సోమేశ్వరాలయంలో ఏర్పాట్ల పరిశీలన
సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో జరిగే మహారాత్రి బ్రహ్మోత్సవాలను అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. శనివారం మండలకేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బ్ర హ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్, లడ్డూ ప్రసాదం తయారు చేయు వంట గది, పోలీసు క్యాంపును కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. డీఆర్డీఓ పీడీ వసంత, ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ఏసీపీ నర్సయ్య, విద్యుత్ డీఈ సారయ్య, ఆర్డబ్ల్యూ డీఈ నవీన్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


