సెకండియర్ పరీక్షలు ప్రారంభం
జనగామ రూరల్: జిల్లా వ్యాప్తంగా 16 సెంటర్లలో గురువారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 98.09 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్ విద్యాధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 3,999మంది విద్యార్థులకు 3,923 మంది విద్యార్థులు హాజరు కాగా 76 మంది గైర్హాజరయ్యారన్నారు. జనరల్లో 3,091 మందికి విద్యార్థులకు 3,055 మంది హాజరుకాగా 36 మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఒకేషనల్లో 908 మంది గాను 868 మంది హాజరు కాగా 40 మంది గైర్హాజరయ్యారన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
98.09శాతం విద్యార్థుల హాజరు
ప్రశాంతంగా రెండోరోజు ఇంటర్ పరీక్షలు
సెకండియర్ పరీక్షలు ప్రారంభం


