West Godavari District Latest News
-
డీఎన్నార్లో యూత్ పార్లమెంట్
భీమవరం : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు జరుగుతుందని ప్రధానంగా ఎన్నికల ఖర్చు తగ్గి పెద్ద ఎత్తున అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. సోమవారం భీమవరం డీఎన్నార్ కళాశాలలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు), ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి మాట్లాడుతూ 2047 నాటికి దేశాభివృద్ధి లక్ష్యంతో ప్రధాని మోదీ వికసిత్ భారత్ ప్రారంభిచారన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు), ఉపాధ్యక్షుడు గోకరాజు పాండు రంగరాజు, డివైఈఓ డి.కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక పదవులకు ఎన్నికలు
15 ఉప సర్పంచ్ పదవులకు ఎన్నిక 2021 ఫిబ్రవరి 13న పంచాయతీలకు ఎన్నికలు జరగగా, మరుసటి రోజున కౌంటింగ్ జరిగింది. చాలావరకు పంచాయతీల్లో వైఎస్సార్సీపీ సానుభూతిపరులే సర్పంచులుగా గెలుపొందారు. ఆ సయమంలో ఎన్నికల కోడ్ ఉండటంతో దాదాపు నెలన్నర రోజుల ఆలస్యంగా ఏప్రిల్ 3న కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. అదేరోజున ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. ఒప్పందం, ఇతర కారణాలతో పది మండలాల పరిధిలోని 15 ఉప సర్పంచ్ పదవులకు ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిలో నరసాపురం మండలంలోని మల్లవరం, భీమవరం రూరల్లోని గొల్లవానితిప్ప, గూట్లపాడు, ఎల్వీఎన్ పురం, తుందుర్రు, బేతపూడి, అత్తిలిలోని కేఎస్ గట్టు, ఇరగవరంలోని కోతపాడు, మొగల్తూరులోని పేరుపాలెం సౌత్, పాలకొల్లులోని అగర్తిపాలెం, గోరింటాడ, ఉండిలోని ఎన్ఆర్పీ అగ్రహారం, వీరవాసరంలోని పెర్కిపాలెం, యలమంచిలిలోని అబ్బిరాజుపాలెం, పాలకోడేరులోని గొరగనమూడి ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో 27న ఉప సర్పంచుల ఎన్నిక నిమిత్తం ప్రత్యేక సమావేశానికి హాజరుకావాలని వార్డు సభ్యులకు పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నిక లాంఛనం కానుంది. సాక్షి, భీమవరం: జిల్లాలోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న రెండు ఎంపీపీ, ఒక వైస్ ఎంపీపీ, 15 మంది ఉప సర్పంచ్ పదవుల భర్తీకి ఈ నెల 27న ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఎంపీటీసీ, వార్డు సభ్యులకు అధికారులు నోటీసుల జారీ చేశారు. అత్తిలి, యలమంచిలి మండల పరిషత్లు గతంలోనే వైఎస్సార్సీపీ కై వసం కాగా సంఖ్యా బలం, జెంటిల్మెన్ ఒప్పందం మేరకు ప్రస్తుత ఎన్నికల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీలుగా వైఎస్సార్సీపీ సభ్యుల ఎన్నిక లాంఛనం కానుంది. జిల్లాలోని ఎంపీటీసీ స్థానాలకు 2021 ఏప్రిల్ 8న ఎన్నికలు జరగగా కోర్టు కేసులతో కౌంటింగ్ వాయిదా పడింది. తీర్పు అనంతరం సెప్టెంబరు 19న కౌంటింగ్ నిర్వహించగా 24న కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులకు పోటీ నెలకొన్న చోట రెండున్నర సంవత్సరాల చొప్పున జెంటిల్మెన్ ఒప్పందం ప్రకారం పదవిని సర్ధుబాటు చేశారు. ఈ మేరకు అత్తిలి ఎంపీపీ, వైస్ ఎంపీపీ, యలమంచిలి ఎంపీపీ గత ఏడాది మార్చి నెలలో తమ పదవులకు రాజీనామాలు చేయడంతో ఖాళీ అయ్యాయి. వీటి భర్తీకి అప్పట్లో ఎన్నికలు జరపాల్సి ఉండగా ఎన్నికల కోడ్తో ఆలస్యమైంది. వైఎస్సార్సీపీదే హవా తణుకు నియోజకవర్గం అత్తిలి మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలకు 16 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించగా టీడీపీ, జనసేన రెండేసి స్థానాల్లో గెలుపొందాయి. ఎంపీపీ పదవి బీసీ జనరల్కు రిజర్వు కాగా ఒప్పందం ప్రకారం మొదటి రెండున్నరేళ్లు తిరుపతిపురం ఎంపీటీసీ సభ్యుడు మక్కా సూర్యనారాయణ ఎంపీపీగా, వైస్ ఎంపీపీలుగా మంచిలి ఎంపీటీసీ సభ్యురాలు దారం శిరీష, ఈడూరు ఎంపీటీసీ సభ్యుడు సుంకర నాగేశ్వరరావు పనిచేశారు. పదవీకాలం పూర్తికావడంతో సూర్యనారాయణ, శిరీష రాజీనామా చేయగా నాగేశ్వరరావు ఇన్చార్జి ఎంపీపీగా సేవలందిస్తున్నారు. నాటి ఒప్పందం ప్రకారం అత్తిలి –1 ఎంపీటీసీ సభ్యురాలు రంభ సుజాత ఎంపీపీగా, గుమ్మంపాడు ఎంపీటీసీ సభ్యుడు అద్దంకి శ్రీనును వైస్ ఎంపీపీగా లాంఛనంగా ఎన్నుకోనున్నారు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి ఎంపీపీ పీఠం జనరల్ మహిళకు రిజర్వయింది. మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకు 14 చోట్ల వైఎస్సార్సీపీ, మూడు చోట్ల టీడీపీ, జనసేన ఒకటి గెలుపొందాయి. యలమంచిలి–1, ఏనుగువానిలంక ఎంపీటీసీ సభ్యులు రావూరి వెంకటరమణ, వినుకొండ ధనలక్ష్మి ఎంపీపీ పదవిని ఆశించారు. పెద్దలు కుదిర్చిన ఒప్పందం ప్రకారం మొదట బాధ్యతలు చేపట్టిన రావూరి వెంకటరమణ రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తికావడంతో గతంలోనే ఆమె రాజీనామా చేశారు. ప్రస్తుతం ఇన్చార్జి ఎంపీపీగా వైస్ ఎంపీపీ గొల్లపల్లి శ్రీనివాసరావు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎట్టకేలకు ఎంపీపీ ఎన్నిక జరుగనుండటంతో గత ఒప్పందం ప్రకారం ధనలక్ష్మిని ఎంపీపీని చేసే పనిలో వైఎస్సార్సీపీ నేతలు ఉన్నారు. రెండు ఎంపీపీ, ఒక వైస్ ఎంపీపీ, 15 ఉప సర్పంచ్ పదవులు ఖాళీ 27న ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు నోటీసుల జారీ చేసిన అధికారులు -
ఫిర్యాదుల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలి
భీమవరం: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన దరఖాస్తుల సత్వర పరిష్కారానికి కొంత సమయం కేటాయించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 241 మంది వివిధ సమస్యలపై ఫిర్యాదు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు ఎట్టి పరిస్థితుల్లో తిరిగి రాకుండా సంతృప్తికరమైన నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని ఆదేశించారు. మండల స్థాయిలోనే అర్జీల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపితే జిల్లా స్థాయి వరకు ఎందుకు వస్తారని కలెక్టర్ నాగరాణి ప్రశ్నించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి, డీఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్ మీటర్లతో ఉపాధికి గండి
భీమవరం: విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో విద్యుత్ మీటరు రీడర్లను రోడ్డున పడేయవద్దని, వారికి సంస్థలోనే ప్రత్యామ్నాయం చూపి ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యుత్ మీటర్ రీడర్ల యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కోనాల భీమారావు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ విద్యుత్ మీటర్ రీడర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రకాశం చౌక్ సెంటర్లో ఆందోళన చేపట్టి, కలెక్టరేట్ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మీకోసంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డికి సమర్పించారు. ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ నాడు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించి స్మార్ట్ మీటర్లను నేలకేసి కొట్టి పెడ బొబ్బలు పెట్టిన నారా లోకేష్ ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎస్క్రో అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని గతంలో సంస్థ సీఎండీ మీటర్ రీడర్స్కు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ఎస్క్రో ద్వారా వేతనాలు ఇవ్వని కాంట్రాక్టరును బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. సబ్ స్టేషన్లలో ఐటీఐ అర్హత ఉన్న వారిని షిఫ్ట్ ఆపరేటర్గా, వాచ్ అండ్ వార్డ్గా నియమించాలని, సర్కిల్ ఆఫీసుల్లో మీటర్ రీడర్స్ అర్హతను బట్టి కంప్యూటర్ ఆపరేటర్స్గా, అటెండర్స్గా, వాచ్మెన్గా నియమించాలని కోరారు. ప్రతి డివిజన్, సబ్ డివిజన్ పరిధిలో బ్రేక్ డౌన్ గ్యాంగ్ మీటర్ రీడర్స్ను ఉపయోగించుకోవాలని, ఎంఆర్టీలో స్కిల్డ్ అండ్ అన్ స్కిల్డ్ వర్కర్గా నియమించాలని డిమాండ్ చేశారు. మూడు కంపెనీల పరిధిలో ఒకే పని దినాలు అమలు చేయాలని, అదనపు పని గంటలను రద్దు చేయాలని సూచించారు. కార్యక్రమంలో చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాంప్రసాద్, వై.వి.ఆనంద్, ఎం.లక్ష్మిపతి, బి. శ్రీనివాసరావు, పెనుమాక జాకబ్, నెక్కంటి సుబ్బారావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీపీఎస్సీ పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష
భీమవరం: ఈ నె 25 నుంచి జరగనున్న ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని కార్యాలయంలో ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలో భీమవరంలోని డీఎన్ఆర్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, డీఎన్ఆర్ కాలేజ్ అటానమస్, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ తాడేపల్లిగూడెంలో పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులను ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య, మధ్యాహ్నాం ఒంటిగంట నుంచి 2 గంటల మధ్య మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. హాల్టిక్కెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద తగిన పోలీసు బందోబస్తు, వైద్య శిబిరాలు, తాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో ఏపీపీఎస్సీ అధికారులు, రెవెన్యూ, విద్యుత్, పోలీస్, మున్సిపాలిటీ, ఆర్టీసీ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రేషన్ బియ్యానికి ఎసరు
ఈకేవైసీ పేరుతో 1.53 లక్షల మందికి ఝలక్ భీమవరం : కూటమి ప్రభుత్వం రేషన్ కార్డుల ఈకేవైసీ పేరుతో రేషన్ బియ్యం ఎగవేసేందుకు రంగం సిద్ధం చేసింది. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హులైన పేదలకు పెద్ద ఎత్తున రేషన్ కార్డులు పంపిణీ చేయడమే గాక కుటుంబ సభ్యులు, పిల్లల పేర్లు కార్డుల్లో నమోదు చేసుకోవడానికి ప్రత్యేక అవకాశం కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్సిక్స్ హామీలను అమలుచేయకపోగా ఉన్న పథకాలకు ఎగనామం పెడుతోంది. గత పది నెలల కాలంలో ప్రభుత్వం కొత్తగా రేషన్కార్డులు మంజూరు చేయకపోవడంతో అనేకమంది కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కార్డుల్లో పేర్లు ఉన్న వ్యక్తులు ఈకేవైసీ చేయించుకోకపోతే వచ్చే నెల నుంచి కోటా బియ్యం కోల్పోనున్నారు. ఏప్రిల్లో 1.53 లక్షల మంది రేషన్కు ఎసరు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 5,58,300 తెల్ల రేషన్ కార్డులుండగా వాటిలో దాదాపు 15,67,322 మంది సభ్యులున్నారు. వారికి ప్రతి నెల 5 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందుతోంది. రేషన్ పొందుతున్న ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో రేషన్ డీలర్లు రేషన్ కార్డుల్లో పేరున్న వారితో వేలిముద్రలు వేయించుకుని ఈకేవైసీ చేస్తున్నారు. కొంతమంది ఉపాధి కోసం తాత్కాలికంగా వలస వెళ్లినవారు, వృద్ధాప్యంలో ఉన్నవారు దూర ప్రాంతంలో ఉన్న తమ పిల్లల వద్దకు వెళ్లడం వంటి కారణాలతో ఈకేవైసీ చేయించుకోలేకపోయారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా ఇంతవరకు 14,13,923 మందికి ఈకేవైసీ పూర్తి కాగా 1,53,399 మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. దీంతో వీరికి అందాల్సిన సుమారు 7.70 లక్షల కిలోల బియ్యానికి గండిపడనుంది. ఈ మేరకు ఇప్పటికే రేషన్ డీలర్లకు కోత విధించి ఏప్రిల్ నెల బియ్యం పౌరసరఫరాల శాఖ పంపిణీ చేస్తోంది. ఈకేవైసీ చేయించుకోవాల్సినవారు అత్యధికంగా భీమవరంలో 16,625 మంది ఉండగా తాడేపల్లిగూడెంలో 12,236 మంది, నరసాపురంలో 12,606 మంది, తణుకులో 11,690 మంది, మొగల్తూరులో 7,496, ఉండిలో 6,167, గణపవరంలో 5,601, యలమంచిలిలో 7,102, అత్తిలిలో 5,660, ఆచంటలో 5,512, పాలకోడేరులో 5,174, ఇరగవరంలో 6,599, ఆకివీడులో 6,372, కాళ్లలో 6,497, పెనుగొండలో 6,751, పోడూరులో 6,151, వీరవాసరంలో 5,809, పెనుమంట్రలో 5,028, పెంటపాడులో 4,836, పాలకొల్లులో 9,485 మంది ఉన్నారు. -
ధాన్యం కొనుగోలుకు 308 కేంద్రాలు
భీమవరం: ధాన్యం కొనుగోలుకు జిల్లాలో ముందుగా తాడేపల్లిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో దాళ్వా సీజన్ ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై సివిల్ సప్లయిస్, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 308 రైతు సేవా కేంద్రాల ద్వారా ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టామన్నారు. మండల వ్యవసాయ అధికారులు ఆయా రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన మౌలిక సదుపాయాలు సరి చూసుకుని సరైన నిర్ధారణతో సర్టిఫికెట్ అందచేయాలని ఆదేశించారు. సాధారణ రకం క్వింటాకు రూ.2,300, ఏ గ్రేడ్ రకానికి రూ.2,320 ధర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గోనె సంచులు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని వాహనాలు, హమాలీలను ముందుగా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లయిస్ మేనేజర్ టి.శివరామ ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
క్షయ నివారణలో కృషికిఅవార్డు
తణుకు అర్బన్: తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని టీబీ విభాగ సీనియర్ ల్యాబ్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్న పంజా రవిబాబు బెస్ట్ అవార్డును అందుకున్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్షయ నివారణ కార్యాలయంలో సోమవారం జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ భానునాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డీఎంహెచ్వో గీతాబాయి చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బంది ధర్నా భీమవరం : డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఫీల్డ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఫీల్డ్ లెవల్ సిబ్బందికి మినిమం స్కేల్, కేడర్, ఉద్యోగ భద్రత, ఎక్స్గ్రేషియా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి అమలు చేయాలని అనేక సార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు కార్యచరణ సిద్ధం చేశామని, ట్రస్ట్ సీఈవో పిలుపు మేరకు వాయిదా వేసి 12న చర్చలో పాల్గొనగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కోశాధికారి డి.రామ్మోహన్, డి.వెంకటరమణ, నాగచార్యులు, తదితరులు పాల్గొన్నారు. పాలిసెట్కు దరఖాస్తుల స్వీకరణ తాడేపల్లిగూడెం (టీఓసీ): రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్–2025 పరీక్ష ఏప్రిల్ 30న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, జిల్లా కోఆర్డినేటర్ డి.ఫణీంద్ర ప్రసాద్ వెల్లడించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో దరఖాస్తులు ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 15 వరకు అందుబాటులో ఉంటాయని, దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీలకు రూ.100 రుసు చెల్లించాలని చెప్పారు. అభ్యర్థులకు తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్లో నిష్ణాతులైన అధ్యాపకులచే ఏప్రిల్ 1 నుంచి పాలిసెట్ కోసం శిక్షణ అందజేస్తారని చెప్పారు. స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇస్తారని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 90102 22178, 94901 04336 నెంబర్లలో సంప్రదించాలన్నారు. చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించాలి భీమవరం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే బాధితుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి చట్ట పరిధిలో తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో 18 అర్జీలు స్వీకరించారు. అర్జీదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నాటు సారా అనర్థాలపై అవగాహన భీమవరం: నాటు సారాతో అనర్థాలను ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. సోమవారం కలెక్టరేట్లో ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదగా నవోదయం– నాటు సారా నిర్మూలన కార్యక్రమంపై అవగాహన పోస్టర్, బుక్లెట్ ఆవిష్కరించారు. నాటు సారాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రామాలు, పట్టణాల్లో అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ వెంకటేశ్వర్లు, ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత పాల్గొన్నారు. -
పసల కృష్ణభారతి యువతకు ఆదర్శనీయం
తాడేపల్లిగూడెం అర్బన్ : గాంధేయవాది, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు పసల కృష్ణ భారతి నేటి యువతరానికి ఆదర్శనీయమని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. కృష్ణభారతి మృతిపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మిల రెండో కుమార్తె కృష్ణభారతి తల్లిదండ్రుల అడుగుజాడల్లో పయనించి స్వాతంత్య్ర సమరయోధురాలిగా నిలిచారని అన్నారు. ఆమె వృద్ధాశ్రమాలను స్థాపించి నిరాశ్రయులైన వృద్ధులకు తోడుగా నిలిచి సేవా తత్పరత కలిగిన మహిళగా ప్రసిద్ధి పొందారని మాజీ మంత్రి కొట్టు తెలిపారు. ఆమె కుటుంబం తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. కృష్ణభారతి కుటుంబంతో తమకు బంధుత్వం ఉందని గుర్తు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కృష్ణభారతి పోషించిన కీలక పాత్రను తెలుసుకుని ప్రధానమంత్రి నరేంద్రమోడి స్వయంగా ఆమె పాదాలకు నమస్కరించడం ఆమె ఔన్నత్యానికి నిదర్శనమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కృష్ణభారతి కుటుంబ సభ్యులకు కొట్టు సత్యనారాయణ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలి అత్తిలి: హిందూ ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ పిలుపునిచ్చారు. సోమవారం అత్తిలి టీటీడీ కల్యాణ మండపంలో హైందవి, శ్రీహనుమాన్ శక్తిజాగరణ సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామజపయజ్ఙం–పూర్ణాహుతి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం విశ్వక్సేనపూజ, మండపారాధన, హోమాలు, శ్రీరామ జపయజ్ఙం మంగళవాయిద్యాల నడుమ వైభవోపేతంగా జరిగంది. సామూహిక విష్ణుసహస్రనామ పారాయణ, హనుమాన్చాలీసా పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త డాక్టర్ అనంతలక్ష్మి, తపన ఫౌండేషన్ వ్యవస్ధాపకులు గారపాటి సీతారామంజనేయచౌదరి, శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక అధ్యక్షుడు కరుణాకర్ సుగ్గుణ, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, శ్రీరామ జపయజ్ఙ నిర్వహణ సమితి సభ్యులు సాధనాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తు గోదావరిలో జారిపడి వ్యక్తి మృతి
పెనుగొండ: సిద్ధాంతం వశిష్టా గోదావరిలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి జారిపడి మృత్యువాత పడ్డాడు. పెనుగొండ మండలం రామన్నపాలెంకు చెందిన బాలిశెట్టి సురేష్ బాబు (37) పాత ఇనుము వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. సోమవారం పాత ఇనుము కొనుగోలు నిమిత్తం బాబాయి సూరిబాబుతో ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. సిద్ధాంతం చేరుకొని బహిర్బూమి కోసం ఉదయం 7.30 గంటలకు సిద్ధాంతం గోదావరి బ్రిడ్జి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యాడు. సమీపంలో జాలర్లతో వెతికించినా ఫలితం లేకుండా పోయింది. ఉదయం 10 గంటలకు సురేష్బాబు మృతదేహాన్ని కనుగొన్నారు. మృతుడుకి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పెనుగొండ ఎస్సై కే గంగాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 30న శ్రీవారి క్షేత్రంలో ఉగాది వేడుకలు ద్వారకాతిరుమల: నూతన సంవత్సరాది పర్వదినానికి శ్రీవారి క్షేత్రం ముస్తాబవుతోంది. ఈ ఏడాది ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా సోమవారం స్థానిక ఉగాది మండపానికి రంగులు వేసే పనులను ప్రారంభించారు. అలాగే మండప పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు. ఈనెల 30న విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ఉభయ దేవేరులతో శ్రీవారు ఆలయం నుంచి వెండి శేష వాహనంపై ఊరేగింపుగా మండపం వద్దకు వెళ్తారు. అక్కడ మండపంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం అర్చకులు, పండితులు పంచాంగ శ్రవణము జరుపుతారు. ఆ తరువాత పండిత సత్కారం, తీర్థప్రసాద వినియోగం జరుగుతుందని, భక్తులు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆలయ ఈఓ సత్యన్నారాయణ మూర్తి కోరారు. -
తమ్ముడిని చంపిన అన్నకు ఏడేళ్ల జైలు
పెంటపాడు: ఆస్తితగాదాల నేపథ్యంలో తమ్ముడిని హత్య చేసిన అన్నకు తాడేపల్లిగూడెం ఏడీజే కోర్టు న్యాయమూర్తి షేక్ సికిందర్ ఏడేళ్ల జైలుశిక్ష విధించారు. పెంటపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆకుతీగపాడు ఎస్సీకాలనీకి చెందిన చిన్నం శ్రీనివాస్, వెంకటేశ్వర్లు (28) అన్నదమ్ములు. వీరు ఒకే ఇంట్లో వేర్వేరు పోర్షన్లలో నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్య ఆస్తితగాదాలు ఉండేవి. ఈ క్రమంలో 2024 జనవరి 9న అన్నదమ్ముల మధ్య ఘర్షణ చెలరేగడం, అన్న చిన్నం శ్రీనివాస్ తమ్ముడైన వెంకటేశ్వర్లుపై కత్తితోదాడి చేశాడు. ఈ దాడిలో వెంకటేశ్వర్లుకు మెడపై బలమైన గాయం కావడంతో ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై అప్పటి ఎస్సై హరికృష్ణ హత్యకేసుగా నమోదు చేశారు. అనంతరం గూడెం డీఎస్పీ విశ్వనాథ్, గ్రామీణ సీఐ రమేష్ పర్యవేక్షణలో ఎస్సై స్వామి, ఏఎస్సై యు.రాజేందర్ పీపీ శివరామకృష్ణ కోర్టులో వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో సోమవారం గూడెం కోర్టు ముద్దాయి శ్రీనివాస్కు ఏడేళ్ల జైలుశిక్ష విధించినట్లు ఎస్సై స్వామి తెలిపారు. హస్తకళా ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్నరసాపురం రూరల్: హస్తకళా ఉత్పత్తులన్నీ మనసు దోచుకునేలా ఉన్నాయని, నరసాపురం ప్రాంతంలో హ్యాండీక్రాఫ్ట్ ఎక్స్పో నిర్వహించడం మన ప్రాంతానికి గర్వకారణమని జాయింట్ కలెక్టర్ టి రాహుల్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం నరసాపురం మండలంలోని రుస్తుంబాద గ్రామంలో అంతర్జాతీయ లేసు ట్రేడ్ సెంటర్ (ఐఎల్టీసీ)లో ఈపీసీహెచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాండీక్రాఫ్ట్ ఎక్స్పో కార్యక్రమాన్ని జేసీ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హస్తకళాకారులు తయారు చేసిన వస్తువులకు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో సైతం మార్కెటింగ్ ఉందన్నారు. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల నుంచి సుమారు 70 హస్తకళా ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రదర్శించడం, అమ్మకాలు సాగించడం ద్వారా వాటి గురించి మరింత ప్రాచుర్యం జరుగుతుందన్నారు. గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ హస్తకళల ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించని వారు మంగళవారం చివరిరోజున అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మన ప్రాంత లేసు అల్లికలు, కళంకారి, కొండపల్లి, ఏటి కొప్పాక బొమ్మలు, ఉప్పాడ చీరలు, బొబ్బిలి వీణలు ఇలా ఎన్నో హస్తకళలు ఉన్నాయన్నారు. ఈయన వెంట ఈపీసీహెచ్ సదరన్ రీజియన్ కోఆర్డినేటర్ కలవకొలను తులసి ఉన్నారు. -
ఆ పార్టీలను మట్టిలో కలిపేస్తాం
యలమంచిలి: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మనుగడ లేకుండా మట్టిలో కలుపుతామని పీవీ రావు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మాపు సూర్యవరప్రసాదరావు హెచ్చరించారు. ఆయన ఆధ్వర్యంలో సోమవారం యలమంచిలిలో మాల మహానాడు సమావేశం నిర్వహించారు. ముందుగా బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుమ్మాపు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు మాలలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరగదని తెలిసి కూడా రాజ్యాంగ విరుద్ధమైన పనులకు మద్దతు ఇవ్వడమంటే, కేవలం ఓటు బ్యాంకు రాజకీయ పరమైన కుట్ర అని ఆరోపించారు. రాష్ట్రంలో అన్నదమ్ములుగా కలిసి ఉన్న మాల, మాదిగలను విడగొట్టాలని 1997–98లో నారా చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. అప్పుడు మాలల పంతం చంద్రబాబు అంతం అనే నినాదంతో ఆ రోజు అధికారం కోల్పోవటం జరిగిందన్నారు. ఆ సంఘటన మర్చిపోయి మళ్లీ కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను తెరపైకి తెచ్చి కేవలం మాలలను కించపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. పూర్తిగా అవాస్తవంతో కూడిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను రద్దు చేసి, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో త్రిసభ్య కమిటీ వేసి విచారణ చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణను నిలిపివేసి ప్రస్తుతం పెరిగిన జనాభా నిష్పత్తి ప్రకారం 15 శాతం ఉన్న రిజర్వేషన్ శాతాన్ని 20 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యమాన్ని బలోపేతం చేసే దిశగా యలమంచిలి మండల యూత్ విభాగం అధ్యక్షుడుగా జల్లి అనిల్ను నియమించి నియామాకపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పితాని పుష్పరాజ్, రాష్ట్ర లీగల్ అడ్వైజర్ కార్యదర్శి బండి సుందరరామూర్తి, నియోజకవర్గ కన్వీనర్ బుంగా జయరాజ్, ఎస్సీ ఉద్యోగుల సంఘం మండల నాయకులు ముడకల గోపాలరావు, బొంద బుజ్జిబాబు, కప్పల బన్నీ, సోడగిరి ప్రదీప్, జల్లి విజయరాజు, రాపాక సుధీర్, తోట ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణపై పీవీ రావు మాల మహానాడు ధ్వజం -
హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెంలో సంచలనం రేకెత్తించిన వైఎస్సార్సీపీ కార్యకర్త గంధం బోసుబాబు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు ఎటువంటి రాజకీయ సంబంధం లేదని, వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు. బోసుబాబు భార్య శాంతికుమారి తనకు మేనమామ వరుసైన సొంగా గోపాలరావుతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ కేసుకు సంబంధించి జీలుగుమిల్లి సీఐ బి. వెంకటేశ్వరరావు, ఎస్సై నవీన్కుమార్ సోమవారం విలేకరులకు వివరాలను వెల్లడించారు. భర్త పెట్టే బాధలు భరించలేక గంధం బోసుబాబు భార్య శాంతికుమారి, తన మేనమామ వరుసైన గోపాలరావు వివాహానికి ముందే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఇరువురి పెద్దలు అంగీకరించకపోవడంతో వీరిద్దరూ వేర్వేరు వివాహాలు చేసుకున్నారు. వివాహమైన అనంతరం శాంతికుమారి తన భర్తకు తెలియకుండా గోపాలరావుతో వివాహేతర సంబంధం కొనసాగించింది. బోసు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా చేసే సమయంలో వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని శాంతికుమారిని మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. ఎన్నికల సమయంలో బెట్టింగ్లు కట్టి డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలయ్యాడు. అంతేకాకుండా భార్య శాంతికుమారి వద్ద ఉన్న డబ్బులు కూడా బలవంతంగా తీసుకున్నాడు. తరచూ తనను హింసించడంతో భర్త బోసుబాబు అడ్డు తొలగించాలని శాంతికుమారి, గోపాలరావు నిర్ణయించుకున్నారు. సమయం కోసం ఎదురు చూస్తుండగా జగదాంబ అమ్మవారి తిరుణాళ్లలో జరిగిన అవకతవకలపై పత్రికలో వచ్చిన కథనాలను ఆమె భర్త బోసు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన విషయమై అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ చిర్రి వెంకటేశ్వరరావు బోసును ఫోన్లో బెదిరించిన కాల్ రికార్డ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సమయంలో తన భర్త బోసుబాబును ఏం చేసినా అది చిర్రి వెంకటేశ్వరరావు మీదకు వెళ్తుందనే ఉద్దేశంతో ఈ నెల 17వ తేదీ శాంతికుమారి గోపాలరావును రాత్రి ఇంటికి రమ్మని మెసేజ్ పెట్టింది. తర్వాత బోసు, పిల్లలు ఇంటి పోర్షన్ బయట వరండాలో పడుకుని పూర్తిగా నిద్రలోకి వెళ్లిన తర్వాత శాంతికుమారి సాయంతో గోపాలరావు తనతోపాటు తెచ్చుకున్న ఇనుపరాడ్డుతో బోసు తలపై కుడి వైపున ఇనుపరాడ్డుతో బలంగా కొట్టాడు. తర్వాత అక్కడి నుంచి గోపాలరావు ఆ రాడ్డుతో పారిపోయాడు. ఈ ఘటనపై ఈనెల 18వ తేదీన తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేయగా భర్త బోసు పెట్టే బాధలు భరించలేకే శాంతికుమారి, గోపాలరావు వివాహేతర సంబంధం కొనసాగించేందుకు ఈ హత్య చేసినట్లు ముద్దాయిలిద్దరూ అంగీకరించారని సీఐ తెలిపారు. అలాగే హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్డును, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా ఈ కేసు దర్యాప్తుకు సహకరించిన కై కలూరు రూరల్ సీఐ, పోలవరం, గణపవరం సీఐలు, చాట్రాయి, ముదినేపల్లి, కొయ్యలగూడెం ఎస్సైలు, సర్కిల్ సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు తెలిపారు. బోసుబాబు హత్యకేసును ఛేదించిన పోలీసులు కేసుకు సంబంధించి ఇద్దరి అరెస్ట్ -
మంత్రి ఇలాకా.. పారిశుద్ధ్యం ఇలాగా..?
నూజివీడు పట్టణంలో పారిశుద్ధ్యం అడుగడుగునా అధ్వానంగా తయారైంది. రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమే కాకుండా, ఐఏఎస్ అధికారి సబ్ కలెక్టర్గా ఉండగా పారిశుద్ధ్యం ఇలాగేనా ఉండేదని పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు దాదాపు 150 మంది ఉన్నా పారిశుద్ధ్యం దిగజారుతోంది. రోజుకు 30 టన్నుల చెత్త నూజివీడులో ఉత్పత్తి అవుతుండగా, ఆదివారం వస్తే కేవలం కొన్ని ప్రధాన రహదారుల్లోని చెత్తను మాత్రమే తొలగిస్తూ మిగిలిన పట్టణమంతా వదిలేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర అంటూ ప్రచారార్భాటం తప్పితే క్షేత్రస్థాయిలో మాత్రం జరిగేది శూన్యమనే విమర్శలు వినిపిస్తున్నాయి. పన్నుల వసూళ్లపై చూపుతున్న శ్రద్ధను మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్యం మెరుగుపరచడంలో చూపించడం లేదని ప్రజలు వాపోతున్నారు. – నూజివీడు -
ట్రిపుల్ఐటీ చదువులు.. పేద కుటుంబాల్లో వెలుగులు
పేద విద్యార్థులకు వైఎస్సార్ వరం నూజివీడు క్యాంపస్లో 2008 బ్యాచ్ విద్యార్థుల మనోగతం ముగిసిన మొదటి బ్యాచ్ ఉద్యోగుల సమ్మేళనం వారంతా పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తేనే కుటుంబ జీవనం సాగుతుంది. ప్రతిభ ఉన్నా ఆర్థిక సహకారం లేక అందుబాటులో ఉన్న విద్యతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇదే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తన హయాంలో ఏర్పాటు చేసిన ట్రిపుల్ఐటీలు వారి జీవితాలను పూర్తిగా మార్చేశాయి. పేద వర్గాలకు చెందిన ప్రతిభ గల విద్యార్థులకు చేయందించి.. ఆరేళ్లపాటు రూపాయి ఖర్చు లేకుండా సమీకృత ఇంజనీరింగ్ విద్యను అందించడంతో దానిని అందుకున్న విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కొలువులు సాధించారు. దీంతో ఒకప్పుడు ఆర్థిక కష్టాల్లో ఉన్న వారంతా నేడు పేదరికంలో నుంచి బయటకు వచ్చారు. ఇదంతా వైఎస్ రాజశేఖర్రెడ్డి ఏర్పాటు చేసిన ట్రిపుల్ఐటీల వల్లే సాధ్యమైందని పూర్వ విద్యార్థులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో రెండు రోజుల పాటు నిర్వహించిన తొలి బ్యాచ్ 2008–14 విద్యార్థుల సమ్మేళనం ఆదివారం కూడా ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు నాటి తమ పరిస్థితులను వివరించారు. – నూజివీడు కొత్త ఇల్లు కట్టుకున్నాం ప్రకాశం జిల్లా దొనకొండ మండలం భూమానపల్లి మా సొంతూరు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లేవారు. రెక్కాడితేనే గానీ డొక్కాడని కుటుంబం మాది. 2008లో ట్రిపుల్ఐటీలో సీటు రావడంతో అక్కడే సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. 2017లో మున్సిపాలిటీలో ఏఈఈ ఉద్యోగం వచ్చింది. దీంతో మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు కొత్త ఇల్లు కూడా కట్టుకున్నాం. ట్రిపుల్ఐటీలో చదువుకోవడం వల్లే మా పేద కుటుంబంలో మార్పు వచ్చింది. – మురికిపూడి మరియదాసు ఫీజు కట్టలేని కుటుంబం మాది.. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం భోగోలు మా ఊరు. పూరింట్లో ఉండేవాళ్లం. అమ్మానాన్న కూలి పనులకు వెళ్లేవారు. ట్రిపుల్ఐటీ అనేది ఒకటి ఉందనే విషయమే తెలియదు. దరఖాస్తు చేయకుండానే సీటు వచ్చింది చేరమంటూ కాల్ లెటర్ వచ్చింది. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశా. 2020లో ఆర్ఎస్సైగా ఉద్యోగం వచ్చింది. మంచి ఇల్లు కట్టి అమ్మానాన్నలకు బహుమతిగా ఇచ్చా. ట్రిపుల్ఐటీ లేకపోతే మా తల్లిదండ్రులు బయటి కాలేజీల్లో చదివించేవారే కాదేమో. – తాడేపల్లి మౌనిక వైఎస్సార్ని మరువలేం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మా సొంతూరు. ఇందిరమ్మ ఇంట్లో ఉండేవాళ్లం. కూలి పనులకు వెళ్తేనే ఇల్లు గడిచేది. ట్రిపుల్ఐటీలో ఈసీఈ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశా. ఆ తర్వాత జేఎన్టీయూ హైదరాబాద్లో ఎంటెక్ పూర్తి చేశా. 2018లో ఎస్సైగా ఎంపికయ్యా. ఇప్పుడు తెలంగాణ ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నా. సొంతూరిలో ఇల్లు కట్టుకున్నా. ఆనందంగా బతుకుతున్నాం. వైఎస్ రాజశేఖర్రెడ్డిని జీవితంలో మరిచిపోలేం. – చారీ రాంబాబు -
సంరక్షించి.. సాగరంలో విడిచి..
నరసాపురం రూరల్: సంతానోత్పత్తి కోసం నరసాపురం మండలం చినమైనవానిలంక ప్రాంతానికి వచ్చి ఆలివ్ రెడ్లీ తాబేళ్లు గుడ్లు పెట్టగా.. గుడ్లను సంరక్షించి పొదిగిన తర్వాత 34 తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో తాబేళ్ల సంరక్షణ, పునరుత్పత్తి కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర ప్రాంతాల్లో కనిపించే ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఆహార అన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వస్తున్నాయి. అలా వచ్చి తీరంలో గుడ్లు పెడుతుండగా అటవీ శాఖ అధికారులు వాటిని సంరక్షిస్తున్నారు. ఫిబ్రవరి 3న తొలిసారిగా గుర్తించిన తాబేళ్ల గుడ్ల నుంచి పిల్లలు బయటకు రాగా ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సముద్రంలోకి విడిచి పెట్టారు. సంరక్షణ కేంద్రంలో ఇప్పటివరకూ 135 తాబేళ్లు పెట్టిన 14,300 గుడ్లు సేకరించి భద్రపరిచినట్టు సిబ్బంది తెలిపారు. తాబేలు పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టే కార్యక్రమంలో ఫారెస్టు బీట్ ఆఫీసర్ కె.రాంప్రసాద్, తాబేళ్ల సంరక్షణా పునరుత్పత్తి కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. సముద్రంలోకి వెళుతున్న తాబేలు పిల్లలు సముద్రంలోకి ఆలివ్ రిడ్లే తాబేళ్లు తొలిసారిగా 34 తాబేలు పిల్లల విడుదల -
హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్పోకుసందర్శకుల తాకిడి
నరసాపురం రూరల్: రుస్తుంబాద గ్రామంలోని అంతర్జాతీయ లేసు ట్రేడ్ సెంటర్ (ఐఎల్టీసీ)లో ఈపీసీహెచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్పో ఆదివారం 3వ రోజుకు చేరింది. సెలవురోజు కావడంతో ఉభయ గోదా వరి జిల్లాలు, పరిసర ప్రాంతాల నుంచి సందర్శకులు, కొనుగోలుదారులు పోటెత్తారు. దేశ నలుమూలల నుంచి వివిధ హస్తకళల కళాకారులు తమ ఉత్పత్తులతో 70కు పైగా స్టాల్స్ ఏ ర్పాటుచేశారు. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కేరళ, రాజస్తాన్, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి హస్తకళాకారులు తరలివచ్చారు. హస్తకళాకృతుల విక్రయం, ప్రదర్శనలతో ఐఎల్టీసీ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రవేశం ఉచితం కావడం, చి న్నారులు ఆడుకునేందుకు ప్లేగేమ్స్, ఫుడ్కోర్టుల ఏర్పాటుతో సందడి నెలకొంది. పీఎం ఇంటర్న్షిప్నకు దరఖాస్తుల ఆహ్వానం భీమవరం (ప్రకాశంచౌక్): ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ కోసం అభ్యర్థులు ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎంపికై న వారికి రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో 550 పరిశ్రమల్లో శిక్షణ ఇస్తారన్నారు. అభ్యర్థుల వయసు 21–24 మధ్య ఉండాలని, ఏడాదికి కుటుంబ ఆదాయం రూ.8 లక్షలలోపు ఉండాలని తెలిపారు. రూ.5 వేల స్టయిఫండ్, ఏక మొత్తంగా రూ.6 వేల ప్రోత్సాహకాన్ని అందిస్తారన్నారు. ఎంపికైన వారికి ప్ర ధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాల కింద బీమా రక్షణ కల్పిస్తారని తెలిపారు. యువతిపై లైంగిక దాడి.. ఏడుగురిపై పోక్సో కేసు ఏలూరు టౌన్ : ఏలూరులో ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించిన ఘటనలో ఏడుగురిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరులోని ఓ ప్రాంతానికి చెందిన యువతిని జేపీనగర్కు చెందిన ఆళ్ల వంశీకృష్ణ ప్రేమిస్తున్నానని నమ్మించాడు. ఆమైపె గతేడాది ఆగస్టులో లైంగికదాడికి పాల్పడ్డాడు, అలాగే పలుమార్లు అత్యాచారం చేశాడు. తమ వద్ద వీడి యోలు ఉన్నాయని, తాము చెప్పినట్టు వినకపోతే సోషల్మీడియాలో పెడతామంటూ వంశీకృష్ణ స్నేహితులు ఏనాదుల సాయిచరణ్, చిట్టూరి శివశంకర్ కూడా ఆమైపె లైంగికదాడికి పాల్పడ్డారు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రు లు యువకులను నిలదీయగా వారిపై గొడ వకు దిగి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు పోలీసుల ను ఆశ్రయించటంతో వంశీకృష్ణ, సాయిచరణ్, శివశంకర్తోపాటు రాయి విజయ్, రాయి పా వని, ఏనాదుల సింహాద్రి, ఏనాదుల కార్తీక్పై ఏలూరు వన్టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 10 వేల మందికి క్యాన్సర్ టీకాలు ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు 10 వేల మంది విద్యార్థులకు టీకాలు వేయించనున్నట్టు రోటరీ (3020) జిల్లా గవర్నర్ వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక వైఎంహెచ్ఏ హాల్లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోట రీ ఆధ్వర్యంలో వైద్య కళాశాలలో తల్లిపాల స్టోరేజీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పోలియో నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. గత రెండేళ్లలో చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. క్లబ్ అధ్యక్షుడు ఎన్జీవీ స్వామి మాట్లాడుతూ రోటరీ సేవలు మరింత విస్తృతం చేయనున్నామన్నారు. అన్నార్తులకు, దివ్యాంగులకు ఆహారం అందజేస్తామన్నారు. స్థానిక సీఆర్ఆర్ పబ్లిక్ స్కూల్ సెంటర్లో రోటరీ పీస్ టవర్ నిర్మాణానికి వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు. రోటరీ అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ, జిల్లా సెక్రటరీ కల్యాణ్రాజు, రోటరీ పీడీజీ డాక్టర్ పి.దామోదర్ రెడ్డి, డాక్టర్ లలిత పాల్గొన్నారు. -
కాపులపై కూటమివివక్ష
తణుకు అర్బన్: కాపుల ఓట్లతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం కాపులపై కుల వివక్ష, సవతితల్లి ప్రేమను చూపిస్తోందని కాపు ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ జె.నాగబాబు, ఉత్తరాంధ్ర తెలగ సంఘం చైర్మన్ పి.వెంకట రామారావు విమర్శించారు. ఆదివారం పైడిపర్రు కాపు కల్యాణమండపంలో కాపు ఐక్య వేదిక చైర్మన్ రాలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 2024 ఎన్నికల ముందు ఏదోరకంగా అందలమెక్కాలనే ఉద్దేశంతో పవన్కల్యాణ్ను అడ్డం పెట్టుకుని కాపుల భావోద్వేగాలను రెచ్చగొట్టి 95 శాతం కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చారన్నా రు. అయితే నేడు కాపుల ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేసి కుల వివక్షను చూపిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభు త్వం కాపుల ప్రయోజనాలకు సంబంధించి ఏ ఒక్క నిర్ణయం తీసుకోకుండా కుల వివక్ష చూపిందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో కాపు కార్పొరేషన్కు ఏడాదికి రూ.3 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి ఇటీవల బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం దుర్మార్గమన్నారు. హైకోర్టు కాపుల విషయంలో సమర్థించిన జీఓ 30 అమలు చేయాలని, మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు కేటాయించిట్టుగా 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లను బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్యవైశ్య, వెలమ, కమ్మ, రెడ్డి కులాల్లో పేదలకు కొనసాగిస్తే అందరికీ సమన్యాయం జరుగుతుందన్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గాల ప్రయోజనాలను, ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఇప్పటికై నా ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులపై అవలంబిస్తున్న వైఖరిని సత్వరమే మానుకుని అందరికీ సమన్యాయం చేయాలని కోరారు. సోషల్ జస్టిస్ ఫోరం బీసీ ఐక్య వేదిక వర్కింగ్ చైర్మన్ జంగాల సింగారయ్య యాదవ్, బీసీ ఐక్యవేదిక వర్కింగ్ చైర్మన్ దానా గౌడ్, కాపు ఐక్యవేదిక మహిళా కన్వీనర్ పిడక వెంకటలక్ష్మి, తణుకు మాజీ వార్డు కౌన్సిలర్లు కాకిలేటి సత్యవాణి, కొమ్మిరెడ్డి రమాదేవి, దూలం చిట్టిపాప, కాకిలేటి హరినాధ్, సూర్యసాగర్బాబు తదితరులు పాల్గొన్నారు. 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయాలి కాపు ఐక్యవేదికలో ధ్వజమెత్తిన నేతలు -
ట్రిపుల్ఐటీతోనే ఈ స్థాయికి..
కాకినాడ రూరల్ మండ లం పోలవరం మా ఊరు. మేము నలుగురం అ న్న దమ్ములం. తల్లిదండ్రు లు కూలి పనులకు వెళ్లేవారు. ట్రిపుల్ ఐటీలో ఉ చితంగా చదువుకునే అవకాశం రావడం వల్ల నే నొక్కడినే చదువుకున్నాను. కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. 2015 నుంచి కోరమాండల్ కంపెనీలో మేనేజర్గా చేస్తున్నా. కొత్త ఇల్లు కట్టుకోవడంతో పాటు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్నా. –కర్రి కోటేశ్వరరావు వైఎస్సార్కు రుణపడి ఉంటాం ప్రకాశం జిల్లా కొత్తపట్న ం మండలం బీరంగుంట మా ఊరు. తల్లిదండ్రులు ఇద్దరూ కూలి పనులకు వెళ్తేనే ఇల్లు గడిచేది. కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి 2016 నుంచి కన్యాకుమారిలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఇంజనీర్గా చేస్తున్నా. తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నా. ట్రిపుల్ఐటీ లేకపోతే ఏ డిగ్రీనో చదివి ఉండేవాడిని. వైఎస్సార్కు రుణపడి ఉంటా. –మద్దా సురేష్ -
ఆర్టీసీకి స్పెషల్ ఆదాయం
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా ఆర్టీసీ గత ఐదేళ్లుగా మంచి ఆదాయంతో దూసుకుపోతోంది. పండుగలకు, తీర్థ యాత్రలకు ప్రత్యేక బస్సులు నడుపుతూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. జిల్లాలోని భీమవరం, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెం డిపోల నుంచి ఏటా సంక్రాంతి, దసరా పండగలతోపాటు కార్తీక మాసంలో, అరుణాచలం తదితర తీర్థ యాత్రలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. టికెట్ ధరలు పెంచకుండా సాధారణ ధరలకే ఈ ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా ప్రజలకు ఆర్టీసీ బాగా చేరువైంది. రికార్డు స్థాయిలో ఆదాయం గత ఐదేళ్లుగా ఆర్టీసీ మంచి ఆదాయాన్ని సాధించింది. 2020లో ఏడాదికి రూ.48 లక్షల ఆదాయం సాధించగా.. 2024 నాటికి ఏడాదికి రూ.కోటి ఆదాయం ఆర్జించే స్థాయికి చేరింది. ఏటా సంక్రాంతికి ఆర్టీసీకి మంచి ఆదాయం వస్తోంది. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి జిల్లాకు.. జిల్లా నుంచి హైదరాబాద్కు పది రోజుల పాటు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రికార్డు స్థాయిలో రూ.99 లక్షల ఆదాయాన్ని సాధించింది. ఈ ఏడాది పంచారామాల ప్రత్యేక బస్సు సర్వీసులు నాటికి ఆర్టీసీ ఆదాయం రూ.1.50 కోట్లు దాటనుంది. ప్రైవేటు బస్సుల దందాకు చెక్ పండుగ సీజన్లు తీర్థయాత్రలకు ప్రైవేటు బస్సుల యాజమాన్యం ఇష్టానుసారంగా టిక్కెట్ ధరలు పెంచి ప్రజలను దోపిడీ చేసేవి. దాంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులతో టిక్కెట్ ధర సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ప్రత్యేక బస్సుల ఏర్పాటుతో ఆర్టీసీ బస్సులు ఎక్కేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వారు కోరుకున్న తీర్థయాత్రలకు కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు వల్ల ప్రైవేటు బస్సుల టిక్కెట్ దందాకు చెక్ పెట్టారు. పశ్చిమగోదావరి జిల్లా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసుల ద్వారా గత 5 ఏళ్ల నుంచి రూ.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కరోనా విపత్తు రెండేళ్లలో కూడా సంక్రాంతి, దసరా, ఇతర తీర్థ యాత్రలకు కూడా ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపారు. ఐదేళ్లలో ప్రత్యేక సర్వీసుల ద్వారా రూ.5 కోట్ల రాబడి ఈ ఏడాది సంక్రాంతికి రూ.99.30 లక్షల ఆదాయం పండగలు, యాత్రలకు ప్రత్యేక సర్వీసులతో ప్రైవేటు దందాకు చెక్గత ఐదేళ్లలో ప్రత్యేక సర్వీసుల ఆదాయం ఏడాది సంక్రాంతికి ఇతర సర్వీసులు (రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో) 2020 36.93 11.80 2021 36.88 28 2022 54.62 30 2023 60 35 2024 70 40 2025 99.51ప్రత్యేక బస్సులతో మంచి ఆదాయం పండగలు, తీర్థ యాత్రలకు, దైవ దర్శనాలకు జిల్లాలోని 4 డిపోల నుంచి ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక సర్వీసుల ద్వారా మంచి ఆదాయం లభిస్తుంది. పశ్చిమగోదావరి జిల్లా ఆర్టీసిని జిల్లా ప్రజలకు మరింత చేరువ చేసేలా టిక్కెట్ ధరలు పెంచకుండానే అన్ని పండుగలకు బస్సులు ఏర్పాటు చేసి క్షేమంగా గమ్య స్థానాలకు చేరుస్తున్నాం. సంక్రాంతి, దసరా పండుగలకు హైదరాబాద్ నుంచి జిల్లాకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ఎన్వీఆర్ వర ప్రసాద్, జిల్లా ప్రజా రవాణాశాఖాధికారి -
చోరీ కేసు నమోదు
జంగారెడ్డిగూడెం: ఆశా వర్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చోరీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. చిన్నంవారిగూడెం గ్రామానికి చెందిన ఏలేటి రాణి అదే గ్రామంలో ఆశా వర్కర్గా పనిచేస్తుంది. ఈనెల 18న ఉదయం స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లగా.. తిరిగి వచ్చి చూసే సరికి బీరువా తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించింది. వెంటనే బీరువా వెతకగా, బీరువాలో ఉంచిన 4 కాసుల బంగారం కనబడలేదని, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఇంటి పక్కనే ఉన్న ఇద్దరిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదుతో పేర్కొన్నారని, ఆ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కండక్టర్పై దాడి, కేసు నమోదు జంగారెడ్డిగూడెం: ఆర్టీసీ బస్సు కండక్టర్పై దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న కోనా ప్రసాద్ శనివారం మధ్యాహ్నం జంగారెడ్డిగూడెం – తాడేపల్లిగూడెం సర్వీస్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జంగారెడ్డిగూడెం నుంచి కొయ్యలగూడెం వెళ్లేందుకు బస్సు ఎక్కిన జల్లి ప్రవీణ్కుమార్ను టిక్కెట్ అడిగారు. కండక్టర్ టిక్కెట్కు సరిపడా చిల్లర ఇమ్మని ప్రవీణ్కుమార్కు సూచించారు. దీంతో ప్రవీణ్కుమార్ కండక్టర్ను దుర్భాషలాడుతూ క్యాష్బ్యాగ్ లాక్కొని, కొట్టడంతో పాటు, బస్సులోని రాడ్డుకు కండక్టర్ను కొట్టాడు. దీంతో కండక్టర్కు గాయాలయ్యాయి. కండక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చేతల్లిగా వరాలిచ్చే అమ్మగా పేరుపొందడంతో మంగమ్మగుడికి వచ్చే భక్తుల సంఖ్య ప్రతీ వారం పెరుగుతూనే ఉంది. ఈ నెల 14 నుంచి 16 వరకూ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. క్యూలో నిలుచున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. 26న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జాబ్మేళా కై కలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త అధ్వర్యంలో ఆటపాక వైవీఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 26న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వై.శ్రీలత ఆదివారం చెప్పారు. జాబ్మేళాలో ఫోర్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్, కై కలూరు నేషనల్ స్కూల్, నవతా రోడ్డు ట్రాన్స్పోర్టు కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. సుమారు 160 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు కలిగి 18–35 సంవత్సరాల వయస్సు కలిగిన యువత అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 9701357315, 6281119575 నెంబర్లతో పాటు టోల్ ఫ్రీ నంబరు 9988853335లో సంప్రదించవచ్చన్నారు. నాటు సారా రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్ట్ చింతలపూడి: నాగిరెడ్డిగూడెం గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున నాటుసారా రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. చాట్రాయి మండలం కొత్తగూడెంకు చెందిన ముల్లంగి శ్రీనివాసరావు, ముల్లంగి రామేశ్వరం బైక్పై నాటుసారా రవాణా చేస్తుండగా 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసినట్లు సీఐ పి.అశోక్ తెలిపారు. తనిఖీల్లో ఎకై ్సజ్ ఎస్సైలు ఆర్వీఎల్ నరసింహారావు, అబ్దుల్ ఖలీల్, జె.జగ్గారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఈ నెల 13తో అమ్మవారి జాతర మహోత్సవాలు ముగిసినప్పటికీ ఈ నెల చివరి వరకు భక్తులు ఎక్కువగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఆదివారం కావడంతో సమీప జిల్లాల నుంచి భక్తులు అమ్మను దర్శించుకున్నారు. వేడి నైవేద్యాలు సమర్పించారు. జాతరకు ఏర్పాటు చేసిన చలువ పందిళ్లలో భక్తులు వంటలు చేసుకుని భోజనాలు చేశారు. దేవస్థానంలో శ్రీక్యూశ్రీ లైన్లు నిండాయి. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్కరోజు ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండనశాల, పెద్ద, చిన్న తీర్ధాలు, లడ్డు ప్రసాదం, గదుల అద్దెలు, చిత్రపటాల అమ్మకం, అమ్మవారికి కానుకల ద్వారా రూ.2,92,056 ఆదాయం వచ్చిందని తెలిపారు. అంబేడ్కర్ను అవమానించిన వారిని శిక్షించాలి గణపవరం: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్లలో అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మాలమహానాడు నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం గణపవరం మండలం పిప్పరలో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాలమహానాడు జాతీయాధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతగా ప్రపంచ దేశాలు మేధావిగా కొనియాడిన బీఆర్ అంబేడ్కర్ను అవమానించడం భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనన్నారు. పేద, దళిత, నిమ్న జాతుల గుండెల్లో కొలువైఉన్న అంబేడ్కర్ను ఎవరు అవమానించినా సహించేదిలేదన్నారు. దళితుల మధ్య ఉన్న ఐక్యతను చెడగొట్టి వారి మధ్య విభేదాలు సృష్టించడానికి పాలకులు చేస్తున్న ప్రయత్నాల కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు చోడదాసి జైపాల్, సబ్బితిరాజు, నీతిపూడి వెంకటేశ్వర్లు, ప్రసన్నకుమార్, వెన్నపుచంటి, బీర త్రిమూర్తులు, సారధి, మోహనరావు, బాబ్జి తదితరులు పాల్గొన్నారు. -
హైవే మొబైల్ వెహికల్స్కు జీపీఆర్ఎస్
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఏలూరు పోలీసు శాఖలోని హైవే మొబైల్ వాహనాలకు జీపీఆర్ఎస్ అమర్చినట్లు ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లాలో రహదారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. ఈ నేపథ్యంలో సిబ్బంది సేవలను మరింత సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు జీపీఆర్ఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అమర్చినట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఏలూరు జిల్లాలోని 8 హైవే మొబైల్ వాహనాలకు జీపీఆర్ఎస్ ఏర్పాటు చేశామని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ హైవే మొబైల్ వాహనాలను పర్యవేక్షించటంతోపాటు ఏదైనా అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించేలా అవకాశం లభిస్తుందని డీఎస్పీ చెప్పారు. సిబ్బందికి రేడియం జాకెట్లు, బేటన్స్ అందజేశామని, మరింత సౌకర్యాలు కల్పిస్తూ విధులు సక్రమంగా నిర్వర్తించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. జాతీయ రహదారుల్లో మద్యం సేవించి వాహనాలు నడపటం, మితిమీరిన వేగంతో వెళ్ళే వాహనాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు చేపట్టేలా శ్రద్ద వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఏదైనా అత్యవసర సమయాల్లో హైవే మొబైల్, పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 83329 59175 లేదా డయల్ 112కు ఫోన్ చేయాలని ఏలూరు డీఎస్పీ సూచించారు. బెల్టు షాపు నిర్వాహకుడి అరెస్ట్ పెనుగొండ: మండలంలోని తామరాడలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని, ఆరు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ ఎస్.మణికంఠ రెడ్డి తెలిపారు. ఆదివారం జరిగిన ఈ దాడిలో గుబ్బల జ్ఞానేశ్వరరావు(50)ను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. దాడుల్లో ఎస్సై ఆర్ మధుబాబు, హెచ్సీ శ్రీమన్నారాయణ, కానిస్టేబుల్ నాగరాజు పాల్గొన్నారు. -
నిట్లో ఉత్సాహంగా మారథాన్
తాడేపల్లిగూడెం (టీఓసీ): పరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఏపీ నిట్ డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ కె.హిమబిందు సూచించారు. నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్వీ రమణారావు ఆధ్వర్యంలో సంస్థలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లబ్ సహకారంతో ఆదివారం నిర్వహించిన మారథాన్ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. ఈ సందర్భంగా డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం, పరుగు, నడక, యోగా వంటివి ఎంతగానో దోహదం చేస్తాయని వీటి సాధన కోసం విద్యార్థులు నిత్యం కొంత సమయాన్ని కేటాయించాలని వివరించారు. అనంతరం నిట్ ముఖద్వారం నుంచి బాలికల వసతి గృహాల వరకు, అక్కడి నుంచి తిరిగి మళ్ళీ నిట్ ముఖద్వారం వరకు మారథాన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ టి.జగన్మోహన్రావు, శారదా ప్రసన్న మాలిక్, సుశాంత్ కుమార్, బెహారా తదితరులు పాల్గొన్నారు. -
రికవరీ ఏజెన్సీల మాఫియా?
తీగలాగితే డొంక కదిలింది ఏలూరు జిల్లా చింతలపూడి ప్రాంతంలోని ఒక సచివాలయంలో పనిచేస్తున్న మహిళా పోలీసుకు ఫోన్ కాల్ వచ్చింది. తాను ఏలూరు నుంచి సీఐ నాగరాజును మాట్లాడుతున్నానని.. చింతలపూడిలోని ఒక వ్యక్తికి చెందిన ఆధార్, పాన్కార్డ్ అతని పూర్తి వివరాలు వాట్సప్లో ఇవ్వాలని చెప్పాడు. ఆమెకు అనుమానం రావడంతో ఏలూరులోని పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చింది. తీగ లాగితే.. మొత్తం డొంక కదిలింది. ఏలూరు శాంతినగర్లో థర్డ్ పార్టీ ఏజెన్సీ పేరుతో ఒక కార్యాలయాన్ని నడుపుతున్న ముఠా దొరికింది. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు, ఏలూరు త్రీటౌన్ పోలీసులు కార్యాలయంపై మూడు రోజుల క్రితం దాడి చేశారు. పత్తేబాద రోడ్డులోనూ ఇదే తరహా ప్రైవేటు ఏజెన్సీ కార్యాలయాన్ని పోలీసులు తనిఖీ చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు సమాచారం. ప్రైవేటు ఏజెన్సీ మాఫియా ఫైనాన్స్ కంపెనీలు రుణాల రికవరీకి థర్డ్పార్టీ ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగిస్తుంది. ఈ నేపథ్యంలో ఏలూరు కేంద్రంగా ప్రైవేటు ఏజెన్సీ మాఫియా జనాలను పోలీసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ ఏజెన్సీలో ఏలూరుకు చెందిన ఆరుగురు వ్యక్తులు, తిరుపతికి చెందిన ఇద్దరు, బెంగుళూరుకు చెందిన మరో ఇద్దరు కీలక పాత్రధారులుగా ఉన్నట్లు గుర్తించారు. ఏలూరుకు చెందిన గడ్డం కిషోర్ అలియాస్ నాగరాజు, మధ్యాహ్నపు వంశీకృష్ణ, ప్రవీణ్కుమార్, రియాజ్, వెంకట్, ఇబ్రహీం, మరో నలుగురిపై ఏలూరు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ ఏజెన్సీ ముఠాలో 10 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత సమాచారం? ప్రైవేటు ఏజెన్సీల పేరుతో సాగుతున్న దందాతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసుల పేరుతో ఏకంగా సచివాలయ ఉద్యోగులను సైతం ప్రభావితం చేస్తూ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం చూస్తే .. వ్యక్తిగత గోప్యత ప్రమాదంలో పడినట్లవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక నకిలీ పోలీసులే ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారా ? లేక నిజంగానే ఎవరైనా పోలీస్ అధికారులు ఈ ఏజెన్సీలకు అండగా నిలుస్తున్నారా? అనేది సందేహంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఇదే తరహాలో ప్రైవేటు ఏజెన్సీల ఆగడాలు సాగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు వాపోతున్నారు. దుగ్గిరాల ప్రాంతానికి చెందిన కలగంటి గోవింద్ కొంతకాలం క్రితం ప్రైవేటు ఫైనాన్స్లో రుణం తీసుకున్నాడు. ఇటీవల అతనికి రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఏజెన్సీ వ్యక్తులు అతడిని కలిసి నీకు బీమా వస్తుంది.. కొంత కడితే ఇంక లోన్ కట్టాల్సిన పనిలేదని కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. కొద్దిరోజుల క్రితం థర్డ్పార్టీ ఏజెన్సీ పేరుతో సీఐ అంటూ ఫోన్ చేసి డబ్బులు కట్టాలని, రూ.1.80 లక్షలు చెల్లించకుంటే చెక్బౌన్స్ కేసు నమోదు చేస్తామని, అల్లరి చేస్తామని, బెయిల్ కూడా రాదంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఏలూరు టౌన్: ఏలూరు పత్తేబాద ప్రాంతానికి చెందిన రామసీత ఒక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో పర్సనల్ లోన్ తీసుకున్నారు. నాలుగేళ్లుగా కడుతూ ఉండగా ఆరు నెలలుగా ఈఎంఐ చెల్లించకపోవడంతో బకాయి పడింది. రామసీతకు ఇటీవల ఒక ఫోన్ వచ్చింది. అమరావతి నుంచి సీఐను మాట్లాడుతున్నాను. మీపై హైకోర్టులో కేసు వేస్తున్నారు. మీ ఇంటికి గంటలో పోలీసు జీపు వస్తుంది. మిమ్మల్ని చెక్బౌన్స్ కేసులో అరెస్ట్ చేస్తారు అంటూ బెదిరించారు. కొంతసేపటి తర్వాత పత్తేబాద సచివాలయానికి చెందిన ఒక మహిళా పోలీసు (మహిళా సంరక్షణ కార్యదర్శి) రామసీత ఇంటికి వచ్చి మీరు పర్సనల్ లోన్ తీసుకున్నారని.. మీపై చెక్బౌన్స్ కేసు పెట్టారని.. వెంటనే సంబంధిత ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుకుని బకాయి డబ్బులు కట్టకపోతే.. పోలీస్స్టేషన్కు తీసుకెళ్తాం.. అంటూ వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల పేరుతో భయభ్రాంతులు సచివాలయ సిబ్బందిని వినియోగిస్త్తున్న వైనం ఏలూరులో రెండు చోట్ల తాత్కాలిక ఆఫీసులు? 9 మందిపై కేసు నమోదు -
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు ప్రదానం
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని మోదుగగుంట గ్రామానికి చెందిన బోనగిరి రమేష్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఐకాన్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. ఆర్యవైశ్య సంఘంలో కీలకంగా వ్యవహరిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న రమేష్ సేవలను గుర్తించి, ఈ అవార్డు ప్రదానం చేశారు. 48 మద్యం సీసాల స్వాధీనం ఆగిరిపల్లి: అక్రమంగా నిల్వ ఉంచిన 48 మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై శుభశేఖర్ తెలిపారు. మండలంలోని తోటపల్లిలో ఆరేపల్లి వేణుగోపాల్ అనే వ్యక్తి అక్రమంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్నాడనే సమాచారంతో ఆదివారం సిబ్బందితో కలిసి దాడి చేసి అతని వద్ద ఉన్న 48 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మండలంలో ఎవరైనా అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాట్నాలమ్మకు రూ.1,26,343 ఆదాయం పెదవేగి: భక్తుల తాకిడితో రాట్నాలమ్మ అమ్మవారి దేవస్థానం కిటకిటలాడింది. పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలసిన రాట్నాలమ్మ తల్లికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యాలు సమర్పించారు. ఈ వారం అమ్మవారికి పూజా రుసుంలతో రూ.60,850, విరాళాలుగా రూ.36,493, లడ్డూ ప్రసాదం అమ్మకం ద్వారా రూ.27,000, ఫొటోల అమ్మకం వల్ల రూ.2,000 ఆదాయం లభించగా, మొత్తం ఆదాయం రూ.1,26,343 లభించిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్.సతీష్కుమార్ తెలిపారు. -
మున్సిపల్ ఆర్ఐలకు కొత్త కంప్యూటర్లు
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం మున్సిపల్ రెవెన్యూ కార్యాలయంలో పాత ఫర్నిచర్, పనిచేయని కంప్యూటర్లతో ఆర్ఐలు ఇబ్బందులు పడుతు న్నారని ‘సాక్షి’లో ప్రచురించిన కథనంపై మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి స్పందించారు. రెవెన్యూ విభాగానికి మూడు కొత్త కంప్యూటర్లు, ప్రింటర్లు ఏర్పాటు చేశారు. తమ ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లిన ‘సాక్షి’కి రెవెన్యూ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రేడ్–1 మున్సిపాలిటీ, ఆదాయంలో ప్రథమ స్థానంలో ఉన్నా భీమవరంలో సౌకర్యాల కొరత వేధిస్తోంది. టెన్త్ పరీక్షలకు 99 శాతం హాజరు భీమవరం: జిల్లాలో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శనివారం నిర్వహించిన ప్రథమ భాష పేపర్–2, ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1కు 99 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. 4,163 మంది విద్యార్థులకు 4,132 మంది హాజరయ్యారన్నారు. 39 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదుకాలేదని నారాయణ తెలిపారు. మద్యం షాపు ఏర్పాటుపై మండిపాటు నరసాపురం: నరసాపురంలోని 26వ వార్డు వీవర్స్ కాలనీలో మద్యం షాపు ఏర్పాటును శనివారం స్థానికులు అడ్డుకున్నారు. కల్లుగీత కార్మికుల కోటాలో షాపును వీవర్స్ కాలనీలో ఇళ్ల మధ్య ఏర్పాటు చేసే యత్నం చేశారు. షాపును ప్రారంభానికి సిద్ధం చేస్తుండగా స్థానిక మహిళలు అడ్డుకున్నారు. కాలనీలో ఇళ్ల మధ్య బ్రాందీ షాపు పెడితే ఎలాగని ప్రశ్నంచారు. కాలనీలో రోడ్డుపై మహిళలు తిరగలేరని, చిన్న పిల్లలు ఆడుకునే గ్రౌండ్ వద్ద షాపు ఎలా పెడతారని నిలదీశారు. మహిళల ఆందోళనతో నిర్వాహకులు షాపు ఏర్పాటు నిర్ణయాన్ని వాయిదా వేసుకుని వెళ్లిపోయారు. బెల్టు షాపులను అరికట్టలేని ప్రభుత్వం భీమవరం: రాష్ట్రంలో బెల్టుషాపులను అరికట్ట లేని కూటమి ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోందని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నర్సింహమూర్తి దుయ్యబట్టారు. శనివారం భీమ వరం సీఐటీయూ కార్యాలయంలో జరిగిన కల్లుగీత సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 70 వేలకుపైగా బెల్టుషాపులు ఉన్నాయని, గోవా, యానాం నుంచి అక్రమ మద్యం వస్తుండటంతో తాటి కల్లు ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో గీత కార్మికుల పరిస్థితి మ రింత అధ్వానంగా మారిందన్నారు. కల్లు గీత వృత్తిలో మార్పు తెచ్చి గీత కుటుంబాలకు ఉ పాధి కల్పించి ఆదుకోవాలన్నారు. ప్రజాప్రతినిధుల అండదండలతోనే బెల్ట్ షాపులు నిర్వహించ డం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా సంఘం అధ్యక్షుడు కామన మునిస్వామి మాట్లాడుతూ బెల్ట్ షాపులు, అక్రమ మద్యం అరికట్టలేని ఎక్సైజ్శాఖ గీత కార్మికుల ఇళ్లపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. నిధుల దుర్వినియోగంపై విచారణ ఉంగుటూరు: కాగుపాడు గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై రెండోసారి శనివారం విచారణ జరిగింది. నూజివీడు డీఎల్పీఓ కార్యాలయంలో డీఎల్పీఓ విచారణ చేయగా ఆరోపణలకు బాధ్యులు సర్పంచ్ కడియాల సుదీష్ణ, కార్యదర్శి, దుర్గాధర్, పూర్వ కార్యదర్శులు బాలకృష్ణ, శ్రీదేవి, ఆరోపణలు చేసిన వార్డు సభ్యులు హాజరయ్యారు. కార్యదర్శి బాలకృష్ణ రూ.1.42 లక్షలు, కార్యదర్శి శ్రీదేవి రూ.6.35 లక్షలు, సర్పంచి సుదీష్ణ రూ.7.77 లక్షల నిధులు దుర్వినియోగం చేసినట్టు నోటీసులో తెలిపారు. మద్యం షాపు ఏర్పాటును అడ్డుకున్న మహిళలు -
ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేయాలి
భీమవరం: జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలుకు వ చ్చేనెల మొదటి వారంలో కేంద్రాలను సిద్ధం చేయా లని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లు, పీజీఆర్ఎస్, రీసర్వే, రెవెన్యూ సదస్సులు, వెబ్ ల్యాండ్, ఏపీ సేవా సర్వీసులు తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ధాన్యం కొనుగోలుకు సిబ్బందిని ని యమించి, మూడు విడతల శిక్షణ ఇవ్వాలన్నారు. గోనె సంచులు, రవాణాకు వాహనాలు సిద్ధం చేసుకోవాలన్నారు. రైతులు రైతు సేవా కేంద్రాలకు వె ళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో వాట్సాప్ చా ట్ను ప్రభుత్వం కల్పించిందన్నారు. రైతు సేవా కేంద్రాల, మిల్లులు వద్ద ఒకే కంపెనీకి చెందిన తేమశా తం యంత్రాలు ఉండేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 120 గ్రామాల్లో సర్వేను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ పాల్గొన్నారు. -
కొల్లేరులో ఆక్రమణదారులకు నోటీసులు
ఖండ్రిక కాలువ ప్రక్షాళనకు ప్రతిపాదనలు నిడమర్రు: కొల్లేరు అభయా రణ్య పరిధిలో అక్రమ ఆక్వా సాగుపై శనివారం ‘సాక్షి’లో ప్రచురించిన ‘కొల్లేరు అభయారణ్యం.. ఆక్రమణలే సర్వం’ శీర్షికన కథనానికి జిల్లా అటవీ శాఖ అధికారులు స్పందించా రు. జిల్లా అటవీ శాఖ అధికారి (వన్యప్రాణి యాజమాన్యం) డి.విజయ దేవరగోపవరంలో 5వ కాంటూరులోపు అక్రమ సాగు చేస్తున్న ఆక్వా చెరువులు, విద్యుత్ తీగలు, బోర్లను పరిశీలించారు. బహిరంగంగా విద్యుత్ తీగలు కనిపిస్తున్నా ఏం చేస్తున్నారని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే సస్పెండ్ చేస్తామని సిబ్బందిపై ఆమె మండిపడ్డారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు రైతులతో మాట్లాడారు. పెదనిండ్రకొలను నుంచి దేవరగోవపరం మీదుగా కొల్లేరులో కలిసేలా 2.5 కిలోమీటర్లు మేర ఖండ్రిక పంట కాలువ రెవెన్యూ రికార్డుల్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పెదనిండ్రకొలను గ్రామ పరిధిలో కాలువ ఆక్రమణలు లేవని, దేవరగోపవరం 5వ కాంటూరు పరిధి నుంచి ఆక్రమణలు ఉన్నట్లు నిర్ధారించారు. సుమారు కిలోమీటరు మేర ఖండ్రిక పంట కాలువ తొమ్మిది ఆక్వా చెరువుల మధ్యలో ఉన్నట్టు గుర్తించారు. ఆయా చెరువుల నిర్వాహకులకు నోటీసులు ఇస్తున్నట్టు తహసీల్దార్ నాగరాజు తెలిపారు. ఆక్రమిత పంట కాలువ 5వ కాంటూరు పరిధిలో ఉండటంతో కాలువ ప్రక్షాళనకు ప్రభుత్వ అనుమతి కోరడంతోపాటు కాలువ తవ్వేందుకు ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించిన రూ.11.80 లక్షల నిధులు మంజూరు చేసేలా నివేదిక పంపుతామన్నారు. ఏలూరు రేంజర్ అధికారి మోహిని విజయలక్ష్మి, అటవీ సిబ్బంది ఉన్నారు. -
ఆ చిన్నారుల చదువుకు వీధి లైట్లే దిక్కు
● ఇళ్ల తొలగింపుతో రోడ్డున పడ్డ బాధితులు ● పట్టాలిచ్చినా కట్టుకునే స్థోమత లేక అవస్థలు ● దయ చూపండని బాఽధితులు, పిల్లల మొర సాక్షి టాస్క్ఫోర్స్: ఆకివీడులోని అమృతరావు కాలనీకి చేర్చి శ్మశాన భూమికి మధ్య ఆక్రమణలను తొ లగించడంతో బాధితులు వీధిన పడ్డారు. వారి పిల్ల లు వీధి దీపాల కింద చదువుకోవాల్సిన దుస్థితి నె లకొంది. 30 ఏళ్లుగా శ్మశానానికి ఆనుకుని పూరి పా కలు, పందిళ్లు వేసుకుని సుమారు 29 కుటుంబాల వారు జీవిస్తున్నారు. ఇటీవల కోర్టు ఆదేశాలతో రెవె న్యూ అధికారులు ఆక్రమణలను తొలగించారు. గత ప్రభుత్వంలోనే 22 మంది బాధితులకు పట్టాలు ఇచ్చారు. తమకు ఇల్లు కట్టుకునే స్థోమత లేదని బా ధితులు ఆక్రమణల నుంచి వైదొలగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్రమణలను ఖాళీ చే యించారు. ఆక్రమణదారులు ఆయా పంచల్లోనే కా లం గడుపుతున్నారు. తాము ఇల్లు నిర్మించుకునే స్థితిలో లేమని చెప్పడంతో ఆయా పట్టాలను వేరొకరికి మార్పు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. ప్రభుత్వమే తమకు ఇల్లు నిర్మించి ఇ వ్వాలని కోరుతున్నారు. 30 ఏళ్లుగా వర్షాలు, ముంపు నీటిలోనే జీవనం గడిపామని, పాములు, క్రిమికీటకాలతో పాటు, శవ దహనాల ఎదురుగా భోజ నాలు చేశామని, నిద్రపోయామని వాపోతున్నారు. వీధి దీపాల కింద చదువులు : 29 బాధిత కుటుంబాల్లో సుమారు వంద మందికి పైగా ఉన్నారు. వా రిలో సుమారు 25 నుంచి 30 మంది వరకు పిల్లలుండగా చాలా మంది ఆరు నుంచి పదో తరగతి చ దువుతున్నవారే. వీరంతా గూడు లేక, చదువుకునేందుకు ఆస్కారం లేక వీధి దీపాల కింద చదువుకుంటూ కాలం గడుపుతున్నారు. ఒక పక్క దోమలు, మరో పక్క ఉక్కబెట్టే వాతావరణంలో అల్లాడిపోతున్నారు. రోడ్లపై పడుకుంటూ, వీధిలైట్ల వెలుగులో చదువుకుంటు న్నా అధికారులకు, పాలకులకు కనికరం లేదని ఆవేదన చెందుతున్నారు. తమను ఆదుకునేందుకు కూ టమి ప్రభుత్వం ముందుకు వస్తుందని ఆశించామని, ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నా పట్టించుకోలేదని పిల్లలు, వృద్ధులు, మహిళలు వాపోతున్నారు. రెండు మూడు తరాల నుంచి ఇక్కడే జీవిస్తున్నామని, వైఎస్ జగన్ ప్రభుత్వంలో తమకు పట్టాలిచ్చారని చెబుతున్నారు. ఇల్లు నిర్మించుకునేందుకు కూటమి ప్రభుత్వం రూ.4 లక్షలు ఇస్తానని ప్రకటించడంతో ఆశగా ఎదురు చూశామని, అవి కాస్తా ఆవిరయ్యాయని ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా వీధి దీపాల కింద పిల్లలు చదు వు కుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే రఘు రామకృష్ణరాజు స్థానిక పార్టీ నేతలను పంపించి విషయం బయటికి రాకుండా సద్దుమణిచే ప్రయ త్నం చేయడం గమనార్హం -
కోకో కొనుగోలు కోసం ధర్నాలు
ఏలూరు (టూటౌన్): కోకో గింజలు కొనుగోలు చేయాలని, అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24, 25 తేదీల్లో మండలాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించనున్నట్టు కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, కార్యదర్శి కె.శ్రీనివాస్ తెలిపారు. చొదిమెళ్లలో నాయకులు శనివారం పర్యటించారు. ధర్నా, రాస్తారోకోలను జయప్రదం చేయాలని రైతులను కోరారు. కోకో గింజల కొనుగోలు, ధరల సమస్యలపై ఉద్యాన శాఖ రాష్ట్ర డైరెక్టర్ సమక్షంలో చర్చలు జరిగినా కోకో రైతులకు న్యాయం జరగలేదన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. సంఘ నాయకులు కోనేరు సతీష్బాబు, పి.నాని, పి.సుధాకర్ పాల్గొన్నారు. -
స్వచ్ఛ ఆంధ్రలో భాగం కండి
భీమవరం(ప్రకాశం చౌక్): స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యసాధనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావా లని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్ నుంచి జేసీ టి.రాహుల్కుమార్రెడ్డితో కలిసి స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఎక్కడా ప్లాస్టిక్ వాడకూడదని, రోడ్లపై చెత్త వేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆలయాల వద్ద వ్యర్థాలను రీసైక్లింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలన్నారు. ఐక్యనగర్లోని హౌసింగ్ కాలనీలో పార్క్ను రూ.30 లక్షలతో అభివృద్ధి చేసేందుకు దేవి సీ ఫుడ్స్ లిమిటెడ్ ముందుకు వచ్చిందన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతిఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలన్నారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
చేతి వృత్తులకు ప్రోత్సాహం
నరసాపురం రూరల్: చేతి వృత్తిదారులను కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సహిస్తుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. శనివారం రుస్తుంబాద గ్రామంలోని అంతర్జాతీయ లేసు ట్రేడ్ సెంటర్ (ఐఎల్టీసీ)లో ఈపీసీహెచ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హ్యాండీ క్రాఫ్ట్స్ ఎక్స్పోకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హస్త కళాకృతులకు దేశవ్యాప్తంగా మార్కెటింగ్ కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. నరసాపురం ప్రాంత లేసు అల్లికలకు ప్రపంచ గుర్తింపు ఉందన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఈపీసీహెచ్ ఎక్స్ చైర్మన్ ఆర్కే పస్సి, ఈడీ ఆర్కే వర్మ పాల్గొన్నారు. -
ఆదివారం.. ఆమె కోసం..
రోజంతా బండెడు చాకిరీ చేసే భార్యకు ఇంటి పనిలో భర్త చేసే చిన్నపాటి సాయం ఎంతో ఉపశమనాన్నిస్తుంది. లేచింది మొదలు పడుకునే వరకు అలుపెరుగని ఆమె శ్రమకు వారంలో ఒక్కరోజైనా విరామం అవసరం. ఆదివారం భర్త ఇంటి పనులు చక్కబెడుతూ ఆమెను మురిపిస్తే వారి సంసార బంధం మరింత బలపడుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆదివారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2025●మనసున మనసై.. ● వారాంతాల్లో విరామంతో ఇల్లాలికి ఉపశమనం ● ఇంటి పనుల్లో భర్త భాగస్వామ్యం అవసరం ● ఇద్దరి మధ్య బలమైన బంధానికి పునాది ● వర్క్ షేరింగ్.. హ్యాపీనెస్ లోడింగ్ అంటున్న మానసిక నిపుణులు భార్యకు విశ్రాంతి అవసరం భార్యకు ఒక్కరోజు విశ్రాంతినివ్వడం ఎంతో అవసరం. పని ఒత్తిడి నుంచి వారికి ఉపశమనం కలుగుతుంది. వారిని పట్టించుకోనట్టు ఉంటేనే ఆడవారికి అలకలు, కోపాలు వస్తాయి. భర్త ఇంటి పనుల్లో కలుగజేసుకుని భార్యకు చేసే సాయం వారి బంధానికి మరింత బలమవుతుంది. కౌన్సెలింగ్లో భార్యాభర్తలకు ఈ విషయాన్ని చెబుతుంటాం. – చల్లా భారతిదేవి, సైకియాట్రిస్ట్, పాలకొల్లు ఆయనకు సెలవొస్తే.. మా వారు పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగి. ఆదివారం, సెలవు రోజుల్లో ఇంటి వద్ద వంట పని, ఇంటి పనుల్లో సాయం చేస్తుంటారు. నా కష్టాన్ని అర్థం చేసుకునే మనస్తత్వం ఆయనకు ఉందని సంతోషం, సంతృప్తి కలుగుతుంటాయి. నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి నా భర్త సహకారమే కారణం. – అంబటి అరుణ సూర్యకుమారి, గృహిణి, నరసాపురం తప్పనిసరిగా సహకరించాలి ఇంటి, వంట పనుల్లో భార్యకు తప్పనిసరిగా సహకరించాలి. నేను వ్యాపారరీత్యా ఆరు రోజులు షాపులో ఉన్నా ఆదివారం తప్పనిసరిగా ఇంటి పనుల్లో నా భార్య లక్ష్మీకుమారికి సహాయపడతాను. ఇతర రోజుల్లోనూ ఇతర పనుల్లో సహాయం చేస్తా. భా ర్యలకు సాయం చేయడం బాధ్యతగా భావించాలి తప్ప నామోషీగా ఫీల్ కాకూడదు. – కారుమూరి నర్సింహమూర్తి (బాబు), భీమవరం ఇంటి పనుల్లో సాయపడతాను నేను ప్రభుత్వ హైస్కూల్ ఉపాధ్యాయుడిని. ఉదయం నుంచి రాత్రి వరకూ ఇంటి కోసం కష్టపడే నా సతీమణి కోసం ఆదివారం ఇంటి పనుల్లో సాయపడతాను. అప్పుడు తెలుస్తుంది ఇంటిని చక్కబెట్టేందుకు ఆవిడ ఎంత కష్టపడుతుందోనని. పొద్దస్తమాను పనిచేసే మహిళలకు వారంలో ఒక రోజు విశ్రాంతి అవసరం. – పొద్దోకు గజేంద్ర గడ్కర్, ఉపాధ్యాయుడు, రాయకుదురు ప్రయోజనాలెన్నో.. ● ఇంటిపనిలో చేదోడువాదోడుగా ఉండే భర్తని ఇల్లాలు చాలా ఎక్కువగా ప్రేమిస్తుందని నిపుణులు అంటున్నారు. భర్త తనను ఎంత ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటున్నాడో అర్థం చేసుకుంటుంది. ఇద్దరి మధ్య ఏమైనా మనస్పర్థలు, అపార్థాలు ఉంటే తొలగిపోతాయి. ఆదివారం వర్క్ షేరింగ్తో ఆ ఇంట హ్యాపీనెస్ లోడింగ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ● ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు. విశ్రాంతి వలన ఆమె శారీరక, మానసిక స్థితి మెరుగుపడుతుంది. ● ఇంటి పనులు త్వరగా పూర్తయితే ఇద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకునేందుకు సమయం పెరుగుతుంది. ● సెలవురోజున పని అయ్యాక ఇల్లాలని సరదాగా బయటకు తీసుకువెళ్లడం వలన వారికి రీఫ్రెష్ అయిన భావన కలిగి వారమంతా ఉత్సాహంగా ఉండే వీలుంటుంది. ● ఇల్లాలు భర్త నుంచి కొంత సమయం కోరుకుంటుంది. అది కూడా స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలని భావిస్తుంది. ప్రేమగా వారి పనుల్లో పాలుపంచుకోవడం వలన ఇది సాధ్యపడుతుంది. ● ఇంటి పని మహిళలే చేయాలన్న భావన నుంచి బయటపడొచ్చు. సాక్షి, భీమవరం: తెల్లారి లేచింది మొదలు ఆడవాళ్ల చేతులు పనులకు ముడిపడతాయి. ఇంటిని శుభ్రం చేయడం, పిల్లలకు స్నానాలు చేయించడం, భర్త, పిల్లలు రెడీ అయ్యేసరికి టిఫిన్లు సిద్ధం చేసి పెట్టడం. అవి పూర్తయ్యేలోగా లంచ్ బాక్స్లు ప్యాకింగ్. ఇలా.. ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు క్షణక్షణం ఉరుకులు పరుగుల జీవితం. భర్తను ఉద్యోగానికి, పిల్లల్ని బడికి సాగనంపాక బండెడు గిన్నులు తోముకుని, ఇంటిల్లపాదివి మాసిన దుస్తులు ఉతుక్కుని, స్నానం చేసి దేవుడికి దణ్ణం పెట్టుకుని.. హమ్మయ్యా అనుకునేసరికి టైం 11 అయిపోతుంది. చాలామంది గృహిణులు ప్రశాంతంగా కూర్చుని టిఫిన్ చేసేది అప్పుడే. సాయంత్రం పిల్లలు, భర్త ఇంటికి తిరిగి వచ్చే వరకు ఏదో పనిలో ఈదుతూనే ఉంటారు. పిల్లలతో హోం వర్క్ చేయించి రాత్రి అందరూ పడుకున్నాక ఉదయానికి అన్నీ సర్దుకుని అలసిసొలసి అప్పుడు నిద్రలోకి జారుకుంటుంటారు. కుటుంబానికి చేదోడుగా.. భర్త, పిల్లల్ని సాగనంపి కుటుంబ పోషణకు చేదోడుగా ఉద్యోగాలు, పనులు చేస్తున్న మహిళలు ఎందరో ఉన్నారు. వీరిపై పనిభారం మరింత ఎక్కువగా ఉంటుంది. దాదాపు ప్రతి ఇంటిలో తొలి మేలుకొలుపు భార్యదే. రాత్రి బాగా పొద్దిపోయాక నిద్రపోయేది ఆమెనే. పనుల సుడిగుండంలో తనను తాను మరిచిపోయి ఎల్లప్పుడూ కుటుంబ క్షేమం కోరే వ్యక్తి ఇల్లాలు. అలాంటి అర్ధాంగికి ఉపశమనం కలిగించేలా వారాంతాలు, ముఖ్యంగా ఆదివారం ఇంటి పనుల్లో భర్త సహాయం చేయడం ద్వారా గృహిణుల మానసిక, శారీరక స్థితులు మ రింత దృఢమవుతాయని మానసిక నిపుణులు సూ చిస్తున్నారు. గృహ సంబంధ బాధ్యతలు పంచుకోవడం మేలని, ఈ దిశగా అందరూ ముందుండాలని అంటున్నారు. న్యూస్రీల్ఏమేం చేయాలంటే.. ఉదయం లేవగానే గదులను తుడవడం, దుమ్ములు దులిపి ఇంటిని శుభ్రం చేయడం. ఇంటి ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు తొలగించడం, మొక్కలకు నీరు పెట్టడం. గిన్నెలు తోమడం, కూరగాయలు కోయడం, వంట చేయడం. దుస్తులు ఉతికి ఆరబెట్టడం, ఐరెన్ చేయడం పిల్లలు ఇంటి వద్దనే ఉంటారు కాబట్టి వా రికి స్నానాలు చేయించడం, హోంవర్క్లో సాయం చేయడం, వారితో కలిసి సరాదాగా ఆడుకోవడం వంటివి భర్తలు చేస్తుండాలి. -
ఏరులై పారుతున్న మద్యం
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వ పాలనలో మద్యం ఏరులై పారుతోంది. ఎకై ్సజ్ అధికారులు దాడులు చేస్తున్నా.. మద్యం అక్రమ విక్రయాలను నియంత్రించలేపోతున్నారు. మరో వైపు కూటమి నేతల సాయంతో బెల్టు షాపుల ఏర్పాటు చేసి జోరుగా విక్రయాలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఏలూరు జిల్లాలో 2025 జనవరి 1 నుంచి మార్చి 15 వరకు అక్రమ అమ్మకాలపై ఏకంగా 899 కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏడు ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధిలో 144 మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో అక్రమ మద్యం, నాటుసారా విక్రయాలపై భారీగా కేసులు నమోదయ్యాయి. 315 ఐడీ కేసుల్లో 324 మంది, 157 బెల్లపు ఊట కేసుల్లో 44 మంది, 345 బెల్టు షాపులపై కేసుల్లో 348 మంది, 50 ఎన్డీపీఎల్ కేసుల్లో 51 మంది, 28 ఇతర కేసుల్లో 28 మందిపై కేసులు నమోదు చేశారు. 42 వాహనాలను ఎకై ్సజ్ పోలీసులు సీజ్ చేశారు. ఏడు ఎకై ్సజ్ సర్కిళ్లలో ఇలా.. జిల్లాలోని ఏడు సర్కిళ్ల పరిధిలో భీమడోలు, ఏలూరు సర్కిళ్లలో తక్కువ కేసులు నమోదయ్యాయి. చింతలపూడి సర్కిల్లో 256 కేసులు నమోదు చేశారు. నూజివీడు సర్కిల్లో 203 కేసులు, జంగారెడ్డిగూడెం సర్కిల్లో 124 కేసులు, పోలవరం 121, కై కలూరు సర్కిల్లో 77 కేసులు నమోదు చేశారు. బెల్టుషాపుల విషయానికొస్తే కై కలూరులో 70, నూజివీడు 50, చింతలపూడి సర్కిల్ పరిధిలో 52 కేసులు నమోదు చేశారు. బెల్లపుఊటకు సంబంధించి చింతలపూడిలో 52 కేసుల్లో 59 వేల లీటర్లు ధ్వంసం చేయగా.. పోలవరం సర్కిల్లో 47,800 లీటర్లు, నూజివీడు సర్కిల్లో 45,310 లీటర్లు, జంగారెడ్డిగూడెం సర్కిల్లో 15,320 లీటర్ల బెల్లపుఊట ధ్వంసం చేశారు. చింతలపూడి పరిధిలో 15 వాహనాలు, నూజివీడులో 16 వాహనాలు, పోలవరం 6, జంగారెడ్డిగూడెం 4, ఏలూరులో ఒక్క వాహనాన్ని సీజ్ చేశారు. నిబంధనలు పాటించాలి అక్రమంగా మద్యం విక్రయించినా.. నిబంధనలు పాటించకపోయినా కేసులు నమోదు చేస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామాల్లో సారా తయారీపై నిఘా ఉంచి దాడులు చేస్తున్నాం. మూడు నెలల్లో భారీగా కేసులు నమోదు చేశాం. – ఆవులయ్య, ఎకై ్సజ్ అధికారి, ఏలూరు 899 కేసుల్లో 799 మంది అరెస్ట్ బెల్టు షాపులపై 345 కేసులు -
నిందితులను కఠినంగా శిక్షించాలి
భీమడోలు : తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గాంధీ కాలనీలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి చెప్పులదండ వేసి అవమానపర్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ శనివారం రాత్రి దళిత నాయకులు కొవ్వొత్తులు పట్టుకుని నిరసన తెలిపారు. తొలుత భీమడోలు సంత మార్కెట్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి దళిత నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో దళిత నాయకుల పైడిమాల యుగంధర్, తుమ్మల శాంతభూషణం, గోగులమూడి రవికుమార్, మద్దాల వెంకటరత్నం, కాలి కిరణ్, రత్తయ్య, బెంజిమన్, డి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరులో.. ఏలూరు (టూటౌన్): అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక నరసింహారావుపేటలోని సంఘ కార్యాలయంలో శనివారం రాత్రి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో అంబేడ్కర్ను అవమానించడం విచారించదగ్గ విషయం అన్నారు. దూబచర్ల వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. నాయకులు ఎన్.కార్తీక్, బి.నాగరాజు, పాము మాన్ సింగ్, అంబటి నాగేంద్ర, కె.మురళీ తదితరులు ఈ ఘటనను ఖండించారు. దెందులూరు మండలంలో.. దెందులూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేయడంపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దెందులూరులో వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఫారెస్ట్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పల్లెం ప్రసాద్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గొల్ల కిరణ్, దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ కన్వీనర్ పొలిమేర హరికృష్ణ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తనగాల శేఖర్ తీవ్రంగా ఖండించారు. 48 గంటల్లో నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. -
హోరాహోరీగా ఆశీలు వేలం
ఆకివీడు : ఆకివీడు నగర పంచాయతీ ఆశీలు వేలం పాట శనివారం హోరాహోరీగా సాగింది. నగర పంచాయతీ కమిషనర్ జీ.కృష్ణమోహన్ పర్యవేక్షణలో వేలం పాట కొనసాగింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు వేలం పాటలో పాల్గొన్నారు. డైలీ మార్కెట్ వేలం పాటను మోటుపల్లి శ్రీధర్ రూ.1,01,01,006కు దక్కించుకున్నారు. వారపు సంత ఆశీలు వసూళ్లను షేక్ అమీర్ రూ.3,30,200కు, కబేళా పాటను షేక్ చంటి సాహెబ్ రూ.35,500కు దక్కించుకున్నట్లు కమిషనర్ కృష్ణమోహన్ చెప్పారు. గత ఏడాది డైలీ మార్కెట్ వేలం పాట ధర కంటే ఈ ఏడాది రూ.20 లక్షలకు పైగా ఆదాయం లభించింది. రూ.1.01 కోట్లకు మార్కెట్ వేలం పాట భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం మున్సిపాలిటీ పరిధిలో 2025–2026 ఏడాదికి మార్కెట్ పన్ను వసూళ్లకు శనివారం భీమవరం మున్సిపాలిటీలో బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలం పాటలో హెచ్చు పాటగా రూ.1,01,49,070కు యార్ర వెంకటేష్ పాడుకున్నారు. గతేడాది వేలంలో రూ.95.68 లక్షలు రాగా.. ఈ ఏడాది రూ.5.42 లక్షల ఆదాయం పెరిగింది. వేలం పాటను అసిస్టెంట్ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు నిర్వహించారు. -
నిషేధిత మందులు.. యథేచ్ఛగా అమ్మకాలు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిషేధిత మందుల అక్రమాలపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝుళిపించారు. పక్కా సమాచారంతో ఏకకాలంలో దాడులు చేయగా.. ఊహించని స్థాయిలో అక్రమాలు వెలుగుచూశాయి. లైంగిక సామార్థ్యాన్ని పెంచే మందులు, గర్భవిచ్ఛిత్తి, మత్తు కలిగించే మందులు పెద్ద మొత్తంలో పట్టుబడ్డాయి. ● జిల్లాలో ఔషధ నియంత్రణ శాఖ అధికారుల దాడులు ● లైంగిక సామర్థ్యం పెంచే మందులు భారీ ఎత్తున సీజ్ ● కాలం చెల్లిన మందులపై స్టిక్కర్లు అంటించి విక్రయాలు తణుకు అర్బన్: జిల్లాలో పలు మందుల దుకాణాల్లో నిషేధిక డ్రగ్స్ అమ్ముతున్నారనే సమాచారంతో జరిపిన దాడుల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. ఈ నెల 21న తణుకు నియోజకవర్గంలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించగా.. నిషేధిత మందులతో పాటు.. కాలం చెల్లిన మందులకు స్టిక్కర్లు అంటించి అమ్ముతున్న వైనం వెలుగుచూసింది. ఈ నిషేధిత మందుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందులతోపాటు మత్తు కలిగించేవి, గర్భస్రావం మందులున్నాయి. తణుకు నియోజకవర్గంలోని అత్తిలిలో సత్యకృష్ణ మందుల దుకాణంలో నిషేధిత మందులతోపాటు కాలం చెల్లిన మందుల నిల్వను అధికారులు కనుగొన్నారు. ఈ దుకాణాన్ని మూసివేసి లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేశారు. తణుకులోని తంగిరాల వారివీధిలో పెంజర్ల నాగేశ్వరరావు కొంతకాలంగా నిషేధిత మందుల్ని రావులపాలెం నుంచి కొని స్థానికంగా అధిక ధరలకు అమ్మడాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించి దాడి చేసి పట్టుకున్నారు. అధిక శాతం లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందుల విక్రయాలు తణుకు పరిసర ప్రాంతాల్లో జోరుగా సాగుతున్నాయని విక్రయదారుడు తెలపడం విశేషం. నాగేశ్వరరావు తణుకులోని పలు దుకాణాలకు ఈ మందులు సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తాడేపల్లిగూడెం, తణుకు, అత్తిలి, ఏలూరులో పలు దుకాణాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిషేధిత మందుల విక్రయాలకు సంబంధించి రూ.కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. నరసాపురం డివిజన్లో సుమారుగా 800, భీమవరం డివిజన్లో 600కు పైగా మందుల దుకాణాలు ఉన్నాయి., కొన్ని దుకాణాల్లో నిషేధిత మందులు విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాడుల విషయం తెలియడంతో అక్రమార్కులు జాగ్రత్త పడిపోయారు. తణుకులో ఒక ఇంట్లో నిషేధిత మందులు విక్రయాలకు సంబంధించి సుమారు రూ.6 లక్షల వరకు మందులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. రావులపాలెంకు చెందిన బచ్చు సుబ్బారావు బ్యాంకు ఖాతాకు ఫోన్ పే ద్వారా పంపినట్లు విజిలెన్స్ అధికారులు ఆధారాలు సేకరించారు. నిషేధిత మందులతో ఆరోగ్యంపై ప్రభావం లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందుల వల్ల గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులు, ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ మందు అధిక వాడకం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. గర్భస్రావం కోసం ఉపయోగించే మందులు ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తాయని, భవిష్యత్తులో తీవ్రం ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. మత్తు మందు వాడకంతో కొన్నాళ్లకు నరాల సమస్యలు, నిద్రలేమి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఔషధ నియంత్రణ శాఖ నిర్లక్ష్యం విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగితే తప్ప నిషేధిత మందుల వినియోగంపై ఔషధ నియంత్రణ శాఖ పర్యవేక్షణ లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ దుకాణంలో ఏ మందులు ఉన్నాయి.. ఏ దుకాణంలో నిబంధనలు పాటిస్తున్నారనే విషయంపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు స్పష్టత ఉంటుంది. కొన్ని రకాల కారణాలతో దాడులు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఔషధ నియంత్రణ శాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షించి తరచూ దుకాణాలపై దాడులు చేస్తే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు. -
వీధి కుక్కలకు ఆపరేషన్లు
తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 12వ వార్డు పాతూరు సచివాలయం సమీపంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ, స్టెరిలైజేషన్, యాంటీ రేబిస్ టీకాలు వేసేందుకు ప్రత్యేక కేంద్రాన్ని నిర్మించారు. తాడేపల్లిగూడెం, తణుకు పరిధిలో కుక్కలకు ఇక్కడ ఆపరేషన్లు చేస్తారు. రూ.18 లక్షలతో నిర్మించిన ఈ కేంద్రంలో కుక్కలకు ఆపరేషన్ చేసేందుకు ఆపరేషన్ థియేటర్, డాక్టర్ రూం, స్టోర్ రూం, స్టెరిలైజేషన్, హీటర్ రూంలతో పాటు కుక్కలను ఉంచేందుకు 37 బోనులు అందుబాటులో ఉంచారు. స్నేహ యానిమల్ వెల్ఫేర్ ఏజెన్సీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు వెటర్నరీ వైద్యులు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, శానిటరీ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో స్నేహ సిబ్బంది ఆపరేషన్ చేసే ముందురోజు కుక్కలను పట్టుకుని బోనులోకి తరలిస్తారు. తరువాత రోజు డాక్టర్, సహాయకుల పర్యవేక్షణలో ఆపరేషన్లు చేస్తారు. అబ్జర్వేషన్ కోసం మూడు రోజులు కుక్కను బోనులో ఉంచుతారు. ఈ సమయంలో వాటికి అవసరమైన ఆహారం, మంచినీరు అందజేస్తారు. సెంటరులో ఎలాంటి దుర్వాసన రాకుండా శానిటేషన్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు. కోలుకున్న తరువాత కుక్కలను ఎక్కడ పట్టుకున్నారో అక్కడే వదిలేస్తారు. కుక్కకు రూ.1500 చొప్పున ఏజెన్సీకి ప్రభుత్వం ఇస్తుంది. మున్సిపల్ డీఈ నాగిరెడ్డి రామారావు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో 35 వార్డులలో 1,150 కుక్కలకు, తణుకు మున్సిపాలిటీ పరిధిలో 500 కుక్కలకు ఈ ఆపరేషన్లు చేస్తారన్నారు. ఇప్పటికే పట్టణంలో 450 కుక్కలకు ఏఆర్వీ వ్యాక్సిన్ అందజేసినట్లు చెప్పారు. నిరంతరం వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. కుక్కల సంతతి తగ్గేనా... తాడేపల్లిగూడెం పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. పురపాలక సంఘం ఆధ్వర్యంలో కుక్కలకు ఆపరేషన్లు చేయడం ద్వారా వాటి సంతతి తగ్గుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. తాడేపల్లిగూడెంలో ప్రత్యేక కేంద్రం కుటుంబ నియంత్రణ, స్టెరిలైజేషన్ శస్త్రచికిత్సల నిర్వహణ -
గంగానమ్మ విగ్రహ తొలగింపుతో ఉద్రిక్తత
నూజివీడు : పట్టణంలోని కృష్ణా బడ్డీ కొట్టు సెంటర్లో రావి చె ట్టు వద్ద ఉన్న గంగానమ్మ విగ్రహాలను శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో యడవల్లి రవిచంద్ర(32) అనే అతను గునపంతో తవ్వి ధ్వంసం చేసి పక్కన పడేశాడు. అంతేకాకుండా అక్కడే ఉన్న దేవుడి ఫొటోలను సైతం పక్కన పడేశాడు. ఈ సంఘటన పట్టణంలో తీవ్ర సంచలనం కలిగించింది. ఈ విషయం తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే స్పందించి యడవల్లి రవిచంద్రను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. ఇది తమ సొంత స్థలమని, అందులో ఎవరెవరో వచ్చి విగ్రహాలు పెట్టి తాము ఏర్పాటు చేసిన గుడి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని, అసలు తమ పట్టా భూమిని తాము స్వాధీనం చేసుకోవడానికి తవ్వినట్లు రవిచంద్ర విచారణలో తెలిపాడని సీఐ పి.సత్యశ్రీనివాస్ తెలిపారు. అయితే మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణతో పాటు పట్టణానికి చెందిన పలువురు పెద్దలు ఇప్పటివరకు ఎక్కడైతే గంగానమ్మ విగ్రహం ఉందో మళ్లీ అక్కడే విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
మెడికల్ షాపులపై దాడులు
తణుకు అర్బన్ : పట్టణంలోని మెడికల్ షాపులపై శుక్రవారం విజిలెన్స్, ఈగల్, ఔషధ నియంత్రణ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల్లో ఉన్న మందుల వివరాలు, నిల్వలు, ఎక్స్పైరీ తేదీలు తదితర అంశాలతోపాటు నిషేధిత మందుల నిల్వలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ జిల్లా ఎస్పీ శ్రీరామ్బాబు ఆదేశాల మేరకు తణుకు పట్టణంలోని పలు దుకాణాల్లో తనిఖీలు చేసినట్లు విజిలెన్స్ ఎస్సై కె.సీతారాం తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు తంగిరాల వారి వీధిలోని ఇండియన్ పబ్లిక్ స్కూలు ఎదురుగా ఉన్న భవనం మూడో అంతస్తులో అనధికారికంగా నిల్వ ఉంచిన నిషేధిత మందులను గుర్తించినట్లు చెప్పారు. లైంగిక సామర్థ్యాన్ని పెంచేవి, మత్తునిచ్చేవి, గర్భస్రావం అయ్యేటటువంటి మందులను అనధికారికంగా నిల్వ ఉంచి విక్రయాలు చేస్తున్న పెంజర్ల నాగేశ్వరరావుపై డ్రగ్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 1940 అండర్ సెక్షన్ 18 సీ ప్రకారం కేసు నమోదు చేసి, అతని నుంచి మందులు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ మందులు తూర్పుగోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన బచ్చు వెంకట సుబ్బారావు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు. అలాగే తణుకు పట్టణంలోని రాష్ట్రపతి రోడ్డులో మరొక మూడు దుకాణాల్లో తనిఖీలు చేశారు. దాడుల్లో ఈగల్ సీఐ సూర్య మోహన్రావు, సీసీఎస్ సీఐ రాంబాబు, తణుకు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పి.మల్లికార్జునరావు, విజిలెన్స్ ఏఈ ఎం.అనీల్బాబు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో.. తాడేపల్లిగూడెం : పట్టణంలోని మెడికల్ షాపులపై శుక్రవారం విజిలెన్సు అధికారులు దాడులు చేశారు. పట్టణంలోని పోర్టుగేట్ డ్రగ్ హౌస్లో ఈ సోదాలు జరిగాయి. దుకాణం లైసెన్సు, నిషేధిత మందులు ఏమైనా ఉన్నాయా? జీఎస్టీ ఇతర అంశాలపై డ్రగ్స్, పోలీసు అధికారుల సమక్షంలో దాడులు చేశారు. తనిఖీల నేపధ్యంలో పట్టణంలోని మెడికల్ షాపులను మూసివేశారు. విజిలెన్సు సీఐ శివరామకృష్ణ, డ్రగ్ ఇన్స్పెక్టర్ అబీద్ అలీ, పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అత్తిలిలో.. అత్తిలి : స్థానిక సత్యకృష్ణ మెడికల్ షాపును విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, జౌషధ నియంత్రణశాఖ సంయుక్తంగా శుక్రవారం తనిఖీ చేశారు. మెడికల్షాపులో అనుమతి లేని మందులతో పాటు కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించామని భీమవరం డ్రగ్ ఇన్స్పెక్టర్ అబిద్ అలీ తెలిపారు. ట్యాబ్లెట్ షీట్లపై ఎక్స్పైరీ డేట్ కట్ చేసి స్టిక్కర్లు వేసి మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించి, షాపును మూయించివేశారు. మెడికల్ షాపు లైసెన్సును రద్దు చేస్తామని అలీ చెప్పారు. ఏలూరు జిల్లాలో.. ఏలూరు టౌన్ : ప్రభుత్వ ఆదేశాలతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్, డ్రగ్స్ కంట్రోల్ అధికారులతో సంయుక్తంగా ప్రత్యేకంగా నియమితులైన విచారణ అధికారులు మెడికల్ షాపులపై దాడులు చేశారు. ఏలూరు జిల్లాలో నూజివీడు, ఏలూరు, ద్వారకాతిరుమల ప్రాంతాల్లో ఒకేసారి అధికారులు తనిఖీలు చేశారు. ఏలూరు నగరంలోని ఉదయ్ జనరిక్, సద్భావన మెడికల్స్, ద్వారకాతిరుమలలోని సంజీవిని మెడికల్స్, నూజివీడు ప్రాంతంలో సాయి బాలాజీ మెడికల్స్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. మందుల షాపుల్లో అనధికారికంగా మందుల విక్రయాలు, డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయాలు, గడువు ముగిసిన మందులను సైతం ఇష్టారాజ్యంగా అమ్ముతున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. రికార్డులు సైతం సక్రమంగా లేవని అధికారుల గుర్తించారు. కొన్ని మందుల షాపుల్లో శుక్రవారం రాత్రి వరకూ తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తనిఖీల్లో భీమడోలు సీఐ యూజే విల్సన్, ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, నూజివీడు రూరల్ సీఐ కె.రామకృష్ణ, విజిలెన్స్ విభాగం సీఐ ప్రసాద్కుమార్, ఎస్సై రంజిత్కుమార్, నాగరాజు, విజిలెన్స్ డీఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తణుకులో నిషేధిత మందులు స్వాధీనం -
హ్యాండ్బాల్ రాష్ట్ర విజేత పశ్చిమగోదావరి
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి అండర్–19 జూనియర్ బాలికల హ్యాండ్బాల్ పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లా సత్తా చాటింది. ఈ నెల 20న విజయవాడలోని ఆంధ్రా లయోల కాలేజీలో ప్రారంభమైన ఈ పోటీలకు 12 ఉమ్మడి జిల్లాలు ప్రాతినిధ్యం వహించాయి. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరిగిన ఈ పోటీల్లో పశ్చిమగోదావరి జట్టు వరుస విజయాలను సాధించింది. శుక్రవారం జరిగిన ఫైనల్స్లో ప్రత్యర్థి తూర్పుగోదావరి జిల్లా జట్టును ఓడించి విన్నర్ ట్రోఫీని అందుకుంది. విజేతలకు ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మల్లేశ్వరరావు, లయోల కాలేజీ వ్యాయామ విద్యా విభాగాధిపతి డాక్టర్ కె.సుజాత ట్రోఫీలు అందజేశారు. -
మధ్యవర్తిత్వంతో సత్వర పరిష్కారం
ఏలూరు (టూటౌన్): కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఎంతో దోహాదపడుతుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ఎఫ్ఏసీ) ఎం.సునీల్ కుమార్ అన్నారు. ఎంపిక చేసిన న్యాయవాదులకు, సోషల్ వర్కర్ల జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎం.సునీల్కుమార్ మాట్లాడుతూ ఐదు రోజులపాటు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో తెలుసుకున్న మెలకువలతో మరింత నైపుణ్యంతో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మధ్యవర్తి త్వం ద్వారా ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన, చట్టపరమైన షరతులతో రాజీ చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెండో అదనపు జిల్లా జడ్జి పి.మంగకుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
ముదినేపల్లి రూరల్: మండలంలోని పెనుమల్లి వద్ద శుక్రవారం ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. ఇందుకు ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామతులు ఆందోళనకు దిగడంతో రెండు గంటల పాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వివరాల ప్రకారం మండలంలోని సంఖర్షణపురానికిచెందిన ముత్యాల చక్రవర్తి(32), మరో ఐదుగురు కూలీలతో మినుము నూర్పిడి చేసేందుకు ట్రాక్టర్పై కూలి పనికి వెళ్తున్నారు. పెనుమల్లి సమీపానికి వెళ్లగానే మలుపు వద్ద డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదం నుంచి ఐదుగురు కూలీలు తప్పించుకోగా ట్రాక్టర్పై ఉన్న మినుము నూర్పిడి యంత్రం చక్రవర్తిపై పడి తీవ్రగాయాలపాలయ్యాడు. ప్రమాద సమయంలో స్థానికులు ఎవ్వరూ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర గాయాలతో అరగంట సేపు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడాడు. సమాచారం అందుకున్న బంధువులు గుడివాడ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. చక్రవర్తి మృతదేహంతో గుడివాడ నుంచి బయల్దేరిన గ్రామస్తులు చక్రవర్తి కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన చేయాలని నిర్ణయించారు. సమాచారం తెలుసుకున్న పోలీసు సిబ్బంది గుడివాడ నుంచి వస్తున్న చక్రవర్తి మృతదేహాన్ని జాతీయ రహదారిపై కోడూరు వద్ద అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులకు, పోలీసులకు తీవ్ర వాగ్వివాదం జరిగింది. మృతుడి తరఫు వ్యక్తులకు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ తరఫు వ్యక్తులకు మధ్య రాజీ చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమించారు. -
నైపుణ్యంతో అపార అవకాశాలు
భీమడోలు: నైపుణ్యాలు గల యువతకు ఉద్యో గ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జిల్లా ప్లేస్మెంట్ అధికారి రవి శ్యామ్ అన్నారు. భీమడోలు వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, జిల్లా ఉపాధి కల్పనా శాఖల సంయుక్త ఆ ధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. 10వ తరగతి ఆపై చదివిని పలువురు నిరుద్యోగులు హాజరయ్యారు. డైకిన్, ముత్తూట్ ఫైనాన్స్, అరిజియో ఫైనాన్స్ కంపెనీల్లో 25 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. కళాశాల ప్రి న్సిపల్ బొమ్ము రవికుమార్, నైపుణ్యాభివృద్ది సంస్థ ప్రతినిధులు జే.రాము. ప్రవీణ్, కోఆర్డినేటర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లిష్ పరీక్షకు 98 శాతం హాజరు భీమవరం: జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షకు 98 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. 21,867 మంది విద్యార్థులకు 398 మంది గైర్హాజరయ్యారన్నారు. ఏపీఓఎస్ఎస్ తెలుగు పరీక్షకు 461 మందికి 368 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 42 పరీక్షా కేంద్రాలు, జిల్లాస్థాయి పరిశీలకులు నాలుగు, డీఈఓ ఆరు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ 10 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ వివరించారు. ఏలూరు జిల్లాలో.. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షకు 22356 మంది విద్యార్థులు హాజరయ్యారు. 22,735 మంది రెగ్యులర్ విద్యార్థులకు 22,288 మంది హాజరయ్యారు. ఒకసారి ఫెయిలైన వారిలో 133 మందికి 68 మంది హాజరయ్యారు. జిల్లాలోని 64 కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారని, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. దూరవిద్య పరీక్షలకు.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న టెన్త్ తెలుగు పరీక్షకు 460 మంది విద్యార్థులకు 402 మంది హాజరయ్యారు. ఉర్దూ పరీక్షకు ఆరుగురికి ఆరుగురు హాజరయ్యారు. తొమ్మిది కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. పంచాయతీ సెక్రటరీ అరెస్ట్ భీమవరం: భీమవరం మండలం చినఅమిరంలో నిధుల దుర్వినియోగం కేసులో పంచాయతీ సెక్రటరీగా పనిచేసిన సాగిరాజు కిషోర్గోపాల్ కృష్ణంరాజును శుక్రవారం అరెస్టు చేసినట్టు డీఎస్పీ ఆర్జే జయసూర్య తెలిపారు. చినఅమిరం పంచాయతీలో సుమారు రూ.3.63 కోట్లు నిధులు దుర్వినియోగం కాగా అధికారుల ఫిర్యాదు మేరకు కృష్ణంరాజును అరెస్ట్ చేశామన్నారు. అతడిని భీమవరం రెండో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 15 రోజుల రిమాండ్ విధించారన్నారు. సొసైటీలో నిధుల గోల్మాల్పై విచారణ పెనుగొండ: మండలంలోని ములపర్రు ప్రాథమిక సహకార సంఘంలో 2018లో రూ.90 లక్షలు గోల్మాల్ కాగా దీనిపై శుక్రవారం విచారణ చేపట్టారు. అప్పటి పాలకవర్గ సభ్యులను అప్పట్లో ప్రజలు, డిపాజిటర్లు, పాలకవర్గ సభ్యులు నిలదీయడంతో రూ.50 లక్షలు చెల్లించారు. మిగతా రూ.40 లక్షలు అప్పటినుంచి రికవరీ కాలేదు. దీంతో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎంఎం రెహమాన్ ములపర్రు సొసైటీలో విచారణ చేపట్టారు. విచారణలో వచ్చిన అంశాలను ఉన్నతాధికారులకు నివేదించినట్టు ఆయన చెప్పారు. ఎండలతో జాగ్రత్త భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎండ తీవ్రత నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ముందస్తు చర్యలను చేపట్టాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండల కేంద్రంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఏర్పాటుచేయాలని సూచించారు. బస్టాప్, పబ్లిక్ ప్రాంతాల్లో నీడ కల్పించేలా పందిర్లు వేయాలన్నారు. ఉపాధి హామీ పథకం పనులు జరిగే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఎండ తీవ్రతతో వడదెబ్బ బారిన పడే ప్రమాదముందని అప్రమత్తంగా ఉండాలన్నారు. గొడు గులు, తలకు టోపీ వంటివి వాడాలన్నారు. కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థుల బహుముఖ ప్రతిభ అభినందనీయం
తాడేపల్లిగూడెం: చదువుతో పాటు, ఇతర రంగాల్లో విద్యార్థులు బహుముఖ ప్రతిభ ప్రదర్శించడం అభినందనీయమని ఏపీ నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్వీ రమణరావు అన్నారు. శుక్రవారం నిట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నిట్కు చెందిన విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని, దీంతో అనేక పురస్కారాలను అందుకుంటున్నందుకు అభినందనీయమన్నారు. సీనియర్ విద్యార్థుల స్ఫూర్తితో జూనియర్లు ప్రేరణ పొంది అన్ని విషయాలలో అన్ని రంగాలల్లో అగ్రగామిగా ఉండాలన్నారు. అనంతరం బ్యాంక్ ఆఫ్ బరోడా అచీవర్స్ అవార్డులను అందించారు. బీటెక్ 2021–25కు చెందిన బీటెక్ ఆఖరిసంవత్సరం చదువుతున్న విద్యార్థులు కలిదిండి పవన్తేజ సత్యవర్మను , తుమ్మూరి మంజునాథ్లను అభినందించారు. ఆలిండియా నిట్ పోటీల్లో నాలుగు పతకాలు సాధించిన ఎస్.హర్షిత్ను అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ దినేష్రెడ్డి, బ్యాంక్ ఆప్ బరోడా పెదతాడేపల్లి బ్రాంచ్మేనేజర్ ఎం.కేదారి తదితరులు పాల్గొన్నారు. -
మోటార్ సైకిల్కు నిప్పు పెట్టిన దొంగలు
కామవరపుకోట: ఒక మోటార్ సైకిల్ నిప్పంటించి కాల్చి వేసి, వేరొక మోటార్ సైకిల్ దొంగిలించిన ఘటన ఈస్ట్ యడవెల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని కొణతం స్వామి ఇంటి ఆవరణలో గురువారం రాత్రి పెట్టిన హోండా షైన్ మోటార్ సైకిల్ శుక్రవారం ఉదయానికి పూర్తిగా కాలిపోయి కనిపించింది. అదే రోజు రాత్రి ముక్కు కృపారాజు ఇంటి ఆవరణలో ఉన్న హోండా షైన్ మోటార్ సైకిల్ దొంగలు దొంగలించిపోయారు. ఈ ఘటనపై బాధితులు తడికలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాలువలో స్నానానికి దిగి విద్యార్థి గల్లంతు పెంటపాడు: మండలంలోని పరిమెళ్ల చినకాపవరం కాలువలో డ్యాం వద్ద స్నానానికి దిగి ఒక విద్యార్థి గల్లంతయ్యాడు. పెంటపాడు ఎస్సై స్వామి తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న 8 మంది విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం పరిమెళ్ల గ్రామ శివారు చినకాపవరం కాలువలోకి స్నానాలు చేసేందుకు వెళ్లారు. కొంతసేపు వారంతా కాలువలో ఆటలాడారు. ఉన్నట్టుండి ఒక విద్యార్థి అయిన గుంటూరు జిల్లా మండేపూడి గ్రామానికి చెందిన పల్లెపోగు వరప్రసాద్ (20) ప్రమాదవశాత్తూ కాలువ లోతు తెలియక కొట్టుకుని పోయాడు. వెంటనే సహచర విద్యార్థులు, స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కాగా రెస్క్యూ సిబ్బంది సాయంతో పరిసర ప్రాంతమంతా రాత్రి పొద్దుపోయే వరకు వెతికినా ప్రసాద్ ఆచూకీ లభించలేదు. ఫైర్ అధికారి జీవీ సుబ్బారావు, ఎస్సై స్వామి సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను పరిశీలించారు. ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి తాడేపల్లిగూడెం (టీఓసీ): ఆరేళ్లుగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు మార్చి నెలాఖరులోగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, అమరావతి జేఏసీ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు హెచ్చరించారు. యూనియన్ పశ్చిమగోదావరి జిల్లా రీజనల్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం స్థానిక సూర్యవంశీ ఎన్క్లేవ్లో రీజినల్ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదరరావు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆరేళ్లు గడిచినా ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బందికి ప్రమోషన్లు ఇవ్వలేదన్నారు. మూడు వేల మంది సిబ్బంది ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. పదోన్నతులతో పాటు 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, సరండర్ లీవ్ సొమ్ములను చెల్లించాలని కోరారు. తొలుత పట్టణంలో ఈయూ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈయూ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.డీ ప్రసాద్, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.సోమసుందర్,సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల బీమారావు పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక
పెదవేగి: మండలంలోని విజయరాయి సీతారామ కల్యాణ మండపంలో శుక్రవారం కోకో రైతుల రాష్ట్ర కమిటీను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బొల్లు రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి గా కె.శ్రీనివాస్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఎస్.గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బోళ్ల సుబ్బారావు (పశ్చిమగోదావరి), పానుగంటి అచ్యుతరామయ్య (ఏలూరు), ఉప్పుగంటి భాస్కరరావు (కోనసీమ), గుదిబండి బండి వీరారెడ్డి (ఏలూరు), మార్ని శ్రీనివాసరావు (తూర్పుగోదావరి) సహాయ కార్యదర్శులుగా ఉప్పల కాశీ (తూర్పుగోదావరి), కొసరాజు రాధాకష్ణ (ఏలూరు), కొప్పిశెట్టి ఆనంద వెంకటప్రసాద్ (కోనసీమ), కోశాధికారిగా జాస్తి కాశీ బాబు (ఏలూరు) మరో 35 మందితో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. కోకో రైతుల సమస్యలను పరిష్కరించాలని 24, 25 తేదీల్లో కోకో సాగు చేస్తున్న అన్ని జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. -
పశ్చిమ తీరానికి ఆలివ్ రిడ్లే
20 వేల కిలోమీటర్లు వచ్చి.. గుడ్లు పెట్టి.. తాము జన్మించిన చోటే మళ్లీ గుడ్లు పెట్టే జీవి సముద్ర తాబేలు మాత్రమే. వీటిలో ఎన్ని రకాలున్నా సముద్ర పర్యావరణాన్ని కాపాడటంలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు ముఖ్యమైనవి. ఇవి రెండడుగుల వరకు పొడవు, సుమారు 500 కేజీల వర కు బరువు ఉంటాయి. ఆహారాన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఈ తాబేళ్లు ఎక్కువగా జపాన్, ఆస్టేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో కనిపిస్తాయి. జీవితాంతం సముద్రంలో గడిపే ఈ జీవులకు స్థిర నివాసం ఉండదు. కేవలం గుడ్లు పెట్టేందుకు మాత్రమే భూమి మీదకు వస్తాయి. నదులు సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. ఏటా అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో ఒడిసా, ఆంధ్రప్రదేశ్లోని ఒడ్డుకు చేరుకుని ఒక్కో తాబేలు 60 నుంచి 150 గుడ్లు పెట్టి ఎవరూ గుర్తుపట్టకుండా ఇసుకతో కప్పేసి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. రాష్ట్రంలోని సూర్యలంక, పలుచోట్ల వీటి సంరక్షణకు గతంలోనే కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటి మాంసానికి ఎక్కువగా డిమాండ్ ఉండటంతో కొందరు వీటిని వేటాడి మాంసాన్ని అమ్ముతుంటారు. ఇవి అంతరించిపోకుండా సముద్ర తాబేళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక జాబితాలో చేర్చి సంరక్షిస్తోంది. సాక్షి, భీమవరం/ నరసాపురం రూరల్: ఉభయ చరజీవుల్లో తాబేళ్లు ఒకటి. తాబేళ్లలో పలురకాలు ఉన్నా ఆలివ్ రిడ్లే రకం వెరీ స్పెషల్. తాబేళ్ల జాతుల్లో ప్రత్యేకమైనవిగా చెప్పుకునే ఆలివ్ రెడ్లీ తమ సంతానోత్పత్తికి పశ్చిమగోదావరి జిల్లాలోని తీరప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుంటున్నాయి. ఇటీవల దీనిని గుర్తించిన జిల్లా అటవీ శాఖ వాటి గుడ్ల కోసం చినమైనివాలంకలో తొలిసారిగా సంరక్షణ కేంద్రం ఏర్పాటుచేసింది. ఇప్పటివరకూ 116 తాబేళ్లకు చెందిన 12,341 గుడ్లను సేకరించి వాటి నుంచి పిల్లలు బయటకు వచ్చేందుకు వీలుగా ఇక్కడ భద్రపరిచారు. 19 కిలోమీటర్ల తీరం జిల్లాలోని నరసాపురం మండలం మర్రితిప్ప నుంచి మొగల్తూరు మండలం మోళ్లపర్రు వరకు 19 కి లోమీటర్లు మేర సముద్ర తీరం ఉంది. ఈ ఏడాది జనవరిలో పదుల సంఖ్యలో మృత ఆలివ్ రిడ్లే తాబేళ్లు పెదమైనివానిలంక, చినమైనివానిలంక గ్రామాల్లోని తీరానికి కొట్టుకురావడాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో చినమైనివానిలంక తీరంలోని ఓ చోట తాబేలు గుడ్లు ఉండటాన్ని గుర్తించిన అధికారులు సంతానోత్పత్తికి తాబేళ్లు ఇక్కడికి వస్తున్నాయని నిర్ధారించారు. కుక్కలు, ఇతర జంతువులు, ఆకతాయిలు నుంచి గుడ్ల సంరక్షణకు చర్యలు చేపట్టారు. ముందుగా గుర్తించిన గుడ్లను తరలించే వీలులేక వాటి రక్షణ కోసం చుట్టూ పొదలను ఏర్పాటుచేశారు. జిల్లాలో తొలిసారిగా.. తాబేళ్ల గుడ్ల సేకరణ, సంరక్షణ, పునరుత్పత్తి కేంద్రాన్ని తొలిసారిగా జిల్లాలోని చినమైనివానిలంక తీరం వద్ద జనవరిలో అటవీశాఖ ఏర్పాటు చేసింది. రోజూ సంరక్షణ కేంద్రం సిబ్బంది తీరం వెంబడి తిరుగుతూ తాబేలు అడుగుల ఆనవాళ్లను బట్టి గుడ్లు పెట్టిన చోటును గుర్తిస్తున్నారు. తాబేలు గుడ్లు పెట్టిన తర్వాత అవి దెబ్బతినకుండా రక్షణ కోసం పైపొరగా వాటిపై రసాయనాలు విడుదల చేస్తుంది. ఈ రక్షణ పొర దెబ్బతినకుండా జాగ్రత్తగా గుడ్ల ను సేకరిస్తున్నారు. సంరక్షణ కేంద్రంలో 10 అంగుళాల లోతులో గుండ్రపు గొయ్యి తీసి వాటిలో 100 నుంచి 150 వరకు గుడ్లను పెట్టి ఇసుకతో కప్పుతున్నారు. గత రెండు నెలల్లో 12,341 గుడ్లు సేకరించి హేచరీలో భద్రపరిచారు. గొయ్యిలోని గుడ్లను ఎప్పుడు సేకరించింది?, ఎన్ని భద్రపరచిందనే వివరాలను గొయ్యి వద్ద స్లిప్పులపై నమోదుచేస్తున్నారు. సహజసిద్ధంగా రెండు నెలల వ్యవధిలో గుడ్ల నుంచి తాబేలు పిల్లలు బయటకు వస్తాయని అటవీ అధికారులు తెలిపారు. సముద్ర జీవులపై స్థానికులకు అవగాహన కలిగేలా తాబేలు పిల్లలను సముద్రంలో విడిచిపెట్టే కార్యక్రమంలో విద్యార్థులు, స్థానికులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తామన్నారు. కడలి తీరం.. కూర్మాల ఆవాసం సంతానోత్పత్తి కోసం సముద్ర తాబేళ్ల రాక గుర్తించిన అటవీ శాఖ గుడ్ల సంరక్షణకు హేచరీ చినమైనివానిలంక వద్ద ప్రత్యేక ఏర్పాట్లు ఇప్పటివరకూ 12,341 గుడ్ల సేకరణ తాబేళ్ల సంరక్షణకు చర్యలు పర్యావరణ సమతుల్యతకు సముద్ర జీవులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. చినమైనివానిలంక వద్ద తాబేళ్ల గుడ్ల సంరక్షణకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేశాం. అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో వాటి రాకకు ఆటంకం కలగకుండా స్థానికులు సహకరించాలి. – చదలవాడ నాగరాణి, కలెక్టర్ రూ.10 లక్షలతో బడ్జెట్ జిల్లాలోని తీర ప్రాంతంలో గుడ్లు పెట్టేందుకు తాబేళ్లు రావడం గుర్తించి తొలిసారిగా సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేశాం. రానున్న సీజన్లో లక్షకు పైగా గుడ్లను సంరక్షించే లక్ష్యంతో శాశ్వత సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు రూ.10 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. – కిరణ్, జిల్లా అటవీశాఖ అధికారి. -
బాలిక హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా తడికలపూడి మండలం జీలకర్రగూడెంలో గుంటుపల్లి గుహల వద్ద బాలికపై నలుగురు అగంతకులు లైంగికదాడికి పాల్పడి ఆపై హతమార్చిన ఘటనలో నిందితులకు జీవిత ఖైదును విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. శుక్రవారం రాత్రి ఏలూరు పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. 2019 ఫిబ్రవరి 24న ఉదయం 11 గంటలకు గుంటుపల్లి గుహల వద్దకు సరదాగా గడిపేందుకు వచ్చిన ప్రేమ జంటపై నలుగురు అగంతుకులు దాడి చేశారు. బాలికపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించిన ప్రియుడిని సైతం దుంగకర్రతో కొట్టి గాయపర్చారు. దీనిపై గుహల ప్రాంతంలో ఆర్కియోలాజికల్ సర్వే సిబ్బంది వడమాల మునిరత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దోచుకునేందుకు వెళ్లి.. హతమార్చి.. నిందితులను కృష్ణా జిల్లా మైలవరం మండలం చండ్రారం గ్రామానికి చెందిన పొట్నూరి రాజు, ద్వార కాతిరుమల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన తుపాకుల సోమయ్య, తుపాకుల గంగయ్య, కృష్ణా జిల్లా నందివాడ మండలం అరిసిలాల గ్రామానికి చెందిన కొమరగిరి నాగరాజుగా గుర్తించారు. వీరు ఒంటరిగా ఉన్న ప్రేమ జంటను గమనించి వారిని దోచుకునేందుకు వెళ్లారు. కత్తి, దుంగకర్రతో ప్రేమ జంట వద్దకు వెళ్లిన వీరు డబ్బులు ఇవ్వాలని లేకుంటే చంపేస్తామని బెదిరించారు. ఈ క్రమంలో పొట్నూరి రాజు దుంగకర్రతో తీవ్రస్థాయిలో తలపై కొట్టడంతో ప్రియుడు అక్కడే పడిపోయాడు. అనంతరం బాలిక వద్దకు వెళ్లి ఆమె దుస్తులను చించివేసి కర్రతో తలపై బలంగా కొట్టి లైంగికదాడికి పా ల్పడ్డారు. తీవ్ర గాయాలైన ప్రియుడు అపస్మారక స్థితిలోకి వెళ్లగా బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఆరేళ్ల పాటు ఏలూరు పోక్సో కోర్టులో విచారణ కొనసాగింది. జీవిత ఖైదు.. రూ.10 వేల జరిమానా పోక్సో కోర్టు న్యాయమూర్తి సునంద శుక్రవారం తుది తీర్పును వెల్లడించారు. నలుగురు నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఐపీసీ 397, 376 (ఎ), సెక్షన్ 4 పోక్సో, 302 ఐపీసీ, 25 (1ఎ) భారతీయ ఆయుధాల చట్టం, 27 భారతీయ ఆయుధ చట్టం మేరకు కఠిన శిక్షలు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. మృతురాలు తల్లిదండ్రులకు రూ.3 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రియుడు నవీన్కుమార్కు తగిన పరిహారం అందజేయాలని డీఎల్ఎస్ఏ ఏలూరుకు లేఖ రాశారు. పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోనే సీతారామ్ బాధితుల తరఫున వాదించగా అప్పటి చింతలపూడి సీఐ యూజే విల్సన్, మరో సీఐ పి.రాజేష్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కేసుపై రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. విలేకరుల సమావేశంలో ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ హబీబ్బాషా, మహిళా పోలీస్స్టేషన్ సీఐ ఎం.సుబ్బారావు, డీసీఆర్బీ ఎస్సై రాజారెడ్డి, తడికలపూడి ఎస్సై చెన్నారావు, ఏపీపీ డీవీ రామాంజనేయులు పాల్గొన్నారు. లైంగికదాడి ఆపై హత్య శిక్ష ఖరారు చేసిన పోక్సో కోర్టు 2019లో గుంటుపల్లి గుహల వద్ద ఘటన -
ఏఎంసీ.. మా పరిస్థితి ఏంటీ?
భీమవరం: నియోజకవర్గంలో శాసనసభ్యుని తర్వాత స్థానం మార్కెటింగ్ యార్డ్ (ఏఎంసీ) చైర్మన్ పదవి. జిల్లాలోని ఏఎంసీల్లో ఈ పదవి పోటీకి అనేక మంది ఆశావహులు ఉన్నారు. అయితే ప్రభుత్వం తాజాగా రిజర్వేషన్లు ప్రకటించడంతో ఆశావహుల ఆశలు గల్లంతయ్యాయి. దీంతో వీరంతా మల్లగుల్లాలు పడుతున్నారు. కొన్నిచోట్ల టీడీపీ, జనసేన మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యేలకు కత్తిమీద సాములా మారింది. ● భీమవరంలో ఏఎంసీ పదవిని ఆశిస్తున్న వారిలో పొత్తూరి బాపిరాజు, ఇందుకూరి రామలింగరాజు (టీడీపీ), బండి రమేష్నాయుడు (జనసేన) ఉన్నారు. అయితే ఇక్కడ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. ● ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు ఏఎంసీ చైర్మన్ పదవిని బొల్లా వెంకట్రావు (బీసీ), ఉండి ఏఎంసీ చైర్మన్ పదవిని జుత్తుగ నాగరాజు (జనసేన), కలిదిండి శ్రీనివాసరాజు (టీడీపీ) ఆశిస్తున్నారు. అయితే ఆకివీడు బీసీ జనరల్కు, ఉండి జనరల్కు రిజర్వు చేయడంతో నాగరాజు ఆశలు గల్లంతయ్యాయి. ● నరసాపురం ఏఎంసీ చైర్మన్ పదవిని టీడీపీ నుంచి కొప్పాడ రవీంద్ర (బీసీ), జనసేన నుంచి వలవల నాని (ఓసీ) ఆశిస్తున్నారు. ఇక్కడ ఓసీ జనరల్కు కేటాయించడంతో కొత్తముఖాలు తెరపైకి వచ్చే అవకాశముంది. ● పెనుగొండలో పోటీ తీవ్రంగా ఉండటంతో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు మింగుడు పడటం లేదు. ఇప్పటివరకు ఓసీకి చెందిన టీడీపీ ఆశావహులు బడేటి బ్రహ్మాజీ, గంటా వాసు, కోయ పోతురాజు, మైగాపుల రాము, జనసేన నుంచి గుర్రాల సూరిబాబు, కొండవీటి శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. ● ఆచంట ఏఎంసీ చైర్మన్ పదవికి టీడీపీ నుంచి బీసీ వర్గానికి చెందిన కేతా మీరయ్య, దొంగ నాగార్జున, పెచ్చెట్టి సుబ్రహ్మణ్యం, కోళ్ల సత్యనారాయణ, గుడాల శ్రీనివాస్, జనసేన నుంచి చిట్టూరి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ పదవిని బీసీ మహిళకు రిజర్వు చేశారు. ఆచంట నియోజవర్గంలో ఉన్న రెండు ఏఎంసీల్లో ఒక్కటి తప్పనిసరిగా జనసేనకు ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు పట్టుబడుతున్నారు. ● తణుకులో పదవి కోసం ఓసీ వర్గాల్లో పలువురు ఆశగా ఎదురుచూస్తుండగా ఇక్కడ ఎస్సీ మహిళకు రి జర్వు చేయడం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు తలనొప్పిగా మారిందని పార్టీ వర్గాలే చెబుతు న్నాయి. ఇక్కడ అబ్బదాసరి లాజర్, నత్త చంద్రశేఖర్, కొండేటి శివ వారి సతీమణులలో ఒకరికి పదవి కేటాయించే అవకాశం ఉందని తెలిసింది. ● తాడేపల్లిగూడెంలో పదవికి జనసేన నుంచి పలువురు ఆశావహులు ఉండగా ఇక్కడ ఎస్సీ జనరల్కు రిజర్వు చేయడంతో కొత్తముఖాలు తెరపైకి రానున్నాయి. పాలకొల్లులో.. పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు శాసనసభ్యునిగా కాపు సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువగా పనిచేశారు. రెండో స్థానమైన ఏఎంసీ చైర్మన్గా క్షత్రియులు, కాపులు, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారు చేశారు. ప్రస్తుతం పదవి బీసీ జనరల్కు రిజర్వు అయ్యింది. పదవిని జనసేన లేదా బీజేపీకి ఇస్తారని ఆయా పార్టీల నేతలు ఎదురుచూస్తుండగా ఇప్పటివరకూ వారితో సంప్రదింపులు జరగలేదు. టీడీపీలో పెచ్చెట్టి బాబు, కోడి విజయభాస్కరరావు, మామిడిశెట్టి పెద్దిరాజు బరిలో ఉన్నారు. వీరంతా శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన వారు. ఇదిలా ఉండగా మంత్రి నిమ్మల రామానాయుడు ఆలోచనా ధోరణి ఏంటన్నది, ఎలా ఉందన్నది బయటపడటం లేదు. రిజర్వేషన్లతో ఆశావహుల ఆశలు గల్లంతు -
లారీ ఢీకొని ఉపాధ్యాయురాలి మృతి
పెనుమంట్ర: మండలంలోని నెగ్గిపూడి గ్రామ పంచాయతీ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం టిప్పర్ లారీ స్కూటర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మార్టేరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న సిర్ల సుజాత (55) అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహం తలపై నుంచి లారీ టైరు వెళ్లడంతో నుజ్జునుజ్జు అయ్యింది. భోజన విరామ సమయంలో తన యాక్టివా మోటార్ సైకిల్పై పాఠశాల నుంచి నెగ్గిపూడిలోని ఇంటికి వెళ్తుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమె భర్త సిర్ల చిన్న సూర్యనారాయణ రెడ్డి ఫిర్యాదు మేరకు పెనుమంట్ర ఎస్సై కె.స్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్య తాడేపల్లిగూడెం రూరల్: అనారోగ్య సమస్యలతో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బాలిక (15) అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఈక్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బాలిక తల్లి సకినాల సుజని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రూరల్ ఎస్సై ప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి భీమవరం: స్థానిక వన్టౌన్లో ఓ గదిలో ఉంటున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఇటికంపాడుకు చెందిన గిరిపరమేశ్వర్ (20) భీమవరంలోని ఆర్టీసీ గ్యారేజీకి ఓ ఏడాది శిక్షణ నిమిత్తం ఫిబ్రవరి 18న వచ్చాడు. మార్చి 20న తల్లిదండ్రులు ఫోన్ చేస్తే రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానంతో వేరొకరికి ఫోన్ చేసి చూడమని కోరగా ఆ వ్యక్తి యువకుడు ఉంటున్న గది దగ్గరకు వెళ్లి తలుపు తెరిచి చూసే సరికి గదిలోని ఫ్యానుకు ఉరివేసుకుని నేలకు తాకుతూ వేలాడుతూ కనిపించాడు. ఈ విషయాన్ని మృతుడి తల్లిదండ్రులకు చెప్పడంతో శుక్రవారం మృతుడి తండ్రి మస్తాన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్సై బి.వై కిరణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గ్రామీణాభివృద్ధిపై సమీక్ష ఏలూరు(మెట్రో): గ్రామీణాభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం శుక్రవారం స్థానిక జెడ్పీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ జి.పద్మశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఉపాధి హామీ పథకం అమలు తీరు, సీసీ రోడ్ల నిర్మాణం, ఫామ్ పాండ్లు, పశు షెడ్ల నిర్మాణాలు తదితర అంశాలపై సమీక్షించారు. జెడ్పీ సీఈఓ భీమేశ్వర్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల డ్వామా, డీఆర్డీఏ, గృహ నిర్మాణ శాఖ పీడీలు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి భీమడోలు: జాతీయ రహదారి భీమడోలు కనకదుర్గమ్మ గుడి వద్ద శుక్రవారం ఓ మోటార్ బైక్ను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదవేగి మండలం వేగివాడకు చెందిన గంటా భరత్(21), గోపాలపురానికి చెందిన చల్లా సుబ్రహ్మణ్యం ఇద్దరూ స్నేహితులు. వారు శుక్రవారం వ్యక్తిగత పనుల నిమిత్తం ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం బైక్పై వెళ్లి పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వచ్చేందుకు భీమడోలు వైపుగా వస్తున్నారు. కనకదుర్గ గుడి వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయాయ్యి. వారిని భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేసి ఏలూరు వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గంటా భరత్(21) మృతి చెందాడు. తీవ్ర గాయాలైన సుబ్రహ్మణ్యాన్ని విజయవాడ తరలించారు. ఈ మేరకు భీమడోలు ఎస్సై వై.సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముగిసిన ఆలిండియా టెన్నిస్ టోర్నమెంట్
భీమవరం: స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్లో నిర్వహించిన ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నీస్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. 35,45, 55, 65, 75 ఏళ్ల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో నిర్వహించిన పోటీలు నిర్వహించారు. 45 ప్లస్ సింగిల్స్లో ఎంవీఎల్ఎన్ రాజు, 55 ప్లస్ సింగిల్స్లో మణిందన్, 65 ప్లస్ డబుల్స్లో ఆనందస్వరూప్, శ్రీనివాస్, 65 ప్లస్ సింగిల్స్లో వి.శ్రీనివాసరెడ్డి, 70 ప్లస్ సింగిల్స్లో సేతు, 70 ప్లస్ డబుల్స్లో సన్యాసిరాజు, గజపతి, 75 ప్లస్ డబుల్స్లో అశోక్రెడ్డి, సాయి రాంబాబు విజేతలుగా నిలిచారు. టోర్నమెంట్ విజేతలకు క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లూరి పద్మరాజు, పెన్మెత్స వెంకటరామరాజు, టోర్నమెంట్ సెక్రటరీ వీవీఎస్ సుబ్రహ్మణ్యంరాజు, ఎ.రాంబాబు బహుమతులు అందజేశారు. ల్యాప్టాప్లు, టచ్ ఫోన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం ఏలూరు (టూటౌన్): అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్ట్యాప్లు, బదిరులకు టచ్ ఫోన్ల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ జిల్లా మేనేజరు బి.రామ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ మొదటి సంవత్సరం, పాలిటెక్నిక్, ఐటీఐ చదివే వారు వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 08812–234146 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. పంచాయతీ కార్యాలయంలో రూ.91 వేలు చోరీ ఉంగుటూరు: స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో రూ.91 వేలు చోరీకు గురైంది. ఇంటి పన్నులు, కుళాయి పన్నులు వసూలు చేసిన బీరువాలో పెట్టి తాళం వేశారు. అయితే గురువారం ఉదయం ఆఫీసు తీసేసరికి బీరువా తాళం పగలగొట్టి ఉండడంతో పంచాయతీ కార్యదర్శి పరిశీలించి చోరీ జరిగిందని నిర్ధారించారు. ఈ మేరకు ఆయన పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్మాప్తు చేస్తున్నామని ఎస్సై సూర్యభగవాన్ తెలిపారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా ఏలూరు (టూటౌన్): యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో తలపెట్టిన ఉద్యోగుల సమ్మె వాయిదా పడినట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం అధ్యక్షులు డి.శ్రీనివాస్ మోహాన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఢిల్లీలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, డిపార్ట్మ్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సెంట్రల్ లేబర్ కమిషన్ మధ్యన శుక్రవారం జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేశారని పేర్కొన్నారు. -
నెలాఖరులోపు సీసీ రోడ్ల నిర్మాణం
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో మిగిలిన సీసీ రోడ్ల నిర్మాణాలను నెలాఖరులోపు పూర్తిచేస్తామని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పల్లె పండుగలో భాగంగా జిల్లాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో 55.37 కిలోమీటర్లు సిమెంట్ రోడ్ల పనులు ప్రారంభించగా 53.54 కిలోమీటర్ల మేర నిర్మాణాలు పూర్తిచేశామన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు, గోకుల్ షెడ్ల నిర్మాణాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, పంచాయతీరాజ్ ఎస్ఈ కె.శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బి.నాగేశ్వరరావు పాల్గొన్నారు. సర్వేలను వేగిరపర్చాలి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్న పలు సర్వేలను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వర్క్ ఫ్రం హోం, మిస్సింగ్ సిటిజన్స్, ఎన్పీసీఐ, ఈకేవైసీ, పిల్లల ఆధార్ నమోదు, జియో ట్యాగింగ్ అంశాలపై మండలాల వారీగా ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ సీహెచ్ నాగరాణి -
●ఆడుకుంటానని.. వెళ్లిపోయావా అన్నయ్యా!
ఆడుకుంటానని వెళ్లి.. అనంతలోకాలకు వెళ్లిపోయావా.. అన్నయ్యా? అంటూ చెల్లెలు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మండలంలోని చినకాపవరం గ్రామంలో ఓల్డ్ వయ్యేరు పంట కాలువలోకి శుక్రవారం స్నానం చేసేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు శరత్ కుమార్, పవన్ సాయి మృత్యువాత పడ్డారు. అయితే విగతజీవిగా పడి ఉన్న అన్న మృతదేహాన్ని చూసిన చెల్లెలు తోడు లేకుండా వెళ్లిపోయావా? అన్నయ్యా అంటూ రోదించింది. పదేళ్ల వయస్సులోనే ఇద్దరు బాలురు మృతి చెందడంతో చినకాపవరం, పెదకాపవరం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. – ఆకివీడు -
ఫెర్రీ వేలం ఖరారు
నరసాపురం రూరల్: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో 2025–26కు సంబంధించి మాధవాయిపాలెం ఫెర్రీ వేలం శుక్రవారం నిర్వహించారు. వేలం రూ.4,1818,959లకు ఖరారైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మించి వేలం ఆదాయం రూ.1.20 కోట్ల మేర పెరిగింది. సీల్డ్ కం బహిరంగ పద్ధతిలో నిర్వహించిన వేలంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం టేకిశెట్టిపాలెం గ్రామానికి చెందిన శ్రీ విఘ్నేశ్వర క్వారీ అండ్ బోట్స్మెన్ లేబర్ కాంట్రాక్ట్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పాట దక్కించుకుంది. నరసాపురం, సఖినేటిపల్లి ఉమ్మడి పశ్చిమగోదావరి జెడ్పీ ఏఓ భవానీ, రెవెన్యూ అధికారి హరికృష్ణ, ఎంపీపీలు మైలాబత్తుల సోనీ, వీరా మల్లికార్జునరావు, నరసాపురం, రాజోలు డీఎల్పీఓలు, ఎంపీడీఓ గాదిరాజు రామకృష్ణంరాజు, ఎంపీడీఓ పర్యవేక్షకుడు వీరభద్రరావు ఆధ్వర్వంలో వేలం నిర్వహించారు. పట్టణ ఎస్సై ముత్యాలరావు పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. -
ఎస్సీ వర్గీకరణ తగదు
భీమవరం: ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర కేబినెట్ ఆమో దం తెలపడాన్ని నిరసిస్తూ భీమవరంలో గురువారం మాలసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు కూటమి ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తప్పుల తడకగా ఉన్న రాజీవ్ రంజన్మిశ్రా కమిషన్ను రద్దు చేసి హైకోర్టు జడ్జిలతో త్రిసభ్య కమిటీ వేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ బిల్లుకు మద్దతు ఇవ్వడం మాలలను అణగదొక్కడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందరకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో మాలల జనాభా అధికమని మిశ్రా కమిషన్ మాలలను తక్కువగా చూపి ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లేళ్ల సుధామ, కేసీ రాజు, సుంకర సీతారామ్, గొల్ల రాజ్కుమార్, అంబటి ఆనందకుమార్, చింతల నాగరాజు, ఈర్లపాటి గోపి తదితరులు పాల్గొన్నారు. -
‘గేట్’లో విద్యార్థుల ప్రతిభ
ఆర్జీయూకేటీ విద్యార్థులకు 1,000లోపు 30 ర్యాంకులు నూజివీడు: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)లో ఆర్జీయూకేటీ పరిధి లోని నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపు ల్ ఐటీల విద్యార్థులు ప్రతిభ కనబర్చారని రిజిస్ట్రా ర్ సండ్ర అమరేంద్రకుమార్ గురువారం తెలిపారు. 400 మంది ఉత్తమ ర్యాంకులు సాధించారని చెప్పారు. నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థి అమిరెడ్డి అశోక్ జాతీయ స్థాయిలో 12వ ర్యాంకు సాధించాడన్నారు. ఈసీఈ విద్యార్థులు 125, 201, 655, 679, 875, 907 ర్యాంకులు, సీఎస్ఈ విద్యార్థులు 182, 241, 298, 308, 342, 475, 663, 680, 724, 783, 844, 915, 983, మెకానికల్ విద్యార్థులు 174, 240, 242, 484, 491, 585, కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు 12, 666 ర్యాంకులతో సత్తాచాటారన్నారు. తాము చేపట్టిన గేట్–25 సపోర్ట్ కార్యక్రమమే విజయానికి కారణమని సెంట్రల్ ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్, హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ కాంపిటీటివ్ ఎ గ్జామ్ సెల్ కో–ఆర్డినేటర్ ఎం.రామకృష్ణ తెలిపారు. విద్యార్థులతో పాటు శిక్షణకు తోడ్పడిన ఈఐటీపీ సెల్ డీన్ పి.శ్యామ్కు కృతజ్ఞతలు తెలిపారు. సాయిచరణ్కు 9వ ర్యాంక్ కై కలూరు: గేట్ పరీక్షలో కలిదిండి మండలం ఆరుతెగలపాడుకి చెందిన చిలుకూరి సాయి చరణ్ 9వ ర్యాంకు సాధించాడు. చిలుకూరి కిషోర్బాబు కుమారుడు చరణ్ కాకినాడ జేఎన్టీయూలో ఇంజనీరింగ్ పూర్తిచేసి హైదరాబాద్లో గేట్ కోచింగ్ తీసుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 77.67 శాతం మార్కులతో తొమ్మిదో ర్యాంకు సాధించాడు. -
నీటి ఎద్దడి ఆవరించేను
ఆరుగాలం కష్టించినా అన్నదాతకు సాగులో ఇబ్బందులు తప్పట్లేదు. చివరి దశలోనూ నీటి సమస్యలు వెంటాడుతుండటంతో చేతికందిన పంటను కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నాడు. పొలాలకు నీరందించే విషయంలో అధికారుల సమన్వయ లోపం వీరికి శాపంలా మారింది. దెందులూరు మండలం పాలగూడెం శివారు పొలాలు నీటి ఎద్దడితో నెర్రలు తీశాయి. దీంతో కొవ్వలి డ్రెయిన్లో ఉన్న కొద్దిపాటి నీటిని మోటార్లతో తోడుకుంటూ చేలకు అందిస్తున్నారు. ఎకరాకు అదనంగా రూ.3 వేల వరకు ఖర్చు అవుతుందని, మునుపెన్నడూ లేనివిధంగా నీటి కోసం అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
క్షీరారామం హుండీ ఆదాయం లెక్కింపు
పాలకొల్లు సెంట్రల్: స్థానిక క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం (క్షీరారామం)లో హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 105 రోజులకు రూ.15,01,481 ఆదాయం వచ్చి నట్టు ఆలయ ఈఓ ముచ్చర్ల శ్రీనివాస్ తెలి పారు. దేవదాయశాఖ భీమవరం డివిజన్ ఇన్స్పెక్టర్ వర్ధినీడి వెంకటేశ్వరరావు, ఈఓలు రంగరాజన్, నాగజ్యోతి పర్యవేక్షించారు. చినఅమిరం పంచాయతీజూనియర్ అసిస్టెంట్ అరెస్ట్ భీమవరం: భీమవరం టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని భీమవరం మండలం చినఅమిరం పంచాయతీలో నిధులు దుర్వినియోగం కేసులో జూనియర్ అసిస్టెంట్ గుండు రామకృష్ణను గురువారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఆర్జీ జయసూర్య తెలిపారు. నిందితుడిని రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా 15 రోజుల రిమాండ్ విధించారన్నారు. మండలంలోని చినఅమిరం, రా యలం గ్రామాల్లో గతంలో పంచాయతీ కార్యదర్శులుగా పనిచేసిన సాగి కిషోర్ కుమార్రాజు, దున్న జయరాజుల హయాంలో సుమారు రూ.2.16 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు అధికారులు నిర్ధారించగా ఈనెల 12న కిషోర్కుమార్రాజు, జయరాజులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సీడబ్ల్యూసీకి చిన్నారులు జంగారెడ్డిగూడెం: మారుటి తండ్రి దాడిలో గాయపడి, చికిత్స పొందుతూ కోలుకున్న చిన్నారులను గురువారం ఐసీడీఎస్ అధికారులు సీడబ్ల్యూసీ (చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) ముందు హాజరు పరిచారు. జంగారెడ్డిగూడెం ఐసీడీఎస్ సీడీపీఓ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో నివాసం ఉంటున్న ఎ.జోత్స్న భర్త నుంచి విడిపోయి రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం సాత్విక్ (11), కరుణ సత్య (8)తో కలిసి రెండో భర్త పి. దుర్గాప్రసాద్ వద్ద ఉంటోంది. ఇటీవల మారుటి తండ్రి దుర్గాప్రసాద్ మద్యం సేవించి వచ్చి చిన్నారులను తీవ్రంగా కొట్టడంతో గాయపడిన సాత్విక్కు జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్ప త్రిలో చికిత్స అందించారు. పోలీసు శాఖ, ఐసీడీఎస్ అధికారులు సాత్విక్, కరుణ సత్యలను జీఎంఎస్కే గంగారత్నం ద్వారా ఏలూరు సీడబ్ల్యూసీ ముందు హాజరు పరిచారు. సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని బ్యూల తెలిపారు. అందుబాటులో టీచర్లసీనియార్టీ జాబితా ఏలూరు(ఆర్ఆర్పేట): పూర్వ పశ్చిమగోదా వరి జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, మున్సిపాల్టీ, కార్పొరేషన్ల యాజమాన్యా ల్లో పనిచేస్తున్న హెచ్ఎంలు, ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా రూపొందించామని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. జాబితాను పూర్వ పశ్చిమగోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో, నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచామన్నారు. జాబితాపై ఎవరైనా అభ్యంతరాలుంటే ఈనెల 25లోపు సమర్పించవచ్చన్నారు. ‘ఆశ్రం’ విద్యార్థుల ప్రతిభ దెందులూరు: ఏలూరులోని ఆశ్రం వైద్య కళాశాల విద్యార్థులు 2024 ఎంబీబీఎస్ పరీక్షా ఫలితాల్లో సత్తాచాటారు. 257 మంది విద్యార్థులకు 238 మంది ఉత్తీర్ణులయ్యారని ప్రిన్సిపాల్ చేబ్రోలు శ్రీనివాస్ తెలిపారు. ఫైనల్ ఎంబీబీఎస్ పార్ట్–1లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. తాగునీటి సమస్య తలెత్తితే ఊరుకోం ఏలూరు(మెట్రో): రానున్న వేసవిలో జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే ఊరుకోబోమని ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. కలెక్టరేట్లో గురువారం తాగునీటి సరఫరా, జల్ జీవన్ మి షన్ పథకాల అమలుపై ఆమె సమీక్షించారు. తాగునీటికి సంబంధించి సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో తాగునీటి సరఫరాపై వారంలోపు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. -
గళమెత్తిన విద్యుత్ మీటర్ రీడర్లు
భీమవరం: విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో విద్యుత్ మీటర్ రీడర్లను రోడ్డున పడేయవద్దని, వారికి సంస్థలోనే ప్రత్యామ్నాయం చూపి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ భీమవరంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలోని చినరంగనిపాలెం యూనియన్ బ్యాంకు నుంచి ప్రదర్శనగా వెళ్లి విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షుడు కోనాల భీమారావు మాట్లాడుతూ గతంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన మంత్రి లోకేష్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సంఘ భీమవరం డివిజన్ అధ్యక్షుడు పెనుమాక జాకబ్ మాట్లాడుతూ ఎస్క్రో ఖాతా ద్వారా వేతనాలు చెల్లిస్తామని గతంలో సంస్థ సీఎండీ మీటర్ రీడర్లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మీటర్ రీడర్లలో అర్హత ఉన్న వారిని సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్గా, వాచ్ అండ్ వార్డ్గా, సర్కిల్ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్స్, అటెండర్స్, వాచ్మెన్స్గా నియమించాలని కోరారు. మూడు కంపెనీల పరిధిలో ఒకే పని దినాలు అమలు చేయాలని, అదనపు పని గంటలను రద్దు చేయాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని విద్యుత్ ఎస్ఈ ఆలపాటి రఘనాథ్బాబు, డీఈ నరహరశెట్టి వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.సీతారాంప్రసాద్, విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఉద్రిక్తత
బుట్టాయగూడెం: జీలుగుమిల్లిలోని అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజుల క్రితం జీలుగుమిల్లి మండలం తాటాకులగూడేనికి చెందిన గంధం బోసు అనే వైఎస్సార్సీపీ కార్యకర్తపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయగా ఖమ్మంలో చికిత్స పొందుతూ మృతిచెందిన విష యం తెలిసిందే. మృతదేహాన్ని గురువారం ఖమ్మం నుంచి బోసు స్వగ్రామానికి తీసుకువస్తుండగా తె లంగాణ, ఆంధ్ర సరిహద్దు వద్ద కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. బోసు మృతికి కారణాలు తేల్చాలంటూ భీష్మించారు. సీఐ బి.వెంకటేశ్వరరావు, ఎ స్సైలు నవీన్కుమార్, చంద్రశేఖర్ ఆందోళనకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులకు, కుటుంబ సభ్యులకు వాదోపవా దం జరిగింది. రాత్రి సమయానికి కూడా ఆందోళన కొనసాగడంతో సరిహద్దు వద్ద కిలోమీటరుకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు అక్కడికి చేరుకుని శుక్రవారం నాటికి నిందితులెవరో తేలుస్తామని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. బోసు మృతదేహాన్ని స్వగ్రామం తరలిస్తున్న సమయంలో కూడా పోలీసులు వెంటే ఉన్నారు. మృతదేహానికి శుక్రవారం అంత్యక్రియలు చేస్తామని బంధువులు తెలిపారు. ఇదిలా ఉండా బోసుపై దాడి కేసులో అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. దోషులను ప్రభుత్వం వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాల రాజు డిమాండ్ చేశారు. గుర్తుతెలియని వ్యక్తి దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తుండగా కుటుంబసభ్యుల ఆందోళన -
మద్యంతర బాదుడు
జిల్లాలో 175 మద్యం దుకాణాలు పత్తాలేని రూ.99 బాటిళ్లు పేదల కోసం అంటూ చంద్రబాబు ప్రకటించిన రూ.99 క్వార్టర్ బాటిళ్లు మద్యం దుకాణాల్లో కనిపించడం లేదు. వీటిపై వచ్చే మార్జిన్ తక్కువగా ఉండటంతో వ్యాపారులు అమ్మకాలకు ఆసక్తి చూపడం లేదు. రూ.99 బాటిళ్లు లేవని చెబుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో మందుబాబులు జేబులు గుల్ల చేసుకుంటున్నారు. భీమవరంలో ఎక్స్ట్రా ధరలపై ఎకై ్సజ్ సీఐ బలరామరాజును ఫోన్లో సంప్రదించగా విషయం తమ దృష్టికి రాలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో.. గత టీడీపీ హయాంలో విచ్చలవిడిగా సాగిన మద్యం అమ్మకాలకు గత వైఎస్సార్ ప్రభుత్వం కళ్లెం వేసింది. ప్రభుత్వ మద్యం పాలసీని తెచ్చి బెల్టుషాపులను అరికట్టడంతో పాటు నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు చేసేలా చర్యలు తీసుకుంది. షాపుల వద్ద మద్యం కొనుగోలు చేసి తీసుకువెళ్లడమే తప్ప అక్కడే తాగేందుకు వీలు లేకుండా చేసింది. ఎమ్మార్పీకి మించి అధిక ధరల ఊసే లేదు. అప్పట్లో ఊరి చివర ఎక్కడో ఉన్న మద్యం దుకాణాలు ఇప్పుడు జనావాసాల్లోకి వచ్చేశాయి. నాడు మద్యంపై వచ్చే ఆదాయం మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరితే ప్రస్తుతం కూటమి నేతలు, సిండికేటు వర్గాల జేబుల్లోకి వెళుతుండటం గమనార్హం. సాక్షి, భీమవరం: పేద, మధ్యతరగతి మందుబాబులే లక్ష్యంగా మద్యం సిండికేట్లు ధరలను పెంచేశాయి. మద్యం వ్యాపారుల కోసం గత నెలలో చంద్రబాబు సర్కారు బాటిల్పై రూ.10ల చొప్పున పెంచితే.. తాజాగా సిండికేట్లు మరో రూ.10 పెంచి విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంలో తెరవెనుక సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు, ఎకై ్సజ్ అధికారులకు భారీగానే ముడుపులు అందుతున్నట్టు సమాచారం. ఎమ్మార్పీపై రూ.20 ఎక్స్ట్రా లిక్కర్ సిండికేట్లకు మేలు చేసేలా అమ్మకాలపై 10 శాతంగా ఉన్న మార్జిన్ను గత నెలలో ప్రభుత్వం 14 శాతానికి పెంచింది. ఆ భారాన్ని మందుబాబులపై మోపుతూ మద్యం ధరలను 15 శాతం వరకు పెంచింది. దీంతో పేద, మధ్యతరగతి వర్గాల వారు అధికంగా సేవించే రూ.120, రూ.130, రూ.150, రూ.180, రూ.190 క్వార్టర్ బాటిళ్ల ధరలు రూ.10 వంతున పెరిగాయి. ఇది చాలదన్నట్టు జిల్లా కేంద్రమైన భీమవరం, ఇతర నియోజకవర్గాల్లో రూ.130 నుంచి రూ.210 వరకు ఉన్న బ్రాండ్లపై రూ.10లు అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం బాటిళ్లపై పాత ఎమ్మార్పీ ధరలే ఉండటంతో రూ.20 ఎక్స్ట్రా (గత నెలలో ప్రభుత్వం పెంచిన రూ.10, ఇప్పుడు సిండికేట్ పెంచిన రూ.10 కలిపి) వసూలు చేస్తున్నారు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత బ్రాండ్ను బట్టి ఈ ధరలను మరింత పెంచేస్తున్నారు. కూలింగ్ చార్జీల పేరిట బీర్లుపై రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అధికంగా వినియోగం ఉండే రూ.130 నుంచి రూ.210 మధ్య ఉన్న బ్రాండ్ల ధరలను ప్రధానంగా పెంచుతున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో రోజుకు సుమారు రూ.3.50 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుండగా రూ.20 ఎక్స్ట్రా రూపంలో మందుబాబులపై రూ.కోటికి పైగా అదనపు భారం పడుతోందని అంచనా. ధరలు పెంచి.. పేదలను ముంచి.. గత నెలలో బాటిల్కు రూ.10 వడ్డన తాజాగా సిండికేట్లు మరో రూ.10 పెంపు ఎమ్మార్పీకి మించి అమ్మకాలు జిల్లాలో మందుబాబులపై రోజుకు రూ.కోటికి పైగా భారం కూటమి నేతలు, ఎకై ్సజ్ వర్గాలకు భారీగా ముడుపులు జిల్లాలో మద్యం ఆదాయం రోజుకు రూ.3.50 కోట్లు జిల్లాలో 175 మద్యం దుకాణాలు ఉండగా కూటమి సిండికేట్లు పర్యవేక్షణలోనే షాపుల నిర్వహణ సాగుతోంది. ఎకై ్సజ్ పాలసీకి విరుద్ధంగా చాలా చోట్ల మద్యం దుకాణాలను బార్ అండ్ రెస్టారెంట్ల మాదిరి మార్చేశారు. షాపుల వద్దనే మద్యం సేవించేందుకు టేబుళ్లు, కుర్చీలతో సిట్టింగ్ ఏర్పాట్లు, మంచింగ్ కోసం ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, సోడా, డ్రింక్, వాటర్ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. లూజ్ సేల్స్, బెల్టుషాపులు షరా మామూలే. నెలరోజుల క్రితం జేసీ రాహుల్కుమార్రెడ్డి భీమవరంలోని మద్యం షాపుల్లో స్వయంగా తనిఖీలు చేసి నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేయించినా పరిస్థితిలో మార్పు రాలేదన్న విమర్శలున్నాయి. -
ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలి
జేసీ రాహుల్కుమార్ రెడ్డి భీమవరం: రైతుల నుంచి దాళ్వా ధాన్యం కొనుగోలుకు అధికారులు సిద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి అధి కారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోళ్లపై సేకరణ కమిటీ సభ్యులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ధాన్యం కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాల్ రూ.2,300, గ్రేడ్–ఎ రకం రూ.2,320 ఉందన్నారు. తేమ శాతం 17 కంటే తక్కువ ఉండేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. బహిరంగ మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ రేటు ఉంటే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకోవచ్చన్నారు. రైతు సేవా కేంద్రాల్లో తగినంత సిబ్బందిని నియమించి వారికి ధాన్యం కొనుగోలుపై పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. గోనె సంచులు, హమాలీలు, ధాన్యం రవాణాకు వాహనాలను అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ టి.శివరాం ప్రసాద్, డీఎస్ఓ ఎన్.సరోజ, జిల్లా సహకార శాఖ అధికారి ఎం.నాగరాజు, జిల్లా రవాణా శాఖ అధికారి బి.ఉమామహేశ్వరరావు, లీగల్ మెట్రా లజీ అసిస్టెంట్ కంట్రోలర్ వీవీ నాగరాజారావు తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ బంగారం అంటగడుతున్న ముఠా అరెస్టు
కై కలూరు: బంగారపు దుకాణాల వద్దకు కారులో దర్జాగా వెళతారు.. అత్యవసరం అంటూ రూ.3 లక్షల విలువ చేసే బ్రాస్లెట్ తాకట్టు పెట్టుకుని కేవలం రూ.1.50 లక్షలు ఇవ్వండనీ అడుగుతారు. హాల్మార్క్ గుర్తుతో పాటు హైదరాబాద్లో కొనుగోలు చేసిన రశీదు ఇస్తారు. చివరికు అది ఒన్ గ్రామ్ బంగారంగా తేలుతోంది. ఈ విధంగా ఏలూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో మోసాలకు పాల్పడిన ముఠాను కై కలూరు టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టౌన్ సీఐ పి.కృష్ణ, ఎస్సైలు డి.వెంకట్కుమార్, డి.శ్రీనులతో కలసి కేసు వివరాలను స్టేషన్లో గురువారం వెల్లడించారు. నెల్లూరు జిల్లా రామవరప్పాడుకు చెందిన కడియాల వెంకటేశ్వరరావు(40) భార్యతో కలసి హైదరాబాదు ఎల్బీ నగర్లో ఒన్ గ్రామ్ బంగారం దుకాణం నడుపుతున్నాడు. పెద్ద తిరుపతిలో కొండపైకి భక్తులను జీపుల్లో తరలించే విజయనగం జిల్లా మెంటాడకు చెందిన చొక్కాపు మణికంఠ(32), నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఉన్నం చంద్రమోహన్(54)లను కలుపుకుని వెంకటేశ్వరరావు మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ నెల 13న కై కలూరు మహాలక్ష్మీ గోల్డ్ షాప్లో బ్రాస్లెట్ తాకట్టు పెట్టి రూ.90 వేలు యజమాని మెంట దీలిప్ నుంచి తీసుకున్నారు. తర్వాత సమీపంలోని కార్తీకేయ ఫైనాన్స్ యజమాని శివవరప్రసాద్కు చైన్ తాకట్టు పెట్టి రూ.1,50 లక్షలు తీసుకున్నాడు. ఆ సమయంలో అతనికి అనుమానం రావడంతో చాకుతో బెదిరించి పరారయ్యారు. తర్వాత భీమవరంలో రూ.1.50 లక్షలు, గుడివాడలో రూ.1.50 లక్షలు, గణపవరంలో రూ.1.30 లక్షలకు నకిలీ బంగారు వస్తువులు అంటగట్టి నగదుతో పరారయ్యారు. తిరిగి కై కలూరులో మోసాలకు పాల్పడడానికి గురువారం వచ్చిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.88 వేలు నగదు, 4 చైన్లు, 4 బ్రాస్లెట్లు, 3 సెల్ఫోన్లు, తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన సీఐ పి.కృష్ణ, ఎస్సైలు డి.వెంకట్కుమార్, డి.శ్రీనులను ఎస్పీ అభినందించారు. గోల్డ్ షాపులే టార్గెట్గా మోసాలు కై కలూరు పోలీసులకు చిక్కిన ఘరానా కేటుగాళ్లు -
వ్యవసాయ క్షేత్రాల సందర్శన
పెనుమంట్ర: రబీలో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య మిల్లింగ్లో గింజ విరిగిపోయి నూక ఎక్కువగా రావడం వల్ల కొనుగోలు ధర తగ్గిపోతుందని మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సంచాలకులు డాక్టర్ టి శ్రీనివాస్ అన్నారు. గురువారం మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శిక్షణ, సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంటీయూ 1121 రకం పంటకాలం 125 రోజుల మాత్రమే అని, నిర్ణీత పంటకాలం పూర్తికాగానే పంటను కోయాలన్నారు. పూర్తిగా ఎండిపోయే వరకు చేనుపై ఉంచరాదన్నారు. ఈనెల 26 నుండి 29 వరకు గుంటూరు లాం ఫారంలో ప్రాంతీయ వ్యవసాయ ప్రదర్శన జరుగుతుందని, దీనిలో దక్షిణ రాష్ట్రాల రైతులు పాల్గొంటరాని చెప్పారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ మొదటివారం నుంచి కోతలు మొదలు అవుతాయన్నారు. నూతన ఎన్ఎల్ఆర్ 3238 రకం ఆశాజనకంగా ఉందని, ఎటువంటి చీడపీడలు లేవని తెలిపారు. చిరుసంచి ప్రదర్శనలో ఉన్న ఎంటీయూ 1426 రకం గుణగణాలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గిరిజారాణి సాగులో ఉన్న వివిధ రకాల గుణగణాలు, ప్రత్యామ్నాయ రకాల గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంవీ కృష్ణాజీ, శాస్త్రవేత్తలు, మండల వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు. -
సునీతా విలియమ్స్కు శుభాకాంక్షలు
ఏలూరు (టూటౌన్): అగ్గిపుల్లపై వ్యోమగామి సునీతా విలియమ్స్ చిత్రాన్ని చిత్రీకరించి అబ్బుర పరుస్తున్నారు ఏలూరుకు చెందిన సూక్ష్మ కళాకారుడు మేతర సురేష్బాబు. తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడిపి క్షేమంగా భూమిపైకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని తనదైన శైలిలో సునీతా విలియమ్స్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సూక్ష్మ కళాకారుడు మేతర సురేష్ బాబుకు పలువురు అభినందనలు తెలియజేశారు. కబడ్డీ పోటీల్లో తృతీయ స్థానం పెదపాడు : వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఈనెల 14 నుంచి 16 వరకు జరిగిన 34వ సబ్జూనియర్ అంతర్ జిల్లా బాలబాలికల కబడ్డీ పోటీల్లో పెదపాడు మండలం వీరమ్మకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు తృతీయ స్థానం సాధించినట్లు హెచ్ఎం రాంప్రసాద్ తెలిపారు. కబడ్డీ పోటీల్లో విద్యార్థులు హర్ష, శాంతరాజు ప్రతిభ చాటారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. -
ఆర్టీసీ రక్షణకు 24న చలో ఢిల్లీ
ఏలూరు (ఆర్ఆర్పేట): దేశంలోని రవాణా రంగ కార్మికులకు ఒక సమగ్ర సంక్షేమ చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న చలో పార్లమెంట్ కార్యక్రమానికి ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం స్థానిక ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్. లింగరాజు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల స్థానంలో దేశవ్యాప్తంగా విద్యుత్ బస్సులను తీసుకొని భవిష్యత్తులో ఆర్టీసీలను కనుమరుగు చేయాలని కేంద్ర ప్రభుత్వం పథకం వేసిందనీ, ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం– ఈ బస్సు స్కీము కూడా ఇందులో భాగమే అన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడి ఆర్టీసీలను కాపాడుకోవాలనీ, ఈనెల 24న ఢిల్లీలో భారీ ప్రదర్శనతో నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ సుందరయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి టీపీఆర్ దొర, ఎస్బీ అనిల్ కుమార్, జిల్లా కార్యదర్శి ఎన్.సురేష్, డిపో అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్ ప్రసాద్, టీకే రావు తదితరులు పాల్గొన్నారు. చెల్లని చెక్కు కేసులో జైలు శిక్ష, జరిమానా నూజివీడు: చెక్కు చెల్లని కేసులో ఒక వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మేజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూర్తి గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు ముసునూరు మండలం కాట్రేనిపాడుకు చెందిన ముసునూరు ప్రభుదాస్కు గోపవరంనకు చెందిన వల్లభనేని గోపాలకృష్ణ 2017 జూన్ 25న రూ.5 లక్షలు అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం తరువాత బాకీ చెల్లించే నిమిత్తం ప్రభుదాస్ రూ.5 లక్షల చెక్కు ఇచ్చాడు. ఈ చెక్కును గోపాలకృష్ణ బ్యాంకులో వేయగా ప్రభుదాస్ బ్యాంకు ఖాతాలో నగదు లేదని బ్యాంకు అధికారులు చెక్కును తిప్పి పంపారు. దీంతో గోపాలకృష్ణ కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం స్పెషల్ మేజిస్ట్రేట్ ప్రభుదాస్కు ఆరు నెలల జైలుశిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. అనుమానాస్పద స్థితిలో రిటైర్డ్ ఉద్యోగి మృతి చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీ పాత చింతలపూడి గ్రామంలో రిటైర్డ్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డి హేమ ప్రకాష్(65) రిటైర్డ్ ఉద్యోగి. పాత చింతలపూడిలో నివాసం ఉంటున్నాడు. గురువారం ఉదయం గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. అప్పటికే ప్రకాష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా హేమ ప్రకాష్ను ఆస్తి కోసం కుటుంబ సభ్యులే కొట్టి చంపారని మృతుని సోదరుడు మోహన్ ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రకాష్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అనుమానాస్పద కేసుగా నమోదు చేసి ఎస్సై కుటుంబరావు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆదుకోకోంటే ఉద్యమమే
సదస్సు తీర్మానాలివీ.. ● అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా రైతుల వద్ద ఉన్న కోకో గింజలను కంపెనీలు వెంటనే కొనుగోలు చేయాలి. ● కంపెనీలు రైతులను నష్టపరిచే చర్యలను అరికట్టాలి. ● కంపెనీలు కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కోకో గింజలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. ● ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేయాలి. ● విదేశీ కోకో గింజలు, పొడి, బట్టర్ వంటి దిగుమతులు నిలుపుదల చేయాలి. మన రైతులను నష్టపరిచే పద్ధతుల్లో దిగుమతులు ఉండరాదు. ● కోకో రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణం చేయాలి. ● కోకో తోటలు సాగు చేస్తున్న రైతులకు ఉద్యాన శాఖ నుంచి రావాల్సిన సబ్సిడీ బకాయిలు చెల్లించాలి. పెదవేగి : కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కోకో రైతుల రాష్ట్ర సదస్సు హెచ్చరించింది. గురువారం ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సును నిర్వహించారు. బొల్లు రామకృష్ణ, బోళ్ల సుబ్బారావు, ఈడ్పుగంటి శ్రీనివాసరావు అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన ఈ సదస్సులో కోకో రైతుల సమస్యలపై చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ తదితర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కోకో రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. కంపెనీల సిండికేట్తో దోపిడీ కోకో గింజల కొనుగోలు కంపెనీలు సిండికేట్గా మారి రైతులను దోపిడీ చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.కేశవరావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 75 వేల ఎకరాల్లో కోకో తోటల సాగు ఉందని, ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొబ్బరి, ఆయిల్పామ్ తోటల్లో కోకో అంతర పంటగా ఉందని తెలిపారు. ప్రపంచ కోకో ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోని 20 దేశాల్లో 20వ స్థానంలో ఉందని, మన దేశ అవసరాలకు తగిన విధంగా ఇక్కడ ఉత్పత్తి లేదని చెప్పారు. 80 శాతం కోకోను ఇతర దేశాల నుంచి మన దేశం దిగుమతి చేసుకుంటోందని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గత సంవత్సరం కంపెనీలు పోటీపడి అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కిలో గింజలను రూ.1,040 వరకు ధర చెల్లించి కొనుగోలు చేశాయని గుర్తుచేశారు. ఈ ఏడాది కంపెనీలు సిండికేట్గా మారి అంతర్జాతీయ ధర ఇవ్వడం లేదని చెప్పారు. పైగా అన్ సీజన్ గింజలు కొనుగోలు చేయడం లేదని, సీజన్ కోకో గింజల ధర రోజురోజుకీ తగ్గించి వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోకో రైతులు సంఘటితం కావాలి కోకో రైతులంతా సంఘటితంగా లేకపోవడం వల్లే కంపెనీలు సిండికేట్గా ఇబ్బంది పెడుతున్నాయని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. నిల్వ ఉంచిన గింజలను పచ్చళ్లు పట్టుకోండి అంటూ రైతులను ఎగతాళి చేస్తూ కంపెనీలు మాట్లాడుతుండటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఈ సదస్సులో విజయరాయి ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త మాధవీలత, పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం పరిధి ఆయిల్ పామ్ రైతుల సంఘం అధ్యక్షుడు ఉండవల్లి వెంకటరావు, ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షుడు మున్నంగి సుబ్బారెడ్డి, కోకో రైతులు పాల్గొన్నారు. 24న ధర్నాలు, రాస్తారోకోలు.. కోకో రైతుల సమస్యలపై ఈ నెల 24, 25 తేదీల్లో ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించాలని, ఎంపీలు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందించాలని, సమస్యను పరిష్కరించకపోతే కోకో గింజలు కొనుగోలు చేస్తున్న కంపెనీల గోడౌన్ల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర సదస్సు పిలుపునిచ్చింది. రాష్ట్రస్థాయి సదస్సులో తేల్చిచెప్పిన కోకో రైతులు కోకో గింజల కొనుగోలు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ విజయరాయిలోని సదస్సుకు పెద్ద సంఖ్యలో కోకో రైతుల హాజరు -
ఏకపక్షంగా గేదెల పాక తొలగింపు
నూజివీడు: తుక్కులూరులో పదేళ్లుగా రెవెన్యూ పోరంబోకు భూమిలో ఉన్న గేదెల పూరి పాకను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ పాక వైఎస్సార్సీపీ సానుభూతి పరుడైన కొలుసు భాస్కరరావుకు చెందినది కావడంతో ఈ నెల 18న అధికారులు ఆఘమేఘాలపై వచ్చి తొలగించడం గమనార్హం. అదే గ్రామంలో మచిలీపట్నం–కల్లూరు జాతీయ రహదారి మార్జిన్లను ఆక్రమించుకొని అనేక దుకాణాలున్నప్పటికీ వాటి వైపు మాత్రం రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. కొలుసు భాస్కరరావు వైఎస్సార్సీపీ సానుభూతి పరుడుగా ఉండటమే కాకుండా అతని భార్య గ్రామంలో అమూల్ పాలకేంద్రాన్ని నడుపుతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అమూల్ కేంద్రాన్ని వదిలేయమని ఆమైపె ఒత్తిడి తీసుకువస్తున్నారు. దానికి నిరాకరించడంతో తమ మాట వినడం లేదని చెప్పి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి చేయించి గేదెల పాకను తొలగించేలా చేశారు. దీంతో భాస్కరరావు తన గేదెలను కట్టేసుకోవడానికి స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
గేదెలను తరలిస్తున్న వ్యాన్ అడ్డగింత
తణుకు అర్బన్ : తణుకు జాతీయ రహదారి శర్మిష్ట సెంటర్లో 5 గేదెలతో వెళ్తున్న వ్యాన్ను గోసేవాసమితి సభ్యులు అడ్డుకున్నారు. గురువారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో గోసేవా సమితి సభ్యుడు కొండ్రెడ్డి శ్రీనివాస్, ఇతర సభ్యులు వ్యాన్ను అడ్డుకుని పోలీసులకు సమాచారం అందజేశారు. వ్యాన్లో ఉన్న గేదెలను తేతలి పశువధ శాలకు తీసుకువెళ్తున్నామని, మరలా నూజివీడులో పెంపకానికి తీసుకువెళ్తున్నామని వ్యాన్ డ్రైవరు రెండు రకాల సమాధానాలు చెప్పారని గోసేవా సమితి సభ్యులు ఆరోపిస్తున్నారు. ఐదింటిలో పాలిచ్చేవాటితోపాటు సూడి, పెయ్యి కూడా ఉన్నాయని.. పెంపకానికి తీసుకెళితే ఇలా వ్యాన్లో ఇరికించరని.. వీటిని వధించే ఫ్యాక్టరీకి తీసుకువెళ్తున్నారని ఆరోపించారు. గేదెలకు సంబంధించిన వ్యక్తులు మాత్రం పి.గన్నవరం బెల్లంపల్లి గ్రామం నుంచి నూజివీడుకు పెంపకానికి తీసుకువెళ్తున్నట్లుగా చెబుతున్నారు. దీనిపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా ప్రాంతానికి వచ్చిన పోలీసులు వ్యాన్ నుంచి గేదెలను దింపి వాటిని అక్కడే చెట్ల వద్ద ఉంచారు. గేదెలను గోశాలకు పంపిస్తామని, నిబంధనలకు విరుద్ధంగా 5 గేదెలను ఒక వ్యాన్లో ఎక్కించినందుకు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్కు వ్యాన్ను అప్పగిస్తామని తణుకు పట్టణ ఎస్సై శ్రీనివాస్ చెప్పారు. -
27 నుంచి గుంటూరులో వ్యవసాయ ప్రదర్శన
ఏలూరు(మెట్రో): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈనెల 27 నుంచి 29 వరకు లాంఫామ్ గుంటూరులో దక్షిణ భారత ప్రాంతీయ వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఏరువాక కేంద్రం ఏలూరు సమన్వయకర్త డాక్టర్ కె. ఫణికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాల వ్యవసాయ పద్ధతులు, కూరగాయలు, పండ్ల సాగులో అధునాతన సాగు పద్ధతులు, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం తదితర అంశాల ప్రదర్శనతోపాటు రైతుల–శాస్త్రవేత్తల చర్చా కార్యక్రమాలు ఉంటాయన్నారు. దక్షిణ భారత వ్యవసాయ నిపుణులు రైతులతో సంభాషించనున్నట్లు వెల్లడించారు. ఏలూరులో సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం ఏలూరు (ఆర్ఆర్పేట): స్థానిక రామచంద్రరావు పేట శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీసిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్ర రూపకల్పనకు గురువారం ప్రారంభ పూజ చేశారు. సెంటిమెంట్, హర్రర్, కామెడీ మేళవించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు వెంకట్ జుత్తిగ తెలిపారు. ఈ చిత్రం షూటింగ్ నిరంతరాయంగా కొనసాగిస్తామని, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే లొకేషన్లు పరిశీలించినట్లు చెప్పారు. ఈ చిత్రంలో ఇరువురు ప్రముఖ సీనియర్ నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తారని, వారి వివరాలు, హీరోయిన్ల వివరాలు త్వరలో ప్రకటిస్తామన్నారు. సినీ నిర్మాత వట్టి శ్యామ్బాబు మాట్లాడుతూ అనన్య చిత్రంలో విలన్ క్యారెక్టర్లో నటించిన అరవింద్ జాలా తమ చిత్రంలో హీరోగా నటిస్తున్నట్లు చెప్పారు. తొలుత ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రముఖ సినీ నిర్మాత అంబికా కృష్ణ క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించి చిత్రం ప్రజాదరణ పొందాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. -
దాడిలో గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెంలో గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్త గంధం బోసు(31) బుధవారం సాయంత్రం మృతి చెందాడు. బోసును కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వైద్యులు చెప్పారు. బోసుపై దాడి జరిగి 48 గంటలు గడిచినా కారణాలు తెలియలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ దాడి చేసిన వ్యక్తుల ఆచూకీ తెలియకపోవడం పట్ల నియోజకవర్గంలో భారీ స్థాయిలో చర్చ జరుగుతుంది. బోసుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సమన్వయ కర్త కారుమూరి సునీల్, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజులు డిమాండ్ చేశారు. దాడి జరిగి రెండు రోజులు గడుస్తున్నా నిందితులను కనిపెట్టడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు. ప్రశాంతమైన ఏజెన్సీ ప్రాంతంలో బోసు హత్యతో గంధరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జీలుగుమిల్లి జాతరలో అవకతవకలపై వచ్చిన వార్తలను బోసు ఫార్వార్డ్ చేయడంతో టీడీపీ నాయకుడు వెంకటేశ్వరరావు ఫోన్లోనే బోసును బెదిరించిన కొద్దిరోజుల్లోనే బోసుపై దాడి జరగడం, బోసు మృతి చెందడం చూస్తుంటే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. -
ఈ నెల 27న మెగా జాబ్మేళా
భీమవరం: స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, డాక్టర్ సీఎస్ఎన్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో భీమవరంలోని సీఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 27న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎస్ఎస్డీసీ జిల్లా మేనేజర్ పోతిన లోకమాన్ చెప్పారు. బుధవారం కళాశాలలో మాట్లాడుతూ జాబ్మేళాకు దాదాపు 20 కంపెనీలు హాజరుకానున్నాయని పీజీ, డిగ్రీ, బీటెక్, ఇంటర్, పదో తరగతి విద్యార్థులు ఈ క్యాంపస్ డ్రైవ్లో పాల్గొనవచ్చన్నారు. దీనికి ఆన్లైన్ ద్వారా, కళాశాలకు నేరుగా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చీడే సత్యనారాయణ, ప్రిన్సిపల్ సకుమళ్ల సత్యనారాయణ, కో–ఆర్డినేటర్ ఎం.రాధిక తదితరులు పాల్గొన్నారు. యూత్ పార్లమెంట్ నిర్వహణకు డీఎన్నార్ ఎంపిక భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2025 కార్యక్రమం ఈ నెల 24,25 తేదీల్లో నిర్వహించనున్నట్లు భీమవరం డీఎన్నార్ కళాశాల ప్రిన్సిపల్ జి.మోజెస్ చెప్పారు. ఈ కార్యక్రమం నిర్వహణకు డీఎన్నార్ను నోడల్ కళాశాలగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఎంపిక చేసిందన్నారు. రెండు జిల్లాల నుంచి వచ్చిన 454 వీడియోలను పరిశీలించి వాటిలో 150 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న అభ్యర్ధులు ఒన్ నేషన్–ఒన్ ఎలక్షన్ అనే అంశంపై మూడు నిమిషాలు మాట్లాడాల్సి ఉంటుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు డివిజన్–2 ఈఈగా మూర్తి పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు డివిజన్–2 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా ఏఎస్ఎల్ఎన్ఎస్ మూర్తి బాధ్యతలు స్వీకరించారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన మూర్తిని సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. జలవనరుల శాఖలో పదోన్నతులు పోలవరం ప్రాజెక్టు జలవనరుల శాఖ అధికారులకు పదోన్నతులు లభించాయి. పి.వెంకటరమణ డివిజన్–1 ఈఈగా, ఏఎస్ఎల్ఎస్ఎన్ మూర్తి డివిజన్–2 ఈఈగా, డి.శ్రీనివాసరావు డివిజన్–3 ఈఈగా, కె.సుబ్రహ్మణ్యం డివిజన్–4 ఈఈగా, జి.కృష్ణ, డివిజన్–5 ఈఈగా, కె.బాలకృష్ణమూర్తి డివిజన్–6ఈఈగా, డి.దామోదరం డివిజన్–7ఈఈగా, కె.పుల్లారావు డివిజన్–8ఈఈగా పదోన్నతులు పొందినట్లు అధికారులు పేర్కొన్నారు. విద్యా సంస్థల బస్సులపై కేసుల నమోదు ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు బుధవారం విద్యా సంస్థల బస్సుల తనిఖీలు నిర్వహించి 8 కేసులు నమోదు చేసినట్టు ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ తెలిపారు. ఫిట్నెస్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన బీమా తదితర అంశాలను పరిశీలించి ఆయా సర్టిఫికెట్లు లేని, నిబంధనలకు విరుద్ధంగా నడుతుపున్న 8 బస్సులపై కేసులు నమోదు చేసినట్టు వివరించారు. అభయాంజనేయస్వామి హుండీ లెక్కింపు పెదపాడు: అభయాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ.12,08,963 వచ్చినట్లు ఆలయ ఈఓ పీ.తారకేశ్వరరావు తెలిపారు. అభయాంజనేయస్వామి హుండీ ఆదాయం లెక్కింపు బుధవారం నిర్వహించారు. 80 రోజులకు జరిగిన లెక్కింపులో ఈ ఆదాయం వచ్చిందని పర్యవేక్షణాధికారి సురేష్ కుమార్ తెలిపారు. -
మహిళలపై నేరాల కట్టడికి శక్తి బృందాలు
భీమవరం: మహిళలపై నేరాలు అరికట్టడానికి, వారి భద్రతకు భరోసాగా జిల్లా వ్యాప్తంగా 30 మంది సిబ్బందితో 5 శక్తి బృందాలు ఏర్పాటు చేసినటు్ల్ ఎస్పీ అద్నాన్ నయీం అస్మి చెప్పారు. బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన శక్తి టీంలను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. శక్తి టీంలు జిల్లాలోని కళాశాలలు, పార్కులు, ఆర్టీసీ బస్టాండ్లు, ముఖ్య కూడళ్లలో మఫ్టీలో ఉంటారని, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, పిల్లలపై వేధింపులు అరికట్టడం, నేరాలను నిరోధించడం, తక్షణ సాయం అందించి వారికి రక్షణ కవచంగా నిలిచేలా పనిచేస్తారని చెప్పారు. ఆపద సమయంలో శక్తి యాప్స్కు వచ్చే ఎస్ఓఎస్ కాల్స్, డయల్ 112, 100 కాల్స్తో సంఘటనా స్థలానికి తక్షణం టీంలు వెళ్తాయన్నారు. యాప్లోని ఎస్ఓఎస్ ఆప్షన్ నొక్కితే వారి లొకేషన్, వీడియో, ఆడియో కంట్రోల్ రూంకు చేరుతుందన్నారు. అంతేకాకుండా ఫోన్ ఊపినా సమాచారం పోలీసులకు చేరుతుందని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) వి.భీమారావు తదితరులు పాల్గొన్నారు. -
నిత్యావసరాల పంపిణీలో అవకతవకలపై కఠిన చర్యలు
భీమవరం: నిత్యావసర సరుకుల పంపిణీలో అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పౌరసరఫరాల అధికారులు, ఎండీయు, రేషన్ డీలర్ల అసోసియేషన్, గ్యాస్ డీలర్ల ప్రతినిధులతో జేసీ సమావేశమై నిత్యవసర సరుకులు పంపిణీ, దీపం–2 గ్యాస్ సిలెండర్ల సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన, కచ్చితమైన కొలతలతో నిత్యావసరాలు పంపిణీ జరగాలనే ధ్యేయంతో పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నిత్యవసరాల డీలర్లు, ఎండీయు ఆపరేటర్లు వినియోగదారుల నుంచి అదనపు రుసుం వసూలు చేసినా, కొలతలలో తేడా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో కొంతమంది అదనపు రుసుం వసూలు చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, విచారణ చేసి వాస్తవమైతే చర్యలు తప్పవన్నారు. రైతులకు నోటీసులు అందించాలి భీమవరం (ప్రకాశంచౌక్): రీ సర్వే గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయిన గ్రామాలలోని రైతులకు 9(2) నోటీసులు అందచేయాలని జేసీ సంబంధిత అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ చాంబర్ లో రీ సర్వే, ఆర్ఓఆర్, ఇనాం ఎస్టేట్, ల్యాండ్ గ్రౌండింగ్, వెబ్ ల్యాండ్ తదితర అంశాల పురోగతిపై ఆయన సమీక్షించారు. -
కొల్లేరుపై సుప్రీంలో వాదనలు
కై కలూరు: కొల్లేరు అభయారణ్యంపై సుప్రీంకోర్టులో బుధవారం వాడివేడిగా వాదనలు సాగాయి. కొల్లేరు సంరక్షణ కోసం 2006 ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయలేదని, కొల్లేరు సరస్సులో అక్రమంగా చేపల చెరువుల సాగు జరుగుతోందని కాకినాడకు చెందిన విశ్రాంత ఉద్యోగి మృత్యుంజయరావు 2004 సెప్టెంబరులో పిటిషన్ వేశారు. దీనిపై ఈ ఏడాది జనవరి 16న సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్.గవాయి, జస్టిస్ ఆగస్టీ జార్జ్ మసీహ్, జస్టిస్ కె.వినోద్చంద్రన్తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోపు కొల్లేరు సరిహద్దులు గుర్తించి అక్షాంశాలు, రేఖాంశాలు ఖరారు చేసి, కొల్లేరు ప్రజలకు అవగాహన కల్పించాలని, అక్రమ చేపల చెరువులను తొలగించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కేసు మార్చి 14న విచారిస్తామని పేర్కొంది. దీంతో ఈ నెల 19 వరకు ప్రభుత్వం గడువు కోరింది. ఈ నేపథ్యంలో అటవీశాఖ నివేదిక అందించింది. సీఈసీ నివేదిక సమర్పించాలని ఆదేశం సుప్రీంకోర్టులో బుధవారం కొల్లేరు అంశంపై విచారణ కొనసాగింది. కొల్లేరు అభయారణ్యాన్ని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు వరకు కుదించి మిగులు భూములు పంపినీ చేయాలని కొల్లేరు పరివాహక గ్రామాల ప్రజలు అనేక పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డుకు నివేదికలు పంపింది. వైల్డ్ లైఫ్ బోర్డు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ)ని నియమించింది. సుకుమార్, అజీజ్ అనే రెండు కమిటీలు అభయారణ్య కుదింపు అంశంపై క్షేత్ర స్థాయి పరిశీలన చేసి నివేదికలు సీఈసీకి అందించాయి. ఈ కమిటీల పూర్తి సారాంశాన్ని, కొల్లేరు కాంటూరు కుదింపు సాధ్యసాధ్యాలకు చేసిన సిఫార్సులను ఏప్రిల్ 2న సుప్రీంకోర్టుకు నివేదించాలని సీఈసీని కోర్టు ఆదేశించింది. 9,500 ఎకరాల్లో చెరువులకు గండ్లు కొల్లేరులో అక్రమ చేపల చెరువులు ఉన్నాయని అటవీశాఖ గతంలో సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది. కొల్లేరులో మత్స్యకారుల జీవనోపాధికి అడ్డంకులు కల్పించమని, ప్రభుత్వం వారికి అవగాహన కల్పించి కోర్టు ఉత్తర్వుల అమలుకు అడ్డు తగలకుండా చెరువుల ధ్వంసంపై చర్యలు తీసుకోవాలని సుప్రీం సూచించింది. రెండు జిల్లాల్లో 18 వేల ఎకరాల చెరువులకు గండ్లు కొట్టాల్సి ఉండగా కోర్టుకు నివేదిక పంపించే సమయానికి 9,500 ఎకరాల చెరువులకు అటవీశాఖ గండ్లు కొట్టింది. దీంతో అనేక గ్రామాల్లో గ్రామస్తులు నిరసన తెలిపారు. ఏప్రిల్ 2న మరోసారి విచారణ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని పూర్తి నివేదిక కోరిన సుప్రీం అక్రమ చెరువుల ధ్వంసం వివరాలు అందించిన అటవీశాఖ -
ఇదేం.. న్యాయం సార్?
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025సాక్షి, భీమవరం: జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం రవాణా శాఖ కార్యాలయాల పరిధిలో 1,327 స్కూల్ బస్సులు ఉన్నాయి. నిబంధనలు మేరకు స్కూల్ బస్సులు విద్యార్థుల రవాణకు మాత్రమే వినియోగించాలి. ఏదైనా ప్రమా దాలు జరిగినప్పుడు, వరదలు, భూకంపాలు తదితర విపత్తులు, అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైతే స్కూల్ బస్సులు వినియోగించుకోవచ్చు. ఇతర ప్రైవేట్ అవసరాలకు వాటిని తీసుకువెళ్లకూడదు. నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తే రవాణ శాఖ అధికారులు సంబంధిత స్కూల్ బస్సు పర్మిట్ సస్పెన్షన్తో పాటు రూ.10,000 జరిమానా, ఒక్కో సీటుకు రూ.1120 చొప్పున పన్ను విధిస్తారు. ఈ మేరకు గత నెల్లో భీమవరం నుంచి పెళ్లి బృందాలను తీసుకెళ్తున్న మూడు బస్సులను అధికారులు సీజ్ చేసి భారీ మొత్తంలో జరిమానాలు విధించడం ప్రైవేట్ స్కూల్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. అంతలోనే ఇలా.. స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్య క్రమంలో భాగంగా రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబు తణుకు పర్యటనకు వచ్చిన సందర్భంగా జన సమీకరణ కోసం అధికారులు ప్రైవేట్ స్కూల్ బస్సులనే వినియోగించడం గమనార్హం. ప్రజావేదిక కోసం తణుకు, పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో స్కూల్ బస్సులను వినియోగించి జనాలను సభా ప్రాంగణానికి తరలించారు. నిబంధనలు మేరకు జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ, ఇతర ప్రజా రవాణ వాహనాలు వినియోగించాల్సి ఉండగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకువచ్చి బస్సులు తీసుకొచ్చారు. పెళ్లి బృందాలను తీసుకువెళ్లారని చెప్పి కేసులు పెట్టి జరిమానాలు విధించిన అధికారులే నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ బస్సుల్లో సభలకు జనాలను తరలించడం యాజమాన్యాలను విస్మయానికి గురిచేస్తోంది. అధికారుల తీరుపై ప్రశ్నించాలని కొందరు భావించినప్పటికి లేనిపోని కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తారన్న ఉద్దేశ్యంతో మిన్నకుండిపోయినట్టు సమాచారం. కాగా ఈ విషయమై మాట్లాడేందుకు రవాణశాఖ అధికారులు సుముఖత చూపలేదు.న్యూస్రీల్ పెళ్లికి స్కూల్ బస్సులు నడిపారని రూ. 1.85 లక్షల జరిమానా తణుకులో చంద్రబాబు పర్యటనకు స్కూల్ బస్సుల్లోనే జనం తరలింపు అధికారుల ఒత్తిడితో బస్సులు పంపిన యాజమాన్యాలు రవాణ శాఖ తీరుపై ముక్కున వేలేసుకుంటున్న జనం గత నెల 17న రాత్రి భీమవరం నుంచి గణపవరానికి పెళ్లి బృందాలను తీసుకెళ్తున్న రెండు స్కూల్ బస్సులు, భీమవరం నుంచి ఆకివీడు వెళ్తున్న ఒక స్కూల్ బస్సును రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. వాటిని భీమవరంలోని రవాణా శాఖ సీజర్ యార్డుకు తరలించి మూడింటికి కలిపి నుంచి రూ. 1,85,540 జరిమానా వసూలు చేశారు. -
బంగారం వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి
భీమవరం: ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు బంగారం అమ్మడానికి వస్తే అది దొంగ బంగారమా? కాదా? అని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు గాని అమ్మకం గానీ చేయాలని డీఎస్పీ ఆర్జీ జయసూర్య అన్నారు. భీమవరం పట్టణ పరిధిలోని త్యాగరాజ భవన్లో బంగారు వ్యాపారస్తులకు బుధవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బంగారపు షాపులలో జరిగే దొంగతనాల గురించి జాగ్రత్తలు వహించాలన్నారు. బంగారం వ్యాపారస్తులందరూ పోలీస్ వారికి సహకరించి దొంగతనాల నివారణలో సహకారం అందించాలని కోరారు. సమావేశంలో వన్ టౌన్, టూ టౌన్ సీఐలు ఎం.నాగరాజు, కాళీచరణ్, ఎస్సై కిరణ్కుమార్ పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు
ఏలూరు ఆర్అండ్బీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కాంట్రాక్టర్లు సాక్షి ప్రతినిధి, ఏలూరు/ఏలూరు(టూటౌన్) : కాంట్రాక్టర్లు రోడ్డెక్కారు.. సుమారు రూ.300 కోట్ల బకాయిలు నిలిచిపోవడంతో జిల్లాలో వందల మంది కాంట్రాక్టర్లు ఆందోళన బాట పట్టారు. ఏలూరు నగరంలోని ఆర్అండ్బీ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా రోడ్లు ఊడ్చుతూ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారని ఆగమేఘాల మీద రోడ్లపై గుంతలు పూడ్చితే.. నెలలు గడిచినా పట్టించుకోవడం లేదంటూ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు. 700 మంది కాంట్రాక్టర్లకు బకాయిలు జిల్లాలో కాంట్రాక్టర్లు బకాయిల కోసం నిరసన గళం విప్పారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల కాంట్రాక్టర్లు, మున్సిపల్ కాంట్రాక్టర్లు, బీఏఐ, ఎస్ఏబీఐ సభ్యులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో సుమారు రూ.300 కోట్ల బకాయిలున్నాయని, మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థల్లో నామినేషన్ ప్రాతిపదికన, ఇతర పనులు నిర్వహించినా బిల్లులు మంజూరు కాలేదు. జిల్లాలో ఆర్అండ్బీ, ఇరిగేషన్ శాఖల్లోని రూ.130 నుంచి రూ.150 కోట్ల పైచిలుకు, సోషల్ వెల్ఫేర్లో రూ.30 కోట్లు, జనరల్ ఫండ్ కింద పనులకు మరో రూ.30 కోట్లు, పంచాయితీరాజ్లో రూ.10 కోట్లు, విద్యాశాఖ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, అన్న క్యాంటీన్లు అన్ని కలిపి మరో రూ.20 కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయి. ఏలూరు నగరంలో జనరల్ ఫండ్ కింద నిర్వహించిన పనులకు రూ.12 కోట్లు, ఇరిగేషన్ రూ.25 కోట్లు, పంచాయతీరాజ్ బకాయిలు, ఏలూరు డివిజన్లో రూ.8 కోట్లు, ఆర్అండ్బీ పనులకు సంబంధించి రూ.40 కోట్లు, సోషల్ వెల్ఫేర్కు సంబంధించి రూ.10 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 200 మంది కాంట్రాక్టర్లు, ఉభయగోదావరి జిల్లాలో 700 మంది కాంట్రాక్టర్లకు బకా యిలు రావాల్సి ఉంది. ఇలా అయితే కాంట్రాక్టర్లు పూర్తిగా అప్పులుపాలై రోడ్డునపడే పరిస్థితులుంటాయని, నిరర్ధక ఆస్తులు (ఎంపీఏ) చెక్కు బౌన్సులతో ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నారని అసోసియేషన్ చైర్మన్ సతీష్ చౌదరి తెలిపారు. తమ కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని వాపోయారు. నెలాఖరు నాటికి బకాయిలు చెల్లించకపోతే భవిష్యత్తులో ఏ ప్రభుత్వ పనికి టెండర్లు వేయబోమని స్పష్టం చేశారు. పది నెలలుగా బిల్లుల కోసం తిప్పలు ఏలూరు జిల్లాలో సుమారు రూ.300 కోట్ల బకాయిలు 20 ప్రభుత్వ శాఖల్లో నిలిచిన బిల్లులు -
ఉజ్వల భవితకు పాలిటెక్నిక్
ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు పెడుతున్న వేళ విద్యార్థులు కూడా సాంకేతికతకు సంబంధించిన కోర్సులను నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంజనీరింగ్లో సైతం కంప్యూటర్ ఆధారిత కోర్సులవైపే మొగ్గు చూపుతున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసే విద్యార్థుల కంటే ముందుగానే ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం పాలిటెక్నిక్ పూర్తి చేసిన అభ్యర్థులకు లభిస్తుంది. దీంతో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుపై దృష్టి పెడుతున్నారు. సాంకేతిక విద్యకు పునాది సాంకేతిక విద్యకు పునాది వేసే పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్ష ఏప్రిల్ 30వ తేదీన జరగనుంది. ఈ మేరకు సాంకేతిక విద్యా శాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2025ను ప్రకటించింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిటెక్నిక్ ప్రవేశం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే, దానిని పునాదిగా మార్చుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. గ్రామీణ పేద విద్యార్థులు ఇంజినీరింగ్ వంటి ఉన్నత సాంకేతిక విద్యను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకుంది. వారికి పాలిటెక్నిక్ కోర్సులు చక్కని వేదికలని పలువురు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరి విలువైన సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందొచ్చని సూచిస్తున్నారు. దరఖాస్తుకు ఏప్రిల్ 15 వరకూ గడువు పాలిసెట్కు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఈ నెల 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి గాను ఈ నెల 12వ తేదీ నుంచే ఫీజులను ఆన్లైన్లో గేట్వే ద్వారా చెల్లించే సౌకర్యం అందుబాటులో ఉంచారు. పాలిసెట్ ఎంట్రన్స్ రాయదలుచుకున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 15వ తేదీ వరకూ గడువు ఉంది. 10వ తరగతి, తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు, ఈ ఏడాది అటువంటి పరీక్షలు రాస్తున్నవారు కూడా పాలిసెట్కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్ష 120 మార్కులకు నిర్వహిస్తారు. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఈ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 30న పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఎంట్రన్స్ పరీక్ష రాయడానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో 7 పాలిటెక్నిక్ కళాశాలలు జిల్లాలో విద్యార్థులకు మొత్తం 7 పాలిటెక్నిక్ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏలూరులోని సీఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాల, హేలాపురి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కలిదిండిలో డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నూజివీడులో నూజివీడు పాలిటెక్నిక్ కళాశాల, శ్రీ సారధి ఇనిస్టిట్యూట్ ఆప్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలున్నాయి. వాటన్నింటిలో కలిపి మొత్తం 2,536 సీట్లు వివిధ కోర్సుల్లో అందుబాటులో ఉన్నాయి. కాగా ముదినేపల్లిలో ఏవీఎన్ పాలిటెక్నిక్ కళాశాల ఉండగా ఈ కళాశాలలో విద్యార్థుల ప్రవేశాలు అతి స్వల్పంగా ఉండడంతో ఈ ఏడాది తమ కళాశాలను నిర్వహించలేమని, మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆ కళాశాల యాజమాన్యం సాంకేతిక విద్యాశాఖకు దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తుకు ఏప్రిల్ 15 వరకూ గడువు ఏప్రిల్ 30న పాలిసెట్ పరీక్ష జిల్లాలో 7 పాలిటెక్నిక్ కళాశాలలు అందుబాటులో 2,536 సీట్లు సద్వినియోగం చేసుకోవాలి పదో తరగతి ముగిసిన వెంటనే పాలిటెక్నిక్ చదివితే చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉన్నత విద్యతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు ఉంటాయి. పాలిసెట్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వారి సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాలలో స్టడీ మెటీరియల్ ఉచితంగా పంపిణీ చేస్తారు. అలాగే ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఆయా కళాశాలల్లో ఉచిత కోచింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కోర్సు చేయడానికి మూడేళ్లకు కేవలం రూ.13 వేల వరకు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరవచ్చు. లేదా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు. – పెదపట్నం సుబ్రహ్మణ్యం, ఏపీ పాలిసెట్ ఏలూరు జిల్లా కో–ఆర్డినేటర్ లభించే కోర్సులు ఇవీ పాలిటెక్నిక్లో వివిధ కోర్సులను జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. పలు చోట్ల ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచికి 60 నుంచి 120 వరకు సీట్లు అందుబాటులో ఉంటాయి. పాలిటెక్నిక్ కోర్సుల కాల వ్యవధి మూడేళ్ల వరకు ఉంటుంది. ఆరు నెలల పాటు విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ కూడా ఉంటుంది. విద్యార్థుల నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు. -
ఐఈఈఈతో జీవితం ఉన్నతం
తాడేపల్లిగూడెం: విద్యార్థులు తమ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం కోసం ఐఈఈఈ ఎంతగానో ఉపయోగపడుతుందని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పూర్వ జీఎం డాక్టర్ కప్పగంటు రామకృష్ణ తెలిపారు. ఏపీ నిట్లో బుధవారం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం, డీఎస్ఐఆర్, సీఆర్డీ హెచ్ఐ, ఈఈఈ నిట్ స్టూడెంట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో జాయింట్ చాప్టర్ వైజాగ్బే విభాగం సహకారంతో అధునాతన సాంకేతికతలు, భవిష్యత్ అవకాశాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్మార్ట్ ఎలక్ట్రికల్ గ్రిడ్లో ఎన్నో ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. వాటిని అందిపుచ్చుకొనేందుకు విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. రిజిస్ట్రార్, డీన్ ప్లానింగ్ దినేష్రెడ్డి, వి.సందీప్ మాట్లాడుతూ ఆధునిక పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్ధులు సాంకేతికతపై పట్టు సాధించాలన్నారు. ఐఈఈఈలో సభ్యత్వం తీసుకోవడం ద్వారా విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. ఆచార్యులు పి.శంకర్, కిరణ్తీపర్తి, వీరా కుమారి, మధు, దిలీప్వర్మ తదితరులు పాల్గొన్నారు. కాళ్ళకూరు వెంకన్న హుండీ ఆదాయం రూ.13 లక్షలు కాళ్ల: కాళ్ళకూరు గ్రామంలో వేంచేసియున్న స్వయంభూః శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు బుధవారం స్వామి వారి హుండీ ఆదాయం లెక్కించారు. 58 రోజులకు గాను రూ:13,74,218 వచ్చినట్లు ఆలయ కార్వనిర్వహణాధికారి అరుణ్ కుమార్ తెలిపారు. గ్రామస్తులు, భక్తులు, మహిళా మండలి సభ్యులు దేవదాయ శాఖ తనిఖీదారు వర్ధినీడి వెంకటేశ్వరరావు సమక్షంలో హుండీ ఆదాయ లెక్కింపు కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. చోరీ కేసులో మరో నిందితుడి అరెస్ట్పెనుగొండ: ఆచంట మండలం వల్లూరులో చోరీ కేసులో మరో నిందితుడు రాజమండ్రికి చెందిన యడ్ల వెంకటేష్ను అరెస్ట్ చేసినట్లు పెనుగొండ సీఐ రాయుడు విజయ్కుమార్ తెలిపారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల 2న వడ్లమన్నాటి భాస్కరరావు వెంకటలక్ష్మి దంపతులను వారి నివాసంలో నిందితులు కత్తితో బెదిరించి సుమారు రూ.9 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దొచుకెళ్లారు. దీనిపై వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి 5గురు నిందితులను ఈనెల 14న అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు వెంకటేష్ను రాజమండ్రిలోని అతడి నివాసంలోనే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడి నుంచి మంగళ సూత్రాలు, కొన పూసతో ఉన్న బంగారు బొందు, సుమారు నాలుగున్నర కాసుల బంగారం, వెండి చెంబు, వెండి పట్టీలు, మరికొంత వెండి స్వాధీనం చేసుకొన్నట్లు వివరించారు. కేసు త్వరితగతిన పురోగతి సాధించడానికి కృషి చేసిన డీఎస్పీ డాక్టర్ జి వేద, సీఐ రాయుడు విజయ్కుమార్, ఆచంట ఎస్సై కేవీ రమణను ఎస్పీ నయీం అస్మీ అభినందించారు. -
దారి దోపిడీ కేసులో ముగ్గురి అరెస్ట్
ఏలూరు టౌన్: ఏలూరు వన్టౌన్ ప్రాంతంలో గత నెలలో ఒక వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి అతని వద్దనున్న రూ.2.40 లక్షలు దోచుకెళ్లిన దారి దోపిడీ ముఠాను ఏలూరు వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ శ్రావణ్కుమార్ బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన కల్లపల్లి దుర్గా నాగ వెంకట కొండలరావు అలియాస్ పండు అనే వ్యక్తి ఏలూరులోని ఆదిత్య అసోసియేషన్ అనే హిందుస్థాన్ లివర్ సంస్థలో డ్రైవర్గా పనిచేసి మానివేశాడు. అక్కడ అకౌంటెంట్గా పనిచేసే గొట్ట వీరేష్ నిత్యం సంస్థ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు నగదును వెంట తీసుకువెళ్లి తిరిగి మరలా ఉదయం కార్యాలయానికి తీసుకురావడాన్ని పండు గమనించాడు. ఆ సొమ్మును కాజేసేందుకు పండు తన స్నేహితులైన ఏలూరు నగరంలోని దక్షిణపు వీధి ప్రాంతానికి చెందిన గుమ్మల మణికంఠ, అతని బావమరిది కల్లపల్లి చందు అలియాస్ అచ్చులతో కలిసి వీరేష్ కదలికలపై రెక్కి నిర్వహించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి విధులు ముగించుకుని వీరేష్ మోటారుసైకిల్ పై ఇంటికి వెళుతుండగా ముగ్గురూ కలిసి వీరేష్ కళ్లల్లో కారం కొట్టి అతని వద్దనున్న రూ 2.40 లక్షల నగదు బ్యాగును అపహరించి పారిపోయారు. బాధితుడు ఏలూరు వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏలూరు వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ ప్రత్యేక బృందంతో చాకచక్యంగా నిందితులను అరెస్ట్ చేశారని డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రూ.1.90 లక్షల నగదును, మోటారు సైకిల్ను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏలూరు వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఎ. సత్యనారాయణ, సీసీఎస్ సీఐ రాజశేఖర్, ఎస్సై కే.మదీనాబాషా, ఎస్సై బీ.నాగబాబు, సీసీఎస్ ఏఎస్సై ఎస్.రాజకుమార్, అహ్మద్, కానిస్టేబుళ్లు ఆర్.మోహనకృష్ణ, బీ నాగార్జున, ఎన్.శేషుకుమార్, ఎ.యశ్వంత్ కుమార్, టీ.సురేష్కుమార్, ఎండీ రుహుల్లాలను ఎస్పీ అభినందించారు. -
రికవరీ చేసిన సెల్ఫోన్ల పంపిణీ
భీమవరం: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దొంగిలించబడిన, చేజార్చుకున్న రూ.23 లక్షల విలువైన 155 సెల్ఫోన్లను బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధితులకు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో చోరీకి గురైన, పోగొట్టుకున్న సెల్ఫోన్లను రికవరీ చేసి తొమ్మిది విడతల్లో సుమారు రూ.రెండు కోట్లు విలువైన 1,394 సెల్ఫోన్లు రికవరీచేసి బాధితులకు అందజేశామన్నారు. 9వ విడతలో 155 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అహ్మదున్నిషా, ఎస్సై నాగేశ్వరరావు ఇతర సిబ్బంది విశేషంగా కృషిచేశారని ప్రశంసించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి భీమారావు, ఆర్మ్ ్డ రిజర్వ్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, భీమవరం డీఎస్పీ రావూరి గణేష్ జయసూర్య తదితరులు పాల్గొన్నారు. -
మద్యం దుకాణంలో వ్యక్తిపై దాడి
తణుకు అర్బన్ : మద్యం దుకాణంలో పనిచేస్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని అగంతకుడు దాడిచేసిన ఘటన తణుకులో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. తణుకు ఉండ్రాజవరం జంక్షన్ గణేష్ చౌక్ ప్రాంతంలోని మద్యం దుకాణం (నైట్ పాయింట్)లో మద్యం విక్రయిస్తున్న పట్టణానికి చెందిన సిర్రా పండుపై గుర్తుతెలియని వ్యక్తి చేసిన దాడి భయబ్రాంతులకు గురిచేసింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన అగంతకుడు మద్యం దుకాణం వద్దకు వచ్చి తచ్చాడిన తరువాత దుకాణంలో ఉన్న పండుపై ఇనుప రాడ్తో విచక్షణారహితంగా దాడిచేయడంతో బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. బాధితుడిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించి బయటకు వచ్చిన వీడియో పుటేజీలో దాడి జరిగిన తీరు భయాన్ని కొలిపే విధంగా ఉంది. దాడిచేసే సమయంలో దుకాణం వద్దకు వచ్చిన వారిని కూడా అగంతకుడు హెచ్చరించడం, ఆ తరువాత తాపీగా అతడు వాహనాన్ని స్టార్ట్ చేసుకుని వెళ్లడం సంచలనంగా మారింది. పోలీసులు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి సీపీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పండు కుటుంబ సభ్యులు.దళిత వర్గాలు తణుకు పట్టణ పోలీస్స్టేషన్కు తరలివచ్చి పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. -
రైతులకు మెరుగైన సేవలందించాలి
ఏలూరు(మెట్రో): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలందించాలని జాయింట్ కలెక్టర్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రత్యేక అధికారి పి.ధాత్రిరెడ్డి అన్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మహాజన సభ స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో బుధవారం జేసీ, డీసీసీబీ ప్రత్యేక అధికారి ధాత్రిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు దరఖాస్తు చేసిన 20 రోజుల్లోగా పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీఏసీఎస్లో వ్యాపార కార్యకలాపాలను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరించాలన్నారు. నిరర్ధక రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి రుణాల వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. రుణాలను సక్రమంగా చెల్లించే ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ర్యాంకింగ్ విధానాన్ని అమలు చేస్తామని, వారికి వడ్డీలో కొంత మొత్తం రాయితీపై రుణాలను అందిస్తామన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన రాబడి, వ్యయాలను ఆమోదించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన బడ్జెట్ ప్రతిపాదనలను కూడా సభలో ఆమోదించారు. సమావేశంలో జిల్లా సహకార శాఖాధికారి ఏ.శ్రీనివాస్, డీసీసీబీ సీఈఓ సింహాచలం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రతినిధులు, సహకార శాఖ పర్సన్ ఇన్చార్జ్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణకు నిరసనగా దున్నపోతుకు వినతిపత్రం
భీమవరం: ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యుత్సాహం తన రాజకీయ పతనానికి నాంది పలుకుతుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ బుధవారం భీమవరం నియోజకవర్గం రాయలం గ్రామంలో వినూత్నంగా దున్నపోతుకు వినతిపత్రం అందజేస్తుండగా భీమవరం టూటౌన్ సీఐ జి.కాళీచరణ్, ఎస్సైలు రెహమాన్, ఇజ్రాయిల్ అడ్డుకున్నారు. అనంతరం పుష్పరాజ్ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు వర్గీకరణ విషయంలో చేసిన తప్పుల వల్లనే కొన్నేళ్లు అధికారానికి దూరమయ్యారని మళ్లీ కూటమి ప్రభుత్వంతో అంటకాగి ఎస్సీ వర్గీకరణ చేయడం రాజకీయ పతనానికి దారితీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో మాల, మాదిగలు అన్నదమ్ముల భావంతో కలిసి మెలిసి ఉంటుండగా వర్గీకరణ పేరుతో వారిని విడగొట్టి పబ్బం కడుపుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ చెల్లుబాటు కాదని ముఖ్యమంత్రి స్థాయిలో మీరు తెలుసుకోవాలని రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాలు పనిచేయడం చాలా దారుణమన్నారు. ఇప్పటికై నా చెల్లుబాటు కానీ వర్గీకరణ విషయాన్ని పక్కన పెట్టి రిజర్వేషన్లు పెంచే ఆలోచనలో చేయాలని, లేకుంటే వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తామని పుష్పరాజ్ హెచ్చరించారు. కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి, జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు నేతల సువర్ణరాజు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చిగురుపాటి రాజేష్, పిట్టా వినోద్ కుమార్,గడ్డం అబ్రహం, జొన్నల వజ్రం, యాకోబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డున పడ్డ హెల్త్ అసిస్టెంట్లు
సాక్షి, భీమవరం: రెండు దశాబ్దాలకు పైగా కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్లుగా ప్రజలకు వైద్య సేవలందించిన వారిని కూటమి ప్రభుత్వం రోడ్డున పడేసింది. వీరిలో మరో ఐదారేళ్లలో రిటైరయ్యేవారు ఎంతోమంది ఉన్నారు. కూటమి ప్రభుత్వం తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తుందని గంపెడాశతో ఎదురుచూస్తున్నవారికి ఊహించని షాక్ ఇచ్చింది. కోర్టు తీర్పును సాకుగా చూపించి రాష్ట్ర వ్యాప్తంగా 920 మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించడంతో వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. జాబు కావాలంటే బాబు రావాలంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన కూటమి నేతలు.. అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలివ్వకపోగా ఉన్న ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవల కోసం పారామెడికల్ రిక్రూట్మెంట్ ద్వారా హెల్త్ అసిస్టెంట్ల (మేల్) నియామకానికి 2002 మే నెలలో నాటి ఉమ్మడి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2324 పోస్టులకు 10వ తరగతి పూర్తి చేసి హెల్త్ అసిస్టెంట్ ట్రైనింగ్ డిప్లమో ఉండడాన్ని విద్యార్హతగా ప్రకటించింది. పరీక్షకు 10వ తరగతి వారితో పాటు ఇంటర్ పూర్తి చేసి హెల్త్ అసిస్టెంట్ శిక్షణ పొందినవారు హాజరయ్యారు. జాబు రాని ఇంటర్ విద్యార్థులు కోరు్ుట్న ఆశ్రయించడంతో 2006లో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ మేరకు సుమారు వెయ్యి మందిని హోల్డ్లో పెట్టి ఇంటర్ చదివిన వారిని విధుల్లోకి తీసుకున్నారు. తదనంతర పరిణామాలతో వారిని చేర్చుకోవడంతో ఉద్యోగుల సంఖ్య దాదాపు 3324కు చేరింది. నోటిషికేషన్ మేరకు 2324 మంది ఉద్యోగులు మాత్రమే ఉండాలని 2012లో కోర్టు తీర్పు ఇవ్వడంతో అదనంగా ఉన్న వెయ్యి మందిని తొలగించారు. వీరంతా ఆందోళన బాట పట్టడంతో అప్పటి ప్రభుత్వం మానవతా దృక్పథంతో విధుల్లోకి తీసుకుంది. ఆగమేఘాలపై తొలగింపు : మార్కులు తక్కువ వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారంటూ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోనే కొందరు హైకోర్టును ఆశ్రయించారు. డీ మెరిట్ ఉద్యోగులను తొలగించి వారికంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారికి న్యాయం చేయాలని గత నవంబర్ 29న తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిని సాకుగా చూపించి కోర్టు ఇచ్చిన 90 రోజుల గడువును పట్టించుకోకుండా తీర్పు వచ్చిన వారంలోపే ఆగమేఘాలపై డిసెంబరు 5, 6 తేదీల్లో ఉన్నతాధికారులు 920 మందిని తొలగించేశారని బాధిత ఉద్యోగులు చెబుతున్నారు. తెలంగాణలోని 280 మంది కాంట్రాక్టు ఉద్యోగులను అక్కడి ప్రభుత్వం నేటికీ కొనసాగిస్తుండటం గమనార్హం. రోడ్డున పడ్డ కుటుంబాలు రూ.3550 జీతానికి ఉద్యోగంలో చేరి ప్రస్తుతం రూ.30,200 జీతం అందుకుంటున్న 920 మంది కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్లు, వారి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీరిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవారు 70 మందికి పైగా ఉన్నారు. కోవిడ్ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేశామని, క్షేత్రస్థాయిలో వైద్యసేవలందించడంలో రెండు దశాబ్దాలకు పైగా కీలకంగా పనిచేస్తున్న తమ పట్ల ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిందని వాపోతున్నారు. కోర్టు తీర్పు అమలుచేశామని చెబుతున్న పాలకులు, అధికారులు కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. రేపోమాపో తమ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని ఎదురుచూస్తుంటే ఉన్న వాటిని తొలగించడం దారుణమంటున్నారు. ఉద్యోగాలు పోయిన బాధతో గుంటూరు, ఉత్తరాంధ్రలోని ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులు గుండెపోటుతో ప్రాణాలను కోల్పోయినట్టు తెలిపారు. 920 మందిని తొలగించిన కూటమి సర్కారు కాంట్రాక్టు ఉద్యోగులుగా రెండు దశాబ్దాలకు పైగా సేవలు వీరిలో పలువురు ఐదారేళ్లలో రిటైరయ్యేవారే.. ఉద్యోగాలు పోవడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబాలు నిర్దాక్షిణ్యంగా తొలగించారు హైకోర్టు ఆదేశాల మేరకు 90 రోజుల గడువు ఉన్నప్పటికీ వారం లోపే తొల గిస్తూ ఆదేశాలిచ్చారు. ఇదెక్కడి న్యాయమని అధికారులు, పాలకులను అడిగితే పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. ఉన్నత స్థాయి లోని కొందరు చేసిన తప్పులకు మా కాంట్రాక్టు ఉద్యోగులను బలిపశువులను చేశారు. – సయ్యద్ జఫ్రుల్లా, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నేత -
అద్దె భవనాల్లో అంగన్వాడీలు
భీమవరం(ప్రకాశం చౌక్): నాడు జగన్మోహన్రెడ్డి పాలనలో నాడు–నేడు పథకంలో పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాకు రూ.9.72 కోట్లు కేటాయించి 60 భవనాలను మంజూరు చేశారు. భవన నిర్మాణంతో పాటు ఫర్నీచర్, కిచెన్, హాలు, క్లాస్ రూమ్, టాయిలెట్ తదితర సౌకర్యాలు కల్పించారు. ఒక్కో భవనానికి రూ.16 లక్షలు వెచ్చించారు. గత ప్రభుత్వం కాలంలో దాదాపు 90 శాతం మేర భవనాలు ప్రారంభించగా.. ఆరు భవనాలను వేగంగా పూర్తి చేసి అంగన్వాడీ కేంద్రాలకు అప్పగించారు. మిగతా భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే వాటిని పూర్తిచేసి అంగన్ వాడీ కేంద్రాలకు అప్పగించడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. జిల్లాలో మొత్తం 1,562 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో 626 సెంటర్లను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. జగన్ ప్రభుత్వం 90 శాతం భవనాల నిర్మాణం చేపట్టింది. వాటిలో కొన్ని ప్రారంభించగా.. కొన్ని నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మిగతా భవనాల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా.. తమకు ఎందుకన్నట్లు ప్రభుత్వం వ్యహరిస్తోంది. ప్రభుత్వం వచ్చి 10 నెలలవుతున్నా భవనాల నిర్మాణం ఊసే ఎత్తడం లేదు. దాంతో అద్దె ఇళ్లలో అంగన్వాడీ కేంద్రాలు నడపాల్సి వస్తోంది. జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు విమర్శలు చేయడం తప్ప జగన్మోహన్రెడ్డి హయాంలో నిర్మించిన అంగన్వాడీ భవనాలను ప్రారంభించాలనే ఆలోచన లేదు. నాడు చంద్రబాబు 10 ఏళ్ల పాలనలో జిల్లాలో అక్కడడక్క అరకొర భవనాలు నిర్మిస్తే.. జగన్ తన 5 ఏళ్ల పాలనలో రెండేళ్లు కరోనా వల్ల ఇబ్బంది పడినా.. మూడేళ్లలో అంగన్వాడీ భవనాల నిర్మాణం మొదలుపెట్టారు. చంద్రబాబు పాలన వచ్చి 10 నెలలు అవుతున్నా అంగన్వాడీలకు కొత్త భవనాలు నిర్మించడం లేదు. పూర్తయిన భవనాలను ప్రారంభించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో 6 భవనాలు వినియోగంలోకి వచ్చాయి. 17 భవనాలు 95 శాతం పూర్తయ్యాయి. 13 భవనాలకు శ్లాబ్ పూర్తి చేశారు. మరో 5 భవనాలు 100 శాతం పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. నిర్మాణం పూర్తయినవి ప్రారంభించడం లేదు. వివిధ దశల్లో ఉన్న వాటి నిర్మాణం పూర్తి చేయడం లేదు. గత ప్రభుత్వంలో అంగన్వాడీ భవనాల మంజూరు ఇలా..మండలం భవనాల నిర్మాణం ఆచంట 7 పెనుగొండ 1 పెనుమంట్ర 2 పోడూరు 9 భీమవరం 2 వీరవాసరం 2 మొగల్తూరు 10 నర్సాపురం 2 పాలకొల్లు 4 మండలం భవనాల నిర్మాణం యలమంచిలి 4 పెంటపాడు 3 తాడేపల్లిగూడెం 2 అత్తిలి 4 ఆకివీడు 1 కాళ్ల 1 పాలకోడేరు 2 గణపవరం 4 వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 60 భవనాల మంజూరు 6 భవనాలు ప్రారంభించగా.. 5 భవనాలు 100 శాతం పూర్తి వివిధ దశల్లో మిగతా భవనాలు వాటిని పూర్తి చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం -
నెత్తుటి ధారలు
హైవేపై రహదారులు రక్తసిక్తమవుతున్నాయి.. రోజు మార్చి రోజు ప్రమాదాలకు జిల్లాలోని జాతీయ రహదారులు కేంద్ర బిందువుగా మారుతున్నాయి.. పది రోజుల వ్యవధిలో ఆరుకుపైగా ప్రమాదాలు జరగ్గా, రెండు భారీ ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదాలు జరిగినప్పుడు అధికారుల నుంచి మంత్రుల వరకు మొక్కుబడిగా హడావుడి చేయడం తప్ప శాశ్వత చర్యలు చేపట్టడం లేదు. బ్లాక్ స్పాట్ల వద్ద జాగ్రత్తలు, సూచిక బోర్డుల ఏర్పాటు, రహదారి స్థితిగతులపై కనీస పర్యవేక్షణ వంటి ప్రాథమిక అంశాలపై కూడా దృష్టి సారించడం లేదు. బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025ప్రమాద ఘంటికలు ● రక్తసిక్తంగా జాతీయ రహదారులు ● పట్టించుకోని ఎన్హెచ్, ఆర్అండ్బీ అధికారులు ● పది రోజుల్లో ఆరుకు పైగా ప్రమాదాలు ● ఏడుగురు దుర్మరణం ● భద్రతా చర్యలు, ముందస్తు జాగ్రత్తలు శూన్యం సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రెండు కీలక జాతీయ రహదారులు ఉన్నాయి. ఎన్హెచ్–16, ఎన్హెచ్ 216 (ఎ) మీదుగా అత్యధిక రాకపోకలు జరుగుతుంటాయి. ఆయా రహదారుల్లో నెలకు సగటున 20 నుంచి 25 వరకు ప్రమాదాలు జరుగుతుండగా.. 10 మందికిపైనే మృత్యువాతపడుతున్నారు. ఎన్హెచ్–216 (ఎ)లో ద్విచక్రవాహనాల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎన్హెచ్–16 మీదుగా రోజుకు 25 వేల వరకు నాలుగు చక్రాలు, ఆపై వాహనాలు, 12 వేల వరకు ఆటోలు, ద్విచక్రవాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఎన్హెచ్–216 (ఎ) మీదుగా సగటున 15 వేలకుపైగా నాలుగు చక్రాలు, ఆపై వాహనాలు, 10 వేలకు పైగా ఆటోలు, ద్విచక్రవాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. 34 బ్లాక్ స్పాట్లు ఏలూరు జిల్లాలో తరుచూ ప్రమాదాలు జరిగే, అత్యంత సంక్లిష్టంగా ఉండే 34 ప్రాంతాలను గుర్తించి బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు. ఇలా గుర్తించిన ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగు స్థలం నెమ్మదిగా వెళ్లాలని సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలి. అలాగే వాహనాల వేగాన్ని తగ్గించడానికి రంబల్ స్టిప్స్ ఏర్పాటు చేయడం, రేడియం స్టిక్కర్లు, హైవే, పోలీస్ పెట్రోలింగ్ లాంటివి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. అయితే జిల్లాలో ఒక్క చోట కూడా మచ్చుకై నా అలాంటి పరిస్థితి లేదు. టోల్ వసూళ్లకే పరిమితమవుతూ.. జాతీయ రహదారిపై గతంలో టోల్ వసూలు చేసే కంపెనీలే కొంతమేర రహదారి మరమ్మతులు నిర్వహించేవి. అయితే ఇటీవల కాలంలో టోల్ప్లాజాలు కేవలం టోలు వసూలు మినహా మిగతా అంశాలతో సంబంధం లేనివిధంగా పనిచేస్తున్నాయి. గన్నవరం సమీపంలోని పిన్నమనేని సిద్థార్థ నుంచి కలపర్రు టోల్గేటు వరకు ఒక సంస్థ, పాత టోల్గేటు నుంచి గుండుగొలను వరకు మరో కంపెనీకి మరమ్మతులు, ఇతర రహదారుల నిర్వహణ బాధ్యతను నేషనల్ హైవే అథారిటీ కట్టపెట్టింది. అయినా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కరువయ్యింది. రహదారులపై పలుచోట్ల గోతులు, ప్రమాదకర మలుపు ఉండటం, అలాంటి చోట్ల కనీసం సూచిక బోర్డులు కూడా లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అతి వేగం.. ప్రమాదాలకు కారణం రాత్రిళ్లు, వేకువజామున ప్రైవేట్ ట్రావెల్స్, ఇతర వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నాయి. 60 నుంచి 80 కిలోమీటర్ల వరకు స్పీడ్ లిమిట్ కాగా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నాయి. పచ్చదనం కరువు డివైడర్లల్లో తప్పనిసరిగా మొక్కలు పెంచాలి. మొక్కలు దట్టంగా పెంచడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాల లైటింగ్ ఇబ్బందులు తగ్గడంతో పాటు వాహనాల నుంచి వెలువడే కార్బన్ డయాకై ్సడ్ను పీల్చుకుని ఆక్సిజన్ను ఇస్తాయని గన్నేరు, ఇతర మొక్కలు పెంచాల్సి ఉంది. కలపర్రు నుంచి గుండుగొలను వరకు ఎక్కడా పచ్చదనం కనిపించని పరిస్థితి. ప్రమాదాలు ఇక్కడే ఎక్కువగా.. దెందులూరు చెక్పోస్టు నుంచి ఆశ్రం, గుండుగొలను నుంచి సత్యనారాయణపురం, ఆశ్రం జంక్షన్, నోవా ఇంజనీరింగ్ కాలేజీ వద్ద బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. ప్రమాదాలు కూడా ఎక్కువగా ఇక్కడే జరుగుతున్నాయి. సమన్వయ లోపం నేషనల్ హైవే అథారిటీ, ఆర్అండ్బీ అధికారుల మధ్య సమన్వయ లోపం మరో ప్రధాన సమస్య. అలాగే వరుస ప్రమాదాలు జరుగుతున్నా పోలీస్ యంత్రాంగం సీరియస్గా స్పందించడం లేదు. కనీసం పోలీస్ శాఖపరంగా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా పరిస్థితి కొంత మెరుగవుతుంది. న్యూస్రీల్అన్ని చర్యలూ తీసుకుంటాం రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. వేగాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవడానికి వీలుగా నేషనల్ హైవే అథారిటీ అధికారులతో మాట్లాడుతున్నాం. బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తాం – షేక్ కరీమ్, ఉప రవాణా కమిషనర్, ఏలూరు ఎన్హెచ్ 16 హనుమాన్ జంక్షన్ నుంచి భీమడోలు మండలం వరకు.. రోజుకు సగటున 35,000పైగా వాహనాల రాకపోకలు ఎన్హెచ్ 216 (ఏ) గుండుగొలను జంక్షన్ నుంచి సిద్ధాంతం వరకు.. రోజుకు సగటున 25,000పైగా వాహనాల రాకపోకలు -
‘ఎన్ఎల్ఆర్–3238’తో మంచి దిగుబడులు
ఆకివీడు: కొత్త వరి వంగడం ఎన్ఎల్ఆర్ 3238 వంగడం దాళ్వాలో అద్భుత ఫలితాల్ని ఇవ్వనుందని జిల్లా వ్యవసాయాధికారి జెడ్.వెంకటేశ్వర్లు చెప్పారు. మండలంలోని కుప్పనపూడిలో రైతు నంద్యాల చల్లారావు పొలంలో వరిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి ఒక మినీ కిట్ చొప్పున నూతన వంగడాల్ని జిల్లా అంతటా పంపిణీ చేసినట్లు చెప్పారు. మధ్యస్థ సన్నాలుగా ఉన్న వీటిని తెలంగాణా సన్నాలను పోలి ఉంటాయన్నారు. గర్భిణులకు ఈ బియ్యం మంచివన్నా రు. 50 బస్తాలకు పైబడి దిగుబడి వస్తుందని చెప్పారు. ఇంతవరకూ సాగులో ఏ విధమైన తెగుళ్లు లేవని.. పల్లపు ప్రాంతాల్లో 45–50 బస్తాలు, మెట్ట ప్రాంతంలో 50–60 బస్తాల పైగా దిగుబడులు వస్తాయని అంచనా వేస్తున్నామని చెప్పారు. ప్రస్తుత దాళ్వా సాగు ఆశాజనకంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఏడీఏ కె.శ్రీనివాసరావు, ఏఓ ఎమ్మార్పీ ప్రియాంక, రైతు నంద్యాల చల్లారావు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓగా గీతాబాయి బాధ్యతల స్వీకరణ భీమవరం(ప్రకాశంచౌక్): డీఎంహెచ్ఓగా డాక్టర్ జి.గీతాబాయి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇంతవర కూ డీఎంహెచ్ఓగా పనిచేసిన డాక్టర్ డి.మహేశ్వరరావు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవడంతో ఈ ఖాళీ ఏర్పడింది. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ భానునాయక్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం రెగ్యులర్ డీఎంహెచ్ఘోగా గీతాబాయికి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో అట్టడుగు వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. వర్గీకరణను నిరసిస్తూ ఆందోళన భీమవరం: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం భీమవరం అంబేడ్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాల సంఘాల నాయకులు కోనా జోసెఫ్, చీకటిమిల్లి మంగరాజు, గంటా సుందర్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. వర్గీకరణ వల్ల మాల, మాదిగల్లో విభేదాలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మీసాల జైరాజ్, కేసీ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈనెల 20న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. ఽకార్యక్రమంలో జేఏసీ నాయకులు ఈది రవికుమార్, బేతాల కమలాకర్, గాతల సందీప్, గొల్ల రాజ్ కుమార్, అంబటి ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాల్యుయేషన్లో మినహాయింపునివ్వాలి భీమవరం: పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీల విషయంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు, గర్భిణులు, బాలింతలు, 60 ఏళ్ల వయస్సు పైబడిన ఉపాధ్యాయులకు డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ నాయకులు జిల్లా విద్యాశాఖాధికారిని కోరారు. మంగళవారం డీఈవో నారాయణను కలిసి వినతిపత్రం అందచేశారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కొందరికి వాల్యుయేషన్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. -
క్షీరారామలింగేశ్వర స్వామి సన్నిధిలో...
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీక్షీరారామలింగేశ్వరస్వామిని తెలంగాణ రాష్ట్ర యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధానార్చకులు నల్లంతిఘల్ లక్ష్మీనరసింహాచార్యులు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. మంగళవారం ఆలయానికి విచ్చేసిన లక్ష్మీనరసింహాచార్యులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. క్షీరారామలింగేశ్వరస్వామి, జనార్దనస్వామి, లక్ష్మీపార్వతి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. ఆలయ సూపరింటెండెంట్ వాసు స్వామివారి చిత్రపటాన్ని, శేషవస్త్రాన్ని అందజేశారు. లక్ష్మీనరసింహాచార్యులు మాట్లాడుతూ పెనుగొండ మండలం కొఠాలపర్రులో రామాలయం ప్రతిష్టాపన కార్యక్రమానికి వచ్చానని, క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. స్థానిక ధర్మపరిరక్షణ సమితి సభ్యులు బాకూరి సత్యనిరంజన్, కొమ్మారెడ్డి హిమదత్, జక్కంపూడి కుమార్, తులా రామలింగేశ్వరరావు, శీరం ఆనందకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జేసీ – శాట్లో గాయత్రికి ఆల్ ఇండియా రెండో ర్యాంక్ ఏలూరు(ఆర్ఆర్పేట): నగరంలోని రామచంద్రరావుపేట శ్రీ శర్వాణీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని ముత్యాల గాయత్రి గత సెప్టెంబర్లో జూనియర్ చాంబర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జేసీ– శాట్ లెవల్–2 ఆల్ ఇండియా పోటీ పరీక్షల్లో పాల్గొని జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో గాయత్రిని పలువురు అభినందించారు. గాయత్రి ఇటువంటి అద్భుత విజయాలు మరిన్ని సాధించాలని ప్రధానోపాధ్యాయిని సీహెచ్ సత్యశారద ఆకాంక్షించారు. జేసీ–ఐ జాతీయ ఉపాధ్యక్షుడు బీ. సిద్థార్థ, జోన్– 26 అధ్యక్షుడు ఎంఆర్టీ భరత్, జే. ఆదిత్య, ఏలూరు ఐపీపీ కేఎన్ రోహిత్, ఏలూరు జోన్ ఎస్ ప్రెసిడెంట్ అరవింద్ గాయత్రికి రూ.51 వేలు నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందించి అభినందించారు. పాఠశాల డైరెక్టర్ కే.మదనమోహనరాజు, ఉపాధ్యాయలు విద్యార్థినిని అభినందించారు. లైంగిక వేధింపులపై కేసు నమోదు ఆకివీడు: చెరుకుమిల్లి గ్రామ శివారు ఉప్పరగూడెం గ్రామానికి చెందిన మహిళపై లైంగిక వేధింపులకు యత్నించిన దోనాద్రి నరసన్నపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు మంగళవారం చెప్పారు. ఈ నెల 6వ తేదీన నిందితుడు ఇంటికి రమ్మని భార్యతో ఫోన్ చేయించాడని, తాను ఇంటికి వెళ్లిన సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడేందుకు యత్నించగా అదే సమయంలో తన భర్త ఇంటికి వచ్చి తన కోసం గట్టిగా కేక వేయగా నిందితుడు పరారయ్యాడని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడి
బుట్టాయగూడెం: గుర్తు తెలియని వ్యక్తులు వైఎస్సార్ సీపీ కార్యకర్తపై మారణాయుధాలతో దాడి చేసి పరారీ కావడం జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెంలో కలకలం రేపింది. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితుడిని తెల్లవారుజామున కుటుంబీకులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త గంథం బోసుబాబు సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతడి తలపై దాడి చేసి పరారయ్యారు. తెల్లవారుజామున కుమారుడు అనూప్శక్తి గమనించి విషయాన్ని తల్లి శాంతికుమారికి చెప్పడంతో ఆమె వెంటనే తన మరిది వీరాంజనేయులు, కడెల్లి చిన్ని అనే వారికి తెలియజేసింది. వెంటనే బంధువులు రక్తపు మడుగులో ఉన్న బోసుబాబును తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఖమ్మం ఆస్పత్రికి రిఫర్ చేయడంతో అక్కడికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐలు బి. వెంకటేశ్వరరావు, బాల సురేష్, ఎస్సైలు నవీన్ కుమార్, చంధ్రశేఖర్ దర్యాప్తు చేపట్టారు. బోసుబాబు ఇంటికి జాగిలాలను రప్పించి తనిఖీలు చేశారు. క్లూస్ టీమ్ కూడా వచ్చి వివరాలు సేకరించారు. కాగా అసలు ఏం జరిగిందనే దానిపై పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. దోషులను కఠినంగా శిక్షించాలి ఇటీవల జీలుగుమిల్లిలో జరిగిన జగదాంబ అమ్మవారి తిరుణాళ్లలో అవకతవకలపై ఒక పత్రికలో వచ్చిన వార్తను వాట్సాప్ గ్రూప్లో తన భర్త బోసుబాబు సెండ్ చేసినట్లు అతని భార్య శాంతకుమారి తెలిపారు. ఈ విషయమై జగదాంబ ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు ఫోన్ చేసి తన భర్తను నానా దుర్భాషలాడి ఎప్పటికై నా తన భర్తను నరికి చంపుతానని హెచ్చరించారని ఈ విషయం తన భర్త తనతో చెప్పినట్లు తెలిపారు. దీంతో ఈ విషయంపై నాలుగురోజుల క్రితం జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆమె చెప్పారు. ఈలోపే తన భర్తపై దాడి జరిగిందని దీనిపై విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రివూట ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిపై మారణాయుధాలతో దాడి దాడి చేసి పరారైన గుర్తు తెలియని వ్యక్తులు తాటాకులగూడెంలో కలకలం బాధితుడి భార్య ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు -
వేసవి దుక్కులతో లాభాలు
చింతలపూడి: జిల్లాలోని మెట్ట ప్రాంతంలో వ్యవసాయ భూముల్లో భూసారం దెబ్బతినడంతో దిగుబడులు తగ్గి పోవడం, చీడ పీడల ఉధృతి పెరగడం వంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. రైతులు సరైన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే నష్టాలు తగ్గించుకోవచ్చునని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. సబ్ డివిజన్లో ఖరీఫ్ సీజన్లో 15,792 హెక్టార్లలో వరి పంట సాగు చేస్తున్నారు. ఇందులో చింతలపూడి మండలంలో అత్యధికంగా 7,603 హెక్టార్లు, లింగపాలెం మండలంలో 3,072 హెక్టార్లు, కామవరపుకోట మండలంలో 2,457 హెక్టార్లు, టి.నరసాపురం మండలంలో 2,661 హెక్టార్లల్లో వరి సాగు చేపట్టారు. వేసవి దుక్కులతో చీడ పీడల నివారణ వేసవి దుక్కులు పంటలకు ఎంతో ప్రయోజనకరం. సాధారణంగా రైతులు కోతలు పూర్తవగానే పొలాలను అలాగే వదిలేస్తారు. తొలకరి పలకరించగానే సాగుకు సిద్ధమవుతారు. చినుకులు పడగానే దుక్కులు దున్నడం ప్రారంభిస్తారు. అలా కాకుండా వేసవిలోనే దుక్కులు దున్నడంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.నాగకుమార్ సూచిస్తున్నారు. వేసవిలో భూమిని దుక్కి దున్నకుండా వదిలేస్తే కలుపు మొక్కలు పెరుగుతాయి. అవి భూమిలోని నీటిని, పోషక పదార్థాల్ని గ్రహించి పెరుగుతాయి. కారణంగా భూమి లోపలి పొరల్లో నీరు హరించుకుపోతుంది. భూసారం తగ్గి పోతుంది. రైతు వేసిన పంటకు పోషకాలు లభించవు. వేసవి దుక్కుల వల్ల భూమి లోపలి పొరల్లో దాగివున్న కీటకాల గుడ్లు, శిలీంధ్రాలు బయటకు వచ్చి ఎండ తీవ్రతకు నశిస్తాయి. దుక్కిలో బయటపడిన పురుగులను పక్షులు తినడం వల్ల పంటలకు చీడ పీడల బెడద తప్పుతుంది. భూసారం పెంచడం ఎలా? భూసారాన్ని పెంచుకోవడానికి రైతులు కనీసం రెండు పంటలు వేసిన తరువాత పచ్చి రొట్ట సాగు చేయాలి. దీనివల్ల భూసారం పెరగడమేకాక చీడ పీడల బెడద తప్పి దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. సేంద్రియ పదార్థాలను నేలకు అందించడం, కలుపు మొక్కలు నివారించడం, నేలలో నివశించే జీవరాశులకు ఆహారంగా, మొక్కలకు కావల్సిన అన్ని పోషక పదార్థాలను అందించే సాధనాలుగా ఈ పచ్చిరొట్ట పంటలు ఉపయోగపడతాయి. నేల సారవంతం భూమిని 25 నుండి 30 సెంటీమీటర్ల లోతు వరకు దుక్కులు దున్నడం వల్ల నేలలో గాలి లభ్యత పెరిగి సూక్ష్మ జీవుల సాంద్రత పెరుగుతుంది. కర్బన పదార్థం లభ్యత పెరిగి నేల సారవంతమవుతుంది. భూమికి వాలుగా దుక్కి దున్నడంతో వర్షం కురిసినప్పుడు ఆ నీరు భూమి లోపలకు ఇంకుతుంది. భూమికి నీరు నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. వాతావరణంలోని నత్రజని వర్షపు నీటితో కలిసి నేలకు చేరడంతో సారవంతంగా మారుతుంది. బి నాగకుమార్ –ఏడీఏ–వ్యవసాయ సబ్డివిజన్ -
వేసవి తాపానికి ఉపశమనం
బుట్టాయగూడెం/పాలకోడేరు: భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. మార్చి మొదటివారం నుంచే ఒకపక్క తీవ్రమైన ఎండలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేసవి తాపాన్ని తట్టుకునేందుకు తాటి ముంజెలు, పుచ్చకాయలు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు సూచిస్తున్నారు. పుచ్చకాయ శరీరంలోని వేడిని తగ్గించడంతో పాటు చలువ చేస్తుంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో.. పుచ్చకాయల కొనుగోలుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మార్కెట్లో కిలో పుచ్చకాయ ధర రూ.20 నుంచి రూ.30 పలుకుతుంది. మన జిల్లాలో సుగర్ బేబీ, నాన్దారి, ఆర్క్మెన్ తదితర రకాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. పుచ్చకాయతో ప్రయోజనాలు పుచ్చకాయలు తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. పుచ్చలో విటమిన్ బి, పొటాషియం, ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం లభించి.. తక్షణ శక్తి నిస్తుంది. ఆల్క్లైన్తో పాటు పీచు పదార్థం ఉండడం వల్ల మూత్ర పిండాలకు ఎంతో ఉపయోగకరం. 100 గ్రాముల పుచ్చకాయలో 91.45 గ్రాముల నీరు, 6 శాతం చక్కెర , 30 క్యాలరీల శక్తి, 7.6 గ్రాముల పిండి పదార్ధాలు, 0.6 గ్రాముల మాంసకృత్తులు, 12 గ్రాముల పొటాషియం, 7 గ్రాముల కాల్షియం ఉంటాయి. వేసవి తాపం తగ్గించే ముంజెలు తాటి ముంజెలు ఎండాకాలంలో మాత్రమే లభిస్తుంటాయి. వేసవి తాపాన్ని తగ్గించడంతో పాటు ఆరోగ్య రక్షణలో ఎంతో ఉపయోగపడతాయి. ఎండలు తీవ్రంగా ఉండటంతో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో, రోడ్ల వెంట తాటి ముంజలు ఏజెన్సీ ప్రాంతంలో విక్రయిస్తూ అనేక మంది వ్యాపారులు కనిపిస్తున్నారు. మార్కెట్లో ముంజెల వ్యాపారం చేసే వ్యాపారులకు మార్చి, ఏప్రిల్, మే నెలలో అధికంగా ఆదాయం వస్తుంది. తాటి ముంజలు 12 ముంజెలు రూ.40కు విక్రయిస్తుండగా మరి కొందరు 18 ముంజులు రూ.50 విక్రయిస్తున్నారు. గిరిజన ప్రాంతంలో సుమారు 75 కుటుంబాలకు పైగా ముంజెలు, తాటి ఆకుల విక్రయాలతో వేసవి కాలంలో జీవనం సాగిస్తున్నారు. తాటి ముంజెలతో ఉపయోగాలు ● ఎన్ని నీళ్లు తాగినా అలసిపోయివారు.. తాటి ముంజెలు తినడం వల్ల చలాకీగా ఉంటారు. ● తాటి ముంజెల్లో ఏ, బీ, సీ విటమిన్లతో పాటు జింక్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ● వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వ్యక్తుల బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి. ● శరీరంలో శక్తిని పెంచి అలసటను దూరం చేస్తుంది. పుచ్చకాయలు, ముంజెలకు వేసవిలో డిమాండ్ జోరందుకుంటున్న అమ్మకాలు ముంజెలతో వేసవిలో మంచి ఆరోగ్యం వేసవి కాలంలో ప్రకృతి సిద్దంగా లభించే తాటి ముంజెలు తినడం మంచిది. ఈ ముంజల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఎండలో తిరిగేవారు డీహైడ్రేషన్కు గురి కాకుండా తాటి ముంజలు ఎంతగానో పనిచేస్తాయి. డాక్టర్ సుధీర్, వైద్యుడు, బుట్టాయగూడెం సీహెచ్సీ వేసవిలో ఎంతో ప్రయోజనకరం పుచ్చకాయ వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మంచిది. వయసుతో సంబంధం లేకుండా అందరూ దీనిని తినవచ్చు. వేసవి తాపం నుంచి రక్షణ పొందవచ్చు. చినమిల్లి రంగమనాయుడు, పీహెచ్సీ వైద్యాధికారి, పాలకోడేరు -
ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదంపై హర్షం
ఏలూరు (టూటౌన్): ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రి వర్గం ఆమోదించడంపై ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు కందుల రమేష్ హర్షం వ్యక్తం చేశారు. స్థానిక కండ్రిగగూడెంలోని సంఘ కార్యాలయం వద్ద మంగళవారం ఆయన మాట్లాడారు. దళితుల్లో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఎస్సీ రిజర్వేషన్ అమలు కోసం రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయమని అన్నారు. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు మాదిగ రాష్ట్ర నాయకులు కాశీ కృష్ణ, ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి మురళి, ప్రధాన కార్యదర్శి తాళ్లూరి నాగేంద్రబాబు, ఎంఎస్పీ ఏలూరు అధ్యక్షుడు గద్దల ప్రసాద్, ఏలూరు వర్కింగ్ అధ్యక్షుడు గూడూరు రాజేష్ బాబు తదితరులు హర్షం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు. దళిత సేన హర్షం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదికను రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడంపై దళిత సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జిజ్జువరపు రవిప్రకాష్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. దీని వల్ల ఎస్సీల్లోని అన్ని ఉప కులాలకు మేలు జరిగేలా సమాన అవకాశాలు ఏర్పడతాయని ఆకాంక్షించారు. -
వర్గీకరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం
పాలకొల్లు సెంట్రల్: ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న బిల్లును వ్యతిరేకిస్తున్నామని వెంటనే బిల్లును ఆపాలని మాల మాహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ అన్నారు. సోమవారం పట్టణంలోని జిల్లా అధ్యక్షుడు గుండె నగేష్ బాబు అధ్యక్షతన జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ముందుగా కులగనణ జరిపి తరువాత జనాభా ప్రాతిపదికన దామాషా పద్ధాతిలో అన్ని కులాలను వర్గీకరణ చేయాలన్నారు. కేవలం మాల మాదిగల మధ్య చిచ్చుపెట్టి ఈ రెండు కులాలు కొట్టుకునేలా వర్గీకరణను తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. ఎప్పటికై నా మంద కృష్ణ మాదిగ వర్గీకరణ అనే అంశాన్ని పక్కనపెట్టి రాజ్యాధికారం కోసం పోరాడితే మాలలు అందరూ కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నారని గ్రహించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి విప్పర్తి ప్రభాకర్, నల్లి సంజీవరావు, నల్లి జయరాజు, పాలపర్తి కృపానాథ్, గాది రవి, బద్ద అంతర్వేది, మట్టా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
సినీ నటుడు నితిన్ సందడి
జంగారెడ్డిగూడెం/బుట్టాయగూడెం: సినీ హీరో నితిన్ గుర్వాయిగూడెం మద్ది క్షేత్రాన్ని దర్శించుకున్నారు. హీరో నితిన్తో పాటు, మైత్రీ మూవీస్ అధినేత రవిశంకర్, దర్శకుడు వెంకి కుడుముల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. తొలుత వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ముఖమండపం వద్ద అర్చకులు వేద ఆశీర్వాదం అందజేసి స్వామి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందించారు. అనంతరం బుట్టయగూడెం మండలంలోని గుబ్బల మంగమ్మ ఆలయాన్ని కూడా హీరో నితిన్ దర్శించుకున్నారు. -
దొంగ నోట్ల చెలామణి?
మధ్యవర్తిత్వంతో కేసుల సత్వర పరిష్కారం వేలేరుపాడు: వేలేరుపాడు మండలంలో రూ.500 నకిలీ నోట్లు చెలామణి అవుతున్నట్లు తెలిసింది. సోమవారం వేలేరుపాడు వైన్షాపు వద్దకు ఓ వృద్ధురాలు మద్యం కొనుగోలుకు 2,500 తీసుకెళ్లగా, వైన్ షాపు సిబ్బంది అవి నకిలీ నోట్లుగా గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, సారపాక కేంద్రాలుగా ఈ దొంగనోట్ల వ్యాపారాన్ని వేలేరుపాడు మండలంలో కొంతమంది వ్యక్తులు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. శివకాశీపురానికి చెందిన ఓ వ్యక్తి బతుకుదెరువు కోసం భద్రాచలం ప్రాంతంలో ఓ పురుగుమందుల షాపులో గత కొన్నేళ్ళుగా గుమస్తాగా చేరాడు. దొంగనోట్ల ముఠాతో చేతులు కలిపిన సదరు గుమస్తా వేలేరుపాడు మండలం రేపాకగొమ్ముకు చెందిన తన బావమరిదికి దొంగనోట్లు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై నిఘా వర్గాలు విచారణ చేపడితే వాస్తవాలు వెలుగుచూస్తాయంటున్నారు. -
గిట్టుబాటు ధర ఇవ్వాలి
కోకోకు గిట్టుబాటు ధర కల్పించాలని కోకో రైతుల సంఘం డిమాండ్ చేసింది. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సంఘ సభ్యులు డైరెక్టర్కు అందజేశారు. 8లో uటిడ్కో ఇళ్ల కోసం.. భీమవరానికి చెందిన కుసుమంచి పద్మావతి, లక్కోజి సుధ పేదలు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వారికి కేవలం రూ.500తో టిడ్కో ఇళ్లు కేటాయిస్తూ పట్టాలు కూడా ఇచ్చారు. అయితే అధికారులు ఇప్పటివరకు టిడ్కో ఫ్లాట్లు కేటాయించలేదు. దీంతో కూలీ పనులపై జీవించే తాము ఇంటి అద్దె, కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, టిడ్కో ఇళ్లు ఇస్తే సొంతింటి కల నెరవేరుతుందని, అద్దె భారం తగ్గుతుందని కలెక్టర్ను కలిసి వారు మొరపెట్టుకున్నారు. సబ్ రిజిస్ట్రార్పై ఫిర్యాదు మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన వీరభద్రరావు అవినీతికి పాల్పడటంతో ప్రభుత్వం బదిలీ చేసింది. ఉన్నతాధికారుల విచారణలో కూడా సబ్ రిజిస్ట్రార్ తప్పు చేశారని రుజు వైనా సస్పెండ్ చేయడం లేదని, వీరభద్రరావు మరలా మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్గా రావాలని ప్రయత్నం చేస్తున్నారని బీసీ సేవా సంఘ జిల్లా అధ్యక్షుడు కముజు నాగ వెంకట ప్రసాద్, జిల్లా కో–ఆర్డినేటర్ వేలూరి రంగబాబు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వీరభద్రరావును సస్పెండ్ చేయాలని కోరారు. -
పరిష్కార వేదిక.. సమస్యలు తీర్చలేక !
భీమవరం/ భీమవరం(ప్రకాశం చౌక్): సమస్యల పరిష్కారం కోసం భీమవరం కలెక్టరేట్లో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వస్తున్న బాధితులకు పూర్తిస్థాయిలో పరిష్కారం కానరావడం లేదు. దీంతో అర్జీదారులు మరలా మరలా అవే దరఖాస్తులు అందిస్తున్నారు. ముఖ్యంగా కొత్త పింఛన్ల మంజూరు, ఇళ్ల స్థలాలు, పింఛన్ పెంపు ఆన్లైన్ కోసం ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. దీంతో ఆయా సమస్యలు పరిష్కారం కావడం లేదు. పలు గ్రామాల్లో సర్వే సక్రమంగా చేయకపోవడం, కూటమి నాయకుల పెత్తనంతో సరిహద్దు సమస్యలు తీర్చలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో గతేడాది జూన్ నుంచి ఇప్పటివరకూ 19,659 వినతులు రాగా 17,442 అర్జీలు పరిష్కరించారు. 2,217 అర్జీలు పెండింగ్లో ఉన్నాయి. కలెక్టరేట్ వద్ద పాట్లు : భీమవరంలో కలెక్టరేట్కు వచ్చి అర్జీలు ఇచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారికి కలెక్టరేట్ 2 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. అలాగే కలెక్టరేట్కు పెద్ద సంఖ్యలో వస్తున్న బాధితులు కూర్చోవడానికి తగి న స్థలం, కుర్చీలు లేకపోవడంతో మెట్లపై, కింద కూర్చుంటున్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. సోమ వా రం కలెక్టరేట్కు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివ చ్చారు. 271 మంది వినతిపత్రాలు సమర్పించారు. ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపి కలెక్టర్కు వినతులు సమర్పించారు. అర్జీలకు పూర్తిస్థాయిలో లభించని పరిష్కారం మరలా మరలా దరఖాస్తుల సమర్పణ వెల్లువెత్తుతున్న వినతులు -
సాయం చేసేవారు లేక..
ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లే రోగుల బాధలు అన్నీ ఇన్నీ కావు. నడవలేని రోగులను సహాయకులు వీల్చైర్పై స్కానింగ్కు, రక్తపరీక్షకు, ఎక్స్రేకు, ఫిజియోథెరపీకి తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది ఎవరూ స్పందించరు. బోలెడన్ని పనులున్నాయ్ మీరే తీసుకువెళ్లాలంటూ చిరాకుగా సమాధానాలు చెబుతారు. చేసేదేం లేక తామే తీసుకువెళ్తున్నామని రోగుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆసుపత్రిలో పురుష, సీ్త్ర సహాయకులుగా సుమారు 35 మంది ఉండేవారని ఇప్పుడు కేవలం 12 మందికే పరిమితమయ్యారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. సోమవారం ఏలూరు జీజీహెచ్లో కనిపించిన దృశ్యాలివి. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
బెదిరించి.. లైంగిక దాడికి పాల్పడి..
ఏలూరు (టూటౌన్): తనను బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడంతో పాటు తనను నగ్నంగా వీడియోలు తీసిన ఇద్దరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ ఓ వివాహిత కుటుంబ సభ్యులతో కలిసి ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్కు సోమవారం వినతిపత్రం అందజేసింది. పోలీసులను ఆశ్రయించినా కనీసం పట్టించుకోవడం లేదని, పైగా రాజీకి రావాలని, లేదంటే కౌంటర్ కేసు పెడతామని పోలీసులే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తనకు, తన కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలంటూ ఐజీని కలిసినట్టు చెప్పింది. బాధితురాలు, ఆమె బంధువులు స్థానిక ఏటిగట్టు వద్ద ఉన్న జిల్లా రజక సంఘం కార్యాలయంలో సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారం గ్రామానికి చెందిన ఓ వివాహితపై అదే ప్రాంతానికి చెందిన యర్రంశెట్టి రవి, అతని స్నేహితుడు గుబ్బల సోమేశ్వరరావు అలియాస్ సోము అనుచితంగా ప్రవర్తించారు. ఆమెను బలవంతంగా లోబర్చుకోవాలని ప్రయత్నించారు. మాట వినకపోతే ఆమె భర్తను, కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. ఈ క్రమంలో వివాహితను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆమెకు మత్తు మందు ఇచ్చి నగ్నంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారు. ఈ క్రమంలో బీచ్కు, భీమవరంలోని స్నేహితుల గదికి తీసుకువెళ్లి పలుమార్లు లైంగిక దాడికి తెగబడ్డారు. అలాగే ఆమెను బెదిరించి పలు దఫాలుగా ఆమె నుంచి రూ.2.50 లక్షలు తీసుకుని మళ్లీ డబ్బులు కావాలంటూ వేధిస్తున్నారు. రాజీ చేసుకోవాలని పోలీసుల ఒత్తిడి తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు ఉండి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోకపోగా నిందితుల పక్షాన కొమ్ము కాశారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కేసును వెనక్కి తీసుకోకపోతే తన భర్తపై, భర్త సోదరునిపై కౌంటర్ రేప్ కేసు పెడతామని, రాజీ చేసుకోవాలని పోలీసులే బెదిరిస్తున్నారని ఆమె వాపోయింది. ఈ విషయంపై పలుమార్లు పోలీస్స్టేషన్కు వెళ్లినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు రాష్ట్ర రజక సంఘం ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్యతో కలిసి ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. దీనిపై ఐజీ అశోక్కుమార్ స్పందించారని, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని విచారణ అధికారిగా నియమించారని, తగిన న్యా యం చేస్తామని హామీ ఇచ్చారని కట్లయ్య తెలి పారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.మురళీకృష్ణ, యలమంచిలి శేషు, బుద్దవరపు గోపి, యండమూరి వీర్రాజు పాల్గొన్నారు. వివాహితపై ఇద్దరు వ్యక్తుల ఘాతుకం నగ్న వీడియోలు చూపుతూ బ్లాక్మెయిల్ బాధితురాలు ఫిర్యాదు చేసినా పట్టని పోలీసులు ఏలూరు రేంజ్ ఐజీని కలిసిన బాధితురాలు, కుటుంబసభ్యులు -
కోకోకు గిట్టుబాటు ధర ఇవ్వాలి
సాక్షి, అమరావతి: కోకో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోకో రైతుల సంఘం డిమాండ్ చేసింది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకు కంపెనీలు కొనుగోలు చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కోకో గింజల కొనుగోలు కంపెనీలు, కోకో రైతుల సంఘాల ప్రతినిధులతో సోమవారం గుంటూరులోని ఉద్యాన శాఖ కార్యాలయంలో జరిగిన సమీక్షలో కంపెనీల మాయాజాలం వలన తాము ఏవిధంగా నష్టపోతున్నామో పలువురు కోకో రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఏపీ కోకో రైతు సంఘం ప్రతినిధులు ఎస్.గోపాలకృష్ణ, బొల్లు రామకృష్ణ, కోనేరు సతీష్ బాబు, గుదిబండి వీరారెడ్డి తదితరులు మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లో కోకో గింజలకు కిలో రూ.700కు పైగా పలుకుతుండగా, రాష్ట్రంలో కంపెనీలు మాత్రం కిలో రూ.550–600కు మించి చెల్లించడం లేదన్నారు. గ్రేడింగ్ పేరిట అడ్డగోలుగా ధర తగ్గించడం వల్ల రైతులు నష్టపోతున్నారని చెప్పారు. వర్షాకాలపు పంట(అన్ సీజన్ ) కోకో గింజలను కంపెనీలు కొనుగోలు చేయడం లేదని, ఫలితంగా రైతులు వద్ద పెద్ద ఎత్తున నిల్వలు పేరుకుపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చి సీజన్, అన్ సీజన్ కోకో గింజలను తక్షణమే కొనుగోలు చేయాలన్నారు. కంపెనీలు తగిన ధర ఇవ్వకపోతే వ్యత్యాసపు ధరను రాష్ట్ర ప్రభుత్వం కోకో రైతులకు చెల్లించేలా చర్యలు తీసుకుని కోకో రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీంను కోకో రైతులకు కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. డైరెక్టర్ కే.శ్రీనివాసులు మాట్లాడుతూ కోకో రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేయాలి -
గళమెత్తిన వైద్య సేవ సిబ్బంది
భీమవరం(ప్రకాశం చౌక్): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేసే ఆరోగ్య మిత్రలు, సిబ్బంది సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సంఘ నాయకులు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం ట్రస్ట్ అధికారులతో చర్చలు జరిపినా ఫలితం లేదన్నారు. దీంతో శాంతియుత నిరసనల్లో భాగంగా విధుల బహిష్కరణ, జిల్లా సమన్వయకర్త ఆఫీసుల వద్ద నిరసనలు, ఈనెల 27న ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ మంగళగిరి వద్ద నిరసనలు చేపట్టనున్నామన్నారు. రోగుల పడిగాపులు : వైద్యసేవ సిబ్బంది విధుల బహిష్కరణతో జిల్లావ్యాప్తంగా 28 నెట్వర్క్ ఆస్పత్రులతో పాటు ప్రభుత్వాస్పత్రుల వద్ద ఆరోగ్యశ్రీ సేవలు అందక రోగులు ఇబ్బంది పడ్డారు. అత్యవసర వైద్యం కోసం రూ.300 నుంచి రూ.500 వెచ్చించి ఓపీ కార్డు తీసుకుని వైద్యుడిని కలిశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎన్నడూ ఆరోగ్యశ్రీ సేవలు ఆగలేదని, కూటమి ప్రభుత్వ తీరుతో ఇబ్బంది పడుతున్నామని పలువురు వాపోయారు. ఈనెల 24న కూడా ఎన్టీఆర్ వైద్యసేవ సిబ్బంది మరోమారు విధుల బహిష్కరిస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆ రోజూ రోగులకు ఇబ్బందులు తప్పేలా లేవు. -
కోణార్క్ ఎక్స్ప్రెస్లో మంటలు
దెందులూరు: భువనేశ్వర్ వెళుతున్న కోణార్క్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. దెందులూరు మండలంలోని సీతంపేట రైల్వే ట్రాక్ సమీపంలో సోమవారం ఈ ఘటన జరిగింది. రైలు ఇంజన్ నుంచి మూడో బోగీ చక్రాల వద్ద మంటలు వ్యాపించాయి. దీనిని గుర్తించిన రైలు సిబ్బంది వెంటనే రైలును నిలిపివేసి మంటలను ఆర్పేశారు. అనంతరం రైలు యథావిధిగా ముందుకు సాగిపోయింది. ఈ ఘటనపై రైల్వే ఎస్సై సైమన్ మాట్లాడుతూ వేసవిలో ఇలా జరగటం సర్వసాధారణమని చెప్పారు. అధిక ఎండల వల్ల బ్రేక్ షూస్లో స్వల్ప మరమ్మతులు వచ్చే అవకాశముందని తెలిపారు. స్మార్ట్ గ్రిడ్తో నాణ్యమైన విద్యుత్ తాడేపల్లిగూడెం: స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ ద్వారా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, నష్టాలను కొంతవరకు తగ్గించవచ్చని వరంగల్ నిట్ ఆచార్యులు డాక్టర్ డి.శ్రీనివాసరావు అన్నారు. ఏపీ నిట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం సహకారంతో పవర్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్ ఇన్ స్మార్ట్గ్రిడ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనే అంశంపై ఐదు రోజుల పాటు జరుగనున్న ఫ్యాకల్టీ డెవలప్మెంటు ప్రోగ్రాం సోమవారం ప్రారంభమైంది. ముఖ్యఅతిధి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ విద్యుత్ పంపిణీ వ్యవస్థను మెరుగుపరుస్తుందన్నారు. పవర్ ఎలక్ట్రానిక్స్లో ఉండే వివిధ రకాల స్విచ్లు, వాటి ఉపయోగాల గురించి వివరించారు. ఏపి నిట్ డీన్ అకడమిక్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతులు పాల్గొన్నారు. కారు ఢీకొని ముగ్గురికి గాయాలు భీమవరం: భీమవరంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారని టూటౌన్ ఎస్సై రెహమాన్ చెప్పారు. పట్టణంలోని 32వ వార్డుకు చెందిన ఎం.బేబిపవన్, భార్య లక్ష్మి, మరో వ్యక్తి మోటారు సైకిల్పై పెదఅమిరం వెళుతుండగా అడ్డవంతెన వద్ద వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రెహమాన్ చెప్పారు. బాలిక ఆదృశ్యం. టూటౌన్ పరిధిలోని రాయలం పంచాయతీ ఉప్పుగుంటకు చెందిన బాలిక ఆదివారం తెల్లవారుజామున అదృశ్యమైనట్లు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రెహమాన్ చెప్పారు. ముగిసిన నాటిక పోటీలు పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు కళాపరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న నాటిక పోటీలు సోమవారం ముగిశాయి. చివరి రోజు చిగురు మేఘం, పక్కింటి మొగుడు, అనూహ్యం నాటికలు ఆకట్టుకున్నాయి. కళాపరిషత్ సభ్యులు కెవీ కృష్ణవర్మ, మానాపురం సత్యనారాయణ, మేడికొండ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.75 కోట్లు ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో సోమవారం అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగింది. ఈ లెక్కింపులో చినవెంకన్నకు విశేష ఆదాయం సమకూరింది. గడచిన 18 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ.1,75,65,133 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి తెలిపారు. భక్తులు కానుకల రూపేణా సమర్పించిన 137 గ్రాముల బంగారం, 3.130 కేజీల వెండితో పాటు అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2000, రూ.1000, రూ.500 నోట్ల రూపంలో రూ.17,500 లభించినట్టు చెప్పారు. ఈ లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సబ్ డీఎఫ్ఓపై చర్యలు తీసుకోవాలి
జంగారెడ్డిగూడెం: తన భర్తను తీవ్రంగా కొట్టి గాయపర్చిన కన్నాపురం రేంజ్ సబ్ డీఎఫ్ఓపై చర్యలు తీసుకోవాలని మడకం అనిత కోరింది. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనిత మాట్లాడుతూ ఈ నెల 10న తన భర్తను మాట్లాడాలని చెబుతూ అటవీశాఖాధికారులు ఫోన్ చేశారని, కన్నాపురం కార్యాలయానికి వెళ్లిన తన భర్తను తీవ్రంగా కొట్టి గాయపర్చారన్నారు. విషయం తెలుసుకున్న తాము అటవీశాఖ కార్యాలయానికి వెళ్లగా, వైద్యం తామే చేయిస్తామని, విషయం పెద్దది చేయవద్దని, చేస్తే కేసులు పెడతామని బెదిరించారని అనిత తెలిపింది. సబ్ డీఎఫ్వో, అతనికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, కులంతో దూషించిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని అనిత కోరింది. కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ మొడియం శ్రీనివాసరావు, జువ్వల బాబ్జి తదితరులు పాల్గొన్నారు. -
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
భీమవరం: పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘ కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్, తహసీల్దార్కు వినతిపత్రాలు అందజేశారు. సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గాతల జేమ్స్, సాగిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ తక్షణం ఏర్పాటుచేసి ఐఆర్ ప్రకటించాలని, డీఆర్, పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని, ఈహెచ్ఎస్ కార్డులపై వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోశాధికారి బీవీ రవిప్రసాద్, భీమవరం యూనిట్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్ఎస్ఎస్ పాల్, పి.సీతారామరాజు పాల్గొన్నారు. అర్జీలకు గడువులోపు పరిష్కారం చూపాలి భీమవరం: ప్రజాసమస్యల పరిష్కార వేదికకు (పీజీఆర్ఎస్) వచ్చే అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కా ర్యాలయంలో పీజీఆర్ఎస్లో భాగంగా బాధితుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. మొత్తం 11 అర్జీలు రాగా ఆయా సమస్యల పరిష్కారానికి ఫోన్లో అధికారులకు ఆదేశాలిచ్చారు. ఏఎస్పీ వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి.పుల్లారావు, జిల్లా మహిళా పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ అహ్మద్ ఉన్నీషా పాల్గొన్నారు. చేనేత కార్మికుల నిరసన భీమవరం: చేనేత కార్మికులకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతూ భీమవరం కలెక్టరేట్ వద్ద సోమవారం చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. చేతివృత్తుల సంఘం జిల్లా నాయకుడు ఎం.సీతారాంప్రసాద్ మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం బడ్జెట్లో రూ.200 కోట్లు కేటా యిస్తే కూటమి ప్రభుత్వం రూ.135 కోట్లు మాత్రమే కేటాయించడం అన్యాయమన్నారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, చేనేత వస్త్రాలపై జీఎస్టీ తొలగింపు హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. వాట్సాప్ ద్వారా పౌర సేవలు భీమవరం (ప్రకాశంచౌక్): మనమిత్ర వాట్సాప్ పౌర సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మనమిత్ర–ప్రజల చేతిలో ప్రభుత్వం సమాచారం వాల్పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. అలాగే జిల్లా క్రైసిస్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించారు. ఇన్చార్జి దేవదాయ శాఖ అధికారిగా సూర్యప్రకాష్ భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లా ఇన్చార్జ్ దేవదాయశాఖ అధికారిగా వి.హరి సూర్య ప్రకాష్ సోమవారం భీమవరం జిల్లా దేవదాయశాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీక రించారు. నిడదవోలు కోటసత్తెమ్మవారి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వాహక అధికారిగా పనిచేస్తున్న ఆయన్ను ఇన్చార్జి జిల్లా దేవదాయశాఖ అధికారిగా నియమించారు. డీఎంహెచ్ఓగా గీతాబాయి భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ)గా డాక్టర్ జి.గీతాబాయిను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ డీఎంహెచ్ఓగా పనిచేసిన మహేశ్వరరావు రెండు నెలల క్రితం పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో సీ ఎంఓహెచ్గా పనిచేస్తున్న గీతాబాయిని డీఎంహెచ్ఓగా నియమించారు. తెలుగును ఐచ్ఛికం చేయొద్దు ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్మీడియెట్ విద్యలో సంస్కరణల్లో భాగంగా ద్వితీయ భాష తెలుగును ఐచ్ఛిక సబ్జెక్టుగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ తెలుగు అధ్యాపకుల సంఘం నాయకులు ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె. యోహానుకు వినతిపత్రం సమర్పించారు. సోమవారం స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రారంభమైన ఇంటర్ మూల్యాంకనం సందర్భంగా వినతిపత్రా న్ని సమర్పించారు. తెలుగును ఐచ్ఛికం చే యడం వల్ల భాష మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీబీ రాజేష్ కుమార్, టి.ప్రేమ్కుమార్ పాల్గొన్నారు. -
ఇళ్ల సమస్యలపై నిరసన గళం
భీమవరం: జిల్లాలో ఇళ్లు, టిడ్కో ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పట్టాల సమస్యలను తక్షణం పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ప్రజా చైతన్య సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా సోమవారం భీమవరంలో కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలుతున్న ప్రముఖులు జిల్లాలోనే ఉన్నా పేదల ఇళ్ల సమస్యలను పట్టించుకునే నాథుడే లేకపోవడం బాధాకరమన్నారు. జిల్లాలో 20 వేలకు పైగా టిడ్కో ఇళ్లలో కనీస సౌకర్యాలు లేవని మండిపడ్డారు. ప్రజల డబ్బులతో కట్టించిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు స్వాధీనం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కల్లబొల్లి హామీలిచ్చి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన ప్రజా ప్రతినిధులు ఇప్పుడు ప్రజల్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ కాలనీలు ప్రతిపక్ష కాలనీలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికీ సమస్యల వలయంగా ప్రభుత్వ కాలనీలు ఉన్నాయని రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, మంచినీరు వంటి కనీస సౌకర్యాలు లేవన్నారు. కనీసం చెత్త బండి, రైస్ బండి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ చేపడతామన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లుకు అందజేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.బలరామ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతకాయల బాబురావు, కౌరు పెద్దిరాజు, కర్రా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా పది పరీక్షలు
భీమవరం: జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 128 కేంద్రాల్లో తెలుగు పరీక్షకు 22,692 మందికి 22,091 మంది హాజరు కాగా 97.35 శాతం హాజరు నమోదైంది. 46 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్, నాలుగు కేంద్రాలను జిల్లాస్థాయి పరిశీలకుడు, నాలుగు కేంద్రాలను ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్, డీఈఓ నాలుగు కేంద్రాలు, కలెక్టర్ ఒక కేంద్రంలో తనిఖీలు చేసినట్టు డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు. లోటుపాట్లు లేకుండా చూడాలి భీమవరంలోని ఎస్సీహెచ్బీఆర్ఎం స్కూల్ కేంద్రాన్ని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణలో లోటుపాట్లు లే కుండా చూసుకోవాలని ఆదేశించారు. విద్యార్థు లకు సమస్యలుంటే కంట్రోల్ రూమ్ 08816– 297200కు ఫోన్ చేయాలన్నారు. డీఈఓ ఈ.నారాయణ ఆమె వెంట ఉన్నారు. -
● పారిశుద్ధ్య చర్యలు
తణుకు అర్బన్: ‘రోడ్లపై తాండవిస్తున్న అపారిశుద్ధ్యం’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురించిన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. సజ్జాపురంలో డ్రెయినేజీల్లోంచి తీసిన పూడికను పదిరోజులైనా తొలగించడం లేదని, ఇంటి ముందు మురుగు గుట్టలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ ప్రచురితమైన కథనంపై స్పందించారు. ఉదయం మినీ జేసీబీ, ట్రాక్టర్ల సాయంతో మురుగు గుట్టలను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. సిల్ట్ తొలగింపు పాలకొల్లు సెంట్రల్: ‘ప్రమాదకరంగా ఏఎంసీ ప్రహరీ’ శీర్షికన ఈనెల 5న ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి సోమవారం అధికారులు స్పందించారు. శానిటరీ వర్కర్లు ఏఎంసీ ప్రహరీ గోడకు కర్రలు అడ్డుపెట్టుకుని ప్రమాదకర పరిస్థితుల్లో సిల్ట్ను తొలగించారు. మార్కెట్ యార్డు ప్రధాన రహదారిలో ఉన్న సిల్ట్ను తొలగిస్తున్నారు. కమిషనర్ బి.విజయసారథి పర్యవేక్షిస్తున్నారు. అ యితే మార్కెటింగ్ యార్డు అధికారులు మాత్రం ప్రహరీ తొలగింపునకు ప్రయత్నం చేయడం లేదు. -
పొట్టి శ్రీరాములు ఆదర్శనీయులు
భీమవరం (ప్రకాశం చౌక్) : అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం ఆదర్శనీయమని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. ఆదివారం బీసీ సంక్షేమ శాఖ, ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో జరిగిన పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాలకు ఆమె హాజరయ్యారు. పట్టణంలోని మావుళ్లమ్మ గుడి వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీజీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణకు పొట్టి శ్రీరాములు జీవితాంతం కృషిచేశారన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు ఆదర్శనీయులని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జి.గణపతిరావు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ రావి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
చెత్త కుప్పగా తణుకు పట్టణం
మాజీ మంత్రి కారుమూరి ధ్వజం ఏలూరు టౌన్: స్వ చ్ఛతపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో తణుకు పట్టణం చెత్త కుప్పగా మారిందని మాజీ మంత్రి కారు మూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆ యన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్ర భుత్వంలో చెత్త సేకరించే వ్యాన్లను మూలన పడేసి ట్రై సైకిళ్లు తీసుకువచ్చారని, ఫలితంగా చెత్త సేకరణ నామమాత్రంగా మిగిలిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో చెత్త కుప్పలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయని తెలిపారు. తణుకులో శ్లాటర్ హౌస్లను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పశువధకు పాల్పడుతున్నారని విమర్శించారు. వందలాది పశువులను వధిస్తుండటంతో వేలా ది లీటర్ల రక్తం భూమిలో ఇంకిపోతూ ఆ ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతూ, ప్రజలు వ్యా ధుల బారినపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్కు దీనిపై ప్రజలు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ పట్టించుకోలేదని చె ప్పారు. శ్లాటర్ హౌస్ పేరుతో కోట్లాది డబ్బు లు చేతులు మారుతున్నాయని, తణుకు ఎమ్మెల్యేకి పావలా ఎమ్మెల్యే అని ప్రజలు పేరుపెట్టా రని గుర్తుచేశారు. తణుకు నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోందని, కోడిపందేలు, పేకాట క్లబ్బులు, గంజాయి, క్రికెట్ బెట్టింగులు, అశ్లీల నృత్యాలతో ఎమ్మెల్యే అక్రమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్టుగా జోరుగా సాగుతోందని మాజీ మంత్రి కారుమూరి విమర్శించారు. -
హేలాపురి సంగీత వైభవం
ఏలూరు (ఆర్ఆర్పేట): హిందూ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక వైఎంహెచ్ఏ హాలులో గుడిపాటి లలిత సంగీత నిర్వహణలో హేలాపురి సంగీత వైభవం పేరిట నిర్వహించిన కార్యక్రమం వీనుల విందు చేసింది. నగరానికి చెందిన పలువురు గాయకులు సంగీత కృతులు ఆలపించి ఆకట్టుకున్నారు. సంగీత కచేరీ నిర్వహించిన కళాకారులకు వయోలిన్ ద్వారా వీరా శివప్రసాద్, మృదంగం ద్వారా సీహెచ్ లక్ష్మీ నారాయణన్, తబ లా ద్వారా సీహెచ్ కల్యాణ్, ఫ్లూట్ ద్వారా కుమార్ బాబు, కీబోర్డ్ ద్వారా వెంకటేశ్వరరావు వాద్య సహకారం అందించారు. వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు యర్రా సోమలింగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కేవీ సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాట్నాలమ్మా.. నమోనమః పెదవేగి: రాట్నాలకుంటలో రాట్నాలమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో అ ర్చకులు విశేష పూజలు చేసి అమ్మవారిని ప్రత్యేకంగా అలకరించారు. ఆలయానికి పలు రూపాల్లో రూ.1,13,141 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్.సతీష్ కుమార్ తెలిపారు. -
సబ్ చానల్స్తో ముంపు నివారణ
● చానల్స్ ఆధునికీకరణతో నీటిపారుదల సుగమం ● ప్రత్నామ్యాయ మార్గాలే మేలంటున్న రైతులు తాడేపల్లిగూడెం రూరల్: ఎర్రకాలువ ముంపు కారణంగా ఏటా వందలాది ఎకరాల పంట నీట మునుగుతుంది. గతేడాది ఎర్రకాలువ గట్టుకు గండ్లు పడి వరి నాట్లు నీట మునగడంతో పాటు ఇసుక మేటలు వేశాయి. దీనికి శాశ్వత పరిష్కారం కోట్లాది రూపాయల ఖర్చుతో కూడుకున్నది. అయితే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అదనపు నీటిని దారి మళ్లించడం వల్ల గట్లు సురక్షితంగా ఉంటాయని రైతులు అంటున్నారు. తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం నుంచి నందమూరు వరకు ఎర్రకాలువ ఆయకట్టు ఉంది. దీని పరిధిలో బంగారుగూడెం, వీరంపాలెం, పట్టెంపాలెం, అప్పారావుపేట, జగన్నాథపురం, మాధవరం, కొ త్తూరు, మారంపల్లి, నవాబుపాలెం, నందమూరు తదితర గ్రామాలు ఉన్నాయి. వర్షాకాలంలో ఎర్రకాలువ గట్టుకు గండ్లు పడి పంట నీట మునగడం పరిపాటిగా మారింది. పట్టెంపాలెం, అప్పారావుపేట, బాపన్నకోడు, మాధవరం తదితర ప్రాంతాల్లో సబ్ చానల్స్ ఉన్నాయి. ముంపు నివారణలో సబ్ చానల్స్ ఎంతగానో ఉపకరిస్తాయని, అయితే సబ్ చానల్స్ నిర్వహణకు నోచుకోకపోవడంతో ముంపు తీవ్రస్థాయిలో ఉంటుందని రైతులు చెబుతున్నారు. సబ్ చానల్స్ ద్వారా ఎర్రకాలువ వరద నీరు ఏలూరు ప్రధాన కాలువలో కలిసే అవకాశం ఉందని, దీంతో గట్లకు గండ్లు పడే అవకాశం తక్కువని అంటున్నారు. ఎర్రకాలువ గట్లను పటిష్టం చేయాల్సి వస్తే రాయితో నిర్మాణం చేయాలని, ఇది వందలాది కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని అంటున్నారు. రూ.10 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు బంగారుగూడెం నుంచి నందమూరు వరకు ఉన్న ఎర్రకాలువ గట్టుకు పడిన 27 గండ్లను తాత్కాలికంగా పూడ్చేందుకు రూ.10 కోట్లతో అంచనాలు తయారు చేసి పంపినట్టు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేయడం ద్వారా ముంపు నివారించే అవకాశం ఉంది. లేకుంటే ఖరీఫ్ సీజన్ లోనూ ఎర్రకాలువ ముంపు తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. సబ్ చానల్స్ను ఆధునికీకరించాలి ఎర్ర కాలువ వరద నీరు సబ్ చానల్స్ నుంచి మళ్లించడం వల్ల ముంపును నివారించవచ్చు. సబ్ చానల్స్ ఆధునికీకరణకు అధికారులు చర్యలు తీసుకోవాలి. లేకుంటే రానున్న వర్షాకాలంలోనూ ముంపు తప్పదు. – గొరసా ఆదినారాయణ, అప్పారావుపేట -
అమరజీవి త్యాగం అజరామరం
ఏలూరు టౌన్: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం బలిదానం చేసి పొట్టి శ్రీరాములు అమరజీవిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఉమ్మడి ప్రకాశం రీజనల్ కో–ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఏలూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ తెలుగు మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలనే తపనతో ఆనాడు పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలను సైతం పణంగా పెట్టారన్నారు. ప్రభుత్వాలు ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. పార్టీ ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్, బీసీ సెల్ అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, మాజీ డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్బాబు, సీనియర్ నాయకులు గంటా మోహన్రావు, యూత్ అధ్యక్షుడు సాయి ప్రదీప్, లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి, జిల్లా కార్యదర్శి జనార్దన్, రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీ గాజుల బాజీ, ఆర్టీఏ విభాగం అధ్యక్షుడు మద్దాల ఫణి, డాక్టర్ వింగ్ అధ్యక్షుడు కొవ్వాడ దుర్గారావు, యువజన నాయకులు బండ్లమూడి సునీల్కుమార్, శంకర్, రమేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు -
ఆరోగ్యశ్రీ సేవలు దూరం
భీమవరం(ప్రకాశం చౌక్): డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ)లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ కూటమి ప్రభుత్వానికి పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. నామమాత్రంగా జరిగిన అధికారులతో చర్చలు విఫలం కావడంతో సోమవారం, ఈనెల 24న (రెండు సోమవారాలు) విధులు బహిష్కరించాలని, జిల్లా ఆరోగ్యశ్రీ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఉద్యోగుల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయా రోజుల్లో పేదలకు ఆరోగ్యశ్రీ సేవలు దూరం కానున్నాయి. కీలకంగా ఉద్యోగులు పేద, మధ్యతరగతి వర్గాల ఆరోగ్య పరిరక్షణలో ఆరోగ్యశ్రీ సేవలు కీలకం. వేలాది మంది ప్రాణాలు నిలపడంలో ఆరోగ్యశ్రీ ఉద్యోగుల పాత్ర ప్రశంసనీయం. ఆరోగ్యశ్రీ కార్డు కలిగి నెట్వర్క్, ప్రభుత్వాస్పత్రులకు వచ్చిన రోగులకు వెంటనే ఓపీ కార్డు రిజిస్ట్రేషన్ చేసి వైద్యుడి వద్దకు పంపుతారు. అలాగే ఆపరేషన్ అవసరమైతే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అనుమతి వచ్చేలా చూడటం, రోగులకు భోజన సౌకర్యం నుంచి వారిని తిరిగి ఇంటికి క్షేమంగా పంపించే వరకూ సాయం ఉంటారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆసరా సాయం కింద వైద్యం పొందిన రోగులకు ఆర్థిక సాయం కూడా అందేది. ఉద్యోగాలు ఉంటాయా.. ఊడతాయా.. ఆరోగ్యశ్రీ సేవలను నిర్వీర్యం చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పథకంలో మార్పులు చేసి బీమా కంపెనీకి అప్పగించాలని చూస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. బీమా కంపెనీకి అప్పగిస్తే తమ ఉద్యోగాలు ఉంటాయో.. ఊడతాయోనని ఆందోళన చెందుతున్నారు. 17 ఏళ్లుగా సేవలందిస్తున్న తమను తొలగిస్తారా అంటూ ఆవేదన చెందుతున్నారు. ఎప్పటికై నా తమ సర్వీసులను క్రమబద్ధీకరిస్తారని భావిస్తున్న తరుణంలో ఉద్యోగాలను తీసేవేసేలా కుట్రలు చేస్తున్నారని అంటున్నారు. పథకాన్ని బీమా కంపెనీకి అప్పగిస్తే తమ ఉద్యోగాల పరిస్థితిపై వైద్యారోగ్య శాఖ లేదా ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. జిల్లాలో 65 మంది ఉద్యోగులు జిల్లాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, ఆచంట, ఆకివీడు, పెనుగొండలో ఆరోగ్యశ్రీలో సేవలందించే ఆస్పత్రులు 36 ఉన్నాయి. వీటిలో నెట్వర్క్ ఆస్పత్రులు 28 భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం పట్టణా ల్లో ఉన్నాయి. వీటితో పాటు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి (తణుకు), ఏరియా ప్రభుత్వాస్పత్రులు 4 (భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం), సీహెచ్సీలు 3 (పెనుగొండ, ఆచంట, ఆకివీడు)లో ఆరోగ్యశ్రీ సేవలందిస్తున్నారు. మొత్తంగా 36 ఆస్పత్రుల్లో 65 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పేదలకు తప్పనిపాట్లు ఆరోగ్యశ్రీ ఉద్యోగులు విధులు బహిష్కరిస్తే ఆస్పత్రులకు వెళ్లే పేదలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఆరోగ్య మిత్రలు లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఓపీ, అత్యవసర ఆపరేషన్లు చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇది పేదల ఆరోగ్యంతో చెలగాటమే అని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. సేవలందక ఎవరి ప్రాణాల మీదకై నా వస్తే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని అంటున్నారు. జిల్లాలో ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు 36 మేనేజర్ 1 టీమ్ లీడర్లు 4 ఆరోగ్యమిత్రలు 58 ఆఫీస్ స్టాఫ్ 2 పేదలకు భారం వైద్య సేవ ఉద్యోగుల చర్చలు విఫలం నేడు, 24న విధుల బహిష్కరణ ఆరోగ్యశ్రీ కార్యాలయాల వద్ద నిరసన పథకాన్ని బీమా కంపెనీకి అప్పగిస్తామనడంపై ఆందోళన సమస్యల పరిష్కారానికి పోరుబాట ఉద్యోగుల డిమాండ్లు ఆరోగ్యశ్రీలో 17 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని సర్వీసును బట్టి ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి జీఓ నం.7లో కేటగిరీ–1 డీపీఓ క్యాడర్ అమలు చేయాలి. ఉద్యోగులందరికీ పనికి తగిన కనీస వేతనం అమలు చేయాలి, వేతనం పెంచాలి. సర్వీసును బట్టి పదోన్నతులు ఇవ్వాలి. ఉద్యోగి చనిపోతే వారి కుటుంబాలకు రూ.15 లక్షల సాయం అందించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రూ.10 లక్షల సాయం అందించాలి. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో ఆరోగ్యశ్రీ ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలి. -
ముగిసిన గుబ్బల మంగమ్మ జాతర
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం అటవీ ప్రాంతంలో కొలువైన గుబ్బల మంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఆదివారం సాయంత్రంతో ముగిశాయి. ఈనెల 14న జాతర ప్రారంభం కాగా.. మూడు రోజులపాటు గిరిజన సంప్రదాయ పద్ధతిలో ఉత్సవాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం ఆలయ కమిటీ సభ్యులు బాలరాజును సత్కరించారు. ఆఖరి రోజు సుమారు 11 వేల మందికిపైగా భక్తులు అమ్మవారిని దర్శించినట్టు ఆలయ కమిటీ ప్రతినిధి, సర్పంచ్ కోర్సా గంగరాజు తెలిపారు. పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్తు భీమవరం : జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, సజావుగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షా పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని, పరీక్ష పేపర్లు కేంద్రాలకు తీసుకొచ్చేటప్పుడు, సమాధాన పత్రాలు తీసుకెళ్లేటప్పుడు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున సమీపంలోని అన్ని జెరాక్సు సెంటర్లను మూసివేయిస్తామన్నారు. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. విద్యార్థులు ఉదయం 9.30 గంటలలోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థులకు అత్యవసర పరిస్థితులు ఎదురైతే 100 లేదా 112 నంబర్కు కాల్ చేయాలని, లేదా సమీప పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు బస్సులు భీమవరం (ప్రకాశంచౌక్): ఏపీఎస్ఆర్టీసీ భీమవరం డిపో నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు బస్సు సర్వీసులు ఏర్పాటుచేసినట్టు డిపో మేనేజర్ పీఎన్వీఎం సత్యనారాయణమూర్తి తెలిపారు. భీమవరం నుంచి విశాఖ (వయా నవుడూరు, బ్రాహ్మణచెర్వు), భీమవరం నుంచి పలాస (వయా పాలకొల్లు, కాకినాడ, విశాఖ, శ్రీకాకుళం, టెక్కలి) సర్వీసులను ఆదివారం పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అంజిబాబు జెండా ఊపి ప్రారంభించారన్నారు. జిల్లాలోని నవుడూరు, పొలమూరు, బ్రాహ్మణచెర్వు గ్రామాల ప్రజ లు నేరుగా విశాఖ వెళ్లేందుకు ఈ సర్వీసులు దోహదపడతాయన్నారు. కోకో నాణ్యత పెంచేలా శిక్షణ ఏలూరు(మెట్రో): కోకో గింజల నాణ్యత పెంచేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎస్.రామ్మోహన్ తెలిపారు. నాణ్యమైన గింజలు లేకపోవడంతో ధర రావడం లేదన్నారు. గింజల నాణ్యతలో కీలకమైన ఫైర్మెంటేషన్, ఎండబెట్టడం, శుభ్రమైన ప్రదేశాల్లో భద్రపరచడం వంటి మెలకువలపై మోండలీజ్ సాంకేతిక అధికారుల సమన్వయంతో గ్రామాల్లో శిక్షణ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆదివారం రామశింగవరం, కొండలరావుపాలెం, చక్రదేవరపల్లి, వంగూరు, తాళ్లగోకవరం తదతర గ్రామాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రైతులు అవగాహన పెంచుకుని గింజల నాణ్యతకు తగు జా గ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వడదెబ్బపై అప్రమత్తం ఏలూరు(మెట్రో): రోజురోజుకూ వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బతో అప్రమత్తంగా ఉండాలని ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి సూచించారు. ఎండ తీవ్రత, వడగాల్పులు సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. నెత్తికి టోపీ లేదా రుమాలు కట్టుకొని, కాటన్ వస్త్రాలు ధరించాలని సూచించారు. తరచూ నీరు, ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోస్, ఓఆర్ఎస్ కలిపిన నీటిని తాగాలన్నారు. అనారోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. -
అలరించిన కళాపరిషత్ నాటికలు
పాలకొల్లు సెంట్రల్: కళలకు నిలయమైన పాలకొల్లు పట్టణంలో పాలకొల్లు కళా పరిషత్ ఆధ్వర్యంలో నాటికల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం స్థానిక బస్టాండ్ వద్ద అడబాల థియేటర్ వెనుక ఖాళీ స్థలంలో నాటిక పోటీలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు విడాకులు కావాలి, కిడ్నాప్ నాటికలు ప్రదర్శించారు. దాంపత్య జీవితంలో దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు, అపోహలు, చిన్నచిన్న సమస్యలు తలెత్తటం సహజమని అంతమాత్రాన్న పట్టింపులకు పోయి విడాకులు కావాలనుకోవడం సమంజసం కాదనే కథాశంతో విడాకులు కావాలి అన్న నాటిక ప్రదర్శించారు. ఈ నాటికను వల్లూరు శివప్రసాద్ రచించగా.. గంగోత్రి సాయి దర్శకత్వం వహించారు. కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని తెలియజెప్పే సందేశంతో కిడ్నాప్ నాటిక కళా ప్రియులను ఆకట్టుకుంది. ఈ పోటీల్ని మంత్రి రామానాయుడు ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకటసత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, కళాపరిషత్ అధ్యక్షుడు కె.వి.కృష్ణవర్మ, సెక్రటరీ మానాపురం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నడిరోడ్డుపై మొరాయింపు
ఉండి: ఆర్టీసీ బస్సులు మొరాయిస్తున్నాయి. నడిరోడ్డుపై మొరాయించడంతో ప్రయాణికులు మండుటెండలో లబోదిబోమంటున్నారు. భీమవరం డిపోకు చెందిన తాడేపల్లిగూడెం వెళ్లే బస్సు కోలమూరు సెంటర్కు వచ్చేసరికి ఆగిపోయింది. ఆ ఎండలో ప్రయాణికుల వెతలు వర్ణనాతీతం. మరో బస్సులో ప్రయాణికులు వెళ్లాల్సి వచ్చింది. ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు భీమవరం: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రధాన పరీక్షలు శనివారంతో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 52 కేంద్రాల్లో ఈ నెల 1న పరీక్షలు ప్రారంభం కాగా ఎక్కడా మాల్ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదు. శనివారం నిర్వహించిన కెమిస్ట్రీ, కామర్స్ జనరల్ పరీక్షకు 15,006 మందికి 14,584 మంది హాజరుకాగా, ఒకేషనల్ పరీక్షకు 927 మంది విద్యార్థులకు 778 మంది హాజరైనట్లు డీఐఈవో ఎ.నాగేశ్వరరావు చెప్పారు. ఈ నెల 17, 18 తేదీల్లో ఒకేషనల్, 19, 20 తేదీల్లో హెచ్ఈసీ పరీక్షలు నిర్వహించాల్సివుంది. ప్రధాన పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఆనందంగా ఇంటి ముఖం పట్టారు. రెండేళ్ల పాటు కలసిమెలసి చదివిన స్నేహితులు ఈ రోజు నుంచి దూరం కానుండడంతో కొంతమంది విద్యార్థులు భావోగ్వేదానికి గురయ్యారు. ఒకరినొకరు అలింగనం చేసుకుని బై బై చెప్పుకుంటూ ప్రయాణమయ్యారు. 15 రోజుల పాటు నిర్వహించిన పరీక్షల్లో ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో విద్యాశాఖాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వైఎన్ కళాశాల అటానమస్ పొడిగింపు నరసాపురం: నరసాపురం వైఎన్ కళాశాల అటానమస్ స్టేటస్ను 2035 వరకూ పాటు పొడిగిస్తూ యూజీసీ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది కళాశాల నాలుగోసారి నాక్ గుర్తింపు సాధించింది. దీంతో ఈ ఏడాది ఎలాంటి పరిశీలన లేకుండా 10 ఏళ్ల పాటు అటానమస్ స్టేటస్ పెంచారని కళాశాల ఉపాధ్యక్షుడు డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ చెప్పారు. కళాశాల అభ్యున్నతికి ఇది మరింత దోహదం చేస్తుందని సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ అందే రామసతీష్ అన్నారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా గోపి ఏలూరు (టూటౌన్): జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా లక్కోజు రాజగోపాలాచారిని(గోపి) నియమించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు యాదవ్ నియామక పత్రాన్ని గోపికి అందజేశారు. స్థానిక పవర్ పేట వడ్రంగి సంక్షేమ సంఘం భవనంలో శనివారం జరిగిన జిల్లా బీసీ సంఘ సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా రాజగోపాలాచారిని, మహిళా కార్యదర్శిగా బాలిన ధనలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శిగా చిదరబోయిన శ్రీనివాస్ యాదవ్, నగర యూత్ అధ్యక్షుడిగా జరజాపు రాఘవ, యూత్ కార్యదర్శిగా ఇదలాడ నాని, బంకురి వెంకట్, బీసీ మహిళ అధ్యక్షురాలిగా మోతిక రాఘవమ్మ, జిల్లా కమిటీ సభ్యులుగా బాయి వెంకట్రావు, కింజంగి రాజు, కొత్తల శివ, కెల్ల దుర్గాప్రసాద్, చిట్టు మోజు రత్నబాబు, కొండల ప్రసాద్ తదితరులను నాయకులును నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు. -
ఇంటింటికీ పోలీసుల కాపలా
సాక్షి, భీమవరం/ తణుకు అర్బన్: వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు సీఎం చంద్రబాబు తణుకు పర్యటన సాగింది. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం శనివారం పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే అడుగడుగునా పోలీసులా ఆంక్షలతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఓ ఏరియా ప్రజలను ఉదయం నుంచి సాయంత్రం వరకు గృహనిర్భంధం తరహాలో బయటకు రానివ్వలేదు. తణుకు రూరల్ తేతలిలో అక్రమ పశువధతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక కొండాలమ్మ పుంత, మహాలక్ష్మి నగర్ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. సీఎం వద్ద తమ గోడు వెల్లబోసుకోవాలని స్థానికులు భావించారు. అయితే ఆయా ప్రాంతాల నుంచి ప్రజలెవరూ బయటకురాకుండా పోలీసులు గృహనిర్భంధం చేశారు. పర్యటన ముగిసిన సాయంత్రం 4 గంటల వరకు గృహ నిర్బంధం కొనసాగింది. సజ్జాపురం అండర్ పాస్ వద్ద పోలీసు పహారాతో పాటు ఇళ్ల వద్ద సచివాలయ పోలీసులు, సిబ్బందిని కాపలా ఉంచారు. దీంతో పిల్లలను పాఠశాలలకు పంపేందుకు, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం బయటకు వెళ్లడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమస్యలు చెప్పుకునే అవకాశం లేకపోవడంతో.. సీఎంతో తమ సమస్యలు చెప్పుకోవాలన్న ఆశతో పలువురు ప్రజావేదిక వద్దకు వచ్చారు. మాట్లాడేందుకు వారికి మైక్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సీఎంకు కొందరు తమ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేయగా తర్వాత వింటానంటూ ఆయన చెప్పడంతో పోలీసులు వారిని బలవంతంగా కూర్చోబెట్టారు. ఎంతో కష్టపడి సభకు వస్తే సమస్యలు వినే వారే లేకుండా పోయారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. కడసారి చూసేందుకూపోలీసుల కాపలాతోనే స్థానిక మహలక్ష్మి నగర్కు చెందిన కర్రి రాజశేఖర్ సమీప బంధువు ఏలూరులోని పోతునూరులో మృతిచెందడంతో అంత్యక్రియల్లో పాల్గొ నేందుకు కుటుంబ సభ్యులు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వారిని బయటకు పంపేందుకు మొదట పోలీసులు అంగీకరించలేదు. విషయాన్ని నిర్ధారించుకున్న అనంతరం ఆటోలో దగ్గరుండి వారిని అక్కడ దింపి వచ్చినట్టు స్థానికులు తెలిపారు. పాఠశాలల్లోని తమ పిల్లలకు క్యారేజీలు ఇచ్చేందుకు సైతం పోలీసులు వెంట వచ్చారన్నారు. గృహనిర్భంధంపై కొందరు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. మరోపక్క పోలీసుల హెచ్చరికలతో వ్యాపారులు సైతం తమ దుకాణాలను అరకొరగానే తెరిచారు. చల్లవారిగూడెంలో ఇంకా పునాది దశలోనే ఉన్న నిర్మాణాలుజంగారెడ్డిగూడెం: మండలంలోని చల్లవారిగూడెం ఆర్అండ్ఆర్ కాలనీలో ఓపీడీఆర్ నిజ నిర్ధారణ కమిటీ శనివారం పర్యటించింది. ఐదుగురు సభ్యుల బృందం కాలనీలో పర్యటించి ప్రజల నుంచి వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ గోదావరి వరదల నేపథ్యంలో కూనవరం, వేలేరుపాడు, కక్కునూరు, పోలవరం, వీఆర్పురం, వి.రామచంద్రాపురం, చింతూరు గ్రామాలకు చెందిన నిర్వాసితులకు చల్లవారిగూడెంలో ఇళ్లను ఇచ్చారని.. ఆ ప్రాంతంలో పెద్ద గోతులు, తుప్పలతో నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. దీంతో నిర్వాసితులే సొంత సొమ్ములు ఖర్చు చేసి గోతులను సరిచేసుకున్నారని సదరు సొమ్మును ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. చల్లవారిగూడెం ఆర్అండ్ఆర్ కాలనీలో అసంపూర్తి నిర్మాణాలు 2 వేలకు వరకు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం వెంటనే నిర్మించాలన్నారు. నాలుగు ఓవర్ హెడ్ ట్యాంక్ల్లో ఒక్కటే పనిచేస్తుందని, నీటి కోసం కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే మిగిలిన మూడు ఓవర్హెడ్ ట్యాంక్లను వాడుకలో తీసుకురావాలన్నారు. వెంటనే రైతు భరోసా, తల్లికి వందనం తదితర సంక్షేమ కార్యక్రమాలు కాలనీలో వెంటనే అమలు చేయాలని డిమండ్ చేశారు. కమిటీలో జాతీయ అధ్యక్షుడు చిగురుపాటి భాస్కరరావు, సభ్యులు రిటైర్డ్ ఐఏఎస్ బండ్ల శ్రీనివాస్ తదితరులున్నారు. ఉదయం 8 గంటలకు చంద్రబాబు హెలీప్యాడ్ వద్దకు చేరుకోవాల్సి ఉండగా 9 గంటలకు రావడంతో గంట ఆలస్యంగా పర్యటన మొదలైంది. ఎన్టీఆర్ పార్కులో పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖీ, చెత్త ఊడ్చే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హోల్సేల్ కూరగాయల మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన కంపోస్ట్ ద్వారా డిస్పోజ్ చేసే యంత్రాలను పరిశీలించారు. ఐక్య నగర్ పార్కును పరిశీలించి పీ4 విధానంలో అభివృద్ధి చేసేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. అనంతరం ప్రజావేదిక వద్ద ఉదయం 10.36 నుంచి 12.40 గంటల వరకు కార్యక్రమం సాగింది. గంటన్నర ఆలస్యం కావడంతో ఎండకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. మరోపక్క భోజనాలు లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. భోజనాలు లేవని టేబుళ్లను తీసేయడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఇంటి వద్ద వంట చేసుకోకుండా వచ్చేశామని, ఇంత ఎండలో ఇప్పుడు ఇంటికి వెళ్లి వంట ఎలా చేసుకునేదంటూ కొందరు మహిళలు వాపోయారు. ఉసూరుమంటూ ఇంటిముఖం క్రొవ్విడిలో దారుణం నిడమర్రు: కొల్లేరు జీరాయితీ చేలల్లో చేపలు పడుతున్నాడంటూ ఓ బాలుడిని కొట్టి గొలుసుతో కట్టేసిన సంఘటన శుక్రవారం నిడమర్రు మండలం క్రొవ్విడిలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం 5వ కాంటూరు పరిధిలో నిరుపయోగంగా ఉన్న చేలల్లో ఉప్పరగుడెంకు చెందిన తాటిపర్తి బుజ్జన్న కుమారుడు లోకేష్ వరుణ్ చేపలు పడుతుండడం గమనించిన అదే గ్రామానికి చెందిన గండికోట వెంకన్న, పండు అతన్ని గ్రామంలోకి తీసుకొచ్చి గొలుసుతో కట్టేశారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వారి ఇంటికి వెళ్లి ప్రాధేయపడినా వదలలేదు. లోకేష్ తాత, మావయ్య విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో వారు మందలించారు. అప్పుడు బాలుడ్ని విడిచి పెట్టినట్లు తెలిసింది. లోకేష్ తండ్రి సాక్షితో మాట్లాడుతూ సుమారు 3 గంటల పాటు తన కొడుకుని కట్టేశారని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొనుగోలుకు ఇబ్బంది ఏంటి? తాము పండించిన పెసలు, మినుములు కొనుగోలు చేయడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి.? పంటను ఇంట్లో ఉంచండి.. కొంటాం అంటున్నారు. రేపు మాపు అంటూ గడిపేస్తున్నారు. స్పష్టమైన ప్రకటన చేయాలి. – మాగంటి రాజు, రైతు, దెందులూరు సర్వే పేరిట తాత్సారం ప్రభుత్వ విధానంపై నమ్మకం లేదు. అనేక మంది రైతులు నష్టానికి అమ్ముకుంటున్నారు. రైతులు కన్నీరు పెడితే ప్రభుత్వానికి మంచిదా.. ఆలస్యం లేకుండా కొంంటే నష్టానికి అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. – కొలుసు గణపతిరావు, రైతు, సొసైటీ మాజీ చైర్మన్ ఇమామ్, మౌజన్లు ధ్రువపత్రాలు సమర్పించాలి ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని మసీదుల్లో ఇమామత్ నిర్వహిస్తూ ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం అందుకుంటున్న ఇమామ్లు, మౌజన్లు, వారితో పాటు ప్రస్తుతం ఉన్న ముతవల్లి లేదా మసీదు అధ్యక్షులు వారి ఆధార్ జిరాక్స్ కాపీలు 2, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు 2, మసీదు పేరుపై ఉన్న బ్యాంక్ ఖాతా జిరాక్స్ కాపీలు తమ కార్యాలయంలో సమర్పించాలని జిల్లా వక్ఫ్బోర్డ్ ఇన్స్పెక్టర్ కేఎండీ అలీం ఒక ప్రకటనలో తెలిపారు. బోనస్ బకాయిలు ఇవ్వాలి ఏలూరు (టూటౌన్): వన సంరక్షణ సమితిల్లో పనిచేస్తున్న కూలీలకు వేతన బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వ్యవసాయ కార్మిక సంఘం బృందం తెలిపింది. శనివారం అటవీ శాఖ జిల్లా అధికారి శుభమ్కు వినతిపత్రం అందజేశారు. సంఘం ఉపాధ్యక్షులు ఏ.రవి, జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గిరిజనులు సేకరించే తునికాకు నేటికి బోనస్ బకాయిలు రూ.5 కోట్ల వరకూ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులు, పేదల పట్ల ప్రభుత్వం, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. మెట్ట ప్రాంతంలో దళితులు, గిరిజనులు ఇతర పేదలకు రావాల్సిన వేతన బకాయిలు అందక అవస్థలు పడుతున్నారని అన్నారు. మురికి కూపంలా ఏలూరు బాలుడిని గొలుసులతో కట్టేసిన వైనం చంద్రబాబు పర్యటనలో అడుగడుగునా నిర్బంధం పశువధ బాధితుల హౌస్ అరెస్ట్ స్థానికులను ఇళ్ల నుంచి బయటకు రానివ్వని పోలీసులు బంధువు కడసారి చూపుకోసం దగ్గరుండి తీసుకువెళ్లిన పోలీసులు -
కొనుగోలు కేంద్రాలు ఎక్కడ?
దెందులూరు: ఏలూరు జిల్లాలో పెసర, మినుము రైతులను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని ఆశలు పెట్టుకుంటే ఇంతవరకూ వాటి ఊసే లేదు. గత ఏడాది నవంబర్లో పెసర, మినుము పంట సాగు చేశారు. ఫిబ్రవరి నెలాఖరుకు దిగుబడి చేతికొచ్చింది. గత ప్రభుత్వ హయాంలో పంటల సాగు పూర్తయ్యే నాటికి రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం ఇంతవరకూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు దెందులూరు కోపరేటివ్ సొసైటీకి వెళ్లి నిలదీశారు. ఏలూరు జిల్లాలో 12,900 ఎకరాల్లో పెసర, 2500 ఎకరాల్లో మినుము పంట సాగు చేశారు. వ్యవసాయానికి పెట్టుబడి సాయం ఇవ్వకపోయినా పండించిన పంటను కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే ఎలా? అని రైతులు, రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే తక్కువ ధరకు అమ్ముకోవాలని.. పెట్టుబడి సొమ్ము కూడా అందదని వాపోతున్నారు. ప్రజా ప్రతినిధులు సైతం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై మాట్లాడడం లేదు. జాయింట్ కలెక్టర్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినా.. ఆ ఆదేశాలు అమలు కాలేదు. పండించిన పంటను మంచి ధరకు అమ్ముకోవచ్చని ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశ మిగిలింది. ఇలాగైతే నష్టానికి అమ్ముకోవడం తప్ప వేరే గత్యంతరం లేదంటున్నారు. ఇంకా పూర్తికాని ఈ–క్రాప్ నమోదు వ్యవసాయ శాఖ సిబ్బంది పంట నమోదు, రైతుల వివరాలు పంట వేసిన తరువాత రైతుతో మాట్లాడి ఈ–క్రాప్ నమోదు చేస్తారు. అయితే పంట చేతికి వచ్చిన తరువాత ఇప్పటికీ పంట నమోదు కార్యక్రమం చేస్తున్నారు. ఈ విషయాన్ని మార్క్ఫెడ్, వ్యవసాయ శాఖాధికారులు ధ్రువీకరించారు. పెసర, మినుము రైతుల ఆవేదన పంటను నష్టానికి అమ్ముకోవాల్సిన దుస్థితి -
పడకేసిన మెడికల్ కాలేజీ నిర్మాణం
పది నెలలైనా పత్తా లేరు నాడు ప్రతిపక్షంలో ఉన్న రామానాయుడు, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి మెడికల్ కళాశాల వద్దకు వెళ్లి ఓ పక్క పనులు జరుగుతుండగా మరోపక్క కళాశాల పార్కింగ్ స్థలంలో నిలబడి ఇక్కడ ఏ పనులూ జరగడం లేదంటూ చాలా హడావుడి చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అక్కడ అంతా బురదే తప్ప పనులేమీ జరగడం లేదని తమ అనుకూల శ్రీపచ్చశ్రీ మీడియా ద్వారా రాద్ధాంతం సృష్టించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 10 నెలలు కావస్తోంది. అధికారంలో లేనప్పుడు మెడికల్ కళాశాల చుట్టూ తిరిగి రాద్ధాంతం చేసిన రామానాయుడు నేడు మంత్రి హోదాలో ఉండి మెడికల్ కళాశాల వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. మెడికల్ కళాశాల వద్దకు వెళితే కాంట్రాక్టర్ను ప్రశ్నించలేని దుస్థితి. బిల్లులు విడుదల చేస్తే తాము పనులు మొదలు పెడతామని కాంట్రాక్టర్ ఎదురు ప్రశ్నిస్తారేమోననే భయంతో మంత్రి నిమ్మల మెడికల్ కళాశాల వైపు వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతోంది. మెడికల్ కళాశాల పనులు త్వరగా పూర్తయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో పనులు ఆపించారని, కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి ఆపై నిధులు రిలీజ్ చేసి తమ హయాంలోనే మెడికల్ కళాశాల పూర్తయిందని గొప్పలు చెప్పుకోవడానికే ఇదంతా చేస్తున్నారని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. పాలకొల్లు సెంట్రల్ : పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామంలో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పడకేశాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్న సమయంలో.. నాడు ప్రతిపక్షంలో ఉన్న రామానాయుడు, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి మెడికల్ కళాశాల వద్దకు వెళ్లి పనులు ఏమీ జరగడం లేదని నానా యాగీ చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా అప్పుడు అల్లరి చేసిన టీడీపీ పెద్దలు వివిధ పదవుల్లో ఉండి కూడా ఇప్పటివరకు కశాళాల వైపే కన్నెత్తిచూసిన పాపాన పోలేదు. కనీసం బిల్లులు కూడా మంజూరు చేయకపోవడంతో ప్రస్తుతం కళాశాల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. సుమారు రూ.75 కోట్లు వృథాయేనా..? పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు, పరిసర ప్రాంత ప్రజలు మెడిసిన్ విద్య అభ్యసించే నిమిత్తం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుమారు 60 ఎకరాల్లో రూ.475 కోట్ల వ్యయంతో ఇక్కడ మెడికల్ కళాశాల మంజూరు చేశారు. వర్చువల్ పద్ధతిలో ఆయన శంకుస్థాపన కూడా చేశారు. 2023 ఫిబ్రవరిలో ల్యాండ్ అగ్రిమెంట్ చేసుకున్న మెగా కన్స్ట్రక్షన్ ఆగస్టులో పనులు ప్రారంభించింది. మొత్తం నిర్మాణం చేయాల్సిన బ్లాక్లు 16 కాగా మొదలుపెట్టిన బ్లాక్లు 3. వాటిలో ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ బ్లాక్లు ఫైల్స్ వర్క్లు (పిల్లర్ పనులు) పూర్తవ్వగా, 24 గంటల సర్వీస్ బ్లాక్లో 82 శాతం ఫైల్స్ వర్క్ పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు రూ.75 కోట్ల విలువైన పనులు పూర్తిచేశారు. వీటి నిమిత్తం ఇంకా సుమారు రూ.30 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నట్టు సమాచారం. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్ట్ సంస్థ పనులు నిలుపుదల చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ సైట్లో ఉన్న ఇసుక, ఇనుము, కంకర వంటి మెటీరియల్ను మెగా కంపెనీకి సంబంధించి మిగతా ప్రాంతాల్లో జరుగుతున్న పనుల నిమిత్తం తరలించేశారు. మొత్తం సైటు ఖాళీ చేసేశారు. నాడు ఓ పక్క పనులు జరుగుతున్నా ఏమీ జరగడం లేదంటూ నిరసనలు నేడు పది నెలలైనా ఆ వైపే చూడని మంత్రి నిమ్మల మెడికల్ కళాశాల బిల్లులు రాక పనులు నిలుపుదల చేసిన సంస్థ ఇప్పటి వరకూ జరిగిన రూ. 75 కోట్ల పనులు గంగపాలేనా...? ఇదీ దగ్గులూరు మెడికల్ కళాశాల దుస్థితి -
చిన్నారులపై మారుటి తండ్రి దాడి
జంగారెడ్డిగూడెం: చిన్నారులను పాశవికంగా హింసించిన ఘటన మరోసారి జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. రెండవ భర్త దాడిలో వివాహిత, ఆమె సంతానం దాడికి గురయ్యారు. పట్టణానికి అంకుశం జ్యోత్స్న, పూతి ఉమామహేశ్వరరావు భార్యభర్తలు. వీరి సంతానం సాత్విక్ (11) 4వ తరగతి చదువుతున్నాడు. కరుణ సత్య (8) 2వ తరగతి చదువుతున్నారు. కాగా జ్యోత్స్న ఉమామహేశ్వరరావుకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో పుచ్చకాయల దుర్గాప్రసాద్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం కాగా వారు గౌరీ పట్నంలో వివాహం చేసుకుని స్థానిక సుబ్బంపేట రోడ్డులో నివాసం ఉంటున్నారు. గత మూడు రోజులుగా దుర్గాప్రసాద్ మద్యం సేవించి వచ్చి పిల్లలు సాత్విక్, కరుణసత్యలను కొడుతూ ఉన్నాడు. అడ్డుకోబోయిన జ్యోత్స్నపై కూడా దాడి చేశాడు. స్థానికులు గమనించి గాయపడిన సాత్విక్ను శనివారం ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు సాత్విక్కు చికిత్స అందిస్తుండగా, జ్యోత్స్న, కరుణసత్య ఆసుపత్రిలోనే ఉన్నారు. విషయం తెలుసుకున్న సీడీపీవో బ్యూలా, సూపర్వైజర్, అంగన్వాడీ సిబ్బంది ఆసుపత్రికి వెళ్లి జ్యోత్స్న, చిన్నారులను అడిగి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. సీఐ వి.కృష్ణబాబు వివరాలు సేకరించారు. గతంలో కూడా దుర్గాప్రసాద్ తనను చంపడానికి ప్రయత్నించాడని, పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు జ్యోత్స్న తెలియజేసింది. గాయపడిన చిన్నారి సాత్విక్కు ఏరియా ఆసుపత్రిలో చికిత్స వివరాలు సేకరించిన అధికారులు -
రంగులు వేస్తూ జారిపడి పెయింటర్ మృతి
భీమవరం: భవనానికి రంగులు వేస్తూ ప్రమాదవశాత్తూ పెయింటర్ జారి పడి మృతి చెందిన ఘటన భీమవరంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం స్థానిక మారుతీనగర్లోని ఓ ఇంటికి పెయింటర్ చీర శివకుమార్(34) శుక్రవారం రంగులు వేస్తుండగా ప్రమాదవశాత్తూ జారి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం భీమవరం నుంచి విజయవాడ తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మామపై అల్లుడు హత్యాయత్నం ఏలూరు టౌన్: మామపై అల్లుడు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇది. పోలీసుల వివరాల ప్రకారం ఏలూరు తంగెళ్ళమూడి కబడ్డీగూడెంకు చెందిన ధర్మవరపు శ్రీను కుమార్తె జ్యోతికి కొత్తపల్లి వెంగళరావుతో 18 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వెంగళరావు మద్యానికి బానిసై ఇటీవల కాలంలో భార్య జ్యోతిని ఇష్టారాజ్యంగా కొడుతూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ నెల 14న భర్త వేధింపులు భరించలేక జ్యోతి తండ్రి ఇంటికి వచ్చింది. వెంగళరావు అక్కడకు రావడంతో మామ అల్లుడి మధ్య వాగ్వివాదం చెలరేగి గొడవగా మారింది. అనంతరం మరోసారి రాత్రివేళ రాగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.అల్లుడు వెంగళరావు తనతో తెచ్చుకున్న కత్తితో మామ శ్రీనుపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. భార్య లక్ష్మి, మనవడు కొత్తపల్లి నాగు శ్రీనుని ఏలూరు జీజీహెచ్కు తరలించారు. ఆసుపత్రి వైద్యులు మెడికో లీగల్ కేసుగా నమోదు చేసి ఆసుపత్రిలోని పోలీస్ ఔట్పోస్టుకు సమాచారం అందించారు. ఏలూరు టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు బైక్లు ఢీకొని నలుగురికి గాయాలు ఉంగుటూరు: జాతీయరహదారిపై శనివారం కై కరం నుంచి భీమడోలు వెళుతున్న రెండు బైకులు ఢీకొని నలుగురుకి తీవ్రగాయాలు అయ్యాయి. ముందు వెళుతున్న బైక్ను ఓవర్టేక్ చేస్తుండగా రెండు బైక్ల హేండిళ్లు లింక్ అవడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులది కూరెళ్లగూడెం, పత్తేపురం గ్రామాలు అని తెల్సింది. క్షతగాత్రులు కె.సుగుణ (38), కె.శాంతిరాజు (39), జాన్సి (46), సాయికిరణ్(24) ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
పది విజయానికి.. పన్నెండు సూత్రాలు
గణపవరం: విద్యార్థి జీవితంలో కీలకమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల గడువు దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్ధుల్లో భయం, ఆందోళన, పెరిగిపోతోంది. విద్యార్థుల తల్లిదండ్రుల్లో అయితే ఆందోళన మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నిరంతర సాధన, గుండెలనిండా ధైర్యం, నమ్మకమే విజయతీరాలకు చేర్చుతుందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ప్రతి విద్యార్ధి పదోతరగతిలో విజయ కేతనం ఎగరవేయడానికి ఈ పన్నెండు నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. భయం వద్దు అనవసర భయాలవల్ల టెన్షన్ వస్తుంది. పరీక్షలపై దృష్టిపెట్టి, ఆయా సబ్జెక్టుల్లో నిరంతర సాధన చేయాలి. విద్యార్థులు ప్రతి రోజూ పదినిముషాలపాటు ధ్యానం లేదా పూజ చేస్తే మంచిది. సందేహమెందుకు ? చదివిన ప్రశ్నలు రాకపోతే.. చదివింది గుర్తుకు రాకపోతే... లాంటి ఆలోచనలు దరిచేరనీయవద్దు. ప్రణాళిక ముఖ్యం ఎంత చదివామన్నది ముఖ్యంకాదు.. ప్రణాళికతో ఎలా చదివామన్నది ముఖ్యం. జాగ్రత్త అవసరం చదువు ధ్యాసలో పడి ఆహారాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. వేళకు తేలికపాటి, బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. పండ్లరసాలు, కొబ్బరిబొండం నీరు, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. మంచి నిద్ర మేలు సరైన మోతాదులో నిద్ర అవసరం. పరీక్షల సమయంలో అర్ధరాత్రి దాటే వరకూ చదవడం వల్ల ఉపయోగం ఉండదు. రాత్రి పదిగంటలకు పడుకుని, వేకువజామునే లేచి చదివితే మంచిది. కొత్త విషయాల జోలికి పోవద్దు పరీక్షల సమయంలో కొత్తవిషయాలు నేర్చుకునే ప్రయత్నం వద్దు. ఈ సమయంలో కేవలం రివిజన్ మాత్రమే చేయాలి. ఇదివరకు చదవని ప్రశ్నలు మరీ ముఖ్యమైనవి అయితేనే తప్ప నేర్చుకునే ప్రయత్నం చేయవద్దు. సెల్ఫోన్లకు దూరం పరీక్షల సమయంలో సెల్ఫోన్ చూడటం, సెల్ఫోన్ ముచ్చట్లు, ఫ్రెండ్స్తో చర్చలు అనవసరం. ముందుగా వెళ్లడం శ్రేయస్కరం పరీక్షకు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరండి. దారిలో ప్రయాణంలో చదవడం, పరీక్షా గదిలోకి వెళ్లేముందు ఓసారి పుస్తకం తీసి చూడాలన్న ఆలోచనే వద్దు. ఇతరులను పట్టించుకోకండి పరీక్ష రాసే సమయంలో పక్కకి చూడవద్దు. ఎవరు ఎన్ని ఎడిషనల్ షీట్లు తీసుకుని రాస్తున్నారన్నది పట్టించుకోకండి. అది మీలో తెలియని ఆందోళన పెంచుతుంది. తెలిసిన ప్రశ్నలకు ముందు ప్రాధాన్యత బాగా తెలిసిన ప్రశ్నలకు ముందుగా జవాబులు రాయండి. సాధ్యమైనంత వరకూ దిద్దుబాటు లేకుండా చూడండి. టైం పూర్తయ్యేవరకూ పరీక్షాహాలు వదిలి రాకండి. హాల్టికెట్ నంబరు, ప్రశ్నల నంబర్లు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవడం మంచిది. ప్రశాంతంగా ఉండండి మామూలు రోజుల్లో ఎలా ఉంటారో పరీక్షలప్పుడు కూడా అలాగే ప్రశాంతంగా ఉండండి. పరీక్షరాసిన వెంటనే ఇంటికి రావడం మంచిది. ఫలానా ప్రశ్నకు సమాధానం సరైనదేనా కాదా అంటూ స్నేహితులతో చర్చ పెడితే ఒకరు రైట్అని, మరొకరు రాంగ్ అని చెబితే మీరు పూర్తి కన్ఫ్యూజన్లోకి వెళ్లిపోయి, మరుసటి రోజు పరీక్షపై అనవసర భయం ఏర్పడుతుంది. విసుక్కోవద్దు.. పోల్చవద్దు తల్లిదండ్రులు పిల్లలను విసుక్కోవడం, చదవడంలేదని తిట్టడంవంటివి చేయవద్దు. పరీక్షలు రాస్తున్న పిల్లలను పంక్షన్లు వంటి ఇతర కార్యక్రమాలకు తీసుకెళ్లడం మంచిదికాదు. ముఖ్యంగా ఇతర విద్యార్ధులతో మీ పిల్లలను అస్సలు పోల్చవద్దు. పునశ్చరణకే ప్రాధాన్యం పరీక్షల సమయంలో కొత్తవి చదివేకన్నా పునశ్చరణకే ప్రాధాన్యత ఇవ్వాలి. పరీక్షరోజున వేకువజామునే లేచి కొంతసమయం ముఖ్య, అతి ముఖ్య ప్రశ్నలు ఒకసారి మననం చేసుకుంటూ చదివితే మంచిది. పరీక్ష పేపరులో అక్షరాలు పొందికగా, పెద్దగా, చూడముచ్చటగా ఉండాలి. ఇంగ్లీషులో గ్రామర్, లెక్కల్లో ఫార్ములాలు, సైన్సులో డయాగ్రమ్లు, సోషల్లో మ్యాప్లు బాగా ప్రాక్టీస్ చేయండి. పరీక్షల సమయంలో సెల్ఫోన్కు విశ్రాంతి ఇవ్వడం మరచిపోవద్దు. – గొర్రెల బాలయ్య, సబ్జక్టునిపుణులు, ఎంఈవో–2ఆహారపు అలవాట్లతో అప్రమత్తం పరీక్షకు వెళ్లడానికి రెండుగంటల ముందు కొబ్బరినీళ్లు తాగాలి. తేనె, నిమ్మరసం, వేడి గంజి వంటివాటిలో ఏదైనా మంచిదే. దీనివలన శక్తి వస్తుంది. బయట ఆహారం, ఫాస్ట్ఫుడ్స్వంటి వాటికి దూరంగా ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. మొలకలు, క్యారెట్, కీరదోస వంటివి తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. ఇవి శరీరానికి నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి. – పి.కిరణ్మయి. వైద్యాధికారిణి -
కేంద్ర మంత్రికి మోషేనురాజు పరామర్శ
భీమవరం : ఢిల్లీలో రోడ్డుప్రమాదంలో కాలికి గాయమైన కేంద్ర ఉక్కు, భారీపరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు పరామర్శించారు. భీమవరంలో శనివారం శ్రీనివాసవర్మ నివాసానికి వెళ్లిన మోషేనురాజు ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. విశ్రాంతి తీసుకుని త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలి మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బుట్టాయగూడెం: గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఆదివాసీలపై ఉందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త తెల్లం రాజ్యలక్ష్మి అన్నారు. కామవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న గుబ్బల మంగమ్మతల్లి జాతర మహోత్సవాల్లో వారు పాల్గొని పూజారి వర్సా పుల్లారావు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తొలుత బాలరాజు దంపతులకు ఆలయ కమిటీవారు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం బాలరాజు, రాజ్యలక్ష్మి దంపతులు కొద్దిసేపు గిరిజన సంప్రదాయ డోలు కొయ్యి నృత్యాలు చేసి సందడి చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు కోర్సా గంగరాజు, కోర్సా రాంబాబు, గుజ్జు రామారావు, తదితరులు బాలరాజు దంపతులను శాలువా కప్పి సత్కరించారు. రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ఉంగుటూరు: చేబ్రోలు రైల్వేస్టేషన్లోని వెయింటింగ్ హాల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడి వయస్సు 55 సంవత్సరాలు ఉంటుందని, తెలుగురంగు చిన్ని గీతల పుల్ హ్యండ్ షర్టు, బిస్కట్ రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నట్లు రైల్వే ఎస్సై పి.అప్పారావు తెలిపారు. మృతదేహన్ని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలిస్తే 94906 17090, 99480 10061 నంబర్లలో తెలియజేయాలన్నారు. -
హైవేపై ఘోర ప్రమాదం
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతితాడేపల్లిగూడెం రూరల్: తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతిచెందాడు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని ఒక ఐటీ కంపెనీకి చెందిన హెచ్ఆర్ విభాగం ఉద్యోగి భోగెల్లి వెంకట సత్య సురేన్ (37), ఆయన భార్య నవ్య (35), కుమార్తె వాసకి కృష్ణ (5), బంధువు శ్రీరమ్య శాంత్రో కారులో తూర్పు గోదావరి జిల్లా ఏడిద గ్రామంలో జరగనున్న విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి బయల్దేరారు. శుక్రవారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపైకి వచ్చేసరికి సురేన్ డ్రైవ్ చేస్తున్న కారు జాతీయ రహదారి మెయింట్నెన్స్ పనులు చేస్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో సత్య సురేన్, నవ్యలు అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తె వాసకి కృష్ణ (5), బంధువు శ్రీరమ్యను తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వాసకి కృష్ణ మృతి చెందగా, శ్రీరమ్యను మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రూరల్ ఏఎస్సై పీవీకే.దుర్గారావు వివరాలు సేకరించారు. మృతదేహాలను తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించి, రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిద్ర మత్తు వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మండపేటలో విషాద ఛాయలు ఈ ప్రమాదంలో తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి. సత్య సురేన్ తండ్రి పాపారావు రిటైర్డ్ ఉద్యోగి. ఈ ఘటనలో పాపారావు చెల్లెలు కుమార్తె ఉప్పులూరి శ్రీరమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. యూఎస్లో ఉంటున్న ఆమె ఇటీవల గృహ ప్రవేశ శుభకార్యానికి హైదరాబాద్ వచ్చారు. ఒకే కుటుంబంలో ముగ్గురిని మృత్యువు కాటేయడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
మీ అవగాహనే బ్రహ్మాస్త్రం
శనివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2025వినియోగదారుల హక్కుల కోసం పోరు గతంలో జిల్లా వినియోగదారుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆకివీడుకు చెందిన బొబ్బిలి బంగారయ్య మోసపోయిన వినియోగదారులతో కోర్టులో కేసులు వేయించి అనేక విజయాలు సాధించారు. ఆకివీడులో 1989 సెప్టెంబర్ 9న ఆయన వినియోగదారుల సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఎంతో మందికి వినియోగదారుల హక్కుల పట్ల అవగాహన కల్పించమేగాక జిల్లా వ్యాప్తంగా ఎన్నో సంఘాల్ని ఏర్పాటు చేయించారు. 20 ఏళ్ల క్రితం టెలిఫోన్ బిల్లుల పెంపుపై పోరాటం చేసి రెంటల్ను రూ.180 నుంచి రూ.110కు తగ్గించేలా చేయించారు. వంట గ్యాస్ కోసం క్యూ విధానానికి స్వస్తి చెప్పి బుకింగ్ విధానం అమలు చేయించగలిగారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతిన్న పంటలకు పంటల బీమా వర్తించకపోవడంతో పోరాటం చేసి ఆకివీడు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లోని 700 మంది రైతులకు దాదాపు రూ.3 కోట్ల నష్టపరిహారం ఇప్పించగలిగారు. అడవికొలను సొసైటీ చానమిల్లి రైతులకు పంటల బీమా మంజూరు చేయించకపోవడంతో వినియోగదారుల సంఘం తరఫున పోరాడి 90 మంది రైతులకు రూ.10 లక్షలు నష్టపరిహారం ఇప్పించగలిగారు. భీమవరం/ఆకివీడు/భీమవరం(ప్రకాశం చౌక్) : ఇటీవల జిల్లాలో తూనికలు, కొలతల్లో వ్యాపారుల మోసం ఎక్కువైంది. వినియోగదారులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాటాలు రావడంతో మోసం చేసేవారికి మరింత సులువైంది. నిత్యావసరాలు, కూరగాయాలు, చికెన్, మటన్ వంటివే గాకుండా రైతుల వద్ద వ్యాపారులు కొనుగోలు చేసే ధాన్యం, చేపలు, రొయ్యల తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తూకాల్లో మోసాలపై వినియోగదారుల సంఘాలు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్నారు. చర్యలు లేకపోవడంతో కొంతమంది వ్యాపారులు మోసమే ధ్యేయంగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. కిలోకు దాదాపు 100 గ్రాముల తక్కువ బరువుతో వినియోగదారుడిని మోసగిస్తున్నారు. తక్కెడకు వినియోగించే కిలో, అర కిలో రాళ్లను తూనికలు, కొలతల అధికారులు నిత్యం పర్యవేక్షించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంతో కొంతమంది వ్యాపారులు రాళ్లను అరగదీయడం, లోపల కన్నాలు పెట్టి పైన పూత వేయడం వంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఎలక్ట్రానిక్ కాటాలు తయారుచేసే కంపెనీలు సక్రమంగా బరువువచ్చేలా ఏర్పాటుచేస్తున్నా వాటిని కూడా వ్యాపారులు తమకు అనుకూలంగా సెట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 90 శాతం ఎలక్ట్రానిక్ కాటాలను ఉపయోగిస్తున్నా వాటి చిప్లు మార్పులు చేసి తూకంలో మోసం చేస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో మోసాలు పెట్రోల్ కంపెనీలు డీలర్లుకు బంక్లను లీజుకు ఇచ్చి నిర్వహణ చేస్తుంటాయి. కొందరు డీలర్లు పెట్రోల్, డీజిల్ పంపులకు ఉండే డిజిటల్ మిషన్లో కంపెనీలకు తెలియకుండా మార్పులు, చేర్పులు చేసి వియోగదారురులను మోసగిస్తున్నాయి. స్వీట్ షాపు యజమానులు తూనికల్లో మోసం చేస్తున్నారు. వినియోగదారులకు కేవలం స్వీట్ మాత్రమే తూకం వేయాల్సివుండగా స్వీట్స్ పెట్టే బాక్స్లను సైతం తూకం వేసి విక్రయిస్తున్నారు. మాంసం విక్రయాల్లో అక్రమాలు మాంసం విక్రయాల్లోను వినియోగదారుడు మోసానికి గురువుతున్నారు. మిగిలిన మాంసాన్ని ఫ్రిజ్లో పెట్టి మరుసటి రోజు విక్రయిస్తున్నారు. నిల్వ మాంసం తినడం వల్ల అనేక మంది అనారోగ్యానికి గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. అడపాదడపా మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు దాడులు చేసి నిల్వ మాంసాన్ని సీజ్ చేయడం మినహా పెద్దగా చర్యలు లేకపోవడంతో వ్యాపారులు భయపడుతున్న దాఖలాలు లేవు. నామమాత్రంగా వినియోగదారుల సంఘాలు వినియోగదారులు మోసపోకుండా నిత్యం అవగాహన కల్పించి వారికి అండగా ఉండాల్సిన వినియోగదారుల సంఘాలు నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. గత ఏడాది కాలంగా వినియోగదారుల సంఘం జిల్లా వ్యాప్తంగా ఒక్క కేసు కూడా నమోదు చేయించలేదంటే వాటి పనితీరు అవగతమవుతోంది. ప్రభుత్వ పరంగా విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేసినా తరచు సమావేశాలు ఏర్పాటు చేయకపోవడంతో కమిటీలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నాయి. న్యూస్రీల్వినియోగదారుల రక్షణ ఇలా.. వినియోగదారుల చట్టం బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుంది. 1986లో తీసుకొచ్చిన వినియోగదారుల చట్టానికి 2019లో చేసిన సవరణలతో ఈ చట్టానికి విశేష అధికారాలు వచ్చాయి. జరినామాతో పాటు జైలుకు కూడా పంపొచ్చు. వస్తువు ఎక్కడ కొనుగోలు చేసినా.. ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయొచ్చు. కేవలం తెల్లకాగితంపై ఫిర్యాదు రాసి వినియోగదారుల ఫోరంలో సమర్పించవచ్చు. జిల్లా స్థాయిలో వినియోగదారుల కమిషన్ ఉండటంతో పాటు దీని పరిధిలో అధ్యక్షుడు, ఇద్దరు సభ్యులు ఉంటారు. ఈ కమిషన్కు సాధారణ కోర్టు జడ్జికి ఉండే అధికారాలు ఉంటాయి.మనం కొనే వస్తువు, అందించే సేవలో ఏదైనా లోపం ఉంటే న్యాయం పొందే హక్కు వినియోగదారుడికి ఉంటుంది. సరైన ధర, తూకం, నాణ్యత, స్వచ్ఛత కలిగిన వస్తువులు లేదా సేవలు పొందడం వినియోగదారుడి ప్రాథమిక హక్కు. ఇటీవల కాలంలో వస్తువుల్లో నాణ్యతా లోపాలు, తూకాల్లో మోసాలు, సేవల్లో నిర్లక్ష్యం వంటివి ఎక్కువై పోయాయి. తాగే పాలు, నీళ్లను కూడా కల్తీ చేస్తున్నారు. సామాన్యుడు వీటిని ప్రశ్నించలేక ఎక్కడికక్కడ సర్దుకుపోతున్నాడు. ఈ తరహా మోసాలను అరికట్టేందుకు వినియోగదారుడు మేల్కొనాలి. అందుకే ఏటా మార్చి 15న అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. వస్తువుల నాణ్యత, సేవల్లో లోపాలకు చెక్ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదుతో అక్రమాలకు అడ్డుకట్ట నేడు అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం -
పోక్సోపై అవగాహన అవసరం
భీమవరం: పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని భీమవరం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జి.సురేష్ బాబు అన్నారు. మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం పోక్సో చట్టంపై అవగాహన కల్పనకు ప్రభుత్వ కళాశాల ఉమెన్స్ హాస్టల్లో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రధానంగా 18 ఏళ్లలోపు బాలికలు అపరిచిత వ్యక్తుల పట్ల ఆకర్షితులు కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. చదువుపై మాత్రమే దృష్టి పెట్టి అవసరమైన వాటికి మాత్రమే సెల్ ఫోన్స్ ఉపయోగించాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యేలేటి యోహాన్, ప్యానల్ న్యాయవాదులు బి.సురేష్ కుమార్, ఎన్.సుధీర్, పి.అంబేద్కర్, బి.లోకేశ్వరరావు, కె.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అబద్ధాలు చెప్పడంలో బాబు, లోకేష్ దిట్ట పాలకొల్లు సెంట్రల్: అబద్ధాలు వల్లించడంలో చంద్రబాబును మించిన ఘనుడు నారా లోకేష్ అని వైఎస్సార్సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జ్ గుడాల శ్రీహరిగోపాలరావు(గోపి) అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అబద్ధాలు వల్లిస్తూనే తండ్రీకొడుకులు రాజకీయాలు చేస్తున్నారన్నారు. తన కుమారుడు దేవాన్ష్కు సెల్ఫోన్ లేదని, ట్యాబ్ లేదని లోకేష్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన కొడుక్కే లేవు మీకెందుకని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను కించపరుస్తున్నారా? అని ప్రశ్నించారు. ఓ పక్క తన మనవడు సెల్ఫోన్ ఆపరేట్ చేయడంలో గొప్పని చంద్రబాబు చెప్పుకుంటారని, లోకేష్ ఏమో అసలు పోనే లేదని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. గతంలో జగనన్న ప్రభుత్వం 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లిచ్చి డిజిటల్ విద్యను అందించిందన్నారు. టీడీపీ నాయకులకు గతంలో చంద్రన్న తోపా, చంద్రన్న పెళ్లికానుక, చంద్రన్న సంక్రాంతి అంటూ సంచులపై ఫొటోలు వేయించుకున్న విషయాలు మర్చిపోయారా చెట్లు, పుట్లపై కూడా రంగులు వేసుకున్న గత విషయాలు గుర్తుకు రావడంలేదా అంటూ ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కర్రా జయసరిత, జోగి వెంకటేశ్వరరావు, జోగాడ ఉమామహేశ్వరరావు, మామిడిశెట్టి చిట్టిబాబు, అరుణ, కెల్లా పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారికి వైభవంగా డోలా పౌర్ణమి ఉత్సవం ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో శుక్రవారం డోలా పౌర్ణమి ఉత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉభయ దేవేరులతో శ్రీవారు తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. ముందుగా ఆలయంలో ఉదయం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అర్చకులు తొళక్క వాహనంపై ఉంచి విశేష పుష్పాలంకారాలు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపి, హారతులిచ్చారు. ఆ తర్వాత శ్రీవారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా తిరువీధులకు పయనమైంది. నాగర్సోల్కు చర్లపల్లిలో మాత్రమే స్టాప్ నరసాపురం: రెండు ప్రధాన ట్రైన్లు ఈ నెల 25 నుంచి సికింద్రాబాద్లో ఆపకుండా చర్లపల్లిలో మాత్రమే ఆపాలని నిర్ణయించింది. 12787, 12788 నరసాపూర్ –నాగర్సోల్ ఎక్స్ప్రెస్, 17231, 17232 నరసాపూర్ సూపర్ ఫాస్ట్ రైళ్లు ఈ నెల 25 నుంచి సికింద్రాబాద్లో ఆగకుండా చర్లపల్లి, మౌలాలి మీదుగా నడుస్తాయని నరసాపురం రైల్వేస్టేషన్ మేనేజర్ మధుబాబు చెప్పారు. చర్లపల్లిలో దిగి సికింద్రాబాద్కు రావాలంటే మళ్లీ వెనక్కి ప్రయాణించాలి. నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ద్వారా పెద్దసంఖ్యలో పగటిపూట హైదరాబాద్ ప్రయాణాలు చేస్తున్నారు. -
పోలీసుల దిగ్బంధంలో తణుకు
తణుకు అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనలో భాగంగా ఆంక్షలు, నిర్భంధాల మధ్య తణుకు పట్టణం వేడెక్కింది. శుక్రవారం పట్టణ ప్రాంతం పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. తణుకు రాష్ట్రపతి రోడ్డు, పెరవలి రోడ్డు, ఉండ్రాజవరం రోడ్డు, సొసైటీ రోడ్డుల్లో పోలీసుల భద్రత కట్టుదిట్టం చేశారు. నిరంతరం పోలీసు సైరన్లతో పట్టణ ప్రాంతం మార్మోగిపోయింది. తాడేపల్లిగూడెం, భీమవరం మున్సిపాలిటీల నుంచి పారిశుద్ధ్య కార్మికులను రప్పించి పారిశుద్ధ్య నిర్వహణ చేయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. గతంలో తణుకు ప్రాంతానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి హాజరైనప్పటికీ ప్రజలపై ఎలాంటి ఆంక్షలు, ఇబ్బందులు లేకుండానే పర్యటన నిర్వహించారు. నేడు ఇంత భద్రత, ఇన్ని రకాల ఆంక్షలు ఏంటనేది ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాష్ట్రపతి రోడ్డులో అడుగడుగునా పోలీసు అఽధికారులు, కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహిస్తుండగా పర్యవేక్షణకు ఉన్నతాధికారులు వాహనాల్లో తిరుగుతున్నారు. శనివారం చంద్రబాబు పర్యటన కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని విద్యాశాఖాధికారుల నుంచి ఆదేశాలివ్వగా, దుకాణదారులకు సైతం తమ దుకాణాలు మూసివేయాలని, సమావేశాలు నిర్వహించే ప్రాంతాల్లోని ఇళ్లలో సైతం కొత్త వారిని ఎవరినీ రానివ్వద్దని పోలీసులు ఆంక్షలు విధించడం ఆశ్చర్యం కలిగిస్తుందని ప్రజలు చెబుతున్నారు. శుక్రవారం తణుకులో సీఎం పర్యటన వ్యవహారాలకు సంబంధించి మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర ఎమ్మెల్యేలు పనులను పర్యవేక్షించారు. సీఎం పర్యటనతో ఎన్నడూ లేని విధంగా భద్రత పట్టణంలో అడుగడుగునా ఆంక్షలు -
కేసుల పరిష్కారానికి కృషి
ఏలూరు (టూటౌన్): ప్యానల్ న్యాయవాదులు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని డీఎల్ఎస్ఏ జిల్లా కార్యదర్శి కె.రత్నప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం ఏలూరు, భీమడోలు కోర్టుల పరిధిలో ప్యానల్ న్యాయవాదులతో ఆయన సమావేశం ఏర్పాటుచేశారు. న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత సేవలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని, న్యాయవిజ్ఞాన సదస్సు ల్లో పాల్గొని ప్రజలకు చట్టాలపై అవగాహన కలిగించాలని, సంక్షేమ పథకాలను పొందటానికి అర్హులైన వారికి అవసరమైతే న్యాయ సహాయాన్ని అందించాలని సూచించారు. ఆయా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. -
ప్రభుత్వంపై పోరు సాగించండి
నరసాపురం రూరల్: కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ ప్రజలకు అండగా నిలవాలని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించినట్టు ఆ పార్టీ ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పెండ్ర వీరన్న తెలిపారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జగన్మోహన్రెడ్డిని తాను కలిసిన సందర్భంలో పై విధంగా సూచించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడవక ముందే ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని, ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్కల్యాణ్ వంటి నేతలు ఇచ్చిన హామీల అమలు కోసం గట్టిగా డిమాండ్ చేయాలని జగన్ ఆదేశించారన్నారు. ప్రజలకు మంచి చేసే విషయంలో రాజీ లేని పోరాటం సాగించాలని సూచించారని, ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడవద్దని అభయమిచ్చారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేసిన మంచిని రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాయన్నారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, అధైర్య పడవద్దని, కార్యకర్తలు నాయకులు ఐక్యంగా ఉంటూ ప్రభుత్వంపై పోరు సాగించాలని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సూచించినట్టు వీరన్న తెలిపారు. -
రహదారి భద్రత.. అంతా మిథ్య !
దెందులూరు : జిల్లాలోని జాతీయ రహదారి (ఎన్హెచ్–16)పై ప్రయాణం ప్రమాదభరితంగా మా రింది. వాహనాల అతివేగాన్ని గుర్తించే స్పీడ్ గన్స్, వాహనాల డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేసే పరికరాలు పనిచేయకపోవడం, పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కరువవడం ప్రమాదాలకు కారణంగా కనిపిస్తున్నాయి. దీంతో దెందులూరు నియోజకవర్గంలోని జాతీయరహదారిపై ప్రమాదాలు అధికా రులకు పెను సవాల్గా మారాయి. బ్రీత్ అనలైజర్స్ పరీక్షలేవీ జిల్లాలో జాతీయ రహదారిపై మద్యం తాగి వాహనాలు నడిపే వారికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు జరగడం లేదు. రవాణాశాఖ అధికారుల వద్ద ఉన్న బ్రీత్ అనలైజర్స్ పనిచేయకపోవడమే ఇందుకు కారణం. పెద్ద ఖరీదు లేకపోయినా కనీసం బ్రీత్ అనలైజర్స్ను కూడా కూటమి ప్రభుత్వం సమకూర్చడం లేదనే విమర్శలు ఉన్నాయి. రంబల్ స్ట్రిప్స్ ఎక్కడ? జాతీయరహదారిపై వాహనాల వేగానికి కళ్లెం వేసే రంబల్ స్ట్రిప్స్ ఎక్కడా కనిపించడం లేదు. బ్రిడ్జిలు, టర్నింగ్ల వద్ద వీటిని ఏర్పాటుచేస్తే కొంతమేర వాహనాల వేగం తగ్గుతుంది. సిబ్బంది కొరత రవాణా శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. జిల్లాలో ఒక డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్, ఆర్టీఓ, ఏడుగురు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, 15 మంది అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. అయితే వీరికి సహాయకారిగా ఉండే కానిస్టేబుళ్లు ఒక్కరూ లేరు. సాధారణంగా ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు ఒక కానిస్టేబుల్ ఉండాలి. దీంతో ఎంవీఐ, ఏఎంవీఐలే రహదారి పర్యవేక్షణ పనులు చూస్తున్నారు. రవాణా చెక్పోస్టులు లేవు జిల్లాలో జాతీయ రహదారిపై రవాణా చెక్ పోస్టులు కూడా లేవు. గతంలో జిల్లాలో 16 వరకు చెక్పోస్టులు ఉండగా ప్రస్తుతం ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. ఎన్హెచ్పై రవాణా చెక్పోస్టులు ఉంటే వాహనచోదకులు జాగ్రత్తగా వెళతారని, మితిమీరిన వేగం తగ్గుతుందని పలువురు అంటున్నారు. టోల్గేట్ల వద్దే హైవే పెట్రోలింగ్ పోలీసులు హైవే పెట్రోలింగ్ పోలీసులు టోల్ప్లాజాలకే పరిమి తమవుతున్నారు. నిత్యం జాతీయ రహదారి వెంబ డి తిరుగుతూ ఎక్కడైనా వాహనాలు నిలిచిపోయి నా, ప్రమాదాలు జరిగినా వీరు సహాయక చర్యలు అందించాల్సి ఉంది. అయితే కొన్ని పెట్రోలింగ్ వా హనాలు టోల్గేట్ల వద్ద, మరికొన్ని చెట్ల కింద నిలిపి ఉంటున్నాయి. ఇలా భద్రతా లోపాలు, పర్యవేక్షణ లేమి, పరికరాల లోటుతో తరచూ ఎన్హెచ్పై ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పనిచేయని స్పీడ్ గన్స్, బ్రీత్ అనలైజర్స్ రవాణా శాఖలో సిబ్బంది కొరత రవాణా చెక్పోస్టులూ లేవు టోల్ప్లాజాలకే పరిమితమవుతున్న ఎన్హెచ్ పెట్రోలింగ్ వాహనాలు ఎన్హెచ్–16పై పర్యవేక్షణ కరువు గత ప్రభుత్వంలో పక్కాగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జాతీయ రహదారిపై స్పీడ్ గన్స్ పనిచేయడంతో పాటు వాటి పర్యవేక్షణకు డీఎస్పీ స్థాయి అధికారి ఉండేవారు. అతివేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి వాహన యజమానులకు జరిమానాలు పంపేవారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత స్పీడ్ గన్స్ పనిచేయడం లేదు. వీటి పర్యవేక్షణ కరువవడంతో జరిమానాల మాటేలేదు. దీంతో వాహనచోదకులు మితిమీరిన వేగంతో వెళుతూ ప్రమాదాల బారినపడుతున్నారు. ఈ ప్రాంతంలో నిబంధనల మేరకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి ఉండగా 120 కిలోమీటర్లకు మించి వేగంతో కొన్ని వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ప్రమాదాల నివారణకు సమష్టి కృషి జిల్లాలో ప్రమాదాల నివారణకు కృషిచేస్తున్నాం. ఆరు నెలల్లో పలు రకాల వాహనాలపై 15,105 కేసులు నమోదు చేసి రూ.9.26 కోట్లు అపరాధ రుసుంగా వసూ లు చేశాం. రవాణా శాఖలో సిబ్బంది కొరత ఉంది. తమ అధికారుల ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణకు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో 174 అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహించారు. ప్రమాదాల నివారణకు వాహనదారులు నిబంధనలు తప్పక పాటించాలి. జాతీయ రహదారులపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాం. – కరీం, జిల్లా రవాణా శాఖ కమిషనర్, ఏలూరు -
కోడ్ ముగిసినా తొలగని ముసుగులు
భీమవరం : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసిన అధికారులు ఎన్నికల కోడ్ ముగిసినా ముసుగులు మాత్రం తొలగించడం లేదు. గత నెలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించగా ఈనెల 4న ఫలితా లు వెల్లడయ్యాయి. కోడ్ ముగిసి రోజులు గడుస్తున్నా జిల్లాలోని పలు ప్రాంతాల్లో నాయకుల విగ్రహాలకు వేసిన ముసుగుల తొలగింపునకు అధికారులు చర్యలు తీసుకోలేదు. కొ న్నిచోట్ల ఫ్లెక్సీలకు వేసిన ముసుగులను ఆయా పార్టీల కార్యకర్తలే తొలగించుకున్నారు. 95.4 శాతం హాజరు భీమవరం : జిల్లావ్యాప్తంగా 52 కేంద్రాల్లో గురువారం నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ ప రీక్షలకు 95.4 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని డీఐఈఓ ఎ.నాగేశ్వరరావు తెలిపా రు. జనరల్ కేటగిరీలో 18,488 మందికి 642 మంది, ఒకేషనల్ కేటగిరీలో 1,754 మందికి 1,483 మంది హాజరయ్యారని చెప్పారు. ఎక్క డా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు. కవయిత్రి మొల్ల జయంతి భీమవరం (ప్రకాశంచౌక్) : స్థానిక కలెక్టరేట్లో గురువారం కవయిత్రి మొల్ల జయంతిని నిర్వ హించారు. జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు కవయిత్రి మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జి.గణపతి రావు, అధికారులు పాల్గొన్నారు. గృహ నిర్మాణాలు వేగిరపర్చాలి భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో మే నెలాఖరులోపు 6,319 గృహ నిర్మాణాలను పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ సీ హెచ్ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గృహ నిర్మా ణ శాఖ అధికారులతో గూగుల్ మీట్ ద్వారా ఆమె సమీక్షించారు. జిల్లాలో 9,107 నిర్మాణాలకు గాను ఇప్పటికీ 2,788 ఇళ్లను పూర్తి చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసీ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయాన్ని విడుదలకు ప్రభు త్వం మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. జి ల్లాలో ఎస్సీ లబ్ధిదారులు 5,593, ఎస్టీ లబ్ధిదారులు 385, బీసీ లబ్ధిదారులు 11,362 మొత్తంగా 18,340 మంది రూ.92.66 కోట్ల మేర లబ్ధి పొందనున్నారన్నారు. జిల్లా హౌసింగ్ అధికారి జి.పిచ్చయ్య, ఈఈ లు, డీఈలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నుంచి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి సస్పెన్షన్ ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు అసెంబ్లీ ని యోజకవర్గానికి చెందిన పిల్లంగోళ్ల శ్రీలక్ష్మిని వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం గు రువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. 17 నుంచి ఒంటి పూట బడులు ఏలూరు (ఆర్ఆర్పేట): వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా ఈనెల 17 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మ మ్మ ప్రకటనలో తెలిపారు. పాఠశాలలు ఉద యం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పనిచేస్తాయని, పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న చోట మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ తరగతులు నిర్వహిస్తారన్నారు. 15న ముఖ్యమంత్రి పర్యటన భీమవరం (ప్రకాశంచౌక్): తణుకులో ఈనెల 15న ఏర్పాటుచేసిన స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారాన్ని ‘స్వచ్ఛ ఆంధ్ర’ దినోత్సవంగా ప్రకటించి ప్రతి నెలా ఒక్కో జిల్లాలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటున్నారన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో పర్యటిస్తారన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం–పునర్వినియోగ వ స్తువులను ప్రోత్సహించండి అనే థీమ్తో త ణుకులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని కలెక్టర్ తెలిపారు. -
టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయ రామరాజుకు వినతిపత్రం సమర్పించినట్టు వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ బదిలీల కోసం చేసే చట్టంలో సర్వీస్ పాయింట్లు ఏడాదికి ఒకటి ఇవ్వాలని, యూపీ స్కూళ్లు, హైస్కూల్ ప్లస్లను యథాతథంగా కొనసాగించాలని కోరామని పేర్కొన్నారు. అలాగే కిలోమీటరు పరిధిలోని ప్రాథమిక పాఠశాలల నుంచి మా త్రమే మోడల్ ప్రైమరీ స్కూల్లోకి మూడు, నాలుగు, ఐదు తరగతులను విలీనం చేయా లని, మిగులు ఉపాధ్యాయులకు పాయింట్లు కేటాయించి బదిలీలకు అనుమతించాలని కోరామని తెలిపారు. ఎనిమిదేళ్లు కాకుండానే రేషనలైజేషన్కు గురయ్యే ఉపాధ్యాయులకు పూర్వ పా ఠశాల స్టేషన్ పాయింట్లు, సర్వీస్ పాయింట్, రేషనలైజేషన్ పాయింట్లు కేటాయించాలని కోరామని సుధీర్ తెలిపారు. -
పైసలిస్తేనే పనులు !
చాట్రాయి తహసీల్దార్ సస్పెన్షన్ అవినీతి ఆరోపణలపై కలెక్టర్ చర్యలు చాట్రాయి: అవినీతి ఆరోపణల నేపథ్యంలో చాట్రాయి తహసీల్దార్ డి.ప్రశాంతిని కలెక్టర్ వెట్రిసెల్వి గురువా రం సస్పెండ్ చేశారు. చాట్రా యి మండలంలోని సోమవరంలో రిజిస్ట్రేషన్ అటవీ భూములను మ్యూటేషన్ చేయడం, జనార్దనవరంలో వాగు పోరంబోకు, అసైన్డ్ భూమికి పట్టా ఇవ్వడంపై ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై కలెక్టర్ రెండుసార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చినా తహసీల్దార్ స్పందించలేదు. అలాగే త హసీల్దార్ అవినీతిపై సీఎం చంద్రబాబు వద్దకూ ఫిర్యాదు లు వెళ్లాయి. సొమ్ములు తీసుకోకుండా తహసీల్దార్ ఏపని చేయడం లేదని మండల ప్రజలు అంటున్నారు. వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులకు గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు కోరగా ఇవ్వనని, మంత్రి పార్థసారథిని వెళ్లి కలవాలనడం, గ్రావెల్ కోసం నరసింహరావుపాలెం పంచాయతీ తీర్మానం చేసినా అ నుమతులు ఇవ్వకపోవడం వివాదాస్పదమయ్యా యి. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ వారికి అనుమతులు ఇవ్వడం, వైఎస్సార్సీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు ఆమె కార్యాలయానికి వెళితే పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు వ్యకులు తహసీల్దార్కు షాడోలుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఏలూరు(మెట్రో) : ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అవినీతిమయం వెరసి ప్రజలకు ప్రభుత్వ సేవలు దూరమవుతున్నాయి. గ్రామస్థాయిలో సేవలందించాల్సిన అధికారులు అక్రమాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. గతంలో గ్రామ సచివాలయాల ద్వారా ఉన్న సమస్యల పరిష్కార వెసులుబాటు ప్రస్తుతం లేకపోవడం కొందరు అధికారులకు కల్పతరువుగా మారింది. జిల్లావ్యాప్తంగా 28 మండలాల పరిధిలో ఆయా తహసీల్దార్ కా ర్యాలయాల్లో భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. ఎక్కువగా మ్యూటేషన్లు పెండింగ్లో పెడుతూ ప్రజ ల నుంచి రెవెన్యూ అధికారులు సొమ్ములు వసూలు చేస్తున్నారు. భూ సంబంధిత తగాదాలు, కుల, ఆ దాయ ధ్రువీకరణ పత్రాల జారీకి ఇబ్బంది పెడుతున్నారు. దీంతో తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సి వస్తోంది. అవినీతి, సేవల జా ప్యంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తు తున్నాయి. తాజాగా అవినీతి ఆరోపణలతో చాట్రా యి తహసీల్దార్ డి.ప్రశాంతి సస్పెన్షన్కు గురికావడం రెవెన్యూ వర్గాల్లో ఉలికిపాటు కలిగించింది. ఇప్పటికే జీలుగుమిల్లిలో.. ఏజెన్సీ ప్రాంతమైన జీలుగుమిల్లి మండలంలో డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తూ ఇన్చార్జి తహసీల్దార్గా వ్యవహరించిన సందీప్గౌడ్ సై తం రెవెన్యూలో అక్రమాలకు తెరలేపారు. ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుల పరంపర కొనసాగడం, ఏజెన్సీ భూముల మ్యూటేషన్, రెవెన్యూ సమస్యల విషయాల్లో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడమే సందీప్ సస్పెన్షన్కు సైతం దారి తీసింది. గత ప్రభుత్వంలో పారదర్శకంగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ సచివాల యాల ద్వారా భూసమస్యల నుంచి జనన, మరణ, కులధ్రువీకరణ పత్రాల జారీ, భూముల రిజిస్ట్రేషన్ల వరకూ అవినీతికి తావులేకుండా సేవలందించే వారు. కూటమి ప్రభుత్వంలో సచివాలయాల ద్వా రా ఆయా సేవలు అందకపోవడంతో ప్రజలు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాల బాట పట్టాల్సి వస్తోంది. అక్కడ ప్రతి పనికీ పైసలివ్వాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రెవెన్యూ అధికారులు సొమ్ములు డిమాండ్ చేస్తున్నారంటూ ఉన్నతాధికారుల నుంచి ముఖ్యమంత్రి వరకు ఫిర్యాదులు చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో ముడుపులు వరుసగా బయటపడుతున్న అక్రమాలు చాట్రాయి తహసీల్దార్ సస్పెన్షన్తో ఉలికిపాటు -
ఫెర్రీ ఆదాయానికి కన్నం
సాక్షి, భీమవరం: నరసాపురం–సఖినేటిపల్లి ఫెర్రీ నిర్వహణను కారుచౌకగా కొట్టేసే పనిలో కూటమి నేతలు ఉన్నారు. 2025–26కి సంబంధించి ఫెర్రీ నిర్వహణకు ఈనెల 26న వేలం నిర్వహించనుండగా 2024–25 మాదిరి కాంట్రాక్టర్లను సిండికేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పశ్చిమగోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలను నరసాపురం రూరల్ మాధవాయిపాలెం–సఖినేటిపల్లి ఫెర్రీ రేవు చేరువ చేస్తుంది. వశిష్ట గోదావరికి అటు ఇటు ఉన్న రెండు రేవుల మధ్య పంటుల ద్వారా రోజూ అధిక సంఖ్యలో ప్రజలు, వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారు. ఏప్రిల్ నుంచి మార్చి నెలాఖరు వరకు రేవు నిర్వహణకు ఏటా అధికారులు బహిరంగ వేలం నిర్వహిస్తారు. వచ్చిన ఆదాయాన్ని నరసాపురం, సఖినేటిపల్లి మండల పరిషత్లకు చెందేలా రెండు జిల్లాలకు చెందిన అధికారులతో ఏర్పాటుచేసిన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) పర్యవేక్షిస్తుంది. నష్టాల పేరుతో స్కెచ్ గతేడాది మే నెలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా ఫెర్రీ బహిరంగ వేలం నిర్వహణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఫెర్రీలో రవాణా చార్జీలుగా ఒక మనిషికి రూ.20, వాహనంతో పాటు ఒకరికి రూ.35, సైకిల్తో పాటు ఒకరికి రూ. 20, కారుకు రూ.150, ఆటోకు రూ.100లు వసూలు చేస్తున్నారు. రోజుకు రూ.లక్షకు పైనే ఆదాయం వస్తుందని అంచనా. ఈ మేరకు గతేడాది వేలం ఆదాయం మరింత పెరుగుతుందని అంతా భావించారు. కాగా నష్టం పేరిట కూటమి నాయకులు ప క్కా స్కెచ్తో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. 2023–24లో వేలం ధర రూ.3,60,99,999కు రూపాయి జోడించి 2024–25కు సంబంధించి రూ.3.61 కోట్లు ప్రారంభ ధరగా నిర్ణయించి గతేడాది జూన్ 21న జేఏసీ వేలం నోటీసు ఇచ్చారు. తర్వాత జూలై 2, 11 తేదీల్లో నోటీసులు ఇచ్చారు. వేలానికి ఎవరూ రాలేదన్న సాకుతో ప్రారంభ ధరను రూ.2.97,83,217కు తగ్గించి ఆగస్టులో సీల్డ్ కవర్, బహిరంగ వేలం నిర్వహించారు. ప్రారంభ ధరకు అదనంగా రూ.16,791 మాత్రమే జోడించిన సొసైటీకి వేలం ఖరారు చేయించారు. 12 నెలల కాలానికి మొత్తం వేలం ధర రూ.2,98,00,008 కాగా అప్పటికే ఐదు నెలలు గడిచిపోవడంతో మిగిలిన ఏడు నెలలకు అయిన మొత్తాన్ని చెల్లించే అవకాశాన్ని పాటదారులకు కల్పించారు. ఈ వ్యవహారంలో రేవు నిర్వహణలో ఆరితేరిన కొందరు నేతలు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. వేలం సొసైటీ పేరున ఉన్నా నిర్వహణ అంతా వారి కనుసన్నల్లోనే జరుగుతుందంటున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభ ధరపై రూ.కోటికి పైగా హెచ్చు ధర రాగా ఇప్పుడు కేవలం రూ.వేలల్లో మాత్రమే వచ్చి నా అధికారులు ఆమోదించడం అనుమానాలకు తావిస్తోంది. రేవులో నష్టం వస్తుంటే గత ప్రభుత్వంలో మూడుసార్లు వేలం ధర అంత భారీగా ఎందుకు పెరిగిందన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. తక్కువ ధరకు దక్కించుకునేలా.. 2025–26కి సంబంధించి రేవు నిర్వహణకు ఈనెల 21న బహిరంగ, సీల్డ్ టెండర్ల పద్ధతిలో వేలం నిర్వహణకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. పాట ప్రారంభ ధర రూ.3.13 కోట్లుగా నిర్ణయించారు. ఈసారీ తక్కువ ధరకు వేలం దక్కించుకునే పనిలో కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా నిబంధనల మేరకే ఫెర్రీ వేలం నిర్వహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. నరసాపురంలో ఫెర్రీ రేవు సంవత్సరం ప్రారంభ ధర హెచ్చుపాట పెరిగిన మొత్తం (రూ.లలో) (రూ.లలో) (రూ.లలో) 2018–19 1,86,70,670 1,87,29,999 59,329 2019–20 1,90,00,000 1,90,09,999 9,999 2020–21 1,94,23,332 2,00,05,000 5,81,668 2021–22 కోవిడ్ కారణంగా అధికారుల పర్యవేక్షణలో నిర్వహణ 2022–23 1,78,99,644 2,79,99,999 1,01,00,355 2023–24 2,17,10,650 3,60,99,999 1,43,89,349 2024–25 2,97,83,217 2,98,00,008 16,791 ఫెర్రీ వేలం పంటు.. లాభాలు లేవంటూ.. నరసాపురం–సఖినేటిపల్లి ఫెర్రీలో కూటమి నేతల హవా గతేడాది ఆదాయానికి గండికొట్టిన వైనం 2025–26కి ఈనెల 21న వేలం మరలా తక్కువ ధరకు ఫెర్రీ దక్కించుకునే ప్రయత్నం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గణనీయంగా ఫెర్రీ ఆదాయం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భారీగా ఆదాయం 2019 మే నెలలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగా 2019–20కి గాను అప్పటికే టీడీపీ నాయకుల పర్యవేక్షణలో ఫెర్రీ వేలం జరిగిపోయింది. ఆ ఏడాది వేలం ప్రా రంభ ధరపై హెచ్చు ధర కేవలం రూ.9,999 మాత్రమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తొలిసారిగా 2020–21కి వేలం నిర్వహించారు. అప్పటివరకు ప్రారంభ ధరపై కేవలం వేలల్లో మాత్రమే ఉన్న హెచ్చు ధర మొదటిసారిగా రూ.5.82 లక్షలకు పెరిగింది. కరోనా నేపథ్యంలో 2021–22లో అధికారుల పర్యవేక్షణలో రేవు నిర్వహణ సాగింది. తర్వాత 2022–23కి జరిపిన వేలంలో ప్రారంభ ధరపై రూ.1.01 కోట్లు హెచ్చు ధర రాగా, 2023–24లో రూ.1.44 కోట్లు హెచ్చు ధర రావడం గమనార్హం. 2024–25కి సంబంధించి మార్చిలోపు వేలం నిర్వహించాల్సి ఉండగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆలస్యమైంది. -
అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసిన వ్యక్తిపై కేసు
ఏలూరు (టూటౌన్): ఏలూరు రూరల్ పరిధిలోని బీడీ కాలనీ చెరువుగట్టు పై ఎర్ర పూర్ణ కుమార్ అనే వ్యక్తి తన ఇంటిలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు సమాచారం అందుకున్న తంగెళ్లమూడి–2 సచివాలయ వీఆర్ఓ అతని ఇంటిపై దాడి చేసి 310 కేజీల రేషన్ బియ్యాన్ని గుర్తించి వాటిని సీజ్ చేశారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీజ్ చేసిన బియ్యం విలువ రూ.12,400 ఉంటుంది. రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని మహిళ మృతి మండవల్లి: మోటూరు రైల్వే స్టేషన్ నుంచి మండవల్లి రైల్వేస్టేషన్కు వెళ్లే దారిలో కిలోమీటరు నెంబరు 51–7–9 మధ్యలో ఓ గుర్తు తెలియన మహిళ మృతదేహాన్ని గురువారం ఆన్డ్యూటీ కీమెన్ గుర్తించాడు. రైలు నుంచి జారిపడి తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె మరణించినట్లు భావిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిస్తే 94407 96570కు ఫోన్ చేయాలని గుడివాడ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్సై తెలిపారు. -
రేపటి నుంచి ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్
భీమవరం: స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం నుంచి ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంటు నిర్వహిస్తున్నట్లు క్లబ్ ఉపాధ్యక్షుడు ఎం.సుబ్బరాజు, టోర్నమెంట్ డైరెక్టర్ యూఆర్పీఆర్ వర్మ చెప్పారు. క్లబ్ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. 15, 16 తేదీల్లో క్వాలిఫయింగ్ మ్యాచ్లు జరుగుతాయన్నారు. 17 నుంచి 21 వరకు ప్రధాన పోటీలు నిర్వహిస్తామన్నారు. కాస్మోపాలిటన్ క్లబ్, యూత్ కల్చరల్ అసోసియేషన్, ఎల్హెచ్ భీమవరం టౌన్హాల్, డీఎన్నార్ కళాశాల, ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణల్లోని టెన్నిస్ కోర్టుల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి 220 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారని . విజేతలకు రూ. 4 లక్షలు విలువైన బహుమతులు అందిస్తామన్నారు. 35, 45, 55, 65, 70,75 ఏళ్ల విభాగాల్లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో నిర్వహించే పోటీలకు వెర్టెక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ వి.వెంకట రాయవర్మ ప్రధాన సహకారం అందిస్తున్నారని తెలిపారు. సమావేశంలో ఏపీఎస్ టీపీఏ కార్యదర్శి ఎ.రాంబాబు, కేఆర్కే రాజు, క్లబ్ సెక్రటరీలు పీవీ రామరాజు, వీవీఎస్ఎస్ వర్మ తదితరులు పాల్గొన్నారు. -
దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు
నరసాపురం: పట్టణంలో ఓ తాళంవేసిన ఇంట్లో దొంగతనానికి పాల్పడిన కేసును పోలీసులు ఛేదించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామానికి చెందిన సిడగం కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రూ.5 లక్షలు విలువ చేసే 5.250 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి నరసాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నరసాపురం డీఎస్పీ డాక్టర్ బి.శ్రీవేద వివరాలు వెల్లడించారు. పట్టణంలోని స్టీమర్రోడ్డులో నివాసం ఉంటున్న యర్రాప్రగడ సుబ్బారావు ఈ ఏడాది జనవరి 31న ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లాడు. అయితే ఈ నెల 3న సుబ్బారావు కుమారుడు వరుసయ్యే కార్తీక్ ఇంటికి వెళ్లి చూసి తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గమనించి ఫోన్ ద్వారా సుబ్బారావుకు తెలిపాడు. దీంతో బంధువులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఇనుప బీరువాలోనూ, పూజ గదిలోనూ ఉంచిన వెండి వస్తువులు దొంగిలించుకుపోయారని గుర్తించి పోలీసుకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని అరెస్ట్ చేశామని డీఎస్పీ శ్రీవేద తెలిపారు. అతనిపై పలు జిల్లాల్లో 15కు పైగా దొంగతనం కేసులు ఉన్నాయని చెప్పారు. కుమార్తో పాటు కలిపి దొంగతనం చేసిన విజయవాడకు చెందిన ఉయ్యాల నరేష్, అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన రేలంగి కృష్ణబాబు పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుడి నుంచి వెండి వస్తువులతో పాటు హైదరాబాద్లో చోరీ చేసిన పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. సీఐ బి.యాదగిరి, ఎస్సైలు సీహెచ్ జయలక్ష్మి, ఎస్ఎన్ ముత్యాలరావు పాల్గొన్నారు. -
గోవుల అక్రమ రవాణా అడ్డగింత
కుక్కునూరు: ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న గోవులను స్థానికులు పట్టుకుని వెటర్నరీ సిబ్బందికి అప్పగించారు. వివరాల ప్రకారం ఛత్తీస్ఘడ్, ఒరిస్సా ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన గోవులను కొందరు గురవారం ఉదయం వింజరం రేవు వద్ద గోదావరి దాటించి తీసుకెళ్లడాన్ని గమనించిన స్థానికులు విలేకరులకు, వెటర్నరీ ఏడీకి సమాచారం అందించారు. వెంటనే ఆ శాఖ సిబ్బంది వచ్చి తనిఖీ చేసి ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో గోవులను బందెలదొడ్డికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయమై బీజేపీ, విశ్వహిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ గోవుల అక్రమ రవాణాకు కుక్కునూరు మండలం రాజమార్గంలా తయారైందని విమర్శించారు. అధికారులు గోవులను తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో రోడ్డు ప్రమాదం జంగారెడ్డిగూడెం: పట్టణంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ద్వారకాతిరుమల నుంచి గోపాలపురం వెళుతున్న కారు పట్టణంలోని బుట్టాయగూడెం రోడ్డులో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న వ్యక్తి సీటు బెల్టు ధరించి ఉండడంతో కారులో బెలూన్లు తెరుచుకోవడంతో కారులోని వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. అలాగే ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో సదరు ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో విద్యుత్ స్థంభం విరిగి కింది పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. స్వర్ణలతకు సూపర్ ఉమెన్ అవార్డు పాలకోడేరు: సెయింట్ జాన్స్ వెల్ఫేర్ సొసైటీ అధినేత డాక్టర్ డీఆర్ స్వర్ణలతకు ‘ఝాన్సీ లక్ష్మీబాయి సూపర్ ఉమెన్–2025’ అవార్డు వరించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో గురువారం హైదరాబాద్లోని రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో కొమ్మూరి చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ కె.శ్రీనివాస్, సరస్వతి ఉపాసకులు శ్రీ దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా ఈ అవార్డు ను అందుకున్నట్లు ఆమె స్థానిక విలేకరులకు ఫోన్లో తెలిపారు. గత 25 సంవత్సరాలుగా సమాజానికి తాను చేస్తున్న సేవను గుర్తించి ఈ అవార్డు ఇచ్చారని ఆమె వివరించారు. -
తలరాతను మార్చే చేతిరాత
భీమడోలు: చేతిరాత తలరాతను మార్చుతుంది అనే నానుడి అక్షర సత్యం అవుతుందని నిపుణులు చెబతున్నారు. గతంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు ఉత్తరాలపై ఆధారపడేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుత రోజుల్లో యువత ఎక్కువగా స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్నారు. దీంతో చేతిరాతపై ఆసక్తి సన్నగిల్లుతుంది. అయితే జీవితానికి కీలకమైన పదో తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచి జరగున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి చేతిరాత కీలకంగా మారనుంది. ముత్యాల్లాంటి దస్తూరితో ఉపాధ్యాయులను మెప్పిస్తే మంచి మార్కులు సొంతమవుతాయని చేతిరాత నిపుణులు చెబుతున్నారు. ఏడాది పాటు కష్టపడి చదివినా పరీక్షల్లో అందమైన చేతిరాతతో సమాధానాలు రాస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో చేతిరాత నిపుణులు విద్యార్థులకు పలు సూచనలు చేస్తున్నారు. నిపుణుల సూచనలివే ● విద్యార్థులు రివిజన్ సమయంలో చేతిరాతపై దృష్టి పెట్టాలి. ● పరీక్ష రాసే సమయంలో కాగితంపై మరీ ఒత్తిపెట్టి రాయకూడదు. ఇలా చేస్తే ఇది వేగంపై ప్రభావం చూపుతుంది. ● సున్నా, నిలువు గీతాలపై సాధన చేయాలి. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ఆపసవ్య దిశలో, హిందీలో సవ్యదిశలో రాయడం మంచిది. ● బుక్లెట్లో కుడి, ఎడమల్లో కొంత మార్జిన్ వదిలి రాయాలి. పేజీకి ఇరవై లైన్లు మించి రాయకూడదు. ● పదాలు రాసేటప్పుడు మొదటి అక్షరం పెద్దగా ఉండాలి. ఇంగ్లీషు పదాలు మూడు మిల్లీ మీటర్లు, హిందీ, తెలుగు అక్షరాలు నాలుగు మిల్లీ మీటర్లు పొడవు ఉండేలా రాస్తే అక్షరాలు ముత్యాల్లా ఉంటాయి. ● పదానికి పదానికి మధ్య దూరం ఒక అక్షరం ఉండాలి. రాసే కొద్దీ అక్షరాల ఆకారం మారిపోకూడదు. అందంగా రాస్తూనే వేగం పెంచి రాయాలి. ● రాసే తరుణంలో కూర్చునే భంగిమ, పెన్ను పె ట్టుకునే విధానం, రాసే విధానం ఒకేలా ఉండాలి. ● తెలుగులో అక్షరాలు గుండ్రంగా ఉండాలి. ఇంగ్లీషులో చక్కని స్ట్రోక్స్తో కొద్దిగా వాలు కలిగి అందమైన ఆకారం రాయాలి. ● కుడి చేత్తో రాసే వారు పేపర్, బుక్లెట్ను కాస్త ఎడమ వైపునకు, ఎడమ చేత్తో రాసేవారు కుడి వైపునకు వంచి రాయాలి. ● ముఖ్యంగా వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకోవాలి. ఆంగ్లంలో స్పెలింగ్లు తప్పులు లేకుండా ఉండాలి. పరీక్షా ముగింపు సమయానికి 5, 10 నిమిషాల ముందు పూర్తి అయ్యేలా ప్రణాళిక చేసుకోవాలి. ● అర్థవంతమైన పదాలను విడగొట్టకుండా చూసుకోవాలి. కొట్టి వేతలు లేకుండా జాగ్రత్త పడాలి. అందమైన దస్తూరితో అధిక మార్కులు విద్యార్థులకు ప్రత్యేక సూచనలిస్తున్న ఉపాధ్యాయులుతప్పులు లేకుండా చూసుకోవాలి పరీక్ష రాసే విద్యార్థులు భయం, ఒత్తిడి లేకుండా పొందుగ్గా అక్షరాలు రాయడంపై దృష్టి సారించాలి. క్వశ్చన్ పేపర్లో బాగా వచ్చిన ప్రశ్నకు సమాధానం రాయాలి. రాసే తరుణంలో తప్పులు లేకుండా చూసుకోవాలి. ఇచ్చిన బుక్లెట్లో పేజీలన్నీ రాస్తే మంచిది. దస్తూరితోనే అదనంగా మార్కులు పొందుతారు. చిన్న అక్షరాలు కంటే పెద్ద అక్షరాలు రాయండి. – పొత్తూరి కృష్ణంరాజు(వాసు) చేతిరాత నిపుణుడు, నారాయణపురం సమయాన్ని వృథా చేసుకోవద్దు పరీక్షా పేపర్ను చదివిన తర్వాత బాగా వచ్చిన ప్రశ్నకు సమాధానం రాయాలి. తొందర పడొద్దు. కష్టమైన ప్రశ్న రాయడానికి సిద్ధపడి సమయాన్ని వృథా చేసుకోవద్దు. మనోధైర్యాన్ని కోల్పోతే భయం, ఒత్తిడి పెరుగుతంది. ఇంగ్లీషు గ్రామర్ పాయింట్లు, లెక్కలల్లో ఫార్ములాలు, సోషల్లో మ్యాప్లు, సైన్సులో డయాగ్రామ్లు వేయాలి. దస్తూరి బాగుండి.. చక్కగా ప్రజెంటేషన్తో అదనపు మార్కులు సాధిస్తారు. – ఈదుపల్లి శ్రీనివాసరావు, ఎంఈఓ, భీమడోలు -
జన్యు ఎడిటింగ్ ద్వారా కొత్త వంగడాల అభివృద్ధి
తాడేపల్లిగూడెం: జన్యు ఎడిటింగ్ పద్ధతి ద్వారా అధిక నిల్వ సామర్థ్యం, మెరుగైన నాణ్యతా ప్రమాణాలు కలిగిన పండ్లు, పువ్వులు, కూరగాయలకు సంబంధించి కొత్త వంగడాలను (జాతులను) అభివృద్ధి చేయవచ్చని పీజీపీఆర్ ఆసియా సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎంఎస్ రెడ్డి చెప్పారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో గురు వారం సంయుక్త ఆధ్వర్యంలో ‘అన్యదేశ పంటలు– హైబ్రిడ్, హరిత భవిష్యత్ కోసం ప్రపంచ వాణిజ్యం, సుస్థిర సాంకేతికతలు’ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. వర్సిటీ ఉపకులపతి డాక్టర్ కె.గోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిఽథిగా విచ్చేసిన డాక్టర్ ఎంఎస్ రెడ్డి విదేశీ కూరగాయల సాగుతో ఇక్కడి రైతులు అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఉపకులపతి డాక్టర్ కె.గోపాల్ మాట్లాడుతూ అవకాడో, డ్రాగన్ ఫ్రూట్, రాంభూటాన్, అబ్లు, ఫ్యాషన్ ఫ్రూట్, ఫిగ్, మాంగోస్టీన్, లిచ్చి, దురైన్, స్టార్ ప్రూట్ వంటి విదేశీ పండ్లు, ఆర్బిడ్స్, డైసీ. డాఫోడిల్ , లోటస్, తులిప్, లిసియాంతుస్, హైబిస్కుస్, అమరిల్లస్, ఆడినియం, వంటి విదేశీ పుష్పాలు, బ్రకోలీ, చెర్రీటమాటో, పర్సేలీ, యూరోపియన్ క్యారోట్, క్యాప్సికం, రమనేస్కో కాలిఫోవర్, రాడిష్, ఓకా వంటి విదేశీ కూరగాయలు మన రాష్ట్రంలో సాగుచేస్తే రైతులు మంచి ఆదాయం పొందవచ్చన్నారు. ఇలా సాగు చేయడం ద్వారా దిగుమతులు తగ్గి విదేశీ మారకం నిలిచి ఉంటుందన్నారు. స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా వ్యవసాయానికి , ఉద్యానానికి అఽధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారన్నారు. ఈ క్రమంలో అన్యదేశ పంటలను ప్రోత్సహించేందుకు పీజీపీఆర్ ఆసియా సొసైటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఈ సదస్సులో వర్చువల్గా వియత్నాం ప్రొఫెసర్ నోగ్యన్ థాయ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ కె.సురేష్, జాతీయ ఉద్యానపరిశోధనా స్థానం కో–ఆర్డినేటర్ డాక్టర్ ప్రకాష్ పాటిల్ తమ అభిప్రాయాలను తెలిపారు. జీవవైవిధ్యం, ఆహార భద్రతను పెంపొందించడానికి అన్యదేశ పంటలు అనే విషయంపై ఐఐహెచ్ఆర్ సైంటిస్టు జి.కరుణాకరన్ మాట్లాడారు. పీజీపీఆర్తో ఒప్పందం వల్ల ఉద్యానవర్సిటీ శాస్త్రవేత్తలకు, పరిశోధన చేసే విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు సాంకేతిక సహకారం, ఆసియా సొసైటీ అందిస్తుందని వీసీ గోపాల్ తెలిపారు. ఈ ఒప్పందంతో కలిపి ఇప్పటి వరకు 82 ఒప్పందాలు చేసుకున్నామని సదస్సు కన్వీనర్, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీయల్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ కె.ధనుంజయరావు చెప్పారు. గురువారంతో ఈ సదస్సు ముగిసిందని పేర్కొన్నారు. డాక్టర్ ఎంఎస్ రెడ్డి సూచన -
నేటి నుంచి గుబ్బల మంగమ్మ జాతర
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ జాతర మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ కమిటీ పూర్తి చేసింది. అమ్మవారికి ముఖ్యమైన రోజుగా చెప్పుకునే శుక్రవారంతో పాటు మూడో రోజు ఆదివారం రావడంతో లక్షలాది మంది భక్తులు జాతర పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ జాతర మహోత్సవాల్లో పూర్తిగా గిరిజన సాంప్రదాయ పద్ధతిలోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్సై దుర్గామహేశ్వరరావు చెప్పారు. రెడ్డి గణపవరంలో దుర్గమ్మతల్లి ఉత్సవాలు మండలంలోని రెడ్డిగణపవరంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఐదురోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించి ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. కనకదుర్గమ్మ జాతర నేపథ్యంలో బుట్టాయగూడెం నుంచి జీలుగుమిల్లి వెళ్లే భారీ వాహనాలు జంగారెడ్డిగూడెం మీదుగా, జీలుగుమిల్లి నుంచి బుట్టాయగూడెం వచ్చే వాహనాలను జంగారెడ్డిగూడెం మీదుగా దారి మళ్లించినట్లు ఎస్సై తెలిపారు. -
ఆకాశవాణి జాతీయ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు
బుట్టాయగూడెం/జంగారెడ్డిగూడెం: విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో మహాత్మాజ్యోతిరావు పూలే జీవిత చరిత్రను కంజర కథగా ఆలపిస్తూ గురువారం రికార్డింగ్లో చేసినట్లు జంగారెడ్డిగూడేనికి చెందిన చిలుకూరి సుబ్బయ్యాచారి తెలిపారు. తనకు బుట్టాయగూడేనికి చెందిన ప్రముఖ డోలక్ కళాకారుడు పెనుగుర్తి సోంబాబు,, పాళ్లూరి ఏసురత్నం హార్మోనియం ద్వారా సహకారం అందించడంతో ఆల్ ఇండియా రేడియో బృందం రికార్డింగ్ చేశారని చెప్పారు. ఫూలే జీవితచరిత్ర ఆధారంగా సుబ్బయ్యాచారి చెప్పే కంజరకథ భారతదేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో ఒకే రోజు, ఒకే సమయానికి ప్రసారం జరగనుంది. ఈ కార్యక్రమం అనంతరం రేడియో స్టేషన్ డైరెక్టర్ చుండూరి శ్రీనివాస్, జయప్రకాష్లు తమ బృందాన్ని అభినందించి శాలువాలతో సత్కరించారని వివరించారు. -
పెద్దింట్లమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
కై కలూరు: మండలంలోని కొల్లేటికోట శ్రీపెద్దింట్లమ్మ ఉత్సవాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో అమ్మవారి ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. ఉత్సవాల సందర్భంగా అర్చకులు ఉదయం నుంచి అమ్మవారికి వివిధ వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు అయిభీమవరం గ్రామానికి చెందిన గొట్టుముక్కల వెంకటసత్యనారాయణరాజు, సుబ్బలక్ష్మి దంపతులు, పొత్తూరి సురేష్రాజు, శ్రీలత దంపతులు ఉచితంగా ప్రసాద వితరణ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కై కలూరుకు చెందిన శ్యామలా నాటక కళా అకాడమీ నిర్వాహకురాలు కురేళ్ళ లక్ష్మీజ్యోతి శిష్యబృందం కూచిపూడి భరతనాట్య ప్రదర్శన ఇచ్చింది. ఏర్పాట్లను ఆలయ ఈఓ కూచిపూడి శ్రీనివాసు పర్యవేక్షించారు. ఇరువర్గాల దాడిలో ఏడుగురికి గాయాలు జంగారెడ్డిగూడెం: ఓ పొగాకు బ్యారన్ విషయంలో తలెత్తిన వివాదానికి సంబంధించి ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడానికి చెందిన ఒక వర్గానికి సంబంధించిన తొమ్మిదేళ్ల వెంకటరత్నం, తొమ్మిదేళ్ల వీరభద్రరావు, తొమ్మిదేళ్ల నరసింహారావు, తొమ్మిదేళ్ల సూర్యచంద్రరావులు, మరో వర్గానికి చెందిన ధనేకుల తరుణ్కుమార్, ధనేకుల చల్లారావు, డెక్కం నాగరాజు ఒకరిపై ఒకరు గురువారం రాత్రి కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఏడుగురికి తలలపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వీరంతా చికిత్స కోసం స్థానిక ఏరియా ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో వీరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వంచనపై గర్జన
వైఎస్సార్సీపీ ‘యువత పోరు’ విజయవంతం సాక్షి, భీమవరం/భీమవరం: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్తో పేదల చదువుకు ప్రోత్సాహం అందిస్తామని చేసిన వాగ్దానాలను విస్మరించి దగాకోరు పాలన సాగిస్తున్న కూటమి సర్కారుపై ప్రజలు, విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. కూటమి పాలనలో దగాపడిన నిరుద్యోగ యువత, విద్యార్థుల పక్షాన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చిన ‘యువత పోరు’కు అనూహ్య స్పందన వచ్చింది. జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, ఆచంట, ఉండి, భీమవరం నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు జిల్లా కేంద్రమైన భీమవరం తరలివచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు నేతృత్వంలో పట్టణంలోని విస్సాకోడేరు వంతెన నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు మెగా డీఎస్సీ నిర్వహించాలని, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని, నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, తల్లికి వందన, విద్యా, వసతి దీవెన ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ గేటు వద్ద జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు, మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జి గూడూరి ఉమాబాల తదితరులు ప్రసంగించారు. అనంతరం కలెక్టరేట్లో డీఆర్ఓ మొగలి వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఉండి, పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జిలు పీవీఎల్ నర్సింహరాజు, గూడాల శ్రీహరిగోపాలరావు(గోపి), నరసాపురం మున్సిపల్ చైర్పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ, పార్టీ జిల్లా అధికారప్రతినిధి కామన నాగేశ్వరరావు, మాలమాహానాడు జాతీయ అధ్యక్షుడు చీకలిమిల్లి మంగరాజు, సోషల్మీడియా జిల్లా కన్వీనర్ బంధన పూర్ణచంద్రరావు, జిల్లా యువత అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, పార్టీ నేతలు చినమిల్లి వెంకట్రాయుడు, పెండ్ర వీరన్న, చెల్లెం ఆనందప్రకాష్, గుణ్ణం నాగబాబు, మద్దా చంద్రకళ, కర్రా జయచరిత, చెరుకూరి కుమారదత్తాత్రేయవర్మ తదితరులు పాల్గొన్నారు. ●ప్రజల పక్షాన పోరుబాట ఆరు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేడు రైతులు, మహిళలు, విద్యార్థులను రోడ్డు మీద నిలబెట్టారు. రైతులు, విద్యుత్ చార్జీల పెంపుతో నష్టపోతున్న వినియోగదారుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేసింది. ఇప్పుడు నిరుద్యోగ యువత, విద్యార్థులకు అండగా నిలబడుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెనకు ఒక్క రూపాయి జమ చేయలేదు. అమ్మ ఒడిని పూర్తిగా ఆపేశారు. మా ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేసి ఐదింటిని ప్రారంభించాం. మిగిలిన వాటి పనులు ముందుకు సాగకుండా కూటమి ఆపేసింది. వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన, నిరుద్యోగభృతి అందించేందుకు చర్యలు చేపట్టాలి. – ముదునూరి ప్రసాదరాజు, జిల్లా అధ్యక్షుడు విద్యార్థులను రోడ్డున పడేశారు కూటమి ప్రభుత్వం అబద్దపు హామీలతో పేద విద్యార్థుల చదువులను రోడ్డు మీదకు తెచ్చింది. కళాశాలలకు ఫీజులు కట్టలేక విద్యార్థులు చదువులు మధ్యలో ఆపేసి మట్టి పనులకు వెళ్లాల్సిన దుస్థితి. వైఎస్సార్సీపీ తెచ్చిన మెడికల్ కళాశాలల నిర్మాణాలను కూటమి అసంపూర్తిగా ఆపేసింది. 20 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ. మూడు వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. – కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రి తల్లికి వందనమని వంచించారు తల్లికి వందనం ఇస్తామని చెప్పి వంచించారు. గత బడ్జెట్లో రూ.5 వేల కోట్లు చూపించి చివరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఏ గ్రామం వెళ్లినా యువత కూటమి ప్రభుత్వం మమ్మల్ని వెన్నుపోటు పొడిచి, నట్టేట ముంచారని ఆవేదన చెందుతున్నారు. 750 మెడికల్ సీట్లు వద్దని లేఖరాసిన ఏకై క సీఎం చంద్రబాఋ. ఇప్పటికై నా కళ్లు తెరిచి పేద విద్యార్థులు, యువతకు న్యాయం చేయాలి. – కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రిహామీలను గాలికొదిలేశారు ఫీజు రీయింబర్స్మెంట్తో ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. తండ్రిని మించి తనయుడిగా మాజీ సీఎం జగనన్న నాడు–నేడు, విద్యా, వసతి, విదేశీ విద్యా దీవెనలతో పేదల ఉన్నతికి ఎంతో తోడ్పాటును అందించారు. అధికారం ఉన్నా లేకపోయినా వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల సంక్షేమానికి పాటుపడుతుంది. నేటి బాలలే రేపటి పౌరులని వారి చక్కటి భవిష్యత్కు మాజీ సీఎం జగనన్ బాటలు వేశారు. – గూడూరి ఉమాబాల, నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జి కదంతొక్కిన పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకుని నిరసన ఫీజు బకాయిలు విడుదల చేయాలి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ -
సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలి
భీమవరం: రైతులు అధిక ఆదాయం పొందేందుకు పూల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. బుధవారం భీమవరం పట్టణం ఆనంద ఇన్లోఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పూలసాగు–ఉద్యాన విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన సదస్సు, రైతులకు శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఎక్కువ నీటి నిల్వలు ఉన్న ప్రాంతాలను గుర్తించి పూల్ మకాన్ సాగుపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని పెనుగొండ, సిద్ధాంతం ప్రాంతాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారని, జిల్లాలో పువ్వుల సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించి రైతులను అవగాహన కల్పించి ప్రోత్సహించాలన్నారు. రైతులు అధిక ఆదాయం వచ్చే ఉద్యాన పంటల వైపు పంట మార్పిడి చేయాలన్నారు. పాలీహౌస్ నిర్మాణానికయ్యే ఖర్చులో 50 శాతం రాయితీగా గరిష్టంగా ఎకరానికి రూ.16 లక్షల రాయితీ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో కేవీకే హెడ్ డాక్టర్ మల్లికార్జున్, డైరెక్టర్ ఆఫ్ ఫ్లోరికల్చర్ డాక్టర్ డీవీఎస్ రాజు, తదితరులు పాల్గొన్నారు. ఏరియా ప్రభుత్వ ఆస్పత్రి పరిశీలన భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిని బుధవారం కేంద్ర బృందం పరిశీలించింది. టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర వైద్య బృంద సభ్యులు డాక్టర్ నీరదా, డాక్టర్ సందీప్ భీమవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని టీబీ విఽభాగం, ఆస్పత్రిలోని ల్యాబ్లు, వార్డులు తదితర వాటిని పరిశీలించారు. టీబీకి సంబంధించి ఆస్పత్రి వైద్యులకు, సిబ్బందికి పలు అంశాలపై అవగహన కల్పించారు. నేడు ఉద్యాన వర్సిటీలో అంతర్జాతీయ సదస్సు తాడేపల్లిగూడెం: వెంకట్రామన్నగూడెం వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో గురువారం అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ కే.గోపాల్ బుధవారం వివరాలు వెల్లడిస్తూ.. వివిధ దేశాల్లో విస్తృతంగా సాగు చేస్తున్న ఉద్యాన పంటలు, దేశంలోని భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో సాగు చేయడానికి అనుకూల అంశాల గురించి ఈ సదస్సులో అధ్యయనం చేస్తారన్నారు. వివిధ దేశాల శాస్త్రవేత్తలతో చర్చించి, ఉద్యాన, వాణిజ్య పంటలు మన రాష్ట్రంలో సాగుచేయడానికి వీలుగా తగిన పద్ధతులు రూపొందించేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. వియత్నాం, శ్రీలంక, అమెరికా తదితర దేశాలకు చెందిన ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఆన్లైన్ విధానంలో పాల్గొంటారన్నారు. బెంగళూరు జాతీయ ఉద్యాన పరిశోధనా సంస్ధ శాస్త్రవేత్తలు సదస్సులో పాల్గొంటారన్నారు. అమెరికాలోని అబర్న్ విశ్వవిద్యాలయంలో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ప్రఖ్యాత ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.ఎస్.రెడ్డి ముఖ్య సందేశం ఇస్తారన్నారు. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు భీమవరం: జిల్లాలోని 52 పరీక్షా కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ పరీక్షకు 15,296 మందికి 14,831 మంది విద్యార్థులు హాజరుకాగా, ఒకేషనల్ పరీక్షకు 1,543 మంది విద్యార్థులకు 1,442 మంది హాజరయ్యారని డీఐఈవో ఎ నాగేశ్వరరావు తెలిపారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదుకాలేదు. నిధుల దుర్వినియోగం కేసులో ఇద్దరి అరెస్టు భీమవరం: భీమవరం మండలం చినఅమిరం, రాయలం గ్రామ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం కేసుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు భీమవరం టూటౌన్ పోలీసులు తెలిపారు. రెండు పంచాయతీల్లో గతంలో పంచాయతీ కార్యదర్శులుగా పనిచేసిన సాగిరాజు కిషోర్కుమార్రాజు, దున్న జయరాజు కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసినట్లు జిల్లా ఉన్నతాధికారుల విచారణలో తేలడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు విచారణ చేసి కిషోర్కుమార్రాజు, జయరాజును బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఆంధ్రా సుగర్స్లో భద్రతా నియమాలు భేష్
తణుకు అర్బన్: ప్రభుత్వం నిర్ధేశించిన సున్నా ప్రమాదాల లక్ష్యాన్ని సాధించాలంటే కార్మికులంతా విధిగా భద్రతా నియమాలను పాటించాలని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె.శ్రీనివాసరావు పేర్కొన్నారు. వెంకటరాయపురంలోని ది ఆంధ్రా సుగర్స్ లిమిటెడ్ సంస్థలో బుధవారం నిర్వహించిన 54వ జాతీయ భద్రతా వారోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిబంధనలను పాటిస్తూ గతేడాదిలో ఒక్క ప్రమాదం కూడా జరగకుండా చర్యలు తీసుకున్న ఆంధ్రా సుగర్స్ యాజమాన్యాన్ని అభినందించారు. వారోత్సవాల్లో భాగంగా శ్రీతిమ్మరాజు స్కూల్స్, శ్రీముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఇనస్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ బి.రామకృష్ణ, పరిశ్రమ భద్రతా అధికారి ఎంఎస్వీవీ రామకృష్ణ, జనరల్ మేనేజరు (హెచ్ఆర్) ఎ.సాంబశివరావు పాల్గొన్నారు.