West Godavari District Latest News
-
వనరూపిణి.. వర ప్రదాయిని
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. విజయవాడకు చెందిన భక్తులు డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. అధికంగా తరలివచ్చిన భక్తుల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీవారితోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు. ఉండి: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉంగుటూరు మండలం బొమ్మిడి గ్రామానికి చెందిన నాగరాజు నర్సింహరాజు, అతని భార్య ఉదయశ్రీ (50) పెదపుల్లేరులో మల్లిఖార్జునస్వామి ఆలయ ప్రతిష్టకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఉండి రైల్వే గేటు దాటిన వెంటనే వీరి ద్విచక్రవాహననాన్ని వెనక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చుని ఉన్న ఉదయశ్రీ కింద పడిపోవడం, ఆమైపె నుంచి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. లారీ విడిచిపెట్టి డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఉదయశ్రీ మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ యెషయా కేసు నమోదు చేశారు. -
వంతెన.. ఇంకెన్నాళ్లీ యాతన
● నిలిచిన రావులపర్రు వంతెన నిర్మాణం ● బిల్లులు అవ్వక పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్ ● వంతెన కోసం ప్రజల ఎదురుచూపులుఉంగుటూరు: పత్తేపురం పంటకాలువపై వంతెన నిర్మాణం మళ్లీ నిలిచిపోయింది. బిల్లులు పూర్తికాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేసినట్లు తెలిసింది. ఈ వంతెన నిర్మాణం కోసం రావులపర్రు గ్రామ ప్రజలు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. 2019కి ముందు పత్తేపురం పంటకాలువపై ఉన్న వంతెన శిథిలమై కూలిన నాటి నుంచి ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. వ్యవసాయ ఉత్పుత్తులు, ఎరువులు పురుగుమందులు గ్రామంలోకి తేవాలన్నా, గ్రామం నుంచి బయటకు తోలాలన్నా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడి ప్రజలు మండల కేంద్రం ఉంగుటూరు చేరాలంటే చుట్టూ తిరిగి నారాయణఫురం మీద నుంచి రావాల్సి వస్తోంది. దీంతో కూలిన వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు గ్రామ ప్రజలు విజ్ఞప్తులు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు మారినా పని పూర్తి కాలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు వంతెన నిర్మాణానికి రూ.70 లక్షలు నిధులు మంజూరు చేయించడంతో పనులు ప్రారంభమయ్యాయి. ఆర్అండ్బీ శాఖ వారి పర్యవేక్షణలో ఈ వంతెన పనులు పూర్తి కావాల్సి ఉంది. గతేడాది కొంతవరకు పనులు చేశారు. పక్క గోడలు కూడా పూర్తయ్యాయి. అయితే ఆ తరువాత నుంచి పనులు నిలిచిపోయాయి. చేసిన పని వరకు బిల్లు అవ్వకపోవడం వల్ల కాంట్రాక్టరు పని ఆపేసినట్లు తెల్సింది. -
శ్రీవారి దేవస్థానం ఈఓగా వేండ్ర త్రినాథరావు
ద్వారకాతిరుమల: అన్నవరం శ్రీ వీరవెంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావును, ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈఓగా నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నియామకానికి సంబంధించిన జీఓ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. రాజమహేంద్రవరం ఆర్జేసీగా పనిచేస్తున్న ఆయన్ను గతేడాది డిసెంబర్ 9న అన్నవరం దేవస్థానం ఈఓగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. అయితే ద్వారకాతిరుమల దేవస్థానం ఈఓగా పనిచేసిన ఎన్వీఎస్ఎన్ మూర్తి గతేడాది డిసెంబర్ 31తో పదవీ విరమణ పొందగా, అప్పటి ఇదే దేవస్థానంలో డీఈఓగా పనిచేస్తున్న యర్రంశెట్టి భద్రాజీ ఇన్చార్జి ఈఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. త్రినాథరావు ఈఓగా బాధ్యతలు చేపట్టిన తరువాత, భద్రాజీ మళ్లీ డీఈఓగా ఇదే దేవస్థానంలో కొనసాగుతారు. టి.నరసాపురం: బంగారం, వెండి ఆభరణాల చోరీపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్సీ ఎం.రాజు తెలిపారు. ఏపిగుంట గ్రామానికి చెందిన యిర్ల సత్యనారాయణ ఈ నెల 10న భార్యతో కలిసి జంగారెడ్డిగూడెంలో బంధువుల గృహ ప్రవేశానికి వెళ్లారు. తిరిగి ఈ నెల 11న ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని 24 గ్రా. బంగారం, 1050 గ్రా. వెండి ఆభరణాలు అపహరణకు గరైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సుబ్రహ్మణ్యేశ్వరా.. శరణు.. శరణు..
ముదినేపల్లి (కై కలూరు): రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన ముదినేపల్లి మండలం, శింగరాయపాలెం–చేవూరుపాలెంలో కొలువైన వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు ఆదివారం పోటెత్తారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు తోలేటి వీరభద్రశర్మ ప్రత్యేక అభిషేకాలు చేశారు. దేవస్థాన ఆవరణలో పుట్టిలో వెలిసిన స్వామివారికి అనేక మంది భక్తులు పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ముఖ్యంగా ఓ జంట యజ్ఞాన్ని నిర్వహించి నాగ ప్రతిష్ట చేశారు. ఆలయ సహాయ కమిషనరు, కార్యనిర్వహణాధికారిణి ఆర్.గంగా శ్రీదేవి, ఆలయ చైర్మన్ బొంగు రవికుమార్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత అన్నప్రసాదాన్ని నిర్వహించారు. కామవరపుకోట: స్థానిక రామన్నపాలెం రోడ్డులోని తపస్య ఎడ్యుకేషనల్ స్కూల్, జూనియర్ కాలేజీలో ఏలూరు చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ పాలూరి, సెక్రటరీ కన్నా సూర్య నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అండర్ 9 చెస్ పోటీలు నిర్వహించారు. ఏలూరుకు చెందిన బాలురు విభాగంలో శివనాగ్ 4 పాయింట్లు, అఖిలేష్ 3 పాయింట్లు, బాలికల విభాగంలో చిర్నవి 3 పాయింట్లు, బిస్మి యాస్మిన్ జారా 2 పాయింట్లు సాధించి ఎంపికయ్యారు. విద్యాసంస్థల యాజమాన్యం జగన్ పాల్గొన్నారు. ముసునూరు: మండలంలోని చింతలవల్లిలో రూ.4.02 కోట్లతో నిర్మించ తలపెట్టిన 33/11 కేవీ విద్యుత్తు ఉప కేంద్ర నిర్మాణానికి ఆదివారం గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారధి భూమి పూజ చేశారు. అనంతరం రూ.83 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రహదారులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టరు టీవీఎన్ఎస్.మూర్తి, ఎస్ఈ యు.హనుమయ్య, విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: పట్టణంలో ఓ ఇంట్లోకి ప్రేవేశించిన పామును స్నేక్ సేవియర్స్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు చదలవాడ క్రాంతి చాకచక్యంగా పట్టుకున్నారు. జంగారెడ్డిగూడెం గ్రాండ్–2 సాయి బాలాజీ టౌన్షిప్ 3వ రోడ్లో దినేష్పటేల్ మార్వాడి వ్యాపారి ఇంట్లోకి నాలుగు అడుగుల గోధుమ తాచుపాము ప్రవేశించింది. ఆదివారం ఉదయం నిద్రలేచి ఇంట్లో నుంచి బయటకు రాగానే గుమ్మం వద్ద గోధుమ తాచు పడుకుని ఉంది. భయభ్రాంతులకు గురైన దినేష్ పటేల్ వెంటనే స్నేక్ సేవియర్స్ సొసైటీకి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన క్రాంతి పామును చాకచక్యంగా పట్టుకుని సమీపంలోని అటవీప్రాంతలో విడిచిపెట్టాడు. కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మకు వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క అదివారం మాత్రమే ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల విక్రయం, వాహన పూజలు, విరాళాల ద్వారా మొత్తం రూ.84,926 ఆదాయం వచ్చిందని తెలిపారు. అమ్మ దర్శనానికి విచ్చేసిన భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని ఈవో చెప్పారు. -
గూడెంలో రేషన్ దందా
తాడేపల్లిగూడెం: పట్టణంలో ఇద్దరు యువకులు రేషన్ దందా సాగిస్తున్నారు. పట్టణం, పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. ఇందులో ఒకరు స్లీపింగ్, మరొకరు యాక్టివ్ పార్టనర్గా కొనసాగుతున్నారు. స్లీపింగ్ పార్టనర్గా చెప్పుకొనే వ్యక్తి గతంలో దొంగ బియ్యాన్ని కొనుగోలు చేసే మిల్లుల సమాచారం తెలుసుకొని ఇతరులకు ఉప్పు అందించి సొమ్ములు చేసుకొనేవాడని ప్రతీతి. ప్రస్తుతం అతడు అక్రమ బియ్యంలో ఉండడమే కాక, ఒక పెద్దతలకాయ పేరు చెప్పి ఉద్యోగుల బదిలీలు చక్కపెడుతున్నాడంటున్నారు. ఏడాదికి ముందు రేషన్ మాఫియా సవితృపేటకు చెందిన వారసత్వ బియ్యం అక్రమ రవాణా చేసే ఒక కుటుంబంలో ఉండేదనేది బహిరంగ రహస్యం. పెదతాడేపల్లి మార్గంలో ఎరువుల గోదాములు కేంద్రంగా అక్రమ బియ్యం నిల్వలు చేసి, జిల్లాను దాటించి సొమ్ములు చేసుకొనే వారు. విజిలెన్సు దాడులు జరిగినా కూడా అక్రమ వ్యవహారాలకు అడ్డుకట్ట పడలేదు. చివరికి వ్యవహారం తలబొప్పి కట్టేలా తయారవుతున్న తరుణంలో ఈ అక్రమ వ్యవహారానికి బలవంతంగా బ్రేక్ వేశారు. అక్రమ రేషన్ వ్యవహారం తాత్కాలికంగా ఆగినట్టుగా కనిపించినా ఏడాదిగా మళ్లీ పురుడుపోసుకుంది. ఈ నూతన ద్వయం అక్రమ రేషన్ వ్యవహారం యథేచ్ఛగా సాగిస్తోంది. యాక్టివ్గా ఉన్న భాగస్వామి ఇటీవల అక్రమ బియ్యం తరలిస్తున్న తరుణంలో విజిలెన్స్ అధికారులు భీమడోలులో బియ్యం పట్టుకున్నారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో, ఆరో వార్డులోని మామిడితోటలోనూ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. అయినప్పటికీ అక్రమ రేషన్ వ్యాపారం మూడు మూటలు, ఆరు బస్తాలుగా సాగుతోందని తెలుస్తోంది. పెద్దతలకాయల పేరుచెప్పి స్లీపింగ్ పార్టనర్ పేట్రేగిపోతున్న వ్యవహారం కూడా చర్చనీయాంశమైంది. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రేషన్ మాఫియా సాగిస్తున్న నయా ద్వయం విచ్చలవిడిగా అక్రమ బియ్యం వ్యాపారం మా వెనుక పెద్దలున్నారంటూ బ్లాక్ మెయిలింగ్ -
నెరవేరని సొంతింటి కల
● వైఎస్పార్ కాలనీలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలు ● రుణం కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం మండవల్లి: పేదల సొంతింటి కళ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం కక్షపూరిత ధోరణే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు సొంతిల్లు సమకూర్చేందేకు వైఎస్సార్ కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించింది. వారు ఇళ్లు నిర్మించుకునేందుకు సైతం రుణం మంజూరు చేసింది. ఈ క్రమంలో చాలా చోట్ల పేదలు ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే తరువాత ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారిపోవడం జరిగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వైఎస్సార్ కాలనీలోని ఇళ్ల నిర్మాణాలపై పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో వైఎస్సార్ కాలనీలో మౌలిక సౌకర్యాలు లేక, రుణం మంజూరు కాకపోవడంతో ఇళ్లు నిర్మించుకునే వీలు లేక లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. మండవల్లిలోని వైఎస్సార్ కాలనీలో 174 మందికి ఒక్కొక్కరికీ సెంటున్నర చొప్పున ఇళ్ల స్థలాలు గతంలో కేటాయించారు. 74 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. కొన్ని ఫౌండేషన్ దశలో, 30 ఇళ్లకు భీములు పోసి, మరో 10 ఇళ్లు శ్లాబ్ దశలో, 10 ఇళ్లు పూర్తికాబడి ఉన్నాయి. మిగిలిన వంద మంది లబ్ధిదారులకు రుణ సౌకర్యం మంజూరు కాకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. రుణ సౌకర్యం కలిగిస్తేనే గృహాలు నిర్మించుకోగలమని చెబుతున్నారు. మౌలిక వసతులు శూన్యం కాలనీ పొలాల మధ్యలో ఉండడం.. ఇక్కడ ఎలాంటి తాగునీటి వసతి కల్పించకపోవడంతో కాలనీలోని లబ్ధిదారులు తాగునీటికి నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కాలనీకి వెళ్లే రహదారి పల్లపు ప్రదేశంలో ఉండటంతో వర్షం నీరు నిలిచిపోయి రాకపోకలు సాగించడానికి అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వైఎస్సార్ కాలనీలో మౌలిక సౌకర్యాలు కల్పించడంతోపాటు, మిగిలిన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలకు రుణాలు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు. అస్తవ్యస్తంగా కాలనీ రహదారి మండవల్లి వైఎస్సార్ కాలనీలో ఇళ్ల నిర్మాణాల పరిస్థితి సుమారు 100 ఇళ్లు రుణ సౌకర్యం లేక ఖాళీ స్థలాలతో ఉన్నాయి. లబ్ధిదారులంతా రెక్కాడితే గానీ డొక్క నిండని పేదవారు. ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పిస్తేనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమవుతాయి. అధికారులు త్వరితగతిన వారికి రుణాలు మంజూరు చేయాలి. – సుంకర కనకరాజు, మండవల్లి కాలనీలో ఉన్నవారందరూ పేదలే. ప్రభుత్వం రుణం మంజూరు చేయకుండా ఇంటి నిర్మాణాలు ప్రారంభించడం కష్టమే. స్థలాలు ఉన్నా ఇళ్ల నిర్మాణాలు జరుగకుంటే ప్రయోజనం లేదు. అధికారులు లబ్ధిదారులందరికీ రుణాలు మంజూరు చేసి సహకరించాలి. – రాజేంద్ర, మండవల్లి -
శ్రీనివాస కల్యాణం.. కడు రమణీయం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాధ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం రాత్రి శ్రీనివాసుని దివ్యకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణల నడుమ జరిగిన ఈ కల్యాణ తంతు భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లను పల్లకీ వాహనంలో ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం అట్టహాసంగా పల్లకీ వాహనాన్ని ఆలయ ఆవరణలోని కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. అంతక ముందే కల్యాణ మండపంలో విశేషంగా అలంకరించిన వేదికపై స్వామి, అమ్మవార్ల కల్యాణ మూర్తులను ఉంచి అర్చకులు పుష్పాలంకారాలు చేశారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ఆలయ ఈఓ వై.భద్రాజీ పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం అర్చకులు, పండితులు స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించి కల్యాణ తంతును ప్రారంభించారు. సుముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేసి, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను భక్తుల గోవింద నామస్మరణల నడుమ వైభవంగా జరిపారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలను అందజేశారు. లక్ష్మీపురంలో అట్టహాసంగా వేడుక -
స్వచ్ఛతకు ‘కృష్ణా’ర్పణం
ఏలూరు (టూటౌన్): అపరిశుభ్రమైన ప్రస్తుత కృష్ణా నది జలాలను పంపుల చెరువులో నింపొద్దని నగర ప్రజలు కోరుతున్నారు. ఏలూరు ప్రజానీకానికి వేసవి దాహార్తిని తీర్చేందుకు పంపుల చెరువు నింపడం కోసం విజయవాడ నుంచి కృష్ణా నది జలాలను కిందికి, ఏలూరు కృష్ణా కెనాల్ లోకి వదిలారు. అయితే ప్రస్తుతం కృష్ణా కెనాల్లోకి వస్తున్న, కాలువలో ప్రవహిస్తున్న నీరు చాలా అపరిశుభ్రంగా, కలుషితంగా, దుర్వాసనతో మురుగు నీటిలా ఉన్నాయి. ఈ అపరిశుభ్రమైన నీటిని పడమటి లాకుల ద్వారా కిందికి వదిలి పరిశుభ్రమైన నీరు వచ్చిన తర్వాతనే పంపుల చెరువులు నింపాలని ఐఎఫ్టీయూ ఏలూరు నగర కమిటీ మున్సిపల్, ప్రభుత్వ అధికారులను కోరింది. ఈ మేరకు ఐఎఫ్టీయూ బృందం ఆదివారం పడమటిలాకుల వద్ద కృష్ణా కెనాల్ నీటిని పరిశీలించారు. అనంతరం పంపుల చెరువు వద్ద నీటిని పరిశీలించారు. మూడు నెలల తర్వాత కృష్ణా కాలువకు నీరు ఏలూరు నగరానికి గోదావరి, కృష్ణా జలాలలతో వేసవిలో దాహార్తిని తీర్చేందుకు ఒక పక్క అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే కృష్ణా కాలువకు విజయవాడ ఎనికేపాడు వద్ద బుడమేరుకు అండర్ టన్నెల్ నిర్మిస్తున్న కారణంగా గత మూడు నెలలుగా ఏలూరుకు వచ్చే కృష్ణా కాలువను మూసివేశారు. ప్రస్తుతం వేసవిలో దిగువ ప్రాంతాల్లోని తాగునీటి చెరువులకు నీటిని అందించే ఉద్దేశ్యంతో ఇటీవల నీటిని విడుదల చేశారు. కానీ ఎగువ ప్రాంతంలో కాలువలో ఉన్న వ్యర్థాల కారణంగా దిగువ ఏలూరు వచ్చేసరికి కృష్ణా కాలువ నీరు కలుషితంగా మారుతోంది. ఈనెల 7వ తేదీ సాయంత్రానికి ఏలూరు చేరుకున్న కృష్ణా నీరు పంపుల చెరువులోకి తోడేందుకు పనికి రాకుండా పోయింది. తాగునీటికి పనికిరావంటూ రిపోర్టు ప్రస్తుతం కృష్ణా కాలువలో వస్తున్న నీరు తాగునీటికి పనిరావంటూ ల్యాబ్ రిపోర్టు వచ్చినట్లు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. మురుగు నీరు ఆగిపోయిన తర్వాతనే కృష్ణా కాలువ నీటిని పంపుల చెరువులోకి తోడటం జరుగుతుందని అంటున్నారు. మరో పక్క కాలువలోకి కొద్ది రోజులు మాత్రమే నీరు విడుదల చేస్తారనే కారణంగా చెరువును నింపేందుకు మున్సిపల్ అధికార యంత్రాంగం తొందర పడుతున్నట్లు కన్పిస్తోంది. అయితే మురుగు నీరు పూర్తిగా దిగువ కొల్లేరులోకి వదిలేసిన తర్వాతనే శుభ్రమైన నీరు వచ్చాకే పంపుల చెరువులోకి నీటిని మళ్లించాలని నగర ప్రజలు కోరుతున్నారు. తాగునీరు.. తాగలేరు ప్రస్తుతం కృష్ణా కాలువలో కలుషిత వ్యర్థాలతో కూడిన నీరు ప్రవహిస్తోంది కాలువలో పరిశుభ్రమైన నీరు వచ్చాకనే కృష్ణా నీటిని పంపుల చెరువులోకి నింపాలి. లేని పక్షంలో ఉన్న నీరు మొత్తం కలుషితమయ్యే ప్రమాదం పొంచి ఉంది. గతంలో ఏలూరు ప్రజలు తెలియని వింత రోగాలతో బాధపడిన సంఘటన గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుని జాగ్రత్తలు పాటించాలి. – బి.సోమయ్య, నగర అధ్యక్షుడు, ఇఫ్టూ ఏలూరు నగర కమిటీ, ఏలూరు డ్రెయినేజీ నీటిని తలపిస్తున్న కృష్ణా నీరు ఆ నీటినే పంపుల చెరువులోకి నింపేందుకు సిద్ధమవుతున్న యంత్రాంగం మురుగు నీరు నింపడంపై నగరవాసుల్లో ఆందోళన స్వచ్ఛమైన నీటినే చెరువులోకి పంపింగ్ చేయాలని డిమాండ్ -
కార్యకర్తలకు అండగా ఉంటాం
కాళ్ల: చంద్రబాబు పాలనలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. కాళ్ళ మండలం పెదఅమిరంలో పదవీ విరమణ చేసిన ఉండి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సర్పంచులకు సత్కార కార్యక్రమం నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ సర్పంచులుగా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లను తీసుకొచ్చి వలంటీర్ వ్యవస్థతో గ్రామాల్ని అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. కూటమి పరిపాలనలో రెండేళ్లు సర్పంచ్లకు ప్రోటోకాల్ కూడా లేకుండా చేశారన్నారు. కార్యక్రమంలో నరసాపురం నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణరాజు, ఆకివీడు మండల పార్టీ అధ్యక్షుడు నంద్యాల సీతారామయ్య, జెడ్పీటీసీలు రణస్తుల మహంకాళి, వేగేశ్న వెంకట రాజు, ఆకివీడు మున్సిపల్ చైర్పర్సన్ జామి హైమా వతి మాట్లాడారు. పదవీ విరమణ చేసిన సర్పంచులు, ఉప సర్పంచ్లను ఘనంగా సత్కరించారు. ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గాప్రసాద్ రాజు, ఉండి ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి రాజు, ఉండి మండల అధ్యక్షుడు ఆంజనేయరాజు, పాలకోడేరు మండల అధ్యక్షులు పాపారావు, ఆకివీడు పట్టణ అధ్యక్షుడు అంబటి రమేష్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ పాల్గొన్నారు. ఉండి నియోజవర్గంలో కులమతాల మధ్య చిచ్చు పెట్టడంతో ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను గెలిపిస్తే సంపద సృష్టిస్తాం, ప్రత్యేక నిధులు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తారని అనుకుంటారని, ఉండి నియోజకవర్గంలో మాత్రం దాని విరుద్ధంగా నడుస్తుందన్నారు. ఇప్పుడు అమరావతిలో రూ.2 లక్షల కోట్లు ఖర్చుపెట్టి రాజధానిగా చేస్తానని చెబుతున్నారని.. రాజధాని నిర్మాణానికి రూ. 10 లక్షల కోట్లు ఉంటే తప్ప పూర్తి కాదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారన్నారు. గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ మూడు ప్రాంతాల అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని మావిగన్ను జగన్ సూచించారని, కూటమి నాయకుల దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నరసింహరాజు మాట్లాడుతూ కూటమి నాయకుల ఒత్తిళ్లకు లొంగకుండా కట్టుబడి ఉన్న సర్పంచులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఆరోగ్య శ్రీ లేదని, ఫీజు రీయింబర్స్మెంట్ లేదని, ఒక్క పథకం కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వటం లేదన్నారు. ఉండి నియోజకవర్గంలో ఇళ్లు పడగొట్టడం వంటివి చేశారని, ఇప్పుడు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు పొందేందుకు చూస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో పోరాటాలకు సిద్ధం కావాలని ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా అండగా ఉండాలని కోరారు. కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు ఉండి నియోజకవర్గంలో భయపడే పరిస్థితి తీసుకొచ్చారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు -
వన్యప్రాణుల దాహార్తి తీర్చేలా..
● అడవిలో సోలార్ పంపులతో నీటి సదుపాయం ● వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు బుట్టాయగూడెం: వేసవిలో అటవీ ప్రాంతంలోని వన్యప్రాణుల దాహర్తిని తీర్చేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గత రెండేళ్లుగా వన్యప్రాణి సంరక్షణ కోసం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నీటితొట్టెలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో వేసవిలో నీటి కోసం పలు రకాల వన్యప్రాణులు అటవీ పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వచ్చేవి. ఆ సమయంలో పలు వన్యప్రాణులు కుక్కల బారిన లేదా వాహనాల కింద పడి మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో నీటితొట్టెలు ఏర్పాటు చేసి వాటి దాహర్తి తీర్చేలా కృషి చేస్తున్నారు. 60 నీటికుంటల ఏర్పాటు పాపికొండల అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణులకు వేసవిలో దాహర్తిని తీర్చేవిధంగా సుమారు 60 నీటి తొట్టెలను ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. వీటితోపాటు అటవీ ప్రాంతంలోని కాల్వల్లో 20 చెలమలను తీసి, వన్యప్రాణులకు నీటి సౌకర్యం లభించేలా చర్యలు తీసుకున్నారు. అవి కాకుండా 25 చెక్డ్యామ్స్ ద్వారా నీటిని నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా నీటితొట్టెల్లో వేసవికాలంలో నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా బేస్ క్యాంప్ సిబ్బంది, బీట్ అధికారులు నీటిని తీసుకొచ్చి నింపుతున్నారు. వాహనాల్లో వెళ్ళలేని నీటి తొట్టెల వద్దకు బేస్క్యాంప్ సిబ్బంది వెళ్లి నింపుతారు. పక్కన ఉప్పు ముద్దలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నీటి కోసం వచ్చిన వన్యప్రాణులు దాహర్తిని తీర్చుకుని ఉప్పు ముద్దను నాకుతాయని దీనితో వడదెబ్బ బారి నుంచి కాపాడుకునే అవకాశాలు ఉంటాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. నీటిని నింపేందుకు రూ.1.50 లక్షల కేటాయింపు వేసవి కాలంలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేలా ప్రభుత్వం సుమారు రూ. 1.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబున్నారు. ఈ నిధులతో వేసవిలో అడవుల్లో నీటి తొట్టెలు నింపేందుకు మాత్రమే ఖర్చు చేస్తామని అధికారులు తెలిపారు. పాపికొండల్లో 14 రకాల జంతువుల సంచారం 1,12,500 లక్షల హెక్టార్లలో పాపి కొండల అభయారణ్యం విస్తరించి ఉంది. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పాపికొండల అభయారణ్యం పరిధిలో ఉన్న బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. వైల్డ్లైఫ్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమేరాలకు చిక్కుతున్నాయి. వాటి సంరక్షణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు, పాపికొండ అభయారణ్యంలో ఎలుగు బంట్లు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, ఆగలి, చిరుతలు, ముళ్ల పందులు, దున్నలు వంటి అనేక జంతువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పాపికొండల అభయారణ్యం లోని వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కృషి చేస్తున్నాం. సుమారు 60 నీటి తొట్టెలు వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో ఏర్పాటు చేశాం. వేసవిలో నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా నీటిని పోసి తొట్టెలు నింపుతున్నాం, జంతువులకు నీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. – ఎస్కే వలీ, అటవీశాఖ రేంజ్ అధికారి, పోలవరం -
విషాదం మిగిల్చిన విహారం
వాగులో పడి యువకుడి మృతి దెందులూరు/చింతూరు: పోలవరం జిల్లా చింతూరు మండలం తులసిపాక సమీపంలోని ఘాట్రోడ్డు సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద వాగులో పడి ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరానికి చెందిన కంతేటి రమేష్ (28) శనివారం మృతి చెందాడు. పది మంది స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. అనంతరం స్నానం చేయడానికి సోకిలేరు వాగులో దిగగా, లోతు అంచనా తెలియక మునిగిపోయాడు. రమేష్ను కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం చింతూరు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మోతుగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ ఇంటర్ వరకు చదివి కొబ్బరి దింపు కూలీగా జీవనం సాగిస్తున్నాడు. రమేష్కు ఏడాది క్రితం వివాహం కాగా భార్య, కుమారుడు ఉన్నారు. మూడు రోజుల క్రితం స్నేహితులతో కలిసి రామసింగవరం నుంచి బొలెరో వాహనంలో వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఏలూరు (టూటౌన్): కాలువలు కట్టేలోగా చెరువులను నీటితో నింపుకోవాలని జలవనరుల శాఖ ఎస్ఈ చిలకపాటి దేవప్రకాష్ సూచించారు. ఈ వేసవిలో ఏలూరు నగర ప్రజల దాహార్తిని తీర్చడం కోసం జలవనరుల శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ చిలకపాటి దేవ ప్రకాష్ జలవనరుల శాఖ ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేిశారు. మున్సిపల్ కార్పోరేషన్ ఇంజినీర్లతో సమన్వయం చేసుకొని కాలువలు కట్టే లోపు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
బడుగుల ఆశాజ్యోతి ఫూలే
అంతర్ జిల్లా నేరస్తుడి అరెస్టు చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నేరస్తుడిని నరసాపురం పోలీసులు అరెస్టు చేశారు. 108 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. 8లో uభీమవరం(ప్రకాశంచౌక్): బడుగు బలహీన వర్గాల విద్యా అవకాశాలకు పునాది వేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు ఫూలే అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరై, ఫూలే చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఏవీ సూరిబాబు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్వీ అరుణకుమారి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డి.పుష్పరాణి, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డా.కీర్తి శ్రవణ్ పాల్గొన్నారు. జిల్లాలో జలధార–జలహారతి కార్యక్రమాన్ని సమర్ధంగా అమలు చేసేందుకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి శనివారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో జలధార–జల హారతి– సాగునీటి సంఘాల బాధ్యత 100 రోజుల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం అమలుపై సమీక్షించారు. -
హిజ్రాలను అడ్డుకున్న పోలీసులు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో శనివారం రాత్రి కొందరు హిజ్రాలకు ఎస్సై టి.సుధీర్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి క్షేత్రంలో కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈనెల 5న ‘సాక్షి’లో ‘శ్రీవారి ఆలయంలో హిజ్రాల రౌడీయిజం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి పోలీస్ అధికారులు స్పందించారు. శనివారం రాత్రి క్షేత్రంలో భారీగా వివాహాలు జరుగుతున్న నేపథ్యంలో హిజ్రాలను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా 15 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. ఈ సందర్భంగా టవేరా కారులో కొండపైకి వెళుతున్న 10 మంది హిజ్రాలను ఎస్సై టి.సుధీర్ సిబ్బందితో కలిసి టోల్గేటు వద్ద అడ్డుకున్నారు. పెళ్లిళ్లకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేసి, దౌర్జన్యాలకు పాల్పడటం సరికాదన్నారు. క్షేత్రంలో జరిగే పెళ్లిళ్లకు వెళ్లడానికి ఇక వీల్లేదన్నారు. కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఎం.రవికుమార్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిరసనలో పాల్గొన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలని, 36 శాతం ఐఆర్ మంజూరు చేయాలని, పాత పెన్షన్ పద్ధతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో శనివారం సాయంత్రం ఓ భక్తుడు పాము కాటుకు గురయ్యాడు. స్థానికులు వెంటనే పీహెచ్సీకి, అక్కడి నుంచి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విజయవాడకు చెందిన ఆర్అండ్బి ఉద్యోగి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలసి ఉదయం క్షేత్రానికి విచ్చేశాడు. ఆదివారం ఉదయం నిత్యకల్యాణంలో పాల్గొనాలని ధర్మఅప్పారాయ నిలయంలో గదిని అద్దెకు తీసుకున్నాడు. సాయంత్రం వెంకటేశ్వరరావు బయటకు వెళ్లే క్రమంలో, సత్రం ముఖ ద్వారం వద్దకు వచ్చేసరికి అక్కడ మెట్లపై ఉన్న పాము ఆయన కాలి బొటన వేలుపై కరిచింది. వెంటనే ఆయనను స్థానిక పీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి 108 ఆంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): వచ్చే డిసెంబర్లో నిర్వహించే నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు (బాలలు) జాతీయ సమన్వయకర్తగా తాడేపల్లిగూడెంకు చెందిన కొల్లి రమావతి నియమితులయ్యారు. ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో నియామకపత్రాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్లు అందించారు. రమావతి ప్రస్తుతం విశ్వ సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలిగా ఉన్నారు. -
రాధాకృష్ణను అరెస్టు చేయాలి
చింతలపూడి: మహిళల పట్ల అనుచితంగా, అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణ, యాంకర్ వెంకటకృష్ణలను వెంటనే అరెస్ట్ చేయాలని చింతలపూడి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి కంభం విజయరాజు డిమాండ్ చేశారు. శనివారం చింతలపూడి పోలీస్ స్టేషన్లో మహిళా విభాగం నేతలతో కలిసి ఆయన ఫిర్యాదు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని మండిపడ్డారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరంగా మాట్లాడటం కేవలం రాజకీయ విమర్శ కాదని, ఇది సమాజంలో మహిళల గౌరవాన్ని కించపరిచే ప్రమాదకర చర్య అని ధ్వజమెత్తారు. సోషల్ మీడియా కార్యకర్తలను టీం బ్యాచ్ అంటూ కించపరచడం, వారిపై వ్యక్తిగత దూషణలకు దిగడం అనైతికమని పేర్కొన్నారు. రాధాకష్ణ, వెంకటకష్ణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యన డిమాండ్ చేశారు. ఎంపీపీ డా.బి.రాంబాబు నాయక్, పట్టణ అధ్యక్షుడు కొప్పుల నాగేశ్వరరావు, జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వరరావు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కనమతరెడ్డి చండీప్రియ, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు త్సల్లాబత్తుల శ్రీనివాసరావు, మున్సిపల్ విభాగం కార్యదర్శి ఎ.సుబ్బారావు, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్.కాంతారావు, బీసీ విభాగం అధ్యక్షుడు ఎం గురుబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. -
అమ్మకానికి సర్కారీ కొలువులు
సిఫార్సు పత్రాలు ఆదివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి, భీమవరం: ‘మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం కావాలా?.. ఎస్సై ఉద్యోగం కావాలా?.. సివిల్ సప్లయిస్ డిపార్ట్మెంట్లోనా.. కలెక్టరేట్లోనా..’ ఎక్కడైనా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సర్కారు కొలువుల పేరిట కొందరు కూటమి నేతలు నిరుద్యోగులకు వలవేసి రూ.3 కోట్ల మేర వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తణుకు నియోజకవర్గంలోని అత్తిలి మండలంలో గత పది నెలల కాలంగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. సొమ్ములు చెల్లించి నెలలు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో బాధితులు ఉన్నారు. తెలిసిన వారి వద్ద తమ ఆవేదన చెబుతుండటంతో ఈ విషయం వెలుగుచూస్తోంది. అత్తిలి మండలంలోని ఒక గ్రామానికి చెందిన కొందరు నేతలు ప్రభుత్వంలో తమకున్న పలుకుబడితో పోలీస్, రెవెన్యూ, సివిల్ సప్లయిస్, రవాణా, కలెక్టరేట్ కార్యాలయం, తదితర ఏ ప్రభుత్వ శాఖలోనైనా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించినట్టు సమాచారం. విద్యార్హతను బట్టి కాసులు కుమ్మరించగలిగితే ఏలూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర ఏరియాల్లో ఆయా ఉద్యోగాల్లో కూర్చోబెడతామని నమ్మించి ఉద్యోగ స్థాయిని బట్టి రూ. 3 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అవసరమైతే స్థానికంగాను ఉద్యోగాలు ఇస్తామని నమ్మించినట్టు చెబుతున్నారు. తమ పిల్లలకు సర్కారు కొలువు దొరుకుతుందన్న ఆశతో కొందరు తల్లిదండ్రులు అప్పో సొప్పో చేసి సదరు నేతల చేతిలో పెట్టారంటున్నారు. అత్తిలి మండలంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన దాదాపు 50 మంది వరకు రూ.3 కోట్ల మేర వారికి కుమ్మరించినట్టు తణుకులో హాట్ టాపిక్గా మారింది. ఉద్యోగాల కోసం సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతస్థాయి నుంచి స్థానిక అధికారులకు సిఫార్సు చేస్తున్నట్టుగా ఉన్న పత్రాలను సొమ్ములు ఇచ్చిన వారికి అందజేసినట్టు సమాచారం. శిక్షణ పేరిట గత ఏడాది కొందరిని ఏలూరు తీసుకువెళ్లి పలు కార్యాలయాల్లో కూర్చోబెట్టినట్టు తెలుస్తోంది. ఏడాది కావస్తున్నా ఇంకా ఉద్యోగాలు రాకపోవడంతో కొందరు సదరు నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా మరికొందరు ఉద్యోగం వద్దని, తాము చెల్లించిన సొమ్ములు తిరిగి ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు పేరు చెప్పేందుకు నిరాకరించిన బాదితుడు ఒకరు తెలిపారు. అధికార కూటమిలో స్థానికంగా పలుకుబడి ఉన్న నాయకులు కావడంతో ఏ విధమైన ఆధారాలు లేకుండానే రూ.లక్షలు తీసుకువెళ్లి వాళ్ల చేతిలో పోశామన్నారు. ఉన్నతస్థాయిలో వారికి చెల్లించామని, అవి రావాల్సి ఉందని రేపు మాపు అంటూ తిప్పుకుంటున్నారని అంటున్నారు. బాదితులంతా చిన్నస్థాయి వారు కావడంతో ఈ విషయం బయటపెడితే ఉద్యోగం మాట ఎలా ఉన్నా తమ డబ్బులు తిరిగిరావన్న ఆందోళనతో ఎవరూ ముందుకురాని పరిస్థితి నెలకొంది. ఇదిలాఉండగా ఈ వ్యవహారం బయటకు పొక్కుతుండటంతో సదరు నేతలు బాధితుల ఇళ్లకు వెళ్లి వారిని బుజ్జగించే పనిలో పడ్డట్టు సమాచారం. ఉద్యోగాలు వద్దు.. మా సొమ్ములు మాకు తిరిగి చెల్లించమని ఒత్తిడి తెస్తున్న ముగ్గురికి తిరిగి సొమ్ములు చెల్లించినట్టు తెలుస్తోంది. నిరుద్యోగ యువతకు తణుకులో కూటమి నేతల ఎర ఉద్యోగాల పేరిట రూ.3 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూళ్లు దాదాపు 50 మంది నుంచి రూ.3 కోట్ల వసూళ్లు! మంత్రులు, ఐఏఎస్ అధికారుల పేరిట సిఫార్సు లేఖలు పది నెలలుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న బాధితులు -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ముమ్మిడివరం: స్థానిక జాతీయ రహదారి కాశివాని తూము బైపాస్ రోడ్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో పాలకొల్లు ప్రాంతం గగ్గిపర్రుకు చెందిన రందికట్ల ఏసురాజు (18) మృతి చెందగా లంకల కోడేరుకు చెందిన కొయ్య రాజకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వీరు యానాం నుంచి మోటారు సైకిల్పై వస్తూ ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయి ఈ ప్రమాదానికి గురయ్యారు. వాహనంపై వెనుక కూర్చున్న ఏసురాజు జారిపడడంతో బస్సు వెనుక చక్రం కింద పడి మృతి చెందాడు. రాజ్కుమార్ కొంచెం దూరం వెళ్లి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 108లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏసురాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాధాకృష్ణవి చెత్త పలుకులు
● మహిళలకు క్షమాపణలు చెప్పాలి ● ఏలూరులో వైఎస్సార్సీపీ బైక్ ర్యాలీ ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల కుటుంబాల్లోని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. చెత్త పలుకులు పలికిన ఏబీఎన్ రాధాకృష్ణ తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఏలూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏలూరు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి తొలుత కొద్ది దూరం ర్యాలీగా వస్తూ.. అనంతరం భారీ బైక్ ర్యాలీతో నగరంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పాతబస్టాండ్ రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీదుగా పాతబస్టాండ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెంటర్, కర్రల వంతెన, జూట్మిల్లు సెంటర్, ఫైర్స్టేషన్ సెంటర్ మీదుగా మోటారు సైకిల్ ర్యాలీ చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై ఆందోళన చేశారు. జర్నలిజం ముసుగులో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ ఇష్టారాజ్యంగా నీచపు రాతలతో మహిళల మనోభావాలను కించపరుస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ ర్యాలీగా ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్కు చేరుకుని టూటౌన్ సీఐ అశోక్కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువస్తూ ప్రజలకు న్యాయం జరిగేలా పత్రికలు, మీడియా తనవంతు పాత్ర పోషిస్తుందని, ఏబీఎన్ రాధాకృష్ణ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల కుటుంబాల్లోని మహిళల వ్యక్తిత్వాలను అవహేళన చేస్తూ.. పార్టీ నేతలకు వెన్నెముక లేనివారంటూ తన వీకెండ్ కామెంట్లో చెప్పటం నీచమైన విధానానికి నిదర్శనం అన్నారు. చంద్రబాబు ఏమి చెబితే అది టీడీపీ నేతలు, కార్యకర్తలు పాటిస్తారనీ వారిపై ఇలాంటి వీకెండ్ కామెంట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికై నా వైఎస్సార్సీపీ పార్టీలోని మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, కై కలూరు పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్బాబు, వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గంటా మోహనరావు, అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, బీసీ సెల్ నగర అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, వాణిజ్య విభాగం కార్యదర్శి భాస్కర్ల బాచి, కార్పొరేటర్ ఇనపనూరి కేదారేశ్వరి, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్, మహిళ నేతలు కంచుమర్తి తులసి, అచ్యుతకుమారి, రుబీనా, రావి సునీత, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కొల్లిపాక సురేష్, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గేదెల సూర్యప్రకాష్, వైఎస్సార్టీయూ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి లంకపల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
కన్నూమన్నూ కానరంతే!
అరకమ తవ్వకాలపై రైతుల ఆవేదన శనివారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి, భీమవరం: జిల్లాలోని ప్రధాన డ్రెయిన్లలో నక్కల డ్రెయిన్ ఒకటి. ఆచంట, పాలకొల్లు, తదితర నియోజకవర్గాల మీదుగా సాగే ఈ డ్రెయిన్పై వేల ఎకరాల ఆయకట్టు ఉంది. రెండు నియోజకవర్గాలు వశిష్ట గోదావరి, సముద్ర తీరానికి దగ్గరగా కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో ఉండటంతో వరదలు, విపత్తుల సమయంలో ముంపు బెడద ఎక్కువగా ఉంటుంది. దీనిని నివారించేందుకు పూర్వం డ్రెయిన్ నక్కల డ్రెయిన్ గట్లను దాదాపు పది మీటర్లు వెడల్పున విశాలంగా అభివృద్ధి చేశారు. కొన్ని చోట్ల గట్ల వెడల్పు 15 మీటర్లకు పైనే ఉంటుంది. ఇప్పటికే ఆక్రమణలతో గట్లు కుచించుకుపోతుండగా అక్రమ తవ్వకాలతో ఇవి మరింత బలహీనంగా మారుతున్నాయి. యలమంచిలి మండలంలో గోదావరి ఏటిగట్టును పటిష్టం చేసే పేరిట గత ఏడాది ఆచంట మండలం ఆచంట వేమవరంలో నక్కల డ్రెయిన్ను ఆనుకుని డ్రెయినేజీ శాఖకు చెందిన సుమారు ఐదెకరాల స్థలంలో రూ.కోటికి పైగా విలువైన మట్టి తవ్వకాలు చేసినట్టు అంచనా. ఏటిగట్టు పనుల ముసుగులో పాలకొల్లు, పరిసరాల్లో కొత్తగా వెలుస్తున్న లే అవుట్లు, మెరక పనుల కోసం ఈ మట్టిని తరలించేశారన్న ఆరోపణలున్నాయి. పరిమితులు పాటించకుండా ఇష్టానుసారంగా తవ్వకాలు చేశారని అప్పట్లో రైతులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. తాజాగా ఆచంటతో పాటు ఆచంట వేమవరంలో నక్కల డ్రెయిన్లో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. కాలువలో పూడికతీత పేరిట రెండు వారాల క్రితం ఆచంట వేమవరం వద్ద డ్రెయిన్ గట్టును గుల్ల చేసేశారు. లోతుగా తవ్వేసి మట్టిని తరలించుకుపోవడంతో గట్టు ప్రమాదకరంగా మారింది. దీనిని గమనించిన స్థానిక రైతులు తవ్వకాలను అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా వారం రోజుల క్రితం ఆచంట వద్ద కొందరు వ్యక్తులు అక్రమ తవ్వకాలు చేయడాన్ని రైతులు అడ్డుకుని లారీలు, జేసీబీలను అధికారులకు అప్పగించారు. తవ్వకాలు చేసిన చోట ట్రాక్టర్ వెళ్లే దారి లేకుండా గట్టు కాలువలోకి జారిపోయి ప్రమాదభరితంగా తయారైందని రైతులు అంటున్నారు. గోతులు పూడ్చి పంట ఉత్పత్తులను తరలించుకునేందుకు వీలుగా గట్టును సరిచేయాలని, అక్రమ తవ్వకాలు చేసిన వారిపై రికవరీకి చర్యలు తీసుకుని అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. ఈ మేరకు బుధవారం మార్టేరులో జరిగిన కిసాన్ మేళాలో పార్టీలకు అతీతంగా రైతులు కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతిపత్రం అందజేశారు.పాలకొల్లు, పరిసరాల్లోని లే అవుట్లకు ఈ మట్టి తరలిపోతున్నట్టు తెలుస్తోంది. డ్రెయిన్ గట్టుకు తూట్లు పొడుస్తూ లక్షలాది రూపాయల మట్టిని కొల్లగొడుతున్నారు. కూటమి నేతల అండదండలతోనే తవ్వకాలు సాగుతుండటంతో అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ తవ్వకాలతో గట్లు కృంగిపోయి బలహీన పడుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాలు, వరదల సమయంలో గండిపడి ముంపునకు గురయ్యే ప్రమాదముందని వారంటున్నారు. అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని, గట్లను పటిష్టం చేయాలని కోరుతున్నారు. అక్రమ తవ్వకాలు గూర్చి పాలకొల్లు డ్రెయినేజీ డీఈ సీహెచ్ మురళీకృష్ణను సంప్రదించగా ఆచంట వేమవరంలో మట్టి తవ్వకాలు చేసిన వారిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఆచంట వద్ద తవ్వకాలు జరుగకుండా సిబ్బందిని కాపలా పెట్టినట్టు తెలిపారు. నక్కల డ్రెయిన్లో మట్టి తోడేళ్లు ఆచంట వేమవరం, ఆచంటలో అక్రమ తవ్వకాలు కూటమి నేతల కనుసన్నల్లో వ్యవహారం పూడికతీత మాటున గట్లుకు తూట్లు పాలకొల్లులో లేఅవుట్లకు రూ.లక్షలు విలువ చేసే మట్టి తరలింపు ముంపు ముప్పుతో ఆందోళనలో రైతులు చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతులు ఆచంటలోని నక్కల కాలువ గట్టుపై గుర్తు తెలియని వ్యక్తులు 2వ తేదీ గురువారం రాత్రి నుంచి జేసీబీలు, టిప్పర్ల సాయంతో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టారు. శుక్రవారం విషయం తెలిసి రైతులమంతా అడ్డుకున్నాం. అప్పటికే 150 అడుగులు పొడవున, 50 అడుగుల వెడల్పు, 15 అడుగుల లోతున గట్టును తవ్వి మట్టి తరలించేశారు. అక్రమ తవ్వకాలతో గట్టు బలహీనపడింది. ఆగస్టు, సెప్టెంబరులో కురిసే భారీ వర్షాలు, గోదావరి వరదల సమయంలో గట్టుకు గండిపడితే పొలాలు ముంపునకు గురికావడంతో పాటు, ఈ భారీ గోతిలో ప్రమాదవశాత్తు మనుష్యులు, పశువులు పడి మృత్యువాత పడే ప్రమాదం ఉంది. గోతిని పూడ్చి గట్టును పటిష్టం చేయాలి. అక్రమ తవ్వకాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.రెండు రోజుల క్రితం మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానంలో జరిగిన కిసాన్ మేళాలో నక్కల డ్రెయిన్లో అక్రమ తవ్వకాలపై ఆచంటకు చెందిన రైతుల ఆవేదన ఇది. -
తోకతిప్ప పంట కాలువ మురుగునీటితో కలుషితం
భీమవరం అర్బన్: మండలంలోని తోకతిప్ప పంట కాలువలోకి కొంతమంది ఆక్వా రైతులు యనమదుర్రు డ్రైయిన్లోని మురుగునీరు మోటార్లతో తోడేయడంతో కలుషితమవుతుంది. ఈ పంటకాలువ గొల్లవానితిప్ప, గూట్లపాడు రేవు, తోకతిప్ప, బరువానిపేట గ్రామాలకు సాగు, తాగు నీరు అందుతుంది. ఈ నెల 15 పంట కాలువలకు నీరు నిలుపుదల చేయనున్న నేపథ్యంలో ముందస్తుగా తోకతిప్ప గ్రామంలోని రక్షిత మంచినీటి చెరువుకు తాగునీటిని నింపాల్సి ఉంది. అంతేకాకుండా ప్రతి ఏటా చేపలు, రొయ్యల చెరువులకు వంతుల వారీ విధానం ద్వారా నీటిని నింపుకుంటున్నారు. తోకతిప్ప– బరువానిపేట గ్రామాల మధ్యలో కొంతమంది రైతులు యనమదుర్రు డ్రెయిన్లోని కలుషిత మురుగునీటిని పంట కాలువల్లోకి తోడుకుని అక్కడి నుంచి తమ చెరువుల్లోకి నీటిని మోటార్లతో నింపుకోవడంపై పలువురు గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ చర్యలను అడ్డుకోవాల్సిన ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా పంటకాలువల్లోకి యనమదుర్రు డ్రెయిన్లోని మురుగునీటి తోడుతున్నా పట్టించుకోవడం లేదని దీంతో తోకతిప్ప, గూట్లపాడు రేవు వరకు పంట కాలువలోని జలాలు కలుషితమవుతున్నాయని రైతులు వాపోతు న్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పంటకాలువల్లోని మురుగునీటిని తోడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
నిందితుడి షాపు తొలగింపు
పెనుగొండ: ఆచంట మండలం కొడమంచిలిలో ఆరేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడిన వెలగన వెంకటస్వామి షోడా షాపును పోలీసులు తొలగించారు. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల పాపపై 70 ఏళ్ల వృద్ధుడు బుధవారం అఘాయిత్యానికి పాల్పడిన సంగతి విధితమే. కాగా, నిందితుడు పరారీలో ఉండడంతో రోడ్డు ఆక్రమణలో ఉన్న అతడి దుకాణాన్ని పెనుగొండ సీఐ రాయుడు విజయ్కుమార్ ఆధ్వర్యంలో ఆచంట ఎస్సై కె.వెంకట రమణ జేసీబీతో కూల్చివేశారు. నిందితుడు కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే కేసు నమోదు చేశామని వివరించారు. అయితే బాధితురాలికి అందించాల్సిన ప్రభుత్వ సహాయం వెంటనే అందించాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. ముక్కు పచ్చలారని బాలికపై అఘాయిత్యానికి పాల్పడినా ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రకటనలు లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బలహీన వర్గానికి చెందిన కుటుంబం కావడంతో ఎవరి అండదండలు లేకపోవడంతో న్యాయం జరగడం లేదంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
నకిలీ టికెట్ల కేసు దర్యాప్తుపై అనుమానాలు
● సాఫ్ట్వేర్ తయారు చేసిన వ్యక్తి ఏ–9 నిందితుడా? ● నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు జరపాలి ● డిమాండ్ చేస్తున్న హిందూ మత వాదులు ద్వారకాతిరుమల: పెద్ద తిరుపతి తరువాత ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం చిన తిరుపతి. అటువంటి క్షేత్రంలో గతనెల 15న బయటపడ్డ శ్రీవారి నకిలీ దర్శనం టికెట్ల స్కామ్ సంచలనాన్ని రేకెత్తించింది. ఈ స్కాంతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ విడిచి పెట్టకూడదని భక్తజన లోకం మొదటి నుంచి కోరింది. ఇంతవరకు జరిగిన ఈ కేసు దర్యాప్తుపై వస్తున్న ఆరోపణలు హిందూ మతవాదులను తీవ్రంగా కలచివేస్తోంది. ఆ దేవదేవుడికే న్యాయం జరగకపోతే.. ప్రజలకు చట్టాలపై నమ్మకం పోతుందని భక్తులు వాపోతున్నారు. సాఫ్ట్వేర్ కట్టుకథ : కేసులో నిందితులుగా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రమేష్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంఎన్వీఎస్ శ్రీనివాసరావు స్నేహితులు. రమేష్ కోరిన విధంగా శ్రీనివాసరావు సాఫ్ట్వేర్ తయారు చేశాడు. శ్రీవారి దేవస్థానానికని చెప్పడంతో శ్రీనివాసరావు తమ వద్ద డబ్బులు తీసుకోకుండా సాఫ్ట్వేర్ తయారు చేసి ఇచ్చాడని రమేష్ తన స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. అదే నిజమైతే డేటాబేస్, యూజర్ ఐడీ, పాస్వర్డ్, లావాదేవీల లాగ్, ఆడిట్ నియంత్రణలు లేకుండా, డైనమిక్ క్యూఆర్ కోడ్ పెట్టి, దేవస్థానానికి ఏవిధమైన లెక్క తెలిసే వీలు లేకుండా, కేవలం టికెట్ మాత్రమే ప్రింట్ వచ్చేలా సాఫ్ట్వేర్ ఎందుకు తయారు చేయాల్సి వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని అంటున్నారు. అసలు దేవస్థానం ఉన్నతాధికారుల ఆథరైజేషన్ లెటర్ లేకుండా సాఫ్ట్వేర్ తయారు చేయడం, దాన్ని బయటకు ఇవ్వడం కూడా నేరమే. దీనిని పోలీసులు ఎందుకు తీవ్రంగా పరిగణించడం లేదో ఆ చిన వెంకన్నకే తెలియాలి. ఏ9 నిందితుడా? ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసి ఉండకపోతే ఈ టెక్నికల్ స్కాం జరిగేది కాదు. అలాంటి స్కామ్కు కారణమైన వ్యక్తిని పోలీసులు ఏ–9 నిందితుడిగా (ఆఖరిలో) చేర్చడం తమను విస్మయానికి గురిచేసిందని పలువురు భక్తులు అంటున్నారు. రాజకీయ ఒత్తిళ్లే దానికి కారణమన్న ఆరోపణలు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేసు దర్యాప్తు నిస్పక్షపాతంగా జరుగుతుందా.. అన్న అనుమానాలు భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి. సీబీ సీఐడీకి అప్పగించాలి : కేసు దర్యాప్తు ఇంకా జరుగుతోందని డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ ఇప్పటికే మీడియాకు తెలిపారు. దాంతో ఈ స్కామ్తో సంబంధం ఉన్న దేవాలయంలోని కీలకమైన వ్యక్తులు ఎవరైనా బయట పడతారా.. లేకపోతే పోలీసులు ఇంతటితో సరిపెడతారా.. అన్న చర్చకూడా క్షేత్రంలో జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తును పోలీసులు నిష్పక్షపాతంగా జరపాలని, లేనిపక్షంలో సీబీ సీఐడీకి అప్పగించాలని భక్తులు కోరుతున్నారు. పోలీసుల దర్యాప్తు ఎలా సాగుతుందో వేచి చూడాలి. -
ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలి
వీరవాసరం: పైలేరియా వ్యాధిగ్రస్తులు డాక్టర్ల సూచనలు, సలహాలను పాటిస్తూ ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలని డీఎంహెచ్ఓ గీతాబాయి తెలిపారు. అండలూరులో శుక్రవారం నిర్వహించిన ఫైలేరియా నివారణ వారోత్సవాల్లో ఆమె పాల్గొని, వ్యాధిపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఫైలేరియాకు సంబంధించిన ఎంఎండీటీ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి వి.క్రాంతి కుమార్, కొణితివాడ పీహెచ్సీ వైద్యులు యు.నవనీత్, ఎంపీహెచ్ఓ పి.ప్రభాకర్ రావు, ఫైలేరియా యూనిట్ ఆఫీసర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): చిత్తూరులో నిర్వహించనున్న ఉమెన్స్ జూనియర్ హాకి టోర్నమెంట్కు జిల్లా తరపున మహిళా జట్టు ఎంపికలను ఆదివారం నిర్వహించనున్నామని జిల్లా హాకి అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కలిదిండి ఆనందరాజు, కె.వి.ఎస్ భరత్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 16 నుంచి 19 వరకూ రాష్ట్ర హాకీ టోర్నమెంట్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్కు క్రీడాకారిణుల ఎంపిక కోసం పోటీలను భీమవరం సెయింట్ మేరీస్ హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేశామని వివరించారు. 2007 జనవరి 1 తర్వాత జన్మించిన వారే అర్హులని, ఆసక్తి గల క్రీడాకారిణిలు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్తో సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాలకు 90301 06037 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. దెందులూరు: మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 5 వ తరగతి ప్రవేశానికి ఈ నెల 12న పరీక్ష నిర్వహించనున్నారు. హాల్ టికెట్స్ https://mjpapbcwreis.apcfss.in వెబ్సైటులో ఉంచారని సమన్వయకర్త, ఏలూరు బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్.భాగ్యలక్ష్మి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావాలని కోరారు. తణుకు అర్బన్ : విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం తణుకులో చోటు చేసుకుంది. స్థానిక సజ్జాపురానికి చెందిన సింహం భవానిశంకర్ (36) టైల్స్ అతికించే వృత్తిలో ఉపాధి పొందుతున్నారు. గురువారం సాయంత్రం ఇరగవరం రోడ్డు కాలనీలోని ఒక భవనంలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలింది. ఫోకస్ లైటుకు సంబంధించిన కనెక్షన్ తీసే క్రమంలో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగలడంతో అక్కడే కుప్పకూలాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువచ్చినా అప్పటికే భవాని శంకర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. భవానిశంకర్కు ఇంకా వివాహం కావాల్సి ఉండగా తల్లితో కలిసి సజ్జాపురంలో నివాసం ఉంటున్నారు. సోదరి మాదాసు కల్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తణుకు పట్టణ ఎస్సై కె.శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమడోలు: జాతీయ రహదారి పొలసానిపల్లి రహదారిపై ఓ కూరగాయల రైతును ఐషర్ వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో గుణ్ణంపల్లికి చెందిన రైతు ఎం.రత్తయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్లితే.. ఎం.రత్తయ్య కూరగాయలను ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం జరిగే సంతలో వేసేందుకు తన బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో భీమడోలు నుంచి పొలసానిపల్లి మధ్య రహదారిపైకి వచ్చేసరికి ఎం.రత్తయ్యను వెనుక నుంచి ఐషర్ వ్యాన్ అతివేగంగా వచ్చి ఢీకొట్టి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న భీమడోలు 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడు రత్తయ్యకు ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు. -
భూసర్వేపై గిరిజనుల కన్నెర్ర
కుక్కునూరు: మండలంలోని అరవపల్లి రెవెన్యూ పరిధిలో నిర్వాసితుల కోసం సేకరించే భూముల సర్వేను స్థానిక గిరిజన రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. వివరాల ప్రకారం పోలవరం జిల్లా, ముంపు మండలాల్లో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిధిలో ముంపునకు గురవుతున్న గిరిజన నిర్వాసితులకు భూమికి భూమి పరిహారం అందించేందుకు మండలంలోని అర్వపల్లి రెవెన్యూ పరిధిలో భూములను సేకరించే దిశగా అధికారులు శుక్రవారం సర్వే చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక గిరిజన రైతులు సర్వే జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి తమకు తెలియకుండా ఎలా సర్వే నిర్వహిస్తారు? అని అడ్డుకున్నారు. తహసీల్దార్కు వినతి సర్వే అడ్డుకున్న అనంతరం కుకునూరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్కు సర్వే నిలిపేయాలని కోరుతూ మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక దాచారం, గొమ్ముగూడెం గిరిజన రైతులు మాట్లాడుతూ, తాత ముత్తాతల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది గిరిజనేతరులు గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదారులుగా వారి పేర్లను మార్పు చేసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించి పరిహారాన్ని పొందాలని గిరినేతర్లు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఆధీనంలో ఉన్న భూములను కనీస సమాచారం తెలియపరచకుండా పిసా గ్రామసభలు నిర్వహించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్వహిస్తున్న ఈ సర్వేను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దీనిపై గిరిజనులంతా ఏకమై పోరాటం చేస్తామని హెచ్చరించారు. అధికారులను సర్వే నిలిపేయాలని అడ్డుకుంటున్న గిరిజన రైతులు తహసీల్దార్ కార్యాలయం ధర్నా చేస్తున్న గిరిజన రైతులు భూముల సర్వేకు వచ్చిన అధికారులు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయని అందుకే సర్వే చేస్తున్నామని చెబున్నారు. తాత ముత్తాతల తరాల నుండి సాగు చేసుకుంటున్న గిరిజన భూములకు పిసా గ్రామ సభలు నిర్వహించకుండా ప్రభుత్వం సర్వే చేయమని ఎలా ఆర్డర్స్ ఇస్తుంది. ఈ భూములను గిరిజన రైతుల పేర్లపై మార్చాలని మేము గతంలో ఉన్నతాధికారులు కలిసి దరఖాస్తు కూడా అందించాం. –సోడే వెంకటేష్, పిసా కమిటీ అధ్యక్షుడు, అరవపల్లి, కుక్కునూరు గిరిజన ఆధీనంలో ఉన్న భూములను గిరిజనులకు తెలియజేయకుండా ప్రభుత్వం గిరినేతర్లకు కట్టబెట్టాలని చూస్తుంది. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని సర్వేను నిలిపివేయాలి. గిరిజన రైతులకు న్యాయం చేయాలి. లేకపోతే పెద్దస్థాయిలో ఉద్యమిస్తాం. – సోడే చంద్రయ్య, గిరిజన రైతు, అరవపల్లి, కుక్కునూరు మండలం -
శ్రీవారి రథానికి అశ్వాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య రథానికి చెక్క అశ్వాలను ఏర్పాటు చేసే పనులు శుక్రవారం రథశాలలో ప్రారంభమయ్యాయి. ఏడేళ్ల క్రితం లక్షలాది రూపాయలతో తయారు చేయించిన శ్రీవారి రథనికి అశ్వాలు లేవు. అవి లేకుండానే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి ఈ రథంలో రథోత్సవాలను నిర్వహిస్తున్నారు. దీనిపై ఈనెల 3న సాక్షి దినపత్రికలో దేవదేవా శ్రీఅశ్వాలుశ్రీ లేవా? శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు రథానికి అశ్వాలు ఏర్పాటు చేయించే పనులు చేపట్టారు. ఈనెల 26 న స్వామి వారి వైశాఖ మాస దివ్య బ్రహ్మత్సవాలు ప్రారంభం కానుండగా, వచ్చే నెల 1న రథోత్సవాన్ని జరపనున్నారు. ఉత్సవాలకు తక్కువ సమయం ఉండటంతో క్షేత్ర దేవత కుంకుళ్లమ్మ అమ్మవారి రథనికి ఉన్న అశ్వాలను తీసి, శ్రీవారి రథనికి ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత కొత్త అశ్వాలను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. భీమవరం (ప్రకాశంచౌక్): రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు భీమవరం మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ మే నెల 9న నిర్వహిస్తున్నామని 3వ అదనపు జిల్లా జడ్జి సంస్థ చైర్మన్గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ బి.లక్ష్మీనారాయణ అన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో అన్ని సివిల్ కేసులు, ప్రో నోటు బాకీ కేసులు, రాజీ చేసుకనే క్రిమినల్ కేసులు, మోటార్ యాక్సిడెంట్, బీమా కేసులు, భార్యభర్తల వివాదాలు, మనోవర్తి కేసులు, గృహ హింస కేసులు, చెక్కు బాకీ కేసులు తదితర కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): అన్నమయ్య జిల్లాలో న్యాయవాది ఎల్లయ్యను దారుణంగా హత్య చేసిన ఘటనను ఖండిస్తూ తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం కోర్టు ఆవరణలో నల్ల బ్యాడ్జీలు ధరించి, నిరసన తెలిపారు. విధులను బహిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.అప్పిరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల భద్రత కోసం ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై ఇలాంటి దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కంకట శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు జి.శేఖర్, కోశాధికారి డి.మహాలక్ష్మి, న్యాయవాదులు మాకా శ్రీనివాసరావు, సూర్యమణి ముఖర్జీ, తోట సత్యనారాయణ తదితరులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. భీమవరం (ప్రకాశంచౌక్): జనగణన ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం భీమవరం మున్సిపల్ కార్యాలయ కాన్ఫరెనన్స్ హాలులో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు జన గణన 2027కు సంబంధించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రం గృహాల జాబితా ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. ఈవీఎం గోడౌన్ తనిఖీ పట్టణంలోని పీపీ రోడ్డులో ఈవీఎంలు భద్రపరిచిన ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంను కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. గోదాములో ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను సమగ్రంగా పరిశీలించారు. భీమవరం(ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం జనసేన జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్నాయుడు తనను వేధింపులకు గురిచేశాడని భీమవరానికి చెందిన ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు భీమవరం టూటౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
శ్మశాన భూములకు రక్షణ కల్పించాలి
ఏలూరు (టూటౌన్): శ్మశాన భూముల్లో చెరువులు తవ్వుతున్న భూస్వాములపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో డీఆర్ఓకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కలిదిండి మండలం, పేదలంక పంచాయతీ పరిధి రామకృష్ణాపురం శివారు గ్రామాల్లో పేదల శ్మశాన భూమి పక్కనున్న భూస్వాములు చేపల చెరువు తవ్వడానికీ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కలిదిండి రెవెన్యూ శాఖ అధికారులకు, గ్రామ పంచాయతీ వెన్యూ అధికారులకు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదని మండిపడ్డారు. పేదల భూములను అభివృద్ధి పేరుతో లాక్కుంటూనే మరోపక్క పేదల ఉసురు తీస్తున్న పాలక ప్రభుత్వాలు పేదల శ్మశాన భూములను కూడా లాగేసుకుంటున్నాయని మండిపడ్డారు. ఇప్పటికై నా ఇరిగేషన్ అధికారులు స్పందించి శ్మశాన భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మహంకాళిరావు, గంటా సుబ్రహ్మణ్యం, వెంకట సుబ్బారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం
భీమవరం (ప్రకాశంచౌక్): జర్నలిస్టులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజానికి మెరుగైన సేవలు అందించగలరని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉన్నారు. జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తిపరంగా ఎల్లప్పుడూ బిజీగా ఉండటం వల్ల వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. పాత్రికేయులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రతి జర్నలిస్టు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరమని సూచించారు. 25 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఉచిత వైద్య శిబిర నిర్వహణలో సేవలందించిన వైద్యులకు కలెక్టర్ అభినందనలు తెలియజేసి సత్కరించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ స్టేట్ చైర్మన్ సీహెచ్ కృష్ణంరాజు, ఒమిక్స్ నెక్స్ట్ జెన్ లేబరేటరీస్ మేనేజింగ్ డైరెక్టర్ కొమ్ముల మురళీకృష్ణ, డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ జి.గీతాభాయి, డీసీఎచ్ఎస్ డాక్టర్ పి.సూర్యనారాయణ, డీపీర్ఓ తలుపుల నాగేశ్వరరావు పాల్గొనగా.. వైద్యులు బి.ఐశ్వర్య, రఘువీర, ప్రియాంక, సూర్య లలిత, శ్వేత, శ్రీవిద్య, శిల్ప, స్రవంతి, నిరుపమ, ప్రియాంక, గోపీనాథ్, విజయానంద్, కిరణ్, వినయ్ కుమార్, శ్వేత తదితరులు వైద్య సేవలందించారు. -
ఇదెక్కడి ‘పచ్చ’పాతం?
ఏలూరు (టూటౌన్): జిల్లా పరిషత్ సెంటర్లో ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారుల వైఖరిపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలను తొలగిస్తున్నా టీడీపీ నాయకులకు చెందిన షాపులను ఎందుకు వదిలేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే నిత్యం రద్దీగా ఉండే జిల్లాపరిషత్ సెంటర్ నుంచి ఇండోర్ స్టేడియం, కలెక్టరేట్కు వెళ్లే మార్గంలో జిల్లాపరిషత్ దుకాణ సముదాయాల వద్ద ఫుట్పాత్లు, డ్రెయిన్లు ఆక్రమించేసి వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. అలాగే డ్రెయిన్లలో సిల్ట్ తొలగింపు ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఈ సమస్య పరిష్కరించాలని ఇటీవల కాలంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కార్పొరేషన్ అధికారులు శుక్రవారం జిల్లాపరిషత్ కూడలిలో ఉన్న పుట్పాత్, డ్రెయిన్ల ఆక్రమణలు తొలగింపునకు శ్రీకారం చుట్టారు. అయితే ఇక్కడా పచ్చపాతమే చూపించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి రాజకీయ పలుకుబడి లేని వారి దుకాణాలు ముందు యథేచ్చగా యంత్రాలతో పగుల గొట్టిన సిబ్బంది, రాజకీయ పలుకుబడి మెండుగా ఉన్న ఓ టీడీపీ నాయకుడి షాపు ముందు పుట్ ఫాత్పై నిర్మించిన జ్యూస్ షాపు జోలికి మాత్రం వెళ్లక పోవడం గమనార్హం. దీంతో ఇదెక్కడి న్యాయం? అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. రాజకీయ పైరవీలకు తావివ్వకూడదు పట్టణంలో ఇటీవల కాలంలో ఆక్రమణలు భారీగా పెరిగాయి. అయితే ప్రజల ఫిర్యాదులతో ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టారు. అయితే ఆక్రమణలు తొలగించే విషయంలో వీడు మనవాడా? కాదా అనే విషయాలతో పాటు రాజకీయ పైరవీలకు చోటివ్వకుండా ఎవ్వరైనా ఒక్కటే అన్న చందంగా ఆక్రమణలు తొలగించాలని పట్టణవాసులు కోరుతున్నారు. సాధారాణ వ్యక్తుల దుకాణాలకు సంబంధించిన ఆక్రమణలు తొలగిస్తున్న నగరపాలక సంస్థ సిబ్బంది, రాజకీయ నాయకులు జోలికి వెళ్లకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ అండా లేని వారి, ప్రతిపక్షనాయకులకు చెందిన వాటిని ధ్వంసం చేసి తమ పార్టీకి చెందిన వారికి మాత్రం వెసులుబాటు కల్పించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా పరిషత్ సెంటర్లో ఆక్రమణలు తొలగింపులో అధికారుల వింత వైఖరి డ్రెయిన్లపై కట్టిన టీస్టాల్, ఇతర నిర్మాణాల తొలగింపు టీడీపీ నాయకుడి జ్యూస్ షాపు జోలికి వెళ్లని వైనం -
ఆగని మట్టి అక్రమ తవ్వకాలు
ద్వారకాతిరుమల: మండలంలోని సత్తాలచెరువులో మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఓ పచ్చ నాయకుడు రాత్రి వేళల్లో యథేచ్ఛగా ఈ దందాను సాగిస్తున్నాడు. పెద్దస్థాయిలో మట్టి తరలింపు జరుగుతన్నా అధికారులెవరూ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. దాంతో అద్దూఅదుపు లేకుండా ఈ దందా సాగిపోతోంది. గ్రామంలోని సత్తాల ఇరిగేషన్ చెరువులో ఓ టీడీపీ నాయకుడు రాత్రి, పగలు తేడా లేకుండా మట్టి అక్రమ తవ్వకాలు జరుపుతున్నాడు. జేసీబీ సహాయంతో మట్టిని తవ్వి, టిప్పర్ల ద్వారా మట్టిని బయటకు తరలించేస్తున్నాడు. ఒక్కో టిప్పర్ మట్టిని దూరాన్ని బట్టి రూ. 7 వేల నుంచి 12 వేలకు విక్రయిస్తున్నాడు. ప్రజాధనాన్ని బహిరంగంగా దోచేస్తున్నా పట్టించుకునే నాథుడు లేకపోవడం దారుణమని గ్రామస్తులు అంటున్నారు. అధికారుల తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు. -
నేత్రపర్వం.. ధ్వజారోహణం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధ్వజారోహణ వేడుక శుక్రవారం రాత్రి నేత్రపర్వంగా సాగింది. శ్రీనివాసుని దివ్యకల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని ఈ వేడుకను భక్తుల గోవింద నామస్మరణల నడుమ అట్టహాసంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో కల్యాణమూర్తులకు అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. రాత్రి ధ్వజారోహణ కార్యక్రమం నిమిత్తం యాగశాలలో ధ్వజపటంపై గరుత్మంతుని చిత్రపటాన్ని అర్చకులు, పండితులు వేద మంత్రోచ్ఛరణలతో లిఖించారు. పూజలు, హోమాది కార్యక్రమాల అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ ధ్వజపటానికి హారతులిచ్చి, దానిని ధ్వజస్తంభంపై ఎగురవేశారు. శ్రీనివాసుని కల్యాణ మహోత్సవాలను వీక్షించేందుకు సర్వాది దేవతలను ఆహ్వానించే క్రమంలో ఈ ధ్వజారోహణ తంతును నిర్వహిస్తామని అర్చకులు జరిపారు. -
రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.364 కోట్లు
నూజివీడు: ఏలూరు జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా గత ఆర్థిక సంవత్సరానికి రూ.472.5 కోట్ల లక్ష్యం కాగా రూ.364.6 కోట్లు ఆదాయం వచ్చినట్లు ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కే శ్రీనివాసరావు పేర్కొన్నారు. నూజివీడులోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీనిలో భాగంగా రిజిస్ట్రేషన్ నిమిత్తం వచ్చిన ప్రజలకు సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా, లేవా అని పరిశీలించారు. అలాగే రికార్డులను తనిఖీ చేసిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంకు గతేడాది టార్గెట్ రూ.69.48 కోట్లు కాగా రూ.54.55 కోట్లు ఆదాయం మాత్రమే వచ్చిందన్నారు. 1983 ముందు నుంచి ఉన్న రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని, దీనివల్ల భూముల వివరాలన్నీ ప్రజలకు సులువుగా అందుబాటులోకి వస్తాయన్నారు. వివాహ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ముందుగానే స్లాట్ బుక్ చేసుకుంటే ప్రక్రియ అరగంటలో పూర్తవుతుందన్నారు. అపార్ట్మెంట్లు, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు గతంలో కంటే ప్రస్తుతం తగ్గాయని, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం యథావిధిగా ఉన్నాయన్నారు. నూజివీడు పట్టణంలో ప్రస్తుతం కొనసాగుతున్న సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద అసౌకర్యాలను గుర్తించామని, త్వరలోనే మరొక సౌకర్యవంతమైన భవనంలోనికి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని మార్చడం జరుగుతుందన్నారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ నడింపల్లి ఫణిసీతారామరాజు ఉన్నారు. -
ధాన్యం విక్రయానికి ట్రక్ షీట్ తప్పనిసరి
పాలకొల్లు సెంట్రల్: రైతులు ధాన్యం విక్రయించేందుకు రైస్ మిల్లులకు పంపాలంటే ట్రక్ షీట్ తప్పనిసరిగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం మండలంలోని లంకలకోడేరు గ్రామంలో కోఆపరేటివ్ సొసైటీ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు ధాన్యం తోలిన వెంటనే నగదు జమచేస్తామని, రవాణా చార్జీలు కూడా చెల్లిస్తామన్నారు. ట్రక్ షీట్ లేకుండా పంపిన ధాన్యాలకు నగదు పడడం ఆలస్యమవుతుందన్నారు. ఆర్డీవో దాశి రాజు మాట్లాడుతూ క్వింటా ధాన్యం మద్దతు ధర కామన్ రకానికి రూ.2,369, గ్రేడ్ ఏ రకానికి రూ.2,389 నిర్ణయించడం జరిగిందన్నారు. గోనె సంచులు రైతు సేవీ కేంద్రాల ద్వారా రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లయి డీఎం ఇబ్రహీం, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, ఏడీఏ మురళీకృష్ణ, అంగర రామ్మోహన్, పాముల రజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల నిరసన
భీమవరం (ప్రకాశంచౌక్): కూటమి ప్రభుత్వం ఏర్పాటై 31 నెలలు గడుస్తున్నా 12వ పీఆర్సీ కమిటీని నియమించకపోవడం విచారకరమని ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయిశ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరంలోని స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం వద్ద గురువారం ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ గోపీమూర్తి, సాయిశ్రీనివాస్ ఈ ఆందోళనకు మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు. ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యల పట్ల ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిరసనగా ఈనెల 25, 26, 27 తేదీల్లో విజయవాడలో నిరాహార దీక్షలు నిర్వహిస్తామని సాయిశ్రీనివాస్ తెలిపారు. డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని అక్రిడిటేటెడ్ జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ఉచిత మెడికల్ హెల్త్ చెకప్ కార్యక్రమం నిర్వహణకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ఈ కార్యక్రమం భీమవరం, వీరవాసరం, ఉండి, కాళ్ల, ఆకివీడు, పాలకోడేరు జర్నలిస్టులకు ఈనెల 10వ తేదీ ఉదయం భీమవరం జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో భీమవరం లయన్స్ క్లబ్, ఫెమినా లయన్స్ క్లబ్, ఒమిక్స్ నెక్ట్స్ లేబోరేటరీస్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అలాగే మిగతా నియోజకవర్గాల్లో ఈ ఆరోగ్య శిబిరాలు ఈనెల 13న నిర్వహిస్తామన్నారు. నరసాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): రబీ సీజన్ ప్రారంభాన్ని దృష్టిలో ఉంచు కొని జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో జేసీ మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కనీసం 50 శాతం గోనె సంచులు సిద్ధంగా ఉంచాలన్నారు. జిల్లాకు 7.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ధాన్యం రవాణా కోసం 1000 వాహనాలను సిద్ధం చేయగా, ఇప్పటి వరకు 438 వాహనాలకే రిజిస్ట్రేషన్ పూర్తయిందన్నారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా సాగి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగ కుండా చూడాలని సూచించారు. అనంతరం గ్యాస్ సరఫరా వ్యవస్థపై పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఎక్కడా గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకో వాలని, వినియోగదారులు బుకింగ్ చేసిన తేదీ ఆధారంగా సరఫరా జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. డొమెస్టిక్ గ్యాస్ను అక్రమంగా ఇతర అవసరాలకు వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆగిరిపల్లి: మండలంలోని తోటపల్లి, గన్నవరం మండలం గొల్లనపల్లి సరిహద్దులో ఉన్న అర్లగట్టును గురువారం రెవెన్యూ అధికారులు పరిశీలించారు. అర్లగట్టుపై గ్రావెల్ తవ్వకాలు పెచ్చు మీరుతుండడంతో ‘కొండలనూ తవ్వేస్తున్నారు’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. దీనిపై తహసీల్దార్ పీఎన్వీ ప్రసాద్ ఆదేశాలతో ఆర్ఐ యూనస్, వీఆర్వో సుబ్బయ్య గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అర్లగట్టుపై గ్రావెల్ తవ్వకాలను పరిశీలించి కలెక్టర్కు నివేదికను పంపిస్తామని తహసీల్దార్ ప్రసాద్ తెలిపారు. అనుమతులు లేకుండా గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
రోత వ్యాఖ్యలపై ప్రజాగ్రహం
శాశ్వత భవనం లేని కలెక్టరేట్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కలెక్టరేట్ ఏర్పడి నాలుగేళ్లు పూర్తయింది. ఇప్పటివరకు శాశ్వత భవనం లేక అద్దె భవనంలో కొనసాగుతోంది. 8లో uవైఎస్సార్ సీపీ హయాంలో నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం పోలీస్ స్టేషన్లుగా మార్చి గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడుస్తోంది. 8లో uశురకవారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: నీచమైన రాతలతో రాక్షాసానందం పొందే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు గట్టిగా బుద్ధి చెబుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు హెచ్చరించారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మరీ ముఖ్యంగా వైఎస్సార్సీపీ నేతల కుటుంబ సభ్యులను రోత పదజాలంతో మాట్లాడడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు వెల్లువెత్తాయి. అదే విధంగా అనేక మండలాల్లో పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసి, చట్టపరంగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తణుకులో బుధవారం జిల్లాస్థాయిలో ఆందోళనలు నిర్వహించగా గురువారం పోలవరం, నూజివీడు, ఉండి, భీమవరం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు, పోలీసు ఫిర్యాదులు చేశారు. ● తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో.. ఏబీఎన్ రాధాకృష్ణ్ణపై చర్యలు తీసుకోవాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డి రఘురామ్ నాయుడు డిమాండ్ చేశారు. రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా తాడేపల్లిగూడెం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వడ్డి రఘురామ్ నాయుడు మాట్లాడుతూ రాధాకృష్ణ వైఎస్సార్సీపీ నాయకుల భార్యలనే కాకుండా యావత్ మహిళా సమాజాన్ని కించపరిచేలా మాట్లాడారన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా నీచమైన, నికృష్టమైన భాష ఉపయోగించడం అనాగరికమన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మెప్పు కోసం ఇలా దిగజారి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పకపోతే ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ● భీమవరం నియోజకవర్గంలో.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై గురువారం భీమవరం వన్టౌన్ పోలీస్స్టేషన్లో భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి చినమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా చినమిల్లి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఎప్పుడూ మహిళా పక్షపాతిగానే ఉంటూ, మహిళలకు పదవులు ఇచ్చి గౌరవించిందన్నారు. మహిళల పట్ల ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీలోని నాయకులు, కార్యకర్తల భార్యల గురించి చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలను చేసిన రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ● ఉండి నియోజకవర్గంలో.. ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నర్సింహరాజు ఆధ్వర్యంలో ఉండి సెంటర్ నుంచి ఉండి పోలీస్ స్టేషన్ వరకూ పార్టీ శ్రేణులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీఎల్ మాట్లాడుతూ పార్టీకి అహర్నిశలు పాటుడుడుతున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల భార్యలపై చేసిన మురికి వ్యాఖ్యలకు రాధాకృష్ణ సిగ్గుపడాలన్నారు. రాజకీయాల్లో మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకూ సబబని ప్రశ్నించారు. నీచమైన మాటలకు క్ష మాపణ చెప్పకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అనంతరం ఉండి స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేసి ఎస్సై ఎండీ నసీరుల్లాకు ఫిర్యాదు చేశారు. ● పాలకొల్లు నియోజకవర్గంలో.. కలానికే కళంకం తీసుకువచ్చిన ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) అన్నారు. పట్టణ పోలీస్స్టేషన్లో ిసీఐ కోలా రజనీకుమార్కు ఫిర్యాదు చేశారు. పత్రికల్లో ఏది రాసినా చెల్లుబాటు అవుతుందనే అహంకారంతో మహిళలను కించపరుస్తూ కథనాలు రాసి పైశాచికానందం పొందుతున్న రాధాకృష్ణ నిరంకుశత్వ ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల మహిళలపై దాడులు, దౌర్జన్యాలు మితిమీరుతున్నాయన్నాయని ఆందోళన చెందారు. రాధాకృష్ణ బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ● నూజివీడు నియోజకవర్గంలో.. నూజివీడు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నేతృత్వంలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. గౌవరమైన జర్నలిజం వృత్తిలో మహిళలను కించపరచడంపై ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవుపలికారు. తక్షణమే రాధాకృష్ణ చేయించిన రోత వ్యాఖ్యలపై మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ● పోలవరం నియోజకవర్గంలో.. పోలవరం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని కోరుతూ బుట్టాయగూడెం పోలీస్ స్టేషన్ ఎదుట పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు కార్యకర్తల భార్యలపై సైతం వ్యాఖ్యలు చేయించడం రాధాకృష్ణ మానసిక స్థితికి అద్దం పడుతుందన్నారు. ఇటువంటి చర్యలను సభ్యసమాజం ఏనాడు స్వాగతించదని, రాధాకృష్ణ తక్షణమే మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కొయ్యలగూడెం మండల కేంద్రంలో గురువారం వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళలపై ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల కుటుంబ సభ్యులపై రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఉంగుటూరు నియోజకవర్గం చేబ్రోలులో వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. చేబ్రోలు బస్టాండ్ సెంటర్ల నుంచి ర్యాలీగా బయల్దేరి పోలీస్ స్టేషన్లో ఎస్సై సూర్యభగవాన్కు ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అలాగే నరసాపురం, ఆచంటలోని పోలీస్స్టేషన్లలో స్థానిక నాయకులు ఫిర్యాదులు చేశారు. చెత్త పలుకుకు ఛీత్కారం నీచానికి పరాకాష్టగా పిచ్చి రాతలు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు, ఫిర్యాదులు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఆత్మగౌరవం కించపరిస్తే గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరిక ఉమ్మడి పశ్చిమలో వెల్లువెత్తిన నిరసనలు -
మూల్యాంకనం.. ప్రశ్నార్థకం!
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇటీవల జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబధించి విద్యార్థులు రాసిన జవాబుపత్రాల మూల్యాంకనం ఉపాధ్యాయులకు సవాలు విసురుతోంది. ముఖ్యంగా ట్యాబ్ ఆధారిత మార్కుల నమోదు ప్రక్రియ ఉపాధ్యాయులకు పెను సవాలు విసురుతోంది. స్పెషల్ అసిస్టెంట్లకు ఈ విధానం తలకుమించిన భారంగా మారింది. ప్రతి స్పెషల్ అసిస్టెంట్ రోజుకు 80 జవాబు పత్రాలకు సంబంధించి ట్యాబ్ల్లో మార్కులు అప్లోడ్ చేయాల్సి వస్తోంది. దీంతో సాంకేతికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో పేపర్ స్కానింగ్ చేయడానికే వారికి 15 నుంచి 20 నిమిషాలకు పైగా సమయం పడుతోంది. ఈ లెక్కన వారు ప్రతిరోజూ సుమారు 640 నిమిషాలకు పైగా సమయం ఇందుకోసం వెచ్చించాల్సి వస్తోంది. అంతేకాకుండా ఎక్కువ మంది స్పెషల్ అసిస్టెంట్లు ఒకేసారి నెట్వర్క్ వినియోగిస్తుండడంతో ట్యాబ్లు సైతం మొరాయిస్తున్నాయి. తరగని పని : సాధారణంగా జవాబుపత్రాల మూల్యాంకనం ఉదయం 9 నుంచి ప్రాంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. అయితే ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ట్యాబ్ ఆధారిత మార్కుల నమోదు ప్రక్రియ కారణంగా రాత్రి 9 గంటలు దాటిన తరువాత కూడా జరుగుతూనే ఉంటోంది. నెట్వర్క్ సమస్య ఒక కారణం కాగా విద్యార్థి రాసిన జవాబుపత్రంలోని ప్రతి పేజీని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి రావడం, అసిస్టెంట్ ఎగ్జామినర్ దిద్దిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి రావడం ప్రధాన సమస్యగా తలెత్తింది. మార్కుల విషయంలో ఎటువంటి తేడా వచ్చినా పూర్తి బాధ్యతను స్పెషల్ అసిస్టెంట్లదేనని చెప్పడంతో వారిలో తీవ్ర ఒత్తిడి నెలకొంటోంది. వేతనం పెంచాలని డిమాండ్ : జవాబు పత్రాల మూల్యాంకనం విధుల్లో ఉన్న అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లకు ఇస్తున్న వేతనం ఏమాత్రం న్యాయసమ్మతం కాదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో నాలుగు గంటలకు పైగా అదనపు సమయం పని చేస్తున్నందున వేతనం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అసిస్టెంట్ ఎగ్జామినర్లకు పేపర్కు రూ. 10 చొప్పున చెల్లించడంతో పాటు రోజుకు రూ.400 డీఏగా చెల్లించనున్నారు. వారికి మొత్తం రోజుకు రూ. 800 చెల్లించే అవకాశం ఉంది. అయితే వారితో పాటు సమానంగా పని చేస్తున్న స్పెషల్ అసిస్టెంట్లకు మాత్రం 80 పేపర్లు వెరిఫికేషన్ చేసినందుకు గాను కేవలం రోజుకు రూ. 300 మాత్రమే చెల్లించే ఏర్పాటు చేయడం దారుణమంటున్నారు. మూల్యాంకన ప్రక్రియలో స్పెషల్ అసిస్టెంట్లు తీవ్ర అన్యాయానికి గురౌతున్నారు. అసిస్టెంట్ ఎగ్జామినర్లు దిద్దిన 80 పేపర్లను వీరు పరిశీలించి ట్యాబ్ల ద్వారా స్కానింగ్ చేసి మార్కులను నమోదు చేయించడం వెట్టి చాకిరీ చేయించడమే. పైగా వారికి రోజుకు కేవలం రూ. 300 వేతనం ఇస్తామనడం శ్రమదోపిడీగా పరిగణించాల్సి ఉంటుంది. – గుగ్గులోతు కృష్ణ, ఏపీటీఎఫ్ 1938, రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ ట్యాబ్ ఆధారిత మూల్యాంకనంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ట్యాబ్ల పనితీరు సక్రమంగా ఉండేలా చూడాలి. వేగవంతమైన నెట్వర్క్ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. మూల్యాంకన విధుల్లో ఉన్న ఉపాధ్యాయులందరికీ నిత్యం ద్రవపదార్థాలు పంపిణీ చేయాలి. దీనితో పాటు గదుల్లో గాలి, వెలుతురు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. – గెడ్డం సుధీర్, వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి సవాలు విసురుతున్న జవాబుపత్రాల మూల్యాంకనం నెట్వర్క్ లేక మొరాయిస్తున్న ట్యాబ్లు స్పెషల్ అసిస్టెంట్లకు పని భారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకూ చేసినా తరగని పని వేతనం పెంచాలని డిమాండ్ -
గుబ్బల మంగమ్మ గుడి వద్ద టూరిజం అభివృద్ధికి కృషి
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలో ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి గుడిని ఏపీ ఫారెస్ట్ పీసీసీఎఫ్ మాజీ అధికారి, ప్రభుత్వ రాష్ట్ర అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా గుబ్బల మంగమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో టూరిజం పరంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన వనరులపై, అధికారులను, కమిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుబ్బల మంగమ్మ గుడి అటవీప్రాంతంలో ఉన్నందున ఆ పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వల్ల కలిగే కాలుష్యాన్ని నివారించేందుకు అధికారులు, కమిటీ సభ్యులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ముఖ్యంగా భక్తులు ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు వాడకుండా అవగాహన కలిగించాలన్నారు. ఆలయ పరిసరాల్లో డీఎఫ్ఓ పర్యవేక్షణలో స్టాగ్ (ప్రదర్శన బోర్డు చిహ్నం) ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ సందీప్ రెడ్డి, సబ్ డీఎఫ్ఓ వెంకట సుబ్బయ్య, జంగారెడ్డిగూడెం రేంజ్ అధికారి దుర్గాకుమార్బాబు, ములగలంపల్లి సెక్షన్ ఆఫీసర్ కె.రాంబాబు, ఆలయ కమిటీ ప్రతినిధులు కోర్సా రాంబాబు, కె. గంగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
గ్రామ స్వరాజ్యానికి తూట్లు
● గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల్లో పోలీస్ స్టేషన్లు ● గత ప్రభుత్వ గుర్తులను చెరిపేస్తున్న వైనం సాక్షి, టాస్క్ఫోర్స్: గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వం గ్రామ స్వరాజ్యం నెరవేర్చేందుకు స్వగ్రామంలోనే పాలన ప్రజల ముంగిటకు తీసుకొచ్చారు. ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్ మండలాల్లో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు అన్ని కలిపి దాదాపు 250 నిర్మించారు. నాడు–నేడు పథకంలో భాగంగా ఎన్నో పాఠశాలలు ఆధునికీకరించారు. వంతెనలు, రోడ్లు నిర్మించారు. కూటమి చర్యలతో విస్మయం వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పెదపాడులో నిర్మించిన సచివాలయాన్ని, పెదవేగిలో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని గురువారం పోలీస్ స్టేషన్లుగా మార్చి ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. అయితే ఈ చర్యలతో గ్రామీణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఎటువంటి ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణాలు చేపట్టలేదని చెబుతున్నారు. ప్రజలకు సేవలను అందించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని పోలీస్ స్టేషన్లుగా మార్చి ప్రారంభించడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. 500కు పైగా శిలాఫలకాలు ధ్వంసం ఈ రెండు ప్రభుత్వ కార్యాలయాలపై గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి స్థానిక ప్రజాపతినిధుల పేర్లు ఉన్న శిలాఫలకాలను కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే ధ్వంసం చేశారు. అంతే కాకుండా నియోజకవర్గంలో దాదాపు 500పైగా శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోకపోగా ‘నూతన భవనం’ అనే పేరుతో ప్రారంభోత్సవం చేయడం ఏంటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పెదవేగిలో పోలీస్ సర్కిల్ ఆఫీస్గా మారిన రైతు భరోసా కేంద్రం -
నాలుగు సంస్థలతో కీలక ఎంఓయూలు
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయం ఒకే రోజు నాలుగు ప్రతిష్టాత్మక సంస్థలతో నాలుగు కీలక అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ)లు కుదుర్చుకుందని ఉపకులపతి డాక్టర్ కె.ధనుంజయరావు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యాన విశ్వ విద్యాలయం పరిపాలన భవనంలో గురువారం నిర్వహించిన ఎంఓయూల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ఒప్పందాలు కేవలం కాగితాలపై సంతకాలతో ఆగిపోకుండా ఆచరణలో గొప్ప ఫలితాలు అందిస్తాయని ఆయన తెలిపారు. నాలుగు ఒప్పందాలు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్), బెంగళూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ (ఐఐహెచ్ఆర్)తో కుదుర్చుకున్నామని తెలపారు. ఈ కార్యక్రమంలో ఐఐహెచ్ఆర్ డైరెక్టర్ డాక్టర్ తుషార్ కాంతి బెహరా, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.మాధవి, డాక్టర్ సీహెచ్ రూత్, డాక్టర్ బి.ప్రసన్నకుమార్, ఎస్.సూర్యకుమారి ప్రేమానందం తదితరులు పాల్గొన్నారు. పెదపాడు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పెదపాడు మండలంలోని తాళ్లమూడిలో చోటు చేసుకుంది. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా నగరం మండలం మెడపల్లి గ్రామానికి చెందిన పేరుమాని ఏడుకొండల రెడ్డి (40) తన టాటా ఇంట్రా వాహనంలో పచ్చిమిర్చి, చిలగడ దుంపల లోడును చీరాల సమీపంలోని చినగంజాం వద్ద లోడు చేసుకుని రాజమండ్రికి బయలుదేరాడు. మార్గమధ్యలో గురువారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో పెదపాడు మండలంలోని తాళ్లమూడి గ్రామానికి వచ్చేసరికి నిద్రమత్తులో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో డ్రైవర్ సీట్లోనే ఇరుక్కుపోవడంతో హైవే పెట్రోలింగ్ అఽధికారులు బయటకు లాగేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఏడుకొండలు రెడ్డి మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పెదపాడు ఎస్సై ఆర్.శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉండి: గ్రామంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పాములపర్రు గ్రామానికి చెందిన కఠారి శ్రీనివాసులు తన ద్విచక్రవాహనంపై బుధవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ఉండి గ్రామానికి టిఫిన్ కోసం వెళ్లాడు. తిరిగి వస్తుండగా గ్రామంలోని వెలివర్రు జంక్షన్ వద్దకు రాగానే పాములపర్రు వైపు నుంచి ఉండి వైపుగా ఎదురుగా వస్తున్న లారీ అతనిని వేగంగా ఢీ కొట్టింది. దీంతో అతనికి తలతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి సోదరుడు అంబులెన్స్లో భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నుంచి అందిన సమాచారం, భార్య దుర్గ ఇచ్చి న ఫిర్యాదు మేరకు ఎస్సై ఎండీ నసీరుల్లా కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. -
శాశ్వత భవనం.. ఇంకెంత దూరం?
● భీమవరం కలెక్టరేట్కు నాలుగేళ్లు పూర్తి ● గత ప్రభుత్వంలో శాశ్వత భవనానికి జీఓ ● కూటమి ప్రభుత్వం వచ్చాక కలెక్టరేట్ తరలింపునకు కుట్రలు భీమవరం (ప్రకాశం చౌక్) : పరిపాలన సౌలభ్యం, ప్రజలకు అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలని లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నరసాపురం పార్లమెంట్ను నూతన పశ్చిమగోదావరిగా జిల్లాగా భీమవరం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. అయితే జిల్లా కలెక్టరేట్ ఏర్పడి నాలుగేళ్లు పూర్తయ్యింది. జిల్లాలోని ఏడు నియోజవర్గాల ప్రజలకు కలెక్టరేట్ ద్వారా అన్ని సేవలు సులభంగా వేగంగా అందుతున్నాయి. ఏలూరు 70 కిలోమీటర్లు వెళ్లే దూరాభారం తగ్గంది. అయితే కలెక్టరేట్కు శాశ్వత భవనం లేక ఇప్పటికీ అద్దె భవనంలో కొనసాగుతుంది. పట్టించుకోని కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భీమవరం నుంచి కలెక్టరేట్ను వేరేచోటుకు తరలించాలని కుట్రలు జరిగాయి. భీమవరం ప్రజలు నుంచి తిరుగుబాటు రావడంతో ఆ ప్రయత్నాలు మానుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలు అవుతున్నా నేటికీ కలెక్టరేట్కు శాశ్వత భవనం నిర్మాణానికి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అసలు కలెక్టరేట్ భవనం నిర్మాణం ఊసే ఎత్తడం లేదు. జిల్లాలోని కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు మంత్రులు కలెక్టరేట్ శాశ్వత భవనం నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదు ఈ ఏడాది నిర్మాణంపై నీలినీడలు భీమవరం మార్కెట్ యార్డ్లోనే కలెక్టరేట్ భవనం నిర్మాణం ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు స్పష్టం చేసి నెలలు గడస్తున్నాయి. కానీ ఇప్పవరకు నిర్మాణానికి సంబంధించి కనీసం అధికారులు పరిశీలన కూడా చేయలేదు. నిర్మాణానికి అనుకూలమైన వాతవారణం ఉండే వేసవిలో కలెక్టరేట్ శాశ్వత భవనం నిర్మాణం పనులు చేపట్టకపోతే ఈ ఏడాది కూడా కలెక్టరేట్ భవనం నిర్మాణం లేనేట్టా? అనే సందేహం కలుగుతుందని ప్రజలు చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కలెక్టరేట్కు శాశ్వత భవనం ఉండాలని అన్నింటికి అనుకూలమైన భీమవరం మార్కెట్ యార్డ్ను ఎంపిక చేసి అక్కడ ఇంటిగ్రేటెడ్ భవనం నిర్మాణానికి జీఓ జారీ చేశారు. అప్పట్లో పలు రాజకీయ పార్టీలు, మేథావులు, సీనియర్ రాజకీయ నాయకులు. నేడు కూటమిలో నాయకులు కూడా అందరు కూడా మార్కెట్ యార్డులో కలెక్టరేట్ నిర్మాణం మంచి నిర్ణయమని ప్రశంసించారు. అలాంటి మార్కెట్ యార్డులో కలెక్టరేట్ భవనం నిర్మాణానికి ఈకూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా మౌనంగా ఎందుకు ఉంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు కలెక్టరేట్ భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యం
ఏలూరు (టూటౌన్): స్థానిక ఐఏడీపీ హాలులో గురువారం ప్రకృతి వ్యవసాయ అమలుపై విస్తృత స్థాయీ శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యస్.కె.హబీబ్ భాషా తెలిపారు. లింగపాలెం, నిడమర్రు, టి.నర్సాపురం, చింతలపూడి, పెదపాడు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, పెదవేగి, వేలేరుపాడు వివిధ మండలాలు నుండి సుమారు 120 మంది కేడర్ సభ్యులు ఈ శిక్షణలో పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, జిల్లా ప్రాజెక్ట్ మేనేజరు బి.వెంకటేష్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని వివరించారు. -
వైభవంగా శ్రీనివాసుని కల్యాణోత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసుని దివ్యకల్యాణ మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయంలో స్వామి వారిని పెండ్లి కుమారుడిగా, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేశారు. అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్ధుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల గోవింద నామస్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికను ఆలయ అర్చకులు విశేషంగా అలంకరించారు. అనంతరం సింహాసనంపై కల్యాణ మూర్తులను ఉంచి ఈ తంతును నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ఈఓ వై.భద్రాజీ, సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
నకిలీ టికెట్ల కేసులో నిందితుల అరెస్ట్
ఏలూరు టౌన్/ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల దేవస్థానంలో నకిలీ టికెట్ల వ్యవహారంలో కీలకమైన నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నకిలీ టికెట్లను కౌంటర్ ద్వారా భక్తులకు విక్రయించి, భారీ ఎత్తున అక్రమార్జన చేసినట్లు పోలీసుల విచారణలో నిర్థారణ అయ్యింది. ఏలూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రూ.100, రూ.200 విలువైన నకిలీ టికెట్లను ముఖ్యంగా శని, ఆదివారాల్లో రద్దీ సమయంలో విక్రయిస్తూ భారీగా సొమ్ములు కాజేసినట్లు తెలిపారు. కీలక నిందితుడు దేవస్థానం ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఐనంపూడి సాయి జగన్నాథరాజు అనే వ్యక్తితో పాటు మరికొందరు ఔట్ సోర్సింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది సైతం నకిలీ టికెట్ల వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నారని స్పష్టం చేశౠరు. ఒక సాప్ట్వేర్ ఉద్యోగి సహాయంలో కంప్యూటర్, ప్రింటర్లను ఏర్పాటు చేయటమే కాకుండా ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ను రూపొందించినట్లు విచారణలో తేలింది. పెన్డ్రైవ్లో సాఫ్ట్వేర్ను వేసుకుని అప్పటికప్పుడు నకిలీ టికెట్లు ప్రింట్ తీస్తూ అవినీతికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిరోజూ రూ.100ల టికెట్లు వంద, రూ.200 టికెట్లు వంద చొప్పున భక్తులకు విక్రయిస్తూ సొమ్మును కాజేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఈ నకిలీ వ్యవహారంపై దేవస్థానం ఈఓ భద్రాజీ ఫిర్యాదుతో ద్వారకాతిరుమల పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కీలక నిందితుల అరెస్ట్ నకిలీ టికెట్ల వ్యవహారంలో ఏడుగురు కీలక నిందితులను ద్వారకాతిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఏ3 సముద్రాల శేషుబాబు, ఏ4 మేక సతీష్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ప్రధాన నిందితుడు ద్వారకాతిరుమలకు చెందిన ఐనంపూడి సాయి జగన్నాథరాజు, ములగాల రమేష్, తొంటపాక సత్యనారాయణ, దెందులూరు మండలం పెరుగు గూడెం గ్రామానికి చెందిన ఉప్పలపాటి శ్రీనివాస్, కొమ్మర గ్రామానికి చెందిన కీర్తి అశోక్కుమార్, మానుకొండ ఆంజనేయులు, ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు గ్రామానికి చెందిన ముత్యాల నాగవెంకట సత్యశ్రీనివాసరావును పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. వీరివద్ద రూ.200 విలువైన 61 నకిలీ టికెట్లు, టికెట్ల ముద్రణకు వినియోగించే ల్యాప్ట్యాప్, థర్మల్ ప్రింటర్, 5 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశంపై లోతైన విచారణ చేస్తున్నామనీ, ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందనీ, రెగ్యులర్ ఉద్యోగులు ఏమైనా దీనిలో భాగస్వాములు అయ్యారా? అనేది విచారణ చేస్తున్నామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ తెలిపారు. ఈ నకిలీ టికెట్ల కేసు దర్యాప్తులో ప్రతిభ చాటుకున్న భీమడోలు సీఐ పీ.కృష్ణ, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్, కానిస్టేబుల్స్ జి.ధర్మరాజు, టి.లక్ష్మీనారాయణ, హోంగార్డు వీజే ప్రకాష్బాబును జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్, డీఎస్పీ శ్రావణ్కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులకు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఓ నిందితుడు స్పెషల్ ఆఫర్ ఇచ్చాడు. సాఫ్ట్వేర్ తయారు చేసింది మీరేనని కోర్టులో ఒప్పుకుంటే రూ. 10 లక్షలు ఇస్తానని అతడు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే ఆ ఆఫర్ను ఇద్దరు నిందితులు ఒప్పుకోలేదు. అయినా పట్టువిడవకుండా రాత్రి వరకు తమ ప్రయత్నాలు సాగించడం విశేషం.. అలా ఎలా తయారు చేశారు..? నకిలీ టికెట్ల స్కామ్కు వినియోగించిన సాఫ్ట్వేర్ను బయట వ్యక్తులు ఇష్టానుసారంగా ఎలా తయారు చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. దేవదాయశాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి, కమిషనర్ స్థాయి అధికారులు ఆర్డర్ కాపీ ద్వారా అనుమతిస్తేనే గానీ సాఫ్ట్వేర్ను తయారు చేయకూడదు. కానీ తన స్నేహితుడు రమేష్ అడిగాడని ఉంగుటూరు మండలం, ఉప్పాకపాడు గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎమ్ఎన్వీఎస్ శ్రీనివాసరావు దేవస్థానం టికెట్ల సాఫ్ట్వేర్ను తయారు చేసేశాడు. ఇదిలా ఉంటే సాఫ్ట్వేర్ తయారు చేసినందుకు శ్రీనివాసరావును పోలీసులు ఎఫ్ఐఆర్లో ఏ9 (ఆఖరి) నిందితుడిగా చేర్చారు. తెలిసి చేసినా.. తెలియక చేసినా ఈ తప్పు కారణంగా నకిలీ టికెట్ల జారీ యథేచ్ఛగా సాగిపోయింది. -
జిల్లా ఆర్చర్లకు పతకాలు
భీమవరం (ప్రకాశంచౌక్): గుంటూరులో ఇటీవల నిర్వహించిన చెరుకూరి వోల్గా– లెనిన్ మెమోరియల్ అండర్ 15 నేషనల్ ఆర్చరీ చాంపియన్షిప్లో కాంపౌండ్ విభాగంలో జిల్లా ఆర్చర్లు పతకాలు గెలుచుకున్నారు. మాగాపు సుహాస్ వ్యక్తిగత విభాగంలో గోల్డ్మెడల్ సాధించాడని ఆర్చరీ జిల్లా అధ్యక్షుడు ఎల్.జయరాజు గురువారం విలేకరులకు తెలిపారు. మిక్సిడ్ విభాగంలో అల్లూరు కనిష్కతో సిల్వర్ మెడల్, బాలుర విభాగంలో బ్రాంజ్ మెడల్ను కై వసం చేసుకున్నాడన్నారు. అల్లూరు కనిష్క, కలిదిండి హేమశ్రీ కాంపౌండ్ గర్ల్స్ టీమ్ సిల్వర్ మెడల్ సాధించిందని తెలిపారు. మెడల్స్ సాధించిన ఆర్చర్లను, కోచ్ సాహిత్ను పలువురు అభినందించారు. టి.నరసాపురం: ప్రభుత్వం నిషేధించిన కలుపు మందు గ్లైసెల్ 360 లీటర్లను వ్యవసాయ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్కే హబీబ్ మాట్లాడుతూ మండలంలోని గుర్వాయిగూడెం గ్రామానికి చెందిన రైతు కె.నాగేశ్వరావుకు చెందిన ఆయిల్ పామ్ తోటలో ఉన్న షెడ్డులో నిషేధిత గ్లైసెల్ కలుపు మందు అక్రమ నిల్వలు ఉన్నాయని సమాచారం వచ్చిందన్నారు. దీంతో మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రియాంక, చింతలపూడి ఎడిఎ సుబ్బారావుతో కలిసి తనిఖీలు నిర్వహించామన్నారు. తనిఖీల్లో 360 లీటర్ల గ్లైసెల్ బాటిళ్లు గుర్తించి, వీవీఆర్ఓ సమక్షంలో ఆ మందులను స్వాధీనం చేసుకుని రైతుపై 6ఏ కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. పురుగుమందుల నియంత్రణ చట్టం 1968, జీవో నెంబర్ 649ప్రకారం గ్లైసెల్ 41 శాతం కలుపు మందును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తయారీ వినియోగం నిషేధించాయన్నారు. గ్లైసెల్ క్రయ విక్రయాలు చట్టరీత్యా నేరమని, ఆ మందును కొన్నా అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యలమంచిలి: మండలంలోని ఆర్యపేట గ్రామానికి చెందిన కవల లక్ష్మీ కుమారి (44) అనే మహిళ కువైట్ దేశంలో గుండెపోటుతో మృతి చెందింది. ఆమె గత నాలుగేళ్లుగా కువైట్లోని ఒక ఇంట్లో పనిచేస్తున్నారు. ఈ నెల 4న ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో స్థానిక భారతీయులు, ఇండియన్ ఎంబసీ సహకారంతో మృతదేహాన్ని కార్గో విమానంలో శుక్రవారం భారతదేశం తీసుకువస్తున్నారు. -
రాధాకృష్ణ వ్యాఖ్యలపై కన్నెర్ర
తణుకు అర్బన్: మహిళలను కించపరిచే విధంగా ఏబీఎన్ చానల్లో రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు దారుణమని వైఎస్సార్ సీపీ నేతలు ధ్వజమెత్తారు. వెంటనే ఆ వ్యాఖ్యలను రాధాకృష్ణ వెనక్కి తీసుకోకపోతే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాధాకృష్ట వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ బుధవారం తణుకు నరేంద్ర సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ సభ్యసమాజం తలదించుకునేలా ఒక తల్లి, అక్క, చెల్లి, భార్యగా ఉన్న మహిళలను అవమానపరిచే విధంగా రాధాకృష్ణ మాట్లాడడం దుర్మార్గమని అన్నారు. అమరావతి రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చుచేసే కంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను మావిగన్ కారిడార్గా మలచాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విన్నపం ప్రజలకు చేరువైంది. ఇది తట్టుకోలేక సీఎం చంద్రబాబుకు బినామీ అయిన ఏబీఎన్ రాధాకృష్ణ ఈ నీచ జర్నలిజానికి ఒడిగట్టాడని మండిపడ్డారు. ఏబీఎన్ రాధాకృష్ణ వ్యవహారం అందరికీ తెలుసునని అన్నారు. తక్షణమే క్షమాపణ చెప్పాలి రాధాకృష్ణ వ్యాఖ్యలను మహిళలంతా ఛీకొడుతున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. మహిళలపై మీకు గౌరవం ఉంటే వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్రెడ్డి చెప్పిన విధంగా మావిగన్ కారిడార్గా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను అభివృద్ధి చేస్తే సుమారుగా రూ.10 వేల కోట్లతోనే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని దీంతో పరిశ్రమలు కూడా వస్తాయని అన్న వ్యాఖ్యలకు డైవర్షన్గా ఇంతకు దిగజారుతావా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని వచ్చి 18 నెలల కాలంలోనే 2 లక్షల కోట్లు పైగా అప్పులు చేసి ఏం చేశారని అన్నారు. సంపద సృష్టించడమంటే జగన్కే దక్కిందని పోర్టుల నిర్మాణం, మెడికల్ కళాశాలలు, భవన నిర్మాణాలు కనిపిస్తాయని గుర్తుచేశారు. మాట్లాడుతున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతణుకులో ఆంధ్రజ్యోతి పేపర్లు చించుతూ నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి కారుమూరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు మహిళలంటే చులకన భావంతో నీచమైన జర్నలిజాన్ని నడుపుతున్న ఏబీఎన్ ఛానల్ను మహిళలు చీదరించుకుంటున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల అన్నారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాసు, సీఈసీ సభ్యుడు కొట్టు వెంకట నాగు, భీమవరం పార్టీ ఇన్చార్జ్ చినమిల్లి వెంకటరాయుడు, పాలకొల్లు ఇన్చార్జ్ గుడాల గోపి, పార్లమెంట్ సెక్రటరీ యడ్ల తాతాజీ, ఎంబీసీ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న తదితరులు ఏబీఎన్ వ్యాఖ్యలకు నిరసనగా ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ తణుకు పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, వెలగల సాయిబాబారెడ్డి, వడ్లూరి సీతారాం, పొట్ల సురేష్, యిండుగపల్లి బలరామకృష్ణ, జల్లూరి జగదీష్, మెహర్ అన్సారీ, నూకల కనకదుర్గ, పెనుమాల రాజేష్, జంగం ఆనంద్కుమార్, ఎస్వీ జాకబ్బాబు, డీజే అమూల్యారావు, గెద్దా శ్రీకాంత్, యారబాటి రామకృష్ణ, షేక్ జిలానీ, బిరుదుకోట చింతన్న, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మావిగన్ డైవర్షన్ కోసమే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి లేకుంటే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు మాజీ మంత్రి కారుమూరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి హెచ్చరిక తణుకులో వైఎస్సార్ సీపీ నేతల నిరసన -
మట్టి దొంగలపై చర్యలు తీసుకోవాలి
పెనుగొండ: ఆచంట నక్కల డ్రెయిన్లో మట్టి దొంగలపై చర్యలు తీసుకోవాలని నక్కల డ్రెయిన్ పరివాహక ప్రాంత రైతులు మంత్రి అచ్చెన్నాయుడుకు ఫిర్యాదు చేశారు. మార్టేరులో నిర్వహించిన కిసాన్ మేళాలో మట్టి మాఫియాపై రైతులు మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. నక్కల కాలువ పడమర గట్టును ఆనుకుని 150 అడుగుల పొడవున, 50 అడుగుల వెడల్పులో 15 అడుగుల లోతున మట్టి అక్రమంగా తరలించుకుపోయారన్నారు. దీంతో రైతులు సమష్టిగా అడ్డుకుని మట్టిని అక్రమంగా తరలిస్తున్న మూడు వాహనాలను, జేసీబీపైనా అఽధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రెండు రోజుల్లో సుమారు 100 వాహనాల్లో మట్టిని తరలించారని తెలిపారు. దీంతో భారీ గోతులు ఏర్పడి దాళ్వా ధాన్యం రవాణా కష్ట సాధ్యంగా మారుతుందని, వర్షాకాలంలో గట్టు బలహీన పడి పరివాహక వరిచేలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి మాఫియాపై అధికారులు చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలని రైతులు మంత్రి అచ్చెనాయుడిని కోరారు. -
ఫుట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డు లోని ఏఎస్ రాజు రెసిడెన్సీ భవనంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎలక్షన్ అబ్జర్వర్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ బడేటి వెంకట్రామయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎలక్షన్ ఆఫీసర్గా గూడూరి సాంబమూర్తి వ్యవహరించగా జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడిగా వేమిరెడ్డి హరికృష్ణ, ఉపాధ్యక్షులుగా ఏఎస్ఎన్ రాజు, ఇళ్ళ మధుసూదనరావు, కార్యదర్శిగా వానపల్లి రమేష్, సంయుక్త కార్యదర్శిగా జ్యోతి, కోశాధికారిగా ఆర్.సూరిబాబు, కార్యవర్గ సభ్యులుగా పి.ధీరేశ్వరనాధ్, విక్రమరావు, టి.సుధా దేవి, వి.దేవి, కో–ఆప్షన్ సభ్యులుగా నందమూరి విష్ణుమూర్తి, పి.సత్యనారాయణ, గౌరవ చైర్మన్గా ఇళ్ల రాధాకృష్ణ, గౌరవ అధ్యక్షులుగా పాపోలు ఏడుకొండలు, మిడతాని సురేష్ కుమార్లు నియమితులయ్యారు. నూతన కమిటీ నాలుగు సంవత్సరాల పాటు పదవీకాలంలో ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధి జి.పవన్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు నగర పాలక సంస్థలో పనిచేసే మున్సిపల్ ఆప్కాస్ కార్మికులు 1000 మందికి మార్చి నెలలో ఇవ్వాల్సిన జీతాలు నేటికి ఇవ్వలేదని, వెంటనే జీతాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10 గంటలకు కార్పొరేషన్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించాలని ఫెడరేషన్ ఏలూరు నగర కమిటీ సమావేశం నిర్ణయించిందని ఆ సంఘ నాయకులు తెలిపారు. స్థానిక ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఫెడరేషన్ సమావేశం యూనియన్ అధ్యక్షుడు లావేటి కృష్ణారావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నగర కార్యదర్శి జి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిధి పోర్టల్ పేరుతో కార్మికుల జీతాలను ఆలస్యం చేస్తున్నారని, దానివల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమావేశంలో యూనియన్ గౌరవాధ్యక్షుడు ఇఫ్టూ ఏలూరు నగర అధ్యక్షుడు బి.సోమయ్య, పంతం చిన్న నాగరాజు, బంగారు వెంకటేశ్వరరావు, తానంకి జార్జి పాల్గొన్నారు. -
ప్రశాంతంగా పోలీస్ పదోన్నతుల అర్హత పరీక్షలు
ఏలూరు టౌన్: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణాజిల్లాలో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు ఫిట్ఫర్ ఎస్ఐ ప్రమోషన్స్లో భాగంగా ప్రీ ప్రమోషనల్ ట్రైనింగ్ క్వాలిఫైయింగ్ పరీక్షలు ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం సమీపంలోని శ్రీ సురేష్చంద్ర బహుగుణ స్కూల్లో ప్రశాతంగా జరిగాయి. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేక పర్యవేక్షణలో మంగళవారం ఉదయం 9గంటల నుంచి 11.30గంటల వరకూ పరీక్షలు నిర్వహించారు. పేపర్–1 పరీక్షకు మొత్తం 112మంది హాజరుకాగా, వారిలో మహిళలు 29మంది, పురుషులు 83మంది ఉన్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకూ పేపర్–2 పరీక్ష నిర్వహించారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, సదుపాయాలను పరిశీలించారు. ఎక్కడా అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా, పటిష్టమైన ఏర్పాట్లు మధ్య పరీక్షలు సాగుతున్నాయని తెలిపారు. బుధవారం ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో పరీక్షలకు హాజరైన సిబ్బందికి టర్న్ అవుట్, స్వ్కాడ్ డ్రిల్, ఆర్మ్స్డ్రిల్, ఆయుధాల కోల్నా జోల్నా, వైవా, నేరస్థల పరిశీలన, నేర స్థలంలో వినియోగించే సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలపై పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ రెండు పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో శిక్షణ అనంతరం వారికి సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతులు లభిస్తాయని ఐజీ అశోక్కుమార్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్.సుస్మిత, పోలవరం డీఎస్పీ యం.వెంకటేశ్వరరావు, డీటీసీ డీఎస్పీ సీహెచ్జీవీ ప్రసాద్, డీఏఆర్ అదనపు ఎస్పీ ఎల్.చెంచిరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా ఈస్ట్జోన్ డీఎస్పీ బీ.విద్య, డీఏఆర్ డీఎస్పీ బీ.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
సెప్సిస్ ప్రాణాంతకం..
● తీవ్ర అనారోగ్యానికి గురువుతున్న బాధితులు ● జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు యలమంచిలి: ప్రస్తుతం వాతావరణ మార్పులతో ప్రజలు రోగాల బారినపడుతున్నారు. చాలారోగాలు ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంటాయి. సాధారణంగా నలతగా ఉందంటే ఇన్ఫెక్షన్ సోకిందంటూ ఉంటా. వైద్యులు వివిధ పరీక్షలు చేసిన తరువాత ఏ ఇన్ఫెక్షనో చెబుతారు. అయితే ఈ సమస్యపై అంతులేని నిర్లక్ష్యం వహిస్తుంటాం. ఇన్ఫెక్షన్ ప్రాణాంతకం అయినా చాలామంది కొంచెం నలతగా ఉంటే సొంత వైద్యం చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో అనేక మంది ఇన్ఫెక్షన్ల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇన్ఫెక్షన్ను సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ను సెప్సిస్ అంటారు. శరీరంలో సోకే ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా అదుపు చేయకపోతే అది తీవ్రమైన ఇన్ఫెక్షన్కు (సెప్సిస్)కు దారి తీయవచ్చు. తొలుత ఇన్ఫెక్షన్ నిర్ధారణ కచ్చితంగా జరగాలి. అనంతరం నియంత్రణకు అవసరమైన చికిత్స చేయించాలి. మల్టిఫ్లెక్స్ పీసీఆర్ అనే అధునాతన వైద్య పరీక్ష ద్వారా త్వరితగతిన సెప్సిస్ను నిర్ధారించవచ్చు. బయోఫయర్ ద్వారా మూడు గంటల్లో నిర్ధారణ చేయవచ్చు. నిర్ధారణతోపాటు ఇన్ఫెక్షన్ నియంత్రణకు కావాల్సిన మందులు వాడాలి. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు యాంటిబయాటిక్స్ వైద్యుల సలహాలు మేరకు మాత్రమే వాడాలి. – డాక్టర్ ఆర్ శ్రీ సాహిత్య ఎమర్జెన్సీ,ఐసీయూ, అత్యవసర చికిత్స వైద్య నిపుణురాలు, పాలకొల్లు ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన వారికి, చిన్న పిల్లలకు, ఊపిరితిత్తులు, గుండె, లివర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి, హెచ్ఐవీ బాధితులకు, సుగర్ వ్యాధి బాధితులకు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి సోకే అవ కాశం ఉంది. ప్రతి సంవత్సరం ఐదు కోట్ల మంది సెప్పిస్ వ్యాధి బారిన పడుతున్నారు. వీరిలో కోటిమంది ప్రాణాలు ప్రమాదస్థితికి చేరుకుంటున్నా యి. ప్రపంచవ్యాప్తంగా 50శాతం మంది సెప్సిస్వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షణాలు ఇది సూక్ష్మ క్రిముల ద్వారా వస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గులుగా ఉండటం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస వేగంగా తీసుకోవడం, విపరీతమైన నీరసం, తీవ్రమైన చలి, ఆయాసం, మూత్ర విసర్జన తగ్గిపోవడం, బీపీ తగ్గడం, పెరగడం, రోగి తికమక పడడం తదితర లక్షణాలు వ్యాధి బాధితుల్లో కనిపిస్తాయి. వ్యాధి సోకే భాగాలు నూటికి 50 శాతం ఊపిరితిత్తులు. కిడ్నీలు, బ్రెయిన్, యూరినరి ట్రాక్, చర్మం, ఇతర భాగాల్లో వ్యాధి ఇన్ఫెక్షన్లు సోకుతాయి. కడుపులో ఇన్ఫెక్షన్లు రావడం ద్వారా అల్సర్లు ఏర్పడతాయి. కాళ్లల్లో పుండ్లు ఏర్పడి చీము పట్టి పరిస్థితి ప్రమాదంగా మారి కొన్నిసార్లు ఆపరేషన్ల ద్వారా ఆ గాయాలను తొలగించాల్సి వస్తుంది. బ్లడ్ కల్చర్, కార్బాఆర్, బయోఫైయర్ (అన్ని రకాల సూక్ష్మ క్రిములకు) పరీక్షల ద్వారా సెప్సిస్ని నిర్ధారిస్తారు. అంటువ్యాధి కారకాలు, వాటి విషపూరిత పదార్థాల వ్యాప్తి, వాటి స్థానం నుంచి రక్త ప్రవాహంలో కలవడం ద్వారా ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఇది ఒక ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన జబ్బు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే గుర్తించి చికిత్స చేయని పక్షంలో శరీరంలోని పలు అవయవాలు ఇన్ఫెక్షన్ల వల్ల పనిచేయడం మానేస్తాయని వివరిస్తున్నారు. చివరికి రోగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వీరికి సకాలంలో వ్యాధి నిర్ధారణ చేసి వైద్యం అందించని పక్షంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ (సెప్సిస్) మారి రోగులను ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. -
వైఎస్సార్ విగ్రహ మరమ్మతులకు అనుమతివ్వండి
ఏలూరు టౌన్: మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద మరమ్మతులు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం సమర్పించారు. ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహం చుట్టూ ఉన్న రెయిలింగ్, ఫ్లోరింగ్ మరమ్మతులకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. గతంలో వైఎస్సార్ విగ్రహం వద్ద వాటర్ ఫౌంటెయిన్ నిర్మిస్తామంటూ రైలింగ్, ఫ్లోరింగ్ తొలగించారనీ, కానీ నేటికీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రభుత్వ నిధులతో కాకుండా తామే సొంత ఖర్చులతో మరమ్మతులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. ఏలూరు నగరంలోనూ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారనీ వాటి పరిష్కారానికి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చర్యలు చేపట్టాలని కోరినట్లు సమన్వయకర్త జయప్రకాష్ తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, రాష్ట్ర మహిళ ప్రదాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ల బాచి, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల ఉన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వికి వైఎస్సార్ సీపీ నాయకుల వినతి -
15 నాటికి నీటి సరఫరా నిలిపివేత
పాలకొల్లు సెంట్రల్: సాగునీటి సంఘాల అధ్యక్షుల సమన్వయంతో మురుగు కాలువలు ప్రక్షాళణ చేసే దిశగా చర్యలు చేపడతామని డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ పెన్మెత్స రామభద్రరాజు అన్నారు. మంగళవారం సాగునీటి సంఘాల అధ్యక్షులు, అధికారులతో స్థానిక డ్రెయినేజీ శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఈ సీహెచ్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 15 నాటికి ప్రధాన కాలువలకు నీటి కట్టడం జరుగుతుందన్నారు. అనంతరం మురుగు కాలువల ప్రక్షాళనపై చర్యలు చేపడతామని చెప్పారు. వీటి బాధ్యతను సాగునీటి సంఘ అధ్యక్షులు చేపడతారని తెలిపారు. గతంలో ఉన్న రేట్లకు పని చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదని అన్నారు. కార్మికుల వేతనాల పెంపుపై ఉన్నతాధికారులతో మాట్లాడతామని చెప్పారు. కార్యక్రమంలో ఏఈఈలు ఎ.దుర్గాప్రసాద్, జి.సతీష్, బి.సాయిశాంతం, సాగునీటి సంఘాల అధ్యక్షులు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, ఇంటి శ్రీరాములు, ఆరుమిల్లి రామశ్రీనివాస్, దేవరపు దొరబాబు, దేవళ్ల మోహన్, మాతా రత్నరాజు, కుక్కల సత్యనారాయణ, పులంకడం రాఘవులు, టి.వెంకట కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
గర్బిణుల ప్రాణాలతో చెలగాటం
ఏలూరు టౌన్: వైద్యులను దేవుడితో సమానంగా గౌరవిస్తూ ఉంటారు... ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్కు వెళితే వైద్యుడు తన ప్రాణాలను కాపాడతారనే నమ్మకంతో ఉంటారు. ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని మాతాశిశు విభాగం (ఎంసీహెచ్)లో గర్భిణుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. నవమాసాలు మోసి... పండంటి బిడ్డకు జన్మనిస్తున్న గర్భిణుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతుందంటూ బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకటీ...రెండో కాదు ఏకంగా పదుల సంఖ్యలో నిత్యం ఇదే తరహా తంతు సాగుతున్నా... జిల్లా స్థాయి అధికారులు సైతం ఏమీ చేయలేకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. గర్భిణులకు ఆపరేషన్లు చేయగా... కుట్లు విడిపోవటం, తీవ్ర ఇన్ఫెక్షన్లతో అనారోగ్యం బారినపడటం, ప్రాణాపాయ స్థితి ఎదుకావడం ఇక్కడ సర్వసాధారణ అంశంగా మారిపోయింది. ప్రాణాలంటే... నిర్లక్ష్యమా ? ఏలూరు జీజీహెచ్లోని ఎంసీహెచ్ విభాగం వైద్యులు, వైద్య సిబ్బందికి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదనీ... తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే గర్భిణుల ఆపరేషన్ల విషయంలో విఫలం అవుతున్నారని అంటున్నారు. గత ఏడాది కాలంలో సుమారు 50 నుంచి 60మందికి పైగా గర్భిణులు ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటూ హాస్పిటల్ నుంచి బలవంతంగా బయటకు వెళ్లిపోవటం పరిస్థితికి అద్దం పడుతుంది. తాజాగా ఎంసీహెచ్ బ్లాక్లో నిడిగట్టు మౌనిక, కొడాలి సుప్రియ, వెన్నెల, పెనుమాల రమ్య, లావణ్య ఇలా గర్బిణిలు వైద్యులు, సిబ్బంది అలసత్వంతో అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆపరేషన్ చేసిన అనంతరం కనీసం కుట్లు సరిగ్గా వేయకపోవటంతో కుట్లు విడిపోయి, తీవ్ర ఇన్ఫెక్షన్తో విలవిల్లాడుతున్నారు. పోనీ బయటకు వెళ్ళి వేరే హాస్పిటల్లో వైద్య చికిత్స చేయించుకుందామని అనుకుంటే... డిశ్చార్జ్ చేయకుండా వైద్య సిబ్బందితో బెదిరింపులకు పాల్పడడం నిత్య కృత్యంగా మారిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. ఎంసీహెచ్ బ్లాక్ వద్ద ఆందోళన ఏలూరు జీజీహెచ్లోని ఎంసీహెచ్ బ్లాక్ వద్ద గర్భిణులపై వైద్యులు, వైద్య సిబ్బంది తీరుకు నిరసనగా మాలమహానాడు రాష్ట్ర నాయకులు అబ్బూరి అనిల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాధితుల తరఫున ఆందోళనకు దిగారు. హాస్పిటల్ గేటు వద్ద బైఠాయించి బాధితుల బంధువులు, యువతతో కలిసి ధర్నా చేశారు. ప్రజలకు సరైన వైద్యం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ అధికారులు చర్యలు చేపట్టకపోవటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది పేదవర్గాల మహిళలు ప్రసూతి కోసం జీజీహెచ్కు వస్తుంటే... ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం దారుణమంటూ నిరసన తెలిపారు. పీజీలతో వైద్యం చేయిస్తూ...చోద్యం చూస్తున్న అధికారులు కుట్లు విడిపోయి... ఇన్ఫెక్షన్లతో తీవ్ర అనారోగ్యం ఏలూరు జీజీహెచ్లో వైద్యసేవలపై తీవ్ర అసంతృప్తి ఏలూరు జీజీహెచ్లో వైద్యులు, సిబ్బంది తీరు దారుణంగా ఉంది. పేద మహిళలు ప్రసూతికి వస్తే ... తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్లే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. రెండు, మూడు సార్లు కుట్లు వేయటానికి వాళ్ళు మనుషులేనా ? అంటూ మండిపడ్డారు. కుట్లు విడిపోయి ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ ఉంటే కనీస వైద్యచికిత్స చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆపరేషన్ చేశాక 20 నుంచి నెలరోజుల వరకూ హాస్పిటల్లోనే ఉంచుతూ... మందులు బయటకు రాస్తూ వ్యాపారం చేస్తున్నారు. – అబ్బూరి అనిల్, మాలమహానాడు, రాష్ట్ర నాయకులు నేను కడుపులో నొప్పితో సుమారు ఆరునెలల నుంచీ ఏలూరు జీజీహెచ్కు తిరుగుతూ ఉన్నా. మేము ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చూపించుకునే స్తోమత లేక జీజీహెచ్కు వస్తే... ఇక్కడ వైద్యులు కనీసం చేయి పట్టుకుని కూడా చూడలేదు. రక్త పరీక్షలు పేరుతో తిప్పుతూ ఉన్నారు. కడుపులో గడ్డలు ఉన్నాయంటారు.. కానీ చికిత్స మాత్రం చేయడం లేదు. పేదలకు సరైన వైద్యం అందే పరిస్థితి కనిపించడం లేదు. ఆసుపత్రి అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలి. – దానం భవానీ, తంగెళ్లమూడి -
లక్ష్మీపురంలో చోరీ
దెందులూరు: పెదవేగి మండలం లక్ష్మీపురం గార్డెన్స్లో రైతు మన్నె సుబ్రహ్మణ్యం ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గత నాలుగు రోజుల నుంచి యజమానులు ఇంట్లో ఉండకపోవడంతో అదును చూసి చోరీ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న 12 కాసుల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. మంగళవారం చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన సుబ్రహ్మణ్యం పోలీసులను ఆశ్రయించాడు. సంఘటన తెలుసుకున్న పెదవేగి సీఐ సీహెచ్ రాజశేఖర్, పెదవేగి ఎస్సై హరి సంఘటన స్థలాన్ని పరిశీలించి, బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాధితులను పరామర్శించారు. భీమవరం (ప్రకాశంచౌక్): శోభిత వర్మ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా రాజమండ్రి నగరంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రఖ్యాత ఇంద్రజాలికుడు, రచయిత, మ్యాజిక్ స్టార్ డాక్టర్ బోస్ను ‘మార్నింగ్ స్టార్’ బిరుదుతో సత్కరించారు. మ్యాజిక్ రంగానికీ, రచనా రంగానికీ బోస్ చేస్తున్న విశిష్ట సేవలను ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస వర్మ కొనియాడారు. ఎస్వీ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఇంద్రజాల ప్రదర్శనలు, ఏక పాత్రాభినయ పోటీలు, కవితా పఠనాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలైన ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం దేవస్థానాలకు నూతన ట్రస్ట్బోర్డు ఏర్పాటు చేసినట్టు ఓ లిస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అందులో భాగంగా ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానానికి చైర్మన్గా ఎస్వీ సుధాకరరావుతో కలిపి 17 మంది సభ్యులతో ట్రస్టుబోర్డు ఏర్పాటు చేసినట్టు అందులో పేర్కొన్నారు. చైర్మన్ మినహా మిగిలిన 16 మందిలో 13 మంది టీడీపీ, 2 జనసేన, 1 బీజేపీకి చెందిన వారు ఉన్నట్టు లిస్ట్లో పేర్కొన్నారు. ద్వారకాతిరుమల మండలం వేంపాడుకు చెందిన చింతమనేని హనుమంతరావు, ద్వారకాతిరుమలకు చెందిన కంపసాటి నాగసీత, నల్లజర్లకు చెందిన యలమాటి శ్రీనివాసరావు, ఆవపాడుకు చెందిన అచ్యుత సత్యనారాయణ, యర్నగూడేఇకి చెందిన పాలూరి వెంకట చరిత, దుద్దుకూరుకు చెందిన కడియం సత్యవతి, హుకుంపేటకు చెందిన హోట వీరభద్రరావు ఎంపికై నట్టు లిస్ట్లో ఉంది. అలాగే ఏలూరుకు చెందిన చలువాది శివకృష్ణ, అనపర్తికి చెందిన పల్లి శ్రీనివాసరెడ్డి, తణుకుకు చెందిన కాకి సురేష్ కుమార్, అల్లి సత్యనారాయణ, నెల్లిమర్లకు చెందిన కింతాడ కళావతి, గూడూరుకు చెందిన బత్తిన ప్రమీల, ప్రత్తిపాడుకు చెందిన చిరుగూరి సుశీల, తాడేపల్లిగూడేనికి చెందిన కాసిరెడ్డి మధులత, ఎమ్మిగనూరుకు చెందిన యుకే సుహాసిని ఎంపికై నట్టు ఉంది. ఆకివీడు: డ్వాక్రా యానిమేటర్ల అవినీతిలో అధికారులు, బ్యాంకు అఽధికారుల భాగస్వామ్యం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సందక ఉదయ కుమారి ఆరోపించారు. స్థానిక సంఘ కార్యాలయంలో మంగళవారం ఐద్వా సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆకివీడులోని సంతపేట, సమతానగర్ ప్రాంతాల్లోని డ్వాక్రా గ్రూపు సభ్యులకు రూ. 2 కోట్ల మేర టోకరా వేసిన సంఘటనపై నేటికీ చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతితో దుర్వినియోగమైన సొమ్మును డ్వాక్రా సభ్యుల వద్ద నుంచి వసూలు చేసేందుకు ఆదేశాలివ్వడం దారుణమన్నారు. గతంలో మేము తీసుకున్న సొమ్ము మాత్రమే తిరిగి చెల్లిస్తామని, అవినీతికి గురై బ్యాంక్లో డ్రా చేసిన సొమ్ముకు మాకు సంబంధంలేదని డ్వాక్రా సభ్యులు చెప్పినా పట్టించుకోకపోవడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై పోలీస్ అధికారులు స్పందించకపోతే డ్వాక్రా సభ్యులతో జిల్లా అధికారుల కార్యాలయాలు ముట్టడిస్తామని ఉదయకుమారి హెచ్చరించారు. కార్యక్రమంలో డోకల లక్ష్మి, గేదల లావణ్య, ఎర్రా కృష్ణవేణి, బొక్కా కళ్యాణి, అర్జి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
డివైడర్ ఎక్కిన కారు
తణుకు అర్బన్: తణుకు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కారు డివైడర్ పైకి దూసుకెళ్లింది. స్థానిక శర్మిష్ట సెంటర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఉండ్రాజవరం మండలానికి చెందిన వ్యక్తి విజయవాడ నుంచి స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నిద్రమత్తులోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. డివైడర్పై ప్రమాద సూచికలు ధ్వంసం కాగా కారు ముందు భాగం నుజ్జుయింది. చికిత్స పొందుతూ మృతి మంగళగిరి టౌన్, నిడమర్రు: ఎస్సై కొట్టాడని ఓ యువకుడు పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా నిడమర్రు గ్రామానికి చెందిన నండూరి శివకార్తికేయ (38)తన మేనకోడలు బంగారం గొలుసు పోవడానికి అదే గ్రామానికి చెందిన వేణుగోపాల్ కారణమని ఆరోపించడంతో ఇరు వర్గాలు మార్చి 29వ తేదీ ఘర్షణ పడ్డారు. ఇరువర్గాలు మార్చి 30న నిడమర్రు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 31వ తేదీన నిడమర్రు బాల వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాల్లో బందోబస్తు నిర్వహిస్తున్న ఎస్సై రమేష్, పోలీస్ సిబ్బందితో శివకార్తికేయ కేసు విషయమై వాగ్వివాదానికి దిగాడు. తనపై కేసు నమోదు చేసి వేణుగోపాల్పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎస్సైను ప్రశ్నించాడు. దీంతో శివకారిక్తేయను జీపులో స్టేషన్కు తీసుకువెళ్లి ఎస్సై రమేష్ కొట్టినట్లు శివకార్తికేయ కుటుంబ సభ్యులు ఆరోపించారు. కల్యాణ మహోత్సవాల్లో అందరూ చూస్తుండగా ఎస్సై రమేష్ కొట్టాడని, విచారణ పేరుతో స్టేషన్కు తీసుకువెళ్లారని బాధితుడు శివకార్తికేయ ఏప్రిల్ 1వ తేదీన పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. శివకార్తికేయ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. పోలీసుల వేధింపులే మృతికి ప్రధాన కారణమని శివకార్తికేయ బంధువులు ఆరోపించారు. పాలకొల్లు సెంట్రల్: పోడూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హోంగార్డు రఘుమండ వెంకటరమణ (57) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విధి నిర్వహణలో భాగంగా ఆదివారం రాత్రి స్టేషన్కు వెళుతూ పాలకొల్లు మార్టేరు రోడ్డులో ఉల్లంపర్రు వద్ద ఉన్న ఓ పెట్రోల్ బంక్లో తన వాహనంలో పెట్రోలు కొట్టించుకున్నాడు. బంక్ నుంచి బయటకు వస్తుండగా ఓ కారు ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయిన రమణ తలకు తీవ్ర గాయమైంది. గాయాలపాలైన రమణను స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆశుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కొరకు భీమవరం తరలించారు. అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు తెలిపారు. రమణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
26 నుంచి చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు
● 30న రాత్రి 8 గంటల నుంచి తిరుకల్యాణం ● వచ్చేనెల 1న రథోత్సవంద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన్నవెంకన్న వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు ఈనెల 26 నుంచి వచ్చే నెల 3 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. వైఖానస ఆగమాన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో ఈ ఉత్సవాలను 8 రోజుల పాటు అట్టహాసంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో శ్రీవారికి ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామోత్సవాలను, శ్రీహరి కళాతోరణ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను వైభవంగా జరుపుతామన్నారు. అలాగే ఆలయ ముఖ మండపంలో స్వామివారు రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 26 నుంచి వచ్చేనెల 3 వరకు ఆలయంలో స్వామివారికి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. యావన్మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని, స్వామివారిని దర్శించి తరించాలని ఈఓ కోరారు. ఉత్సవాలు జరిగేదిలా.. ● ఈనెల 26 న ఉదయం 9.30 గంటలకు శ్రీవారిని పెండ్లి కుమారునిగాను, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేసి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ● 27న రాత్రి 9 గంటలకు ధ్వజారోహణ, అనంతరం హంసవాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ● 28న ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ● 29న ఉదయం 7 గంటలకు హనుమద్వాహనంపై స్వామివారి గ్రామోత్సవం, రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం, అనంతరం వెండి శేష వాహనంపై గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ● 30న ఉదయం 7 గంటలకు సింహ వాహనంపై శ్రీవారి గ్రామోత్సవం, రాత్రి 8 గంటల నుంచి శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ● వచ్చేనెల 1న రాత్రి 8 గంటల నుంచి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ● 2న ఉదయం 10.30 గంటలకు చక్రస్నానం, రాత్రి 9 గంటలకు ధ్వజావరోహణం, అనంతరం అశ్వ వాహనంపై గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ● 3న ఉదయం 9 గంటలకు చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటలకు ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపుసేవ, శ్రీపుష్పయాగం కార్యక్రమాలు జరుగుతాయి. వీటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. -
కొల్లేరు.. ఎడారి తీరు
● మాయమవుతున్న పచ్చదనం ● సముద్రపు ఉప్పునీరు కొల్లేరులోకి.. ● రెగ్యులేటర్ల నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంకై కలూరు: కోటి అందాల కొల్లేరు కళ తప్పింది. ఏప్రిల్లోనే చుక్క నీరు లేక ఎడారిని తలపిస్తోంది. పచ్చదనం మాయమైంది. కొల్లేరు పక్షులు నీటికోసం, ఆహారం కోసం అల్లాడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పర్యవేక్షణ కొరవడడంతో దక్షిణ కాశ్మీరంగా పేరొందిన కొల్లేరు కన్నీరు పెడుతోంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు వరదల సమయంలో కొల్లేరులోకి చేరుతుంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు డ్రెయిన్ల నుంచి ఎక్కువ నీరు వస్తుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది కొల్లేరులోకి నీటి ప్రవాహం తగ్గింది. దీంతో లక్షాలాది ఎకరాల కొల్లేరు భూములు బీటలు వారాయి. పర్యాటకులను ఆకర్షించే సహజసిద్ధ అందాలు నీరులేక కళావిహీనంగా తయారయ్యాయి. అలమటిస్తున్న కొల్లేరు పక్షులు కొల్లేరు సరస్సుకు ఏటా సైబీరియా, ఆస్ట్రేలియా, నైజీరియా వంటి పలు దేశాల నుంచి వలస పక్షులు విడిది కోసం వస్తాయి. మొత్తం 189 రకాల పక్షులు కొల్లేరుపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఏటా డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలలు పక్షుల సంతానోత్పత్తికి అనుకూల కాలం. కొల్లేరులో వింటర్ సీజన్ ముగిసినప్పటీకీ కొన్ని విదేశీ పక్షులతో పాటు స్వదేశీ పక్షులు కొల్లేరులోనే ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పక్షి ప్రేమికుల స్వర్గథామంగా పేరుగడించిన ఆటపాక పక్షుల కేంద్రం విహార చెరువులో కేవలం రెండున్నర అడుగుల నీరు మాత్రమే ఉంది. ప్రస్తుత ఎండలు బట్టి మరో 20 రోజుల్లో నీరు అడుగంటే ప్రమాదం ఉంది. దీంతో పక్షులకు వేసవి ఆహార కష్టాలు ఈ ఏడాది తప్పడం లేదు. రెగ్యులేటర్ల నిర్మాణం కలేనా..? కొల్లేరు సరస్సులో నిత్యం నీరు నిల్వ ఉండాలంటే రెగ్యులేటర్ల నిర్మాణమే శరణ్యమని పలు కమిటీలు తేల్చిచెప్పాయి. వైఎస్సార్సీపీ పాలనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రెగ్యులేటర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నిల్ ఇచ్చారు. ఉప్పుటేరు ముఖద్వారం, చినగొల్లపాలెం, పెదలంక డ్రెయిన్పై డబుల్ లైన్ బ్రిడ్జి. గరిసిపూడి అండర్ టెన్నల్ నిర్మాణాలకు రూ.452 కోట్లు కేటాయించారు. రెగ్యులేటర్ల నిర్మాణం జరిగితే కై కలూరు, ఆకివీడు, భీమవరం, పెడన, దెందులూరు నియోజకవర్గాలకు మేలు జరుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వం రెగ్యులేటర్ల అంశాన్ని పక్కన పడేసింది. కొల్లేరులో నీరు లేకపోవడంతో సముద్రపు ఉప్పునీరు పైకి ఎగదన్నుతోంది. దీంతో పంట పొలాలు చౌడుబారుతున్నాయి. ఇప్పటికే కై కలూరు నియోజకవర్గంలో కలిదిండి మండలం ఉప్పుటేరు పరివాహక ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల భూములు చౌడబారాయి. ప్రతి ఏటా ఏప్రిల్ నెల నుంచి మూడు నెలలు సముద్రపు నీరు కొల్లేరులో కలవడం వల్ల సరస్సులో సహజ సిద్ధంగా పెరిగే నల్ల జాతి చేపలు అంతరించిపోతున్నాయి. ఉప్పుశాతం ఎక్కువై కొల్లేరులో మట్టి బీటలు వేస్తోంది. మావులు (చేపలను పట్టే బుట్ట)ను కొల్లేరు సరస్సులో పెడుతోన్నా మత్స్యకారులకు రిక్తహస్తాలే మిగులుతున్నాయి. కొల్లేరుకు గోదావరి జలాలు మళ్లించాలి. చింతలపూడి వద్ద ఈ అవకాశం ఉంది. పోలవరం నిర్మాణం జరిగితే ఖచ్చితంగా కొల్లేరుకు నీరు వస్తుంది. అసలు కొల్లేరు సమస్యకు గుదిబండగా మారిన 120 జీవోను రద్దు చేయాలి లేదా సవరించాలి. కొల్లేరు ప్రజలతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలి. – చింతపల్లి వెంకటనారాయణ, కొల్లేరు ప్రాంత సాహితీవేత్త, కై కలూరు రెగ్యులేటర్లు నిర్మిస్తే కొల్లేరు సరస్సులో నిత్యం నీరు నిల్వ ఉంటుంది. సముద్రపు నీరు ఏటా కొల్లేరులో ప్రవేశించకుండా షెట్టర్లు మూసుకునే అవకాశం కలుగుతుంది. నిల్వ చేసిన నీటిలో 2 అంగుళాల చేప పిల్లలను వదిలితే కొల్లేరు ప్రజలకు వేట ఉంటుంది. దీంతో కొల్లేరులో వలసలు నివారించవచ్చు. వైఎస్సార్సీపీలో కేటాయించిన పనులను చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడవద్దు. – ముంగర నరసింహారావు, కొల్లేరు నాయకుడు, ఆకివీడు -
కాలువ వంతెనను ఢీకొట్టిన లారీ
తణుకు అర్బన్: తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై అదుపు తప్పిన లారీ కాలువ వంతెన రెయిలింగ్ను ఢీకొట్టి నిలిచింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. రావులపాలెం నుంచి తాడేపల్లిగూడెం వైపు వెళుతున్న లారీ తేతలి జాతీయ రహదారిపై కాల్వ వంతెన వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వంతెన రెయిలింగ్తోపాటు లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనా స్థలానికి హైవే, తణుకు రూరల్ పోలీసులు చేరుకుని ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. తణుకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంకు ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ
నరసాపురం: పట్టణంలోని 10వ వార్డులో బ్యాంకు ఉద్యోగికి చెందిన ఇంటిలో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి పెద్దమొత్తంలో బంగారం, వెండి, నగదు అపహరించుకుపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. నరసాపురానికి చెందిన జి.శ్రీనివాస్ జాతీయబ్యాంకులో పనిచేస్తున్నారు. పది రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా షిరిడీ వెళ్లారు. సోమవారం యాత్ర ముగించుకుని ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లో బీరువాలో దాచిన 18 కాసుల బంగారు నగలు, 2.50 కిలోల వెండి వస్తువులతో పాటు రూ.2 లక్షల నగదు దోచుకుపోయారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై జయలక్ష్మి సిబ్బందితో వచ్చి చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. క్లూస్టీమ్ ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై వివరించారు. -
పేకాటలో పట్టుబడ్డ ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే గన్మెన్
● గతనెల 28న భీమడోలులో పేకాట శిబిరంలో గన్మెన్ అరెస్ట్ ● పదిరోజుల తరువాత ఇప్పుడు సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు ● ఈ పదిరోజులు ఎమ్మెల్యే బడేటి వెంటే గన్మెన్ సాక్షి, టాస్క్ఫోర్స్: ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గన్మెన్ పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. పదిరోజుల తరువాత సోమవారం అతడిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు. సాధారణంగా పోలీసుశాఖలో సిబ్బంది ఏదైనా తప్పు చేసినా, క్రమశిక్షణ ఉల్లంఘించినా వెంటనే వీఆర్కు పంపడం లేదా విచారణ నిర్వహించి సస్పెండ్ చేయడం సర్వసాధారణం. కానీ ఈ కానిస్టేబుల్ విషయంలో మాత్రం పదిరోజులు ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. గతనెల 28న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గన్మెన్ శనపతి శ్రీఆంజనేయులు భీమడోలు పోలీస్స్టేషన్ పరిధిలో ఓ పేకాట శిబిరంలో పేకాడుతూ పోలీసులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు. అతడితో సహా ఎనిమిదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం గన్మెన్కు భీమడోలు పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. శాఖాపరమైన విషయం కావడంతో ఎస్పీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఎస్పీ కూడా చర్యలేమీ తీసుకోలేదు. అప్పటినుంచి గన్మెన్ ఎమ్మెల్యే వెంట అన్ని కార్యక్రమాల్లో భద్రత నిమిత్తం పాల్గొంటున్నారు. సోమవారం ఉదయం చొదిమెళ్లలో జరిగిన సాగునీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంట ఆయన కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీ ఆంజనేయులును సస్పెండ్ చేస్తూ ఎస్పీ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. -
వేప చెట్లను పరిశీలించిన శాస్త్రవేత్తలు
ఏలూరు (టూటౌన్): వివిధ మండలాల్లో పురుగు, తెగుళ్ల కారణంగా చనిపోతున్న వేప చెట్లను సోమవారం నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. బీకే లక్ష్మీ, వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. ఎన్బీవీ చలపతిరావు, ఏలూరు జిల్లా ఏరువాక కేంద్రం సమన్వయకర్త డా. కె. ఫణికుమార్ సంయుక్తంగా పరిశీలించారు. డైబ్యాక్ కారణంగా వేప చెట్లు చనిపోతున్నట్లు గుర్తించారు. డైబ్యాక్ అన్ని వయసుల వేప చెట్ల ఆకులు, కొమ్ములు, పుష్పాలను ప్రభావితం చేస్తుందన్నారు. దీని ప్రభావంతో చెట్టు పైభాగం నుంచి కిందివరకు కొమ్మలు క్రమంగా ఎండిపోతాయన్నారు. దీంతో చెట్లలో పూర్తిగా పండ్ల ఉత్పత్తి నష్టం సంభవిస్తుందన్నారు. డైబ్యాక్ ఒక ఫంగల్ రోగం అయినప్పటికీ, వేప చెట్లు కొన్నిసార్లు టీ మస్కిటో బగ్ కీటకం ద్వారా కూడా ప్రభావితమవుతాయన్నారు. డైబ్యాక్ సోకిన కొమ్ములను కత్తిరించి తొలగించాలని, తర్వాత కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా లేదా కార్బెండెజిం 1 గ్రా, ప్రోఫెనోఫాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి చెట్టు చిగురు, కొమ్మలు బాగా తడిచేలాగా పిచికారీ చేయాలని సూచించారు. -
సెల్ఫోన్ల రికవరీ
జంగారెడ్డిగూడెం: సెల్ఫోన్ చోరీ జరిగినా, పోగొట్టుకున్నా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ అన్నారు. పట్టణంలో ఆదివారం 5వ విడత కార్యక్రమంలో భాగంగా రికవరీ అయిన సెల్ఫోన్లను ఏఎస్పీ సుస్మిత , సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై ఎన్వీ ప్రసాద్లతో కలిసి బాధితుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ సమీప పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి సీఐఆర్లో నమోదు చేయించుకోవాలన్నారు. సెల్ఫోన్ ట్రేస్ కాగానే బాధితులకు అందిస్తామన్నారు. సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. సెల్ఫోన్ వినియోగించే సమయంలో పోలీస్ శాఖ నుంచి మెసేజ్లు, పోలీస్ సిబ్బంది ఫోన్ చేసి చోరీ సెల్ఫోన్ వివరాలు తెలియజేస్తే వెంటనే పోలీస్స్టేషన్లో అప్పగించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటివరకు సీఐఆర్లో 393 రిక్వెస్ట్లు నమోదయ్యాయని ఏఎస్పీ చెప్పారు. కాగా జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్డివిజన్ పరిధిలో చోరీ సెల్ఫోన్ల రికవరీ 90 శాతం ఉందని ఏఎస్పీ అన్నారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్సార్ విగ్రహ ధ్వంసం
● టీడీపీ అల్లర మూకల పనే ● ఇద్దరిపై కేసు నమోదు పెనుమంట్ర: పెనుమంట్ర మండలం ఓడూరు గ్రామంలోని అంబేడ్కర్ పార్కు వద్ద ప్రధాన రహదారి పక్కనే ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి శిలా విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన కొందరు టీడీపీ అల్లరి మూకలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు సిలువూరి హరివర్మ చేసిన ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన సాదే టోనీ, కప్పల చందు అనే యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పెనుమంట్ర ఎస్సై కె.స్వామి ఆదివారం తెలిపారు. ఈ ఇద్దరు యువకులతో పాటు మరో 18 మంది అర్ధరాత్రి పార్కులో పార్టీ చేసుకొని ఈ విగ్రహ విధ్వంసానికి పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పూర్తిస్థాయిలో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
జగ్జీవన్ సేవలు చిరస్మరణీయం
భీమవరం (ప్రకాశంచౌక్): బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, కులరహిత సమాజ స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ అని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్లో ఆదివారం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ 119వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జగ్జీవన్ చిత్రపటం వద్ద కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దళితుల హక్కుల పరిరక్షణ, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. విద్యారంగ అభివృద్ధికి కృషి విశేషమని పేర్కొన్నారు. అనంతరం జగ్జీవన్ జీవిత విశేషాలపై ముద్రించిన కరపత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఆయన జీవితంపై రూపొందించిన వీడియోను ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్వీ అరుణకుమారి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి బాబు, ఆర్డీఓ కె.ప్రవీణ్కుమార్రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పుష్పరాణి, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎన్.వెంకటేశ్వరరావు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పెద్దిరాజు, ఆశాజ్యోతి, రాజశేఖర్, అధికారులు పాల్గొన్నారు. స్ఫూర్తిప్రదాత జగ్జీవన్రామ్ : ఎస్పీ అస్మి అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన సామాజిక విప్లవకారుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ స్ఫూర్తిప్రదాత అని జిల్లా ఎస్పీ అద్నాన్ న యీం అస్మి అన్నారు. జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, మహిళా ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) ఈ.ఇందుమతి, ఆర్ఎస్సై కె.గోపి కృష్ణ పాల్గొన్నారు. -
మండే ఎండ.. అప్రమత్తతే అండ
● వేసవి వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యలు ● అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు భీమడోలు: ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గత ఏడాది కన్నా ఈ ఏడాది గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వచ్చే కొన్ని రోజులు వేడి గాలులతో పాటు ఉక్కపోత పెరిగి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయనుంది. సాధారణంగా మే నెల తొలి వారంలో పెరగాల్సిన ఉష్ణోగ్రతలు, ఎల్నినో ప్రభావంతో ఏప్రిల్ మొదటి వారంలోనే పెరిగాయి. జిల్లాలో 35 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావడం వేసవి తీవ్రతకు అద్దం పడుతోంది. వడదెబ్బ ప్రభావంపై విస్తృత ప్రచారం దీనివల్ల రెక్కల కష్టంపై బతికే బడుగుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోంది. వృద్ధులు, చిన్నారులు, మహిళలు, రోగులు, శ్రమజీవులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారంతా అనారోగ్యానికి గురై వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో వడదెబ్బకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పీహెచ్సీలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందుబాటులో ఉంచి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వేసవి దృష్ట్యా మానవుని శరీరంలో సంభవించే ఉష్ణోగ్రతలను తట్టుకోవడం లేదా నియంత్రించే శక్తి విఫలం కావడం వల్లే ఈ వడదెబ్బ సంభవిస్తుంది. శరరంలో లవణాలు కోల్పోవడంతో దుష్ఫరిణామాల వల్ల ప్రాణాంతకం కావచ్చు. అంతర్గత అవయవాలు సక్రమంగా పనిచేయక మరణం సంభవించవచ్చు. సత్వరం చికిత్స తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. వీటితో పాటు నీటి లోపం, జీర్ణ సంబంధ వ్యాధులు, దోమల ద్వారా వచ్చే వ్యాధులు, చర్మ సమస్యలు, మూత్ర సంబంధ సమస్యలు, తలనొప్పి, ఎలక్ట్రోలైట్ లోపం వల్ల కలిగే మూర్ఛల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డయాబెటిస్, కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎల్నినోనే కారణం ఈ వాతావరణ హెచ్చుతగ్గులకు ఎల్నినో ప్రభావమే కారణమని అధికారులు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్ర జలాలు వేడెక్కడం వల్ల ఏర్పడే ఈ ప్రక్రియ కారణంగా ఈ వేసవి గతంలో కంటే ఎక్కువ తీవ్రంగా ఉంటుందని, వర్షాలు సైతం ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయని వివరిస్తున్నారు. వడదెబ్బ లక్షణాలు – జాగ్రత్తలు వడదెబ్బ తగిలితే శరీర ఉష్ణోగ్రత అమాంతంగా పెరిగిపోవడం, చెమట పట్టకపోవడం, వణుకు, పాక్షికంగా ఫిట్స్ రావడం, అపస్మారక స్థితికి చేరుకోవడం జరుగుతుంది. మగత నిద్ర, కలవరింతలు, పెదవులు తడిబారిపోవడం వంటివి కనిపిస్తాయి. అలాంటి వ్యక్తికి వీలైనంత త్వరగా ప్రాథమిక చికిత్స అందించాలి. వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి చేర్చి గాలి తగిలేలా చూడాలి. శరీరం సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చే వరకు తడి వస్త్రంతో తుడవాలి. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా ఓఆర్ఎస్ తాగించాలి. అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు తాగించరాదు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి. నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● ఎండలో వెళ్లేటప్పుడు తప్పనిసరిగా టోపీ, గొడుగు లేదా తలపాగా ధరించాలి. ● తేలికపాటి నూలు (కాటన్) వస్త్రాలు ధరించడం మంచిది. ● వేడి గాలి ఇంట్లోకి రాకుండా కిటికీలకు పరదాలు లేదా గోనె సంచులు అడ్డుగా కట్టాలి. ● ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలి. ● రోజుకు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలి. చేయకూడనివి ● మధ్యాహ్నం వేళ ఎండలో ఎక్కువగా తిరగరాదు. ● మద్యం సేవించరాదు. ● రోడ్లపై అమ్మే రంగు పానీయాలు, కలుషిత ఆహార పదార్థాలను తినరాదు. ● మాంసాహారం తగ్గించి, తాజా కూరగాయలు తీసుకోవాలి. ● పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమలు లేకుండా చూసుకోవాలి. పీహెచ్సీ పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాం. పంచాయతీల్లో వీటిని అందుబాటులో ఉంచాం. బీపీ, సుగర్ వ్యాధిగ్రస్తులు ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. – ఆర్.జాహ్నవి కృష్ణ, వైద్యాధికారిణి, గుండుగొలను వేసవిలో వడదెబ్బతో పాటు విరోచనాలు, ఫుడ్ పాయిజనింగ్, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగరాదు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నాం. –జేఎం సాయి, జనరల్ మెడిసిన్, సీహెచ్సీ, భీమడోలు -
● నేత్రపర్వంగా రాట్నాలమ్మ ఉత్సవాలు
దెందులూరు: పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారిని రాజరాజేశ్వరిదేవిగా అలంకరించారు. ఉదయం అమ్మవారికి విఘ్నేశ్వర పూజ, నవగ్రహ మండపార్చన తదితర పూజ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ నిర్వహించారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, జడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హరే శ్రీనివాస కోలాటం రాయుడుపాలెం, రత్నాలకుంట, వారిచే కోలాట ప్రదర్శన నిర్వహించారు. ఆలయం వద్ద మహా అన్నసమారాధన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి కమిటీ చైర్మన్ మన్నే శ్రీనివాసరావు, ఈవో ఎన్.సతీష్ కుమార్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుంటున్న కొఠారు అబ్బయ్య చౌదరి అన్నసమారాధన రాజరాజేశ్వరిగా దర్శనమిచ్చిన అమ్మవారు -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నిడమర్రు: మండలంలోని పత్తేపురంలో లాల్ బహుదూర్ శాస్త్రి ఓరియంటల్ (పాచ్య) కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. 1967 నుంచి 1994 మధ్య కాలంలో ఇక్కడ చదువుకున్న సుమారు 135 కుటుంబాలు ఈ వేడుకలో పాల్గొన్నాయి. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి మూర్తిరాజుకు నివాళులర్పించిన అనంతరం అప్పటి అనుభూతులను నెమరు వేసుకొన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తమ గురువులను ఘనంగా సన్మానించుకున్నారు. గ్రూప్ ఫొటోలు దిగారు. క్షేమ సమచారం తెలుసుకున్నారు. మృతి చెందిన గురువులను గుర్తించుకుని నివాళులర్పించారు. ప్రస్తుతం కళాశాల అక్కడ లేకపోయినా, తమ గుండెల్లో ఆ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయని వారు భావోద్వేగానికి లోనయ్యారు. ఆదివారం గ్రామమంతా పండిత శ్రేష్టులతో పులకించింది. -
రైలు ప్రమాదంలో సీఐఎస్ఎఫ్ ఎస్ఐ మృతి
ఏలూరు టౌన్: ఏలూరు నగరానికి చెందిన గోపిరెడ్డి హేమంత్ సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్ రైలులో ప్రయాణిస్తూ ఉండగా.. మధ్యలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతిచెందారు. హేమంత్ భౌతికకాయాన్ని నేడు ఏలూరు పత్తేబాదలోని ఆయన స్వగృహానికి తీసుకురానున్నారని బంధువులు తెలిపారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిపారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. చాట్రాయి: చాట్రాయి ఆర్సీఎం స్కూల్లో ఆదివారం నగదు చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్కూలు సిబ్బంది జీతాల కోసం రూ.2 లక్షలు స్కూలు యాజమాన్యం ఆఫీసు రూంలో పెట్టి తాళం వేసి ఈస్టర్ పండుగను జరుపుకున్నారు. సాయంత్రం చర్చి నుంచి ఆఫీసుకు రాగా తాళాలు పటలకొట్టి రూ.2 లక్షల నగదును దొంగిలించారు. దీంతో యాజమాన్యం స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. నూజివీడు డీఎస్పీ వీఎన్వీ ప్రసాదు, సీఐ, ఎస్ఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
బుట్టాయగూడెం: శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గిరిజన యువకులు మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జీలుగుమిల్లి మండలం తాటిరామన్నగూడెంకు చెందిన మడకం సంతోష్ (19), పండు సందీప్ (20) తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం చిచ్చోడుగుంటలో వేడుకకు హాజరై ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా, గాండ్లగూడెం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అశ్వారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సందీప్, సంతోష్ల మృతితో తాటిరామన్నగూడెంలో విషాద చాయలు అలముకున్నాయి. భీమడోలు: పొలసానిపల్లి పంచాయతీ శివారు ఆంజనేయనగరం గ్రామంలో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు, రూ.68 వేల నగదు దోచుకెళ్లారు. బాధితుడు ముత్తంశెట్టి మణికంఠ తన కుటుంబసభ్యులతో కలిసి ఇంటి వరండాలో నిద్రపోతుండగా, దొంగలు వెనుక తలుపు తీసి లోపలికి ప్రవేశించారు. బీరువా పగులగొట్టి అందులో ఉన్న రెండు కాసుల బంగారు తాడు, చెవిదిద్దులు, నగదును అపహరించారు. ఆదివారం తెల్లవారుజామున నిద్రలేచిన మణికంఠ చోరీ జరిగినట్లు గుర్తించి భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ఎస్.కే. మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం: కుక్క కాటుకు గురై సరైన సమయంలో చికిత్స తీసుకోకపోవడంతో సుంకర పోసిబాబు (37) అనే వ్యక్తి రేబిస్ వ్యాధితో మరణించాడు. పట్టణంలోని అంబికా రెస్టారెంట్ రోడ్డులో హోటల్ నడుపుతున్న పోసిబాబును ఆరు నెలల క్రితం కుక్క కరిచింది. ఈ నెల 3న ఆయనలో రేబిస్ లక్షణాలు కనిపించాయి. ఇది గమనించిన భార్య, కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ మంచినీటిని చూసి బిగుసుకుపోతున్నాడు. వైద్యులు ముఖంపై నీళ్ళు చల్లినప్పటికీ మరింతగా బెదిరిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే రాజమండ్రి, ఆపై కాకినాడ ఆసుపత్రులకు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. శనివారం సాయంత్రం ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడికి భార్య అనంతలక్ష్మి, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. ఎస్సై ఎన్.వి. ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుట్టాయగూడెం: మండలంలోని కామవరం అటవీ ప్రాంతంలో వెలసిన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. లారీలు, మినీ వ్యాన్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణ ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ తల్లికి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి భీమవరంనకు చెందిన ఆలయ మాజీ ధర్మకర్త వడ్డీ సుబ్బారావు కుమారుడు వడ్డీ దివ్య శ్రీవీర వెంకట శ్రీకాంత్ దంపతులు 10 గ్రాముల బంగారం, మోటూరుకి చెందిన కారిచర్ల ఉషశ్రీ 7 గ్రాముల బంగారం సమర్పించారు. దాతలకు ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆశీర్వచనాలు అందించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు దాతలకు అమ్మవారి ఫొటో, ప్రసాదం అందజేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు. -
స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం
భీమడోలు: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. భీమడోలు మానస పాఠశాలలో ఆదివారం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికిల్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ క్యాంపులోని పలు విభాగాలను వాసుబాబు, మానవత జిల్లా అధ్యక్షుడు కండేపు వెంకట సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయవాడ మణిపాల్ ఆసుపత్రి గుండె, క్యాన్సర్ ఆసుపత్రి, సరస్వతి ఎముకల ట్రామా కేర్, వేమగిరి కంటి వైద్య ఆసుపత్రిలకు చెందిన వైద్యులు వచ్చి రోగులకు వైద్య పరీక్షలు చేశారు. ఆయన విభాగాల్లో రోగులకు చేస్తున్న పరీక్షలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతగానో మేలు చేస్తాయన్నారు. సేవాభావంతో మానవత సంస్థ చేస్తున్న మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వారిని అభినందించారు. 350 మంది రోగులకు పలు పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. 47 మందికి కళ్లజోళ్లు వేశారు. ఏడుగురికి కంటి ఆపరేషన్లకు రిఫర్ చేశారు. 65 మందికి గుండె పరీక్షలు చేశారు. మహిళలకు గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఎముకల వైద్య నిపుణులు అక్కెం నరేష్, తాజా మాజీ సర్పంచ్ పాము సునీతామాన్సింగ్, పాఠశాల ప్రిన్సిపల్ యలమర్తి రవీంద్రకుమార్, వైఎస్సార్సీపీ నాయకులు రామిశెట్టి గంగాధర్, పంచకర్ల సత్యనారాయణ, చిలపర్తి ఆదినారాయణ, గోనుగుంట రమణ శంకర్, పసుపులేటి సాంబశివరావు, తుమ్మల ఉమామహేశ్వరరావు, ఉన్నమట్ల సత్యనారాయణ, చిలపర్తి రామారాయుడు తదితరులు పాల్గొన్నారు. -
సాగునీరు విడుదల
దెందులూరు: ‘కొవ్వలిలో సాగుకు నీటి గండం’ శీర్షిక న ‘సాక్షి’లో గత బుధవా రం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. దా దాపు 350 ఎకరాలు వరి పొలాలు పూర్తి స్థాయిలో సాగునీరు అందకపోవడంతో ఈనిపొట్ట దశలో ఉన్న పొలాల భూ ములు బీటలు వారాయి. సాగు చేసే రైతులు కన్నీట పర్యంతమవుతున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి కాలువ ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ సుబ్రమణ్యం పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేశారు. గోదావరి కాలువ నుంచి కొవ్వలిలో సాగు భూములకు నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకున్నారు. తణుకు అర్బన్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సీనియర్ నాయకురా లు, సీపీఐ మాజీ ఎమ్మె ల్యే వంక సత్యనారాయ ణ సతీమణి, ప్రస్తుత ఎ మ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాతృమూర్తి వంక నాగమణి (95) తణుకులోని ఆమె స్వగృహంలో ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె భర్త వంక సత్యనారాయణ గతంలోనే మృతి చెందారు. కుమారులు రామదాస్, మోహన్, రవీంద్రనాథ్, కుమార్తెలు అరుణ, సీతామహాలక్ష్మి ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): పుస్తక పఠనం ద్వా రా జ్ఞానం వస్తుందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ప్రకృతి క్షేత్రపాలకులు మధుసూదనరావు కలెక్టర్ను కలిసి ఎదిగే ఆడపిల్ల ఏమి తెలుసుకోవా లి?, గాంధీ మహాత్ముని దృష్టిలో విద్య– పర్యా వరణం/పరిశుభ్రత అనే రెండు పుస్తకాలను సుమారు 300 ప్రతులను డీఈఓకు అందజేశారు. వీటిని హైస్కూల్ విద్యార్థులకు అందించాలని కోరారు. డాక్టర్ మీసరగండ రమాదేవి రచించిన ఎదిగే ఆడపిల్ల ఏమి తెలుసుకోవాలి? పుస్తకం యుక్త వయసు బాలికలకు అవసరమైన వ్యక్తిగత అవగాహన పెంచేందుకు దో హదపడుతుందన్నారు. కోడూరి శ్రీరామమూర్తి రచించిన గాంధీ మహాత్ముని దృష్టిలో విద్య – పర్యావరణం/ పరిశుభ్రత పుస్తకం ద్వారా పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించవచ్చని చెప్పారు. భీమవరం (ప్రకాశంచౌక్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) ఆధ్వర్యంలో భీమవరం ఎంపీడీఓ కార్యాలయంలో ఈనెల 8న ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీ, జగదీశ్ మైరెన్ ఎక్స్పోర్ట్స్, కియా మో టార్స్, జెస్పర్ మోటర్స్, ఇన్నోవా సోర్స్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.లోకమాన్ తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ 9440838388, 8688594244 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలకు ఆదివారం 1,167 మంది విద్యార్థు లు హాజరయ్యారు. ఏలూరులోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో ఉదయం 127 మందికి 119, మ ధ్యాహ్నం 121 మందికి 111 మంది హాజరయ్యారు. తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 181 మందికి 175 మంది, మధ్యాహ్నం 179 మందికి 172 మంది హా జరయ్యారు. శశి ఇంజనీరింగ్ కళాశాలలో ఉ దయం 116 మందికి 111 మంది, మ ధ్యాహ్నం 105 మందికి 102 మంది హాజర య్యారు. భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 99 మందికి 98 మంది, మ ధ్యాహ్నం 100 మందికి 95 మంది హాజరయ్యారు. డీఎన్ఆర్ కళాశాలలో ఉదయం 98 మందికి 95 మంది, మధ్యాహ్నం 93 మందికి 89 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. -
మిర్చి దిగుమతుల జోరు
తాడేపల్లిగూడెం రూరల్: తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డుకు ఎండుమిర్చి దిగుమతులు వస్తున్నాయి. శ్రీరామనవమి ఉత్సవాలు ముగియడంతో భారీగా మిర్చి ఈ మార్కెట్ యార్డుకు చేరుకుంటుంది. రాముని కల్యాణం తర్వాతే కొత్త పచ్చళ్లు పట్టేందుకు ఎక్కువగా ప్రజలు మక్కువ చూపుతుంటారు. దీంతో ప్రధానంగా ఖమ్మం, వేలేరుపాడు, వరంగల్, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, కొయ్యలగూడెం, దేవరపల్లి, కొవ్వూరు ప్రాంతాల నుంచి మిర్చి ఇక్కడకు దిగుమతి చేస్తున్నారు. గతంలో గుంటూరు నుంచి కూడా ఎండుమిర్చి వచ్చేది. అయితే, అక్కడ మార్కెట్ పుంజుకోవడంతో ఆ ప్రాంతాల నుంచి మిర్చి దిగుమతులు తగ్గాయి. తాడేపల్లిగూడెం మార్కెట్కు ప్రధానంగా దేశవాళీ, ఉత్తరాది ఎండుమిర్చి రకాలు దిగుమతి అవుతుంటాయి. పచ్చళ్లు, నిల్వ కారానికి ఈ ఎండుమిర్చిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీంతో ఇక్కడి వ్యాపారులు సైతం ఈ మిర్చి కొనుగోలుకు ఆసక్తి చూపుతుంటారు. ఆయా ప్రాంతాల్లో దిగుబడులు తగ్గడంతో మార్కెట్కు ఎండుమిర్చి దిగుమతి గతంలో పోల్చుకుంటే తగ్గిందని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎండుమిర్చి ధర పెరిగిందని చెబుతున్నారు. దేశవాళీ రకం కిలో రూ.400 నుంచి రూ.450కు విక్రయిస్తున్నారు. ఉత్తరాది రకాలు కిలో రూ.700 వరకు ధర పలుకుతున్నాయి. ఆవకాయ సీజన్ కావడంతో ఈ ప్రాంత వాసులు ఘాటు తక్కువగా ఉన్న ఉత్తరాది రకాలను వినియోగిస్తారు. ధర జాస్తిగా ఉండటంతో కొనుగోలుదారులు ముందుకు రావడం లేదని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మార్కెట్కు వచ్చే సరికి కల్తీ జరుగుతుందని భావించిన పలువురు కొనుగోలుదారులు నేరుగా రైతుల వద్దకు వెళ్లి పచ్చడి కారం మిర్చిని కొనుగోలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ కారణంగానే మార్కెట్ వద్ద కొనుగోళ్లు తగ్గాయని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. ఉత్తరాది ఎండుమిర్చి రకం వరంగల్ సన్నాల రకం గూడెం ఏఎంసీకి ఎండుమిర్చి రాక పంట తగ్గడంతో పెరిగిన ధరలు కిలో రూ.450 నుంచి రూ.700 వరకు ధర ధర ఆశాజనకంగా ఉందంటున్న రైతులు కొనుగోళ్లు లేవంటున్న వ్యాపారులు ఎకరం పంటకు పది క్వింటాళ్ల వరకు దిగుబడి రావా ల్సి ఉంది. మొదటి కోతలో మూడు క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. మరో రెండు కోతల పంట రావాల్సి ఉంది. అయితే, ఎంత వస్తుందనేది తెలియని పరిస్థితి. గతంలో పోల్చుకుంటే దిగుబడులు తగ్గాయి. దీనికి తోడు పెట్టుబడులు పెరిగాయి. – పల్లా వెంకటరమణ, రైతు, వేలేరుపాడు మండలం ఎండుమిర్చి కొని, ఆడించేందుకు 75 శాతం మంది వినియోగదారులు ఆసక్తి చూ పడం లేదు. ప్యాకెట్ కారానికి అలవాటు పడ్డారు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు తక్కువ నాణ్యత కలిగిన మిర్చిని కొనుగోలు చేసి కారాన్ని ఆడిస్తున్నారు. రంగు ఆకర్షణీయంగా ఉండటంతో వాటినే వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. –ప్రగడ శ్రీను, వ్యాపారి, తాడేపల్లిగూడెం -
బాధితుల ఇళ్లకు వెళ్లి సెల్ఫోన్ల అందజేత
భీమడోలు: భీమడోలు పోలీసులు ఆదివారం వినూత్న సేవా కార్యక్రమం చేపట్టారు. గతంలో సెల్ఫోన్లు పోగొట్టుకున్న బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి రికవరీ చేసిన సెల్ఫోన్లను వారికి అందించారు. భీమడోలు ఎస్సై ఎస్కే మదీనా బాషాతో కలిసి సీఐ వి.కృష్ణలు ఆర్జావారిగూడెంలోని ఇద్దరు బాధితుల గృహాల వద్దకు వెళ్లి వాటిని అందించగా, వారంతా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖలోని పలు విభాగాల పనితీరు, ఆన్లైన్ విధానం గురించి వారికి సీఐ అవగాహన కల్పించారు. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి ఫోన్లు వెతికి పట్టుకుని వాటిని తమకు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఫోన్లు పొగొట్టుకుంటే తిరిగి రాదనే ఆపోహ ఉండేదని, కానీ పోలీసు ఉన్నతాధికారులే తమ ఇళ్లకు వచ్చి వాటిని అందజేయడం వారి పనితీరుకు నిదర్శనమన్నారు. సీఐ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యి మొబైల్ ఫోన్లు ఎస్పీ కేపీఎస్ కిషోర్ ఆదేశాల మేరకు బాధితులకు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నరసాపురం రూరల్: స్థానిక కెనాల్ రోడ్డులో కొలువై ఉన్న శ్రీ సత్తెమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 3న శుక్రవారం నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు సోమవారంతో ముగియనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించే కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి డప్పు వాయిద్యాలు, పోతురాజుల నృత్యాలు, డీజే పోగ్రామ్లతో భక్తుల కోలాహలం మధ్య అమ్మవారి స్నానాల కార్యక్రమం అత్యంత వైభవంగా చేశారు. -
పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మను దర్శించుకున్నారు. మహిహిళలు పాల పొంగళ్లు సమర్పించారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవారికి తలనీలాల మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్ర పటాల అమ్మకం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.1,15,082 వచ్చిందని తెలిపారు. -
అప్సడా రిజిస్ట్రేషన్లు వేగిరపర్చాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో అప్సడా రిజిస్ట్రేషన్లను నూరు శాతం త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో మత్స్య, డ్వామా, పంచాయతీరాజ్ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. భీమవరం, కాళ్ల, మొగల్తూరు, నర సాపురం, ఆకువీడు మండలాల్లో రిజిస్ట్రేషన్ల ప్రగతి తక్కువగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వీఏఎస్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటివరకు 76,540 ఎకరాల విస్తీర్ణంలో రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా, మిగిలిన 29,018 రిజిస్ట్రేషన్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. మడ అడవులు ఉన్న దర్భరేపు, బియ్యపు తిప్ప, వేములదీవి ప్రాంతాల్లో ఆక్వా చెరువుల తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వవద్దని ఆదేశించారు. రేపటి నుంచి ‘నీటి భద్రత’ : రాష్ట్రవ్యాప్తంగా నీటి భద్రత–సాగు నీటి సంఘాల బాధ్యత పేరుతో 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని సోమవారం నుంచి ప్రారంభించనున్నట్టు కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లాలో సంబంధిత శాఖల అధికారులు ఆదివారం సీఎం నిర్వహించే టెలీ కాన్ఫరెన్స్లో భాగస్వామ్యం కావాలని సూచించారు. -
నిబంధనలు మీరితే చర్యలు
సాక్షి, భీమవరం: విద్యాహక్కు చట్టం ఆర్టీఈ 12(1)(సి) అమలులో ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ పి.శ్యాంసుందర్ హెచ్చరించారు. ‘ఉచిత విద్య.. అంతా మిథ్య’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన మాట్లాడారు. జిల్లాలో తొలి విడతగా 1,047 మంది పేద విద్యార్థులు ఉచిత ప్రవేశాలకు అర్హత పొందారన్నారు. ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రభుత్వం వీరికి 25 శాతం రిజర్వేషన్ కింద ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. ఈనెల 7వ తేదీలోగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆదాయం, కులం, ఆధార్, తదితర సర్టిఫికెట్లతో పాటు ఆన్లైన్ దరఖాస్తును తమకు కేటాయించిన పాఠశాలల్లో అందజేసి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. భీమవరం (ప్రకాశంచౌక్): పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్లో గత నవంబర్ 1 నుంచి మార్చి 31 వరకు పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కార ప్రగతిపై సమీక్షించారు. 13,738 ఫిర్యాదులకు 13,006 పరిష్కరించగా వాటిలో సమగ్రంగా పరిష్కరించని 732 ఫిర్యాదులను ఫ్రీ ఆడిట్ టీం ద్వారా గుర్తించామన్నారు. జిల్లా అధికారులు ప్రతి రోజు ఒక గంట అర్జీల పరిష్కారానికి కేటాయించాలని సూచించారు. జిల్లా స్వర్ణ, గ్రామ వార్డు అధికారి వై.దోసిరెడ్డి, నరసాపురం ఆర్డీఓ దాసిరాజు, జిల్లా పంచాయతీ శాఖ అధికారి ఎం.రామనాథరెడ్డి, జిల్లా వైద్యారోగ్య అధికారి జి.గీతా బాయి పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరుకు చెందిన చిత్రకారుడు మజ్జి సూర్య కాంతారావు జాతీ య స్థాయిలో మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. శనివారం చైన్నె లలిత కళా అకాడమీ ఆర్ట్ గ్యాలరీలో శ్రీ ధరిణి కళైకూడమ్ (కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన 21వ నేషనల్ కాంపిటీషన్ అండ్ ఎగ్జిబిషన్లో ప్రతిష్టాత్మక జ్యూరీ అవార్డు అందుకు న్నారు. ఆయన గీసిన చిత్రాల్లోని సృజనాత్మక త, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే శైలి జ్యూరీ సభ్యులను విశేషంగా ఆకట్టుకుంది. ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని ఏలూరు జిల్లా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ఎస్ హరనాథ్ ప్రకటనలో డిమాండ్ చేశారు. ముఖ్యంగా 2022 నుంచి 2026 వరకు ఉన్న సరెండర్ లీవ్స్ బకాయిలు, మూడు డీఏలు,11 పీఆర్సీ అరియర్స్ ఇవ్వాలని కోరారు. 12 పీఆర్సీ కమిటీని వెంటనే నియమించి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలకు శనివారం 1,147 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏలూరులోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో ఉదయం 123 మందికి 110 మంది, మధ్యాహ్నం 116 మందికి 111 మంది హాజరయ్యారు. తాడేపల్లిగూడెం వా సవి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 184 మందికి 180 మంది, మధ్యాహ్నం 181 మందికి 174 మంది హాజరయ్యారు. శశి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 116 మందికి 112 మంది, మధ్యాహ్నం 97 మందికి 93 మంది హాజరయ్యారు. భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 100 మందికి 92 మంది, మధ్యాహ్నం 100 మందికి 92 మంది హాజరయ్యారు. డీఎన్నార్ కళాశాలలో ఉదయం 97 మందికి 95 మంది, మధ్యాహ్నం 96 మందికి 88 మంది హాజరయ్యారు. -
రైతు సేవా కేంద్రాలపై నిర్లక్ష్యం తగదు
ఏలూరు (టూటౌన్): గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన రైతు సేవా కేంద్రాల నిర్మాణాలను కూటమి సర్కారు పూర్తిచేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. ఏలూరు జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 488 కేంద్రాలను మంజూరుచేయగా గత ప్రభుత్వంలోనే 217 కేంద్రాలు వినియోగంలోకి రాగా.. 138 కేంద్రాల పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి రెండేళ్లు కావస్తున్నా చిన్నపాటి పనులను పూర్తిచేయకుండా కాంట్రాక్టర్లు జాప్యం చేస్తున్నారని, ప్రభుత్వం దృష్టి పెట్టి పనులు వేగవంతం చేయాలని కోరారు. ఏలూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఒక పేషెంట్ ప్రతి విభాగానికి వేరే ఓపీ కార్డు తీసుకోవాలనే నిబంధనతో సత్వర సేవలు అందడం లేదని, పలుమార్లు ఓపీ కోసం క్యూలలో నిలవలేక రోగులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ విధానాన్ని వెంటనే మార్చాలని కోరారు. బుట్టాయగూడెం ఆరోగ్య కేంద్రంలో జనరల్ సర్జన్, జనరల్ ఫిజీషియన్ 8 నెలలుగా లేకపోవడంతో ప్రజలకు సేవలందడం లేదన్నారు. మన్యం ప్రాంతం కొయిదా, కుక్కునూరు, అమరవరం ప్రాథమిక ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో వైద్యులు లేరని, డిప్యూటేషన్పై ఒకరు అరకొరగా వచ్చి వైద్యం చేయడంతో ప్రజలకు సకాలంలో సేవలు అందడం లేదన్నారు. పెదపాడు మండలంలో నిడమర్రు ప్రాంతంలో రెండు పీహెచ్సీలు, 12 సబ్ సెంటర్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, మరమ్మతులు చేయించాలని కోరారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా గత ప్రభుత్వం అన్ని పంచాయతీలకు రిక్షా బళ్లు ఇవ్వగా, ప్రస్తుతం చిన్నపాటి మరమ్మతులు చేయకుండా వీటిని మూలన పడేశారన్నారు. అన్ని విషయా లపై చర్యలు తీసుకుంటామని, స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా రిక్షాలను బాగు చేయిస్తా మని ఇంచార్జ్ మంత్రి మనోహర్ హామీ ఇచ్చారు . జీలుగుమిల్లిలో బస్షెల్టర్ను రోడ్డు విస్తరణలో తొలగించాలని, అయితే తిరిగి నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు ఇ బ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ -
జెడ్పీటీసీలకు లక్షల్లో బకాయిలు
దెందులూరు: పేరుకే జెడ్పీటీసీసలమని.. గౌరవం వేతనం లేదని పలువురు జెడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలం నుంచి ఒకరు జెడ్పీటీసీగా ఎన్నికవుతారు. జిల్లాలో 48 మంది జెడ్పీటీసీలున్నారు. ఒక్కొక్కరికి నెలకు గౌరవ వేతనంగా రూ.6000 ప్రభుత్వం కేటాయించింది. 36 నెలలుగా ఒక్కొక్కరికి సుమారు 2.18 లక్షలు రావాల్సి ఉంది. మొత్తం 48 మంది జడ్పీటీసీ సభ్యులకు కలిపి రూ. 1.03 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. ఆరు నెలలు మాత్రమే గౌరవ వేతనం మంజూరు చేశారంటున్నారు. జిల్లా పరిషత్ అధికారులు జెడ్పీటీసీ గౌరవ వేతనం బిల్లులు మంజూరుకు రెండు మూడుసార్లు ప్రభుత్వానికి పంపారని, బిల్లులకు సంబంధించి నిధులు మంజూరు కాలేదు. 2026 సెప్టెంబర్ 30 వరకు జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ఉందని, ఇంకెప్పుడు ప్రభుత్వం గౌరవం వేతనం మంజూరు చేస్తుందని జెడ్పీటీసీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో సంవత్సరానికి జిల్లాకు వివిధ పనుల నిమిత్తం కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్న ప్రభుత్వం ప్రజల నుంచి ఎన్నికై న జెడ్పీటీసీ సభ్యులకు గౌరవం వేతనం ఎందుకు పెండింగ్లో పెడుతున్నారని అడుగుతున్నారు. బయటి వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా ఇబ్బందిగా ఉందని పలువురు జెడ్పీటీసీలు వాపోతున్నారు. జిల్లా పరిషత్ అధికారులు ఒకటికి రెండుసార్లు బిల్లులు పెట్టినా ఎందుకు మంజూరు చేయడం లేదని, పెండింగ్ ఎందుకు పెడుతున్నారని అంటున్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. తమకు అందించే గౌరవ వేతన విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రం సరైనది కాదని జెడ్పీటీసీలు అంటున్నారు మంజూరుకు నోచుకోని బిల్లులు -
తిరుమల పవిత్రతను కాపాడాలి
హిజ్రాల రౌడీయిజం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో కొందరు హిజ్రాల రుబాబు రోజురోజుకు పెచ్చుమీరుతోంది. పోలీసులను కూడా వారు లెక్కచేయడం లేదు. 8లో uక్రైస్తవ విశ్వాసులు ఈస్టర్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. మృతిచెందిన తమ వారి సమాధులను సుందరంగా అలంకరించారు. 8లో uఆదివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి, భీమవరం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లాలో నిరసనలు చేపట్టారు. నాయుడు రాసలీలలు వెలుగుచూసినా తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఆ దిశగా చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదని పార్టీ శ్రేణులు ధ్వజమెత్తారు. వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు నిర్వహించి వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు చేశారు. ● తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు నేతృత్వంలో పార్టీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. పార్టీ కార్యాలయం వద్ద నుంచి వేంకటేశ్వరస్వామి వారి ఆలయానికి చేరుకుని స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వెలుపల నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి వారి ఆలయానికి బీఆర్ నాయుడు వంటి వ్యక్తి చైర్మన్గా ఉండేందుకు అర్హుడు కాదన్నారు. వెంటనే ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కొట్టు నాగేంద్ర, లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబా రెడ్డి, పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారామ్ తదితరులు పాల్గొన్నారు. ● తాడేపల్లిగూడెం కో–ఆర్డినేటర్ వడ్డి రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో పట్టణంలోని పార్టీ కార్యా లయం నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పుంతలో ముసలమ్మ ఆలయం వరకు పాదయాత్ర చేశారు. ఆలయంలో పూజలు నిర్వహించారు. రఘురాం మాట్లాడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం పనితీరు ఉందని మండిపడ్డారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే బీఆర్ నాయుడు వంటి వ్యక్తికి పవిత్ర టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం దారుణమని విమర్శించారు. జిల్లా నాయకులు గుండుబోగుల నాగు, గొర్రెల శ్రీనివాస్, మాకరాజు సతీష్, కై గాల శ్రీనివాస్, పొణుకుమాటి శేషులత తదితరులు పాల్గొన్నారు. ● పాలకొల్లులో బీఆర్ నాయుడు రాజీనామా చేయా లని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) యడ్ల తాతాజీ, ఎస్సీ కమిషన్ మాజీ డైరెక్టర్ చెల్లెం ఆనందప్రకాష్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్రా జయసరిత, రాష్ట్ర అంగన్వాడీ విభాగం ప్రధాన కార్యదర్శి మద్దా చంద్రకళ పాల్గొన్నారు. సద్బుద్ధి ప్రసాదించు స్వామీ ! టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారంపై ఆగ్రహం నాయుడు రాసలీలలు వెలుగుచూసినా చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదని ధ్వజం జిల్లాలో వైఎస్సార్సీపీ నిరసనలు వేంకటేశ్వరస్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు కళంకంగా మారిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును ఆ పదవి నుంచి తక్షణమే తొలగించాలి. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఆయన్ను పదవిలో కొనసాగించడం దౌర్భాగ్యం. బీఆర్ నాయుడు రాసలీలల వ్యవహారం బయటకు వచ్చినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటూ శ్రీవారి పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరిస్తోంది. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ మంత్రి టీటీడీ పవిత్రతకు భంగం కలిగించేలా, నైతికంగా దిగజారి ప్రవర్తిస్తున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే పదవికి రాజీనామా చేయాలి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆయన ప్రవర్తించడం సిగ్గుచేటు. బీఆర్ నాయుడు అశ్లీల కార్యక్రమాలు బహిర్గతమైనా సీఎం పట్టించుకోకపోవడం సబబు కాదు. ఇలాంటి వ్యక్తులపై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోరా. తిరుమల పవిత్రతను కాపాడాలి. – వడ్డి రఘురాం, తాడేపల్లిగూడెం కన్వీనర్ -
ర్యాలీలకు అనుమతి లేదు
ఆకివీడు మండలంలో 144 సెక్షన్ అమలు భీమవరం(ప్రకాశం చౌక్): ఆకివీడు మండలంలో హిందూ, క్రైస్తవ, స్వచ్చంద సంస్థలు, రాజకీయ పార్టీలు చేపట్టే ర్యాలీలు, ఇతర కార్యక్రమాలకు అనుమతులు లేవని, 5న చలో ఆకివీడు పేరిట ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు పెట్టుకున్న సంస్థలు రద్దు చేసుకొవాలని భీమవరం డీఎస్పీ రఘువీరా విష్ణు అన్నారు. శనివారం భీమవరం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవో ప్రవీణ్కుమార్రెడ్డితో కలిసి ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆకివీడు పెద్దపేటలో ప్రస్తుతం ప్రశాంత వాతవరణం ఉందని, ర్యాలీలు ఏర్పాటు చేయడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. మండలంలో 144 సెక్షన్ అమల్లో ఉందని. అలాగే 30 పోలీసు యాక్ట్ కూడా అమల్లో ఉందన్నారు. అనుమతులు లేకుండా కార్యక్రమాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కొనుగోడు తీరేనా?
● రేపటి నుంచి ధాన్యం కొనుగోళ్లు ● 7.7లక్షల టన్నుల సేకరణకు సన్నాహాలు ● జిల్లాలో ఏర్పాటుకానున్న 260 కేంద్రాలు ● గత రబీ చివరిలో కొనుగోలు కష్టాలు సాక్షి, భీమవరం: జిల్లాలో రబీ ధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. అంచనా దిగుబడి, సేకరణ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లా అంతటా 260 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయనుండగా మొదటి కేంద్రాన్ని సోమవారం అప్పారావుపేటలో ప్రారంభించనున్నారు. గత రబీ అనుభవాల దృష్ట్యా ఈసారైనా ధాన్యం సేకరణ సవ్యంగా జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. 2.31 లక్షల ఎకరాల్లో.. జిల్లాలో 2.31 లక్షల ఎకరాల్లో రబీ సాగు జరుగుతోంది. 80 శాతం విస్తీర్ణంలో ఎంటీయూ 1121 సాగు చేయగా, 15 శాతం విస్తీర్ణంలో పీఆర్ 126, మిగిలిన మేర ఇతర వంగడాలను రైతులు సాగు చేశారు. ముందుగా నాట్లు వేసిన తాడేపల్లిగూడెం రూరల్లో కోతలు మొదలయ్యాయి. తర్వాత భీమవరం, తణుకు, ఉండి, ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లోని అధిక శాతం విస్తీర్ణంలో వరిపంట చిరుపొట్ట దశ నుంచి పూత దశల్లో ఉంది. జిల్లా అంతటా మరో రెండు వారాల్లో వరికోతలు మొదలవుతాయని రైతులు అంటున్నారు. కోతలు మొదలు కావడంతో సోమవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని అప్పారావుపేట తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సివిల్ సప్లయీస్ అధికారులు ప్రారంభించనున్నారు. మరో వారం రోజుల్లో భీమవరంలోనూ ప్రారంభం కానుంది. 7.7 లక్షల టన్నుల సేకరణ : దాళ్వాలో ఎకరాకు 75 కిలోల చొప్పున 55 నుంచి 60 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా. ఈ మేరకు 9.5 లక్షల టన్నుల దిగుబడి రానుంది. ఈ మేరకు 7.7 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు. వరి కామన్ వైరెటీ క్వింటాల్కు రూ.2,369, ఏ గ్రేడ్ రకాలకు రూ.2,389లకు కొనుగోలు చేయనున్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన 48 గంటల్లోపు చెల్లింపులు చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. గత సీజన్లో నిరసనలు గత రబీలో పలు లోపాలతో రైతులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. మిల్లింగ్ సామర్థ్యాన్ని బట్టి ప్రభుత్వం మిల్లులకు లెవీ లక్ష్యాలను నిర్ణయించింది. టార్గెట్ పూర్తయిన మిల్లులు ధాన్యం సేకరణ చేయక కొందరు రైతులు దళారులను ఆశ్రయించి అయినకాడికి అమ్ముకోవడం, మరికొందరు ఇబ్బందులు పడు తూ దూర ప్రాంతాల్లోని మిల్లులకు తరలించుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. జిల్లాలో 2.2 లక్షల ఎకరాల్లో దాళ్వా సాగు చేయగా 9.25 లక్షల టన్నుల దిగుబడికి కేవలం 6 లక్షల టన్నులు మా త్రమే సేకరించేందుకు ప్రభుత్వం అనుమతించింది. రైతుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో తర్వాత 7.5 లక్షల టన్నులకు లక్ష్యాన్ని పెంచింది. సీజన్ ప్రారంభంలో సంచులకు కొరత లేనట్టు కనిపించినా మాసూళ్లు ముమ్మరమైనప్పుడు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో లోపాలు బయటపడుతున్నాయి. గడిచిన దాళ్వాలో ఆచంట, పాలకొల్లు, తణుకు నియోజకవర్గాల్లోని పలుచోట్ల గోనె సంచుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సంచులు అందక ఆరిన ధాన్యాన్ని వారం రోజులపైనే రోడ్లు పక్కన, కళ్లాల్లోనే ఉంచేసిన వారు ఎందరో ఉన్నారు. అదే సమయంలో ప్రతికూల వాతావరణంతో పంటను కాపాడుకునేందుకు అగచాట్లు పడాల్సి వచ్చింది. కొందరు మిల్లర్లు సంచులను రైతులకు కాకుండా దళారులకు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రైతు సేవా కేంద్రాల్లో ధ్రువీకరించిన తేమ శాతం మేరకు మిల్లర్లు కొనుగోలు చేయాలని అధికారులు చెబుతుండగా, అందుకు మిల్లర్లు అంగీకరించడం లేదని రైతులు అంటున్నారు. తేమ శాతం పేరిట కోత పెడుతున్నారని, వే బ్రిడ్జిల వద్ద మోసాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
మద్దిలో అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో శనివారం ఆంజనేయస్వామికి అభిషేక సేవ నిర్వహించారు. ఆలయ ముఖ మండపంపై ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు. ఆలయానికి వివిధ సేవల రూపేణా రూ.1,66,107 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 1357 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఈవో తెలిపారు. ద్వారకాతిరుమల : ఓ భక్తుడు పోగొట్టుకున్న ట్యాబ్ ఉన్న బ్యాగ్ను పోలీసులు కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే సదరు భక్తుడికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన ఏశాంత్ శనివారం శ్రీవారి దర్శనార్ధం ద్వారకాతిరుమలకు విచ్చేశాడు. స్వామివారి దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో అతడు తన ట్యాబ్ ఉన్న బ్యాగ్ను పోగొట్టుకున్నాడు. వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. దాంతో ఎస్సై టి.సుధీర్, కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ సీసీ ఫుటేజీల ఆధారంగా బ్యాగ్ను కనుగొన్నారు. అనంతరం బ్యాగ్ను, అందులోని ట్యాబ్ను బాదితుడు ఏశాంత్కు భీమడోలు సీఐ పి.కృష్ణ, ఎస్సై సుధీర్లు అందజేశారు. -
ఆరవల్లి టీడీపీ నేతలకు ఎదురుదెబ్బ
● వైఎస్సార్ కాలనీలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు చేతివాటం ● ‘సాక్షి’ కథనంతో బట్టబయలు ● వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేసిన వైనం సాక్షి టాస్క్ఫోర్స్: ‘ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటులో టీడీపీ నేతల చేతివాటం’ శీర్షికన ఈనెల 3న ‘సాక్షి’లో ప్రచురించిన కథనంతో అత్తిలి మండలం ఆరవల్లి గ్రామంలో టీడీపీ నాయకుల పరువు దిగజారింది. దీంతో చేసేది ఏమీలేక శనివారం ఉ దయం వైఎస్సార్ కాలనీలో నివాసితుల నుంచి వసూలు చేసిన వేలాది రూపాయలను తిరిగి ఇళ్లకు వెళ్లి మరీ ఇచ్చేశారు. అయితే కాలనీలోనే నివసిస్తున్న గ్రామంలోని టీడీపీ ప్రధాన నాయకుడైన వరుసకు సోదరుడు ఈ డబ్బులు వసూలులో కీలకంగా వ్యవహరించారని, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం సరిపోకపోవడంతో మెరుగైన ట్రాన్స్ఫార్మర్ వేయిస్తామని అందుకు ఖర్చులతోపాటు డిపార్టుమెంట్కు కూడా కొంత ముట్టచెప్పాలంటూ ఏసీ ఉన్న ఇంటి నుంచి రూ.1,500, ఏసీ లేని ఇంటి నుంచి రూ.300 ఇచ్చినట్టుగా కాలనీవాసులు చెబుతున్నారు. కొంతకాలం క్రితమే ఈ డబ్బు వసూలు చేయగా తాజాగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు దిగి సిమెంట్ దిమ్మె కట్టించడం, ఆపై ట్రాన్స్ఫార్మర్ బిగించినప్పటికీ ఆ డబ్బును తిరిగి ఇవ్వని పరిస్థితి. దీంతో కాలనీవాసుల నుంచి ఈ వ్యవహారం కాస్తా బయటకు పొక్కింది. ‘సాక్షి’లో వచ్చిన కథనంతో పొరపాటును సరిదిద్దుకునే క్రమంలో ఆ డబ్బు వసూలు చేయడం వాస్తవమేనని, కానీ కూటమికి సంబంధం లేదంటూ కాలనీలోని టీడీపీ సానుభూతిపరులతోనే మీడియాను వారింటికి తీసుకువెళ్లి మరీ చెప్పించడాన్ని, ‘సాక్షి’ పత్రులను దహనం చేయడాన్ని కాలనీవాసులు తప్పుపడుతున్నారు. కథనాన్ని ప్రచురించిన ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాలనీలో సౌకర్యాలకు మా డబ్బే కావాలా.. కాలనీలో సౌకర్యాలు కల్పించేందుకు సైతం తామే డబ్బు చెల్లించాలా అంటూ కాలనీవాసుల్లో కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతోపాటు ఇతర అభివృద్ధికి కూడా మా డబ్బుతోనే చేయాలంటే ఇక ప్రభుత్వం ఏం చేస్తుందంటూ మండిపడుతున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఎటువంటి అభివృద్ధి చేయకపోగా ప్రజల నుంచే డబ్బులు వసూళ్లు చేయడమేంటని కాలనీవాసులు గుర్రుగా ఉన్నారు. -
భక్తులతో పోటెత్తిన చిన వెంకన్న క్షేత్రం
నిత్య కల్యాణంలో పాల్గొన్న 104 జంటలు ద్వారకాతిరుమల: పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో చిన్న వెంకన్న క్షేత్రం శనివారం భక్తజన సంద్రమైంది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. ముఖ్యంగా దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో రద్దీగా మారాయి. 104 జంటలు శ్రీవారి నిత్యార్జిత కల్యాణంలో పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇదిలా ఉంటే అనివేటి మండపంలో పలు భజనమండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. సాయంత్రం వరకు క్షేత్రం భక్తుల రద్దీ కొనసాగింది. -
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ దుర్మరణం
పెనుమంట్ర : మాముడూరు గ్రామంలోని సత్తెమ్మ తల్లి ఆలయం సమీపంలో రొయ్యల చెరువుల్లో మట్టి లెవెలింగ్ పనులు చేస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బొక్క దుర్గాప్రసాద్ (27) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. మావుడూరు పంచాయతీ వార్డు మెంబర్ బొక్క రామకృష్ణ కుమారుడైన దుర్గాప్రసాద్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రొయ్యల చెరువులో మట్టి పనులు చేస్తూ ట్రాక్టర్ రివర్స్ చేస్తుండగా బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. కొడుకు మృతితో ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. దుర్గాప్రసాద్ మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. పెనుమంట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
8న మార్టేరులో కిసాన్ మేళా
ఏలూరు(టూటౌన్): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గోదావరి మండల పరిధిలో కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు ఏలూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కె.ఫణి కుమార్ తెలిపారు. శనివారం ఏలూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 8న మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానంలో కిసాన్ మేళా నిర్వహిస్తారన్నారు. మారుతున్న వాతావరణ, వాణిజ్య పరిస్థితులు–సుస్థిర వరి వ్యవసాయం అంశంపై కిసాన్ మేళా జరగనుందన్నారు. ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విశ్వవిద్యాలయ అధికారులు, వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అధికారులు హాజరవుతారన్నారు. కిసాన్ మేళా సందర్భంగా వ్యవసాయ, ఉద్యాన, మత్స్య పరిశ్రమ, వ్యవసాయ యాంత్రీకరణ, వివిధ ప్రైవేట్ కంపెనీలకు చెందిన ప్రదర్శన శాలలను ఏర్పాటు చేస్తారన్నారు. రైతులకు నూతన వరి రకాల ప్రదర్శన, క్విజ్ పోటీ నిర్వహిస్తారన్నారు. జిల్లాలోని రైతులు పెద్ద సంఖ్యలో కిసాన్ మేళాకు హాజరుకావాలన్నారు. -
ఉత్సాహభరితంగా రన్ ఫర్ జీసస్
ఏలూరు (ఆర్ఆర్పేట): పాపుల రక్షణ కోసం శిలువుపై ప్రాణత్యాగం చేసి క్రీస్తు చూపిన బాటలో పయనించాలని ఏలూరు పీఠాధిపతి బిషప్ పొలిమేర జయరావు, ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు పరిసర ప్రాంతాల క్రైస్తవ సంఘాలు, దైవ సేవకులు, నాయకులు, విశ్వాసుల ఆధ్వర్యంలో శనివారం ఏలూరులో రన్ ఫర్ జీసెస్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఈ ర్యాలీని జయరావు, ఎమ్మెల్యే చంటి, బిషప్ జాన్ ఎస్డీ రాజు, బిషప్ ఎం ఏలీషా రాజు, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ప్రారంభించారు. ఈ ర్యాలీ ఇండోర్ స్టేడియం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జయరావు మాట్లాడుతూ మనిషి త్యాగాల ద్వారా మానవ సమాజానికి సేవ చేయవచ్చన్నారు. ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ క్రీస్తు స్ఫూర్తితో ప్రేమ, కరుణ, క్షమ, సహనం, త్యాగం వంటి సద్గుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. ప్రస్తుతం యుద్ధం ఆగిపోయి శాంతి, సామరస్యాలు నెలకొనాలని ఆకాంక్షించారు. అప్పలనాయుడు మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్నేపల్లి తిరుపతి, హెన్రీ డొమినిక్, ఫాదర్ మైకేల్ ఇంజమాల, బీరపోగు యోహాన్, టి.శ్యాంబాబు, పీవీ రాజు, బేతాళ సతీష్ బాబు, ఫాదర్ బాల, పాస్టర్ పి.జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఈస్టర్ పండుగకు సన్నద్ధం
ఉండి: గుడ్ఫ్రైడే జరుపుకున్న క్రైస్తవ సోదరులు ఆదివారం జరిగే ఈస్టర్ పండుగ కోసం సిద్ధమవుతున్నారు. మృతిచెందిన తమ వారి సమాధులను శనివారం పరిశుభ్రంగా కడిగి రంగులు వేసి అందంగా తీర్చిదిద్దారు. పూలు, పండ్లు, కొవ్వొత్తులు, విద్యుత్ లైట్లతో సమాధులను అలంకరించి ఆదివారం తెల్లవారు జామున చర్చ్ నుంచి బయలుదేరి సమాధుల వద్దకు ఊరేగింపుగా వెళ్తారు. బాణసంచా కాల్పులతో, భక్తి కీర్తనలతో ఊరేగింపు నిర్వహిస్తారు. క్రైస్తవులు తమవారి సమాధుల వద్దకు వెళ్ళి ప్రార్థనలు నిర్వహిస్తారు. ఒకరినొకరు ప్రేమతో పలకరించుకుంటూ ఈస్టరు పండుగ శుభాకాంక్షలు తెలుపుతారు. అనంతరం ఉదయం చర్చిల్లో జరిగే కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని ప్రార్థనలు చేస్తారు. -
కారు ఢీకొని వ్యక్తి మృతి
కై కలూరు: కారు బైక్ను ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించిన ఘటన ఆలపాడు ప్లైఓవర్ బ్రిడ్జిపై శనివారం జరిగింది. కై కలూరు రూరల్ పోలీసుల వివరాలు ప్రకారం భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామానికి చెందిన మామిడి శ్రీను(45) కై కలూరు మండలం ఆలపాడులో చిన్న అల్లుడు పులిపాక సుబ్బారావుతో కలిసి బైక్పై ఆకివీడు వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఆలపాడు ప్లైఓవర్ బ్రిడ్జిపై ఆకివీడు నుంచి వస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. వెనుక కూర్చున్న శ్రీను మరణించాడు. ద్విచక్రవాహం నడుపుతున్న సుబ్బారావుకు గాయాలయ్యాయి. కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెద్ద అల్లుడు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం
బుట్టాయగూడెం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు అన్నారు. మండల కేంద్రమైన బుట్టాయగూడెంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమరావతికి సంబంధించి మొదటి విడతలో 50 వేల ఎకరాలు తీసుకుని పనులు చేయకుండా బాహుబలి సెట్టింగ్లు చేసి రాష్ట్ర ప్రజలకు సినిమా చూపించారని అన్నారు. మళ్లీ రెండో విడతలో 80 వేల ఎకరాలు భూములు సేకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అమరావతి భూములు ఇచ్చే విషయంలో రైతులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. లక్ష ఎకరాలతో అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు దోపిడీకి తెరలేపారన్నారు. అమరావతి పేరుతో రూ.40 వేల కోట్లు అప్పు చేసి రూ.5 వేల కోట్లను అడ్వాన్స్గా తన అనుచరులకు దోచిపెట్టారని అన్నారు. ఒక చోటే కేంద్రీకృతం ఉండకూడదని అభివృద్ధి రాష్ట్ర నలుమూలల ఉండాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి పదే పదే చెబుతూ వస్తున్నారని చెప్పారు. అమరావతికి వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నడూ మాట్లాడలేదని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అద్భుతమైన ప్రతిపాదనను తీసుకువచ్చారన్నారు. ఆ ప్రతిపాదనలను కూడా చంద్రబాబు తీసుకునే పరిస్థితి లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ను అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీరావు, పార్టీ సీనియర్ నాయకులు ఆరేటి సత్యనారాయణ, ఎంపీపీ తెల్లం రమణ, వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్రావు, తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): రాష్ట్రంలో ఐటీ రంగాభివృద్ధికి మరింత ఊతమిస్తూ, నైబర్హుడ్ వర్క్ స్పేసెస్ అనే వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో ఉమ్మడి, వృత్తిపరంగా నిర్వహించే కార్యాలయ మౌలిక వసతులు అందిస్తారన్నారు. హై–స్పీడ్ ఇంటర్నెట్, ప్రత్యేక డెస్క్లు, సమావేశ గదులు వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఈ కేంద్రాలలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, డిజిటల్ వనరులు, సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలు కూడా అందిస్తారన్నారు. దీంతో రిమోట్ వర్కర్లు, ఫ్రీలాన్సర్లు, స్టార్టప్లు, చిన్న సంస్థలకు మరింత మద్దతు లభించి, సహకారం, నెట్వర్కింగ్, నైపుణ్యాభివృద్ధికి అవకాశాలు విస్తరించనున్నాయని చెప్పారు. ఈ విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సమ్మిళిత ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాల పెరుగుదల, ఐటీ రంగ విస్తరణకు దోహదపడుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాల కోరసం జిల్లా ఐటీ మేనేజర్ 7207702737 నెంబరులో సంప్రదించాలన్నారు. ఏలూరు (టూటౌన్): పోలవరాన్ని సందర్శించి తన జీవితం ధన్యమైందని గవర్నర్ చెప్పడం సంతోషకరమైన విషయమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రవి తెలిపారు. ఆ ప్రాంత గిరిజనుల, ప్రజల అవసరాలు, సమస్యలు గురించి పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఉన్న శ్రద్ధ ఆ ప్రాజెక్టుకు భూములిచ్చిన గిరిజనులు, దళితులు, పేదలైన నిర్వాసితులపై లేకపోవడం శోచనీయమన్నారు. నిర్వాసితుల పునరావాసం గురించి ఆలోచన లేకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. పోలవరం నిర్వాసిత కుటుంబాలు 1,05,000 వరకు ఉన్నాయని, వాటిలో దాదాపుగా 50 శాతంగా ఉన్న 50వేల కుటుంబాలకు చెందిన గిరిజనులు గోడు పట్టించుకొనే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. కాగ్ నివేదికలో పునరావాసం కేవలం 20 శాతం కూడా కల్పించలేదని, ప్రాజెక్టు నిర్మాణం మాత్రం 70 శాతం చేసారని తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మండలాన్ని యూనిట్గా తీసుకొని ఒకేసారి పరిహారం చెల్లించాలని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇదే విషయాన్ని కాగ్, సీపీఎం, ఇతర సంస్థలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదన్నారు. నిర్వాసితుల పరిస్థితి ముంపు వాటిల్లినప్పుడు చాలా దయనీయంగా ఉంటుందని, ఆధార్ కార్డులు చూసి కొవ్వొత్తులు, మంచినీటి ప్యాకెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. మరోసారి ఈ ప్రాంతంలో గర్నవర్ పర్యటించి నిర్వాసితులను కలవాలని, వారి సమస్యలు అడిగి తెలుసుకోవాలన్నారు. -
పెళ్లికి త్వరపడాల్సిందే !
ద్వారకాతిరుమల : గోదావరి పుష్కరాలకు ఇంకా పద్నాలుగు నెలలు సమయం మాత్రమే ఉంది. దాంతో గోదావరి పరీవాహక ప్రాంతాల వారు పెళ్లిళ్లు జరుపుకునేందుకు తొందరపడుతున్నారు. ఎందుకంటే పుష్కరాల తరువాత ఏడాది కాలం పాటు ఈ ప్రాంత వాసులు వివాహాది శుభకార్యాలు జరుపుకోరు. అందుకే ఇప్పటికే వివాహాలు కుదుర్చుకున్న వారు ఈ ఏడాది చివరి నాటికి ఎలాగైనా పెళ్లిళ్లు జరుపుకోవాలని ఆతృత పడుతున్నారు. అయితే పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా పెరిగిన వంట నూనెలు, గ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెళ్లివారి గుండెల్లో గుబులు రేపుతున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు పెళ్లి ఖర్చులు రెట్టింపు అవుతున్నాయని సామాన్య, మధ్యతరగతి వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి ముహూర్తాన్ని వాయిదా వేద్దామా అంటే.. గోదావరి పుష్కరాలు దగ్గర పడుతున్నాయి. దాంతో పెళ్లిళ్లు చేసుకునేవారి పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా మారింది. శుభకార్యాలు జరపరెందుకంటే.. గోదావరి జిల్లాల వాసులు చనిపోయిన తమ పితృ దేవతలకు పుష్కరాల సమయంలో పిండ ప్రదానం, షోడశ మహాదానాలు, దశదానాలు చేస్తారు. అందువల్ల పరీవాహక ప్రాంతంలో ఏడాది పాటు శుభకార్యాలు జరపకూడదని పండితులు, పురోహితులు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల వారితో పాటు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన చాలా మంది ఈ సమయంలో శుభకార్యాలను జరుపుకోరు. ఈ ప్రాంతాల వారు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఇది వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. ఇది శాస్త్ర విరుద్ధమని భావించేవారు పుష్కరాల తరువాత ఏడాదిపాటు శుభ కార్యాలకు దూరంగానే ఉంటారు. భారంగా మారిన ధరలు ప్రస్తుతం పెరిగిన ధరలు పెళ్లిళ్లు జరుపుకునే వారికి పెను భారంగా మారాయి. డెకరేషన్కు వినియోగించే పచ్చిపూలతో పాటు అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. నిత్యావసర ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. గ్యాస్ ధరలు ఇలా.. ● సిలిండర్ పెరిగిన ధరతో కలిపి రూ.954కాగా, బ్లాక్లో రూ.2 వేలకు విక్రయిస్తున్నారు. ● కమర్షియల్ సిలిండర్ పెరిగిన ధరతో కలిపి రూ.1,930 కాగా, బ్లాక్లో దొరకడం లేదు. ఒకవేళ దొరికితే రూ.3 వేలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుత ముహూర్తాల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీగా వివాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన్నవెంకన్న సన్నిధి పెళ్లిళ్లకు వేదిక అవుతోంది. బలమైన ముహూర్తాల్లో ఇక్కడ వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈనెల 11, 12, 29 తేదీల్లో పెళ్లిళ్లు అతి భారీగా జరనున్న నేపథ్యంలో ఇప్పటికే కొండపైన, కొండ కింద కల్యాణ మండపాలు, గదులు దాదాపుగా అన్నీ ముందే బుక్ అయిపోయాయి. కేటరింగ్, వాయిద్యకారులు, డెకరేషన్ వ్యాపారులు, పురోహితులు బిజీబిజీగా ఉన్నారు. మార్చి, ఏప్రిల్తో పాటు మే 18 వరకూ, అలాగే జూన్ 17 నుంచి జులై 9 వరకూ, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 8 వరకూ, అక్టోబర్ 11 నుంచి 18 వరకూ, నవంబర్ 10 నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకూ జిల్లా వ్యాప్తంగా భారీగా వివాహాలు జరగనున్నాయి. ఇప్పటికే పెళ్లిళ్లు కుదుర్చుకున్న గోదావరి పరివాహక ప్రాంతాల వారు త్వరపడి ఈ ముహూర్తాల్లోనే పెళ్లిళ్లు చేసుకోవాలి. లేదంటే పుష్కరాల తరువాత ఏడాదిపాటు ఆగాల్సిందే. – గోవింద వఝుల వెంకటరమణమూర్తి శర్మ, పురోహితుడు, ద్వారకాతిరుమలయుద్ధం కారణంగా గ్యాస్, వంట నూనెల ధరలు బాగా పెరిగాయి. ఆ ఎఫెక్ట్ నిత్యావసర సరుకుల మీద కూడా పడింది. గతంతో పోలిస్తే ఇప్పుడు పెళ్లి చేయడానికి రెట్టింపు ఖర్చు అవుతోందని పెళ్లి కొడుకు, పెళ్తి కూతుళ్ల తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. గ్యాస్ కూడా దొరకడం లేదు. పశ్చిమ ఆసియాలో యుద్ధం జరుగుతుంటే.. పెళ్లివారికి ఇక్కడ సెగ తగులుతోంది. – యిమ్మడి నాగు, కిరాణా, క్యాటరింగ్ వ్యాపారి, ద్వారకాతిరుమల (లీటరు, రూ. లలో) రకం పాత ధర కొత్త ధర పామాయిల్ రూ.110 రూ.130 రిఫైండ్ ఆయిల్ రూ. 155 రూ.185 డబ్బా ధర పామాయిల్ రూ.2,000 రూ.2,300 రిఫైండ్ ఆయిల్ రూ.2,500 రూ.2,900 (కిలో రూ. లలో) రకం పాత ధర కొత్త ధర కందిపప్పు రూ.100 రూ.130 పెసరపప్పు రూ.100 రూ.120 మినపగుళ్లు రూ.105 రూ.120 పచ్చిశనగపప్పు రూ.80 రూ.100 వేరుశనగ గుళ్లు రూ.120 రూ.170 యుద్ధ ప్రభావంతో ప్రస్తుతం పెళ్లికి రెట్టింపు ఖర్చు వాయిదా వేద్దామంటే.. మున్ముందు పుష్కరాల అడ్డు ఇప్పుడు కాకుంటే పుష్కరాల తరువాత ఏడాది ఆగాల్సిందే -
తవ్వేయ్.. దోచేయ్
సాక్షి టాస్క్ఫోర్స్ : ఉంగుటూరు మండలంలో ఎర్ర కంకర కూటమి నేతలకు కాసులు పంటగా కురిపిస్తోంది. ఉంగుటూరు మండలం మెట్ట ప్రాంతంలో కంకర క్వారీలు ఇష్టానుసారం తవ్వకాలు చేస్తున్నారు. నల్లమాడు ఉప కేంద్రం పక్కన పెద్ద ఎత్తున కంకరను పొక్లెయినర్ల సాయంతో తవ్వి పట్టుకుపోతున్నారు. పోలవరం కుడి కాలువ గుట్లను దోచేస్తున్నారు. డెల్టా ప్రాంతానికి లారీల్లో కంకర, మట్టి తరలిపోతోంది. ఎ.గోకవరం ఆయకట్టులో ప్రభుత్వ పోరంబోకులో కంకర తవ్వేసి తరలించేస్తున్నారు. రోజుకు వంద లారీలు తగ్గకుండా కంకర తరలిపోతోంది. వీటి వెనక కూటమి నేతలు ఉన్నారనేది బహిరంగ రహస్యం . దాంతో మండలంలోని రెవెన్యూ అధికారులు చేతులేత్తేశారు. మండలంలోని ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. -
అధ్వానంగా కాలువల నిర్వహణ
పెనుగొండ: పంట కాలువలు, డ్రెయిన్లు నిర్లక్ష్యపు నీడలో వాటి సర్వూపాన్ని కొల్పోతున్నాయి. సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో శివారు ప్రాంత రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ప్రధాన కాలువ గట్లు డంపింగ్ యార్డులుగా, అక్రమణలతో నిండిపోతుండడంతో దిగువ ప్రాంతానికి నీరు వెళ్లే పరిస్థితి లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కాలువల నిర్వహణ గాలికొదిలేయడంతో రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. సాగు తుది దశకు చేరుకొన్న తరుణంలో ఇప్పటికే వంతుల వారీ విధానంతో సాగును రైతులు ముందుకు నెట్టుకెళ్తున్నారు. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ఆక్రమణల పరంపర, నిర్వహణా లోపంతో దిగువకు నీరు ప్రవహించే అవకాశం లేదని రైతులు వివరిస్తున్నారు. ముఖ్యంగా దేవ కాలువ, ఇలపర్రు కాలువ, చానల్ 1, చానల్ 2 వంటి ప్రధాన కాలువల్లో వ్యర్థాలు ఎక్కువగా పడేయడంతో పాటు, తూడు పెరిగిపోవడంతో నీరు కిందకు వెళ్లే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు దేవ కాలువ పరీవాహక ప్రాంతాలు సైతం ఆక్రమణకు గురి కావడంతో రోజురోజుకు కాలువ బక్కచిక్కిపోతోంది. దీంతో ఆయకట్టు ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి పంటకాలువల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఆక్రమణలు తొలగించడంతో పాటు, శివారు ప్రాంతాలకు నీరు సక్రమం చేరడానికి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. డ్రెయిన్ల పరిస్థితి దారుణం మురుగు డ్రెయిన్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది, డ్రెయిన్ల గట్టులను పరీవాహక పంచాయతీలు డంపింగ్ యార్డులుగా వినియోగించుకుంటున్నాయి. రోజురోజుకూ చెత్త పెరిగిపోతుండడంతో ఆయా మురుగు డ్రెయిన్లలోకి చెత్త డంపింగ్ చేసేస్తున్నారు. నక్కలు డ్రెయిన్, తాడేరు డ్రెయిన్లు డంపింగ్ యార్డులుగా ఉపయోగపడుతున్నాయి. దీంతో వర్షాకాలంలో నీరు ముందుకు సాగే పరిస్థితి లేక పరీవాహక ప్రాంతమంతా ముంపునకు గురై వందలాది ఎకరాల పంటను నష్టపోవాల్సి వస్తుంది. రైతులు పదేపదే అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోతుంది. డంపింగ్ యార్డులకు స్థలాలు కేటాయించకపోవడం వల్లే కాలువ గట్లను పంచాయతీలు డంపింగ్ యార్డులుగా ఉపయోగిస్తున్నాయని చెబుతున్నారు. -
గోపాలా..ఈ గోవులను పట్టించుకునే వారే లేరా?
● మేత లేక బక్కచిక్కుతున్న ఆవులు ● కె.పెంటపాడు బైరాగిమఠంగోశాల వద్ద వింత పరిస్థితి పెంటపాడు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన కె.పెంటపాడు బైరాగిమఠం గోపాలస్వామి ఆలయంలో గోశాలలోని గోవులు మేత లేక అల్లాడుతున్నాయి. ఇక్కడ 150కి పైగా గోవులు ఉంటాయి. వీటి కోసం ప్రత్యేకంగా కాపరి ఉంటున్నా వాటి ఆలనాపాలనా పట్టించుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా సమస్య తీవ్రతరమైంది. దీంతో గోపాలా.. మా మోర వినవా అంటూ నిత్యం గోపాలస్వామిని మొర పెట్టుకుంటున్నాయి. అయితే గోవుల సంరక్షణ బాధ్యతలు మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. పచ్చగడ్డి ఏదీ? గతంలో ఆలయ ఆవరణలో ఆవుల కోసం ప్రత్యేకంగా పచ్చగడ్డి పెంచే వారు. గత రెండేళ్లుగా ఆ మేత లేదు. సార్వా ఎండుగడ్డి మాత్రం స్టోరేజీ చేశారు. అదికూడా రక్షణ లేకపోవడంతో కుళ్లిపోయింది. గోశాల చుట్టూ దుర్వాసన వస్తోంది. అక్కడే చెత్త వేయడం వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. గోశాల వద్ద నిత్యం మందుబాబులు మద్యం తాగుతున్నారు. అక్కడ, పడమర రాజగోపురం వద్ద మద్యం ఖాళీ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. గోవుల కోసం తాగునీరు లేదు. వారానికి ఒక సారి నీరు పోస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ నీరు ఎండకు వేడెక్కడంతో గోవులు ముట్టుకోవడం లేదు. గోశాల చరిత్ర బైరాగిమఠంలో ఒక గోవు గోపాలుడిని సేవించేందుకు ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి అలసిపోయి అక్కడే మృతి చెందింది. దీంతో ఆ ఆవు బొమ్మ ఆలయంలో ప్రతిష్టించారు. ఆలయానికి వచ్చే భక్తులు తప్పక ఆవు విగ్రహానికి కూడా పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇంత ప్రాశస్త్యం ఉన్న గోశాలలోని గోవులను పట్టించుకోకపోవడం భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయానికి వేల ఎకరాలు భూమి ఉన్నా గోశాలకు విరాళాలివ్వండి అంటూ ప్రచారాలు చేసుకుంటున్నారే తప్ప వాటిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గోశాల నిర్వహణను సవ్యంగా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
బీసీలంటే కూటమి ప్రభుత్వానికి చులకనా?
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో బీసీలంటే కూటమి ప్రభుత్వానికి చులకనగా ఉందా అని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై పార్టీ) రాష్ట్ర కో కన్వీనర్ నెరుసు నాగమణి యాదవ్ ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక సాహిత్య మండలి హాలులో ఆమె విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు బీసీలకు ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని, వారిని రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను విస్మరిస్తే ఫలితం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. బీసీవై పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ ఆకుల వెంకట స్వామి మాట్లాడుతూ బీసీల కోసం 5 డిమాండ్లతో తమ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఇచ్చిన అల్లిమేటం గడువు మార్చి 31తో ముగిసిందని, ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 11న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా దీక్ష కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో నాయకులు సర్నాల శివరాణి, తోకల రామకృష్ణ, అనగాని రామ్ ప్రసాద్, వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సెల్ టవర్ నిర్మాణంపై స్థానికుల ఆందోళన కొయ్యలగూడెం: సెల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అశోక్ నగర్ ప్రాంతవాసులు శుక్రవారం పనులను అడ్డుకున్నారు. నివాసిత ప్రాంతాల మధ్య సెల్ టవర్ ఏర్పాటు చేయడం వలన ఆరోగ్యరీత్యా దుష్పరిణామాలు ఎదుర్కొంటామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు అనుమతులు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటుండగా ప్రభుత్వ పరంగా ఉండాల్సిన అనుమతులు లేవని స్థానికులు ఆరోపించారు. దీనిపై నిర్మాణదారులకు నివాసితులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అన్ని అనుమతులు ఉంటేనే పనులను ప్రారంభించండని స్థానికులు పేర్కొన్నారు. దీనిపై పంచాయతీ, రెవెన్యూ శాఖ అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. -
డివైడర్ను ఢీకొట్టిన కారు
ఆలమూరు: 216ఏ జాతీయ రహదారిలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా చొప్పెల్ల వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆలమూరు ఎస్సై జి.నరేష్ కథనం ప్రకారం.. చింతలపూడికి చెందిన సుంకర నవీన్, చందుమళ్లకు చెందిన కె.రామ్తేజ, పాలకొల్లుకు చెందిన కె.శివాజీ గణేష్కుమార్ కారులో విశాఖపట్నం బయలు దేరారు. చొప్పెల్ల లాకుల వద్దకు వచ్చేసరికి రాంగ్ రూట్ వెళ్లేందుకు ప్రయత్నించిన ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి డివైడర్ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. అందులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్హెచ్, 108 అంబులెన్స్లలో క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎస్సై నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురికి తీవ్ర గాయాలు -
రైతు గోడు ఎవరికీ పట్టదా?
● ఇంకా ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ● ధాన్యం ఆరబెట్టేందుకు రైతుల అవస్థలు భీమడోలు: రబీ ధాన్యం రోడ్డెక్కింది. చేతికందిన పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతుంది. దీనితో రైతులు తమ ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. దళారులకు ధాన్యాన్ని అయినకాడకు అమ్ముకుంటూ నష్టాన్ని మూటగట్టుకుంటున్నారు. ప్రస్తుతం రైతులకు కనీస మద్దతు ధర దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో గోదాములు కొరత, వర్షాల భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో మెషీన్లతో కోసిన పంట తేమ శాతం తగ్గించుకునేందుకు రోడ్లపైనే ఆరబోసుకుంటున్నారు. దళారులను ఆశ్రయిస్తున్న రైతులు వారం రోజుల కితమే ధాన్యం చేతికందినప్పటికీ.. కొనేవాడు లేక బరకాలు కప్పి ఉంచి కాపలా కాస్తున్నారు. రబీ ధాన్యం చేతికందగానే కొనుగోలుకేంద్రాలు తెరవకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతుంది. మెట్ట ప్రాంతాల్లోని బోర్ల కింద సాగు చేసిన 1153 రకం పంట కోతలు ప్రారంభం కాగా మాసూళ్ల పర్వం కూడా పూర్తయ్యింది. అయితే అటూ ప్రభుత్వం కొనక.. దళారులకే అమ్మి తీవ్రంగా నష్టపోతున్నారు. దీనితో రైతులు, కౌలు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఓ పక్క వాతావరణంలో ఏర్పడ్డ ఎల్నినో పరిస్థితులు నేపథ్యంలో విభిన్న పరిస్థితులు తలెత్తడంతో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మార్చి నెలాఖరు నాటికి కోతలు ప్రారంభించినా.. జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసే ఎత్తడం లేదు. వాస్తవానికి సార్వాలో రైతులు ఎకరాకు రూ.10 వేలకు పైగా నష్టాన్ని చవిచూసారు. అయితే దాళ్వాలో ఆ నష్టం నుంచి బయట పడాలంటే ఎకరాకు 50 బస్తాలకుపైగా దిగుబడులు రావాలి. కానీ కొన్ని చోట్ల 40 బస్తాలు మాత్రమే దిగుబడులు రావడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. 1153 రకం వేసిన రైతాంగం తక్కువ దిగుబడులు వస్తుండడంతో దాళ్వా నష్టాల సాగుగా మారింది. ధాన్యం ఆరబోసుకునేందుకు ఇబ్బందులు దాళ్వాలో రైతులు 1121, పీఆర్ 126, 1153, 1426 వరి రకాలను సాగు చేసారు. మెట్ట ప్రాంతాల్లో బోర్ల కింద రైతులు 1153 రకాన్ని సాగు చేయగా.. 110 రోజుల పంట కావడంతో మార్చి నెలాఖరు నాటికి రైతుల చేతికందింది. అయితే ఆ ధాన్యాన్ని రోడ్లపైనే ఆరబోసుకుంటున్నారు. జాతీయ రహదారులు, అప్రోచ్ రోడ్లపై సీతంపేట, సూరప్పగూడెం తదితర గ్రామాల్లోని రైతులు ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. గోదాముల్లో నిల్వ చేసుకునే అవకాశం లేక రైతులు వాటి పై బరకాలు కప్పి భద్రపర్చుకుంటుంన్నారు. ఎకరా సాగుకు రైతుకు రూ.40 వేల నుంచి రూ.45వేల వరకు ఖర్చు అయ్యింది. మెషీషన్లతో కోసిన ధాన్యాన్ని అరబెట్టేందుకు ఎకరాకు ఇద్దరు కూలీలకు రోజుకు రూ.800లు ఖర్చు అవుతుంది. ఎక్కువగా ఎండలో ఉండడంతో గింజ ముక్కలై నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని రైతులు వేడుకుంటున్నారు. 10 ఏకరాల భూమిని ౖౖకౌలుకు తీసుకుని సాగు చేసాను, ఏకరాకు రూ.45వేల వరకు ఖర్చు అయ్యింది. ధాన్యాన్ని కోసి అరపోసి బస్తాలపై నింపాం. ధాన్యం కోనుగోళ్లు ప్రారంభించకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మిల్లుకు తరిస్తున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరచిన తర్వాత రేటు తెలుస్తుంది. అయితే రోడ్లపై ధాన్యం ఉంచితే పోలీసులు ఊరుకోవడం లేదు. –ఎం.బాలయ్య, కౌలు రైతు, సీతంపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 6, 7వ తేదీల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు చర్యలు చేపట్టాం. భీమడోలు సబ్ డివిజన్ పరిధిలో భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు, ద్వారకాతిరుమల మండలాల్లో 55 వేల ఏకరాల్లో దాళ్వా సాగు చేశారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా కొన్నా దళారులపై తగు చర్యలు తీసుకుంటాం. –పి.ఉషారాజకుమారి, ఏడీఏ, భీమడోలు -
కంటైనర్ ఢీకొట్టి ఇద్దరు మృతి
చౌటుప్పల్/కామవరపుకోట: ఆటోను రోడ్డుపక్కన ఆపి టైరు మారుస్తుండగా కంటైనర్ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం, జాలపవారిగూడెం గ్రామానికి చెందిన పళ్ల నవీన్కుమార్, సాధనాల లక్ష్మీనర్సింహస్వామి, రాసపోలి కనకరాజు, నాగపోగుల కృష్ణఫణీంద్రలు ఏలూరు పరిసర ప్రాంతాల్లో కొబ్బరి బొండాలు సేకరించి ఆటోల్లో లోడు చేసుకుని గురువారం రాత్రి హైదరాబాద్కు బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులోని చెరువు సమీపంలోకి చేరుకోగానే పళ్ల నవీన్కుమార్కు చెందిన ఆటో పంక్చర్ అయింది. దీంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి టైరు మార్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన మిగతా ముగ్గురు ఆటో డ్రైవర్లు కూడా తమ వాహనాలను ఆపారు. సెల్ఫోన్ లైట్ల వెలుతురులో ఆటో టైర్ మారుస్తుండగా హైదరాబాద్ వైపునకు వెళ్తున్న కంటైనర్ లారీ వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో సాధనాల లక్ష్మీనర్సింహస్వామి (39) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మిగతా వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పల్లా నవీన్కుమార్(27) అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు. మిగలిన ఇద్దరు ఆటో డ్రైవర్లు చికిత్స పొందుతున్నారు. పల్లా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతులు పల్లా నవీన్ కు భార్య, ఏడాది కుమారుడు ఉన్నాడు. సాధనాల స్వామి భార్య గర్భవతి. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆటో టైరు మారుస్తుండగా ఘటన -
ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలి
ఏలూరు (టూటౌన్): ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం అన్నే భవనంలో రబీ ధాన్యం కొనుగోలు సమస్యలపై ఆయన మాట్లాడారు. ఉంగుటూరు, దెందులూరు మండలాల్లో కొన్ని గ్రామాల పరిధిలో రబీ వరి కోతలు జరుగుతున్నాయని, రైతులు ధాన్యం అమ్ముకోవడానికి సిద్ధం చేస్తున్నారని, కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం వలన ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. దళారులకు ధాన్యం అమ్ముకున్నాక కొనుగోలు కేంద్రాలు తెరవడం వల్ల రైతులకు ప్రయోజనం లేదన్నారు. రబీ ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. -
ఎస్సై దాతృత్వం
లింగపాలెం: మండలంలోని ములగలంపాడులో ఇటీవలే కొడుకులు సరిగ్గా చూడక ఇంటి బయట చెట్టు కింద వృద్ధురాలు నివాసం ఉంటుంది. స్థానికులు, సోషల్మీడియాలో వచ్చిన కథనాలకు ఎస్సై వెంకన్న స్పందించారు. వృద్ధరాలి దగ్గరకు వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడి ఆమెను పక్కనే ఉన్న వాళ్ళ బంధువుల ఇంటి దగ్గర పెట్టి ఆ వృద్ధురాలికి త్వరలోనే నివాసం ఏర్పాటు చేయాలని కుమారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. కామవరపుకోట: తడికలపూడి పోలీస్ స్టేషన్ ఎస్సై చెన్నారావును పోలీస్ ఉన్నతాధికారులు వీఆర్లో పెట్టారు. తడికలపూడి ఎస్సైగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు గడిచింది. శాఖా పరమైన కారణాలతో వీఆర్లో పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఇన్చార్జి ఎస్సై జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్సైగా పని చేస్తున్న కుటుంబరావును నియమించారు. వేలేరుపాడు: గాలి వల్ల 11 కేవీ లైన్ కొయిదా ఫీడర్ వైర్ తెగడంతో వేలేరుపాడు మండలంలోని విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో ఐదు పశువులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. శివకాశీపురం గ్రామంలో శ్రీనివాసరావు చెందిన ఐదు ఎద్దులను (పశువులు) ఇదే గ్రామానికి చెందిన కుంబటి నాగరాజు శుక్రవారం మధ్యాహ్నం దగ్గరలోని పొలాలకు మేతకు తీసుకెళ్లాడు. తిరిగి ఇంటికి తోలుకొస్తున్న క్రమంలో ఒక్కసారిగా గాలి రావడంతో 11కేవీ లైన్ విద్యుత్ వైరు తెగి పశువులపై పడింది. దీంతో ఐదు పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ సమయంలో నాగరాజు పక్కకు పారిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. గణపవరం: రక్తదానం చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని, రక్తదానంతో మరొకరికి ప్రాణదానం చేయవచ్చని గణపవరానికి చెందిన పద్మపూజిత గ్రూపు చైర్మన్ ఆర్.బసవరాజు అన్నారు. శుక్రవారం గణపవరంలో పద్మపూజిత గ్రూపు సంస్థల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శిబిరాన్ని ప్రారంభించిన బసవరాజు రక్తదానంపై ప్రజలలో అవగాహన కల్పించడం ద్వారా స్వచ్ఛందంగా రక్తదానం చేసేలా చైతన్యవంతులు చేయాలని యూత్ సభ్యులకు సూచించారు. ఈ శిబిరంలో రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో పద్మపూజిత అనుబంధ సంస్థల జోనల్, ఏరియా అధికారులు ఫణి, అనిల్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జంగారెడ్డిగూడెం, పోలవరం సర్కిల్ కార్యాలయాలను శుక్రవారం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమీషనర్ కేవీ నాగ ప్రభుకుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, సర్కిల్ పరిధిలో చేపట్టిన కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు. సిబ్బందిని నాటు సారాకు సంబంధించి సమాచారం సేకరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నాగ ప్రభుకుమార్ మాట్లాడుతూ తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి సుంకం చెల్లించని మద్యంపై నిఘా ఉంచాలని సూచించినట్లు తెలిపారు. అనంతరం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులోని బోర్డర్ చెక్పోస్టును ఆయన తనిఖీ చేసి, సూచనలు చేశారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం, పోలవరం సీఐలు కె.శ్రీనుబాబు, కె.వీరబ్రహ్మం, ట్రైనీ ఎస్సై సతీష్కుమార్ పాల్గొన్నారు. నేటి నుంచి పాలిసెట్ ఉచిత కోచింగ్ తాడేపల్లిగూడెం (టీఓసీ): పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ఎస్ఎ్ఫ్ఐ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గణేష్, పతివాడ నాగేంద్రబాబు తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ భీమవరంలోని డాక్టర్ బీవీరాజ్ విద్యా సంస్థల్లోని బి.సీతా పాలిటెక్నిక్ కళాశాలలో శిక్షణ ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకు 90141 52239, 91823 09153, 76809 17097 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. -
వన్స్టాప్ సెంటర్ పరిశీలన
ఏలూరు (టూటౌన్): పట్టణంలోని సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని వన్ స్టాప్ సెంటర్ను గురువారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వన్ స్టాప్ సెంటర్ నిర్వహణ, ఆన్లైన్ ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం మొదలైన విషయాలను అడిగి తెలుసుకున్నారు, ఎక్కువగా గృహ హింస కేసులు నమోదు అవుతున్నాయని, అధికారులు ఎక్కువగా గృహ హింస కేసులు నమోదు అయ్యే ప్రాంతాలలో అవగాహన సదస్సును నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో సెంట్రర్ అడ్మిన్ నిర్మల, స్టాండింగ్ కౌన్సిల్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ద్వారకాతిరుమల: పురుగుల మందు తాగిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. వివరాల ప్రకారం కొయ్యలగూడెం మండలం రాజవరానికి చెందిన ఎ.నాగరాజు(30) ద్వారకాతిరుమల మండలం సీహెచ్ పోతేపల్లిలోని ఓ రైతు వద్ద కమతం ఉంటున్నాడు. ఏం జరిగిందో తెలియదు గానీ నాగరాజు గత మంగళవారం పురుగుల మందు తాగాడు. అప్పటి నుంచి ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు లేకపోవడంతో పోలీస్టేషన్లో కేసు నమోదు కాలేదు. -
వైభవంగా త్రిశూల స్నానం
పాలకొల్లు సెంట్రల్ : పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం త్రిశూలస్నానం, కంకణ విమోచన అవభృద స్నానం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాత్రి స్వామివార్ల పుష్పోత్సవ కార్యక్రమం చేశారు. దాదాపు 25 మంది దంపుతులు అమ్మవారికి బుట్టల్లో సారెను సమర్పించారు. అనంతరం ముత్తయిదువులకు జాకెట్టు, గాజులు పంపిణీ చేశారు. దాతలు కంచర్ల రామారావు కుమారులు సత్యనారాయణ, సూర్యనారాయణ దంపతులు ప్రసాద వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ముచ్చర్ల శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ వాసు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి చేరికలు
తాడేపల్లిగూడెం రూరల్: క్షేత్ర స్థాయిలో వైఎస్సార్ సీపీని బలోపేతం చేయాలని ఆ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ వడ్డి రఘురాం నాయుడు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని ఎల్.అగ్రహారం టిడ్కో గృహ సముదాయం వద్ద జనసేనకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి నియోజకవర్గ ఇన్చార్జ్ వడ్డీ రఘురాం నాయుడు పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకూ ఎల్లప్పుడూ పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే టిడ్కో గృహ సముదాయంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. జగన్ను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతీ కార్యకర్త స మష్టిగా పనిచేయాలన్నారు. నియోజకవర్గంలో పార్టీ జెండాను ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు గొర్రెల శ్రీనివాస్, కాకర్ల శ్రీనివాస్, దత్తి సాయి, మానుకొండ వెంకటేశ్వరరావు, తానేటి అజయ్, లంకా రాజశేఖర్, గోకా వెంకటేశ్వరరావు, తాళ్ళప్రసాద్, వట్టి బుజ్జి, యాండ్రపు వంశీ తదితరులు పాల్గొన్నారు. -
దేవదేవా ‘అశ్వాలు’ లేవా?
● అశ్వాలు లేని రథంలో చిన వెంకన్నకు రథోత్సవం ● అధికారులకు విషయం తెలిసినా పట్టించుకోని వైనం ద్వారకాతిరుమల: ఆ దేవదేవుడి దివ్య రథానికి అశ్వాలు లేవు. అయినా ప్రతి ఆరు నెలలకోసారి క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారు ఉభయ దేవేరులతో కలసి ఈ రథంలోనే క్షేత్ర పురవీదుల్లో విహరించడం గమనార్హం. రథానికి చెక్క అశ్వాలు, ఛత్రం వంటివి లేవని అధికారులకు తెలిసినా వారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో తో భక్తులు ఇదేం దారుణమంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం శ్రీవారి వార్షిక ఆదాయం రూ. 180 కోట్లు పైమాటే. ఇంత ఆదాయం వస్తున్నా.. కనీసం శ్రీవారి రథాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో అధికారులు లేరు. అలాగే స్వామివారి చక్ర స్నానానికి కోనేరు నిర్మించే విషయంలోనూ అధికారులు తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్యాబిన్లోనే చక్ర స్నానం? బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు శ్రీవారికి రథోత్సవాన్ని, ఏడో రోజు చక్రస్నానాన్ని నిర్వహిస్తారు. అయితే అశ్వాలు లేని రథంలో రథోత్సవం, ఆలయ యాగశాలలో ట్యాప్ కింద చక్రస్నానం జరుపుతున్న తీరుపై గతేడాది అక్టోబర్ 11న సాక్షి దినపత్రికలో ‘ఆదాయమున్నా.. కనిపించని వైభవం’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దానికి స్పందించిన ఆలయ అధికారులు యాగశాలలో ట్యాప్ వద్ద ఐరన్ క్యాబిన్ను నిర్మించారు. ఇకపై బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి చక్ర స్నానాన్ని అందులోనే జరపనున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే శ్రీవారి చక్రస్నానం ఇక భక్తులకు పూర్తిగా కనబడనట్టే అవుతుంది. దగ్గరపడుతున్న సమయం శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు ఈనెల 26 నుంచి మే 3 వరకు జరగనున్నాయి. అందులో భాగంగా రథోత్సవం మే 1న జరగనుంది. అంటే రథోత్సవానికి ఇంకా 28 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. అధికారులు స్పందిస్తే ఆ సమయంలోపే రథానికి అశ్వాలను ఏర్పాటు చేయించొచ్చు. అలాగే భక్తులకు అమ్మవార్ల దర్శనం కలిగేలా రథంలో కొద్దిపాటి మార్పులు చేయించొచ్చు. అయితే అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. ఏడేళ్ల క్రితం లక్షలాది రూపాయలతో శ్రీవారి రథాన్ని నిర్మించారు. అయితే రథ నిర్మాణంలో తలెత్తిన లోపాలు కారణంగా రథం జీవకళను కోల్పోయిందన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా రథానికి చెక్క అశ్వాలు, ఛత్రం (పైన గొడుగు), రథం చుట్టూ సింహం బొమ్మలు ఉండాలి. అలాగే అశ్వాలను అదుపు చేస్తున్నట్టుగా రజకుడి బొమ్మ ఉండాలి. కానీ అవేమీ రథంలో లేకపోవడంతో భక్తులు విస్మయానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే రథంలో స్వామివారి పక్కన ఉండే అమ్మవార్లు భక్తులకు కనిపించరు. దాంతో రథయాత్రలో పాల్గొనే భక్తులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. స్వామివారి ప్రస్తుత రథాన్ని పూర్వ రథాలకు మాదిరిగా చేయించాలని భక్తులు కోరుతున్నారు. -
ఉత్సాహంగా వాటర్ స్పోర్ట్స్ పోటీలు
జంగారెడ్డిగూడెం: మండలంలోని కేకేఎం ఎర్రకాలువ రిజర్వాయర్లో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం జిల్లాస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను శాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్ఏ అజీజ్ మాట్లాడుతూ శాప్ లీగ్స్లో భాగంగా జిల్లా స్థాయి వాటర్ స్పోర్ట్స్ నిర్వహించామన్నారు. కాయాకింగ్, కెనో యింగ్, రోయింగ్, డ్రాగన్ బోట్ తదితర పోటీలు అండర్–15 సబ్ జూనియర్స్, అండర్–18 జూనియర్స్ బాలురు, బాలికల విభాగాల్లో పోటీలు నిర్వహించామని తెలిపారు. ఈ పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో నిర్వహించే రాష్ట్రస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఎస్.సత్యనారాయణ, ఎస్.రాంబాబు, యడ్ల తేజేశ్వరరావు పాల్గొన్నారు. -
నెలాఖరులోపు రుణాలు చెల్లిస్తే వడ్డీ మాఫీ
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం ద్వారా 2015–16 నుంచి 2018–19 మధ్య కేంద్ర ప్రభుత్వం వారి ద్వారా ఎన్ఎఫ్డీసీ/ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకాల ద్వారా రుణం పొందిన వారు రుణం చెల్లిస్తే వడ్డీ మాఫీ అవుతుందని ఈడీ ఎం.ముక్కంటి తెలిపారు. గురువారం రుణాలు చెల్లించిన వారికి తన కార్యాలయంలో వడ్డీ మాఫీ సర్టిఫికెట్లను అందించి, సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రుణాలు చెల్లించాల్సిన వారు 465 మంది ఉన్నారని, వారు. అసలు రూ.13.55 కోట్లు చెల్లిస్తే వడ్డీ రూ.1.66 కోట్లు మాఫీ అవుతుందని స్పష్టం చేశారు. నూజివీడు: పట్టణంలోని కొత్తపేట 17వ వార్డులో అనధికారికంగా వంటగ్యాస్ సిలిండర్లను విక్రయించే దుకాణంపై గురువారం నూజివీడు సబ్కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మెరుపు దాడి చేశారు. అయితే సబ్కలెక్టర్ వెళ్లేసరికి దుకాణదారుడు దుకాణాన్ని మూసేసి వెళ్లిపోయాడు. దీంతో సబ్కలెక్టర్ ఇక్కడ ఏ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారనే సమాచారాన్ని చుట్టుపక్కల వారిని అడిగి దుకాణాన్ని సీజ్ చేయించారు. అలాగే దుకాణం షట్టర్పై నోటీసు అంటించారు. ఈ సందర్భంగా సబ్కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్, పట్టణ పరిధిలో ఎక్కడైనా వంట గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సబ్కలెక్టర్ వెంట టీపీఓ కె.వెంకటేశ్వరరావు, మున్సిపల్ మేనేజర్ నరసింహారావు తదితరులు ఉన్నారు. -
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
ఆకివీడు: పట్టణంలో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులో గురువారం అతివేగంగా వచ్చిన కారు ట్రాక్టర్ను ఓవర్ టేక్ చేస్తూ కరెంట్ స్తంభం, గోడను ఢీకొట్టింది. సంఘటనలో ఎవరికీ గాయాలు అవ్వలేదు. స్థానిక శాంతి నగర్ వైపు నుంచి ఇద్దరు మైనర్లు మధ్యాహ్న సమయంలో అతి వేగంగా కారును నడుపుతూ ట్రాక్టర్ను తప్పించబోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి, దాని వెనుకనే ఉన్న గోడను ఢీకొట్టారు. ప్రమాదంలో విద్యుత్ స్తంభం ముక్కలై వైర్లు తెగిపడ్డాయి. మంటలు వచ్చి సరఫరా నిలిచిపోయింది. గోడ ధ్వంసమైంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. మధ్యాహ్నం కావడంతో ఆ ప్రాంతంలో జనసంచారం, పాఠశాల విద్యార్థులు బయటకు రాలేదు. లేకుంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభం ధ్వంసమైన సంఘటనపై స్తంభం పునరుద్ధరణ, లైన్లు ఏర్పాటు వంటి వాటికి రూ. 25,600 ఎస్టిమేట్ వేశామని, సంబంధిత కారు యజమాని వద్ద వసూలు చేస్తామని ట్రాన్స్కో ఏఈ రత్నాకర్ చెప్పారు. -
ప్రారంభం కాని భవనానికి ప్రారంభోత్సవ శిలాఫలకం
యలమంచిలి: ప్రారంభం కాని అంగన్వాడీ భవనానికి ఓ అధికారి గురువారం ప్రారంభోత్సవ శిలాఫలకం ఏర్పాటు చేయించాడు. ఇదెక్కడి చోద్యమంటూ ప్రశ్నించిన గ్రామస్తుడికి ఆ అధికారి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. వివరాల ప్రకారం మండలంలోని ఏనువానిలంకలోని శెట్టిబలిజపేటలో నాడు–నేడు పథకం ఫేజ్–1లో భాగంగా అంగన్వాడీ భవన నిర్మాణానికి వైఎస్సార్ సీపీ హయాంలో రూ.16 లక్షలు మంజూరయ్యాయి. అయితే ఆ నిధులతో భవనాన్ని నిర్మించినా, రంగులు వేయకపోవడంతో అసంపూర్తిగా ఉండిపోయింది. అయితే ఈ గ్రామ సర్పంచ్ జనసేన పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో సర్పంచ్ల పదవీ కాలం ముగిసిపోతుండంతో ఈ భవనాన్ని మార్చి 31న మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించినట్లుగా శిలాఫలకం తీసుకువచ్చి అతికారు. ఆపుతావా..ఆపు..నీ వల్ల అవుతుందా? ఈ విషయం తెలిసి వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లుల కొండలరావు భవనం వద్దకు వెళ్లి అక్కడ పని చేయిస్తున్న సమగ్ర శిక్ష ఏఈ వర్థనపు వెంకటేశ్వరరావు (కాసు)ను ప్రశ్నించారు. దీనికి ఏఈ స్పందిస్తూ శిలాఫలకం వేయడం ఆపుతావా? ఆపు..నీ వల్ల అవుతుందా? మంత్రి చెప్పారు..నేను చేస్తున్నా..అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అయితే నాడు–నేడు పథకంలో పనులు జరిగితే శిలాఫలకంపై మన బడి–మన భవిష్యత్లో నిర్మించినట్లు వేయడం, యలమంచిలి ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి పేరు పక్కన పాలకొల్లు ఎంపీపీ అని వేయడంపై వైఎస్సార్ సీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. -
దివ్యాంగులతో సదరంగం
కూటమి ప్రభుత్వం దివ్యాంగులతో ఆటలాడుతూ నరకం చూపిస్తోంది. అంగవైకల్యం స్పష్టంగా కనిపిస్తున్నా పింఛన్ల కోసం రీ వెరిఫికేషన్ అంటూ వారిని నానా యాతనలు పెడుతోంది. శ్లాట్ బుక్ చేసుకున్న తరువాత ఆసుపత్రికి వస్తే సంబంధిత డాక్టర్ లేరు... అక్కడికి వెళ్లు.. ఇక్కడికి వెళ్లు అంటూ వార్డులు తిప్పుతున్నారని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంటి బిడ్డలతో, నడవలేని పరిస్ధితుల్లో ఉన్న వృద్ధులు ఎలా తిరుగుతారంటూ ప్రభుత్వం, డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు రాగా 12 గంటలు దాటినా దివ్యాంగులను పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. దివ్యాంగుల రీవెరిఫికేషన్ వార్డు వద్ద బాధితుల దయనీయమైన దృశ్యాలు ఇవి. – సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు -
పీఎన్జీ గ్యాస్ కనెక్షన్ల విస్తరణకు చర్యలు
భీమవరం (ప్రకాశం చౌక్): జిల్లాలో పీఎన్జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం జాయింట్ కలెక్టరేట్ ఛాంబర్ ఎన్ఎండీవై గోదావరి గ్యాస్, సివిల్ సప్లైస్, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గృహ వినియోగదారులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన నిరంతర గ్యాస్ సరఫరా అందించేందుకు పీఎన్జీ గ్యాస్ విస్తరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రజల్లో అవగాహన కల్పించి, పీఎన్జీ కనెక్షన్లు పొందేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో తాడేపల్లిగూడెం ప్రాంతంలో మొత్తం 9,902 గ్యాస్ కనెక్షన్లకు పైప్లైన్ సదుపాయం సిద్ధంగా ఉన్నప్పటికీ, కేవలం 63 మంది మాత్రమే వినియోగం చేస్తున్నారని తెలిపారు. ఎల్పీజీ సిలిండర్లతో పోలిస్తే పీఎన్జీ గ్యాస్ వినియోగం ద్వారా వినియోగదారులకు నెలకు సుమారు రూ.100 నుంచి రూ.150 వరకు ఆదా అవుతుందని చెప్పారు. ప్రజలు ముందుకు వచ్చి సంబంధిత శాఖల అధికారులతో సంప్రదించి పీఎన్జీ గ్యాస్ కనెక్షన్లు పొందాలని సూచించారు. గ్యాస్ కనెక్షన్ల కోసం గోదావరి గ్యాస్ అసిస్టెంట్ మేనేజర్ను ఫోన్ నెంబర్ 94914 24143 ద్వారా సంప్రదించాలన్నారు. అలాగే భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు పట్టణాల్లో పీఎన్జీ గ్యాస్ కనెక్షన్ల విస్తరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.సమావేశంలో డీఎస్ఓ ఎన్.సరోజ, గోదావరి గ్యాస్ అసిస్టెంట్ మేనేజర్ ఎం.సత్య రాకేష్, భీమవరం మున్సిపల్ కమిషనర్ ఎం.రామచంద్రారెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖాధికారి యు.మంగపతిరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పీడీఎస్ బియ్యం పట్టివేత
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం పి. అంకంపాలెం సమీపంలో పీడీఎస్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్ను బుధవారం పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్సై క్రాంతి కుమార్ తెలిపారు. పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పీడీఎస్ బియ్యంను తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు డిప్యూటీ తహసీల్దార్, వీఆర్ఓల సమక్షంలో పట్టుకున్నట్లు తెలిపారు. మొత్తం 50 కేజీల పరిమాణం గల 60 బస్తాలు వ్యాన్లో ఉన్నాయన్నారు. బియ్యంను అక్రమంగా రవాణా చేస్తున్న కె.సురేష్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రేషన్ బియ్యం బస్తాలు స్వాధీనం పెదపాడు: రేషన్ బియ్యం అక్రమ నిల్వలను పెదపాడు పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మండలంలోని కొత్తూరు గ్రామంలో రేషన్ బియ్యం అక్రమ నిల్వ చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్సై ఆర్.శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి చితాడ పవిత్ర కుమార్ గోడౌన్పై దాడి చేసి బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకుని అతడిపై కేను సమోదు చేశారు. చింతలపూడి: ఎదురెదురుగా రెండు మోటార్సైకిళ్లు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాఘవాపురం గ్రీన్ ఫీల్డ్ హైవే సమీపంలో ముగ్గురు యువకులు బైక్పై రాఘవపురం నుంచి అతివేగంతో వెళ్తున్నారు. అదే సమయంలో సత్తుపల్లి నుంచి ద్విచక్రవాహనంపై చింతలపూడి వైపు వస్తున్న తెడ్లం గ్రామానికి చెందిన గంజి రాధ (35)ను వారు ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో రాధ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన యువకులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాధ మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎస్సై కె సతీష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుక్కునూరు: రోడ్డు ప్రమాదంలో ఓ సర్పంచ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం అనంతరం కివ్వాక పంచాయతీ సర్పంచ్ మడివి రాజులు తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి తిరిగి వెనక్కి వస్తుండగా స్పోర్ట్స్ బైక్ పై వేగంగా వచ్చిన యువకుడు బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సర్పంచ్ రాజులు కాలి ఎముక విరిగిపోగా, తలకు తీవ్ర గాయమైంది. దీంతో స్థానికులు 108 వాహనంలో స్థానిక పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. ఉంగుటూరు: పాము కాటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన నీలాద్రిపురంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన తాళ్ల సుబ్బారావు (35) బుధవారం పొలంలో మెక్కజొన్న చేలో పొత్తులు విరుస్తుండగా కాలుమీద పాము కాటు వేసింది. దాంతో స్థానికులు అతడిని వెంటనే తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సుబ్బారావుకు భార్య భవాని, పిల్లలు ఉన్నారు. జంగారెడ్డిగూడెం: స్థానిక మార్కండేయపురానికి చెందిన యువతి (20) అదృశ్యంపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం యువతి గతంలో కిరాణా షాపులో పనిచేసేదని, అక్కడ మానివేసి ఇంటి వద్దే ఉంటోందని తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
ఆరోగ్యం.. ఆదాయం
● ద్విచక్ర వాహనంపై ‘సిరిధాన్యాల’ ప్రయాణం ● వ్యాపారంలో లాభం కంటే.. ప్రజల ఆరోగ్యానికే పెద్దపీట చింతలపూడి: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ‘ఫాస్ట్ ఫుడ్’ కల్చర్ పెరిగిపోయి ప్రజలు అనా రోగ్యం బారిన పడుతుంటే, ఓ యువకుడు మాత్రం ప్రజలకు ఆరోగ్యాన్ని పంచుతూ తన జీవనోపాధిని వెతుక్కుంటున్నాడు. చిరుధాన్యాల (మిల్లెట్స్) విలువను చాటిచెబుతున్నాడు చింతలపూడి పట్టణానికి చెందిన దేవగురు సత్యనారాయణ. ఆరోగ్యం.. ఆదాయం.. ఒకే బాటలో.. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కొరల్రు, అరికెలు, సామలు, ఊదలు, రాగి వంటి మిల్లెట్లతో తయారు చేసిన జావను విక్రయిస్తూ ఒకపక్క కుటుంబాన్ని పోషించుకుంటూనే, మరోపక్క ప్రజలకు పోషకాహారాన్ని అందిస్తున్నాడు. గత మూడు సంవత్సరాలుగా తన ద్విచక్ర వాహనాన్ని ఒక ‘మొబైల్ క్యాంటీన్’లా మార్చుకుని ఊరూరా తిరుగుతూ వీటిని విక్రయిస్తున్నాడు. కేవలం జావ అమ్మి వెళ్లిపోవడం కాకుండా, దాని వల్ల కలిగే ప్రయోజనాలను కూడా ఆయన వివరిస్తున్నాడు. మధుమేహం, రక్తపోటు నియంత్రణలో మిల్లెట్లు ఎలా తోడ్పడతాయో వినియోగదారులకు వివరిస్తున్నాడు. ప్రస్తుతం రోజుకు సగటున 40 నుంచి 50 గ్లాసుల జావ విక్రయిస్తూ తనదైన శైలిలో రాణిస్తున్నాడు. ఈ రోజుల్లో ప్రజలకు రుచిపై ఉన్న శ్రద్ధ ఆరోగ్యంపై లేదు. చిరుధాన్యాల గొప్పతనం గురించి ఇంకా సరైన అవగాహన రావాలి. ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం అందితే, మరిన్ని ప్రాంతాల్లో ఈ ఆరోగ్యకరమైన జావను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతానని అంటున్నాడు. మిల్లెట్ జావ తాగడం వల్ల మధుమేహం, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. కొవ్వు కరిగి బరువు కూడా తగ్గుతారు. చిరు ధాన్యాల జావ గురించి ప్రజలకు అవగాహన కలిగించాలి. ప్రభుత్వం సహాయం అందిస్తే వ్యాపారాన్ని మరింత విస్తరించే ఆలోచన ఉంది. – దేవగురు సత్యనారాయణ -
అపరాల రైతుల ఆందోళన
ఏలూరు (ఆర్ఆర్పేట): రైతులు పండించిన పెసర, మినుము పంటలను పూర్తిగా కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ అన్నారు. కొనుగోలు నిబంధనలతో రైతులను ఇబ్బందులు పెడుతున్న అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ అపరాల రైతులు బుధవారం ఏలూరు శివారు సుంకరివారితోట రైతు సేవా కేంద్రం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కొనుగోలు లక్ష్యం పూర్తయిందని గత కొన్ని రోజులుగా కొనుగోలు నిలిపివేయడంతో అపరాల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికే తగిన దిగుబడులు రాక, పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయి అపరాల రైతులు నష్టపోయారన్నారు. అపరాల కొనుగోలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. రైతు సేవా కేంద్రం వద్దకు తీసుకువచ్చిన పంట రోజులు తరబడి ఇక్కడే ఉండిపోవడంతో ఆ పంట కాపలాకు రాత్రి, పగలు ఇక్కడే పడిగాపులు పడాల్సి వస్తోందని అపరాల రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అక్కడికి వచ్చిన మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్తో సంప్రదింపులు జరుపగా పెసర పంటను వెంటనే గోడౌన్కు తరలిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. బుట్టాయగూడెం: బాల బాలికలు సురక్షితమైన ఆరోగ్యవంతమైన వాతావరణంలో పెరుగుతూ మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని బంగారు భవిష్యత్ను నిర్మించుకోవాలని ఐటీడిఏ పీఓ కె.రాములు నాయక్ అన్నారు. కేఆర్పురం ఐటీడీఏ వద్ద మిషన్ వాత్సల్య పథకంపై బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మిషన్ వాత్సల్య పథకం ద్వారా అమలు జరుగుతున్న చట్టాలు, సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సీహెచ్ సూర్య చక్రవేణి మాట్లాడుతూ మిషన్ వాత్సల్య పథకంపై గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, కాలేజీలు, వసతిగృహాల్లో పాటించవలసిన భద్రత, రక్షణ వివరాలను ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు, ఉపాధ్యాయులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాలలతో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసినప్పుడే మిషన్ వాత్సల్య పథకం లక్ష్యాలను చేరుకుని బాలల స్నేహపూర్వక, స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీపీయూ జిల్లా సిబ్బంది యు.బాలస్వామి, రాజేష్, రాజ్కుమార్, డీడీ పి.జనార్థన్ రావు, డీవైఈఓ కె.రవిప్రసన్నకుమార్, ఏఎంఓ కె. శిరమయ్య, జీసీడీఓ డి.రాజేశ్వరి, సీఎంఓ ఎస్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆక్వా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి
కై కలూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపలు, రొయ్యల రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ బి.బలరాం డిమాండ్ చేశారు. కై కలూరు ఎన్జీవోస్ కాలనీలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, ఆక్వా రైతు బొడ్డు నోబుల్ నివాసం వద్ద ఆక్వారంగ ప్రస్తుత పరిస్థితులపై సమావేశం బుధవారం నిర్వహించారు. బలరాం మాట్లాడుతూ ట్రంప్ సుంకాలు, యుద్ధంతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ప్రస్తుతం ఆక్వా ఉత్పత్తులకు స్థిరమైన, నిలకడైన ధరలు లేకపోవడంతో ఉత్పత్తి ఖర్చులు పెరిగి ఆక్వా రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ఆక్వా ఫీడ్కు సంబంధించిన సోయాబీన్ ముడి సరుకుల ధరలు తగ్గినా ఫీడ్ ధరలు తగ్గించకపోవడం అన్యాయమన్నారు. ఫీడ్ ధరలు తగ్గించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. విద్యుత్ సబ్సిడీ రైతులందరికీ వర్తింపజేయాలని, పెంచిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ధరలు తగ్గించాలన్నారు. ఆక్వారంగాన్ని వ్యవసాయ రంగంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతుల సమస్యలపై జూన్ 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభల్లో చర్చిస్తామని చెప్పారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రవి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
టికెట్లు సులభం.. సేవలు పారదర్శకం
ద్వారకాతిరుమల: శ్రీవారి భక్తులకు ఆన్లైన్ సేవలను మరింత చేరువ చేసేందుకు కియోస్క్ మెషీన్లను ఏర్పాటు చేసినట్టు ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. స్థానిక అనివేటి మండపంలో ఏర్పాటు చేసిన ఈ కియోస్క్ మెషీన్లను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, కరూర్ వైశ్యా బ్యాంక్ల సంయుక్త సహకారంతో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో 100 కియోస్క్ మెషీన్లను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని తలపెట్టినట్టు చెప్పారు. అందులో భాగంగానే శ్రీవారి ఆలయంలో ఈ కియోస్క్ల సదుపాయం భక్తులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. భక్తులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉపయోగాలిలా.. ● భక్తుల చేతిలో నగదు లేకపోయినా డిజిటల్ యూపీఐ, కార్డుల ద్వారా (నగదు రహిత) చెల్లింపులు జరిపి దర్శనం, ప్రసాదం, వివిధ సేవా టికెట్లను సులభంగా పొందవచ్చు. ● ఈ మెషీన్ల ద్వారా నేరుగా టికెట్లు తీసుకుంటే క్యూలైన్లలో వేచి ఉండక్కర్లేదు. దాంతో సమయం ఆదా అవుతుంది. ● టికెట్లు విక్రయించే ప్రక్రియలో భక్తులకు మరింత పారదర్శకత లభిస్తుంది. కియోస్క్లు ఏర్పాటు చేసిన ప్రదేశాలు ఇవీ.. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ కియోస్క్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అనివేటి మండపం, కొండ కింద సమాచార కేంద్రం, కేశఖండనశాల, శ్రీ ధర్మ అప్పరాయ నిలయం, ప్రసాదాల కౌంటర్ల సముదాయం, పీఆర్వో కార్యాలయం, నిత్య కల్యాణ మండపం వద్ద వీటిని ఏర్పాటు చేసినట్టు ఈఓ పేర్కొన్నారు. కియోస్క్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు, ఎలక్ట్రికల్ డీఈ టి.సూర్యనారాయణ, కరూర్ వైశ్యా బ్యాంక్ డీజీఎం ఎన్.రమేష్, అరవింద్ గణేష్, సీబీ శేఖర్, ఏలూరు బ్రాంచ్ హెడ్ కె.ఫణికుమార్ తదితరులున్నారు. శ్రీవారి దేవస్థానంలో కియోస్క్ మెషీన్లు ప్రారంభం -
మహిళల ఉపాధి కల్పనకు ప్రాధాన్యం
పెనుగొండ: మహిళలకు ఉపాధి కల్పనతో పాటు పరిశ్రమల స్థాపనకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం ఆచంటలో శ్రీస్వర్ణాంధ్ర 2047శ్రీలో భాగంగా విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. రాష్ట్రంలోనే ఇది మొదటి భవనం కావడం విశేషమన్నారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల్లో పేదరిక నిర్మూలన, ప్రతి కుటుంబానికి ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, ఇంటింటికీ సురక్షిత తాగునీటి సరఫరా తదితర అంశాలు కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు, ప్రత్యేకాధికారి జి. పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్ కేతా విజయలక్ష్మి, ఎంపీపీ దిగమర్తి సూర్యకుమారి, జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్బాబు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్, ఎమ్మెల్యే పితానిలు బుధవారం ఆచంట రావిగుంటలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో పేదల గృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి లక్ష్యాలను సాధించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఇందులో నిర్లక్ష్యం వహించే సిబ్బంది, ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో గృహ నిర్మాణాల పురోగతిపై మండలాల వారీగా సమీక్షించారు. -
ధాన్యం కొనుగోలుపై అవగాహన తప్పనిసరి
పెంటపాడు: దాళ్వా ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు సరైన అవగాహన అవసరమని జాయింట్ కలెక్టర్ రాహుల్కుమార్రెడ్డి పేర్కొన్నారు. సీజన్ ప్రారంభం దృష్ట్యా బుధ వారం పెంటపాడు మండలం ముదునూరులో ఆయన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గోనె సంచుల కొరత రానివ్వకుండా రైతులు సకాలంలో సంచులు తీసుకెళ్లాలన్నారు. మిల్లులకు ధాన్యం అమ్మిన సందర్భంలో ఓటీపీ నెంబర్ తప్పనిసరిగా సరి చూసుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయశాఖాఽధికారి జెడ్.వెంకటేశ్వర్లు, ఏడీఏ ఆర్.గంగాధరరావు, మండల వ్యవసాయాధికారి చిర్ల రవికుమార్ తదితరులు రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత జనవరి 21 నుంచి 29 వరకూ తొలి విడత జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. రెండో విడత పరీక్షలు ఏలూరు జిల్లాలో ఒక కేంద్రంలో, పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు కేంద్రాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లాకు సంబంధించిన ఏలూరు నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి భీమవరంలోని డీఎన్ఆర్ కళాశాల, విష్ణు ఇంజనీరింగ్ కళాశాలల్లో నిర్వహించనున్నారు. తాడేపల్లిగూడెంలోని శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల, శశి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ నెల 2, 4, 5, 6, 7, 8 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తారు. కై కలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2025–26 సంవత్సరానికి దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి గ్రూప్–4 పోస్టులు 17, క్లాస్–4 పోస్టులు 12 భర్తీకి అర్హులైన దివ్యాంగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని విభిన్న ప్రతిభావంతుల సంక్షేను శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.రామ్కుమార్ బుధవారం చెప్పారు. విద్యార్హత, కేటగిరిలలో ఖాళీల వివరాలు, నమూనా దరఖాస్తుతో కూడిన పూర్తి వివరాలు వెబ్సైట్లో పొందుపర్చారన్నారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 08812–234146 నెంబరులో సంప్రదించాలని కోరారు. భీమవరం(ప్రకాశంచౌక్): కాళీపట్నం–భీమవరం ప్రధాన రహదారిపై అభివృద్ధి పనులు చేపట్టనున్న నేపథ్యంలో, ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం నుంచి కాళీపట్నం వైపు వెళ్లే వాహనాలు భీమవరం, దిరుసుమర్రు జంక్షన్ అంతర్గత గ్రామ రహదారి మీదుగా కాళీపట్నం, కాళీపట్నం నుంచి భీమవరం వైపు వచ్చే వాహనాలు కాళీపట్నం, రామాయణపురం గ్రామ అంతర్గత రహదారి మీదుగా భీమవరం రావాలని సూచించారు. భారీ వాహనాలు సమీప ప్రధాన రహదారులు, జిల్లా రహదారుల మీదుగా మళ్లిస్తారన్నారు. జంగారెడ్డిగూడెం: వర్జీనియా వేలం ప్రక్రియ ధరల్లో మార్పు లేకపోవడంతో రైతులు ధర ఎప్పుడు పెరుగుతుందా అని ఎదురుచూస్తున్నారు. వేలం ప్రక్రియలో బయ్యర్లు, సిబ్బంది కొరతతో షిప్ట్ పద్దతిలో వేలం నిర్వహిస్తుండగా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 5 వేలం కేంద్రాల పరిధిలో బుధవారం జంగారెడ్డిగూడెం–1, జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రాల్లో వర్జీనియా పొగాకు వేలం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం–1 వేలం కేంద్రంలో మొత్తం 182 బేళ్లు రాగా, వాటిలో 113 బేళ్లు తిరస్కరించారు. 69 బేళ్ళు కొనుగోలు చేయగా, గరిష్ట ధర రూ. 265, కనిష్ట ధర రూ.250 వచ్చింది. సరాసరి రూ.256.86గా నమోదైంది. జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రంలో 232 బేళ్లు అమ్మకానికి రాగా, 130 బేళ్లు తిరస్కరించారు. 102 బేళ్ళు కొనుగోలు చేయగా, గరిష్ట ధర రూ.265, కనిష్ట ధర రూ.255 వచ్చింది. సరాసరి ధర రూ.258.26 నమోదైంది. -
పేదల ప్రాణాలతో చెలగాటం
భీమవరం(ప్రకాశం చౌక్): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి బకాయిల కోసం ఇప్పటికే రెండుసార్లు సేవలు నిలిపేయగా, తాజాగా బుధవారం నుంచి మూడోసారి సమ్మె బాట పట్టాయి. జిల్లాలో మొత్తం 30 నెట్వర్క్ ఆసుపత్రులు ఉండగా, బుధవారం నాటికి 15 ఆసుపత్రులు సేవలు నిలిపివేశాయి. మిగిలిన ఆసుపత్రులు కూడా అదే బాటలో పయనించే యోచనలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా కోట్లాది రూపాయిల బకాయిలు పెట్టింది. జిల్లాలో ఉన్న నెట్వర్క్ ఆసుపత్రులకు కోట్లు రూపాయలు బకాయిలు ఉన్నాయి. బకాయిలు చెల్లించకుండా సేవలు అందించాలని ఒత్తిడి చేయడం, బిల్లులపై డిస్కౌంట్ల పేరుతో బేరసారాలకు దిగడంతో విసిగిపోయిన యాజమాన్యాలు మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నాయి. పేదల ప్రాణాలతో చెలగాటం ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యోగా డే వంటి కార్యక్రమాల కోసం రూ.300 కోట్లు ఖర్చు పెట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల ప్రాణాలు కోసం ఆరోగ్యశ్రీకి ఖర్చు చేయడానికి నిర్లక్ష్యం చేయడంతో పేదల ప్రాణాలకు ముప్పు వచ్చింది. గతంలో నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె చేయడంతో పేద ప్రజలు వైద్యం కోసం విలవిల్లాడి అప్పులు చేసుకుని వైద్య సేవలు పొందారు. మళ్లీ అదే పరిస్థితిను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. బకాయిల కోసం మళ్లీ సమ్మెకు దిగి వైద్య సేవలు నిలిపేయడంతో పేద, మధ్య తరగతి ప్రజలు వైద్య సేవలకు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరం వైద్యం కోసం దూర ప్రాంతాల ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. స్థానికంగా వైద్యం అందాల్సిన పరిస్థితి లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లే లోపు ప్రాణాలు పోతాయని ఆందోళన చెందుతున్నారు. నెట్వర్క్ కాకుండా ప్రైవేట్ ఆసుపత్రులల్లో వైద్యం పొందాలంటే రూ.లక్షల్లో ఖర్చు చేయడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్యశ్రీ హెల్ప్ డెస్క్ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ జిల్లాలో 15 ఆసుపత్రుల్లో నిలిచిన వైద్యం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడోసారి సమ్మె జిల్లాకు దాదాపు రూ.100 కోట్ల బకాయిలు ఆందోళనలో రోగులు, బంధువులుతణుకు 07 తాడేపల్లిగూడెం 05 పాలకొల్లు 01 నరసాపురం 02 జిల్లాలోని 30 నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం దాదాపు రూ.100 కోట్ల వరకు బకాయి పడింది. ఒక్కో ఆసుపత్రికి రూ.3 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు బకాయిలున్నాయి. సాధారణ ఆసుపత్రులకు రూ.3 కోట్ల వరకు బకాయిలు ఉంటే, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు రూ.10 నుంచి రూ.30 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. దీంతో అప్పులు చేసి మరీ ఆసుపత్రులను నిర్వహించాల్సి వస్తోందని అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు చెల్లించండి అని అడుగుతున్న నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోగా, 10 నుంచి 15 శాతం డిస్కౌంట్ ఇస్తేనే బిల్లులు విడుదల చేస్తామంటూ బేరాలు ఆడుతోంది. ఆఖరికి ఆసుపత్రులు 4 శాతం డిస్కౌంట్కు అంగీకరించినా నిధులు విడుదల చేయడంలో తాత్సారం చేస్తోంది. -
మూల్యాంకనం నుంచి మినహాయింపునకు వినతి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభంకానున్న 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు రాసిన జవాబు పత్రాల మూల్యాంకన విధుల నుంచి వివిధ వర్గాల ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జాక్టో నాయకులు బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జాక్టో నాయకులు మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉపాధ్యాయులకు ఎస్ఎస్సీ మూల్యాంకన విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని, అలాగే 55 సంవత్సరాల వయసు దాటిన ఉపాధ్యాయులకు సైతం మినహాయింపు ఇవ్వాలని కోరారు. మూల్యాంకన విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు చెల్లించే రెమ్యూనరేషన్ను పెంచాలని, మంచినీరు, వెంటిలేషన్ తదితర సౌకర్యాలు కల్పించాలని, పాఠశాల యూనిట్గా 50 శాతం మించకుండా ఏఈ, స్పెషల్ అసిస్టెంట్లను నియమించాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో జాక్టో నాయకులు పువ్వుల ఆంజనేయులు తదితరులున్నారు. -
నకిలీ టికెట్ల వ్యవహారంపై సీరియస్
● టెక్నికల్ టీంను నియమించిన దేవదాయ శాఖ కమిషనర్ ● వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానంలో ఇటీవల వెలుగు చూసిన రూ.200 నకిలీ టికెట్ల వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాలని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, కమిషనర్లకు, జిల్లా ఎస్పీకి సీఎంఓ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. దాంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తును మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయంలో గత నెల 15న రూ.200 నకిలీ టికెట్ల విక్రయాల వ్యవహారం బయటపడింది. దీనిపై దేవస్థానం ఈఓ వై.భద్రాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై టి.సుధీర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎస్.శేషుబాబు, ఏ3 నిందితుడిగా ఉన్న సెక్యురిటీ గార్డు మేకా సతీష్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఏ1 నిందితుడైన ఐఎస్జే రాజు ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించాడు. ఇదిలా ఉంటే రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ నకిలీ టికెట్ల స్కాంపై ఒక టెక్నికల్ కమిటీని నియమించారు. అందులో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) లిమిటెడ్ సభ్యులు, సింహాచలం దేవస్థానానికి చెందిన సిస్టం అడ్మినిస్ట్రేటర్, అన్నవరం దేవస్థానానికి చెందిన మరో సిస్టం అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు. వారం రోజుల్లోగా సంబంధిత రిపోర్టును తనకు అందించాలని కమిషనర్ కమిటీని ఆదేశించారు. మరో ఒకటి రెండు రోజుల్లో కమిటీ దేవస్థానంలో విచారణ చేపట్టనుంది. అయితే వీరు పరిశీలించాల్సిన కంప్యూటర్ సిస్టంను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. దాంతో పోలీసులు ఈ కమిటీకి సహకరిస్తారా.. లేక తామే టెక్నికల్ పరీక్షలు జరిపిస్తామని పోలీసులు చెబుతారా? అన్నది ప్రశ్నార్ధకంగా ఉంది. పోలీసులు కంప్యూటర్ సిస్టంను టెక్నికల్ టీమ్కు ఇవ్వకపోతే వారు దేవస్థానం వద్ద ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించడం మినహా ఏమీ చేయలేరు. ఏది ఏమైనా ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సంచలనంగా మారింది. -
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి
ఏలూరు(ఆర్ఆర్పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు. పీఆర్సీ కమిషనర్ను వెంటనే నియమించాలని, 29 శాతం ఐఆర్ ప్రకటించాలని, మెమో నెంబర్ 57 అమలు చేయాలని, పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రవికుమార్ అధ్యక్షతన చేపట్టారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, అధికారంలోకి వచ్చేముందు ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చిన మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక బకాయిలు విడుదల చేయాలని, ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఎలను వెంటనే విడుదల చేయాలని, కేంద్ర ప్రభుత్వం మెమో 57ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏపీ జేఏసీ నాయకులు చోడగిరి శ్రీనివాసరావు, ఆర్ఎస్ హరినాథ్, నెరుసు రామారావు, సీఐటీయూ నాయకులు ఆర్. లింగరాజు, డీఎన్వీడీ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు కే. శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్1938, ఏపీటీఎఫ్ 257, ఎస్టీయూ, డీటీఎఫ్, బీటీఏ, ఆప్టా, ఏపీఎస్టీఏ, పీఆర్టీయూ తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు మద్దతు ప్రకటిస్తూ సంఘీభావ సందేశం తెలిపారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్పీ మనోహర్ కుమార్, బీ సుభాషిణి, జిల్లా సహాధ్యక్షులు ఎస్.సుధారాణి, జీ వెంకటేశ్వరరావు, కోశాధికారి రంగమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఉండి ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలి
ఏలూరు(ఆర్ఆర్పేట): ఆకివీడు పెద్దపేటలో మతసామరస్యత వాతావరణానికి విఘాతం కలగడానికి ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు వైఖరే కారణమని సీపీఎం ఏలూరు నగర కమిటీ నిర్వహించిన సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నగర కార్యదర్శి పంపన రవికుమార్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి చాగంటి సంజీవ్ మాట్లాడుతూ గత నెల రోజులుగా ఆకివీడు పెద్దపేట వివాదం ముదురుతుంటుంటే జిల్లా పోలీసు యంత్రాంగం ఎమ్మెల్యే ఎలా వ్యవహరించినా సహకరించడం సరికాదన్నారు. పేటలో ఉన్న గుడిని ఏ విధంగా నిర్మించుకోవాలో వారే నిర్ణయించుకుంటారని తెలిపారు. ఇరువర్గాలను ఐక్యం చేస్తూ సమస్యను పరిష్కారం చేసేలా వ్యవహరించాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రవి మాట్లాడుతూ జిల్లా ప్రశాంతతకు మారుపేరని, చిన్న చిన్న ఘర్షణలు జరిగినా వెంటనే సద్దుమణిగేవన్నారు. ఆకివీడులో జరుగుతున్న వివాదం కేవలం డిప్యూటీ స్పీకర్ రాజేస్తున్న వివాదం మాత్రమే తప్ప ప్రజల మధ్య వివాదం కాదన్నారు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అరెస్ట్ చేసిన 57 మంది దళిత యువకులను వెంటనే విడుదల చేయాలన్నారు. దళిత క్రిస్టియన్ రైట్స్ జేఏసీ చైర్మన్ డాక్టర్ పెరికే వరప్రసాదరావు మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేసి ఒక కులానికో, మతానికో ఏకపక్షంగా వ్యవహరించడం తగన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్రావు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం వైఫల్యం వలనే ఈ వివాదం ముదిరిందన్నారు. టీడీపీ, జనసేన కేడర్ కూడా ఆలోచించాలని, రఘురామకృష్ణరాజు కుట్రలో బలికావద్దన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ పూలె ఉద్యమ నేతలు డాక్టర్ పెరియార్ దాసరి జీవన్ శ్యాం, కెవీపియస్ జిల్లా కార్యదర్శి అండుగుల ఫ్రాన్సిస్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పీవీ రామకృష్ణ, సామజిక ఉద్యమ నేతలు మాంచెల్ల ఇస్సాక్, కాకర్ల రాజేంద్ర ప్రసాద్, పీ.వెంకటేశ్వర్లు, పళ్లెం ప్రసాద్, వైఎస్ కనకారావు, జీ.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి చాగంటి సంజీవ్ -
రొయ్యో.. మొర్రో
ఆకివీడు: ఉద్యమించిన రైతులకు పెంచిన రొయ్యల ధరలు అందని ద్రాక్షగానే ఉన్నాయి. రొయ్యల ధరల పతనం, మేత ధరలు ఆకాశాన్నంటడంతో రైతులు ఇటీవల ఆందోళన చేపట్టారు. భవిష్యత్లో ఇదే పరిణామాలు కొనసాగితే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించడంతో ఎగుమతిదారులు మొక్కుబడిగా రొయ్యల ధరల్ని పెంచారు. అయితే పెంచిన ధరలకు షరతులు విధిస్తూ 3 టన్నుల పైబడి పట్టుబడి ఉన్న రొయ్యలకు మాత్రమే ఈ ధర అని ప్రకటించడంతో రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. గత కొన్ని నెలలుగా ఆక్వారైతులు రొయ్య ధరల పతనం, ఎగుమతి దారులు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు రోడ్డు ఎక్కారు. రైతులు తమ సమస్యలపై ఎలుగెత్తి చాటినా చంద్రబాబు ప్రభుత్వం కనికరించలేదు. రొయ్యల ధరలు స్థిరీకరణ, మేత ధరల తగ్గిపు పట్ల ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. గతంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రొయ్యల ధరలు పతనమైనా, మేత ధరలు పెంచినా వెంటనే ఎగుమతిదారులతోనూ, మేత ఉత్పత్తి దారులతో సమావేశాలు నిర్వహించి రైతులకు మేలు చేశారు. ఆ పరిస్థితి నేడు కన్పించడంలేదని రైతులు లబోదిబోమంటున్నారు. రొయ్యపై అంతర్జాతీయ ప్రభావం యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా రొయ్యల మార్కెట్లో ఒడుదుడుకులు ప్రారంభమయ్యాయి. ఎగుమతులపై ప్రభావం పడటంతో ధరల్ని తగ్గించివేస్తున్నారు. పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధం తీవ్రతరం అవ్వడంతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. యుద్ధ నేపథ్యంలో అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతుల్లో ఏర్పడిన ఇబ్బందులను ఎగుమతిదారులు ఆసరాగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం 100 సమీపంలోని కౌంట్ ఉన్న రొయ్యల్ని చైనా, వియత్నాం ఎగుమతి చేస్తున్నారు. వీటి ధర ఆశాజనకంగా ఉన్నా మూడు టన్నుల పైబడి సరుకు ఉండాలనే ఆంక్షలతో రైతులు విలవిలలాడుతోన్నారు. ప్రస్తుతం రొయ్యల ధరలు ఇలా.. 100 కౌంట్ 250 90 కౌంట్ 260 80 కౌంట్ 280 70 కౌంట్ 285 60 కౌంట్ 295 50 కౌంట్ 315 40 కౌంట్ 345 30 కౌంట్ 470 రైతులకు అందని ద్రాక్షగా పెంచిన రొయ్యల ధరలు టన్నుల మతలబుతో ధర పతనం యుద్ధ క్రీనీడల ప్రభావం మేత ధరలు పెరిగినా సాగు కొనసాగింపు వైరస్లను అధిగమించినా లభించని ధర రైతులు సమైక్యంగా ఉద్యమించి హెచ్చరించినా మేత ధరల్లో ఏ మాత్రం తగ్గింపులేదు. మేత ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 100 కౌంటుకు టన్ను మేత ధర లక్ష పైబడే ఉంది. వీరవాసరంలో చేపట్టిన ఉద్యమంకు ముందు ఎంత ధర ఉందో ఇప్పుడూ అంతే ధర ఉంది. 100 కౌంటుకు కేజీకీ రూ.250 అవుతుంది. ప్రస్తుతం ఽరొయ్య కేజీ ధర రూ.235 (టన్ను ధర 2.35 లక్షలు) మాత్రమే ఉంది. పెంపకం ధర అధికంగా ఉండటంతో రైతుకు నష్టమే వస్తుంది. అనధికారికంగా రొయ్యల్ని కొనుగోలు చేయడంలేదు. మూడు టన్నులుకు పైబడి ఉంటే రూ. 250కు కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ఉంటే రూ.15 తగ్గించివేస్తున్నారు. ఆక్వా రంగంలో ఎగుమతి, సీడ్, ఫీడ్, నీడ్స్ అన్నీ కూటమి నాయకుల చేతుల్లోనే ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. రోజు రోజుకూ ధరలు పెంచడం, రొయ్యల ధరలు తగ్గించడం వంటివి వారి ఇష్టానుసారం సాగిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూటమి నాయకులే అధిక శాతం వ్యాపారాల్లో కొనసాగుతున్నారంటున్నారు. జగన్ ప్రభుత్వంలో జగన్ వల్లే ధరలు పడిపోయాయని కూటమి నాయకులు అసత్య ప్రచారం చేశారని, చంద్రబాబు పాలన ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకూ ధరల స్థిరీకరణ పనులు చేపట్టలేదని రైతులు వాపోతున్నారు. దళారుల్ని దింపి ధరల్ని తగ్గించివేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. -
చైన్ స్నాచింగ్ కేసుల్లో ఇద్దరి అరెస్ట్
ఏలూరు టౌన్: చైన్ స్నాచింగ్ కేసుల్లో ఇద్దరు నేరస్తులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి భారీగా బంగారు ఆభరణాలు, రెండు మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ కేసు వివరాలను వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమంట్ర గ్రామానికి చెందిన బండి గోపాలకృష్ణ, ప్రస్తుతం పెనుమంట్రలో నివాసం ఉంటున్న యలమంచిలి మండలం మేడపాడుకు చెందిన కుక్కల హరిప్రకాష్ జల్సాలు, విలాసాలకు అలవాటుపడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించే క్రమంలో వారిద్దరూ దొంగతనాలు చేయటం ప్రారంభించారు. అనంతరం షాపుల వద్ద, ఒంటరిగా వెళ్లే మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలు లాక్కుని పారిపోతున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో వీరిద్దరిపై చోరీ కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల చోరీ చేసిన బంగారు వస్తువులు విక్రయించేందుకు ఇద్దరూ రెండు మోటారు సైకిళ్లపై హైదరాబాద్ వెళుతుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ఉంగుటూరు మండలం సీతారామపురం గ్రామ శివారు, గణపవరం నుంచి నారాయణపురం వైపు వెళ్లే రోడ్డులో నిడమర్రు సీఐ ఎన్.రజనీకుమార్ ఆధ్వర్యంలో చేట్రోలు ఎస్సై ఎం.సూర్యభగవాన్ తన సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తుండగా ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో విచారణ చేయగా చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించి, వారి నుంచి సుమారు రూ.12.80లక్షల విలువైన 128 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు మోటారు సైకిళ్లను చేబ్రోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరసాపురం టౌన్, యలమంచిలి, రాజోలు, చేబ్రోలు, పాలకొల్లు రూరల్ తదితర ప్రాంతాల్లో చోరీ చేసిన బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో నేరస్తుడి అరెస్ట్ నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామంలో ముత్యాల వీరవెంకట సత్యనారాయణ అనే వ్యక్తి ఇంటిలో మార్చి 19న చోరీ జరిగింది. ఈ కేసును నిడమర్రు సీఐ రజనీకుమార్, ఎస్సై ఎస్ఎన్వీవీ రమేష్ విచారణ చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గణపవరం అల్లూరివారి వీధికి చెందిన కాకర్ల నాగదుర్గారావు నిందితుడిగా నిర్ధారించి అరెస్ట్ చేశారు. అతడి నుంచి 26.2 గ్రాముల బంగారు ఆభరణాలు, 808 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అభినందించారు. 128 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం -
గురుకుల ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు
ముసునూరు: గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గాను దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించినట్లు జిల్లా కోఆర్డినేటర్, ముసునూరు బాలికల గురుకుల ప్రిన్సిపాల్ కాకర్ల లక్ష్మీకుమారి తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని వివిధ గురుకులాల్లో 5వ తరగతి, 6, 7, 8 తరగతుల ఖాళీలు, ఇంటర్మీడియెట్, డిగ్రీ ప్రథమ సంవత్సర ప్రవేశాల వివరాల సంబంధిత ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 31తో ముగియగా, తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఈ నెల 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అర్హత గల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. ఏలూరు (టూటౌన్): ప్రకృతి వ్యవసాయ విస్తరణపై జిల్లాస్థాయి ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ (టిఓటి)కు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణలో భాగంగా తొలిరోజు మంగళవారం ఏలూరు ఐఏడీపీ హాల్లో శిక్షణ నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్కే హబీబ్ బాషా ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించి, జిల్లాలో జరుగుతున్న అమలు విధానాలను తెలియజేశారు. అనంతరం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బి.వెంకటేష్ ఏలూరు జిల్లాలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యకలాపాలు, మండలాల వారీ అమలు విధానాలపై సమగ్రంగా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్ కుమార్ (రిటైర్డ్ ఐఏఎస్) జూమ్ మీటింగ్లో శిక్షణలో ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలపై మార్గదర్శకాలు అందించారు. అన్ని మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. కామవరపుకోట: తననే పెళ్లిచుకోవాలని యువతిని బెదిరించిన కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తడికలపూడి ఎస్సై చిన్నారావు తెలిపిన వివరాల ప్రకారం కామవరపుకోటకు చెందిన ఓ యువతి త్వరలో వివాహం చేసుకోబోతుండగా, కొత్తూరు గ్రామానికి చెందిన రాజకుమార్ తన స్నేహితులైన కిషోర్బాబు, అభిలాష్తో కలిసి ఆమెను లక్ష్యంగా చేసుకుని ‘నన్ను తప్ప వేరెవరినీ పెళ్లి చేసుకోకూడదు’అంటూ ఆమె ఇంటికి వెళ్లి దాడికి యత్నించి పలుమార్లు బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన యువతి తల్లిదండ్రులు తడికలపూడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని సోమవారం రాత్రి చింతలపూడి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి 12 రోజుల రిమాండ్ విధించినట్టు ఎస్సై చెన్నారావు చెప్పారు. ఏలూరు (టూటౌన్): అంగన్వాడీలకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబీరాణి డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మధ్యాహ్నం ఏలూరు సీడీపీఓ ఆఫీస్ వద్ద అంగన్వాడీలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బేబిరాణి మాట్లాడుతూ గడచిన ఏడేళ్లుగా అంగన్వాడీలకు ప్రభుత్వం వేతనాలను పెంచలేదని విమర్శించారు. ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల ముందు అనకాపల్లి అంగన్వాడీలు చేస్తున్న ధర్నా శిబిరాల వద్దకు వచ్చి అంగన్వాడీల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత బోడి మల్లన్న చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గ్రాడ్యుటి జీవో ఇచ్చినా గైడ్లైన్ రూపొందించకపోవడం వలన అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలని కోరారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాకు సీఐటీయూ ఏలూరు నగర కార్యదర్శి ఎం ఇసాక్, అంగన్వాడీ యూనియన్ నాయకులు టి రజిని, షేక్ సమీమా నాయకత్వం వహించారు. భీమవరం అర్బన్: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో భార్యభర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భీమవరం ప్రాంతానికి చెందిన దోనపాటి రమేష్, అతని భార్య ధీన తాలూకా ఆఫీసు వద్ద చెట్టుకింద ఫిర్యాదులు రాస్తుంటారు. మంగళవారం లోసరి నుంచి భీమవరం వైపు ద్విచక్ర వాహనంపై వీరు వస్తుండగా కట్టావారిపాలెం వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి మారుతీకారు ఢీకొంది. ఈ ఘటనలో మోటార్సైకిల్పై వెళుతున్న భార్యభర్తలతోపాటు కారు కూడా పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దోనపాటి రమేష్, ధీనలకు గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ పి.మహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ నాయకుడిపై హత్యాయత్నం
● ఆస్తి వివాదంలో బంధువు దాడి ● ఉండిలో ఘటనఉండి: వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ మండల అధ్యక్షుడు, జిల్లా యూత్ మాజీ ప్రధాన కార్యదర్శి శేషాద్రి శివశంకర నాగకుమార్ (శ్రీను)పై హత్యాయత్నం జరిగింది. దీనిపై బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన శేషాద్రి శివశంకర నాగకుమార్ అనే వ్యక్తికి అతడి మేనత్త మనుమడైన దోసా ఫణీంద్రకుమార్కు కొద్దికాలంగా ఆస్తి తగదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారం క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. పెద్దలు చేప్పిన మాటలకు ఒప్పుకుని వెళ్లిన ఫణీంద్ర మరలా తిరిగిరాలేదు. సోమవారం రాత్రి 10:30 గంటల సమయంలో శేషాద్రి శ్రీను అతడి భార్య ధనలక్ష్మి ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్న సమయంలో ఫణీంద్రకుమార్ అతడి భార్య అనితతో ఇంట్లోకి వచ్చి ఆస్తి పంచమంటే పంచవేంట్రా అంటూ తమతో తెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. భయభ్రాంతులకు గురైన శ్రీను, అతడి భార్య ధనలక్ష్మి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు బయటకు వచ్చారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయాడు. వారిని వెంబడించిన బాధితుడి భార్య ఇంటి బయట మరో ముగ్గురు ఉండటం గమనించింది. శ్రీనును స్థానిక ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి భీమవరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. శస్త్రచికిత్స అనంతరం ప్రాణాపాయం నుంచి గట్టెక్కాడు. బాధితుని భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై ఎండీ నసీరుల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. -
బీఫార్మసీ విద్యార్థిని కేసులో పురోగతి
● ఇద్దరు స్నేహితుల వేధింపులతోనే ఆత్మహత్య ● అరెస్ట్ చేసిన ఏలూరు త్రీటౌన్ పోలీసులు ఏలూరు టౌన్: ఏలూరులో సంచలనం రేపిన బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో ఇద్దరు విద్యార్థులను ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు అరెస్ట్ చేశారు. డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెదవేగి మండలం కూచంపూడి గ్రామానికి చెందిన చిలుకూరి సువర్షిణి (20) ఏలూరులోని సర్ సీఆర్ఆర్ విద్యాసంస్థల బీఫార్మసీ కళాశాలలో మూడవ ఏడాది బీఫార్మసీ చదువుతుంది. ఆమె కళాశాల హాస్టల్లోనే ఉంటూ చదువుకుంటుంది. మార్చి 25న అర్ధరాత్రి సమయంలో విద్యార్థిని సువర్షిణి కాలేజీ హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తొలుత పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై రాంబాబు దర్యాప్తు చేయగా ... ప్రేరేపిత ఆత్మహత్యగా నిర్థారణ అయ్యింది. స్నేహితులే కాలయముళ్లు బీఫార్మసీ విద్యార్థిని సువర్షిణికి క్లాస్మేట్స్ బెల్లాని రాటాలు, బూరుగుపల్లి విజయసారధితో మొదటి ఏడాది నుంచి పరిచయం ఏర్పడింది. ముగ్గురూ ఫోన్కాల్స్ చేసుకోవటం, వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ సంభాషణలతో స్నేహం కొనసాగించినట్లు పోలీస్ విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే సువర్షిణి స్నేహితుడు విజయసారధి మద్య కొంత వ్యక్తిగత చాట్ జరిగింది. ఈ చాట్ను విజయసారధి సేవ్ చేసుకున్నాడు. కొంతకాలం అనంతరం ఇరువురి మద్య మనస్పర్థలు ఏర్పడటంతో అతడ్ని దూరం పెట్టింది. కక్ష పెంచుకున్న విజయసారథి ఆమెను మానసికంగా వేధింపులకు గురిచేస్తూ ఉన్నాడు. మార్చి 24న జరిగే ఫేర్వెల్ ఏర్పాట్ల సందర్భంగా క్లాస్రూమ్లో జరిగిన సంభాషణల్లో విజయసారథి విద్యార్థిని సువర్షిణి పట్ల అసభ్యంగా మాట్లాడి అవమానించినట్లు విచారణలో వెల్లడైంది. తనతో చేసిన వ్యక్తిగత చాట్ను ప్రస్తావిస్తూ ఆమెను ఇతరుల ముందు హేళన చేశాడు. అవమానంతో కుంగిపోయిన సువర్షిణి కాలేజీ అధ్యాపకులకు, యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా, చర్యలు తీసుకుంటామని చెప్పారు. 25న ఫేర్వెల్ ముగిసిన అనంతరం తన కుటుంబ సభ్యులతో కొంతసేపు గడిపిన సువర్షిణి సాయంత్రం 6.30 గంటల సమయంలో హాస్టల్కు వచ్చింది. మరో స్నేహితుడు రాటాలు ఫోన్ చేసి మృతురాలితో ప్రైవేట్ చాట్ను ప్రస్తావిస్తూ ... కళాశాల యాజమాన్యానికి ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలనీ, లేదంటే చాట్ను ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు పంపుతామనీ, పరువు తీస్తామని బెదిరించాడు. తీవ్ర మనస్థాపానికి గురైన సువర్షిణి ఈ విషయాన్ని తన తండ్రికి, స్నేహితులకు చెప్పింది. తండ్రి మరుసటి రోజు వచ్చి ఇంటికి తీసుకువెళతానని చెప్పారు. కానీ తన వ్యక్తిగత చాట్ బయటపడుతుందనే భయంతో తీవ్ర ఆందోళనకు గురైన విద్యార్థిని రాత్రి సుమారు 11.34 గంటలకు హాస్టల్ భవనం పై అంతస్తుకు వెళ్లి టెర్రస్ పైనుంచి కిందికి దూకింది. ఆమె స్నేహితులు గుర్తించి ఆటోలో ఏలూరు జీజీహెచ్కు తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ రిఫర్ చేశారు. అనంతరం ఏలూరులోని ఆంధ్ర హాస్పిటల్లో చూపించి, మళ్లీ తిరిగి ఏలూరు జీజీహెచ్కు తీసుకువచ్చి చేర్పించగా చికిత్స పొందుతూ 26తేదీన ఉదయం సుమారు 4.30 గంటల సమయంలో మృతిచెందింది. ఈ కేసు దర్యాప్తులో ఏలూరు త్రీటౌన్ పోలీసులు మృతురాలు సువర్షిణి కుటుంబ సభ్యులు, స్నేహితులు, కాలేజీ అధ్యాపకులను సమగ్రంగా విచారించారు. సీసీటీవీ పుటేజ్ పరిశీలించటంతోపాటు, పలు ఆధారాలను సేకరించి విద్యార్థిని సువర్షిణి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన పెదవేగి మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన బెల్లాని రాటాలు, జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామానికి చెందిన బూరుగుపల్లి విజయసారథిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనీ, దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ స్పష్టం చేశారు. -
మొదలైన ‘విభజన’ సెగ
ద్వారకాతిరుమల: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ద్వారకాతిరుమలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. చారిత్రక నేపథ్యం కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల దృష్టి చిన్నతిరుపతిపై ఎప్పుడూ ఉంటుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ప్రముఖ రాజకీయ నాయకుల తాకిడి కూడా క్షేత్రానికి ఎక్కువే. జిల్లాలో ఏ రాజకీయ కార్యక్రమం జరిగినా ద్వారకాతిరుమలను సందర్శించక మానరు. ఎన్నికలొస్తే చాలు.. నామినేషన్ పత్రాలతో అభ్యర్థులు స్వామివారి చెంతకు చేరతారు. శ్రీవారి ఆశీస్సులు ఉంటే ఎన్నికల్లో గెలుపు తథ్యమన్న సెంటిమెంట్ నాయకుల్లో బలంగా ఉంది. 2022లో వైఎస్సార్ సీపీ హయాంలో జిల్లాల పునర్విభజన జరిగిన సమయంలో గోపాలపురం నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలుపుతున్నట్టు తెలుసుకున్న పలు రాజకీయ పార్టీల నేతలు జేఏసీగా ఏర్పడి, ద్వారకాతిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలోనే ఉంచాలని ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు ఐకాన్గా ఉన్న ఏకై క ప్రముఖ క్షేత్రాన్ని తమకు దూరం చేయొద్దని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు కోరారు. దాంతో ప్రజాభీష్టమే తమ ఇష్టమని కొందరు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ముఖ్య నేతలు ఈ విషయాన్ని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన ద్వారకాతిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలో, మిగిలిన నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం మండలాలను తూర్పుగోదావరి జిల్లాలో కలిపారు. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరమీదకు రావడంతో.. ద్వారకాతిరుమలను నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలన్న అంశం తెరమీదకొచ్చింది. జేఏసీ ఏర్పాటుకు సన్నద్ధం కూటమి ప్రభుత్వం ప్రజలు కోరుతున్న విధంగా ద్వారకాతిరుమలను నియోజకవర్గ కేంద్రంగా చేస్తుందా? లేదా? అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అలాగే జిల్లాలో ఏఏ మండలాలను కలిపి నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తారు అనే అంశంపై కూడా చర్చ సాగుతోంది. అయితే భీమడోలు, ద్వారకాతిరుమల, కామవరపుకోట మండలాలను కలిపి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసి, ద్వారకాతిరుమలను నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని అంతా కోరుతున్నారు. ఈ క్రమంలోనే అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలసి జేఏసీని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. రాజకీయ ఎత్తుగడలు నియోజకవర్గాల పునర్విభజనపై కొందరు కూటమి నేతలు అప్పుడే రాజకీయ ఎత్తుగడలను మొదలుపెట్టారు. ఉంగుటూరు, భీమడోలు, ద్వారకాతిరుమల మండలాలను కలిపి నియోజకవర్గం చేయాలని కొందరు ప్రయత్నిస్తుంటే, భీమడోలు, ద్వారకాతిరుమల, కామవరపుకోట మండలాలను కలిపి నియోజకవర్గం చేయించాలని మరి కొందరు నేతలు పావులు కదుపుతున్నారు. ఏఏ మండలాలను కలిపితే తమ రాజకీయ భవిష్యత్తు బాగుంటుందనే దానిపై ముఖ్య నేతలు దృష్టి సారించారు. పార్లమెంట్ పరిధి కూడా.. గతంలో ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్న ద్వారకాతిరుమల మండలాన్ని, అలాగే చింతలపూడి నియోజకవర్గంలో ఉన్న ద్వారకాతిరుమల మండలంలోని రామన్నగూడెం, వెంకటకృష్ణాపురం, గుండుగొలనుకుంట పంచాయతీలను 2008 లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో గోపాలపురం నియోజకవర్గంలో కలిపారు. దాంతో అప్పటి వరకు ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఈ మండలాలు కాస్తా.. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోకి చేరాయి. అప్పటి నుంచి రాజమండ్రి పార్లమెంట్ నిధులు శివారులో ఉన్న ద్వారకాతిరుమల మండల అభివృద్ధికి అరకొరగానే వచ్చాయన్న విమర్శలున్నాయి. అలాగే పార్లమెంట్ సభ్యుని కలవాలంటే 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రికి వెళ్లాల్సి వస్తోందని సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కాబట్టి ఈసారి జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో ద్వారకాతిరుమలను నియోజకవర్గ కేంద్రంగా, పార్లమెంట్ పరిధి 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఏలూరులో ఉండేలా చేయాలనే ప్రధాన ఎజెండాతో పోరాడేందుకు ప్రజలు, పలు రాజకీయ పార్టీల నాయకులు సిద్ధమవుతున్నారు. జిల్లాల పునర్విభజన జరిగిన సమయంలో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజలు కోరినట్టుగా ద్వారకాతిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలో ఉంచారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. కొత్తగా ఏర్పడే నియోజకవర్గాన్ని ఏలూరు పార్లమెంట్ పరిధిలో చేర్చాలనే ప్రధాన ఎజెండాతో ముందుకెళ్తాం. జేఏసీని ఏర్పాటు చేసి, కార్యాచరణను రూపొందిస్తాం. – పాకలపాటి త్యాగ భీమేశ్వరరావు, వైఎస్సార్ సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు, గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమలను నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలి. అందుకు రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా కృషి చేయాలి. భీమడోలు, ద్వారకాతిరుమల, కామవరపుకోట మండలాలను కలిపి, నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇలా చేస్తే క్షేత్రం కూడా మరింత అభివృద్ధి చెందుతుంది. – మొగతడకల శ్రీనివాసరావు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ మాజీ ఉపాధ్యక్షుడు ద్వారకాతిరుమలను నియోజకవర్గ కేంద్రం చేసి.. ఏలూరు పార్లమెంట్లో కలపాలంటున్న ప్రజలు జేఏసీగా ఏర్పడేందుకు సిద్ధపడుతున్న రాజకీయ నేతలు -
సొంతింటి కలకు చంద్ర గ్రహణం
చంద్రబాబు పాలనలో పేదల సొంతింటి కల సాకారానికి గ్రహణం పట్టింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో జిల్లాలో లక్షలాది మందికి ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్ల నిర్మాణాలు చేశారు. చాలా ఇళ్లు పూర్తయ్యి వందలాది కాలనీలు ఏర్పడగా కొన్ని చోట్ల పూర్తి కావాల్సి ఉంది. అయితే చంద్రబాబు రాకతో ఇళ్ల నిర్మాణం అటకెక్కింది. వాటిలో కొన్ని పూర్తి చేసి ఇప్పుడు అట్టహాసంగా వాటినే ప్రారంభిస్తున్నారు తప్ప.. బాబు పాలనలో పేదలకు సెంటు భూమి ఇవ్వలేదు. మంగళవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2026ఆకివీడు: పేదవాడి సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతుండటంతో పలువురు నిరుపేదలు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమ ఇల్లు పూర్తవు తుందని ఆశించినా, రెండేళ్లు కావస్తున్నా అమలు కాకపోవడంతో ఆ ఆనందం కాస్తా ఆవేదనగా మారుతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్భాటంగా గృహప్రవేశాలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పూర్తయిన ఇళ్లు కొద్దిగా మాత్రమే ఉన్నాయని వారు విమర్శిస్తున్నారు. నియోజకవర్గానికి ఒక ఇంటిని ఎంపిక చేసి నామమాత్రంగా గృహప్రవేశాల వేడుకలు జరుపుతున్నారని మండిపడుతున్నారు. ప్రస్తుత పాలనలో జిల్లా వ్యాప్తంగా కేవలం 595 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. రూ.4.50 లక్షల కోసం ఎదురుచూపు పేదల ఇళ్ల నిర్మాణం కోసం రూ.4.50 లక్షల నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ఆ మొత్తాన్ని రూ.2.50 లక్షలకే పరిమితం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ అరకొర నిధుల మంజూరుపై కూడా లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వంతు నిధులు మంజూరు చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల కాకపోవడంతో కొత్త రుణాలు మంజూరు కావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఎన్నికల హామీ ప్రకారం రూ.4.50 లక్షల ఆర్థిక సాయం అందించాలని వారు కోరుతున్నారు. ఆ స్థలాల్లో నిర్మాణం ఎండమావేనా? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో పేదల కోసం కొనుగోలు చేసి సేకరించిన స్థలాల్లో నేటికీ ఇళ్లు నిర్మాణాలు ప్రారంభం కాలేదు. కొన్ని చోట్ల పట్టాలిచ్చినా లేఅవుట్లు వేసి విభజించకపోవడం, మరికొన్ని చోట్ల లే అవుట్ల విభజన జరగకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. లోతట్టు ప్రాంతాల్లో మట్టి పూడిక పనులకు నిధులు మంజూరు కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. గత ప్రభుత్వంలో మట్టి పూడిక పూర్తయిన చోట కూడా లబ్ధిదారులకు కేటాయింపులు జరగలేదు. దీంతో తమ సొంత ఇంటి కల నెరవేరుతుందా లేదా అని పేదలు నిరుత్సాహంతో ఉన్నారు. సొంత ఇంటి నిర్మాణం కోసం జిల్లాలోని లబ్ధిదారులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది కొత్త రుణాల కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన వేలాది దరఖాస్తులను హౌసింగ్, రెవెన్యూ అధికారులు పరిశీలించి, జిల్లా వ్యాప్తంగా 16,773 మందిని అర్హులుగా తేల్చి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ కొత్త రుణాలను ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేస్తుందా? అని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. గతంలో నిర్మించిన జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్, మంచినీరు, రోడ్ల నిర్మాణం కొంతమేర జరగగా.. ప్రభుత్వం మారిన తర్వాత మౌలిక సదుపాయాల కల్పనకు బ్రేక్ పడింది. రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం లేక కాలనీవాసులు నరకం చూస్తున్నారు. వర్షాకాలంలో కాలనీలు లోతట్టుగా ఉండటంతో నీరు నిలిచి ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొర వసతులు.. అందని నిధులు నాడు మొదలు పెట్టిన ఇళ్లకే ప్రారంభోత్సవాలు ఒక్క సెంటు భూమి ఇవ్వని చంద్రబాబు సర్కారు -
మత్స్యశాఖాధికారిగా బాధ్యతల స్వీకరణ
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా మత్స్యశాఖాధికారిగా డి.శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీనివాస్ విజయవాడ కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ ప్లానింగ్ సెక్షన్లో డిప్యూటీ డైరక్టర్గా పనిచేస్తూ బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ అప్సడ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని, ఆక్వా రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యల పరిస్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆకివీడు: స్థానిక పెదపేటలోని గొంతేనమ్మ గుడిని రామాలయంగా మార్చే ప్రయత్నానికి ప్రభుత్వం తక్షణమే అడ్డుకట్ట వేయాలని మానవ హక్కుల వేదిక(హెచ్ఆర్ఎఫ్) డిమాండ్ చేసింది. నిజనిర్ధారణ కమిటీ ఆదివారం ఆ ప్రాంతంలో పర్యటించి వివరాలు సేకరించినట్లు కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.రాజేష్, కార్యదర్శి జీ.రోహిత్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గొంతేనమ్మ సత్రం పడగొట్టి రామాలయం నిర్మిస్తామనడంపై స్థానిక దళితులు అభ్యంతరం తెలిపారన్నారు. ఏకపక్షంగా కేసులు నమోదు చేయడం, దళితులపై దాడి చేసిన వారిపై ఇంతవరకూ కేసులు నమోదు చేయకపోవడం చూస్తే స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నట్లు అర్థమవుతోందని వారు పేర్కొన్నారు. పోలీసుల మొహరింపు స్థానిక దళితుల్ని భయపెట్టడానికేనన్నారు. దళితులపై దాడిచేసిన వారిపైన, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినవారిపైన కేసులు నమోదు చేయాలని, దాడికి సంబంధం లేనివారిపై వెంటనే వ్యక్తిగత పూచిపై విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజా సమస్యలపై త్వరితగతిన స్పందించి, నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో పోలీసు కార్యాలయాలను ఆశ్రయిస్తారని, బాధితులకు పోలీసు శాఖ భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఫిర్యాదులు పునరావృతం కాకుండా లోతైన దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేకూరేలా చూడాలన్నారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 15 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ యు. రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. నరసాపురం రూరల్: మండలంలోని లక్ష్మణేశ్వరం పరిధి గొల్లలవంతెన సమీపంలో సోమవారం పాత కక్షలతో స్కూటర్కు నిప్పు పెట్టారు. స్థానికుల వివరాల ప్రకారం.. లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన దేశంశెట్టి వెంకటకృష్ణ ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కోలపర్తి పవన్ గొల్లల వంతెన సమీపంలో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చి వెళ్తున్న సమయంతో ఇద్దరికీ వివాదం మొదలైంది. గతంలో గొడవల నేపథ్యంలో పవన్, వెంకట రమణల మద్య మాటామాటా పెరిగింది. వెంకటరమణ తన వద్ద ఉన్న పెట్రోలను పవన్ స్కూటర్పై పోసి నిప్పు అంటించాడు. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణలో గాయపడ్డ వెంకటకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
2న వాటర్ స్పోర్ట్స్ జిల్లా జట్ల ఎంపిక
ఏలూరు రూరల్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీలు జరగనున్నాయని డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఏలూరు జిల్లా అండర్–15 సబ్జూనియర్స్, అండర్–18 జూనియర్స్ బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9 గంటలకు జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ వద్ద చేపట్టనున్నామని వివరించారు. కాయకింగ్, రోయింగ్, డ్రాగన్బోట్ విభాగాల్లో క్రీడాకారులు పాల్గొనాలని పేర్కొన్నారు. ఆసక్తి గల బాలబాలికలు ముందుగా శాప్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు పీవీవీఎస్ కృష్ణమూర్తి, 83318 73037 నంబరులో సంప్రదించాలన్నారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 289 వినతులు అందాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డా. ఎంజే అభిషేక్ గౌడ మాట్లాడుతూ ఫిర్యాదులను నిర్ధేశించిన సమయంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్ఓ భాస్కర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పెదపాడు: జాతీయ రహదారిపై గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గుండుగొలను వైపు నుంచి విజయవాడ వైపు గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు పెదపాడు ఎస్సై, ఎకై ్సజ్ సీఐ ధనరాజ్ కలపర్రు టోల్గేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆటోలో గంజాయి తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులు పిల్లా మోహనరావు, తాతపూడి జితేంద్ర, సబ్బవరపు సాయిబాబులను అరెస్ట్ చేశారు. ఎస్సై ఆర్ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో క్లూయిజ్ టీమ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని బీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రామారావు డిమాండ్ చేశారు. బీటీఏ రాష్ట్ర శాఖ ఆదేశాను సారం దశలవారీ పోరాటాల్లో భాగంగా సోమవారం సాయంత్రం 4గంటలకు స్థానిక జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద బీటీఏ ఏలూరు జిల్లాశాఖ ఆధ్వర్యాన ఉద్యోగ, ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై కొద్ది సేపు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్కి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. దెందులూరు: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. ఎస్సై ఆర్ శివాజీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవరప్పాడు గ్రామానికి చెందిన తంగేళ్ల అప్పారావుకు, లత (20)కు ఏడు నెలల క్రితం వివాహమైంది. తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న అప్పారావు దంపతుల మధ్య గత కొన్నిరోజులుగా చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో మనస్పర్థల కారణంగా మనస్తాపానికి గురైన లత, భర్త అప్పారావు పనికి వెళ్లిన తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లత మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి మార్చురీకి తరలించారు. -
చిగురుమామిడిలో అగ్నిప్రమాదం
● నాలుగు పూరిళ్లు దగ్ధం ● రూ.50 లక్షల ఆస్తినష్టం వేలేరుపాడు: వేలేరుపాడు మండల పరిధిలోని చిగురుమామిడి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.50 లక్షల ఆస్తినష్టం సంభవించింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చండ్రుగొండ సత్తిబాబు, చిన్న నర్శింహులు, ఎక్కిళ్ళ శ్రీను, సింగ్బాబు మిర్చి రైతులు. సోమవారం మిర్చి కోతలు ఉండటంతో అంతా పొలాలకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ముందుగా చిన్న నర్శింహులు ఇంట్లో విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత పక్కనున్న మూడు ఇండ్లకు మంటలు వ్యాపించాయి. అక్కడ నుంచి ఇతర ఇండ్లకు మంటలు వ్యాపించకుండా గ్రామస్తులు మంటలను అదుపుచేశారు. బాధితుల ఇళ్లల్లో గ్యాస్ సీలిండర్లు పేలడం, 33 కిలోమీటర్ల దూరంలోని కుక్కునూరు నుంచి ఫైర్ ఇంజన్ వచ్చేసరికే గృహోపకరణాలు, నగదు, బంగారు ఆభరణాలు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో చండ్రుగొండ సత్యంకు చెందిన విద్యుత్ పిండి మిల్లు, డీజిల్ ఇంజన్, చిన్న నర్శింహులుకు చెందిన ఓ ద్విచక్రవాహనం, ఎక్కిళ్ళ శ్రీనుకు చెందిన కుట్టుమిషన్ కాలిపోయింది. చండ్రుగొండ సత్తిబాబుకు చెందిన రూ.2.20 లక్షలు, 10 కాసుల బంగారం, 5 కాసుల వెండి ఆభరణాలు, సింగ్బాబుకు చెందిన రూ.లక్ష నగదు, 8 కాసుల బంగారం, నాలుగు జతల వెండి పట్టీలు, ఎక్కిళ్ళ శ్రీనుకు చెందిన రూ.2 లక్షల నగదు, ఐదు కాసుల బంగారం, నాలుగు కాసుల వెండి ఆభరణాలు, చిన్న నర్శింహులుకు చెందిన 5 కాసుల బంగారం, లక్షా యాభైవేల నగదు, 6 కాసుల వెండి కాలిబూడిదయ్యాయి. బాధితులకు తక్షణ ప్రభుత్వ సాయం అందలేదు. బాధితులను వైఎస్సార్ సీపీ నేతలు పరామర్శించారు. కట్కూరు సర్పంచ్ లక్ష్మణ్, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కేసగాని శ్రీనివాసగౌడ్, కామినేని వెంకటేశ్వరావు, కౌలూరి సత్తిరాజు, చక్రి, అత్తిలి వెంకన్న బాధితులను పరామర్శించారు. -
ఎల్ నినోతో వర్షాభావం.. రైతులూ జాగ్రత్త!
ఉండి: ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వలన వర్షాలు తక్కువగా కురిసి నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, ఆక్వారైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని మార్టేరు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బీ సహదేవరెడ్డి సూచించారు. గత కొద్దిరోజులుగా ఎన్నార్పీ అగ్రహారం కృషీ విజ్ఞాన కేంద్రంలో రొయ్యల పెంపకంలో మెరుగైన యాజమాన్యాలపై నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమం సోమవారంతో ముగిసింది. మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సహదేవరెడ్డి మాట్లాడుతూ రైతులంతా నీటి వృథాను అరికట్టేలా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆక్వారైతులు తమ చెరువుగట్లపై మొక్కలను పెంచి చల్లని వాతావరణాన్ని ప్రేరేపించడం ద్వారా వాతావరణంలో వేడి తగ్గించి సుస్థిర ఉత్పత్తిని సాధించవచ్చునని అన్నారు. కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లిఖార్జునరావు మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమంలో నేర్చుకున్న సాంకేతికతను చెరువుల యాజమాన్యంలో ఉపయోగించి ఖర్చు తగ్గించుకుని ఉత్పత్తిని పెంచుకోవాలని సూచించారు. ప్రోగ్రాం కన్వీనర్ శ్రీనివాస్ చివరిరోజు శిక్షణలో భాగంగా రొయ్యల్లో వ్యాధుల యాజమాన్యం, ఆర్ఏఎస్ పద్ధతి ద్వారా రొయ్యల పెంపకం, ఆక్వాఫోనీక్స్ విధానం, బయో ఫాలక్ పెంపకం తదితర విషయాలను వివరించారు. ఎంపెడా సాంకేతిక నిపుణుడు దుర్గారావు రొయ్యల ఎగుమతులు, దిగుమతులు, రొయ్యల చెరువుల రిజిస్ట్రేషన్ తదితర విషయాలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు ఏ శ్రీనివాస్, వినయలక్ష్మి, బిందు ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
పెంటపాడు: ముందున్న వాహనాన్ని లారీ ఢీకొని లారీ డ్రైవర్ మృతి చెందాడు. వివరాల ప్రకారం ప్రత్తిపాడు ఆటోనగర్ వద్ద హైవే మరమ్మతు పనులు జరగుతున్నాయి. ఏలూరు వైపు నుంచి తణుకు వైపు వెళుతున్న ధాన్యం లోడు లారీ ముందున్న రహదారి సేప్టీ వాహనాన్ని ప్రమాదవశాత్తూ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం తీవ్రంగా దెబ్బతినగా, లారీ డ్రైవర్ మాచర్లకు చెందిన రాగిపిండి శ్రీనివాసరెడ్డి (48) లారీ క్యాబిన్లో ఇరుక్కొని మృతి చెందాడు. పెంటపాడు పోలీసులు ఇరుక్కొన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. ఎస్సై స్వామి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువును పూడ్చి అమ్మేస్తున్నారు
కామవరపుకోట: స్థానిక వీరభద్ర స్వామి కోటగట్టును పక్కన ఉన్న ఆగర్తి చెరువును పూడ్చి సొమ్ము చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు. గత కొన్ని రోజుల నుంచి అర్ధరాత్రి సమయంలో విచ్చలవిడిగా టిప్పర్లతో మట్టిని తీసుకొచ్చి చెరువును పూడుస్తున్నారు. సెంటున్నర స్థలాన్ని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నా అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి చెరువును పూడుస్తున్న వారిపై చర్య తీసుకోవాలని, లేకుంటే దీనిపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని స్థానికులు తెలిపారు. -
హుండీల లెక్కింపు.. కట్టుదిట్టంగా
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయ హుండీల నగదు, కానుకల లెక్కింపు వేళ.. అధికారులు అలర్ట్ అయ్యారు. సోమవారం జరిగిన లెక్కింపులో అధికారులు పలు నిఘా ఏర్పాట్లు చేయడంతో పాటు, భద్రతా సిబ్బంది ప్రతి ఒక్కరిని మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేశారు. వివరాల్లోకి వెళితే. ఈనెల 11న ప్రమోదా కల్యాణ మండపంలో జరిగిన హుండీల నగదు లెక్కింపులో పశ్చిమగోదావరి జిల్లా, ఇరగవరం మండలం, సూరంపూడి గ్రామానికి చెందిన బొల్లా సురేష్ అనే వ్యక్తి సేవకుడిగా పాల్గొని 59 గ్రాముల 700 మిల్లీ గ్రాముల బరువైన బంగారు చైన్, రెండు మంగళ సూత్రాలు, 4 డాలర్ నోట్లను చోరీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అదే రోజు దేవస్థానం ఈఓ వై.భద్రాజీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్సై టి.సుధీర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. అందులో భాగంగా నిందితుడి బ్యాంక్ అకౌంట్ లోని రూ. 5.10 లక్షలను ఫ్రీజ్ చేశారు. విచారణ అనంతరం నిందితుడిని భీమడోలు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి అతడికి బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ చోరీ ఘటన సంచలనంగా మారడంతో దేవస్థానం, పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. అందులో భాగంగా ఈసారి కౌంటింగ్ హాలు వద్ద ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని నియమించారు. లెక్కింపు పూర్తయ్యే వరకు ఎస్సై టి.సుధీర్ తనిఖీలను పరిశీలించారు. రిజిస్టర్డ్ సేవా దళాలను మాత్రమే.. రిజిస్టర్డ్ సేవాదళాలను మాత్రమే లెక్కింపునకు అనుమతించారు. సేవలో పాల్గొన్న ప్రతి సభ్యుడి వివరాలను రిజిస్టర్లో నమోదు చేసి, వారి నుంచి సంతకాలు సేకరించారు. ఈ లెక్కింపులో పలు సేవా దళాలకు చెందిన 130 మంది పాల్గొనగా, దేవస్థానం అధికారులు, రెగ్యులర్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది, కల్యాణకట్టలోని నాయీ బ్రాహ్మణులు మొత్తం 150 మంది వరకు పాల్గొన్నారు. ఇక ముందు జరిగే లెక్కింపులో పాల్గొనే సేవాదళ సభ్యులు తప్పనిసరిగా ఐడెంటిటీ కార్డులు ధరించాల్సి ఉంటుంది. ప్రత్యేక నిఘా.. కౌంటింగ్ హాల్లోకి వెళ్లే వారిని, బయటకు వచ్చే వారిని డోర్ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ (డీఎఫ్ఎండీ), హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్ (హెచ్హెచ్ఎండీ) ద్వారా భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. లోదుస్తులు (అండర్వేర్)ను తొలగించి, పంచి, కండువా ధరించిన వారిని మాత్రమే లెక్కింపునకు అనుమతించారు. అలాగే లెక్కింపు అందరికీ కనిపించేలా కౌంటింగ్ హాల్లో ఎల్ఈడీ మానిటర్ ఏర్పాటు చేసి, ఈఓ పర్యవేక్షించారు. ముడుపులు, విదేశీ, పెద్ద కరెన్సీ నోట్ల లెక్కింపును సూపరింటెండెంట్ల పర్యవేక్షణలో నిర్వహించారు. తనిఖీలకు మరింత అత్యాధునిక స్కానర్లను వినియోగించాల్సిన అవసరం ఉందని స్థానికులు, పలువురు భక్తులు అంటున్నారు. ముడుపుల వద్ద పర్యవేక్షిస్తున్న సూపరింటెండెంట్ పద్మావతి కౌంటింగ్ హాలు వద్ద భద్రతను పరిశీలిస్తున్న ఎస్సై సుధీర్బొల్లా సురేష్ చోరీ కేసులో షాకింగ్ అంశం బయటపడింది. శ్రీవారి దేవస్థానంలో జరిగే హుండీల నగదు, కానుకల లెక్కింపులో చోరీ చేయడం సులభమని అతడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది. ఇతర దేవాలయాల్లో లోదుస్తులతో లెక్కింపునకు అనుమతించరని, ఇక్కడ ఆ నిబంధన లేకపోవడమే అందుకు కారణమని చెప్పినట్టు సమాచారం. అందుకే లోదుస్తులు లేకుండా లెక్కింపులో పాల్గొనే పద్ధతిని ఇక్కడా అమలు చేస్తున్నారు. శ్రీవారి హుండీల నగదు, కానుకల లెక్కింపులో.. పటిష్ట బందోబస్తు నిర్వహణ కౌంటింగ్ హాలు వద్ద మెటల్ డిటెక్టర్ల ఏర్పాటు ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన భద్రతా సిబ్బంది అత్యాధునిక స్కానర్లు ఏర్పాటు చేయాలంటున్న భక్తులు -
క్షీణించిన వర్జీనియా ధర
● మరింత దిగజారిన కనిష్ట ధర ● సరాసరి కూడా పడిపోతుందని రైతుల ఆందోళన జంగారెడ్డిగూడెం: వర్జీనియా ధర మరింత క్షీణించింది. గరిష్ట ధర స్థిరంగా ఉన్నప్పటికీ కనిష్ట ధర గత ట్రేడింగ్ సెషన్తో పోల్చితే మరో ఐదు రూపాయలు దిగజారింది. వర్జీనియా వేలం ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి రైతులు ధరపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కేజీ ఒక్కింటికి రూ.350 పైబడి ధర వస్తేనే సగటు ధర మెరుగ్గా వచ్చి రైతులు నష్టాల రాకుండా గట్టెక్కగలరని పేర్కొంటున్నారు. సీజన్ ముగిసే నాటికి సరాసరి ధర రూ.330 నుంచి రూ. 350 మధ్య వస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుందని వర్జీనియా రైతు సంఘం నాయకులు పేర్కొంటున్నారు. అయితే ప్రారంభం రోజునే అంచనాలను తారుమారుచేస్తూ గత ఏడాది ప్రారంభ ధర కన్నా తక్కువగా రూ. 265 వద్ద వేలం ప్రారంభమైంది. తొలి రోజే పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్కుమార్కు రైతులు తమ అసంతృప్తిని, ఆందోళనను తెలియజేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోగా ధర పతనమవుతోంది. గరిష్ట ధర స్థిరంగా ఉండి, కనిష్ట ధర పడిపోతూ ఉంటే, సరాసరి కూడా అదే రీతిలో తగ్గిపోతుందని, ఇదిలా కొనసాగితే చివరకు సగటున కేజీ ఒక్కింటికి రూ.100 నుంచి రూ. 120 వరకు నష్టం వచ్చే అవకాశం ఉంటుందని రైతులు వాపోతున్నారు. రోజు విడిచి రోజు వేలం ఎన్ఎల్ఎస్ పరిధిలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల్లో జంగారెడ్డిగూడెం–1, –2 వేలం కేంద్రాలు మినహాయించి, దేవరపల్లి, కొయ్యలగూడెం, గోపాలపురం వేలం కేంద్రాల్లో సోమవారం వేలం జరిగింది. వేలం నిర్వహణకు బయ్యర్లు, సిబ్బంది కొరత రావడం, కర్ణాటకలో వేలం ప్రక్రియ జరుగుతుండటంతో రోజు విడిచి రోజు వేలం నిర్వహించనున్నారు. వచ్చే నెల రోజుల పాటు ఇలానే కొనసాగుతుందని అధికారులు తెలుపుతున్నారు. దేవరపల్లి, కొయ్యలగూడెం, గోపాలపురంలలో ఒక రోజు, జంగారెడ్డిగూడెం–1, –2 వేలం కేంద్రాల్లో ఒక రోజు నిర్వహించేలా నిర్ణయించినట్లు చెప్పారు. దేవరపల్లి వేలం కేంద్రానికి 6 బేళ్లు తీసుకురాగా, వాటిలో 3 తిరస్కరణకు గురై 3 బేళ్లు అమ్ముడయ్యాయి. ఇక్కడ ధర స్థిరంగా రూ. 265 పలికింది. కొయ్యలగూడెం వేలం కేంద్రానికి 113 బేళ్లు రాగా, వాటిలో 54 బేళ్లు తిరస్కరించారు. 59 బేళ్లు కొనుగోలు జరగ్గా, ఇక్కడ గరిష్ట ధర రూ.265, కనిష్ట ధర రూ.250 నమోదైంది. అలాగే గోపాలపురం వేలం కేంద్రాలో 97కు గాను 79 బేళ్లు అమ్మకాలు జరగ్గా, ఇక్కడ కూడా గరిష్టం రూ. 265, కనిష్టం రూ.250 నమోదైంది. మొత్తంగా గరిష్ట ధర రూ.265, కనిష్ట ధర రూ.250 రాగా, సరాసరి ధర రూ. 257.85 లభించింది.వర్జీనియా పొగాకు బేళ్లు -
రూ.3.70 కోట్లకు ఫెర్రీ వేలం ఖరారు
నర్సాపురం రూరల్: మాధవాయిపాలెం ఫెర్రీ వేలం పాట పేరుతో సోమవారం అధికారులు వ్యవహరించిన తీరు, వేలం జరిగిన విధానంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడేలా ఈ పక్రియ సాగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో రేవు వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.4.18 కోట్ల ఆదాయం లభించగా ప్రస్తుతం ఆ మొత్తం భారీగా తగ్గిపోయింది. శ్రీ విఘ్నేశ్వర సాండ్ క్వారీ బోట్స్మెన్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ రూ.3,70,01,000కు పాటను దక్కించుకుంది. రూ.3,59,06,322కి ప్రభుత్వం ప్రారంభ పాట నిర్ధేశించింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం టేకుశెట్టిపాలెంకు చెందిన శ్రీ విఘ్నేశ్వర సాండ్ క్వారీ అండ్ బోట్స్ మేన్ లేబర్ కాంట్రాక్ట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్ రూ,3,60,09,999కు, నరసాపురం ప్రాథమిక మైరెన్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ రూ.3,60,06,333కు సీల్డ్ కవర్ వేశారు. బహిరంగ వేలంలో నర్సాపురం ప్రాథమిక మైరెన్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ రూ. 3,00,70,000కు పాడగా, శ్రీ విఘ్నేశ్వర లిమిటెడ్ రూ.3,70,01,000కు బహిరంగ వేలంలో పాడారు. కేవలం పాటలో పాల్గొనే వారికి మాత్రమే లోనికి వచ్చేందుకు అవకాశం కల్పించారు. ఇతరులు ఎవరు ఎంపీడీవో కార్యాలయంలోకి ప్రవేశించకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల పహారాలో వేలం నిర్వహించడంతో వేలం పాట నిర్వహణలో పారదర్శకత లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా కొత్త నిబంధనలను చేర్చి ఆసక్తి కలిగిన పాటదారులను దూరం చేసే ప్రయత్నం చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. సోమవారం జరిగిన ఈ వేలం పాటలో జేఏసీ సభ్యులుగా కొనసాగుతున్న నరసాపురం, సఖినేటిపల్లి ఎంపీపీలు మైలాబత్తుల సోనీ, వీరా మల్లికార్జున రావు, నరసాపురం, సఖినేటిపల్లి ఎంపీడీవోలు వీకె వీరభద్రరావు, పీఆర్సి రాజ్ కుమార్, తదితరులు వేలం ప్రక్రియను పరిశీలించారు. తగ్గిన ఆదాయం.. అధికారుల తీరుపై విమర్శలు -
●డ్రెయినేజీ ఆక్రమణలు తొలగించండి
ఏలూరులోని ప్రతి డ్రెయినేజీ ఆక్రమణకు గురైందని, ప్రతి పుట్పాత్ది ఇదే పరిస్థితి అని.. తక్షణం ఆక్రమణలను తొలగించాలని సామాజిక కార్యకర్త ఎన్.స్వర్ణలత డిమాండ్ చేశారు. ఏలూరు నగరంలోని సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎండార్స్మెంట్లు ఇస్తున్నారే తప్ప చర్యలు మాత్రం ఉండటం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం ఆమె వినూత్నంగా నిరసన తెలిపారు. ముందుగా కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసి.. అక్కడ నుంచి ఏలూరు కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి అధికారులను నిలదీశారు. – ఏలూరు (టూటౌన్) -
టిడ్కో లబ్ధిదారులకు తాళాలు అందజేత
పాలకొల్లు సెంట్రల్: పెంకుళ్లపాడు ఎల్అండ్టీ గృహాల సముదాయంలో టిడ్కో గృహాల లబ్ధిదారులకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖా మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సోమవారం ఇంటి తాళాలు అందించారు. మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ నేడు 2016 మంది నూతన గృహప్రవేశం చేయడం ఆనందంగా ఉందన్నారు. మిగిలిన 1500 ఇళ్లను జులై నాటికి పూర్తి చేసి అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులందరికీ ఇంటి తాళాలు ఇస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. అయితే కొన్ని ప్రాంతాల వారికే ఇళ్లు మంజూరు చేసినట్లు సమాచారం. టిడ్కోలోకి ఒకే గేటు ఉండడంతో జనం ఎండలో మాడిపోయారు. తాగడానికి నీళ్లు లేవని వాపోయారు. ఇంకా ఇళ్లు పూర్తికాకముందే ఈ హడావుడి ఎందుకని లబ్ధిదారులు నిలదీశారు. భీమవరంలో.. భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన 1920 టిడ్కో గృహాలకు సోమవారం సామూహిక గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన 1,920 టిడ్కో గృహాల సామూహిక గృహప్రవేశాలు సంతోషకరమని పేర్కొన్నారు. మిగతా లబ్ధిదారులకు జూన్–జూలై నెలలలోపు గృహాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జగన్ అన్ని వర్గాలకూ న్యాయం చేశారు
తణుకు అర్బన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కులం, మతం, పార్టీ భేదాల్లేకుండా సంక్షేమ పాలనతో అందరికీ న్యాయం చేశారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఇరగవరం కాలనీకి చెందిన దళిత యువతితో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో కావాల్సిన వారికి మాత్రమే లబ్ధి చేకూరుస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్రెడ్డి ఐదేళ్లు పాలించారని, నేడు మా వాళ్లకే చేయాలనే ఉద్దేశం ఉండడం దురదృష్టకరమని స్పష్టం చేశారు. ఇరగవరం కాలనీలో ఉన్న శ్మశాన వాటిక వ్యవహారంలో కేసులు నమోదుచేశారని యువకులు ఆవేదన చెందుతున్నారని, అందరికీ అండగా ఉంటానని చెప్పారు. ఏ ఇబ్బంది వచ్చినా లీగల్ టీం ఉందని వారు చూసుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ తణుకు పట్టణ అధ్యక్షుడు పెనుమాల రాజేష్ మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఇరగవరం కాలనీలో ఎంతో అభివృద్ధి చేశారని, అడగంగానే కమ్యూనిటీ హాలును నిర్మించారన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు గెల్లా జగన్, వల్లూరి బుజ్జిబాబు, పోతుల దొరబాబు, పడాల బాలు, నేలపాటి ఏసేపు, నేలపాటి సురేంద్ర, దిడ్ల సత్యానందం తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కారుమూరి -
ఆర్థిక అసమానతలు తగ్గించడమే లక్ష్యం
భీమవరం (ప్రకాశంచౌక్): పీ–ఫోర్ కార్యక్రమం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమం సోమవారం భీమవరం త్యాగరాజ్ భవన్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇన్్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ పీ–ఫోర్ కార్యక్రమం రాష్ట్ర సామాజిక ముఖచిత్రాన్ని మార్చే చర్యగా అభివర్ణించారు. జిల్లాలో 49,118 బంగారు కుటుంబాలు గుర్తించగా, వాటిలో 22,762 కుటుంబాలను 2,331 మంది మార్గదర్శకులు దత్తత తీసుకున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.02 కోట్లు
ద్వారకాతిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల నగదు లెక్కింపు సోమవారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో, అన్నవరం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్, ఏఈఓ ఎం.మంజులాదేవి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ లెక్కింపులో స్వామివారికి విశేష ఆదాయం సమకూరింది. గడచిన 20 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ. 2,02,77,293 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 195 గ్రాముల బంగారం, 2.124 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.1,000, రూ.500 నోట్లు ద్వారా రూ. 5 వేలు లభించినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే హుండీల ఆదాయాన్ని పరిశీలిస్తే సగటున రోజుకి శ్రీవారికి రూ.10,13,865 ఆదాయం వచ్చినట్టు ఈఓ పేర్కొన్నారు. ఈ లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు. చింతలపూడి: తిరుపతిలో సోమవారం ఘనంగా జరిగిన శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవంలో చింతలపూడికి చెందిన విద్యార్థిని కారుమంచి రిషిత అద్భుత ప్రతిభ కనబరిచింది. తన విద్యా ప్రతిభతో ఏకంగా 9 బంగారు పతకాలు, ఒక వెండి పతకాన్ని సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా రిషిత ఈ పతకాలను అందుకుంది. చింతలపూడికి చెందిన ఉపాధ్యాయులు కారుమంచి ప్రకాష్ మాస్టారు కుమార్తె అయిన రిషిత, గన్నవరం వెటర్నరీ కళాశాలలో చదువుతోంది. స్నాతకోత్సవం అనంతరం రిషితను కళాశాల అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం నిర్వహించిన సాంఘిక శాస్త్ర పరీక్షకు 22751 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 23249 మంది విద్యార్థులకు గాను 498 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థుల హాజరు 97.86 శాతంగా నమోదైంది. ఈ పరీక్షలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ముగిసిన దూర విద్య 10 పరీక్షలు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో సోమవారం నిర్వహించిన గణితం పరీక్షకు 575 మంది విద్యార్థులు హాజరయ్యారు. 115 మంది గైర్హాజరయ్యారు. అలాగే భారతీయ సంస్కృతి, వారతస్వం పరీక్షకు ముగ్గురు విద్యార్థులకుగాను ఇద్దరు హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారు. ఏలూరు (టూటౌన్): ఆకివీడు ఘటనపై సమగ్ర పరిశీలన చేసేందుకు సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, జాతీయ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాద్ డిమాండ్ చేశారు. సంఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్కు సోమవారం వినతి పత్రం అందజేసారు. దీనికి సంబంధించిన వివరాలను ఏలూరులో పత్రికలకు విడుదల చేశారు. మత ఘర్షణలకు కారణమై దళితులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్న ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు శాసనసభ సభ్యత్వం రద్దు చేసి ఉభా సభాపతి నుంచి తొలగించాలని కోరారు. టి.నరసాపురం: పామాయిల్ గెలలు నరుకుతుండగా విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజుపోతేపల్లి గ్రామానికి చెందిన చెన్ని శివాజీ (23) పామాయిల్ గెలలు నరికే పనికి వెళుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగానే మరో ఇద్దరు కూలీలతో కలసి మండలంలోని గుడ్లపల్లికి చెందిన రైతు పామాయిల్ తోటలో గెలులు నరకడానికి వెళ్లాడు. పామాయిల్ గెలలు నరుకుతుండగా గెడ కత్తి విద్యుత్ తీగలకు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో తోటి కూలీలు 108కి ఫోన్ చేయగా సిబ్బంది వచ్చి అతడిని పరిశీలించి, అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతలపూడి తరలించారు. -
అసెంబ్లీ తీర్మానం రాజకీయ డ్రామా
ఏలూరు టౌన్: రాజధాని అమరావతి టీడీపీ నేతలకు, చంద్రబాబుకు ఏటీఎంలా మారిపోయిందని, చంద్రబాబుకు నిధులు కావాలంటే అప్పుడు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొస్తూ.. శాశ్వత భవనాలేమీ కట్టకుండానే నీళ్ళు తోడటానికి, పిచ్చి మొక్కలు పీకటానికి వేలకోట్లు నిధులు ఖర్చు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ విమర్శించారు. అమరావతి రాజధాని అంశంపై చంద్రబాబు తీరుపై ఏలూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ధ్వజమెత్తారు. అమరావతిలో మూడు పంటలు పండే పొలాలను రైతుల నుంచి తీసుకున్నారని, ప్లాట్లు ఇస్తామంటూ నమ్మించి సుమారు 50 వేల ఎకరాల భూములు సేకరించారని.. ఒక్క శాశ్వత భవనమైనా నిర్మించారా అని ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం పేరిట డ్రామా చేస్తున్నారని, రైతులు రెండో విడత పూలింగ్ చేసేందుకు సహకరించడం లేదనే సాకుతో ఇప్పుడు అసెంబ్లీలో రైతులను మభ్యపెట్టేలా డైవర్షన్ చేయడం నిజం కాదా అని నిలదీశారు. 2028 లోపు అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చెబుతున్న చంద్రబాబు.. అదే సమయంలో ఎవరైనా మార్చేస్తారంటూ ప్రచారం చేయటం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని జేపీ ప్రశ్నించారు. ఈ భారమంతా ఎవరు భరిస్తారు? అమరావతి పేరిట భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి నేడు దారుణంగా ఉందని, ప్లాట్లు డెవలప్మెంట్ లేదని, రోడ్లు వేయలేదని, కొన్ని ప్లాట్లు చెరువుల్లో ఉన్నాయని, చంద్రబాబును మరోసారి నమ్మేస్థితిలో రైతులు లేరని అన్నారు. మొదటి దశలో 50 వేల ఎకరాల భూసేకరణ చేశారని, ఒక్కో ఎకరా అభివృద్ధికి రూ.2 కోట్లు చొప్పున రూ.లక్ష కోట్లు అవసరం అన్నారని, మరోసారి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అన్నారని.. ఇప్పుడు రెండవ దశలో మరో 20 వేల ఎకరాల భూసేకరణ, అభివృద్ధికి మరో రూ.50 వేల కోట్లు.. ఈ భారమంతా రాష్ట్ర ప్రజలు భరించే స్థితిలో ఉన్నారా? అని ప్రశ్నించారు. అమరావతిలో కొత్త భవనాలు కట్టకుండా, డిజైన్ల పేరుతోనే సుమారు రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారని, పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లు పిలవడం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంటూ అసత్య ప్రచారాలు చేశారనీ, సెల్ఫ్ ఫైనాన్స్ అయితే రూ.47 వేల కోట్లు అప్పులు ఎందుకు చేశారో చెప్పాలని జయప్రకాష్ డిమాండ్ చేశారు. కౌన్సిల్లో పెడితే అవినీతి బయటపడుతుందనే భయం రెండో విడత పూలింగ్కు కొత్త నాటకం వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ -
నిబద్ధతతో పనిచేసిన ఉమేష్ చంద్ర
భీమవరం (ప్రకాశంచౌక్): దివంగత ఐపీఎస్ అధి కారి ఉమేష్ చంద్ర విధి నిర్వహణలో నిజాయతీ, నిబద్ధత, అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి అని కలెక్టర్ సీహెచ్ నాగరాణి కొనియాడారు. ఆదివారం స్థానిక వీరమ్మ పార్కు సమీపంలోని ఉన్న ఎన్జీవో హోమ్ పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఉమేష్ చంద్ర 60వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమేష్ చంద్ర చిత్రపటం వద్ద కలెక్టర్, అధికారులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు దిశగా ఉమేష్ చంద్ర చేపట్టిన ప్రయోగాత్మక కార్యక్రమాలు ఆదర్శప్రాయమన్నారు. అనంతరం హోమ్లో వృద్ధులను ఆమె ఆప్యాయంగా పలకరించి భోజన ఏర్పాట్లు చేశారు. వృద్ధులకు అవసరమైన పలు వస్తువులు అందించారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, ఆర్డీఓ కె.ప్రవీణ్కుమార్రెడ్డి, డ్వామా పీడీ సీహెచ్ అప్పారావు, జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి రామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పైపులు..ఎటు చూసినా లీకులు
● తాడేపల్లిగూడెంలో తాగునీరు వృథా ● లీకేజీలతో నీరు కలుషితం తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం పట్టణంలో పలుచోట్ల పైప్లైన్ లీకేజీలతో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నీరు వృథా కావడంతో పా టు కుళాయిలు నుంచి మురుగు నీరు, దుర్వాసన వస్తుందని ప్రజలు ఆందేన చెందుతున్నారు. ప్ర ధాన పైప్లైన్లతో పాటు ఇళ్లకు వెళ్లే పైప్లైన్లకు సైతం లీకేజీలు పడుతున్నాయి. కొన్నిచోట్ల డ్రెయిన్ల వద్ద పైప్లైన్లు ఉండటంతో తాగునీటి పైపుల ద్వా రా మురుగునీరు వస్తుందని పలువురు అంటున్నా రు. తక్షణమే సంబంధిత అధికారులు పైప్లైన్ల లీకేజీలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఈతకోట మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద.. స్థానిక పెద్ద మసీదు సెంటర్ నుంచి టీటీడీ కల్యాణ మండపం రహదారి మార్గంలో ఈతకోట తాతాజీ మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద కాంప్లెక్స్కు సంబంధించిన పైప్లైన్కు సీసీ రోడ్డుకు దిగువన లీకేజీ పడింది. చాలా కాలంగా నీరు వృథా అవుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. స్థానికులు మున్సిపల్ వాటర్ వర్క్స్ అధికారులకు తెలియజేయగా వారు వచ్చి పరిశీలించారు. రోడ్డుకు అవతల వైపు ప్రధాన పైపులైన్ వద్ద ఇతర పైప్లైన్లను సరిచేసేందుకు గొయ్యి తవ్వారు. ఎందుకు తవ్వారు తెలియరాలేదని స్థాని కులు అంటున్నారు. ఇప్పటికీ పైప్లైన్ లీకేజీని మాత్రం అరికట్టలేదు. ఇదిలా ఉండగా లీకేజీని అరికట్టేందుకు సీసీ రోడ్డును పగలగొట్టాల్సి ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. అంబేడ్కర్ భవనానికి ఎదురు సందులో.. మసీదు సెంటర్ అంబేడ్కర్ భవనానికి ఎదురుగా ఎంపీపీ పాఠశాల పక్క సందులో ఓ పైప్లైన్కు లీకేజీ పడింది. ఈ పైప్లైన్ డ్రెయినేజీ వద్ద ఉండటంతో లీకేజీ ద్వారా మురుగు నీరు పైప్లైన్లోకి వెళుతోందని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వ పుస్తక విక్రయ కేంద్రం ఎదురుగా.. జిల్లా ప్రభుత్వ పాఠ్య పుస్తక విక్రయ కేంద్రం ఎదురుగా రోడ్డు పక్కగా డ్రెయినేజీకి సమీపంలో ఓ స్థలం వద్ద పైప్లైన్కు లీకేజీ ఏర్పడింది. నీరు వృథాగా పోతోంది. ఆయా సమస్యలపై అధికారులను వివరణ కోరగా లీకేజీలను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈతకోట మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద.. మున్సిపల్ కాంప్లెక్స్ వద్ధతవ్వి వదిలేసిన గొయ్యి అంబేడ్కర్ భవనం ఎదురు సందులో.. -
30 శాతం ఐఆర్ ప్రకటించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయులకు 30 శాతం ఐఆర్ను తక్షణమే ప్రకటించాలని జాక్టో చైర్మన్ పువ్వుల ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఆశోకవర్థన ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జాక్టో) జి ల్లా నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. జా క్టో జిల్లా చైర్మన్గా పువ్వుల ఆంజనేయులు, వైస్ చైర్మన్గా తలపంటి శ్రీనివాసరావు, సెక్రటరీ జనరల్గా భూక్యా రాము, కోశాధికారిగా ఎన్.ప్రవీణ్ కుమార్ ఎన్నికయ్యారు. వీరితో పాటు అదనపు సెక్రటరీ జనరల్గా కేఎస్వీకే రాజ్కుమార్, కో చైర్మన్లుగా కాటి వెంకటరమణ, బి.విద్యాసాగర్, పేరాబత్తుల సురేష్, మహిళా కో–చైర్మన్గా నందిగం శర్వాణి, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్గా టీఎల్ఎస్ఎన్ మూర్తి, తోట ఎడ్వర్డ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చైర్మన్ ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపైనా జాక్టో రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్ను రద్దు చేయాలని కోరారు. పీఆర్టీయూ, ఆపస్, ఎన్టీఏ, బీటీఏ (అమరావతి), టీఎన్యూఎస్, డీపీఆర్టీయూ, ఎంటీఎఫ్, ఏపీఎస్టీఏ, ఎంటీఎస్, ఏపీటీయూ తదితర ఉపాధ్యాయ సంఘాల జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆందోళనలో మొక్కజొన్న రైతులు
దెందులూరు: రాష్ట్రంలో తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం దెందులూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాలకు పైగా మొక్కజొన్నను పండించిన రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారన్నారు. కష్టనష్టాలు, విపత్తులను తట్టుకుని మొక్కజొన్నను పండిస్తే మద్దతు ధర అందక, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచే యక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అదనుగా దళారులు క్వింటాకు రూ.700 నుంచి రూ.800 వరకు ధర తగ్గించి దోచుకుంటున్నారన్నారు. ఏలూరు జి ల్లాతో పాటు విజయనగరం, ఎన్టీఆర్, బాపట్ల, నంద్యాల, అనంతపురం తదితర జిల్లాల్లో రై తులు కొనుగోలు కేంద్రాల కోసం పలు రూ పాల్లో నిరసనలు తెలిపినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరవాలని, క్వింటాకు రూ.2,400 ధర చెల్లించాలని కోరారు. భీమవరం (ప్రకాశంచౌక్): ప్రతి వారం కలెక్టరేట్, గ్రామ, డివిజినల్ కేంద్రాల్లో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యాక్రమాన్ని సోమవారం రద్దు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ప్రజలు గమనించాలని కోరారు. అలాగే జిల్లాస్థాయిలో భీమవరం త్యాగరాజ భవనంలో సో మవారం మధ్యాహ్నం 2 గంటలకు పీ4 ప్ర థమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. క్యాంపు కా ర్యా లయం నుంచి అధికారులతో సమీక్షించారు. భీమవరం (ప్రకాశంచౌక్): విద్యాహక్కు చట్టం కింద 2026–27కు సంబంధించి ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు జిల్లాలో 1,047 మంది విద్యార్థులు ఎంపికయ్యారని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ పి.శ్యామ్సుందర్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, ఆన్లైన్ దరఖాస్తు ప్రింట్ను ఏప్రిల్ 7లోపు కేటాయించిన పాఠశా లలో సమర్పించి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. గడువులోపు ప్రక్రియ పూర్తికాకుంటే సీటు రద్దు చేస్తారన్నారు. ఎంఈఓలు తమ పరిధిలో జరిగిన ప్రవేశాల వివరాలను ధ్రువీకరించి, పూర్తి నివేదికను జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లాలో సోమ వారం 1,160 ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. నియోజకవర్గాల వారీగా చింతలపూడిలో 123, దెందులూరులో 89, ఏలూరు లో 502, గోపాలపురంలో 12, కై కలూరులో 172, నూజివీడులో 119, పోలవరంలో 91, ఉంగుటూరులో 52 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. -
ఇంతి.. అధోగతి
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో చంద్రబాబు పా లనలో మహిళలు ‘రుణమో రామచంద్రా’ అని అ భ్యర్థిస్తున్నారు.. పథకాలు అందక.. ఉపాధికి మా ర్గాలు లేక అల్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళా సంక్షేమానికి ఎలాంటి పథకాలు అమలు చేయకపోవడం, ఆర్థిక సాధికారత, స్వావలంబనకు ఊతమివ్వకపోవడంతో ఉసూరుమంటున్నా రు. దీంతో మహిళాభ్యున్నతి పూర్తిస్థాయిలో కుంటుపడింది. గత వైఎస్సార్సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారు. మహిళలను ఆర్థికంగా శక్తిమంతులను చేసేందుకు కృషి చేశారు. డ్వా క్రా సంఘాలకు పెద్ద ఎత్తున బ్యాంకు లింకేజీ, సీ్త్ర నిధి రుణాలు అందించారు. ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, చేయూత, చేదోడు, జగనన్న తోడు వంటి పథకాలతో ఆర్థికంగా అండగా నిలిచారు. ప్ర భుత్వ అండతో చిరు వ్యాపారాలు, డెయిరీ యూ నిట్లు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం, కుటీర పరిశ్రమల నిర్వహణ వంటివి మహిళలు చేపట్టారు. అయితే ఇదంతా గతం.. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఎక్కడా ఈ పరిస్థితి కానరావడం లేదు. ఈ నేపథ్యంలో పాత రోజులే బాగున్నాయని మహిళలు అంటున్నారు. చంద్రబాబు, కూటమి నేతల మాటలు నమ్మి మోసపోయామంటూ నిట్టూరుస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో స్వయం సమృద్ధి 2014–19 కాలంలో ఉమ్మడి జిల్లాలో డ్వాక్రా మ హిళలకు రూ.13,451.50 కోట్ల రుణాలు ఇచ్చారు. ఏలూరు జిల్లాలో 1,42,456 గ్రూపులకు రూ.7,682.40 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 1,04,576 గ్రూపులకు రూ.5,753.10 కోట్లు రుణాలుగా అందించి స్వయం సమృద్ధికి దోహదపడ్డారు. అయితే ప్రస్తుత చంద్రబాబు పాలనలో ఈ స్థాయిలో బ్యాంకుల నుంచి రుణాలు అందడం లేదు. దీనిపై మహిళలు పెదవి విరుస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ఏటా నిర్దేశిత లక్ష్యానికి మించి రుణాలు మంజూరు చేశారు. ఏలూరు జిల్లాలో సగటున ఏటా 164.89 శాతం, పశ్చిమగోదావరి జిల్లా లో 177.69 శాతం బ్యాంకు రుణాలు అందించారు. రుణమాఫీతో ఆదుకుని.. వైఎస్సార్సీపీ పాలనలో వైఎస్సార్ ఆసరా పథకంలో డ్వాక్రా మహిళలకు రూ.2,300 కోట్ల మేరకు లబ్ధి చేకూర్చారు. ఏలూరు జిల్లాలో 3.50 లక్షల మందికి పైగా మహిళలకు రూ.1377.16 కోట్ల రుణమాఫీ ప్రయోజనం చేకూరింది. పశ్చిమగోదావరి జి ల్లాలో సైతం మూడు లక్షల మందికి పైగా మ హిళలకు రూ.వెయ్యి కోట్ల మేరకు లబ్ధి కలిగింది. ‘కాపు’కాసిన నేస్తం వైఎస్సార్ కాపు నేస్తం పథకంలో ఒక్కో ఏడాది రూ.15 వేల చొప్పున నాలుగు విడతల్లో రూ.60 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఉమ్మడి జిల్లాలో కాపు మహిళలకు రూ.220 కోట్ల మేరకు లబ్ధి చేకూరింది. ఏలూరు జిల్లాలో 66,488 మందికి రూ.100.45 కోట్లు, పశ్చిమలో లక్ష మందికి రూ.1,20 కోట్ల మేర సహకారం లభించింది. మెండైన చేయూత వైఎస్సార్ చేయూత పథకంలో ఉమ్మడి జిల్లాల పరిధిలోని మహిళలకు రూ.850 కోట్ల మేరకు లబ్ధి చే కూరింది. ఏలూరు జిల్లాలో 1,00,776 మందికి నా లుగు విడతల్లో కలిపి రూ.440 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో 95 వేల మంది మహిళలకు రూ.410 కోట్ల మేరకు లబ్ధి చేకూర్చారు. అగ్రవర్ణ పేదలను అక్కున చేర్చుకుని.. గత వైఎస్సార్సీపీ పాలనలో అగ్రవర్ణ పేదలకు అండగా ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేశారు. ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడు విడతల్లో రూ.45 వేలు అందించారు. ఏలూరు జిల్లాలో 15,047 మందికి రూ.68.68 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 14 వేల మందికి 63 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. అతివకు అన్యాయం చంద్రబాబు పాలనలో అందని భరోసా పథకాల్లేవ్.. ఉపాధికి బాటల్లేవ్ కుంటుపడిన మహిళా సాధికారత వైఎస్సార్సీపీ పాలనలో మహిళాభ్యున్నతికి పెద్దపీట నాటి రోజులే బాగున్నాయంటున్న సీ్త్రమూర్తులు చంద్రబాబు, కూటమి నాయకులు ఎన్నికల ముందు సూపర్ సిక్స్, పథకాల పేరుతో మహిళలను వంచించారు. అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా మహిళా సంక్షేమానికి ఎలాంటి పథకాలను అ మలు చేయలేదు. దీంతో మహిళలు ఆర్థిక భరోసా కోల్పోయారు. ఎప్పటిలాగానే ప్రతి చిన్న అవసరానికీ ఇంట్లో వారిపై ఆధారపడాల్సిన దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏదో పథకం ద్వారా మ హిళల చేతుల్లోకి డబ్బులు వచ్చే అవకాశం లేకపోవడంతో ఉసూరుమంటున్నారు. నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ పాలనే బాగుండేదని, ప్రస్తుతం తమకు ఎలాంటి పథకం అందకపో వడంతో వెంపర్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని పలువురు మహిళలు ఆవేదన చెందుతున్నారు. -
ప్రజల చెవిలో పీ4 పూలు
నరసాపురం: ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. ఏ దో అద్భుతం జరిగిపోయిందంటూ హడావుడి చే యడంలో సిద్ధహస్తుడిగా పేరున్న సీఎం చంద్రబా బు రాష్ట్రంలో పేదలను ఉద్దారిస్తామంటూ పీ4 (పబ్లిక్–ప్రైవేట్–పీపుల్–పార్టనర్ఫిప్) కార్యక్రమా న్ని తీసుకువచ్చారు. ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించిన ముఖ్యమంత్రి పేదరిక నిర్మూలనకు పీ4 అంటూ హడావుడి చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది గడిచినా ఏమాత్రం పురోగతి లేకపోగా.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పీ4 సర్వే ప్రథమ వార్షికోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఇప్పటికే పీ4 సర్వేలో ఎదురవుతున్న ఆటుపోట్లతో తలలు పట్టుకుంటున్న అధికారులు వార్షికోత్సవాన్ని ఏదో రకంగా నిర్వహించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం ఆదివారం సెలవు రోజైనా కార్యక్రమం నిర్వహణపై దృష్టి పెట్టింది. కలెక్టర్ నాగరాణి ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో గూగుల్ మీట్ ద్వారా సమావేశం నిర్వహించారు. జిల్లాస్థాయిలో భీమవరం త్యాగరాజ భవన్లో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ఏడు ని యోజకవర్గాల్లో కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. ఏమిటీ పీ4 సర్వే ఎన్నికల హామీలను అమలు చేయకపోవడంతో తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం పీ4 సర్వే ప్రారంభించింది. జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో ప్రతి కుటుంబా న్నీ సర్వే చేయాలని నిర్ణయించారు. ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి, వారి ఇళ్లలో విలాస వస్తువులు, ఆదాయ మార్గాలు ఇలా పలు అంశాల్లో పడపోత కా ర్యక్రమం నిర్వహించాలన్నది సర్వే లక్ష్యం. తద్వారా బంగారు కుటుంబాల పేరుతో సంపన్న వర్గాలను గుర్తించి వారిని మార్గదర్శకులుగా నియమించి కొన్ని పేద కుటుంబాలను దత్తత తీసుకునేలా చే యాలనేది కార్యక్రమం ఉద్దేశం. ఇలా సంపన్న వర్గా లు దత్తత తీసుకున్న కుటుంబాలకు ఆర్థికంగా చే యూత ఇవ్వడం, అవసరమైన నైపుణ్యాలు పెంచడానికి సహకరించడం చేయాలి. చెప్పడానికి ఇదంతా బాగున్నా.. సర్వే దశలోనే ఈ కార్యక్రమం అట్టర్ఫ్లాఫ్ అయ్యింది. టార్గెట్ ఘనం.. మార్గదర్శకులు దొరకని వైనం జిల్లాలో 4,92,292 కుటుంబాలను సర్వే చేసి ద త్తతకు అర్హమైన 64,940 కుటుంబాలను అధికారు లు తేల్చారు. అయితే ఆయా కుటుంబాలను దత్తత తీసుకోవడానికి సంపన్న వర్గాలైన మార్గదర్శకులు 15 వేల మంది కావాలి. అయితే ఏడాది కాలంలో మార్గదర్శకులు ఎంత మందిని గుర్తించారనే అంశంలో జిల్లా అధికార యంత్రాంగం వద్ద స్పష్టత లేదు. విశ్వసనీయ సమాచారం మేరకు కనీసం 3 వేల కు టుంబాలను కూడా గుర్తించలేదని తెలిసింది. మరి సర్వే లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందనేది ప్రశ్నార్థకమే. పబ్లిసిటీలో పీక్గా పేరున్న చంద్రబాబు పీ4 సర్వే విషయంలోనూ అదే తరహాలో ముందుకు సాగుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హవ్వ.. ఇదెక్కడి విడ్డూరం ? పీ4 సర్వే పేరుతో సీఎం చంద్రబాబు హడావుడి నేడు ప్రథమ వార్షికోత్సవానికి సన్నాహాలు జిల్లాలో మార్గదర్శకులు దొరకని వైనం కార్యక్రమం విజయవంతానికి అధికారుల పాట్లు పీ4 సర్వేకు సంబంధించి ప్రభుత్వ వ్యవహార తీరుతో తొలి నుంచి అధికారులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. మార్గదర్శకులుగా చెప్పే బంగారు కుటుంబాలను గుర్తించాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తూనే ఉంది. కలెక్టర్ తరచూ ఇదే అంశంపై రివ్యూలు నిర్వహించడంతో అధికారులు విసిగిపోయారు. అయినా జిల్లాలో మార్గదర్శకులను రిజిస్టర్ చేయించడం అధికారుల వల్ల కాలేదు. దీంతో వ్యవహారం బెడిసికొట్టే ప్రమాదం ఉందని గుర్తించిన చంద్రబాబు సర్కారు ఓ దశలో ఈ బంగారు కుటుంబాల బాధ్యతను ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు అప్పగించాలని కూడా నిర్ణయించింది. ఒక్కో అధికారి, ఉద్యోగి జీతంలో నెలకు రూ.5 వేలు ఖర్చు చేయించేలా ప్రయత్నం జరిగింది. చివరకు సర్వే విఫలం విషయంలో ప్రభుత్వ ఉద్యోగులను బాధ్యులను చేసేలా సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఒత్తిడి పెంచడం వంటివి కూడా చేశారు. అయితే ప్రభుత్వ చర్యలను మొదటిగా ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. తర్వాత మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు సర్వే లక్ష్యం అమలు సాధ్యం కాదని ధిక్కార స్వరం పెంచారు. మొత్తంగా అటు ప్రజల నుంచే కాకుండా ఇటు అధికారులు, మేధా వుల నుంచి తీవ్ర వ్యతిరేకతతో అభాసుపాలైన పీ4 సర్వేకు వార్షికోత్సవం చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
మాజీ మంత్రి శ్రీరంగనాథరాజుకు పితృవియోగం
ఉండి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు పితృవియోగం జరిగింది. ఆదివారం వేకువజామున ఉండి మండలం యండగండిలోని ఆయన నివాసంలో చెరుకువాడ వెంకట నర్సింహరాజు (96) తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సూర్యకాంతమ్మ, ఇద్దరు కుమారులు శ్రీరంగనాథరాజు, బంగార్రాజు, కుమార్తె విజయ ఉన్నారు. నర్సింహరాజు భౌతికకాయాన్ని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, వైఎస్సార్సీపీ ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నర్సింహరాజు, పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల గోపి, సీనియర్ నాయకులు కనుమూరు అబ్బాయిరాజు, ఆ కివీడు ఏఎంసీ మాజీ చై ర్మన్ వానపల్లి బాబూరా వు, కవిటం ఎంపీపీ వా సిరెడ్డి, పార్టీ నేత యడ్ల తాతాజీ, ఆచంట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు తదితరులు సందర్శించి నివాళులర్పించారు. -
దళితులకు రక్షణ లేదా?
ఏలూరు టౌన్ : రాష్ట్రంలో కూటమి పాలనలో దళితులపై రోజురోజుకూ అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయని, ఆకివీడు పెదపేటలో శ్రీరామనవమి వేడుకల పేరుతో అక్కడకు వెళ్ళి రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పి.. మత, కుల విద్వేషాలు రెచ్చగొట్టడం దారుణమని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు అన్నారు. పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పెదపేటలో రామాలయం కట్టాలని భావిస్తే గ్రామపెద్దలతో సామరస్యంగా చర్చించి ఇరు పక్షాలకూ ఇబ్బంది లేకుండా చేయాలని, కుట్రపూరితంగా గ్రామంలోకి రాజకీయ నేతలతో, పోలీస్ బలగాలతో వెళ్ళి దళితులను అణచివేయాలనే ప్రయత్నం సరైంది కాదన్నారు. ఉప సభాపతి స్థానంలో ఉంటూ కావాలనే మతపరమైన చిచ్చు రేపేందుకు గత కొంతకాలంగా అక్కడికి వెళుతూ దళితుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. మందీ మార్బలంతో పెదపేటలోకి వెళ్ళి గొడవలు సృష్టించారు.. ఒక వర్గం నేతలు నినాదాలు చేస్తూ దళితులను రెచ్చగొట్టారు.. ఇది నిజం కాదా అంటూ వారు ప్రశ్నించారు. 57 మంది దళిత యువకులు, మైనర్లపై అక్రమ కేసులు బనాయించి వారి భవిష్యత్తో చెలగాటం ఆడాలని చూస్తే సహించేది లేదన్నారు. ఎస్సీ సెల్ అధికార ప్రతినిథి మున్నుల జాన్గురునాథ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నిట్టా గంగరాజు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో దళితులకు రాష్ట్రంలో ఎక్కడా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉన్నత పదవుల్లో ఉన్న నేతలు సైతం దళితులను అణచివేసే ధోరణిలో మాట్లాడుతూ పెదపేట వివాదానికి మతం రంగు పులిమే ప్రయత్నం చేయటం సిగ్గుచేటన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఏలూరు నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, ఏలూరు నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రత్తిపాటి విక్టర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ ఆగ్రహం


