breaking news
West Godavari District Latest News
-
బాధ్యతల స్వీకరణ
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఇటీవల నియమితులైన ఉండి నియోజకవర్గానికి చెందిన జుత్తుగ నాగరాజు స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికి ఎటువంటి సమస్యలున్నా పరిష్కరిస్తానని, పాఠకులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యలను లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం చైర్మన్ను గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్ బాబు నాగరాజు, డిప్యూటీ లైబ్రేరియన్ ఎ.నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ మత్తు మహమ్మారిలా విస్తరిస్తూ విద్యార్థులు, యువత, మహిళలు, కార్మికుల జీవితాలను నాశనం చేస్తున్నా ప్రభుత్వం కావాలనే కళ్లు మూసుకుని కూర్చోందని పలువురు నాయకులు ఆరోపించారు. శుక్రవారం విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక రౌండ్ టేబుల్ సమావేశం ఏలూరు ఐద్వా మహిళా సంఘం కార్యాలయంలో నిర్వహించారు. మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఎ.రాణి అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ డ్రగ్స్ సరఫరా కేంద్రాలు బహిరంగంగానే పనిచేస్తున్నా, మత్తు పదార్థాల అమ్మకాలు కాలనీల్లో నిర్భయంగా సాగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం నిశ్చేష్టంగా వ్యవహరిస్తోందని వక్తలు మండిపడ్డారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కె.లెనిన్, డీవైఎఫ్ఐ నాయకుడు ఎ.శరత్ చంద్ర, ఐద్వా నాయకురాలు పి.హైమావతి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం/బుట్టాయగూడెం: వైఎస్సార్సీపీ స్టేట్ లీగల్ సెల్ సెక్రటరీగా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం సరిపల్లికి చెందిన మద్దు రామ్ప్రసాద్, జాయింట్ సెక్రటరీగా ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడేనికి చెందిన షేక్ రఫీ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వీరిని ప్రసాద్ను నియమించినట్లు పార్టీ కార్యాలయం నుంచి శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు వచ్చాయి. ఏలూరు (ఆర్ఆర్పేట): డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు విజయవాడలో శనివారం నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే.కాంతారావు, ఎం.ఆదినారాయణ శ్రేణులకు పిలుపునిచ్చారు. ధర్నా కార్యక్రమం కోసం శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కార్యవర్గం జూమ్ సమావేశం నిర్వహించారు. టెట్ మినహాయింపు, మాతృభాషా మాధ్యమం తదితర అంశాలపై వారు దిశానిర్దేశం చేశారు. -
రొయ్యలు అధరహో
● గత నెల రోజుల్లో భారీగా పెరిగిన ధరలు ● మార్కెట్లో 50 కౌంట్ రూ. 360 వర్షాకాలం, శీతాకాలంలో వైరస్లు వచ్చి రొయ్యల చచ్చిపోతాయి. ఆ సమయంలో అమాంతం రొయ్య ధరలు పెంచేస్తారు. ధరలు పెరిగాయని అప్పులు చేసి రొయ్యల పెంపకం చేస్తే వైరస్లకు పిల్ల సైజులోనే రొయ్యలు చచ్చిపోయి నష్టపోతాం. ఫ్రిబ్రవరి నుంచి రొయ్యల ధరలు తగ్గిపోతాయి. ఒక్కోసారి మే, జూన్ నెలల్లో ఐస్ లేదని రొయ్యలను వ్యాపారస్తులు కొనుగోలు చేయరు. చంద్రబాబు సర్కారు ఫీడ్ ధరలు తగ్గించి, నాణ్యమైన సీడ్ అందించడంతోపాటు విద్యుత్ సబ్సిడీ ఇచ్చి రొయ్య రైతులను ఆదుకోవాలి. – పెనుమాల నరసింహస్వామి, రొయ్య రైతు, గొల్లవానితిప్ప భీమవరం అర్బన్: ఆక్వా రాజధానిగా ఉన్న భీమవరం ప్రాంతంలో తక్కువ సమయంలో వనామీ రొయ్య పెంపకం సిరులు కురిపించడంతో రొయ్యసాగుకు రైతులు మొగ్గు చూపుతుతున్నారు. అయితే శీతాకాలంలో రొయ్యలకు సోకే వైట్ స్పాట్, విబ్రియో, వైట్గడ్ లాంటి వ్యాధులు రైతులను నష్టాల బాట పట్టిస్తున్నాయి. దీంతో పట్టుబడికి వచ్చిన రొయ్యలు ఎక్కువ లేకపోవడంతో రొయ్యల ధరలకు రెక్కలొస్తున్నాయి. భీమవరం మండలంలోని కొత్తపూసలమర్రు, దొంగపిండి, లోసరి, వెంప, పెదగరువు, ఎల్వీఎన్పురం, కొమరాడ, అనాకోడేరు, తోకతిప్ప, నాగిడిపాలెం, దెయ్యాలతిప్ప తదితర గ్రామాల్లో సుమారు 8 వేల ఎకరాల్లో వనామీ పెంపకం సాగిస్తున్నారు. వీటిపై రొయ్య రైతులు, రొయ్య వ్యాపారస్తులు వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. గత వర్షాకాలం నుంచి రొయ్యల సాగుకు ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో వైరస్ బారిన పడి రొయ్యలు మృత్యువాత పడటం, మోంథా తుపాను ధాటికి కొన్ని చోట్ల రొయ్యల చెరువు గట్లు గండ్లు పడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న ఎంతోమంది కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. పట్టుబడికి వచ్చిన రొయ్యలు తక్కువ శాతం ఉండటంతో రొయ్యల ధరలు పెరిగాయని రైతులు చెబుతున్నారు. సిండికేట్తో తక్కువ ధరలు వర్షాకాలం, శీతాకాలంలో వనామీ రొయ్యల సాగుకు ప్రతికూల వాతావరణం కావడంతో వాటికి వైరస్, విబ్రియో, ఈహెచ్పీ, వైట్గట్ తదితర వ్యాధులు సోకి మృత్యువాత పడతాయి. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు రొయ్యల పెంపకానికి వాతావరణం అనుకూలం కావడంతో ఎక్కువ మంది రైతులు రొయ్యలను పెంపకం సాగిస్తుంటారు. ఆ సమయంలో రొయ్యలను వ్యాపారస్తులు సిండికేట్గా ఏర్పడి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తారన్న విమర్శలు ఉన్నాయి. పెరిగిపోయిన ఫీడ్, సీడ్ ధరలు చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టినాటి నుంచి ఫీడ్ ధరలు తగ్గించకపోవడం, నాణ్యమైన సీడ్ అందివ్వకపోవడం, నామమాత్రంగా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందివ్వడం, మరోపక్క లేబర్ చార్జీలు, రొయ్యలకు వాడే మెడిసిన్ ధరలు పెరగడంతో ప్రతిసారి రొయ్యల పెంపకంలో నష్టాలు రావడంతో రైతులు పెంపకం చేసేందుకు అనాశక్తి చూపుతున్నారు. రొయ్యల పెంపకంపై మత్స్యశాఖ చిన్నచూపు విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా జిల్లాకు చేర్చే రొయ్యల పెంపకాన్ని మత్స్యశాఖ అధికారులు చిన్నచూపు చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలామంది రైతులకు రొయ్యల పెంపకంలో మెళుకువలు తెలియదు. దీంతో లక్షలు పెట్టుబడులు పెట్టి తరచూ నష్టాల్ని చూస్తున్నామని చెబుతున్నారు. మత్స్యశాఖాధికారులు రొయ్యల దిగుబడులపై అవగాహన సదస్సులు, పొలం పిలుస్తోంది కార్యక్రమాలు చేయడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. పట్టుబడికి వచ్చిన కేజీ 20 కౌంట్ రూ.540, 25 కౌంట్ రూ. 500, 30 కౌంట్ రూ. 460, 40 కౌంట్ రూ. 390, 45 కౌంట్ రూ..370, 50 కౌంట్ రూ. 360, 60 కౌంట్ రూ. 340, 70 కౌంట్ రూ.320, 80 కౌంట్ రూ.290, 90 కౌంట్ రూ.275, 100 కౌంట్ రూ.255 ఉన్నాయి. ఈ రొయ్య ధరలు ప్రాంతాన్ని బట్టి, ఎక్కువ టన్నేజిని బట్టి రూ. 30 నుంచి 50 మారుతాయని రొయ్య వ్యాపారస్తులు చెబుతున్నారు. డాలర్ల పంటగా పేరొందిన ఆక్వా రంగంపై చంద్రబాబు సర్కార్ పట్టించుకోకపోవడంతో ఆక్వా రంగం ఏడాదికేడాది కుదేలవుతోంది. రొయ్య ధరల నియంత్రణపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో వ్యాపారస్తులు చెప్పిన ధరలకు రొయ్యలను అమ్ముకుని నష్టాలపాలవుతున్నామని రైతులు వాపోతున్నారు. ఈ బాధ తట్టుకోలేక కొందరు రైతులు రొయ్యల పెంపకానికి స్వస్తి పలుకుతున్నారు. -
మావుళ్లమ్మ దేవస్థానం ప్రధాన అర్చకుడికి అవమానం
భీమవరం(ప్రకాశం చౌక్): శ్రీమావుళ్లమ్మ వారి దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ(చిన్ని)కు అవవమానం జరిగింది. దేవస్థానం ధర్మకర్తలి మండలిలో మల్లికార్జున శర్మ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. శుక్రవారం ఆలయ వద్ద జరిగిన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారానికి మల్లికార్జున శర్మను పిలవలేదు సరికదా.. అతనితో ఎక్స్అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయించలేదు. దేవస్థాన అధికారులు కూటమి ప్రజాప్రతినిధులను చూసుకోవడం తప్ప ప్రభుత్వ ఇచ్చిన ఉత్తుర్వుల్లో దేవస్థానం ధర్మకర్తలి మండలిలో ఒకరిగా ఉన్న ఎ అఫీషియో సభ్యుడు మల్లికార్జున శర్మను పట్టించుకోలేదు. దాంతో ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలో చిన్ని ఆలయంలో పూజ కార్యక్రమంలో ఉండిపోయారు. దీనిపై మల్లికార్జున శర్మ మాట్లాడుతూ కోరగా ప్రమాణస్వీకారానికి తనను పిలవలేదని, సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో కూడా తాను ఆలయంలో ఉన్నప్పటికి తనని పిలవలేదని వాపోయారు. ఈ ఘటనపై ఆలయ సహాయ కమిషనర్ మహలక్ష్మీ నగేష్ను వివరణ కోరగా తాను ప్రధాన అర్చుకుడినికి ప్రమాణస్వీకారానికి ఆహ్వనించానని తెలిపారు. బుట్టాయగూడెం: మండలంలోని రెడ్డిగణపవరం, దొరమామిడి గ్రామంలో రాత్రివేళల్లో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. సుమారు 10 ట్రాక్టర్లతో జేసీబీల ద్వారా మట్టి గుట్టలను తొలగించి ఇళ్లకు, ఇటుకల బట్టీలకు తరలిస్తున్నారు. అయితే అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచా రం అందినా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
ముగిసిన స్పోర్ట్స్ కార్నివాల్
భీమవరం: స్థానిక ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 7 నుంచి నిర్వహిస్తున్న జైత్ర–2026 స్పోర్ట్స్ కార్నివాల్ శుక్రవారం ముగిసింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు విజేతలకు బహుమతులు అందజేశారు. వాలీబాల్ పురుషుల విభాగంలో చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రథమ స్థానం సాధించగా, నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల ద్వితీయ స్థానం సాధించింది. వాలీబాల్ ఉమెన్స్ విభాగంలో సెయింట్ ఆన్స్ చీరాల విద్యార్థులు ప్రథమ స్థానం సాధించగా భీమవరం విష్ణు ఇన్స్టిటట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు రెండో స్థానం పొందారు. కబడ్డీ పురుషుల విభాగంలో గుంటూరు విజ్ఞాన లారా యూనివర్సిటీ విద్యార్థుల ప్రథమ స్థానం సాధించగా అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారు. కబడ్డీ ఉమెన్స్ విభాగంలో గుంటూరు సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రథమ స్థానం సాధించగా ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ద్వితీయ స్థానం అందుకున్నారు. కబడ్డీ వాలీబాల్ విభాగంలో మొదటి బహుమతిగా 25 వేల రూపాయలు చెక్కు, ద్వితీయ స్థానం పొందిన వారికి 15 వేల రూపాయలు చొప్పున అందించారు. బ్యాడ్మింటన్ ఉమెన్స్ విభాగంలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల మొదటి స్థానం సాధించగా తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచింది. మెన్ విభాగంలో నరసాపురం స్వర్ణాంధ్ర విన్నర్స్గా నిలవగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల టీమ్ద్వితీయ స్థానం సాధించింది. పికిల్ బాల్ మెన్ విభాగంలో ప్రథమ ద్వితీయ స్థానాలను ఎస్ఆర్కే ఆర్ సాధించగా, మహిళా విభాగంలో విష్ణు ఇంజనీరింగ్ కళాశాల మొదటి స్థానంలో నిలవగా ద్వితీయ స్థానంలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల నిలిచిందని కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి.సత్యనారాయణ రాజు అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ హరి మోహన్, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్స్ జి.సారిక అవినాష్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకష్ణ నిషాంత్ వర్మ, డైరెక్టర్ డాక్టర్ జగపతి రాజు, ఇన్చార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బీహెచ్వీఎస్ రామకృష్ణంరాజు పాల్గొన్నారు. -
నయనానందకరం శ్రీవారి గ్రామోత్సవం
ద్వారకాతిరుమల: ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని నిత్యం ఉభయ దేవేరులు, గోదాదేవితో కలసి క్షేత్ర పురవీదుల్లో అట్టహాసంగా ఊరేగుతున్న శ్రీవారికి అడుగడుగునా భక్తులు హారతులు పట్టి, నీరాజనాలు సమర్పిస్తున్నారు. శుక్రవారం ఉదయం జరిగిన స్వామివారి గ్రామోత్సవం భక్తులకు కనువిందు చేసింది. ముందుగా అర్చకులు ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి విశేష పుష్పాలంకారాలు చేశారు. పూజాధికాల అనంతరం స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, గజ, అశ్వ సేవల నడుమ ప్రతి ఇంటి ముంగిటకు వచ్చిన శ్రీవారికి భక్తులు హారతులిచ్చి, నీరాజనాలు సమర్పించారు. గ్రామోత్సవం అనంతరం గుడి సెంటర్లోని ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లకు, గోదాదేవికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి, హారతులిచ్చారు. జంగారెడ్డిగూడెం: పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో సూర్య కిరణ్ ఫంక్షన్ హాల్లో శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. టీటీడీ నుంచి వచ్చిన ఉత్సవ విగ్రహాలతో ఈ కల్యాణోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా ఉభయ దేవేరులతో కూడిన కల్యాణమూర్తికి ఐవీ రామాంజనేయులు ఇంటి వద్ద అభిషేకాలు విశేష అర్చన వంటి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు. అనంతరం శోభాయాత్రగా కల్యాణ వేదిక వద్దకు ఉత్సవ మూర్తులను తీసుకువచ్చి ప్రత్యేక అలంకరణ చేసి గోదా పద్మావతి సమేత శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా ఏర్పాటు చేసిన భక్తిసంగీత విభావరి భక్తులను అలరించింది. కార్యక్రమ వ్యాఖ్యాతగా బ్రహ్మశ్రీ ఈమని శశి కుమార్ శర్మ వ్యవహరించగా, ఎమ్మెల్యే ఎస్.రోషన్ కుమార్, రాజాన సత్యనారాయణ, మహంకాళి రామ్మోహన్రావు పాల్గొన్నారు. -
పీపీపీ ఉత్తర్వులను భోగి మంటల్లో తగులబెట్టండి
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యను ప్రైవేటీకరించే విధంగా పీపీపీ విధానంలో వైద్య కళాశాల లను ప్రైవేటీకరణ చేసే ఉత్తర్వుల కాపీలను, వికసిత్ భారత్ జీ రాం జి కాపీలను భోగి మంటలలో వేసి తగలబెట్టి నిరసన తెలపాలని సీపీఐ కార్యకర్తలకు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవన్లో బాడిశ రాము అధ్యక్షతన శుక్రవారం సీపీఐ జిల్లా కార్యవర్గ విస్తృత సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అక్కినేని వనజ మాట్లాడుతూ 2024 ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలలో పేద ప్రజలకు పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాదని ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదని ఆమె పేర్కొన్నారు. నిరుద్యోగులకు సంబంధించి ఉపాధి కల్పిస్తామని, ఉపాధి కల్పించని పక్షంలో ప్రతి నిరుద్యోగికి నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఏమైందో? అర్థం కావట్లేదని ఆమె రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఈ నెల 18న ఖమ్మంలో జరుగుతున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాలు ముగింపు సభకు జిల్లా నుండి 3000 మంది వెళ్లాలని నిర్ణయించామన్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వనజ మాట్లాడుతూ జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్లకు డిజైన్ చేశారని, మొదటి దశగా డ్యాం 41.15 మీటర్ల ఎత్తు వరకు, రెండవ దశగా 45.72 మీటర్లుగా నిర్ణయిస్తూ ప్రాజెక్టును పూర్తిగా రిజర్వాయర్ గా మార్చే కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. సర్వస్వం కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించడంలోనూ పునరావాసం కల్పించడంలోనూ కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని ధ్వజమెత్తారు. సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు కారం ధారయ్య, ఉప్పులూరి హేమ శంకర్, నిమ్మగడ్డ నరసింహ, జేవి రమణ రాజు, తొర్లపాటి బాబు, రెడ్డి శ్రీనివాస్ డాంగే, సిపిఐ నాయకులు టీవీఎస్ రాజు, బి.ఎన్.సాగర్, గోలిమే బాల యేసు పాల్గొన్నారు. -
గోదావరిలో స్నానానికి దిగిన వ్యక్తి మృతి
యలమంచిలి: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామానికి చెందిన వినుకొండ రామానాయుడు (43) గోదావరిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి చనిపోయాడని భార్య లక్ష్మీ మానస ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కర్ణీడి గుర్రయ్య తెలిపారు. రామానాయుడు భీమవరంలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 7న మొగలికుదురు బయలుదేరిన రామానాయుడు మార్గ మధ్యలో చించినాడలో గోదావరిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ మునిగిపోయాడు. గత రెండు రోజులుగా గాలించగా శుక్రవారం గోదావరిలో కొత్తగా నిర్మాణంలో ఉన్న రైలు వంతెన వద్ద మృతదేహం పైకి తేలింది. దీంతో శవపంచనామా, పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులుకు మృతదేహం అప్పగించినట్లు ఎస్సై గుర్రయ్య తెలిపారు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నట్లు ఆయన వివరించారు. -
మహిళ హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
ఏలూరు (టూటౌన్)/చింతలపూడి: హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు విధిస్తూ ఏలూరు 2వ అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని శుక్రవారం తీర్పు వెలువరించారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో జరిగిన మహిళా హాత్య కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయి శ్రీకాకొల్లు సువర్ణరాజు(39) శిక్ష విధించారు. చింతలపూడి మండలం బంధంచర్ల గ్రామానికి చెందిన శ్రీకాకొల్లు సువర్ణరాజుకు ఆ ప్రాంతానికి చెందిన కంచర్ల సునీత అలియాస్ ప్రాంతానికి చెందిన కంచర్ల సునీత అలియాస్ గంగ(35)తో వివాహేతర సంబంధం ఉండేది. ఈ క్రమంలో ఆమె ఇతర వ్యక్తులతో ఫోన్లో మాట్లాడుతుందనే అసూయతో ముద్దాయి హాత్యకు పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో 2023 జనవరి 20న చింతలపూడి మండలం బాలవారి గూడెం అడవికి ఆమెను తీసుకెళ్ళి అక్కడ ఆమైపె దాడి చేసి చీరతో ఉరి బిగించి అత్యంత కిరాతకంగా హత్యా చేశాడు. అనంతరం సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు శవాన్ని కొండ దిగువన రాళ్లపై పడేశాడు. ఈ ఘటపై అప్పట్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముద్దాయిపై నేరాలు నిరూపణ అవ్వడంతో న్యాయమూర్తి సెక్షన్ 302 ఐపీసీ కింద జీవిత ఖైదు, రూ.3,000 జరిమానా విధించారు.సెక్షన్ 201ఐపీసీ కింద మరో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించారు. అయితే సాక్ష్యాధారాలతో దర్యాప్తు పూర్తి చేసి దోషికి శిక్ష పడేలా కృషి చేసిన ఎస్బీ ఈఐ మల్లేశ్వరరావు, సీఐ క్రాంతికుమార్, సీఎంసీ ఇన్స్పెక్టర్ ఎం.సుబ్బారావు, ఎస్సై సతీష్కుమార్ కానిస్టేబుల్స్ను జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. -
అంతర్ జిల్లా దొంగల అరెస్టు
ఏలూరు టౌన్: ఏలూరు నగరానికి చెందిన ఇద్దరు స్నేహితులు సులువుగా డబ్బు సంపాదనే లక్ష్యంగా ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోటారు సైకిళ్లను చోరీ చేస్తున్నారు. ఏడాది కాలంలో ఏకంగా 50 మోటారు సైకిళ్ళు చోరీ చేస్తూ చివరికి ఏలూరు త్రీటౌన్ పోలీసులకు చిక్కారు. వీరితో పాటు మరో 14 మంది రిసీవర్లను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి, కేసులు వివరాలు వెల్లడించారు. ఏలూరు తూర్పువీధి గౌరమ్మగుడి ప్రాంతానికి చెందిన మహ్మద్ షాకీర్ ప్రస్తుతం ద్వారకాతిరుమల మండలం గుండుగొలనుకుంట గ్రామంలో నివాసం ఉంటున్నాడు. షాకీర్ మోటారు మెకానిక్గా పని చేస్తూ ఉంటాడు. ఏలూరు సుంకరవారితోట, కనకదుర్గమ్మ గుడి ఎదురుగా నివాసం ఉంటోన్న గోపిశెట్టి సురేష్ నగరంలో గోద్రెజ్ కంపెనీ సేల్స్మెన్గా పని చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసలుగా మారి ఈజీ మనీకి అలవాటుపడ్డారు. మెకానిక్ షాకీర్, సురేష్ ఇద్దరూ ఆయా ప్రాంతాల్లో మోటారు సైకిళ్ళు పార్కింగ్ చేసి ఉండటాన్ని ముందుగా గమనించి స్కెచ్ వేస్తారు. షాకీర్ వేరే తాళంతో మోటారు సైకిల్ను చోరీ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా సురేష్ ఎవరైనా వస్తున్నారా అనేది గమనిస్తూ ఉంటాడు. అనంతరం ఇద్దరూ మోటారు సైకిళ్ళను ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటారు. వీరిద్దరూ ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఏడాదిలో సుమారుగా 50 మోటారు సైకిళ్ళు చోరీ చేయగా, వీటి విలువ సుమారు రూ.25లక్షలు ఉంటుందని పోలీస్ అధికారుల అంచనా. కేసును ఛేదించింది ఇలా గత ఏడాది డిసెంబర్ 1న ఏలూరు త్రీటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో దుగ్గిరాల గ్రామం జోసెఫ్నగర్లోని ఒక ఇంటి గ్రిల్, తాళాలు పగులగొట్టి లోపల ఉన్న హీరో ప్యాషన్ ప్రో మోటారు సైకిల్ చోరీకి గురైంది. ఈ చోరీపై కొరగంటి ప్రభాకర్ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై పి.రాంబాబు దర్యాప్తు చేపట్టి చాకచక్యంగా ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టగా నిందితులు ఇద్దరూ ఏకంగా 50కిపైగా మోటారు సైకిళ్ల చోరీ చేసినట్లు గుర్తించారు. వీరిద్దరి నుంచి 50మోటారు సైకిళ్ళను త్రీటౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే టి.నరసాపురం మండలానికి చెందిన చోరీ సొత్తు రిసీవర్లు 14 మందిని పోలీసులు గుర్తించి వీరిపైనా కేసు నమోదు చేశారు. ఈ కేసు ఛేదించటంలో ప్రతిభ చూపిన త్రీటౌన్ ఎస్ఐ రాంబాబు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. -
కూటమివి ప్రజా వ్యతిరేక విధానాలు
పాలకొల్లుసెంట్రల్: చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు సూచించారు. గు రువారం పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్ గుడాల గోపీ నివాసంలో జరిగిన పార్టీ పాలకొల్లు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కూటమి పాలన రెండేళ్లకు దగ్గరపడుతున్నా సూపర్సిక్స్ హామీల అ మల్లో పూర్తిగా సర్కారు విఫలమైందన్నారు. నామమాత్రంగా కొన్ని పథకాలు అమలు చేసి గొప్పలు చెప్పుకోవడం మినహా మరేమీ లేదన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో విద్యార్థులు, మహిళలు, రైతు లు, కార్మికులు ఇలా అన్నివర్గాలూ అవస్థలు పడుతున్నాయన్నారు. సంక్రాంతి సమీపిస్తున్న ఎక్కడా పండుగ సందడి లేదని, జనం చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అంశంలో వైఎస్సార్సీపీ నిర్వహించిన కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఆందోళనలోకి వెళ్లిందన్నారు. పార్టీ బలోపేతానికి నాయకులు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని ప్రసాద రాజు సూచించారు. పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, సీనియర్ నేతలు గుణ్ణం నాగబాబు, చెల్లం ఆనంద్ ప్రకాష్, చేగొండి సూర్య ప్రకాష్, పార్లమెంట్ కార్యదర్శి యడ్ల తాతాజీ, జెడ్పీటీసీలు నడపన గోవిందరాజులు నా యుడు, గుంటూరి పెద్దిరాజు, యలమంచిలి మండల సీనియర్ నేత దత్తాత్రేయ వర్మ, ఎంపీపీలు ఇనుకొండ రవికుమార్, సుమంగళి, పార్టీ మండల అధ్యక్షుడు కోరాడ శ్రీను, ఉచ్చుల స్టాలిన్, యేసురాజు, కొరప్రాటి వీరస్వామి, పార్టీ జనరల్ సెక్రెటరీ ఖండవల్లి వాసు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు -
హామీలపై నిలదీస్తే రౌడీషీట్లా..?
నేడు విద్యార్థి, యువజన సంఘాల నిరసన భీమవరం: కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతున్న విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై ప్రభుత్వం పీడీయాక్ట్, రౌడీషీట్స్ పెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం భీమవరంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్టు వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పి.పవన్కుమార్ తెలిపారు. గురువారం భీమవరంలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో ధర్నా చేసి ముఖ్యమంత్రిని ప్రశ్నించారనే అక్కసుతో విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై రౌడీషీట్ ఓపెన్ చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ పాలన నడుస్తోందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, జాబ్ క్యా లెండర్ విడుదల చేయకపోవడం, నిరుద్యోగి భృతి ఇవ్వకపోవడం, 20 లక్షల ఉద్యోగావకాశాల కల్పన గురించి ప్రశ్నించినా పట్టించుకోవడం లేదన్నారు. ఇందుకు నిరసనగా శుక్రవారం భీమవరం అంబేడ్కర్ సెంటర్ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. వైఎస్సార్సీపీ యూత్ జిల్లా అధ్యక్షుడు తమనంపూడి సూర్యవెంకటగణేష్ రెడ్డి, వీరవాసరం యువజన ఉపాధ్యక్షుడు ఎన్.సోమరాజు, ఏఐవైఎఫ్ జిల్లా సహ కార్యదర్శి బొక్కా అవినాష్, జి.సునీల్, జి.వర్మ, కె.జగదీశ్ పాల్గొన్నారు. -
జగన్ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యం
తణుకు అర్బన్: రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఆర్గనైజేషన్ యాక్టివిటీ సెక్రటరీ కసిరెడ్డి వజ్ర భాస్కర్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం తణుకు పద్మశ్రీ ఫంక్షన్ హాలులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నా గేశ్వరరావు అధ్యక్షతన పార్టీ సంస్థాగత విస్త్రృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటగా నూరుశాతం పారదర్శకంగా కమిటీలు వేయాలనే ఉద్దేశంతో కార్యాచర ణ చేశామన్నారు. వచ్చేనెల 10లోపు 8,500 మందితో కమిటీలు వేసి డిజిటలైజేషన్ పూర్తిచేస్తామని, తూర్పు, పశ్చిమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సంబంధించి ఫిబ్రవరి 22లోపు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే 10 నియోజకవర్గాలకు సంబంధించి కడప పార్లమెంట్ పుంగనూరు, వేమూరు, మడకశిర నియోజకవర్గాల్లో ఆర్గనైజేషన్ యాక్టివిటీ కార్యక్రమాలు, రచ్చబండ కార్యక్రమాలను రూపొందించామన్నారు. గ్రామస్థాయి నుంచే పాలన సాగాలనే జగనన్న ఉద్దేశంతో ఈ కమిటీల నిర్ణయాలను ఆచరణలో పెడతామన్నారు. తణుకు నియోజకవర్గాన్ని రాష్ట్రానికి దశదిశ నిర్దేశించేలా కమిటీలను రూపొందిస్తామని అన్నారు. పార్టీ కార్యకర్తలను పూర్తిస్థాయిలో కాపాడుకునే రీతిలో పనిచేస్తున్నామన్నారు. కమిటీలతో పార్టీ మరింత బలోపేతం క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్రవ్యాప్తంగా కమిటీలు వేస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి అన్నారు. రాష్ట్ర వ్యాప్త కమిటీల్లో భాగంగా కడప, పుంగనూరు, మడకశిర వంటి ఏడు నియోజకవర్గాల్లో పూర్తిచేసుకుని వజ్ర భాస్కర్రెడ్డి తణుకు వచ్చారని, రెండు రోజుల వ్యవధిలోనే కమిటీల ఏర్పాటు ప్రక్రియ చురుగ్గా సాగిందని అన్నారు. ఈనెల 21న తణుకు, తణుకు రూరల్, ఇరగవరం, అత్తిలి మండలాల్లో సమావేశాలు నిర్వహించనున్నామని, గ్రామాల్లో సైతం విడిగా సమావేశాలు నిర్వహించి కమిటీల సభ్యులు, వైఎస్సార్సీపీ కుటుంబసభ్యులతో కలిసి పనిచేయనున్నామని అన్నారు. చంద్రబాబు సర్కారు వైఎస్సార్సీపీ శ్రేణులపై ఎన్ని కేసులు పెడుతున్నా బెదరకుండా నిలబడటం గొప్పద నమన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, స్టేట్ లీగల్ సెల్ అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ హబీబుద్దీన్, తణుకు, అత్తిలి, ఇరగవరం మండల అధ్యక్షులు పెనుమర్తి వెంకటరామన్న, పైబోయిన సత్యనారాయణ, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ యిండుగపల్లి బలరామకృష్ణ, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, ఏఎంసీ మాజీ చైర్మన్లు బుద్దరాతి భరణిప్రసాద్, ఉండవల్లి జానకి, నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు మెహర్ అన్సారీ, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షుడు పెనుమాల రాజేష్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఆర్గనైజేషన్ యాక్టివిటీ సెక్రటరీ వజ్ర భాస్కర్రెడ్డి -
ఏలూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
ఏలూరు టౌన్:ఏలూరు జిల్లా కోర్టులో ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబ్ పెట్టామని, రిమోట్తో పేల్చివేస్తామని గుర్తుతెలియని దుండగులు పంపిన మెయిల్తో ఒక్కసారిగా కలకలం రేగింది. గురువారం మఽ ద్యాహ్నం 1.30 గంటల సమయంలో కోర్టు ఏఓకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి అవుట్లుక్ మెయిల్లో ఈ సమాచారం రావడంతో కక్షిదారులు, లాయర్లు పరుగులు పెట్టారు. జిల్లా జడ్జి ఫిర్యాదుతో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ రంగంలోకి దిగారు. జిల్లా కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి సుమారు 2 గంటలకు పైగా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేయించారు. ఎల్టీటీఈ అంటూ.. తాము ఎల్టీటీఈ, ఐఎస్ కేపీ సభ్యులమని, సంయుక్తంగా ఈ సమాచారాన్ని పంపించామని, మూడు ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబ్ల ను ఏర్పాటు చేశామని, 100 మీటర్ల దూరం నుంచి రిమోట్తో పేల్చివేస్తామనేది మెయిల్ సారాంశం. జల్లెడ పట్టిన పోలీసులు : డీఎస్పీ శ్రావణ్కుమార్ తక్షణమే కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. సీఐలు కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, అశోక్కుమార్తో పాటు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ప్రాంగణం, గదులు, చాంబర్లు ఇలా అన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చివరికి ఎక్కడా ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు ఏవీ లేవని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
కోడేరు ర్యాంపులో అనధికారిక బాటలు
పెనుగొండ: కోడేరు ఇసుక ర్యాంపులో అనధికారంగా చేస్తున్న బాట పనులు తక్షణమే నిలిపివేయాలని వైఎస్సార్సీపీ నాయకులు గురువారం ఆచంట తహసీల్దార్ సోమేశ్వరరావుకు, ఆచంట పోలీస్స్టేషన్లో వినతిపత్రాలు ఇచ్చారు. అ నంతరం వారు మాట్లాడుతూ కోడేరు ర్యాంపు నుంచి అక్రమంగా ఇసుక తరలించడానికి ఇప్ప టికీ బాట పనులు చేస్తున్నారని, అయినా అధి కారులు, పోలీసులు పట్టించుకోవడం లేదన్నా రు. అధికార పార్టీ నాయకులకు అండగా అధికారులు ఉంటున్నారని ఆరోపించారు. ఇసుక తరలింపుపై త్వరలో హైకోర్టులో కేసు వేయనున్నామన్నారు. అక్రమంగా ఇసుక తరలించేందుకు ప్రయత్నిస్తే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. సీనియర్ నా యకులు సుంకర సీతారామ్, కోట వెంకటేశ్వరరావు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు కేతా తాతరావు, టౌన్ అధ్యక్షుడు పెచ్చెట్టి సత్యనారాయణ, బీసీ నాయకులు కాండ్రేకుల కనకయ్య, గుబ్బల రామకృష్ణ, నియోజకవర్గ దివ్యాంగుల విభాగ అధ్యక్షుడు చదలవాడ ముత్యాలరావు, కోట గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహిళా వింగ్ జిల్లా నూతన కార్యవర్గం భీమవరంలో గురువారం ఎన్నికై ంది. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్.మానస, పి.రాజ్యలక్ష్మి, అసోసియేట్ ప్రెసిడెంట్గా పి. నిర్మల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు వై.మోహన్రావు ఎన్నికల అధికారిగా వ్యవహరించగా జి.సత్యనారాయణ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. భీమవరం: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10న విజయవాడ ధర్నాచౌక్లో డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్టు జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎన్.శ్రీనివాసరావు, ఆర్ఎల్ కేశ్వరరావు గురువారం ప్రకటనలో తెలిపారు. నరసాపురం రూరల్: మొగల్తూరు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం–3కు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గతేడాది సెప్టెంబర్ 24న నిర్వహించిన సర్వేలో 91.43 మార్కులతో ఉత్తమంగా నిలిచినట్టు వైద్యులు తెలిపారు. ఆరోగ్య ఉప కేంద్రం వైద్య సిబ్బంది సమష్టి కృషి, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలందిస్తూ అత్యుత్తమ ప్రమాణాలు కనబర్చడంతో అవార్డు లభించిందన్నారు. కేంద్రం డాక్టర్లు కె.లక్ష్మీపార్వతి, జి.హేన, సీహెచ్ఓ వై.సత్యవతి, ఏఎన్ఎం శ్రీనివాస్, సూపర్వైజర్లు కె.భాస్కరరావు, కె.శ్రీనివాసరావు, కె.విజయలక్ష్మి, సిబ్బందిని పలువురు అభినందించారు. -
ప్రాణాలైనా అర్పిస్తాం
భూసేకరణ కోసం ప్రభుత్వం కనీసం ఎలాంటి గ్రామ సభలు నిర్వహించలేదు. రైతుల అభిప్రా యాలు తీసుకోలేదు. ఏకపక్షంగా భూసేకరణ అప్రజాస్వామికం. ఒక ప్రజాప్రతినిధిగా ఈ చర్యను వ్యతిరేకిస్తున్నా. – అబ్బు సుబ్రహ్మణేశ్వరరావు, సర్పంచ్, మంగపతిదేవిపేట, కొయ్యలగూడెం మండలం భూములను కోల్పోయే వారిలో అంతా చిన్న, సన్నకారు రైతులే. వీరికి వ్యవసాయమే జీవనాధారం. భూములను కోల్పోతే వీరంతా రోడ్డున పడతారు. ప్రభుత్వం రైతుల గోడును పట్టించుకోవాలి. – టి.శ్రీనివాస్, ఎంపీటీసీ, మంగపతిదేవిపేట, కొయ్యలగూడెం మండలం నాకు ఎకరా భూమి వారసత్వంగా రాగా దీనిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నా. ఇప్పుడు ఆ భూమిని తీసుకుని కొంత పరిహారం ఇస్తే సరిపోతుందా. జీవనాధారాన్ని కోల్పోతాం. – ఏకుల శ్రీను, రైతు, బోడిగూడెం ఏలూరు (టూటౌన్): ‘మా ప్రాణాలైనా అర్పిస్తాం.. కానీ మా భూములను మాత్రం నేవీ ఆయుధ క ర్మాగారానికి ఇచ్చేది లేదు’ అంటూ బాధిత రైతులు తెగేసి చెబుతున్నారు. కొయ్యలగూడెం మండలం బోడిగూడెం, బర్కెట్ నగరం, మంగపతిదేవిపేట, ఊట్లగూడెం, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం రేగులగుంట గ్రామాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులు నిరసన బాట పట్టారు. బోడిగూడెం పంచాయతీ పరిధి బర్కెట్ నగరం ప్రాంతంలో 1,200 ఎకరాల్లో నేవీ ఆయుధ కర్మాగారం ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేయడాన్ని వీరంతా వ్యతిరేకిస్తున్నారు. ఈ కర్మాగారం ఏర్పా టుతో చిన్న, సన్నకారు రైతులు జీవనోపాధి కో ల్పోయి రోడ్డుపాలవుతామని ఆవేదన చెందుతు న్నారు. కనీసం తమ అనుమతి తీసుకోకుండా, గ్రా మసభలు నిర్వహించకుండా భూములను లాక్కోవాలని చూడటం దుర్మార్గమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వ చర్యకు నిరసనగా ఇటీవల ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. మాకెవరికీ ఇష్టం లేదు తమ ప్రాంతంలో నేవీ ఆయుధ కర్మాగారం ఏర్పా టుచేస్తున్నట్టు గతనెలలో పత్రికల్లోనే చూశామని, అప్పటివరకూ ఈ విషయం తమకు తెలియదని బాధితులు అంటున్నారు. అయితే తమ వాదనలకు భిన్నంగా రెవెన్యూ అధికారులు మాత్రం స్థానిక రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధం ఉన్నట్లు ప్ర భుత్వానికి నివేదిక పంపడం విడ్డూరంగా ఉందంటున్నారు. తమ ప్రాంతంలోని ఒకరిద్దరు అవినీతిప రుల చర్యలను సాకుగా చూపి వందలాది మంది రై తుల భూములను బలవంతంగా లాక్కోవాలనుకోవడం దుర్మార్గమని మండిపడుతున్నారు. భూ ములను ఇచ్చేందుకు తామెవరికీ ఇష్టం లేదని అలాంటప్పుడు మా భూములను ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం : కర్మాగారం ఏర్పాటు విషయంలో అధికారులు పూర్తిస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కనీసం గ్రామసభలు పెట్టి ప్రాజెక్టు పరిధిలోని రైతులతో మాట్లాడలేదని ఆరోపిస్తున్నారు. స్థానిక రైతు ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా భూములను సేకరించాలని చూస్తే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతా చిన్న, సన్నకారు రైతులే.. ప్రభుత్వం సేకరించాలనుకుంటున్న భూముల్లో అందరూ చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. ఎకరా, రెండెకరాలు ఉన్న వారే అధికం. ఈ ప్రాంతంలో భూసేకరణ చేస్తే సుమారు 500 మందికి పైగా రైతులు నిర్వాసితులు కానున్నారు. ప్రభుత్వం ఇచ్చే అరకొర పరిహారం వల్ల వీరికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. బలవంతంగా భూసేకరణ చేస్తే తామంతా చెల్లాచెదురవుతామని, తమ కుటుంబాల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పునరాలోచన చేయాలని కోరుతున్నారు. ఆయుధ డిపోపై సమరభేరి నేవీ ఆయుధ కర్మాగార బాధిత రైతుల్లో ఆందోళన కర్మాగారానికి భూములిచ్చేది లేదంటూ తేల్చిచెప్పిన వైనం గ్రామ సభలు నిర్వహించకపోవడంపై మండిపాటు జీవనాధారం కోల్పోతామంటున్న కర్షకులు -
గురువులపై కర్ర పెత్తనం
నిడమర్రు: చంద్రబాబు సర్కారు అనాలోచిత నిర్ణయాలతో ఉపాధ్యాయుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 8 పిరియడ్స్ బోధించేలా ప్రతీ సబ్జెక్ట్కు ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి జులై నెలలో టీచర్ హ్యాండ్ బుక్స్ అందించారు. దీని ప్రకారం ఉపాధ్యాయుల బోధన జరుగుతోంది. ఇటీవల 8 పిరియడ్స్ బోధనను 4 పిరియడ్స్కు కుదించి ఉదయం 4 పిరియడ్స్లో 8 పిరియడ్స్కు సంబంధించిన బోధన పూర్తిచెయ్యాలని, మధ్యాహ్నాం 4 పిరియడ్స్ ఎఫ్ఎల్ఎన్ తరగతులు నిర్వహించాలని 75 రోజుల ఎఫ్ఎల్ఎన్ షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వమే 8 పిరియడ్స్ ఎలా బోధించాలో టీచర్ హ్యాండ్ బుక్స్ ఇచ్చి, ఇప్పుడు వాటిని 4 పిరియడ్స్లో బోధించాలనే నిర్ణయంపై ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి సబ్జెక్ట్కు అన్ని పరీక్షలు ఒకే పుస్తకంలో రాయించేలా అందించిన మూల్యాంకన పుస్తకాలతో తలలు పట్టుకుంటున్నారు. 10వ తరగతి విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత చెందేలా ఎస్ఎస్ఎసీ పరీక్షల వరకూ 100 రోజుల ప్రణాళిక రూపొందించింది. ప్రతి రోజు ఆరోజు బోధించిన సబ్జెక్ట్పై సాయంత్రం వేళల్లో పరీక్షలు పెట్టి రోజువారీ విద్యార్థుల మార్కులు ఆన్లైన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో అమలవుతోంది. ఈ 100 రోజుల ప్రణాళిక అమలుపై విద్యాశాఖ జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకూ పర్యవేక్షణ కొనసాగుతోంది. తాజాగా ఈ పర్యవేక్షణ, పరిశీలన బాధ్యతలను మండలంలోని ఇతర శాఖలకు ప్రభుత్వం అప్పగించింది. దీంతో విద్యాశాఖపై పరాయి శాఖల పెత్తనం చేసేలా ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పర్యవేక్షణకు 256 మంది అధికారుల నియామకం పదో తరగతి 100 రోజుల ప్రణాళిక అమలుపై ఏలూరు జిల్లాలోని 256 ఉన్నత పాఠశాలలకు ఆయా మండలాల, పట్టణాల్లోని వ్యవసాయశాఖ, ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ, మండల పరిషత్, పంచాయతీరాజ్ శాఖ, వెలుగు, ఇరిగేషన్, ఉద్యానవనశాఖ, సీ్త్రశిశు సంక్షేమశాఖ, పశువర్ధకశాఖ, వైద్యశాఖ, గృహనిర్మాణశాఖ, మత్య్సశాఖ, పోలీస్శాఖ, టౌన్ప్లానింగ్ వంటి శాఖలకు చెందిన గెజిటెడ్ అధికారులను ప్రత్యేక తరగతుల నిర్వహణా పర్యవేక్షణకు నియమించారు. ఈ మేరకు జిల్లా ఉన్నత అధికారుల నుంచి ఉత్తర్వులు గత నెలలో జారీ అయ్యాయి. చానమిల్లి జెడ్పీస్కూల్లో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంపీడీవో (ఫైల్)గణపవరం జెడ్పీస్కూల్లో విద్యార్థుల ప్రగతి పరిశీలిస్తున్న డీవైఈవో రామాంజనేయులు (ఫైల్)ఇప్పటికే విద్యాశాఖలోని అన్ని స్థాయిల్లో అధికారులు ప్రతి రోజు టెన్త్ విద్యార్థులకు అమలవుతున్న 100 రోజుల ప్రణాళికల అమలుపై తనిఖీలు చేస్తూ ఉన్నత అధికారులకు నివేదికలు ఇస్తున్నారు. అయినా ఇతర శాఖలను ఉపాధ్యాయులపై పెత్తనం చేసేలా, వారి పనితీరును, బోధనను పర్యవేక్షించేలా తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పలు రకాలుగా నిరసనలు తెలుపుతున్నారు. డీఈఓ, డీప్యూటీ డీఈఓ, ప్రతి మండలానికి ఇద్దరేసి చొప్పున మండల విద్యాశాఖ అధికారులు, ప్రతి ఉన్నత పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ప్రధానోపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులను కాదని.. ఇతర శాఖల అధికారులను ప్రత్యేక పర్యవేక్షణ అధికారులుగా నియమించడాన్ని ఆక్షేపిస్తున్నారు. పదో తరగతి ఫలితాల్లో ఏమైనా తేడాలొస్తే ఈ మానిటరింగ్ ఆఫీసర్లు బాధ్యత తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. టెన్త్లో వంద శాతం ఉత్తీర్ణతకు 100 రోజుల ప్రణాళిక పర్యవేక్షణకు ఇతర శాఖల అధికారుల నియామకం ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయుల ఆగ్రహం విద్యాశాఖ అమలు చేస్తున్న ప్రణాళిక అమలు తీరుపై విద్యాశాఖ అధికారులు ఉండగా ఇతర శాఖలను పర్యవేక్షణ అధికారులుగా నియమించడం ఉపాధ్యాయుల అస్థిత్వం దెబ్బతీసే కుట్రగా భావిస్తున్నాం. ఇలాంటి పర్యవేక్షణలను ఏమాత్రం సహించేది లేదు. ఇది మంచి పరిణామం కాదు. – గెడ్డం సుధీర్, రాష్ట్ర నాయకులు, వైఎస్సార్టీఏ ప్రత్యేక తరగతులు నిర్వహించే విషయంలో ప్రభుత్వం, ఇతర శాఖల వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. విద్యాశాఖలో ఎంతో అనుభవం ఉన్న సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వారిని కాదని ఇతర ఽశాఖలకు పెత్తనం వల్ల విద్యార్థులకు ఒరిగేది ఏమి ఉండదు. ఒత్తిడి వల్ల ఆశించిన ఫలితాలు రావు. – పుప్పాల సూర్యప్రకాశరావు, స్టేట్ కౌన్సిలర్, ఎస్టీయూఇప్పటికే సెలవు దినాలు, ఆదివారాలు సైతం ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ రోజువారీ పరీక్షల ఫలితాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఉపాధ్యాయుల బోధనా పనితీరును పర్యవేక్షించేందుకు ఇతర శాఖల అధికారులను నియమించడం ఉపాధ్యాయులను అవమానించడమే. – బోర్రా గోపీ మూర్తి, టీచర్స్ ఎమ్మెల్సీ -
రేషన్ బియ్యం పట్టివేత
పాలకొల్లు (సెంట్రల్) : పాలకొల్లు పట్టణం, చెంబునిపేటలో గురువారం విజిలెన్స్, రెవెన్యూ, పౌర సరఫరా అధికారులతో సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రవాణాకు సిద్ధంగా ఉన్న 3 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వ్యాన్ను సీజ్ చేసినట్లు విజిలెన్స్ ఎస్సై కె.సీతారాం తెలిపారు. బియ్యం విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందన్నారు. యజమాని కనమర్లపూడి శేషగిరిరావు, డ్రైవర్ పీతాని మోహనకృష్ణలపై నిత్యవసర వస్తువుల చట్టం 1955 ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎస్సై కె.సీతారాం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎస్జీఎన్వీ కుమార్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. నూజివీడు: జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు పట్టణంలోని సెయింట్ మేరీస్ హైస్కూల్ విద్యార్థి పీ రేవంత్ ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఫాదర్ జోజిబాబు తెలిపారు. జార్ఘండ్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి బాస్కెట్బాల్ జట్టుకు రేవంత్ నాయకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ను ప్రిన్సిపాల్ అభినందించి గురువారం క్రీడా కిట్ను అందజేశారు. రేవంత్ను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. ఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్.జవహర్ ఈనెల 9న ఏలూరు రానున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు వై.విశ్వమోహాన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి మీటింగ్ హాల్లో జిల్లాలోని ఎస్సీ సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారన్నారు. ముందుగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఏలూరు, రెవెన్యు గెస్ట్హౌస్ నందు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని తెలియజేశారు. ఈ అవకశాన్ని ప్రజలు సద్వినియోగించు కోవలసినదిగా డీడీ విశ్వమోహాన్ రెడ్డి కోరారు. పెదపాడు: మానవత సేవాసంస్థ రాష్ట్ర చైర్మన్, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మారుబోయిన కోటేశ్వరరావు తన భార్య సూర్య నాగమణి భౌతికకాయాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు దానం చేశారు. నాగమణి అనారోగ్యంతో బుధవారం మరణించారు. తన మరణంలో కూడా సేవ ఉండాలనే ఆశయంతో తన శరీరాన్ని మరణానంతరం మెడికల్ కళాశాలలకు అప్పగించేందుకు ముందస్తుగా అనుమతి పత్రాన్ని అందించారు. దీంతో సూర్యనాగమణి భౌతికకాయాన్ని కోటేశ్వరరావు మెడికల్ కళాశాలకు అప్పగించారు. వివిధ జిల్లాలకు చెందిన మానవత ప్రతినిధులు సూర్య నాగమణి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుక్కునూరు: తల్లిదండ్రులపై కుమార్తె దౌర్జన్యం చేసి బెదిరింపులకు పాల్పడడంతో కేసు నమోదు చేసినట్లు కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి పేర్కొన్నారు. వింజరం గ్రామానికి చెందిన కరేటి చిట్టెమ్మ, కృష్ణయ్య దంపతులు, వారి వ్యవసాయ భూములకు వచ్చిన పోలవరం ముంపు పరిహార డబ్బులను వారి బ్యాంక్ ఖాతాల నుంచి మోసపూరితంగా కుమార్తె చిమడబోయిన మంగమ్మ, ఆమె కుటుంబసభ్యుల ఖాతాలకు బదిలీ చేసుకుంది. అలాగే వారి గొర్రెలు, మేకలను అక్రమంగా స్వాధీనం చేసుకోవడంతో ప్రశ్నించిన వృద్ధ దంపతులను అసభ్య పదజాలంతో దూషించి, శారీరకంగా దాడి చేసి, చంపుతామని బెదిరింపులకు గురిచేసింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్టు ఎస్సై చెప్పారు. -
కూటమిలో బయటపడిన విభేదాలు
కొయ్యలగూడెం: పోలవరం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గురువారం అట్టహాసంగా నిర్వహించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పుట్టినరోజు వేడుకలకు నియోజకవర్గంలోని ఏడు మండలాల కూటమి పార్టీల ముఖ్య నేతలు డుమ్మా కొట్టారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులతో పాటు దాని మిత్రపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు కూడా ముఖం చాటేశారు. మరోపక్క ఈ కార్యక్రమానికి డ్వాక్రా మహిళలను పెద్ద ఎత్తున తరలించారు. వీరితో పాటు సీఏల ద్వారా జన సమీకరణకు అధికారులు సహకరించారు. కొయ్యలగూడెంలోని ఏఎంసీ యార్డులో ఈ కార్యక్రమం నిర్వహించడం గమనార్హం. ఇదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్రాంతి వేడుకల ఆటవిడుపు కార్యక్రమాలను కూడా ఎమ్మెల్యే ప్రారంభించి బహుమతులు అందజేశారు. -
కోకో గింజలకు ధర పాలసీ ప్రకటించాలి
ఏలూరు (టూటౌన్): కోకో గింజలకు ధర పాలసీ ప్రకటించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్కు కోకో రైతులు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు పి. సుబ్రహ్మణ్యేశ్వర రావు, పానుగంటి అచ్యుతరామయ్య, గుది బండి వీరారెడ్డి, కోనేరు సతీష్ బాబు, ఆలపాటి శ్రీనివాసరావు మాట్లాడారు. కంపెనీలు సిండికేట్గా మారి ధరలు తగ్గించి వేసి రైతులను మోసగిస్తున్నాయని చెప్పారు. విదేశీ కోకో దిగుమతులపై దిగుమతి సుంకాలు పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో కోకో గింజలకు రూ.550లకు పైగా ధర ఉండగా కంపెనీలు రూ.350లకు కొనుగోలు ప్రారంభించి గత రెండు రోజుల నుంచి రూ.400 లకు రైతుల ఆందోళనతో పెంచారని వివరించారు. అంతర్జాతీయ మార్కెట్ ధర రైతులకు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. దేశంలోనే ఏలూరు జిల్లాలో అత్యధిక కోకో పంట విస్తీర్ణం ఉన్నదని, కేంద్ర కోకో పరిశోధనా కేంద్రాన్ని, రాష్ట్రంలో కోకో బోర్డును ఏర్పాటు చేయాలని ఫలితంగా కోకో రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. దీనిపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ కోకో రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కోకో గింజల ధర ఫార్ములా కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కోకో రైతులు పాల్గొన్నారు. ఏలూరు ఎంపీకి కోకో రైతుల వినతి -
చినవెంకన్న హుండీ ఆదాయం రూ.2.09 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో గురువారం అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ జరిగింది. గడచిన 16 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ. 2,09,40,260 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వై.భద్రాజి తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 79 గ్రాముల బంగారం, 3.552 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రద్దయిన పాత నోట్లు ద్వారా రూ.5,500 లభించినట్టు చెప్పారు. లెక్కింపులో జిల్లా దేవాదాయశాఖ అధికారి కె.శ్రీనివాసు, ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా దళం సభ్యులు పాల్గొన్నారు. -
అద్దె బస్సులు ఆపేస్తాం
సాక్షి, భీమవరం: ఆర్టీసీ అద్దె (హైర్) బస్సుల యజ మానులు పోరుబాట పట్టారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో నెలవారీ మెయింటెనెన్స్ రూ.40 వేల వరకు పెరిగితే.. ఏపీఎస్ఆర్టీసీ కేవలం రూ. 5,200లు మాత్రమే పెంచడంపై అసంతృప్తితో ఉన్నారు. ఆర్టీసీ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర అద్దె బస్సుల యజమానుల సంఘం పిలుపు మేరకు ఈనెల 12 నుంచి బస్సులు నిలిపివేసి సమ్మె చేయాలని నిర్ణయించారు. జిల్లాలో.. జిల్లాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం డిపోల పరిధిలో వెన్నెల, స్టార్లైనర్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, పల్లెవెలుగు తదితర బస్సులు 295 ఉన్నాయి. ఇవి మొత్తం రోజుకు లక్ష కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుండగా, 90 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితమంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం కేవలం పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్లకు మాత్రమే ఫ్రీ సర్వీసును పరిమితం చేసింది. 40 శాతం హైర్ బస్సులే.. జిల్లాలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు మొత్తం 197 ఉండగా వీటిలో 73 హైర్ బస్సులు. ఫ్రీ బస్సుతో ఆయా సర్వీసుల్లో మహిళల రద్దీ విపరీతంగా పెరిగింది. బస్సు సిట్టింగ్ కెపాసిటీ 56 కాగా ప్రస్తుతం వంద మందికి పైనే ప్రయాణిస్తున్నట్టు ఓనర్లు చెబుతున్నారు. లీటరుకు 5.6 కి.మీ చొప్పున బస్సు తిరిగే రూటు, వేసే ట్రిప్పులు (టార్గెట్) మేరకు హైర్ బస్సులకు ఆర్టీసీ డీజిల్ పోయిస్తుంది. మైలేజ్ షార్టేజ్తో అదనంగా డీజిల్ వినియోగమైతే ఆ భారాన్ని యజమానులే భరించాలి. మెయింటినెన్స్ కింద కిలోమీటరుకు రూ.12 నుంచి రూ.13ల చొప్పున ఇస్తుంది. ఏలూరు జి ల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డి పోల పరిధిలో 303 బస్సులు ఉండగా ఫ్రీ సర్వీసు అందిస్తున్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులు 177 ఉన్నాయి. రూ.40 వేల వరకు భారం ప్రయాణికుల రద్దీతో టైర్లు అరుగుదల పెరిగిందని, తరచూ టైర్లు పేలిపోవడం, సీట్లు దెబ్బతినడం, కట్టలు విరిగిపోవడం, ఇంజి సంబంధిత సమస్యలతో మెయింటెనెన్స్ పెరిగిపోయిందని ఓనర్లు అంటున్నారు. రోజుకు 10 లీటర్ల వరకు ఆయిల్ షార్టేజీ వస్తుండటంతో ఆ భారం తమపై పడుతోందని చెబుతున్నారు. మెయింటెనెన్స్, ఆయిల్ షార్టేజీ రూ పాల్లో ఒక్కో బస్సుపై నెలకు రూ.40 వేల వరకు అ దనపు భారంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్రిమెంట్లో ఫ్రీ బస్సు ప్రస్తావన లే దని, ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు మైలేజీ లీటరుకు 5.6 కి.మీ నుంచి 4.6 కి.మీ తగ్గించాలని, మెయింటినెన్స్ కి.మీ రూ.13 నుంచి రూ.18కు పెంచాలని, అనుమతి మేరకు ప్రయాణికులను అనుమతించేందుకు ఆదేశాలివ్వాలని, రద్దీకి అనుగుణంగా బస్సు ల సంఖ్యను పెంచాలని కొద్దినెలలుగా అద్దె బస్సు ల యజమానులు ఆర్టీసీని కోరుతున్నారు. 12 నుంచి సమ్మెలోకి.. ఆయిల్, మెయింటెనెన్స్ కింద ఒక్కో బస్సుకు నెలకు కేవలం రూ.5,200లు పెంచుతూ ఆర్టీసీ బుధవారం సర్క్యులర్ జారీచేయడాన్ని అద్దె బస్సు ల ఓనర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నష్టాల కోర్చి తాము బస్సులు నడపలేమని, రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈనెల 12 నుంచి బస్సులు నిలిపివేసి సమ్మె చేయనున్నట్టు ప్రకటించారు. సర్వీసులు మొత్తం హైర్ బస్సులు బస్సులు ఎక్స్ప్రెస్ 20 9 అల్ట్రా పల్లెవెలుగు 19 17 పల్లెవెలుగు 158 47 ప్రగతి రథ చక్రాలకు బ్రేకులు పోరుబాటలో హైర్ బస్సుల యజమానులు ఫ్రీబస్సు ఓవర్ లోడ్తో భారీగా పెరిగిన మెయింటెనెన్స్ ఒక్కో బస్సుపై నెలకు రూ.40 వేల వరకు అదనపు భారం ఆర్టీసీ కేవలం రూ.5,200 పెంపుపై అసంతృప్తి 12 నుంచి బస్సుల నిలిపివేతకు రాష్ట్ర హైర్ బస్ ఓనర్స్ సంఘం పిలుపు ఎంఎస్ఎంఈలో లోన్పై బస్సు తీసుకుని ఆర్టీసీలో హైర్కు నడుపుతున్నాను. ఫ్రీ బస్సు రద్దీతో నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు అదనపు భారం పడుతుంటే కేవలం రూ. 5,200 మాత్రమే ఆర్టీసీ పెంచింది. డిమాండ్లు పరిష్కరించకుంటే 12 నుంచి బస్సులు ఆపేస్తాం. – రాపాక మహేష్, హైర్ బస్ యజమాని, సిద్దాంతం బస్సులో 56 మందికు గాను వంద మందికి పైనే ప్రయాణిస్తున్నారు. ఓవర్లోడ్తో తరచూ మరమ్మతులతో మెయింటెనెన్స్ పెరిగిపోయింది. నెలనెలా అదనపు భారంతో అద్దె బస్సుల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నాం. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సమ్మె చేస్తాం. – ఎ.ప్రియాంక, హైర్ బస్సు యజమాని, తణుకు -
అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్
పాలకోడేరు: పలుచోట్ల చోరీలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగను పాలకోడేరు పోలీసులు పట్టుకున్నారు. నేరస్తుడి నుంచి సుమారు రూ.7 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పాలకోడేరు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ పి.రఘువీర్ విష్ణు గురువారం వివరాలు వెల్లడించారు. గత నెల 29వ తేదీన విస్సాకోడేరు కు చెందిన కలిదిండి లావణ్య, భర్త శ్రీనివాసరావు ఇంటికి తాళం వేసి భీమవరం ఆసుపత్రికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా బంగారం, వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో మచిలీపట్నం రూరల్, మోకావారి పాలెం, నవీన్ మిట్టల్ కాలనీకి చెందిన నిందితుడు ఆరేపల్లి దుర్గారావును ఈనెల 7వ తేదీ సాయంత్రం గొల్లలకోడేరు సెంటర్లో పాలకోడేరు ఎస్సై రవివర్మ అరెస్టు చేశారు. అతడిపై ఇప్పటికే కృష్ణా, గుంటూరు, ఏలూరు, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 145 దొంగతనాల కేసులున్నాయని, 30 సార్లు జైలుకు కూడా వెళ్లనట్లు డీఎప్పీ చెప్పారు. చోరీ కేసుల్లో పాలకోడేరు పోలీస్ స్టేషన్కు సంబంధించి రూ.2.35 లక్షలు, పెనమలూరు పోలీస్ స్టేషన్ కు సంబంధించి రూ.4.25 లక్షలు, కై కలూరు పోలీస్ స్టేషన్కు సంబంధించి రూ.18 వేలు, శ్రీ కాళహస్తి పోలీస్ స్టేషన్ కు సంబంధించి రూ.40 వేలు విలువైన బంగారం, వెండి ఆభరణాలు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు డీఎప్పీ చెప్పారు. -
నూరు శాతం ఫలితాలు సాధించాలి
తాడేపల్లిగూడెం రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో పది పరీక్షా ఫలితాల్లో నూరు శాతం ఫలితాలు సాధనకు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ ప్రధానోపాధ్యాయులకు సూచించారు. బుధవారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో తాడేపల్లిగూడెం టౌన్, రూరల్, పెంటపాడు, గణపవరం మండలాల ప్రధానోపాధ్యాయులతో 100 రోజుల యాక్షన్ ప్లాన్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో నారాయణ మాట్లాడుతూ స్లిప్ టెస్ట్ల నిర్వహణ, మార్కుల జాబితా, విద్యార్థుల గైర్హాజరు వంటి అంశాలు తెలిపారు. విద్యార్థులు గైర్హాజరు కావడంపై పెంటపాడు, గణపవరం ఎంఈవోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీవైఈవో కేవీఎస్.రామాంజనేయులు, మండల విద్యాశాఖాధికారులు వి.హనుమ, రాజేష్, బాలయ్య, టీవీ.రామకృష్ణ, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
జల జీవన్ మిషన్ వేగంగా పూర్తి చేయాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో జల జీవన్ మిషన్ ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు సంబంధిత శాఖలను సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జలజీవన్ మిషన్ ఫేజ్ వన్ కింద కోస్తాలో తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సంబంధిత శాఖలతో కన్వర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ స్థితిగతులను మెయిల్ కంపెనీ డీజీఎం పి.వాసు సమావేశంలో వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జల జీవన్ మిషన్ ఫేజ్ వన్ కింద జిల్లాలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఆరు నియోజకవర్గాల్లోని 16 మండలాలు పరిధిలో 862 గ్రామాలను కలుపుతూ రూ.1400 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టామన్నారు. పైపులైను వేసే మార్గంలో ఆక్రమణల తొలగింపులో సంబంధిత అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా ప్రతినిధి సాల్మన్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో బహిరంగ మూత్ర విసర్జన నిరోధించేందుకు కట్టుదిట్టమై చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లా వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. -
బరి కోసం చెట్ల నరికివేత
పెనుమంట్ర: పెనుమంట్ర మండలంలో సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని కోడి పందేలు, జూద క్రీడలు నిర్వహించేందుకు కూటమి నాయకులు భారీ ఏర్పాటు చేయిస్తున్నారు. ఇప్పటికే పెనుమంట్ర రజక పేట–జుత్తిగ రోడ్లో రైతుకు చెందిన పచ్చిక బీడులో నేలను చదును చేశారు. పంచాయతీరాజ్ రోడ్డును కూడా పార్కింగ్ కోసం లెవల్ చేశారు. బరి ఏర్పాటుకు ఇరువైపులా ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద పెంచిన చెట్లను సైతం నరికేశారు. ప్రజా ప్రతినిధులు, స్థానిక అధికారుల అండదండలతోనే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీఎం నాయకుడు కేతా గోపాల్ విమర్శించారు. -
కాయ్ రాజా కాయ్!
సాక్షి ప్రతినిధి,ఏలూరు: సంక్రాంతి జూద క్రీడకు సర్వం సన్నద్ధమైంది. కోడి పందేల బరుల్లో ప్రత్యేకంగా పేకాట శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తూ ముందుగానే శిబిరాలను ఖరారు చేసి విక్రయించడానికి వీలుగా అడ్వాన్సులు తీసుకుంటున్నారు. చిన్నపాటి బరుల్లో లక్షతో మొదలై భారీ బరుల్లో కోటిన్నర వరకు ధరకు జూదక్రీడలను ముందుగానే విక్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో కోడిపందాల బరుల్లో భారీగా పేకాట శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా వంద కోట్లపైన కోడిపందేలు జరిగే అవకాశం ఉండగా.. దానికి రెట్టింపు స్థాయిలో జూదక్రీడలు ఉండటం విశేషం. ఉమ్మడి పశ్చిమలో కోడి పందేల బరులు సిద్ధమవుతున్నాయి. మినీ స్టేడియాలను తలపించేలా అట్టహాసంగా ఏర్పాట్లు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ప్రారంభమయ్యాయి. ప్రధానంగా ఉండి, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెంలోని అత్యధికంగా కోడిపందేల బరులు ఏర్పాటవుతుండగా కై కలూరు, పోలవరం, దెందులూరులో భారీగా ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో చిన్నపాటి బరి నుంచి రూ.30 లక్షల వరకు పందేలు నిర్వహించే స్థాయిలో బరులు ఏర్పాటు చేస్తున్నారు. సంప్రదాయ కోడి పందేల ముసుగులో కత్తులు కట్టి నిషేధిత కోడిపందాలు యథేచ్ఛగా ఒకవైపు నిర్వహించడానికి వీలుగా ఏర్పాటు చేస్తుంటే మరోవైపు పూర్తిగా నిషేధమైన జూదక్రీడలను భారీగా కొనసాగించేలా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగానే అమ్మకాలు పేకాటలో కోత ముక్క, లోన బయట, గుండాట శిబిరాలను ప్రతి బరిలో వేర్వేరుగా ఏర్పాటు చేస్తుంటారు. ముందస్తుగానే బరి రద్దీ, స్థాయి ఏర్పాటైన ప్రదేశాన్ని బట్టి ధరలను నిర్ణయిస్తుంటారు. భారీ బరుల్లో మూడు కలిపి రూ.50 నుంచి రూ.70 లక్షల ధరకు విక్రయిస్తుంటారు. వీటిలో నిర్వాహకులకు గుండాటలో అత్యధిక లాభాలు వస్తుంటాయి. భీమవరంలోని గొల్లవానితిప్ప, ఉండిలోని ఉండి, తాడేపల్లిగూడెం, దెందులూరు మండలంలో దుగ్గిరాల, చింతలపూడి, పాలకొల్లు, నర్సాపురం ఇలా ప్రధాన ప్రాంతాల్లో రూ.50 లక్షల నుండి రూ.5 కోట్ల స్థాయి పందేలు నిర్వహించే చోట అత్యధికంగా రూ.70 లక్షల ధరకు పేకాట శిబిరాలు విక్రయిస్తున్నారు. భీమవరం సమీపంలోని ఒక బరిలో గుండాటకు రూ.70 లక్షలు, పేకాటకు రూ.40 లక్షలు, కోతాటకు రూ.30 లక్షలు అడ్వాన్సులు తీసుకున్నట్లు సమాచారం. కోడి పందేల నిర్వాహకులకు జూద క్రీడలే ప్రధాన ఆదాయం. ఉదాహరణకు... కోటి రూపాయలు పందేలు జరిగే బరిలో మూడు రోజుల మీద 30 పందేలు నిర్వహిస్తే రూ.30 కోట్లు కోడి పందేలు జరిగితే అదే శిబిరంలో జూదక్రీడలు రూ.30 నుంచి రూ.40 కోట్ల స్థాయిలో జరుగుతుంటాయి. వాటిని ముందుగానే విక్రయించి సుమారు రూ.కోటి మేర నిర్వాహకులు వసూలు చేస్తారు. ప్రతి కోడి పందెంలో కోటికి రూ.10 లక్షల చొప్పున మెయింటెనెన్స్కు వసూలు చేస్తుంటారు. అతిథులకు భోజనాలు, బరి ఏర్పాట్లు, నిర్వహణ ఇలా అన్ని ఖర్చులు తీసి మిగిలింది నిర్వాహకుడి ఖాతాలో వేసుకుంటారు. ప్రస్తుతం జిల్లాలో తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకులో అత్యధిక ధరకు పేకాట శిబిరాలు అమ్ముడైనట్లు సమాచారం. పందెం బరుల్లో పేకాటకు భారీ డిమాండ్ అత్యధిక బరుల్లో ముందే పేకాట శిబిరాల అమ్మకం బరి స్థాయిని బట్టి ధరల నిర్ణయం చిన్న బరుల్లో రూ.లక్ష నుంచి రూ.15 లక్షల వరకు అమ్మకం గుండాటలో నిర్వాహకులకు భారీగా మిగులు కోడిపందేలను మించి పేకాట -
మార్కెట్ యార్డులోనే కలెక్టరేట్
భీమవరం: పట్టణంలో గతంలో ప్రతిపాదించిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మిస్తారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) స్పష్టం చేశారు. బుధవారం భీమవరంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీంతో కొంతకాలంగా కలెక్టరేట్ తరలిపోతుందనే ప్రచారానికి ఆయన తెరదించడంతోపాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కలెక్టరేట్ను ఉండి ప్రాంతానికి తరలించడానికి చేసిన ప్రయత్నాలకు చెక్ పెట్టినట్లు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పశ్చిమగోదావరి జిల్లాకు భీమవరం కేంద్రంగా ప్రకటించడంతో తాత్కాలిక కలెక్టరేట్ను పట్టణంలోని మల్లితోట ప్రాంతంలోని అద్దె భవనంలో ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన నిర్మాణానికి కుముదవల్లి రోడ్డులోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రూ.100 కోట్లు నిధులు మంజూరుచేసినట్లు ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది ఉండి ఎమ్మెల్యే కలెక్టరేట్ను ఉండి నియోజకవర్గానికి తరలించుకుపోడానికి ముమ్మర ప్రయత్నాలు చేశారు. దీంతో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజుతో సహా వైఎస్సార్సీపీ నాయకులు తరలింపు వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. వామపక్ష పార్టీలు కలెక్టరేట్ తరలింపును అడ్డుకుంటామంటూ ఆందోళన నిర్వహించాయి. ఈ నేపథ్యంలో అంజిబాబు ఏఎంసీలోనే కలెక్టరేట్ అంటూ స్పష్టం చేయడంతో కలెక్టరేట్ తరలింపు వ్యూహానికి చెక్ పెట్టినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్పష్టం చేసిన ఎమ్మెల్యే అంజిబాబు -
పీజీఆర్ఎస్ పరిహాసం
తన స్థలంలో నిర్మాణంలోని షెడ్డు, నిర్మాణ సామగ్రిని ఆక్రమణ పేరిట పంచాయతీ కార్యదర్శి, కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారంటూ ఒక వ్యక్తి మండల స్థాయి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అధికారి సామగ్రిని ధ్వంసం చేయడంలో పంచాయతీ సిబ్బంది ప్రమేయం లేదని తన అర్జీని క్లోజ్ చేశారని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని జిల్లా స్థాయి పీజీఆర్ఎస్లో మళ్లీ ఫిర్యాదు చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తన భూమిని అక్రమంగా వేరొకరి పేరిట చేసిన రిజిస్ట్రేషన్ను రద్దుచేయాలని కోరుతూ ఒక యువకుడు గత ఏడాది పీజీఆర్ఎస్లో ఫిర్యాదుచేశారు. సమస్యను పరిష్కరించి ఎస్సై చేతుల మీదుగా తనకు ఎండార్స్మెంట్ ఇచ్చినట్టు పీజీఆర్ఎస్ సైట్లో అధికారులు ఫేక్ ఫొటో అప్లోడ్ చేసి తన అర్జీని క్లోజ్ చేయగా రీ ఓపెన్ చేయించినట్టు అప్పట్లో ఆయన మీడియా దృష్టికి తెచ్చారు. సాక్షి, భీమవరం: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలుచేసింది. ప్రజల నుంచి వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు నిర్ణీత గడువులోగా పరిష్కరించడం ద్వారా కార్యక్రమం పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. స్పందన సక్రమంగా అమలు జరిగేలా రాష్ట్ర స్థాయిలో మానిటరింగ్ చేసేందుకు అప్పట్లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం స్పందన పేరును ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)గా మార్పుచేసింది. పింఛన్లు, రేషన్కార్డులు, ఇళ్ల స్థలాలు, గృహనిర్మాణ సాయం మంజూరు తదితర ప్రభుత్వ పథకాలు, కుటుంబ తగాదాలు, ప్రభుత్వ భూములు ఆక్రమణలు, తాగునీరు, విద్యుత్ సమస్యలు, సరిహద్దు వివాదాలు, భూ సర్వే తదితర అంశాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఆయా సమస్యలను హై ప్రయారిటీ, కాజువల్ ప్రయారిటీ, మిడివల్, ఫైనాన్సియల్, నాన్ ఫైనాన్సియల్గా విభజించి వాటి ప్రాధాన్య మేరకు 48 గంటల నుంచి నిర్ణీత వ్యవధిలో పరిష్కారం చూపాల్సి ఉంటుంది. అనంతరం దరఖాస్తుదారుని సమస్య పరిష్కారం అయినట్టుగా ఎండార్స్మెంట్ తీసుకుని ఆ ఫొటోను సైట్లో అప్లోడ్ చేసి అర్జీని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. కలెక్టర్ సీహెచ్ నాగరాణి పీజీఆర్ఎస్పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. పీజీఆర్ఎస్ హాలు నుంచి నడవలేని వారు, దివ్యాంగుల చెంతకు వచ్చి అర్జీలు స్వీకరిస్తున్నారు. వాటి పరిష్కార ప్రగతిపై ప్రతి వారం ఆయా శాఖల అధికారులతో సమీక్షిస్తున్నారు. పీజీఆర్ఎస్కు వచ్చేవారికి దాతల సహకారంతో మధ్యాహ్న సమయంలో ఉచిత భోజన వసతి కల్పిస్తున్నారు. కిందిస్థాయిలో కొందరు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సమస్యకు సకాలంలో పరిష్కారం చూపకుంటే జవాబుదారీ కావాల్సి వస్తుందని ఏదోవిధంగా వాటిని క్లోజ్ చేస్తున్నారంటున్నారు. అలాంటి సందర్భాల్లో కొందరు అర్జీదారులు సమస్య పరిష్కారం కోసం తమ ఫిర్యాదులను రీ ఓపెన్ చేస్తున్నారు. గత ఏడాది పీజీఆర్ఎస్కు దాదాపు 43,100 దరఖాస్తులు రాగా వాటిలో 50 శాతం వరకు రెవెన్యూ, సర్వే పరమైన సమస్యలే ఉన్నాయి, మిగిలిన వాటిలో పంచాయతీరాజ్, పోలీస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యుత్, తాగునీరు, రిజిస్ట్రేషన్ తదితర శాఖలకు చెందిన అర్జీలు వచ్చాయి. 32,802 అర్జీలను పరిష్కరించగా, 7,554 అర్జీలను పరిష్కరించాల్సి ఉంది. పెండింగ్లో ఉన్న వాటిలోను అధికంగా రెవెన్యూ పరమైనవి ఉంటున్నాయి. పరిష్కారం అయిపోయినట్టు క్లోజ్ చేసిన వాటిలో రీ ఓపెన్ చేసి పెండింగ్లో ఉన్న దరఖాస్తులు 342 వరకు ఉన్నాయి. వీటిలో 80 శాతం వరకు రెవెన్యూ, సర్వే పరమైనవి కాగా మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి. పరిష్కారం సంతృప్తికరంగా లేని పక్షంలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. సంతృప్తికర సమాధానం లేకుండా పలు అర్జీలు క్లోజ్ రీ ఓపెన్ చేయిస్తున్న దరఖాస్తుదారులు ప్రస్తుతం రీఓపెన్ అయ్యి పెండింగ్లో ఉన్న అర్జీలు 342 గతేడాది మొత్తం అర్జీలు 43,100, పరిష్కరించినవి 32,802, పెండింగ్లో 7,554 -
గోదావరి కాలువ పక్కన డంపింగ్ యార్డ్
● ప్రమాదం అంచున ఐదు గ్రామాల సాగు, తాగునీటి సరఫరా ● కలెక్టర్కు ఫిర్యాదు చేసిన సర్పంచ్, గ్రామస్తులు దెందులూరు: గోదావరి కాలువ పక్కన ఉండ్రాజవరం వంతెన వద్ద డంపింగ్ యార్డ్ నిర్మాణం నిలుపుదల చేయాలని పోతునూరు గ్రామ సర్పంచ్ బోదుల స్వరూప్, కోపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ ఎర్నేని శ్రీను, గ్రామస్తులు కలిసి జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గోదావరి కాలువ పక్కన డంపింగ్ యార్డ్ పెడితే పోతునూరు, కొవ్వలి, సత్యనారాయణపురం, దెందులూరుతో పాటు ఏలూరు గ్రామాలకు సాగు, తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు తెలిపారు. గతంలో ఎన్నడూ గోదావరి కాల్వ పక్కన డంపింగ్ యార్డ్ నిర్మాణం జరగలేదన్నారు. ఫిర్యాదు స్వీకరించిన జిల్లా కలెక్టర్, డీపీఓను విచారణ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. బుధవారం గ్రామ సర్పంచ్ బోదుల స్వరూప్, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ ఎర్నేని శ్రీను విలేకరులతో మాట్లాడుతూ తాము డంపింగ్ యార్డ్ నిర్మాణానికి వ్యతిరేకం కాదన్నారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. గోదావరి కాలువ పక్కన ఎవరైనా డంపింగ్ యార్డ్ పెడతారా అని ప్రశ్నించారు. -
అనధికార భవనాలు, లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం పురపాలక సంఘం పరిధిలో ఉన్న అన్ని అనధికార భవనాలు, లేఅవుట్లను వెంటనే బీపీఎస్, ఐఆర్ఎస్ పథకాల ద్వారా క్రమబద్ధీకరించుకోవాలని, లేనిచో స్థల, భవన యజమానులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రాజమండి జి.సుబ్బారావు తెలిపారు. పురపాలక సంఘం కార్యాలయంలో బుధవారం టౌన్ ప్లానింగ్ సిబ్బంది, లైసెన్స్ సర్వేయర్లుతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పథకాలతోపాటు నూతన విధానంలో వచ్చిన ఆన్లైన్ పద్ధతిలో భవన నిర్మాణ అనుమతులపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ నిబంధనలను ప్రజలకు తెలియజేయాలని, వాటిని పాటించే విధంగా కృషి చేయాలని లైసెన్స్డ్ సర్వేయర్లును కోరారు. పట్టణంలో ఇప్పటికే 400 వరకు బీపీఎస్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. 500లకు పైగా భవనాలను క్రమబద్ధీకరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇన్చార్జి కమిషనర్ ఎం.రవి సుధాకర్, టీపీఏ రమణ, ఏసీపీ జి.సీతారం, టీపీఓ వి.జగదీశ్వరరావు, టౌన్ సర్వేయర్ రౌతు రామకృష్ణ, లైసెన్స్డ్ సర్వేయర్లు వరికూటి శ్రీను, శీతాపతి, రామకృష్ణ, ప్లానింగ్ కార్యదర్శలు పాల్గొన్నారు. -
విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి
భీమవరం: భీమవరం ఎస్ఆర్కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్రస్థాయి ఇంజనీరింగ్ కళాశాలల క్రీడా పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. జైత్ర 2026 పేరిట నిర్వహిస్తున్న స్పోర్ట్స్ కార్నివాల్కు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ అతిథులుగా హాజరై మాట్లాడారు. విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తే విద్యార్థుల్లో మానసిక వికాసం పెరుగుతుందని అన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిషాంత్వర్మ మాట్లాడుతూ ఈ పోటీల్లో పలు ఇంజనీరింగ్ కళాశాలల నుంచి మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో 100 టీంలు పాల్గొంటున్నాయన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దిలీప్ చక్రవర్తి, ఫిజికల్ డైరెక్టర్ పి సత్యనారాయణరాజు, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్స్ సీహెచ్ హరిమోహన్, జి సారిక తదితరులు పాల్గొన్నారు. మొదటిరోజు విజేతల వివరాలు ఉమెన్ వాలీబాల్: భీమవరం ఎస్ఆర్కెఆర్, ఏలూరు సీఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, గుంటూరు సెయింట్ మేరీస్ జట్లపై విష్ణు ఇంజనీరింగ్ కళాశాల టీం విజయం సాధించింది. విష్ణు ఇంజనీరింగ్ కళాశాలపై చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల విజయం సాధించింది. మెన్ వాలీబాల్ విభాగంలో: కేఎల్యు జట్టుపై ఒంగోలు క్విజ్ ఇంజనీరింగ్ కళాశాల జట్టు విజయం సాధించింది. చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల జట్టుపై విజ్ఞాన్ యూనివర్సిటీ జట్టు గెలుపొందింది. భీమవరం బీవీఐటీ జట్టుపై నరసాపురం స్వర్ణాంధ్ర జట్టు విజయం సాధించింది. కబడ్డీ మెన్ విభాగంలో: అమలాపురం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలపై గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీ గెలుపొందింది. అనంతపురం శ్రీవెంకటేశ్వర కళాశాల జట్టుపై ఎస్ఆర్ఎం అమరావతి విజయం సాధించింది. అలాగే ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల జట్టుపై భీమవరం ఎస్ఆర్కేఆర్–2 జట్టు గెలుపొందింది. తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాల ఎస్ఆర్కేఆర్ కళాశాల వన్ జట్టుపై విజయం సాధించింది. బ్యాడ్మింటన్ విభాగంలో: ఒంగోలు కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల, నంబూర్ వీవీఐటీ కళాశాల, అమలాపురం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల, ఎస్ఆర్కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల, నరసరావుపేట తిరుమల ఇంజనీరింగ్ కళాశాల, భీమవరం డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాల, నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల, జేఎన్టీయూకే ఇంజనీరింగ్ జట్లు విజయాలు సాధించాయి. -
తిరువీధుల్లో శ్రీవారి శోభ
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం క్షేత్ర పురవీధుల్లో శ్రీవారికి జరిగిన తిరువీధి సేవ స్వామివారి వైభవాన్ని చాటడంతో పాటు, భక్తులకు కనువిందు చేసింది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించిన తొళక్క వాహనంపై ఉంచి, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. గుడి సెంటర్లోని ధనుర్మాస మండపంలో శ్రీవారు, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి, భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలను పురస్కరించుకుని రాత్రి సైతం స్వామివారి తిరువీధి సేవ వైభవంగా జరిగింది. ఏలూరు (టూటౌన్): చెక్బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్షతో పాటు రూ.7.50 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలంటూ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బుధవారం తీర్పును వెలువరించారు. కుటుంబ అవసరాల నిమిత్తం ఏలూరుకు చెందిన మేడపాటి సుధాకర్ వద్ద నుంచి నగరానికి చెందిన ఆవుల అనిత 2023 ఫిబ్రవరి 18న రూ.8.50 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అప్పును తిరిగి చెల్లించే నిమిత్తం 2024, ఏప్రిల్ 18న రూ.7.50లక్షల చెక్కును ఇచ్చారు. సుధాకర్ రెడ్డి ఆ చెక్కును బ్యాంకులో జమ చేయగా చెల్లుబాటు కాలేదు. దీంతో ఆయన 2025లో కేసు వేశారు. విచారణ అనంతరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బుధవారం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో సదరు మహిళపై నేరం రుజువు కావడంతో ఏడాది జైలు శిక్షతో పాటు, రూ.7.50 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులో ఫిర్యాది దారుని తరుఫున న్యాయవాది చిక్కా భీమేశ్వరరావు తన వాదనలను కోర్టులో వినిపించారు. -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
భీమడోలు: మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగిన 68వ జాతీయ రైఫిల్ షూటింగ్ చాంపియన్షిఫ్లో సూరప్పగూడేనికి చెందిన వెజ్జు ధరియా జూనియర్ కేటగిరిలో ప్రతిభ చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ ఏడాది చివరిలో జరిగే నేషనల్స్ పోటీల్లో విజేతగా నిలిస్తే ఇండియన్ టీంలో స్థానం పొందుతుందని తండ్రి సోము తెలిపారు. చిన్నతనం నుంచి షూటింగ్ పట్ల ఆసక్తిని పెంచుకుని, అలుపెరుగని శ్రమతో తన లక్ష్యం వైపు ముందుకు సాగుతున్న ధరియా యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. మాజీ సర్పంచ్ వెజ్జు సూర్యకుమారి, కొండలరావు మనవరాలు ధరియా గుంటూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. ఆమెను పలువురు అభినందించారు. కొయ్యలగూడెం: మట్టిని అక్రమంగా తరలిస్తున్న జేసీబీని, టిప్పర్ లారీని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తహసీల్దార్ ఎన్.నాగరాజు తెలిపారు. యర్రంపేట సమీపంలోని పులపాల చెరువులో బుధవారం అదే గ్రామానికి చెందిన వ్యక్తి జేసీబీని ఏర్పాటు చేసి లారీల్లో మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పీడబ్ల్యూడీ ఏఈ ఎంఆర్ భాస్కర్తో కలిసి దాడి చేసినట్లు తహసీల్దార్ చెప్పారు. ఈ సమయంలో జేసీబీ, ఒక టిప్పర్ లారీని పట్టుకుని కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్కి తరలించినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం: భర్త, అతని కుటుంబ సభ్యులపై ఓ వివాహిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎంవీ ప్రసాద్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన గంజి వనజకు జోషిబాబుతో 2024 జనవరిలో గన్నవరంలో వివాహమైంది. వివాహ సమయంలో రూ.5 లక్షల నగదు, 6 కాసుల బంగారం, చీర సారె కింద రూ.2 లక్షలు కట్నంగా ఇచ్చారు. చెడు వ్యసనాలకు బానిసైన జోషిబాబు వివాహమైన కొద్దిరోజుల నుంచి భార్య వనజను శారీరికంగా, మానసికంగా వేధిస్తున్నాడు. దీనికి అతని కుటుంబ సభ్యులు ఆరుగురు సహకరిస్తున్నట్లు బాధితురాలు వనజ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్ట్ మొదటి దశ నిర్మాణ పనులన్నీ 2027 మార్చికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబాబు నాయుడు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం పోలవరం ప్రాజెక్ట్ పనులను అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ప్రాజెక్ట్ సైట్లోని సమావేశపు హాలులో సమీక్షించారు. ప్రాజెక్టు పనులు, పునరావాస ప్యాకేజీ తదితర అంశాలపై చర్చించారు. ప్రాజెక్టు ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా రూపొందించాలని సూచించారు. మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. పెదపాడు: రోడ్డు ప్రమాదంలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి మృతి చెందాడు. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతి జిల్లా, నారాయణవనం మండలంలోని జంగంపల్లి గ్రామానికి చెందిన కుంభ విజయ్ ఈనెల 6వ తేదీన మోటారు సైకిల్పై విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా రాత్రి 8.30 గంటల సమయంలో స్థానిక రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల వద్దకు వచ్చేసరికి డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో తలకి బలమైన గాయం కావడంతో జాతీయ రహదారి అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాత్రి 11 గంటల సమయంలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వీఆర్వో రాగాల కృష్ణ ఫిర్యాధు మేరకు పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆగిరిపల్లి: మండలంలో ఇష్టానుసారంగా చేపల చెరువుల కోసం కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఆగిరిపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో పదుల సంఖ్యలో మాంసం దుకాణాలు ఉన్నాయి. ప్రతిరోజు చికెన్ దుకాణాల వద్ద నుంచి చేపల చెరువుల నిమిత్తం కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్నారు. ఈ తతంగం మొత్తం ఉదయం పూట జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. కోళ్ల వ్యర్థాలను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
భీమవరం: భీమవరం డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం సైబర్ నేరాలు, యాంటీ క్రైమ్ చర్యలు, పోకో చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు సైబర్ నేరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధానంగా ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్ కాల్స్, నకిలీ వెబ్సైట్స్ వంటి మోసాలు, సోషల్ మీడియా వేదికల్లో వ్యక్తిగత సమాచారాన్ని నిర్లక్ష్యంగా పంచుకోవడం వలన తీవ్రమైన నష్టం ఏర్పడే ప్రమాదముందని హెచ్చరించారు. కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు) మాట్లాడుతూ విద్యార్ధులు చట్టాలపై అవగాహన పెంపొందించుకుని సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టూటౌన్ సీఐ జి.కాళీచరణ్, కళాశాల ప్రిన్సిపాల్ ఎం.అంజన్కుమార్ పాల్గొన్నారు. -
అడిగేదెవరు.. ఆపేదెవరు?
ద్వారకాతిరుమల: ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు సంపాదించుకుంటాం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టు కొందరు టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఎంతో విలువైన గ్రావెల్ మట్టిని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. మా ప్రభుత్వంలో మమ్మల్ని అడిగేదెవరు.. ఆపేదెవరు అంటూ ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ద్వారకాతిరుమల మండలంలోని పలు చెరువులు, పోలవరం కుడి కాలువ గట్టుపై నిత్యం పొక్లెయిన్లతో యథేచ్ఛగా గ్రావెల్ మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. అధికారులను మామూళ్ల మత్తులో జోకొడుతున్నారు. నిబంధనలకు పాతర వేసి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. నిత్యం వందలాది టిప్పర్ల మట్టిని అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. అక్రమార్కుల మధ్య పంపకాలు తేడా వచ్చినప్పుడు మాత్రమే కథ పోలీస్టేషన్కు చేరుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ నేతల అక్రమార్జనకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. నిబంధనలను తుంగలోకి తొక్కి ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు. గ్రావెల్ మట్టి మాఫియా చెరువులు, పోలవరం కుడి కాలువ గట్లపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తోంది. ముఖ్యంగా గుణ్ణంపల్లి–ఎం.నాగుపల్లి మధ్యలోని పోలవరం కుడి కాలువ గట్టుపై మట్టి తవ్వకాలు గత కొద్ది రోజులుగా యథేచ్ఛగా జరుగుతున్నాయి. దాంతో ఆ ప్రాంతం పెద్ద పెద్ద అగాథాలను తలపిస్తోంది. అలాగే పలు చెరువుల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి, గోతులు పెడుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు ఆ గోతులు నీటితో నిండి పశువులు, రైతులు అందులో పడి మృత్యువాత పడే ప్రమాదం ఉంది. పంపకాలు తేడా వచ్చినప్పుడే.. కొందరు పచ్చనేతలు సిండికేట్గా ఏర్పడి ఈ మట్టి దందాను సాగిస్తున్నారు. సాధారణంగా అధికారులెవరూ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. స్థానికులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. అయితే అక్రమార్కుల మధ్య పంపకాలు తేడా వచ్చి, అంతర్గతంగా ఫిర్యాదులు చేసుకున్నప్పుడు మాత్రమే అధికారులు రంగప్రవేశం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుణ్ణంపల్లి–ఎం.నాగులపల్లి మధ్య జరుగుతున్న ఈ అక్రమ తవ్వకాలపై ప్రజలు మండిపడుతున్నారు. సేవ చేస్తారని కూటమికి అధికారం కట్టబెడితే.. దోచుకు తింటున్నారని ధ్వజమెత్తుతున్నారు. తూతూమంత్రంగా ఫైన్లు సత్తాల పంచాయతీ సండ్రకుంటకు చెందిన ఓ నాయకుడు గతంలో సత్తాల చెరువులో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి, పెద్దపెద్ద గోతులు పెట్టాడు. రెండు మూడు సార్లు పోలీసులు చిక్కినా అతడి తీరు మారలేదు. మంగళవారం రాత్రి సైతం ఆ నాయకుడు గుణ్ణంపల్లి–ఎం.నాగులపల్లి మధ్య పోలవరం కుడి కాలువ గట్టును తవ్వి, మట్టిని తరలిస్తూ పోలీసులకు పట్టబడడంతో అతడి టిప్పర్ను పోలీస్స్టేషన్కు తరలించారు. అయితే పోలీసులు కేసులు నమోదు చేయకుండా మైన్స్ అధికారులకు అప్పగిస్తుండడం, అక్కడి అధికారులు తూతూమంత్రంగా ఫైన్లు వేసి వదిలేస్తుండటం వల్ల ఇలాంటి నాయకులకు భయం లేకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ సీపీకి చెందిన వారిపై మాత్రమే కేసులు నమోదు చేస్తూ.. అధికార పార్టీ వారిని మైన్స్ అధికారులకు అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టి తవ్వకాలు ఎక్కడంటే.. ● తిరుమలంపాలెంకు చెందిన ఓ నాయకుడు ఎటువంటి అనుమతులు లేకుండా సూర్యచంద్రరావుపేటలోని కృష్ణాపురం చెరువు, గొల్లగూడెంలోని దొర చెరువు, తిరుమలంపాలెంలోని నారప్ప చెరువులో మట్టిని తవ్వి తిమ్మాపురంలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ప్రైవేట్ కల్యాణ మండపానికి తరలిస్తున్నాడు. ● పి.కన్నాపురం గ్రామానికి చెందిన ఓ నాయకుడు గుణ్ణంపల్లి–ఎం.నాగులపల్లి మధ్యలోని పోలవరం కుడి కాలువ గట్టును తవ్వి, గ్రావెల్ మట్టిని దూబచర్లకు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నాడు. ఒక్కో టిప్పర్ మట్టిని రూ.5 వేలకు విక్రయిస్తున్నాడు. మొత్తం కాంట్రాక్టు 500 టిప్పర్ల మట్టికి కాగా, రోజుకు 50 టిప్పర్ల మట్టిని తరలిస్తున్నాడు. ● జి.కొత్తపల్లిలో ఓ నాయకుడు రైతుల పొలాల్లో గ్రావెల్ను ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వి, చుట్టు పక్కల ప్రాంతాలకు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నాడు. ● తక్కెళ్లపాడుకు చెందిన టీడీపీ నాయకుడు గుణ్ణంపల్లి ప్రాంతంలోని పోలవరం కుడికాలువ–తాడిపూడి కాలువ గట్ల మధ్యలో ఉన్న ఖాళీ భూమిలో ఈ తవ్వకాలు జరుపుతున్నాడు. ఇప్పటికే కాలువకన్నా ఎక్కువ లోతు తవ్వకాలు జరిపాడు. భవిష్యత్తులో ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ● ఐఎస్.జగన్నాధపురంలో ఓ నాయకుడు ఎర్ర చెరువులోని మట్టిని అక్రమంగా తవ్వి ఇటుక బట్టీలకు, ఖాళీ స్థలాలను మెరక చేసేందుకు తరలిస్తున్నాడు. రెచ్చిపోతున్న టీడీపీ నేతల మట్టి మాఫియా కాలువ గట్లు, చెరువుల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు నిత్యం వందలాది టిప్పర్ల మట్టి తరలింపు మా రాజ్యం.. మా ఇష్టం అంటూ నేతల బెదిరింపులు మామూళ్ల మత్తులో జోగుతున్న అధికార యంత్రాంగం -
భాగవతోత్తముడు త్యాగరాజు
భీమవరం: త్యాగరాజు 96 కోట్ల నారాయణ జపం చేసి శ్రీసీతారామచంద్రుల దర్శనం పొందిన భాగవతోత్తముడని మహా సహస్రావధాని గరికిపాటి నర్సింహారావు అన్నారు. భీమవరం పట్టణంలోని త్యాగరాజ భవనంలో నిర్వహిస్తున్న త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో భాగంగా బుధవారం గరికిపాటి త్యాగరాజు రామాయణంపై ప్రవచనం చేశారు. దేశమంతా మోగుతున్న నినాదం జై శ్రీరామ్ నామ మంత్రమని, నాదోపాసనతో పరబ్రహ్మను చేరవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడు త్యాగరాజు అన్నారు. శ్రీరామ దర్శనం పొంది భగవంతుడున్నాడన్న సత్యాన్ని చాటిన నిష్కార్మయోగి, తెలుగు భాష తీయందనాన్ని, సాహితీ పరిమళాలను విశ్వవ్యాప్తం చేసిన ధన్యజీవి, మోక్ష సాధన మార్గాల్లో సంగీతం ఒకటని తలచి తన సంకీర్తనల ద్వారా భగవంతునికి చేరువై మోక్ష ప్రాప్తి పొందిన మహనీయుడు త్యాగరాజస్వామి అంటూ కీర్తించారు. ఉండి: చెరువుల వద్ద కాపలా ఉంటున్న ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉండి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉండి శివారు ఉప్పుగుంట వద్ద ఇందుకూరి నారాయణరాజు చెరువులపై నివశిస్తున్న దీప్ జ్యోత్ బాసుమతి (21) బుధవారం ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అస్సాం రాష్ట్రం సీమన్ చపూరినుంచి వచ్చి చెరువులపై కాపలా ఉంటున్నాడని, కొంతకాలంగా ఇంటికి వెళ్లిపోదామని చెబుతున్నాడని, ఇంతలో ఇలా ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తండ్రి సుకుమార్ బాసుమతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
15వ రోజుకు ధర్మ పోరాట దీక్ష
నూజివీడు: వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నూజివీడు ట్రిపుల్ ఐటీలోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష బుధవారం నాటికి 15వ రోజుకు చేరింది. క్యాంపస్లోని ఐ3 భవనం ఎదురుగా ఏర్పాటు చేసిన టెంట్లో దీక్ష నిర్వహిస్తున్నారు. వీరందరూ టైంటేబుల్ ప్రకారం విద్యార్థులకు పాఠాలు బోధించి తదనంతరం పోరాట దీక్షలో కూర్చుంటున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడేళ్లకు పైగా తమకు వేతనాలు ఒక్క రూపాయి కూడా పెరగలేదని, దీనిపై తాము గత 15రోజులుగా పోరాడుతున్నా ఆర్జీయూకేటీ యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. యూజీసీ ప్రకారం వేతనాలు ఇస్తామని చెప్పి, కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జడ సుబ్బారావు, రచన గోస్వామి, పీవీ లక్ష్మణరావు, జాడ సీతాపతిరావు, లంకపల్లి రాజేష్, భవాని, ఉదయశ్రీ, దీప్తీ సాహూ తదితరులు పాల్గొన్నారు. -
ఇదేనా చెత్తశుద్ధి !
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలో పారిశుద్ధ్యం కోసం వినియోగించే యంత్రాలు మూలనపడ్డాయి. 2017లో స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా పాలకొల్లు మున్సిపాలిటీకి రెండు కాంప్యాక్ట్ వాహనాలు, మూడు పాప్కాట్లు, స్వీపింగ్ మిషన్లు వచ్చాయి. ఆరు మున్సిపల్ ట్రాక్టర్లు ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థను ప్రారంభించగా పట్టణంలో 14 సచివాలయాలను ఏర్పాటు చేసి 14 చెత్త సేకరించే క్లాప్ వ్యాన్లను కేటాయించారు. ఆరు ట్రాక్టర్లలో రెండు పాడవగా.. ఒకటి మరమ్మతులు పూర్తయ్యి ఇటీవల కార్యాలయానికి చేరుకుంది. చెత్తను డంప్ చేసుకుని వెళ్లే కాంప్యాక్ట్ వాహనాలు రెండు మరమ్మతులకు వెళ్లాయి. పాప్కాట్ వాహనాలు మూడు మూలకు చేరాయి. వీటితో పెద్ద డ్రైనేజీల్లో సిల్ట్ను తొలగించే అవకాశం ఉంటుంది. ఇవి పనిచేయకపోవడం వల్ల సిల్ట్ తీయడానికి లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. రోడ్లను శుభ్రం చేసే స్వీపింగ్ మిషన్ 2018లో పాలకొల్లు మున్సిపాలిటీకి వచ్చింది. అప్పటి నుంచి దీనిని పది సార్లు కూడా ఉపయోగించిన పరిస్థితి లేరు. ఇంజినీరింగ్ విభాగం నిర్లక్ష్య ధోరణి : పాలకొల్లు మునిసిపాలిటీలో ఏ వాహనం మరమ్మతు వచ్చినా వెంటనే సంబంధిత శానిటరీ అధికారులు ఇంజనీరింగ్ విభాగానికి సమాచారం ఇస్తారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ , శానిటేషన్ ఇలా ఏ విభాగంలో పనులు జరగాలన్నా ఇంజనీరింగ్ విభాగానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఇంజనీరింగ్ విభాగం నుంచి అనుమతి రావాలంటే పుణ్యకాలం గడిచిపోతుందని కార్యాలయంలో ఉన్న అన్ని శాఖల సిబ్బంది వాపోతున్నారు. కుర్చీలు, బల్లలకు కూడా ఇంజనీరింగ్ విభాగం నుంచి అనుమతుల కోసం ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యమైన వాహనాలు మరమ్మతులు విషయంలోనూ అదే నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుం డడంతో మరమ్మతులు ఆలస్యం అవుతున్నాయి. స్పెషల్ గ్రేడ్ అంటే ఇదేనా.. పాలకొల్లు మున్సిపాలిటీ గత సంవత్సరం స్పెషల్ గ్రేడ్ మునిసిపాలిటీగా అప్గ్రేడ్ అయిన విషయం తెలిసిందే. మున్సిపాలిటీ ఆదాయం, జనాభా ప్రామాణికంగా గ్రేడ్ను సెలెక్ట్ చేస్తారు. పాలకొల్లు ఆదాయం సుమారు రూ.25 నుంచి రూ.30 కోట్లకు చేరుకోవడం.. జనాభా 80 వేలు దాటడంతో పాలకొల్లు మునిసిపాలిటీ స్పెషల్ గ్రేడ్గా మార్చారు. దీంతో మున్సిపాలిటీ రూపురేఖలు మారే అవకాశం ఉంటుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. పాలకొల్లు మున్సిపాలిటీలో మూలనపడ్డ పారిశుద్ధ్య వాహనాలు మున్సిపాలిటీలో కొన్ని వాహనాలు మరమ్మతుల వల్ల మూలకు చేరుకున్నాయి. కొన్ని రిపేర్కు పంపాం. అన్నీ బాగు చేయించి రన్నింగ్లో పెడతాం. త్వరలో కొత్త వాహనాలు కూడా వచ్చే అవకాశం ఉంది. శానిటేషన్కు ఎలాంటి సమస్య లేకుండా ఎప్పటికప్పుడు వాహనాలు అందుబాటులో ఉంటున్నాయి. రోడ్లపై వేస్తున్న చెత్త కోసం ప్రజల్లో ఇప్పటికే అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – బి.విజయ సారథి, మున్సిపల్ కమిషనర్, పాలకొల్లు -
తవ్వేద్దాం.. దోచేద్దాం
బుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2026నియోజకవర్గంలోని ర్యాంపులన్నీ సీఆర్జెడ్ పరిధిలో ఉండటంతో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవు. అధికారులను అడుగుతుంటే అనుమతులు లేవంటున్నారే తప్ప అక్రమ తవ్వకాలను అడ్డుకోవడం లేదు. ఎన్జీటీ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక మేటలు, నదీ గర్భంలో తవ్వకాలు చేయడం వలన భూగర్భ జలాల్లో ఉప్పునీటి సాంద్రత పెరిగి స్థానిక ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది. – చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మాజీ మంత్రి పీఏసీ సభ్యుడిగా కొట్టు సత్యనారాయణ సాక్షి, భీమవరం: వైఎస్సార్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ (ఆక్వా కల్చర్), అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డి రఘురాం, పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వీరి నియామకంపై పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆకివీడు: ప్యాసింజర్ రైలు ఆలస్యం కాకుండా రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. డిసెంబర్ 28న సాక్షిలో ‘వందే భారత్తో ప్యాసింజర్ రైలు బలి’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి రైల్వే శాఖ స్పందించింది. జనవరి 1 నుంచి రైలు వేళల్లో మార్పు చేసింది. నర్సాపురం నుంచి 1.50కి బయలుదేరే రైలును 10 నిమిషాలు ముందుగా అంటే 1.40కి బయలుదేరేలా సమయాన్ని మార్చారు. దీంతో రైలును ఆకివీడులో ఆపాల్సిన అవసరం ఉండడం లేదు. భీమవరం: ఎరువుల డీలర్లు, రైతులు యూరియాతో పాటు జింక్, గుళికలు కొనుగోలు చేయాలని ఇబ్బందిపెడితే చట్టపరమైన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు, ఎరువుల తయారీ కంపెనీల ప్రతినిధులు, హోల్ సేల్, రిటైల్ డీలర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు ఉన్నందున రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో కొన్నిచోట్ల హోల్ సేల్, రిటైల్ డీలర్లు యూరియాతోపాటు జింక్, గుళికలు ముడిపెట్టి కొనుగోలు చేయాలని రైతులను ఇబ్బంది పెడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సాక్షి, భీమవరం: మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఇలాకాలో ఇసుక అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా ఉంది. గతేడాది కోట్లాది రూపాయల ఇసుకను తరలించేసిన అక్రమార్కులు ఇప్పుడు అదే పనిలో పడ్డారు. తీరం వెంట తవ్వకాలకు సన్నాహాలు చేస్తున్నారు. కోడేరులో బాటలు సిద్ధం చేస్తుండగా వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని సిద్ధాంతం నుంచి బియ్యపుతిప్ప వరకు ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల పరిధిలో వశిష్ట గోదావరిలో ఆరు ఓపెన్ రీచ్లు, ఐదు డీసిల్టేషన్ పాయింట్ల ద్వారా గతంలో ఇసుక తవ్వకాలు జరిగేవి. సముద్రపు ఆటుపోట్లతో ఈ ప్రాంతంలో ఇసుకలో ఉప్పునీటి సాంద్రత ఎక్కువగా ఉండి నిర్మాణ పనులకు అనుకూలంగా లేకపోవడటం, తీరప్రాంత పరిరక్షణలో భాగంగా రెండేళ్ల క్రితం కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్జెడ్) ఇసుక తవ్వకాలపై నిషేధం విధించింది. అప్పటినుంచి ఈ ర్యాంపులు తెరుచుకోలేదు. ఇదే అదునుగా టీడీపీ నేతలు చక్రం తిప్పారు. సాధారణంగా ఇసుక తవ్వకాలు చేయాలంటే ఇరిగేషన్, మైనింగ్, పొల్యూషన్, రెవెన్యూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అనుమతులు తప్పనిసరి. తీరప్రాంతం కోతకు గురికాకుండా ఇసుక మేట వేసిన చోట పరిమిత అడుగుల లోతున జట్టు కార్మికులతో పగటిపూట మాత్రమే తవ్వకాలు, లోడింగ్ చేయాలి. ఏ విధమైన అనుమతులు లేకుండానే సిద్దాంతం నుంచి నరసాపురం వరకు గతంలో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోయాయి. ప్రభుత్వ పెద్దల సిఫార్సులతో అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇసుకాసురుల ఇష్టారాజ్యం అయ్యింది. ఎన్జీటీ నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయినర్లతో నదీగర్భంలో రెండు మూడు మీటర్లు లోతున ఇసుకను తవ్వి కోట్లాది రూపాయల ఇసుకను కొల్లగొట్టారు. లోడింగ్ రూపంలో బయట అమ్మకాలు చేయడంతో పాటు ఎక్కడికక్కడ అనధికార స్టాకులు పెట్టి వరదల సమయంలో అధిక ధరలకు అమ్ముకున్నా అధికారులు కన్నెత్తి చూడలేదన్న ఆరోపణలు ఉన్నాయి. బాటలకు సన్నాహాలు : గోదావరిలో వరద ప్రభావం తగ్గడంతో సిద్ధాంతం, నడిపూడి, కోడేరు, కరుగోరుమిల్లి తదితర చోట్ల ఇసుక మేటలు బయటపడుతున్నాయి. ఈ ఏడాది ఆయా ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు టీడీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. గోదావరిలోకి లారీల రాకపోకలకు వీలుగా బాటలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే కోడేరు వద్ద గతంలోని వరదలకు కొట్టుకుపోయిన పాత బాటను రాళ్లు వేసి పొక్లెయిన్లతో సరిచేస్తున్నారు. బాట పనుల కోసం తీసుకొచ్చిన పొక్లెయిన్ గతేడాది తవ్వకాలు చేస్తున్న దృశ్యం (ఫైల్) ఏలూరు (టూటౌన్): సంక్రాంతి నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. 18న విశాఖపట్నం–చర్లపల్లి (08513), 19న చర్లపల్లి–విశాఖపట్నం(08514) ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు తెలిపారు. పలు ప్రత్యేక రైళ్లు రద్దు : ఈ నెల 13న నడవాల్సిన నర్సాపూర్–చర్లపల్లి, 17న నడవాల్సిన చర్లపల్లి–నర్సాపూర్, 19న వికారాబాద్–చర్లపల్లి, వికారాబాద్–కాకినాడ టౌన్ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 20న వికారాబాద్–నర్సాపూర్, వికారాబాద్–కాకినాడ టౌన్ రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. తాడేపల్లిగూడెం రూరల్: శ్రీష్టా పరీక్షలలో పెదతాడేపల్లి అంబేద్కర్ గురుకుల విద్యార్ధులు ఘన విజయం సాధించారు. గురుకులం నుంచి 134 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకాగా, అందరూ అర్హత సాధించి జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. బల్లి చరణ్కు ఆలిండియా 864 ర్యాంకు, పి.మనోజ్కుమార్కు 1252, జి.రిషి 1386, డి.రితీష్ కుమార్కు 1519, కె.జస్వంత్ 1875 ర్యాంకు సాధించి సంస్థకు గర్వకారణంగా నిలిచారు. విద్యార్థులలో సుమారు 25 మందికి ఫస్ట్ రౌండ్లో సీట్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. గురుకుల ప్రిన్సిపాల్ బి.రాజారావు, ఉపాధ్యాయులు బి.ప్రతాప్, ఆనందరావు, కృష్ణ, బలరాం, రవి విద్యార్ధులను అభినందించారు. ఆకివీడు: ఎట్టకేలకు ఆకివీడు వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంతం శుభ్రపడింది. ఏఎంసీ ప్రాంగణంలో ఇటీవల భారీగా పిచ్చిమొక్కలు, పాదులు విపరీతంగా పెరిగిపోయాయి. దీనిపై ఇటీవల ‘సాక్షి’లో వచ్చిన కథనానికి ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, కార్యదర్శి యోగేశ్వరరావు స్పందించి ప్రాంగణాన్ని జేసీబీతో శుభ్రం చేయించారు. పల్లంగా ఉన్న మార్కెట్ యార్డు ప్రాంతాన్ని మట్టితో పూడ్చి ఎత్తు చేయించి, ప్లాట్ఫారాలు అనుకూలంగా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. కోడేరు వద్ద బాట ఏర్పాటు చేస్తుండటంతో స్థానిక వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం తెలిసి బాట సిద్ధం చేస్తున్నవారు పొక్లెయినర్లను లంకల్లోకి తరలించేశారు. ఈ విషయమై వైఎస్సార్సీపీ నేతలు తహసీల్దార్ సోమేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తే సహించేది లేదని, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా అడ్డుకుంటామన్నారు. బాట ఏర్పాటుపై మైనింగ్శాఖ అధికారులు స్పందిస్తూ కోడేరు ప్రాంతంలో తనిఖీలు చేశామని, అయితే అక్కడ ఇసుక తవ్వకాలు చేస్తున్నట్టు ఆధారాలు దొరకలేదని, రాళ్లతో ఉన్న మట్టి దిబ్బలు, మధ్యలో అక్కడక్కడ కొట్టుకుపోయిన పాత బాట కనిపించినట్టు పేర్కొనడం గమనార్హం. జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలకు సన్నాహాలు గోదావరి తీరం వెంట పాత ర్యాంపుల్లో బాటలు సిద్ధం చేసే పనిలో టీడీపీ నేతలు కోడేరులో యంత్రాలతో బాటలు అడ్డుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు గతేడాది అక్రమ తవ్వకాలతో కోట్లాది రూపాయలు స్వాహా -
వైభవంగా శ్రీవారి తిరువీధి సేవ
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలు శ్రీవారి వైభవాన్ని చాటుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం ఉదయం స్వామి వారికి నిర్వహించిన తిరువీధి సేవ భక్తులకు కనువిందు చేసింది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజ గోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనం అయింది. ప్రతి ఇంటి ముంగిట భక్తులు స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. ఆఖరిలో ఆలయ ప్రధాన కూడలిలో ఉన్న ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. పెదపాడు: కోళ్ల వ్యర్థాలు తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు పెదపాడు పోలీసులు తెలిపారు. మండలంలోని వడ్డిగూడెం గ్రామానికి కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పెదపాడు ఎస్సై తన సిబ్బందితో కలిసి దాడి చేసి వాహనం సీజ్చేశారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కట్టా శారదా సతీష్ తెలిపారు. -
ధర్మ పోరాటానికి సీఐటీయూ మద్దతు
నూజివీడు: స్థానిక ట్రిపుల్ ఐటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిర్వహిస్తున్న ధర్మ పోరాట దీక్ష మంగళవారం నాటికి 14వ రోజుకు చేరింది. దీనిలో భాగంగా ఐ3 బిల్డింగ్ వద్ద అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోరాట దీక్ష నిర్వహించారు. ఈనెల 7న చాన్సలర్ను కలిసి చర్చలు జరపనున్న నేపధ్యంలో చర్చల అనంతరం చేపట్టాల్సిన కార్యాచరణను నిర్ణయిస్తామని వారు పేర్కొన్నారు. వీరి ధర్మ పోరాట దీక్షకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలను, న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు. నేటి నిత్యవసర ధరలకు అనుగుణంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల న్యాయమైన సమస్యలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు చెప్పారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు పరిష్కారం అయితేనే విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు దృష్టి సారించగలరని నిజాన్ని పాలకులు గుర్తించాలన్నారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు జాడ సీతాపతిరావు, పీవీ లక్ష్మణరావు, జడ సుబ్బారావు, రాజేష్ పాల్గొన్నారు. -
యువకుడిపై హత్యాయత్నం
ఆకివీడు: ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగిన ఘటన ఆకివీడు మండలంలోని కోళ్లపర్రు గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడి తల్లిదండ్రులు సరోజనీ, బుల్లియ్య తెలిపిన వివరాల ప్రకారం కోళ్లపర్రు గ్రామ శివారు సగర్లపేటకు చెందిన గండికోట శివ సోమవారం రాత్రి ఆకివీడు వెళ్లి గ్రామానికి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు కాపుకాసి దాడి చేశారు. దీంతో అతడి తలకు, ఛాతిపైన, కుడి చేతి భుజం ఎముకకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న శివను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీహెచ్సీలో చికిత్స చేయించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం మంగళవారం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించారు. బాధితుడి వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు. దీనిపై ఆసుపత్రి నుంచి తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
తణుకు ప్రభుత్వ కళాశాలకు ఐఎస్వో ధ్రువీకరణ
తణుకు అర్బన్: తణుకు చిట్టూరి ఇంద్రయ్య స్మారక ప్రభుత్వ కళాశాల పలు విభాగాల్లో ఐఎస్వో ప్రమాణాల్లో ధ్రువీకరణ సాధించిందని ప్రిన్సిపాల్ సీహెచ్ ఏడుకొండలు తెలిపారు. పర్యావరణ నిర్వహణ, విద్యా సేవల నాణ్యత, ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రమాణాల్లో ధ్రువీకరణ పొందినట్లు చెప్పారు. ఈ ధ్రువీకరణలు హైదరాబాద్కు చెందిన హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ద్వారా జారీ చేయబడినట్లు స్పష్టం చేశారు. ఇది కళాశాల నాణ్యతా ప్రమాణాలకు అంతర్జాతీయ గుర్తింపు అని అన్నారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల సమష్టి కృష్టితో ఈ ఘనత సాధ్యమైనట్లుగా వివరించారు. నరసాపురం: రాష్ట్రంలో ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఏలూరు సీఆర్రెడ్డి కళాశాల గ్రౌండ్లో సోమ, మంగళవారాల్లో నిర్వహించిన క్రికెట్ బాలుర టాలెంట్ స్పాటింగ్లో నరసాపురం పట్టణానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. పట్ణణంలోని రుస్తుంబాద బాలాజీ క్రికెట్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న మామిడి వెంకట నవసూర్య, యర్రంశెట్టి దేవకీనందన్ ఎంపికయ్యారు. త్వరలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే పోటీల్లో వీరు పాల్గొంటారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలువురు అభినందించారు. మండవల్లి: గోడౌన్లో సిగరెట్ బాక్సుల చోరీ జరిగిన ఘటన లోకుమూడిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లోకుమూడిలో రత్న ఎంంటర్ప్రైజస్ పేరిట నిత్యావసర సరుకుల గోడౌన్ నిర్వహిస్తున్నారు. ఈనెల 6న ఉదయం యజమాని గోడౌన్ వద్దకు వెళ్లగా షట్టర్ వంచబడి లాకులు తెరిచి ఉన్నాయి. లోపలకి వెళ్లి చూడగా 11 గోల్డ్ఫ్లాక్ సిగరెట్ బాక్సులు చోరీ జరిగినట్లు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని తెలియజేశారు. దీనిపై బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమవరం: భీమవరరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీంగ్ కళాశాలలో ఈ నెల 7వ తేదీ నుంచి మూడు రోజులపాటు అంతర్ రాష్ట్ర ఇంజనీరింగ్ కళాశాలల మెన్ అండ్ ఉమెన్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బీహెచ్వీఎస్ రామకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీహెచ్ దిలీప్ చక్రవర్తి మంగళవారం చెప్పారు. కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బుధవారం ఉదయం 10 గంటలకు పోటీలను కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్వర్మ, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రారంభిస్తారన్నారు. వాలీబాల్, కబడ్డీ, పికిల్ బాల్, బ్యాడ్మింటన్ విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. తణుకు అర్బన్: ప్రపంచ తెలుగు సభల్లో తణుకుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపునకు గోల్డ్ మెడల్ దక్కింది. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 3 నుంచి 5 తేదీల్లో గుంటూరులో శ్రీ సత్య సాయి స్పిరిచ్యువల్ సిటీ నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వందకు పైగా చిత్రకారులు పాల్గొని కళాఖండాలు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో తాను ఎఫెక్షన్ శీర్షికతో రూపొందించిన చిత్రానికి గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రం అందుకున్నట్లు వెంకటాపు వివరించారు. చిత్రకళా ప్రదర్శన కోఆర్డినేటర్ కళారత్న ఎస్.విజయ్కుమార్, అమీర్ ఆర్ట్ అకాడమీ కార్యదర్శి డాక్టర్ అమీర్ జాన్, డ్రీమ్ ఆర్ట్ అకాడమీ డైరెక్టర్ పెరపోగు రమేష్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ చిత్రకారులు కొండూరి నాగేశ్వరరావు, మారేడు రాము, మధు కురువ చేతులమీదుగా గోల్డ్మెడల్ అందుకున్నట్లు చెప్పారు. -
రెడ్ సిగ్నల్ పడితే మాకేంటి!
ఏలూరు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు, క్రమబద్ధీకరణకు ట్రాఫిక్ పోలీసులు అనేక చర్యలు చేపడుతున్నా వాహనదారులు మాత్రం రూల్స్ పాటించడం లేదు. సిగ్నల్ రూల్స్ సైతం పాటించకుండా ఇష్టారాజ్యంగా ప్రయాణం సాగిస్తూ ప్రమాదాలకు ఎదురు వెళుతున్నారు. రెడ్ సిగ్నల్ పడినా పట్టించుకోకుండా వెళ్లిపోవడం.. ఆపిన కానిస్టేబుల్తో వాగ్విదానికి దిగడం షరా మాములైపోయింది. రూల్స్ పాటించండి.. క్షేమంగా ఇంటికి వెళ్లండి అంటూ ఎన్ని అవగాహన కార్యక్రమాలు పెట్టినా మనకేమిటిలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఏలూరు ప్రధాన కూడలి అయిన ఫైర్స్టేషన్ సెంటర్, పాతబస్టాండ్ సెంటర్లో సిగ్నల్ పడినా ఆగకుండా ప్రయాణాలు సాగిస్తున్న దృశ్యాలు ఇవి. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
ఆదాయంలో ఎదురులేని వెదురు
● జిల్లాలోని మన్యంలో 5,381 ఎకరాల్లో వెదురు వనరు ● ప్రతి ఏటా అక్టోబర్ నుంచి జూన్ వరకూ వెదురు కర్రల కటింగ్ ● ఒక్కసారి నరికినా మూడేళ్లలో మళ్లీ పెరుగుదల బుట్టాయగూడెం: వెదురును పచ్చ బంగారం అంటారు. వెదురు బొంగులను కోష్టాలు, పందిళ్ల నిర్మాణానికి, ఇంటి పైకప్పులకు వాడతారు. నిచ్చెనల తయారీకీ ఉపయోగిస్తారు. వెదురును బద్దలుగా చీల్చి పలు రకాల వస్తువులను తయారు చేస్తారు. బుట్టలు, తట్టలు, గంపలు, చేటలు మొదలైనవి వెదురుతోనే చేస్తారు. వెదురు కలప పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని అడవిలో వేల ఎకరాల్లో సహజ సిద్ధంగా విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో వెదురు కూపులు పచ్చదనంతో ఎత్తయిన చెట్లతో కళకళలాడుతూ కనిపిస్తుంటాయి. ఈ వెదురు కర్రలను ప్రతి ఏటా అక్టోబర్ నెల నుంచి జూన్ నెలాఖరు వరకూ నరికించి జంగారెడ్డిగూడెంలో ఉన్న అటవీశాఖ వెదురు డిపోకు తరలించి అక్కడ వెదురు కర్రలను వేలం వేస్తారు. మన్యంలో 5,381 ఎకరాల్లో వెదురు వనాలు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని జంగారెడ్డిగూడెం, కుక్కునూరు, కన్నాపురం అటవీ రేంజ్ పరిధిలో ఉన్న బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఉన్న అటవీ పరిధిలో సుమారు 5,318 ఎకరాల్లో వెదురు వనాలు ఉన్నాయి. బుట్టాయగూడెం మండలంలోని రేగులపాడు, ముంజులూరు, మోతుగూడెం, పోలవరం మండలంలోని కొల్లుమామిడి–1, 2 గుమ్ములూరు, తదితర ప్రాంతాల్లో వెదురు కొమ్ములను అటవీశాఖ అధికారులు పెంచుతున్నారు. వీటిలో ఒక్కో కూపును మూడు కూపులుగా విభజించారు. వెదురు బాగా పెరిగిన తర్వాత వాటిని అధికారులు నరికిస్తారు. అయితే వీఎస్ఎస్ కూపులుగా కూడా ఉన్నాయి. బుట్టాయగూడెం మండలంలోని ఒర్రింక, ముంజులూరు, రేగులపాడు, చింతపల్లి, రేపల్లె అటవీ ప్రాంతంలో కూడా వెదురు వనాలు ఉన్నాయి. ఒక్కసారి నరికిన ప్రదేశంలో తిరిగి మళ్లీ మూడేళ్లకు వెదురు తయారవుతుంది. దానిని కూడా అటవీశాఖ అధికారులు కూలీలతో నరికిస్తారు. ప్రతి ఏడాది అక్టోబర్ నెలలో వెదురు నరికే కార్యక్రమాన్ని అధికారులు చేపడతారు. ఇక్కడ నరికిన వెదురు కర్రలను లారీల్లో ఆరు నెలల పాటు జంగారెడ్డిగూడెం అటవీశాఖ డిపోకు తరలిస్తారు. ప్రస్తుతం వెదురు నరికే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక్కడ నరికిన వెదురు కర్రలను లారీల్లో గిరిజనులు జంగారెడ్డిగూడెం డిపోకు తరలిస్తున్నారు. 200 కొండరెడ్డి కుటుంబాలకు జీవనోపాధి పశ్చిమ ఏజెన్సీప్రాంతంలోని మారుమూల కొండరెడ్డి గిరిజన గ్రామాల్లో ఉపాధి అవకాశాలు ఉండవు. పూడు వ్యవసాయమే వారికి ఆదాయం. అది కూడా కేవలం తిండి గింజలు సమకూర్చుకోవడానికే తప్ప ఆదాయం కోసం కాదు. బుట్టాయగూడెం కుక్కునూరు, పోలవరం, జీలుగుమిల్లి, వేలేరుపాడు మండలాల పరిధిలో సుమారు 200 కొండరెడ్డి గిరిజన కుటుంబాలు వెదురు కలప నరికివేత జీవనోపాధి కల్పిస్తుంది. ప్రతి ఏటా అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే ఈ వెదురు కలపను కొండరెడ్డి గిరిజనులకు ఆరు నెలలపాటు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. -
ఉపాధి పనుల్లో అవకతవకలు
● పనులు చేయకుండానే బిల్లుల చెల్లింపులు ● ఉపాధి హామీ సామాజిక తనిఖీల్లో వెల్లడి ● రికవరీకి ఆదేశించిన అధికారులు ముసునూరు: ప్రభుత్వ పథకాన్ని సవ్యంగా అమలు చేయకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించబోనని సోషల్ ఆడిట్, పబ్లిక్ హియరింగ్ ప్రొసీడింగ్ అధికారి పురుషోత్తం ఉపాధి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మండలంలోని 16 గ్రామాల్లో జరిగిన ఉపాధి హామీ పనుల 18 వ విడత సామాజిక తనిఖీలపై ప్రజావేదిక కార్యక్రమాన్ని స్థానిక ఉపాధి హామీ కార్యాలయం వద్ద ఎంపీడీఓ పి.ఏసుబాబు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీల్లో పలు గ్రామాల క్షేత్ర సహాయకులు, సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధి హామీ పనుల్లో నాణ్యతాలోపం, అవగాహన లేమి, బిల్లుల చెల్లింపుల్లో ఉన్న ఆరాటం, ఆత్రుత తదితర అంశాలు వెల్లడయ్యాయి. రహదారి వేయకుండానే.. 61 మీటర్ల రహదారి వేసినట్లు బిల్లుల చెల్లింపు, కూలీలు పనికి రాకపోయినా హాజరువేయడం, వేలి ముద్రలు వేయకున్నా వేతనాల చెల్లింపులు, మొక్కలు వేయకుండానే.. వేసినట్లు లెక్కలు చూపడం, తదితర తప్పులు బహిర్గతం అయ్యాయి. 2,467 పనులు నిర్వహించగా, వాటిపై జరిమానాలు రూ.44 వేలతో కలిపి మొత్తం రూ.51 వేలు రికవరీలకు జిల్లా విజిలెన్స్ అధికారిణి అనుపమ ఆదేశించారు. అనంతరం ప్రొసీడింగ్ అధికారి పురుషోత్తం మాట్లాడుతూ సిబ్బంది సక్రమంగా పనిచేయకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో అవసరమైన సమగ్ర సౌకర్యాలు చేపట్టాలని, ఎక్కువ మందిని సమకూర్చాలని ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కొండా దుర్గాభవాని, వైస్ ఎంపీపీ రాజానాయన, ఏపీడీ శ్రీనివాస్, అంబుడ్స్మెన్ మహబూబ్ బాషా, మణికంఠ, స్టేట్ రిసోర్స్ పర్సన్స్, ఏపీఓ రోజ్లీల, టీఏలు, ఎఫ్ఏలు పాల్గొన్నారు. -
పశువుల పాక దగ్ధం
పెంటపాడు: మండలంలోని కె.పెంటపాడులో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదంలో పశువుల పాక దగ్ధమైంది. దోమల కోసం పెట్టిన పొగ రాజుకొని ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ సమయంలో సుమారు 10 గేదెలు పాకలో ఉన్నాయి. కొన్ని పశువులు తప్పించుకోగా 4 పాడి పశువులకు గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన కాకి వీరాస్వామికి చెందిన పశువుల పాకతో పాటు, సమీపంలో ఉన్న గడ్డి వాము అగ్నికి ఆహుతైంది. గూడెం అగ్నిమాపక అధికారి కేవీఎం కొండబాబు, మండల పశువైద్యాఽధికారి పి.అశోక్కుమార్ తమ సిబ్బందితో వచ్చి కాలిన పశువులకు వైద్యపరీక్షలు చేసారు. సిబ్బంది మంటలను అదుపు చేశారు. మూడు పశువులు కోలుకుంటున్నాయని, మరో పశువు 90 శాతం పైగా కాలిపోయిందని, వైద్యాధికారి అశోక్కుమార్ తెలిపారు. -
జోరుగా నల్ల బెల్లం విక్రయాలు
● సారా తయారీకి వినియోగం ● చింతలపూడికి టన్నుల కొద్దీ దిగుమతి చింతలపూడి : ఏలూరు జిల్లాలో నల్ల బెల్లంతో పా టు సాధారణ బెల్లం అమ్మకాలు ఇటీవల గణనీయంగా పెరిగాయి. వ్యవసాయ అవసరాల పేరుతో విక్రయిస్తున్న నల్ల బెల్లం వాస్తవానికి సారా తయారీలో ప్రధాన ముడి పదార్థంగా మారుతోంది. ఈ అక్రమ వ్యాపారం వల్ల పేదల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. చిత్తూరు నుంచి భారీగా.. చింతలపూడిలో సారా తయారీకి ఉపయోగించే నల్ల బెల్లం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. స్థానిక బెల్లం వ్యాపారులు కొందరు సిండికేట్గా మారి టన్నుల కొద్దీ బెల్లాన్ని చిత్తూరు జిల్లా నుంచి దిగుమతి చేసి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. సారా తయారీకే ఈ బెల్లాన్ని వినియోగిస్తారని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేసినా నామమాత్రపు దాడులు చేస్తూ బెల్లం వ్యాపారులకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా గత నెలలో అధికారులు బెల్లం దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. బెల్లం వ్యాపారులతో సమావేశం నిర్వహించి సారా తయారీదారులకు బెల్లం విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే బెల్లం విక్రయాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. వ్యాపారులు కూడా నిబంధనలను అడ్డుపెట్టుకుని కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. చింతలపూడి మార్కెట్కు లారీల్లో టన్నుల కొద్దీ బెల్లం వస్తుందనేది బహిరంగ రహస్యం. ఉన్నతాధికారులు బెల్లం గోడౌన్లపై దాడులు చేసి వ్యాపారులను కట్టడి చేస్తే సారా తయారీని అరికట్టవచ్చు. చింతలపూడి నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్లం అ మ్మకాలు సాగిస్తున్న వ్యాపారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. బెల్లం వ్యాపారులతో సంబంఽధిత అధికారులు కుమ్మక్కు కావడంతో సారాను అరికట్టలేకపోతున్నారు. బెల్లం అమ్మకాలను నియంత్రిస్తే సారా తయారీని నిర్మూలించవచ్చు. – తొర్లపాటి బాబు, సీపీఐ మండల కార్యదర్శి -
మా భూముల కోసం ప్రాణాలైనా అర్పిస్తాం
ఏలూరు (టూటౌన్): మా ప్రాణాలైనా అర్పిస్తాం.. కానీ మా భూములను మాత్రం నావీ ఆయుధ కర్మాగారానికి ఇచ్చేది లేదంటూ కొ య్యలగూడెం మండలం బోడిగూడెం, బర్కెట్ నగరం, మంగపతిదేవిపేట, ఊట్లగూడెం, తూ ర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం రేగులగుంటకు చెందిన రైతులు సోమవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం పీజీఆర్ఎస్లో వినతిపత్రం సమర్పి ంచారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మా ట్లాడుతూ కొయ్యలగూడెం మండలం బోడిగూడెం పంచాయతీ పరిధిలోని బర్కెట్నగరం ప్రాంతంలోని 1,166 ఎకరాల్లో నావీ ఆయుధ కర్మాగారం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేయడం దారుణమన్నారు. దీని వల్ల ఐదు గ్రామాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులు రోడ్డు పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తామంతా జీవనోపాఽధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కనీసం రైతుల అనుమతి తీసుకోకుండా, గ్రామసభలు నిర్వహించకుండా భూములను బలవంతంగా లాక్కోవాలని చూడటం దుర్మార్గమన్నారు. భూములను ఇచ్చేందుకు తామెవరికీ ఇష్టం లేదని స్పష్టం చేశారు. రైతుల అభ్యంతరాలను ప్రభుత్వానికి నివేదించాలని కలెక్టర్ను వారు కోరారు. -
మందు వికటించి 19 గొర్రెలు మృతి
ఉంగుటూరు: ఉంగుటూరు మండలం ఎ.గోకవరంలో జలగ మందు వికటించడంతో 19 గొర్రెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన ఆకుల గంగరాజు 50 గొర్రెలకు జలగ నివారణ మందును ఆదివారం పట్టించారు. ఆదివారం సాయంత్రానికి 12 గొర్రెలు చనిపోయాయి. సోమవారం మరో 7 గొర్రెలు చనిపోయాయి. విషయం పశు సంవర్ధక శాఖ అధికారులకు తెలియడంతో చేబ్రోలు, కై కరంలోని పశువైద్యులు అప్రమత్తమయ్యారు. గొర్రెలను చేబ్రోలు తెప్పించుకుని 30 గొర్రెలకు వైద్యం చేయించారు. ఆ గొర్రెలు తేరుకుంటున్నాయి. గొర్రెలు ఎందుకు చనిపోయాయో తెలుసుకోడానికి ఏలూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. సోమవారం సాయంత్రానికి నివేదిక రాగా.. ఎక్కువ మోతాదులో మందు వాడటం వల్ల గొర్రెలు చనిపోయినట్లు తేలిందని చేబ్రోలు పశువైధ్యాదికారి కిషోర్ వివరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు చేబ్రోలు పశువులు ఆసుపత్రి వద్దకు వెళ్ళి బాధిత రైతులను పరామర్శించారు. -
హోరాహోరీగా కబడ్డీ పోటీలు
వీరవాసరం: కొల్లా భాస్కరమ్మ, గుండా లక్ష్మీ రత్నావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీరవాసరంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఆదివారం హోరాహోరీగా సాగాయి. 25 జిల్లాల నుంచి జట్లు తలపడ్డాయి. ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీలను తిలకించారు. ఈ పోటీల్లో కృష్ణా, ఎన్టీఆర్, అనంతపురం, విజయనగరం జిల్లా జట్లు సెమీఫైనల్కు అర్హత సాధించాయి. తూర్పుగోదావరి– కర్నూలు జట్ల మధ్య జరిగిన పోటీలో కర్నూలు జట్టు విజయం సాధించింది. కాకినాడ– ఏలూరు జట్ల మధ్య పోటీలో కాకినాడ, పశ్చిమగోదావరి– తిరుపతి మధ్య పోటీలో పశ్చమ గోదావరి జట్టు విజయం సాధించింది. విశాఖపట్నం–అన్నమయ్య జిల్లాల మధ్య జరిగిన పోటీల్లో అన్నమయ్య జట్లు విజయం సాధించింది. గుంటూరు– పల్నాడు జిల్లా మధ్య పోటీలో పల్నాడు, శ్రీకాకుళం– కడప మధ్య పోటీలో శ్రీకాకుళం విజయం సాధించారు. సత్య సాయి జిల్లాపై కృష్ణ, తూర్పుగోదావరిపై అనంతపురం, ఏలూరుపై పశ్చిమ గోదావరి, తిరుపతిపై కాకినాడ జట్లు గెలుపొందాయి. నంద్యాలపై పల్నాడు జట్టు, కడపపై బాపట్ల, సత్యసాయిపై నెల్లూరు విజయం సాధించింది. కర్నూలుపై అనంతపురం, ఏలూరుపై తిరుపతి, నంద్యాలపై గుంటూరు, చిత్తూరుపై ఎన్టీఆర్ జిల్లా విజయం సాధించింది. విజయనగరం– ప్రకాశం జట్ల మధ్య జరిగిన పోటీల్లో విజయనగరం 18 పాయింట్లతో, నెల్లూరు–కృష్ణా మ్యాచ్లో కృష్ణా జట్టు 32 పాయింట్లతో విజయం సాధించింది. -
వైఎస్సార్సీపీ శ్రేణుల జోలికొస్తే ఊరుకోం
ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కక్ష గట్టి దాడులు చేస్తే సహించేది లేదని, మా కార్యకర్తలకు ఏమైనా జరిగితే దేనికై నా సిద్ధమని, ఎక్కడికై నా వెళ్లేందుకు వెనుకాడబోమని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. భీమడోలు మండలం అంబర్పేట గ్రామంలో దళితులైన వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు కూరపాటి నాగభూషణంపై కూటమి నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకునేలా వేధించడం దుర్మార్గమన్నారు. కూటమి నేతల భూదందాలు అధికారులకు కనిపించటం లేదా అని ప్రశ్నించారు. ఏలూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న నాగభూషణాన్ని సోమవారం వాసుబాబు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నా రు. పార్టీ అండగా ఉంటుందని నాగభూషణానికి భ రోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగభూషణం 40 ఏళ్ల క్రితం ముగ్గురు అన్నదమ్ముల వద్ద 60 సెంట్ల భూమి కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నారని, ఈ భూమిపై కూటమి నేతల కన్ను పడిందన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు కావటంతో స్థానిక టీడీపీ, జనసేన నేతలు టార్గెట్ చేశారని విమర్శించారు. అంబర్పేటలో ఏకంగా 100 ఎకరాల పోరంబోకు భూమి ఉందని, క్వారీలు కూటమి నేతలు, భూస్వాముల స్వాధీనంలో ఉన్నాయని, అధికారులు వాటి జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కూటమి పార్టీలకు చెందిన పెద్ద రైతులు పలు ఎకరాల భూములను ఆక్రమించుకున్నారని, అయితే దళితుడైన నాగభూషణం కొనుగోలు చేసిన భూమికి సంబంధించి మాత్రమే ప్రభుత్వ అధికారులు అలజడులు సృష్టించటం, లాక్కునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటని వాసుబాబు మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వాసుబాబు -
ఏపీఎన్జీజీఓ సంఘ కార్యవర్గం ఏకగ్రీవం
ఏలూరు(మెట్రో): ఏపీఎన్జీజీఓ అసోసియేషన్ ఏలూరు జిల్లా కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. సోమవారం స్థానిక డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఎన్నికలు నిర్వహించగా ఒక్కో పోస్టుకు ఒక్కో అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో జిల్లా కార్యవర్గం ఏకగ్రీవమైందని, మొత్తం 17 మంది ఎన్నికై నట్టు ఎన్నికల అధికారి కె.శరత్బాబు ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా చోడగిరి శ్రీనివాసరావు (జలవనరుల శాఖ), సహాధ్యక్షుడిగా నోరి శ్రీనివాసరావు (జలవనరులు) , ఉపాధ్యక్షులుగా ఎం.ఫణికుమార్ (పశు సంవర్ధక), ఏవీవీయల్ నరసింహారావు (మున్సిపల్), బి.లక్ష్మీపతి (రాష్ట్ర ఆడిట్), పూడి శ్రీనివాస్ (బీసీ వెల్ఫేర్), ఎండీ రెహమాన్ (సహకార), ఉపాధ్యక్షురాలి గా ఎం.లీలారాణి ఎన్నికయ్యారు. అలాగే సెకండరీ హెల్త్ కార్యదర్శిగా నెరుసు వెంకటరామారావు (వైద్య ఆరోగ్య), కార్యనిర్వాహక కార్యదర్శిగా బి.నరేంద్ర బాబు (వైద్య ఆరోగ్య), సంయుక్త కార్యదర్శులుగా ఎం.సాంబశివరావు (పబ్లిక్ హెల్త్), ఎండీ ఖాదర్ బేగ్ (వ్యవసాయ), కె.ఉమామహేశ్వరరావు (వైద్యారోగ్య), కె.కనికరాజు (పంచాయతీరాజ్), ఎంవీఎన్ఎల్ తులసి (వైద్యారోగ్యశాఖ), సంయుక్త కార్యదర్శిగా (మహిళ) ఎన్.ఝాన్సీ లక్ష్మీబాయి (బీసీ వెల్ఫేర్), కోశాధికారిగా వి.శ్రీనివాసరావు (స్టేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కె.శరత్బాబు, ప్రకాశం జిల్లా కార్యదర్శి ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎం.రంజిత్నాయుడు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల సభ్యులు పాల్గొన్నారు. -
టీడీపీ నేత.. రేషన్ బియ్యం మేత
● 210 బస్తాల బియ్యం, 342 కిలోల పంచదార బ్లాక్ మార్కెట్కు? ● రూ.6 లక్షలకుపైగా ప్రజాధనం లూటీ ● 6ఏ కేసుతో సరిపెట్టిన అధికారులు తణుకు అర్బన్ : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందాల్సిన బియ్యాన్ని తణుకులో టీడీపీ మా జీ కౌన్సిలర్ బొక్కేసిన వ్యవహారం ఆలస్యంగా వె లుగు చూసింది. తణుకు పాతవూరు శివాలయం ప్రాంతంలోని 23వ నంబరు చౌకడిపోను తెరవకుండా విసుగు తెప్పించడంతో పాటు తెరిచినా గంటలోపు తలుపులు మూసివేయడం వంటి వ్యవహారంపై పలువురు కార్డుదారులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. అలాగే లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా కొందరితో వేలిముద్రలు వేయించుకుని, కొందరికి ఏ సమాధానం చెప్పకుండా డిపో మూసేసి సరుకును నేరుగా బియ్యం మాఫియాకు విక్రయిస్తున్న వ్యవహారం బట్టబయలైంది. బి య్యం, పంచదార రేషన్ డిపోలోనే ఉన్నట్టు ఆన్లైన్ లో సరుకు చూపిస్తుండటంతో రెవెన్యూ అధికారులకు చిర్రెత్తుకొచ్చింది. సదరు డిపోలో 105.75 క్వింటాళ్ల బియ్యం (సుమారు 210 బస్తాలు), 342 కిలోల పంచదార నిల్వలు తేడా గమనించి గత నెల లో డీలరుపై 6ఏ కేసు నమోదు చేసి మరో డిపో డీలర్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. టీడీపీ వర్గమనే.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత డీలర్ను తొలగించి టీడీపీ మాజీ కౌన్సిలర్ అభ్యర్థన మేరకు ఈ డిపోను అతడి భార్య పేరున కేటాయించారు. రేషన్ షాపు పెత్తనమంతా సదరు మాజీ కౌన్సిలర్ చూడటం, తదితర సమస్యలపై నాలుగు నెలలుగా పలు ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే టీడీపీ నాయకుడు కావడంతో రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేని పరిస్థితి. అయినా మార్పు లేకపోవడంతో చివరకు కేసు నమోదు చేశారు. ఈ డిపో డ్వాక్రా గ్రూపునకు చెందిన వారికి కేటాయించిన డిపోగా తెలుస్తోంది. బ్లాక్ మార్కెట్కు.. చౌక డిపో పరిధిలో 740 రేషన్ కార్డులు ఉండగా 30 శాతం కూడా సరుకులు పంపిణీ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కార్డుదారులతో బయోమెట్రిక్ వేయించకుండానే బియ్యాన్ని బయట మార్కెట్కు తరలించారు. అయితే ప్రజా పంపిణీ వ్యవస్థ లాగిన్లో మాత్రం బియ్యం స్టాకు కనిపించేది. మొ త్తంగా 210 బస్తాల బియ్యానికి సంబంధించి రూ.6 లక్షలకు పైగా ప్రజాధనం లూటీ చేసినట్టు సమాచారం. అలాగే తణుకు మున్సిపాలిటీ పరిధిలో మరో ముగ్గురు డీలర్లు ఇదే తరహాలో డిపోను నడుపుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో ఉన్న డీలర్లను తప్పించి తమ వారికి చౌకడిపోలు కేటాయించగా రానున్న రోజుల్లో రెవెన్యూ అఽధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది. ఈ వ్యవహారంపై తణుకు తహసీల్దార్ దండు అశోక్వర్మను ‘సాక్షి’ వివరణ కోరగా 23వ నంబరు చౌకడిపోపై పలు ఫిర్యాదులు వచ్చాయని, పరిశీలనలో 105.75 క్వింటాళ్ల బియ్యంతోపాటు 342 కిలోల పంచదార షార్టేజీ ఉండటంతో డీలరుపై 6ఏ కేసు నమోదు చేసి, తాత్కాలికంగా మరో డీలరును ఇన్చార్జిగా నియమించినట్టు చెప్పారు. రేషన్ డిపో డీలర్ రెండు నెలలు బియ్యం ఇవ్వకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. షాపు ఎప్పుడు తీస్తాడో, ఎప్పుడు మూసేస్తాడో తెలిసేది కాదు. నా కార్డుకు సంబంధించి నెలకు 35 కిలోలు బియ్యం ఇవ్వాల్సి ఉండగా రెండు నెలలు పెండింగ్ పెట్టాడు. దీంతో గట్టిగా నిలదీస్తే 35 కేజీలు మాత్రమే ఇచ్చాడు. ఇలాంటి డీలర్ను నేను ఎప్పుడూ చూడలేదు. ఈ డిపో పరిధిలోని కార్డుదారులు మరో డిపోకు వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. – కె.శారద, లబ్ధిదారు, తణుకు -
పేకాట నిర్వాహకులకు మూడేళ్ల జైలు
మండవల్లి: సంక్రాంతి పండుగకు ఎవరూ కోడి పందేలు, పేకాట నిర్వహించవద్దని, పేకాట నిర్వాహకులకు 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని ఎస్ఐ సీహెచ్ఎస్ రామచంద్రరావు అన్నారు. శ్రీ నాగేంద్రస్వామి ఆలయ ఆవరణలో కోడి పందేలు, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలపై సోమవారం గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలని పేర్కొన్నారు. నూజివీడు: ఆలిండియా సాఫ్ట్బాల్ ఇంటర్ యూనివర్శిటీ పోటీలకు ట్రిపుల్ ఐటీ బాల బాలికల జట్లను ఎంపిక చేశారు. జట్టులో నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన మేఘన, అమృత, భాగ్యశ్రీ, తేజస్విని, దివ్య, సంధ్యారాణి ఎంపికయ్యారు. బాలుర జట్టుకు గణేష్, రామ్ ప్రసాద్, రాంబాబు, పరమేష్, రాజేష్, లోవరాజు, కోటిరెడ్డి ఎంపికయ్యారు. బాలుర జట్టు వచ్చే నెల 1 నుంచి 5 వరకు మహారాష్ట్రలో నిర్వహించే పోటీలకు హాజరుకానున్నారు. బాలికల జట్టు 6 నుంచి 10 వరకు నిర్వహించే పోటీల్లో పాల్గొననున్నారు. హ్యాండ్బాల్ సౌత్ జోన్ ఇంటర్ యూనివర్శిటీ పోటీల కోసం జ్ఞానేంద్ర, రాజు ఎంపికయ్యారు. భీమవరం: పట్టణంలోని హన్సీ కల్యాణ మండపంలో చీరల ఎబ్జిబిషన్లో చీరలు దొంగతనం చేసిన నలుగురు మహిళలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రఘువీర్ విష్ణు చెప్పారు. సోమవారం టూటౌన్ పోలీసుస్టేషన్లో విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలో ఈ నెల 3న చీరల ఎగ్జిబిషన్ ఏర్పాటుచేయగా 4న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం కొండపల్లికి చెందిన మేడారపు రజనీ, పొన్న చుక్కమ్మ, పొన్నూరు మల్లి, మేడారపు లక్ష్మి ఎగ్జిబిషన్ తిలకించడానికి వచ్చి సుమారు రూ.80 వేలు చీరలను దొంగిలించారు. ఎగ్జిబిషన్ నిర్వాహకురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేయగా నిందితులను గొల్లవానితిప్ప రోడ్డులో సోమవారం అరెస్ట్ చేసి వారి నుంచి చీరలను స్వాధీనం చేసుకున్నారు. పోలవరం రూరల్: ఈ నెల 7న సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు రానున్నారని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. దీనికి సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్తో కలిసి ఆమె సోమవారం పరిశీలించారు. అనంతరం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. భీమవరం: భీమవరంలో బుధవారం రెండు లారీలు బీభత్సం సృష్టించాయి. ఆగి ఉన్న మినీ లారీని మరో లారీ ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భీమవరం బలుసుమూడి ప్రాంతంలోని ఒక మద్యం దుకాణం వద్ద మద్యం దింపేందుకు మినీ లారీ ఆగింది. ఆ సమయంలో వెనకనుంచి వస్తున్న మరో లారీ ఆ లారీని ఢీకొంది. ఆగి ఉన్న మినీలారీ వేగంగా వెళ్లి రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొని, రోడ్డు మార్జిన్లో దిగబడి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. -
స్వర్ణోత్సవ సంబరాలకు ఎస్వీకేపీ సిద్ధం
పెనుగొండ: మెరుగైన విద్యతో పేరెన్నికగన్న ఎస్వీకేపీ విద్యా సంస్థలు స్వర్ణత్సోవ సంబరాలకు ముస్తాబవుతున్నాయి. పెనుగొండలో 1974లో ప్రారంభమైన ఈ విద్యాసంస్థలు 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నారు. దీని కోసం కళాశాలలో దేశ విదేశాల్లో స్థిరపడిన విద్యార్ధులు తరలిరానున్నారు. ఈ కళాశాలను డాక్టర్ కేఎస్ రాజు, 8 మంది సభ్యులతో ప్రారంభించారు. 1974లో కేవలం నాలుగు కోర్సులతో ప్రారంభమై, 1976లో జాతీయ సేవా పథకం, 1978లో క్రీడా విభాగం, 1984లో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, 1987లో బీఎస్సీ కంప్యూటర్స్ ప్రారంభించారు. 1992లోనే ఎంసీఏ కోర్సు స్థాపించి, ఎందరో సాఫ్ట్వేర్ ఇంజినీర్లను తయారుచేసింది. సంబరాలకు 5 వేలకు పైగా పూర్వ విద్యార్థులు హజరవుతున్నారని, దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నామని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ కే రామచంద్రరాజు తెలిపారు. -
అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి
భీమవరం(ప్రకాశం చౌక్): ప్రజా సమస్యల పరిష్కా ర వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. సోమ వారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి పీజీఆర్ఎస్లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ముందుగా అర్జీల ఆన్లైన్ ప్రక్రియ, రెవెన్యూ క్లినిక్ కౌంటర్లలో దరఖాస్తుల నమోదు, పరిష్కార చర్యలను పరిశీలించారు. డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, గ్రామ, వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ ఏఓ ఎన్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● భీమవరం అంబేడ్కర్ చౌక్కు సమీపంలో ఏర్పాటు చేస్తున్న పార్కుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిల్డ్రన్స్ పార్కుగా నామకరణం చేయాలని అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ సభ్యులు వినతిపత్రం అందించారు. ● రైతు సమస్యలపై భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కమిటీ ఆద్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం జేసీకి వినతిపత్రం సమర్పించారు. ● వీరవాసరం మండలంలో కొణితివాడలో కోడి పందేలకు బరులు సిద్ధం చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు సుబ్బరాజు, కో–ఆర్డినేటర్ వై.అరుణ వినతిపత్రం అందించారు. ● కొవ్వాడ అన్నవరానికి చెందిన పినిశెట్టి సత్యనారాయణ తాను క్యాన్సర్తో బాధపడుతున్నానని, పింఛన్ అందించాలని అభ్యర్థించారు. ● వీరవాసరం మండలం రాయకుదురుకి చెందిన మల్లుల సత్యవతి అర్జీ పింఛన్ కోసం అర్జీ అందించారు. ● భీమవరం ఇందిరమ్మ కాలనీకి చెందిన విప్పర్తి కుమారి తనకు టిడ్కో ఇల్లు మంజూరైనా ఇప్పటికీ అందించలేదని చర్యలు తీసుకోవాలని కోరారు. ● పాలకోడేరు మండలం గొరగనమూడిపాలేనికి చెందిన కడలి భూలక్ష్మి గ్రామంలో కోతుల బెడదపై ఫిర్యాదు చేశారు. పోలీసులు దూషించారంటూ.. పాలకోడేరు: భీమవరం 7వ వార్డు నెహ్రూ కాలనీకి చెందిన కట్టా పద్మావతి పాలకోడేరు మండలం శృంగవృక్షంలోని బంటుమిల్లికి చెందిన పాలా లక్ష్మికి రూ.50 వేలు అప్పు ఇచ్చారు. తర్వాత కాలంలో సొమ్ములు వసూలు చేసుకున్నారు. అయితే తాను బలవంతంగా రూ. 50 వేలు లాక్కుపోయానని పాలా లక్ష్మి పాలకోడేరు పోలీసులకు ఫిర్యాదు చేసిందని పద్మావతి అంటున్నారు. దీంతో స్టేషన్లోని హెడ్ కానిస్టేబుల్ భీమరాజు తనను అసభ్య పదజాలంతో దూషించి అవమానించారని పద్మా వతి స్పందనలో ఫిర్యాదు చేశారు. -
బల ప్రదర్శనకు వేదికగా జాతర
ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రజలను భక్తిమార్గంలో నడిపిస్తూ, ఆధ్యాత్మికతను పెంపొందించే దిశగా జరగాల్సిన శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. జాతరలో రాజకీయాల ప్రవేశంతో వేరుకుంపట్లు పెట్టుకుని ఎవరికి వారుగా ఉత్సవాలను నిర్వహించే పరిస్థితికి ఉత్సవాన్ని దిగజార్చారు. గతంలో 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ జాతర మహోత్సవాలను కొన్ని కమిటీల ప్రతినిధులు ఆదాయ వనరుగా పరిగణించి ప్రతి ఏడేళ్ళకు ఒకసారి నిర్వహించేలా సంప్రదాయాన్ని మార్చేశారు. అయినప్పటికీ అమ్మవారి జాతర నగర ప్రజల్లో సెంటిమెంట్గా నిలిచిపోవడంతో కమిటీల నిర్ణయానికి ప్రజలు అంగీకారం తెలిపి ఎప్పుడు అమ్మవారి జాతరకు పిలుపునిచ్చినా ఉత్సవాల విజయవంతానికి తమవంతు సహకారం అందిస్తున్నారు. బల ప్రదర్శనకు వేదికగా గంగానమ్మ జాతర తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు జాతర జరుగుతుందని నగర ప్రజల్లో చర్చ నడుస్తోంది. గతంలో జాతర మహోత్సవాలన్నీ టీడీపీ అధికారంలో ఉండగా జరిగినవే కావడంతో ఈ చర్చకు బలం చేకూరుతోంది. వివిధ ప్రాంతాల్లో నిర్వహించే జాతర మహోత్సవాలకు సంబంధించి కమిటీల్లో అందరూ టీడీపీకి చెందిన నాయకులే ఉండడంతో ఈ వాదన నిజమే అంటున్నారు. ప్రస్తుతం కొన్ని కమిటీలు తమ ప్రాబల్యాన్ని నిలుపుకోవడం కోసం అదే పార్టీకి చెందిన, అదే సామాజికవర్గానికి చెందిన మరికొందరిని కమిటీలకు దూరం చేయడంతో అలా బయటకు వెళ్ళాల్సి వచ్చిన వారు తమ ప్రాంత వాసులతో చర్చించి వేరుకుంపటి పెట్టుకున్నారనే చర్చ జరుగుతోంది. అలా వేరు కుంపటి పెట్టుకున్న వారు తమ బలాన్ని ప్రదర్శించే కార్యక్రమాలు చేపడుతున్నారని భక్తులు అంటున్నారు. సినీ బృందాలు, ప్రజాప్రతినిధుల సందర్శన వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న జాతరకు ఆయా కమిటీల ప్రతినిధులు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తూ తమ బలాన్ని నిరూపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల విజయోత్సవ యాత్రలు, చిత్ర ప్రమోషన్ కోసం పర్యటన చేస్తూ నగరానికి విచ్చేసిన సినీ బృందాలను కొందరు కమిటీల వారు తమ మేడల వద్దకు రప్పిస్తున్నారు. మరి కొందరు రాజకీయ ప్రముఖులను, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలను ఈ మేడల వద్దకు తీసుకొచ్చి అమ్మవార్లను దర్శించుకునేలా ఏర్పాటు చేశారు. మరోప్రాంతంలో రోజూ ప్రత్యేక సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షించడానికి తిప్పలు పడుతున్నారు. బృందాలుగా సారెల సమర్పణ నగరంలోని అమ్మవారి భక్తులు మాత్రం తమ భక్తిప్రపత్తులు చాటుకుంటూనే ఉన్నారు. ఏడేళ్ళ తరువాత వచ్చిన జాతర ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుచుకుంటున్నారు. అమ్మవార్లు వేంచేసిఉన్న మేడల వద్దకు తండోపతండాలుగా భక్తులు వెళ్ళి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. చద్ది నైవేద్యాలు, చలిమిడి, వడపప్పు, పానకం సమర్పిస్తున్నారు. నగరంలోని వివిధ పేటలకు చెందిన భక్తులు, ఒక్కో అపార్ట్మెంట్లో నివశిస్తున్న భక్తులు సామూహికంగా అమ్మవార్లకు సారెలు సమర్పిస్తున్నారు. కమిటీల్లో పోటీ వాతావరణం గతంలో రెండు మూడు ప్రాంతాలకు పరిమితమైన జాతర ప్రస్తుతం ఏడు ప్రాంతాలకు విడిపోయింది. కేవలం పడమర వీధి, తూర్పువీధి, పవర్పేటల్లో మాత్రమే ఇలా 12 ఏళ్ళకు ఒకసారి జరిగే జాతరను నిర్వహించేవారు. ఈ కమిటీల్లో ఇతరులకు స్థానం కల్పించడానికి ఆయా కమిటీల ప్రతినిధులు నిరాకరించడంతో మరి కొన్ని ప్రాంతాల వారు వీరికి పోటీగా జాతర కొలుపులు ప్రారంభించారు. ముఖ్యంగా దక్షిణపు వీధిలో జాతర మహోత్సవం పడమర వీధి కమిటీకి వ్యతిరేకంగా ప్రారంభమైనట్టు అనుకుంటున్నారు. లక్ష్మీవారపు పేట, ఆదివారపు పేట, తంగెళ్ళమూడి ప్రాంతాల్లో కూడా జాతర నిర్వహిస్తున్నారు. భక్తుల్లో గందరగోళం పోటీ వాతావరణంలో జరుగుతున్న జాతర మహోత్సవాలు భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా గంగానమ్మ జాతరలో భాగంగా స్థానిక పడమర వీధి శ్రీ గంగానమ్మ అమ్మవారు నగరంలోని ఎక్కువ ప్రాంతాల్లో సంచరించే వారు. ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా పడమర వీధి మేడల వద్దకే వెళ్ళి మొక్కులు చెల్లించుకునే వారు. ప్రస్తుతం మరికొన్ని ప్రాంతాల్లో కూడా జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్న కారణంగా తాము గతంలో కొలిచిన అమ్మవారి వద్దకు వెళ్ళాలా, లేకుంటే కొత్తగా తమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మేడలవద్దకు వెళ్ళాలా అనేది తేల్చుకోలేకపోతున్నారు. అటూఇటూ తేల్చుకోలేని వారు మాత్రం ఎందుకై నా మంచిదని రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మేడలను సందర్శించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఏలూరులో సినీ బృందాలు, ప్రజాప్రతినిధుల సందర్శనలు బృందాలుగా అమ్మవార్లకు సారెల సమర్పణ కమిటీల్లో పోటీ వాతావరణం -
108 ఉద్యోగుల సమ్మె సైరన్
భీమవరం(ప్రకాశం చౌక్): కుయ్.. కుయ్.. అంటూ ఆపదలో ఉన్న వారి చెంతకు నిమిషాల్లో చేరి ప్రాణాలు రక్షించే 108 అంబులెన్స్ సేవలకు అంతరాయం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ సమస్యల పరిష్కారం కోసం 108 వాహన ఉద్యోగులు నెలలు తరబడి ఎదురుచూస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతనెల 25 వరకు ఎదురుచూసిన ఉద్యోగులు పోరాటబాట పట్టారు. ఆరోగ్యశ్రీ లేబర్ కమిషనర్కు గతనెల 26న సమ్మె నోటీసు ఇచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని నోటీసులో పేర్కొన్నారు. అలాగే సమస్యలతో కూడిన 18 డిమాండ్లను పొందుపర్చారు. అయితే సమస్యల పరిష్కారానికి చ ర్చలు జరుగుతున్నా సఫలం కాలేదు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 108 వాహన సిబ్బంది మొత్తం 203 మంది పనిచేస్తున్నారు. డిమాండ్లు ● ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ప్రకటించిన రూ.4 వేలల్లో రూ.2 వేలు మాత్రమే పెంచి మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ ఆర్ ఎఫ్పీ ప్రకారం ఈపీఎఫ్ఓ యాజయాన్య వాటాను యాజమాన్యమే చెల్లించాలని చెప్పినా ఇప్పటికీ పట్టించుకోలేదు. ● గత సర్వీసు ప్రొవైడర్ ఇప్పటికీ పుల్, ఫైనల్ సెటిల్మెంట్ చేయకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలి. ● పోలీస్ ఎఫ్ఐఆర్ ఉందని, ఫీల్డ్ విజిట్లో పలురకాల పనిష్మెంట్ల పేరుతో భవ్య సంస్థ ఉద్యోగుల విధులను నిలుపుదల చేయడం లేదా టెర్మినేషన్ చేయడం చేస్తోంది. ఇలా టెర్మినేట్ చేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. ● ఉద్యోగులను తొలగించకుండా మెరుగైన ట్రైనింగ్ ఇవ్వాలి. ● భవ్య సంస్థ వచ్చి 7 నెలలు పూర్తయినా ఏ ఉద్యోగికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వకపోవడం, జీతాలపై స్పష్టత లేకపోవడంపై తీవ్ర ఆందోళన నెలకొంది. ● 5 నుంచి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి వెంటనే ఆటోమెటిక్ శ్లాబ్ అప్గ్రేడ్ చేయాలి. ● భవ్య సంస్థ పనిష్మెంట్ కాలాన్ని చూపుతూ జీతాన్ని తగ్గించడం మానాలి. శ్లాబ్కు అనుగుణంగా వేతనాలు చెల్లించాలి. ● గత సర్వీస్ ప్రొవైడర్ రిలీవింగ్ బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదు. గతంలో మాదిరిగా షిఫ్ట్కు రూ.200 చెల్లించాలి. ● కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మాదిరిగా ఫెస్టివల్ హాలిడేస్ ప్రయోజనాలు అందించాలి. ● సిబ్బంది నియామకం చేపట్టాలి. ● వాహనాల మరమ్మతులకు జిల్లాకు ఒక గ్యారేజీ ఉండటంతో సేవలకు ఆటంకం కలుగుతోంది. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలి. ● వాహనం మైనర్ రిపేర్కు గురైతే ఆ ఖర్చులను సిబ్బంది భరించాలని అధికారులు చెబుతున్నారు. సంస్థ ఆ ఖర్చులు భరించేలా చర్యలు తీసుకోవాలి. ● రోజుకు 12 గంటల పని ఒత్తిడితో కూడకుందని, 8 గంటల పనివిధానం అమలు చేయాలి. ● వాహనాలు నిలుపు ప్రదేశంలో షెల్టర్ లేదని, వాహనాల క్లీనింగ్లకు, ఉద్యోగులకు వాష్రూంలు ఏర్పాటు చేయాలి. ● బ్రేక్ డౌన్ అయిన వాహన సిబ్బందికి అటెండెన్స్ ఇవ్వాలి. ● సంస్థ సీపీఆర్ ఫోన్లు ఇవ్వడం వల్ల మొబైల్ డేటా లేకపోవడంతో అవాంతరాలు ఏర్పడుతున్నా యి. ప్రతి వాహనానికీ డేటాతో కూడిన ఆండ్రాయిడ్ ఫోన్లు అందించాలి. ● ఐఎఫ్టీ కేసుల విషయంలో సరైన గైడెన్స్ రూపొందించి మెడికల్ ఆఫీసర్లకు, 108 సర్వీస్ ప్రొవైడర్కు తెలియజేయాలి. ఉమ్మడి జిల్లాలో 108 ఉద్యోగులు జిల్లా మేనేజర్ 1 సూపర్వైజర్లు 2 పైలెట్లు 90 ఈఎంటీలు 110 కుయ్.. కుయ్.. కష్టాలేనోయ్! సమస్యల పరిష్కారానికి నోటీసు 18 డిమాండ్ల సాధనే లక్ష్యం ప్రభుత్వం స్పందించకుంటే 12 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి.. ఉమ్మడి జిల్లాలో నిలిచిపోనున్న సేవలు -
కొత్త ఉపాధి చట్టాన్ని రద్దు చేయాలి
పోలవరం రూరల్: కొత్త ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని ఏజెన్సీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. సోమవారం పోలవరం మండలం వింజరం సచివాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఏజెన్సీ గిరిజన సంఘం నాయకులు మాట్లాడారు. 10శాతం నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా ఉంటే కొత్త చట్టం ప్రకారం 40 శాతం నిధులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రాల హక్కులు కాలరాస్తూ ఉపాధి హామీ పనులు ఏ ప్రాంతంలో, ఎలా కల్పించాలో కేంద్రం నిర్ణయిస్తుందనడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో ఏజెన్సీ గిరిజన సంఘం నాయకులు కొమరం రామారావు, మడి వెంకటగిరి, పాములేటి పెంటారెడ్డి, శబల శివకుమార్, అరగంటి జోగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంఎన్ఆర్ఈజీఎస్ను కొనసాగించాలి జంగారెడ్డిగూడెం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు జీవరత్నం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మండలంలోని పంగిడిగూడెం గ్రామంలో గ్రామ సచివాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ చట్టంపై గ్రామసభ నిర్వహించారు. సభ అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యదర్శి జె.సతీష్ కి అందించారు. సామాన్యల జీవన హక్కులపై ప్రభావం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధి హామీ చట్టంలో తీసుకువచ్చిన మార్పులు గ్రామీణ పేదలు, కూలీలు, నిరుద్యోగ యువత జీవన హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని డీవైఎఫ్ఐ ఏలూరు జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్ ఖండించారు. ఈ మార్పులను వెంటనే ఉపసంహరించుకొని, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మైసన్నగూడెం సచివాలయం వద్ద కార్యక్రమం నిర్వహించి వినతి పత్రం అందజేశారు. -
కనులపండువగా శ్రీవారికి తిరువీధి సేవ
ద్వారకాతిరుమల: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీవారు ఉభయ దేవేరులతో కలసి, తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. ఈ వేడుక ఆధ్యంతం భక్తులకు కనువిందు చేసింది. ముందుగా ఆలయంలో అర్చకులు స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, విశేష పుష్పాలంకారాలు చేశారు. అనంతరం పూజలు జరిపి హారతులిచ్చారు. ఆ తరువాత స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, అశ్వ, గజ సేవల నడుమ శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. అనంతరం స్థానిక ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు జరిపి, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం: బంగారం తీసుకుని వస్తువులు తయారు చేస్తానని, పాత బంగారం రిపేర్ చేయిస్తానని చెప్పి ఏడుగురిని మోసం చేసిన తండ్రీకొడుకులను అరెస్టు చేసినట్లు ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం స్థానిక మున్సిబు గారి వీధిలో స్వర్ణకారులైన తండ్రీకొడుకులు పడగ రాము, విజయ్ప్రకాష్ బంగారు నగలు తీసుకుని మోసం చేసినట్లు తెలిపారు. నూకారపు చంద్ర అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. వారిని జంగారెడ్డిగూడెం కోర్టులో హాజరు పరచనున్నట్లు చెప్పారు. ద్వారకాతిరుమల: మండలంలోని గుణ్ణంపల్లిలో సోమవారం ఓ భారీ కొండచిలువ స్థానికుల చేతిలో హతమైంది. పోలవరం కుడి కాలువ పక్కనున్న శ్రీనివాస రెడ్డి, తన తోటలోకి వెళుతుండగా 13 అడుగుల ఈ కొండ చిలువ ఆయన కంటపడింది. దాంతో ఒక్కసారిగా ఆయన హడలిపోయారు. వెంటనే చుట్టుపక్కల ఉన్న వారిని పిలువగా, వారొచ్చి ఈ కొండ చిలువను హత మార్చారు. ఇంత పెద్ద కొండ చిలువను చూడడం ఇదే మొదటిసారని స్థానికులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో ఇంకా కొండ చిలువలు ఉన్నాయని, పశువులపై దాడి చేస్తున్నాయని రైతులు అంటున్నారు. అంతా అప్రమత్తంగా ఉండాలని గోపాలపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కో–కన్వీనర్ వసంతాటి శ్రీనివాస్ సూచించారు. -
త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు
భీమవరం: భీమవరం త్యాగరాజ భవనంలో త్యాగరాజ స్వామి 107వ ఆరాధనోత్సవంలో భాగంగా సోమవారం చైన్నెకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు పతంగి బ్రదర్స్ గాత్ర కచేరి ఆకట్టుకుంది. ముందుగా త్యాగరాజ ఆరాధనోత్సవాల అధ్యక్షుడు ఉద్దరాజు కాశీ విశ్వనాథ్ రాజు, గౌరవాధ్యక్షుడు గంధం విశ్వేశ్వరరావు, ఉపాధ్యక్షుడు గన్నబత్తుల శ్రీనివాసరావు, ఎన్ఆర్ కే రాజులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ధాత్రే ఎస్ పతంగి, ధ్రువ ఎస్ పతంగి ఆలపించిన త్యాగరాజ కృతులు, అన్నమయ్య పదాలు అలరించాయి. కారుమూరి ఆదిత్య, చెరుకువాడ వెంకట్రామయ్య, కారుమూరి నరసింహమూర్తి, వబిలిశెట్టి కనకరాజు, వబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదుదారులపై అలసత్వం వద్దు
భీమవరం: పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై అలసత్వం ప్రదర్శించవద్దని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశించారు. సోమవారం భీమవరం వన్టౌన్ స్టేషన్ ఆవచణలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సంబంధిత స్టేషన్ అధికారులతో మాట్లాడి నిర్ణీత గడువులోపు అర్జీలను పరిష్కరించాలన్నారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, డీఎస్పీ రఘువీర్ వి ష్ణు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, మహిళా స్టేషన్ ఇన్స్పెక్టర్ అహ్మదున్నీషా పాల్గొన్నారు. భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలోని కాలువల కాలుష్యంపై అధికారులు తక్షణమే సమగ్ర సర్వే నిర్వహించి, తాగు, సాగునీరు కలుషితం కాకుండా నివారణ చర్యలు చేపట్టాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రజల సమస్యల పరిష్కార పోరాటంలో భాగంగా జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో భీమవరం కలెక్టరేట్ వద్ద జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ వీర్రాజు నేతృత్వంలోని బృందం జేసీ రాహుల్కుమార్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. వీరవాసరం: రాయకుదురు సచివాలయం వద్ద సోమవారం జరిగిన గ్రామ రెవెన్యూ సదస్సు లో రైతులు పలు సమస్యలపై తహసీల్దార్ ఏవీ రామాంజనేయులను నిలదీశారు. రీ సర్వేలో సమస్యలు తలెత్తాయని, పాత పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న నికర భూముల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయని, 20 నుంచి 30 మంది రైతులకు ఒకే ఎల్పీఎంను కేటాయించడంతో ఇబ్బంది పడుతున్నట్టు రైతులు ఆకుల రామారావు లక్ష్మీపతిరాజు, శ్రీనివాస రాములు ప్ర శ్నించారు. దీనిపై తహసీల్దార్ మాట్లాడుతూ రీసర్వేలో జరిగిన తప్పులను సరిదిద్దడానికి చర్యలు తీసుకుంటామన్నారు. సర్పంచ్ గడ్డం భారతి, వీఆర్వో మాండ్రు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. పెనుగొండ: పెనుగొండ గ్రామ పేరు మార్పుపై గ్రామ సభలో పలువురు పంచాయతీ సభ్యులతో పాటు కొందరు గ్రామస్తులు అధికారులను నిలదీశారు. సోమవారం పెనుగొండ పంచాయతీ ఆవరణలో జాతీయ ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ గ్రామం–స్వచ్ఛ సంక్రాంతిపై నిర్వహించిన గ్రామసభ కాస్తా పెనుగొండను వాసవీ పెనుగొండగా మార్చడంపై అభ్యంతర సభగా మారిపోయింది. ప్రజాభిప్రాయం, పంచాయతీ తీర్మానం లేకుండానే వాసవీ పెనుగొండగా మార్పు ఎలా చేస్తారంటూ పంచాయతీ సభ్యులు ప్రశ్నించారు. కేవలం రెవెన్యూ గ్రామానికే పేరు మార్పు చేశామంటూ అధికారులు సమాధానం చెబుతున్నారని ఏది నిజమంటూ ప్రశ్నించడంతో స్థానిక అధికారులు తమ వద్ద సరైన సమాధానం లేదంటూ జవాబివ్వడం కొసమెరుపు. సమావేశంలో సర్పంచ్ నక్కా శ్యామలాసోనీ శాస్త్రి, ఎంపీడీఓ టి.సూర్యనారాయణ మూర్తి, డెప్యూటీ ఎంపీడీఉ ఓ.సూర్యప్రకాశరావు పాల్గొన్నారు. కై కలూరు: రైలు పట్టాలు మరమ్మతుల నిమిత్తం మండవల్లి–కై కలూరు రైలు మార్గంలో లెవిల్ క్రాసింగ్ నంబరు–81 (కోరుకొల్లు గేట్)ను వారం రోజులపాటు మూసివేస్తున్నట్టు కై క లూరు రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎండీ అబ్దుల్ రహ్మాన్ సోమవారం తెలిపారు. ఈనెల 7న ఉదయం 7 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 7 గంటలకు వరకు గేటు మూసివేస్తామని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని కోరారు. -
మీర్జాపురంలో ‘బరి’తెగింపు
నూజివీడు: నూజివీడు పేరు చెబితే.. మామిడి తోట లు, బాస్కెట్బాల్, చెడుగుడు పోటీలు గుర్తుకు వస్తా యి. అయితే ప్రస్తుతం పేకాట శిబిరాలు, గ్రావెల్ మా ఫియా గుర్తుకు వస్తుంది. దీనికితోడు సంక్రాంతిని పురస్కరించుకుని కోడి పందేల నిర్వహణకు అడ్డాగా మారనుంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నూజివీడు ప్రాంతంలో జూదాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పండగ సాంప్రదాయం ముసుగులో కోడి పందేలు భారీ స్థాయిలో నిర్వహించేందుకు నూజివీడు మండలం మీర్జాపురంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారం : కోడి పందేలకు బాపులపాడు మండలం అంపాపురం, ఏలూరు స మీపంలోని కొప్పాక సరసన మీర్జాపురం చేరనుంది. ఇక్కడ భారీ బరి ఏర్పాటు చేయడంతో పాటు సోష ల్ మీడియాలో విస్తృతంగా వీడియోలు పెట్టి ప్రచా రం నిర్వహిస్తున్నారు. ప్రధాన బరిని మూడు ఎకరా ల్లో సిద్ధం చేశారు. కోడి పందెం వేసేందుకు ఒక ప్లాట్ఫాం, పందెలను చూసేందుకు మూడు వైపులా గ్యాల రీ, మరోవైపు వీఐపీలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మీర్జాపురం గ్రామ పరిధిలో నేషనల్ హైవే–216 హెచ్ నూజివీడు–హనుమాన్ జంక్షన్ ప్రధాన రహదారికి సమీపంలో మీర్జాపురం–బిళ్లనపల్లి రోడ్డులో ఈ భారీ బరి సిద్ధమవుతోంది. సంక్రాంతి సంబరాల పేరుతో ఇక్కడ ముసుగు పందేలతో పా టు రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.9 లక్షల చొప్పున రాత్రీపగలూ తేడా లేకుండా పందేలు వేయనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జూదగాళ్లు, కోడిపందేలు చూసేందుకు వచ్చే వారు నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఏలూరులోని హోటళ్లలో రూమ్లను బుక్ చేసుకున్నారు. రూ.కోట్లలో పందేలు మీర్జాపురంలో కోడి పందేలు కోట్లలో జరగనున్నాయి. మొదటి పందెం రూ.కోటి అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. బరి పందేంతో పాటు చూడటానికి వచ్చే వారు కూడా పెద్ద ఎత్తున పందేలు కాస్తారు. అలాగే పేకాట, గుండాట, ఇతర జూద క్రీడలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి జూదాలతో పేదల జేబులు గుల్లకావడం ఖాయంగా కనిపిస్తోంది. వీటిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతారో లేదో చూడాలి మరి. కోడి పందేల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు -
ఇళ్లు.. మంజూరు నిల్లు
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026భీమవరం (ప్రకాశంచౌక్): సొంతింటి కల సాకారం కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఒక్క కొత్త ఇంటిని కూడా మంజూరు చేయకపోవడంతో ఊసురుమంటున్నారు. కొత్త ఏడాదిలో అయినా ఇళ్ల మంజూరు ప్రకటన వస్తుందని ఆశగా ఎదురుచూసిన లబ్ధిదారులకు నిరాశ ఎదురైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు చొప్పున అర్హులైన పేదలకు అందించారు. వీరిలో 50 శాతం మంది ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకున్నారు. మిగిలిన లబ్ధిదారులతో పాటు సొంత స్థలం కలిగిన వారు ఇళ్ల మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. వీరిని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బిల్లులపై బెంగ గ్రామీణ ప్రాంతాల్లో స్థలం ఉండి ఇళ్లు మంజూరు లేకపోవడంతో అద్దె ఇంటిలో ఉంటున్న వారు అప్పు చేసి నిర్మాణాలు చేపడితే తర్వాత ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందా, లేదా అనే మీమాంశలో ఉన్నారు. తీరా అప్పులు చేసి నిర్మాణాలు చేపట్టినా ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. చేసిది లేక అద్దె ఇళ్లలో కాలం గడుపుతున్నారు. అర్జీల వెల్లువ ప్రభుత్వం ఇచ్చిన స్థలం కలిగిన వారు, సొంత స్థలం ఉన్న వారు కొత్త ఇళ్ల మంజూరు కోసం ప్రతి సోమవారం భీమవరం కలెక్టరేట్లో జరిగే పీజీఆర్ఎస్కు వెళ్లి అర్జీలు అందిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవడంతో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుని ఆన్లైన్ చేసే చర్యలు కూడా అధికారులు చేపట్టడం లేదు. జనవరి నుంచి వేసవికాలం పూర్తయ్యే వరకూ ఇళ్ల నిర్మాణాలకు అనుకూలం. ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తే నిర్మాణాలు ప్రారంభించే యోచనలో పలువురు ఉన్నారు. వర్షాకాలంలో ఇళ్లు మంజూరు చేస్తే ఇసుక కొరత, వర్షాలతో నిర్మాణాలు సాగవని అంటున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణానికి పెద్దపీట వేశారు. జిల్లాలో లేఅవుట్లు, సొంత స్థలాలు కలిగిన వారికి సుమారు 70 వేల ఇళ్లు మంజారు చేయగా 36 వేల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో అధిక శాతం పట్టణాలకు చెందిన లేఅవుట్లలో ఉన్నాయి. గత ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండేళ్లలో రికార్డు స్థాయిలో ఇళ్లు మంజూరు చేసింది. జిల్లాలో 15,197 ఇళ్లు మంజూరు చేయగా.. మండలాల వారీగా ఆచంటలో 959, పెనుగొండలో 843, పెనుమంట్రలో 1,013, పోడూరులో 543, భీమవరం రూరల్లో 646, భీమవరం అర్బన్లో 182, వీరవాసరంలో 598, మొగల్తూరులో 586, నరసాపురంలో 567, నరసాపురం అర్బన్లో 212, పాలకొల్లులో 149, యలమంచిలిలో 1,044, పెంటపాడులో 895, తాడేపల్లిగూడెంలో 1,030, తాడేపల్లిగూడెం అర్బన్లో 464, అత్తిలిలో 711, ఇరగవరంలో 838, తణుకులో 723, తణుకు అర్బన్లో 277, ఆకివీడులో 302, ఆకివీడు అర్బన్లో 114, కాళ్లలో 397, పాలకోడేరులో 637, ఉండిలో 876 ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం 18 నెలల కాలంలో జిల్లాలో కేవలం 595 ఇళ్లు మాత్రమే మంజూరు చేసింది. అది కూడా కేవలం పట్టణాలకు మాత్రమే. వీటిలో భీమవరంలో 85, తణుకులో 111, పాలకొల్లులో 60, తాడేపల్లిగూడెంలో 149, ఆకివీడులో 115, నరసాపురంలో 75 ఉన్నాయి. జిల్లాలో 20 మండలాల్లో 409 గ్రామాలు ఉండగా ఇక్క ఇంటినీ మంజూరు చేయలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన కొన్ని ఇళ్లు నిర్మాణ దశలో ఉండగా తమ ప్రభుత్వం మంజూరు చేసినట్టు ప్రచారం చేసుకుంటూ గృహప్రవేశాలు మాత్రం చేయించింది. ఇటీవల జిల్లాలో పూర్తి చేసిన 6 వేల ఇళ్లు కూడా గత ప్రభుత్వంలో మంజూరు చేసినవి కావడం గమనార్హం. పాలకోడేరు మండలం కొండేపూడికి చెందిన లక్ష్మికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సెంటున్నర స్థలం వచ్చింది. అయితే పలు కారణాలతో అప్పట్లో నిర్మాణం చేపట్టలేదు. ఏడాది కాలంగా ఇంటి మంజూరు కోసం ఎదురుచూస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గ్రామాల్లో కొత్త ఇళ్లు మంజూరు చేయలేదు. దీంతో లక్ష్మి సొంతింటి కల సాకారం కాలేదు. ఇలా జిల్లాలో లక్ష్మి లాంటి ఎందరో మహిళలు ఇళ్ల మంజూరు కోసం వేచి చూస్తున్నారు. గృహయోగం ఎప్పుడో ? గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు మంజూరు చేయని చంద్రబాబు సర్కారు ఏడాదిన్నరగా లబ్ధిదారుల ఎదురుచూపులు జిల్లాలో పట్టణ ప్రాంతాలకే కేవలం 595 గృహాల మంజూరు పేదల సొంతింటి కల సాకారంలో నిర్లక్ష్యం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 36 వేల ఇళ్లు పూర్తి -
అవును.. ఇది పంట కాలువే!
ఉండి: నిండా గుర్రపుడెక్క, తూడుతో నిండి అర్తమూరు వెళ్లే పంట కాలువ అ ధ్వానంగా మారింది. ఒక వైపు గట్లు లేకపోవడంతో పల్లపు ప్రాంతాలకు నీరు వెళ్లిపోతోంది. దీంతో రైతులు సాగునీరు అందక అల్లాడుతున్నారు. ఎగువ ప్రాంతాలకు నీరు కావాలంటే రైతులు ఇంజిన్ల సాయంతో తోడుకోవాల్సిన పరిస్థితి. ఒక వైపు గట్టు లేకపోవడం, మరో వైపు తూడు, చెత్తతో నిండిపోవడంతో పాటు పూర్తిస్థాయిలో పూడిక తీసిన దాఖలాలు లేవు. దీంతోపాటు నీటి ప్రవాహం మందగించి పసర్లతో నిండిపోవడంతో అరకొర నీరు కూడా సాగుకు పనికిరావడం లేదని రైతులు అంటున్నారు. ఆక్వా చెరువుల మధ్య నుంచి ప్రవహించే పంట కాలువ కావడంతో నీటి కాలుష్యం పెద్ద సమస్యగా మారింది. రాత్రిళ్లు ఆక్వా వ్యర్థాలను ఈ కాలువలోకి వదులుతున్నారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కాలువ బాగుచేయించాలని కోరుతున్నారు. -
రియల్ ఎస్టేట్ నేలచూపులు
● గూడెంలో చతికలపడ్డ వ్యాపారం ● స్థలాలు, భవనాలను కొనే నాథుడే కరువు తాడేపల్లిగూడెం: ఏడాదిన్నరగా ప్రభుత్వ నిబంధనలు, అన్నీ ఉన్నా ఎవరినీ సంతృప్తిపర్చలేని సందిగ్ధ స్థితిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తాడేపల్లిగూడెం అడ్డాగా ఉంది. వాణిజ్య కేంద్రం కావడం, జాతీయ విద్యాసంస్థ, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వంటివి ఉండటంతో విస్తరించే అవకాశాలు నియోజకవర్గం నా లుగు వైపులా ఉన్న కారణంగా రియల్ ఎస్టేట్ వ్యా పారులు, బ్రోకర్లు వందల సంఖ్యలో ఇక్కడ తయారయ్యారు. అయితే ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. అన్నిరకాల అనుమతులతో స్థలాలను పూడ్చి విక్రయిద్దామంటే కొనే వారు కరువయ్యారు. ఇసుక ధరలు కలవరపెడుతున్నాయి. భవన నిర్మాణ కార్మికులు రోజు వారీ వేతనాలకు ఆసక్తి చూపడం లేదు. అడుగుల వంతున నిర్మాణాలకు మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో భవన నిర్మాణాల కోసం యజమానులు స్థలాలు కొనడం లేదు. బోణీ కావడం లేదు : తాడేపల్లిగూడెం పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నల్లజర్ల వైపు స్థలాలను ఎక్కువగా పూడుస్తున్నారు. డీ మార్టు దగ్గర నుంచి మరో వైపు పాత మిర్చిడాబా వరకు వ్యవసాయ క్షేత్రాలను, వాణిజ్య భూములుగా పూడ్చి లేఅవుట్లుగా మారుస్తున్నారు. అయితే వీటిలో కొన్ని స్థలాలకు అనుమతులు కూడా లేవు. అధికారం అండతో పొలాలను పూడ్చుకుంటూ వెళుతున్నారు. ఏపీ నిట్ రోడ్లలో సకల సదుపాయాలతో ఇటీవల పెద్ద వెంచర్లు వెలిశాయి. రహదారులు, విద్యుత్లైన్లు, మంచినీటి పైపులైన్లు వంటివి ఏర్పాటుచేశారు. ఇక్కడ గజం ధర రూ.17,500గా నిర్ణయించారు. అయినా బోణీ కావడం లేదు. మార్కెట్లో నగదు లావాదేవీలు బాగా తగ్గిపోయాయి. ఎవరి చేతిలోనూ సొమ్ములు ఆడటం లేదు. గతంలో సంక్షేమ పథకాల రూపంలో సొమ్ములు జమయ్యేవి. నెలవారీ ఖర్చులకు ఈ సొమ్ములను వినియోగించుకున్నా.. అదనపు ఆదాయాలను స్థలాలు, భవనాలు వంటివి కొనుగోలు చేయడానికి వాడేవారు. అయితే కూటమి ప్రభుత్వ పాలనలో పరిస్థితులు తారుమారు కావడంతో ‘రియల్’ వ్యాపారం పతనమైంది. -
ముద్రా రుణమంటూ సైబర్ మోసం
మిర్చికి కొత్త క్రేజ్ వేలేరుపాడు మండలం నడిమిగొమ్ము గ్రామంలో ఓ యువ రైతు సాగు చేసిన రంగురంగుల మిర్చి ఆకట్టుకుంటోంది. మంచి దిగుబడి వచ్చింది. 8లో uరూ.2.50 లక్షలకు టోకరా తణుకు అర్బన్: తణుకులో ముద్రా రుణం మంజూరైందని వచ్చిన ఫోన్కాల్కు ఆశపడి ఓ మహిళ రూ.2.50 లక్షలను సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తణుకు పాత పోలీస్స్టేషన్ వీధిలో సిద్ధార్థ కర్రీ పాయింట్ (పంతులు కర్రీ పాయింట్) ద్వారా ఉపాధి పొందుతున్న మహిళ సూరికుర్చి లక్ష్మికి కొంతకాలం క్రితం వచ్చిన ఫోన్ కాల్లో మీకు రూ.5 లక్షలు ముద్ర లోన్ మంజూరైనట్లు సైబర్ నేరగాడు నమ్మించాడు. తాను హైదరాబాద్ బేగంపేటలోని ఆఫీసులో ఉంటానని తన పేరు అరు ణ్గా పరిచయం చేసుకున్నాడు. రుణం కావాలంటే ముందుగా ఫీజు, ఇతర రుసుముల కింద రూ.50 వేలు చెల్లించాలని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన లక్ష్మి పలు దఫాలుగా రూ.2.50 లక్షలు ఆన్లైన్ పేమెంట్ యాప్ల రూపంలో చెల్లించింది. త్వరలో రూ.7.50 లక్షలు ఇస్తామని చెప్పి చివరగా మరో రూ.50 వేలు చెల్లించాలనడంతో ఆమె నిరాకరించింది. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా సైబర్ మోసగాడు లిఫ్ట్ చేయకపోవడంతో బాధితురాలు హైదరాబాద్ వెళ్లినా అక్కడ ఎవరూ సమాధానం చెప్పలేదు. దీంతో తాను మోసపోయినట్టు గ్రహించి ఆదివారం తణుకులో పోలీసులను ఆశ్రయించింది. తాను 20 ఏళ్లుగా కర్రీ పాయింట్ నిర్వహిస్తున్నానని ఎప్పుడూ ఇలా మోసపోలేదని లక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. -
బకాయిలు విడుదల చేయాలి
చింతలపూడి: ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల మూడు నెలల జీతాలు, 12 నెలల పీఎఫ్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు తొర్లపాటి బాబు డిమాండ్ చేశారు. బకాయిల విడుదల కోరుతూ ఐదు రోజులుగా కార్మికులు నిరసన తెలియజేస్తున్నా వెంటనే స్పందించకుంటే డీసీహెచ్ఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆదివారం స్థానిక ప్రభుత్వాస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. పాత కాంట్రాక్టు ముగిసి కొత్త కాంట్రాక్టర్కు బాధ్యతలు అప్పగించే సమయంలో కా ర్మికులకు రావాల్సిన జీతాలను చెల్లించకపోగా, ఆందోళన చేస్తున్నా వైద్యారోగ్య శాఖ అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. తక్షణమే వీరి జీతాల విషయంలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే మంగళవారం నుంచి జిల్లా అధికారుల కార్యాలయం ఎదుట ఆందోళనలకు దిగుతామన్నారు. వీరవాసరం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని సోమవారం భీ మవరం కలెక్టరేట్తో పాటు డివిజనల్, మండల, మున్సిపల్ కార్యాలయాల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. అలాగే మీ కోసం కాల్ సెంటర్ 1100 ద్వారా సమస్యలను తెలియజేయవచ్చన్నారు. -
తీరని చింత
బుట్టాయగూడెం: ఏజెన్సీ, మెట్ట ప్రాంత వరప్రదాయినిగా ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పథకం పలనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పథకం ప్రారంభమై 17 ఏళ్లు కావొస్తున్నా పలు దశల్లోనే పనులు ఉన్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కి 19 నెలలు కావస్తున్నా కనీసం పనులను కన్నెత్తి చూడటం లేదని రైతులు అంటున్నారు. 2009లో శ్రీకారం : 2009లో అప్పటి సీఎం వైఎస్సార్ పథకానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో సుమారు రూ.1,708 కోట్ల అంచనాలతో చేపట్టారు. మొదట్లో పనులు వేగంగా జరిగినా వైఎస్సార్ అకాల మరణంలో మందగించాయి. 2017లో టీడీపీ హయాంలో రూ.4,909 కోట్లతో ఫేజ్–2 పనులు చేపట్టారు. అయితే అవి కూడా కొంత మేర జరిగి నిలిచిపోయాయి. 2019లో వైఎస్సార్సీపీ పాలనలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బకాయిల చెల్లింపు, పనులను వేగవంతం చేశారు. అయితే కోవిడ్ తర్వాత పనులు ముందుకు సాగలేదు. అలాగే భూసేకరణ సమస్యలతో కూడా పనులు ముందుకు సాగని పరిస్థితి. జగన్ హయాంలో నాబార్డు నుంచి పథకానికి రూ.1,930 కోట్లు మంజూరు చేశారు. 33 మండలాలలకు ప్రయోజనం.. పథకం పూర్తయితే ఉమ్మడి పశ్చిమగోదావరితోపాటు కృష్ణా జిల్లా పరిధిలో సుమారు 33 మండలాలు, 410 గ్రామాలకు సాగు, తాగునీరు అందుతుంది. ఉమ్మడి పశ్చిమలో 15 మండలాలు, కృష్ణా జిల్లాలో 18 మండలాలకు ప్రయోజనం చేకూరుతుంది. జిల్లాలో 2 లక్షల ఎకరాలు, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలోని 2.80 లక్షల ఎకరాలకు మొత్తం 4.80 లక్షల ఎకరాలకు నీరందుతుంది. గోదావరి నుంచి 6,870 క్యూసెక్కుల నీరు చొప్పున 90 రోజులపాటు 53.50 టీఎంసీల నీటిని ఎత్తిపోయొచ్చని అధికారులు చెబుతున్నారు. జల్లేరు.. అదే తీరు : బుట్టాయగూడెం–జీలుగుమిల్లి మండలాల మధ్య సుమారు రూ.470 కోట్ల వ్యయంతో జల్లేరు రిజర్వాయర్ పనులను చేపట్టారు. ఇక్కడ 14 టీఎంసీల నీటిని నిల్వ చేస్తారు. ఇక్కడ నుంచి సాగర్ ఎడమ కాల్వ కింద ఉండే 2.80 లక్షల ఎకరాలకు నీటిని అందిస్తారు. అయితే ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వయోడక్ నిర్మాణం ప్రాంతం పిచ్చిమొక్కలతో కనిపిస్తుంది. అలాగే కాలువ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయి ఉన్నాయి. చింతలపూడి ఎత్తిపోతలు, జల్లేరు రిజర్వాయర్ పనుల పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. నిలిచిన చింతలపూడి ఎత్తిపోతల కాలువ పనులు కన్నెత్తి చూడని చంద్రబాబు ప్రభుత్వం గత ప్రభుత్వంలో రూ.1,931 కోట్ల మంజూరు జల్లేరు రిజర్వాయర్ పనులలోనూ అలసత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకం పనుల పూర్తికి ప్రభుత్వం కృషి చేయాలి. ఎన్నికలకు ముందు పలుమార్లు హామీలు ఇచ్చిన చంద్రబాబు, పవన్కల్యాణ్లు అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటినా ఎందుకు పట్టించుకోవడంలేదు. ఇప్పటికై నా దీనిపై దృష్టి పెట్టాలి. – తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, పోలవరం చింతలపూడి పథకం పూర్తయితే మాకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇటు సాగు, తాగునీరు పుష్కలంగా లభిస్తాయి. భూగర్భజలాలు పెరగడం వల్ల పంటలకు పుష్కలంగా నీరు అందుతుంది. పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. – కోర్సా బాలకృష్ణ, గిరిజన రైతు, బెడదనూరు -
వైభవంగా శ్రీవారి తిరువీధి సేవ
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం ఉదయం జరిగిన స్వామివారి తిరువీధి సేవ భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను విశేష పుష్పమాలికలతో అలంకరించిన తొళక్క వాహనంపై ఉంచి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా స్వామివారి వాహనం తిరువీధి సేవకు పయనమైంది. అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, డోలు, సన్నాయి వాయిద్యాలు, అశ్వ, గజ సేవల నడుమ స్వామివారు క్షేత్ర పురవీదుల్లో అట్టహాసంగా ఊరేగారు. ప్రతి ఇంటి ముంగిట భక్తులు శ్రీవారికి నీరాజనాలు సమర్పించారు. అనంతరం స్థానిక ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవికి అర్చకులు విశేష పూజలు జరిపి, భక్తులకు తీర్ధ ప్రసాదాలను పంపిణీ చేశారు. -
20 కాసుల బంగారం చోరీ
తణుకు అర్బన్: ఇంట్లో నిద్రిస్తుండగానే చోరీ జరిగిన ఘటన తణుకు మండలం దువ్వ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దువ్వ సంతమార్కెట్ ప్రాంతంలోని భవనంలో నివసిస్తున్న సింహాద్రి సూర్య భగవాన్ నివాసంలోకి శనివారం రాత్రి దొంగలు ప్రవేశించి 20 కాసుల బంగారు ఆభరణాలు దోచుకున్నారు. సూర్యభగవాన్ ఇంటి కింది భాగంలో మందుల దుకాణం, వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. వ్యాపారం ముగిసిన అనంతరం రాత్రి ఒంటిగంటకు తన భార్యతో కలిసి దుకాణం వెనుక ఉన్న బెడ్రూమ్లో నిద్రించారు. తెల్లవారుజామున 5 గంటలకు మందుల కోసం గ్రామస్తులు తలుపుకొట్టి నిద్రలేపగా మందుల దుకాణంలోకి వెళ్లాడు. క్యాష్ పెట్టె చిందరగా ఉండడంతో అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బెడ్రూమ్లో ఉన్న బీరువా తలుపు తెరిచి ఉంది. చూడగా బంగారు ఆభరణాలు లేవని గుర్తించి స్థానికులకు సమాచారం ఇచ్చి తణుకు రూరల్ పోలీసులను ఆశ్రయించారు. చోరీ ఘటనలో దువ్వ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. చోరీ జరిగిన ఇంటిని తాడేపల్లిగూడెం డీఎస్పీ కె.విశ్వనాఽథ్ పరిశీలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్ బృందం, క్లూస్ టీం ఇంటి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దువ్వలో ప్రధానమైన సంతమార్కెట్ ప్రాంతం ఎంతో రద్దీగా ఉంటుంది. ఎటుచూసినా ఇళ్లు ఉన్నప్పటికీ ఇంట్లోకి చొరబడి చోరీ చేసి తీరు అనుమానాస్పదంగా మారింది. బంగారు ఆభరణాలు ఉన్న ప్రాంతంలోనే ఉన్న రూ.10ల నోట్ల కట్టలు తీసుకోకపోవడం గమనార్హం. బీరువాలో ఉన్న బ్యాంకు పుస్తకాలు ఇతర కాగితాలను సందులో గోడపై వదిలివెళ్లారు. రూరల్ ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వెలివేశారంటూ ఆత్మహత్యాయత్నం
ముసునూరు: తన కుటుంబాన్ని వెలివేసినట్లు కుల పెద్దలు ప్రకటించడంతో మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సెల్ఫీ వీడియో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. ఎస్సై ఎం.చిరంజీవి ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. మండలంలోని లోపూడి గ్రామానికి చెందిన బోట్ల కనకారావు ఇటీవల నాటు సారా తయారీ, విక్రయాలు నిర్వహిస్తుండగా ఎకై ్సజ్ అధికారులు దాడులు చేసి పట్టుకుని రిమాండ్కు తరలించారు. బెయిల్పై వచ్చిన తర్వాత గ్రామంలోని తన సామాజిక వర్గానికి చెందిన కుల పెద్దలు అతనిని పంచాయతీకి పిలిపించి, రూ.లక్ష జరిమానా విధించారని, కట్టలేమని బతిమాలినా వినిపించుకోలేదని జరిమానా చెల్లించకపోతే వెలివేస్తున్నామని ప్రకటించారని వీడియోలో పేర్కొన్నారు. తమ కులస్తులు ఎవరూ తమతో మాట్లాడకుండా ఉండాలని, తన తల్లిదండ్రులను కూడా బెదిరించారని, తమకు మంత్రి పార్థసారథి అండదండలున్నాయని ఏమీ చేయలేవని తనను బెదిరించారని వీడియోలో పేర్కొన్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పురుగుమందు డబ్బాతో సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై చెప్పారు. సీసీ కెమేరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. సారా తయారీ విక్రయాలు మానేయాలని హెచ్చరించామని తమ మాటను ధిక్కరించడంతో మిన్నకుండి పోయామని, వెలి వేయడం, కుల బహిష్కరణ చేయడం వంటి నిర్ణయాలు తాము చేయలేదని కుల పెద్దలు పేర్కొంటున్నారు. పురుగుల మందు డబ్బాతో కుటుంబం సెల్ఫీ వీడియో -
భక్తుల తిప్పలు.. ఎమ్మెల్యే డప్పులు
ద్వారకాతిరుమల: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో గతనెల 30న జరిగిన ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లన్నీ తానే చేయించానని, భక్తులకు ఎక్కడా ఇబ్బందులు కలగలేదని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గొప్పలు చెప్పుకోవడం హాట్ టాపిక్గా మారింది. అయితే ఆరోజు భక్తులు పడిన ఇబ్బందుల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నల్లజర్ల మండలంలోని ప్రకాశరావుపాలెంలో గత శనివారం జరిగిన టీడీపీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గతేడాది ముక్కోటి ఏర్పాట్లను తానే దగ్గరుండి పర్యవేక్షించానని, అప్పుడు 30 నుంచి 35 వేల మంది భక్తులు వచ్చారని, ఈ సారి రెట్టింపు అవుతుందని అనుమానం కలిగిందన్నారు. అందుకే కలెక్టర్, ఎస్పీలతో రివ్యూ చేయించానన్నారు. పెద్ద తిరుపతిలో ముక్కోటి మరుసటి రోజు 64 వేల మంది భక్తులు దర్శిస్తే, ద్వారకాతిరుమలలో ముక్కోటి నాడు 60 వేల మంది భక్తులు దర్శించారన్నారు. ఇబ్బంది కలగకుండా మంచినీరు, మజ్జిగ, అల్పాహారం ఇవ్వాలని రాత్రి 9 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వెంటపడుతూ దేవస్థానం వారికి, పోలీసులకు డైరెక్షన్ ఇచ్చానన్నారు. కనీసం మంచినీరు కూడా అందలేదని, టాయిలెట్స్ లేవని, రూ. 500 లు టికెట్లు తీసుకుని నానా తిప్పలు పడుతున్నామని, ఇప్పటికే 4 గంటల సమయం పట్టిందని, పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయని, అధికారులపై భక్తులు మండిపడ్డారు. టీడీపీ నాయకుల వల్లే ఫెయిల్ వీఐపీ గేట్ నుంచి, ధ్వజస్తంభం మీదుగా వీవీఐపీలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులను మాత్రమే పంపుతామని కలెక్టర్, ఎస్పీలకు వివరించారు. ముక్కోటి నాడు కొందరు టీడీపీ నాయకులు తమ కుటుంబ సభ్యులను, పార్టీకి చెందిన వారిని ఆ గేటు నుంచి లోపలికి పంపారు. దేవస్థానం అధికారులు గేటు తాళాలను సైతం నాయకులకే అప్పగించినట్టు తెలుస్తోంది. ధ్వజస్తంభం వద్ద రద్దీ పెరిగి, రూ. 500 టికెట్లు తీసుకున్న భక్తులు, గోవింద స్వాములు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులంతా అష్టకష్టాలు పడ్డారు. వీఐపీ గేటు లోంచి సుమారు 5 వేల మందికి పైగా వెళ్లినట్టు తెలుస్తోంది. ముక్కోటి ఏర్పాట్లపై గోపాలపురం ఎమ్మెల్యే గొప్పలు 60 వేల మంది శ్రీవారిని దర్శించారని, అన్ని సౌకర్యాలు కల్పించామని ప్రకటన ఆ రోజు సౌకర్యాలు అందక ఇబ్బందులు పడ్డ భక్తులు -
ఆహ్లాదం.. ఆటపాక పక్షుల కేంద్రం
కై కలూరు: పెద్ద పండగ సంక్రాంతి కళ ఆటపాక పక్షుల విహార కేంద్రంలో కనిపిస్తోంది. నూతన ఏడాదికి ఇటీవల సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు పక్షుల కేంద్రాన్ని సందర్శిస్తున్నారు. విదేశీ పక్షుల రాకకు అనువైన శీతాకాలం కావడంతో ఇప్పటికే పక్షులు ఆటపాకలో కనువిందు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆదివారం పలు జిల్లాల నుంచి పర్యాటకులు పక్షుల వీక్షణకు వచ్చారు. బోటు షికారు చేస్తూ పెలికాన్ పక్షుల కేరింతలను దగ్గర నుంచి తిలకించారు. అదే విధంగా సమీప ఈఈసీ కేంద్రంలో పక్షి నమూనా మ్యూజియంలో పక్షుల విశేషాలను తెలుసుకున్నారు. సమీప చిల్డ్రన్ పార్కులో చిన్నారులు ఆటలాడుకున్నారు. అటవీశాఖ ఫారెస్టు బీట్ ఆఫీసర్ రాజేష్ కొల్లేరు పక్షుల విశేషాలు, నైసర్గిక స్వరూపం వంటి విషయాలను పర్యాటకులకు వివరించారు. ద్వారకాతిరుమల: మండలంలోని జి.కొత్తపల్లి గ్రామంలో కోడి పందేల స్థావరంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 17 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 31,630 నగదు, కోడి పుంజు, 17 బైక్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. జంగారెడ్డిగూడెం: కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తండ్రిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం మండలం లక్కవరానికి చెందిన నాగరాజు అతని భార్యతో విడిపోయి ఉంటున్నాడు. భార్య జంగారెడ్డిగూడెంలో తన 8 ఏళ్ల కూతురితో జీవిస్తోంది. శనివారం రాత్రి నాగరాజు భార్య ఇంటికి వెళ్లి భార్యను దూషించి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మిర్చికి కొత్త క్రేజ్
వేలేరుపాడులో గుంటూరు కారం ఘాటు వేలేరుపాడు : సాధారణంగా ఎరుపు రంగులో ఉన్న వివిధ రకాల మిర్చిని రైతులు సాగుచేస్తుంటారు. కానీ ఆ యువ రైతు వైరెటీగా ఉంటుందని పసుపు పచ్చ మిర్చిని సాగు చేశాడు. దీంతో ఆ యువ రైతు పంట పండింది. యూట్యూబ్లో చూసి, గుంటూరు నుంచి తెప్పించి పచ్చ మిర్చి రకం విత్తనాలు నాటిన ఆ రైతుకు మంచి ఆదాయం వచ్చింది. అరుదుగా పండించే ఈ పసుపు పచ్చ మిర్చికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ఆ రైతు పంట పండింది. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం నడిమిగొమ్ము గ్రామానికి చెందిన బుడిపిటి విక్రమ్ అనే యువ రైతు మొత్తం ఐదు ఎకరాల మిర్చి పంట సాగు చేశాడు. ఇందులో పసుపు పచ్చ రకం మిర్చి ఒక ఎకరం సాగు చేయగా, మిగతా నాలుగు ఎకరాల్లో నంబర్ 5 రకం ఎర్ర మిర్చి సాగు చేశాడు. పచ్చ మిర్చికి మంచి డిమాండ్ ఉండడంతో.. యూ ట్యూబ్లో చూసిన విక్రమ్ గుంటూరు నుంచి యువీ, నరింగ ఎఫ్–1 హైబ్రేడ్ చిల్లీ విత్తనాలను తెప్పించి ఎకరం సాగు చేశాడు. ఎకరానికి లక్షా 15 వేల వరకు పెట్టుబడి పెట్టగా 25 క్వింటాళ్ళ పసుపు మిర్చి దిగుబడి వచ్చింది. క్వింటా ధర గుంటూరు మార్కెట్లో ప్రస్తుతం రూ.40 వేలు పలుకుతుండగా, గత ఏడాది క్వింటా ధర రూ.65 వేల వరకు పలికింది. పసుపు రంగు మిర్చి గుంటూరు మార్కెట్ నుంచి దేశ, విదేశాలకు ఎగుమతి అవుతోంది. దేశ, విదేశాల్లో వివిధ వంటకాల్లో వినియోగిస్తున్నారు. ఈ మిర్చిని వివిధ కంపెనీలు చిన్న పిల్లలు తినే బింగో, లేస్, తదితర స్నాక్స్లో వినియోగిస్తున్నారు, రంగుల తయారీకి కూడా వాడుతున్నారు. యూట్యూబ్లో ఎల్లో రకం మిర్చి సాగు లాభసాటిగా ఉంటుందని చూశాను. ఈ ప్రాంతంలో ఈ రకం ఎవరూ సాగు చేయలేదు. వైరెటీ ఉంటుందని ఎకరం వేశాను. ఎకరాకు రూ.1.15 లక్షలు పెట్టుబడి పెడితే రూ.13 లక్షల వరకు లాభం వచ్చింది. నల్ల రేగడి నేల కావడంతో మంచి దిగుబడి వచ్చింది. -
రామేశ్వరుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
పెనుమంట్ర: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు దంపతులు ఆదివారం సాయంత్రం పెనుమంట్ర మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన నత్త రామేశ్వరంలోని ఉమా రామలింగేశ్వర స్వామిని, జుత్తిగలో సోమేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట అడిషనల్ సొలిసిటర్ జనరల్ చెల్ల ధనుంజయ్, హైకోర్టు సీనియర్ న్యాయవాది సర్వ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ద్వారకాతిరుమల : గోవిందా.. గోవిందా.. అంటూ శ్రీవారి భక్తులు చేసిన గోవింద నామస్మరణలతో క్షేత్ర పరిసరాలు ఆదివారం మార్మోగాయి. సెలవుదినం కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు భక్తజన సంద్రమయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, కల్యాణకట్ట, ఇతర విభాగాలు భక్తులతో కిక్కిరిసాయి. తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపంలో భక్తులు పోటెత్తారు. ఆలయ ఆవరణలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. పెదవేగి: మహిమ గల తల్లి శ్రీ రాట్నాలమ్మకు భక్తులు విశేష రీతిలో పూజలు నిర్వహించారు. పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వేంచేసిన శ్రీ రాట్నాలమ్మ అమ్మవారికి ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి దేవస్థానానికి విచ్చేసిన భక్తులు వారి మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఈ వారం అమ్మవారికి పూజా రుసుం వల్ల రూ.18,100, విరాళంపై రూ.4,622, లడ్డూ ప్రసాదంపై రూ.9,975, పులిహోర ప్రసాదంపై రూ.690, ఫొటోల అమ్మకంపై రూ.1,890, మొత్తం రూ.35,277 ఆదాయం లభించినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి నల్లూరి సతీష్ కుమార్ తెలిపారు. కై కలూరు: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మను దర్శించుకున్నారు. మహిళలు అమ్మకు పాలపొంగళ్లు సమర్పించారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క అదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, గధుల అద్దెలు, చిత్రపఠాలు అమ్మకం, వాహన పూజలు, విరాళాలు కలపి రూ.19,426 ఆదాయం వచ్చిందని తెలిపారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఏలూరు (మెట్రో) : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా యూనిట్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం ఏలూరులో జరిగాయి. శ్రీధర్ రాజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా హెచ్.గోపాలకృష్ణ, ఇతర కార్యవర్గ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. -
కోడి పందేలకు సన్నద్ధం
దుగ్గిరాలలో సిద్ధం చేస్తున్న బరిసాక్షి ప్రతినిధి, ఏలూరు : కోడి పందేలకు సర్వం స న్నద్ధమైంది. హైకోర్టు నిషేధాజ్ఞలు.. నూరు శాతం కట్టడి చేస్తామన్న పోలీసుల ప్రతిజ్ఞలు.. సాంప్రదాయ పందాలనే నిర్వహిస్తామంటూ ప్రజాప్రతినిధుల మాటల ముసుగున కత్తికట్టిన కోడి పందేలకు వేదికలు సిద్ధమవుతున్నాయి. మినీ స్టేడియాలను తలపించే రీతిలో ప్రతి నియోజకవర్గంలో భారీ పందెం బరులను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆగకుండా సోషల్ మీడియా వేదికగా పందెంరాయుళ్లను ఆకర్షించేలా హడావుడి చేయడం విశేషం. ఇంత జరుగుతున్నా పోలీసులు మొక్కుబడిగానైనా స్పందించని పరిస్థితి. గతేడాది సంక్రాంతి సీజన్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు పందేలు జరిగినట్టు అంచనా. ఈసారి అంతకు మించి అనే స్థాయిలో పందేల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ, కర్నాటకలకు చెందిన బడా నాయకులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పలుకుతున్నారు. మండలానికి 15కు తగ్గకుండా.. ప్రతి నియోజకవర్గంలోనూ భారీ పందెం బరులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి మండలానికీ 15కు తగ్గకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలోని దుగ్గిరాలలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు సంబంధించిన బరి మినీ స్టేడియం తరహాలో సిద్ధమైంది. పందెంరాయుళ్లు కూర్చోవడానికి వీలుగా సాధారణ గ్యాలరీలు మొదలు వీఐపీల గ్యాలరీ వరకు పందెం బరుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి సంబంధించిన అప్డేట్లను సోషల్ మీడియాలో సైతం పోస్టులు చేస్తున్నారు. ఇదే తరహాలో తాడేపల్లిగూడెంలోని ఏరియా ఆస్పత్రి వెనుక భారీ బరి సిద్ధం చేస్తున్నారు. తణుకు నియోజకవర్గంలోని అత్తిలి, తేతలి, ఆచంట నియోజకవర్గంలోని మార్టేరు, వెలగలేరు, పాలకొల్లు నియోజకవర్గంలో చించినాడ బ్రిడ్జి వద్ద, భీమవరంలోని వీరవాసరం, సీసలి, జువ్వలపాలెం, ఉండి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో, జంగారెడ్డిగూడెం, చింతలపూడి ప్రాంతాల్లోనూ బరులు సిద్ధమవుతున్నాయి. ప్రజాప్రతినిధులకు పర్సంటేజీలు కూటమి పార్టీల నేతలే పూర్తిస్థాయిలో పందేల నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పందేల స్థాయిని బట్టి ప్రజాప్రతినిధులతో పర్సంటేజీలు ఖరారు చేసుకుంటున్నారు. జిల్లాలో ఇద్దరు, ముగ్గురు ప్రజాప్రతినిధులు ఇంకో అడుగు ముందుకేసి సొంత బరులు, సొంత స్థలాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.లక్షల నుంచి రూ.కోట్ల స్థాయి మొ దలు, పందేల జరిగే బరుల వరకూ ముడుపులను పర్సంటేజీల వారీగా ఖరారు చేస్తున్నారు. వీటిల్లో సింహభాగం ప్రజాప్రతినిధి ముఠాకే దక్కుతుంది. అవన్నీ కూడా ఖర్చుల పేరిట వసూలు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఇక పేకాట, గుండాట నిర్వాహకులకు కూడా పందేల స్థాయిని బట్టి రేట్లు ఖరారు చేస్తున్నారు. పండగ పేరు.. జూదాల జోరు ఉమ్మడి పశ్చిమలో బరులకు ఏర్పాట్లు భారీస్థాయిలో పందేలకు సన్నాహాలు మినీ స్టేడియాలను తలపించేలా వేదికలు ప్రజాప్రతినిధులతో నిర్వాహకుల వాటాల మంతనాలు పేకాట, గుండాట, కోతాటలకు స్పెషల్ ప్యాకేజీ సోషల్ మీడియా వేదికగా బరుల వివరాలు వెల్లడి అడ్డగోలుగా బరులు ఏర్పాటుచేస్తున్నా పట్టించుకోని పోలీసు యంత్రాంగంఉమ్మడి జిల్లాలో ఏటా సంక్రాంతి సీజన్లో భారీగా కోడి పందేలు నిర్వహిస్తుంటారు. రూ.5 వేల నుంచి మొదలు రూ.5 కోట్ల వరకు పందేలు కాస్తూ మూడు రోజులపాటు నిర్వహిస్తుంటారు. వీటితో పాటు పేకాట, గుండాట, కోతాట, ఇతర జూదక్రీడలు విచ్చలవిడిగా జరుగుతుంటాయి. పోలీసులు యథావిధిగా కోడిపందాల సీజన్ ముందు మొక్కుబడి బైండోవర్లు, నియోజకవర్గానికి ఓ చోట పందెం బరులను ధ్వంసం చేయడం, కోడికి కట్టే కత్తులను పదుల సంఖ్యలో సీజ్ చేసి నివేదికను హైకోర్టుకు పంపి కట్టడి చేస్తున్నట్టు ప్రకటించి పండగ దాటించేస్తుంటారు. అయితే ఈ ఏడాది జిల్లాలో పోలీస్ స్పందన మాత్రం నామమాత్రంగానే ఉంది. ఉమ్మడి పశ్చిమ రాష్ట్రంలోనే కాకుండా దక్షిణ భారతంలోనే కోడి పందేలకు ప్రసిద్ధి. ఆంధ్ర, తెలంగాణతో పాటు బెంగళూరు, చైన్నె నుంచి పెద్ద సంఖ్యలో పందెంరాయుళ్ల వస్తుంటారు. ముఖ్యంగా భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, కై కలూరులో మూడు రో జుల పాటు మకాం వేసి రూ.లక్షలు మొదలు రూ.కోట్ల వరకు పందేలు కడుతుంటారు. -
వేటకు పోటు
సముద్రంలో వేట సాగించే బోట్లకు డీజిల్ సబ్సిడీ సొమ్ములు ప్రభుత్వం మూ డు నెలలుగా జమ చేయడం లేదు. ఇది చాలా దారుణం. మత్స్యకార భృతి పెంచామని చెబుతున్న ప్రభుత్వం డీజిల్ సబ్సిడీ లేకుండా చేసి నడ్డివిరిచింది. వెంటనే ప్రభుత్వం పెండింగ్ సొమ్ములు జమచేయాలి. నెలకు రిజిస్టర్ బోటుకు డీజిల్ సబ్సిడీ కింద రూ.10 వేలు అందించాలి. – బర్రి శంకరం, మత్యకార నేత డీజిల్ సబ్సిడీ సొమ్ములు కొంతకాలంగా జమకాకపోవడం నిజమే. అయితే సాంకేతిక ఇబ్బందులు కారణంగానే ఇది జరిగింది. త్వరలో డీజిల్ సబ్సిడీ బోటు యజమానుల బ్యాంకు ఖాతాల్లో జమవు తుంది. నరసాపురంలో 139 రిజిస్టర్ బోట్లు ఉన్నాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ వేట సాగించే బోట్లకు ఆ బోట్లు ఏ జిల్లాలో రిజిస్టర్ అయ్యి ఉంటే అక్కడే సొమ్ములు జమవుతాయి. – వై.ఏడుకొండలు, ఇన్చార్జ్ మత్స్యశాఖ అధికారి, నరసాపురంనరసాపురం: సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు చంద్రబాబు ప్రభుత్వం డీజిల్ సబ్సిడీని మూడు నెలలుగా నిలిపివేసింది. ఇక ఈ సబ్సిడీని పూర్తిగా నిలిపివేయడానికి నిర్ణయించినట్టు సమాచారం. దీంతో గంగపుత్రులపై డీజిల్ భారం పడుతోంది. అలాగే సముద్రపు వేట కష్టం కానుంది. ఇప్పటికే ప్రకృతి విపత్తులతో వేట సవ్యంగా సాగడం లేదు. దీనికి తోడు డీజిల్ సబ్సిడీకి బ్రేక్ వేయడంతో వేటకారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మరోవైపు ఐస్ ధరలు, నిర్వహణ వస్తువు ల ధరలు కూడా పెరగడంతో వేటకు ఖర్చు తడిసిమోపెడు అవుతోందని అంటున్నారు. బోటుకు 300 లీటర్లు ప్రభుత్వం వేట బోటుకు నెలకు 300 లీటర్ల డీజిల్పై సబ్సిడీ కింద రూ.2,700 ఇస్తుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబందించి నరసాపురంలో రిజిస్టర్ వేట బోట్లు 139 ఉన్నాయి. గతంలో డీజిల్ సబ్సిడీ లీటరు రూ.6 ఉండగా.. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.9కు పెంచింది. ఇలా సముద్రపు వేటకు ఊతమిచ్చింది. జిల్లాలో సుమారు 5 వేల కుటుంబాలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 19 కిలోమీటర్లు మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. నరసాపురం తీరంలో రోజూ 80కి పైగా మెకనైజ్డ్ బోట్లు వేట సాగిస్తాయి. మత్స్య సంపద ఎక్కువగా లభిస్తుండటంతో విశాఖ, మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు ప్రాంతాలకు చెందిన బోట్లు కూడా ఇక్కడ వేట సాగిస్తాయి. డీజిల్ దెబ్బకు విలవిల ప్రస్తుతం డీజిల్ ధర లీటరు రూ.98లుగా ఉంది. వేట బోట్లకు డీజిల్ ప్రధానం. ఒక్కో బోటు సముద్రంలోకి వేటకు వెళ్లి రోజుల తరబడి ఉంటుంది. సరుకు సరిగా పడకపోతే 10 నుంచి 20 రోజుల వరకు వేచి ఉంటారు. దీంతో అన్ని రోజులకు సరిపడా డీజిల్ నింపుకుని వెళుతుంటారు. బోటు కండీషన్ను బట్టి రోజుకు ఒక్కో బోటుకు 20 నుంచి 30 లీటర్ల డీజిల్ అవసరం. వేటకు వెళ్లాలంటే దాదాపు 300 నుంచి 400 లీటర్లు డీజిల్ నింపుకోవాలి. సగటున 400 లీటర్ల డీజిల్కు రూ.40 వేల వరకు ఖర్చవుతుంది. మొత్తంగా వలలు, ఐస్, నిర్వహణ ఖర్చులు కలిపి ఒక బోటుకు సుమారు రూ.లక్షకు పైగా ఖర్చవుతోంది. ఈ పరిస్థితుల్లో డీజిల్ సబ్సిడీ అందకపోవడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మత్స్య కార్మికులపైనా భారం ఒక్కోబోటుపై 10 మంది వరకు మత్స్యకారులు పని చేస్తారు. వీరికి ప్రత్యేకంగా జీతాలు ఉండవు. వేట ఖర్చులు పోను పడిన సరుకులో వచ్చిన లాభాన్ని బోటు యజమాని కార్మికులకు కొంత శాతం వాటాగా పంచుతాడు. ప్రస్తుతం డీజిల్ సబ్సిడీ అందకపోవడంతో మత్స్య కార్మికులపైనా ఈ ప్రభావం పడుతోంది. అలాగే గోదావరిలో వేట సాగించే ఇంజిన్ చెక్క నావలు కూడా నరసాపురం తీరంలో 200 వరకూ ఉంటాయి. వీరికీ డీజిల్ పోటు తప్పడం లేదు. లీటర్ల లెక్కతో సంబంధం లేకుండా డీజిల్ సబ్సిడీ నెలకు రూ.10 వేలు ఇవ్వాలని మత్స్యకార సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయి నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మూకుమ్మడిగా వేట సాగిస్తున్న మత్స్యకారులు ఆటు‘బోట్లు’ మూడునెలలుగా డీజిల్ సబ్సిడీకి బ్రేక్ చేపల వేటకు ఖర్చులు తడిసిమోపెడు నష్టాలు చవిచూస్తున్న మత్స్యకారులు డీజిల్ పథకానికి కత్తెరపై నిట్టూర్పు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డీజిల్ సబ్సిడీని పెంచాల్సిన చంద్రబాబు ప్రభుత్వం రాయితీని ఇవ్వకపోవడంపై మత్స్యకార సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఏడాదిన్నరగా చంద్రబాబు ప్రభు త్వం పలు నిబంధనలతో మత్స్యకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మత్స్యశాఖ వద్ద రిజిస్టర్ అయిన బోట్లు యజమానులు ముందుగా డీజిల్కు డబ్బులు పెట్టుకోవాలి. తరువాత బిల్లును మత్స్యశాఖకు సమర్పిస్తే ఆరు నెలలకోసారి బిల్లులు మంజూరవుతాయి. -
విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందించాలి
భీమవరం: విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి నైపుణ్యాలను పెంపొందించేలా గైడ్స్ ట్రైనింగు వినియోగించుకోవాలని డీఈఓ నారాయణ, ఏపీసీ శ్యామ్సుందర్ తెలిపారు. గైడ్ కెప్టెన్ అడ్వాన్స్, పేసీ కోర్సులకు సంబంధించి స్థానిక ఎస్సీహెచ్బీఆర్ఎస్ స్కూల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో శనివారం ఆయన పా ల్గొని మాట్లాడారు. రెసిడెన్షియల్ ట్రైనింగ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా సెక్రటరీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రాముఖ్యత ఉంటుందని, విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుందని తెలిపారు. హెచ్ఎంలు శ్రీనివాస్, ఎంఓ చంద్రశేఖర్, అడ్వాన్స్ రిసోర్స్ పర్సన్ కస్తూరి సుధాకర్ పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం మావుళ్లమ్మవారి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని శనివారం లెక్కించారు. 105 రోజులకు రూ.1,02,81,455 ఆదాయం సమకూరింది. అలాగే బంగారం 215 గ్రాములు 200 మిల్లీగ్రాములు, 360 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ లభించినట్టు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మీ నగేష్ తెలిపారు. జిల్లా ఎండోమెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో లెక్కింపు జరిగింది. ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ, భీమవరం తనిఖీదారు వి.వెంకటేశ్వరరావు, శక్తీశ్వర స్వామి దేవస్థానం ఈఓ దండు కృష్ణంరాజు, భీమేశ్వరస్వామి దేవస్థానం ఈఓ తోట శ్రీనివాస్, చిక్కాల దేవస్థానం ఈఓ కడలి సాగర్ పర్యవేక్షించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి ద్వారకాతిరుమల: గొడవ పడుతున్న తల్లి, భా ర్యకు సర్దిచెప్పలేక చెప్పలేక పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందా డు. ద్వారకాతిరుమల పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం.. మండలంలోని శరభాపురం గ్రామానికి చెందిన గుంపుల రాజశేఖర్(30) పి.కన్నాపురంలోని కోకోకోలా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈనెల 1న సాయంత్రం అతడి తల్లి, భార్యకు మధ్య గొడవ జరిగింది. ఈ స మయంలో వారిద్దరికీ సర్దిచెప్పలేక ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజశేఖర్ గ్రామంలోని గొ ప్పగుంట చెరువు వద్ద పురుగుల మందు తాగి పడిపోయాడు. అటుగా వెళ్లినవారు అపస్మారక స్థితిలో ఉన్న రాజశేఖర్ను హుటాహుటిన భీమడోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథ మ చికిత్స అనంతరం రాజశేఖర్ తండ్రి రాంబాబు అతడిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాజశేఖర్ మృతిచెందగా పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. మృతుడి తండ్రి రాంబా బు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ చెప్పారు.కాళ్ల: దాళ్వాలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనువైన వరివంగడాల వినియోగంపై ఉండి కేవీకే శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. శనివారం సీసలిలో జరిగిన రైతు శిక్షణా కార్యక్రమంలో సూచనలిచ్చారు. దాళ్వాలో ఎంటీయూ 1121 వేయడం వల్ల పంట కోత 130 రోజులపైనే పడుతుందని దీని వల్ల వేసవి ప్రభావం పడి బియ్యం నూక అయ్యే ప్రమాదం ఉందన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా 11 ఎంటీయూ 1121తో సంకరపరచి చిరు సంచి దశలో ఉన్న ఎంటీయు 1426 వంగడం సాగు చేయాలన్నారు. జింకు లోపం గమనించి ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలో చొప్పున ముడి జింకును నేలకు వేయాలని సూచించారు. ఎకరాకు 45 కిలోల పొటాషి యం రెండు దఫాలుగా పిచికారీ చేయాలన్నారు. శాస్త్రవేత్తలు మల్లికార్జున, విజయలక్ష్మి, మత్య శాస్త్రవేత్త శ్రీనివాస్, హర్టీకల్చర్ శాస్త్రవేత్త బిందు, వ్యవసాయాధికారి పి.రమేష్నాయుడు పాల్గొన్నారు. -
వ్యూహాలకు పదును పెట్టాలి
తాడేపల్లిగూడెం: లక్ష్యాలు సాధించాలంటే విద్యార్థులు వ్యూహాలకు పదును పెట్టాలని నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్వీ రమణరావు పిలుపునిచ్చారు. ఇనిస్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్, ఏపీ నిట్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఎంటర్ప్రెన్యూర్ షిప్ కమ్ స్కిల్ డెవలప్మెంటు ప్రోగ్రామ్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఏపీఎంఎస్ఎంఈ టెక్నాలజీ సహకారంతో ఈనెల 20 నుంచి 20 రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వి ద్యార్థులు సృజన శీల వ్యాపార ఆలోచనలకు ఆకృతినిస్తే అంకుర పరిశ్రమలు రూపుదిద్దుకుంటాయన్నారు. ఆధునిక పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలన్నారు. విభిన్న ఆలోచనలు, ప్రాజెక్టులతో ముందుకొచ్చే విద్యార్థులను సంస్థ ప్రోత్సహిస్తోందన్నారు. నిట్ డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ, కార్యక్రమం చైర్మన్ జి.రవికిరణ్శాస్త్రి మాట్లాడుతూ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యవంతులుగా తయారు కావడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి, నిట్ అధికారులు పాల్గొన్నారు. -
సందడిగా గోదావరి క్రీడా ఉత్సవాలు
భీమవరం: మానసిక ఒత్తిళ్లు తగ్గించుకోవడానికి, శారీరక ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి క్రీడలు దో హదపడతాయని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అ న్నారు. స్థానిక ఎస్ఆర్కేఆర్ కళాశాలలో శనివారం గోదావరి క్రీడా ఉత్సవాలు (ప్రభుత్వ ఉద్యోగుల జిల్లాస్థాయి పోటీలు)ను ఆమె క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. శని, ఆదివారాల్లో క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, చెస్, టెన్నికాయిట్, త్రో బాల్, క్యారమ్స్, షాట్పుట్ వంటి క్రీడాంశాల్లో 235 బృందాలు, అథ్లెటిక్స్ 56 మందితో క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ఉద్యోగులకు ఆటవిడుపు, శాఖల మధ్య స్నేహపూరిత వాతావరణం పెంపొందించేలా క్రీడా ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి మాట్లాడుతూ మండల, డివిజన్ స్థాయిల్లో ప్రతిభ కనబర్చిన వారు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. కలెక్టర్ నాగరాణి క్రికెట్ బ్యాటింగ్ చేసి, జేసీ వాలీబాల్ ఆడి స్ఫూర్తినింపారు. డీఎస్డీఓ క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, ఆర్డీఓలు కె.ప్రవీణ్కుమార్రెడ్డి, ఖతీబ్ కౌసర్ భానో, దాసి రాజు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
న్యాయ అవగాహన సదస్సు
భీమవరం: ప్రతిభకు వైకల్యం అడ్డుకాకూడదనే సంకల్పంతో బ్రెయిలీ అంధులకు లిపి కనిపెట్టాడని, అంధుల్లో కూడా ఉన్నత స్ధాయికి చేరుకున్నవారు ఉన్నారని 2వ అదనపు జ్యుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఎన్.జ్యోతి అన్నారు. జనవరి 4న బ్రెయిలీ దినోత్సవం సందర్భంగా శనివారం మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జువ్వలపాలెం రోడ్డులోని యూవీఎస్ఎం కంటి ఆసుపత్రి నిర్వహిస్తున్న దృష్టి వైకల్య కేంద్రంలో న్యాయ అవగాహనా సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులున్నా మండల న్యాయ సేవా సంస్థను సంప్రదించాలన్నారు. దృష్టి వైకల్య కేంద్ర నిర్వాహకులు డాక్టర్ యూవీ రమణరాజు కేంద్రంలో అంధ విద్యార్ధులకు అందిస్తున్న సేవల గురించి న్యాయమూర్తికి వివరించారు. న్యాయమూర్తి విద్యార్ధులను పేరు అడిగి భవిష్యత్తులో ఏమవ్వాలని కోరుకుంటున్నావని అడిగి తెలుసుకున్నారు. -
మధ్యవర్తిత్వంపై ప్రత్యేక సదస్సు
ఏలూరు (టూటౌన్): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఈ నెల 2 నుంచి 31 వరకు మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారం నిమిత్తం స్పెషల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా శాశ్వత లోక్ అదాలత్ చైర్పర్సన్ ఎ.మేరీ గ్రేస్ కుమారి తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో శిక్షణ పొందిన మధ్యవర్తులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మధ్యవర్తులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, కక్షిదారులకు న్యాయ సహాయం అందించడానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్, రిటైర్డ్ అదనపు జిల్లా జడ్జి ఏ.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
తమ్ముడు కాకపోయినా తలకొరివి
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని బ్రాడీపేటకు చెందిన కొరటాని శ్రీను (45) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందాడు. బంధువులు ఉన్నా ఎవరింటికీ వెళ్లడు. పొరుగున ఉండే పతివాడ మావుళ్లమ్మను అక్కా అని పిలిచేవాడు. ఆ అనుబంధంతో ఆమె తలకొరివి పెట్టింది. తాను ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసి వయసు మీదపడడంతో మానేశానని.. శ్రీనును ఇంటి వద్దే పెట్టుకుని చూసుకునేదాన్నని మావుళ్లమ్మ తెలిపింది. శ్రీనుకు ఇద్దరు అక్కలున్నట్లు సమాచారం. శనివారం శ్రీను మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినా రాలేదని.. తలకొరివి పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో తానే పెట్టినట్లు ఆమె తెలిపింది. -
నేరాల అదుపునకు సాంకేతిక పరిజ్ఞానం సాయం
కై కలూరు: రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు కృషి చేయాలని ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ సిబ్బందికి సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మండలంలోని పోలీసుస్టేషన్లను ఎస్పీ శనివారం తనిఖీ చేశారు. అనంతరం టౌన్ పోలీసుస్టేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. నేరాల నియంత్రణలో సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా నేరాల సంఖ్య తగ్గుతోందని ఇందుకు సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించడమే ప్రధాన కారణమన్నారు. కై కలూరు స్టేషన్ల పరిధిలో ఇటీవల నమోదైన కేసుల్లో సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించి కేసులను ఛేదించడం అభినందనీయమన్నారు. తాడేపల్లిగూడెం: పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీలోని ఒక ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యాన్ని శనివారం విజిలెన్సు, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా చేసిన దాడిలో స్వాధీనం చేసుకున్నారు. చిన్నంశెట్టి మణికంఠ 4.50 టన్నుల రేషన్ బియ్యం నిల్వ చేసినట్టుగా సోదాల్లో గుర్తించారు. అతనిని అధికారులు ప్రశ్నించగా రేషన్ కార్దుదారుల నుంచి కిలో రూ.20కి కొనుగోలు చేసి , జంగారెడ్డిగూడెంకు చెందిన మంచాల సాయికి కిలో రూ.22 చొప్పున విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు నిల్వ ఉన్న సుమారు రూ.1.80 లక్షల విలువైన బియ్యం స్వాధీనం చేసుకుని, నిత్యావసర వస్తువుల చట్టం 1955 ప్రకారం కేసు నమోదు చేశారు. విజిలెన్సు ఎస్పీ కె.నాగేశ్వరరావు ఆదేశాల మేరకు జరిగిన ఈ దాడిలో విజిలెన్సు ఎస్ఐ కె.సీతారాం, గూడెం సీఎస్డీటి. వి.అన్నపూర్ణ, వీఆర్ఓ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
బతుకు చక్రం సాగేదెలా?
బుట్టాయగూడెం: సమాజంలో మనిషికి గౌరవం, హుందాతనం వచ్చేలా చేసేది అతను ధరించే దుస్తులే. ఆ దుస్తులకు మంచి రూపురేఖలతో సాధారణ గుడ్డను దుస్తులుగా తయారు చేయడంలో టైలరింగ్దే కీలకపాత్ర. అయితే టైలర్ బతుకు చక్రం అంధకారంగా మారింది. రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి రావడంతో కుట్టు మిషన్ల చక్రం వేగం తగ్గింది. వివిధ డిజైన్లతో రెడీమేడ్ దుస్తులు సరసమైన ధరలకే లభించడంతో యువత వాటిపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దీని ఫలితంగా టైలర్ల కుటుంబ పోషణ భారమై దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ప్రజలు రెడీమేడ్ దుస్తులపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి రావడంతో టైలర్స్ చేతుల్లో పనిలేక అనేక మంది రోడ్డున పడుతున్నారు. కొందరైతే ఈ పనిమానేసి వేరే పనుల్లో స్థిరపడుతున్నారు. 30 ఏళ్లపాటు టైలరింగ్ వృత్తిలో అనుభవం ఉన్న టైలర్లు ప్రస్తుతం చేసేందుకు పనిలేక ఇల్లు గడవక బడ్డీ కొట్లు ఏర్పాటు చేసుకుని సరుకులను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. జిల్లాలో 600కు పైగా టైలర్లు జిల్లాలో సుమారు 600కు పైగా టైలర్లు ఉన్నట్లు తెలుస్తుంది. అత్యధికంగా 30 నుంచి 40 సంవత్సరాలు అనుభవం ఉన్న టైలర్లు ఉన్నారు. ఒకప్పుడు ఎలాంటి దుస్తులు కుట్టాలన్నా టైలర్లపైనే ఆధారపడవలసి వచ్చేది. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, పాఠశాలల పునఃప్రారంభం సమయాల్లో టైలర్లకు తీరికలేక రాత్రీ పగలు పనిచేయాల్సి వచ్చేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనుచూపుమేర కనిపించడంలేదని టైలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెడీమేడ్ దుస్తుల ప్రభావం గుదిబండలా మారింది. క్రిస్మస్, సంక్రాంతి పండుల్లో కుట్టేందుకు తమకు పనులు లేక మహిళల చీరల పాలు, పాత ప్యాంట్లు సైజులు చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నామని టైలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 600 మంది టైలర్ల పరిస్థితి ఇలానే ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో రూ.10 వేల ఆర్థిక భరోసా: వైఎస్సార్సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడాదికి రూ.10 వేల చొప్పున టైలర్ల బ్యాంక్ ఖాతాలో జమ చేసేవారు. నాలుగేళ్ల పాటు క్రమం తప్పకుండా టైలర్స్ డే రోజున టైలర్ల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమయ్యాయి. ఇలా ఒక్కో టైలర్కు నాలుగేళ్లలో రూ.40 వేలు సొమ్ము బ్యాంకు ఖాతాలో జమయ్యేవి. ప్రస్తుతం పనులు లేక ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారంలేక తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని టైలర్లు కోరుతున్నారు. టైలర్లకు తగ్గిన గిరాకీ పండుగ రోజుల్లో పనులు లేక వెలవెలబోతున్న షాపులు ప్రత్యామ్నాయ పనుల వైపు చూపు వైఎస్సార్సీపీ పాలనలో ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం టైలర్ వృత్తినే నమ్ముకుని జీవనం సాగించే వారిని ప్రభుత్వం ఆదుకోవాలి. మార్కెట్లోకి రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి రావడంతో పనులు లేక టైలర్లు దుర్భర జీవితం గడుపుతున్నారు. రాబోయే రోజుల్లో టైలర్లు కనుమయ్యే పరిస్థితి నెలకొంది. నేను 1982 నుంచి టైలర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం టైలర్లకు ఇటువంటి పరిస్థితులు వస్తాయని నేను ఊహించలేదు. ప్రభుత్వం టైలర్లను ఆదుకోవాలి. దొండపాటి గంగులు, టైలర్, బుట్టాయగూడెం ప్రస్తుతం రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం టైలర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పండుగ రోజుల్లో కూడా పనులు లేక పస్తులు ఉండే పరిస్థితి నెలకొంది. నేను గత 30 సంవత్సరాలుగా టైలరింగ్ పనిచేస్తున్నాను. ప్రస్తుతం నా దగ్గర ఇద్దరు టైలర్లు పనిచేస్తున్నారు. వారికి పని చూపించడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. పండుగ రోజుల్లో సరైన పనులు లేక ముగ్గురం ఖాళీగా ఉంటున్నాము. గత వైఎస్సార్సీపీ పాలనలో మా బ్యాంక్ ఖాతాలో ఏడాదికి రూ. 10వేలు చొప్పున నాలుగేళ్లలో రూ. 40 వేలు అందించారు. షేక్ లాల్సాహెబ్, బాబూ టైలర్, బుట్టాయగూడెం -
కార్మికుల శక్తి విశాఖ సభలో చూపిస్తాం
తణుకు అర్బన్: కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న పాలకులకు కార్మికుల శక్తి విశాఖపట్నంలో నిర్వహించే కార్మిక బహిరంగ సభలో చూపిస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ.ప్రతాప్ అన్నారు. శనివారం స్థానిక రాష్ట్రపతి రోడ్డులో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇస్తే కొనుగోలు శక్తి పెరుగుతుందని అన్నారు. సంపద కొంతమంది వద్ద పోగుపడడం వల్ల వ్యాపారాలు ముందుకు సాగడం లేదని అన్నారు. కొత్తగా ఎన్ని పరిశ్రమలు వచ్చినా ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేకపోతే సంక్షోభాలు తప్పవన్నారు. కార్మికుల శ్రమ నుంచే సంపద వస్తుందని అటువంటి కార్మికులకు పనికి తగిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు అడగర్ల అజయ కుమారి, ఎన్.ఆదినారాయణ బాబు, ఏ.కృష్ణబాబు, పి.జ్యోతిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఇంట్లో సామగ్రి అగ్నికి ఆహుతి
దెందులూరు: విద్యుదాఘాతంతో గోపన్నపాలెంలో ఆకుల సురేష్కు చెందిన ఇంట్లో ఫ్రిడ్జ్, సామగ్రి అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆకుల సురేష్ ఇంట్లో మంటలు ఎక్కువ కాకుండా అదుపు చేశారు. అప్పటికే ఇంట్లో ఫ్రిజ్తో పాటు రూ.లక్ష విలువచేసే సామగ్రి కాలిపోయింది. తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని 21వ వార్డు కొబ్బరితోట, మహంకాళమ్మ గుడి సమీపంలో ఉంటున్న నడపన రంగారావు(50) శనివారం సాయంత్రం టూ టౌన్లోని ఏలూరు కాలువలో ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యాడు. రంగారావు టీ సెంటర్లో పనిచేస్తున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి కేవీ మురళీ కొండబాబు ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు. పెనుగొండ: అప్పుల బాధతో చిట్ఫండ్ వ్యాపారి దొంగరావిపాలెం బ్రిడ్జి వద్ద శనివారం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండపేట మండలం ఏడిదకు చెందిన పల్లా సురేష్(52) చిట్ఫండ్ చేస్తూ నష్టాల పాలయ్యాడు. భార్య నాగలక్ష్మీకి చెందిన బంగారం అమ్మినా అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. భార్య నాగలక్ష్మి తణుకులో జాన్వీ బ్యూటీ అకాడమీలో బ్యూటిషియన్గా పనిచేస్తోంది. అప్పులు బాధ ఎక్కువ కావడంతో ఏడిదలో ఉన్న ఇంటిని అమ్మే విషయంలో మనస్పర్ధలు రావడంతో తణుకు నుంచి ఏడిద వెళ్తూ గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. మృతుడుకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కొయ్యలగూడెం: సామాజిక తత్వవేత్తలు, సంస్కర్తలు, సాహితీవేత్తల గురించి భావితరాలు తెలుసుకునేలా సమష్టి కృషి అవసరమని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి రచయిత డాక్టర్ ఊటుకూరి వరప్రసాద్ పేర్కొన్నారు. ఆయన రచించిన శ్రీభిన్న స్వరాల్ఙు పుస్తక ఆవిష్కరణ శనివారం జరిగింది. పుస్తక పఠనం సన్నగిల్లుతున్న ఈ రోజుల్లో చదివే వారి సంఖ్య కనుమరుగవుతుందని అన్నారు. తన స్వీయ ఖర్చులతో ముద్రించిన పుస్తకాలను తాను పనిచేసిన పాఠశాలకు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. భీమడోలు: భీమడోలులో శనివారం ఏలూరుకు చెందిన జూడాల వంశీ మోహన్ బైక్ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. మోహన్ విధి నిర్వహణలో భాగంగా భీమడోలులో చిట్స్ కార్యాలయం వద్ద బైక్కు తాళం వేసి వెళ్లాడు. విధులను ముగించుకుని వచ్చేసరికి బైక్ కనిపించలేదు. బాధితుడు భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెదపాడు: మండలంలోని అప్పనవీడులో గత నెల 23న రెడ్డి జ్యోతి అనుమానస్పద మృతిపై పెదపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా భర్త అనిల్, మరో మహిళ పాకలపాటి జ్యోతిని అరెస్టు చేసి శనివారం కోర్టులో హాజరుపర్చామని ఎస్సై కట్టా శారదా సతీష్ తెలిపారు. పోలవరం రూరల్: పోలవరం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు శనివారం 5వ రోజు కూడా కొనసాగాయి. హామీలు ఇచ్చిన నాయకులు, హామీలు విస్మరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పునరాలోచన చేసి జిల్లా కేంద్రంగా చేయాలని సాధన సమితి కమిటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
కబడ్డీ పోటీలు ప్రారంభం
వీరవాసరం: వీరవాసరంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాసులు శనివారం ప్రారంభించారు. 23 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, మానసిక ఉత్తేజం కలుగుతాయన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు, ఎంపీపీ వీరవల్లి దుర్గభవాని, వీరవల్లి చంద్రశేఖర్, అడ్డాల శ్రీరామచంద్రమూర్తి, బాజీంకి గంగా మహేష్ , కరీంశెట్టి మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆగిరిపల్లి: రథసప్తమి ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి భక్తులు అందించే కానుకలకు దేవస్థానం తరపున రసీదు అందిస్తామని ఆలయ కార్యనిర్వహణ అధికారి సీహెచ్ సాయి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ శోభనాచల లక్ష్మీ నరసింహస్వామి మాఘమాస రథసప్తమి ఉత్సవాలు ఈనెల 19 నుంచి 29 వరకు వైభవంగా నిర్వహించునున్నట్లు తెలిపారు. 26న రథోత్సవం నిర్వహించునున్నట్లు తెలిపారు. అన్నదానానికి భక్తులు అందించే విరాళాలకు ఎలాంటి రసీదులు ఇవ్వమని కొంతమంది అంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలాంటి అపోహలు నమ్మవద్దని అన్నారు. గత మూడు సంవత్సరాల క్రితం అన్నదానానికి భక్తులు అందించిన విరాళాలు రూ.6,24899 దేవస్థానం తరఫున ఉన్న బ్యాంక్ అకౌంట్లోనే జమ చేశామని తెలిపారు. ఈ సంవత్సరం కూడా బ్యాంక్ ఖాతాలోనే జమ చేస్తామని తెలిపారు. తణుకు అర్బన్: తణుకు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒక యువకుడు మృతిచెందగా ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం స్థానిక శర్మిష్ట సెంటర్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో తణుకు టి.వేమవరానికి చెందిన కేతా బాలు(19) ఘటనా ప్రాంతంలోనే మృతిచెందగా కోటిపల్లి మహేష్, గుత్తుల జగదీష్ తీవ్రంగా గాయపడి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలుతో పాటు స్నేహితులు మహేష్, జగదీష్ తణుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో వాహనంపై ఉన్న ముగ్గురూ కింద పడిపోగా బాలు బస్సు ముందు చక్రం కిందికి వెళ్లిపోయాడు. కొంత దూరం బస్సు ఈడ్చుకువెళ్లినట్లుగా చెబుతున్నారు. మహేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. -
జాతీయస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో ఫార్మసీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఇరపా అమ్మాజీ కిరణ్ యోగాసన పోటీల్లో ప్రతిభ చాటారు. డిసెంబర్ 29 నుంచి జనవరి 1 వరకు మహారాష్ట్రలో సంగమనేరు ధ్రువ గ్లోబల్ స్కూల్లో పోటీలలో ఐదో స్థానం సాధించారు. అమ్మాజీ రాష్ట్రస్థాయి పోటీలలో గతంలో బంగారు పతకం సాధించిదింద. అమ్మాజీ మాట్లాడుతూ యోగా మానసిక, శారీరక రుగ్మతలకు చక్కటి పరిష్కారమని, యోగా ప్రతి ఒక్కరికి జీవన విధానంగా మారాలని అన్నారు. అంతర్జాతీయ పోటీల్లో కూడా ప్రతిభను చాటి దేశానికి మంచి పేరు తీసుకువస్తానని తెలిపారు. ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన స్వామివారి తిరువీధి సేవ భక్తులకు నేత్రపర్వమైంది. తొలుత ఆలయంలో శ్రీవారు, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా స్వామివారి వాహనం క్షేత్ర వీధులకు పయనమైంది. గ్రామోత్సవం కనుల పండువగా సాగింది. అనంతరం ధనుర్మాస మండపంలో శ్రీవారు, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారి తిరువీధి సేవ రాత్రి వైభవంగా నిర్వహించారు. -
నడిరోడ్డుపై పడిగాపులు
జంగారెడ్డిగూడెం: మండలంలోని దేవులపల్లిలో శుక్రవారం ఆర్టీసీ బస్సు మొరాయించింది. భీమవరం డిపోకు చెందిన బస్సు జంగారెడ్డిగూడెం నుంచి భీమవరం వెళ్తున్న క్రమంలో దేవులపల్లి సమీపంలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు రోడ్డుపై మరో బస్సు కోసం ఎదురుచూడాల్సిన వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. పల్లె వెలుగు బస్సులు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కాలం చెల్లిన బస్సులతో పాటు, కండిషన్ సరిగా లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. పాలకొల్లు సెంట్రల్ : మద్యానికి బానిసైన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని యాళ్లవానిగరువు పంచాయతీకి చెందిన సువ్వాడ పైడిరాజు (55) రైస్మిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మద్యానికి అలవాటు పడిన అతను ప్రతి రోజు మద్యానికి డబ్బులు ఇవ్వాలని లేదంటే చచ్చిపోతానని కుటుంబ సభ్యులను బెదిరించేవాడు. డిసెంబర్ 31న రాత్రి పైడిరాజు నుంచి ఏదో వాసన వస్తోందని భార్య ప్రశ్నించింది. లిమ్కాలో కలుపుమందు కలుపుకుని తాగానని చెప్పడంతో వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. -
ఈ ఏడాదైనా.. ఉండి సమస్యలు తీరేనా?
ఉండి: చంద్రబాబు ప్రభుత్వంలో ఉండి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రజాప్రతినిధులు చేసిన వాగ్ధానాలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఉండిలోని ప్రధాన సమస్యలపై సైతం పాలకులు దృష్టి పెట్టడం లేదు. జాతీయ రహదారి 165పై ఉండి ప్రధాన సెంటర్ జంక్షన్లో ఉండి కాలువపై క్షీణదశకు చేరిన వంతెన ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది. రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో తరచూ వంతెనపై ట్రాఫిక్ నిలిచిపోతుంది. అంతేకాకుండా ఈ మార్గంలో విజయవాడ, గుడివాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, గణపవరం వెళ్లేందుకు భారీ వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో శిథిలావస్థకు చేరుకున్న వంతెన ఎక్కడ కూలిపోతుందోనని బెంబేలెత్తుతున్నారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఇక్కడ వంతెన నిర్మిస్తారు అని అనుకున్నా ప్రస్తుతం జాతీయ రహదారి నిర్మాణ ప్రణాళిక మారిపోవడంతో ఇప్పుడు ఈ వంతెన నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఉండి ఆక్విడెక్టు అధ్వాన స్థితికి చేరిన ఉండి అక్విడెక్టు ఏటా రైతులను నిలువునా ముంచుతోంది. సీజన్ ఏదైనా వర్షం వస్తే చాలు వరి పంట ముంపునకు గురికావలసిందే అన్నట్లుంది పరిస్థితి. ఉండి అక్విడెక్టులో పైనుంచి ఉండి పంటకాలువ, కింది నుంచి బొండాడ మేజర్ డ్రెయిన్ ప్రవహిస్తున్నాయి. పంట కాలువ ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా బొండాడ మేజర్ డ్రెయిన్లో మురుగునీటి ప్రవాహనికి అక్విడెక్టు వద్ద తీవ్ర ఇబ్బంది తలెత్తుతుంది. అక్విడెక్టు వద్ద గుర్రపుడెక్క, తూడు, పెద్ద ఎత్తున చెత్తా చెదారం చేరుకుని మేటలు వేయడంతో మురుగునీరు ప్రవహానికి తీవ్ర ఆటంకం కలుగుతుంది. పూడిక తొలగింపునకు అధికారులు తూతూ మంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. కానీ సమస్య మాత్రం అలానే ఉండిపోతుంది. రెండేళ్ల నుంచి అధికారం అనుభవిస్తున్న కూటమి నాయకులు రైతులను విస్మరించి వారి కోసం ఏదో చేశామని ప్రకటనలు గుప్పించడం గమనార్హం. అధికారులు ,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ఉండి, ఎన్నార్పీ అగ్రహారం, మహదేవపట్నం, వెలివర్రు, పాములపర్రు, కోలమూరు, యండగండి, ఉప్పులూరు తదితర గ్రామాల్లోని వేలాది ఏకరాల వరిపంట ముంపుకు గురవుతుంది. ఇవే కాకుండా నియోజకవర్గంలో పలు సమస్యలు గూడు కట్టుకున్నాయి. వీటిని పరిష్కరించేందుకు అధికార పక్ష నాయకులు ఇప్పుడైనా దృష్టి సారించాలని కోరుకుంటున్నారు. కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఉండి అక్విడెక్టు క్షీణదశకు చేరుకున్న ఉండి వంతెన ఎప్పుడు కూలిపోతుందోనని ఆందోళన రైతులను ముంచుతున్న అక్విడెక్టు ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టని ప్రజాప్రతినిధులు నియోజకవర్గ కేంద్రం ఉండిలోని ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఉండి సెంటర్లోని పెద్ద వంతెన క్షీణదశకు చేరుకుంది. వంతెన నిర్మాణం త్వరగా జరగకపోతే వంతెన ఏదోరోజు కూలిపోయే ప్రమాదం ఉంది. – పీవీఆర్కే ఆంజనేయరాజు, ఎంపీటీసీ వాండ్రం, వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడుప్రతిఏటా రైతులకు కన్నీళ్లు రప్పిస్తున్న ఆక్విడెక్టుపై దృష్టిసారించాలి. ఏన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న అక్విడెక్టు నిర్మాణానికి ఈ ఏడాదిలైనా పూనుకోవాలి. సాధారణ వర్షానికి సైతం పంటలు మునిగిపోతున్న పరిస్థితుల్లో వెంటనే ప్రజాప్రతినిధులు దృష్టిసారించాలి. – గలావిల్లి ధనుంజయ, వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ జిల్లా అధ్యక్షుడు, ఎన్నార్పీ అగ్రహారం -
కౌలు రైతుల రక్షణకు చట్టం తేవాలి
ఏలూరు(టూటౌన్): కౌలు రైతుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావాలని, అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం, రబీ పంట రుణాలు అందించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు అన్నే భవనంలో దేవాలయ కౌలు రైతుల సమావేశాన్ని అనగాని శ్రీరామ్మూర్తి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కొత్త చట్టం తీసుకువచ్చి కౌలు రైతులకు మేలు చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకుండా ఆలస్యం చేయడం తగదన్నారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చేలా కొత్త కౌలు రైతుల చట్టం తేవాలన్నారు. ప్రతి కౌలు రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలన్నారు. ముదినేపల్లి మండలం వడాలి గ్రామానికి చెందిన సర్వీస్ ఇనాం భూముల కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించి పంట రుణాలు, నష్టపరిహారాలు, పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు. వడాలి ఇనాం భూముల కౌలు రైతుల హక్కులు కాపాడాలన్నారు. పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పల్లి శ్రీధర్, కుంచాల బుల్లిబాబు, కొరికాని వెంకటేశ్వరరావు, బెండు పాపారావు, వెలమల రాంబాబు, ముంగట నాగ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఇదెంతకాలం?
జాడ లేని డూడూ బసవన్నలు సంక్రాంతి అంటే డూడూ బసవన్నల సందడి కనిపించేది. అయితే ఆదరణ కరువై, పొట్టకూటి కోసం గంగిరెద్దులను ఆడించే వారు వేరే పనులు చూసుకుంటున్నారు. IIలో uగోరంత పనికి కొండంత హడావుడి చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం దిట్ట. జనవరి నుంచి రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్టు కొద్ది రోజులుగా చెప్పుకుంటూ వచ్చింది. అమల్లోకి వచ్చేసరికి జిల్లా కేంద్రంలోని కార్డుదారులకు మాత్రమే పరిమితం చేసి మిగిలిన వారిని ఉసూరుమనిపించింది. ఇప్పటికే కందిపప్పు సరఫరా మూణ్ణాళ్ల ముచ్చటవ్వగా, పంచదారకు కోత పెడుతోంది. గోధుమ పిండి పంపిణీ ఎంత కాలమన్న అనుమానాలు ఉన్నాయి. శనివారం శ్రీ 3 శ్రీ జనవరి శ్రీ 2026సాక్షి, భీమవరం: సంక్రాంతి పండుగ కోసం అంటూ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు గోధుమ పిండి సరఫరా చేస్తుందని సామాజిక మాధ్యమాల్లో హోరె త్తించారు. అధికారులు సమీక్షలు కూడా నిర్వహించారు. మార్కెట్లో గోధుమ పిండి కిలో రూ.65ల వరకు ఉండగా రూ.20కు లభిస్తుందని లబ్ధిదారులు ఆశించారు. అయితే పంపిణీ చేసే సమయానికి పైలెట్ ప్రాజెక్టు పేరిట నగరాలు, ముఖ్య పట్టణాలకు మాత్రమే ప్రభుత్వం పరిమితం చేసింది. జిల్లాలోని 1,052 రేషన్ డిపోల పరిధిలో 5,67,700 రేషన్ కార్డులు ఉండగా, కేవలం భీమవరంలోని 49 దుకాణాల పరిధిలో 33,363 కార్డులకు మాత్రమే గోధుమ పిండి ఇస్తున్నారు. నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాలతో పాటు 20 మండలాల్లోని కార్డుదారులకు పంపిణీ చేయడం లేదు. దీంతో పండుగ భీమవరం వాసులకేనా అని మిగిలిన లబ్ధిదారులు మండిపడుతున్నారు. గోధుమ పిండి ప్రయోగాత్మకంగా పంపిణీ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కార్డుదారులు అందరికీ అందించాలని కోరుతున్నారు. షాపుల వద్ద పడిగాపులు : కూటమి ప్రభుత్వంలో భిన్నమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉన్న ఎండీయూ వాహనాలను నిలిపివేసి పాత రోజుల్లో మాదిరి సరుకుల కోసం రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తెచ్చింది. దివ్యాంగులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటికే బియ్యం అందజేస్తున్నట్టు ప్రకటించినా క్షేత్రస్థాయిలో సరిగా అమలుకావడం లేదు. ఎంఎల్ఎస్ పాయింట్లలో సరిపడా నిల్వలు ఉండక బఫర్ గోడౌన్ల నుంచి పంపుతున్న పరిస్థితి. గతంలో ఒక దుకాణానికి ఒకే సారి సరుకులు చేరవేస్తే ఇప్పుడు రెండు మూడు ట్రి ప్పులుగా అందిస్తున్నారు. ఒక్కోసారి బియ్యం, పంచదార పూర్తిస్థాయిలో రాక సరుకుల పంపిణీ ఇబ్బంది అవుతోంది. వచ్చిన మేరకు బియ్యం అందజేస్తుండగా పంచదార కోసం మరలా షాపులకు వెళ్లాల్సి వస్తుంది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉండి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రజాప్రతినిధులు చేసిన వాగ్దానాలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. IIలో uగత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 356 ఎండీయూ వాహనాల ద్వారా వినియోగదారుల చెంతకే సరుకులు అందజేసేవారు. తూకంలో కచ్చితత్వం, ఈ–పోస్ యంత్రాలకు జీపీఎస్ ట్రాకింగ్ అమర్చి సరుకుల అక్రమ రవాణాకు తెరదించారు. అలాట్మెంట్ మేరకు రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాలు, పాఠశాలలకు సరుకులు సరఫరా చేసేవారు. జిల్లాలోని ఉండి, తణు కు, తాడేపల్లిగూడెం, పెనుమంట్ర, పాలకొల్లు, నరసాపురంలోని మండల లెవిల్ స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లలో రెండు నెలలకు సరిపడా సరుకులు సిద్ధంగా ఉండేవి.2024 అక్టోబరులో కందిపప్పు పంపిణీ ప్రా రంభించిన చంద్రబాబు ప్రభుత్వం నాలుగు నెలలు తిరక్కుండానే చేతులెత్తేసింది. 2025 ఫిబ్రవరిలో అంతంతమాత్రంగా సరఫరా చేసి మార్చి నుంచి మొత్తం నిలిపివేసింది. కందిపప్పు కోసం డీడీలు తీయవద్దంటూ సివిల్ సప్లయీస్ అధికారులు ముందుగానే డీలర్లకు సమాచారం ఇస్తున్నారు. పంచదారకు కోత పెడుతున్నట్టు వినియోగదారులు చెబుతున్నారు. జిల్లాలోని మొత్తం కార్డుదారులకు దాదాపు 294 టన్నుల పంచదార అవసరమవుతుంది. సకాలంలో పూర్తిస్థాయిలో స్టాకు రాక సమస్య ఎదురవుతోంది. నవంబరు, డిసెంబరు నెలల్లో కొంతమంది కా ర్డుదారులకు చక్కెర అందలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజాపంపిణీ వ్యవస్థ అధోగతి పాలవుతోందని, పూర్తిస్థాయిలో సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు అంటున్నారు. గోధుమ పిండి కొందరికే.. జిల్లా కేంద్రానికే పరిమితం 6 శాతంలోపు కార్డుదారులకే పంపిణీ ఇప్పటికే సక్రమంగా జరగని సరుకుల సరఫరా మూణ్ణాళ్ల ముచ్చటైన కందిపప్పు పంచదారకు కోత వృద్ధులకు డోర్ డెలివరీకి ఆటంకాలు -
గెస్ట్ ఫ్యాకల్టీ ఆందోళన రెండో రోజుకు
నూజివీడు: ట్రిపుల్ ఐటీలో గెస్ట్ఫ్యాకల్టీ వేతనాలను యాజమాన్యం పెంచాలని డిమాండ్ చేస్తూ ఆర్జీయూకేటీ కాంట్రాక్టు టీచింగ్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న ఆందోళన శుక్రవారం రెండో రోజుకు చేరింది. దీనిలో భాగంగా ట్రిపుల్ఐటీ ప్రధాన గేటు వద్ద గెస్ట్ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు నజీర్ హుస్సేన్ మాట్లాడుతూ 2018లో నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 44మందిని గెస్ట్ ఫ్యాకల్టీగా నియమించారని, అప్పటి నుంచి రూ.25వేల వేతనానికే పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీజీతో పాటు డాక్టరేట్ చేసిన టీచర్లు ఎక్కడైనా ఇంత తక్కువ వేతనానికి పనిచేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఎన్నోమార్లు తమ వేతనాలను పెంచాలని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఏడేళ్లుగా వేతనాన్ని ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమతో పనిచేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భవ్యశ్రీ, రవినాయక్, విశ్వనాఽథ్, సునీత, రాజేంద్రరెడ్డి, నేతాజీ తదితరులు పాల్గొన్నారు. స్పందించకపోవడం దారుణం ట్రిపుల్ ఐటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిమాండ్లు పరిష్కరించాలని గత పది రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం అనాగరికమని సీఐటీయూ పట్టణ ప్రధాన కార్యదర్శి జీ.రాజు ధ్వజమెత్తారు. ఈ దీక్షకు సీఐటీయూ, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు సంఘీభావం తెలిపారు. -
ఉత్తమ వర్జీనియా రైతుగా షేక్ బాజీ
కొయ్యలగూడెం: మండలంలోని కన్నాపురానికి చెందిన షేక్ బాజీ ఉత్తమ వర్జీనియా రైతు అవార్డును అందుకున్నారు. గుంటూరులో శుక్రవారం జరిగిన పొగాకు బోర్డు గోల్డెన్ జూబ్లీ వార్షికోత్సవంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ, వేలం డైరెక్టర్ బి.శ్రీనివాస్, కార్యదర్శి డి.వేణుగోపాల్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా బాజీ మాట్లాడుతూ వర్జీనియా పొగాకు పండించడంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రైతులను పొగాకు బోర్డు సత్కరించి, అవార్డులు అందిస్తుందన్నారు. కొయ్యలగూడెం: సెంట్రల్ ఎకై ్సజ్ సవరణ చట్టం 2025 ద్వారా పొగాకు ఉత్పత్తులపై భారీగా పన్నులు పెంచడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జాతీయ ప్రధాన రహదారిపై ఎఫ్ఏఐఎఫ్ఏ నాయకులు రైతులు ఆందోళన నిర్వహించారు. ఇప్పటికే ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం, దేశీయ మార్కెట్లో ధరలు స్ధిరంగా ఉండటం, సాగు ఖర్చులు పెరగడం, నియంత్రణ కారణంగా సాగు విస్తీర్ణం తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారన్నారు. ఈ క్రమంలో అధిక పన్నులు రైతుల ఆదాయంపై ప్రభావం చూపడంతో పాటు, అక్రమ వ్యాపారం పెరుగుతుందన్నారు. చింతలపూడి: చింతలపూడి మండలం పట్టాయిగూడెం, ఊటసముద్రం గ్రామాల్లో పేకాట శిబిరాలపై శుక్రవారం పోలీసులు మెరుపు దాడులు చేశారు. దాడుల్లో 18 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.28,250 నగదును స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆదేశాల మేరకు, సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించినట్లు ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. పట్టాయగూడెంలో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.16,800 నగదు, ఊటసముద్రంలో 10 మందిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.11,450 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దెందులూరు: పోతునూరు గ్రామంలో రొయ్యల చెరువులపై కాపలా కాస్తున్న సత్తనపల్లి రవి ఆత్మహత్య చేసుకున్నాడు. దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ తెలిపిన వివరాల ప్రకారం.. భీమడోలు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన రవి శుక్రవారం సాయంత్రం చెరువులో వాడే టాబ్లెట్లు అధిక మొత్తంలో సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసి మృతికి గల కారణాలను విచారిస్తున్నామని ఎస్సై అన్నారు. -
నాణ్యత లేని ప్యాచ్ వర్కులు
ఉండి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో అధికారులు హడావుడిగా రోడ్డు మరమ్మతులు చేపట్టారు. అయి తే ప్యాచ్ వర్కులు తూతూమంత్రంగా నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. ఉండి–గణపవరం రోడ్డులో కొంతకాలం క్రితం కోలమూరు–ఆరేడు రోడ్డు మర్మమతుల పనులు ముగించారు. కొత్త ఏడాదిలో ఉండి సెంటర్ నుంచి కోలమూరు వరకు పనులు చేపట్టారు. అయితే ఈ పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చారని వాహనచోదకులు అంటున్నారు. గోతులు పూడ్చే సమయంలో మట్టిని పూర్తిగా తొలగించాల్సి ఉండగా కొన్ని ప్రాంతాల్లో పట్టించుకోవడం లేదు. ఇష్టానుసారం గోతులు పూ డ్చుతున్నారు. గ్రావెల్ దానిపై తారు అతి తక్కు వగా వేసి పైన బేబీ చిప్స్ వంటివి వేసి మమ అనిపించేస్తున్నారు. దీని వల్ల ప్రజాధనం వృథా తప్ప అవుతుందని, కొద్దిరోజుల్లోనే గోతులు యథాతథంగా నిలిచి రోడ్డు సాధారణ స్థితికి వచ్చేయడం ఖా యమని స్థానికులు అంటున్నారు. పనులు జరిగే సమయంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కారణమని చెబుతున్నారు. -
జాడ లేని డూడూ బసవన్నలు
● కష్టతరంగా గంగిరెద్దు కుటుంబాల జీవనం ● కనుమరుగవుతున్న సంక్రాంతి సందడి చింతలపూడి : తెలుగువారి సంస్కృతికి, సంప్రదాయానికి ప్రతీక గంగిరెద్దులాట. సంక్రాంతి వస్తుందంటే చాలు.. రంగు రంగుల బట్టలు, గంటలు, మువ్వలతో అలంకరించిన బసవన్నలు ఇంటింటికీ తిరిగి అలరించేవి. కాలక్రమేణా శ్రీడూడూ బసవన్నశ్రీ గొంతులు మూగబోతున్నాయి. ఆదరణ కరువై, పొట్టకూటి కోసం గంగిరెద్దులను ఆడించే వారు వేరే పనులు చూసుకుంటున్నారు. పూర్వకాలం నుండి ఈ కళనే నమ్ముకున్నారు. ఎడ్లను తమ కన్న బిడ్డల్లా సాకుతూ, వాటికి విద్యలు నేర్పి, ఊరూరా తిరుగుతూ తెలుగు లోగిళ్లలో పండుగ వెలుగులు నింపుతారు. ఆధునిక కాలంలో యాంత్రిక జీవనం పెరగడం, వినోద సాధనాలు మారడంతో ఈ కళ తన ప్రాభవాన్ని కోల్పోతుంది. ఒకప్పుడు ఊరు మొత్తం ఎదురుచూసే ఈ ప్రదర్శనను ఇప్పుడు గడప దాటి పలకరించే నాథుడే కరువయ్యాడు. సంక్రాంతి రోజుల్లోనే.. గంగిరెడ్ల వారికి ఏడాది పొడవునా పనేమీ ఉండదు. కేవలం సంక్రాంతి పండుగ (ధనుర్మాసం) ప్రారంభంలో పండుగ వచ్చే నెల రోజుల ముందే వీరికి కాస్తో కూస్తో ఆదరణ లభిస్తుంది. పండుగ సమయంలో గ్రామస్తులు ఇచ్చే పాత బట్టలు, ధాన్యం, చిల్లర డబ్బులే వీరికి ప్రధాన ఆదాయ వనరు. బసవన్నలను అలంకరించడానికి, వాటి మేత కోసం చేసే ఖర్చులతో పోలిస్తే వచ్చే ఆదాయం నామమాత్రమే.. అపార్ట్మెంట్ సంస్కృతి పెరగడం వల్ల నగరాల్లో గంగిరెద్దుల రాక దాదాపు నిలిచిపోయింది. వృత్తిని వదిలేయలేక, పొట్ట నింపుకోలేక గంగిరెద్దుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఊరూరా తిరిగే సంచార జీవనం వల్ల వీరి పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. వీరి తాత, ముత్తాతలు, తండ్రులు పడుతున్న కష్టాలు చూడలేక తర్వాతి తరం కూలి పనులకు వెళ్తోంది. వీరికి స్థిర నివాసం లేకపోవడం వల్ల రేషన్ కార్డులు, ఓటరు కార్డులు వంటి ప్రభుత్వ ఫలాలు అందడం గగనంగా మారుతోంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సుమారు 250 కుటుంబాలకు పైగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఒకప్పుడు ఊరురా గౌరవం పొందిన ఈ కళాకారులు, నేడు సరైన ఆదరణ లేక ఇతర పనుల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రాభవం తగ్గడానికి కారణాలు యాంత్రీకరణ వల్ల వ్యవసాయంలో ఎద్దుల వినియోగం తగ్గిపోయింది. వినోద సాధనాలు, టీవీలు, స్మార్ట్ఫోన్ల రాకతో జానపద కళలపై ఆసక్తి తగ్గింది. ఆర్థిక ఇబ్బందులు, ఎద్దుల పోషణ ఖరీదుగా మారింది. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేదు సంస్కృతిని కాపాడుకుందాం గంగిరెద్దులాట కేవలం ప్రదర్శన కాదు, అది మన వ్యవసాయ ఆధారిత నాగరికతకు ప్రతిరూపం. తెలుగు వారి సంప్రదాయాన్ని ప్రతిబింబించే గంగిరెద్దులాట అంతరించిపోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రభుత్వం ఈ కళాకారులను గుర్తించి, పెన్షన్లతో పాటు ఎద్దుల మేతకు సబ్సిడీ వంటి రాయితీలు కల్పించి, ఈ జానపద కళను కాపాడాలి. సాంస్కతిక ప్రదర్శనల్లో వారికి ప్రాధాన్యత కల్పించాలి. మా తాతలు, తండ్రుల కాలంలో మాకు రాజమర్యాదలు జరిగేవి. ఇప్పుడు పట్టణాల్లో అయితే అడుక్కునే వారిలా చూస్తున్నారు. ఎద్దును చూసి మురిసిపోయే కాలం పోయింది. ఎద్దు పొట్ట నింపడమే ఇప్పుడు మాకు గగనమైపోయింది దీంతో చాలా మంది ఈ కష్టాన్ని భరించలేక కూలీ పనులకు వెళ్తున్నారు. – ఆవుల మంగయ్య, గంగిరెద్దుల కళాకారుడు -
దేశ సేవలో అసువులు బాసి.. తీరని వేదన మిగిల్చి..
కాళ్ల: దేశ సేవలో తరించాలన్న ఆ యువకుడి ఆశ యం నెరవేరలేదు.. కొడుకుపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి.. కుమారుడి మృతి వార్త తెలియగానే ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ శిక్షణను దిగ్విజయంగా పూర్తిచేసుకుని విధుల్లో చేరిన తమ ఊరి బిడ్డ ఇక లేడని తెలిసి ఊరంతా కన్నీరు పెట్టింది.. ఢిల్లీలో జరిగిన రైలు ప్రమాదంలో కాళ్ల మండలం బొండాడపేటకు చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బొర్రా సత్యనారాయణ (నాని) (26) మృతిచెందారు. సీఆర్పీఎఫ్ అధికారులు మృతదేహాన్ని గ్రా మానికి తీసుకువచ్చి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బొండాడపేటలో విషాద ఛాయలు బొండాడపేటకు చెందిన బొర్రా నాగరాజు, జయ దంపతుల రెండో కుమారుడు సత్యనారాయణ గతేడాది సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. ఢిల్లీ విధులు నిర్వహిస్తున్నారు. శిక్షణతో పాటు ఆయన పనిచేసింది కేవలం 9 నెలలు మా త్రమే. కనీసం ఇల్లు కూడా సరిగాలేని నాగరాజు కూలీ పనులు చేసుకుంటూ కుమారుడిని చదివించారు. మిలట్రీలో చేరాలన్న కొడుకు ఆశలు నెరవేర్చారు. ఇటీవల సెలవుపై వచ్చిన నాని త్వరలో ఇల్లు కట్టించి తల్లిదండ్రుకు ఏ కష్టం రానివ్వనని మాటిచ్చి వెళ్లారు. ఇంతలోనే డిసెంబర్ 31న ఢిల్లీలో మధుర వద్ద జరిగిన రైలు ప్రమాదంలో నాని మృతిచెందినట్టు సమాచారం వచ్చింది. ప్రత్యేక విమానంలో భౌతికకాయం నాని భౌతికకాయాన్ని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం రాజమహేంద్రవరానికి పంపించా రు. అక్కడి నుంచి సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండర్ దినేష్కుమార్ శర్మ, ఎస్సై వెంకన్న, ఎనిమిది మంది సిబ్బందితో గ్రామానికి తీసుకొచ్చారు. మండలంలోని జక్కరం కాటన్ పార్కు వద్దకు చేరుకున్న గ్రా మస్తులు, యువత అక్కడి నుంచి భారీ ఊరేగింపుగా భౌతికకాయాన్ని నాని ఇంటికి తీసుకువచ్చారు. స్థానిక పాఠశాల విద్యార్థులు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నానికి సంబంధించి వస్తువులు, దుస్తులు అన్నీ జాతీయ జెండాలో మూటకట్టి కమాండర్ దినేష్కుమార్ శర్మ వాటిని తండ్రి నాగరాజుకు అప్పగించారు. దినేష్కుమార్ శర్మ ఆధ్వర్యంలో సర్పంచ్ మధుసూదనరావు, ఎస్సై శ్రీనివాసరావు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి సిబ్బంది నివాళులర్పించారు. మిన్నంటిన రోదనలు నాని మృతి వార్త తెలిసినప్పటి నుంచి తల్లిదండ్రు లు, సోదరి రోదనలు మిన్నంటాయి. భౌతి కకాయం వద్ద వారు రోదించిన తీరు కన్నీరు పెట్టించింది. శివయ్యా.. నా కొడుకును ఎందుకు తీసుకున్నావ్ అంటూ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. భౌతికకాయాన్ని ఊరేగింపుగా తీసుకువస్తున్న గ్రామస్తులు కుమారుడి మరణ వార్త తెలిసి విలపిస్తున్న తల్లి జయ ఢిల్లీలో రైలు ప్రమాదంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి కన్నీటి సంద్రమైన బొండాడపేట భారీ ర్యాలీగా భౌతికకాయం తరలింపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు -
రైలు ఢీకొని వృద్ధుడి మృతి
తణుకు అర్బన్: రైలు ఢీకొట్టి వృద్ధుడు మృతిచెందిన ఘటన తణుకు రైల్వే అవుట్ పోస్టు ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగింది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. తణుకు మండలం కోనాలకు చెందిన సనమండ్ర గాంధీ(60) కొబ్బరికాయల దింపు కార్మికుడుగా పనిచేసేవాడు. పదేళ్ల క్రితం చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగలడంతో వైద్యులు కుడి చేయి తొలగించారు. అప్పటి నుంచి కొబ్బరికాయలు కొని, అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఇంటి నుంచి బయటకు వచ్చిన గాంధీ తిరిగి ఇంటికి వెళ్లలేదు. శుక్రవారం ఉదయం రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన ఉదంతంతో గుర్తించిన కుటుంబ సభ్యులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టి మృతిచెందినట్లు రైల్వే ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. -
సమస్యల పరిష్కారానికి సహకరించాలి
భీమవరం: సమస్యల పరిష్కారం కేవలం అధికారుల ద్వారానే సాధ్యం కాదని, ప్రజల సహకారం అవసర మని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడుతూ గతేడాది సాధించిన ప్రగతిని వివరించారు. అన్ని శాఖల సమష్టి కృషితో లక్ష్యాలను సాధించామన్నారు. ఖరీఫ్ సీజన్లో 67 వేల మంది రైతుల నుంచి 4.33 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి రూ.987 కోట్లు వారి బ్యాంకు ఖాతాలో జమచేశామన్నారు. రబీ సీజన్కు సంబంధించి 38 వేల టన్నుల యూరియాను సిద్ధం చేశామన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. 100 మంది పేద మత్స్యకారులకు పీఎం లంకలో బోట్ల నిర్మాణం జరుగుతోందన్నారు. జిల్లాలో గురప్రుడెక్క నుంచి కంపోస్టు తయారు చేసేందుకు మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. తాడేపల్లిగూడెంలో కోకో ఉత్పత్తుల ద్వారా మహిళా సంఘాలు చాక్లెట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధి పథంలో నడుస్తున్నారన్నారు. అలాగే మహిళా సంఘాలకు సముద్రపు నాచు తయారీలో శిక్షణ ఇచ్చామన్నారు. జిల్లాలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. తణుకు ఏరియా ఆస్పత్రికి రాష్ట్రస్థాయి కాయకల్ప అవార్డు లభించిందన్నారు. పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనలో జిల్లా రెండో స్థానంలో, అకడమిక్ పెర్ఫార్మెన్స్లో 5వ ర్యాంకు సాధించిందని కలెక్టర్ వివరించారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
రుచి మధురం.. నాణ్యతలో ప్రథమం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న మధురమైన ప్రసాదానికి మొదటి ర్యాంక్ దక్కింది. అలాగే భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనలో రెండో ర్యాంక్ లభించింది. రాష్ట్రంలోని ఏడు ప్రధా న ఆలయాలకు వస్తున్న భక్తులకు ఆయా దేవస్థానా లు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో ద్వారకాతిరుమల దేవస్థానానికి సంతృప్తికర ఫలితాలు వచ్చాయి. శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, అన్నవరం, విజయవాడ, సింహాచలం, కాణిపాకం, శ్రీశైలం దేవస్థానాల్లో భక్తులకు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం గత నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకూ వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా సర్వేను నిర్వహించి, ర్యాంకులను ప్రకటించింది. ఇందులో శ్రీకాళహస్తి 71.2 శాతంతో మొదటి ర్యాంక్ సాధించింది. అలా గే ద్వారకాతిరుమల 70.7 శాతంతో రెండో ర్యాంక్, విజయవాడ 68.1 శాతంతో మూడో ర్యాంక్, అన్న వరం 67.9 శాతంతో నాల్గో ర్యాంక్, సింహాచలం 67.8 శాతంతో ఐదో ర్యాంక్, శ్రీశైలం 67.5 శాతంతో ఆరో ర్యాంక్, కాణిపాకం 66 శాతంతో ఏడో ర్యాంక్ను సాధించాయి. అయితే ప్రసాదాల నాణ్య త, రుచిలో మాత్రం ద్వారకాతిరుమల దేవస్థానా నికి మొదటి స్థానం లభించింది. రుచి, శుచిలో మేటి శ్రీవారి దేవస్థానం భక్తులకు లడ్డూ, పులిహోర, శర్కర పొంగలి, వడ ప్రసాదాలను అందిస్తోంది. అలాగే నిత్యం వేలాది మంది భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందజేస్తోంది. నాణ్యత, రుచిలో ఈ ప్రసాదాలు అద్భుతమని భక్తుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే రాష్ట్రంలోని ఏడు ప్రముఖ ఆలయాల్లో ద్వారకాతిరుమల శ్రీవా రి ప్రసాదాలకు రుచి, నాణ్యతలో మొదటి స్థానం లభించింది. డిప్యూటీ కమిషనర్ హోదా కలిగిన రాష్ట్రంలోని 15 ఆలయాల్లో ఉరుకుంద దేవస్థానానికి మొదటి ర్యాంక్ లభించింది. దేవస్థానాల వారీగా మోపిదేవికి 2వ, విశాఖపట్నంకు 3వ, వాడపల్లికి 4వ, చౌడేపల్లికి 5వ ర్యాంక్, పెంచలకోనకు 6వ ర్యాంక్, మహానందికి 7వ ర్యాంక్, తునికి 8వ ర్యాంక్, అరసవెల్లికి 9వ ర్యాంక్, పెనుగంచిప్రోలుకు 10వ ర్యాంక్, కదిరికి 11వ ర్యాంక్, పెదకాకానికి 12వ ర్యాంక్, బేతంచర్లకు 13వ ర్యాంక్, తిమ్మరాజుపాలెంకు 14వ ర్యాంక్, కసాపురానికి 15వ ర్యాంకులు లభించాయి. దర్శనం సంతృప్తికరంగా జరిగిందా, లేదా. ఆలయాల్లో మౌలిక వసతులు, తాగునీరు, వాష్ రూమ్లు, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలు బాగున్నాయా, లేదా. ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా, లేదా. ఆలయాల్లో పారిశుద్ధ్యం నిర్వహణ సంతృప్తికరంగా ఉందా, లేదా. ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో చినవెంకన్న దర్శనం సంతృప్తికరంగా జరిగిందని 71.5 శాతం మంది, జరగలేదని 28.5 శాతం మంది తెలిపారు. అలాగే తాగునీరు సదుపాయం, ఇత ర మౌలిక వసతులు బాగున్నాయని 65.5 శాతం మంది, బాగోలేదని 34.5 శాతం మంది తెలిపారు. ప్రసాదం తాజాగా, రుచిగా బాగుందని 81.7 శాతం మంది, బాగోలేదని 18.3 శాతం మంది తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ బాగుందని 66.4 శాతం మంది, బాగోలేదని 33.6 శాతం మంది తెలిపారు. శ్రీవారి ప్రసాదానికి ఫస్ట్ ర్యాంకు చినవెంకన్న దేవస్థానం అందిస్తున్న సేవలకు భక్తుల సంతృప్తి ప్రభుత్వం నిర్వహించిన వాట్సాప్, ఐవీఆర్ఎస్ సర్వేలో వెల్లడి నాలుగు అంశాలపై సర్వే -
భక్తుల కొంగు బంగారం.. మావుళ్లమ్మ
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం పట్టణ ఇలవేల్పు, భక్తులపాలిట కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే తల్లి మావుళ్లమ్మవారి 62వ వార్షిక మహోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. నీరుల్లి కూరగాయ, పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో దేవస్థానం సహకారంతో ఈనెల 13 నుంచి వచ్చేనెల 14 వరకు జాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే అమ్మవారి అలంకరణ పనులు పూర్తయ్యాయి. ఆలయం వద్ద చలువ పందిళ్లు, భారీ సెట్టింగ్లు, క్యూలైన్, లైటింగ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయానికి నలుదిక్కులా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సెట్టింగ్లు, విద్యుత్ దీపా ల అలంకరణలకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా భక్తులు : ఉత్సవాలను తిలకించేందుకు జిల్లాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజుల్లో ఆలయం కిటకిటలాడుతుంది. సంక్రాంతికి జిల్లాకు వచ్చే ఇతర ప్రాంతాల వాసులు అమ్మవారిని దర్శించుకోవడం సెంటిమెంట్గా భావిస్తారు. ఇలా నెల రోజుల పాటు ఆలయం వద్ద భక్తజన సందడి ఉంటుంది. ముఖ్యంగా ఆలయం వద్ద విద్యుత్ అలంకరణ, సెట్టింగులు చూసేందుకు పలువురు వస్తుంటారు. మహా అన్నసమారాధన ఉత్సవాల రోజుల్లో ఆలయం వద్ద ఉత్సవ నిర్వాకులు అన్నదానం నిర్వహిస్తారు. రోజుకు సుమారు 7 వేల మంది వరకు భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. అలాగే ఉత్సవాల చివరి రోజు మహా అన్నదానం నిర్వహిస్తారు. ఆ రోజున సుమారు లక్ష మంది అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. 61 ఏళ్లుగా ఉత్సవాలు 61 ఏళ్లుగా నీరుల్లి కూరగాయ, పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో నెలరోజుల పాటు నిర్వహించే ఏకైక ఉత్సవంగా మావుళ్లమ్మ జాతర నిలుస్తుంది. గతంలో ఉత్సవాల్లో సినిమా నటులను సన్మానించి బంగారాన్ని బహూకరించేవారు. నిలువెత్తు స్వర్ణమయం : అమ్మవారిని నిలువెత్తు స్వర్ణమయం చేయడానికి దాతలు, భక్తుల నుంచి బంగారాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 73 కిలోల బంగారం సేకరించగా 60 కిలోల వరకూ ఆభరణాలు తయారు చేసి అమ్మవారికి అలంకరించారు. మరో 13 కిలోల బంగారం ఆభరణాల తయారీకి సిద్ధం చేశారు. అయితే ఉన్నతాధికారుల అనుమతులతో ఆలస్యమవుతోంది. మొత్తంగా 100 కిలోలు బంగారు ఆభరణాలను అమ్మవారికి అలంకరించాలనే లక్ష్యంగా ఆలయ అధికారులు, ఉత్సవ నిర్వాహికులు దాతలను ప్రోత్సహిస్తున్నారు. ఆలయం వద్ద సెట్టింగ్కు ఏర్పాట్లు సిరుల తల్లి.. కల్పవల్లి 13 నుంచి అమ్మవారి ఉత్సవాలు నెల రోజులపాటు వేడుకలు ఆలయం వద్ద చురుగ్గా ఏర్పాట్లు రూ.90 లక్షలతో జాతర నిర్వహణ రూ.90 లక్షల వ్యయంతో.. ఏటా రూ.80 లక్షల నుంచి రూ.90 లక్షలతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మరింత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ సెట్టింగ్స్, లైటింగ్స్ ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జానపద, భరత నాట్య ప్రదర్శనలు, హరికథ, బుర్రకథ వంటి కళాప్రదర్శనలు, సినీ సంగీత విభావరులు ఏర్పాటుచేస్తారు. సుమారు 30 నాటకాలు, 20 హరికథ, బుర్రకథలు, 15 వరకూ సినీ సంగీత విభావరీ కార్యక్రమాలు ఉంటాయి. ఇలా ఆదరణ కోల్పోతున్న నాటకాలను ప్రోత్సహించి నాటక కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నారు. -
కొత్త సొబగులతో కనువిందు
కై కలూరు: పక్షి ప్రేమికుల స్వర్గథామంగా పేరుగడించిన ఆటపాక పక్షుల విహార కేంద్రం కొత్త సొబగులను సంతరించుకుంది. మోంథా తుపాను ధాటికి కోతకు గురైన పక్షుల విహార చెరువుకు అటవీశాఖ అధికారులు మరమ్మతులు చేయించారు. ఐసీఐసీఐ బ్యాంకు సామాజిక సేవలో భాగంగా రూ.20 లక్షలతో పక్షులు నివసించడానికి 50 కృత్రిమ ఇనుప స్టాండ్లు, విద్యుత్ సోలార్ను సమకూర్చింది. నూతన సంవత్సరం, సంక్రాంతి పండగలకు పర్యాటకులను ఆకర్షించడానికి అటవీశాఖ అధికారులు కేంద్రంలో అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. కొల్లేరులో పక్షుల వీక్షణకు అనువైనది శీతాకాలం. ఏడాదిలో నవంబరు నుంచి మార్చి వరకు స్వదేశీ, విదేశీ పక్షులు సందడి కొల్లేరులో కనిపిస్తుంది. అరుదైన పెలికాన్(గూడబాతు) పక్షుల వేలాదిగా ఆటపాక కేంద్రానికి రావడంతో దీనికి ‘పెలికాన్ ఫ్యారడైజ్’ నామకరణం చేశారు. ఇక్కడ పక్షుల విహారానికి 285 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. పక్షుల సంతానోత్పత్తి, అవాసాల కోసం 176 కృత్రిమ ఇనుప స్టాండ్లను అటవీశాఖ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆటపాక పెలికాన్ పక్షులు సంతానోత్పత్తి చేశాయి. ప్రస్తుతం ఆటపాకలో పెలికాన్, పెయింటెడ్ స్టార్క్, బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్, గ్రేహెరాన్, గ్లోబిహైబీస్ పక్షులు సందడి చేస్తున్నాయి. ఆటపాకలో అభివృద్ధి పనులు.. ఇటీవల మోంథా తుపాను దాటికి ఆటపాక పక్షుల విహార కేంద్రం అతలాకుతలమైంది. చెరువు గట్లు కోతకు గురయ్యాయి. దీంతో కొన్ని వారాల పాటు పక్షుల కేంద్రాన్ని మూసివేశారు. అనంతరం అటవీశాఖ రూ.9 లక్షల నిధులతో పక్షుల కేంద్రం టికెట్ కౌంటర్ నుంచి ఈఈసీ కేంద్రం వరకు 600 మీటర్ల రోడ్డును ఏర్పాటు చేసింది. కోతకు గురైన గట్లకు మరమ్మతులు చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా రూ.20 లక్షలతో పక్షుల ఆవాసాలకు 50 ఇనుప కృత్రిమ స్టాండ్లు, ఈఈసీ కేంద్రం విద్యుత్ అవసరరాలకు సోలార్ యంత్రాన్ని అందించారు. ఇటీవల రూ.15 లక్షలతో నూతన బోటును తీసుకొచ్చారు. ఇప్పుడు పక్షుల వీక్షణకు పర్యాటకులకు మూడు బోట్లు అందుబాటులో ఉన్నాయి. కొల్లేరు ప్రాంతంలో కొల్లేరు ఉత్సవాన్ని రెండు రోజుల పాటు నిర్వహించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. పక్షుల వీక్షణకు ఇదే అనువైన కాలమవడంతో త్వరలో తేదీలను ప్రకటించనున్నారు. జిల్లా టూరిజం శాఖకు కొల్లేరు ఉత్సవ ఏర్పాట్లను అప్పగించారు. ఆటపాక, ఏలూరు మండలంలో పక్షుల విహార ప్రాంతాలను ఎంపిక చేసి కొల్లేరు ఉత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. పక్షుల వీక్షణ, బైనాక్యులర్స్ ఏర్పాటు, బోటింగ్, తదితర కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. వీటిలో పాటు దేవాలయాలు, పర్యాటక కేంద్రాల వివరాలతో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు వాటి వివరాలు తెలిపేలా సూచికలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పక్షుల రాకతో కొల్లేరు సరస్సు కళకళలాడుతోంది. పర్యాటలకు కోసం అటవీశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. త్వరలో నిర్వహించనున్న కొల్లేరు ఉత్సవం మరింత శోభ తేనుంది. ఆటపాక పక్షుల విహార కేంద్రానికి మరమ్మతులు చేశాం. నూతన బోటు పర్యాటలకు అందుబాటు ఉంచాం. నూతన ఏడాది, సంక్రాంతి పండగలకు ఏక్కువ సంఖ్యలో యాత్రికులు విచ్చేస్తారని భావిస్తున్నాం. – కే.రామలింగాచార్యులు, ఫారెస్టు రేంజర్, కై కలూరు. పక్షుల విహార కేంద్రానికి పర్యాటకుల సందడి ఐసీఐసీఐ బ్యాంకు రూ.20 లక్షల సాయంతో కృత్రిమ స్టాండ్లు, సోలార్ కొల్లేరు ఉత్సవానికి సన్నాహాలు -
అంజన్నకు విశేష పూజలు
జంగారెడ్డిగూడెం: నూతన సంవత్సరం సందర్భముగా గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. జంగారెడ్డిగూడెం పట్టణం, మండలంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానానికి వివిధ సేవల రూపేణా రూ.3,97,450 ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనరు, కార్యనిర్వహణాధికారిణి ఆర్వీ చందన తెలిపారు. స్వామివారిని బిగ్బాస్ సీజన్ 9 సెకండ్ రన్నరప్ డెమోన్ పవన్ దర్శించుకున్నారు. నూజివీడు: జాతీయస్థాయి సీనియర్ బాస్కెట్బాల్ పోటీలకు నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంపికయ్యారు. పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న బేతాళ ప్రభుదీపిక, షేక్ ఆస్రా చైన్నెలో ఈనెల నాలుగో తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొననున్నారు. వీరిని నూజివీడు డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్, పరిపాలనాధికారి లక్ష్మణరావు, డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి, పీడీ సుబ్బలక్ష్మి అభినందించారు. ద్వారకాతిరుమల: క్షేత్రంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవాలు శ్రీవారి వైభవాన్ని చాటుతున్నాయి. నిత్యం ఆలయంలో సుప్రభాత సేవకు బదులు, తిరుప్పావై పాశురాలను పఠిస్తున్నారు. అలాగే స్వామివారి గ్రామోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. అందులో భాగంగా గురువారం ఉదయం జరిగిన శ్రీవారి తిరువీధి సేవ ఆదం్యతం భక్తులకు నేత్రపర్వమైంది. ఉదయం ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, విశేష పుష్పాలంకారాలు చేశారు. పూజాధికాల అనంతరం స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అశ్వ, గజ సేవలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. అనంతరం స్థానిక ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవికి అర్చకులు విశేష పూజలు జరిపి, హారతులిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించి, తీర్థప్రసాదాలను స్వీకరించారు. -
ఎరువు.. ధర బరువు
సాక్షి, భీమవరం: మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఉంది రైతుల పరిస్థితి. ఖరీఫ్ చివరిలో మోంథా, దిత్వా తుపాన్ల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు రబీ ఆరంభంలోనే ఎరువుల ధరల రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. కాంప్లెక్స్ ఎరువులు బస్తాకు రూ.100 నుంచి రూ.220లు వరకు పెరిగాయి. జిల్లాలో 2.22 లక్షల ఎకరాల్లో రబీ సాగు జరుగనుండగా ఎరువుల రూపంలో రైతులపై దాదాపు రూ.15.40 కోట్ల మేర భారం పడుతుంది. రబీలో వినియోగం ఎక్కువ ఖరీఫ్తో పోలిస్తే రబీలో ఎరువుల వినియోగం ఎక్కువ. ఎకరాకు నాలుగు బస్తాల వరకు రెండు మూడు రకాల కాంప్లెక్స్ ఎరువులు, రెండు బస్తాల యూరియా, అర బస్తా వరకు పొటాష్ వినియోగిస్తుంటారు. జిల్లాలోని 2.22 లక్షల ఎకరాల్లో రబీ సాగు జరుగనుంది. 70 శాతం మేర ఎంటీయూ 1121, మిగిలిన విస్తీర్ణంలో పీఆర్ 126, ఎంటీయూ 1153, ఎంటీయూ 1156 రకాలను సాగు జరుగనుంది. వ్యవసాయ లెక్కలు ప్రకారం ఈ సీజన్లో 41,921 టన్నుల యూరియా, 64,992 టన్నుల ఇతర ఎరువులు అవసరం కానున్నాయి. నత్తనడకన సాగు : మోంథా, దిత్వా తుపాన్లు వలన రైతులకు ఖరీఫ్ కలిసి రాలేదు. మోంథా ప్రభావంతో ఆకివీడు, నరసాపురం, భీమవరం, పెంటపాడు, మొగల్తూరు తదితర మండలాల్లోని 25వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. మాసూళ్లు సమయంలో దిత్వా తుపాను మరింత నష్టం కలిగించింది. తొలకరిలో ఎకరాకు సగటున 26.25 క్వింటాళ్లు చొప్పున జిల్లాలో సాగు చేసిన 2.08 లక్షల ఎకరాలకు 5.77 లక్షల టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా తుపాన్ల వలన సగటు 21 క్వింటాళ్లతో 4.62 లక్షల టన్నులు మాత్రమే వచ్చింది. ఈ మేరకు క్వింటాల్కు మద్దతు ధర రూ.2,369 మేరకు తగ్గిన దిగుబడి 1.15 లక్షల టన్నులకు గాను రూ.242.43 కోట్ల మేర రైతులు నష్టపోయారు. పంట పెట్టుబడులు దక్కకపోవడంతో దాళ్వా పైనే ఆశలు పెట్టుకున్నారు. ముందుగా తొలకరి మాసూళ్లు పూర్తయిన తాడేపల్లిగూడెంలో నాట్లు మొదలవ్వగా పెంటపా డు, అత్తిలి, పాలకోడేరు, ఇరగవరం, పెనుమంట్ర, వీరవాసరం, పోడూరు, పెనుగొండ తదితర మండలాల్లో నారుమడులు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో నారుమడులు పోయడం దాదాపు పూర్తికావాల్సి ఉండగా బ్యాంక్ కెనాల్, నరసాపురం, అత్తిలి, జీఅండ్వీ, ఉండి, కాకరపర్రు తదితర కాలువల పరిధిలోని శివార్లకు పూర్తిస్థాయిలో నీరందక పనులకు ఆలస్యమైంది. ప్రారంభంలోనే సాగునీటి స మస్య ఎదురవ్వడంతో మున్ముందు వంతుల వారీ విధానం మొదలై ఎండలు ముదిరేకొద్దీ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఉంది. ఖరీఫ్ మి గిల్చిన నష్టంతో రబీ పెట్టుబడులకు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఎరువుల ధరలు పెరగడం వా రిని మరింత ఆవేదనకు గురిచేస్తోంది. రకం పాత ధర కొత్త ధర 10:26:26 రూ.1,700 రూ.1,920 14:35:14 రూ.1,800 రూ.1,950 20:20:013 రూ.1,300 రూ.1,400 రైతు నెత్తిన పిడుగు కాంప్లెక్స్ ఎరువుల ధరలకు రెక్కలు బస్తాకు రూ.100 నుంచి రూ.220 వరకు పెంపు జిల్లాలో 2.22 లక్షల ఎకరాల్లో దాళ్వా సాగు రైతులపై రూ.15.40 కోట్ల అదనపు భారం ఇప్పటికే ఖరీఫ్ కలిసిరాక, దాళ్వా పెట్టుబడులకు సొమ్ములు లేక అవస్థలు రూ.15.40 కోట్ల భారం కాంప్లెక్స్ ఎరువుల ధరలను ఇటీవల కంపెనీలు పెంచేశాయి. ఈ సీజన్లో ఎక్కువగా వినియోగించే 10:26:26 కాంప్లెక్స్ ఎరువు (50 కేజీలు) రూ.220లు పెరగ్గా, 14:35:14, 20:20:013, ఇతర రకాలు రూ.100 నుంచి రూ.150ల వరకు పెరిగాయి. ఈ మేరకు ఎకరాకు రూ.700ల వరకు రైతులపై అదనపు భారం పడనుందని అంచనా. జిల్లాలోని 2.22 లక్షల ఎకరాలకు గాను రైతులపై రూ.15.40 కోట్ల మేర అదనంగా భారం పడుతోంది. -
కేజీబీవీల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లాలోని కుకునూరు, వేలేరులోని కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టులను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్టు సమగ్రశిక్ష ఏలూరు జిల్లా అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ కె.పంకజ్కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. కుకునూరులో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, వేలేరులో ఏఎన్ఎం పోస్టులు ఉన్నాయని, సంబంధిత మండలాలకు చెందిన మహిళలు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తులను 11వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఏలూరులోని తన కార్యాలయంలో సమర్పించాలని సూచించా రు. జిల్లాస్థాయి కమిటీ ద్వారా ఎంపిక నిర్వహిస్తారని తెలిపారు. -
మోటార్సైకిళ్లు ఢీకొని వ్యక్తి మృతి
మరొకరికి గాయాలు తాడేపల్లిగూడెం రూరల్: ఎదురెదురుగా రెండు మోటారు సైకిళ్లు గురువారం తెల్లవారుజామున్న ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైనట్లు రూరల్ ఎస్సై జేవీఎన్ ప్రసాద్ తెలిపారు. తాడేపల్లిగూడెం మండలంలోని కుంచనపల్లి గ్రామానికి చెందిన తాడేపల్లి మహిమారావు (21) బైక్పై మెట్ట ఉప్పరగూడెం వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తుండగా, కుంచనపల్లి శ్మశాన వాటిక సమీపంలో ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్ను ఢీకొన్నాడు. అనంతరం పక్కనే ఉన్న రాయిని ఢీకొట్టి రోడ్డుపై పడిపోయాడు. దీంతో మహిమారావు తలకు బలమైన గాయం కావడంతో తొలుత ఏలూరు, అక్కడ నుంచి విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో మోటార్సైకిల్పై ఉన్న కోమటి నాగబాబుకు గాయాలు కాగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. క్షతగాత్రుడు నాగబాబు ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరో ఇద్దరికి గాయాలు జంగారెడ్డిగూడెం: కేఆర్పురం ఐడీటీఏ డీడీకి చెందిన వాహనం మోటార్సైకిల్ను ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్తాన్కు చెందిన అమరారాం చౌదరి (24) జంగారెడ్డిగూడెంలోని ఓ ఫ్యాన్సీ స్టోర్లో పనిచేస్తున్నాడు. గురువారం వేగవరం సమీపంలో ఒక వ్యక్తి నడుచుకుని వెళుతుండగా, మరో వ్యక్తి సైకిల్పై వెళుతున్నాడు. వీరిద్దరిని తప్పించే క్రమంలో కేఆర్పురం ఐడీటీఏ డీడీకి చెందిన వాహనం ఎదురుగా వస్తున్న అమరారాం చౌదరి మోటార్సైకిల్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అమరారాం చౌదరి అక్కడికక్కడే మృతిచెందాడు. చౌదరి వ్యాపారం నిమిత్తం అశ్వారావుపేట వెళ్లి తిరిగి జంగారెడ్డిగూడెం వస్తుండగా ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై ఎన్వీ ప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై కుటుంబరావు, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంలో నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు, సైకిల్పై వెళుతున్న వ్యక్తి బేతాళ వెంకటపతి గాయపడినట్లు ఎస్సై తెలిపారు. -
మెప్మా.. న్యాయం చెప్పమ్మా
ఆకివీడు: యానమిటేర్లు డ్వాక్రా మహిళలను ముంచేశారు. వారి పేరిట రుణాలు రూ.2.80 కోట్లు తీసుకుని పరారయ్యారు. రుణాలు చెల్లించాలని బ్యాంకుల నుంచి డ్వాక్రా మహిళలకు నోటీసులు రావడంతో విషయం బయటపడింది. ఇది జరిగి 20 రోజులు గడుస్తున్నా పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) అధికారుల్లో మాత్రం చలనం లేదు. దీంతో తీసుకుని రుణాలు తాము ఎక్కడ చెల్లంచగలమని బాధితులు లబోదిబోమంటున్నారు. డ్వాక్రా మహిళల నిరసన ఆకివీడు యూనియన్ బ్యాంకు అధికారులు సుమారుగా 32 గ్రూపులకు చెందిన 320 మంది మహిళళలు అప్పులు చెల్లించాలని తాకీదులు పంపారు. ఇంత సొమ్ము తామెక్కడ తీసుకున్నామని మహిళలంతా రోడ్కెక్కి నిరసన తెలిపారు. దీంతో యానిమేటర్ల ఖాతాలు తనిఖీ చేశారు. యానిమేటర్ సుధాకు సంబంధించిన డ్వాక్రా గ్రూపుల నుంచి రూ.1.90 కోట్లు, మేర, స్థానిక సమతానగర్కు చెందిన యానిమేటర్ హేమలత డ్వాక్రా గ్రూపులకు సంబంధించి రూ.90 లక్షల మేర అక్రమాలు జరిగాయని తేల్చారు. నిరక్షర్యాస్యులైన డ్వాక్రా మహిళలు తీర్మానాలు, సంతకాలు, వేలిముద్రలు, స్టాంపులు వంటివాటితో పాటు విత్డ్రా ఫారాలు కూడా యానిమేటర్ల వద్దే ఉంచడంతో అవినీతి, అక్రమాలకు తావిచ్చినట్లయింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు యానిమేటర్లు పరారీలో ఉన్నట్లు తెలిసింది. అయితే డ్వాక్రా గ్రూపుల నుంచి లక్షల రూపాయలు డ్రా చేసిన వైనంపై నేటికీ మెప్మా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సంబంధిత బ్యాంకు నుంచి మాత్రమే పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. యానిమేటర్లపై తక్షణం చర్యలు తీసుకుని దుర్వినియోగమైన సొమ్మును జమ చేయించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. అసలే వడ్డీల భారం డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలకు వడ్డీలపై వడ్డీల భారం పడుతుంది. ప్రతినెలా వాయిదాలు సకాలంలో చెల్లించకుంటే బ్యాంకులు వడ్డీపై వడ్డీలు వేస్తాయి. తీసుకున్న అప్పును కొంత (లక్షలు) చెల్లించిన వెంటనే మళ్లీ రూ.5 లక్షల మేర రుణం అందజేయడంతో మహిళలు అత్యాశతో రుణం తీసుకుని తీవ్ర నష్టానికి గురవుతున్నారు. రూ. 5 లక్షల్లో మూడు లక్షలకు మాత్రమే సున్నా వడ్డీ వర్తిస్తుంది, మిగిలిన రూ. 2 లక్షలకు సాధారణ వడ్డీ చెల్లించాల్సిందే. గ్రూపులో కొందరు సకాలంలో వాయిదా కట్టకపోయినా సున్నా వడ్డీ వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం సున్నా వడ్డీ సొమ్ము వెనక్కి రావడంలేదని మహిళలు వాపోతున్నారు. కొద్దిమంది ఖాతాల్లో మాత్రమే సొమ్ము జమ అవుతుందని చెబుతున్నారు. డ్వాక్రా మహిళలను ముంచేసిన యానిమేటర్లు రూ.2.80 కోట్లు డ్రా చేసి పరారీ రుణాలు చెల్లించాలని డ్వాక్రా మహిళలకు నోటీసులు లబోదిబోమంటున్న బాధితులు 20 రోజులు గడుస్తున్నా.. నోరు మెదపని మెప్మా అధికారులు డ్వాక్రా అప్పు చూసి భయం వేస్తోంది. మాకు తెలియకుండా మా గ్రూపుల నుంచి లక్షలాది రూపాయాలు డ్రా చేసిన యానిమేటర్లపై నేటికీ ఏ విధమైన చర్యలూ తీసుకోలేదు. యానిమేటర్లను పట్టుకుని వారి నుంచి సొమ్ము జమ చేయించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. – పిల్లా రంగమ్మ, సంతపేట, బాధితురాలు, ఆకివీడు -
కాంట్రాక్టర్పై పోలీస్ కేసు నమోదు
భీమవరం (ప్రకాశంచౌక్): ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోపు పూర్తిచేయనందున అజాయ వెంచర్స్ ఎల్ఎల్పీ కాంట్రాక్టర్పై పోలీస్ కేసు నమోదు చేశామని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలపై కాంట్రాక్టర్లతో, పీఎంఏవై 1.0 ఇళ్ల నిర్మాణాలపై హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. పీఎంఏవై 1.0 ఆప్షన్–3కి సంబంధించి అజాయ వెంచర్స్ కాంట్రాక్టర్ 2025 డిసెంబర్ నాటికి 1,780 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉండగా కేవలం 7 ఇళ్లను మాత్రమే పూర్తి చేశారన్నారు. పూర్తిగా అలసత్వం వహించిన వీరిపై ఇళ్ల నిర్మాణాలకు మ్యాప్ చేసిన డివిజన్ల పరిధిలో పోలీస్ కేసులు నమోదు చేశామన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో బాధ్యతారాహిత్యంగా ఉంటే క్షమించ బోమని హెచ్చరించారు. జిల్లాలో కాంట్రాక్టర్లు ఆప్షన్–3 కింద 6,271 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉండగా 1,191 ఇళ్లను పూర్తిచేశారని, నిర్మాణాలు వేగిరపర్చాలన్నారు. పీఎంఏవై 1.0లో వివిధ కేటగిరీల కింద జిల్లాలో 56,210 గృహ నిర్మాణాలు మంజూరు కాగా ఇప్పటివరకు 36,052 నిర్మాణాలను పూర్తిచేశామన్నారు. ఉగాది నాటికి 11,846 ఇళ్ల నిర్మాణాలు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. నూరు శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య, డీఈలు, ఏఈలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
యూరియా కోసం తప్పని పాట్లు
పెనుగొండ: యూరియా కోసం రైతుల పాట్లు తప్పడం లేదు. కొత్త ఏడాది తొలిరోజు గురువారం ఉదయం నుంచి ఆచంట సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు పడ్డారు. యూరియా పంపిణీపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో రైతులు ఒకేసారి ఎక్కువ మంది వస్తుండటంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. దీంతో గందరగోళం నెలకొంది. యూరియా సమృద్ధిగా సమకూరుస్తున్నామని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి స్వయంగా ప్రకటించినా రైతుల్లో మాత్రం ఆందోళన నెలకొనే ఉంది. దీనికి కారణం ఆయా సొసైటీల వద్ద టీడీపీ నాయకులు తమవారికి ముందుగా యూరియాను అందించాలంటూ హుకుం జారీ చేయడమే కారణమని రైతులు అంటున్నారు. మొదటి విడత కోటా ప్రకారమే పంపిణీ అంటూ అధికారులు ప్రకటిస్తున్నా, కొందరు మాత్రం కోటాకు మించి తీసుకువెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆచంట మండలంలో యూరియా కొరత లేకుండా అన్ని చర్యలూ తీసుకున్నామని వ్యవసాయాధికారి బి.నాగరాజు తెలిపారు. గురువారం సైతం మండలానికి యూరియా వచ్చిందన్నారు. -
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ మృత్యుఒడికి
● ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ ● భార్య మృతి, భర్తకు తీవ్రగాయాలు తణుకు అర్బన్: నూతన సంవత్సరం తొలి రోజున దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న దంపతులపై మృత్యువు లారీ రూపంలో కబళించింది. తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతిచెందగా భర్తను ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. తణుకు మండలం వేల్పూరు చింతలదొడ్డిలో నివసిస్తున్న అందే లోకేశ్వరరావు, వెంకటలక్ష్మి దంపతులు తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరి ద్వారకాతిరుమల, మద్ది ఆంజనేయస్వామి ఆలయాలకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ఆలయాల్లో స్వామివార్ల దర్శనాల అనంతరం తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో సరిగ్గా తేతలి జాతీయ రహదారి ప్రాంతంలోకి వచ్చేసరికి తమిళనాడుకు చెందిన లారీ వేగంగా ఢీకొట్టడంతో వెంకటలక్ష్మి (43) అక్కడికక్కడే మృతి చెందింది. భర్త లోకేశ్వరరావును ముందుగా తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకువచ్చి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యసేవలకు ఏలూరు ఆశ్రం హాస్పిటల్కు తరలించారు. మిన్నంటిన భర్త రోదన ఘటనా ప్రాంతంలో కళ్ల ముందే భార్య వెంకటలక్ష్మి మరణాన్ని దగ్గరగా చూసిన లోకేశ్వరరావు తట్టుకోలేకపోయారు. బంధువులకు ఫోన్లు చేసి నా వెంకటలక్ష్మి ఇక లేదంటూ తల్లడిల్లిపోయారు. భార్య మృదదేహం వద్ద ఆయన రోదనలు మిన్నంటాయి. లోకేశ్వరరావు ఉండ్రాజవరం మండలం పాలంగిలో మెడికల్ దుకాణం నిర్వహిస్తున్నారని, కుమారుడు హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా కుమార్తె ఫార్మసీ విద్యనభ్యసిస్తున్నట్లు బంధువులు తెలిపారు. కుమార్తె అందే వల్లి ధన దుర్గ ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదుమేరకు తణుకు రూరల్ ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అభయారణ్యం.. స్వేచ్ఛా విహారం
బుట్టాయగూడెం: పాపికొండల అభయారణ్యంలో పెద్ద పులులు, చిరుతలు గాండ్రిపులతో, పక్షుల కిలకిలరావాలతో సందడి చేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో అభయారణ్యం పరిధిలోకి వచ్చే 23 గ్రామాలు ఖాళీ చేసి ఆయా గ్రామాల్లో ఉండే నిర్వాసితులను ప్రభుత్వం పునరావాస కాలనీలకు తరలించడంతో వన్యప్రాణుల స్వేచ్ఛా జీవనానికి అవకాశం కలిగింది. గోదావరి ఒడ్డున ఉండే గ్రామాలు ఖాళీ కాగా జనసంచారం లేకపోవడంతో పాపికొండల్లో వన్యప్రాణులు మరింత స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం ఏర్పడింది. ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం 2008లో పాపికొండల అభయారణ్యంగా ప్రకటించింది. దీంతో అప్పటివరకు రాష్ట్ర పరిధిలో ఉన్న పాపికొండ లు కేంద్రం పరిధిలోకి మారింది. ఫారెస్టు, వైల్డ్లైఫ్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వన్యప్రాణులు సంరక్షణకు కృషి చేస్తున్నారు. 1012 చ.కిలోమీటర్ల పరిధిలో.. పాపికొండల అభయారణ్యం ఏలూరు జిల్లా పరిధిలోని బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలతో పాటు రంపచోడవరం నియో జకవర్గంలోని దేవీపట్నం, వీఆర్పురం, చింతూరు, మండలాల పరిధిలో సుమారు 1,012.85 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. నాలుగేళ్లకోసారి గణన పాపికొండల అభయారణ్యంలో ప్రతి నాలుగేళ్లకోసారి అధికారులు జంతుగణన నిర్వహించి అడవుల్లో ఉండే వన్యప్రాణులను గుర్తించే ప్రక్రియ చేపడతారు. 2018, 2022ల్లో జంతుగణన నిర్వహించారు. ఆ సమయంలో 116 ప్రాంతాల్లో 232 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి సర్వే చేశారు. సింహాలు, ఏనుగులు తప్ప అన్నిరకాల జంతువులు ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. నేటి నుంచి పులుల జాడ కోసం.. పాపికొండల అభయారణ్యంలో పులుల జాడ కోసం అటవీ శాఖ అధికారులు శుక్రవారం ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. సుమారు 130 ప్రాంతాల్లో 300కు పైగా కెమెరాలు ఏర్పాటు చేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. గతనెల 1న జాతీయ పులుల గణన, వన్యప్రాణుల లెక్కింపు కార్యక్రమం సుమారు 8 రోజులపాటు నిర్వహించారు. ఇందుకోసం అటవీశాఖ అధికారులు ట్రయిల్రన్ను కూడా నిర్వహించారు. అయి తే పులుల జాడ కోసం డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రిప్రజెంటేటివ్ల ఆధ్వర్యంలో పులుల జాడపై ట్రాప్ కెమెరాల ద్వారా సర్వే చేయనున్నారు. గోదావరి తీరం.. స్వేచ్ఛా విహారం గోదావరి పరీవాహక ప్రాంతంలో నది ఒడ్డున ఉన్న తెల్లదిబ్బలు, సిరివాక, కొరుటూరు, శివగిరి, చీడూరు, టేకూరు, తూటిగుంట, ఎర్రవరం, సరుగుడు, పల్లపూరు, పైడాకులమామిడి, వాడపల్లి, కోండ్రుకోట, మాదాపురం, ములగలగూడెం, గాజులగొంది, తల్లవరం, కొత్తూరు, కొత్తమామిడిగొంది, చేగొండపల్లి తదితర గ్రామాలను పోలవరం ప్రాజెక్టులో ముంపు గ్రామాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఆయా గ్రామాల నిర్వాసితులను బుట్టాయగూడెం, జీలు గుమిల్లి మండలాలకు తరలించారు. దీంతో ప్రస్తు తం ఆయా గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. జనసంచారం కూడా లేకపోవడంతో ఆయా గ్రామాల్లో వ న్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగుతూ నీటి కోసం గో దావరి తీరానికి వస్తున్నాయి. పాపికొండల విహార యాత్రకు వెళ్లే పర్యాటకులు నెమళ్లు, అడవి దున్నలు, దుప్పిలు కనిపించినట్టు చెబుతున్నారు.వన్యప్రాణుల ఆవాసం లక్ష ఎకరాల్లో పాపికొండల అభయారణ్యం పులులు, చిరుతలు, అడవి దున్నల సంచారం పోలవరం ముంపు గ్రామాల తరలింపుతో మరింత స్వేచ్ఛగా జీవనం 235 రకాలకుపైగా పక్షి జాతుల గుర్తింపు పాపికొండల అభయారణ్యంతోపాటు ఆ ప్రాంతంలోని 23 గ్రామాలు ఖాళీ కావడంతో వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. వాటి సంరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు గస్తీ కూడా నిర్వహిస్తున్నాం. వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. – ఎస్కే వల్లీ, అటవీశాఖ అధికారి, పోలవరం రేంజ్ -
కోడి పందేల్లో ఎమ్మెల్యే చింతమనేని
సాక్షి, టాస్క్ఫోర్స్: ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో సంక్రాంతికి ముందస్తుగానే కోడి పందేల నిర్వహణకు అనుమతులు ఇచ్చేసినట్టు పందేలరాయుళ్లు బహిరంగంగా శిబిరాలు నిర్వహిస్తున్నారు. పెదవేగి మండలం పెదకడిమిలో గురువారం టీడీపీ నేతలు కోడి పందేల బరి ఏర్పాటు చేశారు. ఈ పందేల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని వీక్షించారు. కోడి పందేలను చూసేందుకు యువకులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. జిల్లా కేంద్రమైన ఏలూరుకు కూత వేటు దూరంలో ఇలా బహిరంగంగా కోడి పందేలు నిర్వహిస్తున్నా అధికారులు మిన్నకుండిపోయారు. -
ఆరోగ్య విస్తరణ అధికారుల సంఘం ఏర్పాటు
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా ఆరోగ్య శాఖలోని ఆరోగ్య విస్తరణ అధికారుల సంఘం ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. గురువారం భీమవరంలో రాష్ట్ర ఆరోగ్య ఎంపీఈఓ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గుడాల హరిబాబు అధ్యక్షతన ఎన్నిక జరిగింది. సంఘ అధ్యక్షుడిగా కడలి శాంతమూర్తి, సహ అధ్యక్షుడిగా జి.వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా జె.సత్యనారాయణ, పి.సుకుమార్, పి.ప్రభాకర్, జనరల్ సెక్రటరీగా ఏఎస్ఎన్ మూర్తి, జా యింట్ సెక్రెటరీగా సీహెచ్ సత్యనారాయణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా యు.ప్రసాద్, ట్రెజరర్గా కె.అప్పారావు, ఈసీ మెంబర్లుగా ఎస్వీఎస్ ప్రసాద్, ఎం.ఫాల్సన్ను ఎన్నుకున్నారు. ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానంలో ఉప కార్యనిర్వాహణాధికారిగా పనిచేస్తున్న వై.భద్రాజీ గురువారం ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్వీఎస్ఎన్ మూర్తి పదవీ కాలం డిసెంబర్ 31తో ముగియడంతో భద్రాజీకి ఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భద్రాజీ గురువారం ఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆలయ అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ద్వారకాతిరుమల: ఏడాదంతా శుభప్రదం కా వాలని కోరుతూ.. వేలాది మంది భక్తులు గు రువారం చిన వెంకన్నను దర్శించారు. దీంతో ద్వారకాతిరుమల క్షే త్రం భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. క్షేత్రంలోని అన్ని విభాగాల్లో భక్తులతో రద్దీ కనిపించింది. పార్కింగ్ ప్రదేశాలు వాహ నాలతో నిండిపోయాయి. వేలాది మంది భక్తులు స్వా మివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం వరకూ క్షేత్రంలో రద్దీ కొనసాగింది. క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు అధికారులు పలు సౌకర్యాలు కల్పించారు. -
విష్ చేశారో మీ సొమ్ము మటాష్ !
● శుభాకాంక్షల పేరుతో సైబర్ కేటుగాళ్ల నయా స్కెచ్ ● వాట్సాప్ లింక్స్ ద్వారా డబ్బు కాజేస్తున్న వైనం తణుకు అర్బన్: సాధారణంగా పండుగలు లేకపోతే ప్రత్యేక రోజుల్లో మన స్నేహితులతో పాటు మనకు అయిన వారికి శుభాకాంక్షలు తెలుపుకోవడం సర్వ సాధారణ విషయం. ఇటీవల పెరిగిన స్మార్ట్ ఫోన్ల వినియోగంతో ఈ కల్చర్ మరింత పెరిగింది. సరిగ్గా ఈ విషయాన్నే సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకునేందుకు ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ విషెస్ పేరుతో లింక్స్ పంపి బ్యాంక్ ఖాతాల్లోని లక్షలాది రూపాయిలను ఖాళీ చేసేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా మీ పేరు, మీ ఫొటోతో మీ స్నేహితులకు న్యూ ఇయర్ విషెష్ చెప్పొచ్చని ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని... సంక్రాంతి పండుగ ఆన్లైన్ ఆఫర్లు కావాలా..? అంటూ సోషల్మీడియాలో వస్తున్న లింక్స్తో బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్న పరిస్థితులు నెట్టింట వైరల్గా మారాయి. ఇప్పటివరకు మీ బ్యాంక్ ఖాతాను ఈ–కేవైసీ చేయాలని కొన్ని, మీ వాహనానికి ట్రాఫిక్ చలాన్ వచ్చిందనే ఏపీకే ఫైల్స్, సీఐడీ ఇతర పోలీసు విభాగాల అధికారులమని మీ న్యూడ్ కాల్స్ వివరాలు మా వద్ద ఉన్నాయని మరికొన్ని, మీ పిల్లలు మా వద్ద ఉన్నారు తక్షణమే మా అకౌంట్కు లక్షలు చెల్లించాలనే ఫోన్ కాల్స్ ద్వారా జరిగిన సైబర్ నేరాలతో ప్రజానీకం అల్లాడుతుండగా తాజాగా న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షల పేరుతో ఖాతాలు ఖాళీ చేసేందుకు సైబర్ కేటుగాళ్లు సిద్ధంగా ఉన్నట్లుగా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శుభాకాంక్షలే టార్గెట్గా... సైబర్ నేరగాళ్లు బ్యాంకు అకౌంట్ల నుంచి నగదు దొంగిలించేందుకు కొత్త రకమైన ట్రెండ్ను సెట్ చేశారు. ఇప్పటికే రకరకాల పద్ధతుల్లో డబ్బు దోచుకుంటున్న కేటుగాళ్ల తాజా వ్యూహం నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి పండుగకుముడిపెట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలంటూ మైకు ద్వారా ప్రచారం చేస్తున్నారు. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సందర్భంగా విషెష్ చెబుతున్నట్లుగా వచ్చే లింకులు ఓపెన్ చేయవద్దని అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా అధికసంఖ్యలో ఆన్లైన్ షాపింగ్, ఆర్డర్స్ బుకింగ్ చేసే వారి ఫేస్బుక్, వాట్సాప్ ఖాతాల ద్వారా వ్యక్తుల వివరాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. అవగాహన అవసరం సైబర్ నేరాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలంటే ముఖ్యంగా థర్డ్ పార్టీగా ఉండే యాప్లు చాలా ప్రమాదకరమని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. కేవలం ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న యాప్లు మాత్రమే సురక్షితంగా ఉంటాయని వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, డాక్యుమెంట్లు, ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయవద్దనేది న్యాయ నిపుణుల సలహా ఇస్తున్నారు. ఆన్లైన్ మోసానికి గురైనట్లుగా తెలిసిన వెంటనే 1930 (నేషనల్ సైబర్ హెల్ప్ లైన్) నంబరుకు కాల్చేసి సమాచారం ఇవ్వడంతోపాటు స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో రూ.9 కోట్ల మేర దోపిడీ జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాల దోపిడీ బాగా పెరిగినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది 16 సైబర్ నేరాలకుగాను సుమారుగా రూ. 3 కోట్ల నగదు సైబర్ నేరగాళ్లు దోచుకోగా, ఈ ఏడాది 30 సైబర్ నేరాలకుగాను రూ.9 కోట్ల నగదును కేటుగాళ్లు దోచుకున్నారు. ఈ సైబర్ నేరాలకు సంబంధించి కొన్ని కేసుల్లో బాధితులకు పోలీసులు రూ.42 లక్షల వరకు రికవరీ చేసి ఇచ్చారు. అయితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయని సైబర్నేరాలు చాలా ఉన్నట్లుగా తెలుస్తోంది. -
బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న దొంగల అరెస్టు
నూజివీడు: వృద్ధులకు మత్తు మందు ఇచ్చి చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర నేరస్తుడు పబ్బరాజు వెంకట యుగంధర్(38)ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను నూజివీడు డిఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ బుధవారం నూజివీడు రూరల్ సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరానికి చెందిన పబ్బరాజు వెంకట యుగంధర్ గత 20 ఏళ్లుగా ఒంటరిగా ఉంటున్న వృద్ధుల ఇళ్లల్లో అద్దెకు ఉంటూ వారిని నమ్మించి అనంతరం పానకంలో మత్తు మందు కలిపి ఇచ్చి స్పృహ కోల్పోయాక బంగారు ఆభరణాలను దోచుకొని పారిపోయేవాడు. ఇదే క్రమంలో ముసునూరు మండలం వలసపల్లిలో బండారుపల్లి జయలక్ష్మి(68)కు మత్తు మందు ఇచ్చి బంగారు ఆభరణాలను, సెల్ఫోన్ను గతేడాది నవంబరు 25న దోచుకెళ్లాడు. దీనిపై ముసునూరు పోలీస్స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయగా ఎస్సై ఎం.చిరంజీవి దర్యాప్తు చేపట్టి నిందితుడిని గతనెల 30న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండలో అరెస్టు చేశారు. విచారణలో చింతలపూడి మండలం ప్రగడవరం, దెందులూరు మండలం వేగవరం, కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డలో చేసిన దొంగతనాల్లో చోరీ సొత్తును సైతం స్వాధీనం చేసుకున్నారు. 149 గ్రాముల నాన్తాళ్లు, నాలుగు సెల్ఫోన్లు, హోండాషైన్ మోటార్ సైకిల్లను స్వాధీనం చేసుకున్నారు. అపరిచిత వ్యక్తులను నమ్మి ఇల్లు అద్దెకు ఇవ్వొద్దని, అపరిచితులు ఇచ్చే కూల్డ్రింక్స్, పానకం తీసుకోవద్దని, అనుమానాస్పద వ్యక్తులపై తక్షణమే పోలీస్స్టేషన్ సమచారం ఇవ్వాలని డీఎస్పీ కోరారు. ఇద్దరు దొంగల అరెస్టు ఒంటరిగా ఉండే వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్ చేస్తున్న ఇద్దరిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నూజివీడు మండలం మర్రికుంట వద్ద ఒంటరిగా ఉన్న పున్నం నాగేశ్వరమ్మ(60) మెడలోని నాన్తాడును గత నెల 26న ఇరువురు యువకులు వచ్చి లాక్కెళ్లిన కేసులో ఇరువురు నిందితులను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ముసునూరు మండలం బలివే కు చెందిన కాగితాల సతీష్, నాయుడు రాజేష్లు తాము దొంగిలించిన సొమ్మును విక్రయించేందుకు వెళ్తుండగా గత నెల 30న మీర్జాపురం శివారులో అరెస్టు చేసి వారి వద్ద నుంచి 20 గ్రాముల బంగారు నాన్తాడు, మోటర్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో నూజివీడు రూరల్ సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ, ముసునూరు ఎస్సై ఎం.చిరంజీవి, నూజివీడు రూరల్ ఎస్సులు ఎన్.లక్ష్మణ్బాబు, జ్యోతిబసు పాల్గొన్నారు. -
చిల్డ్రన్స్ పార్క్కు శంకుస్థాపన
భీమవరం (ప్రకాశంచౌక్): భవ్య భీమవరానికి శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, డాక్టర్ బీవీ రాజు ఫౌండేషన్ సహకారంతో పట్టణంలో రూ.1.60 కోట్ల వ్యయంతో విజ్ఞానం, వినోదాన్ని అందించే కట్టడాలు అందుబాటులోకి రానున్నాయి. అంబేడ్కర్ సర్కిల్ సమీపంలో 47 సెంట్లలో చిల్డ్రన్స్ పార్క్కు, 39 సెంట్లలో కమ్యూనిటీ లైబ్రరీ ప్రాజెక్ట్ నిర్మాణాలకు కలెక్టర్ సీహెచ్ నాగరాణి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు లైబ్రరీ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, విష్ణు కాలేజ్ స్టూడెంట్స్ ఎఫైర్స్ డైరెక్టర్ పి.శ్రీనివాసరాజు, ఆర్డీఓ కె.ప్రవీణ్కుమార్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కుట్రలు.. కుతంత్రాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు.. వేధింపులు, అక్రమ కేసుల పేరుతో కూటమి కుతంత్రాలు గడిచిన సంవత్సరమంతా కొనసాగించారు. సామాన్య ఆటోడ్రైవర్ మొదలుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు అందరిపైనా రకరకాల కేసుల పేరుతో వేధింపులు కొనసాగించారు. ఒకచోట ప్రత్యక్ష వేధింపులు కొనసాగిస్తే, మరోచోట పరోక్ష వేధింపులు, ఇంకొన్నిచోట్ల ఆస్తులు, చేపల చెరువుల విధ్వంసాలు.. ఇలా 2025 సంవత్సరమంతా కూటమి నేతలు సంక్షేమాన్ని విస్మరించి వేధింపులతో కాలం గడిపి అందినంత దండుకున్నారు. 2026లోనైనా జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను మొదలుకొని రోడ్ల నిర్మాణం వరకు అభివృద్ధి పనులు నిర్వహిస్తారా లేక ఇదే రీతిలో డైవర్షన్ రాజకీయాలతోనే కొనసాగిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. డైవర్షన్ రాజకీయాలతో సరి ఉమ్మడి పశ్చిమలో దీర్ఘకాలిక పెండింగ్ ప్రాజెక్టులతో పాటు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ప్రకటించిన సంక్షేమ పథకాలు లెక్కకు మించి అనేకం ఉన్నాయి. ప్రతిపక్షం ప్రశ్నించి ప్రజాపోరాటాలు ఉధృతం చేసినప్పుడల్లా కేసులు, డైవర్షన్ రాజకీయాలతో కాలం గడిపేస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమలో రహదారులను సంక్రాంతి కల్లా పూర్తి చేస్తామని, గతేడాది సంక్రాంతి ముందు ప్రకటించారు. నేటికీ రెండు జిల్లాల్లో రోడ్ల మరమ్మతులు జరగక ప్రధాన రహదారులు సైతం అధ్వానంగా మారిన పరిస్థితి. ఇక పునరావాస కాలనీల్లో సౌకర్యాలు, పోలవరం ప్రాజెక్టు వేగవంతం, ఏలూరు జిల్లాలో ఉపాధి కల్పించేలా పెద్ద సంఖ్యలో పరిశ్రమలు, పలు క్లస్టర్ల ఏర్పాటు, చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఇలా అనేకం ఉన్నాయి. గడిచిన ఏడాదిలో వీటిల్లో ఏ ఒక్కటీ కూడా నామమాత్రపు పురోగతి కూడా ముందుకుసాగని పరిస్థితి. వీటన్నింటిని పక్కన పెట్టి స్థానిక సంస్థల ఉప ఎన్నికలు మొదలుకొని అన్నింటిలోనూ బలం లేకపోయినా అధికారం ఉందని అడ్డగోలుగా స్థానిక పదవులు దక్కించుకున్నారు. రెడ్బుక్ రాజ్యాంగం ఇలా.. జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో రెడ్బుక్ వేధింపులకు తెరతీశారు. ప్రధానంగా దెందులూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు, మూడు నెలల్లో 532 శిలఫలకాలను, సచివాలయ బోర్డులను ధ్వంసం చేశారు. నాలుగు మండలాల్లో ఇదే కొనసాగింది. ఇవికాక చేపల చెరువుల ధ్వంసాలు, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు పెద్ద ఎత్తున కొనసాగాయి. తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాథాకృష్ణ మరో అడుగు ముందుకేసి మాజీ మంత్రి కారుమూరి ఇంటి ముట్టడి చేయించి తీవ్ర గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. గతేడాది అత్తిలి మండల ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి 13 మంది వైఎస్సార్ సీపీ సభ్యులు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంటికి చేరుకుంటే, వందలాది మంది టీడీపీ శ్రేణులు ఇళ్లు చుట్టుముట్టి నానా హంగామా సృష్టించి దాడికి యత్నించారు. స్థానిక ఎస్సై మొదలుకొని డీజీపీ వరకు అందరికీ ఫోన్లు చేసినా ఏ ఒక్కరూ స్పందించని పరిస్థితి. అలా రెండు రోజులుపాటు హడావిడి చేసి ఎంపీటీసీల్లో కొందరిని బెదిరించి మరీ టీడీపీలో బలవంతంగా చేర్చుకున్నారు. యలమంచిలి ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ నామమాత్రపు బలం లేకపోవడంతో ఇదే తరహా చిల్లర రాజకీయాలతో మంత్రి నిమ్మల ప్రయత్నించి భంగపడ్డారు. ఎన్నికలను ఒకటికి రెండు పర్యాయాలు వాయిదా వేయించారు. చివరికి కోర్టు అధికారులకు చివాట్లు పెట్టడంతో వెంటనే నిర్వహించారు. ఈ ఎపిసోడ్లో తన విధులకు ఆటంకం కలిగించారని కానిస్టేబుల్ ఫిర్యాదుతో 17 మందిపై, ఇదే తరహాలో వీఆర్ఓ ఫిర్యాదుతో 9 మందిపై కేసు నమోదు చేశారు. కూటమి దౌర్జన్య కాండ గత ఏడాదంతా వేధింపులతోనే కూటమి రాజకీయం అభివృద్ధి, సంక్షేమాన్ని మరిచి కుట్రలే అజెండా గ్రామస్థాయి నుంచి సమన్వయకర్తల వరకు కేసుల పేరుతో వేధింపులు కుట్ర రాజకీయాలతో స్థానిక సంస్థలు కై వసం దాడులు తగ్గి జిల్లాలో సుపరిపాలన సాధ్యమేనా? పెదపాడు మండలం గుడిపాడులో వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడికి చెందిన 6 ఎకరాల చేపల చెరువులో పట్టుబడులను అడ్డుకోవడం, రహదారి ధ్వంసం చేయడం, హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం స్పందించకపోవడం.. బాధితుడు న్యాయం చేయమని పురుగుల మందుడబ్బాతో ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేసినా పెద్దగా స్పందన లేని పరిస్థితి. ఈ తరహా ఘటనలు అనేకం ఉన్నాయి. ఇక మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి నివాసం వద్ద కొల్లేరువాసుల ముసుగులో టీడీపీ కార్యకర్తలే ఆందోళన చేసి పొలంలో పంట ధ్వంసం చేసి పామాయిల్ గెలలు నరికి బీభత్సం సృష్టించారు. ఇక ఇదే నియోజకవర్గంలో పార్టీ నేతలు అనేక మందిని కేసులు, అరెస్టులతో వేధింపులతో కొనసాగిస్తూనే ఉన్నారు.పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు కక్షసాధింపు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. రెడ్బుక్ వేధింపులంటూ 2022 ఆగస్టు 5న టిడ్కో ఇళ్ల ప్రారంభం సందర్భంగా అప్పటి అధికార పార్టీకి రామానాయుడుకి మధ్య జరిగిన చిన్నపాటి వాదులాట ఘటనలో 2024 డిసెంబర్ 13న కేసు నమోదు చేయించారు. కోర్టులో కేసు కొనసాగుతుండగానే సీఐడీకి కేసు అప్పగించేలా ఒత్తిడి తేవడం.. ఒక్కొక్కరిని విచారణకు పిలిచి వేధింపులు కొనసాగిస్తున్నారు. వైఎస్సార్ సీపీ కీలక నేతలతో సహా అనేక మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయించి హడావిడి కొనసాగిస్తున్నారు. -
మారేనా కూటమి తీరు?
పశ్చిమగోదావరిగురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 20262026భీమవరంలో ఎన్నికల ప్రచార సభలో పవన్ కల్యాణ్ డంపింగ్ యార్డు సమస్య పరిష్కరిస్తానని, డ్రెయిన్లు అభివృద్ధి చేస్తానని, భీమవరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఇవేమీ పట్టాలు ఎక్కలేదు. పట్టణ ప్రజలు, జిల్లా కేంద్రానికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – గాదిరాజు రామరాజు, భీమవరం తాడేపల్లిగూడెం 40 ఏళ్ల నుంచి మార్కెట్ హబ్గా ఉంది. పవన్ కల్యాణ్ తాడేపల్లిగూడేన్ని మార్కెట్ హబ్గా అభివృద్ధి చేస్తానని ఎన్నికల హామీని ఇవ్వడం హాస్యాస్పదం. ఎన్నికల సమయంలో హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ఒక్క హామీనీ అమలు చేయలేకపోయారు. – గుండుమోగుల సాంబయ్య, పండ్ల వ్యాపారి, తాడేపల్లిగూడెం కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం హామీని సీఎం చంద్రబాబు మరిచారు. దీంతో ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయాం. అలాగే రూ. 1.50కే విద్యుత్ ఇస్తానన్న హామీనీ చంద్రబాబు అమలు చేయలేకపోయారు. హామీలు నిలబెట్టుకోవాలి. – వేగేశ్న జయ రామకృష్ణంరాజు, ఆక్వారైతు, పెదఅమిరం సాక్షి, భీమవరం: సాగుకు భరోసా కరువు.. ఆడపడుచులకు ఆర్థిక చేయూత ఇవ్వలేదు.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు.. నిరుద్యోగ భృతి మాటెత్తలేదు.. సంక్షేమ పథకాలు అందక వ్యాపారాలు వెలవెల.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి నాయకులు హామీలు గుప్పించారు.. గద్దెనెక్కి 18 నెలలు గడుస్తున్నా అమలు మాటెత్తడం లేదు.. 2025 సంవత్సరాన్ని వంచనతో పాలించిన నాయకులు 2026లో అయినా హామీలు అమలు చేస్తారా అని జిల్లావాసులు నిలదీస్తున్నారు.. సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్కల్యాణ్ జిల్లాకు ఇచ్చిన హామీలను ఈ ఏడాదైనా పట్టించుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. జిల్లాకిచ్చిన హామీలెన్నో.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ సిక్స్తో పాటు జిల్లాలో జరిగిన ప్రచార సభల్లో నరసాపురంలో వశిష్ట వారధి నిర్మిస్తామని, జిల్లా కేంద్ర భీమవరానికి డంపింగ్యార్డు సమస్య పరిష్కరిస్తామని, తాడేపల్లిగూడెంను మార్కెట్, ఎడ్యుకేషన్ హబ్లుగా అభివృద్ధి చేస్తామని, ఆక్వా రంగానికి ఊతమిస్తూ కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తామని, జోన్లతో నిమిత్తం లేకుండా ఆక్వా రైతులందరికీ రాయితీపై యూనిట్ విద్యుత్ రూ.1.50లకే అందిస్తామని, ఏరియేటర్లపై రాయితీ ఇస్తామని కూటమి నాయకులు హామీలిచ్చారు. వీటితో పాటు విజ్జేశ్వరం నుంచి గోదావరి జలాలను తెచ్చి రక్షిత నీటిని కుళాయిల ద్వారా ఇంటింటికీ సరఫరా చేస్తామని, తణుకును పారిశ్రామికంగా అభివృద్ధి చేసి జిల్లా నుంచి వలసలను అరికడతామని, హైటెక్ టవర్ల నిర్మాణంతో ఇంటి నుంచే ఉద్యోగాలు చేసుకునేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామని, జిల్లాలో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాలు చేయిస్తామని, ఆకివీడులో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి లేదా ఫ్లైఓవర్ నిర్మిస్తామంటూ ఎడాపెడా హామీలిచ్చిన చంద్రబాబు, పవన్కల్యాణ్లు ఈ ఏడాదైనా వాటిని పట్టాలెక్కించాలని జిల్లావాసులు కోరుతున్నారు. తణుకులో హైటెక్ టవర్లు నిర్మించి నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. వర్క్ ఫ్రం హోం చేసుకునేలా సాంకేతికను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు, పవన్కల్యాణ్ చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా ఇంతవరకు ఆ ఊసే లేదు. – దాసి రత్నరాజు, తణుకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని పాలకొల్లు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పారు. ఏడాదిన్నర గడిచినా హామీ కార్యరూపం దాల్చలేదు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాటికి ఎసరు పెడుతున్నారు. నిరుద్యోగ భృతి హామీని అమలుచేయాలి. – కడిమి బాలరాజు, పాలకొల్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా ఆడబిడ్డ నిధి హామీ మాటే మరిచారు. 8 ఏళ్లు నిండిన మహిళ నుంచి 59 ఏళ్ల మహిళ వరకు నెలకు రూ.1,500 సాయం అందిస్తామని ఊరురా ఊదరగొట్టి అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం మానేశారు. –కర్రి సుభాషిణి, జెడ్పీటీసీ, పెనుమంట్ర అధికారంలోకి రాగానే వశిష్ట వంతెన నిర్మిస్తామని నరసాపురంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వంతెన కోసం రూ.680 కోట్లు మంజూరు చేసింది. ఆ పనులను చంద్రబాబు ప్రభుత్వం చేపట్టడం లేదు. కొత్త ఏడాదిలోనైనా ప్రారంభించాలి. – యర్రా ఉమా శ్రీనివాస్, నరసాపురం వంచన పాలన ఎన్నికల హామీల అమలెప్పుడో..! ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూపులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువు కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలంటున్న ఆక్వా రైతులు కలగా వశిష్ట గోదావరిపై వంతెన నిర్మాణం -
వైఎస్సార్ విగ్రహానికి కంచె
తణుకు అర్బన్: తణుకు వై.జంక్షన్లోని వైఎస్సార్ విగ్రహం చుట్టూ రెవెన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో ఇనుప కంచెను ఏర్పాటు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఈనెల 5, 6 తేదీల్లో వైఎస్సార్ విగ్రహాన్ని ప్రారంభిస్తామని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రకటించడంతో ఆ విగ్రహ ప్రాంతంలోకి ఎవరినీ వెళ్లనివ్వకుండా ఇలా కంచె వేశారని వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు సర్కారు ఒత్తిడితో రెవెన్యూ అధికారులు ఈ కంచెను ఏర్పాటుచేశారని ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు. ముదురుతున్న ఫ్లెక్సీ వివాదం వైఎస్సార్ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన చంద్రబాబు ఫ్లెక్సీ వ్యవహారం రోజురోజుకీ ముదురుతోంది. ఈనెల 25న టీడీపీ సానుభూతిపరుడు వైఎస్సార్ విగ్రహానికి చంద్రబాబు ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. దీంతో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి ఆ ఫ్లెక్సీ ముందు వైఎస్సార్సీపీ ఫ్లెక్సీ పెట్టడం.. ఆపై రెండు ఫ్లెక్సీలను పోలీసులు తొలగింపజేయడం తెలిసిన విషయమే. అయితే ఆ రోజు నుంచి పోలీస్ సిబ్బంది నిరంతరం ఆ ప్రాంతంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఈనెల 28వ తేదీన ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. అంతేకాకుండా ఈనెల 29వ తేదీన ఫ్లెక్సీ ఘటనకు సంబంధించి మాజీ మంత్రి కారుమూరితో సహా 13 మంది పార్టీ నాయకులపై కేసులు నమోదుచేశారు. తాజాగా వైఎస్సార్ విగ్రహం వద్దకు ఎవ్వరినీ వెళ్లనీయకుండా చుట్టూ కంచె ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. -
చంద్రబాబు ప్రభుత్వం అన్నింటా విఫలం
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఉంగుటూరు: కూటమి ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని, దీంతో ప్రజలు తమ వైపు (వైఎస్సార్ సీపీ) చూస్తున్నారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. బుధవారం గోపినాథపట్నంలో ఆయన ‘సాక్షి’ విలేకరితో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఏ ఒక్కటీ చంద్రబాబు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, లోక్ష్ల మీద ప్రజలు పెట్టుకున్న భ్రమలు ఏడాదిన్నర కాలంలోనే తొలగిపోయాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వివరించారు. గత పథకాలు పేరు మార్చినా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారని కొట్టు ఎద్దేవా చేశారు. 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తానని అన్నారని.. అవి ఎక్కడ అని ప్రశ్నించారు. అలాగే నిరుద్యోగ భృతి రూ.3 వేలు, మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తానన్న హామీలు ఏమయ్యాయన్నారు. ఏడాదికి మూడు సిలిండర్ల హామీలో కొందరికి ఒకటి, మరికొందరికి రెండు, కొందరికి అసలు ఇవ్వలేదని మాజీ మంత్రి కొట్టు వివరించారు. రైతులకు కనీసం యూరియా సరఫరా చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. పంట నష్టం జరిగినా ఆదుకోలేదని విమర్శించారు. జగన్ హయాంలో ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి రైతులందరికీ పంట నష్టం అందేలా చేశారన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణలో చంద్రబాబు అత్యుత్సాహం చూపారని, ఈ విషయంలో ప్రభుత్వ తీరును వైఎస్సార్ సీపీ కోటి సంతకాలతో పూర్తిస్థాయిలో ఎండగట్టిందని మాజీ మంత్రి కొట్టు వివరించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, జూదం కొనసాగుతున్నాయని, ఇసుక దోపిడీ జరుగుతోందని కొట్టు తెలిపారు. ప్రజాసమస్యల పోరాటానికి వైఎస్ జగన్ పార్టీ క్యాడర్ను సిద్ధం చేస్తున్నారని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఎండగడతామని తెలిపారు. -
ఏలూరులో ‘పచ్చ’పాతం
ఏలూరు టౌన్: ఏలూరులో ‘పచ్చ’పాతం పెచ్చుమీరుతోంది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను కక్షపూరితంగా అధికారులు తొలగించడంతో వివాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే ఏలూరు 19వ డివిజన్ హనుమాన్నగర్ ప్రాంతంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటూ ఉండగా.. నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ సిబ్బంది ఆ ఫ్లెక్సీలను తొలగించారు. దీనిపై స్థానిక నాయకులు ఇదేమి విధానమంటూ టౌన్ప్లానింగ్ సిబ్బందిని నిలదీశారు. దీంతో వారు ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను రూరల్ పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లారు. పార్టీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ సూచనలతో ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి రూరల్ పోలీస్స్టేషన్కు చేరుకుని పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. ఏలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నేతలపై కక్షపూరిత చర్యలు పెచ్చుమీరుతున్నాయన్నారు. టౌన్ప్లానింగ్ అధికారులకు నగరంలో ఏర్పాటు చేసిన ఇతర పార్టీలు, వ్యాపార సంస్థల ఫ్లెక్సీల కనిపించకపోవటం శోచనీయన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా వైఎస్సార్ సీపీ శ్రేణులపై నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు కక్షపూరితంగా వ్యవహరించటం సరికాదన్నారు. ఈ విషయంపై ఇప్పటికే తాము నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్కు వినతిపత్రం సమర్పించామని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఇల వైకుంఠం
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రం మంగళవారం వైకుంఠాన్ని తలపించింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారు ఉత్తర ద్వారం వద్ద భక్తులకు దర్శనమిచ్చారు. భానుడి లేలేత కిరణాలు పుడమిపై ప్రసరించే వేళ.. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ ఉభయ దేవేరులతో శ్రీవారు ఉత్తర ద్వారం వద్ద వెండి గరుడ వాహనంపై సాక్షాత్కరించారు. ఈ వేడుక ఆద్యంతం భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా సిబ్బంది ఉత్తర ద్వారాన్ని పచ్చిపూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వెండి గరుడ వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపు చేసి, విశేషంగా అలంకరించారు. తెల్లవారుజాము 4.15 గంటలకు ఉత్తర ద్వారాలను తెరవగా, దేవస్థానం ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తదితరులు తొలి దర్శనం చేసుకుని, పూజాదికాలు జరుపుకున్నారు. అనంతరం భక్తులకు సర్వదర్శన భాగ్యాన్ని కల్పించారు. ఊహించని విధంగా వేలాది మంది భక్తులు, గోవింద స్వాములు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించి పరవశించారు. ఉదయం 7.30 గంటల సమయంలో స్వామి, అమ్మవార్లు ఉత్తర ద్వారం నుంచి వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవానికి బయల్దేరి వెళ్లారు. గజ, అశ్వ సేవల నడుమ ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. ఆ తరువాత ఉత్తర ద్వారం వద్ద వెండి శేష వాహనంపై కొలువైన స్వామి, అమ్మవార్లు రాత్రి 9 గంటల వరకు భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు 50 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించినట్టు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే గోవింద దీక్షాదారులు తెల్లవారుజామున ఆలయ ప్రధానరాజగోపుర మెట్ల మార్గంలో కర్పూరంతో స్వామివారి శంఖు, చక్ర, నామాలను ఏర్పాటు చేసి, వాటిని వెలిగించారు. అనంతరం ఇరుముడులతో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆ తరువాత దీక్షను విరమించారు. రూ. 40 లక్షల ఆదాయం.. శ్రీవారి రూ. 500 ప్రత్యేక దర్శనం టికెట్లు మధ్యాహ్నం వరకే విక్రయించారు. మొత్తం 2 వేల టికెట్లను విక్రయించారు. రాత్రి వరకు రూ. 200 టికెట్లు దాదాపు 3,500, రూ.100 టికెట్లు 3,500, 50 వేలకు పైగా లడ్డూ ప్రసాదాలు, 27,600 పులిహోర ప్యాకెట్లు, 10,530 శర్కర పొంగలి ప్యాకెట్లు విక్రయించారు. అదేవిధంగా వేలాది మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. వీటి ద్వారా స్వామివారికి సుమారు రూ. 40 లక్షల మేర ఆదాయం లభించింది. తోపులాటలో కింద పడిన భక్తులు : తెల్లవారు జామున క్యూకాంప్లెక్స్ వద్ద గేటు ఒక్కసారిగా తెరవడంతో తోపులాట జరిగి, కొందరు భక్తులు కింద పడిపోయారు. రూ. 500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను, అలాగే గ్రామస్తులను, గోవింద స్వాములను ఒకే దర్శనం క్యూలైన్లో పంపడం వివాదాస్పదమైంది. వీఐపీల పేరుతో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులను తూర్పు రాజగోపురం మీదుగా తీసుకెళ్లి, ధ్వజస్తంభం వద్ద ఉన్న మెయిన్ గేటులోంచి ఆలయంలోకి పంపారు. దాంతో క్యూలైన్లలో ఉన్న భక్తులు పలుమార్లు అరుపులు, కేకలు వేయడంతో ఆలయం గందరగోళంగా మారింది. టీడీపీ నాయకులకు, వీఐపీలకు ఉన్న విలువ తమకు లేదంటూ కొందరు సిబ్బంది గుసగుసలాడారు. సాయంత్రం 5 గంటలకు సాయంకాలార్చన నిమిత్తం నిలుపుదల చేయాల్సిన స్వామివారి దర్శనాన్ని, భక్తులు గొడవ చేయడంతో గంట అదనంగా కొనసాగించి, 6 గంటలకు నిలుపుదల చేశారు.ఉత్తర ద్వారం వద్ద వెండి గరుడ వాహనంపై కొలువైన స్వామి, అమ్మవార్లు ఆలయంలో భక్తుల తోపులాట గరుడ వాహనంపై గ్రామోత్సవంద్వారకాతిరుమల: ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని మంగళవారం ఉదయం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్ వి.గోపాలకృష్ణారావు వేర్వరుగా సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన వారికి ముందుగా దేవస్థానం ఈఓ అర్చకులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. న్యాయమూర్తులు ఉత్తర ద్వారం వద్ద స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ద్వారకాతిరుమలలో వైభవంగా శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం 50 వేల మందికిపైగా స్వామిని దర్శించిన భక్తులు, గోవింద స్వాములు గరుడ వాహనంపై నేత్రపర్వంగా గ్రామోత్సవం -
తాళ్లతో కట్టేసి.. నగలు దోచేసి!
అల్లిపురం: ఇంటి యజమానురాలిని తాళ్లతో కట్టేసి.. 10 తులాల బంగారు ఆభరణాలు, 8 తులాల వెండి వస్తువులను దోచుకుపోయిన కేసులో తల్లీకూతుళ్లు సహా మొత్తం నలుగురు నిందితులను ఆరిలోవ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనరేట్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీసీపీ కె.లతామాధురి ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ రాత్రి 9.50 గంటల సమయంలో ధారపాలెం, బంగారుతల్లి లే–అవుట్లో నివసిస్తున్న మొండు వసంత తన ఇంట్లో నిద్రకు ఉపక్రమించారు. ఆమె లోపల గడియ పెట్టుకుని నిద్రించగా, రాత్రి 10 గంటల సమయంలో కాళ్ల వద్ద ఎవరో సంచరిస్తున్నట్లు అలికిడి అయింది. వెంటనే ఆమె లేచేందుకు ప్రయత్నించగా.. ఒక వ్యక్తి ఆమె కాళ్లను గట్టిగా పట్టుకుని తాడుతో కట్టేశాడు. ఆమె అరవకుండా నోటిని అక్కడే ఉన్న లంగాతో కట్టేశారు. అనంతరం ఆమె మెడలోని 5 తులాల బంగారు పలక సరలు, నెమలి బిల్ల గల రెండు పేటల గొలుసు, చేతులకు ఉన్న 4 తులాల బంగారు గాజులు, లాకెట్తో కూడిన మరో గొలుసు, తులం బరువుగల రెండు ఉంగరాలు, 8 తులాల వెండి ఆభరణాలను బలవంతంగా తీసుకున్నారు. అనంతరం నిందితులు బయటకు వెళ్లి, తలుపులకు బయటి నుంచి గడియపెట్టి పారిపోయారు. తర్వాత బాధితురాలు అతికష్టం మీద కట్లు విప్పుకుని ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సెల్ఫోన్ టవర్ లోకేషన్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దాదాపు వెయ్యి సెల్ఫోన్ల డేటాను విశ్లేషించి నిందితులను గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా రామాయణపురానికి చెందిన నెల్లి నిర్మల కుమారి, ఆమె కుమార్తె నెల్లి లిఖిత, అంబేడ్కర్ కోనసీమ జిల్లా సోంపల్లి (ఇందిరాకాలనీ)కి చెందిన భూపతి అభిరామ్, బి.సావరం గ్రామానికి చెందిన నల్లి మణిరత్నంలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. బంధువుల పరిచయంతో.. ప్రధాన నిందితురాలు నెల్లి నిర్మల కుమారి.. ఆరిలోవలోని బంగారుతల్లి లే–అవుట్లో నివాసం ఉంటున్న తన పెదనాన్న కుమారుడు దుర్గాప్రసాద్ ఇంటికి తరచూ వచ్చి వెళ్తుండేది. ఆ సమయంలో దుర్గాప్రసాద్ ఇంటి యజమానురాలైన వసంత మెడలో ఎక్కువ బంగారు ఆభరణాలు ఉండటం గమనించింది. తనకు ఉన్న అప్పులు తీర్చుకోవడానికి ఆమెను దోచుకోవాలని పథకం వేసింది. భీమవరం కలెక్టర్ ఆఫీస్లో క్యాంటీన్ నడుపుతున్న నిర్మల కుమారి.. తన కుమార్తె లిఖితకు, క్యాంటీన్లో పనిచేస్తున్న అభిరామ్, మణిరత్నంలకు డబ్బు ఆశ చూపించి విశాఖ తీసుకువచ్చింది. 13వ తేదీన దొంగతనం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. మరుసటి రోజు బాధితురాలికి ‘సెండాఫ్’ చెప్పే నెపంతో నిర్మల కుమారి, లిఖిత ఆమెను బయటకు పిలిచారు. ఆ సమయంలోనే అభిరామ్, మణిరత్నం రహస్యంగా ఇంట్లోకి దూరి దాక్కున్నారు. రాత్రి బాధితురాలు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని నిద్రపోయాక, లోపల ఉన్న నిందితులు ఆమెను బంధించి చోరీకి పాల్పడ్డారు. ఈ కేసును ఛేదించడంలో చొరవ చూపిన ద్వారకా సబ్ డివిజన్ క్రైం సీఐ వి.చక్రధర్, ఆరిలోవ క్రైం ఎస్సై ఎ.హరికృష్ణ, ఎంవీపీ క్రైం ఎస్సై సీహెచ్.రామదాసు, ద్వారకా క్రైం ఎస్సై ఎల్. శ్రీనివాసరావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రామారావు, చంద్రశేఖర్లను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అభినందించారు. మహిళను బంధించి ఆభరణాలు దోచుకెళ్లిన ముఠా తల్లీకూతుళ్లు సహా నలుగురి అరెస్ట్ 10 తులాల బంగారం, రూ.10 వేలు స్వాధీనం -
ఆహ్లాదం.. పాపికొండల విహారం
ప్రకృతి రమణీయత నడుమ పాపికొండల విహారం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దీంతో పాపికొండల పర్యాటకంపై అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. 8లో uనిరంతర గస్తీ, నిఘాతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో నేరాల సంఖ్య 19.03 శాతం తగ్గించాం. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామం. పోక్సో కేసుల్లో 25 మందికి శిక్షలు పడగా వీరిలో ఆరుగురికి జీవిత ఖైదు, ఒకరికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. లైంగిక నేరాలకు పాల్పడే 68 మందిపై రౌడీ షీట్లు తెరిచాం. జిల్లా వ్యాప్తంగా 3742 సీసీ కెమెరాలు, మూడు డ్రోన్లు సాయంతో నిరంతర పహారా కాస్తున్నాం. ఆధునిక సాంకేతికత సాయంతో రూ.77 లక్షలు విలువ చేసే 515 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. ట్రాఫిక్ ఉల్లంఘనలపై 31,208 ఈ చలానాల ద్వారా రూ.1.57 కోట్ల జరిమానాలు వేశాం. శాంతి భద్రతల దృష్ట్యా 343 రౌడీషీట్లు క్రియాశీలకంగా ఉంచి నలుగురిపై పీడీ యాక్టు ప్రయోగించాం. నరసాపురం మండలంలో మృతదేహం కేసును కేవలం డీఎన్ఏ ప్రొఫైలింగ్ సాంకేతికను ఉపయోగించి ఛేదించాం. – అద్నాన్ నయిం అస్మీ, ఎస్పీ -
సైబర్ వల
ఈవీఎం గోడౌన్ తనిఖీ భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం పీపీ రోడ్డులోని గోడౌన్్లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం తనిఖీ చేశారు. ఏడాదికాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకులను బెదిరించి వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేశారు. జిల్లా వ్యాప్తంగా చోటుచేసుకున్న 30 ఘటనల్లో దాదాపు రూ.9 కోట్ల నగదును మళ్లించేశారు. ఏడాదికాలంలో జిల్లా వ్యాప్తంగా పోలీస్ రికార్డుల్లో నమోదైన మొత్తం వివిధ నేరాలు 5,076 కాగా మహిళలపై దాడులు, లైగింక వేధింపులు తదితర ఘటనలు 697, చోరీలు 516 ఉన్నాయి. బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం/భీమవరం: గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో సైబర్ నేరాలు పెరిగాయి. 2024 సంవత్సరంలో 16 ఘటనల్లో రూ. 3 కోట్ల వరకు సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. 2025లో డిజిటల్ అరెస్టులంటూ వృద్దులు లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. సెప్టెంబరు నెలలో భీమవరానికి చెందిన వృద్ద దంపతులను డిజిటల్ అరెస్ట్ చేశామంటూ బెదిరించి దాదాపు రూ.99 లక్షలు కాజేశారు. నవంబరులో భీమవరానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ను డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి బ్యాంకు ఖాతా నుంచి రూ.78.60 లక్షలు చోరీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 30 ఘటనలకు సంబంధించి రూ. 9 కోట్ల వరకు చోరీ అయినట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. పోలీస్ స్టేషన్ల వరకు చేరని సైబర్ నేరాలు మరెన్నో. ఎస్పీ అద్నాన్ నయిం అస్మీ ఆధ్వర్యంలో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సైబర్ నేరాలపై జిల్లా పోలీసులు పురోగతి సాధించారు. రిటైర్డ్ ప్రొఫెసర్ కేసు దర్యాప్తులో 14 మంది అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టుచేశారు. కంబోడియా కేంద్రంగా ‘కార్డ్ డీల్’ అనే పద్ధతిని ఉపయోగించి వీరంతా నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. వీరిలో 13 మందిని అరెస్టు చేసి రూ.42.1 లక్షల నగదు రికవరీతో పాటు రూ.19.9 లక్షల మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ చేయించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసులకు సంబంధించి సైబర్ నేరగాళ్ల చేతికి అందకుండా మొత్తం రూ.96.92 లక్షల నగదు హోల్డ్లో పెట్టించారు. జిల్లాలో 60 మంది నిందితులను అరెస్టు చేసి 1,236 కిలోల గంజాయిని ధ్వంసం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో 815 మందిపై, మూడు డ్రోన్లు సాయంతో 186 బహిరంగ మద్యపానం కేసులు నమోదుచేశారు. ఏడాదిలో మొత్తం ప్రమాదాలు 512 మరణాలు చోటుచేసుకున్న ఘటనలు 216 గాయపడిన ఘటనలు 296 రోడ్డు ప్రమాదాల్లో మృతులు 223 మంది సైబర్ నేరాలు 30 చోరీ కేసులు 516మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాల కేసులు ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసులు33697రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారు 432 మంది మిగిలిన కేసులు దాడులు, అల్లర్లు, హత్యలు, ప్రమాదాలకు సంబంధించినవి రూటు మార్చిన కేటుగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరుతో 30 ఖాతాల నుంచి రూ.9 కోట్ల ఖాళీ ఏడాదిలో నమోదైన మొత్తం కేసులు 5,076 512 ప్రమాదాల్లో 223 మంది మృతి, 432 మందికి గాయాలు 1236 కేజీల గంజాయి ధ్వంసం -
ఆయుధ డిపోకు వ్యతిరేకంగా ధర్నా
కొయ్యలగూడెం: నేవీ ఆయుధ కర్మాగార డిపో ఏర్పాటుకు వ్యతిరేకంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. బోడిగూడెం పంచాయతీ పరిధిలో బర్కెట్నగర్ ప్రాంతంలో నేవీ డెక్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతున్నందుకు నిరసనగా నిరసన వ్యక్తం చేశారు. ఒకప్పుడు బీడు భూములుగా ఉన్న తమ పొలాల్లో పోలవరం ప్రాజెక్టు వల్ల బోరులు పడుతున్నాయని రెండు పంటలు పండే భూములను డిపో ఏర్పాటు వల్ల కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్మాగార డిపో నిర్మాణానికి 1200 ఎకరాలు అవసరం కాగా అందులో 400 ఎకరాల భూములు సన్న చిన్న కారు రైతులకు చెందినవేనన్నారు. భూములు కోల్పోతే కుటుంబాలతో సహా నడిరోడ్డున పడతామంటూ గోడు వెళ్లబోసుకున్నారు. నేవీ డాక్ యార్డ్ స్థాపించడానికి స్థానికంగా ఉన్న రైతులందరూ ఒప్పుకున్నట్టు త్వరలో భూసేకరణ జరుగుతున్నట్లు వార్త వచ్చిందని, ఇది పూర్తిగా అసత్యమని, రైతులు వద్దకు ఎవరు సంప్రదింపులకు రాలేదని ఖండించారు. కనీసం గ్రామసభ కూడా నిర్వహించకుండా ప్రచారం చేయడాన్ని రైతులంతా తప్పుబట్టారు. బోడిగూడెం పరిధిలో ఉన్న భూములు చిన్న సన్నకారు రైతులవని, ఈ భూములు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని రైతులు పేర్కొన్నారు. -
స్మార్ట్ మీటర్లతో మీటర్ రీడర్ల ఉపాధికి ప్రమాదం
తాడేపల్లిగూడెం (టీఓసీ): స్మార్ట్ మీటర్లు బిగించడంతో మీటర్ రీడర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మీటర్ రీడర్ల సమావేశం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో గౌరవాధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. వక్తలు మాట్లాడుతూ విద్యుత్ సంస్థను నమ్ముకుని మీటర్ రీడర్లు 20 సంవత్సరాలు పైబడి బిల్లింగ్ చేస్తూ కుటుంబాలు పోషించుకుంటారని, ఇప్పుడు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో జిల్లాలోని 356 మంది మీటర్ రీడర్లు పని లేక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని వాపోయారు. తమను ఆదుకోవాలని గత రెండేళ్లుగా ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై రానున్న రోజుల్లో మీటర్ రీడర్ల యూనియన్ ఆధ్వర్యంలో వైజాగ్, విజయవాడలో జరిగే కార్యాచరణ రూపొందిస్తారని, మీటర్ రీడర్లు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి.దుర్గారావు, మల్లేశ్వరరావు, ఆశోక్, ప్రకాష్, శశిధర్, వెంకటరత్నం, మహేష్, శ్రీను, మోజేష్ తదితరులు పాల్గొన్నారు. -
కీచక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు
పెనుగొండ, పాలకొల్లు (సెంట్రల్), భీమవరం : విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. పోడూరులోని మండల ప్రజా పరిషత్ మెయిన్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు ఎం నాగేశ్వరరావు నాలుగు రోజులు క్రితం అదే పాఠశాలలో 4, 5వ తరగతులు చదువుతున్న ఇద్దరు విద్యార్థినులను పాఠశాల భవనంపైకి పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే ఆ చిన్నారులు భయంతో కేకలు వేసుకుంటూ కిందకు వచ్చి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో సోమవారం రాత్రి ఓ విద్యార్థిని తల్లి పోడూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా ఉపాధ్యాయుడు ఎం నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఇవీవీఎస్ఎస్ఎస్ఎస్ బీఎల్ నారాయణ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఉండి: ఉండి మండలం చెరుకువాడ గ్రామానికి చెందిన బాలిక దివ్యాన్ ఫణిశ్రీ వెలిగట్ల గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. ఈ నెల 27వ తేదీన హైదరాబాద్లోని గచ్చిబౌలీ స్టేడియంలో ఏడు వేల మందితో నిర్వహించిన సామూహిక కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీల్లో దివ్యాన్ ఫణిశ్రీ పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో భాగమైనట్లు బాలిక తండ్రి సత్యప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బాలికకు గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్తో పాటు జ్ఞాపికను అందజేసినట్లు చెప్పారు. కొంతకాలంగా కూచిపూడి నాట్యం నేర్చుకుంటూ హైదరాబాద్లోనే ఉండి చదవుకుంటున్న తన కుమార్తె ప్రపంచ రికార్డు సాధనలో భాగం అయినందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫణిశ్రీకి పలువురు అభినందనలు తెలిపారు. జంగారెడ్డిగూడెం: వైకుంఠ ఏకాదశి, మంగళవారం సందర్భంగా గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీ స్వామి వారి దేవస్థానమునకు ఉపాలయం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామి వారిని భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పి.ధర్మరాజు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల రూపేణా ఆలయానికి రూ.4,45,370 ఆదాయం సమకూరినట్టు ఈవో తెలిపారు. 4,950 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని ఈవో ఆర్వీ చందన చెప్పారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన 28వ ఐపీఎస్జీఎం–2025 రీజనల్ మీట్ క్రీడా పోటీల్లో ఓవరాల్ చాంపియన్షిప్ను ఏలూరు సర్ సీఆర్రెడ్డి పాలిటెక్నిక్ విద్యార్థులు కై వసం చేసుకున్నారు. ప్రధానాచార్యులు డి.ఫణీంద్ర ప్రసాద్ అధ్యక్షతన వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, కోకో, షటిల్, అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 2 ప్రభుత్వ, 10 ప్రైవేట్ పాలిటెక్నిక్లలోని 550 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలకు నిట్ రిజిస్ట్రార్ దినేశ్ శంకరరెడ్డి హాజరుకాగా కాకినాడ ఆర్జేడీటీఈ పి.సుబ్రహ్మాణ్యం, సివిల్ హెచ్ఓడీ జీవీవీఎల్ సత్యనారాయణ, మెకానికల్ హెచ్ఓడీ ఎ.గోపి, పీడీ కమల్ బాషా, విశ్రాంత పీడీ కె.రవికుమార్ పర్యవేక్షించారు. రీజనల్ మీట్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు జనవరి నెలలో తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. -
కలెక్టరేట్లో ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డే
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం కలెక్టరేట్లో ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణకు ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. యలమంచిలి మండలం ఏనుగువానిలంక గ్రామ సచివాలయ ఉద్యోగులకు 10 నుంచి 12 శాతం హెచ్ఆర్ఏ చెల్లింపు సమస్య, గ్రామ వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఏఎన్ఎంలకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మెడికల్ డిపార్టుమెంట్కు సంబంధం లేని విధులు కేటాయించవద్దని కోరారు. డిజిటల్ అసిస్టెంట్లకు ఎన్నికల బీఎల్ఒ డ్యూటీ వేయవద్దని కోరారు. భీమవరం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నూతన క్యాలెండర్ను మంగళవారం కలెక్టర్ నాగరాణి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని మరింత ఉత్సాహంతో నూతన సంవత్సరంలో విధులు నిర్వహించాలన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు వై.మోహనరావు, జిల్లా కార్యదర్శి జి.జకరయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు షేక్ ఉమర్ అలీషా, ట్రెజరర్ పి.నాగభూషణం, ఉపాధ్యక్షుడు కె.కనకరాజు తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): సామాజిక డిసెంబర్ 31న ఉదయం నుంచి అందజేయనున్నారు. జిల్లాలో 2,24,521 మంది లబ్ధిదారులకు రూ.97.19 కోట్ల పింఛన్లను సచివాలయం సిబ్బంది వెళ్లి పంపిణీ చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని, ఎవరైనా మిగిలిపోతే జనవరి 2న అందజేస్తారని తెలిపారు. పంపిణీలో లబ్ధిదారులకు ఏమైనా సమస్య ఉంటే ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఏలూరు (టూటౌన్): బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గిరిజనులపై అక్రమంగా బనాయించిన పోలీసు కేసులు ఎత్తివేయాలని, దౌర్జన్యంగా దున్నేసిన గిరిజనుల పంటకు నష్ట పరిహారం చెల్లించాలని, రైతు సంఘం నాయకుడు ఎం.అప్పలరాజుపై పీడీ యాక్ట్ ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. గిరిజనులపై పోలీసు నిర్బంధం ఆపాలని, గిరిజన భూ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహనరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ తదితరులు మాట్లాడారు. జీవో 1049 ప్రకారం ఏజెన్సీ భూ సమస్యలలో పోలీసులు జోక్యం చేసుకోకూడదన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తూ ఏజెన్సీ ప్రాంతంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు గిరిజనేతర భూస్వాముల కొమ్ము కాస్తూ గిరిజనులు, గిరిజనుల నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం దుర్మార్గమని విమర్శించారు. ఏలూరు (టూటౌన్): 2026 సీజన్కు సంబంధించి కొబ్బరికి కేంద్ర ప్రభుత్వం పెంచిన కనీస మద్దతు ధర రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదని కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె.శ్రీనివాస్ విమర్శించారు. స్థానిక పవరుపేటలోని అన్నే భవనంలో కొబ్బరి మద్దతు ధరపై మంగళవారం ఆయన మాట్లాడారు. ఈ ఏడాది సరాసరి ధర కొద్దిగా పెరిగినా రైతులకు పెట్టుబడి ఖర్చులు రాక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వ విదేశాల నుంచి కొబ్బరి ఉత్పత్తుల దిగుమతులకు అవకాశం కల్పించడం వల్ల దేశీయంగా కొబ్బరి రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. చెట్టు నుంచి కొబ్బరికాయలు కోసి గుట్టగా పోయడానికి ఒక్కో కాయకు రైతుకు రూ.4కు పైగా ఖర్చు అవుతున్నదని వివరించారు. -
భగవన్నామ స్మరణ శక్తివంతమైంది
ఉంగుటూరు : భగవన్నామ స్మరణచాలా శక్తి వంతమైనదని ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. మంగళవారం గోపినాథపట్నంలో ముక్కోటి ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొట్టు వెంకటేశ్వరరావు, సరస్వతీ కల్యాణ మండపంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. మానవ జన్మ సార్ధకతకు భగవన్నామ స్మరణ ఒకటే మార్గమని చాగంటి అన్నారు. గోవిందా నామం కలియుగంలో ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. అనితర సాధ్యం కాని దానిని భగవన్నామస్మరణ సాధ్యం చేస్తుందని వివరించారు. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కాకినాడలో గోవులకు స్థలం అందచేశారని చెప్పారు. కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ చాగంటి కోటేశ్వరరావు మూడోసారి గోపినాథపట్నం వచ్చి ప్రవచనం చెప్పడం ఆనందంగా ఉందన్నారు. -
యూరియా కోసం తప్పని పాట్లు
పెనుగొండ: యూరియా సమృద్ధిగా ఉందంటూ వ్యవసాయాధికారులు, జిల్లా స్థాయి అధికారులు పదేపదే ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్ర స్థాయిలో యూరియా కోసం రైతన్నలకు పాట్లు తప్పడం లేదు. సొసైటీల్లో యూరియా కావాలంటే ఇతర రకాలు తీసుకోవాలని మెలిక పెడుతుండడంతో సార్వాలో నష్టపోయిన రైతన్నలు అదనపు భారం భరించలేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇదే పరిస్థితి సోమవారం ఆచంటలోని మృత్యుంజయ సొసైటీ వద్ద నెలకొంది. తొలుత యూరియా కావాలంటే ఇతర రకాలు తీసుకోలంటూ మెలికపెట్టడంతో ఉదయం సొసైటీ వద్ద గందరగోళం నెలకొంది. యూరియా మాత్రమే ఇవ్వాలంటూ రైతులు పట్టుబట్టి కొద్దిసేపు వాగ్విదానానికి దిగారు. దీంతో ఉన్నతాధికారులు కలగజేసుకొని సమస్యను సర్దుబాటు చేసి, యూరియాపై నియంత్రణ విధించారు. పూర్తి స్థాయిలో ఇవ్వకుండా కోటాగా సరఫరా చేయడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. కేటాయించిన మేర యూరియా తీసుకువెళ్లడానికి రైతులు గంటలు తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. కాగా కొందరు కూటమి నాయకులు యూరియా అందరికీ అందనివ్వకుండా అడ్డుకొంటున్నారని రైతులు ఆరోపించారు. రైతులకు అందించాల్సిన యూరియాలోనూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. -
బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు నన్నయ్య జట్టు ఎంపిక
తాడేపల్లిగూడెం : పట్టణంలోని ఆదికవి నన్నయ్య వర్సిటీ ఆవరణలో మంగళవారం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, పురుషుల ఇంటర్ కాలేజీయేట్, ఇంటర్ యూనిట్ జట్టు బాల్ బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు నన్నయ్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వందమంది పాల్గొనగా నాకౌట్, లీగ్ విధానంలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఎస్కేవీటి.డిగ్రీ కళాశాల, డీఆర్జీ డిగ్రీ కళాశాల, పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాకినాడ జట్లు ఎంపికయ్యాయి. తిరుచిరాపల్లిలో భారతీ దాసన్ విశ్వవిద్యాలయంలో 14వ ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ఎంపికై న జట్లు పాల్గొననున్నాయి. ఎంపికై న క్రీడాకారులకు తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరంలో శిక్షణ శిబిరం ఏర్పాటుచేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు రాణించి విద్యాసంస్థకు పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ టి.అశోక్ కోరారు. -
ఆయన ఏ పార్టీ?
● మావుళ్లమ్మ ట్రస్ట్బోర్డు సభ్యుడిగా నాగభూషణం ● టీడీపీ, జనసేన పార్టీల్లో నాగభూషణంకు సభ్యత్వం సాక్షి, భీమవరం: ఇంతకీ ఆయన ఏ పార్టీ?.. టీడీపీనా? జనసేనా? భీమవరం కూటమి వర్గాల్లో ఇప్పుడిదే చర్చ. ఏడాదికాలంగా నలుగుతున్న భీమవరం మావూళ్లమ్మ వారి దేవస్థానం ట్రస్టు బోర్డు ఎట్టకేలకు ఖరారైంది. రాష్ట్రవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన అమ్మవారి ఆలయ చైర్మన్ పదవిని టీడీపీ, జనసేన నుంచి ఎంతోమంది ఆశించారు. టీడీపీకి చెందిన వారికే ఇస్తారని.. లేదు జనసేన పార్టీకి వస్తుందని టాక్ నడిచింది. అమ్మ దయ మాత్రం స్థానిక ఎమ్మెల్యేకు సన్నిహితునిగా పేరొందిన బొండాడ నాగభూషణంకు ఇచ్చారు. పట్టణానికి చెందిన నాగభూషణంతో పాటు 13 మంది సభ్యులతో కూడిన పాలక మండలిని నియమిస్తూ మంగళవారం దేవాదాయశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. దేవాదాయశాఖ సభ్యులతో ప్యానెల్ను విడుదల చేస్తే, ప్రమాణ స్వీకార సమయంలో వారిలోంచి ఒకరిని చైర్మన్గా మిగిలిన వారు ఎన్నుకుంటారు. చాలావరకు చైర్మన్గా ఎంపికయ్యే వారి పేరే ప్యానెల్లో మొదటి సభ్యుడిగా పేర్కొంటుంటారు. పాలక మండలి సభ్యుల్లో నాగభూషణం పేరే మొదటిగా ఉండటంతో ఆయనే ఆలయ చైర్మన్గా ప్రచారం జరుగుతోంది. నాగభూషణంకు టీడీపీ, జనసేన రెండు పార్టీల్లోను సభ్యుత్వాలు ఉన్నట్టు గుర్తింపు కార్డులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటం హాట్ టాపిక్గా మారింది. కూటమి ప్రభుత్వంలో ఎప్పుడు ఏ నామినేటెడ్ పదవికి ఎవరికి కేటాయిస్తారో తెలీని పరిస్థితులు ఉండటంతో ఎందుకై నా మంచిదని రెండు పార్టీల్లోను సభ్యత్వాలు తీసుకుని ఉంటారన్న ప్రచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జనసేన, టీడీపీలో నాగభూషణం సభ్యత్వ కార్డులు -
14 నుంచి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు
నరసాపురం: నరసాపురం రుస్తుంబాదలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జాతీయస్థాయి పురుషుల, మహిళల కబడ్డీ పోటీలు జనవరి 14 నుంచి 18వతేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏడాది వలె 32వ జాతీయస్థాయి ఇన్విటేషన్ కప్ కబడ్డీ పోటీలు ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంగళవారం గోగులమ్మ ఆలయం వద్ద విలేకరుల సమావేశంలో పోటీల కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకీరామ్, జాతీయ కబడ్డీ అసోసియేషన్ మాజీ కార్యదర్శి వి.వీర్లెంకయ్య టోర్నమెంట్ వివరాలు వెల్లడించారు. వివిధ రాష్ట్రాల నుంచి పురుషుల విభాగంలో 20, మహిళల విభాగంలో 20 మొత్తం 40 జట్లకు ఆహ్వానం పంపామని చెప్పారు. ఫ్రొకడ్డీ పోటీల్లో ఆడిన ఆటగాళ్లు కూడా పాల్గొంటున్నారని చెప్పారు. లీగ్కమ్ నాకౌట్ పద్ధతిలో మ్యాచ్లు జరుగుతుతాయన్నారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.1.50 లక్షలు, రెండో బహుమతిగా రూ.లక్ష, మూడవ బహుమతిగా రూ.75 వేలు, నాల్గో బహుమతిగా రూ.50 వేలు పురుషులు, మహిళల విభాగాల్లో అందిస్తామన్నారు. 50 మంది రిఫరీలు, ఆటగాళ్లు, సిబ్బంది కలిపి 500 మంది పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఆహ్లాదం.. పాపికొండల విహారం
పాపికొండల దగ్గరగా అటవీశాఖ నిర్మించిన కాటేజీలు బుట్టాయగూడెం: చుట్టూ ఎత్తయిన పర్వతశ్రేణులు.. వాటి మధ్యలో గలగలా గోదావరి ప్రవాహం. ఆ కొండల్లో పచ్చటి వృక్షాలు, పక్షుల కిలకిలరావాలు, ఎటు చూసినా ప్రకృతి రమణీయత, సుందర దృశ్యాల సమాహారం పాపికొండల విహారం. ఏలూరు, రంపచోడవరం జిల్లాల నడుమ తూర్పు కనుమల్లో దట్టమైన అడవుల్లో కూడిన పర్వతశ్రేణి పాపికొండలు. ఇంతటి విశిష్టత కలిగిన పాపికొండల పర్యాటకంపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొరుటూరు సమీపంలో ఉడెన్ కాటేజీలు నిర్మించి పర్యాటకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో పాపికొండల అందాలను తిలకించేలా ఏర్పాట్లు చేసింది. దేవీపట్నం మండలం గండిపోచమ్మ అమ్మవారి గుడి సమీపంలో ఉన్న బోటు పాయింట్ నుంచి కొరుటూరు ఫారెస్ట్ కాటేజీలకు చేరుకున్న పర్యాటకులు బస చేసి ప్రకృతి రమణీయమైన అందాలను తిలకించవచ్చు. 15 పర్యాటక కాటేజీలు పాపికొండల పర్యాటకుల కోసం కొరుటూరు సమీపంలోని ఎత్తయిన కొండప్రాంతంలో 15 కాటేజీలు నిర్మించారు. వీటిలో ఉడెన్ కాటేజీలు 5, బేంబో కాటేజీలు 5, టెంట్ హౌస్లు 5 చొప్పున ఏర్పాటు చేశారు. వీటితోపాటు శివగిరి సమీపంలో పర్యాటకుల సౌకర్యార్థం కాటేజీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కాటేజీలు మొత్తం పాపికొండలకు అతిసమీపంలోనే ఉన్నాయి. ఎత్తయిన కొండపై వీటిని నిర్మించడంతో అక్కడి నుంచి పాపికొండల అందాలతోపాటు గోదావరి నదిపై బోట్లను, ప్రకృతి అందాలను కూడా తిలకించవచ్చు. అదేవిధంగా పర్యాటకులు ట్రెక్కింగ్ చేసేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ట్రెక్కింగ్ చేసే సమయంలో ఇద్దరు ఫారెస్ట్ సిబ్బంది వారితోపాటు కొండపైకి వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. పాపికొండల పర్యాటకుల కోసం ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కాటేజీలు ఏర్పాటు చేశాం. కాటేజీలకు సోలార్ ద్వారా విద్యుత్ సదుపాయం కూడా కల్పించాం. పర్యాటకుల మనసుదోచేలా కాటేజీల నిర్మాణం జరిగింది. అందరికీ అందుబాటులో ఉండే విధంగానే కాటేజీల ధర నిర్ణయించారు. – ఎస్కె వల్లి, అటవీశాఖ అధికారి, పోలవరం రేంజ్ కొరుటూరు సమీపంలో ఫారెస్ట్ శాఖ నిర్మించిన ఉడెన్ కాటేజీలు అటవీశాఖ ఏర్పాటు చేసిన టెంట్ హౌస్లు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు అటవీశాఖ ఆధ్వర్యంలో కాటేజీల ఏర్పాటు పర్యాటకులకు ట్రెక్కింగ్కు కూడా అవకాశం -
అండర్–14 క్రికెట్ జట్టుకు దీపక్ ఎంపిక
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీస్ విభాగంలో హోంగార్డుగా పనిచేస్తున్న కే.సూరిబాబు కుమారుడు కే.సాయిదీపక్ అండర్–14 జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ శివకిషోర్ బాలుడు దీపక్ను ప్రత్యేకంగా అభినందిస్తూ... క్రికెట్ బ్యాట్ను బహూకరించారు. హోంగార్డు కుటుంబం నుంచి రాష్ట్రానికి అండర్–14 క్రికెట్ జట్టులో స్థానం సాధించటం సంతోషంగా ఉందనీ, మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్ఐ పవన్కుమార్, తండ్రి సూరిబాబు ఉన్నారు. -
ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధమైంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్తర ద్వారం వద్ద స్వామివారి దర్శనం భక్తులకు కల్పించనున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. అందులో భాగంగా ఆలయ పరిసరాలను, ఉత్తర ద్వారాన్ని సోమవారం రాత్రి పచ్చిపూలతో శోభాయమానంగా అలంకరించారు. ఉత్తర ద్వారంలో స్వామివారు ఆసీనులయ్యే ప్రాంతాన్ని అలంకరించి, ప్రత్యేక మండపాన్ని నిర్మించారు. అర్ధరాత్రి వరకు ఈ పనులు సాగాయి. స్వామివారి వాహన సేవకు వెండి గరుడ, శేష వాహనాలను సిద్ధం చేశారు. సోమవారం రాత్రి 7 గంటల నుంచి నిజరూపంలో ఉన్న శ్రీవారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. క్షేత్రానికి చేరుకున్న దీక్షాధారులు తొలి ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు దూరప్రాంతాల నుంచి గోవింద స్వాములు సోమవారం రాత్రి ఆలయానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం స్వామిని దర్శించిన తరువాత ఇరుముడులు సమర్పించనున్నారు. రెండు వాహనాలపై.. ముక్కోటి పర్వదినాన స్వామివారు ఉత్తర ద్వారం వద్ద ఉదయం 10 గంటల వరకు వెండి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఆ తరువాత అదే వాహనంపై గ్రామోత్సవానికి వెళతారు. ఆ సమయం నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్తర ద్వారం వద్ద స్వామి, అమ్మవార్లు వెండి శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. అలాగే సాయంత్రం వరకు స్వామివారు గర్భాలయంలో నిజరూప దర్శనంలో భక్తులను కటాక్షిస్తారు. నేడు తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామి దర్శనం రెండు వాహనాలపై దర్శనమివ్వనున్న శ్రీవారు ముందు రోజు రాత్రే వేలాదిగా ఆలయానికి చేరుకున్న భక్తులు -
తల్లికి వందనంలో 20 వేల మందికి కోత
పేదల విద్యార్థులు సైతం విద్యాభ్యాసానికి ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థులకు రూ.15 వేలు అందిస్తే అదే పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనంగా మార్చి విద్యార్థులందరికీ రూ.15 వేలు ఇస్తామని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక దాదాపు 20 వేల మంది విద్యార్థులకు కోత పెట్టారు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ఉపాధ్యాయులు సైతం టెట్ పరీక్షలో ఉత్తీర్ణత కావాలనే నిబంధన ఉపాధ్యాయులకు గుదిబండగా మారింది. సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు దీనిపై మినహాయింపు ఇచ్చేలా కేంద్రం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టినా ఇంతవరకు ఎలాంటి ఫలితం లభించలేదు. -
అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలి
భీమవరం(ప్రకాశం చౌక్): పీజీఆర్ఎస్ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి అందిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. తమ శాఖ పరిధిలో లేని ఫిర్యాదులు వస్తే వాటిని తక్షణమే సంబంధిత శాఖ అధికారులకు పంపించాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అనంతరం సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 3, 4 తేదీలలో గోదావరి క్రీడోత్సవాల జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తామన్నారు. డివిజనల్ స్థాయిలో జరిగిన క్రీడా పోటీలలో గెలుపొందిన వారు జిల్లాస్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. సోమారామం ఈఓపై చర్యలు తీసుకోవాలి దివ్యాంగురాలినని కూడా చూడకుండా క్యూలైన్లోంచి తనను పక్కకు నెట్టేసి అమర్యాదగా ప్రవర్తించిన భీమవరం పంచారామ ఆలయ ఈఓ రామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని మద్దింశెట్టి మాధవి లక్ష్మీ కుమారి రెండోసారి పీజీఆర్ఎస్లో ఫిర్యాదుచేశారు. లక్ష్మీకుమారి కార్తీకమాసం చివరి సోమవారం స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న సమయంలో.. ఈఓ తన భుజంపై చెయ్యి వేసి పక్కకు లాగి రద్దీలో గుడికి రావడం అవసరమా అంటూ తనను చులకన చేసి మాట్లాడారని తెలిపారు. -
విద్యా విధానం.. అస్తవ్యస్తం
వేతనాలు పెరగక వెతలు ట్రిపుల్ ఐటీలోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వేతనాలు పెరగక.. ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 8లో u● ప్రైవేటు స్కూళ్లలో ఇష్టారాజ్యం ● తల్లికి వందనంలో భారీగా కోత మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025భీమవరం: జిల్లాలో గత ఏడాదిగా విద్యావిధానంగా అస్తవ్యస్థంగా మారింది. పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం, విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు విద్యార్థినిల పట్ల అసభ్య ప్రవర్తన, పాఠశాలల్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కువ కావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మన బడి నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్ధలకు దీటుగా తయారుచేసి సకల సౌకర్యాలు కల్పించారు. గత ప్రభుత్వం చేపట్టిన పనులు, ఎన్నికల అనంతరం నిలిచిపోయిన అనేక పనులకు మోక్షం లేకుండా పోయింది. జిల్లాలోని 20 మండలాల్లో దాదాపు 1,427 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు లక్షకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. నలుగురు టీచర్ల సస్పెండ్ : పాఠశాలలకు వచ్చే విద్యార్ధులను కన్నబిడ్డలుగా చూసి విద్యాబుద్ధులు నేర్పాల్సిన నలుగురు ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో భయపడిన బాలికలు తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లడంతో జిల్లాలోని పాలకొల్లు మండలం అగర్తిపాలెం, భీమవరం మండలం గొల్లవానితిప్ప, భీమవరం పట్టణంలోని రెండు పాఠశాలల్లోని ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. గొల్లవానితిప్ప స్కూల్ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేటు స్కూల్స్ ప్రైవేటు స్కూల్పై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో విద్యను వ్యాపారంగా మార్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫాం వంటివి విక్రయించకూడదనే నిబంధనలు గాలికి వదిలి యథేచ్చగా అమ్ముకున్నారు. జిల్లాలోని తణుకు, భీమవరం తదితర పట్టణాల్లో ప్రైవేటు స్కూళ్లలో విక్రయాలను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుని విద్యాశాఖాధికారులకు ఫిర్యాదుచేసినా చర్యలు తీసుకోలేదు. ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాంకు అధిక మొత్తంలో వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పది విద్యార్థులకు అందని పౌష్టికాహారం పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచడానికి గత ప్రభుత్వం విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించి వారికి పౌష్టికాహారంగా ప్రత్యేకంగా స్నాక్స్ అందించేవారు. ప్రస్తుతం అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు తప్ప ఎలాంటి స్నాక్స్ లేవు. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థులు తరగతిలో ఉండడం వల్ల నీరసించిపోతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల వాహనాలను నిర్లక్ష్యంగా నడపడంతో అనేక చోట్ల ప్రమాదాలు జరిగాయి. దీంతో విద్యార్థులు గాయాల పాలయ్యార. భీమవరం పట్టణంలోని తిరుమల విద్యాసంస్ధల బస్సు డ్రెయిన్లోనికి ఒరిగి బోల్తా పడింది. వీరవాసరం మండలంలో లిటిల్ బడ్స్ స్కూల్ బస్సు చెట్టును ఢీకొట్టినా విద్యార్థులకు పెద్దగా గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాడేపల్లిగూడెం, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినా అధికారులు పట్టించుకోలేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
మావుళ్లమ్మ మూల విరాట్ దర్శనం పునః ప్రారంభం
భీమవరం (ప్రకాశం చౌక్): మావుళ్లమ్మ వారి 62వ వార్షికోత్సవం సందర్భంగా అలంకరణ పనుల కోసం ఈ నెల 17న మూల విరాట్ దర్శనాన్ని నిలిపివేశారు. అలంకరణ పనులు పూర్తి చేయడంతో సోమవారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ కళాన్యాసం ప్రత్యేక పూజలను నిర్వహించగా అమ్మవారి మూల విరాట్ పునః దర్శనం భక్తులకు కల్పించారు. అమ్మవారి ఆలయ సన్నిధిలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. అమ్మవారిని స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించాలన్నారు. భీమవరం: ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కారం చేయాలని అడిషనల్ ఎస్పీ వి.భీమారావు చెప్పారు, సోమవారం భీమవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా 21 మంది బాధితులు తమ సమస్యలను వివరించారు. అనంతరం సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడి ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. భీమవరం(ప్రకాశం చౌక్): దివ్యాంగులకు ప్రతినెల మూడో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో ప్రతి నెల మూడో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ డే ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దివ్యాంగులు తమ సమస్యలను మూడో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్న్స్ డే రోజున అందజేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. విజువల్లీ చాలెంజ్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రూపొందించిన వికలాంగుల హక్కుల చట్టం–2016 పుస్తకాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతులమీదుగా ఆవిష్కరించారు. భీమవరం(ప్రకాశం చౌక్): రెవెన్యూ సమస్యల పరిష్కారానికి క్లినిక్లు ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో సోమవారం రెవిన్యూ క్లినిక్లు ప్రారంభించి, పనితీరును పరిశీలించారు. కలెక్టరేట్లో 5 కౌంటర్లు ఏర్పాటు చేసి 59 అర్జీలు స్వీకరించారు. భీమవరం: నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి హెచ్చరించారు. న్యూఇయర్ వేడుకలను సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. వేడుకల పేరుతో రోడ్లపై హంగామా చేస్తూ, నిబంధనలు ఉల్లంఘించేవారిపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ ఫ్లెక్సీల తొలగింపు
యనమదుర్రులో ఘటనభీమవరం అర్బన్: భీమవరం మండలంలోని యనమదుర్రు గ్రామంలో సోమవారం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు వివాదంగా మారింది. గ్రామానికి చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఫ్లెక్సీలపై మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుల ఫొటోలతో క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు వస్తున్నారని పంచాయతీ సిబ్బంది, కూటమి నాయకులు ఫ్లెక్సీలను తొలగించారని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్న జనసేన ఫ్లెక్సీలు తొలగించకుండా కక్షతో వైఎస్సార్సీపీవి తొలగించడంపై నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మండి పడుతున్నారు. -
వస్త్ర వ్యాపారం వెలవెల
● ఖాళీగా దర్శనమిస్తున్న దుకాణాలు ● గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదన్న వ్యాపారులు తణుకు అర్బన్: పండుగ రోజుల్లో కూడా తణుకు మార్కెట్ వెలవెలబోతోంది. క్రిస్మస్ పండుగకు పూర్తిగా వ్యాపారం జరగకపోగా, సంక్రాంతి పండుగకు పదిహేను రోజులు మాత్రమే ఉన్నప్పటికీ మార్కెట్లో దుకాణాలన్నీ ఖాళీగా ఉండడం వ్యాపారులకు మింగుడుపడడంలేదు. ప్రజల దగ్గర డబ్బుల్లేవ్ అనే మాటలు ప్రతి వ్యాపారస్తుడి నోటి నుంచి వినిపిస్తోంది. ఇలాంటి రోజులు గతంలో ఎన్నడూ చూడలేదని ఆందోఽళన వ్యక్తం చేస్తున్నారు. పండుగ అంటే వస్త్ర వ్యాపారం ఎక్కువ. గతంలో నెలరోజుల ముందునుంచే దుకాణాలు కిక్కిరిసిపోయేవి. నేడు ఇంకా బోణీ కాని రోజులు నడుస్తున్నాయంటే వ్యాపారం ఏ రకంగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా దుకాణాలు వ్యాపారం జరగక మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయని వ్యాపారులే చెబుతున్నారు. వ్యాపారాలు జరగకపోవడంతో దుకాణాలు ఖాళీ చేస్తున్న పరిస్థితుల్లో తణుకులో రాష్ట్రపతి రోడ్డు, వేల్పూరు రోడ్డుల్లో సైతం పదుల సంఖ్యలో దుకాణాలు ఖాళీ కావడంతో టూలెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. వస్త్ర వ్యాపారానికి తణుకు పేరు వస్త్ర వ్యాపారానికి తణుకు పట్టణం పేరుగాంచింది. పట్టణ ప్రాంత వాసులతోపాటు చుట్టుపక్కల వంద గ్రామాల నుంచి సైతం ప్రజలు తణుకులో ఉన్న వస్త్ర దుకాణాలకు వచ్చి తమకు ఇష్టమైన వస్త్రాలను కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే నగరాల్లో పేరుగాంచిన భారీ వ్యాపార సంస్థలు సైతం తణుకులో ఏర్పాటుచేసిన షోరూంలు గతం నుంచి అందుబాటులో ఉన్నాయి. రెడీమేడ్ దుస్తులు సైతం బ్రాండెడ్ కంపెనీలు విక్రయించే పేరుగాంచిన షోరూంలు ఉన్నాయి. రద్దీ లేని ప్రధాన వీధులు సంక్రాంతి పండుగకు ఇంకా పదిహేను రోజులు మాత్రమే ఉన్నా అధికసంఖ్యలో వస్త్ర, ఫ్యాన్సీ దుకాణాలున్న వీధులు సైతం ఇంకా నిర్మానుష్యంగానే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా తణుకు నరేంద్ర సెంటర్ నుంచి వేల్పూరు రోడ్డు తణుకు పట్టణ వస్త్ర వ్యాపారానికి గుండెకాయ లాంటిది. అటువంటి ప్రధాన వీధికి ఇంకా పండుగ సందడి రాలేదు. బాబు ఎంపోరియం వీధి, ఆలమూరి వారి వీధుల్లో వస్త్ర దుకాణా లతోపాటు మగువలు మెచ్చే ఫ్యాన్సీ, గాజులు, ఎంబ్రాయిడరీ, లేడీస్ డ్రెస్ మెటీరియల్ వంటి దుకాణాలు సైతం ఖాళీగానే ఉండడం వ్యాపారులకు అర్థంకాని పరిస్థితి. రాష్ట్రపతి రోడ్డులోని చెప్పుల, గిఫ్ట్, బంగారు దుకాణాలు సైతం ఖాళీగా ఉన్నాయి. పండుగ వ్యాపారాన్ని నమ్ముకుని ఉన్న వ్యాపారులు కనీసం దుకాణాల్లో పనిచేసే వర్కర్లకు కూడా జీతాలివ్వలేని స్థితిలో ఉన్నామని వాపోతున్నారు. సంక్షేమ నిధులతో సుభిక్షంగా వ్యాపార రంగం గత వైఎస్సార్సీపీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమం రూపంలో అందచేసిన నగదు మార్కెట్లో చలామణి కావడంతో వ్యాపార రంగం విరాజిల్లిందని వ్యాపారులే చెబుతున్నారు. ప్రతి నెలా ఏదోక పథకం పేరుతో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయిన సొమ్ముతో కొనుగోళ్లు చేయడంతో మార్కెట్లో డబ్బు మారకం జరిగేది. నేటి ఇబ్బందులు చూస్తుంటే ఆర్థికమాంద్యం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయా అనే సందేహం కలుగుతోంది. మా 20 సంవత్సరాల వ్యాపార అనుభవంలో ఎన్నడూ ఇలాంటి దుస్థితి లేదు. మార్కెట్లో నగదు మారకం సమస్యతోపాటు ఆన్లైన్ వ్యాపారం, మాల్స్ కూడా ఒక మాదిరి వ్యాపారాలను కుంగదీస్తున్నాయి. క్రిస్మస్ పండుగలో సైతం వ్యాపారం జరగలేదు. సంక్రాంతి పండుగలోనైనా వ్యాపారం జరుగుతుందేమోనని చూస్తుంటే ఇప్పటి వరకు అదికూడా లేదు. – జె.సుజాత, రెడీమేడ్ షాపు యజమాని -
సైడ్ లైట్స్
● సెయింట్గ్జేవియార్ పాఠశాల వద్దకు వచ్చేసరికి ఎదురుగా వాహనాలు రావడంతో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. సెక్యూరిటీ విఫలమైనట్టు కొట్టొచ్చినట్టు కనిపించింది.● గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుల పాదాల రక్షణ నిమిత్తం దారి పొడవునా పరచిన ఎండు గడ్డిలో కొందరు భక్తులకు ముళ్లు గుచ్చుకోవడంతో ఇబ్బంది పడ్డారు. ● మంచినీరు, అల్పాహారం, పండ్లు, టీలు అందించే స్టాల్స్ వద్ద సిబ్బంది సరిపోకపోవడంతో స్టాల్స్ వద్ద తోపులాటలు జరిగాయి. దాంతో అవి భక్తులకు సక్రమంగా అందలేదు. ● భక్తులు నడిచేటప్పుడు గడ్డిలోంచి దుమ్ము విపరీతంగా పైకి లేవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ● మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయ ప్రధాన కూడలిలో గిరి ప్రదక్షిణ వేడుకను ప్రారంభించారు. ● గతంలో వలె ఈ ఏడు గిరి ప్రదక్షిణ వేడుకలో విచిత్ర వేషధారణలను ఏర్పాటు చేయలేదు. ● గిరి ప్రదక్షిణను వేగంగా ముగించారు. సాయంత్రం సుమారు 6.15 గంటకే ఈ వేడుక పూర్తయ్యింది. -
పాము కాటు మరణంపై విచారణ
కలిదిండి(కై కలూరు): ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో తన భార్య మరణించిందని కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇటీవల ఫిర్యాదు అందింది. దీనిపై వైద్యాధికారులు కలిదిండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం విచారణ చేపట్టారు. కలిదిండి మండలం వెంకటాపురం గ్రామంలో అక్టోబరు 30న సిద్దాబత్తుల విజయ(32) దుకాణ ప్రిజ్లో పాలప్యాకెట్ విక్రయానికి తీస్తుండగా కింద నక్కిన నాగుపాము కాటు వేసింది. విషయాన్ని భర్త దుర్గారావుకు చెప్పడంతో కలిదిండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి కై కలూరు, చివరకు ఏలూరు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది. సకాలంలో వైద్యం అందలేదనే దుర్గారావు ఫిర్యాదుతో వైద్యశాఖ జిల్లా ఫొగ్రాం ఆఫీసర్ నరేంద్ర కృష్ణ తన బృందంతో విచారణ చేశారు. దుర్గారావు మాట్లాడుతూ పాము కాటు నిమిత్తం తన భార్యను కలిదిండి పీహెచ్సీకి తీసుకువెళ్లినప్పుడు డాక్టర్ అందుబాటులో లేరన్నారు. నర్సు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి రెండు ఇంజక్షన్లు చేశారన్నారు. అక్కడ నుంచి కై కలూరు సీహెచ్సీకి వెళ్లామని, చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి పంపారన్నారు. అక్కడ తన భార్య మరణించిందని, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని వీడియో, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నివేదికను ఉన్నతాధికారులకు వివరిస్తామని విచారణ బృందం తెలిపింది. వ్యక్తిపై దాడి.. 15 మందిపై కేసు నమోదు ఉండి: ఓ వ్యక్తిపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం చెరుకువాడ గ్రామానికి చెందిన ఆరేపల్లి శివనాగువెంకట సర్వేశ్వరరావు అనే వ్యక్తి బడ్డీకొట్టు, మాంసం వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 28వ తేదీన ఆకివీడు గ్రామానికి చెందిన జేమ్స్ అనే వ్యక్తి దుకాణానికి వచ్చి సిగరెట్ కావాలని అడిగాడు. ఈ విషయంలో ఇరువురి మద్య వాగ్వివాదం ఏర్పడింది. దీంతో జేమ్స్ మళ్లీ మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో మరో 15 మందిని వెంటబెట్టుకుని వచ్చి షాపు ధ్వంసం చేసి, తనను, తన తల్లిని, కుమారుడిని, అతని వద్ద పనిచేస్తున్న పిల్లి దుర్గా వెంకటరావులను కొట్టినట్లు సర్వేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వేతనాలు పెరగక వెతలు
నూజివీడు: ట్రిపుల్ ఐటీలోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వేతనాలు పెరగక.. ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో 2011 నుంచి 2014 వరకు ఇంజినీరింగ్ విద్యార్థులకు బోధన చేసేందుకు నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో 200 మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. అప్పట్లో ఆర్జీయూకేటీ వీసీ వి.రాజ్కుమార్ ఐఐటీలకు, ఎన్ఐటీలకు, సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి అక్కడే ఇంటర్వ్యూలు నిర్వహించి మెరిట్ ఉన్న వారిని ఎంపిక చేసుకొని వారిని నియామక పత్రాలు ఇచ్చి నియమించారు. మీ అందరిని పర్మినెంట్ చేయిస్తాననే హామీతో అప్పట్లో వీరిని తీసుకువచ్చారు. అయితే పర్మినెంట్ సంగతేమో గాని కనీస వేతనాలను సైతం చెల్లించడం లేదని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వాపోతున్నారు. తమకు వేతనాలు పెరిగి ఏడేళ్లు అవుతోందని, గతంలో పలుమార్లు అడిగినా వేతనాలు పెంచకుండా తమకేమీ పట్టనట్టు ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడేళ్లుగా కేవలం రూ.49 వేల వేతనానికే వారు పనిచేస్తున్నారు. ప్రస్తుతం నూజివీడు ట్రిపుల్ ఐటీలో 38 మంది, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 12 మంది పనిచేస్తున్నారు. వీరంతా బోధన చేయడమే కాకుండా అదనపు బాధ్యతలను సైతం నిర్వర్తిస్తున్నారు. 200ల నుంచి 50 మందికి తగ్గిన వైనం వేతనాలు పెంచక.. పర్మినెంట్ చేయకుండా అనేక బాధ్యతలు అప్పగిస్తూ 24 గంటలూ పనిచేయించుకుంటున్న నేపథ్యంలో అత్యధిక శాతం మంది వేరే ప్రైవేటు సంస్థలు, ఇనిస్టిట్యూట్లలో అత్యధిక శాలరీ లభిస్తుండటంతో ట్రిపుల్ ఐటీలో ఉద్యోగాలు మానేశారు. ఇలా 200 మందిలో 150 మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇతర ఉద్యోగాలు చూసుకొని బయటకు వెళ్లిపోయారు. వెళ్లిపోయిన వారంతా రూ.లక్షల్లో వేతనాలను పొందుతూ ఆర్థికంగా ఉన్నత స్థానంలోకి వెళ్లడంతో తామెందుకు ఇక్కడ ఉన్నామా అని మిగిలిన వారు ఆవేదన చెందుతున్నారు. నల్ల రిబ్బన్లతో నిరసన కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ గత ఐదు రోజులుగా ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిరసన ప్రదర్శన చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం భోజన విరామం సమయంలో కొద్దిసేపు డైరెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ను కలిసి వేతనాలను పెంచాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఏడేళ్లుగా చాలీచాలని వేతనాలతో అవస్థలు ఇతర ఉద్యోగాలకు వెళ్లిపోయిన 150 మంది ఆందోళనకు దిగిన కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం మానేసి భవిష్యత్ బాగుంటుందేమోనని ట్రిపుల్ ఐటీలో చేరా. టీచర్ ఉద్యోగంలోనే ఉండి ఉంటే నేడు రూ.1.50 లక్షల పైగా జీతం వచ్చేది. రిటైర్ అయ్యాక పింఛన్ వచ్చేది. ఇక్కడ జీతం లేదు, ఉద్యోగ భద్రత లేదు. – జాడ సీతాపతిరావు, తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ నాది ఉత్తరప్రదేశ్ కాగా గౌహతీ ఐఐటీలో పీహెచ్డీ చేశా. పర్మినెంట్ చేస్తామని హామీ ఇవ్వడంతో 2013లో ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరా. కానీ ఇంతవరకు పర్మినెంట్ చేయకపోగా.. వేతనాలు కూడా చాలా తక్కువ ఇస్తున్నారు. – విజయ్కుమార్ మిశ్రా, బయోసైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ -
గిరిజనులపై దాడులు దుర్మార్గం
జంగారెడ్డిగూడెం: గిరిజనులపై దాడులు దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. ఇనుమూరు గిరిజనులపై దాడులను ఖండించాలని, తప్పుడు కేసులు ఎత్తివేయాలని, గిరిజన భూ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదివాసీ గిరిజన సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గిరిజన సంఘం జిల్లా నాయకులు మొడియం నాగమణి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కుంజా రామారావు మాట్లాడారు. ఇనుమూరు గ్రామంలో మొత్తం 57 గిరిజన కుటుంబాల వారు సాగు చేసుకుంటున్న మొక్కజొన్న పంటను నాశనం చేయడంతోపాటు గిరిజన మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసు, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే ఈ దాడులను ప్రోత్సహిస్తున్ననట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. గిరిజనులపై తప్పుడు కేసులు ఎత్తివేయాలని, దాడికి పాల్పడ్డ తహసీల్దార్, ఎస్సై, భూస్వాములపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయం సూపరింటెండెంట్కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. వ్య.కా.స.జిల్లా అధ్యక్షురాలు తామా ముత్యాలమ్మ, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారం భాస్కర్, మడకం సుధారాణి, బొరగం భూచంద్రరావు, తెల్లం సంకురుడు, రైతు సంఘం, డీవైఎఫ్ఐ, ఏజెన్సీ గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.


