● హాస్టళ్లలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ ఆకస్మిక తనిఖీ
జనగామ రూరల్: పేద విద్యార్థుల సంక్షేమం విషయంలో నిర్వాహకులు నిబంధనలు విస్మరిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని ఎస్సీడీడీ, టీఎంఆర్జేసీ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్, స్టాక్ రిజిస్టర్లు, స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్లను తనిఖీ చేసి ప్రిన్సిపాల్, వార్డెన్లకు పలు సూచనలు చేశారు.


