breaking news
West Godavari District Latest News
-
కుమారుడి గృహప్రవేశానికి వెళ్లి..
పెనుగొండ: కుమారుడు ప్రయోజకుడై కొనుగోలు చేసిన కొత్త ఇంటి గృహప్రవేశానికి ఆనందంగా వెళ్లిన ఆ తండ్రిని మృత్యువు డీసీఎం రూపంలో కబళించింది. ఆచంట మండలం ఆచంట వేమవరానికి చెందిన ఉపాధ్యాయుడు నిల్లా పూర్ణ కళాధర్ (50) హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. పూర్ణ కళాధర్ పెద్ద కుమారుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఓ అపార్ట్మెంట్లో ప్లాట్ కొనుగోలు చేశారు. గృహప్రవేశం నిమిత్తం పూర్ణ కళాధర్ రెండు రోజుల క్రితమే హైదరాబాద్లోని చందానగర్కు వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం మిత్రులతో కలిసి జేఎన్టీయూను సందర్శించడానికి వెళుతుండగా, ఓ డీసీఎం వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పూర్ణ కళాధర్ తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆయన్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కళాధర్కు ఇద్దరు కుమారులు కాగా, ఇటీవలే పెద్ద కుమారుడికి వివాహం జరిగింది. ప్రస్తుతం ఆయన ఆచంట మండలం పెనుమంచిలి వర్ధనపు గరువులోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. కళాధర్ మృతి పట్ల పలు ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. ఉంగుటూరు: ఉంగుటూరులో కోతి దాడి చేసిన ఘటనలో గుర్రాన రత్నకుమారి అనే మహిళ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యురాలు డాక్టర్ శ్రావణరెడ్డి ప్రాథమిక వైద్య సేవలు అందించారు. గ్రామంలో కోతులు దాడలు పెరిగిపోయాయని, చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
రాష్ట్రస్థాయి ఓపెన్ చెస్ పోటీల్లో విజేతలు వీరే..
భీమవరం: స్థానిక అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఓపెన్ చెస్ పోటీల వివరాలను అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాదాసు కిషోర్ తెలిపారు. ఈ పోటీలకు 96 మంది క్రీడాకారులు పాల్గొనగా తాడి సాయివెంకటేష్ (కోనసీమజిల్లా) ప్రథమ, యర్రంశెట్టి లీలాకృష్ణ (ఎన్టీఆర్ జిల్లా) ద్వితీయ, నీలి కుష్పంత్(పశ్చిమగోదావరి), తృతీయ, కుడిపూడి తేజస్ (కోనసీమ జిల్లా), నాల్గవ, టి ప్రసన్నకుమారి (కృష్ణాజిల్లా) ఐదవ స్థానంలో నిలిచారు. విజేతలకు జ్ఞాపికలు, చెస్ బుక్లు అందజేశారు. జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తోట హరిబాబు, సంయుక్త కార్యదర్శి మైలాపురి మురళీ పాల్గొన్నారు. -
బీచ్.. అభివృద్ధి తూచ్
నరసాపురం : పేరుపాలెం బీచ్ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం నెలకొందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్లూఫ్లాగ్ గుర్తింపు కోసం గతంలో సాగిన ప్రయత్నాలు నిలిచిపోగా, అభివృద్ధి పనులు ముందుకు పడటం లేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏకై క బీచ్ పేరుపాలెం. ఏటా లక్షలాది మంది సందర్శకులను ఆకర్షిస్తూ రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బీచ్, పర్యాటక అభివృద్ధికి అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేశారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ● 2020 ఫిబ్రవరిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేరుపాలెంలో మూడు రోజులపాటు బీచ్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించడంతో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ● బీచ్కు అనుసంధానంగా రూ.4.5 కోట్ల వ్య యంతో రహదారి నిర్మాణాలను గత ప్రభు త్వం పూర్తి చేసింది. ● రూ.కోటి వ్యయంతో వైఎస్సార్ స్మృతి వనం, మ్యూజియాన్ని ఏర్పాటుచేశారు. ● ప్రైవేట్ భాగస్వామ్యం రూ.40 కోట్ల వ్యయంతో రిసార్టులు, హోటళ్ల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారు. ప్రస్తుత పరిస్థితి.. డిమాండ్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా బీచ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంపై స్థానికులు, పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2021లో బ్లూ ఫ్లాగ్ బృందం పరిశీలన జరిపినా, ఆ గుర్తింపు సాధించే ప్రక్రియ ప్రస్తుతం నిలిచిపోయింది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పేరుపాలెం బీచ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పేరుపాలెం బీచ్ అభివృద్ధిపై నీలినీడలు కూటమి పాలనలో ఒక్క అడుగూ ముందుకు పడని వైనం బ్లూ ఫ్లాగ్ గుర్తింపుపైనా నిర్లక్ష్యం బీచ్ అభివృద్ధిపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ -
నిధుల దుర్వినియోగంపై మరోసారి విచారణ
కై కలూరు: నిధుల దుర్వినియోగం అభియోగాల విచారణ కై కలూరు పంచాయతీని వీడటం లేదు. రాచపట్నంకు చెందిన చక్కా మురళీ అనే వ్యక్తి కై కలూరు గ్రామ పంచాయతీ సాధారణ నిధులు దుర్వినియోగం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేయడంపై గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో మూడుసార్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. అప్పటి కై కలూరు ఎంపీడీఓ ఆర్.ఫణింద్ర, పంచాయతీ ఈఓ పీఎన్పీ ఆనందభూషణం 2025 జనవరి 18 నుంచి 2025 మే 12 వరకు నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అధికారులు కేవలం ఒక నెల రికార్డులు మాత్రమే పరిశీలించారని, అన్ని నెలల రికార్డుల పరిశీలన చేయాలని తాజాగా కోరారు. దీంతో సెప్టెంబరు 2న ఉదయం 11 గంటలకు ఏలూరు డీపీఓ కార్యాలయం వద్ద విచారణ చేయనున్నారు. ఈ మేరకు ఫిర్యాదుదారుడు చక్కా మురళీకి అధారాలతో రావాలని నోటీసు అందింది. -
జీవనోపాధికి ఖతార్ వెళ్లి ఆత్మహత్య
పెనుగొండ: జీవనోపాధి కోసం గల్ఫ్ దేశమైన ఖతార్కు వెళ్లినప్పటికీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామానికి చెందిన రాపాక సురేష్ (37) జీవనోపాధికోసం ఖతార్ వెళ్లారు. అక్కడ ఆర్థికంగా సతమతమవుతూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన... ఈనెల 14వ తేదీన ఆత్మహత్యకు పాల్పడి కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చారు. మృతుడు సురేష్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అండగా నిలిచిన తెలుగు సంఘాలు కనీసం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చే ఆర్థిక స్థోమత కూడా లేకపోవడంతో, ఆయన బంధువు రత్నరాజు... ఏపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఖతార్ అధ్యక్షుడు వెంకట నరసింహం జోశ్యులకు సమాచారం అందించారు. దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాల సంఘాలు, ప్రవాసుల ఆర్థిక సహకారంతో మృతదేహానికి అవసరమైన అన్ని అనుమతులు సాధించారు. ఇండియన్ కమ్యూనిటీ బెనెవలెంట్ ఫోరం, భారత రాయబార కార్యాలయం సహకారంతో సురేష్ మృతదేహాన్ని ఆచంట వేమవరం గ్రామానికి పంపించినట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఏపీ ప్రవాసాంధ్ర సంఘం ప్రతినిధులు, డైరెక్టర్ అక్కిలి నాగేంద్రబాబుకు సమాచారం అందించడంతో, ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేసి మృతదేహాన్ని గ్రామానికి చేర్చినట్లు పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సంఘ అధ్యక్షుడు వెంకట నరసింహం జోశ్యుల కృతజ్ఞతలు తెలిపారు. -
పురావస్తు శాఖ అనుమతులు లేకుండానే..
ఆలయ ఆగ్నేయ దిశలో ఉన్న ప్రహరీ గోడకు కన్నం కొట్టి లోపల ఉన్న జనరేటర్ను బయటకు తీశారు. ఇప్పుడు ఆ గోడను పూర్తిగా తొలగించి, అక్కడ షాపులు నిర్మించి తమ పేరుతో శిలాఫలకం వేయించుకోవాలని పాలకమండలి (కొంత మంది సభ్యులకు తెలియకుండా జరుగుతున్నట్టు సమాచారం) ఉవ్విళ్లూరుతోంది. దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం ఆలయంలో ఏ నిర్మాణం చేపట్టాలన్నా, కూల్చాలన్నా పురావస్తు శాఖ అనుమతి తప్పనిసరి. గతేడాది కార్తీకమాసంలో కురిసిన భారీ వర్షాలకు పడమర దిశలో (గోలీగుంట సరిహద్దు) ఉన్న ప్రహరీ గోడ కూలిపోయింది. పది నెలలవుతున్నా పురావస్తుశాఖ అనుమతులు లేవనే సాకుతో దానిని పునర్నిర్మించలేదు. పడిపోయిన గోడను కట్టడానికి అనుమతులు తీసుకురాలేని అధికారులు.. ఇప్పుడు షాపుల నిర్మాణం కోసం తూర్పు ప్రహరీని పగలగొట్టడానికి అనుమతులు ఎలా తెచ్చారనేది పెద్ద ప్రశ్నగా మారింది. -
వ్యాన్ ఢీకొని యువకుడి దుర్మరణం
మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కామవరపుకోట: రావికంపాడు అడ్డరోడ్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తడికలపూడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామపంచాయతీ వీరంపాలేనికి చెందిన తాత విశ్వేశ్వరరావు (26) ఏలూరులోని ఓ పౌల్ట్రీ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన తోటి ఉద్యోగైన కొయ్యలగూడెం మండలం రాజవరానికి చెందిన సుదగని సాయి (24)తో కలిసి ఉదయం ద్విచక్ర వాహనంపై ఉద్యోగ పనుల నిమిత్తం బయలుదేరారు. పనులు ముగించుకుని తిరిగి జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వైపు బైక్పై వస్తుండగా... రావికంపాడు అడ్డరోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న వ్యాన్ వారి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విశ్వేశ్వరరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన సాయిని చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. విశ్వేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. వీరంపాలెంలో విషాద ఛాయలు మృతుడు విశ్వేశ్వరరావుకు ఇంకా వివాహం కాలేదు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న పెద్దకొడుకు రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా మృతి చెందడంతో వీరంపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై తడికలపూడి ఎస్సై ఎస్. వల్లీ పద్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కూటమి కనికుట్టు
సాక్షి, భీమవరం : కుట్టుశిక్షణ పేరిట కూటమి ప్రభుత్వం కనికట్టు చేసింది. పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తామంటూ ఆశలు రేపి శిక్షణ పూర్తయ్యాక కుట్టుమెషీన్లు పంపిణీ ఊసుమరిచింది. సర్కారు మాటలు నమ్మి వ్యయప్రయాసలకోర్చి శిక్షణ పొందిన మహిళలు కుట్టుమెషీన్లు కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. త్వరగా అందించమని కోరుతూ పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు చేస్తున్నారు. గతేడాది శిక్షణ బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పన పేరిట కూటమి ప్రభుత్వం గతేడాది ఉచిత కుట్టుశిక్షణ కార్యక్రమం నిర్వహించింది. శిక్షణ అనంతరం మహిళలకు కుట్టుమెషీన్లు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమగోదావరి జిల్లా నుంచి 3,486, ఏలూరు నుంచి 3.259 మంది కలిపి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6,745 మందిని కుట్టుశిక్షణ కోసం ఎంపిక చేశారు. వీరిలో బీసీ మహిళలు 4,516 మంది ఉండగా, బ్రాహ్మణ 28 మంది, కమ్మ 211, కాపు 1711, రెడ్డి 86, ఆర్యవైశ్య 87, క్షత్రియ 50, ఈబీసీ 56 మంది ఉన్నారు. రూ.కోట్లు కుమ్మరించి శిక్షణ నిమిత్తం చంద్రబాబు సర్కారు కోట్లాది రూపాయలు కుమ్మరించింది. శిక్షణ నుంచి మెషీన్లు పంపిణీ వరకు మొత్తం కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం మూడు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. బయట శిక్షణ నిమిత్తం రూ.7 వేల నుంచి రూ.10 వేలలోపు ఫీజు ఉంటే ఏజెన్సీలకు భారీ మొత్తంలో కట్టబెట్టారన్న విమర్శలున్నాయి. శిక్షణ పొందేవారు ఒక్కొక్కరికి రూ.15,599 చొప్పున రూ.10.52 కోట్లు, కుట్టుమెషీన్కు రూ.6,199లు చొప్పున రూ.4.18 కోట్లు లెక్కలు కట్టారు. మొత్తంగా ఒక్కో మహిళకు రూ.21,798లు చొప్పున రూ.14.7 కోట్ల వ్యయంతో శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రానికి 144 మంది చొప్పున భీమవరం, ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం తదితర ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 50 వరకు కేంద్రాలను ఏర్పాటుచేశారు. గత మే నెల నుంచి సెప్టెంబరు వరకు పలు విడతలుగా శిక్షణ కార్యక్రమం సాగింది. రోజుకు రెండు బ్యాచ్లుగా మహిళలకు సంబంధించిన జాకెట్లు, చిన్నపిల్లల గౌన్స్, జుబ్బాలు తదితర వాటిలో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. అందుకు అవసరమైన దారాలు, క్లాత్, ఇతర మెటీరియల్ బాద్యత మహిళలదే. నిర్వాహకులు కేవలం శిక్షణ మాత్రమే ఇచ్చారు. శిక్షణ పొందిన మహిళలకు ప్రభుత్వం కుట్టుమెషీన్లు అందజేయాల్సి ఉంది. ఏడాదవుతున్నా కుట్టుమెషీన్లు ఇంకా అందజేయకపోవడం గమనార్హం. వ్యయ ప్రయాసలకోర్చి కేంద్రాలకు చేరుకుని శిక్షణ పొందిన మహిళలు ఇళ్ల వద్ద ఖాళీగా ఎదురు చూడాల్సి వస్తోంది. ఎన్నో కష్టాల నష్టాలకోర్చి కేంద్రాలకు చేరుకుని శిక్షణ తీసుకున్నామని, నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు కుట్టుమెషీన్లు అందజేయలేదని మహిళలు చెబుతున్నారు. కుట్టుమెషీన్లు ఎప్పుడు వస్తాయంటూ కొందరు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. త్వరితగతిన మెషీన్లు అందజేయాలని మరికొందరు కలెక్టరేట్ల వద్ద జరిగే పీజీఆర్ఎస్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వలనే మెషీన్లు ఇంకా అందజేయలేదని తెలుస్తోంది. కాగా ఏజెన్సీల నుంచి కుట్టుమెషీన్లు వచ్చాక మెషీన్లు అందజేస్తామని అధికారులు అంటున్నారు. స్వయం ఉపాధి పేరిట మహిళలకు కుట్టు శిక్షణ కుట్టుమెషీన్లు అందజేస్తామన్న ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 6,745 మందికి శిక్షణ శిక్షణ నిమిత్తం ఒక్కొక్కరికి రూ.15,599 చొప్పున రూ.10.52 కోట్లు కుట్టుమెషీన్లకు రూ.4.18 కోట్లు ఏడాదవుతున్నా జాడలేని మెషీన్లు -
కోదాడలో బస్సు ప్రమాదం.. ఏలూరులో కలకలం
కోదాడ రూరల్/ఏలూరు టౌన్: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో బుధవారం వేకువజామున హైదరాబాద్ నుంచి ఏలూరు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం రేపింది. ఆగిఉన్న ట్రాలీ లారీని గమనించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్డ్రైవర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరుగురి మృతదేహాలను, గాయపడిన వారిని స్థానికులు సహాయంతో ఉదయం ఐదున్నర గంటల వరకు కోదాడ ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. తీవ్రంగా గాయపడిన మరికొందరిని మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాలని డాక్టర్లు సూచించగా.. వారు సూర్యాపేట, ఖమ్మం, విజయవాడకు వెళ్లారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒక్కొక్కరుగా కోదాడ ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి తల్లడిల్లిపోయారు. ఆరుగురి మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలతో కోదాడ ప్రభుత్వాస్పత్రి ఆవరణ దద్దరిల్లింది. మృతుల్లో ఐదుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉండగా.. ‘ఎన్నో ఆశలతో ఉన్నత చదువులు చదివించి, ఉద్యోగాలు చేస్తూ సంతోషంగా ఉంటున్న సమయంలో మాకు ఈ శిక్ష విధించావు ఎందుకు దేవుడా..’ అని వారి కుటుంబ సభ్యులు రోదించడం చూసి ఆస్పత్రికి వచ్చిన వారు సైతం కన్నీరు పెట్టారు. ఉమ్మడి ‘పశ్చిమ’లో.. ట్రావెల్స్ బస్సు జర్నీ డేటాను పరిశీలిస్తే.. హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి ఏలూరుకు 22 మంది టికెట్లు బుక్ చేసుకున్నట్టు తెలిసింది. వీరిలో ఏలూరులోని ఫైర్స్టేషన్ సెంటర్, జ్యూట్ మిల్లు, ఆశ్రం ఆస్పత్రి, పాత బస్టాండ్ గమ్యస్థానాలుగా ఉన్న వారు ఉన్నారు. దీంతో ఏలూరు నగరవాసుల్లో కలకలం రేగింది. తమకు చెందిన బంధువులు ఉన్నారా అని ఆరా తీశారు. ఇదిలా ఉండగా.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన పెద్దోజు భవానీ అనే మహిళకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను ఖమ్మంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. -
మావుళ్లమ్మ ఆలయంలో ఆన్లైన్ సేవలు
భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయంలో దేవదాయశాఖ, కరూర్ వైశ్యా బ్యాంక్ సౌజన్యంతో ఆన్లైన్ కియోస్క్ యంత్రాలను ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు బుధవారం ప్రారంభించారు. భక్తులకు పూజా సేవలు, విరాళాల చెల్లింపులు సులభతరం చేసేందుకు ఆన్లైన్ యంత్రాలు దోహదపడతాయన్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ధర్మకర్తల మండలి చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు పాల్గొన్నారు. ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో చినవెంకన్న దివ్య పవిత్రోత్సవాలు బుధవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ యా గశాలలో అర్చకులు విష్వక్సేన తదితర విశేష పూజలు, వాస్తు హోమం నిర్వహించారు. అ నంతరం అంకురార్పణను నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా అర్చకులు పుట్టమన్నును తెచ్చి పాలికల్లో పోసి అంకురార్పణ క్రతువు పూర్తిచేశారు. ఆలయంలో ఏడాది పొడవునా తెలిసీ, తెలియక జరిగిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. గురువారం పవిత్రాదివాసాన్ని నిర్వహించనున్నట్టు అర్చకులు తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు పర్యవేక్షించారు. ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర లోకాయుక్త చైర్మన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ టి.మ ల్లికార్జునరావు బుధవారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు ఆయనకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలకగా, దేవస్థానం డీఈఓ వై.భద్రాజీ స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఆలయ ఏఈఓ పి.నటరాజారావు ఉన్నారు. కై కలూరు: చిత్తడి నేలల పరిరక్షణ చట్టం అమ లు చేస్తే కొల్లేరు పరీవాహక 10వ కాంటూరు వరకు 1.60 లక్షల ప్రైవేటు భూములకు నష్టం వాటిల్లుతోందని, సమష్టిగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని వాయిస్ ఆఫ్ కొల్లేరు (సమగ్ర పరిరక్షణ, సాధికారత కోసం కొల్లేరు స్వచ్ఛంద కార్యకర్తల సంస్థ) అధ్యక్షుడు శివాజీరాజు పిలుపునిచ్చారు. కై కలూరులో సంస్థ కార్యాలయంలో బుధవారం అత్యవసర సమవేశం నిర్వహించారు. శివాజీరాజు మాట్లాడు తూ ఈ చట్టం అమలు జరిగితే కొల్లేరు పరీవాహక ప్రాంతంలో 18 మండలాలు, 6 నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాల పరిధిలో గ్రా మాలు, పట్టణాలతో సహా 1,61,000 ఎకరాల వ్యవసాయ, ఆక్వాకల్చర్ భూములన్నీ వెట్ల్యాండ్స్ నిబంధనల పరిధిలోకి వస్తాయన్నా రు. దీని వల్ల ఆస్తి విలువల్లో అపారమైన నష్టంతో పాటు రైతులపై భారీ ఆర్థిక ప్రభావం పడుతుందన్నారు. కొల్లేరు వాయిస్ ఆఫ్ కౌన్సిల్ కార్యదర్శి గంగాధరం మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతం 10వ కాంటూరు వరకు 2,25,000 ఎకరాల విస్తీర్ణంలో ఉందని అధికారులు నివేదికలు పంపుతున్నారని, వాస్తవానికి 100 చదరపు మైళ్ల (64,000 ఎకరాలు) విస్తీర్ణంలో కొల్లేరు ఉందన్నారు. అటువంటిది కొల్లేరు వెలపల భూమిని చిత్తడి నెలల పరిధిలోకి తీసుకురావడం అనాలోచితన విధానమన్నారు. కొ ల్లేరు గ్రామాల్లో ఈ చట్టంపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. -
మా ప్రాణాలకు అపాయం.. రక్షణ కల్పించండి
వేల్పూరు టీడీపీ నేతపై వృద్ధురాలి ఫిర్యాదు™èl׿$MýS$ AÆý‡¾¯ŒS: ™èl׿$MýS$ Ð]l$…yýlÌS… ÐólË*µÆý‡$ G±-t-BÆŠæ M>ÌS-±MìS ^ðl…¨¯]l Ð]l–§ýl$®-Æ>Ë$ fMýSP…Ôðæsìæt Ð]lÆý‡-ÌS„ìSà ™èl¯]lOò³ çßæ™éÅ-Ķæ$™èl²… fÇ-W…-§ýl…r* ™èl׿$MýS$ Æý‡*Æý‡ÌŒæ ´ùÎ-çÜ$-ÌS¯]l$ B{Ôèæ-Ƈ$$…-^éÆý‡$. ÐólË*µÆý‡$ {V>Ð]l$ Ð]l*i Eç³ çÜÆý‡µ…^Œl Æð‡yìlz ¯]lÆó‡…-{§ýl-{ç³Ýë§Šæ ™èl¯]l A¯]l$-^èlÆý‡$-ÌS¯]l$ ç³…í³ D §éyìlMìS ´ëÌSµ-yézÆý‡° BÐðl$ íœÆ>ŧýl$ ^ólĶæ$yýl… Ý린-MýS…V> çÜ…^èl-ÌS¯]l… Æó‡í³…-¨. Ð]l$…VýSâýæ-ÐéÆý‡… Æ>{† çÜ$Ð]l*Æý‡$ 9:10 VýS…rÌS çÜÐ]l$-Ķæ$…ÌZ çÜ$Ð]l*Æý‡$ 20 Ð]l$…¨ Ð]lÅMýS$¢Ë$ C…sìæOò³MìS Ð]l_a Æ>â¶æ$Ï Æý‡$Ð]l#Ó™èl* §éyìlMìS Ķæ$†²…-^éÆý‡° Ð]lÆý‡-ÌS„ìSà ™ðlÍ-´ëÆý‡$. MóSMýSË$ ÐólĶæ$-yýl…™ø Ý린-MýS$Ë$ ºÄ¶æ$-rMýS$ Æ>V> §ýl$…yýl-VýS$Ë$ ç³Æ>Æý‡-Ķæ*ÅÆý‡°, D çœ$r-¯]lMýS$ çÜ…º…-«¨…-_¯]l ïÜïÜsîæÒ फु-sôægŒæ¯]l$ ´ùÎ-çÜ$-ÌSMýS$ A…§ýl-gôæ-íÜ-¯]lr$Ï ^ðl´ëµÆý‡$. వివరాలు ఇలా 40 ఏళ్ల క్రితం మూడు సెంట్ల పట్టా భూమిని కొనుగోలు చేసి ఆ స్థలంలో రెండు భవనాలు నిర్మాణం చేసి ఒకటి అద్దెకు ఇచ్చి మరొక భవనంలో తన కుమారుడు చందు సాయి దుర్గారెడ్డితో కలిసి నివసిస్తున్నట్లు వరలక్ష్మి తెలిపారు. అయితే అద్దెకు ఇచ్చిన భవనాన్ని కొందరు కబ్జా చేసి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించారని ఇప్పటికీ కరెంటు బిల్లు, ఇంటి పన్ను తన పేరుమీదనే ఉన్నాయని తెలిపారు. కబ్జా చేసిన వారికి గ్రామ టీడీపీ నాయకుడు నరేంద్రప్రసాద్ అండగా నినిలిచి ఈనెల 5వ తేదీన తమపై దాడి చేయించారని, దీనిపై రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. తిరిగి మంగళవారం రాత్రి కూడా దాడికి ప్రయత్నించారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారం అడ్డుతగిలారంటూ ఆరోపణ ఉపాధి కోసం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇప్పించిన నూడుల్స్ స్టాల్ను నరేంద్రప్రసాద్ అడ్డుకుని తొలగింపజేశారని వాపోయారు. ప్రస్తుతం ఎండి చేపలు అమ్ముకుంటూ కుమారుడిని పోషిస్తున్నానని, ఇంటి కబ్జాపై కలెక్టరేట్లో అర్జీ పెట్టుకున్నా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తగిన రక్షణ కల్పించి, కబ్జాకు గురైన ఇల్లు అప్పగించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై తణుకు రూరల్ ఎస్ఐ నాళం శ్రీనివాసరావు స్పందిస్తూ.. బాధితురాలు వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సమగ్ర విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. -
మత్స్యకారులను రక్షించిన పోలీసులు
నరసాపురం రూరల్: కాకినాడ తీరం నుంచి వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు నడిసముద్రంలో సాంకేతిక లోపానికి గురైంది. ప్రాణభయంతో అల్లాడుతున్న మత్స్యకారులను నరసాపురం పోలీసులు రక్షించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎనిమిది రోజుల క్రితం కాకినాడ జగన్నాథపురం నుంచి ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. ఐదు రోజుల అనంతరం బోటులో సాంకేతిక లోపం తలెత్తి నడిసముద్రంలో మొరాయించింది. దీంతో వారంతా లంగరు వేసి అక్కడే నిలిచిపోయారు. అటుగా వచ్చిన మరో చేపల వేట బోటులోని మత్స్యకారులు ఈ పరిస్థితిని గుర్తించి అంతర్వేది మైరెన్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన నరసాపురం పోలీసులు, తీరప్రాంతమైన వేములదీవికి చెందిన మత్స్యకారుల సహాయంతో సముద్రంలో చిక్కుకున్న వారిని మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత క్షేమంగా రక్షించారు. మూడు రోజులుగా సరైన ఆహారం లేకపోవడంతో క్షేమంగా ఒడ్డుకు చేరిన మత్స్యకారులు తీవ్ర నీరసానికి గురయ్యారు. ఇది గమనించిన నరసాపురం రూరల్ సీఐ నాగరాజు, ఎస్సై శారద సతీశ్ స్థానికుల సహకారంతో వారికి భోజనాలు సమకూర్చారు. అనంతరం బుధవారం ఉదయం వారు రోడ్డు మార్గాన కాకినాడ వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేసి సహాయపడ్డారు. సురక్షితంగా బయటపడిన మత్స్యకారుల్లో కాకినాడకు చెందిన సంగాని సూర్యచంద్ర, మూస కామేశ్వరరావు, వాసపల్లి శ్రీనివాసు, దున్నా రాజు, పెసంగి జగ్గారావు, పెమ్మాడి భైరవస్వామి, కర్రి శ్రీను ఉన్నారు. ప్రమాదంలో చిక్కుకుని ప్రాణభయంతో ఉన్న మత్స్యకారులను రక్షించడంలో సహకరించిన వేములదీవి ప్రాంత స్థానికులను, పోలీసులను పలువురు అభినందించారు. -
క్షీరారామం.. ఇష్టారాజ్యం!
పాలకొల్లు సెంట్రల్ : పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి (పంచారామం) ఆలయ నిర్వహణలో అధికారులు, పాలకమండలి సభ్యుల తీరు వివాదాస్పదంగా మారింది. పలు నిర్ణయాలు భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు, ఆలయ నిధుల దుర్వినియోగానికి దారితీస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా గేటు పంచాయితీ ఆలయానికి తూర్పు ఆగ్నేయంలో ఉన్న గేటును ఇటీవల అధికారులు మూసివేశారు. దీంతో అక్కడే వేలంపాట ద్వారా పూజా సామగ్రి దుకాణం దక్కించుకున్న వ్యాపారి జీవనోపాధి దెబ్బతింది. ఆయన తన సామాజికవర్గ పెద్దలు, టీడీపీ నేతలను ఆశ్రయించి ధర్నాకు దిగుతామని హెచ్చరించడంతో.. వెనక్కి తగ్గిన ట్రస్ట్బోర్డు సభ్యులు, అధికారులు గుట్టుచప్పుడు కాకుండా తిరిగి ఆ గేటును తెరిపించారు. నిధుల దుర్వినియోగం.. దేవుడి సొమ్ము వృథా ఆలయ అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల స్వామివారి నిధులు వృథా అవుతున్నాయి. ప్రస్తుతం గోశాల ఉన్న స్థలంలో (పాత ఎస్పీఆర్ఆర్ క్లబ్) సుమారు రూ.కోటితో నూతన కార్యాలయం నిర్మించడానికి అనుమతులు వచ్చాయి. కొత్త భవనం నిర్మిస్తారని తెలిసీ, పాత భవనానికి అధికారులు సుమారు రూ.2 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయడం నిధుల దుర్వినియోగమే. కొబ్బరికాయల దిమ్మలు: భక్తుల సౌకర్యార్థం ఆలయంలో కాంక్రీట్ దిమ్మలను పగలగొట్టించి, సుమారు రూ.1.50 లక్షలతో ఐరన్ డోమ్లను ఏర్పాటుచేశారు. కొబ్బరికాయలు కొట్టినప్పుడు వచ్చే భారీ శబ్ధాలకు భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో, వాటిని తొలగించి మళ్లీ పాత పద్ధతిలోనే కాంక్రీట్ దిమ్మలు కట్టించారు. జరిగిన వృథాను ప్రశ్నిస్తే భక్తులకు దైవభక్తి లేదంటూ అధికారులు ఎదురుదాడికి దిగుతున్నారు. ఇదంతా మంత్రికి తెలిసే జరుగుతోందా? గతంలో ధ్వజస్తంభం వద్ద షెడ్డు నిర్మించడానికి అధికారులు ప్రయత్నించగా, పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా వచ్చి పనులను నిలిపివేశారు. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించొద్దని హెచ్చరించారు. అయినా అధికారులు ఆయన మాట బేఖాతరు చేస్తూ పోల్స్ పాతగా, మళ్లీ పత్రికల్లో వార్తలు రావడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయగా వాటిని తొలగించారు. ముందుగా చెబితే మంత్రి అభ్యంతరం వ్యక్తం చేస్తారన్న ఉద్దేశంతోనే ప్రస్తుత నిర్మాణ పనులను ఆయనకు తెలియకుండానే హడావుడిగా చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయంలో ఈఓ, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్.. ఇలా ఇంతమంది సిబ్బంది ఉన్నా ప్రయోజనం శూన్యం. ఆన్లైన్ రికార్డులు రాయడానికి మాత్రం వేరే ఆలయం నుంచి ఓ వ్యక్తిని రప్పించి అదనంగా డబ్బులు చెల్లించి పని చేయించుకోవడం గమనార్హం. తూర్పు ఆగ్నేయ భాగంలో ప్రహరీ గోడను తొలగించిన ప్రదేశంలో లాక్ రూమ్ను ఏర్పాటు చేస్తున్నాం. అలాగే పూజా సామగ్రి విక్రయదారుల కోసం నాలుగు షాపులు ఏర్పాటుచేయాలని ఆలోచిస్తున్నాం. దీనికి పురావస్తు శాఖ అనుమతులు అవసరం లేదు. పడమర దిక్కున ప్రహరీ నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. కాంట్రాక్టర్ త్వరలో పనులు ప్రారంభిస్తానని చెప్పాడు. అలాగే ఆలయంలో నూతన కార్యాలయ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నాం. – ముచ్చర్ల శ్రీనివాసరావు, క్షీరారామలింగేశ్వరస్వామి దేవస్థానం ఈఓ, పాలకొల్లు వివాదాస్పదంగా ఆలయ నిర్వహణ తీరు ఇప్పటికీ నోచుకోని పడమరలో ప్రహరీ గోడ నిర్మాణం తాజాగా తూర్పు ప్రహరీ గోడను తొలగించేందుకు సన్నాహాలు భక్తుల మనోభావాలు పట్టని వైనం -
శ్రీవారికి బంగారు, వెండి కవచాల సమర్పణ
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్నకు ఓ భక్తుడి కుటుంబం రూ.92 లక్షల విలువైన బంగారు, వెండి కవచాలను బుధవారం బహుకరించింది. లింగపాలెం మండలం ధర్మాజీగూడేనికి చెందిన వేగుంట సాంబశివరావు, సౌందర్యలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యులు 584 గ్రాముల బంగారంతో, అలాగే 507 గ్రాముల వెండితో తయారు చేయించిన కవచాలను ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, ఈఓ వేండ్ర త్రినాథరావులకు అందజేశారు. దాత కుటుంబ సభ్యులను చైర్మన్, ఈఓ అభినందించారు. ఈఈ డీవీ భాస్కర్, దాత కుటుంబ సభ్యులు చేవూరి లక్ష్మీనారాయణ, చేవూరి ఈశ్వరప్రవీణ్ పాల్గొన్నారు. ముదినేపల్లి రూరల్: తాగునీటి కోసం టీవీఎస్ మోపెడ్పై వెళ్లి తిరిగి వస్తుండగా, లారీ డ్రైవర్ అజాగ్రత్త కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని సింగరాయపాలెంలో బుధవారం చోటుచేసుకుంది. పెడన మండలం చెన్నూరు శివారు గొల్లగూడెంకు చెందిన గొల్ల వెంకటేశ్వరరావు (60) బుధవారం సాయంత్రం తాగునీటి కోసం టీవీఎస్ మోపెడ్పై సింగరాయపాలెం వెళ్లి, తిరిగి వస్తున్నారు. అదే సమయంలో కోరుకొల్లు వైపు నుంచి సింగరాయపాలెం వస్తున్న లారీ... డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఆయన మోపెడ్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు తలకు తీవ్ర గాయాలై సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వెంకటేశ్వరరావు కుమారుడు నాగబాబు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ను విజయవాడ మాచవరానికి చెందిన భూమ శ్రీనివాసరాజుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఉంగుటూరు: కై కరం గ్రామానికి చెందిన అగ్గల కళ్యాణ్కుమార్ (22) అనే యువకుడు ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ బుధవారం స్థానిక విలేకరులకు వెల్లడించారు. కళ్యాణ్కుమార్ తల్లి 2021లో అనారోగ్యంతో మృతి చెందగా, తండ్రి కూడా లేకపోవడంతో అప్పటినుంచి అతను మానసికంగా కుంగిపోయాడు. దీనికి తోడు తాను ప్రేమించిన అమ్మాయి తిరస్కరించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తల్లిదండ్రులు లేని లోటు, ప్రేమ విఫలమవ్వడం వంటి కారణాలతో తీవ్ర మానసిక క్షోభకు గురైన కళ్యాణ్కుమార్ మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంట్లోని దూలానికి సిల్క్ చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు రాత్రి 12 గంటలకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సూర్యభగవాన్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఆయన వెల్లడించారు. శ్రీనగర్కాలనీ: మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగతనాల పాల్పడుతున్న దొంగను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా నెగ్గిపూడికి చెందిన నీలపు హర్షసాయివర్ధన్ కోడి పందేలు, బెట్టింగులకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మూడు, పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో ఒకటి మొత్తంగా నాలుగు బుల్లెట్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే 11 దొంగతనాలు, ఒక పోక్సో కేసు, ఇటీవల 4 కేసులున్నాయని ఏసీపీ వెంకటరెడ్డి, ఇన్స్పెక్టర్ ప్రభాకర్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. భార్య, కుమారుడు అదృశ్యం ద్వారకాతిరుమల: భార్య, కుమారుడి అదృశ్యంపై భర్త చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం తిమ్మాపురంనకు చెందిన చికాకోలు రంగారావు స్కూల్ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య ఈశ్వరి, ఇద్దరు మగ పిల్లలు సంతానం ఉన్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు భార్యాభర్తలకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం భోజనం అనంతరం రంగారావు తన పెద్ద కుమారుడితో కలిసి ఇంట్లో నిద్రించాడు. కొద్దిసేపటి తర్వాత నిద్రలేచి చూడగా భార్య ఈశ్వరి, రెండో కుమారుడు చరణ్ ఇంట్లో కనిపించలేదు. చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య తన కుమారుడిని తీసుకుని బస్టాండ్ వద్ద కనిపించినట్లు ఎవరో చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి. సుధీర్ తెలిపారు. -
లారీ ఢీకొని షిఫ్ట్ ఆపరేటర్ దుర్మరణం
తణుకు అర్బన్: జీవితంపై ఎన్నో ఆశలు.. పైళ్లె ఏడాది కూడా కాలేదు.. అప్పుడే నూరేళ్లాయువు ముగిసింది. భార్యను ఇంటికి తీసుకువద్దామని ఆశగా బయలుదేరిన ఆ యువకుడి ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది. తణుకు మండలం పైడిపర్రులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక నిండు ప్రాణం బలైపోయింది. తేతలి విద్యుత్ సబ్స్టేషన్లో కాంట్రాక్ట్ షిఫ్ట్ ఆపరేటర్గా తోరంగి కిరణ్ (27) విధులు నిర్వర్తిస్తున్నారు. అందరితోనూ కలివిడిగా ఉండే కిరణ్ ప్రయాణంలో ఎప్పుడూ భద్రతకు ప్రాధాన్యతనిస్తారు. విధులకు వచ్చినా, వెళ్లినా విధిగా హెల్మెట్ ధరించే అలవాటు ఆయనకుంది. బుధవారం మధ్యాహ్నం డ్యూటీ ముగిసిన తర్వాత.. పాలకోడేరు మండలం కోరుకొల్లులోని పుట్టింట్లో ఉన్న తన భార్య ఈశ్వరిని తీసుకువచ్చేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. సరిగ్గా పైడిపర్రు – మండపాక రోడ్డులోకి రాగానే దూసుకొచ్చిన క్వారీ లారీ ఆయన ప్రాణాలను బలిగొంది. లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో పాటు చక్రం తల పైనుంచి వెళ్లడంతో కిరణ్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో ఆయన హెల్మెట్ ధరించే ఉన్నప్పటికీ, ఆ ఘోర ప్రభావం నుంచి ప్రాణం నిలవలేకపోయింది. తీరని శోకసంద్రంలో కుటుంబం.. కిరణ్కు వివాహమై ఇంకా ఏడాది కూడా కాలేదు. ఆషాఢ మాసం కావడంతో భార్యను అత్తగారి ఇంటి నుంచి తన స్వగ్రామం బొమ్మిడికి తీసుకెళ్లడానికి ఉత్సాహంగా బయలుదేరిన భర్త ఇలా విగతజీవిగా మారుతాడని ఆ భార్య ఊహించలేకపోయింది. ఆస్పత్రి మార్చురీ గది వద్ద భార్య, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు అక్కడివారందరినీ కంటతడి పెట్టించింది. మృతుడి తండ్రి రామకృష్ణారావు ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై నాళం శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎకో గణనాథా.. ప్రకృతి ప్రదాత
ద్వారకాతిరుమల: వినాయక చవితి సమీపిస్తుండటంతో వీధివీధినా గణనాథుడి విగ్రహాల సందడి మొదలైంది. పెద్దపెద్ద విగ్రహాలు.. ఆకర్షణీయమైన రంగులు.. ప్రత్యేక అలంకరణలు భారీగా ఏర్పాటు చేయాలన్న అంచనాలతో కమిటీ సభ్యులు హడావిడి చేస్తున్నారు. అయితే ఉత్సవాలు ముగిసిన తర్వాత నిమజ్జనం రూపంలో జలవనరులపై పడే పర్యావరణ భారం ఆందోళన కలిగిస్తోంది. భక్తికి ప్రతీకగా నిలిచే వినాయకుడి విగ్రహం ప్రకృతికి భారంగా మారాల్సిన అవసరం ఉందా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ మెదలాలి. మట్టి విగ్రహాల వైపు మళ్లి.. భక్తితో పాటు ప్రకృతిని కాపాడాలన్న సందేశాన్ని చాటాల్సిన సమయం ఆసన్నమైంది. వినాయక చవితి పండుగకు ఇంకా 19 రోజులు మాత్రమే సమయం ఉంది. మట్టితోనే రూపం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 800 నుంచి 1,200 కుటుంబాలు విగ్రహాల తయారీపై ఆధారపడుతున్నట్టు అంచనా. వీరిలో 250 నుంచి 400 కుటుంబాలు మట్టి విగ్రహాల తయారీని జీవనాధారంగా చేసుకున్నాయి. వీరు నాణ్యమైన మట్టి, పత్తి, వరిగడ్డి, పీచు, ఇనుప ఊసలను ఉపయోగించి వినాయకుడి శరీర భాగాలను ఒక్కొక్కటిగా మలిచి.. జాగ్రత్తగా అమర్చి.. తుది రూపాన్ని ఇస్తున్నారు. ఆరిన తర్వాత సహజ రంగులతో అలంకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి శివారులో జాతీయ రహదారి పక్కన భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామానికి చెందిన పేరవరపు నాగేశ్వరరావు పాతికేళ్లుగా మట్టి విగ్రహాలకు జీవం పోస్తున్నారు. గత 3 నెలల క్రితం ప్రారంభమైన ఈ పనుల్లో నాగేశ్వరరావుకు తన భార్య అన్నపూర్ణ, రెండో కుమార్తె లంకా భారతి, పెద్ద అల్లుడు నాగరాజు, మనుమడు గౌతమ్ చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. నిమజ్జనం తర్వాత.. మట్టి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తే అవి సహజంగా కరిగి మట్టిలో కలిసిపోతాయి. సహజ రంగులను వినియోగిస్తే రసాయన కాలుష్య ప్రమాదం కూడా తగ్గుతుంది. దీనికి భిన్నంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ) విగ్రహాలు నీటిలో సులభంగా కరగకపోవడంతో నిమజ్జనం తర్వాత అవశేషాలు జలవనరుల్లో పేరుకుపోయే అవకాశం ఉంది. పీఓపీ విగ్రహాలతో పలు అనర్థాలు కలుగుతున్నాయి. విగ్రహాలపై ఉపయోగించే కృత్రిమ రంగులు, అలంకరణ సామగ్రి, ప్లాస్టిక్, థర్మాకోల్ తదితరాలు కూడా నీటిలో వ్యర్థాల భారాన్ని పెంచుతాయి. దీంతో చెరువులు, కాలువలు, నదులు, జలాశయాలపై ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నామా? లేక ప్రకృతినే ముంచేస్తున్నామా? అనే ఆలోచన ప్రతి ఉత్సవ కమిటీలో రావాల్సిన అవసరం ఉంది. పీఓపీ విగ్రహాలు, రసాయన రంగులతో పెరుగుతున్న కాలుష్యం మట్టి వినాయక విగ్రహాలతో జలవనరులకు మేలు ఉమ్మడి పశ్చిమలో ఊపందుకున్న విగ్రహాల తయారీ ఐదు అడుగుల వరకు మట్టి గణేష్ విగ్రహాలను తయారు చేస్తున్నాం. అంతకంటే పెద్దవి కావాలంటే ముందుగానే ఆర్డర్ ఇవ్వాలి. విగ్రహం సైజును బట్టి ధర నిర్ణయిస్తాం. పర్యావరణానికి మేలు చేసే మట్టి విగ్రహాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. గతేడాది ఆర్డర్లపై 40కి పైగా విగ్రహాలు విక్రయించాం. ఈ ఏడాది ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమడోలు, ఉంగుటూరు, తణుకుతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆర్డర్లు వచ్చాయి. –పేరవరపు నాగేశ్వరరావు, విగ్రహాల తయారీదారుడు ప్రగాఢమైన భక్తిని చాటుతూ.. కాలుష్యాన్ని తగ్గిద్దాం. ఆడంబరాన్ని తగ్గించి.. ఆచరణను పెంచుదాం. మట్టి విగ్రహాలను ప్రోత్సహించి స్థానిక కళాకారుల జీవనానికి అండగా నిలుద్దాం. భూమి నుంచి వచ్చిన గణనాథుడిని.. తిరిగి భూమిలోనే కలిపే సంప్రదాయాన్ని కాపాడుకుందాం. – బీకేఎస్ఆర్ అయ్యంగార్, న్యాయవాది, ఏలూరు -
డీఆర్ఓగా గ్లోరియా బాధ్యతల స్వీకరణ
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ)గా పి. గ్లోరియా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్చార్జి డీఆర్ఓగా వ్యవహరించిన పి. ప్రభాకర్ నుంచి ఆమె బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని గ్లోరియా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. భీమవరం : ప్రభుత్వం ప్రకటించిన స్పెషల్ టెట్ నోటిఫికేషన్లో ఉపాధ్యాయుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకపోవడానికి నిరసనగా యుటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి భీమవరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక యుటీఎఫ్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ అంబేడ్కర్ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. ఈ సందర్భంగా యుటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీవీఎస్ విజయరామరాజు, కార్యదర్శి పి.కాంత్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడలేదని విమర్శించారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి టెట్ నిబంధనలను సడలించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుటీఎఫ్ నాయకులు జీవీ రామారావు, సీహెచ్. కుమార్ బాబ్జీ, కె.శ్రీరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోలవరం రూరల్ : గోదావరి వరద మళ్లీ స్వల్పంగా పెరుగుతోంది. నదీ పరీవాహక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు శబరి నది నీరు వచ్చి చేరుతుండటంతో గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటిమట్టం 29 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు స్పిల్వేలోని 48 గేట్ల ద్వారా 3.34 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి ఉధృతి పెరుగుతుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం ఏకపక్షంగా స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం సుధీర్, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బీ. రెడ్డిదొర తీవ్రంగా ఆక్షేపించారు. ఉపాధ్యాయ సంఘాలు కోరిన వినతులను పరిగణనలోకి తీసుకోకుండా జీఓ ఇవ్వడం సరికాదని మంగళవారం విడివిడిగా ప్రకటనలు విడుదల చేశారు. ఉపాధ్యాయులకు కొత్తగా ఉద్యోగ నియామకం కాదు కాబట్టి రోస్టర్ విధానంతో పనిలేదని, అందరికీ 40 శాతం ఉత్తీర్ణత మార్కులుగా నిర్ణయించాలని కోరారు. 2009 కంటే ముందు వృత్తిలో చేరిన వారికి టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా విద్యా హక్కు చట్టం సెక్షన్ 23(1)ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని స్పష్టం చేశారు. టెట్ మినహాయింపు కోసం కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలవడానికి వెళ్లిన ఉపాధ్యాయ సంఘ నాయకుల సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేయాలని, బకాయిలు ఉన్న డీఏలు, సీఎల్, ఐఆర్, పీఆర్సీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఏలూరు కుర్రాడు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరుకు చెందిన బైకింగ్ ప్రేమికుడు కడలి లక్ష్మీనారాయణ తన మిత్రులు భరద్వాజ్, వినోద్లతో కలిసి సాహసయాత్ర చేపట్టారు. బైక్పై ఉన్న అభిరుచితో వీరు కేవలం 10 రోజుల్లోనే (2025 డిసెంబర్ 6 నుంచి 16 వరకు) 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుతూ సుమారు 4,500 కిలోమీటర్ల మేర దక్షిణ భారత తీర ప్రాంతాన్ని చుట్టివచ్చారు. వాతావరణ మార్పులు, రోడ్డు పరిస్థితులు వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. ఈ ప్రతిభను గుర్తించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ – 2026 సంస్థ వీరిని ’ఐబీఆర్ అచీవర్స్’గా ప్రకటించింది. ఇటీవల వీరికి నిర్వాహకులు సర్టిఫికెట్, మెడల్ను అందజేశారు. ఈ విజయాన్ని తన పుట్టిన గడ్డ అయిన ఏలూరుకు అంకితం చేస్తున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్పూర్తితో మరిన్ని సాహసయాత్రలు చేస్తామని వారు చెప్పారు. రికార్డు సాధించిన ఈ యువకులను బంధుమిత్రులు ప్రత్యేకంగా అభినందించారు. -
పరారైన జీవిత ఖైదీ అరెస్ట్
జంగారెడ్డిగూడెం (చింతలపూడి): గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయానికి మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. అర్చకుల ఆధ్వర్యంలో తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు అన్నదానం, ప్రసాదాల తయారీని పరిశీలించారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘మన మిత్ర’ డిజిటల్ సేవలు రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాలతో సమానంగా మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో కూడా డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ఈవో ఆర్వీ చందన తెలిపారు. ఇంటి వద్ద నుంచే దర్శనం, సేవా టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం కల్పించామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నరసాపురం: భార్యను హతమార్చిన కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తూ.. హైకోర్టు ఆదేశాలతో మధ్యంతర బెయిల్ పొంది పరారైన ఖైదీని నరసాపురం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి హైదరాబాద్లో పట్టుకున్నట్లు నరసాపురం డీఎస్పీ సుధాకర్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి... 2008 జనవరి 22వ తేదీన నరసాపురానికి చెందిన ఉయ్యూరి వెంకటరమణ తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టి క్రూరంగా హత్య చేశాడు. దీనిపై 2022 నవంబర్ 15వ తేదీన నరసాపురం 10వ అదనపు జిల్లా కోర్టు వెంకటరమణకు జీవిత ఖైదు విధించడంతో, అతను రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, వెంకటరమణ తాను హెచ్ఐవీ రోగినని, పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని పేర్కొంటూ మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించాడు. దీనిని పరిశీలించిన హైకోర్టు 2024 ఏప్రిల్ 24వ తేదీన మూడు నెలల బెయిల్ మంజూరు చేసి, గడువు ముగిసిన తర్వాత తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. అయితే, వెంకటరమణ బెయిల్ గడువు ముగిసిన తర్వాత కూడా జైలుకు వెళ్లకుండా పరారయ్యాడు. ఖైదీని పట్టుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో నరసాపురం టౌన్ సీఐ ఆకుల రఘు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సెల్ఫోన్ సిగ్నల్స్ తదితర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఆ ఖైదీ హైదరాబాద్లోని బోరబండ ప్రాంతంలో తన రెండో భార్యతో కలిసి ఉంటున్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందం హైదరాబాద్ వెళ్లి నిఘా పెట్టగా, ఆ విషయం గమనించిన వెంకటరమణ అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామానికి పారిపోయాడు. అక్కడ పోలీసులు అతనిని ఈనెల 22వ తేదీన పట్టుకుని, 24వ తేదీన హైకోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం వెంకటరమణను రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. -
జాతీయ క్రీడా దినోత్సవం బ్రోచర్ ఆవిష్కరణ
భీమవరం: క్రీడా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27, 28, 29 తేదీల్లో భీమవరంలో నిర్వహించనున్న జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల బ్రోచర్ను మునిసిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈనెల 27న క్రీడా పోటీలు ప్రారంభమవుతాయని, 28న సెయింట్ మేరీస్ విద్యార్థులతో 400 అడుగుల జాతీయ జెండాతో క్రీడా ర్యాలీ, 29న క్రీడా దినోత్సవ వేడుకలు, వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఎ రాంబాబు, హాకీ కోచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ తల్లికి గొల్లవానితిప్ప గ్రామానికి చెందిన కొప్పర్తి బేబీ శ్రీ ఫణి అనీషా రూ.2,20,000 విలువైన వెండి వస్తువులను కానుకగా సమర్పించారు. 766 గ్రాముల వెండి పళ్లెం, 200 గ్రాముల వెండి గిన్నె, ఉద్ధరిణిని దాతలు ఆలయ అధికారులకు అందజేశారు. అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ దాతలను శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు ఉదీశి మీనాక్షి, మిర్తిపాటి గున్నేశ్వరరావు, పాపొలు ఏడుకొండలు అమ్మవారి ప్రసాదాన్ని, జ్ఞాపికను అందజేశారు. దెందులూరు: మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి పెదవేగి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం పెదవేగి మండలం రాయన్నపాలెం గ్రామ శివారు చింతలపాటివారిగూడెంలో తన భర్త ఇంటి వద్ద ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందాడని అతడి భార్య లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని చాట్ల తంబి (45)గా గుర్తించారు. తంబి తన కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. మద్యం అలవాటు, అనారోగ్యం కారణంగా దయ్యాలు కనిపిస్తున్నాయని ఆందోళన గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. -
రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లాలో చివరి దశలో ఉన్న 30 గ్రామాల రీ–సర్వే ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో మండల సర్వేయర్లతో మంగళవారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతుల సమక్షంలోనే సర్వే జరిపి, భూ వివరాల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. ప్రతి రైతుకు 9(2) నోటీసులు అందజేసి, ఈ–కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయించాలన్నారు. అనంతరం సర్వే శాఖ నుంచి జిల్లాకు అందిన అధునాతన ల్యాప్టాప్లను 20 మండలాల సర్వేయర్లకు కలెక్టర్ పంపిణీ చేశారు. సర్వే డేటాను ఎప్పటికప్పుడు ల్యాప్టాప్లలో నమోదు చేసి భద్రపరచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.ఆర్. కల్పశ్రీ, జిల్లా సర్వే అధికారి కె. జాషువా, మండల సర్వేయర్లు పాల్గొన్నారు. పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని ప్రత్యేక సంక్షిప్త సవరణ రోల్ అబ్జర్వర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో మంగళవారం నియోజకవర్గ ఈఆర్ఓలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అభ్యంతరాలు, క్లెయిమ్ల పరిష్కారంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎస్ఎస్ఆర్ ప్రక్రియ ప్రగతిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా గోదావరి పుష్కరాల ఏర్పాట్లు 2027లో జరగనున్న గోదావరి మహా పుష్కరాలకు విచ్చేసే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి మంగళవారం మంత్రులు, పుష్కరాల ప్రత్యేకాధికారి, ప్రభుత్వ కార్యదర్శులతో కలిసి సంబంధిత జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.ఆర్. కల్పశ్రీ, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి -
ఎట్టకేలకు ఎలూడా విస్తరణ
● భారీగా పెరిగిన విస్తీర్ణం ● కొత్తగా నాలుగు మండలాల చేరిక ఎలూడా, భీమా ఉడా కొత్త పరిధి మ్యాప్ అంశం ఎలూడా భీమా ఉడా ప్రధాన కేంద్రం ఏలూరు భీమవరం విస్తీర్ణం 5,353.65 చ.కి.మీ 2,174.675 చ.కి.మీ మండలాలు 26 19 రెవెన్యూ గ్రామాలు 582 282 పట్టణ సంస్థలు 04 06 ద్వారకాతిరుమల : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల (అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు) స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎలూడా) పరిధి భారీగా విస్తరించగా, పశ్చిమగోదావరి జిల్లాకు ప్రత్యేకంగా భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (భీమా ఉడా) నూతనంగా ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజు రెండు జీఓలను విడుదల చేస్తూ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. జీఓ ఎంఎస్ నంబర్ 186 ఆధారంగా ఎలూడాను పునర్వ్యవస్థీకరించారు. గతంలో ఎలూడాలో ఉన్న 19 మండలాలు, 282 రెవెన్యూ గ్రామాలు, 6 పట్టణ ప్రాంతాలను విడదీసి నూతనంగా ఏర్పాటు చేసిన భీమా ఉడాలో చేర్చారు. అదే సమయంలో కై కలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, ద్వారకాతిరుమల మండలాలను కొత్తగా ఎలూడా పరిధిలోకి తీసుకువచ్చారు. గతంలో మచిలీపట్నం (ముడా) పరిధిలో ఉన్న కై కలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాలు, రాజమహేంద్రవరం (రుడా) పరిధిలోకి వెళ్లిన ద్వారకాతిరుమల మండలం ఇప్పుడు ఎలూడా పరిధిలోకి వచ్చాయి. ఎలూడా పరిధి ఇదే తాజా నిర్ణయంతో ఎలూడా విస్తీర్ణం 3,179 చదరపు కిలోమీటర్ల నుంచి 5,353.65 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఎలూడా పరిధిలో మొత్తం 26 మండలాలు (ఏలూరు జిల్లాలోని 21, ఎన్టీఆర్ జిల్లాలోని 5 మండలాలు), 582 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. కొత్తగా చేరిన 5 మండలాల్లోని 137 గ్రామాలు (కై కలూరు–23, కలిదిండి–14, మండవల్లి–31, ముదినేపల్లి–33, ద్వారకాతిరుమల–36) ఇందులో భాగమయ్యాయి. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ, చింతలపూడి, తిరువూరు నగర పంచాయతీలు ఎలూడా పరిధిలోని పట్టణ ప్రాంతాలుగా కొనసాగుతాయి. భీమా ఉడా ఆవిర్భావం జీఓ ఎంఎస్ నంబర్ 181 ద్వారా భీమా ఉడాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు మున్సిపాలిటీలు, ఆకివీడు నగర పంచాయతీ, 19 మండలాలు, 282 రెవెన్యూ గ్రామాలు ఈ కొత్త అథారిటీ కిందకు వచ్చాయి. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి మార్గం ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా పట్టణ ప్రాంతాలు, వాటి శివార్లలో మౌలిక వసతుల కల్పన, రహదారుల విస్తరణ, భూ వినియోగ నియంత్రణ సులభతరం కానున్నాయని నిపుణులు భావిస్తున్నారు. వాణిజ్య భవనాలు, అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణాలకు అనుమతులు. విక్రయాల కోసం వేసే లేఅవుట్లకు, భవన నిర్మాణ ప్లాన్లకు ఆమోదం. నివాస, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల విభజన (జోనింగ్) నిర్ణయం. రహదారుల విస్తరణ, రవాణా, ఇతర మౌలిక సదుపాయాల ప్రణాళిక. పార్కులు, బహిరంగ ప్రదేశాలు, ప్రజా ఉపయోగ స్థలాల పరిరక్షణ. అనధికార నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా వేసే లేఅవుట్ల నిరోధం. -
చనిపోయే వరకూ జైలు శిక్ష
● పల్లెర్లమూడి చిన్నారిపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు ● రెండేళ్లలోనే కోర్టు తీర్పునకు పోలీస్ అధికారుల కృషి ఏలూరు టౌన్: చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ముద్దాయికి చనిపోయే వరకు జైలు శిక్ష (జీవిత ఖైదు) విధిస్తూ కృష్ణా జిల్లా మచిలీపట్నం స్పెషల్ పోక్సో కోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పు చెప్పారు. మరో మూడు సెక్షన్లలో ఒక్కో దానికి మూడేసి ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా కేవలం 90 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసి, స్పీడ్ ట్రయల్తో రెండేళ్ల కాలంలోనే కేసును ముగించి తుది తీర్పు వచ్చేలా చేయడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్ చేతుల మీదుగా పోలీస్ అధికారులను ఘనంగా సత్కరించి, అభినందించారు. రెండేళ్ల క్రితం ఏం జరిగిందంటే.. నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలిక రాత్రివేళ ఇంటి వరండాలో తల్లిదండ్రులు, నానమ్మతో కలిసి నిద్రపోతోంది. 2024 ఆగస్టు 8న రాత్రి 9:30 గంటలకు బాలికను కిడ్నాప్ చేసి పామాయిల్ తోటలోకి తీసుకువెళ్లి చిన్నారిపై అత్యంత అమానుషంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడవడంతో ఆమెను కొట్టి, రక్కి, పాప కాలి వెండి పట్టీలు, పాప తండ్రి సెల్ఫోన్ అపహరించి పరారయ్యాడు. అదే రోజు రాత్రి 12 గంటల సమయంలో గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బాధిత బాలిక బట్టలు లేకుండా కనిపించడంతో స్థానికులు ఇంటికి తీసుకువచ్చి అప్పగించారు. బాధిత బాలిక తల్లిదండ్రులు నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా... పోలీసులు బాధిత బాలిక తల్లి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. అప్పటి నూజివీడు రూరల్ ఎస్సై మల్లికార్జున రెడ్డి కేసు నమోదు చేశారు. అప్పటి ఏలూరు డీఎస్పీ ఈ.శ్రీనివాసులు దర్యాప్తు ప్రారంభించి, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. రెండేళ్లకే కఠిన శిక్ష 2024 ఆగస్టు 8న జరిగిన సంఘటనపై ఏలూరు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ప్రత్యేక శ్రద్ధతో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ నూజివీడు సబ్డివిజన్ ఇన్ఛార్జ్గా ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఏలూరు కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్ఛార్జ్ సీఐ ఎం.సుబ్బారావు, నూజివీడు డీఎస్పీ ప్రసాద్, నూజివీడు రూరల్ సీఐ కె.రామకృష్ణ నిరంతర పర్యవేక్షణలో హెచ్సీ పేరూరి శ్రీనివాస్ సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. స్పెషల్ పీపీ కన్నెకంటి చంద్రశేఖర్, భోగిరెడ్డి వెంకన్నబాబు 21 మంది సాక్షులను విచారించి, ప్రాసిక్యూషన్ తరఫున గట్టిగా వాదనలు వినిపించారు. రెండేళ్లలోనే 2026 ఆగస్టు 24న మచిలీపట్నం స్పెషల్ పోక్సో కోర్టు సెషన్స్ న్యాయమూర్తి గాజుల వెంకటేశ్వర్లు సంచలన తీర్పు చెప్పారు. నాలుగు కఠిన జైలు శిక్షలు పల్నాడు జిల్లా రెంటచింతల మండలం తుమ్మూరుకోట గ్రామానికి చెందిన ముద్దాయి మిరియాల జయరావుకు న్యాయమూర్తి కఠిన శిక్షలు విధిస్తూ తీర్పు వెలువరించారు. పోక్సో చట్టం సెక్షన్ 5(ఎం) రెడ్విత్ 6, బీఎన్ఎస్ సెక్షన్ 65(2) ప్రకారం జీవిత ఖైదు (చనిపోయే వరకు), రూ.1,000 జరిమానా, బీఎన్ఎస్ సెక్షన్ 97 ప్రకారం 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా, బీఎన్ఎస్ సెక్షన్ 309(6) ప్రకారం 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా, బీఎన్ఎస్ సెక్షన్ 305 ప్రకారం 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించారు. బాధిత బాలికకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని స్పెషల్ పోక్సో కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. -
పురపోరుకు న్యాయ పరీక్ష
సాక్షి, భీమవరం : రాష్ట్రంలో స్థానిక సంస్థల సమరానికి ఎన్నికల సంఘం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. పట్టణాల్లో ఓటర్ల జాబితాలు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుతో పాటు రిజర్వేషన్ల ప్రక్రియను వేగవంతం చేసింది. అంతటా ఎన్నికల వేడి మొదలైనప్పటికీ, జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల్లో మాత్రం విలీన వివాదాలు భిన్నమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. గ్రామ విలీన కేసుల ఉపసంహరణకు స్థానిక నేతలు ససేమిరా అనడంతో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. ఏడేళ్లుగా ప్రత్యేక పాలనే జిల్లాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం మున్సిపాల్టీలతో పాటు ఆకివీడు నగర పంచాయతీ ఉంది. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భీమవరంలో తాడేరు, రాయలం, చినఅమిరం, నరసింహపురం, కొవ్వాడ అన్నవరం, తణుకులో వెంకటరాయపురం, పైడిపర్రు, వీరభద్రపురం, పాలకొల్లులో దిగమర్రు, వరిధనం, కొంతేరు, భగ్గేశ్వరం, పూలపల్లి, యాళ్లవానిగరువు, ఉల్లంపర్రు, అడివిపాలెం, తాడేపల్లిగూడెంలో: పడాల, కుంచనపల్లి, ఎల్.అగ్రహారం, కుండ్రుప్రోలు, ప్రత్తిపాడు గ్రామాలను విలీనం చేసేందుకు ప్రతిపాదించారు. అయితే పురపాలక సంఘాల్లో విలీనం వల్ల పన్ను భారం పెరుగుతుందని, ఇళ్ల నిర్మాణాలు, లేఅవుట్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, ఉపాధి హామీ పథకం వర్తించదని పలు గ్రామాల నాయకులు కోర్టులను ఆశ్రయించారు. విలీనంతో మౌలిక వసతులు కల్పన, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం తదితర ప్రయోజనాలను వివరించడం ద్వారా నాటి వైఎస్సార్ సీపీ పెద్దలు చేసిన ప్రయత్నాలతో అప్పట్లోనే ఆయా గ్రామాలకు చెందిన వైఎస్సార్ సీపీ నేతలు కేసులను దాదాపు ఉపసంహరించుకున్నారు. టీడీపీ, మిగిలిన రాజకీయ పార్టీలు అంగీకరించకపోవడంతో కోర్టు కేసులు నడుస్తున్నాయి. దీంతో ప్రతిబంధకాలు లేని నరసాపురం, ఆకివీడులో 2021 మార్చిలోనే ఎన్నికలు జరగ్గా భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మున్సిపాల్టీలు గత ఐదేళ్లుగా ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. అంతకుముందు రెండేళ్ల ప్రత్యేక పాలనతో కలిపితే మొత్తం ఏడేళ్లుగా ఈ నాలుగు పట్టణాల్లో అధికారుల పాలనే సాగుతోంది. ఆశావహుల్లో నిరాశ.. ప్రజల్లో నిరీక్షణ నరసాపురం, ఆకివీడులతో పాటు గ్రామ పంచాయతీల్లో ప్రజాప్రతినిధుల రిజర్వేషన్లు, విజయావకాశాలపై ఆశావహులు లెక్కలు వేసుకుంటుంటే ఈ నాలుగు మున్సిపాల్టీల్లో మాత్రం ఎన్నికలు జరుగుతాయో లేదోనని స్థానిక నాయకులు ఆందోళన చెందుతున్నారు. వార్డుల విభజన నోటిఫికేషన్ రాకపోవడం వారిపై నీళ్లు చల్లినట్లయ్యింది. మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారం, తాగునీరు, పారిశుద్ధ్యం, పౌరసేవల వ్యవస్థ గాడిన పడాలన్నా, అధికారుల్లో జవాబుదారీతనం పెరగాలన్నా త్వరగా ఎన్నికలు జరిగి పాలకవర్గాలు ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈసారి విలీన వాజ్యాలను పక్కనపెట్టి అన్ని పట్టణాల్లోనూ వార్డుల పునర్విభజన చేపట్టి ఎన్నికలు జరుపుతారనే ప్రచారం జరిగినప్పటికీ ఇటీవల కేవలం నరసాపురం, ఆకివీడులలో మాత్రమే వార్డుల విభజనకు నోటిఫికేషన్ విడుదల కావడంతో మిగిలిన చోట్ల ఆందోళన మొదలైంది. స్వపక్షాల నేతలతో కోర్టు కేసులు విత్డ్రా చేయించాలన్న ఆలోచనలో కూటమి నేతలు ఉన్నారు. భీమవరం మున్సిపాల్టీలో ఎన్నికల కోసం టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన ముఖ్య నేతలు తాజాగా భేటీ అయ్యారు. విలీన ప్రతిపాదిత గ్రామాలకు చెందిన కూటమి పక్షాల నేతలతో సమావేశమై కేసులు ఉపసంహరణపై చర్చించారు. కోర్టులో తేలేవరకు విలీనానికి అంగీకరించబోమని వారు స్పష్టం చేయడంతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు సమాచారం. పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెంలోనూ కేసుల ఉపసంహరణకు కూటమి నేతల ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. స్వపక్ష మంత్రి, ఎమ్మెల్యే స్థాయి నేతల ఒత్తిళ్లను ఆ పార్టీలకు చెందిన లోకల్ లీడర్స్ పట్టించుకోవడం లేదు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న వ్యాన్
జంగారెడ్డిగూడెం (చింతలపూడి): నిమ్మలగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లక్కవరం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. లక్కవరం గ్రామానికి చెందిన ఆరుగొల్లు కళ్యాణ్ (26), అదే గ్రామానికి చెందిన చేపల పండుతో కలిసి ద్విచక్ర వాహనంపై ద్వారకాతిరుమలకు బయలుదేరారు. మార్గమధ్యలో నిమ్మలగూడెం వద్ద జి.కొత్తపల్లి వైపు నుంచి వస్తున్న టాటా ఏస్ వాహనం వీరి బైక్ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుంది. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో కళ్యాణ్కు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. 108 సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపణలు.. వాహనంలో ఆక్సిజన్ అందించాలని కోరగా, మొదట ఆక్సిజన్ అందుబాటులో లేదని ఈఎమ్టీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) బదులిచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత వెతికి అమర్చేసరికి తీవ్ర ఆలస్యం జరిగిందని, అప్పటికే కళ్యాణ్ ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి చేరుకున్నాక పరీక్షించిన వైద్యులు కళ్యాణ్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడు చేపల పండు పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు.. మృతుడు కళ్యాణ్ తన కుటుంబానికి ఏకై క కుమారుడు. ఆయనకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉన్న యువకుడు అకస్మాత్తుగా కన్నుమూయడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలచివేస్తున్నాయి. ఈ ఘటనపై లక్కవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి దుర్మరణం, మరో యువకుడి పరిస్థితి విషమం -
రేషన్ డీలర్లపై నిబంధనల పేరుతో ఒత్తిడి
ఏలూరు (ఆర్ఆర్పేట): రేషన్ డోర్ డెలివరీ విధానం వృద్ధులు, దివ్యాంగులు, మహిళా డీలర్లకు ఎంతో కష్టతరంగా మారుతోందని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజులపాటి గంగాధర్గౌడ్, ఏలూరు జిల్లా అధ్యక్షుడు తలారి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి బియ్యం బస్తాను వెయింగ్ మిషన్పై ఉంచి రెండుసార్లు స్కానింగ్ చేసిన తర్వాతే ఈ–పాస్ యంత్రంలో రిసీవ్ అయ్యేలా నిబంధనలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ విధానంతో పాటు, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కార్డుదారుల ఫీడ్బ్యాక్ వంటి అంశాలు డీలర్లకు ఇబ్బందికరంగా మారాయన్నారు. ప్రతి డీలర్కు నెలకు కనీసం రూ.25 వేల ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడకు వినతిపత్రం అందజేశారు. -
డైవర్షన్ కోసమే అక్రమ అరెస్టులు
తణుకు అర్బన్ : మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును మద్యం రవాణాలో అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు. తణుకు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పరిపాలనలో విఫలమై ప్రజలు తిరగబడే పరిస్థితి రావడంతో డైవర్షన్ కోసం ఇలాంటి అక్రమ అరెస్టులకు తెరతీసిందన్నారు. కారుమూరికి లిక్కర్ కుంభకోణానికి ఎటువంటి సంబంధంలేకపోయినప్పటికీ ముందుగా రూ.193 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ అంటూ పచ్చ మీడియాలో కథనాలు వేశారని మండిపడ్డారు. కానీ ఈ కేసులో తాజాగా రూ. 8 లక్షలు అవినీతిగా తేల్చడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ఆయన లిక్కరు వ్యాపారిగా ఉన్నారా? లిక్కరు ట్రాన్స్పోర్టర్గా? ఉన్నారా? అని నిలదీశారు. అసలు వ్యాపారం చేసిన వారిని పట్టించుకోకపోగా, వారిపై ఎలాంటి కేసులు పెట్టకుండా పార్టీలో బలహీన వర్గానికి చెందిన వ్యక్తిగా ఎదుగుతున్న కారుమూరిని లక్ష్యంగా చేసుకుని కక్షపూరితంగా కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ తాడేపల్లిగూడెం ఇన్చార్జ్ వడ్డి రఘురాం నాయుడు, భీమవరం ఇన్చార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు, పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయితీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, నియోజకవర్గ ప్రచారకమిటీ అధ్యక్షుడు గెల్లా జగన్ పాల్గొన్నారు. భీమవరం: కూటమి ప్రభుత్వం బీసీలను అనగదొక్కే కుట్రలో భాగంగా వైఎస్సార్ సీపీలోని బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధిస్తుందని, దానిలో భాగంగానే బీసీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావును అక్రమంగా అరెస్టు చేశారని వైఎస్సార్సీపీ నరసాపురం పార్లమెంట్ సమన్వయకర్త గూడూరి ఉమాబాల అన్నారు. మంగళవారం భీమవరంలో విలేకరులతో మాట్లాడుతూ బీసీ నాయకులు ఎదుగుదల చూడలేక , కూటమి ప్రభుత్వ కుట్రలను ప్రశ్నిస్తున్న నాయకుల అక్రమ అరెస్టులు జరుగుతున్నాయన్నారు. కుటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టడమేగాక చివరకు అరెస్ట్ చేసి జైలుకు పంపే వరకు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపర్చారని ఉమాబాల ధ్వజమెత్తారు. అక్రమ కేసుల నుంచి నాగేశ్వరరావు ఆయన తనయుడు క్లీన్చీట్తో బయటికి వస్తారని అన్నారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి బీసీ వర్గాల నుంచి సరైన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. -
భీమవరం టీడీపీలో ఆక్వా రగడ
భీమవరం: భీమవరం నియోజకవర్గ టీడీపీలో ఆక్వా రగడ రాజుకుంటోంది. పార్టీ నాయకులు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగినా, పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆక్వా రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, తక్షణమే విద్యుత్ సబ్సిడీ అమలు చేస్తామని ఎన్నికల్లో పెద్దఎత్తున ప్రచారం చేశారు. అయితే, అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా విద్యుత్ సబ్సిడీ హామీని అమలు చేయలేకపోయారు. దీనికి తోడు ఆక్వా ఫీడ్, సీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోవడమేగాక, రొయ్యల ధరలు గణనీయంగా పడిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రైతులు రాజకీయాలకు అతీతంగా ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగానే జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, వీరవాసరం తదితర ప్రాంతాల్లో రైతులు ఆక్వా ఫీడ్ బస్తాలను తగలబెట్టడం, రొయ్యలను రోడ్డుపై పడేసి నిరసన తెలపడం, కొంతమంది రైతులు స్వచ్ఛందంగా క్రాప్ హాలిడే ప్రకటించడం వంటి ఆందోళనలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందంటూ భీమవరంలో నిర్వహించిన సభకు ఆక్వా రైతుల నుంచి అనూహ్య స్పందన లభించింది. జగన్ సభతో కూటమి నాయకుల్లో కలవరం జగన్ సభతో ఉక్కిరిబిక్కిరైన ప్రభుత్వం, తప్పనిసరి పరిస్థితుల్లో ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీని అమలు చేసింది. అయితే ఇది కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు మింగుడుపడలేదు. జగన్ సభ వల్లే ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీని అమలు చేసిందని రైతులు బలంగా నమ్మడంతో, ఈ సబ్సిడీ అమలు వల్ల ప్రభుత్వానికి ఎలాంటి మైలేజ్ రాకుండా పోయిందని పార్టీ పెద్దల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో ఆక్వా రైతుల ఉద్యమానికి మద్దతునిచ్చిన టీడీపీ, జనసేన పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని పార్టీ సమావేశాల్లో విమర్శలు గుప్పించడంతో ప్రధానంగా టీడీపీలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. భీమవరం పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక పార్టీ కార్యక్రమంలో వీరవాసరం మండల పార్టీ అధ్యక్షుడు కొల్లేపర శ్రీనివాసరావు, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు వీరవల్లి చంద్రశేఖర్ మధ్య జరిగిన వాగ్వాదం కార్యక్రమాన్ని రసాభసకు గురిచేసింది. రెండు గ్రూపులుగా విడిపోయి టీడీపీ నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి బాహాబాహీకి దిగినా, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ తోట సీతారామలక్ష్మి, జిల్లా పార్టీ అధ్యక్షుడు మంతెన రామరాజు, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు వంటి పెద్దలు ఎవరూ జోక్యం చేసుకోకపోవడంతో ఈ వివాదం మరింత ముదురుతోందని పార్టీ క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే, కొల్లేపర శ్రీనివాసరావు వివాదం వెనుక తోట సీతారామలక్ష్మి కార్యాలయం హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కార్యాలయంలో కొంతమంది అసలు పనులను పక్కనపెట్టి, రాజకీయాల్లో తలదూర్చి నాయకుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భీమవరం నియోజకవర్గంలోని టీడీపీ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల కూటమిలో చులకనైపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంమీద ఆక్వా రైతుల ఆందోళన టీడీపీలో ముసలం పుట్టిస్తోంది. ఇది చిలికిచిలికి గాలివానలా మారుతుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సంక్షోభంలో ఆక్వా రంగం ఆక్వా రైతులకు అండగా నిలిచిన జగన్ జగన్ సభకు అనూహ్య స్పందన కూటమి నేతల్లో కలవరం టీడీపీ నేతల మధ్య తలెత్తిన విభేదాలు రోడ్లపైనే బాహాబాహీ -
దళితవాడలపై ప్రభుత్వాల వివక్ష
భీమవరం (ప్రకాశంచౌక్) : దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎనిమిదేళ్లు కావస్తున్నా దళితపేటల్లో మౌలిక వసతులు కొరవడటం ప్రభుత్వాల అసమర్థతకు నిదర్శనమని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.బలరాం విమర్శించారు. దళిత పేటలకు జీఓ నెం.1235 ప్రకారం రెండు ఎకరాల చొప్పున స్మశాన వాటికలు కేటాయించాలని, మైదాన ప్రాంత గిరిజనులైన యానాదులు, ఎరుకలు, చెంచులకు కనీస గుర్తింపుతో పాటు మరుగుదొడ్లు, మంచినీటి వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సో మవారం కలెక్టరేట్ వద్ద సామాజిక శంఖారావం, చలో కలెక్టరేట్ ధర్నా నిర్వహించారు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ తదితరులు ప్రసంగిస్తూ.. దళితుల సమస్యల పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా అందరూ ఐక్యమై పోరాడాలని పిలుపునిచ్చారు. జిల్లాలో నిర్వహించిన సర్వేల ద్వారా 80 శాతం దళిత కాలనీల్లో శ్శశాన వాటికలు లేవని, ఉన్న 20 శాతం కూడా ఆక్రమణకు గురయ్యాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో మరింత తీవ్రమైన కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. అనంతరం శ్శశాన వాటిక సమస్య ప్రతిబింబించేలా ఖాళీ శవపేటికలు ప్రదర్శనకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కె.క్రాంతిబాబు సహా నేతలు అక్కడే బైఠాయించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, కై లు రైతు సంఘం, రైతు సంఘం, ఐద్వా, వృత్తిదారుల సంఘం, ఎస్ఎఫ్ఐ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం
భీమవరం (ప్రకాశంచౌక్) : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తున్నామని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల ద్వారా ప్రజల నుంచి అందుతున్న ప్రతి ఫిర్యాదును అధికారులు అత్యంత బాధ్యతతో క్షేత్రస్థాయిలో పరిశీలించి, నాణ్యమైన శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్లో జిల్లాస్థాయి పీజీఆర్ఎస్లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జేసీ కేఆర్ కల్పశ్రీ, ఇన్చార్జి డీఆర్వో పి.ప్రభాకర్, డ్వామా పీడీ సీహెచ్ అప్పారావు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్.వెంకటేశ్వరరావు అర్జీలు స్వీకరించారు. మా ఇంటిని లాక్కున్నారు వేల్పూరుకు చెందిన 13 ఏళ్ల జక్కంశెట్టి చందు సాయిదుర్గారెడ్డి వృద్ధారాలైన తల్లి వరలక్ష్మితో కలిసి పీజీఆర్ఎస్కు వచ్చారు. తమ ఇంటిని కొందరు అన్యాయంగా లాక్కున్నారని ఫిర్యాదు చేశారు. అనంతరం చందు విలేకరులతో మాట్లాడుతూ వేల్పూరులో తమకు చెందిన రెండు పోర్షన్ ఇంటిని ముగ్గురు వ్యక్తులకు అద్దెకు ఇచ్చామని, పదేళ్లుగా వారు ఉంటున్నారన్నారు. అయితే ఏడాదిగా అద్దె ఇవ్వకపోవడంతో పాటు తన తల్లి వరలక్ష్మి ఫోర్జరీ సంతకాలతో తాము ఇంటిని వారికి విక్రయించినట్టు పత్రాలు సృష్టించి స్వాధీనం చేసుకున్నారని చెప్పాడు. గతంలో పీజీఆర్ఎస్లో దరఖాస్తు చేసినా న్యాయం జరగకపోవడంతో మరోమారు అర్జీ అందించామన్నారు. కొందరు నా యకులు ఇల్లు స్వాధీనం చేసుకున్నవారి వెనుక ఉండి తమను ఇబ్బంది పెడుతున్నారని, ఇంటిని తమకు అప్పగించడంతో పాటు, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని అర్జీల్లో కోరారు. కలెక్టర్ నాగరాణి -
ఉపాధ్యాయుడి ఉదారత
పోలవరం రూరల్: గూటాల గ్రామంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు జమ్మ రామకృష్ణ సోమవారం సొంత ఖర్చులతో 48 స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఈ పాఠశాల విద్యార్థులు క్రీడా రంగంలో చూపుతున్న ప్రతిభను వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్న ఆయన, క్రీడా సామగ్రి కొరతను తీర్చాలని నిర్ణయించుకున్నారు. గతంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు టి.మధు కిషోర్ ఈ విషయాన్ని రామకృష్ణ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఏలూరు నుంచి పాఠశాలకు విచ్చేసిన రామకృష్ణ, విద్యార్థులకు స్వయంగా ఈ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది ఆయన్ను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. భీమవరం: ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన భీమవరం పట్టణంలోని భారతీయ విద్యా భవన్ స్కూల్లో సీనియర్ బాల, బాలికల డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ సెలెక్షన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గౌరవ్ శర్మ తెలిపారు. బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సెలెక్షన్లు జరుగుతాయన్నారు. సెలెక్షన్లలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులుు పాల్గొంటారని తెలిపారు. చింతలపూడి: ఆయిల్పామ్ తోటలో గెలలు కోస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యవసాయ కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన చింతలపూడి మండలంలోని కమలాపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం కామవరపుకోట మండలం వీరంపాలెం గ్రామానికి చెందిన చవటపల్లి పుల్లయ్య (40) కూలీ పనులకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో కమలాపురం గ్రామానికి చెందిన అప్పలరాజు ఆయిల్పామ్ తోటలో గెలలు కోసేందుకు వెళ్లాడు. తోటలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగలడంతో తీవ్ర విద్యుత్ షాక్కు గురై ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పుల్లయ్య కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమవరం: భావి పౌరుల ఆరోగ్య రక్షణ కోసం భీమవరం పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికల వెల్ఫేర్ గృహాల్లోని విద్యార్థినులకు ఉచితంగా హెపటైటిస్–బి, హెచ్పీవీ నివారణ టీకాలు వేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా గరల్స్ కన్వీనర్ బి సింధు మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టళ్లలోని విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణ చర్యలు సక్రమంగా లేవన్నారు. విద్యార్థినుల కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్నందున వారి ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులందరికి ఉచితంగా హెచ్పీవీ, హెపటైటిస్–బి నివారణ టీకాలను వేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు పి.సాయికృష్ణ, లీల తదితరులు పాల్గొన్నారు -
నేటి నుంచి ఉపాధ్యాయుల నిరసనలు
ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల టెట్ విషయంలో టీచర్ సంఘాల వినతులను పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షం నిర్ణయం తీసుకోవడంపై నేటి నుంచి యూటీఎఫ్ ఆందోళనలు చేపడుతుంది. మంగళవారం జిల్లా కేంద్రాల్లో నిరసనలు. 26 నుంచి 30 వరకూ మండలాల్లో నిరసన బైక్ ర్యాలీలు, సెప్టెంబరు 3న చలో విజయవాడ. అప్పటికీ విద్యాశాఖ మంత్రి స్పందించకపోతే 4వ తేదీ నుంచి విజయవాడలో రాష్ట్రస్థాయి నిరవరిధిక దీక్షలు చేపడతాం. –బొర్రా గోపీమూర్తి, టీచర్ ఎమ్మెల్సీ ఇన్సర్వీస్ వారికి ప్రత్యేక టెట్ నిర్వహణను స్వాగతిస్తున్నాం. కానీ, ఈ స్పెషల్ టెట్లో అర్హత మార్కుల్లో ఎటువంటి మార్పులు లేకపోవడం దారుణం. ఎస్టీయూ తరఫున ఇన్సర్వీస్ టీచర్లకు అర్హత మార్కులు 40 శాతంగా పరిగణించాలనే డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోలేదు. 30 ఏళ్లుగా లెక్కలు చెబుతున్న సబ్జెక్ట్ టీచర్, ఈ 150 మార్కుల టెట్ పరీక్షలో ఇప్పుడు కేవలం 20 మార్కులకే లెక్కలు ఎదుర్కొని, మిగిలిన 130 మార్కులకు తెలుగు, ఇంగ్లీషు, ఫిజిక్స్, బయోసైన్స్, మెథడాలజీ సబ్జెక్టులు ఏవిధంగా రాయగలరు? – లంకలపల్లి సాయి శ్రీనివాస్, ఫ్యాప్టో చైర్మన్ -
ఫిర్యాదులపై నిర్లక్ష్యం ఉపేక్షించం
భీమవరం : పోలీస్స్టేషన్ వచ్చే ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి హెచ్చరించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 9 మంది బాధితుల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. నిర్ణీత గడువులోపు బాధితులకు న్యాయం జరగాలని అధికారులను ఆదేశించారు. పోలీస్స్టేషన్కు వచ్చే సామాన్యుల సమస్యల పట్ల స్పందించడంలో అలసత్వం ప్రదర్శించకూడదని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్) : తాడేపల్లిగూడెం డీ ఆర్జీ మహిళా డిగ్రీ కళాశాలలో ఈనెల 29న మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. సో మవారం కలెక్టరేట్లో డ్రైవ్ పోస్టర్ను ఆవిష్కరించారు. 900 పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, 18–35 ఏళ్ల వారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 8367054119, 7013896277 నంబర్లలో సంప్రదించాలని కోరారు. జేసీ కల్పశ్రీ డీఆర్వో పి.ప్రభాకర్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.లోకమాన్ పాల్గొన్నారు. వర్మీ కంపోస్ట్ స్టాల్ ప్రారంభం డీపీఆర్సీ పంచాయతీల్లో తయారుచేసిన వర్మీ కంపోస్ట్కు సంబంధించిన స్టాల్ను కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. కలెక్టరేట్లో స్టాల్ను ఆమె ప్రారంభించి మాట్లాడుతూ వర్మీ కంపోస్ట్ను రైతులు వినియోగించాలన్నారు. స్టాల్లో కిలోతో పాటు బల్క్గా ప్యాకింగ్లు చేయాలన్నారు. ఇక్కడి స్టాల్పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. డీపీఓ కె.అనురాధ తదితరులు పాల్గొన్నారు. నేత్రదానం మహోన్నతం ప్రజల్లో నేత్రదానంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జాతీయ అంధత్వ నివారణ, దృష్టి లోప నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలన్నారు. జిల్లా ఆరోగ్యశ్రీ కో–ఆర్డినేటర్ కీర్తి కిరణ్, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. భీమవరం : ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తు న్న టెట్ను వ్యతిరేకిస్తున్నట్టు ఉభయగోదావ రి జిల్లాల టీచర్ ఎమ్మె ల్సీ బొర్రా గోపిమూర్తి తెలిపారు. భీమవరంలో సోమవారం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ విలేకరులతో ఆయన మాట్లాడారు. సాధారణ టెట్కు ప్రత్యేక టెట్కు ఎలాంటి తేడా లేదని, దీనిని ఉపాధ్యాయులంతా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పా రు. ఉపాధ్యాయుల మానసిక వేదనను అర్థం చేసుకుని, ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు తగిన వెసులుబాటులు, మినహాయింపులు ఇవ్వాలని ఆయన కోరారు. పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్ట్లోని ఎర్త్ కం రాక్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్)లో కేంద్ర మట్టి, పదార్థాల పరిశోధనా కేంద్రం (సీఎస్ఎంఆర్ఎస్) నిపుణులు సోమవారం కూడా పరీక్షలు నిర్వహించారు. బృందంలో సిద్దార్థ్ పీ హెడవూ, శ్రీహరి టి నాయర్ , అమిత్ సేన్ పాల్గొనగా పోలవరం ప్రాజెక్ట్ ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డీజీఎంలు మురళి పమ్మి, గుట్టపాటి శంకరయ్య, జలవనరుల శాఖ ఈఈ డి.శ్రీనివాస్, డీఈఈలు నిర్మల, శ్రీనివాస్, శేఖర్ బాబు వారికి వివరాలు అందజేశారు. నీరు ప్రవహించే వేగాన్ని కొలిచారు, నేల గట్టిదనం తెలుసుకునే పరీక్షలు చేశారు. కొన్ని నమూనాలు ఇక్కడ ల్యాబ్లో, మరికొన్ని ఢిల్లీలో పరిశోధనాలయంలో లోతుగా పరీక్షించి తుది నివేదికలను సిద్ధం చేయనున్నారు. -
స్క్రూ మేకుతో బయటపడిన నిజం
● పది రోజుల క్రితం భార్య గొంతునులిమి హత్య ● మృతదేహాన్ని ఆకివీడు దగ్గర ఉప్పుటేరు గట్టున పడేసిన వైనం ● భార్యను కడతేర్చిన భర్త అరెస్ట్ ఆకివీడు: ఎలాంటి ఆధారాలు దొరక్కుండా భార్యను హత్య చేసి, ఉప్పుటేరులో పడేసి చేతులు దులుపుకోవాలనుకున్న భర్త పన్నాగం పది రోజులకు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. మెడికల్ స్క్రూ మేకు ఇచ్చిన కీలక ఆధారంతో పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు. ఈ హత్యోదంతానికి సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో అదనపు ఎస్పీ డి.విశ్వనాథ్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఘటన వివరాలు ఇలా.. భీమవరం టూటౌన్లోని వంశీకృష్ణ అపార్ట్మెంట్లో ఉప్పాడ నారాయణరావు, దేవి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె ఉండగా, ఆమె అమెరికాలో ఉంటున్నారు. చేపల కమిషన్ వ్యాపారం చేసే నారాయణరావు అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో పాటు అనుమానాలు పెరిగాయి. కుటుంబ సభ్యులను దూషించడం, శారీరకంగా దగ్గరకు రానివ్వకపోవడం వంటి విషయాలతో కక్ష పెంచుకున్న నారాయణరావు.. ఈ నెల 8న వ్యాపార నిమిత్తం బయటకు వెళ్లి, 14న తిరిగి ఇంటికి వచ్చాడు. అదే రోజు రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగగా, భార్యను నిద్రిస్తున్న సమయంలో గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం అదే రోజు అర్ధరాత్రి తన మారుతి కారు (ఏపీ 37 సీఎల్ 1499)లో మృతదేహాన్ని ఆకివీడు సమీపంలోని ఉప్పుటేరు వంతెన వద్దకు తీసుకెళ్లాడు. మందపాడు వెళ్లే రోడ్డు వైపు వెళ్లి ఉప్పుటేరులో పడేసేందుకు ప్రయత్నించగా, మృతదేహం గట్టుపైనే పడిపోయింది. దీంతో కారును ముందుకు పోనిచ్చి, అక్కడి నుంచి తిరిగి భీమవరానికి వెళ్లిపోయాడు. విస్తృత దర్యాప్తు.. మహిళ మృతదేహంపై పోలీసులు విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్, వేలిముద్రల నిపుణులు, డాగ్ స్క్వాడ్ నేరస్థలాన్ని పరిశీలించాయి. డాగ్ స్క్వాడ్ సమీపంలోని చెరువు గట్టు ప్రాంతం వరకు వెళ్లి ఆగిపోయింది. నిందితుడు ఆ ప్రాంతంలో కారును వెనక్కి తిప్పడంతో అక్కడివరకే జాగిలం వెళ్లినట్లు గుర్తించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆరు ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలకు ఆదేశించారు. ఆయా బృందాలు ఉభయగోదావరి, కృష్ణ, ఇతర ప్రాంతాల్లో పర్యటించి విచారణ చేశారు. స్క్రూ మేకుతో బయటపడిన నిజం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి రెండు రోజులు మార్చురీలో ఉంచారు. పోస్టుమార్టంలో ఆమె ఎడమ కాలుకు స్టీల్ రాడ్డు, సర్జికల్ స్క్రూలు ఉండటాన్ని గుర్తించారు. వాటిని పరిశీలించగా.. ఇంప్లాంట్ తయారీ కంపెనీ ’దాల్ అండ్ సన్స్’గా తేలింది. ఆ స్టీల్ రాడ్, స్క్రూలను హైదరాబాద్లోని సుశీల ఆసుపత్రికి పంపినట్లు నిర్ధారించుకుని ఆరా తీయగా.. 2023 జనవరిలో భీమవరానికి చెందిన ఉప్పాడ దేవికి వాటిని అమర్చినట్లు వెల్లడైంది. పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించగా తాళం వేసి ఉంది. దీంతో కేసు దర్యాప్తు వేగవంతమైంది. నిందితుడి అరెస్ట్ తరచూ గొడవలు పడటంతో పాటు కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషించడం, శారీరకంగా దగ్గరకు రాకపోవడంతోనే హత్య చేసినట్లు నిందితుడు నారాయణరావు అంగీకరించాడని అదనపు ఎస్పీ తెలిపారు. ఈ నెల 23న రాత్రి 7:15 గంటలకు ఆకివీడు పోలీస్ స్టేషన్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన కారును సీజ్ చేసినట్లు వెల్లడించారు. కేసును చాకచక్యంగా ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఆకివీడు సీఐ కాళీచరణ్, ఎస్సై కే శుభశేఖర్, కాళ్ల ఎస్సై ఏ గణేశ్కుమార్, ఉండి ఎస్సై మల్లికార్జునరావు తదితర సిబ్బందిని ఆయన అభినందించారు. -
ఇన్ సర్వీస్ టీచర్లకు షాక్
నిడమర్రు: ఉపాధ్యాయ వృత్తి విద్యా కోర్సులైన బీఈడీ, డీఈడీలు పూర్తి చేసి, డీఎస్సీ రాత పరీక్షలో, ఇంటర్వ్యూలో మంచి ర్యాంక్ సాధించి ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులు, నేడు 30 ఏళ్ల సర్వీసు తర్వాత ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పాస్ కావాలంటూ సోమవారం విద్యాశాఖ ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నూతన విద్యాహక్కు చట్టం ప్రకారం ఇన్సర్వీస్ టీచర్లు సైతం టెట్లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. నాటి నుంచి విద్యాహక్కు చట్టం–2009లో మార్పులు తేవాలంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. లేనిపక్షంలో పలు ముఖ్య డిమాండ్లతో ఉపాధ్యాయులు ప్రతిరోజూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. తాజాగా శనివారం విజయనగరంలోని దాసన్నపేట బాలికల హైస్కూల్లో క్లస్టర్ కాంప్లెక్స్కు హాజరైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పక్షాన కలిసి, టెట్ సమస్యపై పలు డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు. కానీ, తాజాగా జారీ చేసిన ప్రత్యేక టెట్ నోటిఫికేషన్లో ఆ వినతిపత్రంలోని ఏ ఒక్క డిమాండ్ను కూడా పట్టించుకోకపోవడం దారుణమంటూ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. విద్యాహక్కు చట్టం సవరణపై పట్టు నూతన విద్యా చట్టం–2009 ప్రకారం దేశంలో టెట్ విధానం అమల్లోకి వచ్చింది. టెట్ పాస్ అయితేనే డీఎస్సీ రాసేందుకు అర్హత లభిస్తుంది. దీంతో ఏపీ సర్కారు 2011 నుంచి టెట్ పరీక్ష నిర్వహిస్తోంది. అయితే, 2011కి ముందు ఈ నిబంధనపై స్పష్టత లేకపోవడంతో ఆ కాలానికి ముందు ఉద్యోగాలు పొందినవారు ఇంతవరకు టెట్ రాయలేదు. గత ఏడాది సుప్రీంకోర్టు విద్యాహక్కు చట్టం–2009ని పరిగణనలోకి తీసుకుని టెట్పై తీర్పు వెలువరించింది. రిటైర్మెంట్కు 5 ఏళ్లకంటే తక్కువ సర్వీస్ ఉన్న టీచర్లు ఉద్యోగంలో కొనసాగాలంటే తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో 2028 ఆగస్టు 1వ తేదీలోపు ఉత్తీర్ణులు కావాలని స్పష్టం చేసింది. నాటి నుంచి విద్యాహక్కు చట్టం–2009 సెక్షన్ 23(1)ను సవరించాలని కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సాధ్యంకాని పక్షంలో ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్లో కులం, కేటగిరీలతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా 40 శాతం పాస్ మార్కులు ప్రకటించాలని, సీనియర్ టీచర్లకు కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువగా ఉంటుందని కాబట్టి ఈ పరీక్షను ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో నిర్వహించాలని, ఏ సబ్జెక్టు టీచర్కు అదే సబ్జెక్టులో పరీక్ష నిర్వహించాలంటూ ఉపాధ్యాయ సంఘాలు పట్టుబడుతున్నాయి. కానీ, తాజా నోటిఫికేషన్లో నిరుద్యోగ అభ్యర్థుల మార్గదర్శకాలు, సిలబస్ మాదిరిగానే ఇన్సర్వీస్ టీచర్లకు కూడా టెట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2011కి ముందు ఉద్యోగాలు పొందిన వారు సుమారు 35 వేల మంది వరకు ఉండొచ్చని అంచనా. వీరందరి ఆశలను తాజా నోటిఫికేషన్ ఆవిరి చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హత మార్కులు తగ్గింపు లేదు ఉద్యోగంలో కొనసాగాలన్నా, పదోన్నతి పొందాలన్నా ఆయా సబ్జెక్టుల టెట్ పేపర్లలో ఉత్తీర్ణత తప్పనిసరి. నిరుద్యోగ అభ్యర్థుల మాదిరిగా తమకు టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ లేనందున, అందరికీ ఉమ్మడిగా ఒకే విధంగా అర్హత మార్కులు నిర్ణయించాలని సంఘాలు పట్టుపట్టినా ప్రయోజనం లేకపోయింది. ఈ నోటిఫికేషన్లో 150 మార్కులకు గాను ఎస్సీ, ఎస్టీలు 60 మార్కులు, బీసీలు 75 మార్కులు, జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ టీచర్లు 90 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. నేటినుంచి దరఖాస్తుల స్వీకరణ ఈ ప్రత్యేక టెట్కు ఇన్సర్వీస్ టీచర్ల నుంచి నేటి నుంచి విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో సెప్టెంబరు 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబరు 5వ తేదీ నుంచి హాల్టికెట్ల డౌన్లోడ్ ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అక్టోబర్ 11 నుంచి 21 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఎస్జీటీలు పేపర్–1 రాయాలి, పదోన్నతికి అర్హత సాధించాలంటే ఆయా సబ్జెక్టుల్లో పేపర్–2 రాయాలి. ప్రతి పేపర్కూ రూ.1,000 ఫీజు చెల్లించాలి. మినహాయింపులు లేకుండానే ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ జారీ ఉద్యోగం ఉండాలంటే.. అర్హత పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి నేటినుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఉపాధ్యాయుల డిమాండ్ పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల టెట్ మాదిరిగానే నిర్వహిస్తున్నట్లు ప్రకటన -
భక్తుల సౌకర్యాలు, ఆలయ అభివృద్ధికి పెద్దపీట
● శ్రీవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు ● వివరాలను వెల్లడించిన ఆలయ ఈఓ త్రినాథరావు ద్వారకాతిరుమల: చినవెంకన్న దేవస్థానంలో భక్తుల సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొండపైన ద్వారకా నిలయంలో సోమవారం ఆలయ ఛైర్మన్ ఎస్వీ సుధాకరరావు అధ్యక్షతన ట్రస్ట్బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా చర్యలు, కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ధర్మకర్తలు, ఎక్స్ అఫీషియో సభ్యుడు, ప్రత్యేక ఆహ్వానితులు వివిధ అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేశారు. ట్రస్ట్బోర్డు తీసుకున్న నిర్ణయాలను ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు మీడియాకు వెల్లడించారు. ట్రస్ట్బోర్డు తీసుకున్న నిర్ణయాలు ఇవే.. ● భక్తులు నిర్వహించుకునే అన్నప్రాసన, అక్షరాభ్యాస వేడుకలకు రుసుమును రూ.500గా నిర్ణయించారు. లభ్యత మేరకు స్వామివారి తూర్పువైపు అనివేటి మండపంలో ఈ వేడుకలను ఉచితంగా నిర్వహించుకునేందుకు అనుమతించాలని నిర్ణయించారు. ● శ్రీవారి ఆశ్వీయుజ మాస తిరుకళ్యాణ మహోత్సవాల సందర్భంగా తాత్కాలిక విద్యుత్ అలంకరణ ఏర్పాటుకు వచ్చిన తక్కువ టెండర్ను ఆమోదించారు. ● స్వామివారి కొండపైకి వెళ్లే మార్గంలోని ప్రధాన టోల్గేట్ కూడలిలో శ్రీ దశావతార వేంకటేశ్వరస్వామి సిమెంట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వచ్చిన తక్కువ టెండర్ను ఆమోదించారు. ● కొండపైన శ్రీ ధర్మ అప్పారాయ నిలయంలో 2, 3 వ అంతస్తుల నిర్మాణంతో పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా 630 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు, ఓఎల్టీసీ ప్యానెళ్ల ఏర్పాటుకు వచ్చిన తక్కువ టెండర్ను ఆమోదించారు. ● తూర్పువైపు అనివేటి మండపంలోని ఫేజ్–1 ఉత్తర వైపు, ఫేజ్–2 ఉత్తర, దక్షిణ వైపుల్లో ఆర్నమెంటల్ బ్రిక్వర్క్, ఎంఎస్ బ్యారికేడింగ్ గ్రిల్స్ ఏర్పాటుకు వచ్చిన తక్కువ టెండర్లను ఆమోదించారు. ● కొండపైన కేశఖండనశాల ఎదురుగా ఉన్న పాత స్టోన్ పిచింగ్ డ్రెయిన్ పూర్తిగా దెబ్బతినడంతో దాని స్థానంలో సీసీ డ్రెయిన్ నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని ప్రతిపాదించారు. ● మాధవ కల్యాణ మండపంలోని నాలుగు మండపాలు, నాలుగు కిచెన్, డైనింగ్ హాళ్లలో ప్రత్యేక మరమ్మతు పనులకు సంబంధించిన అంచనాలను ఆమోదించారు. ● దొరసానిపాడు గ్రామంలోని స్వామివారి వ్యవసాయ భూమి లీజు హక్కు కోసం నిర్వహించిన బహిరంగ వేలంలో వచ్చిన హెచ్చుపాటను ఆమోదించారు. ● ప్రధాన దేవాలయం, దత్తత దేవాలయాలు, వివిధ ట్రస్టులకు సంబంధించిన జూలై 2026 ఆదాయ, వ్యయాలను ఆమోదించారు. -
చైర్మన్గిరీకి ఉడాంపట్టు
సాక్షి, భీమవరం: భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (భీమా ఉడా) కూటమిలో నామినేటెడ్ కుంపటి రాజేసింది. ఉడా చైర్మన్ పదవి తమదంటే తమదని కూటమిలో మూడు ముక్కలాట మొదలైంది. కూటమి పాలసీకి కట్టుబడి ఎన్నికల్లో తమ సీటు త్యాగం చేసిన వారితో పాటు సీనియర్లు చైర్మన్ రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆశావహులు తమ అధిష్టానం పెద్దల్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. భీమవరం కేంద్రంగా.. జిల్లాల పునర్విభజన అనంతరం భీమా ఉడా ఏర్పాటుకు కసరత్తు మొదలైనా ఎన్నికలు రావడంతో కార్యరూపం దాల్చలేదు. తాజాగా భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం మున్సిపాల్టీలు, ఆకివీడు నగర పంచాయతీ, 19 మండలాల్లోని 282 గ్రామాలతో భీమా ఉడాని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం వారం క్రితం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్లానింగ్ ఆఫీసర్, ఇతర ఉద్యోగుల నియామకం, కార్యాలయం ఏర్పాటు, బడ్జెట్ కేటాయింపులపై ఇంకా స్పష్టత లేదు. నామినేటెడ్ కమిటీ నియామకం సభ్యుల సంఖ్య, అథారిటీ పరిధి మేరకు నామినేటెడ్ కమిటీ నియామకం చేస్తారు. కమిటీలో చైర్మన్తో పాటు ముగ్గురు నుంచి నలుగురు సభ్యులను ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, పట్టణాభివృద్ధిలో అనుభవం ఉన్నవారిని ఎంపిక చేస్తారు. వైస్ చైర్మన్గా ఐఏఎస్ అధికారి లేదా జాయింట్ కలెక్టర్ హోదాలోని వారిని, అధికారిక సభ్యులుగా మున్సిపల్, టౌన్ప్లానింగ్, ఆర్అండ్బీ, ట్రెజరీ శాఖల్లో పనిచేసే వారిని నియామకం చేస్తుంటారు. ఏడాది నుంచి మూడేళ్లు కమిటీ పదవీ కాలం కాగా ప్రభుత్వ నిర్ణయం మేరకు పొడిగింపు అవకాశం ఉంటుంది. రోజువారీ పరిపాలనా వ్యవహారాల కోసం వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో అధికారులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వర్గ విభేదాలతో మరింత రచ్చ సీట్లు కోల్పోయిన వారి అసంతృప్తి కూటమికి చేటు చేయకుండా చంద్రబాబు, పవన్కల్యాణ్లు స్వయంగా ఫోన్లు చేసి ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామంటూ బుజ్జగించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. భీమవరంలో జనసేన పోటీ చేయగా టీడీపీ నుంచి టికెట్ ఆశించిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, కోళ్ల నాగేశ్వరరావు. జనసేన నుంచి టికెట్ ఆశించిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, తాడేపల్లిగూడెంలో టీడీపీ నేత వలవల బాబ్జి, నరసాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ఎన్ఆర్ఐ కొవ్వలి యతిరాజరామ్మోహననాయుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పొత్తూరి రామరాజు, ఉండి నియోజకవర్గంలో జనసేన ఇన్చార్జి జుత్తుక నాగరాజు, పాలకొల్లులో జనసేన ఇన్చార్జి బోనం చినబాబు తదితర నేతలు ఉన్నారు. కూటమి వచ్చాక జరిగిన, ప్రస్తుతం జరుగునున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ప్రస్తావన లేకపోవడం, నామినేటెడ్ పోస్టులు భర్తీలోను అధిష్టానం తమను విస్మరించిందన్న అసంతృప్తితో పలువురు ఉన్నట్టు తెలుస్తోంది. అధినేత మాటకు కష్టపడి మిత్రపక్ష అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే తమకు గుర్తింపు లేకుండా పోయిందని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. భీమా ఉడా చైర్మన్ గిరీ కోసం వీరితో మరికొందరు సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం తదితర చోట్ల కూటమిలోని వర్గ విబేధాలు రచ్చకెక్కాయి. ఈ తరుణంలో భీమా ఉడా చైర్మన్ పదవి మరింత కుంపటిని రాజేస్తోంది. ఏఐ సృష్టించిన చిత్రం ఉడా కార్యకలాపాలు, నిధుల కేటాయింపులో కీలకమైన చైర్మన్ పదవిపై కూటమి నేతలు కన్నేశారు. కమిటీ ఏర్పాటుకు ఇంకా కసరత్తు జరుగుతున్న దాఖలాలు లేకున్నా ముందుగా కుర్చీలో ఖర్చీఫ్ వేసుకునే పనిలో పడ్డారు. మూడు పార్టీల్లోని సీనియర్లు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండటం కూటమిలో కుంపటి రాజేస్తోంది. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా జతకట్టడంతో అప్పటివరకు తామే అభ్యర్థిగా భావించి నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేసిన వారి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆచంట, తణుకు, పాలకొల్లు, ఉండి నియోజకవర్గాలను టీడీపీ, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలను జనసేన, నరసాపురం పార్లమెంట్ను బీజేపీ పంచుకున్నాయి. సీట్లు సర్దుబాటుతో మిగిలిన వారి ఆశలు గల్లంతయ్యాయి. కూటమిలో భీమా ఉడా కుంపటి చైర్మన్ పదవి కోసం మూడు ముక్కలాట మాదంటే మాదంటున్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు రేసులో పలువురు సీనియర్ల పేర్లు -
అక్రమ కేసులు.. ఆగని వేధింపులు
సాక్షి ప్రతినిధి,ఏలూరు: కారుమూరి కుటుంబంపై ‘పచ్చ’ వేధింపులు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో మాజీ మంత్రి కారుమూరిని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో వేధింపుల రాజకీయాలకు తెరతీశారు. ఇంటిపై దాడికి యత్నించడం మొదలు అక్రమ కేసులతో నానా హంగామా సృష్టించారు. నియోజకవర్గ స్థాయి మొదలు రాష్ట్రస్థాయి వరకు తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలతో నిత్యం వేధిస్తూనే ఉన్నారు. ఇక గత మూడు నెలలుగా అరెస్ట్ అంటూ టీడీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. చివరికి ఎన్ఫోర్స్మెంట్ అక్రమ కేసులో కారుమూరి అరెస్టు కావడంతో టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో మరింతగా రెచ్చిపోయారు. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి యథావిధిగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించి చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ మాట్లాడారు. బీసీ నేతపై కక్ష గట్టి.. ఉమ్మడి పశ్చిమలో సీనియర్ నేతగా కొనసాగుతున్న మాజీ మంత్రి, బీసీ నేత కారుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్టుపై వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. తణుకులో పార్టీ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి సాయంత్రం కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో కారుమూరి లక్ష్యంగా వేధింపుల రాజకీయాలకు తణుకులో టీడీపీ తెరలేపింది. ప్రధానంగా గోవధ కర్మాగారం నియోజకవర్గాన్ని పేకాటకు అడ్డాగా మార్చిన వైనం, అధిక ధరలకు మద్యం విక్రయాలతో పాటు నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలపై వైఎస్సార్సీపీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ సమస్యలపై పోరుబాట కొనసాగించింది. ఈ క్రమంలో జిల్లాలో ఎక్కడా లేనివిధంగా తణుకులో వరుస కేసులు నమోదు చేశారు. ప్రధానంగా గతేడాది అత్తిలి ఉప ఎన్నికల సందర్భంగా నామమాత్రపు బలం లేకపోయినా టీడీపీ తెగబడి బెదిరింపుల రాజకీయాలకు పాల్పడింది. వైఎస్సార్సీపీకి ఎంపీటీసీల బలం సంపూర్ణంగా ఉన్న క్రమంలో కొందరిని బెదిరించి టీడీపీలోకి చేర్చుకున్నారు. మిగిలిన ఎంపీటీసీలను కారుమూరి అత్తిలిలో తన నివాసంలో ఉంచి పోలింగ్కు తీసుకువెళ్లే క్రమంలో వందలాది మంది పచ్చమూక ఎమ్మెల్యే రాధాకృష్ణ డైరెక్షన్లో కారుమూరి నివాసంపై దాడికి యత్నించి తీవ్రస్థాయి అలజడి సృష్టించి ఎన్నిక వాయిదా వేయించి తదనంతరం ఎంపీటీసీలను బలవంతంగా టీడీపీలోకి తీసుకుని ఎంపీపీ స్థానాన్ని కై వసం చేసుకుంది. ఇదే తరహా రాజకీయాలకు నియోజకవర్గాన్ని టీడీపీ కేంద్రంగా మార్చింది. గోవధ కర్మాగారాన్ని వ్యతిరేకించడంతో.. తణుకులో గోవధ పశువధ కార్మాగారాన్ని హిందూ సంఘాల మొదలు ప్రజలంతా వ్యతిరేకిస్తున్నా అధికార పార్టీ పట్టించుకోకపోవడంతో వరుస ఆందోళనలు, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొద్దిరోజుల పాటు కొనసాగించారు. అలాగే తణుకులో మద్యం విక్రయాలపై పొలిటికల్ ట్యాక్స్ కలిపి అధి క ధరకు ప్రజాప్రతినిధి కనుసన్నల్లో విక్రయిస్తుండటంపై నిరసనలు కొనసాగించారు. ఈ పరిణామాల క్రమంలో కారుమూరి మంత్రిగా చేసిన సమయంలో అవినీతికి పాల్పడ్డారంటూ రకరకాల అంశాలపై ఆరోపణలు గుప్పించి డైవర్షన్ రాజకీయాలకు తెరదీశారు. అక్రమ మద్యం కేసులో కారుమూరి కుమారుడు సునీల్ అరెస్టు అయిన నాటి నుంచి కారుమూరి కుటుంబ సభ్యులందరినీ అరెస్టు చేస్తారంటూ పెద్ద ఎత్తున టీడీపీ సోషల్ మీడియాలో క్యాపెయినింగ్ నిర్వహించారు. ని యోజకవర్గంలో ప్రధాన సమస్యలపై ప్రశ్నించినప్పుడల్లా ఇదే తరహాలో డైవర్షన్ రాజకీయాలు కొనసాగించారు. ఇక వైఎస్సార్సీపీ పిలుపు మేరకు ని ర్వహించిన చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు ని రసన ర్యాలీ అన్ని చోట్లా జరిగితే తణుకులో మా త్రమే కేసు నమోదు చేశారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ ధర్నా సందర్భంలోనూ తేతలి జంక్షన్ వద్ద, వైఎస్సార్ విగ్రహం సెంటరులో ఫ్లెక్సీ విషయంలోనూ ఇలా ప్రతి దానిలో కారుమూరిపై కేసులు నమోదు చేయడం గమనార్హం. పశ్చిమలో ప్రతిపక్ష కీలక నేతలే లక్ష్యం అక్రమ మద్యం కేసులో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్ రెండేళ్ల నుంచి అధికార పార్టీ కుయుక్తులు ప్రభుత్వ అక్రమాలపై కారుమూరి పోరుబాట గతేడాది అత్తిలి ఎంపీపీ ఎన్నికల సందర్భంగా ఆయన నివాసంపై దాడికి యత్నం తణుకులో బరితెగించిన ‘పచ్చ’నేతలు అక్రమ అరెస్టులు నిరసిస్తూ కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన తణుకు అర్బన్: మద్యం రవాణాలో మాజీ మంత్రి కారుమూరిపై అక్రమ కేసు నమోదుచేశారంటూ వైఎస్సార్సీపీ తణుకు నాయకులు స్థానిక నరేంద్ర సెంటర్లో సోమవారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి చోడే గోపికృష్ణ, తణుకు నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు గెల్లా జగన్ మాట్లాడుతూ తణుకు వంటి ప్రాంతంలో ఒక బీసీ నేత ఎదగడాన్ని జీర్ణించుకోలేకే కూటమి నా యకులు కారుమూరిపై అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. ప్రభుత్వ అక్రమా లు, హామీలపై నిలదీస్తున్న కారణంగానే కా రుమూరి కుటుంబంపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎవరెన్ని కుట్రలు చేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి పొట్ల సురేష్, ఎస్సీ సెల్ పట్టణ అద్యక్షుడు పెనుమాల రాజేష్, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు జంగం ఆనంద్కుమార్, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, నాయకులు కరిబండి రాజేష్, చిన్నూరెడ్డి, ఝాన్సీ లారెన్స్, మమతా యాదవ్, షేక్ ఫహీమా తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వ్ ఫారెస్ట్లో వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలంలోని రమణక్కపేట టేకు రిజర్వ్ ఫారెస్ట్లో సోమవారం ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. అడవికి పుట్టగొడుగుల సేకరణకు వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న జీలుగుమిల్లి సీఐ యాదగిరి, ఎస్సై క్రాంతికుమార్ సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రారంభంలో మృతుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఆరా తీయగా.. మృతుడు బుట్టాయిగూడెం మండలం కోయ అంకంపాలెం గ్రామానికి చెందిన తెల్లం వెంకటేశ్వరరావు (53)గా కుటుంబ సభ్యులు గుర్తించారు. గత రెండు రోజులుగా వెంకటేశ్వరరావు కనిపించకపోవడంతో బంధువులు సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం ప్రచారం చేసినట్లు తెలిపారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, ఎంత వైద్యం చేయించుకున్నా ఉపశమనం కలగడం లేదని ఆయన తరచూ ఆవేదన వ్యక్తం చేసేవారని కుటుంబ సభ్యులు పోలీసులకు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురై వెంకటేశ్వరరావు అడవికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యోగి భద్రతకు ప్రాధాన్యమివ్వాలి
తాడేపల్లిగూడెం: ప్రతి ఉద్యోగి గౌరవానికి, భద్రతకు ఆయా సంస్థలు ప్రా ధాన్యత ఇవ్వాలని న్యా యవాది బిస్నా చంద్రన్ తెలిపారు. ఏపీ నిట్లో సోమవారం ఉమెన్ గ్రీవెన్స్ సెల్ ఆధ్వర్యంలో లైంగిక వేఽధింపుల నిరోధక చట్టంపై బోధన, బోధనేతర సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ కార్యాలయాల్లో లైంగిక వేధింపులు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా ఆరోగ్యకరమైన పని వాతావరణానికి విఘాతం కలిగిస్తాయన్నారు. మహిళా ఉద్యోగులు తమకు ఎదురయ్యే వేధింపులకు మౌనంగా ఉండకుండా చట్టపరంగా అందుబాటులో ఉన్న మార్గాలను వినియోగించుకోవాలన్నారు. లైంగిక వేధింపుల నిరోధక చట్ట ప్రకారం కార్యాలయాల్లో సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించడం యాజమాన్యాల బాధ్యత అన్నారు. వేధింపుల స్వభావం, ఫిర్యాదు చేసే విధానం గురించి వివరించారు. ఫిర్యాదు దారుల గోప్యతను కాపాడుతూ నిబంధ నల ప్రకారం చర్యలు తీసుకొనే వ్యవస్థలు ఉన్నాయన్నారు. సమన్వయకర్తగా ఆచార్యులు ప్రత్యూష జయంతి, రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి పాల్గొన్నారు.న్యాయవాది బిస్నా చంద్రన్ -
ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం
ముసునూరు : ముసునూరులోని గోర్మేట్ పాప్ కార్నికా సంస్థ ఆధ్వర్యంలో జన్యుపరంగా మా ర్పు చేయని (నాన్–జీఎంఓ) మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ విచ్చేశారు. ఆయన కార్నికా సంస్థను సందర్శించి మొక్కజొన్న వంగడాల అభివృద్ధి, విత్తనాల ఉత్పత్తి, పరిశోధన, నా ణ్యతా ప్రమాణాలు తదితర అంశాలను పరిశీలించారు. విత్తనాల విభాగంతో పాటు పరిశోధనశాలను సందర్శించి, అక్కడ జరుగుతున్న పరిశోధనా కార్యక్రమాలను ఆసక్తిగా పరిశీలించారు. సంస్థ ఎండీ ఎస్పీపీ పట్టాభిరామారావు సంస్థ కార్యకలాపాలను వివరించారు. ఘన స్వాగతం ముందుగా ముసునూరు చేరుకున్న ఉప రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, మంత్రులు ఎర్రన్నాయుడు, లోకేష్, కొలుసు పార్థసారథి, ఐజీ జీవీజీ అశోక్కుమార్, కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. జ్ఞాపిక బహూకరణ మొక్కజొన్న వంగడం ఆవిష్కరణ వేదికపై ఉప రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు సీతారామ లక్ష్మణ, ఆంజనేయ సమేత జ్ఞాపికను అందజేశారు. -
అమరావతి చాంపియన్షిప్ పోటీలకు జిల్లా జట్లు
ఏలూరు (ఆర్ఆర్పేట): అమరావతి చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే నిమిత్తం జిల్లాకు చెందిన వివిధ క్రీడా జట్లు ఆదివారం బయలుదేరి వెళ్లాయి. ఏలూరులోని స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియం వద్ద క్రీడాకారుల బస్సులను ఇన్ఛార్జ్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్కే ఖాసిం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు తిరుపతిలో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల తరలింపునకు మొత్తం 7 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి 5 బస్సులను, నూజివీడు నుంచి మరో 2 బస్సులను పంపినట్లు ఆయన వెల్లడించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు విజయాలతో తిరిగిరావాలని ఆకాంక్షిస్తూ పలువురు అధికారులు, క్రీడాభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి ప్రసాద్, పీడీలు గవ్వా శ్రీను, మురళీ నాయక్, కోచ్ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో రాజ్యసభ సభ్యుడు సుబ్బారెడ్డి
ద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయాన్ని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆదివారం ఉదయం సందర్శించారు. తొలుత ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం డీఈఓ వై.భద్రాజీ, ఏఈఓ పి.నటరాజారావు, సూపరింటెండెంట్ ఐవీ రామారావు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆయనకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. ఆ తరువాత వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు, చింతలపూడి నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిలు మామిళ్లపల్లి జయప్రకాష్(జేపీ), కంభంపాటి విజయరాజు తదితరులు సుబ్బారెడ్డికి దుశ్శాలువా కప్పి, పూల బొకేను అందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ మండల కన్వీనర్ ప్రతాపనేని వాసు, తూర్పుగోదావరి జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు బొండాడ వెంకన్నబాబు, నల్లజర్ల సొసైటీ మాజీ చైర్మన్ కారుమంచి రమేష్, జంగా కృష్ణారెడ్డి, గోపా నాగేశ్వరరావు, యాచమనేని నాగేశ్వరరావు, మల్లెపూడి నాగమణి, అచ్యుత ఏసుబాబు, పెద్దిరెడ్డి నాగేశ్వరరావు, మానుకొండ సుబ్బారావు, మానుకొండ కన్నయ్య, షేక్ భాష, బిరుదుగడ్ల బజారయ్య, గుర్రాల లక్ష్మణ్, కస్సే గంగరాజు, రాచగర్ల కృష్ణ, అన్సారి, అందుగుల రమేష్, మనెల్లి నాగరాజు, మానుకొండ పద్మారావు, పెద్దిన దిలీప్ ఉన్నారు. -
మంచినీటి చెరువు నీరు.. తాగలేరు
● కలుషితంగా చావలిపాడు తాగునీటి చెరువు ● చెరువును అభివృద్ధి చేయాలని డిమాండ్మండవల్లి: మండలంలోని చావలిపాడు తాగునీటి చెరువులో నీరు అట్టడుగు స్థాయికి చేరింది. ఈ చెరువును గత కొన్ని సంవత్సరాలుగా గ్రామస్తులు వినియోగించడం మానేశారు. ప్రస్తుతం ఈ చెరువు నీటిని కేవలం వాడకానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. తాగడానికి, వంటలకు మాత్రం ఆర్వో ప్లాంట్ నీటిని టిన్కు రూ.25 నుంచి రూ.30 వెచ్చించి కొనుగోలు చేస్తూ, ఎలాగోలా కాలం వెళ్లదీస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిన దాఖలాలు లేవని గ్రామస్తులు వాపోతున్నారు. ఆ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్న వాగ్దానాలు ఏమైనట్లు అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పేదవర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువులో ఉన్న నీటిని వినియోగిస్తే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాగునీటిని బయట డబ్బులు పెట్టి కొనుగోలు చేయలేక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, చెరువును అభివృద్ధి చేసి స్వచ్ఛమైన మంచినీరు అందేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి
ఏలూరు టౌన్: ఏలూరు పవర్పేట వినాయకుడి గుడి రోడ్డులో ఒక వ్యక్తి డ్రెయినేజీలో పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో టూటౌన్ ఎస్సై మధురాజా తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు పెదవేగి మండలం భోగాపురం గ్రామానికి చెందిన సర్వేశ్వరరావుగా గుర్తించారు. అతడు లారీ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. అతడు ఏలూరు నగరానికి పని నిమిత్తం వచ్చి వెళుతూ, ఆ సమయంలో మద్యం సేవించి ఉండటంతో ప్రమాదవశాత్తు డ్రెయినేజీలో పడిపోయుంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఏలూరు టూటౌన్ సీఐ అశోక్కుమార్ ఆధ్వర్యంలో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెదవేగి: రాట్నాలకుంటలోని శ్రీ రాట్నాలమ్మ అమ్మవారిని ఆదివారం వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. అమ్మవారికి విశేష పూజలు, ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి రూ.1,01,727 ఆదాయం వచ్చిందని ఆలయ కమిటీ చైర్మన్ మన్నే శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నల్లూరి సతీష్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ విడుదల సత్యనారాయణ తెలిపారు. -
నేటినుంచి విర్డ్లో కీళ్ల సమస్యలకు ఉచిత చికిత్స
● 24న స్క్రీనింగ్.. 25 నుంచి 27 వరకు శస్త్రచికిత్సలు ● సేవలందించనున్న అమెరికా, భారత్కు చెందిన ఆర్థోపెడిక్ వైద్యులు ద్వారకాతిరుమల: కీళ్ల సమస్యలతో బాధపడుతూ ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు అరుదైన అవకాశం లభించింది. అమెరికా, భారత్కు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులతో ద్వారకాతిరుమల శివారులోని విర్డ్ ఆస్పత్రిలో ఈనెల 24 నుంచి 27 వరకు ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్టు ఆస్పత్రి ట్రస్ట్ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు తెలిపారు. పలు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ భాగస్వాముల సహకారంతో ఈ శిబిరం జరగనుంది. అందులో భాగంగా 24న ఆస్పత్రిలో భుజం, మోచేయి, చేయి, తుంటి, మోకాలి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి 25 నుంచి 27 వరకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. అమెరికా నుంచి డాక్టర్ శ్రీనాథ్ కామినేని, భారత్కు చెందిన డాక్టర్ భావ్యచంద్ మన్నె, డాక్టర్ శ్రీనివాస్ కంభంపాటి, డాక్టర్ కార్తీక్ అస్తి, డాక్టర్ సముందీశ్వరి తదితర వైద్య నిపుణులు సేవలు అందిస్తారని చైర్మన్ తెలిపారు. చికిత్స ఖర్చులు భరించలేని వారికి అత్యాధునిక వైద్య సేవలను ఉచితంగా అందించడమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. వివరాలకు 83744 45108, 79016 95176 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
గూడెం మున్సిపాలిటీ దారెటు?
● స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ ● చైర్మన్ సీటుపై ఆయా వర్గాల ఊహగానాలు ● తెరవెనుక పావులు కదుపుతున్న జనసేన, టీడీపీ తాడేపల్లిగూడెం: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ రాజకీయ వర్గాల్లో గాలి కబుర్లు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియా మాత్రం రాజకీయ పార్టీల్లో సెగ పుట్టిస్తోంది. సర్ సర్వే ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, ముసాయిదా ఓటర్ల జాబితా తయారీకి ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. పూర్తిస్థాయి ఓటర్ల జాబితా అక్టోబరు నాటికి సిద్ధమవుతున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఎన్నికలు మాత్రం రాబోయే జాబితా ఆధారంగా జరగవచ్చనే ప్రచారం లేకపోలేదు. న్యాయపరమైన వ్యాజ్యాల వల్ల గూడెం మునిసిపాలిటీ ఎన్నికలు జరుగుతాయా లేదా అనే విషయంలో ఇంకా మల్లగుల్లాలు సాగుతున్నాయి. లైన్ క్లియర్ అయితే, గూడెం బరిలో చైర్మన్ అభ్యర్థిగా ఏ వర్గానికి చెందిన వారు పోటీ చేయవచ్చనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. రోస్టరా... ట్విస్టా... రోస్టర్ ప్రకారం ఎన్నికల్లో ఏ వర్గానికి రిజర్వేషన్ ఖరారవుతుందనే అంశంపై ఎన్నో చర్చలు ముడిపడి ఉన్నాయి. గూడెం మునిసిపాలిటీ విషయానికొస్తే ‘రోస్టరా... ట్విస్టా...‘ అనే చర్చ జోరుగా సాగుతోంది. ఏదైనా పురపాలక సంఘం నూతనంగా ఏర్పడినా లేదా కొత్తగా అప్గ్రేడ్ అయినా, రిజర్వేషన్లు జనరల్ కేటగిరీ నుంచే ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో జరిగే ప్రతి ఎన్నిక రోస్టర్ ఆధారంగానే జరుగుతుంది. అదే క్రమంలో గూడెం మునిసిపాలిటీకి ఎన్నిక జరిగితే ఏ వర్గానికి రిజర్వేషన్ ఖరారు కాగలదనే చర్చ సర్వత్రా నడుస్తోంది. బీసీ మహిళా... లేదా ఓసీ జనరలా...? 1928లో పంచాయతీగా ఉన్న గూడెం 1958లో మునిసిపాలిటీగా ఆవిర్భవించింది. మెండు నరసింహారావు సర్పంచ్గా ఉన్న సమయంలో, అప్పటికే రెవెన్యూ గ్రామాలుగా ఉన్న జువ్వలపాలెం, తాళ్లముదునూరుపాడు, యాగర్లపల్లి, మొఖాసాగా ఉన్న కడకట్లను కలుపుతూ మునిసిపాలిటీని ఏర్పాటు చేశారు. 1980 నాటికి ఫస్ట్ గ్రేడ్ మునిసిపాలిటీగా అప్గ్రేడ్ కాగా, 2010 నాటికి సెలక్షన్ గ్రేడ్ మునిసిపాలిటీగా మారింది. 35 వార్డులు, 39 నోటిఫైడ్ స్లమ్లు, మూడు నాన్ నోటిఫైడ్ స్లమ్లతో 20.71 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో, 2011 జనాభా లెక్కల ప్రకారం 1,03,577 మంది జనాభా ఉన్నారు. ఇప్పటివరకు చైర్మన్లుగా ఎవరెవరంటే.. 1958 నుంచి ఇప్పటివరకు ఏడుగురు మునిసిపల్ చైర్మన్లుగా పనిచేశారు. 2019 నుంచి ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. తొలి చైర్మన్గా డాక్టర్ కోడే వెంకట్రావు పని చేయగా, ఆయన తర్వాత ఈలి ఆంజనేయులు, ఈలి వెంకట సత్యనారాయణ (ఈవీఎస్) పనిచేశారు. వీరంతా ఓసీ జనరల్ కేటగిరీకి చెందిన వారే. వారి తర్వాత ఓసీ జనరల్ కేటగిరీలో దేవతి పద్మావతి చైర్పర్సన్గా, ఆపై బీసీ జనరల్ కేటగిరీకి చెందిన కరణం అప్పారావు పనిచేశారు. ఆ తర్వాత ఓసీ వర్గానికి చెందిన ఈతకోట భీమశంకరరావు (తాతాజీ), 2014 నుంచి 2019 వరకు బొలిశెట్టి శ్రీనివాసరావు చైర్మన్గా సేవలందించారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నిక జరిగితే బీసీ మహిళ రిజర్వేషన్తో 2019 తర్వాత ఎన్నిక జరగాల్సి ఉంది. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీలకు రోస్టర్ ప్రకారం రిజర్వేషన్ ఇచ్చి ఎన్నిక నిర్వహించాలి. అయితే గ్రామాల విలీన ప్రతిపాదన కారణంగా ఈ వ్యవహారం కోర్టుకెక్కడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ఎన్నికలు జరిగితే, రోస్టర్ ప్రకారం జరగని రెండు ఎన్నికలను పరిగణనలోకి తీసుకొని ఓసీ జనరల్కు అవకాశం ఇస్తారా లేక వేరే వర్గానికి ఛాన్స్ ఇస్తారా అనేది వేచి చూడాలి. పవర్ పాయింట్లు పెరగకుండా, రాజకీయ హవాకు ప్రతిబంధకం కాకుండా ఉండేలా ఆలోచించి ట్విస్ట్ ఇస్తే, బీసీలకే రిజర్వేషన్ దక్కే అవకాశాలున్నాయి. -
మేజిక్ స్టార్ బోస్కు అమెరికా అవార్డు
భీమవరం: మేజిక్ రంగంలో అసాధారణ ప్రతిభ, అంకితభావం, సేవాదృష్టి కనబరుస్తున్న ప్రముఖ మెజీషియన్ ’మేజిక్ స్టార్ బోస్’ను అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ అత్యంత ప్రముఖ వ్యక్తిగా గుర్తించింది. అమెరికా దేశపు 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా, అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘హాల్ ఆఫ్ ఫేమ్’ అవార్డుకు ఆయన్ను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆయనకు అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేసి ఘనంగా సత్కరించింది. మేజిక్ రంగంలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న బోస్, వివిధ సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన ‘మెజీషియన్గా, రచయితగా 55 సంవత్సరాల నా ప్రస్థానం’ పేరుతో తన స్వీయ చరిత్ర గ్రంథాన్ని ప్రచురించి విడుదల చేశారు. ఆగిరిపల్లి: స్థానిక శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం శోభనాచలుడికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి పుణ్యాహవచనం, స్నపన, ప్రత్యేక అలంకరణ, విశేష అర్చన, పవిత్రములకు సంప్రోక్షణ శాంతి హోమం, పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంత కృష్ణా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి సాయి ఏర్పాట్లు పర్యవేక్షించారు. బుట్టాయిగూడెం: అభయారణ్యం మధ్యలోని ప్రకృతి ఒడిలో వెలసిన శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సొంత వాహనాల్లో భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తజనసందోహంతో కోలాహలంగా మారింది. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి, పసుపు, కుంకుమలు, చీరలు సమర్పించి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. తణుకు అర్బన్: మహిళ అదృశ్యంపై తణుకు రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. తణుకు రూరల్ ఎస్సై నాళం శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన గుణ్ణం రాంబాబు భార్య మెంటమ్మ అలియాస్ దేవి (40) గత కొన్నాళ్లుగా తణుకు పట్టణంలోని కేక్స్ అండ్ కో షాప్లో పనిచేస్తున్నారు. రోజూ మాదిరిగానే శనివారం తణుకులో దుకాణానికి ఉదయం 10 గంటలకు వచ్చిన ఆమె బ్యాంక్కు వెళ్లివస్తానని చెప్పి మధ్యాహ్నం 12 గంటలకు దుకాణం నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తండ్రి రావూరి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. దేవి ఆచూకీ తెలిస్తే తణుకు రూరల్ స్టేషన్లో తెలపాలని కోరారు. ద్వారకాతిరుమల: మండలంలోని సీహెచ్ పోతేపల్లి గ్రామానికి చెందిన ఆకెళ్ల శివగోపాలకృష్ణ అదృశ్యమయ్యాడు. నిమ్మకాయల వ్యాపారం నిమిత్తం తెనాలి వెళ్తున్నానని ఈనెల 16న సాయంత్రం 4 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్కు పలుమార్లు ప్రయత్నించగా స్విచ్ఛాఫ్ వస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధుమిత్రులకు ఫోన్చేసి ఆరా తీసినా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో ఆయన భార్య ఆకెళ్ల కెజియా ఆదివారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అరెస్ట్ అప్రజాస్వామికం
మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్ ప్రజాస్వామికం. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. బలమైన సామాజికవర్గ ప్రజాప్రతినిధులు, నేతలను టార్గెట్ చేస్తున్నారు. అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలు, వేధింపులు ప్రజాస్వామ్యంలో సరికాదు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని కూటమి పెద్దలు గ్రహించాలి. – కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు మాజీ ఎమ్మెల్యే అక్రమ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేయడం అన్యాయం. బీసీ నాయకుడిని తప్పుడు కేసులో ఇరికించారు. టీడీపీ ప్రభుత్వం పాలనను గాలికొదిలేసి, అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేదు. – మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, నూజివీడు మాజీ ఎమ్మెల్యే -
బీసీ నేతలపై పగబట్టి..
అక్రమ కేసులు, ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్ట్లు చేస్తూ కక్ష సాధింపు రాజకీయాలు నడుపుతున్న కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. బీసీ సామాజికవర్గానికి చెందిన నేత రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక చంద్రబాబు సర్కారు అక్రమ కేసును బనాయించి కారుమూరిని అరెస్ట్ చేసింది. బీసీ నాయకులపై పగబట్టారు. – ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్సీపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపులు పరాకాష్టకు చేరా యి. కూటమి ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే మాజీ మంత్రి కారుమూరిని అరెస్ట్ చేయించింది. ఎటువంటి ఆధారాలు లేకుండా, అసలు లేని మద్యం కుంభకోణాన్ని సృష్టించి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇలాంటి చర్యలకు వైఎస్సార్సీపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదు. – కంభం విజయరాజు, చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి బీసీ వర్గానికి చెందిన కారుమూరిని అక్రమ కేసులో అరెస్టు చేయడం కూటమి దుర్మార్గపు చర్యగా భావించాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి రాజకీయంగా బీసీలను అణగదొక్కాలనే ఉద్దేశంతో వేధింపులు, దాడులకు దిగుతోంది. ఎవరెన్ని కుట్రలు చేసినా కారుమూరి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. – నౌడు వెంకటరమణ, వైఎస్సార్సీపీ స్టేట్ బీసీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ -
నాణ్యత డొల్ల.. రోడ్లు గుల్ల
పెనుగొండ: ప్రధాన రహదారుల్లో గుంతల పూడికలో నాణ్యత లోపించడంతో మరమ్మతులు మూన్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. దీంతో వాహనదారుల అవస్థలు పునరావృతం అవుతున్నాయి. పెనుగొండ నుంచి 216వ జాతీయ రహదారి వరకూ ఇటీవలే రోడ్డుపై గోతులను పూడ్చారు. గుంతలు లేని రహదారులంటూ హడావుడి చేశారు. కనీసం మూడు నెలలు కాకుండా మరలా రోడ్డుపై గోతులు పడటంతో మరమ్మతుల్లో నాణ్యత డొల్ల స్పష్టంగా కనిపిస్తోంది. కోనసీమ అంబేడ్కర్ జిల్లా నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించే ముఖ ద్వారం వద్దే ఏర్పడిన భారీ గొయ్యి ప్రమాదాలను నిలయంగా మారింది. జాతీయ రహదారి నుంచి ఏమాత్రం గమనించకుండా లింక్ రోడ్డువైపు దిగినా అంతే సంగతులు. ఇక్కడ ద్విచక్రవాహనాలు బోల్తా పడుతుండగా.. కారులు గోతుల్లో నిలిచిపోతున్నాయి. రామన్నపాలెం వద్ద సైతం రోడ్డుపై గోతులు ఏర్పడటంతో వాహనాలు అప్రమత్తంగా వెళ్లాల్సిన పరిస్థితి. చినుకు పడితే ఈ రోడ్డుపై అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. అలాగే పెనుగొండ శివారునా ఇదే పరిిస్థితి నెలకొంది. నిత్యం వందలాది వాహనాలు ఇటుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా తూర్పుగోదారి, కోనసీమ అంబేడ్కర్ జిల్లాలకు భీమవరం, నరసాపురం, పెనుమంట్ర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. పెనుగొండ ఎస్వీకేపీ విద్యాసంస్థల్లో విధ్యనభ్యసించడానికి వందలాది మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సులు, మో టారు సైకిళ్లుపై వస్తుంటారు. భారీ గోతులతో ఇబ్బందులు పడుతున్నామంటూ వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి రహదారుల మరమ్మతుల్లో నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరమ్మతుల్లో డొల్లతనంతో ఏర్పడిన గొయ్యి రామన్నపాలెం వద్ద రోడ్డు దుస్థితి -
శ్రీవారి క్షేత్రం.. భక్తజన సాగరం
ద్వారకాతిరుమల: చినవెంకన్న సన్నిధి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో పాటు శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో వివాహాలు జరగడంతో సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు, పెళ్లి బృందాలు క్షేత్రానికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. దర్శనం క్యూలైన్లు, అనివెట్టి మండపాలు, కల్యాణకట్ట, నిత్యాన్నదాన భవనం తదితర విభాగాలు భక్తులతో కిక్కిరిశాయి. స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. మరోవైపు శ్రీవారి సన్నిధిలో ఆదివారం ఉదయం కూడా పెద్ద ఎత్తున వివాహాలు జరిగాయి. దీంతో నూతన వధూవరులు, వారి బంధుమిత్రులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. అనివెట్టి మండపంలో భజన మండళ్ల సభ్యుల కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. -
బీసీల రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి
అత్తిలి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 60 శాతం మంది బీసీ జనాభాకు అనుగుణంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వీరవల్లి వీరబ్రహ్మం అన్నారు. అత్తిలి లయన్స్ క్లబ్లో ఆదివారం సంఘ మొదటి జిల్లా సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో ఆరు లక్షల మంది బీసీ ఉద్యోగులు ఉన్నారని, వారి సమస్యల పరిష్కారం కోసం ఐకమత్యంగా కృషి చేస్తామన్నారు. బీసీలకు క్రిమిలేయర్ను రద్దు చేయాలని, పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఏప్రిల్ 11న జ్యోతిరావు పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలకు భారతరత్న ఇచ్చేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషి చేయాలన్నారు. బీసీ ఉద్యోగులకు స్థలాలు కేటాయించాలని, కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో బీసీ భవనాలు నిర్మించాలని, పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు వీరవల్లి రమేష్ మాట్లాడుతూ సంఘం తరఫున ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ డీఏ బకాయిలు, సీసీఎస్ రద్దు వంటి సమస్యలపై వినతిపత్రాలు అందించనున్నట్టు చెప్పారు. బీసీలు రాజకీయ శక్తిగా ఎదగాలని రాష్ట్ర కౌన్సిలర్ టి.గణపతి అన్నారు. బీసీల్లో ఐక్యత లేకపోవటం వల్లే ప్రభు త్వం పట్టించుకోవడం లేదన్నారు. బీసీల ఐక్యత కోసం రాష్ట్ర సంఘ అధ్యక్షుడు వీరబ్రహ్మం విశేష కృషి చేశారని కేవీ రామారావు అన్నారు. బీసీలు అన్నిరంగాల్లో పురోగతి సాధించాలని జిల్లా ఉపవిద్యాశాఖధికారి ఎన్.రమేష్ అన్నారు. జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి వారధి వెంకట రమణారావు, కె.కృష్ణారావు, పంపన కుమారస్వామి, కె.రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ తానంకి శ్రీనివాస్, కె.శాంతారావు,, గుబ్బల రాధాకృష్ణ తదితరులు మాట్లాడారు. సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.కృష్ణారావు అధ్యక్షత వహించారు. జిల్లా కౌన్సిల్ సభ్యుడు టెక్కలి గణపతి, జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో బీసీ ఉద్యోగులు తరలి వచ్చారు. -
ఉప రాష్ట్రపతి పర్యటనకు సర్వం సిద్ధం
ముసునూరు: ఉప రాష్ట్రపతి ముసునూరు మండల పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకష్ణన్, గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ పర్యటనలకు సంబంధించి శాఖల వారీగా కేటాయించిన పనులపై సమీక్షించారు. సోమవారం ముసునూరులోని గోర్మే పాప్ కార్నికా సంస్థ ఆధ్వర్యంలో జన్యుపరంగా మార్పు చెందని మొక్కజొన్న వంగడాన్ని ఉప రాష్ట్రపతి ఆవిష్కరిస్తారన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తిచేసి, విజయవంతం చేయాలని ఆదేశించారు. హనుమాన్ జంక్షన్ నుంచి ముసునూరులో సభాస్థలి వరకు పశువులు, మూగజీవాలు కాన్వాయ్లకు అడ్డురాకుండా చూడాలన్నా రు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్కుమార్రెడి పాల్గొన్నారు. భీమవరం: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 26న భీమవరం అనసూయ చెస్ అకాడమీలో రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చదరంగ పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు మాదాసు కిషోర్ తెలిపారు. విజేతలకు రూ.25 వేల విలువగల చదరంగ పుస్తకాలను బ హుమతులుగా అందిస్తామన్నారు. అండర్ 7, 9, 11, 13, 15 బాలబాలికల గ్రూపులో విజేతలకు షీల్డ్స్, మెడల్స్ కూడా ఇస్తామని, వివరాలకు 90632 24466లో సంప్రదించాలని కోరారు. -
కక్ష సాధింపు తగదు
మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుటుంబంపై ప్రభుత్వం కక్ష సాధింపు తగదు. ఇది బీసీలను అణగదొక్కడానికి జరుగుతున్న చర్యగా భావిస్తున్నాం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విక్రయాలు పారదర్శకంగా జరిగాయి. కారుమూరి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు మానాలి. – దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్), వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు బీసీలు రాజకీయంగా ఎదగకుండా వెన్నుపోటు పార్టీ చేపట్టిన చర్యగా కారుమూరి అరెస్ట్ కనిపిస్తోంది. లేని మద్యం కేసు సృష్టించి గతంలో కారుమూరి సునీల్ను, ఇప్పుడు మాజీ మంత్రి కారుమూరిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం సరఫరా, విక్రయాలు పారదర్శకంగా జరిగాయి. అక్రమ మద్యాన్ని నియంత్రించారు. – వడ్డి రఘురామ్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్చార్జి -
‘సీనియర్ సిటిజన్స్’ జిల్లా అధ్యక్షుడిగా రంగారావు
నరసాపురం: సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా అందే రంగారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక అల్లూరి సాంస్కృతిక కేంద్రంలో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో జిల్లా కమిటిని ఎంపిక చేశారు. గౌరవ అధ్యక్షుడుగా పెన్నెత్స బాబుశ్రీ, అసోసియేట్ అధ్యక్షుడిగా బోనం పాండురంగారావు, ప్రధాన కార్యదర్శిగా కొటికలపూడి చిట్టి వెంకయ్య, కార్యదర్శిగా షేక్ సిలార్ సాహెబ్, కోశాధికారిగా కొట్రెడ్డి సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా మేళం దుర్గాప్రసాద్, అల్లూరి కరుణాకర్, నల్లం నాగేశ్వరరావు, యర్రంశెట్టి వెంకటరత్నం, వలవల రవీంద్రనాథ్ ఠాగూర్ ఎన్నికయ్యారు. ఏపీ విశ్రాతం ఉద్యోగుల సంఘ నాయకుడు రుద్రరాజు రామకృష్ణరాజు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.రాష్ట్ర అధ్యక్షుడు కుకుమారి రామచంద్రరావు నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. భీమవరం: ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఈనెల 28న విజయవాడలో తలపెట్టిన ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని జిల్లా చైర్మన్ ఐవీవీ సత్యనారాయణ కోరారు. ఆదివారం భీమవరంలో నిర్వహించిన సమావేశంలో సదస్సు పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఉద్యమమే శరణ్యమని, అందరూ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జనరల్ సెక్రటరి అల్లం సత్యనారాయణ, మహిళా విభాగం చైర్పర్సన్ డి.సుగుణ సంధ్య, వైస్ చైర్మన్ బి.అరుణ పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): గుంటూరులో ఏపీసీఎస్ఏ తలపెట్టిన భారీ నిరసన ర్యాలీకి అ మరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న సీపీఎస్ ఉద్యోగులంతా వచ్చేనెల 1న ర్యాలీకి హాజరుకావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోమంది పెన్షన్ విషయంలో ఇబ్బంది పడుతున్నారని, రిటైర్ అయిన తర్వాత వారి పరిస్థితి అధ్వానంగా ఉందని, సీపీఎస్ ఉద్యోగులకు న్యాయం చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ కమిషన్ వేయాలని, ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ డీఏలు, సరెండర్ లీవ్ బకాయిలు, మెడికల్ రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
తాగడానికి పనికిరావు
మంచినీటి చెరువులో గుక్కెడు నీళ్లు కూడా గొంతులో పోసుకోవడానికి అవకాశం లేదు. చెరువులోని నీరు పూర్తిగా కలుషితమైంది. అయినప్పటికీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికై నా చెరువును అభివృద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందజేయాలి. – కె.దుర్గారావు, చావలిపాడు అస్తవ్యస్తంగా ఉన్న మంచినీటి చెరువును వెంటనే అభివృద్ధి చేయాలి. ఇది పేరుకే మంచినీటి చెరువు, కానీ ఈ నీటిని ఏవిధంగానూ ప్రజలు వినియోగించే అవకాశం లేదు. గుక్కెడు నీటిని గొంతులో పోసుకుంటే వ్యాధులు రావడం ఖాయం. ఉన్నతాధికారులు స్పందించి చెరువును బాగుచేసి శుభ్రమైన తాగునీటిని అందించాలి. – ఆర్.రామారావు, చావలిపాడు -
ఎన్హెచ్ 165కు గ్రహణం
సోమవారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2026ఆకివీడు: ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి. ప్రజల అభీష్టం మేరకు పాలకులు పనిచేయాల్సి ఉండగా, స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తుండటంతో ప్రజలు ఉద్యమించక తప్పడం లేదు. పాలకొల్లు–పామర్రు రహదారిని (ఎన్ హెచ్– 165) జాతీయ రహదారుల శాఖలో విలీనం చేసి 22 ఏళ్లు గడుస్తున్నా, దీని అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. జాతీయ రహదారిగా గుర్తింపు.. నిలిచిపోయిన పనులు పాలకొల్లు–పామర్రు రోడ్డును దిగమర్రు–పామర్రు రోడ్డుగా మార్చి జాతీయ రహదారి నెం.165గా గుర్తించారు. 2004లో జాతీయం చేసుకున్న ఈ శాఖ, ఇప్పటివరకు రోడ్డు విస్తరణ లేదా అభివృద్ధి పనులను చేపట్టలేదు. ఆ తర్వాత ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం ఈ రహదారిని రెండు ప్రాజెక్టులుగా విభజించింది. మొదటి ప్రాజెక్టు పామర్రు– ఉప్పుటేరు, అజ్జమూరు–దిగమర్రు ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించారు. రెండో ప్రాజెక్టు అజ్జమూరు నుంచి రహదారి అభివృద్ధికి రూ.1,200 కోట్లు మంజూరు చేశారు. అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ 2019లో ఆకివీడు జెడ్పీ స్కూల్ ఆవరణలో వర్చువల్ శంకుస్థాపనలు చేశారు. అయితే పామర్రు నుంచి దిగమర్రు వరకు ఇప్పటికీ రోడ్డు పనులు ప్రారంభం కాలేదు. అలైన్ మెంట్ వివాదం.. నిలిచిన వంతెన నిర్మాణం అధికారులు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును (డీపీఆర్) అప్పట్లోనే కేంద్రానికి అందజేశారు. అయితే ప్రజాప్రతినిధులు మారడంతో అలైన్మెంట్ను మార్చి, మరో రూ.2,000 కోట్లు కలిపి రూ.3,200 కోట్లతో కొత్త ప్రతిపాదనలు పంపారు. దీనిని కేంద్రం తిరస్కరించి, పాత అలైన్ మెంట్లో మార్పులు చేసి డీపీఆర్ పంపాలని ఆదేశించింది. కొత్త రూట్ వల్ల చెరువులు, లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతోపాటు, భూములు పూడ్చేందుకు భారీ వ్యయమవుతుంది. లూజ్ సాయిల్ వల్ల రోడ్డు త్వరగా పాడైపోయి వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందని అధికారులతోపాటు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఉప్పుటేరుపై బైపాస్ వంతెన నిర్మాణానికి మూడేళ్ల క్రితం 12 పిల్లర్లు వేశారు కానీ, పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ఎన్హెచ్–165 అభివృద్ధి పట్టదా అని డెల్టా ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర మంత్రి వర్గంలో ఈ ప్రాంతానికి చెందిన ఎంపీ ఉన్నా.. రెండున్నరేళ్లుగా ఎన్ హెచ్ అభివృద్ధిని పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఉప్పుటేరు నుంచి అజ్జమూరు వరకూ భూసేకరణ పనులు పూర్తి చేసినా అక్కడ మట్టి పూడిక, ఇతర రహదారి పనులు ప్రారంభించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు అంటున్నారు. అధికారుల విముఖత ఎన్హెచ్–165 కొత్త అలైన్ మెంట్ రూట్ను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కమిషనర్ దీని వల్ల ఉపయోగం లేదని, చెరువులు, లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని సూచించినట్టు తెలిసింది. జాతీయ రహదారి లేకపోవడంతో ఆక్వా చెరువులు, అనుబంధ పరిశ్రమలు, విద్యా సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగాలు దెబ్బతింటు న్నాయి. కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరి శ్రమలు కూడా తరలిపోతున్నాయని ప్రజలు ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎన్ హెచ్–165 పనులను తక్షణమే ప్రారంభించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.కూటమి నిర్లక్ష్యం పాత అలైన్మెంట్కు ప్రజాప్రతినిధులు ససేమిరా ! కొత్త అలైన్మెంట్కు కేంద్రం నో శంకుస్థాపన చేసి ఏడేళ్లు ఎన్హెచ్లో విలీనమైన 22 ఏళ్లు డెల్టా ప్రాంతానికి జాతీయ రహదారి అవసరం ఎంతైనా ఉంది. ఎన్హెచ్–165 అభివృద్ధికి రాజకీయలు, స్వార్థ ప్ర యోజనాలు తగదు. అడ్డంకుల్ని తొలగించి తక్షణం డీపీఆర్ను రూపొందించి అమలుజేయాలి. పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలంటే జాతీయ రహదారులు అభివృద్ధి చెందాలి. – ముదునూరి మురళీకృష్ణంరాజు, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ఉండి నియోజకవర్గంలో రాష్ట్ర, కేంద్ర రహదారులు అధ్వానంగా ఉన్నాయి. రోడ్ల విస్తరణ, అభివృద్ధి జరగాల్సి ఉంది. ఏళ్ల తరబడి ఎన్ హెచ్ 165 ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా మారింది. రైతులు స్వచ్ఛందంగా భూమిని ఇచ్చినా ఉప్పుటేరు నుంచి అజ్జమూరు వరకు రోడ్డు పనులు ప్రారంభించలేదు. – మంతెన యోగీంద్రకుమార్ (బాబు), వైఎస్సార్సీపీ ఉండి నియోజకవర్గ ఇన్ చార్జి -
పెద్దింట్లమ్మా.. రక్షించమ్మా..
కై కలూరు: పెద్దింట్లమ్మా.. నీ చల్లని దీవెనలు మాకు అందించమ్మా.. అంటూ భక్తులు అమ్మను ఆర్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సమీప జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మకు వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఒక్క రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, దేవస్థానం అద్దె గదులు, అమ్మవారి చిత్రపటాల విక్రయం, విరాళాల ద్వారా రూ.52,511 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు చెప్పారు. -
పసిబాల్యం.. భిక్షాటనలో ఛిద్రం
ద్వారకాతిరుమల: పసిపిల్లల చేతుల్లో పుస్తకాలు.. బొమ్మలు ఉండాలి. తల్లిదండ్రుల చేతుల్లో భద్రంగా ఆడుకోవాలి. కానీ ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో కొందరు చిన్నారులు తల్లుల చేతుల్లో భిక్షాపాత్రలుగా మారుతున్నారు. ఎండ మండుతున్నా.. వాన కురుస్తున్నా.. పసి పిల్లలను ఎత్తుకుని ఆలయ పరిసరాల్లో భిక్షాటన సాగిస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల వెంటపడి డబ్బులు అడుగుతున్నారు. ఇవ్వకపోతే కొందరు దూషణలకు దిగుతున్నారు. సానుభూతిని సొమ్ము చేసుకునేందుకు పసి బిడ్డలనే పావులుగా మార్చేస్తున్న ఈ దృశ్యాలు.. క్షేత్రంలో నిత్యం మన కళ్లముందే కనిపిస్తున్నాయి. భక్తులే టార్గెట్.. పిల్లలే అడ్డం శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఇదే అదనుగా కొందరు యాచకులు పిల్లలను ఎత్తుకుని భక్తుల వెంట తిరుగుతున్నారు. చిన్నారులను చూపిస్తూ డబ్బులు అడుగుతున్నారు. ఒక భక్తుడు ఇవ్వకపోతే మరో భక్తుడి వెంటపడుతున్నారు. కొందరు పదేపదే అడుగుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని భక్తులు వాపోతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ఎండ.. వాన.. రక్షణేది? పసిపిల్లలను గంటల తరబడి ఎండలో తిప్పడం.. వర్షంలో తడపడం.. రద్దీ ప్రాంతాల్లోకి తీసుకెళ్లడం వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. పాలు తాగే వయసున్న చిన్నారుల నుంచి కొద్దిగా ఎదిగిన పిల్లల వరకు ఈ భిక్షాటనలో కనిపిస్తున్నారు. ఆ పిల్లలకు విశ్రాంతి ఉందా? సరైన ఆహారం అందుతోందా? పాఠశాలకు వెళ్తున్నారా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. చట్టం కఠినంగా ఉన్నా.. పిల్లలను భిక్షాటన కోసం ఉపయోగించడం సాధారణ విషయం కాదు. జువైనెల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్–2015 లోని సెక్షన్ 76 ప్రకారం పిల్లలను భిక్షాటనకు ఉపయోగించినా, వారితో భిక్షాటన చేయించినా ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. భిక్షాటన కోసం చిన్నారిని అంగవైకల్యానికి గురిచేయడం వంటి తీవ్రమైన చర్యలకు పాల్పడితే ఏడేళ్ల నుంచి పదేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. పిల్లలను రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? భిక్షాటనలో కనిపించే చిన్నారులను కేవలం అక్కడి నుంచి తరిమేయడం పరిష్కారం కాదు. వారి పరిస్థితిని పరిశీలించి రక్షణ, పునరావాసం కల్పించాలి. ఇందుకోసం స్థానిక పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (డీసీపీయూ), చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ), మహిళా–శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో చర్యలు తీసుకోవాలి. పిల్లలు ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తే ఎవరైనా చైల్డ్ హెల్ప్లైన్ 1098కు సమాచారం ఇవ్వొచ్చు. ఆలయ పరిసరాల్లో ప్రత్యేక డ్రైవ్ ఏదీ? ద్వారకాతిరుమల వంటి ప్రముఖ పుణ్యక్షేత్రంలో పిల్లలను అడ్డం పెట్టుకుని భిక్షాటన సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల భక్తులు మండిపడుతున్నారు. ఆలయ పరిసరాలు, ఘాట్ రోడ్లు, పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టి చిన్నారులతో భిక్షాటన చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అవగాహన కల్పించాలి పసిబిడ్డలను ఎత్తుకుని భక్తుల ముందు నిలబడటం ద్వారా వచ్చే ప్రతి రూపాయి వెనుక ఒక చిన్నారి బాల్యం దాగి ఉంది. సానుభూతి పేరుతో డబ్బులు ఇవ్వడం కన్నా.. చిన్నారి భిక్షాటనలో కనిపిస్తే 1098 కు సమాచారం ఇవ్వడం మేలని అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈ టోల్ఫ్రీ నెంబర్కు సంబంధించిన ఫ్లెక్సీలు, బోర్డులను క్షేత్రంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే కొంత మేరకు సత్ఫలితాలు రావొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో పసిపిల్లలతో తల్లుల భిక్షాటన ఎండైనా.. వానైనా.. పిల్లలను ఎత్తుకుని భక్తుల వెంట యాచన డబ్బులివ్వకుంటే దూషణలు.. చిన్నారుల భద్రత పట్టని వైనం నిఘా పెట్టాల్సిన అధికారులెక్కడ? -
ఐసెట్ కౌన్సెలింగ్ కేంద్రం ప్రారంభం
భీమవరం: స్థానిక సీఎస్ఎన్ కళాశాలలో ఏపీ ఐసెట్ ఉచిత కౌన్సెలింగ్ కేంద్రాన్ని శనివారం సెక్రటరీ, కరస్పాండెంట్ చీడే సత్యనారాయణ ప్రారంభించారు. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం ఈనెల 24 నుంచి 31 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ సకుమల్ల సత్యనారాయణ తెలిపారు. ఈ కేంద్రంలో విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకుని, ఉచితంగా కౌన్సెలింగ్ సేవలు పొందవచ్చన్నారు. ఈనెల 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని, వచ్చేనెల 7న సీటు కేటాయింపు ఉంటుందన్నారు. కేవీ సత్యనారాయణ, పి.దుర్గాప్రసాద్, టి.లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
పరిశుభ్రత అందరి బాధ్యత
భీమవరం (ప్రకాశంచౌక్): పరిశుభ్రమైన పట్టణ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక హౌసింగ్ బోర్డు ప్రాంతంలోని ఆదిత్య కళావేదిక పార్కులో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. పరిసరాల పరిశుభ్రత, చెత్త నిర్వహణ, పచ్చదనం, స్వచ్ఛత అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ‘సర్’ పరిశీలన భీమవరం మున్సిపాలిటీ పరిధిలో సర్ ప్రత్యేక కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఓటర్ల వివరాల పరిశీలన, సవరణలు, కొత్త ఓటర్ల నమోదు తదితర ప్రక్రియలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తణుకు అర్బన్: తణుకు ఎస్కేఎస్డీ మహిళా కళాశాలలో ఈనెల 26న ఉద్యోగ దిక్సూచి మేళా నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ యు.లక్ష్మీసుందరీబాయ్ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి జరిగే మేళాలో 800లకుపైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు. జియో, ఎల్అండ్టీ, అపోలో ఫార్మసీ, టాటా ఎలక్ట్రా నిక్స్, కియా ఇండియా, హెటెరో ల్యాబ్స్, ఆంధ్రా సుగర్స్ వంటి 15కు పైగా కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ పూర్తయిన వారు రెజ్యూమ్తోపాటు సర్టిఫికెట్స్ జెరాక్స్ కాపీలు వెంట తీసుకురావాలని, ఫార్మల్ డ్రెస్లో రావాలని సూచించారు. భీమవరం: విద్యుత్ ఏఈఈ నియామక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్టు ఎస్ఈ పి.ఉషారాణి తెలిపారు. ఆదివారం నుంచి 27 వరకు ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండు సెక్షన్లుగా పరీక్షలు జరుగుతాయన్నారు. భీమవరం డీఎన్నార్, సీతారాంపురంలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్, తాడేపల్లిగూడెంలో శశి ఇంజనీరింగ్, పెదతాడేపల్లిలో వాసవీ ఇంజనీరింగ్ కాలేజీల్లో కేంద్రాలు ఏర్పాటుచేశారన్నారు. -
ఇది కూటమి ప్రభుత్వమా.. కూల్చే ప్రభుత్వమా?
వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి ధ్వజం ఇరగవరం: ఇది కూటమి ప్రభుత్వమా.. కూల్చే ప్రభుత్వమా అని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అ ధ్యక్షురాలు, శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. శనివారం మండంలోని అయితంపూడిలో తాజా మాజీ సర్పంచ్ లావణ్య కుటుంబాన్ని మరో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డితో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నేతల ఇళ్లను టీడీపీ నేతలు రాజకీయ కక్షలతో కూల్చడం దారుణమన్నారు. తణుకు నియోజకవర్గంలో భయానక వాతావరణం ఉందనడానికి ఈ సంఘటనే నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు తణుకు ఎమ్మెల్యేకు గుణపాఠం తప్పదన్నారు. సర్పంచ్పై ఇంత కక్ష అవసరమా? ఇంత దౌర్జన్యమా? మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ చేస్తున్న రెడ్బుక్ రాజ్యాంగానికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అలాగే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్పై కూడా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందన్నారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు రెడ్బుక్ రాజ్యాంగ పాలన దారుణంగా ఉందన్నారు. ఇళ్లు కో ల్పోయి న వైఎస్సార్సీపీ కుటుంబంతో పాటు మిగిలిన మూడు కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుంద న్నారు. భీమవరం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కనుమూరి విజయదుర్గ, భీమవరం టౌన్ ప్రెసిడెంట్ వై.కృపామణి, జిల్లా మహిళా విభాగం కార్యదర్శి మొగ్గ మంగ, భీమవరం 25వ వార్డు సెక్రటరీ పట్టిం శశితల్లి, పార్టీ అంగన్వాడీల విభాగ రా ష్ట్ర ఉపాధ్యక్షురాలు మద్దా చంద్రకళ, ఎస్.ఎలిజిబెత్ రాణి, ఆశాజ్యోతి, బుద్ధరాజు దేవి, తణుకు మహిళ అధ్యక్షురాలు మెహర్ అన్సారీ, కాకర్ల విశాలాక్షి, మండల అధ్యక్షురాలు కిరణ్మయి, ఉండవల్లి జానకి, షేక్ పాహిమా, టౌన్ మహిళా ప్రెసిడెంట్ నూకాల కనకదుర్గ, నాయకులు పాల్గొన్నారు. -
పేదలపై పంచ్ధర
ద్వారకాతిరుమల: పండుగల వేళ ఇంట్లో తీపి చేసుకుందామంటే ధరలు చేదు అనుభూతిని మిగులుస్తున్నాయి. వంటింట్లో నిత్యావసరమైన పంచదార ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. ప్రస్తుతం పండుగలు, వ్రతాలు, శుభకార్యాల సీజన్ కావడంతో వీటి వినియోగం పెరిగి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. రిటైల్ మార్కెట్లో జులై నెలాఖరు నాటికి కిలో పంచదార ధర రూ.45 ఉండగా.. ప్రస్తుతం రూ.75కు చేరింది. ఈనెల ప్రారంభం నుంచి ధరలు మరింత పెరుగుతున్నాయి. 22 రోజుల్లోనే కిలోకు రూ.30 పెరగడం షాక్కు గురిచేస్తోంది. ఈనెల 1న కిలో రూ.45 ఉన్న ధర ప్రస్తుతం రూ.75గా చేరింది. ఒక కుటుంబం సగటున నెలకు 5 కిలోల పంచదార వినియోగిస్తే సుమారు రూ.150లు అదనపు భారం కానుంది. జిల్లాలో చక్కెర వినియోగంలో 35 శాతం వరకు మాత్రమే ఇళ్లల్లో వాడుతుండగా.. మిగిలిన 65 శాతం హో టళ్లు, బేకరీలు, స్వీట్ షాపులు, క్యాటరింగ్ వ్యాపారాలు, డ్రింక్స్, ఫాస్ట్ఫుడ్ తయారీ యూనిట్లలో వినియోగిస్తున్నారు. మరింత పెరిగే అవకాశం : ఆగస్టు నుంచి నవంబర్ వరకు పండుగల సీజన్ కావడంతో పంచదారకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ధరలూ పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. దేశీయ మార్కెట్లో సరఫరా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా 10 లక్షల టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. అది సత్ఫలితాలనిస్తే ధరలు అదుపులోకి రావచ్చని అంటున్నారు. అదేబాటలో బెల్లం పంచదార ధరల పెరుగుదల బాటలో బెల్లం కూడా పయనిస్తోంది. ప్రస్తుతం రూ.70 నుంచి రూ.100 వరకు నాణ్యతను బట్టి బెల్లం ధరలు ఉన్నాయి. ఆర్గానిక్, ప్యూర్ చెరకు, ప్రముఖ బ్రాండ్ల బెల్లం ధరలు మరింత భగ్గుమంటున్నాయి. నాణ్యమైన ఆర్గానిక్ బెల్లం కిలో రూ.100కు పైగా ఉంది. పంచదార, బెల్లంతో పాటు బియ్యం, నూనెలు, ధని యాలు, పప్పులు, ఉల్లిపాయలు తదితర నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుండటం సా మాన్యుడిని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కూటమి ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. పండుగ సీజన్ ప్రారంభమైందని సంబరపడేలోపు పంచదార ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇతర ముడి సరుకుల ధరలు సైతం భారమయ్యాయి. స్వీట్ల తయారీ ఖర్చు బాగా పెరిగింది. అలాగని స్వీట్ల ధరలు పెంచితే కొనేనాథుడు ఉండడు. పాత ధరలకు అమ్ముదామంటే నష్టాలు భరించాల్సి వస్తోంది. వ్యాపారం ఎలా నడపాలో అర్థం కావడం లేదు. – కొత్తపల్లి దొరబాబు, స్వీట్ షాపు నిర్వాహకుడు, ద్వారకాతిరుమల గత మూడు వారాల్లో పెరిగిన చక్కెర ధర కారణంగా వ్యాపారం దెబ్బతింటోంది. శ్రావణమాసం, వినాయక చవితి, దీపావళి పండుగ సమయాల్లో స్వీట్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఈసారి మెటీరియల్ కాస్ట్ పెరిగిపోవడంతో పెట్టుబడులు కూడా వచ్చేలా కనిపించడం లేదు. ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను అదుపుచేయాలి. – గోపారామ్ దేవాసీ, స్వీట్ షాపు నిర్వాహకుడు, ద్వారకానగర్ తేదీ హోల్సేల్ రిటైల్ఆగస్టు 1 45 50 ఆగస్టు 4 50 55 ఆగస్టు 10 56 60 ఆగస్టు 17 60 65 ఆగస్టు 19 63 68 ఆగస్టు 22 70 75 సంవత్సరం వార్షిక వ్యక్తి సగటు వినియోగం వినియోగం (టన్నులు) (కిలోలు) 2020–21 1.05 లక్షలు 23.5 2021–22 1.12 లక్షలు 24.8 2022–23 1.18 లక్షలు 25.9 2023–24 1.22 లక్షలు 26.5 2024–25 1.25 లక్షలు 27.0 చేదెక్కిన తీపి చక్కెర ధరలు ౖపైపెకి.. 22 రోజుల్లో కిలోకు రూ.30 పెరుగుదల రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం అదే బాటలో బెల్లం ధరలు టీ షాపులు, స్వీట్స్, బేకరీలు, హోటళ్ల వ్యాపారంపై తీవ్ర ప్రభావం ఏఐ సృష్టించిన చిత్రం -
గూడు.. గోడు
భీమవరం(ప్రకాశం చౌక్): రాష్ట్రంలో చంద్రబాబు కూటమి పాలనలో గ్రామీణ ప్రజలకు ‘గృహ’యోగం కలగడం లేదు. ప్రభుత్వం గద్దెనెక్కి రెండేళ్లు దాటినా జిల్లాలో ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయకపోవడం పేదల సంక్షేమంపై నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దీంతో పేదల సొంతింటి కల సాకారం కావడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు భూమి చొప్పున మంజూరు చేయగా.. వేలాది ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. కొందరికి స్థలాలు మంజూరు కాగా ఇళ్ల నిర్మాణాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఇళ్ల ఊసే ఎత్తడం లేదు. దీంతో అద్దె ఇళ్లలోనూ కాలం గడుపుతున్నారు. కొందరు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టినా బిల్లులు రావడం లేదు. పట్టణాలకు మాత్రమే 595 ఇళ్లు : చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు దాటినా జిల్లాలో పట్టణాలకు 595 ఇళ్లు మాత్రమే మంజూరు చేసింది. వీటిలో 57 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. 2014 నుంచి 2019 వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం సెంటు భూమి కూడా పేదలకు ఇవ్వలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ ఇళ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం చూపుతుందని లబ్ధిదారులు వాపోయారు. అప్పట్లో సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేవారికి గృమాలు మంజూ రు కూడా అరకొరగా ఉంది. అది కూడా టీడీపీ నా యకులు, అనుయాయులకే ప్రాధాన్యమిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. నిర్మాణాలకూ వెనుకడుగు వేసవి కాలం ఇళ్ల నిర్మాణాలకు అనుకూలం. ఏటా జనవరి నుంచి జూన్ వరకు నిర్మాణ పనులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇలాంటి సమయంలో నిర్మాణాలు చేపడదామని ఆలోచిస్తున్న పేదలకు ప్రభుత్వ సాయం మాత్రం అందడం లేదు. దీంతో చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. అక్కడక్కడా కొందరు మాత్రమే అప్పులు చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. చాలా చోట్ల గ్రామాల్లో గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్ల స్థలాలు ఖాళీగానే ఉన్నాయి. బెస్మెంట్, దశల వా రీగా నిర్మాణాలు చేపట్టినా బిల్లులు వస్తాయో రావో అన్న సందిగ్ధంలో చాలా మంది ఉన్నారు. యూనిట్ కాస్ట్ పెంచాలి : పెరుగుతున్న భవన నిర్మాణ సామగ్రి ధరల దృష్ట్యా ఇంటి యూనిట్ కాస్ట్ పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం యూనిట్ కాస్ట్ రూ.1.80 లక్షలు ఉండగా కనీసం రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెంచాలని స్థలాల లబ్ధిదారులు కోరుతున్నారు. ఇళ్ల మంజూరు 72,059 తొలి రెండేళ్లలో పూర్తయినవి 15 వేలు శ్లాబ్ పూర్తయినవి 1,513 శ్లాబ్ దశకు వచ్చినవి 2,025 పలు దశల్లో నిర్మాణాలు 34,000 గ్రామాల్లో ఇళ్ల మంజూరు నిల్ పట్టణాలకు ఇళ్ల మంజూరు 595 వాటిలో పూర్తయినవి 57 నిర్మాణంలో ఉన్నవి 224 అనుగృహమెప్పుడో..? ఇళ్ల మంజూరు కోసం పేదల ఎదురుచూపులు గ్రామీణ ప్రాంతాలకు ఇళ్ల మంజూరు నిల్ రెండేళ్లలో పట్టణాలకు కేవలం 595 ఇళ్లు మంజూరు వాటిలో నిర్మాణం పూర్తయినవి 57 గృహాలే.. ఇళ్ల నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం ఏఐ సృష్టించిన చిత్రం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల ఇళ్ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. జగనన్న లేవుట్లు, సొంత స్థలాలు మొత్తంగా సుమారు 70 వేల ఇళ్లు మంజూరు చేయగా వాటిలో 30 వేల నిర్మాణాలు పూర్తయ్యాయి. అధికారం చేపట్టిన తొలి రెండేళ్లలోనే 15 వేల వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేశారు. వేలాది ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లలో సుమారు 6 వేల నిర్మాణాలు చంద్రబాబు పాలనలో పూర్తికాగా.. చంద్రబాబు తన మంత్రులు, అధికారులతో గృహప్రవేశాలు చే యించి వాటిని తానే మంజూరు చేసినట్టు గొప్పులు చెప్పుకుంటున్నారు. -
వైఎస్సార్సీపీ నేతలపై అరకమ కేసులు
నిట్కు కొత్త డైరెక్టర్ ఏపీ నిట్కు నాలుగేళ్ల తర్వాత కొత్త డైరెక్టర్గా ముంబై ఐఐటీ ప్రొఫెసర్ కృష్ణారావు రానున్నారు. అక్టోబర్లో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 8లో uపాలకొల్లు సెంట్రల్: గతేడాది యలమంచిలి ఎంపీపీ ఎన్నికల సమయంలో పెట్టిన కేసులకు సంబంధించి వైఎస్సార్సీపీ నాయకులకు కోర్టు సమన్లు వ చ్చాయి. శనివారం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎంపీపీ ఎన్నికల్లో తమపై అక్రమ కేసులు బనాయించారన్నారు. కూటమి నాయకులే తమ ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేశారని, అయినా తమ నాయకులు వైఎస్ జగన్పై నమ్మకంతో నిజాయితీగా నిలిచారన్నారు. దీనిని జీర్ణించుకోలేని కూటమి నేతలు అక్రమ కేసులు పెట్టి వేధించడం దారుణమన్నారు. తమకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్నారు. కేసులకు భయపడబోమని, కూటమి అక్రమాలను నిలదీస్తూనే ఉంటామన్నారు. ఇటీవల పాలకొల్లు ఏరి యా ఆస్పత్రి అభివృద్ధి పనుల్లో చెత్తను తీసుకువచ్చి డంప్ చేయడాన్ని తీవ్రంగా ప్రతిఘటించామని, దీంతో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. ఆస్పత్రి ఘటనపై కూడా తమ నాయకులపై సీఐడీ కేసులు పెట్ట డం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇప్పటివరకూ పార్టీ నాయకులు యడ్ల తాతాజీ, చిలువూరి కుమారదత్తాత్రేయ వర్మ, ఉచ్చుల స్టాలిన్, కోరాడ శ్రీను, పాలపర్తి కృపానాథ్, బండి రమేష్, రేలంగి శ్రీను, చెన్ను విజయ్, గుంటూరు పెద్దిరాజు, మద్దా చంద్రకళ, మోకా ప్రేమ్చంద్, కుక్కల బాలచందర్, మ ల్లుల కొండ, మందా హరికుమార్, పాలంకి శ్రీను, పోలుకొండ వెంకట్, శంకరావు శ్రీను, పాలపర్తి సందీప్, కొయ్యే నాగేశ్వరరావు, అడబాల రాము, గందం సత్యకీర్తిలకు కోర్టు నుంచి సమన్లు వ చ్చాయన్నారు. కోరాడ శ్రీనివాస్, ఉచ్చుల స్టాలిన్, చెన్ను వి జయ్, పాలపర్తి కృపానాథ్, కుక్కల బాలచందర్, రేలంగి శ్రీను శనివారం సమన్లు అందుకున్నారు. -
ఇన్చార్జిల పాలనే దిక్కు
● ఆర్జీయూకేటీకి రెగ్యులర్ చాన్సలర్ లేని వైనం ● రిజిస్ట్రార్, నూజివీడు, ఒంగోలు డైరెక్టర్లందరూ ఇన్చార్జిలే నూజివీడు: రాష్ట్రంలోని పేదవర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆర్జీయూకేటీతో పాటు దీని పరిధి లోని ట్రిపుల్ఐటీలకు ఇన్చార్జిల పాలనే దిక్కుగా మారింది. ఆర్జీయూకేటీ పరిధిలో నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీలు ఉండగా వీటిల్లో 26,400 మంది విద్యార్థులు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు. మొత్తం విద్యార్థుల్లో 65 శాతం మంది విద్యార్థులు బాలికలే ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీ పరిధిలో కూడా లేరు. రెండేళ్ల పీయూసీతో పాటు నాలుగేళ్ల ఇంజినీరింగ్ విద్యతో పాటు ఎంటెక్ను సైతం ఇక్కడ బోధిస్తారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఆర్జీయూకేటీకి ఇంత వరకు రెగ్యులర్ చాన్సలర్ లేకపోవడం గమనార్హం. ఉన్నత విద్యామండలి చైర్మన్కే ఇన్చార్జి బాధ్యతలు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కొత్తా మధుమూర్తికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్జీయూకేటీ చాన్సలర్గా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. దీంతో మధుమూర్తి ఉన్నత విద్యామండలి చైర్మన్ బాధ్యతలకే పరిమితమవుతూ ట్రిపుల్ఐటీలకు అప్పుడప్పుడు కనీసం చుట్టపు చూపుగా కూడా రావడం లేదు. స్నాతకోత్సవం, కాంటమ్ ల్యాబ్ సందర్శించేందుకు ఢిల్లీ బృందం వచ్చినప్పుడు తప్ప నూజివీడు ట్రిపుల్ఐటీకి టీడీపీ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ఇంత వరకు రాలేదు. తమ సమస్యలను చెప్పుకుందామనుకుంటున్న ఫ్యాకల్టీకి ఇంతవరకు కనీసం చాన్సలర్ ముఖం కూడా ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. అధికారులు తెచ్చే ఫైళ్లు చూసి సంతకాలు చేసి పంపడం తప్ప క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఫ్యాకల్టీ ఇబ్బందులు ఏమిటి, విద్యార్థుల సమస్యలు, బోధన వంటి అంశాలను ఏనాడు పర్యవేక్షించలేదు. దీనికంతటికి ఇన్ఛార్జి కావడమేనా అనే ప్రశ్నలు సిబ్బందిలో వ్యక్తమవుతున్నాయి. నూజివీడులోని ట్రిపుల్ఐటీ ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్తో పాటు నూజివీడు, ఒంగోలు ట్రిపుల్ఐటీలకు డైరెక్టర్లు ఇన్చార్జులే కావడం గమనార్హం. ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ అయిన ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ ఆర్జీయూకేటీ ఇన్చార్జి రిజిస్ట్రార్తో పాటు ఒంగోలు ట్రిపుల్ఐటీ ఇన్చార్జి డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆర్జీయూకేటీ వైస్ఛాన్సలర్ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు నూజివీడు ట్రిపుల్ఐటీకి ఇన్చార్జి డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలా ఒక్కొక్కరికి రెండేసి బాధ్యతలు నిర్వర్తిస్తుండటంపై ఆర్జీయూకేటీ వర్గాల్లోనే కాకుండా మేధావుల్లో, విద్యావంతుల్లో సైతం విస్మయం వ్యక్తమవుతోంది. పాఠాలు చెప్పాల్సిన ప్రొఫెసర్కు పరిపాలనకు సంబంధించిన బాధ్యతలను అదనంగా అప్పగిస్తుండటంతో వారు విద్యార్థులకు పాఠాలు చెప్పే అవకాశం లేకుండా పోతోంది. దీనివల్ల విద్యార్థులకు విద్యాపరంగా తీరని నష్టం వాటిల్లుతోందన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతా ఇన్చార్జులు కావడంతో పరిపాలనకు సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకొని అమలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందనే అభిప్రాయం యూనివర్సిటీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. గతంలో డైరెక్టర్లను ఇతర యూనివర్సిటీల నుంచి ఐఐటీల నుంచి తీసుకువచ్చి నియమించేవారు. ఇప్పటికై నా రెగ్యులర్ డైరెక్టర్లను నియమించాల్సిన అవసరం ఉంది. -
పీఎఫ్ జమ ఆలస్యంపై ఆందోళన
ముదినేపల్లి (కై కలూరు) : ఆడిట్ అభ్యంతరాలతో మాకు న్యాయబద్ధంగా రావాల్సిన పీఎఫ్ మొత్తాలను ఆలస్యం చేస్తే సహించేది లేదని పీఎఫ్ పోరాట సమితి ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ముదినేపల్లిలో శనివారం వారు నిరసన తెలిపారు. పోరాట కమిటీ నాయకులు బేతాళ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, 46 నెలలుగా ఉపాధ్యాయుల జీతాల నుంచి మినహాయించిన పీఎఫ్ మొత్తాలను జమ చేయడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నారు. జిల్లాల పునర్విభజన సమయంలో సీఈవో ఖాతాలకు పీఎఫ్ నగదు కోట్ల రూపాయల్లో చేరినప్పుడు రాని అభ్యంతరం, ఇప్పుడు ఆ మొత్తాన్ని మాకు ఇవ్వడానికి వచ్చేసరికి శ్రీఆడిట్ అభ్యంతరంశ్రీ అని చెప్పడం శోచనీయమన్నారు. కై కలూరు, నూజివీడు నియోజకవర్గాల్లో 1,066 మంది ఉద్యోగులకు పీఎఫ్ సమస్య ఉందని తెలిపారు. ప్రతి ఏటా జరిగే ఆడిట్లో పీఎఫ్ మొత్తం ఎవరికి జమ చేయాలో అప్పుడే తెలిస్తే సంబంధిత జిల్లా అధికారులు చర్యలు చేపట్టేవారని, ఇప్పుడు కొత్తగా అభ్యంతరాలు చెప్పడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొందన్నారు. సమస్యను పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఎఫ్ పోరాట కమిటీ సభ్యులు జాన్సన్ బాబు, జయశ్రీలత, సంధ్య, రామరాజు, నాగేశ్వరరావు, ఎస్టీయూ నాయకులు నాగరాజు, కుమార్, ఏపీటీఎఫ్ నాయకులు కృపాకర్, శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
బోర్డు అనుమతి మేరకే పొగాకు పండించాలి
బుట్టాయగూడెం: పొగాకు బోర్డులో రిజిస్టర్ అయిన రైతులు మాత్రమే పొగాకు పంట సాగు చేయాలని జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం–1 సూపరింటెండెంట్ వై.ప్రశాంత్ తెలిపారు. మండలంలోని దొరమామిడిలో ఈ ఏడాది పొగాకు పంట నియంత్రణపై రైతులకు శనివారం అవగాహన కార్యక్రమాన్ని బోర్డు అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రిజిస్టర్ చేయని రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ పంట సాగు చేయవద్దని చెప్పారు. అలాగే 2026–27 పంట కాలానికి గాను ఉత్తరప్రాంత తేలికపాటి నేలల్లో ఎన్ఎల్ఎస్ పొగాకు పంటను ఒక్కో బేరన్కు 2 వేల కేజీల వరకు మాత్రమే సాగు చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు పరిమితికి మించి పంట సాగు చేయవద్దని సూచించారు. అలాగే సొంత భూములు, సొంత బేరన్ లైసెన్స్ ఉన్న రైతులు మాత్రమే పొగాకు సాగు చేయడం శ్రేయస్కరమని, కౌలు భూముల్లో పొగాకు సాగు లాభదాయకం కాదని చెప్పారు. పొగాకు పంటతోపాటు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలన్నారు. వేరుశనగ, మొక్కజొన్న, కంది, మిరప, శనగ వంటి పంటలు పండించడం ద్వారా ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మార్కెట్లో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పోలిన సుబ్రహ్మణ్యం, కాకర్ల శివ రామకృష్ణ, మద్దిపాటి వెంకట సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పొలం దారి వివాదం మాట్లాడి వస్తుండగా..
● రోడ్డు ప్రమాదానికి గురై వృద్ధుడి మృతి ● లక్ష్మీనగర్ జాతీయ రహదారిపై ఘటన ద్వారకాతిరుమల: పొలం దారి వివాదాన్ని ఏఎంసీ చైర్మన్తో మాట్లాడి తిరిగి స్వగ్రామానికి బైక్పై వెళుతున్న ఓ వృద్ధుడు రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని లక్ష్మీనగర్ వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం 8.45 గంటల సమయంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం. ద్వారకాతిరుమల మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన పొనుకుమాటి మోహన్రావు(62)కు మండలంలోని జి.కొత్తపల్లిలో పొలం ఉంది. ఆ పొలానికి సంబంధించిన దారి విషయమై మాట్లాడేందుకు ఆయన నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామానికి చెందిన గోపాలపురం ఏఎంసీ చైర్మన్ బ్రహ్మరాజు వద్దకు వెళ్లారు. మాట్లాడిన అనంతరం తిరిగి బైక్పై స్వగ్రామానికి బయలుదేరారు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి, భీమడోలు వైపు నుంచి నల్లజర్ల వైపునకు వెళ్తున్న వ్యాన్ ఆయన బైక్ను ఎదురుగా ఢీకొట్టింది. ప్రమాదంలో వ్యాన్ ఆయనపై నుంచి వెళ్లడంతో మోహన్న్రావు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్ ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. నల్లజర్లకు చెందిన వ్యాన్ డ్రైవర్ పులి మురళీకృష్ణ వాహనాన్ని అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని లింగపాలెం మండలం కాఠంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మృతుడి కుమారుడు పవన్న్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఇదిలా ఉంటే మృతుడు మోహన్న్రావు రాంగ్ రూట్లో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. -
శ్లాబ్ కల్వర్ట్ నిర్మాణం ఎప్పుడో?
నూజివీడు: మండలంలోని సుంకొల్లులోని కాపుల బజారు గంగానమ్మ గుడి సమీపంలోని వాగుపై శ్లాబ్ కల్వర్ట్ను నిర్మించడంలో కాంట్రాక్టర్ జాప్యం చేస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వాగుపై ఉన్న శ్లాబ్ కల్వర్టు మూడేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన భారీ వరదకు శ్లాబ్ కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో అప్పటి ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు డీఎంఎఫ్ నిధుల నుంచి రూ.26 లక్షలు మంజూరు చేయించి శ్లాబ్ కల్వర్టు నిర్మాణానికి 2024 ఫిబ్రవరి 11న శంకుస్థాపన చేశారు. అయితే కాంట్రాక్టరు అప్పట్లో పనులు ప్రారంభించడంలో జాప్యం చేయడంతో ఆ తరువాత ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పనులు పూర్తిచేయడానికి వీలుపడలేదు. తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం నిధులను రద్దు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న శంకుస్థాపన చేసిన మంత్రి ఇంతవరకు ప్రారంభం కాని పనులు సుంకొల్లు వాగు మార్గంలో బిక్కుబిక్కుమంటూ ప్రయాణం -
నిట్కు కొత్త డైరెక్టర్ వస్తున్నారు
● అక్టోబరులో బాధ్యతలు చేపట్టనున్న ప్రొఫెసర్ కేవీ కృష్ణారావు ● ముంబై ఐఐటీలో 30 ఏళ్ల అనుభవం తాడేపల్లిగూడెం : ఏపీ నిట్కు నాలుగేళ్ల తర్వాత కొత్త డైరెక్టర్గా ముంబై ఐఐటీలో 30 ఏళ్లుగా సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ప్రొఫెసర్ కేవీ కృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడగా, ఆయన అక్టోబరులో ఇక్కడ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏపీ నిట్కు రెగ్యులర్ డైరెక్టర్ కోసం సుమారు రెండేళ్ల క్రితం నోటిఫికేషన్ ఇచ్చారు. చాలా మంది దరఖాస్తు చేయగా, పరిపాలనా సౌలభ్యం కోసం ఇన్చార్జి డైరెక్టర్లను నియమిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు ఇన్చార్జి డైరెక్టర్గా కొనసాగుతున్నారు. నిట్ డైరెక్టర్ నియామకానికి సంబంధించి వడపోత కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ, రాష్ట్రపతి విజిటర్గా ఉన్న సెలక్షన్ కమిటీ మొదట దరఖాస్తు చేసుకున్న వారిలో ఏ ఒక్కరినీ ఎంపిక చేయలేదు. అయితే, ఇదే సెలక్షన్ కమిటీలో ఉన్న ఐఐటీలకు చెందిన ఇద్దరు సభ్యులు దేశంలోని నిట్లు, ఐఐటీలలో పనిచేస్తున్న ప్రతిభావంతులకు నిట్ డైరెక్టర్గా పనిచేసే అవకాశం కల్పించాలని దరఖాస్తులను వేరుగా స్వీకరించారు. ఈ క్రమంలో ముంబై ఐఐటీలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసిన అనుభవం, మంచి ట్రాక్ రికార్డు ఉన్న ప్రొఫెసర్ కేవీ కృష్ణారావుకు ఈ అవకాశం దక్కింది. ప్రస్థానం.. ప్రొఫెసర్ కేవీ కృష్ణారావు కాకినాడలోని జేఎన్టీయూ నుంచి 1984లో సివిల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. 1986లో మద్రాస్ ఐఐటీ నుంచి రవాణా ఇంజనీరింగ్లో మాస్టర్స్, పట్టణ రవాణా ప్రణాళికలో పీహెచ్డీ పూర్తి చేశారు. 1996లో ఐఐటీ బాంబేలో చేరిన ఆయన వివిధ కీలక పరిపాలనా బాధ్యతలు నిర్వర్తించారు. స్థిరమైన పట్టణాభివృద్ధి, రవాణా ప్రణాళిక, ప్రయాణ ప్రవర్తన నమూనాలు, ట్రాఫిక్ రూపకల్పన, విశ్లేషణ, రహదారి నిర్వహణ తదితర అంశాలపై పరిశోధనలు సాగించారు. పరిశోధన, బోధన రంగాల్లో చేసిన విశేష కృషికి గాను ఐఐటీ బాంబే ఎక్సలెన్సు ఇన్ టీచింగ్ అవార్డులను 2008, 2012, 2016 సంవత్సరాల్లో అందుకున్నారు. ఇప్పటివరకు 20 మంది డాక్టరేట్ పరిశోధకులకు మార్గదర్శకత్వం వహించగా, వందమందికి పైగా సాంకేతిక విద్యార్థుల పరిశోధనలకు దిశా నిర్దేశం చేశారు. అంతర్జాతీయ స్థాయి పరిశోధనా పత్రికలు, సదస్సుల్లో ఆయన పరిశోధనలు ప్రచురితమయ్యాయి. భారతదేశానికి అనువైన రహదారి సామర్థ్య ప్రమాణాల రూపకల్పనలోనూ, ముంబై, నవీ ముంబై, పూణే మెట్రోరైలు వ్యవస్థల మాస్టర్ ప్లాన్ల తయారీలోనూ, జల రవాణా వ్యవస్థల ప్రణాళికలోనూ ఆయన విశేష సేవలందించారు. ఐఐటీ బాంబేలో పట్టణ శాస్త్రం, ఇంజనీరింగ్ కేంద్రం అధిపతిగా, అసోసియేట్ డీన్గా, డీన్గా, డిప్యూటీ డైరెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కత్తిమీద సామే ఏపీ నిట్కు కొత్త డైరెక్టర్గా వస్తున్న ప్రొఫెసర్ కేవీ కృష్ణారావుకు ఇక్కడ బాధ్యతలు నిర్వహించడం కత్తిమీద సామే కానుంది. తొలి డైరెక్టర్ సస్పెండైన తర్వాత ఇక్కడ వ్యవహారాలు పూర్తిగా కొందరు వ్యక్తుల చేతిలోకి వెళ్లిపోగా, నిట్పై కొన్ని అపోహల వల్ల ప్రచారం జరగడం, చివరకు ఇక్కడ ఉన్న సీట్లలో 240 సీట్లు వెనక్కి వెళ్లడానికి దారితీసింది. గతంలో పనిచేసిన సీఎస్పీ రావు కొత్త నిట్లో శాశ్వత భవనాలు రావడానికి, నిర్మాణాలు పూర్తవ్వడానికి కృషి చేయడంతో పాటు సీట్ల సంఖ్యను 480 నుంచి 720కి పెంచారు. ఈ దశలో కొన్ని అవకతవకలు చోటు చేసుకోవడంతో సీబీఐకి ఫిర్యాదులు వెళ్లగా, 2022 ఫిబ్రవరిలో ఆయనతో పాటు ఆరుగురిపై ఐపీసీ, పీసీ యాక్టుల కింద కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో 2018 మార్చిలో నిట్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సీఎస్పీ రావును 2022 మార్చిలో సస్పెండ్ చేశారు. దీనిపై ఆయన అదే ఏడాది సెప్టెంబరులో స్టే తెచ్చుకున్నప్పటికీ విధుల్లోకి చేరలేకపోయారు. ఆయన సస్పెన్షన్ తర్వాత ఏపీ నిట్ గాడిలో పడకపోవడంతో, ఇప్పుడు రానున్న కొత్త డైరెక్టర్పై భారీ బాధ్యతలు ఉన్నాయి. -
శ్రీ ఆంజనేయం
జంగారెడ్డిగూడెం (చింతలపూడి): గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో స్వామివారికి శనివారం వేదపండితులు, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో పంచామృత అభిషేకం వైభవంగా నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో జరిగిన ఈకార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ.1,81,250 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 2,025 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, సహాయ కమిషనర్, ఈఓ ఆర్వీ చందన తెలిపారు. ఆగిరిపల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆగిరిపల్లిలోని శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పవిత్రోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, స్నపన, ప్రత్యేక అలంకరణ, సాయంత్రం విష్వక్సేన పూజ, పవిత్రోత్సవాలు అంకురార్పణ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, ముత్తేవి గోపాలకృష్ణమాచార్యులు, అనంత కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి సాయి పర్యవేక్షించారు. పారిజాతగిరిలో విశేష పూజలు జంగారెడ్డిగూడెం (చింతలపూడి): స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. భక్తులు గిరిప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ వెనుక ప్రాంగణంలో నూతనంగా అభివృద్ధి చేసిన 2 ఎకరాల కార్ పార్కింగ్ ప్రదేశాన్ని పునఃప్రారంభించారు. పూజా టిక్కెట్లు, కానుకలు, విరాళాల ద్వారా ఆలయానికి రూ.1,11,900 ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఈఓ మాణికల రాంబాబు తెలిపారు. యలమంచిలి : కాజ గ్రామ పరిధిలోని 214వ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలకొల్లు మండలం దిగమర్రు గ్రామానికి చెందిన పడాల రాంబాబు (50) మృతి చెందినట్లు ఎస్సై మోటూరి రాజ్కుమార్ తెలిపారు. వివరాల ప్రకారం కొబ్బరి ఒలుపు కార్మికులుగా జీవనం సాగిస్తున్న పడాల రాంబాబు, కాటిక సురేష్ శనివారం కొబ్బరి ఒలుపునకు అంబేడ్కర్ కొనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరం గ్రామం వెళుతుండగా బైక్లో పెట్రోల్ అయిపోయింది. దీంతో సురేష్ బైక్ను నడిపించుకుంటూ వెళ్తుండగా, వెనుక పడాల రాంబాబు నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెనుక నుంచి బైక్ వచ్చి రాంబాబును బలంగా ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఢీ కొట్టిన బైక్ను నడుపుతున్న యువకుడికి తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతని వివరాలు తెలియలేదు. అతడిని చికిత్స నిమిత్తం భీమవరంలోని ఒక పైవేట్ ఆసుపత్రికి తరలించారు. రాంబాబు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాంబాబుకు భార్య శ్రీ శ్యామల, కుమారుడు హేమంతరావు, కుమార్తె మహాలక్ష్మి ఉన్నారు. హేమంతరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజ్కుమార్ తెలిపారు. భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో ప్రశాంతి అనే మూడేళ్ల చిన్నారి తప్పిపోయినట్లు గుర్తించామని సీ్త్ర, శిశు సంక్షేమ అధికారిణి పి.విజయలక్ష్మి తెలిపారు. పాప తన పేరు ప్రశాంతి అని, తండ్రి పేరు కిశోర్, తల్లి పేరు దేవి అని, తనకు ఒక తమ్ముడు ఉన్నాడని చెబుతోందని పేర్కొన్నారు. ఊరు, ఇతర వివరాలు మాత్రం తెలియరాలేదన్నారు. ప్రస్తుతం బాలికను సంరక్షణా కేంద్రానికి తరలించినట్లు ఆమె తెలిపారు. ఈ పాపకు సంబంధించిన వివరాలు తెలిసిన వారు 89191 58821, 89191 59644 నంబర్లను సంప్రదించాలని కోరారు. భీమవరం (ప్రకాశంచౌక్): కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో శనివారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ నాగరాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. -
మంత్రి శంకుస్థాపన చేసి ఆరు నెలలవుతున్నా..
ఆ తరువాత కూటమి ప్రభుత్వంలో ఉపాధిహామీ పథకం కింద శ్లాబ్ కల్వర్టు నిర్మాణంతో పాటు సీసీ రోడ్లు నిర్మాణానికి గాను రూ.35 లక్షలు మంజూరు కాగా గృహనిర్మాణశాఖ మంత్రి ఈ ఏడాది ఫిబ్రవరి 28న పనులకు శంకుస్థాపన చేశారు. అయితే ఇంత వరకు పనులు ప్రారంభించలేదు. కాంట్రాక్టర్ పనులు ప్రారంభించకుండా జాప్యం చేస్తున్నప్పటికీ ప్రజాప్రతినిధులు గాని, అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ మార్గంలో రైతులు వ్యవసాయ భూముల్లోకి వెళ్లాలన్నా, పచ్చగడ్డి కోసుకొని ద్విచక్ర వాహనాలపై తెచ్చుకోవాలన్నా, ట్రాక్టర్లు రాకపోకలు సాగించాలన్నా ప్రతిరోజూ దినదినగండగా రాకపోకలు సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా పశువులు, జీవాలు పొలాల్లోకి మేతకోసం వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు లోతుగా ఉన్న వాగులో పడిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికై నా శ్లాబ్కల్వర్టు నిర్మాణం చేపట్టి ఇబ్బందులను తొలగించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
అమరావతి కప్ రాష్ట్ర పోటీలకు ఎంపిక
ఆకివీడు: స్థానిక సరోజినీ నాయుడు బాలికోన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు, రాష్ట్ర స్థాయిలో ఈ నెల 24న తిరుపతిలో జరిగే అమరావతి కప్ పోటీలకు ఎంపికయ్యారు. వాలీబాల్ పోటీల్లో ఏ మేఘన, జే. నిత్య కృష్ణశ్రీ, అండర్–17 కబడ్డీ పోటీల్లో సీహెచ్ మేరీ గ్రేస్ పాల్గొంటారని ప్రధానోపాధ్యాయురాలు ఇందిర, పీడీ ఎం.రామలక్ష్మి తెలిపారు. మండలంలోని చినకాపవరం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు కే చిట్టిమేరి, టీ వేద సువర్ణ బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొంటారని ప్రధానోపాధ్యాయుడు కే. శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయుడు షేక్ అహ్మద్ ఆలీ తెలిపారు. అలాగే, స్థానిక జెడ్పీ బాలురోన్నత పాఠశాల నుంచి విద్యార్థిని జీ. హంసిక కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారని హెచ్ఎం పారనాయుడు తెలిపారు. -
తప్పిపోయిన మహిళ, బాలికల అప్పగింత
గణపవరం: ఇంట్లోంచి వెళ్లిపోయిన ఓ మహిళ, ఆమె ముగ్గురు కుమార్తెలను ఫిర్యాదు అందిన నాలుగు గంటల్లోనే గణపవరం పోలీసులు సురక్షితంగా పట్టుకుని శుక్రవారం కుటుంబసభ్యులకు అప్పగించారు. వేగంగా స్పందించి ఆచూకీ కనిపెట్టిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ కొమ్మి శివప్రతాప్, డీఎస్పీ శ్రావణ్ కుమార్ అభినందించారు. ఎస్సై ఆకుల మణికుమార్ తెలిపిన వివరాల ప్రకారం నిడమర్రు మండలం బువ్వనపల్లికి చెందిన అల్లు శాంతరాజు భార్య రాణి (26), కుమార్తెలు సిరిహాసిని (10), శృతి హర్షిణి (7), శ్రేష్ట (4)లతో కలిసి గణపవరం మండలం మొయ్యేరులోని బంధువుల ఇంటికి వచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వారు ఇంట్లోంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. బంధువుల ఫిర్యాదుతో ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో, సీఐ నక్కా రజనీకుమర్ ఆధ్వర్యంలో ఎస్సై మణికుమార్, ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. సాంకేతిక ఆధారాల సహాయంతో వారు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మహిళ, పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగుండటంతో బంధువులకు అప్పగించారు. ప్రజలు ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు గానీ, 112 నంబరుకు గానీ సమాచారం ఇవ్వాలని సీఐ రజనీకుమార్ సూచించారు. -
రెండు లారీలు ఢీ.. డ్రైవర్ మృతి
జంగారెడ్డిగూడెం (చింతలపూడి): మండలంలోని వేగవరం బీసీ కాలనీ సమీపంలో జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓ డ్రైవర్ దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఖమ్మం–దేవరపల్లి ఎన్హెచ్–516డీ హైవేపై శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గుజరాత్ నుంచి పిఠాపురం వెళ్తున్న టైల్స్ లారీ, కడియపులంక నుంచి పంజాబ్ వెళ్తున్న మొక్కల లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో టైల్స్ లారీ డ్రైవర్, గుజరాత్లోని పోర్బందర్కు చెందిన హర్ష్ భాయ్ (55) క్యాబిన్లో నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మొక్కల లారీ డ్రైవర్, మైలవరం మండలం కీతిరాయగూడెం వాసి కొణతం వేణు (30) ఛాతి, కాళ్లకు బలమైన దెబ్బలు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి జంగారెడ్డిగూడెంలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆశ్రమ్ హాస్పిటల్కు తరలించారు. కాగా, రెండు వాహనాల క్లీనర్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిట్టీ డబ్బుల కోసం దాడి
ముదినేపల్లి(కై కలూరు): చిట్టీ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదనే కోపంతో ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై ఎస్సై వీరభద్రరావు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వడాలి గ్రామంలో కొబ్బరికాయల వ్యాపారం చేసే మరీదు ధర్మారావు భార్య గతంలో చిట్టీల వ్యాపారం నిర్వహించింది. కొందరు సభ్యులు చందాలు చెల్లించకపోవడంతో గ్రూపులను నిలిపివేసింది. అదే గ్రామానికి చెందిన నారగాని గంగమ్మ తనకు రావాల్సిన డబ్బుల కోసం కోర్టును ఆశ్రయించడమే కాకుండా తరచూ ధర్మారావు దంపతులతో గొడవపడేది. ఒత్తిడి తట్టుకోలేక ధర్మారావు భార్య ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోగా, ఆమె విశాఖపట్నంలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. కాగా, గురువారం గంగమ్మ మరో వ్యక్తితో కలిసి ధర్మారావు ఇంటికి వెళ్లే గొడవకు దిగింది. ఈ క్రమంలో గంగమ్మ ధర్మారావు చూపుడు వేలు కొరకడంతో పాటు, తలపై దాడి చేయడంతో తీవ్ర రక్తగాయమైంది. బాధితుడిని గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆకివీడు: ఆకివీడు సమీపంలోని ఉప్పుటేరు గట్టుపై ఈ నెల 15న లభ్యమైన మహిళ మృతదేహం భీమవరం ప్రాంతానికి చెందినదిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వారం రోజులుగా మృతదేహాన్ని గుర్తించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, బంధువులే హత్య చేసి ఉంటారని అనుమానించారు. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి సరిహద్దు జిల్లాల పోలీసు స్టేషన్లకు ఆమె ఫొటోలు పంపించి విచారణ జరిపారు. ఎట్టకేలకు అందిన సమాచారంతో ఆమెను భీమవరం వాసిగా నిర్ధారించుకున్నారు. మృతదేహాన్ని మినీ వ్యాన్ లేదా కారులో తీసుకొచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
కూటమివి దిగజారుడు రాజకీయాలు
కొయ్యలగూడెం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు అడ్డాగా మారిందని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ తుమ్మలపల్లి గంగరాజు విమర్శించారు. గవరవరం సెంటర్లో మండల రైతు విభాగం అధ్యక్షుడు గంటా రమేష్, గ్రామాల కన్వీనర్లు పలివెల దుర్గారావు, అత్తిలి కిరణ్ కుమార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గుంటూరు మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడు ముబ్బషీర్లపై పొగాకు వ్యాపారి కడిమి సూరిబాబు పెట్టిన అక్రమ కేసుల వెనుక కూటమి కుట్ర ఉందని ఆరోపించారు. ముస్తఫా వద్ద రూ.35 లక్షల అడ్వాన్స్ తీసుకుని ఏడాది దాటినా పొగాకు ఇవ్వకుండా, వేరే కంపెనీలకు విక్రయించడాన్ని ప్రశ్నించినందుకే ఈ కక్ష సాధింపు అని మండిపడ్డారు. అరెస్టులో ఉన్న ముస్తఫాకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంఘీభావం తెలపడాన్ని విమర్శించే స్థాయి సూరిబాబుకు లేదన్నారు. సూరిబాబుతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని గతంలోనే ఆయనను దూరంగా పెట్టామని వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ నూకల రాము స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్థానిక పొగాకు వ్యాపారులు మాట్లాడుతూ తామంతా ముస్తఫా వద్ద అడ్వాన్సులు తీసుకున్నామని వ్యాపారాల్లో నష్టాలొచ్చినా ఆయన తమకు అండగా నిలిచారని తెలిపారు. సూరిబాబు అనేక చోట్ల అడ్వాన్సులు తీసుకుని ఎగవేస్తూ రాజకీయ వేధింపులకు పావుగా మారాడని ఆరోపించారు. ముస్తఫా కుటుంబానికి పూర్తి నైతిక మద్దతు ప్రకటిస్తూ, వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వైఎస్సార్సీపీ శ్రేణులు హెచ్చరించాయి. ఈ కార్యక్రమంలో పార్టీ వాణిజ్య విభాగం నేతలు సీమకుర్తి సత్యనారాయణ, బొమ్మా సత్యనారాయణ, సోషల్ మీడియా కన్వీనర్ చిక్కాల దుర్గాప్రసాద్, మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ బాజీ, ఎంపీపీ గంజిమాల రామారావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దూలపల్లి కాంతారావు, జిల్లా కార్యదర్శి చిడిపి రవి, మిరియాల వెంకటపతి, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఒక విద్యార్థి.. ఒక టీచర్
నూజివీడు : మండలంలోని యనమదల మండల పరిషత్ ఫౌండేషన్ పాఠశాలలో ఒకే ఒక్క విద్యార్థికి ఒక ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నారు. గ్రామంలో 150కి పైగా కుటుంబాలు ఉన్నప్పటికీ, రెండో తరగతి వరకు మాత్రమే ఉన్న ఈ స్కూలుకు కేవలం ఒక్క విద్యార్థే వస్తున్నాడు. కాగా అర కిలోమీటరు దూరంలోని యనమదల హైస్కూల్ ఆవరణలోనే శాటిలైట్ స్కూల్ కూడా ఉంది. ఈ విద్యార్థిని అక్కడికి పంపి, ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని అవసరమైన మరో పాఠశాలకు డిప్యూటేషన్ వేసే వెసులుబాటు ఉంది. అయితే విద్యాశాఖ అధికారులు మాత్రం ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ద్వారకాతిరుమల: స్థానిక పోలీస్స్టేషన్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. రామన్నపాలెం నుంచి తాడేపల్లిగూడెం వెళ్తున్న ఓ ట్రాక్టర్ నియంత్రణ తప్పి దుకాణం మెట్లపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ తాపీ పని చేస్తున్న దొరసానిపాడుకు చెందిన సోమయ్యను ఢీకొట్టడంతో అతడు గాయపడ్డాడు. బాధితుడిని స్థానికులు హుటాహుటీన పీహెచ్సీకి తరలించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ప్రమాద సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఉండి: జాతీయ రహదారి 165పై ప్రయాణిస్తూ ఉండి రైల్వే గేటు దాటే ప్రయాణికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని రైల్వే శాఖ అధికారులు గేటు వద్ద ఒక హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఉండి వద్ద ఆర్వోబీ ఫ్లైఓవర్ పనులు జరుగుతుండటంతో ట్రాక్పై భాగంలో విద్యుత్ లైన్ల ఎత్తు కంటే హైట్ గేజ్ ఎత్తును 40 సెంటీమీటర్లు కిందికి దించారు. ఈ కారణంగా గేటు దాటే లారీలు, టిప్పర్లు వంటి అన్ని రకాల సరుకు రవాణా భారీ వాహనాల ఎత్తు 13 అడుగులకు మించకూడదని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి 13 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న వాహనాలను తోలితే తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనని, అటువంటి వారిపై రైల్వే చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా లేదా జైలు శిక్ష తప్పదని అధికారులు హెచ్చరించారు. -
వంతెన యాతన తీర్చేదెవరు?
ఇరగవరం: మండలంలోని రేలంగి గ్రామంలోని అంతన్నవారిపేట వద్ద ఉన్న పాత వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. ఇరగవరం మండలానికి ఉన్న ఏకై క రైల్వే స్టేషన్ రేలంగి మాత్రమే. ఈ స్టేషన్తో పాటు అత్తిలి, తణుకు, గుమ్మంపాడు, వరిగేడు, బల్లిపాడు తదితర 21 గ్రామాల ప్రజలు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు నిత్యం ఈ వంతెనపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. ఊడిపోయిన రెయిలింగ్.. కుంగిపోతున్న వంతెన బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ వంతెన దశాబ్దాలుగా ప్రజలకు సేవలందించినప్పటికీ ప్రస్తుతం సరైన నిర్వహణ లేక దెబ్బతింది. వంతెనకు ఇరువైపులా ఉన్న రెయిలింగ్ ఊడిపోవడంతో వాహనాలు తరచూ పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్తున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను కాపాడుతున్నారు. వంతెన కింది భాగం బీటలు వారి కుంగిపోతోందని, గర్రండీలు ఊడిపోవడంతో ప్రయాణించే సమయంలో తీవ్రంగా కంపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వాహనాలతో ప్రమాద హెచ్చరిక ప్రతిరోజూ ఈ వంతెనపై స్కూల్ బస్సులు, భారీ వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఆ సమయంలో వంతెన విపరీతంగా ఊగుతుండటంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు. మేము పుట్టకముందు బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ వంతెన నాటి నుంచి ఇప్పటివరకు ఎంతో ఉపయోగపడింది. కానీ, అధికారులు దీని నిర్వహణను పట్టించుకోకపోవడంతో రోజురోజుకూ దెబ్బతింటోంది. రెయిలింగ్ ఊడిపోయి, కింది భాగం కుంగిపోతోంది. భారీ వాహనాలు వెళ్తున్నప్పుడు తీవ్రంగా ఊగుతోంది. వంతెన పూర్తిగా కూలిపోయి పెను ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి కొత్త వంతెన నిర్మించాలి. – గుదే రవితేజ, రేలంగి (అంతన్నవారిపేట) బీటలు తీసి కుంగిపోతున్న వంతెన రెయిలింగ్ ఊడిపోయి ప్రమాదకరంగా ఉన్న రేలంగి అంతన్నవారి పేట వద్ద ఉన్న వంతెన -
వీవీఎం పోస్టర్ల ఆవిష్కరణ
భీమవరం: విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పోటీలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు పాల్గొనాలని డీఈఓ ఓవీఎస్ అనిల్కుమార్ తెలిపారు. వీవీఎం పరీక్షల పోస్టర్ను శుక్రవారం కలెక్టరేట్లోని విద్యాశాఖ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ, జాతీయ విద్యా పరిశోధన మండలి, జాతీయ సైన్స్ మ్యూజియం, విజ్ఞాన భారతి సంయుక్తంగా పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పోటీలకు ప్రభుత్వ పాఠశాలలోని ప్రతి తరగతి నుంచి కనీసం ఇద్దరు విద్యార్థులు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని కోరారు. వీవీఎం జిల్లా కో–ఆర్డినేటర్ రేపాక వెంకన్నబాబు మాట్లాడుతూ సెప్టెంబర్ 30లోపు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, మరిన్ని వివరాలకు సెల్ 98496 66417లో సంప్రదించాలని కోరారు. విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ.నారాయణ, భీమవరం ఎంఈఓలు ఎన్.శ్రీనివాసరావు, కేఎస్సీహెచ్ సాయిరాం, వీవీఎం జిల్లా జాయింట్ కో–ఆర్డినేటర్ మల్లుల శ్రీనివాస్, టెక్నికల్ కో–ఆర్డినేటర్ సయ్యద్ షహింషా పాల్గొన్నారు. పెనుమంట్ర: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించే వ్యవసాయ డిప్లొమా కోర్సులకు మాన్యువల్ స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో మిగిలి ఉన్న సీట్లను భర్తీ చేసే నిమిత్తం, జోనల్ స్థాయిలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారన్నారు. గోదావరి మండలానికి సంబంధించి ఈనెల 27న తమ పరిశోధనా స్థానంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. యూనివర్సిటీ పాలిటెక్నిక్లు మారుటేరు, రంపచోడవరం, ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్లు కొయ్యలగూడెం, పాలకొల్లు, కాకినాడ, ద్రాక్షారామం, మూలపాలెంలో మిగిలిన సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మారుటేరు లేదా వ్యవసాయ పాలిటెక్నిక్, మారుటేరు కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని కోరారు. తణుకు అర్బన్: తణుకు మున్సిపల్ స్కేటింగ్ రింక్లో ఈనెల 30న ఎన్డ్యూరెన్స్ స్కేటింగ్ జిల్లాస్థాయి సెలెక్షన్స్ నిర్వహించనున్నట్లు స్కేటింగ్ కోచ్ వి.లావణ్య తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈనెల 25లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, వివరాలకు 96423 31332లో సంప్రదించాలని కోరారు. -
వాసవీమాత సన్నిధిలో హైకోర్టు జడ్జి
పెనుగొండ: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి దంపతులు శుక్రవారం పెనుగొండ నగరేశ్వర మహిషాసురమర్ధనీ వాసవీ కన్యకపరమేశ్వరి ఆలయాన్ని, అఖిల భారత వాసవీ పె నుగొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని వాసవీ శాంతి థాంను సందర్శించారు. మూలవిరాట్ వాసవీ మా తకు, నగరేశ్వరునికి, మహిషాసురమర్ధనీకి పూజ లు, అభిషేకాలు నిర్వహించారు. వాసవీ శాంతి థాంలో 102 అడుగుల రుషీ గోత్ర మందిరంలోని 90 అడుగుల వాసవీ మాత పంచలోహ విగ్రహాన్ని దర్శించుకుని, మరకత శిల వాసవీ మాతకు పూజలు నిర్వహించారు. పండితులు ఆలయ మర్యాదలతో వేదాశ్వీరచనం అందించారు. -
తెగ తాగించేస్తున్నారు!
శనివారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2026భీమవరం: జిల్లావ్యాప్తంగా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. వేళాపాళా లేకుండా నిత్యం మద్యం అందుబాటులో ఉండటంతో మందుబాబుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. గత రెండేళ్లుగా మద్యం మత్తులో దాడులు, హత్యలు జరిగిన సంఘటనలు జిల్లాలో చాలా ఉన్నాయి. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే అందిస్తామంటూ ప్రచారం చేసి, నేడు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. దీనిపై ఎకై ్సజ్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 192 షాపులు.. 27 బార్లు.. ప్రస్తుతం జిల్లాలో సుమారు 192 బ్రాందీ షాపులు, 27 బార్లు ఉన్నాయి. ఒక్క భీమవరం పట్టణంలోనే 25 బ్రాందీ షాపులు, 6 బార్లలో విక్రయాలు సాగుతున్నాయి. ఇవే కాకుండా ప్రతి పట్టణం, పల్లెల్లో లెక్కలేనన్ని బెల్ట్ షాపులు వెలిశాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే మద్యం విక్రయించాలి. అయితే, నిర్వాహకులు ముందు భాగంలో ఉన్న షట్టర్లను మూసివేసి, వెనుక లేదా పక్క తలుపుల ద్వారా 24 గంటలూ విక్రయాలు జరుపుతున్నారు. దాదాపు ప్రతి మద్యం షాపు వద్ద సిట్టింగ్ రూమ్లు ఏర్పాటు చేయడమే కాకుండా, అక్కడే మంచినీరు, కూల్డ్రింక్స్, స్నాక్స్ అందుబాటులో ఉంచుతుండటంతో మద్యం ప్రియులు షాపుల వద్దనే మద్యం సేవిస్తున్నారు. సెప్టెంబర్తో ముగుస్తున్న టెండర్ల గడువు ప్రభుత్వం నిర్వహించిన మద్యం టెండర్ల గడువు సెప్టెంబర్ నెలాఖరుతో ముగియనుంది. టెండర్ల సమయంలో అమ్మకాలపై 20 శాతం కమీషన్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, షాపులు ప్రారంభించిన 10 నెలల వరకు కేవలం 8.5 శాతమే ఇవ్వడంతో యజమానులు ఆందోళన చేపట్టారు. దీంతో ప్రభుత్వం కమీషన్ను 14.5 శాతానికి పెంచింది. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించాల్సి రావడంతో తీవ్రంగా నష్టపోతున్నామని యజమానులు వాపోతున్నారు. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి ఎక్కువ ధరలకు అమ్మడమే కాకుండా, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి విక్రయాలు సాగిస్తున్నారు. యానం మద్యం అక్రమ రవాణా యానంలో ఎకై ్సజ్ డ్యూటీ తక్కువగా ఉండటంతో మద్యం తక్కువ ధరకు లభిస్తుంది. దీంతో జిల్లాలోని కొందరు వ్యాపారులు యానం నుంచి మద్యాన్ని అక్రమంగా తరలించి ఇక్కడి షాపుల్లో విక్రయిస్తున్నారని సమాచారం. అధికారుల అండదండలతోనే ఈ వ్యవహారం నడుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు 24 గంటలూ అందుబాటులో మద్యం బ్రాందీ షాపులు, బెల్ట్షాపుల్లో యథేచ్ఛగా విక్రయాలు ‘మామూళ్ల’ మత్తులో అధికారులు ! ప్రజాప్రతినిధులకూ వాటాలు ప్రభుత్వం ఎకై ్సజ్ శాఖకు అమ్మకాల టార్గెట్లు విధించడంతో అధికారులు పెద్ద ఎత్తున విక్రయాలు జరిగేలా చూస్తున్నారు. ఇందులో భాగంగానే 24 గంటల అమ్మకాలు, బెల్ట్షాపుల నిర్వహణ సాగుతున్నా ఎకై ్సజ్ శాఖ తూతూమంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకుంటోంది. బ్రాందీ షాపుల్లో నిరంతర అమ్మకాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడానికి నెలవారీ మామూళ్లే కారణమని విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల వల్ల కూడా అధికారులు షాపులపై చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి మద్యం విక్రయాలపై కఠిన నియంత్రణ పాటించకపోతే శాంతిభద్రతల సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది. -
ప్రభుత్వ ఆసుపత్రా? లేక డంపింగ్ యార్డా?
వైఎస్సార్సీపీ పాలకొల్లు నియోజక ఇన్చార్జి గుడాల గోపి ధ్వజం పాలకొల్లు సెంట్రల్: పట్టణంలో ఇప్పటికే ఉన్న యడ్లబజార్, రామయ్య హాలు డంపింగ్ యార్డులతో పాటు నేడు మంత్రి రామానాయుడు చొరవతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కూడా మూడో డంపింగ్ యార్డులా మారిపోయిందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) ఎద్దేవా చేశౠరు. ఇటీవల ఆసుపత్రి ప్రాంగణంలో ల్యాండ్ ఫిల్లింగ్ పేరుతో చెత్తను తరలించడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా నిరసించడంతో స్పందించిన ప్రభుత్వం చెత్తను తొలగిస్తామని చెప్పినప్పటికీ, నేటికీ ఆ ప్రక్రియ పూర్తికాలేదన్నారు. శుక్రవారం తమ పార్టీ నాయకులతో కలిసి ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన, అక్కడ ఇంకా మూడు అడుగుల మేర చెత్త పేరుకుపోయి ఉండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు రోగాలు తగ్గించుకోవడానికి ఆసుపత్రికి వస్తే, మంత్రి సొంత నియోజకవర్గంలో మాత్రం కొత్త జబ్బులు బారిన పడేలా పరిస్థితులు ఉన్నాయని ఎద్దేవా చేశారు. మైక్ దొరికితే వైఎస్ జగన్పై విమర్శలు చేసే మంత్రి రామానాయుడు, తన నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, పనుల్లో నాణ్యతా లోపాలపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చెత్తపై మట్టి కప్పి నిధులు పక్కదారి పట్టించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. అధికారం లభించింది అభివృద్ధి చేయడానికే తప్ప ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు పెట్టడానికి కాదని స్పష్టం చేశారు. స్థానిక సమస్యలను పట్టించుకోని తీరుకు నిరసనగా శనివారం నుంచి రామనామ జపం చేస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి అక్రమాలను ఎండగడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యడ్ల తాతాజీ, కోరాడ శ్రీనివాస్, పాలపర్తి కృపానాథ్, లోపింటి చిరంజీవి, పితాని మురళీ తదితరులు పాల్గొన్నారు. -
● వరలక్ష్మీ నమోస్తుతే
వరలక్ష్మీ నమోస్తుతే.. వరలక్ష్మీ పాహిమాం.. స్మరణలు మార్మోగాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవార్లు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. భీమవరంలో మావుళ్లమ్మవారిని నాలుగు లక్షల గాజులతో విశేషంగా అలంకరించారు. ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ పూజాదికాలు నిర్వహించారు. సుమారు 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈఓ బుద్ధ మహాలక్ష్మీ నగేష్, దేవస్థానం చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు పర్యవేక్షించారు. అలాగే ఏలూరు పత్తేబాదలోని కనకదుర్గమ్మను అరిసెలతో అలంకరించారు. – భీమవరం (ప్రకాశంచౌక్)/ఏలూరు (ఆర్ఆర్పేట) -
ఆంక్షల చిత్రం
● కుంకుళ్లమ్మ ఆలయంలో ఫొటోలు, వీడియోల చిత్రీకరణపై ఆంక్షలు ● దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాలని చెబుతున్న అధికారులు ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలో చినవెంకన్న సోదరిగా పూజలందుకుంటున్న శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారు వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని శాకంబరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గర్భాలయంతో పాటు ఆలయ ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక అలంకారాలు చేశారు. అయితే ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తిని ఉంచడానికి బదులుగా, ఆమె ఫ్లెక్సీకి అలంకరణ చేయడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్లెక్సీ స్పష్టంగా కనిపిస్తూ, దాని ఎదురుగా వైర్లు వేలాడుతుండటంపై విస్తుపోయారు. శ్రీవారి ఉపాలయాల్లోనే అత్యధిక ఆదాయం కలిగిన ఈ ఆలయంలో ఉత్సవమూర్తికి పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్ దండలతో అలంకరించి ఉంటే బాగుండేదని వాపోయారు. మీడియా చిత్రీకరణపై ఆంక్షలు దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయాల్లో మూలవిరాట్ల ఫొటోలు, వీడియోలు తీయడంపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో కుంకుళ్లమ్మ ఆలయంలోనూ అమ్మవారి అలంకారాన్ని చిత్రీకరించేందుకు మీడియాకు అనుమతి లభించలేదు. స్వయంగా ఆలయానికి రాలేని వేలాది మంది భక్తులకు ఉగాది గాజుల అలంకారం, శ్రావణమాస శాకంబరీ అలంకారం, దసరా ఉత్సవాల విశేషాలు మీడియా, సోషల్ మీడియా ద్వారానే తెలిసేవి. తాజా ఆంక్షల వల్ల భక్తులు ఈ అలంకార వైభవానికి దూరమవుతున్నారని, చిన్న ఆలయాల విశిష్టతను ప్రచారం చేయడంలో మీడియా పాత్రను తగ్గించేలా కమిషనర్ నిర్ణయం ఉందని పలువురు విమర్శిస్తున్నారు. సాంప్రదాయాలపై ఆంక్షలు సరికావు ఆలయాలకు వెళ్లలేని భక్తులకు దేవతామూర్తుల అలంకార దర్శనం లేకుండా చేయడం సరికాదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను ఆధ్యాత్మికతకు చేరువ చేయాల్సింది పోయి, ఎన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాలపై ఆంక్షలు విధించి దేవుళ్లను దూరం చేస్తున్నారని మండిపడుతున్నారు. కనీసం ఉత్సవమూర్తుల ద్వారా అయినా అమ్మవారి వైభవాన్ని దర్శించుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కొన్ని ఆలయాల్లో మాత్రం దేవతామూర్తుల అలంకారాల ఫొటోలు యథావిధిగా సోషల్ మీడియాలో కనిపిస్తుండటం చర్చనీయాంశమైంది. భీమవరంలో మావుళ్లమ్మ అమ్మవారి గాజుల అలంకారం ఫొటోలతో పాటు మరికొన్ని ఆలయాల ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల అమలులో ఆలయాల వారీగా వ్యత్యాసాలు ఉన్నాయా లేదా ఆదేశాల్లో స్పష్టత లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
గురువులకు క్లస్టర్ కష్టాలు
నిడమర్రు: విద్యారంగంలో మార్పుల పేరిట కూట మి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. తాజాగా కస్టర్ కాంప్లెక్స్ల నిర్వహణలో మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈనెల నుంచి వచ్చే ఫిబ్రవరి వరకు వీటి నిర్వహణ తేదీలను ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ మేరకు శనివారం నుంచి ఉమ్మడి జిల్లాలోని 144 క్లస్టర్లలో సమావేశాలు నిర్వహించనున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపై ఇలా.. గతేడాదిలో ప్రతి నెలా మూడో శనివారం ఉపాధ్యాయులంతా ఉదయం పాఠశాలకు హాజరై.. మధ్యాహ్నం నుంచి క్లస్టర్ సమావేశాలకు వెళ్లేవారు. అయితే ఇకపై ప్రతినెలా 3, 4 శనివారాల్లో క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈనెల 22, 29 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి. ప్రతి పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుల సంఖ్య ఆధారంగా సగం మంది 22న, మిగిలిన వారు 29న తప్పనిసరిగా హాజరవ్వాల్సి ఉంటుంది. అలాగే సబ్జెక్టు క్లస్టర్ మీటింగులకు 22న నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టు టీచర్లు, 29న లాంగ్వేజ్ టీచర్లు హాజరవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమావేశాన్ని ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిర్వహించనుండగా.. ఉదయం 9 గంటలోపు ఆయా క్లస్టర్ల వద్ద లీప్ యాప్లో తప్పనిసరిగా ముఖ హాజరు వేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎంఈఓలు ఏర్పాట్లు పూర్తిచేశారు. సెలవులకు అవకాశం లేదు : క్లస్టర్ నిర్వహణ రోజుల్లో ఉపాధ్యాయులకు ఎలాంటి సెలవులు మంజూరు చేయరాదని అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. కేవలం మెడికల్ గ్రౌండ్ మినహా ఎలాంటి సెలవులకు అవకాశం లేదు. ఉపాధ్యాయులకు దూరాభారం గతంలో సమావేశాలను ఆయా మండల పరిధిలో మూడు, నాలుగు క్లస్టర్లలో నిర్వహించేవారు. అయితే ఇకపై మండలం మొత్తం టీచర్లు ఒకే క్లస్టర్ సమావేశానికి హాజరవ్వాల్సి ఉంటుంది. సబ్జెక్టు సమావేశాలైతే రెండు, మూడు మండలాల పరిధుల్లో నిర్వహించనున్నారు. దీంతో ఉపాధ్యాయులకు 15 నుంచి 40 కిలోమీటర్లు మేర దూరభారం కానుంది. ముఖ్యంగా మహిళా టీచర్లకు రవాణా సమస్య ఎదురుకానుంది. టీచర్లు లేని బోధన ఎలా.. పాఠశాలల్లో సగం మంది ఉపాధ్యాయులే ఉంటే బోధన ఎలా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రతినెలా రెండు రోజులపాటు బోధన కుంటుపడుతుందనే విమర్శలు వస్తున్నాయి. అలాగే ఏకోపాధ్యాయ పాఠశాలల విషయంలో టీచర్ సమావేశానికి వెళ్తే పార్ట్టైమ్ ఇన్స్ట్రక్లర్లు, వ్యాయామ ఉపాధ్యాయులకు డిప్యూటేషన్పై విధులు కేటాయించారు. జిల్లా ప్రైమరీ సబ్జెక్ట్ మొత్తం పశ్చిమగోదావరి 20 40 60 ఏలూరు 28 56 84 మొత్తం 48 96 144 నెలలో రెండు రోజులు క్లస్టర్ సమావేశాలతో ఆయా స్కూళ్లలో బోధన కుంటుపడే అవకాశం ఉంది. టీచర్లకు బోధనా సమయం తగ్గుతుంది. సమావేశాలు పక్క మండలాల్లో నిర్వహించడం వల్ల మహిళా ఉపాధ్యాయులకు దూరం భారం. ఉన్నతాధికారులు పునరాలోచించాలి. – బొర్రా గోపీమూర్తి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సబ్జెక్టు కాంప్లెక్స్లు ఏర్పాటు అయిన నాటి నుంచి ఇప్పటివరకూ గణితం సబ్జెక్టు కాంప్లెక్స్ గణపవరంలోనే ఉంది. దీనిని ప్రస్తుతం అత్తిలి మండలానికి మార్పు చేశారు. దీంతో గణపవరంలోనే కొనసాగించాలని ఉన్నతాధికారుల దృష్టిలో ఉంచితే పరిశీలిస్తామన్నారు. – పుప్పాల ప్రకాశరావు, ఎస్టీయూ రాష్ట్ర నాయకుడు సమావేశాల నిర్వహణపై ఏడాదికో మార్పు గతంలో ఉదయం బడికి.. మధ్యాహ్నం మీటింగ్కు.. నేటి నుంచి సగం టీచర్లు సమావేశాలకు.. మిగిలిన వారికి పాఠశాలల్లో విధులు మూడు, నాలుగు శనివారాల్లో ఇదే పరిస్థితి -
రోడ్డు ఇలా.. ప్రయాణమెలా?
● దారుణంగా కొత్తపూసలమర్రు – లోసరి రోడ్డు ● నాలుగు కిలోమీటర్ల ప్రయాణానికి గంట సమయం భీమవరం అర్బన్ : మండలంలోని కొత్తపూసలమర్రు – లోసరి రోడ్డు ప్రయాణికులకు, వాహనదారులకు తీవ్ర అవస్థలు కలిగిస్తోంది. కొత్తపూసలమర్రు శివారు నుంచి లోసరిలోని జాతీయ రహదారి 216ఏకి అనుసంధానంగా ఉండే ఈ రోడ్డు గోతులమయమై ప్రమాదాలకు నిలయంగా మారింది. భీమవరం, కాళ్ల మండలాల ప్రజలకు జాతీయ రహదారికి, కృష్ణా జిల్లాకు చేరుకునేందుకు ఇది అత్యంత దగ్గర మార్గం కావడంతో నిత్యం వందలాది స్కూల్ బస్సులు, ఆటోలు, కార్లు, చేపల లారీలు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అలాగే సమీపంలోని చేపల మేత ఫ్యాక్టరీకి బరువైన లోడుతో వెళ్లే హెవీ లారీలు కూడా ఈ మార్గాన్నే వినియోగిస్తాయి. ప్రజాధనం దుర్వినియోగం సుమారు 4 కిలోమీటర్ల పొడవున్న ఈ కీలక రహదారికి ఇప్పటివరకు తారురోడ్డు వేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్ల క్రితం గ్రామీణులు, రైతులు స్వచ్ఛందంగా చందాలు వేసుకుని వేసిన గ్రావెల్ రోడ్డే నేటికీ ఆధారంగా ఉంది. ప్రాముఖ్యత లేని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల స్వలాభం కోసం సీసీ రోడ్లపైనే మళ్లీ రోడ్లు వేస్తున్న సర్కారు, నిత్యం వేలాదిమంది ప్రయాణించే ఈ రహదారిని మాత్రం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. చినుకు పడితే అస్తవ్యస్తం కొద్దిపాటి వర్షానికే రోడ్డంతా బురదమయంగా మారి వాహనాలు దిగబడిపోతున్నాయి. ఈ మార్గంలో ప్రయాణించలేక కొందరు కొత్తపూసలమర్రు నుంచి గూట్లపాడు, తోకతిప్ప, బరువానిపేట మీదుగా సుమారు 12 కిలోమీటర్లు అదనంగా చుట్టూ తిరిగి జాతీయ రహదారికి వెళ్లాల్సి వస్తోంది. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, గెలిచాక మరచిపోవడం పరిపాటిగా మారిందని, ప్రజాప్రతినిధులు, ఇప్పటికై నా స్పందించి వెంటనే రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా ఈ రోడ్డు దుస్థితిపై ఆర్అండ్బీ ఏఈ రాజశేఖర్ను వివరణ కోరగా ఈ ఆర్అండ్బీ పరిధిలో లేదని, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉందని స్పష్టం చేశారు. ఆ శాఖ రోడ్డును వేయాలని తెలిపారు. -
ప్రత్యక్ష ఎన్నికలు అభినందనీయం
ఏలూరు (ఆర్ఆర్పేట): నీతి ఆయోగ్ సూచనలు, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థల అధ్యక్ష స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ఏపీ అసెంబ్లీ నిర్ణయించడం అభినందనీయమని అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్ పొలిమేర హరికృష్ణ అన్నారు. స్థానిక గన్ బజార్లో నిర్వహించిన సమితి ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యక్ష ఎన్నికల విధానం వల్ల ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని, ప్రజా తీర్పుతో ఎన్నికయ్యామనే భావన కలుగుతుందన్నారు. దీనివల్ల ప్రజాప్రతినిధుల ఫిరాయింపులు, బెదిరింపులు, క్యాంప్ రాజకీయాలకు తెరపడి స్థానిక సంస్థల్లో అభివృద్ధి, సంక్షేమం వేగవంతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలువురు ఎస్సీ, బీసీ నాయకులు పాల్గొన్నారు. -
బ్యాగోతం బట్టబయలు
చిరిగిన బ్యాగులు.. అరకొర పుస్తకాలు.. కాళ్లకు చెప్పులతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు.. విద్యాసంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇప్పటికీ బడుల్లో విద్యార్థి మిత్ర కిట్లను పూర్తిస్థాయిలో అందించలేదు. అలాగే ఇచ్చిన సామగ్రి నాణ్యత తీసికట్టుగా ఉందని తల్లిదండ్రులు అంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులకు అందించిన సామగ్రి నాణ్యతపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్. శురకవారం శ్రీ 21 శ్రీ ఆగస్టు శ్రీ 2026భీమవరం: మెగా డీఎస్సీ నిర్వహణలో విమర్శలు ఎదుర్కొన్న కూటమి ప్రభుత్వం విద్యార్థి మిత్ర పథ కంలో భాగంగా విద్యార్థులకు పంపిణీ చేసిన పాఠశాల సామగ్రి నాణ్యతా లోపంతో మరో వివాదంలో చిక్కుకుంది. విద్యాశాఖ మంత్రి నారా లో కేష్ నేతృత్వంలో విద్యావ్యాప్తి వేగవంతంగా జరుగుతోందని ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు ప్రచారం చేసుకుంటునా, ఈ విద్యాసంవత్సరంలో జిల్లావ్యాప్తంగా పంపిణీ చేసిన స్కూల్ బ్యాగులు, బెల్టులు, షూలలో తీవ్ర నాణ్యతా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వంలో పారదర్శకంగా.. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో పాఠశాలలు తెరిచిన మొదటి రోజే పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్తో పాటు స్కూల్ బ్యాగ్, యూనిఫాం, షూస్, బెల్టులను పంపిణీ చేసేవారు. అయితే ప్రస్తుత విద్యాసంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఇరాన్ యుద్ధాన్ని సాకుగా చూపి బడులు తెరిచిన రెండు నెలల తర్వాత విద్యార్థి మిత్ర కిట్లను అందించింది. పారదర్శకంగా పథకాన్ని అమలు చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. పంపిణీ చేసిన రెండు, మూడు నెలలకే బ్యాగులు చిరిగిపోతుండటంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరిగిన బ్యాగులకు కుట్లు వేసుకుని బడికి వస్తున్న విద్యార్థుల పరిస్థితిని చూసి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. జిల్లాలో 1,399 ప్రభుత్వ పాఠశాలలు జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, నరసాపురం మున్సిపాలిటీలు, ఆకివీడు నగర పంచాయతీతో పాటు 20 మండలాల పరిధిలో దాదాపు 1,399 ప్రభుత్వ పాఠశాలలు ఉ న్నాయి. వీటిలో సుమారు 90 వేల మంది వి ద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థుల అవసరాల కోసం ఈ ఏడాది 86,258 స్కూల్ బ్యాగులు, యూనిఫాంలు, షూలు, 4,77,462 పాఠ్యపుస్తకాలు, 56,315 బెల్టులు, 9,285 డిక్షనరీలు కా వాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది. అయితే మొదటి విడతలో నోట్ పుస్తకాలు, డిక్షనరీలు మినహా మిగిలిన వస్తువులు పాఠశాలలకు పూర్తిస్థాయిలో చేరలేదు. కొత్తగా చేరిన విద్యార్థులకు రెండో విడతలో విద్యాసామాగ్రి వస్తుందని అధికారులు తెలిపినా, నేటికీ పలు పాఠశాలల్లో పూర్తిస్థాయిలో అందలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంపిణీ చేసిన వస్తువులు తీవ్ర నాణ్యతా లోపంతో ఉండటం వల్లే తక్కువ వ్యవధిలోనే పాడవుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పుస్తకాల సంఖ్య ఎక్కువగా ఉండటం, బ్యాగుల పరిమాణం చిన్నదిగా ఉండటంతో అవి త్వరగా చిరిగిపోతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. షూస్ సైజులు సరిగా లేకపోవడం (పెద్దవిగా ఉండటం) వల్ల కొందరు విద్యార్థులు షూస్ వేసుకోలేక చెప్పులతోనే పాఠశాలలకు వస్తున్నారు. చిరిగిన బ్యాగులకు కుట్లు వేయించి వాడలేక, కొత్తవి కొనలేక నిరుపేద తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, పేద విద్యార్థులకు అందజేసే విద్యార్థి మిత్ర సామగ్రిలో పూర్తిస్థాయి నాణ్యత ప్రమాణాలు పాటించాలని కోరుతున్నారు. కిట్టు.. నాణ్యత తీసికట్టు నాణ్యతలేని విద్యార్థి మిత్ర సామగ్రి మూడు నెలలకే చిరిగిపోతున్న స్కూల్ బ్యాగులు కొత్త విద్యార్థులకు ఇప్పటికీ అందని కిట్లు జిల్లాలో 1,399 పాఠశాలలు 85,283 బ్యాగుల పంపిణీ ప్రస్తుత విద్యాసంవత్సరంలో విద్యార్థులకు ఇచ్చిన స్కూల్ బ్యాగ్స్ చిరిగిపోయినట్టు మా దృష్టికి రాలేదు. నాణ్యమైన బ్యాగ్స్, యూనిఫామ్, షూస్ వంటివి పంపిణీ చేశాం, ఎక్కడైనా బ్యాగ్స్ చిరిగిపోయినట్లు ఎంఈఓల దృష్టికి తీసుకువెళితే వాటిని పరిశీలించి కొత్త బ్యాగులు ఇస్తాం. – పి.శ్యామ్సుందర్, సమగ్రశిక్షా అడినల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్, భీమవరం -
22 నుంచి పవిత్రోత్సవాలు
ఆగిరిపల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆగిరిపల్లిలోని శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి వార్ల ఆలయ పవిత్రోత్సవాలను ఈనెల 22 నుంచి 25 వరకు శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి సాయి తెలిపారు. 22న అంకురార్పణ, 23న సర్వదేవత ఆహ్వానం, పవిత్రముల ధాన్యాధివాసము, 24న నవ కుంభారాధన, శాంతి హోమం, 25న పవిత్రములు విసర్జన, పూర్ణాహుతి, స్వామివారికి శాంతి కల్యాణం, గరుడోత్సవం జరుగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కార్యనిర్వహణాధికారి సాయి విజ్ఞప్తి చేశారు. పెంటపాడు: స్థానిక డీఆర్ గోయంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 28న మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కోలా శ్రీమన్నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖమైన 10 కంపెనీలకు సంబంధించి ఉద్యోగాల భర్తీ కోసం ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగులు ఈ మేళాలో పాల్గొనవచ్చన్నారు. నూజివీడు: మహిళా పోలీసు విధులకు ఆటంకం కలిగించిన టీడీపీ నాయకుడు, కార్యకర్తలపై బుధవారం రాత్రి నూజివీడు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం మండలంలోని సిద్ధార్ధనగర్లో ఈనెల 12న బాల్యవివాహం జరుగుతున్న విషయం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మహిళా పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించింది. దీంతో మహిళా పోలీసుతో పాటు అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజరు, పోలీసు కానిస్టేబుళ్లు బాల్య వివాహం జరుగుతున్న ఇంటి వద్దకు వెళ్లి వివాహాన్ని నిలిపి వేయించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం గ్రామ సచివాలయంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసు షేక్ సుల్తానాబేగంపై టీడీపీ నాయకులు దుర్భాషలాడగా ఆమె రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన టీడీపీ ఎస్టీ నాయకుడు బాణావతు బద్రునాయక్తో పాటు భూక్య శ్రీనివాసరావు, లాకావతు తిరుమలేశు, మన్నే రమేష్, యాదల శ్రీనివాసరావు, యాదల లక్ష్మీనారాయణలపై రూరల్ ఏఎస్సై నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెనుగొండ: ప్రభుత్వానికి వారధులుగా పనిచేసే ఉద్యోగులు ప్రజలకు నిస్వార్థ సేవలు అందించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సీఈవో పి జగదాంబ తెలిపారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. అనంతరం పలువురు ఎంపీడీవోలకు ఫోన్ ద్వారా ఆమె పలు సూచనలు చేశారు. రానున్న గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. సిటిజెన్ ఈకేవైసీ, వాట్సప్ మనమిత్రా సర్వేలు, సచివాలయ సేవలు అందించే విధానంపై పలు సూచనలు చేశారు. సచివాలయాలకు వచ్చిన ప్రజానీకానికి మనమిత్ర సేవలపై అవగాహన కల్పించాలని వివరించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పెనుగొండ ఎంపీడీవో టి.సూర్యనారాయణ మూర్తి డిప్యూటీ ఎంపీడీవోలు ఒ సూర్యప్రకాశరావు, ఎ.మల్లేశ్వరరావు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. డ్రైవర్కు స్వల్ప గాయాలు.. బట్టలు, పార్సిళ్లు దగ్ధం ద్వారకాతిరుమల: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యాన్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగిన ఘటన మండలంలోని లక్ష్మీనగర్ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యాన్లో తరలిస్తున్న బట్టలు, పార్సిళ్లు కాలిపోయాయి. అలాగే డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే. ఏలూరు నుంచి రాజమహేంద్రవరం వైపు బట్టల లోడుతో వెళ్తున్న బొలెరో వ్యాన్ను లక్ష్మీనగర్ వద్ద రాత్రి 11.15 గంటల సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో వ్యాన్లో షార్ట్ సర్క్యూట్ సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వ్యాన్లోని బట్టలు, పార్సిళ్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న భీమడోలు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన మంగళూరుకు చెందిన డ్రైవర్ షాహిద్ను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
కొల్లేరులో అక్రమ చెరువుల గట్లు ధ్వంసం
భీమడోలు: కొల్లేరు అభయారణ్యం ఆగడాలలంక రెవెన్యూ పరిధిలోని 40 ఎకరాల అక్రమ చెరువు గట్టును గురువారం అటవీశాఖ అధికారులు ధ్వంసం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం, రెవెన్యూ అధికారుల సమక్షంలో, అటవీశాఖ సెక్షన్ అధికారి ఈశ్వరరావు పర్యవేక్షణలో అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది ఈ చర్య చేపట్టారు. ఆగడాలలంక బీసీ సొసైటీకి చెందిన సర్వే నంబర్లు 1297, 1299, 1300, 1305 పరిధిలోని ఈ గట్లను అటవీ శాఖ సిబ్బంది ధ్వంసం చేశారు. గతంలోనూ కోర్టు ఆదేశాలతో ఈ చెరువును అటవీశాఖ అధికారులు ధ్వంసం చేశారు. అయితే, 2026 జూన్ 30వ తేదీన గ్రామానికి చెందిన కూటమి నేతల ప్రోద్బలంతో సుమారు 300 మంది గ్రామస్తులు తెల్లవారుజామున దౌర్జన్యంగా చొరబడి చెరువు గట్టును పూడ్చి, అక్రమంగా చేపలు పెంచేందుకు గట్టును పునర్నిర్మించేందుకు ఉపక్రమించారు. అప్పట్లో అటవీశాఖ అధికారులు వారిని అడ్డుకున్నారు. మరోసారి గండి కొట్టారు తాజాగా అటవీశాఖ అధికారులు మరోసారి చర్యలు చేపట్టి, 40 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ ఆక్వా చెరువుకు గండి కొట్టారు. ఇదిలా ఉండగా, ఇదే చెరువుకు రెండుసార్లు గండ్లు కొట్టినా, రెండుసార్లు గ్రామస్తులు వాటిని పూడ్చిన విషయం విదితమే. అయితే, ఈ చెరువుకు పూర్తిస్థాయిలో నాలుగు వైపులా గట్లు ధ్వంసం చేస్తే మళ్లీ గండ్లు కొట్టేందుకు అవకాశం ఉండబోదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే విధంగా రెండు రోజుల క్రితం ఆగడాలలంక రెవెన్యూ పరిధిలోని, దెందులూరు మండలం పోతునూరు గ్రామంలోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిలోని అక్రమ ఆక్వా చెరువును కూడా ధ్వంసం చేశారు. కొల్లేరు అభయారణ్యం పరిధిలోకి అక్రమంగా ప్రవేశిస్తే కఠిన కేసులు నమోదు చేస్తామని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీట్ అధికారి శ్రీకాంత్, అసిస్టెంట్ బీట్ అధికారి కొండలరావు, వివిధ సెక్షన్ల బీట్ అధికారులు, అసిస్టెంట్ అధికారులు, బేస్లైన్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎస్బీఐలో నకిలీ రుణాల కుంభకోణం
ఏలూరు టౌన్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణపవరం బ్రాంచ్లో నకిలీ వ్యవసాయ రుణాల పేరుతో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్లో ప్రధాన నిందితుడు తూము కేశవ శ్రీనివాస్ను అరెస్ట్ చేసి, రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినట్లు ఏపీ సీఐడీ తెలిపింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రు గ్రామానికి చెందిన తూము కేశవ శ్రీనివాస్... గత కొంతకాలంగా చేపల చెరువులు సాగుచేస్తున్నట్లు... తక్కువ విలువ భూములను, బ్యాంక్ ప్యానెల్ వాల్యూవర్స్తో అధిక విలువ చూపుతూ ఎస్బీఐ బ్యాంకు అధికారులతో కుమ్మకై ్క తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకుంటూ పరారీలో ఉన్న ప్రధాన నిందితుడ్ని సీఐడీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా.. గణపవరం ఎస్బీఐ బ్రాంచ్లో నకిలీ వ్యవసాయ రుణాల కుంభకోణంపై క్రైమ్ నెంబర్ 18/2022 ఆఫ్ సీఐడీ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి సీఐడీ ఎస్పీ ఆర్.గంగాధరరావు పర్యవేక్షణలో సీఐడీ విశాఖపట్నం ప్రత్యేక బృందం నిందితుడు తూము కేశవ శ్రీనివాస్ను ఈనెల 10న అరెస్ట్ చేసి రాజమండ్రి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా... న్యాయమూర్తి ఎల్.వెంకటేశ్వరరావు నిందితుడికి జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. నిందితుడ్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రాజమహేంద్రవరం సీఐడీ ప్రాంతీయ కార్యాలయ అధికారులు క్రైమ్ నెంబర్ 34/2022 ఆఫ్ సీఐడీ పోలీస్స్టేషన్ కేసుపై ప్రధాన నిందితుడు తూము కేశవ శ్రీనివాస్ను పీటీ వారెంట్పై కేంద్ర కారాగారం నుంచి ఏసీబీ కోర్టులో గురువారం ప్రవేశపెట్టగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. నిందితుడ్ని తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించామని రాజమండ్రి సీఐడీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కేసులో ఎస్బీఐ సిబ్బందిని గతంలోనే సీఐడీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఇక భూమి విలువను ఎక్కువగా చూపించిన బ్యాంక్ ప్యానెల్ వాల్యూయర్స్ను త్వరలో అరెస్ట్ చేస్తామని సీఐడీ అధికారులు ప్రకటించారు. నిందితుడు శ్రీనివాస్పై నాలుగు కేసులు నమోదు అయ్యాయని స్పష్టం చేశారు. వీటితో పాటు మరికొన్ని కేసుల్లోనూ నిందితుడుగా ఉన్నట్లు... ఈ కేసుల్లో సుమారు రూ.1.70కోట్లు బ్యాంకును మోసం చేసినట్లు ఎస్బీఐ ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఈ కేసుల్లో తూము భాస్కర శివకుమార్, తూము సత్యసోమ సుందరి, తూము నరేంద్రకుమార్, గోపిశెట్టి మాధురి, వీ.వనజాక్షి, వి.నరేంద్ర, కే.రామమోహనరావు, మరికొందరు ఉన్నారని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన సీఐడీ -
బాల శాస్త్రవేత్తలకు వేదిక.. సైన్స్ కాంగ్రెస్
● ఎన్సీఎస్సీ పోటీలకు దరఖాస్తుల స్వీకరణ ● ఈనెల 31 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ● 10–17 ఏళ్లలోపు బాలశాస్త్రవేత్తలకు అవకాశం నిడమర్రు: పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో శాసీ్త్రయ, వైజ్ఞానిక ఆలోచలను పెంచేందుకు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ (ఎన్సీఎస్సీ) కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత మూడేళ్లుగా నిలిపేసిన ఈ కార్యక్రమాన్ని 2026–27 విద్యా సంవత్సరంలో పునః ప్రారంభించారు. జాతీయ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రేరణ సహకారంతో రాష్ట్ర సాంకేతిక మండలి, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చదివే ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్ధులు ఈ పోటీలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదు అంశాల్లో ఈ పోటీలు 2026–27 సంవత్సరంలో ప్రధాన అంశంగా సుస్థిర అభివృద్ధి కోసం విజ్ఞానం, ఆవిష్కరణలు రూపొందించాలి. దీనిలో 5 ఉప అంశాలుగా.. వ్యర్థాల నిర్వహణ కోసం 5 ఆర్ సూత్రాలు, శక్తి కోసం 4 ఈ సూత్రం, నీటి నిర్వహణ, ఆహారం, వ్యవసాయం, ఆరోగ్యం, సుస్థిర అభివృద్ధి కోసం జాతీయ జ్ఞాన వ్యవస్థల వినియోగం. వీటిలో విద్యార్ధులు తమ ప్రాజెక్ట్ కూపొందించేందుకు ప్రధాన అంశం, ఉప అంశాల్లో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. ఎంచుకున్న అంశం సామాజిక ప్రాధాన్యం, చూపిన పరిష్కారం, విజ్ఞాన శాస్త్రం ఆధారంగా ఉండాలి. అలాగే ఆ ప్రాజెక్ట్ స్థానిక విషయమై ఉండాలి. ప్రాజెక్ట్ ప్రదర్శనలు, నమూనాలు అవవసరం లేదు. కేవలం పరిశోధించిన అంశానికి చెందిన ఫొటోలు, మ్యాప్లు, గ్రాఫ్లు, రిపోర్టులు, సంబంధిత అధికారుల అభిప్రాయాలు, వారి ధ్రువీకరణతో రిపోర్టులు మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇలా.. సంబధిత వెబ్సైట్లో ఆన్లైన్లో ఈనెల 31వ తేదీ లోపు విద్యార్ధులు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఒక జట్టుకు ఇద్దరు విద్యార్థులుండాలి. వీరిలో ఒకరిని గ్రూప్ లీడర్గా, మరొకరిని గ్రూప్ మెంబరుగా నమోదు చేసుకోవాలి. పాఠశాలల నుంచి ఎన్ని బృందాలైనా పాల్గొనవచ్చు. ఆరు నుంచి ఇంటర్ చదువుతున్న 10 నుంచి 17 సంవత్సరాలలోపు వయసున్న వారు అర్హులు. రెండు గ్రూపులుగా రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి. 10 నుంచి 14 ఏళ్ల విద్యార్థులను జూనియర్ గ్రూప్గా, 14 నుంచి 17 ఏళ్ల విద్యార్థులు సీనియర్ గ్రూప్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసిన ప్రాజెక్ట్లకు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో 200 మార్కులు ఉంటాయి. వాటిలో రాతపూర్వక రిపోర్టుకు 100, ఓరల్ ప్రజెంటేషన్కు 100 మార్కులు కేటాయించారు. జాతీయస్థాయి పోటీల్లో ఓరల్ ప్రజెంటేషన్కు 50, రాతపూర్వక రిపోర్టుకు 40, పోస్టర్ ప్రజెంటేషన్కు 10 పాయింట్లు కేటాయించారు. పోటీల షెడ్యూల్ ఇలా జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమం సెప్టెంబరు, అక్టోబరుల్లో నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతిభ చూపిన వారికి డిసెంబరులో రాష్ట్రస్థాయిలో పాల్లొనే అవకాశం ఉంటుంది. రాష్ట్రస్థాయిలో ఉత్తమంగా నిలిచిన విద్యార్ధులు వచ్చే ఏడాది జనవరి తరరువాత జరిగే జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొంటారు. జాతీయస్థాయిలో పోటీల విజేతలకు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు అందజేస్తారు. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ విద్యార్థుల మేథస్సుకు ఉపయోగపడుతోంది. ఇక్కడ ప్రతిభ చూపిన బాలలకు జాతీయ స్థాయిలో బాల శాస్త్రవేత్తలుగా గుర్తింపు లభిస్తుంది. జిల్లాలో ఉన్నత, ప్రాథమికోన్నత విద్యార్ధులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా ఆయా సైన్స్ ఉపాధ్యాయులచే కృషి చేస్తున్నాము. 6వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులు జూనియర్, సీనియర్ గ్రూపులుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. – మల్లుల శ్రీనివాస్, జిల్లా సమన్వయకర్త, ఎన్సీఎస్సీ -
పూజా సామగ్రి ధరలకు రెక్కలు
● పూల ధరలు మూడింతలు ● టాపు లేపిన టెంకాయలు ● వరలక్ష్మీ వ్రత ప్రభావం ద్వారకాతిరుమల: వరాల తల్లి వరలక్ష్మీదేవిని కొలిచే పర్వదినం సందర్భంగా పూజా సామగ్రి ధరలు ఆకాశాన్నంటాయి. సాధారణ రోజులతో పోలిస్తే పూలు, పండ్లు, కొబ్బరికాయల ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా పూల ధరలు మూడింతలు పెరిగాయి. ఇదిలా ఉండగా జిల్లావ్యాప్తంగా పూలు, పండ్ల దు కాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. చుక్కలు చూపించిన పూల ధరలు డిమాండ్ దృష్ట్యా వ్యాపారులు పూల ధరలను అమాంతం పెంచేవారు. కిలో చామంతి పూలు రూ.300 నుంచి గురువారం రూ.1,000కు చేరా యి. తమలపాకుల ధర డజను రూ.20 పలికింది. సైజును బట్టి ఒక్కో కొబ్బరికాయ రూ.30 నుంచి రూ.40 వరకు విక్రయించారు. డజన్ అరటిపండ్ల ధర రూ.60కి చేరింది. నైవేద్యానికి సమర్పించే ఆపిల్, దానిమ్మ తదితర పండ్ల ధరలకూ రెక్కలొచ్చాయి. దీంతో పండుగ నిమిత్తం ప్రజలు నామమాత్రంగానే వీటిని కొనుగోలు చేశారు. సందడిగా మార్కెట్లు పండుగ పూజ కోసం పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, కొబ్బరికాయలు కొనుగోలు చేసేందుకు మహిళలు మార్కెట్లకు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో దుకాణాలు కలకళలాడాయి. అయితే ధరల భారం వల్ల వినియోగదారులు కొనుగోళ్లలో కోత విధించారని, అనుకున్న స్థాయిలో వ్యాపారం సాగలేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. -
భూసేకరణపై సీబీఐ, సిట్తో విచారణ చేయాలి
బుట్టాయగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం చేస్తున్న భూసేకరణపై సీబీఐ, సిట్తో సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. మండలంలోని దుద్దుకూరులో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం సేకరిస్తున్న భూముల విషయంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. గిరిజన బాధితులు గొంతెత్తి తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడన్నారు. ముఖ్యంగా భూ సేకరణలో కూటమి నాయకులు కనుసైగల్లోనే అధికారుల అండదండలతో జరుగుతున్నాయని ఆరోపించారు. భూముల్లో గిరిజనులు ఉంటే హక్కుదారులుగా వేరేవాళ్లని చూపించి వారికి పరిహారం సొమ్ము జమ చేస్తున్నారని అనేక మంది బాధితులు తన వద్ద వాపోతున్నారని తెలిపారు. ముఖ్యంగా వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో భూసేకరణలో దళారుల బెడద ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుందని అన్నారు. భూసేకరణకు భూములు ఇస్తున్న రైతుల నుంచి ఖాళీ చెక్లను తీసుకుని సొమ్ములు వారి ఖాతాలో పడే సమయానికి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుందని చెప్పారు. దీనివల్ల భూములిచ్చిన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. బాధితులకు అండగా తమ పార్టీ వైఎస్సార్ సీపీ ఉంటుందని చెప్పారు. ఈ భూసేకరణపై జరిగే అవినీతి అక్రమాలపై నిగ్గు తేల్చే వరకూ పోరాటం చేస్తామని చెప్పారు. అలాగే ఈ వ్యవహారాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్తానని తెలిపారు. భూ యజమానులు ఎవ్వరూ కూడా దళారులకు ఒక్క రూపాయి చెల్లించవద్దన్నారు. భూ సేకరణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు పత్రికల్లో, టీవీ ఛానళ్లలో వస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనీసం నోరు మెదపకపోవడం బాధాకరమని అన్నారు. వారు ఇప్పటికై నా భూములిచ్చే రైతులకు అండగా నిలవాలని కోరారు. -
రాష్ట్రంలో రెండేళ్లుగా అవినీతి, అక్రమాలే
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో గుంపు ప్రభుత్వం ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా అవినీతి, అక్రమాలు విపరీతంగా పెరిగిపోయాయని మాజీ ఐఏఎస్ అధికారి జీ విజయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వాటిపై తాను సంధించిన ప్రశ్నలకు లోకేష్ ఎందుకు సమాధానం చెప్పడంలేదని నిలదీశారు. టెట్ ఉత్తీర్ణులైన వారికే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వాలని, ఇప్పటికే పని చేస్తున్న ఉపాధ్యాయులు సైతం టెట్లో అర్హత సాధించాల్సిందే అని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇస్తే అసలు పరీక్షలే లేకుండా క్రీడల కోటాలో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. క్రీడలో కోటాలో ఉద్యోగాలు కల్పించడానికే ఒక ప్రత్యేక జీవో జారీ చేయడం, తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలిచ్చిన అనంతరం ఆ జీఓను రద్దు చేయడం చూస్తుంటే అక్రమాలు జరిగాయని అందరికీ స్పష్టంగా అర్థమౌతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు చదువు చెప్పడానికి చదువులేని వారిని నియమించడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. సత్యం రాజు చలువతో విదేశాల్లో మేనేజ్మంట్ కోటాలో చదివిన లోకేష్కు చదువు విలువ ఏమి తెలుస్తుందని ఎద్దేవా చేశారు. 2014లో దొడ్డిదారిన ఎమ్మెల్సీగా ఎంపికై మంత్రి అయిన లోకేష్ వారసత్వం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారని, తాను మాత్రం మెరిట్ ద్వారా ఐఏఎస్ అయ్యానన్నారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో పునరావాసం ఏర్పాట్లలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తాము జీలుగుమిల్లిలో పర్యటిస్తే గిరిజనులు తమ గోడు వెళ్లబోసుకున్నారన్నారని, తమ భూములు అక్రమంగా లాగేసుకుంటున్నారని వాపోయారన్నారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో గిరిజనులతో ఆటలాడద్దని హెచ్చరించారు. తాము అన్ని వర్గాలకు అండగా ఉంటామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ముందుగా 10 వేల కోట్లతో అంచనాలు వేయగా నిర్మాణం ఆలస్యం కావడంతో ఇప్పుడు రూ.55 వేల కోట్లకు అంచనాలు పెరిగాయని, 270 ముంపు గ్రామాల్లో 99 వేల కుటుంబాలు నిర్వాసితులుగా ఇప్పటికీ మిగిలిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనలు పడుతున్న కష్టాలపై తమ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో ప్రత్యేకంగా అధ్యయనం చేసి వారి కోసం పోరాడతామన్నారు. సమావేశంలో మెండెం సంతోష్ కుమార్, జీ మోక్షానందం, డీ సుధీర్ పాల్గొన్నారు. -
27న ఎకై ్సజ్ కార్యాలయం ముట్టడి
తణుకు అర్బన్: కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 27న భీమవరం ఎకై ్సజ్ కార్యాలయం ముట్టడించనున్నట్టు ఏపీ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి తెలిపారు. గురువారం స్థానిక సీ ఐటీయూ కార్యాలయంలో మామిడిశెట్టి నాగభూషణం అధ్యక్షతన తణుకు డివిజన్ గీత కార్మిక సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని లిక్కరాంధ్రప్రదేశ్గా మారు స్తోందని మండిపడ్డారు. మద్యం ఆదాయాన్ని పెంచుకోవడానికి రాష్ట్రంలో 3,636 బ్రాందీ షాపులను ఏర్పాటుచేసి వాటికి అనుబంధంగా గ్రామాల్లో లక్ష వరకు బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. మద్యం ఏరులై పారుతుండటంతో గీత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గీత కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్లు, నష్టపరిహారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘ డివిజన్ కార్యదర్శి కాసాని శ్రీనివాస్, కట్టా వెంకటేశ్వరరావు కడలి బాలాజీ, కాకతల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల ఆదాయాన్ని గురువారం జిల్లా దేవదాయశాఖ అధికారి కె.శ్రీనివాసు సమక్షంలో లెక్కించారు. 17 రోజులకు రూ.1,65,14,515 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. కానుకల రూపంలో 116 గ్రాముల బంగారం, 2.185 కిలోల వెండితో పాటు అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అలాగే లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2,000, రూ.500 ల నోట్ల ద్వారా రూ.3 వేలు లభించాయన్నారు. సగటున రోజుకి రూ.9,71,442 ఆదాయం వచ్చినట్టు పేర్కొన్నారు. ముసునూరు: దేశ ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈనెల 24న ముసునూరులో పర్యటించనున్నారని, ఈ మేరకు పటిష్ట ఏర్పాట్లు చే యాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ఏ లూరు ఐజీ అశోక్కుమార్, జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్, జేసీ అభిషేక్ గౌడతో కలిసి గురువారం హెలీప్యాడ్, బహిరంగ సభాస్థలి, వాహనాల క్వానాయ్ రూట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో ఆమె సమీక్షించారు. ముసునూ రులో గోర్మెట్ పాప్ కార్నికా సంస్థ ఆధ్వర్యంలో నూతన పాప్ కార్న్సీడ్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి పాల్గొంటారన్నారు. సీఎం చంద్రబాబు, గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ హాజరయ్యే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం గోర్మెట్ పాప్ కార్ని కా ఫ్యాక్టరీలో పలు విభాగాలను ఆమె పరిశీలించారు. సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్కుమార్రెడ్డి తదితరులు ఉన్నారు. ఏలూరు టౌన్: ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడ) పిలుపుతో ఏలూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో జూడలు విధులను బహిష్కరించి చేపట్టిన సమ్మె గురువారం కొనసాగింది. జూడాల సమ్మెతో ప్రజలు మరింత అసౌకర్యానికి గురవుతున్నారు. జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ పెంచాలనీ, కష్టానికి తగిన ఫలితాన్ని ఆశించటం తమ హక్కుగా భావిస్తున్నామని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా ఏపీ జూడతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఎంఎస్సీ, పీహెచ్డీ పోస్టుల భర్తీలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనీ, వైద్యుల పోస్టుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లుగా ఉండాలని డిమాండ్ చేశారు. ఏపీ జూడ నుంచి సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ను తప్పించటం సరైన విధానం కాదని అన్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
నూజివీడు: సైబర్ నేరాలు, మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిషోర్ సూచించారు. ముసునూరు మండలం కాట్రేనిపాడులో ఈ నెల 24న జరగనున్న ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం, ఆయన నూజివీడులో విలేకరులతో మాట్లాడారు. నూజివీడు సర్కిల్ పరిధిలో ఇటీవల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ, వీసాలు ఇప్పిస్తామంటూ లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, అలాంటి మాటలు నమ్మొద్దని, అలా ఎవరైనా చేస్తే వెంటనే సమీపంలోని పోలీసుస్టేషన్లో తెలపాలన్నారు. ఇళ్లల్లో ఎక్కువ మొత్తంలో బంగారం, నగదు ఉంచకుండా బ్యాంకు లాకర్లను వినియోగించాలన్నారు. దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వ్యవసాయ దిగుబడుల విక్రయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, వ్యాపారుల వివరాలను పోలీసుల ద్వారా ధ్రువీకరించుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు నూజివీడులో రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చేయడం, ఆర్టీసీ బస్సులను నిలపడం వల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధించాలని సీఐని ఆదేశించారు. తోపుడు బండ్లు, పండ్ల దుకాణాలకు ట్రాఫిక్కు ఇబ్బంది లేని ప్రాంతాలను కేటాయించాలన్నారు. ప్రజలు, వ్యాపారులు బాధ్యతగా వ్యవహరిస్తే సమస్యలను సులువుగా పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్, సీఐ ఐవీ నాగేంద్రకుమార్ పాల్గొన్నారు. -
మద్దిలో డిజిటల్ సేవలు ప్రారంభం
జంగారెడ్డిగూడెం (చింతలపూడి): గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి క్షేత్రంలో నూతన డిజిటల్ సేవలను గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ప్రారంభించారు. తొలుత ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన మద్ది చెట్టు సంరక్షణకు వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం నిపుణులతో సంప్రదింపులు జరిపి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆలయ అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ దృష్ట్యా స్థల సేకరణ, మాస్టర్ ప్లాన్ పనులపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు – జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నుంచి ఆలయ రాజగోపురం వరకు ఉన్న రహదారికి ఇరువైపులా సుమారు 8 అడుగుల ప్రైవేటు స్థలాన్ని యజమానుల నుంచి కొనుగోలు చేయాలని సూచించారు. ఆ ప్రదేశంలో భక్తులు ఎండ, వానల నుంచి రక్షణ పొందేలా నీడ నిచ్చే షెడ్లు నిర్మించాలని పేర్కొన్నారు. అలాగే ఆలయం ముందు భాగంలో ఉన్న వ్యాపార సముదాయాలు, షాపులను తొలగించి, వాటిని వెనుక ఉన్న పార్కింగ్ స్థలంలోకి మార్చాలని ఆదేశించారు. రూ.1.20 కోట్ల వ్యయంతో అధునాతనంగా నిర్మించిన 8 గదుల ’శ్రీరామ సదనం’ వసతి గృహ భవనాన్ని పరిశీలించిన ఆయన, మిగిలిన చిన్నపాటి పనులను వేగంగా పూర్తి చేసి తక్షణమే భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. అలాగే నూతనంగా నిర్మించిన అన్నదాన భవనంలో స్టీల్ బల్లల ఏర్పాటు, బాయిలర్ పనులను త్వరగా పూర్తి చేసి, నూతన భవనంలోనే అన్నప్రసాద వితరణ ప్రారంభించాలని ఆదేశించారు. ప్రసాదాల తయారీ పాకశాలను, నిల్వ ఉంచే స్టోర్ రూమ్ను తనిఖీ చేసి లడ్డూ, పులిహోర నాణ్యతను రుచి చూసి పరిశీలించారు. కేశఖండన శాల, మరుగుదొడ్లు, డార్మిటరీలను తనిఖీ చేసి నిరంతరం పారిశుధ్యాన్ని నిర్వహించాలని శానిటేషన్ సిబ్బందికి మార్గదర్శకాలు ఇచ్చారు. కరూర్ వైశ్యా బ్యాంక్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ కియోస్క్ యంత్రాన్ని, ’మన మిత్ర’ వాట్సాప్ యాప్ ద్వారా ఆన్లైన్ టికెటింగ్, బుకింగ్ విధానాన్ని ప్రజలకు వినియోగించుకోవాలన్నారు. తొలుత కమిషనర్కు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారి, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజన సత్యనారాయణ, ధర్మకర్తలు, అర్చక బృందం పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి కె.శ్రీనివాసు, ఆలయ తనిఖీదారు వి.సురేష్ కుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు చింతపల్లి రత్న సురేష్, దూళిపాళ ప్రభాకరరావు, తిరుమలశెట్టి నాగవర లక్ష్మి అనీల, వల్లూరి సునీత, లయ సిబ్బంది పాల్గొన్నారు. -
యువతకు ఉద్యోగాలు కల్పించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): యువతకు ఉద్యోగాలు కల్పించాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏలూరు జిల్లా కన్వీనర్ తొర్లపాటి రాజు డిమాండ్ చేశారు. అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్యర్యంలో కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ విధానాల కారణంగా యువత నిరుద్యోగం, ఉపాధి, వలసలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిఏటా కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు, ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. పోటీ పరీక్షల్లో జాప్యం, పేపర్ లీకులు, పరీక్షల రద్దు, నియామక ప్రక్రియలో అవకతవకల వల్ల నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్, 4 లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, కొత్త పరిశ్రమల ఏర్పాటు వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యుడు కురెళ్ల వరప్రసాద్ మాట్లాడుతూ 2025 మెగా డీఎస్సీలో పేపర్ లీకేజీ, మెరిట్ జాబితా అక్రమాలు, స్పోర్ట్స్ కోటా దుర్వినియోగంపై హైకోర్టు పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏఐవైఎఫ్ మాజీ కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ నీట్ పరీక్షల బాధ్యత రాష్ట్రాలకు అప్పగించాలని, పీపీపీ విధానాన్ని రద్దు చేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, యువజన సమాఖ్య మాజీ నాయకులు భజంత్రి శ్రీనివాస్, నాగం అచ్యుత్, పార్టీ సభ్యులు బళ్ల కనకదుర్గరావు, మావూరి విజయ తదితరులు పాల్గొన్నారు. -
దెబ్బకు దిగొచ్చారు
అనుమానాస్పద మృతి ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంఘటన కాళ్ల మండలంలో చోటుచేసుకుంది. 8లో uఆక్వా రైతులకు రాయితీ విద్యుత్పై రెండేళ్లుగా కాలయాపన చేస్తున్న కూటమి ప్రభుత్వం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భీమవరం పర్యటన ప్రభావంతో దిగొచ్చింది. ఆఘమేఘాలపై ఎన్నికల హామీని అమలుచేస్తూ జీఓను విడుదల చేసింది. మరోపక్క రొయ్య ధరలు పెరుగుతుండటం ఆక్వా రైతులకు ఊరటనిస్తోంది. నెలరోజుల క్రితం కిలోకు వంద కౌంట్ రూ.220 ఉన్న ధర ప్రస్తుతం రూ.280కు చేరింది. గురువారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2026సాక్షి, భీమవరం: సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు సిండికేట్ దోపిడీతో ఆక్వా అధోగతి పాలవుతోంది. జోనన్తో నిమిత్తం లేకుండా ఆక్వా రైతులందరికీ రూ.1.50 రాయితీ విద్యుత్ ఇస్తానని, కోల్డ్ స్టోరేజీలు కట్టిస్తానని, ఏరియేటర్స్పై సబ్సిడీ ఇస్తానంటూ ఉండి ఎన్నికల సభలో ఇచ్చిన హామీలను చంద్రబాబు అటకెక్కించారు. మరోపక్క సిండికేట్ పెద్దలు దాదాపు టీడీపీకి చెందిన వారే కావడంతో కూటమి పాలనలో వారి ఇష్టారాజ్యంగా మారింది. అదునుచూసి ఏకపక్షంగా మేత ధరలు పెంచుతూ, రొయ్య రేట్లు తగ్గిస్తూ రైతుల కష్టాన్ని కాజేస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన రాయితీ విద్యుత్ అందించాలని, సిండికేట్ దోపిడీని అరికట్టాలంటూ ఏడాదిన్నర కాలంగా రైతులు రోడ్డెక్కి వరుస ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ వచ్చింది. ఆఘమేఘాలపై.. రెండేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం తాజాగా రాయితీ విద్యుత్ జీఓ విడుదల చేయడం జగన్ పర్యటన పుణ్యమేనని ఆక్వా రైతులు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 54,033 రాయితీ కనెక్షన్లు ఉండగా తాజాగా మరో 12,500 కనెక్షన్లకు రాయితీ ఇస్తూ జీఓ విడుదల చేసింది. ఇప్పటికే జిల్లాలో 13,648 రాయితీ కనెక్షన్లకు గాను కొత్తగా 3,459 కనెక్షన్లకు రాయితీ వర్తించనుంది. మరోపక్క నెల రోజుల క్రితం వరకు పతనమవుతూ వచ్చిన రొయ్య ధరలు తర్వాత పుంజుకోవడం రైతులకు ఊరటనిస్తోంది. గత నెల మొదటి రెండు వారాల్లో వంద కౌంట్ ధరను ఆక్వా సిండికేట్ రూ.220 వరకు తగ్గించేసింది. మిగిలిన 80, 70, 60, తదితర కౌంట్ల ధరలు కిలోకు రూ.30 నుంచి రూ. 50 వరకు కోత పెట్టారు. జగన్ వచ్చి వెళ్లాకా.. ధరలు పెరుగుతున్నట్టు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం వంద కౌంట్ ధర రూ.280లు వరకు ఉండగా మిగిలిన కౌంట్లు ఆ మేరకు పెరిగాయంటున్నారు. ధరలను నిలకడగా ఉంచాలని, గిట్టుబాటు ధర లేని సమయంలో రొయ్యలను నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీల నిర్మించాలని, ఏరియేటర్లుపై సబ్సిడీ హామీలను కూటమి ప్రభుత్వం అమలుచేయాలని ఆక్వా రైతులు కోరుతున్నారు. ఆక్వా రైతుల పక్షాన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చంద్రబాబు సర్కారుపై సమరభేరీ మోగించారు. గత నెల 15న భీమవరం వచ్చారు. ఆయన పర్యటన ఆద్యంతం జనసునామీని తలపించింది. సిండికేట్ దోపిడీతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్న ఆక్వా రైతులకు జగన్ రాక కొండంత ధైర్యాన్నిచ్చింది. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులతో భీమవరం పోటెత్తింది. జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా రైతులు సమస్యల సుడిగుండంలో కూరుకుపోయారన్నారు. ఆక్వా రైతులకు చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. జోన్తో సంబంధం లేకుండా ఎంతమంది రైతులకు రాయితీ విద్యుత్ ఇచ్చారని జగన్ ప్రశ్నించగా ఎవరికి ఇవ్వలేదని రైతులు చెప్పారు. కోల్డ్ స్టోరేజీలు కట్టించారా? ఏరియేటర్స్పై సబ్సిడీ ఇస్తురా ? అని ప్రశ్నించగా.. ఏమీ కట్టించలేదని, సబ్సిడీ ఇవ్వలేదని వేలాదిమంది రైతులు చేతులు అడ్డంగా ఊపుతూ బదులిచ్చారు. రాబోయే మన ప్రభుత్వంలో సిండికేట్ను నామరూపల్లేకుండా చే స్తానంటూ జగన్ హెచ్చరించిన సమయంలో సభా ప్రాంగణం మొత్తం రైతుల హర్షధ్వానాలతో మార్మోగింది. ఆక్వాకు అండగా జగన్ భీమవరం పర్యటన ప్రభావం రాయితీ విద్యుత్ హామీని అమల్లోకి తెచ్చిన కూటమి సర్కారు పెరుగుతోన్న రొయ్యల ధరలు కిలో రూ.60 వరకు పెరిగిన వైనం హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు -
జూడాల సమ్మె సైరన్
● ఏలూరు జీజీహెచ్లో నిరసన దీక్ష ● అత్యవసర సేవల బహిష్కరణ ఏలూరు టౌన్: ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడా) సమ్మె సైరన్ మోగించారు. ఏలూ రు సర్వజన ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్యసేవలను బహిష్కరించి ఆందోళనను ఉధృతం చేశారు. ఏలూరు జీజీహెచ్లోని ఎంసీహెచ్ బ్లాక్ సమీపంలో రోడ్డుపై నిరసన దీక్ష చేపట్టారు. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ బోధనాసుపత్రిలోడాలు వైద్యసేవలకు వెళ్లకుండా సమ్మె చేయటంతో రోగులకు ఇబ్బందులు తప్పటం లేదు. రోజూ వందలాది మంది ప్రజలు జిల్లా వ్యాప్తంగా ఏలూరు జీజీహెచ్కు వైద్య చికిత్సలకు వస్తూ ఉండగా జూడాల సమ్మెతో సేవల్లో జాప్యం జరుగుతుందని చెబుతున్నారు. నిరసన దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి ఏలూరు జీజీహెచ్ జనరల్ సర్జరీ విభాగం జూనియర్ అసిస్టెంట్ డాక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపుతో ఏలూరు జీజీహెచ్లోనూ సమ్మె చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లో జూడలకు అత్యధిక స్టైఫండ్ ఇస్తుంటే ఇక్కడ మాత్రం తక్కువ ఇవ్వటం న్యాయం కాదని అన్నారు. -
గూడెం.. హాల్టులపై నిర్లక్ష్యం
తాడేపల్లిగూడెం: భౌగోళికంగా జిల్లాకు కేంద్ర స్థానం.. ప్రముఖ వాణిజ్య, విద్యా కేంద్రం.. చెన్నె–హౌరా మార్గంలో (మెయిన్ లైన్) జిల్లాలో ఏ గ్రేడ్ స్టేషన్.. రోజుకు సుమారు 7,900 మంది ప్రయాణాలు.. ఆదాయం రూ.6 లక్షలకు పైమాటే.. అయినా పలు రైళ్లకు హాల్టులు లేవు.. ప్రజల వినతులు, వేడుకోలు తప్ప పట్టించుకునే నాథుడు కరువు.. కూటమి పార్టీ ఎమ్మెల్యే ఉన్నా.. బీజేపీ ఎంపీ పరిధిలో ఉన్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. పలు రైళ్లకు ఇక్కడ హాల్టులు ఇవ్వాలనే డిమాండ్ బలంగా ఉన్నా ఆచరణ సాధ్యం మాత్రం కావడం లేదు. ఆది నుంచి అంతే.. గతంలో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చివరిది. ఏలూరుకు 18 ఏళ్లపాటు ఎంపీగా చేసిన బోళ్ల బులిరామయ్య గూడేనికి చేసిందేమీ లేదు. పైగా గూడెం అభివృద్ధి కాకూడదనుకున్నారో ఏమో బైపాస్ రోడ్డు ఊరి బయట నుంచి వేశారనే విమర్శలు ఉన్నాయి. అనంతరం కావూరి సాంబశివరావు సమయంలోనూ చేసిందేమీ లేదు. రెండో ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణంలో కేంద్ర వాటా సొమ్ము కూడా ఇప్పించలేదు. కనుమూరి బాపిరాజు ఎంపీగా ఉన్నప్పుడు కోరమాండల్ ఎక్స్ప్రెస్కు హాల్టు ఇప్పించారు. ప్రస్తుత బీజేపీ ఎంపీ శ్రీనివాసవర్మ కూడా హాల్టులు కోసం ఏమాత్రం ప్రయత్ని ంచడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఏ గ్రేడ్ స్టేషన్ అయినా.. చెన్నె–హౌరా మార్గంలో (మెయిన్ లైన్) ఏ గ్రేడ్ రైల్వేస్టేషన్గా జిల్లాలో తాడేపల్లిగూడెం నిలిచింది. ఇక్కడ నిలిచే రైళ్ల వల్ల 81 శాతం ఆదాయం వస్తుంది. ఇక్కడి స్టేషన్లో 38 రైళ్లు ఆగుతాయి. వారాంతపు, ఇతర రైళ్లు 24 వెళుతుంటాయి. రోజుకు 7,900 మంది ప్రయాణికులు రైళ్లు ఎక్కుతున్నారు. రోజుకు రూ.6,14,000 ఆదాయం వస్తుంది. ఇక్కడ సూపర్పాస్టు రైళ్లకు హాల్టులు ఇవ్వాలని, వందేభారత్ను నిలుపుదల చేయాలని పలువురు కోరుతున్నారు. జాతీయ విద్యాసంస్థ నిట్ ఇక్కడ ఉండటంతో సూపర్ఫాస్ట్ రైళ్లకు హాల్టులు ఇవ్వాల్సి ఉంది. అలాగే డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఇక్కడుంది. అహ్మదాబాద్, వడోదర ప్రాంతాలకు వెళ్లే రైలు నుంచి సుమారు 22 రైళ్లకు హాల్టులు ఇవ్వాలని ఏళ్ల తరబడి చేస్తున్న వినతులు బు ట్టదాఖలవుతున్నాయి. కనీసం ఎంపీలు కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తాడేపల్లిగూడెం ప్రాంతం భౌగోళికంగా జిల్లాకు కేంద్ర స్థానంలో ఉంది. ప్రముఖ వాణిజ్య, విద్యాకేంద్రం. ఇక్కడ చాలా కాలంగా సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టులు ఇవ్వాలని కో రుతున్నాం. డీఆర్ఎంకు, కేంద్ర రైల్వే శాఖ మంత్రికి వినతులు ఇచ్చాం. ఎవరూ స్పందించడం లేదు. ఇక్కడ రైళ్లకు హాల్టులు ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. – రవి అగర్వాల్, జెడ్ఆర్యూసీసీ సభ్యుడు ఇంకెన్నాళ్లీ చిన్నచూపు ఆదాయం ఉన్నా ఆగని రైళ్లు ఎంపీకి వినతులు ఇచ్చినా స్పందన నిల్ కూటమి పాలనలో చర్యలు శూన్యం ఏ గ్రేడ్ స్టేషన్ అయినా తప్పని నిరాదరణ -
బాలికల ఆచూకీ లభ్యం
ఉండిలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఇద్దరు బాలికల ఆచూకీ విశాఖలో లభించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 8లో uరాయితీ విద్యుత్ హామీపై రెండేళ్లుగా నోరుమెదపని చంద్రబాబు ప్రభుత్వం జగన్ పర్యటన దెబ్బకు దిగొచ్చింది. వేలాదిగా తరలివచ్చిన రైతులను చూసి ఆఘమేఘాలపై జీఓను తెచ్చింది. అధికారంలో ఉన్నా, లేకున్నా జగన్ ఎప్పుడూ రైతుల పక్షపాతే. వైఎస్సార్సీపీ హయాంలో అప్సడాను ఏర్పాటుచేసి అండగా నిలిచారు. కరోనా సమయంలోనూ ఆదుకున్నారు. – వడ్డి రఘురాంనాయుడు, వైఎస్సార్సీపీ తాడేపల్లిగూడెం కో–ఆర్డినేటర్, అప్సడా మాజీ వైస్ చైర్మన్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భీమవరంలో రొయ్యల రైతులకు అండగా నిలబడటానికి సదస్సు నిర్వ హించారు. ప్రభుత్వం దిగి వచ్చి రూ.1.50కే యూనిట్ విద్యుత్ జీఓను విడుదల చేసింది. రొయ్యల ధరలు కూడా పెరుగుతున్నాయి. జగన్మోహన్రెడ్డి రొయ్యల రైతుల పక్షాన పోరాడటంతోనే ప్రభుత్వం దిగి వచ్చింది. – కావలి దామోదరరావు, నందమూరి గరువు, ఆక్వా రైతు -
హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయండి
ఏలూరు టౌన్: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) ఏలూరు జిల్లా కార్యాలయం విషయంలో ప్రభుత్వ అధికారులు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పార్టీ కార్యకలాపాలను అడ్డుకోవటం అభ్యంతరకరమని వైఎస్సార్సీపీ జిల్లా లీగల్సెల్ అధ్యక్షుడు సీహెచ్ రాజేంద్రప్రసాద్ అన్నారు. బుధవారం ఏలూరు జాయింట్ కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ అభిషేక్ గౌడ్ను కలిసి ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా విద్యుత్శాఖ అధికారులు, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్ వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఏలూ రు ఏఎస్ఆర్ స్టేడియం సమీపంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం అంశంపై డబ్ల్యూపీ నం. 13427 ఆఫ్ 2026, డబ్ల్యూపీ నం.22124 ఆఫ్ 2025 మేరకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని స్పష్టం చేశారు. విద్యుత్శాఖ ఇష్టారాజ్యంగా సరఫరా నిలిపివేస్తూ నిబంధనలు మీరుతుందని, గతంలోనూ ఇదే తరహాలో విద్యుత్ సరఫరా కట్ చేసిన సందర్భంలో కోర్టు ఉత్తర్వులతో సరఫరా పునరుద్ధరించారని తెలిపారు. కార్యాలయానికి తాళాలు వేయటం, కార్యకలాపాలను అడ్డుకోవటం చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీనిపై ఏలూరు నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్గా చర్యలు చేపట్టాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో న్యాయవాది ఆచంట వెంకటేశ్వరరావు ఉన్నారు. -
జూడాల సమ్మైపె చర్చించాలి
తణుకు అర్బన్: ప్రభుత్వ జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మైపె శాసనమండలిలో చర్చ జరగాలని శాసనమండలి సభ్యుడు వంక రవీంద్రనాథ్ అన్నారు. బుధవారం శాసనమండలిలో పలు ప్రజా సమస్యలను ఆయన మండలి దృష్టికి తీసుకువచ్చారు. ముందుగా మండలి డిప్యూటీ చైర్మన్గా ఎన్నికై న తూమాటి మాధవరావును అభినందిస్తూ మండలిలో ప్రజాసమస్యలపై అధిక సమయం చర్చలు జరిగేలా చూడాలని సూచించారు. వచ్చే నెలలో పదవీ కాలం ముగియనున్న ఎంపీటీసీలకు ఈ ప్రభుత్వం గౌరవ వేతనం విడుదల చేయకపోవడం చాలా విచారకరమని, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఎంపీటీసీలకు అందాల్సిన గౌరవ వేతనాన్ని వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. భీమవరం (ప్రకాశంచౌక్): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక జిల్లా–ఒక ఉత్పత్తి కార్యక్రమంలో భాగంగా జిల్లాను ప్రత్యేక ఉత్పత్తి జిల్లాగా ఎంపిక చేసేందుకు చర్యలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రతినిధుల బృందం సభ్యులు ఇష్దీప్ చంద్, స్మిత్ బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ నాగరాణితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. జిల్లాలోని రొయ్యల సా గు, ఆక్వాకల్చర్, ప్రాసెసింగ్ యూనిట్ల పని తీరు, ఉత్పత్తి సామర్థ్యం, మౌలిక వసతులు, ఉపాధి కల్పన, ఎగుమతులు, మార్కెటింగ్ అవకాశాలపై ఈ బృందం పరిశీలన జరుపుతోంది. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని బృంద సభ్యులు చెప్పారు. జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్, హ్యాండ్లూమ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం: విద్యార్థులు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ మధుమూర్తి పిలుపునిచ్చారు. ఏపీ నిట్లో బుధవారం 2026–27 బ్యాచ్ విద్యార్థులకు ఇండక్షన్ కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంజనీరింగ్ విద్యార్థి జీవితంలో మొదటి సంవత్సరం కీలకమని, పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, కొత్తగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలన్నారు. క మ్యూనికేషన్ నైపుణ్యాలు, ప్రాయోగిక సామర్థాలు, క్రమశిక్షణ, నైతిక విలువలు, జట్టు భా వన వంటివి ముఖ్యమన్నారు. నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణరావు వర్చువల్గా మాట్లాడుతూ అధ్యాపకుల బలం, వారి అనుభవాలను విద్యార్థులు పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. డీన్ అకడమిక్ ఎన్.జయరామ్, రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి, రవికిరణ్శాస్త్రి, అసోసియేట్ డీన్లు పాల్గొన్నారు. యలమంచిలి: జిల్లాలో దేవదాయశాఖ ఆధీనంలోని దేవస్థానాల్లో దేవతామూర్తులను సెల్ఫోన్లో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని పూర్తిగా నిషేధించాలని ఎండోమెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దేవస్థానాల్లో మూలవిరాట్ల ఫొటోలు, వీడియోలు తీయడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమన్నారు. ఆలయ ఈఓలు ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ప్రముఖ ఆలయాల్లో ఈ నియమం పాటిస్తున్నా.. కొన్ని ఆలయాల్లో ఉత్సవాల సమయాల్లో మూలవిరాట్ల ఫొటోలు తీస్తున్నారని, మీడియా సైతం వీటిని ప్రసారం చేస్తుందన్నారు. దీని వలన ఆలయ సంబంధమైన ప్రధాన దేవతా విగ్రహాల కళలు తగ్గుతున్నాయని వేద పండితులు భావిస్తున్నారన్నా రు. కొన్ని ఆలయాల్లో ప్రధాన క్రతువులు, ప్ర త్యేక పూజల సమయంలో అధికారులే వీడియోలు, ఫొటోలు తీసి మీడియాకు ఇచ్చే అలవాటు కొనసాగుతుందని, ఇకపై దీనిపైనా ని షేధం విధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉత్సవ విగ్రహాలను మాత్రమే మీడియాకు, ప్రచారానికి వినియోగించాలని ఆయన ఆదేశించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జాతీయ లోక్ అదాలత్ల ద్వారా ఎక్కువ కేసులు పరిష్కారానికి పోలీస్ అధికారులు కృషి చేయాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి కోరారు. స్థానిక జిల్లా కోర్టులో ఉమ్మడి జిల్లాలోని పోలీసు అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. వచ్చేనెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులను రాజీ చేస్తామన్నారు. కక్షిదారులు సంబంధిత పోలీసు అధికారులను లేదా న్యాయస్థానాలను సంప్రదించవచ్చన్నారు. కేసుల పరిష్కారంలో సలహాల కోసం 15100 ద్వారా సంప్రదించవచ్చన్నారు. -
ట్రిపుల్ఐటీలో భద్రత ప్రశ్నార్థకం!
● గాడి తప్పిన సెక్యూరిటీ విభాగం ● సూపర్వైజర్ల ఇష్టారాజ్యం ● సెక్యూరిటీ సిబ్బందిపై దాడితో కలకలం నూజివీడు: నూజివీడు ట్రిపుల్ఐటీ (ఆర్జీయూకేటీ)లో పటిష్ట భద్రత కల్పించాల్సిన సెక్యూరిటీ విభాగం తీవ్ర నిర్లక్ష్యానికి, అక్రమాలకు నిలయంగా మారింది. దాదాపు 200 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్న ఈ పూర్తిస్థాయి రెసిడెన్షియల్ క్యాంపస్లో, ఇటీవల డ్యూటీ కేటాయింపు వివాదం దాడికి దారితీయడం కలకలం రేపింది. వివాదం వెనుక అసలు కారణం ఈనెల 16న మధ్యాహ్నం షిఫ్టులో విధుల్లో ఉన్న లంకపల్లి భూషణం అనే సెక్యూరిటీ గార్డు బాత్రూమ్కు వెళ్లిన సమయంలో సూపర్వైజర్ ప్రత్తిపాటి నరేష్ తనిఖీకి వచ్చారు. ఆలస్యంగా స్పందించాడనే నెపంతో భూషణంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నరేష్, ఈనెల 18న అతడికి డ్యూటీ కేటాయించలేదు. దీనిపై ప్రశ్నించిన భూషణంతో పాటు అతడి కుమారుడిపై సూపర్వైజర్, తన అనుచరులతో కలిసి భౌతిక దాడికి పాల్పడ్డారు. ట్రిపుల్ఐటీ ప్రారంభమై 18 ఏళ్లవుతుండగా ఇలాంటి ఘోర ఉదంతం చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. సెక్యూరిటీ విభాగంలో రాజ్యమేలుతున్న అరాచకం గత కొన్నేళ్లుగా పర్యవేక్షించాల్సిన సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉండటంతో, కొందరు సూపర్వైజర్లు స్వేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పక్షపాతం.. అధికార దుర్వినియోగం డ్యూటీ పాయింట్ల కేటాయింపులో తీవ్ర పక్షపాతం చూపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ‘మా వెనుక మంత్రి ఉన్నారు’ అని చెప్పుకుంటూ అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. విధి నిర్వహణలో ఉండి కూడా బయటకు వెళ్లడం, విద్యార్థులు గోడలు దూకి వెళ్తున్నా పట్టించుకోకపోవడం పరిపాటిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేరచరిత్ర ఉన్నవారికి పునరావాసం 12 ఏళ్ల క్రితం క్యాంపస్లో ల్యాప్టాప్ల చోరీకి పాల్పడి విధి నిర్వహణ నుంచి తొలగించిన పాత సిబ్బందిని మళ్లీ విధుల్లోకి తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. వైఫల్యాలెన్నో.. ప్రతి షిఫ్టునకు 55 మంది సెక్యూరిటీ ఉన్నా, ఏడాది క్రితం సిబ్బంది క్వార్టర్స్లో రెండుసార్లు చోరీకి జరిగాయి. ఇప్పటివరకు ఆ దొంగలను పోలీసులు ప ట్టుకోలేకపోవడం భద్రతా లోపాలను వేలెత్తి చూపుతోంది. పైకి భద్రంగా కనిపిస్తున్నా, లోపల డొల్లగా మారిన ట్రిపుల్ఐటీ సెక్యూరిటీ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని, ఆర్జీయూకేటీ చాన్సలర్ వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితులను చక్కదిద్దాలని విద్యార్థులు, సిబ్బంది కోరుతున్నారు. -
స్థానిక ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునీత కలెక్టర్లకు ఆదేశించారు. బుధవారం అమరావతి సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సీహెచ్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ, 409 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వీటిలో 16 గ్రామాలకు సంబంధించి కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. రెండు విడతల్లో పోలింగ్కు ప్రతిపాదనలు పంపామని, మొదటి విడతలో నరసాపురం డివిజన్లో 8 మండలాల్లోని 165 పంచాయతీలు. తాడేపల్లిగూడెం డివిజన్లోని ఇరగవరం, అత్తిలి రెండు మండలాల్లోని 39 పంచాయతీలు ఉన్నాయన్నారు. రెండో విడతలో భీమవరం డివిజన్లోని 7 మండలాల్లో 143 పంచాయతీలు, తాడేపల్లిగూడెం డివిజన్లోని పెంటపాడు, తణుకు తాడేపల్లిగూడెం మండలాల్లో 62 పంచాయతీలు ఉన్నాయన్నారు. అలాగే 4,579 పోలింగ్ కేంద్రాలను గుర్తించగా.. సుమారు 3,366 కేంద్రాలను ఆన్లైన్లో మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా తయారీ ఈనెల 21న, జాబితా ప్రచురణ 23న, వినతులు, అభ్యంతరాల స్వీకరణకు 26 వరకు, కేంద్రాల జాబితా ఆమోదానికి 29న, పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురణకు ఆగస్టు 31గా షెడ్యూల్ ప్రకటించామన్నారు. అలాగే జిల్లాలో ఓటర్ల ప్రచురణకు సమగ్ర ప్రణాళిక అమలు చేయా లన్నారు. డీపీఓ అనూరాధ, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ సీహెచ్ నాగరాణి -
వీబీజీ రామ్జీ పనుల్లో అవకతవకలు?
నూజివీడు : మండలంలోని దిగవల్లి ఉపాధి హామీ (వీబీజీ రామ్జీ) పనుల్లో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శోభనాద్రి చెరువు పూడికతీత, గట్టు బలపరిచే పనుల పేరిట ఎలాంటి పనులు చేయకుండానే ఫీల్డ్ అసిస్టెంట్ మస్తర్లు వేస్తున్నారని తెలిపారు. చెరువు గ్రామానికి ఆనుకుని ఉండటంతో ప్రతిరోజూ కూలీలను అక్కడికి తీసుకెళ్లి మస్తరు వేసి పంపించేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 11న 22 మంది, 12న 26 మంది, 13న 29 మంది, 14న 25 మంది, 17న 20 మంది పనిచేసినట్లు కాగితాల్లో చూపినప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు జరగలేదని స్పష్టం చేశారు. గతంలోనూ మండలంలో కోట్లాది రూపాయల నిధులు పక్కదారి పట్టడంతో అప్పటి ఏపీఓపై చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఉన్నతాధికారులు దిగవల్లి పనులపై తక్షణమే విచారణ జరిపి నిజాలను వెలికితీయాలని కోరుతున్నారు. -
వృద్ధురాలి అనుమానాస్పద మృతి
కాళ్ల: ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంఘటన కాళ్ల మండలం ఎస్సీ బోస్ కాలనీలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం కాలనీకి చెందిన దంతులూరి సరోజినీ (70) ఒంటరిగా నివాసముంటుంది. బుధవారం ఉదయం పాలు పోసే వ్యక్తి వచ్చి పిలవగా స్పందన లేదు. స్థానికులతో కలిసి తలుపులు తెరచి చూడగా సరోజినీ విగతజీవిగా పడి ఉంది. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆదేశాల మేరకు ఆకివీడు రూరల్ సీఐ కాళీచరణ్, ఎస్సై గణేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ పలు ఆధారాలు సేకరించింది. మృతురాలి చెవులకు ఉన్న ఆభరణాలు కనిపించకపోవడం, బీరువా తాళాలు కనిపించకపోవడంతో, బీరువాలో ఉండాల్సిన సుమారు 11 కాసుల బంగారం చోరీకి గురైనట్లు బంధువులు ఆరోపించారు. ఈ నెల 4న కంటి ఆపరేషన్ చేయించుకుని వస్తుండగా కూడా ఇంట్లోని పది పట్టు చీరలు, కాసు బంగారం చోరీకి గురయ్యాయని, అయితే ఆ సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. బంధువులు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఐస్ బాక్స్లో ఉంచడం, బీరువాను తెరిచి చూడటంతో దర్యాప్తునకు కొంత అడ్డంకిగా మారింది. మృతురాలి సోదరుడు మంతెన సత్యనారాయణరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. బంగారం చోరీ? -
బీసీల కులగణనపై కేంద్రం మాట తప్పింది
భీమవరం: భీమవరం: జనగణనలో బీసీ కులగణన చేపడతామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించినా, ఫార్మాట్లో ఆ ఊసే లేకుండా చేసి దేశంలోని 80 కోట్ల మంది బీసీలను కేంద్రం మోసం చేసిందని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఆరోపించారు. బుధవారం భీమవరంలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 1, 2026 నుంచి చేపట్టే మొదటి దశ కుటుంబాల లెక్కింపులో ఓబీసీలను చేర్చాలని కోరినా పట్టించుకోలేదన్నారు. కేంద్రం ఇటీవల విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లోని 40 ప్రశ్నల్లో కేవలం ఎస్సీ, ఎస్టీ, ఇతరులు అని మాత్రమే పేర్కొన్నారని, తెలంగాణ, బీహార్ తరహాలో ఓబీసీ కాలమ్తో పాటు ప్రతి కులానికి యూనిక్ నెంబర్ కేటాయించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి బీసీ కులగణన చేయడం ఇష్టం లేదని విమర్శించారు. తక్షణమే గెజిట్ను సవరించి, జనాభా దామాషా ప్రకారం చట్టసభలు, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అలాగే ఎన్నికల వాగ్దానం ప్రకారం ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు కొడవర్తి శివప్రసాద్, బల్లా పరమేశ్వరరావు, కేశవభట్ల విజయ్, అత్తిలి బాబి, మారిశెట్టి నరసింహమూర్తి, సతీష్, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆటోను ఢీకొట్టిన బస్సు
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): మండలంలోని వేగవరం చెక్ పోస్ట్ వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం జీలుగుమిల్లి మండలం పి.రాజవరం గ్రామానికి చెందిన కొండముర్ల దిలీప్ (23) పొగాకు బేళ్లను దింపి ఆటోలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఉదయం 5:30 గంటల సమయంలో వేగవరం వద్ద మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణికులెవరూ లేకపోవడం, బస్సులోని 46 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన దిలీప్ను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం మత్తులో లారీతో ఇల్లును ఢీకొట్టిన డ్రైవర్
నూజివీడు: మండలంలోని యనమదల శివారు రేగుంటలో మంగళవారం రాత్రి తాగి వాహనం నడిపిన ఒక లారీ డ్రైవర్ తీవ్ర కలకలం సృష్టించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గారపాటి తంబీ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో పూటుగా మద్యం సేవించి లారీతో సెంటర్లోని బడ్డీ కొట్టు పందిరిని, పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టాడు. అనంతరం లారీ సమీపంలోని పెండెం శ్రీకాంత్ ఇంటి ఆవరణలోకి దూసుకెళ్లింది. అయితే కుడివైపు ముందు చక్రం కాలువలో పడిపోవడంతో లారీ అక్కడే ఆగిపోయింది. ఘటనా సమయంలో ఇంట్లోని వారంతా లోపలికి వెళ్లడంతో ప్రమాదం తప్పిందని, కాలువలో పడకపోతే లారీ నేరుగా బాత్రూమ్లను ఢీకొట్టేదని ఊపిరి పీల్చుకున్నారు. నిర్ల క్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్ను నిలదీయగా బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచా రం అందుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. టి. నరసాపురం: పాము కాటుకు గురై చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన టి. నరసాపురం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొరివి రామన్నపాలెం పుట్టగట్టు గ్రామానికి చెందిన కూలీ గంటా మంగయ్యను ఈ నెల 12న రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా రక్తపింజర పాము కరిచింది. మొదట స్థానికంగా నాటు వైద్యం చేయించినప్పటికీ పరిస్థితి విషమించడంతో 14న ఏలూరు, ఆపై విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. అనంతరం విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి మార్చగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు హెచ్సీ జయరాజు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దెందులూరు: చోరీ ఉదంతం బయటపడకుండా సీసీ కెమెరా వైర్లను కత్తిరించి ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన సంఘటన జోగన్నపాలెంలో చోటు చేసుకుంది. ఎస్సై డి.వెంకట్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కే.విజయరాణి ఈ నెల 5న ఇంటికి తాళం వేసి, ఆ తాళాలను కుమారుడైన రవిచంద్రకు ఇచ్చి హైదరాబాద్ వెళ్లారు. ఈ నెల 19న పనిమనిషి శుభ్రం చేయడానికి రాగా, ఇంటి తలుపులు పగులగొట్టి ఉండడాన్ని గమనించి పక్కనే ఉన్న రవిచంద్రకు సమాచారం అందించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంట్లోని ఇన్వర్టర్, బ్యాటరీ, మిక్సీ సహా సుమారు రూ10,000 విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించి దర్యాప్తు చేపడుతున్నారు. ఆగిరిపల్లి: స్థానిక ఎస్ఎస్ రెస్టారెంట్ యజమాని శ్రీనివాసరావు, ఆయన కుమారుడు, సిబ్బందిపై దాడి చేసిన ఐదుగురు వ్యక్తులను బుధవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. మంగళవారం బిర్యానీ కొనుగోలు విషయమై తలెత్తిన వివాదంలో ఈ దాడి జరిగింది. నూజివీడు రూరల్ సీఐ నాగేంద్రకుమార్ ఆధ్వర్యంలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు చెప్పారు. పోతవరప్పాడు గ్రామానికి చెందిన ఆ ఐదుగురినీ అరెస్ట్ చేసి నూజివీడు కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై వెల్లడించారు. భీమవరం: తపాలా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు డాయ్ అఖర్ పేరిట జాతీయ స్థాయి లేఖ రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు భీమవరం పోస్టాఫీసు సీనియర్ సూపరింటెండెంట్ కె.హరి కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 18 ఏళ్లలోపు విద్యార్థులు ఎన్వలప్, ఇన్ల్యాండ్ లెటర్ కార్డ్ విభాగాల్లో పోటీ పడవచ్చని పేర్కొన్నారు. విజేతలకు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో నగదు బహుమతులు అందజేస్తారని వివరించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ రచనలను అక్టోబర్ 31లోపు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, భీమవరం డివిజన్, భీమవరం–534210 చిరునామాకు స్పీడ్పోస్ట్ ద్వారా పంపాలని సూచించారు. కాళ్ల: మండలంలోని పెదఅమిరంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై గణేష్ కుమార్ తెలిపారు. అస్సాం రాష్ట్రానికి చెందిన రాకేష్ లగాచు (19) చినఅమీరంలోని కార్ సర్వీసింగ్ సెంటర్లో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి తన బైక్పై పెదఅమిరం వైపు వస్తుండగా హెల్త్ క్లినిక్ వద్ద బైక్ అదుపుతప్పి, రోడ్డు పక్కన గోడ వద్ద ఉన్న వేరో మోటార్ సైకిల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై రాకేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సహచర ఉద్యోగి వంటాబత్తిన శామ్యూల్ ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొణితివాడ వాసి.. ఖ్యాతి గడించి..
వీరవాసరం: అంకితభావం, ప్రతిభ, కృషి, ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. దేశ సేవతో పాటు సమాజ సేవలో నిరంతరం పాటుపడిన ఉద్యోగికి పురస్కారాలు ఉత్తేజానిస్తాయి. అందులోనూ విశిష్ట అవార్డులు ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తాయి. అలాంటి అరుదైన ఘనతను సాధించారు వీరవాసరం మండలం కొణితివాడకు చెందిన డీఎస్పీ (స్పెషల్ బ్రాంచ్) దొంగ సత్యనారాయణ. ఆయన ఇప్పటివరకూ పలు మెడల్స్, అవార్డులు తీసుకున్నారు. ప్రత్యేకంగా రాష్ట్రపతి పోలీస్ మెడల్ను ఇటీవల రెండోసారి స్వీకరించి ఖ్యాతి గడించారు. ఆయన 1 నుంచి 10వ తరగతి వరకు కొణితివాడ హైస్కూల్లో చదువుకున్నారు. వీరవాసరంలో ఇంటర్ చదివి భీమవరం కేజీఆర్ఎల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1998 బ్యాచ్లో సబ్ ఇన్స్పెక్టర్గా పోలీస్ శాఖలో చేశారు. సుదీర్ఘ సేవా కాలంలో ధైర్యం, అంకితభావం, క్రమశిక్షణ, విధి నిర్వహణలో నిబద్ధత, వృత్తిపరమైన నైపుణ్యంతో విశిష్ట సేవలు అందించారు. ఆయన సేవలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ స్థాయి ఉన్నతాధికారులు గుర్తించి, రివార్డులతో సత్కరించారు. పురస్కారాల పంట దొంగ సత్యనారాయణ 12 క్యాష్ రివార్డులు, 12 గుడ్ సర్వీస్ ఎంట్రీలు, 21 కమాండేషన్లు / ప్రశంసలు, ముఖ్యమంత్రి శౌర్య పథకం (2005), రాష్ట్రపతి పోలీస్ పతకం గ్యాలంట్రీ (2008, 2026), కేంద్ర ప్రభుత్వ అతి విశిష్ట సేవా పతకం (2015), సేవా పతకం (2021) అందుకున్నారు. ప్రస్తుతం ఆయన తెలంగాణలో స్పెషల్ బ్రాంచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా సేవలందిస్తున్నారు. ఆయన ఇటీవల మరోసారి రాష్ట్రపతి పోలీస్ పతకం అందుకోవడం గ్రామానికే గర్వకారణంతా ఉందని గ్రామస్తులు అంటున్నారు. డీఎస్పీ సత్యనారాయణ ఘనత -
మహిళ, కుటుంబసభ్యులపై కత్తితో దాడి
చికిత్స పొందుతున్న లక్ష్మి తల్లి కుమారిబాధితురాలితో మాట్లాడుతున్న డీఎస్పీ రవిచంద్ర అత్తిలి: ప్రేమిస్తున్నానంటూ వెంటపడి సహజీవనం చేస్తున్న ఒక వ్యక్తి, సదరు మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటన అత్తిలిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల ప్రకారం అత్తిలికి చెందిన నార్ని లక్ష్మికి గతంలో వివాహమైంది. అయితే ప్రస్తుతం భర్త లేకపోవడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన ధనాల లోవరాజు ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి, సహజీవనం ప్రారంభించాడు. బుధ వారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన లోవరాజు, తనకు పిల్లలే ముఖ్యమా లేక తను కావాలో తేల్చుకోవాలని లక్ష్మితో గొడవకు దిగాడు. తనకు పిల్లలే కావాలని ఆమె తెగేసి చెప్పడంతో ఆగ్రహానికి గురైన లోవరాజు లక్ష్మితో పాటు ఆమె పెద్ద కుమార్తె ధనుష, తల్లిదండ్రులు కుమారి, ఏసులపై చాకుతో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాధితులను స్థానికులు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మి పెద్ద కుమార్తె ధనుష పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కె.విశ్వనాథ్ తెలిపారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తాడేపల్లిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. -
తృటిలో తప్పిన ప్రమాదం
దెందులూరు: పెదపాడు మండలం వట్లూరు సమీపంలోని ఇంజినీరింగ్ కాలేజీ వద్ద బుధవారం ఒక ఆర్టీసీ బస్సును కంటైనర్ ఢీకొట్టింది. విజయవాడ నుంచి అమలాపురం వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సులో సాంకేతిక లోపం తలెత్తడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును రోడ్డు మార్జిన్లో నిలిపివేశాడు. అనంతరం ప్రయాణికులను మరో బస్సులోకి ఎక్కించి, సురక్షితంగా పంపించివేశాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఒక కంటైనర్ లారీ, రోడ్డు పక్కన ఆపి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టి, ఆగకుండా వెళ్లిపోయింది. అప్పటికే ప్రయాణికులు మరో బస్సులోకి మారడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై హైవే పోలీసులకు సమాచారం అందించగా, వారు ఛేజ్ చేసి కంటైనర్ను పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దోమకాటు.. ఆరోగ్యానికి చేటు
● పల్లెల్లో విజృంభిస్తున్న వ్యాధులు ● నేడు ‘ప్రపంచ దోమల దినోత్సవం’ భీమడోలు: ఆకారం చిన్నదే అయినా దోమకాటు ప్రాణాంతకం. వాతావరణ మార్పులు, పారిశుద్ధ్య లోపం కారణంగా పల్లెల్లో దోమలు విజృంభిస్తున్నాయి. ఫలితంగా ఆస్పత్రుల్లో జ్వరపీడితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతంలో నిర్వహించిన ఇంటింటి ఆరోగ్య సర్వేలు, డ్రై ఫ్రైడే వంటి కార్యక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించకపోవడం ప్రజలు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దాడులు, హత్యల కంటే దోమల ద్వారా వ్యాపించే రోగాలతోనే ఎక్కువ మంది మృత్యువాత పడుతుండటం గమనార్హం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వర్షాకాలం వచ్చిదంటే ఇంటింటికీ వైద్య ఆరోగ్య సిబ్బంది, సచివాలయ, వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిపై సర్వే చేసి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం గ్రామాల్లో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఆడ అనాఫిలిస్ దోమ వల్లే మలేరియా వ్యాపిస్తుందని 1897 ఆగస్టు 20న సర్ రొనాల్డ్ రాస్ కనుగొన్నారు. దీనికి గుర్తుగా ప్రతి ఏటా ఆగస్టు 20న ‘ప్రపంచ దోమల దినోత్సవం’ జరుపుకుంటారు. దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు ● మలేరియా : ఆడ అనాఫిలిస్ దోమ వల్ల వస్తుంది. చలి, వణుకుతో కూడిన జ్వరం వస్తుంది. ● డెంగీ : పగటిపూట కుట్టే ఏడీస్ దోమల వల్ల సోకుతుంది. హఠాత్తుగా తీవ్ర జ్వరం, కీళ్ల నొప్పులు, ప్లేట్లెట్స్ పడిపోవడం, దద్దుర్లు, ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తం కారడం దీని లక్షణాలు. ● మెదడువాపు : క్యూలెక్స్ దోమల వల్ల ముఖ్యంగా 2–14 ఏళ్ల లోపు పిల్లల్లో వస్తుంది. ఆకస్మిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, మూర్చ, పక్షవాతం ప్రధాన లక్షణాలు. ● చికెన్గున్యా : ఏడీస్ ఈజిప్ట్ దోమల వల్ల వస్తుంది. జ్వరం, కనీసం అడుగు తీసి వేయలేని స్థాయిలో భరించలేని కీళ్ల నొప్పులు ఉంటాయి. ● ఫైలేరియా (బోదకాలు) : క్యూలెక్స్ దోమ వల్ల వ్యాపిస్తుంది. తరచూ జ్వరం రావడం, కాళ్లు, చేతులు వంటి అవయవాల్లో వాపు (బిళ్లలు కట్టడం) వస్తుంది. దోమల నివారణ చర్యలు దోమల నివారణకు చర్మానికి యూకలిప్టస్, లెమన్ ఆయిల్ రాసుకోవచ్చు. వీటిలోని సినోల్ రసాయనం కీటక నివారణిగా పనిచేస్తుంది. అలాగే, చీకటి పడే సమయంలో తలుపులు మూసి ఇంట్లో కర్పూరం వెలిగించడం ద్వారా దోమలను అరికట్టవచ్చు. వర్షాకాలలో దోమల కుట్టడం ద్వారా జ్వరాలు బారిన పడుతుంటారు. దోమల వల్ల వ్యాపించే వ్యాధులను నియంత్రణకు కృషి చేస్తున్నాం. గ్రామాల్లో అవగాహన ర్యాలీలు, కరపత్రాలను అందించి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. పరిసరాల్లో నీటి నిల్వలు తొలగించాలి. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో దోమ తెరలు వాడాలి. – జి.గోవిందరావు, జిల్లా సహాయ మలేరియా అధికారి, ఏలూరు దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై దృష్టిని సారించాలి. ప్రతి ఇంటి వద్ద వారానికోకసారి ఫ్రైడే–డ్రైడే పాటిస్తే దోమల నియంత్రం సాధ్యమవుతుంది. దోమల నివారణ మనందరి బాధ్యత. పంచాయతీ అధికారుల సహకారంతో దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి అక్కడ కీటక నియంత్రణ చర్యలు చేపడుతున్నాం. – డాక్టర్ పి.జాహ్నవి, వైద్యాధికారిణి, పీహెచ్సీ, గుండుగొలను -
గిరిజన విద్యార్థిని మృతిపై విచారణ
బుట్టాయగూడెం: గిరిజన ప్రాంత ప్రజలకు వైద్యులు, సిబ్బంది మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి శోభ ఆదేశించారు. బుధవారం ఆమె పులిరామన్నగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఇటీవల మలేరియాతో మృతి చెందిన గిరిజన విద్యార్థిని మడకం నందిత (12) ఇంట్లో మరోసారి విచారణ చేపట్టారు. ఏజెన్సీలో మలేరియా మరణాలు సంభవించకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఫార్మసీ, ల్యాబ్, ప్రసూతి, అత్యవసర వార్డులను పరిశీలించి ఆస్పత్రి ప్రాంగణంలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. తర్వాత కామయ్యకుంట గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థిని మృతిపై విచారించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సుమతి, డీఎంఓ ఎన్ఎస్ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు భీమా ఉడా
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కేంద్రంగా ‘భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’ (భీమా ఉడా) ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా నరసాపురం పార్లమెంట్ను నూతన పశ్చిమగోదావరి జిల్లాగా ఏర్పాటు చేశారు. జిల్లా అడ్మినిస్రేషన్ సంబంధించి దాదాపు 90 శాతం విభాగాలను జిల్లాలో ఏర్పాటు చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం భీమవరం అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఏర్పాటు చేసే చర్యలు తీసుకునే సమయంలో ప్రభుత్వం మారిపోయింది. దీంతో ఏలూరు అర్భన్ డెవలప్మెంట్ అథారిటీలోనే పశ్చిమగోదావరి జిల్లా కూడా ఉండిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు భీమా ఉడాను ఏర్పాటు చేశారు. తీరిన ప్రయాణ భారం : గతంలో జిల్లా ప్రజలు భూముల అనుమతులు, టౌన్ ప్లానింగ్ పనుల కోసం 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏలూరుకు ప్రయాణించాల్సి వచ్చేది. కొత్త జిల్లా ఏర్పాటుతో పాటు ఇప్పుడు ‘భీమా ఉడా’ స్థానికంగా అందుబాటులోకి రావడంతో ప్రజలకు ప్రయాణ భారం తగ్గి, పనులు సులభంగా, వేగవంతంగా పూర్తవుతాయి. నిర్వహణ, పని విధానం ÁÐ]l* Eyé {糫§é¯]l M>Æ>Å-ÌSĶæ*°² ÁÐ]l$-Ð]l-Æý‡…ÌZ HÆ>µr$ ^ólĶæ$-¯]l$-¯é²Æý‡$. A£é-Çsîæ ´ëϰ…VŠæ BïœசÆŠ‡™ø ´ër$ AÐ]l-çÜ-Æý‡OÐðl$¯]l íܺ¾…-¨° CMýSPyýl °Ä¶æ$-Ñ$Ýë¢Æý‡$. BÆý‡$ Ð]l¬°-íÜ-´ë-Í-sîæÌZϰ Ýë«§é-Æý‡×æ ¿ýæÐ]l¯]l A¯]l$-Ð]l$-™èl$Ë$, ÌôæA-Ð]l#r$Ï Ý린MýS so¯Œl ´ëϰ…VŠæ Ñ¿êVýS… ^èl*çÜ$-MýS$…-r$…-¨. Ð]l*çÜtÆŠæ ´ëϯŒl §ésìæ fÇVóS ò³§ýlª ™èlÆý‡à °Æ>Ã-×êÌS A¯]l$-Ð]l$™èl$Ë$ ÁÐ]l* Eyé §éÓÆ>¯ól gêÈ AÐ]l#™éƇ$$. hÌêÏÌZ° {V>Ò$׿ {´ë…™é-ÌS-°²…-sìæMîS çÜ…º…-«¨…-_¯]l ÌôæA-Ð]l#r$Ï, ¿ýæÐ]l-¯éË$, çܦÌêÌS AÀ-Ð]l–¨® A¯]l$-Ð]l$™èl$Ë$ ç³NÇ¢Ýë¦-Ƈ$$ÌZ ÁÐ]l* Eyé ç³Ç-«¨-ÌZ¯ól fÆý‡$VýS$™éƇ$$. భీమవరం వ్యూ ఇప్పటివరకు అథారిటీ కార్యాలయం దూరంగా ఉండటంతో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనధికార లేఅవుట్లు వేసి, నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు విక్రయించేవారు. ఇప్పుడు స్థానికంగానే భీమా ఉడా అందుబాటులోకి రావడంతో ప్రజలు సులభంగా ఫిర్యాదు చేసే అవకాశం ఏర్పడింది. ఇది అక్రమ లేఅవుట్లకు, నిబంధనల ఉల్లంఘనలకు చెక్ పెడుతుందని భావిస్తున్నారు. అథారిటీ పరిధిలో ఆరు మున్సిపాలిటీలు, 19 మండలాలు భీమవరంలో ప్రధాన కార్యాలయం ఏర్పాటుతో కార్యకలాపాలు ఇకపై సొంత జిల్లాలో భవన నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతులు -
24న ‘చలో కలెక్టరేట్’
భీమవరం: దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 24న చలో కలెక్టరేట్ పేరుతో ధర్నా నిర్వహిస్తున్నట్లు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు తెలిపారు. మంగళవారం భీమవరంలో కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 80 శాతం దళిత వాడలకు శ్మశానవాటికలు లేవని, ఉన్నవి కూడా ఆక్రమణలకు గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. శ్మశానవాటిక సమస్య తెలిసేలా శవపేటిక ప్రదర్శన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు బత్తుల విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం: ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో జిల్లా ప్రొక్యూర్మెంట్ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలిక సదుపాయాలు, రవాణా, గన్నీ బ్యాగుల లభ్యతపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో సివిల్ సప్లైస్ మేనేజర్ ఎండీ ఇబ్రహీం, డీఎస్ఓ ఎన్.సరోజ, జిల్లా వ్యవసాయాధికారి జెడ్. వెంకటేశ్వరరావు, ఆర్టీఓ కేఎస్ఎంవీ కృష్ణారావు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జర్మనీ జాబ్ ఆపర్చునిటీ ప్రోగ్రామ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి.లోకమాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో భాగంగా విశాఖ, తిరుపతి, గుంటూరు కేంద్రాల్లో అభ్యర్థులకు జర్మన్ భాషలో రెండు లెవెల్స్ వరకు ఉచితంగా శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.. 8 నుంచి 10 నెలల పాటు సాగే ఈ శిక్షణను పూర్తి చేసుకున్న వారికి జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తారని వివరించారు. ఎంపికైన వారు నెలకు రూ.2.75 లక్షల నుంచి రూ.3.30 లక్షల వరకు వేతనం పొందే అవకాశం ఉందని స్పష్టం చేశారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉండి, బీఎస్సీ నర్సింగ్, ఏఎన్ఎం లేదా జీఎన్ఎం పూర్తి చేసిన వారు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం 86885 94244 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. యలమంచిలి: పాలకొల్లు పట్టణంలోని శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారిని మయన్మార్లో భారత డిప్యూటీ అంబాసిడర్గా (యాంగోన్) పనిచేస్తున్న ఐఎఫ్ఎస్ అధికారి బుడిగి శ్రీనివాసులరెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆయనను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. అనంతరం ప్రధాన అర్చకులు అనిల్ కుమార్, వీరబాబు వేద ఆశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. దెందులూరు: చైనాలోని జియాన్ నగరంలో ఈ నెల 19 నుంచి 22 వరకు జరగనున్న ‘ఇసు ప్రిక్స్–2026 ఇంటర్నేషనల్ జూనియర్ గ్రాండ్ స్కేటింగ్’ పోటీలకు జోగన్నపాలేనికి చెందిన అంతర్జాతీయ స్కేటర్, విద్యార్థి మాత్రపు జెస్సీరాజ్ ఎంపికైంది. ఈ వివరాలను ఐఎస్ఈ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు జెస్సీరాజ్ ఇప్పటికే చైనా బయలుదేరి వెళ్లింది. -
లాభాల పుట్టగొడుగులు
● అడవిలో నాటు పుట్టగొడుగులు లభ్యం ● రుచితోపాటు ఆరోగ్యం ● గిరిజన ప్రాంతంలో కట్ట రూ.100, బయట ప్రాంతాల్లో రూ.500కు కొనుగోలు బుట్టాయగూడెం: ప్రకృతి సిద్ధంగా అడవుల్లో పెరిగే పుట్టగొడుగుల రుచి అద్భుతంగా ఉంటుంది. వర్షాకాలంలో అటవీ ప్రాంతంలో పుట్టగొడుగులు పెరుగుతుంటాయి. గ్రామాల్లో లభించే పుట్టగొడుగులతో పోలిస్తే, అటవీ ప్రాంతంలో పెరిగేవి గిరిపుత్రుల ఆహారంలో ప్రధాన భాగమవుతున్నాయి. అయితే ఈ ఏడాది వర్షాలు అంతంతమాత్రంగానే కురిశాయి. అయినప్పటికీ, గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పశ్చిమ మన్యంలోని అటవీ ప్రాంతంలో నాటు పుట్టగొడుగులు విరివిగా లభిస్తున్నాయి. వర్షాల ప్రభావంతో పుట్టలపై పుట్టగొడుగులు పెద్దఎత్తున కనిపిస్తున్నాయి. దీంతో అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే గిరిజనులు నాటు పుట్టగొడుగులను సేకరించి, తమ ఇళ్లలో వండుకోవడంతో పాటు విక్రయిస్తున్నారు. ఒక కట్ట రూ.100 చొప్పున విక్రయం అటవీ ప్రాంతంలో లభించే పుట్టగొడుగులను 25 నుంచి 30 వరకు ఒక కట్టగా కట్టి, సుమారు రూ.100 చొప్పున గిరిజనులు విక్రయిస్తున్నారు. అడవిలో లభించే ఈ నాటు పుట్టగొడుగులకు అధిక డిమాండ్ ఉంది. అడవి నుంచి తెచ్చిన వెంటనే ఇవి అమ్ముడుపోతున్నాయి. అయితే పుట్టగొడుగుల సేకరణ అంత సులభమైన పనికాదు. తెల్లవారుజామునే అటవీ ప్రాంతానికి వెళ్లి పుట్టలపై ఉన్న పుట్టగొడుగులను సేకరించాలి. ఒక్కోసారి ఆ పుట్టల్లో పాములు ఉండే ప్రమాదం ఉంది. అలాగే చీమలు కూడా కుడతాయి. పుట్టగొడుగుల సేకరణకు వెళ్లిన గిరిజనులు విషపురుగుల బారిన పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రతిఏటా వర్షాకాల సీజన్లో ఈ ప్రాంతానికి వచ్చి పుట్టగొడుగులను కొనుగోలు చేసి తీసుకెళ్లేవారు చాలామందే ఉన్నారు. ఈ ఏడాది కూడా వర్షాలకు పుట్టగొడుగులు లభిస్తుండటంతో వీటి కోసం అనేకమంది ఏజెన్సీ ప్రాంతానికి క్యూ కడుతున్నారు. కొంతమంది గిరిజన ప్రాంతంలో రూ. 100కు కొనుగోలు చేసి, బయట ప్రాంతాల్లో రూ.300 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ పుట్టగొడుగులు ఎంతో రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని గిరిజనులు చెబుతున్నారు. -
రైతుల కష్టంపై ‘నీళ్లు’
లింగపాలెం : ఆరుగాలం శ్రమించి ఆయిల్ పామ్ పండిస్తున్న రైతులను దళారీ వ్యవస్థ నిలువునా ముంచుతోంది. లింగపాలెం మండలంలోని కొన్ని వే–బ్రిడ్జిల వద్ద దళారులు తీవ్ర అక్రమాలకు పాల్పడుతున్నారు. నవభారత్, గోద్రేజ్ ఫ్యాక్టరీలకు తరలించే గెలల విషయంలో వీరు భారీ మోసానికి తెరతీశారు. పగటిపూట రైతుల నుంచి కొనుగోలు చేసిన ఆయిల్ పామ్ గెలలను వే–బ్రిడ్జిల వద్ద ఉంచి, రాత్రివేళ వాటిపై విచ్చలవిడిగా నీళ్లు చల్లుతున్నారు. తద్వారా కృత్రిమంగా బరువు పెంచి ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. ఫ్యాక్టరీల వద్దకు చేరాక గెలల్లో తేమ శాతం ఎక్కువగా ఉందనే కారణంతో యాజమాన్యాలు ధరలో కోత విధిస్తున్నాయి. దళారుల కక్కుర్తి కారణంగా గత నెలలోనే టన్నుకు రూ. 450 చొప్పున ధర తగ్గిపోయిందని రైతులు వాపోతున్నారు. -
అడవికి వెళ్లి సేకరిస్తాం
చిన్నప్పటి నుంచి మా అడవిలో లభించే పుట్టగొడుగులను తింటున్నాను. ఏది తినాలో, ఏది తినకూడదనే విషయాన్ని మా పెద్దల ద్వారా తెలుసుకుని తింటున్నాను. వర్షాకాలంలో అడవికి వెళ్లి వీటిని సేకరిస్తాం. అధికంగా లభిస్తే బయట విక్రయిస్తాము. – కోర్స గంగరాజు, కామవరం, బుట్టాయగూడెం మండలం మా గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో నాటు పుట్టగొడుగులు అధికంగా లభిస్తాయి. ప్రతిఏటా వర్షాలు కురిసే సమయంలో ఈ పుట్టగొడుగులు మొలుస్తాయి. వాటిని సేకరించి వండుకుని తింటాము. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. – కోర్స రాంబాబు, కామవరం, బుట్టాయగూడెం మండలం -
ఐదో విద్యార్థి మృతదేహం లభ్యం
పెనుగొండ: ఇరగవరం మండలం అయితంపూడి వద్ద నరసాపురం కాలువలో కారు బోల్తా పడిన ఘటనలో గల్లంతైన ఐదో విద్యార్థి మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మోరి గ్రామానికి చెందిన చెరుకూరి రామచరణ్ మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం పెనుగొండ వద్ద గుర్తించారు. ఈ నెల 16న తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు గల్లంతవ్వగా, నలుగురి మృతదేహాలు అదే రోజు సాయంత్రానికి లభ్యమైన విషయం తెలిసిందే. రామచరణ్ ఆచూకీ కోసం తణుకు సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, ఇరగవరం ఎస్సై నసీరుల్లా ఆధ్వర్యంలో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితంపూడి నుంచి నరసాపురం వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర రెండు రోజుల పాటు నిర్విరామంగా గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఓ కానిస్టేబుల్ పెనుగొండ వద్ద కాలువలో చెట్టు కొమ్మల మధ్య ఇరుక్కున్న మృతదేహాన్ని గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సహాయక బృందాలు మృతదేహాన్ని వెలుపలికి తీశాయి. తండ్రి దుర్గాప్రసాద్, బంధువులు అది రామచరణ్ దేహంగా నిర్ధారించడంతో, పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు రెండు రోజులుగా నీటిలోనే ఉండిపోవడంతో రామచరణ్ మృతదేహం ఉబ్బిపోయి, గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. కొడుకు కోసం నిద్రాహారాలు మాని సహాయక చర్యల్లో పాల్గొన్న తండ్రి దుర్గాప్రసాద్ విగతజీవిగా మారిన కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. బంధువుల రోధనలతో పెనుగొండ–మార్టేరు రహదారిపై తీవ్ర విషాదం అలముకుంది. రామచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ గల్ఫ్ దేశంలో ఉపాధి పొందుతూ, ఇటీవలే సెలవుపై స్వగ్రామానికి వచ్చారు. రామచరణ్ను సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరంలో చేర్పించారు. బుధవారం నుంచే తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. మానవత్వం చాటుకున్న ఆటో డ్రైవర్ మృతదేహం చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయి, దుర్వాసన వస్తుండటంతో వెలుపలికి తీయడం పోలీసులకు సవాలుగా మారింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న పెనుగొండకు చెందిన ఆటో డ్రైవర్ చిట్టిబాబు తన ఆటోను ఆపి సహాయంగా నిలిచాడు. ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో ధైర్యంగా వెళ్లి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి మృతదేహాన్ని అంబులెన్స్లోకి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో చిట్టిబాబుకు పోలీసులతో పాటు స్థానికులు అభినందనలు తెలిపారు. -
చెల్లని చెక్కు కేసులో ఆరు నెలలు జైలు
ఏలూరు (టూటౌన్): చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో నేరం రుజువు కావడంతో ఒక మహిళకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.6.50 లక్షల జరిమానా విధిస్తూ ఏలూరు మొబైల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఏలూరు జిల్లా రెండవ అదనపు సెషన్స్ కోర్టు ఖరారు చేస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. మొబైల్ కోర్టు న్యాయమూర్తి 2025లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ, చెక్కు ఇప్పించిన ఉప్పల అనురాధ ఏలూరు రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో అప్పీలు చేయగా.. కోర్టు దానిని కొట్టివేస్తూ కింది కోర్టు తీర్పునే సమర్థించింది. ఏలూరు గాంధీ మైదానం పడమర వీధికి చెందిన మేడపాటి సుధాకర్ రెడ్డి వద్ద 2022 మే 4న అదే ప్రాంతానికి చెందిన ఉప్పల అనురాధ తన కుటుంబ అవసరాల నిమిత్తం రూ.9 లక్షలు అప్పు తీసుకున్నారు. ఆ సొమ్ములో కొంత భాగం చెల్లించేందుకు 2023 మే 5న రూ.6.50 లక్షలకూ చెక్కు అందజేశారు. ఆ చెక్కును సుధాకర్ రెడ్డి బ్యాంకులో జమ చేయగా బౌన్స్ అయింది. దీంతో ఆయన తన న్యాయవాది ద్వారా ఏలూరు మొబైల్ కోర్టులో అనురాధపై కేసు దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన మొబైల్ కోర్టు శిక్ష ఖరారు చేయగా, అప్పీలును పరిశీలించిన రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఆ తీర్పును నిలబెట్టింది. అత్తిలి: తణుకు రైల్వే అవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంచిలి –అత్తిలి రైల్వే స్టేషన్ మధ్యలో రైలు కిందపడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన చల్లా గణపతి (36) నిడదవోలు నుంచి నరసాపురం వెళుతున్న పాసింజర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తణుకు రైల్వే అవుట్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యలమంచిలి: పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయ హుండీలను మంగళవారం లెక్కించారు. నాలుగు నెలల కాలానికి రూ. 17,71,375 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు. భీమవరం ప్రాంతీయ తనిఖీదారు పి సత్య సాయికుమారి సమక్షంలో సిబ్బంది హుండీలు లెక్కించినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఆలయ సూపరింటెండెంట్ వాసు, ధర్మకర్తలు, పాలకొల్లు ఇండియన్ బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. పోలవరం రూరల్: పోలవరం సీఐ బి. కృష్ణకుమార్ ఆధ్వర్యంలో పోలవరం పోలీసులు, ఎకై ్సజ్ శాఖ అధికారులు సంయుక్తంగా మంగళవారం సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. పోలవరం మండలం తోటగొంది గ్రామానికి సమీపంలోని కాలువ గట్ల వద్ద అక్రమంగా ఏర్పాటు చేసిన సారా తయారీ కేంద్రాలను గుర్తించి తనిఖీ చేశారు. అక్కడ సారా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 1,000 లీటర్ల బెల్లం ఊటతో పాటు డ్రమ్ములు, పొయ్యిలు, ఇతర సామాగ్రిని అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అక్రమ సారా తయారీదారులను గుర్తించి కఠిన కేసులు నమోదు చేస్తామని ఎస్సై పి. అప్పారావు హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్సై అప్పారావు, ఎకై ్సజ్ ఎస్సై కె. నాగేంద్రకుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
మద్ది క్షేత్రంలో విశేష పూజలు
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): గురవాయిగూడెంలోని మద్ది ఆంజనేయస్వామికి మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ.2,83,450 ఆదాయం సమకూరిందని, నిత్యాన్నదాన సత్రంలో 2,668 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ఆలయ ఈవో ఆర్వీ చందన వెల్లడించారు. నూజివీడు: రైసు పుల్లింగ్ పేరుతో నూజివీడు ప్రాంతంలో దాదాపు రెండు కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు దాచేపల్లి శ్రీనివాసరావు ఆచూకీ తెలపాలని పట్టణ పోలీసులు మంగళవారం పట్టణంలోని చిన్నగాంధీబొమ్మ సెంటర్లో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు పాస్టర్ ఆర్ ప్రసన్నకుమార్ను అరెస్టు చేయగా, శ్రీనివాసరావు మాత్రం పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. నూజివీడు స్వగ్రామం అయినప్పటికీ హైదరాబాద్లో స్థిరపడిన శ్రీనివాసరావు ఈ ప్రాంతంలోని పేదవారి నుంచి రైసుపుల్లింగ్ పేరుతో డబ్బులు వసూలు చేశాడు. దీనిపై మోసపోయామని గ్రహించిన బాధితులు ఆరునెలల క్రితం పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావు ఆచూకి తెలిపిన వారికి తగిన పారితోషికం సైతం అందజేస్తామని ఫ్లెక్సీలో పోలీసులు పేర్కొన్నారు. తణుకు అర్బన్: తణుకు ఎస్కేఎస్డీ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థిని మానే మనోజ్ఞ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతగా నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ భూపతిరాజు హిమబిందు తెలిపారు. ఇటీవల ఒంగోలులో లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిర్వహించిన బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ 2026 పోటీల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి మనోజ్ఞ డబుల్స్ విభాగంలో రాష్ట్రస్థాయి విజేతగా నిలిచినట్లు చెప్పారు. నవంబరు 14 నుంచి 21వ తేదీ వరకు సౌత్జోన్ విభాగానికి సంబంధించి కర్ణాటకలో జాతీయస్థాయి సిక్కింలో నిర్వహించనున్న పోటీలకు అర్హత సాధించినట్లు వివరించారు. మంగళవారం కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్య ఉషారాణి, జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకట కృష్ణారావు విద్యార్థినిని అభినందించారు. -
చిత్రం.. చరిత్రకు సాక్ష్యం
అపురూప దృశ్యాల విపంచిక.. అన్ని వేడుకలను తనలో నిబిఢీకృతం చేసుకుని కొత్తగా చూపించే మౌన రుషి కెమెరా. 1816 నుంచి 2026వ సంవత్సరం వరకు రెండు శతాబ్దాల పైబడిన సుదీర్ఘ పయనంలో ఎన్నో ఆధునికతలను తనలో నింపుకుంటూ ముందుకు సాగుతోంది కెమెరా. ఈ క్రమంలో నాటి తరం నుంచి యువతరం ఉపాధి మార్గంగా నిలుస్తుంది. తాడేపల్లిగూడెం రూరల్: ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నానుడి మనుషులకే కాదు...పరికరాలకు వర్తిస్తుందా ? అంటే...అవుననే చెప్పాలి. ఎందుకంటే ఈ నానుడి అక్షరాలా నిజమే. ఈ కోవలోనే ఒకనాటి భారీ సరంజామాతో కూడుకున్న కెమెరా నేడు అరచేతిలో అద్భుతం అనే స్థాయికి చేరుకుంది. నాడు వెలుగు ఆధారితంగానే ఈ కెమెరాల్లో చిత్రాలను బంధించేవారు. నేడు వెలుగు...చీకటి ఏదైనా సరే చిత్రాలను అత్యద్భుతంగా రూపొందించే టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చింది. అసలు కెమెరా సృష్టికర్త జోసఫ్ నైస్ఫోర్ నీప్సి. ఫ్రెంచ్ దేశానికి చెందిన ఇతను 1816లో స్వయంకృతంగా కెమెరాను రూపొందించారు. తదుపరి 1826 – 29వ సంవత్సరం మధ్య లూయిస్ డాగూరేతో కలిసి జోసఫ్ శాశ్వతమైన కెమెరాను తయారు చేశారు. అప్పట్లో 124జి ఫిల్మ్పై చిత్రాలను ప్రింట్ వేసేవారు. మారుతున్న కాలానికనుగుణంగా 35 ఎంఎం ఫిల్మ్పై ఛాయాచిత్రాలను తీసి, ఆ ఫిల్మ్కు డార్క్ రూమ్లో మెరుగులద్ది ఇచ్చేవారు. అనంతరం 1975లో స్టీవ్ శాసన్ అనే వ్యక్తి 23 సెకన్లలో దృశ్యీకరించే డిజిటల్ కెమెరాను తయారు చేశారు. డిజిటల్ రంగంలో చోటు చేసుకున్న సరికొత్త మార్పుగా దీనిని పేర్కొనవచ్చు. 1980వ దశకంలో కమర్షియల్ డిజిటల్ కెమెరా అందుబాటులోకి వచ్చింది. ఇదే కెమెరా మారుతున్న డిజిటల్ రంగానికనుగుణంగా సరికొత్త సొబగులను అందిపుచ్చుకుంది. అదే విధంగా 1930వ సంవత్సరంలో వీడియో కెమెరా అందుబాటులోకి వచ్చింది. 1980వ దశకంలో వీడియో కెమెరా వినియోగం విస్తరించింది. ప్రస్తుతం 5డి సిరీస్లో డిజిటల్ కెమెరాలు, 4కె సిరీస్లో వీడియో కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటితో ఎంత దూరంలో ఉన్న చిత్రాన్నైనా మరింత స్పష్టంగా చిత్రీకరించవచ్చు. ఎత్తయిన ప్రదేశాల నుంచి సైతం ఫొటో, వీడియోలను చిత్రీకరించే డ్రోన్ వంటి పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఉపాధి రంగంగా...! ఫొటో, వీడియోగ్రఫీ రంగం ఎందరికో ఉపాధి అందిస్తుంది. జిల్లాలో రమారమీ ఐదు నుంచి ఆరు వేల మంది ఫొటోగ్రాఫర్లు పనిచేస్తున్నారని యూనియన్ నాయకులు పేర్కొంటున్నారు. వీరు కాకుండా ఫ్రీలాన్సర్లుగా, అమెచ్యూవర్స్ (స్వతంత్రులు) ప్రత్యామ్నాయ ఉపాధి మార్గంగా ఈ రంగాన్ని ఎంచుకుని పనిచేస్తున్నారు. మారుతున్న కాలానికనుగుణంగా ఒకనాడు ఫిల్మ్లపై ఫొటోలను అందించిన సీనియర్లు సైతం డిజిటల్ కెమెరాలపై అవగాహన పెంచుకుంటూ ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకుంటున్నారు. ఎందరో ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం సైతం ముందుకొచ్చి వృత్తి శిక్షణా తరగతులు నిర్వహించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభించగలవని సీనియర్ ఫొటోగ్రాఫర్లు పేర్కొంటున్నారు. నేడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో అరచేతిలో అద్భుతాలు సృష్టిస్తున్నాయి కెమెరాలు. అవే మొబైల్ కెమెరాలు. డిజటల్ కెమెరాలకు తగ్గట్టుగా కెమెరా, వీడియో విజువల్స్ను స్పష్టంగా చిత్రీకరిస్తూ మొబైల్ వినియోగదారులకు చిన్ని తెరపైనే అద్భుతాలు పంచుతున్నాయి. ఎంత ఖరీదు మొబైల్ అయినా వాటిని తీసే వారి చేతిలోనే పనితనం ఉంటుందనేది ప్రతీతి. అందుకే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మొబైల్స్, కెమెరాలు కొనుగోలు చేసినా ఫొటోగ్రాఫర్కు సాటి రావనేది జగమెరిగిన సత్యం. అయితే, మొబైల్ కెమెరాలు కొంత మేర ఫొటో, వీడియోగ్రఫీ వృత్తిపై ప్రభావం చూపిందని చెప్పక తప్పదు. మొబైల్ రాకతో కనుమరుగవుతున్న ఫొటోగ్రఫీ స్వీయ ఫొటోగ్రఫీతో కొరవడుతున్న ఆదాయం నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం -
పాప్కార్న్ కంపెనీ కార్మికులకు తీవ్ర అస్వస్థత
ముసునూరు: మండల కేంద్రం ముసునూరు–కాట్రేనిపాడు సరిహద్దులోని ఓ ప్రైవేటు పాప్కార్న్ కంపెనీలో రసాయనిక వాయువులు వెలువడి కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వివరాల ప్రకారం.. పాప్కార్న్ కంపెనీలో కార్మికులు ఉదయం పని చేస్తున్న సమయంలో ఇద్దరికి ఊపిరి పీల్చుకునే విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. చూస్తూ ఉండగానే వారు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో యాజమాన్యం స్పందించి ముసునూరు పీహెచ్సీకి తరలించారు. వైద్యాధికారి గంగాధరరావు ప్రథమ చికిత్స అందించి, పరిస్థితి విషమంగా ఉండడంతో నూజివీడుకు రిఫర్ చేశారు. అక్కడి నుంచి అంబులెన్స్లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. తక్షణ వైద్య సేవలు అందించడంతో క్షతగాత్రుల ఆరోగ్యం కుదుట పడింది. తక్షణమే ఆసుపత్రికి తరలించడం వలన అన్ని రకాల పరీక్షలు నిర్వహించి, వైద్య సేవలు అందించినట్లు ఏరియా ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్ వరప్రసాద్ తెలిపారు. గాలి ప్రవేశించకుండా ఉండడం వలన విష వాయువులు, రసాయనాలతో తీవ్ర ప్రమాదం సంభవిస్తుందని జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. ప్రమాదంపై యజమాని మాట్లాడుతూ కార్మికులు రాత్రి ఒంగోలులో పని చేసి అలసటతో వచ్చి, ఏమీ తినకుండానే ఇక్కడ పనిలోకి రావడంతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. బాధితులకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరేంత వరకు పూర్తి వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. -
పట్టపగలే ఇళ్లు గుల్లజేస్తాడు
నూజివీడు: పట్టణంలోని గాంధీనగర్లోని గాజుల మురళీకృష్ణ ఇంటిలో పట్టపగలు జూలై ఒకటో తేదీన జరిగిన భారీ చోరీలో నిందితుడు ఒంగోలు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. తాళం వేసి ఉన్న ఇంటిలో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో చోరీ జరగగా దాదాపు 40 కాసుల బంగారం చోరీకి గురైంది. అప్పటి నుంచి సీఐ ఐవీ నాగేంద్రకుమార్ నేతృత్వంలో నూజివీడు నుంచి హైదరాబాద్ వరకు సీసీ కెమెరాల్లోని ఫుటేజీని పరిశీలించి దొంగను గుర్తించి దాదాపు 20 రోజులు హైదరాబాద్లో మకాం వేసి కంటిమీద కునుకు లేకుండా గాలించినప్పటికీ దొరకలేదు. ఆ తరువాత ఒంగోలులో మరో దొంగతనానికి పాల్పడి 90 కాసుల బంగారంను దొంగిలించాడు. ఈ సంఘటనలో క్లూస్ టీంకు వేలిముద్రలు లభ్యమవ్వడంతో దొంగను గుర్తించారు. నూజివీడు, మైలవరం, నర్సరావుపేటలలో కూడా ఇదే దొంగ దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఆ దొంగ ముంబాయి వైపు వెళ్తుండగా ఒంగోలు పోలీసులు హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసుల సహకారంతో పూనే దాటిన తరువాత లూనావాలా వద్ద అదుపులోకి తీసుకొని ఒంగోలుకు తీసుకువచ్చారు. పగటిపూటే చోరీలు కర్ణాటకకు చెందిన ఈ దొంగ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తూ ద్విచక్ర వాహనంపైనే వందల కిలోమీటర్లు తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లల్లో పగటిపూట మాత్రమే దొంగతనాలు చేస్తాడు. హైదరాబాద్ నుంచి 250 నుంచి 350 కిలోమీటర్ల దూరం వెళ్లి అక్కడి పట్టణాల్లో దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇదే తరహాలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం, ఏలూరు జిల్లా నూజివీడు, పల్నాడు జిల్లా నర్సారావుపేట, ఒంగోలులలో దొంగతనాలకు పాల్పడ్డాడు. నాలుగు చోట్ల కలిపి దాదాపు 240 కాసుల బంగారు నగలను చోరీ చేశాడు. చోరీల తరువాత ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు ఎక్కడా కూడా హెల్మెట్ను తలపై నుంచి తీయకుండా జాగ్రత్త పడతాడు. పెట్రోలు బంకుల్లో, మద్యం షాపుల వద్ద ఎక్కడా హెల్మెట్ తీయకుండానే పెట్రోలు కొట్టించుకోవడం, మద్యం కొనుక్కోవడం చేస్తుంటాడు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒంగోలు నగరం చేసిన దొంగతనం సంఘటనలో క్లూస్ టీంకు వేలిముద్రలు లభ్యమవ్వడంతో దొంగ దొరికాడు. పిల్లలకు ఇంటర్నేషనల్ స్కూల్లో విద్య ఈ దొంగకు ఇరువురు కుమారులు, ఒక కుమార్తె ఉండగా వీరిని బెంగళూరు, హైదరాబాద్లలోని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నట్లు తెలిసింది. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.3 లక్షలు చొప్పున ఫీజులు చెల్లిస్తూ చదివిస్తుండటం గమనార్హం. దొంగతనాలు చేస్తూ పిల్లలను ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివిస్తుండటం చూసి విస్తుపోవడం పోలీసు అధికారుల వంతైంది. భారీ దొంగతనాలు చేసిన అంతర్రాష్ట్ర దొంగ దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
పది రూపాయల కోసం వివాదం
ఆగిరిపల్లి: బిర్యానీకి కోసం హోటల్కి వెళ్లిన వ్యక్తి పది రూపాయలు తక్కువ ఇవ్వడంతో మొదలైన వివాదం చివరికి హోటల్ యజమాని, సిబ్బందిపై విచక్షణ రహితంగా దాడి చేసే వరకు వివాదం దారి తీసింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం ఆగిరిపల్లి శివారులో తులిమిల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి రెస్టారెంట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం పోతవరప్పాడు గ్రామానికి చెందిన వ్యక్తి బిర్యాని కోసం వచ్చి పది రూపాయలు తక్కువగా చెల్లించాడు. రెస్టారెంట్ యజమాని కుమారుడు రూ.10 తక్కువగా ఇచ్చావు అనడంతో వివాదం మొదలై ఇరువురు ఘర్షకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హోటల్ వద్దకు వచ్చి ఇరువురికి సర్ది చెప్పి పంపించి వేశారు. సాయంత్రం మరలా పోతవరప్పాడు గ్రామానికి చెందిన వ్యక్తి హోటల్ వద్దకి 15 మందిని తీసుకువచ్చి హోటల్ యజమాని శ్రీనివాసరావు, కుమారుడు రాజేష్, హోటల్ సిబ్బంది మంటూ, రాకేష్పై బీరు సీసాలు, కరల్రతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా హోటల్లో ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై నాగరాజు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆగిరిపల్లిలో సంచలనం రేకెత్తించింది. రెస్టారెంట్ యజమానిపై దాడి -
చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): జంగారెడ్డిగూడెం పట్టణం అశ్వరావుపేట రోడ్డులోని కే–కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. ఈనెల 13న రాత్రి9:30 గంటల సమయంలో ప్రమాదానికి గురైన సుమారు 55 నుంచి 60 ఏళ్ల వయస్సు గల వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 17న మృతి చెందారని ఎస్సై పేర్కొన్నారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు వెంటనే జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. -
విద్యార్థుల సురక్షిత ప్రయాణమే ధ్యేయం
ఏలూరు టౌన్: విద్యార్థుల సురక్షిత ప్రయాణంపై విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. మంగళవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు, విద్యాసంస్థల యాజమాన్యాలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యాసంస్థల వాహన డ్రైవర్లు భద్రతా ప్రమాణాలు పాటించేలా స్కూల్స్, కళాశాలల యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని తెలిపారు. విద్యాసంస్థకు చెందిన ప్రతి బస్సులోనూ విధిగా డాష్బోర్డ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటిని పోలీస్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయాలని సూచించారు. ఎలాంటి నేర నేపధ్యం లేని బాధ్యతాయుతమైన డ్రైవర్లును మాత్రమే నియమించుకోవాలని ఆదేశించారు. బస్ డ్రైవర్కు విధిగా యూనిఫామ్, గుర్తింపు కార్డు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆర్టీవో శేఖర్, ఎంవీఐ విఠల్, విద్యాసంస్థల బస్సుల యాజమాన్యాలు పాల్గొన్నారు. నెలాఖరులోగా ఏర్పాటు చేసుకోవాలి ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని అన్ని విద్యాసంస్థల బస్సుల్లో వీఎల్టీడీ, డ్యాష్బోర్డ్ కెమెరాలను ఈ నెలాఖరు నాటికి ఏర్పాటు చేసుకోవాలని ఇన్ఛార్జి ఆర్టీవో బాలేందు శేఖర్ స్పష్టం చేశారు. చొదిమెళ్లలోని డీటీసీ కార్యాలయంలో విద్యాసంస్థల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అత్యవసర సమయాల్లో, ప్రమాదాలు జరిగినప్పుడు డ్యాష్బోర్డ్ కెమెరా వీడియోలు కీలక సాక్ష్యాలుగా ఉపయోగపడతాయన్నారు. సమావేశంలో వాహన తనిఖీ అధికారులు, విద్యాసంస్థల ప్రతినిధులు, పాల్గొన్నారు. -
పుస్తకాలు లేని చదువులెలా!?
నూజివీడు: విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామంటూ విద్యాశాఖ మంత్రి చెబుతున్న మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా, నేటికీ ప్రభుత్వ పాఠశాలలకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందలేదు. పరీక్షల వేళ పుస్తకాలు లేకపోవడంతో తమ పిల్లలు ఎలా చదువుకోవాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందని పుస్తకాలు.. అగమ్యగోచరంగా పరీక్షలు ఈ నెల 17 నుంచి విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ (నిర్మాణాత్మక మూల్యాంకనం) పరీక్షలు ప్రారంభమయ్యాయి. 19 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. అయితే, ఇంతవరకు నాలుగో తరగతికి చెందిన గణితం, ఈవీఎస్ పాఠ్యపుస్తకాలు విద్యార్థుల చేతికి అందలేదు. ప్రస్తుతం గణితం, ఈవీఎస్ సబ్జెక్టులను కలిపి ఒకే పాఠ్యపుస్తకంగా ఇస్తున్నప్పటికీ, వాటిని కూడా ప్రభుత్వం ఇప్పటివరకు పాఠశాలలకు సరఫరా చేయలేదు. దీంతో విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. నామమాత్రంగానే పంపిణీ నూజివీడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు సుమారు 500 మంది వరకు ఉన్నారు. వీరిలో కేవలం 40 నుంచి 60 మంది విద్యార్థులకు మాత్రమే పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజుల్లో గణితం పుస్తకాలు అందాయి. ఆ తర్వాత ఒక్క పుస్తకం కూడా రాకపోవడంతో, వందలాది మంది విద్యార్థులు పుస్తకాలు లేకుండానే కాలం వెల్లదీయాల్సి వస్తోంది. అధికారుల ఉదాసీనత పాఠశాలలకు అవసరమైన పాఠ్యపుస్తకాల కోసం ఎంఈఓలు ఇండెంట్ పెట్టి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో చదివేది పేద వర్గాల విద్యార్థులు కావడంతోనే అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికై నా విద్యాశాఖ స్పందించి, తక్షణమే పుస్తకాలు పంపిణీ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నేటికీ 4వ తరగతికి రాని గణితం, ఈవీఎస్ పుస్తకాలు పుస్తకాలు లేకుండానే ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు మండలంలోని నాలుగో తరగతి విద్యార్థులకు సంబంధించి గణితం, ఈవీఎస్ పాఠ్యపుస్తకాలు సరిపడా రాలేదు. దీనిపై స్పందించి, పుస్తకాల కోసం ఇండెంట్ పెట్టడంతో పాటు టెక్ట్స్బుక్స్ ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందితోనూ మాట్లాడుతున్నాం. త్వరలోనే విద్యార్థులందరికీ పుస్తకాలు అందజేస్తాం. – సంగెపు జమలయ్య, ఎంఈఓ–2, నూజివీడు మండలం -
ఆటోను ఢీకొన్న మోటార్సైకిల్
ఉంగుటూరు: ముందు వెళ్తున్న ఆటోను వెనుకనుంచి మోటార్సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి బాదంపూడి బైపాస్ వద్ద జరిగింది. ప్రమాద వివరాలను చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ వెల్లడించారు. భీమడోలు మండలం కొండ్రుపాడు గ్రామానికి చెందిన నరెడ్ల దొరబాబు (30), దాసరి నాగరాజు పనుల నిమిత్తం తణుకు మండలం తేతలి గ్రామానికి వెళ్లారు. పని పూర్తి చేసుకుని తిరిగి స్వగ్రామానికి మోటార్సైకిల్పై వస్తుండగా.. బాదంపూడి బైపాస్ రోడ్డులో వెలమళ్ళ సర్వీస్ రోడ్డులోకి ముందుగా రేకులు లోడుతో వెళుతున్న ఆటో ఒక్కసారిగా తిరగడంతో, వెనుక వస్తున్న మోటార్సైకిల్ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నరెడ్ల దొరబాబు, దాసరి నాగరాజులను హైవే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే దొరబాబు మృతి చెందాడు. రేకులతో వెళ్తున్న ఆటో డ్రైవర్ దేశంశెట్టి నాగేశ్వరరావు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, నిర్లక్ష్యంగా ఆటో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకరి మృతి, మరొకరికి గాయాలు -
క్రికెట్లో విస్తృత అవకాశాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): క్రికెట్ క్రీడలో ప్రస్తుత రోజుల్లో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయని రిటైర్డ్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. స్థానిక ఎస్వీసీ సినిమా ప్రాంగణంలో సోమవారం భీమవరం బ్లాస్టర్స్ ఫ్రాంచైజీ ఆధ్వర్యంలో ’ఆంధ్రా టెన్నిస్బాల్ ప్రీమియర్ లీగ్’ ట్రోఫీ టూర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. క్రీడలు కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా, మానసిక దృఢత్వానికి, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి చక్కటి వేదికగా ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఫ్రాంచైజీ యజమానులు అబ్బూరి అనిల్, జి. గౌతమ్ మాట్లాడుతూ.. ఆంధ్రా టెన్నిస్బాల్ ప్రీమియర్ లీగ్ కోసం రాష్ట్రంలోని ఒంగోలు, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం వేదికలుగా ప్రాథమికంగా 670 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరిలో ’గ్రీన్ వికెట్’ పేరుతో మరోసారి వడపోత ఎంపికలు నిర్వహించి, 8 ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొని మొత్తం 180 మంది క్రీడాకారులను కొనుగోలు చేశాయని వెల్లడించారు. ఏటీబీపీఎల్ ఆపరేషన్స్ హెడ్ ఐ.కొండలరావు మాట్లాడుతూ.. వచ్చే సెప్టెంబర్ 18 నుంచి 28వ తేదీ వరకు మంగళగిరిలోని డాక్టర్స్ స్పోర్ట్స్ అకాడమీ క్రీడా ప్రాంగణంలో ఈ పోటీలు ఘనంగా జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా ఏటీబీపీఎల్ ట్రోఫీని అతిథులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు, సాయి స్వర్ణ హీరో షోరూమ్ జనరల్ మేనేజర్ ఏవీ సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
ముసునూరు: తీవ్ర మనస్తాపానికి గురైన ఇంజనీరింగ్ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన ఘటన ముసునూరు మండలంలో చోటుచేసుకుంది. గోపవరం గ్రామానికి చెందిన డాలు రవితేజ (19) ఏలూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సర విద్యార్థి. గత రెండు నెలలుగా కాలేజీకి వెళ్లకపోవడంతో కాలేజీకి వెళ్ళి సక్రమంగా చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన రవితేజ తల్లిదండ్రులు తమ వాటర్ ప్లాంట్కు వెళ్లిన సమయంలో తన ఇంటిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు. దెందులూరు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదవేగి మండలం కొప్పులవారిగూడెం గ్రామానికి చెందిన పామర్తి వెంకటేశ్వరరావు (55) ఆదివారం ఏలూరులో పని ఉండి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా గాలాయగూడెం పతాంజలి పామాయిల్ ఆఫీస్ వద్ద అతివేగంగా నిర్లక్ష్యంగా వస్తున్న మరొక ద్విచక్ర వాహనం వెంకటేశ్వరరావు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతడ్ని 108 వాహనంలో ఏలూరు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పెదవేగి: జీవితంపై విరక్తి చెంది పురుగుమందును ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి ఎక్కించుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు. పెదవేగి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదవేగి మండలం కవ్వగుంట గ్రామానికి చెందిన శ్రీకాకుళం వెంకటేశ్వరరావు (37) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 2022 నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన, వంగాయగూడెం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 16న ఆటోలో ఇంటి నుంచి బయటికి వెళ్లగా, లక్ష్మీపురం వద్ద పోలవరం కుడికాలువ కట్టపై గుర్తించారు. వెంటనే 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో, చనిపోవాలన్న ఉద్దేశంతోనే పురుగుమందును ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి ఎక్కించుకున్నట్లు వెంకటేశ్వరరావు పోలీసులకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ సోమవారం ఆసుపత్రిలో మృతి చెందారని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. ఉండి: స్కూల్కు వెళ్తున్నామని చెప్పి బ్యాగులు తగిలించుకుని ఇంటి నుంచి బయలుదేరిన ఇద్దరు పదో తరగతి విద్యార్థినులు బడికి వెళ్లకుండా అదృశ్యమయ్యారు. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఉండి జగనన్న కాలనీ, కొండ్రోతుపేటకు చెందిన ఇద్దరు బాలికలు పదోతరగతి చదువుతున్నారు. ఎప్పటిలాగే సోమవారం ఉదయం స్కూల్కు వెళుతున్నామని చెప్పి బ్యాగులు వేసుకుని ఇంటి నుంచి బయలుదేరారు. కొంతసేపటికి మీ పిల్లలు ఈరోజు స్కూల్కు ఎందుకు రాలేదు? అంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం) బాలికల తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో లబోదిబోమంటూ తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకుని ఆరా తీశారు. పాఠశాల గేటు వరకు వచ్చిన విద్యార్థినులు లోపలికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్లిపోయారనే విషయం తెలియక తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బంధువులు, స్నేహితులు ఇళ్ల వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించకపోవడంతో ఉండి పోలీసులను ఆశ్రయించారు. ఓ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చింతలపూడి (జంగారెడ్డిగూడెం): గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో, దాతల ఆర్థిక సహకారంతో గిరి ప్రదక్షిణ మార్గంలో చేపట్టిన మరుగుదొడ్డి నిర్మాణం వివాదానికి దారితీసింది. ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి సమీపంలో ఈ నిర్మాణం చేపట్టడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయ ఈవో, ధర్మకర్తల మండలి అనుమతి లేకుండా, అనధికారికంగా ముత్యాలమ్మ విగ్రహం వద్ద సోమవారం శంకుస్థాపన చేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ నిర్మాణాన్ని వేరే ప్రాంతంలో చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ వివాదంపై ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ స్పందిస్తూ.. ఆలయాభివృద్ధికి సహకరించే దాతలను ఎల్లప్పుడూ గౌరవిస్తామని తెలిపారు. అయితే, కమిటీ స్థలాన్ని ఖరారు చేయకుండా దాతలు ఇష్టానుసారంగా నిర్మాణం చేపట్టడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. -
వ్యవసాయ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకులు అందిస్తున్న రుణ సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ (ట్రెజరీ) జి.భాస్కర్ సూచించారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏలూరులో నిర్వహించిన వ్యవసాయ రుణాల అవుట్రీచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బ్యాంక్ ఆధ్వర్యంలో వివిధ రంగాల అభివృద్ధికి అందిస్తున్న సేవలను వివరించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి రుణాల మంజూరు ప్రక్రియను సరళతరం చేశామన్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ పి. శ్రీనివాసరావు విశిష్ట అతిథిగా హాజరుకాగా విజయవాడ రీజినల్ హెడ్ ఈ. వెంకటేశ్వరరావు, రీజినల్ ఆఫీస్ చీఫ్ మేనేజర్ జయ మహీధర్ రెడ్డి, ఏలూరు బ్రాంచ్ చీఫ్ మేనేజర్ దీపక్కుమార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం, అర్హులైన రైతులకు వ్యవసాయ రుణాలను మంజూరు చేసి పంపిణీ చేశారు. -
‘దీన్దయాల్’ స్కాలర్షిప్నకు దరఖాస్తుల ఆహ్వానం
భీమవరం: విద్యార్థుల్లో తపాలా బిళ్లల సేకరణ పట్ల ఆసక్తి పెంపొందించడానికి పోస్టల్శాఖ దీన్దయాల్ స్పర్శ యోజన స్కాలర్షిప్లను అందిస్తున్నట్లు భీమవరం పోస్టల్శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 9వ తరగతిలో 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 5 శాతం మార్కుల సడలింపు ఉంటుందన్నారు. ప్రతి తరగతి నుంచి 10 మంది విద్యార్థులను ఎంపికచేసి ప్రతినెల రూ.500 చొప్పున స్కాలర్షిప్ అందజేస్తారన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు దగ్గరలోని పోస్టాఫీసు నుంచి దరఖాస్తును పొంది సెప్టెంబర్ 16లోగా భీమవరం డివిజన్ పోస్టాఫీసుకు స్పీడ్ పోస్టు ద్వారా పంపించాలని తెలిపారు. -
ఆశ్రంలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
దెందులూరు: ఆశ్రం ఆసుపత్రి వైద్యులు మరోసారి తమ అరుదైన వైద్య సేవలతో ప్రాణాలు నిలబెట్టి మరో మైలురాయిని సాధించారు. అధిక ప్రమాదకర గర్భధారణ నేపథ్యంలో, ఓ తల్లికి ప్లేట్లెట్స్ పడిపోవడంతో పాటు గర్భంలోని శిశువుకు రక్తప్రసరణ కూడా తగ్గింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో 31 వారాలకే ముందస్తు ప్రసవం చేయాల్సి వచ్చింది. గైనకాలజీ హెచ్ఓడీ డాక్టర్ వందన, పీడియాట్రిక్స్ హెచ్ఓడీ డాక్టర్ వసుంధర ఆధ్వర్యంలోని వైద్య సిబ్బంది ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అనంతరం ఆ శిశువును నియోనాటల్ ఐసీయూలో ఉంచి 61 రోజుల పాటు ప్రత్యేక వైద్య సేవలు అందించారు. సోమవారం నాటికి పాప ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడటంతో సంపూర్ణ ఆరోగ్యంతో తల్లి, శిశువును డిశ్చార్జ్ చేసినట్లు ఆశ్రం ఆసుపత్రి డైరెక్టర్ జి.రతీదేవి, సీఈఓ కె.హనుమంతరావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేసిన డాక్టర్ వందన, డాక్టర్ వసుంధర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. -
పెళ్లింట విషాదం
కుక్కునూరు: పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపిన ఆ కుటుంబంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొని వాగులో పడటంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రం మణుగూరు ప్రాంతానికి చెందిన వనమాల వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తమ పెద్ద కుమార్తె వివాహాన్ని జరిపించారు. వివాహ వేడుక అనంతరం సోమవారం తెల్లవారుజామున కారులో మణుగూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. కుక్కునూరు మండలంలోని లంకాలపల్లి గ్రామ సమీపంలోని కల్వర్టు వద్దకు చేరుకునే సమయానికి డ్రైవింగ్ చేస్తున్న వెంకటేశ్వర్లుకు నిద్రమత్తు రావడంతో వాహనంపై నియంత్రణ కోల్పోయి కారుతో వేగంగా కల్వర్టును ఢీకొట్టాడు. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు భార్య వనమాల లక్ష్మి (40) అక్కడికక్కడే మృతి చెందింది. రెండో కుమార్తె వనమాల దేవి (14) చేతులకు స్వల్ప గాయాలు కాగా, కారులో ఉన్న బత్తుల రాము తలకు స్వల్ప గాయమైంది. వెంకటేశ్వర్లుతోపాటు మరో వ్యక్తి ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు వెంటనే ఎస్సై పి.రాజారెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పెళ్లి సందడి ముగించుకుని కుటుంబంతో కలిసి ఇంటికి తిరుగు ప్రయాణమైన సమయంలో జరిగిన ఈ ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారి గాయాలతో బయటపడగా, తల్లి ప్రాణాలు కోల్పోవడం బంధువులను, స్థానికులను కలచివేసింది. ప్రమాదంపై కుక్కునూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్ద కుమార్తె వివాహం వేడుక అనంతరం మణుగూరు తిరుగుప్రయాణం కుక్కునూరు మండలం లంకాలపల్లి సమీపంలో కల్వర్టును ఢీకొన్న కారు మహిళ దుర్మరణం, మరో ఇద్దరికి గాయాలు -
సబ్ కలెక్టర్ విచారణ
నూజివీడు: పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందిన ఘటనపై సబ్కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న సోమవారం ప్రాథమిక విచారణ నిర్వహించారు. మండలంలోని బోర్వంచకు చెందిన రామకూరి ప్రేమ్బాబు కడుపులో నొప్పితో ఆసుపత్రిలో చేరగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన విషయం పాఠకులకు తెలిసిందే. సంబంధిత ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్య తీసుకోవాలని కోరుతూ మృతుడి బాబాయ్ రామకూరి రాజు సబ్ కలెక్టర్కు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీని అందజేశారు. ఈ నేపథ్యంలో నూజివీడు ఏరియా ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ మత్రూనాయక్, ఆర్ఎంవో డాక్టర్ వరప్రసాద్, సీనియర్ వైద్యులు శ్రీనివాస్ సబ్ కలెక్టర్ను కలసి ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి సంబంధిత సమాచారాన్ని ఉన్నతాధికారులకు పంపనున్నట్లు సబ్ కలెక్టర్ వినూత్న పేర్కొన్నారు. -
వసతులు మృగ్యం.. చదువుకు దూరం
చాట్రాయి: అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ప్రకటనలు ఆచరణలో నీరుగారిపోతున్నాయి. చాట్రాయి మండలంలో పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల లేమితో మూతపడుతుండటంతో పేద విద్యార్థుల చదువు ప్రశ్నార్థకంగా మారుతోంది. రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కు అధికారుల నిర్లక్ష్యంతో పేదలకు దూరమవుతోందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తి పనులతో టాయిలెట్ల కష్టాలు మండలంలోని జనార్దనవరం దళితవాడ ప్రాథమిక పాఠశాలలో గత ప్రభుత్వ హయాంలో ‘నాడు–నేడు’ పథకం కింద రూ.2.68 లక్షలతో టాయిలెట్ల నిర్మాణం ప్రారంభించారు. అయితే ఎన్నికల ముందు పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఇవి పూర్తికాకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళా ఉపాధ్యాయులు పక్క ఇళ్లకు వెళ్లాల్సి వస్తుండగా, విద్యార్థులు మరుగుదొడ్ల కోసం ఇళ్లకు పరిగెత్తాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సమస్యతో విసిగిపోయిన విద్యార్థులు బడికి దూరమవుతున్నారు. ఉపాధ్యాయురాలే స్కూలుకు తాళం వేసి, ఉన్న కొద్దిమంది విద్యార్థులను దూరంగా ఉన్న వేరే పాఠశాలకు తీసుకెళ్లి బోధన సాగిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉపాధ్యాయులు కరువు.. బడుల తరలింపు ● యర్రవారిగూడెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు లేకపోవడంతో, అక్కడ ఉన్న 10 మంది విద్యార్థులు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పాఠశాలకు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. ● చాట్రాయి గొల్లగూడెం ప్రాథమిక పాఠశాలలో ‘నాడు–నేడు’ కింద అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ ఉపాధ్యాయుడిని నియమించలేదు. దీంతో అక్కడి 12 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు వెళ్లినా.. ఫీజులు కట్టలేక వెనక్కి వచ్చి, ప్రస్తుతం చాట్రాయి మెయిన్ స్కూలుకు వెళ్తున్నారు. పాఠశాలలో వసతులున్నా ఉపాధ్యాయుడిని నియమించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నా అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి. ● జగన్నాథపురం, టీ గుడిపాడు, నరసింహారావుపాలెం ప్రాథమిక పాఠశాలలు సైతం వివిధ కారణాలతో మూతపడటంతో చిన్నారులు చదువుకు దూరమవుతున్నారు. పట్టించుకోని విద్యాశాఖ అధికారులు మండలంలో ఇద్దరు ఎంఈవోలు ఉన్నప్పటికీ, పాఠశాలలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలల పునఃప్రారంభానికి ముందు ఉపాధ్యాయులు గ్రామాల్లో తిరిగి ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ప్రచారం చేసేవారే కరువయ్యారని, అందుకే విద్యార్థులు ప్రైవేటు బాట పట్టడమో లేదా బడులకు దూరమవడమో జరుగుతోందని ప్రజలు మండిపడుతున్నారు. పాఠశాల కావాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు లిఖితపూర్వకంగా అర్జీ అందిస్తే, పై అధికారులకు నివేదిక ఇచ్చి ఆ బడులను తిరిగి తెరిచేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. – మాసగిరి శ్రీనివాసరావు,ఎంఈవో 1, చాట్రాయి చాట్రాయి మండలంలో అస్తవ్యస్తంగా ప్రాథమిక విద్య అసంపూర్తిగా ‘నాడు–నేడు’ పనులు.. ఉపాధ్యాయులు లేక బడుల బంద్ ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు -
ఆయుధ డిపోను అడ్డుకుంటాం
కొయ్యలగూడెం: ఏడాదికి రెండు పంటలు పండే సారవంతమైన భూములను అభివృద్ధి పేరుతో సేకరిస్తూ, వేలాది మంది రైతు కుటుంబాలను రోడ్డున పడేసే ప్రయత్నాలను ప్రజాసంఘాలు సమర్థవంతంగా ఎదుర్కొంటాయని నాయకులు స్పష్టం చేశా రు. బోడిగూడెం, మంగపతిదేవిపేట, బర్కెట్నగర్, ఊట్లగూడెం తదితర గ్రామాల మధ్య ప్రభుత్వం చేపట్టదలచిన నేవీ ఆయుధ డిపో నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భూసేకరణ కోసం 2013 భూసేకరణ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని, తక్షణమే గ్రామసభలు నిర్వహించాలని కోరారు. ఉనికి కోసం వ్యవసాయంపైనే ఆధారపడే చిన్న, సన్నకారు రైతుల భూములను బలవంతంగా లాక్కోవడానికి ఒప్పుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వేలాది ఎకరాల నిరుపయోగ అటవీ భూములు అందుబాటులో ఉన్నప్పటికీ, రైతుల భూములను పణంగా పెట్టి ఆయుధ డిపో ఏర్పాటు చేయాలనుకోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కాంట్రాక్టు పనుల్లో లబ్ధి పొందేందుకు, నష్టపరిహారం పేరుతో కోట్లాది రూపాయలు కాజేసేందుకే ప్రజాప్రతినిధులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం వారితో కలిసి డిపో ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రజాసంఘాల నాయకులు హామీ ఇచ్చారు. విద్యావేత్త అలుగు ఆనంద శేఖర్, ఏఐకేఎంఎస్, ప్రజాసంఘాల సమాఖ్య, ఇఫ్టూ నాయకులు బొగ్గవరపు బాబురావు, ఎస్.రాజశేఖర్, ఎస్.సుందరరావు, కె.సుందరరావు తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ పీజీఆర్ఎస్
భీమవరం: ప్రజాసమస్యలపై త్వరితగతిన స్పందించి, నిర్ణీత గడువులోగా చట్టపరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా అదనపు ఎస్పీ డి.విశ్వనాథ్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులను స్వీకరించిన అనంతరం ఫోన్లో సంబంధిత పో లీసు అధికారులతో మాట్లాడారు. బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం : డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వ ర్సిటీ (వెంకటామన్నగూడెం) వీసీ డాక్టర్ కె.ధనుంజయరావుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీ విత సాఫల్య పురస్కారం లభించింది. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. వ్యవ సాయ, ఉద్యాన రంగ అభివృద్ధి, విద్యా, పరిశోధన రంగాలకు రైతు సంక్షేమానికి చేస్తున్న సేవలకు గాను ఈ పురస్కారం లభించింది. వేము సాహితీ సేవా సంస్థ రజతోత్సవాలను పురస్కరించుకుని ఈ అవార్డును గజల్ శ్రీనివాసు చేతుల మీదుగా అందించారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో 2,174.675 చదరపు కిలోమీటర్ల పరిధిలో భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (భీమా ఉడా)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, తణుకు, ఆకివీడు, భీమవరం మున్సిపాలిటీలు, 19 మండలాల పరిధిలోని 282 గ్రామాలు ఈ పరిధిలోకి వస్తాయి. భీమవరంలో ప్రధాన కార్యాలయం ఉంటుంది. ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో ఈనెల 26 నుంచి స్వామివారి దివ్య పవిత్రోత్సవాలను నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినా థరావు తెలిపారు. ఉత్సవాలను ఈనెల 29 వరకు అత్యంత వైభవంగా జరుపుతామన్నారు. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసీ, తెలియక జరిగిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం నాలుగు రోజుల పాటు పవిత్రోత్సవాలను జరపడం ఇక్కడ ఆనవాయితీ. ఆలయ అర్చకులు 26న అంకురార్పణతో ఉ త్సవాలకు శ్రీకారం చుడతారని తెలిపారు. అ లాగే 27న పవిత్రాధివాసం, 28న పవిత్రావరోహణ, ఉత్సవాల్లో ఆఖరి రోజైన 29న ఆలయ యాగశాలలో మహా పూర్ణాహుతి వేడుకలు కన్నులపండువగా జరుగుతాయన్నారు. ఈ నా లుగు రోజులు ఆలయంలో స్వామివారికి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు ఈఓ తెలిపారు. ఆగిరిపల్లి: రాజధాని అమరావతి పేరుతో దొ డ్డిదారిన గ్రావెల్ను అక్రమంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మండలంలోని ఈదులగూడెం, కల్లుటూరు తాడేపల్లి, చొప్పరమెట్ల సరిహద్దులో ఉన్న కొండ పోరంబోకు గట్టుపై వారం రోజులుగా ఎల్అండ్టీ సంస్థకు అనుమతులు ఉన్నాయంటూ గ్రావెల్ తవ్వ కాలు చేస్తున్నారు. అయితే గ్రావెల్ను అమరావతికి తరలించకుండా లారీల్లో వందలాది ట్రి ప్పులను సూరంపల్లి సమీపంలో ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలించి రూ.లక్షలు ఆర్జిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
అర్జీల పరిష్కారంపై అశ్రద్ధ వద్దు
భీమవరం (ప్రకాశంచౌక్) : ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి తీసుకున్న అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, గడువులోపు పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో భాగంగా డీఆర్వో పి.ప్రభాకర్, పీజీఆర్ఎస్ జిల్లా ప్రత్యేక అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, కలెక్టరేట్ ఏఓ ఎన్.వెంకటేశ్వరరావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్లో 163, రెవెన్యూ క్లినిక్లో 50 మొత్తంగా 213 అర్జీలు స్వీకరించామన్నారు. జిల్లా అధికారులు వృద్ధుల సంక్షేమం ట్రిబ్యునల్ మెంబర్ మేళం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. వృద్ధుల సమస్యల పరిష్కరించాలి భీమవరం: వృద్ధుల సమస్యలను పరిష్కరించాలని సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం భీమవరంలో జేసీ కేఆర్ కల్పశ్రీకి వినతిపత్రం అందజేశారు. వృద్ధుల కోర్కెల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వయోవృద్ధుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొటికలపూడి చిట్టి వెంకయ్య, ఉపాధ్యక్షుడు కరుణాకర్ చౌదరి ఆధ్వర్యంలో వినతిపత్రం అందించా రు. అనంతరం వారు మాల్లాడుతూ తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అప్పిలేట్ ట్రిబ్యునల్ మెంబర్ మేళం దుర్గా ప్రసాద్, ఫోరం నిర్వహణ కార్యదర్శి తాళ్లపూడి గాంధీ, ప్రధాన కార్యదర్శి బోనం పాండు రంగారావు తదితరులు పాల్గొన్నారు. జేసీ కల్పశ్రీ -
స్థానిక పోరుకు
మంగళవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2026స్థానిక సమరానికి సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన మున్సిపల్, పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు కసరత్తు మొదలైంది. పురపాలక సంస్థల్లో ఓటర్ల జాబితాల రూపకల్పన, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. సెప్టెంబరు 3న వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటించాలని ఈసీ ఆదేశించడం ఆశావహుల్లో ఆసక్తి నెలకొంది. సాక్షి, భీమవరం: జిల్లాలో ఐదు మున్సిపాల్టీలు, ఒక నగర పంచాయతీ ఉన్నాయి. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో సమీప గ్రామాల విలీన ప్రతిపాదనకు వ్యతిరేకంగా గతంలో కొన్ని గ్రామాలు కోర్టులను ఆశ్రయించాయి. గత ఐదేళ్లుగా ఎన్నికలు జరగకపోవడంతో ఈ పురపాలక సంఘాలు ప్రత్యేక పాలనలోనే ఉన్నాయి. 2021 మార్చిలో ఎన్నికై న నరసాపురం మున్సిపాల్టీ పాలకవర్గ పదవీకాలం ఇటీవల మార్చిలో ముగిసింది. తర్వాత ఎన్నిక జరిగిన ఆకివీడు నగర పంచాయతీ పాలకవర్గం పదవీకాలం మరో నాలుగు నెలల్లో ముగియనుంది. మరోపక్క జిల్లాలో 409 పంచాయతీలకు దాదాపు 2021లో ఎన్నికలు జరిగిన దాదాపు 390 పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగిసింది. 2021 సెప్టెంబరులో బాధ్యతలు చేపట్టిన 20 మంది జెడ్పీటీసీ, 332 మంది ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం సెప్టెంబరు 24తో ముగుస్తుంది. ఈ తరుణంలో స్థానిక ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సన్నాహాలు షురూ భీమవరం మున్సిపాల్టీలో 39 వార్డులు ఉండగా, తణుకులో 34, తాడేపల్లిగూడెంలో 32, పాలకొల్లులో 31, నరసాపురంలో 31 వార్డులు ఉన్నాయి. 2011 జనాభా లెక్కలు ప్రకారం వార్డుల విభజనకు రెండు నెలల క్రితం ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్తో వార్డుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావించినా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఉన్న వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి సెప్టెంబరు 3న అధికారికంగా ప్రకటించాలని తాజాగా ఈసీ ఆదేశించింది. ఈ మేరకు 2026 జనవరి ఒకటికి ఓటు హక్కు ఉన్న వారి వివరాలతో అధికారులు జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు కీలకమైన చైర్మన్, కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డు సభ్యుల పదవులకు రిజర్వేషన్లు ఖరారుపైన కసరత్తు జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల గుర్తింపునకు.. జిల్లాలోని పంచాయతీల్లో ఏప్రిల్లోనే వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను వెల్లడించగా ఇటీవల పోలింగ్ కేంద్రాల గుర్తింపునకు ఆదేశించారు. ఈనెల 20లోపు పంచాయతీల వారీగా పోలింగ్ స్టేషన్ల ప్రాథమిక జాబితా సిద్ధం చేసి 23న ప్రచురించాలి. 26 వరకు అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితాలను 31న ప్రచురిస్తారు. వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఓటర్లు ఎంతమంది ఉన్నారనే వివరాలను సిద్ధం చేస్తున్నారు. పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపిన ఆ కుటుంబంలో వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రానున్న రెండు, మూడు నెలల్లో స్థానిక ఎన్నికలు మొదలై కొత్త పాలకవర్గాలు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు, విజయావకాశాలపై ఆశావహులు ఎవరి అంచనాల్లో వాళ్లు తలమునకలై ఉన్నారు. ఈసారి తమకు అవకాశం దక్కుతుందన్న ఆశతో ఇప్పటికే పలువురు స్థానిక, సామాజికవర్గ పెద్దలను కలిసి మంతనాలు సాగిస్తున్నారు. ఎన్నికల ఖర్చుపైన లెక్కలు వేస్తున్నారు. గతంలో కౌన్సిలర్లుగా, సర్పంచులుగా పనిచేసిన వారు మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతుండగా, కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే యువత అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. లోకల్గా జరిగే శుభకార్యాలు, కార్యక్రమాలకు హాజరవుతూ ఆశావహులు ప్రజల్లో తిరిగేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రిజర్వేషన్లు, ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలపై కసరత్తు సెప్టెంబరు 3న వార్డుల జాబితాల ప్రకటన ఆశావహుల్లో ఉత్సాహం రిజర్వేషన్లపై లెక్కలు జిల్లాలో ఐదు మున్సిపాల్టీలు, 409 పంచాయతీలు ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన కూటమి వాటి ఊసెత్తడం లేదు. సూపర్సిక్స్లోని మిగిలిన హామీల అమలు అంతంతమాత్రమే. కొత్త పింఛన్ ఒక్కటీ ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ, వలంటీర్, సచివాలయ వ్యవస్థల నిర్వీర్యం, రెడ్బుక్ రాజ్యాంగంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది. స్థానిక సంస్థలకు నిధుల కొరతతో అభివృద్ధి పడకేసింది. చంద్రబాబు సర్కారు వంచనపై మహిళలు, రైతులు, యువత, ఉద్యోగులు, కార్మికులు తదితర అన్నివర్గాల్లోని తీవ్ర వ్యతిరేకత రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు లాభిస్తుందని వైఎస్సార్సీపీ పూర్తి విశ్వాసంతో ఉంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అమలుచేసిన నవరత్నాలు, సచివాలయ వ్యవస్థ, ఇంటింటికీ సంక్షేమ పథకాలు, ఊరూరా అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, చంద్రబాబు పాలనలో అన్నింటా పెరిగిన ధరలు, ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ పోరాటాలకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన స్థానిక పోరులో ఘన విజయం అందిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
సబ్సిడీ బియ్యం.. ప్రచార ఆర్భాటం
● తక్కువ ధరకే అమ్మకాలు అంటూ హడావుడి ● అట్టహాసంగా నిడమర్రులో అవుట్లెట్ ● మూడు రోజులకే దుకాణం బంద్ దుకాణం ప్రారంభానికి ముందు రూ.52 వేల విలువైన సూపర్ ఫైన్ బియ్యం బస్తాలు పంపించారు. తొలిరోజు రూ.30 వేలు అమ్మకాలు చేసి ప్రభుత్వానికి చెల్లించాను. దుకాణం అద్దె, నిర్వహణ ఖర్చులు, కమీషన్, కూలి వంటి విషయాలు అడుగుతుంటే అధికారులు సమాధానం చెప్పడం లేదు. బియ్యం సరఫరా చేసిన రైస్మిల్లర్ల అసోసిషన్ ప్రతినిధులను అడిగితే ఇప్పటికే కిలో రూ.10 నష్టానికి సరఫరా చేస్తున్నాం, అమ్మకాలకు కమీషన్ ఇవ్వలేమని స్పష్టం చేస్తున్నారు. దీంతో దుకాణం ఎలా నిర్వహించాలో తెలియక మూతపడింది. –మైలవరపు లాలలయ్య, నిర్వాహకుడు, నిడమర్రు నిడమర్రులో సూపర్ఫైన్ రైస్ అమ్మక దుకాణానికి సంబంధించిన సమస్యను నిర్వాహకులు నా దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని డీఎస్ఓ దృష్టికి తీసుకుని వెళ్లమని నిర్వాహకులకు చెప్పాం. వీటి నిర్వహణపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేవు. –జరీనా బేగం, సివిల్ సప్లయీస్ డీటీ, నిడమర్రు నిడమర్రు : పేదలకు ప్రభుత్వం సబ్సిడీపై సూపర్ ఫైన్ (సన్న) బియ్యాన్ని తక్కువ ధరకే అందిస్తుందంటూ నిడమర్రులో ఈనెల 4న స్థానిక అధికారులు, నేతలు అట్టహాసంగా అవుట్లెట్ను ప్రారంభించారు. నిడమర్రు సెంటర్లో బియ్యం అమ్మకాలకు ప్రారంభించిన దుకాణం మూడు రోజులకే మూతపడింది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు సబ్సిడీ సన్నబియ్యం కోసం వచ్చి దుకాణానికి తాళాలు వేసి ఉండటంతో వెనుదిరుగుతున్నారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప.. ఆచరణలో అమలు కావడం లేదని నిట్టూరుస్తున్నారు. విధి విధానాలపై స్పష్టత కరువు మార్కెట్లో విపరీతంగా పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు మార్కెట్ విలువ కంటే తక్కువ ధరలకే ఈ దుకాణాల ద్వారా బియ్యం అందిస్తామని చెప్పుకొచ్చారు. మార్కెట్లో కిలో రూ.62 నుంచి రూ.68 వరకూ పలుకుతున్న బీపీటీ, కేఎన్ఎం సూపర్ ఫైన్ స్టీమ్ బియ్యాన్ని కిలో రూ.52కి, గ్రేడ్–1 రా రైస్ (పచ్చి బియ్యం) కిలో రూ.50కే అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రచారం చేశారు. ఆధార్ కార్డు ఆధారంగా ఒకరు రూ.10 కిలోలు కొనుగోలు చేసుకోవచ్చని ప్రకటనలు గుప్పించారు. దీంతో అధికారులు నిడమర్రుకి చెందిన మైలవరపు లాలాలయ్యను ఈ అవుట్లెట్ నిర్వహించడానికి ఒప్పించారు. దీంతో ఆయన దుకాణం అద్దెకు తీసుకుని, సొంత ఖర్చులతో ని ర్వహణకు, తూకాలకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేశారు. అవుట్లెట్ ప్రారంభంలో అధి కారులు రూ.52 వేల విలువైన బియ్యం కూడా పంపించారు. వాటి అమ్మకాలు కూడా జరిగాయి. త ర్వాత దుకాణం నిర్వహణ ఖర్చులు, అమ్మకం కమీషన్ పై అధికారులు చేతులెత్తేశారు. తమకు ఎలాంటి విధివిధానాలు లేవని చెప్పడంతో దుకాణం మూడు రోజులకే మూతపడింది. -
కొనసాగిన జూడాల సమ్మె
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందే పరిస్థితి కనిపించడం లేదు. ప్రజలకు కొంతమేర వైద్యసేవలు అందిస్తున్న జూనియర్ డాక్టర్స్ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరితో వ్యవహరిస్తూ వారి డిమాండ్లపై చర్యలు తీసుకోవటంలో జాప్యం చేస్తోంది. ఏపీ జూనియర్ డాక్టర్స్ అసొసియేషన్ (జూడ) రాష్ట్రవ్యాప్త పిలుపుతో ఏలూరు స ర్వజన ఆసుపత్రిలో జూడలు ఆందోళన బాటపట్టారు. జూనియర్ డాక్టర్స్ చేపట్టిన సమ్మె సోమవారం ఐదో రోజుకు చేరింది. ఏలూరు జీజీహెచ్లోని ఎంసీహెచ్ బ్లాక్ వద్ద ధర్నా, నిరసన దీక్ష చేపట్టారు. సాధారణ వైద్య సేవలకు సంబంధించి విధులను బహిష్కరించిన జూడలు, అత్యవసర వైద్య సేవలను అందిస్తూ వైద్యసేవలు కొనసాగిస్తున్నారు. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ బోధనాసుపత్రి (జీజీహెచ్)లో జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ స్టైఫండ్ను 15 శాతం పెంచాలనీ, పదవీ విరమణ వయసు 62కు తగ్గించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకునే వరకూ ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.


