జనగామ రూరల్: పర్యావరణంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని స్టేషన్ ఘన్పూర్ కళాశాల ఎన్న్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జ్యోత్స్న అన్నారు. పెంబర్తి గ్రామంలో ఎనన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా ఆదివారం పర్యావరణం, సుస్థిరాభివృద్ధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు పర్యావరణాన్ని సంరక్షించడం, చెట్ల పెంపకం, నీటి వనరులను కాపాడటం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి అంశాలపై ప్రజలకు వివరించారు. భవిష్యత్ తరాలకు శుభ్రమైన ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.


