breaking news
West Godavari District Latest News
-
అంతర్ జిల్లా పోటీలకు ఫుట్బాల్ జట్టు
భీమవరం: ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి మూడు రోజులపాటు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగే జూనియర్ బాలుర అంతర్ జిల్లాల చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా జూనియర్ బాలుర జట్టు పాల్గొంటుందని జిల్లా అసోసియేషన్ గౌరవ చైర్మన్ ఇళ్ల రాధాకృష్ణ శనివారం చెప్పారు. నూతన పశ్చిమగోదావరి జిల్లా ఏర్పాటు తర్వాత మొదటిసారిగా రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో జట్టు పాల్గొంటున్నట్లు తెలిపారు. పోటీలకు వెళ్లిన క్రీడాకారులకు రాధాకృష్ణ, ఉప అధ్యక్షులు ఎఎస్ఎన్ రాజు, ఇళ్ల మధుసూదనరావు, కార్యదర్శి వానపల్లి రమేష్, గౌరవ అధ్యక్షుడు పాపోలు ఏడుకొండలు శుభాకాంక్షలు తెలిపారు. భీమవరం: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణికి అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం వినతిపత్రం అందజేశారు. ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ వుదిసి వెంకట పాండురంగారావు మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ తక్షణమే వేయాలని, తాత్కాలిక భృతి, ఐఆర్, పెండింగ్లో ఉన్న డీఏ, సరెండర్ లీవ్ ఇవ్వడంతోపాటు పలు సమస్యలను పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో కామరాజు, ఎస్ఎన్వీ సత్యనారాయణ, పేపకాయల కృష్ణ, జేఏసీ సెక్రెటరీ రామచంద్రరావు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు విజయరామరాజు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సాయివర్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ చిట్టూరి హరిప్రసాద్బాబు తదితరులు పాల్గొన్నారు. కై కలూరు: ఓ వివాహిత కనిపించడం లేదని ఆమె తల్లి రూరల్ పోలీసు స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేసింది. కై కలూరు మండలం పందిరిపల్లిగూడెంకు చెందిన బలే కుసుమసాయికి అదే గ్రామానికి చెందిన చినరాజుతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి అమ్మాయి(16), అబ్బాయి(15) సంతానం ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా కుసుమసాయి కనిపించకపోవడంతో ఆమె తల్లి కర్ణం దుర్గా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై వి.రాంబాబు చెప్పారు. -
సమయం లేదు సర్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఇంటింటా సర్వే చివరి దశకు చేరింది. ఓటర్లకు ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫారాల (ఈఎఫ్)ల మ్యాపింగ్ గడువు మంగళవారంతో ముగియనుంది. ఉమ్మడి పశ్చిమలో 31.19 లక్షల ఓటర్లకు 83.29 శాతం ఓట్లు డిజిటలైజేషన్ కాగా ఇంకా 16 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు ఓటర్ల వద్దే ఉన్నాయి. గడువులోపు మిగిలిన వారు మ్యాపింగ్ చేసుకోకుంటే ఓటు గల్లంతే అంటున్నారు. మరోపక్క వలస ఓట్లలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపునకు కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 31.19 లక్షల మంది.. ఓటరు జాబితా ప్రక్షాళన కోసం గతనెల 15 నుంచి ఎన్నికల కమిషన్ సర్ కార్యక్రమం చేపట్టింది. 2002 జాబితా ప్రకారం తొలిదశలో ఓటర్ల మ్యాపింగ్కు నిర్ణయించింది. ఈ మేరకు బూత్ లెవిల్ ఆఫీసర్లు (బీఎల్ఓ) ఈనెల 14 వరకు ఇంటింటికీ వచ్చి ఓటర్లకు ఎన్యుమరేషన్లు అందజేయాలి. జాబితాలోని అడ్రస్లో ఓటరు ఉంటున్నారా లేదా అనేది పరిశీలించి మ్యాపింగ్ చేయాలి. 2002 తర్వాత ఓటుహక్కు పొందిన వారి వివరాలను ఈసీ మార్గదర్శకాల మేరకు మ్యాపింగ్ చేయాలి. ఉమ్మడి పశ్చిమలో 31.19 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఏలూరు జిల్లాలో 16,44,193 ఓట్లకు గాను 92.95 శాతంతో 15.28 లక్షల ఓట్లు మ్యాపింగ్ పూర్తయ్యింది. పశ్చిమగోదావరి జిల్లాలో 14,75,036 మంది ఓటర్లు ఉండగా శనివారం నాటికి 81.05 శాతంతో 11.95 లక్షల ఓట్లు మ్యాపింగ్ పూర్తయ్యింది. అధికంగా భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం అర్బన్ ఏరియాలు, వీరవాసరం మండలంలోను, ఏలూరు జిల్లా పరిధిలోని ఏలూరు అర్బన్తో పాటు నూజివీడు, దెందులూరు ఏరియాలో మ్యాపింగ్ చేయాల్సిన ఓట్లు ఉన్నాయి. ఏలూరు జిల్లా నియోజకవర్గం ఓటర్లు డిజిటలైజేషన్ శాతం ఉంగుటూరు 2,07,346 1,95,375 94.23 దెందులూరు 2,25,615 2,10,860 93.46 ఏలూరు 2,34,948 2,23,046 94.93 పోలవరం 2,55,122 2,36,203 92.58 చింతలపూడి 2,74,003 2,49.089 90.91 నూజివీడు 2,40,581 2,26,439 94.12 కై కలూరు 2,06,578 1,87,214 90.63 మొత్తం 16,44,193 15,28,226 92.95 పశ్చిమగోదావరి జిల్లా నియోజకవర్గం ఓటర్లు డిజిటలైజేషన్ శాతం ఆచంట 1,79,987 1,49,707 83.18 పాలకొల్లు 1,95,062 1,64,813 84.49 నరసాపురం 1,71,053 1,46,367 85.57 భీమవరం 2,52,549 1,85,981 73.64 ఉండి 2,26,503 1,80,241 79.58 తణుకు 2,35,359 1,91,697 81.45 తాడేపల్లిగూడెం 2,14,523 1,76,771 82.40 మొత్తం 14,75,036 11,95,557 81.05 ఉమ్మడి పశ్చిమలో 31.19 లక్షల ఓటర్లు 83.29 శాతం డిజిటలైజేషన్ పూర్తి ఇంకా ఓటర్ల వద్ద ఉన్న ఎన్యుమరేషన్ ఫారాలు 17 శాతం 14తో ముగియనున్న గడువు ఈలోపు డిజిటలైజ్ కాకుంటే ఓటు గల్లంతే! వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపునకు కూటమి కుట్రలు ఏఐ సృష్టించిన చిత్రం ఏలూరు జిల్లాలో నూరు శాతం, పశ్చిమలో 99.91 శాతం ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేసినట్టు బీఎల్ఓలు చెబుతున్నారు. అయితే ఈ మేరకు డిజిటలైజేషన్ మాత్రం జరగలేదు. ఎన్యుమరేషన్ పూర్తికి మరో రెండు రోజులు గడువు ఉండగా 11 నాటికి పూర్తిచేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. డెత్, షిఫ్టింగ్, శాశ్వత వలసదారుల దరఖాస్తులపై ఈఆర్ఓ, ఏఈఆర్ఓలు ఏ మేరకు శ్రద్ధ చూపారనేది ప్రశ్నార్థకమే. సర్వే అనంతరం తొలగించిన ఓట్లు, కొత్తగా నమోదైన ఓట్లు, మార్పులు, చేర్పుల వివరాలతో జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. అనంతరం క్లయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబరు 18లోపు పరిష్కరిస్తారు. సెప్టెంబరు 22న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. ఈ నేపథ్యలో నిర్ణీత గడువులోపు డిజిటలైజ్ చేయించుకోకుంటే ఓటును కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. షిఫ్టింగ్, శాశ్వత వలసదారుల ఓట్ల విషయంలో కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా మ్యాపింగ్ కాని ఆయా ఓట్లను తొలగించాల్సి ఉంది. కాగా వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించి కూటమి పార్టీలకు చెందిన వారి ఓట్లను కాపాడుకునేందుకు కుట్రలు చేస్తున్నట్టు సమాచారం. -
పుష్కర పనులకు కేంద్ర గ్రాంటు
నరసాపురం: నరసాపురంలో పుష్కరాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం 25 శాతం రుణవాటా కింద అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) గ్రాంట్ మంజూరు చేసినట్టు మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం గ్రాంటును 25 శాతం రుణం రూపంలో ఇస్తుందని, మిగిలిన 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఇప్పటికే రూ.15 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అంచనాలు తయారు చేసి పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. యూసీఎఫ్ గ్రాంటు కింద నరసాపురం మున్సిపాలిటీ రూ.34 కోట్ల అర్హత సాధించిందన్నారు. ముందుగా పుష్కరాల అభివృద్ధి పనులు, నిర్వహణపై మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఎమెల్యే బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, టీడీపీ ఇన్చార్జి పొత్తూరి రామరాజు పాల్గొన్నారు. -
పెంటాథ్లాన్ పోటీలు ప్రారంభం
ఏలూరు (ఆర్ఆర్పేట): స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో మోడరన్ పెంటాథ్లాన్ లేజర్ రన్ ఛాంపియన్ షిప్ – 2026 క్రీడా పోటీలు శనివారం నిర్వహించారు. ఈ పోటీలను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందకు సాగాలన్నారు. ఈ క్రీడలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారు. ఏపీ స్పోర్ట్స్ డైరెక్టర్ కే. జగదీశ్వరి, డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్, ఏపీ మోడరన్ పెంటాథ్లాన్ చైర్మన్ సీహెచ్.వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్ కే. హరిబాబు, వైస్ చైర్మన్ పీ. షణ్ముగం తదితరులు పాల్గొన్నారు. భీమడోలు: కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. కోనసీమ జిల్లా రావులపాలెం సమీపంలోని ఉప్పలగుప్తం మండలం టి.చల్లపల్లికి చెందిన ఐదుగురు ఓ కారులో ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చారు. దర్శనం ముగించుకుని తిరిగి తమ స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యమైన భీమడోలు జాతీయ రహదారిపైకి వచ్చేసరికి ముందుగా వెళ్తున్న ఓ వాహనాన్ని తప్పించబోయి కారు అదుపు తప్పి డివైడర్పైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులోని డ్రైవర్ ఏ.ప్రకాష్, ప్రయాణికులు జయరాం శ్రీనివాస్, సుంకర సందీప్కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. భీమడోలు పోలీసులు విచారణ చేస్తున్నారు. 100 మార్కులు తెచ్చుకున్న విద్యార్థికి విమాన ప్రయాణం లింగపాలెం: పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్థికి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇచ్చిన మాట ప్రకారం సొంత ఖర్చులతో విమాన ప్రయాణం చేయించి ఆదర్శంగా నిలిచారు. లింగపాలెం మండలం కలరాయనగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కె.వజ్రకుమార్ విద్యార్థుల్లో చదువుపై పోటీతత్వాన్ని పెంచేందుకు ఒక వినూత్న ప్రకటన చేశారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో సాంఘిక శాస్త్రం (సోషల్ స్టడీస్) సబ్జెక్టులో 100కు 100 మార్కులు సాధించిన వారికి ఉచితంగా విమానంలో హైదరాబాద్ తీసుకెళ్లి, అక్కడ పర్యాటక ప్రదేశాలను చూపిస్తానని మాటిచ్చారు. ఉపాధ్యాయుడు ఇచ్చిన స్ఫూర్తితో కష్టపడి చదివిన కొండపల్లి వినయ్ అనే విద్యార్థి పబ్లిక్ పరీక్షల్లో వందకు వంద మార్కులు సాధించి లక్ష్యాన్ని అందుకున్నాడు. దీంతో ఉపాధ్యాయుడు వజ్రకుమార్ తన మాట నిలబెట్టుకుంటూ, సదరు విద్యార్థి విమాన ప్రయాణ ఖర్చులను స్వయంగా భరించి గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ విద్యార్థికి పలు పర్యాటక ప్రాంతాలను చూపించి సరికొత్త అనుభూతిని అందించారు. విద్యార్థిని ప్రోత్సహించిన ఉపాధ్యాయుడు వజ్రకుమార్ను నూజివీడు డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి పీఎస్. సుధాకర్, ఎంఈఓలు కేవీకే దుర్గారావు, జె.రవీంద్ర, ఎస్ఎంసీ చైర్మన్ గద్దల తబిత అభినందించారు. -
విద్యార్థులు లేక వెలవెలబోతున్న హాస్టల్
మండవల్లి: మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో ప్రస్తుతం విద్యార్థులెవరూ లేకపోవడంతో హాస్టల్ వెలవెలబోతోంది. ఈ హాస్టల్ సమీపంలో రైల్వే ట్రాక్ ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. విద్యార్థులు హైస్కూల్కు వెళ్లాలన్నా, తిరిగి హాస్టల్కు రావాలన్నా రైల్వే ట్రాక్ దాటాల్సి వస్తోంది. అలాగే రైల్వే ట్రాక్ వెంబడే నడవాల్సి వస్తుండటంతో, భద్రతా కారణాల దృష్ట్యా పిల్లలను ఈ హాస్టల్లో ఉంచేందుకు తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. గతంలో ఈ వసతి గృహంలో సుమారు 40 మంది వరకు విద్యార్థులు ఉండేవారు. ప్రస్తుతం ఈ హాస్టల్కు ఇన్ఛార్జ్ మేట్రన్గా రాధ వ్యవహరిస్తుండగా, వర్కర్గా సుస్మిత విధులు నిర్వహిస్తూ హాస్టల్ను శుభ్రం చేస్తున్నారు. విద్యార్థులను చేర్పించేందుకు తాము నందిగామలంక, పెనుమాకలంక తదితర గ్రామాలకు వెళ్లి ప్రచారం చేసినప్పటికీ, హాస్టల్లో ఒక్కరు కూడా చేరలేదని మేట్రన్ రాధ తెలిపారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, ఈ హాస్టల్ను గ్రామంలోని ఏదైనా అద్దె భవనంలోకి మార్చితే విద్యార్థులు చేరే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వసతి గృహాన్ని తక్షణమే గ్రామంలోకి మార్చాలని పలువురు కోరుతున్నారు. -
ట్రిపుల్ఐటీలో ‘మెటా గేట్’ శిక్షణ
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ఐటీలోని మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ (ఎంఎంఈ) విభాగ విద్యార్థుల కోసం ‘మెటా గేట్’ కోచింగ్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక గేట్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించడమే లక్ష్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ సెల్ ద్వారా ఆర్జీయూకేటీ పరిపాలనా విభాగం దీనిని చేపట్టింది. గేట్ మెటలర్జీ అకడమిక్ హెడ్ శుభ్రదీప్ పాల్ హాజరై, గేట్ పరీక్ష ద్వారా లభించే ఉన్నత విద్యా, పరిశోధనా అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వీసీ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణ రావు, రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ తదితర అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పీయూసీ విద్యార్థుల కోసం ఒప్పందం పీయూసీ విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, ప్రారంభ దశలోనే సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు వీలుగా ‘మెటాగేట్ బ్రిడ్జ్ కోర్స్’ నిర్వహణ కొరకు సదరు సంస్థతో విశ్వవిద్యాలయం రెండో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సెంట్రల్ అకడమిక్ డీన్ దువ్వూరి శ్రావణి, ఈఐటీపీ డీన్ శ్యామ్, సెంట్రల్ ఫైనాన్స్ ఆఫీసర్ నాగార్జున దేవి, ఎంఎంఈ హెచ్ఓడీ వీరశ్రీను, రామకృష్ణ, వెంకటేశ్వర్లు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. భీమవరం: బాలికపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై రహమాన్ చెప్పారు. రాయలం గ్రామానికి చెందిన బాలిక (5) ఇంటికి బావ వరస అయ్యే కె మణికంఠవర్మ (21) తన తల్లితో కలసి ఈనెల 8వ తేదీన వచ్చారు. బాలిక తన చెల్లితో కలసి ఆడుకుంటుండగా నిందితుడు బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యలమంచిలి: అబ్బిరాజుపాలెం ఫెర్రీ వేలం శుక్రవారం రూ.8.10 లక్షలకు ఖరారైన సంగతి తెలిసిందే. ఆ ధర కన్నా ఎక్కువ ధరకు పాట పాడతానని, మళ్లీ వేలం నిర్వహించాలని కోరుతూ శనివారం శిరిగినీడి వెంకటేశ్వరరావు రూ.4.05 లక్షలు చెల్లించారు. దీనిపై ఈ నెల 16న మళ్లీ టెండర్లు పిలిచి ఫెర్రీ వేలం నిర్వహిస్తామని గ్రామ కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్, డిప్యూటీ ఎంపీడీఓ జేడీవీ ప్రసాద్ తెలిపారు. -
గోస్తనీ కాలువలో బాలిక మృతదేహం లభ్యం
తణుకు అర్బన్: తణుకు గోస్తనీ కాలువలోకి దూకి గల్లంతైన బాలిక గాలిదేవర శ్రీ యామిని లాస్య (15) మృతదేహం శనివారం లభ్యమైంది. శుక్రవారం ఉదయం స్థానిక సజ్జాపురం శివాలయం వంతెన పైనుంచి బాలిక దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం నుంచి గోస్తనీ కాలువలో ఎన్డీఆర్ఎఫ్ బృందం బోటులో గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం సమయంలో బాలిక దూకిన ప్రాంతానికి కొంత దూరంలోనే మృతదేహం లభ్యమైంది. లాస్య మృతదేహం ఎన్డీఎంసీ అనే పేరుతో ఉన్న ప్రైవేటు దంత వైద్యశాల యూనిఫామ్లో ఉంది. బాలిక కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, స్థానిక ప్రజలు ఘటనా ప్రాంతానికి భారీగా చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఏం జరిగిందో.. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. కాలువలోకి దూకే ముందు వంతెనపై కొంత సేపు టచ్ఛాడడం, ఈక్రమంలో స్థానికులు పలుకరించగా ఎటువంటి అనుమానం రాకుండా కాలువలో చేపలు చూస్తున్నానని సమాధానం చెప్పడం వంటి అంశాలు అనుమానాస్పదంగా మారాయి. రెండేళ్ల క్రితం తల్లి లక్ష్మి అదే వంతెన పైనుంచి గోస్తనీ కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడడం, ఆ తరువాత తండ్రి సైతం కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో లాస్య మేనత్త సత్యవతి వద్ద ఉండగా ఆమె చెల్లెలు శ్రీహన్సిక నానమ్మ, తాతయ్యల వద్ద ఉంటోంది. తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందచేశారు. పట్టణ ఎస్సై సీహెచ్వీ సత్యనారాయణ పర్యవేక్షించారు. కన్నీరు మున్నీరవుతున్న కుటుంబసభ్యులు -
పుస్తకాల్లేని చదువులు
ప్రస్తుత విద్యాసంవత్సరం గత నెల 12వ తేదీన ప్రారంభమైనప్పటికీ, నేటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్య, నోట్ పుస్తకాలను అందించలేదు. గత జగన్ ప్రభుత్వ హయాంలో పాఠశాలలు తెరిచిన రోజే పాఠ్య, నోట్ పుస్తకాలతో పాటు స్కూల్ బ్యాగ్, షూస్, సాక్స్, టై, బెల్ట్, యూనిఫామ్ వంటివన్నీ అందించేవారు. అయితే ఈ ఏడాది జిల్లాలోని 1,376 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 87 వేల మంది విద్యార్థులకు విద్యా సామాగ్రి అందించాల్సి ఉండగా, ఏ పాఠశాలకూ నూరు శాతం పుస్తకాలు, సామాగ్రి అందిన దాఖలాలు లేవు. అంతేకాకుండా, ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా చేరిన విద్యార్థులకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పుస్తకాలు, విద్యా సామాగ్రి అందకపోవడంతో, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులంతా ఇంటింటికీ తిరిగి, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే అన్నీ ఉచితంగా అందుతాయని ప్రచారం చేశారు. తీరా ఇప్పుడు ప్రభుత్వం నుంచి పుస్తకాలు, యూనిఫామ్ వంటివి సకాలంలో ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలియక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. పుస్తకాలే సక్రమంగా అందించలేని ప్రభుత్వం, ఇక ’తల్లికి వందనం’ పథకంలో ఎటువంటి మెలికలు పెట్టి కోత విధిస్తుందోనని, తమ పిల్లలకు ఆ సొమ్ము అందుతుందో లేదోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. భీమవరం: విద్యకు పెద్దపీట వేస్తామని, ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో తామే మేటి అని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం, ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా విద్యార్థులకు నేటికీ పూర్తిస్థాయిలో పుస్తకాలు, విద్యా సామాగ్రి పంపిణీ చేయలేకపోయింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాఠశాలలు తెరిచిన రోజునే విద్యార్థులందరికీ ’జగనన్న విద్యా కానుక’ కిట్లను అందజేయడమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయడం, ’అమ్మఒడి’ పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ప్రతి ఏటా రూ. 15 వేల ఆర్థిక ప్రోత్సాహం అందించడంతో ప్రభుత్వ బడులకు ఆదరణ పెరిగింది. దీంతో భారీగా ఫీజులు చెల్లించి ప్రైవేట్ స్కూళ్లలో చదివించే మధ్యతరగతి తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 5,673 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. బడులు తెరిచి నెల దాటినా పూర్తికాని పుస్తకాల పంపిణీ విద్యార్థులకు తప్పని అవస్థలు కొత్తగా చేరిన విద్యార్థులకు అందని పుస్తకాలు, యూనిఫాం కూటమి పాలనపై మండిపడుతున్న తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది అదనంగా చేరిన విద్యార్థులకు కూడా అందించడానికి వీలుగా ఆయా పాఠశాలలకు పుస్తకాలు, ఇతర విద్యా సామాగ్రి చేరుతున్నాయి. గత ఏడాది విద్యార్థులందరికీ పాఠశాలల ప్రారంభంలోనే పంపిణీ పూర్తి చేయగా, ఈసారి కొత్తగా చేరిన విద్యార్థులకు అందించే కార్యక్రమం చేపట్టాం. పుస్తకాలు, విద్యా సామాగ్రి కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – పి.శ్యామ్సుందర్, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, భీమవరం -
రాష్ట్రస్థాయి రోల్బాల్ పోటీలకు ఎంపిక
తణుకు అర్బన్: రోల్బాల్ అసోసియేషన్ ఆఫ్ అంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో శనివారం తణుకులో జరిగిన రోల్ బాల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో 8 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వి.లావణ్య తెలిపారు. ఎంపికలకు 18 మంది క్రీడాకారులు హాజరుకాగా అండర్ 14 విభాగంలో ఆర్.గగన్దీప్, కె.యశ్వంత్, జి.భువన్, వి.వీహాస్, అండర్ 17 విభాగంలో జి.రంజిత్, కె.అఖిల్, ఎం.తనిష్క్, ఎన్.శరత్రావు ఎంపికై నట్లు చెప్పారు. ఈనెల 24 నుంచి 26 తేదీల్లో గుంటూరులో జరిగే రోల్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు వీరు పశ్చిమ గోదావరి జిల్లా తరుఫున ఆడనున్నారని వివరించారు. -
అక్రమ పొగాకు బేళ్లు సీజ్
జంగారెడ్డిగూడెం: కొయ్యలగూడెం, గోపాలపురం నుంచి గుంటూరుకు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా అవుతున్న 28 హైగ్రేడ్ పొగాకు బేళ్లను విజిలెన్స్ అధికారులు సీజ్ చేసినట్లు ఎన్ఎల్ఎస్ రీజినల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్ తెలిపారు. ముందస్తు సమాచారంతో నిఘా ఉంచిన విజిలెన్స్ అధికారులు కిరణ్ జీఎం, సాయి ప్రశాంత్, ధర్మతేజ రెండు ఆటోల్లో తరలిస్తున్న ఈ పొగాకును పట్టుకుని, తదుపరి చర్యల నిమిత్తం జంగారెడ్డిగూడెం వేలం కేంద్రానికి తరలించారన్నారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ, నిబంధనలు ఉల్లంఘించి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, కేవలం వేలం కేంద్రాలలోనే పొగాకు అమ్మాలని కోరారు. అక్రమ రవాణా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, బోర్డు నిబంధనల ప్రకారం బహుమతి కూడా ఇస్తామన్నారు. బ్రైట్ గ్రేడ్ పొగాకు 100 కేజీల బేలుకు రూ.500, మీడియం గ్రేడ్ బేలుకు రూ.400, లో గ్రేడ్ బేలుకు రూ.200, పొగాకు చూరా బేలుకు రూ.100 చొప్పున పారితోషికం ఇస్తామన్నారు. సమాచారం కోసం ఔస్డీ విజిలెన్స్ గుంటూరు 91540 30702, జంగారెడ్డిగూడెం 98497 77055 నంబర్లలో సంప్రదించవచ్చని ఆర్ఎం సురేంద్రకుమార్ తెలిపారు. -
లోక్ అదాలత్తో సత్వర పరిష్కారం
ఏలూరు (టూటౌన్): కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు ఉ మ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎస్.శ్రీదేవి చెప్పారు. శనివారం స్థానిక జిల్లా న్యాయసేవాధికార సంస్థ భవనంలో 2వ జాతీయ లోక్అదాలత్ ప్రారంభ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కక్షిదారుల మధ్య సామర స్య వాతావరణంలో విభేదాలు తగ్గించేందుకు, కేసు ల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ నిర్వహి స్తున్నామని చెప్పారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 36 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యక్షంగా పాల్గొనలేని కక్షిదారులు ఆన్లైన్ ద్వారా హాజరుకావచ్చన్నారు. వాహన ప్రమాద బీమా కేసులో టాటా జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.20 లక్షల చెక్కులను కక్షిదారులకు అందజేశారు. 1వ అదనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని, 2వ అదనపు జిల్లా జడ్జి ఎం.మీనాదేవి, 5వ అదనపు జిల్లా జడ్జి ఆర్వీవీఎస్ మురళీకృష్ణ, 8వ అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాసమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనె సీతారాం, ప్రభుత్వ న్యాయవాది సుబ్రహ్మణ్యం, లోక్ అదాలత్ సభ్యుడు అబ్బినేని వి జయకుమార్ పాల్గొన్నారు. కక్షిదారులకు సీతారాం ఆహార పొట్లాలను అందజేశారు. 7,890 కేసుల రాజీ : 7,890 కేసులను రాజీ చేశారు. వీటిలో 7,437 క్రిమినల్, 215 సివిల్, 185 వాహన ప్రమాద, 53 ఫ్రీలిటిగేషన్ కేసులు రాజీ చేసినట్టు తెలిపారు. వాహన ప్రమాద బీమా కేసులకు సంబంధించి రూ.12.18 కోట్లు పరిహారంగా చెల్లించారు. -
రౌడీషీటర్కు రూ.లక్ష జరిమానా
భీమవరం: బాండ్ ఉల్లంఘించిన రౌడీషీటర్ జెట్టి వెంకటేశ్వరరావుకు మేజిస్ట్రేట్ రూ.లక్ష జరిమానా విధించినట్లు డీఎస్పీ రఘువీర్ విష్ణు చెప్పారు. శనివారం వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఆయన వివరాలు వెల్లడించారు. వెంకటేశ్వరరావుపై వన్టౌన్ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద ఉన్న కేసులకుగాను నిందితుడ్ని ఇటీవల భీమవరం మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా ఏడాది పాటు సత్ప్రవర్తనతో ఉండాలని ఆదేశిస్తూ రూ.5 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై బైండోవర్ చేశారు. అయితే బైండోవర్ కాలం అమలులో ఉండగానే నిందితుడు గత నెల 18వ తేదీన సుంకర పద్దయ్యగారి వీధిలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్కు నివేదిక పంపారు. దీంతో బాండ్ ఉల్లంఘన విచారణ నిర్వహించి, రూ.5 లక్షల బాండ్ మొత్తాన్ని జప్తు చేస్తూ ఏడు రోజుల్లో చెల్లించాలని నిందితుడు వెంకటేశ్వరరావును ఆదేశించారన్నారు. అయితే నిందితుడి వినతితో బాండ్ ఉల్లంఘన మొత్తాన్ని రూ.లక్షకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఎస్పీ చెప్పారు. విలేకర్ల సమావేశంలో సీఐ ఎ రమేష్ పాల్గొన్నారు. -
ఆక్వా రైతులను ఆదుకున్న ఘనత వైఎస్ జగన్దే
పాలకొల్లు సెంట్రల్: గతంలోని అన్ని ప్రభుత్వాలు ఆక్వా రైతులను నిర్లక్ష్యం చేస్తే, వారిని అన్నివిధాలా ఆదుకున్న ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ము దునూరి ప్రసాదరాజు అన్నారు. శనివారం పాలకొల్లులోని అడబాల మినీ గార్డెన్స్లో నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) అధ్యక్షతన వైఎస్సార్సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈనెల 15న ఆక్వా రైతుల సమస్యలపై జిల్లాకు రానున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయడంపై చర్చించారు. జగన్ హామీతోనే నాడు విద్యుత్ ధరల తగ్గింపు ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ.. ఆక్వా రైతులు తమ సమస్యలను పాదయాత్రలో జగన్ దృష్టికి తీసుకువెళ్లగా రూ.3.85గా ఉన్న విద్యుత్ యూనిట్ ధరను అధికారంలోకి రాగానే రూ.1.50 లకే ఇస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. దీంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దిగివచ్చి విద్యుత్ ధరను రూ.2కు తగ్గించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆక్వా రంగానికి అండగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే అప్సడా సంస్థను ఏర్పాటు చేసి, దానికి ఆయనే చైర్మన్గా ఉంటూ కీలక నిర్ణయాలు తీసుకున్నారని ప్రసాదరాజు తెలిపారు. ఫీడ్ ధరల నియంత్రణకు చర్యలు తీసుకున్నారన్నారు. కరోనా కష్టకాలంలోనూ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు ధరలు తగ్గించకుండా నిఘా పెట్టారన్నారు. ఆక్వా ఉత్పత్తులకు డొమెస్టిక్ సేల్స్ ద్వారా అదనపు ఆదాయం కల్పించాలనే సంకల్పంతో స్థానికంగా మార్కెట్లను ఏర్పాటు చేశారని చెప్పారు. ఫీడ్, ప్రాసెసింగ్ యూనిట్లన్నీ కూటమి నాయకులవే.. ప్రస్తుతం రాష్ట్రంలోని ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లలో మెజారిటీ చంద్రబాబు సామాజికవర్గానికి, టీడీపీ నాయకులకు చెందినవేనని ప్రసాద రాజు ఆరోపించారు. పార్టీ నడపడానికి వారి నుంచి నిధులు వసూలు చేసే చంద్రబాబు.. ఫీడ్ ధరలు తగ్గించాలని, రొయ్యల ధరలు పెంచాలని వారిని ఎలా నిలదీయగలరని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఫీడ్ ధరలను కేజీకి రూ.14 పెంచితే, కంటితుడుపు చర్యగా రూ.4 తగ్గించాలని సిఫార్సు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిని అలుసుగా తీసుకున్న కంపెనీలు కేవలం రూ.2 మాత్రమే తగ్గించి చేతులు దులుపుకున్నాయని మండిపడ్డారు. 15న భీమవరానికి వైఎస్ జగన్ రాక నాడు జగనన్న ప్రకటనతో విద్యుత్ ధరలు తగ్గినట్టే.. నేడు కూడా అదే పరిస్థితి పునరావృతం కానుందని ప్రసాదరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈనెల 15న వైఎస్ జగన్ భీమవరం రానున్నారని, ఆయన రాకతో ఫీడ్ ధరలు తగ్గుతాయని, రొయ్యల కొనుగోలు ధరలు పెరుగుతాయని అన్నారు. జగన్ హయాంలోనే అన్నివర్గాలకు న్యాయం నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో యువత, మహిళలు, బీసీలు, రైతులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. జగన్ పర్యటనను జయప్రదం చేయాలి నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు మాట్లాడుతూ.. జగన్కు ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆక్వా రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి పర్యటనను జయప్రదం చేయాలని కోరారు. పార్టీ నరసాపురం పార్లమెంట్ సమన్వయకర్త గూడూరి ఉమాబాల, ప్రోగ్రామ్ ఇన్చార్జి చింతలపాటి శ్రీనివాసరాజు, సీనియర్ నాయకులు మేకా శేషుబాబు, గుణ్ణం నాగబాబు, చెల్లెం ఆనందప్రకాష్, కుమార దత్తాత్రేయవర్మ, యడ్ల తాతాజీ, జెడ్పీటీసీలు నడపన గోవిందరాజులు నాయుడు, గుంటూరి పెద్దిరాజు, ఎంపీపీలు యినకొండ ధనలక్ష్మీ రవికుమార్, సబ్బితి సుమంగళి, పట్టణ, మండలాల అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు, ఉచ్చుల స్టాలిన్, పెన్మెత్స ఏసురాజు, కొర్రపాటి వీరాస్వామి, కర్రా జయసరిత, మద్దా చంద్రకళ, నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు పాలకొల్లులో సమావేశంలో మాట్లాడుతున్న ప్రసాదరాజు, చిత్రంలో మురళీకృష్ణంరాజు, గుడాల గోపి, ఉమాబాల, పాల్గొన్న పార్టీ శ్రేణులు -
ఆక్వాకు అండగా.. అన్నొస్తున్నాడు
విదేశీ మారకద్రవ్యంతో దేశానికి మేలు చేస్తున్న ఆక్వా రైతులు చంద్రబాబు సర్కారు దగాతో రోడ్డున పడ్డారు. సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు సిండికేటు దోపిడీతో సాగు భారమై దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. దగాపడ్ట తమ పక్షాన ప్రభుత్వంపై సమరభేరి మోగించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాక కోసం ఆక్వా రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సాక్షి, భీమవరం: ఫీడ్ కంపెనీలు ఇష్టానుసారం పెంచిన ఆక్వా మేత ధరలు తగ్గించాలని, రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఆక్వా రైతులకిచ్చిన ఎన్నికల హామీలు అమలుచేయాలని ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అల్టిమేటం జారీచేశారు. లక్షలాది మంది రైతు కుటుంబాలను రోడ్డున పడేసి సిండికేటు ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్న చంద్రబాబు సర్కారు నిగ్గు తేల్చేందుకు ఈనెల 15న నేరుగా ఆయనే భీమవరం వస్తున్నారు. సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎక్స్పోర్టర్లు చేస్తున్న మోసాలు, దోపిడీ, ఇతర సమస్యలపై ఉండి బైపాస్ రోడ్డులో ఏర్పాటుచేయనున్న వేదిక వద్ద రైతులతో భేటీ కానున్నారు. ఆక్వా రైతుల ప్రయోజనాల కోసం పోరాటం సాగించనున్నారు. ఈ సందర్భంగా జగన్ రాక కోసం ఉభయగోదావరితో పాటు కృష్ణా జిల్లాల ఆక్వా రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అప్పటికైనా ప్రభుత్వం చల నం వస్తుందని ఆకాంక్షిస్తున్నారు. వేదిక స్థలం పరిశీలన ఉండి బైపాస్ రోడ్డులోని బీవీ రాజు విగ్రహం సమీపంలో ఏర్పాటుచేయనున్న ముఖాముఖీ వేదిక స్థలాన్ని శనివారం జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, భీమవరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ చినమిల్లి వెంకటరాయుడు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తదితరులు పరిశీలించారు. ముఖా ముఖీ కార్యక్రమం నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై సమీక్షించారు. అలాగే పర్యటన అనుమతుల కోసం కలెక్టర్ సీహెచ్ నాగరాణిని పార్టీ నేతలు క లిసి వినతిపత్రం అందజేశారు. ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పెండ్ర వీరన్న, పార్లమెంట్ సెక్రటరీ యడ్ల తాతాజీ, పార్టీ నేతలు కోడే యుగంధర్, గాదిరాజు రామరాజు, చిలుకూరి దత్తాత్రేయవర్మ తదితరులు పాల్గొన్నారు. అధినేత పర్యటనకు సంబంధించిన సన్నాహాల్లో వైఎస్సార్సీపీ జిల్లా కార్యవర్గం నిమగ్నమైంది. పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలో ఇటీవల ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన నేతలు సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. ఉమ్మడి పశ్చిమగోదావరితో పాటు తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన ఆక్వా రైతులు తరలిరానున్నారు. ఆక్వా రైతులకు కోసం జిల్లాకు వస్తున్న జగన్కు ఘన స్వాగతం పలికి పర్యటన విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లా అంతటా నియోజకవర్గాల వారీగా వైఎస్సార్సీపీ శ్రేణులు సన్నాహాక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రొయ్య రైతుల కష్టాలపై పోరుబాట 15న వైఎస్ జగన్ భీమవరం రాక ఉండి బైపాస్ రోడ్డులో ఆక్వా రైతులతో ముఖాముఖీ ఏర్పాట్లలో వైఎస్సార్సీపీ నేతలు రొయ్యల ఎగుమతిదారుల సిండికేట్ వల్లే రొయ్యల ధరలు తగ్గించివేస్తున్నారు. ప్రభుత్వం ధరల స్థిరీకరణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. మేత ధరల్ని ఇష్టానుసారం పెంచేస్తున్నారు. ముడిసరుకు ధరలు తగ్గినా మేత ధరల్ని తగ్గించడం లేదు. ధర ఒరల్లో రైతులు నలిగిపోతున్నారు. విద్యుత్ రాయితీల హామీని అమలుజేయాలి. రైతులు లక్షల రూపాయలు నష్టపోతున్నారు. – పాతపాటి శ్రీనివాసరాజు, ఆక్వా రైతు, పెదకాపవరం, ఆకివీడు మండలం ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నా రొయ్య రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించడం లేదు. జగనన్న వస్తేనే ఆక్వా రైతులకు న్యాయం జరుగుతుందని మా నమ్మకం. ఫీడు కంపెనీలు ఇష్టానుసారం ధరలు పెంచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలానే కొనసాగితే ఆక్వా సాగు చేసే పరిస్థితి లేదు. జగనన్న రాక కోసం రొయ్య రైతులంతా ఎదురుచూస్తున్నాం. – కె.సర్వేశ్వరరావు, రొయ్యల రైతు, రాయకుదురు, వీరవాసరం మండలం -
ఆరోగ్యకర కుటుంబాలు శ్రేయస్కరం
భీమవరం (ప్రకాశంచౌక్): ఆరోగ్యకరమైన, సంతోషకరమైన కుటుంబాలే సమాజానికి శ్రేయస్కరమని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం చౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు అవాగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడుతూ.. దేశ ప్రగతికి, కుటుంబాల ఆర్థిక సుస్థిరతకు ఆరోగ్యవంతమైన జనాభా కీలకమన్నారు. ఈనెల 18 వరకు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. డీఎంహెచ్ఓ ఎం.రవిబాబు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి దేవసుధ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారి సుజాత లక్ష్మి, సీడీపీఓ లక్ష్మీకాంతం పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. జిల్లాలో సర్ ప్రక్రియలో భాగంగా డిజిటలైజేషన్ పురోగతిపై శనివారం గూగుల్ మీట్ ద్వారా అధికారులతో సమీక్షించారు. నిర్దేశిత గడువులోపు నూరు శాతం లక్ష్యాన్ని సాధించాలన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులను డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని సూచించారు. డీఆర్వో, ఆర్డీఓ లు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. భీమవరం: మూడేళ్ల వ్యవధిలోని ఇన్సర్వీస్ టీచర్లంతా తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణులు కావా లనే నిబంధనతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొందని, దీనిపై ప్రభుత్వం స్పందించి టెట్ నుంచి మినహాయించాలని ఎమ్మెల్సీ బొ ర్రా గోపీమూర్తి డిమాండ్ చేశారు. భీమవరంలో శనివారం ఇన్సర్వీస్ టీచర్లకు టెట్పై అవ గాహన కోసం యూటీఎఫ్ ఏర్పాటుచేసిన ప్రత్యేక శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. టెట్ మినహాయింపు ఇచ్చే వరకూ పోరాటం చేస్తామన్నారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు టెట్పై అవగాహన, శిక్షణ తరగతులు, స్టడీ మెటీరియల్ అందజేత అభినందనీయమన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీఎస్ విజయరామరాజు, రాష్ట్ర కార్యదర్శి కె.శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీవీవీ రామానుజరావు(గాంధీ), జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం: పేదలకు పట్టెడన్నం పెడుతున్న ప్ర జా పంపిణీ వ్యవస్థకు తూట్లు పొడిచేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి ధ్వజమెత్తారు. అంత్యోదయ అన్నయోజన కార్డులపై ఇచ్చే బియ్యం కుదింపునకు నిరసనగా పట్టణంలోని మెంటేవారితోటలో శనివారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. 35 కిలోల బియ్యం పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కుదించి ఒకరికి ఏడు కిలోలు ఇస్తాననే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు జక్కంశెట్టి సత్యనారా యణ, ఎ.రవి, ఆకుల హరేరామ్, మామిడి శెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ కేరళ ప్రభుత్వం మాదిరిగా ప్రతి రేషన్ కార్డుపై 16 రకాల నిత్యావసర సరుకులు అందించాల న్నారు. నాయకులు కొల్లాటి శ్రీనివాస్, జుత్తిగ నర్సింహమూర్తి, పి.పూర్ణ, జి.రామకృష్ణ, కేతా గోపాలన్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం: జిల్లాలోని రెండు ఎకై ్సజ్ స్టేషన్లకు సీఐలను నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయని ఎకై ్సజ్ శాఖ జిల్లా పర్యవేక్షకుడు బి.సుబ్బా రావు తెలిపారు. భీమవరం స్టేషన్కు జి.బసంతి, పాలకొల్లుకు ఎం.రామశేషయ్య పదోన్నతిపై వస్తున్నారన్నారు. -
ప్రత్యేక పీజీఆర్ఎస్లో 150 అర్జీలు
వీరవాసరం : భీమవరం, నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం భీమవరం నియోజకవర్గం స్థాయిలో వీరవాసరం మండల కేంద్రం తులసి ఫంక్షన్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 150 అర్జీలు వచ్చాయని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జేసీ కేఆర్ కల్ప శ్రీ, ఏలూరు జెడ్పీ సీఈఓ పి.జగదాంబ, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.పిచ్చయ్య, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆపరేషన్ గోల్డ్మాల్
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన భారీ గోల్డ్లోన్ మోసాన్ని పోలీసులు ఛేదించారు. వినియోగదారులు తాకట్టు పెట్టిన దాదాపు రూ.10 కోట్ల విలువైన బంగారాన్ని బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతాదారులు తమ బంగారు ఆభరణాలను కుదువపెట్టి రుణాలు తీసుకున్నారు. అయితే బ్యాంక్లో భారీగా గోల్డ్ లోన్ మోసం జరిగినట్లు గుర్తించిన బ్యాంక్ సీనియర్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్.సుస్మిత ఈ కేసుపై దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా 176 గోల్డ్ లోన్ ఖాతాల్లో భారీ అవకతవకలు జరిగినట్లు పోలీసులు కనుగొన్నారు. సుమారు రూ. 10 కోట్ల విలువైన, దాదాపు 6.449 కిలోల బంగారు ఆభరణాలు మాయమైనట్లు తేలింది. గోల్డ్ అప్రైజర్ రాజు అరెస్ట్ ఈ మోసానికి పాల్పడిన జంగారెడ్డిగూడెం వెలమపేట ప్రాంతానికి చెందిన బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ చలపాక రాజును పోలీసులు అరెస్టు చేశారు. ఖాతాదారులు తాకట్టు పెట్టిన అసలైన బంగారాన్ని అపహరించి, వాటి స్థానంలో నకిలీ ఆభరణాలను ఉంచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అపహరించిన బంగారాన్ని నిందితుడు తన పేరుతో, తన తల్లిదండ్రుల పేరుతో జంగారెడ్డిగూడెంలోని వివిధ జ్యూవెలరీ షాపుల్లో విక్రయించడమో లేదా తాకట్టు పెట్టడమో చేసినట్లు ఆధారాలు లభించాయి. సొత్తు రికవరీ.. సిబ్బందికి అభినందనలు నిందితుడి నుంచి రూ. 10 లక్షల నగదును, వివిధ జ్యూవెలరీ షాపుల నుంచి సుమారు 4.120 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ సొత్తు విలువ సుమారు రూ.5.81 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో లోతైన విచారణ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. కేసును సమర్థవంతంగా ఛేదించిన ఏఎస్పీ సుస్మిత, సీఐ ఎం.వి.సుభాష్, ఎస్సైలు ఎన్.వీరప్రసాద్, ఎం.కుటుంబరావు, ఎస్.కె.జబీర్, ఎస్.వల్లీపద్మ, ఇతర సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఛేదించిన జంగారెడ్డిగూడెం పోలీసులు రూ.10 కోట్ల విలువైన 6.449 కిలోల బంగారం మాయం రూ.10 లక్షల నగదు, 4.12 కిలోల బంగారం రికవరీ -
కదం తొక్కిన అంగన్వాడీలు
భీమవరం (ప్రకాశం చౌక్): ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ అంగన్వాడీలు శుక్రవారం భీమవరం కలెక్టరేట్ వద్ద భారీ నిరసన చేపట్టారు. వేతనాలు పెంచే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కే. ఝాన్సీలక్ష్మి, కార్యదర్శి డి.కళ్యాణి మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా, వేతనాల పెంపుపై ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వేతనాలు పెంచుతామని చెప్పి, నేడు ఆ మాటను విస్మరించారని మండిపడ్డారు. నిత్యావసర ధరలు పదిసార్లు పెరిగినా తమ వేతనాలు మాత్రం అలాగే ఉన్నాయని, పైగా యాప్ల పేరుతో పని ఒత్తిడిని పెంచుతున్నారని వారు పేర్కొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.రాజా రామ్మోహన్ రాయ్ మాట్లాడుతూ.. అంగన్వాడీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. టార్గెట్ల పేరుతో క్షేత్రస్థాయిలో అనధికారికంగా డ్యూటీలు చేయించడం తగదని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసన అనంతరం అంగన్వాడీలు కలెక్టరేట్ గేటు వరకు ప్రదర్శన నిర్వహించి, అక్కడ బైఠాయించి డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నేతలు కర్రి నాగేశ్వరరావు, బి.వాసుదేవరావు, పి.వి.ప్రతాప్, ఎం.ఆంజనేయులు, డి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రేడింగ్ పేరుతో కోతలు తగదు
ద్వారకాతిరుమల : నాణ్యమైన పంటను అందిస్తున్నా గ్రేడింగ్ పేరుతో కోతలు విధించడం సరికాదని ఆయిల్పామ్ రైతులు గోద్రెజ్ ఫ్యాక్టరీ యాజమాన్య ప్రతినిధులను నిలదీశారు. ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో ఆయిల్ పామ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. సీహెచ్ పోతేపల్లిలోని గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. పలువురు రైతులు మాట్లాడుతూ తాము నాణ్యమైన గెలలను ఫ్యాక్టరీకి సరఫరా చేస్తున్నప్పటికీ గ్రేడింగ్ సాకుతో కోతలు విధిస్తూ అన్యాయం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కంపెనీ యాజమాన్యం కోర్టును ఆశ్రయించడం వల్ల రైతులు, కంపెనీ మధ్య సఖ్యత దెబ్బతింటోందని అభిప్రాయపడ్డారు. తక్షణమే ఆ ప్రక్రియను విరమించుకుని, రైతులకు ప్రయోజనం చేకూరేలా యాజమాన్యం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఫ్యాక్టరీ ప్రతినిధి నవనీత్ స్పందిస్తూ రైతుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ పామ్ రైతు సంఘం అధ్యక్షుడు, ద్వారకాతిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు చింతమనేని హనుమంతరావు, సొసైటీ చైర్మన్ పోలిన శ్రీనివాసరావు, మాసిరెడ్డి హరిబాబు, అక్కిసెట్టి సుధాకర్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు దేవరపల్లి వీరాస్వామి చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
ఆ రోజులు మళ్లీ రావాలి
శనివారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2026భీమవరం: ఆక్వా హబ్గా పేరొందిన జిల్లాలో అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆక్వా రైతులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జగన్ పర్యటనతో ప్రభుత్వంలో కదలిక వస్తే తమ కష్టాలు కొంతైనా తీరతాయని గంపెడాశతో ఉన్నారు. ప్రభుత్వానికి డాలర్ల పంట పండిస్తున్న ఆక్వా సాగులో రైతుల ఇబ్బందులు ప్రభుత్వానికి కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నా వాటి పరిష్కారానికి చొరవ చూపకపోవడంతో రైతులు సాగులో నష్టాలను భరించలేక క్రాప్ హాలీడే తప్ప మరొక మార్గం లేదనే నిర్ణయానికి వచ్చారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 1.20 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగుచేస్తుండగా దాంతో సుమారు 90 వేల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ యూనిట్ రూ.1.50 అందించడంతోపాటు ఫీడ్, సీడ్ ధరలపై నియంత్రణ విధించారు. కోవిడ్ సమయంలో ఎగుమతులు లేవంటూ రొయ్యల ఎగుమతులదారులు ధరలు ఘననీయంగా తగ్గించగా.. ఎక్స్పోర్టు కంపెనీల వద్ద రెవెన్యూ అధికారులను పెట్టి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయించారు. ప్రస్తుత పరిస్థితిని రైతులు గుర్తు చేసుకుని కూటమి ప్రభుత్వం ఆక్వా రంగానికి చేస్తున్న ద్రోహంపై మండిపడుతున్నారు. ముంచిన మేత ధరలు రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడిసరుకు ధరలు పెరిగాయంటూ ఇటీవల ఫీడ్ ధరలు విపరీతంగా పెంచారు. ఇదే తరుణంలో రొయ్యల ధరలు పతనం కావడంతో రైతులు రోడెక్కి ఆందోళనలు చేపట్టారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఫీడ్ బస్తాలను రోడ్డుపై వేసి తగులబెట్టారు. రొయ్యలు రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. పంట విరామంటూ చెరువుల వద్ద ఫ్లెక్సీలు పెట్టి మరీ నిరసన తెలిపారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ రైతులకు అండగా ఉంటుందంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో కంగారు పడ్డ ప్రభుత్వం తక్షణం ఫీడ్ ధరను కిలోకు రూ.4 తగ్గిస్తామని, సబ్సిడీ విద్యుత్ను ఆక్వా రైతులందరికీ వర్తించేలా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. అయితే ఫీడ్ కంపెనీలు కేవలం రూ.2 లు మాత్రమే తగ్గించడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సబ్సిడీ విద్యుత్ ఫలాలు నేటికీ రైతులకు అందకపోవడంతో ప్రభుత్వం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెగుళ్లతో కుదేలు జూన్ నెల ప్రారంభం నుంచి రొయ్యల సాగుకు ప్రతికూల వాతావరణంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ, ఉక్కబోత ఎక్కువగా ఉండడం వెంటనే ఈదురుగాలులు, వర్షంతో చల్లగా మారడంతో రొయ్యలకు వైరస్ వ్యాపిస్తున్నాయి. వైట్గట్ తెగుళ్లుతో నష్టపోతున్నారు. తెగుళ్ల కారణంగా మందులకు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి రావడంతోపాటు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకప్పుడు మీసం మెలేసిస రొయ్యల రైతు నేడు దిగాలుగా చెరువు వైపు చూస్తున్నారు. ఇప్పటికే చెరువులు తవ్వకానికి, విద్యుత్, ఇంజిన్లు, ఏరియేటర్స్ వంటివాటికి లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు ప్రతికూల వాతావరణం, ప్రభుత్వ సహాయం లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో జగన్ పర్యటన సందర్భంగా ప్రభుత్వంలో చలనం వచ్చి రైతులకు మేలుచేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిస్తున్నారు. రొయ్యల ధరల్లో నిలకడలేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. రొయ్యలు 80 కౌంట్ నుంచి కౌంట్ తగ్గే స్థితిలో గతంలో కేవలం రూ.10 వ్యత్యాసం ఉండగా నేడు రూ.30 వరకు ఉంటుంది. దీంతో రైతులకు నష్టాలు తప్పడంలేదు. రొయ్యల ధరలు 15 రోజులపాటు ఒకే విధంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – గాదిరాజు సుబ్బరాజు, ఆక్వా ఫ్రాన్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి ప్రస్తుతం రొయ్యలకు వైట్గట్ వంటి వ్యాధులు సోకాయి. ఫీడ్, మందుల ధరలు పెరిగిపోవడంతో పెట్టుబడులు పెట్టలేక సతమతమవుతున్నారు. తెగుళ్ల కారణంగా అనేక చెరువులు ఖాళీగానే దర్శన మిస్తున్నాయి. ఫీడ్ ధరలు తగ్గించడానికి, సబ్సిడీ విద్యుత్ రైతులందరికీ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – భోగిరెడ్డి శ్రీనివాసరావు, ఆక్వా రైతు, తోలేరు ఆక్వా రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆక్వా జోన్స్ ప్రమేయం లేకుండా సబ్సిడీ విద్యుత్ ఇస్తున్నట్లు ప్రకటించి నెలలు గడిచిపోతున్నా అమలు కావడం లేదు. ఫీడ్ ధరలు రూ.4 తగ్గించినట్లు ప్రకటించినా కేవలం రూ.2 మాత్రమే తగ్గించాయి. ముడిసరుకు ధరలు తగ్గించేలా కేంద్రంపై రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి తేవాలి. – బొల్లెంపల్లి శ్రీనివాసరావు, ఆక్వా రైతు, అండలూరు వైఎస్ జగన్ పాలనను గుర్తు చేసుకుంటున్న ఆక్వా రైతులు జగన్ భీమవరం పర్యటనపై ఆశలన్నీ తగ్గని ఫీడ్, సీడ్ ధరలతో రైతులు సతమతం అమలు కాని సబ్సిడీ విద్యుత్ -
దూరవిద్య కోర్సుల ప్రయోజనాలపై అవగాహన
ఏలూరు (ఆర్ఆర్పేట) : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో దూర విద్యా విధానంలో నిర్వహిస్తున్న వివిధ కోర్సుల ప్రయోజనాలపై అవసరార్థులకు అవగాహన కలిగించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ సూచించారు. ఏపీఓఎస్ఎస్ 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువు మధ్యలో ఆపివేసిన వారికి దూరవిద్యా విధానంలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ విధానంలో 10వ తరగతి పూర్తి చేసిన వారు రెగ్యులర్ ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరవచ్చని, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు రెగ్యులర్ డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ ఆశ, జిల్లాలోని ఎంఈఓలు, అపోస్ గుర్తింపు పొందిన కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. కుక్కునూరు: మండలంలోని తొండిపాక పంచాయతీలో ఉపాధి హామీ పథకం పనుల్లో జరిగిన అవకతవకలపై అధికారులు ఎట్టకేలకు చర్యలు చేపట్టారు. ఉపాధి హామీ పనుల్లో అక్రమాలపై సాక్షిలో కథనం నేపథ్యంలో టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ), ఫీల్డ్ అసిస్టెంట్ (ఎఫ్ఏ)ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవంగా పనులు చేయకుండానే చేసినట్లు మస్తర్లు అప్లోడ్ చేసి బిల్లులు డ్రా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సంబంధిత సిబ్బంది అవకతవకలకు పాల్పడ్డారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన కథనాలను అధికారులు సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టారు. అక్రమాలు జరిగినట్లు తేలడంతో శుక్రవారం సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. -
భీమవరంలో ఎస్ఆర్ షాపింగ్మాల్ ప్రారంభం
భీమవరం: పట్టణంలోని ఉండి రోడ్డులో ఎస్ఆర్ షాపింగ్మాల్ 16వ బ్రాంచ్ను శుక్రవారం సినీ నటి కృతిశెట్టి ప్రారంభించారు. అభిమానులతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. భీమవరం పరిసర ప్రాంతాలంటే తనకెంతో ఇష్టమని, ఇక్కడి ప్రేక్షకుల అభిమానం మరువలేనన్నారు. ఎస్ఆర్ షాపింగ్ మాల్లో అద్భుతమైన డిజైన్లు, అన్ని వయసుల వారికి నచ్చే వస్త్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. ముందుగా శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, కేంద్ర ఉక్కు, భారీపరిశ్రమశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు తదితరులు షాపింగ్మాల్ను సందర్శించి వస్త్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ ఎస్.గోపీనాథ్రెడ్డి, డైరెక్టర్ ప్రసాద్రెడ్డి, పర్చేజింగ్ డైరెక్టర్ కేశవరెడ్డి, పీఈవో ఉదయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మండలి చైర్మన్ మోషేన్రాజు, ఎంపీ, ఎమ్మెల్యే, మాట్లాడుతున్న కృతిశెట్టి -
రైతులకిచ్చిన హామీలు గాలికి
రైతులకు అండగా 15న భీమవరానికి వైఎస్ జగన్ భీమవరం: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీలను అమలుచేయకుండా ఘోరంగా మోసం చేసిందని, రైతులు పంట పండించడానికి, పండిన పంటను విక్రయించుకోడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అన్నారు. శుక్రవారం భీమవరంలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పార్టీ భీమవరం మండల పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల పక్షాన ప్రభుత్వానికి నిలదీయడానికి ఈనెల 15న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నందున రైతులు పెద్ద సంఖ్యలో జగన్ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని, పార్టీ శ్రేణులు శక్తివంచన లేకుండా కృషిచేయాలని ప్రసాదరాజు పిలుపునిచ్చారు. ప్రధానంగా ఆక్వా హబ్గా పేరొందిన జిల్లాలో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రొయ్యలకు మద్దతు ధరలేకపోవడం ఫీడ్, సీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో రైతులు నష్టాలబాట పట్టారన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని గత మూడు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాలుగా ఆందోళనలు చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడంతో చివరకు క్రాప్ హాలీడే దిశగా రైతులు ఆలోచన చేస్తున్న తరుణంలో రైతులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని చెప్పారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ నిరంతరం పోరాడుతుందని, పెంచిన రొయ్య మేతల ధరలను తగ్గించే వరకు ఆక్వా రైతుల పక్షాన పోరాడుతుందని ప్రసాదరాజు స్పష్టం చేశారు. జగన్మోహన్ పర్యటనను రైతులు, పార్టీ శ్రేణులు, వైఎస్సార్సీపీ అభిమానులు విజయవంతం చేయాలని ముదునూరి కోరారు. సమావేశంలో పార్టీ భీమవరం నియోజవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకట రాయుడు, నియోజవర్గ పరిశీలకుడు మంతెన సోమరాజు, పార్టీ మండల అధ్యక్షుడు జల్లా కొండయ్య తదితరులు పాల్గొన్నారు. -
పంట కాల్వలకు నీటి విడుదల
కై కలూరు: సాగు నీరు లేక వరి నారు ఎండిపోతున్న వైనంపై రైతుల ఇబ్బందులను వివరిస్తూ ‘తడవని మడి.. అన్నదాత అలజడి’ శీర్షికతో సాక్షిలో శుక్రవారం కథనం వెలువడిన విషయం పాఠకులకు విధితమే. దీనిపై ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్పందించారు. నీటిని శివారు ప్రాంతాలకు విడుదల చేయాలని ఇరిగేషన్ సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఇరిగేషన్ డీఈఈ ఎం.శిరిష ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కై కలూరు నియోజకవర్గానికి నీటిని చేరవేసే పోల్రాజ్, క్వాంప్ బెల్ కాల్వలకు ఒక్కోదానికి 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో వరి రైతులు ఊపిరిపిల్చుకున్నారు. -
నరసాపురం – బెంగళూరు వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభం
పాలకొల్లు సెంట్రల్: నరసాపురం నుంచి బెంగళూరుకు ప్రయాణించే వారికి కోసం వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. గతంలో స్పెషల్ ట్రైన్గా ఉన్న ఈ రైలు, ఇకపై రెగ్యులర్ రైలుగా అందుబాటులో ఉంటుందని, దీనివల్ల ప్రయాణ చార్జీలు సుమారు 30 శాతం తగ్గుతాయని మంత్రి తెలిపారు. రైలు 17293 నెంబరుతో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:50 గంటలకు నరసాపురం నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9:45 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. 17294 నెంబరుతో ప్రతి శనివారం ఉదయం 11:00 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:50 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. పాలకొల్లు, ఆకివీడు, భీమవరం స్టేషన్లలో రూ. 20 కోట్లతో గూడ్స్ షెడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నరసాపురం: వైఎన్ కళాశాల హెచ్ఆర్డీ సెంటర్, ఏపీఎస్ఎస్డీసీ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం మెగా జాబ్మేళా నిర్వహించారు. పలు కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి మొత్తం 511 మంది హాజరు కాగా, 210 మందికి ఉద్యోగాలు లభించాయని కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ కనకారావు చెప్పారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
గురుకుల పాఠశాల తనిఖీ
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని పెదతాడేపల్లి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను శుక్రవారం సర్వశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి.శ్యామ్ సుందర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, వృత్తి విద్య ల్యాబ్, ఇతర విద్యా సౌకర్యాలను పరిశీలించారు. తొలుత నూతనంగా ఏర్పాటు చేసిన లైబ్రరీ హాలును ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరంలో పది ఫలితాల్లో నూరు శాతం లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తామన్నారు. ఆయన వెంట ఎంఈఓ–2 పీఎంకే జ్యోతి, ప్రిన్సిపాల్ బి.రాజారావు, ఉపాధ్యాయులు పి.శశికుమార్, ఎస్. ఆనందరావు, డి.కృష్ణ, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టి.నరసాపురం: ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి ఇచ్చిన ఉత్తర్వులను మండలంలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు కచ్చితంగా పాటించాలని ఎంఈఓ టి.రామ్మూర్తి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బొర్రంపాలెం గ్రామానికి చెందిన జి.పాండురంగ పీజీఆర్ఎస్ ద్వారా చేసిన ఫిర్యాదుపై జిల్లా అధికారులు స్పందించినట్లు పేర్కొన్నారు. ఆర్టీఈ చట్టం అమలుతో పాటు పాఠశాలల్లోని, విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల వివరాలు, వారి విద్యార్హతలు, జీతభత్యాల వివరాలను నోటీస్ బోర్డులపై స్పష్టంగా ఉంచాలని స్పష్టం చేశారు. -
తల్లి లేక.. తండ్రి ప్రేమకు నోచుకోక..
తల్లి లేని లోటు, తండ్రి లేని అనాథరికం ఆ పసి హృదయాన్ని నిలువెల్లా దహించివేసింది. రెండేళ్ల క్రితం కన్నతల్లి ఏ కాలువలో దూకి అదృశ్యమైందో.. అదే గోస్తనీ కాలువ ఒడ్డున నిలబడి శుక్రవారం 15 ఏళ్ల లాస్య బలవన్మరణానికి యత్నించింది. ఎందుకు బతకాలి? అనే నిరాశతో ఆ బాలిక తీసుకున్న నిర్ణయం తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలో విషాదఛాయలు నింపింది. తణుకు అర్బన్: తల్లి లేకపోవడం, తండ్రి బాధ్యతారాహిత్యం వంటి కుటుంబ సమస్యల నేపథ్యంలో 15 ఏళ్ల బాలిక తణుకులో కాలువలోకి దూకి ఆత్మహత్యకు యత్నించింది. తణుకు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన గాలిదేవర పెద్దిరాజు, దుర్గల మనుమరాలు గాలిదేవర శ్రీ యామిని లాస్య (15) పది వరకు చదువుకుని, ప్రస్తుతం ఒక ప్రైవేటు దంత వైద్యశాలలో పనిచేస్తోంది. తండ్రి వెంకటేశ్వరరావు గత కొన్నేళ్లుగా కుటుంబాన్ని వదిలేసి విజయవాడలో ఉంటున్నాడు. దీంతో లాస్య పట్టణంలోని బెల్లం మార్కెట్ ప్రాంతంలో మేనత్త సత్యవతి వద్ద, ఆమె చెల్లెలు నానమ్మ ఇంట పెరుగుతున్నారు. శుక్రవారం ఉదయం నానమ్మ ఇంటికి వచ్చి మాట్లాడిన లాస్య ఆసుపత్రికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. తల్లి బాటలోనే కుమార్తె రెండేళ్ల క్రితం కుటుంబ కలహాల కారణంగా లాస్య తల్లి లక్ష్మి కూడా అదే గోస్తనీ కాలువ వంతెన పైనుంచి దూకి గల్లంతైంది. ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. ఇప్పుడు కుమార్తె లాస్య కూడా తల్లి మరణించిన అదే ప్రదేశం నుంచే కాలువలోకి దూకడం గమనార్హం. రక్షించే ప్రయత్నం విఫలం కాలువలోకి దూకడానికి ముందు లాస్య వంతెనపై అనుమానాస్పదంగా తిరుగుతుండటం చూసి కొందరు ప్రశ్నించగా చేపలు చూస్తున్నానని సమాధానమిచ్చింది. దూకిన తర్వాత సుమారు 200 మీటర్ల దూరం ఆమె నీటిపై తేలుతూ వెళ్తుండటం గమనించిన స్థానిక మహిళలు ఒడ్డుకు రావాలని కేకలు వేశారు. కానీ ఆమె వారిని చూస్తూనే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. అక్కడ పురుషులెవరూ లేకపోవడంతో ఆమెను కాపాడలేకపోయారు. పోలీసుల దర్యాప్తు : సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా లాస్య ఆచూకీ లభించలేదు. తణుకు పట్టణ ఎస్సై సీహెచ్వీ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లి లేని లోటు, తండ్రి నిరాదరణ వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించింది, లేక మరేదైనా వేధింపుల కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోస్తనీ కాలువలో దూకి బాలిక గల్లంతు రెండేళ్ల క్రితం అదే ప్రాంతంలో కాలువలో దూకిన బాలిక తల్లి తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలో విషాదఛాయలు -
ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ బహిష్కరణ
ఏలూరు (ఆర్ఆర్పేట) : నగరంలోని ఉప విద్యాశాఖాధికారి (డిప్యూటీ డీఈఓ) కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ఏలూరు నగరపాలక సంస్థ (కార్పొరేషన్) ఉపాధ్యాయులు బహిష్కరించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ జీఓ నెంబర్ 84, 73, 74 రాజ్యాంగ సవరణలకు వ్యతిరేకంగా కార్పొరేషన్ ఉపాధ్యాయులను ఇతర యాజమాన్యాల్లోకి సర్దుబాటు చేయడం వల్లే కౌన్సెలింగ్ ప్రక్రియను బహిష్కరించినట్టు చెప్పారు. కార్పొరేషన్ యాజమాన్యంలోని ఉపాధ్యాయులను ఇతర యాజమాన్య పాఠశాలలకు బదిలీ చేయడమే కాకుండా, నగరానికి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా సరిహద్దు ప్రాంతాలకు పంపాలని చూడటం ఉపాధ్యాయులను తీవ్రంగా వేధించడమేనని వారు మండిపడ్డారు. ఈ మేరకు ఏలూరు ఉప విద్యాశాఖాధికారి నిమ్మగడ్డ రవీంద్ర భారతికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ ఏలూరు నగర శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కురమా ఆనంద్ కుమార్, అబ్బదాసరి శ్రీనివాసరావు, యూటీఎఫ్ నాయకులు సీహెచ్ షణ్ముఖి, జొన్నకూటి రాజారావు పాల్గొన్నారు. అయితే నగరపాలక సంస్థకు చెందిన సుమారు 10 మంది ఉపాధ్యాయులు సర్దుబాటు ప్రక్రియకు హాజరు కాలేదని, శనివారం నిర్వహించే సర్దుబాటు ప్రక్రియకు హాజరు కాని పక్షంలో వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపులకు ఉప విద్యాశాఖాధికారి మెసేజ్లు పంపారు. నిబంధనల ప్రకారం సర్దబాటు చేయని పక్షంలో కోర్టులోనే ఈ విషయాన్ని తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. -
మురుగు కాలువలో విద్యుత్ స్తంభాలు
ఆకివీడు: పంట కాలువలు, మురుగు కాల్వల ఆక్రమణలపై స్థానిక రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మండల పరిధిలోని అయిభీమవరం గ్రామంలో పంట కాల్వ గట్టు వెంబడి విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడమే కాకుండా, వాటికి సపోర్టుగా మరికొన్ని స్తంభాలను కాల్వ మధ్యలోనే పాతడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆకివీడు నుంచి ఏలూరు జిల్లా పోతుమర్రు ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేసేందుకు గానూ, ఇక్కడ హైటెన్షన్ వైర్ల కోసం ఈ స్తంభాలను నాటారు. కాలువ మధ్యలో సపోర్టింగ్ స్తంభాలు, కాల్వ గట్టును ఆనుకుని ప్రధాన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతో భవిష్యత్తులో పంట కాల్వను ఆధునికీకరించుకునే అవకాశం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక రైతుల ఇబ్బందులను పట్టించుకోకుండా, మరో జిల్లాకు విద్యుత్ సరఫరా చేయడం కోసం ఇష్టానుసారంగా స్తంభాలు వేయడంపై రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే కాల్వ గట్లపై ఆక్రమణలు ఉండటంతో కాల్వలను బాగు చేసుకోలేకపోతున్నామని మొరపెట్టుకుంటున్న రైతులకు, ఈ విద్యుత్ స్తంభాల ఏర్పాటుతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. కాలువలో చెత్త, పూడిక పేరుకుపోయినప్పుడు కాలువ తవ్వకం పనులు చేపడితే ఈ విద్యుత్ స్తంభాలు పక్కకు ఒరిగి ప్రమాదాలు జరిగే అవకాశముందని రైతులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అసలు కాలువలో పూడిక తీయడమే చాలా కష్టతరంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. అసలు నిబంధనలకు విరుద్ధంగా కాలువల్లో విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు అధికారులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఎందుకు అనుమతులు ఇచ్చారో అర్థం కావడం లేదని పలువురు రైతులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. -
బాధ్యతలు స్వీకరించిన జేసీ కల్పశ్రీ
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా కె.ఆర్.కల్పశ్రీ శుక్రవారం కలెక్టరేట్లోని ఆమె చాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. ఆమెను కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.ప్రభాకర్, సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ టి.మోహన్ రాజు, కలెక్టరేట్ ఎ.ఓ. వెంకటే శ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉండి: జిల్లాలో రెండు ప్రభుత్వ, 16 ప్రైవేటు కాలేజ్లకు శుక్రవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. మండలంలోని ఎన్నార్పీ అగ్రహారంలోని ప్రభుత్వ ఐటీఐలో ఉదయం 11:30 గంటల నుంచి ప్రారంభమైన కౌన్సెలింగ్కు జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. శుక్రవారం మొదటిరోజు 57 మందికి కౌన్సెలింగ్ నిర్వహించగా వారిలో 49 మంది మాత్రమే హాజరు కాగా వారు జిల్లా వ్యాప్తంగా వున్న ఐటీఐలలోని వివిధ ట్రేడ్లలో సీట్లు పొందినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన విద్యార్థులకు శని,ఆదివారాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వారు తెలిపారు. పెనుగొండ: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద నీరు నెమ్మదిగా చేరుతుంది. ఇటీవల మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో ఎగువ నుంచి నీరు భారీగా చేరుతుంది. దీంతో దొంగరావిపాలెం, సిద్ధాంతం, నడిపూడి, పెదమల్లం, కోడేరు, అయోధ్యలంక, భీమలాపురంలో ఇసుక తిన్నెలు నెమ్మదిగా నీట మునుగుతున్నాయి. మరో వారంలో గోదావరికి ఎర్రనీరు పోటెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాడేపల్లిగూడెం: అఖిల భారత ఇంజనీరింగ్ సాంకేతిక సంస్థ(ఏఐసీటీఈ) గ్రాడ్యుయేట్ విద్యా మండలి సభ్యుడిగా ఏపీ నిట్ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్.వి.రమణరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా రమణరావు మాట్లాడుతూ దీనిని గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. దేశంలోని ఇంజనీరింగ్ విద్యను మరింత నాణ్యంగా, సమర్ధవంతంగా తీర్చిదిద్దడంలో ఈ మండలి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఫలితాల ఆధారిత బోధన, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, నవకల్పన, పారిశ్రామిక అనుసంధానం వంటి అంశాలకు ప్రాధాన్యం కల్పించేలా కృషి చేస్తానన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): గతేడాది ఆగస్టు 24న నిర్వహించిన టీటీసీ పరీక్షలకు సంబంధించిన మార్కుల జాబితాలు విడుదలయ్యాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మార్కుల జాబితాలు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కడప జిల్లాల విద్యాశాఖాధికారుల కార్యాలయాలకు పంపించారని తెలిపారు. అభ్యర్థులు మూడు వారాల్లోగా వారి హాల్ టిక్కెట్లు చూపించి మార్కుల జాబితాలు పొందవచ్చని తెలిపారు. గత మే నెలలో జరిగిన పదో తరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్కు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయని తెలిపారు. జంగారెడ్డిగూడెం: కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సహకార సంఘాల జాతీయ డేటా బేస్ ర్యాంకుల్లో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం సహకార సంఘం ప్రతిభ కనబరిచింది. అన్ని విభాగాల్లో కలిపి 65.25 శాతం స్కోరు సాధించి రాష్ట్రంలోనే 9వ స్థానంలో, జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఘనత సాధించినందుకు సంఘ చైర్పర్సన్ గంధం గోపాలకృష్ణ, సీఈఓ సర్వేశ్వరరావు, సిబ్బందికి జిల్లా సహకార యూనియన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. -
విద్యుత్ షాక్తో యువతి మృతి
ఏలూరు టౌన్: శిక్షణ పొందిన కోర్సులో నైపుణ్యం సాధించింది. సొంతంగా తన కాళ్లపై నిలబడి, కుటుంబానికి అండగా ఉండాలని అడుగులు వేస్తున్న యువతి ఆశలు ఆవిరయ్యాయి. వివరాల ప్రకారం ఏలూరు వన్టౌన్ ఏసుపాదపురానికి చెందిన వంజరపు మనోజ (24) శుక్రవారం విద్యుత్ షాక్తో మృతి చెందింది. బ్యూటీషియన్ కోర్సు పూర్తి చేసిన మనోజ ఏలూరు వన్టౌన్లోని కన్నయ్య పార్క్ వద్ద ఓ భవనంలో బోటిక్ షాపును ప్రారంభించేందుకు పూనుకుంది. శుక్రవారం ఉదయం బోటిక్ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సామగ్రి అంతా కొనుగోలు చేసింది. అలాగే షాపు ఓపెనింగ్కు సంబంధించి భవనం మొదటి అంతస్తు వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తోన్న తరుణంలో సమీపంగా వెళ్తున్న విద్యుత్ వైర్లకు ఫ్లెక్సీ ఐరన్ పైప్ తగలడంతో విద్యుత్షాక్తో సంఘటనా స్థలంలోనే మనోజ మృతి చెందింది. సమాచారం అందుకున్న ఏలూరు వన్టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించారు. -
●ఆచంటేశ్వరునికి జలాభిషేకం
రైతన్నలు, ప్రజల ఇబ్బందులు తొలగించడానికి వర్షాలు సమృద్ధిగా కురువాలని కోరుతూ ఆచంటలోని ఆచంటేశ్వరునికి గోదావరీ జలాలతో సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించిన, గోదావరి నుంచి వెయ్యి కుండలతో తీసుకువచ్చిన జలాలను వేద పండితుల మంత్రోచ్ఛరణలతో ఆచంటేశ్వరునికి జలాభిషేకం చేశారు. జలాభిషేకం తిలకించడానికి భక్తులు భారీగా హజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రంగరాజు, చైనెక్కంటి గణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. – పెనుగొండ -
విద్యార్థినిపై హెచ్ఎం అనుచిత ప్రవర్తన
పాలకోడేరు: మోగల్లు హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు మోగంటి వెంకట త్రినాథులు తీరుపై శుక్రవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. 9వ తరగతిలో పాఠాలు బోధిస్తున్న సమయంలో ఒక బాలిక మెడలోని చున్నీని తీసుకుని ఆయన తన మెడలో వేసుకుని చాలా బాగుంది అంటూ కామెంట్ చేసినట్లు విద్యార్థులు ఆరోపించారు. దీంతో విద్యార్థులతో పాటు, బాలిక బంధువులు హెచ్ఎంను నిలదీయడంతో పాఠశాలలో కాస్త ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన పలువురు పెద్దలు వచ్చి సర్దిచెప్పినట్లు సమాచారం. పలువురు విద్యార్థులు డీవైఈవో రమేష్కు ఫిర్యాదు చేయడంతో ఆయన స్థానిక ఎంఈవో నాగరాజుతో పాటు కలిసి పాఠశాలకు వచ్చి వివరాలు సేకరించారు. ఉన్నతాధికారులకు నివేదిస్తామని డీవైఈవో తెలిపారు. మూడేళ్లుగా త్రినాథులు ఇక్కడ పనిచేస్తుండగా ఆయన పనితీరుపై గ్రామస్తులు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు పాఠశాలలో 630 మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 285కి పడిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. -
జంగారెడ్డిగూడెంలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం
జంగారెడ్డిగూడెం : స్థానిక ఇందిరానగర్ కాలనీలో గురువారం రాత్రి నిర్మాణంలో ఉన్న అంబేడ్కర్ భవన పునాదులతో పాటు విగ్రహాన్ని ధ్వంసం చేశారని ప్రముఖ అంబేడ్కర్ వాది పీఎస్ఎస్ఎస్ గాంధీ శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. గత 26 ఏళ్లుగా కాలనీలో అంబేడ్కర్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహిస్తున్నామన్నారు. అయితే గురువారం రాత్రి కొందరు దుండగులు దౌర్జన్యంగా ప్రవేశించి అంబేడ్కర్ హాలు పునాదులను, స్థలం చుట్టూ వేసిన తాత్కాలిక కాంపౌండ్ క్లాత్ను ధ్వంసం చేశారని తెలిపారు. నిర్మాణ సామగ్రిని నేలపాలు చేయడమే కాకుండా, ఇక్కడ విగ్రహం ఉండడానికి వీల్లేదంటూ కుల వివక్షతో కూడిన మాటలతో దూషించారని ఆరోపించారు. అంబేడ్కర్ విగ్రహం ముక్కును పగలగొట్టారని, ప్రొక్లెయిన్తో మొత్తం విగ్రహాన్ని కూలగొడతామంటూ నానా హంగామా చేసి స్థానికులను భయబ్రాంతులకు గురిచేశారని వివరించారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. యలమంచిలి: అబ్బిరాజుపాలెం సూరయ్య రేవు ఫెర్రీ వేలం రూ.8.10 లక్షలకు ఖరారైంది. స్థానిక సచివాలయంలో ఇన్చార్జి ఎంపీడీఓ జేడీవీ ప్రసాద్ పర్యవేక్షణలో గ్రామ కార్యదర్శి ఎం.దుర్గాప్రసాద్ వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన శిరిగినీడి శ్రీనివాస్, శిరిగినీడి వెంకటేశ్వరరావు చెరో రూ.50 వేలు ధరావతు, రూ.5 లక్షలు సాల్వెన్సీ, పంటు లైసెన్స్దారు నుంచి అగ్రిమెంట్ తీసుకుని వేలంలో పాల్గొన్నారు. వేలాన్ని రూ.7.50 లక్షల నుంచి ప్రారంభించి రూ.4 లక్షల వరకు తగ్గించారు. అక్కడి నుంచి శిరిగినీడి శ్రీనివాస్, శిరిగినీడి వెంకటేశ్వరరావు వేలాన్ని పెంచారు. చివరిగా శిరిగినీడి శ్రీనివాస్ రూ.8.10 లక్షలకు దక్కించుకున్నట్లు గ్రామ కార్యదర్శి ఎం.దుర్గాప్రసాద్ ప్రకటించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి వేలం ఖరారు చేస్తామన్నారు. ఈ వేలం 2027 జూన్ వరకు అమలులో ఉంటుందని గ్రామ కార్యదర్శి ఎం.దుర్గాప్రసాద్ తెలిపారు. పాలకొల్లు సెంట్రల్ : పట్టణంలో ఓ ఆటో బోల్తా కొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోనసీమ జిల్లా రాజోలు మండలం నాగార్జున వీధికి చెందిన గుబ్బల సత్యనారాయణ (57), గుబ్బల రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఈ నెల 7న పెద్ద అల్లుడు ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ వస్తున్నారని చూడడానికి వెళ్లిన సత్యనారాయణ దంపతులు శుక్రవారం నర్సాపూర్ ఎక్స్ప్రెస్కు తిరిగి వచ్చారు. స్టేషన్లో దిగిన సత్యనారాయణ దంపతులు బస్టాండ్ వరకూ షేరింగ్ ఆటో ఎక్కారు. స్టేషన్ నుంచి బయలుదేరిన ఆటో డ్రైవర్ అతి వేగంగా నడపడంతో దేశాలమ్మ ఆలయం సమీపంలో దుర్గాప్రూట్స్ జ్యూస్ వద్దకు వచ్చే సరికి బ్రేక్ వేయడంతో ఆటో తిరగబడింది. ఈ ఘటనలో సత్యనారాయణకు తీవ్రమైన గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన 108కు కాల్ చేసి స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యదు మేరకు కేసు నమోదు చేశారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తం
భీమవరం: సైబర్ నేరాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. గురువారం భీమవరం యాక్సిస్ బ్యాంక్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అప్రమత్తత నినాదంతో నిర్వహించిన వాకథాన్ ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకు ఖాతాల నుంచి నగదు అపహరించేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారన్నారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి మాట్లాడుతూ సైబర్ మోసాలకు గురైతే 1930 నంబర్కు ఫోన్ చేయాలన్నారు. యా క్సిస్ బ్యాంక్ రాజమండ్రి క్లస్టర్ హెడ్ సీహెచ్ శ్రీనివాసరావు, ఏరియా శాలరీ హెడ్ ఎంవీఎస్ఎన్ కిషోర్, మార్కెటింగ్ హెడ్ బి.ఉదయ్, ఆర్డీఓ ప్రవీణ్కుమార్ రెడ్డి, డీఎస్పీ రఘువీర్ విష్ణు, కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ ఎస్ఆర్కే నిశాంత్వర్మ తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణంలోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు)ను గురువారం కలెక్టర్ నాగరాణి తనిఖీ చేశారు. గోడౌన్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. డీఆర్వో పి.ప్రభాకర్ ఉన్నారు. జీఎస్టీ వసూళ్లు వేగిరపర్చాలి జిల్లాలో జీఎస్టీ వసూళ్లను వేగిరపర్చాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి జీఎస్టీ వసూళ్లపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాల్లో పరిశ్రమల వద్ద పెండింగ్లో ఉన్న జీఎస్టీని వసూలు చేయడానికి చర్యలు తీసుకోవాలని, కేసులు న మోదు చేయాలని ఆదేశించారు. -
చంద్రబాబు పాలనలో దోచుకోవడమే లక్ష్యం
మాజీ మంత్రి పేర్ని నాని భీమవరం: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజలను దోచుకోవడం మినహా అభివృద్ధి, సంక్షేమం ఎక్కడా కనిపించడం లేదని వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. గురువారం భీమవరంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడా రు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు రాజ్యమేలుతున్నాయన్నారు. నారాయణ, చైతన్య, భా ష్యం, విజ్ఞాన్ వంటి ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ చంద్రబాబు మనుషులవే అని, ఎన్నికల్లో వీరు ఇచ్చిన నిధులకు బదులుగా, ఇప్పుడు ప్రభుత్వం ఫీజుల రూపంలో ప్రజల రక్తాన్ని పిండటానికి సహకరిస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభు త్వం ఆక్వా రైతులకు అన్యాయం చేస్తోందని నాని ధ్వజమెత్తారు. తీరప్రాంతంలోని ఆక్వా రంగాన్ని చంద్రబాబు అనుచరులైన సీడ్, ఫీడ్ కంపెనీల యజమానులే శాసిస్తున్నారన్నారు. వారు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి రైతులను దోచుకుంటున్నారని, ఫీడ్పై రూ.4 తగ్గించాలని సీఎం చెబితే, కంపెనీలు రూ.2 మాత్రమే తగ్గించినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించా రు. అలాగే ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం వి ఫలమైందన్నారు. చివరి గింజ వరకు కొంటామనే మాట దేవుడెరుగు, మొదటి గింజను కూ డా ప్రభుత్వం సక్రమంగా కొనడం లేదని, మి ల్లుల బాకీలు చెల్లించాలంటే 10 శాతం కమిషన్ అడ్వాన్స్గా అడుగుతున్నారన్నారు. 15న వైఎస్ జగన్ రాక కూటమి ప్రభుత్వ అసమర్థతను, తప్పుడు పరి పాలనను రైతుల తరఫున నిలదీయడానికి ఈ నెల 15న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భీమవరం వస్తున్నారని నాని తెలిపా రు. నష్టపోయిన రైతులు, ప్రజలు పెద్ద సంఖ్య లో తరలివచ్చి తమ సమస్యలను జగన్కు వివరించాలని పేర్ని నాని కోరారు. -
రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ఎంపిక
ముసునూరు : రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు రమణక్కపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు ఇందుప్రియ, భార్గవి ఎంపికై నట్లు హెచ్ఎం పీవీఎస్ రామకృష్ణారావు తెలిపారు. ఈ నెల 1న విజయవాడ మేరీ స్టెల్లా కళాశాలలో జరిగిన బాస్కెట్ బాల్ సెలెక్షన్లలో అండర్–16 విభాగంలో తమ విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. వీరు విజయవాడ పటమట జెడ్పీ హైస్కూల్లో జరుగనున్న పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా బాస్కెట్ బాల్ జట్టు తరుఫున పాల్గొంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పోటీలకు ఎంపికై న విద్యార్థినులను ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు. భీమవరం (ప్రకాశంచౌక్) : గునుపూడి శ్రీ సోమేశ్వర జనార్దస్వామి దేవస్థానంలో గురువారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. 112 రోజులకుగాను రూ. 11,02,607 ఆదాయం లభించింది. విదేశీ కరెన్సీ 4 డాలర్లు ఉన్నాయి. స్వామివారి శాశ్వత నిత్యాన్నదానంనకు రూ.31,045 ఆదాయం వచ్చింది. దేవదాయ ధర్మాదాయ శాఖ భీమవరం తనిఖీ దారు పీఎస్ సాయికుమారి, ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగార్రాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన బోణం చినబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం పూలపల్లి ఎస్ఎస్ఎస్ కళ్యాణ మండపంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా గాంధీ భగవాన్రాజు, నూతన అధ్యక్షుడు బోణం చినబాబు, సెక్రటరీ సత్యనారాయణరాజు, ట్రెజరర్ సోంబాబు, ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చినబాబు మాట్లాడుతూ గత మూడేళ్లుగా పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాల ఆక్వా రైతు సంఘం ఏర్పాటుచేసి ఎనలేని పోరాటం చేస్తున్న గాంధీ భగవాన్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం అభినందనీయమని అన్నారు. జై భారత్ క్షీరారామ ఆక్వా నూతన సంఘం కూడా గాంధీ భగవాన్రాజు బాటను అనుసరిస్తూ ఆక్వా రైతుల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. అలాగే శుక్రవారం లంకలకోడేరు గ్రామంలో ఎంపెడా ఆధ్వర్యంలో జరగనున్న అవగాహనా సదస్సుకు ఆక్వా రైతులు హాజరుకావాలన్నారు. నూతన కార్యవర్గ సభ్యులను ఆక్వా రైతు సంఘం నాయకులు, రైతులు ఘనంగా సత్కరించారు. -
ఎరువు.. అక్రమాల దరువు
శురకవారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2026సాక్షి, భీమవరం: ఎరువుల బ్లాక్ మార్కెట్, జిల్లాల మధ్య అక్రమ రవాణాకు తాడేపల్లిగూడెం కేరాఫ్ అడ్రస్గా మారిందా? కొందరు హోల్సేల్ డీలర్లు పాత స్టాకును రీప్యాకింగ్ చేసి అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారా? ఇందుకు కూటమి నేతలు, కొందరు ఉద్యోగులు కొమ్ముకాస్తున్నారా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. జిల్లాలో తాడేపల్లిగూడెం ఎరువుల ర్యాక్ పా యింట్గా ఉంది. ఫెర్టిలైజర్స్ వ్యాపారంలో దీర్ఘకాలంగా వ్యాపారం అనుభవం ఉన్న డీలర్లు ఇక్కడ ఎందరో ఉన్నారు. జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం 2.21 లక్షలు, రబీ సాగు విస్తీర్ణం 2.3 లక్షల ఎకరాల వరకు ఉంటుంది. తొలకరిలో 17,800 టన్నుల యూరియా, 1,650 టన్నుల డీఏపీ, 32,500 ట న్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరమవుతాయి. దా ళ్వాలో 41,821 టన్నుల యూరియా, 64,992 టన్నుల ఇతర ఎరువులు వినియోగిస్తుంటారు. జిల్లాతో పాటు పరిసర జిల్లాలకు కంపెనీల కేటాయింపుల మేరకు యూరియా, డీఏపీ, ఇతర రకాల ఎరువులు రైల్వే వ్యాగన్లు ద్వారా సరఫరా అవుతుంటాయి. గూడెం నియోజకవర్గంలోని ప్రత్తిపాడు, నవాబుపాలెం, పెదతాడేపల్లి, చినతాడేపల్లి తదితర ప్రాంతాల్లో మార్క్ఫెడ్, ప్రైవేట్ డీలర్లకు చెందిన గోదాముల్లో వీటిని నిల్వ చేస్తుంటారు. రీ ప్యాకింగ్తో సొమ్ములు ఏడాదిన్నర క్రితం ఓ కంపెనీ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో బ్రాంచులు ఉన్న హోల్సేల్ డీలర్కు పెద్ద మొత్తంలో ఎరువులను కేటాయించింది. సదరు డీలరు వీటిని రీప్యాకింగ్ చేసి బస్తాకు రూ.30 నుంచి రూ.40 అదనంగా సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇదే తరహాలో మరికొందరు అక్రమాలకు పాల్పడినట్టు అప్పట్లో చర్చ నడిచింది. గతేడాది అధికారుల తనిఖీల్లో పలు గోదాముల్లో స్టాకు వ్యత్యాసాలు గుర్తించినా రాజకీయ ఒత్తిళ్లతో వాటిని కప్పిపుచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కృత్రిమ కొరత సృష్టించి.. కొందరు హోల్సేల్ డీలర్లకు పలు జిల్లాల్లో లైసెన్సులు ఉండటంతో కృత్రిమ కొరత సృష్టించి ఒక జిల్లాకు కేటాయించిన ఎరువులను మరో జిల్లాలో అధిక ధరలకు విక్రయిస్తూ రైతులపై భారం మోపుతున్నారంటున్నారు. అధికారులు తనిఖీలకు వచ్చి న సమయంలో కేవలం స్టాకు రికార్డులు మాత్రమే పరిశీలిస్తున్నారని, ఒక జిల్లాకు వచ్చిన సరుకు వాస్తవానికి ఏ జిల్లాలో విక్రయించారు? వే బిల్స్, ఇతర రవాణా పత్రాల ఆధారంగా పూర్తి పరిశీలన చేయకపోవడం వలన అక్రమాలు బయటకు రావడం లేదంటున్నారు. ఇటీవల యూరియా కంపెనీలు ఎమ్మార్పీ ధరను దఫదఫాలుగా రూ.5 నుంచి రూ.30 వరకు పెంచుతూ వచ్చాయి. ఈ క్రమంలో తక్కువ ధరకు వచ్చిన వాటిని రీప్యాకింగ్ చేసి కొత్త ధరకు సరఫరా చేశారని తెలుస్తోంది. పక్కదారి పట్టిస్తూ.. ప్రస్తుతం రైతులు యాప్ను డౌన్లోడ్ చేసుకుంటేగాని ఎరువుల కొనుగోలుకు అవకాశం లేదు. ఇదంతా రికార్డ్ ప్రకారం జరుగుతుంది. జిల్లాలో వ్యవసాయం చేసే రైతుల కంటే కౌలు రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరిలో చాలామందికి కౌలు గుర్తింపు కార్డులు లేవు. ఎరువుల కోసం అసలు రైతు పాస్బుక్ జెరాక్సులను ఎరువుల దుకాణాల్లో అందజేసి ఎరువులు పొందుతున్నారు. వీటి ఆధారంగా వ్యాపారులు ఎరువులను దారి మళ్లిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం యూరియా బస్తా అసలు ధర రూ.260 కాగా జి ల్లాలోని పలుచోట్ల రూ.300 నుంచి రూ.320 వరకు పెంచి అమ్మకాలు చేస్తున్నట్టు తెలిసింది. ఉన్నత స్థాయికి ఫిర్యాదు ఎరువుల గోదాములపై పూర్తిస్థాయిలో నిఘా కొరవడటంతో డీలర్ల ఇష్టారాజ్యంగా మారిందన్న విమర్శలున్నాయి. గతేడాది యూరియా కొరత ఏర్పడటం, అధిక ధరలకు అమ్మకాలు చేయడం నిదర్శనంగా రైతులు చెబుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలంటున్నారు. గోడౌన్లలో ఉన్న స్టాకును భౌతికంగా తనిఖీలు చేయాలని, వేబిల్స్, రవాణా పత్రాలు, స్టాక్ మూమెంట్, రిటైల్, హోల్సేల్ డీలర్ల లావాదేవీలను పూర్తిగా పరిశీలించాలని కోరుతున్నారు. గుంటూరుకు చెందిన ఒక అధికారి అండతో జిల్లాలో ఎరువుల అక్రమాలు జరుగుతున్నాయంటూ కొందరు ఉన్నత స్థాయికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణంలోని బలుసు మూడి బీసీ కాలనీలోని రామలక్ష్మమ్మనగర్లో గురువారం కలెక్టర్ సీహెచ్ నాగరాణి పర్యటించారు. సర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ, కాలనీలో పారిశుద్ధ్య పరిస్థితులు, చెత్త సేకరణ తదితర అంశాలపై ప్రజలను ఆరా తీశారు. డిజిటలైజేషన్ ప్రక్రియ వేగిరపర్చేందుకు ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని అసిస్టెంట్ కమిషనర్ రాంబాబును ఆదేశించారు. పారివుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. భీమవరం: ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదని, ఉద్యోగులంతా సిద్ధం కావాలని అమరావతి ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ ఐతం సత్యనారాయణ పిలుపునిచ్చా రు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఉద్యమానికి గురువారం భీమవరంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఉద్యోగులు, ఉపా ధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. 12వ పీఆర్సీ కమిషన్ను 2023 జూలై నాటికి నియమించాల్సిన ఉన్నా పట్టించుకోవడం లేదని, 30 శాతం తగ్గకుండా మ ధ్యంతర భృతి ప్రకటించి డీఏ బకాయిలు చెల్లించా లని డిమాండ్ చేశారు. ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని అన్నారు. సమస్యల పరిష్కారానికి సుదీర్ఘ పోరాటానికై నా వె నుకాడబోమన్నారు. జేఏసీ జనరల్ సె క్రటరీ అల్లం సత్యనారాయణ, ట్రెజరర్ కనకరావు, మహిళా విభాగం జనరల్ సెక్రటరీ బి.అరుణ పాల్గొన్నారు.ఏపీ జేఏసీ నాయకులు నిఘా కరువు ఫెర్టిలైజర్స్ ర్యాక్ పాయింట్గా తాడేపల్లిగూడెం గూడెం, పరిసరాల్లో విస్తరించిన ఎరువుల గోదాములు గతంలో రీ ప్యాకింగ్, బ్లాక్ మార్కెట్తో భారీగా దోపిడీ కూటమి నేతల కనుసన్నల్లో ఎరువుల దందా అక్రమాల అడ్డుకట్టకు ఉన్నత స్థాయికి ఫిర్యాదు -
ఫెర్రీ వేలం కోసం గ్రామస్తుల ఆందోళన
యలమంచిలి: అబ్బిరాజుపాలెం ఫెర్రీ వేలాన్ని మూడోసారి కూడా వాయిదా వేయడాన్ని నిరసిస్తూ గురువారం సచివాలయం వద్ద గ్రామస్తులు ఆందోళన చేశారు. గత రెండు పర్యాయాలు సరైన లైసెన్స్ లేని కారణంగా అధికారులు వేలాన్ని వాయిదా వేశారు. ఈసారి గ్రామానికి చెందిన శిరిగినీడి శ్రీనివాస్ లైసెన్స్ అగ్రిమెంట్ తీసుకురావడంతో వేలం రూ.13 లక్షలతో ప్రారంభించారు. రూ.7.50 లక్షల వరకు పాటను తగ్గించారు. అప్పటికీ పాట పాడకపోవడంతో పాటను శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఇన్చార్జి ఎంపీడీఓ జేడీవీ ప్రసాద్ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్ ప్రకటించారు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది రేవు పాట రూ.3.47 లక్షలకు వెళ్లిందని, అంతవరకు తగ్గించి వేలం నిర్వహించాలని పట్టుబట్టారు. అయితే వారి మాటలను పట్టించుకోకుండా వేలాన్ని వాయిదా వేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాన్ని కొనసాగించాలని సచివాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ శుక్రవారం వేలం తీరును చూస్తామని, అకారణంగా మరోసారి వాయిదా వేస్తే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని హత్యకేసులో నిందితుడి అరెస్ట్
భీమవరం అర్బన్: సాఫ్ట్వేర్ ఉద్యోగిని హత్యకేసులో నిందితుడు, ఆటో డ్రైవర్ శ్యాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భీమవరంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రఘువీర్ విష్ణు గురువారం వివరాలను వెల్లడించారు. తాడేరు గ్రామానికి చెందిన కొత్తపల్లి అనంతవాణి హైదరాబాద్లోని ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని. కొంతకాలంగా తల్లి అనారోగ్యంగా ఉండటంతో స్వగ్రామం తాడేరు వచ్చి వర్క్ ఫ్రం హోం ద్వారా ఉద్యోగం చేస్తోంది. బేతపూడి గ్రామ శివారు కొర్రపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ శ్యాంబాబు అనంతవాణికి మాయమాటలతో దగ్గరయ్యాడు. అయితే శ్యాంబాబుకు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలియడంతో కొంతకాలంగా అతడిని దూరం పెడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో అనంతవాణిపై కక్ష్య పెంచుకున్న శ్యాంబాబు ఈ నెల 5వ తేదీన ఆమె ఇంటికి వెళ్లి గొడవ పడి ఆమెను కత్తితో హత్య చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శ్యాంబాబుని యనమదుర్రు గ్రామంలోని వంతెన వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు హత్యకు వినియోగించిన కత్తి, ఆటో, ద్విచక్ర వాహనం, హత్య చేసిన సమయంలో ధరించిన దుస్తువులను స్వాఽధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. విలేకరుల సమావేశంలో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీశ్వరరావు, రూరల్ ఎస్సై ఐ వీర్రాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఎస్ఆర్ షాపింగ్మాల్ ప్రారంభం
భీమవరం: భీమవరంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఎస్ఆర్ షాపింగ్మాల్ను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సినీ నటి కృతి శెట్టి (ఉప్పెన ఫేం) ప్రారంభించనున్నట్లు షాపింగ్ మాల్ డైరెక్టర్ ప్రసాద్రెడ్డి గురువారం తెలిపారు. రాష్ట్రంలో 16వ బ్రాంచ్ను పట్టణంలోని ఉండి రోడ్డులోని బొంబే స్వీట్స్షాపు ఎదురుగా ఏర్పాటుచేసినట్టు చెప్పారు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందిస్తామన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఫ్యామిలీ మొత్తానికి అన్ని ఆఫర్లను అందిస్తున్నామన్నారు. డైరెక్టర్ కేశవరెడ్డి మాట్లాడుతూ సినీనటి కృతిశెట్టితోపాటు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు, మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, ఎంపీ పాక వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. -
మూసివేసిన బాలకేంద్రం ప్రహరీ గోడ
స్పందనపాలకొల్లు సెంట్రల్ : ఉదయం బాలభవన్... సాయంత్రం క్లబ్ పార్కింగ్ శీర్షికతో గత నెల 24న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు, క్లబ్ సభ్యులు స్పందించారు. బాలభవన్ ప్రహరీగోడను ఇష్టానుసారంగా పగులగొట్టి, ఆ స్థలాన్ని క్లబ్ సభ్యులు పార్కింగ్కు వాడుకుంటున్న తీరుపై సాక్షి కథనం ప్రచురించింది. దీనిపై బాలభవన్ చైర్మన్, జిల్లా కలెక్టర్ స్పందిస్తూ.. క్లబ్ ఆక్రమణలపై తక్షణమే పర్యవేక్షణ చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు. దీంతో స్థానిక తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లు బాలభవన్ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం క్లబ్ నిర్వాహకులను పిలిపించి గట్టిగా హెచ్చరించారు. అధికారుల హెచ్చరికలతో దిగొచ్చిన క్లబ్ సభ్యులు.. గత రెండేళ్లుగా తాము పార్కింగ్ స్థలంగా వాడుకుంటున్న బాలభవన్ స్థలాన్ని ఖాళీ చేశారు. అంతేకాకుండా, గతంలో పగులగొట్టిన ప్రహరీగోడను తిరిగి యథావిధిగా నిర్మించి బాలభవన్కు అప్పగించారు. ఈ వ్యవహారం పట్టణంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. బాలభవన్కు చిన్నారులు శిక్షణా తరగతుల కోసం వస్తుంటారని, దానికి పక్కనే క్లబ్ నిర్వహించడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
ఆక్వా రైతులకు అండగా
● 15న వైఎస్ జగన్ భీమవరం రాక ● ఏర్పాట్లను సమీక్షించిన నేతలు ● రైతులతో ముఖాముఖీ వేదికకు స్థల పరిశీలన భీమవరం పర్యటనలో భాగంగా జగన్ ఆక్వా రైతులతో భేటీకానున్నారు. అందుకోసం ఉండి బైపాస్ రోడ్డులో అనువైన స్థలాన్ని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు, రీజనల్ కోఆర్డినేటర్ అమర్నాథ్, ఎమ్మెల్సీ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశీల రఘురాం పరిశీలించారు. ఏర్పాట్లుపై నాయకులకు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ పార్లమెంట్ కార్యదర్శులు, ఎస్ఈసీ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు. సాక్షి, భీమవరం: సిండికేట్ దోపిడీతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆక్వా రైతులకు అండగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 15న భీమవరం రానున్నారు. ఆక్వా సమస్యలపై ఉండి బైపాస్ రోడ్డులో ఏర్పాటుచేయనున్న వేదిక వద్ద రైతులతో నేరుగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పర్యటన ఏర్పాట్లపై పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అధ్యక్షతన గురువారం భీమవరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షులు పేర్ని నాని, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పీఏసీ సభ్యుడు కొట్టు సత్యనారాయణ, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్లమెంట్ కోఆర్డినేటర్ గూడూరి ఉమాబాల, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఉప్పల వాసుబాబు, వడ్డి రఘురామనాయుడు, చినమిల్లి వెంకట్రావు, గుడాల శ్రీహరిగోపాలరావు తదితరులు సమావేశమయ్యారు. రైతుల ఆందోళనలు చంద్రబాబుకు పట్టవు ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించిన వివరాలను అమర్నాఽథ్ మీడియాకు వివరించారు. సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ కంపెనీలు ఏకమై మేత ధరలు పెంచేసి, రొయ్య ధరలు తగ్గించేసి ఆక్వా రైతుల్ని అడ్డగోలుగా దోచుకుంటున్నాయన్నారు. తమను ఆదుకోవాలని రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. నాలుగైదు కంపెనీలకు ఆక్వా సంపదను దోచిపెట్టేందుకు లక్షలాది ఆక్వా రైతు కుటుంబాల్ని రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు. మత్స్యకారులు వేటకు వెళ్లి ఆరుగురు గల్లంతయ్యారన్నారు. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో పొగాకు రైతులు, డెల్టాలో యూరియా దొరక్క వరి రైతులు పడుతున్న ఇబ్బందులు ఇవేమీ చంద్రబాబుకు పట్టవన్నారు. వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తే గొడ్డలంటాడు, తల్లంటాడు, చెల్లంటాడే తప్ప ప్రజాసమస్యల్ని ఏరకంగా పరిష్కరించాలనే ఆలోచన చంద్రబాబు చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి గడువిచ్చినప్పటికి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతుల పక్షాన పోరాటానికి జగన్ భీమవరం వస్తున్నారన్నారు. ఉండి బైపాస్ రోడ్డులో రైతులతో ముఖాముఖీగా సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారని అమర్నాథ్ తెలిపారు. పేర్ని నాని మాట్లాడుతూ విద్య, ఆక్వా తదితర అన్ని రంగాల్లో తన వాళ్లకి దోచిపెట్టడం లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. ఇచ్ఛాపురం నుంచి తడ వరకూ ఉన్న తీరప్రాంతం మొత్తం ప్రజలు చేపలు, రొయ్యల సాగుపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వీరి కష్టాన్ని చంద్రబాబు ఫీడ్, సీడ్ కంపెనీలకు దోచిపెడుతున్నారన్నారు. ఆక్వా చరిత్రలో తొలిసారి జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల ఆక్వా చరిత్రలో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేయడం మొదటిసారి చూస్తున్నామ న్నారు. రాయితీ విద్యుత్, ధరల నియంత్రణతో జగన్ ఆక్వా రంగాన్ని ఆదుకున్నారన్నారు. అంతకంటే ఎక్కువ మేలు చేస్తామంటూ ఎన్నికల్లో చెప్పుకొచ్చిన చంద్రబాబు రైతుల నడ్డి విరిచారని విమర్శించారు. జగన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని ప్రసాదరాజు తెలిపారు. -
బోళ్ల బుల్లిరామయ్య శత జయంతి వేడుకలు
తణుకు అర్బన్: మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ బోళ్ల బుల్లిరామయ్య శత జయంతి వేడుకలు తణుకు ఆంధ్రా సుగర్స్ లిమిటెడ్ సంస్థ ఆవరణలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ ది ఆంధ్రా సుగర్స్ లిమిటెడ్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గాను, రాజకీయ రంగంలో నాలుగుసార్లు ఎంపీగా, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా బుల్లిరామయ్య అందించిన సేవలను కొనియాడారు. అనంతరం ఉద్యోగులకు మిఠాయిలు పంచారు. సంస్థ అడిషనల్ సెక్రటరీ పీవీఎస్ విశ్వనాధకుమార్, జనరల్ మేనేజరు (హెచ్ఆర్) ఎ.సాంబశివరావు, వివిధ విభాగాల అధిపతులు, సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు -
వ్యక్తి ఆత్మహత్య
దెందులూరు: కుమార్తె మరణంతో మనోవేదనకు గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దెందులూరు ఎస్సై డి వెంకట్ కుమార్ తెలిపిన వివరాలు ఇవి. కొవ్వలి గ్రామానికి చెందిన గొరిపర్తి శ్రీనివాసరావు (52) ఈ నెల 8న పొలంలో నీరసంగా పడి ఉండడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. కుమార్తె మరణంతో మనోవేదన గురై పురుగులమందు తాగినట్లు చెప్పడంతో అర్ధరాత్రి ఏలూరు ఆశ్రమం వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు. భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని కేరళ రాష్ట్ర డీజీపీ రావాడ ఆజాద్ చంద్ర శేఖర్, సరిత దంపతులు గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి పూజలు చేసి డీజీపీ దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, వుదీశి మీనాక్షి శేషవస్త్రం, ప్రసాదం ఫొటో అందజేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు. -
ఆక్వా రంగ పురోభివృద్ధికి కృషి చేయాలి
వీరవాసరం: మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఆక్వా రంగ పురోభివృద్ధికి సిబ్బంది, రైతులు కలిసికట్టుగా పాటుపడాలని జిల్లా మత్స్య శాఖ అధికారి (డీఎఫ్ఓ) శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశాల మేరకు వీరవాసరం, పెనుమంట్ర, అత్తిలి, ఇరగవరం, పాలకోడేరు మండలాల ఆక్వా రైతులకు మంగళవారం వీరవాసరంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ మాట్లాడుతూ.. ఆక్వాకల్చర్ రంగంలో నమోదు ప్రక్రియలు, ఉత్తమ యాజమాన్య పద్ధతులపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అప్సడా రిజిస్ట్రేషన్లు, ఎంపెడా చెరువుల ఎన్రోల్మెంట్స్, పోస్ట్ హార్వెస్ట్ టెస్ట్ సర్టిఫికెట్, ఎగుమతుల ప్రక్రియ (ఎక్స్పోర్ట్ ప్రొసీజర్స్) తదితర అంశాలపై ఆయన రైతులకు వివరించారు. రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ పి.రామ్మోహనరావు మాట్లాడుతూ.. రొయ్యలకు వచ్చే వైట్ సిండ్రోమ్, వివిధ వైరస్ వ్యాధులపై రైతులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. అనంతరం రైతులు అడిగిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఎంపెడా డీడీ గోపాల్ ఆనంద్, ఉండి రిసోర్స్ సెంటర్ హెడ్ చంద్రశేఖర్, ఎఫ్డీఓ సతీష్, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, గౌరిప్రియ, భోగిరెడ్డి శ్రీనివాస్, గంధం కేసుబాబు, యరకరాజు గోపాలకృష్ణరాజు, మళ్ల ప్రకాష్, మళ్ల శ్రీరామ్మూర్తి, తాడాల ప్రసాద్లతో పాటు రొయ్యల రైతులు పాల్గొన్నారు. -
దస్తావేజు లేఖర్ల నిరాహారదీక్ష
భీమవరం: ప్రజా, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో రిజిస్ట్రేషన్లను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396ను నిరసిస్తూ మంగళవారం భీమవరంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు, అసిస్టెంట్లు, స్టాంప్ వెండర్లు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా దస్తావేజు లేఖర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తాళ్ళూరి మధు, భీమవరం లేఖర్ల అసోసియేషన్ కార్యదర్శి కవురు పృథ్వీశంకర్ మాట్లాడుతూ.. 396 జీవో వల్ల ప్రజల ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయని, దీనివల్ల ఆస్తులకు రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాలుగు లక్షల మంది దస్తావేజు లేఖర్లు, అసిస్టెంట్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్ల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న దస్తావేజు లేఖరుల వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదని, కాబట్టి ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియనే యథావిధిగా కొనసాగించాలని వారు కోరారు. 396 జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, రెండు రోజుల పాటు పెన్డౌన్ కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి గుండు హరిబాబు, గండ్రెడ్డి మధు, వీరగొట్టపు అప్పారావు, రాపాక శ్యామల ప్రసాద్, పామర్తి మహేష్, మేకా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
సివిల్ కేసుల రాజీకి ప్రాధాన్యత
భీమవరం: ఈనెల 11వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో క్రిమినల్కేసులతో పాటు సివిల్ కేసుల రాజీకి ప్రాధాన్యం ఇవ్వాలని భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ బి.లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం భీమవరంలో న్యాయవాదులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జడ్జి లక్ష్మీనారాయణ మాట్లాడారు. కేసుల రాజీ వలన కలిగే ప్రయోజనాలను కక్షిదారులకు తెలియజేయాలన్నారు. అనంతరం న్యాయవాదులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) ఎం సుధారాణి, ఒకటవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పి హనీష, 2వ అదనపు జ్యుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఎన్ జ్యోతి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆరేపల్లి నటరాజ్, జనరల్ సెక్రటరీ బడుగు అశోక్ బాబు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్) : జిల్లా జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న టి.రాహుల్కుమార్రెడ్డి బదిలీ అయ్యారు. ఆయన్ను సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో కె.ఆర్.కల్పశ్రీ జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమితులయ్యారు. భీమవరం : రాష్ట్రంలోని ఇతర అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతున్నా విద్యాశాఖలో మాత్రం జిల్లా విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపుల అంశాన్ని కారణంగా చూపుతూ పదోన్నతులు నిలిపివేయడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి ప్రకాశం, బీవీ నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు ప్రతి ఏటా బదిలీలు, పదోన్నతులు కల్పించాలనే నిబంధనను సక్రమంగా అమలు చేయకపోవడంతో చాలామంది ఉపాధ్యాయులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పదవి విరమణకు దగ్గరలో ఉన్న ఉపాధ్యాయులకు సక్రమంగా పదోన్నతులు అందక పోవడంతో ఆర్థికంగా ఎంతో నష్టపోతారన్నారు. ప్రభుత్వం పోస్టుల ఫ్రీజింగ్ గడువు ఈనెల 13వ తేదీ వరకు పెంచిన నేపథ్యంలో ఇప్పటికై నా పదోన్నతులు కల్పించాలని ప్రకాశం, నారాయణ కోరారు. పోలవరం రూరల్: గోదావరి నదిలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండటంతో నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల నీరు నదిలోకి చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 26.690 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. నీటిమట్టం పెరుగుతుండటంతో స్పిల్వే 48 గేట్ల నుంచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. మహానందీశ్వరస్వామి ఆలయానికి వెళ్లే తాత్కాలిక రోడ్డు మార్గం కోతకు గురై రోడ్డు దిగువన వేసిన తూరలు కూడా కొట్టుకుపోయాయి. ఎగువ నుంచి వర్షపు నీరు చేరుతుండటంతో మరింత నీరు పెరిగే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఉంగుటూరు: చేబ్రోలు వద్ద రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మృతిచెందిన షేక్ చాంద్ బాషా, అతని భార్య హసీనా, పెద్ద కుమార్తె ఫరీన్, చిన్న కుమార్తె సమీరాల మృతదేహాలకు మంగళవారం గుడివాడలో హసీనా తమ్ముడు అబ్దుల్లా అంత్యక్రియలు నిర్వహించారు. సోమవారం సాయంత్రానికి తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి కావడంతో, రైల్వే పోలీసులు మృతదేహాలను బాషా బావమరిదికి అప్పగించారు. తాడేపల్లిగూడెంలో బాషా బంధువులు ఎవరూ లేకపోవడంతో అబ్దుల్లా మృతదేహాలను గుడివాడకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపారు. వారి మరణానికి గల ప్రధాన కారణాలను కేసు దర్యాప్తు చేస్తున్న సి.ఐ. శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కుటుంబంలోని నలుగురూ వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, దీనికి తోడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ సమస్యలన్నింటికీ చావే పరిష్కారం అనుకుని వారు ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు చెప్పారు. -
మనసున్న మారాజు
● సాగును పండగ చేసిన వైఎస్సార్ ● ఫీజు రీయింబర్స్మెంట్తో పేద విద్యార్థులకు వెలుగులు ● ఆరోగ్యశ్రీ, 108, 104లతో వైద్య భరోసా ● గూడెంలో ఉద్యానవర్సిటీ ఏర్పాటు ● నేడు వైఎస్ జయంతి ● జిల్లా అంతటా సేవా కార్యక్రమాలకు సన్నాహాలు ఫీజు రీయింబర్స్మెంట్తో ఇంజనీరింగ్ చదువుకుని రైల్వే లోకో పైలెట్ ఉద్యోగం సాధించాను. నేడు సీనియర్ అసిస్టెంట్ లోకో పైలెట్గా పనిచేస్తున్నాను. నా ఉన్నత స్థితికి వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకమే కారణం. ఆయన చేసిన మేలును ఎన్నటికి మరువలేను. – కడలి బాలకృష్ణ, పడమటిపాలెం, వీరవాసరం మండలం కూలి పని చేసుకుని జీవించే నాకు గుండె జబ్బు రావడంతో నా పని అయిపోయిందనుకున్నాను. పిల్లల పరిస్థితి ఏమిటని దిగులుచెందుతున్న సమయంలో ఆరోగ్యశ్రీ ఆదుకుంది. 2008లో ఉచితంగా ఆపరేషన్ చేయించి తండ్రి ప్రాణం నిలబెడితే ఆయన తనయుడు జగన్ గత ప్రభుత్వంలో మా సొంతింటి కలను సాకారం చేశాడు. – చేబోలు వీర్రాజు, ఆకివీడు నేను పాల వ్యాపారం చేసేవాడిని. ఒక రోజు పాల సైకిల్ వేసుకుని వెళ్తుండగా చాతిలో నొప్పి వచ్చి ఆయాసం అనిపించింది. వైద్యులను సంప్రదించగా వెంటనే పెద్దాసుపత్రికి చూపించుకోమన్నారు. రాజమహేంద్రవరంలో చూపిస్తే బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారు. ఆ సమయంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంలో ఫ్రీగా ఆపరేషన్ చేసి మందులు అందచేశారు. ఆ మహానుభావుడు ప్రవేశపెట్టిన పథకం వల్లే జీవితం గడుపుతున్నాను. – జి.త్రినాథులు, మేడపాడుసాక్షి, భీమవరం : జిల్లాతో దివంగత వైఎస్సార్కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. రాజకీయ ప్రస్థానంలో పలుమార్లు జిల్లాకు విచ్చేసిన వైఎస్సార్ ఇక్కడి ప్రజలతో మమేకమయ్యేవారు. చోటామోటా నాయకులను పేరుపేరునా పలకరించేవారు. పెద్దాయన ఆత్మీయ పలకరింపుతో ప్రజలు ఉబ్బితబ్బిబ్బయ్యేవారు. ప్రగతి పరవళ్లు ● పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి భీమవరం పట్టణ పరిధిలో 82 ఎకరాలు, ఆకివీడు మండలం తాళ్లకోడులో 74 ఎకరాలు, నరసాపురంలో 15 ఎకరాలు, పాలకొల్లులో 70 ఎకరాలు, పెనుగొండలో 36 ఎకరాలు, తణుకులో 14 ఎకరాలు, జిల్లా అంతటా వందల ఎకరాలు సేకరించారు. వేలాది మందికి సొంత గూడును సమకూర్చారు. ● ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపు 32 వేల మందికి దాదాపు రూ.150 కోట్ల విలువైన వైద్యసేవలు అందించారు. అర్హులందరికీ పింఛన్ల మంజూరు, పావలా వడ్డీ రుణాలు, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర పథకాలు ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేశారు. ● దక్షిణ భారత దేశంలో మొదటిగా 2007లో హార్టీకల్చర్ యూనివర్శిటీని తాడేపల్లిగూడెం రూరల్ వెంకట్రామన్నగూడెంలోని 220 ఎకరాల్లో ఏర్పాటుచేశారు. దేశవ్యాప్తంగా ఉద్యాన రైతులకు సేవలు అందిస్తున్న ఈ వర్శిటీ ద్వారా 23 రకాల వంగడాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ● డెల్టా ఆధునికీకరణలో సుమారు రూ.140 కోట్లతో కాలువల అభివృద్ధితో పాటు రుణమాఫీ, పావలా వడ్డీ రుణాలు, ఉచిత విద్యుత్, కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీ కార్యక్రమాల ద్వారా సాగును పండగ చేశారు. ● నరసాపురం రూరల్ పేరుపాలెం బీచ్కు అనుంసంధానంగా రోడ్లను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు. ● భీమవరంలో సమ్మర్ స్టోరేజి ట్యాంకు–2, యనమదుర్రు డ్రెయిన్పై ఐదు వంతెనలు, పాలకొల్లు మండలం శివుదేవని చిక్కాలలో సాగునీటికి ఎత్తిపోతల పథకం, తాడేపల్లిగూడెంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల స్థాపన, ఆంధ్రా యూనివర్శిటీ క్యాంపస్, రూ.34 కోట్లతో యాగర్లపల్లి వద్ద రెండో ఫ్లైఓవర్, ఎరక్రాలువపై అప్పారావుపేట, వీరంపాలెం, మాధవరం కంసాలిపాలెం వద్ద మూడు వంతెనలు, మోడ్రన్న్ లైబ్రరీ తదితర అభివృద్ధి పనులు వైఎస్ హయాంలో చేసినవే. వైఎస్ఆర్.. ఈ పేరు పేదల సొంతింటి కలను సాకారం చేసింది. ఆపదలోని ఎందరి ప్రాణాలనో నిలిపింది. పేదింటి పిల్లల్ని ఇంజినీర్లు, డాక్టర్లు, ఉన్నత విద్యావంతుల్ని చేసింది. వ్యవసాయాన్ని పండుగ చేసింది. ఇందిరమ్మ, జలయజ్ఞం, 108, 104, పింఛన్లు, పావలా వడ్డీ, రుణమాఫీ తదితర పథకాలతో ఆయన పాలన స్వర్ణయుగాన్ని తలపించింది. అందుకే వైఎస్సార్ పేరు వింటే పేదల మోములు వికసిస్తాయి. వారి హృదయాలు ఆనందంతో నిండిపోతాయి. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే.. నమస్తే.. నమస్తే బాబు.. నమస్తే పాప.. నమస్తే.. నమస్తే.. నమస్తే. అంటూ ఆత్మీయంగా పిలిచే పెద్దాయన దివికేగి ఏళ్లు గతించినా పేదల గుండెల్లో గూడుకట్టుకుని ఉన్నారు. వైఎస్ 77వ జయంతి సందర్భంగా బుధవారం జిల్లా అంతటా వేడుకలు, పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల నిర్వహణకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాట్లు చేశారు. -
ఆక్వా రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించాలి
పాలకొల్లు సెంట్రల్: ఫీడ్ కంపెనీలు ధరలు తగ్గించకుండా, ప్రాసెసింగ్ యూనిట్లు రొయ్యల ధరలు పెంచకుండా తాత్సారం చేస్తే ఆక్వా రైతులకు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ‘క్రాప్ హాలిడే’ (పంట విరామం) ప్రకటిస్తూ ప్రత్యేక జీవో విడుదల చేయాలని రాష్ట్ర ఆక్వా సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పూలపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం అప్సడా ఆధ్వర్యంలో జరిగిన జూమ్ సమావేశంలో రా మెటీరియల్ కొరత సాకుతో ఫీడ్ కంపెనీలు ధరలు పెంచాయని, అదే సమయంలో ఉత్పత్తి పెరిగిందనే నెపంతో ప్రాసెసింగ్ యూనిట్లు రొయ్యల ధరలు తగ్గించాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల 100 కౌంట్కు రూ.40 నుంచి రూ.50 వరకు రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. దేశంలోనే ఏపీ నుంచి ఆక్వా ఉత్పత్తి ఎక్కువగా జరుగుతున్నందున, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి 100 కౌంట్ రొయ్యలకు రూ.300 మద్దతు ధరను సబ్సిడీ రూపంలోనైనా అందించాలని డిమాండ్ చేశారు. అలాగే మొత్తం ఉత్పత్తిలో 30 శాతాన్ని దేశీయ మార్కెట్లో విక్రయించే అవకాశం కల్పించాలన్నారు. ప్రభుత్వం ఈ విధానాలపై స్పందించకుంటే పంట విరామం ప్రకటించడం ద్వారానే మున్ముందు రొయ్యలకు మంచి ధర లభిస్తుందని స్పష్టం చేశారు. వారం రోజుల్లో దీనిపై ప్రత్యక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆక్వా సంఘం నాయకులు మేడిది జాన్రాజు, అంగర వరప్రసాద్, సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. -
రైతు కంట కన్నీరు
జంగారెడ్డిగూడెం: రైతు కంట కన్నీళ్లు పెట్టించే ప్రభుత్వానికి మనుగడ ఉండదని ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్సీపీ, రైతు సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన, ధర్నా, సభ నిర్వహించారు. పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, కార్లు, బైకులతో ర్యాలీగా తరలివచ్చారు. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ వద్ద ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ పంచాయతీ కార్యాలయం, గంగానమ్మ గుడి సెంటర్, బోసు బొమ్మ సెంటర్, అశ్వరావుపేట రోడ్డు మీదుగా టొబాకో బోర్డ్ కార్యాలయం వరకు సాగింది. వర్జీనియా పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ సురేంద్రకు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డీఎన్నార్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, రైతు సంక్షేమంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఆనందంగా లేరని, దీనికి కారణం చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలేనని విమర్శించారు. వర్జీనియా పొగాకు రైతుకు కనీస మద్దతు ధర కేజీ రూ. 300 ఇవ్వాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మాట్లాడుతూ గత ఏడాది వర్జీనియా పొగాకుకు గరిష్టంగా రూ.450 పైగా రాగా, ఈ ఏడాది గరిష్టంగా రూ.260 మాత్రమే వస్తోందని చెప్పారు. దివంగత నేత వైఎస్సార్ రైతు బాంధవుడిగా ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం వంటి పథకాలు ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు వరి పండించవద్దని అనడం దౌర్భాగ్యమని విమర్శించారు. వైఎస్సార్ హయాంలో రూ.200 కోట్ల సాయం పోలవరం నియోజకవర్గ కన్వీనర్ తెల్లం బాలరాజు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్సార్ హయాంలో పొగాకు రైతులను రూ.200 కోట్లు ఇచ్చి కొనుగోలుచేసి ఆదుకున్నారని గుర్తు చేశారు. జగన్మోహన్రెడ్డి కూడా మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి ఆదుకున్నారన్నారు. చంద్రబాబు మాత్రం వ్యవసాయం దండగని రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రభుత్వానికి రైతుల సంక్షేమం ముఖ్యం కాదని, కేవలం రాజకీయాలే ముఖ్యమని విమర్శించారు. మామిడి, మిర్చి, వరి రైతులంతా తీవ్ర నష్టాల్లో ఉన్నారని, విత్తనాలు, ఎరువుల దగ్గర నుంచి పంట అమ్ముకునే వరకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రశించే వారిపై కేసులు పెట్టడం, మామిడి రైతులపై లాఠీఛార్జి చేయడం అమానుషమని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వరరావు, సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు ధర్ముల సురేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పొగాకు కొనుగోలుకు రూ. 1000 కోట్లు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు రైతులను చిన్న చూపు చూస్తున్నారని ధ్వజమెత్తారు. పొగాకు రైతులకు అండగా నిలబడి పోరాటం చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు, ఏలూరు కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్, బీవీఆర్ చౌదరి, రైతు సంఘాల నాయకులు సత్రం వెంకటరావు, వామిశెట్టి హరిబాబు, ఓరుగంటి నాగేంద్ర, కర్పూరం గుప్త, కుక్కల ధర్మరాజు, జెట్టి సత్య ఆదిత్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ విభాగాల నాయకులు, కార్యకర్తలు, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వానికి మనుగడ ఉండదు వర్జీనియా పొగాకు రైతుల భారీ నిరసన ర్యాలీలో వక్తలు గిట్టుబాటు ధర కల్పించాలంటూ జంగారెడ్డిగూడెంలో భారీ బహిరంగ సభ కేజీకి కనీస మద్దతు ధర రూ.300 ఇవ్వాలని డిమాండ్ వైఎస్సార్సీపీ, వామపక్షాలు, రైతుల సంఘాల నేతల హాజరు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు మాట్లాడుతూ ప్రస్తుతం వర్జీనియా రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జగన్ హయాంలో మార్క్ఫెడ్ ద్వారా నిధులు ఏర్పాటు చేసి పొగాకును కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం పండించిన పంట కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు. వర్జీనియా పొగాకు వల్ల విదేశీ మారకద్రవ్యం లభిస్తుందని, లక్షలాది మంది కూలీలు దీనిపై ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు మాట్లాడుతూ చంద్రబాబు తనను విజనరీ సీఎంగా చెప్పుకుంటారని, అసలు విజన్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకుంటున్నారని, రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. పోలవరం కన్వీనర్ తెల్లం బాలరాజు మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో పొగాకు పంట ద్వారా ప్రజలు ఉపాధి పొందుతున్నారని, గతంలో వైఎస్సార్, జగన్మోహన్రెడ్డి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. -
బాలిక మృతిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారుల విచారణ
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన మోతుగూడెంకు చెందిన నాలుగేళ్ల కొండరెడ్డి బాలిక మృతిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం విచారణ జరిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డిఎంహెచ్ఓ) డాక్టర్ యు.శోభ, జిల్లా మలేరియా అధికారి వి.ఎస్.ఎస్.ప్రసాద్, జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాంబాబు, కేఆర్ పురం ఐటిడిఏ డిప్యూటీ డిఎంహెచ్ఓ సుమతి మంగళవారం బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (సిహెచ్సీ) సందర్శించారు. ఈ సందర్భంగా బాలిక మృతికి గల కారణాలపై అక్కడి వైద్యులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని అధికారులు తెలిపారు. అనంతరం డిఎంహెచ్ఓ శోభ మోతుగూడెం గ్రామాన్ని సందర్శించారు. మృతి చెందిన బాలిక తల్లిదండ్రులు గురుగుంట్ల వెంకటరెడ్డి, సునీతలను పరామర్శించి, ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ వసుంధర, ప్రోగ్రామ్ ఆఫీసర్ పూజ, అంతర్వేదిగూడెం పిహెచ్సీ వైద్యాధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన జాతీయ స్థాయి నాటిక పోటీలు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ సౌజన్యంతో హేలాపురి కళా పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక వైఎంహెచ్ఏ హాల్లోని కానాల గురుమూర్తి కళావేదికపై నిర్వహిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు 18వ స్మారక జాతీయస్థాయి నాటిక పోటీలు నాలుగో రోజైన మంగళవారం ఆహ్లాదభరిత వాతావరణంలో ముగిశాయి. ముందుగా యడ్లపాడు మానవత సాగరి సంస్థ ఆధ్వర్యంలో జరుగుల రామారావు రచన, దర్శకత్వంలో ప్రదర్శించిన ‘అందరూ మంచివారే.. కానీ’ అనే నాటిక కుటుంబ బంధాలను, మానవ సంబంధాలను కాపాడుకోవాలనే సందేశాన్ని ఇస్తూ సాగింది. అనంతరం జరుగుల రామారావు దర్శకత్వంలోనే ‘బావా ఎప్పుడు వచ్చితీవు’ అనే మరో నాటికను ప్రదర్శించారు. సంకుచిత భావాలున్న భర్తకు తగిన రీతిలో బుద్ధి చెప్పే భార్య కథను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఘనంగా బహుమతుల ప్రదానం నాటిక ప్రదర్శనల అనంతరం రాత్రి బహుమతి ప్రదానోత్సవ సభ అత్యంత వైభవంగా నిర్వహించారు. హేలాపురి కళా పరిషత్ అధ్యక్షులు పెదపాటి రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ నాటక పరిషత్ల సమాఖ్య అధ్యక్షుడు బుద్దాల వెంకట రామారావు, ఆంధ్రప్రదేశ్ నాటక పరిషత్ వేదిక అధ్యక్షుడు ముత్తవరపు సురేష్ బాబు, బొప్పన నరసింహారావు, కళారత్న ఎస్.వి. రామారావు, గరికపాటి కాళిదాసు, మజ్జి సూర్యకాంతారావు, కే.బి. రావు తదితరులు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుత్తా కౌసలేంద్రరావు, పి. విజయ్ కుమార్, వల్లముల రామాంజనేయులు, మండవ రాజగోపాలకృష్ణ తదితరలు పాల్గొన్నారు. -
మీరు ఇక మారరా ‘సర్’?
సాక్షి, టాస్క్ఫోర్స్: సర్ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చొరబడుతున్నారు. ఏకంగా గ్రామ సచివాలయంలో బీఎల్ఓలతో కలిసి డిజిటలైజేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో? అర్థం చేసుకోవచ్చు. తాజాగా పెంటపాడు మండలం మౌంజీపాడు గ్రామ సచివాలయంలో టీడీపీ నాయకుడు పాతూరు రాంప్రసాద్ చౌదరి డిజిటలైజేషన్ ప్రకియను నిర్వహిస్తున్నాడు. గతంలో ఈయనే ఓ మహిళ ఫామ్ను నింపడం చర్చనీయాంశమైంది. అయితే ఇంత జరుగుతున్నా టీడీపీ నాయకులపై ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకవపోవడం గమనార్హం. తణుకు అర్బన్: కట్నం కోసం వేధిస్తున్న భర్తతో పాటు మరొక నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తణుకు రూరల్ ఎస్సై నాళం శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన మానసకు హైదరాబాద్కు చెందిన తుమ్మల కృష్ణతో 2002లో వివాహమైంది. పెళ్లి నాటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని భర్త, అత్తమామలు వేధిస్తున్నారని బాధితురాలి తండ్రి శ్రీమన్నారాయణమూర్తి పోలీసులను ఆశ్రయించాడు. -
పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన
పోలవరం రూరల్ 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళవారం ఆయన ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నెల రెండో వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరాన్ని సందర్శించనున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం రూ.990 కోట్లతో 440 రోజుల్లోనే కొత్త డయాఫ్రం వాల్ నిర్మించిందని మంత్రి చెప్పారు. ఏడాది కాలంలో గ్యాప్–1 పనులు 48 శాతం, గ్యాప్–2 పనులు 29 శాతం పూర్తయ్యాయని, 2027 నాటికి ఈసిఆర్ఎఫ్ డ్యాం పూర్తి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రధాన కాలువలను అనుసంధానించే 4 టన్నెల్స్ మరో 10 రోజుల్లో పూర్తవుతాయన్నారు. కేంద్రం రూ.8,323 కోట్లు అడ్వాన్స్గా ఇచ్చిందని దీంతో పనుల్లో వేగం పెరిగిందని తెలిపారు. నిర్వాసితుల ఇళ్ల నిర్మాణ సాయాన్ని రూ.3.5 లక్షలకు, ఇంటి స్థలం మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచామని, జూలైలో సీఎం పర్యటన సందర్భంగా రూ.200 కోట్ల నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. 2027 నాటికి తొలిదశ ఆర్అండ్ఆర్ పూర్తి చేస్తామన్నారు. పోలవరాన్ని ఐకానిక్ బ్రిడ్జిలు, రిసార్ట్స్తో టూరిజం హబ్గా మారుస్తామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో జేసీ వి.అభిషేక్, ఈఎన్సీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
దళిత రైతులకు దక్కని అసైన్డ్ ఫలాలు
చింతలపూడి: నిరుపేద దళితుల ఆర్థికాభివృద్ధి కోసం గతంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక మంచి పథకం క్షేత్రస్థాయిలో అక్రమార్కుల పాలువుతోంది. గత ప్రభుత్వం ఏలూరు జిల్లాలోని పలు మండలాల్లో నిరుపేద ఎస్సీ రైతులకు సాగు నిమిత్తం అసైన్డ్ భూములను కేటాయించింది. ఆ భూములకు సాగునీటి సౌకర్యం కల్పించి, దళిత రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాలనే లక్ష్యంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ఉచితంగా సామూహిక వ్యవసాయ బావులను (కమ్యూనిటీ బోర్వెల్స్) తవ్వించింది. అంతేకాకుండా లక్షలాది రూపాయల ప్రజాధనంతో వీటికి మోటార్లు, విద్యుత్ సౌకర్యం కూడా కల్పించింది. చేతులు మారిన భూములు.. అక్రమార్కుల చేతుల్లో బోర్లు ప్రభుత్వం ఆశించిన ఆశయం బాగున్నా, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా మారింది. నిరుపేదలకు చెందిన ఆ అసైన్డ్ భూములు, లక్షల రూపాయల ఖర్చుతో వేయించిన బోర్ల ఫలాలు నేడు అర్హులైన ఎస్సీ రైతుల చేతుల్లో లేవు. దళితుల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకున్న కొందరు బడా రైతులు, స్థానిక రాజకీయ పలుకుబడి ఉన్న నేతలు ఆ భూములను, బోర్లను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. సొంత భూముల్లోనే కూలీలుగా.. గత కొద్ది సంవత్సరాలుగా సాగు పెట్టుబడులు పెరిగిపోవడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడంతో దళిత రైతులు తమ భూములను ధనిక రైతులకు అప్పగించాల్సి వచ్చింది. చాలా చోట్ల ఎస్సీ కార్పొరేషన్ నిర్మించిన బోర్లు, మోటార్లతో సహా భూములను అనధికారికంగా బడా రైతులు కొనుగోలు చేశారు. రికార్డుల్లో దళిత రైతుల పేర్లు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పంటలు పండించి లాభాలు గడిస్తున్నది మాత్రం ఇతర ధనిక వర్గాలే కావడం గమనార్హం. నాడు ప్రభుత్వం ఎవరినైతే భూయజమానులుగా చూడాలనుకుందో, ఆ దళిత రైతులే నేడు తమ సొంత భూముల్లోనే కూలీలుగా మారిన దుస్థితి నెలకొంది. సమగ్ర విచారణ అత్యవసరం ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు స్పందించి ప్రత్యేక సర్వే నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలోని ఏయే మండలాల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బోర్లు వేశారు? ప్రస్తుతం అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయి? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలి. అక్రమంగా భూములు, బోర్లను అనుభవిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని, తిరిగి ఆ వసతులను నిరుపేద దళిత రైతులకు దక్కేలా చూడాలి. లేనిపక్షంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఆశయం నీరుగారిపోతుంది. మా సంస్థ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం ద్వారా జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారులను వివరాలు కోరగా.. ఆ సమాచారం తమ వద్ద అందుబాటులో లేదని సమాధానం ఇచ్చారు. కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసిన ఒక పెద్ద పథకానికి సంబంధించిన వివరాలు లేవని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలి. – తుల్లిమెల్లి కుటుంబరావు, ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు -
వ్యక్తిని బలిగొన్న భూ వివాదం
జంగారెడ్డిగూడెం: కొద్దిపాటి వ్యవసాయ భూమి కోసం అన్నదమ్ముల కుటుంబాల మధ్య నడుస్తున్న వివాదం చివరకు రక్తపాతానికి దారితీసింది. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామ శివారులోని రైతు భరోసా కేంద్రం వద్ద మంగళవారం మధ్యాహ్నం కారుమూరి దుర్గారెడ్డి (55) తన అన్న కుమారుడి చేతిలో హత్యకు గురయ్యాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం పేరంపేట గ్రామానికి చెందిన కారుమూరి వెంకటరెడ్డి, దుర్గారెడ్డి అన్నదమ్ములు. వీరికి పంగిడిగూడెం వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న 1.70 ఎకరాల వ్యవసాయ భూమి విషయంలో గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. తమకు ప్రాణహాని ఉందని, భూమిని ఇప్పించాలని దుర్గారెడ్డి గతంలో జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేశారు. గత ఆదివారం కూడా పొలంలో పని చేసుకుంటుండగా వెంకటరెడ్డి, అతని కుమారుడు శ్రీనివాసరెడ్డి వచ్చి దుర్గారెడ్డిపై దాడికి ప్రయత్నించాడు. దీనిపై బాధితుడు డయల్ 112కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరువర్గాలను పిలిపించి బైండోవర్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం దుర్గారెడ్డి రైతు భరోసా కేంద్రం వద్ద కూర్చుని ఫోన్ మాట్లాడుతుండగా, అతని అన్న కుమారుడు శ్రీనివాసరెడ్డి కత్తితో విచక్షణా రహితంగా నరికి చంపాడు. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే.. చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఘటనాస్థలానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దుర్గారెడ్డిని హత్య చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. దుర్గారెడ్డికి ప్రాణహాని ఉందని హత్యకు అరగంట ముందే మా క్యాంపు కార్యాలయం నుంచి జంగారెడ్డిగూడెం పోలీసులకు ఫోన్ చేసి రక్షణ కల్పించాలని కోరినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. పోలీసులు సకాలంలో స్పందించ లేదని, ఇది ముమ్మాటికీ శాంతిభద్రతల వైఫల్యమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా వైఫల్యం లేదు దుర్గారెడ్డి హత్య కేసులో పోలీసుల వైఫల్యం ఏమీ లేదని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా అదనపు ఎస్పీ వై.ప్రసాదరావు, ఏఎస్పీ సుస్మిత స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి జంగారెడ్డిగూడెం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. వివాదాస్పద భూమిని దున్నుతున్నారని సమాచారం అందడంతో, పోలీసులు పనులు నిలిపివేయించి వెళ్లారని వివరించారు. అయితే పోలీసులు అక్కడి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే దుర్గారెడ్డి హత్యకు గురయ్యాడని తెలిపారు. బాబాయిని నరికి చంపిన వ్యక్తి -
శబ్ద కాలుష్యానికి కారణమైతే వాహనాల సీజ్
ఏలూరు టౌన్: ఏలూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ శబ్ద కాలుష్యంతో ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తే భారీ జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ హెచ్చరించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శబ్ద కాలుష్యంపై తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు ఉక్కుపాదంతో చర్యలు చేపడతారని స్పష్టం చేశారు. ఈ డ్రైవ్లో భాగంగా ఇప్పటివరకు 15 స్పీకర్ బాక్సులు, 225 ఎల్ఈడీ లైట్లు, మోడిఫైడ్ సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏలూరు ట్రాఫిక్ సీఐ ఎస్.లక్ష్మణరావు నేతృత్వంలో సిబ్బంది మంగళవారం నగరంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేలా నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన స్పీకర్లు, ఎదురుగా వచ్చే వాహనదారుల కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఉన్న ఎల్ఈడీ లైట్లు, రణగొణ ధ్వనులు చేసే 50 మోటారు సైకిళ్ల సైలెన్సర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్, ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు, త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, కై కలూరు రూరల్ సీఐ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గోటేరులో ముగ్గురిపై కేసు నమోదు
ఇరగవరం: మండల పరిధిలోని గోటేరు గ్రామంలో ఓ మహిళపై దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నసీరుల్లా తెలిపారు. వివరాల ప్రకారం గోటేరు గ్రామానికి చెందిన యండమూరి రత్నకుమారికి అదే గ్రామంలో సుమారు 5 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థల సరిహద్దుల్లో ఉన్న దాదాపు 15 గజాల స్థలాన్ని కొవ్వూరు కృష్ణమోహన్ కుటుంబ సభ్యులు ఆక్రమించారు. ఈ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు, ఇరుపక్షాల స్థల పత్రాలను పరిశీలించి కొలతలు వేసుకుందామని రత్నకుమారి పలుమార్లు కోరారు. తమ స్థల పత్రాలను తెస్తామని, వారిని కూడా తీసుకురావాలని అడిగినప్పటికీ కృష్ణమోహన్ కుటుంబ సభ్యులు స్పందించకుండా రత్నకుమారితో తరచూ గొడవకు దిగేవారు. ఈ నేపథ్యంలో, యండమూరి రత్నకుమారి తన స్థలంలో పూలు కోసుకుంటుండగా కొవ్వూరు కృష్ణమోహన్, అతని భార్య, కుమారుడు అరవింద్ కలిసి ఆమైపె దాడికి తెగబడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం నుంచి గుంటూరుకు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 32 నాణ్యమైన పొగాకు బేళ్లను పొగాకు బోర్డు నిఘా (విజిలెన్స్) అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో కలపర్రు టోల్ ప్లాజా వద్ద నిఘా ఉంచిన అధికారులు, అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు ఆటోలను తనిఖీ చేసి ఈ పొగాకును స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కేసు నమోదు చేసి, సీజ్ చేసిన పొగాకును జంగారెడ్డిగూడెం వేలం కేంద్రానికి తరలించారు. ఈ దాడుల్లో నిఘా అధికారులు కిరణ్, జీఎం సాయి ప్రశాంత్, ధర్మతేజ పాల్గొన్నారు. ఇరగవరం: పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఘటన ఇరగవరం మండలం కె.ఇల్లిందలపర్రు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై నసిరుల్లా తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో మంగళవారం పేకాట శిబిరంపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారు వద్ద నుంచి రూ.2430 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఏలూరు టౌన్: తల్లి మరణించి, తండ్రి వదిలేయడంతో దయనీయ స్థితిలో ఉన్న ముగ్గురు చిన్నారులకు ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చొరవతో తండ్రి నీడ దక్కింది. కుక్కునూరు మండలం కివ్వక గ్రామానికి చెందిన షేక్ మహాలక్ష్మి (7), లావణ్య (5), అమూల్య (3) అనే చిన్నారుల తల్లి రెండేళ్ల క్రితం మరణించగా, తండ్రి షేక్ వెంకన్న తొమ్మిది నెలల క్రితం పిల్లలను వదిలి వెళ్లిపోయాడు. ఇటీవల ఏలూరు బాలసదనంలో ఈ పిల్లలను కలిసిన ఎస్పీ, వారి దీనస్థితిపై చలించి తండ్రి ఆచూకీ కనుగొనాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన మహిళా పీఎస్ సీఐ ఎం.సుబ్బారావు, కుక్కునూరు పోలీసులు, శక్తి టీమ్ మహారాష్ట్రలో ఉన్న తండ్రి వెంకన్నను గుర్తించి ఏలూరుకు రప్పించారు. ఎస్పీ శివకిషోర్ సమక్షంలో ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లల బాధ్యతను అప్పగించారు. పిల్లల సంక్షేమం, భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. పాలకొల్లు సెంట్రల్: మండలంలోని పెనుమదం గ్రామంలో మంగళవారం సాయంత్రం ఓ కుక్క స్వైర విహారం చేయడంతో సుమారు పది మందికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. కుక్క దాడిలో తీవ్ర గాయాలైన నాగలక్ష్మీ, బాలుడు విన్నులు పాలకొల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాగలక్ష్మిని బుగ్గపై, చెవులపై తీవ్రంగా కరవగా బాలుడి చేతిపై దారుణంగా కరిచింది. కుక్కలను అదుపు చేయకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని, పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి కుక్కల సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నకిలీ బిల్లులు తయారు చేసిన వ్యక్తిపై కేసు తణుకు అర్బన్: నకిలీ బిల్లులు తయారు చేసి సంస్థ యజమానిని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదుచేసినట్లు తణుకు రూరల్ ఎస్సై నాళం శ్రీనివాస్ తెలిపారు. తణుకు మండలంలోని శ్రీనివాస ఇండస్ట్రీస్లో సారిక వెంకటేశ్వరరావు గుమస్తాగా పనిచేస్తూ కంప్యూటర్లో ట్యాలీ సాఫ్ట్వేర్ ద్వారా బిల్లులు తయారుచేయడం, అకౌంట్స్ నిర్వహించడం విధుల్లో భాగంగా బయట వ్యక్తుల పేర్లపై నకిలీ బిల్లులు తయారుచేసి వాటిని ఇచ్చినట్లుగా చూపిస్తూ సదరు నగదును తన భార్య బ్యాంక్ అకౌంట్కు ఫోన్పే ద్వారా జమ చేయించాడు. దీంతో ఇండస్ట్రీస్ యజమాని సింహాద్రి వెంకటరత్నం పోలీసులను ఆశ్రయించాడు. -
పారదర్శకంగా సర్
ఆలోచింపజేసిన నాటికలు ఏలూరులో నిర్వహిస్తున్న జాతీయస్థాయి నాటిక పోటీలు సోమవారం మూడో రోజుకు చేరుకున్నాయి. 3వ రోజు ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి. 8లో uకలెక్టర్ నాగరాణి సాక్షి, భీమవరం: ఓటరు ముసాయిదా జాబితా తుది జాబితాను తలపించే విధంగా తప్పులు లేకుండా తయారుచేయాలన్న లక్ష్యంతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ను జిల్లాలో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కలెక్టరేట్లోని చాంబర్లో సోమవారం ప్రింట్ మీడియాతో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 14.75 లక్షల మంది ఓటర్లకు గాను ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ 99.82 శాతం పూర్తయ్యిందన్నారు. 9,10,507 ఓట్లను డిజిటలైజ్ చేశామన్నారు. అర్బన్ ఏరియాలు, డిజిటలైజ్ ఆలస్యమవుతున్న చోట ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. ప్రతి మండలానికి ప్రత్యేకాధికారులను నియమించి పర్యవేక్షిస్తున్నామన్నారు. విదేశాల్లో ఉన్న వారు ఆన్లైన్ ద్వారా మ్యాపింగ్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఈనెల 14 వరకు బీఎల్ఓల ఇంటింట సందర్శనకు గడువుందని, 9వ తేదీ నాటికి నూరుశాతం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం 21న ముసాయిదా జాబితా ప్రదర్శించి, 21 నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాల స్వీకరణ, ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 18 వరకు క్లెయిమ్స్ పరిష్కరించి 22న తుదిజాబితాను ప్రచురించనున్నట్టు కలెక్టర్ నాగరాణి వివరించారు. భీమవరం: గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం అర్హులైన ఉపాధ్యాయులు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సర్... గడువివ్వండి
● ఓటర్ల ఎన్యూమరేషన్ గడువు పెంచాలి ● కేంద్ర ఎన్నికల సంఘానికి ఓటర్ల విజ్ఞప్తి ● ముసాయిదా జాబితా రూపకల్పనలో లోపిస్తున్న పారదర్శకత! ఆకివీడు: ఓటర్ల ఎన్యూమరేషన్ కార్యక్రమ గడువును మరింత పెంచాలని ఓటర్లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్యూమరేషన్ గడువును ఈ నెల 14వ తేదీ వరకే పరిమితం చేయడం వల్ల ఓటర్లకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం వంద శాతం ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో చాలా ప్రాంతాల్లో ఇంకా ఫారాలు అందలేదని ఓటర్లు వాపోతున్నారు. అందిన ఫారాలను కూడా ఏవిధంగా పూర్తి చేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి నేతల చేతుల్లోకి ఫారాలు ఫారాలను పూర్తి చేయించే బాధ్యతను బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) పూర్తిగా విస్మరించారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కొంతమంది నిరక్షరాస్యులైన ఓటర్లు తమ ఫారాలు పూర్తి చేయించుకోవడం కోసం స్థానికుల చుట్టూ తిరుగుతున్నారు. చదువుకున్న వారు సైతం ఫారాలను ఎలా పూర్తి చేయాలో తెలియక తప్పులు దొర్లిస్తున్నారు. దీనివల్ల ఓటర్ల జాబితాలో తమ పేర్లు నమోదు అవుతాయో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, చాలా గ్రామాలు, వార్డుల్లో బీఎల్ఓలు స్వయంగా ఓటర్లకు ఫారాలు ఇవ్వకుండా, కూటమి నాయకుల ఆధ్వర్యంలో పంపిణీ చేయిస్తున్నారు. తిరిగి ఆ ఫారాలను మళ్లీ ఆ నాయకులకే ఇవ్వాల్సి వస్తోంది. బీఎల్ఓల పరిధిలో ఫారాలు పూర్తి చేయడానికి సమయం సరిపోకపోవడంతో, వాటిని రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టి ఈ నెల 12వ తేదీ లోపు అందజేయాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా ఫారాలు ఏ విధంగా భర్తీ అవుతున్నాయో ఓటర్లకే తెలియడం లేదు. ఈ ప్రక్రియ వల్ల ఫారాలు పూర్తి స్థాయిలో అధికారులకు చేరుతాయా లేదా అన్న సంశయం నెలకొంది. నిబంధనల ప్రకారం.. బీఎల్ఓలే స్వయంగా ఓటరుకు ఫారం అందజేసి, పూర్తి చేయించాల్సి ఉంటుంది. ఈ గందరగోళం వల్ల చనిపోయిన ఓటర్ల పేర్ల తొలగింపులో కూడా నిర్లక్ష్యం జరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత వివరాలతో ఓటర్ల తికమక 2002 ఓటరు జాబితాలో పేరు ఉంటే ఇతర వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ.. నాటి ఓటరు సంఖ్యను, గతంలో ఓటు వేసిన సమయంలో ఉన్న ఓటరు సంఖ్యను నమోదు చేయాలన్న సూచనతో ఓటర్లు తికమక పడుతున్నారు. అప్పటి జాబితాలో పేరు లేకపోతే ఈసారి తమకు ఓటు హక్కు లభించదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. హడావిడిగా ఓటర్ల జాబితాను తయారు చేయడం వల్ల పారదర్శకత లోపించి పలు అక్రమాలకు తావిచ్చినట్లవుతుందని, గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య కొంత మేర తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్యూమరేషన్ గడువును పెంచితేనే బీఎల్ఓలు సమర్థవంతంగా ఓటర్ల జాబితాను తయారు చేయగలరని కోరుతున్నారు. ఎన్యూమరేషన్ వివరాలను డిజిటలైజేషన్ పూర్తి చేసి, ఈ నెల 14వ తేదీ లోపు తుది వివరాలను అందజేయాల్సి ఉంది. అనంతరం ఈ నెల 21వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ జరుగనుంది. ఈ ముసాయిదాపై క్లెయిములు, అభ్యంతరాలను ఈ నెల 21 నుంచి ఆగస్టు 20వ తేదీ లోపు దాఖలు చేసుకోవచ్చు. అభ్యంతరాల పరిష్కారం సెప్టెంబర్ 18వ తేదీ లోపు పూర్తి చేసి, తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 22వ తేదీన అధికారికంగా ప్రచురించనున్నారు. -
తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలి
తణుకు అర్బన్: ప్రజల్లో జంతువుల పట్ల ప్రేమతో పాటు సరైన అవగాహన కూడా ఉండాలని, జంతువులు మనుషుల మధ్య సంబంధాల్లో తలెత్తే ఆరోగ్య సమస్యలపై విస్త్రృత ప్రచారం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టరు చదలవాడ నాగరాణి అన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా తణుకు వెటర్నరీ సిబ్బంది శిక్షణ కేంద్రంలో సోమ వారం రేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెంపుడు కుక్కలు, పిల్లులు, ఇతర జంతువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. వీధి కుక్కలు, కోతులు, పిల్లులు ఇతర జంతువులు కరిచిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, పశు ఆరోగ్య సంస్థ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వాకాని ప్రసాద్, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కోటిలింగరాజు, డిప్యూటీ డైరెక్టర్ లంక కనక సుధాకర్, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఇన్చార్జి ఆర్ఎంఓ డాక్టర్ ఎల్.సాయి బాలాజీ పాల్గొన్నారు. -
సామాన్యులపై విద్యుత్ బాదుడు
ఆగిరిపల్లి: మండలంలోని కొత్త ఈదరలో విద్యుత్ అధికారులు ఇతర చార్జీల పేరుతో వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నారని పలువురు గ్రామస్తులు వాపోతున్నారు. గత నెలలో సాధారణంగా రూ.వెయ్యి వరకు వచ్చిన విద్యుత్ బిల్లులు.. ఈసారి ఇతర చార్జీల పేరిట రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు రావడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. దీనిపై విద్యుత్ శాఖాఅధికారులను అడిగితే గత నెలలో అధిక లోడుతో మీ గ్రామంలో రెండు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయని,.. ఆ నష్టం మీరే భరించాలని చెప్పడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. సాంకేతిక లోపాల వల్లనో, అధిక లోడు వల్లనో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలి గానీ, సామాన్య వినియోగదారులపై రుద్దడం ఏంటని గ్రామస్తుడు అక్కిరెడ్డి ప్రసాద్ వర్మ ప్రశ్నించారు. తాను ఏసీ కూడా వాడటం లేదని, 267 యూనిట్లకు గాను రూ.1384 విద్యుత్ బిల్లు వచ్చిందని, దీనికి తోడు అదర్ చార్జీల పేరుతో రూ.4,550 వచ్చిందని ఏమి చేయాలో అర్థం కావటం లేదని వాపోయారు. దీనిపై విద్యుత్ అధికారులును అడిగితే విద్యుత్ బిల్లు కట్టాల్సిందేనని తేల్చి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఒకేసారి వేల రూపాయల్లో అదనపు బిల్లులు రావడంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా వేసిన ఈ ఇతర ఛార్జీలను విద్యుత్ బిల్లుల నుంచి తక్షణమే తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
పంట కాలువలో దూకి వ్యక్తి మృతి
తాడేపల్లిగూడెం (టీఓసీ): పంట కాలువలో దూకి ఓ వ్యక్తి మృతి చెందాడు. గణపవరం మండలం కాశిపాడు గ్రామానికి చెందిన గొట్టాపు చిన్న (30) పంట కాలువలో దూకినట్లు తాడేపల్లిగూడెం ఫైర్ స్టేషన్కు సమాచారం అందింది. దీంతో ఫైర్ సిబ్బంది సోమవారం ఉదయం 6 గంటల నుంచి కాలువలో వెతికినట్లు ఫైర్ ఆఫీసర్ కేవీ మురళీ కొండబాబు తెలిపారు. చిలకంపాడు లాకుల వద్ద మృతదేహాన్ని కనుగొని, బయటకు తీసి, మృతుని బంధువులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. నూజివీడు: చెల్లని చెక్కు కేసులో నూజివీడుకు చెందిన శీలం పద్మశ్రీకి రూ.2 లక్షల జరిమానా, ఆరు నెలల జైలుశిక్షను విధిస్తూ స్పెషల్ మేజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం నూజివీడుకు చెందిన వీర్ల వెంకటేశ్వరరావు 2023 అక్టోబర్ 5న పద్మశ్రీకి రూ.1.25 లక్షల నగదును అప్పుగా ఇచ్చారు. కొంతకాలం తరువాత బాకీ చెల్లించమని అడగగా పద్మశ్రీ 2023 డిసెంబరులో రూ.లక్షకు చెక్కును వెంకటేశ్వరరావుకు ఇచ్చారు. ఆ చెక్కును ఆయన బ్యాంకులో వేయగా పద్మశ్రీ బ్యాంకు ఖాతాలో నగదు లేదని బ్యాంకు అధికారులు తిరస్కరించారు. దీనిపై వెంకటేశ్వరరావు కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం స్పెషల్ మేజిస్ట్రేట్ రూ.2 లక్షల జరిమానా, ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు. భీమవరం: సినీ నటుడు నిఖిల్ భీమవరంలో సందడి చేశారు. సోమవారం రక్షాదళ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం నిఖిల్ మాట్లాడుతూ దానాల్లో విద్యాదానం గొప్పదని, రక్షాదళ్ అధ్యక్షుడు మంగదొడ్డి మహేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు విలువైన పుస్తకాల కిట్స్ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం విద్యార్థులకు సెల్పీలకు ఫోజులిచ్చారు. త్వరలో విడుదలైయ్యే తన చిత్రం టికెట్లను విద్యార్థులకు ఉచితంగా అందిస్తానన్నారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు), జిల్లా విద్యాశాఖాధికారి ఇ నారాయణ, మంగదొడ్డి మహేంద్ర, ఎంఈవో ఎన్ శ్రీనివాసరావు, సాయిరామ్, ఎన్ఎస్ ప్రసాద్, దాయన చంద్రజీ, షేక్ బాబాజీసాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరుల్లో ఉన్న కస్తూరిబా బాలికోన్నత పాఠశాలల విషయంలో పాల్పడిన అవినీతికి సంబంధించి ఏలూరు జిల్లా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ కే. పంకజ్ కుమార్ని మాతృ సంస్థకు సరెండర్ చేస్తూ సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. కై కలూరు వైవీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా పని చేస్తున్న పంకజ్ కుమార్ను ఏలూరు జిల్లా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్గా గతంలో నియమించారు. ఇటీవల వేలేరుపాడు, కుక్కునూరు కస్తూరిబా బాలికోన్నత పాఠశాలల్లో జరిగిన అవినతీకి సంబంధించి ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదులపై విచారణ అనంతరం అందిన నివేదికను అనుసరించి ఆయనపై క్రమశిక్షణ చర్య తీసుకున్నట్టు తెలిపారు. ఏలూరు (టూటౌన్): యూట్యూబర్ ప్రశ్న రావణ్పై వరుసగా కేసులు నమోదు చేయడం, ఒక కేసులో బెయిల్ పొందిన వెంటనే మరో కేసులో అరెస్టు చేయడం, అనంతరం కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేయడం రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ, న్యాయపాలనపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వైఎస్సార్సీపీ న్యాయ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రామాంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19(1)(ఎ), 21 ప్రతి పౌరుడికి సమానత్వం, భావ ప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛను హామీ ఇస్తున్నాయన్నారు. సుప్రీంకోర్టు పలుమార్లు ‘బెయిల్ ఈజ్ ది రూల్, జైల్ ఈజ్ ది ఎక్సెప్షన్’ అని స్పష్టం చేసిందన్నారు. అలాగే, నేరం కోర్టులో రుజువయ్యే వరకు ప్రతి వ్యక్తి నిర్దోషిగానే పరిగణించబడతాడనే సూత్రాన్ని గౌరవించాలన్నారు. దేశ భద్రత కోసం ఉద్దేశించిన కఠిన చట్టాలను రాజకీయ కక్షసాధింపుకు ఉపయోగిస్తున్నారనే అనుమానాలకు తావు లేకుండా ప్రభుత్వం వ్యవహరించాలని పేర్కొన్నారు. మృతదేహాన్ని వెలికితీస్తున్న ఫైర్ సిబ్బంది -
డీపీఆర్వోగా బాధ్యతల స్వీకరణ
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా డీపీఆర్వోగా టి.మోహన్ రాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ చదలవాడ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ అంకితభావంతో విధులు నిర్వహించాలని కోరారు. భీమవరం: విశాఖపట్నం గంభీరగెడ్డ రిజర్వాయర్లో నిర్వహించిన సౌత్ జోన్ అంతర్రాష్ట్ర కనోయింగ్ అండ్ కయాకింగ్ చాంపియన్షిప్ పోటీల్లో భీమవరం బీవీ రాజు డిగ్రీ కళాశాల విద్యార్థిని వనమాడి మౌనిక రెండు కాంస్య పతకాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఐఆర్ కృష్ణంరాజు చెప్పారు. సోమవారం పతకాలు సాధించిన మౌనికను అభినందించిన సందర్భంగా ఆయన వివరాలు తెలిపారు. ఈ నెల 4న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాప్ సహకారంతో పోటీలు జరిగాయన్నారు. భీమవరం: ప్రజా కళలను కళాకారులను ప్రోత్సహించే విషయంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.మంగరాజు తీవ్రంగా విమర్శించారు. సోమవారం భీమవరంలో ఏర్పాటుచేసిన ప్రజానాట్యమండలి జిల్లా మహా సభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లా డారు. ప్రజా నాట్యమండలి ఎంతోకాలంగా ప్రజల కష్టసుఖాలను పాటలుగా వీధి నాటకాలుగా తయారుచేసి ప్రజలను చైతన్య పరుస్తుందన్నారు. ప్రభుత్వాలు కళాకారులను పట్టించుకోవడంలేదని గుర్తింపు కార్డులు, ఇతర ప్రోత్సాహకాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి చైతన్య ప్రసాద్ అధ్యక్షత వహించగా గోదావరి సాహితీ స్రవంతి కన్వీనర్ శ్రీనివాసరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి బి వాసుదేవరావు, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వల్లి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం తాకట్టు పెట్టి మోసపోయిన బాధితులు సోమవారం జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మితను మర్యాదపూర్వకంగా కలిసి ఆవేదనను విన్నవించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, దర్యాప్తులో భాగంగా పోలీసులు తమ వద్ద ఉన్న బంగారు తాకట్టు ఆభరణాల ఒరిజినల్ రసీదులను తీసుకుంటున్నారని, భవిష్యత్తులో ఒరిజినల్ రసీదులు లేకపోతే రేపు బ్యాంకు నుంచి నగలు విడిపించుకునే సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయని తమ అనుమానాలను ఏఎస్పీ దృష్టికి తెచ్చారు. దీనిపై ఏఎస్పీ సానుకూలంగా స్పందిస్తూ.. కేసును త్వరితగతిన ఛేదించడానికి, దర్యాప్తు ప్రక్రియలో భాగంగానే ఒరిజినల్ రసీదులను సేకరిస్తున్నామని, ఇవి కేసులో చాలా కీలకమని స్పష్టం చేశారు. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రసీదులు తీసుకున్నందుకు ప్రతి ఒక్కరికీ పోలీసుల తరఫున గ్యారెంటీగా అక్నాలెడ్జ్మెంట్ పత్రం ఇస్తామని చెప్పారు. తామే స్వయంగా బ్యాంకు అధికారులతో మాట్లాడి బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. -
సమస్యలు పరిష్కరించాలని వినతి
భీమవరం: ఆశ వర్కర్స్కు ప్రభుత్వమిచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ నెల 31న ధర్నాలు నిర్వహిస్తున్నట్లు ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సీహెచ్ లక్ష్మి చెప్పారు. సోమవారం యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఎంహెచ్వో కార్యాలయంలో వినతిపత్రం అందచేసిన అనంతరం మాట్లాడుతూ తమకు సంబంధం లేని పనిని బలవంతంగా చేయిస్తున్నారని, ఆన్లైన్ సేవల పేరుతో పని భారాన్ని పెంచేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పని ఒత్తిడి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని తక్షణమే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. -
వైట్ గట్.. ఆదాయం కట్
● రొయ్య రైతులను కలవరపెడుతున్న కొత్త వైరస్ ● ఇప్పటికే మేత ధర పెంపుతో రైతు కుదేలు ● రొయ్యకు గిట్టుబాటు ధర రాని వైనం మంగళవారం శ్రీ 7 శ్రీ జూలై శ్రీ 2026ఆకివీడు: రొయ్య రైతులను కొత్త వైరస్ కలవర పెడుతోంది. ఇప్పటికే గిట్టుబాటు ధర రాక, మేత ధరలు పెరిగి ఆక్వా పరిశ్రమ కుదేలు కాగా.. ఇప్పుడు కొత్త వైరస్ ఆందోళన రేకెత్తిస్తోంది. ఆక్వా సాగుతో ఆదాయం పెంచుకుందామని ఆశపడిన రైతులకు నిరాశే మిగులుతోంది. ఇప్పటికే రొయ్యల ధరలు పడిపోయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. మేత ధరలు కంపెనీలు అడ్డంగా పెంచేయడంతో సాగు చేయలేమంటూ రైతులు చేతులెత్తేశారు. తాజాగా రొయ్యలకు వైట్గట్ వైరస్ సోకడంతో సాగు దినదిన గండంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. ఇప్పుడు వైరస్లు రైతుల వెన్నుల్లో వణుకు పుట్టిస్తోంది. వ్యాధులతో పాటు విద్యుత్ సబ్సిడీ విషయంలో ప్రభుత్వం మోసం చేయడంతో రైతులు ఘొల్లుమంటున్నారు. రొయ్య జీర్ణాశయం దెబ్బతీస్తున్న వైట్ గట్ చెరువు నీటిలోని సహజ ఆహారమైన ప్లాంక్టాను, పెల్లెట్ రూపంలో అనుబంధ ఆహారాన్ని రొయ్యలు తీసుకుంటాయి. వీటితో పాటు నీటిలోని వ్యాధికారక క్రిములు, సేంద్రియ పదార్థాలు, ఇతర పదార్థాలు రొయ్యల జీర్ణాశయం పేగులోకి చేరతాయి. పోషణకు సహకరిస్తాయి. పేగులో చేరిన హానికర బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు విషపదార్థాల్ని స్రవిస్తాయి. ఈ విషపదార్థాలు ఆహార నాళంలో విబ్రియో బ్యాక్టీరియా అధిక సంఖ్యలో పెరగడానికి, పేగు గోడల కణజాలం క్షీణించేలా చేస్తోంది. దీంతో రొయ్య తెల్లగా మారిపోతుంది. రొయ్య పేగు (గట్) తెలుపు రంగులో కన్పిస్తుంది. రొయ్యలకు వైట్ గట్ వైరస్ సోకడం వల్ల రైతులకు ఆదాయం భారీగా తగ్గిపోతుంది. ఈ వ్యాధి సోకిన రొయ్యల్లో లూజు సెల్ ఏర్పడుతోంది. మేత తినడం తగ్గించేస్తుంది. మలం తెల్లగా నీటిపై చారలుగా తేలుతోంది. ఈ విధంగా ఉన్న రొయ్య జీర్ణవ్యవస్థ దెబ్బతిందని గుర్తించాలి. కాలేయం పాలిపోయి వాపు వస్తుంది. రొయ్యలు ఆహారాన్ని తీసుకోకపోవడం, చెరువు అంచుల దగ్గర, ఏరియేటర్ల దగ్గర గుంపులుగా చేరతాయి. బరువు తగ్గిపోయి, ఎదుగుదల క్షీణిస్తుంది. నాణ్యతలేని మేత, చెరువు అపరిశుభ్రంగా ఉంచడం, నీటి నాణ్యత లేకపోవడం, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం, పర్యావరణ, వాతావరణ పరిస్థితులు కారణంగా ఈ వైరస్ వ్యాసిస్తుంది. దీని నివారణకు సరైన మందులు అందుబాటులో లేవు. దీంతో రైతులు వైట్గట్ నివారణకు ఇతర మందులు ఉపయోగిస్తున్నా ఫలితం ఉండడం లేదు. నీటి నాణ్యత, మేత యజమాన్యంతో పాటు వ్యాఽధి తీవ్రతను బట్టి తగిన ప్రో బయోటిక్స్, మందులు వాడాల్సి ఉంటుంది. ప్రతి అర్జీని గడువులోపు పరిష్కరించాలి ఇటీవల కాలంలో రొయ్యలకు విపరీతంగా వైరస్ సోకి తీవ్ర నష్టాల పాలవుతున్నాం. ఎన్ని మందులు వాడినా నివారణ ఉండడం లేదు. ఆయా కౌంట్లలో పట్టేయాల్సి వస్తుంది. వైట్గట్ రొయ్య రైతుల పాలిట శాపంగా మారింది. పారుడు వ్యాధిగా పేరుపడ్డ ఈ వైరస్తో రొయ్య రైతుకు నష్టం తప్పడం లేదు. – పూసపాటి రాధాకృష్ణంరాజు, రొయ్య రైతు, సిద్ధాపురం రొయ్యల సాగు కత్తిమీద సాములా ఉంది. రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. మేత ధరలు పెరగడం, రొయ్యల ధరల పతనంతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతుంటే వైరస్లు మరింత దెబ్బతీస్తున్నాయి. భారీ పెట్టుబడులతో రొయ్యల సాగు భారంగా మారింది. డాలర్ల పంటకు దిక్కులేకుండా పోతుంది. – వేగేశ్న వెంకట రాజు, రొయ్య రైతు, చినకాపవరం -
ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు?
భీమవరం: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ములను తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రసన్నకుమార్ మాట్లా డుతూ రూ.7 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని వాటిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం దుర్మార్గమన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అనేక మంది విద్యార్థులు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ వంటి కోర్సులను అభ్యసించేందుకు ఆసక్తి ఉన్నా విద్యాసంస్థలకు ఫీజులు కట్టలేని పరిస్థితిలో చదువులకు వెనుకంజ వేస్తున్నారన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చినా అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయినా ఇంతవరకు బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని ఇచ్చిన హామీలని నెరవేర్చలేదన్నారు. హాస్టల్స్ విద్యార్థులకు రూ.3 వేలు మెస్ చార్జీలు పెంచాలని, అద్దెభవనాల్లోని హాస్టల్స్కు సొంతభవ నాలు నిర్మించాలని ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. ర్యాలీగా వెళ్లి డీఆర్వోకు వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రసాద్, సహాయ కార్యదర్శి బి.సింధు, పి.నాగేంద్రబాబు, కె.రోహిత్, ఎన్.సాయిఫణికుమార్ పాల్గొన్నారు. -
జ్వరం, వాంతులతో చిన్నారి మృత్యువాత
● ప్రభుత్వాసుపత్రిలో సరైన వైద్యం అందలేదని తల్లిదండ్రుల ఆవేదన ● మోతుగూడెంలో విషాదచాయలుబుట్టాయగూడెం: వాంతులు, జ్వరం, విరేచనాలతో బాధపడుతూ వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన ఒక నాలుగేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. అనారోగ్యంతో బాధపడుతున్న తమ బిడ్డకు వైద్యం చేయించి, క్షేమంగా ఇంటికి తీసుకువెళ్దామనుకున్న ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. బిడ్డ మృతదేహాన్ని చూసి వారు తల్లడిల్లిపోతున్నారు. ఈ విచారకర సంఘటనకు సంబంధించి చిన్నారి తల్లిదండ్రులు గురుగుంట్ల వెంకటరెడ్డి, సునీత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తమ మూడో సంతానమైన రిత్విక శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎంతో ఆరోగ్యంగా, ఆటపాటలతో గడిపిందని వారు తెలిపారు. శనివారం సాయంత్రం జ్వరం రావడంతో పాటు వాంతులు, విరేచనాలు అవుతుండడంతో బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో (సీహెచ్సీ) చేర్పించినట్లు చెప్పారు. వైద్యం కోసం వచ్చిన తమ బిడ్డను ఆస్పత్రిలో చేర్పించేందుకు కూడా చాలా కష్టపడాల్సి వచ్చిందని, స్థానిక వ్యక్తి ఒకరితో మాట్లాడించిన తర్వాతే చేర్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణం తమ కూతురు రిత్వికను ఆస్పత్రిలో చేర్చిన తర్వాత ఎటువంటి వైద్య పరీక్షలు చేయకుండా కేవలం ఒక సిరప్, పారాసెట్మాల్ టాబ్లెట్ మాత్రమే ఇచ్చారని తల్లి సునీత ఆరోపించారు. ఆదివారం రాత్రి సమయానికి బిడ్డ విపరీతంగా ఏడుస్తూ బాధపడుతున్నా, ఆ సమయంలో ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోలేదని వాపోయారు. బిడ్డ బాధ చూడలేక అక్కడ ఉన్న సిబ్బందిని నిద్ర లేపగా.. వారు డాక్టర్కు ఫోన్ చేశారని, ఆ తర్వాత వచ్చిన డాక్టర్ పరిశీలించి పాప పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారన్నారు. వెంటనే అంబులెన్స్ సిద్ధం చేసి జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి రిఫర్ చేశారని తెలిపారు. అయితే, జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే తమ కూతురు మృతి చెందిందని, మార్గమధ్యంలోనే చనిపోయి ఉండవచ్చని అక్కడి వైద్యులు తెలిపారన్నారు. సకాలంలో వైద్యం అంది ఉంటే తమ బిడ్డ బతికేదని సునీత తీవ్రంగా రోదించారు. బాలిక తండ్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. గురువారం నుంచి తాను కూడా టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నానని, శనివారం సాయంత్రమే తాను ఇదే బుట్టాయగూడెం సీహెచ్సీ నుంచి డిశ్చార్జ్ అయ్యానని చెప్పారు. నీరసంగా ఉండటం వల్ల తాను తిరిగి ఆస్పత్రికి రాలేకపోయానని, కడసారి కూతుర్ని కూడా చూసుకునే పరిస్థితి లేకుండా పోయిందని వెంకటరెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి రిత్విక మృతితో మోతుగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ కోర్సా గంగరాజు డిమాండ్ చేశారు. బాలిక కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలి సరైన వైద్యం అందక మృతి చెందిన రిత్విక కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కారం రాఘవ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన బాలిక మృతిపై స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ వసుంధరను, వైద్యులను, సిబ్బందిని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బన్నే వినోద్, బాషా శ్యాంబాబు, కెచ్చెల మంగిరెడ్డి, ప్రతాప్ పాల్గొన్నారు. -
ఆలోచింపజేసిన నాటికలు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ సౌజన్యంతో హేలాపురి కళా పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక వైఎంహెచ్ఏ హాల్లోని కానాల గురుమూర్తి కళావేదికపై నిర్వహిస్తున్న ‘శ్రీ అల్లూరి సీతారామరాజు 18వ స్మారక జాతీయస్థాయి నాటిక పోటీలు’ సోమవారం మూడో రోజుకు చేరుకున్నాయి. 3వరోజు ప్రదర్శించిన నాటికలు నాటక ప్రియులను, రసజ్ఞులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తొలుత హైదరాబాద్కు చెందిన స్వర్ణ సూర్య డ్రామా లవర్స్ బృందం సీ్త్ర మాత్రే నమః నాటికను ప్రదర్శించారు. బొప్పన నరసింహారావు సౌజన్యంతో ప్రదర్శితమైన ఈ నాటికకు పూర్ణిమ పెమ్మరాజు మూలకథ అందించగా, ఉదయ్ భాగవతుల నాటకీకరణ, దర్శకత్వం వహించారు. సమాజంలో సీ్త్ర ఉనికిని చాటిచెప్పే ఈ కథాంశం ప్రేక్షకులను ఆలోచింపజేసింది. అనంతరం గుంటూరుకు చెందిన ఆరాధన ఆర్ట్స్ అకాడమీ బృందం సరి గమ పాప అనే నాటికను రంగస్థలంపై అద్భుతంగా ఆవిష్కరించారు. గోకవరపు దీప్తి సౌజన్యంతో ప్రదర్శితమైన ఈ నాటికకు గోవిందరాజుల నాగేశ్వరరావు రచన చేయగా, నాడింపల్లి వెంకటేశ్వరరావు దర్శకత్వం వహించారు. నటీనటుల హావభావాలు, చక్కటి సంభాషణలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి, సభలో చప్పట్ల వర్షం కురిపించాయి. పరిషత్ గౌరవ అధ్యక్షుడు గుత్తా కౌసలేంద్రరావు, అధ్యక్షుడు పెదపాటి రామకృష,్ణ సహాయ కార్యదర్శులు వల్లముల రామాంజనేయులు, మండవ రాజగోపాలకృష్ణ, కోశాధికారి మహ్మద్ ఖాజావలి, కమిటీ సభ్యులు ఎస్. కస్తూరిరావు, చింతల మల్లేశ్వరరావు, ఎం. సూర్యనారాయణ యాదవ్ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించి, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -
గుడికి దారేది?
లక్ష్మీపురంలో ఆలయ భూ వివాదం రోజురోజుకి కొత్త మలుపు తిరుగుతోంది. వివాదాస్పదంగా మారిన భూమిలోనే శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మండపం, ఆలయానికి వెళ్లే ప్రధాన దారి ఉండటం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే సదరు భూమిలో నరికి విక్రయించగా వచ్చిన చెట్ల సొమ్ము ఏ నాయకుడి జేబులోకి వెళ్లిందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దేవుడి భూమి కబ్జా వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులపై ఇంతవరకు ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు చేపట్టలేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం పంచాయతీ, లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పూరీ మఠాధిపతులు మంత్రరత్నం అమ్మాజీ (లక్ష్మీ అమ్మవారు) కుటుంబ సభ్యులు 1992 లో ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానానికి దత్తత ఇచ్చారు. అప్పటి నుంచి ఆ ఆలయం, దానికి సంబంధించిన ఆర్ఎస్ నెంబర్ 38/1 లోని 1.73 ఎకరాల భూమి దేవస్థానం ఆధీనంలోనే ఉంది. ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్ (ఎఫ్ఎల్ఆర్)లో సదరు భూమి దాత కుటుంబ సభ్యుడైన శ్రీమత్ మంత్రరత్నం ప్రతివాద భయంకర వెంకట సంపత్ కుమారాచార్యులు పేరు ఉంది. దేవస్థానం అధికారుల అశ్రద్ధ కారణంగా రెవిన్యూ రికార్డుల్లోకి స్వామివారి పేరు చేరలేదు. దాంతో దేవుడి భూమి ఇప్పుడు చిక్కుల్లో పడింది. అంతా తప్పులతడకే.. దాత సంపత్ కుమారాచార్యులు సదరు భూమిని 1967 జనవరి 18న కమ్మ సేవ సంఘం ద్వారకాతిరుమల మండలానికి బహుమతిగా ఇచ్చినట్టు కొందరు టీడీపీ నేతలు ఒక అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ను తెచ్చారు. దాని ఆధారంగానే రెవెన్యూ అధికారులు ఆన్లైన్ రికార్డులను సంఘం పేరు మీదకు మార్చారు. ఇటీవల దీనిపై వివాదం రాజుకోవడంతో మళ్లీ సదరు భూమి ఆన్లైన్ రికార్డులను మ్యూటేషన్ ద్వారా అధికారులు మార్చారు. దానికి సంబంధించిన ఆన్లైన్ రికార్డ్ ఇంకా అప్డేట్ కాలేదు. అయితే తప్పు జరగబట్టే అధికారులు సర్దుబాటు చర్యలు చేపట్టినట్టు స్పష్టమైంది. ఇదిలా ఉంటే ఆలయ ఆవరణలోని వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మండపం, ఆలయానికి వెళ్లే ప్రధాన దారి సైతం వివాదాస్పద సర్వే నెంబర్ భూమిలోనే ఉన్నాయి. దాత గుడిని దేవస్థానానికి అప్పగించి, గుడి దారిని సంఘానికి రాసిచ్చారా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. భూమి దేవస్థానం చేజారితే ఆలయానికి వెళ్లే దారి కూడా ఉండదని భక్తులు ఆందోళన చెందుతున్నారు. చెట్లు అమ్మిన సొమ్ము ఎక్కడ? టీడీపీ నేతలు సదరు భూమి తమ చేతిలోకి వచ్చిందన్న ఆనందంతో ఇటీవల అందులోని పెద్ద పెద్ద చెట్లను, తులసి మొక్కలను తొలగించారు. చెట్ల కలపను అమ్ముకుని రూ.50 వేల వరకు సదరు నాయకులు లబ్ధి పొందినట్టు సమాచారం. ఆ సొమ్ము ఏ నాయకుడి జేబులోకి చేరిందనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. వివాదాస్పద భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని చెబుతున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, చెట్ల సొమ్మును కూడా ప్రభుత్వ ట్రెజరీలోనే ఉంచాలి కదా.. తమ నేతల జేబుల్లో ఉంచడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ వారు కావడంతో కబ్జా చేసింది అధికార పార్టీ నేతలు కావడంతో చర్యలకు వెనకాడుతున్నారు. దాత అసలు ఇంటి పేరు శ్రీమత్ మంత్రరత్నం ప్రతివాద భయంకర అయితే అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో ఇంటి పేరు శ్రీమత్ భయంకర ప్రతివాద అని ఉంది. అసలు దాత తండ్రి పేరే లేదు. దాత 1967 లో ఈ భూమి బహుమతిగా ఇచ్చినట్టు ఇందులో ఉంది. దాత 1967కు ముందే మృతి చెందాడని, అలాంటప్పుడు సంఘానికి ఈ భూమిని ఆయన ఆత్మ రాసిచ్చిందా? అని పలువురు అంటున్నారు. సదరు కమ్మ సేవ సంఘం అధ్యక్షుడు ఎవరు? ఆయనకు ఇంత వరకు ఎందుకు నోటీసులు జారీ చేయలేదు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేవుడి భూమిని దేవుడికి అప్పగించాల్సిందే. లేకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తాం. కొందరు టీడీపీ నేతలు ఆ భూమిని కబ్జా చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. రెవెన్యూ అధికారులు తమ తప్పులను సరిచేసుకుంటున్నారు. దాత కుటుంబీకులు ఆ భూమి దేవస్థానానికే చెందాలని అధికారులకు తెలిపారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టలేదు. – తానేటి వనిత – మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి ముదురుతున్న లక్ష్మీపురం ఆలయ భూ వివాదం కబ్జా భూమిలోనే కల్యాణ మండపం, గుడికి వెళ్లే దారి చెట్టు నరికి విక్రయించిన సొమ్ము ఏమైంది? నిగ్గు తేల్చాలంటున్న భక్తులు, స్థానికులు -
రహదారి ధ్వంసం.. నిలిచిన రాకపోకలు
ఆగిరిపల్లి: గుర్తు తెలియని వ్యక్తులు మండలంలోని కనసానపల్లి, గన్నవరం మండలం గొల్లనపల్లి వెళ్లే రహదారిని ధ్వంసం చేయడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రైతులు, గ్రామస్తులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజుల క్రితం కనసానపల్లి నుంచి గొల్లనపల్లి వెళ్లే రహదారిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళ జేసీబీతో భారీ గుంత తవ్వి రహదారిని ధ్వంసం చేశారని గ్రామస్తులు తెలిపారు. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు, నిత్యావసరాల కోసం ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ రోడ్డును ధ్వంసం చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై గ్రామస్తులు కారు సత్యనారాయణ, నల్లమోతు నరేష్, శోభన్బాబు సోమవారం ఆగిరిపల్లి పోలీస్స్టేషన్న్లో ఎస్సై నాగరాజుకు ఫిర్యాదు చేశారు. ఆగిరిపల్లి: ఈదులగూడెం వీఆర్ఏ రామిశెట్టి లక్ష్మణరావు గ్రామంలో అక్రమాలకు పాల్పడుతుండడంపై రైతు దండబోయిన వెంకటేశ్వరరావు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. పెద్ద చెరువు భూమిలోని 50 సెంట్ల భూమిని వీఆర్ఏ లక్ష్మణరావు అక్రమంగా ఆక్రమించుకొని జామాయిల్ మొక్కలు వేసి, చుట్టూ ఫెన్సింగ్ వేశాడు. అంతేకాకుండా అతని అనుచరులను కూడా ప్రోత్సహించి చెరువు భూమిని ఆక్రమించుకునేలా చేస్తున్నాడని దీంతో పొలాల్లో రైతుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతు వెంకటేశ్వరరావు తెలిపాడు. అంతేకాకుండా గ్రామంలోని సీతారామాంజనేయ స్వామికి చెందిన 1.06 ఎకరాల భూమిని వీఆర్ఏ అనుచరులు ఆక్రమించుకొని జామాయిల్ మొక్కలు వేశారని, దీంతో ఆలయానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
మాంసం దుకాణాల తొలగింపు
ద్వారకాతిరుమల: క్షేత్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన మాంసం దుకాణాల కారణంగా భక్తులు, స్థానికులు పడుతున్న ఇబ్బందులపై సాక్షి దినపత్రికలో సోమవారం ‘క్షేత్రంలో రోడ్డుపక్కన మళ్లీ మాంసం దుకాణాలు’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై పంచాయతీ అధికారులు స్పందించారు. రోడ్డుపక్కన ఉన్న దుకాణాలను సిబ్బందితో తొలగింపజేశారు. మళ్లీ రోడ్డు పక్కన మాంసం దుకాణాలను ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని పంచాయతీ కార్యదర్శి జీటీవీ శ్రీనివాస్ వ్యాపారులను హెచ్చరించారు. సంతకం ఫోర్జరీ చేశారని ఫిర్యాదు తణుకు అర్బన్: విద్యుత్ స్మార్ట్ మీటరు ఏర్పాటులో విద్యుత్ శాఖ సిబ్బంది నా తల్లి సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ దువ్వ గ్రామానికి చెందిన సిర్రా రమేష్ సోమవారం తణుకు తహసీల్దారు కార్యాలయంలో పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. గతనెల 20వ తేదీన తాము వద్దని చెప్పినా తమ అనుమతి లేకుండా విద్యుత్ స్మార్ట్ మీటరును విద్యుత్ శాఖ లైన్మెన్ అజకర్ ఏర్పాటుచేశారని, తమ అనుమతి లేకుండా ఎలా బిగించారని నిలదీసిన క్రమంలో తన తల్లి రత్నకుమారి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉన్న అంగీకార పత్రాన్ని చూపించారని ఆరోపించారు. ప్రతినెలా రూ.వెయ్యి నుంచి రూ.1,500 లోపు వచ్చే బిల్లు స్మార్ట్ మీటరు కారణంగా రూ. 14,539 వచ్చిందని చెప్పారు. ఫోర్జరీ సంతకం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
● కన్నకొడుకే కర్కశకుడిగా మారి..
కన్నకొడుకే కర్కశకుడిగా మారి నవమాసాలు మోసి పెంచిన తల్లిని వేధిస్తున్న ఘటన ఇది. తంగెళ్ళమూడి ప్రాంతానికి చెందిన బుగత నీలమ్మ (95) అనే వృద్ధురాలి భర్త ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించారు. అప్పటి నుంచి ఆమె ప్రభుత్వం ఇచ్చే పింఛన్ డబ్బులతోనే జీవనం సాగిస్తోంది. అయితే, ప్రతి నెలా పింఛన్ డబ్బులు రాగానే ఆమె కుమారుడు బుగత రమేష్ తల్లి వద్దకు వచ్చి, ఆమెను తీవ్రంగా కొట్టి ఆ డబ్బులను బలవంతంగా లాక్కెళుతున్నాడు. కొడుకు పెడుతున్న బాధలను భరించలేక, సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఆ వృద్ధురాలు సహాయకుల సాయంతో వచ్చి ఫిర్యాదు చేసింది. కన్నకొడుకు వేధింపుల నుంచి తనకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కలెక్టర్ వెట్రిసెల్విని ఆమె కన్నీటితో వేడుకుంది. – ఫొటో: సాక్షిఫొటోగ్రాఫర్/ ఏలూరు -
వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన కెన్యా ప్రతినిధులు
ద్వారకాతిరుమల: మండలంలోని గుణ్ణంపల్లి గ్రామానికి చెందిన రైతు పల్లి సుబ్బారెడ్డి సాగు చేస్తున్న పీఎండీఎస్ ఫీల్డ్ వరి పంటను కెన్యా దేశానికి చెందిన ప్రతినిధులు ఆదివారం సందర్శించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రైతు అనుసరిస్తున్న సాగు విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పంట నిర్వహణ, జీవామృతం, ఘనజీవామృతం వినియోగం, తెగుళ్ల నివారణ, ఖర్చు తగ్గింపు, దిగుబడి పెంపు వంటి వివరాలను రైతుతో నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక నాణ్యత గల దిగుబడులు సాధిస్తున్న తీరును కెన్యా ప్రతినిధులు అభినందించారు. రైతుల అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ పర్యటనలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ వెంకటేష్, ఏడీపీఎం వల్లీ, తదితరులు పాల్గొన్నారు. -
తణుకులో రేషన్ దందా
తణుకు అర్బన్: తణుకులో చౌక డిపోల రేషన్ దందా జోరుగా సాగుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందాల్సిన బియ్యాన్ని కొందరు రేషన్ డీలర్లు బొక్కేస్తున్నారు. 1వ తేదీ నుంచి రేషన్ డిపోల్లో బియ్యం, పంచదార పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని డిపోలు తెరవకపోవడం, కొన్ని డిపోల్లో అవకతవకల నేపథ్యంలో తలెత్తిన ఫిర్యాదుల మేరకు తణుకులో నిర్వహించిన విజిలెన్స్ దాడులు సంచలనం రేకెత్తించాయి. తణుకులో ఈ నెల 2, 3 తేదీల్లో జరిపిన విజిలెన్స్ దాడుల్లో భాగంగా ముందుగా దుకాణ షట్టర్లు తెరవకుండా సీల్ వేశారు. అనంతరం పూర్తిస్థాయి అధికారుల తనిఖీల్లో 12, 21, 35, 49 డిపోల్లో సరుకుల్లో అవకతవకలు గుర్తించి ఆ దుకాణాలను సీజ్ చేసి 6 ఏ కేసులు నమోదు చేశారు. ఇంతవరకు బియ్యం బదులుగా డబ్బులు ఇవ్వడం, తక్కువ తూకం తూచడం లేదా లబ్ధిదారుడి బయోమెట్రిక్ వేయించుకుని బియ్యం ఇవ్వకుండా ఎగ్గొట్టడం చూశాం కానీ తణుకులో మాత్రం ఏకంగా దించిన బియ్యం బస్తాలను నేరుగా బ్లాక్ మార్కెట్కు తరలించేసి క్యాష్ చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వివాదాస్పదంగా 21వ నంబరు డిపో వివాదాస్పదంగా మారిన 21వ నంబరు డిపోలో ఈ నెల 1వ తేదీ నుంచి సరుకులు ఇవ్వాల్సి ఉండగా తణుకు ఇరగవరం కాలనీలోని మొఖమట్ల ఉమాదేవి పేరుతో ఉన్న డిపోను ఆ రోజు కొంతసేపు తెరచి తరువాత మూసివేశారు. 2వ తేదీన పూర్తిగా తెరవకపోవడంతో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్, తణుకు రెవెన్యూ అధికారులు దుకాణం తెరవకుండా ముందుగా సీల్ వేశారు. 3వ తేదీన విజిలెన్స్ అధికారులు షట్టర్ తెరచి చూడగా ఒక్క బియ్యం బస్తా కూడా కనిపించకపోవడంతో విస్తుపోయారు. రికార్డుల ప్రకారం 9,690 కిలోల బియ్యం ఉండాల్సి ఉండగా, 8,790 కిలోల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కేవలం రెండో రోజుకే బియ్యం బస్తాలు మాయం కావడంపై ఆరా తీస్తే, ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి దించుకున్న బియ్యం బస్తాలను వెంటనే బ్లాక్ మార్కెట్కు తరలించారని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తణుకులో కొన్ని రేషన్ డిపోల్లో డీలర్లను మార్చి తమ వారికి కట్టబెట్టారు. ఇదే అదనుగా కొందరు రేషన్ డిపోలను తమ ఆదాయ వనరుగా మార్చుకుని దోపిడీకి దిగుతున్నారు. ఈ ఏడాది జనవరి మొదటి వారంలో తణుకు పాతవూరులోని 23వ నంబరు డిపో కూడా ఇదే తరహాలో డిపో తెరవకుండా ఉండటం, లబ్ధిదారుల ఫిర్యాదుతో అధికారుల రంగప్రవేశంతో 210 బస్తాల బియ్యం, 342 కిలోల పంచదార, సుమారుగా రూ.6 లక్షల విలువైన సరుకులు మాయం చేసినట్లు తేలింది. ఈ వ్యవహారం నిరూపణ కావడంతో సదరు రేషన్ డీలరుపై రెవెన్యూ అధికారులు 6 ఏ కేసు నమోదు చేశారు. తాజాగా 21వ నంబరు రేషన్ డిపోలో సైతం సుమారుగా రూ.5 లక్షల విలువైన 8,790 కిలోల బియ్యం మాయం చేయడం వివాదాస్పదంగా మారింది. రేషన్ డిపోల బియ్యం నేరుగా బ్లాక్ మార్కెట్కు -
అదృశ్యమైన తల్లి, పిల్లల అప్పగింత
కామవరపుకోట: ఈ నెల 29న భర్తతో గొడవపడి పిల్లలతో సహా అదృశ్యమైన తల్లీపిల్లల ఆచూకీని తడికలపూడి పోలీసులు గుర్తించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్సై వల్లి పద్మ వివరాల ప్రకారం మండలంలో తడికలపూడి గ్రామానికి చెందిన బాకీ దుర్గ భర్తతో గొడవపడి జూన్ 29వ తేదీన ఇద్దరు కుమారులను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె తిరిగి రాకపోవడంతో తల్లి వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు ఈనెల 2న తడికలపూడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఆమె ఆచూకీ గుర్తించి, శనివారం రాత్రి తడికలపూడి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెను, ఆమె కుమారులను కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. -
రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా ఎంపిక
ఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల చివరి రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా వి.కృష్ణయ్య, కార్యదర్శి గా కె.ప్రభాకరెడ్డి, కోశాధికారిగా మర్రాపు సూర్యనారాయణ, ఉపాధ్యక్షులుగా వై.కేశవరావు, జొన్నా శివశంకరరావు, పీవీ ఆంజనేయులు, మూలి వెంగయ్య, పి.హేమలత, ఆర్ చంద్రశేఖర్ రెడ్డి, గౌరుశెట్టి నాగేశ్వరరావు, ఆకుల హరేరామ్, వల్లూరు భారతి, సహాయ కార్యదర్శులుగా ఏ.హరి, జి.రామకృష్ణ, టి.రామచంద్రుడు, జె.జయంతి బాబు, కంచుమాటి అజయ్ కుమార్, కె.శ్రీనివాస్, ఎం.అప్పలరాజు, బుద్ధరాజు రాంబాబుతో పాటు మరో 46 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తణుకు అర్బన్: మోడ్రన్ పెంటాథ్లాన్ లేజర్ రన్ జిల్లా జట్ల ఎంపికలు ఆదివారం తణుకు శ్రీ చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. అండర్ 9, 11, 15,17, 19 కేటగిరీలకు సంబంధించి జిల్లా నలుమూలల నుంచి 100 మంది క్రీడాకారులు హాజరుకాగా అత్యుత్తమ ప్రతిభ చూపించిన 32 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సంకు విరాటలక్ష్మి తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 11, 12 తేదీల్లో ఏలూరులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఎంపికలను వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్.సూర్యనారాయణ, కె.బాబూరావు, కె.సుబ్బారావు, ఎ.నాగేశ్వరరావు, ఆర్.నాయక్లు పర్యవేక్షించారు. -
చోరీ మొబైల్స్ రికవరీ
జంగారెడ్డిగూడెం: చోరీకి గురై మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, వాటిని నేరుగా బాధితుల ఇళ్లకే వెళ్లి అందజేశారు జంగారెడ్డిగూడెం పోలీసులు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, ఇన్స్పెక్టర్ ఎం.వి.సుభాష్ ఆదేశాల మేరకు స్థానిక ఎస్ఐ ఎన్.వీరప్రసాద్, కె.సోమరాజు గత నెల రోజుల్లో రికవరీ చేసిన సుమారు రూ.5,75,000 విలువైన 28 మొబైల్ ఫోన్లను బాధితుల ఇళ్లకు వెళ్లి స్వయంగా అందజేశారు. మరోసారి జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో మొబైల్ ఫోన్లను రికవరీ చేసినందుకు జంగారెడ్డిగూడెం పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. -
మాడవీధుల విస్తరణకు రూ. 1.11 లక్షల విరాళం
కాళ్ల: మండలంలోని కాళ్లకూరులో ఉన్న స్వయంభూః శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మాడవీధుల విస్తరణకు భక్తులు విరాళం అందించినట్లు దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈఓ మోకా అరుణ్ కుమార్ ఆదివారం తెలిపారు. దొడ్డనపూడి గ్రామానికి చెందిన ఆరేటి సర్వేశ్వరరావు–జానకమ్మల జ్ఞాపకార్థం వారి కుమారులు వీవీ సత్యనారాయణ–కృష్ణకుమారి, వెంకటేశ్వరరావు–సత్యవతి, రంగారావు–వెంకటరత్నం దంపతులు రూ.1,11,600 అందించినట్లు వివరించారు. ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి ప్రతిమతో సత్కరించారు. -
కిరణ్ రాయల్పై పోలీసులకు ఫిర్యాదు
ఏలూరు టౌన్: కిరణ్ రాయల్పై వైఎస్సార్సీపీ నాయకులు ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని అసభ్యంగా, వ్యక్తిగతంగా కించపరిచేలా కిరణ్ రాయల్ వ్యాఖ్యలు చేశారని.. తమ మనోభావాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయని, అతనిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలంటూ వైఎస్సార్సీపీ సోషల్మీడియా ఏలూరు జిల్లా ఉపాధ్యక్షుడు బండ్లమూడి సునీల్, ఏలూరు నియోజకవర్గ సోషల్ మీడియా ప్రెసిడెంట్ పచ్చిపులుసు సుజన్, పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ఏలూరు నగరంలోని డివిజన్ ఇన్చార్జ్లు ప్రత్తిపాటి విజయకుమార్, సురేంద్రకుమార్, వినయ్, వైష్ణవి, కోండ్రు వినోద్కుమార్, బూరగ జ్యోతిసాగర్, కొండ్రు కిరణ్, ఇందేటి ఏసుబాబు, లంకపల్లి దీపక్, ఉప్పెన రజనీకాంత్, కరణం జగ్గారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యలమంచిలి: అడవిపాలెంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహ్మద్ కరీముల్లా (31) మృతి చెందాడు. మేడపాడు శివారు కొంతేరు జగనన్న కాలనీకి చెందిన కరీముల్లా పాలకొలు్ోల్లని ఇండియన్ గ్యాస్ కంపెనీలో మేనేజర్ పని చేస్తున్నాడు. పని పూర్తయిన తరువాత తన బైక్పై ఇంటికి వెళ్తుండగా అడవిపాలెం పంచాయతీ గాంధీనగర్లోని బిస్కెట్ ఫ్యాక్టరీ వద్ద వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో కరీముల్లా తీవ్ర గాయాలు కావడంతో ప్రమాద స్థలంలోనే కన్నుమూశాడు. ఈ మేరకు తండ్రి మహ్మద్ మునిరుద్దీన్ పోలీసులకు పిర్యాదు చేయడంలో హెడ్ కానిస్టేబుల్ కె.శ్యాంసన్రాజు కేసు నమోదు చేశారు. మృతదేహానికి ఆదివారం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దెందులూరు: హోటల్ సరుకులు తీసుకురావడం కోసం వెళ్తూ గాలాయగూడెంలో ఈ నెల 4న బైక్ ప్రమాదంలో దేసు కోటివెంకట శ్రీనివాస్ (22)కు తలకు గాయమైంది. వెంటనే స్థానికులు ఆశ్రం ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం అతను మృతి చెందాడు. మృతుడు గంగన్నగూడెం హోటల్లో 8 నెలలుగా పని చేస్తున్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెంకట్ కుమార్ తెలిపారు. కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవాలయంలో ఆదివారం భక్తులు కిటకిటలాడారు. సమీప జిల్లాల నుంచి భారీగా అమ్మవారిని దర్శించుకుని వేడి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున అమ్మవారి ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదాలు, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల అమ్మకం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.80,206 ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ పరిధిలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ నాన్– అఫిషియల్ సభ్యుడిగా కొవ్వలి వినియోగదారుల సేవా మండలి అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది ఎస్.ఎన్.కట్టా నియమితులయ్యారు. ఈ మేరకు ఎక్స్ అఫిషియో సెక్రెటరీ కే.కన్నబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీవో జారీ చేశారు. కట్టా నియామకంపై జిల్లా వినియోగదారుల సంఘాల ప్రతినిధులు బొబ్బిలి బంగారయ్య, కుకునూరి రామచంద్ర రావు మానవత స్వచ్ఛంద సంస్థ నాయకులు కడియాల వెంకట కృష్ణారావు, మేతర అజయ్ బాబు, ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోనే సీతారామారావు తదితరులు అభినందనలు తెలిపారు. -
పురుగు మందుల వాడకంలో జాగ్రత్తలు
పెదవేగి: పంటలకు వాడే క్రిమి సంహారక మందుల విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించకపోతే, తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడటంతో పాటు ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, పంటలపై మందులు పిచికారీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల వ్యవసాయ అధికారులు, డివిజనల్ వ్యవసాయ సహాయ సంచాలకులు పలు సూచనలు చేశారు. పిచికారీ సమయంలో జాగ్రత్తలు ● మందులు పిచికారీ చేసే సమయంలో శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు, ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలి. ● పిచికారీ చేసే సమయంలో పొగ తాగడం, నీరు తాగడం లేదా భోజనం చేయడం చేయరాదు. ● పిచికారీ కోసం వాడే స్ప్రేయర్లు మంచి స్థితిలో ఉన్నాయో లేదో ముందుగా చూసుకోవాలి. నాజిల్స్ను శుభ్రం చేయడానికి నోటితో గాలి ఊదరాదు. ● పురుగు, తెగుళ్ల మందులను కలిపేటప్పుడు చేతులతో కాకుండా కర్రతో కలపాలి. ● మందులను ఆహార పదార్థాలతో కలిపి రవాణా చేయరాదు. పురుగు మందుల డబ్బాలను పిల్లలకు అందకుండా ప్రత్యేక గదిలో తాళం వేసి భద్రపరచాలి. ● మందులు వాడే ముందు వాటిపై ఉన్న వివరాలు, రంగు ముద్రలను జాగ్రత్తగా పరిశీలించాలి. ● గాలి వీచే దిశను బట్టి మాత్రమే మందును పిచికారీ చేయాలి. ● ఒకవేళ ప్రమాదవశాత్తు మందు కళ్లలో పడితే వెంటనే మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. విష ప్రభావానికి గురైతే వెంటనే ప్రథమ చికిత్స అందించి, డాక్టర్ను సంప్రదించాలి. ● పిచికారీ పూర్తయిన వెంటనే స్నానం చేసి, దుస్తులను శుభ్రపరచుకోవాలి. స్ప్రేయర్లను శుభ్రంగా కడిగి, ఇంజన్ ఆయిల్ రాసి జాగ్రత్త పరచాలి. ● ఖాళీ అయిన మందుల డబ్బాలను భూమిలో గొయ్యి తీసి పూడ్చిపెట్టాలి. వాటిని ఇతర అవసరాలకు వాడకూడదు. -
14న ఫ్యాప్టో ర్యాలీ
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయులు, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జూలై 14న ఏలూరులో ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ ర్యాలీ, కలెక్టరేట్ పికెటింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఫ్యాప్టో కో–చైర్మన్ కే నరహరి ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. స్థానిక పవర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా 12వ పీఆర్సీని వెంటనే నియమించి వేతన సవరణ ప్రక్రియ ప్రారంభించడంతో పాటు, 30 శాతం మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని కోరారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని, టెట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో చేపడుతున్న ఈ ఉద్యమంలో ప్రతి ఉపాధ్యాయుడు, ఉద్యోగి స్వచ్ఛందంగా పాల్గొని జూలై 14న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా చైర్మన్ జీ.మోహన్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఫ్యాప్టో నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. ఉద్యమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ ఎం.ఆదినారాయణ, కో–ఛైర్మన్లు జీ. వెంకటేశ్వరరావు, జంగం రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
‘హద్దులు’ దాటిన ఇసుక అక్రమాలు
● చింతలపూడి వద్ద రెండు లారీలు స్వాధీనం ● తెలంగాణకు అక్రమ రవాణా చింతలపూడి: తెల్లవారక ముందే రోడ్లెక్కితే చాలు.. గోదావరి బంగారం సరిహద్దులు దాటిపోతోంది. ఏపీలో దొరికే నాణ్యమైన గోదావరి ఇసుకను పొరుగు రాష్ట్రంలో భారీ ధరలకు విక్రయిస్తూ కొందరు అక్రమార్కులు కోట్లకు పడగలెత్తుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా చింతలపూడి మండలం మేడిశెట్టివారిపాలెం వద్ద ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న గోదావరి ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో దొరికిన లారీలు చింతలపూడి ఎస్సై కే.సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొవ్వూరు పరిసర ప్రాంతాల నుంచి గోదావరి ఇసుక లోడుతో తెలంగాణ వైపు దూసుకుపోతున్న రెండు లారీలను పోలీసులు అడ్డుకున్నారు. వీటికి సంబంధించి సరైన అనుమతులు లేకపోవడంతో సదరు లారీలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వాహనాలను చింతలపూడి మార్కెట్ కమిటీ ఆవరణకు తరలించారు. ఇసుక అక్రమ దందాపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ జరుపుతామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సతీష్ కుమార్ ఈ సందర్భంగా హెచ్చరించారు. సరిహద్దు గ్రామాల్లో డంపింగ్ యార్డులు కొవ్వూరు, రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి నిత్యం వేలాది టన్నుల గోదావరి ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతోంది. ఇందుకు తెలంగాణ సరిహద్దుల్లోని ఏపీ గ్రామాలే ప్రధాన కేంద్రాలుగా మారుతుండటం గమనార్హం. గురుబట్లగూడెం, మేడిశెట్టివారిపాలెం, మల్లేశ్వరం, ఎండపల్లి, అల్లిపల్లి గ్రామాల్లో పగటిపూట రహస్యంగా ఇసుకను భారీ ఎత్తున డంపింగ్ చేస్తున్నారు. చీకటి పడగానే తెలంగాణలోని పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలకు లారీల ద్వారా తరలిస్తూ, అక్కడ డిమాండ్ను బట్టి భారీ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జరిమానాలు విధిస్తున్నా.. తగ్గని జోరు! గతంలో పోలీసులు దాడులు చేసి, కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించినా అక్రమార్కుల తీరులో మార్పు రావడం లేదు. ఇసుక ప్రతిరోజూ సరిహద్దులు దాటుతూనే ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, సరిహద్దు ప్రాంతాల్లో శాశ్వత నిఘా పెంచాలని, ఇసుక మాఫియాపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. -
చెరువు గట్టు ఆక్రమణలపై నోటీసులు
ద్వారకాతిరుమల : స్థానిక లింగయ్య చెరువు గట్టు ప్రాంతంలో ఆక్రమించి దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు గ్రామ పంచాయతీ అధికారులు ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. చెరువు గట్టుపై ఆక్రమణల కారణంగా నిత్యం చిన వెంకన్న ఆలయానికి వచ్చే భక్తులకు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ట్రాఫిక్ సమస్య కూడా అధికమవుతోందని పేర్కొన్నారు. నోటీసు అందిన ఏడు రోజుల్లోపు ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించి పంచాయతీ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే నోటీసులపై పలువురు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. తాము ఎన్నో ఏళ్లుగా ఇదే ప్రాంతంలో వ్యాపారాలు నిర్వహిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, దుకాణాలు తొలగిస్తే జీవనోపాధిని కోల్పోతామని అంటున్నారు. చెరువు ప్రాంతాన్ని పార్కుగా అభివృద్ధి చేసి, దుకాణ సముదాయాలను ఏర్పాటు చేసి, వాటిని అద్దెకు ఇస్తే తమకు జీవనోపాధి కొనసాగడమే కాకుండా గ్రామ పంచాయతీకి రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతుందని అంటున్నారు. -
చికెన్ ధరలకు రెక్కలు
గణపవరం : ఇటీవల కాలంలో చికెన్ ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు చికెన్ అందుబాటులో లేకుండా పోయింది. వారం రోజులుగా ధరలు ౖపైపెకి ఎగబాకుతూ, ప్రస్తుతం కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.300 కు చేరింది. పది రోజుల క్రితం దీని ధర రూ.200 మాత్రమే ఉండటం గమనార్హం. అలాగే, స్కిన్తో కూడిన చికెన్ ప్రస్తుతం కిలో రూ.250 వరకు విక్రయిస్తుండగా, బ్రాయిలర్ లైవ్ కోడి (బర్డ్) ధర కిలో రూ.160 నుంచి రూ.180 వరకు పలుకుతోంది. ధరల పెరుగుదలకు కారణాలు ఇటీవల కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో చాలామంది చికెన్ కొనుగోలు వైపు మొగ్గు చూపారు. దీనివల్ల ఒక్కసారిగా డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్నంటాయి. అలాగే ప్రస్తుతం రైతుల వద్ద అవసరానికి సరిపడా కోళ్ల లభ్యత లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కార్పొరేట్ సంస్థలు ధరలు పెంచుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా ఇదే పరిస్థితి సాధారణంగా ఏటా వేసవిలో చికెన్ ధరలు మండిపోతుంటాయి. ఈ ఏడాది కూడా మార్చి నుంచి మే చివరి వరకు కిలో చికెన్ రూ.300 నుంచి రూ.350 వరకు, ఓ దశలో రికార్డు స్థాయిలో రూ.380 వరకు కూడా విక్రయించారు. వేసవి తర్వా త ధరలు తగ్గి సాధారణంగా కిలో రూ.200 లోపే ఉన్నప్పటికీ, మళ్లీ పది రోజులుగా ధరలు భారీగా పెరిగాయి. ఆదివారం వచ్చిందంటే చికెన్ సెంటర్ల వద్ద సందడి కనిపించేది. కానీ ఈ వారం ధరలు చుక్కలు తాకడంతో మాంసాహార ప్రియులు తమ కొనుగోళ్లను సగానికి సగం తగ్గించుకున్నారు. -
గురువులపై సర్దుపోటు
ఉపాధ్యాయుల సర్దుబాటు విషయంలో పలు నిబంధ నలు సడలించాలి. ఫౌండేషన్, బేసిక్ ప్రైమరీ స్కూళ్లకు 15–20 మంది విద్యార్థులుంటే ఇద్దరు ఎస్జీటీలను కేటా యించాలి. అలాగే యూపీల నుంచి హైస్కూల్గా వర్గోన్నతి చెందిన పాఠశాలల్లో గ్రేడ్–2, పీడీ పోస్టులు ఇవ్వనందున ముందుగా మిగిలిన టీచర్లను సర్దుబాటు చేయాలి. –గోపీమూర్తి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గణపవరం మండలంలో మూడు మాత్రమే మిగులు పోస్టులు ఉన్నాయి. మొత్తం 14 పోస్టులు అవసరం. రెండు గణితం, ఒక ఎస్జీటీ మి గులుగా ఉంటే ఇంకా 5 ఎస్జీటీలు, 3 స్కూల్ అసిస్టెంట్ లు, 3 పీడీలు, 3 గ్రేడ్–2 హెచ్ఎంల పోస్టులు అవసరం. ఆ పాఠశాలలో జూనియర్ టీచర్కు బదులుగా సీనియర్ టీచర్ విల్లింగ్ ఉంటే వారికి అవకాశం ఎంఈఓ లాగిన్లో కల్పించారు. –ఏసీవీ ప్రకాష్, ఎంఈవో–1, గణపవరంనిడమర్రు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి అనుగుణంగా టీచర్ల నియామకానికి రంగం సిద్ధమైంది. గతనెల 30 నాటికి పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ను పరిగణనలోకి తీసుకుని సర్దుబాటు చేయనున్నారు. ఒకవైపు పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ ప్రక్రియ జరుగుతుండగా.. మరోవైపు వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో సర్దుబాటుపై ఉపాధ్యాయ సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఆగస్టు 31 వరకూ పాఠశాలల్లో నమోదు ఉంటుంది. అయితే జూన్ 30 రోల్ ఆధారంగా పాఠశాలల్లో మిగుల పోస్టులు లెక్కతేల్చారు. దీంతో ఏలూరు జిల్లాలో 422, పశ్చిమగోదావరి జిలాల్లో 260 టీచర్ పోస్టులు సర్ప్లస్ (మిగులు)గా ఉన్నత అధికారులు లెక్కగట్టారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో టీచర్ పోస్టులు భారీగా మిగిలినట్టు అంచనా. ఈ మేరకు ఆదివారం జాబితాను అధికారులు విడుదల చేశారు. అయితే ఏ స్కూళ్లలో ఏ పోస్టులు అవసరమనే సమాచారం మాత్రం ఇవ్వలేదు. ఆ వివరాలు ఎంఈఓల లాగిన్లకు మాత్రమే అందుబాటులో ఉంచారు. సర్దుబాటు విషయంలో రోజుకో నిబంధనతో జూనియర్ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్క్ అడ్జస్ట్మెంట్ ఇలా.. ● గతేడాది 121 మంది విద్యార్థులున్న మోడల్ ప్రైమరీ పాఠశాలకు ఒక్ హెచ్ఎం, ఐదుగురు ఎస్జీటీలను ఇచ్చారు. ఈ ఏడాది 151 మంది విద్యార్థులకు పెంచారు. అయితే గతంలో మాదిరిగానే 121 మంది విద్యార్థులకు 6 పోస్టుల విధానం కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నా పరిగణనలోకి తీసుకోలేదు. ● స్కూల్ అసిస్టెంట్ల విషయంలో ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6,7,8 తరగతుల్లో 10 మందికి ఒక ఎస్ఏ, 11–30 వరకూ ఇద్దరు, 31–140 వరకూ నలుగురు, 141–175 వరకూ ఐదుగురు చొప్పున ఎస్ఏలను సర్దుబాటు చేశారు. ● ఉన్నత పాఠశాలల్లో ఐదు సెక్షన్లకు గ్రేడ్–2 హెచ్ఎంతో సహా 8 మంది ఎస్ఏలు, 6 సెక్షన్ల వరకూ 9 మంది, 7 సెక్షన్లకు 12 మంది, 8 సెక్షన్లకు 13 మంది, 9,10 సెక్షన్ల వరకూ 15 మంది, 10, 11 సెక్షన్ల వరకూ 16 మంది, 13 సెక్షన్లకు 18 మంది, 14 సెక్షన్లకు 19 మంది ఎస్ఏలను మంజూరు చేశారు. ● ఈ విధంగా 25 సెక్షన్ల వరకే గ్రేడ్–2 హెచ్ఎంతోపాటు 31 పోస్టులు ఉండేలా సర్దుబాటు ప్రక్రియ జరిగినట్టు అధికారులు తెలిపారు. నేడు సర్దుబాటు సోమవారం మిగులు టీచర్లను సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఏ టీచర్ సర్ప్లస్ అయ్యారనేది అధికారులు ప్రకటించారు. అయితే ఏ మండలాల్లో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నయనేది స్పష్టత లేక ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ముందుగా మిగులు టీచర్లతో మండలం యూనిట్గా ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా సర్దుబాటు ఉంటుంది. ఇంకా మిగిలితే డివిజన్ స్థాయిలో, జిల్లాస్థాయిలో కౌ న్సెలింగ్ నిర్వహిస్తారు. ఎక్కువగా తాజాగా పదోన్నతి వచ్చిన వారు, డీఎస్సీ–2025లో నియామకం పొందిన వారికి స్థానచలనం తప్పదని పలువురు చెబుతున్నారు. విద్యార్ధులకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు ఉమ్మడి జిల్లాలో 682 మిగులు టీచర్ పోస్టులు రోజురోజుకూ కొత్త నిబంధనలపై ఆందోళన అడ్మిషన్లు పూర్తవకుండానే వర్క్ అడ్జెస్ట్మెంట్ అవసరమైన పోస్టుల వివరాలు ఎంఈఓల లాగిన్కు.. డివిజన్లు మారే పరిస్థితిపై జూనియర్స్ ఆందోళన జిల్లా ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లు లాంగ్వేజ్ పండిట్లు ఏలూరు 247 125 50 పశ్చిమగోదావరి 174 57 29 -
‘సర్’తో ఓటుకు రక్షణ
భీమవరం (ప్రకాశంచౌక్) : ప్రత్యేక ఓటర్ల జా బితా సవరణ (సర్) ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి స్వచ్ఛమైన, తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. పట్టణంలోని చిగుడీలుపేట పద్మశాలీల బజార్ ప్రాంతంలో ఆదివారం ఆమె పర్యటించి సర్ ప్రక్రియను పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలపై ఓటర్లను ఆరా తీశా రు. డిజిటలైజేషన్పై బీఎల్ఓలను ప్రశ్నించా రు. ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ పనులను గడువులోపు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాంతంలో వీధి కుక్కలు అధికంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ వాటికి స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ ఎ.రాంబాబు, బీఎల్ఓలు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్) : ఓటర్ల జాబితా ప్ర త్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమ రేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ ను వేగవంతంగా పూర్తి చేసి నూరు శాతం ల క్ష్యం సాధించాలని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి ఆదేశించారు. పట్టణంలోని 1, 2వ వార్డుల్లో ఆదివారం ఆయన పర్యటించి ఓటర్ల ఎన్యుమరేష న్, డిజిటలైజేషన్ను పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ఆరా తీశారు. ఎన్యుమరేషన్ ఫారాలను ప్రజలు పూర్తిగా నింపి వీలైనంత త్వరగా బీఎల్ఓలకు అందజేయాలని, తద్వారా సమ గ్ర, పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించాలని కోరారు. మెంటేవారితోట ప్రాంతంలో డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్తను గమించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటికీ చెత్త సేకరణపై ఆరా తీశారు. తహసీల్దార్ రావి రాంబా బు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఎ.రాంబాబు, బీఎల్ఓలు ఉన్నారు. భీమవరం: భీమవరం పట్టణంలో బంగ్లాదేశీయులు ఉన్నారా అనే విషయమై పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇత ర ప్రాంతాల నుంచి భీమవరం వచ్చి పనులు చేసుకుంటున్న వారి వివరాలను తెలుసుకున్నారు. పలువురిని పశ్చిమ బెంగాల్కు చెందినవారిగా గుర్తించారు. వన్టౌన్ సీఐ ఎ.రమేశ్, ఎస్సై కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. యలమంచిలి : ఎంపీటీసీ సభ్యులకు 2024 నుంచి గౌరవ వేతనాలు రావటం లేదని, తొందరగా ఇప్పించాలని యలమంచిలి ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి ఆధ్వర్యంలో మండలంలోని ఎంపీటీసీ సభ్యులు ఆదివారం పాలకొల్లులో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో వైస్ ఎంపీపీలు గొల్లపల్లి శ్రీనివాసరావు, కొప్పాడి శ్రీనుబాబు, మాజీ ఎంపీపీ రావూరి వెంకటరమణ, ఎంపీటీసీ సభ్యులు కడలి సుబ్బలక్ష్మి, కంబాల సత్యశ్రీ, కడలి సునీత, మానుకొండ చిట్టెమ్మ, ఇసుకపల్లి శ్రీధర్ వర్మ, కంబాల తిరుమల వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు ఉన్నారు. పెదవేగి: రాట్నాలకుంటలోని రాట్నాలమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆల యానికి పలు రూపాల్లో రూ.1,32,165 ఆదా యం లభించిందని దేవస్థాన చైర్మన్ మన్నే శ్రీనివాసరావు తెలిపారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. ఈఓ నల్లూరి సతీష్కుమార్ పర్యవేక్షించారు. -
పోలీస్స్టేషన్ వద్ద ఆందోళన
యలమంచిలి: చించినాడ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆచంట మండలం భీమలాపురం గ్రామానికి చెందిన చప్పిడి హేమ చంద్రిక (19) తలకు బలమైన గాయమైంది. దీంతో ఆమెను భీమవరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది. చంద్రిక తన మేనమామ కట్టా శ్రీనివాస్తో కలిసి తాటిపాకకు అమ్మమ్మ ఇంటికి వెళ్తుండగా చించినాడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బొలెరో ట్రక్ డ్రైవర్ ముగ్గు గణేష్ మద్యం సేవించి ఆ మత్తులో వాహనాన్ని రాంగ్ రూట్ లో అతివేగంగా నడపడం వలనే ప్రమాదం జరిగిందని నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ బంధువులు మృతదేహంతో పోలీస్స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. దీనిపై ఎస్సై రాజ్కుమార్ స్పందిస్తూ ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, పోలీస్స్టేషన్ వద్ద ఆందోళన చట్ట విరుద్ధమని హెచ్చరించడంతో మృతదేహాన్ని అంబులెన్స్పై పోలీస్స్టేషన్ నుంచి దూరంగా తరలించారు. అనంతరం బంధువులు, కుటుంబ సభ్యులు సుమారు మూడు గంటలపాటు స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. దీంతో ఎస్సై రాజ్కుమార్ ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడి ఇప్పటికే కేసు నమోదు చేశామని, నిందితుడిని విచారిస్తున్నామన్నారు. చంద్రిక న్యాయం జరుగుతుందని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
సందేశాత్మకంగా నాటిక పోటీలు
ఏలూరు (ఆర్ఆర్పేట) : నగరానికి చెందిన హేలా పురి కళాపరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామ రాజు 18వ స్మారక జాతీయ స్థాయి నాటిక పోటీల్లో భాగంగా రెండో రోజు ఆదివారం ప్రదర్శించిన నాటికలు సందేశాత్మకంగా సాగాయి. స్థానిక వైఎంహెచ్ఏ హాలులో ప్రదర్శించిన నాటికలు సమాజంలోని సమకాలీన అంశాలను, మానవీయ విలువలను ప్రతిబింబించాయి. తొలుత హర్ష క్రియేషన్స్ (విజయవాడ) బృందం భువి కోరని భ్రమణం నాటికను ప్రదర్శించారు. ముడుపల్లి మోహన్ గుప్తా (గుప్తా ఫౌండేషన్) సౌజన్యంతో ప్రదర్శితమైన నా టికకు మూలకథ ఆచార్య ఉమామహేష్ అందించా రు. తాళాబత్తుల వెంకటేశ్వరరావు నాటకీకరణ చేశారు. కత్తి శ్యామ్ప్రసాద్ దర్శకత్వం వహించారు. అనంతరం ముద్దుకూరి ఆర్ట్స్ క్రియేషన్స్ (చిలకలూరిపేట) బృందం మా ఇంట్లో మహాభారతం నాటికను ఆవిష్కరించింది. మహమ్మద్ ఖాజావలీ సౌజన్యంతో నాటికకు ముద్దుకూరి రవీంద్రబాబు రచన, దర్శకత్వం వహించారు. కుటుంబ విలువలు, మానసిక సంఘర్షణల నేపథ్యంలో సాగిన నాటిక వినోదాత్మకంగా సాగింది. -
నైపుణ్యం మెండుగా.. కొలువులు దండిగా..!
ఏలూరు (ఆర్ఆర్పేట) : ఇంజనీరింగ్ చదువు వేలాది మంది విద్యార్థుల కల. సాంకేతిక విద్యపై మక్కువతో పాటు కోర్సు పూర్తయితే కొలువులు సులభంగా సాధించవచ్చనే ఆశతో ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు బీటెక్ వైపు అడుగులు వేస్తుంటారు. ఇటీవల విడుదలైన ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల్లో ర్యాంకు లు సాధించిన విద్యార్థులు, త్వరలో ప్రారంభం కా నున్న కౌనర్సెలింగ్ నేపథ్యంలో ఏ బ్రాంచ్ ఎంచుకోవాలనే సందిగ్ధంలో ఉన్నారు. ఉద్యోగావకాశాలు, భా రీ ప్యాకేజీలు అందించే కోర్సుల గురించి నిపుణులు, సీనియర్ల నుంచి సలహాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన ఇంజనీరింగ్ కోర్సులు, వాటి ప్రాధాన్యతలను పరిశీలిస్తే.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ● డిమాండ్ : క్యాంపస్ రిక్రూట్మెంట్లలో ఐటీ కంపెనీలు మొదటగా సీఎస్ఈ విద్యార్థులకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ● ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ : రానున్నది కృత్రిమ మేధ శకం కావడంతో విద్యార్థులు ఏఐ, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్ కోర్సుల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. గత నాలుగేళ్లుగా ఈ సీట్లు పూర్తిగా భర్తీ అవుతున్నాయి. ● పాఠ్యాంశాలు : కంప్యూటర్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్/హార్డ్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటా బేస్ వంటి అంశాలపై ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ● ద్వితీయ ప్రాధాన్యం : విద్యార్థుల రెండో చాయిస్గా ఈసీఈ నిలుస్తోంది. ● ద్వంద్వ ప్రయోజనం: ఈ బ్రాంచ్ చదవడం వల్ల అటు కోర్ (హార్డ్వేర్) రంగంతో పాటు ఇటు సాఫ్ట్వేర్ రంగంలోనూ సులభంగా ఉద్యోగాలు సాధించవచ్చు. ● పాఠ్యాంశాలు : శాటిలైట్ కమ్యూనికేషన్స్, మై క్రో ప్రాసెసర్స్, సర్క్యూట్స్, యాంటెన్నా వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ● భారీ ఉద్యోగావకాశాలు: ప్రైవేట్ రంగంలో వస్తున్న హైడల్ పవర్ ప్రాజెక్టుల కారణంగా రా బోయే నాలుగేళ్లలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ● ప్రయోజనం : విద్యార్థులకు అటు ఎలక్ట్రికల్, ఇటు ఎలక్ట్రానిక్స్ రెండింటిపైనా పట్టు లభిస్తుంది. మెకానికల్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ మెకానికల్ (ఎవర్గ్రీన్ బ్రాంచ్): ద్విచక్ర వాహనాల నుంచి విమానాలు, ఆటోమొబైల్స్, భారీ యంత్రాల రూపకల్పన వరకు మెకానికల్ ఇంజనీర్ల పాత్ర కీలకం. కెమికల్ ఇంజనీరింగ్ : డీఎన్ఏ సీక్వెన్సింగ్, జెనెటిక్ ఇంజనీరింగ్ వంటి ఆధునిక మార్పుల వల్ల ఈ కోర్సుకూ మంచి భవిష్యత్తు ఉంది. ఏలూరులో ఏపీఈఏపీసెట్కు హాజరైన విద్యార్థులు (ఫైల్) ఊరిస్తున్న ఇంజనీరింగ్ కోర్సులు పట్టుసాధిస్తే ముంగిటకే ఉద్యోగం కృత్రిమ మేధ పిలుస్తోంది బ్రాంచ్ కన్నా నైపుణ్యాలే కీలకం ఉమ్మడి జిల్లాలో 8,350 సీట్లు ఏఐ రావడంతో కంప్యూటర్ సైన్స్కు ఉద్యోగావకాశాలు ఉండవనే అపోహ సరైంది కాదు. ఆధునిక నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి కోర్ బ్రాంచ్ విద్యార్థులకు కూడా విస్తృత అవకాశాలు లభిస్తాయి. బ్రాంచ్ ఎన్నిక కీలకమే కానీ ఎంపిక చేసుకున్న బ్రాంచ్లో నైపుణ్యం సాధిస్తేనే అవకాశాలు వస్తాయి. కళాశాలల ఎంపిక కేవలం దానికి ఉన్న పేరు, చేస్తున్న ప్రచారం ఆధారంగా ఉండకూడదు. నాక్, ఎన్బీఏ గుర్తింపు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. – డాక్టర్ మార్లపల్లి కృష్ణ, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల సీఎస్ఈ ప్రొఫెసర్ఏలూరు జిల్లా పరిధిలో 4 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 1,200, రా మచంద్ర కళాశాలలో 1,020, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో 600, హేలాపురి కళాశాలలో 330 సీట్లు మొత్తంగా 3,150 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఏలూరు జిల్లా నుంచి 3,816 మంది పరీక్ష రాయగా, 2,766 మంది ఇంజనీరింగ్కు అర్హత సాధించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 9 కాలేజీల్లో 5,200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జిల్లాలో 11,287 మంది పరీక్షలు రాయగా.. 8,212 మంది అర్హత సాధించారు. అయితే, ఇతర జిల్లాల టాపర్లు ఉమ్మడి జిల్లాలోని కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపడం వల్ల స్థానిక విద్యార్థుల మధ్య సీట్ల కోసం గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. -
మద్ది ఆంజనేయస్వామికి రూ.2.08 లక్షల ఆదాయం
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం ఆలయ ప్రాకార మండపంలో అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. శనివారం సాయంత్రం వరకు వివిధ సేవల రూపేణా ఆలయానికి రూ. 2,08,267 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఆలయంలో జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను ధర్మకర్తల మండలి అధ్యక్షులు రాజాన సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు. కాగా, నిత్యాన్నదాన సత్రంలో సుమారు 1,897 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ రాజాన సత్యనారాయణ, ఈవో ఆర్.వి.చందన పేర్కొన్నారు. -
ఎన్యుమరేషన్.. పరేషాన్
సాక్షి ప్రతినిధి,ఏలూరు : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఎన్యుమరేషన్ ఫారాల పరేషాన్ జిల్లాలో అక్కడక్కడా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఫారాలు అందకపోవడం, మరికొన్ని చోట్ల రాజకీయ కారణాలతో అందించకుండా నిలుపుదల చేస్తే ఫిర్యాదులతో వెంటనే ఇవ్వడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా మరోవైపు ఫారాల పంపిణీ, డిజటలైజేషన్ వేగవంతం చేయాలని సమీక్షా సమావేశాల్లో అధికారులు ప్రత్యేక ఆదేశాలిచ్చారు. ఫారాలు.. అడిగితేనే ఇస్తారట! సర్ కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సీరియస్గా నిర్వహిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం, సర్కు సంబంధించి కొన్ని చోట్ల ప్రజలు అడిగే అనుమానాలు బీఎల్ఓలు నివృతి చేసే పరిస్థితి లేకపోవడంతో మరోవైపు సమస్యలు కొనసాగుతుండగా ఇంకోవైపు మాత్రం పూర్తిస్థాయిలో ఫారాల పంపిణీ జరగలేదు. ఏలూరు నగరంలో శాంతినగర్లోని కొన్ని వీధులు, అలాగే ఇతర ప్రాంతాల్లో పంపిణీ ప్రక్రియ పూర్తి కాలేదు. శనివారానికి శ్రీరామవరం పోలింగ్బూత్ నంబర్ 80 పరిధిలో ఫారాల పంపిణీ ప్రక్రియ జరగలేదు. దీనిపై తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన తర్వాత పంపిణీ చేశారు. అలాగే ఏలూరు రూరల్ మండలంలోని గుడివాకలంకలో 800 మందికి ఫారాల పంపిణీ పూర్తి కాలేదు. విషయాన్ని స్థానికులు తహసీల్దార్ దృష్టికి తీసుకువస్తే ఫారాల పంపిణీ ప్రక్రియ గంటలో పూర్తిచేశారు. ఇలా కొన్నిచోట్ల జరుగుతూనే ఉంది. శనివారం పోలవరం నియోజకవర్గంలో గంట సేపు సర్వర్ నిలిచిపోవడంతో డిజిటలైజేషన్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. క్షేత్రస్థాయిలో ఫారాల పంపిణీ జరిగిందా లేదా అనే ప్రక్రియపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టి సారించకుండానే నూరు శాతం ప్రక్రియ పూర్తయిందని నివే దికలు ఇవ్వడంతో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీపై దృష్టి మరలింది. ప్రస్తుతం జిల్లా యంత్రాంగమంతా డిజటలైజేషన్పైనే హడావుడి చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి జిల్లాలో 75 శాతం డిజటలైజేషన్ పూర్తి కావాలని కలెక్టర్ నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ కై కలూరులో 62.02 శాతం, నూజివీడులో 63.99, పోలవరం 66.77, ఉంగుటూరులో 66.86, ఏ లూరులో 69.47 శాతం, దెందులూరు నియోజకవర్గంలో 56.37 శాతం, చింతలపూడిలో 58.07 శాతం, మొత్తంగా జిల్లాలో 63.29 శా తం డిజటలైజేషన్ చేసినట్టు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. జిల్లాలో పోలవరం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో మాత్రమే ఎన్యుమరేషన్ ఫారాలు వంద శాతం పంపిణీ పూర్తయిందని, మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో 99 శాతం, ఏలూరు నగరంలో 98.27 శాతం పూర్తయిందని అధికారులు తెలిపారు. అన్నీ సమస్యలే ‘సర్’ ఏజెన్సీ ఏరియాలో తరచూ సర్వర్ సమస్యలు కొన్ని గ్రామాల్లో ఫిర్యాదు చేస్తేనే ఫారాలు అందజేత నేటి సాయంత్రానికి 70 శాతం డిజిటలైజేషన్కు కలెక్టర్ ఆదేశం పూర్తిగా ఇళ్లకు చేరని ఎన్యుమరేషన్ పత్రాలు అన్ని పనులు సచివాలయ సిబ్బందితోనే -
రైలు నుంచి జారి యువకుడి మృతి
తణుకు అర్బన్: రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని యువకుడు మృతిచెందిన ఘటన శనివారం తణుకు మండలం వేల్పూరు రైల్వేస్టేషన్న్ సమీపంలో చోటు చేసుకుంది. సుమారు 25 ఏళ్ల వయసు ఉన్న యువకుడు గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి మృతి చెంది ఉంటాడని రైల్వే పోలీసులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి కుడి చేతిపై అమ్మ అనే అక్షరాలతో పచ్చబొట్టు ఉన్నట్లు చెబుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాదంపూడిలో షూటింగ్ సందడి
ఉంగుటూరు: మండల పరిధిలోని బాదంపూడి గ్రామంలో శనివారం ఉదయం నూతన చిత్ర సినిమా షూటింగ్ సందడిగా సాగింది. దర్శకుడు పవన్ బాసింశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని పలు కీలకమైన సీన్లను బాదంపూడి గ్రామంలోని భక్తాంజనేయ స్వామి గుడి ప్రాంగణం, గోదావరి కాలువ గట్టు, మెయిన్ రోడ్డుపై చిత్రీకరించారు. కమెడియన్లు సత్య, జబర్దస్త్ రోహిణి, తమిళ హాస్యనటుడు యోగి బాబు, హీరోయిన్ జయశ్రీ, సీనియర్ నటుడు తనికెళ్ళ భరణిలతో పాటు స్థానిక బాదంపూడి గ్రామానికి చెందిన చిన్నారులు కూడా పాల్గొన్నారు. షూటింగ్ అనంతరం భక్తాంజనేయ స్వామి ఆలయంలో పూజారి కె.ఫణికుమార్ ఆధ్వర్యంలో సినీ ప్రముఖులతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా విద్యార్థులకు, యువకులకు ఇచ్చిన అన్ని హామీలను తక్షణమే అమలు చేయాలని, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐయస్ఏ) ఐసా రాష్ట్ర కార్యదర్శి ఎస్.నాగార్జున డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలో శనివారం ఐసా జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి అధ్యక్షతన జరిగింది. నాగార్జున మాట్లాడుతూ గత ఎన్నికలు సందర్భంగా కూటమి, ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు, యువకులకు అనేక రకాలైన హామీలు ఇచ్చిందని, విద్యార్థులకు స్కాలర్షిప్లు, రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పారని, రెండేళ్లు కావస్తున్నా పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల కాలేదన్నారు. బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని వాపోయారు. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. ఈ నెల 8న విజయవాడలో జరిగే ఐసా, ఆర్వైఏ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వర్క్షాపునకు జిల్లా నుంచి విద్యార్థులు హాజరై జయప్రదం చేయాలని తెలిపారు. నూజివీడు: పట్టణంలోని, మండలంలోని విత్తనాల దుకాణాలను, విత్తన కంపెనీని వ్యవసాయశాఖ తనిఖీ బృందం శనివారం తనిఖీ చేసింది. దీనిలో భాగంగా ఏలూరు ఏడీఏ అనిల్కుమారి తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని అన్నదాత సీడ్స్ను తనిఖీ చేయగా రూ.31 వేలు విలువ కలిగిన 31 బస్తాల వరి విత్తనాలు స్టాకు తేడా ఉండటాన్ని గమనించారు. మీర్జాపురంలోని సీపీ సీడ్స్ కంపెనీలో తనిఖీలు చేయగా అక్కడ రూ.11.76 లక్షల విలువ కలిగిన 1.680 టన్నుల మొక్కజొన్న విత్తనాలు స్టాకు రిజిస్టర్లో నమోదుకు, భౌతిక నిల్వకు తేడా ఉన్నట్లు గమనించారు. దీంతో ఈ రెండు చోట్ల విత్తనాల విక్రయాలు జరపకుండా నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ విత్తనాల డీలర్లు స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్లు నిర్వహణ సక్రమంగా నిర్వహించాలన్నారు. రైతులందరూ తాము కొనుగోలు చేసిన విత్తనాలకు తప్పనిసరిగా డీలర్ల వద్ద నుంచి బిల్లులు పొందాలని సూచించారు. యలమంచిలి: అబ్బిరాజుపాలెం ఫెర్రీ వేలం మరోసారి వాయిదా పడింది. సరైన లైసెన్స్ కానీ, అగ్రిమెంట్ కానీ లేకుండా పాటదారులు పాటకు హాజరు కావడంతో ఈ నెల 9కి పాటను వాయిదా వేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి ప్రకటించారు. ఈసారి ధరావతును రూ.20 వేల నుంచి రూ.50 వేలకు, సాల్వెన్సీని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంపై పాటదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఫెర్రీ వేలం గడువు పూర్తయినా పడవలు తిరుగుతున్నాయని, అధికారులు రేవు కొనసాగించవద్దని కంటి తుడుపుగా బోర్డు పెట్టి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్య నటుడు యోగిబాబుకు స్వాగతం పలికి, సత్కరిస్తున్న దృశ్యం -
నాటకం.. ఆలోచనాత్మకం
ఏలూరు (ఆర్ఆర్పేట) : హేలాపురి కళాపరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 18వ స్మారక జాతీయ స్థాయి నాటిక పోటీలు శనివారం స్థానిక వైఎంహెచ్ఏ హాలులో ప్రా రంభమయ్యాయి. తొలి రోజు రెండు ప్రదర్శనలు ఆలోచనాత్మకంగా సాగాయి. అభినయ ఆర్ట్స్ (గుంటూరు) కళాకారులు సహానా నా టిక ప్రదర్శించారు. ప్రపంచంలో బతకాలంటే సమస్యలతో, సంఘటనలతో జతకట్టి వాటిని ప్రతిఘటిస్తూ ముందుకు సాగాలనే సందేశమిస్తూ నాటిక సాగింది. అనంతరం అరవింద ఆర్ట్స్ (తాడేపల్లి) కళాకారులు దేవుణ్ణి చూసా నాటిక ప్రదర్శించారు. కనిపించే మనుషుల్లోనే దేవుణ్ణి చూడాలనే సందేశంతో ఈ నాటిక సాగింది. తొలుత నిర్వహించిన సభా కార్యక్రమంలో ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జి. పాండురంగారావు, వైఎంహెచ్ఏ అధ్యక్షు డు యర్రా సోమలింగేశ్వరరావు, హేలాపురి కళాపరిషత్ అధ్యక్షుడు పెదపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జూనోసిస్ వ్యాధులతో జాగ్రత్త!
జంగారెడ్డిగూడెం: జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించే వ్యాధులు (జూనోటిక్ వ్యాధులు) ప్రస్తుతం పెద్ద సవాల్గా మారుతున్నాయి. ఏటా జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1885 జూలై 6న శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ రేబీస్ వ్యాధికి విజయవంతంగా మొదటి టీకాను కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజును జరుపుకుంటారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకుడు డాక్టర్ పీ.ఎన్.వీ. శేఖర్ దొర జూనోటిక్ వ్యాధుల తీవ్రత, వాటి నివారణపై ప్రత్యేక అవగాహన కల్పించారు. జూనోసిస్ అంటే ఏమిటి? జంతువులు, పక్షుల నుంచి మనుషులకు వ్యాపించే అంటువ్యాధులను శ్రీజూనోటిక్ వ్యాధులుశ్రీ అంటారు. ప్రపంచవ్యాప్తంగా మనుషులకు వచ్చే అంటువ్యాధులలో దాదాపు 60 శాతం జంతువుల నుంచే సంక్రమిస్తున్నాయని అంచనా. వ్యాప్తి చెందే మార్గాలు: వ్యాధి సోకిన జంతువులను తాకడం (డైరెక్ట్ కాంటాక్ట్), వాటి లాలాజలం, రక్తం, మలమూత్రాల ద్వారా, సరిగ్గా ఉడకని మాంసం, పచ్చి పాలు తాగడం ద్వారా, దోమలు, ఈగలు, గోమార్లు (టిక్స్) వంటి కీటకాల ద్వారా ఈ వ్యాధులు మనుషులకు వ్యాపిస్తాయి. ప్రధానమైన జూనోటిక్ వ్యాధులు రేబిస్: పిచ్చి కుక్కలు, పిల్లుల కాటు ద్వారా వస్తుంది. నాడీ వ్యవస్థ దెబ్బతిని, నీటిని చూసి భయపడటం (హైడ్రోఫోబియా) దీని ముఖ్య లక్షణం. లక్షణాలు బయటపడితే మరణం ఖాయం. బర్డ్ ఫ్లూ/స్వైన్ ఫ్లూ: పక్షులు, పందుల ద్వారా వ్యాపించే వైరస్. తీవ్రమైన శ్వాసకోస సమస్యలు, జ్వరం, దగ్గుకు దారితీస్తుంది. ఆంథ్రాక్స్: గొర్రెలు, మేకలు, పశువుల నుంచి సంక్రమిస్తుంది. చర్మంపై నల్లటి పుండ్లు పడటం, శ్వాస ఆడకపోవడం దీని లక్షణాలు. బ్రుసెల్లోసిస్: వ్యాధి సోకిన పశువుల పచ్చి పాలు తాగడం ద్వారా వస్తుంది. మనుషులలో కీళ్ల నొప్పులు, పునరావతమయ్యే జ్వరం, గర్భిణీ సీ్త్రలలో గర్భస్రావానికి కారణమవుతుంది. క్షయ వ్యాధి (టీబీ): వ్యాధి ఉన్న ఆవుల పాలు సరిగా కాచకుండా తాగడం వల్ల మనుషులకు ఊపిరితిత్తుల, పేగుల క్షయ సోకుతుంది. జూనోటిక్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు: ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులు, ఇతర పశువులకు పశువైద్యుల సలహా మేరకు రేబీస్, బ్రసెల్లా వంటి నివారణ టీకాలను సకాలంలో వేయించాలి. వ్యక్తిగత పరిశుభ్రత: జంతువులను తాకిన తర్వాత, వాటికి మేత వేసిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఆహార నియమాలు: పాలు, పాల పదార్థాలను బాగా కాచి మాత్రమే వాడాలి. మాంసాన్ని బాగా ఉడికించిన తర్వాతే తినాలి. పచ్చి మాంసం ముట్టుకున్నాక చేతులు శుభ్రం చేసుకోవాలి. బాహ్య పరాన్నజీవుల నిర్మూలన: పశువుల పాకలలో, ఇళ్ల పరిసరాలలో గోమార్లు (టిక్స్), ఈగలు, దోమలు చేరకుండా క్రమం తప్పకుండా క్రిమిసంహారక మందులు చల్లాలి. అడవి జంతువులకు దూరం: కోతులు, ఎలుకలు, గబ్బిలాలు వంటి వన్యప్రాణులకు దూరంగా ఉండాలి. జంతువుల ప్రవర్తనలో తేడా వస్తే వెంటనే వెటర్నరీ డాక్టర్కు సమాచారం అందించాలి. అప్రమత్తత, పరిశుభ్రతతోనే అడ్డుకట్టజూనోటిక్ వ్యాధుల పట్ల భయం వద్దు.. అవగాహన ముఖ్యం. ఒకే ప్రపంచం – ఒకే ఆరోగ్యశ్రీ అనే సంకల్పంతో పశువుల ఆరోగ్యంపై దృష్టి పెడితేనే మానవాళి ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. జంతువుల యజమానులు, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, పశువైద్య శాలల సేవలను సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ పి.ఎన్.వి. శేఖర్ దొర, సహాయ సంచాలకులు, ప్రాంతీయ పశువైద్యశాల -
అల్లూరి జీవితం ఆదర్శనీయం
భీమవరం (ప్రకాశంచౌక్): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం ఆదర్శనీయమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూ పతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. శనివారం స్థానిక అల్లూరి స్మతివనంలో 30 అడుగుల కాంస్య విగ్రహం వద్ద అల్లూరి జయంతి వేడుకలు నిర్వహించి డిజిటల్ స్క్రీన్ను ప్రారంభించారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ అల్లూరి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కలెక్టర్ సీహెచ్ నాగరాణి మాట్లాడుతూ అల్లూరి జీవితం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడారు. అనంతరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. చిన్నారులు అల్లూరి వేషధారణలతో ఆకట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రపై నిర్వహించిన పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు అందించారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఉద్దరాజ విశ్వనాథరాజు, గాదిరాజు సుబ్బరాజు, కంతేటి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటింటికీ రేషన్ పంపిణీలో నిర్లక్ష్యం
పాలకోడేరు: ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం, ప్రజా పంపిణీ వ్యవస్థపై శ్రద్ధ కొరవడటం, అప్పటికప్పుడు తోచిన నిర్ణయాలు తీసుకోవడం వంటి కారణాల వల్ల ప్రతి నెలా 26న ప్రారంభం కావాల్సిన నిత్యావసర వస్తువుల పంపిణీ, వారం రోజులు గడిచినా మొదలుకాని దుస్థితి నెలకొంది. ఉండి ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో ఆకివీడు, ఉండి, కాళ్ళ, పాలకోడేరు, భీమవరం రూరల్, గణపవరం మండలాలు, భీమవరం మున్సిపాలిటీ ఉన్నాయి. ఈ పాయింట్ నుంచి ఆయా ప్రాంతాలకు బియ్యం, పంచదార, గోధుమపిండితో పాటు అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా అవుతుంటాయి. సాధారణంగా ప్రతి నెలా 16 నుంచి 25వ తేదీ లోపు సరుకులు సరఫరా చేస్తే, 26వ తేదీ నుంచి రేషన్ డీలర్లు 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటింటికీ వెళ్లి రేషన్ పంపిణీ చేస్తారు. ఈ ఏర్పాటు నిత్యావసర చట్టంలో లేనప్పటికీ, డీలర్లకు ఎలాంటి ప్రతిఫలం అందించకుండానే అధికారులు వారిని బెదిరించి బలవంతంగా ఈ పని చేయించుకుంటున్నారు. అయినప్పటికీ సకాలంలో సరుకులు డెలివరీ ఇవ్వకపోవడంతో జూలై నెల పంపిణీ ఆరు మండలాల్లోని కొన్ని షాపుల వద్ద నిలిచిపోయింది. గతంలో సరుకు రేషన్ షాపులకు డెలివరీ అయిన వెంటనే ఈ–పాస్ మిషన్లో డౌన్లోడ్ చేసుకునేవారు. అయితే ఇప్పుడు డీలర్లు స్వయంగా ఉండి ఎంఎల్ఎస్ పాయింట్కు వెళ్లి వేలిముద్ర వేయాల్సి ఉంటోంది. అలా వేసిన 24 గంటల వరకూ ఈ–పాస్ మిషన్లోకి సరుకు వివరాలు రావడం లేదు. గతంలో తక్షణమే పూర్తయ్యే ఈ ప్రక్రియ ఇప్పుడు మూడు రోజుల సమయం తీసుకుంటోంది. సరుకు వచ్చిన వెంటనే థంబ్ వేయడం, ఆ తర్వాత మూడో రోజున ఈ–పాస్ మిషన్లోకి డేటా డౌన్లోడ్ కావడం వంటి సాంకేతిక సమస్యలతో ఆలస్యం జరుగుతోంది. ఈ విధానంలో 26వ నుంచి డోర్ డెలివరీ మొదలవ్వాలంటే, 24 నాటికే సరుకును రేషన్ షాపులకు చేర్చాల్సి ఉంది. గోదాముల్లో పంచదార, గోధుమ పిండి నిల్వలు సరిపడా ఉండడం లేదు. గతంలో మూడు నెలలకు సరిపడా స్టాక్ నిల్వ ఉండేది. ఇప్పుడు ఏ నెలకు ఆ నెల సరిపడా సరుకులు అందుబాటులో లేకపోవడంతో ప్రజా పంపిణీ వ్యవస్థకు తరచూ అంతరాయం కలుగుతోంది. ప్రజా పంపిణీ పటిష్టంగా అమలు కావాలంటే రేషన్ డీలర్లపై కొరడా ఝళిపించడమే పరమావధిగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు తప్ప, అసలు సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై ఎంఎల్ఎస్ పాయింట్ అధికారులను ప్రశ్నించగా, సాంకేతికంగా కొన్ని మార్పులు చేస్తున్నందునే ఈ సమస్య వచ్చిందని, వచ్చే నెల నుంచి పంపిణీని మరింత పటిష్టంగా అమలు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. నేటికీ సరుకుల దిగుమతి పూర్తి కాని వైనం -
ఎరువు కోసం యాప్సోపాలు
ఎరువులు ఎప్పుడు ఇస్తారుభీమవరం : వ్యవసాయమే జీవనాధారమైన జిల్లా లో సార్వా వరిసాగు ఆదిలోనే హంసపాదు అన్నట్టు తయారైంది. ఓ పక్క పూర్తిస్థాయిలో వర్షాలు లేక రైతులు సతమతమవుతుంటే మరోపక్క ఎరువులు కొనుగోలుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పశ్చిమలో 2.35 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేయాల్సి ఉంది. ముఖ్యంగా ఎంటీయూ 1318, ఎంటీయూ 1153, 1156, స్వర్ణ వంటి రకాల సాగుకు సన్నద్ధమవుతున్నారు. నూతన విధానంలో రైతుల పాట్లు గతంలో రైతులు ఎరువులను ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎరువుల షాపులో కొనుగోలు చేసి తెచ్చుకునేవారు. అయితే యూరియాకు కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో సబ్బిడీ ఇవ్వడంతో యూరియా వాడకాన్ని తగ్గించడానికి, వరిసాగుకు గాకుండా ఆక్వా చెరువులు, ఇతర ఫ్యాక్టరీలు అక్రమ వాడకాన్ని అరికట్టడానికి ఈ ఏడాది కేంద్రం అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఏఐఎంఎస్) యాప్ను అమలులోనికి తెచ్చింది. దీనిద్వారా యూరియా, డీఏపీ ఎరువులు అవసరమైన రైతులు యాప్లో పూర్తి వివరాలను తప్పక పొందుపరచాలి. అనంతరం ఎకరాకు 70 కిలోల యూరియా, 40 కిలోల డీఏపీ మాత్రమే మూడు దఫాలుగా ఇస్తారు. ఎరువులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా తమ ఈకేవైసీ చేయించుకోవాలి. భూయజమానులే ఎరువులు తెచ్చుకోవడానికి అర్హులు. కౌలు రైతులైతే కౌలు కార్డులు లేదా భూ యజమాని అంగీకారం ఉండాలి. అధిక ధరలకు యూరియా రైతుల ఇబ్బందులను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు అధిక ధరలకు యూరియాను విక్రయిస్తున్నారు. 50 కిలోల బస్తా రూ.260 విక్రయించినట్టు రసీదు ఇస్తున్నా రూ.320 వసూలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. సాగు మొదట్లోనే ఇన్ని సమస్యలు ఉంటే సార్వా సాగును గట్టెక్కించేది ఎలా అని రైతులు మదనపడుతున్నారు. ఎరువులు ఆన్లైన్ కేటాయింపుల్లో సాఫ్ట్వేర్ నిబంధనలు రైతులకు శాపంగా మారాయి. భూమి విస్తీర్ణాన్ని రౌండ్ ఆఫ్ చేసే విధానం క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా లేదని రైతులు అంటున్నారు. ఉదాహరణకు 1.95 సెంట్ల భూమి ఉన్న రైతుకు 2 ఎకరాల లెక్కన 140 కిలోల యూరియా ఇవ్వాల్సి ఉండగా కేవలం 5 సెంట్లు తక్కువగా ఉందనే సాకుతో దానిని 1.5 ఎకరాలుగా లెక్కించి 105 కిలోలకే పరిమితం చేస్తున్నారు. అలాగే కొన్నిసార్లు యాప్ ఓపెన్ కాకపోవడంతో గంటల తరబడి ఎరువుల దుకాణాల వద్ద వేచిచూడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో యాప్లో రైతు పేరు రాకపోవడం, భూమి విస్తీర్ణం చూపించకపోవడం, ఓటీపీ రాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ కష్టాలు రైతులకు తప్పని తిప్పలు యాప్లో బుకింగ్తో జాప్యం దుకాణాల వద్ద పడిగాపులు సార్వా సాగులో ఇబ్బందులు ప్రభుత్వం ఏఐఎంఎస్ యాప్తో సంబంధం లేకుండా రైతులకు ఎరువులు ఇవ్వాలి. యాప్ కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. అవసరమైన ఎరువులు దఫదఫాలుగా ఇవ్వడం వల్ల పలుమార్లు షాపుల చుట్టూ తిరగడం రైతులకు కష్టమే. ఈక్రాప్ అయితేనే ఎరువు అంటున్నారు. అయితే నాట్లు వేసే సమయంలోనే ఈక్రాప్ చేస్తారు. నారుమడి సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎరువులు పూర్తిగా అందించాలి. – బి.బలరామ్, కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
‘తేనె’లూరే ఉపాధి
● విలువ ఆధారిత ఉత్పత్తుల్లో నైపుణ్యం ● ప్రతిభతో ‘ఉద్యాన’ విద్యార్థుల గుర్తింపు తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ విద్యార్థులు తేనె, తేనెటీగల మైనం (బీస్ వాక్స్) ఆధారిత ఉత్పత్తులతో అద్భుత ఆవిష్కరణలు చేస్తున్నారు. ప్రిన్సిపల్ సైంటిస్టు డాక్టర్ ఎన్.ఇమ్మాన్యుయేల్ నేతృత్వంలోని అనుభవాత్మక అభ్యాస కార్యక్రమం ద్వారా విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సహజసిద్ధమైన తేనె ఉత్పత్తుల మార్కెట్ 2026 నాటికి రూ.11 వేల కోట్లకు పైగా చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన స్వీట్ రివల్యూషన్, ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ వంటి ఆశయాలకు ఈ కళాశాల వేదికగా నిలుస్తోంది. 50కి పైగా వినూత్న ఉత్పత్తులు ● విద్యార్థులు తేనె, మైనంతో 50కి పైగా సహజసిద్ధమైన విలువ ఆధారిత ఉత్పత్తులను అభివృద్ధి చేశారు. వీటిలో ముఖ్యమైనవి ● సౌందర్య, ఔషధ సాధనాలు : మాయిశ్చరైజర్లు, సబ్బులు, బాడీ బటర్, నొప్పి నివారణ బామ్లు, దోమల నివారణ క్రీములు. ● గృహోపయోగ, ఇతర వస్తువులు: పర్యావరణ రహిత కొవ్వొత్తులు, బీస్ వాక్స్ క్రేయాన్స్. ● ఆహార ఉత్పత్తులు : తేనె ఆధారిత మిఠాయిలు, పోషక విలువలు గల ఆరోగ్యవర్ధక ఆహారాలు. ● నూరు శాతం సేంద్రియ, స్థానిక వనరులతో తయారైన ఈ పర్యావరణహిత ఉత్పత్తులు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. ఇవి వినియోగదారులకు ఆరోగ్య ప్రయోజనాలను అందించడమే కాకుండా.. గ్రామీణ ఉపాధి, మహిళా సాధికారత, రైతులకు అదనపు ఆదాయాన్ని చేకూరుస్తున్నాయి. లభించిన పేటెంట్లు.. అవార్డులు ● విద్యార్థులు తయారు చేసిన పెయిన్ రిలీఫ్ బామ్, మస్కిటో రిపెలెంట్ క్రీమ్, మాయిశ్చరైజింగ్ క్రీమ్లకు పేటెంట్లు లభించాయి. ఈ ఉత్పత్తుల విక్రయం ద్వారా విద్యార్థులు రూ.5 లక్షలకు పైగా ఆదాయం ఆర్జించారు. ● ఆవిష్కార్ 2022 రాష్ట్రస్థాయి పోటీల్లో మూడో బహుమతి, నిట్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన స్టార్టప్ ఎక్స్పో 2023లో విజేతగా నిలిచారు. ● డాక్టర్ ఎన్.ఇమ్మాన్యుయేల్కు ఎక్స్లెన్స్ ఇన్ ఇన్నోవేషన్ అవార్డు (2020), ఉద్యానవర్సిటీ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం (2023), ఏపీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం (2025) లభించాయి. టాటా ఇన్నోవేషన్ హబ్, వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవాల్లో విద్యార్థులు ప్రదర్శించిన స్టాళ్లను మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ప్రత్యేకంగా ప్రశంసించారు. వర్సిటీ వీసీ డాక్టర్ కె.ధనుంజయరావు మా ర్గదర్శనంలో, డీన్ బి.ప్రసన్నకుమార్, రిజిస్ట్రా ర్ ఎం.మాధవి పర్యవేక్షణలో ఈ పరిశోధనలు, గ్రామీణ విస్తరణ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. -
కారు ఢీకొని వ్యక్తికి గాయాలు
తణుకు అర్బన్: తణుకు పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి గాయపడ్డాడు. గుంటూరు నుంచి వాడపల్లి వెళుతున్న కారు హైవేపై షర్మిష్ట జంక్షనన్ వద్దకు వచ్చే సరికి అదుపు తప్పి డివైడర్పైకి దూసుకెళ్లింది. ఈ సమయంలో ఉండ్రాజవరం మండలం చివటం గ్రామానికి చెందిన వ్యక్తి సైకిల్ వస్తుండగా అతన్ని ఢీకొట్టి డివైడర్ పైకి ఎక్కింది. ప్రమాదంలో వ్యక్తికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తణుకులోని ప్రెవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై పట్టణ పోలీసులను ఆరాతీయంగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తణుకు పట్టణ పోలీసులు తెలిపారు. -
పెదనిండ్రకొలనులో దారుణం
నిడమర్రు: పెదనిండ్రకొలను ఎస్సీ కాలనీలో రహదారి సరిహద్దు వివాదం ఒకరి ప్రాణాలను బలిగొంది. ఈ ఘర్షణలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన మద్దా యాకోబు (42), రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్ చాగంటి ఏసుదాసు కుటుంబాల మధ్య కొంతకాలంగా స్థల వివాదం నడుస్తోంది. ఏసుదాసు ఇంటికి వెళ్లే పంచాయితీ రోడ్డును యాకోబు ఆక్రమించి రేకుల షెడ్డు వేసుకున్నారని ఆరోపణ. ఈ మేరకు ఏసుదాసు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై శనివారం స్థానిక ఎంపీడీఓ విజయకుమారి, తహసీల్దార్ గద్దె శ్రీధర్బాబులు స్పందించి, ఇరు కుటుంబాలకు నచ్చజెప్పారు. ఇద్దరూ సంబంధిత పత్రాలను తీసుకువస్తే విచారించి న్యాయం చేస్తామని, అప్పటివరకు ఎలాంటి ఘర్షణలకు దిగవద్దని హెచ్చరించి వెనుదిరిగారు. అధికారులు వెళ్లిన కొద్దిసేపటికే, అంటే మధ్యాహ్నం 4 గంటల సమయంలో, రోడ్డు నిర్మాణం కోసం ఏసుదాసు కంకర వేస్తుండగా మరోసారి వివాదం తలెత్తింది. ఇరు కుటుంబాల మధ్య మొదలైన వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో చాగంటి ఏసుదాసు, ఆయన భార్య పండు, కుమారుడు సుబ్బారావు కలిసి యాకోబు కుటుంబ సభ్యులపై గునపంతో దాడి చేశారు. ఈ ఘటనలో యాకోబు (42) మెడపై తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన యాకోబు భార్య ప్రసన్న, కుమారుడు వంశీని చికిత్స కోసం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ పరిశీలించి, వివరాలను వెల్లడించారు. ఈ కేసును సీఐ రజనీకుమార్, ఎస్సై ఫణికుమార్ దర్యాప్తు చేస్తున్నారు. రహదారి వివాదంలో వ్యక్తి హత్య -
గర్జించిన కాపు గళం
తణుకు అర్బన్: పేద బడుగు బలహీన వర్గాల కోసమే ప్రాణాలు కోల్పోయిన మహానేత వంగవీటి మోహనరంగా అని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ అన్నారు. వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా తణుకు కాపు కల్యాణమండపంలో శనివారం నిర్వహించిన కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కేఆర్పీఎస్) కాపు గళం రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాపుల రిజర్వేషన్ సాధనకు బీసీవై కూడా సహకరిస్తుందన్నారు. బీసీలు, దళితులు, కాపులపై దాడులు, హత్యలు కలవరపరుస్తున్నాయని, మన పిల్లల భవిష్యత్తు హరించే పరిస్థితి నేడు ఉందన్నారు. పేద బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన వంగవీటి మోహనరంగా ఆశయాలను గుర్తుచేశారు. కాపులు, బీసీలు, ఎస్సీలు రాజ్యాధికారం కోసం ఐక్యంగా పోరాడాలని, కేవలం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోవద్దని పిలుపునిచ్చారు. జనాభా దామాషా ప్రకారం కాపులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. కాపు జేఏసీ నాయకుడు తోట రామకృష్ణ మాట్లాడుతూ, కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నిలదీశారు. రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభంపై ప్రభుత్వం అనుసరించిన తీరును తప్పుబట్టారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చిన మహనీయుడు దామోదరం సంజీవయ్య అని.. ఆయనతో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును పోల్చుకోవడం కూటమి మంత్రి అవివేకమని అన్నారు. సామాజిక విశ్లేషకురాలు కన్నా రజిని మాట్లాడుతూ, రాజ్యాధికారమే లక్ష్యంగా కాపు జాతి ముందుకు సాగాలని అన్నారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం కుదుటపడి, తిరిగి ఉద్యమాన్ని భుజానకెత్తుకోవాలని కోరారు. రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో చనమల్ల ప్రసాదరావు, మాసాబత్తుల శ్రీనివాస్ తదితర కేఆర్పీఎస్ నాయకులు, అధిక సంఖ్యలో కాపు సామాజికవర్గ ప్రజలు పాల్గొన్నారు. రిజర్వేషన్ల కోసం కేఆర్పీఎస్ సదస్సు -
రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
ఏలూరు (టూటౌన్): కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, వ్యవసాయ విధానాలు దేశీయ వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నాయని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు టి.సాగర్ విమర్శించారు. ఏలూరులో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభల్లో ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. విదేశీ వాణిజ్య ఒప్పందాల పేరుతో అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి నూనెగింజలు, వంటనూనెలు, పత్తి, మొక్కజొ న్న, పాల ఉత్పత్తుల దిగుమతి సుంకాలను కేంద్రం భారీగా తగ్గించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల దేశీయంగా ఆయిల్పామ్, వేరుశనగ, పత్తి పండించే రైతులతో పాటు.. సుమారు 10 కోట్ల మంది పాడి రైతులు, స్థానిక డెయిరీలు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థల లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అన్నదాతల రుణమాఫీని మాత్రం విస్మరిస్తోందని మండిపడ్డారు. -
యలమంచిలి ఎంఈఓపై విచారణ
యలమంచిలి: యలమంచిలి మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ)గా ఇటీవల వరకు పనిచేసిన అవిడి శ్రీవాణిపై వేధింపులు, అవినీతి ఆరోపణలు రావడంతో విద్యాశాఖ ఆర్జేడీ నాగమణి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం డీవైఈఓ కేవీఎస్ రామాంజనేయులు శనివారం విచారణ చేశారు. యలమంచిలిలిలోని ఎంఈఓ కార్యాలయంలో ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, కార్యాలయ సిబ్బంది, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు సుమారు 50 మంది వరకు హాజరయ్యారు. శ్రీవాణి ఉపాధ్యాయులు, కార్యాలయ సిబ్బందితో అమానవీయంగా వ్యవహరించడం, చులకనగా చూడటం, ఆర్థిక అవకతవకలకు పాల్పడటం, విధి నిర్వహణలో కక్ష సాధింపు, బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. మహిళా సిబ్బంది ఎంఈఓ వేధింపులను వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు కోసం సంతకాలు చేసేందుకు ఇబ్బందులు పెట్టారని రిటైర్డ్ ఉద్యోగులు వివరించారు. -
ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య
భీమవరం: భీమవరం పట్టణం పెదపేట కల్కి బజారులో ఒక యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లా అల్లమ్గడ్ గ్రామానికి చెందిన ప్రదీప్ సబర్ పెదపేటలో అద్దె ఇంటిలో ఉంటూ మేసీ్త్ర సహాయకుడిగా పనిచేస్తున్నాడు. తీవ్రమైన కడుపు నొప్పిని తట్టుకోలేక శుక్రవారం రాత్రి నివాసముంటున్న గదిలోని బాత్రూమ్లో ఇనుప రాడుకు టవల్తో ఉరివేసుకుని మృతి చెందాడు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముదినేపల్లి(కై కలూరు): పేకాట జూదరులపై కఠినంగా వ్యవహరిస్తామని ముదినేపల్లి ఎస్ఐ వీరభ్రదరావు హెచ్చరించారు. చిగురుకోట శివారు అయ్యవారిరుద్రవరం రోడ్లో పేకాట జరుగుతుందనే సమాచారంతో శుక్రవారం అర్ధరాత్రి దాడులు చేశారు. పేకాట ఆడుతున్న ఏడుగురిపై కేసు నమోదు చేసి, వారి నుంచి రూ.9,400 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. పేకాట, కోడిపందేలు వంటి అసాంఘిక కార్యక్రమాలపై పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. పెనుమంట్ర: ఆలమూరు గ్రామంతో పాటు పరిసర గ్రామాల భక్తులు శ్రీ పోలేరమ్మ దేవతగా ఆరాధించే వేపచెట్టు శనివారం మధ్యాహ్నం ఈదురుగాలితో కూడిన కొద్దిపాటి వర్షానికి నేలకొరిగింది. ఈ చెట్టు స్థానికంగా విశేష గుర్తింపు పొందడంతో దానిని చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు తరచూ వచ్చేవారు. చెట్టు రహదారిపై పడిపోవడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రెండు వైపులా ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు. ఆకివీడు: స్థానిక బైపాస్ రోడ్డులో బియ్యం లోడు ట్రాక్టర్ శనివారం తిరగబడింది. పీడీఎస్ బియ్యం బస్తాల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ తిరగబడటంతో ట్రక్కులోని బియ్యం బస్తాలు కిందపడ్డాయి. సంబంధిత రైస్మిల్లర్ బియ్యం బస్తాల్ని మరో లారీలోకి లోడు చేయించారు. ట్రాక్టర్ డ్రైవర్కు ఏవిధమైన గాయాలు కాలేదు. గత మూడు నెలల నుంచి లారీలు, ట్రాక్టర్లు, ఇతర లోడు వాహనాల్ని బైపాస్ రోడ్డు నుంచి అయిభీమవరం రోడ్డు మీదుగా ఆకివీడులోని జాతీయరహదారి వెంట మళ్లించారు. కొన్ని రోజులకే బైపాస్ రోడ్డు దెబ్బతింది. గుంతలుగా మారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోందని వాహన చోదకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రోడ్డు మరమ్మతులు చేసేవరకూ ట్రాఫిక్ను మళ్లింపును పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. -
10న ప్లేస్మెంట్ డ్రైవ్
భీమవరం (ప్రకాశంచౌక్): నరసాపురం వైఎన్ డిగ్రీ కాలేజీలో ఈనెల 10న మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగ రాణి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో పోస్టర్ ను ఆవిష్కరించారు. సుమారు 21 ప్రముఖ, త దితర కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని, 1,500కు పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. 18–35 ఏళ్ల వయసున్న అభ్యర్థులని, మరిన్ని వివరాలకు సెల్: 9502024765, 7330803719లో సంప్రదించాలని కోరారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.లోకమాన్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెంలోని పాతూరులో అధిక లోడ్ కారణంగా 12వ వార్డు కనకదుర్గమ్మ గుడి వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తరచూ ట్రిప్ అవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై గతనెల 11న ‘విద్యుత్ కోతలతో ఉక్కిరిబిక్కిరి’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుచేశారు. ఏపీఈపీడీసీఎల్ తాడేపల్లిగూడెం డివిజన్ ఈ ఈ నరసింహమూర్తి మాట్లాడుతూ ఇంప్రూ వ్మెంట్ ట్రాన్స్ఫార్మర్ పనిచేయడం ప్రారంభించిందని, తరచూ ట్రిప్ అయ్యే సమస్యలు ఉండవని చెప్పారు. వీరవాసరం: మండలంలోని పలు హైస్కూళ్లను ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని, 12వ పీఆర్సీని వెంటనే నియ మించాలని, నాలుగు డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని డి మాండ్ చేశారు. లేకుంటే ఈనెల 14న ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద పికెటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కెవీ రామచంద్రరావు, మండల అధ్యక్ష ప్రధా న, కార్యదర్శులు సత్యనారాయణ, దగ్గుమిల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఆదివారం నుంచి జరుగనున్న డిపార్ట్మెంటల్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు డీఆర్వో పి.ప్రభాకర్ తెలిపారు. కలెక్టరేట్లో శనివారం పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. భీమవరం డీఎన్నార్, తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటుచేశారని, ఆదివారం, 8, 9 తేదీల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారి కె.భాస్కర్రావు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఈనెల 11న జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తెలిపారు. శనివారం జిల్లా కోర్టు భవనంలో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకూ 10,003 రాజీయోగ్యమైన కేసులు గుర్తించామని, ఆయా కేసుల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. రాజీమార్గంలో కేసుల పరిష్కారానికి కక్షిదారులు సహకరించాలని కోరారు. మార్చిలో నిర్వహించిన లోక్ అదాలత్లో 9,530 కేసులను రాజీ చే సినట్టు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చని, స మస్యలు ఉంటే 08812 224555 లేదా 15100 ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. -
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
కామవరపుకోట: విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం జలపావరిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. తడికలపూడి ఎస్సై వల్లి పద్మ తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం మండలం చక్ర దేవరపల్లికి చెందిన దూదిపాల రవికుమార్ 27 సంవత్సరాలు వృత్తిరీత్యా వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో కామవరపుకోట మండలం జలపువారిగూడెం గ్రామానికి చెందిన కాంతారెడ్డి సత్యనారాయణరెడ్డి ఆయిల్పామ్ తోట ఎదురుగా ఉన్న పశువుల షెడ్ నిర్మాణ స్థలంలో శుక్రవారం ఉదయం వెల్డింగ్ పని చేస్తుండగా, ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ బాక్స్ వద్ద విద్యుత్ సరఫరాను పరీక్షించే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు దూదిపాల పోతురాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వల్లి పద్మ తెలిపారు. కుక్కునూరు: కుక్కునూరుకు చెందిన బొల్లు జగదీష్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. శుక్రవారం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) తరఫున యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశ కోఆర్డినేటర్గా బోల్లు జగదీష్ ను నియమించింది. కుక్కునూరులో జన్మించిన జగదీష్ హైస్కూల్ విద్య వరకు స్వగ్రామంలోనే పూర్తి చేసి, ఉన్నత విద్య అనంతరం ఉపాధి కోసం దుబాయ్కు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. అక్కడ ప్రవాస ఆంధ్రుల సంక్షేమం, అభ్యున్నతికి కృషి చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాష్ట్ర ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు రవికుమార్ జగదీష్కు శుభాకాంక్షలు తెలియజేశారు. మండవల్లి: ఏలూరు జిల్లా డీపీఆర్ఓగా దుర్గాప్రసాద్ పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఆయన డీపీఆర్ఒ కార్యాలయంలో అడిషనల్ డీపీఆర్ఓగా పని చేస్తున్నారు. దుర్గాప్రసాద్ నియామకంపై పలువురు అధికారులు, డీపీఆర్ఒ కార్యాలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. భీమవరం : పట్టణంలో వేరువేరు ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన రెండు మోటారుసైకిల్స్ చోరీ చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు టూటౌన్ పోలీసుస్టేషన్లో కేసులు నమోదయ్యాయి. గణపవరం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన జి.అశోక్కుమార్ పట్టణంలోని ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత నెల 27న అశోక్కుమార్ రాయలం గ్రామంలోని సాయిబాబా ఆలయం వద్ద బైక్ను పార్క్ చేసిన గుడిలోనికి వెళ్లి తిరిగివచ్చేసరికి బైక్ మాయమైంది. దీనిపై టూటౌన్ పోలీసు హెచ్కానిస్టేబుల్ ఎస్ఎన్ భూషణం కేసు నమోదు చేశారు. అలాగే గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పి.బాలాజీసత్యకుమార్ గత నెల 5న టౌన్ రైల్వేస్టేషన్ వద్ద పార్కింగ్ చేసిన మోటారుసైకిల్ ఆదృశ్యమైంది. దీంతో భాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం హెచ్కానిస్టేబుల్ టి గోవిందరాజు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పెనుగొండ: కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లీ కొడుకులు ఆత్మహత్యాయత్నం చేయగా తల్లి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసకుంది. వివరాల ప్రకారం వల్లూరు శివారు చిల్లేవారిపాలెంలో గుండె వెంకట రమణ(47), గుండే నరేంద్ర(21)ల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో శుక్రవారం సాయంత్రం తల్లి గుండె వెంకట రమణ యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేయడంతో, అదే యాసిడ్ను కొడుకు నరేంద్ర లాక్కొని తాగాడు. దీంతో స్థానికులు 108లో తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించగా, తల్లి వెంకటరమణ అప్పటికే మృతి చెందగా, కొడుకును మెరుగైన వైద్యం నిమిత్తం భీమవరం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.వెంకట రమణ తెలిపారు. భీమవరం: బంగారు ఆభరణాలను చోరి కేసులో ముద్దాయికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ భీమవరం రెండో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎన్. జ్యోతి శుక్రవారం తీర్పు చెప్పారు. సీఐ ఎ. రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని కళాభవన్ వీధికి చెందిన వి.కృష్ణవేణి 2019 జులై 17న పాలకోడేరు మండలం వేండ్ర గ్రామంలోని పుట్టింటికి వెళ్లి తిరిగొచ్చేసరికి తాళాలు పగలగొట్టి మూడు కాసుల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిడదవోలుకు చెందిన మొహిద్దీన్ అలీని అప్పట్లోనే అరెస్టు చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం శుక్రవారం తీర్పునిచ్చారు. -
ప్రభుత్వానికి జగన్ అంటే భయం
కాళ్ల: కూటమి ప్రభుత్వానికి రెండేళ్లలోనే రాష్ట్ర ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చిందని నరసాపురం పార్లమెంటు పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణం రాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ అన్నారు. కాళ్ల మండలం పెద అమిరం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నియోజవర్గ స్థాయి బీఎల్ఏలతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మన ఓటు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీఎల్ఎపై ఉందని స్పష్టం చేశారు. మన ఓటును మనం కాపాడుకోకపోతే రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు అందటం కష్టమవుతుందని ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు బీఎల్ఏ లందరూ చెప్పాలని తెలిపారు. ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే భయం ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వానికి రెండేళ్లకే పూర్తి వ్యతిరేకత వచ్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల గెలుపు బీఎల్ఎలపైనే ఉందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పెద్దపీట వేస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చకుండా పరిపాలన చేస్తుందని, ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు. సర్ను అడ్డుపెట్టుకుని ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని తప్పుపట్టారు. ఒక్క ఓటు పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. వేరే ప్రాంతంలో ఉన్నా, బయట దేశాల్లో ఉన్నా మన ఓటును ఏ విధంగా కాపాడుకోవాలో ఈ కార్యక్రమంలో తెలిపారు. ఉండి నియోజకవర్గంలో పీవీఎల్ నరసింహరాజును ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పెనుమత్స ప్రసాదరాజు, ఆకివీడు నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, పార్టీ నాయకులు కామన నాగేశ్వరరావు, నంద్యాల సీతారామయ్య, పడాల కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
త్వరపడండి సర్
పక్కదారి పడుతున్న మట్టి నూజివీడు మండలంలో పొలం మెరక నిమిత్తం మట్టి కోసం అనుమతులు తీసుకొని చెరువు మట్టిని తవ్వి యథేచ్ఛగా విక్రయిస్తూ టీడీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. 8లో uశనివారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2026సాక్షి, భీమవరం: ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఇంటింట సర్వేకు మరో పదిరోజులు మాత్రమే గడువుంది. జిల్లాలోని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారం(ఈఎఫ్)లు పంపిణీ 99.7 శాతం పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. ఓటర్లు వివరాల డిజిటలైజేషన్ జరిగింది కేవలం 39 శాతం మాత్రమే. ఈ నెల 14వ తేదీలోగా డిజిటలైజేషన్ చేయించుకోకపోతే ఓటు గల్లంతేనని నిపుణులు చెబుతున్నారు. జూన్ 15 నుంచి ఓటరు సమగ్ర సర్వే మొదలైంది. ఈ నెల 14 వరకు బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్ఓ) ఇంటింటికి వచ్చి ప్రతి ఓటరుకు ఈఎఫ్లు అందజేయాలి. 2002 జాబితా ప్రకారం ప్రస్తుతం ఆ నివాసంలో ఓటరు ఉంటున్నారా? లేదా? అనేది పరిశీలించాలి. కొన్నిచోట్ల బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లకుండా ఒక చోటుకి పిలిచి ఫాంలు అందజేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని 1.471 పోలింగ్ కేంద్రాల్లో 14,75,036 మంది ఓటర్లు ఉండగా 10,84,974 ఓట్లు మ్యాపింగ్ అయ్యాయి. 3,90,062 ఓట్లు మ్యాపింగ్ కాలేదు. వీటిలో అత్యధికంగా భీమవరంలో 81,282 ఓట్లు, తాడేపల్లిగూడెంలో 66,064, ఉండిలో 61,160, తణుకులో 52,047, పాలకొల్లులో 45,727, ఆచంటలో 44,782, నరసాపురంలో 39,050 ఓట్లు మ్యాపింగ్ చేయాల్సి ఉంది. నత్తనడకన డిజిటలైజేషన్ శుక్రవారం నాటికి జిల్లాలో 14,70,603 మంది ఓటర్లకు ఈఎఫ్లు అందజేయడం ద్వారా 99.7 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఉండిలో నూరుశాతం లక్ష్యం చేరుకున్నట్టు ఉంది. ఎన్యుమరేషన్ ఫారాల్లో ఓటర్లు ఇచ్చిన వివరాలను బీఎల్ఓలు డిజిటలైజ్ చేయాలి. ఇంతవరకు కేవలం 6,56,126 ఓట్లతో కేవలం 44.48 శాతం మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. అత్యధికంగా తణుకులో 50.43 శాతం ఓట్లు డిజిటలైజ్ చేయగా ఆచంటలో 50.11 శాతం, పాలకొల్లులో 48 శాతం, నరసాపురంలో 44.36 శాతం, తాడేపల్లిగూడెంలో 43.57 శాతం, ఉండిలో 41.26 శాతం, భీమవరంలో 36.23 శాతం ఓట్లు చేశారు. ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ, డిజిటలైజ్కు ఈనెల 14వ వరకు మాత్రమే గడువుంది. రానున్న పదిరోజుల్లో మిగిలిన 55.52 శాతం ఓట్లను డిజిటలైజ్ చేయాల్సి ఉంది. ఇంటింట సర్వే అనంతరం బీఎల్ఓలు తొలగించిన ఓట్లు, కొత్తగా నమోదైన ఓట్లు, మార్పులు, చేర్పుల వివరాలతో జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ఆ తరువాత అందిన క్లెయింలు, అభ్యంతరాలు స్వీకరించి వాటిని సెప్టెంబరు 18లోగా పరిష్కరిస్తారు. అనంతరం సెప్టెంబరు 22న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు.నియోజకవర్గం మొత్తం ఈఎఫ్లు డిజిటలైజ్ ఓట్లు ఇచ్చినవి అయినవి ఆచంట 1,79,987 1,79,828 90,192 పాలకొల్లు 1,95,062 1,93,115 92,938 నరసాపురం 1,71,053 1,70,575 75,877 భీమవరం 2,52,549 2,51,209 91,492 ఉండి 2,26,503 2,26,501 93,465 తణుకు 2,35,359 2,35,053 1,18,700 తాడేపల్లిగూడెం 2,14,523 2,14,322 93,462 జిల్లాలో 14.75 లక్షల మంది ఓటర్లు 99.7 శాతం మందికి ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చేశామంటున్న అధికారులు తిరిగి బీఏల్ఓల చేతికి వచ్చినవి 38 శాతం మాత్రమే ఆ మేరకు డిజిటలైజేషన్ పూర్తి 14వ తేదీతో ముగుస్తున్న గడువు -
చిర్రెత్తికొచ్చింది
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం జనసేనలో వర్గ విబేధాలు తారాస్థాయికి చేరాయి. అవినీతి ఎమ్మెల్యేగా, తీవ్ర వివాదాస్పద నేతగా ఖ్యాతిగాంచిన జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజును నియోజకవర్గ కేడర్ మొదలుకొని పార్టీ అధిష్టానం వరకు ఎవరు సీరియస్గా పట్టించుకోని పరిస్థితి. బలప్రదర్శన చాటేలా వంద కార్లతో ఏలూరు పార్టీ సమావేశానికి హాజరై పోలవరంలో దొరల పాలనకు ముగింపు పలుకుతానని... రెండేళ్ళుగా పార్టీలో తనను ఇబ్బందిపెడుతున్నారని ఆయన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. పోలవరం నియోజకవర్గం నుంచి చిర్రి బాలరాజు గెలుపొందిన నాటి నుంచి వివాదాస్పద, దూకుడు వైఖరితో వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారారు. పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. స్వయంగా పోలవరం జనసేన నేత కరాటం రాంబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమ ఫోన్ల సంభాషణ ఆడియో వైరల్గా మారడంతో ఎమ్మెల్యే అవినీతి తెరపైకి వచ్చింది. నియోజకవర్గ స్థాయి అధికారుల వరకు అందరి వద్ద డబ్బులు వసూలు చేసి అట్టహాసంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం, పార్టీలో ప్రశ్నించిన వారిపై తన సొంత టీమ్తో దాడులు చేయించడంతో అప్రతిష్టపాలయ్యారు. బాలరాజు అవినీతి అంటూ నామినేటెడ్ పదవులకు ఎంత తీసుకుంది.. ఏఏ పనులకు ఎంత వసూలు చేసింది.. బాధితుల ఫోన్ నెంబర్లతో సహా లేఖలో పేర్కొని పార్టీకి ఫిర్యాదు చేయడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఎమ్మెల్యే తీరుపై అతని భార్య జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను కలిసి ఫిర్యాదు చేసి న్యాయం చేయమని కోరింది. గత నెలలో పవన్ పిలిపించి ఎమ్మెల్యేకు క్లాస్ పీకారు. నాలుగు వారాల్లోగా నియోజకవర్గంతో పాటు, కుటుంబ పరిస్థితులను చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. కరాటం వర్సెస్ ఎమ్మెల్యే పార్టీ సీనియర్ నేత కరాటం రాంబాబు సోదరుడి కుమారుడు కరాటం సాయిబాబు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ హవా సాగిస్తున్నారు. కొంతకాలం నుంచి ఎమ్మెల్యేకు, సాయిబాబుకు దూరం పెరిగింది. ఎమ్మెల్యేకు రాజకీయ గురువుగా ఉన్న జీ.రవికుమార్ కూడా కొద్ది రోజుల నుంచి ఎమ్మెల్యేకు దూరంగా ఉండటం మరింత చర్చగా మారింది. రెండ్రోజుల రోజుల క్రితం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పార్టీ నియామకాల గురించి ఏర్పాటు చేసిన సమావేశానికి బలరాజుకు ఆహ్వానం అందలేదు. సాయిబాబుతో బలరామకృష్ణ సమావేశమై పార్టీ నియామకాలపై చర్చించారు. దీంతో బాలరాజుకు చిర్రెత్తుకొచ్చి శుక్రవారం ఏలూరులో జరిగిన పార్టీ సమావేశానికి బలప్రదర్శనగా హాజరయ్యారు. జంగారెడ్డిగూడెం వైజంక్షన్లో అన్ని మండలాల్లో కేడర్ను సమీకరించి కార్ల ర్యాలీ నిర్వహించి జంగారెడ్డిగూడెంలోనే మాట్లాడారు. ఏలూరు పార్టీ సమావేశానికి చేరుకుని నిర్మాణ సారథుల ఎంపిక కమిటీకి తన వర్గానికి చెందిన దరఖాస్తులను అందచేసి పోలవరంలో దొరల పాలనకు ఈ రోజు నుంచి తెరపడిందని.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చిర్రి బాలరాజు పెట్టే నేతలనే గెలిపించుకుంటానని సవాల్ చేశారు. కరాటం సాయిబాబు మాట వినేవారికే సమాచారమిచ్చి వారికే పదవులు ఇవ్వాలని ప్రయత్నించారని, పార్టీ శ్రేణులు తన దగ్గరకు వచ్చి బాధపడితే 400 మందితో కలిసి ఏలూరు వచ్చి దరఖాస్తులు ఇచ్చానని, పెత్తందారీ వ్యవస్థను పారదోలాలని, దొరల పాలనకు చరమగీతం పాడతానని హెచ్చరించారు. పోలవరం జనసేనలో తారాస్థాయికి వర్గ విభేదాలు పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేకు దక్కని ప్రాధాన్యం వంద కార్లతో బలప్రదర్శనగా ఏలూరుకు చిర్రి బాలరాజు పోలవరంలో దొరల పాలనకు ముగింపు పలుకుతానని ప్రకటన -
స్కూటర్ చోరీ.. దొంగల అరెస్టు
భీమడోలు: స్థానిక గోలి అపార్ట్మెంట్లో చోరీకి గురైన స్కూటర్ను భీమడోలు పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒక యువకుడితో పాటు అతనికి సహకరించిన మైనర్ బాలుడిని అరెస్ట్ చేశారు. భీమడోలు సీఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వి.కృష్ణ కేసు వివరాలను వెల్లడించారు.గోలి అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్న గుట్టుట దుర్గాప్రసాద్ ఈ నెల 1వ తేదీ రాత్రి తన సుజుకి యాక్సిస్ స్కూటర్ను పార్క్ చేసి, తాళాలను వాచ్మెన్ గదిలో భద్రపరిచారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ తాళాలు పగులగొట్టి స్కూటర్ను చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ వి.కృష్ణ పర్యవేక్షణలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితేభీమడోలు జంక్షన్లోని సంతమార్కెట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా వస్తున్న ఒక స్కూటర్ను ఆపేందుకు ప్రయత్నించారు. దానిపై ఉన్న ఇద్దరు వ్యక్తులు పారిపోయేందుకు యత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లికి చెందిన వసంతటి మణిబాలాజీ (19)తో పాటు ఒక మైనర్ బాలుడిగా గుర్తించారు. తామే ఆ స్కూటర్ను దొంగిలించినట్లు నిందితులు అంగీకరించడంతో, వారి నుంచి రూ. లక్ష విలువైన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మణిబాలాజీని భీమడోలు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. మైనర్ బాలుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచి, హోంకు తరలించారు. ప్రధాన నిందితుడు మణిబాలాజీపై గతంలోనూ ఒక కేసు ఉందని సీఐ తెలిపారు. ఈ కేసును వేగంగా ఛేదించిన హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ బాజి, ఎస్. శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బందిని సీఐ అభినందించారు. -
ఆక్వా రిజిస్ట్రేషన్లలో అలసత్వం
● అప్సడా నిబంధనలకు తూట్లు ● ఏలూరు జిల్లాలో నత్తనడకన సాగుతున్న నమోదు ప్రక్రియ ● రైతులు రాయితీలు కోల్పోయే ప్రమాదం కై కలూరు: ఆంధ్రప్రదేశ్లో ఆక్వారంగంలో పారదర్శకత, నాణ్యమైన ఉత్పత్తులు, జవాబుదారితనం పెంచేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అప్సడా’ చట్టం–2020 అమలు జిల్లాలో నత్తనడకన సాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, విద్యుత్ రాయితీలు పొందాలంటే అప్సడా రిజిస్ట్రేషన్ తప్పనిసరని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రగతి శూన్యంగా ఉంది. ఈ చట్టంపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఏలూరు జిల్లాలో దాదాపు 40,149 మంది రైతులు 1,49,604 ఎకరాల్లో చేపలు, రొయ్యల సాగు చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు కేవలం 91,430 ఎకరాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి. చట్టం ప్రకారం నమోదు చేసుకుంటేనే ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపరిహారం, విద్యుత్ సబ్సిడీలు అందుతాయి. అయినప్పటికీ, కొందరు రైతులు, స్థానిక రైతు సంఘాలు ఈ విషయంలో చొరవ చూపడం లేదు. జీడీపీలో టాప్.. నమోదులో లాస్ట్ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో ఏలూరు జిల్లా కలిదిండి మండలం ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ ఆక్వారంగం భారీగా విస్తరించినప్పటికీ, మొత్తం 30,406.3 ఎకరాలకు గాను కేవలం 11,308 ఎకరాలకే రిజిస్ట్రేషన్ జరిగింది. ఇంకా 19,097.50 ఎకరాల నమోదు పెండింగ్లో ఉంది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేస్తూ, సిబ్బంది కొరతను తీర్చాలని కమిషనర్ను కోరారు. అయితే స్థానిక చేపల రైతుల సంఘాలు అవగాహన సమావేశాలు నిర్వహిస్తే ప్రయోజనం ఉంటుందని స్థానికులు సూచిస్తున్నారు. నమోదు ప్రక్రియలో ప్రధాన అడ్డంకులు ● ఆధార్ కార్డుతో భూమి సర్వే నంబర్లు లింక్ కాకపోవడం. ● ఇతర రాష్ట్రాల్లో ఉండే యజమానుల నుంచి ఓటీపీలు సకాలంలో రాకపోవడం ● జాయింట్ ఎల్పీఎంలో పదిమంది రైతులున్నా ఆన్లైన్లో ఒకే సైట్గా చూపించడం. ● చెరువులు అమ్మినా పాత యజమానుల పేర్లే ఉండటం, మ్యుటేషన్ సమస్యలు వేధించడం. ● ఇటీవల బదిలీల వల్ల గ్రామ మత్స్యశాఖ సహాయకులు కొరత ఏర్పడడం. దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు ● భూమి అడంగల్, ల్యాండ్ పాస్బుక్ (లీజు భూమి అయితే రిజిస్టర్డ్ లీజ్ అగ్రిమెంట్). ● మండల సర్వేయర్ ధ్రువీకరించిన చెరువు ఆటోక్యాడ్ మ్యాప్. ● ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, రూ.10 స్టాంప్ పేపర్పై అఫిడవిట్. ● వీటిని సచివాలయంలో లేదా విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్కు అందించి, ఎకరానికి రూ.1,000 చొప్పున ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి. అప్సడా రిజిస్ట్రేషన్ వల్ల ఆక్వా రైతులకు కలిగే ప్రయోజనాలపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. కలిదిండి మండలంలో ఆక్వా రైతులు ఎక్కువుగా ఉన్నప్పటికీ రైతులు ముందుకు రావడం లేదు. ఆక్వా సాగు చేస్తున్న వారంతా అప్సడా చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ తప్పక చేయించాలి. నిబంధనలు పాటించని వారిపై జిల్లా కమిటీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. – బి.రాజ్కుమార్, మత్స్యశాఖ అధికారి, కై కలూరుమండలం మొత్తం విస్తీర్ణం జరిగిన రిజిస్ట్రేషన్లు చేయాల్సినవి కై కలూరు 15896.73 10371.2 5525.53 ముదినేపల్లి 18557.79 10580.68 7977.11 మండవల్లి 19919.83 11585.44 8334.39 కలిదిండి 30406.03 11308.53 19097.50 భీమడోలు 10900.70 9893.43 1007.27 నిడమర్రు 15172.60 10478.24 4694.36 ఉంగుటూరు 5718.46 4815.29 903.17 పెదపాడు 11166.08 9095.93 2070.15 దెందులూరు 7288.10 6151.04 1137.06 ఏలూరు 14578.19 6151.04 8427.15 మొత్తం 149604.51 91430.82 58173.69 -
డిజిటలైజేషన్ వేగంగా పూర్తి చేయాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ‘సర్’ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను జూలై 8 నాటికి వంద శాతం పూర్తి చేయడానికి సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. పొరపాట్లు లేని, కచ్చితమైన, పారదర్శకమైన, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపొందించడమే ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్ ్స ద్వారా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. మండల ప్రత్యేక అధికారులు, ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఎక్కడా ఆలస్యం జరగకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. రాబోయే నాలుగు రోజులు అత్యంత కీలకమైనవని ప్రతి బూత్లో పురోగతిని రోజువారీగా సమీక్షించాలని సూచించారు. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సమయంలో తప్పనిసరిగా ఐడీ కార్డులు ధరించాలని ఆదేశించారు. ఎస్ఐఆర్ను వేగవంతం చేయాలి కాళ్ల: సర్ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాళ్ల మండలం పెదఅమిరం పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బీఎల్ఓలు, రెవెన్యూ సిబ్బందితో సమీక్షించారు. ఓటర్ల మ్యాపింగ్ పురోగతి, పెండింగ్ వివరాలు, ఫాంల పంపిణీ, పూర్తయిన దరఖాస్తుల స్వీకరణ, డిజిటలైజేషన్ పురోగతి తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
ఆర్ఎంపీ వైద్యుడి అనుమానాస్పద మృతి
దెందులూరు : మండలంలోని కొవ్వలి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు కాకిలేటి శివయ్య (55) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... శివయ్య వంగాయగూడెంలో సొంతంగా క్లినిక్ నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం కొవ్వలిలో ఇల్లు కొనుగోలు చేసి, అక్కడి నుంచే క్లినిక్కు వెళ్లి వస్తున్నారు. ఆయన భార్య వీరరాఘవమ్మ ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని ఐసీడీఎస్ విభాగంలో లీగల్ అడ్వైజర్గా పనిచేస్తుండగా, కుమార్తె హైదరాబాద్లో ఉంటున్నారు. శుక్రవారం ఉదయం పంచాయతీ కార్యాలయం సమీపంలోని మురుగు కాలువలో శివయ్య మృతదేహం ఉన్నట్లు వీరరాఘవమ్మకు ఆమె తమ్ముడు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. కాలువలో శివయ్య మృతదేహంతో పాటు ఆయన వాడుతున్న స్కూటర్ కూడా పడి ఉంది. తన భర్త తలపై మారణాయుధాలతో నరికిన గాయాలు ఉన్నాయని, ఎడమ కాలు, కుడి చేయి, శరీరంపై తీవ్ర గాయాల గుర్తులు ఉన్నాయని ఎవరైనా హత్య చేసి ఉంటారనే అనుమానం ఉందని వీరరాఘవమ్మ దెందులూరు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని నూజివీడు డీఎస్పీ, భీమడోలు సీఐ పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దెందులూరు ఎస్సై డి. వెంకట్ కుమార్ తెలిపారు. అయితే వైద్యుడు శివయ్య మృతి కేసులో ఆయన సెల్ఫోన్ కాల్ డేటా దర్యాప్తుకు అత్యంత కీలకంగా మారే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కూడా ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. -
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి
భీమవరం: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలుచేయాలని, న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, న్యాయవాదులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భీమవరంలో న్యాయవాదులు కోర్టు ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఐఎఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెల్లబోయిన రంగారావు మాట్లాడుతూ న్యాయవాదులకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ, పర్యవేక్షణ చట్టాలను వెంటనే తీసుకురావాలని, న్యాయవాదులపై పెరిగిపోతున్న దాడులను నిలువరించాలన్నారు. జూనియర్ న్యాయవాదులకు రూ.10 వేల స్టైఫండ్ వెంటనే అమలు చేయాలని, వైద్యం, బీమా సదుపాయాలు అందించాలని, అర్హులైన న్యాయవాదులకు ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని చెల్లబోయిన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ బడుగు అశోక్బాబు, ఐఎఎల్ నాయకులు మల్లుల శ్రీనివాసరావు, వైవీ ఆనంద్, మోకా రాముడు, బోకూరి విజయరాజు, సుబ్బయ్య, ఇంటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
షాకిచ్చిన స్మార్ట్ మీటరు
తణుకు అర్బన్ : ‘స్మార్ట్ మీటరు వద్దు మొర్రో’ అని మొత్తుకున్నా వినకుండా విద్యుత్ సిబ్బంది బలవంతంగా బిగించడంతో, ఓ పేద కుటుంబానికి ఏకంగా రూ. 14,539 బిల్లు వచ్చింది. తణుకు మండలం దువ్వ గ్రామం హరిజనవాడకు చెందిన సిర్రా రమేష్ నివాసంలో ఆయన తల్లి రత్నకుమారి పేరుతో విద్యుత్ సర్వీస్ ఉంది. ఎస్సీ కోటా కింద గతంలో వీరికి 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వర్తించేది. అయితే, గత నెల 20న సిబ్బంది వచ్చి పాత మీటరు పాడైందంటూ బలవంతంగా స్మార్ట్ మీటరు బిగించారు. తాజాగా మొబైల్కు రూ. 14,539 బిల్లు రావడంతో బాధితులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వినియోగదారుల అనుమతి లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకోని పేదల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై విద్యుత్ శాఖ డీఈ కె.నరసింహమూర్తిని వివరణ కోరగా పాత మీటరు స్ట్రక్ అవ్వడం వల్ల గతంలో వాడిన యూనిట్లు నిలిచిపోయాయని, దీనివల్ల స్లాబ్ మారి బిల్లు ఎక్కువగా వచ్చిందని తెలిపారు. బిల్లును సరిచేస్తామని, అనుమతి లేకుండా స్మార్ట్ మీటరు బిగించకూడదు కాబట్టి దానిని వెంటనే మారుస్తామని వివరించారు. -
7న జంగారెడ్డిగూడెంలో రైతు మహా ధర్నా
జంగారెడ్డిగూడెం: వైఎస్సార్సీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్తో ఈ నెల 7న జంగారెడ్డిగూడెంలో చేపట్టే భారీ రైతు నిరసన కార్యక్రమం సన్నాహక సమావేశం శుక్రవారం జంగారెడ్డిగూడెంలోని జెట్టి కార్యాలయంలో జరిగింది. వైఎస్సార్సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూలై 7న ఉదయం 9 గంటలకు భారీ ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని, గతంలో మొక్కజొన్న, మిరప, నాటు పొగాకు రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారని మండిపడ్డారు. ప్రస్తుతం పొగాకు రైతులకు సరైన మద్దతు ధర లభించక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ తెల్లం బాలరాజు మాట్లాడుతూ పొగాకు రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ మార్క్ఫెడ్ను రంగంలోకి దించి ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేసి రైతులకు కొండంత అండగా నిలిచిందని పేర్కొన్నారు. చంద్రబాబుకు రైతులంటే ఇష్టం ఉండదని, గతంలో విద్యుత్ ఉద్యమం చేసిన రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర ఆయనదని అన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథరావు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్ పార్టీల సహకారంతో, రైతు సంఘాల అభ్యర్థన మేరకు ఈ మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ధర్నాకు వచ్చే ప్రజల కోసం తమ కార్యాలయం పరిధిలో భోజన వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, కొయ్యలగూడెం ఎంపీపీ గంజిమాల రామారావులతో పాటు తుమ్మలపల్లి గంగరాజు, మంతెన సోమరాజు, గంటా శ్రీను, జంగారెడ్డిగూడెం మండలం అధ్యక్షుడు ఓరుగంటి నాగేంద్ర కుమార్, పట్టణాధ్యక్షుడు కర్పూరం గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
‘ఇదేంటి సర్’పై కదలిక
ఆక్వా రిజిస్ట్రేషన్లలో అలసత్వం ఆక్వారంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అప్సడా’ చట్టం–2020 అమలు నత్తనడకన సాగుతోంది. 8లో uద్వారకాతిరుమల: సర్ ప్రోగ్రామ్లో భాగంగా ఓటర్లకు అందిస్తున్న ఎన్యూమరేషన్ ఫారంలోని కాలమ్–1లో 2002 నాటి వివరాలను నమోదు చేసే విషయంలో ఓటర్లు అయోమయానికి గురవుతున్న అంశంపై సాక్షి దినపత్రికలో శుక్రవారం ‘ఇదేంటి సర్’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పందించి వివరణ ఇచ్చారు. అందులో భాగంగా సీహెచ్ పోతేపల్లిలోని సచివాలయంలో స్థానిక వైఎస్సార్ సీపీ ప్రతినిధుల సమక్షంలో ఓటరు జాబితాను పరిశీలించారు. జాబితాలోని 1,024 మంది ఓటర్లలో 641 మందికి ఒకే ఎపిక్ నంబర్ నమోదై ఉండడాన్ని గుర్తించామన్నారు. 2025 ఓటరు జాబితా నాటికి ప్రతి ఓటరుకి ప్రత్యేక ఎపిక్ నంబర్లు కేటాయించి లోపాన్ని పూర్తిగా సరిచేసినట్టు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నేత యాచమనేని నాగేశ్వరరావు మాట్లాడుతూ 2025 ఓటరు జాబితా సక్రమంగా ఉన్నప్పుడు, ఎన్యూమరేషన్ ఫాంలో 2002 నాటి ఎపిక్ నెంబర్లు ఎందుకు నమోదు చేయమంటున్నారని ప్రశ్నించారు. -
సొసైటీ అక్రమాలపై విచారణ చేయాలి
టి.నరసాపురం: మక్కినవారిగూడెం సొసైటీలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, దుర్వినియోగమైన నగదును రికవరీ చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రైతులు ఆందోళన నిర్వహించారు. సొసైటీలో పనిచేస్తున్న ఇద్దరు గుమస్తాలు ఎరువుల విక్రయాల్లో సుమారు రూ.1.44 కోట్ల అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నూజివీడు డీఆర్ఓ రవికుమార్ విచారణ చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న గుమస్తా సిరిమళ్ళ సాయితేజ మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేయగా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ అవినీతిలో సాయితేజ ప్రమేయం లేదని, ఆయనపై అన్యాయంగా ఆరోపణలు చేస్తూ నగదు కట్టించాలని చూడటం వల్లే ఆత్మహత్యకు యత్నించాడని అతని కుటుంబ సభ్యులు సొసైటీ వద్ద ధర్నాకు దిగారు. సొసైటీ చైర్పర్సన్ సూర్యనారాయణ వివరణ ఇస్తూ.. ఉన్నతాధికారుల పూర్తి విచారణ అనంతరం నిజానిజాలు వెల్లడవుతాయని తెలిపారు. భీమవరం (ప్రకాశంచౌక్): కలెక్టరేట్లో జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో శుక్రవారం జిల్లా స్థాయి కౌన్సిల్ సమావేశం కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై నిశితంగా పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను వివిధ జిల్లాలు, జోన్లు, మల్టీ–జోన్ కేడర్లలో సర్దుబాటు చేసే అంశంపై ఉద్యోగ సంఘాల నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. జిల్లాల విభజన, కేటాయింపుల వల్ల ఏ ఒక్క ఉద్యోగి నష్టపోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మాట్లా డుతూ ఉపాధ్యాయుల బదిలీలు, సీనియారిటీ విషయంలో తమకు అన్యాయం జరగకుండా పారదర్శకంగా విభజన జరిగేలా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను వినతిపత్రం రూపంలో కలెక్టర్కు అందజేశారు. యూటీఎఫ్, ఏపీడబ్ల్యూజేయు, ఇతర గుర్తింపు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఇన్చార్జ్ డీఆర్ఓ పి.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: సహచర అధికారిణి వేధింపులు తాళలేక ఓ ఆశా కార్యకర్త గుండెపోటుకు గురైంది. బాధితురాలి వివరాల ప్రకారం.. పట్టణంలోని హరిజనపేట అర్బన్ పీహెచ్సీ పరిధిలో బిట్రాల రమాదేవి ఆశా కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్నారు. అదే కేంద్రంలో పనిచేస్తున్న ఏఎన్ఎం పద్మ గత కొంతకాలంగా తనను తీవ్రంగా అవమానిస్తూ, వేధింపులకు గురిచేస్తోందని రమాదేవి ఆరోపించారు. ఈ వేధింపులపై రమాదేవి మెడికల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేయగా, విధులకు హాజరైన తర్వాత సమస్యను సర్దుబాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. దీంతో తన భర్త ఆదినారాయణతో కలిసి ఇంటికి పయనమయ్యారు. అయితే, తీవ్ర మనస్తాపానికి గురైన రమాదేవికి మార్గమధ్యంలోనే ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. ఆమె భర్త స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుండి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జంగారెడ్డిగూడెం: వర్షాకాలంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా సురక్షితమైన మంచినీరు అందించాలని, ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి జీవీకే మల్లికార్జునరావు అధికారులను ఆదేశించారు. జంగారెడ్డిగూడెం డీఎల్డీవో కార్యాలయం వద్ద శుక్రవారం పది మండలాల పంచాయతీ అభివృద్ధి అధికారులు, విస్తరణ అధికారులు, ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో సమీక్ష సమావేశం, పంచాయతీ రికార్డుల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. -
పక్కదారి పడుతున్న చెరువు మట్టి
నూజివీడు : పొలంలో మెరక నిమిత్తం మట్టి కావాలని అనుమతులు తీసుకొని చెరువు మట్టిని తవ్వి యథేచ్ఛగా విక్రయిస్తూ టీడీపీ నాయకులు జేబులు నింపుకుంటున్నారు. మంత్రి పేరు చెబుతూ అధికారుల నోళ్లు మూయిస్తూ మట్టిని తమ ఇష్టారాజ్యంగా తవ్వేసి విక్రయించుకుంటున్నారు. మండలంలోని పోలసానపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన 7ఎకరాల వ్యవసాయ భూమిని మెరక చేసుకునేందుకు గాను కురువిడి చెరువులో నుంచి 2500 క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని వారి సొంత ఖర్చులతో తవ్వి తోలుకునేందుకు ఇరిగేషన్ అధికారులు అనుమతినిచ్చారు. అయితే ఆ చెరువు నుంచి మట్టి తోలకుండా రాయన్న చెరువు నుంచి మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారు. పొలాల్లోకి తోలుకుంటామని అనుమతి తీసుకొని వాణిజ్య అవసరాలకు, ఇతర అవసరాలకు అక్రమార్కులు అమ్మేస్తున్నారు. అనుమతులు ఒక చెరువులో తీసుకుని వేరే చెరువు నుంచి మట్టిని ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నా ఇరిగేషన్ అధికారులు గానీ, రెవిన్యూ అధికారులు గానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక ఆంతర్యం ఏంటి? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ చెరువు నుంచి ఆగిరిపల్లి మండలం అనంతసాగారం పరిధిలో ఉన్న ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన ఆయిల్ పామ్నర్సరీకి ట్రాక్టరు మట్టిని రూ.1,500లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పొక్లెయిన్కు టక్కులో మట్టిని పోసినందుకు రూ.100 ఇస్తుండగా కొంత మొత్తం ట్రాక్టర్ కిరాయి కింద మినహాయించగా మిగిలిన మొత్తం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోందని పలువురు పేర్కొంటున్నారు. మట్టిమాఫియాకు ఆదాయం ఫుల్లు మట్టి తవ్వకాలకు అనుమతి కోసం ప్రభుత్వం కేవలం క్యూబిక్ మీటరు మట్టికి ఒక రూపాయి చెల్లిస్తే చాలనే నిబంధన తీసుకొచ్చింది. దీంతో అనుమతి కోసం దరఖాస్తుదారుడు కేవలం 2500ల క్యూబిక్ మీటర్ల మట్టికి రూ.2500లు చెల్లించారు. అనుమతి వచ్చాక ఒక్క ట్రిప్పుకు రూ100ల నుంచి రూ.150లను అదనంగా వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారు. అసలు ఒక చెరువులో అనుమతి తీసుకొని వేరొక చెరువులో తవ్వుతున్నా రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని, వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాలి
ఏలూరు (టూటౌన్): దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకుండా రైతు ఆత్మహత్యలకు కారణం అవుతుందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు ఏలూరు నగరంలో శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కళాకారుల డప్పు దరువులు, నృత్యాలతో ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది. జ్యూట్ మిల్ సెంటర్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించారు. ఇండోర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య అధ్యక్షత వహించారు. వీజు కృష్ణన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల వ్యవసాయ విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 ఏళ్ల కాలంలో 10 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. 30 లక్షల మంది కౌలు రైతులకు ఎలాంటి రాయితీ అందడం లేదన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గోదావరి జిల్లాల్లో సాగునీటపాటు రైతుల రక్తం కూడా ఆత్మహత్యల రూపంలో పారుతుందని చెప్పారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, బి.బలరాం, అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి టి.సాగర్, సీనియర్ నాయకులు వై.కేశవరావు, పోలవరం నిర్వాసితుల సంఘం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, అన్ని జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ -
కోర్టు ఆదేశాలతో స్పీడ్ బ్రేకర్ల తొలగింపు
సాక్షి టాస్క్ఫోర్స్ : కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల్లో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకుల ఇంటి ముందు ఏర్పాటుచేసిన అనధికార స్పీడ్ బ్రేకర్లను అధికారులు శుక్రవారం తొలగించారు. మండలంలోని అయితంపూడి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఉప్పులూరు లావణ్య, ఆమె భర్త వైఎస్సార్ సీపీ నాయకుడు ఉప్పులూరి జితేంద్ర మాట్లాడుతూ తమ ఇంటి ముందు నరసాపురం, అశ్వారావుపేట స్టేట్ హైవేపై జనవరిలో అధికారులు, కూటమి నాయకులు కలిసి నిబంధనలకు విరుద్ధంగా స్పీడ్ బ్రేకర్లు వేశారని తెలిపారు. స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా మాజీ మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అనంతరం లావణ్య, జితేంద్ర దంపతులు కోర్టును ఆశ్రయించగా గత నెలలో స్పీడ్ బ్రేకర్లు తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసు వేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం స్పీడ్ బ్రేకర్లు తొలగించకపోతే సంబంధిత అధికారులపై తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు ఆగమేఘాల మీద శుక్రవారం ఉదయం జేసీబీ సహాయంతో ఆర్ అండ్బీ అధికారులు అనధికారంగా వేసిన స్పీడ్ బ్రేకర్లు తొలగించారు. పెదపాడు: కోళ్ల వ్యర్థాలు తరలిస్తున్న నలుగురు వ్యక్తులపై పెదపాడు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. మండలంలోని వడ్డిగూడెం గ్రామానికి తెలంగాణ రాష్టంలోని సత్తుపల్లి నుంచి నిషేధిత కోళ్ల వ్యర్థాలు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు చేపల చెరువు యజమాని ఘంటసాల తిరుపతిరాజులపై కేసు నమోదు చేసినట్లు పెదపాడు ఎస్సై ఆర్.శ్రీను తెలిపారు. -
రేషన్ షాపులపై విజిలెన్స్ దాడులు
తణుకు అర్బన్: తణుకులో రేషన్ షాపులపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం నిర్వహించిన ఈ దాడుల్లో తణుకు, పైడిపర్రులోని 4 రేషన్ డిపోల్లో అవకతవకలను గుర్తించి బాధ్యులపై 6 ఏ కేసులు నమోదుచేశారు. గురువారం రాత్రి నిర్వహించిన దాడుల్లో తణుకు వీరభద్రపురం పరిధిలోని 35వ నంబరు గాడెల్లి అనూష పేరుమీద ఉన్న డిపోలో బియ్యం 9210 కేజీలు ఉండాల్సి ఉండగా 760 కిలోలు, పంచదార 6 కిలోలు తక్కువగా ఉన్నాయని, పైడిపర్రు మండపాక రోడ్డులోని 49వ నంబరు దిడ్ల శ్రీనివాస్ పేరుమీద ఉన్న రేషన్ డిపోలో 3335 కిలోలు బియ్యం ఉండాల్సి ఉండగా 865 కిలోలు, పంచదార 18.50 కిలోలు ఎక్కువ ఉన్నాయని సీఎస్డీటీ ఇన్చార్జి ఎన్.శ్రీదేవి తెలిపారు. శుక్రవారం నిర్వహించిన దాడుల్లో ఇరగవరం కాలనీలో 21వ నంబరు ముఖమట్ల ఉమాదేవి పేరుతో ఉన్న రేషన్ డిపోలో 9690 కిలోల బియ్యం ఉండాల్సి ఉండగా 8790 కిలోలు తక్కువ, పంచదార 7.50 కిలోలు ఎక్కువ ఉందని, ఎన్టీఆర్ పార్కు ప్రాంతంలోని 12వ నంబరు పూడి లక్ష్మి పేరుతో ఉన్న రేషన్ డిపోలో 10580 కిలోలు బియ్యం ఉండాల్సి ఉండగా 1880 కిలోలు తక్కువ ఉందని, పంచదార 3.50 కిలోలు ఎక్కువ ఉందని చెప్పారు. అత్యధికంగా 21వ నంబరుతో ఉన్న ముఖమట్ల ఉమాదేవి రేషన్ డిపోలో ఏకంగా 8790 కిలోల బియ్యం తక్కువగా ఉండడం, మూడు రోజుల వ్యవధిలోనే ఇంతటి తేడా రావడం సంచలనంగా మారింది. వచ్చిన బియ్యాన్ని నేరుగానే బ్లాక్ మార్కెట్కు తరలించే శారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 1న మాత్రమే దుకాణం తెరిచారని, 2న దుకాణం తెరవలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ దాడుల్లో సీఐలు డి.ప్రసాద్కుమార్, డి.గంగాభవాని, విజిలెన్స్ అగ్రికల్చర్ ఆఫీసర్ జి.మీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఏపీఏఐఎంఎస్ యాప్పై అవగాహన కల్పించాలి
ఏలూరు (టూటౌన్): జిల్లాలో ఎరువులకు ఎలాంటి కొరత లేదని, ఏపీఏఐఎంఎస్ యాప్ పై ప్రతి రైతుకూ అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వ్యవసాయాధికారులు ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఎరువుల పంపిణీపై గురువారం స్థానిక కలెక్టరేట్ నుంచి వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు, గ్రామస్థాయి వ్యవసాయ శాఖ సిబ్బందికి టెలి కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈ–క్రాప్ వివరాల ఆధారంగా రైతులకు అవసరమైన మేరకు రైతులకు ఎరువుల పంపిణీ చేయాలని సూచించారు. ఎరువుల నిల్వలను డీలర్లు తప్పనిసరిగా నోటీస్ బోర్డులపై ప్రదర్శించాలన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్లో జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, వ్యవసాయ, అనుబంధ శాఖలకు చెందిన మండల, గ్రామ స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
జంగారెడ్డిగూడెం: పట్టణంలో బుట్టాయగూడెం రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం గ్రామానికి చెందిన నామాల సాయిపవన్ (26) తాపీ పని చేస్తాడు. బయ్యన్నగూడెం నుంచి జంగారెడ్డిగూడెం మోటార్సైకిల్పై పని నిమిత్తం వచ్చి, పని అయ్యాక తిరిగి బయ్యన్నగూడెం వెళ్తున్నాడు. ఈ సమయంలో బుట్టాయగూడెం రోడ్డులోకి వెళ్లేసరికి ఎదురుగా వస్తున్న ఓమ్నీ వ్యాన్ సాయిపవన్ మోటార్ సైకిల్ను ఢీకొంది. ఈ ఘటనలో సాయి పవన్ అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే ఓమ్నీ వ్యాన్ డ్రైవర్ మానేపల్లి గంటయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెంటపాడు: మండలంలోని అలంంపురంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాచర్ల నుంచి దాలిరెడ్డి (25), కోళ్లశివ, గాడి ప్రసాద్ ముగ్గురూ కలిసి మోటార్సైకిల్పై రాచర్ల నుంచి అలంపురం వెళ్లడానికి రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో గుర్తు తెలియని ఓ వాహనం వీరిని ఢీకొట్టింది. దీంతో బండిపై ఉన్న దాలి రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా వాహనం నడుపుతున్న ప్రసాద్కు, కోళ్ల శివకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని మెరుగైనవైద్యం నిమిత్తం రాజమండ్రి తరలించారు. ప్రమాదంలో రెడ్డి మృతదేహాన్ని గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బందువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చినస్వామి తెలిపారు. -
అప్రమత్తంగా ఉండాలి సర్
● ఒక్కరికి ఒకే ఓటు నినాదంతో సర్ ● బోగస్ ఓట్ల తొలగింపే లక్ష్యం ● జిల్లాలో ఇప్పటికే 48.41 శాతం ఎన్యుమరేషన్ పూర్తి బుట్టాయగూడెం : బోగస్ ఓటర్లకు చెక్ పెట్టడంతో పాటు, ప్రతి ఓటరుకూ ఒకే చోట ఓటు హక్కు ఉండేలా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అనర్హులను తొలగించి, అర్హులతో కూడిన కొత్త జాబితాను రూపొందించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 2002 నాటి సమగ్ర సర్వే ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఇప్పటికే ఇంటింటికీ వెళ్తూ పాత జాబితా ప్రకారం ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. జిల్లాలో 48.41 శాతం ప్రక్రియ పూర్తి జిల్లా వ్యాప్తంగా మొత్తం 16,44,193 మంది ఓటర్లు ఉండగా, 1,744 మంది బీఎల్ఓలు జూన్ 15 నుంచి తమ పరిధిలోని ఇళ్లను సందర్శిస్తున్నారు. ఇప్పటివరకు 16,34,851 మందికి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడంతో ఈ ప్రక్రియ 99.43 శాతం పూర్తయింది. కాగా, పంపిణీ చేసిన ఫారాలలో ఇప్పటివరకు 7,95,931 మందికి సంబంధించిన డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. అంటే జిల్లా వ్యాప్తంగా మొత్తం 48.41 శాతం మ్యాపింగ్ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 15వ తేదీ నాటికి వంద శాతం లక్ష్యాన్ని చేరుకునేలా బీఎల్ఓలు పనులను వేగవంతం చేశారు. ఈ సర్ కార్యక్రమంలో మృతుల కుటుంబాలకు, వలసలు వెళ్లిన వారికి, డబుల్ ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నామని, అనంతరం ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను శాశ్వతంగా తొలగిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏజెన్సీ పరిధిలో ‘సిగ్నల్’ కష్టాలు మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే పోలవరం నియోజకవర్గంలో డిజిటలైజేషన్ ప్రక్రియ కొంత కష్టతరంగా మారింది. ఇక్కడి ఏజెన్సీ గ్రామాల్లో మొబైల్ సిగ్నల్ సమస్య తీవ్రంగా ఉండటమే ఇందుకు కారణం. పోలవరంలో మొత్తం 2,55,122 మంది ఓటర్లు ఉండగా, 254 మంది బీఎల్ఓలు 2,55,121 మందికి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. వీటిలో ఇప్పటివరకు 1,39,271 ఓట్ల మ్యాపింగ్ పూర్తవగా, 54.59 శాతంగా నమోదైంది. సిగ్నల్ లేని గ్రామాల్లో బీఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలను అక్కడికక్కడే మాన్యువల్గా పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత సిగ్నల్ లభించే ప్రాంతాలకు చేరుకుని డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఈ కారణంగానే పని కొంత ఆలస్యమవుతోందని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. అయినప్పటికీ ఈ నెల 15వ తేదీ లోపు వంద శాతం పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. నియోజకవర్గం మొత్తం ఓటర్లు బీఎల్ఓలు పంపిణీ డిజిటలైజేషన్ పూర్తి అయిన చేసిన ఫారాలు అయినవి శాతందెందులూరు 2,25,615 239 2,24,540 94,381 41.83 ఏలూరు 2,34,948 213 2,28,121 99,042 42.15 చింతలపూడి 2,74,003 273 2,73,077 1,23,389 45.03 నూజివీడు 2,40,581 286 2,40,259 1,18,311 49.18 కై కలూరు 2,06,578 235 2,06,387 1,04,946 54.59 ఉంగుటూరు 2,07,346 214 2,07,346 1,16,591 56.23 -
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
నూజివీడు: టీడీపీ ప్రభుత్వం వచ్చిందే మట్టి దోపిడీకి అన్నట్లుగా గ్రామాల్లో పరిస్థితులు తయారయ్యాయి. అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఎంతో విలువైన మట్టి తరలించి అధికార పార్టీ నాయకులు జేబులు నింపుకొంటున్నారు. మండలంలోని దేవరగుంటలోని కోతులగుంట చెరువులో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఇష్టారాజ్యంగా మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. చెరువులో నుంచి మట్టిని కిలోమీటరు దూరం ఉన్న గ్రామంలోకి తోలడానికి రూ.800, దేవరగుంట నుంచి వేంపాడు వద్దకు తోలేందుకు ట్రక్కుకు రూ.1400 చొప్పున వసూలు చేస్తున్నారు. గ్రామంలోకి కిరాయితో కలుపుకుని ట్రక్కు రూ.450కు తోలవచ్చని కానీ ఇక్కడ రూ.800లు వసూలు చేస్తూ దోచుకుంటున్నారని, ఈ దోపిడీని ఆపే అధికారులే లేకపోవడం దారుణమైన పరిస్థితులకు అద్దం పడుతోందని పలువురు గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా అక్రమంగా మట్టిని తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నా వీఆర్ఓ గానీ, తహసీల్దార్ గానీ, ఇరిగేషన్ అధికారులు గానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనర్హం. కొన్ని చెరువుల్లో అయితే తూము లెవెల్ కంటే ఇంకా లోతుకు తవ్వి మట్టిని తరలిస్తుండటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలా తవ్వడం వల్ల అరకొరగా చెరువుకు నీళ్లు వచ్చినా తూము నుంచి బయటకు రావని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని కోరతున్నారు. -
ముమ్మరంగా వరి నాట్లు
ఉంగుటూరు: ఏలూరు జిల్లాలోనే అత్యధికంగా వరి సాగు చేసే ఉంగుటూరు మండలంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఈ ఏడాది మండల వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 25,600 ఎకరాల్లో వరి నాట్లు వేస్తున్నారు. దీంతో ఎటు చూసినా రైతులు, కౌలురైతులు, వ్యవసాయ కూలీలు పొలం పనుల్లో నిమగ్నమై బిజీబిజీగా కనిపిస్తున్నారు.మండలంలోని ఏ గ్రామానికి వెళ్లినా వ్యవసాయ సందడే కనిపిస్తోంది. గత పది రోజులుగా సాగునీటి బోదెలు బాగు చేయడం, గట్లు చెక్కడం, పొలాలను దమ్ము చేయడం, తుర్రాలు సరిచేయడం, నారు పీకడం వంటి పనులతో ఆయకట్టు ప్రాంతాలన్నీ కళకళలాడుతున్నాయి. ఈ హడావుడి మరో 20 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. బెంగాల్ కూలీల రాక స్థానిక కూలీల కొరతను అధిగమించడానికి పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వలస కూలీలు ఇక్కడి గ్రామాల్లో, పొలాల వద్దే తాత్కాలిక మకాంలు ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక కూలీలతో పాటు వీరు కూడా నాట్ల ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. మండలంలోని మెట్ట, డెల్టా ప్రాంతాల్లోని రైతులు ఈ ఏడాది అత్యధికంగా సంపద స్వర్ణ రకం వంగడాన్ని సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రస్తుత సీజన్లో సాగు ఖర్చులు భారీగా పెరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్లు వేయడానికి ఎకరాకు రూ.5,000, ట్రాక్టరుతో దమ్ము చేయడానికి రూ.4 వేల నుంచి రూ.4,500, గట్లు వేయడానికి ఎకరాకు రూ.1,200 వరకు ఖర్చవుతోందని చెబుతున్నారు. మెట్ట, డెల్టా పరిధిలో సాగు ఇలా.. మండలంలోని మెట్ట ప్రాంతంలో బోరు బావుల కింద ఆధారపడి పంట సాగు చేస్తుండగా, డెల్టా ప్రాంతంలో ఏలూరు–గోదావరి కాలువ నీటితో సాగు చేస్తున్నారు. మెట్ట ప్రాంత గ్రామాలైన గొల్లగూడెం, నల్లమాడు, యర్రమల్లిపాడు, ఎ.గోకవరం, గోపాలపురం, గోపినాథపట్నం, నీలాద్రిపురం, నాచుగుంట, వెల్లమిల్లిలో సాగు పనులు ఊపందుకున్నాయి. అలాగే డెల్టా ప్రాంత గ్రామాలైన బాదంపూడి, ఉంగుటూరు, నారాయణపురం, చేబ్రోలు, కై కరం, తల్లాపురం, రావులపర్రు, కాగుపాడు, బొమ్మిడి, దొంతవరం, కాకర్లమూడి, వీఏ పురం నాట్లు వేసుకునే పనిలో బిజిగా ఉన్నారు. ఈ గ్రామాల్లోని ఆయకట్టు పరిధిలో వ్యవసాయ పనులు శరవేగంగా సాగుతుండటంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామాల్లో సందడి వాతావరణం -
దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (ఆర్ఆర్పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్లును గురువారం డీఈఓ కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకట లక్ష్మమ్మ మాట్లాడుతూ 14 సంవత్సరాల వయసు నిండి చదవగలిగిన, రాయగలిగిన పరిజ్ఞానం కలిగిన వారంతా పదో తరగతి ప్రవేశాలకు అర్హులన్నారు. అలాగే పదో తరగతి అనుత్తీర్ణులై, చదువు మధ్యలో ఆపి వేసిన వారికి ఇది సువర్ణ అవకాశమన్నారు. అలాగే 15 సంవత్సరాల వయసు నించి పదో తరగతి పూర్తి చేసుకున్న వారు ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరడానికి అర్హులన్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, ట్రాన్స్జెడర్లు, మాజీ సైనికోద్యోగులకు ఫీజులో రాయితీ లభిస్తుందని తెలిపారు. ప్రవేశాలు పొందడానికి ఈ నెల 31 వరకూ గడువు ఉందన్నారు. ఇతర వివరాలకు తమ సమీపంలోని మండల విద్యాశాఖాధికారులు, డివిజనల్ విద్యాశాఖాధికారులు, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో గానీ లేదా ఆధీకృత కేంద్రాల్లో గానీ సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.ఆశ, అసిస్టెంట్ డైరెక్టర్ ఎంవీ అవధాని తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు పట్టుదలతో చదువుకోవాలి
నూజివీడు : విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధనకు పట్టుదలతో ముందుకు సాగాలని, అప్పుడే సులువుగా లక్ష్యాన్ని సాధించగలుగుతారని ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్ఐటీకి వచ్చిన పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు గురువారం స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ జీవితంలో వచ్చిన అవకాశాన్ని విద్యార్థులు వృథా చేసుకోవద్దని, చక్కగా చదువుకుని దేశానికి ఉపయోగపడే పౌరులుగా మారాలన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలని, ఏమైనా అర్థం కాకపోతే వెంటనే అడగాలని సూచించారు. క్యాంపస్లోనే అన్ని వసతులు ఉన్నాయని, ఆసుపత్రి సైతం ఉన్నందున విద్యార్థులకు ఎలాంటి భయం అక్కర్లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ బి.లక్ష్మణరావు, డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి, డీఎస్డబ్ల్యూఓలు లంకపల్లి రాజేష్, దుర్గాభవాని, పీయూసీ ఇన్చార్జి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం: ఏపీ నిట్లో స్థానిక ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ విద్యార్థులకు పీహెచ్డీ సీట్లు వచ్చినట్లు ప్రిన్సిపాల్ టి.అశోక్ గురువారం తెలిపారు. పి.తేజస్విని, జీఆర్.సత్యనారాయణకు ఈ సీట్లు వచ్చాయన్నారు. ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థలో తమ విద్యార్థులకు సీట్లు రావడం ఆనందంగా ఉందని ప్రిన్సిపాల్ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో రసాయన శాస్త్ర విభాగం కోర్సు కో–ఆర్డినేటర్ శ్రీరాముడు, అధ్యాపకులు పుత్రయ్య, రమణ, డాక్టర్ ప్రశాంతి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆగిరిపల్లి: మండలంలోని నూగొండపల్లిలో రీసర్వే పేరుతో రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడి తన భూమిని వేరొక వ్యక్తి పేరుపై నమోదు చేశారని రైతు మల్లవల్లి అర్జున్ రావు ఆరోపించాడు. గురువారం బాధితుడు విలేకరులతో మాట్లాడుతూ నూగోండపల్లిలో తనకు వారసత్వంగా 1.94 ఎకరాల పొలం ఉందని, అయితే సంవత్సరం క్రితం గ్రామంలో రీసర్వే నిర్వహించారని, ఆ సర్వేలో అప్పటి సర్వేయర్ మునీర్, తన పొలంలోని 16.05 సెంట్లు స్థలాన్ని వేరొకరి పేరుపై అక్రమంగా నమోదు చేశారని ఆరోపించారు. తన భూమిని తనకు మళ్లీ ఇప్పించి, న్యాయం చేసి, అక్రమాలకు పాల్పడిన సర్వేయర్ పై చర్యలు తీసుకోవాలని ఇటీవల సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశానని బాధితుడు అర్జున్ రావు తెలిపాడు. -
ఇంటర్మీడియట్ విద్య అధికారిగా అప్పారావు
యలమంచిలి: పాలకొల్లు కోకోనట్ మర్చంట్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బి. అప్పారావు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా (డీఐఈఓ) పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా చాంబర్స్ కళాశాల యాజమాన్యం గురువారం ఆయ న్ను సత్కరించింది. చైర్మన్ కేవీఆర్ నరసింహారావు మాట్లాడుతూ ఇంటర్ విద్యా ఉపాధి కోర్సులను మరింత అభివృద్ధి చేసి, తీర ప్రాంత విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలోని జూనియర్ కళాశాలలను రాష్ట్రంలో ముందు వరుసలో నిలపాలని ఆకాంక్షించారు. కళాశాల కార్యదర్శి కేవీ సీతారామరాజు, చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కటారి నాగేంద్ర కుమార్, చాంబర్స్ కళాశాలల ప్రిన్సిపాల్ డి.వెంకటేశ్వరరావు అభినందనలు తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన డీటీ
జంగారెడ్డిగూడెం: భూమి మ్యూటేషన్ రద్దుకు సంబంధించి కేసు తీర్పు కాపీని ఇచ్చేందుకు సొమ్ములు తీసుకుంటూ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటేషన్పై పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ కె.వెంకటేశ్వరరావు గురువారం ఏసీబీ అధికారులకు చిక్కా రు. వివరాలిలా ఉన్నాయి.. జంగారెడ్డిగూడెం మండలం టెక్కినవారిగూడెం గ్రామానికి చెందిన పోతన సుకుమార్ అనే వ్యక్తికి తండ్రికి చెందిన ఎకరా భూమి ఉంది. నిమ్మలగూడెం రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ భూమి తాత నుంచి వీలునామా ద్వారా ఆయన తండ్రికి సంక్రమించింది. ఈ భూమికి సంబంధించి జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో మ్యూటేషన్ కూడా పూర్తయ్యింది. అయితే కుటుంబ వివాదాల కారణంగా ప్రత్యర్థులు ఆర్డీఓ కోర్టును ఆశ్రయించి ఈ మ్యూటేషన్ను రద్దు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ వివాదంపై విచారణకు హాజరైన సుకుమార్కు కేసు తీర్పు కాపీని ఇచ్చేందుకు వెంకటేశ్వరరావు రూ.50 వేలు డిమాండ్ చేశారు. తాను అంత ఇవ్వలేనని సుకుమార్ రూ.20 వేలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ తహసీల్దార్తో జరిగిన సంభాషణను రికార్డు చేసి ఏలూరు ఏసీబీ అధికారులకు ఇచ్చారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు సుకుమార్ గురువారం డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావుకు రూ.20 వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ జీవీ కృష్ణారావు, సీఐలు బాలకృష్ణ , శ్రీనివాసరావు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేయడంతో పాటు వెంకటేశ్వరరావును అరెస్టు చేసి రాజమండ్రి ఏసీబీ కోర్డులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ అధికారులు చెప్పారు. -
ఏపీ నిట్ విద్యార్థుల ప్రతిభ
తాడేపల్లిగూడెం: ఆసియా బ్రౌన్ బొవేరీ (ఏబీబీ) సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరులో నిర్వహించిన ఏబీబీ యాక్సిలరేటర్–2026 జాతీయస్థాయి పోటీల్లో ఏపీ నిట్ విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారని డైరెక్టర్ ఎన్వీ రమణరావు, రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి గురువారం తెలిపారు. దేశవ్యాప్తంగా 1,600కు పైగా జట్లతో పాటు 14 వేల మంది విద్యార్థులు పాల్గొన్న పోటీల్లో తమ విద్యార్థులు ప్రాజెక్టుతో ప్రతిభ కనబర్చి రూ.1.50 లక్షల నగదు పురస్కారం అందుకున్నారన్నారు. అసోసియేట్ డీన్ పెద్దపాటి శంకర్ టీమ్ మెంటర్గా వ్యవహరించారన్నారు. . ప్రాజెక్ట్ అ‘ద్వితీయ’ం నిట్లో మూడో సంవత్సరం చదువుతున్న సౌమ్యదీప్దాస్, బి.కిసాన్ (ఈఈఈ), శివమ్కుమార్ (మెకానికల్), ఆర్యన్ శ్యామ్ (సీఎస్ఈ) బృందం బియాండ్ మానిటరింగ్ ఏఐ ఏజెంట్స్ ఫర్ రియల్ టైమ్ పాడ్ రీసోర్స్ డిస్కవరీ అండ్ డిపెండెన్సీ మ్యాపింగ్ పేరుతో వినూత్న ప్రాజెక్టును రూపొందించారు. కృత్రిమ మేధస్సు ఆధారంగా క్లౌడ్ వాతావరణంలో పనిచేస్తున్న అతి చిన్న కంప్యూటింగ్ వనరులను తక్షణమే గుర్తించడం, వాటి పరస్పర ఆధారిత సంబంధాలను విశ్లేషించడం ప్రాజెక్టు ప్రత్యేకత. -
కూటమిది ధృతరాష్ట్ర పాలన
వైఎస్సార్సీపీ గూడెం కన్వీనర్ రఘురాం తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ధృతరాష్ట్ర పాలన సాగిస్తోందని అప్సడా మాజీ వైస్చైర్మన్, వైఎస్సార్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ వడ్డి రఘురాం విమర్శించారు. గురువారం ఆయన లండన్ నుంచి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేదని, వరి నుంచి కోకో వరకు ఇదే పరిస్థితి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రైతుల సమస్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందిస్తే గానీ ప్రభుత్వంలో చలనం రావడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వ హయాంలో మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ధరల స్థిరీకరణ కోసం నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.7,800 కోట్లు కేటాయించి ఆపద కాలంలో రైతులను ఆదుకున్నారని గుర్తుచేశారు. ఉచిత పంటల బీమా కింద రూ.3,500 కోట్లు కేటాయించాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం ఎందుకు చెల్లించలేదన్నారు. ఆక్వా రంగం కుదేలవుతోందని, ఫీడ్ రేటు కిలోకు రూ.14 వరకు పెరిగితే రూ.2 తగ్గించి చేతులు దులుపుకోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా రైతులకు అన్నిరకాల సేవలు అందేవని, యూరియా విషయంలో కచ్చిత పర్యవేక్షణ ఉండేదన్నారు. అప్పట్లోనే ఆక్వా జోన్ పరిధిలో 50,800 క నెక్షన్లు ఉన్నాయని, చంద్రబాబు ప్రభుత్వం జీఓ 169తో పవర్ ఫ్యాక్టర్ నిబంధనతో రైతులను కొత్త తరహా మోసం చేస్తోందన్నారు. ఈ నిబంధన వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులను అన్నివిధాలా మోసం చేస్తోందని, అయి నా ప్రశ్నిస్తానన్న నాయకుడు నోరు మెదపడం లేదన్నారు. వైఎస్ జగన్ ప్రజాదరణను ఎవరూ అడ్డుకో లేరని, నష్టపోయిన అన్నివర్గాలకు అండగా ఉంటూ వైఎస్సార్సీపీ పోరాడుతుందన్నారు. -
6న ఎస్ఎఫ్ఐ ధర్నా
భీమవరం: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈనెల 6న భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్టు జిల్లా కార్యదర్శి టి.ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థులకు నష్టం కలిగించేలా ఉన్న ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేయాలని, హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ధర్నా చేపట్టనున్నామన్నారు. ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ నాయకులు ఎస్.లక్ష్మణ్, పి.సాయికృష్ణ, పి.త్రినాథ్, జి.కౌశిక్, జి.అభి పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్: జిల్లావ్యాప్తంగా 99.5 శాతం ఎన్రోల్మెంట్ ఫారాలు పంపిణీ పూర్తయిందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. గురువారం బంగారుగూడెంలో జరుగుతున్న సర్ కార్యక్రమం పురోగతిని ఆమె పరిశీలించారు. పారదర్శకంగా, స్వచ్ఛంగా ఓటర్ల జాబి తా రూపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈనెల 21 నాటికి డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురిస్తామన్నారు. ప్రతి ఓటరును సరైన పోలింగ్ కేంద్రానికి మ్యాపింగ్ చేయడం కీలకమని, మ్యాపింగ్ శాతాన్ని పెంచడంతో పాటు ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని బీఎల్ఓలను ఆదేశించారు. ఆర్డీవో ఎం.సూర్యారావు, తహసీల్దార్ ఎం.సునీల్కుమార్, బీఎల్వోలు ఉన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా ఇన్చార్జి రెవెన్యూ అధికారిగా పెంచల ప్రభాకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాను ముందంజలో నిలిపేందుకు కృషిచేయాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటివరకు డీఆర్వోగా ఉన్న బి.శివన్నారాయణరెడ్డి గత నెల 30న పదవీ విరమణ చేయడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. ఇన్చార్జి డీఆర్వోగా బాధ్యతలు చేపట్టిన ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఉండి: ఐటీఐ జిల్లా కన్వీనర్, ఎన్నార్పీ అగ్రహారం ప్రభుత్వం ఐటీఐ ప్రిన్సిపాల్గా ఎం.లక్ష్మీసరోజ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఏలూరు ఐటీఐ, డీఎల్టీసీ ఏడీగా విధులు నిర్వహిస్తున్న ఆమె పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. ఐటీఐ అధికారులు, సిబ్బంది ఆమెను అభినందించారు. కై కలూరు: కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చెరువు గట్లను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. కై కలూరు మండలం పెంచికలమర్రులో పట్టపగలు ఎవరికీ అనుమా నం రాకుండా కూలీలతో ఓ వ్యక్తి చేపల చెరువు గట్లును పటిష్ట పరుస్తున్నాడు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో అధికారులు ధ్వంసం చేసిన చెరువుల్లోనే సాగు చేస్తున్నాడు. దీనిపై ఇటీవల సాక్షిలో ‘ఆగని అక్రమ గట్లు పర్వం’ శీర్షికన కథనం వెలువడింది. దీనిపై అటవీశాఖ కైక లూరు రేంజర్ కె.రామంలింగాచార్యులు స్పందించారు. క్షేత్రస్థాయి సిబ్బందిని పంపించారు. గట్లును ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా రేంజర్ మాట్లాడతూ అభయారణ్యంలో అక్రమ సాగు చేసినా, గట్లు ఏర్పాటు చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
మహిళా సాధికారత ఊసేది?
శురకవారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2026భీమవరం(ప్రకాశం చౌక్): డ్వాక్రా సంఘాల సృష్టికర్తగా చెప్పుకునే చంద్రబాబునాయుడి పాలనలో మహిళలు నిరంతరం మోసపోతూనే ఉన్నారు. గత 2014 ప్రభుత్వ కాలంలో బంగారు రుణాలు మాఫీ చేస్తామని నమ్మించి చివరకు మహిళలను మోసం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ మహిళలను ఆర్థికంగా చైతన్యవంతులను చేస్తామని, ఉపాధి–వ్యాపారాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తా మని హామీలు ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటుతున్నా మహిళలకు ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు. ఈ పాలనలో మహిళా సాధికారత అనే మాటే వినిపించడం లేదు. 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వ ఆర్థిక సాయంతో జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో డ్వాక్రా మహిళలు అనేక వ్యాపారాలు ప్రారంభించారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక మద్దతు లేకపోవడం, బ్యాంకు రుణాలు దొరక్కపోవడంతో పెట్టుబడుల కొరత ఏర్పడి మహిళలు తమ వ్యాపారాలను మూసేసుకుంటున్నారు. కొందరు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యాపారాలు సాగిస్తున్నారు. నిలిచిపోయిన ‘సీ్త్ర నిధి’ రుణాలు చిన్నపాటి వ్యాపారాల పెట్టుబడి కోసం మహిళలు సీ్త్రనిధి రుణాలను ఆశ్రయిస్తుంటే అక్కడ కూడా నిరాశే ఎదురవుతోంది. జిల్లాలోని అనేక గ్రామాల్లో, పట్టణాల్లో సీ్త్ర నిధి రుణాలు మంజూరు కావడం లేదు. గతంలో జరిగిన కొన్ని అవకతవకలను సాకుగా చూపిస్తూ ఈ రుణాలను పూర్తిగా నిలిపివేశారు. పెట్టుబడుల కోసం మహిళల ఎదురుచూపులు కుటుంబానికి ఆసరాగా నిలవాలనే తపనతో చిన్న చిన్న వ్యాపారాలు చేయడానికి మహిళలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పెట్టుబడి లేక, ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. మహిళా సాధికారత అంటే కేవలం మాటలు కాదు, వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే ప్రధాన ఆశయం కావాలి. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం తరహాలోనే వ్యాపారాల కోసం ఆర్థిక సాయం అందించి, బ్యాంకు రుణాలు మంజూరు చేస్తే.. పేద, మధ్యతరగతి కుటుంబాల మహిళలు వ్యాపారాలు చేసుకుంటూ గౌరవంగా జీవించగలుగుతారు. పథకం లబ్ధిదారులు లబ్ధి (రూ.కోట్లలో)చేయూత 1,12,017 168.00 కాపు నేస్తం 1,95,728 366.47 చేదోడు 29,102 29.10 ఈబీసీ నేస్తం 25,457 38.18 బ్యాంకు రుణాలు 15,000 75.00 అందని ఆర్థిక ప్రోత్సాహకాలు నిలిచిన ఉపాధి వ్యాపారాలు సీ్త్ర నిధి రుణాల్లేవు మహిళా సంక్షేమం మరిచిన కూటమి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.615 కోట్ల లబ్ధి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో రూ.615.15 కోట్లు ఖర్చు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల మహిళలకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని విధంగా (ఉచితంగా) ఆర్థిక సాయం అందించారు. ఆ నిధులతో మహిళలు చిన్నపాటి వ్యాపారాలు పెట్టుకుని సొంతంగా ఉపాధి పొందారు. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లలో మహిళలకు పైసా సాయం కూడా చేయలేదు. జిల్లాలో 30,093 డ్వాక్రా సంఘాల్లో 3,00,990 మంది సభ్యులు ఉన్నారు. బ్యాంకులు గ్రూపులపై ఇచ్చే సాధారణ డ్వాక్రా రుణాలు తప్ప, మహిళల సొంత ఉపాధి కోసం కనీసం రూ.25 వేల అప్పు కూడా ఇవ్వడం లేదు. ఏదైనా షూరిటీ (హామీ) ఉంటేనే లోన్ ఇస్తామని బ్యాంకర్లు తెగేసి చెబుతుండటంతో పేద, మధ్యతరగతి మహిళలకు బ్యాంకు అప్పు దొరకడం లేదు. ఫలితంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించలేక మహిళలు ఉపాధికి దూరమవుతున్నారు. కూటమి ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు అందిస్తామని ప్రకటించడంతో.. జిల్లాలో దాదాపు 10 వేల మంది మహిళలు కిరాణా, వస్త్ర, టైలరింగ్, బ్యూటీషియన్, ఫుడ్ బిజినెస్ వంటి వివిధ వ్యాపారాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కూటమి నాయకుల సిఫార్సులు, ఇంటర్వ్యూలు అన్నీ పూర్తయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం బ్యాంకులకు సబ్సిడీ సొమ్ము జమ చేయలేదు. ఏడాదన్నర దాటినా ఈ సబ్సిడీ రుణాలు మంజూరు కాకపోవడంతో మహిళలు మరోసారి మోసపోయారు. -
అడ్డగోలు అక్రమాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పదవీ కాలం కొద్దిరోజుల్లో పూర్తవుతుంది.. కనీసం ఇప్పుడైనా నాలుగు రూపాయలు సంపాదించుకోకపోతే ఎలా.. నిబంధనలు ఎలా ఉన్నా.. ఏఈ నుంచి కమిషనర్ వరకు ఎవరు బలైనా మాకు అనవసరం.. మా పనులు కావాల్సిందే.. మా కమీషన్లు అందాల్సిందే ఇది ఏలూరు నగ రపాలక సంస్థ సభ్యుల తీరు. కౌన్సిల్ తీర్మానం లేకుండా స్థాయి సంఘం సమావేశం రహస్యంగా నిర్వహించి కౌన్సిల్ తీర్మానం చేసినట్టు హడావుడిగా 19 పనులకు రూ.4.03 కోట్ల కేటాయింపు ప్రతిపాదనలు ఖరారు చేశారు. ఇక్కడ మరో ప్రత్యేక విషయమేమింటే.. ఏలూరు మేయర్ భర్తకు చెందిన లేఅవుట్లో మళ్లీ రోడ్లు నిర్మాణానికి రూ.96 లక్షలు కేటాయించుకోవడం గమనార్హం. ఒత్తిళ్లు.. నిబంధనలకు నీళ్లు ఏలూరు నగరపాలక సంస్థలో అడ్డగోలు దందాకు తెరపడటం లేదు. టౌన్ ప్లానింగ్ మొదలు ఇంజనీరింగ్ వరకు అధికారుల ఒత్తిళ్లతో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారు. తాజాగా కొద్ది నెలల క్రితం టౌన్ప్లానింగ్లో భారీ అవతవకలు జరిగాయని, అలాగే అనుమతులకు మించి అక్రమ కట్టడాలు నగరంలో ఉన్నాయనే ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రెండు రోజులపాటు సమగ్రంగా రికార్డులు పరిశీలించడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఇక తాజాగా ఏలూరు నగరంలో జరిగిన రూ.56 కోట్ల విలువైన 1,621 నామినేషన్ పనులపైనా ఆరోపణలు రావడం లోకాయుక్తకు ఫిర్యాదులు అందడంతో లోకాయుక్త నామినేషన్ పనులపై క్షుణ్ణంగా విచారించి నివేదికలు సమర్పించాల్సిందిగా రాష్ట్ర మున్సిపల్ శాఖను ఆదేశించింది. ఈ క్రమంలో రాజమండ్రి మున్సిపల్ ఆర్డీ సీహెచ్ నాగనరసింహారావు, ఏలూరు కమిషనర్ ఎ.భానుప్రతాప్లు వివరాలు అందజేయాలని ఆదేశించారు. ఈ పనుల్లోనూ రూ.2.06 కోట్లు మేయర్ భర్త ఎస్ఎంఆర్ పెదబాబుకు చెందిన ఎస్ఎంఆర్నగర్లో పనులు నిర్వహించారు. లేఅవుట్లో నిబంధనలకు విరుద్ధంగా పనులు ఎలా చేశారు.. ఫైల్ ప్రా సెసింగ్ ఎలా చేశారని.. లేఅవుట్లో ఎన్ని ఇళ్లు ఉ న్నాయి.. కార్పొరేషన్కు ఎంత ఆదాయం వస్తుంద ని కూడా తదితర వివరాలు కోరారు. వీటిపై ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులు ఉక్కిరిబిక్కిరి అ వుతున్న తరుణంలో గత నెల 17న స్థాయి సంఘం సమావేశం నిర్వహించారు. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఏలూరు కార్పొరేషన్లో వింత పరిస్థితి కౌన్సిల్ నిర్వహించకుండానే పనుల ఖరారు 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.4.03 కోట్లతో పనులు మళ్లీ మేయర్ లేఅవుట్కు రూ.96 లక్షల పనులు లోకాయుక్త విచారణ కొనసాగుతున్నా మరోసారి పనుల కేటాయింపు పాలకవర్గం గడువు ముగియనున్న నేపథ్యంలో హడావుడి వ్యవహారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు కౌన్సిల్ సమావేశం నిర్వహించి రూ.4.03 కోట్ల వ్యయంతో 19 పనులు ఖరారు చేసి ప్రతిపాదనలు పంపారు. వీటిల్లో కూడా కొన్ని ఎస్ఎంఆర్ నగర్లోని లేఅవుట్లో రూ.96 లక్షలతో అంచనాతో రెండు పనులను ప్రతిపాదించిన ప నులను ఎస్ఎంఆర్ నగర్ లేకుండా సర్వే నెంబర్, ఫలనా వ్యక్తి ఇంటి నుంచి ఫలానా వ్యక్తి ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణం రూ.24 లక్షలు, మళ్లీ అదే లేఅవుట్లో 50వ డివిజన్ సర్వే నంబబరుతో ఫలానా వ్యక్తి ఇంటి నుంచి ఫలానా ప్లాట్ వరకు రహదారి నిర్మాణం రూ.72 లక్షలు కేటాయింపు ప్రతిపాదనలు పంపారు. సాధారణ లేదా అత్యవసర కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించి పనులు ఖరారు చేస్తారు. అయితే 17న స్టాండింగ్ కౌన్సిల్ నిర్వహించినట్టు చెబుతున్నారు గాని మార్చి 27న బడ్జెట్ సమావేశాల అనంతరం ఇప్పటివరకు ఎలాంటి కౌన్సిల్ సమావేశం జరగలేదు. ఈ నెలాఖరుతో పాలకవర్గం ముగియనుండటంతో హడావుడిగా ప్రతిపాదనలు పెట్టడం, నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మిస్ట్రేషన్కు రిటైర్డ్ ఏఈ కేవీ సాయిప్రసాద్ ఫిర్యాదు చేశారు. -
సిరుల తల్లి.. స్వర్ణంతో శోభిల్లి..
గురువారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2026భీమవరం(ప్రకాశం చౌక్): బంగారం చందాల సేకరణ కోసం 12 మందితో ఒక ప్రత్యేక బంగారం కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆలయంలో భక్తులు, దాతల నుంచి బంగారం లేదా నగదు రూపంలో చందాలు సేకరించే పనిని ప్రారంభించింది. ఇందుకోసం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ ద్వారా ఇప్పటివరకు 13 గ్రాముల బంగారం చందాల రూపంలో వచ్చింది. రాబోయే మూడేళ్ల కాలంలో మిగిలిన 27 కిలోల బంగారాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వర్ణమయ కై ంకర్యంలో భాగస్వాములుకండి మావుళ్లమ్మ అమ్మవారిని పూర్తి స్వర్ణమయం చేయడానికి దాతలు, భక్తులు తమ స్తోమతను బట్టి బంగారం లేదా నగదును విరాళంగా అందించవచ్చు. గతంలో కేవలం బంగారం ఉన్నవారే సమర్పించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు, సామాన్య భక్తులు కూడా తమకు తోచిన నగదును చందాగా ఇచ్చి అమ్మవారి స్వర్ణమయ కై ంకర్యంలో భాగస్వాములు కావచ్చు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరుతున్నారు. ఇప్పటివరకు 75 కిలోల బంగారం సేకరణ అమ్మవారిని 100 కిలోల బంగారంతో శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు 2009లోనే ఈ బంగారం సేకరణ ప్రారంభమైంది. అప్పటినుంచి ఇప్పటివరకు భక్తులు, దాతలు స్వచ్ఛందంగా 75 కిలోల బంగారాన్ని సమర్పించారు. దాతలు 2 గ్రాముల నుంచి 46 గ్రాముల వరకు తమ శక్తి కొద్దీ బంగారాన్ని అందించారు. ఈ 75 కిలోల బంగారంలో ఇప్పటికే 52 కిలోల బంగారాన్ని ఆభరణాల రూపంలో అమ్మవారికి అలంకరించారు. మిగిలిన 23 కిలోల బంగారాన్ని కొత్త ఆభరణాల తయారీ కోసం సిద్ధం చేశారు. అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయం కోసం మరో 27 కిలోల బంగారం అవసరం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం అమ్మవారికి బంగారం సమర్పిస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉండేవారు ఆలయ అధికారులను సంప్రదించి, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా నగదు విరాళాలను పంపవచ్చు. దేశవ్యాప్తంగా గుర్తింపు 100 కిలోల బంగారంతో పూర్తి స్వర్ణమయమైన తర్వాత, సంవత్సరంలో 365 రోజులూ భక్తులకు స్వర్ణమయ రూపంలో దర్శనమిచ్చే ఏకై క అమ్మవారిగా మావుళ్లమ్మ ఖ్యాతి గడించనున్నారు. సుమారు రూ.90 లక్షల వ్యయంతో నెల రోజుల పాటు జరిగే అమ్మవారి వార్షిక జాతర, భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులు, నిత్య అన్నదానం, సాంస్కృతిక ప్రదర్శనలు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల సందడితో ఈ ఆలయం ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ స్వర్ణమయ ప్రాజెక్టుతో అమ్మవారి కీర్తి ప్రపంచవ్యాప్తం కానుంది. భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మవారిని 100 కిలోల బంగారంతో స్వర్ణమయం చేసేందుకు దాతలు, భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటివరకు భక్తులు స్వచ్ఛందంగా బంగారం సమర్పిస్తూ వచ్చారు. అయితే, అమ్మవారిని పూర్తి స్వర్ణమయం చేయాలనే లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేసేందుకు దేవదాయ శాఖ మరో అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా బంగారం, నగదు రూపంలో విరాళాలు వసూలు చేసేందుకు ఒక ప్రత్యేక ప్రాజెక్టును తలపెట్టింది. శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి పూర్తి స్వర్ణమయం కోసం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బంగారం, నగదు చందాలను సేకరిస్తున్నాము. ఒక ప్రత్యేక కమిటీ ద్వారా ఈ కార్యక్రమం పారదర్శకంగా సాగుతోంది. ఆలయంలో ప్రత్యేక కౌంటర్ కూడా అందుబాటులో ఉంది. భక్తులు, దాతలు ఈ మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మవారి స్వర్ణమయ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలి – బుద్దా మహాలక్ష్మి నగేష్, సహాయ కమిషనర్, ఈవో, మావుళ్లమ్మ దేవస్థానం పసిడి కాంతులు మావుళ్లమ్మ స్వర్ణమయానికి బంగారం సేకరణ 100 కిలోల సేకరణ లక్ష్యం ఇప్పటికే 75 కిలోల విరాళాలు 52 కిలోలతో ఆభరణాల అలంకరణ కొత్తగా బంగారు కమిటీ ఏర్పాటు -
ఎవరి కోసమో ఈ సిమెంట్ రోడ్డు?
● ఇళ్లు లేని చోట రూ.55 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణం ● రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమేనని ప్రజల మండిపాటు భీమవరం: కూటమి ప్రభుత్వ పాలన ‘అయిన వారికే అన్నట్టు’ సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామ పరిధిలో రూ.55 లక్షల ఉపాధి హామీ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డు ప్రజల అవసరాలకు కాకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే వేశారని పలువురు ఆరోపిస్తున్నారు. మండలంలోని అనేక గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నా పట్టించుకోని పాలకులు, అధికారులు.. గొల్లలకోడేరులో ఒక్క ఇల్లు కూడా లేని చోట లక్షలాది రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మించడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా పోలీసు కార్యాలయానికి వెళ్లే దారిలో, పంట కాలువ వెంబడి పలువురు రియల్టర్లు భవన నిర్మాణ స్థలాల విక్రయం కోసం వెంచర్లు వేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఒక్క ఇల్లు కూడా లేదు. అయినప్పటికీ, కాలువ వెంబడి గొల్లలకోడేరు పంచాయతీ పరిధిలో రూ.55 లక్షల వ్యయంతో నూతనంగా సిమెంట్ రోడ్డును నిర్మించారు. ఈ రహదారిని గత నెల 30న కలెక్టర్ నాగరాణి, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. శిలాఫలకంపై ఒకలా... క్షేత్రస్థాయిలో మరోలా... గొల్లలకోడేరు గ్రామంలోని ‘శ్రీనిలయం’ నుంచి ‘అల్లూరి వెంకటనాగార్జున’ ఇంటి వరకు సీసీ రహదారి నిర్మించినట్లు శిలాఫలకంపై పేర్కొన్నారు. కానీ, ఆ మార్గం మధ్యలో ఎక్కడా ఒక్క ఇల్లు కూడా లేకపోవడం గమనార్హం. ప్రజలకు అత్యవసరమైన చోట్ల రోడ్లు వేయకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా ప్రజాధనాన్ని ఎలా కేటాయిస్తారంటూ స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాటుచేసిన శిలాఫలకం గొల్లలకోడేరులో నూతంగా నిర్మించిన సీసీ రోడ్డు -
టీడీపీలో భూప్రకంపనలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండతో దేవుడి భూమిని కబ్జా చేసిన అధికార పార్టీ నేతల పరిస్థితి ఇప్పుడు తలకిందులైంది. అక్రమ వ్యవహారాలు వెలుగులోకి రావడంతో పాటు ఆన్లైన్ రికార్డులు, పలు ఆధారాలు బయట పడుతుండటంతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక రెవెన్యూ అధికారులైతే ఇప్పటికే ఆన్లైన్ రికార్డులను మార్పుచేసి, తమ తప్పులను సరిచేసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ భూ వివాదంపై గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మంగళవారం రాత్రి ద్వారకాతిరుమల మండల పరిషత్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మరోవైపు దాతలు భూమిని స్వామివారికి అప్పగించండి అంటూ తహసీల్దార్కు లేఖ పంపడం చర్చగా మారింది. ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం పంచాయతీ, లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని, పూరీ మఠాధిపతులైన మంత్రరత్నం అమ్మాజీ (లక్ష్మీ అమ్మవారు) కుటుంబ సభ్యులు 1992లో చినవెంకన్న దేవస్థానానికి దత్తత ఇచ్చారు. అప్పటి నుంచి ఈ ఆలయానికి సంబంధించిన ఆర్ఎస్ నెంబర్ 38/1 లోని 1.89 ఎకరాల భూమి దేవస్థానం ఆధీనంలోనే ఉంది. స్వామివారి నిత్య సేవలకు వినియోగించే తులసిని అందులోనే సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో కొందరు వ్యక్తులు సదరు భూమిలోకి చొరబడి తులసి మొక్కలను, చెట్లను, చుట్టూ ఉన్న ఫెన్సింగ్ను తొలగించారు. ఇదేంటని స్థానికులు ప్రశ్నించగా కొందరు టీడీపీ నేతలు ఈ భూమిని దాత అమ్మాజీ కుటుంబ సభ్యుడైన మంత్రరత్నం ప్రతివాద భయంకర వెంకట సంపత్కుమారాచార్యులు 1967లో కమ్మ సేవ సంఘం, ద్వారకాతిరుమలకు బహుమతిగా ఇచ్చారని చెప్పారు. రెవెన్యూ ఆన్లైన్ రికార్డును పరిశీలించగా చెల్లుబాటుకాని అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా సంఘం పేరు మీదకు ఆ భూమిని మార్చినట్టు స్పష్టమైంది. సదరు భూమి దేవుడిదని అన్నందుకు శ్రీవారి దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావుపై, ఓ టీడీపీ నేత వాగ్వాదానికి కూడా దిగాడు. జరిగిన పరిణామాలపై సాక్షి దినపత్రికలో గతనెల 25 నుంచి వరుస కథనాలు ప్రచురితం అవుతుండటంతో అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. వివాదాస్పద భూమి సేవ సమితి పేరున అసైన్ అయినట్టు తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి, మళ్లీ రికార్డును రివర్ట్ చేయడం జరిగిందని ఎమ్మెల్యే మద్దిపాటి అన్నారు. ఆ భూమి ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉందని, డాక్యుమెంట్లు పరిశీలించిన తరువాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అప్పటి వరకు ఆ భూమి ఎవరికీ చెందదని వ్యాఖ్యానించారు. జిరాయితీ భూమిపై ప్రభుత్వ పెత్తనం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్ (ఎఫ్ఎల్ఆర్)లో కూడా మంత్రరత్నం ప్రతివాద భయంకర వెంకట సంపత్కుమారాచార్యులు పేరే ఉందని, అడంగల్లో పేర్లు మార్చినంత మాత్రాన సేవ సంఘానికి యాజమాన్య హక్కు రాదన్న విషయం ఎమ్మెల్యేకు తెలియదా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. దేవస్థానం ఆధీనంలో 30 ఏళ్ల క్రితం నుంచి ఉన్న ఈ భూమిని వివాదంలోకి నెట్టింది కేవలం టీడీపీ నాయకులేనని భక్తులు మండిపడుతున్నారు. రోజురోజుకూ ముదురుతున్న లక్ష్మీపురం భూ వివాదం కబ్జాదారులు తమ పార్టీవారు కావడంతో ఎమ్మెల్యే మద్దిపాటి సతమతం విలేకరుల సమావేశంలో పొంతన లేని సమాధానాలు వివాదాస్పద భూమిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న ఎమ్మెల్యే దేవుడికిచ్చిన జిరాయితీ భూమిపై ప్రభుత్వ జోక్యం ఏంటటున్న భక్తులు ఆ భూమి దేవుడికే చెందాలంటూ తహసీల్దార్కు దాత కుటుంబీకుల లేఖ ఎమ్మెల్యే అనుచరుడిదే కీలక పాత్ర ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడిగా ఉన్న తిమ్మాపురంనకు చెందిన ఓ టీడీపీ నాయకుడు ఈ భూ కబ్జాకు సూత్రదారుడిని పలువురు ఆరోపిస్తున్నారు. ఆ నాయకుడి మాట కాదనలేక చేసిన పనులు కారణంగానే ఎమ్మెల్యే ఈ భూ వివాదంలో ఇరుక్కుని, సతమతం అవుతున్నాడని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. నేడు కలెక్టరేట్ వద్ద ఆందోళన దేవుడి భూమి దేవుడికే చెందాలని వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద గురువారం ఆందోళన చేపట్టి, కలెక్టర్కు వినతిపత్రం అందిస్తామని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత తెలిపారు. ఏలూరు, తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజ తదితరులు పాల్గొంటారని చెప్పారు. పార్టీ శ్రేణులు ఉదయం 10 గంటలకు చేరుకోవాలని వనిత పిలుపునిచ్చారు. -
రూ.96.06 కోట్ల పింఛన్ల పంపిణీ
భీమవరం (ప్రకాశం చౌక్): జిల్లాలో 2,20,625 మంది లబ్ధిదారులకు రూ.96.06 కోట్ల విలువైన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను బుధవారం పంపిణీ చేసినట్లు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని 26వ వార్డు బ్యాంక్ కాలనీ–2లో ఆయన స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్ అందుకున్న వృద్ధురాలు జి.అచ్చయమ్మ ఇంటిని సందర్శించిన జాయింట్ కలెక్టర్ అక్కడ తాగునీటి సరఫరా, నీటి నాణ్యతను పరిశీలించారు. అలాగే ఐ.వెంకట్రావుకు పింఛన్ అందజేస్తూ కుటుంబ సభ్యులు ఎలా చూసుకుంటున్నారో ఆరా తీశారు. అనంతరం అదే ప్రాంతంలోని మురుగు కాలువలను పరిశీలించి కాలువల శుభ్రతపై శానిటేషన్ సెక్రటరీని ప్రశ్నించారు. వీధుల్లో ప్రత్యేక డంపింగ్ పాయింట్ ఏర్పాటు చేసి, ప్రజలు అక్కడే చెత్త వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ఎస్.వేణుగోపాల్, భీమవరం మున్సిపల్ కమిషనర్ కే.రామచంద్రారెడ్డి, ఏపీవో ఎం.శ్రీనివాస ప్రసాద్, వీఆర్వో హారిక, వెల్ఫేర్ అసిస్టెంట్, ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ, శానిటేషన్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. ఎల్పీఎం ఆధారంగా భూముల రిజిస్ట్రేషన్లు జిల్లాలో భూ రీ–సర్వే ప్రక్రియ పూర్తయిన గ్రామాల్లో మాత్రమే కొత్తగా కేటాయించిన ఎల్పీఎం నంబర్ల ఆధారంగా భూముల రిజిస్ట్రేషన్లు చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఆస్తి వివరాల నకళ్లు జారీ చేసే ప్రక్రియకు సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై వస్తున్న వార్తల నేపథ్యంలో బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ తన ఛాంబర్ నుంచి జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లు సర్వే నంబర్ల ఆధారంగా నిర్వహించేవారని, ప్రస్తుతం భూ రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో ఎల్పీఎం నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లా రిజిస్ట్రార్ టి.ప్రసాద్ రెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ ఎన్.మాధవి, జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. -
ఆ భూమి దేవుడికే చెందాలి
దాత వెంకట సంపత్కుమారాచార్యులు కుటుంబీకులైన, హైదరాబాద్కు చెందిన మంత్రరత్నం ప్రతివాద భయంకర రాధాకృష్ణమాచార్యులు, పార్థసారథి అయ్యంగార్లు సదరు భూమి ఆన్లైన్ రికార్డును కుల సంఘం పేరున మార్చడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఇటీవల కలెక్టర్, ఆర్డీవో, దేవస్థానం ఛైర్మన్, ఈఓ, తహసీల్దార్కు కొద్దిరోజుల క్రితం రిజిస్టర్ పోస్టు ద్వారా ఒక లేఖ పంపారు. దేవస్థానం ఆధీనంలో ఉన్న ఆ భూమి బయట వ్యక్తులకు చెందకూడదని, అవసరమైతే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. దాత కుటుంబీకులు స్పష్టంగా సదరు భూమి దేవస్థానంకు చెందినదని చెబుతున్నప్పటికీ, ఎమ్మెల్యే మద్దిపాటి మాత్రం ఇంకా ఆ భూమి దేవుడిదని ఒప్పుకోకపోవడం గమనార్హం. -
ప్రమాదవశాత్తూ పంటబోదెలో పడి..
నేడు జ్యేష్ట మాస జాతర భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం మావుళ్లమ్మవారి ఆలయంలో గురువారం జ్యేష్ట మాస జాతర నిర్వహించనున్నారు. గ్రామోత్సవం, ప్రత్యేక పూజలు చేయనున్నారు. తాడేపల్లిగూడెం రూరల్: ప్రమాదవశాత్తు పంట బోదెలో పడి ఓ మోటారుసైక్లిస్ట్ మృతి చెందాడు. రూరల్ ఎస్సై ఎస్.రవికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పట్టెంపాలెం గ్రామానికి చెందిన కట్టా అఖిల్ (31) మంగళవారం రాత్రి కుంచనపల్లిలో ఫంక్షన్కు తన స్నేహితుడు సతీష్తో కలిసి తన మోటారు సైకిల్పై వెళ్లాడు. తిరిగి అదే రోజు అర్ధరాత్రి స్వగ్రామం పట్టెంపాలెం బయల్దేరాడు. చినతాడేపల్లి యింకుల్లు కళ్యాణ మండపం సమీపంలోకి వచ్చేసరికి మలుపును గుర్తించకపోవడంతో ప్రమాదవశాత్తు ఆ పక్కనే ఉన్న పంట బోదెలో పడి మృతి చెందాడు. బుధవారం ఉదయానికి కూడా అఖిల్ ఇంటికి రాకపోవడంతో భార్య సత్యదుర్గ తన బావమరిదికి ఫోన్ చేసి ఆరా తీసింది. అనంతరం చినతాడేపల్లి వద్ద పంట బోదెలో పడి మృతి చెంది ఉన్న అఖిల్ను గుర్తించి కుటుంబ సభ్యులకు విషయం ఫోన్ ద్వారా తెలియజేశాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు రూరల్ పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అఖిల్ భార్య సత్యదుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఎస్సై రవికుమార్ దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. -
వర్జీనియా ధరల పరిశీలన
కొయ్యలగూడెం: ట్రేడింగ్ కంపెనీలతో చేస్తున్న ప్రయత్నాలు ఆశాజనకంగా ఉన్నాయని వర్జీనియా పొగాకుకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా పొగాకు బోర్డు కృషి చేస్తుందని బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీ పేర్కొన్నారు. మంగళవారం ఆమె ఆక్షన్ మేనేజర్ కె.రామాంజనేయులుతో కలసి కొయ్యలగూడెంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. వేలం విధానాలను, రేటు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. వేలం అనంతరం రైతులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సరాసరి ధర రూ.300 ఉండేలా చూడాలని పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు కాకర్ల నంది కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర తేలిక నేలలు రీజినల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్, కొయ్యలగూడెం వేలం నిర్వహణ అధికారి శివకుమార్, ఎఫ్ఓ దీపక్ తదితరులు పాల్గొన్నారు. -
పాలకులతో అధికారుల కుమ్మక్కు
కొయ్యలగూడెం: ఎలక్షన్ ప్రక్రియ నేపథ్యంలో ఓటర్ ఫారాల నమోదులో పాలకులకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. మంగళవారం పొంగుటూరు, చొప్పరామన్నగూడెం, గవరవరం గ్రామాల్లో శ్రీసర్శ్రీ కార్యక్రమం అమలుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ సీపీకి అనుకూల ఓటర్ల ప్రాంతాల్లో ఇప్పటివరకు సర్వే ప్రక్రియ ప్రారంభించలేదన్నారు. అధికార పార్టీ నాయకులు ఇస్తున్న జాబితాకు అనుగుణంగానే బీఎల్వోలు, బీఎల్ఏలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘సర్’ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి బూత్ కన్వీనర్ పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చురుగ్గా పనిచేయాలని సూచించారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగన్ 2.0లో కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని, ప్రతి ఒక్కరు స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సానుభూతిపరులను గెలిపించుకునే విధంగా కృషి చేయాలని కోరారు. చంద్రబాబు పాదం పెడితేనే కరువుకాటకాలు కవల పిల్లలుగా ప్రజలకు ఎదురవుతాయని ఎద్దేవా చేశారు. మండల రైతు విభాగం అధ్యక్షుడు గంటా రమేష్, మండల కో–కన్వీనర్ బిరుదుగడ్డల ప్రేమ్కుమార్, ఎంపీపీ గంజిమాల రామారావు, పొంగుటూరు, చొప్పరామన్నగూడెం, గవరవరం గ్రామాల కన్వీనర్లు గేలం వెంకటేశ్వరరావు, సతుల కిరణ్, పలివెల దుర్గారావు, పార్టీ నాయకులు పసుపులేటి రవీంద్ర, చీమకుర్తి సత్యనారాయణ, గేలం అప్పారావు, బొమ్మ రామకృష్ణ, ప్రగడ శివాజీ, చిరవూరి శ్రీను, ఎర్రమళ్ళ నాగు, పసుపులేటి కాశీరాం, దిరిసిపోము మధు, పలివెల సత్యనారాయణ, గేలం శ్రీను, గుండుమోలు మూర్తి రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఎన్సీయూలో వైద్యుల గైర్హాజరు
నూజివీడు: స్థానిక ఏరియా ఆసుపత్రిలోని నవజాత శిశు విభాగం (ఎస్ఎన్సీయూ)లో వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. అప్పుడే పుట్టిన పసిబిడ్డల నుంచి మూడు నెలల వయస్సు ఉన్న చిన్నారులకు అత్యవసర చికిత్స అందించేందుకు మే 23న రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ విభాగ నిర్వహణను ప్రభుత్వం థర్డ్ పార్టీకి అప్పగించగా వారు ఇద్దరు వైద్యులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, నర్సులు, సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. నిబంధనల ప్రకారం వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడే ఉండి సేవలు అందించాల్సి ఉంది. అయితే నూజివీడు, హనుమాన్ జంక్షన్ ప్రాంతాలకు చెందిన ఈ ఇద్దరు వైద్యులకు సొంత క్లినిక్లు ఉండటంతో ప్రభుత్వ విధులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరు ప్రతిరోజూ ఆసుపత్రికి వచ్చి, కేవలం రిజిస్టర్లో సంతకాలు చేసి కొద్దిసేపటికే వెళ్లిపోతున్నారు. అత్యవసరంగా ఏదైనా కేసు వస్తే అక్కడి సిబ్బంది ఫోన్ చేసి పిలిచే వరకు కేంద్రానికి రావడం లేదు. వైద్యులు సకాలంలో అందుబాటులో లేక పసిప్రాణాలకు ముప్పు వాటిల్లితే ఎవరు బాధ్యత వహిస్తారని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి సలహా సంఘం సభ్యులు ప్రశ్నిస్తున్నారు. సిబ్బంది దురుసు ప్రవర్తన మంగళవారం మధ్యాహ్నం ఈ కేంద్రాన్ని పరిశీలించగా ఇద్దరు వైద్యులూ విధుల్లో లేరు. దీనిపై అక్కడి సిబ్బందిని ప్రశ్నించగా కనీస సమాధానం చెప్పకుండా దురుసుగా ప్రవర్తించారు. ఎస్ఎన్సీయూ విభాగాన్ని ఫొటోలు తీస్తున్న క్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ అది తన సొంత ఆసుపత్రి అన్నట్లుగా వ్యవహరిస్తూ ఫొటోలు తీయనివ్వకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. సంతకాలు చేసి వెళ్లిపోతున్న వైనం డ్యూటీ సమయంలో కచ్చితంగా ఎస్ఎన్సీయూలోనే ఉండాలని సదరు వైద్యులను ఇప్పటికే పలుమార్లు ఆదేశించాం. వారి నిర్లక్ష్య వైఖరిపై ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. డాక్టర్ పద్మజారాణి, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ -
పెంచికలమర్రులో విషాదఛాయలు
కై కలూరు: ఆ ముచ్చటైన కుటుంబంపై విధి కన్నెర్రచేసింది. ముద్దుముద్దు మాటలు పలికే నాలుగేళ్ల కుమారుడిని చూసి మురిసిపోతున్న ఆ దంపతుల ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. గర్భిణి అయిన భార్య, కంటిపాపలాంటి కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘోర ప్రమాదం కై కలూరు మండలం పెంచికలమర్రు గ్రామంలో మంగళవారం విషాదఛాయలు నింపింది. గ్రామానికి చెందిన జయమంగళ విజయ్కుమార్, వెంకటరాజు అన్నదమ్ములు. జేసీబీ, పొక్లెయిన్ పనులు చేస్తూ వీరంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. వీరి తల్లి రమాదేవి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మంగళవారం ఆమెను చూసేందుకు కుటుంబ సభ్యులంతా వెళ్లారు. తల్లికి తోడుగా ఉండేందుకు చిన్న తమ్ముడు వెంకటరాజు అతని భార్య లక్ష్మి అక్కడే ఉంచారు. తిరిగి విజయ్కుమార్, అతని భార్య భువనైక నాగదుర్గ (25), కుమారుడు కారుణ్య నాగసాయి (4), వెంకటరాజుతో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. వెంకటరాజు కారు నడుపుతున్నాడు. అయితే కృష్ణా జిల్లా గన్నవరం వెస్ట్ బైపాస్ రహదారి, బీబీగూడెం సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ఓ గూడ్స్ కంటైనర్ లారీ టైర్ పగిలి, వీరి కారుపైకి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన గర్భిణి నాగదుర్గ, ఆమె కుమారుడు నాగసాయి అక్కడికక్కడే మరణించారు. విజయ్కుమార్కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ప్రాణపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు. ఇటీవల పలు దేవాలయాలు సందర్శించి మొక్కులు తీర్చుకుని వచ్చిన ఆ కుటుంబంలో ఈ ఘోర విషాదం జరగడంతో స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. నరసాపురం: మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వద్ద నుంచి బంగారు గొలుసు చోరీ చేసిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఆరుగట్లపాలెంకు చెందిన పాలెపు దుర్గాప్రసాద్ను మంగళవారం అరెస్ట్ చేసినట్టు టౌన్ సీఐ ఆకుల రఘు చెప్పారు. బాధితుడు చీదే ముత్యాలరావుకు ఈ నెల 28న నరసాపురం బస్టాండ్లో దుర్గాప్రసాద్ పరిచయమయ్యాడు. ఆ సమయంలో ముత్యాలరావు మద్యం మత్తులో ఉన్నాడు. కొంతసేపటికి ముత్యాలరావును వద్ద ఉన్న బంగారు గొలుసు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విచారణ చేసి దుర్గాప్రసాద్నును అరెస్ట్ చేసి అతిని వద్ద నుంచి రూ 1.70 లక్షలు విలువైన బంగారు చైన్ను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ చెప్పారు. -
ఆన్లైన్ చేసిన ఐదు ఓట్లు
దెందులూరు: ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రులో నాగరాజు కుటుంబంలో ఐదు ఓట్లను ఆన్లైన్ చేశారు. ఆ కుటుంబంలోని ఓట్లు ఆన్లైన్ చేయడానికి బీఎల్ఓ నిరాకరించడంతో ఓటరు జాబితా సవరణలో సమస్యలు ఏంటి సార్ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై ఏలూరు రూరల్ మండల తహశీల్దార్ జి విజయకుమార్ రాజు స్పందించి మంగళవారం ఉదయం శ్రీపర్రు సచివాలయానికి వెళ్లారు. బాధిత నాగరాజు, బీఎల్వో షరీఫ్ను పిలిపించి ఘటనపై విచారణ నిర్వహించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతమైతే భారతీయ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం నాగరాజు కుటుంబంలోని ఐదు ఓట్లను ఆన్లైన్ చేశారు. బీఎల్ఓలు అందరూ విధిగా వారికి ఇచ్చిన ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల ఫారాలు అందజేసి పూర్తి చేసిన తర్వాత వాటిని తీసుకువచ్చి ఆన్లైన్ చేయాలని తహసీల్దార్ ఆదేశించారు. సచివాలయాల్లో కూర్చొని ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శివ ఉన్నారు. ఏలూరు (టూటౌన్): రైతాంగ ఉద్యమాల స్ఫూర్తితో బలమైన రైతు కూలీ ఉద్యమాన్ని నిర్మించాలని ఏఐకేఎంకేఎస్ అఖిలభారత మహాసభ సావనీరు ఆవిష్కరణ సభలో వక్తలు పిలుపునిచ్చారు. ఏఐకేఎంకేఎస్ అఖిలభారత మహాసభల సావనీర్ ఆవిష్కరణ సభ ఏపీ రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరులోని లేడీస్ క్లబ్ నందు జిల్లా కార్యదర్శి షేక్ బాషా అధ్యక్షతన జరిగింది. ముందుగా సావనీరును దారి దీపం పత్రికా సంపాదకులు డీవీఎస్ వర్మ ఆవిష్కరించి మాట్లాడారు. ప్రధాన వక్త ఏఐకేఎంకేఎస్ అఖిల భారత అధ్యక్షులు ఎస్ ఝాన్సీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సామ్రాజ్యవాద అనుకూల విధానాల మూలంగా అన్ని రాష్ట్రాల్లోనూ రైతాంగం తీవ్రమైన సమస్యల్లో కూరుకు పోయారన్నారు సభలో బీకేఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ప్రిన్సిపల్ సంకు మనోరమ, రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యు.వీరబాబు, ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంఎస్ నాగరాజు, దళిత నాయకులు మామిడూరి మహంకాళి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు స్వామివారి చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకుల ఆధ్వర్యంలో తమలపాకుల అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలు జరిపించుకున్నారు. వివిధ సేవల రూపంలో ఆలయానికి రూ. 2,72,533 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 2,473 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ (ఈఓ) ఆర్వీ చందన ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఏలూరు (టూటౌన్): ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసకువచ్చిన వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీ జీరాంజీ) పథకం జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుందని డ్వామా పీడీ కేవీ సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జూలై 1 నుంచి పథకం పనులు ప్రారంభం, 2వ తేదీన గ్రామ పంచాయతీల్లో నిర్వహించే సమావేశానికి ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం సంబంధిత ప్రజాప్రతినిధులను తప్పక ఆహ్వానించాలని పీడీ సుబ్బారావు పేర్కొన్నారు.


