West Godavari District Latest News
-
వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో జిల్లా నేతలు
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జిల్లా నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు వడ్డి రఘురాం (తాడేపల్లిగూడెం), గుడాల గోపి (పాలకొల్లు), చినమిల్లి వెంకటరాయుడు (భీమవరం), ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, వంక రవీంద్రనాథ్ హాజరయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. – సాక్షి అమరావతి -
నూరు శాతం లక్ష్యాలు సాధించాలి
భీమవరం : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను నిర్దేశిత లక్ష్యాల మేరకు నూరు శా తం సాధించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బడి పిలుస్తోంది కార్యక్రమంపై సమీక్షించారు. మండల ప్రత్యేక అధికారులు శ్రద్ధ చూపాలని, గతేడాది కంటే 10 శాతం అధికంగా విద్యార్థుల చేరికలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలంలో ఐదేళ్లు పైబడిన పిల్లల్లో కనీసం 55 శాతం మంది 1వ తరగతిలో చేరేలా చూడాలని తెలిపారు. డీఈఓ ఈ.నారాయణ, సమగ్ర శిక్ష ఏపీసీ పి.శ్యాంసుందర్, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. భీమవరం : జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి 425 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా యలమంచిలి మండలంలో 80.4 మి.మీ వర్షం కురిసింది. తణుకులో 2.4, భీమవరంలో 8.6, నరసాపురంలో 65.6, పాలకొల్లులో 60.2, అత్తిలిలో 3.2, గణపవరంలో 2.8, పాలకోడేరులో 36.4, పెనుమంట్రలో 22.6, ఇరగవరంలో 10.6, పెనుగొండలో 2.8, ఆచంటలో 15.2, పోడూరులో 26.2, వీరవాసరంలో 50, మొగల్తూరులో 38.2 మి.మీ వర్షపాతం నమోదైంది. భీమవరం : ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) జిల్లా కమిటీని స్థానిక పొట్టి శ్రీరాములు బాలికల మున్సిపల్ హైస్కూల్లో బుధవారం ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా బి.దుర్గాప్రసాద్, జిల్లా అధ్యక్షుడిగా పీవీఎస్ఎస్బీ రమణారావు, ప్రధాన కార్యదర్శిగా ఎం.హరికృష్ణ, అసోసియేట్ అధ్యక్షుడిగా పి.నాగరాజు, అదనపు కార్యదర్శిగా వే మూరి శ్రీవల్లి, ఉపాధ్యక్షులుగా టి.ఆనంద్ప్రసాద్, ఏఎన్వీ సుభాషిణి, కె.గంగరాజు, పి. రాజేశ్వరరావు, జిల్లా కార్యదర్శులుగా కొల్లాబత్తుల జాన్ మోజెస్, బి.పుణ్యవతి, డి.తిరుమలేశ్వరి, వి.దుర్గ, సీహెచ్ఎన్ఆర్ఎల్ కుమారి, ఎ.అన్నపూర్ణ, జి.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిలర్గా పీవీఎస్ఎస్బీ రమణారావును ఎన్ను కున్నారు. ఎన్నికలకు అధికారిగా రాష్ట్ర కార్యదర్శి ఎ.ఉదయ బ్రహ్మం వ్యవహరించారు. నూతన జిల్లా కౌన్సిల్ ప్రమాణ స్వీకారం అనంతరం జిల్లా అధ్యక్షులు రమణారావు మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్ట్లో కేంద్ర మట్టి, పదార్థాల పరిశోధనా సంస్థ (సీఎస్ఎంఆర్ఎస్) బృందం బుధవారం రెండో రోజు పరీక్షలు నిర్వహించింది. గురువారం కూడా పరీక్షలు కొనసాగనున్నాయి. బృంద నిపుణు లు సిద్దార్థ్ పి.హెడవూ, శ్రీహరి టి.నాయర్, గౌరవ్ పాండే గ్యాప్–2 ప్రాంతంలో 14 పరీక్ష లు నిర్వహించారు. గ్యాప్–2లో వాడిన మట్టి లో తేమ శాతం, పటుత్వం, రాతిని పరిశీలించా రు. వీరి వెంట జలవనరుల శాఖ డీఈలు డి.శ్రీనివాస్, శ్రీకాంత్, విజయ్కుమార్, ఎంఈఐ ఎల్ ప్రాజెక్ట్ జీఎం ఎ.గంగాధర్, డీజీఎంలు మురళి పమ్మి, గుట్టపాటి శంకరయ్య ఉన్నారు. చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని బోయగూ డెం గ్రామానికి చెందిన మాతవరపు నాగమణి (50) అనే మహిళ వడదెబ్బకు గురై మృతి చెందింది. మంగళవారం సాయంత్రం నాగమణి ఎండ తీవ్రత తట్టుకోలేక ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. కుటుంబ సభ్యులు ఆమెకు ఉపశమనం కలిగించే ప్రయత్నం చేసినా పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూసింది. ఎం.హరికృష్ణ పి.రమణారావు -
ప్రతిష్టాత్మకంగా శాశ్వత క్యూ కాంప్లెక్స్
ద్వారకాతిరుమల: రాష్ట్రంలో పెద్ద తిరుపతిలో మా త్రమే ఉన్న శాశ్వత క్యూ కాంప్లెక్స్ను.. ఇప్పుడు చిన్న తిరుపతిలో సౌకర్యవంతంగా నిర్మించి, భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చామని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. శ్రీవారి దివ్య క్షేత్రంలో రూ.12.50 కోట్లతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ను బుధవారం నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఈఓ త్రినాథరావు విలేకరులతో మాట్లాడుతూ పెద్ద తిరుపతిలో మినహా ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఆలయంలోనూ శాశ్వత క్యూ కాంప్లెక్స్ లేదన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతో ప్ర తిష్టాత్మకంగా నిర్మించి, భక్తులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. శాశ్వత క్యూ కాంప్లెక్స్లో ఒకేసారి 4,500 మంది భక్తులు కూర్చోవచ్చని చెప్పారు. అత్యవసర పరిస్థితుల సమయంలో వినియోగించేలా ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేశామని, నిరంతరాయంగా భక్తులకు మంచి నీటిని అందిస్తున్నా మన్నారు. క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి వెళ్లిన భక్తులు శ్రీవారి దర్శనానంతరం తిరిగి బయటకు వెళ్లి, అక్కడ ఉచిత ప్రసాదాన్ని అందుకుంటున్నారన్నారు. శాస్త్రబద్ధంగానే ఏర్పాట్లు శ్రీవారి ఆలయంలో నూతన వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఇతర కట్టడాలు, దర్శన ఏర్పాట్లు పూర్వ ఆచారాలు, సనాతన సాంప్రదాయాల ప్రకారమే జరిగాయని ఆలయ ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు తెలిపారు. ఆలయ చైర్మన్ సుధాకరరావు, ఈఓ త్రినాథరావు, ఈఈ భాస్కర్ల చొరవ కా రణంగా అనేక శాశ్వత నిర్మాణాలు జరిగాయ న్నారు. అనివెట్టి మండపంతో శ్రీవారి కల్యాణ్యాన్ని వైభవంగా నిర్వహించగలుగుతున్నామని, వివాహాలు జరుపుకునే వారికి సైతం ఈ మండపాలు ఉపయోగపడుతున్నాయన్నారు. దీంతో అనివెట్టి మండపం ఫేజ్–2 నిర్మాణాన్ని జరిపారన్నారు. నూతన క్యూ కాంప్లెక్స్, దానికి సంబంధించిన క్యూలైన్లు శాస్త్రానికి అభ్యంతరం లేకుండా ఉన్నాయన్నారు. విలేకరుల సమావేశంలో ఈఈ డీవీ భాస్కర్, ఏఈఓలు ఎం.దుర్గారావు, పి.నటరాజా రావు, రమణరాజు, ఉమా పతి, సూపరింటెండెంట్లు ఐవీ రామారావు, కె.కిషోర్, జి.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. చిన వెంకన్న ఆలయ ఈఓ త్రినాథరావు -
సచివాలయ సిబ్బంది విలపింఛెన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ల మెడపై పెన్షన్ కత్తి వేలాడుతోంది. తమకు సంబంధం లేకపోయినా కేవలం పెన్షన్ పంపిణీ తమ చేతులు మీదుగా జరగడం, మిగిలిన సొమ్ము సీఎఫ్ఎంఎస్లో సక్రమంగా ఎవరు జమ చేయకపోయినా చివరికి సచివాలయ సిబ్బంది ఖాతాలో పడుతుంది. ఈ తరహాలో ఒక్క ఏలూరు జిల్లాలో 214 మంది వెల్ఫేర్ అసిస్టెంట్లకు రూ.68.18 లక్షలు చెల్లించాలని మెమోలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. గ్రామాల్లో పెన్షన్ పంపిణీకి సంబంధించి చెక్ పవర్ పంచాయతీ కార్యదర్శికి, నగరాలు, పట్టణాల్లో వార్డు అడ్మిన్లకు ఉంటుంది. సంబంధం లేని అసిస్టెంట్లకు మెమోలు జారీ చేయడం కలకలం రేపింది. తీవ్ర విమర్శలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ మిగిలిన సొమ్ము ప్రభుత్వ ఖాతాకు జమ చేయలేదనే కారణంతో 214 మంది సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లకు డీఆర్డీఏ పీడీ మెమోలు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,503 మంది సిబ్బందికి రూ.42.54 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు (5 ఏళ్లు) బకాయిలు మూడు రోజుల్లో చెల్లించాలని హడావుడి మొదలుపెట్టడం తీవ్ర విమర్శలకు రేగుతున్నాయి. వాస్తవానికి జిల్లాలోని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శికి చెక్ పవర్ ఉంటుంది ప్రతి నెలా పెన్షన్లు ఎంత మందికి ఎంత మొత్తం ఆ గ్రామంలో మంజూరయ్యాయో ముందుగా వివరాలు ఇచ్చి ఆ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. చెక్ పవర్ ఉన్న పంచాయతీ కార్యదర్శి నగదును విత్డ్రా చేసి వెల్ఫేర్ అసిస్టెంట్కు ఇవ్వడం, వెల్ఫేర్ అసిస్టెంట్ పెన్షన్లు పంపిణీ చేసి 3వ తేదీలోపు పెన్షన్ ఎవరైనా తీసుకోకపోతే మిగిలిన మొత్తాన్ని సీఎఫ్ఎంఎస్ ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తారు. ఇదంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. సదరు వెల్ఫేర్ అడ్మిన్ ఎంత మొత్తం పంపిణీ చేసింది, ఎంత నగదు నిల్వ ఉంది, ఏ తేదీన తిరిగి చెల్లించిందో అన్ని వెబ్సైట్లో ఉంటాయి. ఆన్లైన్లో ప్రతినెలా వెల్ఫేర్ అసిస్టెంట్ ఖాతా మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక జీరోగా కనిపిస్తుంది. ఈ క్రమంలో 5వ తేదీలోపు చెల్లించకపోతే డీఆర్డీఏ అధికారులు 10వ తేదీలోపు పూర్తి కాకపోతే ఎంపీడీఓల నుంచి ఫోన్లు, హడావుడి ఉంటుంది. మరోవైపు సకాలంలో జమ చేయకపోతే రోజుకు రూ.100 లేదా 18 శాతం వడ్డీ వెల్ఫేర్ అసిస్టెంట్లు చెల్లించాలి. దీంతో పాటు ఏటా ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తుంది. ఆడిట్లో లోపాలు, అవకతవకలు ఉంటే వెంటనే బాధ్యులకు మెమోలు జారీ చేసి జీతంలో రికవరీతో సహా అన్ని చర్యలు తీసుకుంటారు. ఇంత పకడ్బందీ వ్యవస్థతో పెన్షన్ పంపిణీ జరుగుతుంది. అయితే ఏటా ఆడిట్ జరిగినా కూడా 2020–21 నుంచి బాకీలంటూ జిల్లా అధికారులు మెమోలు ఇవ్వడం కక్ష సాధింపేనని వెల్ఫేర్ అసిస్టెంట్లు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి 214 మంది సచివాలయ సిబ్బంది రూ.68,18,525లు చెల్లించాల్సి ఉందని నోటీసులో పేర్కొన్నారు. నిజంగానే 2020 నుంచి బకాయిలుంటే ఏటా డీఆర్డీఏ ద్వారా జరిగే వార్షిక ఆడిట్లో ఎందుకు వెలుగులోకి రాలేదు. సహజంగా పెన్షన్లు మిగిలితే సీఎఫ్ఎంఎస్లో జమ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో కట్టిన పేమెంట్ ఫెయిల్ అయితే మళ్లీ చెల్లిస్తే ఒక రశీదు వచ్చి మరో రశీదు పెండింగ్లో ఉంటుంది. అలాంటి వాటికి లిఖితపూర్వకంగా కార్యాలయంలో వివరాలు ఇస్తూ ఉంటారు. ఇంకో వైపు వెల్ఫేర్ అసిస్టెంట్లు 2020–21 నుంచి ఇప్పటివరకు బదిలీలు జరగడంతో అనేక మంది స్థానచలనమయ్యారు. అలాగే ఎంపీడీఓలు పూర్తి విచక్షణతో ప్రభుత్వ అనుమతితో పెన్షన్ సొమ్మును గతంలో అత్యవసర కార్యక్రమాలకు వినియోగించిన దాఖలు జిల్లాలో ఉన్నాయి. ఉదాహరణకు జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెంలో కరోనా సమయంలో ప్రతి రేషన్కార్డు దారుడికి రూ.1,000 చొప్పున తక్షణ ఆర్థిక సాయం కింద గ్రామంలో రూ.20 వేలు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేశారు. దానికి సంబంధించి ఈ రోజుకు కూడా డీఆర్డీఏ నుంచి ఆ గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్కు మెమోలు అందుతూనే ఉన్నాయి. పలుమార్లు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చినా మెమోలు వస్తుండటం గమనార్హం. వెల్ఫేర్ అసిస్టెంట్లపై పెన్షన్ కత్తి ఏలూరు జిల్లాలో 214 మందికి మెమోలు 2021 నుంచి బకాయిలంటూ ప్రభుత్వం హడావుడి జిల్లాలో రూ.68.18 లక్షలు చెల్లించాలంటూ నోటీసులు మూడు రోజుల్లోపు జమ చేయాలని హుకుం -
ఇంటర్లో గ్రూపులే కీలకం
భీమవరం : వేసవి సెలవులు ముగియనున్నాయి. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు ఇంటర్మీడియెట్ తదితర కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఏ గ్రూపులో చేరాలి, ఏ కోర్సు తీసుకుంటే భవిష్యత్ బాగుంటుందనే సందిగ్ధంలో చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. ఇదిలా ఉండగా జేఈఈ, నీట్ అంటూ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఉన్నత విద్యకు వారధిలా ఇంటర్మీడియెట్ నిలుస్తుందనడంలో సందేహం లేదు. 15 ప్రభుత్వ కాలేజీలు జిల్లాలో 15 ప్రభుత్వ, రెండు ఎయిడెడ్, రెండు సోషల్ వెల్ఫేర్, 82 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఆయా కాలేజీల్లో ఎంపీసీ బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. ● ఎంీపీసీ : ప్రధానంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులుంటాయి. ఇంజినీరింగ్లో స్థిరపడాలనుకునేవారు ఎంపీసీ తీసుకోవచ్చు. జేఈఈ, ఏపీఈఏపీసెట్ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఐఐటీ, నిట్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు. ● బైపీసీ : ప్రధానంగా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉంటాయి. నీట్, ఏపీఈఏపీ సెట్ పరీక్షల ద్వారా డాక్టర్, వైద్య సంబంధిత వృత్తులు, ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు. అలాగే అగ్రికల్చర్ కోర్సుల్లో చేరవచ్చు. ● ఎంఈసీ/సీఈసీ : ప్రధానం మ్యాథ్స్, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులు ఉంటాయి. చార్టెడ్ ఎకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కమర్షియల్ ఏజెంట్లు, బ్యాంకు ఉద్యోగాలకు ఈ కోర్సు ఉపకరిస్తుంది. ● ఐటీఐలు : పదో తరగతి తర్వాత ఐటీఐ కోర్సులను ఎంచుకోవడం ద్వారా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించవచ్చు. ఎలక్ట్రికల్, డీజిల్ మెకానిక్, ఫిట్టర్ తదితర కోర్సులు ఉంటాయి. ● పాలిటెక్నిక్ : పాలిటెక్నిక్ కోర్సుల ద్వారా సాంకేతిక విద్యలో రాణించవచ్చు. సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్, సివిల్, కెమికల్ తదితర కో ర్సులు ఉన్నాయి. పాలిటెక్నిక్ పూర్తయిన తర్వాత ఉద్యోగాలు పొందవచ్చు. అలాగే లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశించవచ్చు. జిల్లాలో 101 జూనియర్ కాలేజీలు ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో వసతుల కల్పనతోపాటు విద్యాబోధన మెరుగుపడింది. ప్రభుత్వ కళాశాలల్లో ఫీజులు తక్కువ ఉండడంతోపాటు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నారు. దీంతో విద్యార్థుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. గడిచిన విద్యా సంవత్సరంలో ఫస్టియర్లో 49 శాతం, సెకండియర్లో 66 శాతం ఉత్తీర్ణత సాధించారు. –జి.ప్రభాకరరావు, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి, భీమవరం -
తీరంలో ఈదురుగాలుల బీభత్సం
తూర్పుతాళ్లులో నేలకొరిగిన తాడిచెట్టు చామకూరిపాలెం మోడిలో విద్యుత్ స్తంభం నరసాపురం రూరల్: నరసాపురం తీర ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. నరసాపురం పట్టణంతో పాటు నరసాపురం మండలంలోని సీతారాంపురం, రుస్తుంబాద, యర్రంశెట్టిపాలెం, తూర్పుతాళ్లు, మొగల్తూరు మండలంలోని పేరుపాలెం నార్త్, కేపీ పాలెం, రామన్నపాలెం, లక్కువారితోట, శేరేపాలెం, మొగల్తూరు, కుక్కలవారితోట తదితర గ్రామాల్లో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభా లు, చెట్లు నేలకొరిగాయి. కొబ్బరి, మామిడి, ఆకుకూరలు తదితర పంటలకు నష్టం వాటిల్లింది. ప లు ప్రాంతాల్లో చెట్లకు ఉన్న మామిడి పండ్లు రాలిపోయాయి. దీంతో బుధవారం నేలరాలిన కాయలను ఏరుకుని సంతకు తీసువచ్చి అయినకాడికి అమ్ముకున్నారు. మొగల్తూరులో ఓ ఇంటిపై తాడి చెట్టు పడటంతో భవనం పైకప్పు దెబ్బతినడంతో పాటు ప్రహరీ గోడ కూలిపోయింది. పలు ఇళ్లల్లో ఫ్యాన్లు, ఏసీలు, విద్యుత్ ఉపకరణాలు కాలిపోయినట్టు సమాచారం. ప్రధాన రహదారుల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో ఉదయం వరకూ వాహన రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. -
జోరుగా మట్టి అక్రమ తవ్వకాలు
చింతలపూడి: చింతలపూడి మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, సహజ వనరులను నిలువునా దోచేస్తున్నారు. మండల పరిధిలోని వెలగలపల్లి గ్రామ పరిధిలో ఉన్న మర్రికుంట చెరువు, ఉర్లగూడెం గ్రామ పరిధిలోని రాళ్ల చెరువుల్లో గత కొన్ని రోజులుగా అక్రమ మట్టి తోలకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రాత్రింబవళ్లు తేడా లేకుండా సాగుతున్న ఈ వ్యవహారంతో ప్రభుత్వ ఆదాయానికి లక్షల రూపాయల గండి పడుతుండగా, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల కనుసన్నల్లోనే మట్టి భాగోతం ఈ అక్రమ తవ్వకాలపై గ్రామస్థులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, జేసీబీలతో చెరువులను తవ్వేస్తూ మట్టిని తరలిస్తున్నా.. మైనింగ్, రెవెన్యూ, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు చేసినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఒకవేళ పోలీసు అధికారులు పట్టుకున్నా పై స్ధాయిలో ఒత్తిడి తీసుకు వచ్చి కేసులు లేకుండా బయట పడుతున్నారని సమాచారం. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, రాయల్టీ చెల్లించకుండా సాగుతున్న ఈ దందా వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోంది. కొందరు అధికార పార్టీ నేతలు అధికారులను మేనేజ్ చేస్తూ లక్షల రూపాయల విలువైన మట్టిని సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పర్యావరణానికి తీవ్ర ముప్పు చెరువుల్లో ఇష్టానుసారంగా జేసీబీలతో లోతుగా తవ్వేయడం వల్ల భూగర్భ జలాల మట్టం పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో చెరువుల కట్టలు బలహీనపడి, గ్రామాల్లోకి నీరు వచ్చే ప్రమాదం పొంచి ఉందంటూ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మట్టి లోడుతో గ్రామాల్లోని అంతర్గత రహదారులపై నిత్యం తిరుగుతున్న భారీ ట్రాక్టర్ల వల్ల రోడ్లన్నీ ధ్వంసమై గుంతలమయంగా మారుతున్నాయి. ఇప్పటికై నా స్పందించేనా? ఈ మట్టి దోపిడీపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని చింతలపూడి మండల ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. వెలగలపల్లి, ఉర్లగూడెం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై విచారణ జరిపి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చింతలపూడి మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా -
పాతూరులో తాగునీటి ఎద్దడి
సాక్షి, టాస్క్ఫోర్స్: సూరప్పగూడెం పంచాయతీ పాతూరులో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. గ్రామానికి ప్రధాన ఆధారంగా ఉన్న మంచినీటి చెరువు అడుగంటడంతో గ్రామస్తులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో నాలుగైదు రోజుల్లో చెరువు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి నెలకొంది. గ్రామ, మండల స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మునుపెన్నడూ లేని విధంగా నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తోందని గ్రామస్తులు అంటున్నారు. రెండు దశాబ్దాలుగా తాగునీటి కష్టాలు అంటే ఏంటో తెలియదని.. కానీ ప్రస్తుత కూటమి పాలనలో దాహం కేకలు వినిపిస్తున్నాయని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. గ్రామంలో సరైన బోరు లేకపోవడంతో, చెరువులోని అడుగంటిన నీటిని చేదులు తీసి, ఒకచోటకు చేరిన నీటిని మోటార్లతో తోడి, ఆ నీటినే ఫిల్టర్ చేసి గ్రామస్తులకు సరఫరా చేస్తున్నారు. దుర్వాసన కొడుతున్న ఈ నీరు బట్టలు ఉతుకేందుకు తప్ప తాగడానికి ఎంతమాత్రం పనికిరావని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నీటిని తాగితే అనారోగ్యం పాలుకావడం ఖాయమని వాపోతున్నారు. దీనితో కొందరైతే సొంత డబ్బులతో ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. ఇళ్లలో జరిగే చిన్న చిన్న శుభకార్యాలకు సైతం నీరు లేక ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. పశువులు తాగేందుకు కూడా నీరు లేకపోవడంతో, ట్యాంకర్లతో తెచ్చుకున్న నీటిని తొట్టెల్లో పోస్తూ వాటి ప్రాణాలను కాపాడుకుంటున్నారు. ముందస్తు ప్రణాళికలేవీ? గత నెల 20న గోదావరి కాల్వను మూసివేసిన క్రమంలో చెరువును పూర్తి స్థాయిలో నీటితో నింపలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీ, గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం, జలవనరుల శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో చెరువులను పూర్తి స్థాయిలో నింపలేదు. ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉండటంతో నీరు ఆవిరైపోవడం కూడా మరో కారణమని అధికారులు చెబుతున్నారు. దీనితో నెల రోజులు గడవక ముందే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన వచ్చింది. గ్రామంలోని సమస్యలపై పూర్తి అవగాహన లేని వారు అధికారులపై ఆధిపత్యం చలాయించి ప్రధాన సమస్యలను పక్కన పడేయడంతో పాలన పడకేసింది. రూ.40 లక్షలతో మైక్రో ఫిల్టర్ వైఎస్సార్సీపీ హయాంలో గ్రామంలోని రెండు వేల మంది జనాభాకు స్వచ్ఛమైన మంచినీరు అందించాలనే గ్రామస్తుల అభ్యర్థనపై, అప్పటి ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు జలజీవన్ మిషన్లో రూ.40 లక్షల మంజూరు చేయించారు. దీనితో గ్రామంలో మైక్రో వాటర్ ఫిల్టర్తో పాటు పైపులైన్ల నిర్మాణం చేపట్టారు. దీనివల్ల గ్రామస్తులు గతంలో తాగునీటి సమస్యను ఎన్నడూ ఎదుర్కోలేదు. అయితే ప్రస్తుత ప్రత్యేక అధికారుల పాలనలో ఇలాంటి ప్రధాన సమస్యలను గాలికొదిలేశారు. పంచాయతీలు సైతం అత్యవసర పనులు చేసేందుకు నిధులు లేకపోవడంతో మౌనం వహించి చేతులెత్తేస్తున్నాయి. ఎండిపోయిన మంచినీటి చెరువుఇప్పటికే మంచినీటి చెరువులోని నీటిని ఫిల్టర్ చేసి గ్రామస్తులకు సరఫరా చేస్తున్నాం. గ్రామంలోని ప్రజలకు తాగునీరు అందించేందుకు అవసరమైన ట్యాంకర్లను ఏర్పాటు చేస్తాం. గోదావరి కాల్వకు తిరిగి నీటిని విడుదల చేసే వరకు చెరువులోని నీరు తాగునీటి అవసరాలను తీరుస్తుంది. అయినప్పటికీ గ్రామంలో అత్యవసర పనుల్లో భాగంగా కొత్త బోరు ఏర్పాటుకు తవ్వకం పనులు ప్రారంభించాం. నాలుగైదు రోజుల్లో బోరు సిద్ధమవుతుంది. – బాలామణి, పంచాయతీ అభివృద్ధి అధికారి, సూరప్పగూడెం పాతూరు గ్రామంలో వారం రోజులుగా తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడింది. గత్యంతరం లేక ఎవరికి వారు సొంత ఖర్చులతో ట్యాంకర్లతో నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత 20 ఏళ్లుగా గ్రామంలో మంచినీటి సమస్య రాలేదు. పంచాయతీ పాలకవర్గం ఉన్నంత వరకు సమస్య రాకుండా చూశారు. ప్రత్యేకాధికారుల పాలన, పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం, అవగాహన లేమి వల్లే చెరువును పూర్తి స్థాయిలో నింపలేదు. నెల రోజులకే చెరువు ఎండిపోయింది. – వెజ్జు అప్పారావు, గ్రామస్తుడు, పాతూరు -
ఎమ్మెల్యే వాటా రూ.10లు
● సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మందుబాబుల మాటలు ● త ణుకు మండలం వేల్పూరు మద్యం దుకాణం వద్ద చర్చ సాక్షి టాస్క్ఫోర్స్: తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇలాకా వేల్పూరు గ్రామంలో మద్యం మాఫియా మందుబాబులకు చుక్కలు చూపిస్తుంది. క్వార్టర్ బాటిల్పై అదనంగా రూ.30 తీసుకుంటూ జేబులు గుల్ల చేస్తుంది. క్వార్టర్పై అదనంగా వసూలు చేస్తున్న సొమ్ములో మా ఎమ్మెల్యేకు బాటిల్కు రూ.10 ఇవ్వాలంటూ మందుబాబులు చర్చించుకోవడం తణుకులో సంచలనంగా మారింది. మందుబాబులు చెబుతున్న మాటల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో తణుకులో మద్యం అమ్మకాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వైరల్ అవుతున్న వీడియోలో రూ.99 మద్యం బాటిల్ రూ.130కు అమ్ముతున్నారని, రూ.130 బాటిల్కు రూ.150 తీసుకున్నారని మందుబాబులు చెబుతున్నారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఎమ్మెల్యే నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న మద్యం దుకాణంలో ఈ తరహా విక్రయాలు జరుగుతుండడం విశేషం. ఎమ్మారీ ధరలకే మద్యం ఎక్కడ? ఎన్నికల హామీల్లో భాగంగా నాణ్యమైన మద్యాన్ని క్వార్టర్ బాటిల్ రూ.99 ధరకే ఇస్తామన్న చంద్రబాబు మాటలు నీటిమీద రాతలుగా మారాయని మద్యం ప్రియులు విమర్శిస్తున్నారు. రాత్రి సమయాల్లో క్వార్టర్ బాటిల్ రూ.170కు అమ్ముతున్నారని మందుబాబులు ఆరోపిస్తున్నారు. నాణ్యమైన మద్యాన్ని ఎమ్మార్పీ ధరలకు విక్రయిస్తామని చెప్పి నేడు తణుకులో అడ్డంగా దోచేస్తున్నారని ఇదెక్కడి దోపిడీ అంటూ మందుబాబులు చర్చించుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఎకై ్సజ్ అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి. -
ఏలూరులో పోలీసు తనిఖీలు
ఏలూరు టౌన్: మాదక ద్రవ్యాల నిర్మూలన ధ్యేయంగా ఏలూరు నగరంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని.. ముఖ్యంగా యువత మత్తుపదార్థాలకు బానిసగా మారకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు అన్నారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో ఈగల్ టీమ్, త్రీటౌన్ పోలీస్, డాగ్ స్క్వాడ్ సంయుక్తంగా ఏలూరు ఆర్టీసీ బస్టాండ్లో తనికీలు చేపట్టారు. కొత్త బస్టాండ్లో ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు చేశారు. అనంతరం ప్రయాణికులకు డ్రగ్స్, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలను, సమాజానికి ఏవిధంగా చేటు చేస్తుందనే విషయాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే 1972 హెల్ప్లైన్కు తెలియజేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీపీటీవో ఎస్కే షబ్నం, ఈగల్ ఆర్ఎస్ఐ బీ.ఉదయ్భాస్కర్, నషాముక్తి భారత్ అభియాన్ ఇన్ఛార్జ్ రామ్కుమార్, అధికారులు పాల్గొన్నారు. -
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు
కంకిపాడు: మహిళ హత్య కేసులో నిందితుడిని కంకిపాడు పోలీసులు బుధవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ జె.మురళీకృష్ణ మీడియా సమావేశం నిర్వహించి హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఏలూరు జిల్లా కై కలూరు మండలం వింజరం గ్రామానికి చెందిన జొన్నాదుల మేరి (33), కృష్ణాజిల్లా పెడన మండలం షేరివత్తర్లపల్లి గ్రామానికి చెందిన తోకల వినోద్బాబు (అలియాస్ వినోద్కుమార్)తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. మేరి, శివకుమార్ భార్యాభర్తలు. కై కలూరులోని ఓ హోటల్లో మేరి పనిచేస్తున్న సమయంలో, అక్కడికి ట్రాక్టర్ నడిపే పనులకు వచ్చిన వినోద్బాబుతో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇటీవల వీరిద్దరూ తెన్నేరు గ్రామంలోని ఇటుకల బట్టీల వద్ద పనులకు వచ్చారు. అనుమానంతో గొంతు నులిమి హత్య మేరి తాను పనిచేసిన హోటల్లోని వంట మేసీ్త్రతో చనువుగా మాట్లాడటం వినోద్బాబుకు నచ్చలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదం జరిగేది. ఈ నెల 24వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో, నైట్ ప్యాంటుతో మేరి మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసి పరారయ్యాడు. మృతురాలి భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలు వినోద్బాబు కోసం గాలించాయి. కంకిపాడు సమీపంలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. -
మద్ది దేవస్థానానికి రూ.9,99,999 విరాళం
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం 8 గదులతో శ్రీ రామ సదనం పేరుతో నిర్మించనున్న విశ్రాంతి భవనానికి భారీ విరాళం అందించారు. జంగారెడ్డిగూడెంకు చెందిన అబ్బిన దత్తాత్రేయ, సత్యవతి దంపతులు తమ కుమారుడు అబ్బిన సునీల్ కుమార్, కోడలు మనోరమ తరఫున ఒక గదికి అయ్యే ఖర్చు రూ. 9,99,999 బుధవారం అందజేశారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ఆర్.వి. చందనకు ఆలయ కార్యాలయంలో చెక్కు రూపంలో ఈ సొమ్మును అందజేశారు. మండవల్లి: మండలంలోని చావలిపాడులో రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. రాచపట్నం గ్రామానికి చెందిన అందుగల పరసయ్య (50) పోలుకొండలో రొయ్యల చెరువుపై సూపర్ వైజర్గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం 5 గంటలకు పరసయ్య తన బైక్పై ఇంటి నుంచి పనికి బయలుదేరాడు. చావలిపాడు కాలనీ రోడ్డులో వెళ్తుండగా, ఉదయం 5:40 గంటల సమయంలో వెనుక నుండి వచ్చిన ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పరసయ్య రోడ్డుపై పడిపోగా, ట్రాక్టర్ వెనుక చక్రం అతని వీపుపై నుంచి వెళ్ళడంతో తీవ్ర గాయాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి భార్య సుధారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తెలికిచర్లలో బుధవారం ఉదయం పామాయిల్ తోటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తాడేపల్లిగూడెం అగ్నిమాపక అధికారి కేవీ మురళీ కొండబాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పామ్ ఆయిల్ చెట్లు కాలిపోతున్నాయన్న సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది త్వరితగతని వెళ్ళి మంటలను అదుపు చేసినట్లు వెల్లడించారు. రైతులకు, పరిసరాల ప్రజలకు అగ్నిప్రమాదాలపై తీసుకువాల్సిన జాగ్రత్తలు గురించి వెల్లడించినట్లు వివరించారు. భీమవరం: భీమవరం పట్టణం సిగిడీల పేటలో లోఓల్టేజ్ విద్యుత్ సమస్య ఉండడంతో అక్కడికి వెళ్లిన విద్యుత్శాఖ ఉద్యోగులు ఆకులు సతీష్, ఎ.సునీతను స్థానికులు కొట్టడంతో కేసు నమోదుచేసినట్లు భీమవరం వన్టౌన్ సీఐ ఎ రమేష్ చెప్పారు. సిగిడీల పేటలో లోఓల్టేజ్ సమస్య ఉందంటూ స్ధానికులు పీజేఆర్ఎస్లో పిర్యాదుచేశారు. పరిశీలించడానికి బుధవారం వెళ్లగా వీర సూర్యచంద్రరావు, లక్ష్మణరావు గాయపర్చినట్లు సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు సీఐ చెప్పారు. భీమవరం: భీమవరం ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో బుధవారం నిర్వహించిన దాడులలో భీమవరం పట్టణంలో గెద్దాడ రామప్రసాద్ను అరెస్టు చేసి అతని వద్ద ఆరు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు భీమవరం ఎకై ్సజ్ సీఐ కె బలరామరాజు బుధవారం చెప్పారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్ఐలు పి ఉమామహేశ్వర రావు, పి సునీల్ కుమార్లు పాల్గొన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని బలరామరాజు హెచ్చరించారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
భీమవరం: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని యుటీఎఫ్ జిల్లా కమిటీ బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా ఖజానా అధికారి కార్యాలయాల్లో వినతిపత్రాలు అందచేశారు. గత విద్యా సంవత్సరంలో నెలవారీ మీటింగ్స్ వివరాలు, తీర్మానాలు, ఫొటోలు 24 గంటల్లో అప్లోడ్ చేయాలనే ఆదేశాలను ఉపసంహరించుకోవాలని, జూన్ నెలలో నిర్వహించే ట్రైనింగ్ షెడ్యూల్ను వాతావరణ పరిస్థితులు, ఉపాధ్యాయుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఖరారు చేయాలని, పదో తరగతి మూల్యాంకనానికి సంబంధించిన రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని, మెడికల్ బిల్లులు ఏలూరుకు పంపడం, తిరిగి వచ్చిన మెడికల్ బిల్లులను ప్రొసీడింగ్ ఇచ్చి డిస్పాచ్ చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని జిల్లా విద్యాశాఖాధికారి నారాయణను కోరారు. కార్యక్రమంలో యుటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీఎస్ విజయ రామరాజు, పి.క్రాంతి కుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీవీ రామానుజరావు(గాంధీ), జిల్లా గౌరవాధ్యక్షుడు సీహెచ్ పట్టాభిరామయ్య తదితరులు పాల్గొన్నారు. భీమవరం: జిల్లా శాప్ లీగ్–2026 అథ్లెటిక్స్ పోటీల్లో అండర్–16, 20 బాలబాలికల విభాగాల్లో యువ క్రీడాకారులు ప్రతిభ చూపి విజేతలుగా నిలిచారని జిల్లా క్రీడల అధికారి టీఎస్డీఓ ఎన్.మోహన్దాస్ చెప్పారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలోని అథ్లెటిక్ మీట్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. అండర్–16 బాలుర విభాగం 60 మీటర్ల పరుగు పందెంలో సంతోష్కుమార్ విజేతగా నిలవగా జావెలిన్ త్రో విభాగంలో కల్యాణ్ ప్రథమ స్థానం, 600 మీటర్ల విభాగంలో శ్రీహరి లంజా సాత్విక్ ప్రతిభ కనబర్చినట్లు చెప్పారు. అండర్–20 బాలుర విభాగం 100 మీటర్ల పోటీలో జి.సోమేశ్వరరావు, 800 మీటర్ల పోటీలో బి.వినోద్ విజయం సాధించారని, లాంగ్ జంప్లో వీవీ అవినాష్, హైజంప్ విభాగంలో ఎల్వీ గణేష్, ఎన్వీ గణేష్, 400 మీటర్ల విభాగంలో హర్షవర్ధన్ ఉత్తమ ప్రదర్శన కనబర్చారన్నారు. అండర్–16 బాలికల విభాగం లాంగ్ జంప్లో జి.పవిత్ర, 60 మీటర్ల పోటీలో టి.వనిత ప్రథమ స్థానం సాధించగా 600 మీటర్ల విభాగంలో అశ్విత, అశ్రితలు ప్రతిభ కనబర్చారు. -
ఆటపాక కేంద్రంలో పక్షుల విలవిల
వీడిన ఆక్రమణల చెర పాలకోడేరు మండలం శృంగవృక్షంలో గ్రామాభివృద్ధి కమిటీ చొరవతో ప్రభుత్వ భూమిని ఆక్రమణల చెర నుంచి విడిపించారు. 8లో uకై కలూరు: అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఆటపాక పక్షుల విహార కేంద్రంలో నీరు లేక పక్షులు పస్తులుంటున్నాయని పర్యావరణ ప్రేమికులు ప్రొఫెసర్ సుధాబత్తుల విజయకుమార్, సామాజిక కార్యకర్త ఎల్.ఎస్.భాస్కరరావులు ఆరోపించారు. నీరు లేక ఎడారిగా మారిన ఆటపాక పక్షుల విహార కేంద్రాన్ని మంగళవారం వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటపాకలో 286 ఎకరాల విస్తీర్ణంలో పక్షుల విహార చెరువును అటవీశాఖ ఏర్పాటు చేసిందన్నారు. ఏటా సైబిరియా, నైజిరియా, అస్ట్రేలియా వంటి దూర ప్రాంతాల నుంచి విదేశీ వలస పక్షులు విడిదికి వస్తాయన్నారు. వేసవిలో నీటి కొరత వేధిస్తున్నా అటవీ అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించడం లేదన్నారు. ఆటపాక పంట కాల్వ నుంచి నీటిని ఇక్కడకు తరలించే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. సమీప పోల్రాజ్ కాల్వలో నీరు ఉంటున్నా నీరు నింపడం లేదన్నారు. అటపాక పక్షుల కేంద్రం చుట్టూ చేపల చెరువుల్లో నీరు పుష్పలంగా ఉన్నాయన్నారు. కేవలం అధికారుల నిర్లక్ష్యంతోనే పక్షుల కేంద్రం చెరువు బీటలు వారిందన్నారు. ఇప్పటికై న అధికారులు పక్షుల కేంద్రం చెరువులో ఎల్లప్పుడు నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
మన ఓట్లను కాపాడుకోవాలి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు ● బూత్ స్థాయి ఏజెంట్లకు ‘సర్’పై అవగాహన భీమవరం: ఎన్నికల్లో అక్రమాలు, అవకతకలతో అధికారంలోకి వస్తున్న వారికి చెక్ పెట్టడానికి వైఎస్సార్సీపీ బూత్లెవెల్ ఏజెంట్స్ ఎంతో అప్రమత్తంగా ఉండాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు స్పష్టం చేశారు. భీమవరంలో నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు అధ్యక్షతన నిర్వహించిన వైఎస్సార్సీపీ బూత్ లెవల్ ఏజెంట్స్ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పదేళ్లకొకసారి జరిగే ఓటర్ల జాబితా ప్రక్షాళనలో పార్టీ సానుభూతిపరులు, నాయకులు, కార్యకర్తల ఓట్లు గల్లంతు కాకుండా బూత్ లెవెల్ ఏజెంట్స్ పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. ఇటీవల ఇతర రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక ఓట్లను భారీగా తొలగించారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ బూత్ లెవెల్ ఆఫీసర్స్తో కలిసి పనిచేసి పక్కా జాబితా తయారు చేయించాలన్నారు. స్థానికంగా లేనివారు, వలస వెళ్లినవారు, చనిపోయిన వారి వివరాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. నరసాపురం పార్లమెంట్ సమన్వయకర్త ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ.. ఏజెంట్స్ కష్టపడి పనిచేస్తే వైఎస్సార్సీపీ ఓట్లు ఎట్టిపరిస్థితుల్లోనూ తొలగించరన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో జరిగిన సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలు తిరిగి వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని, అనుకూల ఓట్లను వేయించుకునే బాధ్యత మనపైనే ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వై.నాగార్జున యాదవ్, ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శి పడాల కిశోర్రెడ్డి ఏజెంట్స్కు శ్రీసర్శ్రీ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గూడూరి ఉమాబాల, మేడిది జాన్సన్, పేరిచర్ల విజయనర్సింహరాజు, కామన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గంలో.. కాళ్ళ: మన పార్టీ ఓట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. పెదఅమిరం పార్టీ కార్యాలయంలో ఉండి నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 నుంచి 20 ఏళ్లకు ఒకసారి ఓటర్ల జాబితా ప్రక్షాళన సర్ ప్రక్రియ చేపడుతుందని, గతంలో 2002లో ఇది జరిగిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అధికార పార్టీలు తమకు అనుకూలంగా ఓట్లు తొలగించాయని, మనం ముందుచూపుతో లేకపోతే అదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. ప్రతి ఓటరును రిన్యూవల్ చేయించాల్సిన బాధ్యత ఏజెంట్లపై ఉందన్నారు. ఉండి నియోజకవర్గంలోని 238 పోలింగ్ బూత్ల ఏజెంట్లు వెరిఫికేషన్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్టీ అధికార ప్రతినిధి యనమల నాగార్జునయాదవ్ ఏజెంట్లకు ఓట్ల వెరిఫికేషన్పై అవగాహన కల్పించి, సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా బూత్లెవెల్ ఏజెంట్ల నియోజకవర్గ అధ్యక్షుడిగా పాలా రాధాకృష్ణతో పాటు ఆకివీడు, ఉండి, కాళ్ళ, పాలకోడేరు మండలాల కన్వీనర్లను ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల, ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శి పడల కిశోర్రెడ్డి, పెన్మత్స దుర్గాప్రసాదరాజు, స్థానిక జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్, మండల కన్వీనర్లు, బూత్లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు. పెద అమిరంలో ఉండి నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన కార్యక్ర మంభీమవరంలో వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లసమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు -
ఆక్వా రైతుల ఆక్రందన
● తగ్గని ఫీడ్, సీడ్ ధరలు ● పెరగని రొయ్య ధర ● సబ్సిడీ విద్యుత్ హామీ అమలు శూన్యం భీమవరం: దేశానికి విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న ఆక్వా రైతుల ఆక్రందన అరణ్య రోదనగానే మిగులుతోంది. రొయ్యల మేత (ఫీడ్) ధరలు తగ్గించాలని, నాణ్యమైన సీడ్ అందించాలని, ధరల పతనాన్ని అరికట్టాలని, సబ్సిడీ విద్యుత్ ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులు పోరుబాట పట్టినా ఫలితం కనిపించడం లేదు. జిల్లాలోని 20 మండలాల్లో దాదాపు 1.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుండగా, అందులో సుమారు 90 వేల ఎకరాల్లో రొయ్యల సాగు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో సాగు దీనికంటే ఎక్కువే ఉంటుందని అంచనా. ఒకప్పుడు రొయ్యల సాగుతో లాభాలు గడించిన రైతులు, నేడు మార్కెట్ ఒడిదుడుకులతో కుదేలవుతున్నారు. ఆందోళనల్లో కూటమి నాయకులే అధికం విశేషమేమిటంటే, ఈ రొయ్యల రైతుల ఆందోళనలకు కూటమి పార్టీల నాయకులే నాయకత్వం వహిస్తున్నారు. పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో టీడీపీ నాయకుడు, మంత్రి నిమ్మల రామానాయుడి అనుచరుడు గొట్టుముక్కుల గాంధీ భగవాన్ రాజు, భీమవరం ప్రాంతంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఈ నిరసనల్లో ముందున్నారు. ఫీడ్ బస్తాలు తగులబెట్టడం, విద్యుత్ అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో భీమవరంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆక్వా రైతులు, ఫీడ్ మిల్లుల యజమానులు, ఎక్స్పోర్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎక్స్పోర్టర్లు అంతంతమాత్రంగానే రాగా, ఫీడ్ మిల్లుల యజమానులు ఒక్కరు కూడా హాజరుకాకపోవడం గమనార్హం. దీని వెనుక పెద్ద లాబీయింగ్ జరుగుతోందని రైతులు అనుమానిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించకుంటే రైతులు ‘క్రాప్ హాలిడే’ ప్రకటించే ప్రమాదం ఉంది, ఇది దేశ విదేశీ మారకద్రవ్య ఆదాయాన్ని దెబ్బతీస్తుంది. కూటమి నాయకులు ఎన్నికల హామీ ప్రకారం జోన్లతో ప్రమేయం లేకుండా ఆక్వా రైతులందరికీ సబ్సిడీ విద్యుత్ అందించాలి. పెరిగిన పెట్టుబడులతో ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఇది కొంత ఊరట కలిగిస్తుంది. ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలి. – మళ్ల తులసీరామ్ , ఫ్రాన్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ఒకపక్క ఫీడ్, సీడ్ ధరలు పెరిగి, మరోపక్క రొయ్యల ధరలు పతనం కావడంతో నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని ఈ సమస్యలను పరిష్కరించాలి. – గాదిరాజు వెంకటసుబ్బరాజు, ఫ్రాన్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ను రూ.1.50కే అందించడమే కాకుండా, కోవిడ్ సమయంలో రొయ్యల ధరలు పడిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఫీడ్ ధరలు ఇష్టమొచ్చినట్లు పెంచకుండా ఉత్పత్తిదారులతో కట్టుదిట్టమైన సమీక్షలు నిర్వహించింది. అప్సడాను ఏర్పాటు చేసి నిత్యం రైతులకు అండగా నిలిచింది. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తాము అధికారంలోకి రాగానే ఆక్వా జోన్లతో ప్రమేయం లేకుండా రైతులందరికీ సబ్సిడీ విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఆ హామీ అమలు కాలేదు. పైగా ఫీడ్, సీడ్ ధరలు పెరిగి, రొయ్యల ధరలు తగ్గడంతో రైతులు రోడ్డున పడ్డారు. -
రొయ్య ధరపై కుదరని సయోధ్య
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం కలెక్టరేట్లో కలెక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో జరిగిన రొయ్యల ఎగుమతిదారులు, ఆక్వా సంఘ నాయకులు, రైతుల సమావేశం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. రొయ్యల ధరల పెరుగుదల లేదా స్థిరత్వంపై ఎక్స్పోర్టర్ల నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో రైతులకు నిరాశే ఎదురైంది. ఈ సమావేశానికి కొందరు ఎక్స్పోర్టర్లు మాత్రమే హాజరయ్యారు. ఎగుమతిదారుల నాయకుడు తోట జగధీష్ మాట్లాడుతూ.. ఈక్వెడార్, చైనా దేశాలలో రొయ్యల ఉత్పత్తి విపరీతంగా పెరగడం వల్లే మన రొయ్యలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్, ధరలు తగ్గుతున్నాయని వెల్లడించారు. కోవిడ్ సమయంలోనూ ఇలాంటి పరిస్థితే తలెత్తిందని, దీనికి తోడు ప్రాసెసింగ్ ప్లాంట్లలో లేబర్ సమస్య కూడా ఉందని పేర్కొంటూ, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఆక్వా రైతు సంఘం నాయకులు తులసి రాంబాబు, సుబ్బరాజులు మాట్లాడుతూ.. కేవలం పది రోజుల వ్యవధిలోనే టన్నుకు రూ.50 వేల వరకు రైతు నష్టపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల ధరలు కనీసం 10 నుంచి 15 రోజుల పాటైనా స్థిరంగా ఉండేలా చూడాలని కోరారు. ఇటీవల జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎక్స్పోర్టర్లు అమలు చేయడం లేదని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి కొన్ని సూచనలు చేశారు. ఎక్స్పోర్టర్లు, ఆక్వా రైతులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఫీడ్ (మేత) ధరల విషయంలో రైతులకు ఉపశమనం కలిగించామని, లేబర్ సమస్యను కూడా వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని తెలిపారు. ఎగుమతిదారులు ధరలను మార్చే ముందు రైతులతో చర్చించాలని, నిర్ణయించిన రేట్లు కనీసం 15 రోజుల వరకు స్థిరంగా ఉండేలా చూడాలని, అప్సడా రిజిస్ట్రేషన్లను వేగవంతం చేయాలని సూచించారు. రొయ్యల ధరలు తగ్గడంపై రైతులు ఆందోళన చెందవద్దని, పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో అప్సడా డైరెక్టర్ వి.సత్యనారాయణరాజు, జిల్లా మత్స్యశాఖ అధికారి డి.శ్రీనివాస్, ఎంపెడా డీడీ ఆనంద్, ఆక్వా రైతులు, హ్యాచరీ యజమానులు, ఫీడ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
పౌల్ట్రీకి వడదెబ్బ
మండుతున్న ఎండలు పౌల్ట్రీకి గుబులు పుట్టిస్తున్నాయి. వడదెబ్బతో వేల సంఖ్యల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. రోజువారీ గుడ్ల ఉత్పత్తి పదిశాతం మేర తగ్గింది. ఆయా రూపాల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పౌల్ట్రీ రంగానికి రోజుకు రూ.4.17 మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. జూన్ మొదటి వారం వరకు ఎండల తీవ్రత ఉంటుందన్న వాతావరణశాఖ హెచ్చరికలు కోళ్ల రైతులను కలవరపరుస్తున్నాయి. ● షెడ్లలో చల్లదనం కోసం పైకప్పుపై వాటర్ స్ప్రింక్లర్లు ఏర్పాటుచేసి కొబ్బరి ఆకులు కప్పాలి. వేడిగాలులు చొరబడకుండా చుట్టూ గోనెసంచులు కట్టి తరచూ వాటిని నీటితో తడుపుతుండాలి. షెడ్లు లోపల ఫ్యాన్లు ఏర్పాటుచేయాలి ● కోళ్లు వడదెబ్బకు గురికాకుండా ఎలక్ట్రోలైట్స్, విటమిన్స్, సప్లిమెంట్స్ను వాటర్, ఫీడ్ ద్వారా అందించాలి ● పగటి పూట మేత తగ్గించేసి రాత్రిపూట పెట్టాలి, చల్లటి తాగునీటిని అందించాలి ● విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూసుకోవాలి ● చనిపోయిన కోళ్లను లోతుగా గోతులు తీసి పాతిపెట్టాలి ఎండ తీవ్రతకు చనిపోయిన కోళ్లు సాక్షి, భీమవరం: ఉమ్మడి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, అత్తిలి, ఇరగవరం, ఉంగుటూరు, దేవరపల్లి, ఉండ్రాజవరం తదితర మండలాల్లో దాదాపు కోటి వరకు లేయర్ కోళ్లు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు 36 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటాయి. వారం రోజులుగా 45 నుంచి 48 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలతో ముందెన్నడూ లేనివిధంగా కోళ్ల మరణాలు అధికమయ్యాయి. అధికారవర్గాల లెక్కలు ప్రకారం రోజుకు 1.5 శాతం వరకు కోళ్లు చనిపోతున్నాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు లక్షన్నర వరకు కోళ్లు మృత్యువాత పడుతున్నట్టు అంచనా. ఒక కోడి చనిపోవడం వల్ల రూ.250 వరకూ నష్టం వాటిల్లుతుండగా కోళ్ల మరణాలు ద్వారా రోజుకు రూ. 3.76 కోట్లు మేర కోళ్ల రైతులు నష్టపోతున్నారు. ఉత్పత్తిపైనా ప్రభావం ఎండల తీవ్రత గుడ్ల ఉత్పత్తిపైనా ప్రభావం చూపు తోంది. సాదారణ పరిస్థితుల్లో జిల్లాలో రోజుకు 80 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. ప్రస్తుతం సుమారు 72 లక్షల గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ఎనిమిది లక్షల గుడ్ల డ్రాపింగ్తో కోళ్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఫాంగేట్ వద్ద గుడ్డు ధర రూ.5.30 పైసలు ఉండగా రోజుకు రూ.42.4 లక్షలు కోల్పోతున్నారు. కోళ్ల మరణాలు, గుడ్ల డ్రాపింగ్ రూపంలో జిల్లాలోని పరిశ్రమకు రోజుకు రూ.4.17 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. కొద్ది రోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ఈ మేరకు నష్టం జరిగినట్టు అంచనా. పెరిగిన నిర్వహణ భారం : అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లను కాపాడుకునే జాగ్రత్తలతో ఖర్చు తడిసి మోపెడవుతోందని కోళ్ల రైతులంటున్నారు. వడదెబ్బకు గురికాకుండా ప్రత్యేక మందులు, షెడ్లలోని వాతావరణాన్ని చల్లబర్చేందుకు ప్రత్యేక సంరక్షణ చర్యలతో నిర్వహణ భారం పెరిగిందంటున్నారు. కోళ్ల మేతకు వినియోగించే సోయా, డీఓబీ, మొక్కజొన్న, జీఎన్సీ, నూకలు, మందుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, గుడ్డు ధర గిట్టుబాటవ్వక కొట్టుమిట్టాడుతున్న పౌల్ట్రీ పరిశ్రమను ప్రస్తుత ఎండలు మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరకే ప్రజలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోళ్ల రైతులు కోరుతున్నారు. అప్రమత్తంగా ఉండాలి : అధిక ఉష్ణోగ్రతలతో కోళ్ల మరణాలు పెరిగిపోవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశుసంవర్ధకశాఖ జేడీ ఆర్.కోటిలింగరాజు, పౌల్ట్రీ యజమానులు, పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్షించారు. జూన్ మొదటి వారం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో కోళ్ల మరణాల నియంత్రణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వడగాల్పులకు కళ్లు తేలేస్తున్న కోళ్లు అధిక ఉష్ణోగ్రతలతో పెరిగిన మరణాలు లక్ష కోళ్ల పౌల్ట్రీలో రోజుకు 1500 వరకు మృత్యువాత 10 శాతం మేర తగ్గిన గుడ్లు ఉత్పత్తి ఎండల తీవ్రతతో రోజుకు రూ.4.17 కోట్ల నష్టం -
ఇంటర్నేషనల్ బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపిక
భీమవరం: ఇంటర్నేషనల్ పురుషుల బీచ్ వాలీబాల్ పోటీల్లో పాల్గొనే భారత్ జట్టు జిల్లాకు చెందిన బీచ్ వాలీబాల్ క్రీడాకారులు ముదునూరి రామకృష్ణంరాజు, పెన్మత్స కృష్ణ చైతన్య ఎంపికయ్యారని జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యవామ మంగళవారం భీమవరంలో విలేకర్లకు తెలిపారు. జూన్ 4 నుంచి నాలుగు రోజులపాటు చైనీస్ తైపీలో జరగనున్న టూర్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారన్నారు. పోటీలకు ఎంపికై న రామకృష్ణంరాజు, కృష్ణ చైతన్యలను సత్యవామ, కార్యదర్శి రాఘవేంద్రరావు, కోశాధికారి ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పవన్ కుమార్రాజు తదితరులు అభినందించారు. భీమవరం: పది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన పరీక్షకు కేవలం 15.55 శాతం మాత్రమే హాజరయ్యారు. 283 మంది పరీక్షకు హాజరుకావల్సివుండగా 44 మంది మాత్రమే హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ చెప్పారు. అలాగే ఏపీఓ ఎస్ఎస్ పరీక్షకు 89 మందికి 70 మంది హాజరయ్యారని ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు. భీమవరం: జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియట్ డీఐఈవో జి.ప్రభాకరరావు తెలిపారు. మొదటి ఏడాది ఇంటర్ జనరల్ పరీక్షకు 1,358 మందికి 1,218 మంది హాజరుకాగా ఒకేషనల్ పరీక్షకు 525 మందికి 462 మంది హాజరయ్యారన్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్ పరీక్షకు 748 మందికి 96 మంది గైర్హాజరుకాగా.. ఓకేషనల్ పరీక్షకు 271 మందికి 240 మంది హాజరయ్యారని తెలిపారు. భీమవరం (ప్రకాశంచౌక్): ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం రెండో దశ అమలుకు సంబంధించి మంగళవారం కలెక్టర్ చాంబర్ నుంచి జిల్లా స్థాయి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లాలో 2026–27 సంవత్సరానికి సంబంధించి మొత్తం 1,05,561 మంది నిరక్షరాస్యులను గుర్తించారని, ఈ సంవత్సరం 52,781 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి నిరక్షరాస్యుడిని యాప్లో నమోదు చేయడమే కాకుండా, వారికి బోధించేందుకు తగిన వలంటీర్లను అనుసంధానం చేయాలన్నారు. -
వరిచేలల్లో అగ్నికీలలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): వేసవిలో వరిచేలకు నిప్ప పెట్టవద్దని తాడేపల్లిగూడెం ఫైర్ ఆఫీసర్ కేవీ మురళీ కొండబాబు పేర్కొన్నారు. ఉభయగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాద వివరాలను ఆయన వెల్లడించారు. నాచుగుంట, జగన్నాథపురం, జువ్వలపాలెం గ్రామాల్లో వరిచేలకు మంటలు చెలరేగగా అగ్నిమాపక సిబ్బంది వెళ్లి మంటలను అదుపు చేశారు. పూళ్ళ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలంలో చెలకలు అంటుకుని, అక్కడ ఉన్న చెట్లు కూడా కాలిపోవడంతో పాటు రైల్వే హైటెన్షన్ వైర్లు మీదకు రావడంతో అగ్నిమాపక సిబ్బంది వెళ్లి మంటలను అదుపు చేశారు. జంగారెడ్డిగూడెం: అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న 3 మట్టి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. సోమవారం రాత్రి మట్టి అక్రమ రవాణాపై సమాచారం అందడటంతో పుట్లగట్లగూడెం కొంగల చెరువు వద్దకు వెళ్లేసరికి ఎటువంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తుండటం గుర్తించి, 3 మట్టి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు చెప్పారు. తదుపరి చర్యల నిమిత్తం రెవెన్యూ శాఖకు సమాచారం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. -
కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి
భీమవరం: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం భీమవరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో వార్షిక తనిఖీలు నిర్వహించారు. తొలుత ఆయనకు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసు బలగాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు కార్యాలయంలోని వివిధ విభాగాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో గడిచిన ఏడాది కాలంలో జిల్లాలో నమోదైన నేరాల గణాంకాలు, దర్యాప్తు పురోగతి, కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి తీసుకున్న చర్యల గురించి నివేదికలను తెలుసుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం డీఎస్పీలు రఘువీర్ విష్ణు, ఎం సుధాకరరావు, డి విశ్వనాథ్, జిల్లా ఆర్మ్ర్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పోలవరం రూరల్: నేషనల్ పార్క్, టైగర్ జోన్ల పేరుతో ఆదివాసులను అడవుల నుంచి తరలిస్తే తిరుగుబాటు తప్పదని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి సుధాకర్ అన్నారు. గడ్డపల్లిలో మంగళవారం సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు పోరండ్ల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నేషనల్ పార్క్ పేరుతో టైగర్ జోన్ల అభివృద్ధి పేరుతో గడ్డపల్లి పంచాయతీ గ్రామాలైన దారువాడ, చిలకలూరు, తంగేడుగొండ, గిన్నెపెల్లి, చీమలూరు, గడ్డపల్లి గ్రామాలను అడవి నుంచి ఖాళీ చేయించాలని అధికారులు చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టారు. ఆదివాసులు, అడవి జంతువులు కలిసి మెలిసి జీవిస్తున్న ప్రకృతి సహజ సిద్ధ జీవన సౌందర్యం అడవిని ప్రభుత్వం ధ్వంసం చేయడం కోసం ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు కారం రాఘవ, సరియం రామ్మోహన్, పీవైఎల్ జిల్లా కన్వీనర్ గురుగుంట్ల ప్రసాద్, అరుణోదయ రాష్ట్ర కమిటీ నాయకుడు నడపల ముక్క రెడ్డి, ముంజలూరు సర్పంచ్ కెచ్చల ముక్కారెడ్డి, గడ్డపల్లి వైస్ ప్రెసిడెంట్ ముసలారెడ్డి, పెద్ద ఎత్తున ఆదివాసీలు పాల్గొన్నారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ -
వైద్యం.. అపహాస్యం
తణుకు అర్బన్: జిల్లాలో వైద్యం.. అపహాస్యంగా మారింది. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల ఏర్పాటులో నిబంధనలు పాటించకపోయినా, కొన్నిరకాల ధృవపత్రాలు సక్రమంగా లేకపోయినా వారికి అనుమతులు ఇవ్వడంలో వైద్యారోగ్య శాఖ రాజకీయ సిఫార్సులు, ఇతర వ్యవహారాలకు తలొగ్గి పూర్తిస్థాయిలో పరిశీలన లేకుండానే అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఫలంపై విమర్శలు ఈనెల 16న తణుకులో బీహార్కు చెందిన రింకూ కుమారి అనే గర్భిణిని ఒక ఆర్ఎంపీ వైద్యుడు పైడిపర్రులోని స్టార్ హాస్పిటల్లో చేర్చగా ఊరు, పేరుతోపాటు కేస్ హిస్టరీ తెలియకుండానే శస్త్రచికిత్స చేయడం.. కొద్ది గంటల్లోనే ఆడశిశువుకు జన్మనిచ్చి బాలింత మృతి చెందింది. మూడేళ్లుగా అనుమతులు లేని ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు జరుగుతున్నాయంటే వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తుందనేది ప్రశ్నగా మిగులుతోంది. పైగా వైద్యం వికటించి బాలింత చనిపోతే వారం రోజులకు కానీ వైద్య ఆరోగ్య శాఖ స్పందిచకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో గతనెల 28న ఉండ్రాజవరానికి చెందిన గర్భిణి మానుకొండ ప్రవల్లిక రెండు చెవులు లేని ఆడ శిశువుకు జన్మనిచ్చింది. సదరు గర్భిణి 22వ వారంలో తణుకు వేవ్ స్కానింగ్ సెంటర్లో టిఫా స్కానింగ్ చేయించుకోగా అన్ని అవయవాలు బాగానే ఉన్నట్లుగా రిపోర్టు ఇచ్చింది. స్కానింగ్ సెంటర్ వైఫల్యంపై వివరణ కోరగా టిఫా స్కానింగ్లో చెవులు ప్రొటోకాల్ కాదని తణుకు వేవ్ స్కానింగ్ సెంటర్ రేడియాలజిస్ట్ వైద్య ఆరోగ్య శాఖకు సంజాయిషీ ఇవ్వడం, అదే నివేదికను సమర్థిస్తూ డీఎంహెచ్వో డాక్టర్ జి.గీతాబాయ్ సైతం పత్రికా ప్రకటనగా ఇస్తూ సమర్థించుకోవడం సైతం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రైవేటు వైద్యశాలలో అనుమతి లేకుండా ప్రసవాలు బాలింత మృతి జరిగిన వారం రోజులకు విచారణ రెండు చెవులు లేకుండా బిడ్డ జన్మించినా పట్టని వైనం స్కానింగ్ సెంటర్ల నిర్లక్ష్యం.. పట్టించుకోని అధికారులు -
ప్రభుత్వ భూమికి వీడిన ఆక్రమణల చెర
పాలకోడేరు: గ్రామాభివృద్ధి కమిటీ చొరవతో ప్రభుత్వ భూమిని ఆక్రమణల చెర నుంచి విడిపించారు. కోవిడ్కు ముందు శృంగవృక్షంలో చెత్త ఎక్కడ బడితే అక్కడే వేయడంతో గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. దీనిపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో గ్రామాభివృద్ధి కమిటీ ఎఫ్ఎంబీ, అడంగళ్లు పరిశీలించి గ్రామంలో ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించారు. దూసనపూడి రోడ్లో రీ.స.నెంబర్.479/3లో 1.51 ఎకరాలు మడుగును ఆక్రమించుకున్నారని, అది డంపింగ్ యార్డుకు ఉపయోగపడుతుందని వివరిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు జిల్లా కలెక్టర్కు ఇచ్చిన డైరెక్షన్ మేరకు మంగళవారం సచివాలయం సర్వేయర్ మణికంఠ రోవర్ సహాయంతో ఆ భూమిని కొలిచి సరిహద్దులు నిర్ణయించి సర్వే రాళ్లు పాతారు. కాగా ఎంతో విలువైన భూమిని కాపాడినందుకు గ్రామాభివృద్ధి కమిటీని గ్రామస్థులు అభినందించారు. కుక్కునూరు:వివాహితను లైంగిక వేధింపులకు గురిచేసిన కానిస్టేబుల్పై మంగళవారం కేసు నమోదైంది. ఎస్సై రాజారెడ్డి చెప్పిన వివరాల ప్రకారం, పెద్దరావిగూడెం గ్రామానికి చెందిన వివాహితను వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ లైంగిక వేధింపులకు పాల్పడుతూ, బ్లాక్ మెయిల్ చేశాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు కానిస్టేబుల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. నూజివీడు: మండలంలోని పల్లెర్లమూడికి చెందిన వైద్యురాలు ఉప్పలపాటి స్రవంతి న్యూరాలజీ విభాగంలో దేశవ్యాప్తంగా టాపర్గా నిలిచి ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ పురస్కారాన్ని అందుకున్నారు. 2023 సంవత్సరానికి గాను న్యూరాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆమెకు ఈ గౌరవం లభించింది. ఈ అవార్డును కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చేతుల మీదుగా ఈనెల 23న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అందుకున్నట్లు స్రవంతి కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం స్రవంతి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. ఆమె సాధించిన ఈ ఘనత పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు నూజివీడు: కారు ఢీకొని ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన ఘటన పట్టణంలోని బైపాస్ రోడ్డులో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. హనుమంతులగూడెంకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ యండ్రపాటి రవికుమార్ (37) సోమవారం రాత్రి 8 గంటల సమయంలో పుల్లల లోడుతో ఉన్న ట్రాక్టర్ను తీసుకొని కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో గల ఫ్యాక్టరీ వద్ద పుల్లలను దించి తిరిగి వస్తుండగా అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో నూజివీడు బైపాస్ రోడ్డులో గల బృందావన్ గార్డెన్ సమీపంలోకి వచ్చే సరికి వెనుక నుంచి కారు ట్రాక్టర్ ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో రవికుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. రవికుమార్కు భార్య వీర ధర్మవతి, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ పీ సత్య శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
ఆరోగ్యశ్రీలో రూ. 6,740 గుంజేశారు
ఈ ఏడాది ఫిబ్రవరి 14న అత్తిలికి చెందిన నా సోదరి బొప్పే విజయలక్ష్మి ఇంట్లో కాలుజారి పడి కాలు విరిగిన సందర్భంలో తణుకు ఆపిల్ ఆస్పత్రిలో చేర్చాను. శస్త్రచికిత్స చేయాల్సిన క్రమంలో ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ బెడ్ ఇవ్వకుండానే స్ట్రెచర్పైనే ఉంచి రక్తపరీక్షలు, ఎక్స్రే ఇతర ఖర్చులంటూ రూ.6,740 వసూలు చేశారు. మరో రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో డిశ్చార్జ్ అయి తణుకులోని మరో ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో చేర్చి ఉచిత వైద్యసేవలు పొందాము. దీనిపై జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు న్యాయం జరగలేదు. – దొడ్డిపట్ల మల్లిఖార్జున గంగాప్రసాద్, అత్తిలి -
వడదెబ్బకు ఐదుగురి బలి
పోలవరం రూరల్: జిల్లాలో వడగాలులు తట్టుకోలేక ఐదుగురు మృతి చెందారు. పోలవరం పంచాయతీ పరిధిలోని బెస్తా వీధికి చెందిన పెదమల్లు అనసూయ (85) మంగళవారం వడదెబ్బ తగిలి ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురైంది. స్థానికులు ఆమెను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అనంతరం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మృతిచెందింది. నిద్రలోనే మరణం ఆగిరిపల్లి: అనంతసాగరంనకు చెందిన ఈసం వెంకటేశ్వరరావు (70) వడదెబ్బ తగిలి మృతి చెందాడు. సోమవారం ఉదయం వెంకటేశ్వరరావు తన గేదెలను మేపడానికి పొలంలోకి తోలుకొని వెళ్లాడు. ఎండవేడికి వడదెబ్బకు గురై తీవ్ర అస్వస్థతకు గురి అవడంతో కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స అందజేశారు. మంగళవారం ఉదయం వెంకటేశ్వరరావు నిద్రలోనే మరణించాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఉపాధి హామీ పనికి వెళ్లి.. కుక్కునూరు: వడదెబ్బకు గురై ఉపాధి హామీ కూలీ మృతి చెందాడు. కమ్మరిగూడెం గ్రామానికి చెందిన మిడియం ఎర్రయ్య (50) శనివారం ఉదయం ఉపాధి హామీ పనికి వెళ్లి ఇంటికి వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా వైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కొత్తగూడెంలో... దెందులూరు: కొత్తగూడెంలో ఉపాధి కూలీ లంకపల్లి ఏలియా (55) మంగళవారం వడదెబ్బకు మృతి చెందాడు. ఉదయం ఉపాధి పనికి వెళ్లి ఇంటికి వచ్చిన ఏలియా వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే దెందులూరు ప్రభుత్వాసుపత్రి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చింతలపూడిలో... చింతలపూడి: స్థానిక వైఎస్సార్ కాలనీకి చెందిన తోట సీతామహాలక్ష్మి (37) సోమవారం వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. -
ప్రకృతి సంగీతం.. గిరిపుత్రుల సొంతం
● పండుగలు, ఇంటి శుభకార్యాల్లో లయబద్ధంగా నృత్యాలు ● వినసొంపుగా సరిగమలు ఎరుగని రాగాలు బుట్టాయగూడెం: దట్టమైన అటవీ ప్రాంతంలో బాహ్య ప్రపంచానికి దూరంగా కొండ కోనల నడుమ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తుంటారు కొండరెడ్డి గిరిజనులు. వీరు సంస్కృతి, సాంప్రదాయాలకు ఎక్కవ ప్రాధాన్యత ఇస్తుంటారు. వీరికి బయట ప్రపంచంతో పనిలేదు. అటవీ ప్రాంతమే ప్రపంచం. ప్రకృతి అందించిన సంగీతం వీరి సొంతం. సరిగమలు ఎరుగని రాగాలతో లయబద్ధంగా నృత్యాలు చేస్తూ పండుగలు, శుభకార్యాల్లో సందడి చేస్తారు. నేటి ఆధునిక ప్రపంచంలో సంగీతం ఎన్నో కొత్త పుంతలు తొక్కుతుంది. డాన్సుల్లో అనేక రకాలు పుట్టు కొస్తున్నాయి. ‘రామ.. రామ.. రామ.. ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలా. రామ..రామ..రామ.. ఉయ్యాలో...రాగమెత్తరాదే ఉయ్యాలా....’ అంటూ బతుకమ్మ పాటలు పాడడం రాదు. ‘అదిగో అల్లదిగో శ్రీ హరి వాసమూ పదివేల శేషుల పడగల మయమూ’ అంటూ అన్నమయ్య కీర్తనలు పాడరు. బ్రేక్ డాన్స్, స్నేక్ డాన్స్, కూచిపూడి, భరత నాట్యం తెలియదు. వీరికి తెలిసింది చుట్టూ కొండకోనలు, వాగు వంకలతో అలలారే గిరి పల్లెల్లో ప్రకృతి నేర్పిన సంగీతం, నాట్యంతోనే తమదైన శైలిలో ఆట, పాటలతో జీవితాన్ని ఆనందంగా గడపుతుంటారు. కూ... అంటూ కూసే కోయిలమ్మల పాట, గలగలపారే సెలయేటిని మరిపించే కమ్మదనం గిరిపుత్రుల ఆట, పాటలు సొంతం. గిరిజనుల్లోనే కోయ తెగకు చెందిన వారు ‘రెరెలయ్య ..రెరెల....రెరెలా....రేలా....’అంటూ పాడుకుంటే కొండరెడ్లు ‘జొన్నకూడు...జొన్న విల్లు.. జొన్నకూలితే.. పోతేనత్త’ అంటూ కొత్త పంటలు వచ్చిన సమయంలో పసుపు పచ్చపండుగ, మామిడి పండుగ, చింత పండుగ, భూదేవి పండుగలలో పాడుకుంటారు. అలాగే పెళ్ళిళ్ల సమయంలో కొండరెడ్డు ‘కళ్ళేడమ్మ.. కళ్ళేడమ్మ.. గోగులపిల్లకు.. కెచ్చెల పెల్లోడు’ అంటూ పెళ్లికి సంబంధించిన పాటలు పాడుతూ లయ బద్ధంగా నృత్యాలు చేస్తూ ఆనందంగా గడుపుతారు. వాయిద్య పరికరాలు సొంతంగా తయారీ కొండరెడ్డి గిరిజనులు వారు వాయించే వాయిద్య పరికరాలు సొంతంగా తయారు చేసుకుంటారు. అడవిలో లభించే ఉస్కటేకు, వేగెసా చెట్టులతో డప్పుల నమోనాలను తయారు చేసి వాటిని మేక చర్మాలతో అందంగా తయారు చేసుకుంటారు. అలాగే అడ్డతీగ గిల్లలతో గుత్తులు కట్టి డప్పు వాయిద్యాల నడుమ ఆ గిల్లలు ఊపుతూ చక్కటి తాళంతో మహిళలు నృత్యం చేస్తూ ఉంటారు. వేసవిలోనే డోలుకొయ్యిల వాయిద్యాల మోత గిరిజన పల్లెలు వేసవి కాలంలో డోలు కొయ్యిల వాయిద్యాలతో మోగిపోతుంటాయి. ఇటు శుభ కార్యాలతో పాటు గిరిజనులు తరతరాలుగా జరుపుకునే బాట పండుగ, మామిడికాయ పండగ వన దేవతలు పండుగలతో సందడి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో డోలుకొయ్యిల వాయిద్యాలు, రేల పాటలు, సాంప్రదాయ నృత్యాలు గ్రామాల్లో సంచరించే వారికి కనువిందు చేస్తాయి. -
పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్చండి
భీమవరం: ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయా లని కలెక్టర్ సీహెచ్ నాగరాణి పిలుపునిచ్చారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలోని దుర్గాపురం ప్రాంతంలో ఆమె ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాలో సుమారు 1,200 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 6 వేల మందికి పైగా నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్నారన్నా రు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, సామాజిక అవగాహన, లోకజ్ఞానం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. జి ల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ప్ర భుత్వ పాఠశాలల ప్రయోజనాలపై విస్తృత ప్ర చార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, డీఈఓ ఈ.నారాయణ, తహసీల్దార్ రావి రాంబాబు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ద్వారకాతిరుమల : చినవెంకన్న దివ్య క్షేత్రంలో ఆదివారం సైతం భక్తుల రద్దీ కొనసాగింది. వేసవి సెలవులు కావడంతో వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అనివెట్టి మండపం, తూర్పురాజగోపుర ప్రాంతం, కల్యాణకట్ట ఇలా అన్ని విభాగాలు భక్తులతో పోటెత్తాయి. సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. కై కలూరు : రొయ్యల సాగు రైతుల ప్రధాన స మస్యలపై డెల్టా ఆక్వాఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కై కలూరు సీఎన్నార్ గార్డెన్లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్టు సంఘ నాయకులు సురేష్, రాము ఆదివారం తెలిపారు. రొయ్యల మేతల ధరల పెంపు, డీజిల్ ధరలతో సమస్యలు, రొయ్య ధరల పతనం వంటి సమస్యలపై చర్చిస్తామన్నారు. భీమడోలు : ‘గ్రామాల్లో దా హం కేకలు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. భీమ డోలు ఎంపీడీఓ సీహెచ్ పద్మా వతి ఆదేశాల మేరకు గుండుగొలను వింధ్యవాసిని చెరువులో పసర్లు తొలగించే పనులను పంచాయతీ అభివృద్ధి అధికారి ఎం.వెంకట్రావు చేపట్టారు. చెరువు గట్టుపై పిచ్చిమొక్కలను తొలగించారు. అలాగే వైఎస్సార్ కాలనీలో మంచినీటి సమస్య పరిష్కారానికి గుండుగొలను పంచాయతీ నుంచి రూ.7.2 లక్షలతో బ్రాహ్మణచెర్వు నుంచి పైపులైన్ నిర్మా ణం చేపడుతున్నామని ఎంపీడీఓ తెలిపారు. దెందులూరు : కౌలు రైతుల రక్షణ కోసం నూత న కౌలు చట్టం తీసుకురావాలని, కౌలు రైతు లందరికీ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సా యం వంటి పథకాలు అందించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన దెందులూరులో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కౌలు రైతులు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభు త్వం తక్షణమే కౌలు చట్టం తేవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను నిర్లక్ష్యం చేస్తే ఆహార సంక్షోభం తప్పదని హెచ్చరించారు. -
వడదెబ్బతో ఐదుగురి మృతి
తణుకు అర్బన్/కుక్కునూరు/దెందులూరు/జంగా రెడ్డిగూడెం: ఎండల తీవ్రతకు వడదెబ్బతో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. తణుకు తహసీల్దారు కార్యాలయం ప్రాంతంలోని సిమెంట్ బెంచ్పై పడుకుని ఓ వ్యక్తి ప్రాణం విడవగా స్థానికులు గుర్తించి పోలీసులకు తె లియజేశారు. మృతుడికి సుమారు 58 ఏళ్ల వయసు ఉంటుందని, కోర్టు పక్క వీధిలో మార్కెట్ వద్ద కొంతకాలంగా పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడని, వడదెబ్బకు చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నా రు. మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు తణుకు పట్టణ పోలీస్స్టేషన్కు తెలపాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. కుక్కునూరులో.. వడదెబ్బతో కుక్కునూరు మండలంలో ఇద్దరు వ్య క్తులు మృతిచెందారు. తొండిపాక పంచాయతీ మె ట్టగూడెం గ్రామానికి చెందిన నోముల వంశీకృష్ణ (35) జీవనోపాధి నిమిత్తం సరిహద్దు గ్రామమైన బూర్గంపాడులో హోటల్లో వంట మాస్టర్గా విధు లు నిర్వహిస్తున్నాడు. రోజులా శనివారం విధులకు వెళ్లిన వంశీకృష్ణ అస్వస్థతకు గురై హోటల్లోనే కుప్పకూలిపోయాడు. సహచరులు అతడిని బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా వడదెబ్బ తగిలిందని నిర్ధారించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వంశీకృష్ణ శనివారం రాత్రి మృతి చెందాడు. వంశీకృష్ణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బంజరగూడెంలో 84 ఏళ్ల వృద్ధుడు బంజరగూడెం గ్రామానికి చెందిన గవర్ల పెరుమాళ్లు (84) అనే వృద్ధుడు ఆదివారం ఉదయం వడదెబ్బకు గురై మృతి చెందాడు. పెరుమాళ్లు ఉన్నట్టుండి అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. పోతునూరులో.. దెందులూరు మండలం పోతునూరులో కోడెల సత్యనారాయణ (79) వడదెబ్బకు గురై మృతి చెందారు. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రతకు ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో మరో ఆస్పత్రికి తరలించేలోపు ఆయన కన్నుమూశారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రెవెన్యూ అధికారులు ఘటనపై వివరాలు సేకరించారు. జంగారెడ్డిగూడెంలో.. జంగారెడ్డిగూడెం లక్ష్మీనారాయణ థియేటర్ సమీపంలోని చాపల దాసుగారి రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. సుమారు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి ఆదివారం వడదెబ్బకు గురై మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. ఎస్సై ఎన్వీ ప్రసాద్ ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. అతడు ఉప్పలమెట్టకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కోడెల సత్యనారాయణ (ఫైల్) గవర్ల పెరుమాళ్లు (ఫైల్) -
రోడ్డు ప్రమాదంలో తెగిపడిన మహిళ చేయి
జంగారెడ్డిగూడెం: తాడువాయి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ చేయి తెగిపడింది. దీనికి సంబంధించి ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉంగుటూరు మండలం కాకర్లమూడి గ్రామానికి చెందిన 54 మంది భక్తులు తాడేపల్లిగూడెం డిపో ఆర్టీసీ బస్సు మాట్లాడుకుని తెలంగాణ రాష్ట్రం భద్రాచలం శ్రీరాముని దర్శనానికి శనివారం రాత్రి బయలుదేరారు. మండలంలోని తాడువాయి సమీపంలోకి వచ్చే సరికి జగిత్యాల నుంచి పాలకొల్లు ధాన్యం లోడుతో వెళుతున్న లారీ వీరి బస్సును వెనుక పక్క భాగంలో (సుమారు రెండు సీట్లు వద్ద ) బలంగా ఢీకొంది. దీంతో వెనుక సీట్లో చేయి బయటకు పెట్టుకుని ఉన్న రాజాన పద్మకుమారి చేయి తెగిపడిపోయింది. పక్కనే ఉన్న నాయుడు రామలక్ష్మికి కూడా గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. వెనుక ఉన్న మిగిలిన ప్రయాణికులు పద్మకుమారి చేయిని వెతికి ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. దీంతో ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి పంపించారు. ఆర్టీసీ డ్రైవర్ షేక్ అఫ్రాన్ ఫిర్యాదు మేరకు సూర్యపేటకు చెందిన లారీ డ్రైవర్ కంభం ఆంజనేయులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. బస్సును ఢీకొన్న లారీ.. ఇద్దరికి గాయాలు -
● వంతెన.. ప్రమాదం అంచున..
మండపాక నుంచి గుమ్మంపాడు వెళ్లే (ఎడ్ల పందేల పుంత) రహదారిలోని రేలంగి కాలువపై వంతెన రెయిలింగ్ లేక ప్రమాదకరంగా మారింది. వంతెనకు ఇరువైపులా రెయిలింగ్ కూలిపోయి దాదాపు పదేళ్లు కావస్తోంది. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల ప్రజలు ఇటుగా రాకపోకలు సాగిస్తుంటారని, రాత్రిళ్లు ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బళ్ల చిన వీరభద్రరావు అన్నారు. వంతెన రెయిలింగ్ నిర్మించాలని కోరుతున్నారు. – ఇరగవరం -
వరి గడ్డి కాల్చివేతతో అనర్థాలు
వీరవాసరం: దాళ్వా వరి కోతలు పూర్తయిన అనంతరం పొలాల్లో మిగిలిపోయిన వరిగడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్చవద్దని వ్యవసాయ అధికారి కె.భరత్ సూచించారు. పొలాల్లో మిగిలిపోయిన వరిగడ్డిని పశుగ్రాసం కొరకు కొందరు రైతులు కట్టలు కడుతుంటే మరి కొందరు మిగిలిన వరిగడ్డిని కాల్చి వేస్తున్నారు. వరి గడ్డిని కాల్చడం వలన నేల సహజమైన సారవంతమైన స్వభావాన్ని కోల్పోతుందని, అంతేకాకుండా పంటలకు మేలు చేసే స్వప్న జీవులు నశిస్తాయని వ్యవసాయ అధికారి భరత్ వివరించారు. వరి చేలలో మిగిలిన అవశేషాలు కుళ్లిపోయేలా డి కంపోజర్లను వినియోగించడం వలన నేల సారవంతం పెరగడమే కాకుండా రసాయన రువులు వినియోగం కూడా తగ్గుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భూమి ఆరోగ్యాన్ని కాపాడే విధంగా రైతులు శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని ఆయన కోరారు. -
అత్యవసర వైద్యం.. అందనంత దూరం
భీమవరం(ప్రకాశం చౌక్) : జిల్లాలో ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి స్థానికంగా అత్యవసర వైద్యం అందించే పరిస్థితి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో లేదు. దీంతో ఎమర్జెన్సీ కేసులను గుంటూరు, విజయవాడ, కాకినాడ ప్రభుత్వాస్పత్రులకు సిఫార్సు చేస్తున్నారు. అప్పటికే పరిస్థితి విషమించిన క్షతగాత్రులు అంబులెన్సుల్లో తరలించేలోపు మృత్యువాత పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఏదైనా రోడ్డు ప్రమాదం లేదా తీవ్ర అనారోగ్యం వస్తే జిల్లాలోని తణుకు, భీమవరంలోని మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులకు తీసుకువస్తున్నారు. అయితే ఇక్కడ పూర్తిస్థాయిలో స్పెషలిస్టులు, మైరుగైన వైద్యం అందించడానికి పరికరాలు లేవు. దీంతో ఆయా ఆస్పత్రుల వైద్యులు వేరే ఆస్పత్రులకు సిఫార్సులు చేస్తున్నారు. క్షతగాత్రులను 125 కిలోమీటర్లకు పైగా దూరం తీసుకువెళ్లడం దాదాపు 2 గంటల నుంచి 3 గంటల వరకు సమయం ప ట్టడం కుటుంబసభ్యులకు ఇబ్బందిగా మారింది. అ లాగే ప్రమాద తీవ్రత కూడా పెరిగిపోతోంది. సుమారు రెండు నెలల క్రితం వీరవాసరం మండలానికి చెందిన ఓ మహిళ తీవ్ర అనారోగ్యంతో భీమవరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు మెరుగైన వైద్యం అవసరమైంది. అయితే స్థానికంగా స్పెషలిస్టులు లేకపోవడంతో వెంటనే గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నరసాపురం మండలం ముత్యాలపల్లిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని అంబులెన్స్లో భీమవరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకురాగా అక్కడ వైద్యులు వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు. భీమవరంలో ఎక్కడా అత్యవసర మెరుగైన వైద్యం అందించే న్యూరో స్పెషలిస్టులు లేకపోవడం, చినపిల్లల వైద్యానికి కూడా అత్యంత మెరుగైన వైద్య పరికరాలు, వైద్యులు లేకపోవడంతో వారిలో తండ్రిని కాకినాడకు, కుమారుడిని గుంటూరు మెడికల్ కళాశాలకు సిఫార్సు చేశారు. తండ్రిని కాకినాడ తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. కుమారుడు ఇప్పటికీ చికిత్స పొందుతున్నాడు. వైద్యో నారాయణో ‘హరి’ స్థానికంగా అందని ఎమర్జెన్సీ సేవలు తీవ్రంగా గాయపడిన వారికి వైద్యసేవలు కొరత కాకినాడ, విజయవాడ, గుంటూరుకు సిఫార్సు మార్గమధ్యలో మృత్యువాత జిల్లాలో ముందుకు సాగని మెడికల్ కాలేజీ నిర్మాణం దూరం 130 కి.మీ. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి అత్యంత మైరుగైన వైద్యం అందించి ప్రాణాలు నిలబడాలంటే పాలకొల్లు సమీపంలోని దగ్గులూరులోని మెడికల్ కాలేజీ అందుబాటులోకి రావాలి. క్షతగాత్రులను దూర ప్రాంతాలకు తీసుకువెళ్లేలోపు వారి పరిస్థితి విషమించి చనిపోతుండగా.. ఆయా కుటుంబాలు దిక్కులేనివి అవుతున్నాయి. మెరుగైన వైద్యం కోసం గుంటూరు, విజయవాడ, కాకినాడ తీసుకువెళ్లడం భారంగా ఉంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. మెడికల్ కాలేజీ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. – వి.శ్రీనివాస్, తోకలపూడి, వీరవాసరం మండలం -
ధ్యానంతో ఒత్తిడి దూరం
భీమవరం: పోలీస్ వృత్తిలో ఎదురయ్యే తీవ్రమైన ఒత్తిడిని నియంత్రించుకోవడానికి ధ్యానం దివ్యౌషధమని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, జిల్లా ఆర్మడ్ రిజర్వ్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. జిల్లా పోలీస్ సిబ్బందికి మానసిక ప్రశాంతత, ఒత్తిడి నిర్వహణ కోసం ‘హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్’ శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక డీఎన్నార్ కళాశాల ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమబద్ధమైన ధ్యాన సాధన ద్వారా ఏకాగ్రత పెరగడంతో పాటు శారీరక దృఢత్వం, మానసిక సమతుల్యత సిద్ధిస్తాయన్నారు. వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇది దోహదపడుతుందని వివరించారు. మూడు రోజుల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. హార్ట్ఫుల్నెస్ సంస్థ డిస్ట్రిక్ట్ కో–ఆర్డినేటర్ ఆకుల స్వామి, ఆర్పీ కె. రాజే ష్బాబు, ట్రైనర్లు ఎస్.గాయత్రీదేవి, సీహెచ్ సత్యనారాయణ రాజు, జి.రవిప్రకాష్ ప్రత్యేక ధ్యాన తరగతులు నిర్వహించారు. శ్వాసక్రియలు, ధ్యాన ముద్రలు, వ్యాయామాలపై శాసీ్త్రయ శిక్షణ అందించారు. సీఐలు ఎ.రమేష్, పి.మురళీకృష్ణ, బి.శ్రీనివాసరావు, వి.శ్రీనివాసరావు, జి.కాళీచరణ్, ఇందుమతి, ఎస్సైలు, రిజర్వ్ సిబ్బంది, హోమ్గార్డులు పాల్గొన్నారు. -
● లో ఓల్టేజీతో ‘దిమ్మె’తిరిగే షాక్
కాళ్ల మండలం ఏలూరుపాడు గరువు ప్రాంతంలో లోఓల్టేజీ సమస్య పరిష్కారానికి స్థానికులు సొంత ఖర్చుతో ట్రాన్స్ఫార్మర్ దిమ్మె ఏర్పాటు చేసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుచేస్తామని అధికారులు చెప్పడంతో దిమ్మె ఏర్పాటుచేశామని, ఏడాది గడిచినా ట్రాన్స్ఫార్మర్ మాత్రం బిగించడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. లోఓల్టేజీతో చాలా ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు. దీనిపై విద్యుత్ ఏఈ రాంబాబును వివరణ కోరగా సమస్య పరిష్కారానికి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామన్నారు. – కాళ్ల -
నిబంధనలు మీరి.. ప్రజాధనం పక్కదారి
ఏలూరు (టూటౌన్): అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఓ ప్రైవేట్ లేఅవుట్లో మౌలిక వసతుల కల్పనకు నామినేషన్ విధానంలో పనులు చేయించేసి సొమ్ము చేసేసుకున్నారు. లేఅవుట్ నిబంధనలు, నామినేషన్ విధానానికి విరుద్ధంగా రూ.1.73 కోట్లతో స్థానిక మార్కెట్ యార్డు సమీపంలోని ఎస్ఎంఆర్ నగర్ లేఅవుట్లో రోడ్లు, డ్రెయిన్లు, పైప్లైన్ పనులు చేయించడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ గ్రాంట్లు, పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్ములతో ఎవరి మెప్పు కోసం నగరపాలక సంస్థ అధికారులు ఈ లేఅవుట్లో వెచ్చించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. లేఅవుట్ నిబంధనలు ఇలా.. లేఅవుట్ నిబంధనలను అనుసరించి లేఅవుట్లు ఏర్పాటు చేసిన సమయంలో రోడ్లు, డ్రెయిన్లు, వీధి లైట్లు, వాటర్ సప్లయ్, పైప్లైన్లు, ప్లాంటేషన్ పనులు లేఅవుట్ యజమానులు చేయించాలి. వీటి కోసం లేఅవుట్లో 30 శాతం స్థలాన్ని కేటాయించాలి. అలాగే పార్కులు, ప్లే గ్రౌండ్ కోసం మరో 10 శాతం స్థలం కేటాయించాలి. ముఖ్యంగా మౌలిక వసతులకు అయ్యే ఖర్చును యజమానులే భరించాల్సి ఉంటుంది. ఇలా అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత ఆ లేఅవుట్ను స్థానిక సంస్థకు అప్పగించాల్సి ఉంటుంది. ఆ సమయంలో పార్కులు, ప్లేగ్రౌండ్ కోసం ఉంచిన స్థలాన్ని గిఫ్ట్ డీడ్ కింద స్థానిక సంస్థకు లేఅవుట్ యాజమాన్యం రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సదరు లేఅవుట్ను స్థానిక సంస్థ అధికారులు పరిశీలించి అన్ని నిబంధనలు పాటించిన తర్వాతే స్వాధీనం చేసుకోవాలి. అనంతరం ఆ లేఅవుట్లో నిర్వహణ పనులు మాత్రమే స్థానిక సంస్థలు చేపట్టాల్సి ఉంది. నిర్వహణ పనులు మాత్రమే చేయాల్సిన చోట వసతులు ఏలూరు మార్కెట్ యార్డు సమీపంలోని ఎస్ఎంఆర్ నగర్ను నగరపాలక సంస్థకు గతంలో అప్పగించారు. అక్కడ నిర్వహణ ప నులను మాత్రమే చే యాల్సిన నగరపాలక సంస్థ అధికారులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.1.35 కోట్ల నిధులతో రోడ్లు, డ్రెయిన్లు వేయించారు. అలాగే అత్యవసరం కాని పనులను నామినేషన్ విధానానికి విరుద్ధంగా రూ.29.35 లక్షలతో ఆరు పైపులైన్, రూ.8.49 లక్షలతో ఆర్సీసీ కల్వర్టు, అప్రోచ్ పనులకు కమిషనర్ అనుమతించగా ఆ యా పనులు చేసేశారు. నామినేషన్ పద్ధతిని చేసిన ఆరు పైప్లైన్ పనులు మూడు పనులుగా మాత్ర మే చేయాలి. కానీ రూ.5 లక్షలు దాటకూడదనే ఆలోచనతో నిబంధనలకు విరుద్ధంగా ఇంజనీరింగ్ అధికారులు ఆ మూడు పను లను ఆరు ముక్కలుగా చేసి అక్రమాలకు తెరతీశా రు. నామినేషన్ ద్వారా పనులకు రూ.37.84 లక్షలు వెచ్చించారు. ఏలూరు ఎస్ఎంఆర్ నగర్లో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రెయినేజీ క్రాస్ రోడ్డు నం.3లో 110 మి.మీ హెచ్డీపీఈ పైప్ ఇంటర్ కనెక్షన్ పనులకు రూ.4.87 లక్షలు క్రాస్రోడ్లలో 110 మి.మీ హెచ్డీపీఈ పైప్ ఇంటర్ కనెక్షన్ పనులకు రూ.4.89 లక్షలు 160 మిమీ హెచ్డీపీఈ పైప్ ఇంటర్ కనెక్షన్ పనులకు రూ.4.92 లక్షలు దక్షిణ వైపు క్రాస్ రోడ్డులో 160 మి.మీ పైప్ ఇంటర్ కనెక్షన్ పనులకు రూ.4.92 లక్షలు మెయిన్ లైన్ హెచ్డీపీఈ పంపిణీ పైప్లైన్ రెక్టిఫికేషన్కు రూ.4.85 లక్షలు క్రాస్ రోడ్లలో హెచ్డీపీఈ పంపిణీ పైప్లైన్ రెక్టిఫికేషన్కు రూ.4.90 లక్షలు ఆర్సీసీ కల్వర్ట్ నిమిత్తం రూ.4.99 లక్షలు సీసీ అప్రోచ్ ఏర్పాటుకు రూ.3.50 లక్షలు మొత్తంగా నామినేషన్ ద్వారా పనులకు రూ.37.84 లక్షలు వెచ్చించారు. ప్రజాధనాన్ని ప్రైవేట్ లేఅవుట్లో ఖర్చుపెట్టారు. దీనికి బాధ్యులైన నగరపాలక సంస్థ అధికారులు, కమిషనర్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. స్థానిక సంస్థలకు అప్పగించిన ప్రైవేట్ లేఅవుట్లను కేవలం నిర్వహణ మాత్రమే చేయాల్సి ఉండగా ఎస్ఎంఆర్ నగర్లో ఏకంగా పనులు చేపట్టి నిధులను దుర్వినియోగం చేశారు. ఈ అక్రమాలపై లోకాయుక్తను ఆశ్రయించడంతో పాటు కలెక్టర్, విజిలెన్స్, ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తా. –కేవీ సాయిప్రసాద్, మున్సిపల్ రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీర్, ఏలూరు 15వ ఆర్థిక సంఘం నిధులతో పనులు సీసీ డ్రెయిన్కు రూ.10.22 లక్షలు సీసీ డ్రెయిన్కు రూ.10.85 లక్షలు సీసీ రోడ్డుకు రూ.23.92 లక్షలు సీసీ రోడ్డుకు రూ.27 లక్షలు సీసీ డ్రెయిన్కు రూ.10.37 లక్షలు సీసీ రోడ్డుకు రూ.52.63 లక్షలు ప్రైవేట్ లేఅవుట్లో నామినేషన్ పనులు రూ.1.73 కోట్ల కార్పొరేషన్ నిధులతో మౌలిక వసతులు 15వ ఆర్థిక సంఘం నిధులూ వినియోగం నగరపాలక సంస్థ అధికారుల లీలలు -
మెడికల్ కాలేజీతో మెరుగైన వైద్యం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలని సంకల్పించారు. దీనిలో భాగంగా పాలకొల్లు మండలం దగ్గులూరులో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు కూడా చేపట్టారు. అత్యంత మెరుగైన వైద్యం, అధునాతన పరికరాలు ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ కాలేజీ నిర్మాణం పూర్తయితే పలురకాల స్పెషలిస్టులతో పాటు అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వస్తాయి. అత్యవసర సేవలు కూడా వేగంగా అందుతాయి. అయితే కూట మి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ కాలేజీ నిర్మాణాన్ని అటకెక్కించింది. నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, కూటమికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నా ప్రజలకు ఉత్తమ సేవలందించే వైద్య కళాశాల నిర్మాణాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. స్థానికంగా మెడికల్ కాలేజీని అందుబాటులోకి తీసుకువచ్చి పేదల ప్రాణాల కాపాడవచ్చనే ఆలోచనల కూడా వీరు చేయడం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భీమవరం నుంచి కాకినాడకు దూరం 125 కి.మీ. భీమవరం నుంచి విజయవాడకు దూరం 139 కి.మీ. భీమవరం నుంచి గుంటూరుకు దూరం 183 కి.మీ. -
చెట్టును ఢీకొన్న కారు
బుట్టాయగూడెం: మండలంలోని నూతిరామన్నపాలెం సమీపంలో ఆదివారం సాయంత్రం ఓ కారు చెట్టును ఢీకొట్టింది. తాడేపల్లిగూడెంకు చెందిన కొందరు యువకులు గుబ్బల మంగమ్మగుడి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా నూతిరామన్నపాలెం సమీపంలో ఒక ఆటోను ఢీకొట్టి పక్కనే ఉన్న కొబ్బరిబొండాల కొట్టును ఢీకొట్టి ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో తమకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని ఆటో డ్రైవర్, కొబ్బరిబొండాల వ్యాపారులు సతీష్, భవానీ కోరుతున్నారు. కాళ్ల: తల్లిదండ్రులు తమ పిల్లలను అనుమతి లేని పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కోల్పోవద్దని మండల విద్యాశాఖాధికారి–1 డీ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కాళ్ల మండలం సీసలి గ్రామంలో ప్రభుత్వ అనుమతి లేకుండా శ్రీ భారతి స్కూలు అడ్మిషన్లు నిర్వహిస్తూ, ఫీజులు వసూలు చేస్తున్నట్టు సమాచారం వచ్చిందని, ఈ నేపథ్యంలో యాజమాన్యానికి నోటీసు ఇచ్చామన్నారు. పిల్లలను గుర్తింపు లేని పాఠశాలలో చేర్పించడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే విద్యా పథకాలు, సంక్షేమ ప్రయోజనాలు, ఉపకార వేతనాలు, తల్లికి వందనం, యూనిఫాం, మధ్యాహ్న భోజన పథకం వంటివి వర్తించవని వెల్లడించారు. రూ.2 లక్షల నగదు అపహరణ ఏలూరు టౌన్: ఏలూరు ఆర్ఆర్పేట రైల్వే ట్రాక్రోడ్డులోని ఓ ఏసీల దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఏలూరు సంతోష్నగర్ ప్రాంతానికి చెందిన గేదెల చంద్రశేఖర్ గత ఏడాది కాలంగా రైల్వేట్రాక్ రోడ్డులో డైకిన్ సాయిబాలాజీ కూలింగ్ సొల్యూషన్స్ పేరుతో ఏసీల విక్రయ దుకాణం నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి యథావిధిగా తన పనులు ముగించుకుని షాప్ షట్టర్లకు తాళాలు వేసి ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం వచ్చి చూసేసరికి షాపు వెనుకవైపు షట్టర్ తాళాలు పగలగొట్టి ఉండటంతో లోనికి వెళ్లి చూడగా కౌంటర్లోని రూ.2 లక్షల నగదు అపహకరణకు గురయ్యాయని గుర్తించాడు. సీసీ కెమెరాలను పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి లోనికి ప్రవేశించి కౌంటర్లోని నగదు అపహరించినట్లు గుర్తించారు. షాప్ యజమాని చంద్రశేఖర్ ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దెందులూరు: ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు దెందులూరు ఎస్సై డి.వెంకట్ కుమార్ తెలిపారు. పెరుగుగూడెం గ్రామానికి చెందిన మోత్కూరి లక్ష్మణరావు కుమార్తెకు ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని చెప్పి ఏలూరుకు చెందిన మాగంటి లక్ష్మీ రత్న దుర్గ వాణి, మాగంటి అశోక్ కుమార్ రూ.1.20 కోట్లు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. నకిలీ రసీదులు, అడ్మిషన్ పత్రాలు, లేఖలు, ఇతర డాక్యుమెంట్లు సృష్టించి ఫిర్యాదుదారున్ని మోసం చేశారన్నారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ నిందితులు విచారణకు సహకరించకుండా తప్పించుకుంటూ వచ్చారన్నారు. అరెస్ట్ చేసిన నిందితులను ఏలూరు కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు. -
ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి
ఉండి: యండగండిలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇవి. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు నుంచి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కామేష్(20) స్థానికుడైన కార్తీక్ ఇద్దరు కలిసి ద్విచక్రవాహనంపై గరగపర్రు రోడ్డు నుంచి యండగండి వైపు వెళుతున్నారు. ఇదే సమయంలో యండగండి వైపు నుంచి వస్తున్న మరో వ్యక్తి ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కామేష్ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం నడుపుతున్న కార్తీక్కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఏలూరు తరలించారు. మరో ద్విచక్రవాహనంపై వచ్చిన వ్యక్తికి గాయాలుకాగా అతడిని భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఉండి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏలూరు టౌన్: ఏలూరు రూరల్ సాయినగర్ శివారు సూర్యనారాయణ కాలనీలో గుర్తు తెలియని వృద్ధుడు మృతిచెంది రోడ్డుపక్కన పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. మృతుని వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందన్నారు. వడదెబ్బకు మృతి చెంది ఉంటాడా.. లేక అనారోగ్యంతో మృతిచెందాడా అనే అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. -
పెద్దింట్లమ్మా.. పాహిమాం
కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మ నీ చల్లని దీవెనలు మాకు అందించమ్మా అంటూ భక్తులు కొల్లేటికోట పెద్దింట్లమ్మను ఆర్తితో వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం తరలివచ్చి అమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు వేడి నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్క రోజు ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల విక్రయం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.80,870 ఆదాయం వచ్చిందని చెప్పారు. -
సరైన నిర్ణయం తీసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం ఆక్వారైతుల సమస్యలపై సరైన నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే రైతు పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ప్రభుత్వానికి రైతుల నుంచి వచ్చే ఆదాయాన్ని రైతు కోసమే ఖర్చు చేయాలి. గతంలో చంద్రబాబు పాలకొల్లు సభలో 90 శాతం మంది ఆక్వా రైతులు నష్టపోయారని చెప్పారు. ఇప్పుడు అదే స్థితిలో ఉన్నారు. – యడవల్లి వెంకటేశ్వరరావు, మండల జనసేనపార్టీ అధ్యక్షుడు సిండికేట్ వ్యవస్థను రూపుమాపి ప్రభుత్వమే రొయ్యల కొనుగోలు చేపట్టాలి. లేకపోతే ఆక్వా రైతు సిండికేట్ చేతిలో బలైపోతున్నాడు. అప్పుడు ఊబిలో కూరుకుపోతున్నాడు. మేతల ధరలు తగ్గించాలని కోరినందుకే సిండికేట్లు ఆక్వా రైతులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. పట్టుబడి వచ్చినా పట్టుకుని అమ్ముకోలేని స్థితిలో ఆక్వా రైతు ఉన్నాడు. – యువరాజు, ఆక్వా రైతు నాయకుడు, కలిగొట్ల సిండికేట్లు, మేతల వ్యాపారులు ఐకమత్యంగా ఆక్వా రైతుల నడ్డి విరుస్తున్నారు. ఆక్వా రైతులంతా ఐకమత్యంగా కార్యాచరణ రూపొందిద్దాం. ఆక్వా రైతులను నిలువునా ముంచుతున్న సిండికేట్లకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. ప్రభుత్వం దిగివచ్చేలా అమరావతికి పాదయాత్ర చేద్దాం. – అడబాల నాని, వైఎస్సార్సీపీ నాయకుడు, ఉండి మండలానికి ఒకటి చొప్పున కోల్డ్ స్టోరేజ్లు ప్రభుత్వమే నిర్మించి ఆక్వా రైతులకు అందజేయాలి. ఎందుకంటే సిండికేట్ల చేతిలో మోసపోయి సర్వం కోల్పోతున్న ఆక్వా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. సబ్సిడీ విద్యుత్ను కూడా వెంటనే అందజేసి ఆక్వారైతును నష్టాల ఊబి నుంచి పైకి తీసుకురావాలి. – పూసపాటి వెంకట్రాజు, ఆక్వా రైతు, ఉండి -
ద్వారకా తిరుమలకు పోటెత్తిన భక్తులు
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రం శనివారం భక్తజనులతో పులకించింది. మండుతున్న ఎండలను సైతం భక్తులు లెక్కచేయకుండా శ్రీవారి దర్శనార్ధం ఆలయ ఆవరణలో బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో క్షేత్ర పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివెట్టి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట, నిత్యాన్నదాన సదనం తదితర విభాగాల్లో భక్తులు కిటకిటలాడారు. క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయ ఆవరణలో బారులు తీరారు. సామాన్య భక్తుల సౌకర్యార్ధం ఆలయ అధికారులు అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. క్యూలైన్లలోని భక్తులకు నిరంతరంగా వడ జావను, మంచి నీటిని అందించారు. దర్శనం టికెట్లు, ప్రసాదాల విక్రయాలు, కేశఖండన టికెట్ల విక్రయాలు, విరాళాల ద్వారా శ్రీవారికి రూ. 40 లక్షలకు పైగా ఆదాయం లభించింది. -
భయంతో పట్టుబడులు చేయొద్దు
పాలకొల్లు సెంట్రల్: ఆక్వా రైతులకు జరుగుతున్న అన్యాయంపై రైతుల్లో పెను మార్పు వచ్చిందనడానికి మొన్న జరిగిన నిరసన కార్యక్రమమే నిదర్శనమని, ఈ నిరసన ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అని జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్రాజు అన్నారు. శనివారం పూలపల్లిలో జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు. ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు దిగి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, తమ ఉద్యమం మరింత ఉగ్రరూపం దాల్చుతుందని హెచ్చరించారు. ఫీడ్, ప్రాసెసింగ్ యూనిట్లు ఆక్వా రైతులను దోచుకోవాలనే దుర్భుద్ధితోనే ఉన్నాయని ఆరోపించారు. తాము తమ సమస్యల కోసం పోరాటం చేస్తుంటే, కొందరు రైతులు తమ సరుకు పట్టుబడి దశకు చేరుకుందని ప్రాసెసింగ్ యూనిట్లను ఆశ్రయిస్తున్నారని, దానికి వారు ఉన్న ధర కంటే మరింత తక్కువ అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ. 230 ఉన్న ధరను, పట్టుబడి చేసే రైతులను భయపెట్టి మరో రూ. 10 నుంచి రూ. 20 తగ్గించి అడుగుతున్నారని, ధరలు ఇంకా తగ్గిపోతాయని రైతులను భయాందోళనకు గురిచేస్తున్నారని గుర్తుచేశారు. ఏదైనా కారణం చేత వైరస్ బారిన పడిన సరుకును మాత్రమే రైతులు పట్టుబడి చేసుకోవాలని, ధరలు తగ్గిపోతాయనే భయంతో సాగు బాగున్న రైతులు పట్టుబడులు చేయవద్దని సూచించారు. ఈ నెల 29న అమలాపురంలో రాష్ట్రస్థాయి ఆక్వా సంఘం సర్వసభ్య సమావేశంలో తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మేడిది జాన్రాజు, మేకా ఫణీంద్ర కుమార్, పెన్మెత్స వెంకట సత్యనారాయణరాజు, సోంబాబు పాల్గొన్నారు. -
తాగునీటి చెరువులో రొయ్యల సాగు
● పెంచికలమర్రులో రాత్రికి రాత్రే రొయ్యల పట్టుబడి ● పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై అధికారుల తప్పుడు నివేదికలు పంచాయతీ చెరువుల్లో రొయ్యల సాగు నిషేధం. వరదలకు ఎగువ నుంచి కొట్టుకొచ్చిన రొయ్యలు పెంచికలమర్రు చెరువులో పడ్డాయి. అసలు ఇక్కడ చెరువుల్లో సాగు జరగడం లేదు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, తహసీల్దారుతో కలిసి పరిశీలించాను. – బి.రాజ్కుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి, ఏలూరు సాక్షి, టాస్క్ఫోర్సు: పెంచికలమర్రు రక్షిత నీటి పథకం చెరువులో రాత్రికి రాత్రి సుమారు రూ.30 లక్షల రొయ్యలను పట్టుకుని అమ్మేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాపీగా వచ్చిన జిల్లా స్థాయి అధికారులు అసలు సాగే లేదని, వరదలకు రొయ్యలు ఈ చెరువులోకి కొట్టికొచ్చాయని జిల్లా కలెక్టర్కే ఝలక్ ఇస్తూ నివేదిక ఇచ్చారు. కై కలూరు మండలం పెంచికలమర్రులో 2000 సంవత్సరంలో సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. కొల్లేరు పరిసర ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేసే ఉద్ధేశంతో ఏర్పాటు చేశారు. నీటిని నిల్వ చేసుకోడానికి ఒక్కో చెరువు 20 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 3 చెరువులు కలిపి 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. సమీపంలో చేపల చెరువుల సంఖ్య పెరగడంతో ఇక్కడ నీరు కలుషితమైంది. కాల్వల ద్వారా నీటి సరఫరా లేదు. 2019లో పంచాయతీ చెరువులో చేపల పట్టుబడికి పాటలు పెట్టి అదాయాన్ని పంచాయతీ తీసుకుంది. సీడబ్ల్యూఎస్ స్కీం చెరువులు ఇప్పుడు రాజకీయ నేతల అండతో అక్రమ సాగుకు కేరాఫ్గా మారాయి. జిల్లా కలెక్టర్కు తప్పుడు నివేదికలు పెంచికలమర్రు వాటర్ స్కీంలో 20 ఎకరాల్లో రొయ్యల సాగు, మరో 20 ఎకరాల్లో చేప పిల్లల సాగును ముగ్గురు కలిసి చేస్తోన్నారు. మంచినీటి చెరువుల్లో రసాయనాలతో రొయ్యల సాగు నిషేధం. రొయ్యల సాగుపై పీజీఆర్ఎస్లో మే 4న ఫిర్యాదు చేశారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ గిరి, స్థానిక డీఈ సత్యనారాయణ, ఏఈ నాగబాబు ఆక్వా సాగు జరగడం లేదని ఎండార్స్మెంట్ ఇచ్చారు. దీనిపై ఫిర్యాదుదారుడు తిరిగి పీజీఆర్ఎస్లో చెరువుల్లో చేపలు, రొయ్యలు ఉంటే అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే తప్పుడు సమాచారం ఇచ్చినందుకు తనను శిక్షించండని మరో ఫిర్యాదు చేశాడు. దీంతో శనివారం జిల్లా ఫిషరీస్ అధికారి రాజ్కుమార్, ఆర్డబ్ల్యూఎస్ అధికారి కడియాల శ్రీనివాసరావు, ఏఈ నాగబాబు, తహసీల్దారు రామకృష్ణారావులు వచ్చి చెరువులను పరిశీలించారు. అయితే శుక్రవారం రాత్రే ఈ చెరువులో రొయ్యల పట్టుబడులు చేశారు. కొల్లేరు మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని రూ.కోట్లు గడిస్తున్న అక్రమార్కుడు అండతోనే పెంచికలమర్రు తాగునీటి చెరువుల్లో రొయ్యల సాగు జరుగుతోంది. అధికారులు ఎవరూ తన మాట కాదనరని, ఎవరైన అధికారులు వస్తే తన సామాజికవర్గ ప్రజలను ఉసిగెల్పి గొడవ చేయిస్తానని బీరాలు పలుకుతున్నాడు. అప్పుడప్పుడు మత్స్యశాఖ మంత్రితో ఫొటోలు దిగి గొప్పలు చెప్పుకుంటున్నాడు. -
మద్దిలో అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో శనివారం ఆంజనేయస్వామికి అభిషేక సేవ నిర్వహించారు. ఆలయ ముఖ మండపంపై ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు. ఆలయానికి వివిధ సేవల రూపేణా రూ.1,98,573 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 2405 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఈవో తెలిపారు. నరసాపురం: మొగళ్తూరు మండలంలోని మొళ్లపర్రు, పేరుపాలెం, కేపీపాలెం బీచ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రాహుల్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బీచ్ల అభివృద్ధిపై శనివారం ఆయన సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పర్యాటక అభివృద్ధికి సంబంధించి పెండింగ్లో ఉన్న వివిధ ప్రాజెక్టుల నిర్మాణ సమస్యలపై చర్చించారు. పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. వ్యాపార వర్గాలతో పాటు మత్స్యకారులకు కూడా భూములను లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రజలు అపోహలు వీడి అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. యువతకు, పెట్టుబడిదారులకు పర్యాటక, పారిశ్రామిక, బ్యాంకింగ్ రంగాల ద్వారా నైపుణ్య శిక్షణ అందిస్తామని తెలిపారు. ఈ సమీక్షలో ఆర్డీవో దాసి రాజు, పర్యాటక అభివృద్ధి అధికారి ఎ. వెంకట అప్పారావు, తహసీల్దార్ రాజ్ కిషోర్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం అర్బన్: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో అడ్మిషన్లు పెంచేందుకు ఆ శాఖ అధికారులు, హాస్టళ్ల నిర్వాహకులు, అసిస్టెంట్లు కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎన్వీ అరుణకుమారి ఆదేశించారు. శశి ఇంజినీరింగ్ కాళాశాల సెమినార్ హాలులో సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ల అధికారులు, అసిస్టెంట్లు, సిబ్బందికి సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది హాస్టళ్లలో విద్యార్థులు వసతికి చేరేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. విద్యాభివృద్ధి, ఆరోగ్యం, భద్రత, సమగ్ర వికాసాన్ని, నిర్ణీత మోను ప్రకారం పౌష్టికాహారం అందచేయడమే లక్ష్యంగా చేసుకుని అన్ని హాస్టళ్ళలో సౌకర్యాలను ప్రభుత్వం కల్పింస్తుందన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ సహాయ అధికారి బాలగోపాల రామాంజనేయరాజు, తాడేపల్లిగూడెం అర్బన్ వార్డు వెల్ఫేర్ సెక్రటరీలు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన ఆక్వా రైతు
ఉండి: ఆక్వా రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ శనివారం ఉండిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ర్యాలీగా ఉండి సెంటర్కు చేరుకుని మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఆదుకోవాలని, రొయ్యల కొనుగోలు సిండికేట్లపై చర్యలు తీసుకో వాలని వారు నినాదాలు చేశారు. కూటమి నాయకులైన ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉండికి చెందిన రైతు పూసపాటి వెంకట్రాజు తన చెరువులోని రొయ్యలను రోడ్డుపై పోయడంతో పాటు, స్థానికులకు పంపిణీ చేశారు. ప్రభుత్వానికి డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ఆక్వా రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా మేతల ధరలు పెరిగినప్పటికీ, మేతల తయారీదారులు, రొయ్యల కొనుగోలుదారులు ఏకమై కిలోకు రూ.50 చొప్పున ధర తగ్గించి రైతుల వెన్నువిరుస్తున్నారని వారు మండిపడ్డారు. అంతేకాకుండా, రొయ్యల పట్టుబడికి అవసరమైన లారీలను పంపించకుండా తాత్సారం చేస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వేలకోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి ఇస్తున్న ఆక్వా రంగంపై ఎలాంటి భరోసా లేదని, ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి సిండికేట్లపై చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో ఆక్వా సాగుకు క్రాప్ హాలిడే ప్రకటించడానికి రైతులంతా సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. మండలానికి ఒకటి చొప్పున కోల్డ్ స్టోరేజ్లను ప్రభుత్వమే నిర్మించాలని, అప్పుడే ఆక్వారైతు నిశ్చింతగా ఉండగలడని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించుకుంటేనే ఆక్వా రైతు బతుకుతాడని లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమన్నట్లు రైతుల పరిస్థితి ఉందని పలువురు నాయకులు వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు యూనిట్ విద్యుత్తును రూ.1.50కే అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించని పక్షంలో అమరావతికి పాదయాత్ర చేస్తామని, ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే తగిన విధంగా ఆక్వారైతుల స్పందన ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే ఆక్వా రైతు ఆవేదనలో కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ఉండిలో నిరసన ర్యాలీ రొయ్యలు రోడ్డుపై పోసి ఆందోళన సిండికేట్లపై చర్యలు తీసుకోవాలని నినాదాలు కేజీకి రూ.50 తగ్గించి రైతును ముంచేస్తున్నారంటూ ఆందోళన -
వసూల్ రాజా!
రూ.10 కోట్లతో స్కూల్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏఎంసీ చైర్మన్ పదవికి రూ.30 లక్షల బేరం, వైస్ చైర్మన్ పదవికి రూ.15 లక్షలు, పీఏసీఎస్ చైర్మన్ పదవికి రూ.10 లక్షల నుంచి 12 లక్షలు, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు రూ.లక్ష, ఇసుక ర్యాంపు కోసం అడ్వాన్సు రూ.25 లక్షలు.. ఇదీ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వసూళ్ల చిట్టా. పదవులకు, పనులకు, పోస్టింగులకు ఇలా ప్రతిదానికి రేటు కట్టి ముక్కుపిండి వసూలు చేయడం ఆయన ప్రత్యేకత. ఇది కాకుండా పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా చేసుకోవడానికి ప్రతి శాఖ నుంచి టార్గెట్ పెట్టి మరీ వసూలు చేశారు. ఇలా జిల్లా రాజకీయాల్లో గత ఆరు నెలలుగా పోలవరం ఎమ్మెల్యే వ్యవహారశైలి హాట్ టాపిక్గా మారింది. ఇవన్నీ కాకుండా కుటుంబ వ్యవహారం కూడా ఇబ్బందికరంగా మారడం, సొంత పార్టీ శ్రేణులే ఫిర్యాదులు చేసిన క్రమంలో ఎట్టకేలకు పార్టీ అధినేత పిలిచి గట్టిగా క్లాస్ పీకినట్లు సమాచారం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆది నుంచి దూకుడు వ్యవహార శైలితో కొనసాగుతున్నారు. తారాస్థాయిలో అవినీతికి పాల్పడుతూ పెద్ద ఎత్తున వసూళ్ల దందాకు తెరలేపడంతో పాటు తరచూ వివాదాల్లో కొనసాగుతూనే ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో వర్గ విభేదాలు, టీడీపీ నేతలతో దూరం, ఇవన్నీ కాకుండా కుటుంబంలో తీవ్ర సమస్యలు ఇలా అన్నీ చుట్టుముడుతున్నా అవినీతి దందా మాత్రం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. కొన్ని నెలల క్రితం రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని కూటమి నేతలే ఫోన్లో మాట్లాడుకోవడం సోషల్ మీడియాలో వైరల్ కావడం ఎమ్మెల్యే పరిస్థితికి నిదర్శనం. తాజాగా కొద్ది రోజుల క్రితం పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణుల పేరిట ఎమ్మెల్యే చేసిన అవినీతి వ్యవహారాలకు సంబంధించి 7 పేజీల ఫిర్యాదు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదే రీతిలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు ఫిర్యాదు అందింది. దీంతో పాటు ఎమ్మెల్యే భార్య గతంలో పవన్ కల్యాణ్ను కలవడానికి మూడు, నాలుగు సార్లు ప్రయత్నించి విఫలమై, ఇటీవల కలిసి బాలరాజుపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ పరిణామాల క్రమంలో శనివారం పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి పిలుపు రావడంతో ఎమ్మెల్యే బాలరాజు వెళ్లి కలిశారు. అధిష్టానం సీరియస్ పంచాయతీ రాజ్ శాఖ నుంచి రూ.147 కోట్ల నిధులు పోలవరానికి ఇస్తే అభివృద్ధి పనులు ఎందుకు చేయలేకపోయారు. ఇదేం పద్ధతి.., ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని పవన్ కల్యాణ్ క్లాస్ పీకినట్లు సమాచారం. ఫిర్యాదులోని అన్ని అంశాలకు సమగ్ర వివరణ ఇవ్వాలని, అలాగే కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని కుటుంబ సమస్యను నాలుగు వారాల్లో చక్కదిద్దుకోవాలని, అధికారులను సమన్వయం చేసుకుని పనులు పూర్తి చేసేలా చూడాలని సూచించినట్లు సమాచారం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై అధిష్టానానికి ఫిర్యాదు పదవులు, పనులు అన్నింటా వసూళ్లే ఏఎంసీ చైర్మన్ పదవికి రూ.30 లక్షలు, వైస్ చైర్మన్కు రూ.15 లక్షలు రెండేళ్ళల్లో భారీగా పెరిగిన వ్యక్తిగత ఆస్తులు ఎమ్మెల్యేను వివరణ కోరిన పవన్ కల్యాణ్ కుటుంబ వివాదాలపైనా వివరణ కోరినట్లు సమాచారం మక్కినవారిగూడెం పీఏసీఎస్ చైర్మన్ పదవి కోసం ఒకరి వద్ద రూ.10 లక్షలు, మరో నేత వద్ద రూ.15 లక్షలు, టీ. నర్సాపురం పీఏసీఎస్ చైర్మన్ పదవి కోసం రూ.15 లక్షలు, ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు రూ.లక్ష, కొత్త పట్టిసీమ పీఏసీఎస్ చైర్మన్ పదవి కోసం రూ.7 లక్షలు, గూటాల ఇసుక ర్యాంపు కోసం రూ.25 లక్షలు, అండర్–16 క్రికెట్ టీమ్ కోసం రూ.5 లక్షలు, బ్రాందీషాపు సిండికేట్ నుంచి లక్షల వసూళ్లు ఇలా ప్రతి పనికి వసూళ్లకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు సంవత్సరాల వ్యవధిలో ఎమ్మెల్యే సొంత గ్రామమైన బర్రింకలపాడులో క్యాంపు ఆఫీసు సమీపంలో రూ.10 కోట్ల వ్యయంతో 56 గదుల స్కూల్ను నిర్మిస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మధురా రెస్టారెంట్ను కోటిన్నరకు లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
కూటమిలో మట్టి, మద్యం చిచ్చు
భీమవరం: వీరవాసరం మండలంలోని కూటమి నాయకుల మధ్య విభేదాలు రోజురోజుకూ రచ్చకెక్కుతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అక్రమ మద్యం, మట్టి తరలింపు వ్యాపారాలు చేస్తూ పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారని టీడీపీ నాయకులే అధికారులకు ఫిర్యాదు చేయడం భీమవరం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా కూటమిలోని టీడీపీ నాయకులు గ్రూపులుగా విడిపోయి, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వేసవి సీజన్లో మట్టి విక్రయాలు జోరుగా సాగుతుండగా, వీరవాసరం మండలంలోని కొంతమంది కూటమి నాయకులు పైరవీలు చేస్తూ ట్రాక్టర్లు, లారీలు, జేసీబీల యజమానుల వద్ద పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. మట్టి తోలకాలకు అడ్డంకులు లేకుండా చూడాలంటే పార్టీ అధినాయకులకు, అధికారులకు ముడుపులు ముట్టచెప్పాలంటూ మట్టి తరలించే వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. మరికొంతమంది నాయకులైతే తమ సొంత ట్రాక్టర్లు, లారీలు, జేసీబీలను ఉపయోగించి మట్టిని తరలిస్తున్నారు. ప్రస్తుతం మండలంలోని పలు గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు సొంత అవసరాల కోసం మట్టిని తరలించే వారి సంఖ్య భారీగా పెరిగింది. అనేక చోట్ల ప్రధాన రహదారుల వెంట ఉన్న పంట పొలాలను పూడ్చి మెరక చేస్తున్నారు. రెవెన్యూ అనుమతులు లేకపోవడం వరం మట్టి తరలింపునకు సంబంధించి రెవెన్యూ అధికారుల అనుమతులు అవసరం లేకపోవడం రాజకీయ నాయకులకు బాగా కలిసివచ్చింది. కొంతమంది నాయకులు రెవెన్యూ, మైనింగ్ అధికారులు, పార్టీ అధినాయకులకు ముడుపులు ఇవ్వాలంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అసంతృప్తితో ఉన్న మరో వర్గం నాయకులు ఇటీవల వీరవాసరం మండల పరిషత్ సమావేశంలో అక్రమ మట్టి తరలింపును అడ్డుకోవాలని అధికారులను కోరారు. విచ్చలవిడిగా మట్టి లారీలు, ట్రాక్టర్లు తిరగడం వల్ల రహదారులు ధ్వంసమవుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కె. శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి వీరవల్లి శ్రీనివాసరావు, బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు వి.దివాకర్, జనసేన మండల ప్రధాన కార్యదర్శి జి. విజయలక్ష్మి కలిసి తహసీల్దార్కు ఫిర్యాదు చేయడం విశేషం. అలాగే శుక్రవారం భీమవరంలో టీడీపీ నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తోట సీతారామలక్ష్మికి కూడా ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు కూడా వీరవాసరం మండలంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, బెల్ట్ షాపులకు కొదవలేకుండా పోయిందని, అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మొత్తం మీద వీరవాసరం మండలంలో కూటమి నాయకుల అంతర్గత విభేదాల వల్ల జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో కూటమి పార్టీల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధికారులు, పార్టీ పెద్దలకు టీడీపీ నేతల ఫిర్యాదు మట్టి తరలింపుతో రోడ్లు పాడవుతున్నాయని ఆందోళన మద్యం అధిక ధరలకు విక్రయించడంపైనా ఫిర్యాదు -
రోడ్డున పడ్డ రొయ్య రైతు
సాక్షి, భీమవరం/ పాలకొల్లు సెంట్రల్ : రొయ్య ధరలు పతనంపై ఆక్వా రైతులు రోడ్డెక్కారు. సిండికేట్ దోపిడీని అడ్డుకోకపోతే చావే శరణ్యమంటూ రొయ్యలు రోడ్డుపై వేసి నిరసన తెలిపారు. తమకు గొంతెమ్మ కోరికలు లేవని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేస్తే చాలంటూ మండుటెండలో కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైతులకు న్యాయం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు పదిరోజుల వ్యవధిలో రొయ్య ధరలు కిలోకు 100 కౌంట్ రూ. 265 నుంచి రూ.230కు, మిగిలిన కౌంట్లు రూ.30 నుంచి రూ.50 వరకు పతనం కావడంపై జై భారత్ క్షీరారామ ఆక్వారైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్రాజు ఆధ్వర్యంలో శుక్రవారం పాలకొల్లులో రైతులు ఆందోళన చేశారు. మండుటెండలో పూలపల్లి వై.జంక్షన్ వద్ద తొట్టెల్లోని రొయ్యలు రోడ్డుపై వేసి నిరసన తెలిపారు. కొద్దిసేపు ట్రాఫిక్ను స్తంభింప చేశారు. రొయ్య ధరల పతనంతో తీవ్రంగా నష్టపోతున్నామని, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ నాయకులు, రైతులు మాట్లాడుతూ నాలుగు నెలలు పాటు చెరువుల వద్ద కాపలా ఉండి ప్రతికూల వాతావరణం, పరిస్థితులకు ఎదురొడ్డి ఆక్వా కల్చర్ చేస్తే.. సీడు, ఫీడు, ప్రాసెసింగ్ ప్లాంట్ల యాజమాన్యాలు, ఎక్స్పోర్టర్స్ ఏకమై రైతుల కష్టాన్ని అడ్డంగా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల మేత ధరలను పెంచుతున్నట్టు ఫీడ్ కంపెనీలు ప్రకటించగా రైతులు రొడ్డెక్కడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని పెంపును తాత్కాలికంగా వాయిదా వేసిందన్నారు. వచ్చే నెల నుంచి ఫీడు ధరలు పెంచుతామని కంపెనీలు చెబుతున్నాయని, ఈ లోగా రైతులను ఏదో విధంగా దోచేయాలని రొయ్య రేట్లు తగ్గించారని మండిపడ్డారు. ఫీడ్ రేట్లు పెంచితే ఉపేక్షించేది లేదని రాష్ట్ర వ్యాప్తంగా ప్లాంట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులను ఏకం చేసే దిశగా రాష్ట్ర కమిటీ ఏర్పాటుకోసం త్వరలో అమలాపురంలో రాష్ట్ర స్థాయిలో ఆక్వా రైతుల సమావేశం నిర్వహించనున్నట్టు గాంధీభగవాన్రాజు తెలిపారు. ఎన్నికల హామీల అమలేది అధికారంలోకి వస్తే రూ.1.50 కే సబ్సిడీ విద్యుత్ను అందిస్తామని, కోల్డ్ స్టోరేజీలు నిర్మాణం, ఏరియేటర్లపై సబ్సిడీ ఇస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలుచేయాలని డిమాండ్ చేశారు. సబ్సిడీ విద్యుత్ కోసం వేలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. తాము కొత్తగా గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను మాత్రమే అమలుచేయమని కోరుతున్నామని రైతులు స్పష్టంచేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రానున్న రోజుల్లో క్రాప్ హాలిడేకు వెళ్లనున్నట్టు రైతులు ప్రకటించారు. సంఘ నాయకులు బోణం చినబాబు, మేకా ఫణి, రుద్రరాజు సత్యనారాయణరాజు, పెన్మెత్స సత్యనారాయణరాజు, సోమేశ్వరరాజు, సోమరాజు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. స్తంభించిన ట్రాఫిక్ వైఎస్సార్సీపీ హయాంలో అప్సడాలో ఫోన్ చేస్తే వెంటనే స్పందించి రైతుల సమస్య పరిష్కారానికి కృషిచేసేవారు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఎత్తే నాథుడు లేడని రైతులు వాపోతున్నారు. రైతులు ఐకమత్యంగా ఉంటే సిండికేట్ దోపిడీకి అడ్డుకట్ట వేయవచ్చని, సాగు పూర్తయ్యాక రెండు మూడు నెలలు పాటు చెరువును ఎండగట్టి సాగుచేస్తే మంచి కౌంట్ వచ్చే వీలుంటుందన్నారు. వంద కౌంట్ వల్ల రైతులకు ఒరిగేదేమీ ఉండదని నిరసనలో పాల్గొన్న రైతులు తెలిపారు. అధికశాతం మంది రైతులు సాగు పూర్తయ్యాక చెరువును ఎండగట్టకుండా మళ్లీ సాగు ప్రారంభించడం వల్ల సీడు, ఫీడు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎక్స్పోర్టర్స్ బాగుపడుతున్నారన్నారు. రైతుల్లోని అనైక్యతను సిండికేట్ తమకు అనుకూలంగా మలుచుకుంటోందని వివరించారు. రెండు మూడు నెలలు విరామం ఇస్తే సీడు, ఫీడు, పాస్రెసింగ్ ప్లాంట్లు, ఎక్స్పోర్టర్స్కు వ్యాపారం జరగక వారంతా దారిలోకి వస్తారన్నారు. ఆ దిశగా రైతుల్లో చైతన్యవంతం కావాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు. ధరల పతనంపై ఆగ్రహం పాలకొల్లులో రొయ్యలు రోడ్డుపై పడేసి నిరసన సిండికేట్ దోపిడీని అరికట్టాలని డిమాండ్ ప్రభుత్వం స్పందించకుంటే క్రాప్ హాలిడేకు వెళ్తామంటున్న రైతులు -
కానరాని క్యాంపస్ ప్లేస్మెంట్స్
నిట్కు తగ్గిన కంపెనీల రాక తాడేపల్లిగూడెం: జాతీయ విద్యాసంస్థల్లో సీటు సాధిస్తే చాలు ఉద్యోగాలకు ఢోకా లేదనే ధీమా ఉండేది. విద్యావ్యవస్థలో వస్తున్న వినూత్న మార్పులు, ఏఐ కారణంగా క్యాంపస్ ప్లేస్మెంట్లు దాదాపుగా తగ్గాయి. ఒకప్పుడు నిట్లు, ఐఐటీలు వంటి జాతీయ విద్యాసంస్థలకు కంపెనీలు క్యూ కట్టేవి. వందల సంఖ్యలో సంస్థలు వచ్చి విద్యార్థులకు భారీ వేతనాలతో ఆఫర్ లెటర్లు ఇచ్చేవి. దేశంలో 31వ నిట్గా ఏర్పడిన ఏపీ నిట్ కూడా ఉద్యోగాల కల్పనలో తిరుచ్చి నిట్తో పోటీపడేది. ఇప్పుడు పరిస్థితి మారింది. గత రెండు మూడు సంవత్సరాలుగా ఏపీ నిట్కు కంపెనీల రాక తగ్గిపోవడంతో ఉద్యోగాల లభ్యత అంతంత మాత్రంగానే ఉంది. ఏఐ ప్రభావం నేరుగా కొలువులపై పడడంతో కంపెనీల రాక పూర్తిగా తగ్గింది. 2019లో ఏపీ నిట్ తొలి బ్యాచ్ బయటకు వెళ్లినప్పటి నుంచి 2025–26 బ్యాచ్ వరకు గణాంకాలను పరిశీలిస్తే ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ప్రతి బ్యాచ్లో దాదాపుగా 90 శాతానికి పైగా విద్యార్థులు భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందేవారు, ఇప్పుడు వాతావరణం భిన్నంగా ఉంది. ● 2022 బ్యాచ్లో 270 కంపెనీలు రాగా 522 మంది విద్యార్థులకు ఆఫర్ లెటర్లు లభించాయి. అప్పుడు ప్లేస్మెంట్ శాతం 95.69గా ఉండగా, అత్యధిక వార్షిక వేతనం రూ.47.3 లక్షలుగా నమోదైంది. ● 2023 బ్యాచ్కు సంబంధించి 174 కంపెనీలు రాగా, కేవలం 352 మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. దీంతో ప్లేస్మెంట్ శాతం 88.75కు పడిపోయింది. అత్యధిక వార్షిక వేతనం రూ.47 లక్షలుగా ఉంది. ● 2024 బ్యాచ్లో 174 కంపెనీలు మాత్రమే వచ్చి 361 మందికి ఆఫర్ లెటర్లు ఇవ్వగా, ప్లేస్మెంట్ శాతం 74.55కు తగ్గి, అత్యధిక వార్షిక వేతనం రూ.44.1 లక్షలుగా నమోదైంది. ● 2025–26 పాస్డ్ అవుట్ బ్యాచ్లో 180 కంపెనీలు వచ్చి 510 మందికి ఆఫర్ లెటర్లు ఇవ్వగా, ప్లేస్మెంట్ శాతం 80.94గా ఉంది. ఈ బ్యాచ్లో అత్యధిక వార్షిక వేతనం రూ. 65 లక్షలుగా నమోదైంది. -
పవన్ మా గోడు పట్టదా..?
డిప్యూటీ సీఎం కార్యాలయం వద్ద ఉణుదుర్రు బాధితుల నిరసన ఉండి: ఉణుదుర్రు ఆర్అండ్బీ రోడ్డు పక్కన ఇళ్ళు కోల్పోయిన బాధితులకు కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగకపోవడంతో చివరికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లారు. ఉణుదుర్రు బాధితులు సుమారు 30 మంది వరకు మంగళగిరికి వెళ్లారు. అక్కడ మండుటెండలో మాకు న్యాయం చెయ్యండి అంటూ బ్యానర్ పట్టుకుని నిరసనకు దిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూసినా డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ లభించకపోవడంతో కార్యాలయ అధికారిగా భావిస్తున్న ఓ వ్యక్తికి తమ సమస్య చెప్పి వినతి పత్రాలను ఆయనకు అందజేసినట్లు బాధితులు తెలిపారు. పవన్కు కలిసేందుకు రాత్రి వరకు ఎదురు చూశారు. ఆలకోడు భూముల్లో ఉన్న ఇళ్లను గ్రామానికి చెందిన కొందరు కూల్చేసేందుకు పన్నాగం పన్నారని తెలిపారు. ఈ నెల 13న ఇళ్ళలో నుంచి బయటకు గెంటేసి దౌర్జన్యంగా ఇళ్ళు కూల్చేసారని వాపోయారు. చాలా మందికి అద్దె ఇళ్ళు కూడా దొరక్కపోవడంతో సీపీఎం నాయకుల సహాయంతో గ్రామంలోని హైస్కూల్లో తలదాచుకున్నామని వారి సహకారంతోనే భోజనాలు చేస్తున్నట్లు తెలిపారు. తమపై కక్షకట్టిన గ్రామానికి చెందిన కొందరు నాయకులు, ఆక్వా రైతులు గ్రామంలోని హైస్కూల్లో తలదాచుకుంటున్న తమను ఖాళీ చేయించారని తెలిపారు. -
పోలీసులు కొట్టడం వల్లే మృతి
భీమవరం: కుటుంబ సభ్యుల వేధింపులు, పోలీసులు కొట్టడం వల్లే తన కుమారుడు నవీన్కుమార్ మృతిచెందాడని మృతుని తల్లి వీధి బుజ్జి శుక్రవారం భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణుకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మృతిపై పలు అనుమానాలున్నాయని, పోస్టుమార్టం రిపోర్టు కూడా బయటపెట్టడం లేదని, కారకులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. స్పందించిన డీఎస్పీ కేసు ఏలూరు రేంజ్ ఐజీ పరిధిలో ఉందని, జిల్లా ఎస్పీ మానిటరింగ్ చేస్తున్నారని చెప్పారు. కేసు విచారణ పూర్తి పారదర్శకంగా ఉంటుందని న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. యలమంచిలి: అనంతపురం జిల్లాలోని సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లు, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీల మే నెల జీతాలను నిలిపివేయాలని జిల్లా అధికారి ఇచ్చిన ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించింది. పశ్చిమగోదావరి జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ షేక్ ఉమర్ అలీషా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల పొట్ట కొట్టేలా ఏకపక్ష ఉత్తర్వులు జారీ చేయడం అత్యంత బాధాకరమన్నారు. సచివాలయ సిబ్బంది కేవలం ఆధార్ సేవలకే పరిమితం కాలేదన్నారు. ఉద్యోగులు సకాలంలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ, వారిపై ఉన్న అదనపు పనిభారాన్ని గుర్తించకుండా, జీతాలు నిలిపివేస్తామని బెదిరించడం వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల నిలిపివేతకు జారీ చేసిన సదరు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. భీమవరం: భానుడి భగభగలతో జిల్లాలో గత వారం రోజులుగా విద్యుత్ వాడకం విపరీతంగా పెరిగింది. దీంతో అనధికారిక విద్యుత్ కోతలు విధిస్తున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే వడగాల్పులు వీచడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. సాయంత్రం 5 వరకు ఎండ వేడిమిని తట్టులేకపోవడంతో ఎక్కువ మంది ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్స్ వద్ద సేదతీరుతున్నారు. గ్రామాల్లోని ప్రజలు ఇంటివద్దే ఉండడంతో ఏసీల వాడకం పెరిగింది. జిల్లా వ్యాప్తంగా ఈనెల 14న 11.581 మిలియన్ యూనిట్స్ విద్యుత్ను వినియోగించగా 15న 11.670, 16న 11.927 మిలియన్ యూనిట్స్ వినియోగించారు. 18న 12.009, 19న 12.279, 20న 12.503 మిలియన్ యూనిట్స్ విద్యుత్ను వినియోగించారు. గత రెండు రోజులుగా మరింత పెరిగి దాదాపు 13 మిలియన్ యూనిట్స్కు చేరినట్లు చెబుతున్నారు. మరో నాలుగు రోజులు ఎండ తీవ్రత, వడగాల్పులు ఉండడంతో విద్యుత్ వాడకం మరింత పెరిగే అవకాశముంటుందని దాంతో అనధికారిక విద్యుత్ కోతలు పెరిగే ప్రమాదముందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూజివీడు: గిట్టుబాటు ధర లేక నష్టపోయిన మామిడి, మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 23 న వైఎస్సార్సీపీ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి పట్టణ పోలీసులు అనుమతి నిరాకరించినట్లు వైఎస్సార్సీపీ వర్గాలు తెలిపాయి. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు మైలవరం రోడ్డులోని అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అనంతరం సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పట్టణ సీఐను అనుమతి కోరుతూ లేఖ అందజేశారు. రైతులకు సంబంధించిన సమస్యలపైన నిరసన తెలపడానికి సీఐ అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. అనుమతి నిరాకరించడం వెనుక ఒత్తిడులు ఉండొచ్చని వైఎస్సార్సీపీ నాయకులు భావిస్తున్నారు. ద్వారకా ఎస్టేట్కు తరలిరండి: మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు అబేంద్కర్ సెంటర్లో రైతుల నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతిని నిరాకరించినందున నియోజకవర్గవ్యాప్తంగా తరలి వచ్చే మామిడి, మొక్కజొన్న రైతులతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ వైఎస్సార్సీపీ నియోజకవర్గ కార్యాలయమైన ద్వారకా ఎస్టేట్ వద్దకు రావాలని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పిలుపునిచ్చారు. -
ఫిర్యాదులు గడువులోగా పరిష్కరించాలి
పెనుగొండ: ప్రజా ఫిర్యాదుల వేదికలో అందిన అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఇన్చార్జి కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆచంట బాలం వారి పాలెం పీ4 భవనంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో 170 అర్జీలను స్వీకరించారు. గత వారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో వచ్చిన అర్జీలపై ఆర్డీవో దాసిరాజు, డీపీవో వై.దోసి రెడ్డి, జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య సంబంధిత అధికారులతో పరిష్కారాలపై సమీక్ష నిర్వహించారు. ఆచంట నుంచి 116, పెనుమంట్ర నుంచి 17, పోడూరు నుంచి 8, పెనుగొండ నుంచి 29 ఆర్జీలు అందాయి. కార్యక్రమంలో సీపీఓ కే శివపార్వతి, డీఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ గీతాబాయి, జిల్లా సర్వే అధికారి కే జాషువా, తదితరులు పాల్గొన్నారు. భీమవరం: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా జరిగినట్లు ఇంటర్ విద్యాశాఖ జిల్లా అధికారి జి.ప్రభాకరరావు చెప్పారు. జిల్లాలోని 41 పరీక్షా కేంద్రాల్లో ఫస్టియర్ పరీక్ష నిర్వహించగా జనరల్ పరీక్షకు 6,349 మందికి 6,057 మంది హాజరుకాగా ఒకేషనల్ పరీక్షకు 355 మందికి 322 మంది హాజరయ్యారన్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్ పరీక్షకు 2,082 మందికి 1,701 మంది, ఒకేషనల్ పరీక్షకు 77 మందికి 65 మంది హాజరయ్యారని ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ప్రభాకరరావు చెప్పారు. -
ప్రభుత్వ బడికి పెరిగిన ఆదరణ
భీమవరం: పేద విద్యార్థులకు సైతం ఉత్తమ విద్య అందించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన విద్యా సంస్కరణలు నేడు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మనబడి, నాడు–నేడు పథకాలతో ప్రభుత్వ పాఠశాలు ఆధునిక హంగులతో రూపుదిద్దుకోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించేందుకు మొగ్గు చూస్తు న్నారు. గతంలో ఇంగ్లీష్ పదాలు రావాలంటే కేవలం ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలోనే సాధ్యమని తల్లిదండ్రులు భావించే వారు. దీనికితోడు ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, ఇంగ్లీషు మీడియం బోధించకపోవడంతో పేదవర్గాలు అప్పులు చేసి మరీ తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివించేవారు. విద్యకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిరావడంతో ఒక్కరే ముద్దు, ఇద్దరు వద్దు అంటూ ఒక్కొక్క సంతానంతో సరిపెట్టుకున్నారు. సత్తా చాటుతున్న విద్యార్థులు : వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన విద్యాసంస్కరణలతో గత రెండేళ్లుగా టెన్త్ పబ్లిక్ పరీక్షలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తాచాటుతూ ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా మార్కులు సాధిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లాలో 1,366 ప్రభుత్వ పాఠశాలలకు గాను 1,096 ప్రైమరీ, 38 అప్పర్ప్రైమరీ, 232 హైస్కూళ్లు ఉన్నాయి. బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రగతిని వివరించడంతో సుమారు 4,979 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే నూతన విద్యాసంవతర్సంలో మరింతమంది విద్యార్థులు చేరే అవకాశాలున్నాయి. బడి పిలుస్తోంది కార్యక్రమానికి స్పందన బాగుంది. జిల్లాలోని ఉపాధ్యాయులు వారి స్కూళ్ల పరిధిలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రగతి వివరించడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి ఆశక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 87,857 మంది విద్యార్థులు ఉండాలని లక్ష్యానికిగాను ఇప్పటివరకు 93 శాతం ప్రగతిని సాధించాం. స్కూళ్లు ప్రారంభించేనాటికి నూరు శాతం లక్ష్యాన్ని సాధిస్తామనే నమ్మకముంది. – ఇ నారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి జగన్ ప్రభుత్వంలో నాడు–నేడు, మనబడి పథకంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి సత్ఫలితాలు ఇస్తున్న నాటి విద్యాసంస్కరణలు ఇంగ్లీష్ మీడియం ప్రవేశంతో నేడు టెన్త్లో అత్యుత్తమ ఫలితాలు ఈ ఏడాది ప్రభుత్వ బడుల్లో 4,979 మంది చేరిక వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ విద్యపై ప్రత్యేక దృష్టిపెట్టారు. రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలను మనబడి, నాడు–నేడు పధకంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పూర్తిస్థాయి మౌలిక వసతులతోపాటు ల్యాబ్లను ఏర్పాచేయించారు. అంతేగాకుండా ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరిగా ఉండేవిధంగా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు ఉచిత భోజనంతోపాటు నాణ్యమైన స్కూల్ బ్యాగ్లు, పుస్తకాలు వంటి విద్యాసామగ్రిని అందించారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేవిధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మరెన్నో సంస్కరణలు అమలుచేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మారింది. -
హుండీ ఆదాయం రూ.2.06 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల నగదు లెక్కింపు గురువారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, మద్ది ఆంజనేయస్వామి ఆలయ ఈఓ ఆర్వీ చందన, పోలీసుల పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ లెక్కింపులో స్వామివారికి విశేష ఆదాయం సమకూరింది. గడిచిన 15 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ. 2,06,21,794 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 281 గ్రాముల బంగారం, 2.887 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2,000, రూ.1,000, రూ.500 నోట్లు ద్వారా రూ.31 వేలు లభించినట్టు చెప్పారు. -
పొలంలో రాజుకున్న నిప్పు
తణుకు అర్బన్: తణుకులో ఓ పొలంలో వరి కుదుళ్లకు పెట్టిన నిప్పు అతివేగంగా రాజుకుని పక్కనే ఉన్న గేదెల పాకతోపాటు ధాన్యం రాశులపైకి ఎగబాకింది. ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎగుమతిదారులు సిండికేటుగా ఏర్పడి రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. మార్కెట్లోకి రొయ్యలు ఎక్కువగా వచ్చే సమయం చూసి ముందుగానే ధరలు తగ్గించేస్తున్నారు. సిండికేటు దోపిడికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పాలకొల్లులో నిరసన కార్యక్రమం చేపట్టాం. ఉదయం 9 గంటలకు పూలపల్లి వై జంక్షన్ వద్ద జరిగే కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులు హాజరుకావాలని కోరుతున్నాం. – గొట్టుముక్కల గాంధీభగవాన్రాజు, జైభారత్ క్షీరారామా ఆక్వారైతు సంఘం అధ్యక్షుడు, పాలకొల్లు -
● ప్రభుత్వాసుపత్రిలో నరకమే
రోగుల బంధువులే స్కానింగ్, ఎక్స్రే వార్డులకు తీసుకెళ్తున్న దృశ్యం పేద మధ్యతరగతి వారికి ప్రభుత్వాసుపత్రే దేవాలయం. ఆసుపత్రికి వస్తే అన్ని రకాలుగా వైద్యం సకాలంలో అందుతుందనేది పాత మాట. ఇప్పుడు ఎందుకు వచ్చాం రా.. భగవంతుడా అన్నట్లు తయారైంది ఏలూరు సర్వజన ఆసుపత్రి. రోగులను ఎక్స్రేకు తీసుకెళ్లాలన్నా... రక్తనమూనాకు తీసుకెళ్లాలన్నా, స్కానింగ్ వార్డుకు తీసుకెళ్లాలన్నా రోగి బంధువులు నరకం చూడాల్సిందే. స్ట్రెచర్, వీల్చైర్పై తీసుకువెళ్ళాలంటే నానా యాతన పడుతున్నారు. ఆసుపత్రి సహాయ ఉద్యోగులు స్పందించకపోవడంతో వారి బంధువులే అవస్థలు పడుతున్నారు. గురువారం ప్రభుత్వాసుపత్రిలో కనిపించిన దృశ్యాలివి. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు వీల్ చైర్ లేక మనవరాలి సాయంతో నడుస్తున్న వృద్ధురాలు, రోగిని తీసుకెళ్తున్న బంధువు -
వడగాల్పుల వేళ అప్రమత్తత అవసరం
భీమవరం (ప్రకాశంచౌక్): రానున్న వారం రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలతోపాటు వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. వేసవి తీవ్రతపై గురువారం ఆర్డీవోలు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో ఇన్చార్జి కలెక్టర్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే అవసరాల మేరకు వాటర్ ట్యాంకుల ద్వారా తాగునీరు సరఫరా చేయాలన్నారు. బస్టాండ్, మార్కెట్ ప్రదేశాలు, ముఖ్య కూడళ్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వడగాల్పులపై తీసుకోవలసిన జాగ్రత్తలపై పట్టణాల్లోని ముఖ్య ప్రదేశాలలో హోర్డింగులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో, పీహెచ్సీలలో అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పనులు పూర్తి చేసుకోవాలన్నారు. పక్షులు, జంతువుల కోసం పశు సంవర్థక శాఖ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పారిశుధ్యంపై దష్టి పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని ఆయన అధికారులను కోరారు. -
అయ్యో.. రొయ్య
చెట్టుకిందే చెక్పోస్టు దెందులూరు: ఏలూరు రూరల్ మండలం చాటపర్రులో ఏఎంసీ చెక్పోస్ట్ చెట్టు కిందే నిర్వహిస్తున్నారు. ఇక్కడ కేవలం చెక్పోస్టు బోర్డు మాత్రమే ఉంది. శురకవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026సాక్షి, భీమవరం : రొయ్య ధరలు పతనమవుతున్నాయి. పది రోజుల వ్యవధిలో కౌంట్ను బట్టి కిలోకు రూ.30 నుంచి రూ.40 వరకు పడిపోవడంతో ఎకరాకు రూ.లక్ష వరకు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎగుమతిదారులు ఏకమై ధరలు తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. సిండికేటు దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పడుతున్నారు. శుక్రవారం పాలకొల్లులో నిరసన తెలిపేందుకు ఆక్వారైతు సంఘం పిలుపునిచ్చింది. రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుంటే 2.63 లక్షల విస్తీర్ణం, ఏటా దాదాపు మూడు లక్షల టన్నుల రొయ్యల దిగుబడితో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొదటిస్థానంలో ఉంది. కిలోకు 30 నుంచి 40 కౌంట్ వరకు రొయ్యలు అమెరికాకు, 50 నుంచి 100 కౌంట్ వరకు చైనా, యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. పది రోజుల క్రితం 100 కౌంట్ కిలో రూ.265 ఉండగా ప్రస్తుతం రూ.230కి పడిపోయింది. నేరుగా కంపెనీలకు కాకుండా మధ్యలో దళారులకు విక్రయించుకునే వారికి రూ.220లోపే ఉంటుంది. అన్ని కౌంట్ల రొయ్యల ధరలు ఆదే మాదిరి కిలోకు రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గిపోయాయి. ప్రతికూల వాతావరణం, నాణ్యతలేని సీడు, ఫీడుతో ఇబ్బందులు పడుతుంటే ధరల పతనం తమను మరింత నష్టాల్లోకి నెట్టేస్తోందని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లోకి రొయ్యలు అధికంగా వస్తుండటంతో ప్రాసెసింగ్ ప్లాంట్ల యాజమాన్యాలు, ఎగుమతిదారులు సిండికేటుగా ఏర్పడి భారీ మొత్తంలో కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసుకునే పనిలో ఉన్నారంటున్నారు. ఆన్సీజన్లో ఎగుమతులు చేసుకోవడం ద్వారా పెద్ద మొత్తంలో లాభాలను ఆర్జిస్తుంటారని చెబుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ధరలను తగ్గించేస్తున్నారని, ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరుతున్నారు.మేత ధరల పిడుగు మేత ధరలను పెంచుతున్నట్టు ఇటీవల ఫీడ్ కంపెనీలు ప్రకటించిన విషయం విదితమే. ఈ ధరలు అమల్లోకి వస్తే టన్ను మేత ధర అధనంగా రూ.10 వేల వరకు పెరగనుంది. ఎకరానికి రెండు నుంచి రెండున్నర టన్నుల మేత వినియోగిస్తుండగా రూ.20 వేల నుంచి 25 వేల భారం పడుతుంది. మేత ధరల పెంపును నిరసిస్తూ వీరవాసరం, పాలకొల్లులో రైతులు ఆందోళనలు చేసి ఫీడ్ బస్తాలను తగలపెట్టారు. వైఎస్సార్ సీపీ రైతులకు మద్దతుగా నిలిచింది. ధరలు పెంచితే రైతులకు అండగా ఉద్యమిస్తామని పార్టీ నేతలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగి వచ్చి మేత ధరల పెంపును వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. కాగా ధరలు పెరగడం ఖాయమన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. కౌంట్ 10 రోజుల ప్రస్తుతం 100 రూ.265 రూ.230 90 రూ.275 రూ.240 80 రూ.295 రూ.260 70 రూ.305 రూ.270 60 రూ.315 రూ.280 50 రూ.335 రూ.305 40 రూ.365 రూ.335 30 రూ.475 రూ.435 రైతులకు సిండికాటు రొయ్య ధరలు భారీగా పతనం పది రోజుల వ్యవధిలో కౌంట్కు రూ.30 నుంచి రూ.40 వరకు వ్యత్యాసం ఎకరానికి రూ.లక్ష వరకు నష్టపోతున్న రైతులు ఇప్పటికే మేత ధరల పెంచుతామంటున్న ఫీడ్ కంపెనీలు పోరుబాట పట్టిన ఆక్వా రైతులు నేడు పాలకొల్లులో భారీ నిరసన సీడు, ఫీడు ధరలు, చెరువుల లీజు తదితర ఖర్చులతో వంద కౌంట్ కేజీ రొయ్యల ఉత్పత్తికి రూ. 250 వరకు వ్యయమవుతుందని రైతులు అంటున్నారు. ధరలు తగ్గించేసి రూ.230కు కొనుగోలు చేస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని వారు వాపోతున్నారు. ప్రాసెసింగ్, ఫీడ్ ప్లాంట్లు, ఎగుమతిదారులు ఆక్వా రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని మండిపడుతున్నారు. రొయ్యల ధరలు తగ్గించడాన్ని నిరసిస్తూ పోరుబాట పడుతున్నారు. శుక్రవారం పాలకొల్లులో భారీ ఎత్తున నిరసన తెలపనున్నట్టు జైభారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం గురువారం ప్రకటించింది. -
ఆధునిక సాంకేతికతతో నేరాల అదుపు
భీమవరం: జిల్లావ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణను మరింత బలోపేతం చేయడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించడం, పారదర్శకమైన పోలీసింగ్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ధ్యేయంగా పోలీసు యంత్రాంగం పనిచేయాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. గురువారం భీమవరం డీఎన్నార్ కళాశాలలో జిల్లా స్థాయి నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్మార్ట్ పోలీసింగ్లో భాగంగా రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆధునిక సాంకేతిక అంశాలపై పోలీసు అధికారులు, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు. అనంతరం ఇటీవల రాష్ట్రస్థాయిలో అత్యున్నత డీజీపీ కమెండేషన్ డిస్క్ అవార్డులందుకున్న ఐదుగురు పోలీసు సిబ్బంది, విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. -
ఎయిర్పోర్టు భూముల పరిశీలన
తాడేపల్లిగూడెం: నియోజకవర్గంలోని వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట గ్రామాల మధ్య ప్రతిపాదించిన ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించిన స్థలాలను గురువారం ప్రీ పీజీబిలిటీ స్టడీ నిమిత్తం వచ్చిన ఎయిర్పోర్టు అఽథారిటీ ఆఫ్ ఇండియా చైన్నెకు చెందిన ప్రాంతీయ కార్యాలయ ఆరుగురు సభ్యుల బృందం పరిశీలించింది. మల్టీ డిసిప్లినరీ బృందంలోని సభ్యులు వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట గ్రామాల్లో భూములను పరిశీలించారు. భౌగోళిక పరిస్థితులు, భూసేకరణకు అనుకూలత, రవాణా అనుసంధానం, వాతావరణ పరిస్థితులు, భవిష్యత్ విస్తరణ అవకాశాలు, సమీప ప్రాంతాల్లో ఎత్తయిన నిర్మాణాలు, హైటెన్షన్ లైన్లు వంటి సాంకేతిక అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేశారు. ప్రాఽథమిక సమాచారం, భూభాగ స్వరూపం, పరిసర గ్రామాల పరిస్థితులు, కనెక్టివిటీ, రహదారి సదుపాయాలపై కూడా పరిశీలనలు చేశారు. భీమవరం: జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 41 పరీక్షా కేంద్రాల్లో ఉదయం జరిగిన మొదటి ఏడాది జనరల్ పరీక్షకు 2,761 మంది విద్యార్థులకు 2,545 మంది హాజరుకాగా ఒకేషనల్ పరీక్షకు 261 మందికి 221 మంది హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం జనరల్ పరీక్షకు 1,220 మందికి 1,046 మంది, ఒకేషనల్ పరీక్షకు 141 మందికి 122 మంది హాజరైనట్లు ఇంటర్ విద్యా శాఖ జిల్లా అధికారి ప్రభాకరరావు తెలిపారు. ఆగిరిపల్లి: మండలంలోని చొప్పరమెట్లకు చెందిన పోలగాని నాగేశ్వరమ్మ (55) వడదెబ్బ తగిలి మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం నాగేశ్వరమ్మ ఎప్పటిలాగానే సగ్గూరు చెరువు వద్ద గేదెలు మేపడానికి వెళ్లింది. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుం సభ్యులు వెతకగా చెరువు సమీపంలో పొలాల వద్ద ఆమె విగతజీవిగా పడి ఉంది. గేదెలు మేపడానికి వెళ్లిన ఆమె వడదెబ్బ తగిలి మరణించడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నాగేశ్వరమ్మకు ఇరువురు కుమారులు ఉన్నారు. ఏలూరు రూరల్ : ఈ నెల 21న ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో చేపట్టాల్సిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు వాయిదా వేశామని డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. కొద్దిరోజులుగా జిల్లాలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే అథ్లెట్లు ఇబ్బందులు పడకుండా పోటీలు వాయిదా వేశామని వివరించారు. త్వరలో జిల్లా అథ్లెటిక్స్ కోచ్ జి.కృష్ణకుమారి, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి ప్రసాద్తో చర్చించి తదుపరి పోటీల నిర్వహణ తేదీ వెల్లడిస్తామన్నారు. ఏలూరు(ఆర్ఆర్పేట): నిధులు కేటాయించకుండా వచ్చే రెండేళ్ల కాలంలో రాష్ట్రంలోని 36 ప్రాజెక్టులు పూర్తి చేయడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతని ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని, నిధులు లేకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. 36 ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధులు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. గురువారం ఏలూరులో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని చిన్న,మధ్య తరహా ప్రాజెక్టులు పూర్తి చేస్తామని లక్ష్యం ప్రకటించడం సరిపోదని, అందుకు అవసరమైన కార్యాచరణ ఉండాలన్నారు. ఏలూరు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి జిల్లాలకు ఎంతో ఉపయోగకరమైన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. ఏలూరు(ఆర్ఆర్పేట): ఏలూరు రూరల్ మండలం వెంకటాపురం పంచాయతీ మాదేపల్లిలో జరుగుతున్న జనగణన కార్యక్రమంలో ఇళ్ల గణనను కలెక్టర్ కె.వెట్రిసెల్వి గురువారం తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్లగణనను సచివాలయ సిబ్బంది యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. వేడి గాలుల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో అవసరమైన మేర చలివేంద్రాలు ఏర్పాటుచేయాలన్నారు. -
ముగిసిన ఈఏపీసెట్ పరీక్షలు
భీమవరం: పట్టణంలో ఈనెల 12న ప్రారంభమైన ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఆఖరి రోజున ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 234 మందికి 37 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. డీఎన్నార్ అటానమస్ కళాశాలలో 200 మందికి 186 మంది హాజరు కాగా విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో 200 మందికి 178 మంది విద్యార్థులు హాజరయ్యారు. తాడేపల్లిగూడెంలో.. తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం వా సవీ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 240 మందికి 204 మంది, మధ్యాహ్నం 240 మందికి 216 మంది హాజరయ్యారు. ప్రిన్సిపాల్ రాంబాబు, పరీక్ష కేంద్రం కో–ఆర్డినేటర్ నటరాజ్ పర్యవేక్షించారు. ఏలూరులో.. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. అగ్రి కల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు మూడు కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం షిఫ్టుల్లో నిర్వహించిన పరీక్షలకు 739 మంది హాజరయ్యారు. ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 169 మందికి 156 మంది, మధ్యాహ్నం 168 మందికి 158 మంది, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 110 మందికి 98 మంది, మధ్యాహ్నం 110 మందికి 102 మంది, ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 120 మందికి 110 మంది, మధ్యాహ్నం 120 మందికి 115 మంది హాజరయ్యారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్ సంస్థల అభివృద్ధికి సాంకేతిక ఆవిష్కరణలు కీలకమని ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో బుధవారం ‘ఆవిష్కరణల ద్వారా ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ల బలోపేతం– మేధో సంపత్తి హక్కులు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, వాణిజ్యీకరణ’ అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ వినియోగంతో ఉత్పత్తి ప్రక్రియలో సమయం, వనరుల వృథాను తగ్గించి తక్కువ వ్యయంతో అధిక నాణ్యత గల ఉత్పత్తులు తయారు చేయవచ్చని తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతిరావు మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ యూనిట్లకు ప్రభుత్వం ద్వారా రుణ సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు, సబ్సిడీలు, మార్కెటింగ్ సహా యం అందిస్తున్నట్టు చెప్పారు. విశాఖకు చెంది న ఎన్ఆర్డీసీ సైంటిస్టు, ప్రాజెక్టు హెడ్, పాలకొల్లు ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా ప్రజా గ్రంథాల యాల అభివృద్ధికి, పాఠకులలో పఠనాభిరుచి పెంపొందించేందుకు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో బుధవారం కంకిపాడు మండలం తెన్నేరుకి చెందిన దాత దేవినేని మధుసూదనరావు అందజేసిన పుస్తకాలను జిల్లా పరిధిలోని 31 గ్రంథాలయాలకు పంపిణీ చేశారు. మొత్తం 6 విభాగాలకు చెందిన 250 పుస్తకాలను గ్రంథాలయ లైబ్రేరియన్లకు అందజేశారు. ఆగిరిపల్లి: పొలంలో మెరక నిమిత్తం అనుమతులు తీసుకొని అధికార పార్టీ నాయకులు మట్టిని యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. మండలంలోని కొమ్మూరు రిజర్వాయర్ పరిధిలో కృష్ణవరం, సురవరం, కొమ్మూరుకి చెందిన వారు పొ లాల మెరక కోసమని అనుమతులు తీసుకున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన నాయకులు కృష్ణవరం గ్రామంలో చెరువుని ఆనుకుని ఉన్న 8 ఎకరాల ముంపు పొలానికి మట్టిని తరలిస్తున్నారు. పొక్లయిన్లతో తవ్వి 50 ట్రాక్టర్లలో వందలాది ట్రిప్పులు ఇలా తరలించేశారు. గ్రా మంలో మెరక పొలాలకు కాకుండా ఆ ఒక్క పొలానికి మట్టిని ఎందుకు తరలిస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. -
ట్రిపుల్ఐటీ.. మెంటార్లు పిటీ
● 18 ఏళ్లుగా అవే కష్టాలు ● సర్వీసుల క్రమబద్ధీకరణకు ఎదురుచూపులు ● మొదట్లో 200 మంది.. ప్రస్తుతం 80 మంది విధులు నూజివీడు: ఐదుసార్లు వడబోసి ఎంతో మెరిట్తో ఎంపికయ్యారు.. 18 ఏళ్లుగా పీయూసీ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నా వారి జీవితాల్లో మాత్రం వెలుగులు లేవు.. సర్వీసుల క్రమబద్ధీకరణకు నోచుకోక, తక్కువ జీతాలతో ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ఐటీల్లో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న మెంటార్లు. 2008లో రాష్ట్రంలో ట్రిపుల్ఐటీలను ప్రభుత్వం స్థాపించింది. విద్యార్థులకు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ విద్యలో భాగంగా మొదటి రెండేళ్లు పీయూసీ కోర్సు బోధనకు అ ప్పట్లో ఐదు దశల ఎంపిక ప్రక్రియ ద్వారా దాదాపు 200 మంది మెంటార్లను నియమించారు. హామీల అమలెప్పుడు? ఆర్జీయూకేటీ వ్యవస్థాపక చాన్సలర్ ఆచార్య డి.రా జ్రెడ్డి మెంటార్లను నియమించేటప్పుడు పదేళ్ల స ర్వీసు తర్వాత రెగ్యులరైజేషన్ దిశగా పరిశీలి స్తామని హామీ ఇచ్చారు. దీంతో మెంటార్లు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. హామీ ఇచ్చి 18 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఉద్యోగ భద్రత లేకుండా, పర్మినెంట్ కాకుండా అరకొర జీతాలతోనే వీరు జీవితాలను నెట్టుకొస్తున్నారు. సర్వీసుల క్రమబద్ధీకరణకు మెంటార్లు కోర్టును ఆశ్రయించగా వారి అభ్యర్థనను పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. జూనియర్ లెక్చరర్ల కంటే జీతం తక్కువే.. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ లెక్చరర్ల కంటే మెంటార్ల జీతాలు తక్కువగా ఉన్నాయి. జూనియర్ లెక్చరర్లకు రూ.57 వేల జీతం చెల్లిస్తుండగా మెంటార్లకు రూ. 45 వేల నుంచి రూ.50 వేల వరకు మాత్రమే ఇస్తున్నారు. అర్హతలు, విధులు, బోధనా బాధ్యతలు అన్నీ జూనియర్ లెక్చరర్లతో సమానంగా ఉన్నా జీతాల విషయంలో వీరికి న్యాయం జరగడం లేదు. ఎంటీఎస్లో కూడా మొండిచేయే యూనివర్సిట్లో కాంట్రాక్ట్ బోధనా సిబ్బందికి మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్)ను అమలు చేసిన ప్రభుత్వం ఈ విషయంలో ట్రిపుల్ఐటీల్లో మెంటార్లకు మాత్రం మొండిచేయి చూపింది. తమపై వివక్ష దారుణమని వీరంతా ఆవేదన చెందుతున్నాయి. ప్రభుత్వం స్పందించాలని వినతి ట్రిపుల్ఐటీల ప్రారంభంలో మొత్తంగా 200 మంది మెంటార్లు విధుల్లో చేరారు. సర్వీసులు క్రమబద్ధీకరణ కాకపోవడంతో చాలా మంది వేరే ఉద్యోగాల్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం 80 మంది వరకు పనిచేస్తుండగా వీరి వయసు 45 ఏళ్లకు చేరింది. కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్ల మధ్య ఇంకా తాత్కాలిక ఉద్యోగాలతోనే వీరు కొనసాగుతున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని మెంటార్లు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ముగిసిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
వెయిట్ లిఫ్టింగ్లో జూనియర్, సీనియర్ విభాగాల్లో పాల్గొన్న లిఫ్టర్లుఏలూరు రూరల్: శాప్ లీగ్స్ పోటీల్లో భాగంగా బుధవారం ఏలూరు ఇండోర్ స్టేడియంలోని వెయిట్ లిఫ్టింగ్ హాల్లో జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 50 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చాటిన వారు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికకానున్నారు. ఈ సందర్భంగా డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బడేటి వెంకట్రామయ్య మాట్లాడుతూ కఠోర సాధనతో బాలబాలికలు వెయిట్లిఫ్టింగ్లో సత్తా చాటవచ్చన్నారు. రాష్ట్రస్థాయి పోటీలు ఏలూరులోనే నిర్వహిస్తామన్నారు. పోటీల ప్రారంభోత్సవంలో సెట్వెల్ సీఈఓ కెఎస్ ప్రభాకరరావు, రాష్ట్ర వెయిట్లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి దీన్షాబాబు, పశ్చిమగోదావరి జిల్లా డీఎస్డీఓ ఎన్ మోహన్దాస్ తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్ బస్సుల తనిఖీ
జంగారెడ్డిగూడెం, పోలవరం రూరల్ : రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మే ఒకటి నుంచి స్కూలు బస్సులు తనిఖీ చేస్తున్నామని రవాణాశాఖ అధికారులు ఎస్ఎస్ రంగనాయకులు, కేడీవీ రవిగోపాల్, సీహెచ్ సత్యనారాయణ మూర్తి తెలిపారు. బుధవారం పోలవరం మండలంలో స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం డివిజన్లో 296 బస్సులు ఉండగా ఇప్పటివరకు మొత్తం 248 స్కూల్ బస్సులను తనిఖీ చేశామని, భద్రతా లోపాలు ఉన్న 209 బస్సులకు లోపాలను సరి చేసుకోవాలని నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. స్కూల్ బస్సులకు అత్యవసర ద్వారం, అగ్నిమాపక యంత్రాలు, ప్రథమ చికిత్స పెట్టే, వేగ నియంత్రణ, జీపీఎస్ పరికరాలు, అదేవిధంగా 185జి ప్రమాణాలు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలు అన్నీ చెల్లుబాటులో ఉండాలని ఆదేశించామన్నారు. ఆగిరిపల్లి: బైక్ దొంగల ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారం రోజుల క్రితం సగ్గూరు గ్రామానికి చెందిన యలమర్తి పుల్లయ్య తన ఇంటి ముందు ఉంచిన బైకు కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన ఎస్సై శుభశేఖర్ ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.2.50 లక్షల విలువైన నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన సగ్గూరు గ్రామానికి చెందిన పోతర్లంక చరణ్, కొత్త సురవరం గ్రామానికి చెందిన షేక్ ఇమ్రాన్, ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన మారెళ్ళ నాగసాయిపై కేసు నమోదు చేసి నూజివీడు కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై తెలిపారు. భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం పట్టణంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో మామిడి పండ్ల విక్రయ కేంద్రాలు, గోదాములు, పండ్ల దుకాణాల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా వ్యాపారులకు రసాయనాలు ఉపయోగించి కృత్రిమంగా పండించిన మామిడి పండ్లను విక్రయించరాదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ వంటి హానికర రసాయనాలతో పండ్లు పండించడం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని వారికి వివరించి అవగాహన కల్పించారు. వినియోగదారుల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా అనుమానాస్పదంగా ఉన్న మామిడి పండ్ల నమూనాలను సేకరించి, ప్రయోగశాలకు పరీక్షల నిమిత్తం పంపించారు. పరీక్షల ఫలితాల ఆధారంగా ఆహార భద్రత చట్టాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రజలు సహజసిద్ధంగా పండిన పండ్లను మాత్రమే కొనుగోలు చేయాలని, కృత్రిమంగా పండించిన పండ్లను గుర్తించిన పక్షంలో సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని మోదుగ గుంట గ్రామానికి చెందిన వివాహిత గెల్లా సంధ్యను పాత గొడవలను పురస్కరించుకుని అదే గ్రామానికి చెందిన కొడమంచిలి నరేష్ రాయితో కొట్టి గాయపరిచాడు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. బాధిత మహిళ సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీవారి క్షేత్రం.. సేవల్లో ప్రథమం
● మరోమారు మొదటి ర్యాంకు ● వాట్సాప్, ఐవీఆర్ఎస్ సర్వేలో వెల్లడి ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆల యాలకు వచ్చే భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సర్వేలో ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానానికే మళ్లీ మొదటి ర్యాంకు దక్కింది. ప్రతి నెలా వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా దర్శనం సంతృప్తికరంగా జరిగిందా? ఆలయాల్లో తాగునీటి వసతులు బాగున్నాయా? ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా? పారిశుద్ధ్యం సంతృప్తికరంగా ఉందా? అనే ఈ నాలుగు అంశాలపై సర్వే నిర్వహిస్తున్నారు. అందులో ప్రతి నెలా ఏదో ఒక అంశంలో మొదటి ర్యాంకు సాధిస్తున్న ద్వారకాతిరుమల దేవస్థానం, గత నెల అన్ని అంశాల్లోనూ మొదటి ర్యాంక్ సాధించింది. తాజాగా మూడు రోజుల క్రితం వెలువడిన మే నెలకు సంబంధించిన సర్వేలో ద్వారకాతిరుమల దేవస్థానం మళ్లీ అన్ని అంశాల్లోనూ మొదటి ర్యాంక్ పొందింది. అయితే ఈసారి దర్శనం ఇతర అంశాల్లో శ్రీశైలం దేవస్థానం, సౌకర్యాల కల్పనలో సింహాచలం దేవస్థానం ఆఖరి స్థానాల్లో నిలిచాయి. దర్శనం, ఇతర అంశాల్లో.. ద్వారకాతిరుమల 73.4 శాతంతో మొదటి ర్యాంక్ సాధించగా, శ్రీకాళహస్తి 73.1 శాతంతో రెండో, విజయవాడ 71.4 శాతంతో మూడో, కాణిపాకం 70.8 శాతంతో నాల్గో, అన్నవరం 70.7 శాతంతో ఐదో, సింహాచలం 70.4 శాతంతో ఆరో, శ్రీశైలం 70.1 శాతంతో ఆఖరి స్థానంలో నిలిచాయి. సౌకర్యాల కల్పనలో.. ద్వారకాతిరుమల 73.25 శాతంతో మొదటి ర్యాంక్, శ్రీకాళహస్తి 72.73 శాతంతో రెండో, విజయ వాడ 71.42 శాతంతో మూడో, కాణిపాకం 70.86 శాతంతో నాల్గో, అన్నవరం 70.55 శాతంతో ఐదో, శ్రీశైలం 69.85 శాతంతో ఆరో, సింహాచలం 69.79 శాతంతో చివరి ర్యాంకు సాధించాయి. -
నిప్పుల కొలిమి
జనసంచారం లేక వెలవెలబోతున్న భీమవరంలో ప్రకాశం చౌక్ సెంటర్ సాక్షి, భీమవరం: భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మండే ఎండలతో నిప్పులు కురిపిస్తున్నాడు. మధ్యాహ్నమయ్యే సరికి జిల్లాను నిప్పుల కొలిమిగా మార్చేస్తున్నాడు. ఉక్కపోత, ఎండ తీవ్రత, విద్యుత్ కోతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోడ్లు నిర్మానుష్యంగా మారి అప్రకటిత కర్ఫ్యూను తలపిస్తున్నాయి. అగ్నిగుండంలా.. జిల్లాలో బుధవారం 43 డిగ్రీలకు పైబడి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రతకు తోడు వాతావరణంలో తేమశాతం పెరిగి ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అగ్నిగుండంలా ఉంటుండటంతో బయటకు రావాలంటేనే జనం హడలెత్తిపోతున్నారు. వాణిజ్య కేంద్రాలుగా పేరొందిన భీమవరంలోని జువ్వలపాలెం రోడ్డు, పీపీ రోడ్డు, తాడేపల్లిగూడెంలోని కేఎన్, తాలుకా ఆఫీస్ రోడ్లు, నరసాపురంలోని స్టీమర్ రోడ్డు, తణుకులోని వేల్పూరు రోడ్డు, రాష్ట్రపతి రోడ్డు, పాలకొల్లులోని బస్టాండ్ సెంటర్ ప్రాంతాలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. ఎండ తీవ్రతకు ఇళ్లపైన వాటర్ ట్యాంకుల్లో నీరు, గృహోపకణాలు వేడెక్కిపోతున్నాయి. వేసవితాపం నుంచి ఉపశమనం కోసం శీ తల పానీయాలను ఆశ్రయిస్తుండటంతో రోడ్ల వెంబడి చెరకు రసం, పుచ్చకాయలు, కొబ్బరిబొండా లు, జ్యూస్సెంటర్లు వినియోగదారులతో కిటకిటలాతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల నుంచి 30 డిగ్రీల వరకు ఉండటంతో రాత్రి పది గంటలయినా వాతావరణంగా వేడిగానే ఉంటోంది. దీనికితోడు ఏసీలు వినియోగంతో లోడ్ పెరిగి అప్రకటిత విద్యుత్ కోతలతో విలవిలలాడాల్సి వస్తోంది. నాలుగు రోజులపాటు.. జిల్లాలో ఈనెల 24 వరకు నాలుగు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఎండ తీవ్రత దృష్ట్యా అత్యవసరమైతే తప్ప ఉద యం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బయట తి రగవద్దని అధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని, లేదంటే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పెరిగిన ఏసీల అమ్మకాలు జిల్లాలో స్థానిక వ్యాపారులకు చెందిన ఎలక్ట్రికల్ గృహోపకరణాల 90 వరకు ఉండగా బజాజ్, రిలయన్స్ తదితర కంపెనీలకు చెందిన షోరూమ్లు 30 వరకు ఉన్నాయి. మొన్నటివరకూ అంతంతమాత్రంగా ఉన్న ఏసీ, కూలర్, ఇన్వెర్టర్ల అమ్మకాలు ఎండల తీవ్రతతో కొద్దిరోజులుగా 10 నుంచి 15 శాతం మేర పెరిగి నట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గృహోపకణాలపై ఈఎంఐ సదుపాయం కల్పిస్తుండ టంతో సామాన్యులు సైతం ఏసీల వైపు మొగ్గుచూపుతున్నారు. విపరీతమైన తలనొప్పి, తీవ్రజ్వరం, మగత నిద్ర లేదా కలవరింపులు, ఫిట్స్, పాక్షికంగా అపస్మారక స్థితి ఉంటే వడదెబ్బ లక్షణాలుగా గుర్తించి ప్రథమ చికిత్స అందించాలని వైద్యులు సూచిస్తున్నారు. చల్లని ప్రదేశానికి చేర్చి, చల్లని గు డ్డతో శరీరాన్ని తుడవడంతో పాటు చల్లని గాలి తగిలేలా చూడాలి. వీలైనంత త్వరగా సమీపంలోని ఆస్పత్రికి తరలించాలి. ఎండలో ప్రయాణించేటప్పుడు తలకు టవల్ లేదా టోపీ కచ్చితంగా పెట్టుకోవాలి. ఎండలో పని చేయకూడదు. మద్యం సేవించి ప్రయాణించరాదు. త్వరగా జీర్ణమయ్యే శాఖాహారం తీసుకోవాలి రోడ్డు పక్కన విక్రయించే రంగు నీళ్ల పానీయాలు, కూల్డ్రింక్స్ తీసుకోకపోవడం మంచిది. మజ్జిగ, నిమ్మరసం, బార్లీ, కొబ్బరినీళ్లు సేవించాలి. వృద్ధులు, చిన్నారులు, గుండె, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు ఎండలో తిరగకుండా చూసుకోవాలి. -
వంతెన పనులతో నీటి సమస్య తీవ్రం
భీమవరం: భీమవరం పట్టణంలోని లోసరి ప్రధాన కాలువపై నిర్మిస్తున్న వంతెన పనులు నత్తనడకన సాగుతుండడంతో పలు గ్రామాలకు మంచినీటి సమస్య తీవ్రమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే గ్రామాల్లోని మంచినీటి చెరువుల్లో నీరు అడుగంటడం, పసర్లుబారడంతో ప్రజలు తాగునీటికి పడుతున్న కష్టాలు చెప్పనలవికావు. ఈనెలాఖరుకు కాలువలకు నీరు వదులుతారని మంచినీటి చెరువులను నీటితో నింపి నీటి ఎద్దడి నివారిస్తామంటూ పంచాయతీల అధికారులు చెబుతుండగా లోసరి కాలువపై భీమవరం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు కారణంగా మరికొన్ని రోజులు నీటి సరఫరా నిలిచిపోతుందనే ఆందోళన పలు గ్రామాల్లో వ్యక్తమవుతుంది. పనులు ఇంకా గ్రౌండ్ లెవిల్లోనే.. భీమవరం నుంచే ప్రవహించే లోసరి ప్రధాన పంట కాలువ ద్వారా మండలంలోని గొల్లవానితిప్ప, తోకతిప్ప, గూట్లపాడు, కొత్త పూసలమూరు, దొంగపండి, లోసరి, బర్రెవానిపేట తదితర గ్రామాల ప్రజలకు తాగు, సాగు నీరు లభిస్తుంది. కాలువపై నిర్మించిన వంతెనలకు ఎంతోకాలంగా అప్రోచ్ రోడ్లు లేకపోవడంతో నిరుపయోగంగా మిగిలిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనా సాంకేతిక కారణాలతో పనులు ప్రారంభం కాలేదు. అయితే ఎట్టకేలకు రూ.24 కోట్లు నిధులు మంజూరు కావడంతో ఏప్రిల్ 17న ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్తో అమరావతి నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారంటూ భారీ ఏర్పాట్లు చేశారు. అయితే పవన్కల్యాణ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఆ శంకుస్థాపన నిలిచిపోయింది. ఆ తరువాత లోసరి కాలువపై నూతనంగా నిర్మించాల్సిన వంతెన పనులు తరువాత చేపట్టారు. పనులు ప్రస్తుతం గ్రౌండ్ లెవిల్లోనే ఉండడంతో మరో 10 రోజుల్లో కాలువలకు నీరు వదిలినా లోసరి కాలువకు నీటి సరఫరా మరికొన్ని రోజులు నిలిపివేయాల్సి ఉంటుంది. వంతెనకు కనీసం పిల్లర్ల నిర్మాణం పూర్తిచేస్తేగాని కాలువకు నీరు వదిలే అవకాశంలేదు. లోసరి కాలువపై నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణ పనులు ఈనెల 31వ తేదీన కాలువలకు నీటి విడుదల వంతెన నిర్మాణ పనులతో కాలువలకు నీటి విడుదల ఆలస్యమయ్యే ప్రమాదం ఇప్పటికే అడుగంటిన మంచినీటి చెరువులు తాగునీటి కోసం ప్రజల ఆందోళన లోసరి కాలువపై భీమవరం వద్ద వంతెన నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీనివల్ల ఈనెలాఖరుకు కాలువలకు నీటిని వదిలినా లోసరి కాలువకు నీటి సరఫరా కష్టమే. ఇప్పటికే తాగునీటికి ఇబ్బందులు పడుతున్న ప్రజలు కాలువకు సకాలంలో నీరు వదలకపోతే గుక్కెడు నీళ్లు కోసం పడరాని పాట్లు పడాల్సి ఉంటుంది. అధికారులు స్పందించి పనులు వేగంగా చేయించి కాలువకు నీటి విడుదలలో జాప్యం లేకుండా చూడాలి. – బోకూరి విజయరాజు, వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి లోసరి కాలువపై బ్రిడ్జి నిర్మాణ పనులు కారణంగా కాలువకు నీటి విడుదలలో ఇబ్బందులు లేకుండా చూస్తాం. బెడ్లెవిల్ పనులు వేగంగా పూర్తిచేయించి నీటి సరఫరా చేయిస్తాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – అడబాల శ్రీనివాస్, ఆర్అండ్బీ ఈఈ, భీమవరం కాలువలకు నీటి సరఫరా నిలిపివేసిన వెంటనే పనులు ప్రారంభించి ఉంటే ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తిచేసి నీటి సరఫరాకు అటంకం లేకుండా ఉండేదని, ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపనంటూ పనుల ప్రారంభంలో జాప్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శంకుస్ధాపనకు భారీ ఏర్పాట్లుచేసిన అధికారులు పెద్ద మొత్తంలో ఖర్చుచేయగా కనీసం స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)తోనైనా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించకుండా జాప్యం చేయడం ప్రజలను ఇబ్బందులపాలు చేయడమేనని విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా పనులు వేగంగా చేయించి నీటి సరఫరాకు అడ్డంకులు లేకుండా చూడాలని కోరుతున్నారు. -
ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలి
తణుకు అర్బన్: ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు సరిదే ఏసుబాబు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం తణుకు ఆర్టీసీ డిపో వద్ద రెండు రోజులపాటు నిర్వహించే గేట్ మీటింగ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీ్త్ర శక్తి బస్సుల్లో జీరో టికెట్ విధానాన్ని నిలుపుదల చేసి, మిగిలిన ప్రయాణికులకు మాత్రమే టికెట్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, పీఆర్సీ కమిటీని నియమించి ఐఆర్ను వెంటనే ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు, అరియర్స్, లీవ్ ఎన్క్యాష్మెంట్లు ఇవ్వా లని, పదవీ విరమణ, మృతిచెందిన సిబ్బందికి వెంటనే సెటిల్మెంట్స్ చేయాలని కోరారు. అలాగే ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సిబ్బంది ద్వారానే ని ర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంఘ కార్యదర్శి బయ్యే సుబ్బారావు, పబ్లిసిటీ సెక్రటరీ మాటూరి రాజు తదితరులు పాల్గొన్నారు. -
పొగాకు వేలం కేంద్రాల పరిశీలన
జంగారెడ్డిగూడెం: రైతులు పొగాకును గ్రేడింగ్ చేసే సమయంలో ఎన్టీఆర్ఎం రాకుండా చర్యలు తీసుకోవాలని పొగాకు బోర్డు గుంటూరు మేనేజర్(ఎక్స్టెన్షన్) సురేఖ అన్నారు. బుధవారం జంగారెడ్డిగూడెం వర్జీనియా వేలం కేంద్రం 1, 2 లను ఆమె రాజమండ్రి ఆర్ఎం జె.సురేంద్రకుమార్తో కలిసి సందర్శించారు. పొగాకు మార్కెట్ గురించి పొగాకు కొనుగోలుదారులతో చర్చించి రైతులకు మంచి యావరేజ్ ధర వచ్చే విధంగా కొనుగోలు జరపాలని సూచించారు. అలాగే రైతులతో సమావేశంలో భాగంగా పొగాకు గ్రేడింగ్ గురించి, ప్రస్తుతం ఉన్న పొగాకు మార్కెట్ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని పంట నియంత్రణ గురించి సూచనలు చేశారు. జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రాల్లో పరిధిలో ఉన్న తాడువాయి, వేగవరం, నరసన్నపాలెం గ్రామాల్లో పొగాకు క్యూరింగ్ బ్యాలెన్స్, గ్రేడింగ్ పాయింట్లను పరిశీలించి గ్రేడింగ్ చేసేటప్పుడు ఎన్టీఆర్ఎం రాకుండా గ్రేడింగ్ చేసుకోవాలని సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రాల ఆక్షన్ సూపరింటెండెంట్లు గ్రేస్ మార్గరెట్, ప్రశాంత్, రైతులు పాల్గొన్నారు. -
అభయాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ.11.90 లక్షలు
పెదపాడు: అప్పనవీడులో వేంచేసియున్న శ్రీ అభయాంజనేయస్వామి హుండీ ఆదాయాన్ని బుధవారం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వీ సురేష్ పర్యవేక్షణలో లెక్కించినట్లు ఆలయ చైర్మన్ వేమూరి శ్రీనివాసరావు తెలిపారు. 55 రోజులకుగాను రూ.11,90,806 ఆదాయం లభించిందన్నారు. కార్యక్రమంలో ఈఓ తారకేశ్వరరావు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. భీమవరం: పట్టణంలోని ఒక ఫ్యాక్టరీ వద్ద ఉన్న డ్రెయినేజీలో సిల్ట్ తీస్తుండగా విషవాయువు ప్రభావంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ఉండి రోడ్డులో ఉన్న ఒక రైస్మిల్లును కొన్నేళ్ల క్రితం మూసివేశారు. కాగా రైస్మిల్లులో మరో ఫ్యాక్టరీ నడుపుతున్నట్లుగా సమాచారం. ఆ ఫ్యాక్టరీ వద్ద డ్రెయినేజీలో సిల్ట్ తీసేందుకు భీమడోలు మండలం గుండుగొలను నుంచి ఈ నెల 19వ తేదీన నలుగురు వ్యక్తులు వచ్చారు. 20వ తేదీన కూడా ఎనిమిది మంది వచ్చారు. అందరూ కలిసి బుధవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో మిల్లు వద్ద ఉన్న డ్రెయినేజీలో సిల్ట్ తీస్తుండగా ఏదో తెలియని విషవాయువు లాంటిది వారికి తగలడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే వారిని దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, వాలేపు వెంకన్న (45) అనే వ్యక్తి మృతి చెందాడు. వాలేపు రాజు, బత్తుల ప్రభాకర్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దీనిపై వివరాలు సేకరిస్తున్నామని టూటౌన్ ఎస్ఐ రెహ్మాన్ తెలిపారు. ఆ రైస్మిల్లులో ఏ ఫ్యాక్టరీ నడుపుతున్నారనేది చర్చనీయాంశమైంది. పట్టణానికి చెందిన రాజకీయ పార్టీ నాయకుల అండదండల్లో ఆ ఫ్యాక్టరీ నడుస్తుందని గుసుగుసలు వినిపిస్తున్నాయి. -
ఆన్లైన్ మందుల విక్రయాలపై నిరసన
తణుకు అర్బన్: మెడికల్ హోల్సేలర్స్ అండ్ రిటైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం ఒక రోజు సమ్మె నిర్వహించారు. తణుకులో అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గాదె వెంకట రామఫణి మాట్లాడుతూ ప్రధానంగా ఆన్లైన్లో మందుల అమ్మకాలు నిలిపివేయాలని, నకిలీ మందులను అరికట్టాలని డిమాండ్ చేశారు. అక్రమ ఈ–ఫార్మసీ కార్యకలాపాలు, జీఎస్ఆర్ 817ఈ, జీఎస్ఆర్ 220ఈ నోటిఫికేషన్స్ ఉపసంహరించుకోవాలన్నారు. అనంతరం తణుకు మెడికల్ అసోసియేషన్ హాల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ దండు అశోక్వర్మకు వినతిపత్రం అందజేశారు. సహకరించిన మెడికల్ రిప్రజెంటేటివ్స్, సీఐటీయూ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. సంఘ అధ్యక్షుడు గళ్లా దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షుడు ప్రగళ్లపాటి సూర్యకొండ, కార్యదర్శి గమిని రామచంద్రరావు, కోశాధికారి బొంగు సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
విమానాశ్రయం.. అయ్యేనా సాకారం?
● నేడు కేంద్ర బృందం రాక ● వెంకట్రామన్నగూడెంలో పర్యటన తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం ఏళ్ల నాటి కల. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైమానిక విధానాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట గ్రామాల పరిధిలో విమానాశ్రయ నిర్మాణం కోసం భూసేకరణ చేయాలనుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. భూసేకరణ ప్రక్రియ కూడా దాదాపు కొలిక్కి వచ్చింది. ఈ క్రమంలో గురువారం కేంద్ర కమిటీ బృందం విమానాశ్రయ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, కార్యకలాపాల కోసం వివరాల సేకరణకు ఇక్కడకు రానుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో.. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధ అవసరాల కోసం రహస్య విమానాశ్రయాన్ని తాడేపల్లిగూడెంలో నాణ్యతా ప్రమాణాలతో నిర్మించారు. అయితే ఒక్క విమానం కూడా ఇక్కడ ల్యాండ్ కాలేదు. విమానాశ్రయం కోసం సేకరించిన 653.48 ఎకరాల భూ మి, ఈ భూమిలో 1.90 కిలోమీటర్ల మేర నిర్మించిన రన్వే ఉంది. విశాఖలో ఉండే కేంద్ర ప్రభుత్వ అధి కారి ఈ భూములకు కస్టోడియన్గా ఉన్నారు. త ర్వాత కాలంలో ఈ భూమి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని ప్రతిపాదించి టెండర్ల దశకు చేరినా కార్యరూపం దాల్చ లేదు. తర్వాత కాలంలో ఈ భూమిలో ఏయూ క్యాంపస్కు 100 ఎకరాలు, ఇంటి నిర్మాణాలకు 153 ఎకరాల భూమిని కేటాయించారు. అలాగే ఏపీ నిట్కు 170 ఎకరాల భూమి కేటాయించారు. దీంతో ఈ భూముల్లో ఎయిర్పోర్టు ప్రతిపాదన పూ ర్తిగా ఆగిపోయింది. పట్టాలెక్కని ప్రతిపాదనలు పట్టణానికి సమీపంలో వెంకట్రామన్నగూడెంలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆధీనంలో ఉన్న భూముల్లో ఇజ్రాయెల్ సహకారంతో పైలెట్రహిత యుద్ధ విమానాల విడిపరికరాల నిర్మాణం చే పట్టాలని భావించారు. అయితే అదీ కార్యరూపం దాల్చలేదు. మచిలీపట్నంలో సైనిక అవసరాల కోసం నిర్మించిన రాడార్ స్టేషన్, సైనికుల శిక్షణా అవసరాల కోసం ఈ భూమిని వినియోగించాలనే ప్రతిపాదన వచ్చినా పట్టాలెక్కలేదు. ఇదిలా ఉండగా విమానాశ్రయం ఏర్పాటుకు ఏవియేషన్ వి భాగం నుంచి విండ్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందారు. రేఖాంశాల మధ్య గాలుల గమనం గురించి అ ధ్యయనం చేసి అప్పట్లో గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలోనే డొమిస్టిక్, రవాణా అవసరాల కోసం 50 కిలోమీటర్ల పరిధిలో సర్వే చేయగా తాడేపల్లిగూడెం అనువైందనే నివేదిక కూడా వచ్చింది. -
కొబ్బరిచేడు ప్రక్షాళనకు మోక్షమెప్పుడో?
కాళ్ల: మండలంలోని ఎల్ఎన్ పురం నుంచి ఆనందపురం గ్రామం మీదుగా ఉప్పుటేరులో కలిసే కొబ్బరిచెడు మురుగు కాలువ కిక్కిస, గురప్రుడెక్క, తూడుతో పూర్తిగా పూడుకుపోయి నీరు ముందుకు సాగడం లేదు. సుమారు ఐదు కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉప్పుటేరులో కలిసే ఈ కాలువను ఆనుకుని సుమారు 1,700 ఎకరాల ఆక్వాసాగు జరుగుతుంది. కాలువ పూర్తిగా పూడుకుపోవడంవల్ల వర్షాకాలం గ్రామాల్లో మురుగునీరు లాగక ముంపునకు గురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తవ్విన ఈకాలువను ప్రక్షాళన చేయాలని అధికారులు, నాయకులను ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కొబ్బరిచేడు కాలువను ప్రక్షాళన చేసి గ్రామాలను ముంపు బారి నుంచి కాపాడి, తమ ఆక్వాసాగుకు ఇబ్బంది లేకుండా చూడాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దృష్టికి తీసుకువెళ్ళనున్నట్లు రైతులు తెలిపారు. -
జీలుగతో భూసారం పెంపు
కాళ్ల: పంటల సాగులో రోజురోజుకు పెరుగుతున్న రసాయనిక ఎరువుల వాడకం వలన భూసారం తగ్గిపోయి నేల ఆరోగ్యం క్షీణిస్తుందని, ఇటువంటి పరిస్థితుల్లో పచ్చిరొట్ట సాగు చేయడం అవసరమని మండల వ్యవసాయాధికారి పి.రమేష్ నాయుడు తెలిపారు. జీలుగ విత్తనాలు భూసారాన్ని పెంచే అత్యుత్తమ పచ్చిరొట్ట ఎరువు. పంటలను విత్తడానికి ముందు పచ్చిరొట్ట సాగు చేసి నేలలో కలియదున్నాలని. తద్వారా నేలకు ముఖ్యమైన పోషకాలు అంటే ముఖ్యంగా నత్రజని, కొంత మేరకు భాస్వరం, పొటాష్లతో పాటు ఇతర సూక్ష్మ పోషకాలు కూడా నేలకు అందుతాయని చెప్పారు. తద్వారా భూసారం పెరిగి, నేల ఆరోగ్యం కూడా మెరుగవుతుందన్నారు. పచ్చిరొట్ట ఎరువులుగా సాగు చేయడానికి అనువైన పంటలు ముఖ్యంగా జనుము, జీలుగ, పెసర, పిల్లిపెసర అని తెలిపారు. ఈ పంటలను నేలలో ప్రధాన పంట విత్తడానికి ముందుగా సాగు చేసుకొని 30–40 రోజులలో అంటే 50 శాతం పూత దశలో నేలలో కలియదున్నాలి. ఈ పచ్చిరొట్ట ఎరువులను నేలలో కలియదున్నిన వెంటనే ఒక ఎకరాకు 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కనుక వేసుకున్నట్లయితే పచ్చిరొట్ట బాగా చివికి నేలకు మంచిగా అందడమే కాకుండా ప్రధాన పంటకు భాస్వరం ఎరువులైన డీఏపీ కానీ సూపర్ ఫాస్పేట్ కానీ వేయాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. జీలుగ విత్తనాలు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా 50 శాతం రాయితీపై అందజేస్తుందని, ప్రస్తుతం మండలంలోని అన్నీ రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
బాలింత మృతదేహానికి పోస్టుమార్టం
తణుకు అర్బన్: తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉన్న బాలింత మృతదేహానికి బుధవారం పోలీసుల పంచనామా అనంతరం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి మునిసిపల్ కార్మికులచే ఖననం చేయించారు. ఈనెల 16వ తేదీన స్టార్ హాస్పిటల్లో శస్త్రచికిత్స ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చి బాలింత మృత్యువాత పడిన విషయం అందిరికీ తెలిసిందే. ఆమె బీహార్కు చెందిన కుమారిగా గుర్తించడం మినహా ఆమెకు సంబంధించిన ఆధారాలు ఇంతవరకు సేకరించలేకపోయారు. ఆస్పత్రికి ప్రసవం నిమిత్తం తీసుకువచ్చిన ఆర్ఎంపీ వైద్యుడు చంటి, అతని స్నేహితుడు రాజమండ్రికి చెందిన మోషే, మరొక మహిళ ఈ వ్యవహారంలో ఉన్నప్పటికీ ఘటన తరువాత మోషే, మహిళ పరారవ్వడం, వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలించడం తప్ప మరేమీ పురోగతి లేదు. ఈ వ్యవహారపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఉంగుటూరు: ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. చేబ్రోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడెం కుచెందిన తాటిపర్తి కాంతారవు (49) ఈనెల 13న ఏలూరు ద్విచక్రవాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా నారాయణపురంలోని పెట్రోలు బంకు సమీపంలో అదుపు తప్పి డివైడరుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో డివైడరుపై ఉన్న చెట్టు మెద్దు ఒకటి అతడి కంటికి గుచ్చుకుంది. హైవే అంబులెన్సు వారు తొలుత తాడేపల్లిగూడెం, అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహ్చ్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న కాంతారావు సోమవారం రాత్రి మృతి చెందాడు. కాంతారావు భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సూర్య భగవాన్ తెలిపారు. -
తేనెటీగల పెంపకంతో అధిక ఆదాయం
తాడేపల్లిగూడెం: తేనెటీగల పెంపకంతో రైతులు అధిక ఆదాయాలు పొందవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మంగళవారం వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో హనీబీ న్యూక్లియస్ కేంద్రం ప్రారంభోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు, ఉద్యానవర్సిటీ వీసీ డాక్టర్ కె.ధనుంజయరెడ్డి మాట్లాడుతూ జాతీయ తేనెటీగల పెంపకం తేనె మిషన్ ఆధ్వర్యంలో న్యూక్లియస్ స్టాకు కేంద్రం ప్రారంభమైందన్నారు. ఎన్బీహెచ్ఎం పథకం కింద వెంకట్రామన్నగూడెం కేవీకేకు రూ.92.728 లక్షల నిధులు మంజూరు కాగా, తొలి విడతలో 43.99 లక్షలతో తేనెటీగల పెంపకంపై రైతులు, గ్రామీణ యువత, మహిళలకు శాసీ్త్రయ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మూడు బ్యాచ్లలో మొత్తం 75 మందికి వారం రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. కేవికెలో న్యూక్లియస్ కల్చర్ యూనిట్ను ఏర్పాటుచేసి 75 శాతం రాయితీపై 425 తేనెటీగల పెట్టెలు, తేనె సేకరణ యంత్రాలు , 24 రకాల అనుబంధ పరికరాలను రైతులకు అందజేశారు. వర్సిటీ విస్తరణ సంచాలకులు డాక్టర్ రూత్, రిజిస్ట్రార్ ఎం.మాధవి, డీన్ ఆఫ్ హార్టీకల్చర్ బి.ప్రసన్నకుమార్, పరిశోధన సంచాలకులు జి.రామానందం, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్ఎస్.విజయ పద్మ, అసోసియేట్ డీన్ ఎన్బీవీ, చలపతిరావు, శాస్త్రవేత్తలు టి.సుశీల, ఈ.పద్మ, ఎన్.ఇమ్మానుయేల్, కేవీకే సమన్వయకర్త కిరణ్కుమార్ పాల్గొన్నారు. -
ధర్మాకోల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
ఉంగుటూరు: చేబ్రోలులోని లక్ష్మీ సమన్విత ధర్మాకోల్ పరిశ్రమలోని గోదాములో మంగళవారం తెల్లారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో గోదాములో ఉన్న ధర్మాకోల్ పెట్టెలు దగ్ధమయ్యాయి. లక్షలాది రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని పరిశ్రమ యాజమాన్యం తెలిపింది. పరిశ్రమలో మంటలను అదుపుచేసే పటిష్టమైన వ్యవస్థ ఉండటంతో ముడి సరుకు నిల్వ ఉంచిన గోదాములోకి మంటలు వ్యాపించకుండా సిబ్బంది కట్టడి చేశారు. భీమడోలు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. పాలకోడేరు: విస్సాకోడేరులో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు నర్సాపురం డీఎస్పీ ఎం సుధాకర్రావు తెలిపారు. బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి మంచెం వెంకట గణేష్, బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేసిన మరో ఇద్దరు బడేటి దుర్గా మహేష్ అలియాస్ బాబి, దేవరకొండ భోగేశ్వరరావులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నాలుగో నిందితుడు ఆకుల చిన్న పరారీలో ఉన్నాడని, అరెస్ట్ చేసిన ముగ్గురిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. ఉండి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి గాను విద్యార్థులు జూన్ 30వ తేదీలోగా ఽఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ జిల్లా కన్వీనర్, ఎన్నార్పీ అగ్రహారం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యార్థులు తమ సమీపంలోని (ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం, ఆచంట) ప్రభుత్వ ఐటీఐలో ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకువెళ్లి వెరిఫికేషన్ చేయించుకుని రసీదు పొందాలన్నారు. కౌన్సెలింగ్ సమయంలో రసీదు తప్పనిసరిగా చూపించాలన్నారు. వివరాలకు 08816 297093, 96664 07468 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
బ్లేడుతో దాడి కేసులో ఏడాది జైలు
ఏలూరు టౌన్: ఓ వ్యక్తిపై బ్లేడుతో దాడి చేసిన కేసులో ముద్దాయికి ఏడాది జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ ఏలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్కేఎండీ అబుతాలిబ్ పర్వేజ్ తీర్పు చెప్పారు. ఏలూరు కత్తేపువీధి సెంటర్లో 2020 డిసెంబర్ 25న రాత్రి 9గంటల సమయంలో జూపూడి సుకుమార్ తన స్నేహితులతో మాట్లాడుతన్నాడు. అదే సమయంలో కత్తేపువీధి సీఎస్ఐ చర్చి ప్రాంతానికి చెందిన బండ్లమూడి నవీన్ ఆకస్మికంగా వెనుకవైపు నుంచి వచ్చి బ్లేడుతో సుకుమార్ మెడపై దాడి చేశాడు. బాధితుడు మరుసటి రోజు ఏలూరు వన్టౌన్ ఎస్సై రామకృష్ణకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై ఏలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్కేఎండీ అబుతాలిబ్ పర్వేజ్ విచారణ చేపట్టారు. ప్రాసిక్యూషన్ తరపున సహాయ ప్రభుత్వ న్యాయవాది హేమలత సాక్షాధారాలను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. ముద్దాయి నవీన్ నేరం రుజువు కావటంతో ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పర్వేజ్ తీర్పు ఇచ్చారు. ఏలూరు వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ, ఎస్సైలు సుధాకర్, రామకృష్ణ, దుర్గాప్రసాద్, కోర్టు కానిస్టేబుల్ హరికిషోర్ సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. భీమవరం: అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతిచెందినట్లు భీమవరం వన్టౌన్ ఎస్సై ఎస్వీవీ కృష్ణాజీ మంగళవారం చెప్పారు. ఒరిస్సా రాష్ట్రం కాండ్రపడ జిల్లా రాధానాగ్కు చెందిన యాదాపు స్వయమ్ (35) మరొక ముగ్గురు భీమవరం ఎల్అండ్టీ కంపెనీలో పనిచేయడానికి ఈనెల 17వ తేదీన వచ్చారు. తాడేరు రోడ్డులోని మద్యం షాపు వద్ద మద్యం కొనుగోలు చేసి రెండు రోజులపాటు అతిగా మద్యం సేవించడంతో మంగళవారం మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణాజీ చెప్పారు. -
సమస్య జటిలం
భీమవరం: మండుటెండలో గుక్కెడు నీళ్లు కోసం పలు గ్రామాల్లో ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. పంచాయతీ మంచినీటి చెరువుల్లో నీరు అడుగంటడం, నీరు పసర్లు పట్టి దుర్వాసన రావడంతో తాగునీటి కొనుగోలు చేసి తాగాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో ఆరు మున్సిపాల్టీలతోపాటు సుమారు 409 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో పంచాయతీలకు అనుబంధంగా శివారు గ్రామాలు ఉన్నాయి. భీమవరం వంటి పట్టణంలో నిత్యం మంచినీటి సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారు. ట్యాంకర్ల ద్వారా వచ్చే నీరే శివారు ప్రాంతాలకు దిక్కవుతుంది. పాలకొల్లులో అయితే ఒంటిపూట నీరే గతి. 321 మంచినీటి చెరువులు జిల్లాలోని 409 గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 321 మంచినీటి చెరువులు ఉన్నాయి. చెరువుల నీటిని ఓవర్హెడ్ ట్యాంకుల నుంచి పైప్లైన్స్ ద్వారా సరఫరా చేస్తున్నారు. అయితే వేసవిలో దాదాపు 40 రోజుల పాటు కాలువలకు నీటి సరఫరాను నిలుపుదల చేయడంతో గ్రామాల్లో మంచినీటి సరఫరాకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దాదాపు అన్ని పంచాయతీల్లో 40 రోజులకు సరిపడా నీటిని నిల్వ చేసే చెరువులు లేవు. దీంతో కాలువలను కట్టేముందు మంచినీటి చెరువులను పూర్తిగా నీటితో నింపుకోవాలని అధికారులు పంచాయతీ అధికారులను ఆదేశిస్తుంటారు. కొన్ని గ్రామాల్లో అధికారులు నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా చెరువులను నింపకపోవడంతో మే నెలలో మంచినీటి ఎద్దడి ఏర్పడు తోంది. చెరువుల్లో నీరు అడుగంటి, నీరు పసర్ల బారిన పడటం, దుర్వాసన రావడంతో పంచాయతీ సరఫరా చేసే నీటిని వాడుకోడానికి పనికిరావడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లో అడుగంటిన నీటిని పూర్తిగా క్లోరినేషన్ చేయకుండానే పైప్లైన్స్ ద్వారా సరఫరా చేస్తున్నారని వాపోతున్నారు. ఈ నెలాఖరుకు కాలువలకు నీటిని వదులనున్నా శివారు గ్రామాలకు చేరే సరికి మరో వారం, పది రోజులు సమయం పడుతుందని అప్పటివరకు చెరువుల్లో ఉన్న నీరు సరిపోయే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జలవనరుల శాఖ మంత్రి ఇలాకాలోనే.. రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సొంత నియోజకవర్గమైన పాలకొల్లు పట్టణంలోని ప్రజలకు ఒంటిపూట నీటిని సరఫరా చే యడం విశేషం. అభివృద్ధిలో పథంలో దూసుకుపోతున్నామంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా పట్టణ ప్రజలకు రెండు పూటలా మంచినీరు ఇచ్చే పరిస్థితే లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. భీమవరం మండలం గొల్లవానితిప్పలో చెరువువీరవాసరం మండలంలో రంగు మారిన నీరుతాగునీటికి కటకట జిల్లాలో తాగునీటి కష్టాలు చెరువుల్లో అడుగంటిన నీరు కొన్నిచోట్ల పసర్లు పట్టిన నీరే సరఫరా పాలకొల్లులో ఒంటిపూట సరఫరాతో సరి గొల్లవానితిప్పలోని చెరువులో నీరు అడుగంటడంతో మంచినీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే చెరు వులో నీరు చాలా వరకు తగ్గిపోయింది. నెలాఖరుకు కాలువలకు నీటిని వదలినా మరో 10 రోజుల వరకు అంటే జూన్ 10 వరకు మా గ్రామానికి నీరు వచ్చే అవకాశం లేదు. అప్పటివరకు చెరువులో ఉన్న నీటిని ఎలా సరఫరా చేస్తారో చూడాల్సిందే. – బోకూరి విజయరాజు, మాజీ సర్పంచ్, గొల్లవానితిప్ప భీమవరం మండలంలోని పలు గ్రామాల్లోని మంచినీటి చెరువుల్లో నీరు పసరెక్కి పచ్చగా కన్పిస్తున్నాయి. ఎండ తీవ్రతతో నీరు రంగుమారి పోయింది. అదే నీటిని సరఫరా చేయడంతో వ్యాధులకు గురయ్యే ప్రమాదముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లో నీటి పూర్తిగా క్లోరినేషన్ చేయించి కుళాయిల ద్వారా సరఫరా చేయాలి. – పెనుమాల నర్సింహస్వామి, మాజీ ఎంపీటీసీ, భీమవరం మండలం -
మోటార్సైకిల్ నుంచి జారిపడి మహిళ మృతి
పెనుగొండ: మోటార్సైకిల్ నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందింది. పెనుగొండ ఏఎస్సై అంజిబాబు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయ పురం మండలం అంకంపాలెంకు చెందిన పేరూరి వెంకట రమణ (53) మధుమేహ సమస్యలు, హైపర్ టెన్సన్తో బాధపడుతోంది. మంగళవారం ఉదయం కుమారుడు సతీష్తో కలసి మోటార్సైకిల్పై తణుకు వైపు వెళ్తుండగా దొంగరావిపాలెంవద్ద అకస్మాత్తుగా స్పృహ తప్పి రోడ్డపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే వెంకట రమణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
లైంగిక దాడులు అరికట్టాలి
మోటార్సైకిల్ నుంచి జారిపడి.. మోటార్సైకిల్పై నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందిన ఘటన పెనుగొండ మండలం దొంగరావిపాలెంలో చోటుచేసుకుంది. 8లో uఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మిఏలూరు(ఆర్ఆర్పేట): సమాజంలో బాలల పై లైంగిక దాడులు పెరిగిపోయాయని, వాటిని అరికట్టడానికి సమాజంలో ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి సూచించారు. మంగళవారం వట్లూరు లోని వెలుగు కార్యాలయంలో జాగృతి పథకం–2025 సురక్షిత్ భవిష్య–పోక్సో కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేశారని, ఈ చట్టంలో నేరస్తులను కఠినంగా శిక్షిస్తారన్నారు. ఇటువంటి నేరాలు ఎక్కువగా బంధువులు, స్నేహితుల ద్వారానే జరుగుతున్నాయన్నారు. మహిళలు, బాలలపై జరిగే నేరాల్లో బాధితులకు జిల్లా న్యాయ సేవా ధికారి సంస్థ ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తుందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ మెంబర్ న్యాయవాది పి.వెంకటేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, ఏలూరు జిల్లా బాలల సంరక్షణ అధికారిణి సూర్యచక్రవేణి, డీఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీసర్ అనిత, ప్యానల్ న్యాయవాదులు ఎ.గంగాభవాని, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. -
● ఎన్సీసీ శిక్షణ.. దేశ రక్షణ
దేశరక్షణలో మేము సైతం అంటూ ఎన్సీసీ క్యాడెట్లు శిక్షణ పొందుతున్నారు. ఏలూరు సీఆర్రెడ్డి కళాశాలలో ఎన్సీసీ శిబిరంలో 574 మంది క్యాడెట్లకు డ్రిల్ విభాగంలో శిక్షణ ఇస్తున్నారు. యుద్ధ నైపుణ్యాలు, 22 రైఫిల్ ఫైరింగ్, మ్యాప్ రీడింగ్, టెంట్ నిర్మాణ నిర్వహణ, విపత్తుల నిర్వహణ, ట్రాఫిక్పై అవగాహనపై శిక్షణ ఇస్తున్నారు. 19 ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్నల్ అమిత్ పాండే ఆధ్వర్యంలో శిబిరం నిర్వహిస్తుండగా.. బెటాలియన్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఎం.కొండయ్య, క్యాంపు కెప్టెన్ కె.శివశంకర్, సంజయ్ మౌర్య, సిద్ధప్ప పర్యవేక్షిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు -
ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
ఉంగుటూరు: జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణతో ముందకు వెళుతున్నామని ఐజీ జీవీజీ అశోక్కుమార్ తెలిపారు. మంగళవారం చేబ్రోలు పోలీస్స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతీ య రహదారిపై గంజాయి రవాణాను అరికట్టడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని నేరాల అదుపునకు చర్యలు చేపట్టామన్నారు. మహిళల రక్షణకు జిల్లాలో 25 వేల కెమెరాలు అమర్చామన్నారు. అనంతరం ఆయన మహి ళా పోలీసులతో సమావేశమయ్యారు. గ్రామా ల్లో ప్రజలతో మమేకం కావాలని, గుడ్టచ్, బ్యాడ్టచ్పై పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. సోషల్ మీడియా ప్రభావంతో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, సెల్ఫోన్లకు పిల్లలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారన్నారు. పరీక్షల్లో అధిక మార్కులు వచ్చిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల పిల్లలను సత్కరించారు. మహిళా పోలీసులు, చేబ్రోలు పోలీసులకు హె ల్మెట్లు అందించారు. తిరుమల పాల పరిశ్రమ అందించిన అంబులెన్స్ను మరోమారు ఐజీతో డాక్టర్ శ్రావణరెడ్డి పీహెచ్సీకి అందజేశారు. తొలుత స్టేషన్లో రికార్డులను ఆయన పరిశీలించారు. ఎస్పీ కేపీ శివకిషోర్, డీఎస్పీ శ్యామ్కుమార్, సీఐ రజనీకుమార్, ఎస్సైలు సూర్యభగవాన్ (చేబ్రోలు), మణికుమార్ (గణపవరం ), ఏలూరు ఎస్బీ ఎస్సై ఐ.రమేష్ (నిడమర్రు) పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక కలెక్టరేట్లో మంగళవారం మత్స్యకారుల సేవలో పథకంలో భాగంగా జిల్లాకు చెందిన 1,774 మత్స్యకార కుటుంబాలకు రూ.3.54 కోట్ల వేట నిషేధ సాయాన్ని ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి అందజేశారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సాయాన్ని జమచేసినట్టు ఆయన చెప్పారు. సముద్రపు నాచు (సీ వీడ్) పెంపకం వంటి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలపై మత్స్యకారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మత్స్యశాఖ జేడీ డి.శ్రీనివాస్, సహాయ సంచాలకుడు ఎల్ఎల్ఎన్ రాజు, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు మైల వసంతరావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం కలెక్టరేట్లో బుధవారం ఎంఎస్ఎంఈ వర్క్షాప్ ని ర్వహించనున్నట్టు ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ లు, యువ ఆవిష్కర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పరిశ్రమల అధికారులతో సమీక్షించారు. వర్క్షాప్లో పాల్గొనడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదని స్పష్టం చేశారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 18 విడతల్లో 399 భూసమస్యల దరఖాస్తులను పరిష్కరించినట్టు ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు అనుబంధంగా రెవెన్యూ క్లినిక్స్ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మొత్తంగా 684 దరఖాస్తు లను తీసుకున్నామన్నారు. డివిజన్ల వారీగా భీమవరంలో 107 దరఖాస్తులు, నరసాపురంలో 104 దరఖాస్తులు, తాడేపల్లిగూడెంలో 50 దరఖాస్తులను పరిష్కరించామన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు పాల్పడితే చర్యలు తప్పవని ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి హెచ్చరించారు. జనగణనకు జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు. ఇటీవల భీమవరంలో విధులు నిర్వహిస్తున్న వార్డు సెక్రటరీ కేవీఆర్ కిషోర్పై జరిగిన దాడి ఘటన వివరాలను ఆ శాఖ ప్రతినిధులు మంగళవారం ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ దాడి ఘటనపై కేసు నమోదు చేశారని, ఇటువంటి ఘటనలను ఉపేక్షించేది లేదన్నారు. జనగణ నకు వచ్చిన సిబ్బందిపై అనుమానాలు ఉంటే తహసీల్దార్ కార్యాలయం, కలెక్టరేట్లోని కంట్రోల్రూమ్లో సంప్రదించాలన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ పనితీరు కనబరిచి జిల్లా వైద్యారోగ్య వ్యవస్థ ప్రతిష్టను నిలబెట్టాయని కలెక్టర్ సీహెచ్ నాగ రాణి తెలిపారు. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తాజా పనితీరు అంచనాల్లో జిల్లాలోని 34 పీహెచ్సీల్లో 33 కేంద్రాలు ఏ గ్రేడ్ సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. -
చంపొద్దు.. సమాచారం ఇవ్వండి..
కై కలూరు: ప్రకృతి రమణీయతకు, పక్షుల అందాలకు చిరునామాగా నిలుస్తున్న కొల్లేరు ప్రాంతంలో అరుదైన కొండ చిలువల మరణమృదంగం మోగుతోంది. విషపూరిత సర్పాలు కానప్పటికీ వీటి భారీకాయాన్ని చూసి భయపడి జనం చంపేస్తున్నారు. కై కలూరు నియోజకవర్గం కలిదిండి లాల్వ డ్రెయిన్ సమీప చెరువుపై సోమవారం 10 అడుగుల భారీ కొండ చిలువ కనిపించడంతో పొలుగు, పారతో దాని తల పగులగొట్టి ప్రాణం తీశారు. ఇటువంటి ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. కొద్ది ఘటనల్లో మాత్రమే అటవీశాఖ అధికారులు వీటిని రక్షించి చింతలపూడి ఎగువన అడవుల్లో వదులుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి 9 మండలాల పరిధిలో 77,138 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడ 2.90లక్షల ఎకరాల్లో చేపల, రొయ్యల చెరువులు సాగవుతున్నాయి. ఈ ప్రాంతానికి సుమారు మూడు దశాబ్దాల క్రితం అరణ్య ప్రాంతాల నుంచి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వంటి వాగుల ద్వారా కొండ చిలువలు వలస రావటం మొదలైంది. కిక్కిస పాదలు, చేపల చెరువుల గట్లపై ఆవాసాలను ఏర్పాటు చేసుకుని ఇక్కడే తిష్ట వేశాయి. కొల్లేరు చిత్తడి నేలలు కొండ చిలువలకు అనుకూల ఆవాసాలుగా మారాయి. చెరువులపై కోళ్లు, పక్షులు, ఎలుకలను ఆహారంగా తీసుకుంటున్నాయి. నీటిలో వేగంగా ప్రయాణించగలిగిన కొండ చిలువలు ఆహార అన్వేషణలో భాగంగా బయటకు వచ్చి ప్రజల చేతిలో మృత్యువాతపడుతున్నాయి. భయపడి ఊపిరి తీసేస్తున్నారు.. సరీసృపాలలో అరుదైన కొండచిలువలను వాటి భారీ ఆకారాలను చూసి దాడి చేస్తున్నారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొండంగి, మట్టగుంట, పడమటిపాలెం, కలిదిండి, కై కలూరు మండలం ఆటపాక, వరహపట్నం, భుజబలపట్నం, ముదినేపల్లి మండలంలోని కొన్ని గ్రామాలు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ప్రాంతాల్లో కొండచిలువల సంచారం కనిపిస్తోంది. ఇవి మాంసాహారులు. నీటిలో సైతం వేగంగా ఈదగలవు. పాడుబడిన క్షీరదాల బొరియలు, చెట్లు, మడ అడవుల్లో దాక్కుంటాయి. క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలను తింటాయి. ఒకసారి ఆహారం తీసుకున్న తర్వాత వారం పాటు ఏమీ తినకుండా ఉండగలవు. ఎక్కువగా ఒంటరి జీవితం గడుపుతాయి. సంభోగ సమయంలో మాత్రమే జత కడతాయి. ఒంటరిగా కనిపిస్తున్న సమయంలో వీటిని హతమారుస్తున్నారు. అంతరిస్తున్న అరుదైన జాతి ఇండియన్ రాక్ పైథాన్గా పిలిచే కొండ చిలువల శాసీ్త్రయ నామం పైథాన్ మోలురూస్. గోధుమరంగుపై నల్లటి డైమండ్ మచ్చలు ఉంటాయి. ఇవి 12 అడుగుల పొడవు, 52 కేజీల బరువు పెరుగుతాయి. వీటి జీవితకాలం గరిష్టంగా 21 సంవత్సరాలు. ఏడాది వయసు నుంచి జత కడుతుంటాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూ సీఎన్) హాని కలిగే జాతుల జాబితా (రెడ్ లిస్ట్)లో వీటిని చేర్చింది. చిత్తడి నేలలు, గడ్డి భూములు, రాతి పర్వతాలు, నదీ లోయల్లో ఇవి నివసిస్తుంటాయి. ఐయూసీఎన్ సంస్థ దాదాపు 40 శాతం రాక్ పైథాన్ జాతి అంతరించిందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఏటా 20 నుంచి 30 కొండచిలువలు ప్రజల చేతిలో హతమవుతున్నట్టు అంచనా. పుట్టిన బిడ్డలను తల్లే తినేస్తోంది సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇవి జతకట్టి 2 నుంచి 3 నెలల్లో గర్భం దాలుస్తాయి. అనంతరం మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో రోజుకు 20 నుంచి 30 గుడ్ల చొప్పున కనీసం 100 గుడ్ల వరకు పెడతాయి. నాలుగు నెలల పాటు గుడ్లను పొదుగుతాయి. పొదిగిన గుడ్లలో 80 శాతానికి పైగా పిల్లలు అవుతాయి. పుట్టిన పిల్లలు 18–24 అంగుళాల వరకు పాడవు ఉంటాయి. అయితే, పుట్టిన వాటిలో 25 శాతం పిల్లల్ని వరకు తల్లే తినేస్తుంది. ఆహారం అందక ఇంకొన్ని చనిపోతాయి. చివరకు 10–15 పిల్లలు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. చిత్తడి నేలలు, గడ్డిభూములు, ఎర్రనేలలు, మడ ఆడవుల్లో ఇవి ఉంటాయి. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్ దేశాల్లో వీటి సంతతి ఎక్కువగా ఉంది. కొండ చిలువలు అరుదైన జాతి. వీటిని చంపడం నేరం. మూడేళ్లు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ జాతిని షెడ్యూల్–1లో చేర్చారు. కొల్లేరు ప్రాంతాల్లో కనిపిస్తే అటవీశాఖ అధికారులకు, ఇతర ప్రాంతాల్లో కనిపిస్తే టొరిటోరియల్ సిబ్బందికి సమాచారం ఇవ్వండి. వీటికి హానిచేయకుండా అప్పగిస్తే అటవీ ప్రాంతాల్లో వదిలిపెడతాం. – కె.రామలింగాచార్యులు, అటవీశాఖ రేంజర్, కై కలూరు ఇండియన్ రాక్ పైథాన్గా పిలిచే కొండచిలువలు అరుదైనవి. వీటిని ప్రభుత్వాలు షెడ్యూ ల్–1 కేటగిరిలో చేర్చింది. ఎలుకలు, కోళ్లు, పందికొక్కులను తింటాయి. ఇవి అంతరించిపోతున్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూ సీఎన్) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇవి విషపూరితం కావు. ఇవి కనిపిస్తే చంపకుండా ఫారెస్టు అధికారులకు చెప్పండి . – కంటమహింతి మూర్తి, తూర్పు కనుముల వన్యప్రాణి సంరక్షణ సంస్థ అధ్యక్షుడు, విశాఖపట్టణం ప్రజల చేతుల్లో కొండ చిలువలు హతం మూడు దశాబ్దాలుగా కొల్లేరు చిత్తడి నేలల్లో నివాసాలు చేపల, రొయ్యల చెరువు గట్లుపై సంచారం అంతరిస్తున్న జాతిగా గుర్తించిన ఐయూసీఎన్ ఆందోళన వ్యక్తం చేస్తున్న అటవీశాఖ -
నకిలీ మద్యంపై ఉక్కుపాదం
ఏలూరు టౌన్: జిల్లాలో నాటుసారా, నకిలీ మద్యం, కల్తీ కల్లు, మాదకద్రవ్యాల నేరాలపై ఉక్కుపాదం మోపాలని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని ఎకై ్సజ్ ప్రొహిబిషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ హెచ్చరించారు. మంగళవారం స్థానిక ఎకై ్సజ్ డీసీ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ ఎకై ్సజ్ అధికారులతో ఆయన స మావేశం నిర్వహించారు. నవోదయం కార్యక్రమం ద్వారా నాటుసారా కట్టడి చేస్తూ గ్రామాల్లో మరోసారి సారా తయారీ పునరావృతం కాకుండా పటిష్ట చర్య లు చేపట్టాలని చెప్పారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలనీ, నిందితులకు కఠిన శిక్షలు కోర్టుల్లో విధించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కక్షిదారులు రాబోయే మెగా లోక్అదాలత్లో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రాష్ట్ర సరి హద్దు వెంబడి, చెక్పోస్టుల్లోనూ పటిష్ట నిఘా ఏ ర్పాటు చేస్తూ రాష్ట్రంలోకి నాన్డ్యూటీ పెయిడ్ లిక్కర్ ప్రవేశించకుండా అరికట్టాలని చెప్పారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా కేర్ కమిటీతో విద్యాసంస్థల్లోనూ, పరిశ్రమల్లోనూ అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. మద్యం దుకాణదారులు విధిగా నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ కేవీఎన్ ప్రభుకుమార్, ఏలూరు జిల్లా ఎక్సైజ్ అధికారి ఎ.అవులయ్య, పశ్చిమగోదావరి జి ల్లా ఎకై ్సజ్ అధికారి బి.సుబ్బారావు, జిల్లా అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరిటిండెంట్లు, 13 మంది సీఐలు, ఎన్ఫోర్స్మెంట్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
మిస్టరీగా బాలింత మృతి కేసు
● మూడురోజులుగా మృతదేహం మార్చురీలోనే.. ● పత్తాలేని వైద్యారోగ్య శాఖ ● శిశువు భీమవరం శిశు గృహకు తణుకు అర్బన్: తణుకులో సంచలనం రేకెత్తించిన బాలింత మృతి కేసులో చిక్కుముడులు వీడటంలేదు. పోలీసుల దర్యాప్తులో బాలింత బీహార్కు చెందిన వారని రాజమండ్రిలో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రసవానికి రాజమండ్రి నుంచి తణుకు పట్టణానికి ఎందుకు వచ్చారు, పట్టణానికి చివరగా ఉంటూ ప్రసవాల్లో చివరి స్థానంలో ఉండే ఆస్పత్రినే ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఎన్నో అనుమానాలు.. ఈనెల 16వ తేదీన తణుకులోని పైడిపర్రు ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసి ఆడ శిశువును బయటకు తీయడం వెంటనే బాలింత మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ బాలింతను ఆస్పత్రిలో చేర్చిన ఆర్ఎంపీ వైద్యుడు చంటి, రాజమండ్రిలో ఉండే అతని స్నేహితుడు మోషేతోపాటు మరొక మహిళ మాత్రమే శస్త్రచికిత్స చేయించడంపై తలెత్తిన అనుమానాలు నివృత్తి కాలేదు. ప్రస్తుతం మోషే పోలీసుల అదుపులో ఉండగా, మోషేతోపాటు మరొక మహిళ ఆచూకీ దొరికితేనే కానీ కేసు కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. బాలింత తరపున ఎవరూ ఆస్పత్రికి రాకపోవడంతో గత మూడు రోజులుగా తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలోనే మృతదేహం ఉంచాల్సి వచ్చింది. తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న శిశువు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో మంగళవారం ఐసీడీఎస్, పోలీసుల సహకారంతో భీమవరంలోని శిశు గృహకు తరలించినట్లుగా వైద్యులు చెబుతున్నారు. వైద్యమే లోపమా.. బాలింత మృతి ఘటనకు సంబంధించి గర్భిణి వద్ద ఎటువంటి వైద్య పరీక్షలకు చెందిన రిపోర్టులు లేకపోవడం, ఆమెకు సంబంధించిన ఆరోగ్యస్థితి హిస్టరీ తెలియకుండానే శస్త్రచికిత్స చేయడం కూడా వివాదాస్పదంగా మారింది. గర్భిణిగా ఆస్పత్రికి వచ్చినప్పుడు ఆమె గుండె పరిస్థితి ఎలా ఉంది, రక్త శాతం ఎంత ఉంది, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు చూసి శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా అవేమీ పట్టించుకోకుండా శస్త్రచికిత్స ఎలా చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రులైన తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి కానీ, లేదంటే అన్ని విభాగాల సౌకార్యాలు ఉన్న ఏలూరు, కాకినాడ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్స చేయించి ఉంటే బాలింత బతికి ఉండేదేమోననే అంశంపై కూడా తణుకులో చర్చ జరుగుతోంది. రక్తశాతం తక్కువగా ఉన్న సమయాల్లో శస్త్రచికిత్స చేసిన వెంటనే గుండెకు సరిపడా రక్తం అందక ప్రాణం పోయే పరిస్థితులు ఉంటాయని సైతం వైద్యులు చర్చించుకుంటున్నారు. మౌనంగా వైద్యారోగ్య శాఖ గర్భిణులు, బాలింత, శిశు మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కోట్లాది రూపాయిలు వెచ్చిస్తున్నా మాతాశిశు మరణాలు జరుగుతుండడం శోచనీయం. ఈనెల 16వ తేదీన బాలింత మృతిచెందడం, 17న వెలుగులోకి రావడం, ఇప్పటికే మూడు రోజులు గడిచిపోయినా వైద్యారోగ్య శాఖ ఇంతవరకు ఎటువంటి స్పందన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఘటనపై డీఎంహెచ్వో డాక్టర్ గీతాబాయిని వివరణ కోరేందుకు సాక్షి ప్రయత్నించగా ఫోన్లో అందుబాటులోకి రాలేదు. -
గాడితప్పిన పోలీస్ !
సాక్షి, భీమవరం: ప్రజల నుంచి ఫిర్యాదులు అందినప్పుడు చట్టప్రకారం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి చార్జిషీట్ దాఖలు చేయడం పోలీసుల పనిగా ఉన్నత న్యాయస్థానం చెబుతోంది. అందుకు భిన్నంగా జిల్లాలో కొందరు పోలీసులు తెరవెనుక సెటిల్మెంట్లు, పైరవీలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పాలక పక్షాల నేతల కనుసన్నల్లో విపక్ష నేతలు, సామాజిక కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం, బాధితుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు కేసు నమోదుకు తాత్సారం, ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలని బాధి తులపై ఒత్తిడి తెచ్చి కేసులు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయా సందర్భాల్లో న్యాయం కోసం బాధితులు ఉన్నతాధికారుల తలుపు తడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. జిల్లాలోని ఎస్పీ, ఏలూరులోని డీఐజీ కార్యాలయాలకు అందుతున్న ఫిర్యాదుల్లో స్థానిక పోలీస్ అధికారుల అవినీతి వ్యవహారాలపై అధికంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. పోలీసులకు వ్యతిరేకంగా కొందరు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఏసీబీ వలలో.. జిల్లాలోని కొందరి అవినీతి ఏసీబీ గడపకు చేరుతోంది. రెండు నెలల క్రితం చీటింగ్ కేసుకు సంబంధించి నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయకుండా ఉండేందుకు బాధితుల నుంచి రూ.25 వేలు తీసుకుంటూ తణుకులో ఒక హెచ్సీ ఏసీబీకి చిక్కారు. ఈ వ్యవహారంలో స్టేషన్ లోని మరికొందరి పాత్రపైనా అప్పట్లో ఏసీబీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇటీవల తాడేపల్లిగూడెంలో ప్రేమ వ్యవహారానికి సంబంధించిన కేసు విషయమై పోలీసులు యువకుడిని బెదిరించి రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. బాధితులు రూ.70 వేలు చెల్లించేందుకు పోలీసులతో ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీని ఆశ్రయించారు. ఎస్సై, కానిస్టేబుల్ నగదు తీసుకుంటున్న సమయంలో ఏసీబీకి పట్టుబడ్డారు. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నా.. విధి నిర్వహణలో అలసత్వం, ఆరోపణలు తదితర కారణాలతో నాలుగు నెలల వ్యవధిలో జిల్లాలోని పలువురు సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లపై ఉన్నతా ధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. జనవరిలో తణుకు సర్కిల్లోని సీఐ, ఎస్సైను లీవ్పై పంప గా, ఫిబ్రవరిలో మరో సీఐ, ఎస్సైను రేంజ్ వీఆర్కు పంపారు. నెలరోజుల క్రితం ఆకివీడు సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆయన స్థానంలో బాధ్యతలు తీసుకున్న సీఐ తాజాగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొద్దిరోజుల క్రితం యలమంచిలి ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేయగా, ఉండి ఎస్సైను వీఆర్కు పంపారు. క్రమశిక్షణ చర్యలు ఏ మేరకు మార్పు తీసుకువస్తున్నాయనేది ప్రశ్నార్థకమే. తాజా ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలకు న్యాయం అందించే దిశగా పోలీస్ వ్యవస్థ పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు. బాలికపై లైంగిక దాడి కేసులో ఇటీవల భీమవరం పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలికకు న్యాయం చేయాల్సింది పోయి నిందితులకు కొమ్ము కాస్తారా? అని ప్రశ్నించింది. అధికార పక్షానికి చెందిన నిందితులను కాపాడేందుకు కేసు వాపసు తీసుకొమ్మని పోలీసులు తమపై ఒత్తిడి తెస్తున్నట్టు బాలిక తల్లి న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. తన కుమారుడి మరణానికి ఆకివీడు పోలీసులు కారణమని తల్లి ఆరోపిస్తోంది. కోడలు, అత్త పెట్టిన అక్రమ కేసుపై ఈనెల 10న పోలీసులు తన కుమారుడిని స్టేషన్కు పిలిచి చిత్రహింసలకు గురిచేయడంతో నొప్పులు తట్టుకోలేక 11న ఆత్మహత్య చేసుకున్నట్టు బోరుమంది. తనకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీని కలిసే ప్రయత్నం చేయగా స్థానిక పోలీసులు అడ్డంకులు కల్పించడంతో ఏలూరులో డీఐజీని కలిసి వినతిపత్రం అందజేసినట్టు తెలిపింది. ఈ ఘటనపై విచారణకు డీఐజీ ఆదేశించారు. నరసాపురం రూరల్లో జనసేన పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఓ బాలిక పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను కూడా లైంగికంగా వేధిస్తున్నట్టు పేర్కొంది. స్థానిక పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. పోక్సో కేసు నమోదుకు ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు. పోలీసుల చెరలో న్యాయం సెటిల్మెంట్లు, పైరవీల్లో పోలీసులు కూటమి నేతల సేవలో తరిస్తున్న లోకల్ బాస్లు కేసుల నమోదుకు తాత్సారం బాధితులపై ఒత్తిడి తెచ్చి నీరుగార్చే ప్రయత్నాలు న్యాయం కోసం ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్న బాధితులు -
ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
నూజివీడు: పట్టణంలోని ట్రిపుల్ఐటీ ఎదురుగా ఉన్న జగనన్న కాలనీలో మండు వేసవిలో నీళ్లు లేక కాలనీ మహిళలు సోమవారం రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. గత నాలుగు నెలలుగా నీటి సమస్యతో సతమతమవుతున్నా మున్సిపల్ అధికారులు గాని, పాలకులు గాని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజుల క్రితం తమ నీటి సమస్యపై సబ్కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీని అందజేశామని అయినా ఇంత వరకు నీటి సమస్యను పరిష్కరించలేదని, ఇంక అర్జీలను తీసుకోవడం ఎందుకని వారు ప్రశ్నించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీ రాజు మాట్లాడుతూ కాలనీవాసులు నీటి సమస్యతో నెలల తరబడి ఇబ్బందులు పడుతున్నా కనీసం ట్యాంకర్లతోనైనా సరఫరా చేయాలనే ఆలోచన చేయకపోవడం దారుణమన్నారు. కాలనీలోని మంచినీటి సమస్యను పరిష్కరించకుంటే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు రామకూరి మరియదాసు, స్థానికులు పాల్గొన్నారు. -
ఇంధన భారంపై వైఎస్సార్సీపీ నిరసనాగ్రహం
నరసాపురం: నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు తణుకు అర్బన్: మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి కారుమూరి. చిత్రంలో ఎమ్మెల్సీ రవీంద్రనాథ్, పార్లమెంట్ పరిశీలకుడు మురళీకృష్ణంరాజు సాక్షి, భీమవరం ● నరసాపురంలో.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాటి నుంచి ప్రజలపై మోయలేని భారాలు వేస్తూ, నిరంకుశ పాలన సాగిస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, నరసాపురం సమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ నరసాపురంలో పాదయాత్ర నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఆర్డీఓ దాసి రాజుకు వినతిపత్రం అందజేశారు. పార్టీ సీజీసీ సభ్యుడు పీడీ రాజు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బర్రే శ్రీవెంకటరమణ, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న తదితరులు పాల్గొన్నారు. ● తణుకులో.. తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ జిల్లా పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్రపతి రోడ్డు, నరేంద్ర సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎడ్ల బళ్లు, గుర్రపు స్వారీ లతో వినూత్నంగా నిరసన తెలిపారు. కారుమూరి మాట్లాడుతూ నీకు 15 వేలు, నీకు 15 వేలు అంటూ ఊదరగొట్టిన మంత్రి ఇంధన పొదుపు పేరిట సైకిల్పై తిరిగి ముందు, వెనుక నాలుగు కార్లలో వీడియో కవరేజీ డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ ఇంధన ధరలు పెంచమని మేనిఫెస్టోలో పేర్కొన్న కూటమి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ధరలు పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఇంధనంపై గుజరాత్, తమిళనాడులో 14 శాతం పన్ను ఉంటే రాష్ట్రంలో 31 శాతం వసూలు చేస్తున్నారన్నారు. ● భీమవరంలో.. భీమవరంలో నియోజకవర్గ ఇన్చార్జి చినమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, పార్టీ శ్రేణులు ఉండి రోడ్డులోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు వ్యాన్కు తాడుకట్టి నిరసన తెలిపారు. చినమిల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నిత్యావసర, ఇంధన ధరలకు రెక్కలొచ్చి సామాన్యుల జీవనం దుర్భరంగా మారిందన్నారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీని ఓడిస్తే పెట్రోల్ ధరలు తగ్గుతాయంటూ ఎన్నికల్లో వేదాలు వల్లించిన లోకేష్ పెంచిన ధరలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, రాష్ట్ర కార్యదర్శి పాలవెల్లి మంగ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఇంటి సత్యనారాయణ, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బోకూరి విజయరాజు పాల్గొన్నారు. ● ఉండిలో.. ఉండిలో నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఉండి పార్కు వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఇంధన ధరలు తగ్గించాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీవీఎల్ మాట్లాడుతూ పెట్రోల్ ధరలు తగ్గిస్తామంటూ ఎన్నికల ముందు కూటమి నేతలు కోతలు కోసి ఇప్పుడు ధరల పెంపుతో ప్రజలకు వాతలు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కార్యదర్శి కరిమెరక రామచంద్రరావు, ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శి బడుగు బాలాజీ, క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుర్రం బెన్హర్, జిల్లా గ్రీవెన్స్సెల్ అధ్యక్షుడు గళావిల్లు ధనుంజయ, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జహంగీర్, జిల్లా కార్యదర్శి గుండా సుందరరామనాయుడు పాల్గొన్నారు. ● తాడేపల్లిగూడెంలో.. తాడేపల్లిగూడెంలో పట్టణ మాజీ అధ్యక్షుడు గుండుబోగుల నాగు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రే ణులు పాల్గొని పట్టణంలో ర్యాలీ చేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ● ఆచంటలో.. ఆచంటలో పోడూరు జెడ్పీటీసీ సభ్యుడు గుంటూరి పెద్దిరాజు, పెనుగొండ ఎంపీపీ పూతినీడి వెంకటేశ్వరరావు, ఆచంట మండల కన్వీనర్ జక్కంశెట్టి శ్రీరాములు, పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఉండి: ఉండిలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నర్సింహరాజు, నాయకులు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు సామాన్యులపై భారం మోపుతున్న కూటమి ప్రభుత్వంపై మండిపాటు రాష్ట్రంలోనే ధరలు అధికమని ఆగ్రహం అధికారులకు వినతులు అందజేసిన నేతలు -
గళమెత్తిన సహకార సంఘాల ఉద్యోగులు
భీమవరం: సహకార సంఘాల ఉద్యోగులకు ప్రభు త్వం ఇచ్చిన హామీలకు విరుద్ధంగా జీఓ విడుదల చేయడంపై సోమవారం భీమవరం సహకార కేంద్రబ్యాంక్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. సహకార ఉద్యోగుల సంఘం రాష్ట్ర జేఏసీ సభ్యుడు నందమూరి సుబ్బారావు మాట్లాడుతూ 2025 డిసెంబర్ 6 నుంచి ఫిబ్రవరి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఉద్యోగులు వేతన సవరణ, గ్రాట్యూటీ చెల్లింపు, ఆరోగ్య బీమా, పదవీ విర మణ వయసు పెంపు, సర్వీసుల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్ల సాదనకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో నిరవధిక సమ్మె చేపట్టిన సందర్భంలో మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర సహకార బ్యాంకు చైర్మన్ గన్ని వీరాంజనేయులు రాష్ట్ర ఉద్యోగుల జేఏసీతో చర్చలు జరిపి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే హామీలకు విరుద్ధంగా ఉద్యోగుల హక్కులకు భంగం కలిగేలా జీఓ 322 వి డుదల చేసి ఉద్యోగులను మోసం చేయడం దు ర్మార్గమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత చ ర్యను నిరసిస్తూ జీఓ కాపీలను దహనం చేసినట్టు చెప్పారు. తాడేరు, ఈలంపూడి, గూట్లపాడు, వెంప, యండగండి, విస్సాకోడేరు, కుముదవల్లి, కాళ్ల సహకార సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న రైతుల నిరసన దీక్ష
నూజివీడు: నూజివీడు ప్రాంతంలో అనేక సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లు ప్రతి ఏటా రైతులను దారుణంగా మోసం చేస్తున్నారని రైతు సంఘం రాష్ట్ర నాయకులు చలసాని వెంకట రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవరగుంట గ్రామ ఆర్గనైజర్ ద్వారా అడ్వంటా సీడ్ కంపెనీ వారి నాసిరకం మొక్కజొన్న విత్తనాలతో తీవ్రంగా నష్టపోయిన గొల్లపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షను ప్రారంభించిన చలసాని రామారావు మాట్లాడుతూ ప్రభుత్వం, రైతులు, వ్యవసాయ అధికారుల మెతకతనాన్ని ఆసరా చేసుకున్న సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లు రైతుల పట్ల చులకన భావంతో వ్యవహరిస్తున్నారన్నారు. అనేక గ్రామాల్లో సీడ్ మొక్కజొన్న బాధిత రైతులను బెదిరించటం, ప్రలోభ పెట్టడం వంటి దుష్ట చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహించారు. రైతు సంఘం నేత నిమ్మగడ్డ నరసింహా మాట్లాడుతూ గొల్లపల్లి సీడ్ మొక్కజొన్న బాధిత రైతులకు తక్షణమే పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా సీడ్ ఆర్గనైజర్ల పట్ల ప్రభుత్వం మెతకతనం విడనాడాలని కోరారు. దీక్షా కార్యక్రమం అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో బాధిత రైతులకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నేతలు మడుపల్లి నాగేందర్రావు, చాట్ల పుల్లారావు, సూర్య కుమార్, బాధిత రైతులు బండి రత్నబాబు, మెరుగు సువర్ణరాజు, రుద్రపాటి సురేష్ పాల్గొన్నారు. -
వ్యాట్ వాత.. పెట్రో ధరల మోత
తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో వ్యాట్ మోతతో పెట్రో ధరల మోత మోగుతుందని, చంద్రబాబు పెట్రో మోసం ప్రజలకు భారంగా మారిందని వైఎస్సార్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్, అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డి రఘురాం విమర్శించారు. సోమవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంపై పెట్రో భారం రూ.3,391 కోట్లు పడుతుందని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో పెట్టి, ఈ విషయాన్నీ గాలికొదిలేశారన్నారు. రాష్ట్రంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ఎక్కువగా ఉండటంతో దేశం మొత్తం మీద ఇక్కడే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు,లోకేష్ పెట్రో ధరల పెరుగుదలకు పన్నులే కారణమని చెప్పి, ఇప్పుడు నిస్సిగ్గుగా ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయని, ప్రజలంతా పొదుపు పాటించేలా అవగాహన కల్పించాలని మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలను దగా చేసేలా రాష్ట్రంలో వ్యాట్ మోతతో వా తలు పెడుతున్నారన్నారు. టీడీపీ కూటమికి ప్రజలే బుద్ధి చెప్పాలని రఘురాం పిలుపునిచ్చారు. -
అనుమానాస్పదంగా బాలింత మృతి
తణుకు అర్బన్: తణుకులో శిశువును ప్రసవించిన కొద్దిసేపటికే తల్లి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తణుకు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని స్టార్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆ మహిళ వ్యవహారం గందరగోళంగా మారింది. అసలు ఆమె ఎవరు.. ఏ ఊరు.. ఏంటనే వివరాలు లేకుండా అప్పటికప్పుడు ప్రసవానికి రావడం, కండీషన్ను బట్టి వెంటనే శస్త్రచికిత్స చేయడం, ఆమె చనిపోవడం మిస్టరీగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఈనెల 17న రాత్రి తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి బాలింత మృతదేహాన్ని తీసుకురాగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు వ్యక్తులు మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకురావడంతో ఆస్పత్రి సిబ్బంది మార్చురీలో భద్రపరిచారు. ఆమె తరఫున ఏ ఒక్కరూ రాకపోవడం అను మానాలకు తావివ్వడంతో తణుకు రూరల్ పోలీసులు రంగప్రవేశం చేశారు. పిల్లల విక్రయాలకు సంబంధించిన వ్యవహారంగా అనుమానాలు రావడంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. అనుమానాలెన్నో.. తణుకులో ఓ ఆస్పత్రిలో కాంపౌండర్గా, బయట ఆర్ఎంపీగా చలామణి అవుతున్న పెనుమాక డేవిడ్ చంటి తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఓ గర్భిణిని ఈనెల 16న పట్టణంలోని స్టార్ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. ఆస్పత్రి వైద్యుడు కనీసం ఆమె వివరాలు ఏమీ తెలుసుకోకుండా, ఎలాంటి రిపోర్టులు లేకుండానే సిజేరియన్ చేసి శిశువును బయటకు తీశారు. కొద్దిసేపటికే ఆమె మృతిచెందడంతో మృతదేహాన్ని చంటి, రాజమండ్రికి చెందిన అతడి సన్నిహితుడు బిక్కవోలు మోషే కలిసి దువ్వ వెంకయ్య వయ్యేరు వద్దకు తీసికెళ్లినట్టు సమాచారం. తిరిగి అక్కడి నుంచి అంబులెన్స్లో ఈనెల 17న సాయంత్రం తణుకు ప్రభుత్వాస్పత్రికి చేర్చి వారే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలింత వేరే రాష్ట్రానికి చెందిన మహిళకాగా ఆస్పత్రిలో చేర్చే సమయంలో మోషేతో పాటు మరో మహిళ కూడా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. పోలీసులు వచ్చేలోపు మోషేతో పాటు ఆ మహిళ అక్కడి నుంచి ఉడాయించింది. గర్భిణి పేరు కుమారి అని తనకు మోషే అప్పగించాడని చంటి చెబుతున్నాడు. వివరాలు తెలియకుండా ఆపరేషన్ ఎలా చేశారని వైద్యుడు సుంకవల్లి పాండురంగారావుని అడగ్గా ఎమర్జెన్సీ అని చెప్పడంతోనే సిజేరియన్ చేసినట్టు చెప్పారు. పసిపిల్లల విక్రయాల్లో భాగమేనా..? చంటి గతంలోనూ ఇదే తరహాలో కొందరికి సిజేరియన్లు చేయించి శిశువులను విక్రయించేవాడనే ఆ రోపణలు ఉన్నాయి. ఇదే క్రమంలో గర్భిణికి ఆపరేషన్ చేయించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. చంటిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా మోషే ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు తణుకు రూరల్ ఇన్చార్జి ఎస్సై జానా సతీష్ తెలిపారు. 16న బాలింత మృతిచెందగా సుమారు 24 గంటలపాటు మృతదేహాన్ని ఎక్కడ ఉంచారు, ఏం చేయాలనుకున్నారనేది అనుమానాస్పదంగా ఉంది. ఇదిలా ఉండగా చంటి పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు. శిశువును వీరభద్రపురంలో ఒక ఇంట్లో ఉంచారనే సమాచారంతో పోలీసులు శిశువును తీసుకువచ్చి ప్ర భుత్వాస్పత్రిలో చేర్చారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్లు కృష్ణకుమారి, వెంకటలక్ష్మి, మహాలక్ష్మి శిశువును సో మవారం పరిశీలించారు. చికిత్స అనంతరం వైద్యు ల సూచనల మేరకు శిశువును జిల్లా కేంద్రంలోని శిశు గృహ సెంటర్కు తరలిస్తామని వారు చెప్పారు. వివరాలు తెలియకుండా శస్త్రచికిత్స చేసిన డాక్టర్ ఆస్పత్రిలో చేర్పించిన ఆర్ఎంపీ గందరగోళంగా బాలింత మృతి వ్యవహారం శిశువుల విక్రయాల్లో భాగమా అనే అనుమానాలు ! -
ప్లాస్టిక్ వ్యర్థం.. కాలువలకు అనర్థం
భీమవరం: స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అంటూ అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే భీమవరం పట్టణంలోని వివిధ పంట కాలువలు ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారాలతో నిండిపోతున్నాయి. కళ్లెదుటే పంట కాలువను డంపింగ్ యార్డులుగా మారుస్తున్నా మునిసిపల్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో ప్లాస్టిక్ నిషేధమంటూ సాక్షాత్తు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అనేక పర్యాయాలు సమావేశాలు నిర్వహించినా, జాయింట్ కలెక్టర్ టి రాహుల్కుమార్రెడ్డి స్వయంగా షాపుల్లో తనిఖీలు చేసినా క్యారీబాగ్ల అమ్మకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ప్రధానంగా కిరాణా, స్వీట్స్ షాపులు, కూరగాయల దుకాణాలు, భోజన హోటళ్లు, తోపుడుబండ్లు వంటి వాటి వద్ద వీటి వినియోగం ఎక్కువగా కనబడుతోంది. కొందరు వ్యాపారులు నిజాయతీగా క్యారీబాగ్ల వినియోగం తగ్గించినా ఎక్కువ శాతం వ్యాపారులు పట్టించుకోవడం లేదు. అడపాదడపా మునిసిపల్ అధికారులు తనిఖీలు చేసి మొక్కుబడిగా పెనాల్టీలు వేయడం తప్ప కఠినమైన చర్యలు లేకపోవడంతో పట్టణంలో ఎక్కడ చూసిన ప్లాస్టిక్ వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్ధాలతో పూడిపోతున్న కాలువలు పట్టణం గుండా లోసరి, గూట్లపాడు వెళ్లే కాలువతోపాటు, చినఅమిరం వెళ్లే పంట కాలువ, లోసరి ఛానల్, అనాకోడేరు పంట కాలువల గుండా భీమవరం మండలంలోని అనేక గ్రామాలకు తాగు, సాగునీటి సరఫరా జరుగుతుంది. ఎంతో ప్రధానమైన కాలువలు భీమవరం పట్టణం మధ్య నుంచి వెళ్లడం ఈ కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతోపాటు చెత్తా, చెదారాలు వేయడంతో నీరు కలుషితమై ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఏ కాలువ చూసినా తీవ్ర దుర్గంధం, చెత్తతో నిండి ఉన్నప్పటికీ వీటిని ప్రక్షాళన చేసే చర్యలు లేకపోవడం విశేషం. కాలువల్లో పూడిక తీయించి ప్రక్షాళన చేయాలని, ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త వేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ప్రశాంతంగా ఈఏపీసెట్
భీమవరం: పట్టణంలోని నాలుగు కేంద్రాల్లో సోమవారం ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో 220 మందికి 214 మంది, డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో 200 మందికి 194 మంది, డీఎన్నార్ అటానమస్ కళాశాలలో 200 మందికి 192 మంది, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 300 మందికి 292 మంది హాజరయ్యారు. తాడేపల్లిగూడెంలో.. తాడేపల్లిగూడెం: పెదతాడేపల్లిలోని వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఈఏపీసెట్కు ఉదయం 240 మందికి 231 మంది, మధ్యాహ్నం 240 మందికి 233 మంది హాజరయ్యారు. ప్రిన్సిపాల్ రాంబాబు పర్యవేక్షించారు. భీమవరం(ప్రకాశం చౌక్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లలో అందిన అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఇన్చార్జి కలెక్టర్, జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్లో 157, రెవెన్యూ క్లినిక్లో 46 అర్జీలు స్వీకరించినట్టు చెప్పారు. డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, డీపీ ఓ వై.దోసిరెడ్డి, భీమవరం డీఎల్డీఓ ఎ.వెంకటలక్ష్మి, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం: జిల్లాలో టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా సమన్వయంతో పనిచేయా లని జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈనెల 25 నుంచి జూన్ 4 వరకు టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను జిల్లాలో 23 కేంద్రాల్లో నిర్వహించనున్నామని 4,418 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. అలాగే ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు ఈనెల 25 నుంచి జూన్ 1 వరకు నిర్వహిస్తామని, ఎస్ఎస్సీ పరీ క్షలకు నాలుగు కేంద్రాల్లో 478 మంది, ఇంటర్ పరీక్షలకు రెండు కేంద్రాల్లో 411 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. డీఈఓ ఈ.నారాయణ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి జి. ప్రభాకరరావు, అధికారులు పాల్గొన్నారు. భీమవరం: స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి బాధితుల నుంచి 22 అర్జీలను స్వీకరించారు. సంబంధిత పోలీస్స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలపై త్వరితగతిన స్పందించి నిర్ణీత గడువులోపు చట్టపరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం అధికారి ఏవీ సూరిబాబు తె లిపారు. జిల్లాలో 3 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం బాలురు 8, బాలికలు 6 హాస్టళ్లు, ఇంటర్ నుంచి పీజీ విద్యార్థుల కోసం బాలురు 8, బాలికలు 7 హాస్టళ్లు నిర్వహిస్తున్నామన్నా రు. మొత్తంగా 29 హాస్టళ్లు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రవేశాలకు సంబంధించిన మరిన్ని వివరాలకు సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి, భీమవరం సెల్ 9441252102, 9490134897లో సంప్రదించా లని కోరారు. అలాగే సహాయ వెనుకబడిన త రగతుల సంక్షేమ అధికారి, నరసాపురంను కూడా సంప్రదించవచ్చన్నారు. -
సాగులో సమతుల్యత అవసరం
తాడేపల్లిగూడెం: సాగులో సమతుల్యత ఎరువుల వినియోగం ఖరీప్ 2026కు సంబంధించి ఐసీఏఆర్ అటారి జోన్ పరిధిలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవర్సిటీ, కృషి విజ్ఞానకేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమీకృత వ్యవసాయ పద్ధతులు సమర్థవంతమైన విధానమని కేవీకే సైంటిస్టు ఏ.దేవీవరప్రసాదరెడ్డి అన్నారు. ఒకే రకమైన పంటపై ఆధారపడకుండా అనుబంధ కార్యకలాపాలను సమన్వయం చేసుకోవడం వల్ల లాభాలుంటాయన్నారు. ఈ వ్యవసాయంలో భాగంగా చేపల పెంపకం, పశుపోషణ, కోళ్ల పెంపకం వంటి వాటిని అనుసంధానం చేసుకోవాలన్నారు. రైతులు బహుళ ఆదాయాలు పొందడానికి ఇది ఒక మార్గమన్నారు. చేపల చెరువుల్లోని నీటిని పంటలకు ఉపయోగించడం, పశువుల నుంచి లభించే పేడను సేంద్రియ ఎరువుగా వాడటం, కోళ్ల పెంపకం ద్వారా గుడ్లు, మాంసం నుంచి అధిక ఆదాయం పొందవచ్చన్నారు. మత్స్య విభాగంలో చేపల పట్టుబడి, వలల వినియోగంపై అవగాహన కల్పించారు. దీంతో పాటు ఎరువుల వినియోగంపై విశదీకరించారు. -
24న జిల్లా రచయితల సంఘం వార్షికోత్సవం
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘం 6వ వార్షికోత్సవం ఈ నెల 24వ తేదీన స్థానిక వైఎంహెచ్ఏ హాలులో నిర్వహించనున్నట్టు ఆ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు లంకా వెంకటేశ్వర్లు, నాగారస్త్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార స్వీకర్త బేతవోలు రామబ్రహ్మం ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సాహిత్య సభ జరుగుతుందని, అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన పలువురు ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. నూజివీడు: మండలంలోని అన్నవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన జే సాయికుమార్, ఉదయ్ విస్సన్నపేట నుంచి విజయవాడకు బైక్పై వెళ్తుండగా అన్నవరం వద్దకు వచ్చేసరికి నూజివీడు నుంచి ఖమ్మం వెళ్తున్న వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయికుమార్ (26) అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలైన ఉదయ్ను చికిత్స నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే రూరల్ ఎస్సై జ్యోతీబసు సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): పిల్లలు లేని దంపతులు దేశవ్యాప్తంగా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (సీఎఆర్ఏ) పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. జిల్లా శిశు గృహ కేంద్రంలోని ప్రత్యేక దత్తత విభాగంలో ఆశ్రయం పొందుతున్న 7 నెలల వయస్సు గల ఆడ శిశువును ఈ ఏడాది మార్చి 17న కర్ణాటక రాష్ట్రానికి చెందిన దంపతులు చట్టబద్ధంగా దత్తత స్వీకరించారు. వారికి నిబంధనల ప్రకారం సోమవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు తుది ఉత్తర్వులు అందజేశారు. బుట్టాయగూడెం: నూరు శాతం సబ్సిడీపై రైతులకు ఆయిల్పామ్ మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు ఉద్యానవన శాఖ అధికారిణి ఎన్. ప్రసన్నలక్ష్మి తెలిపారు. సోమవారం బుట్టాయగూడెం వ్యవసాయాధికారి కార్యాలయంలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ గత ఏడాది 594 మంది రైతులకు 680 హెక్టారుల్లో 85 వేల మొక్కలను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది కూడా అంతే స్థాయిలో మొక్కలను పంపిణీ చేస్తున్నామని, సబ్సిడీపై ఎరువులు కూడా అందిస్తున్నామని తెలిపారు. మొక్కలు కావాల్సిన రైతులు బ్యాంక్ పుస్తకం, ఆధార్కార్డు వివరాలతో రైతు సేవా కేంద్రాల్లో తమ పేర్లలను నమోదు చేసుకోవాలన్నారు. అదేవిధంగా జీలుగుమిల్లి మండలంలో కూడా 700 హెక్టారుల్లో 610 మంది రైతులకు సుమారు 87,500 మొక్కలను పంపిణి చేస్తున్నట్లు చెప్పారు. జంగారెడ్డిగూడెం: దేవులపల్లి – లక్కవరం రహదారిలో ఓ వృక్షం అగ్నికి ఆహుతైంది. గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ కాల్చి నిర్లక్ష్యంగా రోడ్డు పక్కన పడేయడంతో, ఎండు ఆకులు అంటుకుని వృక్షం అగ్నికి ఆహుతైంది. వాహనదారులు గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేసినట్లు అగ్నిమాపక అధికారులు చెప్పారు. -
మృత్యు శకటాలుగా మట్టి ట్రాక్టర్లు
తణుకు అర్బన్: మట్టి ట్రాక్టర్లు మితిమీరిన వేగంతో పయనిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ట్రాక్టర్ డ్రైవర్లు నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనాలను నడపడంతో నిత్యం పలుచోట్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వేసవి వస్తుందంటే చాలు మట్టి మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతుంది. వ్యవసాయ భూముల్లో మట్టి తోలకం కోసం పోటాపోటీగా నడస్తున్న ట్రాక్టర్లతో ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఈ వేసవి మొదలైన రోజు నుంచి మట్టి తోలకాలు జోరుగా సాగుతున్న నేపధ్యంలో మట్టి ట్రాక్టర్ల వేగానికి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఒకరికంటే మరొకరు అధికంగా ట్రిప్పులు వేయాలనే ఉద్దేశంతో వేగంగా నడుపుతున్న తీరు ప్రయాణికుల ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఇందుకు నిదర్శనమే తణుకు మండలం వేల్పూరు గ్రామ పరిధిలోని బైపాస్ రోడ్డులో ఒక అమాయక ప్రాణం బలిగొంది. ఈనెల 17వ తేదీన బైపాస్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పాలకోడేరు మండలం అన్నాకోడేరు గ్రామానికి చెందిన పులగం బాలాజీ, భవాని దంపతులను ట్రాక్టరు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో భవాని అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. వాహనాన్ని ఢీకొట్టిన వెంటనే ట్రాక్టరు సైతం సమీపంలోని పొలాల్లోకి దూసుకువెళ్లిన తీరు వాహన వేగాన్ని తెలుపుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ట్రాక్టరు డ్రైవరు కూడా మైనరుగా ఉన్నాడని, విపరీతమైన సౌండ్తో పాటలు పెట్టుకుని వేగంగా వచ్చాడని ప్రయాణికులు చెబుతున్నారు. నిర్లక్ష్యం, వేగం, నిబంధనలు పాటించని వైనానికి ఒక నిండు ప్రాణం బలైంది. గతంలోనూ ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృత్యుశకటాలుగా.. తణుకు నియోజకవర్గంలోని తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల్లోని గ్రామాల్లో వ్యవసాయ భూముల నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా మట్టిని తవ్వడం ఒకటైతే, మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు ప్రయాణిస్తున్న వేగం ప్రయాణికులను భయపెడుతోంది. ముఖ్యంగా ట్రాక్టరు డ్రైవర్లు అధికశాతం మైనర్లే ఉంటున్నారని, ట్రాక్టరుకు నిబంధనలకు విరుద్ధంగా భారీ సౌండ్ బాక్స్లు ఏర్పాటుచేసుకుని విపరీతమైన సౌండ్స్తో ప్రయాణిస్తున్నారని ఆయా గ్రామాల్లోని నివాసితులు చెబుతున్నారు. గ్రామాల్లోని రోడ్లపై వేగంగా వెళ్తున్న తీరు చూస్తుంటే పిల్లలను రోడ్డుపైకి వదలాలంటేనే భయమేస్తుందని పలువురు చెబుతున్నారు. నిబంధనలు పాటించకుండా నడుస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కొన్ని ట్రాక్టర్లకు నంబరు ప్లేట్లు కూడా ఉండడంలేదని, కొన్నింటికి ఉన్నప్పటకీ విపరీతమైన అలంకరణతో ఆ నంబరు ప్లేట్లు కనిపించని పరిస్థితిలో ఉంటున్నాయి. అయితే అధికారులు ఈ తరహా వాహనాలను నిలువరించినా రాజకీయ ఒత్తిడిలు, సిఫార్సులతో చర్యలు తీసుకోలేకపోతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. మితిమీరిన వేగంతో పయనం పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న వైనం ఇటీవల మట్టి ట్రాక్టరు ఢీకొని మహిళ మృతి నిబంధనలు పాటించని ట్రాక్టర్ల డ్రైవర్లు పట్టించుకోని అధికారులు -
కూటమికి తొత్తులా మున్సిపల్ కమిషనర్
ఏలూరు (టూటౌన్): ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఎ.భానుప్రతాప్ కూటమి ప్రభుత్వానికి తొత్తులా పనిచేస్తున్నారని, తమ సమస్యలపై ఎన్నిసార్లు కలిసినా కనీస మర్యాద కూడా ఇవ్వకుండా స్పందించడం లేదని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) విమర్శించారు. కూటమి నాయకుల కనుసన్నల్లో కావాలనే తమను ఇబ్బంది పెడుతున్నారంటూ సాక్షాత్తు కలెక్టర్ వెట్రిసెల్వి ఎదుటే నిలదీశారు. ఈ సందర్భంగా కమిషనర్ భానుప్రతాప్ వైఎస్సార్సీపీ నాయకులతో వాగ్వాదానికి దిగడంతో కలెక్టర్ ఆయన్ను పక్కకు పంపించి వేశారు. అనంతరం కలెక్టరేట్ బయట జయప్రకాష్ విలేకరులతో మాట్లాడుతూ స్థానిక ఫైర్స్టేషన్ సెంటర్లో దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహం చుట్టూ గ్రానైట్ మరమ్మతులు చేయించే విషయంలో ఇప్పటికే పీజీఆర్ఎస్లో పలుమార్లు వినతిపత్రం అందించామన్నారు. దీనిపై కమిషనర్కు కలెక్టర్ లేఖ పంపగా తాము కమిషనర్ను ఆయన చాంబర్లో కలిశామన్నారు. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకులన్న మర్యాద లేకుండా కనీస గౌరవం ఇవ్వకుండా కమిషనర్ మాట్లాడారని మండిపడ్డారు. ఈ విషయంలో కమిటీ వేస్తామని చెప్పి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సిగ్గు చేటన్నారు. గతంలో మున్సిపల్ నిధులతో వైఎస్సా ర్ విగ్రహాన్ని నిర్మించారని గుర్తుచేశారు. 2023లో ఇడా ఆధ్వర్యంలో బ్యూటిఫికేషన్ పేరుతో విగ్రహం చుట్టూ గ్రానైట్ను తొలగించారని.. పనులు మొదలు పెట్టేలోపు ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయన్నారు. -
నా బిడ్డ మరణించింది ఆకివీడు పోలీసుల వల్లే
ఏలూరు (టూటౌన్): ఆకివీడు పోలీసుల చర్యల వల్లే తన కుమారుడు వీధి నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని, తనకు న్యాయం చేయాలంటూ మృతుని తల్లి వీధి బుజ్జి సోమవారం డీఐజీ అశోక్కుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఫిర్యాదు వివరాలను ఏలూరు కలెక్టరేట్ వద్ద మీడియాకు విడుదల చేశారు. బాధితురాలి కథనం మేరకు ఈనెల 10వ తేదీన ఆకివీడు పోలీస్ స్టేషన్లో సీఐ ఖాళీచరణ్ తమ కుమారుడు వీధి నవీన్ కుమార్ బట్టలు విప్పి కొట్టాడని, దీంతో నొప్పులు భరించలేక 11వ తేదీన అతడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, తమకు న్యాయం చేయాలని నవీన్ తల్లి బుజ్జి కోరారు. తాను గల్ఫ్లో ఉపాధి నిమిత్తం పనికి వెళ్లానని చెప్పారు. తమ కుమారుడిపై కోడలు, అత్త పెట్టిన అక్రమ కేసు నిమిత్తం స్టేషన్కు పిలిచి బట్టలు ఊడదీసి కొట్టడం కారణంగా తన బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని వాపోయారు. ఈ విషయంపై భీమవరం డీఎస్పీ, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు ఆటంకాలు కలిగించి అడ్డగించారని చెప్పారు. విధి లేని పరిస్థితుల్లో డీఐజీని కలవడానికి ఏలూరు వచ్చినట్లు తెలిపారు. ఆర్పీఐ పార్టీ మత్తే బాబీ, కుటుంబ సభ్యులతో కలిసి ఆమె డీఐజీని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం డీఐజీ అశోక్ కుమార్ వెంటనే పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి విచారణకు ఆదేశించారు. డీఐజీకి ఫిర్యాదు చేసిన మృతుడి తల్లి -
రెచ్చిపోతున్న మట్టి మాఫియా
జంగారెడ్డిగూడెం: ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రేయింబవళ్లు యథేచ్ఛగా మట్టిని తవ్వి తరలించేస్తున్నారు. ఎర్రకాలువ జలాశయం, చెరువులు, కాలువ గట్లు కాదేదీ మట్టి దోపిడీకి అన్నట్టు చెలరేగిపోతున్నారు. వాస్తవానికి రైతులు తమ పొలాలను ఎత్తు చేసుకునేందుకు చె రువులు, జలాశయాల నుంచి మట్టిని తవ్వుకోవ చ్చు. దీనిని అడ్డం పెట్టుకుని అక్రమార్కులు మట్టిని అక్రమంగా తవ్వుతూ ఇటుక బట్టీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. అధికారులపై దాడులకు తెగబడుతూ.. జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం, టి.నరసాపురం మండలాల్లో మట్టి దోపిడీ ఎక్కువగా ఉంది. తాజాగా ఎటువంటి అనుమతులు లేకుండా జంగారెడ్డిగూడెం మండలంలోని ఎ.పోలవరంలో చిన్న, పెద్ద చెరువు మట్టిని తరలిస్తుండగా ఇరిగేషన్ అధికారులు అడ్డుకోగా మట్టి మా ఫియా వారిపై దాడులకు పాల్పడింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి జేసీబీ, మట్టి ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. అలాగే మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తవ్వేయ్.. దోచేయ్.. ● వేగవరం, తాడువాయి గ్రామాల పరిధిలో ఎర్రకాలువ జలాశయంలో మట్టిని ఇటుక బట్టీలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. ఒక్కో లారీ మట్టిని రూ.5 వేలకు విక్రయిస్తున్నారు. ● కొయ్యలగూడెం మండలంలో చెరువుల్లో మట్టిని తరలించేస్తున్నారు. చెరువుల్లో భారీ గోతులు పెట్టడంతో రైతులు, పశువుల కాపర్లు, పశువులు ప్రమాదాలకు గురవుతారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయా గ్రామాల పరిధిలో రోడ్లు పాడవుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నా మాఫియా ఖాతరు చేయడం లేదు. ఇక్కడ పరిమిత క్యూబిక్ మీటర్లకు అనుమతులు తీసుకుని వేలాది క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వేస్తున్నారు. ● టి.నరసాపురం మండలం కేతవరం రెవెన్యూ పరిధిలో గ్రావెల్ను తవ్వి తరలించేస్తున్నారు. ● బుట్టాయగూడెం, కొయ్యలగూడెం సరిహద్దులో ఉన్న చెరువులో మట్టిని తరలించేస్తున్నారు. కొయ్యలగూడెం మండలంలో మట్టి తవ్వకాలు కేతవరంలో మట్టిని రవాణా చేస్తున్న ట్రాక్టర్ ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో దందా -
ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్డ్
భీమవరం: స్థానిక ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం జేఈఈ అడ్వాన్స్ పరీక్ష లు ప్రశాంతంగా జరిగాయి. 150 మంది వి ద్యార్థులకు 149 మంది హాజరయ్యారని సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ పీఆర్ఎస్ వెంకటపతిరాజు తెలిపారు. అలాగే విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో 120 మందికి 117 మంది, డీఎన్నార్ కళాశాలలో 160 మందికి 159 మంది హాజరయ్యారు. తాడేపల్లిగూడెంలో.. తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం శ్రీవాసవి ఇంజనీరింగ్ కళాశాలలో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు 208 మందికి 208 మంది హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్, చీఫ్ సూపరింటెండెంట్ రాంబాబు, కేంద్రం కో–ఆర్డినేటర్ నటరాజ్ తదితరులు పర్యవేక్షించారు. అలాగే శశి ఇంజనీరింగ్ కళాశాలలో 150 మందికి 148 మంది, ఏపీ నిట్లో 200 మందికి 197 మంది హాజరయ్యారు. తణుకు అర్బన్: జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు 24 మంది క్రీడాకారులు ఎంపికై నట్టు ఏపీ ఫెన్సింగ్ ఆఫ్ అసోసియేషన్ కార్యదర్శి జీఎస్ వీ కృష్ణమోహన్ తెలిపారు. ఏపీ స్టేట్ క్యాడెట్ బాయ్స్ అండ్ గరల్స్ (అండర్ 17) ఫెన్సింగ్ చాంపియన్షిప్ 2026–27, 21వ నేషనల్ క్యాడెట్ ఫెన్సింగ్ ఏపీ స్టేట్ టీమ్ సెలెక్షన్స్ స్థానిక ఆకుల శ్రీరాముల ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. రాష్ట్రంలోని పలుజిల్లాల నుంచి 120 మంది క్రీడాకారులు హా జరయ్యారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 23న ఉత్తరాఖండ్లో జరిగే జాతీయ క్యాడెట్ ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కళాశాల అధినేత ఆకుల విష్ణువర్థన్, ఏపీ ప్రైవేట్ ఐటీఐ మేనేజ్మెంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బసవ రామకృష్ణ పోటీలను ప్రారంభించారు. భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. అలాగే డి విజన్, మండల కేంద్రాల్లోనూ ఈ కార్య క్రమం నిర్వహిస్తామని, ప్రజలు అర్జీలు సమర్పించవచ్చన్నారు. అలాగే అర్జీలను అధికారిక వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని, 1100 కాల్ సెంటర్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
ఆర్టీసీ ప్రైవేటీకరణ యత్నం తగదు
తాడేపల్లిగూడెం (టీఓసీ): ప్రజా రవాణాలో ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ప్రైవేటీకరణ ప్రయత్నాలు చేయడం తగదని, ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీనే కొనుగోలు చేయాలని ప్రజారవాణా శాఖ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఆలీ డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీ గ్యారేజీ గేటు వద్ద ఆదివారం రెండో రోజు జరిగిన ధర్నాలో ఆలీ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీనే కొనుగోలు చేయాలని, మూసివేసిన ఆర్టీసీ డిపోలను తిరిగి తెరవాలన్నారు. ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేయాలని, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లించాలన్నారు. ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ వారికి అప్పగించే విధానం వీడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, తాత్కాలిక భృతి ప్రకటించాలని, డీఏ బకాయిలు చెల్లించాలని డి మాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన 39 సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిపో అధ్యక్షుడు టి.బుజ్జిబాబు, రాష్ట్ర నాయకులు శివ, కోశాధికారి నరసింహ, వీరన్న, బాషా తదితరులు పాల్గొన్నారు. -
నిర్వాసితులపై నిర్లక్ష్యం
బుట్టాయగూడెం: పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేశారు.. తరాలుగా పెనవేసుకున్న బంధాన్ని వీడి కట్టుబట్టలతో తమ ప్రాంతం విడిచి నిర్వాసిత కాలనీల్లో అడుగుపెట్టారు ఈ గిరి జనులు. ఇక్కడ ఉపాధి హామీ పనులు లేక, వసతులు కరువై సమస్యలతో సహవాసం చేస్తున్నారు. గ్రామాలు విడిచి ఏడేళ్లు గడుస్తున్నా తమను పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన చెందుతున్నారు. పనుల్లేక.. జీవనం సాగక.. బుట్టాయగూడెం మండలం ముప్పినవారిగూడెం సమీపంలో వేలేరుపాడు మండలంలోని చిగురు మామిడి, బోళ్లపల్లి, శ్రీరాంపురం, కొర్రాజుగూడెం, వసంతవాడ గ్రామాల నిర్వాసితుల కోసం కోసం పునరావాస కాలనీ (చిగురుమామిడి కాలనీ) నిర్మించారు. చిగురుమామిడి గ్రామానికి చెందిన 80 కుటుంబాలు, శ్రీరాంపురానికి చెందిన 10 కు టుంబాలు ఏడేళ్ల క్రితం ఇక్కడికి వచ్చారు. వీరిలో 40 మందికి మాత్రమే ఉపాధి హామీ పనులు కల్పిస్తుండగా మిగిలిన వారు జాబ్కార్డులు బదిలీ కా కపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. పనుల్లేక అవస్థలు పడుతున్నారు. వీరంతా పనులు కల్పించాలని కోరుతున్నారు. కాలనీకి రెండు గ్రామాల నిర్వాసితులు రాగా.. మూడు గ్రామాల నిర్వాసితులు రా వాల్సి ఉంది. వీరంతా ఆర్అండ్ఆర్ పరిహారం అందిన తర్వాత వస్తారని తెలిసింది. రాత్రిళ్లు భయం.. భయం నిర్వాసిత కాలనీలో సోలర్తో పాటు విద్యుత్ లైట్లను ఏర్పాటుచేశారు. ఇవి చాలాకాలంగా వెలగక పోవడంతో రాత్రిళ్లు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. కాలనీలోని ఏ వీధిలోనూ దీపాలు వెలగడం లేదని చెబుతున్నారు. అయితే రాత్రిళ్లు పాముల బెడద ఎ క్కువ ఉందని, తాము వేలేరుపాడు మండలం పరిధిలోనే ఉన్నట్టు అధికారులు చెప్పడంతో ఏం చే యాలో అర్థం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఖాళీ ఇళ్లు.. సమస్యల లోగిళ్లు ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఇళ్లలో పిచ్చిమొక్కలు భా రీగా పెరిగిపోయాయి. అస్తవ్యస్తంగా ఉన్న కాలనీని చూసి నిర్వాసితులు ఆందోళ చెందుతున్నారు. ఉ పాధి హామీ పథకంలో అయినా పేరుకుపోయిన పిచ్చిమొక్కలును తొలగించాలని కోరుతున్నారు. వర్షాకాలంలో వరద నీరు ముంచెత్తుతోందని, నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే కాలనీలో 60 వేల లీటర్ల వాటర్ ట్యాంకు నిర్మించినా విద్యుత్ కోతల సమస్యతో నీటి సమస్య నెలకొందని అంటున్నారు. కాలనీలో చేతి పంపులు ఏర్పాటుచేయాలని నిర్వాసితులు కోరుతున్నారు. పునరావాసం.. సమస్యలతో సహవాసం చిగురుమామిడి కాలనీలో సమస్యల తిష్ట వెలగని వీధిలైట్లు, పాముల బెడద తాగునీటికి ఇక్కట్లు కొందరికే ‘ఉపాధి’ పనులు ఏడేళ్లు గడుస్తున్నా అందని జాబ్కార్డులు కన్నెత్తి చూడని ప్రజాప్రతినిధులు -
సబ్సిడీ రాదు.. ఆక్వా సాగదు
భీమవరం: ఆక్వా రంగాన్ని ఆదుకుంటాం.. జోన్స్ తో ప్రమేయం లేకుండా రొయ్యలు సాగుచేస్తున్న రైతులందరికీ సబ్సిడ్ విద్యుత్ అందిస్తాం.. అంటూ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు ఆక్వా రైతులను కన్నెత్తి చూడటం లేదు. ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినా పట్టించుకోవడం లేదు. సబ్సిడీ విద్యుత్ అందక సాగు భారమై రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో దాదాపు 1.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా సుమారు 90 వేల ఎకరాల్లో రొయ్యల సాగు ఉంది. నరసాపురం, భీమవరం, ఉండి, పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రొయ్యలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. అలాగే ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల పరిధిలోనూ వేలాది ఎకరాల్లో రొయ్యలను పండిస్తున్నారు. గత ప్రభుత్వంలోనే విద్యుత్ సబ్సిడీ జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 90 వేల ఎకరాలకు పైగా రొయ్యల సాగు ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆక్వా చెరువులను విద్యుత్ యూనిట్ రూ.1.50కే అందించారు. 2024 ఎన్నికల సమయంలో జోన్స్తో ప్రమేయం లేకుండా ఆక్వా రైతులందరికీ సబ్సిడీ విద్యుత్ అందిస్తామని కూటమి పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నష్టాల ఊబిలో ఉన్న తమకు సబ్సిడీ విద్యుత్ ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు ఆశించారు. అయితే చంద్రబాబు ప్రభు త్వం అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా రొ య్యల రైతులందరికీ సబ్సిడీ విద్యుత్ అందకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక పక్క విద్యుత్ కోతలు, గత నెలలో డీజిల్ కొరత వంటి సంక్షోభాలు రైతులను అతలాకుతలం చేశాయి. జిల్లాలో 16,332 ఆక్వా విద్యుత్ కనెక్షన్లు ఉండగా 14,242 కనెక్షన్లకు ప్రతినెలా సుమారు రూ.23 కోట్లు సబ్బిడీ కింద ఇస్తుండగా.. దాదాపు 2 వేల కనెక్షన్లకు సంబంధించి రాయితీ విద్యుత్ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. వీటిలో భీమవరం విద్యుత్ డివిజన్లో 1,235, నరసాపురం డివిజన్లో 585, తాడేపల్లిగూడెం డివిజన్లో 270 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. దీనిపై ఆక్వారైతు సంఘాలు ప లుమార్లు ప్రభుత్వం, విద్యుత్ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినా అదిగో, ఇదిగో ఇస్తున్నామంటూ కా లం వెళ్లదీస్తున్నారు. సబ్బిడీ విద్యుత్ లభించని కొందరు రైతుల వద్ద విద్యుత్ శాఖ సిబ్బంది తక్కువ మీటర్ రీడింగ్లు తీయించి వారి వద్ద పెద్ద మొత్తంలో మామూళ్లు గుంజుతున్నట్టు తెలిసింది. ఇలా ఓ మండలంలోని విద్యుత్ లైన్మెన్ తప్పుడు విద్యుత్ రీడింగ్లతో పెద్ద మొత్తంలో కూడబెట్టగా అదికాస్తా బయట పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అతడిని భయపెట్టి కొందరు మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు సుమారు రూ.8 లక్షలు గుంజడంతో ఓ ప్రజాప్రతినిధి జోక్యం చే సుకుని తిరిగి ఇప్పించినట్టు ప్రచారం జరుగుతోంది. తప్పుడు రీడింగ్లతో ప్రభుత్వానికి న ష్టం చేకూర్చిన లైన్మెన్పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజాప్రతినిధి కొమ్ముకాయడంపై తీవ్ర చర్చ జరుతోంది. ప్రభుత్వం సబ్సిడీ వి ద్యుత్ ఇవ్వకపోవడం వల్ల రైతులు నష్టపోతుండగా కొందరు విద్యుత్ శాఖ సిబ్బంది పెద్ద మొ త్తంలో కూడబెట్టుకుంటున్నారని ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు సబ్సిడీ విద్యుత్ను ఆక్వా జోన్స్తో ప్రమేయం లేకుండా రైతులందరికీ ఇవ్వాలని కోరుతున్నారు. విద్యుత్ రాయితీ.. అందేది అంతంతే ! జోన్స్తో ప్రమేయం లేకుండా సబ్సిడీ ఇస్తామని కూటమి నాయకుల హామీ జిల్లాలో 90 వేల ఎకరాల్లో రొయ్యల సాగు సబ్సిడీ వర్తించని కనెక్షన్లు 2,090 పట్టించుకోని ప్రజాప్రతినిధులు -
పద్మావతీ.. మాకేంటీ దుస్థితి
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న దే వస్థానంలో పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (తిరుపతి) (పారిశుద్ధ్య కాంట్రాక్ట్ సంస్థ) మేనేజర్పై మహిళా కార్మికులు చేస్తున్న ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు పరుష పదజాలాన్ని వాడుతున్నాడని వారు అంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తున్న వారిని ఏదో ఒక వంకతో పనిలోంచి తీసేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు మహిళా కార్మికులు ఆది వారం ఆలయ సూపరింటెండెంట్ ఐవీ రామారావుకు ఫిర్యాదు చేశారు. సదరు మేనేజర్పై ఈ ఆరోపణలు, ఫిర్యాదులు కొత్తేమీ కాదు. గతేడాది అక్టోబర్ 1న ఈ సంస్థ శ్రీవారి దేవస్థానంలో పారిశుద్ధ్య కాంట్రాక్ట్ పనులు చేపట్టినప్పటి నుంచి ఈ ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. కొందరు మహి ళా కార్మికులతో అసభ్యకరంగా చేసిన వాట్సాప్ చా టింగ్లు, ఫోన్లలో మాట్లాడిన వాయిస్ రికార్డింగ్లు గతంలోనే బయటపడ్డాయి. అయితే కాంట్రాక్టర్ సాక్షాత్తూ సీఎం చంద్రబాబు బంధువు కావడంతో అధికారులు మేనేజర్పై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారని పలువురు అంటున్నారు. అలాగే నాసిరకం మెటీరియల్ వినియోగంపై నోరు విప్పితే.. టార్గెట్ చేసి, పనిలోంచి తీసేస్తున్నారని కొందరు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పారిశుద్ధ్య పనులకు సంబంధించి మెషీనరీకి మాత్రమే దేవస్థానం నెలకు సుమారు రూ.3.50 లక్షలు కాంట్రాక్టర్కు చెల్లిస్తోంది. ఇలా రెండేళ్లకు దాదాపు రూ.84 లక్షలు చెల్లించనుంది. అయితే ఇంత విలువైన మెషినరీ ఈ దేవస్థానానికి వచ్చిందా.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మొత్తంగా పారిశుద్ధ్య పనులకు నెలకు రూ.18.28 లక్షలు చెల్లిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నెలకు సుమారు రూ.54 లక్షల వరకు చెల్లిస్తోంది. ఎప్పుడూ ఇంత ఇబ్బంది పడలేదు తాము పదేళ్ల నుంచి పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నామని, ఇప్పటివరకు ఏ మేనేజర్ వల్ల ఇంత ఇ బ్బంది పడలేదని సూపరింటెండెంట్కు కార్మికులు తెలిపారు. దేవస్థానంపై ఆధారపడి బతుకుతున్న తమను అధికారులు ఆదుకోవాలని, అలాగే సదరు మేనేజర్పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇప్పటివరకూ జీతాల్లేవ్ పద్మావతి కాంట్రాక్ట్ సంస్థ కింద దేవస్థానంలో 180 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చినప్పటి నుంచి కార్మికులకు జీతాలు ఆలస్యంగానే అందుతున్నాయి. ఈనెల 5లోపు అందాల్సిన జీతాలు, నెలలో సగం రోజులు గడిచినా.. ఇప్పటివరకు అందలేదు. పారిశుద్ధ్య కాంట్రాక్ట్ సంస్థపై కార్మికుల మండిపాటు శానిటేషన్ మేనేజర్ ఆగడాలపై ఫిర్యాదు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ మహిళా కార్మికుల ఆరోపణలు నెలలో సగం రోజులు గడిచినా అందని జీతాలు కాంట్రాక్టర్ సీఎం చంద్రబాబు బంధువు కావడంతో చర్యలు శూన్యం -
ఫీడ్ ధరలు తగ్గించకపోతే ఊరుకోం
వీరవాసరం: ఆక్వా ఫీడ్ ధరలను తగ్గించకపోతే ఆందోళనలు పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంత రొయ్యల రైతుల సంక్షేమ సంఘం తీర్మానం చేసింది. ఆదివారం వీరవాసరం తులసి ఫంక్షన్ హాల్లో ఐదు నియోజకవర్గాల రొయ్యల రైతుల సంక్షేమ సంఘ గ్రామస్థా యి, జిల్లాస్థాయి కమిటీల నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రొయ్య రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లినా అండగా ఉండటామని, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో జరుగుతున్న ఫీడ్ కంపెనీలు, రొ య్యల రైతుల నాయకులు, ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న ప్రత్యేక సమీక్ష సమావేశాలు సానుకూలంగానే ఉండటం ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఆక్వా ఫీడ్ యజమానులు చేస్తున్న ప్రభుత్వ లాబీయింగ్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలొగ్గుతాయేమో అన్న అనుమానాన్ని రైతులు వ్యక్తం చేశా రు. భీమవరం ప్రాంత జిల్లా అధ్యక్షుడు మల్ల తులసీరామ్, కార్యదర్శి గాదిరాజు సుబ్బరాజు, బాపిరాజు, వీరవల్లి చంద్రశేఖర్, ఎం.వెంకట్రావు, పెద్దెత్తున రొయ్య రైతులు పాల్గొన్నారు. -
ఉద్యాన విద్యకు క్రేజ్
● ఆకర్షిస్తున్న కోర్సులు ● ఉపాధికి, ఉద్యోగానికి ఢోకా లేదు ● విదేశీ విద్యార్థుల ఆసక్తి ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన విద్యార్థులు ఈ కోర్సులో చేరవచ్చు. 31–12–2026 నాటికి వయస్సు 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 25 ఏళ్లు, దివ్యాంగులకు 27 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. వర్సిటీ పరిధిలో నాలుగు ప్రభుత్వ ఉద్యాన కళాశాలలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెం కళాశాలలో 100 సీట్లు, అన్నమయ్య జిల్లా అనంతరాజుపేట కళాశాలలో 100 సీట్లు, వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో 60 సీట్లు, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం, నెల్లూరు జిల్లా చినలాటరిపి కళాశాలల్లో 50 సీట్ల చొప్పున ఉన్నాయి. వర్సిటీ అనుబంధ కళాశాలలైన అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్, ప్రకాశం జిల్లా మార్కాపురం, చంద్రశేఖరపురంలోని కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 60 సీట్ల చొప్పున మొత్తం 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్లను ఏపీ ఈఏపీసెట్ మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. హార్టికల్చర్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు 15 శాతం కోటా ఉంటుంది. దీని ద్వారా హార్టీసెట్ మెరిట్ ఆధారంగా యూనివర్సిటీ కళాశాలల్లో 54 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 27 సీట్లు భర్తీ చేస్తారు. ఐసీఏఆర్ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికై న వారికి 20 శాతం సీట్లు, స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ ద్వారా విదేశీ విద్యార్థులకు 70 సీట్లు కేటాయిస్తారు. ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ కోటాలో 47 సీట్లు, ఇండస్ట్రీ కోటాలో ఆరు సీట్లు ఉన్నాయి. రైతు కోటా కింద కనీసం ఒక ఎకరం పొలం కలిగిన వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు నిబంధనల మేరకు సీట్లు కేటాయిస్తారు. తాడేపల్లిగూడెం : పచ్చని ప్రకృతి ఒడిలో చదువుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు? అచ్చంగా ఇలాంటి వాతావరణంలోనే తాడేపల్లిగూడెం పరిధిలోని వెంకట్రామన్నగూడెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులకు చక్కని అవకాశాలను కల్పిస్తోంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఉద్యాన విద్యకు క్రేజ్ బాగా పెరిగింది. ఈ విద్యను అభ్యసిస్తే కొలువులకు కొదువ లేదు, ఉపాధికి బోలెడు అవకాశాలున్నాయి. డిమాండ్కు తగ్గట్టుగా మారుతున్న కోర్సులు విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ మానస పుత్రికగా 2007లో దేశంలోనే రెండో విశ్వవిద్యాలయంగా ఇది ఊపిరి పోసుకుంది. ఐసీఏఆర్ పరిధిలో ఏ–గ్రేడ్ సాధించిన ఈ వర్సిటీ, 2026–27 విద్యాసంవత్సరానికి గాను పాలిటెక్నిక్, డిగ్రీ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సు ఉద్యోగం, ఉపాధి, ఉన్నత విద్యకు చక్కని అవకాశం కల్పించే ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు అర్హులు. 31–08–2026 నాటికి 15 నుంచి 22 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఈ కోర్సు కాలపరిమితి రెండేళ్లు కాగా, బోధన పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. వర్సిటీ పరిధిలోని నాలుగు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 200 సీట్లు, మూడు ప్రైవేటు కళాశాలల్లో 120 సీట్లు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర కళాశాలల్లో 60 సీట్ల చొప్పున ఉన్నాయి. ఏలూరు జిల్లా నూజివీడు, అన్నమయ్య జిల్లా కలికిరి, ప్రకాశం జిల్లా పొదిలి, పల్నాడు జిల్లా మద్దిరాల, నంద్యాల జిల్లా కోయిలకుంట్ల కళాశాలల్లో 40 సీట్ల చొప్పున కేటాయించారు. ఈ ఏడాది పాలిటెక్నిక్లో ల్యాండ్ స్కేపింగ్, నర్సరీ మేనేజ్మెంట్ కోర్సును రామచంద్రపురం, మడకశిర కళాశాలల్లో ప్రవేశపెట్టారు. ఈ ప్రత్యేక కోర్సు కోసం మొత్తం 50 సీట్లు కేటాయించారు. మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఎరువులు, పురుగు మందుల కంపెనీలు, వివిధ ఉద్యాన పరిశ్రమల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నాణ్యమైన విద్యాబోధన – వసతులు అనుభవజ్ఞులైన అధ్యాపకులు, శాస్త్రవేత్తలతో డిజిటల్ తరగతులు, అత్యాధునిక ప్రయోగశాలల ద్వారా ఇక్కడ నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఐసీఏఆర్ ఆరవ డీన్స్ కమిటీ సిఫారసుల మేరకు ఇక్కడ పాఠ్యాంశాల బోధన జరుగుతుంది. చదువుతో పాటు ఆటలు, క్రీడలు, సెంట్రల్ లైబ్రరీ సౌకర్యాలు ఉన్నాయి. బాలురు, బాలికలకు వేర్వేరుగా సురక్షితమైన వసతి గృహాల (హాస్టల్) సదుపాయం కల్పించారు. విస్తృత ఉద్యోగావకాశాలు రాష్ట్ర సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల ద్వారా అభ్యర్థులు మండల హార్టికల్చర్ ఆఫీసర్, హెచ్ఈఓ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వంటి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చు. ఐసీఏఆర్, డీఆర్డీఓ, స్పైసెస్ బోర్డు, కాఫీ బోర్డు, రబ్బర్ బోర్డు, టీ బోర్డులలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయాలనుకునే హార్టీకల్చర్ గ్రాడ్యుయేట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ్ఖ్కఇ) పరీక్షలకు హాజరు కావచ్చు. ప్రైవేటు రంగంలో కొలువులతో పాటు, స్వయం ఉపాధి పొందేందుకు ఉద్యాన విద్య ఎంతగానో దోహదపడుతుంది. ఉద్యాన వర్సిటీ ముఖద్వారం ఉద్యాన విద్య అనేది యువత భవిష్యత్తుకు బాటలు వేసే అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగం. పండ్లు, కూరగాయలు, పూలు, ఔషధ, సుగంధ పంటల ఉత్పత్తి ద్వారా దేశ ఆహార భద్రతకు, పోషకాహార లభ్యతకు, రైతుల ఆదాయ వృద్ధికి ఉద్యానరంగం ఎంతో కీలకంగా మారింది. ప్రభుత్వం రాయలసీమను హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేస్తుండటంతో, ఉద్యాన విద్యార్థులకు ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి, అగ్రి బిజినెస్, స్టార్టప్లు, ఎగుమతి రంగాలలో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడుతూ సమాజానికి సేవ చేయాలనుకునే యువత ఉద్యాన విద్యను ఎంచుకోవాలి. – డాక్టర్ కె.ధనుంజయరావు, వీసీ, ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం -
ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. స్థానిక ఆర్టీసీ గ్యారేజీ గేటు ఎదుట ఎర్ర బ్యాడ్జీలు ధరించి ధర్నా చేశారు. డిపో కమిటీ నాయకుడు సీహెచ్ రమణ మాట్లాడుతూ పీఆర్సీ నియమించాలని, తాత్కాలిక భృతి ప్రకటించాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని కోరారు. ఎలక్ట్రిక్ బస్సులు నిర్వహణ ఆర్టీసీ యాజమాన్యం ద్వారానే జరగాలని, ఈ బస్సుల నెపంతో వివిధ డిపోలను ఖాళీ చేసే చర్యలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. సీ్త్రశక్తి అమలు సందర్భంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. హెల్త్ స్కీమ్ ద్వారా సరైన సేవలు అందించాలని కోరారు. 39 డిమాండ్లకు యాజమాన్యం స్పందించాలని నినదించారు. డిపో నాయకులు ఏవీ మనోహర్, ప్రచా ర కార్యదర్శి కె..శ్రీనివాస్, ప్రకాష్, ఎన్ఎస్ వాసు తదితరులు పాల్గొన్నారు. -
మహిళ మృతి
గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన తాడేపల్లిగూడెం మండలంలోని కుంచనపల్లి హైవేపై చోటుచేసుకుంది. 8లో uపాలకొల్లు సెంట్రల్: ఆక్వా రైతులకు సంకటంగా మారిన ఫీడ్ ధరల సమస్య పరిష్కారానికి చర్చలు కొలిక్కిరాలేదని మరోసారి సమావేశం ఏర్పాటు చేయనున్నారని జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్రాజు అన్నారు. శనివారం పూలపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫీడ్ కంపెనీలతో శుక్రవారం జరిపిన చర్చలకు మంత్రి అచ్చెన్నాయుడు రాకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఫీడ్ ధరలు పెంచాల్సిందేనని కంపెనీల ప్రతినిధులు అంటే.. కుదరదని రైతులు పట్టుబట్టారన్నారు. రైతులతో చర్చలు పూర్తయితేనే పెంచిన ఫీడ్ ధరలు అమలులోకి వస్తాయని చెప్పారు. ఎక్కడైనా ధరలు పెంచి విక్రయిస్తే ఆక్వా సంఘం సభ్యులకు సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు. అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులతో మూడుసార్లు చర్చలు జరగ్గా కొంత వరకూ సానుకూలత వ్యక్తం చేశారన్నారు. సమస్యలు పరిష్కారం కాకుంటే తుది కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పెన్మెత్స వెంకట సత్యనారాయణరాజు, సజ్జా బుజ్జి, భూపతిరాజు శ్రీనివాసరాజు, అంగర వరప్రసాద్, గుంటూరి చంటిరాజు, మేడిది జాన్రాజు తదితరులు పాల్గొన్నారు. -
మామిడి రైతు గుండెలధర
నూజివీడు: పండ్లలో రారాజుగా పిలుచుకునే మా మిడిని సాగుచేసే రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ ఏడాది దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో ధర ఎక్కువగా ఉంటుందని భావించిన రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. మామిడి కాయలకు గిట్టుబాటు ధర లభించక, పెట్టిన పెట్టుబడి రాక రైతులు నష్టాల పాలవుతున్నారు. నూజివీడు డివిజన్ వ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో ఉన్న మామిడి తోటలకు చెందిన రైతుల దుస్థితి దయనీయంగా తయారైంది. 25 వేల ఎకరాల్లో బంగినపల్లి రకం, 10 వేల ఎకరాల్లో కలెక్టర్ రకం, మిగిలిన 5 వేల ఎకరాల్లో చిన్నరసాలు, ఇతర రకాలు సాగవుతున్నాయి. డివిజన్లో ప్రధాన వాణిజ్య పంటగా విలసిల్లుతున్న మామిడి గత కొన్నేళ్లుగా నష్టాలను పంచుతోంది. రెండేళ్లుగా అయితే పరిస్థితులు దా రుణంగా తయారయ్యాయి. అయినా ప్రభుత్వం ఏమాత్రం రైతులను పట్టించుకోవడం లేదు. పూత దశలోనే కుదేలై.. ఈ ఏడాది బంగినపల్లి, కలెక్టర్ రకాల్లో పూత బాగా వచ్చినా పిందె కట్టే దశలో నల్లతామర తెగులు ఆ శించడం, ప్రతికూల వాతావరణం వల్ల ఆశించిన స్థాయిలో పిందె కట్టకుండా పూతంతా రాలిపోయింది. దీంతో దిగుబడి పూర్తిగా పడిపోయింది. రైతులు పూత, పిందె నిలుపుకోవడం కోసం 10 నుంచి 12 సార్లు వరకు రసాయన మందులు పిచికారీ చేసినా లాభం లేకుండా పోయింది. రోజురోజుకూ ధరల పతనం మామిడి సీజన్ ప్రారంభమైన ఫిబ్రవరి ద్వితీయార్థంలో మామిడికి ధరలు మెరుగ్గా ఉన్నా రానురాను పతనమవుతున్నాయి. బంగినపల్లి రకానికి ప్రారంభంలో ముంబై మార్కెట్లో టన్నుకి రూ.1.20 లక్షలు సైతం ధర లభించింది. అది క్రమేణా పడిపోయి చివరకు రూ.40 వేలకు చేరగా ప్రస్తుతం కాయలు బాగుంటే టన్ను రూ.25 వేలు మాత్రమే లభిస్తోంది. స్థానిక మార్కెట్ల్లో టన్నుకి రూ.12 వేల నుంచి రూ.18 వేలు మాత్రమే లభిస్తోంది. దీనికి మరలా టన్నుకు వంద కిలోల కాయలను సూట్ పేరుతో తీసేస్తున్నారు. పది టన్నులు తీసుకెళ్తే టన్ను కాయలు సూట్ పేరుతో దోచుకుంటున్నారు. దీనికి తోడు కమీషన్ పేరుతో కూడా రైతులను దోచుకోవడంతో మామిడి రైతులకు కోత ఖర్చులు, కిరాయిలు రాని పరిస్థితి. వేలాది మంది రైతులు ఆధారపడిన మామిడి నష్టాలను పంచుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. తామంటేనే ప్రభుత్వానికి అలుసుగా తయారైందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు 14 ఎకరాలు మామిడి తోట ఉండగా గతేడాది రూ.4 లక్షలు నష్టం వచ్చింది. దీంతో ఏడెకరాల్లో చెట్లు నరికించేసి అందులో ఆయిల్పామ్ వేశా. ఈ ఏడాది కూడా రూ.2 లక్షల నష్టం వచ్చింది. దీంతో మిగిలిన ఏడెకరాల్లోని మామిడి చెట్లు తొలగించి అందులో కూడా ఆయిల్పామ్ వేస్తా. మామిడిపై స్థిరమైన ఆదాయం రావడం లేదు. – లావు ధనకోటేశ్వరావు, కొత్తరావిచర్ల, నూజివీడు మండలం తోతాపురి కాయలు కొనేవాళ్లే కనిపించడం లేదు. టన్ను రూ.3,500 అంటే కోత కూ లి, కిరాయిలు కూడా రావు. కోత కోసే బదులు తోటల్లోనే వదిలేస్తే ఖర్చులు అయినా మిగులుతా యి. ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. ఆదాయం రాక చాలా మంది రైతులు తోటలు తీసేస్తున్నారు. – పెద్దగమళ్ల ఆదినారాయణ, నూజివీడుమామిడి.. ధర తడబడి మరింత దిగజారిన ధరలు బంగినపల్లి టన్ను రూ.12 వేల నుంచి రూ.18 వేలు కలెక్టర్ టన్ను రూ.3,500 లబోదిబోమంటున్న రైతులు -
సబ్జైలు తనిఖీ
నరసాపురం: తగాదాలకు, నేరాలకు పాల్పడే ముందు భవిష్యత్ పరిణామాలు ఆలోచించు కోవాలని నరసాపురం జూనియర్ సివిల్ జడ్జి ఎస్.రాజ్యలక్ష్మి సూచించారు. నరసాపురం సబ్జైలును శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీలకు అందుతున్న సదుపాయాలు, జైలు పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలను, ఖైదీలకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించా రు. నేరాలు చేసి జైలు పాలైతే కుటుంబాలు రో డ్డున పడతాయని, బంధువుల ముందు చు లకన అవుతామని అన్నారు. మండల న్యాయ సేవాధికారసంస్థ ద్వారా ఉచిత న్యాయ సహా యం అందుతుందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సబ్జైలు సూపరింటెండెంట్ టి.అప్పారావు ఉన్నారు. భీమవరం: రాబోయే విద్యా సంవత్సరానికి ప్ర భుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. స్థానిక క్యాంపు కార్యాల యం నుంచి శనివారం బడి పిలుస్తోంది కార్యక్రమం అమలు తీరుపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వా రా సమీక్షించారు. ప్రత్యేక ప్రచార కార్యక్రమా లు చేపట్టాలని, తల్లిదండ్రులను సమగ్ర అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపినా సంబంధిత సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రైవేట్ యాజమాన్యాలు అడ్డంకులు సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఈఓ ఈ.నారాయణ తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): డెంగీ నివారణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని డీఎంహెచ్ఓ జి.గీతాబాయి అన్నారు. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా శనివారం పట్టణంలోని ప్రకాశంచౌక్ నుంచి జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గీతాబాయి మాట్లాడుతూ డెంగీ దేశవ్యాప్తంగా ప్రజారోగ్యానికి ప్రధాన సవాలుగా మారిందని, ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా డెంగీ వ్యాప్తిని అరికట్టవచ్చాన్నారు. డెంగీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అలాగే డెంగీ నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా మలేరియా అధికారి డా. వి.క్రాంతికుమార్, ప ట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, జిల్లా ఉప మలేరియా అధికారి, డిప్యూటీ హెచ్ఈఓ, ఎస్యుఓ, సిబ్బంది పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజలంతా పర్యావరణహిత వస్తువులు వినియోగించాలని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్రలో భాగంగా శనివారం పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అధికారులు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డితో కలిసి జేసీ పట్టణంలో క్యారీ బ్యాగుల విక్రయ దుకాణాలు, ప్లాస్టిక్ వస్తువు ల నిల్వ కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రతి వ్యాపారి కచ్చితంగా పాటించాలని లేకుంటే చ ర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యావరణానికి హాని కలిగించని పదార్థాలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ ఎ.రాంబాబు పాల్గొన్నారు. పెంటపాడు: కారులో గంజాయితో వెళుతున్న ఓ వ్యక్తిని పెంటపాడు పోలీసులు అరెస్టు చేశా రు. శనివారం సీఐ రవికుమార్ అతడిని తాడేపల్లిగూడెం కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్టు ఎస్సై స్వామి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. దినవాహి కృష్ణవంశీ అలియాస్ కిట్టు అనే వ్యక్తి కారులో మూడు కి లోల గంజాయి తీసుకుని విజయవాడ వెళు తుండగా ప్రత్తిపాడు వై.జంక్షన్ వద్ద అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి చిరునామా వివరాలు తెలియరాలేదు. -
రుణాలు సద్వినియోగం చేసుకోవాలి
పెనుగొండ: డ్వాక్రా మహిళలకు, రైతులకు అందిస్తున్న వ్యవసాయ రుణాలను, ఇతర రుణాలు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ వీరభద్రరావు తెలిపారు. శనివారం ఆచంటలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ ఔట్ రీచ్ కార్యక్రమాన్ని ఆచంట చాంబర్ కమిటీ హాల్లో నిర్వహించి రుణాల చెక్కులను అందించారు. యూనియన్ బ్యాంక్లో వ్యవసాయ రుణాలు, ఇతర పథక రుణాలపై అవగాహన కల్పించారు. డిపాజిట్లపై వచ్చే వడ్డీని, తిరిగి తక్కువ వడ్డీకి తీసుకొనే అవకాశాలను వివరించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ ఫణి, ఏపీఎం రామకృష్ణ, ఆచంట బ్రాంచ్ మేనేజరు కే సుధాకర్, సీహెచ్ శ్రీనివాస్, దివ్య రాంబాబు, కేతా రామకృష్ణ, కోట వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. భీమవరం: భీమవరం పట్టణం బలుసుమూడి ఎస్టీ కాలనీ చర్చిలో మేరిమాత, ఏసుప్రభు విగ్రహాలను ధ్వంసం చేశారని చర్చి పాస్టర్ ఎన్. స్టాలిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్ఐ రామారావు శనివారం చెప్పారు. ఈ నెల 13వ తేదీ రాత్రి చర్చి పక్కన గల ఖాళీ స్థలంలో ఐదుగురు వ్యక్తులు మద్యం సేవించి, అక్రమంగా చర్చిలోనికి ప్రవేశించి విగ్రహాలను ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్ఐ తెలిపారు. జంగారెడ్డిగూడెం: అదృశ్యమైన మహిళ మృతదేహం శనివారం జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎర్రకాలువలో లభ్యమైంది. ఎస్సై ఎన్వీ ప్రసాద్ వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంకు చెందిన తోట మేరీ (45) ఈ నెల 7న ఇంటి నుంచి అదృశ్యమైంది. మేరీ సోదరుడు గండే సురేష్ వద్ద ఉంటోంది. ఆమె కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికినా.. ఆచూకీ లభించకపోవడంతో ఈ నెల 12వ తేదీన జంగారెడ్డిగూడెం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి మేరీ ఆచూకీ కోసం పోలీసులు, ఆమె కుటుంబసభ్యులు వెతుకుతున్నారు. శనివారం మధ్యాహ్న ఎర్రకాలువలో కుటుంబసభ్యులకు మృతదేహం లభించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని మేరీ మృతదేహాన్ని గుర్తించారు. అనుమానాస్పద మృతి కేసును మార్చి దర్యాప్తు చేస్తున్నారు. -
పవనూ.. ఇది తగునా!
‘నేనేమీ సీఎం కావాలని పార్టీ పెట్టలేదు’ అంటూ జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్టాఫిక్గా మారాయి. ఎన్నికల సభల్లో సీఎం.. సీఎం.. అని పిలిపించుకుంది ఎందుకన్న సందేహాలు తలెత్తుతున్నాయి. తమ అభిమాన నేతను ముఖ్యమంత్రిగా చూడాలన్న కేడర్ ఆశలపై ఆయన మాటలు నీళ్లు చల్లినట్లయ్యింది. ఆదివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2026సాక్షి, భీమవరం: తమిళనాడులో సినీ హీరో విజయ్ పార్టీని స్థాపించిన రెండేళ్లకే ముఖ్యమంత్రిగా ఎన్నికై న విషయం తెలిసిందే. ఇతర పార్టీలతో పొత్తు పెట్టు కోకుండా ఒంటరిగా పోటీచేసి అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తే.. జనసేన పార్టీ పెట్టి పుష్కర కాలమైనా ఇంకా పొత్తుల కోసం పాకులాటపై ఇంటా బయట తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయమై శుక్రవారం మంగళగిరిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ‘నేనేమీ సీఎం కావాలని పార్టీ పెట్టలేదు’ అన్న పవన్కల్యాణ్ మాటలు కేడర్ను నైరాశ్యంలోకి నెట్టేస్తున్నాయి. గతంలోని ఎన్నికల ప్రచారంలో ఎక్కడకు వెళ్లినా అభిమానులతో సీఎం.. సీఎం.. అని పిలిపించుకున్న పవన్ ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో వామపక్షాలతో జతకట్టిన పవన్ తాజాగా తాను వామపక్షవాదిని కాదని చెప్పడం చర్చకు దారితీస్తోంది. మొదట్లో విమర్శలు టీడీపీ, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా జనసేన పార్టీ స్థాపించినట్లు మొదట్లో పవన్కల్యాణ్ చెప్పుకొచ్చా రు. చంద్రబాబు పోలవరం, అమరావతిలో రాజ ధాని పేరుతో సొంత సామాజికవర్గానికే దోచి పెడుతున్నాడని ఆరోపించారు. అమరావతిలో రాజధాని ఏర్పాటుకు అన్ని వేల ఎకరాలు అవసరం లేదంటూ ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ పాచిపోయిన లడ్డూలు, పిడికెడు మట్టి ఇచ్చారంటూ భారతీయ జనతా పార్టీపై ఽసైతం విమర్శలు గుప్పించారు. కూటమిలో రచ్చకెక్కిన విభేదాలు తాడేపల్లిగూడెంలో జనసేన, టీడీపీ మధ్య వైరం ఇప్పటికే రచ్చకెక్కింది. మరోపక్క టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందిన పాలకొల్లు, ఆచంట, ఉండి, తణుకులలో తమకు తగిన ప్రాధాన్యం లేదన్న నిరాశలో పార్టీ శ్రేణులు చాలా వరకు సైలెంటైపోయారు. పార్టీ కోసం జిల్లాలో కీలకంగా పనిచేసిన నేతలకు ప్రభుత్వంలో తగిన స్థానం దక్కలేదన్న అసంతృప్తి ఉంది. పవన్ సీఎం అయితే తమకు తగిన ప్రా తినిధ్యం లభిస్తుందని ఎదురుచూస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. గతంలో లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తారని ప్రచారం జరిగిన సందర్భంలో ప్ర భుత్వంలో పవన్కు ప్రాధాన్యత తగ్గుతుందని కేడర్ ఆందోళన చెందారు. సోషల్ మీడియా వేదికగా తమ గళం వినిపించారు. అప్పట్లో సోషల్ మీడి యాలో టీడీపీ, జనసేనలు పోటాపోటీగా పోస్టులు సైతం పెట్టుకున్నారు. ప్రభుత్వంలో తర్వాతి స్థానంలో ఉన్న పవన్ సీఎం అవుతారని ఎదురుచూస్తున్నారు. కాగా సీఎం కావాలని పార్టీ పెట్టలేదన్న పవన్ వ్యాఖ్యలు ఆయన అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ మాటలు దేనికి సంకేతమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కడదాకా టీడీపీ పల్లకీ మోయాల్సిందేనా అని కేడర్ అంతర్మథనం చెందుతున్నారు. పార్టీ పెట్టింది సీఎం అయ్యేందుకు కాదా ! సభల్లో సీఎం.. సీఎం.. అని పిలిపించుకుంది ఎందుకు ? పవన్కల్యాణ్ వ్యాఖ్యలపై జనసేన కేడర్లో నిర్వేదం కడదాకా టీడీపీకి కొమ్ము కాయాల్సిందేనా..? ఇప్పటికే జనసేన ఎమ్మెల్యేలు, కేడర్కు దక్కని ప్రాధాన్యం జనసేన ఎమ్మెల్యేలకు పోటీగా టీడీపీ నేతలు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, అర్జీల స్వీకరణ అసంతృప్తితో రగలిపోతున్న నేతలు -
బీపీ లేకుండా హ్యాపీగా ఉందాం
అసంక్రమిత వ్యాధులను గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా ఎన్సీడీ సర్వే నిర్వహిస్తున్నాం. ఈ సర్వేలో ఎక్కువగా అధిక రక్త పోటు కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో సుమారు 2 లక్షల 70 వేల మంది రక్తపోటు ఉన్న వారిని గుర్తించాం. వైద్యుల సూచనలు పాటిస్తూ బీపీ, సుగర్ వ్యాధులను నియంత్రించుకోవచ్చు. – డాక్టర్ నరేంద్రకృష్ట, ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రస్తుత జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా అధిక రక్తపోటు బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన కలిగి ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహార శైలితో అధిక రక్తపోటును అధిగమించవచ్చు. – డాక్టర్ డాక్టర్ డి.వంశీకృష్ణ, బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రంబుట్టాయగూడెం: ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద అనారోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు ఒకటి. బీపీతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. సైలెంట్ కిల్లర్గా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. అందువల్ల దీనిపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు లేకుండా గుండె, బ్రెయిన్, కిడ్నీలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అధిక రక్త పోటు కారణంగా మధుమేహం, స్ట్రోక్, గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, బ్రెయిన్స్ట్రోక్ వంటి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. తరచూ రక్తపోటును పరీక్షించుకోవడం, ఆరోగ్య కరమైన జీవనశైలితో రక్తపోటు నివారించ వచ్చని డాక్టర్లు చెబుతున్నారు. నేడు ప్రపంచ అధిక రక్తపోటు నివారణ దినోత్సవం సందర్భంగా శ్రీసాక్షి శ్రీ ప్రత్యేక కథనం ఆధునిక కాలంలో మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. సాంకేతిక ప్రభావం వల్ల దినచర్యలో చాలా మార్పులు వచ్చాయి. పూర్వ కాలంతో పోలిస్తే వ్యాయమం లేకపోవడం, శ్రమ లేని పనులు పెరిగిపోయాయి. ప్రతి పనిలో ఒత్తిడి పెరిగిపోయింది. దీనివల్ల బీపీ బారిన పడుతున్న వారి సంఖ్య అధికమవుతుంది. జిల్లా వ్యాప్తంగా బీపీ బాధితులపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో సుమారు 2.70 లక్షల మందికి రక్తపోటు ఉన్నట్లు గుర్తించారు. బీపీ అంటే.. రక్తనాళాల్లో రక్తం వేగంగా ప్రవహించి అధిక ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే సమస్యే హై బీపీ. ఒక వ్యక్తి సాధారణ స్థితిలో బ్లడ్ ప్రెజర్(బీపీ) 120/80గా పేర్కొంటారు. అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పెద్ద వయసులో కొన్ని పరిస్థితుల్లో 140/90గా ఉన్నా సాధారణ స్థితిగానే నిర్ధారిస్తున్నారు. చాలా మందికి రక్తపోటు ఉన్నట్లు తెలియకపోడం వల్ల ఉన్నట్టుండి గుండెపోటు వచ్చి కుప్పకూలిపోతున్నారు. తల నొప్పి, అలసట అనిపిస్తే ఏ మాత్రం నిర్లక్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రధించి బీపీ చెక్ చేయించుకోవాలి. హైపర్ టెన్షన్ అసాధరణ రీతిలో రావడంతో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మెదడు, గుండెలో నరాలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. పక్షవాతం, కిడ్నీ సమస్యలు, నరాల సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇటీవల 20 – 30 ఏళ్ల లోపు యువత గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ సమస్యలతో మృత్యువాత పడుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి అధిక రక్తపోటుతో బాధపడే రోగులు ఆహార పదార్థాల్లో ఉప్పు తక్కువగా వినియోగించుకోవాలి. మసాలాలు, నిల్వ చేసిన పచ్చళ్లు, కారం తగ్గించాలి. రోజూ గంట పాటు సాధారణ వ్యాయామం, యోగా వంటివి చేయడం మంచిది. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. మత్తు పదార్థాలు, ఆల్కహాల్, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. సాధారణంగా వయసు మళ్లిన వారికి రక్తపోటు వస్తుంది. జన్యుపరమైన కారణాలతో కూడా వస్తుంది. ధూమపానం, ఊబకాయం, ఏ పని చేయకుండా ఒకే చోట గంటల తరబడి ఉండడం, హైపో థైరాయిడ్, ఒత్తిడి, అనారోగ్యకర ఆహార అలవాటుతో పాటు కంటికి సరిపడా నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, దీర్ఘకాలిక మూత్ర పిండాల జబ్బుల వల్ల బీపీ వస్తుంది. మెడ నరాల లాగేస్తున్నట్లు ఉండడం, కళ్లు తిరగడం, ఆకస్మికంగా తూలిపోవడం, తరచూ తలపోటు రావడం, ఒళ్లంతా చెమటలు పట్టడం, యూరిన్ తక్కువగా రావడం, కాళ్లు తిమ్మిరిగా ఉండడం బీపీ లక్షణాలు అధిక రక్తపోటుతో అనర్థాలు ముందస్తు గుర్తింపుతో ప్రమాద నివారణ ఆరోగ్యకరమైన జీవన శైలితోనే రక్తపోటు నివారణ నేడు ప్రపంచ అధిక రక్తపోటు నివారణ దినోత్సవం -
సార్వాకు సన్నద్ధం
● విత్తనాల సేకరణ, మెట్టదుక్కులతో బిజీ ● జిల్లాలో 2.25 లక్షల ఎకరాల్లో సాగు ● 53,750 క్వింటాళ్ల విత్తనాలు అవసరం భీమవరం: జిల్లాలో దాళ్వా మాసూళ్లు పూర్తికావస్తున్న తరుణంలో రైతులు సార్వా సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో దా ళ్వాలో 2.35 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయగా సార్వాలో 2.25 లక్షల ఎకరాల్లో నాట్లు వేయనున్నారు. సార్వాలో తుపానులు, అధిక వర్షాల నుంచి గట్టెంకేందుకు తగు విత్తన రకాలు ఎంపిక చేసువాల్సి ఉంది. ఈ మేరకు విత్తనాల సేకరణ పనిలో రైతులు నిమగ్నమయ్యారు. కొందరు రైతులు భూములను మెట్ట దుక్కులు చేస్తూ ఎత్తుపల్లాలను సరిచేసుకుంటున్నారు. మేలైన వంగడాలివే.. సార్వాలో మేలైన వరి వంగడాలను ఎంపిక చేసుకుని అధిక దిగుబడుగులు సాధించాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. వాటిలో ఎంటీయూ 1318, ఎంటీయూ 1153,1156, స్వర్ణ రకాలను ఎంపిక చేసుకోవచ్చు. జిల్లాలో సార్వాకు సుమారు 53,750 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా 90 శాతానికి పైగా రైతులే నేరుగా సమకూర్చుకుంటారని అంచనా. జూన్ మొదటి వారంలో వరి నారుమడులు ప్రారంభించి ఆగస్టు 15 నాటికి నాట్లు పూర్తి చేస్తే తుపానులు, వరదల నుంచి పంటను కాపాడుకోవచ్చు. వరి నారుమడి నుంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఈ సీజన్లో ఎక్కువ మంది రైతులు వరినాట్లు వేసే పద్ధతినే అవలంబిస్తున్నందున ఎకరాకు 25 నుంచి 30 కిలోల విత్తనాలు అవసరం కాగా, వెదజల్లు పద్ధతిలో ఎకరానికి 12 కిలోల విత్తనాలు సరిపోతాయి. నారు ఆరోగ్యం కోసం.. వరినారు దృఢంగా, ఆరోగ్యవంతంగా ఉండాలంటే నారు వేసే ముందు మడిని 12 రోజుల ముందు దమ్ముచేసి నీరు పెట్టడానికి, తొలగించడానికి వీలు గా ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి సెంటు భూమిలో ఐదు కిలోల వంతున విత్తనాలు చల్లుకోవాలి. విత్త నం ఎక్కువైతే నారు బలహీనంగా ఉండి, మాగుడు తెగులు సోకే అవకాశం ఉంది. మొలక కట్టిన విత్తనాన్ని పలచటి నీటి మీద చల్లుకోవాలి. నారు రెండు, మూడు ఆకులు తొడిగే వరకూ ఆరుతడి పెడుతూ తరువాత పలుచగా నీరుండేలా చూసుకోవాలి. ఎరువులు ఇలా.. దమ్ములో ప్రతి ఐదు సెంట్ల నారుమడికి రెండు కిలోల యూరియా, 7 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్, 2 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. విత్తనాలు వేసిన రెండు వారాల తర్వాత మరలా 2 కిలోల యూరియా పైపాటుగా వేయాలి. అవసరాన్ని బట్టి నారుమడిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. జిల్లాలో ఎరువుల అవసరంపై వ్యవసాయశాఖ అంచనా వేసింది. వీటిని రైతు సేవాకేంద్రాలు, పీఏసీఎస్లు, ప్రైవేట్ వ్యాపారుల వద్ద నిల్వ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. రకం టన్నులు యూరియా 18,000 కాంప్లెక్స్ 16,000 డీఏపీ 1,600 పొటాష్ 4,200 సూపర్ 4,200 -
ఆన్లైన్ మందుల విక్రయాలతో నష్టం
పాలకొల్లు సెంట్రల్: ఆన్లైన్ మందుల విక్రయాలతో చిరు వ్యాపారులకు నష్టం వాటిల్లుతోందని, దీనికి నిరసనగా ఈనెల 20న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్ పాటిస్తున్నట్టు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు తటవర్తి కృష్ణమూర్తి తెలిపారు. శనివారం పట్టణంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ మందుల విక్రయాలపై ప్రభు త్వం జారీ చేసిన నోటిఫికేషన్ ఇప్పటికీ కొనసాగించడం దారుణమన్నారు. అక్రమ ఈ–ఫార్మసీలు ప్రజారోగ్యానికి ముప్పని, భౌతిక ధ్రువీకరణ లేకుండా మందుల విక్రయాల వల్ల ఒకే ప్రిస్కిప్షన్ను పదేపదే ఉపయోగించే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఏఐ ఆధారిత నకిలీ ప్రిస్కిప్షన్లు, యాంటీ బయాటిక్స్ అలవాటు కలిగించేలా మందులపై నియంత్ర ణ లేకుంటే ప్రజారోగ్యానికి ముప్పు తప్పదన్నారు. ఈ–ఫార్మసీలు భారీ డిస్కౌంట్ల కారణంగా దేశంలో కెమిస్ట్, డ్రగ్గిస్ట్పై ఆధారపడిన సుమారు 5 కోట్ల కు టుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. ఆయా సమస్యలపై ప్రధానికి విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని, దీంతో దేశవ్యాప్తంగా ఒక్కరోజు బంద్కు పిలుపునిచ్చినట్టు చెప్పారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.చలపతి, ట్రెజరర్ జీవీఆర్ ఫణి తదితరులు పాల్గొన్నారు. -
పీఏసీఎస్లో ఇష్టారాజ్యంగా నియామకాలు
నూజివీడు: నూజివీడు పీఏసీఎస్లో అధికార పార్టీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా నియామకాలు చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తమ అనుచరులను, కావాల్సిన వారిని నియమంచుకుంటూ వారికి జీతాల రూపంలో వేల రూపాయలు చెల్లిస్తున్నారు. సొసైటీల్లో ఏవరినైనా నియమించాలంటే జిల్లా స్థాయి సాధికార కమిటీ ఉత్తర్వుల ప్రకారం నియమించుకోవాల్సి ఉండగా ఈ సొసైటీలో ప్రస్తుతం 8 మంది ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వారికి ప్రతినెలా రైతుల సొమ్మును దోచిపెడుతూ దుర్వినియోగం చేస్తున్నారు. ఈ సొసైటీలో పర్మినెంట్ పోస్టులు ఆరు ఉండగా ముగ్గురు ఉద్యోగులు పనిచేస్తున్నారు. మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులలో ముగ్గురు వ్యక్తులను నియమించుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఎనిమిది మందిని నియమించుకున్నారు. ఇందులో ఐదుగురు గత నాలుగేళ్ల నుంచి పనిచేస్తుండగా ముగ్గురిని మాత్రం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఇటీవలే నియమించారు. గత ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.12 కోట్ల వ్యాపారం మాత్రమే చేసినా సొసైటీ రుణాల రికవరీ కూడా వందశాతం లేదు. ఇష్టారాజ్యంగా నియమించుకొని జీతాలకు సొసైటీ సొమ్మును దుర్వినియోగం చేస్తే తరువాత ఆడిట్ అభ్యంతరాలు వచ్చి రికవరీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తే ఎవరు భరిస్తారనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికై నా నూజివీడు సొసైటీ తీరుపై సహకారశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
ఎస్.కొండేపాడు బాధితులకు వాసుబాబు పరామర్శ
గణపవరం: గణపవరం మండలం ఎస్. కొండేపాడు గ్రామంలో రెండు రోజుల క్రితం కలుషిత మైదాపిండితో వేసిన బజ్జీలు తిని తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను శుక్రవారం ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు పరామర్శించారు. భీమవరంలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాఽధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. బాధితులంతా పూర్తిగా కోలుకునే వరకూ వైద్యం అందించాలని ఆయన వైద్యులను కోరారు. ఏ అవసరం వచ్చినా తనకు తెలియజేయాలని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు. వాసుబాబు వెంట గణపవరం ఎంపీపీ అర్థవరం రాము, మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ దండు రాము, వైఎస్సార్ సీపీ మండల యూత్ అధ్యక్షుడు కొట్టు నరేష్, కొండేపాడు మాజీ సర్పంచ్ తోట సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ కొండేపాడు గ్రామ అధ్యక్షుడు గంగుమోలు సూరిబాబు తదితరులు ఉన్నారు. పాలకొల్లు సెంట్రల్: పట్టణంలో యడ్లబ బజారు, రామయ్యహాలు ప్రాంతాల్లో ఉన్న డంపింగ్ యార్డుల్లో పొగ వస్తుందని ఫిర్యాదులు రావడంతో ఏలూరు పర్యావరణ శాఖ ఇంజనీర్ రామచంద్రమూర్తి విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఎన్విరాన్మెంట్ బోర్డుకు వచ్చిన ఫిర్యాదు మేరకు డంపింగ్ యార్డుకు తనిఖీ చేస్తున్నామన్నారు. మునిసిపల్ అధికారులకు నోటీసు జారీ చేసి నివేదిక కోరతామన్నారు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి పట్టణంలో ఉన్న రెండు డంపింగ్ యార్డుల్లో నిత్యం పొగ వస్తుందని చుట్టూ ఇళ్లు, ఆలయాలు ఉన్నాయని స్థానిక ప్రజలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని పలు సమస్యలను తెలియజేస్తూ నేరుగా ఎన్విరాన్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ బి.విజయసారథి, పబ్లిక్ హెల్త్ డీఈ విజయ్కుమార్, మునిసిపల్ డీఈ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు : మండలంలోని బాదంపూడిలో ఉండ్రాజవరపు గంగ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన కేసులో నిందితుడు తాడేపల్లిగూడేనికి చెందిన బొగత శివకు ఏడాది జైలు, 2వేలు జరిమానా విధిస్తూ తాడేపల్లిగూడెం అడిషనల్ జ్యుడిషియల్ ఫస్టు క్లాస్ మెజిస్ట్రేట్ కె.లలిత తీర్పు శుక్రవారం వెలువరించినట్లు చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ తెలిపారు. 6–7–2025న ఉండ్రాజవరపు గంగ వరంగల్ వెళ్లగా ఎవరు ఇంట్లో లేకపోవడం చూసి తాళాలు బద్దలు కొట్టి బీరువాలో బంగారపు మంగళ సూత్రాలు 4 గ్రామలు, బంగారు కాయిన్ 2 గ్రాములు, ఒక వెండి గ్లాసును శివ దొంగలించాడు. దీంతో ఎస్సై సూర్యభగవానన్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి నిందితుడిని కోర్టులో హజరపరిచారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష వేశారు. -
విద్యుత్ ఎస్ఈకి వైఎస్సార్సీపీ లీగల్ నోటీసులు
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయానికి ఎలాంటి ముందస్తు నోటీసూ ఇవ్వకుండా విద్యుత్ సర్వీసును తొలగించిన అంశంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో విఫలమైన విద్యుత్ అధికారులకు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. నగరంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయానికి ఇటీవల విద్యుత్ సరఫరాను తొలగించారు. ముందస్తు నోటీసులూ ఇవ్వకుండా సర్వీసును తొలగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వైఎస్సార్సీపీ నాయకులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు సదరు కార్యాలయానికి మూడు రోజుల్లోపు సర్వీసును పునరుద్ధరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రతులను నాయకులు ఈనెల 12న ఈపీడీసీఎల్ ఎస్ఈ సాల్మన్రాజుకు కలిసి అందచేశారు. ఈ నెల 15 తేదీలోపు విద్యుత్ సర్వీసును పునరుద్ధరించాల్సిన అధికారులు ఆ పని చేయకుండా తిరిగి వైఎస్సార్సీపీ నాయకులకు నోటీసులు పంపి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. లీగల్ సెల్ నాయకులు కోర్టు ధిక్కరణ నోటీసులు అందచేశారు. ఉత్తర్వులను ధిక్కరించిన నేరానికి జరిమానా, ఇతర క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోవలసి వస్తుందని సదరు నోటీసులో గుర్తు చేశారు. -
పెట్రో మంట
పశ్చిమాసియా కల్లోలంతో చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే గ్యాస్ ధరలకు రెక్కలు రాగా శుక్రవారం నుంచి పెట్రోల్పై లీటరుకు రూ.3.29, డీజిల్కు రూ.3.14 చొప్పున పెరిగాయి. దీంతో లీటరు పెట్రోల్ రూ.113.12కు, డీజిల్ రూ.100.78 చేరాయి. ఈ మేరకు జిల్లాలోని వినియోగదారులపై రోజుకు రూ. 19.6 లక్షలు భారం పడుతుందని అంచనా. సాక్షి, భీమవరం: నెలల తరబడి సాగుతున్న అమెరికా– ఇరాన్ యుద్ధం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మార్చి రెండో వారంలో గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. డొమెస్టిక్ సిలెండర్ రూ.892 నుంచి రూ. 952కు, వాణిజ్య సిలెండర్ రూ.1850.50 నుంచి రూ. 2177కు పెరిగాయి. రెండు నెలలు తిరగకుండానే వాణిజ్య సిలెండర్ ధరను రూ.3,170కు పెంచింది. జిల్లాలో 6,21,626 గృహావసరాలు (డొమెస్టిక్) కనెక్షన్లు ఉన్నాయి. సగటున ఒక్కో కుటుంబం ఏడాదికి ఏడు సిలెండర్లు చొప్పున జిల్లాలోని వినియోగదారులు 43.5 లక్షల డొమెస్టిక్ సిలెండర్లు వినియోగిస్తారని అంచనా. వంట గ్యాస్ కోసం రెండు నెలల క్రితం వరకు ఏడాదికి రూ.6,244 వెచ్చిస్తే, తాజా పెంపుతో రూ.6,664 చెల్లించాల్సి వస్తుంది. పెరిగిన ధరలు మేరకు జిల్లా వాసులపై రూ. 24.94 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. సామాన్యులకు సెగ : మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. కంది, మినుము, పెసరపప్పులు నాణ్యత రకాన్ని బట్టి కిలో రూ.125 నుంచి రూ.135 వరకు ఉన్నాయి. పామాయిల్ ప్యాకెట్ రూ.140 వరకు ఉండగా, సన్ఫ్లవర్, వేరుశనగ, బ్రాన్ ఇతర ఆయిల్ ధరలు రూ.150 నుంచి రూ. 200 పైగా పలుకుతున్నాయి. నిత్యావసర సరుకులు లేనిదే రోజు గడవక సామాన్యుల జీవనం దుర్భరంగా మారింది. ఇప్పటికే గ్యాస్ ధరల పెంపుతో వారిపై అదనపు భారం పడింది. కమర్షియల్ సిలెండర్లు ధర భారీగా పెంచడంతో హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, బజ్జీల బళ్లు, స్వీట్స్ షాపులు, కర్రీ పాయింట్లలో ధరలకు రెక్కలొచ్చాయి. టిఫిన్, మీల్స్పై ప్లేటుకు రూ. 5 నుంచి రూ.20 వరకు ధరలు పెంచేశారు. మిగిలిన ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుతో రవాణా భారం కానుంది. సరుకుల రవాణా చార్జీలు పెరిగి కూరగాయలు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థలైన హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్పీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ)తో పాటు రిలయన్స్, నయారా తదితర ప్రైవేట్ కంపెనీలకు చెందిన పెట్రోల్ బంకులు 165 వరకు ఉన్నాయి. రోజుకు సుమారు 1.5 లక్షల లీటర్ల పెట్రోల్, 4.5 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతుంది. శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి పెట్రోల్పై రూ. 3.29, డీజిల్పై రూ. 3.14 చొప్పున ఆయిల్ కంపెనీలు ధరలను పెరిగాయి. ఈ మేరకు వినియోగదారులపై రోజుకు పెట్రోల్పై రూ. 4.93 లక్షలు, డీజిల్పై రూ. 14.13 లక్షలు కలిపి రూ.19.6 లక్షల భారం పడుతుంది. నిత్యావసర ధరల నియంత్రణ, రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. 2024 అక్టోబరులో రేషన్ దుకాణాల ద్వారా కంది పప్పు పంపిణీ ప్రారంభించిన కూటమి ప్రభుత్వం నాలుగు నెలలు తిరక్కుండానే చేతులెత్తేసింది. గత ఏడాది మార్చి నుంచి మొత్తం నిలిపివేసింది. కార్డుదారులకు రూ.20కు కిలో చొప్పున గోధుమ పిండి అందజేస్తామని చెప్పి జనవరి నుంచి పైలెట్ ప్రాజెక్టు పేరిట నగరాలు, ముఖ్య పట్టణాలకు మాత్రమే పరిమితం చేసింది. జిల్లాలో 5,67,700 రేషన్ కార్డులకు భీమవరం పరిధిలో 33,363 కార్డులకు మాత్రమే గోధుమ పిండి ఇస్తున్నారు. రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేదవర్గాల వారు కోరుతున్నారు. లీటరు పెట్రోల్కు రూ.3.29,డీజిల్కు రూ.3.14 పెంపు జిల్లాలో రోజుకు 4.5 లక్షల లీటర్ల డీజిల్, 1.5 లక్షల లీటర్ల వరకూ పెట్రోల్ వినియోగం వినియోగదారులపై రోజుకు రూ.19.6 లక్షల భారం ఇప్పటికే డొమెస్టిక్ సిలెండర్పై రూ.60, కమర్షియల్పై రూ.1370ల పెంపు సామాన్యులపై పెరిగిన ధరల భారం -
భారీ వాహనాల ప్రవేశంపై ఆంక్షలు
ఏలూరు టౌన్: నగరంలో ట్రాఫిక్ నియంత్రణంలో భాగంగా నగరంలోకి భారీ వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధించామని ఏలూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు తెలిపారు. ఏలూరు పోలీస్ డార్మిటరీలో ఇటుకబట్టీల ట్రాక్టర్ డ్రైవర్లతో ట్రాఫిక్ సీఐ ప్రత్యేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారణకు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ట్రాక్టర్లు, లారీలు, ఇతర భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించామని స్పష్టం చేశారు. ఈ సమయంలో డ్రైవర్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఇష్టారాజ్యంగా నగరంలోకి ప్రవేశించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే క్షతగాత్రులను సకాలంలో హాస్పిటల్కు చేర్చేందుకు ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. అతివేగం ప్రమాదకరమనీ, ట్రాక్టర్ డ్రైవర్లు ముఖ్యంగా పరిమిత వేగంతోనే ప్రయాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై శ్రీధర్, ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు. -
నిమ్మకాయల యార్డులో మృతదేహం లభ్యం
ఏలూరు టౌన్: ఏలూరు నిమ్మకాయల యార్డ్ ప్రాంగణంలో గోడ పక్కగా ఒక మృతదేహాన్ని గుర్తించారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో గుర్తు తెలియని సుమారు 50 ఏళ్ల వయస్సున్న వ్యక్తి ఒక మృతదేహాన్ని నిమ్మకాయల యార్డులో పనిచేసే వారు గుర్తించారు. వెంటనే ఏలూరు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఏలూరు వన్టౌన్ సీఐ జి.సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్ళిన స్థితిలో గుర్తు పట్టలేని విధంగా ఉంది. సుమారుగా వారం రోజుల క్రితం చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతదేహంపై లేత ఆకుపచ్చ రంగు పుల్హ్యాండ్స్ చొక్కా, నలుపురంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉందనీ... ఎవరికై నా తెలిస్తే తమను సంప్రదించాలని ఏలూరు వన్టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. -
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
పెంటపాడు: మండలంలో పలు ప్రాంతాలలో మట్టి మాఫియా ఊపందుకొంది. కాగా ఇదే అదనులో బి.కొండేపాడుకు చెందిన టీడీపీ నాయకునిడిగా చెప్పుకునే ఒక వ్యక్తి ఓల్డ్ వయ్యేరుకు ఆనుకొని ఉన్న పొలం నుంచి సమీపంలో ఉండే మరో ఈనాం భూమిగా పిలిచే సుమారు 25 సెంట్లను ట్రాక్టర్లతో హడావుడిగా పూడ్చుతున్నాడు. ఈ సమాచారం అందుకున్న గ్రామ వీఆర్ఓ పద్మ, సివిల్ సప్లయిస్ డీటీ శ్రీనివాస్, వీఆర్ఏ రాజు తదితరులు మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. అనుమతి లేకుండా మట్టి తవ్వకం చేసినా, అనుమతులు లేని భూములు పూడ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఏడో రోజు శుక్రవారం స్వామివారికి పంచామృత అభిషేకం, ఉదయం ఎనిమిది గంటల నుంచి నవకల స్నపనం, అనంతరం స్వామివారికి విశేష అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ స్వామి వారికి 12సార్లు పూలతో అర్చన, 12 రకాల ప్రసాదాలతో నివేదన చేశామన్నారు. దాతలు వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ విద్యాసంస్థలవారు, వెలివేటి సత్య వెంకట సూర్య రామకృష్ణ దంపతులు, శ్రీ దత్త సర్వాణి దంపతులు, జమ్మి గంగరాజు, దివంగత ముదుపాక సింగరాజు కుటుంబ సభ్యులను అర్చకులు స్వామివారి వేద ఆశీస్సులు, శేషవస్త్రాలు, ప్రసాదాలతో సన్మానించారని ఈఓ కలగర శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, పెనుమర్తి రామకుమార్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
కూటమి నేత దర్జాగా కబ్జా
తాడేపల్లిగూడెం: జాగా కనిపిస్తే దర్జాగా కబ్జా చేసేయ్ అన్న రీతిలో నియోజకవర్గంలోని కూటమి నేత వ్యవహార శైలి ఉంది. బాల వెంకటేశ్వర స్వామి భూములను కబ్జా చేసి విక్రయించి సొమ్ములు చేసుకున్న ఘనమైన చరిత్ర కలిగిన ఈ నేత తాజాగా పట్టణంలోని రెండో టౌన్లో బాలవెంకటేశ్వరస్వామి భూమిని ఆక్రమించిన నిర్మాణాలు వివాదాస్పదమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ నేత అక్రమాలకు అప్పటి ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ చెక్ పెట్టారు. ఆక్రమణలు తొలగించి భూమిని దేవదాయ శాఖకు బదలాయించారు. కూటమి పాలన వచ్చాక సదరు నేత మళ్లీ అక్రమ నిర్మాణాలు చేశారు. కట్టడి చేయాల్సిన దేవదాయ శాఖ అధికారులు తూతూ మంత్రంగా బోర్డు ఏర్పాటుచేసి చేతులు దులిపేసుకున్నారు. ఈ నేత ఉంటున్న ఇల్లు కూడా దేవదాయ శాఖకు చెందిన భూమిలో ఉందని కేసు నమోదైంది. దేవదాయశాఖ మంత్రిగా పైడికొండల మాణిక్యాలరావు ఉన్న సమయంలో ఇదే ప్రాంతంలో అక్రమ రహదారి నిర్మాణానికి చెక్ పెట్టారు. అక్రమ నిర్మాణాలపై దేవదాయశాఖ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది,. కూలగొట్టడానికి మాత్రం ఆ శాఖ వెనుకడుగు వేస్తోంది. దేవదాయ శాఖ భూమిలో నిర్మాణాలు -
జీడి.. మద్దతు కొరవడి
● జీడిపిక్కల కొనుగోలుకు ప్రభుత్వం వెనుకంజ ● దళారుల గుప్పిట్లో గిరిజన రైతులు ● గిట్టుబాటు ధర రాక ఇళ్లలోనే నిల్వ బుట్టాయగూడెం: అమాయక గిరిజన రైతులు దళారులు చేతుల్లో చిక్కుకుంటున్నారు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటకు కనీసం గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఆ పంటలను తక్కువ ధరలకే అమ్ముకుంటున్నారు. ఈ ఏడాది చంద్రబాబు ప్రభుత్వం జీడిమామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో దళారులు చేతుల్లో గిరిజన రైతులు నిలువునా మోసపోతున్నారు. దళారుల దందా తెలిసినా ప్రభుత్వాధికారులు మిన్నకుండిపోవడం శోచనీయం. మన్యంలో 1,100 మందికి పైగా రైతులు గిరిజన ప్రాంతంలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల పరిధిలో సుమారు 11 వందల మందికి పైగా గిరిజన రైతులు సుయారు 2 వేల ఎకరాల్లో జీడిమామిడి పంటలను పండిస్తున్నారు. ప్రతిఏటా ఆరువేల టన్నులు వరకు జీడిమామిడి పిక్కల దిగుబడి వస్తుంది. సగటున 160 కిలోల దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. గిరిజన ప్రాతంలో పండించే జీడి పిక్కలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. గిరిజన ప్రాంతంలో సేకరించే జీడిమామిడి పప్పు బయట పప్పుకంటే ఎంతో రుచిగా ఉంటుంది. అందుకే ఇక్కడి పప్పు కొనుగోలు చేసేందుకు బయట వ్యాపారులు ఎగబడతారు. ఎక్కడా కనిపించని కొనుగోలు కేంద్రాలు గిరిజనులు పండించిన జీడిమామిడి పంట అమ్మకోవడానికి ఈ ప్రాంతంలో ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. దీంతో దళారులే గ్రామస్థాయిలో విక్రయాలు చేస్తుంటారు. ఈ ఏడాది ప్రారంభంలో కిలో రూ.170కి వ్యాపారులు జీడిమామిడి పిక్కలు కొనుగోలు చేశారు. తర్వాత కిలో రూ.150 నుంచి ప్రస్తుతం కిలో రూ. 140 కి కొనుగోలు చేస్తున్నట్లు గిరిజన రైతులు చెబుతున్నారు. దీని వల తీవ్రంగా నష్ట పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది బయట నుంచి వచ్చిన వ్యాపారులు సిడికెట్గా ఏర్పడి ధరను పతనం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గిట్టుబాటు ధర కోసం రైతుల విజ్ఞప్తి గిరిజన ప్రాంతంలో ప్రధానంగా ఉద్యాన తోటలో జీడిమామిడి పంటల సాగు చేస్తుంటారు. ఐటీడీఏ ద్వారా ఉద్యానవన శాఖ పంటల సాగుకు ప్రోత్సహిస్తుంది. అయితే గిరిజనులు పండించిన పంటలను అమ్ముకునే సమయంలో మాత్రం పట్టించుకునే నాథుడే లేరని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట అమ్ముకోవడానికి కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని గిరిజన రైతులు కోరుతున్నారు. అలాగే తాము పండించిన పంటకు క్వింటాకు రూ.20 వేలు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. గిరిజన ప్రాంతంలో గిరిజనలు ప్రతిసీజన్లో జీడిమామిడి పంటను అమ్ముకోవడాకి కొనుగోలు కేంద్రా ఏర్పాటు చేయకపోవడం అన్యాయం. ప్రభుత్వం, అధికారులు కనీసం పట్టించుకోకపోడం వల్ల గిరిజనులు దళారు చేతిలో మోసపోతున్నారు. ఐటీడీఏ అధికారులు పట్టించుకుని కనీసం జీసీసీ ద్వార నైనా జీడిపిక్కలను కొనుగోలు చేసే విధంగా కృషి చేయాలి. – కారం రాఘవ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు, అలివేరు -
విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక గ్రీవెన్స్
భీమవరం (ప్రకాశంచౌక్): విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎన్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రత్యేక పీజీఆర్ఎస్లో మొత్తం 22 అర్జీలు అందినట్లు డీఆర్వో పేర్కొన్నారు. పీజీఆర్ఎస్కు రావడానికి దివ్యాంగులు ఎదుర్కొనే ఇబ్బందులను దష్టిలో ఉంచుకుని సేవాభావంతో స్పందించి సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు. -
మంచి పాలన అంటే కూల్చడమేనా?
● ఉండిలో రఘురామ రాక్షసరాజ్యం ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఉండి: ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు నేతృత్వంలో బుల్డోజర్, రాక్షస రాజ్యం నడుస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. ఉండి మండలం ఉణుదుర్రు, సాగుపాడు గ్రామాల్లో అధికారులు అక్రమంగా కూల్చివేసిన ఇళ్ల బాధితులను శుక్రవారం ఆయన పరామర్శించారు. నివాసాలు కోల్పోయి రోడ్డున పడ్డ మహిళల బాధలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు కన్నీటి పర్యంతమవుతుంటే వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కొందరు భూస్వాముల స్వార్థం కోసం పోలీసుల అండతో 84 కుటుంబాలకు చెందిన 71 ఇళ్లను, ఆలయాలను తెల్లవారుజామున బుల్డోజర్లతో కూల్చి వేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇంట్లోని సామాగ్రిని కూడా బయటకు తెచ్చుకోనివ్వకుండా అధికారులు నిరంకుశంగా వ్యవహరించారని మండిపడ్డారు. భూస్వాముల ఇళ్లు, గెస్ట్హౌస్లను వదిలేసి, పేదల ఇళ్లను మాత్రమే కూల్చడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. బాధితులకు సీపీఎం తరపున తాత్కాలిక పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కూల్చివేతలకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, నివాసయోగ్యం కాని చోట సెంటున్నర భూమి ఇస్తే న్యాయం జరిగినట్టు కాదని హితవు పలికారు. ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం ప్రకారం బాధితులకు 3 సెంట్ల భూమి, ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉండి నియోజకవర్గంలో పేదలకు జరుగుతున్న అన్యాయంపై పెద్ద ఎత్తున పోరాడతామని అన్నారు. నియోజకవర్గంలో బుల్డోజర్, రఘురామ రాక్షస పాలన సాగనివ్వబోమని పేదల పక్షాన ఉద్యమిస్తామని అన్నారు. కలెక్టర్, ఎస్పీలు చట్టవిరుద్ధమైన చర్యలను చూస్తూ మౌనంగా ఉండటం దారుణమన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్, వాసుదేవరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వాసుదేవరావు, కర్రి నాగేశ్వరరావు, ధనికొండ శ్రీని వాస్, జుత్తిగ నర్సింహమూర్తి, జక్కంపూడి సత్యనారా యణ, కేవీపీ జిల్లా కార్యదర్శి క్రాంతి పాల్గొన్నారు. -
సేంద్రియ వ్యవసాయ పద్ధతులు ఎంతో మేలు
చింతలపూడి: ప్రస్తుత రోజుల్లో రైతులు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటను పండించడానికి విచక్షణారహితంగా రసాయన ఎరువులు వాడుతున్నారు. ఫలితంగా భూముల్లో పంటలకు కావలసిన పోషకాలు అందుబాటులో లేక సమతుల్యత లోపించి ముందెన్నడూ లేని విధంగా ద్వితీయ సూక్ష్మ పోషక లోపాలు పంటల్లో కనిపిస్తుంది. ఈ పోషకాలు లోపించినప్పుడు సాగులో మిగతా యాజమాన్య పద్ధతులన్నీ సక్రమంగా పాటించకపోయినా దిగుబడులు తగ్గుతాయి. వీటిని అధిగమించడానికి సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మేలని వ్యవసాయ సహాయ సంచాలకులు వై.సుబ్బారావు సూచిస్తున్నారు. చింతలపూడి సబ్డివిజన్ పరిధిలో ఏటా ఖరీఫ్ సీజన్లో 35,542 ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తుంటారు. ఇవి కాక 340 ఎకరాల్లో మొక్కజొన్న, 157 ఎకరాల్లో వేరుశనగ పంటలు పండిస్తారు. రబీ సీజన్లో సుమారు 1,500 హెక్టారుల్లో వరి, 18,000 హెక్టారుల్లో మొక్కజొన్న, 2, 500 హెక్టారుల్లో వేరుశెనగ పంటలను రైతులు సాగు చేస్తుంటారు. ఎరువుగా జిప్సం జిప్సంలో 24 శాతం కాల్షియం, 18 శాతం గంధకం ఉంటుంది. కాల్షియం, గంధకం మొక్కల పెరుగుదలకు అవసరమైన ద్వితీయ శ్రేణి పోషకాలను అత్యంత చౌకగా జిప్సం ద్వార అందించవచ్చు. ముఖ్యంగా నూనె గింజలు, పప్పు ధాన్యాల వంటి పంటల్లో గంధకం ఆవశ్యకత అధికంగా ఉంటుంది. కాల్షియం మొక్కల్లోని జీవకణాల అంచులు గట్టిగా ఉండటానికి, కణ విభజనకు, వేర్ల అభివద్ధికి గింజకట్టడానికి అవసరమవుతుంది. దీని వల్ల మొక్కలకు చీడపీడలను ఎదుర్కొనే శక్తి సమకూరుతుంది. వేరుశనగలో ఇలా వేరుశనగ పంటలో అధిక దిగుబడులకు జిప్సంను పూత దశలో వేసుకుని భూముల్లో కలియ బెట్టడం వల్ల వేరుశనగ ఊడలు జిప్సంలోని కాల్షియం, గంధకాన్ని తీసుకుని అధిక దిగుబడులు వస్తాయి. వేరుశెనగలో జిప్సం వినియోగం వల్ల కాయలు గట్టిగా ఉండి కాయ నిండా పప్పు వద్ధి చెంది గింజల్లో అధిక నూనె శాతం కలిగి ఉంటుంది. ఫలితంగా కాయలు అధిక బరువు కలిగి మంచి ధర పలుకుతాయి. కాబట్టి పూత సమయంలో ఎకరాకు 200 కిలోల చొప్పున భూమిలో తగిన తేమ ఉన్నప్పుడు మొక్కలకు దగ్గరగా వేసుకోవాలి. బీడు ,చౌడు భూముల్లో నీరు సరిగా ఇంకదు. గాలి ప్రసరణ తక్కువగా ఉంటుంది. భూమి భౌతిక లక్షణాలు క్షీణించి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మొక్కల వేర్లు సరిగా వద్ధి చెందక మొక్కల్లో ఎదుగుదల ఉండదు. ఇలాంటి భూముల్లో జిప్సం వినియోగంవల్ల నేల గుల్లబారి భూమిలో నీరు ఇంకే స్వభావం పెరిగి మొక్కల వేర్లు బాగా వృద్ధి చెందుతాయి. పంట దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. – వై సుబ్బారావు, చింతలపూడి వ్యవసాయ సబ్డివిజన్ ఏడీఏ పాడి–పంట -
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఆగ్రహం
కోకో ధర పెంచాలి అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన కోకో గింజల ధరకు అనుగుణంగా రైతుల కోకో గింజలకు ధర పెంచాలని కోకో రైతులు డిమాండ్ చేస్తున్నారు. 8లో uభీమవరం: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలతో సరుకు రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరల ఆకాశాన్నంటాయని, పేద, మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారనుందని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ఆందోళన వ్యక్తం చేశారు. చమురు ధరల పెంపును నిరసిస్తూ శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో భీమవరం బుధవారం మార్కెట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా భీమారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు కొరవడిన కారణంగానే దేశానికి ఈ దుస్థితి పట్టిందన్నారు. చిరకాల మిత్రదేశంగా ఉన్న ఇరాన్ పట్ల భారత్ వైఖరి దేశానికి నష్టం కలిగిస్తుందన్నారు. మోదీ స్వార్ధపూరిత నిర్వాకం కారణంగా దేశ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం సీతారామ్ ప్రసాద్, కిలారి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
గూడెంపై ఏసీబీ డేగకన్ను
సాక్షి టాస్క్ఫోర్స్: తాడేపల్లిగూడెం నియోజకవర్గంపై ఏసీబీ డేగకన్ను వేసిందా? గురువారం నాటి ఏసీబీ దాడితో దాడులు ఆగుతాయా? ఇది ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ. గత రెండేళ్లుగా నియోజకవర్గంలోని అధికారులు కొందరు అవినీతి విషయంలో చురుగ్గా ఉన్నట్టు విమర్శలున్నాయి. మున్సిపాలిటీలో సర్వేయర్ రౌతు రామకృష్ణ, తాజాగా గురువారం పట్టణ ఎస్ఐ నాగరాజు, బాలకృష్ణలపై ఏసీబీ దాడులతో రానున్న నెలల్లో మరిన్ని అవినీతి జలగలను పట్టే అవకాశాలున్నట్టు విస్తృతంగా చర్చ నడుస్తోంది. బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. పౌరసరఫరాల శాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నా, లారీల అక్రమ తరలింపునకు బ్రేక్ పడటంలేదు. మున్సిపాలిటీలో కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. దీంతో వచ్చిన అధికారగణం ఇష్టారాజ్యం సాగుతోంది. అధికార కేంద్రాలను ప్రసన్నం చేసుకుంటే చాలు, ఇక్కడ మన రాజ్యమే అన్నట్టుగా వ్యవహారాలున్నట్టుగా ప్రచారం ఉంది. తాజాగా మున్సిపాలిటీలో సామాజిక జాడ్యం కూడా వేళ్లూనుకున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో సుపీరియారిటీ కాంప్లెక్స్ పద్ధతిలో వర్గాలుగా అధికారులు విడిపోయినట్టుగా చెబుతున్నారు. దూకుడుగా ఏసీబీ అధికారులు నియోజకవర్గానికి సుపరిచితుడుగా ఉన్న పట్టణ సర్వేయర్ రామకృష్ణపై ఏసీబీ దాడి చేసినట్టు దాడి అనంతర పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. తాజాగా గురువారం పట్టణ ఎస్ఐ నాగరాజు, కానిస్టేబుల్ బాలకృష్ణల ఉదంతంలో అవినీతి కోణం కన్నా, వ్యక్తిగత ప్రాబల్యాల నేపథ్యంలో దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. దాడులు ఇకపై కొనసాగవచ్చని, నియోజకవర్గంలో ఆరుగురు అవినీతి అధికారుల వివరాల సేకరణలో ఏసీబీ దూకుడుగా ఉన్నట్టుగా సమాచారం. నాగరాజుపై దాడి చేయడానికి గాను 72 గంటల పాటు ఏసీబీ అధికారులు గూడెంలో మకాం వేసి, రెడ్ హ్యాండెడ్గా ఎస్సైను, కానిస్టేబుల్ను పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. పట్టణ పోలీస్ స్టేషన్ కొన్ని సంవత్సరాలుగా వార్తల్లో ఉంది. ఇక్కడ రాష్ట్రంలో ఒక పోలీసు ఉన్నతాధికారికి బంధువుగా ఉన్న సిబ్బంది ఒకరి నేతృత్వంలోనే వ్యవహారాలు సాగినట్టు కలరింగ్ ఇచ్చారు. అధికారుల బదిలీలు, చేర్పులు, మార్పుల నేపథ్యంలో ఒక వ్యక్తిని హోల్డ్లో ఉంచినట్టుగా తెలుస్తోంది. శ్రీచైతన్యశ్రీవంతుడైన వసూలుదారుడు ఒకరు ఇద్దరు అధికారులకు కలెక్షన్ ఏజెంట్గా వ్యవహరించినట్టుగా బాహాటంగానే చెబుతున్నారు. వాస్తవానికి గురువారం జరిగిన ఏసీబీ దాడిలో కలెక్షన్ ఏజెంట్ బుక్ కావాల్సి ఉండగా, ట్రాప్లో బాలకృష్ణ పడినట్టు సమాచారం. మున్సిపాలిటీలో సర్వేయర్ను ట్రాప్ చేసి వాయిస్ రికార్డింగ్ ఆధారంగా మాత్రమే అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. తర్వాత కొందరి పోద్బలంతో జరిగిన ట్రాప్ అని తేలింది. తాజా ఉదంతంలో కూడా ప్రేమజంట వ్యవహారంలో ఎస్ఐ వాయిస్ రికార్డింగ్ క్రియాశీలక భూమిక పోషించినట్టుగా తెలుస్తోంది. పట్టణంలో ఒక వ్యాపారికి సంబంధించి కుటుంబ వ్యవహారంలో వరకట్న వేధింపుల కేసును కాస్తా, హత్యాయత్నం కేసుగా నమోదు చేయించేందుకు గాను ఒక ప్రజాసంఘ నేత ద్వారా పట్టణ పోలీసులు కొందరితో సంప్రదింపులు సాగించినట్టుగా తెలుస్తోంది. హిట్ జాబితాలో ఆరుగురు అధికారులునియోజకవర్గంలో ఒక రెవెన్యూ అధికారి అక్రమ రేషన్ వ్యవహారంలో చురుగ్గా ఉన్నట్టు, ఈ క్రమంలో ఫొటోగ్రాఫర్ నేనున్నా, ఎవ్వరు నిన్ను టచ్ చేస్తారో నే చూసుకుంటా అనే భరోసా ఇచ్చినట్లు సమాచారం. వారసత్వపు ఆస్తులు, మాస్టర్ప్లాన్లు, టీడీఆర్ బాండ్లు వంటి విషయాలలో ముగ్గురు మున్సిపాలిటీ అధికారుల వ్యవహార శైలి, తదనంతర వ్యవహారాలపై ఏసీబీకి సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకరు సామాజిక కార్డు బలంతో నెట్టుకొస్తున్నట్టు ప్రచారం ఉంది. ఇంకొకరు సైలెంట్గా వ్యవహారాలు జరపడంలో నిష్ణాతుడంటున్నారు. ఇలాంటి ఆరుగురు వ్యక్తులకు చెందిన సమాచార సేకరణలో ఏసీబీ అధికారులు ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. -
గోదావరి జిల్లాల ప్రజల ఆరాధ్యుడు కాటన్
భీమవరం: గోదావరి జిల్లాల ప్రజల ఆరాధ్యుడు, అపర భగీరథుడు సర్ ఆర్ధర్ కాటన్ అని పలువురు వక్తలన్నారు. శ్రీవిజ్ఞానవేదిక, రైతు కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో భీమవరం పట్టణం జువ్వలపాలెం రోడ్డులోని కాటన్ విగ్రహం వద్ద శుక్రవారం కాటన్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళిలర్పించారు. రైతు కార్యాచరణ సమితి నాయకులు పాతపాటి మురళీకృష్ణంరాజు, కలిదిండి గోపాలకృష్ణంరాజు, కోళ్ల సీతారామ్, పి.రామకృష్ణంరాజు(పార్క్రాజు) మాట్లాడుతూ ధవళేశ్వరంలో ఆనకట్ట నిర్మించి ఉభయగోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు కాటన్ అని కొనియాడారు. చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు మాట్లాడుతూ తరాలు మారినా గోదారి గుండె చప్పుడు కాటన్ దొరేనని గోదావరి జిల్లాల వాసుల గుండెల్లో మాత్రం కాటన్ గుండె చప్పుడు ఎప్పుడూ వినిపిస్తాయన్నారు. కార్యక్రమంలో కె.కృష్ణంరాజు, టీవీవీ ప్రసాద్, భట్టిప్రోలు శ్రీనివాసరావు, గంటా సుందరకుమార్, ఎస్.సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఈఏపీసెట్ పరీక్ష
భీమవరం: భీమవరం పట్టణంలోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం నిర్వహించిన పరీక్షకు 150 మందికి 143 మంది విద్యార్దులు హాజరుకాగా మధ్యాహ్నం పరీక్షకు 150 మందికి 144 మంది హాజరయ్యారు. విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో రెండు షిప్ట్స్లో 220 మంది విద్యార్థులకు 211 మంది, డీఎన్నార్ అటానమస్ కళాశాల సెంటర్లో 200 మందికి 194, ఇంజనీరింగ్ కళాశాల సెంటర్లో 200 మందికి 193 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏలూరు జిల్లాలో 787 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు శుక్రవారం నగరంలో ప్రశాంతంగా జరిగాయి. ఏలూరులోని మూడు పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం షిప్టుల్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 787 మంది హాజరయ్యారు. ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో మధ్యాహ్నం షిప్ట్నకు 120 మందికి గాను 116 మంది హాజరు కాగా ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 170 మందికి 163 మంది, మధ్యాహ్నం 170 మందికి 161 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 180 మందికి 176 మంది హాజరు కాగా మధ్యాహ్నం 180 మందికి 171 మంది హాజరయ్యారు. వీరవాసరం: వైఎస్సార్సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శిగా వీరవాసరానికి చెందిన మద్దాల అప్పారావును నియమించినట్లు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ సందర్భంగా మద్దాల అప్పారావు మాట్లాడుతూ పార్టీ పురోభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శిగా నియమించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, పార్టీ ముఖ్య నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పెనుగొండ: ఆచంట బాలంవారిపాలెంలోని పీ4 భవనంలో శుక్రవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి 238 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేక పీజీఆర్ఎస్కు జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శశ్రద్ధ చూపాలన్నారు. అర్జీలపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలతో వచ్చే సమావేశానికి హజరు కావాలని సూచించారు. ఆచంట మండలం నుంచి 129, పెనుమంట్ర మండలం నుంచి 28, పోడూరు మండలం నుంచి 17, పెనుగొండ మండలం నుంచి 64 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఆర్డీవో దాసిరాజు, డ్వామా పీడీ డాక్టర్ సీహెచ్ అప్పారావు, డీఆర్డీఏ పీడీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): జిల్లాలో బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా 5,965 మంది బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించామని కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్కు తెలిపారు. బడి పిలుస్తోంది, ఎన్రోల్మెంట్ డ్రైవ్ పై కలెక్టర్లతో విద్యా శాఖ కార్యదర్శి శనివారం జూమ్ కాన్ఫరెన్న్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కోన శశిధర్ మాట్లాడుతూ అంగన్వాడీలలో ప్రీ స్కూల్లో ఉన్న పిల్లలను మొదటి తరగతిలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని, బడి మానివేసిన వారిని తిరిగి బడులలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీలలో ప్రీ స్కూల్ చదువుతున్న వారిలో 11,200 మంది పిల్లలను మొదటి తరగతిలో చేర్పించేందుకు లక్ష్యం కాగా, ఇంతవరకు 5,965 మందిని బడులలో చేర్పించామని, మిగిలిన వారిని కూడా త్వరలో ప్రభుత్వ బడులలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
అక్రమంగా మట్టి తవ్వకాలు
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం పంచారామ క్షేత్రానికి చెందిన గునుపూడి టిడ్కో ఇళ్ల సమీపంలోని వ్యవసాయ భూమిలో కొందరు అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తుండగా భక్తులు గమనించి పంచారామ క్షేత్ర అధికారులకు తెలియజేశారు. శుక్రవారం ఆలయ ఈఓ కృష్ణంరాజు, ఆలయ అధికారులు అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. వారి ఫిర్యాదుతో రెవెన్యూ, పోలీస్ శాఖాధికారులు మట్టి తవ్వుతున్న జేసీబీ, మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనుమతులు లేకుండా దేవస్థానం భూమిలో మట్టి తవ్వకాలకు సిద్ధపడడంపై అటు భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు (టూటౌన్): యుద్ధ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ఇందన వనరుల వినియోగంలో పొదుపు పాటించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్లో శుక్రవారం మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరతా లేదని, సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలను నమ్మి ప్రజలు ఆందోళనకు గురికావద్దన్నారు. రబీ ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. -
కోకో గింజల ధర పెంచాలి
దెందులూరు: అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన కోకో గింజల ధరకు అనుగుణంగా రైతుల కోకో గింజలకు ధర పెంచాలని, విదేశీ కోకో గింజల దిగుమతులు వెంటనే నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం పెదవేగి మండలం విజయరాయి గాంధీనగర్ సీతారామ కల్యాణమండపంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కోకో రైతుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో కోకో రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ మాట్లాడుతూ అన్సీజన్ వర్షాకాలపు గింజలకు కిలోకు రూ.350 ధర ఇచ్చి కంపెనీలు కొనుగోలు చేశాయని, అత్యంత నాణ్యత కలిగిన సీజన్ గింజలకు ప్రస్తుతం కంపెనీలు కిలోకు రూ.300 మాత్రమే ధర ఇస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కిలో గింజలకు రూ.400 ఉందని, దిగుమతి సుంకాలతో అధర రూ.600 పైగా ఉంటుందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ ధర తగ్గినప్పుడు కోకో గింజలకు ధర తగ్గించిన కంపెనీలు పెరిగినప్పుడు ఎందుకు పెంచడం లేదు? అని ప్రశ్నించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏమీ మాట్లాడకపోవడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కోకో రైతుల సంఘం, కోకో రైతులు, ఆయా కంపెనీల ప్రతినిధులతో జాయింట్ సమావేశం వెంటనే జరిపి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా కోకో గింజలకు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి అచ్యుతరామయ్య (అశోక్), రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదిబండి వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కోనేరు సతీష్ బాబు,కూసం రామిరెడ్డి, ఆలపాటి శ్రీనివాసరావు, ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షుడు మున్నంగి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేలసారాన్ని కాపాడుకోవాలి
తాడేపల్లిగూడెం : నేలసారాన్ని కాపాడుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చని కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ దేవీవరప్రసాదరెడ్డి అన్నారు. వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో నాణ్యమైన చేప పిల్లల ఉత్పత్తి పద్ధతులు, నర్సరీల నిర్వహణ, సంరక్షణ పద్ధతులపై రైతులకు వివరించారు. సమతుల్య ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రతిరైతూ తమ నేలను పరిరక్షించుకోవాలని, దాని ఆధారంగానే ఎరువులను వాడుకోవాలన్నారు. ఎరువుల ఖర్చును తగ్గించుకొని భూసారం పెంచుకోవాలన్నారు. రసాయనిక ఎరువుల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు జీవ ఎరువులు, సూక్ష్మ జీవుల వాడకం, వర్మి కంపోస్టు పద్ధతులపై విశదీకరించారు. నాణ్యమైన చేప పిల్లల ఎంపిక, ఉత్పత్తి పద్ధతులు తల్లి చేపల ఎంపిక, అఽఽధిక దిగుబడులు సాధించడం గురించి తెలిపారు. వ్యాధులులేని అధిక దిగుబడినిచ్చే రోహు, కట్ల, మృగల, గ్రాస్ కార్ప్,సిల్వర్ కార్ప్ చేపల ఎంపిక గురించి వివరించారు. హార్మోన్ ఇంజక్షన్లు, నర్సరీల నిర్వహణ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖాధికారి రాజ్కుమార్, జిల్లా సహకార సంఘం అధ్యక్షులు వసంత్ రావులు పాల్గొన్నారు. -
వేసవి తాపం.. చేపకు శాపం
● వాతావరణంలో మార్పులతో కొట్టుకుంటున్న మత్స్యం ● చెరువుల వద్దే పడిగాపులు కాస్తున్న ఆక్వా రైతులు భీమవరం అర్బన్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఆక్వా రంగం ప్రస్తుతం వాతావరణ మార్పులతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఆక్వా రైతులు చెరువుల్లో చేపలను రక్షించేందుకు ఇంజిన్ బోట్లు, ఏరియేటర్లు తిప్పుతూ మరికొన్ని చోట్ల ఆక్సిజన్ ట్యాబ్లెట్లు వినియోగిస్తున్నారు. చేపలను రక్షించుకునేందుకు రైతులు రాత్రులు, పగలు తేడా లేకుండా చెరువుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో భీమవరం, ఉండి, నరసాపురం, మొగల్తూరు, ఆచంట, పాలకొల్లు, కాళ్ల తదితర మండలాల్లో సుమారు లక్షా 40 వేల ఎకరాల్లో శీలావతి, కట్ల, ఫంగస్, రూప్చంద్, తిలాఫీ, గడ్డిచేప తదితర సప్పనీటి చేపలను పెంచుతున్నారు. చేపల పెంపకంలో నష్టాలు తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది రైతులు వాటిని పెంచేందుకు మొగ్గు చూపిస్తున్నారు. రోజుకు సుమారు 1000 టన్నుల పైగా చేపలు కోల్కత్తా, బెంగాల్, మహారాష్ట్ర, ఒడిస్సా తదితర ప్రాంతాలకు ఎగుమతులు అవుతూ ఉంటాయి. దీంతో కోట్లాది రూపాయలు విదేశీ మారకద్రవ్యం జిల్లాకు చేరుకుంటుంది. దినదిన గండం గతేడాది కంటే ఈ ఏడాది ప్రారంభంలోనే ఎండలు ఎక్కువగా ఉండటంతో చేపలు చెరువుల్లోని నీరు ఇంకిపోయి ఉప్పుశాతం పెరిగిపోతుందని రైతులు వాపోతున్నారు. గత మూడు వారాలుగా వడగాల్పులు కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ఆక్సిజన్ శాతంలో హెచ్చుతగ్గులు ఏర్పడడంతో చేపలు ఉపరితలంపై అసహనంగా ఈదుతున్నాయి. దీంతో వాటికి తాటాకు తెగులు, మొప్ప తెగులు, పేను పట్టడం వంటి వ్యాధులతో మృత్యువాత పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. వేసవిలో సాధారణంగా ఉప్పు శాతం నాలుగుపైగా ఉంటే చేపలు ఒక్కొక్క సారి హఠాత్తుగా మృత్యువాత పడడంమే కాకుండా ఎదుగుదల మందగిస్తుందని రైతులు చెబుతున్నారు. వేసవి అంటేనే చేపకు గడ్డు కాలం ఫిబ్రవరి నుంచి పంట కాలువల ద్వారా వచ్చే సాగునీరు వంతుల వారీ విధానంతో చేపలు చెరువులకు నీళ్లు పెట్టడానికి ఆస్కారం తక్కువ ఉండటంతో జూలై నెల వరకు వేసవి తాపానికి తట్టుకుని చెరువులో చేపలు బతికితేనే రైతుకు పెట్టుబడులు వస్తాయని లేకుంటే నష్టాలే మిగులుతాయని రైతులు చెబుతున్నారు. చేపలు చెరువు సాగు చేసే రైతులు ప్రతి వారానికి ఒకసారి నీటిని నింపడంతో పీహెచ్, అమ్మోనియా, నైట్రేట్ తదితర క్షార గుణాలు అదుపులో ఉంటాయి. సుమారు 4 నెలలు సప్పనీరు లేకపోవడంతో నీటిలో ఉన్న క్షారగుణాల్లో మార్పులు వచ్చి చేపలు మృత్యువాత పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. నీటి పరమాణువులను అదుపులోకి తీసుకువచ్చేందుకు రసాయనిక మందులు, ఎరువులు వాడాల్సి వస్తుంది. చేపలు పెంపకంపై ఆధారపడ్డ సన్నచిన్న కారు రైతులు వాతావరణ మార్పులతో కుదేలవుతున్నారు. ఎండలు వల్ల చెరువులో నీటి వేడిమికి తట్టుకోలేక మృత్యుపడతున్నాయని దీంతో ఏటా తీవ్ర నష్టాలు చవి చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎకరం చేపల సాగు చేసేందుకు సుమారు రూ.2 లక్షలు వరకు ఖర్చు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. చేపల సాగు చేయాలంటే 15 ఎకరాలు పైగా చేపలు చెరువు ఉండాలని వెల్లడిస్తున్నారు. చేపలకు మేతలుగా డీఓపీ తవుడు, చెక్క, పత్తిపిండి, పిల్లేట్స్ వేస్తుంటారు. చేపకు పెట్టే మేతను బట్టీ 6 నుంచి 9 నెలల్లో కేజీ చేప తయారవుతుందని చెబుతున్నారు. చేప ఎదుగుదల మందగిస్తే చివరకు అప్పులు మిగులుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడ్డు పరిస్థితుల్లో ఉన్న ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. వాతావరణంలో మార్పులు కారణంగా ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు చేయించుకుని వాటికి అనుగుణంగా మందులు వినియోగించాల్సి వస్తుంది. దీంతో పెట్టుబడులు ఎక్కువతున్నాయి. ప్రతి రోజు చెరువు వద్దే ఉండి పరిశీలించాల్సి వస్తుంది. – ఆర్ బాలకృష్ణ, ఆక్వా రైతు, దొంగపిండి నేను రెండు ఎకరాల్లో చేపల సాగు చేస్తున్నాను. అయితే ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండడంతో చేపలు మృత్యువాత పడుతుండడంతో పట్టుబడికి రాకముందే పట్టేశాను. దీంతో ఈ ఏడాది నష్టాలు ఎదురయ్యాయి. – వాటాల విజయకృష్ణ, ఆక్వా రైతు, నాగేంద్రపురం -
కువైట్లో చిక్కుకున్న కలిదిండి మహిళ
కలిదిండి(కై కలూరు): ఇద్దరు ఆడ పిల్లలకు తల్లి ప్రేమ కరువైందని కువైట్లో చిక్కుకున్న తన భార్యను ప్రభుత్వం చొరవ తీసుకుని తిరిగి పంపించే ఏర్పాట్లు చేయాలని కలిదిండి మండలం కలిదిండి ఇందిరా కాలనీకి చెందిన బండి వెంకన్న వేడుకుంటున్నాడు. వెంకన్న భార్య ప్రశాంతి పొట్టకూటి కోసం మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లిది. ఆమె కువైట్లో ఉండగానే ప్రశాంతి తల్లిదండ్రులు మరణించిన కడచూపుకు నోచుకోలేకపోయింది. బిడ్డల కోసం తిరిగి భారత్ రావడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కడం లేదు. అసలేం జరిగిందంటే..? ప్రశాంతి ఓ కాంట్రాక్టరు ద్వారా మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లింది. రెండేళ్లు ఎగ్రిమెంటుపై కువైట్లో ఓ కుటుంబంలో పనికి కుదిరింది. ప్రతినెలా డబ్బులు కలిదిండిలో భర్త వెంకన్నకు పంపుతోంది. రెండేళ్లు పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తానని ఆమె యజమానులను కోరితే అందుకు నిరాకరించారు. పాస్పోర్టు ఇవ్వలేదు కానీ, తిరిగి ప్రశాంతిపై దొంగతనం నెపం ఆరోపించారు. చివరకు కువైట్ పోలీసులు విచారణ చేసి ప్రశాంతి తప్పు లేదని తేల్చారు. ప్రస్తుతం ఆమెకు భారత్ ఎంబసీలో ఆశ్రయం కల్పించారు. ఇదిలా ఉంటే దక్షిణాసియాలో యుద్ధం కారణంగా ఆమె ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయని తన భార్యను ఇండియాకు పంపించేలా చర్యలు తీసుకోవాలని భర్త వెంకన్న కోరుతున్నాడు. -
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
వీరవాసరం : మండలంలో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మండలంలోని మత్స్యపురి, బొబ్బనపల్లి, కొణితివాడ తదితర గ్రామాల్లో మట్టి తవ్వకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. వరి చేలలో మట్టిని తరలించుకోవాలంటే సీనరీజ్ను అందజేసి రెవెన్యూ అధికారులకు తెలియజేయాలి. ప్రభుత్వ అనుమతులు తీసుకుని మట్టిని తవ్వుకొని పనులు పూర్తి చేసుకోవాలి. అయితే అలాంటి పనులేమీ కట్టకుండానే సీనరీజిల్ని పన్నులను కట్టకుండానే స్థానిక గ్రామ రెవెన్యూ అధికారులను, రెవెన్యూ సిబ్బందిని మచ్చిక చేసుకుని మట్టి తవ్వకాలను పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. మట్టి ట్రాక్టర్లపై ఎలాంటి బరకాలను కప్పకపోవడంతో ఆ మట్టి రోడ్డుపై పడి ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరుతున్నారు. అయితే మట్టి తవ్వకాలపై తహసీల్దార్ ఏవీ రామాంజనేయులును వివరణ కోరగా మండలంలో మట్టి తవ్వకాలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఎవరైనా మట్టి తరలిస్తే పొక్లెయిన్లను, ట్రాక్టర్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
రొయ్య మేత.. రైతుకు వ్యథ
వేసవి తాపం.. చేపకు శాపం ఆక్వా రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఎండలు ఎక్కువగా ఉండడంతో చెరువుల్లో చేపలను రక్షించేందుకు ఆక్వా రైతులు నానా పాట్లు పడుతున్నారు. 8లో uశురకవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2026భీమవరం: దేశానికి విదేశీమారక ద్రవ్యం తెచ్చిపెడుతున్న ఆక్వా రంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. కంపెనీ యజమానులు ఆక్వా ఫీడ్ ధరలు దారుణంగా పెంచడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం కంటితుడుపు చర్యలు తీసుకోవడంపై రైతులు మండిపడుతున్నారు. ఒక పక్క ఆక్వా ఫీడ్ ధరలు భగ్గుమంటున్నాయని గగ్గోలు పెడుతుంటే.. ధరల పెంపును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడాన్ని రైతులు తీవ్రంగా తప్పపడుతున్నారు. ఇప్పటికే మొన్నటివరకు విద్యుత్ కోతలు, డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు మూలిగేనక్కపై తాడిపండు పడినట్లు ఒక్కసారిగా క్వింటాళ్ల రొయ్యల మేతను రూ.16 వేలు పెంచేశారు. దీనిని పూర్తిగా అడ్డుకోవాల్సిన ప్రభుత్వం కంపెనీ యజమానులతో మాట్లాడతామంటూ చేస్తున్న సన్నాయినొక్కులు ఎవరి కోసమంటూ ప్రశ్నిస్తున్నారు. 1.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు వ్యవసాయమే జీవనాధరమైన జిల్లాలో గత కొన్నేళ్లుగా రొయ్యలు, చేపల సాగుతో ఇక్కడి జీవన పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆక్వా సాగు రైతులు, కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుండగా లక్షలాది మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో ముందుగా తీరప్రాంతమైన నరసాపురం, భీమవరం నియోజకవర్గాల పరిధిలో ప్రారంభమైన రొయ్యలు, చేపల సాగు ప్రస్తుతం అన్ని నియోజకవర్గాలకు విస్తరించింది. దాదాపు 1.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా దానిలో సుమారు 90 వేల ఎకరాల్లో రొయ్యల సాగే. ప్రతి ఏటా మూడు పంటలు పండిస్తున్న రొయ్యల రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ, సహకారాలు లభించకపోవడంతో క్రాప్ హాలీడే ప్రకటించాలనే నిర్ణయానికి వస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు భారీగా పెరగడం, ఽరొయ్యల ధరలు నిలకడగా లేకపోవడంతో రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. 2024 ఎన్నికల సమయంలో రైతులందరికీ ఆక్వా జోన్తో సంబంధం లేకుండా యూనిట్ విద్యుత్ రూ.1.50 ఇస్తామని ప్రకటించిన కూటమి నాయకులు అందలమెక్కి రెండేళ్లు కావస్తున్నా సబ్సిడీ విద్యుత్ మాట ఎత్తకపోవడం పట్ల మండిపడుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో అప్సడా ఏర్పాటుచేసి రొయ్యల ధరలు నిలకడ, ఫీడ్, సీడ్ ధరలపై నియంత్రణ ఏర్పాటుచేసి రైతులకు అండగా నిలవగా నేటి చంద్రబాబు ప్రభుత్వం ఆక్వా రైతులను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఫీడ్ ధరల పెంపుతో రైతులపై దాదాపుగా రూ.400 కోట్లు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఽఫీడ్ ధరల పెంపుతో ఆందోళన బాట పట్టడానికి రైతులు సంసిద్ధం అవుతుండగా వారికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ప్రకటిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్ల కాలంలో రొయ్యల మేత ధర టన్నుకు దాదాపు రూ.40 వేలు పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో టన్ను ఫీడ్ ధర రూ.70 వేలు నుంచి రూ.80 వేలు ఉంటే, నేడు టన్ను రూ.1.22 లక్షల వరకు పెరిగిందని, అయితే రొయ్యల ధర మాత్రం 100 కౌంట్ రూ.240 కంటే తక్కువగానే ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల్లోనే టన్ను రొయ్యల మేత దాదాపు రూ.16 వేలు పెరగడంతో ఆందోళన చెందుతున్న రైతులకు పూర్తిస్థాయిలో ఊరట కలిగించకపోగా తాత్కాలిక తగ్గింపు అంటూ వ్యవసాయశాఖామంతి అచ్చెన్నాయుడు ప్రకటించడాన్ని తీవ్రంగా మండిపడుతున్నారు. రొయ్యల మేత తయారీ ముడిసరుకు ధరలు పెరగకపోయినా ఫీడ్ ధరలు పెంచడాన్ని ప్రభుత్వం సమర్థించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా ఫీడ్ ధరలపై ఆందోళన ధరల తాత్కాలిక తగ్గింపుపై మండిపాటు పెంచిన ధరలు తగ్గించాలంటూ డిమాండ్ రెండేళ్లలో టన్నుకు దాదాపు రూ.40 వేలు పెంపు రొయ్యల ధరలు మాత్రం 100 కౌంట్ రూ.240 లోపే జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు పెరిగిన ఫీడ్ ధరతో రైతులపై రూ.400 కోట్ల భారం రైతులకు అండగా వైఎస్సార్సీపీ పోరుబాటకు సిద్ధం -
ఉచిత న్యాయ సహాయం
ఏలూరు (టూటౌన్): అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందజేయనున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యన్.శ్రీలక్ష్మి తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యన్.శ్రీలక్ష్మి శనివారపుపేటలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని, శ్రీరామనగర్ ఆరవరోడ్డులోని సైనిక వెల్ఫేరు ఆఫీసు నందు ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్ను, జిల్లా కారాగారాన్ని గురువారం సందర్శించారు. శనివారపుపేటలోని బాలుర వసతి గృహంలో బాలలకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, మంచినీటి సౌకర్యం, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అలాగే అబ్జర్వేషన్ హోమ్లోని బాలలకు ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. తదనంతరం శ్రీరామనగర్ 6వ రోడ్డులోని సైనిక సంక్షేమ కార్యాలయము నందు ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినికల్ను సందర్శించి, క్లినిక్ పనితీరు మాజీ సైనికులకు అందుతున్న న్యాయ సహాయంపై అడిగి తెలుసుకున్నారు. అలాగే జిల్లా కారాగారంలోని ఖైదీలకు అందుతున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ చెస్ పోటీల్లో ప్రతిభ
టి.నరసాపురం: అంతర్జాతీయస్థాయి చదరంగం పోటీల్లో చిన్న గుర్వాయిగూడెం మోడల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థి గుడికందుల చిరన్వి బాలికల అండర్–7 విభాగంలో ద్వితీయ స్థానం సాధించినట్లు విద్యాశాఖాధికారులు టి.రామ్మూర్తి, ఎస్.కళ్యాణిలు తెలిపారు. ఈ మేరకు స్థానిక పాఠశాలలో గురువారం అభినందన సభ నిర్వహించారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్, ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత నెల 26న విజయవాడ నగరంలో కానూరులోని స్కాట్ స్పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ పిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్–2026లో చిరన్వి ప్రతిభ చూపిందన్నారు. హెచ్ఎం టి.కన్నయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: హనుమద్ జయంతి మహోత్సవాలల సందర్భముగా గురవాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం విశేష పూజలు నిర్వహించారు. ఉపాలయంలో వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణాన్ని సామూహికంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాష్ట్రంలో పలు ఆలయాలకు చెందిన వేద పండితులతో చతుర్వేదస్వస్తి పారాయణలు చేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ఆర్వీ చందన తెలిపారు. శుక్రవారం ఆలయంలో హనుమద్ వ్రతం, మహాశాంతి హోమం నిర్వహిస్తామన్నారు. -
వైభవంగా శ్రీచక్రస్నానం, మహా పూర్ణాహుతి
జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు గురువారం నిత్య హోమం, వసంతోత్సవం, శ్రీచక్రస్నానం, మహా పూర్ణాహుతి వైభవంగా నిర్వహించారు. రాత్రి గజవాహన సేవ, ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ యాజమాన్యం వల్లభనేని శ్రీనివాసరావు, ప్రసన్నలక్ష్మి దంపతులు, కోటపోతుల బాబి, కోటపోతుల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. పండితులు పోనంగి పవన్కుమార్ ఆచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు, ఋషికేశ్ ఆచార్యులు వైదిక కార్యక్రమాలు చేశారు. శుక్రవారం ధ్రువమూర్తికి పంచామృత అభిషేకం, నవకల స్నపనం, ద్వాదశ ఆరాధన, ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీ పుష్పయాగం నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాలను ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఈఓ కలగర శ్రీనివాస్ పర్యవేక్షించారు. -
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
వీరవాసరం మండలంలో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పన్నులను కట్టకుండానే అధికారులను మచ్చిక చేసుకుని మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. 8లో uదేశానికి విదేశీమారక ద్రవ్యం తెచ్చిపెడుతున్న ఆక్వా రంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూడడం దారుణం. ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఒక్కసారిగా ఫీడ్ ధరలు టన్నుకు రూ.16 వేలు పెంచేశారు. ఫీడ్ తయారీ ముడిసరుకు ధరలు తగ్గిన సమయంలో ఫీడ్ ధరలు తగ్గాల్సి ఉండగా మరింత పెంచారు. ప్రభుత్వం చర్యలు తీసుకుని వెంటనే పెంచిన ధరలు పూర్తిగా తగ్గించాలి. – గాదిరాజు వెంకట సుబ్బరాజు (కేజీఎఫ్), వెస్ట్గోదావరి ప్రాన్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ కార్యదర్శి, భీమవరం ఆక్వా ఫీడ్ ధరలు దారుణంగా పెంచారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా పెంచిన ధరలను పూర్తిగా తగ్గించాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, ధరల్లో నిలకడ లేకపోవడంతో ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం పూర్తిగా రైతులకు అండగా ఉండాల్సిన తరుణంలో ఫీడ్ ధరలు భారీగా పెంచడం దారుణం. పెంచిన ధరలను పూర్తిగా తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – భోగిరెడ్డి శ్రీనివాసరావు, ఆక్వా రైతు, తోలేరు, వీరవాసరం మండలం -
గిరిజనాభివృద్ధికి గ్రహణం
బుట్టాయగూడెం: కూటమి ప్రభుత్వం గిరిజనాభివృద్ధిని గాలికి వదిలేసింది. సమస్యల పరిష్కారానికి వేదిక కావల్సిన కోటరామచంద్రపురం (కేఆర్పురం) ఐటీడీఏ పాలకవర్గ సమావేశం రెండున్నర సంవత్సరాలుగా నిర్వహించకపోవడంపై గిరిజన ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన పాలకవర్గ సమావేశం రెండున్న సంవత్సరాలుగా నిర్వహించలేదు. గిరిజన సంక్షేమ పథకాల అమలు తీరు, గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, వార్షిక బడ్జెట్ రాబడులు, వ్యయాలపై సమీక్షకు పాలక వర్గ సమావేశం ఎంతో కీలకమైనది. అంత ప్రాముఖ్యత ఉన్న ఈ సమావేశం నిర్వహణ గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారని గిరిజన సంఘ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పట్టించుకునే వారే లేరు కేఆర్పురం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం 2023 ఆగస్టు 30న నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ సమీక్ష సమావేశం నిర్వహణకు సంబంధించి ఎవ్వరూ పట్టించుకోలేదు. గిరిజన గ్రామాల్లో అనేక సమస్యలు నెలకొన్నాయని గిరిజనులు చెబుతున్నారు. గిరిజన గ్రామాలకు సరైన రహదారులు లేక గిరిపుత్రులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. అలాగే పోడుభూములకు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకునే వారే లేరని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఐటీడీఏ ద్వారా నిర్వహిస్తున్న పాఠశాలల్లో కొత్తగా వస్తున్న విద్యా విధానంతో అనేక మంది గిరిజన విద్యార్థులు డ్రాప్ అవుట్స్గా మారే అవకాశం ఉందని గిరిజన సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇలా అనేక సమస్యల పరిష్కారానికి పాలకవర్గ సమావేశం వేదికగా ఉంటుంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. దీనిపై ఐటీడీఏ పీఓ రాములు నాయక్ను వివరణ కోరగా త్వరలోనే పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. రెండున్నరేళ్లుగా నోచుకోని ఐటీడీఏ పాలకవర్గ సమావేశం గిరిజన ప్రాంతంలో ఎక్కడి సమస్యలు అక్కడే తక్షణమే సమీక్ష ఏర్పాటు చేయాలని గిరిజన సంఘాల డిమాండ్ -
ఆక్వా రైతులకు అండగా వైఎస్సార్ సీపీ
కాళ్ల: ఆక్వా రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం సాగిస్తుందని ఆ పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నరసింహరాజ అన్నారు. పెదఅమిరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రొయ్య మేత ధరలు కిలోకి రూ.10 పైన ఒకేసారి పెంచడం వల్ల ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో రొయ్య మేత ధర పెంచాలంటే ఆక్వా అధారిటీ కమిటీ ఏర్పాటు చేసి రైతులతో, ఆక్వా ఫీడ్ తయారుదారులతో మాట్లాడి అందరి అనుమతితో ఒక నిర్ణయం తీసుకునేవారని చెప్పారు. జగన్ పాలనలో ఐదేళ్లలో ఇంత పెద్ద ఎత్తున రేట్లు పెరగటం ఎప్పుడు జరగలేదని గుర్తు చేశారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో కూడా రొయ్య ధరలు తగ్గినప్పుడు రొయ్య ఎగుమతిదారులతో మాట్లాడి ఆక్వా రైతులకు మద్దతు ధర కల్పించేలా కృషి చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు కరెంట్ సబ్సిడీ ఇస్తామని, ఆక్వా రైతులను ఆదుకుంటామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు రైతులను నట్టేట ముంచుతుందని అసహనం వ్యక్తం చేశారు. ఉండి నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఆక్వాకల్చర్ సాగవుతుందన్నారు. డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామ కృష్ణంరాజు రైతులపై దృష్టి పెట్టి గుళ్లు, మైకులు సమస్యలపై కాకుండా కాకుండా రొయ్య మేత ధరల పరిస్థితిపై మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యమంత్రితో మాట్లాడి ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేనిపక్షంలో వైఎస్సార్ సీపీ ఆక్వా రైతుల పక్షాన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పెన్మెత్స దుర్గాప్రసాద్రాజు, ఆకివీడు జెడ్పీటీసీ వేగేశ్న వెంకటరాజు, ఆకివీడు రైతులు పెన్మెత్స ఆంజనేయరాజు, రాజేష్, నాయకులు అంబటి రమేష్, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నరసింహరాజు -
అంగన్వాడీల పదోన్నతుల్లో అన్యాయం
భీమవరం: అంగన్వాడీ పదోన్నతుల విషయంలో అవకతవకలు జరిగాయని, కొన్ని ప్రాంతాల్లో రాజకీయ ఒత్తిడిలు పనిచేస్తున్నాయని, దీనిపై వెంటనే విచారణ జరపాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి డి కళ్యాణి గురువారం డీఆర్వో శ్రీమన్నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. హెల్పర్లకు పదోన్నతి విషయంలో అనేక పోరాటాలు చేసి జీవోలు సాధించుకున్నా అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదోన్నతుల్లో విషయంలో అధికారులు సైతం అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపించేంత వరకు పోస్టుల భర్తీని పెండింగ్లో పెట్టాలని కోరారు. ఆమె వెంట కె జాన్సీలక్ష్మి, ఎండీ హసీనా బేగం ఉన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో వివిధ రంగాల నుంచి రావాల్సిన వాణిజ్య పన్నుల వసూళ్ల లక్ష్య సాధనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. గురువారం వశిష్ట సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు నిర్ధేశించిన రూ.485 కోట్ల లక్ష్యానికిగాను 85.41 శాతం వసూళ్లు సాధించామని, వృత్తి పన్ను వసూళ్లలో 86.72 శాతం సాధనతో రాష్ట్రంలో జిల్లా తొమ్మిదో స్థానంలో నిలిచిందని కలెక్టర్ తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు రూ.543.02 కోట్ల వాణిజ్య పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించగా ఇంకా వృత్తి పన్ను ద్వారా రూ.16.65 కోట్లు, ఇతర బకాయిల ద్వారా రూ.40.61 కోట్లు, వ్యాట్ పాత చలాన్ల ద్వారా రూ.35.42 కోట్ల వసూళ్ల లక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ బి.నాగార్జున రావు, డిప్యూటీ కమిషనర్ కేపీ శైలజశ్రీ, సహాయ కమిషనర్లు డి.సాంబశివరావు, ఏవీ శ్రీనివాస్, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జీ పిచ్చయ్య, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ ఏ.నాగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ దరఖాస్తులపై సమీక్ష పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో అర్జీదారులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేలా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. గురువారం పలువురు అర్జీదారులతో ఆమె ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యల పరిష్కార స్థాయిని సమీక్షించారు. నూతన వీసీ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు నూజివీడు: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీల పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలలో నాణ్యమైన సాంకేతిక విద్యను అందించేందుకు మరింత కృషి చేస్తానని వైస్ ఛాన్సలర్ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు పేర్కొన్నారు. వీసీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా నూజివీడు ట్రిపుల్ఐటీకి విచ్చేసిన ఆయన గురువారం విలేకర్లతో మాట్లాడారు. పదో తరగతి పూర్తయిన వెంటనే విద్యార్థులు ట్రిపుల్ ఐటీల్లోని ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సులో జాయిన్ అవుతున్నారని, వారిని దేశానికి ఉపయోగపడే భావిభారత ఇంజినీర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తన 26 ఏళ్ల అధ్యాపక బోధన అనుభవంతో ట్రిపుల్ ఐటీల్లో సంస్కరణలను తీసుకువచ్చి మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్తానన్నారు. విద్యార్థుల భవిష్యత్కు ఉపయోగపడే నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా బోధన సాగేలా చర్యలు చేపడతామన్నారు. బోధన, బోధనేతర సిబ్బంది సహకారంతో ఆర్జీయూకేటీ పేరు ప్రతిష్టలు మరింత ఇనుమడించేలా పనిచేస్తామన్నారు. వైస్ఛాన్సలర్ను ట్రిపుల్ ఐటీలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెంటార్లు, బోధనేతర సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ‘22ఏ మెగా పరిష్కార మేళా’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని, ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసు కోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. -
కలుషిత బజ్జీల సంఘటనపై అధికారుల దర్యాప్తు
గణపవరం: మండలంలోని కొందేపాడు గ్రామంలో నిల్వ మైదాపిండితో చేసిన బజ్జీలు తిని 13 మంది తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటనకు సంబంధించి అధికారుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. గురువారం రాష్ట్ర ఫోరెన్సిక్ సహాయ సంచాలకులు శ్రీనివాస్, గణపవరం సిఐ నక్కారజనీకుమార్ వైద్య శాఖ అధికారులు కొందేపాడుగ్రామంలో బజ్జీలు వేసిన ఇంటిని పరిశీలించారు. వంట గదిలో మైదాపిండిని, నూనె తదితర వస్తువులను వారు పరిశీలించి శాంపిల్స్ సేకరించారు. ఘటనుకు గల కారణాలు తెలుసుకునే పనిలో వారు నిమగ్నమయ్యారు. కొందేపాడు గ్రామంలో బుధవారం చేపల చెరువు వద్ద గోదాములో నిల్వ ఉన్న మైదా పిండిని చెరువు వద్ద పనిచేసే మిరియాల మణికంఠ అనే వ్యక్తి తెచ్చి తమ సమీపబంధువైన ముఖమట్ల కనకదుర్గకు ఇవ్వడం, ఆమె ఆ మైదా పిండితో వేసిన బజ్జీలు కుటుంబసభ్యులతోపాటు ఇరుగు పొరుగువారికి ఇవ్వడం, అవి తిన్న 13 మంది వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందడం తెలిసిందే. అయితే ఒకరిద్దరు తప్ప మిగిలిన బాధితులంతా కోలుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఇద్దరి పరిస్థితి కూడా మెరుగుపడుతున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. గ్రామంలో పిప్పర పీహెచ్సీ వైద్యాధికారులు కె.ప్రియాంక, రియోలతో పాటు ప్రథమ చికిత్స శిబిరం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ కొత్త కేసులు ఏమీ లేవని వైద్యాధికారులు తెలిపారు. మరో 24 గంటల పాటు గ్రామంలోనే ఉండి పరిస్థితిని పరిశీలిస్తామని వారు తెలిపారు. -
పాలకవర్గ సమావేశం నిర్వహించాలి
ప్రతి మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం రెండున్న సంవత్సరాలుగా జరగకపోవడం బాధాకరం. కూటమి ప్రభుత్వం గిరిజన సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసింది. అనేక సమస్యలతో గిరిజన గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. – తెల్లం బాలరాజు, పోలవరం మాజీ ఎమ్మెల్యే గ్రామ స్థాయిలో గిరిజనులు ఎదుర్కొనే అన్ని సమస్యలను సభ్యులందరూ ఐటీడీఏ పాలకవర్గం దృష్టికి తీసుకువస్తారు. రెండున్నరేళ్లుగా సమావేశం జరగకపోవడం వల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికై నా అధికారులు, ప్రభుత్వ పాలకులు స్పందించి చర్యలు తీసుకోవాలి – సరియం రామ్మోహన్రావు, ఏఐటీఎఫ్ జాతీయ కన్వీనర్, బుట్టాయగూడెం -
ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి
భీమడోలు: ఫ్రభుత్వ పాఠశాలల్లో బడిఈడు పిల్లలందరిని చేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని కాకినాడు రీజనల్ జాయింట్ డైరెక్టర్(ఆర్జేడీ) జి.నాగమణి అన్నారు. మెగా ఎన్రోల్మెంట్ డ్రైవ్లో భాగంగా గురువారం భీమడోలులో ఆమె పర్యటించారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. భీమడోలు నెం.1, నెం.4 పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ప్రవేశ పత్రాలను అందజేశారు. ఆమె మాట్లాడుతూ నూరుశాతం ఎన్రోల్మెంట్ జరిగేలా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. కనీసం ఆదర్శ పాఠశాలల్లో 70 మంది విద్యార్థులుండేలా టీచర్ల సమష్టిగా కృషి చేయాలన్నారు. ఎంఈవో 1, 2 ఈదుపల్లి శ్రీనివాసరావు, అయినపర్తి భాస్కర్కుమార్, క్లస్టర్ హెచ్ఎం జీఎస్ పద్మజ పాల్గొన్నారు.


