పాలకుర్తి టౌన్: మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్) వ్యాధిని ముందస్తుగా అడ్డుకునేందుకు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ (హెచ్పీటీ) కీలకప్రాత పోషిస్తుందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి మల్లికార్జునరావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత శ్రేణి ఆస్పత్రిలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హెచ్పీవీ టీకాను మల్లికార్జున్రావు ప్రాంరభించారు. ఆయన మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాలు పూర్తి కాని బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ను వేయలన్నారు. డీసీహెచ్ఓ నరేందర్, పరమేశ్వరి, శాంతకుమార్, మండల వైద్యాధికారి బండి ఉషా, గాయత్రి, ఎంపీడీఓ వే దవతి, ఎంపీఓ శ్రీనాథ్రెడ్డి, ఎంఈఓ నర్సయ్య, స ర్పంచ్ విజయ, ఉప సర్పంచ్ కిరణ్ పాల్గొన్నారు.
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి
మల్లికార్జునరావు


