ధర్మం కోసం పోరాటం
● గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
చిల్పూరు: పదహారు ఏళ్ల వయసులోనే కత్తి పట్టి సనాతన ధర్మాన్ని కాపాడేందుకు పోరాటం చేసిన మహావ్యక్తి ఛత్రపతి శివాజీ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కొనియాడారు. ముందుగా చిన్నపెండ్యాల గ్రామంలోని ఆర్చిగేట్ నుంచి రాజవరం గ్రామం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నా రు. గ్రామంలో బజరంగ్దళ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పా టు చేసిన శివాజీ విగ్రహాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా భజరంగ్ధళ్ సభ్యులు ఆయనకు కత్తి బహుకరించారు.


