breaking news
West Godavari District Latest News
-
ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం
జక్కంపూడి రాజా వైఎస్సార్సీపీ యువజన విభాగాన్ని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో క్రియాశీలక యువజన నాయకులతో పార్టీ అభివద్ధికి కృషి చేస్తాం. కమిటీల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న తప్పులపై పోరాటాలు, ఉద్యమాలకు యువత సిద్ధంగా ఉన్నారు. కారుమూరి సునీల్ రైతులు, మహిళలు, యువత, అన్ని వర్గాలను చంద్రబాబు ప్రభుత్వం మోసం ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామన్నారు. ఏడాది కావస్తున్నా అసెంబ్లీల్లో ప్రస్తావన గానీ, బడ్జెట్లో కేటాయింపులు గానీ చేయలేదు. అబద్ధపు హామీలతో పబ్బం గడుపుకుంటున్న కూటమి నేతలకు గుణపాఠం చెప్పేందుకు యువత ఎదురు చూస్తోంది. ముదునూరి మురళీ కృష్ణంరాజు యువతను మభ్యపెట్టి కూటమి అధికారంలోకి వచ్చింది. 20 లక్షలు ఉద్యోగాలు, రూ.3 వేల నిరుద్యోగ భృతి అని హామీలు ఇచ్చి చంద్రబాబు యువతను మోసం చేశారు. జగనన్మోహన్్ రెడ్డి పిలుపునందుకుని అన్ని ఉద్యమాల్లో యువత ఉత్సాహంగా పాల్గొంటోంది. మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయి, కారుమూరి నాగేశ్వరరావు మన నాయకుడు జగన్ మాట ఇస్తే తప్పే మనిషి కాదు. పార్టీలో యువతకే ప్రాధాన్యత కల్పిస్తారు. దోచుకో.. దాచుకో అన్నట్టుగా చంద్రబాబు పాలన ఉంది. అప్పుడు జగన్ సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల మార్కెట్లో వ్యాపారాలు జరిగేవి. జగన్ లేకపోవడంతో వ్యాపారులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు మళ్లీ వడ్డీలు తెచ్చుకునే పరిస్థితికి వచ్చేశారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ యువత తలుచుకుంటే ప్రభుత్వాలను కూల్చగలరు, అధికారంలోకి తీసుకురాగలరు. 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం, అరెస్ట్లు చేయడం పరిపాటిగా మారింది. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షనన్ పాలిటిక్స్ చేస్తున్నారు. యువతంతా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి. కొట్టు నాగేంద్ర, సీఈసీ సభ్యుడు యువత దశ, దిశగా మారి పార్టీని బలోపేతం చేయాలి. 2029లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవ్వడానికి యువత కష్టపడి పార్టీ కోసం పనిచేయాలి. ఏడాదిన్నరలో ఏ పథకం కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు. వితంతు పెన్షన్లు ఒక్కటి కూడా ఇవ్వలేదు. పార్టీ కష్టకాలంలో బాగా పనిచేసి 2029 ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలి. సాక్షి, భీమవరం: చంద్రబాబు సర్కారు అరాచక పాలనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రజల పక్షాన పోరాటాలు, ఉద్యమాలు చేసేందుకు యువజన విభాగం సిద్ధంగా ఉందని ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. ఆ దిశగా భవిష్యత్ కార్యాచరణ చేస్తున్నట్టు చెప్పారు. వైఎస్సార్సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జల్లాల యువజన విభాగం విస్తృత స్థాయి సమావేశం పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని పద్మశ్రీ ఫంక్షన్్ హాలులో మంగళవారం జరిగింది. యువజన విభాగం పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్ అధ్యక్షతన జరిగిన సభలో యువజన విభాగం సంస్థాగతంగా బలోపేతానికి, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని రాజా సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యం ఏదోరకంగా ప్రజలను మోసగించడం, మభ్యపెట్టడం చంద్రబాబు నైజమన్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి సూపర్ సిక్స్ పేరిట రాష్ట్ర ప్రజల ఓట్లు దండుకుని ప్రజలకు మొండిచేయి చూపించారన్నారు. ఏడాదిన్నరైనా ఇంటికో ఉద్యోగం, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి వాగ్దానాల ఊసే లేదన్నారు. అసెంబ్లీలో వాటి ప్రస్తావన గాని, బడ్జెట్లో కేటాయింపులు గాని లేవన్నారు. రైతులు, మహిళలు, యువతను మోసం చేశారు యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కారుమూరి సునీల్ మాట్లాడుతూ రైతులు, మహిళలు, యువతను ఈ ప్రభుత్వం ఎంతో మోసం చేసిందన్నారు. తల్లికి వందనం అరకొరగా ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అటకెక్కించారని, ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టారని విమర్శించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఎస్ఈసీ సభ్యుడు కొట్టు నాగేంద్ర, యువజన విభాగం ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల అధ్యక్షులు కామిరెడ్డి నాని, పిల్లి సూర్యప్రకాష్, కంటమనేని రమేష్, రాగిరెడ్డి అరుణకుమార్, సంచార జాతుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న, యువజన విభాగం నియోజకవర్గ, మండల అధ్యక్షులు పాల్గొన్నారు. సాక్షి, భీమవరం/ తణుకు అర్బన్: తణుకు వేదికగా జరిగిన వైఎస్సార్సీపీ యువజన విభాగం సమావేశంలో ఉత్సాహం ఉరకలు వేసింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి తరలివచ్చిన యువ నేతలతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. క్షేత్ర స్థాయి నుంచి సంస్థాగతంగా పూర్తి స్థాయిలో యువజన విభాగం బలోపేతానికి, పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు కార్యక్రమాల విజయవంతానికి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. క్షేత్రస్థాయి నుంచి యువజన విభాగం బలోపేతమే లక్ష్యం వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి తణుకులో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల యువజన విభాగం విస్తృతస్థాయి సమావేశం -
కొల్లేరు వాసుల కన్నెర్ర
● అటవీ శాఖ ఆంక్షలపై ఆగ్రహం ● ఫారెస్ట్ అధికారులు వర్సెస్ కొల్లేరు వాసులు ● సమస్యను పరిష్కరించని ప్రజాప్రతినిధులు ● అభయారణ్య భూముల్లో సాగుకు యత్నం సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టు ఒక వైపు కొల్లేరు అభయారణ్యంలో ఆక్రమణలను తొలగించి నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ అధికారులకు ఘాటుగా చురకలు పెట్టింది. మరో వైపు ఎన్నికల్లో అమలుకాని హామీలను ప్రకటించిన ప్రజాప్రతినిధులు దిద్దుబాటు చర్యల్లో భాగంగా కొల్లేరు ప్రజల ఆశలతో ఆడుకుంటున్నారు. ఢిల్లీకి వెళ్లి హడావుడి చేయడం తప్ప తమకేం లాభం లేదని కొల్లేరు వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొల్లేరు అభయారణ్యంలో జి రాయితీ, డీ–ఫాం, ప్రభుత్వ అనే మూడు కేటగిరిల భూములున్నాయి. మొత్తం అభయారణ్యం 77,138 ఎకరాలుగా నిర్ణయించగా, వీటిలో జి రాయితీ భూములు 14,932, డీ–ఫాం భూములు 5,510 ఎకరాలు, మిగిలిన ప్రభుత్వ భూమి 56,696 ఎకరాలుంది. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో క్షేత్ర స్థాయి పరిశీలన చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ) కొల్లేరు ప్రభుత్వ భూమిలో ఎలాంటి సాగు చేసినా నివేదిక అందించాలని అటవీ శాఖ అధికారులకు ఆదేశించి నిబంధనలు కఠినతరం చేశారు. దీంతో ప్రజాప్రతినిధులు తెరవెనుక ఉంటూ కొల్లేరు గ్రామాల్లో భూముల కోసం నిరసనలకు ఉసిగొల్పుతున్నారు. జిల్లాలోని నిడమర్రు, భీమడోలు, మొండికోడు, గుండుగొలను, ఆగడాలలంకల్లో కొల్లేరు అభయారణ్య ప్రాంతాల్లో దాదాపు 5,500 ఎకరాల్లో వ్యవసాయం సాగు చేస్తున్నారు. ఈ పద్ధతి 2006 నుంచి కొనసాగుతోంది. పొలాల్లో ఎరువుల వాడకం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, గతంలో కోర్టుకు ఫిర్యాదులు చేశారు. ఇటీవల సుప్రీం ఆదేశాలతో ఇకపై కొల్లేరులో దాళ్వా సాగు చేయవద్దని అటవీ అధికారులు ఆంక్షలు విధించారు. నిడమర్రు మండలం పెదనిండ్రకొలను, తోకలపల్లి, భైనేపల్లి, ఆముదాపల్లి, ఉంగుటూరు మండలం అప్పారావుపేట, రామన్నగూడెంకు చెందిన ప్రజలు కొల్లేరు ప్రభుత్వ భూముల్లో సుమారు 1,680 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. ఈ గ్రామాలకు చెందిన 400 మంది పొలాలకు వెళ్ళడానికి మంగళవారం ప్రయత్నిస్తే భీమడోలు మండలం సాయన్నపాలెం వద్ద అటవీ సిబ్బంది నచ్చచెప్పి వెనక్కి పంపారు. నీటి మూటలుగా నాయకుల హామీలు ఎన్నికల ముందు కొల్లేరు గ్రామాల ఓట్ల కోసం నాయకులు హామీలు ప్రకటించారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 2 పార్లమెంటు, 4 అసెంబ్లీ స్థానాల్లో కొల్లేరు పరిధి ఉంది. జిల్లాలో కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, పశ్చిమగోదావరిలో కె.రఘురామకృంరాజు అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీలు పుట్టా మహేష్కుమార్ యాదవ్, భూపతిరాజు శ్రీనివాసవర్మ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఉందని కొల్లేరు సమస్యలు పరిష్కారమవుతాయని కామినేని శ్రీనివాస్ ప్రతిచోట మాటలు చెబుతూ కాలం గడిపారు. అటవీశాఖలో అలజడి ఈ నెల 13న కలెక్టరేట్లో రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ డాక్టర్ పీవీ.చలపతిరావు సమీక్షా నిర్వహించినప్పుడు ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు కొల్లేరు రైతులను తీసుకొచ్చి వ్యవసాయానికి అనుమతులు కల్పించాలని కోరారు. దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. తాజా పరిణామాల క్రమంలో డిసెంబర్ 1న ముఖ్యమంత్రి ఉంగుటూరులో పర్యటనున్నారు. కొల్లేరు వాసులు సీఎంను కలిసి విన్నవించే దిశగా అడుగులు వేస్తున్నారు. -
తగ్గేదేలే..
బాలుర విభాగంలో షార్ట్పుట్లో మూడు చక్రాల సైకిల్ అయినా... పరుగు పందెం అయినా... బరువు విసరడమైనా... మాకు మేమే సాటి అన్నట్లు పోటీల్లో తగ్గేదేలే అని నిరూపించుకున్నారు వీరు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన క్రీడాపోటీల్లో విభిన్న ప్రతిభావంతులు పెద్ద ఎత్తున పాల్గొని వారి నైపుణ్యాన్ని కనబరిచారు. తోటి స్నేహితులు సహకరిస్తూ సరదాగా స్టేడియంలో సందడి చేశారు. మంగళవారం ఎఎస్ఆర్ స్టేడియంలో జరిగిన క్రీడా పోటీల చిత్రాలు ఇవి. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు బాలికల పరుగు పందెం -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు
ఏలూరు టౌన్: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రజలు హర్షించడం లేదని.. టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారని వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పిలునిచ్చిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమాన్ని ఏలూరు నియోజకవర్గంలో పెద్దెత్తున చేపడుతున్నారు. 46వ డివిజన్లో వైఎస్సార్సీపీ మైనార్టీ వింగ్ నాయకులు రియాజ్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం సంతకాల సేకరణ చేపట్టారు. ఏలూరు సమన్వయకర్త జేపీ మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను టీడీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, ప్రజలు నేడు తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతున్నారని, ముఖ్యంగా రైతుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయని తెలిపారు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువస్తే వాటిలో 10 మెడికల్ కాలేజీల భవన నిర్మాణాల చేయలేకపోవడం టీడీపీ నేతలు చేతగానితనానికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, లీగల్ సెల్ ఏలూరు అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, ఆర్టీఐ వింగ్ జిల్లా అధ్యక్షుడు స్టాన్లీ బాబు, పీ.రాజేష్, సముద్రాల చిన్ని, కొల్లిపాక సురేష్, తులసీ, ఎండీ రుబీనా బేగం, సాయి, రాము, బండ్లమూడి సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
కై కరం తిరునాళ్లకు ఏర్పాట్లు
ఉంగుటూరు: కై కరం షష్ఠి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి ఆరు రోజులు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైస్కూలు గ్రౌండ్లో షాపుల కోసం ఏర్పాట్లు చేశారు. తహసీల్దారు పూర్ణచంద్ర ప్రసాద్, వీఆర్వో ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై సూర్య భగవాన్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గుడి ప్రాంగణంలో వైద్య సిబ్బందితో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వేకువజాము నుంచి కల్యాణం అనంతరం దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా పరిశుభ్రమైన జిల్లాగా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెనన్స్ హాలు నుంచి పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, తాగునీరు, అందరికీ ఇల్లు, రోడ్డు ఆక్రమణలు, పీజీఆర్ఎస్, అక్రమ లేఅవుట్లు, తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ శాఖాధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షించారు. అందరికీ ఇళ్లు సర్వే కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు మంజూరయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనంతరం జిల్లాలోని మందుగుండు సామగ్రి తయారీదారులతో సమీక్ష నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా మందుగుండు సామగ్రి తయారుచేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తయారీ కేంద్రాలలో 15 కేజీలకు మించి మందుగుండు సామగ్రి ఉండకూడదన్నారు. భీమవరం: ఏలూరు ఆర్టీసీ పెట్రోల్ బంకులో అవినీతి కుంభకోణంలో సంబంధం లేని నలుగురు ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడాన్ని ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. మంగళవారం భీమవరంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారామ్మోహన్రాయ్, యూనియన్ జిల్లా కార్యదర్శి రాయుడు మాట్లాడుతూ అవినీతి జరిగిన రూ.82 లక్షలు వసూలు పేరుతో ఎలాంటి విచారణ చేయకుండా కొంతమంది ఉద్యోగుల దగ్గర బలవంతంగా సొమ్ము రికవరీ చేసి అసలు సంబంధం లేని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ సుందరయ్య, ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు ఎంఎస్ రావు వంటివారిని సస్పెండ్ చేయడం దారుణమన్నారు. అధికారులతో విచారణ చేయించి అసలు దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఽకార్యక్రమంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు వాసుదేవరావు, నాయకులు ఆంజనేయులు, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు: సీఎం చంద్రబాబు ఉంగుటూరు మండలం గొల్లగూడెం డిసెంబరు 1న పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు. గొల్లగూడెం సూర్య స్కూలు ప్రాంగణంలో పార్టీ కార్యకర్తల సమావేశం జరిపేందుకు నిర్ణయించారు. దాని ఎదురుగా హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. -
బడా కార్పొరేట్ల కోసమే విత్తన చట్టం
ఏలూరు (టూటౌన్): బడా కార్పొరేట్ విత్తన కంపెనీల లాభాల కోసమే కేంద్ర ప్రభుత్వం ‘2025 విత్తన చట్టం’ ముసాయిదా ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం ఏలూరు అన్నే భవనంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ప్రస్తుత ముసాయిదాలో సెక్షన్ 16(3) ప్రకారం విత్తనాలను వాణిజ్యపరంగా రైతులకు విడుదల చేయటానికి దేశంలోనూ, ఇతర దేశాలలోనూ పరిశోధనలు చేయవచ్చని చెప్పిందన్నారు. కానీ విదేశీ వాతావరణంలో జరిగిన ప్రయోగాలు ఉపయోగపడవు అని చెప్పారు. గతంలో బీటీ విత్తనాల వలన రైతులు నష్టపోయారని, తిరిగి విదేశీ టెక్నాలజీకే అవకాశం కల్పిస్తున్నారని విమర్శించారు. కంపెనీలు నాణ్యత లేని విత్తనాలు సరఫరా చేస్తే లైసెన్సులు రద్దు చేయటం, జైలు శిక్షలు విధించటం లాంటి పెనాల్టీలు ముసాయిదాలో లేకపోవడం వలన రైతులకు నష్టం జరుగుతుందని చెప్పారు. విత్తన నాణ్యతపై, జెర్మినేషన్ పై స్పష్టత ఉండాలన్నారు. రాష్ట్రాల స్థాయిలో నిపుణులతో సమావేశాలు ఏర్పాటు చేసి విత్తన చట్ట ముసాయిదాను రూపొందించాలని కోరారు. నూతన విత్తన చట్టం ద్వారా రైతులకు రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను శ్రీనివాస్ కోరారు. ఏలూరు(మెట్రో): ధాన్యం సేకరణలో రైతులు ఎదుర్కునే సమస్యలను ముందుగానే గుర్తించి వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు హాలులో మంగళవారం జెడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయ సీజన్లో జిల్లాలో రికార్డు స్థాయిలో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు లక్ష్యంగా నిర్ధేశించినట్లు తెలిపారు. శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాధ్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో టాయిలెట్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలపై విద్యా శాఖాధికారులు పర్యవేక్షణ ఉండాలన్నారు. తణుకు వద్ద పశు మాంస కబేళాలు నిర్వహిస్తున్నారని, దీంతో ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నారని, సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, కలెక్టర్ కె.వెట్రిసెల్వి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దెందులూరు: కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని దెందులూరు పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి తోకలపల్లి వెళ్తున్న కోళ్ల వ్యర్థాల వాహనాన్ని దెందులూరు పోలీసులు మంగళవారం తెల్లవారుజామున సీజ్ చేశారు. వాహన యజమాని పవన్ కుమార్, డ్రైవర్ సాంబశివరావుతో పాటు తోకలపల్లికి చెందిన చేపల చెరువు రైతు, హైదరాబాదులోని సరఫరాదారుడు పైన కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆర్ శివాజీ తెలిపారు. -
సీజన్లో ఖాళీగా ఉంటున్నాం
నేను చిన్నప్పటి నుంచి సముద్రంలో బోటుపై వేట సాగిస్తాను. ఇప్పుడు మాకు సముద్రంలో మంచి సీజన్. ఇలా వల వేశామంటే అలా చేపలు పడతాయి. అయితే తుపాన్ల కారణంగా బోట్లు వెళ్లడంలేదు. దీంతో సీజన్లో ఖాళీగా ఉంటున్నాము. –తిరుమాని నాగరాజు, మత్స్యకార్మికుడు, నరసాపురం మొన్నటి నెలలో బోటు వేసుకుని వేటకు వెళితే తుపాను కారణంగా వెంటనే తిరిగి రావాల్సి వచ్చింది. మా ఓనర్ మళ్లీ బోటు సముద్రంలోకి పంపలేదు. ఈ మధ్యకాలంలో ఎక్కవ రోజులు ఖాళీగా ఉండాల్సి రావడంతో అప్పులు చేసుకుని తినాల్సి వస్తోంది. – టి.ఏడుకొండలు, వేములదీవి కేవలం వేట నిషేధం సమయంలో ఇచ్చే డబ్బులే కాకుండా తుపాన్ల కారణంగా ఖాళీగా ఉన్న సమయంలో కూడా ప్రభుత్వం ఏదో రకంగా సాయం అందించి మమ్మల్ని ఆదుకోవాలి. మాకు సముద్రంలో వేట తప్ప మరో పని చేతకాదు. – కె.ఏసుబాబు, పేరుపాలెం -
ఉత్సాహంగా దివ్యాంగుల ఆటల పోటీలు
ఏలూరు రూరల్ : ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో మంగళవారం దివ్యాంగుల జిల్లాస్థాయి ఆటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. మానసిక, శారీరక దివ్యాంగులకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. ట్రైసైకిల్, రన్నింగ్, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, కేరమ్స్, చెస్ తదితర అంశాల్లో దివ్యాంగులు పోటీ పడ్డారు. ఇందులో గెలుపొందిన వారికి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3వ తేదీన బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. పోటీల ప్రారంభోత్సవానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దివ్యాంగుల సంక్షేమశాఖ జిల్లా అధికారి, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్ఏ అజీజ్తో పాటు ఇడా చైర్మన్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి, జెండా ఊపి పోటీలను ఆరంభించారు. ఈ సందర్భంగా ఏలూరులో దివ్యాంగులకు కోసం కమ్యునిటీహాలు నిర్మించాలని దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకుడు వీరభద్రరావు (వాసు) ఎమ్మెల్యేను కోరారు. ఇటీవల రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు సాధించిన దివ్యాంగుడు మన్విత్ను నిర్వాహకులు సన్మానించారు. హనుమాన్ జంక్షన్, కై కులూరు, ద్వారకాతిరుమల తదితర ప్రాంతాలకు చెందిన పలు స్వచ్చంద సంస్థలకు చెందిన దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నూజివీడు: పట్టణంలోని త్రివిధ హైస్కూల్ విద్యార్థి నాగళ్ల వివేక్ స్కూల్గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ సబ్బినేని శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ఇటీవల కర్నూల్లో నిర్వహించిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని వివేక్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడన్నారు. ఈ సందర్భంగా వివేక్ను ప్రిన్సిపాల్ శ్రీనివాస్తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. ముదినేపల్లి రూరల్: అల్లూరు హైస్కూల్కు చెందిన 8వ తరగతి విద్యార్థిని వి ప్రమోదిని జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు శొంఠి రామోజీ తెలిపారు. ఇటీవల మచిలీపట్నం నోబుల్ కళాశాలలో జరిగిన అండర్–14 ఉమ్మడి కృష్ణాజిల్లా బాలికల విభాగంలో ఆమె ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రమోదినిని ఎస్ఎంసీ చైర్మన్ ఎస్ వెంకటశ్యామల, కమిటీ సభ్యులు దావు నాగరాజు, వి రత్నకామేశ్వరరావు, హెచ్ఎం. ఉపాధ్యాయులు సత్కరించారు. ముసునూరు: అక్కిరెడ్డిగూడెంలో తాళాలు వేసి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ.60 వేల నగదు, 11 కాసుల బంగారం అపహరించుకు పోయిన ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. అక్కిరెడ్డిగూడెంలో పైడిపాముల ఎబినేజర్, సుందర్సింగ్ అన్న దమ్ములు. వీరి కుటుంబ సభ్యులందరూ ఇంటి ఎదురుగా ఉన్న చర్చిలో సోమవారం రాత్రి ప్రార్థనలకు వెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి ఇండ్లలోకి ప్రవేశించి, బీరువాలు పగలగొట్టి, చోరీకి పాల్పడ్డారు. ప్రార్థనలు ముగించుకుని, యజమానులు ఇంట్లోకి వస్తుండడం చూసి, ఇంటి వెనుక నుంచి పారి పోయారు. ఇంట్లోకి చేరుకున్న యజమానులు బంగారం, నగదు చోరీకి గురైనట్లు గుర్తించి, ముసునూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్సై ఎంకే.బేగ్, చాట్రాయి ఎస్సై రామకృష్ణ జిల్లా కేంద్రం నుంచి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ను రప్పించి, ఆధారాలు సేకరించారు. నూజివీడు రూరల్ సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
వేట సాగక.. పూట గడవక
● వరుస తుపాన్లతో సముద్రంలో సాగని వేట ● సీజన్లోనూ పస్తులు తప్పడం లేదనిమత్స్యకారుల ఆవేదననరసాపురం: ప్రస్తుతం సముద్రంలో మత్స్యసంపద అధికంగా దొరికే కాలం. సముద్రంలో బోట్లపై వేటకు వెళ్లే మత్స్యకారులకు చేతినిండా పని, జేబులు నిండా డబ్బులతో కళకళలాడే సమయం. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో సీజన్లోనూ మత్స్యకారులు పస్తులుండాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. వరుస తుపాన్లు, అల్పపీడనాలతో తీరంలో బోట్లకు లంగరు వేసి, ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి. వెంటాడుతున్న తుపాన్లు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకూ 61 రోజులపాటు సముద్రంలో వేటనిషేధం అమలు చేస్తుంది. సముద్రంలో చేపల పునర్పుత్తి సీజన్ కావడంతో, మత్స్యసంపద అంతరించిపోకూడదనే ఉద్దేశ్యంతో వేట నిషేధం అమలు చేస్తారు. ఈ ఏడాది జూన్లో వేట ప్రారంభమైన నాటి నుంచి మత్స్యకారులకు ప్రకృతి సహకరించడం లేదు. జూలై మొదలు వరుస తుపాన్లు వెంటాడుతున్నాయి. పట్టుమని పది రోజులు కూడా వేట సాగడం లేదు. మొన్న మోంథా తుపానుతో అల్లాడగా ప్రస్తుతం మళ్లీ బంగాళాఖాతంలో అల్పపీడనం, తుపాను హెచ్చరికలు వాతావరణశాఖ నుంచి వెలువడడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా వేట నిషేధం ముగిసిన తరువాత సముద్రంలో చేపలు పెద్దసంఖ్యలో వలలకు చిక్కుతాయి. దీంతో భారీగా పెట్టుబడులు పెట్టి సముద్రంలోకి వేటకు వెళతారు. తీరా వేటకు వెళ్లిన బోట్లు తుపాను హెచ్చరికలతో తీరానికి ఖాళీగా వస్తే అంతా నష్టమే మిగులుతుంది. ప్రస్తుతం మత్స్యకారులు అలాంటి నష్టాలే చూస్తున్నారు. ఇదే అసలైన సీజన్.. ప్రస్తుతం శీతాకాలం నడుస్తుంది. సముద్ర తీరంపై మంచుతెరల కారణంగా చల్లని వాతారణం, తరువాత సూర్యోదయం నుంచి ఎండ తీవ్రత కారణంగా అధిక ఉఫ్ణోగ్రతతో వతీరం వాతావరణ వేడెక్కడం.. లాంటి వాతావరణంతో సముద్రం లోపలిభాగం నుంచి చేపలు, రొయ్యిలు పైకి వచ్చి వలలకు చిక్కుతాయి. ఈ రకమైన వాతావరణంలో మత్స్యసంపద అధికంగా దొరుకుతుందని, అందుకే నవంబర్, డిసెంబర్ మాసాల్లో ముమ్మరంగా వేట సాగుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. అయితే వరస తుపాణ్లు మత్స్యకారుల ఉపాధిని దెబ్బకొడుతున్నాయి. ఏదీ సందడి.. నరసాపురం తీరంలో వివిధ జిల్లాలకు చెందిన బోట్లు వేట సాగిస్తాయి. బంగాళాఖాతానికి కీలకమైన ప్రాంతం కావడం, గోదావరి, సముద్ర సంగమ ప్రాంతం కావడంతో ఇక్కడ మత్స్యసంపద ఎక్కువగా దొరుకుతుంది. దీంతో నరసాపురంతో పాటుగా తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖపట్టణం, శ్రీకాకుళం., కృష్ణా జిల్లాకు చెందిన సుమారు 150 వరకూ మెకనైజ్డ్ బోట్లు నరసాపురం తీరంలో వేట సాగిస్తాయి. ఏటా రూ.400 కోట్ల మత్స్యసంపద ఇక్కడి నుంచి ఎగుమతి జరుగుతుంది. జూన్ నుంచి డిసెంబర్ వరకూ ముమ్మరవేటతో సందడిగా ఉండే నరసాపురం తీరంలో వరుస ప్రకృతి విపత్తులు నడ్డివిరిచాయి. ఆదుకోని ప్రభుత్వం ఈ ఏడాది వేట ప్రారంభమై 160 రోజులు గడిచిని తుపాన్ల దెబ్బకి దాదాపు 40 రోజులు మత్స్యకారులు ఖాళీగా ఉన్నారు. దీంతో గంగపుత్రులు అప్పులు చేసుకుని జీవనం సాగించాల్సిన పరిస్థితి. గత జగన్ ప్రభుత్వం వేట నిషేధం సమయంలో జిల్లాలో 5 ఏళ్లలో 6,427 మందికి రూ.7.87 కోట్లు మత్స్యకార భరోసా సాయం అందించింది. చంద్రబాబు సర్కారు మత్స్యకార భరోసాను రూ.20 వేలకు పెంచినా, అర్హులందరకి అందించలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది ఎక్కువ రోజులు వేట లేకుండా ఖాళీగా ఉన్న మత్స్యకారులకు చంద్రబాబు ప్రభుత్వం ఏవిధమైన సాయం అందించలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మహిళపై హత్యాయత్నం
కై కలూరు: తనతో సహజీవనం చేసే మహిళ 6 నెలలు నుంచి దూరంగా ఉండటంతో కసి పెంచుకున్న వ్యక్తి ఆమైపె హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కై కలూరులో మంగళవారం జరిగింది. కై కలూరు పట్టణ సీఐ ఏవీఎస్.రామకృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం కై కలూరు మండల శీతనపల్లి గ్రామానికి చెందిన చిన్నం ఏసేబు(పండు, 50) డ్రెవర్గా పనిచేసేవాడు. వివాహం జరిగిన కొద్ది కాలానికే భార్య, పిల్లలతో విడిపోయాడు. ఈ నేపథ్యంలో హైదరాబాదు మైబాద్లో లలిత(45)తో పరిచయం ఏర్పడింది. అప్పటికే లలితకు మల్లిఖార్జునరావుతో వివాహం జరిగింది. వీరికి పాప. లలితను ఏసేబు 15 ఏళ్ల క్రింతం శీతనపల్లి తీసుకొచ్చి సహజీవనం చేస్తున్నాడు. లలిత కుతూరు ఆమెతోనే ఉంటూ చదువుకుంటుంది. ఏసేబు మద్యానికి బానిసై గొడవలు చేస్తుండడంతో ఆమె ఆరు నెలల నుంచి అతనికి దూరంగా కై కలూరు ఇస్లాంపేటలో బంధువుల ఇంటి వద్ద నివాసముంటుంది. మంగళవారం సాయంత్రం ఆమె ఇంటికి వెళ్లి తన జీవితాన్ని నాశనం చేశావంటూ కొబ్బరి బొండాలు నరికే కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె కుడి చేతిని అడ్డుపెట్డడంతో చేతి వేళ్ల మధ్య నుంచి సుమారు 4 అంగుళాల లోతుకు తెగింది. కూతురు, బంధువులు గాయపడిన లలితను కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. లలిత ఫిర్యాదు మేరకు కేసు టౌన్ ఎస్ఐ ఆర్.శ్రీనివాస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో పొగాకు రైతు మృతి
జంగారెడ్డిగూడెం: వేగవరం సమీపంలో జాతీయ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్జీనియా పొగాకు రైతు మృతి చెందాడు. ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం టి.నరసాపురం మండలం అప్పలరాజుగూడెంకు చెందిన మువ్వ సాంబశివరావు (57) జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రానికి వచ్చారు. వేలం కేంద్రంలో పనులు ముగించుకుని తిరిగి ఇంటికి కలపాల రాజు అనే వ్యక్తితో కలిసి మోటార్సైకిల్పై వెళుతున్నాడు. అదే సమయంలో రామాయణం బ్రహ్మం అనే వ్యక్తి మోటార్సైకిల్పై వేగవరం పుంత రోడ్డు నుంచి వస్తూ వీరి మోటార్సైకిల్ను, సమీపంలో ఉన్న రెండు విద్యుత్ స్తంభాలను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో సాంబశివరావుకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సాంబశివరావు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో సాంబశివరావు మోటార్సైకిల్పై వెనుక కూర్చొన్న కలపాల రాజుతో పాటు మరో మోటార్సైక్లిస్టు రామాయణం బ్రహ్మంకు గాయాలయ్యాయి. వీరిద్దరు స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా మృతిచెందిన సాంబశివరావుకు భార్య మణికుమారి, ఇద్దరు కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బుట్టాయగూడెం: శ్రీకాకుళం నుంచి తెలంగాణవైపు గోవులను అక్రమంగా తరలిస్తున్న లారీని మంగళవారం జీలుగుమిల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై క్రాంతికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జీలుగుమిల్లి జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేస్తుండగా అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు చెప్పారు. డ్రైవర్ను విచారించగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న 50 ఎద్దులు, 15 ఆవులు మొత్తం 65 పశువులను అధిక ధరలకు కబేళాలకు అమ్మేందుకు తరలిస్తున్నట్లు తేలిందన్నారు. వీఆర్ఓ ఫిర్యాదుతో లారీని పోలీస్స్టేషన్కు తీసుకువచ్చామని, గోవులను గోశాలకు తరలించామని చెప్పారు. -
ఏం చేశారని.. మా కోసం
చికెన్ సరిపోవడం లేదని.. నూజివీడు ట్రిపుల్ఐటీలో చికెన్ అరకొరగా పెడుతున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 8లో uరైతును రాజు చేస్తామన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ. 20 వేలు ఇస్తామని చెప్పి మొదటి ఏడాది ఎగనామం పెట్టారు. ఉచిత పంటల బీమాకు ఎసరుపెట్టి అన్నదాతకు ధీమా లేకుండా చేశారు. ధాన్యం కొనుగోలులో దళారులకు గేట్లు తెరిచారు. రైతులకు అన్నివిధాలా అండగా ఉన్న రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఆక్వాకు రూ.1.50 సబ్సిడీ విద్యుత్ హామీ ఊసేలేదు. సాగులో రైతుకు భరోసా లేకుండా చేసిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు ‘రైతన్నా.. మీకోసం’ పేరుతో హడావుడి చేస్తోంది. మంగళవారం శ్రీ 25 శ్రీ నవంబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం: నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతుపై వ్యవసాయ, ఉద్యాన, పట్టు, ఆక్వా, పాడి, పౌల్ట్రీ, గొర్రెల పెంపకందారులందరికీ అవ గాహన కార్యక్రమాల పేరిట మరో గారడీకి చంద్రబాబు ప్రభుత్వం తెరలేపింది. ఏడాదిన్నర పాలనలో చేసిందేమీ లేకపోయినా ఇప్పుడు ఈ ప్రచార ఆర్భాటమేంటని రైతులు అంటున్నారు. ఏడాది సాయానికి ఎగనామం జిల్లా అంతటా ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు, పవన్కల్యాణ్లు అన్నదాత సుఖీభవ సా యంగా ఏటా రూ.20 వేలు ఇస్తామంటూ ఊదర గొట్టారు. మొదటి ఏడాది సాయానికి ఎగనామం పెట్టిన ప్రభుత్వం రెండో ఏడాది నుంచి అరకొర మందికి సాయం అందించి చేతులు దులుపుకుంటోంది. ప్రస్తుతం జిల్లాలో 1,03,761 మంది రైతులకు ఈ ఏడాది సాయం అందిస్తుండగా.. తొలి ఏడాదికి గాను జిల్లాలోని రైతులు రూ.207.52 కోట్లు నష్టపోయినట్టు అంచనా. మరోపక్క కౌలు రైతులను ఎలాంటి సాయం అందించకుండా గాలికొదిలేసింది. పంటల బీమా.. లేదు ధీమా రైతులపై ప్రీమియం భారం లేకుండా 2019 ఖరీఫ్ నుంచి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమాను తీసుకువచ్చింది. ప్రతి ఎకరాకు బీమా వర్తించడంతో పంట నష్టం వాటిల్లినప్పుడు రైతులతో పాటు కౌలు రైతులకు పూర్తి పరిహారం అందేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తివేసి ప్రీమియం భారాన్ని రైతులపై మోపింది. జిల్లాలో 2,15,068 ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేయగా రైతులు ఎకరాకు రూ. 210లు చొప్పున 72,766 ఎకరాలకు మాత్రమే ప్రీమియం చెల్లించారు. మిగిలిన 1,42,302 ఎకరాలు క్రాఫ్ ఇన్సూరెన్స్కు దూరంగా ఉన్నాయి. ప్రాధాన్యం మరిచి.. రైతులను వంచించి.. ధాన్యం కొనుగోళ్లలో దళారులే ఇప్పుడు తెరవెనుక ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్న విమర్శలున్నాయి. తేమశాతం ఎక్కువనో, తాలుగింజలు ఉన్నాయనో కోత పెడుతున్నారు. గత రబీలో తొలుత 6 లక్షల టన్నులు మాత్రమే సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించిన ప్రభుత్వం రైతుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో తర్వాత 7.5 లక్షల టన్నులకు పెంచింది. కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో సంచుల కొరత వేదిస్తోంది. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే చెల్లింపులు చేస్తామని చెప్పి గత సీజన్ చివరిలో దాదాపు నెలన్నర రోజులు జాప్యం చేయడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఆక్వా రైతులందరికీ రూ.1.50లకే సబ్సిడీ విద్యుత్ అందిస్తామంటూ ఎన్నికల్లో చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు మాట మార్చారు. ఆక్వా జోన్లో వాటికేనంటూ మెలిక పెడుతున్నారు. ప్రభుత్వ తోడ్పాటు లేకపోవడం, సిండికేటు దోపిడీతో నష్టాలు భరించలేక ఈ ఏడాది ప్రారంభంలో పాలకొల్లు, ఆచంట, నరసాపురంలోని ఆక్వా రైతులు క్రాఫ్ హాలీడే ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది.విత్తు నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకూ సాగులో రైతుకు అన్నివిధాలా అండగా గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసింది. చంద్రబాబు ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చింది. కొన్ని ఆర్బీకే భవనాలను ఇతర కార్యాలయాలకు వినియోగిస్తుండగా, మరికొన్ని తాళం వేసి కనిపిస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నకిలీల బెడద అరికట్టేందుకు గత ప్రభుత్వం రూ.కోటి వ్యయంతో నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ను ఏర్పాటుచేసింది. జిల్లాలోని భీమవరం, ఉండి, నరసాపురం, తణుకు, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో ల్యాబ్స్ నిర్మించారు. రైతులు శాంపిల్స్ తెస్తే చాలు వ్యవసాయం, మత్య్సశాఖ, పశు సంవర్ధక శాఖలకు సంబంధించి అన్ని పరీక్షలు ఇక్కడ ఉచితంగా చేయాలన్నది లక్ష్యం. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో కొన్నిచోట్ల ఇవి నిరుపయోగంగా ఉన్నాయి. పశువధ శాలకు క్లీన్చిట్పై మండిపాటు మాజీ మంత్రి కారుమూరి ధ్వజం నిండా మునిగిన రైతు ఉచిత పంటల బీమాకు ఎసరు ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం అన్నదాత సుఖీభవకు మొదటి ఏడాది ఎగనామం రెండో ఏడాది లబ్ధిదారుల సంఖ్య కుదింపు మీకోసం పేరుతో ప్రచార ఆర్భాటం ప్రభుత్వంపై రైతుల ఆగ్రహం -
ఒక్కసారిగా తగ్గాయి
ఏడాది పాటు మంచి ధర పలికిన కొబ్బరి ధరలు ఒక్కసారిగా తగ్గాయి. కొబ్బరి దింపు, వలుపు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ధరలు తగ్గితే దింపులు గగనమే. ధరలు ఇంకా పతనమవుతాయనని వ్యాపారులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి కొబ్బరి ధరలు నిలకడగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. – పంజా సురేష్, రైతు, పంజా వేమవరం పది రోజులుగా కొబ్బరి ఎగుమతులు మందగించాయి. నెల రోజుల్లో వెయ్యి కాయల ధర రూ.10 వేలకు పైగా తగ్గింది. ఏడాదిగా ధరలు బాగుండడంతో రైతుల నుంచి కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో కాయలు నిల్వ చేశాం. ప్రస్తుతం ధరలు తగ్గడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి. – గంధం త్రినాథులు, కొబ్బరి వ్యాపారి, మేడపాడు కొన్ని నెలలుగా ధరలు పెరుగుతుండటంతో రైతుల నుంచి కొబ్బరి కొనుగోలు చేసి నిల్వ చేశాను. ధరలు మరింత పెరుగుతాయని ఆశించిన తరుణంలో ఒక్కసారిగా తగ్గిపోవడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారు. ఎగుమతులు లేకపోవడం మరింత ఇబ్బందికరం. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – మల్లుల శేషయ్య, కొబ్బరి వ్యాపారి, నవుడూరు -
పేదల ఇళ్లపై స్మార్ట్ పిడుగు
● జగనన్న కాలనీలో ఇళ్లకు స్మార్ట్ మీటర్ల బిగింపు ● ఆందోళనలో లబ్ధిదారులు ఆకివీడు: పేదలపై కక్ష సాధింపుల్లో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం ఇళ్లకు స్మార్ట్ (అదానీ) మీటర్లు బిగిస్తోంది. ఏళ్ల తరబడి పూరిళ్లలో కాలం గడిపిన తమకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి సహకరించారని, కనీసం బిల్లులు కట్టలేని స్థితిలో ఉన్న తమకు ప్రస్తుత చంద్రబాబు సర్కారు స్టార్ట్ మీటర్ల భారం మోపుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు. స్టార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ సరఫరా కోసం ముందుగానే రీచార్జి చేసుకోవాల్సి వస్తుందని ఇది తమకు భారమని అంటున్నారు. ఆకివీడు మండలంలోని కుప్పనపూడి శివారు తాళ్లకోడులోని జగనన్న కాలనీలో గత ప్రభుత్వంలో 3,600 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. వారిలో సుమారు 1,600 మంది నిర్మాణాలు పూర్తిచేసి గృహ ప్రవేశా లు కూడా చేశారు. మరో 1,000 మందికి పైగా లబ్ధిదారులు పునాది వరకు నిర్మించుకుని చంద్రబాబు ప్రభుత్వంలో రూ.4 లక్షల సాయం ఇస్తారనే హామీ ని నెరవేరుస్తారని ఎదురుచూస్తున్నారు. ఈ తరు ణంలో ఇళ్లకు స్మార్ట్ మీటర్లను బిగించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కాలనీలో సుమా రు 200కు పైగా ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించారు. ఇవి తమకు వద్దని చెబుతున్నా బలవంతంగా బిగిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. టార్గెట్ కోసం కాంట్రాక్టర్ తిప్పలు స్మార్ట్ మీటర్ల బిగింపు లక్ష్యాన్ని పూర్తి చేసుకునేందుకు కాంట్రాక్టర్ తిప్పలు పడుతున్నారు. మండలంలో ఇప్పటికే వ్యాపార సంస్థలు, పరిశ్రమలకు, చిరు వ్యాపా రాలకు వీటిని బిగించారు. అపార్ట్మెంట్లలో ఒకేసారి 40 నుంచి 80 వరకూ మీటర్లను బిగిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో మీటర్లు బిగించేందుకు జగనన్న కాలనీల వైపు దృష్టి సారించారు. ఇదిలా ఉండగా ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన లోకేష్ ఇప్పుడు మీటర్లు బిగిస్తుంటే నోరు మెదపడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. కొన్నినెలల క్రితం స్మార్ట్ మీటర్లను ప్రజలు వ్యతిరేకిస్తే బిగింపు ఆపారని, మరలా ఇప్పుడు మొదలు పెట్టారని అంటున్నారు. స్మార్ట్ మీటర్ల వల్ల పేద, మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడతాయి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా సీపీఎం ఆందోళన చేపట్టింది. మరలా ప్రజా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకువస్తాం. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలి. – కె.తవిటినాయుడు, సీపీఎం మండల కార్యదర్శి, ఆకివీడు -
షష్ఠి ఉత్సవాలకు ముస్తాబు
అత్తిలిలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 8లో uచంద్రబాబు ప్రభుత్వం రైతులను పూర్తిగా వంచించి పాలన సాగిస్తోంది. జోన్లతో నిమిత్తం లేకుండా ఆక్వా చెరువులు అన్నింటికీ సబ్సిడీ విద్యుత్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చారు. సిండికేట్ దోపిడీతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విత్తు నుంచి ధాన్యం విక్రయించుకునే వరకూ వరి రైతులది అదే పరిస్థితి. ఏదో ఉద్దరించినట్టుగా ఇప్పుడు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉంది. – వడ్డి రఘురాం, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తాడేపల్లిగూడెం ఐదు ఎకరాలు కౌలు సాగు చేస్తున్నాను. మమ్మల్ని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. అన్నదాత సుఖీభవ సాయం అందడం లేదు. కనీసం బీమా సాయం కూడా అందించలేని పరిస్థితి ఉంది. గతంలో బీమా బాధ్యత ప్రభుత్వమే తీసుకోవడంతో రైతులకు ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు విపత్తులతో రైతులు నష్టపోతూ తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. – గొట్టుముక్కల ఏసురత్నం, తూర్పుపాలెం -
చికెన్ సరిపోవడం లేదని ఆందోళన
నూజివీడు: చికెన్ అరకొరగా పెడుతున్నారని ఆదివారం ట్రిపుల్ఐటీ క్యాంపస్లోని మెస్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రిపుల్ ఐటీలోని మెస్ల నిర్వహణను హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్కు అప్పగించారు. శాఖాహారం మాత్రమే పెడతామని ఈ ఫౌండేషన్ కండిషన్ పెట్టింది. విద్యార్థులకు వారంలో నాలుగు రోజుల పాటు కోడిగుడ్డు, రెండు రోజుల పాటు చికెన్ పెట్టే బాధ్యతను క్యాంపస్లో విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థకు అప్పగించారు. దీనికి గాను ఒక్కొక్క విద్యార్థికి రోజుకు రూ.6.69లు ట్రిపుల్ఐటీ చెల్లిస్తుంది. ఈనెల 23న 12 గంటలకు మెస్లో భోజనాలు ప్రారంభమవ్వగా మధ్యాహ్నం 12.30 గంటల వరకు చికెన్ రాలేదు. చివరకు 1.30 గంటలకు ఉన్న చికెన్ అయిపోగా మిగిలిన వారు తమకు చికెన్ ఏదని నిలదీసేసరికి ఫ్యాకల్టీ తిట్టడంతో ఇంజినీరింగ్ మూడు, నాలుగో సంవత్సరం విద్యార్థులు మెస్ వద్ద రోడ్డుపై ఆందోళనకు దిగారు. ప్రతి వారం తమకు చికెన్ సరిపోవడం లేదని, రెండోసారి వెళ్లి కొద్దిగా పులుసు వేయమన్నా వేయడం లేదని విద్యార్థులు వాపోయారు. హెల్పింగ్ హ్యాండ్స్ను అడ్డం పెట్టుకొని కొందరు ఫ్యాకల్టీ కోడిగుడ్లు, చికెన్ వ్యవహారాన్ని నడుపుతుండటం గమనార్హం. విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయాన్ని ఫ్యాకల్టీలు ఏఓ దృష్టికి తీసుకెళ్లగా ఆయన విద్యార్థుల వద్దకు వచ్చి బెదిరింపు ధోరణిలో వార్నింగ్లు ఇచ్చినట్లు సమాచారం. విద్యార్థులు తమ సమస్యలను చెప్పేందుకు లేచి నిల్చుంటే వారి ఐడీ, బ్రాంచి వివరాలు అడగడంపై విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. వారానికి రెండు రోజులు చికెన్ పెట్టమంటే కేవలం ఒక రోజు మాత్రమే అరకొరగా పెడుతున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. -
రొయ్యల చెరువులో విష ప్రయోగం
ఆకివీడు: మండలంలోని కుప్పనపూడిలో ఎకరంన్నర రొయ్యల చెరువులో విష ప్రయోగం చేయడంతో చెరువులోని రొయ్యలన్నీ చనిపోయాయి. చెరువు యజమాని మారుబోయిన రాంబాబు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు పురుగు మందు కలిపినట్లు గుర్తించి ఆకివీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన సలాది సూర్యనారాయణకు చెందిన చెరువును లీజుకు తీసుకుని సాగు చేస్తున్నట్లు రాంబాబు తెలిపారు. ఎస్సై నాగరాజు చెరువును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. ఏలూరు టౌన్: ఏలూరు కొత్తపేట ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక కొత్తపేట గాదివారి వీధికి చెందిన గేదెల సాయికుమార్ (33) పూలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంత కాలంగా భార్యతో విభేదాలు రావటంతో ఆమె నుంచి దూరంగా ఉంటున్నాడు. ఒంటరిగా జీవిస్తోన్న సాయికుమార్ ఆదివారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పెదపాడు: ఎన్టీఆర్ జిల్లా నున్నలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్న్ ఆఫ్ ఇండియా(ఎస్జీఎఫ్ఐ) సైక్లింగ్ ట్రాక్ ఈవెంట్లో ఏలూరుకు చెందిన జీ స్నేహిత ద్వితీయస్థానం సాఽధించింది. దీంతో జార్ఖండ్లోని రాంచిలో జనవరి 13న జరిగే పోటీలకు ఎంపికై ంది. సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఏఆర్సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–19 బాలబాలికల హ్యాండ్బాల్ పోటీలు సోమవారం హోరాహోరీగా జరిగాయి. పూల్ సిలో విన్నర్గా వెస్ట్ గోదావరి, రన్నర్గా విజయనగరం జట్లు నిలిచాయి. -
కొల్లేరుకు ప్రతి ఏటా వచ్చే విదేశీ వలస పక్షులు..
నార్తరన్ పిన్టైల్ (సూది తోక బాతు), రెడ్ క్రిస్టడ్ పోచర్ట్ (ఎర్రతల చిలువ), కామన్ శాండ్ పైపర్ (ఉల్లంకి పిట్ట), పసిఫిక్ గోల్డెన్ స్లోవర్ (బంగారు ఉల్లంకి), కామన్ రెడ్ షాంక్ (ఎర్రకాళ్ల ఉల్లంక్), బ్రాహ్మణి షెల్ డక్(బాపన బాతు), గ్రేట్ వైట్ పెలికాన్ (తెల్ల చిలుక బాతు), బ్లాక్ క్యాప్డ్ కింగ్ఫిషర్(నల్ల తల బుచ్చిగాడు), గుల్ బిల్డ్ టర్న్(గౌరి కాకి ముక్కు రేవుపిట్ట), కాస్పియన్ టర్న్(సముద్రపు కాకి), గ్రేటర్ శాండ్ ప్లోవర్(పెద్ద ఇసుక ఉల్లంకి), రూఫ్ (ఈల వేసే పెద్ద చిలువ), మార్స్ శాండ్పైపర్ (చిత్తడి ఉల్లంకి) వంటివి దాదాపు 71 జాతులు ఉన్నట్టు గుర్తించారు. -
అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి
భీమవరం(ప్రకాశం చౌక్): పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి పీజీఆర్ఎస్లో ఆమె పాల్గొన్ని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని నిర్ణీత గడువులోపుగా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులు సంతృప్తిచెందేలా సమస్యలను పరిష్కరించాలన్నారు. అధికారులు లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. -
రోడ్డు ప్రమాదంలో భవానీ భక్తుడి మృతి
హనుమాన్జంక్షన్ రూరల్: బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో భవానీ భక్తుడు మృతి చెందాడు. ఈ ఘటన బాపులపాడు మండలం ఉమామహేశ్వరపురం వద్ద చైన్నె–కోల్కతా జాతీయ రహదారిపై జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు సమీపంలోని సజ్జాపురానికి చెందిన కుక్కనూరి జయరామ్ (33) భవానీ దీక్ష విరమణ నిమిత్తం స్నేహితుడు అలబాని సాయితేజతో కలిసి సోమవారం పల్సర్ బైక్పై విజయవాడ దుర్గ గుడికి బయలుదేరారు. అమ్మవారి దర్శనం ముగించుకుని బైక్పై ఇంటికి తిరిగి వెళ్తుండగా ఉమామహేశ్వరపురం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపు తప్పి రహదారి డివైడర్ను ఢీకొట్టడంతో వాహనం నడుపుతున్న జయరామ్ తీవ్ర రక్తస్రావానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సాయితేజ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఈ నెల 26న జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్ జితేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. జంగారెడ్డిగూడెం సూర్య డిగ్రీ కాలేజీలో నిర్వహించే ఈ జాబ్ మేళాలో 17కి పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, పూర్తి వివరాలకు 96525 03799, 96663 22032 నెంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
నేత్రపర్వం.. ధ్వజారోహణం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమైన శ్రీ వల్లీదేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాత్రి ఆలయంలో ధ్వజారోహణ వేడుక నేత్రపర్వంగా జరిగింది. ముందుగా అర్చకులు, పండితులు గర్భాలయంలో కొలువైన స్వామికి విశేష అభిషేకాలను నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. ఆ తరువాత ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్ల కల్యాణ మూర్తులను ఉంచి పండితులు, అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపనను నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ధ్వజపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. -
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
నరసాపురం రూరల్ : పేరుపాలెం బీచ్లో ఆదివారం సముద్ర స్నానం చేస్తూ గల్లంతైన యువకుడి మృతదేహం సోమవారం లభ్యమైంది. ఏలూరులోని కొత్తపేటకు చెందిన మునగాల సాయిగణేష్(19) ఆదివారం తన స్నేహితులతో కలిసి బీచ్కు వచ్చాడు. సముద్ర స్నానం చేస్తుండగా అలల ఉధృతికి గల్లంతైన విషయం విధితమే. సోమవారం మోళ్ళపర్రు తీరంలో గణేష్ మృతదేహం కొట్టుకురావడంతో పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏలూరు రూరల్: డిసెంబర్ 3న ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురష్కరించుకుని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు 25న ఏలూరులో దివ్యాంగుల జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించనున్నామని డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఏర్పాట్లు చేశామని వివరించారు. ఆసక్తి గలవారు 9948779015 నెంబరుకు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు. ఏలూరు (టూటౌన్): జిల్లా అటవీ శాఖాధికారి(టెరిటోరియల్)గా పోతంశెట్టి వెంకట్ సందీప్ రెడ్డి జిల్లా అటవీ శాఖాధికారి కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సందీప్ రెడ్డి 2019లో ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు. గతంలో డోర్నాల సబ్ డివిజనల్ అటవీ శాఖాధికారిగా, ఆత్మకూరు ఇన్చార్జ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్గా విధులు నిర్వహించారు. కడప, పాడేరు జిల్లా అటవీశాఖాధికారిగా విధులు నిర్వహించి ఏలూరు జిల్లాకు బదిలీపై వచ్చారు. ఏలూరు (టూటౌన్): కొల్లేరును మూడో కాంటూరుకు కుదించాలని, ఎకో సెన్సిటివ్ జోన్, చిత్తడి నేలల పరిరక్షణ పేరుతో పదో కాంటూరుకు పెంచరాదని డిమాండ్ చేస్తూ జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని కొల్లేరు ప్రజలు, రైతుల పరిరక్షణ కమిటీ తరఫున ఏ.రవి సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం 26న ఉదయం 11 గంటలకు ఏలూరులోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరుగుతుందని తెలిపారు. -
కొల్లేరుకు అతిథులొచ్చారు!
కై కలూరు: శీతాకాలపు విడిది పక్షుల కిలకిలారావాలతో కొల్లేరు కళకళలాడుతోంది. లక్షల కిలోమీటర్ల దూరం నుంచి తన రెక్కల చప్పుళ్లతో కొల్లేరుకు విదేశీ అతిథి పక్షులు వచ్చేశాయ్. ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కొల్లేరు పక్షుల వీక్షణకు అనువైన కాలం. ఈ ఏడాది ఎక్కువ మంది పర్యాటకులు కొల్లేరుకు విచ్చేస్తారని అటవీ శాఖ అంచనా వేస్తోంది. సర్వేల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 482 పక్షి జాతులు ఉన్నాయి. సింహభాగం 210 పక్షి జాతులు కొల్లేరులో సంచరిస్తాయి. కొల్లేరు ప్రాంతానికి రష్యా, బ్రిటన్, సైబీరియా, బంగ్లాదేశ్, నైజీరియా, ఆస్ట్రేలియా, శ్రీలంక తదితర 29 దేశాల నుంచి 71 జాతులకు చెందిన వలస జాతి పక్షులు 1.20 లక్షలు వస్తాయని అంచనా. ప్రపంచంలో పక్షి జాతులు 11,145 ఉండగా, భారతదేశంలో 1,378 ఉన్నాయి. భారతదేశ పక్షి జాతుల వాటా 12.3 శాతంగా ఉంది. కొల్లేరులో స్వదేశీ, విదేశీ అన్ని పక్షులూ కలిపి 4 లక్షల వరకు శీతాకాలంలో విహరిస్తాయి. పక్షుల అత్తారిల్లు కొల్లేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో రామ్సార్ సదస్సు గుర్తించిన ఏకై క చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు. దీని విస్తీర్ణం 2,22,300 ఎకరాలు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించింది. కొల్లేరు 5వ కాంటూరు వరకు 77,135 ఎకరాలను కొల్లేరు అభయారణ్యంగా గుర్తించారు. ఇరు జిల్లాల్లో ఆటపాక, మాధవాపురం పక్షుల విహార కేంద్రాలు ప్రసిద్ధమైనవి. ఏటా శీతాకాలంలో విదేశీ పక్షులు ఇక్కడ గూళ్లు కట్టుకుని సంతానోత్పత్తితో మార్చి మొదటి వారంలో పుట్టింటికి వెళతాయి. కై కలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రంలో పెలికాన్ పక్షులు అధికంగా రావడంతో దీనికి పెలికాన్ ప్యారడైజ్గా నామకరణ చేశారు. బార్ టెయిల్డ్ గాడ్విట్ నిర్విరామంగా అత్యధిక దూరం ప్రయాణించే పక్షి బార్ టెయిల్డ్ గాడ్విట్. ఈ పక్షి ఎక్కడా ఆగకుండా 11 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇవి కొల్లేరు అభయారణ్య ప్రాంతానికి ఏటా వస్తాయి. ఆర్కిటిక్ టర్న్ అత్యధిక దూరం వలస పోయే పక్షి ఆర్కిటిక్ టర్న్. ఏకంగా 12,200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఎనిమిదిన్నర రోజుల్లోనే చేరుకుంటుంది. అలస్కా నుంచి న్యూజిలాండ్కు వలస వెళ్తుంది. బార్ హెడెడ్ గీస్ ఎక్కువ ఎత్తున ఎగిరే వలస పక్షి బాతు జాతికి చెందిన బార్ హెడెడ్ గీస్. ఇది సముద్రమట్టానికి దాదాపు 8.8 కిలోమీటర్ల ఎత్తున ఎగురుతుంది. ఈ జాతికి చెందిన పక్షులు హిమాలయాల నుంచి ప్రయాణించి, భారత భూభాగంలోని చిలుకా, పులికాట్ తదితర సరస్సులకు వస్తాయి. గ్రేట్ స్నైప్ అత్యధిక వేగంతో ప్రయాణించే వలస పక్షి గ్రేట్ స్నైప్, ఈ పక్షి గంటకు 96.5 కిలోమీటర్ల వేగంతో దాదాపు 6,500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీనిని పరికరాలతో వీక్షించడం కూడా కష్టం. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పిట్టలకు ఎల్లలుండవు. శీతాకాలంలో హిమాలయాలకు దూరంగా నార్తరన్ దేశాలు మంచుతో ఉంటాయి. దీంతో ఆహారం కోసం పక్షులు వలస వస్తాయి. చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరు వీటికి అనువైన ప్రాంతం. ఈ ప్రాంతంలో కాలుష్యం కారణంగా వలస పక్షులు తగ్గుతున్నాయి. చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యతగా ఉండాలి. – శ్రీరామ్రెడ్డి, తెలుగు రాష్ట్రాల ఈ–బర్డ్ సమీక్షకుడు, హైదరాబాదు పక్షులను నేస్తాలుగా భావించి ఆదరించాలి. కొల్లేరు వాతావరణం అనుకూలంగా ఉండటంతో పక్షులు వలస వస్తున్నాయి. అటవీ శాఖ పక్షుల రక్షణకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్ చివరన ఏషియన్ వాటర్ బర్డ్స్ సెన్సస్(ఏడబ్ల్యూసీ) చేయాలని భావిస్తున్నాం. ఏలూరు జిల్లాలో ఆటపాక, మాధవాపురంలో పక్షుల విహార కేంద్రాలను అభివృద్ధి చేశాం. కొల్లేరు పక్షుల వీక్షణకు ఇదే అనువైన సమయం. – బి.విజయ, జిల్లా అటవీశాఖ అధికారి, ఏలూరు శీతాకాలంలో విడిది పక్షుల సందడి ఏటా 71 జాతులకు చెందిన 1.20 లక్షల విదేశీ వలస పక్షులు అక్టోబరు నుంచి మార్చి చివరి వరకు కనువిందు స్థానికంగా 210 రకాల పక్షి జాతులు ఉన్నట్టు గుర్తింపు -
షష్ఠి ఉత్సవాలకు అత్తిలి ముస్తాబు
● నేడు స్వామివారి కల్యాణం ● 26న షష్ఠి మహోత్సవం అత్తిలి: రాష్ట్రంలో పేరుగాంచిన అత్తిలి శ్రీవల్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి కల్యాణ మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలలో చలువ పందిళ్లు నిర్మించి, విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దారు. ఈ నెల 25 నుంచి డిసెంబరు 9 వరకు జరిగే మహోత్సవాలలో ప్రతి రోజు సాయంత్రం స్వామివారి కళావేదికపై పలు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. మంగళవారం రాత్రి 7.20 గంటలకు దాసం ప్రసాద్, రాజరాజేశ్వరి దంపతులచే శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణాన్ని నిర్వహిస్తారు. 26న షష్ఠి తీర్థ మహోత్సవం సందర్భంగా ఉదయం కోలాట భజన, అన్నసమారాధన, రాత్రి శ్రీస్వామివారి ఊరేగింపు ఉత్సవ కార్యక్రమాలు జరుగుతాయని షష్ఠి కమిటీ అధ్యక్షుడు కురెళ్ల ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షుడు దిరిశాల మాధవరావు తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా పేరుగాంచిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి తిరునాళ్లు ఏటా ఘనంగా నిర్వహిస్తుంటారు. నాగదోషం ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు, కుజదోషం, కాల సర్పదోషం ఉన్నవారు ఈ దేవాలయాన్ని దర్శించి, స్వామికి పంచామృతాలతో అభిషేకించడం ద్వారా తమ కోర్కెలు తీరతాయని భక్తుల విశ్వాసం. సంతానంలేనివారు నాగుల చీర కట్టుకుని, ముడుపులు కడతారు. సంతానం కలిగిన తరువాత పిల్లల తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకుని, పిల్లలపై నుంచి బూరెలను పోసే సంప్రదాయం ఇక్కడ ఉంది. చిన్నపిల్లలకు నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి శుభకార్యక్రమాలు ఈఆలయంలోనే నిర్వహిస్తుంటారు. షష్ఠి తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలలో విద్యుత్ దీపాలతో దేవతామూర్తుల సెట్టింగ్లు నెలకొల్పారు. ఉత్సవాలలో అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సై పి.ప్రేమరాజు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసారు. -
‘సాక్షి’ స్పెల్బీ, మ్యాథ్బీకి విశేష స్పందన
● ఉమ్మడి జిల్లా నుంచి భారీగా రాక ● ఇంగ్లిష్, గణితంపై పట్టు సాధించేందుకు దోహదం తాడేపల్లిగూడెం (టీఓసీ): పాఠశాల స్థాయి విద్యార్థుల్లో ఇంగ్లిష్, గణితంలో ప్రతిభను వెలికితీసేందుకు సాక్షి స్పెల్బీ, మ్యాథ్బీ క్వార్టర్ ఫైన ల్స్ పరీక్షలు ఆదివా రం తాడేపల్లిగూడెంలోని సెంట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో నిర్వహించారు. లెక్కలపై భయాన్ని పోగొట్టడంతో పాటు ఇంగ్లిష్ నైపుణ్యాలను పెంచేలా నిర్వహించిన పరీక్షలు ఉత్సాహంగా సాగాయి. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నాలుగు కేటగిరీలుగా పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని జంగారెడ్డిగూడెం, నిడదవోలు, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, ఏలూరు తదితర ప్రాంతాల నుంచి 500 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతో సెంట్ ఆన్స్ ప్రాంగణంలో సందడి నెలకొంది. సెంట్ ఆన్స్ విద్యాసంస్థల చైర్మన్ అద్దంకి విజయకుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కె.ప్రవీణ్ వర్మ, శిరీషా, శ్రీనివాస్ పరీక్షలను ప ర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్గా డ్యూక్స్ వాఫే, అసోసియేట్ స్పాన్సర్గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ రాజమండ్రి వారు వ్యవహరిస్తున్నారు. గణిత సమస్య పరిష్కారంలో ప్రాక్టీస్ చేయడానికి, నైపుణ్యాలు సాధించ డానికి మ్యాథ్బీ పరీక్షలు ఉపయుక్తం. గణిత జ్ఞానాన్ని కొత్తమార్గంలో అన్వయించడానికి, భవిష్యత్ పరీక్షలకు సిద్ధం చేయడంలో సహాయపడుతుంది. – యశస్విని, కేకేఆర్ గౌతమ్, ఏలూరు సాక్షి స్పెల్బీ, మ్యాథ్బీ పరీక్షలు రాయడం వల్ల పోటీ పరీక్షలపై అవగాహన పెరుగుతుంది. భయం తగ్గుతుంది. పై స్థాయి పోటీలకు వెళ్లాలనే లక్ష్యం ఏర్పడుతుంది. మా భవిష్యత్తుకు ఎంతో ఉపయుక్తం. – కె.ప్రజ్ఞత, ప్రతిభ స్కూల్, జంగారెడ్డిగూడెం క్వార్టర్ ఫైనల్స్ స్పెల్బీ పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించి ఫైనల్ స్థాయిలకు వెళ్లేందుకు కృషి చేస్తాను. పరీక్ష బాగా రాశాను. మరింత ఉత్సాహం వస్తుంది. పరీక్షల నిర్వహణ అభినందనీయం. – జె.హర్షిత్, ఆదిత్య, పాలకొల్లు ఇంగ్లిష్లో స్పెల్లింగ్ నేర్చుకోవడం వల్ల పదాలు గుర్తు ఉండటం, పట్టు సాధించడం జరుగుతుంది. ప్రతి పదం అర్థం కూడా నేర్చుకోవడానికి వీలు ఉంటుంది. స్పోకెన్ ఇంగ్లిష్కు ఉపయుక్తం. – ఎం.వర్షిణి, ఆదిత్య, నరసాపురం -
పీపీపీపై ఉద్యమం ఉధృతం
మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ హెచ్చరికపాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని చంద్రబాబు సర్కారు విరమించుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ హెచ్చరించింది. మండలంలోని దగ్గులూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణాలను పరిరక్షణ కమిటీ రాష్ట్ర బృందం ఆదివారం పరిశీలించింది. అనంతరం పాలకొల్లులోని డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ భవనంలో కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. జైభీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగలిగే వ్యక్తుల్లో దేశంలోనే చంద్రబాబు అగ్రగణ్యులని విమర్శించారు. పీపీపీలో ప్రభుత్వ ని యంత్రణ ఉంటుందని సీఎం చెబుతున్నారని, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు నడిపే ఆస్పత్రులు, స్కూళ్లలో ప్రభుత్వ నియంత్రణ ఉంటుందా అని ప్రశ్నించారు. రిజర్వేషన్లు లేని వ్యవస్థను నడిపించడమే పీపీపీ విధానం అన్నారు. పీపీపీ పేరుతో బాలకృష్ణకి కూడా ఒక కాలేజీని ఇవ్వాలని, పవన్ కళ్యాణ్కి కూడా 30 శాతం కాలేజీలు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. పరిరక్షణ కమిటీ కో–కన్వీనర్ వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ పాలకొల్లులో మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్మించి నడపాలన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి.బలరాం మాట్లాడుతూ పీపీపీలోనే ప్రజలకు సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుతాయని మంత్రి లోకేష్ ప్రకటించడం సిగ్గుచేటన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ గతంలో 107, 108 జీఓలను విడుదల చేసి వైద్య సీట్లను అమ్మకానికి పెడితే నేడు మొత్తం కాలేజీలను అమ్మేసే పద్ధతిని చంద్ర బాబు ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఇంధన శాఖ అడిషనల్ డైరెక్టర్ ఏవీ పటేల్ మాట్లాడుతూ అట్టడుగు పేదలకు వైద్యం అందకుండా చేయడమే చంద్రబాబు సర్కారు లక్ష్యమా అని ప్రశ్నించారు. రాష్ట్ర కో–కన్వీనర్ కొరివి వినయ్కుమార్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ముందు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ మాట్లాడుతూ గతంలో ఏ సమస్య వచ్చినా రోడ్డెక్కిన స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు ఇప్పుడు సొంత ఇ లాకాలో మెడికల్ కాలేజీని అమ్మేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే, ఐలు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దిగుపాటి రాజగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో రూ.5 వేల కోట్లు మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఖర్చుపెట్టలేని అసమర్థ సీఎం చంద్రబాబు అని మండిపడ్డారు. సంచర జాతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెండ్ర వీరన్న మాట్లాడుతూ పేదలకు అన్యాయం చేయాలని చూస్తే భవిష్యత్తులో వారే తగిన గుణపాఠం చెబుతున్నారు. కార్యక్రమంలో దగ్గులూరు సర్పంచ్ విశ్వనాథం పేరయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు కొలుకూరి అర్జున్రావు, కాకర రాజ్కుమార్, బీఎస్పీ నాయకుడు ఈవీసీ శేఖర్బాబు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుడు సోడదాసి గంగయ్య, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు, ఐద్వా జిల్లా కార్యదర్శి పూర్ణ, ఆల్ ఇండియా క్రిస్టియన్ వర్కింగ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మత్తే రాజ్కుమార్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లాటి పెద్దిరాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సీహెచ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. -
నల్ల బంగారం.. తవ్వకాలకు సిద్ధం
● రేచర్ల బొగ్గు బ్లాక్కు ముగిసిన టెండర్లు ● నేటి నుంచి ఈ–ఆక్షన్ కేటాయింపు ● 2,225 మిలియన్ టన్నుల నిల్వలు ● ఆంధ్రా సింగరేణిగా ‘చింతలపూడి’సాక్షి ప్రతినిధి, ఏలూరు: చింతలపూడి బొగ్గు తవ్వకాల వ్యవహారం తుది దశకు చేరుకుంది. బొగ్గు నిల్వల ఖరారు, బ్లాక్ల వారీగా గుర్తింపు ఇలా ఏళ్ల తరబడి సాగిన ప్రయత్నాలు పూర్తయి మొట్టమొదటిగా రేచర్ల బ్లాక్ను నిర్ధారించి టెండర్లు ఆహ్వానించి తుది దశకు తీసుకువచ్చారు. సోమవారం నుంచి ఈనెల 28లోపు ఈ–వేలం ద్వారా రేచర్ల బ్లాక్ను ఖరారు చేయనున్నారు. 2,225.63 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్న ఈ బ్లాక్ను వేలం ద్వారా అప్పగించనున్నారు. 1964 నుంచి 2004 వరకు కేంద్ర ప్రభుత్వం నా లుగు సర్వేలు నిర్వహించింది. 2006 నుంచి 2016 వరకు సర్వే ప్రక్రియ వేగంగా పూర్తిచేసి తుది దశకు తీసుకువచ్చారు. చింతలపూడి, టి.నర్సాపురం, జంగారెడ్డిగూడెం మండలా ల్లోని కొన్ని గ్రామాల్లో గ్రేడ్–1 నిల్వలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియోబోటానీ అనే సంస్థలు గుర్తించి కేంద్రానికి నివేదిక అందజేశారు. ఇప్పటికే రెండు సార్లు టెండర్లు పిలవగా ఎవరూ ముందుకు రాకపోకవడంతో నిలిచిపోయాయి. మూడోసారి ఈ ఏడాది సె ప్టెంబర్లో దరఖాస్తులు ఆహ్వానించి అదేనెల 15న ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం అక్టోబర్ 27 వరకు దరఖాస్తు స్వీకరణకు తుది గడువుగా నిర్ణయించి 28న టెక్నికల్ బిడ్లను తెరిచారు. 22.24 చ.కిలోమీటర్ల పరిధిలో.. రేచర్ల గ్రామాన్ని కేంద్రంగా తీసుకుని ఎర్రగుంటపల్లి, సీతానగరం, మేడిశెట్టివారిపాలెం, లింగగూడెం, రాఘవాపురం తదితర గ్రామాల పరిధిలోని 22.24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రేచర్ల బొగ్గు బ్లాక్ను ఖరారు చేశారు. 623 మీటర్లలోతు నుంచి గరిష్టంగా 1,123 మీటర్ల లోతులో జీ–13 గ్రేడ్ బొగ్గు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. 2,225.63 మిలియన్ టన్నుల నిల్వలు ఈ బ్లాక్ పరిధిలో ఉన్నట్టు గుర్తించారు. వచ్చే వారంలో టెండర్ ఖరారైతే 2026 మార్చి నాటికి పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. -
క్షేత్రంలో కొనసాగిన రద్దీ
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. వేలాది మంది భక్తులు తరలివచ్చారు. క్షేత్రంలోని అన్ని విభాగాలూ భక్తులతో కిటకిటలాడాయి. నూజివీడు: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆక్రమణలకు అడ్డే లేకుండా పోయింది. ప్రభుత్వ భూ ముల ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. నూజివీడు మండలం గొల్లపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఉన్న దాదాపు 10 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని అక్రమార్కులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇటుగా కన్నెత్తి చూసేందుకు రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సాహసించడం లేదు. అక్రమార్కులకు టీడీపీ నాయకుల అండదండలున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ స్థలంలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి గత ప్రభుత్వ హ యాంలో శంకుస్థాపనలు జరిగాయి. అంగన్వాడీ కేంద్రానికి, పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా బల్క్కూలర్ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంగన్వాడీ భవన నిర్మాణం బేస్మెంట్ స్థాయి వరకూ పూర్తయి ఆగిపోగా, బల్క్కూలర్ యూనిట్ నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఇప్పుడు ఆ స్థలంపై అక్రమార్కుల కన్నుపడింది. 10 సెంట్ల స్థలం విలువ దాదాపు రూ.25 లక్షలపైనే ఉంది. ఈ ఆక్రమణపై గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి పీజీఆర్ఎస్లో వినతిపత్రం సైతం ఇచ్చారు. అయినా ఆక్రమణదారులు మాత్రం ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్తే అర్జీని పరిష్కరించడానికి నెల రోజులు సమయం ఉంటుందంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని, ఈలోపు స్లాబ్ లెవెల్ వర కూ గోడలు సైతం నిర్మాణమవుతాయని పలువురు అంటున్నారు. కలెక్టర్ స్పందించి ఆక్రమణలను నిలువరించాలని కోరుతున్నారు. -
ఆలోచనలు పెంచేలా..
విద్యార్థుల్లో విశ్లేషనాత్మక ఆలోచనలు పెంచేలా భవిష్యత్తు సవాళ్లకు వారిని సిద్ధం చేసేలా సాక్షి స్పెల్బీ పరీక్షల ద్వారా ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటి పరీక్షలు విద్యార్థుల్లో భయాన్ని పోగొడతాయి. సాక్షికి అభినందనలు. – కె.సత్యనారాయణ, విద్యార్థి తండ్రి విద్యార్థులను ప్రోత్సహించేలా ఇంగ్లిష్ స్పెల్లింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడంతో పాటు గణితంపై పట్టు సాధించేలా స్పెల్బీ, మ్యాథ్బీ పరీక్షల నిర్వహణ అభినందనీయం. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయుక్తం. – జి.నాగజ్యోతి, టీచర్, ప్రతిభ స్కూల్, జంగారెడ్డిగూడెం -
సత్యసాయి జయంతి వేడుకలు
భీమవరం (ప్రకాశంచౌక్): భగవాన్ సత్య సాయిబాబా సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వంటి ధర్మాలను ఆచరించి భగవత్ స్వరూపుడిగా పూజింపబడుతున్నారని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. ఆదివారం బాబా శత జయంతి వేడుకల సందర్భంగా స్థానిక భీమేశ్వరస్వామి దేవస్థానం సమీపంలోని సత్యసాయి బాబా మందిరంలో అధికారికంగా ఉత్సవాలు నిర్వహించారు. బాబా చిత్రపటానికి కలెక్టర్ నాగరాణి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి పూలమాలలు వేశారు. అనంతరం సాయిబాబా సేవా సంస్థ సభ్యులతో కలిసి సత్యసాయి బాబా శత వార్షిక లోగో, 2026 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. భీమవరం: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈనెల 26న అమరావతిలోని అసెంబ్లీలో విద్యార్థులతో నిర్వహించే మాక్ అసెంబ్లీ నిర్వహణకు జిల్లా నుంచి ఏడుగురు విద్యార్థులను ఎంపిక చేసినట్టు డీఈఓ ఈ.నారాయణ ఆదివారం ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఎంపిక చేశామన్నారు. వీరవాసరం మండలం రాయకుదురు హైస్కూల్ విద్యార్థిని వై.జోయిసి (భీమవరం), పెనుగొండ మండలం దేవ హైస్కూల్ విద్యార్థి కోడెల్లి సరిత (ఆచంట), యలమంచిలి మండలం మేడపాడు హైస్కూల్ విద్యార్థి ఎ.శ్రీవర్షిణి (పాలకొల్లు), మొగల్తూరు మండలం పిప్పళ్లవారితోట హైస్కూల్ విద్యార్థి పి.గుణశివరామ్కుమార్ (నరసాపురం), పాలకోడేరు మండలం పెన్నాడ హైస్కూల్ విద్యార్థి జి సత్య (ఉండి), ఇరగవరం మండలం రేలంగి హైస్కూల్ విద్యార్థి ఎం.శ్రీమహాలక్ష్మి (తణుకు), పెంటపాడు మండలం దర్శిపర్రు హైస్కూల్ విద్యార్థి పి.గాయత్రిదుర్గ (తాడేపల్లిగూడెం) ఎంపికయ్యారన్నారు. విద్యార్థులుతో గైడ్ టీ చర్లు కేవీ రామచంద్రరావు, సూర్యకళ అమరావతి వెళతారని పేర్కొన్నారు. వీరవాసరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్– 17 బాలికల క్రికెట్ జట్ల ఎంపికలు దేవరపల్లి ఏఎస్ఎన్ఆర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 25న నిర్వహిస్తున్నామని ఉమ్మడి పశ్చిమగోదా వరి జిల్లా కార్యదర్శులు పత్రికా ప్రకటనలో తెలిపారు. వివరాలకు సెల్ 9866678844లో సంప్రదించాలన్నారు. ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న స్పెషల్ జ్యుడీషియల్ మే జిస్ట్రేట్ అఫ్ సెకండ్ క్లాస్ పోస్టులు తాత్కాలిక పద్ధతిపై భర్తీకి ప్యానెల్లో పేర్లు చేర్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా జడ్జి ఎస్.శ్రీదేవి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 4 ఖాళీగా ఉన్నా యని దరఖాస్తులను జిల్లా జడ్జి, పశ్చిమగోదా వరి జిల్లా, ఏలూరు కార్యాలయానికి డిసెంబర్ 12న సాయంత్రం 5 గంటలలోపు పంపాలన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.45 వేలు గౌరవ వేతనంగా ఇస్తారన్నారు. ఏలూరు (టూటౌన్): ఏలూరులోని అల్లూరి సీ తారామరాజు స్టేడియంలో ఈనెల 25న ఉ దయం 9 గంటల నుంచి విభిన్న ప్రతిభావంతులకు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.రామ్కుమార్ ప్రకటనలో తెలిపారు. వివిధ క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని, 600 మందికిపైగా పోటీల్లో పాల్గొంటారన్నారు. -
రసవత్తరంగా ఎస్జీఎఫ్ బాస్కెట్బాల్ పోటీలు
నూజివీడు: నూజివీడులో నిర్వహిస్తున్న ఎస్జీఎఫ్ బాలుర, బాలికల అండర్–17 రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి 13 బాలుర జట్లు, 13 బాలికల జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. శనివారం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ గోపీమూర్తి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరుగుతున్న ఈ పోటీలు లీగ దశను ముగించుకొని నాకౌట్ దశకు చేరుకున్నాయి. ఈ పోటీలు పలు జట్ల మధ్య హోరాహోరీగా సాగగా, మరొకొన్ని పోటీలు ఏకపక్షంగా సాగాయి. బాలికల విభాగంలో గుంటూరు జట్టు చిత్తూరుపై 19–8, పశ్చిమగోదావరి జట్టు విజయనగరంపై 38–0, తూర్పు గోదావరి జట్టు కర్నూల్పై 29–10, వైజాగ్ జట్టు అనంతపురంపై 21–13, వైఎస్సార్ కడప జట్టు నెల్లూరుపై 20–0, చిత్తూరు జట్టు విజయనగరంపై 26–2, గుంటూరు జట్టు పశ్చిమగోదావరిపై 36–24, కర్నూల్ జట్టు శ్రీకాకుళంపై 29–2, వైజాగ్ జట్టు ప్రకాశంపై 13–0, కృష్ణాజిల్లా జట్టు నెల్లూరుపై 19–0 తేడాతో గెలుపొందాయి. బాలుర విభాగంలో తూర్పు గోదావరి జట్టు వైజాగ్పై 50–32, చిత్తూరు జట్టు శ్రీకాకుళంపై 27–17. గుంటూరు జట్టు వైఎస్సార్ కడపపై 28–3, అనంతపురం జట్టు పశ్చిమగోదావరిపై 32–8, కృష్ణాజట్టు కర్నూలుపై 31–12, చిత్తూరు జట్టు తూర్పుగోదావరి జట్టుపై 30–21, వైజాగ్ జట్టు శ్రీకాకుళంపై 23–16, గుంటూరు జట్టు నెల్లూరుపై 29–12, అనంతపురం జట్టు విజయనగరంపై 29–0, కర్నూల్ జట్టు ప్రకాశంపై 17–02తేడాతో గెలుపొందాయి. దీంతో బాలికల విభాగంలో క్వార్టర్స్ ఫైనల్కు కృష్ణ, కర్నూలు, అనంతపురం, గుంటూరు, తూర్పుగోదావరి, కడప, చిత్తూరు, వైజాగ్ జట్లు చేరాయి. క్వార్టర్ ఫైనల్స్లో కృష్ణా జట్టు కర్నూలుపై 26–12, తూర్పుగోదావరి జట్టు వైఎస్సార్ కడపపై 18–6తేడాతో, గుంటూరు జట్టు అనంతపురంపై 35–17, వైజాగ్ జట్టు చిత్తూరుపై 24–20 స్కోర్తో గెలుపొందాయి. దీంతో కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు, వైజాగ్ జట్లు సెమీస్కు చేరాయి. కార్యనిర్వాహక కార్యదర్శి వాకా నాగరాజు పోటీల నిర్వహణను పర్యవేక్షించారు. -
నేటినుంచి సుబ్బారాయుడి కల్యాణోత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్ర ఉపాలయమైన శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం కల్యాణోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయం, పరిసరాలు విద్యుద్దీప అలంకారాలతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఈనెల 23 నుంచి 29 వరకు జరిగే కల్యాణోత్సవాల్లో భాగంగా, తొలిరోజు ఉదయం 9.30 గంటలకు అర్చకులు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా చేస్తారు. 24న పుణ్యహవాచనము, అంకురార్పణ, రాత్రి ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ఠాపన, 25న స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, నిత్యౌపాసనను నిర్వహిస్తారు. 26న రాత్రి 7 గంటల నుంచి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుంది. అలాగే 27న స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, నిత్యౌపాసన, సాయంత్రం నెమలి వాహనంపై గ్రామోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహిస్తారు. 28న స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, నిత్యౌపాసన, బలిహరణ, పూర్ణాహుతి, అవబృధస్నానం, వసంతోత్సవం, ధ్వజావరోహణ వేడుకలను జరుపుతారు. 29న స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, ద్వాదశి ప్రదక్షిణలు, శ్రీ పుష్పయాగోత్సవ వేడుకలతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని, ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి కోరారు. -
ఆర్టీసీ పెట్రోల్ బంకులో అవినీతిని వెలికితీయాలి
ఏలూరు (టూటౌన్): ఏలూరు ఆర్టీసీ పెట్రోల్ బంకులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం మాట్లాడారు. ఏలూరు ఆర్టీసీ పెట్రోల్ బంకులో అవినీతి జరిగితే గుట్టు చప్పుడు కాకుండా ఏలూరు డిపో మేనేజర్తో సహా తొమ్మిదిమంది నుంచి రూ.50 లక్షలకు పైగా వసూలు చేసి ఏవిధమైన చర్యలు లేకుండా కప్పిపుచ్చాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు పత్రికల్లో వార్తలు రావడం బాధాకరం అన్నారు. డబ్బులు తిరిగి చెల్లిస్తే దోషులపై చర్యలు ఉండవా అని ఆయన ప్రశ్నించారు. ఎస్.డబ్ల్యూ.ఎఫ్ రాష్ట్ర నాయకునిపై కక్ష సాధింపుతో వేటు వేస్తూ తప్పు చేయలేదని నికరంగా నిలబడ్డ మరో ముగ్గురు ఉద్యోగులపై కూడా వేటు వేయడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండించింది. ఈ కుంభకోణం వెనుక అసలు సూత్రధారులు ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వెంటనే సస్పెన్షన్ చేసిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని, ఆర్టీసీ పెట్రోల్ బంక్ లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని రవి డిమాండ్ చేశారు. కఠినంగా శిక్షించాలి జంగారెడ్డిగూడెం వసతి గృహంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేసి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి -
ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి విద్యార్థి మృతి
ఆకివీడు: తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్న ఓ విద్యార్థి పశువులు కడుగుతూ ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన ఆకివీడు మండలంలోని పెద్ద కాపవరం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కటారి దుర్గాప్రసాద్, పార్వతీ దంపతులకు కుమారుడు సందీప్ (21), కుమార్తె ఉన్నారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న సందీప్ కౌలు రైతుగా జీవిస్తున్న తండ్రి దుర్గాప్రసాద్కు అన్ని పనుల్లో చేదోడు, వాదుడోగా ఉండేవాడు. సందీప్ శనివారం పశువులను కడుగుతూ చెరువులో ప్రమాదవశాత్తూ మునిగి దుర్మరణం పాలయ్యాడు. సందీప్ను బాగా చదవించాలని ఆశ పడ్డామని, ఇంతలోనే మృత్యువు కబళించిందని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు కాలేదు. -
శ్రీవారి ఆలయంలోకి సెల్ఫోన్లు.. నో ఎంట్రీ
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలోకి భక్తులు ఎవరూ సెల్ఫోన్లు తీసుకెళ్లకుండా సెక్యూరిటీ అధికారులు శనివారం చర్యలు చేపట్టారు. స్వామివారి దర్శనార్థం శుక్రవారం ఆలయానికి విచ్చేసిన కామవరపుకోటకు చెందిన ఓ భక్తుడు శ్రీవారి మూలవిరాట్ ఫొటో తీసి, వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడంతో రేగిన కలకలంపై, భద్రతా వైఫల్యాలపై పలు పత్రికల్లో శనివారం కథనాలు ప్రచురితమయ్యాయి. దాంతో అప్రమత్తమైన చీఫ్ సెక్యూరిటీ అధికారి జీవీఎస్ పైడేశ్వరరావు ఉదయం సిబ్బందికి పలు సూచనలిచ్చారు. దాంతో సిబ్బంది భక్తుల సెల్ ఫోన్లను ఆలయంలోకి అనుమతించడం లేదు. ప్రధానంగా ఆలయ తూర్పు రాజగోపురం గేటు వద్ద సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. దాంతో సెల్ఫోన్లు నో ఎంట్రీ అంటూ.. వాటిని కౌంటర్లో భద్రపరచుకోవాలని భక్తులకు సిబ్బంది సూచించారు. ప్రొటోకాల్ కార్యాలయం నుంచి ఆలయంలోకి వెళుతున్న వారి వద్దే ఎక్కువగా ఫోన్లు ఉంటున్నాయి. సాధారణ భక్తులెవరూ ఫోన్లతో ఆలయంలోకి వెళ్లడం లేదు. ఇదిలా ఉంటే అధికారులు ఈ చర్యలను ఇలాగే పకడ్భందీగా కొనసాగించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. వీరవాసరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14, 17 బాలుర క్రికెట్ జట్ల ఎంపికలు ఏలూరు దగ్గర వంగూరు ఏఎన్ఎం క్రికెట్ అకాడమీ గ్రౌండ్స్ నందు ఈనెల 24వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శులు కె.అలివేలుమంగ, డి.సునీత, కే దుర్గాప్రసాద్, పీఎస్ఎన్ మల్లేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు ఉదయం 9 గంటలకల్లా రిపోర్ట్ చేయాలన్నారు. వివరాలకు సెలెక్షన్ ఆర్గనైజర్ రమేష్ రాజు సెల్: 98853 24848లో సంప్రదించాలన్నారు. -
హాస్టల్లో సమస్యలపై కలెక్టర్కు మొర
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే ఏపీ బీసీ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలను శనివారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆమెకు హాస్టల్లోని సమస్యలపై మొర పెట్టుకున్నారు. హాస్టల్లో స్నానానికి సరైన నీళ్లు ఉండడంలేదని, వచ్చిన నీళ్లతో స్నానం చేస్తుంటే చర్మ వ్యాధులు వస్తున్నాయమని ఓ విద్యార్థి తన ఒంటిపై ఉన్న మచ్చలను చూపించారు. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వడంలేదని కొందరు వాపోయారు. టిఫిన్, భోజన సమయాల్లో మంచినీళ్లు ఇవ్వడం లేదని, తిన్నా రెండు గంటలకు నీళ్లు ఇస్తున్నారని తెలిపారు. పుస్తకాలు పెట్టుకోవడానికి సరైన డెస్క్లు లేవని, భోజనంలో సరపడనంత కూరలు వేయడం లేదని, జ్వరం వస్తే కనీసం ధర్మామీటరు కూడా పెట్టి చూడడం లేదని, ఫ్యాన్లు సరిపోవడం లేదని, బాత్రూమ్లకు డోర్లు, లైట్లు లేవని విద్యార్థులు కలెక్టర్కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ముందుగా ఆర్డబ్యూఎస్ అధికారులకు నీటి సమస్య వివరించి పరీక్షలు నిర్వహించాలని డీఈవోకు సూచించారు. లక్ష్యసాధనకు కృషి చేయాలి ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యాన్ని సాధించేలా ఉండాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి విద్యార్థులకు సూచించారు. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులంతా ఒక కుటుంబంలా మెలగాలన్నారు. మొదటి నుంచి ప్రణాళిక ప్రకారం చదువుకుంటే పదవ తరగతి కూడా చిన్నదేనని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ సూత్రాన్ని గుర్తుంచుకుని విద్యపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సమావేశం అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కలెక్టర్ పర్యవేక్షణ చేస్తుండగా కరెంట్ కట్ అవ్వడంతో సెల్ఫోన్ వెలుతురులోనే విద్యార్థులకు భోజనాలు ఏర్పాటుచేశారు. కనీసం జనరేటర్ కూడా వేయకపోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో డీఈవో ఈ నారాయణ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సూరిబాబు, తహసీల్దార్ యడ్ల దుర్గాకిషోర్, ఎంఈవో గుమ్మల్ల వీరాస్వామి, ఆర్ఎమ్ఎన్వీ శర్మ, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జి సూర్యకుమారి, పి శ్రీదేవి, వార్డెన్ కె ప్రవీణ్, వీఆర్వో వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కృత్రిమ గర్భధారణతో మేలు జాతి దూడలు
భీమవరం అర్బన్: రైతులు, పశు పెంపకందారులు పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే పశువుల పెంపకం, వాటి పునరుత్పత్తి అంశంపై తగిన శ్రద్ధ చూపాలి. అప్పుడే పాడి పరిశ్రమ లాభాల బాట పడుతుంది. పాడి పశువు ఈతకు ఈతకు మధ్య 14 –15 నెలల ఎడం ఉంటేనే లాభదాయకంగా ఉంటుందంటున్నారు మండల పశు వైద్యాధికారి పి.పుండరీ బాబు. పశువుల సంతానోత్పత్తి ఎక్కువగా చలికాలంలో ఆస్కారం ఉంటుందని, ముఖ్యంగా ఎక్కువ శాతం గేడెలు చలికాలంలోనే ఎదకు వస్తాయని చెబుతున్నారు. ఎద లక్షణాలు కనిపించన వెంటనే కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్లు వేయిస్తే చూడి కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ఇంకా గేదేలు చూడి కట్టడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. 14 గంటల్లో అండం విడుదల సాధారణంగా ఎదకు వచ్చిన తర్వాత 14 గంటలకు అండం విడుదలవుతుంది. ఎదకు వచ్చిన పశువులను కృత్రిమ గర్భధారణ చేయించే వరకు ఇతర పశువులు దాటకుండా జాగ్రత్త పడాలి. బయటికి వదలకూడదు. ఎద మొదలైన 12 గంటల తర్వాత కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్లు చేయించాలి. ఉదయం ఎదకు వస్తే సాయంత్రం, సాయంత్రం ఎదకు వస్తే మరుసటిరోజు ఉదయం గర్భధారణ చేయించాలి. ఇలా చేయించిన తర్వాత రోజంతా ఇంట్లోనే కట్టి వేయాలి. బయటకు వదలకూడదు. ఎద లక్షణాలు మరుసటి రోజు కూడా కన్పిస్తే తిరిగి రెండోసారి గర్భధారణ చేయించాలి. మూగ ఎద లక్షణాలను గుర్తించాలి పశువుల్లో కృత్రిమ గర్భోత్పత్తి ఫలప్రదం కావాలంటే ఎద లక్షణాలు స్పష్టంగా గుర్తించి సరైన సమయంలో వీర్యదానం చేయించాలి. గేదె నిలకడ లేకుండా తిరుగుతూ, పళ్లు ఇకిలిస్తూ అరుస్తుంటే ఎదకు వచ్చినట్లు గుర్తించాలి. తాడు తెంచుకుని పరుగులు తీస్తుంది. ఇతర పశువులను నాకుతూ వాటిపైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటాయి. పశువు మానం ఉబ్బి పగలు తీగలు వేస్తుంది. తరచుగా మూత్ర విసర్జన చేస్తుంది. ఇలాంటి లక్షణాలు పశువు ఎదకు వచ్చినట్లు గుర్తించేందుకు ఉపయోగపడతాయి. కొన్ని పశువుల్లో ఎదకు వచ్చినా ఈ లక్షణాలు బయటకు స్పష్టంగా కన్పించవు. ఆ పరిస్థితిని మూగ ఎద అంటారు. గేదెల్లో ఎద లక్షణాలు అంత స్పష్టంగా కన్పించవు. కాబట్టి ఎదను గుర్తించడం కొంచెం కష్టం. అటువంటప్పుడు కొన్ని సూచనలు పాటించడం ద్వారా ఎదను గుర్తించి పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలి. వేసెక్టమీ చేసిన దున్నపోతులను నాలుగు గంటల కొకసారి మందలో తిప్పటం ద్వారా గేదెల్లో ఎదను గుర్తించవచ్చు. గేదెలకు ఒకసారి కృత్రిమ గర్భధారణ చేసిన తరువాత తిరిగి మరుసటి రోజుకూడా చేయించడం మంచిది. గేదెలు సాధారణంగా వేసవి కాలంలో ఎదకు రావు. చల్లని వాతావరణం కల్పించినట్లయితే ఎదకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందుకు రోజుకు రెండు మూడు సార్లు చల్లని నీటితో కడగాలి. అవకాశం ఉంటే నీటిలో ఈదించాలి. గేదెలను రెండు మూడు గంటల పాటు చీకట్లో ఉంచితే త్వరగా ఎదకు వచ్చే అవకాశం ఉంటుంది. కృత్రిమ గర్భధారణ చేసిన వెంటనే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు గేదెలను చల్లని నీటిలో కడిగినా, నీటిలో ఈదించినా లేదా నీడలో కట్టివేసినా చూలు నిలిచే అవకాశం ఉంది. కృత్రిమ గర్భధారణ నాటు గేదెలు, ఆవులకు చేయించవచ్చు. నాటు పశువులకు ఎద లక్షణాలు గుర్తించి కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్ వేయిస్తే మేలు జాతి దూడలు వృద్ధి చెందుతాయి. తద్వారా రైతులు, పశు పెంపకం దారులు ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చు. – పి.పుండరీబాబు, పశు వైద్యాధికారి, భీమవరం మండలం -
రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం
తాడేపల్లిగూడెం: అన్నదాత సుఖీభవ కింద పూర్తి సాయం అందించకుండా, కొంత సొమ్ము విదిలించి రాష్ట్రంలోని రైతులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం, ఆక్వా కల్చర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం ధ్వజమెత్తారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల హామీలో ప్రతి రైతుకూ పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు ఇస్తామని ప్రకటించి తొలి ఏడాది ఎగ్గొట్టారన్నారు. రెండో ఏడాది అమలు చేసినా రాష్ట్రంలో 7 లక్షల మందికి కోత విధించారన్నారు. అయినా పూర్తి సాయం చేసినట్టు ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్లలో రాష్ట్రంలో మొత్తంగా 53,58,366 మందికి రూ.34,378 కోట్ల సాయం అందించారన్నారు. అ లాగే అప్పట్లో కౌలు రైతులకూ న్యాయం చేయగా, ప్రస్తుత చంద్రబాబు సర్కారు మొండిచేయి చూపిందన్నారు. ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం సుమా రు రూ.21 వేల కోట్ల సాయం అందించాల్సి ఉండ గా కేవలం రూ.4,685 కోట్లు మాత్రమే ఇచ్చారని, మిగిలిన రూ.16 వేల కోట్లకు పైగా బాకీ పడ్డారన్నారు. ఆక్వా రైతులకూ.. ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ రాయితీ కింద రూ.1.50లు ఇస్తామన్న ప్రభుత్వం వర్తింపజేసే విషయంలో దొంగదారులు వెతుకుతోందని రఘు రాం విమర్శించారు. ఆక్వా జోన్, నాన్ ఆక్వాజోన్ అంటూ, రిజిస్ట్రేషన్లు, మార్గదర్శకాల పేరిట రాయి తీ ఎగ్గొట్టేలా ప్రవర్తిస్తోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఆక్వా రైతులకు అన్యాయం చేయాలని చూస్తే వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆదేశాలతో ఉద్యమానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ రుణాలు, కనీస మద్దతు ధర కోసం స్థిరీకరణ నిధి, ఈ–క్రాప్ విధానం, ఇన్ఫుట్ సబ్సిడీ వంటి సంక్షేమ పథకాలకు మంగళం పాడిన ఘనత చంద్రబాబు సర్కారుకే దక్కుతుందన్నారు. ప్రభుత్వ విధానాలు రైతుల పాలిట శాపంలా మారాయన్నారు. -
కౌలుకోలేని దెబ్బ
నేడు సత్యసాయి ఉత్సవాలు భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో అధికారికంగా ఆదివారం సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఆదివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం: అన్నదాత సుఖీభవ పథకం అమలులో ఎన్నికల హామీని చంద్రబాబు సర్కారు తుంగలోకి తొక్కింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు లక్ష మందికి పైగా కౌలు రైతులు ఉండగా రెండో విడతలోనూ మొండిచేయి చూపింది. కనీసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేకుండా చేసింది. మోంథా తుపాను కలిగించిన కష్టం నుంచి కొంత ఊరట లభిస్తుందన్న వారి ఆశలపై నీళ్లుచల్లింది. సాగులో కష్టం వస్తే మొదటిగా కుదేలయ్యేది కౌలు రైతులే. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్ట డం, వచ్చిన దానిలో అసలు రైతుకు మగతా పోనూ వారికి మిగిలేది అంతంతమాత్రమే. పంట తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలు పంటకు నష్టం కలిగిస్తే అప్పు ల ఊబిలో కూరుకుపోయేదీ కౌలు రైతులే. అసలు రైతులతో పాటు కౌలు రైతులకు అన్నదాత సుఖీ భవ సాయం, ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామంటూ ఎన్నికల్లో కూటమి నేతలు పదేపదే ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక అన్నదాత సుఖీభవ పథకం పోర్టల్లో కౌలు రైతులు దరఖాస్తు చేసుకునే ఆప్షన్ లేకుండా చేయడం గమనార్హం. రెండో విడతలోనూ దగా ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ తొలి విడత సాయా న్ని ప్రభుత్వం విడుదల చేసింది. రెండో విడత నుంచి కౌలు రైతులకు సాయం విడుదల చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు అప్పట్లో కూటమి నేతలు ప్రకటించారు. ప్రస్తుత సీజన్కు గాను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4.03 లక్షల ఎకరాల్లో తొలకరి పంటగా వరి సాగుచేశారు. ఇటీవల వచ్చిన మోంథా తుపాను ప్రభావంతో దాదాపు 45 వేల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. వీరిలో 70 శాతానికిపైగా కౌలు రైతులే ఉంటారని అంచనా. అన్నదాత సుఖీభవ రెండో విడతలో తమకు ప్రభుత్వం సాయం విడుదల చేస్తుందని గంపెడాసతో రైతులు ఎదురుచూస్తున్నారు. తొలి విడతతో కలిపి రాష్ట్రం ప్రభుత్వం నుంచి ఒక్కో కౌలు రైతుకు రూ.10,000 చొప్పున సాయం విడుదల కావాల్సి ఉంది. కాగా రెండో విడతలోనూ చంద్రబాబు సర్కారు కౌలురైతులకు ఎగనామం పెట్టి వారి ఆశలపై నీళ్లు చల్లింది. గతంలో లక్ష్యానికి మించి.. కౌలు రైతులకు గత జగన్ సర్కారు కొండంత అండగా నిలిచింది. అసలు రైతుల మాదిరి రైతుభరోసా, పంటల బీమా పరిహారం తదితర అన్ని రకాల ప్రయోజనాలను అందించింది. భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా కేవలం 11 నెలల కాలానికి సాగు ఒప్పందం చేస్తూ 2011 కౌలు చట్టాన్ని సవరించింది. ఖరీఫ్, రబీ సీజన్కు సంబంధించి ఒకసారి జారీచేసిన కార్డును మరలా యజమాని అంగీకారం మేరకు రెన్యూవల్ చేసుకునే వీలు కల్పించింది. భూ యజమానుల్లో అపోహలు తొలగడంతో జిల్లాలో సీసీఆర్సీ కార్డుదారుల జారీ గణనీయంగా పెరిగింది. 2023–24 సీజన్లో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 84,185 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ లక్ష్యానికి గాను 89,589 కార్డులు జారీచేశారు. జగన్ పాలనలో లక్ష్యానికి మించి కార్డులు జారీ చేస్తే చంద్రబాబు పాలనలో కార్డుల సంఖ్య 72,259కు తగ్గిపోవడం గమనార్హం.నూజివీడులో ఎస్జీఎఫ్ బాలుర, బాలికల అండర్–17 రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. 13 జిల్లాల జట్లు పాల్గొన్నాయి. 8లో uబాబు మార్కు మోసం కౌలు రైతులను దగా చేసిన చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ 2వ విడతలోనూ మొండిచేయి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వని వైనం కౌలు రైతులకు అండగా నిలిచిన గత జగన్ సర్కారు అసలు రైతుల మాదిరి అన్ని ప్రయోజనాలూ వర్తింపు తామరాడకు చెందిన సుమారు పది మంది కౌలు రైతులకు రెండు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం వేసే రైతు భరోసా ఇవ్వలేదు. ఎన్నికల హామీలను చంద్రబాబు సక్రమంగా అమలు చేయకుండా కౌలు రైతులను మోసం చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు మిగిలేది చేసిన అప్పులే. ప్రభుత్వం తక్షణమే కౌలు రైతులను ఆదుకోవాలి. – ఎస్.వెంకటేశ్వరరావు రైతు సంఘం నాయకుడు, పెనుగొండ ఏడాదిన్నరగా కౌలు రైతులకు ప్ర భుత్వం ఎలాంటి సాయం ఇవ్వలేదు. రైతు భరోసాతో పాటు పంటల బీమా దక్కకపోవడంతో కౌలు రైతులు ఆర్థికంగా నలిగిపోతున్నారు. పెట్టుబడుల కోసం అందించే అరకొర సాయం కూడా అందడం లేదు. వ్యవసాయం దండగ అంటూ చంద్రబాబు ప్రభుత్వం కౌలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. – సాక కిసింజర్, కౌలు రైతు, రామయ్యగూడెం, చినకాపవరం, ఆకివీడు మండలం సొంత భూమి అరెకరం ఉంది. నాలుగు ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. గత ప్రభుత్వం రైతు భ రోసా పేరుతో క్రమం తప్పకుండా రూ.13 వేలు మా ఖాతాలో జమ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభవ పేరుతో రూ.7 వేలు ఇస్తామన్నారు. మొదటి, రెండో విడతల సొమ్ములు కౌలు రైతులకు ఇప్పటికీ జమకాలేదు. – గునుపూడి మురళి, కౌలు రైతు, బ్రాహ్మణచెరువు ,పెనుమంట్ర మండలంలక్ష్యానికి దూరంగా గుర్తిపు కార్డుల జారీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెండున్నర లక్షల మందికి పైగా కౌలు రైతులు ఉంటారని అంచనా. చంద్రబాబు పాలనలో కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీ తూతూమంత్రంగా సాగుతోంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం కౌలు రైతుల సంఖ్యను గణనీయంగా తగ్గించేశారు. ఖరీఫ్ ప్రారంభానికి ముందే పశ్చిమగోదావరి జిల్లాలో 1.05 లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా నిర్ణయించింది. కాగా కేవలం 72,259 మందికి మాత్రమే జారీచేశారు. ఏలూరు జిల్లాలో 75,000 కార్డుల జారీ లక్ష్యానికి గాను 60,973 మందికి మాత్రమే గుర్తింపు కార్డులు ఇచ్చారు. -
మాక్ అసెంబ్లీ ఎంపికలో రాజకీయాలు!
● ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం ● రాజకీయ నేతల సిఫార్సులతో ఎంపికలంటూ ఆరోపణలు ● అంతా పారదర్శకమే అంటున్న డీఈఓ భీమవరం: విద్యార్థులకు రాజ్యాంగం, హక్కులపై అవగాహన, రాజకీయాలపై ఆసక్తి కలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మాక్ అసెంబ్లీ రాజకీయ ప్రమేయంతో గందరగోళంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తాయి. మాక్ అసెంబ్లీకి ఎంపిక చేసే విద్యార్థులను ప్రతిభతో కాకుండా రాజకీయ పైరవీలతో ఎంపిక చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భగా మాక్ అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే రాష్ట్రస్థాయిలో అమరావతిలో మాక్ అసెంబ్లీ నిర్వహణకు ప్రతి నియోజకవర్గం నుంచి ఒక విద్యార్థిని ఎంపిక చేసే బాధ్యత విద్యాశాఖకు అప్పగించింది. ఈ మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ వంటి పోటీలు నిర్వహించారు. స్కూల్ స్థాయిలో ప్రతిభ చూపిన ముగ్గురిని మండల స్థాయికి, అక్కడి నుంచి ముగ్గురిని నియోజకవర్గ స్థాయికి అక్కడ అత్యంత ప్రతిభ చూపిన ఒక విద్యార్థిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేయాలి. ఇలా జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఏడుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీలో పాల్గొంటారు. రాజకీయ పైరవీలతో.. అమరావతిలో నిర్వహించే మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేల మాదిరిగా విద్యార్థులు వ్యవహరిస్తూ ఆయా ప్రాంతాల సమస్యలపై మాట్లాడాల్సి ఉంటుంది. అయితే విద్యార్థుల ఎంపికలో రాజకీయాలు చోటుచేసుకున్నాయని, అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కాకుండా కొందరు రాజకీయ నేతల సిఫార్సులతో ఎంపికలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రమేయంతో ఎంపికలు జరిగితే చిన్నతనంలోనే విద్యార్థులకు రాజకీయ కుట్రలు, కుతంత్రాలు, అవినీతిని అలవాటు చేసినట్టు అవుతుందని తల్లిదండ్రుల ఆవేదన చెందుతున్నారు. అమరావతిలో ఈనెల 26న నిర్వహించే మాక్ అసెంబ్లీ లో పాల్గొనే విద్యార్థుల ఎంపిక అంతా పారదర్శకంగా జరిగింది. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రతిభ కనబర్చిన ముగ్గురు విద్యార్థుల జాబితా రాష్ట్రస్థాయికి పంపించాం. అక్కడ విద్యార్థుల ప్రతిభ, హాజరు వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గం నుంచి ఒక్క రిని ఎంపిక చేశారు. ఎంపిక విషయంలో స్థా నికుల ప్రమేయం ఎంతమాత్రం లేదు. –ఈ.నారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం -
రేంజ్లో మావోయిస్టుల బెడద లేదు
తాడేపల్లిగూడెం రూరల్: ఛత్తీస్ఘఢ్ నుంచి మావో యిస్టులు తాత్కాలిక షెల్టర్ నిమిత్తం ఏలూరు వచ్చారని, రేంజ్ పరిధిలో మావోయిస్టుల బెడద లేదని ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ మావోయిస్టుల కదలికలపై పూర్తి సమాచారం ఉందని, ఇక్కడకు రాగానే వారిని అరెస్టు చేశామన్నారు. గతంలో ఏమైనా కేసుల్లో ఉన్నారా? అనే దానిపై విచారిస్తున్నామన్నారు. ఐదేళ్లుగా గంజాయి రవాణా, విక్రయాలకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు లేవన్నారు. నిందితుల పై నిఘా పెట్టామన్నారు. రాత్రి సమయాల్లో డ్రంక న్ డ్రైవ్, ట్రావెల్స్ బస్సుల నిర్వహణ, లారీ డ్రైవర్ల ఫేస్ వాష్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ న్నారు. డిసెంబర్ 31 వరకు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందన్నారు. రేంజ్ పరిధిలో శాంతిభద్రతలు ప్ర శాంతంగా ఉన్నాయన్నారు. రూరల్ స్టేషన్ రికార్డులు సక్రమంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, డీఎస్పీ డి.విశ్వనాథం, సీఐలు ఆదిప్రసాద్, బీబీ రవికుమార్, ఎస్సై జేవీఎన్ ప్రసాద్ ఉన్నారు. -
న్యాయవాదులకు బీమా కల్పించాలి
అత్తిలి: న్యాయవాదులకు మెడికల్ ఇన్సూరెన్స్ను ప్రభుత్వం కల్పించాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) డిమాండ్ చేసింది. శనివారం తణుకు బార్ అసోసియేషన్లో ఐలు జిల్లా కమిటీ సమావేశాన్ని జి.విజయభాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు. ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు దిగ్గుపాటి రాజగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో 50 వేల మంది న్యాయవాదులు ఉన్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ప్రతి మండల పరిధిలో ఒక కోర్టును ఏర్పాటు చేయాలన్నారు. జూనియర్ న్యాయవాదులకు రెండేళ్లుగా ఉపకార వేతనాలు ఇవ్వడం లేదన్నారు. న్యాయవాదులు కామన మునిస్వామి, కౌరు వెంకటేశ్వర్లు, మేక ఈశ్వయ్య, కేఎల్ సత్యవతి, పి.పెద్దిరాజు, పీపీ లక్ష్మీ, పి.లలితకుమారి, పి.మణికంఠ పాల్గొన్నారు. భీమవరం: ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు–2026కు ఫీజు చెల్లింపు, నామినల్ రోల్స్ సమర్పించే విషయంలో సమస్యల పరిష్కారానికి జిల్లాస్థాయి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుచేసినట్టు డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. టెక్నికల్ సమస్యల విషయంలో డి.ఈస్టర్ బాబు ఏఎస్ఓను సంప్రదించాలన్నారు. ఎన్.సత్యనారాయణ, అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, సెల్: 99891 08476, ఎన్వీఎన్కే తిరుపతి రాజు సూపరింటెండెంట్, సెల్: 94919 69299, డి. ఈస్టర్బాబు, ఏఎస్ఓ సెల్: 90102 44677, పి.కుమారస్వామి, సీనియర్ అసిస్టెంట్ సెల్: 94414 85204, డి.ఆశీర్వాదం, ఏపీఓ సెల్: 99496 36680 నంబర్లలో సంప్రదించవచ్చు. జంగారెడ్డిగూడెం: స్థానిక బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న పొడపాటి కావ్య మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ శనివారం ఆమె పోస్టుమార్టం నిర్వహించకుండా ఆందోళన చేశారు. ఏరియా ఆస్పత్రిలో మార్చురీ వద్ద ఆందోళన, శ్రీనివాసపురంలో రాస్తారోకో చేశారు. కావ్య కుటుంబ సభ్యులు, జొన్నవారిగూడెం గ్రామస్తులు, దళిత, విద్యార్థి, ప్రజా సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. కావ్య మృతికి కారణం పాఠశాలలోని ఉపాధ్యాయులని, వారిని పిలిపించి తమతో మాట్లాడించాలని డిమాండ్ చే శారు. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరి కిది కాదని బాలిక తండ్రి గంగాధరరావు, మే నత్త వెంకటలక్ష్మి అన్నారు. ఆందోళన సాయంత్రం వరకు సాగింది. తహసీల్దార్ కే.స్లీవజోజి, సీఐ ఎంఎస్ సుభాష్, ఎస్ఐలు ఎంవీ ప్రసాద్, షేక్ జబీర్, ఎం.కుటుంబరావు, గురుకుల పాఠశాలల జిల్లా కో–ఆర్డినేటర్ బి.ఉమాకుమారి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఒక దళిత విద్యార్థి మృతి చెందితే దళిత ఎమ్మెల్యే కనీసం తమను పలకరించలేదని ఎమ్మెల్యే రో షన్ను ఉద్దేశించి ధ్వజమెత్తారు. చివరికి ఆందోళనకారులకు నచ్చచెప్పి ఆర్డీఓ కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఆర్డీఓ ఎంవీ రమణ మాట్లాడుతూ కావ్య కుటుంబానికి న్యాయం చేస్తామని, న్యాయ విచారణ జరుపుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం కావ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి పోలీస్ బందోబస్తు నడుమ జొన్నవారిగూడెం తీసుకువెళ్లి కుటుంబసభ్యులు అంత్యక్రియలు చేశారు. కొయ్యలగూడెం: వర్జీనియా పొగాకు కొనుగోలు వేలం ప్రక్రియ శనివారంతో ముగిసింది. వేలం కేంద్రానికి 1,592 బేళ్లను రైతులు తీసుకురాగా వాటిని కొనుగోలు చేయడం పూర్తయ్యింది. మొత్తంగా 192 రోజుల్లో రూ.530 కోట్ల వి లువైన 17.87 మిలియన్ల కిలోల పొగాకును రైతుల నుంచి కొనుగోలు చేశారు. సుమారు 25 కంపెనీలు ప్రాతినిధ్యం వహించగా రూ.453 గరిష్ట ధరతో రికార్డు పలికింది. కిలో కు సగటు ధర రూ.296 వచ్చింది. -
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
● రోడ్డుపై గుంతలే ప్రమాదానికి కారణం ● సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు ద్వారకాతిరుమల: మండలంలోని సూర్యచంద్రరావుపేట శివారులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి, రోడ్డు పక్కనున్న తోటలోకి దూసుకెళ్లి కొబ్బరి చెట్టును ఢీకొట్టింది. శనివారం మద్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణికులు, భక్తులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుపై ఉన్న గోతులే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు ఆర్టీసీ డిపోకి చెందిన పల్లెవెలుగు బస్సు విజయవాడ నుంచి ద్వారకాతిరుమలకు వెళుతుండగా మార్గమధ్యంలో ఘటనా స్థలం వద్ద రోడ్డుపై ఉన్న గోతులను తప్పించేందుకు ఓ కారు అకస్మాత్తుగా ఎడమ పక్కకు తిరిగింది. దీంతో వెనుక వస్తున్న బస్సు కారును తప్పించే క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న తోటలోకి దూసుకెళ్లి కొబ్బరి చెట్టును ఢీకొట్టింది. బస్సులో 56 మంది ప్రయాణికులు తీవ్ర భయందోళనకు గురయ్యారు. స్థానికులు బస్సు అత్యవసర ద్వారాన్ని తెరిచి ప్రయాణికులను బయటకు దించారు. ఒకరిద్దరికి స్వల్ప గాయాలు కాగా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఏలూరు ప్రజా రవాణా శాఖ అధికారి ఎస్కే షబ్నం ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రయాణికులను మరో బస్సులో ద్వారకాతిరుమలకు పంపారు. రోడ్డుపై గోతులే కారణం : సూర్యచంద్రరావుపేట శివారులోని మలుపులో ఉన్న గోతుల వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. బైక్లపై క్షేత్రాలకు వెళ్లే భక్తులు ప్రమాదాలబారిన పడుతున్నారు. కార్లు, ఇతర వాహనాలు గోతుల్లో పడి ధ్వంసమవుతున్నాయి. దీంతో పంచాయతీ సిబ్బంది ఈ ప్రాంతంలో సూచికగా ఒక ఎరుపు రంగు పరుపును కర్రల సహాయంతో నిలబెట్టారు. కారు ఈ సూచికను తప్పించే క్రమంలోనే బస్సు ప్రమా దం జరిగింది. రోడ్డును పునర్నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఏలూరు చైత్ర ఆస్పత్రిలో సోదాలు
ఏలూరు టౌన్: స్థానిక అశోక్నగర్లోని చైత్ర హాస్పిటల్పై శనివారం ఆకస్మికంగా ఆరు శాఖల అధికారులు మూకుమ్మడిగా దాడులు చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, జిల్లా వైద్యారోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ, డ్రగ్ కంట్రోల్ అధికారులు, జీఎస్టీ, కార్పొరేషన్ టౌన్ప్లానింగ్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేయడం చర్చనీయాంశమైంది. ఆస్పత్రిలోని మందుల విభాగం, రికార్డులు, ఆరోగ్యశ్రీ పథకం అమలు, భద్రతా చర్యలు, భవన నిర్మాణంలో నిబంధనల అమలు, జీఎస్టీ తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఈ శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టామని, నిర్వహణ, పరిపాలన విభాగాల్లో సోదాలు చేశామని, కొన్ని రికార్డుల్లో లోపాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. అలాగే ఫార్మసీలో కాలం చెల్లిన మందులు గుర్తించారనీ, భవన నిర్మాణంలోనూ నిబంధనలు పాటించలేదనీ, పలు విభాగాల్లో అవకతవకలు జరిగినట్టు ఆధారాలు లభించాయనీ, రికార్డులను స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. గతంలోనూ ఈ ఆస్పత్రిపై పలు అభియోగాలు, ఫిర్యాదు ఉన్నాయని చెప్పారు. ఇదిలా ఉండగా ఏకకాలంలో ఆరు శాఖల అధికారులు దాడులు చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ హరిభగవాన్ వ్యవహార శైలిపైనా జోరుగా చర్చ సాగుతోంది. ఆరోగ్యశ్రీ పథకంలోనూ డబ్బు లు వసూలు చేస్తున్నారనే అపవాదు ఉంది. ఆయన గతంలోనూ పలు వివాదాల్లో కేంద్ర బిందువుగా ఉండటంతో భిన్నమైన చర్చ నడుస్తోంది. -
వైఎస్సార్సీపీలో నియామకాలు
యడ్ల తాతాజీ మహ్మద్ అబీబుద్దీన్పేరిచర్ల విజయ నరసింహరాజు పులుపు అనిల్కుమార్ భీమవరం: భీమవరం మండలానికి చెందిన పేరిచర్ల విజయ నరసింహరాజు (నర్సింబాబు) వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు నియామకం చేసినట్లు కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం తెలిపింది. విజయ నరసింహరాజు భీమవరం మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా తాతాజీ పాలకొల్లు సెంట్రల్: వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా పాలకొల్లుకు చెందిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ యడ్ల తాతాజీని నియమించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. జాయింట్ సెక్రటరీలుగా.. అత్తిలి: ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన పులుపు అనిల్కుమార్, అత్తిలి గ్రామానికి చెందిన మహ్మద్ అబీబుద్దీన్లను పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీలుగా నియమించారు. దీనిపై వారు మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. -
శ్రీవారి క్షేత్రంలో పారిశుద్ధ్య పనులు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సాక్షి దినపత్రికలో శ్రీఖర్చు అరకోటి.. స్వచ్ఛత మాటేంటిశ్రీ శీర్షికతో గురువారం ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. ఆ రోజు అనివేటి మండపంలో తూతూమంత్రంగా నిర్వహించిన పనులపై శుక్రవారం శ్రీశ్రీవారి క్షేత్రంలో హడావుడిగా స్వచ్ఛత పనులుశ్రీ శీర్షికన మరో కథనం ప్రచురితమైంది. దీనిపై ఆలయ అధికారుల ఆదేశాలతో పారిశుధ్య కార్మికులు మళ్లీ అనివేటి మండపంలో దశావతారాల విగ్రహాలను సోప్ ఆయిల్తో శుభ్రం చేశారు. స్వామివారి పాదుకా మండపం వద్ద ఉన్న శ్రీవారి కల్యాణ మండపంలోని శిల్ప సంపదను సిబ్బంది వాటర్ జెట్ మెషిన్తో శుభ్రం చేశారు. సాక్షి కథనాలతో అధికారులు తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంస్థ దిగొచ్చింది. పారిశుధ్య కార్మికుల బ్యాంక్ అకౌంట్లకు శుక్రవారం గత నెల వేతన సొమ్ములను జమ చేసింది. కై కలూరు: పామర్రు – దిగమర్రు(165) జాతీయ రహదారి ఇరువైపుల ప్రైవేటు సంస్థల ప్రచార బోర్డులు వల్ల ప్రమాదాలు జరుగుతున్న తీరుపై ఈ నెల 17న శ్రీప్రచార యావ.. ప్రమాదాలకు తోవశ్రీ అనే శీర్షికతో సాక్షిలో కథనం వెలువడింది. దీనిపై కై కలూరు పంచాయతీ అధికారులు స్పందించారు. ఈవో వై.ప్రసాద్ ఆదేశాలతో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీరంగం సిబ్బందితో కలసి శుక్రవారం తొలగింపు కార్యక్రమం చేపట్టారు. కై కలూరు టౌన్హాలు వద్ద ఏర్పాటు చేసిన ప్రచార బోర్డులను తీసివేశారు. పంచాయతీ ఈవో ప్రసాద్ మాట్లాడుతూ కొంతమంది పంచాయతీకి సమాచారం ఇవ్వకుండా రాత్రి వేళల్లో బోర్డులు రోడ్డు పక్కనే ఏర్పాటు చేస్తున్నారన్నారు. -
రోడ్లు ఘోరం.. ఒళ్లు హూనం
భీమవరానికి చెందిన 25 ఏళ్ల వెంకటేష్ మార్కెటింగ్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ద్విచక్ర వాహనంపై రోజూ 70 కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాడు. కొద్దిరోజుల క్రితం సాధారణంగా మొదలైన వెన్నునొప్పి రానురానూ ఎక్కువైంది. వైద్యుడిని సంప్రదించగా గోతుల రోడ్లతో వెన్నెముక డిస్క్లపై ఒత్తిడి పెరిగినట్టు గుర్తించారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. చేతులెత్తేసిన సర్కారుసాక్షి, భీమవరం: ఇటీవల కాలంలో వెన్ను స మస్యలతో ఆస్పత్రులను ఆశ్రయించే యువత సంఖ్య పెరుగుతోంది. వీరిలో మోటారు సైకిళ్లు, కార్లు, బస్సులు, ఆటోలు తదితర వాహనాల్లో రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారే ఎక్కువగా ఉంటున్నారని వైద్యవర్గాలు అంటున్నాయి. అడుగుకో గుంతతో అధ్వానంగా ఉన్న రోడ్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. గోతులతో వెన్నుపై ఒత్తిడి పెరిగి వెన్నునొప్పి, మెడ నొప్పి, స్లిప్ డిస్క్ సమస్యలకు దారితీస్తున్నాయి. మొదట్లో తేలికపాటిగా మొదలై తర్వాత తీవ్రనొప్పిలోకి దించేస్తున్నాయి. బస్సులు, ఆటోలు తదితర వాహనాల్లో ఈ గోతుల రోడ్లపై కొద్ది దూరం ప్రయాణిస్తే చాలు నడుం పట్టేసిందన్న మాటలే వినిపిస్తున్నాయి. గుంతల్లో పడి వెన్నెపోటు ● వాహనం గుంతలో పడినప్పుడు వెన్నెముకపై ఆకస్మికంగా ఒత్తిడి పడి వెన్నునొప్పి వస్తుంది. ఇది సాధారణ నడుము నొప్పి నుంచి తీవ్రమైన వెన్నునొప్పి వరకు ఉండవచ్చు. ● వెన్నెముక కండరాలు అకస్మాత్తుగా బిగుసుకుపోతాయి, ఇది దీర్ఘకాలిక వెన్ను సమస్యలకు దారితీస్తుంది. ● వెన్నెముక డిస్క్లపై పడే ఒత్తిడి వల్ల అవి బయటకు వచ్చి, నరాలపై ఒత్తిడిని కలిగిస్తాయి. ● నరాలపై ఒత్తిడి వల్ల స్పర్శ కోల్పోవడం లేదా మూత్ర, మల విసర్జనపై నియంత్రణ కో ల్పోవడం వంటి సమస్యలు రావచ్చు. ● రోడ్లపై నిరంతర కుదుపుల వల్ల వెన్నెముక కీళ్లపై ఒత్తిడి పెరిగి, అవి క్రమంగా అరిగిపోతాయి. ● గోతులు, గడ్డల వల్ల ప్రమాదాలు జరిగి వెన్నెముకకు తీవ్రమైన గాయాలు కలిగే అవకాశం ఉంది. ● నడుము నొప్పి చికిత్స, హెర్నియేటెడ్ డిస్క్ సర్జరీ, డిస్క్ రీప్లేస్మెంట్ సర్జరీ, సయాటికా సర్జరీ, స్పైనల్ కార్డ్ ట్రీట్మెంట్, సయాటిక్ నర్వ్ ట్రీట్మెంట్ తదితర శస్త్రచికిత్సలకు దారితీయవచ్చు నని వైద్యులు అంటున్నారు. ● వాహనాల రద్దీతో రోడ్లలో దుమ్ములేచిపోయి ప్రయాణికులు ముక్కుమూసుకుని రాకపోకలు సాగించాల్సి వస్తోంది. శ్వాస సంబంధిత సమస్యలతో పాటు కళ్లల్లో దుమ్ముపడి నరకయాతన చూస్తున్నారు. ఎమ్మెల్యేలకు సెగ చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలలైనా రోడ్ల సమస్య అలానే ఉంది. ఆర్అండ్బీ మంత్రికి చాలాసార్లు చెప్పాం, రోడ్లు బాగుచేయడం లేదని ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది, రోడ్ల్లపై తిరిగే పరిస్థితి లేకుండా ఉంది, రోడ్లు అభివృద్ధికి వెంటనే చర్యలు చేపట్టాలంటూ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రోడ్ల దుస్థితికి అద్దం పడుతున్నాయి. రోడ్లపై ప్రజలు తమను నిలదీస్తున్నారంటూ పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. అత్తిలి పరిసర గ్రామాల నుంచి జిల్లా కేంద్రం భీమవరానికి వెళ్లే ఆర్అండ్బీ రహదారులు అధ్వానంగా మారాయి. అత్తిలి నుంచి వయా ఈడూరు, కంచుమర్రు మీదుగా భీమవరం వెళ్లే రోడ్లు పూర్తిగా పాడవ్వడంతో ఇటుగా ప్రయాణించాలంటే నరకయాతన పడుతున్నాం. భీమవరం వెళ్లి వచ్చేసరికి నడుము నొప్పితో పాటు తీవ్రమైన అలసట వస్తోంది. రోడ్లను ఆధునికీకరించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలి. – బుడితి సుజన్కుమార్, అత్తిలి రోడ్లపై ప్రయాణించాలంటే భయం భయంగా ఉంది. రోడ్లు ధ్వంసంతో ఏదైనా భారీ వాహనం వెళితే పెద్ద ఎత్తున దుమ్ము లేస్తుంది. వెనుక ద్విచక్ర వాహనంపై అదే దుమ్ములోంచి ప్రయాణించాల్సిన దుస్థితి వస్తుంది. కళ్లల్లో విపరీతంగా దుమ్ము పడి వాహనం నడిపేందుకు ఇబ్బందులు పడుతున్నాం. నాసిరకం రోడ్ల మరమ్మతులతో సమస్యలు తప్పడం లేదు. – ఎం.సూర్యారావు, పాలకోడేరు పొలమూరు–నవుడూరు మధ్య రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ రోడ్డుపై ప్రయాణికులు క్షతగాత్రులు అవ్వడమే కాకుండా మృత్యువాత కూడా పడుతున్నారు. తరచూ ప్రయాణించే వారు వెన్ను సమస్యలతో బాధపడుతున్నారు. దుమ్ము, ధూళితో అనారోగ్యాల పాలవుతున్నారు. దాతలు ముందుకు వచ్చి మరమ్మతులు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. – మేనిడి సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచ్, పోలమూరు, పెనుమంట్ర మండలం నడుం పడిపోతోంది జిల్లాలో అధ్వానంగా రోడ్లు వాహన చోదకులు, ప్రయాణికులకు వెన్ను సమస్యలు వైద్యులను ఆశ్రయిస్తున్న వారిలో యువతే అధికం మూణ్ణాళ్ల ముచ్చటైన రూ.42 కోట్ల మరమ్మతులు జిల్లాలో ఆర్అండ్బీ పరిధిలో 457 కి.మీ మేర స్టేట్ హైవే, 1,108 కి.మీ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు ఉన్నాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం తదితర కార్యకలాపాల నిమిత్తం రోజూ వేలాది మంది ఈ రోడ్లు మీ దుగానే రాకపోకలు సాగించాలి. అధికారంలోకి రావడమే ఆలస్యం రోడ్లను అద్దంలా మార్చేస్తాం. ఎక్కడా గుంతలన్నవే లేకుండా చేస్తామని చెప్పిన చంద్రబాబు సర్కారు చేతులెత్తేసింది. రూ.42.57 కోట్లతో 160 కి.మీ స్టేట్ హైవే, 538 కి.మీ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లలో మరమ్మతులతో సరిపెట్టింది. చాలా చోట్ల నాసిరకంగా పనులు చేయడంతో కొద్దిరోజులకే రాళ్లు పైకిలేచి రోడ్డంతా చెల్లాచెదురై గోతులు మళ్లీ మొదటికొచ్చాయి. జిల్లాలోని తాడేపల్లిగూడెం–పత్తిపాడు, భీమవరం–తాడేపల్లిగూడెం, మోగల్లు– అత్తిలి, బ్రాహ్మణచెరువు–వీరవాసరం, సిద్దాంతం–పెనుగొండ, పెదకాపవరం–క్రొవ్విడి, నౌడూరు– కొండేపూడి తదితర రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. పెద్దపెద్ద గోతులతో ప్రయాణికులను ప్రమాదాలకు గురిచేస్తున్నాయి. ద్విచక్ర వాహన చోదకుల తో పాటు ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ఇతర వాహనాల్లో ప్రయాణించేవారు భారీ కుదుపులకు లోనవుతున్నారు. రోజూ ప్రయాణాలు సాగించేవారు నడుం నొప్పి, వెన్నునొప్పితో బాధపడుతున్నామ ని, వాహననాలు తరచూ మరమత్ములకు గురవుతున్నాయని వాపోతున్నారు. -
స్వార్థంతోనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ
నరసాపురం రూరల్: చంద్రబాబు ప్రభుత్వం స్వార్థం కోసమే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. శుక్రవారం మండలంలోని వేములదీవి వెస్ట్ గ్రామంలో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమే చంద్రబాబు పన్నాగమని విమర్శించారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేసిన వైద్య కళాశాలలను నిర్మించే సామర్థ్యం చంద్రబాబు ప్రభుత్వానికి లేక, కమీషన్లు దండుకునేందుకు ప్రైవేటుపరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, భవిష్యత్తులో ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం ఖాయమన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఇప్పటికే నియోజకవర్గంలోని పలు పంచాయతీల్లో కోటి సంతకాల కార్యక్రమంలో సంతకాలు సేకరించామన్నారు. అధిక సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోరాటానికి మద్దతు పలకడం అభినందనీయమన్నారు. నాయకులు పీడీ రాజు, ఉంగరాల ర మేష్, దొండపాటి వెంకట్, ఓడుగు సత్యనారాయణ, మైలాబత్తుల శ్రీను, కడలి రాంబాబు, దొంగ మురళి, అండ్రాజు చల్లారావు, తిరుమాని నాగరాజు, అడ్డాల నర్సింహరావు, గాది సుధారాణి పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం
భీమవరం: భీమవరం సమగ్ర శిక్షలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు అడిషినల్ ప్రాజెక్ట్ ఆఫీస్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో శుక్రవారం వినతిపత్రం అందించారు. జిల్లా సమగ్ర శిక్ష కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు బావాజీ మాట్లాడుతూ తక్కువ జీతాలతో ఉద్యోగులు కుటుంబాలను పోషించుకోలేని దయనీయ పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం మినిమం టైం స్కేల్ హామీ అమలు చేయకుంటే ఊరుకోబోమన్నారు. తక్షణమే మినిమం టైమ్ స్కేల్, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, లేకుంటే పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. భీమవరం: ఆరుగాలం కష్టపడి పంటలు పండించే కౌలు రైతులను పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయాన్ని భూస్వాములకు, భూయజమానులకు అందించడాన్ని ఏపీ కౌలురైతుల సంఘం జిల్లా కమిటీ తీవ్రంగా విమర్శించింది. ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు శుక్రవా రం ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ క ల్యాణ్ రాష్ట్రంలో కౌలు రైతులను పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఎన్నికలకు ముందు తప్పుడు వా గ్దానాలు చేసి కౌలు రైతులను నిలువునా మో సం చేశారని విమర్శించారు. కౌలు రైతులు, పేద రైతులను గుర్తించి తక్షణమే అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు. భీమవరం: పదో తరగతి పరీక్షల కోసం ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పాఠశాలల పనిదినాల్లో మాత్రమే అమలు చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ ఎల్వీ చలం కోరారు. ప్రణాళికను బలవంతంగా అమలు చేయరాదని, గతేడాది ప్రకటించిన సీసీఎల్ కూడా ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. విద్యార్థులు మానసికంగా ఆనందంగా ఉంటేనే ప్రణాళిక ఉద్దేశం నెరవేరుతుందన్నారు. సెలవు రోజుల్లో ప్రణాళిక ఉపసంహరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భీమవరం: పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను డీఈఓ ఈ.నారాయణ శుక్రవారం పత్రికలకు విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 16న ప్రారంభం కానున్న పరీక్షల వివరాలు ఇలా ఉన్నాయి. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు వ రకూ జరుగనున్నాయి. 16న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1 (గ్రూప్ ఎ), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1 (కాంపోసిట్ కోర్స్), 18న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లిష్, 23న మేథమెటిక్స్, 25న ఫిజికల్ సైన్స్, 28న బయోలాజికల్ సైన్స్, 30న సోషల్ స్టడీస్, 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2 (కాంపోజిట్ కోర్సు), ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1 (సాంస్కృతం, అరబిక్, పర్సియన్), 1న ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–2 (సాంస్కృతం, అరబిక్, పర్సియన్), ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్స్ (థియరీ) పరీక్షలు నిర్వహించనున్నారు. పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టును శుక్రవారం కేంద్ర జల సంఘం ప్రతినిధులు పరిశీలించారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర జలసంఘం డిజైన్లు, పరిశోధన విభాగం సభ్యుడు ఆదిత్య శర్మ, కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్ ఎస్ఎస్ భక్షిలతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి ఎం.రఘురాం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులో జరుగుతున్న ప్రతి పనినీ క్షుణ్ణంగా పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు, డిజైన్ల ప్రకారం ఏ విధంగా, ఎంతవరకు జరుగుతున్నాయి అనే విషయాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీరికి జలవనరుల శాఖ ఈఎన్సీ కె.న రసింహమూర్తి, ఎస్ఈ కె.రామచంద్రరావు, క్వాలిటీ కంట్రోల్ విభాగం సీఈ కె.శేషుబాబు పనుల వివరాలను తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుంచి మొత్తం పనుల వివరాలను కేంద్ర బృందానికి జలవనరుల శాఖ అధికారులు చూపించి వివరించారు. -
డిసెంబరు 13న లోక్ అదాలత్
భీమవరం: రాజీ చేసుకుంటే ఇరుపార్టీలు నెగ్గినట్లేనని, రాజీ వల్ల కాలం, వ్యయం ఆదా అవుతాయని భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ బి.లక్ష్మీ నారాయణ అన్నారు. తీయ లోక్ అదాలత్లో కేసుల రాజీకి తీసుకుంటున్న చర్యలపై శుక్రవారం న్యాయమూర్తి పత్రికా సమావేశం నిర్వహించారు. ముందస్తు లోక్ అదాలత్ సిట్టింగులు పెట్టి కేసులు రాజీకి ప్రయత్నం చేస్తున్నామని, జాతీయ లోక్ అదాలత్ ఒక మంచి అవకాశం కాబట్టి కక్షిదారులు వినియోగించుకోవాలన్నారు. విద్యార్థులకు శ్రీభారత రాజ్యాంగం–సామాజిక బాధ్యత్ఙ అంశంపై వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించామన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణుల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు నవంబరు 26న మెమోంటో, సర్టిఫికెట్స్ ఇస్తామన్నారు. కార్యక్రమంలో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జి.సురేష్ బాబు, 1వ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పి.హనీష, 2వ అదనపు జ్యుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఎన్.జ్యోతి పాల్గొన్నారు. ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో భద్రతా వైఫల్యం కారణంగా ఓ భక్తుడు శుక్రవారం శ్రీవారి మూలవిరాట్ను సెల్ఫోన్తో ఫొటో తీశాడు. ఫొటో వాట్సప్ స్టేటస్లో పెట్టడంతో కలకలం రేగింది. కామవరపుకోటకు చెందిన ఓ భక్తుడు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నాడు. బయటకు వెళ్లే సమయంలో సెల్ఫోన్తో మూలవిరాట్్ను ఫొటో తీశాడు. దేవస్థానం సిబ్బంది గమనించక పోవడంతో బయటకు వెళ్లిపోయాడు. ఫొటోను వాట్సప్ స్టేటస్గా పెట్టుకున్నాడు. భక్తులు ఆలయంలోకి సెల్ఫోన్లు తీసుకెళ్లడంపై నిషేధం ఉంది. కొందరు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పలువురు భక్తులు ఫోన్లతోనే ఆలయంలోకి వెళ్లిపోతున్నారు. మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేయకపోవడం, సీసీ కెమేరాల పర్యవేక్షణ లోపం కూడా ఇందుకు ఒక కారణమని అంటున్నారు. -
అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
అత్తిలి: తణుకు పట్టణంలో ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడులలో తణుకు మూడో వార్డు టి.వేమవరం రోడ్డులో సకినాల వెంకట దుర్గ తాతేశ్వరరావును అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఎస్.మణికంఠ రెడ్డి తెలిపారు. అతని నుంచి మూడు బాటిల్స్ విదేశీ మద్యం, 3 బాటిల్స్ డిఫెన్స్ మద్యం, రెండు బాటిల్స్ తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు హైదరాబాదు నుంచి మద్యం బాటిల్స్ని తీసుకొని వచ్చి తణుకు పరిసర ప్రాంతాలలో అధిక ధరకు విక్రయిస్తున్నారనే సమాచారంపై అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. -
శివాలయంలో ప్రతిష్ఠ మహోత్సవాలు
ద్వారకాతిరుమల: క్షేత్రపాలకుడైన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో నూతన రాజగోపుర శిఖర ప్రతిష్ఠ మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయం ముందు తాత్కాలికంగా నిర్మించిన యాగశాలలో పండితులు ఉదయం 9.30 గంటలకు గణపతి పూజ నిర్వహించి, ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పుణ్యాహవాచన, పంచగవ్యప్రాసన, దీక్షధారణ, యాగశాల సంస్కారం, ప్రధాన దేవత ఆవరణ మండపారాధనలు, అగ్నిప్రతిష్ఠాపన, అఖండదీప స్థాపన, పంచగవ్యాదివాసం, బలిహరణ, నీరాజన మంత్రపుష్పాలను వేద మంత్రోచ్ఛరణలతో వైభవంగా నిర్వహించారు. యాగశాలలో వేదికపై ఆశీనులైన స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు, శిఖర కలశాలకు ఆలయ అర్చకులు పూజాధికాలు జరిపారు. దేవస్థానం ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి, డీఈఓ భద్రాజీ, ఏఈఓ రమణరాజు, సూపరింటిండెంట్ దుర్గాప్రసాద్ తదితరులున్నారు. -
ఉత్సాహంగా బాస్కెట్బాల్ పోటీలు
నూజివీడులో బాస్కెట్బాల్ పోటీలను ప్రారంభించి మాట్లాడుతున్న డీఈఓ వెంకటలక్ష్మమ్మ పోటీల్లో తలపడుతున్న కృష్ణ, ప్రకాశం బాలుర జట్లు నూజివీడు: రాష్ట్రస్థాయి బాస్కెట్ పోటీలు నూజివీడులో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని బేతస్థ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో 13 ఉమ్మడి జిల్లాల నుంచి బాలుర, బాలికల జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. బాస్కెట్బాల్ పోటీలను జిల్లా డీఈఓ వెంకటలక్ష్మమ్మ ప్రారంభించి మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుతో పాటు క్రీడల్లో కూడా తర్ఫీదు ఇప్పించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, డీవైఈఓ పీఎస్ సుధాకర్, బేతస్థ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కరస్పాండెంట్ బండి శ్యామ్, ఎస్జీఎఫ్ ఏలూరు జిల్లా సెక్రటరీ అలివేలు మంగ, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ఏలూరు జిల్లా సెక్రటరీ ఐ.రమేష్, అబ్జర్వర్ డీ కృష్ణమోహన్, కార్యనిర్వాహక కార్యదర్శి వాకా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహభరితంగా పోటీలు బాలికల, బాలుర జట్ల మధ్య బాస్కెట్బాల్ పోటీలు ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి. బాలికల విభాగంలో గుంటూరు జట్టు విజయనగరం జట్టుపై 38–04 తేడాతో, పశ్చిమగోదావరి జట్టు చిత్తూరు జట్టుపై 30–19 తేడాతో, తూర్పుగోదావరి జట్టు శ్రీకాకుళంపై 31–2 తేడాతో, అనంతపురం జట్టు ప్రకాశం జట్టుపై 15–0 తేడాతో, కృష్ణా జట్టు వైఎస్సార్ కడప జట్టుపై 15–3 తేడాతో గెలుపొందాయి. బాలుర విభాగంలో తూర్పుగోదావరి జట్టు శ్రీకాకుళంపై 30–3 తేడాతో, వైజాగ్ జట్టు చిత్తూరుపై 33–30తో, నెల్లూరు జట్టు వైఎస్సార్ కడపపై 22–10తో, పశ్చిమగోదావరి జట్టు విజయనగరంపై 27–0తో, కృష్ణా జట్టు ప్రకాశంపై 33–05 తేడాతో గెలుపొందాయి. -
పేదలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర
ఏలూరు (టూటౌన్) : రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన 18 నెలల వ్యవధిలో రూ.2.50 లక్షల కోట్లు అప్పు తెచ్చిందని, దీనిలో రూ.4 వేల కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయని, తద్వారా 2 వేల మెడికల్ సీట్లు రాష్ట్రంలోని విద్యార్థులకు అందుబాటులో ఉండేవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు. ఏలూరులోని సీపీఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ కాలేజీలు పూర్తయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇది వదిలేసి ప్రైవేట్ వ్యక్తులకు వీటిని కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. హామీలన్నీ గాలికొదిలేశారు.. కూటమి నేతలు ఎన్నికలకు ముందు అనేక అంశాలపై వాగ్దానాలు చేశారని, అధికారంలోకొచ్చిన తర్వాత వాటిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. గిట్టుబాటు ధరలు లేక ఉద్యాన పంటలు పండించే రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారని, పెరిగిన నిత్యావసరాలు, కూరగాయల ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారని ఆయన చెప్పారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. రాష్ట్రంలో విద్యారంగం నేడు మరణ శయ్యపై ఉందని, వేలాది ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, నేడు ఆ మాటే మర్చిపోయారని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేనప్పుడు వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను బెదిరించడం తగదు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను బెదిరించినట్టు మాట్లాడటం తగదని ఈశ్వరయ్య అన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎందరో ప్రాణత్యాగాలతో ఏర్పడి, లక్ష కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసేందుకు పావులు కదపడం అత్యంత దుర్మార్గమన్నారు. ఎన్నికలకు ముందు జూలు విదిల్చి ప్రశ్నిస్తా, ఆరేస్తా అంటూ ప్రగల్భాలు పలికిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో నోరుమెదపరేమని ప్రశ్నించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య కేంద్రంలోని మోదీ–షా ప్రభుత్వం నరమేధానికి పాల్పడుతోందని ఈశ్వరయ్య దుయ్యబట్టారు. లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్న మావోయిస్టులను పట్టుకుని అడవిలోకి తీసుకెళ్ళి బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం చేస్తున్నది అత్యంత దుర్మార్గం, దారుణమని చెప్పారు. డిసెంబర్ 26న ఖమ్మం జిల్లాలో సీపీఐ శత వార్షికోత్సవాల సభను ఐదు లక్షల మందితో నిర్వహిస్తున్నట్టు ఈశ్వరయ్య చెప్పారు. ఈ సందర్భంగా లక్ష మంది వలంటీర్లతో కవాతు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శ్రీనివాస డాంగే, తొర్లపాటి బాబు, నిమ్మగడ్డ నరసింహ, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు చలసాని వెంకట రామారావు పాల్గొన్నారు. -
మద్ది క్షేత్రంలో ముగిసిన కార్తీక మాసోత్సవాలు
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న కార్తీక మాసోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఆఖరిరోజు స్వామి వారిని దర్శిచుకునేందుకు జంగారెడ్డిగూడెం మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా నెలరోజుల పాటు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన అధికారులకు, ఆయా శాఖల సిబ్బందికి ఈవో ధన్యవాదాలు తెలిపారు. మండవల్లి: మోటార్సైకిళ్ల చోరీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీసు స్టేషన్ వద్ద సీఐ రవికుమార్ గురువారం వివరాలను వెల్లడించారు. మండవల్లి, లోకుమూడి, మణుగునూరు గ్రామాల్లో మోటారు సైకిళ్లు చోరీ జరుగుతుండడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కొవ్వాడలంక వద్ద ముగ్గురు నిందితలను ఎస్సై రామచంద్రరావు అరెస్టు చేశారు. నిందితులు పల్నాడు జిల్లా బొల్లపల్లి మండలం గంగుపల్లి తండాకు చెందిన రామవత్ దుర్గాప్రసాద్ నాయక్, (మైనర్ బాలుడు), సీతారామపురం తండాకు చెందిన బాణావత్ తులసిబాబునాయక్గా గుర్తించారు. నిందితుల నుంచి 5 బైకులు, రూ.7 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అత్తిలి: రాష్ట్రంలో దివ్యాంగులు తమ వైకల్యం శాతం నిర్ధారణ పరీక్షల కోసం నెలలు తరబడి వేచి చూస్తూ అనేక ఇబ్బందులకు గురౌతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు బుడితి సుజన్ కుమార్ పేర్కొన్నారు. సదరం స్లాట్ బుకింగ్ ఆన్లైన్లో మాత్రమే అమలులో ఉన్నందున సాంకేతికమైన కారణాలతో స్లాట్ బుకింగ్ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోతుందని దీంతో దివ్యాంగులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని, సదరం స్లాట్ బుకింగ్ను ఆఫ్లైన్లో కూడా అమలు చేసేలా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించాలని కోరారు. నూతన పింఛన్లు కోసం నిరంతరం దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టాలని, వెరిఫికేషన్ వెనువెంటనే పూర్తి చేసి దివ్యాంగులకు ఫించన్ మంజూరు చేయాలని సుజన్కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. -
కుష్టు వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా..
● ఇంటింటి సర్వే చేపట్టిన వైద్య సిబ్బంది ● జిల్లా వ్యాప్తంగా 1,390 టీంలతో సర్వే ● మందులు వాడుతున్న 42 కేసులు, 1,535 అనుమానిత కేసుల గుర్తింపు భీమవరం (ప్రకాశం చౌక్): జిల్లాలో కుష్టు (లెప్రసీ) వ్యాధిని కట్టడి చేసేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు ఈనెల 17 నుంచి ఇంటింటి సర్వే చేపట్టారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి అనుమానిత కేసులను నమోదు చేసి నిర్థారణ పరీక్షలకు సిపార్సు చేస్తున్నారు. ఈ సర్వే ఈనెల 30వ తేదీ వరకూ జరగనుంది. జిల్లాలో 1,395 టీంలు లెప్రసి సర్వే చేస్తూ ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఒక్కో టీంలో ఆశా వర్కర్ తోపాటు మేల్ వలంటీర్ ఉంటారు. ఇప్పటివరకు 6 వేల ఇళ్లు సర్వే చేసి దాదాపు 2,56,909 మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేశారు. కుష్టు అంటువ్యాధి కాదు కుష్టు అంటువ్యాధి కాదని, సకాలంలో గుర్తించి చికిత్స చేస్తే త్వరితగతిన అదుపు చేయవచ్చని వైద్యాధికారులు చెబుతున్నారు. వ్యాధి బారిన పడిన విషయం నలుగురికి తెలిస్తే ఇబ్బందిగా ఉంటుందనే భయంతో చాలా మంది ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం, శరీరంపై వచ్చే మచ్చలు గురించి తెలియకపోవడం, అవగాహన లేకపోవడంతో వ్యాధి ముదిరిపోయే ప్రమాదం ఉంది. శరీరంపై వచ్చే సర్శ లేని రాగి మచ్చలు ఉంటే వెంటనే వైద్యులకు చూపించుకొవాలని నిర్లక్ష్యం చేయరాదని వైద్యులు చెబుతున్నారు. 2022–23 సంవత్సరంలో 96, 2023–24లో 133, 2024–25లో 89 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో నిర్వహిస్తున్న సర్వేలో ఇప్పటివరకు 42 కొత్త కేసులు గుర్తించగా 1535 అనుమానిత కేసులు గుర్తించారు. పాత కేసులు జిల్లాలో 633 ఉన్నాయి. మందులు వాడుతున్న 42 కేసుల్లో మల్టి బ్యాసిలరి(ఎంబి) కేసులు 15, పాసివ్ బ్యాసిలరీ(పీబీ) 27 కేసులు ఉన్నాయి. వ్యాధి లక్షణాలు ● చర్మంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు. చెవులపై బుడిపెలు, కణుతులు, నరాల తిమ్మిర్లు. ● మందమైన మెరిసే జిడ్డుగల చర్మం ● కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం. ● కనురెప్పలు మూత పడకపోవడం. ● చేతులు, కాళ్లలో బొబ్బలు రావడం. ● చేతి, కాలివేళ్లు వంకర్లు తిరిగి అంగవైకల్యం రావడం. ● కాళ్ల చెప్పులు జారిపోవడం ● చల్లని, వేడి వస్తువులను గుర్తించలేకపోవడం. ● పాదాలు, మడమల్లో వాపు. ● ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి రక్తం కారడం. చికిత్స విధానం కుష్టు వ్యాధికి రెండు పద్ధతుల్లో చికిత్స అందిస్తారు. శరీరంపై మూడు మచ్చలు ఉన్నవారికి పాసివ్ బ్యాసిలరీ (పీబీ) విధానంలో ఆరు నెలల పాటు చికిత్స అందిస్తారు. ఐదు మచ్చలకు పైబడి ఉన్నవారికి మల్టీ బ్యాసిలరీ (ఎంబీ) విధానంలో 12 నెలల చికిత్స అందిస్తారు. దీనిలో భాగంగా నెలకు ఒకసారి మందులు రోగుల ఇళ్లకు వెళ్లి వైద్య సిబ్బంది అందిస్తారు. సర్వేలో గుర్తించిన రోగులకు సకాలంలో వైద్యం అందజేయడంతోపాటు ఆ వ్యాధిపై వారికి, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తారు. బహుళ ఔషధ చికిత్స (మల్టీ డ్రగ్ థెరపీ) ద్వారా వ్యాధిని అరికడుతున్నారు. వ్యాధికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా మందులు అందిస్తున్నారు. 2027 నాటికి కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని, జీరో కేసు నమోదువాలని లక్ష్యంతో ప్రతి ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నాం. ప్రజలు కూడా దీనికి సహకరించాలి. ప్రారంభ దశలో మచ్చలను గుర్తిస్తే కుష్టుని పూర్తిగా నిర్మూలించవచ్చు. అశ్రద్ధ చేస్తే అంగవైకల్యం రావచ్చు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని బహుళ ఔషధ చికిత్స ద్వారా పూర్తిగా కుష్టుని నిర్మూలించవచ్చు. స్పర్శ లేని రాగి రంగి మచ్చలు చెమట పట్టని మచ్చలు ఉన్నా వెంటనే సమీప ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలి. – డాక్టర్ రవిబాబు, జిల్లా కుష్టు నిర్మూలన అధికారి, భీమవరం -
నిర్మల భక్తికి ఫలం.. పోలి స్వర్గం
నిడమర్రు: హరిహరులకు ఇష్టమైన కార్తీకమాసం ఎన్నో రకాలుగా విశిష్టమైనది. ఈ మాసంలో ప్రతి రోజు పుణ్యప్రదమని పురాణాలు చెబుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న శివకేశవ ఆలయాల్లో ఈ నెలంతా దైవారాధనలూ, దీపారాధనలూ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అయితే ‘పోలి స్వర్గం’ తెలుగువారికే ప్రత్యేకం. నిర్మలమైన భక్తికి, నిస్వార్థ దీపారాధనకూ ఉన్న ప్రాధాన్యాన్ని ఈ సంప్రదాయం చాటి చెబుతుంది. గురువారంతో కార్తీక మాసం పూజలు ముగిశాయి. గురువారం మధ్యాహ్నం అమావాస్య ముగియడంతో మార్గశిర పాడ్యమి ప్రారంభమైంది. దీంతో శుక్రవారం తెల్లవారు జామున పోలి స్వర్గానికి సాగనంపేందుకు మహిళా భక్తులు సిద్ధమయ్యారు. ముగింపులో దీపారాధన ఈ మాసం ముగింపు సందర్భంగా వత్తులతో దీపాలను వెలిగిస్తారు. అలాగే భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది. కార్తీక అమావాస్య నాడు మహిళలు వేకవజామునే లేచి స్నానాధులు ముగించి దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం పోలిని సర్వానికి పంపే వేడుకను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆరటి దొప్పలతో దీపాలను వెలిగిస్తారు. వాటిని సమీపంలో ఉన్న నదిలో, చెరువులో లేదా ఇతర జనవనరుల్లో వదిలి పెడతారు. ఆ అవకాశం లేని వారు ఇంట్లోనే పళ్లాలలో నీరు పోసి, వాటిలో దీపాలు విడిచి పెడతారు. పోలిని లక్ష్మీ స్వరూపంగా ఆరాధిస్తారు. కాబట్టి కార్తీక అమావాస్య రోజుకు బదులు ఆ మరుసటి రోజు, అంటే మార్గశిర శుద్ధ పాడ్యమినాడు పోలి పేరిట దీపాలను వెలిగిస్తారు. పోలి కథను చెప్పుకుంటూ శుక్రవారం వేకువజాము నుంచి ఆ దీపాలను నీటిలో వదులుతారు. కార్తీకమాసం నెలంతా దీపాలు వెలిగించడం పుణ్యప్రదం. అయితే అలా చేయలేనివారు. ఈ రోజు 30 వత్తులతో దీపాల్ని వెలిగించి, నీటిలో విడిచిపెడితే, నెల రోజులూ దీపాలు వెలిగించిన ఫలితం వస్తుందని స్కంద పురాణంలో పేర్కొన్నారు. అలాగే దీపాలనూ, స్వయం పాకాన్నీ దానం చేయడం వలన విశేష ఫలం లభిస్తుందంటారు. – తిరుమల శేషాచలం, అర్చకులు, నిడమర్రు ముగిసిన కార్తీక మాసోత్సవం పోలిని స్వర్గానికి సాగనంపేందుకు సిద్ధమైన భక్తులు నేడు శివకేశవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు -
మెమరీ చాంపియన్ షిప్లో కాంస్య పతకాలు
జంగారెడ్డిగూడెం: ఈనెల 15, 16 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించిన ఏషియా ఓపెన్ మెమరీ చాంపియన్షిప్లో ప్రతిభ స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ సుభాష్, ప్రతిభా సరోజ్ కాంస్య పతకాలు సాధించారు. ఈ పోటీలను ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎంఎఫ్ఎస్), ఏషియా మెమరీ స్పోర్ట్స్ అలయన్స్ (ఏఎంఎస్ఏ) సంయుక్తంగా నిర్వహించాయి. భారత్తో పాటు ఫిలిప్పీన్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, అమెరికా దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో టీమ్ ఇండియా తరుఫున సుభాష్, సరోజ్ ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం వహించారు. కిడ్స్ కేటగిరీలో ప్రతిభ సరోజ్, అడల్డ్స్ కేటగిరీలలో సుభాష్ ఇద్దరూ బైనరీ నంబర్స్, రాండమ్ వర్డ్స్, స్పోకెన్ నెంబర్స్, రాండమ్ నెంబర్స్, రాండమ్ కార్డ్స్ ఈ ఐదు విభాగాల్లో కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెంలో వీరిని సత్కరించి పలువురు అభినందనలు తెలిపారు. -
శ్రీవారి క్షేత్రంలో హడావుడిగా స్వచ్ఛత పనులు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో గురువారం ఆగమేఘాలపై స్వచ్ఛత పనులు చేపట్టారు. సాక్షి దినపత్రికలో ‘ఖర్చు అరకోటి.. స్వచ్ఛత మాటేంటి’ శీర్షికతో గురువారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై కలెక్టర్ కె.వెట్రిసెల్వి స్పందించారు. పారిశుద్ధ్య పనులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉంటే ఉదయాన్నే పారిశుద్ధ్య కార్మికులు ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలోని శ్రీవారి దీపారాధన మండపాన్ని శుభ్రం చేసే పనులు చేపట్టారు. సెక్షన్ సూపరింటెండెంట్ ఐవీ రామారావు దగ్గరుండి పనులు చేయించారు. మద్యాహ్నం నుంచి అనివేటి మండపాన్ని, మండపంలోని దేవతామూర్తుల విగ్రహాలను ఒక మెషీన్ ద్వారా హడావిడిగా శుభ్రం చేసే పనులు నిర్వహించారు. అయితే వాటిని శుభ్రం చేసేందుకు సక్రమంగా సోపాయిల్ వినియోగించక పోవడం వల్ల, కడిగిన విగ్రహాలు తడి ఆరిన తరువాత మళ్లీ దుమ్ముతో కనిపించాయి. మెషీన్ సామర్థ్యం చాలక మండప పైభాగాలను కూడా సరిగ్గా కడగలేక పోయారు. దాంతో విగ్రహాలపైన, మండప పైభాగాల్లో ఎక్కడ దుమ్ము.. అక్కడే ఉంది. చంద్రబాబు సర్కారు లక్షలాది రూపాయలను కాంట్రాక్టర్లకు దోచిపెడుతూ, పారిశుద్ధ్యాన్ని గాలికొదిలేసిందని పలువురు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే పారిశుద్ధ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను రెండు రోజుల్లోగా అందిస్తామని కలెక్టర్కు ఆలయ అధికారులు సమాదానం ఇచ్చినట్టు తెలిసింది. అలాగే రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్కు దీనిపై వాస్తవ పరిస్థితులను లేఖ ద్వారా తెలిపినట్టు సమాచారం. ఇక పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (తిరుపతి) సంస్థకు నోటీసు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. -
శ్రీవారి క్షేత్రంలో అమావాస్య ఎఫెక్ట్
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీపై గురువారం అమావాస్య ఎఫెక్ట్ చూపింది. కార్తీకమాస పర్వదినాలను పురస్కరించుకుని గత నెలరోజులుగా స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అమావాస్య కావడంతో గురువారం ఆలయానికి భక్తుల రాక స్వల్పంగా ఉంది. దాంతో మధ్యాహ్నం ఆలయ పరిసరాల్లో నామమాత్రంగా భక్తులు సంచరించారు. ఆ తరువాత నుంచి దాదాపుగా అన్ని విభాగాలు ఖాళీగా మారాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అనివేటి మండపం, ఉచిత ప్రసాద వితరణ క్యూలైన్లు, కల్యాణ కట్ట తదితర విభాగాలు భక్తుల లేమితో వెలవెలబోయాయి. -
వైఎస్సార్ సీపీలో నేతలకు పదవులు
తణుకు అర్బన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలో జిల్లాకు చెందిన నేతలకు వివిధ పదువులు కేటాయిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. తణుకుకు చెందిన పొట్ల సురేష్ను రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శిగా, అడ్డా వెంకట సూర్యనారాయణ (బాబు)ను రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కార్యదర్శిగా నియమించారు. దీనిపై వారు మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పెదవీరప్ప ఉండి: వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పాములపర్రు గ్రామానికి చెందిన తాటిపట్టి పెదవీరప్ప నియమితులయ్యారు. పార్టీ నియోజకవర్గ కళాకారుల సెల్ అధ్యక్షుడిగా మల్లువలస దుర్గారావు, కళాకారుల జిల్లా అధ్యక్షుడుగా రేలంగి సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. చింతలపూడి నుంచి ముగ్గురికి జిల్లా పదవులు చింతలపూడి: వైఎస్సార్ సీపీ క్రీస్టియన్ మైనార్టీ జిల్లా కార్యదర్శిగా చింతలపూడికి చెందిన కాటూరి ఏలియ, పార్టీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ ఖాజా మొయినుద్దీన్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మహమ్మద్ హాజీలను నియమించారు. పెనుగొండ: వైఎస్సార్ సీపి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పెనుగొండ మండలం సిద్ధాంతానికి చెందిన ఎంపీటీసీ చిన్నం ఏడుకొండలును, సత్యవరం గ్రామానికి చెందిన తమనంపూడి సూర్య వెంకట గణేష్ రెడ్డిని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమించారు. -
బంగారం చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
భీమవరం: బంగారం చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వివరాలు వెల్లడించారు. ఈనెల 17వ తేదీన భీమవరం పట్టణం టిడ్కో కాలనీకి చెందిన కణితి అంజనేయప్రసాద్ బంగారు నగల తయారీ షాపులో పనిచేస్తున్నాడు. షాపు యజమాని ఆదేశాలతో నరసాపురం పట్టణంలోని జైన్ గోల్డ్షాపులో ఇచ్చేందుకు బంగారు ఆభరణాలను తీసుకువెళుతున్నాడు. 125 గ్రాముల బంగారు వడ్డాణం, 10 గ్రాముల ఆరు బంగారు లాకెట్స్ ఫ్యాంట్ జేబులో పెట్టుకుని ఆర్టీసీ బస్ ఎక్కుతుండగా నగలు అపహరణకు గురయ్యాయి. వెంటనే వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా సీఐ ఎం నాగరాజు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. టెక్నికల్, క్రైమ్ బృందంతో బస్ కాంప్లెక్స్లోని సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించి అనుమానితులను గుర్తించారు. ఈనెల 19వ తేదీన భీమవరం రైల్వే జంక్షన్ స్టేషన్ పరిసరాల్లో ఏలూరు జిల్లా నూజివీడు కొత్తపేటకు చెందిన బంకురు కుమార్, అజరాయి పేటకు చెందిన మలుగుమాటి సుభాష్ను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.15 లక్షల విలువైన బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసును కేవలం 48 గంటల్లో ఛేదించిన వన్టౌన్ సీఐ ఎం నాగరాజు, ఎస్సై మోహన్వంశీ, క్రైమ్పార్టీ హెడ్ కానీస్టేబుల్ యెహోసువా, కానిస్టేబుల్ జి రామకృష్ణ, అడ్డాల శ్రీనులను అభినందించి రివార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ ఎస్పీ వి భీమారావు తదితరులు పాల్గొన్నారు. -
రైతులపై పగ.. సుఖీభవలో దగా
సాక్షి ప్రతినిధి,ఏలూరు: చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతలకు మళ్లీ శఠగోపం పెట్టింది. సూపర్ సిక్స్–సూపర్ హిట్ అంటూ ఊరూవాడా వేల సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హడావుడి చేసిన సర్కారు రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇచ్చేశామని స్వయం ప్రకటన చేసుకుంది. అయితే ఇచ్చింది రెండు విడతల్లో రూ.14 వేలే. అది కూడా ఎంపిక చేసిన రైతులనే రీతిలో కొందరికే పరిమితమై జిల్లాలో 58 వేల మంది సాగుదారులకే, సుమారు లక్షకు పైగా కౌలురైతులకు ఎగనామం పెట్టింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా పేరుతో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా ల్లో మొత్తంగా 3,22,824 మందికి రైతుభరోసా అందిస్తే చంద్రబాబు సర్కారు మాత్రం 2,64,729 మందికి అందజేసినట్టు ప్రకటించింది. ‘సూపర్’ మోసం కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో ప్రతి రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని ప్రకటించింది. అధికారంలోకి రాగానే విజయవంతంగా మొదటి సంవత్సరం ఎగనామం పెట్టి రైతులను నిట్టనిలువునా మోసం చేసింది. 18 నెలల కాలంలో జిల్లాలో మూడుసార్లకు పైగా గోదావరి వరదలు, తుపాను దాటికి పంట నష్టం వాటిల్లినా ఒక్క రూపాయి పరిహారం ఇవ్వకపోగా కేంద్ర సాయంతో కలిపి ఇచ్చే అన్నదాత సుఖీభవలో కూడా భారీగా కోతలు విధించి రైతులను నిలువునా మోసం చేస్తుంది. పూర్తి వ్యవసాయ ఆధారిత జిల్లాలో సర్కారు వంచనకు రైతులు ప్రతి సీజన్లోనూ మోసపోతూనే ఉన్నారు. ఎన్నికల ప్ర చారంలో చెప్పేది ఒకటి ఆచరణలో, క్షేత్రస్థాయిలో చేసేది ఒకటిగా ఉంది. పెట్టుబడి సాయం రూ.20 వేల చొప్పున ఏలూరు జిల్లాలోనే రైతులకు రూ.471.69 కోట్లు, పశ్చిమగోదావరిలో రూ.220 కోట్లకుపైగా ఇవ్వాల్సి ఉంది. అయితే మొదటి సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టారు. ఇక రెండో సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లో లబ్ధిదారుల సంఖ్యను భారీ గా తగ్గించేశారు. గత ప్రభుత్వ హయాంలో 2023– 24లో ఏలూరు జిల్లాలో 1,98,179 మంది రైతులకు రూ.236.99 కోట్లు పెట్టుబడి సాయం రైతుభరోసా పేరుతో అందించారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో 1,24,645 మందికి రూ.168.17 కోట్లు అందించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలు వు దీరిన తర్వాత ఈ ఏడాది ఏలూరు జిల్లాలో 1,60,968 మందికి రూ.106.23 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 1,03,761 మందికి రూ.68.97 కో ట్లు జమ చేశారు. దీనిలో పీఎం కిసాన్ పథకం ద్వా రా రూ.4 వేలు అందగా మిగిలిన రూ.10 వేలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. జగన్ సర్కారులో రైతులకు అగ్రస్థానం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అన్నదాత సంక్షేమానికి పెద్దపీట వేశారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో నాలుగేళ్లు కలిపి పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పేరుతో రూ.50 వేలు అందిస్తామని ప్రకటించి క్షేత్రస్థాయిలో రూ.67,500 జమచేసి ఆదుకున్నారు. గత ప్రభుత్వంలో ఏలూరు జిల్లాలో మొత్తంగా రూ.1830.24 కోట్లు రైతు భరోసా, రూ.22.29 కో ట్లు సున్నా వడ్డీ పేరుతో మంజూరు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని విడతలు కలిపి రూ.796.41 కోట్లు రైతులకు జమచేశారు. మరోసారి వంచన అన్నదాత సుఖీభవ సాయంలో కోతలు అర్హుల జాబితాను కుదించిన సర్కారు జిల్లాలో 58 వేల మంది రైతులకు మొండిచేయి తొలి ఏడాది రూ.471 కోట్లు ఎగనామం మోంథా తుపాను బాధితులకూ అందని సాయం కౌలు రైతుల సంక్షేమం పట్టని ప్రభుత్వం ఈకేవైసీ లేదని, రికార్డుల్లో తేడాలున్నాయని, బ్యాంకులో నమోదు కాలేదని ఇలా పలు కారణాలతో చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలో 58,098 మంది రైతులకు సాయంలో కోత విధించింది. ఇస్తామన్న రూ.20 వేలలో ఇచ్చేది రూ.14 వేలు అందులోనూ వేలాది మందికి కోత విధించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక అధికారంలోకి రాగానే కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి అదుకుంటామని ప్రకటించిన సర్కారు కౌలురైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడంతో ఉమ్మడి జిల్లాలో సుమారు లక్ష మంది రైతులు ఎటువంటి పథకాలూ అందక ఇబ్బంది పడుతున్నారు. -
మేడపాడు హోమ్కు బాలిక తరలింపు
పెంటపాడు: ‘బాలికపై సంరక్షకురాలి ఘాతుకం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారు లు స్పందించారు. గణపవరం ప్రాజెక్టు సీడీపీఓ టీఎల్ సరస్వతి, భీమవరానికి చెందిన ఐసీపీఎస్ సోషల్ వర్కర్ జేమ్స్ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు దుర్గాభవాని, సుజాత సీడబ్ల్యూజీ కమిటీ సభ్యులు పెంటపాడులో నానమ్మ వద్ద ఉన్న బాధిత బాలిక గోండి సంతోషిణిని కలిశారు. మేడపాడులోని సీడబ్యూసీ హోమ్, హాస్టల్కు తరలించారు. సంతోషిణి భ విష్యత్ ఉన్నతంగా ఉండేలా చర్యలు తీసుకుంటామి ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. కైకలూరు: ఎటువంటి బూతు పదాలు ఉపయోగించకుండా సోషల్ మీడియాలో చిన్నపోస్టు పెట్టినందుకే కైక లూరు మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శింగంశెట్టి రాముపై పోలీసులు కేసు నమోదు చేసి పోలీసు స్టేషన్కు పిలిపించడం అన్యాయమని పార్టీ ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ ఘటనతో టీడీపీకి అభద్రతభావం ఉన్నట్టు తెలుస్తుందన్నారు. ప్రశాంత రాజకీయాలను టీడీపీ చేయాలని, వైఎస్సార్సీపీ నాయకులను అణచివేస్తే తిరగబడతామని హెచ్చరించారు. భీమవరం (ప్రకాశంచౌక్): పీజీఆర్ఎస్ అర్జీలను అధికారులు స్వయంగా పిటిషనర్తో మా ట్లాడి పరిష్కరించాలని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లో అ క్టోబర్, నవంబర్ నెలల్లో పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలపై నోడల్ టీం ఫ్రీ ఆడిట్ నిర్వహించి గుర్తించిన అర్జీల పరిష్కారంలో లోపాలపై అధికారులతో సమీక్షించారు. ఏలూరు టౌన్: ఏలూరు జీజీహెచ్లో చెవి, ముక్కు, గొంతు విభాగం వైద్యనిపుణులు అరుదైన రెండు శస్త్ర చికిత్సలు విజయవంతంగా చేశారు. రోగులు సంపూర్ణంగా సమస్య నుంచి కోలుకుంటున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎంఎస్ రాజు తెలిపారు. గోపన్నపాలేనికి చెందిన వెంకట సత్యనారాయణ (36)కు మొ ఖం ఎడమవైపు వాపుతో కనుగుడ్డు ఉబ్బి ముందుకు పొడుచుకుని వచ్చింది. కనీసం చూడలేని స్థితిలో ఉండగా వైద్యులు పరీక్షించి సైనోనేసల్ క్యాన్సర్గా గుర్తించారు. ఈనెల 18న శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరుకి చెందిన వీరాస్వామి (56) గొంతులో ఇబ్బందిగా ఉండటంతో గొంతు బొంగురుపోయింది. ఎండోస్కోపీ ద్వారా స్వరపేటికపై ఉన్న కణితిని గుర్తించి శస్త్రచికిత్స ద్వారా కణితిని తొలగించారని ఈఎన్టీ హెచ్ఓడీ డాక్టర్ డి.సుధ తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): సమగ్రశిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 24న పోరాట దీక్ష చేపట్టనున్నట్టు సమగ్ర శిక్ష రాష్ట్ర జేఏసీ వైస్ చైర్మన్ వాసా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు నోటీసులను గురువారం సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ కె.పంకజ్కుమార్, డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మలకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల హెచ్ఆర్ పాలసీ, ఎంటీఎస్, వేతనాల పెంపును డిమాండ్ చేస్తూ ఏలూరు కలెక్టరేట్ వద్ద దీక్ష చేపట్టనున్నామన్నారు. అప్పటికీ ప్ర భుత్వం స్పందించకుంటే డిసెంబర్ 10న సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. ఆయా రోజుల్లో జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు సామూహిక సాధారణ సెలవు ఇవ్వాలని కోరామని, లేకుంటే ఉ ద్యోగులు సీఎల్ పెట్టుకుని విజయవంతం చే యాలని పిలుపునిచ్చారు. -
స్థలం లేదు.. ఇల్లూ లేదు
2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పేరుతో గృహ నిర్మాణాన్ని ఉద్యమంలా చేపట్టింది. ఏలూరు జిల్లాలో లక్షకు పైగా ఇళ్ల స్థలాలు, 98,874 ఇళ్లను మంజూరు చేశారు. వీటిలో 2023 అక్టోబర్లో 25 వేలకు పైగా ఇళ్లకు గృహ ప్రవేశాలు సైతం జరిగాయి. ఏలూరు డివిజన్లో 458 లేఅవుట్లలో 60,042, నూజివీడు డివిజన్లో 137 లేఅవుట్లలో 14,628, జంగారెడ్డిగూడెం డివిజన్లో 144 లేఅవుట్లలో 13,420, జిల్లావ్యాప్తంగా 27,582 సొంత స్థలాల్లో 27,582 ఇళ్ల నిర్మాణానికి, 98,874 ఇళ్లకు అనుమతులు ఇచ్చారు. వీటికి సబ్సిడీలు, బ్యాంకు రుణం అన్నీ లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఆయా కాలనీలకు విద్యుత్ సౌకర్యం, నిబంధనలకు అనుగుణంగా రహదారులు, మంచినీరు తదితర వసతులు కల్పించారు. ఏలూరు(మెట్రో) : క్రెడిట్ కొట్టేయడంలో సీఎం చంద్రబాబుకు ఎవరూ సాటిరారు. తాను చేసింది శూ న్యమైనా.. కంటికి కనిపించిందంతా చేశానని చెప్పుకోవడంలో ఆయన సిద్ధహస్తులు. ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తూ జగనన్న కాలనీ ఇళ్లపై గో బెల్స్ ప్రచారానికి తెరదీశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల సొంతింటి కలను సాకారం చే సేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష లాది స్థలాలు, ఇళ్లు మంజూరు చేసి వాటి నిర్మాణానికి కృషి చేశారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చేసరికి 80 శాతం వరకు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభంగా కాగా, కొన్ని పూర్తయి గృహ ప్రవే శాలు కూడా జరిగాయి. మరికొన్ని వివిధ స్థాయిల్లో ఉన్నాయి. అప్పట్లోనే ఇళ్లకు రిజిస్ట్రేషన్ సైతం పూర్తిచేసి లబ్ధిదారులకు అందించిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుంది. స్థానికంగా సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారులకు ఇళ్లకు హక్కులు కల్పించారు. ఒక్క ఇల్లు మంజూరు చేయకపోయినా.. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా జిల్లాలో ఒక్క ఇంటి స్థలం గానీ, ఇల్లు గానీ మంజూరు చేయలేదు. కనీసం భూసేకర ణ గానీ, సెంటు స్థలం కొనుగోలు గానీ చేయలేదు. అయినా వేల సంఖ్యలో ఇళ్లు నిర్మించాం. రూ.కోట్ల లో ప్రజలకు లబ్ధి చేకూర్చాం అంటూ ప్రచారం చే స్తున్నారు. దీనికి మరో అడుగు వేసి గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన ఇళ్లను కూడా తామే కట్టించ్చామంటూ ప్రచార ఆర్భాటాలు మొదలెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త ర్వాత జిల్లాలో 15,024 గృహ ప్రవేశాలు జరిగాయని పేర్కొంటున్నారు. దీనికి కొనసాగింపుగా ప్రతిఒక్కరి సొంతింటి కల చంద్రబాబు సర్కారు నెరవేర్చుతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటనలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం తీరుపై విమర్శలు చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చే నాటికే జిల్లావ్యాప్తంగా 45,453 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యా యి. 35,432 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే వీటిలో 15,024 ఇళ్లు పూర్తయ్యాయని, వాటికి గృహ ప్రవేశాలు చేపడుతున్నట్టు టీడీపీ ప్రజాప్రతినిధులు ఊదరగొడుతూ హడావుడి చేశారు. జిల్లాలోని ఆ యా నియోజకవర్గాల్లో ప్రారంభోత్సవాలు అంటూ 10 లోపు ఇళ్లను ప్రారంభించి, బయటకు మాత్రం వేల సంఖ్యల్లో నిర్మాణాలు పూర్తయ్యాయని ప్రకటిస్తున్నారు. ఇక ఇప్పటికే పూర్తయి లబ్ధిదారులు ని వాసం ఉంటున్న ఇళ్లను సైతం గృహ ప్రవేశాల జాబితాలో చేర్చడం మరింత విడ్డూరం. ఇదిలా ఉండగా గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి బిల్లులు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రోత్సా హం కరువై చాలాచోట్ల లబ్ధిదారులు గృహనిర్మాణాలను నిలిపివేస్తున్నారు. కొర్రీలతో కాలయాపన చంద్రబాబు ప్రభుత్వం స్థలం గానీ, ఇల్లు గానీ మంజూరు చేయకున్నా.. కొత్త ఇళ్ల కోసం సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోందని ప్రకటిస్తున్నారు. వాస్తవానికి ఆయా సచివాయాల్లోకి వెళితే పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళితే కొర్రీలతో కాలయాపన చేస్తున్నారు. గృహాలపై నీలి నీడలు పైసా విదల్చని చంద్రబాబు సర్కారు గృహ నిర్మాణాలపై క్రెడిట్ చోరీ గత వైఎస్సార్సీపీ పాలనలో ఇళ్లనూ ప్రభుత్వ ఖాతాలోకి.. -
ధాన్యం కొనుగోలుకు పటిష్ట చర్యలు
భీమవరం: సార్వా సీజన్ ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యే క శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సార్వా సీజన్ ధాన్యం కొనుగోలు, పీజీఆర్ఎస్ పెండింగ్ ఫిర్యాదుల ప్రగతి, సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్, అర్హులందరికీ ఇ ళ్లు, రీసర్వేకు వెబ్ ల్యాండ్లో చేయాల్సిన సవరణ తదితర అంశాలపై అధికారులతో స మీక్షించారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని పరికరాలను రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, డీటీలు ఎం.సన్యాసిరావు, నాగమణి, ఈడీఎం కిరణ్కుమార్ పాల్గొన్నారు. జేసీ రాహుల్కుమార్రెడ్డి -
రుణాల మంజూరుపై సమీక్ష
భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక కలెక్టరేట్లో గురువారం జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం–జిల్లాస్థాయి సమీక్ష కమిటీ సమావేశం (బ్యాంకర్ల సమావేశం) కలెక్టర్ సీహెచ్ నాగరాణి అధ్యక్షతను నిర్వహించారు. సీసీఆర్సీ కార్డుల మంజూరు, పశు కిసాన్, ఎస్హెచ్జీ, ఎంసీపీ, పీఎం స్వనిధి, పీఎంఈజీపీ, వీవర్స్ ముద్ర యోజన, పీఎం విశ్వకర్మ, సూర్యఘర్, విద్యా రుణాలు తదితర అంశాల ప్రగ తిపై కలెక్టర్ బ్యాంకర్లతో సమీక్షించారు. భీమవరం ఎమ్మెల్యే, రాష్ట్ర పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడారు. 2024–25 మెప్మా అవని వార్షిక సంచికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఎల్డీఎం ఎ.నాగేంద్ర ప్రసాద్, యూబీఐ రీజనల్ హెడ్ వి. సత్యనారాయణ, నాబార్డ్ డీడీ నిష్యంత్ చంద్ర, ఆర్బీ ప్రతినిధి రామకృష్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 7,432 ఎపిక్ కార్డుల పంపిణీ జిల్లాలో ఓటరుగా నమోదు చేసుకున్న వారికి గత నాలుగు నెలల్లో 7,432 ఎపిక్ కార్డులను అందించా మని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో రాజకీయ పా ర్టీల ప్రతినిధులతో పలు అంశాలపై సమీక్షించారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 1,461 పోలింగ్ స్టేషన్లకు అదనంగా 123 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. -
కారు మబ్బులు.. రైతుల బెంబేలు
వరి మాసూళ్లు చేపడుతున్న తరుణంలో ఆకాశంలో కమ్ముకుంటున్న కారుమబ్బులు రైతులను కలవరపెడుతున్నాయి. వరి కోతల సమయంలో మారుతున్న వాతావరణం బెంబేలెత్తిస్తోంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను రక్షించుకునేందుకు అన్నదాత పరుగులు పెడుతున్నాడు. ఇప్పటికే భారీ వర్షాలు, మోంథా తుపానుతో దెబ్బతిన్న రైతులు మిగిలినపంటనైనా కాపాడుకునేందుకు మాసూళ్లు ముమ్మరం చేశారు. యంత్రాలతో కోతలు కోసి ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ఈ సమయంలో మబ్బులు ఆందోళన కలిగిస్తున్నాయి. ధాన్యాన్ని బస్తాల్లో నింపి, నెట్టులు కట్టి బరకాలతో కప్పి ఉంచారు. – పెంటపాడుఅలంపురంలో మబ్బులు కమ్మిన ఆకాశం ధాన్యం ఒబ్బిడి చేసుకుంటున్న రైతులు ధాన్యంపై బరకాలు కప్పి.. -
అక్రమార్కులు.. అప్రోచ్ రోడ్డునూ వదలరు
● అర్ధరాత్రి యథేచ్ఛగా మట్టి తవ్వకాలు ● పట్టించుకోని అధికారులు సాక్షి, టాస్క్ఫోర్స్: చంద్రబాబు సర్కారులో మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. రేయింబవళ్లు చూడకుండా అక్రమార్కులు మట్టి తవ్వి తరలించేసి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా సూరప్పగూడెంలోని జాతీయ రహదారి ఐస్ ప్లాంట్ పక్కనే ఉన్న అప్రోచ్ రోడ్డు గట్టుపై అక్రమార్కుల కన్ను పడింది. ఇంకేముంది రాత్రికి రాత్రి గట్టుపై ఉన్న మట్టిని తవ్వి తరలించి ప్రైవేటు స్థలాన్ని పూడ్చేందుకు వినియోగించేశారు. దీనిపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సూరప్పగూడెంలోని జాతీయ రహదారి ఐస్ ప్లాంట్ పక్కనే ఉన్న అప్రోచ్ రోడ్డు గట్టును కొందరు వ్యక్తులు మంగళవారం రాత్రి అక్రమంగా తవ్వేశారు. భారీ జేసీబీ సాయంతో అక్రమంగా 30 లారీల మట్టిని తరలించుకుపోయారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ మట్టితో రియల్ ఏస్టేట్ భూమిని పూడ్చేశారు. గట్టు తవ్వేయడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీనిపై ఐస్ప్లాంట్ మేనేజర్ తిరుమలశెట్టి రాజు బుధవారం భీమడోలు రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. సర్వీస్ రోడ్డును అక్రమంగా తొలగించి ప్రైవేటు స్థలంలో మెరక చేయడంపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న భీమడోలు ఆర్ఐ జగన్నాథం, వీఆర్వో ప్రవీణ్ ఘటనా స్థలానికి చేరుకుని మట్టి తవ్వేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. తగు చర్యలు కోసం తహసీల్దార్కు నివేదిక సమర్పించినట్లు చెప్పారు. -
22 నుంచి దివ్యాంగుల నిర్ధారణ వైద్య శిబిరాలు
కై కలూరు: జిల్లా సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ప్రత్యేకావసరాలు కలిగిన యువతీ, యువకులకు ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దివ్యాంగుల నిర్ధారణ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి షెడ్యూలు విడుదలైంది. క్యాంపుల్లో ఎంపిక చేసిన వారికి త్వరలో హియిరింగ్ ఎయిడ్స్, సీపీ వీల్ చైర్ విత్ కమోడ్, బిగ్ వీల్ చైర్, స్మాల్ వీల్ చైర్, వాకింగ్ స్టిక్స్ ఎడ్జస్ట్బుల్, బ్రైలీ కిట్ వంటి పరికరాలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కలిపి ఒకటి నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల్లో ప్రత్యేకావసరాల కలిగిన వారిని 3,301 మందిని గుర్తించారు. వీరికి వైద్య శిబిరంలో నిర్ధారణ తర్వాత పరికరాలను అందించడానికి ఎంపిక చేయనున్నారు. వైద్య శిబిరాల షెడ్యూల్ పోలవరం నియోజకవర్గంలోని ప్రత్యేకావసరాలు కలిగిన 608 మందికి 22వ తేదీన బుట్టాయిగూడెం జెడ్పీ హైస్కూల్లో వైద్య శిబిరం నిర్వహించనున్నారు. అలాగే చింతలపూడి నియోజకవర్గంలోని 562 మందికి 23వ తేదీన చింతలపూడి జెడ్పీ హైస్కూల్లో, కై కలూరు నియోజకవర్గంలోని 339 మందికి 24వ తేదీన కై కలూరులో భవిత కేంద్రం, ఉంగుటూరు నియోజకవర్గంలోని 317 మందికి 25వ తేదీన నారాయణపురం జెడ్పీ హైస్కూల్, నూజివీడు నియోజకవర్గంలోని 462 మందికి 26వ తేదీన నూజివీడు ఎస్ఆర్ఆర్ జెడ్పీ హైస్కూల్, దెందులూరు నియోజకవర్గంలోని 435 మందికి 27వ తేదీన దెందులూరు జెడ్పీ హైస్కూల్, ఏలూరు నియోజకవర్గంలోని 578 మందికి 28వ తేదీన ఏలూరు భవిత కేంద్రము, అశోకవర్ధని మున్సిపల్ పాఠశాల అశోక్ నగర్ ఏలూరులో వైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయి. కై కలూరు భవిత సెంటర్ జిల్లాలో 3,301 మంది ప్రత్యేకావసరాల చిన్నారుల గుర్తింపు ఉచితంగా ఉపకరణాలపంపిణీకి కసరత్తు క్యాంపు రోజున రవాణా ఖర్చులు, ఉచిత భోజన సదుపాయం ప్రత్యేకావసరాలు కలిగిన విద్యార్థులకు ప్రభుత్వం అత్యంత ఖరీదైన ఉపకరణాలను పంపిణీ చేస్తోంది. జిల్లాలో 7 నియోజకవర్గాల్లో క్యాంపులు జరుగుతాయి. రవాణా ఖర్చులతో పాటు భోజన సదుపాయం కల్పిస్తున్నాం. తల్లిదండ్రులు విద్యార్థులను సకాలంలో వైద్య శిబిరాలకు తీసుకురావాలి. గుర్తించిన వారికి త్వరలో పరికరాలు అందిస్తాం. – డాక్టర్ కే.పంకజ్కుమార్, అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్, సమగ్ర శిక్షా, ఏలూరు జిల్లా -
ఖర్చు అరకోటి.. స్వచ్ఛత మాటేంటి?
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రంలో పారిశుద్ధ్యం పేరుతో శ్రీవారి సొమ్ము దోపిడీకి గురౌతోంది. పారిశుద్ధ్యం, ఇతర ఖర్చులు గతేడాది కంటే మూడు రెట్లు పెరిగినా.. స్వచ్ఛత మాత్రం కానరావడం లేదు. ఆలయ పరిసరాలు, శిల్ప సంపద దుమ్మూ, దూళితో కళావిహీనంగా మారాయి. దాంతో భక్తులు విస్తుపోతున్నారు. అయినా దేవస్థానం అధికారుల్లో ఏమాత్రం చలనం లేకపోవడం శోచనీయం. వివరాల్లోకి వెళితే. ద్వారకాతిరుమల దివ్య క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తుంటారు. శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు దేవస్థానం పారిశుద్ధ్య పనులకు నెలకు లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తోంది. ఈ క్రమంలోనే 2022 అక్టోబర్ 1 నుంచి, ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పారిశుద్ధ్య పనులు నిర్వహించిన మంగళగిరికి చెందిన సెవెన్ హిల్స్ ఫెసిలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి నెలకు రూ.18.28 లక్షలు చెల్లించారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఈ పారిశుద్ధ్య, ఇతర (ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఏసీ మెకానిక్, కార్పెంటర్, మేషన్) పనులను పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (తిరుపతి) సంస్థకు నెలకు సుమారు రూ.54 లక్షలకు అప్పగించారు. గత కాంట్రాక్టులో మొత్తం 132 మంది పనిచేయగా, ప్రస్తుత కాంట్రాక్టులో 200 మంది వరకు పనిచేస్తున్నారు. అయినా గతంతో పోలిస్తే.. పారిశుద్ధ్యం మెరుగుపడకపోగా మరింత అధ్వానంగా మారింది. కళావిహీనంగా.. శ్రీవారి ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని దీపారాధన మండపం పొగపట్టి నల్లగా మారింది. యంత్రాలతో శుభ్రం చేయాల్సిన పారిశుద్ధ్య సిబ్బంది కానరావడం లేదు. భక్తులు, గోవింద దీక్షాదారులు మండపాన్ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. అలాగే అనివేటి మండపంలోని దశావతారాలు, ఇతర శిల్ప సంపద దుమ్మూ, దూళి పట్టి కళావిహీనంగా మారాయి. శ్రీవారి పాదుకా మండపం వద్ద ఉన్న స్వామివారి కల్యాణ మండపంలోని శిల్పాలు మురికిపట్టి చూడడానికి ఎబ్బెట్టుగా ఉన్నాయి. శివాలయం ఘాట్ రోడ్డులో, ఇతర ప్రదేశాల్లో చెత్తా, చెదారం దర్శనమిస్తోంది. జీతాలు ఇవ్వండి మహాప్రభో కాంట్రాక్టర్ కార్మికులకు గడచిన నెల వేతనాలను ఇప్పటి వరకు ఇవ్వలేదు. దాంతో జీతాలు ఇవ్వండి మహాప్రభో.. అంటూ కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. ఇదిలా ఉంటే గడచిన నెల బిల్లును ఇప్పటి వరకు కాంట్రాక్టర్ దేవస్థానానికి సమర్పించలేదని, అందుకే కార్మికులకు వేతనాలు అందలేదని తెలుస్తోంది. పొగపట్టి నల్లగా మారిన శ్రీవారి దీపారాధన మండపంకొండపైన శివాలయం ఘాట్ రోడ్డులో చెత్తా, చెదారం అనివేటి మండపంలో దుమ్ముతో కళావిహీనంగా మారిన నరసింహ, మత్స్యావతార శిల్పాలుటెండర్ షరతుల ప్రకారం కాంట్రాక్టర్ వాటర్ జెట్ మెషీన్లు, సింగిల్ డిస్క్ స్రబ్బర్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, వెట్ అండ్ డ్రై స్క్రబ్బర్ డ్రయర్లు, తదితర మెషీన్లతో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలి. కానీ యంత్రాలతో పనులు చేస్తున్న దాఖలాలు లేవు. సోప్ ఆయిల్, ఫినాయిల్ ఇతర కెమికల్స్ నాసిరకమైనవి వినియోగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం కొబ్బరి చీపుర్లు కూడా ఇవ్వడం లేదని, ఏ పనిముట్టు అడిగినా వాయిదా వేస్తున్నారని కొందరు పారిశుద్ధ్య కార్మికులు వాపోతున్నారు. ప్రశ్నిస్తే పనిలోంచి ఎక్కడ తీసేస్తారోనని వారు భయపడుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో అధికారులు కాంట్రాక్టర్ తెచ్చిన మెటీరియల్స్ నాణ్యతను, పరిమాణం, ఐఎస్ఐ మార్క్ను పరిశీలించేవారు. కానీ ఇప్పుడవేమీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీవారి క్షేత్రంలో కానరాని పరిశుభ్రత గత ప్రభుత్వంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగిన వ్యయం కాంట్రాక్టర్ సీఎం బంధువు కావడంతో అధికారులూ గప్చుప్ మెషీన్లతో జరగని పనులు.. టెండర్ షరతుల ఉల్లంఘన కార్మికులకు నేటికీ అందని గత నెల వేతనాలు గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పారిశుద్ధ్య టెండర్ల నిర్వహణను ఆలయ అధికారులకే అప్పగించారు. దాంతో ఆలయ ఆదాయ, వ్యయాలను బట్టి ఏ ఆలయానికి ఆ ఆలయంలో అధికారులు టెండర్లను ఇచ్చారు. అయితే ప్రస్తుత చంద్రబాబు సర్కారు పారిశుద్ధ్యం హైజనిక్గ్గా ఉండాలన్న సాకుతో రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు సంబంధించిన టెండర్ ప్రక్రియను రాష్ట్ర దేవాదాయశాఖ కార్యాలయంలో నిర్వహించింది. 2015 నుంచి 2019 వరకు అన్ని ప్రముఖ ఆలయాల్లో పారిశుద్ధ్య, ఇతర పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ భాస్కరనాయుడికే మళ్లీ ఈసారి కాంట్రాక్టులను అప్పగించారు. చంద్రబాబు బంధువు కాబట్టే ఆయనకు మళ్లీ కాంట్రాక్టులు దక్కాయన్న ఆరోపణలున్నాయి. అందుకే పారిశుద్ధ్య లోపాలపై అధికారులు నోరు మెదపలేక పోతున్నారని భక్తులు, గ్రామస్తులు వాపోతున్నారు. -
జగనన్న కాలనీలపై కక్ష
భీమవరం: పేదలకు అందమైన ఇళ్లు నిర్మిస్తాం. గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటిస్థలాలిస్తామంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క సెంటు భూమి పేదలకు ఇవ్వకపోగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఏర్పాటుచేసిన జగనన్న కాలనీలపై కక్ష కట్టింది. వాటికి వసతులు కల్పించకుండా ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతోంది. దీనితో కాలనీల్లో నివాసముంటున్న లబ్ధిదారులు కనీసం సౌకర్యాలు కరువై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో 637 జగనన్న లేఅవుట్స్ ప్రత్యేకంగా ఏర్పాటుచేసి 70 వేల ఇళ్లు మంజూరు చేశారు. పేదల ఇంటి నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా దాదాపు 50 ఏజెన్సీల ద్వారా ఇళ్లు నిర్మించే బాధ్యతను అప్పగించారు. 2022లో ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి జగనన్న కాలనీలతోపాటు సొంతస్థలాల్లో దాదాపు 35 వేల వరకు ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాలనీల్లో వసతులు కరువు : జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మాణం సాగుతున్న సమయంలోనే కాలనీలకు విద్యుత్ సౌకర్యం, మంచినీటి సరఫరా వంటి వాటికి నిధులు కేటాయించి పెద్దపెద్ద కాలనీల వద్ద ప్రత్యేకంగా విద్యుత్ సబ్స్టేషన్స్ ఏర్పాటుచేసి విద్యుత్ లైన్లు వేశారు. మంచినీటి సరఫరాకు అనేక చోట్ల పైపులైన్స్ పూర్తి చేయగా రోడ్లు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం మారడంతో చంద్రబాబు ప్రభుత్వం జగనన్న కాలనీలను పూర్తిగా విస్మరించింది. రోడ్ల నిర్మాణం లేకపోవడంతో వర్షం వస్తే మోకాలు లోతు బురదలో లబ్ధిదారులు అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. రోడ్లు లేకపోవడంతో పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. దట్టంగా పచ్చగడి అలుముకోవడంతో ఆయా ప్రాంతాలు చిట్టడవిని తలపిస్తున్నాయి. దీంతో దోమలు పెరిగి ఇళ్లలో నిద్రపోలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. కొన్నిపాంత్రాల్లో చేపట్టిన రోడ్ల లెవలింగ్కు ప్రభుత్వం దాదాపు రూ.20 కోట్లు నిధులు విడుదల చేయాల్సివుందని చెబుతున్నారు. నిర్మాణం పూర్తిచేసుకున్న ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో అప్పడప్పుడు ట్యాంకర్ ద్వారా వచ్చిన నీటిని టిన్స్లో నింపుకుని కాలం గడపాల్సివస్తున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగనన్న కాలనీలో ఇళ్ల మధ్య పిచ్చి మొక్కలతో చిట్టడవి తలపిస్తున్న దృశ్యం ఇళ్లకు మంచినీటి కుళాయిలు లేక టిన్స్లో నీరు నింపుకుంటున్న దృశ్యం జగనన్న కాలనీల్లో వర్షం వస్తే రోడ్లు మునిగి ఇబ్బంది పడుతున్నాం. బురదమయంగా మారి పెద్ద పెద్ద గోతులు పడుతున్నాయి. నడిచి వెళ్లెందుకు కష్టంగా ఉంది. ఇల్లు నిర్మించుకున్న నాటి నుంచి రోడ్లు సరిగా వేయలేదు. వెంటనే కాలనీల్లో రోడ్లు నిర్మించాలి. – డి.మోజేష్, మోగల్లు నియోజకవర్గంలోనే మోడల్ కాలనీగా తీర్చిదిద్దామన్నారు. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. సౌకర్యాలు కల్పిస్తే బాగుటుంది. రహదారులు, డ్రెయినేజీ సౌకర్యాలు కల్పించాలి. – సీహెచ్ మహాలక్ష్మి, మోగల్లు సదుపాయాలు కల్పించకుండా ఇక్కట్లకు గురిచేస్తున్న బాబు ప్రభుత్వం జిల్లాలో వైఎస్సార్సీపీ పాలనలో 70 వేల ఇళ్ల మంజూరు 35 వేల ఇళ్లు పూర్తయినట్లు అంచనా గతంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి చంద్రబాబు సర్కారులో బిల్లులు నిల్ కాలనీల వద్ద రోడ్లు లేక చిట్టడవిని తలపిస్తున్న దుస్థితి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగనన్న కాలనీలను ప్రధానమంత్రి ఆవాస యోజన పథకంగా మార్పుచేసి ఇళ్లు నిర్మిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో నిర్మించుకున్న ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు చెల్లించకుండా కొత్తగా నిర్మించుకున్నవారికి మాత్రమే బిల్లులు చెల్లించి గతంలోని లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘మావో’ల షెల్టర్ జోన్గా ఏలూరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరును మావోయిస్టులు సేఫ్ షెల్టర్ జోన్గా ఎంచుకున్నారు. ఇతర రాష్ట్రాల వలస కూలీలుగా సాధారణ ప్రజల్లో కలిసిపోయి కొద్దికాలం తలదాచుకోవాలనుకున్నారు. దానికనుగుణంగానే కూలి పనుల కోసం వచ్చామని చెప్పి ఇల్లును అద్దెకు తీసుకున్నారు. కొద్దిరోజులకే పోలీసులకు రెడ్హ్యాండెడ్గా చిక్కడం కలకలం రేపింది. ఏలూరులోని గ్రీన్సిటీలో మావోయిస్టుల అరెస్టుతో జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. 15 మంది మావోయిస్టులను మంగళవారం అరెస్టు చేసి బుధవారం వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి వద్ద హాజరు పరచగా రిమాండ్ విధించి సెంట్రల్ జైలుకు పంపారు. భారీ బందోబస్తు నడుమ పోలీసులు వారిని జైలుకు తరలించారు. అరెస్టు అయిన మావోయిస్టుల్లో ఒక మైనర్ ఉన్నారు. మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు లచ్చు అలియాస్ గోపాల్ నేతృత్వంలో 14 మంది ఏలూరులో గత 15 రోజులుగా షెల్టర్ పొందుతున్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ పక్కా సమాచారంతో దాదాపు 10 రోజులు పాటు నిఘా కొనసాగించి పూర్తిగా నిర్ధారించుకున్న తరువాత మంగళవారం మెరుపుదాడి నిర్వహించి అరెస్టు చేశారు. 15 మంది నుంచి రూ.2.80 లక్షల నగదు, 15 తుపాకులు, 132 రౌండ్ల బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. వైద్య అవసరాలు, ఏలూరులో పోలీసుల హడావుడి కొంత తక్కువగా, ప్రశాంతంగా ఉంటుందనే యోచనతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా పోలీసులు నివాసం ఉండే చోటే ఎంపిక చేసుకున్నారు. నగరంలో పశ్చిమబెంగాల్ మొదలుకొని ఒడిశా వరకు ఐదారు రాష్ట్రాలకు చెందిన కార్మికులు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. ఛత్తీస్గఢ్కు చెందిన సభ్యులు కావడంతో ఏలూరును సురక్షిత ప్రాంతంగా భావించారు. 11 ఏళ్ల తరువాత.. జిల్లాలో మావోయిస్టుల హడావుడి, అరెస్టులు జరిగి 11 ఏళ్లు గడిచింది. గతంలో బుట్టాయగూడెం కేంద్రంగా, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల కేంద్రంగా మావోయిస్టుల కార్యకలాపాలు అధికంగా ఉండేవి. గతంలో జలతారువాగు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2001లో న్యూడెమోక్రసీకి చెందిన ధర్మన్న ఎన్కౌంటర్లో ఇద్దరు స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ మృతి చెందారు. 2002లో పాతపట్టిసీమ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. 2003లో పందిరిమామిడిగూడెం వద్ద ఆర్టీసీ బస్సును దగ్ధం చేశారు. 2004లో జనశక్తి క్రాంతి దళం ఎల్ఎన్డీ పేటలో వ్యాపారి కొల్లూరి గోపాలకృష్ణను మావోయిస్టులు కాల్చిచంపారు. ఇదే ప్రాంతంలోని డేరా కొండ వద్ద 2005లో పోలీస్ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. 2006లో పోలవరం సమీపంలో పోలీసు ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. చివరిగా 2014లో బుట్టాయగూడెం సమీపంలో న్యూడెమోక్రసీ నక్సల్స్ 14 మంది, యాక్షన్ టీమ్ సభ్యులు ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసుల రికార్డుల ప్రకారం మావోయిస్టులకు సంబంధించి చివరి అరెస్టు ఘటనగా రికార్డయ్యింది. 2014లో చివరిగా మావోయిస్టుల అరెస్టు తాజాగా ఏలూరులో 15 మంది.. 10 రోజుల నుంచి మావోయిస్టుల కదలికలపై ఇంటెలిజెన్స్ నిఘా పక్కా సమాచారంతోనే ఇల్లు ముట్టడించి అదుపులోకి -
తగ్గిన ఖరీఫ్ దిగుబడి
● ఎకరాకూ 30 బస్తాల కంటే తక్కువే ● తెగుళ్లు, తుపాను ప్రభావంతో నష్టం ఆకివీడు: ఒకవైపు తెగుళ్ల తంటా, మరోవైపు వాతావరణం అనుకూలించక ఖరీఫ్లో ధాన్యం దిగుబడులు భారీగా తగ్గిపోయాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎలుకల దాడి వరి పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపింది. పొట్ట, ఈనిక, పూత దశలో తెగుళ్లు విజృంభించాయని, అదే సమయంలో మోంథా తుపాను నియోజకవర్గంలో ఖరీఫ్ పంటపై తీవ్ర ప్రభావం చూపిందని అంటున్నారు. వరి చేలల్లో కంకులు పుష్కలంగా ఉన్నప్పటికీ తప్ప, తాలు, పసిరి గింజల శాతం అధికంగా వచ్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో పాటు పలు చోట్ల కుదుళ్లు అధికంగా వేసుకోకపోవడం మరో కారణంగా చెబుతున్నారు. దీంతో మాసూళ్లు పూర్తి చేసిన రైతులు దిగాలుగా ఉన్నారు. ఎకరానికి 25 నుంచి 30 బస్తాల దిగుబడి వచ్చిందని చెబుతున్నారు. మెరక ప్రాంతాల్లో 35 బస్తాల వరకూ దిగుబడి వచ్చిందంటున్నారు. గతంలో 35 బస్తాల నుంచి 40 బస్తాల వరకూ దిగుబడి ఉండేది. ఈ ఏడాది ఖరీఫ్ సాగుపై వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల పర్యవేక్షణ కూడా అంతంత మాత్రంగానే ఉందంటున్నారు. బదిలీల పరంపరలో ఏ అధికారి వచ్చారో, ఏ అధికారి వెళ్లారో తెలియకపోవడం, వ్యవసాయ శాఖలో క్షేత్రస్థాయిలో ఆర్ఎస్కేల బదిలీలు, మండల వ్యవసాయ శాఖ అఽధికారుల బదిలీలతో కొత్తవారు చేరినప్పటికీ క్షేత్రస్థాయి పర్యటన తీవ్రంగా లోపించిందని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ సాగులో పెట్టుబడులు కూడా వచ్చే అవకాశాలు కన్పించడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పంట పడిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందంటున్నారు. దిగుబడులు తగ్గినా, పంట నష్టపోయినా నష్ట పరిహారం, బీమా సౌకర్యం లభించే అవకాశం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకివీడు మండలంలోని చినకాపవరం గ్రామంలో తెగులు సోకిన పంట(ఫైల్), ధాన్యం ఆరబెట్టిన దృశ్యం ఖరీఫ్ మాసూళ్లు జరుగుతు న్నాయి. యంత్రాలతో కోతలు పూర్తి చేశాం. పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. ఎకరానికి 35 బస్తాలకు తగ్గదనుకున్నాం. పట్టబడులు పడితే 26 నుంచి 28 బస్తాల దిగుబడి వస్తోంది. పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు. ప్రకృతి విళయతాండవం, అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర నష్టానికి గురయ్యాం. – కోట చైతన్య, రైతు, గుమ్ములూరు, ఆకివీడు మండలం -
ఆక్వా కళాశాల ఆధ్వర్యంలో శిక్షణ
నరసాపురం రూరల్: స్థానిక మత్స్య కళాశాల ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు రొయ్యల సాగు – వ్యాధుల యాజమాన్యంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం జాతీయ మత్య్సాభివృద్ధి మండలి (ఎన్ఎఫ్బీడీ) ఆర్థిక సహకారంతో ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ కె.మాధవన్, రిసోర్స్ పర్సన్లు డాక్టర్ టి నీరజ, యూనివర్శిటీ హెడ్ ఆర్.అరుణ్ కుమార్, డాక్టర్ కె.మాధవి, డా. ఎన్.వీరభద్రరావు, తదితరులు రొయ్యల రైతులకు శిక్షణా కార్యక్రమం ప్రాముఖ్యతను తెలిపారు. రొయ్యల చెరువులో వ్యాధులు ఎలా గుర్తించాలి, నివారించాలి.. మంచి లాభాలను పొందడానికి పాటించాల్సిన సూచనలు వివరించారు. రొయ్యల చెరువులో వాడే లైనర్ల ప్రాముఖ్యత, రొయ్యలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలిపారు. కామవరపుకోట: మండలంలో కొత్తూరులో కోటి సంతకాల సేకరణలో భాగంగా చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు పాల్గొని చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరించారు. మండల కన్వీనర్ రాయంకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని గ్రామంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా కంభం విజయరాజు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం చంద్రబాబు ప్రభుత్వ పాతరకు కారణం కాబోతుందన్నారు. ద్వారకాతిరుమల: తమ వద్ద మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేసి, ఇవ్వాల్సిన సొమ్మును ఎగ్గొట్టిన మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్ చిలక అప్పారావుపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. రైతు సంఘం ఆధ్వర్యంలో హనుమాన్లగూడెంలో ఆర్గనైజర్ ఇంటి ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కట్టా భాస్కరరావు, గుర్రం రాంబాబు మాట్లాడుతూ మోసపోయిన రైతులకు అధికారులు న్యాయం చేయాలని కోరారు. గతంలో దీనిపై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయగా మండల తహసీల్దార్, వ్యవసాయాధికారి ఆర్గనైజర్ను పిలిపించి మాట్లాడారని, ఆ సమయంలో అతడు రైతులకు సీడ్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చి, ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడని అన్నారు. రైతుల సమక్షంలో జరిగిన ఒప్పందంలో ఇచ్చిన బ్యాంకు చెక్కులు బౌన్స్ అయ్యాయని తెలిపారు. రైతులకు దాదాపు రూ.15 లక్షలకు పైగా సొమ్ము రావాల్సి ఉందన్నారు. వీరవాసరం: అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం ద్వారా చేకూరుతున్న లబ్ధి రైతు కష్టానికి చేదోడు వాదోడుగా నిలుస్తుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం వీరవాసరం మండలం రాయకుదురు కోపరేటివ్ బ్యాంకు ఆవరణలో ఏర్పాటుచేసిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఈరోజు రైతులందరికీ శుభదినం అన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,03,761 మందికి రైతులకు రూ.68.97 కోట్ల ఖాతాలలో జమచేశామన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ తోట సీతారామ లక్ష్మి, ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఒకేరోజు రెండు మెడికల్ సర్టిఫికెట్లా?
మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆగ్రహం సాక్షి, టాస్క్ఫోర్స్: దేవుడితో సమానంగా భావించే వైద్యుల సైతం ఒత్తిళ్లకు తలొగ్గడం వైద్య వృత్తికి కళంకమని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతునూరు కోపరేటివ్ సొసైటీ మాజీ చైర్మన్ డీఎన్వీడీ ప్రసాద్ అరెస్టు అనంతరం దెందులూరు సీహెచ్సీ సూపరింటెండెంట్ సుందర్బాబు పరీక్షలు నిర్వహించారు. మొదటి ఇచ్చిన మెడికల్ రిపోర్టులో గుండె, మోకాలు ఆపరేషన్ జరిగిందని, రిమాండ్కు ఫిట్ కాదని సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. సర్టిఫికెట్ ఇచ్చిన సూపరింటెండెంట్ మళ్లీ రిమాండ్కు ఫిట్ అని రాయటం వెనుక ఎవరి ఒత్తిడి ఉందని, ఎందుకు సర్టిఫికెట్ మార్చారని ప్రశ్నించారు. ఒక రోజే రిమాండ్కు ఫిట్ కాదని మళ్లీ ఫిట్గా ఉన్నారని సర్టిఫికెట్ మార్చాల్సిన అవసరం సూపరింటెండెంట్కు ఎందుకు వచ్చిందన్నారు. దెందులూరు సీహెచ్సీ సూపరింటెండెంట్ ఉదంతంపై న్యాయపోరాటం చేస్తామన్నారు. తక్షణమే ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణకు ఆదేశించాలన్నారు. గతంలో వైఎస్సార్సీపీ నేతలను రెండుసార్లు అక్రమ అరెస్టులు చేసి రిమాండ్కు పంపాలని చూశారని, న్యాయస్థానం రెండుసార్లు రిమాండ్ తిరస్కరించడమే కాక కేసు పెట్టిన ఎస్సై మెమో ఇచ్చిందని అబ్బయ్య చౌదరి గుర్తు చేశారు. న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందన్నారు. -
రాజ్యాంగంపై అవగాహన అవసరం
అప్రోచ్ రోడ్డునూ వదలరు భీమడోలు మండలం సూరప్పగూడెంలోని ఐస్ ప్లాంట్ పక్కనే ఉన్న అప్రోచ్ రోడ్డు గట్టుపై అక్రమార్కుల కన్ను పడింది. రాత్రికి రాత్రి మట్టిని తవ్వి తరలించారు. 8లో uఏలూరు (ఆర్ఆర్పేట): స్వతంత్ర భారతదేశ సుపరిపాలన కోసం రాజ్యాంగం రూపొందించారని, రాజ్యాంగంపై ప్రతి భారతీయుడు అవగాహన కలిగి ఉండాలని, సమసమాజ నిర్మాణానికి రాజ్యాంగం ఎంతో దోహదపడుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం సెట్వెల్ డిపార్ట్మెంటు, మానవతా స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా భారత రాజ్యాంగంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల ప్రారంభ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రత్న ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి భారతీయుడు రాజ్యాంగాన్ని పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాది రత్నరాజు, సెట్వెల్ సీఈవో కే ప్రభాకర్ రావు, గ్రంథలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్ బాబు, మానవతా రీజియన్ చైర్మన్ రత్నాకర్ రావు, మానవతా అధ్యక్షుడు ఎమ్మెస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నూజివీడు: రాష్ట్రంలో జరుగుతున్న ఎన్కై ంటర్ల పర్వాన్ని ఆపాలని దీనిపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి.హరినాథ్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో అరెస్టు చేసిన వారందరినీ కోర్టులో హాజరపరచాలని డిమాండ్ చేశారు. నక్సలైట్ సమస్య రాజకీయ సమస్యగా చూడాలి తప్ప శాంతిభద్రతల సమస్యగా చూడడం అవివేకమన్నారు. 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని అంతం చేస్తామని చెప్పిన దానికి ముందే హిడ్మాను ఎన్కౌంటర్ చేశామని చెప్పడం చట్టధిక్కారానికి పాల్పడడమేనని, దీన్ని వామపక్ష ప్రజాస్వామ్య పౌరహక్కుల సంఘాల నేతలు ఖండించాలన్నారు. -
విద్యుదాఘాతంతో జేసీబీ ఆపరేటర్ మృతి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు నగరపాలక సంస్థలో అవుట్ సోర్సింగ్ జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తున్న సీహెచ్ రమేష్ (35) బుధవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన రమేష్ ప్రస్తుతం ఏలూరు చాణక్యపురి కాలనీలో భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. బుధవారం సాయంత్రం స్థానిక అశోక్ నగర్ స్మృతి వనంలో జేసీబీతో శుభ్రం చేస్తూ ఉండగా జేసీబీ విద్యుత్ వైర్లకు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. భీమడోలు: ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేసిన కేసులో నలుగురు నిందితులను బుధవారం భీమడోలు పోలీసులు అరెస్ట్ చేశారు. గుండుగొలను గ్రామానికి చెందిన నిట్టా నాగరాజుపై అదే గ్రామానికి చెందిన గొల్ల గౌతమ్, కాళీ రాజకుమార్, బొంతు శివకుమార్, సిరికోటి నరేంద్ర వర్మ ఈనెల 18వ తేదీ దాడి చేసి బీరు బాటిల్ పగలకొట్టి పొట్టలో పొడిచారు. తీవ్రగాయాలైన నాగరాజు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను ఎస్సై ఎస్కే మదీనా బాషా అరెస్ట్ చేసి భీమడోలు కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు చెప్పారు. ఆకివీడు: లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనలో లారీ డ్రైవర్కు ఆరు నెలల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆకివీడు మండలంలోని సిద్ధాపురంనకు చెందిన కలిదిండి సత్యనారాయణరాజు 2021 డిసెంబర్ 10వ తేదీన వ్యవసాయ పనుల నిమిత్త కాళింగూడెం వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామ సరిహద్దులోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కలిదిండి ఇంద్రరాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై బీవై కిరణ్ కుమార్ కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో లారీ డ్రైవర్ బండ్రెడ్డి వీర వెంకట సత్యనారాయణకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ బుథవారం భీమవరం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జీ.సురేష్ బాబు తీర్పు వెలువరించారని ఎస్సై హనుమంతు నాగరాజు చెప్పారు. భీమవరం: భీమవరం ఆర్టీసీ కాంప్లెక్స్లో జరిగిన చోరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఈనెల 17న సుమారు రూ.15 లక్షలు విలువ కలిగిన బంగారు వడ్డానం, లాకెట్ ముక్కలు కలిగి ఉన్న సంచితో బస్ ఎక్కుతుండగా మరో వ్యక్తి బస్సు ఎక్కుతున్నట్లుగా నటించి ఆ సంచిని దొంగిలించాడు. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేయగా వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నిందితుడిని అదుపులోనికి తీసుకుని బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. -
విశేష అలంకరణలో సోమేశ్వరస్వామి
భీమవరం(ప్రకాశంచౌక్): పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా బుధవారం విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రధాన అర్చకుడు చెరుకూరి రామకృష్ణ సాయంకాల విశేష అలంకరణ జరిపారు. ఉమాసోమేశ్వర స్వామివారిని సుమారు 4,500 మంది భక్తులు దర్శించున్నారని ఈఓ కృష్ణంరాజు తెలిపారు. దర్శనం, అభిషేకం టికెట్ల ద్వారా రూ.54,341, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.3,525, నిత్యాన్నదాన ట్రస్టు నందు కానుకల రూపంలో రూ.1,60,312 ఆదాయం లభించిందని ఈవో చెప్పారు. తణుకు అర్బన్: జాతీయ స్థాయి సివిల్ సర్వీస్ అథ్లెటిక్స్ పోటీలకు తణుకు మండలం మండపాక జిల్లా పరిషత్ హైస్కూలు ఫిజికల్ డైరెక్టర్ సంకు సూర్యనారాయణ ఎంపికయ్యారు. నాగార్జున యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ అథ్లెటిక్స్ పోటీల్లో 1,500 మీటర్ల పరుగు పందెంలో ఆయన ప్రథమ స్థానం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వచ్చేనెల 13 నుంచి 15వ తేదీ వరకు బిహార్ రాష్టంలోని పాట్నాలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో సూర్యనారాయణ పాల్గొంటారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.ఫణిశ్రీ తెలిపారు. వరుసగా మూడవ సంవత్సరం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సూర్యనారాయణను పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు అభినందించారు. తణుకు అర్బన్: తణుకు ఎస్కేఎస్డీ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థిని మానె మనోజ్ఞ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ అండర్ 19 విభాగంలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ భూపతిరాజు హిమబిందు తెలిపారు. ఈనెల 14, 15 తేదీల్లో విశాఖపట్నం జిల్లాలోని పర్వాడ ఐకాన్ స్పోర్ట్స్ హబ్లో నిర్వహించిన పోటీల్లో బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగంలో మానె మనోజ్ఞ ద్వితీయ స్థానం సాధించిందని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 7వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొంటుందన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్య ఉషారాణి విద్యార్థినిని అభినందించారు. -
ఉప్పులూరులో కొనసాగుతున్న వైద్య శిబిరం
ఉండి: ఉప్పులూరులో జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో రెండోరోజు బుధవారం వైద్య శిబిరం కొనసాగించారు. వైద్య బృందాలు ఇంటింటికీ తిరిగి జ్వరాలపై సర్వే నిర్వహించారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు జాగ్రత్తలు తెలిపారు. యండగండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ ఐసీ కీర్తన ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో 30 మంది రోగులు వైద్యపరీక్షలు చేయించుకున్నారు. వారిలో 10 మందికి జ్వరాలు ఉన్నట్లుగా నిర్ధారణ కావడంతో వారికి డెంగీ పరీక్షలు పరీక్షలు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. అయితే ఎవ్వరికీ డెంగీ నిర్ధారణ కాలేదని, అవన్నీ సాధారణ జ్వరాలేనని వైద్య బృందం స్పష్టం చేసింది. వైద్యశిబిరాన్ని, ఫీవర్ సర్వేలను జిల్లా మలేరియా అధికారి క్రాంతికుమార్, యూనిట్ అధికారి మూర్తి పర్యవేక్షించారు. -
మెరుగైన సేవలే కెనరా బ్యాంక్ లక్ష్యం
కై కలూరు: దేశవ్యాప్తంగా వర్చువల్ విధానంలో కెనరా బ్యాంకుల ప్రారంభోత్సవాల్లో భాగంగా 10,001 బ్రాంచ్ను కై కలూరు మండలం ఆలపాడు లో కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి మద్దిరాల నాగరాజు (ఐఏఎస్), కెనరా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.సత్యనారాయణరాజు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆక్వా రైతులకు రుణాలు అందించడానికి బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు. కెనరా బ్యాంకు సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులతో పాటు అన్నివర్గాల ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కెనరా బ్యాంక్ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కెనరా బ్యాంక్ విజయవాడ జనరల్ మేనేజర్ సీజే విజయలక్ష్మి, భీమవరం రీజనల్ హెడ్ ఎం.మాధవరావు, ఆలపాడు బ్రాంచి హెడ్ ఆర్.రాజేంద్రప్రసాద్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో డిజిటల్ అసిస్టెంట్ మృతి
బుట్టాయగూడెం: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం సమీపంలోని బండార్లగూడెంకు చెందిన పూనెం రామారావు (36) పోలవరం గ్రామ సచివాలయం–3లో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తూ బుట్టాయగూడెం మండలం అల్లికాల్వ సమీపం డౌన్లో ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో రామరావు కింద పడిపోగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో స్థానికులు 108 వాహనం కోసం ఫోన్ చేయగా 2 గంటల సమయం పడుతుందని సమాధానం చెప్పడంతో ట్రాక్టర్లోనే రామారావును స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుని వచ్చారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. కాగా డిజిటల్ అసిస్టెంట్గా జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో పనిచేసిన రామారావు ఇటీవలే పోలవరం మండలానికి బదిలీపై వచ్చారు. రామారావు భార్య రామలక్ష్మి బుట్టాయగూడెం పోలీస్స్టేషన్లో హోమ్ గార్డ్గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. రామలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై దుర్గామహేశ్వరరావు తెలిపారు. రామారావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఉలిక్కిపడ్డ ఏలూరు
మావోల జాడతో.. సాక్షి ప్రతినిధి, ఏలూరు: మారేడుమిల్లిలో మావోయిస్టు అగ్రనేత ఎన్కౌంటర్ అనంతరం పలువురు మావోయిస్టులు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో పట్టుబడడం సంచలంనగా మారింది. పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ఏలూరు మినీ బైపాస్లోని గ్రీన్సిటీలో ఒకే ఇంట్లో 15 మంది మావోయిస్టులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 15 ఏళ్ళ క్రితం వరకు మావోయిస్టుల కదలికలు ఏలూరు జిల్లాలోని ఏజెన్సీలో ఉండేవి. ఎన్కౌంటర్లు కూడా జరిగేవి. అడపాదడపా షెల్టర్ జోన్గా ఉండే ఈ ప్రాంతంలో ఇప్పుడు మళ్లీ అలజడి ప్రారంభమైంది. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్కరోజే 51 మంది మావోయిస్టులను పక్కా స్కెచ్తో అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఏలూరు నగరంలో మంగళవారం మధ్యాహ్నం 15 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ నేపథ్యంలో అందిన సమాచారంతో విజయవాడ నగరంలో ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి సమాచారంతో ఏలూరులో ఉంటున్న వారి వివరాలు తెలుసుకున్నారు. రూ.12 వేల అద్దెకు సరిగ్గా 13 రోజులు క్రితం గ్రీన్సిటీలో ఇల్లు తీసుకుని ఉంటున్నారు. ఆపరేషన్ కగార్తో పేరుతో కేంద్రం వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు కేడర్ను తుద ముట్టిస్తోంది. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్న క్రమంలో మావోయిస్టులు షెల్టర్ జోన్ బాటపట్టారు. సొంత రాష్ట్రమైతే సమస్యలు ఉంటాయనే యోచనతో పొరుగు రాష్ట్రాలకు వలస వచ్చారు. ప్రధానంగా ఛత్తీస్గఢ్లోని ఫ్లటూన్, దళ సభ్యులు ముఖ్యుల ఆదేశాలతో షెల్టర్ జోన్గా ఏలూరు, విజయవాడ, కృష్ణా, కోనసీమ, కాకినాడ జిల్లాలను ఎంపిక చేసుకుని మూడు బృందాలు ఐదు ప్రాంతాలకు వచ్చారు. ఏలూరులో 15 మంది, విజయవాడ నగరంలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో 28, కోనసీమలో ఒకరు, కాకినాడలో ఇద్దరిని మంగళవారం అరెస్టు చేశారు. వారిని ఆయా జిల్లాల డీటీసీలకు తరలించి ఎస్పీల నేతృత్వంలో విచారిస్తున్నారు. దాదాపు 20 ఏళ్ళ క్రితం వరకు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో నిత్యం అలజడి వాతావరణం ఉండేది. మావోయిస్టులతో పాటు బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, తెలంగాణ నుంచి విలీనమైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో జనశక్తి, న్యూడెమోక్రసీ వర్గాల కదలికలు ఎక్కువగా కొనసాగేవి. ఈ క్రమంలో తరుచూ అరెస్టులు, లొంగుబాట్లు, చిన్నపాటి ఎన్కౌంటర్లు సాగేవి. 2009లో అప్పటి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నివాసమైన బుట్టాయగూడెంలోని దుద్దుకూరులో మావోయిస్టులు రెక్కీ నిర్వహించారు. బాలరాజు నివాసం వద్ద రెక్కీ నిర్వహించగా.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 2010లో పోలీసులకు, న్యూడెమోక్రసీ దళ కమాండర్కు ఎదురుకాల్పులు జరిగాయి. 2014లో బుట్టాయగూడెంలోని ఇప్పాలమ్మగుడి సమీపంలో పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుల్లో మావోయిస్టుల కార్యకలాపాలు అధికంగా ఉండేవి. గోదావరి పరీవాహక గ్రామాలను షెల్టర్జోన్గా ఏర్పాటుచేసుకుని మావోయిస్టులు కొనసాగేవారు. 2005లో కుక్కునూరు పోలీస్స్టేషన్ను పేల్చివేయడం అదే మండలంలోని బంజరగూడెం సమీపంలో కాంగ్రెస్ నేత మండవ రామిరెడ్డిని కాల్చిచంపిన ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. 2007 వేలేరుపాడులోని రాళ్ళపూడి గ్రామంలో కోయిదా గ్రామస్తులకు పునరావాస కాలనీలు ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రాళ్ళపూడి సమీపంలో పంచాయతీ కార్యాలయాన్ని పేల్చివేసి ఐదుగురిని హతమారుస్తామని లేఖ విడుదల చేశారు. గతంలో బుట్టాయగూడెం కేంద్రంగా పోలీస్ ఆపరేషన్లు కొనసాగేవి. ఏలూరు నగరం అందులోని గ్రీన్సిటీనే ఎంచుకున్నారనే దానిపై పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తుంది. 25 ఏళ్ళ క్రితం ఆడపాదడపా ఏలూరును షెల్టర్ జోన్గా వినియోగించుకునేవారు. అనారోగ్యానికి గురైన క్రమంలో వైద్యసేవల కోసం ఏలూరును కొన్ని సార్లు ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ నుంచి ఏలూరుకు 15 మంది సభ్యులు రావడానికి ఎవరు సహకరించారు? ఎవరి సహకారంతో ఇల్లు అద్దెకు తీసుకున్నారనే దానిపై విచారిస్తున్నారు. గ్రీన్సిటీలో కానిస్టేబుల్ మొదలుకొని సీఐ వరకు అనేక మంది పోలీసులు నివాసం ఉండటం, ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేని ప్రాంతం కావడంతో గ్రీన్సిటీని ఎంపిక చేసుకుని ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు భావిస్తున్నారు. మావోయిస్టుల షెల్టర్ జోన్గా నగరం ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్తో షెల్టర్ జోన్కు రాక గ్రీన్సిటీలో ఒకే భవనంలో 15 మంది మావోయిస్టులు 12 రోజులుగా మకాం ఉన్నట్లు నిర్ధారణ పశ్చిమ ఏజెన్సీలో గతంలో మావోయిస్టులఎన్కౌంటర్లు, అరెస్టులు -
నాన్ లేఅవుట్లపై కొరడా
భీమవరం(ప్రకాశం చౌక్): పశ్చిమగోదావరి జిల్లాలో నిబంధనలు పాటించకుండా వేసిన నాన్ లేఅవుట్లు, నిర్మించిన భవనాలపై లోకాయుక్తతో పాటు హైకోర్టులో పిటిషన్లు వేయడంతో జిల్లా పంచాయతీ అధికారులు రంగంలోకి దిగారు. నాన్ లేఅవుట్లు, వాటిలో నిర్మించిన భవనాలపై చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా నాన్లేవుట్లు గుర్తించాలని పంచాయతీ కార్యదర్శలకు ఆదేశాలు జారీ చేశారు. గుర్తించిన నాన్ లేఅవుట్లలో బోర్డులు పెట్టాలని, నిబంధనలు పాటించకుండా నిర్మాణం చేసిన భవనాలకు నోటీసులు జారీ చేయాలని అదేశాలు ఇవ్వడంతో పంచాయతీ కార్యదర్శులు బోర్డులు పెట్టడంతో పాటు నోటీసులు జారీ చేస్తున్నారు. 500 ఎకరాల్లో నాన్ లేఅవుట్లు జిల్లాలో 20 మండలాలు, 409 గ్రామ పంచాయతీలున్నాయి. వాటిలో 800 వరకు నాన్ లేఅవుట్లు ఉన్నాయి. 500 ఎకరాల్లో నిబంధనలకు పాటించకుండా అక్రమ లేఅవుట్ చేసి వ్యాపారాలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు కలిసి నాన్ లేఅవుట్లు వేసి స్థలాలు అమ్మేశారు. అక్రమ లేవుట్లు వేసి పంచాయతీ, రెవెన్యూ శాఖకు ఫీజులకు ఎగనామం పెట్టారు. దాంతో రూ.కోట్లల్లో ఆదాయం కోల్పోయారు. టీడీపీ పాలనలో విచ్చలవిడిగా.. 2014 నుంచి 2019 వరకు టీడీపీ పాలనలో గ్రామాల్లో అధికంగా సంఖ్యలో నాన్ లేఅవుట్లు వేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు నిబంధనలు పాటించకుండా, పంచాయతీల అనుమతుల లేకుండా ఫీజలు చెల్లించకుండా వందల ఎకరాలను రియల్ ఎస్టేట్గా చేసి వ్యాపారం చేసుకున్నారు. వీరవాసరం మండలం నవుడూరులో కొందరు టీడీపీ నాయకులు నిబంధనలు పాటించకుండా నాన్ లేవుట్ వేయడంపై కొందరు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ ప్రభుత్వంలోనే నిబంధనలు ఉల్లంగించారు. గ్రామ కార్యదర్శుల హస్తం కొందరు రియల్ వ్యాపారాలు అధికార పార్టీ అండతో గ్రామ పంచాయతీల్లో పచ్చని భూములను నిబంధనలు పాటించకుండా, ప్రభుత్వానికి ఫీజలు కట్టి అనుమతులు తీసుకోకుండా ప్లాట్లుగా మార్చేశారు. ఉండాల్సినన కొలతల ప్రకారం రోడ్లు, డ్రెయిన్లు లేకుండా స్థలాలు పూడ్చి అమ్మేశారు. నాన్ లేఅవుట్లలో స్థలాలు కొని మోసపోతున్నారు. నాన్ లేఅవుట్లో స్థలాలు తీసుకుంటే పంచాయతీ నీళ్లు, రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించదు. తక్కువ ధరకు స్థలం వస్తుందని కొనుగోలు చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ చేసుకోవాలని అధికారులు చెప్పడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండిపోతున్నారు. గ్రామ పంచాయతీలల్లో అనధికార లేఅవుట్ వేయడంలో కొందరు పంచాయతీ సెక్రటరీలు హస్తం ఉందంటున్నారు. రూ.లక్షల్లో లంచాలు తీసుకుని నిబంధనలు లేకునా పంచాయతీకి చెల్లించాల్సిన ఫీజు కట్టకపోయిన వ్యాపారం జోరుగా సాగుతుంది. జిల్లాలోని అనధికార లేఅవుట్ల యాజమానులు లేక డెవలపర్స్ జనవరి లోపు ఎల్ఆర్ఎస్ పూర్తి చేయాలి. లేఅవుట్ను అన్ని అనుమతులతో క్రమబద్ధీకరించుకోవాలి. లేదంటే నాన్ లేఅవుట్లపై చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో నాన్ లేఅవుట్లను గుర్తించి వాటిలో పంచాయతీ నుంచి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. అనధికార లేఅవుట్లో స్థలాలు కొంటే పంచాయతీ నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వరు. మంచినీటి సౌకర్యం, డ్రెయిన్ల ఏర్పాటు జరగదు. – ఎస్.రామనాథరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి జనవరిలోపు ఎల్ఆర్ఎస్ చేసుకోకపోతే చర్యలు ఆదేశాలు జారీచేసిన జిల్లా పంచాయతీ అధికారి జిల్లాలో దాదాపు 500 ఎకరాల్లో నాన్ లేఅవుట్ల గుర్తింపు గత టీడీపీ హయాంలో పుట్టగొడుగుల్లా వెలసిన లేఅవుట్లు జిల్లాలోని అక్రమ లేఅవుట్లను జనవరి లోపు ఎల్ఆర్ఎస్ చేసుకోకపోతే చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారి కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 7 నుంచి 19 వరకు ఆయా మండల కేంద్రాల్లో ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు నాన్ లేఅవుట్లపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాన్ లేఅవుట్లు పరిస్థితి లేదు. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం గత ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 630 జగనన్న లేవుట్లు చేసి పూడిక పనులు చేసింది. దాంతో మట్టి మాఫియాకు, పంచాయతీల్లో అక్రమ లేవుట్ వ్యాపారాలకు అడ్డుకట్ట వేసింది. పేదలకు సెంటున్నర భూమి చొప్పున ఇవ్వడంతో గత వైఎస్సార్సీపీ పాలనలో గ్రామాల్లో అక్రమ లేఅవుట్ వ్యాపారాలు పూర్తిగా నిలిచిపోయాయి. -
మద్యం షాపు ఎదుట ధర్నా
నరసాపురం రూరల్: మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తూర్పుతాళ్లు సెంటర్లో వైన్ షాప్ ఎదుట మంగళవారం సాయంత్రం పసలదీవి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామానికి చెందిన కొట్టు శివన్నారాయణ కుటుంబం కేపీపాలెం ఉప్పులూరు వారి మెరకలో నివసిస్తోంది. శివన్నారాయణ బంధువు సోమవారం అస్వస్థతకు గురవడంతో నరసాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రిలో డబ్బు చెల్లించేందుకు కేపీపాలెం నుంచి బయలుదేరి సెంటర్లో వైన్ షాపు వద్ద శివన్నారాయణ ఆగి మద్యం సేవించాడు. అక్కడ తూర్పుతాళ్ళు చామకూరి వారి మెరకకు చెందిన ఓ వ్యక్తి అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గాయపడ్డ శివన్నారాయణను బంధువులు నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించాడు. ఈ గొడవ జరిగిన వైన్షాప్ వద్ద మంగళవారం సాయంత్రం పసలదీవి గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఎస్సై నాగలక్ష్మి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామస్తుల ఆందోళన నేపథ్యంలో తూర్పుతాళ్లు సెంటర్లోని రెండు వైన్షాపులు నిర్వాహకులు మూసివేశారు. న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టినప్పటికీ అధికార యంత్రాంగం స్పందించకపోవడం దారుణమని పసలదీవికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు పులపర్తి త్రిమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వైన్ షాపుల వద్ద విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరగడమే ఈ గొడవకు కారణమని ఆయన విమర్శించారు. -
కాలుష్య కాసారం
నరసాపురం: నరసాపురం నియోజకవర్గంలో ప్రధానమైన వేములదీవి కాలువ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. సుమారు 40 వేల మంది ఈ నీటిని వివిధ అవసరాలకు వాడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కలుషిత నీటినే తాగాల్సి వస్తోంది. మరోవైపు కాలువను బాగు చేయకపోవడంతో సుమారు 6 వేల ఎకరాల ఆయకట్టు రైతులు అవస్థలు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా.. స్థానిక ఎమ్మెల్యే గానీ, అటు ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గానీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి లక్ష్మణేశ్వరం, రాజుల్లంక, దర్బరేవు, మర్రితిప్ప, వేములదీవి, బియ్యపుతిప్ప వరకూ 7 కిలోమీటర్లు మేర ఈ చానల్ ప్రవహిస్తుంది. 10 పంచాయతీలకు ఈ కాలువ నీరే ఆధారం. అడుగడుగునా.. కాలుష్య జాడలే పట్టణంలో డ్రెయినేజీ నీరంతా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈ కాలువలోనే కలుస్తుంది. వేలముదీవి చానల్ గ్రామాల వారు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పీచుపాలెంలో చేపల, రొయ్యల విక్రయాలు జరుగుతాయి. వాటి వ్యర్థాలు ఈ కాలువలోనే కలుపుతున్నారు. లక్ష్మణేశ్వరంలో టీడీపీ పెద్దలకు చెందిన సంధ్య మైరైన్ రొయ్యల ఫ్యాక్టరీ వ్యర్థాలు ఈ కాలువలోనే కలుపుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ స్కీంల ద్వారా ఈ నీటిని శుద్ధి చేయకుండానే తాగునీటిగా సరఫరా చేస్తున్నారు. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఈ గ్రామాల్లో కిడ్నీ వ్యాధుల బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే.. ఎమ్మెల్యే నాయకర్ ఎక్కడున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువ మొత్తం గుర్రపు డెక్కే : కాలువ పొడవునా గుర్రపు డెక్క, చెత్తతో నీరు పారడం లేదు. దీంతో 6 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాలువను బాగుచేయలేదు. రెండేళ్ల క్రితం వైఎస్సార్సీపీ హయంలో బాగుచేశారు. మోంథా తుఫాన్ సమయంలో కాలువ పొడవునా అనేక చోట్ల చెట్లు కూలి కాలువలో పడిపోయాయి. వాటిని తొలగించే చర్యలు చేపట్టలేదు. వేములదీవి కాలువలో కలుస్తున్న వ్యర్థాలు, మురుగునీరు ఆ నీటినే తాగుతున్న 40 వేల జనాభా కాలువలో నీరు పారక రైతుల అవస్థలు ప్రజాపతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం వేములదీవి చానల్ పొడువునా 40 వేలమంది జనాభాకు ఈ కాలువ ద్వారానే తాగునీరు సరఫరా అవుతుంది. విషపు నీటిని మా గ్రామాల ప్రజలు తాగాల్సి వస్తోంది. ఈ గ్రామాల్లో ఇటీవల కిడ్నీ బాధితులు బాగా పెరుగుతున్నారు. కాలుష్య నీటిని తాగడం వల్లేనని వైద్యులు చెబుతున్నారు. కాలువ బాగు చేయకపోతే మా గ్రామాలు మరో ఉద్దానంలా తయారవుతాయి. – ముదునూరి మార్రాజు, రాజుల్లంక మాజీ సర్పంచ్ 6 వేల ఎకరాల ఆయకట్టుకు ఈ కాలువ ద్వారానే నీరు అందాలి. గుర్రపు డెక్క, చెత్త పేరుకుపోయింది. అసలు ఇక్కడ కాలువ ఉన్నట్లు తెలియడం లేదు. ఎప్పుడో రెండేళ్ల క్రితం కాలువను బాగు చేశారు. మళ్లీ అతీగతీ లేదు. నరసాపురం పట్టణంలోని డ్రెయినేజీ నీరంతా ఈ కాలువలోనే కలుస్తుంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. – అయితంపూడి బాపిరాజు, రైతు వేములదీవి చానల్ కాలుష్యంపై అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేశాం. ఎవరూ పట్టించోవడంలేదు. ప్రజల ఆరోగ్యం, రైతుల బాగోగులు పట్టించుకోకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవహరించడం దారుణం. అన్ని వ్యర్థాలు ఈ కాలువలోనే కలిపేస్తున్నారు. సంధ్య మైరెన్స్ వ్యర్థాలు కాలువలో కలిపేస్తున్నా కూడా వారిని నియంత్రించే ధైర్యం అధికారులకు లేదు. –బిళ్లు సత్యనారాయణ, వైఎస్సార్సీపీ నేత -
గోదావరిలో దూకి తండ్రీకొడుకులు మృతి
కుమార్తె కోసం గాలింపు యలమంచిలి: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన శిరిగినీడి దుర్గాప్రసాద్ (40) కుమారుడు మోహిత్ సూర్య వినాయక్ (14), కుమార్తె జాహ్నవి సాత్విక్ (9)లను గోదావరిలో తోసి ఆ తర్వాత తాను కూడా దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దుర్గాప్రసాద్, వినాయక్ మృతదేహాలు లభించగా జాహ్నవి మృతదేహం కోసం గాలిస్తున్నారు. 16 ఏళ్ల క్రితం విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన నాగలక్ష్మీతో దుర్గాప్రసాద్కు వివాహమైంది. ఆధార్ అప్డేట్ చేయిస్తానని విశ్వేశ్వరాయపురంలో ఉన్న ఇద్దరు పిల్లలను సోమవారం తన బైక్పై ఎక్కించుకుని బయటకు తీసుకువచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దుర్గాప్రసాద్ బైక్, చెప్పులు చించినాడ వద్ద గోదావరి వంతెనపై ఉండడంతో గోదావరిలో దూకి ఉంటారని బావమరిది రమేష్బాబు సోమవారం రాత్రి యలమంచిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్సై కె.గుర్రయ్య కేసు నమోదు చేసి, గోదావరిలో గాలించగా మంగళవారం రాత్రి దుర్గాప్రసాద్, అతని కుమారుడు మోహిత్ సూర్య వినాయక్ మృతదేహాలు లభించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. భీమవరం: జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఎస్పీతో కలిపి మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకున్న చర్యలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని జూమ్ ద్వారా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా గంజాయి మాట విన్పించకూడదని, కేసులు గుర్తిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని హెచ్చరించారు. మాదకద్రవ్యాల వినియోగంపై సమాచారం తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్చేసి ఈగల్ బృందానికి సమాచారం అందించాలన్నారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు 12 కేసులు నమోదు కాగా 55 మందిని అరెస్టు చేసి 40.399 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు చెప్పారు. రహదారుల భద్రత విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. మంగళవారం కలెక్టర్ జిల్లా రహదారుల భద్రత సమావేశంలో పలు సూచనలు జారీ చేశారు. సమావేశంలో ఎస్పీ కూడా పాల్గొన్నారు. -
బాలికపై ఘాతుకం.. స్పందించిన అధికారులు
వరి కోతల్లో బిజీ ఆచంట నియోజకవర్గంలో సార్వా కోతలు ఊపందుకొంటున్నాయి. ఇప్పటికే సగం పూర్తి కావాల్సి ఉన్నా, తుపాను ప్రభావంతో ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. 12లో uపెంటపాడు: సాక్షిలో ప్రచురితమైన ‘బాలికపై సంరక్షురాలి ఘాతుకం’ వార్తకు జిల్లా అధికారులు మంగళవారం స్పందించారు. ఈ సందర్భంగా గణపవరం ప్రాజెక్టు సీడీపీవో టీఎల్ సరస్వతి, ఐసీపీఎస్ సోషల్ వర్కర్ జేమ్స్ ఆధ్వర్యంలో బాలిక గోండి సుభాషిణిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. బాలిక నాయనమ్మ నుంచి వివరాలు సేకరించారు. బాలికకు సంరక్షురాలు వాతలు పెట్టిన మాట వాస్తవమేనని నిర్ధారించుకున్నారు. ఈ ఘటనలో మాధవి, సత్యనారాయణపై జువైనల్ యాక్టు ప్రకారం పెంటపాడు పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. అనంతరం గూడెం ఏరియా ఆసుపత్రిలో బాలికకు వైద్య పరీక్షలు చేయించారు. ఈ విషయంపై ఐసీడీఎస్ సీడీపీవో, సూపర్వైజర్లు మాట్లాడుతూ బాలికను అట్లకాడతో వాతలు పెట్టినట్లు గుర్తించామన్నారు. గాయాలు తగ్గినట్లు వైద్యులు ధ్రువీకరించారన్నారు. బాలికను సీడబ్ల్యూసికి తరలించేందుకు వీలుగా ఉన్నతాఽధికారులకు సిఫార్సు చేశామన్నారు. -
వరి కోతల్లో రైతులు బిజీ
పెనుగొండ: ఆచంట నియోజకవర్గంలో సార్వా కోతలు ఊపందుకొంటున్నాయి. నియోజకవర్గంలో ఇప్పటికే సగంకుపైగా కోతలు పూర్తి కావాల్సి ఉన్నా, మోంథా తుపాను ప్రభావంతో కోతలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులుగా కోతలు జోరుగా సాగుతున్నాయి. నియోజకవర్గంలో ఆచంట మండలంలో 10,200 ఎకరాల్లోనూ, పెనుగొండ మండలంలో 1,100, పెనుమంట్ర మండలంలో 13,200, పోడూరు మండలంలో 11400 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. వీటిలో 70 శాతంకు పైగా రైతులు ఎంటీయూ 1318 వరి రకం, మిగిలిన వారు స్వర్ణ, ఎంటీయూ 1121, పీఆర్ 126 వరి రకాలు వచ్చేసీజన్కు విత్తన రకాలుగా సాగు చేసారు. విత్తన రకాలు సాగు చేసిన రైతన్నలు ముందుగానే కోతలు పూర్తి చేసి ఇప్పటికే ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకొన్నారు. మిగిలిన రైతులు నెమ్మదిగా కోతలకు శ్రీకారం చుట్టారు. కోతలకు రైతులు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. దిగుబడులపై ప్రభావం మోంథా తుపాను ప్రభావంతో నియోజకవర్గంలో నాలుగు మండలాల్లోనూ వేలాది ఎకరాలు వరిచేలు నేలకొరిగాయి. వీటిని కోయడానికి నానావస్థలు పడుతున్నారు. వ్యవసాయ శాఖాధికారుల సూచనల మేరకు పడిన వరి దుబ్బులను లేపి కట్టుకొన్నా, గింజ ఎక్కువగా నేలకు రాలిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లో దిగుబడులపై ప్రభావం చూపింది. దిగుబడులు తగ్గడం, కోతకు వ్యయం పెరగడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. పెనుగొండ మండలంలో నడిపూడి, ఇలపర్రు, వడలి, కొఠాలపర్రుల్లోనూ, ఆచంట మండలం ఆచంట వేమవరం, కొడమంచిలి, వల్లూరు, ఇతర గ్రామాల్లోనూ, పెనుమంట్ర మండలం ఇల్లిందల పర్రు, మల్లిపూడి, రామేశ్వరం, మాముడూరు గ్రామాల్లోనూ, పోడూరు మండంలోని పలు గ్రామాల్లోనూ వరి నేలకొరిగింది. ఆయా గ్రామాల్లో వరి కోతలకు అదనంగా యంత్రాలకు మరో రూ.2 వేలు ఖర్చు అవుతుండడంతో భారంగా మారింది. ఎకరం గంటలో పూర్తి కావలసి ఉండగా, మరో అరగంట నుంచి గంట వరకూ వరి కోత యంత్రానికి కోతకు సమయం పడుతుంది. దీంతో అదనపు భారం పడుతుండడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. వాతావరణంలో మార్పులు రాకముందే మిగిలిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకొని గట్టేక్కాలని రైతులు ఆఘమేఘాలపై కోతలు కోయడానికి యత్నాలు చేసుకొంటున్నారు. -
తాగునీటితోనే జ్వరాలు
గ్రామంలో తాగునీటి సమస్య కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారు. అధికారులు చెబుతున్నదాని కంటే జ్వరపీడితుల సంఖ్య అధికంగా ఉంది. జ్వరాల సర్వే చేసి ప్రజలంతా పూర్తిగా కోలుకునే వరకు వైద్య శిబిరాన్ని కొనసాగించాలి. – నిమ్మల కేశవకుమార్, ఎంపీటీసీ, ఉప్పులూరు ఇటీవల కురిసిన వర్షాలతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేస్తే నీరు నిలవ ఉండేది కాదు. మురుగు నీరు నిలువ ఉండడం వలన దోమలు విజృంభించి ఉప్పులూరు ప్రజలు జ్వరాల బారిన పడ్డారు. – డాక్టర్ బెన్నీసామ్యూల్, ప్రభుత్వ వైద్యాధికారి, యండగండి పీహెచ్సీ ఉప్పులూరులో పారిశుద్ధ్య పనులు చేపట్టాం. గతంలో కురిసిన వర్షాల వల్ల కొంత ఇబ్బంది ఏర్పడింది. ప్రస్తుతం ఫాగ్ మిషన్ ద్వారా దోమల మందు చల్లిస్తున్నాం. గ్రామమంతా బ్లీచింగ్ చల్లించి ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ప్రస్తుతం ప్రజల ఆరోగ్య పరిస్థితి కంట్రోల్లోనే ఉంది. – కే శ్రీనివాస్, ఎంపీడీవో, ఉండి -
వీధిలైట్ల ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేస్తాం
ద్వారకాతిరుమల: దూబచర్ల నుంచి రాళ్లకుంట మీదుగా ద్వారకాతిరుమల క్షేత్రానికి భక్తులు కాలినడకన వెళ్లే మార్గంలో వీధిలైట్ల ఏర్పాటు పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని రాళ్లకుంట గ్రామానికి చెందిన దాత గంటా బాబ్జి తెలిపారు. సాక్షి దినపత్రికలో సోమవారం ‘నడక దారిలో నరకయాతన’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. దాతల సహకారంతో దూబచర్ల నుంచి ద్వారకాతిరుమల వరకు ప్రతి 50 మీటర్లకు ఒక వీధి లైటును ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పంచాయతీల్లో తీర్మానాలు చేసి, అంచనాలు రూపొందించి విద్యుత్ సంస్థకు రూ.22 లక్షలు చెల్లించినట్టు తెలిపారు. ఈ మొత్తం దాతల నుంచి సేకరించామన్నారు. ఇప్పటికే దూబచర్ల నుంచి రాళ్లకుంట శివారు వరకు సుమారు 118 వీధి లైట్లు ఏర్పాటు చేశామని, ఇంకా రాళ్లకుంట నుంచి ద్వారకాతిరుమల వరకు 100 లైట్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. -
అంతర్ జిల్లా నేరస్తుడి అరెస్ట్
పమిడిముక్కల: రాత్రి సమయంలో ఇళ్లల్లో, దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా నేరస్తుడి ఆటలకు పమిడిముక్కల పోలీసులు చెక్ పెట్టారు. నిందితుడి నుంచి రూ.3.10 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను గుడివాడ సబ్ డివిజన్ ఇన్చార్జి డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం, మిలిటరీ మాధవరం గ్రామానికి చెందిన కడియాల శ్రీధర్ రైళ్లలో, రైల్వే స్టేషన్ ఫ్లాట్ఫామ్లలో దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవాడు. ఏడాది కాలంగా అంతర్ జిల్లాల్లో బైక్ దొంగతనాలు, దేవాలయాలు, తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. గతంలో అతనిపై జీఆర్పీ విజయవాడలో 13 కేసులు ఉన్నాయి. సీఐ చిట్టిబాబు ఆధ్వర్యంలో ఎస్సై శ్రీను సిబ్బందితో కలిసి మంగళవారం తాడంకి హైస్కూల్ వద్ద బైక్పై వెళ్తున్న నేరస్తుడు కడియాల శ్రీధర్ను అదుపులోకి తీసుకొని విచారించారు. పమిడిముక్కల మండలం మంటాడ శివాలయంలో, కంకిపాడులో, తిరుపతిలో దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడు. అతడి నుంచి రూ.2 లక్షల విలువైన 20 గ్రాముల బంగారం, లక్ష రూపాయలు విలువ చేసే రెండు ద్విచక్ర వాహనాలు, రూ.10,250 నగదు స్వాధీనం చేసుకున్నారు. నేరస్తుడిని పట్టుకున్న పోలీసులను ఎస్పీ విద్యాసాగర్నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): బాలల హక్కుల వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో సమాజంలో ప్రతి ఒక్కరూ బాలల హక్కుల కోసం చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీ ఎస్టీఏ) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జీజేఏ స్టీవెన్ అన్నారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్ కాలనీలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి సెంటర్ కోఆర్డినేటర్ భలే సురేష్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టీవెన్ మాట్లాడుతూ బాలలకు ఆట, పాట, విద్యా, పౌష్టిక ఆహారం, ఆరోగ్యం, సంరక్షణ, వంటి హక్కు, రాజ్యాంగం కల్పించిందని వివరించారు. ట్రేస్ ఇండియా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్ల యాంజిలో, ఏలూరు లయన్స్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ వీజీఎంవీఆర్ కృష్ణారావు ప్రభుత్వ ఉపాధ్యాయుని కిరణ్ కుమారి మాట్లాడుతూ విద్యార్థులు పరిశుభ్రంగా ఉండాలని, పరిశుభ్రమైన ఆహార పదార్థాలు భుజించాలని, స్వచ్ఛమైన నీరు తాగాలని, అనారోగ్యాలు పాలవకుండా తమను తాము రక్షించుకోవాలని సూచించారు. పోటీల్లో గెలుపొందిన వారికి అతిథులు బహుమతులు అందజేశారు. -
పొగాకు బోర్డు అధికారుల క్షేత్ర పర్యటన
జంగారెడ్డిగూడెం: నారుమడి పెంపకంలో శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని వర్జీనియా పొగాకు బోర్డు ఆర్ఎం జీఎల్కే ప్రసాద్ రైతులకు సూచించారు. మంగళవారం జంగారెడ్డిగూడెం టుబాకో బోర్డు ప్లాట్ ఫామ్ 32 పరిధిలో చిన్నవారిగూడెం గ్రామంలో వర్జీనియా పొగాకు బోర్డు అధికారులు క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. రీజనల్ మేనేజర్ జీఎల్కే ప్రసాద్ ఆధ్వర్యంలో తిరుమలశెట్టి రవికి చెందిన పొగ నారు నర్సరీని సందర్శించి నారుమడి పెంపకం, సాగు విధానాలపై అవగాహన కల్పించారు. అనంతరం రైతులు రీజనల్ మేనేజర్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ హర్ష, రైతులు బుద్ధాల సత్యనారాయణ, మాదాసు సత్యనారాయణ, బుద్దాల రాజు, పొనగంటి ముత్తయ్య, బండారు వీరస్వామి, దాకవరపు వెంకటేశ్వరరావు, బండారు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నూజివీడు: తాళాలు వేసి ఉన్న సెల్ఫోన్ షాపులో దొంగతనం చేసిన నిందితుడిని చాట్రాయి పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ పట్టణంలోని సీఐ కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీ రాత్రి చాట్రాయి ప్రధాన సెంటర్లో ఉన్న సెల్ఫోన్ షాపు తాళం, తలుపు పగలగొట్టి లోపల ఉన్న సెల్ఫోన్లను, నగదును దొంగతనం చేశారు. దీంతో షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాట్రాయి ఎస్సై డీ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమేరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు టెక్నాలజీని ఉపయోగించి ఈనెల 17న వచ్చిన సమాచారం మేరకు చాట్రాయి నుంచి పోలవరం వెళ్లే రోడ్డులో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి దాదాపు రూ.2 లక్షల విలువైన సెల్ఫోన్లను రికవరీ చేశారు. నిందితుల్లో ఒకరు ఏలూరులోని పాములదిబ్బ ప్రాంతానికి చెందిన ముంగి సాగర్ కాగా మరో వ్యక్తి మైనర్ బాలుడు. నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ, ఎస్సై డీ రామకృష్ణ, ఇతర సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
గిరిజన గ్రామాల్లో పోలీసుల తనిఖీలు
కుక్కునూరు: అల్లూరి జిల్లా, మారేడుమిల్లి అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యంలో విలీన మండలాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒరిస్సా, చత్తీస్ఘడ్ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు మండలంలో నివసిస్తున్నారన్న అనుమానంతో నెమలిపేట, లంకాలపల్లి గుత్తికోయ గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. గ్రామంలోకి కొత్తవారెవరైనా వస్తే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు. అంతేకాక కుటుంబసభ్యులు కాకుండా ఇతర వ్యక్తులను ఇంట్లోకి అనుమతించవద్దని ఆదేశించారు. -
ఉప్పులూరు.. జ్వరాలతో బేజారు
● సర్వేలో 30 మంది జ్వర పీడితుల గుర్తింపు ● వైద్య శిబిరం నిర్వహిస్తున్న అధికారులు ఉండి: ఉండి మండలం ఉప్పులూరు గ్రామం జ్వరాలతో అల్లాడిపోతుంది. పదుల సంఖ్యలో జ్వరపీడితులు ఆసుపత్రుల బాట పట్టడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులు గత కొద్దిరోజులుగా జ్వరాల బారినపడుతున్నా పెద్దగా ఎవ్వరూ లెక్కచేయలేదు. అయితే జ్వరపీడితులు రోజురోజుకు పెరిపోవడంతో పాటు ప్లేట్లెట్లు పడిపోయి ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని రోగులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో మంగళవారం గ్రామంలో యండగండి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది డాక్టర్ బెన్నీ సామ్యూల్, ఐసీ కీర్తన ఆధ్వర్యంలో వైద్య బృందం నిర్వహించారు. వైద్య సిబ్బందితో పాటు ఆశావర్కర్ల బృందం గ్రామంలో ఇంటింటికీ తిరిగి జ్వరాల సర్వే నిర్వహించడంతో 30 మంది రోగులను గుర్తించినట్లు వారు తెలిపారు. వీరికి సాధారణ జ్వరాలేనని తేల్చగా డెంగీ జ్వర అనుమానితులుగా గుర్తించిన ఇద్దరి శాంపిల్స్ను మాత్రం తాడేపల్లిగూడెం పరీక్ష నిమిత్తం పంపించినట్లు డాక్టర్ తెలిపారు. సర్వేలో జ్వర పీడితులు 30 మంది మాత్రమే గుర్తించినా ప్రైవేటు ఆసుపత్రుల బాట పట్టిన వారు అంతకంటే ఎక్కువమంది ఉన్నారని, కొందరు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ వైద్య శిబిరాన్ని ఎంపీడీవో శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీవో సీఎస్వీ రెడ్డి, జిల్లా మలేరియా అధికారి వీ క్రాంతి, జిల్లా ఎపీస్టోమలాజిస్ట్ సుభాష్, మలేరియా యానిట్ అధికారి ఏఎస్ఎస్ఎన్ మూర్తి పరిశీలించి ప్రజలకు అందుతున్న వైద్యంపై ఆరాతీసారు. పారిశుద్ధ్య లోపమే కారణమా? గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంతో జ్వరాలు వ్యాపించాయని వైద్య సిబ్బంది చెబుతుండగా గ్రామంలోని మంచినీటి చెరువులో నీరు రంగు మారిందని, ఆ నీటిని తాగి ప్రజలు జ్వరాలబారిన పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే మంగళవారం నీటిపరీక్షలు నిర్వహించామని, తాగునీటిలో ఎటువంటి ఇబ్బంది లేదని పరీక్షల్లో తేలిందని ఎంపీడీవో కే శ్రీనివాస్ స్పష్టం చేశారు. -
శుభకరం.. శివయ్య దర్శనం
ద్వారకాతిరుమల: క్షేత్రపాలకునిగా విరాజిల్లుతున్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో శివయ్యకు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, లక్ష బిళ్వార్చన, జ్యోతిర్లింగార్చనను మంగళవారం కన్నుల పండువగా నిర్వహించారు. కార్తీక మాసం, అందులోనూ మాసశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలను అత్యంత వైభవంగా జరిపారు. ముందుగా ఆలయ గర్భాలయంలో కొలువైన శివయ్యకు అర్చకులు, పండితులు మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ మహన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని, మద్యాహ్నం లక్ష బిళ్వార్చనను నిర్వహించారు. రాత్రి ఆలయ మండపంలో జ్యోతిర్లింగార్చనను జరిపారు. శివలింగాకారంలో ఏర్పాటు చేసిన దీపాలను భక్తులు ఎంతో భక్తిప్రపత్తులతో వెలిగించారు. ప్రత్యేక అలంకరణలో సోమేశ్వర స్వామి భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం గునుపూడి గ్రామంలో వేంచేసియున్న శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన స్వామివారిని సుమారు 6 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. దర్శనం, అభిషేకం టికెట్లు ద్వారా రూ.86 వేలు, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.4 వేలు కలిపి మొత్తం ఆదాయం రూ.90 వేలు వచ్చినట్లు ఆలయ కమిటీ తెలిపింది. స్వామివారి నిత్యాన్న దానం ట్రస్ట్ నందు కానుకల రూపంలో రూ.42 వేల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. బలే రామస్వామికి లక్ష బిళ్వార్చన ముసునూరు: కార్తీకమాసం, మాస శివరాత్రి కావడంతో బలివే మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి మంగళవారం అంగరంగ వైభవంగా రుద్రాభిషేకం, లక్ష బిళ్వార్చన నిర్వహించారు. ఏలూరు వర్తక సంఘ ప్రతినిధులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక సహిత లక్ష బిళ్వార్చన నిర్వహించి, రుద్ర హోమం, జ్యోతిర్లింగార్చన చేశారు. భక్తులు దేవస్థాన ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మకంటి శ్యామలరావు, ఈఓ పామర్తి సీతారామయ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం ఐదు వేల మంది భక్తులకు తొమ్మిది రకాల తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. మంచు కొండల్లో క్షీరారామలింగేశ్వరస్వామి పాలకొల్లు సెంట్రల్: కార్తీకమాసం పురస్కరించుకుని మంగళవారం పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు వీరబాబు స్వామివారిని మంచుకొండల్లో శివయ్యలా అలంకరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించి తరించారు. మాస శివరాత్రి సందర్భంగా ఆలయ అభిషేక పండిట్ భమిడపాటి వెంకన్న బ్రహ్మత్వంలో స్వామివారికి లీలా కల్యాణం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో 16 మంది దంపతులు పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ మీసాల రాము, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, ట్రస్ట్బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
గొర్రెల వధ వ్యవహారం.. నేతల బేరం!
అత్తిలి: అత్తిలి మేకల కబేళాలో చనిపోయిన గొర్రెలను వధించి మాంసాన్ని విక్రయిస్తున్న వ్యవహారాన్ని ఇటీవల పంచాయతీ అధికారులు దాడి చేసి గుట్టురట్టు చేసిన సంగతి తెలిసిందే. గత నెల 30న అత్తిలి కబేళాలో చనిపోయిన గొర్రెలను వధించి మాంసాన్ని తరలించడానికి సిద్ధపడుతున్న సమయంలో పంచాయతీ అధికారులు దాడిచేసి మాంసాన్ని, చనిపోయిన గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారితో పాటు మరో ముగ్గురిపై కూడా అత్తిలి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. గత కొన్నేళ్లుగా చనిపోయిన, వ్యాధిసోకిన గొర్రెలను ఈ కబేళాలో వధించి మాంసాన్ని పరిసర ప్రాంతాలలో తక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం పశువైద్యులు, పంచాయతీ అధికారులు పర్యవేక్షణలో గొర్రెలు, మేకలను వధించాల్సి ఉండగా పంచాయతీలో శానిటరీ ఇన్స్పెక్టర్ లేకపోవడంతో మేకలు, గొర్రెలను వధించే సమయంలో స్టాంపు వేసే ప్రక్రియ జరగడంలేదు. దీంతో కొందరు మాంసం విక్రయదారులు అడ్డగోలుగా నిర్జీవంగా ఉన్న గొర్రెలను వధించి మాంసాన్ని విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల చనిపోయిన గొర్రెలను వధించిన వ్యవహారం జరిగిన అనంతరం లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు వినిపిస్తోంది. మాంసం దుకాణదారుల తరుఫున లక్షలాది రూపాయలను సమకూర్చి కూటమి నాయకులకు, అధికారులకు ముట్టజెప్పినట్లు బాహాటంగా పేర్కొంటున్నారు. దీని వెనుక ఆంతర్యం ఏమిటని ప్రజలు గుసగులాడుకుంటున్నారు. లక్షలాది రూపాయలు చేతులు మారాయని గుసగుసలు -
వరిపై మానుపండు తెగులు
భీమవరం: సార్వా సీజన్ ప్రారంభం నుంచి రైతులను కష్టాలు చుట్టుముడుతున్నాయి. వరి కంకుల్లో పసుపు రంగులో సుద్దలు, సుద్దలుగా మానుపండు వ్యాపించడంతో గింజలు తప్పలుగా మారి తీవ్ర నష్టం కలుగుతుందని వాపోతున్నారు. పైరు ఈనిక, పాలుపోసుకునే దశలో ఉన్న ప్రాంతాల్లో వర్షాల కారణంగా పుప్పొడి రాలిపోవడం, మానుపండు తెగులు సోకడం రైతన్నలకు తీవ్ర నష్టం తెచ్చిపెట్టింది. పుప్పొడి రాలిపోవడంతో ఎక్కువ గింజలు తప్పలుగా మారిపోయి దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానుపండు తెగులుతో గింజ రాలిపోవడంతోపాటు గట్టిదనం లోపించి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు వాపోతున్నారు. మానుపండు తెగులు చేనులోనికి దిగగానే పసుపు వంటి పౌడర్ పడుతుందని, దీనికి వల్ల రైతుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. మానుపండు తెగులు కారణంగా ధాన్యం ఎడెనిమిది బస్తాల తగ్గిపోయే ప్రమాదముంది. వర్షాల కారణంగా గింజలు తప్పలుగా మారిపోతున్నాచి. మానుపండు తెగులు గోరుచుట్టుపై రోకలిపోటుగా పరిణమించింది. మొత్తం మీద సార్వా పంట తీవ్ర నష్టాలు కలిగించింది. – వంగూరి రత్తయ్య, రైతు పంజా వేమవరం అక్టోబర్లో వర్షాలు కారణంగా మానుపండు ఆశించింది. ఈనిక దశలో ఉన్న పైరుపై వర్షాల వల్ల పుప్పొడి రాలిపోయి తప్పలుగా మారే అవకాశముంది. మానుపండు నివారణకు టిల్ట్ మందును ఎకరాకు 200 మిల్లీలీటర్ల పిచికారీ చేస్తే ప్రయోజనం ఉంటుంది. – జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారిసార్వా ఈనిక దశలో ఉండగా వర్షాల కారణంగా మానుపండు తెగులు ఎక్కువగా ఆశించింది. గతంలో ఎన్నడూలేని విధంగా మొత్తం కంకులకు తెగులు కనబడుతోంది. దీని నివారణకు మందులు లేవని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు. దీనివల్ల దిగుబడి తగ్గిపోయే ప్రమాదముంది. – కాపకాయల సత్యనారాయణ, రైతు, వేమవరం -
క్షేత్రపాలకుడి ఆలయంలో భక్త సంద్రం
ద్వారకాతిరుమల: క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని శివదేవునికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ముందుగా దేవస్థానం సిబ్బంది ఆలయాన్ని సుగంధ భరిత పుష్పమాలికలతో శోభాయమానంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు, శివ దీక్షాదారులు తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు, పూజాధికాలను జరుపుకున్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని ఉసిరిచెట్ల వద్ద మహిళా భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ గర్భాలయంలో శివయ్యకు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ క్షీరాభిషేకాలు నిర్వహించి, హారతులిచ్చారు. రాత్రి గంగా, పార్వతీ సమేత శివయ్య శేష వాహనంలో క్షేత్ర పురవీదుల్లో అట్టహాసంగా ఊరేగారు. ప్రతి ఇంటి ముంగిట భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించి, నీరాజనాలు సమర్పించారు. -
బలివేలో ప్రత్యేక పూజలు
ముసునూరు: మండలంలోని శివాలయాలు నాలుగో సోమవారం భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున అమృత ఘడియల్లో బలివేలోని బలే రామస్వామి ఆలయంలో త్రిలోచనుడికి శివభక్తులు జ్యోతిర్లింగాక్షక పారాయణంతో అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. నూజివీడు సివిల్ కోర్టు జడ్జి కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకుని, అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ముసునూరు,లింగపాలెం, పెదవేగి, ఏలూరు మండలాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈఓ పామర్తి సీతారామయ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. చెక్కపల్లిలోని శివాలయం, భక్తాంజనేయ స్వామి ఆలయాల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. రమణక్కపేటలోని పార్వతీ సమేత శివాలయంలో భక్తులు దీపోత్సవాన్ని నిర్వహించారు. వేల్పుచర్ల, గుడిపాడు, చింతలవల్లి, గోగులంపాడు, గ్రామాల్లోని శివాలయాలలో పలువురు భక్తులు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. -
నూజివీడులో ఆర్చరీ పోటీల నిర్వహణ
నూజివీడు: ఏపీ జూనియర్ అండ్ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్చరీ చాంపియన్షిప్–2025 పోటీలు సోమవారం పట్టణంలోని సార థి ఇంజినీరింగ్ కళాశాలలో సాగాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్, ఉమ్మడి కృష్ణా జిల్లా ఆర్చరీ అసోసియేషన్, చెరుకూరు ఓల్గా ఆర్చరీ అకాడమీ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో భాగంగా కాంపౌండ్ విభాగంలో పోటీలను నిర్వహించారు. 26 జిల్లాల నుంచి 36 మంది పురుషులు, 20 మంది మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు. మహిళల విభాగంలో రిషి కీర్తన, షణ్ముఖ నాగసాయి, సూర్యహాసిని, కన్షిక, పురుషుల విభాగంలో చరణ్శ్రీసాయి, సుహాస్, హర్షవర్ధన్, త్రినాథ్ చౌదరి, వెంకట ప్రద్యుమ్నలు ఎంపికయ్యారు. వీరవాసరం: నవంబర్ 21 నుంచి 23 వరకు ఆంధ్ర ప్రదేశ్ 69వ స్కూల్ గేమ్స్ అండర్–17 బాలబాలికల సాఫ్ట్బాల్, అంతర జిల్లాల టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ అధ్యక్షుడు జుత్తిగ శ్రీనివాస్, కార్యదర్శులు పీఎస్ఎన్ మల్లేశ్వరరావు, బాజీంకి శ్రీనివాసరావు తెలిపారు. ఈ పోటీలలో ఉమ్మడి జిల్లాల బాల బాలికల జట్ల నుంచి సుమారు 416 మంది క్రీడాకారులు 52 మంది కోచ్, మేనేజర్లు పాల్గొంటారు. ఉంగుటూరు : యానాం నుంచి ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లికి మద్యం తీసుకెళ్తున్న ఇద్దరు యువకులను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కారులో యానాం నుంచి 24 బాటిల్స్ మద్యం తీసుకెళ్తుండగా.. చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ అదుపులోకి తీసుకుని కోర్టులో హజరుపరిచారు. కోర్టు యువకులకు రిమాండు విధించింది. తాడేపల్లిగూడెం రూరల్ : మండలంలోని పడాల గరువుకు చెందిన గుజ్జి జయంతి, కుటుంబ సభ్యులు ఈ నెల 16న విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంటికి వచ్చి చూసేసరికి బంగారు, వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. వీటి విలువ రూ.1.90 లక్షలు ఉంటుందని, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ హెచ్సీ జిలాని తెలిపారు. -
చివరి సోమవారం పోటెత్తిన భక్తులు
భీమవరం(ప్రకాశం చౌక్): కార్తీక మాసం చివరి సోమవారం భీమవరం పంచారామక్షేత్రం శ్రీ ఉమాసోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానం శివ నామస్మరణతో మార్మోగింది. పంచారామక్షేత్రాల యాత్రికులు, జిల్లా నలమూల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. సుమారు 20 వేల మంది భక్తులు ప్రత్యేక క్యూలైన్లలో స్వామిని దర్శించుకున్నారు. పార్వతి దేవి, అన్నపూర్ణదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. దేవస్థానంలో స్వామికి అభిషేకాలు, పూజలు, కార్తీక దీపారాధానలు, కార్తీక నోములు నోచుకున్నారు. రాజకీయ నాయకులు, ప్రముఖులు స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం ఆద్వర్యంలో నిర్వహించిన అన్నదానంలో పెద్ద సంఖ్యలో భక్తులు అన్నదాన ప్రసాదం స్వీకరించారు. దర్శనం, అభిషేకం టికెట్ల ద్వారా రూ.7,59,900 ఆదాయం, లడ్డూ ప్రసాదంతో రూ.46,000 ఆదాయం వచ్చింది. నిత్యాన్నదానం ట్రస్ట్లో కానుకల రూపంలో రూ.1,26,660 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. స్వామికి ప్రత్యేక పూజలు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజాము నుంచే ప్రధాన అర్చకుల రామకృష్ణ ఆధ్వర్యంలో అర్చకులు స్వామికి మహాన్యాసపూర్వక రుధ్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం స్వామికి లక్షపత్రి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి డి.రామకృష్ణంరాజు, ట్రస్ట్బోర్డు చైర్మన్ చింతలపాటి బంగారాజు, ధర్మకర్తలు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. పట్టణంలోని భీమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు కార్తీక నోములు నోచుకున్నారు. పట్టణంలో పలు శివాలయాల్లో కార్తీక మాసం నాలుగో సోమవారం స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, నిర్వహించారు. పాలకొల్లులో అన్నదాన సత్రం సమీపంలో క్యూలైన్ పంచారామ క్షేత్రానికి భారీగా తరలివచ్చిన భక్తులు పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం క్షీరారామరామలింగేశ్వరస్వామి ఆలయం కార్తీక మాసం చివరి సోమవారం భక్తులతో కిటకిటలాడింది. వేకువ జాము నుంచి భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం పులకించింది. మహిళలు వేకువజామునే కాలువలో స్నానాలు ఆచరించి.. కార్తీక దీపాలు వదిలి అనంతరం క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామికి అభిషేకాలు చేయించుకునే భక్తులు మహాన్యాసంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ పంచారామ యాత్రికులతో ఆలయం కిటకిటలాడింది. ద్రాక్షారామం, సామర్లకోట, అమరావతి, భీమవరం క్షేత్రాలను సందర్శించిన యాత్రికులు క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు అంచనా వేశారు. ఆలయం ఎదురుగా క్షీరారామలింగేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా పాలు పంపిణీ చేశారు. కాపు క్లబ్ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేశారు. కార్తీకమాస ఉచిత అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి భక్తులు బారులు తీరారు. కొంతవరకూ టెంట్లు వేసినా భక్తుల తాకిడి పెరగడంతో ఎండలో గంటల తరబడి నిలబడ్డారు. రేపాక వారి సత్రం నుంచి బొమ్మన వరకూ అన్నదానానికి భక్తులు క్యూలో నిలబడ్డారు. ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఎస్సై జీజె ప్రసాద్, పోలీసు సిబ్బంది, కళాశాలల విద్యార్థిలు, పలు సేవా సంస్థల సభ్యులు తమ సేవలు అందించారు. -
గ్రావెల్ గుట్టలు మాయం
నూజివీడు: పట్టణానికి చెందిన ఒక టీడీపీ చోటా నాయకుడి దెబ్బకు మండలంలోని గ్రావెల్ గుట్టలు మాయమవుతున్నాయి. రాత్రి సమయాల్లో జేసీబీలు పెట్టి అడ్డగోలుగా తవ్వకాలు చేసి టిప్పర్లలో తరలించి అమ్ముకుంటున్నారు. మండలంలోని హనుమంతులగూడెంలోని తేలపోడు తిప్ప గట్టును తవ్వేసి గ్రావెల్ను తరలిస్తూ దోచుకుంటున్నారు. టిప్పర్ గ్రావెల్ను పట్టణానికి తరలించి రూ.8 వేల నుంచి రూ.9 వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. విస్సన్నపేట, ముసునూరు ప్రాంతాలకు సైతం గ్రావెల్ను తరలిస్తున్నారు. అధికారులు ప్రశ్నిస్తే మంత్రి పేరు చెప్పి బెదిరిస్తున్నారు. నియోజకవర్గంలో నూజివీడు, ఆగిరిపల్లి మండలాల్లో రాత్రి సమయాల్లో గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకుంటున్న అధికారులే కరువయ్యారు. కొండలను పిండి చేసేస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. హనుమంతులగూడెంలోని గట్టును రాత్రి సమయంలో జేసీబీలతో తవ్వి టిప్పర్లలో తరలించడాన్ని గమనించిన గ్రామస్తులు పలువురు పట్టుకుని ఆపారు. అడ్డొస్తే తొక్కించేస్తామంటూ చోటా టీడీపీ కార్యకర్త బెదిరించడం గమనార్హం. దీంతో గ్రామం నుంచి గ్రావెల్ను ఎలా తరలిస్తారో చూస్తామంటూ గ్రామస్తులు రాత్రి సమయాల్లో నిఘా పెట్టారు. దీంతో అక్రమార్కులు హనుమంతులగూడెం నుంచి మండలంలోని సిద్ధార్థనగర్ వైపు ఉన్న గుట్టలపైకి దృష్టి మళ్లించారు. అక్కడ గుట్టలను పిండి చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 40 నుంచి 50 టన్నుల బరువుతో తిరుగుతున్న గ్రావెల్ టిప్పర్లతో మట్టిరోడ్లు ధ్వంసమైపోతున్నాయి. -
మద్దిలో కార్తీక సోమవారం పూజలు
జంగారెడ్డిగూడెం: మద్ది క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా స్వామికి లక్ష తమలపాకులతో శ్రీవార్షికశ్రీ లక్షార్చన కార్యక్రమం ఆలయ అర్చకులు, వేదపండితులు, రుత్విక్లు వైభవంగా నిర్వహించినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. వివిధ సేవల రూపేణా రూ.1,56,400 విరాళంగా సమకూరినట్లు ఈవో తెలిపారు. భీమవరం: వయసు మళ్లిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే.. ఆస్తి దస్తావేజు వయోవృద్ధుల మనోవర్తి చట్టం ప్రకారం రద్దు చేస్తారని భీమవరం 2వ అదనపు జ్యుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఎన్.జ్యోతి అన్నారు. ఉండి మండలం మహాదేవపట్నంలోని సన్రైజ్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో సోమవారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. పిల్లలకు చిన్నతనం నుంచే పెద్దవారి పట్ల ప్రేమ, ఆప్యాయతలను తెలియజేస్తూ పెంచాలన్నారు. అనంతరం వృద్ధుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాదులు పి.అంబేద్కర్, ఎన్.సుధీర్, బి.సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పు నిచ్చారు. వన్టౌన్ దక్షిణపు వీధికి చెందిన టేకి శివరామకృష్ణ గంగాధరాచారి కుటుంబం నగరానికి చెందిన ఎం.సుధాకరరెడ్డి వద్ద 2022లో రూ.6 లక్షలు అప్పు తీసుకున్నారు. బాకీ తీర్చే నిమిత్తం 2023 జనవరిలో రూ.4.80 లక్షల చెక్కును సుధాకరరెడ్డికి ఇచ్చారు. ఆ చెక్కు బౌన్స్ అయ్యింది. సుధాకరరెడ్డి కోర్టులో కేసు వేశారు. చెల్లని చెక్కు ఇచ్చిన నేరం రుజువైనందున గంగాధరాచారికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. అలాగే రూ.4.80లక్షలు చెల్లించాలని ఆదేశించింది. పెనుగొండ: దొంగరావిపాలెంలో విజిలెన్స్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు పెనుగొండ ఎస్సై గంగాధర్ తెలిపారు. సోమవారం నిర్వహించిన తనిఖీల్లో రావులపాలెం వైపు వెళ్తున్న బొలేరో వాహనంలో అక్రమంగా 58 బస్తాలు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం చేసుకోవడంతో పాటు, వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. -
భయం భయంగా..
భీమడోలు మీదుగా ద్వారకాతిరుమల క్షేత్రానికి కాలినడకన వెళ్తున్నాను. మధ్యలోని గ్రామాల్లో ఉన్న సెంటర్లలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో వీధి లైట్లు లేవు. నడిచి వెళుతుంటే వాహనాలు మీదకొస్తున్నాయి. దాంతో భయం భయంగా నడవాల్సి వస్తోంది. కనీసం లైట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – కిలాడి కొండమ్మ, వసంతవాడ, పెదపాడు మండలం దూబచర్ల నుంచి రాళ్లకుంట మీదుగా క్షేత్రానికి పాదయాత్రగా వెళ్తున్నాను. మధ్యలో రోడ్డుపైనే పాములు కనిపించాయి. కనీసం వీధి లైట్లు కూడా లేవు. విద్యుత్ స్తంభాలకు మాత్రం ఇనుప పైపులు దర్శనమిస్తున్నాయ్. లైట్లు ఏర్పాటు చేయనప్పుడు ఆ పైపులెందుకు. వెంటనే నడక దారిలో లైట్లు ఏర్పాటు చేయాలి –దొడ్డ రాధాకృష్ణ, చానమిల్లి, పెదపాడు మండలం కాలినడక మార్గాల్లో షెల్టర్లు లేక ఇబ్బందిగా ఉంది. నడవలేని వారు విశ్రాంతి పొందే వీలు లేక రోడ్ల పక్కనే కూర్చుంటున్నారు. ప్రతి మూడు, నాలుగు కిలోమీటర్లకు ఒకటైనా షెల్టర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇంత ఆదాయం వస్తున్నా ఇంతవరకూ పట్టించుకోకపోవడం సరికాదు. ఇప్పటికైనా దేవస్థానం సిబ్బంది, ప్రభుత్వం దృష్టి సారించాలి. అధికారి బాబీ, మార్టేరు దూబచర్ల–ద్వారకాతిరుమల కాలినడక మార్గంలో మరుగుదొడ్లు లేవు. దాంతో పాదయాత్రగా వస్తున్న భక్తులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ముఖ్యంగా మహిళా భక్తులు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. దానికి తోడు రోడ్ల పక్కన పెరిగిన పొదలు, లైట్లు లేని చీకటి మార్గం వల్ల నరకం కనిపించింది. – బత్తుల శివలక్ష్మి, కుంచనపల్లి, తాడేపల్లిగూడెం మండలం -
గోమాంసం కేరాఫ్ తణుకు?
సాక్షి టాస్క్ఫోర్స్: విశాఖలో వెలుగుచూసిన గోమాంసం లింకు తణుకు ప్రాంతంతో ముడిపడడం సంచలనంగా మారింది. విశాఖపట్నం పోర్టులో ఇటీవల కోల్డ్ స్టోరేజ్లో నిఘా విభాగం పట్టుకున్న 1.89 లక్షల కిలోల గోమాంసంతో ఈ ప్రాంతానికి సంబంధం ఉందంటూ వస్తున్న కథనాలతో తణుకు వాసులు ఆందోళన చెందుతున్నారు. విశాఖలో కంటైనర్లు, కోల్ట్ స్టోరేజ్లలో పట్టుబడిన గోమాంసంలో ఎక్కువ భాగం తణుకుదేనని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పశు సంవర్థక శాఖ తాడేపల్లిగూడెం డీడీ డాక్టర్ సుధాకర్ను విశాఖకు రప్పించి కేంద్ర నిఘా విభాగం వివరాలు ఆరాతీసింది. గోవధ మహా పాపమని, తణుకులాంటి ప్రాంతంలో ఇలా జరుగుతుందా? అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో నిర్వహిస్తున్న లాహం ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో నిర్వహిస్తున్న పశువధ కారణంగా ఇటీవల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశు వధ కార్యకలాపాలతో ఇళ్లలో ఉండలేకపోతున్నామని పిల్లలకు ఊపిరి అందడంలేదని కర్మాగారం ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిటికీలు, తలుపులు తెరచుకునే అదృష్టం లేకుండాపోయిందని, తలుపులు తెరిస్తే చాలు దుర్వాసనతో అల్లాడిపోతున్నామని వాపోతున్నారు. పిల్లలు ఆరుబయట ఆటలాడుకునేందుకు ఇంటి బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉందని చెబుతున్నారు. కోవిడ్ పరిస్థితుల్లో ఉపయోగించిన మాస్క్లు తేతలి గ్రామ పరిధిలోని మహాలక్ష్మీనగర్లో ఇప్పటికీ వినియోగించాల్సిన దుస్థితి నెలకొంది. ఆరుబయట కూర్చోవాలంటే మహిళలు మాస్క్లు పెట్టుకోవాల్సిందేనని వాపోతున్నారు. నాలుగు జిల్లాల నుంచి పశువుల తరలింపు తేతలి పశువధ కర్మాగారానికి తణుకు పరిసర ప్రాంతాల్లోని పశువులతోపాటు పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల నుంచి పశువులను అక్రమ మార్గంలో వ్యాన్లపై తోలుకువస్తున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఏ ప్రాంతంలో గేదెలు కనిపించకపోయినా తేతలి పశువధ కర్మాగారానికి వచ్చి వెతుక్కునే పరిస్థితి వచ్చిందంటూ పశు పోషకులు చెబుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో పశువులను పశువధ శాలకు తోలుకు వస్తున్నారని, పశువులను నిబంధనలకు విరుద్దంగా ఒకదానిపై ఒకటి ఎక్కించి తీసుకొస్తున్నారని, అవి తీవ్రంగా గాయపడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటివరకు తేతలి ప్రాంతానికే పరిమితమైన పశువధశాలకు చెందిన దుర్వాసన నేడు మెల్లగా తణుకు ప్రాంతానికి కూడా పాకింది. తాజాగా తణుకులోని సజ్జాపురం, పైడిపర్రు ప్రాంతాలకు కూడా దుర్వాసన వెదజల్లుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. తేతలి గ్రామంతోపాటు డ్రైవర్స్ కాలనీ, పైడిపర్రు, మహలక్ష్మీనగర్, సజ్జాపురం, అండర్ గ్రౌండ్ ప్రాంతవాసులు ఈ దుర్వాసనకు బాధితులుగా ఉన్నారు. విశాఖలో పట్టుబడ్డ గోమాంసం లింకులపై కథనాలు తణుకులో గోవధ జరుగుతోందా? పశువధ శాల ప్రాంతంలో ఉండలేకపోతున్నామంటున్న బాధితులు ఎదురుతిరిగితే దాడులు, కేసులు తణుకు ఎమ్మెల్యే న్యాయం చేయలేదంటున్న బాధితులు పశువులను వధించడం వల్ల స్థానికంగా బతకడం కష్టంగా ఉంది. బాధితులందరం కలిసి రోడ్డెక్కితే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మాకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు సైతం పశువధశాలకే అనుకూలంగా ఉంటున్నారు. పోలీసులు, పశువధశాల యజమానులు కుమ్మకై ్క పోయి పోరాటం చేసే మాపైనే కేసులు పెట్టే పరిస్థితి ఎదురైంది. పరిస్థితి ఇలానే కొనసాగితే మాత్రం ఈ ప్రాంతం బీడుగా మారే ప్రమాదం ఉంది. –రాపాక మందులు, మహాలక్ష్మీనగర్, తేతలి కష్టార్జితంతోపాటు అప్పులు చేసి తేతలిలోని మహాలక్ష్మినగర్లో ఇళ్లు నిర్మించుకున్నాం. ఏడాది కాలంగా విపరీతమైన దుర్వాసనతో పిల్లలు వాంతులు చేసుకుంటున్నారు. ఆ వాసన సమయంలో కడుపులో తిప్పడంతోపాటు తల తిరిగిపోతుంది. తణుకు ఎమ్మెల్యేతోపాటు జిల్లా కలెక్టరు, పవన్ కల్యాణ్ను కూడా కలిశాం. మా సమస్య పరిష్కారం కాలేదు. సమస్య పరిష్కారం కాకపోతే ఇళ్లు వదిలిపెట్టి దూరంగా వెళ్లాల్సిందే. –టి.భవాని, మహాలక్ష్మీనగర్, తేతలి -
నడక దారిలో నరకయాతన
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రానికి పాదయాత్రగా వెళ్లే భక్తులు కాలినడక మార్గాల్లో నరక యాతన అనుభవిస్తున్నారు. వీధి లైట్లు, మరుగుదొడ్లు, విశ్రాంతి పొందేందుకు కనీసం షెల్టర్లు లేక అష్టకష్టాలు పడుతున్నారు. దాంతో మా కష్టాలు చూడవయ్యా.. అంటూ ఆ గోవిందుడికి మొర పెట్టుకుంటున్నారు. ద్వారకాతిరుమల దివ్య క్షేత్రానికి కాలినడక భక్తుల సంఖ్య పెరుగుతోంది. సాధారణంగా ప్రతి శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి 2 వేల మంది వరకు భక్తులు పాదయాత్రగా క్షేత్రానికి చేరుకుంటున్నారు. వారంతా దేవస్థానం నిత్యాన్నదాన భవనంలో స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించి, డార్మెటరీల్లో, ఆలయ పరిసరాల్లో విశ్రాంతి పొందుతున్నారు. శనివారం ఉదయాన్నే శ్రీవారు, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. శనివారం సైతం అధిక సంఖ్యలోనే భక్తులు కాలినడకన క్షేత్రానికి వస్తున్నారు. ప్రస్తుతం కార్తీకమాస పర్వదినాల్లో ఒక్క శుక్రవారం నాడే 4 వేల మందికి పైగా భక్తులు కాలినడకన క్షేత్రానికి చేరుకుంటున్నారు. రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, గణపవరం, దేవరపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు దూబచర్ల–రాళ్లకుంట మీదుగా క్షేత్రానికి వస్తున్నారు. కృష్ణాజిల్లా, ఏలూరు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు భీమడోలు, తడికలపూడి మీదుగా, అదేవిధంగా ఖమ్మం, అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత భక్తులు కామవరపుకోట మీదుగా క్షేత్రానికి చేరుకుంటున్నారు. చిమ్మ చీకట్లో.. సెల్ఫోన్ వెలుగుల్లో ఎక్కువగా భక్తులు దూబచర్ల–రాళ్లకుంట మీదుగా, ఆ తరువాత భీమడోలు మీదుగా క్షేత్రానికి వస్తున్నారు. ఈ మార్గాల్లో లైట్లు లేకపోవడంతో చిమ్మ చీకట్లోనే తమ పాదయాత్రను సాగిస్తున్నారు. కొందరు ఇళ్ల వద్ద నుంచి టార్చ్ లైట్లు వెంటబెట్టుకొస్తుంటే, మరికొందరు సెల్ఫోన్ వెలుగుల్లో నడుస్తున్నారు. విష సర్పాల మధ్య నుంచి తమ యాత్ర సాగుతోందని భక్తులు వాపోతున్నారు. కొందరు కర్రలు పట్టుకుని నడుస్తున్నారు. రాళ్లకుంట మార్గంలో విద్యుత్ స్తంభాలకు పైపులు ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్నా ఒక్క లైటు కూడా అమర్చలేదు. మధ్యలో మరుగుదొడ్లు లేక మహిళా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నడిచే సమయంలో అలసట వస్తే విశ్రాంతి పొందేందుకు షెల్టర్లు లేక రోడ్లపైనే కూర్చుంటున్నారు. రాళ్లకుంట గ్రామంలో కొన్నేళ్ల క్రితం దాతలు నిర్మించిన షెల్టర్ ఒక్కటే భక్తులకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తోంది. కోతలతోనే సరి కొందరు ప్రజాప్రతినిధులకు రాజకీయంగా వాడుకోవడానికి క్షేత్రం పేరు బాగా ఉపయోగపడుతోంది. భక్తులకు అదిచేస్తాం.. ఇది చేస్తామని కోతలు కోస్తున్న పాలకులు కనీసం కాలినడక మార్గాల్లో వీధిలైట్లు కూడా వెలిగించలేక పోతున్నారని భక్తులు మండిపడుతున్నారు. పాదయాత్ర మార్గాల్లో ఉన్న గ్రామ పంచాయతీలు తమ పంచాయతీ శివార్ల వరకు వీధి లైట్లు వెలిగించగలిగితే సమస్య కాస్త తీరుతుంది. ఈ విధానాన్ని అమలు పరిచేవారు ఎవరన్నది ఇక్కడ ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటికై నా పాలకులు కళ్లు తెరవాలని పాదయాత్ర భక్తులు కోరుతున్నారు. కాలినడక మార్గాల్లో శ్రీవారి భక్తుల అవస్థలు వీధి లైట్లు, మరుగుదొడ్లు, షెల్టర్లు లేక ఇక్కట్లు చీకట్లో విషసర్పాల మధ్య నుంచి క్షేత్రానికి చేరుకుంటున్న భక్తులు కనీస సౌకర్యాలు కల్పించాలంటూ భక్తుల మొర -
‘సంతాన ప్రాప్తిరస్తు’ టీం సందడి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇటీవల విడుదలైన సంతాన ప్రాప్తిరస్తు చిత్రం తారాగణం ఆదివారం నగరంలో సందడి చేసింది. హీరో, హీరోయిన్లు విక్రాంత్, చాందినీ చౌదరి చిత్రం ప్రదర్శితమౌతున్న వీ– మ్యాక్స్ థియేటర్లో ప్రేక్షకులతో మాట్లాడారు. అనంతరం విలేకరుల సమావేశంలో హీరో విక్రాంత్ మాట్లాడుతూ యువ జంటలు ఎదుర్కొంటున్న సంతానలేమి సమస్యను ప్రధానాంశంగా సినిమాను తెరకెక్కించామన్నారు. హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ సంతాన ప్రాప్తిరస్తు సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని, ప్రేక్షకులు మంచి చిత్రం చూసామనే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. హీరో, హీరోయిన్లు పడమర వీధిలో శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతరకు సంబంధించి మేడల్లో కొలువై ఉన్న అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుట్టాయగూడెం: బిర్సాముండా 150వ జయంతి సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీల్లో బుట్టాయగూడెం మండలం ఇప్పలపాడు సమీపంలో ఉన్న ఏకలవ్య మోడ్రన్ స్కూల్ విద్యార్థిని తెల్లం భువన ప్రథమ స్థానంలో నిలిచిందని ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్ తెలిపారు. బహుమతిని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ చేతుల మీదుగా అందుకున్నట్లు తెలిపారు. -
ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తూ
ఎన్నికల హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం పాలనలోనూ అదే ఒరవడి కొనసాగిస్తోంది. పేదల కోసం కొత్త కార్యక్రమాలు చేస్తున్నట్టు హడావుడి చేయడం, లబ్ధిదారుల ఎంపికంటూ అధికారులను పరుగులు పెట్టించడం, పేదల్లో ఆశలు రేకెత్తించి చివరకు అటకెక్కించడం పరిపాటిగా మారింది. కార్పొరేషన్ రుణాల పేరిట సోపానం, పేదవర్గాల కోసం చేపట్టిన పీ–4 ఇలా కార్యక్రమం ఏదైనా చివరకు జరుగుతోంది ఇదేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సోమవారం శ్రీ 17 శ్రీ నవంబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం: ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల్లోని నిరుద్యోగ యువత స్వయం ఉపాదికి సబ్సిడీ రుణాల పేరిట చంద్రబాబు ప్రభుత్వం మార్చిలో హడావుడి చేసిన విషయం తెలిసిందే. జిల్లాకు రూ.122.5 కోట్ల విలువైన 3,728 యూనిట్లను కేటాయించింది. వీటిని రూ.2 లక్షలు, రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు, రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల కేటగిరీలుగా విభజించింది. జనరిక్ మెడికల్ షాపుల యూనిట్ ధర రూ.8 లక్షలుగా ఉంది. యూనిట్ వ్యయం మొత్తంలో 40 శాతం వరకు ప్రభుత్వ సబ్సిడీ, మిగిలింది బ్యాంకు రుణంగా నిర్ణయించింది. తొలుత మార్చి నెలాఖరు నాటికి యూనిట్లను గ్రౌండ్ చేయాలని భావించగా ఎమ్మెల్నీ ఎన్నికల కోడ్ రావడంతో మే నెలాఖరు వరకు పొడిగించింది. ‘స్వయం ఉపాధి సోపానం’ పేరిట లబ్ధిదారుల ఎంపికకు ఇంటర్వూలు సైతం నిర్వహించగా ఇప్పుడు ఆ ఊసే వినిపించడం లేదు. ఒక్కో గ్రామానికి కేటాయించిన యూనిట్లు ఐదు నుంచి పదిలోపే ఉండగా దరఖాస్తులు భారీగా వచ్చాయి. రుణాలు రాని వారి అసంతృప్తి ప్రభుత్వానికి చేటు చేస్తుందన్న ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు వెనుకడుగేశారని తెలుస్తోంది. తమకు కార్పొరేషన్ రుణాలు ఎప్పుడు విడుదల అవుతాయోనని ఇంటర్వూల్లో ఎంపికై న అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. విశాఖలోని పోర్టులో వెలుగుచూసిన గోమాంసం లింకు తణుకు ప్రాంతంతో ముడిపడటం సంచలనంగా మారింది. అట్టడుగు పేద కుటుంబాలను సంపన్నుల సాయంతో అభివద్ధి చేసేందుకు పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ పార్టనర్షిప్ (పీ–4) అంటూ హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. జిల్లాలో మొత్తం 4,92,292 కుటుంబాలకు పలు వడపోతల తర్వాత 64,940 కుటుంబాలు అర్హులుగా ఎంపిక చేశారు. సంపన్నులను మార్గదర్శకులుగా చేర్పించి ఆయా కుటుంబాలను వారికి అనుసంధానించాలి. దత్తత తీసుకున్న కుటుంబాలకు ఆర్థిక చేయూత, లేదా జీవనోపాధికి అవసరమైన నైపుణ్యాలను నేర్పించడం ద్వారా వారి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలన్నది పీ–4 ముఖ్య ఉద్దేశం. జిల్లాలో 15 వేల మంది మార్గదర్శకులను గుర్తించాలని లక్ష్యం కాగా సుమారు 1,700 మంది మాత్రమే మార్గదర్శకులు రిజిస్టర్ చేసుకున్నారు. వీరికి దాదాపు 35 వేల కుటుంబాలను మ్యాపింగ్ చేశారు. మార్గదర్శకులుగా చేరేందుకు సంపన్న వర్గాల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో చివరకు ఉద్యోగవర్గాలపై భారం మోపారు. టీచర్లను భాగస్వాములను చేసే ప్రయత్నాలను ఉపాధ్యాయ సంఘాలు ఆదిలోనే తిప్పికొట్టాయి. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు జిల్లాలో ఎన్ని పేద కుటుంబాలకు ఏ విధంగా మేలు జరిగిందనేది స్పష్టత లేదు. ప్రస్తుతం పీ–4 అమలులోనే ఉన్నట్టు చెబుతున్నా గతంలో మాదిరి రోజువారీ రివ్యూలు, ప్రగతి నివేదికలు జరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు.కొబ్బరి వ్యాపారం కోసం కాపు కార్పొరేషన్ ద్వారా రుణం వస్తుందని ఎంతో ఆశగా దరఖాస్తు చేసుకున్నాను. కానీ ఇంతవరకూ రుణం మంజూరు కాలేదు. ఈ ఏడాది కొబ్బరి ధర బాగుండడంతో తోటి వ్యాపారస్తులంతా పెద్ద సంఖ్యలో లాభాలు ఆర్జించారు. పెట్టుబడి సాయం లేకపోవడంతో నేను నష్టపోయాను. – వల్లభు దుర్గాప్రసాద్, యలమంచిలిలంక చంద్రబాబు సర్కార్ మాయ మాటలతో పాలన సాగిస్తోంది. కార్పొరేషన్ రుణాలు, పీ–4, గృహ నిర్మాణానికి రూ.4 లక్ష సాయం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం వాటిని పక్కన పడేసి పేదలను అవమానపరిచింది. ఇచ్చిన మాటకు కట్టుబడాలన్న, ప్రజలకు ఏదైనా చేయాలన్న జగన్మోహన్రెడ్డి తర్వాతే ఎవరైనా. – పీవీఆర్కే ఆంజనేయరాజు, ఎంపీటీసీ, వాండ్రం సోపానం.. సుదూరం జాడలేని కార్పొరేషన్ రుణాలు దారిచూపని పీ–4 సాయం జిల్లాలో 64,940 కుటుంబాల ఎదురుచూపులు పారిశుద్ధ్యంపై తనిఖీల్లేవు ఏడాదిన్నరలో అటకెక్కిన హామీలెన్నో.. ప్రచార ఆర్భాటంగా చంద్రబాబు సర్కారు పాలన అక్టోబర్ 2 తర్వాత నుంచి రాష్ట్రం అంతటా ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్టు మార్చిలో తణుకులో జరిగిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర సభలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎక్కడకు వచ్చేది రెండు, మూడు గంటల ముందే తెలియజేస్తానని, ఎమ్మెల్యేలు పరుగెత్తాల్సి వస్తుందన్నారు. స్వచ్ఛత లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానన్నారు. అయితే ఇప్పటివరకు ఒక్కచోట కూడా ఆకస్మిక తనిఖీలు చేసింది లేదు. అందుకోసం ప్రణాళికలు రచించింది లేదు. సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపంతో స్వచ్ఛాంధ్ర ప్రకటనలకే పరిమితమవుతోంది. చాలా పంచాయతీల్లో సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. డంపింగ్ యార్డులు లేక, బృందావనాలు వినియోగానికి నోచుకోక గ్రా మాల్లో సేకరించిన చెత్తను కాలువ గట్లు, రోడ్లు పక్కన ఎక్కడపడితే అక్కడే డంప్ చేస్తున్నారు. -
తవ్వేయ్.. తరలించేయ్
● ఇరిగేషన్ చెరువులో గ్రావెల్ తవ్వకాలు ● అడ్డుకున్న రైతులపై దౌర్జన్యం ● పట్టించుకోని అధికారులు !సాక్షి, టాస్క్ఫోర్స్: భీమడోలు మండలం పొలసానిపల్లిలోని చందుబోణం మైనర్ ఇరిగేషన్ చెరువులో రెండు రోజులుగా గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. శనివారం రాత్రి నుంచి భారీ పొక్లయిన్లతో గ్రావెల్ను తవ్వి తరలిస్తుండగా ఆయకట్టు రైతులు అడ్డుకున్నా అక్రమార్కులు పట్టించుకోలేదు. ఆదివారం పట్టపగలే గ్రావెల్ తవ్వుతుండగా రైతులు మరోమారు అడ్డుకున్నారు. భారీ గుంతలతో తమ పొలాలకు పెను ప్రమాదం తప్పదని రైతులు నిలదీశారు. వీరిపై అక్రమార్కులు దౌర్జన్యానికి దిగారు. గ్రావెల్ తవ్వకాలకు పంచాయతీ తీర్మానం చేసి ఇచ్చారని సుధీర్ అనే వ్యక్తి రైతులతో వాగ్వాదానికి దిగాడు. తీర్మానం చూపించాలని రైతులు నిలదీస్తే.. మీరే వెళ్లి పంచాయతీ నుంచి అడిగి తెలుసుకోండని అడ్డగోలుగా మాట్లాడాడు. అధికారులు, కూటమి నాయకుల సహకారంతోనే మట్టి మాఫియా చెలరేగిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఉప సర్పంచ్ అంబటి నాగేంద్రప్రసాద్ గ్రావెల్ తవ్వకాలపై వీడియో తీసి అధికారులకు పంపించారు. దీంతో వీఆర్వో ఇక్కడకు వచ్చి పొక్లయిన్తో తవ్వకం పనులను నిలిపివేయించి మట్టి మాఫియాను హెచ్చరించారు. అయితే పొక్లయిన్ను సీజ్ చేయలేదు. అభివృద్ధి పనుల సాకుగా.. పొలనానిపల్లిలో అభివృద్ధి పనులకు గ్రావెల్ను వినియోగించుకునేలా గతంలో పంచాయతీ తీర్మానం చేసింది. దీనిని సాకుగా చూపి చందుబోణం చెరువులో గ్రావెల్పై మాఫియా కన్నేసి తవ్వకాలు చేపట్టింది. దీనిపై పంచాయతీ, రెవెన్యూ అధికారుల దృష్టికి రైతులు తీసుకువెళ్లగా అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే సంబంఽధిత అధికారులు పొంతలు లేని సమాధానం చెబుతున్నారు. దీనిపై గ్రామ కా ర్యదర్శి జయరామకృష్ణను వివరణ కోరగా తమ ప్రమేయం లేదని, గ్రామంలో గ్రావెల్ తరలింపుపై పంచాయతీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. అభివృద్ధి పనులకు తప్ప ఇతరులు గ్రావెల్ తీసుకువెళితే ఊరుకోబోమన్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యను వీఆర్వోకు తెలిపి చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. భారీ గుంతలతో ప్రమాదం వీఆర్వో గ్రావెల్ తవ్వకాల ప్రాంతానికి వచ్చి పంచ నామా చేసి పొక్లయిన్ను ఎందుకు సీజ్ చేయలేదని మాజీ ఉప సర్పంచ్, వైఎస్సార్సీపీ నేత అంబటి నాగేంద్రప్రసాద్ ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో భారీ గుంతలతో చెరువు సహజ స్వరూపం కోల్పోతుందని, నీరు పెట్టినా నీరంతా కిందకు ఇంకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు భూగర్భ జలాలు తగ్గిపోతుంటే, ఇప్పుడు నీరు పెట్టేందుకు ఆస్కారం లేకుండా గ్రావెల్ మాఫియా చెలరేగిపోతుందని, అధికారులు వీరికి సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. -
●అంతటా నిర్లక్ష్యం.. అందేంత ఎత్తులో ప్రమాదం
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రమాదాలు తెచ్చిపెట్టేలా ఉంది. తణుకు బొమ్మల వీధిలో డ్రెయినేజీలో కలిసిన విద్యుత్ స్తంభం తుప్పుపట్టి కూలేందుకు సిద్ధంగా ఉంది. అలాగే ఇదే వీధిని ఆనుకుని ఉన్న నంబర్ 13 లాల్ బహుదూర్ శాస్త్రి మున్సిపల్ పాఠశాల రోడ్డులో ఫ్యూజు క్యారియర్ బాక్సు చేతికి అందేంత ఎత్తులో ఉంది. విద్యుత్ తీగలు కూడా తక్కువ ఎత్తులో ఉన్నాయి. పాఠశాలకు వెళ్లే పిల్లలు ఇటుగా రాకపోకలు సాగిస్తుంటారని, ఆయా సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. – తణుకు అర్బన్ -
నాన్ అకడమిక్ అంశాలు తగ్గించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయులపై ఒత్తిడికి కారణమవుతున్న నాన్ అకడమిక్ అంశాలు పూర్తిగా తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రవణ్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆపస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆదివారం స్థానిక సేవాభారతి కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. అఖిల భారతీయ ఉపాధ్యాయ సంఘం జాతీయ కార్యదర్శి జి.లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో జాతీయ భావాలను పెంపొందించాలని సూచించారు. జాతీయ విద్యా విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ సత్యనారాయణ మాట్లాడుతూ పరీక్షా విధానాల్లో మార్పులు అవసరమన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన 100కు పైగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయా సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాధ్యుడు క్రొవ్విడి రాజకుమార్, జిల్లా అధ్యక్షుడు సీహెచ్ సతీష్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
చలికాలం.. జర భద్రం
● పెరిగిన చలి తీవ్రత ● పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు ● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు భీమవరం (ప్రకాశం చౌక్): జిల్లాలో వారం రోజులు గా చలి తీవ్రత క్రమేపీ పెరుగుతోంది. సాయంత్రం 5 గంటలకే వాతావరణం చల్లబడి చలి మొదలవుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. చలి పెరుగుతున్న క్రమంలో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ము ఖ్యంగా గుండె సమస్యలు, డయాబెటిస్, ఆస్తమా, పొగతాగే వారు, క్యాన్సర్, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. చలికాలంలో ముఖ్యంగా శ్వాసనాళాలు ముడుచుకుపోయే అవకాశం అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి ● చర్మం పొడి బారకుండా మాయిశ్చరైజర్లు వినియోగించాలి. ● తగిన మోతాదులో నీరు కచ్చితంగా తాగాలి. ● శీతల పానియాలు, ఐస్క్రీమ్లు, కూలింగ్ వా టర్కు దూరంగా ఉండాలి. ● దుమ్ము, ధూళి ఉండే ప్రాంతాలకు దూరంగా, చలిగాలుల్లో తిరగడం మానేయాలి. ● ఇమ్యూనైజేషన్ వ్యాక్సిన్ ఏడాదికి ఒకసారి, న్యూమోనియా వ్యాక్సిన్ ఐదేళ్లకు ఒకసారి వై ద్యుల సూచనలతో వేయించుకోవాలి. ● ఇండోర్ వ్యాయామం, జిమ్ ప్లాన్ చేసుకోవాలి. ● బయటకు వెళ్లే సమయంలో తగినంత వేడిని శరీరానికి అందించే ఉన్ని దుస్తులు ధరించాలి. ● ఇంట్లో ఎవరికై నా జలుబు, దగ్గు వస్తే వైద్యుల సూచనలతో మందులు వాడాలి. ● సొంత వైద్యం సరికాదు. కుటుంబంలో ఒకరికి వాడే ఔషధాలు వేరొకరికి వినియోగించరాదు. ● శ్వాస సంబంధిత సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఏజెన్సీలో చలి పంజా బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో కొద్ది రోజులుగా పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నా యి. రోజురోజుకూ చలితీవ్రత పెరుగుతోంది. మా రుమూల కొండ ప్రాంతాల్లోని గ్రామాల్లో ఉదయం 8 గంటలు దాటితే కానీ ప్రజలు బయటకు రాలేని, సాయంత్రం 6 గంటలకే ఇళ్లకు చేరాల్సిన పరిస్థితి. బ్యాక్టీరియా, వైరస్ల ప్రభావంతో చాలామంది జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్నారు. దీంతో ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. డిసెంబర్, జనవరిలో చలి మరింత పెరిగే అవ కాశం ఉంది. మంచులో ప్రయాణాలు ప్రమాదకరమని పోలీసులు సూచిస్తున్నారు. గతంలో గిరిజన మండలాల్లో వేకువజామున మంచులో ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి. బుట్టాయగూడెంలో పొగమంచు -
రెస్టారెంట్లలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు
భీమవరం (ప్రకాశంచౌక్): జాయింట్ కలెక్టర్ ఆదేశాలు మేరకు భీమవరంలో శనివారం పలు రెస్టారెంట్లలో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఆర్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని జువ్వలపాలెం రోడ్, డీఎన్నార్ కాలేజ్ రోడ్లోని రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు. ఓ రెస్టారెంట్లో చికెన్ ఫ్రై రంగులు కలిపి తయారు చేస్తున్నట్టుగా గుర్తించి శాంపుల్ సేకరించి కేసు నమోదు చేశారు. మరో రెండు రెస్టారెంట్ల ఏర్పాటుకు అనుమతులు లేవని గుర్తించి నోటీసులు జారీ చేశారు. ద్వారకాతిరుమల: ఓ భక్తుడు పోగొట్టుకున్న సెల్ ఫోన్ పోలీసుల చొరవతో తిరిగి వెంటనే అతడికి దక్కింది. వివరాల ప్రకారం విజయవాడలోని మొగలరాజపురంకు చెందిన భక్తుడు రాయవరపు వెంకట సాయి దుర్గాప్రసాద్ శ్రీవారి దర్శనార్థం శనివారం ఉదయం బైక్పై ద్వారకాతిరుమల క్షేత్రానికి విచ్చేశాడు. తీరా చూస్తే జేబులో ఉండాల్సిన తన సెల్ ఫోన్ కనిపించలేదు. వెంటనే పోలీస్టేషన్కు చేరుకుని మార్గ మధ్యలో ఎక్కడో ఫోన్ పోయిందని ఫిర్యాదు చేశాడు. వెంటనే ఎస్సై టి.సుధీర్ లొకేషన్ ఆధారంగా సదరు సెల్ఫోన్ ద్వారకాతిరుమల మండలంలోని సూర్యచంద్రరావుపేట గ్రామ పొలాల్లో ఒక పసువుల కాపరి వద్ద ఉన్నట్టు గుర్తించారు. అతడికి ఫోన్ దొరికినట్టు తెలుసుకుని, వెంటనే ఫోన్ను దుర్గాప్రసాద్కు ఇప్పించారు. గణపవరం: మండలంలోని అర్థవరం పోస్టాఫీసులో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో పోస్టల్ ఇన్స్పెక్టర్ టి.సుబ్రహ్మణ్యం శనివారం విచారణ చేశారు. పోస్ట్మాస్టర్ ఖాతాదారుల అక్కౌంట్ల నుంచి నగదు అక్రమంగా స్వాహా చేశారని ఖాతాదారులు ఆందోళన చేసిన నేపథ్యంలో పోస్టల్శాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా పోస్టాఫీసులోని రికార్డులు పరిశీలించారు. ఖాతాదారుల డబ్బు తిరిగి వారికి వచ్చేలా కృషి చేస్తామని సుబ్రహ్మణ్యం తెలిపారు. -
సబ్జైలు తనిఖీ
నరసాపురం: తగాదాలకు, నేరాలకు పాల్పడే ముందు భవిష్యత్ పరిణామాలు ఆలోచించుకోవాలని నరసాపురం బూనియర్ సివిల్ జడ్జి ఎస్.రాజ్యలక్ష్మి సూచించారు. నరసాపురం సబ్ జైలును జడ్జి శనివారం ఆకిస్మకంగా తనిఖీ చేశారు. జైలులో ఖైదీలకు అందుతున్న సదుపాయాలు, జైలు పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించారు. ఖైదీలకు అందిస్తున్న ఆహారాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి ఖైదీలతో మాట్లాడుతూ నేరాలు చేసి జైలు పాలైతే, కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. బంధువుల ముందు చులకన అవుతారని చెప్పారు. ఆర్థిక స్తోమత లేని వారికి మండల న్యాయసేవాధికారసంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జడ్జి వెంట సబ్జైలు సూపరిం్డంట్ టి.అప్పారావు, ప్యానల్ యన్యావాది విరీష, పీఎల్బీవీ శ్యామ్ కుమార్ ఉన్నారు. ఏలూరు (టూటౌన్): డెడికేటెడ్ కమిషన్ వేసి బీసీల సమగ్ర కులగణన చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఆర్నేపల్లి తిరుపతి డిమాండ్ చేశారు. స్థానిక తంగెళ్ళమూడి శివగోపాలపురంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీల జనాభా దామాషా మేరకు చట్టబద్ధ రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని కోరారు. సమావేశంలో బీసీ నాయకులు కిమిడి రేణు కేశవరావు, తాడిశెట్టి దుర్గారావు, ఆండ్రంచి మాణిక్యం పాల్గొన్నారు. -
నిబంధనలు మీరి తరగతులపై ఫిర్యాదు
ఏలూరు (ఆర్ఆర్పేట): అధికారంలో ఉంటే ఏ చర్య అయినా చెల్లుబాటు అవుతుంది అనుకోవడం అవివేకమని, హైకోర్టు ఆదేశాలు ధిక్కరించి నగరంలో అనుమతి లేకుండా నారాయణ జూనియర్ కాలేజీలో హైస్కూల్ నడుపుతున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కే. లెనిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సీసీకి నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అనంతరం లెనిన్ మాట్లాడుతూ నగరంలోని మోర్ మార్కెట్ సందులో నారాయణ జూనియర్ కళాశాలలోనే అనుమతులు లేకుండా 6వ తరగతి నుంచి పదవ తరగతి వరకు పాఠశాల నడుపుతున్నారని, గత రెండు సంవత్సరాలుగా కళాశాలలో పాఠశాల నడుపుతూ ఉన్నా విద్యా శాఖ గానీ, ఇంటర్మీడియట్ బోర్డు గానీ అటు వైపు కన్నెత్తి చూడడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షుడు ఎం.జయంత్, ఎం.శివ తదితరులు పాల్గొన్నారు. -
ఏడు వారాల దీక్ష.. ఏడుకొండల వాడే రక్ష
● అధిక సంఖ్యలో గోవింద దీక్షలు తీసుకున్న స్వాములు ● శనివారం.. ఏకాదశినాడు దీక్ష చేపట్టడంపై భక్తుల హర్షం ద్వారకాతిరుమల: శ్రీనివాసా గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా.. అంటూ గోవింద దీక్షాదారులు చేసిన గోవింద నామస్మరణలు, భజనలతో క్షేత్ర పరిసరాలు మారుమ్రోగాయి. ద్వారకాతిరుమల చినవెంకన్న సన్నిధిలో వివిధ ప్రాంతాలకు చెందిన పెద్ద ఎత్తున భక్తులు శనివారం ఏడువారాల గోవింద దీక్షను స్వీకరించారు. పసుపు రంగు దుస్తుల్లో తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తుల మెడలో అర్చకులు మాలలు వేశారు. దీక్ష చేపట్టిన భక్తులంతా స్వామి, అమ్మవార్లను దర్శించి, ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలో ఉన్న దీపారాధన మండపంలో దీపాలు వెలిగించారు. అనంతరం వారు గోవింద నామస్మరణలతో భజనలు చేశారు. కార్తీకమాసంలో.. స్వామివారికి ప్రీతికరమైన రోజు.. అందులోనూ ఉత్పన్న ఏకాదశి నాడు 7 వారాల దీక్షను స్వీకరించడాన్ని భక్తులు తమ అదృష్టంగా భావిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చేనెల 30న ఉదయం ఇరుముడులతో స్వామివారి ఉత్తరద్వార దర్శనం, నిజరూప దర్శనం చేసుకుని దీక్షను విరమిస్తారు. అంతేకాక ముందురోజు జరిగే శ్రీవారి గిరి ప్రదక్షిణలో సైతం దీక్షాదారులు పాల్గొంటారు. రేపటి నుంచి మండల దీక్షలు సాధారణంగా భక్తులు 108 రోజుల మహా మండల దీక్ష, 41 రోజుల మండల దీక్ష, 21 రోజుల అర్ధ మండల దీక్ష, ఏడువారాల వ్రత దీక్షలను చేపడతారు. అయితే ఏడువారాల దీక్ష ముగియడంతో సోమవారం నుంచి మండల, వచ్చే నెల 8 నుంచి అర్ధ మండల దీక్షాలు ప్రారంభం అవుతాయి. అనారోగ్యం, ఇతర సమస్యలతో బాధపడే భక్తులు ముక్కోటికి 11 లేదా 9 రోజుల ముందు దీక్షలు చేపడతారు. నిత్య వైదిక కార్యక్రమాలు దీక్షాదారులు తెల్లవారుజామునే చన్నీటి స్నానాన్ని ఆచరించి, ఆలయానికి చేరుకుంటారు. అనంతరం స్వామివారి దీపారాధన మండపంలో దీపాలు వెలిగించి, గోవిందనామాలు చదువుతారు. ఆ తరువాత ఆలయంలో ప్రదక్షిణలు చేసి, శ్రీవారి తొలి హారతిని అందుకుంటారు. సాయంత్రం సూర్యాస్తమయం తరువాత కూడా ఆలయంలో పూజలు చేస్తారు. దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలివే స్వాములకు శ్రీవారి దేవస్థానం ఉచిత దర్శనంతో పాటు, తీర్ధ ప్రసాదాలు, అన్న ప్రసాదాన్ని అందిస్తోంది. అయితే దీక్షలు స్వీకరించాల్సిన తేదీలు, దీక్షలు చేపట్టడం వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృత ప్రచారం చేస్తే దీక్షాదారుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. -
రేషన్ బియ్యం స్వాధీనం
చింతలపూడి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మండంలోని ఫాతిమాపురం అడ్డరోడ్డు వద్ద విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ అధికారులు శనివారం పట్టుకున్నారు. అశోక్ లేలాండ్ వాహనంలో తరలిస్తున్న 35.09 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ డ్రైవర్ కలపాల సుధాకర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ధర్మాజీగూడెం గ్రామానికి చెందిన కఠారి శ్రీను, ప్రగడవరం గ్రామానికి చెందిన నున్నా శ్రీను, ఫాతిమాపురం గ్రామానికి చెందిన చిలకమ్మ, శంకుచక్రపురం గ్రామానికి చెందిన సీతారాములు అనే వ్యక్తులు చుట్టు పక్కల గ్రామాల రేషన్ కార్డుదారుల నుంచి కేజీ 13 రూపాయలకు కొనుగోలు చేసి వాటిని చాట్రాయి మండలం, మర్లపాలెం గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రరావు, వంగర దత్తులకు కిలో 19 రూపాయలకు అమ్ముతున్నట్లు చెప్పినట్లు అధికారులు తెలిపారు. దీంతో నిందితులపై కేసు నమోదు చేసి రూ.1.40 లక్షల విలువైన బియ్యం, రూ.8 లక్షల విలువైన వాహనాన్ని సీజ్ చేసినట్లు విజిలెన్స్ ఎస్సై సీహెచ్ రంజిత్ కుమార్ తెలిపారు. లింగపాలెం: విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలతో పాటు శారీరకంగా మానసికంగా, ఆరోగ్యంగా ఉంటారని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు టి.శేఖర్ బాబు చెప్పారు. ధర్మాజీగూడెంలోని శ్రీ సాయి క్రిశాలీస్ ఇంటర్ నేషనల్ స్కూల్ క్రీడా మైదానంలో 69వ రాష్ట్రస్థాయి అండర్–19 నెట్ బాల్ ఛాంపియన్షిప్ మూడు రోజుల పాటు జరిగే పోటీలను శనివారం ప్రారంభించారు. పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేఖర్ బాబు మాట్లాడుతూ జీవితంలో ఎదగడానికి విద్యార్థులు చదువుతోపాటు క్రీడలను కూడా ప్రతినిత్యం ప్రాక్టీస్ చేయాలన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ఏలూరు జిల్లా ఆర్ఐఓ కె. యోహాను, కె. జయరాజు, జె.రవీంద్ర పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): నేర పరిశోధనలలో కీలకమైన సాక్ష్యాలను విశ్లేషించడానికి, నిర్ధారించడానికి స్పెక్టోమెట్రీ ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని హైదరాబాద్ సీఎస్ఐఆర్–ఐఐసీటీ సీనియన్ సైంటిస్ట్ యూవీఆర్ విజయ సారథి అన్నారు. స్థానిక సీఆర్ రెడ్డి పీజీ కళాశాలలో పీజీ కెమిస్ట్రీ విభాగం, ఐక్యూఏసీ సంయుక్తంగా అతిథి ఉపన్యాస కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయసారథి మాట్లాడుతూ మెటీరియల్స్ (పదార్థాల) విశ్లేషణ కోసం ఉపయోగించే కొన్ని ముఖ్యమైన మాస్ స్పెక్ట్రోమెట్రిక్ సాంకేతికతలను వివరించారు. కార్యక్రమంలో పీజీ కళాశాల కరస్పాండెంట్ కానాల శ్రీనివాసరావు, డైరెక్టర్ వీఆర్ఎస్ బాబు యలమర్తి, ఇన్చార్జి ప్రిన్సిపాల్ కె.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీలు
ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై నిర్వహిస్తున్న విస్తృత స్థాయిలో తనిఖీల్లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో 72 కేసులు నమోదు చేసినట్టు ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ తెలిపారు. ఏలూరు జిల్లాలో కలపర్రు టోల్గేట్, జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆర్టీఓలు ఎస్బీ శేఖర్, ఎస్ఎస్ రంగనాయకులు పర్యవేక్షణలోని మోటార్ వాహనాల తనిఖీ అధికారుల ప్రత్యేక బృందాలు ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై గత సోమవారం నుంచి శుక్రవారం రాత్రి వరకు 72 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఆయా నిబంధనల అతిక్రమణలకు గానూ నమోదు చేసిన ఈ కేసుల్లో రూ.7,65,230 అపరాధరుసుం విధించగా, రూ.4,50,100 ఇప్పటి వరకు వసూలైనట్లు తెలిపారు. సరైన ధ్రువపత్రాలు చూపని, అత్యవసర ద్వారం, అగ్నిమాపక పరికరాలు, ప్యాసింజర్ లిస్టు లేని తదితర ఉల్లంఘనలపై కేసులు నమోదు చేశామన్నారు. పెదపాడు: డివైడర్ పక్కనే నిద్రిస్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పెదపాడు పోలీస్స్టేషన్ పరిధిలో తాళ్లమూడి వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన వల్లి కృష్ణమూర్తి(40) విజయరాయి గ్రామానికి కూలి పనుల నిమిత్తం జట్టుతో కలిసి వచ్చి, వారి నుంచి విడిపోయి విడిగా కూలి పను లు చేసుకుంటున్నాడు. అయితే అతడు డివైడర్ పక్కనే నిద్రిస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు. బంధువులు ఫిర్యాదు మేరకు పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్న తిరుపతిలో భక్తుల రద్దీ
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రంలో శనివారం భక్తులు పోటెత్తారు. శ్రీవారికి ప్రీతికరమైన రోజూ అందులోనూ కార్తీకమాసంలో ఆఖరి శనివారం, ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తుల గోవింద నామస్మరణలతో స్వామి సన్నిధి మారుమోగింది. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలోని దీపారాధన మండపంలో, అలాగే ఎదురుగా ఉన్న చెట్ల వద్ద భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించారు. వేలాది మంది భక్తులు కల్యాణకట్టలో స్వామివారికి మొక్కులు చెల్లించారు. అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నిత్యాన్నదాన సదనం ఇతర విభాగాల్లో భక్తుల రద్దీ కనిపించింది. ఆలయ ఆవరణలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. -
ప్రదక్షిణ మార్గం నుంచే ఆలయంలోకి వెళ్లాలి
● శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామీజీ ● చిన వెంకన్న ఆలయంలో వివాదాస్పద క్యూలైన్, విగ్రహాల పరిశీలన ద్వారకాతిరుమల: ఆలయాల్లోకి భక్తులు ప్రదక్షిణ మార్గం గుండానే వెళ్లాలన్న నియమం ఉందని శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజజీయర్ స్వామీజీ అన్నారు. ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో అప్రదక్షిణ మార్గంలో క్యూలైన్ నిర్మాణం చేపట్టారన్న ఆధ్యాత్మికవేత్త బీకేఎస్ఆర్ అయ్యంగార్ ఫిర్యాదుపై స్వామీజీ శుక్రవారం క్షేత్రాన్ని సందర్శించారు. స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం ఆయన వివాదాస్పద క్యూలైన్, ఆంజనేయ, గరుత్మంతుని విగ్రహాలను పరిశీలించి ఆలయ ప్రధానార్చకుడు పీవీఎస్ఎస్ఆర్ జగన్నాథాచార్యులు (రాంబాబు)తో మాట్లాడారు. అనంతరం స్వామీజీ ఆలయ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. భక్తులు ప్రదక్షిణగా వెళితేనే దేవుడితో బంధం ఏర్పడుతుందని, లేదంటే ఆ బంధం నుంచి దూరమవుతామని అన్నారు. ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు దిలీపుడికి అప్రదక్షిణ వల్ల సంతానం కలగలేదని, మళ్లీ గోసేవ చేసుకుని, గోవు అనుగ్రహంతోనే సంతానాన్ని పొందారన్నారు. శ్రీ రాముడు సైతం వనవాసానికి వెళ్లే సందర్భంలో కలశాల చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్లారని తెలిపారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం చుట్టూ ఉన్న ఆళ్వార్లను, విఖనస మహర్షిని, అమ్మవార్లను దర్శించిన తరువాతే స్వామి వారిని దర్శించాలనే నియమం ఉందన్నారు. చిన వెంకన్నను ప్రదక్షిణ మార్గం గుండా వెళ్లి దర్శించుకోవడానికి ఇక్కడ అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఆలయంలో ఆంజనేయ స్వా మి, గరుత్మంతుడు శ్రీవారి పాదాలకు కాకుండా, భక్తుల పాదాలకు నమస్కరిస్తున్నట్టు ఉందని, ఆ విగ్రహాల ముందున్న క్యూలైన్ గట్టును తొలగించాలని ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తికి సూచించారు. చరిత్రలో భాగమైన నృసింహ సాగరాన్ని గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేయాలన్నారు. మహా కుంభాభిషేకం జరపాలి ఏలూరు చెన్నకేశవస్వామి ఆలయ రాజగోపుర పునర్నిర్మాణం తర్వాత మహాకుంభాభిషేకం జరపలేదని, వెంటనే జరపాలని, శ్రీవారికి కుచ్చులమెట్ట ఉత్సవాన్ని పునరుద్ధరించాలని, స్థానాచార్య పో స్టుకు ఉన్న అడ్డంకులను తొలగించి వెంటనే పోస్టును భర్తీ చేయాలని, ఏలూరులోని ఆర్ఆర్పేట రాఘవాచర్య వీధిలో అరిటికట్ల సరోజిని శ్రీవారికి విరాళంగా ఇచ్చిన 176 గజాల స్థలంలో రూపక ఆలయాన్ని గాని, గ్రంథాలయాన్ని గాని నిర్మించాలని అయ్యంగార్ ఈఓను కోరారు. అనంతరం విశ్వహిందూపరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ఒబిలిశెట్టి వెంకటేశ్వర్లు, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర కోశాధికారి పైడేటి రఘు మాట్లాడుతూ అంతరాలయ దర్శనం టికెట్ను రూ.500 కంటే తగ్గించాలని, ఏలూరు చెన్నకేశవస్వామి ఆలయంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి, కోనేరును శుభ్రపరచాలని కోరారు. ఏలూరు శ్రీవైష్ణవ సంఘం అధ్యక్షుడు కొంపల్లి కృష్ణమాచార్యులు, సీ్త్ర శక్తి సంఘం అధ్యక్షురాలు కొంపల్లి తాయారు తదితరులు ఉన్నారు.శ్రీవారి సేవలో.. అహోబిల రామానుజ జీయర్ స్వామీజీ స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆయనకు ఆలయ అధికారులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. ఈఓ మూర్తి స్వామీజీకి శ్రీవారి చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఇటీవల ఇక్కడ గోమాతలు శరీరాన్ని విడిచిపెట్టాయి కాబట్టి ఆ దోషాన్ని తొలగించమని పెరుమాళ్లను ప్రార్థించినట్టు చెప్పారు. -
పచ్చనేత భూకబ్జా
ఆగిరిపల్లి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడిగేవారు లేకపోవడంతో మండలంలో భూకబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. మండలంలో నెక్కలం గొల్లగూడెంలో టీడీపీ నేత సుమారు రూ.50 లక్షల విలువైన ఎకరా భూమిని ఆక్రమించుకుని చుట్టూ ఫెన్సింగ్ వేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామంలో కరెంట్ ఆఫీస్ రోడ్డులోని మల్లయ్యగట్టు వద్ద ఉన్న ప్రభుత్వ భూమిలో సుమారు 80 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇక్కడ ఇంకా ఎకరా భూమి ఖాళీగా ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూమిపై స్థానిక నేత కన్నేశారు. కొన్నిరోజుల క్రితం భూమి చుట్టూ ఫె న్సింగ్ వేసినా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
చివరికి చిక్కాడు
ఏడేళ్లుగా పరారీలో నిందితుడు భీమడోలు: హత్య కేసులో ఏడేళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని భీమడోలు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు సమీపంలోని డోకుపర్రుకు చెందిన గూడవల్లి స్టీవెన్ అలియాస్ శ్రీనుని పట్టుకుని కోర్టులో హాజరుపర్చారు. భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్సై మదీనా బాషా తెలిపిన వివరాల ప్రకారం.. 2017లో ఏలూరు సత్రంపాడు ఎంఆర్సీ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ పెదపల్లి దుర్గారామ్ ప్రసాద్ (21)ను స్టీవెన్, అతడి తండ్రి, సోదరుడు కలిసి పూళ్ల సమీపంలోని చెరుకు తోటలో హత్య చేశారు. ఆటోను అపహరించుకుని పరారయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా కరోనా సమయంలో స్టీవెన్ తండ్రి, సోదరుడు మృతి చెందారు. అయితే ప్రధాన నిందితుడు స్టీవెన్ ఏడేళ్లుగా పోలీసులకు కనిపించకుండా, సాక్ష్యాలను సైతం మాయం చేస్తూ పరారీలో ఉన్నాడు. 2018 నుంచి కోర్టు వాయిదాలకు కూడా హాజరుకావడం లేదు. ఈ కేసును జిల్లా ఎస్సీ కె.ప్రతాప్ శివకిషోర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీఐ విల్సన్, ఎస్సై మదీనా బాషా, హెచ్సీ సూరిశెట్టి శ్రీనివాస్, కానిస్టేబుల్ జె.సురేష్తో ప్రత్యేక బృందాన్ని నియమించారు. వారు చాకచక్యంగా స్టీవెన్ను అదుపులోకి తీసుకుని భీమడోలు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. -
కొలిక్కిరాని కొల్లేరు హద్దులు
శనివారం శ్రీ 15 శ్రీ నవంబర్ శ్రీ 2025సాక్షి, ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు కాంటూరు సరిహద్దుల కథ కొత్త మలుపులు తిరుగుతోంది. కొల్లేరు పరీవాహక ప్రజలను ఊరించి, ఊరించి ఉసూరుమనిపిస్తోంది. కొల్లేరు ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని ప్రజాప్రతినిధులు వారి అవసరాలతో ఆటలాడుకుంటున్నారు. కొల్లేరు పరీవాహక గ్రామాల ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామనే ప్రధాన ఎన్నికల వాగ్దానంతో గద్దెనెక్కిన నాయకులు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. కొల్లేరు అంశంపై తుది నిర్ణయం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉన్నా స్థానిక నాయకులు అంతా తమ చేతుల్లోనే ఉందంటూ బిల్డప్ ఇస్తున్నారు. 2.25 లక్షల ఎకరాల్లో.. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో 10వ కాంటూరు వరకు 2.25 లక్షల ఎకరాల్లో కొల్లేరు విస్తరించి ఉంది. ఆక్రమణల కారణంగా అప్పటి చంద్రబాబు పాలనలో 120 జీఓను ప్రవేశపెట్టారు. దీంతో కొల్లేరు అభయారణ్యం 5వ కాంటూరు వరకు 77,135 ఎకరాలుగా నిర్ణయించారు. తర్వాత కూడా ఆక్రమణల పర్వం పెరగడంతో కొల్లేరు ఆపరేషన్ నిర్వహించి ఇరు జిల్లాల్లో 31,120 ఎకరాల్లోని అక్రమ చెరువులను ధ్వంసం చేశారు. వీటిలో 14,932 ఎకరాల జిరాయితీ, 5,510 ఎకరాల డీ–ఫాం భూ ములు ఉన్నాయి. వీటికి పరిహారం ఇవ్వకుండా ధ్వంసం చేశారని ఇటీవల రాష్ట్ర చేపల రైతుల సంఘం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. సీఈసీ అధ్యయనం : కొల్లేరు ఆపరేషన్ తర్వాత సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయలేదని, దీంతో కొల్లేరు అభయారణ్యంలో ఆక్రమణలు పెరిగాయని కాకినాడకు చెందిన పర్యావరణవేత్త మృత్యుంజయరావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఈ ఏడాది జనవరి 16న సుప్రీంకోర్టు జడ్జ్జీలు కొల్లేరులో ఆక్రమణలపై ఘాటుగా స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) సభ్యులు జి.భానుమతి, రమన్లాల్ భట్, సునీల్ లిమాయే, చంద్రప్రకాష్ గోయల్ జూన్ 17, 18వ తేదీల్లో కొల్లేరులో పర్యటించారు. అయితే ఇప్పటికీ వారు సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వలేదు. అటవీ అధికారి కీలక సమావేశం సీఈసీ సభ్యులు అడిగిన సమాచారం ఇరు జిల్లాల్లో రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖల నుంచి పూర్తిస్థాయిలో రాకపోవడంతో సీఈసీ సీరియస్ అయ్యింది. దీంతో రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ పీవీ చలపతిరావు ఏలూరులో కలెక్టర్, ఇరు జిల్లాల అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్, డ్రైనేజీ శాఖల అధికారులతో గురువారం సమీక్షించారు. కొల్లేరు అభయారణ్యం సరిహద్దులను అభయారణ్యం రూపొందించినప్పుడు ఉన్న రికార్డులతో ప్రస్తుతం ఆధునిక లిడార్ సర్వే టెక్నాలజీ ద్వారా గుర్తించి నివేదికలు సమర్పించాలని సూచించారు. నీటిపారుదల శాఖ కొల్లేరు సరస్సు ప్రాంతం వివరణాత్మక కాంటూర్ మ్యాప్లతో పాటు, ఉప్పుటేరు సరిహద్దులను గుర్తించి నివేదికలు సమర్పించాలని చెప్పారు. మలుపులు తిరుగుతున్న కథ సీఈసీకి సమాచారం ఇవ్వడంలో జాప్యం జిల్లా అధికారులపై సీఈసీ సీరియస్ అభయారణ్యం హద్దులు గుర్తించాలని ఆదేశం ఆక్రమిత చెరువులు ధ్వంసం చేశామంటూ ప్రభుత్వం బిల్టప్ కొల్లేరులో నేటికీ ఆగని అక్రమ సాగుకొల్లేరు గ్రామాల్లో సీఈసీ పర్యటించినా అక్రమ సాగు మాత్రం యథేచ్ఛగా సాగుతూనే ఉంది. అటవీశాఖ ఇరు జిల్లాల్లో 18 వేల ఎకరాల్లో అక్రమ చేపల సాగు కొల్లేరు అభయారణ్యంలో ఉందని నివేదిక ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వీటిలో 9,500 ఎకరాల చెరువులకు గండ్లు పెట్టామని తెలిపింది. వాస్తవానికి అటవీ అధికారులు గండ్లు పెట్టిన చెరువుల్లో దర్జాగా అక్రమ సాగు జరుగుతోంది. ఇది ఎక్కడ బయటపడితే సీఈసీ ఆగ్రహానికి గురవుతామో అనే ఆందోళనలో అటవీ అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో సీఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఇటు కొల్లేరు ప్రజలు, అటు అధికారులు ఎదురుచూస్తున్నారు. -
భీమవరం టీడీపీలో రభస
● పదవులు అమ్ముకున్నారంటూ తోపులాట ● రసాభాసగా ప్రమాణ స్వీకార కార్యక్రమం భీమవరం: భీమవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సీనియర్లను అవమానిస్తున్నారని, ప్రొటోకాల్ పాటించడం లేదని, ప్రభుత్వ పదవులు అమ్ముకుంటున్నారంటూ ఆరోపణల నేపథ్యంలో నాయకుల మధ్య తోపులాట జరగ్గా సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ మండల కమిటీ, క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్ ప్రమాణస్వీకారం స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శుక్రవారం ఏర్పాటుచేశారు. పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ ఇన్చార్జ్ తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులను వేదికపైకి పిలిచే సమయంలో వీరవారం ఎంపీపీ వీరవల్లి దుర్గాభవానీ ఫొటో ఫ్లెక్సీలో వేయలేదని, ప్రొటోకాల్ ప్రకారం వేదికపైకి పిలవలేదంటూ గందరగోళం ప్రారంభమైంది. సీనియర్లను అవమానిస్తున్నారంటూ నాయకులు మండిపడ్డారు. అనంతరం మాజీ కౌన్సిలర్ పామర్తి వెంకట్రామయ్య మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పెద్దనాయకులెవ్వరూ రోడ్డుపైకి రాలేదంటూ వ్యాఖ్యానించడంతో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి ఆయనపై విరుచుకుపడ్డారు. పార్థసారథికి మద్దతుగా కోళ్ల రామచంద్రరావు (అబ్బులు) నిలవగా పార్టీ నాయకులు మధ్య తోపులాట జరిగింది. రాష్ట్ర మహిళా సాధికారిక వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు వంటి నాయకులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా నాయకులు శాంతించలేదు. ఇటీవల నియామకాలు జరిగిన పార్టీ పదవులతోపాటు ప్రభుత్వ పదవులను అమ్ముకున్నారంటూ ఆరోపణలతో శ్రేణులు మండిపడ్డారు. పార్టీలో క్రమశిక్షణ లేదని, పదవుల పందేరంతో వన్మేన్ షోగా మారిందని నిలదీశారు. -
వ్యవస్థల నిర్వీర్యం చంద్రబాబు నైజం
పాలకోడేరు: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుందని వైఎస్సార్సీపీ ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ న రసింహరాజు అన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడం చంద్రబాబు నైజమన్నారు. శుక్రవారం వి స్సాకోడేరు, గొగరనమూడి గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ విధానంతో ప్రైవేటుపరం చేయడం ద్వారా ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేసిందన్నారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం చేపట్టగా అపూర్వ స్పంద వస్తోందన్నారు. ప్రైవేటీకరణను ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అనంతరం నా యకులతో కలిసి ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. విస్సాకోడేరు సర్పంచ్ బొల్లా శ్రీనివాస్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు చేకూరి నరేంద్రరాజు, విస్సాకోడేరు మాజీ సర్పంచ్ పెన్మత్స శ్రీనివాసరాజు, పంపన రామకృష్ణ, దొంగ సురేష్, బళ్ల పరమేశ్వరరావు, దిడ్ల ప్రవీణ్, తులసే చంద్రమోహన్, ఎంపీటీసీ బొల్లం గాంధీ, నాయకులు పాల్గొన్నారు. -
టెన్నిస్ పోటీల నిర్వహణ భేష్
జ్యోతిర్లింగార్చన భీమవరం (ప్రకాశంచౌక్): పంచారామక్షేత్రం ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. జ్యోతిర్లింగార్చన నేత్రపర్వమైంది. పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు కాస్మోకల్చరల్ స్పో ర్ట్స్ కాంప్లెక్స్లో జరుగుతున్న సీహెచ్ బుద్దావతా రం రాజు మెమోరియల్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ పోటీలు శుక్రవారంతో ముగి శాయి. ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ కాస్మో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ఏటా టెన్నిస్ పోటీలను నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. విజేతల కు బహుమతులు అందించారు. పోటీల్లో వివిధ రా ష్ట్రాల నుంచి 230 మంది క్రీడాకారులు హాజరయ్యా రు. కాంప్లెక్స్ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్రాజు, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బూన్రాజు పాల్గొన్నారు. విజేతలు వీరే.. ● 75 ఏళ్ల విభాగంలో.. డబుల్స్ విన్నర్స్గా రాధాకృష్ణ (చైన్నె), నాయుడు (అనకాపల్లి) ● 70 ఏళ్ల విభాగంలో.. ఎస్.సెట్టు (తమిళనాడు), ఎ.రాంబాబు (తెలంగాణ), సింగిల్స్లో ఎస్.సెట్టు (తమిళనాడు) ● 65 ఏళ్ల విభాగంలో.. డబుల్స్ విన్నర్స్గా వి.శ్రీనివాసరెడ్డి (అనంతపురం) ఎస్.రాథ్ (ఒడిసా), సింగిల్స్లో శ్రీనివాసరెడ్డి (అనంతపురం) ● 55 ఏళ్ల విభాగంలో.. డబుల్స్ విన్నర్స్గా ఆర్ఎన్ రమేష్ (మైసూర్), పాల్ మనోహర్ (తెలంగాణ), సింగిల్స్లో ఆర్ఎన్ రమేష్ (మైసూర్) ● 45 ఏళ్ల విభాగంలో.. డబుల్స్ విన్నర్స్గా ఎంవీఎల్ఎన్ రాజు (విశాఖ), దినకర్రెడ్డి (తిరుపతి), సింగిల్స్లో నాగరాజ్ (హిందూపురం). -
రైల్వేగేటును ఢీకొన్న వాహనం
● నిలిచిన విద్యుత్ సరఫరా ● రైళ్ల రాకపోకలకు ఆటంకం అత్తిలి: అత్తిలి మండలంలోని మంచిలి రైల్వేగేటును బొలెరో వాహనం ఢీకొట్టడంతో కొద్దిసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు మార్టేరు నుంచి అత్తిలి వైపు వస్తున్న బొలెరో వాహనం మంచిలి రైల్వేస్టేషన్ వద్దకు వచ్చేసరికి రైల్వేగేటు వేసి ఉంది. అయితే డ్రైవర్ గుర్తించకుండా బొలెరో వాహనాన్ని వేగంగా తీసుకువచ్చి రైల్వేగేటును ఢీకొట్టాడు. దీంతో గేటు పోల్పైకి లేచి రైల్వే విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ తీగలు కిందకు వేలాడాయి. ఈ మార్గంలో వచ్చే రైళ్లు కొద్దిసేపు నిలిచిపోయాయి. రైల్వేశాఖ అఽధికారులు తక్షణమే విద్యుత్ తీగలకు మరమ్మతులు చేపట్టడంతో రాత్రి 7.50 గంటలకు రైళ్లు యథావిధిగా రాకపోకలు సాగించాయి. విద్యుత్ తీగల మరమ్మతుల కా రణంగా రైల్వేగేటుకు ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. బొలేరో వాహనం డ్రైవర్ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
వచ్చేనెలలో బాలోత్సవం
భీమవరం: భీమవరంలో మూడేళ్లుగా బాలో త్సవం నిర్వహణ పిల్లల్లో శాసీ్త్రయ దృక్పథం, అభ్యుదయ భావజాలం, సృజనాత్మకతను పెంపొందించి సమాజాబివృద్ధికి దోహదం చేస్తోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీ మూర్తి అన్నారు. శుక్రవారం బాలోత్సవం కమిటీ అధ్యక్షుడు ఇందుకూరి ప్రసాదరాజు అధ్యక్షత బాలోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. బాలో త్సవాలు వచ్చేనెల 12, 13 తేదీల్లో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తారన్నారు. ప్రసాదరాజు మాట్లాడుతూ 18 కల్చరల్, 15 అకడమిక్ అంశాల్లో బాలోత్సవం నిర్వహిస్తామన్నారు. ప్రధాన కార్యదర్శి సీహెచ్ పట్టాభిరామయ్య, ఉపాధ్యక్షుడు గాతల జేమ్స్, ట్రెజరర్ పి.సీతారామరాజు, కల్చరల్ కమిటీ కన్వీనర్ బి.చైతన్య ప్రసాద్, అకడమిక్ కమిటీ కన్వీనర్ పి.శ్రీనివాసరాజు పాల్గొన్నారు. ఉండి: ఏనీవేర్ రిజిస్ట్రేషన్లకు చిరునామాగా మారిన ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టినట్టు సమాచారం. ఉండిలో సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన ఎంవీ సుధారాణి, ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్ సరాబంధురాజును సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. బదిలీపై కాకినాడ వెళ్లిన సుధారాణికి సమాచా రం అందించారు. ఉండిలో పనిచేస్తున్న సరాబంధు రాజు డ్యూటీకి వచ్చి తిరిగి వెళ్లిపోయారు. ఉండిలో ప్రత్యేక బృందంతో దర్యాప్తు అనంతరం ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. భీమవరం: రైలులో గంజాయి తరలిస్తున్న ము గ్గురు వ్యక్తులు భీమవరంలో రైల్వే పోలీసులకు చిక్కారు. రైల్వే సీఐ సోమరాజు తెలిపిన వివరాల ప్రకారం ఒడిసాకు చెందిన మనుప్రధాన్, అరుణ్ప్రధాన్, డింకుడిగాల్ శుక్రవారం పూరి–తిరుపతి రైలులో ఒడిసా నుంచి విజయవాడకు 10 కిలో గంజాయిని నాలుగు బాక్సుల్లో ప్యాక్ చేసి తరలిస్తున్నారు. భీమవరం టౌన్ రైల్యే స్టేష న్ వద్ద తనిఖీలు చేస్తుండగా ముగ్గురు పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని వెంబడించి అరెస్టు చేసినట్టు సోమరాజు తెలిపారు. గంజాయి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందన్నారు. నిందితులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఈ దాడిలో ఎస్సై సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. యలమంచిలి: చించినాడ వద్ద వశిష్ట గోదావరి నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం శుక్రవారం గోదావరిలో రైలు వంతెన సమీపంలో లభ్యమైందని ఎస్సై కర్ణీడి గురుయ్య తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో బుధవారం సాయంత్రం మొగల్తూరు మండలం కుమ్మరపురుగుపాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి సుబ్బారావు (35) చించినాడ వద్ద వశిష్ట గోదావరిలో దూకి గల్లంతయ్యాడు. వంతెనపై అతడి బైక్, సెల్, పాదరక్షలు కనిపించడంతో స్థానికులు కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు. సుబ్బారావు సోదరుడు జల దుర్గారావు గురువారం పోలీసులకు ఫిర్యా దు చేశారు. కేసు నమోదు చేసి గోదావరిలో గాలించగా శుక్రవారం మృతదేహం లభ్యమైంది. అప్పటికే చీకటి పడటంతో మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. శవ పంచనామా, పోస్టుమార్టం శనివారం నిర్వహిస్తామని ఎస్సై గుర్రయ్య చెప్పారు. -
ఉసురు తీసిన టిప్పర్ లారీ
మహిళ దుర్మరణం గణపవరం: అతివేగంగా వస్తున్న టిప్పర్ లారీ స్కూటర్ను ఢీకొట్టగా మహిళ దుర్మరణం పాలైన ఘటన గణపవరం మండలంలోని వరదరాజపురం శివారులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గురువారం గణపవరంలోని చినరామచంద్రపురానికి చెందిన కొట్టు సత్యనారాయణ, భార్య సత్యవతితో కలిసి యాక్టివాపై బంధువుల ఇంటికి వల్లూరు బయలుదేరారు. మార్గమధ్యలో వరదరాజపురం శివారున అతివేగంగా వెళ్తున్న టిప్పర్ లారీ వీరిని ఓవర్ టేక్ చేయబోయి ఢీకొట్టింది. దీంతో సత్యనారాయణ, సత్యవతి రోడ్డుపై పడిపోగా సత్యవతి పొట్టమీదుగా లారీ వెనుక చక్రాలు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. సత్యనారాయణ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గణపవరం ఎస్సై ఆకుల మణికుమార్ ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రోడ్డుపై గోతుల వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. గణపవరం నుంచి పిప్పర వెళ్లే ప్రధాన రహదారి గోతులమయంగా మారింది. ఇటీవల భారీ వర్షాలకు గోతులు మరింత ప్రమాదకరంగా ఉన్నాయి. వాహనాలు గోతులను తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి తక్షణం గోతులనైనా పూడ్పించాలని పలువురు కోరుతున్నారు. -
హాస్టల్ విద్యార్థులపై గేదె దాడి
భీమడోలు: భీమడోలు జెడ్పీ హైస్కూల్ నుంచి హాస్టల్కు వెళుతున్న విద్యార్థులపై ఓ గేదె దాడి చేయగా 9 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురు విద్యార్థులను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగిలిన వారిని భీమడోలు సీహెచ్సీలో వైద్యం అందించి హాస్టల్కు పంపారు. విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు భీమడోలు ఆస్పత్రికి చేరుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. భీమడోలు హైస్కూల్ను సాయంత్రం 4 గంటలకు విడిచిపెట్టడంతో పాఠశాలలో విద్యార్థులంతా రోడ్డుపై వెళుతున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ గేదె పరుగులు తీస్తూ భీమడోలు బాలురు, బాలికల వసతి గృహానికి చెందిన 6,8,9,10 తరగతులకు చెందిన 9 మంది విద్యార్థులపై దాడి చేసింది. విద్యార్థులు సీహెచ్ లక్ష్మీచోళిత, దేవదాసు విన్సీ, జంగం సన్నీ, బి.భార్గవికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్.దీప్తి, వై.ఏసుకుమారి, యూజే సింధు, బి.లావణ్య, బి.శైలజలకు స్వల్ప గాయాలయ్యాయి. వా రందరినీ భీమడోలు సీహెచ్సీకి తరలించి వైద్యం అందించారు. తీవ్ర గాయాలైన నలుగురిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఎంఈఓ–2 అయినపర్తి భాస్కర్కుమార్లు పరామర్శించారు. మెరు గైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే ధర్మరాజు కోరా రు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. విద్యార్థులను పరామర్శిస్తున్న డీఈఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులు -
కొల్లేరు అభయారణ్యం హద్దులను గుర్తించాలి
మాంసాహారం.. డల్లుగా వ్యాపారం కార్తీకమాసం కావడంతో 20 రోజులుగా మాంసాహార వినియోగం తగ్గింది. వ్యాపారాలు పడిపోయాయని వ్యాపారులు అంటున్నారు. 8లో uఏలూరు(మెట్రో): కొల్లేరు అభయారణ్యం సరిహద్దులను గుర్తించి నివేదిక సమర్పించాలని రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ పీవీ చలపతిరావు ఆదేశించారు. కలెక్టరేట్లో అటవీ శాఖ అదనపు ప్రి న్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శాంతిప్రియ పాండే, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల అ టవీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో కొ ల్లేరు అభయారణ్యం, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికార కమిటీ కొల్లేరు అభయారణ్యంపై నివేదిక కోరిన అంశాలపై చలపతిరావు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్ర స్తుతం ఉన్న రికార్డులను ఆధునిక లిడార్ సర్వే టె క్నాలజీ ద్వారా గుర్తించి నివేదికలు సమర్పించాలన్నారు. జిరాయితీ, డి.ఫారం పట్టా భూముల వివరాలతో పాటు కేంద్ర సాధికార కమిటీ ఆదేశించిన నివేదికలు సమర్పించాలన్నారు. నీటిపారుదల శా ఖ కొల్లేరు సరస్సు ప్రాంతం వివరణాత్మక కాంటూ ర్ మ్యాపులను అందించాలన్నారు. అలాగే ఉప్పుటేరు సరిహద్దులను గుర్తించి నివేదికలు సమర్పించాలన్నారు. జేసీలు అభిషేక్ గౌడ, టి.రాహుల్కుమార్రెడ్డి, జిల్లా అటవీ శాఖాధికారి బి.విజయ, డీ ఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజ నీర్ శేషుబాబు, ఎస్ఈ దేవప్రకాష్, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, పంచాయతీరాజ్ ఎస్ఈ రమేష్, డీపీఓ కె.అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను శుక్రవారం నుంచి నిర్వహించనున్నట్టు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్బాబు ప్రకటనలో తెలిపారు. 20 వరకు వారోత్సవాలు కొనసాగుతాయన్నారు. -
పక్కాగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు
కలెక్టర్ నాగరాణి భీమవరం: జిల్లాలో ప్రజల భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలుచేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, ఆక్రమణల తొలగింపు, ఐరాడ్ వెబ్సైట్లో యాక్సిడెంట్ డెత్ కేసుల నమోదు, తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ముందుగా భీమవరంలో ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలు, తీసుకోవాల్సిన చర్యలపై భీమవరం డీఎస్పీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ భీమవరంలో నిర్మాణంలో ఉన్న మూడు రోడ్లను డిసెంబర్ 15 నాటికి పూర్తిచేయాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ నయీం అస్మి మాట్లాడుతూ రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి టీం వర్క్గా పనిచేయాలని సూచించారు. డీఎస్పీలు ఆర్.జయసూర్య, డి.విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీనివాసరావు, జిల్లా రవాణా శాఖ అధికారి ఎస్ఎండీ కృష్ణారావు, 216 నేషనల్ హైవే పీడీ బి శ్రీనివాస్, ఆర్అండ్బీ 165 హైవే డీఈ ఎన్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు గూడుపుఠాణి
మా ప్రభుత్వం రావడమే ఆలస్యం.. ఇళ్లు లేని పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇస్తామంటూ ఎన్నికల్లో కూటమి నేతలు ఊరూవాడా ఊదరగొట్టారు. పాలన చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. కొత్తగా గృహ నిర్మాణ సాయం చేసిందీ లేదు. కాగా గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లను గృహప్రవేశాల పేరిట తామే నిర్మించామంటూ చంద్రబాబు సర్కారు గొప్పలు చెప్పుకుంటోంది. శురకవారం శ్రీ 14 శ్రీ నవంబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం: పేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో మునుపెన్నడూ లేనివిధంగా గత వై ఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలోని 626 లేఅవుట్లలో దాదాపు 47,362 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. సొంత స్థలం ఉన్న వారితో కలిపి 56,210 మందికి ఇంటి నిర్మాణం కోసం రూ.1.80 లక్షల చొప్పున సాయం మంజూరు చేశారు. గృహనిర్మాణ పనుల వేగవంతానికి కోట్లాది రూపాయలు వెచ్చించి జగనన్న కాలనీల్లో తాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పనకు కృషి చేశారు. డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న లబ్ధిదారులకు అదనంగా రూ.35 వేల రుణ సాయాన్ని అందించారు. సబ్సిడీపై ఐరన్, సిమెంట్, ఇసుకను ఉచితంగా అందజేయడంతో పాటు పేదలపై రవాణా భారం పడకుండా లేఅవుట్ల సమీపంలోనే స్టాక్ పాయింట్లను ఏర్పాటుచేశారు. పదేళ్ల తర్వాత ఇంటిపై సర్వహక్కులు ఉండేలా అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించి లబ్ధిదారుల పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2024 మే నెలాఖరు నాటికి జిల్లాలో 30,947 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా మిగిలిన వాటిలో కొన్ని పునాది, రూఫ్ తదితర దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. రూ.4 లక్షలు సాయమని చెప్పి.. రాష్ట్ర గృహ నిర్మాణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పీఎం ఆవాస్ యోజనతో అనుసంధానం చేసి ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల సాయం చేయనున్నట్టు చంద్రబాబు సర్కారు ప్రకటించింది. కొత్తగా మంజూరు చేసే ఇళ్లకు మాత్రమే ఈ సాయం అందిస్తామంది. 2025 మార్చి నుంచి గృహనిర్మాణ సాయం మంజూరు చేయనున్నట్టు ప్రకటించినా ఇప్పుడూ ఆ ఊసే ఎత్తడం లేదు. ఏడాది లక్ష్యాన్ని చేరలేక.. గత ప్రభుత్వంలో పునాది, లింటల్ తదితర దశ ల్లోని 9,107 ఇళ్లను ఈ ఏడాది మే నెలాఖరు నాటికి పూర్తిచేయాలని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. రూ.1.80 లక్షలకు గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు అదనంగా రూ.50 వేలు సాయాన్ని ప్రకటించింది. కాగా సిమెంట్, ఐరన్, ఇటుక తదితర నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడంతో ఈ సాయం చాలక లబ్ధిదారులు ముందుకు రాని పరిస్థితి. నిర్ణీత గడువు నాటికి కేవలం 3,434 ఇళ్లను మాత్రమే పూర్తి చేశారు. పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం గత ప్రభు త్వం తెచ్చిన పథకాలు, పనులను తమవిగా చెప్పుకుంటూ చంద్రబాబు సర్కారు క్రెడిట్ చోరీకి ప్రయత్నించడమే తప్ప ఏడాదిన్నర పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు. ఇప్పటివరకూ సెంటు భూమి ఇవ్వని ఈ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు నిర్మించినట్టు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. సూపర్ సిక్స్ హామీలను అమలుచేయలేక చేతులెత్తేసి చంద్రబాబు సర్కారు సాగిస్తున్న ప్రజావ్యతిరేక పాలనను ప్రజలంతా గమనిస్తున్నారు. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాజీ మంత్రి, తణుకు బాబు ‘కలరింగ్’ ఏడాదిన్నరలో సెంటు స్థలం కూడా ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలో ఇళ్లు నిర్మించినట్టు కలరింగ్ గృహప్రవేశాల పేరిట హడావుడి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో 56,210 ఇళ్లు మంజూరు మే 2024 నాటికి 30,947 ఇళ్లు పూర్తి సెంటు భూమి సేకరించి పేదలకు పంచిన దాఖలాలు లేని చంద్రబాబు సర్కారు ఇప్పుడు పాత పంథానే అనుసరిస్తోంది. గతంలో స్థలాలు పొంది ఆర్థిక ఇబ్బందులతో ఇళ్ల నిర్మాణం చేసుకోని వారి స్థలాలకు ఎసరుపెట్టే పనిలో ఉంది. ఇళ్లు కట్టుకోని వారి స్థలాలను రద్దు చేసి అర్హులైన వారికి అందజేయనున్నట్టు గతంలో జరిగిన కేబినేట్ సమావేశంలో నిర్ణయించింది. ఈ స్థలం ఉందన్న భరోసాతో వీరిలో పిల్లల పెళ్లిళ్లు చేసిన వారూ, వైద్యం కోసం అప్పులు చేసిన వారు ఎంతోమంది ఉన్నారు. ఏడాదిన్నర చంద్రబాబు పాలనలో ఇటీవల ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అర్బన్ ఏరియాలో స్థలాలు ఉన్న కేవలం 595 మందికి మాత్రమే గృహ నిర్మాణ సాయాన్ని మంజూరు చేశారు. వీటిలో తణుకులో 111, నరసాపురంలో 75, భీమవరంలో 85, పాలకొల్లులో 60, తాడేపల్లిగూడెంలో 149, ఆకివీడులో 115 మంది ఉన్నారు. గ్రామాల్లో ఇంకా సర్వే చేస్తున్నారు. కాగా పీఏంఏవై కింద గతంలో జిల్లాకు 6,770 గృహాలు మంజూరు కాగా ఇప్పటికే 6,600 ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు పూర్తిచేసుకుని గృహప్రవేశాలు పూర్తిచేసుకున్నారు. మిగిలిన 100 ఇళ్ల నిర్మాణాల్లో తాజాగా గృహ ప్రవేశాలు నిర్వహించి మొత్తం ఇళ్లను తామే నిర్మించినట్టు చంద్రబాబు సర్కారు ప్రచారం చేసుకుంటుండటం గమనార్హం. -
నిబంధనలకు విరుద్ధంగా సర్దుబాట్లు
ఏలూరు (ఆర్ఆర్పేట): హైస్కూళ్లలో పోస్టులను నిబంధనలకు విరుద్ధంగా ఏలూరు ఎంఈఓ–1 సర్దుబాటు చేశారని, వీటిని వెంటనే సరిచేయాలని ఏపీటీఎఫ్ నాయకులు డీఈఓకు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈనెల 7న ఒక బీఎస్ స్కూల్ అసిస్టెంట్ను ఇంగ్లిష్ పోస్టులో సర్దుబాటు చేశారని డీఈఓ దృష్టికి తీసుకువెళ్లారు. ఈనెల 13న ఏలూరు ఉప విద్యాశాఖాధికారి 12 పేర్లతో సర్దుబాటు జాబితా విడుదల చేశారన్నారు. ఆ జాబితా లో రెండో పేరులో ఉన్న ఉపాధ్యాయుడు బీఎస్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో సీనియర్గా ఉన్నా ని బంధనలు మీరి సర్దుబాటు చేశారన్నారు. అలాగే క్లస్టర్లో లేని ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ సీనియర్ ఉపాధ్యాయుడిని గోపన్నపాలెంలో, సీనియర్ అ యిన బీఎస్ స్కూల్ అసిస్టెంట్ను ఏలూరు శ్రీరామ్ నగర్లో నియమించారన్నారు. అలాగే ఒక స్పెషల్ గ్రేడ్ టీచర్ను గైనెస్ట్ బీఎస్ స్కూల్ అసిస్టెంట్గా పినకడిమి హైస్కూల్లో నియమించారన్నారు. ఆ యా సర్దుబాట్లను సరిచేయాలని కోరారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి రామారావు, కార్యదర్శి డీకేఎస్ఎస్ ప్రకాష్రావు, జిల్లా నాయకుడు నాయుడు కొండయ్య, నగర ప్రధాన కార్యదర్శి అబ్బదాసరి శ్రీనివాస్ ఉన్నారు. -
విద్యారంగంపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
తాడేపల్లిగూడెం (టీఓసీ): విద్యారంగంపై ప్రభు త్వానికి చిత్తశుద్ధి లేదని, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ, ఐఆర్ తదితర బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉభయగోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి అన్నారు. యూ టీఎఫ్ మండల శాఖ నూతన కౌన్సిల్ సమావేశం గురువారం పట్టణంలోని జెడ్పీ హైస్కూల్లో యూటీఎఫ్ మండల అధ్యక్షుడు పెద్దిరెడ్డి తిరుపతిరావు అధ్యక్షతన నిర్వహించారు. గోపిమూర్తి మాట్లాడుతూ విద్యా బోధనలో యాప్ల నిర్వహణను ఖండించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామరాజు, ప్రధాన కార్యదర్శి రామభద్ర, కోశాధికారి పి.క్రాంతికుమార్, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ కేవీ సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి పి.శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. జిల్లాలో 72వ అఖిలభారత సహకార వారోత్సవాలను శుక్రవారం నుంచి 20 వరకు నిర్వహించనున్న సందర్భంగా వాల్పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. వారోత్సవాల్లో భాగంగా సహకార రంగం ప్రాముఖ్యత, ప్రజాదరణ, కార్యకలాపాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఆత్మనిర్భర్ భారత సాధకులుగా సహకార సంఘాలు పనిచేయాలన్నారు. సహకార సంఘాల నిర్వహణ సామర్థ్యం, జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందించేందుకు కంప్యూటరీకరణ అమలు చేయాలన్నారు. జిల్లా సహకార శాఖ అధికారి కె.మురళీకృష్ణ, అసిస్టెంట్ రిజిస్టర్లు ఈ.పూర్ణచంద్రరావు, ఐ.హుస్సేన్, ఎస్.శ్రీనివాసరావు జి.సత్యనారాయణ, సీనియర్ ఇన్స్పెక్టర్ డి.శేషుబాబు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): రెండు రోజులుగా ఓ ప్రధాన పత్రిక పనిగట్టు కుని సచివాలయ ఉద్యోగులపై కక్షపూరితమైన వార్తలు రాయడం సరికాదని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రీజినల్ కో–ఆర్డినేటర్ జీవీఎస్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశా రు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలకు సేవచేయాలనే ఆకాంక్షతో రాష్ట్రంలో 1.20 లక్షల మంది సచివాలయ వ్యవస్థలోకి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారన్నా రు. గత 16 నెలలుగా ఆత్మగౌరవాన్ని సైతం పక్కనపెట్టి ఇంటింటా సర్వేలు చేస్తున్నా ఆ పత్రికకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. తమ సేవలను సీఎం అభినందిస్తుంటే, ప్రభుత్వానికి, సచివాలయ ఉద్యోగుల మధ్య ఎందుకు గ్యాప్ సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకువచ్చిందనే ఏకైక కారణంతోనే తమపై కక్ష కట్టడం సమంజసం కాదన్నారు. ఉద్యోగులపై వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని ఆయన కోరారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు ఆర్ఆర్పేట వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారికి అర్చన నిమిత్తం 108 స్వర్ణ పుష్పాల తయారీకి విరాళాలు సేకరించిన అధికారులు, స్వర్ణ పుష్పాల తయారీ చేపట్టలేదని, చర్యలు తీసుకోవాలని భక్తులు కోరారు. దేవదాయశాఖ రీజనల్ జా యింట్ కమిషనర్ వేండ్ర త్రినాథరావును కలిసి వినతిపత్రం సమర్పించినట్టు గురువారం పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. 2021లో 108 మంది భక్తులు 4 గ్రాముల చొప్పున బంగారం నిమిత్తం సొమ్ములు చెల్లించారన్నారు. ఆర్జేసీ ని కలిసిన వారిలో బీకేఎస్ఆర్ అయ్యంగార్, జీవీ నాగేశ్వరరావు, గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, నాగళ్ల శ్రీనివాసరావు ఉన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించాల్సి ఎస్ఏ–1 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు డీఈఓ ఎం. వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 5వ తరగతి వరకూ జరగాల్సిన పరీక్షలను 17వ తేదీన, 6 నుంచి 10వ తరగతి వరకూ జరగాల్సిన పరీక్షలను 20న నిర్వహించాలని ఆదేశించా మ ని పేర్కొన్నారు. ప్రశ్నపత్రాలను అప్పటివర కూ సురక్షితంగా భద్రపరచాలని ఆదేశించారు. -
126 సెల్ఫోన్ల్ల రికవరీ
భీమవరం: జిల్లాలో చోరీకి గురైన, పోగొట్టుకున్న సెల్ఫోన్ల 11వ విడత రికవరీ, పంపిణీ కార్యక్రమా న్ని స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి చేతులమీదుగా సుమారు రూ.18.90 లక్షల విలువైన 126 సెల్ఫోన్లను వాటి యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 9154966503కు వాట్సాప్ లో హాయ్/ హెల్ప్ అని మెసేజ్ చేసి, లింక్ ద్వారా ఆన్లైన్లో వివరాలు నింపడం ద్వారా చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న సెల్ఫోన్లను పొందవచ్చన్నారు. జిల్లాలో ఇప్పటివరకూ మొత్తంగా సుమారు రూ.2.60 కోట్ల 1,738 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు. ఎవరికై నా సెల్ఫోన్ దొరికితే సొంతానికి వాడు కోకుండా సమీపంలోని పోలీస్స్టేషన్లో అందించాలని సూచించారు. లేకుంటే కేసుల్లో చిక్కుకోవాల్సి వస్తుందన్నారు. సెల్ఫోన్ల రికవరీకి కృషిచేసిన మొబైల్ ఫోన్ ట్రాకింగ్ బృంద సభ్యులు ఇన్స్పెక్టర్ అహ్మదున్నిషా, డి.రత్నారెడ్డి, వీజీఎస్ కుమార్, బి.శ్రీనివాస్, కె.వెంకటేశ్వరరావు, పి.లక్ష్మీకుమారి, కె.పాపారావు, కె.ప్రసాద్బాబు, కె.అబ్బాస్, ఎస్.భాస్కర్, ఎంవీడీ ప్రసాద్, ఎం.అనిల్కుమార్ను జిల్లా ప్రత్యేకంగా అభినందించినారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ డి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. బాధితులకు అందజేసిన ఎస్పీ -
నాణ్యత లేని ఆహారం అందిస్తే చర్యలు
ఉండి: విద్యార్థులకు నాణ్యత లేని ఆహారం అందిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు జూపూడి కిరణ్ హెచ్చరించారు. గురువారం ఉండి జడ్పీ హైస్కూల్తో పాటు కాపులపేటలోని అంగన్వాడీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించగా కోడిగుడ్లు దుర్వాసన రావడం, అన్నం గట్టిగా ఉండడం, కూరల్లో నాణ్యత లేకపోవడంతో తినలేకపోతున్నామంటూ పలువురు విద్యార్థులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులకు అందించే ఆహారంలో లోటుపాట్లు రావడం బాధాకరమని, విద్యార్థుల ఫిర్యాదులను కలెక్టర్ దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. అనంతరం మధ్యాహ్నా భోజనాన్ని కిరణ్ రుచి చూచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టళ్లు లేదా పాఠశాలల్లో ఎక్కడైనా నాణ్యత లేని ఆహారం అందిస్తే వెంటనే 99639 85678 నంబర్కు ఫోన్ చేయాలన్నారు. నాణ్యమైన భోజనం, రుచికరమైన పదార్థాలు అందించాల్సిన బాధ్యత సదరు ఏజెన్సీలు, నిర్వాహకులపై ఉందని, నిబంధనలు మీరితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే అంగన్వాడీల్లో విద్యార్థులకు అందించే ఆహారంపై సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈవో నారాయణ, డీఎస్ఓ ఎన్ సరోజా, డీఈవో ఆఫీస్ ఏడీ ఎన్ సత్యనారాయణ, ఎంఈవోలు బీ జ్యోతి, బీ వినాయకుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు జూపూడి కిరణ్ -
చైర్మన్ చొరవతో కార్మికులకు తిరిగి ఉపాధి
● శ్రీవారి దేవస్థానంలో కాంట్రాక్టర్ కొత్త రూల్ ● 50 ఏళ్లు పైబడిన కార్మికుల తొలగింపు ● బాధితులకు బాసటగా నిలిచిన చైర్మన్ ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం ఛైర్మన్ ఎస్వీ సుధాకరరావు చొరవతో ఇటీవల విధుల నుంచి తొలగింపబడిన పారిశుధ్య కార్మికులకు తిరిగి ఉపాధి లభించింది. వివరాల్లోకి వెళితే గతనెల 1 న ద్వారకాతిరుమల, అన్నవరం దేవస్థానాల్లో పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్(తిరుపతి) సంస్థ పారిశుధ్య, ఇతర పనులకు సంబంధించిన కాంట్రాక్టును చేపట్టింది. ద్వారకాతిరుమల దేవస్థానంలో పారిశుధ్య, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, కార్పెంటర్లు, తాపీ పని, తదితర పనులకు సంబంధించిన కార్మికులు సుమారు 190 మంది పనిచేస్తుండగా వారంతా గతనెల 1 నుంచి పద్మావతి సంస్థ ఆధీనంలోకి వెళ్లారు. అయితే సంబంధిత కాంట్రాక్టర్ 50 ఏళ్ల వయస్సు పైబడిన కార్మికులను ఈనెల 1 నుంచి తొలగిస్తూ కొత్త రూల్ను అమలు చేశారు. దాంతో 26 మంది కార్మికులు ఉపాధిని కోల్పోయి, రోడ్డున పడ్డారు. బాధిత కార్మికులు చైర్మన్ సుధాకరరావును కలసి మొరపెట్టుకున్నారు. ఆయన కార్మికులకు బాసటగా నిలిచి, సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికుల పొట్టగొట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. దాంతో చేసేదేమీ లేక 60 ఏళ్ల వయస్సు పైబడిన ముగ్గురు, నలుగురు కార్మికులను మినహా మిగిలిన వారందరినీ విధుల్లోకి తీసుకున్నారు. కాగా అన్నవరం సత్యదేవుని ఆలయంలో 50 ఏళ్లు వయస్సు పైబడిన 45 మందిని విధుల నుంచి తొలగించగా వారిని కాంట్రాక్టర్ నేటికీ విధుల్లోకి తీసుకోలేదు. -
మొక్కల నరికివేతపై చర్యలు తీసుకోవాలి
జంగారెడ్డిగూడెం: మామిడి, జీడి, జామాయిల్ మొక్కలను అక్రమంగా నరికిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.జీవరత్నం డిమాండ్ చేశారు. మైసన్నగూడెంలో మామిడి, జీడిమామిడి, జామాయిల్ మొక్కలు నరికివేత ఘటనపై ఆయన మాట్లాడారు. గ్రామానికి చెందిన పిల్లి పోతురాజు, పులపాకుల వీర్రాజు, పిల్లి వెంకట సుబ్బారావు, గుద్దాటి సూర్యకిరణ్ నాలుగు ఎకరాల భూమిని గత పదేళ్లుగా సాగుచేస్తున్నారన్నారు. ఆ భూమిలో మామిడి, జీడి, జామాయిల్ మొక్కలను పెంచుతున్నారన్నారు. సదరు భూమికి సంబంధించి విచారణ చేసి పట్టాలు ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గతంలో ఒకసారి కొన్ని మొక్కలు నరికి వేశారని, బాధిత రైతులు ఫిర్యాదు చేయగా అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. మళ్లీ ఈనెల 12వ తేదీ రాత్రి మరోసారి వారు భూమిలో అక్రమంగా ప్రవేశించి మొక్కలను నరికివేశారని తెలిపారు. తక్షణమే పోలీసు వారు కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకొని బాధితులకు రెవెన్యూ చట్టం ప్రకారం నష్టపరిహారం రూ.4 లక్షలు ఇప్పించాలని కోరారు. సత్వరం బాధితులకు న్యాయం చేయకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని జీవరత్నం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి
భీమవరం: పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో తాను ముందుంటానని, ఏ సమస్యనైనా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని జిల్లా ఖజానాధికారి మహ్మద్ మజ్హర్ బేగ్ అన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం భీమవరం ఉప ఖజానా కార్యాలయానికి సందర్శనకు వచ్చిన ఆయన్ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా భీమవరం యూనిట్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ఖజానాధికారి అల్లూరి రవివర్మ, పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు గాతల జేమ్స్, సాగిరాజు సత్యనారాయణ రాజు, కోశాధికారి రవిప్రసాద్, భీమవరం యూనిట్ కార్యదర్శి పి.సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. భీమవరం: స్థానిక డీఎన్ఆర్ కాలేజీలో గత రెండు రోజులుగా వివిధ క్రీడాంశాల్లో జరుగుతున్న ప్రభుత్వ సివిల్ సర్వీస్ ఉద్యోగుల ఆటల పోటీలు ముగిశాయని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎన్.మోహన్ దాస్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 19 విభాగాలలో పోటీల్లో నిర్వహించగా ఎక్కువమంది క్రికెట్, చెస్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్ ఆటల్లో పాల్గొన్నట్లు తెలిపారు. క్రీడల్లో మొత్తం 58 మంది పాల్గొనగా 44 మంది పురుషులు, ఎనిమిది మంది సీ్త్రలు వివిధ విభాగాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ నెల 19 నుంచి 22 వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వారు పాల్గొంటారని డీఎస్డీఓ ఎన్.మోహన్దాస్ తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): శ్రీ కృష్ణా సుజుకి సంస్థ బెస్ట్ వాల్యూ షోరూమ్ సరికొత్త హంగులతో స్థానిక సత్రంపాడులో గురువారం ప్రారంభించారు. షోరూం అధినేత నారా శేషు మాట్లాడుతూ తమ షోరూమ్లో ప్రతి వాహనం ఎక్సేంజ్పై రూ. 2వేలు వరకు లాయల్టీ బోనస్ ఇస్తామన్నారు. అలాగే ప్రతి సుజుకి పాత వాహనం కొనుగోలుపై 1 సంవత్సరం వారంటీతో వస్తుందని, ఈ షోరూమ్లో సర్వీస్ సెంటర్ కూడా ప్రారంభించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో శ్రీ కృష్ణా గ్రూపు అధినేత నారా వెంకట శేషగిరిరావు, సుజుకి బెస్ట్ వాల్యూ హెడ్ అభిషేక్, సుజుకి రీజినల్ మేనేజర్ శివరామకృష్ణ, సుజుకి ఏరియా మేనేజర్ అరుణ్ కుమార్, సర్వీస్ ఏరియా మేనేజర్ రాజశేఖర్, శ్రీ కృష్ణా సుజుకి సిబ్బంది పాల్గొన్నారు. -
లక్కవరం దోపిడీ కేసులో మరో నిందితుడి అరెస్ట్
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ఓ ఇంట్లో జరిగిన దోపిడీ కేసులో మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథం తెలిపారు. గురువారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆమె వివరాలు వెల్లడించారు. లక్కవరం గ్రామంలోని రామాలయం వీధిలోని లక్ష్మీకుమారి ఇంట్లో గత సెప్టెంబర్ 23న తెల్లవారుజామును దండుగులు దోపిడీకి పాల్పడ్డారు. ఆమె భర్తను కర్రలతో కొట్టి బీరువాలోని సుమారు 40 కాసుల బంగారు ఆభరణాలు, 2 కేజీల వెండి వస్తువులు దోచుకుపోయారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి గతంలో అంగడి విల్సన్బాబు, గజ్జెల వాసు, దేవర శ్రీరామమూర్తి, షేక్ బాజీలను అరెస్టు చేయగా, కేసులో 5వ నిందితుడిగా ఉన్న కావేటి చిన్నా అలియాస్ ప్రసాద్, అలియాస్ రమేష్, అలియాస్ రాముని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. కావేటి చిన్నాపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, బాపట్ల జిల్లాలు, గుంటూరు అర్బన్, గుంటూరు జిల్లాలో పలు కేసులు ఉన్నాయన్నారు. అలాగే కామవరపుకోట చింతలపూడి రోడ్లో వృద్ధురాలి మెడలోని రెండు కాసుల బంగారు గొలుసు చోరీ చేశాడన్నారు. చోరీ సొత్తు రికవరీ లక్కవరం చోరీకి కేసుకు సంబంధించి గతంలో అరెస్టు చేసిన నిందితులు అంగడి విల్సన్బాబు, గజ్జెల వాసు, దేవర శ్రీరామమూర్తి, షేక్ బాజీల నుంచి రూ.30 లక్షలు విలువైన 246 గ్రాముల బంగారం రికవరీ చేయగా గురువారం 5వ నిందితుడు కావేటి చిన్న నుంచి రూ.12 లక్షలు విలువైన 70.860 గ్రాముల బంగారం, 1.704కేజీల వెండి, మొత్తంగా రూ. 42 లక్షలు విలువైన సొత్తును రికవరీ చేసినట్లు చెప్పారు. కేసు చేధనలో కృషిచేసిన సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై షేక్ జబీర్, ఏఎస్సై ఎన్వీ సంపత్కుమార్, పీసీలు షేక్ షాన్బాబు, ఎన్.రమేష్లను ఎస్పీ కేపీఎస్ కిషోర్, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాధన్లు అభినందించారు. -
గోదావరిలో యువకుడి గల్లంతు !
యలమంచిలి: మొగల్తూరు మండలం కుమ్మరపురుగుపాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి సుబ్బారావు (35) చించినాడ వద్ద వశిష్ట గోదావరిలో దూకి గల్లంతై ఉంటాడని అతని అన్నయ్య కొత్తపల్లి జల దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కర్ణీడి గురుయ్య తెలిపారు. వివరాల ప్రకారం కుటుంబ కలహాల నేపథ్యంలో బుధవారం సాయంత్రం సుబ్బారావు తన బైక్ వేసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అతని బైక్, సెల్, చెప్పులు చించినాడ వంతెనపై కనిపించడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. దీంతో చించినాడ వచ్చి చూడగా బైక్, సెల్, చెప్పులు సుబ్బారావువే అని కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై వివరించారు. పాలకొల్లు సెంట్రల్: అడ్డు వచ్చిన కుక్కను తప్పించే యత్నంలో ఓ కారు బోల్తా పడి ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి పాలకొల్లు నుంచి ముగ్గురు వ్యక్తులు కారులో బయలుదేరి దిండి వెళుతున్నారు. దిగమర్రు బైపాస్ రోడ్డులో పెదమామిడిపల్లి చేరుకునే సరికి ఓ శునకం అడ్డురావడంతో దానిని తప్పించబోయి అదుపు తప్పి కారు బోల్తా పడి పక్కనే ఉన్న వరి చేలోకి పడిపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భీమవరం అర్బన్: తను ప్రేమించిన వ్యక్తికి మరొకరితో నిశ్చితార్థం కావడంతో మనస్థాపం చెందిన డెంటల్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్లోని సఖిల్గూడ ప్రాంతానికి చెందిన నిమ్మల సింహాచలం కుమార్తె హేమవర్షిని (22) భీమవరంలోని విష్ణు కళాశాలలో 2021 సంవత్సరం నుంచి డెంటల్ కోర్సు చదవుతోంది. సమీపంలోని కొవ్వాడ గ్రామంలో నందననాయుడు ఇంట్లో అద్దెకు ఉంటుంది. అదే కళాశాలలో విద్యనభ్యసిస్తున్న చిట్టుమూరి నవీన్రెడ్డికి, హేమ వర్షినికి గత రెండేళ్లుగా పరిచయం ఏర్పడింది. నవీన్ రెడ్డి వారం క్రితం హేమ వర్షిణికి ఫోన్ చేసి తనకు నిశ్చితార్థం అయిందని చెప్పాడు. దీంతో హేమవర్షిని మనస్థాపం చెంది బుధవారం రాత్రి తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై విద్యార్థిని తండ్రి నిమ్మల సింహాచలం పోలీసులకు ఫిర్యాదు చేయగా రూరల్ ఎస్సై ఐ వీర్రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యలమంచిలి: చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై కర్ణీడి గుర్రయ్య తెలిపిన వివరాల ప్రకారం ఊటాడ పెదపేటకు చెందిన కాకిలేటి రాహుల్ (22) మద్యానికి బానిస కావడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన రాహుల్ నాలుగు రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించగా అతడిని కుటుంబ సభ్యులు పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. సోదరుడు నవరత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. -
మాంసాహారం.. డల్లుగా వ్యాపారం
● కార్తీకం ఎఫెక్ట్తో తగ్గిన మాంసాహార వినియోగం ● వ్యాపారాలు లేవంటున్న మాంసం వ్యాపారులుఏలూరు (ఆర్ఆర్పేట) : మారిన ప్రజల ఆహారపు అలవాట్లలో భాగంగా మాంసాహార ప్రియులు ఎక్కువైపోయారు. ఎక్కడ చూసినా చికెన్ జాయింట్లు, చికెన్ ఫ్రైలు, చికెన్ టిక్కాలు, కబాబులు, తండూరి చికెన్లు ఇలా అల్పాహారాలు సైతం మాంసాహారానికి సంబంధించినవే ఉంటున్నాయి. ఇక ప్రజల భోజనాల్లోకి బిర్యానీలు చొచ్చుకువచ్చాయి. దీంతో ఏమూల చూసినా బిర్యానీ పాయింట్లు, నాన్ వెజ్ రెస్టారెంట్లు దర్శనమిచ్చి వారి వ్యాపారం జోరుగా సాగుతుంది. అయితే కార్తీక మాసం కావడంతో గత 20 రోజులుగా మాంసాహార వినియోగం తగ్గింది. దాదాపు 50 శాతం వ్యాపారాలు పడిపోయాయని మాంసాహార వ్యాపారులు చెబుతున్నారు. కార్తీకం.. ప్రత్యేకం కార్తీక మాసం హిందువుల్లో ప్రత్యేక మాసంగా పరిగణించబడుతోంది. నిత్యం మాంసాహారం తీసుకునే వారు సైతం ఈ కార్తీక మాసంలో మాంసం జోలికి వెళ్లడం లేదు. దీనికి తోడు అనేక మంది అయ్యప్ప మాలలు ధరించడం, వాటితో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి మాల, ఆంజనేయ స్వామి మాల, సాయి బాబా మాల ఇలా వివిధ దేవతల పేరిట మాలలు ధరించి సుమారు 45 రోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. దీంతో వ్యాపారాలు లేక మాంసం వ్యాపారులు విలవిల్లాడుతున్నారు. కొందరు వ్యాపారులకు కనీసం రోటేషన్ జరిగే స్థాయిలో కూడా వ్యాపారం జరగడంలేదని వాపోతున్నారు. కొందరు అప్పులు చేసి వ్యాపారాలు చేస్తుండగా చేసిన అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితి కూడా కనిపించడంలేదంటున్నారు. ప్రతీ ఏటా ఈ పరిస్థితి సాధారణమే అయినప్పటికీ ఈ ఏడాది ఎఫెక్ట్ మరింత ఎక్కువగానే ఉందంటున్నారు. నిలకడగానే ధరలు సాధారణంగా కార్తీక మాసం వచ్చిందంటే కోడి మాంసం ధరలు తగ్గుతాయి. వేట మాసం, చేపలు, రొయ్యల ధరల్లో కూడా వ్యత్యాసం కనిపిస్తుంది. అయితే ఈ ఏడాది చికెన్ ధరలు మాత్రం నిలకడగానే ఉన్నాయి. కార్తీక మాసానికి ముందు కిలో స్కిన్లెస్ రూ. 240, స్కిన్తో రూ. 200 నుంచి రూ. 220 వరకూ విక్రయించే వారు. గతంలో కార్తీక మాసంలో స్కిన్లెస్ చికెన్ రూ.180కు, స్కిన్తో రూ. 160కు పడిపోయేది. ఈ ఏడాది మాత్రం కార్తీక మాసానికి ముందు ఉన్న ధరలే కొనసాగుతున్నాయి. వినియోగం తగ్గినా ధరలు తగ్గక పోవడం కూడా మాంసం వ్యాపారాలు తగ్గడానికి ఒక కారణంగా చెబుతున్నారు. కార్తీక మాసం తరువాత కూడా మాంసాహారం వినియోగం పెద్దగా పెరిగే సూచనలు కనిపించడంలేదు. వివిధ దేవతల మాలల దీక్షలు జనవరి వరకూ కొనసాగనుండడంతో వారి కుటుంబ సభ్యులు సైతం మాంసాహారానికి దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. దీంతో మాంసం వ్యాపారాలు తగ్గిన దానిలో 20 శాతం మాత్రమే పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ వ్యాపారం ఈ ఏడాది భారీగా తగ్గింది. కార్తీక మాసంలో వ్యాపారం తగ్గడం సర్వసాధారణమే కాఈన ఈ ఏడాది అంతకు మించి తగ్గడానికి కారణం తెలియడం లేదు. బహుశా మాలలు ధరించిన వారు ఎక్కువ మంది ఉండి ఉంటారనే అనుకుంటున్నాము. – షేక్ మహబూబ్ జానీ, చికెన్ వ్యాపారి కార్తీక మాసం అయినా మటన్ ధర నిలకడగానే ఉంటుంది. కానీ ఈ ఏడాది మాంసం వినియోగం తగ్గడంతో మాంసాహార ప్రియులను ఆకర్షించడానికి కొద్దిగా ధరలు తగ్గినా వ్యాపారాలు పెరగలేదు. ఈ పరిస్థితి వచ్చే ఫిబ్రవరి వరకూ ఉండేలా కనిపిస్తోంది. ఏలూరులో జాతర రోజు వరకూ మాంసం వినియోగం తగ్గిస్తారని అంటున్నారు. – షేక్ మున్వర్ అలీ, మటన్ వ్యాపారి -
మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి
జంగారెడ్డిగూడెం: ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందజేయాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు ఈ.లక్ష్మీరెడ్డి సూచించారు. గురువారం పట్టణంలోని డాక్టర్ బీఆర్అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, స్టోర్ రూమ్, కూగాయలు, పప్పు, నూనె, కోడిగుడ్లు, తదితర నిత్యావసర సరుకుల నాణ్యతను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అన్నం వండినప్పుడు గంజి వార్చుతుండడాన్ని ఆయన గమనించారు. ప్రభుత్వం ఎన్నో పోషక విలువలున్న ఫోర్ట్ఫైడ్ బియ్యాన్ని పాఠశాలలకు అందజేస్తుందని ఆ బియ్యాన్ని అన్నం వండేటప్పుడు గంజి వార్చితే పోషకాలన్నీ బయటకు పోతాయని, ఇక నుంచి అన్నం వార్చకూడదని సూచించారు. విద్యార్థులకు మధ్యాహ్నం వండిన అన్నం, కూరలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనతో పాటు జిల్లా సహాయ పౌర సరఫరాల అధికారి ప్రతాప్ రెడ్డి, లీగల్ మెట్రాలజీ అధికారులు, స్థానిక సీఎన్ఎటి. వెంకటేశ్వరరావు, ఏపీ గురుకుల పాఠశాలల సొనైటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ బి.ఉమాకుమారి, ప్రిన్సిపాల్ టి.గంగాభవానీ తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీలో పర్యటన బుట్టాయగూడెం: రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు ఈ.లక్ష్మీరెడ్డి బుధవారం ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు. బుట్టాయగూడెం మండలంలోని మర్లగూడెం అంగన్వాడీ కేంద్రం, బుట్టాయగూడెంలోని ఏపీ గురుకుల పాఠశాలలోని భోజనశాలను సందర్శించారు. వంటలను స్వయంగా రుచి చూశారు. విద్యార్థులకు అనుగుణంగా మంచినీటి సదుపాయంలే దని ప్రిన్సిపాల్ కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. అలాగే బీసీ కాలనీ సమీపంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా పరిషత్ హైస్కూల్ను కూడా సందర్శించారు. కేఆర్పురం ఐటీడిఏ డిప్యూటీ డైరెక్టర్ పి.జనార్థన్రావు, ఎంఈఓ టి.బాబూరావు, ఏటీడబ్ల్యూఓలు శ్రీవిద్య, జనార్థన్, సీడీపీఓ యూవి పద్మావతి, సివిల్ సప్లయి ఆర్ఐ కె.పద్మావతి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ముగిసిన సివిల్ సర్వీస్ జట్ల ఎంపిక
ఏలూరు రూరల్: జిల్లా సివిల్ సర్వీస్ జట్ల ఎంపిక పోటీలు ముగిశాయి. బుధవారం ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో రెండోరోజు క్రీడాధికారులు క్రికెట్, యోగా జట్లు ఎంపిక చేశారు. క్రికెట్ జట్టుకు పవన్శ్రీనివాస్రెడ్డి, బి నవీన్సూర్య, కె రాజేష్, ఎం.కృష్ణారావు, ఏ సునీల్బాబు, ఎండీ మొహనీస్, పీఎన్డీవీ ప్రసాద్, జె సత్యనారాయణ, డి రవికుమార్, జి సతీష్కుమార్, షేక్ రియాజ్, డి వెంకటేశ్వరరావు ఎంపికయ్యారు. మరోపక్క యోగా జట్టుకు మొనగంటి మహీంద్రాచార్యులు, ఇరస అమ్మాజీ, డ్యాన్స్ జట్టుకు పాయం రత్నకుమారి ఎంపికై నట్లు డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్ వెల్లడించారు. బుధవారం పోటీలకు 20 మంది హాజరు కాగా 15 మంది ఎంపికయ్యారన్నారు. మొత్తంగా 106 మంది క్రీడాకారులు జిల్లా జట్లుకు ప్రాతినిధ్యం వహించనున్నారని వివరించారు. ఎంపికై న వారు ఈ నెల 19వ తేదీ నుంచి 22 వరకూ ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సివిల్ సర్వీస్ పోటీల్లో పాల్గొనాల్సి ఉందన్నారు. -
శ్రీవారి అంతరాలయ దర్శన ప్రాప్తిరస్తు
ద్వారకాతిరుమల: శ్రీవారి అంతరాలయ దర్శనం కోసం భక్తులు ఎన్నో ఏళ్ల నుంచి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దగ్గర నుంచి ఆ దేవదేవుడిని కనులారా వీక్షించాలని తహతహలాడుతున్నారు. అయితే ఆ సమయం రానేవచ్చింది. ఈనెల 27 నుంచి అంతరాలయ దర్శనాన్ని పునః ప్రారంభిస్తున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి బుధవారం ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. కరోనా మహమ్మారి కారణంగా ఐదేళ్ల క్రితం స్వామివారి అంతరాలయ దర్శనాన్ని, అలాగే అమ్మవార్ల ముందు నుంచి క్యూలైన్లలో వెళ్లే విధానాన్ని రద్దు చేశారు. కోవిడ్ అనంతరం ఇతర దేవాలయాల్లో అంతరాలయ దర్శనాలు పునః ప్రారంభం అయినప్పటికీ, ఈ ఆలయంలో మాత్రం పునరుద్ధరణ కాలేదు. గతంలో కంటే ఆలయంలో భక్తుల రద్దీ పెరగడం, అంతరాలయ భాగం ఇరుకుగా ఉండటమే అంతరాలయ దర్శనాన్ని పునరుద్ధరించక పోవడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే అంతరాలయ దర్శనం కోసం భక్తుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్న నేపధ్యంలో, ఈ దర్శనాన్ని పునః ప్రారంభిస్తున్నట్టు ఈఓ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అంతరాలయం ముందు భాగంలో గతంలో ఉన్న చెక్కల ర్యాంపు ఏళ్లతరబడి మూలన పడి ఉండటంతో దెబ్బతింది. దానికి మరమ్మతులు చేసి, ఆలయ ఆవరణలో ఉంచారు. ప్రస్తుతం వీఐపీలకు మాత్రమే ప్రస్తుతం వీఐపీలకు, వారు సిఫార్సు చేసిన వారికి మాత్రమే అంతరాలయ దర్శన భాగ్యం కలుగుతోంది. సామాన్య భక్తులు దూరం నుంచే స్వామి, అమ్మవార్లను దర్శనం చేసుకోవాల్సి వస్తోంది. ఇటీవల ఓ వృద్ధ దంపతులు అంతరాలయ దర్శనం కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు నుంచి లెటర్ తెచ్చారు. దాన్ని ఎవరికి అందజేయాలో తెలియక చాలాసేపు ఆలయంలోనే తిరిగారు. వారిని చూస్తే.. స్వామివారి అంతరాలయ దర్శనం కోసం భక్తులు ఇంతిలా ఆరాటపడుతున్నారా.. అని అక్కడున్న వారందరికీ అనిపించింది. టికెట్తో దళారులకు చెక్.. ఈనెల 27 నుంచి అంతరాలయ దర్శనానికి వెళ్లే ఒక్కో భక్తుడు రూ. 500 టికెట్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దాంతో ఇక దళారులకు చెక్ పడినట్టేనని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం అంతరాలయ దర్శనం కోసం కొందరు భక్తులు పలుకుబడి, పేరు ఉన్న దళారులను ఆశ్రయిస్తున్నారు. వారు ఒక్కో భక్తుడి నుంచి రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు టికెట్ పెట్టడం వల్ల భక్తులకు దళారులతో పని ఉండదని, ఆ సొమ్ము దేవుడికే చెందుతుందని పలువురు అంటున్నారు. ఈనెల 27 నుంచి శ్రీవారి అంతరాలయ దర్శనం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు టికెట్ రుసుం ఒక్కొక్కరికి రూ.500 ఇక దళారులకు చెక్ పడినట్టే -
విద్యా స్ఫూర్తి ప్రదాత మూర్తిరాజు
భీమవరం: విద్యాదానానికి తమ యావదాస్తిని ఖర్చు చేసిన ‘విద్యాస్ఫూర్తి ప్రదాత’ చింతలపాటి వరప్రసాద మూర్తి రాజు ఆదర్శప్రాయుడని కలెక్టర్ చదలవాడ నాగరాణి కొనియాడారు. విద్యాదాత మూర్తి రాజు 13వ వర్థంతిని పురస్కరించుకొని బుధవారం భీమవరం అడ్డ వంతెన సమీపంలోని మూర్తి రాజు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లెక్టర్ మాట్లాడుతూ 1962 నుంచి మారుమూల ప్రాంతాల్లో 68 విద్యాసంస్థలు నెలకొల్పి భావి పౌరులకు విద్యా విలువలను, భారతీయ సంస్కృతిని అందించాలనే లక్ష్యంతో మూర్తి రాజు కృషి చేశారని తెలిపారు. సర్వోదయ మండలి, మానవత సేవా సంస్థ, అల్లూరి సేవాసమితి విజ్ఞాన వేదిక, వసుధ ఫౌండేషన్, పుర ప్రముఖులు పాల్గొన్నారు. విద్యలోనూ, క్రీడల్లోనూ రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ‘మూర్తి రాజు స్ఫూర్తి అవార్డులు’ అందజేశారు. -
గ్రావెల్ దోపిడీని అడ్డుకున్న గ్రామస్తులు
నూజివీడు: మట్టి, గ్రావెల్ ఎక్కడ కనబడినా దోచుకోవడమే లక్ష్యంగా టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగుతున్నారు. మండలంలోని హనుమంతులగూడెంలో మంగళవారం అర్ధరాత్రి పట్టణానికి చెందిన ఒక టీడీపీ చోటా నాయకుడు టిప్పర్లతో అక్రమంగా గ్రావెల్ తవ్వి తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డం తిరిగారు. గ్రామానికి సమీపంలోని రేలపోడు తిప్పలో నూజివీడుకు చెందిన ఒక వ్యక్తి రాత్రి 10 గంటల నుంచి నాలుగు టిప్పర్లు పెట్టి పొక్లెయిన్తో గ్రావెల్ను తవ్వి లోడు చేసి వెళ్తుండగా గ్రామం వద్ద దాదాపు 30మంది గ్రామస్తులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడి గ్రావెల్ను తవ్వి తరలించడానికి నువ్వెవరవంటూ నిలదీశారు. దీంతో టిప్పర్లకు అడ్డం వచ్చారంటే తొక్కించేస్తామని, కేసుల్లో ఇరికిస్తామంటూ బెదిరించారు. అయినప్పటికి గ్రామస్తులు బెదరకుండా గ్రావెల్ను తరలించే టిప్పర్లకు అడ్డంగా రోడ్డుపై ట్రాక్టర్ను అడ్డుగా ఉంచి టిప్పర్లను ఆపేశారు. తరువాత రెవెన్యూ అధికారులకు, సిబ్బందికి ఫోన్లు చేసినా వారెవరూ స్పందించలేదు. దీంతో చేసేదేమీ లేక అర్ధరాత్రి 12 గంటల సమయంలో టిప్పర్లలోని గ్రావెల్ను అక్కడే అన్లోడ్ చేసి ఖాళీగా వెళ్లిపోయారు. పేట్రేగిపోతున్న అక్రమార్కులు అధికార పార్టీకి చెందిన అక్రమార్కులు రోజురోజుకు పేట్రేగిపోతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రతిరోజూ రాత్రి సమయంలో టిప్పర్లు పెట్టి నూజివీడు, విస్సన్నపేట, ముసునూరు, ఆగిరిపల్లి, విజయవాడ వంటి ప్రాంతాలకు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున గ్రావెల్ను తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇంత దారుణంగా గ్రావెల్ దోపిడీ ఎన్నడూ జరగలేదని, ఇలాగే వదిలేస్తే రాబోయే రోజుల్లో కొండలేవీ కనిపించవని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఫుడ్ కమిషన్ తనిఖీలు
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు కృష్ణ కిరణ్ బుధవారం పాలకొల్లు, నరసాపురం, పెనుమంట్ర, వీరవాసరం మండలాల్లో వివిధ ప్రభుత్వ, గురుకుల పాఠశాలలు ఎమ్మెల్సీ పాయింట్లు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ముందుగా పాలకొల్లు మండలంలోని దిగమర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం అమలుపై ప్రధానోపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం భోజనం మెనూ అమలుపై విద్యార్థుల అభిప్రాయాలను సేకరించారు. అనంతరం చిన మామిడిపల్లి మున్సిపల్ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. తదుపరి ఏపీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను, నరసాపురం ఏపీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను, పెనుమంట్రలో ఎమ్మెల్సీ పాయింట్ సందర్శించారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ, జిల్లా సివిల్ సప్లయి అధికారి ఎన్.సరోజ, మిడ్ డే మీల్స్ అసిస్టెంట్ డైరెక్టర్, ఐసీడీఎస్ సిబ్బంది, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అధికారులు, ఎంఈఓలు ఉన్నారు.


