breaking news
West Godavari District Latest News
-
మత్స్య సాగులో.. మరణ మృదంగం
● ఆక్వా చెరువులపై పాటించని జాగ్రత్తలు ● విద్యుత్ తీగలు, మోటార్లు, గన్పౌడర్ పేలి ప్రమాదాలు ● పిట్టల్లా రాలిపోతున్న కూలీలు కై కలూరు: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఆక్వారంగం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలుస్తోంది. కాసుల సంపాదనలో అక్షయపాత్రగా పేరొందిన ఈ రంగాన్ని నమ్ముకుని లక్షలాది మంది జీవిస్తున్నారు. పొట్టకూటి కోసం పలు రాష్ట్రాల నుంచి వలస కూలీలు చేపల, రొయ్యల చెరువులపై కుటుంబాలతో సహా నివసిస్తున్నారు. యజమానుల నిర్లక్ష్యం, కూలీల అవగాహన లోపంతో విద్యుత్ తీగలు తగలి కొందరు, మోటర్లలో చిక్కుకుని మరికొందరూ, చెరువులపై వాలే పిట్టలను నాటు తుపాకితో బెదిరించే క్రమంలో గన్పౌడర్ పేలి ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇటువంటి మరణాలు ఇటీవల పెరిగాయి. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా సాగు 5.75 లక్షల ఎకరాల్లో ఉంది. ఇందులో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో చేపల సాగు 1.80 లక్షలు, రొయ్యల సాగు 1.10 లక్షలు వెరసి 2.90 లక్షల ఎకరాల్లో సాగువుతోంది. ఇక ఆక్వా విద్యుత్ సర్వీసులు విషయానికి వస్తే ఏలూరు జిల్లాలో 4,759, పశ్చిమగోదావరిలో 16,374 వెరసి 17,124 ఉన్నాయి. ఆక్వా చెరువు గట్లపై విద్యుత్ తీగలను మోటర్లకు అమర్చడానికి కింద అమర్చుతున్నారు. గట్టుపై గడ్డి కోసే క్రమంలో కొడవళ్లకు తీగలు తగిలి, కూలీలు, ప్రజలు మరణిస్తున్నారు. ఇటీవల మహాశివరాత్రి రోజున కలిదిండి మండలం పడమటిపాలెంలో రొయ్యల సాగు ఫ్యాన్ సెట్ రాడ్లో చిక్కుకుని తల్లీకూతురు అక్కడికక్కడే మరణించడం కలిచివేసింది. కూలీలు పిట్టల్లా రాలిపోతున్నారు కొల్లేరు సమీప గ్రామాల్లో చేపల, రొయ్యల చెరువులపై రోజువారీ పనిచేయడానికి స్థానిక కూలీల కొరత ఉంది. పైగా అధిక అడ్వాన్సులు చెల్లించాల్సి వస్తోంది. ఇటువంటి తరుణంలో ఒడిశా, ఆసోం, గుజరాత్, వెస్ట్ బెంగాళ్, నేపాల్ నుంచి ఆక్వా చెరువులపై పనిచేయడానికి వలస కూలీలు వస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం వీరి సంఖ్య 30 వేల పైనే ఉంటుందని అంచనా. చెరువుపై నివాసం ఉండే వ్యక్తికి నెలకు రూ.15 వేలు, అదే కుటుంబానికి రూ.20 వేలు అందించి గృహవసతితో పాటు సమస్తం చెరువు యజమాని భరిస్తున్నాడు. కొత్తగా వచ్చిన కూలీలకు అవగాహన లేక యంత్రాలు, విద్యుత్ తీగలు తగలి మరణిస్తున్నారు. కొల్లేరుకు గన్పౌడర్ తయారీ కల్చర్ ఆక్వా సాగు చెరువుల్లో చిన్న చేపలను కొల్లేరు పక్షులు తినేస్తాయి. దీనిని నివారించడానికి నెల్లూరు, తమిళనాడుల నుంచి నొక్కలొళ్లు అనే తెగకు చెందిన కుటుంబాలు కొల్లేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరి వద్ద పిట్టలను బెదిరించడానికి నాటు తుపాకీలు ఉంటాయి. గన్పౌడర్ తయారు చేసే క్రమంలో అవి పేలి అనేక మంది చేపల చెరువు గట్లుపై మృత్యువాత పడుతున్నారు. గతేడాది ఏకంగా భైరవపట్నం గుడారాల్లో గన్పౌడర్ పేలి అనేక మంది మృత్యువాతపడ్డారు. విద్యుత్ తీగలు, మోటర్లు, గన్పౌడర్ తయారీ క్రమంలో మరణించిన ఘటనలు అనేకం పోలీసు స్టేషన్లకు చేరడం లేదు. యజమానులు ప్రాణాలకు ఖరీదు కట్టి సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఆక్వా సాగు కొందరికి కాసులు కురిపిస్తుంటే.. ఈ రంగాన్ని నమ్ముకుని ఉపాఽధి కోసం వచ్చిన కూలీలు మాత్రం ప్రమాదవశాత్తూ మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. ఆక్వా చెరువులపై కనీస జాగ్రత్తలు పాటించకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలకు అవగాహన లేకపోవడంతో మత్స్యసాగు మరణ మృదంగం మోగిస్తోంది. -
చెద మందు పిచికారీ చేస్తూ ప్రమాదం
నరసాపురం రూరల్: ఇంటికి రంగులు వేసే క్రమంలో జరిగిన ఒక దురదృష్టకర ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మొగల్తూరు పంచాయతీ పరిధిలోని కుక్కలవారి తోటలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన వనం రాజేష్ తన ఇంటికి రంగులు వేయిస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న చెద పురుగుల నివారణ కోసం చెదమందు (క్రిమి సంహారక మందు) తో పాటు టర్పంటైన్ ఆయిల్ను కలిపి ఒక ప్లాస్టిక్ క్యాన్ ద్వారా పిచికారీ చేస్తున్నారు. ఆ సమయంలో ఊహించని విధంగా స్ప్రేయర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి మంటలు చెలరేగి వనం రాజేష్తో పాటు అతనికి వరుసకు సోదరుడైన వనం సత్యనారాయణరావులకు శరీరమంతా తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెనువెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను వెంటనే నరసాపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాలు బలంగా ఉండటంతో, మెరుగైన చికిత్స నిమిత్తం వారిని భీమవరంలోని మరొక ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం బాధితులు అక్కడ చికిత్స పొందుతున్నారు. -
భాషాశాస్త్రంపై వర్క్షాప్ ప్రారంభం
నూజివీడు : ట్రిపుల్ఐటీలో తెలుగుశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల వర్క్షాప్ బుధవారం ప్రారంభమైంది. ‘లింగ్విస్టిక్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్’ అనే అంశంపై నిర్వహించిన వర్క్షాప్లో పలు అంశాలపై సమగ్రంగా చర్చ నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ తెలుగుశాఖ ఆచార్యులు దేవారెడ్డి విజయలక్ష్మి మాట్లాడుతూ భాషాశాస్త్రాన్ని పరిచయం చేశారు. హెడెల్బర్గ్ విశ్వవిద్యాలయ ఆచార్యులు తొట్టెంపూడి గణేష్ ఆన్లైన్ ద్వారా మాట్లాడుతూ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి పెద్ద పరిమాణంలో పాఠ్య డేటాతో శిక్షణ పొందిన ఆధునిక కృత్రిమ మేధస్సు మోడళ్లని, ఇవి మనుషుల భాషను అర్థం చేసుకుని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, కథలు రాయడం, అనువాదం చేయడం వంటి పనులు చేయగలవని వివరించారు. సామాజిక మేలుకోసం ఈ టెక్నాలజీని విద్య, ఆరోగ్య సమాచారం, రైతులకు సూచనలు, ప్రభుత్వ సేవలలో ఉపయోగించవచ్చన్నారు. ఈ రంగంలో నైపుణ్యం సాధించిన వారికి డేటా సైంటిస్ట్, ఏఐ ఇంజనీర్, ఎన్ఎల్పీ (నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్) స్పెషలిస్ట్, మెషిన్ లెర్నింగ్ డెవలపర్ వంటి విభాగాల్లో దేశీయంగా, అంతర్జాతీయంగా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. వర్క్షాప్ కన్వీనర్, తెలుగు శాఖాధిపతి ఉడుము ఝాన్సీ సదస్సు లక్ష్యాలను, ఉద్దేశాలను, ఉపయోగాలను తెలిపారు. అకడమిక్ డీన్ సాదు చిరంజీవి, వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
యాజమాన్య పద్ధతులతో మామిడిలో అధిక దిగుబడులు
నూజివీడు: రైతులు యాజమాన్య పద్ధతులను అవలంభించడం ద్వారానే మామిడిలో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించొచ్చని మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త కే రాధారాణి పేర్కొన్నారు. మండలంలోని సుంకొల్లు, సిద్ధార్ధనగర్లలోని మామిడి తోటలను ఉద్యాన అధికారి ఆర్ హేమతో కలిసి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రాధారాణి మాట్లాడుతూ మామిడి పూత పిందె కట్టి నిలవడానికి, పిందెలు బఠానీ సైజు ఉన్నప్పుడు 15 నుంచి 20 రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలన్నారు. కాయ పెరిగే దశలో 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. పిందే రాలడాన్ని నివారించడానికి నాఫ్తలిన్ ఎసిటిక్ యాసిడ్ 20 పీపీఎం 20 మిల్లీ గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. తేనెమంచు పురుగు నివారణ ఇలా.. అజాడిరిక్టన్ 3000 పీపీఎం రెండు మిల్లీలీటర్ నీటికి, బుప్రోపెజన్ 25ఎస్సీ ఒక ఎంఎల్ లీటరు నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్ఎల్ 0.3 మిలీ లేదా థయామిథాగ్జామ్ 25 శాతం డబ్ల్యూజీ 0.3 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. తామర పురుగుల నివారణకు.. నీలిరంగు జిగురు అట్టలు 40 నుంచి 50 చొప్పున తోటల్లో ఏర్పాటు చేసుకోవాలి. వేప నూనె మూడు వేల పీపీఎం 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొంగామియ సోప్ 7.5 గ్రా, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎసిఫేట్ 75 ఎస్పీ 1.5 గ్రా లేదా పిప్రోనిల్ 5ఎస్సీ 2 మి లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు నివారణకు.. నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములు లేదా హెక్సాకోనజోల్ 2 మి లీ లేదా అజాక్సిస్ట్రోబిన్ 1 మిల్లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి పక్షి కన్ను తెగులు నివారణకు.. 3 గ్రా కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా కార్బన్డిజం 1 గ్రా+ మాంకోజెబ్ 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మసి మంగు నివారణకు ఎమామెట్టిన్ బెంజయెట్ 0.4 గ్రా లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకులపై మసిని తొలగించుటకు రెండు కిలోల గంజిపొడిని గోరువెచ్చని నీటిలో మూడు లేదా నాలుగు లీటర్లు కలిపి ఉడికించి తరువాత మిగతా నీరు పోసి వంద లీటర్ల గంజి ద్రావణం తయారుచేసి తెగులు కనిపించిన భాగాలపై ఎండ బాగా ఉన్న రోజుల్లో పిచికారీ చేయాలి. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి ఆర్ హేమ, రైతులు, రైతు సేవా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. -
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా..
భీమడోలు: దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ వృద్ధుడిని వ్యాన్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ దుర్ఘటన బుధవారం జాతీయ రహదారి భీమడోలు వద్ద చోటు చేసుకుంది. భీమడోలు పంచాయతీ పరిధిలోని సూర్యారావుపేటకు చెందిన యర్రంశెట్టి నాగేశ్వరరావు(65) ఎంఎంపురం గ్రామంలో శ్రీపాండురంగ స్వామి వార్ల ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవానికి బుధవారం ఉదయం వెళ్లాడు. అక్కడ స్వామి వార్లను దర్శించుకుని తిరుగుపయనంలో పూళ్లలో బస్ ఎక్కి భీమడోలు వద్ద దిగాడు. రోడ్డు దాటుతుండగా తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వైపుగా వెళ్తున్న వ్యాన్ అతివేగంగా వచ్చి ఆతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమారుడు యర్రంశెట్టి నాగశ్రీనివాస్ ఫిర్యాదు మేరకు భీమడోలు ఎస్సై ఎస్కే మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి
నరసాపురం రూరల్ : చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు ప్రమాదవశాత్తూ నీటిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని వెస్ట్కుక్కిలేరులో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వేములదీవి పడమర గ్రామానికి చెందిన బొమ్మిడి యేసుబాబు (53) మత్స్యకారుడు. బుధవారం ఉదయం యథావిధిగా వెస్ట్కుక్కిలేరులో చేపల వేట కోసం వెళ్లిన అతడు ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న తహసీల్దార్ ఐతం వీరవెంకట సత్యనారాయణ, ఆర్ఐ సురేఖ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నరసాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ముదినేపల్లి రూరల్: ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తూ చెరువులో పడిన బాలుడు మునిగిపోయి మృతి చెందిన ఘటన మండలంలోని గురజలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గురజకు చెందిన దినేష్ కృష్ణవేణి తమిళనాడుకు చెందిన దినేష్ బాలన్తో నాలుగేళ్ల కిందట వివాహం కాగా వీరికి దినేష్ నితీష్ అనే రెండున్నర సంవత్సరాల వయస్సున్న కుమారుడున్నాడు. కృష్ణవేణి కుమారుడిని చిన్నప్పటి నుంచి గురజలోని తల్లి లుక్కా వీరమ్మ వద్దనే ఉంచింది. నితీష్ చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరగడంతో స్థానిక పిల్లలతో మమేకమై ఆడుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయం ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న చెరువులో పడి మునిగి మృతి చెందాడు. తల్లి కృష్ణవేణి ఫిర్యాదు మేరకు హెడ్కానిస్టేబుల్ పి ప్రదీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బుట్టాయగూడెం : మండలంలోని దొరమామిడి సమీపంలో ఉన్న గుబ్బల మంగమ్మతల్లి జల్లేరు జలాశయం, చింతలగూడెం సమీపంలో ఉన్న పోగొండ రిజర్వాయర్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి బి.రాజ్కుమార్ మాట్లాడుతూ జల్లేరు జలాశయంలో 48 వేలు, పోగొండ రిజర్వాయర్లో లక్షా 20 వేల చేప పిల్లలను విడుదల చేశామన్నారు. ఎంపీపీ తెల్లం రమణ, ఏఎంసీ వైస్ చైర్మన్ కొండేపాటి రామకృష్ణ, అలివేరు సర్పంచ్ కారం లక్ష్మి, మంగయ్యపాలెం సర్పంచ్ మాల్చి వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణకారుల ఆకలి కేకలు
● కార్పొరేట్ దుకాణాలతో తగ్గిన గిరాకీ ● బంగారం ధరలు పెరగడంతో పూర్తిగా దిగజారిన ఉపాధి ● ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న స్వర్ణకారులు ఏలూరు (ఆర్ఆర్పేట): ఒకప్పుడు తాళిబొట్టు చేయాలంటే విశ్వకర్మ వంశస్థుల దగ్గరికి వెళ్ళేవారు. వారు వధూవరుల నక్షత్రాలు చూసి వారికి సరిపడే తారాబలం చూసి ముహూర్తం పెట్టి మంగళ సూత్రాలు చేసేవాళ్ళు. ఇప్పుడు కార్పొరేట్ బంగారు దుకాణాలకు వెళ్లి కొంటున్నారు. పెద్ద కంపెనీల బంగారు దుకాణాలకు జనాభా క్యూ కడుతున్నారు. రెడీమేడ్గా యంత్రాలతో తయారైన ఆభరణాలు ఆకర్షణీయంగా ఉండడంతో ప్రజలు వాటిపట్ల ఆకర్షితులవుతున్నారని స్వర్ణకారులు చెబుతున్నారు. కార్పొరేట్ దుకాణాల ప్రాబల్యం పెరగడంతో స్వర్ణకారుల జీవితాలు ఒడిదుడుకులకు లోనయ్యాయని అంటున్నారు. పూర్తిగా తగ్గిన ఉపాధి : ప్రస్తుత మార్కెట్లో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం కాసు ధర రూ. 1.15 లక్షలు పలుకుతోంది. ఏడాది క్రితం వరకూ బంగారం ధరలు పెరిగినా వారానికో 15 రోజులకో రూ.100 నుంచి రూ. 200 మధ్యలో పెరిగేది. ఇప్పుడు రోజూ రూ.1000 వరకూ పెరుగుతుండడంతో సామాన్యులు బంగారం వైపు కన్నెత్తి చూసే ఆలోచన కూడా చేయలేకపోతున్నారు. దీంతో ఆభరణాలు చేయించుకోలేక మిన్నకుండిపోతున్నారు. ఈ కారణంగా స్వర్ణకార వృత్తిలో ఉన్న వారికి చేతి నిండా పనే లేకుండా పోయింది. ఆభరణాల తయారీ మాత్రమే తెలిసిన స్వర్ణకారులు వేరే వృత్తిలోకి వెళ్ళలేక పోతున్నారు. దీంతో వారి కుటుంబాల్లో ఆకలి కేకలు వేయక తప్పడం లేదు. కుటుంబ పోషణ నిమిత్తం కొంతమంది స్వర్ణకారులు ఏదో ఒక దుకాణంలో సహాయకుడిగా పని చేస్తున్నారు. మరికొంత మంది బ్యాంకుల్లో అప్రైజర్లుగా పని చేసుకుంటున్నారు. గతంలో బ్యాంకు అప్రైజర్లకు వయో పరిమితి ఉండేది కాదు. ప్రస్తుతం బ్యాంకుల్లో అప్రైజర్లుగా పని చేసే వారికి సైతం 60 ఏళ్ళకే పదవీ విరమణ నిబంధన అమలు చేస్తూ ఉండడంతో వారికీ ఆదాయ మార్గాలు మూసుకుపోతున్నాయి. గతంలో 1500 స్వర్ణకారుల కుటుంబాలు గతంలో జిల్లాలో స్వర్ణకార వృత్తిలో దాదాపు 1500 కుటుంబాల ఉండేవి. ఆభరణాలు తయారు చేయడంలో నైపుణ్యం కలిగిన ఆ కుటుంబాలకు మారిన పరిస్థితుల కారణంగా, కార్పొరేట్ దుకాణాల వల్ల వృత్తిని వదిలి వెళ్ళక తప్పడంలేదు. ఈ మేరకు నిపుణులైన ఎంతో మంది స్వర్ణకారులు ఇప్పటికే వృత్తికి దూరమయ్యారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కేవలం 150 –200 మధ్య మాత్రమే వృత్తి కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. భవిష్యత్లో బంగారు ఆభరణాలు స్థానికంగా తయారు చేసే వారే కరువైపోతారనడంలో సందేహమే లేదని, అదే పరిస్థితి వస్తే కార్పొరేట్ వ్యాపారులదే రాజ్యంగా ఉంటుందంటున్నారు. బంగార ఆభరణాల ధరలకు రెక్కలు రావడంతో పాటు నాణ్యత కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందంటున్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి ఒకటికి బదులుగా ఒకరోజు ముందుగానే ఫిబ్రవరి 28న పింఛన్లను అందజేస్తామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మార్చి 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 26 నుంచి వీఆర్వోలకు ఆరోగ్య పరీక్షలు భీమవరం (ప్రకాశంచౌక్): ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి తణుకుతో పాటు తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, భీమవరం ఏరియా ఆస్పత్రుల్లో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 25 వరకు షెడ్యూల్ ప్రకారం వీఆర్వోలు, వీఆర్ఏలకు నిర్వహించనున్న ఆరోగ్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల వారికి తాడేపల్లిగూడెం హాస్పటల్లో, తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాలకు తణుకు ప్రభుత్వ జిల్లా హాస్పటల్లో, ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి మండలాలకు సంబంధించి నరసాపురం ప్రభుత్వ ఏరియా హాస్పటల్లో, పెనుగొండ, పెనుమంట్ర, ఆచంట, పోడూరు, పాలకొల్లు మండలాలకు సంబంధించి పాలకొల్లు ఏరియా ఆస్పత్రిలో పరీక్షలు చేస్తారన్నారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 25 వరకు భీమవరం, పాలకోడేరు, వీరవాసరం, ఆకివీడు, కాళ్ల, ఉండి, గణపవరం మండలాలకు సంబంధించి భీమవరం ఏరియా హాస్పిటల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. బంగారం ధరలు విపరీతంగా పెరగడం, కార్పొరేట్ దుకాణాల తాకిడి కారణంగా స్వర్ణకారులు ఉపాధికి దూరమైపోయారు. చేనేత కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను స్వర్ణకారులకూ అమలు చేయాలి. స్వర్ణకార దుకాణాలకు పూర్తి ఉచిత కరెంటు ఇవ్వాలి. స్వర్ణకార కుటుంబంలో ఆడపిల్ల వివాహానికి రూ.2 లక్షలు ఆర్థిక సహాయం చేయాలి. 50 సంవత్సరాలు నిండిన స్వర్ణకారుడికి రూ.6 వేలు పెన్షన్ ఇవ్వాలి. – లక్కోజు రాజగోపాలాచారి, కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా స్వర్ణకార సంఘం స్వర్ణకారులకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేయాలి. ప్రతి జిల్లా కేంద్రంలో స్వర్ణకార క్లస్టర్స్ ఏర్పాటు చేయాలి. ప్రతి మున్సిపల్ పట్టణంలో మున్సిపాల్టీకి సంబంధించిన షాపుల్లో స్వర్ణకారులకి షాపులు కేటాయించాలి. స్వర్ణకారులకు పోలీస్ వేధింపులు లేకుండా ఓల్డ్ జీవో మార్పు చేసి అమలు చేయాలి. హెచ్యూడీ హాల్ మార్క్ సింగిల్ నగలకే పర్మిషన్ స్వర్ణకాడికి ఇవ్వాలి. బ్యాంకు అప్రైజర్ ఉద్యోగాలు విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులకే కేటాయించాలి. – బొద్దూరి నాగభూషణం, అధ్యక్షుడు, ఏలూరు నగర స్వర్ణకార సంఘం -
ఆందోళన కలిగిస్తున్న గర్భస్రావాలు
మండలిలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ తణుకు అర్బన్: ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రభుత్వా సుపత్రుల్లో జరుగుతున్న గర్భస్రావాలు ఆందోళన రేపుతున్నాయని, వాటిపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. బుధవారం శాసనమండలిలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. 5 మండలాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత 9 నెలల కాలంలో 281 గర్భస్రావాలు జరిగాయని ఇది చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి నిజంగా అబార్షన్ జరిగిందా లేదా.. ప్రభుత్వం ఇస్తున్న లక్ష్యాలను పూర్తి చేయలేక ఫాల్స్ అబార్షన్ రికార్డ్ చేస్తున్నారా అనే విషయాన్ని పరిశోధించాలని కోరారు. నిజంగా అబార్షన్లు జరిగితే అందుకు కారణాలను గుర్తించి గర్భిణి మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, పోషక ఆహారం, సప్లిమెంటరీ మందులు సకాలంలో అందించాలని విజ్ఞప్తి చేశారు. బుట్టాయ గూడెం, పోలవరం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఎంఎస్ఎంఈ విభాగంలో ఎస్సీ వర్గాలకు గత ఏడాది ఇన్సెంటివ్స్ సక్రమ విధానంలో ఇవ్వలేదని, అనుకూల వర్గాలకు మాత్రమే ఇన్సెంటివ్స్ ఇచ్చారని, షెడ్యూల్డు కులాలు, చిన్న పరిశ్రమలు పెట్టుకున్నవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. -
రైల్వే ప్రాజెక్టులకు మొండిచేయి
● ముందుకు సాగని కోటిపల్లి–నరసాపురం లైన్ పనులు ● నరసాపురం–మచిలీపట్నం కొత్త లైన్ కల నెరవేరేనా ? నరసాపురం: జిల్లాకు సంబంధిచి నరసాపురం–కోటిపల్లి రైల్వే లైన్, నరసాపురం–మచిలీపట్నం కొత్త రైల్వే లైన్ నిర్మాణం ప్రాజెక్ట్లకు ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో మొండి చేయి మిలిగింది. బడ్టెట్ ప్రవేశపెట్టి దాదాపు నెలరోజులు కావస్తున్నా.. అసలు జిల్లాలో రైల్వే ప్రాజెక్ట్లకు కేటాయింపులు ఏమైనా చేశారా? అన్న అంశంపై రైల్వే శాఖ నుంచి ఇంతవరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నరసాపురం రైల్వే ప్రాజెక్ట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని ఎదురు చూస్తున్నారు. నరసాపురం కోడలు నిర్మలాసీతారామన్ కీలక రైల్వే ప్రాజెక్ట్ల విషయంలో కరుణ చూపించకపోవడంతో నిరాశ చెందుతున్నారు. సాగని నరసాపురం–కోటిపల్లి పనులు కీలకమైన నరసాపురం–కోటిపల్లి రైల్వే లైన్ పనులు ముందుకు సాగడం లేదు. ప్రతీ బడ్జెట్లో కొంత మేర నిధులు కేటాయిస్తున్నప్పటికీ పెద్దగా కదలిక లేదు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేయడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటా సొమ్ములు విడుదల కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. స్థల సేకరణ పూర్తి కాలేదు. గోదావరిపై మూడుచోట్ల వంతెన పనులు మొదలు కావడం ఒక్కటే పురోగతి. ఈ రైల్వేలైన్ కోసం దాదాపు 200 ఎకరాల భూమి సేకరించాలి. తొలి దశలో 158.55 ఎకరాలు సేకరించారు. తూర్పుగోదావరి జిల్లాలో భట్లపాలెం, కామనగరువు ప్రాంతాలు అమలాపురం మండలంలో భట్నవిల్లి, రోళ్లపాలెం, భట్లపాలెం, పేరూరు పరిధిలో ప్రాంతాల్లో 60 శాతం స్థల సేకరణ జరిగింది. ఈ ప్రాంతాల్లో మిగిలిన 40 శాతంతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలోని యలమంచిలి, నరసాపురం ప్రాంతాల్లో భూసేకరణ ఇంకా పూర్తి కాలేదు. ఇంతవరకూ సేకరించిన భూమిలో బాధితులకు పూర్తిస్థాయిలో ఇంకా నష్టపరిహారం చెల్లించలేదు. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎంపీల కృషితో కేంద్రం ప్రతి బడ్జెట్లో నిధులు కేటాయించింది. ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవు. రూ.2,800 కోట్ల అంచనాతో ఈ భారీ ప్రాజెక్ట్కు సంబంధించి గోదావరిపై మూడు పాయల వద్ద వంతెన నిర్మాణం జరుగుతోంది. వంతెన నిర్మాణాలకు రూ.700 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి టెండర్లు పిలిచి మూడేళ్ల్ల క్రితం ప్రారంభించారు. ఇంతవరకూ నిధుల్లో ఎక్కువ మొత్తం వంతెనలకే సరిపోయింది. 2001లో రూ.800 కోట్ల అంచనాతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ వ్యయం ప్రస్తుతం రూ.2,800 కోట్లకు చేరింది. బ్రిటిష్ హయాం నుంచి నరసాపురం నుంచి ట్రాక్ను మచిలీపట్నం వరకూ పొడిగించాలని ప్రతిపాదన ఉంది. నరసాపురం, మచిలీపట్నం సముద్ర తీర పట్టణాలు కావడం, జలరవాణా ప్రధానంగా ఉండే ఆ రోజుల్లో వీటిని కలపాలని భావించారు. అయితే రెండేళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడంలేదు. కోటిపల్లి టు నరసాపురం రైల్వేలైన్ నిర్మాణం పూర్తయితే అటు కోనసీమ నుంచి ఇటు కోస్తాకు రైల్వే ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. మరోవైపు నరసాపురం–మచిలీపట్నం రైల్వే లైన్ నిర్మాణం కూడా సాగితే మొత్తం గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు జిల్లాలకు అనుసంధానంగా నాలుగు వైపుల నుంచి అతిపెద్ద రైల్వే రవాణా వ్యవస్థ ఏర్పడుతుంది. సముద్ర తీర ప్రాంతాలకు అనుసంధానంగా రైల్వే వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఇంత ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాజెక్టుల జాప్యంతో గోదావరి జిల్లాలో అన్ని పార్లమెంట్ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమి ఎంపీలు నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
పెనుగొండ ఎంపీడీవో పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి
పెనుగొండ: పెనుగొండ ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి పనితీరుపై కలెక్టర్ చదలవాడ నాగరాణి అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల వ్యాప్తంగా జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పురోగతిపై సమీక్షించారు. సర్వే నత్త నడకన సాగడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం జేశారు. రెండు రోజుల్లో టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తణుకులో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న వన్స్టాప్ సెంటర్ లో కాంట్రాక్ట్ పద్దతిపై పని చేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మహిళా,శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి డి.శ్రీలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ –1, కేసు వర్కర్ – 2, పారా లీగల్ పర్సనల్/లాయర్ –1, పారా మెడికల్ పర్సనల్ – 1, సైకో సోషల్ కౌన్సెలర్–1, కంప్యూటరు పరిజ్ఞానం ఉన్న ఆఫీసు అసిస్టెంట్–1, మల్టీ పర్పస్ స్టాఫ్/కుక్ – 3, సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్ –3 పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులు జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి కార్యాలయంలో మార్చి 7న సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలని కోరారు. బుట్టాయగూడెం: బుట్టాయగూడెం తహసీల్దార్ పీవీ చలపతిపై వీఆర్వోలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమను కులం పేరుతో దూషిస్తున్నారని, అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని అంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీఆర్వోలు మాట్లాడుతూ మహిళా వీఆర్వోలు సంతకాల కోసం తహసీల్దార్ రూంకు వెళ్తే గంటల తరబడి నిలబెట్టి సంతకం పెట్టకుండా అసభ్యకర పదజాలంతో తిడుతున్నారని తెలిపారు. కోయ వాళ్లకు ఏం పని రాదు వీళ్లను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలంటూ కులం పేరుతో తిడుతూ అవమానిస్తున్నారని చెప్పారు. తహసీల్దార్పై చర్యలు తీసుకుని నాయ్యం చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు (ఆర్ఆర్పేట): త్వరలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా తెరపైకి తీసుకువచ్చిన ఇన్విజిలేషన్ ఆటోమేషన్ విధానాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని ఏపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యర్శులు ఈ. రామ్మోహన్, జీ. మోహన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇన్విజిలేషన్ ఆటోమేషన్ కారణంగా పరీక్షల నిర్వహణలో అధిక పరిపాలన కేంద్రీకరణ చోటుచేసుకుని, అనవసర గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఇది ఉపాధ్యాయుల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, తల్లిదండ్రులలో పరీక్షల నిర్వహణపై అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు. ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో సిగరెట్ మాఫియా యథేచ్ఛగా పేట్రేగిపోతుందని ఈ మాఫియాను తక్షణం ప్రభుత్వం అరికట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ ముందు నుంచి కృత్రిమ కొరత సృష్టించి, అధిక రేట్లకు విక్రయిస్తూ వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నారని విమర్శించారు. రూ.170 ఉన్న పెట్టె రూ.250 అమ్ముతూ రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతున్న మాఫియాను అరికట్టాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
కూటమి కనికుట్టు
మహిళల స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా కుట్టుమెషీన్లు అందించనున్నట్టు గతంలో ప్రచారం చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఈ పథకం కింద శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలు వాటి కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. కుట్టుమెషీన్లు ఎప్పుడు వస్తాయంటూ..? కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి, భీమవరం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పన పేరిట కూటమి ప్రభుత్వం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గతేడాది ఉచిత కుట్టుశిక్షణ కార్యక్రమం చేపట్టిన విషయం విదితమే. శిక్షణ అనంతరం మహిళలకు కుట్టుమెషీన్లు అందజేస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి 3,486, ఏలూరు నుంచి 3,259 మంది కలిపి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6,745 మందిని ఎంపిక చేశారు. వీరిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు 4,516 మంది, బ్రాహ్మణ సామాజిక వర్గం 28 మంది, కమ్మ 211, కాపు 1,711, రెడ్డి 86, ఆర్యవైశ్య 87, క్షత్రియ 50, ఈబీసీ 56 మంది మహిళలు ఉన్నారు. మెషీన్లు కోసం ఎదురుచూపులు శిక్షణ పొందిన వారికి కుట్టుమెషీన్లు అందజేయాల్సి ఉంది. ఆరు నెలలు కావస్తున్నా కుట్టుమెషీన్లు పంపిణీ చేయలేదు. వ్యయ ప్రయాసల కోర్చి కేంద్రాలకు చేరుకుని శిక్షణ పొందిన మహిళలు ఇళ్ల వద్ద ఖాళీగా ఎదురు చూడాల్సి వస్తోంది. కుట్టుమెషీన్లు ఎప్పుడు వస్తాయంటూ కొందరు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా మరికొందరు కలెక్టరేట్ల వద్ద జరిగే పీజీఆర్ఎస్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఎన్నో కష్టాల నష్టాల కోర్చి కేంద్రాలకు చేరుకుని శిక్షణ తీసుకున్నామని, నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు కుట్టు మెషీన్లు అందజేయలేదని మహిళలు చెబుతున్నారు. కాగా శిక్షణ పూర్తయ్యిందని, ఏజెన్సీల నుంచి కుట్టుమెషీన్లు వచ్చాక మెషీన్లు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. శిక్షణ నిమిత్తం ఒక్కొక్కరికి రూ.15,599 చొప్పున రూ.10.52 కోట్లు, కుట్టుమెషీన్కు రూ.6,199లు చొప్పున రూ.4.18 కోట్లు లెక్కలు కట్టారు. మొత్తంగా ఒక్కొక్కరికి రూ.21,798లు చొప్పున రూ.14.7 కోట్లు వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శిక్షణ నుంచి మెషీన్లు పంపిణీ వరకు మొత్తం కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం మూడు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. కేంద్రానికి 144 మంది చొప్పున భీమవరం, ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం తదితర ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 50 వరకు కేంద్రాలను ఏర్పాటుచేశారు. రోజుకు రెండు బ్యాచ్లుగా మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. గత మే నెల నుంచి సెప్టెంబరు వరకు విడతలుగా శిక్షణ కార్యక్రమం సాగింది. మహిళలకు సంబంధించిన జాకెట్లు, చిన్నపిల్లల గౌన్స్, జుబ్బాలు తదితర వాటిలో శిక్షణ ఇచ్చారు. అందుకు అవసరమైన దారాలు, క్లాత్, ఇతర మెటీరియల్ బాద్యత మహిళలదే. నిర్వాహకులు కేవలం శిక్షణ మాత్రమే ఇస్తారు. శిక్షణ నిమిత్తం బయట రూ.7 వేల నుంచి రూ.10 వేలలోపు ఉంటే ఏజెన్సీలకు భారీ మొత్తంలో కట్టబెట్టారన్న విమర్శలున్నాయి. ‘బాబు’ గారడీ జాడలేని కుట్టుమెషీన్లు శిక్షణ పూర్తయి ఆరు నెలలు ఇప్పటికీ అందజేయని మెషీన్లు ఉమ్మడి జిల్లాలో 6,745 మంది ఎంపిక కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు -
టీడీపీ నేతలకు చేదు అనుభవం
కొయ్యలగూడెం: నేవీ ఆయుధ డిపో నిర్మాణంపై చర్చల కోసం వచ్చిన టీడీపీ నేతలకు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గ టీడీపీ నేతలు బోడిగూడెం, మంగపతిదేవిపేట గ్రామాలకు వెళ్లగా నేతలు వస్తున్న సమాచారంతో గ్రామస్తులు రోడ్డుపైకి చేరుకొని వారి వాహనాలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో నాయకులు తమ వాహనాలు దిగి గ్రామస్తులను సర్ది చెప్పడానికి ప్రయత్నించగా మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటూ తమ నోటి దగ్గర జీవనాధారం లాక్కోవాలని చూస్తే ప్రాణత్యాగానికై నా వెనుకాడమని హెచ్చరించారు. తమని విభజించి లోబరుచుకోవడానికి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలని లేని పక్షంలో మున్ముందు నాయకులను ఏ కారణం చేత కూడా గ్రామాలలో తిరగనివ్వమని పేర్కొన్నారు. కూటమి నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఇప్పటికే 60 శాతానికి పైగా రైతులు నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి సముఖత వ్యక్తం చేస్తూ ఆమోద పత్రాలు అందజేశారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సైతం అధికార పార్టీ కోసం రైతులను పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. దీంతో నాయకులు చర్చలు నిర్వహించకుండానే వెనుదిరిగారు. -
జోరుగా క్రికెట్ బెట్టింగ్లు
● చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు ● లాడ్జిలు, ప్రత్యేక భవనాల్లో గుట్టుగా నిర్వహిస్తున్న వైనం తణుకు అర్బన్: టీ 20 వరల్డ్ కప్ క్రికెట్ ఫీవర్ క్రీడాభిమానులను ఉత్సాహపరుస్తుంటే.. క్రికెట్ బెట్టింగ్ బుకీలకు మాత్రం రూ.కోట్లు తెచ్చిపెడుతోంది. తణుకుకు పట్టణానికి చెందిన ఒక రాజకీయ నేత కుమారుడు క్రికెట్ బెట్టింగ్లో నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తణుకులో అప్పటిటలో సంచలనం రేకెత్తించింది. పైడిపర్రు గ్రామానికి చెందిన ఒక ఏసీ మెకానిక్ సైతం బెట్టింగ్ల మత్తులో అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రకమైన బెట్టింగ్ ఇబ్బందులు కొన్ని మాత్రమే వెలుగులోకి రాగా మరెన్నో వ్యవహారాలు బయటకు రావడం లేదు. పందెంరాయుళ్లు అమాయకులను బెట్టింగ్ రొంపిలోకి దింపి రూ.కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. బంతి బంతికి బెట్టింగ్ చేస్తూ యువతను బెట్టింగ్లోకి దింపి వారి జీవితాలను నాశనం చేసేస్తున్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు వినియోగిస్తూ బుకీలు ఆన్లైన్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. సిక్స్ కొడితే ఇంత, ఫోర్ కొడితే ఇంత, వికెట్ పడితే ఇంత అంటూ ఫిక్స్ చేసి నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నా పోలీసు అధికారులు పట్టించుకోకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం టీ 20 వరల్డ్కప్ జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం జోరుగా నడుస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు ప్రాంతాల్లో లాడ్జిలు, ప్రత్యేక భవనాల్లో క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న బుకీల దందాలో అగ్రశ్రేణి జట్లు ఆడుతున్న రోజుల్లో సుమారుగా రూ.6 కోట్లకుపైగా చేతులు మారుతున్నాయని తెలుస్తోంది. బుకీలు యువతను రెచ్చగొడుతూ వారి మానసిక గమనాన్ని సైతం పక్కదారి పట్టిస్తూ కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. జిల్లాలోని అన్ని పట్టణాల్లో ప్రస్తుతం క్రికెట్ ఫీవర్తో బెట్టింగ్లు నడుస్తుండగా తణుకు పట్టణంతోపాటు పైడిపర్రు కేంద్రంగా ఈ బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయని గ్రామస్తులే చెబుతున్నారు. ఇళ్లు గుల్ల : బెట్టింగ్ వ్యవహారంలో కొడుకు చదువులు, కుమార్తెల వివాహాల కోసం కూడబెట్టిన సొమ్మును సైతం క్రికెట్ బెట్టింగ్లోకి తరలించే పరిస్థితులు నెలకొన్నాయి. యువత చెడు మార్గంలోకి వెళ్లి తమ ఇళ్లు గుల్ల చేసుకోవడంతో మహిళల పుస్తెలు కూడా పందేల్లో ఫణంగా పెడుతున్న తీరు కలచివేస్తోంది. ముఖ్యంగా ఈజీ మనీకి అలవాటుపడిన యువత క్రికెట్ బుకీల వలలో పడి తమ ఇళ్లు, వాకిలి అమ్మినా తీరని అప్పుల్లో కుటుంబాన్ని ముంచేస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చివరకు ఆత్మహత్యల బారిన పడుతున్నారు. క్రికెట్ బుకీల వ్యవహారంపై పోలీసు అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
నేర నియంత్రణే లక్ష్యం
ఎస్పీ అద్నాన్ నయీం అస్మి భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే ధ్యేయంగా పనిచేయాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయం నుంచి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా స్థాయి నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించాలని, సిబ్బంది కేటాయింపులు కార్యాలయ నిర్వహణలో పారదర్శకత ఉండాలని ఆదేశించారు. అత్యవసర సేవా స్పందన సమయాన్ని మరింత తగ్గించాలని, కేసుల దర్యాప్తులో సాక్ష్యాధారాల సేకరణ, సమన్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో గోప్యతను కాపాడటంతో పాటు, మార్చి 14న జరగనున్న లోక్ అదాలత్ ద్వారా గరిష్ట స్థాయిలో కేసులను పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు రఘువీర్ విష్ణు, డి.విశ్వనాథ్, జి.శ్రీ వేద పాల్గొన్నారు. -
వేతనాలు పెంచే వరకు ఉద్యమం ఆగదు
భీమవరం (ప్రకాశంచౌక్): వేతనాలు పెంచే వరకు ఉద్యమం ఆగదు అని ప్రాజెక్టు కార్యాలయాల వద్ద అంగన్వాడీ హెల్పర్లు ఆందోళన చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అంగన్వాడీ హెల్పర్లు ఆందోళనలో పాల్గొన్నారు. కేవలం రూ.7 వేలతో కుటుంబాలను ఎట్లా నెట్టుకొచ్చేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా నాయకుడు ఎం. ఆంజనేయులు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు వికసిత ఆంధ్రప్రదేశ్కు చాలా దూరంలో ఉన్నాయని అన్నారు. అధికారం కోసం వాగ్దానాలు చేసిన కూటమి ప్రభుత్వం కేంద్ర పాలకులు, పెట్టుబడిదారుల అడుగులకు మడుగులొత్తుతున్నారని అన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే మరింత ఉధృతంగా పోరాటం కొనసాగుతుందని అన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జి.ప్రకాశం మాట్లాడుతూ పాఠశాల విద్యారంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష తప్పనిసరి అనే నిబంధన సరికాదన్నారు. రెండు సంవత్సరాల లోపు పాస్ కానిచో ఉపాధ్యాయ ఉద్యోగ అర్హత కోల్పోతారని, పదోన్నతి రాదని వారిని ఇబ్బందులు గురి చేయడం వారి అనుభవానికి ఇబ్బందిగా ఉందన్నారు. సదరు ఉపాధ్యాయుల సీనియార్టీని, అనుభవాన్ని పరిగణలో తీసుకుని టెట్ నోటిఫికేషన్కి ముందు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని, పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని ఎంపీని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ సీహెచ్ సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు కండిపోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తణుకు అర్బన్: రాష్ట్రంలో 12 డిపోల ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ బాధ్యతలు పినాకిల్ సంస్థకు అప్పగించడం, 4 డిపోల షెడ్యూల్స్తో పాటు సిబ్బందిని వేరే డిపోలకు బదిలీ చేసే కార్యక్రమం మొదలు పెట్టిన విధానాన్ని నేషనల్ మజ్దూర్ యూనిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం తణుకు డిపోలోని యూనిటీ సభ్యులు మొదటి సర్వీస్ నుంచి ఎరుపు రంగు బ్యాడ్జీలు ధరించి, గేట్ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో యూనిటీ కార్యదర్శి బయ్య వెంకట సుబ్బారావు, అధ్యక్షులు సరిదే ఏసుబాబు, పాల్గొన్నారు. తణుకు అర్బన్: సమస్యల పరిష్కారం నిమిత్తం గత 9 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సహకార ఉద్యోగులను పట్టించుకోపోవడం సిగ్గు చేటని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ.ప్రతాప్, సహకార ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు సీహెచ్ వెంకటేశ్వరరావు విమర్శించారు. మంగళవారం స్థానిక కోర్టు వద్ద 9వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా రోడ్డు మీద పడుకొని దండం పెడుతూ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ప్రతాప్, వెంకటేశ్వరరావు, ఐలు జిల్లా కార్యదర్శి కామన మునిస్వామి మాట్లాడుతూ సహకార సంఘ సమస్యలు పరిష్కారం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడదని స్పష్టం చేశారు. తక్షణమే సమస్యలపై చర్చలు జరపాలని లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. -
మేకా శేషుబాబుపై సస్పెన్షన్ ఎత్తివేత
పాలకొల్లు సెంట్రల్: మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబుపై వైఎస్సార్సీపీ సస్పెన్షన్ ఎత్తివేసింది. గతంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబుపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ప్రకటించింది. పాలకోడేరు: శృంగవృక్షం హైస్కూల్లో 7 వ తరగతి చదువుతున్న తన కుమార్తె పట్ల లైబ్రరీ టీచర్ డేవిడ్ రాజు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్కూల్ ప్రధానోపాధ్యాయుడికి, విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె స్కూల్కు వెళ్ళటానికి భయపడుతుంటే గట్టిగా అడిగామని, డేవిడ్ రాజు సెల్ ఫోన్లో అసభ్యకర వీడియోలు చూపిస్తూ లైంగికంగా వేధిస్తున్నాడని తమ కూతురు తెలిపిందన్నారు. ఈ విషయం ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకు వెళ్ళినా ఎలాంటి చర్య తీసుకోకుండా, టీచర్కు సపోర్ట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. -
కౌలుకోలేని దెబ్బతీశారు
అసలు రైతుల మాదిరి కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20 వేలు పెట్టుబడి సాయం, ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తాం, పంట రుణాలు, ఇతర సదుపాయాలు వర్తింపచేస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటి ఊసే మరిచింది. హామీలకు ఎగనామం పెట్టి వారి నడ్డి విరిచింది. దగాపడ్డ కౌలు రైతులు ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. జిల్లా కేంద్రం భీమవరంలో రెండు రోజుల పాటు నిరసన దీక్షలు నిర్వహించారు. కౌలు రైతు పోరుబాట అధికారంలోకి వస్తే కౌలు రైతులను అన్ని విధాల ఆదుకుంటామని ఎన్నికల్లో చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు కౌలు రైతులకు చేసిందేమీ లేదు. ప్రభుత్వ సాయం అందక కౌలు రైతులు రుణ ఊబిలో కూరుకుపోతున్నారు. అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్పి కౌలు రైతులను వంచించారు. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు తక్షణం ఆర్ధికసాయం అందించి ఆదుకోవాలి. – ఉందుర్తి శ్రీనివాసరావు, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను ఏవిధంగానూ ఆదుకోవడం లేదు. తక్షణం పెట్టుబడి సాయం కింద కౌలు రైతులకు రూ.20 వేలు అందజేయాలి. ఈ సీజన్కు సంబంధించి రెండు విడతల సొమ్ము జమచేయాలి. పంట నష్టపరిహారంతో పాటు, యజమానులకు సంబంధం లేకుండా ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీచేయాలి. – రామాంజనేయులు, కౌలురైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సాక్షి, భీమవరం: జిల్లాలో వరి పండించే రైతులు 3.5 లక్షల వరకు ఉండగా 1.5 లక్షల మంది వరకు కౌలు రైతులు ఉంటారని అంచనా. సాగులో కష్టం వస్తే మొదటిగా కుదేలయ్యేది కౌలు రైతులే. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టడం, వచ్చిన దానిలో పొలం యజమానికి మిగతా చెల్లించగా వారికి మిగిలేది అంతంతమాత్రమే. పంట తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలు పంటకు నష్టం కలిగిస్తే అప్పుల ఊబిలో కూరుకుపోయేది కౌలు రైతులే. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీని తగ్గించేశారు. జిల్లాలో 1.05 లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా కేవలం 72,259 మందికి మాత్రమే జారీచేశారు. కూటమి దగా కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ సాయం, ఇన్ఫుట్ సబ్సిడీ అందిస్తామంటూ ఎన్నికల్లో పదేపదే చెప్పిన కూటమి అధికారంలోకి వచ్చాక అన్నదాత సుఖీభవ పథకం పోర్టల్లో కౌలు రైతులు దరఖాస్తు చేసుకునే ఆప్షన్ లేకుండా చేసింది. గుర్తింపు కార్డులు పొందిన వారికి రెండో దఫాలో సాయం అందిస్తారని కూటమి నేతలు చెప్పుకొచ్చారు. మొదటి దఫాతో కలిపి ఒక్కో కౌలు రైతుకు రూ.10 వేల చొప్పున సాయం అందాల్సి ఉంది. రెండో విడతలోనూ చంద్రబాబు సర్కారు కౌలురైతులకు ఎగనామం పెట్టి వారి ఆశలపై నీళ్లు చల్లింది. మరోపక్క తొలకరిలో వచ్చిన మోంథా తుఫానుతో జిల్లాలోని 9201 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. వీరిలో 70 శాతానికి పైగా కౌలు రైతులే ఉంటారని అంచనా. కౌలు రైతులకు జగన్ సర్కారు కొండంత అండగా నిలిచింది. అసలు రైతుల మాదిరి రైతు భరోసా, పంటల బీమా పరిహారం, తదితర అన్ని ప్రయోజనాలను అందించింది. భూ యజమానుల్లో అపోహలు తొలగించి కౌలు రైతు గుర్తింపు కార్డులను గణనీయంగా పెంచింది. 2023–24 సీజన్లో జిల్లాలో 84,185 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ లక్ష్యానికి గాను 89,589 కార్డులు జారీచేశారు. జగన్ పాలనలో లక్ష్యానికి మించి కార్డులు జారీ చేస్తే కూటమి పాలనలో కార్డుల సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. పెట్టుబడి సాయానికి ఎగనామం కూటమి మోసంపై కౌలు రైతుల మండిపాటు పెట్టుబడి సాయం, పంట నష్ట పరిహారం అందించాలని డిమాండ్ జిల్లా కేంద్రంలో రెండు రోజులు నిరసన దీక్ష జిల్లాలో 72,259 మంది కౌలురైతులు చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ కౌలు రైతులు పోరుబాట పట్టారు. పెట్టుబడి సాయం విడుదల చేయాలని, పంట నష్టపరిహారం ఇవ్వాలని, భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీచేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీటి సాధన కోసం ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో రెండు రోజుల పాటు నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు భీమవరంలోని ప్రకాశం చౌక్ సెంటర్ వద్ద సోమ, మంగళవారాల్లో రెండు రోజులు పాటు రిలే దీక్షలు నిర్వహించారు. వీరి దీక్షలకు ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, అంబేడ్కర్ ఆశయ సాధన కమిటీ, తదితర సంఘాల నేతలు కౌలు రైతులకు మద్దతు తెలిపారు. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీచేయాలని ఆయా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం రిలే దీక్షల ముగింపు అనంతరం కలెక్టరేట్కు చేరుకుని అధికారులకు వినతిపత్రం అందజేశారు. -
స్పందన
కొయ్యలగూడెం: అక్రమ క లప ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నట్టు కన్నాపురం అటవీశాఖ రేంజర్ భానుప్రకాష్ ఆదివారం తెలిపారు.. కుంకాల నుంచి అక్రమంగా కలపను ట్రాక్టర్పై తరలిస్తున్న సమాచారంతో ఎఫ్ఎస్ఓ మణికుమారి సిబ్బందితో కలిసి దాడులు చేశారన్నారు. ట్రాక్టర్ గుర్తించి రేంజ్ కార్యాల యానికి తరలించి కేసు నమోదు చేశామన్నారు. కలప అక్రమ రవాణాపై ఈనెల 8న, గత డిసెంబర్ 13న ‘సాక్షి’లో వచ్చిన కథనాలకు అటవీ శాఖ స్పందించింది. నెల రోజుల్లో పది కేసుల వరకు నమోదు చేయడం విశేషం. భీమవరం(ప్రకాశంచౌక్): జిల్లా కలెక్టరేట్తో పా టు మండల, మున్సిపల్ కార్యాలయాల్లో సో మవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించను న్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ఉ దయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా అదనపు ఎస్పీ వి.భీమారావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడలో డీఎస్పీగా పనిచేస్తున్న సమయంలో ఆయన ఓ యువకుడి హత్య కేసులో పర్యవేక్షణ లోపాల కు బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేశారు. తనఖా పెట్టిన బంగారం మాయం జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం ఐఐఎఫ్ఎల్ బ్యాంకులో ఓ మహిళ కుదవపెట్టిన బంగారాన్ని బ్రాంచ్ మేనేజర్ మాయం చేశాడు. ఎ స్సై ఎన్వీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన ఎన్.ధనలక్ష్మి ఐఐఎఫ్ఎల్ బ్యాంకులో 270 గ్రాము ల బంగారు ఆభరణాలను 2023లో తనఖా పె ట్టి రుణం తీసుకున్నారు. బ్రాంచ్ మేనేజర్ ఉ ద్దగిరి చైతన్య రాము రుణంపై వడ్డీ కట్టాలంటూ ఫోన్ చేసేవాడు. ధనలక్ష్మి వడ్డీ కట్టలేకపో వడంతో రుణాన్ని అప్డేట్ చేస్తానని, ధనలక్ష్మి ఫోన్కు ఓటీపీ వచ్చిందని చెప్పమని అడిగేవా డు. అలా పలుమార్లు ఓటీపీ తెలుసుకున్నాడు. గత డిసెంబర్ 20న ధనలక్ష్మి బంగారాన్ని విడిపించేందుకు బ్యాంకుకు వెళ్లగా ధనలక్ష్మి పేరు న అసలు బంగారం తనఖా లేదని తెలిసింది. చైతన్య రాము ఎప్పుడో మానివేశారని బ్యాంకు సిబ్బంది చెప్పారు. చైతన్య రాము ఆ బంగారా న్ని విడిపించి వేరే వ్యక్తుల పేరున పెట్టినట్టు తె లుస్తోంది. ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసు లు కేసు నమోదు చేశారు.బాధితులు ఇంకా చా లా మంది ఉన్నట్టు ధనలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. జంగారెడ్డిగూడెం: వైద్య పీజీ సీట్లు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడేనికి చెందిన ఎస్కే షంషీర్ అహ్మద్ రాఘవాపురం పీహెచ్సీలో హెల్త్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా రు. ఆయన పెద్ద కుమార్తె, మేనల్లుడు ఎంబీబీఎస్ పూర్తిచేశారు. విదేశాల్లో పీజీ చదువు కో సం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అ హ్మద్కు తెలంగాణలోని మహబూబ్నగర్ జి ల్లా మరికల్ గ్రామానికి చెందిన గుండా రా ఘవ పరిచయమయ్యాడు. తాను విదేశాల్లో పీజీ సీటు ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో దఫదఫాలుగా షంషీర్ అహ్మద్ ఫోన్పే, ఆన్లైన్ ద్వారా రూ.19.50 లక్షలు రాఘవకు బదిలీ చేశారు. అనంతరం రాఘవకు ఫోన్ చేసినా సమాధానం చెప్పకపోవడం, సీటు ఇప్పించకుండా తప్పించుకుని తిరుగుతూ మాయమాటలు చెప్పుకొచ్చాడు. దీంతో అహ్మద్ తాను మోసపోయానని గ్రహించి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. పెదవేగి: వారం రోజుల్లోగా కోకో గింజల ధర ల పాలసీ ప్రకటించి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధర నిర్ణయించకపోతే కోకో రైతుల పోరాటం తప్పదని ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర స మావేశం హెచ్చరించింది. విజయరాయిలో ఆ దివారం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అ ధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజల ధరను కి లోకు రూ.350కు తగ్గించడం దారుణమన్నా రు. ఆయిల్పామ్ మాదిరిగా ఫార్ములాతో కో కో గింజల ధర నిర్ణయించాలని కోరారు. -
దళారులు చెప్పిందే ధర!
ఆక్వా రంగంలో దళారులు, వ్యాపారులదే రాజ్యం. వారు నిర్ణయించిందే ధర. రైతుల డిమాండ్కు ఏమాత్రం ప్రాధాన్యత లేదు. ప్రభుత్వం కనీస మద్దతు ధరలు నిర్ణయించినా అమలుకు నోచుకోవడం లేదు. నేను 20 ఎకరాల్లో రూప్చంద్ సాగు చేస్తున్నాను. 50 శాతం చెరువుల్లో చేపలు పట్టుబడికి సిద్ధంగా ఉన్నాయి. ధర రూ.85కు పడిపోవడంతో ఈ ధరకు అమ్మితే పెట్టిన పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదు. – సంకు శ్రీనివాసరావు, రూప్చంద్ రైతు ఏడాది కాలంగా చేపల సాగు నష్టాలతోనే నడుస్తోంది. వ్యాపారులు చేప ధర తగ్గించేయడం, కంపెనీలు మేత ధర పెంచేయడంతో మేం నలిగిపోతున్నాం. 20 ఎకరాల్లో వేసిన రూప్చంద్ పట్టుబడి దశకు చేరింది. ధర పడిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. విద్యుత్ బిల్లులు సైతం తలకుమించి భారంగా మారాయి. ప్రభుత్వం ఆక్వా రైతుల సమస్యలపై దృష్టి సారించి న్యాయం చేయకపోతే ఈ సాగుకు మనుగడ ఉండదు. – రమేష్రాజు, ఆక్వా రైతు, గణపవరం -
విజయీభవ
ఏలూరు (ఆర్ఆర్పేట) : ఉమ్మడి జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ థియరీ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. సో మవారం నుంచి ప్రథమ సంవత్సరం, మంగళవారం నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేయడంతో పాటు హాల్టికెట్లు కూడా వెబ్సైట్, వాట్సాప్లలో అందుబాటులో ఉంచింది. ఇక విద్యార్థులు తాము చదివిన చదవునంతా జవాబుపత్రాలపై పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు తొలి మెట్టు అయిన ఈ పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగానే వారు భవిష్యత్లో తమ లక్ష్యాలను చేరుకోవడానికి సోపానం ఏర్పడుతుంది. వచ్చేనెల 24 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 109 పరీక్షా కేంద్రాలు ఏలూరు జిల్లాలో ప్రథమ సంవత్సరం పరీక్షలకు 17,556 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 17,059 మంది మొత్తంగా 34,615 మంది హాజరుకానున్నారు. ఈ మేరకు ఏలూరు జిల్లాలో 56 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా పత్రాలను పంపిణీకి 21 స్టోరేజ్ పాయింట్లను సిద్ధం చేశారు. ఆయా రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రథమ సంవత్సరం 19,662 మంది, ద్వితీయ సంవత్సరం 17,888 మొత్తంగా 37,550 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా 53 కేంద్రాలను ఏర్పాటుచేశారు. 800 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు పూర్తి చేశారు. ఏలూరు జిల్లాలో పరీక్షల నిర్వహణ కోసం మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు, రెండు సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. పరీక్షా కేంద్రాల్లో 1,006 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. 800 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల విధుల్లో పాల్గొంటారు. జిల్లా కేంద్రం ఏలూరులో 17 సెంటర్లు ఉన్నాయి. ఆరు సెంటర్లలో ప్రహరీ గోడలు లేకపోవడంతో అక్కడ మ రింత పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడానికి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ఇంటర్ పరీక్షలకు ఎంసెట్, నీట్ మాదిరిగా ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. కాగా ఉదయం 8.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి కేంద్రాల్లో చేస్తున్న ఏర్పాట్లను ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ పర్యవేక్షించి అధికారులకు సూచనలు జారీ చేశారు. ద్వితీయ సంవ్సతరం 24న.. సెకండ్ లాంగ్వేజ్–2 26న.. ఇంగిష్–2 28న.. బోటనీ, హిస్టరీ–2 మార్చి 4న.. లెక్కలు–2ఏ, సివిక్స్–2 మార్చి 6న.. జువాలజీ, ఎకనామిక్స్–2 మార్చి 9న.. లెక్కలు–2బీ మార్చి 11న.. కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్–2 మార్చి 13న.. ఫిజిక్స్–2 మార్చి 16న.. మోడరన్ లాంగ్వేజ్–2, జియోగ్రఫీ–2 మార్చి 18న.. కెమిస్ట్రీ–2 మార్చి 23న.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్–2 ఆల్ ద బెస్ట్ నేటి నుంచి ఇంటర్ పరీక్షలు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి వచ్చేనెల 24 వరకు నిర్వహణ ఉమ్మడి జిల్లాలో 72,165 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం 23న.. తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ 25న.. ఇంగ్లిష్–1 27న.. హిస్టరీ, బోటనీ–1, మార్చి 2న.. లెక్కలు–1 మార్చి 5న.. బయోలజీ–1, జువాలజీ–1 మార్చి 7న.. ఎకనామిక్స్–1 మార్చి 10న.. ఫిజిక్స్–1 మార్చి 12న.. కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్–1 మార్చి 14న.. సివిక్స్–1 మార్చి 17న.. కెమిస్ట్రీ–1 మార్చి 21న.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్–1 మార్చి 24న.. మోడల్ లాంగ్వేజ్, జాగ్రఫీ–1 -
మామిడిపై నల్ల తామర దాడి
● ప్రతికూల వాతావరణంతో నష్టం ● మాడిపోయిన మామిడి పూత నూజివీడు: ఈ ఏడాది మామిడి తోటల్లో 90 శాతం తోటలు పూతతో కళకళలాడాయి. దీంతో దిగుబడి బాగుంటుందని, కష్టాలు తీరతాయని మామిడి రైతులు భావించారు. ఇంతలోనే నల్ల తామరకు, ప్రతికూల వాతావరణం తోడవడంతో వచ్చిన పూతంతా మాడిపోయింది. దీంతో మామిడిపై పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలైనట్లేనని రైతన్నలు లబోదిబోమంటున్నారు. నూజివీడు డివిజన్లో ప్రధాన వాణిజ్య పంటగా మామిడి దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. నూజివీడు రసాలన్నా.. సువర్ణరేఖ.. బంగినపల్లి అన్నా దేశ విదేశాల్లో ఎంతో ప్రసిద్ధి. అలాంటి మామిడి పరిస్థితి రానురాను దయనీయంగా తయారవుతోంది. గత రెండేళ్లుగా కాపు లేకపోవడం.. ఈ ఏడాది పూత పెద్ద ఎత్తున రావడంతో మామిడి ఆదుకుంటుందనే గంపెడాశతో ఉన్న రైతులను నల్లతామర, ప్రతికూల వాతావరణం నట్టేట ముంచింది. నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, చింతలపూడి, లింగపాలెం మండలాల్లో దాదాపు 40 వేల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఈ మామిడి తోటల్లో డిసెంబరు నుంచి పూతలు ప్రారంభమై, జనవరిలో గణనీయంగా రావడంతో రైతులు ఆనందపడ్డారు. బంగినపల్లి, తోతాపురి, రసాలు, సువర్ణరేఖ, తియ్యమామిడి తదితర అన్ని రకాల్లో పూతలు ముమ్మరంగా వచ్చాయి. ఫిబ్రవరి 2 నుంచి మామిడి తోటలపై తామర పురుగు దాడి చేయడం, ఉదయం 9 గంటల వరకు మంచు పడటంతో వచ్చిన పూతలో దాదాపు 70 శాతం పూత నిలువునా మాడిపోయింది. ఒక్కొక్క రైతు పూత వచ్చిన దగ్గర నుంచి పూత నిలుపుకోవడం కోసం 10 నుంచి 12 సార్లు రసాయన మందులు పిచికారీ చేసినప్పటికీ చివరలో తామర పురుగు ఆశించడంతో చేసిన ప్రయత్నమంతా వృథా అయింది. రైతుల ఆశలు అడియాశలయ్యాయి. కనిపించని పిందె కట్టు డివిజన్లోని మొత్తం విస్తీర్ణంలో 90 శాతం తోటల్లో ఈ ఏడాది పూతలు వచ్చాయి. మామిడి అనేది ఒక ఏడాది కాస్తే, మరో ఏడాది కాపు తక్కువగా ఉంటుంది. తామర పురుగు ఆశించడం, ప్రతికూల వాతావరణంతో పూత కాడలకు, పూమొగ్గలకు ఆశించి అందులోని రసాన్నంతా పీల్చేయడంతో పూతంతా మాడిపోయింది. ఎన్నిసార్లు రసాయన మందులు పిచికారీ చేసినా వాటిని నియంత్రించడం సాధ్యపడలేదు. దీంతో లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో విలవిల్లాడుతున్నారు. వరుసగా మూడేళ్లు మామిడి తోటల వల్ల దెబ్బతినిపోయామని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మామిడి పరిస్థితి దారుణంగా తయారైంది. పూతలు బాగా వచ్చినప్పటికీ తామర పురుగు వల్ల పూతంతా మాడిపోయింది. రెండేళ్లుగా నష్టాలే మిగులుతుండగా, ఈ ఏడాది కూడా నష్టాలు తప్పేలా లేవు. రెండెకరాల్లో ఉన్న చిన్న రసాల చెట్లకు 6 సార్లు మందులు పిచికారీ చేశా. రూ.30 వేలు పెట్టుబడి కాగా పెట్టుబడి వచ్చే పరిస్థితి కనబడటం లేదు. వికృతి రాంబాబు, కొత్త ఈదర, ఆగిరిపల్లి మండలం నల్ల తామర పురుగుల నివారణకు తోటల్లో జిగురు అట్టలు కాని, పాతచీరలను ఆముదంలో ముంచి గాలివాటంకు అనుగుణంగా తోటలలో కట్టాలి. దీంతో చీరకు అంటుకున్న నల్ల తామర పురుగులు అతుక్కుపోయి ఎగరలేవు. గతేడాది ఉన్నంత ఉధృతంగా అయితే ఈ ఏడాది లేవు. మంచు వల్ల కూడా నష్టం జరిగింది. ఆర్.హేమ, ఉద్యాన అధికారి, నూజివీడు 4 ఎకరాల్లో మామిడి తోట ఉండగా బంగినపల్లి, చిన్నరసాలు, సువర్ణ రేఖ రకాల చెట్లు ఉన్నాయి. ఈ ఏడాది పూత బాగా వచ్చింది. పూతను కాపాడుకునేందుకు 4 సార్లు మందులు పిచికారీ చేశాను. దీనికి రూ.60 వేలు పెట్టుబడి అయింది. అనుకోకుండా ఫిబ్రవరిలో నల్ల తామర ఆశించడంతో పూతంతా మాడిపోయింది. తోటలోకి వెళ్లాలని అనిపించడం లేదు. వెలివల శివరామకృష్ణ, సుంకొల్లు, నూజివీడు మండలం -
జాడలేని ఓడరేవు
హార్బర్ లేకపోవడంతో వశిష్ట గోదావరి గట్టున నిలిపి ఉంచుతున్న వేటబోట్లు నరసాపురం: నరసాపురం తీర ప్రాంతంలో దశాబ్దాల కలగా ఉన్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని చంద్రబాబు ప్రభుత్వం విజయవంతంగా అటకెక్కించింది. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసిన ప్రాజెక్ట్పై నిండా నిర్లక్ష్యం చూపుతోంది. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో ప్రాజెక్ట్ ఊసెత్తకపోవడమే ఇందుకు నిదర్శనం. గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నరసాపురం మండలం బియ్యపుతిప్ప వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2022 మే నెలలో ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లు పిలవగా, విశ్వసముద్ర సంస్థ పనులు దక్కించుకుంది. పర్యావరణ, ఇ తర సాంకేతిక అనుమతులు కూడా వచ్చాయి. 600 ఎకరాల విస్తీర్ణంలో రూ.429.43 కోట్ల ని ర్మాణ వ్యయంతో 2023 ఫిబ్రవరిలో ప్రాథమికంగా పనులు కూడా ప్రారంభించారు. నిర్మాణం.. ప్రశ్నార్థకం 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంలో ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కాంట్రాక్ట్ సంస్థ ఎన్నికల ముందు ప్రాథమిక సర్వే వంటి పనులు చేపట్టగా.. ఈ ప్రభుత్వంలో వెనుకడు గు వేసింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫిషింగ్ హార్బర్ నిర్మించి తీరుతామని హామీలు గుప్పించిన కూటమి నేతలు ప్రస్తుతం దీనిపై ఏమీ మాట్లాడటం లేదు. మత్స్య ఎగుమతులకు ఊతం మత్స్య సంపద, ఆక్వా ఎగుమతుల్లో ఉమ్మడి పశ్చిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ నుంచి దేశ, విదేశాలకు ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అ వుతాయి. ఏటా రూ.కోట్ల విదేశీ మారకద్రవ్యం కూడా వస్తుంది. తీరప్రాంతంలో సముద్ర మ త్స్య సంపద ద్వారా కూడా భారీగా ఆదాయం సమకూరుతుంది. ఏటా నరసాపురం తీరంలో రూ.300 కోట్ల విలువచేసే మత్స్య ఎగుమతులు ఉంటాయి. హార్బర్ వంటి మౌలిక వసతులు ఉంటే మరో 40 శాతం ఎగుమతులు పెరిగే అ వకాశం ఉంది. ఈ కారణంతోనే గత ప్రభుత్వం హార్బర్ నిర్మాణానికి పూనుకుంది. బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ దశాబ్దాలుగా మత్స్యకారుల కల. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఖర్చు భరించేలా హార్బర్ నిర్మాణానికి గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ నిర్ణయం చేశారు. అన్ని అనుమతుల కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అప్పట్లో టెండర్లు కూడా పిలిచి, పనులను కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పనులు ఎందుకు మొదలుపెట్టడం లేదనేది అర్థం కావడం లేదు. హార్బర్ను నిర్మించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. వెంటనే పనులు ప్రారంభించాలి. – ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ‘వల’విల బియ్యపుతిప్ప హార్బర్ నిర్మాణంపై నిర్లక్ష్యం రాష్ట్ర బడ్జెట్లో ఊసెత్తని వైనం ప్రాజెక్టును అటకెక్కించిన చంద్రబాబు ప్రభుత్వం గత ప్రభుత్వంలో హార్బర్ నిర్మాణానికి శ్రీకారం -
అంతరాలయ దర్శనం.. కట్టుదిట్టం
ద్వారకాతిరుమల: చినవెంకన్న అంతరాలయ దర్శ నం టికెట్ల రీప్రింట్ దందాకు పూర్తిస్థాయిలో చెక్ పడింది. దీంతో స్వామివారి ఆదాయం గణనీయంగా పెరిగింది. గత శనివారంతో పోలిస్తే ఈ వారం 151 అంతరాలయ దర్శనం టికెట్లు అధికంగా అ మ్ముడయ్యాయి. ఈనెల 15న ‘సాక్షి’లో ‘దొడ్డిదారిన శ్రీవారి దర్శనాలు’ శీర్షికన ప్రచురించిన కథనంతో టికెట్ల రీప్రింట్ వ్యవహారం బయటపడింది. దీ నిపై స్పందించిన దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావు, ఈవో వై.భద్రాజీ చర్యలు తీసుకు న్నారు. పలువురు అధికారుల విధులను మార్పు చేశారు. అలాగే ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు వీఐపీల పేరుతో వచ్చేవారి వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత అంతరాలయ దర్శనానికి అ నుమతిస్తున్నారు. అయితే దర్శనం టికెట్లను మాత్రం తప్పనిసరిగా కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అధికారుల చర్యలతో అంతరాలయ దర్శనం టికెట్ల విక్రయాలు అధికంగా పెరిగాయి. ఈనెల వరుసగా మూడు శనివారాల్లో విక్రయించిన అంతరాలయ దర్శనం టికెట్ల సంఖ్యను పరిశీలిస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈనెల 7న 476, 14న 670, 21న 821 టికెట్లను విక్రయించారు. టికెట్ల రీప్రింట్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత తొలి శనివారం 821 టికెట్లు విక్రయించడం విశేషం. గత వారంతో పోలిస్తే 151 టికెట్లు అదనంగా విక్రయించగా దేవస్థానానికి అ దనంగా రూ.75,500 ఆదాయం సమకూరింది. ఆ దివారం సాయంత్రం 6 గంటల వరకు 527 అంతరాలయ దర్శనం టికెట్లను విక్రయించారు. టికెట్ల రీప్రింట్ దందాకు చెక్ -
ఎన్నడూ లేని సంక్షోభం
నేను 11 ఎకరాల్లో ఆక్వా సా గు చేస్తున్నాను. ఇటువంటి ఆక్వా సంక్షోభం ఎన్నడూ చూడలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం కనీ సం విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం లేదు. ఇది ఇస్తే కొంతైనా కో లుకుంటాం. ఫీడ్ ధరల తగ్గించాలి గతంలో ముడిసరుకుల ధరలు తగ్గినా కిలోకు రూ.20 తగ్గించాల్సి ఉన్నా తగ్గించలేదు. ప్రస్తుతం ఫిష్ మీల్ ధర పెరిగిన నేపథ్యంలో మళ్లీ ధరలు పెంచడం అన్యాయం. –తంగెళ్లబాబు, ఆక్వా రైతు నాణ్యత లేని సీడ్ వల్ల ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం ఈహెచ్పీ ఉన్న తల్లి రొయ్యల నుంచి సీడ్ దిగుమతి కావడంతో ఎక్కువ నష్టం జరుగుతోంది. సీఏఏ అధికారి ద్వారా సరైన పర్యవేక్షణ లేకపోవడం కారణంగా కనిపిస్తోంది. ఆక్వా సాగు బాగుండాలంటే మంచి సీడ్ లభించాలి. ఆక్వా రైతులు సమస్యలపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని సాగుకు అన్నిరకాలుగా ప్రోత్సాహం అందించాలి. –మరిడి వెంకటేశ్వరరావు, ఆక్వా రైతు -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు–నరసాపురం రోడ్డులో పెదగరువు వెళ్లే రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భవిరిశెట్టి ప్రభు కుమార్ (32) అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి ద్విచక్ర వాహనంపై తన సోదరి ఇంటికి పాలకొల్లు వస్తున్న ప్రభు కుమార్ పెదగరువు రోడ్డు వద్దకు వచ్చే సరికి లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రభు కుమార్ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పృథ్వీ తెలిపారు. కై కలూరు: ద్విచక్రవాహనంపై ఆగివున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆలపాడు జాతీయ రహదారి ఆదర్శ స్కూల్ వద్ద ఆదివారం జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పంచాయతీ బొమ్ములూరుకు చెందిన చిన్నపరుపు నాగశ్రీను(49) బడ్డీ కొట్టు నిర్వహిస్తున్నాడు. కై కలూరులో బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్తుండగా.. ఆదర్శ స్కూల్ వద్ద పక్కకు ఆపి నిలబడ్డాడు. ఇంతలో కై కలూరు నుంచి ఆకివీడు వెళ్తున్న కారు గట్టిగా ఢీకొట్టడంతో నాగశ్రీను మరణించాడు. కుమారుడు భానుప్రసాద్ ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై వి.రాంబాబు కేసు నమోదు చేశారు. -
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ళ శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. అన్నదాన కార్యక్రమానికి భక్తలు పోటెత్తడంతో ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగా శ్రీదేవి ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీప్రాంతంలో కొలువైన గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అధికంగా తరలివచ్చిన భక్తుల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీతోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు. నరసాపురం రూరల్: సెలవు దినం కావడంతో సముద్ర తీరం పర్యాటకుల రాకతో కళకళలాడింది. మొగల్తూరు మండలంలోని కేపీ పాలెం, పేరుపాలెం గ్రామాలతో పాటు నరసాపురం మండలంలోని పెదమైనవానిలంక, చినమైనవానిలంక గ్రామాల పొడవునా విస్తరించి ఉన్న బీచ్ ప్రాంతం ఆదివారం ఉదయం నుంచే సందర్శకులతో కిక్కిరిసిపోయింది. ప్రకృతి ప్రేమికులు, యువత ప్రత్యేక వాహనాలు, ద్విచక్ర వాహనాలపై భారీ సంఖ్యలో తరలిరావడంతో తీరమంతా కోలాహలం నెలకొంది. ఉదయాన్నే బీచ్కు చేరుకున్న పర్యాటకులు ఉత్సాహంగా సముద్ర కెరటాలలో స్నానాలు చేస్తూ సేదతీరారు. ఒడ్డుకు కొట్టుకువస్తున్న కెరటాల మధ్య ఇసుక తిన్నెలపై చిన్నారులు ఆటలాడుకుంటూ సందడి చేశారు. తీరానికి సమీపంలో ఉన్న ఆలయాలను పర్యాటకులు దర్శించుకున్నారు. అనంతరం అక్కడి సర్వే తోటలు, కొబ్బరి తోటల నీడన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా గడిపారు. తీరం వెంబడి వాహనాల రద్దీ పెరగడంతో పాటు, స్థానిక వ్యాపారాలు కూడా పుంజుకోవడంతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం కనిపించింది. -
పాతాళానికి రూప్చంద్ ధర
● ఏడాదిలో కిలో రూ.125 నుంచి రూ.82కు పడిపోయిన ధర ● మేతల ధర పెంపుతో తీవ్ర ప్రభావం గణపవరం: రూప్చంద్ చేపల సాగు చేపట్టిన ఆక్వా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏడాది క్రితం వరకూ ధర బాగానే.. ప్రస్తుతం ధర పాతాళానికి పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పది నెలల్లో కిలోకు ఏకంగా రూ.40 వరకూ ధర తగ్గింది. దీంతో రూప్చంద్ సాగుచేసే రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితి గతేడాది జనవరిలో రూప్చంద్ కిలో ధర రూ.125 వరకు పలికింది. రొయ్యల సాగులో తీవ్ర నష్టాల్లో ఉన్న రైతులు రూప్చంద్ సాగు చేపట్టారు. మంచి ధర ఉండడంతో రైతులు ఆనందపడ్డారు. అయితే క్రమంగా ధర తగ్గిపోవడంతో రైతు ఢీలపడ్డాడు. గత జూలై వరకు రూ.112 – రూ.115 వరకూ పలికిన ధర, క్రమంగా తగ్గుముఖం పడుతూ ప్రస్తుతం రూ.82కి చేరింది. గత మూడు, నాలుగు నెలలుగా రూ.80 నుంచి రూ.85 మధ్యే ఉంది. దీంతో రైతులు చేపలను అమ్ముకోలేక, చెరువుల్లో ఉంచి మేపలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో ఆక్వాసాగు మొదలైన తర్వాత ఇంతటి గడ్డు పరిస్థితి ఎప్పుడూ చూడలేదని రైతులంటున్నారు. సరిగా పట్టుబడి సమయానికి ధర తగ్గిపోవడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండేళ్ల క్రితం కూడా రూప్చంద్ ధర కిలో రూ.60కు పడిపోయి రైతులు దారుణంగా నష్టపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 2.35 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా.. అందులో 1.5 లక్షల ఎకరాల్లో చేపల సాగు చేస్తున్నారు. ఇందులో అధిక శాతం అంటే 70 నుంచి 80 వేల ఎకరాల్లో రూప్చంద్ సాగు చేస్తున్నారు. ప్రస్తుత ధర కిలో రూ.85 చొప్పున అమ్మితే వచ్చే సొమ్ము కేవలం మేతలు, మందులకే సరిపోతుంది. చెరువు లీజులు, సీడ్, విద్యుత్ బిల్లులు, కాపలాదారుల జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులు చూసుకుంటే ఎకరాకు కనీసం లక్ష రూపాయల నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు మేత కంపెనీలు కిలోకు రూ.4 చొప్పున ధరలు పెంచడంతో మరింత నష్టం తప్పడం లేదు. కొంతకాలం వేచిచూస్తే చేప ధర పెరుగుతుందన్న ఆశతో రోజుల తరబడి చేపలను చెరువులో ఉంచి మేపడం వల్ల మరింత నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు -
పెద్దింట్లమ్మ జాతరకు భక్తుల తాకిడి
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరలో ఆదివారం భక్తులు కిటకిటలాడారు. సమీప జిల్లాల నుంచి వేలాది మంది మొక్కులు సమర్పించుకున్నారు. పెద్దింట్లమ్మకు విశేషార్చన, నూతన వస్త్ర అలంకరణ, పుష్పాలంకరణ, పంచమావరణ కలశార్చన, ద్రవ్యోపచారాలతో అర్చన, ధూపసేవ, బాలభోగం, నీరాజన మంత్ర పుష్పార్చన జరిగింది. అమ్మవార్లకు వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ఉచిత ప్రసాద వితరణ దాతగా విజయవాడకు చెందిన కొయ వేంకటేశ్వరరావు దంపతులు వ్యవహరించారు. జాతరకు వచ్చిన భక్తులకు ఉచిత ప్రసాదం, మజ్జిగను ఆలయ ధర్మకర్త కొల్లి రాంబాబు అందించారు. భక్తులకు వాటర్ ప్యాకెట్లను విజయవాడకు చెందిన బండారు కృష్ణ ప్రసాద్ పంపిణీ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వాహనాలతో వచ్చిన భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మకు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు వంటలు చేసుకోడానికి దేవస్థానం ఉచిత పందిర్లను కేటాయించింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కూరెళ్ల లక్ష్మీజ్యోతి బృందం ప్రదర్శించిన కూచిపూడి భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఈ నెల 28న జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గాగోకర్ణేశ్వస్వామి కల్యాణం జరుగుతుందన్నారు. అమ్మవారికి రూ.2,29,565 ఆదాయం వచ్చిందని ఈవో శ్రీనివాసు చెప్పారు. 28న జలదుర్గా గోకర్ణేశ్వర కల్యాణం -
కాపు సంక్షేమంపై తీవ్ర నిర్లక్ష్యం
ఎన్నికల సమయంలో కాపులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కాపుల సంక్షేమం విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ముచ్చటగా మూడోసారి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ ఏడాది బడ్జెట్లో కూడా కాపు కార్పొరేషన్కు ఎలాంటి నిధులూ కేటాయించలేదు. కాపు కార్పొరేషన్ అలంకారప్రాయంగా మారింది. కూటమి ప్రభుత్వంపై కాపులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. – కొత్తపల్లి రమేష్నాయుడు, జాతీయ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు/నరసాపురం -
30 దాటినా .. ఒంటరే!
●పెళ్లికాని ప్రసాద్లకు కొత్త తంటా ●మ్యారేజ్ బ్యూరోల్లో పేరుకుపోతున్న బయోడేటాలు తాడేపల్లిగూడెం: ఆరంకెల జీతం, ఆస్తిపాస్తులు ఉన్నా.. పెళ్లి మాత్రం కావడం లేదు. సమాజంలో పెళ్లి కాని ప్రసాద్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ముప్పై ఏళ్లు దాటుతున్నా పెళ్లి పీటలు ఎక్కే భాగ్యం దక్కడం లేదు. ఒకప్పుడు అమ్మాయిల తల్లిదండ్రులు పెళ్లికొడుక్కి కట్నకానుకల కోసం ఇబ్బంది పడేవారు. ఇప్పుడు పిల్ల దొరికితే చాలు.. కట్నం అక్కర్లేదు, అని అబ్బాయిల తల్లిదండ్రులు అనే పరిస్థితి ఏర్పడింది. చాంతాడులా వధువుల డిమాండ్లు మారుతున్న కాలంతో పాటు అమ్మాయిల ఆలోచనా తీరు మారింది. ఒకప్పుడు పెళ్లిచూపుల్లో అబ్బాయిలు ప్రశ్నలు వేసేవారు, ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిల అర్హతలను పరీక్షిస్తున్నారు. వాళ్ల లిస్టు వింటుంటే అబ్బాయిలు పెళ్లిళ్లపై ఆశలు వదులేసుకుంటున్నారు. సాఫ్ట్వేర్ జాబ్, చిన్న కుటుంబం, ఆస్తిపాస్తులు ఇవన్నీ చూస్తుండడంతో పెళ్లి కాని అబ్బాయిల సంఖ్య పెరిగిపోతోంది. గత పదేళ్లలో అమ్మాయిలు ఉన్నత విద్య అభ్యసించడం సర్వసాధారణంగా మారింది. దీంతో తమకంటే ఎక్కువ చదువుకున్న అబ్బాయి, ఎక్కవ జీతం వచ్చే అబ్బాయి కావాలంటున్నారు. ఇంజినీరింగ్ కోర్సులు చేసిన అమ్మాయిలు.. డిగ్రీ చదివిన అబ్బాయిలను వద్దంటున్నారు. మ్యారేజ్ బ్యూరోల్లో వెయిటింగ్ మ్యారేజ్ బ్యూరోలకు వస్తున్న వారిలో 30 ఏళ్లకు పైబడిన వారే అధికంగా ఉంటున్నారు. అమ్మాయికి తగ్గ అబ్బాయి దొరకడం లేదని కొందరు అంటుంటే, అసలు అమ్మాయిలే దొరకడం లేదని అబ్బాయిల తరపు వారు బాధపడుతున్నారు అని పురోహితులు, మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెబుతున్నారు. లెక్కల్లో తేడా ఉమ్మడి పశ్చిమలో 2011 జనాభా లెక్కల ప్రకారం 39,36,966 జనాభా ఉండగా.. 19,72,048 మంది పురుషులు, 19,64,918 మంది మహిళలు ఉన్నారు. కొత్త పశ్చిమ జనాభా లెక్కల ప్రకారం 18 లక్షల మంది జనాభాలో పురుషులు 8,89,252 మంది, మహిళలు 8,90,683 మంది ఉన్నారు. ప్రతి 1004 మంది మహిళలకు, 1000 మంది పురుషులు ఉన్నారు. వెయ్యి మంది బాలురకు, 964 మంది బాలికలు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. 2011 లెక్కల ప్రకారం బాలికల నిష్పత్తి తక్కువగా ఉండడం పెళ్లిళ్లపై ప్రభావం చూపిందంటున్నారు. మా అమ్మాయిలకు సంబంధాలు చూడమని గతంలో మ్యారేజ్ బ్యూరోలకు బయోడేటాలు వచ్చేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. వయసు ముదిరిన యువకులకు సంబంధాలు చూడమనే వారు అధికం అయ్యారు. అయినా వివాహాలు కుదరడం లేదు. – నాయుడు, మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ నాయకుడు -
అక్రమ కలప స్వాధీనం
కొయ్యలగూడెం: అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకున్నట్లు కన్నాపురం ఫారెస్ట్ రేంజర్ భాను ప్రకాష్ శనివారం తెలిపారు. రాజవరం సమీపంలో రహస్య ప్రదేశంలో అక్రమ కలపను నిల్వ ఉంచారన్న సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. ఈ నేపథ్యంలో సుమారు రూ. లక్ష విలువైన 20 టేకు దిమ్మలు గుర్తించి కన్నాపురం రేంజ్ కార్యాలయానికి తరలించామన్నారు. ఉండి: తేనెటీగల పెంపకంపై ఔత్సాహిక రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తేనెకు మంచి మద్దతు ధరను ప్రకటించాలని బాపట్ల కీటక శాస్త్ర ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ కోటేశ్వరరావు కోరారు. ఎన్నార్పీ అగ్రహారంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కొద్దిరోజులుగా జరుగుతున్న శాసీ్త్రయ తేనెటీగల పెంపకం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తేనె వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం తేనెలో కల్తీని ఏవిధంగా గుర్తించగలమో వివరించారు. పోలవరం రూరల్: పోలవరం మండలం పట్టిసం శివక్షేత్రం రేవులో నిత్యం తిరుగుతున్న ఫెర్రీ లాంచీ నిబంధనలకు విరుద్ధగా తిరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాయంత్రం 6 గంటలకే బోట్లు నిలిపివేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ ఏడు గంటల వరకు యథేచ్ఛగా తిరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దీనిపై శనివారం సాయంత్రం రేవులో విలేకరులు లాంచీ ఆలస్యంగా తిరగడంపై ప్రశ్నించగా, స్థానిక కూటమి భాగస్వామ్యంలోని పార్టీ నాయకులు దురుసుగా ప్రవర్తించడం కలకలం రేపింది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నా అధికారులు మౌనం వహించడంపై పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పంచాయతీల నిర్వహణపై శిక్షణ
ఏలూరు(మెట్రో) : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 10 మండలాలకు చెందిన గ్రేడ్ 4, గ్రేడ్ 5 పంచాయతీ డెవలప్మెంట్ అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. జెడ్పీ సీఈవో, జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ప్రిన్సిపాల్ ఎం.శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్షేత్ర స్థాయి పాలనను పటిష్టం చేయడం, గ్రామ పంచాయతీల్లో సర్వీస్ డెలివరీ మెరుగుపరచడం, రికార్డుల సక్రమ నిర్వహణ, పంచాయతీ ఆస్తుల పరిరక్షణ, మంచినీటి సంరక్షణ పద్ధతులు, ఘన ద్రవ, మల వ్యర్ధాల నిర్వహణ, సొంత వనరుల పెంపుదల, 100 శాతం పన్నులు, పన్నేతర ఆదాయాల వసూళ్లు అనే లక్ష్యాల సాధనలో పంచాయతీ అధికారుల పాత్ర అత్యంత ప్రాధాన్యమని శ్రీహరి తెలిపారు. పంచాయతీ సొంతఆదాయ వనరుతో పాటు ఇంటి పన్ను మదింపు, వసూళ్ల ప్రక్రియపై అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం జిల్లా కో–ఆర్డినేటర్ ప్రసంగ రాజు, మాస్టర్ ట్రైనర్స్ జీడీ శ్రీనివాస్, సూర్య కుమార్, విజయ భాస్కర్, వెంకటేష్ పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం కార్మికులకు రాయితీలు ప్రకటించినా.. ఇంతవరకు దానికి సంబంధించిన జీవో విడుదల చేయలేదని ఏపీ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్లు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంఘ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. కార్మికుల పిల్లల వివాహా లకు రూ.40 వేలు, కార్మికుడి భార్య లేదా కూతురి డెలివరీకి రూ.30 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, మట్టి ఖర్చులకు రూ.20 వేల చొప్పున ఇచ్చేలా చూస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అయినా ఇంత వరకు వీటికి సంబంధించిన జీవో విడుదల చేయలే దన్నారు. కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్ విధానాన్ని అమలు చేసే విధంగా తగు చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశం అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఏ.రాణికి అందజేశారు. జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంకు చెందిన రిటైర్డ్ హవాల్దార్ (ఆర్మీ) దంగల గోపాలకృష్ణ కేఎం కరియప్ప స్మారక పురస్కారం అందుకున్నారు. ఇటీవల విజయవాడలో హోం మినిస్టర్ అనిత చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఇండియన్ ఆర్మీలో అందించిన సేవలకు గుర్తింపుగా తనకు ఈ పురస్కారాన్ని అందచేసినట్లు తెలిపారు. -
కోతకు గురవుతున్న ఆలయం
పోలవరం రూరల్: అఖండ గోదావరి నది మధ్య పోలవరం ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రసిద్ధి చెందిన మహానందీశ్వరస్వామి ఆలయానికి ఒక వైపు వరదల ప్రభావంతో కోతకు గురవుతోంది. గత కొన్నేళ్ళుగా స్పిల్వే దిగువ నుంచి వరద ప్రవాహం ఉండటంతో ఆలయం చుట్టూ ఉన్న గట్టు మరింతగా కోతకు గురైంది. లంక ఒడ్డు పూర్తిగా కోతకు గురికావడంతో, దిగువన నిర్మించిన అన్నదాన శిబిరం భవిష్యత్తు ప్రశార్థకంగా మారింది. మళ్లీ వరద సమయానికి ఇది మరింత పెరిగితే అన్నదాన శిబిరం గోదావరిలో కలిసిపోయే పరిస్థితి ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి దాతల సహకారంతో మోటార్లు ఏర్పాటు చేసి మంచినీటి వసతి, మరుగుదొడ్లు, నిర్వాహకులు ఉండేందుకు వీలుగా గదుల నిర్మాణాలు జరిగాయి. సెలవు దినాల్లో వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. నందీశ్వరస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పోలీస్ చెక్పోస్టు ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్టు దాటి వెళ్లడానికి అందరికీ అనుమతులు లేవు. మహాశివరాత్రి ఉత్సవాల సమయంలో ఈ క్షేత్రానికి భక్తులు వెళ్ళేందుకు అనుమతులు రావడంతో సుమారు 10 వేల మంది వరకు దర్శించుకున్నారు. -
●కవలలు.. కనువిందు
జాతీయ కవలల దినోత్సవాన్ని తణుకు మాంటిస్సోరీ స్కూలులో శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో ఉన్న 30 మంది కవలలతోపాటు రెండు కవల త్రయం జంటలను డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రకాశరావు మాట్లాడుతూ ఇంత మంది కవలలు తమ పాఠశాలలోనే ఉండడం ఆనందంగా ఉందని, కవలలంతా మంచి విద్యాబుద్ధులతో ఉన్నతస్థాయికి చేరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్కూలు హెడ్మిస్ట్రస్ ఎం.లక్ష్మి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.జ్ఞానమంజరి, కాలేజ్ ఎకడమిక్ డైరెక్టర్ పి.కిషోర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. – తణుకు అర్బన్ -
సహకార సంఘ ఉద్యోగుల ధర్నా
అత్తిలి: సహకార సంఘ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ జిల్లా సెక్రటరీ పి.కృష్ణశాస్త్రి డిమాండ్ చేశారు. డీసీసీబీ అత్తిలి బ్రాంచ్ వద్ద సహకార సంఘాల సీఈఓలు, సిబ్బంది చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం 6వ రోజుకు చేరింది. ఈసందర్భంగా యూనియన్ జిల్లా సెక్రటరీ పి.కృష్ణశాస్త్రి మాట్లాడుతూ సహకార సంఘ ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. జీఓ నెం.36 వెంటనే అమలు చేసి, 2019, 2024 సంవత్సరాలలో పెండింగ్లో ఉన్న వేతన సవరణ చేపట్టాలని, అంతవరకు మధ్యంతర భృతి ఇవ్వాలని చెప్పారు. గ్రాట్యూటీ సీలింగ్ రూ.2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారని, గ్రాట్యూటీ చట్టాన్ని అమలు పరిచి చట్ట ప్రకారం గ్రాట్యూటీ చెల్లింపు చేయాలని కోరారు. రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, 2019 తరువాత సహకార సంఘాలలో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేసి, వారికి కూడా జీఓ నెం 36 అమలు చేయాలని డిమాండ్ చేసారు. ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా కల్పించాలని, ఉద్యోగి సర్వీస్లో మరణిస్తే ఆ కుటుంబానికి ఆధారం లేకుండా పోతుందని, అందువల్ల ప్రతి ఉద్యోగికి రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలని అన్నారు. సహకార సంఘాల ఉద్యోగుల చేపట్టిన సమ్మెకు మాజీ డీసీఎంఎస్ చైర్మన్, ఎస్.ఇల్లిందలపర్రు పీఏసీఎస్ చైర్మన్ నడింపల్లి సత్యనారాయణరాజు సంఘీభావం తెలిపారు. వీరి న్యాయబద్ధమైన డిమాండ్లను సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యూనియన్ ఉపాధ్యక్షులు బలుసు శ్రీనివాసులు, 14 సహకార సంఘాల సీఈఓలు, సిబ్బంది పాల్గొన్నారు. -
బిల్లు.. కాంట్రాక్టర్లు ఘొల్లు
తణుకు మున్సిపాలిటీలో రూ.10 కోట్ల బిల్లుల పెండింగ్తణుకు అర్బన్: తణుకు మున్సిపాలిటీలో బిల్లులు పెండింగ్ పడటంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. టెండర్ అగ్రిమెంట్ ప్రకారం గడువులోపు పనులు పూర్తిచేసినా బిల్లులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కారులో 20 నెలల్లో 100కు పైగా పనులు చేశామని, రూ.10 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నట్టు చెబుతున్నారు. పనులు చేయించుకుంటున్నారే తప్ప బిల్లుల వరకూ వచ్చేసరికి అధికారులు అదిగోఇదిగో అంటూ కాలం గడిపేస్తున్నారని, పాలకుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ నిధులతో పాటు జనరల్ ఫండ్స్, ఇతర ఫండ్స్తో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఎంబుక్ల రూపంలో బీరువాల్లో మూలుగుతున్నాయని అంటున్నారు. దీంతో కొత్త పనులకు టెండర్లలో కూడా పాల్గొనడం లేదని చెబుతున్నారు. అప్పులు చేసి మరీ పనులు అప్పులు చేసి పనులు చేస్తున్నామని బిల్లులు ఇవ్వకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నట్టు క్లాస్–1 నుంచి క్లాస్–5 వరకు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత మొదటి ఏడాది రెండు నెలల కాలంలో కొంత బిల్లులు ఇచ్చారని, ఆ త ర్వాత పనులు చేయించుకోవడమే తప్ప బిల్లుల ఊసే లేదన్నారు. కాంట్రాక్టర్లలో ఎక్కువ మంది చిన్నతరహా వారే కావడంతో బిల్లుల కోసం కార్యాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు. గ్రంథాలయ భవనం అందుబాటులోకి వచ్చినా.. తణుకు బ్యాంక్ కాలనీలో గత వైఎస్సార్సీపీ ప్రభు త్వ హయాంలో రూ.1.03 కోట్ల నిధులతో గ్రంథాలయ భవన నిర్మాణం మొదలుపెట్టగా చంద్రబా బు సర్కారులో ప్రారంభోత్సవం జరిగింది. ఈ భవనం అందుబాటులోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా కాంట్రాక్టరుకు ఇవ్వాల్సిన బిల్లు ఒక్క రూ పాయి కూడా విడుదల చేయని దుస్థితి తణుకు మున్సిపాలిటీలో నెలకొంది. -
గుట్కా.. వ్యాపారం జోరుగా..
మత్తు.. జీవితాలు చిత్తు ● జిల్లాలో యథేచ్ఛగా గుట్కా, ఖైనీ అమ్మకాలు ● నిఘా నామమాత్రం.. దాడులు తూతూమంత్రం ● గతేడాదిగా ఒక్క కేసూ లేదు భీమవరానికి చెందిన ఓ కార్మికుడు ఖైనీ తినడంతో గొంతు క్యాన్సర్ వచ్చింది. ప్రాణాపాయ స్థితిలో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో మూడు నెలలపాటు చికిత్స పొంది కొద్దిరోజులుగా కోలుకుంటున్నాడు. రూ.3 లక్షల వరకూ ఆస్పత్రి ఖర్చులయ్యాయి. భీమవరం (ప్రకాశంచౌక్): క్యాన్సర్ కారకాలైన గుట్కా, ఖైనీ అమ్మకాలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. మద్యం దుకాణాలు, బెల్టుషాపులు, పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో విక్రయిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా విక్రయాలు జరుగుతున్నాయి. గతంలో గుట్టుచప్పుడుగా చేసే ఈ వ్యాపారం ఇటీవల బహిరంగంగానే సాగుతోంది. ప్రధానంగా రహదారులను ఆనుకునే ఉండే మద్యం, పాన్ షాపుల్లో ఏ సమయంలో అయినా గుట్కా, ఖైనీ దొరుకుతోంది. యువత బా‘నిషా’ ఖైనీ, గుట్కాకు యువత బానిసలవుతున్నారు. మద్యం సేవించిన తర్వాత మరింత మత్తు కోసం వీటిని తింటున్నారు. 20 నుంచి 30 ఏళ్ల యువతే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మద్యం లభించని, మద్యం కొనుగోలుకు డబ్బులు లేని సమయాల్లో తక్కువ ధరకు ఖైనీ, గుట్కాలు నములుతూ మత్తులో తూలుతున్నారు. వీటికి విపరీతంగా అలవాటు పడినవారు క్యాన్సర్ వంటి రోగాల బారినపడుతున్నారు. దాడులు మరిచిన అధికారులు జిల్లావ్యాప్తంగా గుట్కా, ఖైనీ ప్యాకెట్ల అమ్మకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం పోలీసు దాడులు కూడా జరగడం లేదు. గ తంలో అప్పుడప్పుడు దాడులు చేసి ఖైనీ, గుట్కా ప్యాకెట్లను పట్టుకుని, విక్రయించే వారిపై కేసులు న మోదు చేసేవారు. అయితే ఏడాదిగా జిల్లాలో ఒక్క దాడి జరగలేదు. కనీసం దుకాణదారులకు పోలీ సులు హెచ్చరికలు కూడా జారీ చేయడం లేదు. దీంతో వీటి అమ్మకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. నిషేధిత పదార్థాలను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యమే కారణమనే విమర్శలు ఉన్నాయి. ఖైనీ, గుట్కా తీసుకోవడం వల్ల గొంతు, నోరు, ఆహార నాళిక, పేగు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ప్రాణాలు పోయే అవకాశం ఉంది. చిన్నపాటి మచ్చ పడినా కూడా అవయవం తొలగించాల్సి వస్తుంది. నోటి క్యాన్సర్ సోకితే ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది పడి క్రమేపి బలహీన పడి ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు పోతాయి. ఖైనీ, గుట్కా వల్ల జరిగే అనర్థాలపై క్యాన్సర్ దినోత్సవం నాడు అవగాహన కార్యక్రమాలు ని ర్వహిస్తున్నాం. అలవాటు ఉన్నవారు ఇప్పటికై నా మానుకోవడం ఉత్తమం. – డాక్టర్ ఎన్.హరిశ్చంద్ర ప్రసాద్, జనరల్ మెడిసిన్ -
కేంద్ర పథకాల నిధులు వినియోగించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాకు కేటాయించిన కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను నూరు శాతం వినియోగించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం సర్వే, వైద్యం, వ్యవసాయం, విద్య, పంచాయ తీరాజ్, ఐసీడీఎస్, ఉద్యాన శాఖల అధికారులతో ఆమె సమావేశమయ్యారు. జిల్లాకు కేటాయించిన కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపై సమీక్షించారు. శాఖల వారీగా నిధుల మంజూరు, ఖర్చు, పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నిధుల వినియోగానికి నెల మాత్రమే గడువు ఉందని, ఈలోపు నూరు శాతం సద్వినియోగం చేయాలన్నారు. ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కేంద్రం నుంచి 60:40, 90:10 నిష్పత్తులో నిధులు మంజూరు చేస్తారన్నారు. సమగ్ర శిక్ష ఏపీసీ పి.శ్యాం సుందర్, డీఎంహెచ్ఓ జి.గీతాబాయి, జిల్లా సర్వే అధికారి జాషువా, పంచాయతీరాజు ఎస్ఈ శ్రీనివాసరావు, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారి రాజేష్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎం.హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం(ప్రకాశంచౌక్): నరసాపురం పార్లమెంట్ పరిధిలోని జాతీయ రహదారులు, ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధిపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తన క్యాంపు కార్యా లయంలో శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రవాణా, ఆర్ అండ్బీ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విజయవాడ రీజనల్ ఆఫీసర్ హరికృష్ణ, కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్కుమార్రెడ్డి, ఆర్అండ్ బీ ఎస్ఈ విజయరత్న తదితరులు హాజర య్యారు. నరసాపురం బైపాస్ రోడ్డు నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిన నేపథ్యంలో త్వరగా పనులు చేపట్టాలన్నారు. ద్వారకాతిరుమల: గోవిందా హరి గోవిందా.. అంటూ వేలాది మంది భక్తులు చిన వెంకన్నను దర్శించుకున్నారు. శనివారం వేకువజాము నుంచి భక్తుల రాక మొదలైంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కల్యాణకట్ట, ప్రసాదాలు, టికెట్ విక్రయాల కౌంటర్లు, ఇతర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. వే లాది మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనివేటి మండపంలో కోలాట భజన మండలి సభ్యుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనివేటి మండపాలు, ఆలయ పరిసరాల్లో వివాహాలు జోరుగా జరిగాయి. అలాగే పలు ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న కొత్త జంటలు, వారి కుటుంబసభ్యులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం వరకూ రద్దీ కొనసాగింది. ఏలూరు (టూటౌన్): స్థానిక ఉమా కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ వేదికగా మూడు రోజులుగా జరుగుతున్న స్టేట్ లెవల్ కంటిన్యూ రిహాబిలిటేషన్ ఎడ్యుకేషన్ (సీఆర్ఈ) శిక్షణా కార్యక్రమం శనివారం ముగిసింది. ముఖ్య అతిథులుగా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకుడు బి.రామ్కుమార్, సర్వ శిక్ష అభియాన్ ఏపీసీ కె.పంకజ్కుమార్ హాజరయ్యారు. పంకజ్కుమార్ మాట్లాడుతూ ఆధునిక పద్ధతులు ఉపయోగించి దైనందిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసుకోవాలనే విషయాలను వివరించారు. రామ్కుమార్ మాట్లా డుతూ స్మార్ట్ హియరింగ్ ఎయిడ్స్, స్పీచ్–టు–టెక్ట్స్ సాఫ్ట్వేర్లు, ఏఐ యాప్ల ద్వారా దివ్యాంగులు స్వయంగా పనులు చేసుకునేలా తీర్చిదిద్దవచ్చన్నారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.పెద్దిరెడ్డి మాట్లాడుతూ స్పెషల్ ఎడ్యుకేటర్లు కేవలం సంప్రదాయ పద్ధతులకే పరిమి తం కాకుండా విజువల్ లెర్నింగ్ టూల్స్, ఇంటరాక్టివ్ సాఫ్ట్వేర్లను బోధనలో భాగం చే యాలని సూచించారు. అనంతరం శిక్షణలో పా ల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందించారు. -
నేరాల నియంత్రణపై దృష్టి
ఐజీ అశోక్కుమార్ పెనుగొండ: ఏలూరు పోలీస్ రేంజ్ పరిధిలో నేరాల నియంత్రణలో పోలీసులు చురుగ్గా పనిచేస్తున్నారని రేంజ్ ఐజీ అశోక్కుమార్ అన్నారు. శనివారం ఆచంట పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా రు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కేసుల వివరాలు, క్రైం రేటు, నమోదులపై ఆరా తీశారు. గంజాయి అక్రమ రవాణా నివారణ, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఆయన చెప్పారు. రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా లో జాతీయ రహదారిలో ప్రమాదాలకు అవకాశం ఉన్న 23 బ్లాక్ స్పాట్లను గుర్తించామన్నారు. నరసాపురం పట్టణం, పెంటపాడు, తణుకు, తాడేపల్లిగూడెంలో బ్లాక్ స్పాట్లు ఉన్నాయన్నారు. హైవే అధికారులతో చర్చించి ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని ఐజీ అశోక్కుమార్ తెలిపారు. అలాగే తణుకు, భీమవరం స్టేషన్లను మోడల్ పోలీస్స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఏఎస్పీ భీమారావు, నరసాపురం డీఎస్పీ డాక్టర్ శ్రీవేద, సీఐ రాయుడు విజయకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉగాదికైనా..అనుగృహం కలిగేనా?
సమస్యలు పరిష్కరించాలి సమస్యల పరిష్కారం కోసం సహకార పరపతి సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఆందోళన ఆరో రోజుకు చేరింది. 8లో uజిల్లాలో పక్కా ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఉగాది నాటికి 9,135 ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా ఇప్పటివరకు కేవలం 200 మాత్రమే పూర్తయ్యాయి. నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోవడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సాయం సరిపోక ఇళ్ల నిర్మాణానికి పేద వర్గాలు వెనకడుగు వేస్తున్నాయి. ప్రభుత్వం అందించే సాయం పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఆదివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026పేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో మునుపెన్నడూ లేనివిధంగా జిల్లాలో పక్కా ఇళ్ల నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. 626 లేఅవుట్లలో 47,362 మందికి ఇళ్ల స్థలాలు అందజేశారు. సొంతంగా స్థలం ఉన్న పేదలు 22,757 మందితో మొత్తం 70,119 మందికి ఇళ్లను గత ప్ర భుత్వం మంజూరు చేసింది. రూ.1.80 లక్షలు గృహనిర్మాణ సాయంతో పాటు ఇంటి నిర్మాణంలో వారికి అడుగడుగునా అండగా నిలిచింది. సబ్సిడీపై ఐరన్, సిమెంట్, ఇసుకను ఉచితంగా అందజేసింది. లబ్ధిదారులపై రవాణా చార్జీల భారం పడకుండా లేఅవుట్ల సమీపంలోనే వీటి స్టాక్ పాయింట్లను ఏర్పాటుచేశారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న లబ్ధిదారులకు అదనంగా రూ.35,000 రుణసదుపా యం కల్పించారు. పనుల వేగవంతానికి కో ట్లాది రూపాయలు వెచ్చించి జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేశారు. పదేళ్ల తర్వాత ఇంటిపై సర్వహక్కులు ఉండేలా లబ్ధిదారుల పేరిట స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి కన్వెన్షన్ డీడ్ అందజేసే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో దాదాపు 28 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. సాక్షి, భీమవరం: ఇళ్లు లేని పేదలకు మూడు సెంట్లు స్థలం ఇస్తామంటూ ఎన్నికల్లో చెప్పుకొచ్చిన చంద్రబాబు ఇప్పటివరకు సెంటు స్థలం కూడా పంపిణీ చేయలేదు. ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు సాయం అందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రకటించినా ఇప్పుడు ఆ ఊసేలేదు. గత ప్రభుత్వంలో మంజూరు చేసి నిర్మాణంలో ఉన్న వాటినే పూర్తిచేసి తమ ఖాతాలో వేసుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగా గత మే నెలాఖరు నాటికి జిల్లాలో పునాది, లింటల్ దశల్లోని 9,107 ఇళ్లను పూర్తిచేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గృహ నిర్మాణ సాయం రూ.1.80 లక్షలు కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు అదనంగా రూ.50 వేల సాయాన్ని ప్రకటించింది. ని ర్మాణ వ్యయం భారీగా పెరగడంతో ఇది ఏమాత్రం సరిపోక లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. నిర్మాణం.. బహుభారంరానున్న ఉగాది నాటికి జిల్లాలో 9,135 ఇళ్లను పూర్తిచేయాలని నవంబరు 15న లక్ష్యంగా నిర్ణయించా రు. కాగా సిమెంట్, ఐరన్, ఇటుక తదితర నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడంతో రూ.6 లక్షలు ఉంటేనే గాని ఇంటి నిర్మాణం పూర్తికాని పరిస్థితి. ప్రభుత్వ సాయం చాలడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. మరో పక్క సంక్షేమ పథకాల అమలు నిలిచిపోవడంతో పేదలు దగ్గర డబ్బులు లేక ఇ బ్బంది పడుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ సాయం పెంచాలని కోరు తున్నారు. త్వరితగతిన ఇళ్లను నిర్మించుకోవాలని హౌసింగ్ అధికారులు ఒత్తిడి తెస్తున్నా ఆర్థిక పరమైన ఇబ్బందులతో చాలా మంది లబ్ధిదారులు ముందుకురాక గత మూడు నెలల కాలంలో కేవలం 200 ఇళ్లు మాత్రమే పూర్తికావడం గమనార్హం. ఉగాదికి మరో మూడు వారాలు గడువు మాత్రమే ఉండటంతో లక్ష్యం చేరుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గూడు.. గోడు పెరిగిన వ్యయం.. చాలని సాయం ముందుకు సాగని గృహ నిర్మాణ పనులు ఉగాది నాటికి 9,135 ఇళ్లు పూర్తిచేయాలని టార్గెట్ ఇప్పటికి పూర్తయినవి కేవలం 200 గృహాలే గత ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో స్థలాల పంపిణీ జిల్లాలో ఇళ్ల నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న పేదలు ఎందరో ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి మరో మూడు నెలల్లో రెండేళ్లు పూర్తికానుంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఒక్క ఇళ్లు మంజూరు చేయకపోవడం గమనార్హం. పీఎం ఆవాస్ యోజన కింద ఇటీవల పట్టణ ప్రాంతాలో 595 ఇళ్లను మంజూరు చేశారు. ఆవాస్ ప్లస్లో భాగంగా జిల్లాలో 16,773 ఇళ్లను సర్వే చేసిన అధికారులు 10,789 మంది అర్హులుగా గుర్తించారు. వీరంతా కొత్త మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. -
డిజిటల్లో జనగణన
భీమవరం (ప్రకాశంచౌక్): 2027 జనాభా లెక్కల సేకరణకు ప్రత్యేకత ఉందని, డిజిటల్ రూపంలో వివరాలు సేకరించడంతో పాటు వెబ్ పోర్టల్ ద్వారా ప్రజలు వ్యక్తిగతంగా సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకునే వీలుంటుందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. జనాభా లెక్కల సేకరణపై ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులు కలెక్టర్లతో రాష్ట్రస్థాయి సమావేశాన్ని అమరావతిలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి సమా వేశానికి హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జనగణనకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): సేవాభావంతో విభి న్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి సూచించారు. కలెక్టరేట్లో తొలిసారిగా శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఆరోగ్య సమస్యలు, వై ద్యం, ఉపాధి, రూ.15 వేల పింఛన్, బ్యాంకు రుణాల కోసం పలువురు అర్జీలు అందించారు. మొత్తంగా 40 అర్జీలను స్వీకరించారు. నలుగురు శారీరక దివ్యాంగులకు జేసీ స్మార్ట్ఫోన్లు అందించారు. విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు బి.రామ్కుమార్, డీఎంహెచ్ఓ జి.గీతాబాయి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరుపై జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించినట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. జిల్లాలోని 916 మంది అధికారులు బుధవారం 20 మండలాల్లో పాఠశాలలను తనిఖీ చేసి పథకం అమలును పరిశీలించినట్టు చెప్పారు. 916 పాఠశాలల్లో 61,573 మంది విద్యార్థులకు 52,171 మంది హాజరుకాగా 50,033 మంది మధ్యాహ్న భోజనాన్ని భుజించారన్నారు. పథకాన్ని పటిష్టంగా అమ లు చేయాలని, ఆహార పదార్థాల నాణ్యతలో రాజీ పడబోమని అన్నారు. పెదవేగి : పెదవేగి మండల కేంద్రంలో 140 ఏళ్ల వయసున్న తురాయి చెట్టును కూలగొట్టడం చర్చనీయాంశంగా మారింది. చెట్టు ఉన్న ప్రాంతం తు రాయి చెట్టు సెంటర్గా పేర్గాంచింది. పంచాయతీ అధికారులకు తెలియకుండా శివరాత్రి రోజున ఈ చెట్టును కొందరు కూలగొట్టారు. దీనిపై సమాధానం చెప్పే నాథుడే కరువయ్యాడు. ఇదిలా ఉండ గా చెట్టు తొలగింపు తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ సీపీల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఇక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఉండటంతో అదే ప్రాంతంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని భావించి చెట్టును తొలగించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహాన్ని వైఎస్సార్సీపీ నాయకులు ఏర్పాటుచేశారు. అయితే ఇది ప్రభుత్వ స్థలం అని పోలీసులు జోక్యం చేసుకుని ఆంజనేయస్వామి విగ్రహాన్ని తొలగించారు. విగ్ర హం ఏర్పాటుచేసిన వారికి నోటీసులు ఇచ్చారు. ఏలూరు(మెట్రో): ప్రభుత్వ ఉద్యోగుల స మస్యల పరిష్కారానికి ప్రతినెలా మూడో శుక్రవారం ఎంప్లాయిస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్టు డీఆర్వో వి.విశ్వేశ్వరరావు తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నట్టు ఆయన చెప్పారు. 46 మంది ఉద్యోగులు అర్జీలు సమర్పించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్.దేవకీదేవి, హౌసింగ్ డీడీ జి.సత్యనారాయణ, డీపీఓ కె.అనురాధ, ఏపీఎస్జీఓ జిల్లా ప్రెసిడెంట్ చోడగిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అక్రమాలకు ఆరోగ్యసిరి
తణుకుకు చెందిన ఓ మహిళ ప్రమాదవశాత్తూ పడిపోవడంతో కాలు విరిగింది. కుటుంబసభ్యులు ఆమెను స్థానికంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కార్డు చూపించి వైద్యం చేయాలని కోరారు. అప్రూవల్ వచ్చే వరకూ ఖర్చులు భరించాలంటూ, ఎక్స్రే, రక్త పరీక్షలంటూ ఆస్పత్రి సిబ్బంది రూ.6,700 వరకు కట్టించుకున్నారు. రూమ్లో అడ్మిట్, వైద్యం నిమిత్తం మరో రూ.15,000 కట్టాలన్నారు. తాము చెల్లించలేమని కుటుంబ సభ్యులు ఆమెను నెట్వర్క్ పరిధిలోని మరో ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ ఉచితంగా పరీక్షలు, శస్త్రచికిత్స చేశారు. గతంలో పారదర్శకంగా.. ఎన్టీఆర్ వైద్య సేవల్లో డబ్బులు తీసుకున్నట్టు నిర్ధారణయితే పెద్ద మొత్తంలో పెనాల్టీతో పాటు రిజిస్ట్రేషన్ రద్దు నిమిత్తం సిఫార్సు చేసేందుకు కూడా వెనుకాడేది లేదు. – కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఎన్టీఆర్ వైద్య సేవలపై సెప్టెంబరులో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ నాగరాణి ఆస్పత్రి యాజమన్యాలను ఇలా హెచ్చరించారు. ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత సేవలు అందిస్తుందని, ఎక్కడైనా డబ్బులు వసూలు చేస్తే సహించమన్నారు. కొన్ని ఆస్పత్రులపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని, వాస్తవం అని తేలితే పెద్ద మొత్తంలో పెనాల్టీతో పాటు, రిజిస్ట్రేషన్ రద్దు నిమిత్తం సిఫార్సుకు వెనుకాడేది లేదన్నారు. 16 నెట్వర్క్ ఆస్పత్రులపై ఆరోపణలు రాగా వాటిలో రెండింటిపై రుజువు కావడంతో అప్పట్లో జరిమానాలు విధించారు. సాక్షి, భీమవరం: కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని ఆసరాగా చేసుకుని ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) సేవలను కొన్ని ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. అధికారుల హెచ్చరికలను బేఖాతరు చే స్తూ ఉచిత వైద్య సేవలకు రోగుల నుంచి సొ మ్ములు వసూలు చేస్తున్నాయి. జిల్లాలో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు అందించే ప్రభుత్వ ఆస్పత్రులు 42 ఉండగా ప్రైవేట్ ఆస్పత్రులు 30 వరకు ఉన్నాయి. ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో 22 మల్టీ స్పెషాలిటీ, ఎనిమిది డెంటల్ ఆస్పత్రులు ఉన్నాయి. ఈ పథకం కింద వైద్యసేవ పొందే రోగికి ఉచిత అడ్మిషన్, అవసరమైన వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలతో పాటు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకూ మందులు, రూమ్ సదుపాయం, అల్పాహారం, రెండు పూటలా భోజనం, వైద్యసేవలు అందించాలి. డిశ్చార్జి సమయంలో రోగికి సరిపడా మందులు ఇచ్చి పంపాలి. కాగా మత్తు ఇచ్చేందుకనో, వైద్యానికి అప్రూవల్ రావడానికి ఆలస్యమవుతుందనో, కొన్ని వైద్య పరీక్షలు బయట చేయించాలనో, మందులు కోసమనో.. రకరకాల కారణాలు చెప్పి రోగుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. ఎందుకొచ్చిన గొడవన్నట్టు చాలామంది రోగులు ఆస్పత్రి యాజమాన్యాలు అడిగినంత సొమ్ములు చెల్లించి అక్కడితో వదిలేస్తున్నారు. కొందరు బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ముగ్గురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై తణుకులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి రూ.3.02 లక్షలు, భీమవరంలోని మరో ఆస్పత్రికి రూ.68 వేలు జురిమానాలు విధించారు. కొద్దినెలల క్రితం 16 ఆస్పత్రులపై ఫిర్యాదులు రాగా వీటిలో రెండింటిపై ఆరోపణలు నిర్ధారణ కావడంతో వాటికి ఫెనాల్టీలు వేశారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిల్లుల విడుదల చేయకపోవడం, అజమాయిషీ కొరవడటంతో నెట్వర్క్ ఆస్పత్రుల ఇష్టారాజ్యంగా మారిందంటున్నారు. అనధికార వసూళ్లకు పాల్పడుతూ పేద రోగుల జేబులను ఖాళీ చేస్తున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయడం ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వైద్య సేవ.. అందని తోవ ఆపదలో ఆరోగ్యశ్రీ కూటమి పాలనలో కొరవడిన అజమాయిషీ నెట్వర్క్ ఆస్పత్రుల చేతివాటం ఉచిత సేవలకు రోగుల నుంచి డబ్బుల వసూళ్లు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా పథకం అమలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలుచేసింది. క్యాన్సర్ తదితర ఖరీదైన జబ్బుల చికిత్సకు పరిమితి లేకుండా సాయం అందించింది. 1,059 చికిత్సల సంఖ్య (ప్రొసీజర్ల)ను 3,257కి పెంచడంతో పాటు కు టుంబానికి రూ.5 లక్షలు ఉన్న వ్యయ పరి మితిని రూ.25 లక్షలకు పెంచడం ద్వారా పేదల ఆరోగ్యానికి మరింత భరోసా కల్పించారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. వైద్య సేవలకు ఆటంకం రాకుండా నిరంతరం అందిస్తూ వచ్చారు. రోగి కోలుకునే వరకు కుటుంబ పోషణకు ఆరోగ్య ఆసరా పథకం కింద అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించేవారు. అక్రమాలకు తావులేకుండా 14400 టోల్ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసే వీలు కల్పించారు. ఇలా ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారు. -
నిధుల దుర్వినియోగంపై విచారణ చేయాలి
చింతలపూడి: చింతలపూడి మహిళా మార్ట్లో నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని సీఐటీయూ, ఏపీ వెలుగు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వీఓఏలు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. వెలుగు వీఓఏలు, మెప్మా ఆర్పీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాషిణి మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం సుమారు రూ.48 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన మహిళా మార్ట్ అవినీతి, నిర్లక్ష్యం, అక్రమాల కేంద్రంగా మారిందని ఆరోపించారు. ప్రస్తుతం మార్ట్లో రూ.4 లక్షల విలువైన సరుకులు మాత్రమే ఉండటం అనుమానాస్పదంగా ఉందన్నారు. మిగిలిన రూ.44 లక్షల విలువైన సరుకులు ఎక్కడికి వెళ్లాయో అంతుచిక్కడం లేదన్నారు. మహిళలకు లాభాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. అలాగే గణిజర్లకి చెందిన వీఓఏ ఈదర సరితను రాజకీయ ఒత్తిళ్లతో అక్రమంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ డీఎల్ ప్రమద్వరకు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్వీఎస్ఎన్ నారాయణ, మెప్మా ఆర్పీల సంఘ అధ్యక్షురాలు ఝాన్సీ, కార్యదర్శి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
స్తంభించిన సహకారం
● సొసైటీ ఉద్యోగుల సమ్మెబాట ● సహకార సంఘాల్లో అందని సేవలు ● జిల్లాలో 122 సొసైటీల్లో 415 మంది ఉద్యోగులు ● జీఓ 36ను అమలు చేసి ఉద్యోగులందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చి జీతభత్యాలు చెల్లించాలి. ● సహకార ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచాలి. ● ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ చేయాల్సి ఉంది. అయితే 2019, 2024లో చేయనందున రెండు వేతన సవరణలతోపాటు అప్పటివరకు మధ్యంతర భృతి చెల్లించాలి. ● 2019 తరువాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలి. ● సహకార ఉద్యోగులకు ఆరోగ్య బీమా రూ.5 లక్షలు కల్పించడంతో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ రూ.20 లక్షలకు కల్పించాలి. ● ఉద్యోగులు మరణిస్తే కారుణ్య నియామకం కింద వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి సొసైటీల్లో ఉద్యోగం ఇవ్వాలి. ఆకివీడు: తమ సమస్యల పరిష్కారం, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సహకార సంఘాల ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఈనెల 16 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లడంతో జిల్లాలోని 122 సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్లు) మూతపడ్డాయి. సొసైటీల కార్యకలాపాలు స్తంభించడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. డిసెంబరు మొదటి వారం నుంచి జనవరిలో సంక్రాంతి వరకు దశల వారీగా పోరాటాలు చేసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం చర్చలకు కూడా పిలవలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. జిల్లాలో 415 మంది ఉద్యోగులు జిల్లాలోని 122 సొసైటీల్లో 415 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా సమ్మెలోకి వెళ్లారు. సహకార ఉద్యోగులకు ప్రభుత్వ గుర్తింపు లేదని, పింఛన్, గ్రాట్యూటీ, బీమా సౌకర్యాలు లేవని వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు సంఘాల్లో ఉద్యోగుల జీతభత్యాలు ఇప్పటికీ డ్యూటీ పద్దుల ద్వారానే డ్రా చేస్తున్నారు. సొసైటీల పాలకవర్గం నిర్ణయం మేరకే జీతభత్యాలు ఇవ్వడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వమే నడపాలి : పాలకవర్గాల ద్వారా నడుస్తూ ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న సొసైటీలను ప్రభు త్వమే నడపాలని రైతులు, ఉద్యోగులు కోరుతున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన రీతిలోనే సంఘాలను విలీనం చేయాలని అంటున్నారు. దీనిద్వారా రుణాల పంపిణీకి, వడ్డీ రాయితీలు, ఫిక్స్డ్ డిపాజిట్ల భద్రత, ఇతర బ్యాంకింగ్ సేవల్లో పారదర్శకత ఏర్పడుతుందని అంటున్నారు. సహకార వ్యవస్థలో పారదర్శకత, నిజాయతీ, నిబ ద్ధత, నమ్మకం ఏర్పడటానికి ప్రభుత్వం వాటిని విలీనం చేయాలి. రైతులను భాగస్వామ్యం చేయాలి. ఆర్టీసీ ఉద్యోగుల మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగులుగా వీరిని గుర్తించాలి. ఈ మేరకు ప్రభుత్వాలు కమిటీని వేసి నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. – బొబ్బిలి బంగారయ్య, కో–ఆపరేటివ్ ఎంప్లాయీస్ సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఆకివీడు -
కక్ష సాధింపు చర్యలు ప్రారంభమైనట్టేనా?
ఉండి: ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు ఇంటిని, ఆయన కార్యాలయాన్ని కూలగొట్టేందుకు అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయంటూ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎప్పుడూ లేనిది ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు చేసిన అనంతరం ఇరిగేషన్ అధికారులు, డీసీ సంఘ నాయకులకు అప్పుడే వెలివర్రు పంటబోదె గుర్తు కొచ్చినట్టుగా సర్వేయర్, వీఆర్వో, డీసీ సంఘ చైర్మన్ తోట ఫణి, వైస్ చైర్మన్ మంతెన సాయిలచ్చిరాజు, ఇరిగేషన్ ఏఈ ఫణిశంకర్ ఆధ్వర్యంలో పలువురు వెలివర్రులో పంట బోదె కొలతలు కొలిచారు. ఇది మా ఆస్తి అంటూ డీసీ చై ర్మన్ వ్యాఖ్యలు చేసినట్టుగా వీడియోలు వెలువడ్డాయి. అక్రమాలను బయటపెట్టాననే.. దీనిపై వెంకటేశ్వరరాజు స్పందిస్తూ తన ఇంటిని, టీడీపీ కార్యాలయాన్ని కక్ష గట్టి కూలగొట్టినా పందిరి వేసుకుని డిప్యూటీ స్పీకర్ అక్రమాలు, అన్యాయాలను నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తానని తేల్చిచెప్పారు. రఘురామకృష్ణరాజు అక్రమాలను బయటపెడుతున్నాననే ఉద్దేశంతోనే తనపై కక్ష గట్టారన్నారు. శనివారం వాటిని కూలగొట్టేందుకు వస్తామని తనకు హెచ్చరికలు జారీ చేశారని తెలిపారు. తన ఇల్లు, కార్యాలయం పోయినా ఫరవాలేదు గానీ ఎమ్మెల్యే అక్రమాలను అరికట్టాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి అచ్చెన్నాయుడు, మరో మంత్రి నిమ్మల రామానాయుడులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు వీడియోలో మాట్లాడారు. బాధితులంతా తరలిరండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అక్రమాలను అరికట్టకపోతే ఉండి నియోజకవర్గంలో టీడీపీ వినాశనం తథ్యమని వెంకటేశ్వరరాజు అన్నారు. నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులు, ఎమ్మెల్యే చేతిలో ఇళ్లు కోల్పోయినవారంతా వచ్చి తనతో కలవాలని ఆయన కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు క్రమశిక్షణతో ఉండాలని చెప్పగా.. తాను విమర్శలు మానుకున్నానని తెలిపారు. డీసీ చైర్మన్ తోట ఫణి తన ఇల్లు, కార్యాలయం పడగొడతానని హెచ్చరించగా.. డీసీ వైస్ చైర్మన్ సాయిలచ్చిరాజు ఇరిగేషన్కు సంబంధించి కాదని, ఇది ఇరిగేషన్ జాబితాలో లేదని కొట్టించమంటున్నారు కాబట్టే కొట్టిస్తున్నామని అంటున్నారని వెంకటేశ్వరరాజు వివరించారు. నియోజకవర్గంలో ఇళ్లు, చర్చిలు, మసీదులు, ఆలయాలు కోల్పోయిన వారంతా శనివారం ఉదయం 10 గంటలకు వెలివర్రు రావాలని, ఇక్కడి నుంచే అమరావతికి పాదయాత్రగా వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబా బు, మంత్రి లోకేష్లను కలిసి వివరిద్దామని వెంకటేశ్వరరాజు తీవ్ర ఆవేశంతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియోల్లో మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్పై టీడీపీ నేత తిరుగుబాటు వ్యాఖ్యలు ఆయన ఇంటికి వెళ్లి కొలతలు వేసిన అధికారులు కూలగొట్టేందుకే అంటూ సోషల్ మీడియాలో వీడియోలు హల్చల్ -
మోసం చేయడం చంద్రబాబు నైజం
హామీలు ఇచ్చి మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం. చంద్రబాబు అధికారం చేపట్టిన ప్రతిసారీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. ఇది చరిత్ర చెప్పే నిజం. ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని నమ్మబలికారు. మేనిఫెస్టోలో ఊదర గొట్టారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఆ పథకం అమలు దరిదాపుల్లోకి రాలేదు. మూడోసారి బడ్జెట్లో అయినా సూపర్ సిక్స్ పథకాల కోసం కేటాయింపులు ఉంటాయని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆశగా ఎదురు చూశారు. ఒక్క పైసా నిధులు కూడా కేటాయించలేదు. – కుక్కల కిరణ్కుమార్, బీసీ సంఘ నాయకుడు, పెనుగొండ -
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సమావేశం
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన మాధవ కల్యాణ మండపంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (హెచ్డీపీటీ) ఆధ్వర్యంలో గురువారం రాత్రి అర్చకులు, ట్రస్ట్ జిల్లా కో–ఆర్డినేటర్లతో విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ట్రస్ట్ ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీవారి దేవస్థానం ఏఈఓ పి.నటరాజారావు, రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోట సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అర్చకులు తమ జీవనోపాధి, గౌరవ వేతనాల పెంపు, పెండింగ్ బకాయిలు విడుదల, చిన్న దేవాలయాల అభివృద్ధి, దేవాలయ ఆస్తుల రక్షణ, హుండీ లెక్కల పారదర్శకత, గోశాలల పరిరక్షణ, అర్చకుల వైద్య–పింఛన్ భద్రత తదితర అంశాలపై విస్తృతంగా విన్నపాలు చేశారు. వీటిపై శ్రీనివాసులు స్పందిస్తూ అర్చకుల అభ్యర్థనలను పూర్తిగా అర్థం చేసుకున్నానని తెలిపారు. వీటిని సమగ్రంగా సంకలనం చేసి ప్రభుత్వం, దేవాదాయ శాఖ అధికారులతో చర్చించి ప్రతిపాదనల రూపంలో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెదవేగి: ప్రమాదవశాత్తు కాలు జారి పడడంతో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పెదవేగి పోలీసులు కేసు నమోదు చేశారు. పెదవేగి ఎస్సై ఎం.హరిగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. పెదవేగి మండలం విజయరాయిలోని నూజివీడు సీడ్స్ ఫ్యాక్టరీలో బిహర్కు చెందిన దుర్గేష్ గత 5 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. దుర్గేష్ తమ్ముడైన చోటు కుమార్సాహ్ కూడా ఆరు నెలల క్రితం అన్న పనిచేస్తున్న ఫ్యాక్టరీలోనే చేరాడు. ఈ నెల 19న అన్నదమ్ములు ఓవర్ డ్యూటీ చేసే ప్రక్రియలో ఫ్యాక్టరీలో పైకి ఎక్కి పనిచేస్తుండగా, ప్రమాదవశాత్తు దుర్గేష్కు కాలు జారి కింద పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలైన అతడిని హుటాహుటిన ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 20న దుర్గేష్(32) మృతిచెందినట్లు ఆసుపత్రి సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. ద్వారకాతిరుమల: మండలంలోని గొల్లగూడెంలో ఓ వ్యభిచార గృహంపై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. నిర్వాహకురాలిని అరెస్టు చేసి, ఇద్దరు విటులను, బాధితురాలిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గొల్లగూడెం గ్రామానికి చెందిన పంచవ నాగమణి ఇంటికి విటులను రప్పించి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు భీమడోలు సీఐ యుజే విల్సన్, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్లకు సమాచారం అందింది. దాంతో వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేసేందుకు సిబ్బందితో కలసి మెరుపుదాడి చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరు విటులను, బాధితురాలిని అదుపులోకి తీసుకున్నారు. నాగమణిని అరెస్టు చేసి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్సై సుధీర్ తెలిపారు. -
లడక్లో పర్వతారోహణ శిక్షణకు ఎంపిక
పెంటపాడు: పెంటపాడు ప్రభుత్వ పోస్టు బేసిక్ పాఠశాలలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థి అన్నంనీడి సత్యనారాయణ లడక్లో పర్వతారోహణ శిక్షణకు ఎంపికయ్యాడు. ఎంఈవో ఎం.శ్రీనివాస్ విద్యార్థిని అభినందించారు. సత్యనారాయణ ఉపాధ్యాయిని సాయి స్వరూప శిక్షణలో పర్వతారోహణపై ఆశక్తి పెంచుకున్నాడు. ఎవరెస్టు అధిరోహణకు రాష్ట్ర స్థాయిలో ఎంపికయ్యాడు. జాతీయ స్థాయిలో హిమాలయ పర్వత శ్రేణుల వద్ద లడక్లో జరగనున్న హై ఆల్టిట్యూడ్ శిక్షణకు ఎంపికై నట్లు తెలిపారు. ఉపాధ్యాయిని సాయి స్వరూప మాట్లాడుతూ గండికోట అడ్వెంచర్స్ స్పోర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు శిక్షణ పొందాడన్నారు. రాష్ట్రానికి చెందిన 25 మంది దివ్యాంగ విద్యార్థులతో పోటీపడి ఉన్నతశిక్షణకు ఎంపికై న సత్యనారాయణకు ఫిబ్రవరి 23 నుంచి 12 రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు. -
నానో టెక్నాలజీపై విస్తృత పరిశోధనలు
తాడేపల్లిగూడెం: నానో టెక్నాలజీపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిఽశోధనలు సాగుతున్నాయని దక్షిణ కొరియాలోని చుంగ్–ఆంగ్ విశ్వవిద్యాలయ బ్రెయిన్ పూల్ సైంటిస్టు డాక్టర్ గెడ్డా గంగరాజు తెలిపారు. ఏపీ నిట్లో కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం గ్రీన్ సింథసిస్ ఆఫ్ నానో మెటీరియల్స్ ఆఫ్ నానో మెటీరియల్స్ ఫర్ బయోమెడికల్ అండ్ ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ అంశంపై విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. పర్యావరణానికి హాని కలుగకుండా సహజ వనరులను ఉపయోగించి నానో పదార్తాలను తయారుచేసే విధానాన్నే గ్రీన్ సింథసిస్ అంటారన్నారు. ఈ గ్రీన్ సింథసిస్ పద్ధతి పర్యావరణ పరిరక్షణతో పాటు సమర్ధవంతమైన జీవవైద్య పరిష్కారాలను చూపించే భవిష్యత్ సాంకేతికతగా గుర్తింపు పొందుతుందన్నారు. కెమికల్ ఇంజనీరింగ్ విభాగాఽధిపతి డాక్టర్ వినోద్కుమార్ రాజా, ఆచార్యులు కుల్దీప్ రాయ్, సుశాంత్ బెహరా తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): యూనియన్ బ్యాంకులో ప్రవేశపెట్టిన కొత్త డిపాజిట్ పథకంపై ఖాతాదారులకు అవగాహన కల్పించేందుకు బ్యాంకు సిబ్బంది శుక్రవారం బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం వీరమ్మ పార్కు వద్ద ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ కెఎంఎస్ ఉదయగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 444 రోజులకు సాధారణ ప్రజలకు 6.6% వడ్డీ లభిస్తుందని, సీనియర్ సిటిజన్స్కు 7.10 శాతం, సూపర్ సీనియర్లకు 7.35 శాతం వడ్డీ లభిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ హెడ్ వెంకన్న బాబు, సత్యనారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగేంద్ర ప్రసాద్, సీనియర్ మేనేజర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కలిదిండి(కై కలూరు): బహిర్భూమికి వెళ్ళిన వ్యక్తి కాల్వలో పడి ఊపిరాడక మరణించిన ఘటన కలిదిండి మండలం కోరుకొల్లు పెద్ద కాల్వ వద్ద శుక్రవారం జరిగింది. కలిదిండి పోలీసుల వివరాల ప్రకారం కోరుకొల్లుకు చెందిన వీరవల్లి ప్రసాద్(28) ఉదయం 10 గంటల ప్రాంతంలో కాల్వలో కొట్టుకుపోతున్న ప్రసాద్ను స్థానికులు రక్షించి కోరుకొల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్ళారు. డాక్టర్ పరీక్షించి అప్పటికే మరణించాడని ధ్రువీకరించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైతులను నిండాముంచిన చంద్రబాబు
చంద్రబాబు రైతులను నిండా ముంచాడు. రైతుభరోసా సక్రమంగా ఇవ్వకపోవడం, యూరియా కొరత తీర్చకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.పది వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. బడ్జెట్లో తప్పడు లెక్కలు చెబుతూ అన్నదాతలను మళ్లీ భయపెట్టే యత్నం చేశారు. చంద్రబాబు చెబుతున్న రైతన్నలకు నిజాలు తెలిసిపోయాయి. చంద్రబాబు ఇక నీ అబద్ధాల్ని కట్టిపెట్టు. – మంద జయలక్ష్మి, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి, ఉంగుటూరు -
తూకం.. నిలువునా మోసం
తణుకు అర్బన్ : చేపలు, మాంసం, ఇతర సరుకులు కొనుగోలు చేస్తున్నారా.. అయితే దుకాణాల్లో కాటాలను జాగ్రత్తగా గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తూకాల్లో ఏకంగా కిలోకు 150 గ్రాములపైనే తేడాలు వస్తున్నాయి. తూనికలు, కొలతల అధికారులు తణుకులో ఈనెల 17వ తేదీన నిర్వహించిన దాడుల్లో ఈ విషయం బయటపడింది. తనిఖీల్లో భాగంగా వెళ్లిన ప్రతి దుకాణంలోను తూకంలో భారీ వ్యత్యాసాలు వచ్చాయి. ఎలక్ట్రానిక్ తూకాలను సైతం తూకం ఎక్కువగా చూపే విధంగా సెట్టింగ్ చేసుకున్న తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. తక్కెడలు, ఇనుప కాటాలు వినియోగంలో ఉన్న సమయంలో అధికంగా మోసం జరిగేదని, ఎలక్ట్రానిక్ కాటాలు కదా అటువంటి మోసం జరగదనుకుంటున్న ప్రజానీకానికి షాకిచ్చే విధంగా తూకాన్ని వారికి అనుకూలంగా మార్చేస్తున్నారు. తణుకులో తూనికలు, కొలతల విభాగానికి చెందిన అధికారులు తూకాలు చెక్ చేస్తున్నారనే విషయం తెలుసుకున్న కొందరు మాంసం, చేపల దుకాణాల యజమానులు తూకాలను దాచడం, దుకాణాలు మూసేయడం వంటివి లీగల్ మెట్రాలజీ అధికారుల దాడుల్లో బట్టబయలైంది. తూకంలో వ్యత్యాసం తెలుసుకున్న ప్రజానీకం మార్కెట్లో తూకంతో ఈ విధంగా మోసం చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిలోకి 150 గ్రాములు తగ్గించేస్తున్నారు.. తణుకు మార్కెట్లో ఒక చికెన్ దుకాణంలో అరకిలో చికెన్ కొనుగోలు చేస్తే 400 గ్రాములు మాత్రమే వచ్చిందనే ఫిర్యాదుతో తణుకులో లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా తణుకు ఉండ్రాజవరం రోడ్డులోని చేపల దుకాణంలో రెండు కాటాలు కూడా 5 కిలోల రాయి పెట్టిన సందర్భంగా 5 కిలోల 725 గ్రాములు చూపించడం ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే కిలో చేపకు 150 గ్రాములు తక్కువ తూకం వస్తుందని అధికారులు చెబుతున్నారు. అలాగే తణుకు మునిసిపాలిటీ పరిధిలోని మరికొన్ని దుకాణాల్లో సైతం నిర్వహించిన తనిఖీల్లో కిలోకి 100 నుంచి 150 గ్రాముల వరకు అధికంగా బరువు చూపుతుందని నిర్ధారణ అయ్యింది. తనిఖీలు చేసిన మూడు దుకాణాల్లో మూడు కూడా తూకం వ్యత్యాసం రావడం చూస్తుంటే మార్కెట్లో చేపలు, మాంసం దుకాణాలతోపాటు ఇతర దుకాణాల్లో తూకాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కక్కుర్తి కాటా తణుకు మార్కెట్లో చేపలు, మాంసం దుకాణాల్లో తూకంలో వ్యత్యాసాలు లీగల్ మెట్రాలజీ దాడుల్లో బట్టబయలైన వైనం ఆందోళనలో ప్రజానీకం.. కఠిన చర్యలు తప్పవంటున్న అధికారులు మార్కెట్లోని దుకాణాల్లో ఉన్న తూకాలు నిబంధనల ప్రకారం సక్రమంగా లేదని నిర్ధారణ అయితే కాటాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు కేసులు నమోదుచేస్తాం. చాలా దుకాణాల్లో లీగల్ మెట్రాలజీ విభాగంచే కాటాలను సీలు వేయించుకోకుండా వినియోగిస్తున్నారు.. వారిపై కేసులు నమోదుచేస్తాం. ఎలక్ట్రానిక్ కాటాలను ఎక్కువ బరువు చూపించేలా సెట్ చేస్తే చర్యలు తీసుకుంటాం. – టి.రాంబాబు, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ -
వీల్ చైర్ క్రికెట్ కెప్టెన్గా రాజశేఖర్
పాలకొల్లు సెంట్రల్: ఏపీ వీల్ చైర్ క్రికెట్ కెప్టెన్గా పాలకొల్లు పట్టణానికి చెందిన మురపాక నళిని రాజశేఖర్ ఎంపికయ్యాడు. క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఫిబ్రవరి 23 నుంచి 28 వరకూ నిర్వహించనున్న జాతీయ వీల్ చైర్ క్రికెట్ పోటీలకు రాజశేఖర్ను కెప్టెన్గా నియమిస్తూ ఏసీఏ శుక్రవారం ప్రకటించింది. కైకలూరు : అమ్మా.. పెద్దింట్లమ్మ.. నీ భక్తులను రక్షించమ్మా.. అంటూ భక్తులు కొల్లేటికోట పెద్దింట్లమ్మను ఆర్తితో వేడుకున్నారు. అమ్మవారి జాతర(తీర్థం) శుక్రవారానికి 3వ రోజుకు చేరుకుంది. ఉదయం జలదుర్గా పెద్దింట్లమ్మకు నూతన వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి ఖడ్గనామార్చన, ధూపసేవ, బాలభోగం, అష్టోత్తరం, పాత్రసాధన, పంచహారతులు, నైవేద్యం, నీరాజన మంత్రపుష్పాల పూజలు జరిగాయి. భుజబలపట్నం గ్రామానికి చెందిన సయ్యపురాజు గుర్రాజు, శృంగవరప్పాడుకు చెందిన బలే గణేష్ దంపతులు అమ్మవారికి వస్త్రాలంకరణ, ఉచిత ప్రసాద దాతలుగా వ్యవహరించారు. రాత్రి నంది అవార్డు గ్రహీత మెజీషియన్ రఘు ప్రదర్శించిన మ్యాజిక్ షో అందరినీ ఆకట్టుకుంది. -
దాళ్వా వరిలో జింక్ లోపం
అత్తిలి: జిల్లాలో సాగులో ఉన్న దాళ్వా వరి పంటకు పలు ప్రాంతాల్లో జింక్లోపం, సల్పైడ్ విష ప్రభావం ఆశించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. రైతులు ఎర్ర తెగులుగా పొరబడే ఈ లోపాన్ని త్వరగా గుర్తించి, నివారణా చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. సార్వా కంటే దాళ్వా వరిలో నారు నాటిన 2 నుంచి 4 వారాల్లో జింక్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. మెరక తీసిన పొలాల్లో జింక్ లోపం ఆశిస్తుంది. సేంద్రియ పదార్ధం వేసిన పొలాల్లో నారుమడిలో నారు తీసేసిన తరువాత నాట్లు వేసిన పంట చేలల్లో చలి, మంచు అధికంగా ఉండే ప్రాంతాలు, చౌడు ఉప్పు నేలల్లో భాస్వరం ఎరువు సిఫార్సుకు మించి ఎక్కువ మోతాదులో వేసిన చేలల్లో జింక్లోపం కనిపిస్తుంది. లక్షణాలు.. జింక్ లోపించినప్పుడు మొక్కల పెరుగుదల కుంటుపడి, ఆకులు సన్నగా వచ్చి కొన్నిసార్లు నత్రజని లోపాన్ని పోలి ఉంటాయి. ప్రధానంగా మొక్క పైనుంచి 3 లేదా 4 ఆకు మధ్య ఈనె తెల్లగాపాలిపోతుంది. మధ్య ఈనె ముందుగా ఆకుపచ్చ నుంచి పసుపు రంగుకు తరువాత తెలుపు రంగుకు మారుతుంది. తరవాత దశల్లో ముదురు ఆకు చివరలో మధ్య ఈనెకు ఇరుపక్కలా తుప్పు రంగు లేదా ముదురు ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. ప్రతి 3 రుతువులకు ఒక సారి, అదే కొత్తగా వరి సాగుచేసే నేలలు లేదా చౌడు నేలల్లో రుతువులకు ఒకసారి ఎకరాకు 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ వేయాలి. దాళ్వా వేసే ప్రాంతాల్లో ప్రతి రబీలో జింక్ సల్ఫేట్ వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో భాస్వరం సంబంధిత ఎరువుల్లో జింక్ సల్ఫేట్ కలిపి వేయరాదు. కనీసం 2 – 3 రోజుల వ్యవధి ఉండాలి. భూసార పరీక్షల్లో జింక్ స్థాయి 0.65 ఎర్ర నేలల్లో, నల్ల నేలల్లో 0.7 పీపీఎం కంటే తక్కువగా ఉన్నప్పుడు ముందుగా నివారణ చర్యలు చేపట్టాలి. సల్ఫైడ్ లక్షణాలు, నివారణ చర్యలు ఈ సమస్య ప్రధానంగా మురుగు నీటి సౌకర్యం లేక నీరు నిలిచిపోయే పల్లపు భూముల్లో, వేర్లకు గాలి సరిగా తగలని పరిస్థితుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నేల నుంచి కుళ్లిన కోడిగుడ్ల వాసనలా ఉండే హైడ్రోజన్ సల్ఫైడ్ దుర్వాసన అకస్మాత్తుగా వెలువడుతుంది. ప్రభావిత మొక్కలను వేర్లతో బయటకు తీసి పరిశీలించినప్పుడు, వేర్లపై నలుపురంగు మచ్చలు కనిపిస్తాయి. అవి గాలికి తగిలిన కొన్ని సార్లు ఏవిధమైన లక్షణాలు కనిపించకుండా వెంటనే ఎరుపులేక గోధుమరంగుకు మారుతాయి. నత్రజని, భాస్వరం ఎరువులు వేసినప్పటికీ పైరు వేసిన 2 – 5 వారాల మధ్య పైరు మీద లోప ఏపుగా ఎదగదు. నీటిని మురుగు నీటి కాలువల ద్వారా బయటకు పంపి, చేలను ఎండగట్టడం ద్వారా వేర్లకు గాలి ప్రసరణ మెరుగుపడి, సల్ఫైడ్ వల్ల కలిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు అని మండల వ్యవసాయశాఖ అధికారి టీకే రాజేష్ చెప్పారు. పాడి–పంట -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
కామవరపుకోట: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన గురువారం మంకెనపల్లి శివారులో చోటుచేసుకుంది. తడికలపూడి ఎస్సై పి.చెన్నా రావు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కామవరపుకోట యానాదుల కాలనీకి చెందిన చేవూరి జ్యోతి (35), భర్త నాగయ్యతో కలిసి మంకెనపల్లి సమీపంలో ఆయిల్పామ్ తోటలో కాపలాగా ఉంటున్నారు. బుధవారం భార్యాభర్తలిద్దరూ తోటలో నుంచి కామవరపుకోట ఇంటికి వెళ్లారు. తిరిగి తోటకు వస్తుండగా ఇద్దరూ మద్యం సేవించి ఉండగా వీరి మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో నాగయ్య భార్యను స్థానిక పశువుల ఆస్పత్రి వద్ద వదిలేసి తోటలోకి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం లేచి చూసేసరికి భార్య కనిపించకపోవడంతో చుట్టుపక్కల పొలాల్లో వెతికాడు. అన్నదేవర చెరువు సమీపంలో మంకెనపల్లి బస్సు స్టేజీ వెనుక జ్యోతి మృతి చెందినట్టు తెలిసింది. ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యం మత్తులో ఉన్న ఆమైపె గుర్తుతెలియని వ్యక్తులు లైంగికదాడికి పాల్పడి హతమార్చినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. -
ఉండిలో రగులుతున్న దేశం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, శాసనమండలి డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుపై నియోజకవర్గంలో ధిక్కారస్వరం మొదలైంది. ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలుగుతమ్ముళ్ల అసమ్మతి ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటేశ్వరరాజు విలేకరుల సమావేశం నిర్వహించి మరీ ఎమ్మెల్యే రఘురామ అరాచకాలకు పాల్పడుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం జిల్లా రాజకీయాల్లో హాట్టాఫిక్గా మారింది. ఎమ్మెల్యే వర్సెస్ తెలుగు తమ్ముళ్లు ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ తెలుగు తమ్ముళ్ల వ్యవహారం హాట్హాట్గా మారింది. దశాబ్దాలుగా టీడీపీలో పనిచేస్తున్న కేడర్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు ప్రజాప్రతినిధి దగ్గరకు కూడా రానివ్వడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తరచూ ఏదోక వివాదాస్పద చర్యలతో హాట్టాఫిక్గా నిలిచే ఎమ్మెల్యే వ్యవహారం మరో సారి జిల్లాలోని చర్చగా మారింది. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో అందరి వద్ద భారీగా డబ్బులు దండుకుని ఎమ్మెల్యే దోపిడీకి తెరతీశారని, రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యేగా గెలిచాక కోడిపందాలు, జూదం విచ్చలవిడిగా సాగుతున్నాయని, ఆక్వా రైతులను భయాభ్రాంతులకు గురిచేసి వసూళ్లకు పాల్పడుతున్నారని ఇటీవల టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు (బుడ్డియ్యరాజు) విలేకరుల సమావేశంలో ఆరోపించారు. తనకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని, నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసే అరాచకాలను త్వరలోనే ముఖ్యమంత్రికి, లోకేష్ను కలిసి ఫిర్యా దు చేస్తానని తెలిపారు. అనధికారిక మట్టి మాఫి యాను అధికారికం చేశారని, ఏ అధికారి కూడా అడ్డుకునే పరిస్థితి లేకుండా చేసి భారీగా దోచుకుంటున్నారని, జిల్లా ఉన్నతాధికారులు కూడా రఘురామకృష్ణరాజుకు మద్దతుగా ఉండి అరాచకాలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకపోగా ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కార్యాలయం వద్ద గొడవలు చేయాలని రఘురామకృష్ణరాజు ఆదేశిస్తూ తాను వెళ్లి తనకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ శివరామరాజు కార్యాలయం వద్ద రచ్చ చేశానని అన్నారు. తనతో సహా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కలవడానికి ఎవరు వెళ్లినా చేతులు కట్టుకుని నుంచోవాలని, కొత్తపల్లి నాగరాజు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా మారి అక్రమాలు, దందాలు చేస్తున్నారని పొత్తూరి ఆరోపించారు. తాజా పరి ణామాల నేపథ్యంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరుపై ఫిర్యాదులకు పార్టీ నేతలే సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. ఉండి టీడీపీలో మాజీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజుకు బలమైన వర్గం ఉంది. రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రామరాజు వర్గాన్ని దూరంగా పెట్టారు. ఎన్నికల సమయంలో టికెట్ సర్దుబాటుకు అవకాశం లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రా మరాజు టికెట్ను రఘురామకృష్ణరాజుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కేటాయించింది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇబ్బంది ఉండదని మంతెన రామరాజుకు భరోసా ఇచ్చారు. కట్చేస్తే.. రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో మంతెన పాత్రను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కనీసం చిన్నపాటి బదిలీ మొదలు కేడర్కు పోస్టింగ్లు వేయించడం వరకు కూడా ఏ అంశంలోనూ మంతెన పాత్ర లేకుండా చేశారు. ఈ క్రమంలో ప్రస్తుత పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రామరాజు ఉండి రాజకీయాలు, నియోజకవర్గ పరిస్థితులపై టీడీపీ అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో వెంకటేశ్వరరాజు ఆరోపణలను నియోజకవర్గంలోని మూడు మండలాల టీడీపీ అధ్యక్షులు విలేకరుల సమావేశం పెట్టి ఖండించారు. ఈ క్రమంలో జిల్లా అధ్యక్షుడి హోదాలో మంతెన రామరాజు క్రమశిక్షణ తప్పితే చర్యలుంటాయని, ఎవరూ మాట్లాడవద్దంటూ ఏకవాక్యంలో ముగించడం విశేషం. డిప్యూటీ స్పీకర్పై ధిక్కార స్వరం టీడీపీ కేడర్ తిరుగుబాటు రఘురామపై తారాస్థాయిలో అసమ్మతి తీవ్రంగా వేధిస్తున్నారంటూ రాష్ట్ర కార్యదర్శి ధ్వజం అభివృద్ధి పేరుతో దోపిడీకి తెరతీశారంటూ విమర్శలు నివురుగప్పిన నిప్పులా అసమ్మతి నేతలు -
బాబు మోసాన్ని ప్రజలు పసిగట్టారు
పెనుగొండ: ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న జిమ్మిక్కులు, మోసాలను, దుష్ప్రచారాలను ప్రజ లు పసిగట్టారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ అ డ్వయిజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. గురువారం తూర్పుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ యన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అప్పు లు, పథకాలపై దుష్ప్రచారం చేశారన్నారు. తాజా గా తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని సైతం దుష్ప్రచారానికి వాడుకుని చివరకు బోర్లా పడ్డారన్నారు. తిరిగి చంద్రబాబు కుటుంబం పైకే లడ్డూ వ్యవహరం వెళ్లిందన్నారు. ఇప్పుడు ప్రజల దృష్టి మరల్చేందుకు దాడులు, కక్ష సాధింపులకు పాల్పడుతు న్నారని విమర్శించారు. పార్టీ పటిష్టత కోసం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు అనుబంధ కమిటీల నియామకాలు పూర్తి చేయాలని సూచించారు. గ్రామస్థాయి వరకూ కమిటీలు విస్తరించాలని, ప్రతిఒక్కరినీ భాగస్వామ్యం చేయాలన్నారు. కార్యకర్తలకు పూర్తిస్థాయి గుర్తింపు ఉంటుందని, రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని అన్నారు. ఎంపీపీ పూతినీడి వెంకటేశ్వరరావు (పెద్ద), రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడపాటి సాయి చంద్ర మౌళీశ్వర రెడ్డి, మండల కన్వీనర్ నల్లిమిల్లి వెణుప్రతాపరెడ్డి (బాబీ), ఎస్సీ సెల్ మండల కన్వీనర్ పలివెల శ్రీను, పంచాయతీ సభ్యులు ఆదిరెడ్డి సన్యాసిరావు, వెలగల శ్రీనివాస రెడ్డి, పెనుగొండ పట్టణ అధ్యక్షుడు ఆసు నగరి, నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు -
పసలదీవిలో పోస్టల్ కుంభకోణం
● పోస్ట్ మాస్టర్ చేతివాటం ● పొదుపు సొమ్ములు పక్కదారి నరసాపురం రూరల్: పసలదీవి పోస్టాఫీస్లో ఖాతాదారుల పొదుపు సొమ్ము పక్కదారి పట్టడంతో కలకలం రేగింది. సుమారు 20 ఏళ్లుగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్న రాయప్రోలు ప్రసాద్ వందలాది మంది ఖాతాదారులను నమ్మించి వారి నగదును సొంతానికి వాడుకు న్నట్టు తెలిసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అవకతవకలు జరిగినట్టు సమాచారం. విచారణ పూర్తయితే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పోస్టాఫీస్ పరిధిలో పసలదీవి, చామకూరిపాలెం, కొండవీటి కొడప గ్రామాలకు చెందిన సుమారు 2,500 మంది ఖాతాదారులు ఉన్నారు. వీరంతా వివిధ పథకాలు, ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లలో దాచుకున్న సొమ్మును ప్రసాద్ కాజేసినట్టు తెలిసింది. ఖాతాదారులు పోస్టాఫీస్కు వచ్చినపుడు నగదు తీసుకుని పాస్బుక్లు తన వద్దే ఉంచుకునేవాడని, ఈ నగదును డిజిటల్ రికార్డుల్లో నమోదు చేయకుండా సొంతానికి వాడుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. మరికొందరి ఖాతాల్లో వేయమని ఇచ్చిన డబ్బును సైతం రికార్డుల్లో రాయకుండా మాయం చేసినట్టు విచారణలో తేలింది. పోస్టల్ శాఖ ఉన్నతాధికారి ఏఎస్పీ నరసింహారావు నేతృత్వంలో సిబ్బంది మూడు రోజులుగా పోస్టాఫీసులో వి చారణ చేస్తుండగా బాధితులు క్యూ కడుతున్నా రు. తనిఖీ సిబ్బంది ఖాతాల ఆడిట్, లావాదేవీల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, విచారణ అనంతరం బాధితులకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. తాను గురువారం పో స్టాఫీస్కు వచ్చి ఆరా తీయగా తన ఖాతాల్లో రూ.1,000 మాత్రమే ఉన్నాయనడంతో ఏం చేయాలో తెలియలేదు. మా కుమార్తెల వివాహ సమయానికి వచ్చేలా రూ.లక్ష, రూ.40 వేలు డిపాజిట్ చేయమని పోస్ట్మాస్టర్ ప్రసాద్కు ఇచ్చాను. నన్ను నమ్మించి నిండా మోసం చేశాడు. – గన్నాబత్తుల సత్యచంద్రకళ, బాధితురాలు -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రిఫ్రిజిరేటర్ దగ్ధం
నరసాపురం రూరల్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లోని రిఫ్రిజిరేటర్ పేలి మంటలు చెలరేగిన ఘటన మొగల్తూరు మండలంలో చోటు చేసుకుంది. కొండావారిపాలెంకు చెందిన బొడ్డుపల్లి రమేష్ గృహంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా బుధవారం సాయంత్రం రిఫ్రిజిరేటర్ నుంచి మంటలు అంటుకున్నాయి. నాలుగు గదుల ఆ ఇంటిలో రెండవ గదిలో గల రిఫ్రిజిరేటర్ నుంచి అకస్మాత్తుగా మంటలు రావడంతో ఇంటిలోని వారంతా భయాందోళన చెంది బయటకు వచ్చి నరసాపురం ఫైర్స్టేషన్కు సమాచారం అందించారు. ప్రమాదంలో రిఫ్రిజిరేటర్ ఉన్న గదిలోని మంచం, టీవీ ఇతర ఫర్నీచర్ సామగ్రి అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. -
పీహెచ్సీలో నవజాత శిశువు మృతి
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆగ్రహం భీమడోలు: పూళ్ల పీహెచ్సీలో మగ నవజాత శిశువు మృతిపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్లితే.. పూళ్ల పంచాయతీ పరిధిలోని ఎంఎంపురం గ్రామానికి చెందిన పసుపులేటి పావనికి ఉంగుటూరు మండలం బొమ్మిడికి చెందిన వీరే శ్రీనివాస్తో ఏడాది క్రితం వివాహమైంది. వారిద్దరు దుబాయ్లో జీవనోపాధి కోసం ఉద్యోగాలు చేస్తున్నారు. పావని తొలి కాన్పు కోసం ఆరు నెలల క్రితం పుట్టిల్లు ఎంఎంపురం గ్రామానికి వచ్చింది. భర్త శ్రీనివాస్ దుబాయ్లో ఎలక్ట్రిక్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు పావనిని పీహెచ్సీలో చేర్చారు. సాయంత్రం సాధారణ కాన్పు అయ్యింది. పుట్టిన మగ బిడ్డను చూసి ఆనందంగా ఉన్న పావలి, కుటుంబ సభ్యులకు కొద్ది సేపటికే విషాదం మిగిలింది. బిడ్డ తక్కువ బరువుతో పాటు ఉమ్మనీరు తాగేసిందని చెప్పి బిడ్డ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు ఎంవీ ప్రదీప్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. వారు ఏలూరులోని ఓ ప్రైవేటు పిల్లల ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే శిశువు మృతి చెందినట్లు నిర్థారించారు. దీనితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోపోద్రిక్తులై మృత శిశువును రాత్రి పీహెచ్సీ వద్దకు తీసుకువచ్చి ఆందోళన చేశారు. దీనితో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న సీఐ యూజే విల్సన్ ఆధ్వర్యంలో ఎస్సై ఎస్కే మదీనా బాషా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, వైద్యుల నుంచి వేర్వేరుగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి అన్న పసుపులేటి మోహన్ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై విచారణ చేస్తామని సీఐ తెలపడంతో ఆందోళన విరమించారు. నవజాత శిశువు మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపర్చారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటుల సీఐ విల్సన్ తెలిపారు. భీమడోలు: భీమడోలు పంచాయతీ పరిధి చినలింగంపాడుకి చెందిన కొయ్య తాతారావు (76) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చినలింగంపాడు ఏరియాలో రేకుల షెడ్డు ఇంట్లో తాతారావు, నాగరత్నం దంపతులు నివాసముంటున్నారు. బుధవారం తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు దిగురుపాటిదిబ్బ వైపునకు వెళ్లిన తాతారావు ఎంతకీ రాకపోవడంతో నాగరత్నం వెళ్లి చూడగా అక్కడి పడి ఉండడంతో అతడిని భీమడోలు సీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. నాగరత్నం ఫిర్యాదు మేరకు హెచ్సీ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విజన్ పేరుతో రాష్ట్రం అథోగతి
సూపర్ సిక్స్ అంటూ గద్దెనెక్కిన చంద్రబాబు ప్రజల్ని వంచించి పాలన సాగిస్తున్నారు. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లలో ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, సున్నావడ్డీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ హామీలకు ఒక్క రూపాయి కూడా కేటాయింపు చేయలేదు. అమరావతి అంటూ రెండేళ్లలో రెండు లక్షల కోట్లకు పైనే అప్పులు తెచ్చి ఎక్కడ పెట్టారో అర్థంకాని పరిస్థితి. విజన్ పేరుతో రాష్ట్రాన్ని అథోగతిపాలు చేస్తున్నారు. – ముదునూరి మురళీకృష్ణంరాజు, వైఎస్సార్ సీపీ పశ్చిమగోదావరి జిల్లా అబ్జర్వర్ / సాక్షి, భీమవరం -
తక్కువ ధరకే ఫార్చునర్ కారు అంటూ టోకరా
కళ్యాణదుర్గం: తక్కువ ధరకే ఫార్చునర్ కారు వస్తుందంటూ సైబర్నేరగాళ్లు ఆన్లైన్ ద్వారా ఓ అమాయకుడికి ఆశ చూపి రూ.24 లక్షలకు టోకరా వేశారు. ఈ ఘటన కళ్యాణదుర్గం మండలంలో వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం వట్లూరు గ్రామానికి చెందిన భీముడు అజిత్కుమార్ ‘ఓఎల్ఎక్స్’లో ఓ ఫార్చునర్ కారు రూ.24 లక్షలకే వస్తుందంటూ పోస్టు పెట్టాడు. ఈ పోస్టు చూసిన వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన వేణుగోపాల్రెడ్డి కారు కోసం అజిత్ కుమార్తో బేరం కుదుర్చుకున్నాడు. ఈ వ్యవహారంలో అజిత్ కుమార్ హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఉప్పొంక గ్రామానికి చెందిన తూర్పు త్రిశాంత్ను పావుగా వాడుకున్నాడు. ఈ క్రమంలో వేణుగోపాల్రెడ్డి ద్వారా రూ.24 లక్షలను తూర్పు త్రిశాంత్ పేరిట కళ్యాణదుర్గంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాకు జమ చేయించాడు. అనంతరం ఓఎల్ఎక్స్లో ఫార్చునర్ కారు పెట్టినందుకు ఒరిజనల్ ఓనర్ అకౌంట్కు రూ.10 వేలు ఫోన్ పే ద్వారా చెల్లించి.. మిగిలిన డబ్బుతో ఉడాయించేశాడు. కారు కోసం వేణుగోపాల్రెడ్డి.. అజిత్కుమార్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తోంది. తనను మోసం చేశారని గ్రహించాడు. బాధితుడు ఆ జిల్లాలో ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా కేసు విచారణ జరుగుతోంది. వచ్చిన సొమ్ముతో అజిత్, త్రిషాంత్ కర్ణాటకకు వెళ్లి ఓ జ్యుయలరీ షాపులో బంగారం కొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో నేరగాళ్ల కోసం విజయవాడ సైబర్ క్రైం పోలీసులు రెండు రోజుల క్రితం కళ్యాణదుర్గం వచ్చి విచారణ జరిపినట్లు సమాచారం.పక్కా ప్లాన్తో మోసాలుభీముడు అజిత్ కుమార్ అమాయకులను లక్ష్యంగా చేసుకుని పక్కా ప్రణాళికతో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతనికి ఏకంగా పలు రకాల చిరునామాలతో ఐదు ఆధార్ కార్డులు ఉన్నట్లు తేల్చారు. ఇలాంటి కేసుల్లో న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొనేందుకు తన సోదరితో పాటు ఐదుగురు అడ్వకేట్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఏ సమస్య వచ్చినా అజిత్కుమార్ను అరెస్టు చేయకుండా అడ్వకేట్లే కాపాడుతుంటారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలోనే సైబర్ మోసంపై ఓ సీఐ.. అజిత్కుమార్కు ఫోన్ చేయగా.. ‘గాలిని పట్టుకోగలవా?! నీకు దమ్ముందా’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
చంద్రబాబు సూపర్ మోసం
సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు ప్రజలను సూపర్ మోసం చేశాడు. ఆడబిడ్డలకు రూ.1,500, నిరుద్యోగ భృతి రూ.3 వేలు పథకాల కోసం మూడో బడ్జెట్లో కూడా నిధులు కేటాయించలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్ కూడా అమలు కాలేదు. ముస్లిం మైనార్టీలకు దులహన్ పథకం కింద పెళ్లయిన ఆడ కూతురికి రూ.లక్ష, స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షలు వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. – ఎస్కే నౌషాద్ మొహిద్దీన్, వైఎస్సార్ సీపీ జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి / తాడేపల్లిగూడెం (టీఓసీ) -
వర్క్ టూ రూల్ అమలు చేస్తాం
భీమవరం: సమస్యలు పరిష్కరించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ టూ రూల్ అమలు చేస్తామని అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు అన్నారు. భీమవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద మూడో రోజు నిరసన కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొని మాట్లాడారు. తమను ఇబ్బందులకు గురి చేస్తే ప్రత్యక్ష ఆందోళనకు పిలుపునిస్తామన్నారు. 2 నెలలైనా తమ సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోనందున అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 16 నుంచి 19 వరకు తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో జేఏసీ జాయింట్ సెక్రటరీ సంధ్యారాణి, వైస్ చైర్మన్ జి.జకర్యా, వీఆర్వో, వీఆర్ఏ, సర్వేయర్లు పాల్గొన్నారు. భీమవరం: గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం సీఐటీయు ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ సహాయకులకు తెలంగాణలో మాదిరిగా పేస్కేలు అమలు చేయాలని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సుబ్బారావు, గౌరవ అధ్యక్షుడు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టర్కు వినతిపత్రం అందజేశామని అన్నారు. ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యకలాపాలలో క్షేత్రస్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్న వీఆర్ఏలు కనీస వేతనాలు లేక పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులలో ఉన్నారని అన్నారు. ప్రమోషన్ల పేరుతో హడావుడి చేసిన ప్రభుత్వం ప్రమోషన్లు ఇవ్వడానికి అభ్యంతరాల పేరుతో మధ్యలోనే ఆగిపోయిందని అన్నారు. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అదనపు డ్యూటీలు కూడా వీఆర్ఏలపై మోపుతున్నారని అన్నారు. ఈ సమస్యలు పరిష్కరించమని శాంతియుతంగా అడుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని అన్నారు. భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలోని ఆకివీడు, భీమవరం బ్రాంచిల పరిధిలోని సహకార బ్యాంకుల ఉద్యోగులు బుధవారం భీమవరంలోని డీసీసీబీ బ్యాంకు వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ జీఓ నెం. 36 వెంటనే అమలుపరిచాలని, 2019 నుంచి 2024 పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేయాలి, అప్పటివరకు మధ్యంతర భృతి ఇవ్వాలన్నారు. ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ సిలింగ్ 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారని గ్రాట్యుటీ చట్టాన్ని అమలుపరిచి చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపు చేయాలన్నారు. సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగులకు కూడా రిటైర్మైంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. 2019 తరువాత సహకార సంఘాలలో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రూ.5 లక్షలకు ఆరోగ్య బీమాను కల్పించాలని, ఉద్యోగి సర్వీస్లో మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 20 లక్షల టర్మ్ బీమా పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో అర్హులైన పేదల పిల్లలకు ఉచిత విద్య అవకాశం కల్పించడానికి నిర్దేశించిన చట్టం ప్రకారం 25 శాతం సీట్లకు 1వ తరగతిలో ప్రవేశాల కోసం అర్హులైన తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవచ్చని సమగ్రశిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ కే.పంకజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లోని 25 శాతం సీట్లలో ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4, బీసీలకు 6 శాతం, ఇతరులకు 5 శాతం సీట్లు రిజర్వ్ చేసినట్లు తెలిపారు. ఈ నెల 20 నుంచి మార్చి 10 వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. -
మొక్కుబడిగా పొలం పిలుస్తోంది
తణుకు అర్బన్: రైతుకు వెన్నుదన్నుగా నిలబడాల్సిన వ్యవస్థలు రైతాంగ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా నిర్వహించే సదస్సుల ద్వారా సాగు ఖర్చులు తగ్గించుకునే వైనంతోపాటు దిగుబడులను పెంచడం, తెగుళ్ల నివారణకు అవసరమైన సూచనలు రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. గిట్టుబాటు ధరలు అధికంగా వచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంతోపాటు కౌలు రైతుల పట్ల మరింత శ్రద్ధ వహించి బిందు, తుంపర సేద్యం పరికరాల వినియోగంపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలి. రైతులకు తగ్గిన ఆసక్తి గ్రామాల్లో కనీసం వారానికి రెండు రోజులు వ్యవసాయ క్షేత్రంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాలు నిర్వహించాలి. అయితే మొక్కుబడిిగా వచ్చామా, వెళ్లామా అన్నట్లుగానే వ్యవసాయ శాఖ పనితీరు ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రైతులు పొలం పిలుస్తోంది కార్యక్రమాలకు ముఖం చాటేస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్లో తుపాను కారణంగా నష్టపోయిన పంటకు ఇంతవరకు నష్టపరిహారం అందచేయలేని పరిస్థితుల్లో చంద్రబాబు సర్కారు ఉందని, పంట నష్ట నమోదుతోపాటు అందుకు తగ్గ వివరాలను రైతులకు అందచేయడంలో కూడా వ్యవసాయ శాఖ విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఆయకట్టుకు సంబంధించి 2,80,000 ఎకరాలు ఉండగా ఇందులో 2,20,000 ఎకరాల్లో వరితో పాటు వివిధ పంటలు పండిస్తున్నారు. 1,20,000 మంది రైతులు ఉండగా, 80 వేల మంది కౌలు రైతులు సాగుచేస్తున్నారు. గతంలో ఖరీఫ్లో సుమారుగా 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, రబీలో 7.20 లక్షల మెట్రిక్ టన్నులు పంట దిగుబడి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దుక్కి దున్నడం, ఏ పంటకు ఎరువు ఎంత వాడాలి, నారు దశలో జాగ్రత్తలు, ఈనిక, కోతల సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలు గతంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు కూలంకషంగా వివరించేవారు. ప్రస్తుతం పంటకు ఏ పరిస్థితుల్లో ఏ పురుగు మందులు వినియోగించాలి, ఎంత యూరియా చల్లాలనే విషయాలు సవివరంగా వినిపించే పరిస్థితులు పోయాయని చెబుతున్నారు. హాజరుకాని మిగిలిన శాఖల అధికారులు రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పొలం పిలుస్తోంది కార్యక్రమం అన్నిచోట్ల తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సైతం పూర్తిస్థాయిలో రాని పరిస్థితుల్లో ఇతర శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఎలా వస్తారు. వ్యవసాయ క్షేత్రాల్లో ఏ సమయంలో రైతులు ఏం చేయాలనే విషయాలు సద్వినియోపడతాయనేది వాస్తవమే అయినప్పటికీ అది ఆచరణలోకి రాని పరిస్థితి. – అడారి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ రైతు విభాగం అత్తిలి మండల అధ్యక్షుడు వారానికి రెండు రోజులపాటు కనీసం నాలుగు గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాలను నిర్వహించాలనే నిబంధన ఉన్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు మమ అనిపించేలా నిర్వహిస్తున్నారు. కేవలం నెలలో ఒకటో రెండో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జలవనరులు, మత్స్యశాఖ, వ్యవసాయ మార్కెటింగ్, విద్యుత్తు, సేంద్రీయ శాఖ, పశుసంవర్ధక శాఖ, జల వనరులు, ఉద్యాన, రైతు మిత్ర సంఘాలు, భూసార పరిరక్షణ శాఖ సిబ్బంది పొలం పిలుస్తోంది కార్యక్రమాల్లో హాజరై రైతులకు సలహాలు, సూచనలు అందచేయాలి. పొలం పిలుస్తోంది కార్యక్రమ సమాచారం ముందుగా ఇవ్వకుండా అప్పటికప్పుడు వెళ్లడం అక్కడ ఉన్న రైతులను గట్టుపై కూర్చోపెట్టి ఫొటో దిగి మమ అనిపించేస్తున్నారు. -
‘పది’ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
భీమవరం: మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సజావుగా జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో 10 తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై బుధవారం విద్యా శాఖ, ఇంటర్, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చిలో జరగనున్న పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, డీఈవో ఇ.నారాయణ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జి.ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల మ్యాపింగ్, ఫారం 6, 7, 8 క్లైమ్ల పరిష్కారం, యువ ఓటర్ల నమోదు ప్రచారం తదితర అంశాలపై సమీక్షించారు. -
పెద్దింట్లమ్మ జాతర ప్రారంభం
కై కలూరు: రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర ఘనంగా బుధవారం ప్రారంభమయ్యింది. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖద్వార నిర్మాణానికి శంకుస్థాపన, ఆలయ ప్రాకార మండపం ఎదురుగా శివపార్వతుల విగ్రహాలను ప్రారంభించారు. అనంతరం గోకర్ణపురం గోకర్ణేశ్వరస్వామి ఆలయ ధర్మకర్తల చైర్మన్ భల్లం రామరాజు, ధర్మకర్తల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్నారు. మొదటి రోజు అమ్మవారికి విఘ్నేశ్వరపూజ, పుణ్యహవాచనం, పంచామృతాభిషేకం, నూతన వస్త్ర అలంకరణ, చక్రార్చన, దూపసేవ, బాలభోగం జరిగింది. భక్తులకు ఉచిత ప్రసాదాన్ని అందించారు. వస్త్రాలంకరణ, ఉచిత ప్రసాద దాతలుగా భుజబలపట్నం గ్రామానికి చెందిన ముదునూరి రామలింగరాజు, కనుమూరి నాగ వెంకట సుబ్బరాజు, పేరిచర్ల హేమంత్ దంపతులు వ్యవహరించారు. ఈవో మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి మార్చి 3 వరకు జాతర జరుగుతుందన్నారు. -
శివయ్యకు శ్రీపుష్ప యాగోత్సవం
ద్వారకాతిరుమల: క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం జరిగిన విశేష కార్యక్రమాలతో శివయ్య బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉదయం దేవస్థానం సిబ్బంది ఆలయాన్ని సుగంధ భరిత పుష్పమాలికలు, మామిడి తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం గర్భాలయంలో కొలువైన శివదేవుడికి అర్చకులు విశేష అభిషేకాలు జరిపారు. ఆ తరువాత అమ్మవార్లకు కుంకుమార్చన నిర్వహించారు. రాత్రి అర్చకులు వేద మంత్రోచ్ఛరణలు, డోలు, సన్నాయి వాద్యాలు, భక్తుల శివనామస్మరణల నడుమ ద్వాదశ కోవెల ప్రదక్షిణను అట్టహాసంగా జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు శ్రీపుష్ప యాగోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ స్వామి, అమ్మవార్లకు పూలు, పండ్లను సమర్పించారు. -
నిరుద్యోగులకు వంచన
సాక్షి, భీమవరం: జిల్లాలో ఎనిమిది ఇంజినీరింగ్, 55 వరకు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. పాలిటెక్నిక్, వృత్తి విద్య కోర్సులు కళాశాలలు 20కు పైగా ఉన్నాయి. వేల మంది విద్యార్థులు వీటిలో చదువుతున్నారు. ఇప్పటికే డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసి పోటీ పరీక్షల నిమిత్తం ఇంటి వద్ద, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, పాలకొల్లు పట్టణాలతో పాటు విశాఖ, విజయవాడ, హైదరాబాద్ తదితర నగరాల్లోని కోచింగ్ సెంటర్లలో ప్రిపేరవుతున్న వారు వేలల్లో ఉంటారు. కోచింగ్ సెంటర్లకు వేలు, లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నారు. హాస్టల్, మెస్ నిమిత్తం నెలకు ఆరు వేలకు పైనే ఖర్చవుతుంది. తమ బిడ్డల భవిష్యత్తు కోసం అయినకాడికి అప్పులు చేసి తల్లిదండ్రులు కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి తగిన ఉద్యోగం రాక కుటుంబం కోసం ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఎందరో. వీరిలో చాలామంది తమ చదువుకు తగిన ఉద్యోగం కోసం వేచి చూస్తున్నవారు ఉన్నారు.ఉన్న వాటికి కొర్రీకొత్త ఉద్యోగాల కల్పన లేకపోగా ఉన్న వాటిని తొలగించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. ఎన్నికల ముందు వలంటీర్ల జీతం రూ.10 వేలు చేస్తామని చెప్పి వారిని విధుల్లోకి తీసుకోకుండా జిల్లాలోని 8,616 మంది వలంటీర్లను పక్కన పెట్టింది. కూటమి నేతలకు మద్యం షాపులు కట్టబెట్టేందుకు ప్రైవేట్ మద్యం పాలసీ తేవడంతో గతంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన 893 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది రోడ్డున పడ్డారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఎంతోమంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు వేశారు. జిల్లాలోని సచివాలయాల్లో 1,66 ఖాళీ పోస్టులు ఉండగా వాటిని భర్తీ చేయకుండా క్లస్టర్ల పేరిట ఉద్యోగులను క్రమబద్ధీరణ పేరుతో పక్కన పెట్టేశారు. సర్వేలు, అదనపు బాధ్యతలతో సచివాలయ ఉద్యోగులపై పనిభారం పెంచేసి తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారు.గతంలో నిరుద్యోగులకు భరోసా2014 –19 వరకు టీడీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 34,108 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తే 2019–24లో వైఎస్సార్ ప్రభుత్వంలో ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే శాశ్వత, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్లో 15 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించడం గమనార్హం. వీటిలో సచివాలయ ఉద్యోగాలు 4,230 ఉన్నాయి.నిరుద్యోగ భృతి చెల్లించాలినిరుద్యోగ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి రూ.3000 ఇస్తానని హామినిచ్చింది. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. నేను డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నాను. సరైన ఉద్యోగాలు లేవు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలి. – పడవల దీపక్, రాయకుదురునిరుద్యోగ భృతికి మంగళం ?నిరుద్యోగ భృతి ఇస్తానన్న హామీ గంగలో కలిపేశారు. రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు నిరుద్యోగ భృతి ఊసే లేకుండా పోయింది. బడ్జెట్లో కూడా నిధులు కేటాయింపులు చేయకపోవడం చూస్తుంటే ఆ పథకం ఇక లేనట్లేనని అనిపిస్తోంది. ఏడాదికి రూ. 7,200 కోట్లు అవసరం ఉండగా మూడు బడ్జెట్లలో రూ.21,600 కోట్లు చంద్రబాబు సర్కారు ఎగ్గొట్టింది. – సత్తి పవన్ మహేష్ రెడ్డి (చిన్నూ), వైఎస్సార్సీపీ అత్తిలి యూత్ విభాగ అధ్యక్షుడు -
త్వరలో వశిష్ట వారధి నిర్మాణ పనులు
భీమవరం: నరసాపురం ప్రజల చిరకాల వాంచ ఎన్హెచ్ఎ–216 బైపాస్ రోడ్డు నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయని, వశిష్ట వారధి, నరసాపురం బైపాస్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైందని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ త్వరలోనే బైపాస్ రోడ్ నిర్మాణ పనులు, వశిష్ట వారధి నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. రెండు లైన్ల రహదారిగా ఉన్న ఎన్హెచ్ 216ను నాలుగు లైన్ల జాతీయ రహదారిగా అభివృద్ధి చేయడానికి అధికారులు అంగీకరించారని తెలిపారు. ఎన్హెచ్ 216 నరసాపురం బైపాస్ రోడ్డు నిర్మాణంతో పాటు ఎన్హెచ్ 165 దిగమర్రు ఆకివీడు రహదారి, భీమవరం బైపాస్ నిర్మాణం పనులు పూర్తి అయ్యేలా కృషి చేస్తానని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. -
విద్యార్థులకు చంద్రబాబు వెన్నుపోటు
భీమవరం(ప్రకాశం చౌక్): కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా వెన్నుపోటు పోడిచిందని వైఎస్సార్సీపీ ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పెండ్ర వీరన్న అన్నారు. బుధవారం భీమవరంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.7,900 కోట్లు కూటమి ప్రభుత్వం రూ.1,200 కోట్లకు నాలుగు జీవోలను విడుదల చేసిందని ఇంతవరకు పైసా ఫీజు చెల్లించలేదన్నారు. ఫీజు బకాయిల సాకుతో విద్యార్థులకు హాల్టికెట్లు ఇవ్వడం లేదని దాంతో విద్యార్థులను మానసిక ఆందోళనకు గురవుతున్నారన్నారు. యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక పేద తల్లిదండ్రులు వడ్డీలకు వేల రూపాయలు అప్పులు తెచ్చి ఫీజులు చెల్లిస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేద బిడ్డ పెద్ద చదువుల కోసం పేద విద్యార్థులకు ఫీజుల భారం లేకుండా ఉన్నత చదువులను ప్రభుతం ద్వారా చదివించారన్నారు. -
ఆధ్యాత్మిక అభివృద్ధే లక్ష్యం
ఆధ్యాత్మిక అభివృద్ధి లక్షమే ఈ తపస్సు కాల దీక్షలు. దీక్షలు చేపట్టిన విశ్వాసులు దేవుని పట్ల విశ్వాసంతో దీక్ష, జీవన విధానం కొనసాగించాలి. ప్రేమ, త్యాగం, సేవాభావాలను కలిగి ఉండాలి. దీక్షాధారులు ఇతరులకు స్పూర్తి కావాలి. – ఏలూరు పీఠాధిపతి, డాక్టర్ పొలిమేర జయరావు, ఉమ్మడి పశ్చిమలో బిషప్ జాన్ ములగాడ ప్రొత్సాహకంతో దీక్షలను ప్రారంభించడం దేవుని ఆశీస్సులుగా, కర్తవ్యంగా భావిస్తున్నాను. ఆరుగురితో తపస్సుకాల దీక్షలు ప్రారంభం కాగా ప్రస్తుతం లక్షకుపైగా విశ్వాసులు దీక్షలు చేపడుతున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. – ఏలూరు అమలోద్బవి చర్చి రెక్టర్ కెథ్రడల్ ఫాదర్ మైఖేల్ -
నాగేంద్రసింగ్కు అవార్డు
ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రాథమిక స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్ది వారి బంగారు భవిష్యత్తుకు అహర్నిశలు పాటుపడిన ఉపాధ్యాయుడు రాజ్పుట్ నాగేంద్రసింగ్ శిక్షారత్న అవార్డు అందుకున్నారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు విద్యా బోధన, దస్తూరి, మౌలిక సదుపాయాల కల్పన, ఆరోగ్యం, తల్లిదండ్రులతో సమన్వయం, సాంస్కృతిక అంశాలు, క్రమశిక్షణ మొదలైన అంశాలను ప్రాతిపదికగా తీసుకుని నవాచారి గతి విద్యా సమూహ్ భారత్ సంస్థ జాతీయ ఇన్నోవేటివ్ శిక్షారత్న అవార్డులను ప్రకటిస్తుంది. ఈ మేరకు 2025–26వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 మంది ఉపాధ్యాయులను శిక్షారత్న అవార్డుకు ఎంపిక చేసింది. ఏలూరు శ్రీరాంనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న రాజపుట్ నాగేంద్ర సింగ్ ఈ అవార్డుకు ఎంపికై న 8 మందిలో ఉన్నారు. ఆయనకు ఈ అవార్డును జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ మంగళవారం అందచేసి ప్రత్యేకంగా అభినందించారు. తణుకు అర్బన్: తూనికలు, కొలతల విభాగం అధికారులు మంగళవారం తణుకులో విస్తృతస్థాయి దాడులు నిర్వహించారు. తణుకు ఎన్టీఆర్ పార్కు ప్రాంతంలోని చికెన్ దుకాణంలో అరకిలో చికెన్కు 100 గ్రాములు తక్కువ వచ్చిందనే ఫిర్యాదుతో లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ టి.రాంబాబు అదే చికెన్ దుకాణంలో మంగళవారం తనిఖీలు చేయగా తూకం సక్రమంగానే ఉన్నప్పటికీ కాటాకు సీలు లేకపోవడంతో కేసు నమోదుచేశారు. అలాగే తణుకు ఉండ్రాజవరంలోని చేపల దుకాణంలో ఏకంగా 5 కిలోలకు 750 గ్రాములు తూకం ఎక్కువ చూపడంతో అవాక్కయ్యారు. అతని వద్ద ఉన్న రెండు ఎలక్ట్రానిక్ కాటాలు కూడా అదే విధంగా చూపడంతో రెండు కాటాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేశారు. ఆయన వెంట హెడ్ కానిస్టేబుల్ గణేష్ ఉన్నారు. తణుకు అర్బన్: అనుమానాస్పద స్థితిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తణుకులో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పట్టణ ఎస్సై కె.శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇవి. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి గ్రామానికి చెందిన కొమ్ముకూరి సూరిబాబు (27) తణుకు రైల్వే స్టేషన్ రోడ్డులోని ఒక ఇంట్లోకి సుమారు పదిరోజుల క్రితం అద్దెకు దిగారు. దాదాపు అయిదేళ్ల క్రితం తణుకు ఇరగవరం కాలనీకు చెందిన తిరుమల అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్న సూరిబాబు స్థానికంగా ఉన్న స్పిన్నింగ్ టెక్స్టైల్స్ సేల్స్మెన్గా పని చేస్తున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఇక్కడ అద్దెకు వచ్చిన నాటి నుంచి భార్య తిరుమల అప్పుడప్పుడు వచ్చి వెళుతోంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో గడియ పెట్టుకున్న సూరిబాబు తలుపులు తీయకపోవడంతో యజమాని అనుమానంతో భార్యతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం అర్థరాత్రి ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా సూరిబాబు ఉరి వేసుకుని ఉన్నాడు. మంగళవారం ఉదయం అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల సమాచారంతో ఎస్సై శ్రీనివాస్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తణుకు అర్బన్: తణుకు సజ్జాపురంలోని వస్త్ర దుకాణంలో మంగళవారం చోరీ జరిగింది. తల్లీపిల్లల ఆసుపత్రి వీధిలో రాఘవేంద్ర టెక్స్టైల్స్ పేరుతో నిర్వహిస్తున్న వస్త్రదుకాణం షట్టర్స్ వంచి దొంగలు చోరీకి పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 3.15 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు షట్టర్ను బలవంతంగా ధ్వంసంచేసి ఇద్దరు లోపలకు చొరబడిన వ్యవహారం సీసీ కెమెరాలో నమోదుకావడంతో విషయం బయటపడింది. ఈ ఘటనలో క్యాష్ కౌంటర్లో ఉంచిన సుమారు రూ.11 వేలు నగదును అపహరించుకుపోయారు. టైక్స్టైల్స్ యజమాని లక్ష్మణ్ దుకాణం పైఅంతస్తులో నివాసం ఉంటున్నప్పటికీ ఎటువంటి చప్పుడు కాలేదని చెబుతున్నారు. దుకాణ యజమాని ఫిర్యాదుతో ఎస్సై కె.శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిత్యం జనసంచారం ఉండే ఈ రోడ్డులో జరిగిన ఈ చోరీతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కియోస్క్ సేవలు నిర్వీర్యం
పెనుగొండ: నిరంతరం సాంకేతిక జపం చేసే చంద్రబాబు ప్రభుత్వం సాగులో సాంకేతికతకు మాత్రం తిలోదకాలిచ్చింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతన్నలకు సేవలన్నీ ఒకే చోట అందించడానికి ప్రతి సచివాలయం పరిధిలోనూ ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. గత ప్రాధాన్యతను కనిపించకుండా ఉంచేందుకు, రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా మార్చి గాలి కొదిలేశారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన కియోస్క్లను సైతం మూలకు చేర్చి వదిలేసింది. వైఎస్సార్ సీపీ హయాంలో.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మారుమూల గ్రామాల్లో సైతం రైతులకు సేవలందించాలని జిల్లాలో ప్రతి 600 హెక్టార్లకు ఒక ఆర్బీకేను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా జిల్లాలో 409 కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిలో రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి గాను అత్యాధునిక కియోస్క్లు ఏర్పాటు చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, యంత్ర పరికరాలు, పంట కొనుగోలు వంటి సేవలను అందించాలన్నా ఉన్నత లక్ష్యంతో కియోస్కాలు ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా పంటలకు సంబంధించి రక్షణ చర్యలు, వాతావరణ వివరాలు, పంటలకు సమయం ప్రకారం తీసుకొనే జాగ్రత్తలను రైతులు కియోస్క్లు ద్వారా తెలుసుకొనేవారు. గత ప్రభుత్వంపై ద్వేషంతో నిర్లక్ష్యం గత ప్రభుత్వంలో ప్రపంచ వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు ప్రశంసలు అందుకోవడంతో చంద్రబాబు సర్కార్కు కంటగింపుగా మారింది. ఇది కాస్తా ద్వేషంగా మారడంతో అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే జిల్లాలో ఉన్న 409 కేంద్రాల్లో 100 కేంద్రాలను మూసివేసి, ఇతర కార్యాలయాలకు మార్పు చేశారు. అదేవిధంగా పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్న కియోస్క్లను మూలన చేర్చారు. దీంతో రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందకుండా పోతున్నాయన్న విమర్శలు సర్వత్రా నెలకొన్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రైతులకు సేవలందించడానికి ఏర్పాటు చేసిన కియోస్క్లు మూలకు చేర్చడం దారుణమంటూ విమర్శిస్తున్నారు. కియోస్క్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పలు చోట్ల మూలకు చేరిన కియోస్క్ యంత్రాలు రైతులకు సాంకేతిక సేవలు అందని వైనం కియోస్క్ యంత్రాలపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వైఎస్ జగన్పై ద్వేషమే కారణమా! నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కియోస్క్ సేవలను పునరుద్ధరించాలి. విత్తనాలు, వాతావరణ వివరాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రాల వివరాల కోసం వ్యవసాయాధికారులపై ఆధారపడకుండా కియోస్క్లు సేవలు అందించేవి. వాటిని మూలకు చేర్చడం దారుణం. కియోస్క్లను పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలి. – చిన్నం రామిరెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు -
గ్రావెల్ దోపిడీకి ‘కొత్త మార్గం’
ద్వారకాతిరుమల: కొందరు టీడీపీ నాయకులు మట్టి దోపిడీకి కొత్త మార్గం ఎంచుకున్నారు. గతంలో ఇసుకను ఖాళీ ప్రదేశాల్లో డంప్ చేసి, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎలా రవాణా చేసేవారో.. ఇప్పుడు మట్టిని కూడా అలా రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో పగలూ, రాత్రి అనే తేడా లేకుండా పోలవరం కుడి కాలువ గట్టును తవ్వి, గ్రావెల్ మట్టిని తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులెవరూ ఆవైపు కన్నెత్తి చూడటం లేదు. వివరాల్లోకి వెళితే. ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి వద్ద పోలవరం కుడి కాలువ గట్టును కొందరు పచ్చనేతలు ఇష్టానుసారంగా జేసీబీతో తవ్వేస్తున్నారు. ఆ మట్టిని అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా తరలించి గ్రామంలోని అందనాలమ్మ చెరువు వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో డంప్ చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. అక్కడ నుంచి ఆ మట్టిని టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి, అమ్ముకుని, సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో టిప్పర్ మట్టిని రూ.5 వేల నుంచి రూ. 6 వేలకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వైపు కన్నెత్తి చూడని అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. బెర్మ్ల పేరుతో.. గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లకు ఇరువైపులా బెర్మ్లు నిర్మించేందుకు మట్టిని తరలిస్తున్నట్టు నాయకులు చెబుతున్నారు. మంగళవారం ద్వారకానగర్లోని సీసీ రోడ్ల బెర్మ్లకు కొంత మట్టిని వినియోగించారు. అయితే రోడ్లు నిర్మించిన కాంట్రాక్టర్ మట్టిని కొనుగోలు చేసి, బెర్మ్లు నిర్మించాలి. అలా కాకుండా అధికార పార్టీ నాయకులు కాలువ గట్టును కొల్లగొట్టి, బెర్మ్లు నిర్మించడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గోతులమయం కాలువ గట్టుపై ఉన్న మట్టితో పాటు, ఆ ప్రాంతంలో పెద్దపెద్ద గోతులు తవ్వి గ్రావెల్ మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఆ గోతులు భవిష్యత్తులో ప్రమాదాలకు కారణం అవుతాయని స్థానికులు అంటున్నారు. రైతులు, పశువుల సంచారానికి వీలు లేకుండా కాలువ గట్టును ఇష్టానుసారం తవ్వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ధ్వజమెత్తుతున్నారు. పోలవరం కాలువ గట్టుపై యథేచ్ఛగా గ్రావెల్ మట్టి తవ్వకాలు ఇసుక తరహాలో ఖాళీ స్థలంలో మట్టి డంపింగ్ అక్కడి నుంచి రాత్రి వేళల్లో ఇతర ప్రాంతాలకు రవాణా -
పింఛన్ ఇప్పించండి మహాప్రభో...!
కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు కావస్తోంది. ఇప్పటివరకు నూతన పింఛన్లు మంజూరు చేయలేదు. అధికారంలోకి వచ్చిన నాటినుంచి నూతనంగా వితంతు, వృద్ధాప్య పింఛన్లు ఏమీ మంజూరు చేయకపోవడంతో ఎందరో వృద్ధులు, వితంతువులు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి అధికారంలోకి వస్తే 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్లు అందజేస్తామని ఎన్నికల హామీగా ప్రకటించారు. నాకు 53 ఏళ్లు ఉన్నా నేటికీ పింఛన్ మంజూరు చేయలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పింఛన్ ఇప్పించాలని కోరుతున్నా. – కొడమంచిలి వెంకట్రావు, మోదుగ గుంట, తాడేపల్లిగూడెం రూరల్ -
నేటి నుంచి తపస్సు కాల దీక్షలు
● సుమారు లక్ష మందికిపైగా దీక్షల స్వీకరణ ● 40 రోజులపాటు విశ్వాసుల దీక్షలు దెందులూరు: ప్రభువు ఏసుక్రీస్తు ఎడారికి వెళ్లి 40 రోజుల పడిన శ్రమలను అనుసరించి క్రైస్తవులు అనునిత్యం ప్రార్థిస్తూ, ఉపవాసం చేస్తూ తపస్సుకాల దీక్షలు చేస్తారు. నేటి నుంచి ఈ దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని క్రైస్తవ సంఘాలతో కలిపి లక్ష మందికిపైగా ఈ తపస్సు కాల దీక్షలు స్వీకరించనున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తపస్సు కాల దీక్షలను ఫాదర్ ఐ.మైఖేల్ ప్రారంభించారు. 1992వ సంవత్సరంలో భీమవరం ఆర్సీఎం విచారణ వేంపాడులో అప్పట్లో ఆర్సీఎం ఏలూరు పీఠాధిపతి జాన్ ములగాడ ప్రొత్సాహం, సహాయ సహకారాలతో ఆరుగురితో తపస్సు కాల దీక్షలను ప్రారంభించారు. జాన్ ములగాడ ప్రస్తుత ఏలూరు పీఠాధిపతి డాక్టర్ పొలిమేర జయరావు సహాయ సహకారాలతో అన్ని క్రైస్తవ సంఘాలతో కలిపి ప్రస్తుతం లక్షకుపైగా తపస్సు కాలదీక్షలు చేపడతున్నారు. దీక్షలు ఇలా.. ● ఉదయం, సాయంత్రం దేవాలయాలకు వెళ్లి ప్రార్థనలు చేయాలి. ● తెలుపు, ముక్కుపొడి రంగు దుస్తులు ధరించాలి. ● కాళ్లకు చెప్పులు వేయకూడదు. నేలపై చాప మీద నిద్రించాలి. ● మాంసాహారం, వివాహ జీవితానికి, మద్యానికి దూరంగా ఉండాలి. ● ప్రతి బుధ, శుక్రవారాల్లో శిలువు మార్గంలో పాల్గొనాలి. వారంలో ఒకరోజు దీక్షలు చేపట్టిన వారి సమూహం వద్ద రాత్రి ప్రార్థన నిర్వహించాలి. ● దీక్షా కాలంలో ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలి. -
అబద్ధాలు, అసత్యాలతో రాష్ట్ర బడ్జెట్
ఆత్మస్తుతి, పరనింద, అబద్ధాలు, అసత్యాలతో రాష్ట్ర బడ్జెట్ ప్రసంగం సాగింది. బడ్జెడ్ గోరంత.. ప్రసంగంలో చెప్పుకుంది కొండంత. బడ్జెట్ కేటాయింపులు భూతద్ధంలో చూపిస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం చేసినా నోరు మెదపలేని చంద్రబాబు రాష్ట్ర బడ్జెట్లో కేంద్రం నుంచి నిధులు వస్తాయని పేర్కొనడం హాస్యాస్పదమే. లోటు పూడ్చడానికి ప్రజలపై పన్నుల బాదుడు ఉంటుంది. ప్రైవేటీకరణకు పెద్ద పీట వేయడం సరికాదు. రాష్ట్ర సంపదను కార్పొరేట్లకు మళ్లించేందుకు రహదారిగా ఈ బడ్జెట్ ఉంది. చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. – మామిడి దాన వరప్రసాద్, ఇఫ్టు ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి, తాడేపల్లిగూడెం (టీఓసీ) -
ఎన్నికల హామీలు అమలు చేయకుండా మోసం
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి 20 నెలలు దాటినా హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు విమర్శించారు. పట్టణంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు, ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలకు ఏటా రూ.18 వేలు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. ఇటీవల బడ్జెట్లో సామాజిక న్యాయం పూర్తిగా కొరవడిందన్నారు. ఏపీ బడ్జెట్ దాదాపు రూ.3 లక్షల కోట్లు అయినప్పటికి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ద్రోహం జరిగిందని విమర్శించారు. ఎస్సీలకు రూ. 48 వేల కోట్లు, ఎస్టీలకు రూ.18 వేల కోట్లు, బీసీలకు రూ.1.5 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. నాయకులు పొట్ల విజయకుమారి, మరపట్ల రాజు, టి.యోహాను, ఎం.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం: బత్తాయి, నిమ్మలో బ్రీడింగ్, జెన్టిక్స్, జినోమిక్స్ పద్ధతులను ఉపయోగించి వ్యాధి నిరోధక శక్తి కలిగిన కొత్త రకాలను అభివృద్ధి చేయడంపై మంగళవారం 27వ అంతర్జాతీయ సదస్సు ఆన్లైన్లో జరిగింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్ సైడ్ నుంచి ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ చంద్రికా రామడుగు మాట్లాడారు. రాయలసీమ ప్రాంతంలో బత్తాయి, నిమ్మ పంటలను ఆశించే సిట్రస్ గ్రీనింగ్ అనే వ్యాధి రైతులకు సవాలుగా మారిందన్నారు. ఈ వ్యాధి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలు గురించి సదస్సులో చర్చించారు. మొక్క బ్రీడింగ్ స్థాయిలో జెనెటికల్ మార్పులు చేయడం ద్వారా ఆస్ట్రేలియా లైమ్ వంటి రకాలు తెగుళ్లు తట్టుకున్నట్టుగా డాక్టర్ చంద్రికా తెలియజేశారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉద్యాన వర్సిటీకి ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ మేరకు ఎంఓయూ ప్రయత్నాలు జరుగుతున్నాయని వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీయల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డాక్టర్ సీహెచ్.రూత్ తెలిపారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.మాధవి, పరిశోధనా సంచాలకులు డాక్టర్ రామానందం, యూనివర్సిటీ లైబ్రేరియన్ డాక్టర్ మధుమతి పాల్గొన్నారు. -
ఆల్బెండజోల్తో నులిమేద్దాం!
యలమంచిలి: నులి పురుగులు చిన్నారుల్లో రక్తహీనతకు దారితీస్తాయి. కడుపులో చేరి నొప్పి, మంట, వికారం కలుగుజేస్తాయి. దీనివల్ల ఆకలి ఉండదు. పిల్లలు నీరసపడతారు. శారీరక, మానసిక ఎదుగుదల లోపాలను కలిగి ఉంటారు. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వాంతులు, మలంలో రక్తం, అతిసారం వంటి సమస్యలు ప్రబలుతాయి. ఏడాది నుంచి 19 ఏళ్లలోపు వారిలో ప్రధానంగా నులి పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఏడాది నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు 3,51,125 మంది ఉన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా వీరికి ఈనెల 17 నుంచి ఆల్బెండజోల్ మాత్రలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పాటించాల్సిన జాగ్రత్తలు ● అపరిశుభ్రత వల్ల నులి పురుగుల సమస్య తలెత్తుతుంది. కావున చిన్నారులు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ● చేతి గోళ్లలో పేరుకున్న మట్టి వల్ల నులి పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. పెరిగిన గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. ● మల విసర్జన తరువాత, భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. కాళ్లకు చెప్పులు ధరించాలి. ● శుభ్రమైన నీటిని తాగాలి, పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగాక మాత్రమే వినియోగించాలి. చిన్నారుల జీవితాన్ని నులి పురుగులు నులి మేస్తున్నాయి. పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అలాంటి నులి పురుగులను కేవలం ఒకే మాత్ర ఆల్బెండజోల్తో నులిమేయవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 19 ఏళ్ల లోపు వారందరికీ ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ ఈ నెల 17న ప్రారంభమవుతుంది. -
ఆక్వా ఆశలపై నీళ్లు చల్లి..
ఆకివీడు ఆక్వా రంగానికి బడ్జెట్లో అరకొర మాత్రమే నిధులు కేటాయించి చంద్రబాబు ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఆక్వా రంగం అభివృద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రొయ్యల ఎగుమతుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డాలర్ల రూపంలో వందల కోట్ల రూపాయాల్ని ఆదాయంగా గడిస్తున్నా, ఆ రంగానికి తగిన ప్రాతినిధ్యం, నిధుల కేటాయింపు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్వా రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి సైతం బడ్జెట్లో ఏ విధమైన నిధులూ కేటాయించలేదు. నర్సాపురం తీరంలో ఆక్వా యూనివర్సిటీ నిర్మాణానికి మాత్రం మొక్కుబడిగా రూ. 20 కోట్లు కేటాయించారు. విపత్తులు, ధరలు పడిపోయినప్పుడు, తెగుళ్ల బెడదతో మూకుమ్మడిగా పట్టుబడులు పట్టిన సమయంలో రైతులు రొయ్యలు నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్ల ఏర్పాటుకు బడ్జెట్లో స్థానం లేకపోయింది. విద్యుత్ రాయితీ గాలికే ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య విద్యుత్. అప్సడాలో నమోదు కాకుండా ఉన్న చెరువులకు కూడా విద్యుత్ యూనిట్ ధర రూపాయిన్నరకు ఇస్తానని ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం అప్సడా అంటూనే డప్పుకొడుతోందని రొయ్య రైతులు ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆక్వా రైతులు వేల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్ రూ.1.50 పైసలకే విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గతేడాది ఇదే సమస్యపై రైతులు ఆందోళన చేస్తే చంద్రబాబు పాలనలోని ప్రజాప్రతినిధులు నీళ్లు చల్లి ఉద్యమాన్ని నీరుగార్చారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. పేరుకే రూ.1.50 విద్యుత్ ఆక్వా రైతులు మళ్లీ మోసానికి గురవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన యూనిట్ ధర రూ.1.50 పేరుకేనని, బిల్లు వచ్చే సరికి మూడు రూపాయల వరకూ పడుతోందని పలువురు రైతులు వాపోతున్నారు. పది ఎకరాల లోపు రైతులకు, అప్పడాలో నమోదు కాని రైతులకు, నాన్జోన్లోని రైతులకు యూనిట్ ధర రూ.4.25 పైగా వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాలర్ల పంట పండించే రొయ్యల సాగును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మళ్లీ పెరిగిన మేత ధర.. తగ్గిన రొయ్య ధర రొయ్యల మేత ధరల్ని మళ్లీ పెంచివేశారని రైతులు వాపోతున్నారు. ఇటీవల రైతులు ఉద్యమించడంతో మేత తయారీ యజమానులు దిగివచ్చి రూ.4 తగ్గించారు. అయితే ప్రస్తుతం రొయ్యల మేత భారీగా పెంచివేశారని ఆవేదన చెందుతున్నారు. రొయ్యల చెరువుల్లో పెంపకం తగ్గిపోతే ధర స్వల్పంగా పెంచుతున్నారని, చెరువుల్లో నిండుగా రొయ్యల పెంపకం, తెగుళ్లు వచ్చిన సమయంలో ధర పతనమైపోతుందంటున్నారు. ఈ విధానంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆక్వా జోన్ల వారీగా విద్యుత్ బిల్లుల వివరాలు ఆక్వా జోన్ మొత్తం రైతులు సబ్సిడీ కలిగిన వారు నాన్జోన్ భీమవరం జోన్న్ 9,929 8,278 1,651 నర్సాపురం జోన్ 4,314 3,993 321 తాడేపల్లిగూడెం జోన్ 2,099 1,979 120 అధిక ఆదాయాన్ని ప్రభుత్వాలకు సమకూర్చే రొయ్యల సాగుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి దృష్టి పెట్టాలి. ప్రపంచ దేశాల్లో మార్కెట్ సౌకర్యం, అధిక ధరలు లభించే విధంగా కృషి చేయాలి. స్థానికంగా విద్యుత్ సబ్సిడీలు, మేతలు, మందుల సబ్సిడీల సౌకర్యం కల్పించాలి. రైతులు సాగులో ఆటుపోటులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. – నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ ఆకివీడు మండల కమిటీ, కుప్పనపూడి ఎన్నికల ముందు చేసిన వాగ్ధానం ప్రకారం రొయ్య రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ కల్పించాలి. ఆక్వా జోన్ల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. విద్యుత్ సబ్సిడీ కల్పిస్తే తెగుళ్లతో నష్టపోయిన రైతుకు కొంత ఉపశమనం దొరుకుతుంది. రూ.1.50 పైసల సబ్సిడీతోపాటు, ట్రాన్స్ఫార్మర్ల సబ్సిడీలు, అదనపు ఛార్జీల వడ్డన వంటివి తొలగించాలి. – పీవీఆర్కే ఆంజనేయరాజు, వైఎస్సార్సీపీ ఉండి మండల అధ్యక్షుడు, వాండ్రం బడ్జెట్లో ఆక్వాకు అరకొర కేటాయింపులు ఆక్వా యూనివర్సిటీకి మొక్కుబడిగా నిధులు విద్యుత్ రాయితీలపై ఊసెత్తని వైనం ధరల స్థిరీకరణ నిధులూ అటకెక్కినట్లే -
ప్రణాళికాబద్ధంగా మాత్రల పంపిణీ
ఈ నెల 17న ఆల్బెండజోల్ మాత్రలను ఒకటి నుంచి 19 ఏళ్లలోపు పిల్లలచే మింగిస్తాం. ఆ రోజు కుదరని వారికి ఈ నెల 24న స్పెషల్ డ్రైవ్ పెట్టి మాత్రలు ఇస్తాం. నూరు శాతం లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశాము. – డాక్టర్ వాకా ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్ఓ, నరసాపురం ఏడాది నుంచి రెండేళ్లలోపువారికి ఆల్బెండజోల్ సగం మాత్రను నీళ్లలో కలిపి ఇవ్వాలి. 2 నుంచి 19 ఏళ్లలోపు వారు మధ్యాహ్నం భోజనం తరువాత మాత్రను చప్పరించేలా చూడాలి. టీచర్లు, వైద్య సిబ్బంది పర్యవేక్షణలో మాత్రలు నమిలి మింగించేలా చూడాలి. – డాక్టర్ కె.అశ్వని, వైద్యాధికారి, మేడపాడు పీహెచ్సీ -
కరుణించమ్మా.. కొల్లేరు పెద్దింట్లమ్మా
● ఈనెల 18 నుంచి అమ్మవారి జాతర ● వేంగి చాళుక్యుల కాలం నుంచి పెద్దింట్లమ్మకు పూజలు ● తెలంగాణ బోనాల తరహాలో మొక్కులు కైకలూరు: కొల్లేటి మహాపట్టమహిషి పెద్దింట్లమ్మ జాతర ద్వీపకల్పమైన కొల్లేరు సరస్సు మధ్యన అంగరంగ వైభవంగా జరగనుంది. రాష్ట్రంలో అత్యంత పురాతన చరిత్ర కలిగిన దేవాలయాల్లో ఏలూరు జిల్లా, కైకలూరు మండలం కొల్లేటి కోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఒకటి. ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకూ జాతర జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి మార్చి 3 వరకు అమ్మవారి జాతర (తీర్థం) నిర్వహిస్తున్నారు. జాతరలో అత్యంత కీలకఘట్టమైన జలదుర్గా గోకర్ణేశ్వరుల కల్యాణం ఈనెల 28 శనివారం రాత్రి జరుగుతుంది. కొల్లేరు సరస్సు మధ్యలో కోట దిబ్బపై పెద్దింట్లమ్మతల్లి 9 అడుగుల ఎత్తులో, విశాల నేత్రాలతో వీరాసన భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు. కాలాలతో పాటు కోటలు మాయమైనప్పటికీ పెద్దింట్లమ్మ తల్లి విగ్రహం చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. సామాన్యంగా ఒక గ్రామానికి ఒక దేవత ఉంటుంది. కానీ పెద్దింట్లమ్మను ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 44 కొల్లేరు దిబ్బలపై నివ సించేవారందరూ కులదైవంగా ఆరాధిస్తారు. కొల్లేరుకు తెలంగాణ బోనాల సంప్రదాయం తెలంగాణలో ఉజ్జయిని మహంకాళి, మైసమ్మ, పోచమ్మ.. పెద్దమ్మ, మారెమ్మలకు జూలై నెలలో బోనాలు సమర్పిస్తారు. అదేవిధంగా 2020 నుంచి కొల్లేటికోట పెద్దింట్లమ్మకు బోనాలు సమర్పిస్తున్నారు. అమ్మవారి దేవస్థానానికి 2 కిలోమీటర్ల దూరంలోని పందిరిపల్లిగూడెం నుంచి ప్రభల ఊరేగింపుతో పాటు బోనాలు ప్రతి ఏటా తీసుకొస్తున్నారు. బోనాలు, 7 కావిళ్లలో అమ్మవారి పుట్టించి నైవేద్యం పసుపు, కుంకుమ, నెయ్యి, వేప రొట్టలు, నిమ్మకాయలు, పానకం, కల్లుతో పెద్దింట్లమ్మ దేవస్థానం తీసుకువస్తారు. 3 మైళ్ల దూరంలోని గోకర్ణేశ్వరపురంలో గోకర్ణేశ్వరస్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారితో అంగరంగ వైభవంగా కల్యాణం జరిపిస్తారు. జాతరలో కొల్లేరు భక్తజన సంద్రంగా మారిపోతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి, జిల్లాల నుంచి భక్తులు విరివిగా విచ్చేసి అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ప్రయాణం సులభతరం పూర్వం కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరకు వెళ్లాలంటే ప్రయాణం కష్టతరంగా ఉండేది. అటువంటిది ఆలపాడు నుంచి అమ్మవారి దేవస్థాఽనం 7 కిలోమీటర్ల రోడ్డుకు మరమ్మతులు చేశారు. కొన్ని ప్రాంతాల్లో నూతన రోడ్డు ఏర్పాటు చేశారు. దేవస్థానం ఎదురుగా దాతల సాయంతో శివపార్వతుల విగ్రహాం ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) దాతల సాయంతో నిర్మించిన అతిపెద్ద అనివేటి మండపం ఆకర్షణీయంగా మారింది. చలువ పందిర్లు, భక్తులకు కావల్సిన అన్ని వసతులు సిద్ధం చేశారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారి దేవాలయం వరకు ప్రభుత్వం సీసీ రోడ్లు ఏర్పాటు చేసింది. భక్తులకు జల్లు స్నానాలు, చలువ పందిర్లు, వంట ప్రాంగణాలు, కోనేరులో నీరు ఇలా అన్ని సౌకర్యాలు కల్పించాం. జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గాగోకర్ణేశ్వరుని కల్యాణం ఈ నెల 28న జరుగుతుంది. భక్తులు అమ్మను దర్శించుకోవాలి. – కూచిపూడి శ్రీనివాసు, పెద్దింట్లమ్మ ఆలయ కార్యనిర్వహణాధికారి, కొల్లేటికోట -
అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు
తణుకు అర్బన్: దువ్వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో నలుగురికి స్వల్పగాయాల య్యాయి. తణుకు సజ్జాపురం ప్రాంతానికి చెందిన నలుగురు పల్నాడు జిల్లా కోటప్పకొండ దేవాలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో భాగంగా దువ్వ సమీపంలోని వ్యవసాయ చెక్ పోస్టు వద్దకు వచ్చే సరికి కారు అదుపు తప్పి పల్టీలు కొట్టుకుంటూ విశాఖ–విజయవాడ రోడ్డుపైకి వచ్చి బోల్తా కొట్టింది. అప్పటికే కారు నుజ్జు అయినప్పటికీ కారులోని ప్రయాణికులకు ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తణుకు రూరల్ పోలీసులు తెలిపారు. క్షతగాత్రులకు కారుమూరి పరామర్శ చలో గుంటూరు కార్యక్రమానికి వెళ్లేందుకు అదే ప్రాంతంలోని వేచి ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కారు బోల్తా పడడాన్ని గమనించి వెంటనే పరుగున వెళ్లి క్షతగాత్రులను కారులో నుంచి జాగ్రత్తగా బయటకులాగారు. అక్కడే ఉన్న జర్నలిస్టులు సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కాసేపటికి ఘటనా స్థలానికి వచ్చిన మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు బాధితులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను ఆరా తీశారు. నరసాపురం రూరల్: మోటార్ బైక్ అదుపు తప్పిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. మొగల్తూరు హెడ్ కానిస్టేబుల్ సుబానీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉండి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ చల్లా పవన్ కుమార్ (27) తన స్నేహితుడు చంద్రగిరి దుర్గారావుతో కలిసి మోటార్బైక్పై ఆదివారం పేరుపాలెం బీచ్కి వచ్చారు. తిరిగి ఉండి వెళ్లే క్రమంలో మోడి గ్రామానికి చేరుకునేసరికి వారి బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పవన్ కుమార్ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుని సోదరి బత్తుల పెద్దింట్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్పై గల మరో వ్యక్తి దుర్గారావుకు గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నారన్నారు. కై కలూరు: వరకట్న వేధింపులపై కై కలూరు రూరల్ పోలీసు స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. కై కలూరు మండలం పెంచికలమర్రుకు చెందిన ప్రశాంతికి ఏలూరు జిల్లా గుడివాకలంకకు చెందిన బలే రామారావుతో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇరువురు సంతానం. కొద్ది రోజులుగా అధికకట్నం తీసుకురావాలని వేధిస్తుడటంతో భర్త, అతని కుటుంబ సభ్యులపై ప్రశాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూరల్ ఎస్సై వి.రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫ్రీజర్ లేదు.. కావాలంటే తెచ్చుకోండి
● మృతదేహంపై ప్రభుత్వాస్పత్రి అధికారుల నిర్లక్ష్యం ● భీమవరంలో ఘటన ● దళితుడనే ఇంత నిర్లక్ష్యమా అంటూ కేవీపీఎస్ ఆగ్రహం భీమవరం (ప్రకాశంచౌక్): చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఫ్రీజర్లో ఉంచాల్సి ఉండగా, తమ వద్ద అలాంటి సౌకర్యాలేమీ లేవని, కావాలంటే ఫ్రీజర్ తెచ్చుకోవాలని భీమవరం ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం అత్తిలి మండలం వరిఘేడుకి చెందిన కన్నెపా ముల రాంబాబు (49) భీమవరం అంబేడ్కర్ సెంటర్లో సొంత ఆటోలో కూర్చొని ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఫిట్స్ ద్వారా మృతిచెందినట్టు నిర్ధారించారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశా రు. పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని అప్పగిస్తా మని వైద్యులు తెలిపారని, అయితే మృతదేహా న్ని ఫ్రీజర్లో పెట్టకుండా బయటే వదిలేశారని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో ఫ్రీజర్ లేదని, అలాంటి సౌకర్యాలు ఇ క్కడ లేవని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాడీని ఇవ్వకుండా.. ఫ్రీజర్లో పెట్టకుండా.. దళిత వ్యక్తి మృతదేహం పట్ల భీమవరం ప్రభు త్వ ఆసుపత్రి అధికారులు, సిబ్బంది తీరు దారుణమని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతి బాబు అన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో ఫ్రీజర్ లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మృతదేహాన్ని ఫ్రీజర్లో పెట్టకుండా బయటే పెట్టడంతో బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కనీసం బాడీని తమకు అప్పగించండని వేడుకుంటున్నా ఇవ్వకుండా.. అటు ఫ్రీజర్లో పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్లే జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో కనీస సదుపాయాలు లేవని అర్థమవుతోందన్నారు. సౌకర్యాలు లేకనా లేదా చనిపోయిన వ్యక్తి దళితుడు కాబట్టే ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. పెనుమంట్ర: మహాశివరాత్రి సందర్భంగా నత్తారామేశ్వరంలో జరిగిన రథోత్సవంలో ఓ భక్తుడి కాలిపై నుంచి రథం వెళ్లడంతో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎం.జయభరత్రెడ్డి (తణుకు) అనే వ్యక్తి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ర థోత్సవాన్ని చూడటా నికి వచ్చా రు. రథం పక్క నుంచి నడిచి వెళుతుండగా రథచక్రం ఆయన ఎ డమ కాలి వేళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్రగాయమైంది. 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి తణుకులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్ నాగరాణి భీమవరం (ప్రకాశంచౌక్) : మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలను ఆదివారం సుమారు 3.50 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ఆలయాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. భీమవరం సోమేశ్వర స్వామి, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి, ఆచంట రామేశ్వర స్వామి, లక్ష్మణ్యేశ్వరం లక్ష్మణ్యేశ్వరస్వామి, న త్తారామేశ్వరం రామలింగేశ్వర స్వామి, శివదే వుని చిక్కాల శివదేవుని స్వామి, వీరంపాలెం విశ్వేశ్వరస్వామి, జుత్తిగ ఉమా వాసఖి రవి సోమేశ్వర స్వామి, యనమదుర్రు శక్తిశ్వర స్వామి తదితర క్షేత్రాలకు భక్తులు పోటెత్తారన్నారు. క్యూలైన్లలో పిల్లలకు పాలు, పెద్దలకు అల్పాహారం, తాగునీరు అందించారన్నారు. అ న్నిశాఖల అధికారుల సమష్టి కృషితో ఉ త్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కృషి చేశామన్నారు. భీమవరం(ప్రకాశంచౌక్) : జిల్లా కలెక్టరేట్తో పా టు మండల, మున్సిపల్ కార్యాలయాల్లో సో మవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీ జీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. అలాగే ప్రజలు 1100 టోల్ఫ్రీ నంబర్కు సంప్రదించి సమస్యలను తెలియజేయవచ్చని సూచించారు. -
శివోహం.. భజేహం
పెనుగొండ : ఆచంటలో రథోత్సవం భీమవరం(ప్రకాశం చౌక్) : హరోంహర.. శంభో శంకర స్మరణలు మార్మోగాయి. జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిశాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని భీమవరం గునుపూడిలోని పంచారామక్షేత్రం ఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆలయంలో ఆదివారం వేకువజాము నుంచి ప్రత్యేక అభిషేకాలు చేశారు. నిర్విరామంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చేకూరి రామకృష్ణ, కందుకూరి సోంబాబు ఆధ్వర్యంలో స్వామివారికి లక్షపత్రి పూజ, ప్రత్యేక అలంకరణలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ బంగార్రాజు, కార్యనిర్వహణాధికారి డి.కృష్ణంరాజు, ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మో షన్రాజు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వచ్ఛంద, వ్యాపార సంస్థల ప్రతినిధులు భక్తులకు మజ్జిగ, తాగునీరు, అల్పాహారం అందజేశారు. క్షీరారామం.. మోక్షధామం పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీ రారామలింగేశ్వరస్వామి ఆలయం (క్షీరారామం)కు వేకువజాము నుంచి భక్తులు పోటెత్తారు. ఆలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, విశేష అభి షేకాలు జరిగాయి. సర్వ దర్శనం కోసం శరవణ హోటల్ వరకూ భక్తులు వేచి ఉన్నారు. రూ.50, రూ.100 ప్రత్యేక దర్శనాలు కల్పించారు. ఆలయంలో వైద్య క్యాంపులు ఏర్పాటుచేశారు. ఆలయంలో రాత్రి 8.35 గంటలకు జగజ్జ్యోతి వెలిగించారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో ఆలయం గాలిగోపురం నుంచి స్వామి ప్రధానాలయ శిఖరం వరకూ వరదా సోమేశ్వరరావు ఆధ్వర్యంలో పాగా ఏర్పాటు చేశారు. ఆచంటలో రథోత్సవం పెనుగొండ : ఆచంటలోని ఆచంటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో విశేష పూ జలు జరిగాయి. సాయంత్రం 4 గంటలకు ఆచంటేశ్వరుని రథోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. సుమారు 25 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు అంచనా. ముక్తిమార్గం.. నత్తారామేశ్వరం పెనుమంట్ర: నత్తారామేశ్వరంలోని రామేశ్వరస్వా మి, జుత్తిగలోని సోమేశ్వర స్వామి ఆలయాలకు భ క్తులు పోటెత్తారు. నత్తారామేశ్వరంలో వేకువజా మున కల్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు గో స్తనీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వా మివార్లను దర్శించుకున్నారు. మధ్యాహ్నం రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. లక్ష్మణేశ్వరంలో.. నరసాపురం రూరల్: లక్ష్మణేశ్వరంలోని దుర్గాలక్ష్మణేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో విశేష పూజలు జరిగాయి. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. హరహర మహాదేవ శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు పంచారామాల్లో జనసందోహం వేకువజాము నుంచి బారులు ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు -
ఫైళ్లు కదలవు.. సమస్యలు తీరవు
భీమవరం(ప్రకాశం చౌక్) : పాలనా సౌలభ్యం, ప్రజ లకు పరిపాలన అందుబాటులో ఉండటంతో పా టు సమస్యలను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలను పునర్విభజన చేశారు. దీనిలో భాగంగా భీమవరం కేంద్రంగా నూతన పశ్చిమగోదావరి జిల్లా ఏర్పడింది. ఈ ప్రాంత ప్రజలకు కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చింది. అయినా ప్రజల సమస్యలు తీరడం లేదు. అర్జీలు అందించి నెలలు గడుస్తున్నా భూసమస్యలు పరిష్కారం కావడం లేదు. నెలల తరబడి పెండింగ్లోనే.. కలెక్టరేట్కు వచ్చే రెవెన్యూ శాఖకు సంబంధించి ఫైళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. రెవెన్యూ సమస్యలపై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ అందిస్తే తర్వాత ఫైల్ సిద్ధం చేయడానికి నెల రోజులు, అక్కడ నుంచి ఆర్డీఓ కార్యాలయానికి పంపించడానికి మరో నెల రోజులు, అక్కడ నుంచి కలెక్టరేట్కు పంపించడానికి మరో నెల రోజులు ఇలా మూడు నెలలు సమయం పడుతుంది. అలాగే కొన్ని తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లోనే నెలల తరబడి పెండింగ్లోనూ ఉండిపోతున్నాయి. చివరకు కలెక్టరేట్ కు వచ్చినా ఫైల్ జాయింట్ కలెక్టర్, కలెక్టర్ లా గిన్కు వెళ్లడానికి మరో మూడు నుంచి ఆరు నెలలు సమయం పడుతుంది. అది కూడా అర్జీదారులు కలెక్టరేట్కు వచ్చి అధికారులు చూట్టూ తిరిగితే గానీ ఫైల్ ముందుకు కదలని పరిస్థితి. కలెక్టర్, జేసీ లాగిన్కు వెళ్లిన ఫైల్ కూడా ఎప్పుడు క్లియర్ చేస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి. పైసలిస్తేనే ముందుకు..! భూ సమస్యల, మార్పులు చేర్పులపై దరఖాస్తులు ముందుకు కదలలాంటే వసూళ్ల పర్వం కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. తహసీల్దార్, ఆర్డీ ఓ కార్యాలయాల్లో పైసలిస్తేనే ఫైళ్లు కలెక్టరేట్కు చేరుతున్నాయని, లేకుంటే నెలల తరబడి నిరీక్షణ తప్పదనే విమర్శలు వస్తున్నాయి. సమస్యలు వేగంగా పరిష్కారం కాకపోవడంతో ప్రతి సోమ వారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో మళ్లీ మళ్లీ అవే అర్జీలు వస్తున్నాయి. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పట్టించుకుని అర్జీలను వేగంగా పరిష్కరించాలని అర్జీదారులు కోరుతున్నారు. భీమవరం మండలం గుట్లపాడుకు చెందిన ఓ రైతు తన భూమిని 22ఏ నుంచి తొలగించాలని కోర్టు ఆర్డర్ ఉందని ఏడాది క్రితం తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ అందజేశారు. ఆర్డీఓ కార్యాలయం ద్వారా కలెక్టరేట్కు దరఖాస్తు చేసుకోగా.. నెలల తరబడి సదరు రైతును తిప్పుకుని చివరకు ఆ పని చేయలేమని కలెక్టర్, జేసి చేతులు ఎత్తేశారు. దీంతో సదరు రైతు కోర్టు ఆర్డర్ అమలు చేయలేదని మరలా కోర్టును ఆశ్రయించాడు. ఆకివీడుకు చెందిన ఓ మహిళ తన అడంగల్లో భూ విస్తీర్ణానికి సంబంధించి సరిచేయాలని దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి అక్కడి నుంచి కలెక్టరేట్కు చేరడానికి మూడు నెలలు పట్టింది. కలెక్టరేట్కు చేరి ఆరు నెలలు గడిచింది. మహిళ కుటుంబసభ్యులు నెలల తరబడి కలెక్టరేట్లోని అధికారుల చుట్టూ తిరిగితే ఇటీవల జాయింట్ కలెక్టర్ లాగిన్కు వెళ్లింది. అయినా ఇప్పటికీ ఫైల్ క్లియర్ కాలేదు. ముందుకు కదలని భూ సమస్యల దస్త్రాలు నెలల తరబడి లాగిన్లలోనే.. అధికారుల తీరుతో అర్జీదారుల అసంతృప్తి కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు కలెక్టర్, జేసీ సమీక్షా సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్లు, పర్యటనల కారణంగానే ఫైల్స్ క్లియర్ చేయడంలో ఆలస్యమవుతోందని తెలుస్తోంది. తమ ఫైళ్ల పరిస్థితిపై అడిగితే కలెక్టరేట్ అధికారులు ఇదే సమాధానమిస్తున్నారని అర్జీదారులు ఆవేదన చెందుతున్నారు. నరసాపురం, భీమవరం ఆర్డీఓ కార్యాలయాల నుంచి కలెక్టరేట్ వరకు సుమారు 500 నుంచి 1,500 వరకు ఫైళ్లు పెండింగ్లో ఉన్నట్టు అంచనా. వాటిలో 22 ఏ, భూ విస్తరణ, వర్గీకరణ తదితర భూ సమస్యల ఫైళ్లు ఉన్నాయి. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వీఆర్ఏల సమస్యలపై ముఖం చాటేసిన ప్రభుత్వం
ఉండి: గత ఎన్నికల సమయంలో వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని మాటిచ్చిన కూటమి ప్రభు త్వం అధికారం చేపట్టిన తర్వాత ముఖం చాటేసిందని వీఆర్ఏల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 18న వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోరుతూ సంఘ ఆధ్వర్యంలో కలెక్టర్కు రాయబారం పంపే కార్యక్రమంపై ఆదివారం ఉండిలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు 18న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు రాయబారం కార్యక్రమం నిర్వమించనున్నామన్నారు. సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు వినతులు ఇచ్చినా ఫలితం లేదన్నారు. కనీసం సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన కూడా చేయడం లేదన్నారు. తెలంగాణ మాదిరి పే స్కేలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. భీమవరంలో జరిగే రాయబార కార్యక్రమాన్ని జిల్లాలోని వీఆర్ఏలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వీఆర్ఏలు పాల్గొన్నారు. -
ఫలితాన్ని మార్చే చేతిరాత
ఏలూరు (ఆర్ఆర్పేట): పబ్లిక్ పరీక్షలు దగ్గరకు వచ్చేశాయి. ప్రశ్నాపత్రంలో ఇచ్చిన వాటికి సరైన మాధానాలు రాయడం ఒక్కటే మార్కులు సంపాదించడానికి ఉపయోగపడుతుందనుకుంటే పొరపాటే. జవాబు పత్రాలు మూల్యాంకనం చేసే వారికి విద్యార్థులు రాసిన జవాబులు పూర్తిగా అర్థమైతేనే వారు ఆశించిన మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. పరీక్షల సమయం దగ్గరకు వచ్చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లల చదువు ఎలా సాగుతోంది అనే అంశంపైనే శ్రద్ధ చూపుతున్నారు. చదువుతో పాటు దస్తూరీ పైనా దృష్టి సారిస్తే చక్కటి మార్కులు సొంతమంటున్నారు నిపుణులు. అక్షర దోషాలు, గజిబిజి చేతిరాత వల్ల ఒకటి, రెండు మార్కులు కోల్పోయే ప్రమాదముందంటున్నారు. విద్యార్థి కోల్పోయే ఆ ఒకటి, రెండు మార్కులే ర్యాంకును వేలల్లో తగ్గించేస్తుందనే విషయాన్ని గుర్తెరిగి దస్తూరీపై కూడా శ్రద్ధ చూపాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమాధాన పత్రాన్ని దిద్దే ఉపాధ్యాయుడికి మంచి దస్తూరి కనిపిస్తే ఆ ప్రభావం ఆయన వేసే మార్కులపై సానుకూలంగా ఉంటుందని, ఈ క్రమంలో చక్కటి దస్తూరితో పరీక్షలు రాస్తే మంచి మార్కులు అందుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జవాబు సూటిగా, అక్షరాలు పొందికగా ఉంటే పత్రాలను మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులు మంచి మార్కులు వేసే అవకాశముంటుందంటున్నారు. పరీక్షలు ప్రారంభమయ్యే లోపు ప్రతి రోజూ కొద్ది సేపు రాతపై కూడా శ్రద్ధ పెట్టి సాధన చేస్తే పరీక్షల్లో ఆందోళన లేకుండా సాఫీగా రాయవచ్చంటున్నారు. విద్యార్థులు చేసే పొరపాట్లు కొందరు విద్యార్థులు ఒక జవాబు పత్రంపై 25–30 లైన్లు రాస్తారు. గజిబిజిగా ఉంటే జవాబు పత్రం చూడగానే ఆకట్టుకోదు. ఒక్కోపేజీలో 16–18 లైన్లకు మించకూడదు. లైన్లు సమాంతరంగా ఉండాలి. చాలా మంది విద్యార్థులు ఒత్తిపట్టి రాస్తుంటారు. పెన్నును వేళ్లతో బిగుతుగా పట్టుకుంటారు. దీంతో పేజీ రెండో వైపు అక్షరాలు కనిపిస్తూ చివరికి జవాబుపత్రం గజిబిజిగా తయారవుతుంది. హ్యాండ్ రైటింగ్పై దృష్టి పెట్టాలంటున్న అధ్యాపకులు -
వైభవంగా నృసింహ మహా యజ్ఞం
ద్వారకాతిరుమల: ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై స్వయంభూగా కొలువైన శ్రీ కనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అతి రుద్ర సహిత శ్రీ సుదర్శన, నృసింహ ధన్వంతరీ 32వ మహా యజ్ఞం ఆదివారం రాత్రి కనుల పండువగా జరిగింది. హైదరాబాద్కు చెందిన కొచ్చెర్లకోట సత్యవేంకట లక్ష్మీనరసింహం గురుజీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన రుత్వికులు, పండితులు పాల్గొని, ఈ యజ్ఞ క్రతువును వైభవోపేతంగా నిర్వహించారు. స్వయంభూ శ్రీ లక్ష్మీ నారసింహుడికి ఈ యజ్ఞం జరపడం వల్ల లోకశాంతి చేకూరుతుందని పండితులు తెలిపారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో జరిగిన పలు కార్యక్రమాలతో సుందరగిరి పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఉదయం విఘ్నేశ్వర పూజ, మండపారాధనలు, అనంతరం శాలిగ్రామ అభిషేకం, లక్ష బిల్వార్చన, సూర్య నమస్కారాలు, మృత్తిక లింగార్చన, ఏక బిల్వార్చన, సహస్ర లింగార్చన, మహా లింగార్చన, 365 లింగాలకు పార్ధివ మహాలింగార్చన, 121 పార్ధివ లింగార్చన, కలశారాధన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం హోమగుండ ప్రతిష్ఠ, అగ్ని ప్రతిష్ఠాపనా కార్యక్రమాలను వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో అశేష భక్తజనంతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
మృతదేహంతో ధర్నా
ఉండి: సుమారు మూడు నెలల క్రితం ఒమన్ దేశంలో మృతి చెందిన ఓ మహిళ మృతదేహంతో ఆదివారం కుటుంబీకులు ఏజెంట్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. మృతురాలి కుమార్తె వివరాల ప్రకారం నర్సాపురం మండలం చిట్టవరానికి చెందిన పిట్ట రాజమణిని ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం గ్రామానికి చెందిన ఏజెంట్ విమల ఒమన్కు పంపించింది. వెళ్ళినప్పటి నుండి ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గత ఏడాది డిసెంబర్ 4న ఆమె మృతి చెందింది. తన తల్లి మరణించినట్లు ఏజెంట్ ఫోన్ చేసి చెప్పిందని మృతదేహాన్ని తీసుకురావాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని తెలిపారు. స్థానికంగా ఉన్న భారతీయుల సాయంతో తల్లి మృతదేహాన్ని తీసుకొచ్చామని ఆమె తెలిపారు. మృతురాలి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించారు. కై కలూరు: పక్షి ప్రేమికుల స్వర్గధామంగా పేరుపొందిన ఆటపాక పక్షుల విహార కేంద్రంలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. శివరాత్రి పర్వదినం కావడంతో విజయవాడ – నరసాపురం రూట్లో శైవ క్షేత్రాలను సందర్శించే యాత్రకులు ఆటపాక పక్షుల కేంద్రాన్ని సందర్శించారు. బోటు షికారులో ప్రయాణించి పెలికాన్, పెయింటెడ్ స్ట్రార్క్ పక్షుల కేరింతలను దగ్గర నుంచి వీక్షించారు. భీమడోలు: మానసిక స్థితి బాగోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ద్వారకాతిరుమలకు చెందిన చీమకుర్తి జ్యోతికృష్ణ గణపతి(50) శనివారం రాత్రి భీమడోలు రైల్వే గేటు సమీపాన రైలు కింద పడి మృతి చెందాడు. జ్యోతికృష్ణ గణపతి ఆలయం వద్ద దుకాణాన్ని నిర్వహించేవాడు. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనితో ఇంట్లో ఎవరి చెప్పకుండా శనివారం సాయంత్రం బయటకు వచ్చేసాడు. భీమడోలు రైల్వే గేటు వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని పట్టెంపాలెం వై.జంక్షన్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు రూరల్ ఎస్సై జేవీఎన్ ప్రసాద్ సిబ్బందితో ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.3200, మూడు కోడి పుంజులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రసాద్ వివరించారు. హెడ్ కానిస్టేబుల్ ఎండీ జిలాని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆకివీడు: పాత కక్షల నేపథ్యంలో ఆదివారం స్థానిక సంతపేట వద్ద ఇరువర్గాలు దాడికి పాల్పడిన ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. స్థానిక సాలిపేటకు చెందిన చుండూరు సాయిబాబు అతని స్నేహితులు పోలిశెట్టి చక్రధరరావు, గోపిశెట్టి ప్రసన్నకుమార్ సంతమార్కెట్లోని రామాలయం వద్ద కూర్చుని మాట్లాడుకొంటుండగా బొట్టా చైతన్య, మోహన్ వచ్చి తిట్టారు. ఎందుకు తిడుతున్నారని అడిగినందుకు ఇటుక రాయితోనూ, బీర్ బాటిల్తో దాడి చేయడంతో ప్రసన్నకుమార్, సాయిబాబు గాయపడి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు చెప్పారు. కుక్కునూరు: అనుమానస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైన ఘటన ఆదివారం మండలంలోని గుండేటివాగు సమీపంలో జరిగింది. కుక్కునూరు మండల కేంద్రంలోని కిష్టారం గ్రామానికి చెందిన సోడే సంకురు(40) మృతదేహం గుండేటివాగు సమీపంలో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. -
స్కేటింగ్లో సత్తా
తణుకు అర్బన్: స్కేటింగ్లో సత్తాచాటి తణుకుకు చెందిన కాకిలేటి గేయ దీపిక అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. 8 ఏళ్ల వయసులోనే స్కేటింగ్లో కఠోర సాధన చేసి ఇంత వరకు 25 పతకాలు సాధించి సంచలనం రేకెత్తిస్తోంది. 3వ తరగతి చదువుతున్న చిన్నారి ప్రతిరోజూ తణుకు స్కేటింగ్ రేంజర్స్ అకాడమీలో శిక్షణ పొందుతూ తన ప్రతిభను చాటుతోంది. ఈవెంట్స్ ఉన్న రోజుల్లో ముందు నుంచి ఉదయం సమయంలో కూడా ప్రాక్టీస్ చేస్తుంది. అంతర్జాతీయ స్థాయికి చేరిన దీపికతో క్రీడాభిమానులు ఫొటోలు దిగి కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం విశేషం. పతకాల ప్రయాణమిలా.. ఈ నెల 7, 8 తేదీల్లో పూనేలో జాతీయస్థాయి ఎండ్యూరెన్స్ స్కేటింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొన్న దీపిక అండర్–8 బాలికల విభాగంలో మూడు ఈవెంట్స్లో మూడు బంగారు పతకాలు సాధించి మాల్దీవుల్లో జరగనున్న అంతర్జాతీయ స్కేటింగ్ పోటీలకు అర్హత సాధించింది. ఇంతవరకు పూనే, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ ప్రాంతాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని రాష్ట్ర, జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో 14 బంగారు, 7 సిల్వర్, 4 కాంస్య పతకాలు సాధించింది. -
రెండు నెలలుగా జీతాల్లేవు
భీమవరం(ప్రకాశం చౌక్): విద్యుత్ శాఖలో స్పాట్ మీటర రీడర్లు జీవితాలతో కూటమి ప్రభుత్వం అడుకుంటుంది. ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకుని కాంట్రాక్టర్లు గత రెండు నెలలగా జీతాలు చెల్లించడం లేదు. జిల్లాలోని పెద తాడేపల్లి, నర్సాపురం, తణుకు సబ్ డివిజన్లోని 100 మందికి రెండు నెలలగా జీతాలు ఇవ్వకుండా మీటర్ రీడింగ్ పనులు చేయిస్తున్నారు. పెద తాడేపల్లి, తణుకు నర్సాపురం సబ్ డివిజన్లో.. పెద తాడేపల్లి, నర్సాపురం, తణుకు సబ్ డివిజన్ల్లో మీటర్లు రీడర్లు 100 మంది ఉన్నారు. వారికి గత రెండు నెలలగా జీతాలు బ్యాంకు ద్వారా చెల్లించకుండా కాంట్రాక్టరు ఇబ్బందులు పెడుతున్నారు. దాంతో రీడర్లు నర్సాపురం, తాడేపల్లి డీఈల వద్ద మొరపెట్టకున్నారు. ఇప్పటికే రీడర్లుకు రెండు నెలల జీతాలు లేవు. మరో వారం రోజుల మూడో నెల వస్తుంది. పీఎఫ్, ఈఎస్ఐ మినహాయింపు లేదు జీతాలతో పాటు ప్రతి నెల పీఎఫ్, ఈఎస్ఐ కూడా కాంట్రాక్టర్ చెల్లించాలి. ఈ రెండు నెలలు జీతాలు చెల్లించకపోవడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ కూడా చెల్లించడం లేదు. దాంతో మీటర్ రీడర్కు ప్రమాదం జరిగితే అతను, అతనిపై ఆధారపడిన కుటుంబం నష్టపోతారు. ఈ విషయం తెలిసి కూడా కూటమి ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వంలో సకాలంలో జీతాలు గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖలోని స్పాట్మీటర్ రీడర్లుకు ప్రతి నెల ఒకటో తేదీ జీతాలు బ్యాంకు ద్వారా జమ చేసేవారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లు, విద్యుత్ శాఖ అధికారులను సమన్వయం చేసి మీటర్ రీడింగ్ సకాలంలో జరిగేలా, మీటర్లు రీడర్లుకు జీతాలు పెడింగ్ లేకుండా సకాలంలో అందేలా పనిచేసేవారు. కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య అవినీతి జగరకుండా చర్యలు తీసుకుని మీటర్ రీడర్లకు ఇబ్బందులు లేకుండా చూసేవారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న రీడర్లు గత రెండు నెలలగా జీతాలు రాక మీటర్ రీడర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కరి సుమారు రూ.50 వేల వరకు జీతాలు చెల్లించాల్సి ఉంది. జీతాలు రాక ఈఎంఐలు, ఇంటి అద్దెకు, కుటుంబ పోషణకు మీటర్ రీడర్లు అప్పులు చేస్తున్నారు. ఒక్కొక్క మీటర్ రీడర్ 5 వేల సర్వీసులు బిల్లింగ్ చేసి వియోగదారులకు సకాలంలో బిల్లు అందిస్తారు. దాంతో వినియోగదారులు సకాలంలో బిల్లు చెల్లిస్తారు. మూడు డివిజన్ల్లో మీటర్ రీడర్లుకు పెడింగ్లో ఉన్న జీతాలు వెంటనే బ్యాంకు ద్వారా జమ చేయాలని కాంట్రాక్టర్లు అదేశించాం. నిబంధనలకు విరుద్దంగా కాంట్రాక్టర్లు మీటర్లు రీడర్లుకు నగదు రూపంలో జీతాలు చెల్లించకూడదు. – పి.ఉషారాణి, విద్యుత్ శాఖ ఎస్ఈ వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకోవాలి. దిద్దుబాటు, గజిబిజి ఉండకూడదు. పదానికి పదానికి మద్య దూరం ఉండాలి చేతి రాత గుండ్రంగా, అర్థమయ్యేలా ఉండాలి. సమాధాన పత్రంలో పేజీకి 15– 16 లైన్లు ఉండాలి. పేజీకి పైన, కింద మార్జిన్ విడిచి పెట్టాలి. మొదటి వరుసలో ఎంత బాగా రాసారో చివరి వరకు అదే దస్తూరి కొనసాగించాలి. తెలుగు, ఆంగ్లం, హిందీ సబ్జెక్టులలో లెటర్ రైటింగ్ ఒకే పేజీలో వచ్చేలా రాయాలి. అక్షర దోషాలు, దిద్దుబాట్లు లేకుండా చూసుకోవాలి గణితంలో అంకెలు స్పష్టంగా ఉండాలి. కొట్టివేతలు వస్తే మార్కులు తగ్గుతాయి. సాంఘికశాస్త్రంలో సమాధానాలు పాయింట్ల వారీగా రాయాలి. శీర్షికలు, ఉప శీర్షికలు కింద అండర్లైన్ చేయాలి. -
సంక్షోభంలో ఉప్పు సాగు
● నిరాశతో సాగుకు సమాయత్తం ● తీరంలో కనిపించని ఒకప్పటి జోరు ● 200 ఎకరాలకు పడిపోయిన సాగు విస్తీర్ణం నరసాపురం: జిల్లాలోని నరసాపురం తీరంలో ఈ ఏడాది ఉప్పు సాగు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. గత ఏడాది వరస ప్రకృతి విపత్తులు, అధిక వర్షాలు నిండా ముంచాయి. పెట్టుబడులు రాక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ఏడాది దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీంతో ఈ ఏడాది సాగుకు బ్రేక్ వేశారు. సాగు గణనీయంగా తగ్గిపోయింది. ఇదే పరిస్థిఽతి కొనసాగితే భవిష్యత్లో తీరంలో ఉప్పుసాగు కనిపించే పరిస్థితి ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి. వేసవి ప్రారంభం కావడంతో ప్రస్తుతం తీర గ్రామాల్లో ఉప్పు సాగు ముమ్మరంగా ప్రారంభమైంది. నరసాపురంలో 19 కిలోమీటర్లు ఉన్న తీరప్రాంతంలో 200 ఎకరాల్లో ఉప్పు సాగు చేపట్టారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని వేములదీవి, తూర్పుతాళ్లు, చినమైనవానిలంక, పెదమైనవానిలంక, పేరుపాలెం, కేపీపాలెం తదితర 8 గ్రామాల్లో ఉప్పుసాగు మొదలైంది. గిట్టుబాటు ధరలేక.. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఉప్పుకు గిట్టుబాటు ధరలేక రైతులు విలవిల్లాడారు. తుపాన్లు, వర్షాల కారణంగా అసలు పంట దిగుబడి రావడమే తగ్గిపోవడంతో సాగు చేపట్టిన రైతులు అప్పులపాలయ్యారు. ప్రస్తుతం తీరంలో పండించే ఉప్పు బస్తా(50కిలోలు) రైతుల వద్ద దళారులు రూ.200కు కొనుగోలు చేస్తున్నారు. కనీసం బస్తా రూ.300 ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. కష్టపడి పంట పండించే రైతుకు ఏళ్ల తరబడి అదే ధర దక్కుతోంది. ఏటేటా తగ్గుతున్న విస్తీర్ణం.. 2022, 2023 సంవత్సరాల్లో తీరంలో 1500 ఎకరాల్లో ఉప్పు సాగు జరిగింది. ఏటా సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. గత ఏడాది 900 ఎకరాల విస్తీర్ణంలో జరిగింది. ఈ ఏడాది 200 ఎకరాలకు పడిపోయింది. తీరంలో ఉప్పుమడులు చేపలు, రొయ్యల చెరువులుగా మారుతున్నాయి. రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే తీరంలో దాదాపు 15 గ్రామాల్లో 4 వేల ఎకరాల్లో ఉప్పు సాగు జరిగేది. రోజుల తరబడి కష్టం ఉప్పు సాగు కష్టంతో కూడుకున్నది. ఒక్కసారి మడి కడితే దాదాపు ఆ మడి నుంచి 6 నెలల వరకూ ఉప్పు దిగుబడి వస్తూనే ఉంటుంది. దీంతో ఉప్పుసాగు లాభాలు తెచ్చిపెడుతుంది. వేసవి ప్రారంభంలో ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉప్పుసాగు ప్రారంభం అవుతుంది. మండే ఎండల్లో చిన్న చిన్న మడులను ఏర్పాటు చేసి ఉప్పు సాగు చేస్తారు. ఒక్కో ఎకరానికి సంబంధించి 60 నుంచి 70 మడులు కడతారు. ముందుగా మడుల్లో మట్టిని కాళ్లతో తొక్కి చదును చేసి తరువాత సముద్రంలోని ఉప్పు నీటిని ఆ మడుల్లో నింపుతారు. సాగు ప్రారంభమైన నాటి నుంచి మడుల్లో 60 రోజుల పాటు 6 నుంచి 10 మంది విపరీతంగా శ్రమిస్తేనే కానీ ఉప్పు తయారీ కాదు. ఎకరానికి పెట్టుబడి రూ.30 వేల వరకు ఉంటుంది. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు రోజుకు 100 కిలోల వరకూ ఉత్పత్తి వస్తుందని రైతులు చెబుతున్నారు. గిడ్డంగుల సమస్యపై దృష్టి పెట్టని ప్రభుత్వం ఉప్పును భద్రపరచుకోవడానికి గిడ్డంగులు సదుపాయం పెద్ద సమస్య. ప్రభుత్వం గిడ్డంగులను నిర్మించాలనే కనీస ఆలోచన కూడా చేయకపోవడం గమనార్హం. గిడ్డంగులు ఉంటే వర్షాలు వచ్చినప్పుడు పండించిన ఉప్పును వాటిలో భద్రపరుచుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. అకస్మాత్తుగా వర్షాలు పడినా, తుఫాన్లు వంటి విపత్తులు వచ్చి పడినా ఉప్పు కుప్పలు ద్వంసమయిపోతాయి. రైతు కష్టం మొత్తం కరిగిపోతుంది. అధికార పంటగా గుర్తింపు లేదు ఉప్పు సాగుకు అధికార పంటగా ఇంతవరకూ గుర్తింపు లేదు. ఉప్పు పంట ప్రకృతి విపత్తుల కారణంగా ధ్వంసమైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్ట పరిహారం రాదు. బీమా లాంటి సదుపాయాలు ఉండవు. ఉప్పుసాగును అధికార పంటగా గుర్తించాలని, మిగిలిన పంటలకు మాదిరిగా అందించే సదుపాయాలు కల్పించాలని రైతులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎండలు ప్రారంభం కాగానే ఉప్పు సీజన్ మొదలవుతుంది. ఈ ఏడాది సాగుపై రైతులకు శ్రద్ధ లేదు. ఎన్నో ఏళ్లుగా ఉప్పు పంట సాగు చేస్తున్న రైతులు ఈ ఏడాది సాగుకు స్వస్తి చెప్పారు. వరుసగా నష్టాలు రావడమే కారణం. గత ఏడాది తుఫాన్లు, వర్షాలతో పెట్టుబడులు కూడా రాలేదు. రైతులు అప్పుల పాలయ్యారు. ఒకప్పుడు తీరం అంతా ఉప్పుమడులతో కళకళలాడేది. మైలా రాధాకృష్ణ, ఉప్పు రైతు, పీఎం లంక, నరసాపురం మండలం 50 కేజీల బస్తా రూ 200 పలుకుతోంది. దళారుల మా వద్ద కొన్న ధరకు బయట మార్కెట్లో ఉప్పు ధరకు సంబంధం లేదు. దాదాపు మూడేళ్ల నుంచి ఇదే ధర. గిట్టుబాటు కావడం లేదు. పెట్టుబడులు బాగా పెరిగాయి. గిట్టుబాటు ధర లేకపోతే సాగు కష్టం. గిడ్డంగులు లేకపోవడం వల్ల వర్షాలు పడితే దళారులు అడిగినంతకు అమ్ముకోవాలి. ఉప్పు సాగు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి –మైలా శ్రీనివాస్, పెదమైనవానిలంక, నరసాపురం మండలం -
సంక్షేమాన్ని విస్మరించి..
రాష్ట్ర బడ్జెట్లో కార్పొరేట్ల అభివృద్ధి తప్ప ప్రజల సంక్షేమం ఎక్కడా కనిపించలేదు. రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి, సామాజిక న్యాయానికి తోడ్పడేలా లేదు. ప్రచారం మిన్న.. చేతల్లో సున్నా అన్నట్టుగా ఉంది. నెలకు మహిళలకు రూ.1,500, నిరుద్యోగి భృతిపై నిర్దిష్టంగా చెప్పకపోవడం అన్యాయం. పేదలు ఎదురుచూస్తున్న 3 సెంట్లు, 2 సెంట్ల ఇళ్ల స్థలాలకు నిధులు కేటాయించకపోవడం మోసం చేయడమే. –జేఎన్వీ గోపాలన్, సీపీఎం జిల్లా కార్యదర్శి కూటమి నాయకులు ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు అమలుకు నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరం. పట్టణ ప్రాంతాల్లో 3 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్లు నిర్మించి పేదల సొంతింటి కల నెరవేరుస్తామన్న హామీ అమలుకు నిధులు కేటాయించలేదు. నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1,500 హామీలను పట్టించుకోకపోవడం ఏరుదాటాక.. తెప్పతగలేసిన చందంగా ఉంది. –కోనాల భీమారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి రాష్ట్ర బడ్జెట్లో కౌలు రైతులకు మొండిచేయి చూపారు. అన్నదాత సుఖీభవ సాయంపై స్పష్టత ఇవ్వలేదు. పంట నష్టపోయిన రైతులకు పంటల బీమా పరిహారానికి ఎలాంటి కేటాయింపులు జరగలేదు. ధరలు పడిపోయి రైతులు నష్టపోతున్నా పంటలకు కనీసం మద్దతు ధరలు కూడా అందడం లేదు. కౌలు రైతులపై ఈ ప్రభుత్వానికి ఎలాంటి దయ లేదు. వ్యవసాయ రంగానికి కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయి. – కె.శ్రీనివాస్, ఏపీ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి -
బడ్జెట్లో దళితులకు అన్యాయం
కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు భీమవరం : రాష్ట్ర బడ్జెట్లో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో 9 వేల కోట్లతో దళితులను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. లక్షలాది మంది దళిత నిరుద్యోగులు, యువత ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారని గుర్తుచేశారు. ఇవి కాకుండా దళిత పేటల అభివృద్ధికి ఇవి ఎలా సరిపోతాయో ప్రభుత్వమే చెప్పాలన్నారు. ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్ గత సంవత్సరం బడ్జెట్ కంటే సుమారు 10 శాతం పెంచినట్లు ప్రభుత్వం చెబుతుందని గతంలో రూ.18,497 కోట్లు కేటాయిస్తే ఖర్చు చేసింది మాత్రం రూ.16,830 కోట్లు అని మిగిలిన నిధులు 1,667 కోట్లు కూడా ఈ బడ్జెట్ లో కలపాలని అవి కలిపితే కేవలం రూ.480 కోట్లు మాత్రమే అదనంగా ఇచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం 2013 ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం దళితులకు 17 శాతం అంటే సుమారు 55 వేల కోట్ల పైనే బడ్జెట్ నిధులు కేటాయించాలని కేవలం 6 శాతం మాత్రమే కేటాయించారని తెలిపారు. మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం అంతా కేవలం కార్పొరేట్లు, పెట్టుబడి దారులు, ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించడానికే సరిపోయిందన్నారు. ద్వారకాతిరుమల: సుందరగిరిపై స్వయంభూగా కొలువైన శ్రీ కనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించనున్న అతి రుద్ర సహిత శ్రీ సుదర్శన, నరసింహ ధన్వంతరీ 32వ మహా యజ్ఞానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏటాలాగే ఈ ఏడు కూడా మహా శివరాత్రి నాడు సాయంత్రం మొదలుగా తెల్లవార్లు ఈ మహా యజ్ఞాన్ని ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా హైదరాబాద్కు చెందిన కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యజ్ఞ ఏర్పాట్లను సీహెచ్ కుటుంబరావు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆలయ యాగశాలలో యజ్ఞ క్రతువుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ముందుగా నరసింహ గురూజీ గర్భాలయంలో కొలువైన స్వామివారి మూలవిరాట్ వద్ద కంకణధారణ చేశారు. అనంతరం యాగశాలలో మహాగణపతి పూజ, హోమాన్ని నిర్వహించారు. ఆ తరువాత కలశ పూజ చేశారు. అలాగే పండితులు, రుత్వికులు వేద మంత్రోచ్ఛరణలతో సహస్ర లింగార్చన, మహా లింగార్చన, మృత్తిక లింగాలకు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. లోకశాంతి కోసం పలు వనమూలికలు, భక్ష్యాలు, వివిధ రకాల ద్రవ్యాలు, సమిదులు, ఖరీదైన ద్రవ్యాలతో ఆదివారం రాత్రి నిర్వహించనున్న మహా యజ్ఞం భక్తులను పరవశింప జేయనుంది. -
అంతర్రాష్ట్ర బైక్ దొంగ అరెస్టు
నరసాపురం: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామానికి చెందిన మాన్యం వంశీ మణికంఠను శనివారం నరసాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.14 లక్షలు విలువచేసే 21 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో నర్సాపురం డీఎస్పీ జి.శ్రీవేద కేసు వివరాలు వెల్లడించారు. వ్యసనాలకు అలవాటుపడిన మణికంఠ కొంతకాలంగా బైక్ దొంగతనాలు చేస్తున్నాడు. ఈ నెల 7న నరసాపురం పట్టణం చినమామిడిపల్లిలో సర్రా శ్యాంబాబు ఇంటి గేటు తాళాలు పగులగొట్టి బైక్ దొంగతనం చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం నరసాపురం సీఐ తనిఖీలు చేస్తుండగా పాలకొల్లు రోడ్డు వీరభవానీ గుడి వద్ద మణికంఠ అనుమానాస్పదంగా కనిపించడంతో విచారించారు. నరసాపురం టౌన్లో 8 చోట్ల, తెలుగు రాష్ట్రాలో పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసినట్టు నిందితుడు అంగీకరించాడని చెప్పారు. -
జిల్లాకు తీవ్ర అన్యాయం
చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పసలేని పద్దుల బడ్జెట్గా ఉంది. జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. బడ్జెట్లో ఆక్వా యూనివర్సిటీ ప్రస్తావన లేదు. కోటిపల్లి రైల్వేలైన్ ఊసే ఎత్తలేదు. నిరుద్యోగభృతి ఎండమావిగా ఉంది. బీసీ మహిళలకు పింఛన్, ఇతర సంక్షేమ పథకాలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు. సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ తీవ్ర అన్యాయం చేశారు. రాష్ట్రాన్ని అమావాస్య చీకటిగా మార్చే విధంగా బడ్జెట్ రూపొందించడం దురదృష్టకరం. – పీవీఎల్ నరసింహరాజు, వైఎస్సార్సీపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ -
ప్రజలకు నిరాశే..
కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవు. ముఖ్యంగా సూపర్ సిక్స్లోని నిరుద్యోగభృతి, ఆడబిడ్డ నిధి ఈ ఏడాదైనా అమలు చేస్తారని ప్రజలు ఆశించారు. అయితే వారికి నిరాశే ఎదురైంది. గత ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేస్తుందని ఆరోపించిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు మించి అప్పులు చేసి రాష్ట్ర ద్రవ్యలోటు రూ.75,868 కోట్లకు తీసుకెళ్లడం రాష్ట ఆర్థిక పరిస్థితికి ఆందోళన కల్గించే విషయం. రాష్ట్రంలోని రెవెన్యూలో రూ.34,998 కోట్లు కేవలం వడ్డీలకు చెల్లించాల్సి ఉంది. రెవెన్యూ లోటు రూ.21,935 కోట్లు ఉండటంతో నెలవారీ ఖర్చులకు కూడా తప్పకుండా అప్పులు చేయాలి. ఈ భారం ప్రజలపై పడుతుంది. ప్రభుత్వం అనవసరపు ఖర్చులు చేయకుండా, పొదుపు చర్యలు చేపట్టాలి. – వంక రవీంద్రనాథ్, ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బడ్జెట్లో ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ సుద్ధ అబద్ధాలు. రైతు వెన్ను విరిచేలా వ్యవసాయ బడ్జెట్ ఉంది. పురుగు మందులు, ఎరువులు లేకుండా పంటలు పండిస్తారనడం విడ్డూరం. గతేడాది మాదిరిగానే అరకొరగా కేటాయింపులు చేశారు. అన్నదాత సుఖీభవలో రైతుల సంఖ్యను కుదించడం అన్యాయం. రూ.10 వేల కోట్లకు రూ.6,600 కోట్లే ఇస్తామంటున్నారు. కౌలు రైతుల గురించి ప్రస్తావన లేదు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. చిత్తూరు రైతులకు మామిడి సాయం ఇప్పటివరకు అందలేదు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీపైనా అబద్ధాలు చెప్పారు. ప్రధాన బడ్జెట్ ప్రసంగంలో రూ.890 కోట్లు ఇచ్చామన్నారు. అయితే వ్యవసాయ బడ్జెట్లో రూ.627 కోట్లు అని చెప్పారు. – వడ్డి రఘురాం, వైఎస్సార్సీపీ గూడెం కన్వీనర్, ఏపీ రైతు విభాగం ఆక్వాకల్చర్ వర్కింగ్ ప్రెసిడెంటు -
మానవత నాగేశ్వరరావు అనుమానాస్పద మృతి
ఏలూరు టౌన్: అనేక మందికి సేవలు అందించిన ఆలపాటి నాగేశ్వరరావు అలియాస్ మానవతా నాగేశ్వరరావు అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. ఈ నెల 9న ఏలూరు నగరంలోని వసంతమహాల్ సెంటర్లోని ఆయన నిర్వహిస్తోన్న గాయత్రి ఫైనాన్స్ కార్యాలయం నుంచి ఒంటరిగా బైక్పై బయటకు వెళ్ళారు. ఆరు రోజుల అనంతరం ఆగిరిపల్లి ప్రాంతంలో పెద్ద చెరువులో విగతజీవిగా కనిపించారు. మానవత స్వచ్చంద సంస్థ ద్వారా అనేక మందికి సేవలు అందిస్తుండగా... ఆకస్మికంగా మృతిచెందటం ఏలూరు, పరిసర ప్రాంతాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. శనివారపుపేట శాతవాహన నగర్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలపాటి నాగేశ్వరరావు ఉంటున్నారు. ఈనెల 9న ఉదయం 11గంటల సమయంలో వసంతమహాల్ సెంటర్లోని తాను నిర్వహిస్తోన్న గాయత్రి ఫైనాన్స్ కంపెనీ కార్యాలయం నుంచి బైక్పై బయటకు వచ్చారు. ఆ తరువాత ఆచూకీ దొరకలేదు. ఆయన భార్య టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నగరంలోని సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా గాలింపు చేపట్టగా... నూజివీడు వైపు వెళుతున్నట్లు గుర్తించారు. అనంతరం ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ కావటంతో ఆచూకీ కనిపెట్టటం క్లిష్టంగా మారింది. గన్నవరం, ఆగిరిపల్లి మద్య ప్రాంతంలో బ్రహ్మలింగయ్య చెరువు వద్ద డ్రోన్లతో పరిశీలించగా ఆయన మోటారు సైకిల్ను గుర్తించారు. శనివారం చెరువు ప్రాంతం తుప్పల వద్ద నాగేశ్వరరావు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నూతన విద్యుత్ చట్టాలతో నష్టం
భీమవరం : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యుత్ చట్టంతో ప్రజలకు ముప్పు వాటిల్లుతుందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బలవంతపు భూ సేకరణ తక్షణం ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం డిమాండ్ చేశారు. శనివారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ, విస్తృత సమావేశం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం మాట్లాడుతూ చారిత్రాత్మకంగా నిర్వహించిన దేశవ్యాప్త సమ్మెను దేశంలో ఉన్న కార్మిక వర్గం, వ్యవసాయ కూలీలు, పేద రైతులు, కౌలు రైతులు, వృత్తిదారులు, గ్రామీణ పేదలు విజయవంతం చేశారని ఈ సమ్మె భవిష్యత్ పోరాటాలకు నాంది అని అన్నారు. ఉపాధి హామీ చట్టం మార్పు వల్ల వ్యవసాయ కూలీలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తక్షణం పాత చట్టాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. -
ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలి
పాలకొల్లు సెంట్రల్ : ఆక్వా రైతులు కష్టాలు ప్రభుత్వానికి తెలియడం లేదా అని జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్రాజు ప్రశ్నించారు. ఓ పక్క ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతుంటే.. ఫీడ్ కంపెనీలు తమ స్వార్ధంగా వ్యవహరిస్తూ ఫీడ్ ధరలు పెంచడం బాధాకరమైన విషయమని అన్నారు. ఫీడ్ ధరలు పెంచుతున్నా మత్స్య శాఖ మంత్రి, అప్సడా సభ్యులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమైన విషయమన్నారు. ఫీడ్ కంపెనీలు పెంచిన ధరలకు వ్యతిరేకంగా జిల్లా స్థాయిలో ఉన్న అన్ని ఆక్వా సంఘాల నేతలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి కొన్ని నిర్ణయాలు తీసుకుందన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆక్వా రైతు సంఘ నాయకులు అందరూ కలెక్టర్కు వినతిపత్రం అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వినతిపత్రాలు సమర్పించిన అనంతరం ఫీడ్ కంపెనీలు, ప్రాసెస్ యూనిట్లు, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూసి అనంతరం జిల్లా వ్యాప్తంగా మళ్లీ ఆక్వా రైతులతో సమావేశం ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఆ తదుపరి మిగతా జిల్లాల సంఘాలతోనూ చర్చించి అందరితో ఏ చర్యలు తీసుకోవాలో, ఎలా ముందుకు వెళ్లాలో కార్యాచరణ చేస్తామన్నారు. -
అలంకరణలు కూడా చేయలేరా?
క్షీరారామంలో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల మండపాల్లో గుమ్మాలకు కనీసం పూల అలంకరణ కూడా చేయించలేని స్థితిలో క్షేత్రం ఉందా అని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శనివారం ఆమె ఆలయానికి సందర్శించారు. స్వామి, అమ్మవార్లను దర్శించి అనంతరం ఆలయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆలయ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయంలో ఈనెల 12 నుంచి శివరాత్రి ఉత్సవాలు జరుగుతుండగా, ఆలయంలో ఎక్కడా ఉత్సవాల సందడి కనిపించడం లేదన్నారు. ఆలయంలో కనీసం పూల అలంకరణ చేసేందుకు ఆదాయం లేదా అని అసహనం వ్యక్తం చేశారు. ఆలయంలో ఆహ్లాదకరంగా, ప్రశాంత వాతావరణం కనిపించాలని, ఇంత దారుణంగా ఉంచుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాను హెచ్చరించినా అధికారుల పనితీరులో ఏమాత్రం మార్పు లేదన్నారు. శివరాత్రికి ఆలయంలో అన్నదానం ఏర్పాటుచేయకపోవడం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాతలు ఎవరైనా అన్నదానం చేస్తే వారికి సరైన ప్రదేశం ఏర్పాటుచేయాలని సూచించారు. మహాశివరాత్రికి క్యూలైన్లు, ట్రాఫిక్, శానిటేషన్పై ప్రత్యేక దృష్టికి సారించి పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్డీఓ దాసి రాజు, డీఎస్పీ శ్రీవేద, తహసీల్దార్ యడ్ల దుర్గాకిషోర్, కమిషనర్ బి. విజయసారథి, సీఐ కె.రజనీకుమార్, డీఈఓ హరి సూర్యప్రకాశరావు, ఎస్సై పృద్వీ, ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు ఉన్నారు. సోమారామంలో పక్కా ఏర్పాట్లు భీమవరం(ప్రకాశం చౌక్): పంచారామక్షేత్రం భీమవరం గునుపూడిలోని ఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆలయం (సోమారామం)లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్లర్ నాగరాణి ఆదేశించారు. శనివారం ఆమె ఆలయాన్ని సందర్శించి శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించారు. క్యూలైన్లు, శానిటేషన్ ఏర్పాట్లను పరిశీలించి అన్నదానం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగార్రాజు, సభ్యులు ఆమెకు స్వామి చిత్రపటం, శేషవస్త్రం అందజేశారు. ఏలూరు (టూటౌన్): మెడికల్, ఫార్మా మా ఫియాను అరికట్టాలని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో చేస్తున్న ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ సీపీఐ ఏలూరు ఏరి యా సమితి ఆధ్వర్యంలో శనివారం ఏలూరు పాతబస్టాండ్, అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయాలని, మెడికల్, ఫార్మా మాఫియాను అరికట్టాలని, మందుల అధిక ధరలను తగ్గించాలని, నకిలీ మందులను అరికట్టాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని నినాదాలు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలందరికీ అవసరమైన విద్య, వై ద్యాన్ని ప్రైవేటుపరం చేయడం ద్వారా కూట మి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 60 వేల మెడికల్ షాపుల్లో అర్హత లేని వారు ఫార్మసీ సర్టిఫికెట్లు కొనుగోలు చేసి ప్రజలకు అవసరమైన మందులను అధిక ధరలకు విక్రయిస్తూ నకిలీ మందులను సరఫరా చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. కార్పొరేట్ ఆస్పత్రులు సొంత మెడికల్ షాపుల నిర్వహణ ద్వారా అధిక ధరలకు మందులు విక్రయిస్తున్నారన్నారు. ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దెందులూరు: ప్రభుత్వ వ్యాయామ కళాశాలలో ప్రవేశాల కోసం ఏపీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీసెట్)కు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.నతానియేలు తెలిపారు. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులకు గడువు ఉందని, రూ.1,000 అపరాధ రుసుంతో మే 15 వరకు, రూ.2 వేల అపరాధ రుసుంతో మే 25లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 24 నుంచి 28 వరకు దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించారని చెప్పారు. -
బురిడీ.. అంకెల గారడీ
కొత్త పథకాలు, ప్రాజెక్టుల ఊసేలేదు.. పాత ప్రాజెక్టులకు అరకొరగా కేటాయింపులు.. పోలవరం నిర్వాసితుల గోడు పట్టని తీరు.. ఆక్వా వర్సిటీ, వశిష్ట గోదావరి వంతెన నిర్మాణాలు, కొల్లేరు వంటి సమస్యలను విజయవంతంగా అటకెక్కించిన వైనం.. గతేడాది మాదిరిగానే ఈ ఏడాదీ రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చంద్రబాబు ప్రభుత్వం మొండిచేయి చూపింది. నిధుల కేటాయింపులు, కీలక అంశాలపై కనీసం ప్రస్తావన కూడా లేకపోవడం విచారకరం. రాష్ట్ర బడ్జెట్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాకు లెక్కకు మించిన హా మీలను కూటమి నాయకులు గుప్పించారు. వందల కోట్లతో పథకాలు, ప్రాజెక్టులతో అద్భుతాలు చేస్తామని ఊరూవాడా ప్రచారం చేశారు. తీరా అధికారం చేపట్టిన తర్వాత జిల్లా అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టారు. ఏటా రాష్ట్ర బడ్జెట్లో అరకొర కేటాయింపులతో సరిపెడుతున్నారు. ‘కౌలు’కునేదెలా..? ఉమ్మడి జిల్లాలో 2.45 లక్షల మందికిపైగా కౌలు రైతులు ఉన్నారు. కౌలు వ్యవసాయం ఒడిదొడుకులతో సాగుతోంది. కౌలు రైతుల రక్షణ కోసం ప్రత్యే క చట్టంతో గుర్తింపు ఇచ్చి కౌలురైతులకు కూడా రైతుభరోసా మొదలు అన్ని పథకాల వర్తింపు, గుర్తింపు కార్డుల జారీ, పంట నష్ట పరిహరం వంటివి అందేలా చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హా మీలు ఇచ్చారు. అయితే బడ్జెట్ కౌలురైతుల ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. ‘ఆక్వా’ంక్షలు ఫలించేనా..! గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నరసాపురంలో ఆక్వా యూనివర్సిటీని ఏర్పాటుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ యూనివర్సిటీని అటకెక్కించింది. రూ.332 కోట్లతో జరగాల్సిన భవన నిర్మాణానికి అరకొర నిధులను మంజూరు చేయడంతో పాటు వాటిని కూడా పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేని పరిస్థితి. గత బడ్జెట్లో రూ.36 కోట్లు కేటాయించినా పనులకు అనుమతులు రాలేదు. ప్రస్తుత బడ్జెట్లో రూ.20 కోట్లు మాత్రమే కేటాయించారు. వంతెన.. యాతన నరసాపురం ప్రాంతంలో తలమానికంగా ఉండే వశిష్ట గోదావరి వంతెన నిర్మాణానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి అనుమతులతో శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు. అయితే చంద్రబాబు పాలనలో రాష్ట్ర బడ్జెట్లో రెండేళ్లుగా నిధులు కేటాయించకపోవడంతో ప్రాజెక్టు శంకుస్థాపనకే పరిమితమైంది. కీలక ప్రాజెక్టులకు రిక్తహస్తం జిల్లాలో కీలకమైన పోలవరం ప్రాజెక్టు, పునరావాసం, చింతలపూడి ఎత్తిపోతల పథకం, గోదావరి డె ల్టా ఆధునికీకరణ, ఎర్రకాల్వ, కొల్లేరు ఏ ఒక్క దాని కీ న్యాయం జరగలేదు. సుమారు రూ.5 వేల కోట్లు కేటాయించాల్సిన చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ.435 కోట్లతో సరిపెట్టారు. గత బడ్జెట్లో రూ.220 కోట్లు కేటాయించినా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ● డెల్టా ఆధునికీకరణకు వందల కోట్లు అవసరం కాగా మొక్కుబడిగా రూ.100 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయింపులతోనూ పనులు జరగని పరిస్థితి. ● ఎన్నికల సమయంలో నల్లజర్ల నుంచి తాడేపల్లిగూడెం వరకు ఎర్రకాల్వ ముంపునకు శాశ్వత ప రిష్కారం చూపుతామని కూటమి నాయకులు ప్రకటించారు. అయితే బడ్జెట్లో నామమాత్రంగా సాధారణ మెయింటినెన్స్కు రూ.10 లక్షలు మాత్రమే కేటాయించారు. ● 122 గ్రామాల ప్రజల జీవనస్థితితో ముడిపడి ఉన్న కొల్లేరుకు సంబంధించి బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదు. కొల్లేరును 3వ కాంటూరుకు కు దించి జిరాయితీ భూములిస్తాం, కొల్లేరు గ్రామా ల్లో రోడ్లు, తాగునీరు, మౌలిక సదుపాయాలన్ని కల్పిస్తామని ఎన్నికల్లో ప్రకటించి సుప్రీంకోర్టు సాకుతో గాలికి వదిలేశారు. ● పోలవరం ప్రాజెక్టు పరిధిలో నిర్వాసితులకు పరిహారం అలానే పెండింగ్లో ఉంది. పరిహారం గురించి బడ్జెట్లో ప్రస్తావన కూడా లేదు. పథకాల ఊసేదీ.. సూపర్ సిక్స్ హామీల పేరుతో కూటమి ప్రభుత్వం నిండా వంచించింది. ఈ బడ్జెట్లోనూ ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, రెండు సెంట్ల స్థలాలు వంటి హామీలను ప్రస్తావించలేదు. ఏలూరు జిల్లాలో 6.71 లక్షలు, పశ్చిమగోదావరి జిల్లాలో 6 లక్షల మందికి పైగా మహిళలు ఆడబిడ్డ నిధి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మోసాల పద్దు నిధుల్లేవ్.. పథకాల్లేవ్ పాత ప్రాజెక్టులకు అరకొర కేటాయింపులు అటకెక్కిన వశిష్ట గోదావరి వంతెన కనిపించని ఫుడ్, ఆక్వా క్లస్టర్లు ఉమ్మడి జిల్లాకు మరోసారి మొండిచేయి రాష్ట్ర బడ్జెట్పై విమర్శల వెల్లువ -
కట్టలు తెగిన వివాదం
● స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్ల మధ్య పోరు ● ఏడీఏ టేబుల్పై నోట్ల కట్టల వీడియో హల్చల్ ● అధికారులకు తలనొప్పిన వ్యవహారం తణుకు అర్బన్: తణుకు విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో విద్యుత్ బిల్లుల రీడర్లకు సంబంధించి ఇద్దరు కాంట్రాక్టర్ల మధ్య తలెత్తిన వివాదం అధికారులకు తలనొప్పిగా మారింది. ఈనెల 13న సాయంత్రం కార్యాలయంలోని ఏడీఈ టేబుల్పై రూ.500 నోట్ల కట్టలు (సుమారు రూ.7.50 లక్షలు) ఉంచి.. ‘రీడర్లు అంతా డీఈఈ కార్యాలయానికి వచ్చి మీ జీతాలు తీసుకువెళ్లండి.. ఇప్పుడు రాకపోతే మిమ్మల్ని తొలగిస్తాం’.. అంటూ, తాను విజయవాడకు చెందిన కాంట్రాక్టరునంటూ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఏడీఈ చాంబర్లో ఏడీఈ బోడపాటి దివాకర్ సీటులో ఉండగానే కాంట్రాక్టరు నోట్ల కట్టలు పేర్చి వీడియో తీసి వైరల్ చేయడం వివాదాస్పదంగా మారింది. స్పాట్ బిల్లింగ్ టెండర్లో గందరగోళం స్పాట్ బిల్లింగ్కు సంబంధించి గత నవంబరులో జరిగిన టెండర్ల వ్యవహారం గందరగోళంగా మారింది. విజయవాడకు చెందిన శంకర్ ఇన్ఫ్రా పేరుతో వేసిన టెండరు ఎల్ 1గా క్వాలిఫై కాగా, తణుకుకు చెందిన పోతుల మాధురి పేరుతో వేసిన టెండరు ఎల్ 2గా రెండో స్థానంలో నిలిచింది. ఎల్ 1 కాంట్రాక్టరును వర్కుకు సంబంధించి అగ్రిమెంట్కి పిలిచినా రాకపోగా రీడర్లతో బిల్లులు తీయించే నిర్వహణ చేయలేదని, దీంతో నోటీసులు కూడా ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్ 2 కాంట్రాక్టర్ సదరు నిర్వహణను డిసెంబరు నుంచి చేస్తున్నారు. అయినా సాంకేతిక కారణాలతో వర్కుకు బిల్లు చేయలేదు. ఎల్ 2 కాంట్రాక్టర్ బిల్లు కోసం అడుగుతున్నా బిల్లు ఇవ్వలేమని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరితో కలిపి సబ్ డివిజన్ కు సంబంధించిన 30 మంది రీడర్లకు మూడు నెలల జీతాల బకాయిలు ఉన్నాయి. తాజాగా అధికారుల చొరవతో ఎల్ 1 కాంట్రాక్టర్ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తణుకు ఏడీఈ కార్యాలయానికి వచ్చి రీడర్లకు జీతాలు ఇస్తానని.. ముందురోజు వాట్సాప్ గ్రూపు ద్వారా తెలిపినా రీడర్లు రాకపోవడంతో.. రీడర్లు అంతా రావాలని, జీతాలు ఇస్తానంటూ డబ్బు కట్టలతో వీడియో చేశారు. అయితే రీడర్లు మాత్రం తమకు గతంలో మాదిరిగా మాధురి ఇన్ఫ్రా ద్వారానే బ్యాంకు ద్వారా జీతాలు వేయాలని కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకరు చినబాబు పేషీ.. మరొకరు లోకల్ పేషీ ఇద్దరు కాంట్రాక్టర్లలో ఒకరు చినబాబు పేషీ కాగా, మరొకరు లోకల్ పేషీగా వ్యవహారం నడుస్తోందనే గుసుగుసలు వినిపిస్తున్నాయి. దీంతో టెండరు వ్యవ హారం అధికారులకు తలనొప్పిగా మారింది. నిబంధనల ప్రకారం అధికారులు ఎల్ 1 వైపు మొగ్గుచూపుతుండగా, స్థానికంగా ఉన్న సిఫార్సులతో తనకే ఇవ్వాలనే దిశగా ఎల్ 2 పోరాటం చేస్తున్నట్టుగా గుప్పుమంటోంది. ఈ నేపథ్యంలో నోట్ల కట్టల వ్యవహారం అధికారులను మరింత ఇరకాటంలో పడేసింది. గతే డాది డిసెంబరు ముందు వరకు ప్రస్తుత ఎల్ 2 కాంట్రాక్టరు అయిన పోతుల మాధురి టెండరు ద్వారా నిర్వహణ చేశారు. అయితే తాజాగా టెండరు దక్కకపోవడం, ఎల్ 1 కాంట్రాక్టరు నిర్వహణకు ముందు కు రాకపోవడంతో ఎల్ 2 కాంట్రాక్టరు రీడర్లను మే నేజ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బుల వ్యవహారం తెలియదు స్పాట్ బిల్లింగ్కు సంబంధించి రీడర్లకు జీతాలు ఇచ్చేందుకు వచ్చిన కాంట్రాక్టర్ ఆ డబ్బులు రీడర్లకు ఇచ్చేందుకు తెచ్చినవని, టేబుల్పై పెట్టి లెక్కపెట్టుకుంటున్నారని అనుకున్నానని ఏడీఈ బోడపాటి ది వాకర్ వివరణ ఇచ్చారు. డబ్బులను వీడియో తీసిన విషయం తనకు తెలియదని అంటున్నారు. -
ఆరోగ్యశ్రీ వైద్యానికి డబ్బులా!?
తణుకు అర్బన్ : ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవల్లో తమ నుంచి డబ్బు దండుకున్నారంటూ పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామానికి చెందిన దొడ్డిపట్ల మల్లిఖార్జున గంగా ప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తన సోదరి బొప్పే విజయలక్ష్మి ఈనెల 9న పడిపోయి కాలు విరగడంతో తణుకులోని ఆపిల్ ఆస్పత్రికి అదే రోజు సాయంత్రం 5 గంటలకు తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వగా రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం లోపలకు తీసుకెళ్లిన సిబ్బంది స్ట్రెచర్పైనే ఉంచి ఎక్స్రే, రక్త పరీక్షలు చేశారు. ఇందుకు రూ.1,200, రక్త పరీక్షలకు రూ. 4,540తో పాటు మరో రూ.1,000 కట్టించుకున్నారు. ఆరోగ్యశ్రీలోనే కదా.. డబ్బులు ఎందుకని ప్రశ్నిస్తే ఆరోగ్యశ్రీ అప్రూవల్ వచ్చేవరకు మీరు ఖర్చులు పెట్టుకోవాలని బదులిచ్చారు. దీంతో బాధితులు చెల్లించారు. కాసేపటికి రూంకి పంపిస్తామని చెప్పిన ఆస్పత్రి సిబ్బంది.. రూ.15 వేలు చెల్లించాలన్నారు. తాము చెల్లించలేమని బాధితులు చెప్పగా.. రూ.10 వేలు చెల్లించమన్నారు. దీంతో వెళ్లిపోతామని బాధితులు చెప్పి తణుకు సాయిశ్వేత ఆస్పత్రిలో చేరారు. అక్కడ అన్ని పరీక్షలు, శస్త్రచికిత్స ఉచితంగానే చేశారు. ఆపిల్ ఆస్పత్రి తీరుపై 104 నంబరుకు ఫిర్యాదుచేస్తే విజయలక్ష్మి పేరు సాయిశ్వేత ఆస్పత్రిలో మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యిందని, ఆపిల్లో కాలేదన్నారు. ఆపిల్ ఆస్పత్రి సిబ్బంది రిజిస్ట్రేషన్ను పెండింగ్లో పెట్టి అందినకాడికి దోచేయాలని చూశారని బాధితుడు గంగా ప్రసాద్ తెలిపారు. ఇలాంటి ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య తన దృష్టికి రాలేదని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కీర్తి ‘సాక్షి’కి చెప్పారు. ఆపిల్ ఆస్పత్రి రసీదులు, ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్ చూపిస్తున్న బాధితుడు గంగా ప్రసాద్ ఆపిల్ ఆస్పత్రిలో విజయలక్ష్మి పేరుతో ఆరోగ్యశ్రీలో రిజిస్ట్రేషన్ చేసిన పత్రం కాలు విరగడంతో తణుకులోని ఆపిల్ ఆస్పత్రికి బాధితురాలు పరీక్షలంటూ స్ట్రెచర్ పైనే రూ.6,740 వసూలు రూం చార్జీలకు రూ.15 వేలు చెల్లించాలంటూ డిమాండ్ -
ముగిసిన మావుళ్లమ్మ వార్షిక మహోత్సవాలు
● అమ్మవారికి మహానివేదన సమర్పణ ● అన్నసమారాధనకు పోటెత్తిన భక్తులు భీమవరం(ప్రకాశం చౌక్): దాదాపు నెల రోజుల నుంచి నీరుల్లి కూరగాయపండ్లు వర్తక సంఘం, అమ్మవారి ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీమావుళ్లమ్మ వారి 62వ వార్షిక మహోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారికి మహానైవేద్యం సమర్పించి, అన్నసమారాధన నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు, ఉత్సవ నిర్వాహకులు అమ్మవారికి పలు రకాల పిండి వంటలు, స్వీట్స్,పులిహోర తదితర వాటిని మహా నివేదనగా సమర్పించారు. రూ.1.45 లక్షలు పలికిన లడ్డూ ఉత్సవాలు సందర్భంగా అమ్మవారికి సమర్పించిన 36 కిలోల లడ్డును వేలం వేయగా భీమవరానికి చెందిన బోడపాటి చినబాబు అనే భక్తుడు రూ 1.45 లక్షలకు వేలం పాటలో దక్కించుకున్నారు. లక్ష మందికిపైగా అన్నప్రసాదం ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు అమ్మవారి ఆలయం వద్ద అన్నదాన ప్రసాదం వితరణ నిర్వీరామంగా కొనసాగింది. భీమవరం పట్టణంతో పాటు జిల్లా నలుమూలు నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి అన్నదాన ప్రసాదం స్వీకరించారు. ప్రత్యేక క్యూలైన్లు ద్వారా భక్తులు అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని అన్నదాన ప్రసాదం స్వీకరించారు. మిగిలిన వారికి అమ్మవారి ఆలయం ముందు ఖాళీ ప్రదేశంలో భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయం పడమటివైపు తాలూకాఫీసు సెంటర్, దక్షిణంవైపు వేణుగోపాల స్వామి ఆలయం సెంటర్, ఆదివారం బజారు రోడ్డు, అన్నదానానికి వచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయాయి. దాదాపు లక్ష మంది అన్నప్రసాదం తీసుకున్నట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. -
పూర్తి స్థాయిలో అమలు కాలేదు
తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయ లేదు. ఎన్నికల సమయంలో ఇంటిలో ఎంత మంది చదివితే అంత మందికి ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున అందచేస్తామని ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించారు. పథకం అమలులో మాత్రం దారుణంగా కోతపెట్టారు. మా ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకాన్ని హమీ ఇచ్చిన మేరకు అమలు చేశాం. ఎన్నికల్లో మేము అబద్దపు హామీలు ఇవ్వలేదు. శాసన మండలిలో తప్పుడు లెక్కలు చెప్పడం దారుణం. – ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు గుండు సున్నా పెట్టారు. ముఖ్యంగా తల్లికి వందనం పేరుతో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ 15,000 చొప్పున ఇస్తామంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టేసారు. తీరా ఇచ్చే సమయంలో నిబంధనల పేరుతో అర్హులను తగ్గించేసి అరకొరగా కేవలం 13,000 చొప్పున ఇవ్వడం దుర్మార్గం. జగన్ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పేరుతో అర్హులందరికీ రూ.15,000 చొప్పున ఇవ్వడాన్ని తల్లులంతా స్వాగతిస్తున్నారు. – కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి -
వైఎస్సార్సీపీలోకి ఆటో యూనియన్ సభ్యులు
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ పరిపాలన చూసిన ప్రజలు వైఎస్సార్సీపీకి పట్టం కట్టడానికి ఎదురుచూస్తున్నారని జిల్లా పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల గోపి అన్నారు. పట్టణంలోని రైల్వేగేటు సెంటర్కు చెందిన 30 మంది ఆటో యూనియన్ సభ్యులు శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతనంగా పార్టీలో చేరిన సభ్యులకు నరసాపురం పార్లమెంటు పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్ గుడాల గోపి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రజలు ఛీ కొడుతున్నారని గుర్తించాలి రాష్ట్రంలో కూటమి పాలన అరాచకాలు, అక్రమాలు చూసిన ప్రజలు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారని గుడాల గోపి చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఛీకొడుతున్నారనే విషయాన్ని కూటమి ప్రభుత్వం గ్రహించాలన్నారు. కూటమి నేతలు ఇప్పటికై నా బుద్ధి తెచ్చుకొని రెడ్బుక్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజలకు సక్రమమైన పాలన అందించాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో ఉప్పే సత్యనారాయణ, కుక్కల కృష్ణ, ఉన్నమట్ల శ్రీధర్, చేరుగొండి నాగబాబు, శోడదాశి చిట్టిబాబు, ముళ్లపర్తి సాయికుమార్, నెవురి శంకర్, చొప్పల రాజేష్, సాకా ఆనందరావు, బొంద ప్రసాద్, లికితపూడి పెద్దిరాజు, విప్పర్తి రంగబాబు, మైలే మోషే, నక్కా నరేష్కుమార్, శిడగం శ్రీను, యింజమూరి రాకేష్, దాకే నాగరాజు, సాగా నర్సింహమూర్తి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి యడ్ల తాతాజీ, నేతలు కోరాడ శ్రీనివాసరావు, జోగాడ ఉమామహేశ్వరరావు, వీరా మల్లిఖార్జునుడు, ఉండ్రాజవరపు రవి, ఉప్పే పండు, పడ్డా అంతర్వేది తదితరులు పాల్గొన్నారు. -
మార్చి 13 నుంచి జాతీయ స్థాయి నాటికల పోటీలు
పాలకొల్లు సెంట్రల్: సాంఘిక నాటక రంగానికి పుట్టినిల్లు అయిన పాలకొల్లులో కళా రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నాటిక పోటీలను నిర్వహిస్తున్నామని పాలకొల్లు కళాపరిషత్ అధ్యక్షుడు కేవీ కృష్ణవర్మ అన్నారు. ఈ మేరకు శుక్రవారం కళాపరిషత్ ఆధ్వర్యంలో మార్చి 13, 14, 15 తేదీల్లో 17వ జాతీయ స్థాయి నాటికల పోటీల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణవర్మ మాట్లాడుతూ అడబాల థియేటర్ వెనుక భాగంలో ఉన్న స్థలంలో నాటిక పోటీలు నిర్వహించనున్నామన్నారు. అనంతరం మొదటి పత్రికను సంస్థ గౌరవ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావుకు అందజేశారు. కార్యక్రమంలో కేఎస్పీఎన్ వర్మ, మానాపురం సత్యనారాయణ, జక్కంపూడి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముదినేపల్లి రూరల్ : మట్టి లారీల వల్ల రోడ్లు ధ్వంసమవుతున్నాయంటూ మండలంలోని పెదగొన్నూరు గ్రామస్తులు లారీలను నిలిపివేసిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని రోజులుగా ప్రజాప్రయోజనాల కోసమంటూ టిప్పర్లతో గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు మట్టిని తరలిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల ఇటీవలనే నూతనంగా వేసిన రోడ్లు ధ్వంసమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ టిప్పర్లతో కాకుండా ట్రాక్టర్లతో మట్టిని తరలించాలని చెప్పినప్పటికీ టిప్పర్లతో తరలిస్తున్నందున రోడ్లు పాడైపోతున్నట్లు శ్రవణం బాలాజీ అనే గ్రామస్తుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికై నా ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ట్రాక్టర్లతోనే మట్టిని తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తణుకు అర్బన్: పూనేలో ఈ నెల 7,8 తేదీల్లో నిర్వహించిన జాతీయస్థాయి ఎండ్యూరెన్స్ స్కేటింగ్ పోటీల్లో తణుకుకు చెందిన క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. తణుకు స్కేటింగ్ రేంజర్స్ అకాడమీలో శిక్షణ పొందిన తణుకుకు చెందిన కాకిలేటి గేయ దీపిక అండర్–8 బాలికల విభాగంలో మూడు బంగారు పతకాలు, అండర్–19 బాలుర విభాగంలో రెడ్డి పవన్ హర్షవర్థన్ రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకం, అండర్–7 విభాగంలో ఖండవల్ల మయాంక్ కాంస్య, అండర్–5 బాలికల విభాగంలో మండల నిహస్వి కాంస్య పతకం సాధించినట్లు కోచ్ లావణ్య శుక్రవారం విలేకరులకు తెలిపారు. వీరు త్వరలో మాల్దీవుల్లో నిర్వహించే అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. తాడేపల్లిగూడెం : కోస్తా ప్రాంత ముస్లింల ఆధ్యాత్మిక సదస్సు శని, ఆదివారాల్లో తాడేపల్లిగూడెంలో నిర్వహించనున్నట్టు నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తబ్లీఘీ జమాత్ పేరిట నిర్వహించే ఈ సదస్సు దావతుల్ హక్ రెలిజియల్ ట్రస్టు (ఏపీ) ఆధ్వర్యంలోని పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం శాఖ పర్యవేక్షణలో జరుగుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ముస్లింలు హాజరుకానున్నారని వివరించారు. శనివారం ఉదయం ఐదు గంటల నుంచి సదస్సు ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. ద్వారకాతిరుమల: శ్రీవారి సన్నిధిలో మార్చి 20 నుంచి 23 వరకు రాష్ట్ర స్థాయిలో ఒంగోలు, పుంగనూరు జాతి ఆవుల అందాలు, పాల పోటీలను నిర్వహించనున్నట్టు గోజాతి సంరక్షణ రాష్ట్ర అధ్యక్షులు యు.చక్రపాణి తెలిపారు. ఈ మేరకు పోటీలు జరిగే మార్కెట్ యార్డు స్థలాన్ని శుక్రవారం ఆయన ఏఎంసీ చైర్మన్ వై.బ్రహ్మరాజుతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ద్వారకాతిరుమలలో గోసమ్మేళనం పేరుతో కొంత కాలంగా ఒంగోలు, పుంగనూరు జాతి గోవులకు అందాలు, పాల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. రైతులకు, పశువులకు అన్ని సౌకర్యాలను కల్పించి, పోటీల్లో గెలుపొందే గోవులకు బహుమతులను అందిస్తామన్నారు. -
చంద్రబాబు, లోకేష్ను ఏమనాలి ?
ప్రతి తల్లి తమ పిల్లల్ని చదివించుకోవాలన్న సంకల్పంతో అమ్మ ఒడి పథకం తెచ్చింది మాజీ సీఎం జగన్. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి టాయిలెట్స్ మెయింటినెనన్స్ కోసం రూ. వెయ్యి తగ్గిస్తే సైకో అంటూ టీడీపీ, జనసేన నాయకులు విమర్శలు చేశారు. ఇప్పుడు వారు ఏం అభివృద్ధి చేశారని రూ.2 వేలు కోత పెట్టారు. చంద్రబాబు, లోకేష్ను ఏమని పిలవాలి. – కవురు శ్రీనివాస్, ఎమ్మెల్సీ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చాక చేస్తున్న పనులకు పొంతన లేదు. అర్హులందరికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పి కొందరికే ఇచ్చింది. రకరకాల కారణాలు చెప్పి ఎంతోమంది అర్హులకు సాయం అందించలేదు. వాస్తవాలు కప్పి పుచ్చి అందరికి ఇచ్చినట్టు శాసన మండలిలో కూటమి నాయకులు చెప్పడం సిగ్గుచేటు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. – కొట్టు సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం, తాడేపల్లిగూడెం ఎన్నికల్లో నీకు పదిహేను వేలు, నీకు పదిహేను వేలు అంటూ ఊదరగొట్టారు. అమల్లోకి వచ్చేసరికి రూ. 2 వేలు కోతపెట్టి రూ.13 వేలు మాత్రమే జమచేశారు. అది కూడా కొందరికి రూ.9 వేలు లోపే ఇచ్చారు. ఏవేవో కారణాలు చెప్పి అర్హులకు అన్యాయం చేశారు. మా ప్రభుత్వంలో పాఠశాల అభివద్ధికి తల్లిదండ్రుల అభీష్టం మేరకు రూ. వెయ్యి తగ్గిస్తే నానా రాద్దాంతం చేసిన కూటమి నేతలు ఇప్పుడు నోరుమెదపడం లేదు. – చెరుకువాడ శ్రీరంగనాధరాజు, మాజీ మంత్రి, ఆచంట సాంకేతిక కారణాలు, కరెంటు బిల్లులు, ఫోర్ వీలర్స్ సాకుగా చూపించి చాలా మంది అర్హులకు తల్లికి వందనం ఇవ్వలేదన్నది సుస్పష్టం. లబ్ధి పొందిన వారిలోనే కొందరికి రూ.9 వేల లోపే సాయం పొందిన వారు ఉన్నారు. వీటన్నింటిని కప్పిపుచ్చుతూ అందరికీ ఇచ్చేశామంటూ కూటమి నాయకులు మండలి సాక్షిగా అసత్యాలు వల్లె వేస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే మండలిలో మా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. – వంకా రవీంద్రనాథ్, ఎమ్మెల్సీ -
మహాశివరాత్రికి బలివే సిద్ధం
ముసునూరు: దేవదాయశాఖ ఆధీనంలో ఉన్న బలే శ్రీరామ లింగేశ్వర ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఏలూరు జిల్లాగా ఏర్పడిన తర్వాత నాలుగో ఏడాది ఈ నెల 14 నుంచి 18 వరకు ఐదు రోజులు పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న ప్రత్యేక అధికారిగా, సర్పంచ్ రావు ప్రవీణ సుధాకర్, ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మకంటి శ్యామలరావు, ఈఓ పామర్తి సీతారామయ్య నేతృత్వంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పిండ ప్రదానాలకు, అమావాస్య స్నానాల కోసం బలివే క్షేత్రంలో ఈ ఏడాది శాశ్వత జల్లు స్నానాలు, మహిళలకు ప్రత్యేక స్నాన ఘట్టాలు, రహదారుల వెడల్పుతో వన్ వే తరహా రాకపోకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే రెండు జిల్లాల సరిహద్దులో ఉన్న బలే రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న దృష్ట్యా మొత్తం 5 విభాగాలుగా నూజివీడు, ఏలూరు, సత్తుపల్లి ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. -
అత్త వేధింపులతో కోడలు ఆత్మహత్య
ముదినేపల్లి రూరల్: అత్త వేధింపులు భరించలేక కోడలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని దేవపూడిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం గురిండి గ్రామానికి చెందిన సింధుపురం సంతోషిని(27) దేవపూడికి చెందిన చేడు మహేష్ను ప్రేమించి 2023లో వివాహం చేసుకుంది. ఈ వివాహానికి సంతోషిని బంధువులు అంగీకరించినప్పటికీ మహేష్ తల్లి ఒప్పుకోలేదు. అయినప్పటికీ వీరిరువురు వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కూతురు ఉండగా తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. దీంతో అత్త అప్పలనరసమ్మ తరచూ కోడలైన సంతోషిని అనారోగ్యవంతురాలైన కూతురిని కన్నావంటూ వేధిస్తోంది. అయితే ఇటీవల మళ్లీ సంతోషిని గర్భం దాల్చింది. అయినప్పటికీ అత్త వేధింపులు ఆపకపోవడంతో పడక గదిలో ఫ్యాన్కి ఉరి వేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి సంతోషిని గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై సంతోషిని సోదరుడు సింగుపురం శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై వీరభద్రరావు గుడివాడ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆకివీడు: స్థానిక శ్రీరామ్పురంలో నివసిస్తున్న రాజనాల మంగతాయారు(48) ప్రమాదవశాత్తూ శుక్రవారం కాలువలో పడి మృతి చెందింది. గత కొంతకాలంగా ఆమె మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. కాలువలో నీళ్లు తీసుకువచ్చేందుకు వెళ్లగా ఫిట్స్ రావడంతో కాలువలో పడి మునిగిపోయింది. స్థానికులు వెంటనే గమనించి ఆమెను రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. ెపనుగొండ: వశిష్టా గోదావరిలో దొంగరావిపాలెం వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు పెనుగొండ ఎస్సై కె.గంగాధర్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గురువారం సాయంత్రం దొంగరావిపాలెం ఇన్చార్జి వీఆర్ఓ వంకా వెంకటేశ్వరరావు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడు 35–45 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉండి: మండలంలోని ఆరేడులో చోరీకి గురైన కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గణపవరం గ్రామానికి చెందిన ముత్తిరెడ్డి రవితేజ రొయ్యల చెరువుల గట్లపై పెంచుతున్న కోళ్లను బుధవారం రాత్రి చోరీ చేసిన ఘటన పాఠకులకు విధితమే. గురువారం సాయంత్రం ఆ కోళ్లను ఆటోలో తరలిస్తున్న వీరవాసరం మండలం వడ్డిగూడేనికి చెందిన సైదు మోహన్రావును ఎన్నార్పీ అగ్రహారం వద్ద పోలీసులు అరెస్టు చేసి, కోళ్లను స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్ చేశారు. శుక్రవారం నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై ఎండీ నసీరుల్లా తెలిపారు. -
భారీగా అక్రమ మద్యం ధ్వంసం
నరసాపురం రూరల్: అక్రమ మద్యం తయారీ, విక్రయం, రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి హెచ్చరించారు. శుక్రవారం మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్లో రూ.24 లక్షల విలువైన మద్యం, సారాను ధ్వంసం చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత ఎస్పీ స్వయంగా రోడ్ రోలర్ను నడిపి మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు ఆదేశాల మేరకు నరసాపురం సబ్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో సీజ్ చేసిన 4,550 బాటిళ్ల డ్యూటీ పెయిడ్ లిక్కర్ (డీపీఎల్), 2,136 బాటిళ్ల నాన్–డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్), 620 లీటర్ల అక్రమ సారాను వివిధ శాఖల అధికారుల పర్యవేక్షణలో ధ్వంసం చేశామన్నారు. కార్యక్రమంలో నరసాపురం ఆర్డీఓ దాసి రాజు, అదనపు ఎస్పీ వి.భీమారావు, నరసాపురం సబ్ డివిజన్ డీఎస్పీ డాక్టర్ జి.శ్రీవేద తదితరులు పాల్గొన్నారు. -
తల్లికి వంచన
నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టారు. ఆనక తొలి ఏడాదికి ఎగనామం పెట్టి.. ఇప్పుడు మండలి వేదికగా తల్లికి వందనం అందరికీ ఇచ్చామంటూ చంద్రబాబు ప్రభుత్వం అసత్యాలు వల్లించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సాక్షి, భీమవరం: అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తల్లికి వందనం పథకానికి ఎగనామం పెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రస్తుత విద్యాసంవత్సరానికి జిల్లాలో 1,920 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, 121 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లోని 3,16,328 మంది విద్యార్థుల్లో 2,29,106 మందిని అర్హులుగా గుర్తించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కో విద్యార్థికి రూ.15,000 చొప్పున రూ. 343.81 కోట్లను తల్లుల ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. రూ.2,000 కోత పెట్టి గతేడాది జూన్ 12న తొలి విడతగా 1,76,574 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.229.55 కోట్లను జమచేసింది. తర్వాత వచ్చిన గ్రీవెన్న్స్లో 12,553 మందికి అందించగా, ఫోర్ వీలర్, స్థలం, ఇన్కంటాక్స్, విద్యుత్ బిల్లులు తదితర వాటిని సాకుగా చూపించి పక్కనపెట్టేసిన వారు ఎంతోమంది ఉన్నారు. కొందరు లబ్ధిదారులకు రూ.13 వేలు కూడా పూర్తిగా ఇవ్వకుండా రూ.8000 వేల నుంచి రూ.8850 మాత్రమే జమచేశారు. అందరికి ఇచ్చేశామంటూ గురువారం శానస మండలిలో కూటమి ప్రజాప్రతినిధులు చెప్పడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలి వేదికగా సర్కారు అవాస్తవాలు తల్లికి వందనం అందరికీ ఇచ్చామంటూ బుకాయింపు జిల్లాలో పూర్తిస్థాయిలో అర్హులకు అందని సాయం జిల్లాలో అర్హులైన విద్యార్థులు 2,29,106 మొదటి విడతలో 1,76,574 మంది, గ్రీవెన్స్లో 12,553 మందికి లబ్ధి కొందరికి రూ. 8 వేల నుంచి రూ. 9 వేలు మాత్రమే జమ వీరవాసరం మండలం రాయకుదురుకు చెందిన తోట పెద్దిరాజు వ్యవసాయ పనులు చేస్తుంటారు. ఆయన ఇద్దరు కుమార్తెలు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. పెద్దిరాజుకు సెంటు భూమి లేదు. ఆయన పేరిట 46 ఎకరాలు భూమి ఉన్నట్టు చూపిస్తోందంటూ, అతని భార్యకు తల్లికి వందనం సాయం అందించలేదు. కార్యాలయాల చుట్టూ తిరిగి సాంకేతిక లోపాన్ని సరిచేయించుకున్నా సాయం అందలేదని చెబుతున్నారు. పాలకోడేరు మండలం కుముదవల్లికి చెందిన కె. మరియమ్మ తనయుడు ఇంటర్ చదువుతున్నాడు. తల్లికి వందనం పథకం కింద గత ఏడాది రూ.8,850 మాత్రమే అకౌంట్కు జమచేశారు. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ వాటా అని, త్వరలో కేంద్ర ప్రభుత్వ వాటా జమవుతుందంటూ మెసేజ్ వచ్చింది. ఎనిమిది నెలలు కావస్తున్నా మిగిలిన సొమ్ము రాలేదని ఆమె తెలిపారు. కుముదవల్లికి చెందిన సాయిబాబా, వెంకటరమణ దంపతులు.. తల్లి లేని మనువరాలు మేఘనను తమ వద్దే ఉంచుకుని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. అర్హత ఉన్నప్పటికి కార్డులో పేరు లేదని చెప్పి వారికి సాయం అందించలేదు. సాంకేతిక లోపాన్ని సరిచేయించుకుంటే తర్వాతి ఏడాది వస్తుందని అధికారులు చెప్పినట్టు సాయిబాబా తెలిపారు. -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ధర్నా
భీమవరం: పీఆర్సీ కమిటీపై తక్షణం నిర్ణయం తీసుకోకుంటే ఈనెల 25న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం భీమవరం కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. 12వ పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏ బకాయిలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు సాయివర్మ మాట్లాడుతూ పదవీ విరమణచేసిన ఉపాధ్యాయ, ఉద్యోగులందరికీ పెన్షనరీ బెనిఫిట్స్ను పదవీ విరమణ చేసిన రోజునే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన కార్యదర్శి కేవీ రామచంద్రరావు మాట్లాడుతూ ప్రస్తుతమున్న హెల్త్ కార్డుల వల్ల ఉపాధ్యాయులకు వైద్య సదుపాయాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దావీదు, జిల్లా ఆర్థిక కార్యదర్శి పీవీడీ ప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పప్పాల సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): దేశవ్యాప్తంగా విశ్వ విద్యాలయాలలోను, ఉన్నత విద్యాసంస్థలలో కొనసాగుతున్న కుల ఆధారిత వివక్షను నిర్మూలించి సమానత్వాన్ని నిర్ధారించేందుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించిన ఈక్విటీ నిబంధనలను 2026 తక్షణమే అమలు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి డిమాండ్ చేశారు. ఏఐఎస్ఏ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం పట్టణంలోని ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ సబ్ సెంటర్ వద్ద ఏఐఎస్ఏ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పోస్టర్స్ విడుదల చేశారు. అప్పలస్వామి మాట్లాడుతూ యూజీసీ నిబంధనలపై నడుస్తున్న సుప్రీంకోర్టు స్టేను ఎత్తివేయాలని, విశ్వ విద్యాలయాలల్లో జరుగుతున్న హింసను అరికట్టేందుకు రోహిత్ చట్టంను తక్షణమే అమలు చేయాలన్నారు. పాలకొల్లు సెంట్రల్: అనధికార కట్టడాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిల్డింగ్ ప్లీనరైజేషన్ స్కీమ్ (బీపీఎస్)పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని రాజమండ్రి రీజనల్ డైరెక్టర్ (ఆర్డీ) జి.సుబ్బారావు అన్నారు. శుక్రవారం స్థానిక మునిసిపల్ కార్యాలయం చైర్మన్ చాంబర్లో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సచివాలయ సిబ్బంది, ఎల్టీపీలతో ఆయన సమావేశం నిర్వహించారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్లపై ప్రజల్లో ఇంకా స్పష్టత లేదన్నారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్పై ఎలా ముందుకు వెళ్లాలో తెలియని ప్రజలు ఉన్నారని అలాంటి వారికి కూడా అర్థమయ్యేలా టౌన్ప్లాన్ సిబ్బంది కృషి చేయాలన్నారు. ఏ వార్డుల్లో ఎంత మంది బీపీఎస్, ఎల్ఆర్ఎస్ల పరిధిలో ఉంటారో వారికి గ్రూపు క్రియేట్ చేసి సమాచారం ఇవ్వడం లేదా వారి వద్దకు వెళ్లి వారికి అర్థమయ్యేలా వివరించాలన్నారు. బిల్డింగ్ క్రమబద్దీకరణలో భాగంగా ఎవరైనా బీపీఎస్కు వర్తించి భారీ స్థాయిలో నగదు చెల్లించే పరిస్థితి ఉంటే వారికి ఈఎంఐ పద్ధతిలో అవకాశం కల్పిస్తామన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): వాణిజ్య పన్నుల పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ సకాలంలో పన్నులు చెల్లించడం ద్వారా ప్రజలకు మరింత సంక్షేమం అందించడానికి దోహదపడుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జీఎస్టీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రంగాల నుంచి అందే ఆదాయంతో పాటు నిబంధనల మేరకు వాణిజ్య పన్నులు చెల్లింపుల ద్వారా అందే ఆదాయం జిల్లా, రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. -
నో స్టాక్.. కార్డుదారులకు షాక్
● రేషన్ షాపుల ముందు నోస్టాక్ బోర్డులు ● గడువు ముగియక ముందే రేషన్ దుకాణాలు క్లోజ్ తాడేపల్లిగూడెం: రేషన్ షాపుల ముందు నోస్టాక్ బోర్డులు కార్డుదారులను వెక్కిరిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కక్షగట్టి ఇంటింటికీ రేషన్ అందించే వాహనాలను నిలుపుదల చేయించి, రేషన్ షాపుల ముందు క్యూ వ్యవస్థను మళ్లీ అమల్లోకి తీసుకొచ్చింది. అయితే పేదలు తమ కోటా సరుకులను తెచ్చుకునేందుకు చౌక దుకాణాల వద్దకు వెళ్లినా సరుకు లేదంటూ తిప్పి పంపించేస్తున్నారు. జిల్లాలో చాలా రేషన్ షాపుల వద్ద మొదటి వారంలోనే నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అయితే లెక్కల ప్రకారం కార్డుదారులందరికీ బియ్యం సరఫరా అవుతున్నట్టు అధికారులు చెబుతుండడం గమనార్హం. అయితే 15వ తేదీ సాయంత్రం వరకు ఇవ్వాల్సిన సరుకులు వారం ముందే అయిపోతున్నాయని, ఈ బియ్యం నల్లబజారుకు తరలిపోతున్నాయని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులకు అడ్డా ఒకప్పుడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉంగుటూరు, తాడేపల్లిగూడెం ప్రాంతాలు రేషన్ మాఫియాకు అడ్డాగా ఉండేవి. ఇక్కడి నుంచే కాకినాడ యాంకరేజ్ పోర్టుకు బియ్యం తరలివెళ్లిపోయేవి. అయితే ఈ మాఫియా కొంతకాలం ఆగినా ఇటీవల కాలంలో మళ్లీ యాక్టివ్ అయ్యిందని సమాచారం. ఇటీవల కొందరు డీలర్లు రాజీనామా చేయడం, సస్పెండ్లు వంటి కారణంగా ఖాళీగా ఉన్న దుకాణాలను చేజిక్కించుకున్న డీలర్లు సరుకును అడ్డదారులకు పంపిస్తున్నట్టు సమాచారం. తాడేపల్లిగూడెంలో ఇద్దరు అధికారం ఉన్న వ్యక్తుల అండ చూసుకొని ఎరువుల గోదాములనే అక్రమ బియ్యం గోదాములుగా మార్చుకుని బియ్యాన్ని హద్దులు దాటిస్తున్నారు. అయితే విజిలెన్సు అధికారులు దాడులు తర్వాత కొంత ఆగినట్టు కనిపించినా, వెళ్లాల్సిన సరుకు దొడ్డిదారిన వెళుతోందని సమాచారం. ఇన్చార్జిల ఇష్టారాజ్యం ఇటీవల కాలంలో చౌక దుకాణాల ఖాళీలు వచ్చినా, ఇన్చార్జిలే నియామకమే తప్ప పూర్తిస్థాయిలో కొత్త డీలర్లను నియమించలేదు. ఇప్పటికే ఉన్న డీలర్లనే ఇన్చార్జిలుగా నియమిస్తూ ఉండడంతో రెండు మూడు దుకాణాలకు ఒకే డీలర్ గుప్పిట్లోనే ఉంటున్నాయి. దీంతో అక్రమ వ్యాపారం మూడు పూలు ఆరుకాయలుగా విరాజిల్లుతుంది. అలాగే కొందరు రెవెన్యూ అధికారులు మ్యాపింగ్ పేరుతో కార్డులను హద్దులు దాటించి పట్టణంలో కార్డులను పల్లె డీలర్లకు, గ్రామ కార్డులను పట్టణంలోని రేషన్ దుకాణాలకు మ్యాపింగ్లో మార్చడంతో బియ్యం తెచ్చుకోవడం భారమై చాలా మంది సరుకులు తెచ్చుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా 551332 రేషన్ కార్డులున్నాయి. 1052 రేషన్ దుకాణాలున్నాయి. ఉన్న కార్డుదారులందరికి బియ్యం ఇవ్వాలి. కానీ ఏ నెలా కూడా పూర్తిస్థాయిలో పంపిణీ చేయడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఉదాహరణకు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో, తాడేలప్లిగూడెం పట్టణం, తాడేపల్లిగూడెం మండలం కలిపి మొత్తం 81 రేషన్ దుకాణాలున్నాయి. పెంటపాడు మండలంలో ఫిబ్రవరి కోటాగా 309 మెట్రిక్ టన్నుల బియ్యం, పది టన్నుల పంచదార వచ్చింది. తాడేపల్లిగూడెం పట్టణంలో 44 రేషన్ దుకాణాలున్నాయి. మండలంలో 37దుకాణాలున్నాయి. మొత్తం 55 వేల 800 మెట్రిక్ టన్నుల బియ్యం, పంచదార 23 టన్నులు, పట్టణంలో మాత్రం గోధుమపిండి 12 టన్నులు వచ్చింది. అయితే 12వ తేదీ నుంచే చాలా షాపుల వద్ద నోస్టాక్ బోర్డులు దర్శమిచ్చాయి. ఇప్పటికై నా సివిల్ సప్లయిస్ అధికారులు స్పందించి రేషన్ను పూర్తి స్థాయిలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
22న చేనేత గర్జన
పాలకొల్లు సెంట్రల్: చేనేత వృత్తి నేడు దారుణమైన కష్టాల్లో ఉందని చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకుడు పిల్లలమర్రి బాలకృష్ణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని వీవర్స్ కాలనీలో రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రాల్లో గత 78 ఏళ్లుగా పరిపాలించిన ప్రభుత్వాలు అనుసరించిన చేనేత వ్యతిరేక జౌళి పరిశ్రమ అనుకూల విధానాలే ఆ పరిస్థితికి కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో చేనేత రంగానికి కనీసం రూ.2000 కోట్లు కేటాయించాలని అన్నారు. సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.203 కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనేక చేనేత సమస్యలపై ఈ నెల 22న చేనేత గర్జన నినాదంతో చలో మంగళగిరి కార్యక్రమం చేపట్టనున్నట్లు సూచించారు. మంగళగిరిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి నేతన్న సర్కిల్ వరకూ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. -
ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా సేవలు
తాడేపల్లిగూడెం: ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా సేవలను విస్తరించడమే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యమని బ్యాంకు ముంబై సెంట్రల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ డాక్టర్ జి.భాస్కర్ తెలిపారు. బ్యాంకు ఆధ్వర్యంలో శుక్రవారం మాగంటి కల్యాణ మండపంలోని మెగా అగ్రికల్చరల్ క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బాస్కర్ మాట్లాడుతూ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రుణాలను అందిస్తున్నామన్నారు. అనంతరం రైతులకు రూ.80 కోట్ల విలువైన రుణ మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో విజయవాడ రీజినల్ మేనేజర్ పి.సతీష్బాబు, డాల్ఫిన్స్ గ్రూపు సీఈఓ డి.లీలాకృష్ణ, స్థానిక బ్యాంకు మేనేజర్ షేక్ కరీం పాల్గొన్నారు. అలాగే ఈ నెల 21న రిటైల్ క్రెడిట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్టు తెలిపారు. -
సంచలనం రేకెత్తించిన విజిలెన్స్ దాడులు
తణుకు అర్బన్/ఇరగవరం: ఇరగవరం మండలం కంతేరు గ్రామంలో గురువారం నిర్వహించిన విజిలెన్స్ దాడుల్లో ఎరువులు, పురుగుమందుల అనధికార నిల్వల వ్యవహారం జిల్లాలో సంచలనం రేకెత్తించింది. సరుకు కొనుగోళ్లు చేసి ఎక్కడైనా అమ్మేసుకుంటాం అనే రీతిలో అనధికారిక గోడౌన్లో నిర్వహిస్తున్న బ్లాక్ వ్యాపారాన్ని విజిలెన్స్ అధికారులు బట్టబయలు చేశారు. ఈ దాడిలో కంతేరు గ్రామంలో దీవెన ఆగ్రో కెమికల్స్ పేరుతో నడుస్తున్న అనధికార గోడౌన్లో రూ. 80,01,059 విలువైన 22,893 కిలోల పురుగుమందులు, రూ. 14,34,142 విలువైన 26,474 మెట్రిక్ టన్నుల ఎరువుల బస్తాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎరువులు, పురుగుమందుల వ్యాపారం నిర్వహణ, అవసరమైన లైసెన్స్లు ఉన్నప్పటికీ గోడౌన్కు ఎటువంటి అనుమతి లేదని, వ్యవసాయాధికారుల నుంచి డోర్ నంబరుతో సహా తీసుకోవాల్సిన ధ్రువపత్రాలు లేవని గుర్తించారు. అలాగే ఎరువుల నిల్వల్లో తేడాలు ఉండడం వంటి కారణాలతో దీవెన ఆగ్రో కెమికల్స్ సంస్థ ప్రొప్రైటర్ గంటా సురేంద్రపై 6ఏ కేసు నమోదు చేశారు. వ్యవసాయాధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో గత సీజన్లో ఎరువుల కొరతతోపాటు అరకొర పంపిణీలో సైతం తమకు కావాల్సిన వారికి మాత్రమే ఇచ్చారంటూ రైతుల ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా తణుకు మండలం ముద్దాపురం సొసైటీలో టీడీపీ నాయకులు తమకు అనుకూలమైన వారికి ముందుగానే ట్రాక్టర్లలో ఎరువుల బస్తాలు ఎక్కించి వారి ఇళ్లలో నిల్వలు చేశారు. ఈ వ్యవహారాన్ని రైతులు నిలదీయడంతో గతేడాది అక్టోబరు నెలలో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. నాయకులు వ్యవసాయాధికారులను సైతం ప్రసన్నం చేసుకుని అధికంగా నిల్వలు చేసుకుంటారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అనధికార నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పల్లె పోరుకు సన్నాహాలు
శురకవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026యలమంచిలి: గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. గతేడాది సెప్టెంబర్ 3న తాత్కాలిక షెడ్యూల్ను ప్రతిపాదించి, ఈ మేరకు కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రతి జిల్లా నుంచి ముగ్గురికి సాంకేతిక అంశాలపై శిక్షణ కూడా ఇచ్చారు. ఈ శిక్షణకు జిల్లా నుంచి ఒక ఈఓపీఆర్డీ, ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. అనంతరం ఎన్నికలపై ఎలాంటి ఉత్తర ప్రత్యుర్తతాలు జరపని ఎన్నిక సంఘం తాజాగా (ఈనెల 6న) మార్చి 9వ తేదీ నాటికి పంచాయతీల ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. డీపీఓ కార్యాలయాల్లో.. నిర్ణీత సమయంలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా చేపట్టాల్సిన ప్రక్రియలను పూర్తి చేసుకునేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టినట్టు తెలిసింది. గతనెల 1 వరకు ఉన్న అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు భీమవరంలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో ఎన్ని పంచాయతీల్లో ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది? ఆయా గ్రామ పంచాయతీల్లో వార్డుల వివరాలు ? జనాభా, సామాజిక వర్గాల వివరాల సేకరణ తదితర పనులు మొదలయ్యాయి. ప్రభుత్వం.. సంశయం రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుముఖంగా ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్సిక్స్ హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉచిత గ్యాస్ సిలెండర్ పథకానికి సంబంధించి చాలా మంది వినియోగదారులకు సొమ్ములు జమకావడం లేదు. దీనిపై సమాధానం చెప్పే నాథుడే లేడు. అలాగే ఉచిత బస్సు పథకం వచ్చిన తర్వాత చాలా గ్రామాల్లో బస్సులు ఆగడం లేదు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి (రూ.1,500) పథకాల ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ హామీ అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు వెళ్తుందా అనేది వేచి చూడాలి. పశ్చిమగోదావరి జిల్లాలో 409 పంచాయతీ ఉండగా.. భీమవరం మున్సిపాలిటీలో నాలుగు, పాలకొల్లు మున్సిపాలిటీలో ఏడు, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఐదు పంచాయతీలను విలీనం చేయడంతో 2021లో ఈ 16 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో మిగిలిన 393 పంచాయతీలకు అప్పట్లో ఎన్నికల నిర్వహించగా పాలకవర్గాలు ఏర్పడ్డాయి. ఈ సారి ఆ 16 గ్రామాలపై స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాలోని 393 పంచాయతీల్లో 2021 ఏప్రిల్ 3న పాలన మొదలు కాగా, పాలకవర్గాల పదవీ కాలం వచ్చే ఏప్రిల్ 2తో ముగియనుంది. సంగ్రామానికి సై పంచాయతీ ఎన్నికలకు కసరత్తు ఏప్రిల్ 2తో ముగియనున్న పదవీ కాలం వచ్చేనెల 9 నాటికి ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలు జిల్లాలో 393 పంచాయతీలు -
నేడు మెగా క్రెడిట్ అవుట్ రీచ్
ఏలూరు (ఆర్ఆర్పేట): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త మెగా వ్యవసాయ రుణ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహిస్తోందని ఆ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సతీష్బాబు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తమ బ్యాంక్ రైతులకు, వ్యవసాయానికి, వ్యాపారాలకు అనుకూలమైన ఆర్థిక పరిష్కారాల నిమిత్తం రుణాలు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. రైస్మిల్, దాల్ మిల్, ఆయిల్ మిల్ ఏర్పాటుకు రూ.100 కోట్ల వరకు, కోల్డ్ స్టోరేజ్, గోదాం ఏర్పాటు కోసం రూ.50 కోట్ల వరకు, రివాల్వింగ్ క్యాష్ క్రెడిట్ లేదా టర్మ్ లోన్ సపోర్ట్ కింద రూ.20 లక్షల వరకు రుణాలు అందిస్తామని వివరించారు. సోలార్ ప్లాంట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, పౌల్ట్రీ వ్యాపారం లేదా విస్తరణకు రుణాలు మంజూరు చేయనున్నట్టు పేర్కొన్నారు. రుణ సహాయం కోసం 92239 01111 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చని, టోల్ ఫ్రీ నంబర్ 1800 30 30లో కూడా సంప్రదించవచ్చని సూచించారు. -
పెనుగొండ ఎంపీడీఓపై విచారణ
పెనుగొండ: పెనుగొండ ఎంపీడీఓ టి.సూర్యనారా యణ మూర్తిపై వచ్చిన ఆరోపణలపై నరసాపురం డీఎల్డీఓ జి.రాణి గురువారం విచారణ చేపట్టారు. 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం, అభివృద్ధి పనులు, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకున్నారంటూ పెనుగొండకు చెందిన కాకి ప్రభాకర్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఎంపీటీసీలకు నిధుల కేటాయింపులో వివక్ష చూపారని, నిధులను సరిగా ఖర్చు చేయలేదని ఆరోపించారు. అలాగే కాంట్రాక్టర్ల నుంచి నేరుగా యాప్లలో కమీషన్లు తీసుకున్నారని, గ్రామ కార్యదర్శుల నుంచి సైతం వసూళ్ల పర్వం ఉందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో జెడ్పీ సీఈఓ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలంటూ డీఎల్డీఓను ఆదేశించారు. మండలంలోని గ్రా మ కార్యదర్శులు, కాంట్రాక్టర్లు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బందిని ఆమె విచారించారు. ఓచర్లు, ఎంబుక్లు, తీర్మానాలు పరిశీలించారు. వివాదాస్పదంగా తీరు ఎంపీడీఓ తీరు వివాదాస్పదంగా ఉంది. ప్రొటోకాల్ పాటించడంలోనూ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తుందని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇటీవల వెంకట్రామపురంలో నిర్వహించిన శంకుస్థాప న కార్యక్రమాల్లో సర్పంచ్ను కించపరిచేలా వ్యవహరించారన్న విమర్శలు వున్నాయి. దీనికి తోడు వడలిలో శంకుస్థాపనలు, అభివృద్ధి పనుల వివరాలు తెలియకుండానే నిర్వహిస్తున్నారని అధికార పక్షం నుంచే ఆరోపణలు రావడంతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వాయిదా వేశారు. వడలి గ్రా మంలో ఎంపీటీసీలకు సమాచారమే ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. భేదాభిప్రాయాలతోనే.. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపీల మధ్య వ్యతిరేక పార్టీల వలన వచ్చిన భేదాభిప్రాయాలు ఎంపీడీఓకి కలిసి వచ్చాయని ఎంపీటీసీలు అంటున్నారు. దీంతో నిధులను విచ్చలవిడిగా వెచ్చిస్తున్నారని ఆరోపించారు. విచారణలో ఎంపీటీసీలకు అవకాశం కల్పించకపోవడం దురదృష్టకరమని, మరింత లోతుగా విచారణ నిర్వహించాలని పలువురు డిమాండ్ చేశారు. విచారణ అనంతరం నివేదికను సీఈఓకు సమర్పిస్తామని, నివేదిక ఆధారంగా తుది నిర్ణయం ఉంటుందని డీఎల్డీఓ రాణి తెలిపారు. -
కందిపోయిన సంక్షేమం
ఆకివీడు: బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలకు రెక్కలు రావడంతో కొనుగోలు చేయడం భారంగా మారింది. దీనికితోడు రేషన్ షాపుల్లో చంద్రబాబు ప్రభుత్వం కందిపప్పు సరఫరా నిలిపివేయడంతో పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో నిత్యావసర సరుకుల ధరలపై బాదుడే బాదుడు అంటూ ప్రచారం చేసిన కూటమి నేతలు నేడు అధికారంలో ఉన్నా, జీఎస్టీ తగ్గినా ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు. కనీసం రేషన్ దుకాణాల ద్వారా కూడా కందిపప్పును సరఫరా చేయడం లేదు. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ.150కు చేరింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ వాహనాల ద్వారా కిలో రూ.67కు కందిపప్పును అందించేవారు. ఇది పేదలకు ఉపయుక్తంగా ఉండేది. సరఫరాకు మంగళం : కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రెండు, మూడు నెలలు మాత్రమే కందిపప్పును రేషన్ షాపుల్లో విక్రయించారు. తర్వాత సరఫరా నిలిచిపోయింది. మరలా ఎప్పటినుంచి ఇస్తారనే స్పష్టత కూడా లేదు. దీంతో బహిరంగ మార్కెట్లో కందిపప్పు కొనాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వంలో ఇంటికే రేషన్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతినెలా బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమ పిండిని ఎండీయూ వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే అందించేవారు. కరోనా వంటి విపత్తు సమయంలోనూ పక్కాగా సరుకులు పేదలకు చేరాయి. ప్రస్తుతం ఇంటికే రేషన్ సరఫరా నిలిచిపోగా, సరుకుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం కోత పెట్టింది. రేషన్ షాపుల్లో కందిపప్పు సరఫరాకు మంగళం బహిరంగ మార్కెట్లో ధరలకు రెక్కలు పేదలకు తప్పని ఇబ్బందులు గత ప్రభుత్వంలో ఇంటికే రేషన్ -
పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు
కై కలూరు: రోడ్డు మలుపు తప్పించే క్రమంలో ఓ కారు పంట కాలులో దూసుకెళ్లడంతో తండ్రీకూతురికి గాయాలైన ఘటన కై కలూరు మండలం పామర్రు–దిగమర్రు జాతీయ రహదారి పల్లెవాడ మలుపు వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు, క్షతగాత్రుల వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా వెంప గ్రామానికి చెందిన ఇంజేటి సువర్ణరాజు(45) డయాలసిస్ చేయించుకునేందుకు తన కుమార్తె అర్పిత(19)తో కలసి తన కారులో కై కలూరు మీదుగా ఏలూరు వెళ్తున్నాడు. అయితే పల్లెవాడ మలుపు వద్ద అదుపుతప్పి కారు పంట కాలువలోకి దూసుకుపోయింది. నీరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమీప గ్రామస్తులు గమనించి కారు అద్దాలు పగలగొట్టి అతికష్టం మీద తండ్రీకూతురిని బయటకు తీసుకొచ్చారు. సువర్ణరాజుకు స్టీరింగ్ కడపు భాగంలో గుచ్చుకుంది. కుమార్తెకు తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరినీ 108లో కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఏలూరు సర్వజన ఆస్పత్రికి పంపారు. తండ్రీకూతుళ్లకు గాయాలు -
శివరాత్రికి ప్రత్యేక బస్సులు
భీమవరం(ప్రకాశం చౌక్): మహాశివరాత్రి ఉ త్సవాలకు జిల్లాలోని నా లుగు ఆర్టీసీ డిపోల నుంచి 46 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎస్.గిరిధర్కుమార్ తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ పట్టిసీమ, వీరపాలెం, ఆచంట, శ్రీశైలం క్షేత్రా లకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామ న్నారు. శ్రీశైలానికి భీమవరం నుంచి 3, నరసాపురం నుంచి 2, తాడేపల్లిగూడెం నుంచి 2, తణుకు నుంచి 2, పట్టిసీమకు తణుకు వయా నిడదవోలు, పంగిడి, కాపవరం మీదుగా 5 బస్సులు, తాడేపల్లిగూడెం, నల్లజర్ల, కొయ్యలగూడెం మీదుగా 10 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. వీరంపాలేనికి తాడేపల్లిగూడెం నుంచి 12, ఆచంటకు తాడేపల్లిగూడెం నుంచి పిప్పర, అత్తిలి, మార్టేరు మీదుగా 3, నరసాపురం నుంచి వయా పాలకొల్లు, మార్టేరు మీదుగా 2 బస్సులు నడుపుతామన్నారు. కళాశాల బస్సు డ్రైవర్లు, క్లీనర్కు దేహశుద్ధి ద్వారకాతిరుమల: ఓ ప్రైవేట్ కళాశాల బస్సులో ఇంటర్ విద్యార్థినితో బస్సు డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని తిరుమలంపాలెం పంచాయతీ పావులూరివారిగూడేనికి చెందిన ఓ బాలిక కామవరపుకోట మండలంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ప్రైవేట్ క్లాసుల కారణంగా బస్సు ఆలస్యంగా గ్రామానికి చేరుతోంది. ఈ నేపథ్యంలో ఈనెల 7న రాత్రి కళాశాల బస్సులో విద్యార్థిని ఇంటికి బయలుదేరింది. ఇదిలా ఉండగా ఇదే బస్సులో గతంలో డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి మార్గమధ్యలో ఈ బస్సు ఎక్కాడు. క్లీనర్తో ముచ్చటిస్తుండగా.. విద్యార్థిని దిగే స్టేజీ రాగా, బస్సును ముందుకు తీసుకువెళ్లి తిప్పుకొస్తామని చెప్పాడు. బస్సు ముందుకు వెళ్లగానే పాత డ్రైవర్ విద్యార్థిని పక్కన కూర్చుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక బస్సులోంచి కిందకు దూకి, ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా పలువురు గ్రామస్తులతో కలిసి వెళ్లి బస్సును అడ్డగించారు. గొల్లగూడెం వద్ద బస్సును ఆపి బస్సుతో సహా ప్రస్తుత, పాత డ్రైవర్లను, క్లీనర్ను తిరుమలంపాలెం గ్రామానికి తీసుకొచ్చారు. ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ను బస్సులోంచి దింపి దేహశుద్ధి చేశారు. విషయాన్ని కళాశాల యాజమాన్యానికి తెలియజేసినా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. పోలీస్ కేసు పెడతామని అనగా ఎట్టకేలకు యాజమాన్యం దిగివచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు శాంతించారు. ఇద్దరు డ్రై వర్లు, క్లీనర్ను యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. విద్యాశాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పోలవరం రూరల్: పట్టిసంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు 550 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ అన్నారు. పట్టిసీమలో మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయం, ఇసుక తిన్నెలు, రేవులో ఏర్పాట్లపై సూచనలిచ్చారు. ఆయన వీరేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏటిగట్టు రోడ్డులో ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ఎప్పుటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. బుట్టాయగూడెం: బుట్టాయగూడెం ఎంపీపీగా ఎన్నికై న వైఎస్సార్సీపీ ఎంపీటీసీ తెల్లం రమణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమీపంలో కేటాయించిన ప్రత్యేక గదిలో ఆమె పూజా కార్యక్రమాలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీఓ కె.జ్యోతి, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏఓ బేబీ సరోజిని, జెడ్పీటీసీ మొడియం రామతులసి, వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్ రావు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైఎస్సార్సీపీ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. -
కదం తొక్కిన కార్మిక లోకం
భీమవరం/భీమవరం (ప్రకాశం చౌక్): దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం జిల్లాలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. స్థానిక సీఐటీయూ కార్యాలయం వద్ద కార్మిక, కర్షక సంఘాల ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. శ్రామిక హక్కులపై జరుగుతున్న దాడిని ఐక్య పోరాటాల ద్వారా తిప్పుకొట్టాలని సీఐటీయూ జిల్లా పూర్వ కార్యదర్శి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి.బలరాం పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాసేలా లేబర్ కోడ్లు తీసుకువచ్చిందన్నారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏపీ ఎన్జీజీఓస్ నిరసన : మధ్యాహ్న భోజన విరామ సమయంలో భీమవరం కలెక్టరేట్ వద్ద ఏపీ ఎన్జీజీఓస్ ఉద్యోగులు నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు యూవీ పాండు రంగారావు మాట్లాడుతూ నూతన కార్మిక చట్టాల రద్దు, వేతన సవరణ, పీఎఫ్ఆర్డీఏ చట్టం రద్దు, పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ అమలు, పీఎం స్కూల్, సొసైటీ ఉద్యోగులకు 62 ఏళ్ల పదవీ విరమణ, సీపీఎస్ ఉద్యోగుల కోసం మెమో–57 అమలు తదితర డిమాండ్లు చేశారు. కార్యదర్శి పోతన సుకుమార్, సహధ్యక్షుడు శ్రీనివాసరాజు, కోశాధికారి కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల మూసివేత సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లాలోని 1,620 అంగన్వాడీ కేంద్రాలను మూసివేసి కార్యకర్తలు సమ్మె లో పాల్గొన్నారు. భీమవరంలో సీఐటీయూ తదితర యూనియన్లు చేపట్టిన నిరసనలు, ర్యాలీల్లో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
మహా ప్రసాదం.. వితరణకు సిద్ధం
భీమవరం (ప్రకాశం చౌక్) : భీమవరం శ్రీమావుళ్లమ్మ వారి 62 వార్షిక మహోత్స వాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారి ఆలయం వద్ద అఖండ అన్నసమారాధన నిర్వహించనున్నారు. భీమవరం పట్టణంతో పాటు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చే సుమారు లక్ష మంది భక్తులకు అమ్మవారి అన్నప్రసాదాన్ని అందించేందుకు ఉత్సవాల నిర్వాహకులు నీరుల్లి కూరగాయ పండ్లు వర్తక సంఘం, అమ్మవారి ఉత్సవ కమిటీ ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ మేరకు అన్నదానం కోసం అవసరమైన కూరగాయలు, బియ్యం ఇతర వస్తువులను గురువారం ఉదయమే అమ్మవారి ఆలయం వద్దకు చేర్చి గురువారం సాయంత్రం నుంచే వంటలను తయారు చేయడం ప్రారంభించారు. శుక్రవారం ఉదయం నుంచీ అన్నదానం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మావుళ్లమ్మకు మహా నైవేద్యం శ్రీమావుళ్లమ్మ వారికి శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ప్రత్యేక పూజల నడుమ మహా నైవేద్యం సమర్పిస్తారు. పలు రకాల పిండి వంటలు, స్వీట్లు, పులిహోర ఇతర ప్రత్యేక ప్రసాదాలతో అమ్మవారికి మహానైవేద్యం సమర్పిస్తారు. అనంతరం అన్నదాన ప్రసాదం వితరణ ప్రారంభిస్తారు. చక్ర పొంగలి, పులిహోర, అన్నం, బంగాళదుంప కుర్మా, వంకాయ కూర, ఆవకాయ పచ్చడి, సాంబారు, పెరుగుతో భక్తులకు అన్నదానం చేస్తారు. వాటితో పాటు భక్తులు తీసుకువచ్చే పలు రకాల పిండి వంటలు, స్వీట్లు ఉంటాయి. పోలీసు బందోబస్తు అమ్మవారి అన్నదాన ప్రసాదం స్వీకరించడానికి భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదుగురు సీఐలు, పది మంది ఎస్సైలు, 150 మంది పోలీసు సిబ్బంది సేవలు అందించనున్నారు. భోజనం చేసే ప్రాంతాల వద్ద, జనం లోపలికి, బయటకు వెళ్లే మార్గాల వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. శ్రీధనలక్ష్మీ వారి అలంకరణ అమ్మవారి 62 వార్షిక మహోత్సవాల్లో భాగంగా గురువారం మావుళ్లమ్మ అమ్మవారు ధనలక్ష్మీ అమ్మవారి అలంకరణలో దర్శమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. నేడు మావుళ్లమ్మకు మహా నైవేద్యం సమర్పణ లక్షమందికి అన్నసమారాధన ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు అన్నదానం -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
కాళ్ల: తాళం వేసి ఉన్న ఇంటి తలుపులు పగులగొట్టి విలువై వెండి, బంగారం, నగదు అపహరించుకుపోయిన సంఘటన మండలంలోని సీసలిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అరవ సత్యనారాయణ ఈ నెల 9న కుటుంబంతో కలసి తిరుపతి వెళ్లారు. తిరిగి 12న ఇంటికి వచ్చేసరికి తాళం పగలకొట్టి ఉండటాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా ఇల్లంతా చిందరవందరగా ఉంది. బీరువా తలుపులు తీసి ఉండడంతో తనిఖీ చేయగా అందులో ఉన్న రూ. లక్ష నగదుతో పాటు నాలుగు కిలోల వెండి, ఒకటిన్నర కాసుల బంగారం పోయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై శ్రీనివాసరావు పరిశీలించి వివరాలు సేకరించారు. భీమవరం క్లూస్ టీం సీఐ రాజేష్ తన బృందంతో ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు. -
ముద్దాపురంలో టీడీపీ శ్రేణుల విధ్వంసం
● అర్ధరాత్రి సమయంలో శిలాఫలకం ధ్వంసం ● అడ్డుకున్న వైఎస్సార్సీపీ నాయకులపై దౌర్జన్యం తణుకు అర్బన్: తెలుగుదేశం పార్టీ శ్రేణులు సృష్టిస్తున్న విధ్వంసం, వివాదాలు, కవ్వింపుల పరంపర తణుకు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఫ్లెక్సీ వివాదాలతో గొడ వలు రేకెత్తించిన టీడీపీ శ్రేణులు తాజాగా తణు కు మండలం ముద్దాపురంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ప్రాంతంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డు నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని ధ్వంసంతో మరోసారి కవ్వింపులకు దిగారు. బుధవారం రాత్రి శిలాఫలకాన్ని ధ్వంసం చే స్తున్న వ్యవహారాన్ని అడ్డుకున్న వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రావడం, వారు వెళ్లిన తర్వాత అనుకున్న విధంగానే టీడీపీ శ్రేణులు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఓ సమయంలో గ్రామంలో ఉద్రిక్తంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో పోగైన టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టే ధోరణితో ప్రవర్తించినా వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనం పాటించడంతో ఎటువంటి ఘర్ష ణలు జరగలేదు. అయితే అర్థరాత్రి వరకు కొనసాగిన ఈ వ్యవహారంలో శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.5 కోట్ల నిధులతో రోడ్డు నిర్మాణానికి మా జీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారని, నిధులు కూడా కేటాయించారని పార్టీ నాయకులు చెబుతున్నారు. గురువారం రాత్రి తణుకు రూరల్ పోలీసులకు ముద్దాపురం వైఎస్సార్సీపీ నాయకులు ఫిర్యా దు చేశారు. శిలాఫలకాన్ని పడగొడుతుండగా అడిగినందుకు తమపై దౌర్జన్యానికి దిగారని, శిలాఫలకం ధ్వంసం చేసిన వారి పేర్లతో సహా 10 మందిపై ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. -
ఆదాయం మితం.. ఖర్చు అధికం
● పట్టిసం ఉత్సవాల నిర్వహణ తీరు ● సరిపడా నిధులు లేవంటున్న పంచాయతీ ● ఐదేళ్లుగా టెండర్దారులకు రూ.29 లక్షల బకాయిలు పోలవరం రూరల్ : పట్టిసం మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణలో పంచాయతీకి వచ్చే ఆదాయానికి చేసే ఖర్చుకు పొంతన లేకుండా ఉంది. దీంతో ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం గ్రామ పంచాయతీకి ఏర్పాట్లు చేయడం కష్టతరంగా మారింది. ఈ విషయాన్ని సమావేశాల్లో అధికారుల దృష్టికి తీసుకు వస్తూనే ఉన్నారు. గత ఐదేళ్లుగా ఉత్సవాల నిర్వహణకుగాను టెండర్దారులకు రూ.29 లక్షలు బకాయిలు ఉన్నట్లు పంచాయతీ అధికారులు చెబుతున్నారు. సగం కూడా రాని ఆదాయం 2020 నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో లాంచీలు లేకపోవడం, నీటి ప్రవాహం మారిపోయి ఉత్సవాల సమయంలో నీరు తగ్గడంతో అధికార యంత్రాంగం పరిశీలించి నది మధ్యలో పంట్లు ఏర్పాటు చేసి భక్తులు కాలినడకన వెళ్లి వచ్చే విధంగా ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీ, పట్టిసం ఫెర్రీ, సైకిల్ స్టాండ్ల వేలం నిర్వహిస్తారు. అలాగే ఉత్సవాల సమయంలో ఇసుక తిన్నెలపై ఏర్పాటు చేసే దుకాణదారుల నుంచి అశీలు వసూలు చేస్తుంటారు. ఉత్సవాల సమయంలో ఈ సొమ్ము ఖర్చు చేస్తుంటారు. ఏటా రూ.18 నుంచి రూ.20 లక్షల వరకు గ్రామ పంచాయతీ ఏర్పాట్లకు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఆదాయం మాత్రం అందులో సగం కూడా రావడం లేదంటున్నారు. ఫెర్రి కాంట్రాక్టర్ చేపట్టే పనులివే.. ప్రతి సంవత్సరం ఇసుక తిన్నెలపై దుకాణదారుల నుంచి సమారు రూ. 75వేలు ఆశీలు వసూలు అవుతుంటాయి. ఫెర్రీ కాంట్రాక్టర్ భక్తులను నదిదాటించేందుకు అవసరమయ్యే ర్యాంపులు, క్యూలైన్లు, టిక్కెట్ కౌంటర్లు, చలువ పందిళ్ళు, ప్లాట్ఫారాలు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేస్తుంటారు. గ్రామపంచాయతీ ఇసుక తిన్నెలపై చలువపందిళ్ళు తాత్కాలిక మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, పలు శాఖల అధికారుల క్యాంపు కార్యాలయాల, లైటింగ్, జనరేటర్లు, చేతిపంపులు ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా కొన్ని పనులు పంచాయతీ, కొన్ని పనులు ఫెర్రీ కాంట్రాక్టర్ చేపడుతారు. వీరు చేసే తాత్కాలిక పనులకు వెదురుకర్రలు, బాదులు, తాటాకు, ఎవదురుకంప వినియోగిస్తారు. వీరిని అధికారుల ఆదేశాల మేరకు అటవీప్రాంతం నుంచి తెచ్చుకుంటారు. ఉత్సవాల్లో సమయంలో వీటిని వినియోగించి, తదుపరి వీటిని అమ్మి, సొమ్ము చేసుకుంటారు. లాంచీ టికెట్ రేటు పెంచినా.. గత సంవత్సరం లాంచీ టిక్కెట్ ధర రూ. 30 ఉండగా, అదనంగా రూ.10 పెంచి వసూలు చేయగా, రూ.8 లక్షలు ఆదాయం వచ్చింది. మరలా ఈ ఏ డడాది కూడా రూ.10 పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే ఆదాయానికి, ఖర్చులకు ఎక్కడా పొంతన లేకుండా పోతోందని, ఉత్సవాలు అనంతరం ఖర్చుల వివరాలపై అధికారులు దృష్టి సారించి ఆలయానికి వచ్చే వాస్తవ ఆదాయాన్ని పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. పట్టిసం శివక్షేత్రం సంవత్సరం ఫెర్రి ఆదాయం సైకిల్ స్టాండ్ ద్వారా.. 2021–2022 రూ. 5 లక్షలు రూ.70 వేలు 2022–2023 రూ.15 లక్షలు రూ.1.40 లక్షలు 2023–2024 రూ.10.05 లక్షలు రూ.1.43 లక్షలు 2024–2025 రూ.11.70 లక్షలు రూ.1.90 లక్షలు 2025–2026 రూ.11.85 లక్షలు రూ.1.91 లక్షలు -
శివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు
భీమవరం: రానున్న మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ ఆదేశించారు. గురువారం ఆయన జిల్లాలో పర్యటించి భీమవరం వన్టౌన్, కాళ్ల పోలీస్స్టేషన్ల పనితీరుపై సమీక్షించారు. పంచారామక్షేత్రం భీమవరంలో సోమేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, క్యూలైన్ల నిర్వహణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘాపై సూచనలు ఇచ్చారు. వార్షిక తనిఖీల్లో భాగవంగా ఆయా పోలీస్స్టేషన్లను పరిశీలించి రికార్డులు, కేసుల దర్యాప్తుపై ఆరా తీశారు. ప్రజలకు పోలీసు సేవలపై నమ్మకం కలిగించేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్–1 ఫలితాల్లో ప్రతిభ చూపిన భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ రైటర్ (హెడ్ కానిస్టేబుల్) గురుజు దివాకర్ కుమార్తె లక్ష్మీ అంజనను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఏఎస్పీ వి.భీమారావు, డీఎస్పీ రఘువీర్ విష్ణు, సీఐలు, ఎస్సైలు ఉన్నారు. -
శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమై, క్షేత్రపాలకునిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు స్వామివారిని పెండ్లి కుమారునిగాను, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేసే వేడుక కన్నులపండువగా జరిగింది. ముందుగా ఆలయ ముఖ మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై గంగా, పార్వతీ సమేత శివదేవుని ఉత్సవ మూర్తులను ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం అర్చకులు, పండితులు శైవ ఆగమోక్తంగా వేడుకను ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ శివయ్యను పెండ్లి కుమారునిగా, గంగా, పార్వతీ అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేశారు. ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ, ఏఈఓ ఐ.రమణరాజు, సూపరింటిండెంట్ కేవీ దుర్గాప్రసాద్ దంపతులు స్వామి వారికి పూజాధికాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయంలో అంకురార్పణ, ధ్వజారోహణ తదితర కార్యక్రమలు జరుగుతాయని ఆలయ ఈఓ తెలిపారు. -
అధిక ధరలకు కొంటున్నాం
సామాన్యుడికి పోషకాలు అందించేది కందిపప్పు. కొన్ని నెలలుగా రేషన్ షాపుల్లో కందిపప్పు ఇవ్వకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బయట మార్కెట్లో అధిక ధరలకు కొనాల్సి వస్తుంది. ఎన్నికల ముందు రేషన్ షాపుల ద్వారా అన్ని సరుకులు ఇస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం అఽధికారం చేపట్టిన తర్వాత మరిచిపోయింది. –ఎం.సూర్యారావు, పాలకోడేరు చంద్రబాబు ప్రభుత్వం పప్పన్నం కూడా తిననివ్వడం లే దు. రేషన్ ద్వారా కందిపప్పు ఇస్తామని చెప్పి చేతులెత్తేడం దారుణం. వారానికి రెండు మూడు రోజులు పప్పుకూర వండుకుందామంటే అధిక ధర పెట్టి కొనాల్సి వస్తుంది. అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ప్రభుత్వం ధరలను నియంత్రించాలి – ముత్యు విజయ, దుంపగడప, ఆకివీడు మండలం -
అపచారం.. దురాచారం
● ఏలూరు గంగానమ్మ జాతరలో నిర్వాహకుల తీరుపై విమర్శలు ● అడ్డగోలు వసూళ్లపై తీవ్ర ఆగ్రహం ఏలూరు (ఆర్ఆర్పేట): గత అక్టోబర్ నెల నుంచి నగరంలో నిర్వహించిన శ్రీ గంగానమ్మ జాతర సందడి ముగిసింది. అయితే ఈ ఏడాది నిర్వహించిన జాతరలో వివిధ కమిటీలు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మవార్ల దర్శనానికి టిక్కెట్లు పెట్టి భక్తులను దోచుకున్నారని పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జాతర రోజున అమ్మవార్లకు జీవాలను చూపడానికి కూడా రూ.50 నుంచి రూ.500 వరకూ వసూలు చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీనికి తోడు అమ్మవారి ఘటాలను కొంతమంది భక్తుల ఇంటి వద్ద దింపి వారి ఇంట్లో భోజనాలకు ఏర్పాటు చేయడం కోసం కమిటీ ప్రతినిధులు సదరు భక్తుల నుంచి రూ. 5 వేల నుంచి రూ. 15 వేల వరకూ వసూలు చేశారని తెలుసుకుని కొంతమంది వృద్ధులు ఇదెక్కడి దురాచారమని మండిపడుతున్నారు. గతంలో అమ్మవారి ఘటాలను తలకు ఎత్తుకున్న అనంతరం ఊరంతా తిరిగే వరకూ కిందకు దింపే వారు కాదని, గంటకు ఒకరు చొప్పున డ్యూటీలు వేసుకుని ఒకరి తరువాత ఒకరు ఘటాలను దింపకుండా తిప్పుతూనే ఉండాలనేది సంప్రదాయంగా వస్తోందని, అయితే జాతర కమిటీల ప్రతినిధులు డబ్బుకు ఆశపడి భక్తుల ఇళ్ల వద్ద అమ్మవార్ల ఘటాలను దింపి వారి ఇంట్లోకి తీసుకువెళ్లడం సంప్రదాయానికి వ్యతిరేకమనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి సంప్రదాయ వ్యతిరేక చర్యలు నగరానికి ఏమి అరిష్టాన్ని తెచ్చి పెడతాయో? అని కొందరు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ స్థితికి నగరం జాతర సందడి ఇప్పుడిప్పుడే నగరం సాధారణ స్థితికి చేరుకుంటుంది. నగరంలోని తూర్పు వీధి మొదలు తంగెళ్ళ మూడి వరకూ ఏడు ప్రాంతాల్లో శ్రీ గంగానమ్మ వారి జాతర సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవార్లకు ముడుపు కట్టడం నుంచి అమ్మవార్ల పాదం భూమిపై మోపడం, అమ్మవారిని నగరంలోకి ఘనంగా స్వాగతించడం, అమ్మవార్లను మేడల్లో ప్రవేశపెట్టడం, అక్కడి నుంచి ప్రతీ నిత్యం అమ్మవార్లకు భక్తులు నైవేథ్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం, నగరంలోని ప్రతి వీధిలో అమ్మవారిని ఊరేగించి అమ్మవార్ల దర్శనాన్ని ప్రజలకు కల్పించడం వంటి కార్యక్రమాలతో నాలుగు నెలల పాటు నగరంలో సందడి వాతావరణం నెలకొంది. గత నెల 26వ తేదీ నుంచి జాతర ముగింపు దశకు చేరుకుని ఈ నెల 9వ తేదీతో అమ్మవార్లను సాగనంపే ప్రక్రియ వరకూ అంతా సజావుగా సాగిపోయింది. శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర ముగిసినా ఇప్పటికీ నగరంలోని భక్తులు అమ్మవారి జాతర ముచ్చట్లే చెప్పుకుంటున్నారు. జాతర విశేషాలను సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లు విశేషంగా ప్రచారం చేయడంతో ఏలూరు నగరంలోనే కాక పరిసర ప్రాంతాల ప్రజలు సైతం జాతర విశేషాలపై ఎంతో ఆసక్తి కనబరిచారు. ఉత్సాహంగా అన్న సమారాధనలు నగరంలోని తూర్పువీధి, దక్షిణపు వీధి, పవర్ పేట, లక్ష్మీవారపు పేట, ఆదివారపు పేట, పడమర వీధి, తంగెళ్లమూడి ప్రాంతాల్లో జాతర ముగిసిన నేపథ్యంలో జాతర కమిటీల ప్రతినిధులు భారీ ఎత్తున అన్న సమారాధనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే తంగెళ్ళమూడి, దక్షిణపు వీధి కమిటీలు అన్న సమారాధన ముగించగా మరికొన్ని కమిటీల ప్రతినిధులు తాము త్వరలో అన్న సమారాధన నిర్వహిస్తామని ప్రచారం చేస్తున్నారు. -
పెద్దింట్లమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష
కై కలూరు: జిల్లాలో అతిపెద్ద జాతరల్లో ఒకటైన కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఆర్డీఓ ఎం.అచ్యుత అంబరీష్ సూచించారు. గురువారం జాతరకు సంబంధించిన సమన్వయ సమావేశాన్ని ఆలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అంబరీషన్ మాట్లాడుతూ జాతర ఈ నెల 18 నుంచి మార్చి 3 నిర్వహిస్తారని పేర్కొన్నారు. భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యం వంటి సౌకర్యాల కల్పనలో ముందుండాలన్నారు. ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ జాతర అన్ని రోజులు పూర్తి పోలీసు బందోబస్తు చేపడతామన్నారు. అనంతరం జాతర బుక్లెట్ను అవిష్కరించారు. కార్యక్రమంలో ఘంటసాల వెంకటలక్ష్మీ, తహసీల్దారు రామకృష్ణ, ఆలయ ఈఓ కూచిపూడి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని ఏపీ దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కో–కన్వీనర్, జిల్లా అధ్యక్షులు మేడపాటి వీర వెంకట రాఘవేంద్రరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ మెంబర్ సర్వే(యూఎఫ్ఎంఎస్) వల్ల దివ్యాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రత్యేక యూనిట్గా గుర్తించాలని, కుటుంబంలో ఇతరులు ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నప్పటికీ, దివ్యాంగులు మాత్రం శారీరక, ఆర్ధిక పరిమితుల వల్ల బలహీనంగానే ఉంటారని తెలిపారు. దివ్యాంగులను వారిని కుటుంబంతో సంబంధం లేకుండా విడిగా సర్వే చేయాలని, సంక్షేమ పథకాల కోత నివారించాలని, కుటుంబ ఆదాయాన్ని ప్రామాణీకంగా తీసుకుంటే దివ్యాంగులకు అందే ఫించన్లు, ఇతర ప్రభుత్వ రాయితీలు రద్దయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవీయకోణంతో ఆలోచించి దివ్యాంగుల ఆర్ధిక స్థితిగతులను విడిగా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇరగవరం: మండలంలోని కె.ఇల్లింద్రపర్రు గ్రామంలో గురువారం విద్యుత్ షాక్తో యువ కుడు మృతి చెందాడు. ఎస్సై జానా సతీష్ తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న గ్రామానికి చెందిన గోపిశెట్టి సతీష్ కుమార్ (28) తన స్వగ్రామంలో సొంత ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నాడు. అయితే విద్యుత్ తీగలకు ప్లాస్టిక్ గొట్టం బిగిస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలింది. దీంతో సతీష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు. -
స్వామి భూములు ఎక్కడ?
గురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి, భీమవరం/ నరసాపురం రూరల్: నరసాపురం రూరల్ కొప్పర్రు శ్రీసీతారామస్వామి దేవస్థానం భూముల కౌలుహక్కుల కోసం గురువారం నిర్వహించ తలపెట్టిన బహిరంగ వేలానికి బ్రేక్ పడింది. ప్రైవేట్ వ్యక్తుల చెరువులో కలిపేసుకున్న ఈ భూములకు సరిహద్దులు నిర్ణయించిన తర్వాత వేలం వేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. కొప్పర్రులోని శ్రీసీతారామస్వామి ఆలయానికి మాన్యం దొడ్డిలో 468/2 సర్వే నంబరులో 1.32 ఎకరాలు, 456/1లో 1.52 ఎకరాలు, 458/1లో 1.60 ఎకరాల సాగు భూమి ఉంది. వీటిని ముగ్గురు రైతులు కౌలు సాగుచేస్తున్నారు. చుట్టుపక్కల సుమారు 35 ఎకరాల పంట పొలాల్ని ఆక్వా సాగు కోసం గత ఏడాది యజమానులు ప్రైవేట్ వ్యక్తికి లీజుకు ఇచ్చుకున్నారు. మే నెలలో ఈ పొలాలతో పాటు దేవుడి భూముల్ని సైతం కలిపేసుకుని ఏకమొత్తం చెరువుగా మార్చేశారు. ఆలయ అధికారులు ఇటీవల హడావుడిగా గతంలోని వారి కౌలు లీజును రద్దుచేయడంతో పాటు ఈనెల 12న కొత్తగా కౌలు నిమిత్తం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. చెరువులో ఆలయ భూములు ఎక్కడున్నది సరిహద్దు గట్లు లేకుండా ఏ విధంగా వేలం వేస్తారంటూ ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు యాదంరెడ్డి సూరిబాబు, రావి బ్రహ్మాజీలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. చర్యలు తీసుకుంటున్నాం.. ఈ వ్యవహరంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. చెరువు తవ్విన వారికి నోటీసులు ఇచ్చామని, కౌలుదారుల లీజును రద్దుచేశామని, పోలీసులకు ఫిర్యాదుచేసినట్టు ఆలయ ఈఓ రామచంద్రకుమార్ తెలిపారు. చెరువు సాగుచేస్తున్న వారు ప్రస్తుత పంట ముగిసేవరకు సమయం కోరారని, త్వరలో ఆలయ భూములకు సరిహద్దులు నిర్ణయించి వేలం నిర్వహించనున్నట్టు తెలిపారు. నిబంధనలు పాటించకుండా ఆలయ భూముల్లో అక్రమంగా చెరువులు తవ్వేశారు. దాదాపు 40 ఎకరాల ఏక చెరువులో ఆలయ భూములు ఎక్కడున్నాయో కూడా తెలీని పరిస్థితి. అధికారులకు తెలిసే అంతా జరిగింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆలయ భూముల సరిహద్దు గట్లు వేసిన తర్వాతనే బహిరంగ వేలం వేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశాం. – యాదంరెడ్డి సూరిబాబు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కొప్పర్రు సీతారామస్వామి ఆలయ భూముల బహిరంగ వేలానికి బ్రేక్ పొలాలు లీజుకు తీసుకుని చెరువు తవ్విన ప్రైవేట్ వ్యక్తులు సమీపంలోని స్వామి భూములు 4.44 ఎకరాలు స్వాహా తెరవెనుక చక్రం తిప్పిన కూటమి నేతలు హడావుడిగా 12న బహిరంగ వేలం ప్రకటించిన అధికారులు చెరువు పరిధిలోని మిగిలిన పొలాలు ఆక్వాజోన్లో ఉన్నప్పటికి ఆలయ భూములు మాత్రం ఆక్వాజోన్లో లేవని ఫిషరీష్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వీటిలో చెరువులు తవ్వడంతో ఆక్వాజోన్ అనుమతుల కోసం హడావుడిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఆలయ భూముల్ని చెరువులో కలపడం వెనుక కూటమికి చెందిన కొందరు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ఒక్క పంట సాగుతో నష్టాలు చవిచూస్తున్న కౌలు రైతులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పొలాలు అప్పగించినట్టు సమాచారం. ఈ వ్యవహారం వెనుక దేవదాయ శాఖ అధికారుల పాత్రపైనా గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మే నెలలోనే చెరువులు తవ్వేసి ఆక్వా సాగు చేస్తున్నా ఇంతకాలం ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ చెరువులో భూములకు ఏడాదికి ఎకరాకు సుమారు రూ.60 వేల చొప్పున లీజు ఒప్పందం కుదిరినట్టు చెబుతున్నారు. ఈ మేరకు గతంతో పోలిస్తే ఆలయ ఆదాయం రెట్టింపు కానున్నా అది రికార్డు పరంగా ఇప్పటి వరకు ఎందుకు చూపలేదంటున్నారు. ఆలయ భూముల్ని చుట్టుపక్కల పొలాలతో కలిపి ఏకచెరువు చేయడం వలన ప్రైవేట్ వ్యక్తుల భూముల్ని లీజుకు తీసుకున్న వారు తప్ప ఇతరులు వేలంలో స్వామివారి భూముల్ని దక్కించుకునే వీలుకాదంటున్నారు. భవిష్యత్తులో ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా గట్లు ఏర్పాటుచేసి బహిరంగ వేలం నిర్వహించే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
దేవుడితో రాజకీయాలు వద్దు
యలమంచిలి: కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా దేవుడితో చేసే రాజకీయాలకు స్వస్తి పలకాలని వైఎస్సార్సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) హితవు పలికారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చడానికి తిరుపతి లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందంటూ విష ప్రచారానికి తెరలేపిందని ఆయన విమర్శించారు. ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి రాష్ట్రంలోని ఇతర దేవాలయాల ప్రసాదాలకు ఇదే నెయ్యి వాడినట్లు విష ప్రచారం చేస్తున్నారన్నారు. నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నివేదికలు వచ్చినా కూటమి నాయకులు దానిని జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. పవన్ కల్యాణ్పై ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకుని కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసారన్నారు. కనీసం ఆయనైనా స్పందించి ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నంత మాత్రాన పవన్ తన శైలిని మార్చుకోవలసిన అవసరం లేదన్నారు. ఆయన ధైర్యంగా ఈ విషయంలో ప్రభుత్వాన్నీ నిలదీసి తన పారదర్శకతను నిరూపించుకోవాలని కోరారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్లపై దాడులు చేయడం అరాచక పాలనకు పరాకాష్టని గోపి విమర్శించారు. -
పంచాయతీ కార్యదర్శుల మెడపై కత్తి
● 15లోగా 50 శాతం పన్నులు వసూలు చేయాలని హుకుం ● లేదంటే సస్పెండ్ చేస్తామని ఉన్నతాధికారుల బెదిరింపులు నరసాపురం: పంచాయతీ కార్యదర్శుల మెడపై పన్నుల వసూళ్ల కత్తి వేలాడుతోంది. గ్రామాల్లో ఆస్తి, ఇతర పన్నులు ఈ నెల 15 లోగా 50 శాతం వసూలు చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. దీంతో వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వచ్చే నెలలో గానీ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాదు. ఏటా మార్చిలో పన్నుల వసూళ్లు ముమ్మరం చేసి ఏప్రిల్ నెలలో ముమ్మరంగా వసూళ్లపై పంచాయతీ కార్యదర్శులు దృష్టిపెడతారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాకుండానే తమపై ఒత్తిడి ఏంటని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 శాతం వసూలు చేయకుంటే సస్పెండ్ 15వ తేదీ కల్లా 50 శాతం పన్నులు వసూలు చేయకుంటే సస్పెండ్ చేస్తామనే హెచ్చరికలు అందాయి. పన్నుల వసూళ్లలో బాగా వెనుకబడ్డ వారిలో మండలానికి ఒకరి చొప్పున కార్యదర్శులను గుర్తించి వారిని సస్పెండ్ చేయడం ద్వారా మిగిలిన సెక్రటరీలకు హెచ్చరికలు పంపించే దిశగా ఉన్నతాధికారులు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఎన్నడూలేని విధంగా ప్రభుత్వ ఆదేశాలతో ఉన్నతాధికారులు తమపై కత్తిపెట్టారని కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు .అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.3 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసిన ప్రభుత్వం ఆ సొమ్ము సక్రంగా ఖర్చు చేయడం చేతకాక ముందస్తుగా పన్నులు వసూలు చేయమనడంపై బహిరంగగానే విమర్శిస్తున్నారు. గత రెండేళ్ల నుంచి జేబులో పైసాలేకుండా ప్రజలు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని ఒత్తిడి చేసి పన్నులు ఎలా వసూలు చేస్తాం? అని ప్రశ్నిస్తునఆనరు. ఇప్పటికీ జిల్లాలో మొత్తం 20 శాతం కూడా వసూళ్లు జరగలేదు. మరోవైపు ప్రభుత్వ సూచనలతో అధికారులు పెట్టిన 50 శాతం పన్నుల వసూళ్ల డెడ్లైన్కు మరో నాలుగురోజులే గడువుంది. దీంతో చేసేదిలేక సెక్రటరీలు పన్నుల వసూళ్ల కోసం పరుగులు పెడుతున్నారు. రిటైర్మెంట్కు దగ్గరున్న వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కార్యదర్శుల వెతలు వర్ణనాతీతం. కార్యదర్శులపై పెరిగిన పని ఒత్తిడి పంచాయతీ కార్యదర్శులకు కేవలం పన్నుల వసూలు మాత్రమే కాకుండా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ రకాల పీ–4 సర్వే, కుల గణన, సంక్షేమ పథకాల లబ్ధిదారుల వెరిఫికేషన్ వంటివి నిర్వహించాల్సి వస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సర్వేలలో నిమగ్నం కావాల్సి రావడం, మరో వైపు పన్నుల వసూళ్లకు పరుగులు పెట్టడం చేస్తున్నారు. కొందరు బకాయిలకు రాజకీయ పలుకుబడి ఉండటంతో బలవంతంగా వసూలు చేయలేకపోతున్నారు. దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో బిల్ కలెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్ల కొరత ఉంది. పన్ను వసూలు చేయాల్సిన బాధ్యత క్షేత్ర స్థాయిలో సిబ్బందికి ఉన్నప్పటికీ, ఖాళీలు ఎక్కువగా ఉండటంతో ఆ భారం అంతా పంచాయతీ కార్యదర్శులపైనే పడుతోంది. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన శ్రీస్వర్ణ పంచాయతీ పోర్టల్ఙ్ ఆనన్లైన్ వ్యవస్థ ద్వారా పన్నుల చెల్లింపు చేయించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యలు, సర్వర్ లోపాల వల్ల డేటా ఎంట్రీ ఇబ్బందిగా మారుతోంది. సంక్షేమ పథకాలు అందడంలో ఏమైనా జాప్యం జరిగితే గ్రామస్థులు పంచాయతీ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య తిరిగి వారి వద్దకు వెళ్లి పన్నులు అడగడం పంచాయతీ కార్యదర్శులకు ఇబ్బందిగా మారింది. -
తీరంలో తాబేళ్ల మృత్యుఘోష
● నరసాపురం, పేరుపాలెం బీచ్ల్లో విషాద దృశ్యాలు ● సుమారు 50 తాబేళ్ల మృత్యువాత నరసాపురం రూరల్: నరసాపురం నియోజకవర్గ తీర ప్రాంతంలో ఏటా వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ఆలివ్ రెడ్లీ తాబేళ్లు, వేటగాళ్ల నిర్లక్ష్యానికి బలైపోతున్నాయి. గతేడాది కూడా ఇదే సమయంలో తాబేళ్లు మృత్యువాత పడిగా కలెక్టర్ చొరవతో తాబేళ్ల గుడ్లను సేకరించి సంరక్షించి పిల్లలు బయటకు వచ్చాకా సముద్రంలో విడిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పేరుపాలెం, పెదమైనవానిలంక, చినమైనవానిలంక వంటి తీరప్రాంత గ్రామాల్లో ఈ ఏడాది జనవరి నుంచే తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు ఒడ్డుకు రావడం ప్రారంభించాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో వీటి గుడ్లను సేకరించి హ్యాచరీల ద్వారా సంరక్షించే పనులు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ, సముద్రంలో జరుగుతున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు రోజులుగా భారీ సంఖ్యలో తాబేళ్లు మృతి చెంది తీరానికి కొట్టుకొస్తున్నాయి. పోయిన సంవత్సరం కూడా ఇదే సమయంలో సుమారు 100కు పైగా తాబేళ్లు ప్రాణాలు కోల్పోయాయి. తాజాగా మంగళవారం 29, బుధవారం 20 తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. వీటితోపాటు రెండున్నర మీటర్ల పొడవు, 240 కిలోల బరువు ఉన్న హేంపర్ బ్యాక్ డాల్ఫిన్ కూడా తీరానికి కొట్టుకు వచ్చింది. కేవలం తూర్పుతీరానికి దగ్గరలో నదీముఖ తీర ప్రాంతాల్లో 30 మీటర్ల కంటే తక్కువ లోతులో ఇవి సంచరిస్తుంటాయి. ప్రమాదపుటంచున ఉన్న ఈ తరహా డాల్పిన్లు ప్రస్తుతం పరిరక్షించాల్సిన జాతిగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. తాబేళ్ల కళేబరాలకు అధికారులు పోస్టుమార్టం నిర్వహించి, మరణానికి కారణాలు విశ్లేషించారు. దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న సందర్శకులు చనిపోయిన తాబేళ్ల కళేబరాలు తీరం వెంబడి కుళ్లిపోతుండటంతో ఆ ప్రాంతమంతా తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోంది. దీనివల్ల బీచ్కు వచ్చే పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సముద్ర తాబేళ్లకు సంబంధించి పోస్టుమార్టంలో అధిక శాతం వాటి పాదాలు నరికివేసి ఉండటం, కళ్లు పీకేసి ఉండటంతో పాటు, బలమైన దెబ్బతగిలిన గాయలతో పాటు వలల్లో చిక్కుకున్న అవశేషాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించిట్లు అఽధికారులు చెబుతున్నారు. వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.చంద్రశేఖర రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అటవీ అధికారి డీఏ కిరణ్, ఫారెస్ట్ రేంజర్ మురాల కరుణాకర్ పర్యవేక్షణలో మృత కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి ఏయస్ఆర్ మూర్తి, మత్స్యశాఖ అభివృద్ది అధికారి ఏడుకొండలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాంప్రసాద్, మైరెన్ ఏఎస్సై ఫాతిమా పాల్గొన్నారు. మృత కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్న దృశ్యం సముద్ర జీవుల సంరక్షణ కోసం ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడమే ఈ మరణాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మత్స్యకారులు తీరం నుంచి 8 నాటికల్ మైళ్ల అవతల మాత్రమే వేట సాగించాలి. చాలా మంది ఈ నిబంధనను అతిక్రమించి తీరానికి దగ్గరగా వేటాడుతున్నారు. సంతానోత్పత్తి కోసం తీరానికి వచ్చే క్రమంలో, ఈ తాబేళ్లు మత్స్యకారుల వలల్లో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందుతున్నాయి. తాజాగా తాబేళ్లతో పాటు డాల్ఫిన్ వంటి అరుదైన జీవులు కూడా మృతి చెందడం కలిచివేస్తోంది. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
బుట్టాయగూడెం: మోటార్సైకిల్ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం సమీపంలోని కనకదుర్గమ్మ అమ్మవారి గుడి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అశ్వారావుపేటకు చెందిన నరాలశెట్టి నాగేశ్వరరావు (52) బుధవారం సొంత పనిమీద ద్విచక్రవాహనంపై జీలుగుమిల్లి వెళ్లి తిరిగి వస్తుండగా తాటాకులగూడెం సమీపంలోని కనకదుర్గమ్మ అమ్మవారి గుడి సమీపంలో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై క్రాంతికుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి నాగేశ్వరరావు భార్య నాగమల్లేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నాగేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుడి స్వగ్రామం బాపట్ల జిల్లా అని ఉద్యోగ రీత్యా అశ్వారావుపేటలో హార్టికల్చడ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్లు నాగమల్లేశ్వరి ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఆరోగ్యం భద్రం.. ప్రణాళికతో విజయం
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. 10వ తరగతి, ఇంటర్మీడియెట్తో పాటు అన్ని తరగతులకు పరీక్షలు దగ్గర పడ్డాయి. ఏడాదంతా చదివింది ఒక ఎత్తు అయితే ఈ రెండు మూడు నెలలు చదివేది మరో ఎత్తుగా చెప్పవచ్చు. ఈ సమయంలో కేవలం చదువు ఒక్కటే కాదు. ఈ సమయంలో ఆరోగ్యమూ ముఖ్యమే అని వైద్యులు, సైకాలజిస్టులు చెబుతున్నారు. ఒత్తిడి.. పెను ప్రభావమే పబ్లిక్ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్థులపై సహజంగానే ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలా ఒత్తిడి చేయడం విద్యార్థుల శారీరక, మానసిక పరిస్థితులపై పెను ప్రభావమే చూపుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. పరీక్షల సమయంలో వినోదం, క్రీడలకు దూరమై విద్యార్థులు మానసికంగా అధిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అదే జరిగితే ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని హెచ్చరిస్తున్నారు. వారికి కొంత ఆటవిడుపు సమయం ఇవ్వాలని, సూచిస్తున్నారు. ఆహారం, విశ్రాంతిపై ప్రత్యేక శద్ధ అవసరం చదువు ధ్యాసలో పడి సమయానికి ఆహారం, విశ్రాంతి తీసుకోకపోయినా ప్రమాదమే అని, అటువంటి వారికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. కొందరు పిల్లలను రాత్రి 11 గంటల వరకూ చదివించి, తిరిగి తెల్లవారుజామునే 5 గంటలకు నిద్రలేపి మళ్లీ చదివిస్తుంటారని అలా చేయడం వల్ల విద్యార్థికి తగిన విశ్రాంతి దొరకక తొందరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుందంటున్నారు. విద్యార్థులకు ఇచ్చే ఆహారంలో తేలికగా జీర్ణం అయ్యే ఇడ్లీ, చారుతో భోజనం మంచిందంటున్నారు. అలాగే అందుబాటులో ఉండే సీజనల్ పండ్లు, మెదడు చురుకుగా పని చేయడానికి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలి. పరీక్షలు పూర్తయ్యే వరకూ మాంసాహారాలకు, మసాలాలు, ఉప్పు, కారాలు అధికంగా ఉండే ఆహారాలు పెట్టకపోవడమే మంచిది. రాత్రి సమయాల్లో నిద్రకు ఉపక్రమించే ముందు టీలు, కాఫీలు తీసుకోకూడదు. రాత్రి పొద్దుపోయే వరకూ చదవకూడదు. కనీసం 8 గంటలు నిద్రపోవాలి. తెల్లవారుజామున చదివితే పాఠ్యాంశాలు బాగా గుర్తుంటాయి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులు (ఫైల్) చదువుతో పాటు ఆరోగ్యమూ ముఖ్యమే.. పరీక్షల సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి ఆహారం, విశ్రాంతిపై శ్రద్ధ అవసరం తల్లిదండ్రులూ ఒత్తిడి పెట్టొద్దు త్వరలో టెన్త్, ఇంటర్ పరీక్షలు జిల్లాలో 58 వేల మందికి పైగా విద్యార్థులు త్వరలోనే ఇంటర్మీడియెట్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రాంభం కానున్నాయి. ఇంటర్మీడియెట్కు సంబంధించిన ప్రయోగ పరీక్షలు ముగిశాయి. పదో తరగతి విద్యార్థులకు ప్రస్తుతం ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. మార్చి 2వ తేదీ నుంచి గ్రాండ్ టెస్ట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అనంతరం ఈ నెల 23వ తేదీ నుంచి ఇంటర్మీడియెట్ విద్యార్థులకు, మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వారి పరీక్షలు ముగిసిన అనంతరం డిగ్రీ, పీజీ, 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు కూడా పరీక్షలు జరుగుతాయి. -
ముద్దాపురంలో శిలాఫలకం ధ్వంసం
తణుకు అర్బన్: తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో టీడీపీ శ్రేణులు కయ్యానికి కాలు దువ్వారు. గత వైఎస్సార్సీపీ హయాంలో స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో 2024లో రోడ్డు శంకుస్థాపన కోసం ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని బుధవారం రాత్రి ధ్వంసం చేశారు. ధ్వంసం చేస్తున్న కార్మికులను వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నించగా తణుకు నుంచి పనికి వచ్చామని గ్రామ మాజీ సర్పంచ్ ముళ్లపూడి శ్రీనివాస్ పని పురమాయించినట్లు చెప్పారు. అప్పట్లో రూ.5 కోట్లు నిధులతో రోడ్డు నిర్మాణం కోసం మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారని, నేడు అర్ధాంతరంగా రాత్రి సమయంలో ఆ శిలాఫలకాన్ని తొలగించే పనులు చేపట్టారని వైఎస్సార్ సీపీ నాయకులు తుమ్మగంటి నాగ సత్యనారాయణ (నాగు) విమర్శించారు. ఇదేమిటని మళ్లపూడి శ్రీనివాస్ను ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా ఇంటి లోపలకు వెళ్లిపోయారని నాగు తెలిపారు. ద్వారకాతిరుమల: ఐఎస్ జగన్నాథపురంలో సుందరగిరిపై స్వయంభూ కనకవల్లీ సమేత లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ద్వితీయ దివస మోదక హవన ప్రారంభ వేడుకలు బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా ఆలయ యాగశాలలో మహా గణపతి లక్షమోదక హోమాన్ని జరిపారు. మహాశివరాత్రి నాడు జరిపే అతిరుద్రప్రయోగ సహిత సుదర్శన నృశింహ మహాయజ్ఞం నిర్వహణలో భాగంగా ఈ వేడుకను నిర్వహించారు. ఉదయం ఆలయ యాగశాలలో నారసింహుని ఉపాసకులు కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ ఆధ్వర్యంలో, సీహెచ్ కుటుంబరావు పర్యవేక్షణలో పలు కార్యక్రమాలను వైభవంగా జరిపారు. రుత్వికులు, పండితులు మోదకాలను, పలురకాల దినుసులను హోమగుండంలో వేస్తూ క్రతువును నిర్వహించారు. లోక శాంతి కోసం ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ముదినేపల్లి రూరల్: ఇటీవల అదృశ్యమైన తల్లీపిల్లల ఆచూకీ తెలుసుకుని స్ధానిక పోలీసులు కుటుంబ సభ్యులకు బుధవారం అప్పగించారు. బొమ్మినంపాడుకు చెందిన వాసుపల్లి పెద్దిరాజులుకు భార్య శిరీషతోపాటు రాజేశ్వరి, శాంతిప్రియ, నాగదుర్గ కుమార్తెలున్నారు. వీరంతా ఈనెల 8న ఆధార్కార్డు సవరణలు చేసుకునేందుకు బయటకు వెళ్లారు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో పెద్దిరాజులు పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు పెద్దిరాజులు భార్య శిరీష, కుమార్తెలు కలిదిండి మండలం కోరుకొల్లులో ఉన్నట్లు గుర్తించి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. ఎస్సై వీరభద్రరావు వీరిని కుటుంబసభ్యులకు అప్పగించారు. తణుకు అర్బన్: గుర్తు తెలియని మృతదేహం తణుకు మండలం వేల్పూరు గ్రామ పరిధిలోని కంపోస్టు యార్డులో బుధవారం లభ్యమైంది. కంపోస్టు యార్డులోని చెత్తకు నిప్పుపెట్టిన స్థలంలో మృతదేహం కొంతభాగం కాలిపోయి ఉంది. మృతుడి వయస్సు సుమారుగా 40 నుంచి 50 మధ్య ఉండవచ్చని, తెలుపురంగు చొక్కా, నీలం రంగు జీన్స్ ఫ్యాంటు ధరించి ఉన్నారని, జుట్టు కొంతమేర తెలుపు రంగుతో ఉందని, నాలుగు రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. తణుకు రూరల్ పోలీసులు మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి పంచనామా అనంతరం అంత్యక్రియలు జరిపించారు. రూరల్ స్టేషన్ ఏఎస్సై అనుమానాదస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మండవల్లి: ఓ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం లింగాల గ్రామానికి చెందిన సాయిలక్ష్మి ఈ నెల 10వ తేదీన ఇంట్లో దేవుడికి దీపారాధన చేస్తుండగా, దీపం వత్తు ఆమె చీరకు అంటుకుని మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. సమాచారం తెలుసుకున్న భర్త వెంకటేశ్వరరావు వెంటనే వచ్చి ఆమెను కై కలూరు ప్రభుత్వాసుపత్రికి అనంతరం మెరుగైన వైద్య సేవల నిమితం గన్నవరం సిద్ధార్ధ మెడికల్ కాలేజీకి తరలించారు. బుధవారం ఉదయం ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడు సాయిల శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సస్యరక్షణతో మామిడిలో అధిక దిగుబడులు
నూజివీడు: రైతులు మామిడి తోటల్లో సస్యరక్షణ చర్యలను చేపట్టడం ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవ్చని ఉద్యాన అధికారి ఆర్ హేమ పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో మామిడి తోటలను సందర్శించిన ఆమె మామిడి తోటల సస్యరక్షణపై రైతులకు పలు సూచనలు చేశారు. మామిడి తోటల్లో పూతమీద తేనెమంచు పురుగు ఆశించినట్లయితే, నివారణకు అజారక్టిన్ 3000 పీపీఎం 2ఎంఎల్ లీటరు నీటికి, బుప్రోపెజన్ 25 ఈసీ 1.5 ఎంఎల్ లీటరు నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 ఎంఎల్ లేదా థయామిథాక్సాన్ 25 శాతం 0.3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. తామర పురుగుల నివారణకు నీలి రంగు జిగురు అట్టలు 40 నుంచి 50 వరకు తోటల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. వేపనూనె 3000 పీపీఎం 2ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. పోంగామియా సోప్ 7.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని, ఎసిఫేట్ 75 ఎస్పీ 1.5 గ్రాములు లీటర్ నీటికి లేదా ఫిప్రోనిల్ 5 ఈసీ 2ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా తామర పురుగులను నివారించుకోవచ్చన్నారు. బూడిద తెగులు నివారణ ఇలా.. నీటిలో కరిగే గంధకం 3 గ్రా లేదా హెక్సాకొనజోల్ 2 ఎంఎల్ లేదా అజాక్సిస్ట్రోబిన్ 1ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పక్షికన్ను తెగులు సోకితే.. నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా కార్బండిజమ్ 1 గ్రాము, మాంకోజబ్ 2.5 గ్రాములు కలిపి లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మసిమంగు నివారణకు ఎమామెక్టిన్ బెంజీయేటర్ 0.4 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకులపై మసిని తొలగించుటకు 2 కిలోల గంజి పొడిని గోరువెచ్చని 3 నుంచి 4 లీటర్ల నీటిలో కలిపి ఉడికంచిన తరువాత మిగులు నీరుపోసి 100 లీటర్ల గంజి ద్రావకం తయారు చేసి తెగులు కనిపించిన భాగాలపై ఎండ బాగా ఉన్న రోజల్లో పిచికారీ చేయాలి. 4–5 రోజుల తరవాత నీటిని పిచికారీ చేస్తే చాలా వరకు మసి రంగు పోతుందని ఉద్యాన అధికారి హేమ తెలిపారు. పాడి–పంట -
విధులకు హాజరై.. తిరిగి వెళుతూ..
● ఆర్ఎంవో డాక్టర్ తాతారావు గుండెపోటుతో మృతి ● శోకసంద్రంలో తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్య సిబ్బంది తణుకు అర్బన్ : తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ అందే వెంకట రమా సత్య తాతారావు (56) గుండెపోటుతో మృతిచెందారు. బుధవారం ఉదయం విధుల్లోకి వచ్చిన ఆయన ఓపీలో రోగులకు వైద్యసేవలందించారు. అనంతరం వైద్య సిబ్బందికి సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. అనంతరం గుండెల్లో కొంచెం మంటగా ఉందంటూ ఆస్పత్రిలో ఈసీజీ తీయించుకుని నార్మల్గా ఉందని నిర్ధారించుకుని ఇంటికి వెళ్లిపోతానని నిడదవోలుకు కారులో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరారు. ఉండ్రాజవరం దాటిన తర్వాత గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా కారు అదుపు తప్పి రోడ్డు మార్జిన్లోని పిల్లకాలువ పక్కకు వెళ్లి నిలిచిపోయింది. స్థానికులు వెంటనే కారు అద్దాలు పగులగొట్టి కిందకు దించి సీపీఆర్ చేసి అక్కడ నుంచి నేరుగా ఆయన్ను తణుకులో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన కన్నుమూసినట్టు వైద్యులు నిర్ధారించారు. గతేడాది జూన్లో సాధారణ బదిలీల్లో భాగంగా తాడేపల్లిగూడెం ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా ఉన్న ఆయన తణుకు ఆర్ఎంఓగా విధుల్లో చేరారు. శోకసంద్రంలో ఆస్పత్రి వర్గాలు తాతారావు ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేక ఆస్పత్రి వర్గాలు శోకసంద్రంలో నిలిచారు. తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణలో ఉంచిన ఆయన భౌతికకాయాన్ని వైద్యవర్గాలు సందర్శించాయి. తాడేపల్లిగూడెం ఆర్టీవో కౌసర్ భానో ఆస్పత్రికి వచ్చి తాతారావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.సాయికిరణ్తోపాటు తహసీల్దార్ దండు అశోక్వర్మ, వైద్యులు, సిబ్బంది డాక్టర్ తాతారావుకు నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులు నిడదవోలులోని ఆయన నివాసానికి తాతారావు భౌతికకాయాన్ని అంబులెన్స్లో తరలించారు. ఆయనకు భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలోను, చిన్న కుమార్తె వైజాగ్ ఆస్పత్రిలో మెడిసిన్ విద్యనభ్యసిస్తున్నారు. ఆస్పత్రికి వెళ్దామన్నా వద్దన్న వైనం తణుకులో కార్డియాలజిస్ట్కు చూపించుదామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్ పట్టుబట్టినా.. మా డాక్టరు దగ్గరకు వెళ్తానని బలవంతంగా బయలుదేరినట్లుగా ఆస్పత్రి వైదులు చెబుతున్నారు. గతంలోనే గుండెకు రెండు స్టంట్స్ పడటంతో అశ్రద్ధ వద్దని అన్నా వినలేదని వాపోయారు. ‘మనిషి ప్రాణం ఎంతో విలువైనది. ఆస్పత్రికి వచ్చే రోగికి అత్యవసర వైద్యం అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు విలువైన వైద్యం సత్వరమే అందించగలిగితే ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వారవుతారు. అందుకోసం ప్రతి ఒక్కరూ వైద్యసేవలో అప్రమత్తంగా ఉండాలి.’ బుధవారం మధ్యాహ్నం వైద్య సిబ్బందికి నిర్వహించిన సమావేశంలో ఆయన ఇచ్చిన చివరి సందేశం. -
అక్రమ కలప స్వాధీనం
కొయ్యలగూడెం: రేంజర్ భాను ప్రకాష్కి అందిన సమాచారంతో బుధవారం దిప్పకాయల పాడులో దాడులు నిర్వహించి అక్రమ కలపతో రవాణా అవుతున్న వాహనాన్ని స్వాధీనం చేసుకొని కన్నాపురం అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు ఎఫ్ఎస్ఓ పి.మణికుమారి పేర్కొన్నారు. వాహనంలో సుమారు యాభైకి పైగా దిమ్మలతో ఉన్న టేకు దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. కలప విలువను లెక్కించాల్సి ఉందన్నారు. బీట్ ఆఫీసర్ కె.నవీన్, కె.వెంకన్నబాబు, రాంబాబు పాల్గొన్నారు. పంట కాలువలో శిశువు మృతదేహం పెదపాడు: పెదపాడు ఎస్సీ ఏరియాలోని కమ్యూనిటీ హాలు వద్ద పంట కాలువలో శిశువు మృతదేహం లభ్యమైంది. స్థానికులు బుధవారం సాయంత్రం మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ఆర్.శ్రీనివాస్ అక్కడకు చేరుకుని శిశువు మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి పంపించారు. వీఆర్వో అనకాపల్లి నర్సింహరావు ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జన్మనిచ్చిన బిడ్డను ఎవరు పడేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
పది సూత్రాలు పాటిస్తే విజయం మీదే
పరీక్షల్లో విజయం సాధించాలంటే విద్యార్థులు పది సూత్రాలు పాటించాలి. రోజు, వారం, నెల వారీగా చదువుకు ప్రణాళిక రూపొందించుకోవాలి. తెలియని విషయాలను ఉపాధ్యాయల నుంచి తెలుసుకోవాలి. అర్థమైనవి పదేపదే చదవాలి. గతంలో నమూనా పరీక్షల ఆధారంగా ప్రణాళిక వేసుకోవాలి. పునశ్చరణ చేసుకోవాలి. మంచి దస్తూరీ అలవరుచుకుని నిర్ణీత సమయంలో పరీక్ష ముగించడానికి కృషి చేయాలి. సెల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం, సరైన నిద్ర ఉండాలి, అన్ని సబ్జెక్టులకు సమాన సమయాన్ని కేటాయించాలి. వ్యక్తిగత లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటిని సాధించాలనే కసితో చదవాలి. – అక్కింశెట్టి రాంబాబు, సైకాలజిస్ట్ -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం పి. అంకంపాలెం సమీపంలోని కోళ్లఫారమ్లో ఒక యువతి ఆనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సా రాష్ట్రం రాయ్ఘడ్ జిల్లా బీఎల్ఓడీ మండలం ఓయ్పంగు గ్రామానికి చెందిన పతిక రష్మిక (19) నాలుగు రోజుల క్రితం పి. అంకంపాలెం సమీపంలోని కోళ్లఫారం వద్ద జీవనోపాధి కోసం వచ్చి పనిలో చేరింది. అయితే ఆ యువతి షెడ్లో అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందింది. రష్మిక అదే కోళ్లఫారమ్లో పనిచేస్తున్న ప్రశాంత్ అనే యువకుడితో గత 8 నెలలుగా పరిచయం ఉండి ఒరిస్సాలోనే సహజీవనం చేసినట్లు సమాచారం. అయితే ప్రశాంత్కు ఇప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల ప్రశాంత్ తన భార్యతో కలిసి కోళ్ల ఫారమ్లో పనిచేస్తుండగా రష్మిక కూడా నాలుగు రోజుల క్రితం ఇక్కడికి వచ్చినట్లు పలువురు చెబుతున్నారు. ముగ్గురూ ఒకే గదిలో నివసిస్తున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం ప్రశాంత్, అతని భార్య పని నిమిత్తం కోళ్లఫారమ్కు వెళ్లగా రష్మిక షెడ్లో ఉరివేసుకున్నట్లు చెబుతున్నారు. యువతి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందో తమకు తెలియదని అంటున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరోగ్యకరమైన ద్రవ పదార్థాలు తీసుకోవాలి
వచ్చేది వేసవి కాలం కావడంతో ఘన పదార్థాలు శరీరానికి పెద్దగా సహించవు. డీహైడ్రేషన్తో వాంతులు, విరోచనాలతో ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంటుంది. అటువంటి సమయంలో ఆరోగ్యకరమైన ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా మంచినీరు, కొబ్బరి నీరు, పండ్ల రసాలు, మజ్జిగ, రాగిజావ వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అలాగే రోజుకు కనీసం 8 గంటలు గాఢనిద్రకు కేటాయించాలి. ప్రతిరోజూ కొద్ది సమయం యోగ, ధ్యానం సాధనకు కేటాయించాలి. – డాక్టర్ ఎంఎల్వీ ప్రసాద్, ఆంధ్రా హాస్పిటల్స్ డైరెక్టర్ -
పంచాయతీ కార్యదర్శిపై దాడి
బుట్టాయగూడెం : ఇంటి పన్ను కట్టమని అడిగినందుకు పంచాయతీ కార్యదర్శిపై ఒక వ్యక్తి దాడి చేశాడు. దీనిపై బుధవారం రాత్రి కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొరమామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి గుండేపల్లి సోమరాజు బుధవారం సాయంత్ర సిబ్బందితో కలిసి ఇంటి పన్నులు వసూలు చేసేందుకు వెళ్లారు. గ్రామంలోని ఒక టీస్టాల్ వద్ద పవన్కుమార్ అనే వ్యక్తిని ఇంటి పన్ను చెల్లించమని అడుగగా ఆ వ్యక్తి వివాదస్పదంగా మాట్లాడినట్లు కార్యదర్శి తెలిపారు. అసభ్య పదజాలంతో మాట్లాడుతూ పలుమార్లు తనపై దాడి చేసి కొట్టినట్లు కార్యదర్శి చెప్పారు. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయ్యాలని కోరుతూ స్థానిక పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. కార్యదర్శి సోమరాజుపై జరిగిన దాడిని డిప్యూటీ ఎంపీడీఓ, వీఎస్ఎస్ శ్రీనివాసరావు, కార్యదర్శిలు రామకృష్ణ, కిరణ్, తదితరులు తీవ్రంగా ఖండించారు. -
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ డిమాండ్వీరవాసరం: తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో చంద్రబాబు కచ్చితంగా ప్రజలకు ,శ్రీవారి భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ శెట్టిబలిజ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కవురు శ్రీనివాస్ మంగళవారం డిమాండ్ చేశారు. తిరుమల ప్రసాదం అంటే సందేహించే స్థాయికి చంద్రబాబు తన తప్పుడు ప్రచారంతో తీసుకెళ్లారని ఇంతకన్నా ఘోరం ఏముంటుందని తీవ్రంగా ఆక్షేపించారు. లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతు కొవ్వు లేదని దేశంలోనే ప్రతిష్టాత్మక ల్యాబ్లు చెప్పాయన్నారు. ప్రజల దృష్టిలో పూర్తిగా కిందకు పడిపోయిన చంద్రబాబు మళ్లీ ఏదో రకంగా తన అబద్ధాలు నిజాలని చెప్పడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలంతా దీన్ని గమనిస్తున్నారని వివరించారు. అన్ని రకాల రిపోర్టులను చూసిన తర్వాతే చార్జిషీట్ వేశారని.. మరి ఎందుకు చంద్రబాబు కుట్రలు మీద కుట్రలు చేస్తున్నారని ప్రశ్నించారు. పరిపాలనలో ఘోరంగా విఫలమయ్యారని, ప్రజలంతా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.


