మీనారాయణ, పెండెల శ్రీనివాస్, పేర్వారం ప్రభాకర్, హఫీజ్, రాజనర్సయ్య, సంపత్ కుమార్, రాంనరసయ్య, మడూరి వెంకటేశ్, ఉప్పలయ్య, స్టెల్లా, శ్రీధర్బాబు, నాగార్జున, విష్ణు, అరుణ, బాబు, మధు శంకర్, రాజు, చందర్, రమేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పరిష్కారానికి ఇంకెన్నాళ్లు?
జనగామ రూరల్: తమకు అన్యాయం జరిగినా నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం లేదని ఓ బాధితురాలు..కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉందని అంత్యోదయ కార్డు ఇచ్చి ఆదుకోవాలని ఓ పేదమహిళ.. రెండో విడత ఇందిరమ్మ బిల్లు రావడం లేదని ఓ లబ్ధిదారు, ఆరు నెలల నుంచి వేతనాలు లేక అవస్థలు పడుతున్నామని ఓ చిరుద్యోగి..ఇలా పలు సమస్యలతో సోమవారం ప్రజలు గ్రీవెన్స్సెల్కు తరలివచ్చారు. ఈసందర్భంగా ప్రజల నుంచి 69 వినతులను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్షాలోమ్, జిల్లా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల్లో ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు, భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. దూరప్రాంతాల నుంచి ఖర్చులు పెట్టుకుని ఏళ్లతరబడి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు వాపోయారు. గ్రీవెన్స్లో వచ్చిన ప్రతి దరఖాస్తును ఆయా శాఖల అధికారులు నిషితంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు గోపిరామ్, డీఎస్ వెంకన్న, డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, కలెక్టరేట్ ఏవో శ్రీకాంత్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తులు కొన్ని ఇలా.. ● నర్మెట మండల కేంద్రానికి చెందిన దేవర ధ్రువిత్రెడ్డి తన దరఖాస్తు అందిస్తూ తన తల్లి చనిపోయిందని, తండ్రి పట్టించుకోవడం లేదని తనకు చదువుకునేందుకు సోషల్ వెల్ఫేర్ గురుకులం లో సీటు ఇప్పించగలరని వినతిపత్రం అందజేశాడు. ● రఘునాథపల్లి మండలం కన్నాయిపల్లి గ్రామానికి చెందిన యాదగిరి కుమార్తె జస్విక.. తాను ఆత్మకూరు సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నానని పాలకుర్తిలో గాని, నర్మెటలో గాని గురుకులంలో సీటు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ● జనగామ పట్టణానికి చెందిన సంఘ వెంకటేశ్ తన దరఖాస్తు అందిస్తూ తన ఇంటి చుట్టూ నీరు నిలుస్తున్నందున ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సమస్యను పరిష్కరించాల్సిందిగా దరఖాస్తు అందించారు. ● తరిగొప్పుల మండలంలోని అక్కరాజుపల్లి గ్రామానికి చెందిన పుష్ప..తన భర్త కృష్ణయ్య మరణించాడని నలుగురు కుమార్తెలతో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నానని, కూలి పనులపై ఆధారపడి జీవిస్తున్నందున తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. నిందితులపై కేసుపెట్టడం లేదు గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు 2019లో తనను అకారణంగా కొట్టి కులం పేరుతో దూషించారు. అప్పటినుంచి న్యాయం జరగాలని, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని పోలీసులను కోరినా పట్టించుకోవడం లేదు. తనకు తల్లిదండ్రులు, తోబుట్టువు ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్లిన న్యాయం జరగడం లేదు. – కోసంగి ఉపేంద్ర, రామరాజుపల్లి, దేవరుప్పుల మండలం రెండో విడత బిల్లుకు ఇబ్బందులు ఇందిరమ్మ ఇల్లు పనులు ప్రారంభించినప్పుడు మొదటి విడత బిల్లు వచ్చింది. అయితే సజ్జల లెవల్కు రాగా రెండో విడత బిల్లుకు ఫొటో అప్లోడ్ కావడం లేదని అధికారులను అడగగా ఉప్పల్లో ఇల్లు ఉందని అందుకే బిల్లు రావడం లేదని అంటున్నారు. తమకు ఎక్కడ ఇల్లు లేదని హైదరాబాద్కు, కలెక్టరేట్కు అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. ఇల్లు లే కున్నా ఉన్నట్లు ఆన్లైన్లో చూపిస్తోందని, విచారణ చేపట్టి తమకు ఇందిరమ్మ బిల్లు వచ్చేలా చూడాలి. –కోసున రాంచంద్రరెడ్డి, గోపాలపురం, పాలకుర్తి మండలం ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి గ్రామంలో ఎలాంటి ఆస్తులు లేవు. ఇద్దరు పిల్లల భవిష్యత్ కోసం హైదరాబాద్లో కూలీ పనులు చే సుకుంటు బతుకుతున్నాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినా ఇంతవరకు అనుమతి పత్రాలు ఇవ్వడం లేదు. – మిద్దేపాక సునీత, పసరమడ్ల, జనగామ మండలం ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు గ్రీవెన్స్లో దరఖాస్తులు చేస్తున్నా పట్టింపులేదు.. ప్రజావాణిలో బాధితుల గోడు వినతులను సత్వరం పరిష్కరించాలి: కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్పట్టా కావడం లేదు గ్రామంలో సర్వే నెంబర్ 191లో ఎకరం 36 గుంటల భూమి నా పేరిట ఉంది. గత ప్రభుత్వంలో పట్టాపాస్ బుక్ కోసం దరఖాస్తు చేసుకున్నా. అధికారులు ఇప్పటివరకు పట్టా పాస్ బుక్ ఇవ్వడం లేదు. భూభారతిలో దరఖాస్తు చేసుకున్న ఎలాంటి సమాధానం లేదు. సర్వే చేపట్టి పట్టా పాస్ బుక్ మంజూరు చేయాలి. –బొట్ల బాబు, యశ్వంతాపూర్, జనగామ మండలం అంత్యోదయ కార్డు ఇచ్చి ఆదుకోవాలి నాపేరు ఖమ్మం శ్రీకాంత్. మాది స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామం. పుట్టుకతోనే నాకు కళ్లు కనబడవు. వివాహమై 5 ఏళ్లు అవుతోంది. పింఛన్తో, భార్య కూలీ పనులతో కాలం వెల్లదీస్తున్నాం. తల్లిదండ్రుల రేషన్కార్డులో పేరు ఉంది. దివ్యాంగుడి కోటా కింద నాకు అంత్యోదయ కార్డు మంజూరు చేయాలని, 5 ఏళ్ల నుంచి తిరుగుతున్నా. నాకు కొత్త కార్డు మంజూరు చేయండి.ఆరు నెలలుగా వేతనాలు లేవు తెలంగాణ మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు, పీడీ, కంప్యూటర్ ఆపరేటర్స్, నైట్ వాచ్మెన్, అటెండర్లకు ఆరు నెలలుగా జీతాలు రావడం లేదు. దీంతో జీవనోపాధి కష్టంగా మారింది. ప్రభుత్వం వెంటనే మాకు రావాల్సిన వేతనాలు విడుదల చేసి ఆదుకోవాలి. -
శాంతిభద్రతలకు భంగం కలగొద్దు
రఘునాథపల్లి: శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, కేసుల వేగవంతమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా ఆదివారం రఘునాథపల్లి సీఐ సర్కిల్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. కేసులకు సంబంధించిన వివరాలు, ఇతరత్రా రికార్డులు పరిశీలించారు. సర్కిల్ పరిధిలోని మూడు మండలాల్లో శాంతిభద్రతలు, పెండింగ్ కేసులపై ఏసీపీ, సీఐ, ఎస్సైలతో డీసీపీ సమీక్షించారు. వినాయక చవితి ఉత్సవాలతో పాటు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నందున క్షేత్రస్థాయిలో ఇబ్బందులు, సమస్యాత్మక ప్రాంతాల సమాచారం అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్ ఏసీపీ భీంశర్మ, జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్రెడ్డి, సర్కిల్ పరిధి ఎస్సైలు దూదిమెట్ల నరేశ్, శ్రవణ్కుమార్, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ -
ప్రతీ గ్రామానికి సాగునీరు అందించాలి
చిల్పూరు: సాగునీటి వసతులు లేని ప్రతీ గ్రామానికి మల్లన్నగండి దేవాదుల రిజర్వాయర్ ద్వారా అందించాలనే డిమాండ్తో తాను ఒక రోజు పాదయాత్ర చేపట్టినట్టు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చెప్పారు. ఆదివారం ఉదయం వేలేరులో చేపట్టిన పాదయాత్ర మధ్యాహ్నం చిల్పూరు మండలం కొమ్ముగుట్టకు చేరుకోగానే సాగునీటి వసతులు లేని కొండాపూర్, శ్రీపతిపల్లి, లింగంపల్లి గ్రామాల కు చెందిన రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు రాజయ్యకు ఘనస్వాగతం పలికారు. పాదయాత్ర ద్వారా లింగంపల్లి సమ్మక్క–సారలమ్మ జాతర జరిగే గద్దెల వద్దకు చేరుకుని పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతీ ఎకరాకు సాగునీరు అందించాలనే డిమాండ్తో చేపట్టిన పాదయాత్రకు మంచి స్పందన వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎడవెళ్లి కృష్ణారెడ్డి, జనగామ యాదగిరి, మాలోతు రమేశ్నాయక్, కంకటి రవి, వెన్నం మాధవరెడ్డి, రంగు హరీశ్, బత్తుల రాజన్బాబు, లొడెం రవీందర్, గాలి ప్రవీణ, డాక్టర్ గూళ్ల ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య -
నేటినుంచే రాగిజావ
జనగామ: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 1 (సోమవారం) నుంచి రాగి జావ పథకం ప్రారంభం కానుంది. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 10 తరగతుల విద్యార్థుల పోషకాహారాన్ని (ప్రధానమంత్రి పోషణ్) మరింత బలోపేతం చేయడానికి పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సహకారంతో రాగిజావ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్యాక్ చేసిన రాగి, బెల్లం పొడి ప్యాకెట్లను మండల స్థాయికి పంపిస్తారు. అక్కడి నుంచి ఎంఈ వోల పర్యవేక్షణలో పాఠశాలలకు రవాణా చేస్తారు. ఇందుకు సంబంధించి మధ్యాహ్న భోజనం వడ్డించే కుక్, హెల్పర్లకు రాగిజావ వడ్డించినందుకు గాను ఒక్కో విద్యార్థికి 25 పైసల చొప్పున చెల్లించనున్నారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్న త, ప్రభుత్వ పాఠశాలలు 545 ఉండగా, సుమారు 31వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.రాగిజావ ఇలా..ప్రతీ విద్యార్థికి రోజుకు 10 గ్రాముల రాగిపిండి, 10 గ్రాముల బెల్లం పొడి కలిపి అందిస్తారు. మధ్యాహ్న భోజనంలో గుడ్లు ఇవ్వని రోజు వారానికి మూడుసార్లు రాగి జావ వడ్డించాలి. రాగి జావ తయారీ కోసం సురక్షితమైన తాగునీటిని మాత్రమే ఉపయోగించాలి. స్వచ్ఛతతో కూడిన కిచెన్న్ షెడ్తో పాటు గాలి, వెలుతురు సమపాళ్లలో ఉండేలా హెచ్ఎంలు చూసుకోవాలి. వంట తయారుచేసే గ్రూపులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు తలకు కవర్, మాస్క్ ధరించి, చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలి. పాత్రలు, వంటగది, భోజనశాలను ప్రతి రోజు శుభ్రం చేయాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. రాగిజావ పంపిణీ చేసే సమయంలో ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ చేస్తూ ప్రతి పిల్లవాడికి సమానంగా వడ్డించేలా చూడాలి. రాగి జావ తయారుచేసేందుకు అవసరమైన ఇంధన ఖర్చుల కోసం ప్రతీ విద్యార్థికి రోజుకు 25 పైసల చొప్పున ప్రభుత్వం వారికి చెల్లించనుంది. ప్రతీనెల రాగిజావ కోసం పాఠశాల వారీగా నివేదికలను ఎంఈవోలు అందించాల్సి ఉంటుంది. రాగి జావతో విద్యార్థుల ఆరోగ్యం, పోషణ మెరుగుపడడంతో పాటు మధ్యాహ్న భోజన పథకం మరింత సమర్థవంతంగా అమలవుతుందని విద్యాశాఖ ముఖ్య ఉద్దేశ్యం.పిల్లలకు పోషకాహారం అందించడమే లక్ష్యంజిల్లాలో 545 ప్రభుత్వ బడుల్లో అమలురాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ రిజ్వాన్ బాషా పర్యవేక్షణలో సర్కారు బడుల్లో నేటి నుంచి వారానికి మూడు రోజుల పాటు విద్యార్థులకు రాగి జావ అందించనున్నాం. ప్రభుత్వం రాగి, బెల్లం పొడి ప్యాకెట్లను పంపిస్తుండగా, ఎంఈవోల ద్వారా పాఠశాలలకు వాటిని సప్లయ్ చేస్తాం. ఈ పథకం విజయవంతంగా అమలు చేసేందుకు నిత్యం పర్యవేక్షిస్తాం.– బొమ్మనబోయిన శ్రీనివాస్, ఏఎంఓసర్కారు బడులకు వచ్చే విద్యార్థులకు ప్రభుత్వ రా గిజావ అందించడం మంచి నిర్ణయం. రాగిజావతో పిల్లల ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగు పడడమే కాకుండా దృఢంగా తయారవుతారు. దీంతో చదువుతో పాటు ఆటల్లో మరింత రాణిస్తారు.– రావుల రామ్మోహన్రెడ్డి,ప్రభుత్వ ఉపాధ్యాయుడు -
హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. ఆలయంలోని స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకుని పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాల్లో హేమాచలగుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించిన పూజారులు స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించారు. సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని పంపిణీ చేసి వేద మంత్రోచ్ఛరణతో ఆశీర్వచనం ఇచ్చారు. -
పొద్దంతా క్యూలోనే..
పాలకుర్తి టౌన్: యూరియా కోసం మండల కేంద్రంలో రైతు సేవా సహకార సంఘం గోదాం వద్ద ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రైతులు క్యూలో బారులు తీరారు. 444 బస్తాలు యూరియా రాగా వ్యవసాయ అధికారులు సమక్షంలో సొసైటీ సిబ్బంది, పోలీస్ బందోబస్తు మధ్య ఒక్క రైతుకు ఒకే బస్తా చొప్పున అందజేశారు. గంటల తరబడి క్యూలో నిలబడిన రైతులు కొందరికీ దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. నర్మెటలో.. నర్మెట: సాగుచేసిన పంటలకు సమయానికి యూ రియా వేద్దామంటే చాలినంత దొరకకపోవడంతో సొసైటీల షాపుల ముందు ఆడా, మగా తేడా లేకుండా బారులుతీరుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో నిల్వ ఉందని తెలుసుకున్న రైతులు ఆదివారం ఉదయం నుంచే బారులు తీరారు. కొందరికీ దొరక్కపోవడంతో రెండు రోజులలో యూరియా అందుబాటులోకి వస్తుందని తెలుపడంతో నిరాశతో వెనుదిరిగారు. యూరియా కోసం అవే తిప్పలు ఒక్కరికీ ఒకే బస్తా.. వెనకుంటే దొరకనట్టే -
శాంతించిన గోదావరి
కన్నాయిగూడెం: మూడు రోజుల నుంచి ఉరకలేసిన గోదావరి ఉధృతి ఆదివారం కొంతమేర తగ్గి శాంతించింది. మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్కసాగర్ బ్యారేజీలోకి ఆదివారం సాయంత్రం వరకు 8,17,183 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నిన్నటి వరకు 8,57,190 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా ఆదివారం 40 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం తగ్గి శాంతించింది. ప్రస్తుతం బ్యారేజీ 59 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. బ్యారేజీ వద్ద ప్రస్తుతం 82.90 మీటర్ల నీటి మట్టం ఉంది. ఇంకా నీటిలోనే రహదారులు వాజేడు: మండల పరిధిలోని పేరూరు వద్ద గోదావరి వరద క్రమేపీ తగ్గుతూ వస్తోంది. మూడు రోజుల క్రితం ముంపునకు గురైన రహదారులు ఇంకా నీటిలోనే ఉన్నాయి. టేకులగూడెం చివరన 163 నంబర్ జాతీయ రహదారి ముంపునకు గురికావడంతో ఛత్తీస్గఢ్, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు– గుమ్మడిదొడ్డి, ఏడ్జెర్లపల్లి– పూసూరు, పేరూరు–కృష్ణాపురం గ్రామాల మధ్యన రహదారులు ముంపులోనే ఉండడంతో రాకపోకలు కొనసాగడం లేదు. జాతీయ రహదారి నుంచి కోయవీరాపురం గ్రామానికి వెళ్లే రహదారి చాకలి వాగు వద్ద మునగడంతో గుట్ట పక్కన ఉన్న పాత దారి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద 8,17,183 క్యూసెక్కుల నీటి ప్రవాహం 59 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల -
ఓపీఎస్ సమరయాత్ర!
● పెన్షన్ స్కీం కొత్త విధానంలో ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యూటీ, పెన్షన్ కమ్యూనికేషన్, హెల్త్కార్డులు ఉండవు. ● సీపీఎస్ షేర్ మార్కెట్పై ఆధారపడి ఉంటుంది. దీంతో ఎంత పెన్షన్ వస్తుందో తెలియదు. అందుకే దీనిని అన్ డిపెండెడ్ పెన్షన్ స్కీం అంటారు. షేర్ మార్కెట్లో నష్టాలు వస్తే ఇబ్బందులు తప్పవు. ● కొత్త పెన్షన్ విధానం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎఫ్, ఆర్డీఏ అనే చట్టాన్ని తీసుకొచ్చింది. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసే అస్కారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది.జనగామ: ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ఆర్థిక విధానాలకు అనుగుణంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం (ఎన్డీఏ) కొత్త పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. 2004 తర్వాత నియమితులైన ఉపాధ్యాయ, ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ విధానాన్ని అమలుచేస్తూ కొత్త జీవోలను తీసుకొచ్చింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ని సమర్థిస్తూ అమల్లోకి తెచ్చింది. సదరు సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) అమలుచేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం(నేడు) కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేయనున్నారు. అనంతరం హైదరాబాద్లో జరిగే మహాసభకు బయలుదేరుతారు. 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నియమించబడిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరినీ సీపీఎస్ పరిధిలోకి తీసుకొస్తూ 653, 654, 655 జీవోలను విడుదల చేసింది. సీపీఎస్ నూతన పెన్షన్ విధానం అమలులోకి రావడంతో ఉద్యోగి వేతనం బేసీక్ పే నుంచి 10శాతం తీసుకుని మ్యాచింగ్ గ్రాంట్గా ప్రభుత్వం మరో 10శాతం కలిపి మొత్తాన్ని షేర్ మార్కెట్లో పెడుతుంది. సీపీఎస్ ఉద్యోగి పదవీ విరమణ పొందిన తర్వాత 60శాతం నగదు చేతికి అందించి, రూ.పది లక్షలు దాటితే దానిపై 30శాతం పన్ను విధించేలా జీవోలను సవరించింది. మిగిలిన 40శాతం నగదును షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి దానిపై వచ్చే వడ్డీని ప్రతీ నెల పెన్షన్గా అందించేందుకు శ్రీకారం చుట్టింది. దీని ద్వారా వచ్చే పెన్షన్ చాలా తక్కువగా ఉండడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. పాత పెన్షన్ విధానంలో ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యూటీ, పెన్షన్ కమ్యూనికేషన్, హెల్త్ స్కీంలు కూడా అమలులో ఉండడంతో రిటైర్ అయిన ఉద్యోగికి కచ్చితంగా భరోసా ఉండేది. నేడు ఆ పరిస్థితి లేకపోవడంతో సీపీఎస్ ఉద్యోగులు ఏటా సెప్టెంబర్ 1వ తేదీని నిరసన దినోత్సవంగా పాటిస్తూ, తమ హక్కుల సాధన కోసం గళమెత్తనున్నారు. సీపీఎస్ అమలైన తర్వాత.. సీపీఎస్ విధానం అమలైన తర్వాత జిల్లాలో సుమారుగా 3వేల మంది నియమితులయ్యారు. ఉపాధ్యా య, ఉద్యోగులు ఉద్యోగ విరమణ తర్వాత సామాజిక భద్రతకు పెన్షన్ను ఒక్క హక్కుగా 1982లో కల్పించారు. అయితే పెన్షన్తో పాటు గ్రాట్యుటీని కూడా రద్దుచేయడంతో ఉద్యోగ విరమణ అనంతరం భద్రత లేకుండా పోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానం ఉపాధ్యాయ, ఉద్యోగులకు శాపంగా మారింది. పాత పింఛన్ విధానం కోసం టీచర్లు, ఉద్యోగుల పోరుబాట కలెక్టరేట్ వద్ద ధర్నాలు..హైదరాబాద్లో మహాసభ నేడు సీపీఎస్ ఉద్యోగుల నిరసన దినోత్సవం -
కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ లింగాలఘణపురం: విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్త్ ఉంటుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శనివారం మండలంలోని నెల్లుట్ల పాఠశాలలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. పదో తరగతి, ప్రీప్రైమరీ విద్యార్థులతో మాట్లాడారు.. ప్రైమరీ విద్యార్థులతో బోర్డుపై ఉన్న పదాలను చదివించి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ప్రణాళికబద్ధంగా చదువుకోవాలని, అప్పుడే మంచి మార్కులు సాధిస్తారని పదో తరగతి విద్యార్థులకు సూచించారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉందో పరిశీలించి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అనే విషయాలను తెలుసుకున్నారు. హెడ్మాస్టర్లు రవీందర్, సమ్మక్క తదితరులు ఉన్నారు. -
కేంద్ర ఆర్థిక పథకాలతో మహిళల స్వావలంబన
● ఆర్బీఐ జీఎం ఎంజీ సుప్రభాత్ పాలకుర్తి టౌన్: సామాజిక ఆర్థిక భద్రత పథకాలతో గ్రామీణ మహిళలు స్వావలంబన సాధించేందుకు బ్యాంకులు పనిచేస్తున్నాయని ఆర్బీఐ జనరల్ మేనేజర్ ఎంజీ సప్రభాత్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి కల్యాణ మండపంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలో సోషల్ సెక్యూరిటీ స్కీమ్ విలేజ్ అవేర్నెస్ ప్రోగ్రాం, సంతృప్త ప్రచార కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలను ప్రజలకు చేరవేడయంతో పాటు కేవైసీ అప్డేట్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేంద్రన్తో కలిసి మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సురక్ష బీమా యోజన, జీవన్జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు పరిధిలో గల 33 మహిళ సంఘాలకు రూ.4కోట్ల రుణాల మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పీఎన్బీ సికింద్రాబాద్ సర్కిల్ హెడ్ సుజిత్కుమార్, డీఆర్డీఏ పీడీ వసంత, ఏపీడీ నూరోద్దిన్, పీఎన్బీ మేనేజర్ అడేపు రమేశ్, డీసీఎం శ్రీనివాస్, ఏపీఎం శ్రీరాములు, చంద్రశేఖర్ సీసీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
‘డబుల్’ ఇళ్ల పంపిణీలో వసూళ్లు ?
తరిగొప్పుల: గత ప్రభుత్వం గూడులేని నిరుపేదల ఆవాసం కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాల పంపిణీలో కొందరు వసూళ్లకు పాల్పడినట్లు మండలవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మండలంలోని అక్కరాజుపల్లి గ్రామంలో అప్పటి ప్రభుత్వం 2020లో 30డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించింది. కాగా లబ్ధిదారులు ఎంపిక కోసం రెవెన్యూ అధికారులు పలుమార్లు గ్రామసభలు నిర్వహించారు. అయినప్పటికీ తుది జాబితా కొలిక్కిరాకపోవడంతో లబ్ధిదారుల ఎంపిక నిలిపివేశారు. ఇదిలా ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాలు లేనప్పటికీ తహసీల్దార్ సెలవులో ఉండగా శనివారం తహసీల్దార్ కార్యాలయంలో గుట్టుచప్పుడు కాకుండా రెవెన్యూ సిబ్బంది ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. కాగా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ప్రొటోకాల్ పాటించకుండా స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం ఏంటని రెవెన్యూ సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో అప్పటికే 21 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయగా 9 మందికి పంపిణీ చేయలేదు. కాగా, లబ్ధిదారుల్లో ఒక్కరైనా ఓ మహిళా లబ్ధిదారుకు ఫోన్ చేసి పట్టాలు పంపిణీ చేస్తున్న రెవెన్యూ అధికారులకు ఇవ్వాలని చెప్పి రూ.10 వేలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ విషయమై రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆంధ్రయ్యను వివరణ కోరగా కలెక్టర్ సూచన ఆదేశాల మేరకు తహసీల్దార్ సూచన మేరకే ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని, ఎవరి నుంచి డబ్బులు వసూలు చేయలేదన్నారు. ఇల్లు ఇప్పించండి సారూ.. ఎప్పుడూ కూలుతుందో తెలియని పెంకుటింటిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న తనకు ఇల్లు ఇప్పించాలని అక్కరాజుపల్లి గ్రామానికి చెందిన బొమ్మెన రేణుక అనే మహిళ శనివారం కలెక్టర్ను వేడుకునేందుకు వెళ్లగా పోలీసులు ఆమెను గేటు వద్ద అడ్డుకున్నారు. తన వెంట తెచ్చుకున్న సంచిని తనిఖీ చేశారు. పలుమార్లు ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకున్నానని అయినప్పటికీ తనకు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. భర్త మృతి చెందాడని, కొడుకు, కూతురుతో కాలం వెళ్లదీస్తున్న తనని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాలు లేకున్నా పట్టాల పంపిణీ తహసీల్దార్ సెలవులో ఉండగా గుట్టుచప్పుడు కాకుండా.. -
జాతీయ లోక్ అదాలత్ను
సద్వినియోగం చేసుకోవాలి ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ జనగామ రూరల్: జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా న్యాయసేవాసంస్థ ఆధ్వర్యంలో కోర్టులో జాతీయ లోక్ అదాలత్పై కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ మొత్తంలో కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలన్నారు. డీసీపీ బి.రాజమహేంద్రనాయక్ మాట్లాడుతూ..జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల సర్కిల్ ఇన్స్పెక్టర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు పెండింగ్లో ఉన్న రాజీపడ తగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించుకునేలా కక్షిదారులకు సూచనలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్, ఇ.సుచరిత, జూనియర్ సివిల్ జడ్జి శశి, ఆర్డీఓ కె.గోపిరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి.సుహాసిని, ఏసీపీలు ఎ.నర్సయ్య, ఆర్. భీమాశర్మ, ప్లీడర్ రామ్మోహన్రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరిచంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్సీడీ నుంచి మినహాయించండి
జనగామ: ప్రభుత్వం ఎన్సీడీ ఆన్లైన్ ప్రోగ్రాం నుంచి ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏలను మినహాయించాలని కోరుతూ శనివారం జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్రావుకు వినతిపత్రం అందించారు. అనంతరం దేవేంద్ర, ఎ.శారద, ఎన్.పద్మావతి, అమృత, వసంత, సవిత, జ్యోతి, కుల్సూమ్ సుల్తాన్ మాట్లాడుతూ.. ఎన్సీడీకి సంబంధించి 2014లో స్టేట్ లెవల్ అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్(ఎన్సీడీ) చేసిన తర్వాత 2017, 2022 రీ స్క్రీనింగ్ సైతం చేశామన్నారు. 2022 సంవత్సరంలో సైతం చేసినట్లు స్పష్టం చేశారు. 2025లో మరో యాప్ను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చి గత వివరాలను నమోదు చేయాలనడం భావ్యం కాదన్నారు. ఒకే పనిని రెండు, మూడుసార్లు చేయిస్తుండడంతో తమకు అప్పగించిన వైద్యసేవలను పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నామన్నారు. ఉన్నతాధికారులు తమ సమస్యను మానవతా దృక్పథంతో ఆలోచించి విముక్తి కలిగించాలన్నారు. డీఎంహెచ్ఓకు ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏల వినతి -
వానకొండయ్య జాతరకు సకల సౌకర్యాలు
దేవరుప్పుల: శ్రీవానకొండయ్య లక్ష్మీనర్సింహ్మస్వామి జాతర నాటికి సకల సౌకర్యాలు కల్పించేలా పనులు వేగవంతం చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్లో తన నివాసంలో దేవాదాయశాఖ అధికారులతో కడవెండి శివారులోని శ్రీవానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కేటాయించిన రూ.కోటి నిధులు వినియోగంపై సమీక్ష జరిపారు. కల్యాణమండపం, అన్నదానసత్రం, భక్తులకు తాగునీటి సౌకర్యం, దీపాలంకరణ, సేద తీరేందుకు భవన సముదాయం వంటి మౌలిక వసతుల పనులు సత్వరమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. -
పెసర్ల ధర పిసరంత!
శనివారం శ్రీ 30 శ్రీ ఆగస్టు శ్రీ 2025● జనగామ మార్కెట్లో ఒక్కసారిగా పతనం ● మూడు రోజుల వ్యవధిలో మూడు వేలకుపైగా వ్యత్యాసం ● అమ్మకానికి ససేమిరా అంటున్న రైతులు ● పెట్టుబడి సైతం రాదని ఆవేదన ● సరుకు నాణ్యత లేదంటున్న వ్యాపారులుజనగామ: జిల్లా రైతులకు పెసర్ల ధరలు షాక్ ఇస్తున్నాయి. మూడు రోజులుగా క్వింటాల్కు రూ.7,800ల వరకు ధర పలికి శుక్రవారం ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అమ్ముకునేందుకు ససేమిరా అంటున్న రైతులు.. మంచి ధర రాకుంటే ఇంటికి తీసుకెళ్తామంటున్నారు. ఇంత తక్కువ ధరకు అమ్మితే పెట్టుబడి సైతం రావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యార్డుకు వచ్చిన పెసర్లు నాణ్యత లేకపోవడంతోనే ధర ఇవ్వలేకపోతున్నామని వ్యాపారులు అంటుండగా..ఇదే సరుకును మూడు రోజుల క్రితం ఎక్కువ ధరకు ఎలా తీసుకున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ–నామ్ పద్ధతిలో పెసర్ల కొనుగోలుకు ఐదారుగురు వ్యాపారులు రావాల్సిన చోట.. ఒకేఒక్కరు రావడంలో పోటీ లేకుండాపోయింది. తమ శ్రమతో పండించిన పంటకు సరైన విలువ దక్కకపోవడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అమ్మకానికి నిరాకరణ మార్కెట్కు పెసర్లను తీసుకొచ్చిన రైతులు ధరలు తగ్గిపోవడంతో అమ్మకానికి నిరాకరిస్తూ ఇంటికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు కొంతమంది రైతులు ప్రైవేటులో తీసుకొచ్చిన అప్పులను తీర్చేందుకు తక్కువ ధరకై నా పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత కష్టం చేసి పండించిన పంటకు కనీసం ఉత్పత్తి వ్యయం కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యవసాయం ఎలా చేయాలని వాపోతున్నారు. ఎక్కువ మంది ఖరీదుదారులు రావాల్సిన చోట ఒక్కరు మాత్రమే రావడం..ధరలు పడిపోవడానికి ప్రధాన కారణమని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. మార్కెట్లో లావాదేవీలు మందగించడంతో రైతులు, వ్యాపారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. పెసర్ల నాణ్యత ఆధారంగా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. 25న రూ.7,800.. 29న రూ.4,700 జనగామ ఏఎంసీకి ఐదు రోజులుగా పెసర్లు వస్తున్నాయి. జిల్లాలో 7 వందల ఎకరాలకు పైగా పెసర పంట సాగుచేయగా.. మొదట్లో వర్షాభావ పరిస్థితుల్లో 20 శాతం పంట చేతికందకుండా పోగా, చాలా చోట్ల దిగుబడులు అమాంతం తగ్గాయి. ఉన్న పంటను అమ్ముకుందామంటే ధరలు తగ్గడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ నెల 25న క్వింటాల్ పెసర్ల ధరలు రూ.7,800, రూ.6,400, రూ.6,600 మూడు కేటగిరీల్లో ధర పలుకగా, 26న రూ.6,350, రూ.5,700, రూ.4,200 ధర ఇచ్చారు. 29న రూ.4,751, రూ.4,525, రూ.4,502 ధర మాత్రమే పలికింది. 25, 26 తేదీల్లో 151 క్వింటాళ్లు కొనుగోలు చేయగా, 29న మాత్రం 50 క్వింటాళ్ల సరుకు వాపస్ వెళ్లగా..వ్యాపారి 30 క్వింటాళ్లను కొనుగోలు చేశాడు.అభ్యంతరాలుంటే తెలపండిఇంటికి తీసుకెళ్తున్నా.. నాలుగు ఎకరాల్లో పెసర పంట సాగు చేశా. పెట్టుబడులకు రూ.30వేల వరకు ఖర్చు అయ్యింది. 15 క్వింటాళ్ల దిగుబడి రావాలి. పంటసాగు చేసిన మొదట్లో వర్షాభావ పరిస్థితులతో 9 క్వింటాళ్ల దిగుబడి తగ్గింది. ఆరు క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. మార్కెట్లో నాలుగు రోజుల క్రితం క్వింటాల్ పెసర్లకు రూ.6వేల నుంచి రూ. 7,800 ధర పలుకగా.. ఇవాళ కేవలం రూ.4,750 ఇస్తామంటున్నారు.. ఇదేంటని అడిగితే మార్కెట్లో ధర పడిపోయిందని చెబుతున్నారు. సరుకును ఇంటికి తీసుకెళ్తున్నా..సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మార్కెట్లో ధర పలికితే అక్కడ అమ్ముకుంటా.. – ధరావత్ రవి,రైతు, బంజర, దేవరప్పుల -
దేనికై నా సిద్ధమే
● సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా ఎదుర్కొంటా ● ఎమ్మెల్యే కడియం శ్రీహరిస్టేషన్ఘన్పూర్: సుప్రీంకోర్టు తీర్పు ఏ రకంగా వచ్చినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని ఓ ఫంక్షన్హల్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గస్థాయి సమన్వయ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన కడియం మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని, ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలన్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఒక్కొక్క ఎంపీటీసీ స్థానానికి ఇద్దరు ఇన్చార్జ్లను నియమిస్తానని, వారు గ్రామంలోని అందరి అభిప్రాయాలు తీసుకుని రెండు, మూడు పేర్లను సిఫార్సు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శిరీశ్రెడ్డి, నాయకులు సీహెచ్ నరేందర్రెడ్డి, బెలిదె వెంకన్న, చిల్పూరు దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, లింగాజీ, రంజిత్రెడ్డి, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
జనగామ రూరల్: జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు అన్నారు. శుక్రవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో జీపీ కార్మికులు అవస్థలు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కనీస వేతనం రూ. 26,000లు ఇవ్వాలని, యూనిఫామ్, సబ్బులు, నూనెలు ఇవ్వాలని, ఇన్సూరెన్స్, పీఎఫ్, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి నారోజు రామచంద్రం, బస్వ రామచంద్రం, సాంబయ్య, యాకన్న, సంగీ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘రెవెన్యూ’లో వేళ్లూనిన అవినీతి!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూశాఖలో అవినీతి పరాకాష్టకు చేరుతోంది. కొందరు తహసీల్దార్లు, అధికారులు అక్రమాదాయానికి కొత్తదారులు వెతుక్కుని మరీ అవినీతికి పాల్పడుతుండడం వివాదాస్పదమవుతోంది. కిందిస్థాయిలో పలువురు వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి పైస్థాయిలో సర్వేయర్లు, ఇన్స్పెక్టర్లు, తహసీల్దార్ల వరకు అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతీ పనికి ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్న కొందరి తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చేయి తడిపితే తప్ప దస్త్రం కదిలించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఓ వైపు శాఖాపరమైన చర్యలు.. మరోవైపు ఏసీబీ దాడులు చేస్తున్నా కొందరు తహసీల్దార్ల తీరు మారడం లేదు. తాజాగా ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. శుక్రవారం ఆయన ఇంటితో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపై ఐదు చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. ప్రాథమికంగా రూ.5 కోట్ల అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తుండడం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆది నుంచి అవినీతి ఆరోపణలు.. 2022లో వీఆర్ఎస్కు దరఖాస్తు.. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించిన కేసులో అరెస్టయిన తహసీల్దార్ బండి నాగేశ్వర్రావుపై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ధర్మసాగర్, కాజీపేట, హసన్పర్తితోపాటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్లో పలుచోట్ల పనిచేసిన సమయంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు అధికారులు అందాయి. తహసీల్దార్ ఉద్యోగంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో భాగస్వామిగా చేరి రెండు చేతులా సంపాదిస్తూ ప్రభుత్వ, అసైన్డ్భూములను అప్పనంగా కట్టబెట్టారన్న ఫిర్యాదు మేరకు 2019లో అప్పుడున్న కలెక్టర్ విచారణ జరిపారు. ధర్మసాగర్ మండలంలోని ఓ గ్రామంలో గుట్టను విక్రయించి రిజిస్ట్రేషన్ చేసి పాస్పుస్తకాలు జారీ చేయడం వివాదంగా మారింది. 1976లో హసన్పర్తి శివారు కోమటిపల్లిలో కొనుగోలు చేసిన సీకేఎం కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్కు చెందిన 29 గుంటల భూమిని నగరానికి చెందిన ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేసి వారి నుంచి రూ.45 లక్షలు తీసుకున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఈ విషయమై బాధితులు 2022లో అప్పటి సీపీ, డీసీపీ, ఏసీపీకి ఫిర్యాదు చేశారు. తహసీల్దార్తోపాటు ఆ ముగ్గురిపై చేసిన ఫిర్యాదుపై విచారణ జరిగినా ఇప్పటికీ నానుతోంది. వరంగల్, హైదరాబాద్లో విలాసవంతమైన భవనాలను నిర్మించడంతోపాటు ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగుచూడడంతో స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు కూడా ఆయన దరఖాస్తు చేసుకున్నారు. చివరకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దాడులు చేయడం చర్చనీయాంశమవుతోంది. ఏసీబీ దాడులు చేస్తున్నా వెరవని వైనం.. ● 2024లో భూసేకరణలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై వరంగల్ ఆర్డీఓ సిడాం దత్తును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ● అంతకుముందు వరంగల్ జిల్లా సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ● జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో ఏకంగా సంయుక్త పాలనాధికారి సీసీ రూ.45 వేలు తీసుకుంటూ అడ్డంగా దొరికాడు. ● హనుమకొండ జిల్లా నడికూడ మండల ఆర్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ● భూపాలపల్లిలో రెవెన్యూ అధికారులకు లంచమివ్వాలని, లేదంటే తమ పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం లేదని వృద్ధ దంపతులు భిక్షాటన చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ● వెంకటాపూర్లో ఓ రైతు తనకున్న భూమిని పట్టా చేయాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి, చివరకు విసిగిపోయి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. ● ఇలా ఆరోపణలు వచ్చిన పలువురిపై బదిలీలు, సస్పెన్షన్, వీఆర్లో వేటు పడినా.. రాజకీయ పలుకుబడితో మళ్లీ కీలక మండలాల్లో పోస్టింగ్లు తెచ్చుకుని అదే తంతు కొనసాగిస్తున్నారు. ● నాలుగేళ్లలో అవినీతి నిరోధక శాఖ ఉమ్మడి జిల్లాలో 66కు పైగా వివిధ శాఖలకు చెందిన వారిని పట్టుకుంది. అందులో రెవెన్యూ శాఖదే అగ్రస్థానం ఉండడం గమనార్హం. అయినా ఆ శాఖలో పని చేస్తున్న కొందరిలో మార్పు రావడం లేదన్న చర్చ జరుగుతోంది. అడ్డదారుల్లో కొందరు తహసీల్దార్లు, అధికారులు భూసమస్యల పరిష్కారానికి రూ.లక్షల్లో డిమాండ్ తీవ్ర ఆరోపణలు వస్తున్నా.. మారని తీరు ఆదాయానికి మించిన ఆస్తుల వివాదంలో బండి నాగేశ్వర్ ఏసీబీ దాడులతో మళ్లీ కలకలం.. రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో ఫైళ్లు స్వాధీనంఖిలా వరంగల్: వరంగల్ ఫోర్ట్రోడ్డులోని ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. బీరువా, కౌంటర్లు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతీ ఫైల్ను పరిశీలించి కొన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మండల ఏర్పాటు నుంచి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
అలుగు పడితే ఆగుడే
శుక్రవారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2025జనగామ: రాష్ట్రమంతటా భారీ వర్షాలు..పొంగిపొర్లుతున్న ప్రాజెక్టులు..ఉప్పొంగుతున్న వాగులు..నిండు కుండలా చెరువులు..కానీ జనగామ జిల్లాలో నామమాత్రంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్దగా ఇబ్బంది లేకుండానే లోలెవల్ కాజ్వే, బ్రిడ్జిల వద్ద రాకపోకలు సాగుతున్నాయి. ఏటా జోరు వర్షాలతో వరద ఉధృతి పెరిగి రఘునాథపల్లి, లింగాలఘనపురం, జఫర్గడ్, పాలకుర్తి, బచ్చన్నపేట, జనగా మ రూరల్, నర్మెట తదితర మండలాల పరిధిలో అనేక గ్రామాలకు రోజుల తరబడి రవాణా సౌకర్యం, రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి. అయినప్పటికీ శాశ్వత బ్రిడ్జిల నిర్మాణం, ప్రమాదకరమైన రోడ్ల మరమ్మతులు తాత్కాలికంగా చేస్తున్నారు. ఈ సారి అనుకున్న స్థాయిలో వర్షాలు లేకపోవడంతో వరదలు లేవు. భారీ వర్షాలు కురియకముందే రవాణా కు అంతరాయం కలుగకుండా బ్రిడ్జిలు, లో లోవల్ కాజ్వేలు, ప్రమాదకరంగా ఉన్న రోడ్లు, కట్టల మరమ్మతుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కామారెడ్డి వరదల పరిస్థితి జిల్లాలో రాకుండా చూడాలని సూచిస్తున్నారు.గండి పడి.. రఘునాథపల్లి: మండలంలోని మేకలగట్టు నుంచి మచ్చుపహాడ్కు వెళ్లే తాత్కాలిక రోడ్డుకు గండి పడి రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసినా, విద్యుత్ లైన్లు కిందకు ఉండడంతో రెండేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు. ఇబ్రహీంపూర్ గ్రామ పెద్దచెరువు వద్ద బ్రిడ్జి లేకపోవడం, మండల గూడెం వద్ద కాజ్వే దెబ్బతినగా, అలుగు దాటుతూ ప్రజలు నరకం చూస్తున్నారు. బానాజీపేట, కోడూరు, రామన్నగూడెం వాగుపై బ్రిడ్జిల నిర్మాణం లేకపోవడంతో వాగు ఉధృతమైతే పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి.రోడ్డు తెగితే కష్టమే.. నర్మెట్ట: భారీ వర్షం కురిస్తే వెల్దండ ఊరచెరువు మత్తడి రోడ్డు తెగిపోయే ప్రమాదం ఉంది. జనగామ రహదారి మండల కేంద్రానికి సమీపంలో లోలెవల్ కాజ్వే కోతకు గురైంది. తండాలకు వెళ్లే రూట్లలో భారీ వర్షాలతో లో లెవల్ కాజ్వేలను ముంచేస్తుండడంతో రాకపోకలు నిలిచిపోతాయి.ప్రధాన రూట్ అయినా.. జనగామ రూరల్: జనగామ–హుస్నాబాద్ ప్రధాన రూట్ గానుగుపాడు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టికల్వర్టు ప్రమాదకరంగా మారింది. నూతన బ్రిడ్జి మూడేళ్లుగా పెండింగ్లో ఉంది. ఈ కట్టపై అదుపు తప్పి తే అంతే. జనగామ నుంచి చీటకోడూరులో లెవల్ బ్రిడ్జి, సిద్దెంకి–పెద్దరామన్చర్ల, ఎర్రగొళ్లపహాడ్–పెద్దతండా, జనగామ నుంచి పోచన్నపేట మీదుగా బచ్చన్నపేట వెళ్లే దారిలో కల్వర్టులు, కాలువల సమీపంలో బ్రిడ్జిల ని ర్మాణం లేకపోవడంతో వరదలతో దాటలేని పరిస్థితి ఉంది.రాకపోకలు బంద్ చిల్పూరు: భారీ వర్షాలు కురిస్తే చిల్పూరు గుట్ట నుంచి మండల కేంద్రం బర్రెంకల చెరువు మత్తడి, వెంకటాద్రిపేట నుంచి మండల కేంద్రానికి వచ్చే రోడ్డు మధ్యలో చిల్పూర్ వాగు ఉప్పొంగితే రాకపోకలు నిలిచి పోతాయి. పల్లగుట్టకు వెళ్లే రూట్లో మూడు రూట్లలో లోలెవెల్ కల్వర్టులు ఉన్నాయి. స్తంభించిపోతున్న రాకపోకలు, రవాణా లో లెవల్ బ్రిడ్జి, మత్తళ్ల కల్వర్టులపై చిన్నచూపు తాత్కాలిక మరమ్మతులకే పరిమితం కామారెడ్డి వరదల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్న ప్రజలు -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
చిల్పూరు: మండలంలోని పల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న చిదురాల ఆర్యన, జీడి ప్రీతి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం ఎల్లంభట్ల విజయ్కుమార్, ఫిజికల్ డైరెక్టర్ దేవ్సింగ్ గురువారం తెలిపారు. ఈనెల 25న జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించడంతో పాటు ఈనెల 30, 31 తేదీల్లో మహబూబ్నగర్ జిల్లాలో నిర్వహించే 11వ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులను చిల్పూరు ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, పీఏసీఎస్ వైస్ చైర్మన చిర్ర నాగరాజు తదితరులు అభినందించారు.అప్రమత్తంగా ఉండాలి టెలీకాన్ఫరెన్స్లో ఎమ్మెల్యే పల్లాజనగామ: వాతావరణ శాఖ హెచ్చరికలతో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఎమ్మెల్యే పల్లా టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు.. భారీ వర్షాలు కురిసే సమయంలో నియోజకవర్గ ప్రజలకు పార్టీ శ్రేణులు అందుబాటులో ఉండి సహాయక చర్యల్లో భాగస్వామ్యులు కావాలని కోరారు. పట్టణ, గ్రామాల్లోని ప్రజలు తడిచిన చేతులతో విద్యుత్ స్తంభాలు, కరెంటు వైర్లను తాకవద్దని సూచించారు.సాగుకు సరిపడా యూరియాజనగామ రూరల్: జిల్లాలో సాగుకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందస్తు ప్రణాళికతో జిల్లాలోని రిజర్వాయర్లకు జలకళ సంతరించుకుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, ఆర్డీవో వెంకన్న, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ, నీటిపారుదల శాఖ ఎస్ ఈ సుధీర్, డీఈలు పాల్గొన్నారు.న్యాస్లో ఏడునూతుల పాఠశాలకొడకండ్ల: జాతీయస్థాయి నేషనల్ అచీవ్మెంట్ సర్వే(న్యాస్)లో మండలంలోని ఏడునూతుల ఉన్నత పాఠశాల ఆదర్శంగా నిలిచింది. న్యాస్లో జనగామ జిల్లా ఆరో తరగతి విభాగంలో 35వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్ పాఠశాల హెచ్ఎం నారబోయిన యాకయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందిస్తూ ప్రశంసపత్రాలను అందజేశారు. ఈ విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయులు కమల్కుమార్, రాంబాబు, భాస్కర్, సోమేశ్వర్, యాదగిరి, రజిత, మమత, రజిత, విజయ, ఈర్య కవితలతో పాటు విద్యార్థులను హెచ్ఎం అభినందించారు.ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలిరఘునాథపల్లి: ప్రజలందరూ ఐక్యంగా ఉండి గణేశ్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని కురుమవాడలో శ్రీ విఘ్నేశ్వర యూత్ ప్రతిష్ఠించిన వినాయకుడికి సీఐ, ఎస్సైలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండలంలో మేకలగట్టు వద్ద వరద ప్రవాహానికి రోడ్డు తెగి రాకపోకలు నిలిచి పోగా డీసీపీ పరిశీలించారు. ఆయన వెంట జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ ఫణికిషోర్, ఎస్సై దూదిమెట్ల నరేశ్ తదితరులు ఉన్నారు. -
పింఛన్లు పెంచకుంటే రాజీనామా చెయ్
● సెప్టెంబర్ 9న మహాగర్జన నిర్వహిస్తాం● మంద కృష్ణమాదిగ స్టేషన్ఘన్పూర్: ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా దివ్యాంగులకు, చేయూత పింఛన్దారులకు పింఛన్లు పెంచాలని, లేదంటే సీఎం రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. దివ్యాంగులు, చేయూత పింఛన్దారుల నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాన్ని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, వీహెచ్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక సిరిపురం గార్డెన్స్ ఫంక్షన్హాల్లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం సోమరాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన మంద కృష్ణమాదిగ మాట్లాడారు.. దివ్యాంగులకు రూ.4వేల నుంచి రూ.6వేలకు, వృద్ధులు, వితంతువులకు రూ.2016 నుంచి రూ.4వేలకు పెంచుతామని హామీ ఇచ్చి ఇంతవరకూ అతీగతీ లేదన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలోగా డిమాండ్లను పరిష్కరించాలని, లేదంటే హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సెప్టెంబర్ 9న వికలాంగులు, చేయూత పెన్షన్దారుల మహాగర్జన సభతో ప్రభుత్వానికి గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ బోడ సునీల్, వీహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి కుమార్, ఉపాధ్యక్షుడు బిర్రు నగేశ్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు గద్దల కిషోర్, ఈగ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణాల్లో జిల్లా రెండో స్థానం
● ప్రభుత్వం నుంచి ప్రశంసపత్రం అందజేత ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ రూరల్: నిరుపేదలకు సొంత ఇళ్లను అందించే లక్ష్యంతో అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జిల్లాలో వేగవంతంగా జరిగేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మొదటి విడతలో 71శాతం, రెండో విడతలో 86 శాతం గ్రౌం డింగ్ పూర్తి అయినందున ఈ నెలలో రాష్ట్ర స్థాయిలో జనగామ జిల్లా రెండో స్థానం దక్కించుకుందన్నారు. ఈమేరకు ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రశంసపత్రం, ల్యాప్టాప్ను గురువారం కలెక్టర్ తన చాంబర్లో హౌజింగ్ పీడీ మాతృ నాయక్కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో మొత్తం మొదటి విడతలో 716ఇల్లు మంజూరు కాగా 479 గ్రౌండింగ్ అయ్యాయని, రెండో విడతలో 5,282 ఇల్లు మంజూరు కాగా, 4,341 గ్రౌండింగ్ దశలో ఉన్నాయన్నారు. నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి లింగాలఘణపురం: జనగామ పట్టణానికి సంబంధించిన గణనాథుల నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం నెల్లుట్ల చెరువును అన్ని శాఖల అధికారులతో కలిసి పరి శీలించారు. అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్, జిల్లా పంచాయతీ అధి కారి స్వరూప, నీటిపారుదల శాఖ ఎస్ఈ సుధీర్, ఆర్డీఓ గోపీరామ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, ఆర్అండ్బీ డీఈ అశోక్, మత్స్యశాఖ అధి కారి రాణాప్రతాప్, తహసీల్దార్లు హుస్సేన్, రవీందర్, ఎంపీడీఓ రఘురామకృష్ణ ఉన్నారు. రేపు జాబ్మేళా జనగామ రూరల్: ఈనెల 30వ తేదీన జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీలో 80 పోస్టులకుగాను జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు విద్యార్థులు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో కలెక్టరేట్ లోని ఎస్.8.లో ఉదయం 10:30 గంటలకు హాజ రుకావాలని సూచించారు. వివరాలకు 79954 30401 ఫోన్నెంబర్లో సంప్రదించాలన్నారు. -
వేర్వేరు కేసుల్లో ఇద్దరికి ఏడాది జైలు
రఘునాథపల్లి: ద్విచక్రవాహనం, గ్యాస్ సిలిండర్ దొంగలించిన కేసులో నిందితుడికి కోర్టు ఏడాది జైలు, జరిమానా విధించినట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్ గురువారం తెలిపారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరుకు చెందిన ఎస్కే ఖయ్యూం గత నెల 7వ తేదీన మండలంలోని కంచనపల్లిలో ఆమనగంటి రాజశేఖర్కు చెందిన గ్యాస్ సిలిండర్, గోవర్దనగిరిలో ద్విచక్రవాహనం దొంగిలించాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి గురువారం కోర్టులో హాజరుపర్చగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.శశి నిందితుడికి ఏడాది జైలు, రూ.500 జరిమానా విధించారు. అలాగే 21 మే 2018న మండలంలోని నిడిగొండ వద్ద అతి వేగంగా కారు నడిపి మేడె కుమార్, పెంబర్తి మణెమ్మ మరణానికి కారకుడైన హైదరాబాద్కు చెందిన ఎండీ ఖమ్యూం అలియాస్ లోబో అనే నిందితుడికి ఏడాది జైలు, రూ.12,500 జరిమానా విదించినట్లు ఎస్సై తెలిపారు. -
విఘ్నరాజు
కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు ప్రతీకగా ఇప్పటివరకూ రాక్షసులని చూశాము. ఇక మమతాసురుడు అనే రాక్షసుని కథ ఇది. శంబరుడు అనే రాక్షసుని ప్రలోభంతో మమతాసురుడు ముల్లోకాలనూ పీడించసాగాడు. దేవతల కోరిక మేరకు వినాయకుడు, విఘ్నరాజుగా అవతరించి మమతాసురుని సంహరించాడు. చిత్రంగా ఈ అవతారంలో వినాయకుడు నాగుపాముని వాహనంగా చేసుకున్నట్లు చెబుతారు. ఇక్కడ మమత అంటే దేహాభిమానానికి ప్రతీక. ఆ దేహంలోని కుండలిని జాగృతం చేసిన రోజున మోక్షానికి గల విఘ్నాలన్నీ తొలగిపోతాయి. దేహాభిమానానికి మమతాసురుడు, కుండలినికి సూచనగా నాగ వాహనం కనిపిస్తాయి. -
వినాయకుడు
వినాయకుడంటే భౌతికంగా మనకు కనిపించే ఆకారం మాత్రమే కాదు.. ఆయన రూపు, స్వభావం వెనుక లోతైన అర్థం ఉందని వేదాంతులు చెబుతుంటారు. గణేశుని ఆరాధనతో బాధల నుంచి సులభంగా విముక్తి పొంద వచ్చని సూచిస్తుంటారు. అందుకే గణేశుడే ప్రముఖంగా ఆరాధించబడే గాణపత్యం అనే శాఖ కూడా ఉంది. వినాయకుని ఆరాధనలో ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయని చెప్పేందుకు ఓ గొప్ప ఉదాహరణ ఆయన అవతారాలు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుడు ఎనిమిది అవతారాలను ధరించాడు. ఆ ఎనిమిది అవతారాల వివరాలను, గణనాథుని మహిమలను తెలుసుకుని ఆ వినాయకుని సేవించి తరిద్దాం. -
గజాననుడు
కుబేరుని ఆశ నుంచి లోభాసురుడు అనే రాక్షసుడు జనించాడు. శివపంచాక్షరిని జపించిన ఆ లోభాసురుడు, శివుని అనుగ్రహంతో ముల్లోకాలనూ జయించే వరాన్ని పొందాడు. కానీ అతని లోభానికి అంతులేకుండా పోయింది. చివరికి శివుని కైలాసాన్ని కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని తెలుసు కున్న దేవతలు రైభ్యుడనే రుషిని శరణువేడారు. గణపతిని కనుక ఆవాహన చేస్తే, లోభాసురుని పరాజయం ఖాయమని సూచించాడు. అలా సకల దేవతల ప్రార్థనలను మన్నించి గణేశుడు ‘గజాననుడి’గా అవతరించి లోభాసురుని జయించాడు. గజాననుడు అంటే ఏనుగు ముఖం కలిగినవాడు అని అర్థం. ఏనుగు తల బుద్ధిని సూచి స్తుంది. ఆ బుద్ధిని కనుక ఉపయోగిస్తే మనలోని లోభం (అత్యాశ, పిసినారితనం) దూరం కాకతప్పవు. -
ఏకదంతుడు
చ్యవనుడనే రుషి మదాసురుడనే రాక్షసుని సృష్టించాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు అతనికి ‘హ్రీం’ అనే మంత్రాన్ని ఉపదేశించి నిరంతరం జపిస్తే ఫలితం దక్కుతుందన్నాడు. లోకాధి పత్యమే అభీష్టంగా గల మదాసురుడు ఆ హ్రీంకారాన్ని యుగాల తరబడి జపించాడు. దాంతో అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించి మదాసురునికి తిరుగులేకుండాపోయింది. అతని చేష్టలకు దేవతలంతా భీతిల్లిపోయి సనత్కుమారుని చెంతకు ఉపాయం కోసం పరుగులు తీశారు. సనత్కుమారుని సూచన మేరకు వారంతా గణేశుని కోసం ప్రార్థించగా, ఆయన ‘ఏకదంతు’నిగా అవతరించి మదాసురిని జయించాడు. ఇక్కడ మదాసురుడు అంటే మదానికి (గర్వం) చిహ్నం, ఏకదంతుడు ఈ సృష్టి యావత్తూ ఒకటే అన్న అద్వైతానికి చిహ్నం. -
లంబోదరుడు
దేవ, రాక్షసులు కలిసి సాగరాన్ని మధించినప్పుడు చివరగా అమృతం దక్కిన విషయం తెలిసిందే! ఈ అమృతాన్ని రాక్షసులకు కాకుండా చేసేందుకు విష్ణుమూర్తి మోహినీ అవతారాన్ని ధరించాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసిన శివునికి కూడా మనసు చలించగా విష్ణువు తన నిజరూపంలోకి రావడంతో శివుడు భంగపడి క్రోధితుడయి క్రోధాసురుడు అనే రాక్షసుడు జనిం చాడు. సూర్యదేవుని ఆశీస్సులతో మహాబలవంతుడయ్యాడు. క్రోధాసురుడు ప్రీతి అనే కన్యను వివాహమాడగా హర్షం, శోకం అనే సంతానం కలిగారు. వినాయకుడు లంబోదరుని రూపంలో క్రోధాసురుడిని అణచివేశాడు. క్రోధం ఎప్పుడూ తాను ఇష్టపడిన దాని కోసం వెంపర్లాడుతుంది. ఆ వెంపర్లాటలో గెలిస్తే హర్షం, ఓడితే శోకం అనే ఉద్వేగాలు కలుగుతాయి. -
మహోదరుడు
శివుడు ఓసారి తీవ్రమైన తపస్సులో మునిగిపోయాడు. ఎంత కాలమైనా ఆయన ఆ తపస్సుని వీడకపోవడంతో పార్వతి కంగారు పడి పరమేశ్వరుని తపస్సు నుంచి బయటకు తీసుకురావాలని గిరిజన యువతిగా మారి ఆయన తపోభంగం కలిగించే ప్రయ త్నం చేసింది. పార్వతి చేష్టలకు పరమేశ్వరునికి దిగ్గున మెలకువ వచ్చి ఏం జరిగింది అన్న అయోమయం కూడా ఏర్పడి ఓ రాక్షసుడు జనించాడు. అతనే మోహాసురుడు. ఆ మోహాసురుడు సూర్యుని ఆరాధించి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. దేవతల ప్రార్థనను మన్నించి గణేశుడు లంబో దరునిగా అవతరించాడు. మోహం ఎప్పుడూ అయోమయానికి దారితీస్తుంది. దృక్పథం సంకుచితంగా మారిపోతుంది. అందరూ నావారే అన్న విశాలమైన దృష్టి కలిగిన రోజున ఆ మోహం దూరమైపోతుంది. -
ధూమ్రవర్ణుడు
అరిషడ్వార్గాలు అయిపోయాయి, దేహాభిమానమూ తీరిపోయింది. ఇక ‘నేను’ అనే అహంకారం ఒక్కటే మిగిలింది. దానికి సూచనే అహంకారాసురుడనే రాక్షసుడు. ధూమ్రము అంటే పొగ అన్న అర్థం కూడా వస్తుంది. ధూమ్రానికి ఒక ఆకారం అంటూ ఉండదు. ఒక పరిమితీ ఉండదు. సర్వవ్యాపి అయిన ఆ భగవంతుని ప్రతిరూపం ధూమ్రం. మనిషి ‘తాను’ అనే అహంకారాన్ని వీడి ఆ భగవంతునిలో ఐక్యం కావడానికి సూచనే ఈ అహంకారాసురుని వృత్తాంతం. ‘నేను’ అనే అహంకారాన్ని పక్కనపెట్టి తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ పరులకు ఉపకారం చేస్తూ దైవ చింతనతో దైవాన్ని వెతుకుతూ మోక్షంకోసం సాధన చేయడమే దీని సారాంశం. -
వక్రతుండుడు
పూర్వం ఇంద్రుడు చేసిన ఒక పొరపాటు వల్ల ‘మాత్సర్యా సురుడు’ అనే రాక్షసుడు ఉద్భవించాడు. అతని ధాటికి ముల్లోకాలూ అల్లాడిపోయి దేవతలంతా దత్తాత్రేయుని శరణు వేడారు. అంతట దత్తాత్రేయుడు, గణపతిని ప్రార్థించమని సూచించాడు. ‘గం’ అనే బీజాక్షరంతో దేవతలంతా ఆ గణపతిని గురించి తపస్సు చేయ గానే ‘వక్రతుండుని’గా అవతరించాడు. ఆయన సింహవాహనుడై ఆ మాత్సర్యాసురుని జయించాడు. వక్రతుండం అనేది ఓంకారా నికి ప్రతీకగా, మాత్సర్యాసురుడు మనలోని మత్సరానికి (ఈర్ష్య) ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ లోకం నాది, ఈ లోకంలో అందరికంటే నాదే పైచేయి కావాలి అనుకున్న రోజున ఈర్ష్యాసూయలు జనిస్తాయి. ఈ జగత్తు ఒక నాటకం మాత్రమే అని గ్రహించిన రోజున మనసులో ఎలాంటి ఈర్ష్య ఉండదు. -
సాగునీటికి మొదటి ప్రాధాన్యం
బుధవారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2025రఘునాథపల్లి: బ్యాంక్ స్ట్రీట్లో భారీ వినాయక మండపంనవరాత్రి ఉత్సవాలకు వినాయకుడిని తీసుకువెళ్తున్న ఉత్సవ కమిటీ ప్రతినిధులుబీసీ అభివృద్ధి అధికారిగా బాధ్యతలుజనగామ: జిల్లా బీసీ అభివృద్ధి అధికారిగా ఎన్.లక్ష్మినర్సింహరావు మంగళవారం బాధ్యలను స్వీకరించారు. రంగారెడ్డి జిల్లాలో పని చేస్తున్న ఆయన పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. ప్రస్తుతం ఎఫ్ఏసీగా పని చేస్తున్న రవీందర్ నుంచి బాధ్యతలను తీసుకున్న తర్వాత కలెక్టర్ రిజ్వాన్ బాషాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలిజనగామ రూరల్: న్యాయవాదుల భద్రత, రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఐలు (ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్) జిల్లా కన్వీనర్ గాజుల రవీందర్ అన్నారు. కూకట్పల్లి కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాది తన్నీరు శ్రీకాంత్పై దాడికి నిరసనగా మంగళవారం కోర్టు ఆవరణలో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులపై వరుస దాడులు జరుగుతుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు దాడులను అరికట్టడంలో విఫలమయ్యాయని విమర్శించారు. న్యాయవాదులకే రక్షణ లేకపోతే ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోకన్వీనర్ మహేశ్వరం బద్రీనాథ్, వట్టేపు వినయ్ కుమార్, అమృత రావు, బిట్ల గణేష్, ఎ. లక్ష్మణ స్వామి, గుగులోత్ శ్రీనివాస్, మోతే సంపత్, బాలబోయిన సంపత్, చాగంటి శ్రీనివాస్, బస్కుల ఠాగూర్, కాముని శ్రావణ్ కుమార్, పోగుల కార్తీక్, తదితరులు పాల్గొన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలుచిల్పూరు: జిల్లాలో యూరియా కొరత లేదని, అక్రమ నిల్వలు చేసి కృత్రిమ కొతర సృష్టిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి అంబికసోని అన్నారు. మండలంలోని మంగళవారం మండల వ్యవసాయాధికారి నజీరుద్దిన్తో కలిసి పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ జిల్లాలో సరిపోను యూరియా నిల్వలు ఉన్నాయని, ఎక్కడైన యూరియా వచ్చిందనగానే రైతులు ఒక్కసారిగా ఎగబడటంతో దొరకడంలేదన్నారు. సొసైటీల వారీగా యూరియా వస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏఈఓలు వినయ్కుమార్, నర్సింహులు, యాకూబ్ తదితరులు ఉన్నారు. పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలిజనగామ రూరల్: పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు తోట హృతిక్సాయి డిమాండ్ చేశారు. మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో పట్టణంలో నిరస న కార్యక్రమంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్ తీసుకో లేక, కొత్త అడ్మిషన్ పొందలేక ఇబ్బందులు పడుతున్నారన్నాఉ. భవనాలకు అద్దె చెల్లించకపోవడంతో యజమానులు తాళాలు వేసే పరి స్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి దేశగాని సాయి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివార్ల మహేందర్, వట్టిపల్లి గణేష్, దేవులపల్లి నితీష్, సాగర్, అక్షిత్ పాల్గొన్నారు. రేపు ఉచిత ఉపకరణాల శిబిరంజనగామ రూరల్: జిల్లాలో దివ్యాంగులకు రేపు (గురువారం) అలింకో సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉపకరణాల క్యాంపు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాలలోపు ఉన్న విద్యార్థులు ఈ నెల 28న ప్రెస్టన్ హైస్కూల్లో ఉదయం 10 నుంచి ఐదు గంటల వరకు శిబి రం ఉంటుందన్నారు. ఆధార్, రేషన్, సదరం సర్టిఫికెట్ జిరాక్స్తో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు కోఆర్డినేటర్ నాగరాజు (9491533047)ను సంప్రదించాలన్నారు. సందడి షురూ● జిల్లాలో పండుగ హోరు ● మార్కెట్లో రద్దీ, లడ్డూలకు గిరాకీ ● మండపాలు సిద్ధం చేసిన నిర్వాహకులు నేడు వినాయక చవితిజనగామ: జనగామలో వినాయక చవితి పండుగ సందడి మొదలైయింది. ఆధ్యాత్మికత, భక్తి, ఉత్సాహం, వ్యాపారం అన్నీ కలిసిపోయి గ్రామాలన్నీ పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ప్రకృతిని ఆరాధించడం, పంచభూతాలను పూజించడం భారతీయ సంస్కృతి గొప్పతనం. వినాయక చవితి పండుగను పురస్కరించకుని గణపయ్యను 21 రకాల పత్రులతో పూజించడంలో శాసీ్త్రయమైన భావన ఉంది. ఈ పత్రాలు నీటిలో కలిసినప్పుడు ఔషధ గుణాలు వ్యాపించి వాగులు, చెరువులను శుభ్రం చేస్తాయని విశ్వాసం. పత్రి పూజ ద్వారా ప్రకృతిని కాపాడుకోవాలని పండుగ మనకందించే సందేశం. నేడు (బుధవారం) వినాయక చవితి పండుగ నేపధ్యంలో సాక్షి ప్రత్యేక కథనం. మండపాలకు విగ్రహాల తరలింపు.. పట్టణంలోని పలు ప్రాంతాల్లో వ్యాపారులు తయారీ చేసిన వినాయకుడి ప్రతిమల విక్రయాలు జోరందుకున్నాయి. పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ప్రతిమలను కొనుగోలు చేసి ఆటోలు, ట్రాక్టర్లు, డీసీఎం, ఇతర వాహనాల్లో మండపాలకు తరలిస్తున్నారు. అలాగే పూలదండలు, పండ్లు, పత్రులు, పూజా సామగ్రి కోసం కొనుగోలుదారులు బారులుదీరారు. గ్రామాల నుంచి ప్రత్యేకంగా మామిడి కొమ్మలు, సీతాఫల్, జామ, దానిమ్మ, పత్రులు, పండ్లు పెద్ద ఎత్తున మార్కెట్కు చేరాయి. మార్కెట్లో రద్దీ నెలకొంది. కిక్కిరిసిన బస్టాండ్ పండుగ రాకతో జనగామ ఆర్టీసీ బస్టాండ్ జనసందోహంతో నిండిపోయింది. ఉద్యోగాలు, చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వారు స్వగ్రామాలకు చేరుకోవడంతో బస్టాండు కిక్కిరిసిపోయింది. విద్యావ్యవస్థను మరింత పటిష్టపరచాలిజనగామ రూరల్: విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశహాల్లో విద్యావ్యవస్థ పటిష్టతపై అదనపు కలెక్టర్ పింకేష్కుమార్, విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి అన్ని రంగాల్లో రాణించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. అంతకుముందు ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన హెచ్ఎంలకు ప్రశంసపత్రాలు అందించి అభినందించారు. సమావేశంలో విద్యాశాఖ అధికారులు చంద్రభాను, రవికుమార్, సత్యమూర్తి, శ్రీనివాస్, గౌసియా బేగం, రామరాజు, నాగరాజు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే విద్యార్థి ఆరోగ్య ప్రొఫైల్ కార్డు వాల్ పోస్టర్లను అదనపు కలెక్టర్ పింకేష్కుమార్, డీఎంహెచ్ఓ మల్లికార్జునరావుతో కలిసి విడుదల చేశారు. ప్రతీ విద్యార్థి ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం నమోదుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పోస్టు మాస్టర్లకు పింఛన్ కిట్ల పంపిణీ జనగామ: జిల్లాలో ఆసరా పింఛన్ల పంపిణీ ప్రక్రియను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు బ్రాంచ్ పోస్టు మాస్టర్లకు కొత్త మొబైల్ ఫోన్లు, ఫింగర్ ప్రింట్ డివైజ్లతో పాటు సాంకేతిక పరికరాలకు సంబంధించి కిట్లను అందించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ చేతుల మీదుగా 167 కిట్లను అందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ వసంత, ఏపీడీ నూరోద్దీన్, డీపీఎం సతీష్, గిరిబాబు, పోస్టల్ శాఖ ఏఎస్పీ కృష్ణ, నవీన్, భాస్కర్, పోస్ట్ మాస్టర్లు పాల్గొన్నారు.శానిటేషన్పై ప్రత్యేక దృష్టిజనగామ: పట్టణంలో పేరుకుపోయిన ప్రజా సమస్యలు, శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని పలు వార్డులతో పాటు హైదరాబాద్, సిద్దిపేట, సూర్యాపేట రహదారులను పరిశీలించారు. 17వ వార్డులోని మోడల్ మార్కెట్, 15 వార్డులో స్లాటర్ హౌస్, 15, 17, 20, 21, 27, 29, 30 వార్డుల్లో నెలకొన్న సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ గోపయ్య, పులిశేఖర్, జవాన్లు లక్ష్మణ్, ఎల్లేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.తప్పని నిరీక్షణజిల్లాలో పెద్దగా యూరియా కొరత లేకున్నా.. పలు మండలాల పరిధిలో నిరీక్షణ తప్పడం లేదు. మంగళవారం కొడకండ్ల, నర్మెట, పాలకుర్తి, దేవరుప్పుల, స్టేషన్ఘన్పూర్, రఘునాథపల్లి మండలాల్లో ఆగ్రోస్, పీఏసీఎస్, ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణాల వద్ద రైతులు తెల్లవారు జాము నుంచే యూరియా కోసం బారులుదీరారు. – జనగామ/సాక్షి నెట్వర్క్భక్తితో పూజిద్దాం.. భద్రతతో నిఘా ఉంచుదాం.. మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలకు చెక్ నిర్వాహకులు, ఎలక్ట్రీషియన్లకు విద్యుత్ శాఖ సూచనలు ఎమ్మెల్యే కడియం శ్రీహరి లింగాలఘణపురం: సాగునీటి పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం మండలంలోని పలు గ్రా మాల్లో పనుల జాతరలో భాగంగా రూ.2.30కోట్ల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నెల్లుట్లలో విలేకరులతో మాట్లాడారు. ఆర్ఎస్ ఘన్పూర్ నుంచి నవాబుపేట రిజర్వాయర్కు వచ్చే ప్రధాన కాల్వకు రూ.150 కోట్ల లైనింగ్ పనులను మంజూరు చేయించానన్నారు. రిజర్వాయర్ పనులన్నీ ఏడాదిలో పూర్తి చేయించి నియోజకవర్గంలోని ప్రతీ చెరువును గోదావరి జలాలతో నింపి స స్యశ్యామలం చేస్తామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలకు సాగునీరు అందలేదన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వసంత, ఆర్డీఓ గోపీరామ్, డీఈ ఆర్.రవీందర్, ఎంపీడీఓ రఘురామకృష్ణ, తహసీ ల్దార్ రవీందర్, ఏఈ శ్రీనివాసు, శివకుమార్, గుడి వంశీధర్రెడ్డి, మోహన్, శ్రీలతారెడ్డి, బాబు, దిలీ ప్రెడ్డి, సదానందం తదితరులు పాల్గొన్నారు. భద్రతా ఏర్పాట్లుగణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా సాగేందుకు పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ నేతృత్వంలో ఏసీపీ, సీఐ, ఎస్సైల ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేస్తున్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, భద్రతా సిబ్బందిని మొహరించారు. ఆధ్యాత్మికత, భక్తి ఆరాధనతో నిండిన వినాయక చవితి వేడుకలు జిల్లాలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. కాగా వారం రోజులపాటు కనుమరుగైన వరణుడు ముసురు రూపంలో ప్రత్యక్షం కావడంతో చిరు వ్యాపారులు ముసురులోనే అమ్మకాలు జరిపారు. మహాగణపతి.. గోమయ గణపతిజిల్లాలో వచ్చే నెల (సెప్టెంబర్) 6వ తేదీన వినాయక నిమజ్జనం జరుపుకోవాలని జిల్లా గణేష్ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు మంచాల రవీందర్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బాణాపురం వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు, సిద్ధాంతి కృష్ణ మాచార్యులు ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు రంగ నర్సింగరావు, కీర్తి నరసయ్య తదితరులు ఉన్నారు. లడ్డూలకు గిరాకీ వినాయకుడి చేతిలో లడ్డూ పెట్టడం సంప్రదాయం. ఈసారి కూడా అర కిలో లడ్డూ నుంచి 25 కిలోల బరువు ఉన్న లడ్డూల వరకు తయారు చేయడానికి స్వీట్ హౌస్ల్లో ఆర్డర్లు ఇచ్చారు. పట్టణంలో రాత్రి సమయంలో గణేష్ మండపాలు విద్యుత్ వెలుగుల అలంకరణలతో మెరిసిపోతున్నాయి. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
ఉపాధ్యాయులకు పదోన్నతులు
జనగామ: జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ముగిసింది. విద్యారంగంలో కొత్త మార్పులు చోటు చేసుకున్నా యి. 87 మంది ఎస్జీటీలు (సెకండరీ గ్రేడ్ టీచర్లు) వివిధ విభాగా ల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందారు. దీంతో హై స్కూల్స్లో సబ్జెక్ట్ నిపుణుల కొరత తీరనుండగా.. ప్రాథమిక పాఠశాల పిల్లలకు బోధన పరంగా కష్టాలు ప్రారంభం కానున్నాయి. సబ్జెక్టుల వారీగా ప్రమోషన్లు జిల్లాలో సబ్జెక్టుల వారీగా ఎస్జీటీలుగా పదోన్నతులు పొందారు. ఇందులో పీఎస్ హెచ్ఎం–22, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ–15, సోషల్ స్టడీస్–24 గణితం–6, ఫిజిక్స్–5, ఇంగ్లిష్–9, తెలుగు–1, హిందీ–2, ఫిజికల్ డైరెక్టర్ –1, స్పెషల్ ఎడ్యుకేషన్–3 ఉన్నారు. ఈ పదోన్నతుల హైస్కూల్ స్థాయిలో ఉపాధ్యాయుల కొరత తీరనుండగా, ప్రాథమిక పాఠశాలల్లో మాత్రం సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో కొత్త సవాళ్లు ‘బడి బాట’ ద్వారా ఈ ఏడాది ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లోనే అత్యధికంగా అడ్మిషన్లు వచ్చాయి. ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్న పీఎస్ల పరిధిలో ఒకరికి ప్రమోషన్ రావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. జిల్లాలోని సుమారు 50 ప్రాథమిక పాఠశాలల్లో ఒకరు పదోన్నతిపై హైస్కూల్ స్థాయికి వెళుతున్నారు. దీంతో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఏర్పడుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఖాళీల భర్తీకి తక్షణమే విద్యావలంటీర్లను నియమించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు అదనపు కలెక్టర్, డీఈఓ పింకేష్కుమార్ చేతులమీదుగా ఆర్డర్ కాపీలను అందించగా, వారు విధుల్లో చేరి బాధ్యతలను తీసుకున్నారు. ఎస్జీటీల పోస్టుల నుంచి 87 మంది ఖాళీ సుమారు 50 పాఠశాలల్లో ఒకేఒక్కరు పీఎస్ పరిధిలో ఉపాధ్యాయుల కొరత -
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులనే పూజిద్దాం
జనగామ రూరల్: పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులనే పూజించాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని నెహ్రూ చౌక్ వద్ద మున్సిపాలిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రసాయనాలతో తయారు చేసిన ప్రతిమలతో నీటి కాలుష్యం పెరిగిపోతుందన్నారు. మట్టి ప్రతిమలను పూజించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. అలాగే ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ ఆర్మీ వింగ్ 10 బెటాలియన్ కెడెట్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఆర్యభట్టా పాఠశాలలో కరస్పాండెంట్ సురేష్ చంద్ర, ప్రిన్సిపాల్ సృజన ఆధ్వర్యంలో మట్టి వినాయకులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్న అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
తరిగొప్పుల: మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం మండలంలో ఆకస్మిక పర్యటన చేసి కేజీబీవీ, ఇందిరమ్మ ఇళ్లు, ఫర్టిలైజర్ షాపులను పరిశీలించారు. కేజీబీవీలో మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని ఎస్ఓ సునీతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయలు, పప్పు ధాన్యాలు పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇసుక, కంకర, ఇతర సామగ్రి నిర్ణీత ధరలో లబ్ధిదారులకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫర్టిలైజర్ షాపులోని స్టాక్ రిజిస్టర్లు పరిశీలించి యూరియా కొరత సృష్టిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మొగుళ్ల మహిపాల్రెడ్డి, ఎంపీడీఓ ఆలేటి దేవేందర్రెడ్డి, ఏఓ మనోహిత్ విక్రమరావు, ఎంపీఓ మాలతి, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి రఘునాథపల్లి: నా జెండా..ఎజెండా నియోజకవర్గ అభివృద్ధేనని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం మండలంలోని వివిధ గ్రామాలు, కాలనీల్లో రూ.4 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక నిధులు మంజూరు చేశారన్నారు. అవినీతి, అక్రమాలు చేయను.. నీతి నిజాయితీగా పని చేస్తానని, తనతో ఉన్న వారు ఎవరైనా అ న్యాయం చేస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమాల్లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, ఆర్డీఓ గోపిరామ్, డీఆర్డీఓ పీడీ వసంత, లింగాల జగదీష్చందర్రెడ్డి, బొల్లం అజయ్, శివకుమార్, రవిగౌడ్ పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించండి మహాప్రభో!
చెప్పులరిగేలా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాం..ఈ ఫొటోని మహిళ యశ్వంతాపూర్ గ్రామానికి చెందిన మారబోయిన చంద్రకళ. తన భర్త మల్ల య్య అనారోగ్యంతో మరణించాడని, తనకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని, ఇద్దరు ఆడపిల్లలను కూలీ పనులు చేసి పోషిస్తున్నానని, అంత్యోదయ కార్డు ఇప్పించి ఆదుకోవాలని కలెక్టర్ను వేడుకుంది. ● గ్రీవెన్స్లో బాధితుల గోడు ● సమస్యలు త్వరగా పరిష్కరిస్తాం.. ● కలెక్టర్ రిజ్వాన్ బాషా ● ప్రజావాణిలో 74 అర్జీలుజనగామ రూరల్: పట్టా పాస్ బుక్ కోసం ఏళ్ల తరబడి తిరుగుతున్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి ఆదుకోవాలని, అంత్యోదయ కార్డు మంజూరు చేయాలని, వేతనాలు రాక కుటుంబం గడవటం లేదని.. ఇలా పలు సమస్యలతో ప్రజలు సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్లోని ప్రజావాణికి వచ్చారు. సమస్యలు పరిష్కరించండి మహాప్రభో..అంటూ కలెక్టర్ను వేడుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు బెన్షాలోమ్, పింకేష్ కుమార్, జిల్లా అధికారులు ప్రజల నుంచి 74 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులు సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు గోపిరామ్, డీఎస్ వెంకన్న, డిప్యూటీ కలెక్టర్ కొమరయ్య, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఆరు నెలల నుంచి వేతనం లేదు..
పట్టణంలోని ఎస్సీ ఏ హాస్టల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఏడాది నుంచి పనిచేస్తున్న. ఆరు నెలల నుంచి వేతనం రాకపోవడంతో కుటుంబం గడవటం ఇబ్బందిగా ఉంది. కలెక్టర్ చొరవ తీసుకొని జిల్లాలోని 16 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనం ఇప్పించి ఆదుకోవాలి. – జి.నాగరాజు, అవుట్సోర్సింగ్ ఉద్యోగి అక్రమంగా పట్టా చేసుకున్నారు.. తన భర్త ఎండీ అబ్బాస్ పేరు మీద సర్వే నంబర్ 448లో 2.28 ఎకరాల భూమి ఉంది. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నాం. బతుకుదెరువు కోసం వేరే గ్రామానికి వెళ్తే మా బంధువులు ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా పట్టా చేసుకున్నారు. ఈ విషయమై పోలీస్స్టేషన్కు వెళ్లినా ప్రయోజనం లేదు. విచారణ చేపట్టి న్యాయం చేయాలి. – ఎండీ జెహేరా, తిడుగు -
అదనపు కలెక్టర్గా బాధ్యతల స్వీకరణ
జనగామ: జనగామ జిల్లా రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్గా బెన్షాలోమ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషాను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఓపీఎస్ అమలు చేయాలిజనగామ రూరల్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగమొల్ల దర్శన్గౌడ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆత్మగౌర సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్ విధానం ఉద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు. ఎన్నికల ముందు సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. సెప్టెంబర్ 1న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేపట్టిన ఉద్యోగుల ఆత్మగౌరవ సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగవెల్లి ఉపేందర్, ఉపాధ్యక్షులు మంగ నర్సింహులు, భిక్షం, చింతల రజిత, రామారావు, స్రవంతి, శేఖర్రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు. సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యంనర్మెట: ఉపాధి సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తేనే అభివృద్ధిలో పురోగతి సాధిస్తామని అదనపు అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో సోమవారం ఎంపీడీఓ బోడపాడి అరవింద్ చౌదరి అధ్యక్షతన 16వ సామాజిక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ మెటీరియల్, లేబర్ కాంపోనెంట్, మస్టర్ల నిర్వాహణలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కార్యదర్శులు సమన్వయ లోపం కనిపిస్తుందన్నారు. పనుల్లో నిర్లక్ష్యం, రికార్డుల నిర్వహణలో పారదర్శకత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఎం అంజి గౌడ్, ఎస్ఆర్పీ నరేందర్, క్యూ సి రాజవర్ధన్, ఏఈ ప్రదీప్, ఏపీఓ బిరుకూరి రమాదేవి, పంచాయతీ కార్యదర్శులు కందకట్ల శ్రీధర్, వంశీ, శ్రీకాంత్, ప్రశాంత్, రమేశ్, యాకూబ్, చలపతి, సురేష్, నరేష్ అనిల్, పవన్, సుజాత, కల్యాణ్, రిజ్వాన్, టీఏలు, ఎఫ్ఏలు పాల్గొన్నారు. అథ్లెటిక్స్లో యువకుడి ప్రతిభరఘునాథపల్లి: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో మండలంలోని వెల్లి గ్రామానికి చెందిన కళ్లెం నవీన్ ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అండర్ 20 పురుషుల విభాగం 400 మీటర్ల లాంగ్ జంప్లో నవీన్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ నెల 30, 31 తేదీల్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నవీన్ను గ్రామస్తులు అభినందించారు.రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలిజనగామ రూరల్: రేషన్ డీలర్ల సమస్యల పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మురళి అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు డీలర్లకు కమీషన్ రాకపోవడంతో ఇబ్బందులు ప డుతున్నారని, వెంటనే కమీషన్ విడుదల చే యాలన్నారు. కార్యక్రమంలో చెవ్వ శ్రీనివాస్, ఎడ్ల మల్లయ్య, రామగల్ల శ్రీను, దయాకర్, రాజయ్య, దేవస్వామి పాల్గొన్నారు. -
పాఠశాల ఆవరణలోనే ఎఫ్ఆర్ఎస్
జనగామ: ప్రభుత్వ పాఠశాలల్లో పారదర్శకత, క్రమశిక్షణను పెంపొందించేందుకు ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) ద్వారా హాజరు నమోదు విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. ఎఫ్ఆర్ఎస్ విధానంలో చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకునేందుకు గత 24 రోజుల పాటు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. ఈ సమయంలో టీచర్లు పాఠశాల ప్రాంగణానికి దూరంగా ఉన్నా.. ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ వేశారు. ఈ విధానం అమలు చేసే సమయంలో అన్ని పాఠశాల ఆవరణ (ప్రి మిసెస్)లో జీపీఎస్ సిస్టం ద్వారా అనుసంధానం చేశారు. ఈ నేపధ్యంలో సోమవారం నుంచి స్కూల్ ఆవరణలో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ వేయాలనే నిబంధనలు అమలు చేశారు. దీంతో టీచర్లు ఉరుకులు, పరుగులతో సమయంలోపు పాఠశాలకు చేరుకుని ఎఫ్ఆర్ఎస్ వేశారు. పాఠశాల ప్రాంగణంలోనే.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై స్కూల్ ప్రాంగణంలోనే ఎఫ్ఆర్ఎస్ విధానంలో హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉపాధ్యాయులు ఎక్కడైనా హాజరు నమోదు చేసుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు మాత్రం పాఠశాల పరిధిలో ఉన్నప్పుడే హాజరు నమోదవుతుంది. చిన్న చిన్న సాంకేతిక ఆటంకాలు తొలి రోజుల్లో సహజమే కానీ త్వరలోనే వాటిని అధిగమిస్తామని అధికారులు వెల్లడించారు. పలువురి ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్లు పెండింగ్ జిల్లాలో యూఆర్ఎస్ (గురుకులం), కేజీబీవీ, మో డల్, ప్రభుత్వ పాఠశాలలు 508 వరకు ఉన్నాయి. ఇందులో సుమారు 2,860 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పని చేస్తున్నారు. ఇప్పటి వ రకు 2,848 మంది టీచర్లు, సిబ్బంది ఎఫ్ఆర్ఎస్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోగా 12 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఉదయం 9 గంటలు, సాయంత్రం ఉన్నత, ప్రాథమికోన్నత 4.15, ప్రాథమిక 4 గంటల వరకు రోజుకు రెండు సార్లు యాప్లో అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో పలు చోట్ల సెల్ఫోన్ సిగ్నల్ మొరాయించడంతో అటెండెన్స్ పూర్తి చేసుకునేసరికే మొదటి పీరియడ్ పూర్తవుతుంది. సాయంత్రం కూడా అరగంట వరకు పాఠశాల ఆవరణలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సర్వర్ సామర్థ్యాన్ని పెంచి సిగ్నల్ సమస్య ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు. అమలులోకి వచ్చిన కొత్త నిబంధనలు జిల్లాలో 12 మంది టీచర్ల రిజిస్ట్రేషన్లు పెండింగ్ -
జనహిత పాదయాత్ర
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పరిధి ఇల్లంద మార్కెట్నుంచి మండలకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ వరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్లు జనహిత పాదయాత్ర నిర్వహించారు. వారి వెంట మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ శ్రేణులు నడిచారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. అనంతరం అంబేడ్కర్ సెంటర్లో జరిగిన కార్నర్ మీటింగ్లో ముఖ్యనేతలు ప్రసంగించారు. – సాక్షి, వరంగల్ -
నోటిఫికేషనే తరువాయి..
స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధంఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముగిసి దాదాపుగా రెండేళ్లు కావస్తోంది. దీనిపై ఇదివరకే ఈ సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు జ రిపించాలన్న హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. వీటంన్నిటిని దృష్టిలో పెట్టుకుని వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికార పార్టీ నేతలు, సీఎం నిర్ణయించినట్లు ప్రచారం. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం ఎటూ తేలకపోయినప్పటికీ.. పార్టీ పరంగా ఆ మేరకు అవకాశం కల్పించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు ఆ పార్టీ ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు చెబుతున్నారు. ఈ నెల 29న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలపై చర్చించి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, చీఫ్ సెక్రటరీల నుంచి ఆదేశాలు అందడంతో అందరూ అలర్ట్ అయ్యారు. ● సెప్టెంబర్ మొదటి వారంలో ప్రకటించే అవకాశం ● ‘స్థానిక’ంలో బీసీలకు 42 శాతం అవకాశం.. పార్టీ కేడర్కు కాంగ్రెస్ సంకేతాలు ● ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. ఆ తర్వాతే సర్పంచ్, ‘ఫ్యాక్స్’ల ఎన్నికలు ● ఉమ్మడి జిల్లాలో 6 జెడ్పీలు, 75 జెడ్పీటీసీ స్థానాలు.. ● జిల్లా కలెక్టర్లకూ సీఎస్ సమాచారం.. సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి వేళయ్యిందా..? రిజర్వేషన్లు తేలకున్నా ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతోందా..? ఈ మేరకు పార్టీ కేడర్, నాయకులకు సంకేతాలు అందాయా..? పీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడనుందా?.. జిల్లా ఉన్నతాధికారులను కూడా అప్రమత్తం చేశారా?... అంటే నిజమే అంటున్నాయి అధికార పార్టీ, అధికార వర్గాలు. నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని సోమవారం కూడా జిల్లా కలెక్టర్లకు మౌఖికాదేశాలు అందాయన్న ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్లోనే నోటిఫికేషన్..?.. ఈ దిశగానే కసరత్తు... -
ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
జనగామ: అన్ని శాఖల అధికారుల సమన్వయంతో గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టర్ సమావేశం హాలులో అదనపు కలెక్టర్లు బెన్షాలోమ్, పింకేష్కుమార్, డీసీపీ రాజ మహేంద్రనాయక్తో కలిసి సబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 27 నుంచి సెప్టెంబర్ 6వ తే దీ వరకు ఉత్సవాలు జరగనున్నాయని, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు సంబంధిత అధికారులతో సమావేశాలు ఏర్పాటు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించాలన్నారు. నిమజ్జనం చేసే చెరువుల వద్ద రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షణలో పటిష్టమైన భారీగేడ్లు, క్రేన్లు, నిరంతర విద్యుత్ సరఫరాకు ఎన్పీడీసీఎల్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ, నిమజ్జన ప్రాంతంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 20 మంది గజ ఈతగాళ్లతో పాటు పోలీసు భద్రత ఉండాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. మండపాల నిర్వాహకులు ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీఓలు గోపీరామ్, డీఎస్ వెంకన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొమరయ్య, డీపీఓ నాగపురి స్వరూప, ఏసీపీ భీమ్శర్మ, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు. మట్టి వినాయకులను పూజిద్దాంవినాయక చవితి పండుగ రోజు మట్టి ప్రతిమలను పూజించి, పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సునీత ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ మానస, జిల్లా బీసీ సంక్షేమాధికారి రవీందర్, డీపీఓ స్వరూప, ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, ఎస్డీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొమురయ్య తదితరులు ఉన్నారు. మండపాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా -
యూరియా కోసం తిప్పలు
స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్, చిల్పూరు మండలాలకు చెందిన రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి, రెండు బస్తాల కోసం స్థానిక పీఏసీఎస్ల వద్ద గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది. స్టేషన్ఘన్పూర్ పీఏసీఎస్ కార్యాలయానికి శనివారం 555 బస్తాలు యూరియా రాగా ఆదివారం 293 బస్తాలను పంపిణీ చేశారు. మిగిలిన 262 బస్తాలను సోమవారం పంపిణీ చేస్తారని తెలుసుకున్న రైతులు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పీఏసీఎస్ వద్దకు చేరుకున్నారు. దీంతో రైతుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న ఎస్సై వినయ్కుమార్, ఏఓ చంద్రన్కుమార్ పీఏసీఎస్ వద్దకు చేరుకుని రైతులకు సర్దిచెప్పారు. యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలి
హన్మకొండ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్ధల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చేపట్టనున్న సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని ఆ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు బుట్టి శ్యాం యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని సంఘం కార్యాలయంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రంజిత్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిందన్నారు. బీసీలకు రిజర్వేషన్ల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న బిల్లును ఆమోదం తెలిపేలా ఒత్తిడి పెంచాలన్నారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ముందుకు వెళ్తే యుద్ధం చేస్తామన్నారు. సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్య, నాయకులు బాబు యాదవ్, సౌగాని శ్రీనివాస్, బగ్గీ రాజు, సనత్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన టేబుల్ టెన్నిస్ పోటీలు
హసన్పర్తి: నగరంలోని కిట్స్ ఇంజనీరింగ్ కశాశాల ఇండోర్ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. టేబుల్ టెన్నిస్ వెటరన్ క్రీడాకారుడు రమేశ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ క్రీడలతో క్రమశిక్షణ, స్నేహభావం పెంపొందుతుందన్నారు. అనంతరం విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరీశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కిట్స్ కళాశాల ఏఓ డాక్టర్ రమేశ్రెడ్డి, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ మోహన్రావు, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్లు డాక్టర్ జైసింగ్ అజ్మీరా, సునీల్కుమార్, కార్యనిర్వాహక సభ్యులు రవికుమార్, వెంకటస్వామి, మహేశ్, డాక్టర్ ప్రభాకరాచారి తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో ‘పనుల జాతర’
ఊరూరా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలుజనగామ రూరల్: గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి, నిరుపేద కూలీల కుటుంబాలకు జీవనోపాధి పెంచేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. శాఖల సమన్వయంతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఒకేసారి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పూర్తయిన పనులను ప్రారంభించాలని నిర్ణయించింది. ‘పనుల జాతర–2025’ పేరుతో నిర్వహించే కార్యక్రమానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో జిల్లాలోని 12 మండలాల పరిధి 283 గ్రామాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం 278 పనులకు రూ.1.35 కోట్లు కేటాయించారు. ‘ఉపాధి’కి కొత్తరూపం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేదలకు ఉపాధి కల్పనకే కాకుండా శాశ్వత ఆస్తులను సృష్టించేందుకు దోహదపడనుంది. ఈ మేరకు పనుల జాతర కార్యక్రమం ద్వారా వేలాది మందికి పని కల్పించడం సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో వ్యక్తిగత, సామూహిక ఆస్తుల కల్పన పనులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపు తీసుకురానున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ‘పనుల జాతర’లో భాగంగా పూర్తయిన పనులు ప్రారంభోత్సవం, చేయాల్సిన పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇందులో గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాలకు ప్రాధాన్యం కల్పించనున్నారు. స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ) ద్వారా నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ను ప్రారంభిస్తారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు ‘జలనిధి’ పథకం ద్వారా చేపట్టనున్న పనులకు కూడా భూమిపూజ చేస్తారు. అలాగే పశువుల కొట్టాలు, కోళ్లు, గొర్రెల షెడ్లు, ఎరువుల తయారీ కేంద్రాలు తదితర వాటిని నిర్మించనున్నారు. నిస్వార్థ సేవకులకు సన్మానం సామూహికంగా చేపట్టే ఈ కార్యక్రమం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా, గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధి కూలీలు, దివ్యాంగులు, పారిశుద్ధ్య కార్మికులు, హరిత సంరక్షకులను అధికారులు సన్మానించనున్నారు. ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు పాల్గొనేలా షెడ్యూల్ రూపొందించారు. జీపీ, అంగన్వాడీ భవనాలకు ప్రాధాన్యం జిల్లాలో 278 పనులకు రూ.1.35కోట్లు కేటాయింపుసమన్వయంతో పనిచేయాలి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా అమలు చేస్తున్న పనుల జాతర కార్యక్రమాన్నిర అధికారులు సమన్వయంతో పని చేసి లక్ష్యాలు పూర్తి చేయాలి. ఆయా గ్రామాల్లో చేపట్టే పనులు ప్రణాళిక ప్రకారం లక్ష్యాలు నిర్ధేశించుకొని పనులు చేపట్టాలి. అంగన్వాడీలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలి. – రిజ్వాన్ బాషా, కలెక్టర్ -
కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు
● సెప్టెంబర్ నుంచి ఆరు స్పెషల్ ట్రైన్ సర్వీస్లు కాజీపేట రూరల్ : ప్రయాణికుల సౌకరార్థ్యం దీపావళి, ఛాత్, విజయదశమి పండుగల సందర్భంగా కాజీపేట జంక్షన్, వరంగల్ మీదుగా సంత్రగచ్చి–చర్లపల్లి మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ ఆదివారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు సంత్రగచ్చి–చర్లపల్లి (08845) ఎక్స్ప్రెస్ ప్రతీ శుక్రవారం సంత్రగచ్చిలో బయలుదేరి శనివారం కాజీపేట జంక్షన్కు చేరుకుంటుంది. అదేవిధంగా సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు చర్లపల్లి–సంత్రగచ్చి (08846) ఎక్స్ప్రెస్ ప్రతీ శనివారం కాజీపేట జంక్షన్కు చేరుకుంటుంది. ఈ రైళ్ల సర్వీస్లకు అప్అండ్డౌన్ రూట్లో ఖరగ్పూర్, బాలాసోర్, బద్రఖ్, కటక్, భువనేశ్వర్, ఖుర్ధ రోడ్, బెరహంపూర్, విజయనగరం, సింహాచలం, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, రాయన్పాడ్, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. రైలు నుంచి జారి పడి యువకుడి దుర్మరణం ఖిలా వరంగల్: రైలు నుంచి జారి పడి ఓ యు వకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన నె క్కొండ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ జి. సుదర్శన్ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని గోండియా జిల్లా సదక్ అర్జనీ గ్రామానికి చెందిన రామేశ్వర శ్రీరామజీ బోయర్(28) ఆదివారం ఉదయం గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఆధార్, ఓటర్ కార్డుల ఆధారంగా మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి భద్ర పర్చినట్లు ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిఎస్ఎస్తాడ్వాయి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన శనివారం రాత్రి వెంగ్లాపూర్ గ్రామంలో జరిగింది. తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డి కథనం ప్రకారం... వెంగ్లాపూర్ గ్రామానికి చెందిన ఆలెం సురేశ్ (40) కుమార్తె లాస్య ఆరోగ్యం బాగా లేకపోవడంతో ములుగు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. వెంగ్లాపూర్ దాటిన తర్వాత ఐకేపీ సెంటర్ వద్ద రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈఘటనలో సురేశ్కు బలమైన గాయాలు, కుమార్తె లాస్యకు స్వల్ప గాయాలయ్యాయి. 108లో ములుగు ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యాధికారి పరీక్షించి సురేశ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆదివారం మృతుడి తల్లి ఎర్రక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్రెడ్డి తెలిపారు. మహిళను బెదిరించిన వ్యక్తిపై కేసు గీసుకొండ : గీసుకొండ మండలం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు(కేఎంటీపీ) వద్ద ఓ మహిళను బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు అయ్యింది. పోలీసుల కథనం ప్రకారం.. సంగెం మండలం చింతలపల్లి తండాకు చెందిన ఆంగోత్ కమల కేఎంటీపీలో హోటల్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో శనివారం రఫీక్ అనే డ్రైవర్ హోటల్లో టీ తాగిన అనంతరం చిట్టీపై తన ఫోన్ నంబర్ రాసి అందులో డబ్బులు పెట్టి ఆమెకు ఇచ్చాడు. ఇలా ఎందుకు ఇచ్చావని కమల ప్రశ్నించగా ఆమెను దుర్బాషలాడుతూ చంపుతానని బెదిరించాడు. దీంతో సదరు మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గీసుకొండ సీఐ మహేందర్ ఆదివారం తెలిపారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
రెబ్బెన: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్షిప్లో కొనసాగుతున్న 71వ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ముగిశాయి. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆదిలా బాద్ మహిళ జట్టు విజేతగా నిలువగా పురుషుల వి భాగంలో వరంగల్ జిల్లా జట్టు విజయకేతనం ఎగురేసింది. సెమీఫైనల్తోపాటు ఫైనల్ పోటీలు నిర్వహించగా క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. ఫైనల్లో ఆదిలాబాద్ జిల్లా మహిళల జట్టు వరంగల్ జట్టుతో తలపడింది. పురుషుల విభాగంలో వరంగల్ జిల్లా క్రీడాకారులు రంగారెడ్డి జిల్లాతో తలపడ్డారు. పోటీలతో స్నేహభావం.. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల నిర్వహణతో వివిధ జిల్లాల క్రీడాకారుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తిరుపతి, బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్రెడ్డి, ఎస్వోటూజీఎం రాజమల్లు, బాల్బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి, ప్రధానకార్యదర్శి రఘునాథ్రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు రాజయ్య తదితరులు పాల్గొన్నారు. చాంపియన్గా ఆదిలాబాద్, వరంగల్ జట్లు -
కాజీపేట రైల్వేడిపోకు పూర్వ వైభవం
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లోని రన్నింగ్ డిపోకు త్వరలో పూర్వ వైభవం రానుంది. ఐదేళ్ల క్రితం వెలవెలబోయిన కాజీపేట జంక్షన్కు మహర్దశ పట్టనుంది. ఇటీవల సికింద్రాబాద్లో జరిగిన రన్నింగ్స్టాఫ్ రివ్యూలో రైల్వే అధికారులు కాజీపేట రన్నింగ్ డిపోను దృష్టిలో పెట్టుకొని దసరా కానుకగా కొత్తగా పోస్టులు ప్రకటించారు. 90 గూడ్స్ అసిస్టెంట్ లోకో పైలెట్లు, 90 అసిస్టెంట్ లోకో పైలెట్లు, 10 ప్యాసింజర్ అసిస్టెంట్ లోకో పైలెట్లను కలుపుకొని కొత్తగా 190 పోస్టులను అధికారులు అలాట్మెంట్ చేసినట్లు రైల్వే ట్రేడ్ యూనియన్ నాయకులు ఆదివారం తెలిపారు. గతంలో కాజీపేట జంక్షన్ నుంచి డోర్నకల్, విజయవాడ రైల్వే డిపోలకు రైల్వే క్రూ లింక్లు, లోకోపైలెట్లను తరలించి ప్రాధాన్యతను తగ్గించారని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్త పోస్టులతో ఆ సమస్య లేకుండా పోయిందని వివరించారు. కాజీపేట నుంచి క్రూ లింక్లను తరలించి ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయవద్దని గతంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, రైల్వే నాయకులు రైల్వే జీఎం, డీఆర్ఎంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో నాటి రైల్వే జీఎం కాజీపేటకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కాజీపేటకు అలాట్ చేసిన కొత్త పోస్టులతో మొత్తం కాజీపేట రైల్వే రన్నింగ్ డిపో 720 మంది స్టాఫ్తో సికింద్రాబాద్ డివిజన్లో పెద్ద డిపోగా మారనుంది. బెల్లంపల్లి, డోర్నకల్తోపాటు ఇతర రైల్వే డిపోల్లో పనిచేస్తూ కాజీపేటకు రెక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్న వారు ఇక్కడికి బదిలీపై వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కాజీపేట రైల్వే డిపోపై ప్రత్యేక శ్రద్ధ.. వయా కరీంనగర్ మీదుగా భీమవరం–నాందేడ్కు సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఎక్స్ప్రెస్ రైలుకు కాజీపేట రైల్వే డిపోకు చెందిన క్రూ వారే (లోకోపైలెట్, అసిస్టెంట్ లోకోపైలెట్, ట్రైయిన్మేనేజర్–గార్డు) పనిచేసే అవకాశం ఉందని, అప్ అండ్ డౌన్ రూట్లో ఈ రైలుకు ఆరుగురు రన్నింగ్ స్టాఫ్ పనిచేస్తారని రైల్వే నాయకులు తెలిపారు. భవిష్యత్లో కరీంనగర్ మీదుగా నిజమాబాద్, నాందేడ్ వరకు ఎక్కువ రైళ్లను ప్రవేశపెట్టి నడిపించే క్రమంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కాజీపేట రైల్వే డిపోపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని పేర్కొన్నారు. రైల్వే నాయకుల హర్షం.. కాజీపేట రైల్వే డిపోకు కొత్తగా సికింద్రాబాద్ రైల్వే అధికారులు 190 ఎల్పీ, ఏఎల్పీల పోస్టులను మంజూరు చేసినందుకు కాజీపేట రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ లోకో రన్నింగ్ బ్రాంచ్ చైర్మన్ పాక రాజ్కుమార్, కాజీపేట రైల్వే మజ్దూర్ యనియన్ లోకోరన్నింగ్ బ్రాంచ్ సెక్రటరీ పి.సాయికుమార్ హర్షం వ్యక్తం చేశారు. దసరా కానుకగా కొత్త పోస్టులు ఇండెంట్ 190 ఎల్పీ, ఏఎల్పీ పోస్టులకు గ్రీన్సిగ్నల్ రన్నింగ్ స్టాఫ్ క్రూ రివ్యూలో నిర్ణయం ఫలించిన ఎంపీ, ఎమ్మెల్యే, రైల్వే నాయకుల కృషి -
ఉపాధ్యాయుడు రాజేందర్పై క్రిమినల్ కేసు
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జి ల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల సై న్స్ ఉపాధ్యాయుడు పెండ్యాల రాజేందర్పై క్రిమి నల్ కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ రాహుల్శర్మ ప్రకటనలో తెలిపారు. రాజేందర్ మూడు రోజుల క్రితం పాఠశాలలో విద్యార్థులు తాగే ఆర్వో ప్లాంట్లో క్రిమిసంహారక మందు కలిపినట్లు నిర్ధారించా మని పేర్కొన్నారు. ఎంఈఓ దేవానాయక్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేట్టారు. ఇందులో ప్రస్తుత ప్రత్యేకాధికారి వెంకటనర్సయ్యపై వ్యక్తిగత విభేదాల కారణంగా పాఠశాల ప్రతిష్ఠను దెబ్బతీసేలా రాజేందర్ కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. కుట్రలో భాగంగా ఈ నెల 21వ తేదీన రాత్రి తాగునీటి ట్యాంకులో హానికర పురుగులమందు కలిపినట్లు విద్యార్థులు గమనించి పోలీసులకు తెలిపారన్నారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి రాజేందర్ తాగునీటిలో విషం కలిపారని నిర్ధారించినట్లు తెలిపారన్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.. తాగునీటిలో క్రిమిసంహారక మందు కలిపిన ఘట నలో ఉపాధ్యాయుడు రాజేందర్ను అరెస్ట్ చేసినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఈ తరహా దారుణ చర్యలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేలేదన్నారు. ఈ కేసులో ఇతరుల ప్రమేయం ఉందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని, దర్యాపు పూర్తి స్థాయిలో కొనసాగుతోందన్నారు. సమావేశంలో సీఐ నరేశ్కుమార్, ఎస్సై సాంబమూర్తి పాల్గొన్నారు. -
పొలం గట్లే పిల్లలకు దారి..
మంచ్యతండా ప్రాథమిక పాఠశాల భవనంపొలం గట్లపై నడుస్తున్న పాఠశాల విద్యార్థులుమరిపెడ రూరల్: మారుమూల పల్లెలు, గిరిజన తండాల్లోని పలు పాఠశాలలు పొలాల మధ్య ఉండడంతో సరైన రహదారులు లేవు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు తిప్పలు తప్పడంలేదు. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబా బాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామ పంచాయ తీ పరిధిలోని మంచ్యతండాలో 20 ఏళ్ల క్రితం పొలాల మధ్య పాఠశాల ఏర్పాటు చేశారు. అందులోనే అంగన్వాడీ కేంద్రంతోపాటు పాఠశాల నిర్వహణ కొనసాగుతోంది. అంగన్వాడీ కేంద్రంలో 10 మంది చిన్నారులు, ప్రాథమిక పాఠశాలలో 20 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా, గదిలో ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు బోధిస్తుండగా.. వరండాలో అంగన్వాడీ పిల్లల ఆలనా పాలన చూస్తున్నారు. కాగా దారి లేకపోవడంతో విద్యార్థులు, చిన్నారులు పొలం గట్ల మీదుగా పాఠశాలకు వెళ్లి, అదే గట్లపై మళ్లీ సాయంత్రం ఇంటికి వస్తున్నారు. ఉపాధ్యాయులు సైతం తమ ద్విచక్రవాహనాలను రోడ్డుపై నిలిపి, గట్ల వెంబడి పాఠశాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో పొలం గట్లు తడిసిపోయి పిల్లలు జారి కింద పడిపోతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలకు తక్షణమే అదనపు గదులతో పాటు, రహదారిని ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, మంచ్యతండా వాసులు కోరుతున్నారు. రహదారి లేని మంచ్యతండా పాఠశాల ఇరుకు గదిలోనే 30 మంది విద్యార్థులకు బోధన పట్టించుకోని విద్యాశాఖ అధికారులు -
గూడ్స్షెడ్కు భారీగా ఎరువులు
ఖిలా వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్ గూడ్స్షెడ్కు ఆదివారం కోరమండల్ కంపెనీకి చెందిన ఎరువులు భారీగా వచ్చాయి. 20:20:0:13 రకం 1844 మెట్రిక్ టన్నులు, 15:15:15 రకం 526 మెట్రిక్ టన్నులు, 16:20:0:13 రకం 319 మెట్రిక్ టన్నులు చేరాయి. కోరమండల్ ఎరువులను రికార్డుల ప్రకారం వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్రెడ్డి పరిశీలించారు. కలెక్టర్ సత్యశారద, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ ఆదేశాల ప్రకారం కోరమండల్ ఎరువులను నిబంధనల ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పీఏసీఎస్ గోదాంలు, ఫర్టిలైజర్ షాపులకు పంపించనున్నట్లు వ్యవసాయ అధికారి రవీందర్రెడ్డి తెలిపారు. అలాగే, సోమవారం ఆర్సీఎఫ్ కంపెనీకి చెందిన 1,319.12 మెట్రిక్ టన్నుల యూరియా నగరానికి రానుందని, దీంతో ఉమ్మడి జిల్లా రైతుల యూరియా కష్టాలు తీరనున్నాయని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ పేర్కొన్నారు. -
ఆర్ట్స్ కళాశాల డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల ఫలితాల విడుదల
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్)లో బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ మొదటి, రెండు, ఐదో (బ్యాక్లాగ్) సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఆదివారం ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 1,014మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 355మంది (35శాతం)ఉత్తీర్ణులయ్యారని ప్రిన్సిపాల్ జ్యోతి తెలిపారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, ఆ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి సుధీర్, అధ్యాపకులు గిరిప్రసాద్, శ్రీదేవి, నహిదాపర్వీన్, జితేందర్,రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో తీజ్ ఉత్సవాలు
జనగామ : జనగామ జిల్లాలో తీజ్ ఉత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సేవాలాల్ మహరాజ్కు గిరిజనులు ప్రత్యేక పూజలు చేశారు. తండాలతో పాటు జనగామ పట్టణంలో తీజ్ వేడుకలు అంబరాన్నంటాయి. సంప్రదాయ నృత్యాలతో బంజారా మహిళలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహిళలు, యువకులు, చిన్నారులంతా పాల్గొని తీజ్ పండుగను వైభవంగా నిర్వహించారు. పట్టణంలో శోభాయాత్ర జనగామ పట్టణంలో స్థానిక బంజారాలు తీజ్ ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ మహరాజ్, మేరమా యాడి, జగదాంబ మాత ఆశీస్సులతో మొదలైన ఉత్సవాల్లో బంజారా పెద్దలు, యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తరతరాలుగా బంజారాలు అడవి జీవన విధానంలో అలవాటు పడి, ప్రకృతినే ఆరాధిస్తూ జీవనం సాగిస్తున్నారని పెద్దలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సకల సంపదల మూలమే ప్రకృతి అని చాటి చెప్పే ఈ తీజ్ పండుగ బంజారాల ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. పెళ్లి కాని అమ్మాయిలు తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో తీజ్ వేడుకలను ఆచరిస్తూ, తండావాసుల సంక్షేమం కోసం, చక్కటి వరుడు దొరకాలని దేవుడిని కోరుకనే పండుగ తీజ్ అని పేర్కొన్నారు. వేడుకలో చివరి రోజు సుమారు ఐదు వందల మంది బంజారాలు పాల్గొని పట్టణంలో భారీ శోభాయాత్రను నిర్వహించారు. అనంతరం తీజ్ బుట్టలను భక్తిశ్రద్ధలతో చెరువులో నిమజ్జనం చేశారు. మాజీ కౌన్సిలర్ వాంకుడోత్ అనిత, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, వంశీ, లాలమ్మ, రవి, కిషన్న్, డాక్టర్ బాలాజీ స్వప్నరాథోడ్, ప్రదీప్, శంకర్, డాక్టర్ రఘు, దేవి, మంజుల, పద్మ, విజయ, లలిత పాల్గొన్నారు. పెద్ద ఎత్తున శోభాయాత్ర ఆధ్యాత్మిక వాతావరణంలో తీజ్ బుట్టల నిమజ్జనం -
ఘనంగా స్తంభం పాకుడు
స్టేషన్ఘన్పూర్ : మండలంలోని ఇప్పగూడెంలో కృష్ణాష్టమి తొమ్మిదో రోజున ప్రతీ ఏటా నిర్వహించే స్తంభం పాకుడు వేడుకలను ఆదివారం వేణుగోపాలస్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ కచేరి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇనుప పైప్ స్తంభం పాకే కార్యక్రమాన్ని నిర్వహించగా యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. వెంకటేష్ అనే యువకుడు స్తంభంపై వరకు పాకి విజేతగా నిలువగా అందరూ అభినందించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు దామెర వేణు, జూలుకుంట్ల ప్రకాశ్రెడ్డి, దార్న శ్రీధర్, పోకల చందర్, రామజ్యోతి, శ్రీను, నరేష్, రాజు, శ్రీను, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
సొసైటీ భూములపై సీఎం చొరవ చూపాలి
● టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఖాజా షరీఫ్ జనగామ: భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ భూములకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి చొరవ చూపించాలని జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు ఖాజా షరీఫ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన దీక్షకు జిల్లా ఉంచి టీఎన్జీఓ నాయకులు తరలి వెళ్లారు. జూబ్లీహిల్స్ గోపాల్పూర్లోని సర్వే 142 ఎకరాల భూమిని భాగ్యనగర్ హౌసింగ్ సోసైటీ ఉద్యోగులకు గత ప్రభుత్వం కేటాయించిందని, సీఎం ప్రత్యేక దృష్టి సారించి సొసైటీ సభ్యులకు స్థలాలను ఇప్పించాలన్నారు. ఆయన వెంట జిల్లా కార్యదర్శి పెండెల శ్రీనివాస్, పేర్వారం ప్రభాకర్, ఎండీ హఫీజ్, నాగార్జున తదితరులు ఉన్నారు. -
ఎస్జీటీలకు ఎస్ఏలుగా పదోన్నతి
జనగామ: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ)కు పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుంది. స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పదోన్నతుల కోసం జిల్లా విద్యాశాఖ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసి, నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నారు. సీనియార్టీ ప్రకారం జిల్లాలో 172 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉండగా, 88 మందికి పదోన్నతి లభించనుంది. ఇందుకు సంబంధించి నేడు వెబ్ఆప్షన్లు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేయగా, 26న ప్రమోషన్ ఆర్డర్లు విడుదల చేయనున్నారు. గతంలోనే సీనియార్టీ కలిగిన 20 మంది స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్ మాస్టర్లుగా పదోన్నతి పొందిన నేపథ్యంలో, మిగిలిన ఖాళీలను ఎస్జీటీలతో భర్తీ చేస్తున్నారు. డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. డీఈఓజనగామ. కామ్లో పదోన్నతుల జాబితాను అప్లోడ్ చేశారు. ఈ జాబితాలో ఉన్న మొబైల్ నంబర్ను పదోన్నతి పొందనున్న టీచర్లు ధ్రువీకరించడంతో పాటు రిజిస్టర్ ఫోన్ నంబర్కు వచ్చే ఓటీపీతో వెబ్ ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. మొబైల్ నంబర్తో తప్పుగా ఉంటే వెంటనే సరి చేసుకోవాలని డీఈఓ ఆదేశించారు. పదోన్నతుల తర్వాత విద్యాశాఖలో ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది. సబ్జెక్టుల వారీగా పదోన్నతి పొందుతున్న ఎస్టీటీలు పీఎస్ హెచ్ఎం 22, బయాలజీ 15, సోషల్ 24, గణితం 6, ఫిజిక్స్ 5, ఇంగ్లిష్ 9, తెలుగు 1, హిందీ 2, ఫిజికల్ డైరెక్టర్ 1, స్పెషల్ ఎడ్యుకేషన్ 3 ఎస్జీటీలు పదోన్నతి పొందనున్నారు. 172 ఖాళీలు.. 88 మందికి పదోన్నతులు నేడు వెబ్ ఆప్షన్లు.. రేపు ఆర్డర్ కాపీలు -
జోరుగా విగ్రహాల విక్రయాలు
● రూ.2 వేల నుంచి రూ.20వేల వరకు.. జనగామ: జిల్లాలో వినాయక విగ్రహాల విక్రయాలు ఊపందుకుంది. ఈ నెల 27 నుంచి వినాయక చవితి పండగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంతో పాటు స్టేషన్ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో విగ్రహాల అమ్మకాలు జోరందుకున్నాయి. రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన కుటుంబాలు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని 2వేల వినాయక ప్రతిమలను తయారు చేసి అమ్మకాలు చేస్తున్నారు. ఇక్కడ తయారైన విగ్రహాలు సూర్యాపేట, సిద్దిపేట, నల్లగొండ, చేర్యాలతో పాటు జిల్లాలోని ఆయా మండలాలకు సప్లయ్ చేస్తున్నారు. పలువురు వ్యాపారులు హైదరాబాద్ నుంచి హాల్సేల్గా మరో 2వేల విగ్రహాలు కొనుగోలు చేసి, ఇక్కడ రిటేయిల్గా అమ్మకాలు చేస్తున్నారు. అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విగ్రహాల అమ్మకాల నిర్వాహకులు కొంత ఆందోళనలో ఉన్నారు. భక్తిని పెంపొందించే డిజైన్లలో.. వినాయక ప్రతిమలను చూడగానే భక్తిని పెంపొందించే విధంగా వివిధ దేవతామూర్తులతో కలిసి ఉండి ఆకట్టుకునే గణపతులను తయారు చేశారు. సుమారు 10 ఫీట్ల ఎత్తులో విభిన్న రూ పాల్లో ఉన్న విగ్రహాలు రూ.2వేల నుంచి రూ.20 వేల వరకు ధర పలుకుతున్నాయి. -
గోదావరి జలాలు తీసుకొస్తా
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి వేలేరు: వచ్చే యాసంగి నాటికి పైప్లైన్ పనులు పూర్తి చేసి గండిరామారం రిజర్వాయర్ నుంచి వేలేరు మండలానికి గోదావరి జలాలు తీసుకొచ్చి మండలంలోని రైతులకు సాగునీరందిస్తానని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం మండలంలోని మల్లికుదుర్ల, సోడాషపల్లి, పీచర, శాలపల్లి, లోక్యాతండా, వేలేరు గ్రామాల్లో పనుల జాతర–25 కార్యక్రమంలో భాగంగా రూ.3 కోట్ల 69 లక్షల 35 వేల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈసందర్భంగా వేలేరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండలానికి సంబంధించిన ఎంపీడీఓ కార్యాలయ నిర్మాణానికి మరో రూ.2.50 కోట్లు నిధులు పెంచి ఇవ్వాలని ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఓ వ్యక్తి పాలనను గాలికి వదిలి పదవిని అడ్డం పెట్టుకుని పదవులు, పనులు, పథకాలు అమ్ముకుని అక్రమంగా సంపాదించాడని విమర్శించారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వేలేరు మండలం మల్లికుదుర్లలోని ఎస్సీ కాలనీలో రూ.25 లక్షలు, సోడాషపల్లిలో రూ.25 లక్షలు, పీచరలో రూ.33.20 లక్షలు, శాలపల్లిలో రూ.16.60 లక్షలు, వేలేరులో రూ.45.55 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. శాలపల్లిలో రూ.12 లక్షలు, లోక్యాతండాలో రూ.12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. లోక్యాతండా నుంచి పీచర వరకు రూ.2 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, పీఆర్ ఈఈ ఆత్మరామ్, అగ్రికల్చర్ ఏడీ ఆదిరెడ్డి, డీడబ్యూఓ జయంతి, తహసీల్దార్ కోమి, ఎంపీడీఓ లక్ష్మీప్రసన్న, పీఆర్ డీఈ శిరీష, పీఆర్ఏఈ రూపావతి, ఏఓ కవిత, ఎంపీఓ భాస్కర్, మాజీ ఎంపీపీ సమ్మిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కత్తి సంపత్, నాయకులు మల్లికార్జున్, బిల్లా యాదగిరి, సద్దాం హుస్సేన్, సమ్మయ్య, రాజిరెడ్డి, ప్రమోద్రెడ్డి, లక్ష్మణ్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మట్టి గణపతులకే జై
సహజసిద్ధమైన ప్రకృతి ఒడిలో రసాయనాల కాలుష్యం రోజురోజుకు ఎక్కువ అవుతుంది. ప్లాస్టిక్ వ్యర్ధాలు, ప్రమాదకర వాయువులతో పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నాయి. వినాయక చవితి అంటే ప్రతీ ఇంటా బొజ్జ గణపయ్య ప్రతిమలు ప్రతిష్ఠించడం ఆనవాయితీ. పూర్వకాలంలో మట్టి విగ్రహాలనే ఎక్కువగా పూజించేవారు. ఆధునిక పోకడలు పెరిగిపోవడం, రంగులను చూసి ఆకర్షణకు గురవుతూ, ఆర్భాటాలకు వెళ్తూ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు. భవిష్యత్ తరాలను ఆలోచిస్తున్న పర్యావరణ వేత్తలు మట్టి విగ్రహాల ఆవశ్యకతను తెలియజేస్తూ, అటు తయారీదారులు, మరోవైపు ప్రజలను చై తన్య పరిచేవిధంగా ప్రయత్నిస్తున్నారు. మరో రెండురోజుల్లో వినాయక చవితి పండుగ నేపధ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – జనగామ మట్టి ముద్దలకు మనోహర రూపాలు ● ఏటా పెరుగుతున్న మట్టి వినాయక విగ్రహాలు ● పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, వాసవీ కన్యకాపరమేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ ● ఐదు వేలకుపైగా విగ్రహాల తయారీఎస్పీఆర్ స్కూల్లో మట్టి విగ్రహాలను తయారు చేస్తున్న విద్యార్థులుచెరువు మట్టితో మనోహర రూపాన్ని.. -
విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి
● అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ రఘునాథపల్లి: విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్కుమార్ తెలిపారు. శనివారం మండలంలోని ఖిలాషాపూర్ జెడ్పీ పాఠశాలను పరిశీలించి తాగునీరు, కొత్త బోరు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్ల మరమ్మతు, వాలీబాల్ గ్రౌండ్, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. తరగతి గదులను పరిశీలించి కంప్యూటర్, సైన్స్ ల్యాబ్లను ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. అలాగే ప్రాథమిక పాఠశాలను సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రఘునాథపల్లిలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేసి సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, ఏఎంఓ శ్రీనివాస్, ఏడీ మూర్తి, సీఎంఓ నాగరాజు, ఎంఈఓ రఘుందన్రెడ్డి, ఏఈ భరత్, హెచ్ఎంలు భారత రవీందర్, యాదవరెడ్డి, పంచాయతీ కార్యదర్శి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
అనుమానం వస్తే తనిఖీ చేస్తున్నాం..
అర్ధరాత్రి యువత బర్త్డేలు చేసుకొని రోడ్లపై అరవడం, డ్యాన్సులు చేయడం చేస్తున్నారు. వీరిని వారిస్తే వాగ్వాదానికి దిగుతున్నారు. బస్టాండ్, చౌరస్తా వంటి ప్రాంతాల్లో మాకు ఏమాత్రం అనుమానం వచ్చిన వారి ఫింగర్ ప్రింట్ తీసుకుని పాత నేరస్తులు అయితే ప్రశ్నించి ఆ సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. రాత్రి పూట విధులు కొంత కష్టమైనప్పటికీ పోలీస్శాఖలోకి వచ్చినం కాబట్టి సంతోషంగా నిర్వహిస్తున్నాం. – ఎం.వినూష, కానిస్టేబుల్ క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తున్నాం.. పోలీస్శాఖలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నా. రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహించడం, అనుమానితులను చెక్ చేయడం వంటివి చేస్తున్నా. నూతనంగా పొలీస్ శాఖలో వచ్చిన మహిళా కానిస్టేబుళ్లకు రాత్రిపూట ధైర్యంగా విధులు ఏవిధంగా నిర్వహించాలో క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తున్నా. వారు ఎంతో బాగా నేర్చుకుంటున్నారు. – తాండ్ర కమల ఏఎస్సై, హనుమకొండ -
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మనదే
● రాష్ట్ర మంత్రులు లక్ష్మణ్, సీతక్క ● జనహిత పాదయాత్రపై సమీక్ష ఈ నెల 25, 26 తేదీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టనున్న జనహిత పాదయాత్ర విజయవంతానికి శనివారం హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రులు లక్ష్మణ్, సీతక్కలు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వందశాతం విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. – హన్మకొండ చౌరస్తా -
ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025
పోలీస్స్టేషన్కు వెళ్లగానే చిరునవ్వుతో ఆహ్వానించే ఓ రిసెప్షనిస్ట్. అక్రమార్కుల తాట తీసే ఓ టాస్క్ఫోర్స్ టీం మెంబర్. ఇలా శాఖలోని అన్ని విభాగాల్లో ముందుంటున్నారు మహిళా పోలీసులు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో అందరూ సమానమే అనేలా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇన్నాళ్లు కొన్ని విధులకే పరిమితమైన వారంతా ఉన్నతాధికారుల నిర్ణయాలతో రోడ్డెక్కి విధులు నిర్వహిస్తున్నారు. ‘మీ భద్రతే మా బాధ్యత’ అంటూ రాత్రిళ్లు సైతం విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. – వరంగల్ క్రైం పోలీస్స్టేషన్కు వెళ్లగానే చిరునవ్వుతో ఆహ్వానించే ఓ రిసెప్షనిస్ట్. అక్రమార్కుల తాట తీసే ఓ టాస్క్ఫోర్స్ టీం మెంబర్. ఇలా శాఖలోని అన్ని విభాగాల్లో ముందుంటున్నారు మహిళా పోలీసులు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో అందరూ సమానమే అనేలా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇన్నాళ్లు కొన్ని విధులకే పరిమితమైన వారంతా ఉన్నతాధికారుల నిర్ణయాలతో రోడ్డెక్కి విధులు నిర్వహిస్తున్నారు. ‘మీ భద్రతే మా బాధ్యత’ అంటూ రాత్రిళ్లు సైతం విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. – వరంగల్ క్రైం కమిషనరేట్లో మహిళా అధికారులు ఇలా.. సీఐ 2ఏఎస్సై, హెడ్కానిస్టేబుళ్లు 245కానిస్టేబుళ్లు 352హోంగార్డులు 70ఆర్మీకి దీటుగా విధులు..పోలీస్ శాఖలో అందరూ సమానమే అనేలా పురుషులతో సమానంగా మహిళా అధికారులతో విధులు చేయిస్తున్నాం. ఆర్మీలో పురుషులతో సమానంగా అన్ని రకాల విధులు మహిళా అధికారులు చేస్తున్నారు. అదే స్ఫూర్తితో ఇక్కడ డ్యూటీలు వేస్తున్నాం. ఏ డ్యూటీ వేసిన వారు చక్కగా రాణిస్తున్నారు. గతంలో కూడా అన్ని రకాల డ్యూటీలను మహిళా అధికారులు చేశారు. ప్రస్తుతం మరోసారి వారు అన్ని రకాల విధుల్లో రాణిస్తున్నారు. – సన్ప్రీత్సింగ్, పోలీస్ కమిషనర్, వరంగల్డయల్ 100 కాల్స్ మొదలుకుని కష్టతరమైన ఫిర్యాదుల విచారణకు సైతం మహిళా పోలీసులు సై అంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పురుషులతో సమానంగా స్వీకరిస్తూ రంగంలోకి దిగుతున్నారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా బ్లూకోల్ట్ విధుల్లో పురుషులతో కలిసి సమర్థంగా రాణిస్తున్నారు. రాత్రిపూట పెట్రోలింగ్ విధుల్లో భాగస్వామ్యమవుతున్నారు. మహిళా నేరస్తులను జైళ్లకు తరలించే క్రమంలో ఎస్కార్ట్గా, నేతల సభలకు షార్ట్ వెపన్లతో హాజరై సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. కష్టతరమైనప్పటికీ విధులకు.. సాధారణంగా పోలీస్ స్టేషన్లలో రూల్కాల్ ఉదయం 9 గంటలకు చేపడుతున్నారు. అప్పటి నుంచి 2 గంటల వరకు విధులు నిర్వహించి.. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు డ్యూటీలో కొనసాగుతున్నారు. రాత్రి డ్యూటీ ఉన్నవారు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. రిసెప్షన్ విధులు నిర్వహించే మహిళలు ఉదయం 9 నుంచి 2 గంటల వరకు డ్యూటీలో ఉంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి 9 గంటల వరకు మరొకరు విధులు చేపడుతున్నారు. వీరికి 24 గంటల పాటు రెస్ట్ దొరుకుతుంది. హుషారుగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో.. మహిళా పోలీస్ అధికారులు అత్యంత హుషారుగా ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను వేతనంతో పాటు 30 శాతం అదనంగా చెల్లిస్తారు. దీనికి తోడు ఉన్నత అధికారుల నుంచి విధులకు సంబంధించి ఎలాంటి ఒత్తిళ్లు లేకపోవడంతో ట్రాఫిక్ విధుల్లో మక్కువ చూపిస్తున్నారు. ప్రస్తుతం ట్రైసిటీ పరిధి ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలో ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు ఏఎస్సైలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఏడుగురు కానిస్టేబుళ్లు, ఒకరు హోంగార్డు విధుల్లో కొనసాగుతున్నారు. చాలెంజింగ్ విధులు... రాత్రిపూట విధులు నిర్వహించడం మహిళా పోలీసులకు చాలెంజింగ్ మారింది. బ్లూకోల్ట్ సిబ్బందితో సమానంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిర్దేశించిన డ్యూటీని నిర్వహిస్తున్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న హాస్టళ్ల పరిసరాలను పరిశీలించడంతోపాటు బార్అండ్రెస్టారెంట్ల దగ్గర ఎదురయ్యే ఆకతాయిల గొడవలు మొదలు కొని, అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో బ్యాగులు, తదితర వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం, రౌడీ షీటర్ల ఇళ్లను సందర్శించి ఉన్నారో, లేదో తెలుసుకోవడం, రాత్రి పూట నిర్వహించే వ్యాపారాలను బంద్ చేసి ఎక్కడా చిన్న ఘటన జరగకుండా చూసుకోవడం చేస్తున్నారు. దీంతోపాటు ఏదైనా లాఅండ్ఆర్డర్కు సంబంధించి పెద్ద సంఘటన జరిగితే వెంటనే బ్లూకోల్ట్ సిబ్బంది సహకారం తీసుకుని పరిష్కరిస్తున్నారు. డీసీపీ 1 రాత్రిపూట మహిళా పోలీసుల పెట్రోలింగ్ కూడళ్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్లలో తనిఖీలు పురుషులతో సమానంగా విధులు వరంగల్ కమిషనరేట్లో తమదైన మార్క్ -
యూరియా కొరత సృష్టిస్తే చర్యలు
● కలెక్టర్ రిజ్వాన్బాషా ● ఘన్పూర్లో ఆగ్రోస్ కేంద్రం తనిఖీస్టేషన్ఘన్పూర్: జిల్లాలో యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్బాషా అన్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని ఆగ్రోస్ కేంద్రాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. యూరియా అమ్మకాలకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో సాగుకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎక్కువ రద్దీ లేకుండా ఉదయాన్నే షాపులు తెరిచి అమ్మకాలు చేయాలన్నారు. ఉపాధ్యాయులు గైర్హాజరు కావొద్దు ముందస్తుగా అనుమతి లేకుండా ఏ ఒక్క ఉపాధ్యాయుడు పాఠశాలకు గైర్హాజరు కావొద్దని కలెక్టర్ సూచించారు. ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లు జెడ్పీఎస్ఎస్ను శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు. అనంతరం పదవ తరగతి క్లాస్ రూమ్కు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, పరిశుభ్రంగా వంటల తయారీ ఉంటుందా అడిగి తెలుసుకున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఏఓ చంద్రన్కుమార్, ఎంఈఓ కొమురయ్య, కొల్లూరి ప్రకాశం, ఆగ్రోస్ సెంటర్ నిర్వాహకులు మహేష్ తదితరులున్నారు. క్రీడల్లోనూ రాణించాలి జనగామ రూరల్: యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్ రిజ్వాన్బాషా అన్నారు. శనివారం పట్టణంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 17వ గ్రామోత్సవం సందర్భంగా క్రీడలను ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాలీబాల్, త్రో బాల్ క్రీడా పోటీల్లో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, యువత పాల్గొని ప్రతిభ కనబర్చి జిల్లా, జాతీయ స్థాయిలో పేరు నిలబెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి బి. వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ ధూపటి రాజేశ్వరి, ఇంటర్నేషనల్ పారా త్రోబాల్ ప్లేయర్ కృష్ణవేణి, టెలివిజన్ కళాకారుని షీలా సింగ్, ఈషా ఫౌండేషన్ ప్రతినిధి స్వామి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బెన్షాలోమ్
జనగామ: జనగామ రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్గా పి.బెన్షాలోమ్ను నియమిస్తూ రెవెన్యూ విభాగం ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జనగామలో పని చేస్తున్న రోహిత్సింగ్కు పౌరసరఫరాల శాఖ అదనపు డైరెక్టర్గా నియమించారు. 2017 (ఐఏఎస్) బ్యాచ్కు చెందిన బెన్షాలోమ్.. యాదాద్రి భువనగిరి, నారాయణపేట రెవెన్యూ అదనపు కలెక్టర్గా పని చేశారు. నారాయణపేట జిల్లా నుంచి ఇటీవల బదిలీ కాగా, వెయిటింగ్లో ఉన్న ఆయనకు జనగామ ఏసీగా నియమించారు. ఈ మేరకు రేపు (సోమవారం) అదనపు కలెక్టర్గా బాధ్యతలను తీసుకోనున్నారు. అదేరోజు రోహిత్సింగ్ రిలీవ్ కానున్నారు. కాగా 2023 జూన్ 3వ తేదీన జనగామ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రోహిత్సింగ్ విధి నిర్వహణలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. రాష్ట్ర స్థాయిలో సేవలందించేందుకు పదోన్నతిపై వెళ్లడంతో అన్ని వర్గాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
కొత్త కార్డులకు రేషన్
● సెప్టెంబర్ నుంచి పంపిణీకి చర్యలు ● జిల్లాలో 1.80 లక్షల రేషన్ కార్డులు ● కొత్త జాబితాలో 18,812 మందికి లబ్ధిజనగామ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతీఒక్కరికి ఆహార భద్రత (రేషన్) కార్డు అందిస్తోంది. గత ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాల కళ నెరవేరింది. పాత వారితో పాటు కొత్తగా కార్డులు వచ్చిన వారికి వచ్చే నెల (సెప్టెంబర్) నుంచి ఉచిత సన్నబియ్యం అందుకోనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జిల్లాకు అదనపు కోటా కేటాయించగా పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన తెల్ల రేషన్ కార్డులతో కలిపి జిల్లాలో మొత్తం 1,80,158 నమోదయ్యాయి. దీని ద్వారా 5,46,110 మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందుకోనున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు.. ప్రభుత్వ నిర్ణయం మేరకు మూడు నెలల కోటా పూర్తి కావడంతో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని రేషన్ షాపుల ద్వారా పాత, కొత్త కలిపి రెగ్యులర్గా లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రైవేట్ మార్కెట్లో సన్న బియ్యం ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రోజు వారి కూలీలు, సామాన్య, పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది. అధికారుల ఏర్పాట్లు జిల్లాలో 335 రేషన్ దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో 1,63,283 తెల్ల రేషన్ కార్డులు ఉండగా, సెప్టెంబర్ కోటా ప్రారంభం నాటికి 1,80,158కి చేరుకున్నాయి. ఇందులో కొత్తగా 18,812 ఉండగా, 5,46,110 (కొత్తవారు 50,976) మంది యూనిట్స్ (సభ్యులు) లబ్ధిపొందనున్నారు. వచ్చే నెల సన్న బియ్యం పంపిణీకి జిల్లాకు 3,470.358 మెట్రిక్ టన్నులు కేటాయించారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ గోదాంల నుంచి బియ్యాన్ని రేషన్ దుకాణాలను పంపించేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా బియ్యం నాణ్యతపై ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేసి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిఘా వేశారు.రేషన్ దుకాణాలు: 335 రేషన్ కార్డులు: 1,80,158 లక్షలు కొత్త కార్డులు: 18,812 లబ్ధిదారులు (యూనిట్స్): 5.46 లక్షల మంది కొత్తగా చేరిన వారు : 50,976 బియ్యం అలాట్: 3,470.358 మెట్రిక్ టన్నులు -
సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా!
జనగామ: డీఎస్సీ సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అయ్యేనా!.. అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రతీ డీఎస్సీకి ముందు 3 సార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. టెట్ ఆవిర్భావం తర్వాత 2012 డీఎస్సీకి ముందు 3 సార్లు టెట్ నిర్వహించగా, జూలై 2011, 2012 జనవరి, జూన్, ఆగస్టు మాసాల్లో టెట్ నిర్వహించారు. ఆ తర్వాత మార్చి 2014, మే 2016, జూలై 2017లో టెట్ అర్హత పరీక్ష నిర్వహించారు. అనంతరం 2017 అక్టోబర్లో డీఎస్సీ (టీఆర్టీ) నోటిఫికేషన్ జారీ చేసి 2018 ఫిబ్రవరిలో 8,792 పోస్టులకు గాను డీఎస్సీ పరీక్షలు జరిపారు. అప్పటి నుంచి 4 సంవత్సరాల వరకు టెట్ నిర్వహించలేదు. తిరిగి జూన్ 2022, సెప్టెంబర్ 2023, మే–జూన్ మాసం 2024లో టెట్ నిర్వహించి, 2024 జూలైలో డీఎస్సీ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేశారు. గత డీఎస్సీ తర్వాత 2025 జనవరి, 2025 జూన్లో టెట్ పరీక్ష నిర్వహించారు. ప్రస్తుతం టీచర్ల పదోన్నతి, పదవీవిరమణతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు మరో డీఎస్సీ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది చివర లేదా వచ్చే సంవత్సరం జనవరిలో మరో టెట్ నిర్వహించే అవకాశం ఉందని విద్యావేత్తలు భావిస్తున్నారు. దీంతో మరో టెట్ తర్వాతనే డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. జిల్లాలో 6వేల మంది పోటీ జిల్లాలో 250 టీచర్ పోస్టులు ఉండే అవకాశం ఉంది. గత 2024 డీఎస్సీ ద్వారా దాదాపు 221 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కాగా, ఎస్జీటీలో 117, స్కూల్ అసిస్టెంట్, ఇతర విభాగాలు కలుపుకుని 100 పోస్టులను భర్తీ చేశారు. దీని కోసం 5 వేల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇప్పుడు మరో డీఎస్సీ కోసం దాదాపు 6 వేల మంది పోటీ పడే అవకాశం ఉండగా, రాత్రింబవళ్లు ప్రిపరేషన్ అవుతున్నారు. ఆర్థికశాఖ అనుమతి బట్టి ఖాళీలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో టెట్ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్! ప్రస్తుత పదోన్నతులతో 200 ఉపాధ్యాయ ఖాళీలు -
నవరాత్రులు శాంతియుతంగా నిర్వహించుకోవాలి
జనగామ రూరల్: గణపతి నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. శుక్రవారం ఏసీపీ కార్యాలయంలో పోలీసులు, యువత, వివిధ మతస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ మండపాల వద్ద నిబంధనల మేరకు వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు దామోదర్రెడ్డి, శ్రీనివాస్, అబ్బయ్య, భరత్, చెన్నకేశవులు, శ్రీదేవి, వేణు, నాగయ్య, తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలి పాలకుర్తి టౌన్: పోలీస్స్టేషస్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. శుక్రవారం పాలకుర్తి పోలీస్స్టేషన్ను తనిఖీ చేసి పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సైబర్ నేరాలు, సీసీ కెమెరాల ఆవశ్యకత గురించి ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ జనకిరామ్రెడ్డి, ఎస్సైలు దూలం పవన్కుమార్, లింగారెడ్డి, యాకుబ్ హుస్సేన్, సిబ్బంది పాల్గొన్నారు.డీసీపీ రాజమహేంద్రనాయక్ -
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేస్తాం
● ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి: నియోజకవర్గంలో శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయిస్తామని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గంలోని మైలారం, విస్నూరు, పాలకుర్తి, వల్మిడి, ముత్తారం తదితర గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించగా పలు పనులకు శంకుస్థాపన చేశారు. మైలారంలో రూ. 1 కోటి, ముత్తారంలో రూ.2.80 కోట్లతో నిర్మించిన బ్రిడ్జితో పాటు మరికొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యశాలల పనితీరు మెరుగుపడినప్పుడే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఎన్. వసంత, పీఆర్ డీఈ రామలింగయ్య, చిట్యాల ఐలమ్మ, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ మంజుల భాస్కర్, అడ్డూరి రవీందర్రావు, రాపాక సత్యనారాయణ, గిరగాని కుమార్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 23 శ్రీ ఆగస్టు శ్రీ 2025
విద్యారణ్యపురి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంపునకు (శనివారం) నుంచి ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) (ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు)ను అమలు చేయనున్నారు. ఇందుకోసం ఇంటర్ బోర్డు అధికారులు సెంటర్ బోర్డ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) సాంకేతిక సహకారంతో టీజీబీఐఈ – ఎఫ్ఆర్ఎస్ యాప్ను ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రతీరోజు రెండు సార్లు (ఉదయం, మధ్యాహ్న భోజనం తర్వాత) హాజరు తీసుకుంటారు. ఈమేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టారు. కళాశాలకు ఏ విద్యార్థి అయినా హాజరుకాకుంటే అతడి తల్లిదండ్రుల ఫోన్కు సందేశం వెళ్తుంది. ఈ హాజరును ఆ కళాశాల ప్రిన్సిపాల్, డీఐఈఓ, రాష్ట్ర అధికారులు కూడా పర్యవేక్షిస్తారు. ఎఫ్ఆర్ఎస్ అమలుపై గత గురువారం ఆయా జిల్లాల్లో డీఐఈఓలు.. కాలేజీ ప్రిన్సిపాళ్లతో సమావేశాలు నిర్వహించి హాజరు అమలు విధానాన్ని తెలియజేశారు. హనుమకొండ, వరంగల్లో డీఐఈఓలు ఎ.గోపాల్, శ్రీధర్సుమన్ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. జిల్లాల వారీగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, విద్యార్థుల వివరాలురోజుకు రెండుసార్లు హాజరు నమోదు ● గైర్హాజరైతే తల్లిదండ్రుల ఫోన్లకు సమాచారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 50 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు2,9002,013● అధ్యాపకులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి టీజీబీఐ ఈ –ఎఫ్ఆర్ఎస్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందులో విద్యార్థుల ఫొటోతో సహా వివరాలు నమోదు చేయాలి. ● తరగతి ప్రారంభమయ్యాక స్మార్ట్ ఫోన్లో ఆ యాప్ ద్వారా కెమెరా ఓపెన్ చేసి వీడియా మాదిరిగా కూర్చున్న విద్యార్థులను తీసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఫొటో క్యాప్చర్ అయి హాజరు నమోదవుతుంది. ● ఈ విధానంతో 15నుంచి 20 సెకన్లలోనే 80మంది విద్యార్థుల వరకు హాజరు నమోదు చేయవచ్చని చెబుతున్నారు. ● ముఖ హాజరుకు శుక్రవారంనుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టారు. ఇంకా చేపట్టనివారు ఉంటే ఈనెల 23న చేపడతారు. ● కళాశాలల సమయం ఉదయం 9:30 గంటల నుంచి ప్రతీ తరగతి గదిలోని తొలి పీరియడ్ తీసుకునే అధ్యాపకుడు విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు చేస్తారు. ● మళ్లీ మధ్యాహ్నం లంచ్ తర్వాత 2గంటలకు మరోసారి నమోదు చేస్తారు. ప్రతీ జిల్లాకు ఇద్దరికి ఏఐ చాంపియన్లుగా శిక్షణ ఇంటర్ విద్యలో కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర బోర్డు నిర్ణయించింది. విద్యలో నాణ్యత పెంపు, విద్యార్థుల్లో నైపుణ్యాల అ భివృద్ధి, సరికొత్త సాంకేతికత పరిచయం కోసం ఏఐని విని యోగించుకోనున్నారు. దీనిపై పట్టున్న సిబ్బందిని గుర్తించి ఏఐ చాంపియన్లుగా ఎంపిక చేసింది. ప్రతీ జిల్లాలోని అకడమిక్ మానిటరింగ్ సెల్లోని ఇద్దరు లెక్చరర్లు, ఒక లైబ్రేరియన్, ప్రతీ జిల్లాకు ఏఐ చాంపియన్లుగా ఎంపికై న ఒక లెక్చరర్, నాన్టీచింగ్ సిబ్బందికి శుక్రవారం హైదరాబాద్లో సంబంధిత ఉన్నతాధికారులు ఏఐ ఎఫ్ఆర్ఎస్ అమలు, వినియోగంపై శిక్షణ ఇచ్చారు. 1,2721,000విద్యార్థులకు రోజుకు రెండు సార్లు హాజరు మానుకోట1,3501,200734821520535యాప్ డౌన్లోడ్ విధానం తన మొబైల్ ద్వారా చూపిస్తున్న వరంగల్ డీఐఈఓ శ్రీధర్ సుమన్ జనగామ1,050950ఇంటర్లో హాజరుశాతాన్ని పెంచేందుకే.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు తక్కువగానే ఉంటోంది. ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థుల్లో మధ్యాహ్నం భోజనం కోసం కొందరు ఇంటికి వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది. తిరిగి రావడం లేదు. ఇంటివద్ద కాలేజీకి అని చెప్పి డుమ్మా కొట్టే పిల్లలు కూడా ఉన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత తక్కువగా రావడానికి కూడా విద్యార్థులు తరగతులకు సరిగా హాజరుకాకపోవడమే అనేది ఇంటర్బోర్డు అధి కారులు భావిస్తున్నారు. ఆయా సమస్యలకు పరిష్కారంగానే ఎఫ్ఆర్ఎస్ను అమలు చేస్తున్నారన్నది స్పష్టమవుతోంది. నేటినుంచే అమలు.. రిజిస్ట్రేషన్ షురూ -
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!
విధుల్లో నిర్లక్ష్యం, ఆరోపణలు వచ్చినా ఉపేక్షించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రతీ అధికారి తన పనిని అంకితభావంతో చేయాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న ఆయన... పట్టణంలోని 30 వార్డుల్లో పర్యటిస్తే ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు అక్ర మ నిర్మాణాలు, సెల్లార్ల భాగోతం, ఎంక్రోచ్మెంట్లు, నిర్మాణాలు చేసుకుని నెలలు గడిచి పోతున్నా.. ఇంటినంబర్లకు నోచుకోని ఇళ్లు తదితర సమస్యలు నేరుగా గుర్తించేందుకు దోహదపడుతుంది. రిజిస్ట్రేషన్లు, బీమా లేకుండా నడిపిస్తున్న శానిటేషన్, ఇతర వాహనాల పరిస్థితిపై దృష్టి సారిస్తే.. జరిమానాల రూపంలో పురపాలికపై కొంత భారం తగ్గించి, ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న డబ్బులతో మరింత అభివృద్ధి చేయవచ్చు.జనగామ: గాడితప్పిన జనగామ పురపాలికను పట్టాలెక్కించేందుకు బాధ్యతలు చేపట్టిన రెండవ రోజే కమిషనర్ మహేశ్వర్రెడ్డి రంగంలోకి దిగారు. ‘గాడిన పడేనా?’ కొత్త మున్సిపల్ కమిషనర్కు ఎన్నో సవాళ్లు.. శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. శుక్రవారం కమిషనర్ చాంబర్లో పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, శానిటేషన్, ఇంజనీరింగ్ తదితర సెక్షన్ ఉద్యోగులు, వార్డు ఆఫీసర్లతో మహేశ్వర్రెడ్డి సమావేశమయ్యారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని, మున్సిపల్ ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. అక్రమ నిర్మాణాల కట్టడికి.. పట్టణంలో అక్రమ నిర్మాణాల కట్టడికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రణాళిక శాఖ ఇంటి అనుమతులతో పాటు నిర్మాణ సమయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలంటూ హుకుం జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని, దానికి ఖచ్చితమైన సమాధానం చెప్పేలా బాధ్యత కలిగి పనిచేయాలని చెప్పారు. జనగామలో అనేక చోట్ల అక్రమ నిర్మాణాలు, ఎంక్రోచ్మెంట్లు, నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ల నిర్వహణపై ఎలాంటి చర్యలు ఉంటాయోనని ప్ర జలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఇంటి నిర్మాణ అనుమతుల్లో జాప్యం ఉండకుండా చూసుకుని, రెవెన్యూ వసూళ్లలో పురోగతి సాధించాలని ఆదేశించారు. అస్తవ్యస్తంగా మారిన టౌన్ ప్లానింగ్ శాఖను మేలు కొలిపే విధంగా కమిషనర్ పనితీరు ప్రజల్లో కొంతమేర విశ్వాసాన్ని పెంచుతోంది. అధి కారం చేపట్టిన రెండవ రోజే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం, భవిష్యత్లో పట్టణ పాలనలో క్రమశి క్షణ, పారదర్శకత పెరగనుందనే సంకేతాలు ఇస్తోంది. అధికారులు తమ విధుల్లో సమయపాలన పా టించాలని తెలిపారు. ఇంటి అసెస్స్మెంట్లలో వేగం పెంచి రెవెన్యూ వసూళ్లలో పారదర్శకత సాధించా లని సూచించారు. ప్రజలకు న్యాయం జరి గే విధంగా ప్రతి చర్యలో స్పష్టత ఉండాలన్నారు.నిర్లక్ష్యానికి తావులేదుఇంటి అనుమతుల జాప్యంపై ఆరా శానిటేషన్ నిర్వహణపై ఫోకస్ ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలి బాధ్యతలు చేపట్టిన రెండవ రోజే మున్సిపల్ కమిషనర్ ఉద్యోగులతో సమీక్షశానిటేషన్పై దృష్టి పట్టణంలో భ్రష్టుపట్టిన శానిటేషన్ నిర్వహణపై నూతన కమిషనర్ ఫోకస్ సారించారు. శానిటేషన్ నిర్వహణలో మార్పులు తీసుకురావాలని సంబంధిత శాఖకు సూచనలు చేశారు. పట్టణ ప్రజలకు ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించడమే తమ ప్రధాన కర్తవ్యంగా పని చేయాలన్నారు. -
భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ రఘునాథపల్లి: భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ ఆదేశించారు. గురువారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రెవెన్యూ అధికారులతో భూభారతిపై సమీక్ష నిర్వహించారు. భూభారతిలో వచ్చిన దరఖాస్తులు, క్షేత్రస్థాయి పరిశీలనపై ఆరా తీశారు. భూభారతిలో నమోదైన ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఫణికిషోర్, ఆర్ఐలు శరత్చంద్ర, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
గాడిన పడేనా?
జనగామ: గాడి తప్పిన జనగామ పురపాలిక పాలన కొత్త కమిషనర్కు ముళ్ల కిరీటం కానుంది. పారిశుద్ధ్య నిర్వహణ గాడి తప్పగా, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ వ్యవస్థ అదుపు తప్పి ప్రైవేటు వ్యక్తులు ఆజమాయిషీ చేసే స్థాయికి దిగజారింది. అడ్డగోలు నిర్మాణాలు, అనుమతుల్లో జాప్యం, అక్రమంగా సెల్లార్ల నిర్వహణ ఇలా చెప్పుకుంటే పోతే అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. గత కమిషనర్ వెంకటేశ్వర్లు రామగుండం కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్గా బదిలీపై వెళ్లగా, వెయింటింగ్లో ఉన్న డి.మహేశ్వర్రెడ్డి గురువారం జనగామ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నారు. ముందున్న సవాళ్లు.. పట్టణ పరిపాలనలో అనేక సవాళ్లు, సమస్యలు జనగామ కొత్త కమిషనర్కు స్వాగతం పలుకుతున్నాయి. పట్టణం వేగంగా విస్తరిస్తున్నా దానికి తగ్గట్టుగా మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పన్ను వసూళ్లలో పారదర్శకత, నిర్మాణ అనుమతుల్లో నిబంధనలు, మౌలిక సదుపాయాల మెరుగుదల ఇవన్నీ కొత్త కమిషనర్ ముందున్న కీలక అంశాలు. పారిశుద్ధ్య నిర్వహణ, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత వంటి అంశాలు కొంతకాలంగా సరిగా సాగడం లేదు. వీటిని సమర్థవంతంగా సరిదిద్దడం, గాడితప్పిన పాలనను మళ్లీ సరైన దారిలో నడిపించడం కొత్త కమిషనర్ మహేశ్వర్రెడ్డి ముందు పరీక్షగా మారింది. పారిశుద్ధ్యం..అస్తవ్యస్తం.. జనగామలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారిపోయింది. డ్రైనేజీలను గాలికి వదిలేయగా, రోడ్లపై చెత్తడంపులు దుర్వాసన వెదజల్లుతున్నాయి. జీఎంఆర్ కాలనీ, బాలాజీనగర్, కుర్మవాడ, శ్రీ సాయి రెసిడెన్సీ, హౌజింగ్ బోర్డు, ఇందిరమ్మ కాలనీ, గిర్నిగడ్డ, సూర్యాపేట రోడ్డులోని పలు కాలనీలు, గీతానగర్, ఇండస్ట్రియల్ ఏరియా, ధర్మకంచ, తదితర వార్డుల్లో డ్రైనేజీలు అధ్వానంగా మారగా..దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. కొత్త మున్సిపల్ కమిషనర్కు ఎన్నో సవాళ్లు పట్టుతప్పిన పట్టణపాలన అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య నిర్వహణ అనుమతుల్లేని నిర్మాణాలు.. జనగామ కమిషనర్గా మహేశ్వర్రెడ్డి బాధ్యతల స్వీకరణఅడ్డగోలు నిర్మాణాలు.. పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లు, ఫైర్ సేఫ్టీ లేకుండా కట్టడాలు, అనుమతులకు మించి ఫ్లోర్స్ తదితర నిర్మాణాల సమయంలో చర్యలు శూన్యం. ఇటీవల శ్రీలక్ష్మి, విజయ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగి కోట్ల ఆస్తినష్టం వాటిల్లినా, తిరిగి నిర్మాణ సమయంలో ఎలాంటి నిబంధనలు తీసుకుంటున్నారనే పర్యవేక్షణ లేకుండా పోయిందని ప్రజలు మండిపడుతున్నారు. కృష్ణాకళామందిర్ రూట్తో పాటు బాలాజీనగర్, సిద్దిపేట రోడ్డు, జ్యోతినగర్ ఏరియా, తదితర ప్రాంతాల్లో భారీ భవంతుల నిర్మాణం జరుగుతోంది. వీటికి అనుమతులు ఉన్నాయా? నిబంధనలు పాటిస్తున్నారా? అని పర్యవేక్షించేవారు లేకపోయారు. పురపాలికలోని అన్ని విభాగాలపై నిఘా ఉంచి గాడితప్పిన పురపాలికను పట్టాలెక్కించే బాధ్యత కొత్త కమిషనర్పై ఉంది. ఇదిలా ఉండగా కమిషనర్ మహేశ్వర్రెడ్డి బాధ్యతలను స్వీకరించగా, తర్వాత స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, పురపాలిక స్పెషల్ ఆఫీసర్ పింకేశ్ కుమార్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. -
ఆహ్లాదకరంగా స్మృతివనం
పాలకుర్తి టౌన్: బసవ పురాణం గ్రంథకర్త పాల్కురికి సోమనాథుడి స్మృతివనంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. ‘అధ్వానంగా సోమనాథుడి స్మృతివనం’ శీర్షికతో బుధవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం కదిలివచ్చింది. గురువారం మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర ఆలయానికి సమీపంలో ఉన్న స్మృతివనాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మృతి వనం పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలని, ఆలయానికి వచ్చే భక్తులు సందర్శించి కాసేపు గడిపే విధంగా తీర్చిదిద్దాలన్నారు. స్మృతివనం పరిసర ప్రాంతాల్లోకి అపరిచిత వ్యక్తులు రాకుండా పోలీసులు నిరంతరం నిఘా పెంచాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్యను కలెక్టర్ ఫోన్లో ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో పీడీ వసంత, జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూప, అడిషనల్ ఏపీడీ నూరోద్ధిన్, పీఆర్ డీఈ రామలింగాచారి, ఎంపీడీవో రవీందర్, ఇన్చార్జి ఎంపీవో నీరటి మాధవ్, పంచాయతీ కార్యదర్శి వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. యూరియా కొరత లేదు.. పీఏసీఎస్, ఫర్టిలైజర్ల దుకాణాల్లో రైతులకు సరిపడా యూరియా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలు, మన గ్రోమోర్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించి యూరియా గోదాంలను తనిఖీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని కళ్యాణమండపాన్ని కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. కళ్యాణమండపంలో అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయాలని డీఆర్డీవో పీడీ వసంతను ఆదేశించారు. చిన్నారుల ఆరోగ్యరక్షణకు స్వర్ణప్రాశన జనగామ: చిన్నారుల ఆరోగ్య రక్షణకు పూర్వకాలంలో స్వర్ణ ప్రాశన వేసేవారని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏకశిల బీఈడీ కళాశాల ఎదురుగా వేద ఆయుర్వేదిక్ పంచకర్మ వెల్నెస్ హాస్పిటల్లో పుష్యమి నక్షత్రం పురస్కరించుకుని 6 నెలల నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలకు డాక్టర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఉచిత స్వర్ణప్రాశన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. స్వర్ణప్రాశనతో పిల్లలో మేథోశక్తి పెరగడంతో పాటు జీర్ణ శక్తిని మెరుగుపడుతుందన్నారు. బాలల రక్షణ సామాజిక బాధ్యత.. జనగామ రూరల్: బాలల రక్షణ ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యత అని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. బాలబాలికల రక్షణ, మానవ అక్రమ రవాణా అనే అంశాలపై ప్రజ్వల ఎన్జీవో ఆధ్వర్యంలో ఏకశిల బీఈడీ కళాశాలలో జిల్లా రిసోర్స్ పర్సన్లకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు..పాఠశాలల యాజమాన్యాలు,, పిల్లల తల్లిదండ్రులు వారి సంరక్షణ కోసం ప్రధాన భూమిక నిర్వహించాలన్నారు. అన్ని రకాల నిర్లక్ష్యం, దోపిడీల నుంచి బాలలకు రక్షణ కల్పించాలన్నారు. కార్యక్రమంలో కోర్స్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, గౌసియా బేగం, సెంటర్ ఇన్చార్జ్ మల్లికార్జున్, ప్రజ్వల ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు. మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి సోమనాథుడి స్మృతివనాన్ని సందర్శించిన కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ‘సాక్షి’ కథనానికి కదిలిన జిల్లా యంత్రాంగం -
అక్రమాలకు కేరాఫ్గా డీటీఓ కార్యాలయాలు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రవాణాశాఖ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు అగడం లేదు. అన్ని పనులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఏజెంట్లు, ప్రైవేట్ వ్యక్తులు రూ.లక్షలకు పడగలెత్తుతుండగా.. అధికారుల ఆదాయం, అక్రమాస్తులకు హద్దూపద్దు లేదు. ఇటీవల అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన దాడుల్లో వెల్లడవుతున్న ఆస్తుల వివరాలే ఇందుకు సాక్ష్యం. మే 7న ఏకంగా వరంగల్ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇంటిపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై దాడులు చేసిన ఏసీబీ.. ఆ తర్వాత ఈ జిల్లాలో పనిచేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న జగిత్యాల డీటీఓ భద్రునాయక్ రూ.22వేలు తీసుకుంటుండగా ఆగస్టు 6న పట్టుకున్నారు. తాజాగా వరంగల్, హనుమకొండలలో ఎంవీఐగా పనిచేసిన జి.వివేకానంద రెడ్డి నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కడం రవాణాశాఖలో కలకలం రేపుతోంది. నెల రోజుల కిందట వివిధ పనుల కోసం ఏజెంట్ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల మేరకు వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ.. కొందరు సీనియర్ ఎంవీఐల ఆస్తులపై ఆరా తీస్తుండటం హాట్టాపిక్గా మారింది. హనుమకొండ డీటీఓలో రెండింతలు పెరిగిన వసూళ్లు.. హనుమకొండ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో వివిధ పనుల కోసం లంచాలు వసూలు చేస్తున్నారని, ఏజెంట్ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఏడాది క్రితం వచ్చిన ఓ సీనియర్ ఎంవీఐ.. ఈ కార్యాలయానికి లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ కోసం వచ్చే వాళ్లనుంచి చేసే వసూళ్లు రెండింతలు చేశారన్న ఫిర్యాదులు కమిషనర్ కార్యాలయం వరకు వెళ్లాయి. లెర్నింగ్ లైసెన్స్కు ఏడాది కిందట రూ.500 వరకు తీసుకుంటే ప్రస్తుతం రూ.1,000కి పెంచారని, రూ.700–800లు ఉన్న లైసెన్స్ మామూళ్లు రూ.2,000లకు పెరిగిందని బాధితులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు కొనుగోలు చేసుకొని వచ్చిన అర్జీదారునికి అసలు కంటే కొసరే ఎక్కువగా భారమవుతోందని తెలుస్తోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన అసలు సొమ్మును కట్టినా తనిఖీ అధికారులు కొసరుగా వేరే రేట్లను ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. గతంలో ఒక్కో వాహనానికి రూ.2,200 ఉంటే దానిని ఏకంగా రూ.5,500 పెంచినట్లు ఆరోపణలున్నాయి. ఇలాగే ఇటీవల జూన్ మాసంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ ధరలు ఒక్కోబస్సుకు రూ.4,500ల వరకు వసూలు చేయడం వివాదాస్పదమైంది. కాగా ముఖ్యంగా వాహన ఫిట్నెస్లు, లె ర్నింగ్ లైసెన్సు, డ్రైవింగ్ లైసెన్సుల ఫైళ్లపైనే కోడ్లు ఉండడం బహిరంగ రహస్యం. కోడ్లేని ఫైళ్లను.. చిన్న చిన్న పొరపాట్లను సాకుగా చూపుతూ కొర్రీలు పెడుతూ ఫిట్నెస్ ఆపడం.. వాహనదారుడు దానికి వేరే రేటు ఇచ్చుకుంటే పూర్తి చేయడం ద్వారా రూ.వేలు చేతులు మారుతున్నాయి. అంతులేని ఆదాయం.. పోస్టింగ్ కోసం పోటాపోటీ.. రవాణాశాఖలో అంతులేని ఆదాయం ఉండటంతో కొందరు అధికారులు పోటీపడీ పోస్టింగ్లు కొంటున్నారు. కొందరు మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్లు ఇప్పుడు ఇన్చార్జ్ డీటీఓలుగా కూడా అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇందులో కూడా కొన్నిచోట్ల సీనియర్లు తిరకాసు చేసి జూనియర్లను ముందుంచి తెరవెనుక అక్రమ ఆదాయమార్గాలపై చక్రం తిప్పుతున్నారు. హనుమకొండ డీటీఓ పోస్టు కూడా ఖాళీ అయిన సమయంలో వాస్తవానికి అదే కార్యాలయంలో సీనియర్గా ఉన్న 1994 బ్యాచ్కు చెందిన సీనియర్ ఎంవీఐ డీటీఓగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే తెరపైన కీలక పోస్టులో ఉండటం ఇష్టం లేక అతనే ఆ పోస్టుపై విముఖత చూపడంతో 2012 బ్యాచ్కు చెందిన ఒకరికి ఆ పోస్టు కట్టబెట్టి ఆ సీనియర్ ఎంవీఐ అన్నీ తానై చూస్తుండటం వల్లే మామూళ్లు రెండింతలయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలాఉంటే ఇన్చార్జ్ల కోసం అన్ని జిల్లాల్లో పోటీ ఉంది. వరంగల్లో ఎంవీఐగా ఉన్న ఒకరు మహబూబాబాద్ ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తుండగా, పెద్దపల్లి ఎంవీఐగా ఉన్న ఓ అధికారి ఆ పోస్టుతోపాటు ములుగు ఎంవీఐగా, ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తున్నారు. భూపాలపల్లిలో ఎంవీఐగా, ఇన్చార్జ్ డీటీఓగా ఒక్కరే చూస్తున్నారు. ఇలా.. ఏళ్లతరబడిగా ఉమ్మడి వరంగల్లో పాతుకుపోయిన కొందరు రవాణాశాఖ అధికారుల తీరుపై ఆ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేసుకుంటూ కోరుకున్న పోస్టుల్లో కొనసాగుతున్నారంటున్నారు. కాగా, రవాణాశాఖలో పెచ్చుమీరుతున్న అవినీతిపై కొందరు అవినీతి నిరోధకశాఖ అధికారులు కూడా ద్వంద్వ వైఖరితో ఉన్నారన్న చర్చ కూడా ఆశాఖలో సాగుతోంది. వ్యక్తిగత పరిచయాల ఆధారంగా లెక్కకు మించిన అవినీతి జరిగినా ఆ కార్యాలయాలు, అధికారులపై ఉదాసీనంగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీబీ దాడులకు వెరవని రవాణాశాఖ అధికారులు వసూళ్లకు ‘ప్రైవేట్’ వ్యక్తులు, ఏజెంట్లే మధ్యవర్తులు కాసుల కక్కుర్తితో అడ్డంగా దొరుకుతున్న అధికారులు ఆదాయాన్ని మించిన ఆస్తులు.. ఆ ఫిర్యాదులపైనే పలువురిపై దాడులు ప్రతి పనికీ రేటు.. ఇటీవలే రెండింతల పెంపు హనుమకొండ డీటీఓ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు -
పూర్వ ప్రాథమిక తరగతులకు నిధులు
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరంనుంచి పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు పాఠశాలల్లో చిన్నారులకు అడ్మిషన్లు కల్పించారు. ప్రభుత్వం తాజాగా సమగ్ర శిక్ష ద్వారా పూర్వ ప్రాథమిక తరగతుల విద్యార్థుల కోసం నిధులు మంజూరు చేసి విడుదల చేసింది. ఈ మేరకు ఒక్కో స్కూల్కు రూ.1.70లక్షల నిధులను కలెక్టర్లకు జమ చేశారు. హనుమకొండ జిల్లాలో 45 పూర్వ ప్రాథమిక తరగతులకు నిధులు మంజూరై విడుదలయ్యాయి. అందులో 25 స్కూళ్లకు రూ.1.70లక్షల చొప్పున, మరో 20 స్కూళ్లకు రూ.50వేల చొప్పున నిధులు మంజూరు చేశారు. రంగులు, విద్యార్థులకు ఆట వస్తువులు ఆయా పాఠశాలల్లోని పూర్వ ప్రాథమిక తరగతి గదికి రూ.50వేలు వెచ్చించి రంగులు వేయించాల్సింటుంది. ఆట వస్తువులు కొనుగోలు చేయాలి. ఒక్కో విద్యార్థికి రూ.1,000 కేటాయించి బ్యాగ్, షూస్, బెల్ట్, టై తదితర వస్తువులు కొనుగోలు చేయాలి. ఈ నిధులు జిల్లా కలెక్టర్లకు విడుదల చేసిన నేపథ్యంలో వాటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంపై కూడా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్.. డీఈఓలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. త్వరలోనే జిల్లాల కలెక్టర్లు ప్రతీ పూర్వ ప్రాథమిక తరగతి విద్యార్థుల బాగోగులు చూసుకునేందుకు ఒక ఆయా, ఒక ఇన్స్ట్రక్టర్ నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. కొన్నింటికి రూ.1.70లక్షలు, మరికొన్నింటికి రూ.50వేల చొప్పున విడుదల తరగతి గదికి కలర్, ఆటవస్తువులకు, విద్యార్థులకు బ్యాగ్, షూస్, టై, బెల్టు త్వరలోనే ఆయాలు, ఇన్స్ట్రక్టర్ల నియామకంజిల్లా పాఠశాలలు నిధులు హనుమకొండ 65 52.50 వరంగల్ 32 54.40 ములుగు 08 13.60 మహబూబాబాద్ 22 37.40 జయశంకర్ భూపాలపల్లి 54 78.60 జనగామ 15 21.90 -
టీచర్ల పోరుబాట
● రేపు హైదరాబాద్ ఇందిరాపార్క్ ఎదుట మహాధర్నా ● ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారమే ప్రధాన డిమాండ్జనగామ: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి యునైటెడ్ స్కూల్ టీచర్స్ యూనియన్(యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ఈనెల 23న రాష్ట్రవ్యాప్తంగా భారీ ధర్నాకు ఐక్య ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. విద్యారంగంలో కొనసాగుతున్న బోధనా సిబ్బంది లోపాలు, వేతన బకాయిలు, పదో న్నతులు, పెన్షన్ సమస్యలు, పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత తదితర సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృ ష్టికి తీసుకెళ్లడం ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం. విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయుల హక్కులు, విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు ప్రతిపాదనలు, విజ్ఞప్తులు చేసినా పట్టించుకోకపోవడంతో చివరి అస్త్రంగా రాష్ట్రవ్యాప్త ధర్నాకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ 3 దశల పోరాటంలో భాగంగా చివరి అంకంలో 23న ఇం దిరా పార్క్ ఎదుట తలపెట్టిన రాష్ట్రస్థాయి ధర్నాకు పెద్దఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్టు హామీలను అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. పీఆర్సీని ప్రకటించి అమలుచేయాలని, పెండింగ్ డీఏలను చెల్లించాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి. చంద్రశేఖర్రావు డిమాండ్ చేశారు. విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆరోపించారు. ఓపీఎస్ను వెంటనే అమలు చేయాలని డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్ప రాంరెడ్డి కోరారు. ప్రధాన డిమాండ్లు ఇవి.. ● అన్ని క్యాడర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ తక్షణమే విడుదల చేయాలి. జీహెచ్ఎం, ఎస్ఏ, పీఎస్హెచ్ఎం ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. ● జీవో నెంబర్ 25ను సవరించాలి. ప్రతీ పాఠశాలలో కనీసం ఇద్దరు, 40 మంది విద్యార్థులకు తరగతికి ఒక్కరు, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ వర్క్లోడ్కు అనుగుణంగా పోస్టులను భర్తీ చేయాలి. ● పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుల పెన్షనరీ బెనిఫిట్స్ విడుదల చేయాలి. ● 2003 డీఎస్సీ టీచర్లకు పాతపెన్షన్కు ఆప్షన్ ఇవ్వాలి ● ీఓపీఎస్ను పునరుద్ధరించాలి. ● 317 జీవో కారణంగా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులను స్థానిక జిల్లాలకు బదిలీ చేయాలి. ● పైరవీ డిప్యూటేషన్లను రద్దు చేయాలి. -
బతుకమ్మకుంట పనుల పరిశీలన
జనగామ రూరల్: పట్టణంలోని బతుకమ్మకుంట అభివృద్ధి, సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ సూచించారు. గురువారం మున్సిపాలిటీ ఇంజనీరింగ్ ఉద్యాన శాఖ అధికారులతో కలిసి ఆయన పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాకింగ్ ట్రాక్ పనులను పరిశీలిస్తూ మొరం నింపి అందంగా తీర్చిదిద్దాలన్నారు. పార్క్ ఆవరణలో చెత్త చెదారం ఉండరాదన్నారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి శ్రీధర్రావు, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.నేడు హనుమకొండ కలెక్టరేట్లో పెన్షన్, జీపీఎఫ్ అదాలత్హన్మకొండ అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఈనెల 22న (శుక్రవారం) పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ జరపనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ అదాలత్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పెన్షన్, జీపీఎఫ్ కేసులు, ఖాతాల సమస్యలు చర్చించి పరిష్కరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. ఆయా ఖాతాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.నేడు ‘డయల్ యువర్ డీఎం’హన్మకొండ : మెరుగైన సేవల కోసం ప్రయాణికులనుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22న (శుక్రవారం) ఉదయం 11గంటల నుంచి 12గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, తరిగొప్పుల, పాలకుర్తి రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలిసీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్జనగామ రూరల్: ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ సూచించారు. గురువారం పట్టణంలోని సబ్జైలును ఆయన సందర్శించి మాట్లాడారు..జైల్లో ఉన్న నేరం మోపబడిన ఖైదీల భోజన వసతి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదులు లేని ఖైదీలు ఎవరైనా ఉంటే జిల్లా న్యాయసేవ అధికారి సంస్థ దృష్టికి లిఖితపూర్వకంగా తెలియజేస్తే ఉచిత న్యాయవాదిని నియమిస్తామన్నారు. జైల్లో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు. జైలులో ఖైదీలకు ఏవైనా సమస్యలు ఉంటే పేపర్పై రాసి కంప్లైంట్ బాక్స్లో వేయాలని చెప్పారు.జాతీయస్థాయి పారా అథ్లెటిక్ పోటీలకు ఎంపికస్టేషన్ఘన్పూర్: మండలంలోని నమిలిగొండ శివారులోని ప్రభుత్వ మాడల్ స్కూల్కు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి సిద్దార్థనాయక్ జాతీయస్థాయి పారాఅథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సి పాల్ వేణుగోపాల్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 6 నుంచి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరుగనున్న పారాఅథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో జావెలిన్ త్రో పోటీలలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి సిద్దార్థనాయక్ ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా విద్యార్థి సిద్దార్థనాయక్ను ప్రిన్సిపాల్ ప్రత్యేకంగా అభినందించారు. పీఈటీ అశోక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వాతావరణ మార్పులపై అవగాహన
జనగామ: మానసిక ఆరోగ్యంపై వాతావరణ మార్పు హానికరమైన ప్రభావాలను తెలుసుకునేందుకు అనేక దేశాల్లో నిర్వహించిన 19 అధ్యయనాల సారాంశంపై ‘సాక్షి’ మెయిన్ పేజీలో ‘సోలాస్టాల్జియా’ కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనం జనగామ పట్టణం నెహ్రూపార్కు రోడ్డులోని సెయింట్ పాల్స్ ప్రధానోపాధ్యాయురాలు మరియాజోసెఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో ప్రేరణ కలిగించింది. సేవ్ఎర్త్, వాటర్, పొల్యూషన్, జంతువుల రక్షణ, వనసంపదను రక్షించుకుందాం..అనే నినాదంతో ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ, సాక్షి దినపత్రికను చదువుతూ ప్రార్ధన సమయంలో విద్యార్థులు సహచర పిల్లలకు అవగాహన కలిగించారు. ‘సాక్షి’ కథనం ప్రేరణగా సెయింట్ మెరీస్ విద్యార్థుల ప్రదర్శన -
కాల్వ మరమ్మతు పనుల పరిశీలన
బచ్చన్నపేట: మండలంలోని లక్ష్మాపూర్ శివారులో గల గోదావరి పైపులైన్ డెలివరీ పాయింట్ నుంచి కొడవటూర్ గ్రామచెరువులోకి వెళ్లే కాల్వ మరమ్మతు పనులు చేయిస్తామని ఇరిగేషన్ డీఈ మంగీలాల్ అన్నారు. బుధవారం కాల్వ మరమ్మతు పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ కాల్వ పనులకు గానూ రాష్ట్ర ప్రభుత్వం రూ.10.35లక్షలు మంజూరు చేసిందన్నారు. కాలువ పనులు పూర్తయితే గోదావరి జలాలు సులువుగా చెరువులోకి వెళ్తాయని తెలిపారు. కొడవటూర్ చెరువు నుంచి తాళ్ల చెరువు, చింతలకుంట, గుడి చెరువు నిండే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీఈ శ్రావణ్, ఏఈ వెంకన్న, సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీశ్రెడ్డి, నాయకులు కొల్ల నర్సిరెడ్డి, నీల శ్రీనివాస్, మిన్నాలపురం కనుకయ్య, వంగపల్లి శేఖర్రెడ్డి, కరికె కర్ణాకర్ పాల్గొన్నారు. -
యూరియా కొరత సృష్టించొద్దు
లింగాలఘణపురం: జిల్లాలో సరిపడా యూరియా అందుబాటులో ఉందని, దుకాణాదారులు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ షేక్ రిజ్వా న్ బాషా హెచ్చరించారు. బుధవారం మండలంలో ని నెల్లుట్ల, లింగాలఘణపురం గ్రామాల్లోని ఆగ్రోస్ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా స్టాక్ నిల్వలు, కొనుగోలు చేసిన రైతుల వివరాలను పరిశీలించారు. కలెక్టర్తో పాటు డీఏఓ అంబికాసోనీ, తహసీల్దార్ రవీందర్, ఏఓ శ్రీనివాస్రెడ్డి, ఏఈఓ స్పందన ఉన్నారు. కురుమ సంఘం భవనం నిర్మించండి.. జనగామ: జిల్లా కేంద్రంలో దొడ్డి కొమురయ్య కురు మ భవనంతో పాటు ఒగ్గు కళాక్షేత్రం, డాక్టర్ చుక్క సత్తయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు కంచె రాములు ఆధ్వ ర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి జాయ మల్లేష్, ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండి వీరస్వామి, ప్రచార కార్యదర్శి అనిల్కుమార్, లింగాలగణపురం మండల కురుమ సంఘం అధ్యక్షుడు బండ చంద్రమౌళి, చౌదరపల్లి విజయభాస్కర్, జనగామ మండల అధ్యక్షుడు బండ రవి, పట్టణ అధ్యక్షుడు గడ్డం మల్లేశం, నకిర్త వీరస్వామి, పూర్ణచంద్ర, వినయ్, హరీశ్ పాల్గొన్నారు. నానో యూరియాతో ప్రయోజనాలు.. జనగామ రూరల్: నానో యూరియాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ అధికారులకు నానో యూరియాపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికాసోని, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీధర్, ఏడీఏలు, అధికారులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ‘ఉపాధి’ పనులు ముమ్మరం చేయాలి.. ఉపాధి హామీ పనులు ముమ్మరం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో డీఆర్డీఓ వసంత ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులపై ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచా యతీ సెక్రటరీలతో వీసీ ద్వారా సమీక్షించారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఉపాధి హామీ పనులు చేపట్టాలని, ప్రజాప్రతినిధులు పాల్గొనేలా ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. వీసీలో ఈజీఎస్ అదనపు పీడీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీగా ‘పనుల జాతర’.. పనుల జాతర– 2025 కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. పనుల జాతరలో భాగంగా 22 తేదీన కొత్త పనులను ప్రారంభించడానికి ముఖ్యంగా పశువుల పాకలు, గొర్రెల షెడ్లు, కోళ్ల ఫామ్ షెడ్లు, పొలం బాటలు, గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాలు, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లు, సెగ్రిగేషన్ షెడ్లు, గ్రామీణ రహదారులు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల ద్వారా చేస్తున్నామన్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థికి డెంగీ
స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ శివారు పల్లగుట్ట క్రాస్రోడ్డు సమీపంలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థికి డెంగీ జ్వరం రావడంతో ఘన్పూర్ ప్ర భుత్వ ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. చిల్పూరు మండలం మల్కాపూర్కు చెందిన ఏడో తరగతి విద్యార్థి అజయ్కుమార్ మూడురోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో పాఠశాలకు చెందిన డాక్టర్ పవన్కుమార్ ఘన్పూర్ సీహెచ్సీలో బుధవారం చూపించగా డెంగీ ఫీవర్గా గుర్తించారు. అప్రమత్తమైన ఘన్పూర్ సీహెచ్సీ వైద్యుల ఆధ్వర్యంలో పాఠశాలలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. జ్వర లక్షణాలు కలిగిన 44 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. పాఠశాల పరిసరాల్లో, విద్యార్థుల గదుల్లో దోమల నివారణ మందు స్ప్రే చేశారు. కార్యక్రమంలో ఘన్పూర్ సీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ రుబీనా, ఆర్బీఎస్కే ఎంఓ డాక్టర్ అజయ్కుమార్, సీహెచ్ఓ వెంకటస్వామి, ఎస్యూఓ శేషయ్య, ఇన్చార్జి ప్రిన్సిపాల్ రఘుపతి, పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హెల్త్క్యాంపు నిర్వహించిన వైద్యసిబ్బంది -
అమ్మో ..3లక్షలా!
లిక్కర్ షాపు లైసెన్స్ ఫీజు 50శాతం పెంపుజనగామ: రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటిస్తూ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక్కో షాపునకు లైసెన్స్ అప్లికేషన్ ఫీజు రూ.3 లక్షలుగా నిర్ణయించింది. గతంలో ఉన్న రూ.2లక్షల ఫీజుకు 50శాతం అదనపు భారం వేసింది. కొత్త ఎకై ్సజ్ పాలసీ నోటిఫికేషన్తో లిక్కర్ యజమానులు, కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునేవారు నిరుత్సాహానికి గురవుతున్నారు. జిల్లాలో 12 మండలాల పరిధిలో 47 మద్యం దుకాణాలు ఉండగా 2023–25 మద్యం పాలసీ సమయంలో వ్యాపారులు 2,356కు పైగా టెండర్లు దాఖలు చేశారు. ఇందుకు ఎకై ్సజ్ శాఖకు రూ.47.12 కోట్ల మేర ఆదాయం(నాన్ రిఫండబుల్) సమకూరింది. టెండర్ల సమయంలో ఉన్న పోటీ..మద్యం దుకాణాల్లో విక్రయాలు మొదలైన తర్వాత వ్యాపారుల్లో కనిపించలేదు. పెట్టుబడికి తగ్గట్టుగా చాలా చోట్ల వ్యాపారం లేక, నష్టం వచ్చి అమ్మకానికి ముందుకు వచ్చినా ఎవరూ కొనేందుకు సాహసించలేదు. జిల్లాలో నెలకు రూ.20కోట్ల మేర లిక్కర్, బీర్ల అమ్మకాలు జరుగుతుండగా, ఇప్పటివరకు రూ.4వందల కోట్ల వరకు వ్యాపారం జరిగింది. జనాభా ప్రాతిపదికన లిక్కర్ దుకాణాలకు ఎకై ్సజ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 5వేల జనాభా కలిగిన గ్రామాలకు రూ.50లక్షలు, 5వేల నుంచి 50వేల వరకు రూ.55లక్షలు, 50వేల నుంచి లక్ష వరకు రూ.60లక్షలు, లక్ష నుంచి 5లక్షల వరకు రూ.65లక్షలు, 5 లక్షల నుంచి 20లక్షల వరకు రూ.85లక్షలు, 20లక్షలకు పైగా జనాభా కలిగిన పట్టణాల్లో రూ.1.10కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. 2025–27 రెండేళ్ల కాలపరిమితి సమయంలో ఆరు సమాన వాయిదాలతో ఎకై ్సజ్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మద్యం దుకాణాల అమ్మ కాల సమయంలో 2023–25 లైసెన్స్ కాలంలో ఉన్న నిబంధనలు తిరిగి అమలుచేయనున్నారు. ప్రస్తుతం దుకాణాల లైసెన్స్ కాలపరిమితి నవంబర్ 30వ తేదీ వరకు ఉండగా, కొత్త పాలసీలో ఒక్కో షాపునకు టెండర్ ఫీజును రూ.3లక్షలకు పెంచడంతో వ్యాపారులు కొంతమేర నిరుత్సాహంగా ఉండగా, మునుపటి మాదిరిగా కొత్తవారు ధైర్యం చేస్తారా అనేదానిపై సందిగ్ధత కనిపిస్తుంది. ఇదిలా ఉండగా నూతన మద్యం పాలసీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయగా, ఇందుకు సంబంధించిన షెడ్యూల్ రావాల్సి ఉంది.నూతన మద్యం పాలసీలో లైసెన్స్ అప్లికేషన్ ఫీజు 50శాతం పెంచుతూ రూ.3లక్షలుగా నిర్ణయించారు. లైసెన్స్ కోసం ఇచ్చే డబ్బులను తిరిగి చెల్లించరు. నూతన లైసెన్స్ కాలపరిమితి 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండేళ్ల పాటు అమలులో ఉంటుంది. కలెక్టర్ నేతృత్వంలో మద్యం దుకాణాల కేటాయింపులను లాటరీ ద్వారా కేటాయిస్తారు. లిక్కర్ షాపుల కేటాయింపులు రిజర్వేషన్ల ప్రాతిపదికగా ఉంటాయి. జిల్లాలో 47 మద్యం దుకాణాలకు గాను రిజర్వేషన్ల ప్రకారం గౌడ కులస్థులకు 13 (15శాతం), ఎస్సీ 5(10శాతం), ఎస్టీ 1(5శాతం), జనరల్ కేటగిరీ 28 దుకాణాలుగా గతంలో మాదిరిగానే గుర్తిస్తారు. నూతన మద్యం పాలసీ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నిరుత్సాహంలో ఆశావహులు గత మద్యం పాలసీతోనే నష్టాలు వచ్చాయంటున్న వ్యాపారులు కొత్త పాలసీలో భారీ ఫీజుతో గిట్టుబాటు కష్టమేనని అభిప్రాయం -
తడిసిముద్దయిన పెసర
● వరుస వర్షాలతో పంటకు తీవ్ర నష్టం ● పరిహారం అందించాలని రైతుల వినతి పాలకుర్తి: మండలంలో వేసిన 250 ఎకరాల పెసర పంటకు వరుస వర్షాలతో తీవ్ర నష్టం జరిగింది. తమ పంటకు పూర్తిగా నష్టం జరిగిందని, న్యాయం చేయాలని రైతులు మండల వ్యవసాయాధికారులకు బుధవారం విన్నవించారు. అన్ని గ్రామాల్లో పెసర పంటకు నష్టం జరిగిందని, విస్నూరు గ్రామంలో ఏనుగ అశోక్ తాను మూడు ఎకరాల్లో వేసిన పెసర పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మండలంలో పెసర పంటకు తీవ్ర నష్టం జరిగిన విషయం వాస్తవమేనని మండల వ్యవసాధికారి శరత్ చంద్ర తెలిపారు. నష్టంపై నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు. -
బ్రిడ్జిపై లైట్లు ఏర్పాటు చేయాలి
జనగామ రూరల్: పట్టణంలోని నెహ్రూ పార్క్ నుంచి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వరకు రైల్వే క్రాసింగ్ కోసం ఏర్పాటుచేసిన బ్రిడ్జిపై లైట్లు ఏర్పాటు చేసి రాత్రిపూట ప్రమాదాలు జరగకుండా ప్రజల ప్రాణా లకు రక్షణ కల్పించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బూడిది గోపి డిమాండ్ చేశారు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశా రు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణంలో హైదరాబాద్–కాజీపేట రైల్వేలైన్ క్రాసింగ్ చేయడం కోసం బ్రిడ్జి నిర్మించారు. సరైన నిర్వహణ లేకపోవడంతో బ్రిడ్జి పాడుకావడంతో పాటు పెచ్చులూడిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సి పాలిటీ అధికారులు బ్రిడ్జిపై లైటింగ్ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. బొట్ల శేఖర్, బీరయ్య, ఎండీ అజారుద్దీన్, బూడిది ప్రశాంత్, ఉపేందర్, సుధాకర్, సౌందర్య తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా -
సోమేశ్వరాలయంలో లక్ష బిల్వార్చన
పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మినర్సింహస్వామి దేవాలయంలో శ్రావణమాసం ఉత్సవాల్లో భాగంగా మంగళవారం లక్ష బిల్వా ర్చన, కుంకుమార్చన, చండీయాగం నిర్వహించారు. అలాగే అర్చకుల వేద మంత్రోచ్చరణ మధ్య వైభవంగా ఆరుద్రోత్సవం జరిగింది. 108 లీటర్ల ఆవుపాలతో ఆభిషేకం, గర్భాలయ దీపోత్సవం, పుష్పాలంకరణ, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్శర్మ, దేవగిరి అనిల్కుమార్, మత్తగజం నాగరాజు, ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
సీఎంఆర్ లక్ష్యం చేరుకోవాలి
జనగామ: జిల్లాలో ఖరీఫ్, రబీ (2024–25) సీజన్కు సంబంధించి సీఎంఆర్ డెలివరీ నిర్ణీత గడువులోగా లక్ష్యం చేరుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం హాలులో ఖరీఫ్, రబీ 2024–25 సీఎంఆర్ డెలివరీ, రాబోవు ఖరీఫ్ 2025–26 సంసిద్ధత అంశాలపై రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్తో కలిసి కలెక్టర్ ఉన్నతాధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను అనుసరించి రైస్ మిల్లర్లు సీఎంఆర్ను నిర్ణీత సమయంలో డెలివరీ చేయాలన్నారు. 2024–25 వానాకాలం(ఖరీఫ్) సీజన్లో 18,055 మెట్రిక్ టన్నులు, యాసంగి (రబీ) 2024–25లో 80,095 మెట్రిక్ టన్నులు బియ్యాన్ని రైస్ మిల్లర్లు డెలివరీ చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుత సీజన్ వానాకాలం సీజన్లో(2025–26) వచ్చే వరి ధాన్యం కొనుగోళ్ల అంచనా లకు తగ్గట్టుగా ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకో వాలన్నారు. ఈ సమీక్షలో సివిల్ సప్లయీస్ డీఎం హథిరామ్, పౌర సరఫరాల శాఖ అధికారి సరస్వతి, డీఆర్డీఓ పీడీ వసంత, డీఏఓ అంబికాసోని, మార్కెటింగ్ డీఎం నరేంద్ర, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్, వెలిదె వెంకన్న, అశోక్, గాదె శ్రీనివాస్, దాస నర్సయ్య, జిల్లా హరికిషన్, లక్ష్మణ్, రమేశ్, సంతో ష్, దొంతుల రాజు తదితరులు ఉన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు రైస్ మిల్లర్ల సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా -
సాంకేతిక సమస్యలుంటే చెప్పండి
స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల విషయంలో ఏదైన సాంకేతిక సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని పథకంలో హౌసింగ్ పీడీ మాతృనాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని పైలట్ గ్రామంగా ఎంపికై న తానేదార్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తూ లబ్ధిదారులతో మాట్లాడారు. ఏమైన సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. నిబంధనల మేరకు త్వరగా నిర్మాణాలు పూర్తి చేసి సకాలంలో బిల్లులు పొందాలన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు బెలిదె వెంకన్న, మాజీ సర్పంచ్ గాదె చంద్రయ్య, నాయకులు దుంపల పద్మారెడ్డి, మాచర్ల కుమారస్వామి, మంతెన ఇంద్రారెడ్డి, ఆకుల కృష్ణంరాజు, దుంపల సురేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన పీడీ -
కొరత సృష్టిస్తే చర్యలు
నర్మెట: యూరియా కొరత సృష్టించినా.. అధిక ధరలకు విక్రయించినా ఫర్టిలైజర్ షాపు యజమానులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మండలకేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. రైతులతో ఫోన్లో మాట్లాడి యూరియా కొనుగోలు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులు, పరిసరాలను పరిశీలించి సిబ్బంది హాజరు పట్టికను, టీబీ, డెంగీ, మలేరియా వ్యాధిగ్రస్తులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారి ఉదయ్ కిరణ్కు సూచించారు. ఆయన వెంట డీఏఓ అంబికాసోని, తహసీల్దార్ మోహసిన్ ముజ్తాబా, ఏఓ సింగారం కరుణాకర్, ఆర్ఐ సింగారపు సాయిబాబా, ఏఈఓ సుంకరి జగదీష్ తదితరులున్నారు. రైతువేదిక ఎదుట రైతుల నిరసన తరిగొప్పుల: మండలకేంద్రంలోని కొందరు ఫర్టిలైజర్ షాపు యజమానులు కావాలనే యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని రైతులు మంగళవారం రైతువేదికలోని వ్యవసాయశాఖ కార్యాలయం ఎ దుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని రైతులకు పంపి ణీ చేయడానికి తీసుకువచ్చిన యూరియాను ఇతర మండలాలకు చెందిన రైతులకు విక్రయిస్తున్నారన్నారు. రైతులు అజ్మీర రమేష్, జాటోతు రవి, జాటోతు సమ్మయ్య, భాస్కర్ పాల్గొన్నారు. వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలి కలెక్టర్ రిజ్వాన్ బాషా -
బ్రిడ్జికి మరమ్మతు చేపట్టాలి
జనగామ రూరల్: పట్టణంలోని నెహ్రూ పార్క్ నుంచి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి వరకు కాజీపేట హైదరాబాద్ రైల్వే క్రాసింగ్ కోసం ఏర్పాటు చేసిన బ్రిడ్జి పెచ్చులూడి పోతున్నాయని, వెంటనే మరమ్మతు చేపట్టాలని సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ 38 సంవత్సరాల క్రితం నిర్మించిన బ్రిడ్జి కావడంతో పగుళ్లు ఏర్పడి పెచ్చులూడిపోతున్నాయన్నారు. ముఖ్యంగా మెట్లదారులు కూలిపోయి శిథిలావస్థలో ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి ముందు లైట్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి మరమ్మతు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండీ హజారుద్దిన్, మంగ బీరయ్య, బండ సౌందర్య, గాజుల నాగరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
జనగామ రూరల్: వర్షాకాలంలో సీజనల్ వాధ్యులు ప్రబలే అవకాశం ఉందని ప్రతీఒక్కరు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు అన్నా రు. మంగళవారం పట్టణంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా గర్భిణులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారులకు సీజనల్ వ్యాధులు, ము ఖ్యంగా డెంగీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, లార్వా పెద్ద దోమలను నిర్మూలించే చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం ఆ స్పత్రిలోని రిజిస్టర్లు, రికార్డ్లు పరిశీలించారు. డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు -
నిడిగొండ సొసైటీలో శఠగోపం
రఘునాథపల్లి: మండలంలోని నిడిగొండ ప్రాథమి క వ్యవసాయ సహకార సంఘంలో భారీ అవినీతి బహిర్గతమైంది. రైతులకు తెలియకుండా వారి పేరిట రుణాలు తీసుకోవడంతో పాటు రుణమాఫీ కోసం ప్రభుత్వానికి తప్పుడు వివరాలు పంపి కోట్లాది రూపాయలు కొల్లగొట్టే కుట్ర బయటపడింది. ఉన్నతాధికారుల విచారణలో రూ.39 లక్షలు దుర్వినియోగమైనట్లు నిర్ధారణ అయింది. దీంతో సొసైటీ మాజీ సీఈఓ పెద్దగోని వెంకటరాజయ్య, అతని కుమారుడు పెద్దగోని రాజ్కుమార్లపై రఘునాథపల్లి పోలీస్స్టేషన్లో కోఆపరేటివ్ విభాగం అసిస్టెంట్ రిజిస్టార్ వేముల వేణుగోపాల్ మంగళవారం ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపిన వి వరాల ప్రకారం.. నిడిగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 11 గ్రామాల పరిధిలో 3,760 మంది సభ్యులున్నారు. 2024 సంవత్సరంలో ప్రభుత్వం రుణమాఫీ రైతుల అర్హుల జాబితా కో రింది. గతంలో సొసైటీ సీఈఓలుగా పని చేసిన తండ్రీకొడుకులు వెంకటరాజయ్య, రాజ్కుమార్లు సొసైటీ నుంచి 554 మంది రుణాలు తీసుకున్నార ని, వారి ఆధార్ నంబర్లతో సహ రుణమాఫీ కోసం ప్రభుత్వానికి పంపారు. ఆ జాబితాలో 36 మంది రైతులు మాత్రమే అర్హులు కాగా ..తనిఖీలో 518 మంది రైతు రుణాలు తీసుకున్నారన్నది నకిలీవిగా గుర్తించారు. 518 మంది పేరిట రూ 2,31,89,605 లను మోసపూరితంగా తీసుకోవాలని సర్కారుకు వివరాలు పంపినట్లు అంతర్గత విచారణలో తేలింది. వెంకటరాజయ్య రైతులకు తెలియకుండా వారి పేర్లతో (బినామీ పేర్లతో) రూ.7,09,266 అప్పు తీసుకున్నట్లు గుర్తించారు. విచారణ నివేదికలోని విషయాలను జతపరుస్తూ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. తండ్రి పదవీవిరమణ.. కొడుకు కార్యదర్శి సహకార సంఘం కార్యదర్శిగా పని చేసిన వెంకటరాజయ్య జూన్ 30, 2016న పదవీ విరమణ చేశారు. ఆయన కొడుకు రాజ్కుమార్ను కార్యదర్శిగా నియమించారు. సంస్థలో వెంకటరాజయ్య తాత్కాలిక ఉద్యోగిగా తనకు తానే నియమించుకొని సంఘం ఆర్థిక లావాదేవీలు చూస్తున్నారు. తండ్రీకొడుకులు నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో సీఈఓ రాజ్కుమార్ను డీసీ ఓ సస్పెండ్ చేశారు. ఫిర్యాదుల పరంపర నేపధ్యంలో డీసీఓ ఆదేశాలతో అసిస్టెంట్ రిజిస్టార్ దివ్య విచారణ నిర్వహించారు. భారీగా ఆర్థిక దుర్వినియోగం జరిగినట్లు తేల్చారు. విచారణలో గుర్తించిన అంశాలు.. చిన్నం మల్లయ్య పేర రూ.1.06,146, దొరగొల్ల సత్తయ్య రూ.48,177, కుక్కల యాదయ్య రూ.48, 093, మద్దూరి మల్లయ్య రూ. 54,029, మద్దూరి రాజు రూ.1.08,745, నీల సదయ్య రూ.90,000, నీల యాకయ్య రూ. 55,000, పొరెడ్డి మోహన్రెడ్డి రూ.1,12,149 పేర్లపై రుణాలు తీసుకొని దుర్విని యోగం చేశారు. పైగా వెంకటరాజయ్య జూన్ 30, 2016న పదవీ విరమణ చేయగా.. అధికారుల అ నుమతి లేకుండా (ఉత్తర్వులు) జూలై 1, 2016 నుంచి జనవరి 31, 2024 వరకు రూ.11.37 లక్షలు వేతనంగా తీసుకున్నారు. మహేందర్ అనే రైతు రు ణం చెల్లింపు కోసం రూ.30 వేలు చెల్లించగా ఖా తాలో జమ చేయలేదు. ఎరువులు అమ్ముకొని రూ. 5,39,915, దుర్వినియోగం, ఓచర్స్ లేకుండా రూ. 3, 51,057 లక్షలు ఖర్చు చేసినట్లు విచారణలో వెల్ల డైంది. ఇలా తండ్రీకొడుకులు కలిసి రూ.39,13, 048 నిధులు దుర్వినియోగం చేసినట్లు తేల్చారు. -
శాంతిభద్రతల పరిరక్షణలో ముందుండాలి
తరిగొప్పుల: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ముందుండాలని ఏఎస్పీ చేతన్ నితిన్ అన్నారు. మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు, సిబ్బంది కిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులో ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలన్నారు. నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో గంజాయి విక్రయిస్తే సమాచారం అందించాలన్నారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా పోలీస్స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీఐ అబ్బయ్య, ఎస్సై గుగులోతు శ్రీదేవి, ఏఎస్సై కాసర్ల రాజయ్య సిబ్బంది పాల్గొన్నారు. ఏఎస్పీ చేతన్ నితిన్ -
పాఠశాలల బలోపేతానికి కృషి
స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి స్వచ్ఛంద సంస్థలు కృషి చేయడం అభినందనీయమని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ అన్నారు. ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లు ఉన్నత పాఠశాలలో ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల దత్తత, విద్యార్థులకు నేత్ర వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఏఎంఓ హాజరై మాట్లాడారు. పిల్లలకు కంప్యూటర్, సైన్స్ల్యాబ్, స్పోకెన్ ఇంగ్లిష్, మోటివేషన్ తదితర అంశాలపై దృష్టి సారించడం ద్వారా విద్యార్థుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. అనంతరం వాసన్ ఐ ఆస్పత్రి వారిచే విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా అప్ గ్రేడ్ మైక్లాస్ రూమ్ సంస్థ సహకారంతో అవసరమైన విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ కొమురయ్య, ఎర్త్ ఫౌండేషన్ ఫౌండర్ కలవేణి శ్రీనివాస్, డైరెక్టర్ వెన్నెల, కోఆర్డినేటర్లు రాజు, ఆంజనేయులు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తులతో పోటెత్తిన సోమేశ్వరాలయం
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు, అర్చనలు, కొడె మొక్కులు చెల్లించుకున్నారు. 23 నుంచి క్రీడాపోటీలు జనగామ: గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23, 24 తేదీల్లో పురుషులు, మహిళలకు క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి వెంకట్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో 23న పురుషులకు వాలీబాల్, 24న మహిళలకు త్రో బాల్ పోటీలు జరుగుతాయన్నారు. వాలీబాల్ పోటీలకు14 సంవత్సరాల పైబడి, ఒకే గ్రామానికి చెందిన వారు ఉండాలన్నారు. త్రోబాల్లో 13 నుంచి 21 సంవత్సరాల లోపు ముగ్గురు, 21 సంవత్సరాల పైబడి మిగతా వారు ఉండాలన్నారు. విజేతలకు నగదు పురస్కారం ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 8099724409, 9849298108 నంబర్లను సంప్రదించాలన్నారు. 22వ తేదీ నుంచి సదరం స్లాట్ బుకింగ్జనగామ రూరల్: సదరం యూడీఐడీ క్యాంపునకు హాజరయ్యే దివ్యాంగులు ఈ నెల 22 నుంచి మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వసంత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 22 నుంచి 29వ తేదీ వరకు లెప్రసీ, యూసిడ్ బాధితులు, వినికిడి లోపం, కంటి చూపు కోల్పోయిన వారు, తలసేమియా, నరాల బలహీనత తదితర రుగ్మతలతో బాధ పడుతున్న దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 8008202287 నంబర్లో సంప్రదించాలన్నారు. విద్యుత్ వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలి● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ జనగామ: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎ న్పీడీసీఎల్ ఎస్ఈ టి.వేణుమాధవ్ అన్నారు. సోమవారం సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తడిబట్టలు, చేతులతో విద్యుత్ తీగలు, స్విచ్లను తాకవద్దని, వర్షపు నీటితో తడిసిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రిక్ తీగలు, ఇతర పరికరాలను ముట్టుకోవద్దని సూచించారు. ఇళ్లలో బట్టలు ఆరవేసే సమయంలో ఐరన్ వైర్కు బదులుగా ప్లాస్టిక్ను ఉపయోగిస్తే మేలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో విద్యుత్ తీగలు తెగి పడినట్లు గమనిస్తే వెంటనే టోల్ ఫ్రీ 1912 నంబర్కు సమాచారం అందించాలన్నారు. వ్యవసాయ పొలాలు, ఇంట్లో వినియోగదారులు, రైతులు సొంతంగా కరెంటు పనులు చేసుకోవద్దని, అర్హత కలిగిన వారితో మాత్రమే మరమ్మతు చేయించాలన్నారు. కురుమలు ‘స్థానికం’లో సత్తాచాటాలిరఘునాథపల్లి: కురుమ కులస్తులు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచ రాములు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని కురుమ సంఘం కార్యాలయంలో పేర్ని రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వర్షాల నేపధ్యంలో గొర్రెల పెంపకందారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్, మాజీ జెడ్పీటీసీ బొల్లం అజయ్, నాయకులు గొరిగ రవి, గుండా వెంకటయ్య, మల్లేష్, యాకయ్య, మహేందర్, సోమయ్య, శ్రీశైలం, భద్రయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. 28న దివ్యాంగుల గుర్తింపు జనగామ: సమగ్ర శిక్ష జనగామ ఆధ్వర్యంలో ఈనెల 28న దివ్యాంగుల గుర్తింపుతో పాటు ప్రత్యేక అవసరాలకు అవసరమయ్యే పరికరాల పంపిణీకి క్యాంపు నిర్వహించబడుతుందని డీఈఓ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. 18 సంవత్సరాలలోపు వయస్సు గల ది వ్యాంగులు తమ ఆధార్, యూడీఐడీ, రేషన్ కా ర్డు, సదరం సర్టిఫికెట్, రెండు ఫొటోలతో క్యాంపునకు హాజరుకావాలన్నారు. క్యాంపు నిర్వహించే స్థలం త్వరలో తెలియజేస్తామన్నారు. -
సమస్యల పరిష్కారమేది?
జనగామ రూరల్: ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులకు మోక్షమెప్పుడోనని బాధితులు వాపోతున్నా రు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని పలు ప్రాంతా ల నుంచి బాధితులు వినతులు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్బాషా అదనపు కలెక్టర్ పింకేష్కుమార్, ఉన్నతాధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన స మావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రీవెన్స్లో వచ్చి న వినతులు సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 34 వినతులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. వినతులు కొన్ని ఇలా.. ● జనగామ మండలం చౌడారం గ్రామానికి చెందిన యాసారపు రవికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విన్నవించారు. ● చిల్పూరు మండలం పల్లగుట్టకు చెందిన దారా ఝాన్సీ డబల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ● దేవరుప్పుల మండలం రామచంద్రాపురం గ్రామంలో 2022–23 సంవత్సరంలో నిర్మించిన డ్రెయినేజీ నాసిరకం పనులతో నిర్మించారని, నాణ్యతప్రమాణాలు పరిశీలించి చర్య తీసుకోవాలని సుధాకర్రెడ్డి, ఇన్నారెడ్డి, రమేశ్, ఆంజనేయులు ఫిర్యాదు చేశారు. ● జనగామ, పాలకుర్తి రహదారిలోని పటేల్ గూడెం వాగు వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిర్ర వీరస్వామి కలెక్టర్కు వినతి అందించారు. ● నీర్మాల గ్రామానికి చెందిన మేడ కల్పనకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని వినతి అందించింది. వినతులు తక్షణమే పరిష్కరించాలి కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రజావాణికి 34 అర్జీలు -
రోడ్డుపై నిలిచిన నీరే..గొంతు తడిపింది..
జనగామ: దాహంతో అలమటిస్తున్న ఓ అనాథ.. రోడ్డుపై నిలిచి ఉన్న నీటితో గొంతు తడుపుకున్నాడు. జీవులు చివరకు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు రోడ్డుపై నిలిచే వరద, మురికి నీటితో గొంతు తడుపుకునే దృశ్యం ప్రతీఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. వరద నీటితో దాహం తీర్చుకునే పరిస్థితి, సమాజం సిగ్గుపడేలా చేస్తుంది. మనిషి ప్రాథమిక హక్కు కరువైన సమయంలో మిగిలేది మురికి నీరు అనే సామెత నిజమైంది. గుక్కెడు నీటి కోసం తండ్లాడిన ఓ నిరాశ్రయుడు రోడ్డుపై నిలిచిన కలుషితమైన వర్షం నీటితో గొంతు తడుపుకునే దృశ్యం కన్నీళ్లు పెట్టించిన సంఘటన జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మంతెన మణికుమార్, కొయ్యడ రవి, ముఖ్య సలహాదారులు వంగ భీమ్ రాజు అనాథను తీసుకు వెళ్లి, మినరల్ వాటర్తో దాహం తీర్చారు. పట్టణంలో అనాథల ఆకలి, దాహం తీర్చేందుకు ప్రత్యేక క్యాంటిన్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషాకు విజ్ఞప్తి చేశారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
జనగామ: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టర్ సమావేశ హాల్లో భారీ వర్షాలు, సీజనల్ వ్యాధులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై ఆయాశాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలతో శిథిలావస్థకు చేరి, కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాల నుంచి ఆయా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు చేరవేయాలన్నారు. వాగులు, కల్వర్టుల వద్ద వరద పోటెత్తిన సమయంలో ప్రజలకు జాగ్రత్తలు చెబుతూనే వారు అటువైపు రాకుండా నియంత్రించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మురుగు కాల్వల్లో ఆయిల్ బాల్స్ వేయడంతో పాటు దోమల నివారణకు ఫాగింగ్ చేయించాలన్నారు. డెంగీ, చికున్ గున్యా, మలేరియా వంటి జ్వరాలు రాకుండా ఇంటింటా ఫీవర్ సర్వే చేపట్టాలన్నారు. అత్యవసర సమయంలో ప్రజలు 9052308621 నంబర్కు సమాచారం అందించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఆర్డీఓ గోపి రామ్, డిప్యూటీ కలెక్టర్లు కొమురయ్య, సుహసిని, డీఆర్డీఓ పీడీ వసంత, డీపీఓ స్వరూప, జిల్లా అధికారులు పాల్గొన్నారు. యూరియా కొరత లేదు.. జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. యూరియా, ఎరువుల లభ్యతపై రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం కలెక్టర్లతో హైదరాబార్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అనంతరం ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. అక్కడ నుంచి డీసీపీ రాజమహేంద్రనాయక్, డీఏఓ కె.అంబికాసోనీతో కలిసి పట్టణంలోని పలు ఎరువులు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ఎక్కడ యూరియా కొరత లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో 1273.935 మెట్రిక్ టన్నుల యూరియా, 245.65 మెట్రిక్ టన్నుల డీఏపీ మార్క్ఫెడ్ వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు ఒకే దుకాణం వద్ద రద్దీ లేకుండా, వేర్వేరుగా కొనుగోలు చేసేలా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. యూరి యా కొనుగోలులో సమస్యలు ఉత్పన్నమైతే 8977 745512 నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
పాపన్న పోరాట స్ఫూర్తితో పనిచేస్తున్నాం..
రఘునాథపల్లి: బహుజన వీరుడు సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం ఖిలాషాపూర్లో గౌడ సంఘం నాయకులు గడ్డమీది వెంకన్న అధ్యక్షతన జరిగిన పాపన్న జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. పాపన్న చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. గోల్కొండ కోటపై జెండా ఎగుర వేసిన బహుజనుల పోరాట యో ధుడు పాపన్న అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాపన్న జయంత్రి వేడుకలు అధికారికంగా నిర్వహించడంతో పాటు హైదరాబాద్లో పాపన్న విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్రెడ్డి భూమి పూజ చేశారన్నారు. అంతకుముందు బస్టాండ్ వద్ద ఉన్న పాపన్న విగ్రహానికి పూలమాల వేశారు. అలాగే ఖిలాషాపూర్ ఉన్నత పాఠశాలలో పీఎంశ్రీ, అటల్ టింకరింగ్ ల్యాబ్ను ప్రారంభించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మాజీ జెడ్పీటీసీలు లింగాల జగదీష్చందర్రెడ్డి, బొల్లం అజయ్, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, తహసీల్దార్ ఫణికిషోర్, ముప్పిడి శ్రీధర్, కోళ్ల రవి, తదితరులు పాల్గొన్నారు. పాపన్న ఆశయాలను భావితరాలకు తెలియజేయాలి జనగామ రూరల్: సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను భావితరాలకు తెలిసేలా కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్లో పాపన్న జయంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాపన్న చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి రవీందర్, ఎకై ్సజ్ శాఖ అధికారి అనిత, బీసీ కుల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ఓపీఎస్ అమలు చేయాలి
జనగామ: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వెంటనే అమలు చేయాలని కోరుతూ వచ్చే నెల 1న మహాధర్నా తలపెట్టినట్లు పీఆర్టీయూ సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్ల మహిపాల్రెడ్డి, టీజీఈ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఖాజీ షరీఫ్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మహాధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ అసంబద్ధమైన సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందు పరిచిన విధంగా సీపీఎస్ను రద్దు చేసి, మాట నిలబెట్టుకోవాలన్నారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం పురస్కరించుకుని చేపట్టే మహాధర్నాలో సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు కొర్నేలియస్, ఆంజనేయులు, బొగ్గారపు శ్రీనివాస్, సీతారామయ్య, మహిపాల్ రెడ్డి, మర్యాల రమేష్, బీకోజపీ, అంబటి నగేష్, నరేందర్, లక్ష్మణ్, బాబు, పుల్లారెడ్డి, మధుసూదన్ తదితరులు ఉన్నారు. -
ఎరువుల కొరత సృష్టించొద్దు
బచ్చన్నపేట: ఎరువుల కొరత సృష్టించొద్దని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలో ఆగ్రోస్ ఎరువుల దుకాణాన్ని, పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ రైతులు కొనుగోలు చేసిన ఎరువులకు రశీదు అందించాలన్నారు. స్టాక్ బోర్డు తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. పీఎస్కు వచ్చిన ఫిర్యాదులు వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి విద్యాకర్రెడ్డి, ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ -
ఇక్కడ ఇలా.. అక్కడ అలా!
జనగామ: కరువు కేరాఫ్ అడ్రస్గా ఉన్న జనగామ జిల్లాపై వరణుడు అలక బూనినట్టు కనిపిస్తున్నాడు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసినా.. మోస్తరు కురిసింది. గడచిన ఐదు రోజుల్లో ఒక్క భారీ వర్షం కురియలేదు. రెడ్ అలర్ట్ జారీ చేయగా, వరణుడు తుస్సు మనిపించగా, ఆరెంజ్ అలర్ట్గా ప్రకటించినా.. వాతావరణ శాఖ అంచనాలను తలకిందులు చేశాడు. చివరకు ఎల్లో అలర్ట్ జాబితాకు వచ్చినా మోస్తరు వాన నమోదు కాలేదు. రాష్ట్రం నలుమూలలా వర్షాలు కురుస్తున్నప్పటికీ, జిల్లాలో ఆ ప్రభావం అంతగా కనిపించడం లేదు. ఇందులో జనగామ నియోజకవర్గంలో మరీ దారుణంగా మారింది. జిల్లాలో 955 చెరువులు.. 248 చోట్ల మత్తళ్లు జిల్లాలో 955 చెరువులు ఉన్నాయి. ఇందులో 159 చోట్ల 25 శాతం నిండగా, 261 చెరువుల్లో 50 శాతం, 143 చోట్ల 75 శాతం, 230 చెరువుల్లో 75 నుంచి 100 శాతం వరద నీరు చేరుకోగా, 160 చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. అల్పపీడన ప్రభావం, రుతు పవనాల ఎఫెక్టు కలిసినా జనగామ నియోజకవర్గంలో వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. నియోజకవర్గంలో నేటికి బోరుబావులు గ్యాబ్ ఇస్తున్నాయి. ఈ ప్రాంతంలో 249 చెరువులు ఉండగా, 113 చోట్ల 25 శాతం మాత్రమే నీటి శాతం ఉన్నట్లు లెక్కించారు. ఇందులో కొన్ని చోట్ల జీరో శాతం ఉండడం ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. ఈ మండలాల పరిధిలో కేవలం 15 చెరువులు మాత్రమే మత్తళ్లు పోస్తున్నాయి. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలో 314 చెరువులకు గాను 14 చోట్ల 25 శాతం నీరు మాత్రమే ఉండగా, 73 చెరువులు మత్తడి పోస్తున్నాయి. 137 గ్రామాల్లో 75 నుంచి 100 శాతం వరకు నిండాయి. పాలకుర్తి నియోజకవర్గంలో 392 చెరువులకు గాను 69 చోట్ల మత్తడి పోస్తుండగా, ఒక చెరువులో 25 శాతం మాత్రమే నీటి జాడలు ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. 364 చెరువులు మాత్రం 75 నుంచి 100 శాతం వరకు నిండాయి. పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నప్పటికీ, జనగామలో మాత్రం ఇంకా కరువు ఛాయలు పోలేదని చెప్పుకోవచ్చు. జిల్లాలో అత్యధికంగా రఘునాథపల్లిలో 26, చిల్పూరులో 16, జఫర్గఢ్లో 13, నర్మెటలో 7 చెరువులు 100 శాతం నిండగా, జనగామ, బచ్చన్నపేట, తరిగొ ప్పుల, స్టేషన్ఘన్పూర్, లింగాలఘణపురం, దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల ప్రాంతాల్లో అతి తక్కువ చెరువులు మత్తడి పోస్తున్నాయి. ఇదిలా ఉండగా గండిరామారం రిజర్వాయర్లో నీటి మ ట్టం తగ్గుముఖం పట్టగా, కన్నెబోయినగూడెం ప్రా జెక్టులో జీరో పర్సంటేజ్ కూడా పెరగలేదు. రాష్ట్రమంతటా విస్తారంగా కురుస్తున్నా.. జిల్లాలో అంతంతే! పెరగని భూగర్భ జలాలు భారీ వర్షాలు కురుస్తేనే మేలంటున్న అన్నదాతలు జిల్లాలో 248 చెరువులే మత్తళ్లుతేదీ వర్షపాతం నమోదు 12 16.2 13 0.4 14 11.6 15 13.7 16 9.2 17 33.0 18 1.1 -
ఇంకా ‘ఇన్స్పైర్’ కాలేదు!
విద్యారణ్యపురి: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇన్స్పైర్ అవార్డు మనక్ చక్కటి వేదికగా నిలుస్తోంది. విద్యార్థులు భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో.. భాగంగా శాస్త్రసాంకేతిక శాఖ (డీఎస్టీ), నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) ద్వారా ప్రతి సంవత్సరం ఇన్స్పైర్ అవార్డుల మనక్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, వివిధ గురుకులాల్లోని ఆరో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థుల మేధస్సుకు పదును పెడుతోంది. 2025–26 విద్యాసంవత్సరంలో ఒక్కో పాఠశాలల నుంచి ప్రాజెక్టుల రూపకల్పనకు ఐదు చొప్పున నామినేషన్లు స్వీకరిస్తున్నారు. జూన్ 15 నుంచి ఆగస్టు 15 వరకు మహబూబాబాద్ జిల్లా మినహా మిగిలిన ఐదు జిల్లాల్లో విద్యార్థులతో నామినేషన్లు చేయించేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పెద్దగా ఆసక్తి చూపలేదు. మహబూబాబాద్ జిల్లా 789 నామినేషన్లతో రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. సెప్టెంబర్ 15 వరకు గడువు ఉండడంతో ఇంకా నామినేషన్లు పెరిగే అవకాశం ఉంది. సైన్స్ టీచర్లు ఎక్కువగా శ్రద్ధ వహిస్తేనే.. ఉమ్మడి జిల్లాలోని డీఈఓలు, జిల్లా సైన్స్ అధికారులు ఇప్పటికే అన్ని యాజమాన్యాల పాఠశాలల హెచ్ఎంలతో సమావేశాలు నిర్వహించారు. ఇన్స్పై ర్ అవార్డులకు నూతన ఆవిష్కరణల ప్రాజెక్టులతో విద్యార్థులతో నామినేషన్లు చేయించాలని ఆదేశించారు. నామినేషన్లు చేయించేందుకు ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునేందుకు స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో టెక్నికల్ టీంలు కూడా ఏర్పాటుచేశారు. పాఠశాలల్లో ఐడియా బాక్స్లను ఏర్పాటు చేయాలని ఆదేశించినా ఆ దిశగా అడుగు ముందుకు పడలేదు. ప్రధానంగా సైన్స్ టీచర్లు ఎక్కువగా శ్రద్ధ వహిస్తే నామినేషన్లు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. హెచ్ఎంలు, టీచర్లలో కొంత నిర్లిప్తత కూడా కారణమని తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో మాత్రం డీఈఓ, సైన్స్ అధికారి ప్రత్యేక దృష్టిసారించడంతో నామినేషన్లు బాగా అయ్యాయని తెలుస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ఇలా.. హెచ్టీటీపీఎస్//డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్స్పైర్అవార్డ్స్–డీఎస్టీ.గౌట్.ఇన్ ద్వారా లేదా గూగుల్ ప్లేస్లోర్లో ఇన్స్పైర్ మనక్యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. స్కూల్ అథారిటీ ద్వారా యూజర్ ఐడీ, పాస్వర్డ్తో లాగిన్ అయ్యి విద్యార్థుల ఆవిష్కరణ వివరాలను నమోదు చేయడంతోపాటు నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. పాఠశాలల హెచ్ఎంలు, గైడ్ టీచర్ల సహకారంతో విద్యార్థులతో ప్రాజెక్టులకు సంబంధించి నామినేషన్లు పంపించవచ్చు. ఇన్స్పైర్ నామినేషన్కు కావాల్సినవి.. విద్యార్థి సృజనాత్మక ఆలోచన లేదా ప్రాజెక్టు సంక్తిప్త నివేదిక రెండువేల పదాలకు మించకూడదు. విద్యార్థి ఆధార్ కార్డుతో అనుసంధానించిన ఏదైనా జాతీయ బ్యాంకు లేదా పోస్టాఫీస్ ద్వారా జారీచేసిన పొదుపు ఖాతా పాస్పుస్తకం, విద్యార్థి పాస్ఫొటో, వివరాలు, ఫోన్నంబర్, గైడ్ టీచర్ వివరాలు కూడా ఉండాలి. ఎంపికై తే ఒక్కో విద్యార్థి నామినేషన్కు రూ.10 వేలు.. ఇన్స్పైర్ అవార్డుకు ప్రాజెక్టు రూపకల్పన చేసి వెబ్సైట్ ద్వారా పంపితే ఎంపికై న విద్యార్థికి రూ. 10వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. విద్యార్థి వినూత్న ఆవిష్కరణలకు సంబంధించి నమూనా రూపొందించేందుకు, ప్రయాణ ఖర్చులకు ఈ డబ్బులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. జిల్లాస్థాయిలో ఇన్స్పైర్ అవార్డుల ప్రాజెక్టులకు సంబంధించిన నమూనా ప్రదర్శనలు నవంబర్లో నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయి ఇన్స్పైర్, ఇందులో ప్రతిభ కనబరిస్తే జాతీయస్థాయికి అవకాశం ఉంటుంది. అక్కడ ప్రతిభ కనబరిస్తే జపాన్ వంటి దేశాల పర్యటనకు ఎంపిక చేస్తారు. అలా ఎంపికై న వారికి రూ.25వేల పారితోషికం కూడా అందజేస్తారు.జిల్లాల వారీగానామినేషన్ల వివరాలు..జిల్లా నామినేషన్ల సంఖ్య మహబూబాబాద్ 789 హనుమకొండ 30 వరంగల్ 45 ములుగు 30 భూపాలపల్లి 10 జనగామ 25 ‘ఇన్స్పైర్ మనక్’ అవార్డుల నామినేషన్లు వేయించేందుకు పెద్దగా ఆసక్తి చూపని హెచ్ఎంలు, టీచర్లు 789తో మహబూబాబాద్ రాష్ట్రంలోనే మొదటి స్థానం మిగిలిన జిల్లాల్లో తక్కువగా వేసిన విద్యార్థులు -
తిరుగుపయనం
● ముగిసిన సెలవులు ● రద్దీగా మారిన ఆర్టీసీ బస్టాండ్శ్రీకృష్ణజన్మాష్టమి, శ్రావణమాసం పర్వదినం బోనాల జాతర, అంతకుముందు వానల నేపథ్యంలో ప్రభుత్వ సెలవుల నేపథ్యంలో గ్రామాలకు వచ్చిన విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు తిరుగుపయనమయ్యారు. ఆదివారం ఒక్కసారిగా జనగామ ఆర్టీసీ బస్టాండ్తోపాటు బచ్చన్నపేట, రఘునాథపల్లి, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ తదితర మండలాల పరిధిలోని బస్టాప్లు ప్రయాణికులతో నిండిపోయాయి. ఉప్పల్, జగద్గిరిగుట్ట, మేడిపల్లి, చింతల్, లింగంపల్లి, కూకట్పల్లి, ఎల్బీనగర్, హనుమకొండ తదితర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఒక్కో బస్సులో 110 మందికి పైగా కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వచ్చింది. కొంతమంది ప్రయాణికులు సీటులేక గమ్యస్థానం చేరుకునే వరకు నిల్చునే ఉన్నారు. – జనగామ -
సాక్షి ఫొటోగ్రాఫర్లకు రాష్ట్రస్థాయి అవార్డులు
హన్మకొండ కల్చరల్/జనగామ: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాక్షి ఫొటోగ్రాఫర్లను రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక చేశారు. వరంగల్కు చెందిన సాక్షి సీని యర్ స్టాఫ్ ఫొటోగ్రాఫర్ పెద్దపల్లి వరప్రసాద్, జనగామ ఫొటోగ్రాఫర్ గోవర్ధనం వేణుగోపా ల్ ఉత్తమ వార్త చిత్రాల పోటీల్లో బహుమతులకు ఎంపికయ్యారు. తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో వారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలి జనగామ రూరల్ : గణపతి నవరాత్రుల సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టంగా చేయాలని గణేష్ ఉత్సవ సమితి కమిటీ జిల్లా అధ్యక్షుడు మంచాల రవీందర్, విశ్వహిందూ పరిషత్ జిల్లా నాయకులు రంగ నర్సింగరావు కోరారు. ఆదివారం స్థానిక నెల్లుట్ల చెరువును వారు సందర్శించారు. నిమజ్జన కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తల్తెకుండా చూడాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు జనగామ: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో జిల్లా వ్యాప్తంగా ముసురు వాన కురుస్తోంది. ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9 వరకు జిల్లాలో సరాసరి 12.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వివిధ మండలాల పరిధిలో ఉదయం నుంచి విడతలవారీగా కురుస్తున్న వర్షం.. పట్టణంలో రాత్రి ముసురుతో మొదలైంది. స్టేషన్ఘన్పూర్ మండలం తాటికొండ లొకేషన్ పరిధిలో 48 మిల్లీ మీటర్లు కురియగా, నర్మెటలో 42.5 మి.మీ, స్టేషన్ఘన్పూర్లో 33.0 మి.మీ, జఫర్గఢ్లో 27.3 మి.మీ, తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారం లొకేషన్లో 16.0 మి.మీ, కొడకండ్లలో 10.3 మి.మీ, పాలకుర్తి మండలం గైడూరు లొకేషన్లో 8.0మి.మీ, దేవరుప్పులలో 4.3 మి.మీ, జనగామలో 4.0 మి.మీ, లింగాలఘనపురంలో 3.5 మి.మీ, రఘునాథపల్లిలో 1.8 మి.మీ, బచ్చన్నపేటలో 1.8 మిల్లీ మీటర్ల మేర కురియగా.. రాత్రి 10 గంటల తర్వాత కొంత మేర పెరిగింది. రామప్ప శిల్పకళ మరుపురానిది.. వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ సంపద మరుపురానిదని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ సామ్ కోషి కొనియాడారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులు సందర్శించారు. ఈ సందర్భంగా రామప్ప రామలింగేశ్వరస్వామిని శ్రీనివాస్రావు దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి జస్టిస్ శ్రీనివాస్రావుకు గైడ్ విజయ్కుమార్, జస్టిస్ సామ్ కోషికి గైడ్ వెంకటేశ్లు వివరించారు. ఈ సందర్భంగా వారు శిల్పకళ సంపద బాగుందని వివరించారు. వారి వెంట ములుగు జిల్లా జడ్జి సూర్య చంద్రకళ, భూపాలపల్లి జడ్జి దిలీప్కుమార్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సదానందం, ములుగు డీఎస్పీ రవీందర్, సీఐ సురేష్, ఎస్సై చల్ల రాజు ఉన్నారు. బీసీ ముస్లింలకు రిజర్వేషన్లు అందాలి న్యూశాయంపేట: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బీసీ ముస్లింలకు రిజర్వేషన్ ఫలాలు అందాలని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ అన్నారు. హనుమకొండ ములుగురోడ్డులోని ముస్లిం కమ్యూనిటీ సెంటర్లో బీసీ ముస్లిం ఏ, బీ, ఈ గ్రూప్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ డాక్టర్ రాజ్మహ్మద్ అధ్యక్షతన ఆదివారం జరిగిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికీ బీసీ ముస్లింలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. వరంగల్ నుంచి హక్కుల సాధన కోసం బీసీ ముస్లింల ఓ అడుగు ముందుకు పడడం హర్షించదగ్గ విషయమన్నారు. ముఖ్యఅతిథిగా రావాల్సిన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు ఫోన్లో తమ మద్దతు తెలిపారు. -
ఘనంగా తీజ్ వేడుకలు
● భక్తి శ్రద్ధలతో బంజారాల పండగ ● ఉత్సాహంగా పాల్గొన్న యువతులు జనగామ: జిల్లాలో తీజ్ ఉత్సవాలను బంజారాలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు, యువతులు, చిన్నారులు కొత్త బట్టలు ధరించి, రంగు రంగుల పూలతో అలంకరించుకున్న ఊయలల వద్ద భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. తొమ్మిది రో జులపాటు జరుపుకునే తీజ్ ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన తీజ్ ఉత్సవాల్లో బంజా రా ఆడబిడ్డలు ఉత్సాహంగా పాల్గొని గోధుమలను బుట్టల్లో చల్లి భక్తిని చాటుకున్నారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్ట ణ మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాటలు పాడుతూ, ఊయల ఆడుతూ ఆనందంగా గడిపారు. మహిళలు పరస్పరం తాంబూలాలు పంచుకుంటూ, మిఠాయిలు, పిండి వంటలు స మర్పించారు. కుటుంబం సుఖశాంతులతో నిండాలని కోరుకుంటూ తీజ్ ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. వేడుకల్లో 2వ వార్డు మాజీ కౌన్సి లర్ వాంకుడోతు అనిత, డాక్టర్ స్వప్న రాథోడ్, మంజుల, మమత, భారతి, కవిత, వరలక్ష్మి, లలిత, విజయ, పుష్ప, ప్రమీల, వరలక్ష్మి, విమల, సునీత, నవనీత, రేనా తదితరులు పాల్గొన్నారు. కడగుట్ట తండాలో.. కొడకండ్ల : మండలంలోని కడగుట్ట తండా పరిధిలోని దుబ్బతండాలో ఆదివారం తీజ్ వేడుకలను గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. తండా పెద్ద బానోత్ హుస్సేన్నాయక్ ఆధ్వర్యంలో గిరిజన యువతులు ఆచార సాంప్రదాయాలకనుగుణంగా వేడుకలను నిర్వహించారు. -
నామినేషన్లు పంపించాలి..
ఇన్స్పైర్ అవార్డులకు నామమాత్రంగానే నామినేషన్లు పంపారు. విద్యార్థుల్లోని ప్రతిభ వెలికితీసేందుకు ఒక చక్కటి వేదిక ఇన్స్పైర్ అవార్డు మనక్. అన్ని యాజమాన్యాల పాఠశాలలు తమ విద్యార్థులను ప్రోత్సహించాల్సింటుంది. అందుకు ఒక ఐడియాతో ప్రాజెక్టుకు సంబంధించి సంక్షిప్తంగా వివరాలు పంపించాలి. హెచ్ఎంలు, టీచర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి సెప్టెంబర్ 15లోగా విద్యార్థులతో నామినేషన్లు పంపాలి. – ఎస్.శ్రీనివాసస్వామి, హనుమకొండ జిల్లా సైన్స్ అధికారి● -
సోమేశ్వరాలయంలో హుస్సేన్నాయక్ పూజలు
పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్నాయక్ ఆది వారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హూస్సేన్నాయక్కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి, ప్రసాదం అందజేశారు. గోశాలల అభివృద్ధికి కృషి గోశాలల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని హుస్సేన్ నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని శ్రీగౌరి గోషాలను పరిశీలించారు. గోశాల నిర్వహణను ప్రోత్సహిస్తామని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్శర్మ, దేవగిరి అనిల్, మత్తగజం నాగరాజు, బీజేపీ నాయకులు దొంగరి మహేందర్, మారం రవికుమార్, కమ్మగాని శ్రీకాంత్, సంపత్ పాల్గొన్నారు. -
డీఈఈసెట్–25 స్పాట్ అడ్మిషన్లు
విద్యారణ్యపురి: పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు 2025–27 విద్యాసంవత్సరానికి డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ) రెండేళ్ల కోర్సు కళాశాలల్లో (ప్రభుత్వ, ప్రైవేట్) వారీగా స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా విద్యాశిఽక్షణా సంస్థ ప్రధానాచార్యుడు డాక్టర్ ఎండీ అబ్దుల్హై ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తెలంగాణ డీఈఈ సెట్–2025లో అర్హత సాధించి ఉండాలని, ఏ కళాశాలలోనూ (ప్రభుత్వ, ప్రైవేట్) సీటు పొందలేదని రిపోర్ట్, జాయిన్ కాని అభ్యర్థులు మాత్రమే స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియకు హాజరుకావాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వరంగల్, హనుమకొండలో విద్యాశిక్షణ సంస్థలో ఖాళీ సీట్లలోనే భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ డైట్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు ఈనెల 19న హాజరు కావాలని, ఈనెల 21న సీటు పొందిన అభ్యర్థులు కాలేజీలో రిపోర్టు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రైవేట్ డైట్ కళాశాలల్లో ఈనెల 20న స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావాల్సి ఉంటుందని, సీటు పొందినవారు ఈనెల 21న కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు హెచ్టీటీపీఎస్//డీఈఈసెట్,సీడీఎస్ఈ.తెలంగాణ.గౌట్.ఇన్ వెబ్సైట్ను చూడాలని సూచించారు. -
గర్జిస్తున్న గ్రామసింహాలు
పొలం వద్దకు వెళ్లి వస్తుండగా.. ఈఫొటోలోని వ్యక్తి జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామానికి చెందిన రైతు బత్తిని హరీష్. జూలై 29న వ్యవసాయ పొలం వద్దకు వెళ్లొస్తుండగా.. ఎస్సీ కాలనీ వద్ద కుక్కల గుంపు ఒక్కసారిగా విచక్షణారహితంగా దాడి చేసింది. దీంతో హరీష్ శరీరంపై నాలుగు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. కూనూరు పీహెచ్సీకి వెళ్లి యాంటీ డోస్లు తీసుకున్నారు. చిన్నారిపై దాడి ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు మైదం సిరితన్విక. రెండు రోజుల క్రితం ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో పిచ్చి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. స్థానికులు స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది.జనగామ: జనగామ పట్టణం కుక్కలకు అడ్డాగా మారిపోయిందా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ప్రతి వీధిలో గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు మనిషి కనిపిస్తేచాలు గుర్రుమంటూ భయపెడుతున్నాయి. కాలనీలోకి కొత్తవ్యక్తులు వస్తే మొరుగుతూ స్థానికులను అప్రమత్తం చేసే ఈ కుక్కలే రోడ్లపై చెత్త డంపుల్లో వేసే మటన్, చికెన్, ఇతర ప్రమాదకర వ్యర్థాలను తింటూ క్రూరంగా మారుతున్నాయి. దీంతో వృద్ధులు, చిన్నారులు, మహిళలు కుక్క కాటుకుతో ఆస్పత్రికి పరుగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎక్కడ చూసినా కుక్కలే.. పట్టణాలు, మండలాలు, గ్రామాలు ఇలా ఎక్కడ చూసినా కుక్కలు బెడద తప్పడంలేదు. ఏదోచోట రోజుకు ఒకరిద్దరైనా కుక్కకాటుకు గురవుతున్న పరిస్థితి. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసే వారి పాలిట కుక్కలు ప్రాణసంకటంగా మారాయి. ఢిల్లీ ఘటనపై సుప్రీంకోర్టు స్పందిస్తూ వీధి కుక్కల నియంత్రణకు మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి విధితమే. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో వీధి కుక్కల సంతతి రోజు రోజుకూ పెరుగుతుంది. నియంత్రణకు సంబంధించి పురపాలిక, పంచాయతీ శాఖ పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా.. కుక్క కాటుకు గురైన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే జంతు ప్రేమికులు మాత్రం కుక్కలను చంపడం పరిష్కారం కాదని, శాసీ్త్రయ పద్ధతుల్లో సమస్యను ఎదుర్కోవాలని సూచిస్తుండడం గమనార్హం. ఎలా అరికట్టాలి.. పట్టణాల్లో రాత్రిపూట కుక్కల సంచారాన్ని అరికడితే కొంతమేర దాడులను నియంత్రించవచ్చు. పట్టణంలోని బాలాజీనగర్, శ్రీనగర్ కాలనీ, అంబేడ్కర్ నగర్, రైల్వేస్టేషన్, కుర్మవాడ, ధర్మకంచ, గ్రేయన్ మార్కెట్, వీవర్స్కాలనీ, గిర్నిగడ్డ, గుండ్లగడ్డ, ఆర్టీసీ చౌరస్తా, సిద్దిపేటరోడ్డు, నెహ్రూపార్కు తదితర ప్రాంతాల్లో వందలాది కుక్కలు సంచరిస్తూ దడ పుట్టిస్తున్నాయి. పురపాలిక పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో ఎప్పటికప్పుడు చెత్త డంపులను తొలగించి, శానిటేషన్ నిర్వహిస్తే గుంపులుగా వచ్చే కుక్కల సంతతి తగ్గిపోతుంది. కుక్కల జనన నియంత్రణ శస్త్రచికిత్సల్లో వేగం పెంచాలి.భయపెడుతున్న కుక్కలు విచక్షణారహితంగా దాడులు రోడ్డుపైకి రావాలంటేనే జంకుతున్న జనం ప్రేక్షక పాత్రలో మున్సిపల్ అధికారులు -
నిరక్షరాస్యులకు ఉల్లాస్
మహిళలు చదవడం, రాయడమే లక్ష్యంజనగామ రూరల్: మహిళలు అక్షరాస్యులుగా ఉంటే కుటుంబం, సమాజం బాగు పడుతుంది. ఇందుకుగాను ప్రభుత్వం మహిళా సంఘాల్లో నిరక్షరాస్యులైన మహిళలను సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు జిల్లా విద్యాశాఖ, సెర్ప్ అధికారులు సమన్వయంతో ‘ఉల్లాస్’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేలా కార్యాచరణ రూపొందించారు. అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ (ఉల్లాస్) పథకాన్ని అమలులోకి తీసుకొచ్చాయి. దీని ద్వారా జిల్లా వ్యాప్తంగా దశల వారీగా అమలు చేసేలా జిల్లా ఉన్నతాధికారులు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. గ్రామాల్లో నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతారు. రెండోదశలో మధ్యలో బడిమానేసిన వారిని గుర్తించి ఓపెన్ స్కూల్ ద్వారా నేరుగా పదో తరగతి చదివిస్తారు. ఆసక్తిని బట్టి ఓపెన్ డిగ్రీ వరకు చదివించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధి అవకాశాలు కల్పించేలా.. సామాజిక సాధికారతలో భాగంగా ఉల్లాస్ కార్యక్రమం ద్వారా చదువురాని వారందరికీ చదవడం, రాయడం నేర్పించడమే ప్రధాన లక్ష్యం. మహిళా సంఘంలోని కొంతమంది మహిళలు సంతకం చేయడం, మరికొంత మంది వేలిముద్ర వేస్తున్నారని ప్రభుత్వం గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. మహిళల ఆసక్తిని బట్టి ఓపెన్ టెన్త్, డిగ్రీ వరకు చదివించడమే కాకుండా స్కిల్ డెవలప్మెంట్, టెక్నికల్ కోర్సుల్లోనూ చేర్పించి ఉపాధి, అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు. బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక క్రమశిక్షణ, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలను సైతం నేర్పిస్తారు. కలెక్టర్ చైర్మన్గా, డీఈఓ కన్వీనర్, డీపీఓ, ఇతర శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. మండల కమిటీలో చైర్మన్గా ఎంపీడీఓ, ఎంఈఓ, హెచ్ఎం, సీఆర్సీలు సభ్యులుగా కొనసాగుతారు. మహిళల చదువు.. కుటుంబానికి వెలుగు మహిళలు అక్షరాస్యులుగా ఉంటేనే ఆ కుటుంబంలో వెలుగులు ప్రసరిస్తాయని, ఇలాంటి కుటుంబాల ద్వారా ఆ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. బడికి వెళ్లే పిల్లల సంఖ్య పెరగడంతోపాటు డ్రాపౌట్స్ తగ్గించి, బాల్య వివాహాలపై అవగాహన పెరుగుతుంది. అక్షరాస్యులుగా మారడంతో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై అవగాహన పెరిగి అర్హులందరికీ ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొంటుంది.మహిళలు సద్వినియోగం చేసుకోవాలి చదవడం, రాయడం నేర్పించాలనే లక్ష్యంతో ‘ఉల్లాస్’ అమలు చేస్తున్నాం. జిల్లాలోని మహిళా సంఘాల్లోని నిరక్షరాస్యుల వివరాలను గుర్తించేలా గ్రామాల్లో వివరాలు సేకరిస్తున్నాం. నిరక్షరాస్యులు, మధ్యలో బడి మానేసిన వారికి, దివ్యాంగులకు చదవడం, రాయడం నేర్పిస్తారు. నిరక్షరాస్యులైన మహిళలకు ఇది మంచి అవకాశం. సద్వినియోగం చేసుకోవాలి. – వసంత, డీఆర్డీఓ● అక్షరాస్యత పెంపునకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి విద్యాశాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహణ జిల్లాలో 1,29,979 మంది మహిళా సంఘాల సభ్యులు -
సోమేశ్వరాలయంలో ఎమ్మెల్యే పూజలు
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి శేష వస్త్రాలతో ఘనంగా సన్మానించి, ప్రసాదం అందజేశారు. అలాగే మండలంలోని వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్శర్మ, దేవగిరి అనిల్కుమార్, మత్తగజం నాగరాజు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
జనగామ రూరల్: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మేడబోయిన మమత ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. శనివారం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పొదల లవకుమార్ అధ్యక్షతన ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న రూ. 8 వేల కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. తక్షణమే పెండింగ్ బకాయిలు విడుదల చేయకుంటే ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దాసగాని సుమ, జిల్లా ఉపాధ్యక్షులు మామిడాలా రమేశ్, భూక్యా యాకన్న రాథోడ్, సహాయ కార్యదర్శి బొమ్మిశెట్టి ఆర్య, మనీత్ రాజ్, కృష్ణ, స్నేహ, మానస నాగశ్రీ తదితరులు పాల్గొన్నారు. టీఎల్ఎం మేళా పూర్తి చేయాలి జనగామ: ఈ నెల 21వ తేదీ వరకు మండల స్థాయి టీఎల్ఎం మేళా వందశాతం పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు శనివారం వారు మాట్లాడుతూ టీఎల్ఎం మేళా పూర్తి చేసి, విజేతల వివరాలను స్పైడ్ షీట్లో నమోదు చేసి, అందుకు సంబంధించిన కాపీలను 21వ తేదీ సాయంత్రం వరకు వాట్సాప్ ద్వారా ఉన్నతాధికారులకు పంపించాలన్నారు. రేపు డిజిటల్ అక్షరాస్యతపై శిక్షణ ఈ నెల 18న జిల్లా స్థాయిలో 1 నుంచి 5వ తరగతి వరకు గణిత సబ్జెక్టును బోధించే టీచర్ల(మండల రిసోర్స్ పర్సన్లు)కు డిజిటల్ అక్షరాస్యత, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ బోధనపై జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్డు సెయింట్ మెరీస్ హైస్కూల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి 12 మండలాల ఎంఈఓలకు డీఈఓ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరిగే శిక్షణకు ల్యాప్టాప్ లేదా ట్యాబ్ వెంట తెచ్చుకోవాలన్నారు. శిక్షణకు హాజరు కాని టీచర్లపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక పాలకుర్తి: ఈ నెల 18, 19వ తేదీల్లో రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరగనున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు పాలకుర్తి మండలం గూ డూరు, చెన్నూరు జెడ్పీహెచ్ఎస్ నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపిౖకైయ్యారని పీడీ చిట్యాల యాదగిరి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ గూడూరుకు చెందిన భూక్యా రాకేష్, కీర్తి శ్రీకల, చెన్నూరుకు చెందిన మొలుగూరి అఖిల, చిలువేరు రేవతి, అర్కల సాత్విక్లు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారన్నారు. ఈ మేరకు హెచ్ఎంలు శైలజ, రమేశ్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించి రాష్ట్రస్థా యిలో కూడా ప్రతిభ కనబర్చాలని కోరారు. గుట్కా ప్యాకెట్ల పట్టివేతకొడకండ్ల: మండలకేంద్రంలోని పాపన్నచౌరస్తాలో నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను పట్టుకున్నట్లు ఎస్సై చింత రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం పాపన్నచౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మండలం గుండెపురి కేఆర్కే తండాకు చెందిన లకావత్ విజయ్ స్కూటీని తనిఖీ చేయగా పొగాకు ఉత్పత్తులను లభ్యమయ్యాయన్నారు. విజయ్ నల్లగొండకు చెందిన వినోద దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసి కొడకండ్లలోని కిరాణా షాపులకు అమ్ముతున్నాడు. స్వాధీనం చేసుకున్న పొగాకు ఉత్పత్తుల విలువ రూ.1.52లక్షలు ఉంటుందన్నారు. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభను కనబర్చిన ఎస్సై రాజు, ఏఎస్సై కత్తి రమేశ్, కానిస్టేబుల్స్ రాకేష్, వెంకటేష్లను డీసీపీ రాజమహేంద్రనాయక్ అభినందించారు. -
పత్తి చేను ధ్వంసం
దేవరుప్పుల: సాగు చేసిన పత్తిమొక్కలను ధ్వంసం ఘటన శనివా రం పెద్దమడూరులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పెద్దమడూరుకు చెందిన మడిపెల్లి కొమురయ్య రెండు ఎకరాలు, సంగీ అంజయ్యకు చెందిన 30గుంటల భూమి వారి పేరుమీద పట్టాదారు పాస్ పుస్తకం ఉండటంతో పత్తి పంట సాగు చేశారు. ఇదే గ్రామానికి చెందిన ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు భూ రికార్డుల్లో తమ పేర్లు కూడా ఉన్నాయనే సాకుతో పెద్ద ఎత్తున వెళ్లి శనివారం పత్తి మొక్కలను పీకేశారు. ఈ విషయమై బాధిత రైతులు పీఎస్లో ఫిర్యాదు చేయగా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు తహసీల్దార్ అండాలుకు సిఫారసు చేసినట్లు ఎస్సై సృజన్కుమార్ తెలిపారు. -
అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
జనగామ రూరల్: ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, స్టేషన్ఘన్పూర్లో 2025–26 విద్యా సంవత్సరానికి కామర్స్ విభాగంలో అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాహత్ ఖానం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత పీజీ కోర్సులో 55 శాతం మార్కులతో పాసై ఉండాలని, నెట్, సెట్, పీహెచ్డీ వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 19న సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 20న ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. -
ఒడంబడిక !
నిట్ వరంగల్లోని బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏలతో పాటు పీహెచ్డీ విద్యను అభ్యసిస్తున్న సుమారు 6 వేల మంది విద్యార్థులకు ఇతర పరిశ్రమలు, సంస్థల్లో ఇంటర్న్షిప్, విద్యా పరస్పర బదిలీలకు, టెక్నాలజీ ఉపయోగానికి ల్యాబ్స్ సౌకర్యం, ఆవిష్కరణలకు, పరిశోధనలకు ఎంఓయూలు తోడ్పాటునందిస్తున్నాయి. ఇక్కడి విద్యార్థులకు వివిధ సంస్థల్లో విద్యను అభ్యసించే అవకాశం వీటి ద్వారా లభిస్తోంది. దీంతో పాటు ఇతర సంస్థలు, పరిశ్రమల్లో ఆవిష్కరణలకు, పరిశోధనలకు తోడ్పడుతున్నాయి. 103 నేరుగా.. 2 వర్చువల్గా నిట్ వరంగల్తో జీడబ్ల్యూఎంసీ, భువనగిరి ఎయిమ్స్, సీఎస్ఆర్–ఐఐఎంటీ, ఐఐటీ గోవా, వీజేటీఐ ముంబాయి, నిట్ జమ్శెడ్పూర్, ఐఐఐటీడీఎం కర్నూల్, ఐఐఎం విశాఖపట్నం, ఐఐటీ జమ్మూ, ఐఐటీ భువనేశ్వర్, ఐఐటీ హైదరాబాద్, నిట్ జైపూర్ మాలవ్య, టాటా కన్సల్టెన్సీ హైదరాబాద్, బెంగళూరు ఇన్ఫోసిస్, ది లక్ష్య ఫౌండేషన్ వరంగల్, హైదరాబాద్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్, స్వీడెన్ యూనివర్సిటీ ఆఫ్ మలార్డలాన్, హైదరాబాద్ టీఎస్కాస్ట్, ఇండియన్ రైల్వేస్, నోయిడాలోని ది మిస్టో టెక్స్లతో నేరుగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల వర్చువల్గా థాయిలాండ్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో, జర్మనీలోని నార్ధో హుస్సేన్ యూనివర్సిటీ ఆఫ్ ఆప్లైడ్ సైన్స్తో వర్చువల్గా ఎంఓయూ కుదుర్చుకుంది. రాష్ట్రం, దేశంలోనే పలు సంస్థలతోనూ.. భువనగిరి ఎయిమ్స్లో ఆధునిక టెక్నాలజీని వైద్య రంగంలో ఉపయోగించేందుకు, కాజీపేట మండలం అయోధ్యపురంలో నిర్మిస్తున్న కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో టెక్నాలజీ ఉపయోగానికి ఇండియన్ రైల్వేతో, మెరుగైన రోడ్ల నిర్మాణానికి న్యూఢిల్లీలోని సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో, పరిశ్రమల్లో పరిశోధనకు ఎన్ఐ–ఎంఎస్ఎంఈతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇవే కాకుండా.. ఎంజీఎంలోని మూగ, చెవిటి చిన్నారులకు తోడ్పడేందుకు ‘అమ్మ’ యాప్ను నిట్ వరంగల్ విద్యార్థులు స్టార్టప్గా రూపొందించారు.అంతర్జాతీయ ప్రమాణాలు. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకునే అవకాశాలు. ప్రపంచాన్ని చుట్టి రావాలన్నా.. నూతన సాంకేతికతలో రాటుదేలాలన్నా.. సరికొత్త ఆవిష్కరణల్ని రూపొందించాలన్నా.. జీవితంలో బాగా స్థిరపడాలన్నా విద్యార్థులకు కల్పతరువు నిట్ వరంగల్. ఇక్కడ సీటు వస్తే చాలు.. లైఫ్ సెట్ అనుకుంటారు. అలాంటి క్యాంపస్తో వివిధ పరిశ్రమలు, కంపెనీలు ఎంఓయూలు చేసుకునేందుకు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు నిట్.. ఆఫ్లైన్లోనే కాదు.. వర్చువల్గా పరస్పర ఒప్పందాలు చేసుకుంటూ కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. – కాజీపేట అర్బన్ఎంఓయూలో ‘వరంగల్ నిట్’ కొత్త ధోరణి అటు వర్చువల్గా, ఇటు నేరుగా ఒప్పందాలు సరికొత్త ఆవిష్కరణలు, పరిశోధనలు, ఉద్యోగావకాశాలకు తోడ్పాటు ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకోవడం, విస్తరించే దిశగా ప్రయత్నాలు ప్రత్యేకతను చాటుకుంటున్న సాంకేతిక సంస్థఎంఓయూలతో అభివృద్ధి నిట్ వరంగల్లో నేరుగా ఆవశ్యకతను బట్టి వర్చువల్గా ఆన్లైన్లో ఎంఓయూలను కుదుర్చుకుంటున్నాం. ఎంఓయూల ద్వారా నిట్ విద్యార్థులతో పాటు నిట్ వరంగల్ విద్యాసంస్థ అభివృద్ధి తోడ్పడుతున్నాయి. పరిశోధనలకు అనువుగా, ఆవిష్కరణలకు నెలవుగా ఉన్న నిట్ వరంగల్తో ఎంఓయూ కుదుర్చుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. పరిశ్రమలతో ఉపాధి, విద్యాసంస్థలతో ఇంటర్న్షిప్లే కాకుండా పరిశోధనలకు, నూతన ఆవిష్కరణలకు ఎంఓయూలు ఉపయోగపడతాయి. – బిద్యాధర్ సుబుదీ, నిట్ డైరెక్టర్ -
వైభవంగా గోకులాష్టమి
సీతారామచంద్ర స్వామి దేవాలయంలో కృష్ణుడు, గోపిక వేషధారణలో చిన్నారులు జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాల్లో గోకులాష్టమి వేడుకలను శనివారం ప్రజలు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు. విశ్వహిందూ పరిషత్, బాలభారతి, హిందూ జ్ఞానవేదిక–ప్రబోధా సేవా సమితి, గీతాశ్రమం, శ్రీ కృష్ణ ఉత్సవ కమిటీ (గొల్ల కురుమ సంఘం) ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బనుక సిద్ధిరాజ్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్తో పాటు తదితరులు ఆర్టీసీ చౌరస్తా నుంచి ఊరేగింపుగా నెహ్రూపార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపిక వేషధారణలో అలరించారు. – జనగామ మరిన్ని ఫొటోలు 9లో.. ర్యాలీలో పాల్గొన్న గొల్ల,కురుమలు -
నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
వరంగల్ క్రైం: çßæ¯]l$-Ð]l$-Mö…yýl ´ùÎçÜ$-Ë$, ™ðlÌS…V>׿ Ķæ*…sîæ ¯éÆöP-sìæMŠSÞ {yýlVŠæÞ MýS…{sZÌŒæ sîæ… B«§ýlÓ-Æý‡Å…ÌZ ¯]lË$VýS$Æý‡$ VýS…gêÆ‡$$ çÜÃVýSÏ-Æý‡Ï¯]l$ AÆð‡‹Üt ^ólÔ>Æý‡$. çßæ¯]l$-Ð]l$-Mö…yýl ´ù΋ÜõÜt-çÙ¯ŒS BÐ]l-Æý‡-׿ÌZ Ô¶æ${MýS-ÐéÆý‡… HÆ>µr$ ^ólíܯ]l ÑÌôæ-MýS-Æý‡$ÌS çÜÐ]l*-Ðól-Ôèæ…-ÌZ HïÜï³ ¯]lÆý‡-íÜ…àÆ>Ð]l# ÐðlÌS-Ïyìl…_¯]l ÑÐ]l-Æ>ÌS {ç³M>Æý‡….. Ô¶æ${MýS-ÐéÆý‡… E§ýlĶæ$… çßæ¯]l$-Ð]l$-Mö…yýl MýS$Ð]l*-ÆŠ‡-ç³-ÍÏÌZ° òÜÆ‡$$…sŒæ gZòÜ-‹œ çÜ*PÌŒæ §ýlVýSYÆý‡ ¯]lË$VýS$Æý‡$ Ð]lÅMýS$¢-Ë$ G…yýl$ VýS…gêÆ‡$$ MýSÍW E¯é²-Æý‡° Ð]l_a¯]l çÜÐ]l*-^éÆý‡…-™ø ¯éÆöP-sìæMŠSÞ ïÜI }M>…-™Œæ, GOòÜÞ ïÜòßæ^Œl ç³Æý‡$-Ô¶æ$-Æ>Ð]l¬-Ë$, íܺ¾…¨™ø MýSÍíÜ ÐðlãÏ M>Æý‡$-ÌZ VýS…gêÆ‡$$° ™èlÆý‡-ÍçÜ$¢¯]l² °…¨™èl$-ÌS¯]l$ A§ýl$-ç³#-ÌZMìS ¡çÜ$-MýS$-¯é²Æý‡$. MýSÈ…¯]l-VýS-ÆŠ‡MýS$ ^ðl…¨¯]l G…yîl Oò³gꯌl, G‹Üyîl A¯éÞ-ÆŠæ, G…yîl AÆ>¾¯Œl, MýS$Ð]l*-ÆŠ‡-ç³-ÍÏMìS ^ðl…¨¯]l AÆý‡Û§Šæ AÎRꯌS¯]l$ AÆð‡çÜ$t ^ólíÜ-¯]lr$Ï ™ðlÍ´ëÆý‡$. ÒÇ ¯]l$…_ 25MìS-ÌZÌS 800{V>-Ð]l¬ÌS G…yýl$ VýS…gêÆ‡$$-™ø´ër$ I§ýl$ òÜÌŒæ-¸ù¯]l$Ï, M>Æý‡$¯]l$ ÝëÓ«©¯]l… ^ólçÜ$-MýS$-¯]l²r$Ï ™ðlÍ´ëÆý‡$. Oò³gꯌl, A¯éÞ-ÆŠæ, AÆ>¾¯ŒS.. B…{«§ýl-{ç³-§ól-ÔŒæ& JyìlÔ> »êÆý‡zÆŠ‡ Ð]l§ýlª »êË$ A¯ól Ð]lÅMìS¢ ¯]l$…_ VýS…gêÆ‡$$° ¡çÜ$-Mö_a çßæ¯]l$-Ð]l$-Mö…yýl-ÌZ° MýS$Ð]l*-ÆŠ‡-ç³-ÍŠిÌSP ^ðl…¨¯]l AÆý‡Û§Šæ AÎRꯌS C…sZÏ yýl…‹³^ólíÜ, AÐ]l-çÜ-Æý‡-OÐðl$¯]l ÐéâýæÏMìS Ñ{MýS-Ƈ$$-çÜ$¢…sêÆý‡$. D{MýS-Ð]l$…-ÌZ VýS…gêÆ‡$$° M>Æý‡$-ÌZ ¡çÜ$-MöçÜ*¢ ´ùÎçÜ$-ÌSMýS$ ç³r$t-ºyéz-Æý‡° ™ðlÍ ´ëÆý‡$. °…¨™èl$-ÌS¯]l$ çßæ¯]l$-Ð]l$-Mö…yýl ´ùÎçÜ$-ÌSMýS$ Aç³µ-W…^èl-V> C¯ŒS-òܵ-MýStÆŠ‡ Ð]l$^èla ÕÐ]l-MýS$-Ð]l*ÆŠ‡ MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólíÜ MøÆý‡$t-ÌZ àfÆý‡$-ç³-Ç_ ÇÐ]l*…yŠæMýS$ ™èlÆý‡-Í…_¯]lr$Ï ™ðlÍ´ëÆý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…-ÌZ Ķæ*…sîæ ¯éÆöP-sìæMŠS {yýlVŠæÞ MýS…{sZÌŒæ sîæ…, çßæ¯]l$-Ð]l$-Mö…yýl ´ù΋ÜõÜt-çÙ¯ŒS A«¨M>Æý‡$-Ë$, íܺ¾…¨ ´ëÌŸY-¯é²Æý‡$. 25 కిలోల 800 గ్రాముల గంజాయి, కారు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఏసీపీ నరసింహారావు -
విద్యుదాఘాతంతో విద్యార్థికి గాయాలు
చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థిని దైనంపల్లి సిరి తొమ్మిదో తరగతి చదువుతుంది. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వేడుకల ఏర్పాట్లలో భాగంగా స్టీల్ పైప్తో కూడిన జెండాలను పట్టుకుని వెళ్తున్న క్రమంలో పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యార్థిని సిరి చేతికి, కాలుకు గాయాలు అయ్యాయి. గమనించిన పాఠశాల సిబ్బంది హూటహూటిన స్థానిక సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించా రు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని పలు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం ఆస్పత్రిలో ఉన్న బాలికను పరామర్శించారు. -
డెంగీతో బాలిక మృతి
వేలేరు: డెంగీ జర్వంతో బాలిక మృతి చెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సూత్రపు రమేష్ కూతురు శాన్విక(7)కు ఐదు రోజల క్రితం జర్వం రాగా చికిత్స నిమిత్తం హనుమకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానాకు తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు డెంగీగా గుర్తించి చికిత్స చేస్తున్న క్రమంలో శుక్రవారం ఉదయం మృతిచెందింది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
సాంకేతికాభివృద్ధిలో కొత్త ఒరవడి
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి సాంకేతికంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని ప్రాజెక్టు డైరెక్టర్ వంగూరు మోహన్రావు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో మోహన్రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఏపీటీఎస్–విజిలెన్స్ వారిచే గౌరవ వందనం స్వీకరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగ అమరులకు కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో 18 జిల్లాల్లో 70 లక్షల మంది వినియోగదారులకు 24/7 మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. 2024 సంవత్సరం (ఏప్రిల్ నుంచి జూలై) తో పోల్చుకుంటే 33 కేవీ బ్రేక్ డౌన్స్ 2025 (ఏప్రిల్ నుంచి జూలై) లో 21శాతం, 11 కేవీ బ్రేక్ డౌన్లు 46శాతం తగ్గాయన్నారు. విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ సీఎండీ వరుణ్ రెడ్డి స్వీయ ఆలోచనతో రూ. కోటి బీమా సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు. పునరుత్పాదక శక్తి జూన్ 30, 2025 నాటికి ఎన్పీడీసీఎల్లో 2155.87 మెగావాట్ల సోలార్ ఎనర్జీ జనరేషన్ సామర్థ్యాన్ని సాధించామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వంటేరు తిరుపతి రెడ్డి, మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు అశోక్ కుమార్, తిరుమల్రావు, రాజుచౌహాన్, అశోక్, వెంకటరమణ, మాధవరావు, సీజీఎంలు చరణ్ దాస్, రవీంద్రనాథ్, జాయింట్ సెక్రటరి రమేష్, కంపెనీ కార్యదర్శి వెంకటేశం, వరంగల్ ఏపీటీఎస్ సీఐ కిరణ్ పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ మోహన్రావు -
సంఘాలను మరింత పటిష్టం చేయాలి
హన్మకొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మరింత పటిష్టం చేయాలని తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీసీబీలు, టెస్కాబ్ పాలకవర్గాలకు ప్రభుత్వం ఆరు నెలలు పొడిగింపు ఇచ్చిన సందర్భంగా శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చిత్రపటాలకు పాలక వర్గంతో కలిసి రవీందర్ రావు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు సేవ చేసేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందన్నారు. వరంగల్ డీసీసీబీని ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తామన్నారు. వ్యవసాయ రంగానికి సేవలు విస్తృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ బ్యాంక్ డైరెక్టర్లు హరిప్రసాద్, మాడుగుల రమేష్, దొంగల రమేష్, ఎరబ్రెల్లి గోపాలరావు, మురళి, సంపెల్లి నరసింగరావు, నరేందర్ రెడ్డి, పోలపాక శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు రాజేష్ ఖన్నా, రామచంద్ర రావు, లక్ష్మారెడ్డి, దేవేందర్రావు, మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ గౌడ్, డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు -
విద్యార్థి ఆత్మహత్య
బచ్చన్నపేట: తండ్రి మందలించాడని మనస్థాపంతో విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని లింగంపల్లిలో గురువారం రాత్రి జరి గింది. కుటుంబ సభ్యులు, ఎస్సై అబ్దుల్ హమీద్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేడబోయిన నర్సమ్మ–మల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. చిన్న కుమారుడు సాయివర్ధన్ (20) హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నాడు. సాయివర్ధన్ సరిగా చదవడంలేదని తండ్రి మల్లయ్య మందలించాడు. దీంతో సాయివర్ధన్ క్షణికావేశంలో తమ బావి వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి పెద్దవంగర: అనుమానాస్పద స్థితిలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని ఉప్పరగూడెం గ్రామానికి చెందిన గద్దల బన్నీ (17) తన చిన్నతనంలో తల్లిదండ్రులు మృతి చెందడంతో అమ్మమ్మ గ్రామమైన ఉప్పరగూడెంలో తాత కొమురయ్య సంరక్షణ లో పెరిగాడు. పదో తరగతి పూర్తి కావడంతో ప్రస్తు తం నెల్లికుదరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. రాఖీ పౌర్ణమితోపాటు వరుస సెలవులు రావడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. శుక్రవారం తాత పొలం పనులకు వెళ్లాడు. అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై క్రాంతికిరణ్ను వివరణ కోరగా ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వర్ధన్నపేట మార్చురీకి తరలించామని, ఫిర్యాదు అందితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతామని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదన్నారు. -
దంత వైద్యశిబిరానికి స్పందన
హన్మకొండ చౌరస్తా: భారత స్వాతంత్య్ర దినోత్సవం, ఎస్వీఎస్ దంత వైద్యశాల 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ చౌరస్తాలోని దంత ఆస్పత్రిలో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని అనూహ్య స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ గిరిధర్రెడ్డి పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, టూత్పేస్టులు, మౌత్ వాష్లు అందజేశారు. దంతాల పరిరక్షణపై ప్రతిఒక్కరూ దృష్టి సారించాలని సూచించారు. వైద్య శిబిరంలో వైద్యులు గణేష్, హారిక, సిబ్బంది యాకూబ్రెడ్డి, సౌమ్య, చంద్రిక, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
చేతవెన్న ముద్ద.. చెంగల్వ పూదండ
జనగామ: చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి, సందెతా వీధులు సరి మువ్వ గజ్జెలు, చిన్ని కృష్ణ నిను చేరి కొలుతూ.. అంటూ నేడు (శనివారం) శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకునేందుకు ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. హిందూ ఇతిహాసాల్లో ఎనిమిదో అవతా రంగా పిలుచుకునే శ్రీకృష్ణభగవానుడి జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి అని పిలుచుకుంటారు. శ్రావణమాసంలో వచ్చే శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భా గంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా వేడుకలను అట్టహాసంగా జరుపుకుంటారు. ద్వాపర యుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయనను ప్రతిఒక్కరూ ఇష్టదైవంగా కొలిచి మొక్కుతారు. వివిధ రూపాలు, సంప్రదాయాలతో కృష్ణపరమాత్మను కొలిచే విధానం భారతీయ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం. ఆ కులస్తులు కృష్ణుడిని కులదైవంగా కొలిచి మొక్కుతారు. నేడు పోటీలు.. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నేడు ఉదయం 10 గంటలకు సీతారామచంద్రస్వామి ఆలయంలో చిన్నారులకు రాధాకృష్ణుల వేషధారణ పోటీలను నిర్వహించనున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లను వేషధారణలతో అలంకరించి తీసుకు రావాలని వీహెచ్పీ ప్రతినిధి మోహనకృష్ణ భార్గవ తెలిపారు. అలాగే యువతీ, యువకులకు ఉట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దీంతో పాటు చిన్నారుల కోసం భగవద్గీత పారాయణం వంటి ఆధ్యాత్మిక కా ర్యక్రమాలను నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. హిందూ బంధువులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విశ్వహిందూ పరిషత్ షష్ట్యాబ్ది స్థాపన దివస్ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు ఏకశిల పబ్లిక్ స్కూల్, గీతాశ్రమంలో బాలబారతి ఆధ్వర్యంలో నిర్వాహకులు త్రిపురారి సూర్యప్రసాద్పద్మ పర్యవేక్షణలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. నేడు శ్రీ కృష్ణ జన్మాష్టమి ఆలయాలు, పాఠశాలల్లో వేడుకలుశ్రీ కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని నేడు శ్రీకృష్ణమందిరంతో పాటు ఆలయాలు, శ్రీ వైష్ణవులు, భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తా రు. ఊయల కట్టి అందులో శ్రీ కృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి, పాటలు, సంకీర్తనలు పాడుతూ ఆరాధిస్తారు. పళ్లు, అటుకులు, వెన్నె, పెరుగు మీగడను స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. పురవీధుల్లో ఉట్లుకట్టి పోటీపడి వాటిని కొడతారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణున్ని ప్రార్థిస్తే గోదా నం చేసిన ఫలితంగా భక్తుల విశ్వాసం. అంతే కాకుండా కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫ లం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెబు తుందని భక్తులు అంటున్నారు. -
విద్య, వైద్యానికి పెద్దపీట
కుల గణన దేశానికే రోల్మోడల్ధర్మకంచ మినీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగుర వేసి సెల్యూట్ చేస్తున్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, పక్కన కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీసీపీ రాజమహేంద్రనాయక్ జనగామ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్న ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కుతుందని ఆలేరు ఎమ్మెల్యే, ప్ర భుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం ధర్మకంచ మినీ స్టేడియంలో జరిగిన 79వ పంద్రాగస్టు దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవి ష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించి, పో లీసుల మార్చ్ ఫాస్ట్ తిలకించాను. అనంతరం జాతీయ, తెలంగాణ గీతం ఆలపించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై విప్ మాట్లాడారు. 2047 నాటికి భా రత్ రూపురేఖలు మార్చే గేమ్ ఛేంజర్లో తెలంగాణ కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో ‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్రణాళికతో సీఎం రేవంత్రెడ్డి ముందుకు వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన దేశానికి రోల్మోడల్గా నిలుస్తుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి, పార్లమెంటుకు పంపించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 5,998 ఇందిరమ్మ ఇళ్లు మంజూరీ కాగా, ఇందులో 4,750 చోట్ల గ్రౌండింగ్ పూర్తై, నిర్మాణ పనులు మొదలైనట్లు పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతుందన్నారు. గత సీజ న్లో 1.66 లక్షల మెట్రిక్ టన్ను ల ధాన్యం కొనుగోలు చేసి, రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.386కోట్లు జమ చేసినట్లు తెలిపారు. 2024–25 వార్షిక సంవత్సరంలో పదో తరగతిలో రా ష్ట్రంలో 98.81శాతంతో ఉత్తమ ఫలితాలు సాధించగా, కలెక్టర్ రిజ్వాన్ బాషా, విద్యాశాఖ సంయుక్త భాగస్వామ్యంతో జాతీయ స్థాయిలో న్యాస్లో ఉత్తమంగా నిలవడం గర్వకారణమన్నారు. వానాకాలం సీజన్లో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతుభరోసా ద్వారా రూ.3.51లక్షల ఎకరాల సాగు భూమికి రూ.2.33 కోట్ల మేర జమ చేశామన్నారు. మహిళలను మరింత ఆర్థిక బలోపేతం చేయాలనే సీఎం రేవంత్రెడ్డి సంకల్పం మేరకు ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో 50 వణిత టీస్టాల్స్ ఏర్పాటు లక్ష్యంగా రూ.158.29కోట్ల రుణాలు అందించినట్లు చెప్పారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 90శాతం మేర భూసేకరణ పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. అలాగే జిల్లాలో ప్రతి నీటి బొట్టును భూమిలోకి పంపించి, భూగర్భ జలాల సాధనే లక్ష్యంగా కలెక్టర్ ముందు చూపుతో 7,175 ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టి మరో రికార్డు సృష్టించారన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో జనగామలో సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయన్నారు. అభివృద్ధి పథకాల అమలులో భాగంగా కృషి చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, మీడియాకు విప్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలు తీరు తెన్నులను అద్ధంపట్టేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ రోహిత్సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, ఆర్డీఓ గోపీరామ్, తహసీల్దార్ హుస్సేన్ తదితరులు ఉన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రం ధర్మకంచ మినీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇందులో లింగాలఘనపురం, చౌడారం, స్టేషన్ఘన్పూర్ కేజీబీవీ, నెహ్రూపార్కు రోడ్డు సెయింట్ పాల్స్, జనగామ రైల్వేస్టేషన్ ఏరియా, ఘన్పూర్ ఉన్నత పాఠశాలలు, ఎర్రగొల్లపహాడ్ యూపీఎస్, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు కరాటేతో పాటు దేశ భక్తిని చాటుకునేలా ప్రదర్శనలు నిర్వహించారు. 2024–25 వార్షిక సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖలో కొనసాగుతున్న ఉన్నత పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు విప్ చేతలు మీదుగా ఒకొక్కరికి రూ.10వేల చొప్పున 8 మందికి రూ.80 వేల నగదు పురస్కారంతో పాటు సర్టిఫికెట్లను అందించారు. విద్యార్థులు బోయిని నాగవైష్ణవి (10వ తరగతి, కొడకండ్ల, టీజీఆర్ఎస్), జనగామ శ్రీజ (10వ తరగతి, కొడకండ్ల, టీజీఆర్ఎస్), ఆరు సాయివంశీ (10వ తరగతి, నర్మెట,మోడల్), ఎండీ గులాంసాధిక్ (10వ తరగతి, కొడకండ్ల, ఉన్నత పాఠశాల), జక్కుల పల్లవి (ఇంటర్, ఎంపీసీ, కొడకండ్ల, టీజీఆర్జేసీ, బాలికలు), చింతకింది స్పందన (ఇంటర్,ఎంపీసీ, కొడకండ్ల, టీజీఆర్జేసీ, బాలికలు) కున్సోతు నితిన్ కుమార్ (ఇంటర్, ఎంపీసీ,కొడకండ్ల, మోడల్), ఏ.హరిబాబు (ఇంటర్, సీఈసీ, స్టేషన్ఘన్పూర్, మోడల్) విద్యార్థులు ఉత్తమ ప్రతిభతో నగదు బహుమతిని అందుకున్నారు. మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యజిల్లాలో మహాలక్ష్మి పథకంలో 2.39 కోట్ల మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రూ.110.75 కోట్ల మేర లబ్ధి చేకూరిందన్నారు. 76,403 తెల్లరేషన్ కార్డుదారులకు రూ.500 సబ్సిడీ అందించామన్నారు. గృహజ్యోతి ద్వారా 14.59 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల చొప్పున ఇప్పటి వరకు రూ.42.04 కోట్లు మేర జీరో కరెంటు బిల్లులు ఇష్యూ చేశామని, రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్య సేవలకు గాను రూ.10 లక్షల వరకు పెంచగా, జిల్లాలో 23,345 మందికి శస్త్ర చికిత్సలు చేసి, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించామన్నారు. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 59,745 మంది రైతులకు రూ.522.72 కోట్ల మేర పంట రుణమాఫీ చేశామన్నారు. ఉత్తములకు ప్రశంస బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ ఘనత ప్రగతిలో జిల్లా అగ్రగామి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అంబురాన్నంటిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు జిల్లాలోని 420 మహిళా స్వయం సహాయ సంఘాలకు సీ్త్రనిధి–మెప్మా, ఐకేపీ ద్వారా మంజూరైన రూ.46.03 కోట్ల రుణాలను విప్ బీర్ల అయిలయ్య చేతుల మీదుగా అందించారు. ఇందులో డీఆర్డీ ద్వారా 377 సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 40.30కోట్లు, సీ్త్రనిధి–మెప్మా ద్వారా 43 సంఘాలకు రూ.5.73 కోట్ల చెక్కులను అందించారు. -
రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి
స్టేషన్ఘన్పూర్: కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ మూలసూత్రాలను దెబ్బతీసే కుట్రలను చేస్తున్నారని, రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశం ఇప్పటికీ భిన్నత్వంలో ఏకత్వంగా ఉండడానికి కారణం అంబేడ్కర్ అందించిన రాజ్యాంగమేనన్నారు. రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే రాజ్యాంగం మనల్ని రక్షిస్తుందన్నారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేయాలని, ఓటర్ల జాబితాలో తప్పిదాలపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి చేపడుతున్న పథకాలు అద్భుతమని, దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అంతకుముందు పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్కోట్లు, మహిళలకు తడి, పొడి చెత్తబుట్టలను పంపిణీ చేశారు. మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్య, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ ఐలయ్య, పొట్లపల్లి శ్రీధర్రావు, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, నాయకులు శిరీష్రెడ్డి, సీహెచ్.నరేందర్రెడ్డి, బెలిదె వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
సమరయోధుల అడుగుజాడల్లో నడవాలి
జనగామ రూరల్: స్వాతంత్య్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. పంద్రాగస్టు దినోత్సవం సందర్భంగా శు క్రవారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కోర్టు సిబ్బందిని ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుందని, స్వేచ్ఛ స్వతంత్య్రం కోసం పోరాడి వారి ప్రాణాలను త్యాగాలు చేశారన్నారు. అనంతరం కోర్టు ప్రాంగణంలో జరిగిన ఆటల పోటీల్లో గెలుపొందిన న్యాయవాదులకు, సిబ్బందికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జిలు విక్రమ్, సుచరిత, జూని యర్ సివిల్ జడ్జి శశి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దండబోయిన హరిప్రసాద్ యాదవ్, సీనియ ర్ అడ్వకేట్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గవర్నమెంట్ లీడర్స్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, న్యాయవాదులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ -
కవులు, కళాకారుల నిలయం జనగామ
జనగామ: జనగామ జిల్లా కవులు, కళాకారులకు నిలయంగా కీర్తించబడుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశం హాలులో తెలంగాణ గెజిటెడ్ ఆఫీస ర్స్ అసోసియేషన్ 9వ వార్షికోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా కలెక్టర్ టీజీఓ జనగామ సమాచార దర్శినిని ఆవిష్కరించారు. ఇందులో జనగామ జిల్లా చరిత్రను పొందు పరచడం గొప్ప విషయమన్నారు. జిల్లా విశిష్టతను తెలిపే విధంగా వీటిని ముద్రించి అందుబాటులో ఉంచితే భవిష్యత్ తరాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతరం వక్తలు మాట్లాడు తూ బచ్చన్నపేట మండలం కట్కూరుకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయురాలు, రచయిత్రి బల్ల సరస్వతి 1970 ప్రాంతంలో చిట్టి చిలకమ్మా గేయాన్ని రాయగా, తెలంగాణ ఆత్మకథ, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల పోరు, విద్యార్థుల బాధలను కళ్లకు కట్టినట్టుగా శిశిరధ్వని గేయ కావ్యాన్ని రచించి లక్షలాది మంది ప్రజల అభిమాన్ని చూరగొన్నారన్నారు. అనంతరం బల్ల సరస్వతిని ఘనంగా సత్కరించారు. ఒగ్గు కళాకారుడికి సన్మానం లింగాలఘణపురం: ఇండియన్ కాన్సులేట్ జనరల్ డాక్టర్ మదన్మోహన్శెట్టి చేతుల మీదుగా ఒగ్గుఢోలు కళాకారుడు, ఉస్తాద్ ఒగ్గు రవిని న్యూజిలాండ్లోని అక్లాండ్లో సన్మానించారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా రాష్ట్రం నుంచి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సీడీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అక్లాండ్ వేదికగా జరిగిన ప్రదర్శనలో ఒగ్గుఢోలు, పేరిణి, డప్పు కళాకారులు అద్భుతంగా తమ ప్రదర్శనలు ఇచ్చారు. దీంతో కళాకారులను ఇండియన్ కాన్సులేట్ జనరల్ మోహన్శెట్టి సన్మానించారు. ఈ సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సీడీ ఫౌండేషన్ చైర్మన్ చారుదాసులకు కళాకారులు కృతజ్ఞతలు తెలిపారు. పద్మశ్రీ గడ్డం సమ్మయ్యకు.. దేవరుప్పుల: టీజీఓఎస్ ఽఆధ్వర్యంలో అప్పిరెడ్డిపల్లెకు చెందిన ప్రముఖ చిందు యక్షగాన కళాకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత గడ్డం సమ్మయ్యను కలెక్టర్ రిజ్వాన్బాషా సన్మానించారు. అంతముందుకు అమృత్ సరోవర్లో భాగంగా చిన్నమడూరు కోమటికుంటలో జాతీ య పతాకాన్ని సమ్మయ్య ఎగురవేసి స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు. కొడకండ్ల: మండలంలోని నర్సింగాపురంలో పంట పొలాల్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జాతీయ జెండాను ఎగురవేశారు. దేశగాని సతీష్గౌడ్, పలువురు రైతులు కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించగా రైతులు వినూత్నంగా పంట పొలాల వద్ద జెండాను ఆవిష్కరించుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో కప్పల రాజాలు, సోమయ్య, భిక్షపతి, శివ, సారయ్యలు పాల్గొన్నారు. ‘నవోదయ’ గడువు పెంపు మామునూరు : వరంగల్ మామునూరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరోతరగతిలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 27వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు నవోదయ ప్రిన్సిపాల్ పూర్ణిమ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13న తేదీతో ముగియగా.. విద్యాలయ సమితి మరోమారు గడువు పెంచుతూ అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. -
వేడుకలకు సిద్ధం
● మినీ స్టేడియంలో పంద్రాగస్టు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ● ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య జనగామ: 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియం సర్వంగ సుందరంగా ముస్తాబైంది. డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జనగామ ఆర్డీఓ గోపిరామ్, డీఆర్డీవో పీడీ వసంత, విజయ డెయిరీ డైరెక్టర్ గోపాల్సింగ్, తహసీల్దార్ హుస్సేన్, యువనజన, క్రీడల శాఖ అధికారి వెంకట్రెడ్డి ఉన్నారు. షెడ్యూల్ ఇదే.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరుకానున్నారు. ఉదయం 9:30 గంటలకు ప్రభుత్వ విప్ జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం 9.35నుంచి 9.40 మధ్య పోలీస్ శాఖ గౌరవ వందనం స్వీకరిస్తారు. 9.40 నుంచి 9.50 గంటల మధ్య పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగే పరేడ్ను వీక్షిస్తారు. 9.50 నుంచి 10గంటల వరకు జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విప్ బీర్ల అయిలయ్య ప్రసంగిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రశంసాపత్రాల అందజేత ఉంటుంది. -
భారత్ మెరవాలి
మార్పు రావాలి.. ● ప్రపంచంలోనే దేశం అగ్రగామిగా నిలుస్తుంది.. ● పాలకుల విధానాలు మారాల్సిన అవసరం ఉంది ● అభిప్రాయాలు వ్యక్తం చేసిన ‘నలంద’ విద్యార్థులు ● ‘వందేళ్ల భారత్ ఎలా ఉండాలి’ అనే అంశంపై ‘సాక్షి’ టాక్షోమహబూబాబాద్ అర్బన్: ‘మనది ఎప్పుడూ అభివృద్ధి చెందుతున్న దేశమే. మారుతున్న ఆధునిక టెక్నాలజీని అందుకుని ఇంకా మార్పు రావాలి.. అప్పుడే భారత్ మెరుస్తుంది’ అని విద్యార్థులు అంటున్నారు. నేడు (శుక్రవారం) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘2047కు వంద సంవత్సరాలు పూర్తి చేసుకునే భారత్ ఎలా ఉండాలి’? అనే అంశంపై, ఉచిత పథకాలు, పాలకుల విధానం, విద్యా, వైద్యం, ఆరోగ్య రంగ అంశాలపై మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో గురువారం ‘సాక్షి’ టాక్షో నిర్వహించింది. ఇందులో విద్యార్థులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. సమరయోధుల త్యాగాలతోనే స్వేచ్ఛ అనేక మంది సమరయోధుల పోరాటాలతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఇన్నేళ్లు గడిచినా దేశంలో ఎక్కడి ప్రజలు అక్కడే ఉన్నారు. పేదలను పట్టించుకొనే నాథుడే లేడు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా నేటితరం విద్యార్థులు ఉన్నత చదువులు చదివి దేశానికి తమవంతు సహాయం అందించేలా బాధ్యత తీసుకుంటేనే భవిష్యత్లో దేశం ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తుంది. – జాహ్నవి, బీకాం, ద్వితీయ సంవత్సరంనాయకుల్లో మార్పు రావాలి.. భారత్కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా చిన్న దేశాలకు స్వాతంత్య్రం వచ్చి అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాయి. కానీ, 150 కోట్లకుపైగా జనాభా ఉన్న భారతదేశం మాత్రం అభివృద్ధిలో వెనుకంజలో ఉంది. దీనికి ప్రధాన కారణం రాజకీయ నాయకులు. కొంతమంది ధనార్జనే ధ్యేయంగా ఆస్తులు సంపాదిస్తున్నారు. ముందుగా రాజకీయ నాయకులు మారితేనే దేశం మారుతుంది. – గోగు రమేశ్, బీకాం మూడో సంవత్సరం కొన్ని పథకాలు తొలగించాలి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాయి. ఇందులో కొన్ని ప్రజలకు ఉపయోగం లేనివి ఉన్నాయి. వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయి. వాటిని సక్రమంగా పేద, మధ్య తరగతి వారికి, చిరువ్యాపారులకు అందిస్తే దేశం ఆర్థిక పురోగతి సాధిస్తుంది. మిగిలిన నిధులను రైతులకు, పాఠశాలలు, గ్రామాలు, తండాల అభివృద్ధికి ఉపయోగించాలి. – హర్షవర్ధన్, బీఎస్సీ, ఫస్ట్ ఇయర్ -
సుందరీకరణ పనుల్లో వేగం పెంచాలి
జనగామ: పట్టణంలోని బతుకమ్మకుంట సుందరీకరణ పనుల్లో మరింత వేగం పెంచాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. గురువారం శుక్రవా రం అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రూ.1.50 కోట్లతో వాకింగ్ ట్రాక్, లైట్స్, చిల్డ్రన్ పార్క్ తదిత ర సుందరీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. కలెక్టర్ వెంట ఉద్యాన శాఖ అధికారి శ్రీధర్రావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలి రఘునాథపల్లి: భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పనులుంటేనే బయటకు వెళ్లాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సూచించారు. గురువారం మండలంలోని బానాజీపేటలో కాజ్వేపై ప్రవహిస్తున్న వాగును పరిశీలించారు. కాజ్వే దెబ్బతినగా..నాణ్యత లేని రివిట్మెంట్ నిర్మాణంపై ఆరా తీశారు. మండలంలో వరదల పరిస్థితిపై తహసీల్దార్ ఫణికిషోర్ను అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్లో 24 గంటలు పని చేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితులలో కంట్రోల్ రూమ్ నెంబర్ 90523 08621కు సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. పరిశీలించిన కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
పెళ్లి పీటలపై ఆగిన మూడుముళ్ల బంధం..
లింగాలఘణపురం: రెండుమూడు గంటల్లో పెళ్లి. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ఫంక్షన్ హాల్ సందడిగా మారింది. కానీ ఇంతలో ఓ పిడుగు లాంటి వార్త. పెళ్లి కొడుకు తనతో ప్రేమాయణం సాగించాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పెళ్లి కూతురు బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో పెళ్లి పీటల మీదనే మూడుముళ్ల బంధం ఆగింది. ఈ ఘటన మండలంలోని వడిచర్ల సమీపం ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంరాజుపల్లికి చెందిన ఓ యువకుడికి అదే మండలంలోని మరో గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. బుధవారం వివాహం జరగాల్సి ఉంది. అంతా సిద్ధం చేసుకున్నారు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పెళ్లి పీటలపై కూర్చునే సమయంలో సదరు యువకుడితో ప్రేమాయణం సాగించిన ఓ యువతి హైదరాబాద్లోని ఓ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సదరు యువకుడు తనతో ప్రేమాయణం కొనసాగించి మరో యువతిని వివాహం చేసుకుంటున్నాడని తెలిపింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు సదరు యువకుడి వివరాలు తెలుసుకుని పెళ్లి కూతురు బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఫంక్షన్ హాల్లో ఆందోళన నెలకొంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో యువకుడి బంధువులతో వాగ్వాదానికి దిగి పెళ్లిని ఆపారు. ఆ యువకుని విషయం తెలియాలని, అంతవరకు ఊరుకునేది లేదంటూ మండిపడి వధువు బంధువులంతా వెళ్లిపోయారు. ఫలితంగా రెండుమూడు గంటల్లో ఏకమయ్యే జంట విడిపోయింది. దీంతో వివాహానికి హాజరైన బంధువర్గమంతా అవాకై ్క ఎక్కడివారక్కడ వెళ్లిపోయారు. పెళ్లి కొడుకు తనను ప్రేమించాడని పోలీసులకు యువతి ఫిర్యాదు పోలీసుల సమాచారం మేరకు పెళ్లి ఆపిన వధువు కుటుంబ సభ్యులుయాదవనగర్లో మరో పెళ్లి.. డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ యాదవనగర్లో కొద్ది గంటల్లో జరగాల్సిన వివాహ వేడుక అర్ధాంతరంగా ఆగింది. డోర్నకల్ సీఐ బి.రాజేశ్ కథనం ప్రకారం.. యాదవనగర్కు చెందిన మహేశ్ పాతడోర్నకల్ చెందిన తన స్నేహితురాలిని నెల రోజుల క్రితం రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఈ విషయం మహేశ్ ఇంట్లో చెప్పలేదు. దీంతో కుటుంబ సభ్యులు మహేశ్కు వేరే సంబంధం చూసి బుధవారం పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ఈ విషయం రహస్య వివాహం చేసుకున్న యువతి తెలుసుకుని డోర్నకల్ చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వివాహ తంతును అడ్డుకుని మహేశ్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. సదరు యువతి బెంగుళూరులో కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. -
అమృత బార్లో చోరీ
జనగామ: పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు ప్రధాన కూడలిలోని అమృతబార్లో బుధవారం చోరీ జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్సై భరత్, బార్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 12న రాత్రి బార్ మూసి వేసి ఇంటికి వెళ్లిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తి బార్ వెనకభాగం నుంచి లోనికి వచ్చి కౌంటర్లోని సుమారు రూ.2.50లక్షలు ఎత్తుకెళ్లారు. బుధవారం బార్ సిబ్బంది వచ్చి చూసేసరికి కౌంటర్లోని నగదు కనిపించలేదు. దీంతో యజమానితో పాటు పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్టీం అక్కడకు చేరుకుని చోరీ ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. బార్ క్యాషియర్ రూ.2.50లక్షలు ఉండవచ్చని అంటుండగా పోలీసులు రూ.1.20 లక్షలుగా ప్రాథమిక అంచనా వేశారు. బార్ క్యాషియర్ ఆకారపు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భరత్ తెలిపారు. -
కాకతీయుల శిల్పకళ అద్భుతం
● కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి విద్యారణ్యపురి: కాకతీయుల శిల్పకళ అద్భుతమని, నాటి సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనమని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో హిస్టరీ విభాగం ఆధ్వర్యంలో ‘కాకతీయాస్ టెంపుల్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్’ అనే అంశంపై రెండు రోజులు నిర్వహించునున్న రాష్ట్రస్థాయి వర్క్షాప్ ప్రారంభ సభలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాకతీయుల కాలంలో వివిధ కట్టడాల్లో నాటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సౌండ్బాక్స్ టెక్నాలజీని ఉపయోగించారన్నారు. ప్రభుత్వ పింగిళి మహిళా కళా శాల ప్రిన్సిపాల్ బి. చంద్రమౌళి మాట్లాడుతూ కాకతీయుల శిల్పకళా సాంస్కృతిక వైభవాన్ని తెలియజేసేందుకు ఈ వర్క్ షాప్ ఒక వేదికగా ఉపయోగపడుతుందన్నారు. సాంస్కృతిక పరిశోధకుడు, తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ కీలకపోన్యాసం చేస్తూ దక్షిణాసియాలోనే ప్రసిద్ధ హోజసాల చాళుక్య శైలులతో కూడిన కాకతీయుల శిల్పకళా ప్రసిద్ధిగాంచిందన్నారు. రామ ప్ప, వెయ్యిస్తంభాల ఆలయాల్లో అద్భుత సౌందర్యం దాగి ఉందన్నారు. వరంగల్ నిట్ విశ్రాంత ప్రొఫెసర్ పాండురంగారావు మాట్లాడుతూ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్పదేవాలయాన్ని ప్రకృతి విపత్తులనుంచి పరిరక్షించుకోవాలన్నారు. కేయూహిస్టరీ విభాగం విశ్రాంత ఆచార్యుడు కె.విజయబాబు మాట్లాడుతూ రామప్పదేవాలయంలో మదనిక, నాగిని వంటి శిల్పాల సౌందర్యం 800 సంవత్సరాలనాటి సాంకేతికత నేటితరానికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. అనంతరం కేయూ పాలకమండలి సభ్యుడు మల్లం నవీన్, హెరిటేజ్ యాక్టివిస్ట్ అరవింద్ ఆర్య, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ అరుణ మాట్లాడారు. ఈ వర్క్షాప్లో కన్వీనర్ కొలిపాక శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, అధ్యాపకులు సురేశ్బాబు,శ్యామ్యూల్ప్రవీణ్కుమార్, యుగేంధర్, మధు, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
పరికరాలు లేవు.. వైద్యం అందించలేము
ఎంజీఎం : పూర్తిస్థాయి వైద్యాధికారులు లేకపోవ డం, హెచ్ఓడీలు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తుండ డం, వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు జంకుతుండడం వెరసి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పెద్ద సార్లు ఉంటారు అని భరోసాతో వస్తున్న రోగులకు ఆశించిన మేర వైద్యం అందడం లేదు. అలాంటి ఘటనే ఇది. జూనియర్ వైద్యుల పర్యవేక్షణలో వందలాది మంది రోగులకు చికిత్సలు అందిస్తున్న క్రమంలో పైల్స్తో బాధపడే ఓ రోగికి ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యం అందించలేమని గెంటేసినంతా పనిచేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పరిపాలనాధికారులు క్యాజు వాలిటీ వద్దకు పరుగులు పెట్టి సదరు రోగిని అడ్మి ట్ చేసుకుని చికిత్స అందించడం మొదలు పెట్టా రు. వివరాలోకి వెళ్తే.. వరంగల్ జిల్లా రాయపర్తి మండం కొండూరు గ్రామానికి చెందిన బాచబో యిన రత్నాకర్ అనే వ్యక్తి కడుపునొప్పి భరించలేక భార్య బుచ్చమ్మతో కలిసి సోమవారం ఎంజీఎం ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చారు. పరీక్షలు చేసిన వైద్యులు పైల్స్ సమస్య ఉన్నట్లు గుర్తించారు. వైద్యం చేయడానికి అవసరమైన పరికరాలు అందుబాటులో లేవని చెప్పి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి కి వెళ్లాలని రెఫర్ చేశారు. దీంతో ఏమీ తోచని స్థితి లో సదరు రోగి మూడు రోజులుగా ఎంజీఎం ఆస్పత్రి ఎదురుగా ఉన్న రేకుల షెడ్లోనే వేచి ఉన్నాడు. ఈ విషయం బుధవారం సోషల్ మీడియాలో రావడంతో వెంటనే ఎంజీఎం పరిపాలనాధికారులు కా ర్యాలయాలు వదిలి క్యాజువాలిటీ వద్దకు పరుగులు పెట్టారు. బాధితుడిని స్వయంగా అత్యవసర విభాగంలో చేర్పించి చికిత్స మొదలు పెట్టారు. కాగా, చివరకు మెరుగైన చికిత్స నిమిత్తం మళ్లీ హైదరాబాద్కు తరలించారు. ట్రాక్టర్ ప్రమాదంలో విద్యార్థి మృతి శాయంపేట : ట్రాక్టర్ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన మంగళ వారం రాత్రి మండలంలోని నేరేడుపల్లి శివారులో చోటు చేసుకుంది. ఎస్సై పరమేశ్ కథనం ప్రకారం.. ఆత్మకూరు మండలం హౌజుబుజుర్గు గ్రా మానికి చెందిన షేక్ ఫరాజ్ అహ్మద్ (16) శాయంపేట మండలం నేరేడుపల్లిలోని జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో రోజు మాదిరి మంగళవారం పాఠశాలకు వెళ్లాడు. సా యంత్రం 4 గంటలకు ఇంటికి వెళ్లే సమయంలో పా ఠశాల ఎదుట హౌజుబుజుర్గు గ్రామానికి చెందిన షేక్షబినాబీకి చెందిన ట్రాక్టర్ను డ్రైవర్ ఉమర్ నడుపుకుంటూ వస్తుండగా షేక్ ఫరాజ్ అహ్మద్తో పాటు కొంత విద్యార్థులు ఎక్కారు. ఈ క్రమంలో నేరేడుపల్లి శివారులోని మలుపు వద్ద డ్రైవర్ బ్రేక్ వేయగా ట్రాక్టర్లో కూర్చున్న ఫరాజ్ అహ్మద్ ఎగిరి రోడ్డుపై పడగా తీవ్ర గాయాలయ్యాయి. వారి వెను క వస్తున్న అదే గ్రామానికి చెందిన షేక్ కరీం.. ఫరా జ్ అహ్మద్ తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే ఫరాజ్ అహ్మద్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి షేక్ కమ ల్ ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ● ఎంజీఎంలో కొనసాగుతున్న రెఫరల్ ట్రీట్మెంట్ ● మూడు రోజులుగా వైద్యం కోసం క్యాజువాలిటీ ఎదుట పడిగాపులు ● సోషల్ మీడియా కథనాలతో రోగి వద్దకు వైద్యులు -
కల్వల వాసికి అరుదైన అవకాశం
● ఆసియా పసిఫిక్ గ్రామీణాభివృద్ధి కేంద్రంలో ప్రోగ్రాం ఆఫీసర్గా వెంకటమల్లు నియామకంకేసముద్రం: రాజేంద్రనగర్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ(ఎన్ఐఆర్డీపీఆర్)లో రీసెర్చ్ ఆఫీసర్గా పనిచేస్తున్న మహబూబాబాద్ జిల్లా కేసముంద్రం మండలం కల్వ ల గ్రామానికి చెందిన తాడబోయిన వెంకటమల్లు అంతర్ ప్రభుత్వ సంస్థ సెంటర్ ఆన్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ (సీఐఆర్డీఏసీ)లో ప్రోగ్రాం ఆఫీసర్గా నియామకమయ్యారు. 15 దేశాల్లో గ్రామీణాభివృద్ధి పేదరిక నిర్మూలన కోసం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆ సంస్థలో ప్రోగ్రాం ఆఫీసర్గా ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు వెంకటమల్లును అభినందించారు. బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉన్న ఆ సంస్థకు చెందిన ప్రధాన కార్యాలయంలో ప్రోగ్రాం ఆఫీసర్గా తనను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు వెంకటమల్లు పేర్కొన్నారు. -
ఇంకా తేరుకోలేదు..!
సాక్షి, వరంగల్: వరంగల్ నగరంలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు వరుణుడు సృష్టించిన వరద బీభత్సం ఇంకా చాలా కాలనీలను వీడలేదు. మంగళవారం రాత్రి వరంగల్లో 19 మిల్లీమీటర్లు, ఖిలా వరంగల్లో 19.3 మిల్లీమీటర్ల మోస్తరు వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిపివ్వడంతో నగరంలోని ప్రధాన రహదారుల్లోని నిలిచిన నీరు క్లియర్ అయినా, మైసయ్యనగర్, వివేకానంద కాలనీ, మధురానగర్, పద్మానగర్, శివనగర్, సాకరాశికుంట, నాగేంద్రనగర్, ఎస్ఆర్ తోట, సంతోషి మాత కాలనీలను ఇంకా వరద వీడలేదు. ముఖ్యంగా వర్షపు నీరు బయటకు వెళ్లే స్ట్రోమ్ వాటర్ డ్రెయిన్లు ఇరుకుగా ఉండడం వల్ల నీటి ప్రవాహంలో ఇబ్బందులు ఏర్పడి రోడ్లపైనే నిలిచిపోతోంది. డ్రెయినేజీలు, రహదారుల నిర్మాణాలు అసంపూర్తిగా వదిలేయడం వల్లే ఈ కాలనీలకు ప్రతీ వర్షాకాలం తిప్పలు తప్పడంలేదనే విమర్శలొస్తున్నాయి. ఖిలా వరంగల్ అగర్త చెరువు వరదనీటి కాల్వల నిర్మాణం, అభివృద్ధి పనుల పేరుతో ఉర్సు చెరువుకెళ్లే కచ్చా నాలాను మూసివేయడం, అండర్ డ్రెయినేజీ, స్ట్రోర్మ్ వాటర్ డ్రెయినేజీ నిర్మాణం, చేపల బ్రిడ్జి విస్తరణ, పెరికవాడ వరదనీటి కాలువ పనులతోపాటు నాలా విస్తరణ ఆలస్యం వల్లే ఇళ్లలోకి వరద చేరుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వాలు మారినా తమ జీవితాలు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాతికోట ఉత్తర ద్వారం నుంచి పడమర ద్వారం వరకు నీరు నిలిచి ఉండడంతో అక్కడ సాగుచేసే ఆకుకూరలు, కూరగాయ తోటలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫ్లడ్ లైట్లు కూడా వరదలోనే మునిగి ఉన్నాయి. రెండు రోజులైనా వరంగల్ నగరంలోని పలు కాలనీలను వీడని వరద రోడ్లపై నీరు ఉండడంతో బయటకు వచ్చేందుకు భయం నిత్యావసరాలు లేక ఇబ్బందిపడుతున్న లోతట్టుప్రాంతవాసులు -
16న శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు
హన్మకొండ: శ్రీ కృష్ణ జన్మాషమి వేడుకలను ఈ నెల 16(శనివారం)న ఘనంగా నిర్వహించనున్నట్లు యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజు యాదవ్ తెలిపారు. ఈమేరకు బుధవారం హనుమకొండ రాంనగర్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణ భారత దేశంలోనే అత్యంత భారీగా ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. యాదవ కుల దైవం శ్రీ కృష్ణుడు, బలరాముడని తెలిపారు. ప్రస్తుతం సైన్స్, టెక్నాలజీ మీదనే విద్యార్థులు, యువకుల దృష్టి సారిస్తున్నారు. అందుకే భావితరాలకు సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర తెలియచెప్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ నేపథ్యంలో మూడేళ్లుగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటలకు రాంనగర్ నుంచి శ్రీ కృష్ణుడి శోభాయాత్ర ప్రారంఽభమై అంబేడ్కర్ కూడలి, పోలీస్ హెడ్క్వార్టర్, అశోక, బస్టాండ్ కూడళ్ల మీదుగా బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రం వరకు సాగుతుందన్నారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజుతో పాటు పార్టీలకతీతంగా నాయకులు పాల్గొంటారని వివరించారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ జన్మాష్టమీ పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ప్రతినిధులు కన్నెబోయిన రాజయ్య యాదవ్, గిరబోయిన రాజయ్య యాదవ్, బొంగు అశోక్, కెంచ కుమారస్వామి, రాజేందర్, ఎల్లావుల కుమార్ యాదవ్, రజనీకుమార్, దూడయ్య, చెన్నమల్లు, బుట్టి శ్యాం యాదవ్, బొంగు రాజు యాదవ్ పాల్గొన్నారు. యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజు