West Godavari District Latest News
-
అరాచకాలు.. దౌర్జన్యాలు
ఆదివారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి, భీమవరం: ఎన్నికల హామీలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఏడాది పాలనలో సూపర్ సిక్స్ హామీలు, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పాలన సాగిస్తోంది. ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తున్న వారిని వేధింపులకు గురిచేస్తోంది. జిల్లాలోని దాదాపు 37 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించింది. కూటమి నేతలు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాలు పేకాట స్థావరాలకు నిలయంగా మారాయన్న విమర్శలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటున్నారు. పదవుల కోసం కుతంత్రాలు ఇటీవల అత్తిలి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా కూటమి కుట్ర రాజకీయాలు బయటపడ్డాయి. అత్తిలి మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్సీపీకి 13 సభ్యుల సంఖ్యాబలం ఉండగా, కూటమికి ఆరుగురే ఉన్నారు. ఎన్నికలు సవ్యంగా జరిగితే ఎంపీపీ, వైస్ ఎంపీపీలుగా వైఎస్సార్సీపీ సభ్యుల ఎన్నిక లాంఛనమే. కాగా కుట్ర రాజకీయాలతో పదవులు కాజేసే ఎత్తుగడ చేశారు. మెజార్టీకి అవసరమైన సభ్యులను తమ వైపు తిప్పుకోవడం ద్వారా విలువలకు నీళ్లొదిలి పదవులను దక్కించుకున్నారు. అత్తిలి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అల్లరి మూకలు, కూటమి శ్రేణులతో మాజీ మంత్రి కారుమూరి నివాసాన్ని చుట్టిముట్టి వైఎస్సార్సీపీ సభ్యులు ఎన్నికకు హాజరుకాకుండా అడ్డుకోవడం కూటమి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా నిలిచింది. ఎంపీపీ ఎన్నిక సందర్భంగా కూటమి దౌర్జన్యంపై ఎస్సై నుంచి డీజీపీ వరకు కారుమూరి ఫోన్లు చేసి వివరించే ప్రయత్నం చేసినా ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. యలమంచిలి ఎంపీపీ ఎన్నికలో పదవుల కోసం కూటమి కుట్రలు ఫలించలేదు. పోలీసులు, కూటమి నేతలను అడ్డం పెట్టుకుని సామధాన దండోపాయాలు చేసినా వైఎస్సార్సీపీ సభ్యులు తలొగ్గకపోవడంతో కూటమి తోక ముడవక తప్పలేదు. న్యూస్రీల్కుట్రలు.. కేసులు ఏప్రిల్ 8న వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ అధ్యక్షతన ఏలూరులో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారని టీడీపీ నాయకుల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాలకొల్లులో టిడ్కో లబ్ధిదారులకు ప్లాట్ల పంపిణీ సందర్భంగా 2022 ఆగస్టు 5న నాటి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సమావేశంలో జరిగిన గొడవపై రెండేళ్ల తర్వాత 2024 డిసెంబర్ 13న పాలకొల్లు టౌన్ పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ నేత యడ్ల తాతాజీ, ఎమ్మెల్సీ కవురు శ్రీని వాస్, పార్టీ నేత గుణ్ణం నాగబాబులతో పాటు మొత్తం 24 మందిపై కేసు నమోదు చేశారు. మార్చి 28న యలమంచిలిలో ఎంపీపీ ఎన్నిక సందర్భంగా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ తనను కులం పేరుతో దూషించినట్టు టీడీపీ నేత ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అలాగే ఎంపీపీ ఎన్నిక సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని, వీఆర్ఓ విధులకు అడ్డుకున్నారని పోలీసులు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వారిపైన కూటమి కక్ష కట్టింది. రెండేళ్ల క్రితం తమ పార్టీ నేతలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ కూటమి నేతల ఫిర్యాదులపై భీమవరానికి చెందిన పి. శ్రీనివాస్, బి.జయరామ్, జి.మురళీకృష్ణ, ఉండికి చెందిన జి.సుందర్కుమార్, కె.దొరబాబు, కె. మహేష్ తదితరులపై కేసులు నమోదయ్యాయి.కూటమి కక్ష సాధింపులు ఏడాది పాలనలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు వైఎస్సార్సీపీ నేతలు, సోషల్ మీడియా యాక్ట్విస్ట్లే లక్ష్యం వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ఎత్తుగడ జిల్లాలో 37 మందిపై అక్రమ కేసులు ఆటోడ్రైవర్పైనా జులుంతూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలి కానురూకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త, ఆటో డ్రైవర్ పంజా దుర్గారావు తణుకు, నిడదవోలు పట్టణ రాజకీయాల్లో యాక్టీవ్గా ఉంటూ వైఎస్సార్సీపీకి సానుకూలంగా పోస్టులు పెడుతుంటారు. జనవరి 17న తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అతని ఆటోని అడ్డగించి, వ్యతిరేకంగా పో స్టులు పెడతావా అంటూ దుర్భాషలాడారు. రవాణా శాఖ అధికారులను పి లిచి ఆటో సీజ్ చేయించారు. దుర్గారావుకు జ రిమానా విధించిన పోలీసులు 41 నోటీసు ఇచ్చి విడుదల చేశారు. 12 గంటలకుపైగా పోలీస్స్టేషన్లో ఉంచి దుర్గారావు పెట్టిన పోస్టులను పరిశీలించారు. -
శ్రీవారి అంతరాలయ దర్శనం రద్దు
ద్వారకాతిరుమల: భక్తుల రద్దీ దృష్ట్యా ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం అధికారులు స్వామి వారి అంతరాలయ దర్శనాన్ని శనివారం ఐదు గంటల పాటు రద్దు చేశారు. దీంతో ప్రజాప్రతినిధుల సిఫార్సులతో వచ్చిన వారికి, వీఐపీలకు షాక్ తగిలింది. కాగా అధికారులు తీసుకున్న నిర్ణయంపై సామాన్య భక్తులు హర్షం వ్యక్తం చేశారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. రద్దీ దృష్ట్యా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీవారి అంతరాలయ దర్శనాన్ని రద్దు చేయాలని ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి ఆదేశించారు. అంతే కాకుండా అధిక సమయం అక్కడే ఉండి పర్యవేక్షించారు. ఎవరైనా ఈ నిర్ణయాన్ని అతిక్రమిస్తే చర్యలు చేపడతానని తీవ్రంగా హెచ్చరించారు. అదే సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులతో వచ్చిన వారికి, వీఐపీలకు చుక్కెదురైంది. అయితే అధికారులు వారికి నచ్చజెప్పి కొండపైన గదుల్లో వసతి కల్పించి, మధ్యాహ్నం నుంచి అంతరాలయ దర్శనం చేయించారు. సౌకర్యాలపై ఆరా : భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఈఓ సత్యనారాయణమూర్తి స్వయంగా పరిశీలించారు. ఆలయంలో భక్తుల వద్ద ఉన్న దర్శనం టికెట్లను ఆయన పరిశీలించారు. నిత్యాన్నదాన భవనంలో అన్నప్రసాదం స్వీకరిస్తున్న భక్తులతో మాట్లాడి, రుచి, నాణ్యతపై ఆరా తీశారు. ప్రసాదం కౌంటర్లు, ఇతర విభాగాలను తనిఖీ చేశారు. రూ.43 లక్షలు ఆదాయం: శ్రీవారిని 30 వేల మంది భక్తులు దర్శించినట్టు ఆలయ అధికారులు తెలిపారు. దర్శనం టికెట్లు, ప్రసాదాల విక్రయాలు, స్వామివారి నిత్యార్జిత కల్యాణాలు, విరాళాలు, ఇతర సేవా రుసుముల ద్వారా రూ.43 లక్షల ఆదాయం సమకూరిందన్నారు. క్షేత్రం కిటకిట.. హరినామమే అందరి నోట శ్రీవారి క్షేత్రం భక్తజన సంద్రాన్ని తలపించింది. సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. వేకువజాము నుంచే భక్తుల రాక మొదలైంది. దీంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివెట్టి మండపం, వైకుంఠం క్యూకాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల, ఉచిత ప్రసాద వితరణ క్యూలైన్లు, నిత్యాన్నదాన విభాగాలు భక్తులతో పోటెత్తాయి. క్యూలైన్లు నిండిపోవడంతో భక్తులు ఆలయ ఆవరణలో బారులు తీరారు. అనివేటి మండపంలో భజన మండలి సభ్యుల కోలాట నృత్యాలు అలరించాయి. స్వామివారి కొండపైన ఘాట్ రోడ్డులో భక్తుల వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. రాత్రి వరకూ క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. చిన వెంకన్న క్షేత్రం.. భక్త జన సంద్రం 5 గంటల పాటు నిలిపివేసిన అంతరాలయ దర్శనం -
వెబ్ కౌన్సెలింగ్పై ఉపాధ్యాయుల గళం
యలమంచిలి: ఉపాధ్యాయ సంఘాలకు ఇచ్చిన హామీకి భిన్నంగా విద్యాశాఖ అధికారులు ఏకపక్షంగా సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్ కౌన్సెలింగ్ బదులు ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం మండల విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కోశాధికారి పోలిశెట్టి క్రాంతికుమార్ మాట్లాడుతూ విద్యాశాఖ తీసుకునే అసంబద్ధ నిర్ణయాలను ఖండిస్తూ ఉపాధ్యాయ సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బదిలీల్లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్గా కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సంఘ అధ్యక్షుడు గుత్తిందీవి శ్రీనివాస్, ఎస్టీయూ సంఘ అధ్యక్షుడు రుద్రరాజు బాల విజయవర్మ, ఉపాధ్యాయులు ప్రేమ్కుమార్, అవధాని, విజయానంద, సత్యనారాయణ, రాంబాబు, శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. పోడూరులో.. పాలకొల్లు సెంట్రల్: ఉపాధ్యాయుల బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిలర్ ఎంవీ రాజశేఖర్ డిమాండ్ చేశారు. శనివారం పోడూరులో మండల ఉపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకేవీ రామభద్రం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ఎస్జీటీలకు మాన్యువల్గా బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాలని, రెండు జిల్లాల్లో ఖాళీలకు ఆన్లైన్లో ఆప్షన్లు ఇవ్వడం కష్టమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం ఎంఈఓ జి.విజయకుమార్, మండల అధ్యక్షుడు డి.క్షేమమూర్తికి వినతిపత్రం అందజేశారు. సంఘాల సభ్యులు బి.శేషగిరిరావు, కె.పెద్దిరాజు పాల్గొన్నారు. -
శుభ కార్యాలకు విరామం
ద్వారకాతిరుమల: పెళ్లి పనులు ప్రారంభించడం దగ్గర నుంచి అన్ని పనులకు ముహూర్తాలు చూస్తారు. అటువంటి ముహూర్తాలకు 48 రోజుల పాటు బ్రేక్ పడింది. ఈ ఏడాది జనవరి 30 నుంచి జూన్ 7 వరకు వివాహాలు జోరుగా జరిగాయి. ఆయా ముహూర్తాల్లో జిల్లావ్యాప్తంగా వేలాది వివాహాలు నిర్వహించారు. ఈనెల 10 నుంచి గురు మూఢమి, 26 నుంచి ఆషాఢ మాసం కావడంతో జులై 25 వరకు పెళ్లి సందడికి విరామం వచ్చింది. తిరిగి వివాహ ముహూర్తాలు శ్రావణ మాసం జూలై 26 నుంచి ప్రారంభం కానున్నాయి. అప్పటివరకు వివాహాది శుభకార్యాలకు ఆగాల్సిందే. 48 రోజులు పనులు లేనట్టే.. వివాహాది శుభకార్యాలపై ఆధారపడి జీవనోపాధి పొందే పురోహితులు, పచ్చిపూల మండపాలు, డెకరేషన్, షామియానా పందిళ్లు నిర్మించే వారు, వాయిద్యకారులు, క్యాటరింగ్, లైటింగ్ కార్మికులకు 48 రోజుల పాటు పనులు లేనట్టే. వీరంతా మళ్లీ జులై 26 నుంచి బిజీ కానున్నారు. వివాహ ముహూర్తాలు : వివాహాలకు ఈ ఏడాది జూలై 26, 30, 31, ఆగస్టు 1, 3, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 17, సెప్టెంబర్ 23, 24, 26, 27, 28, అక్టోబర్ 1, 2, 3, 4, 7, 8, 10, 11, 12, 16, 17, 22, 23, 24, 26, 28, 29, 30, 31, నవంబర్ 1, 2, 4, 7, 12, 13, 14, 15, 22, 23, 25, 26, 27 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. నేటి నుంచి 48 రోజులపాటు బ్రేక్ జూలై 26 నుంచి మళ్లీ ముహూర్తాలు శ్రావణం వరకూ ఆగాల్సిందే.. ఈనెల 10 నుంచి గురు మూఢమి. అలాగే 26 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. దీంతో ఆషాఢ మాసం ముగిసే వరకూ వివాహాలు చేసుకునే వారు ఆగాల్సిందే. శ్రావణ మాసమైన జూలై 26 నుంచి బలమైన ముహూర్తాలు ఉన్నాయి. నవంబరు తర్వాత మళ్లీ ముహూర్తాలు లేవు. – గోవింద వఝుల వెంకటరమణ మూర్తి శర్మ, పురోహితుడు, ద్వారకాతిరుమల -
గంజాయి రవాణా చేస్తున్న నలుగురి అరెస్టు
గణపవరం : చెడు వ్యసనాలకు బానిసలై, గంజాయి అమ్మకాలు చేస్తున్న నలుగురు యువకులు పోలీసుల వలలో చిక్కారు. గణపవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద పోలీసులు శనివారం ఉదయం మాటువేసి గంజాయి అక్రమంగా రవాణాచేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.50వేల విలువైన 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. శనివారం సాయంత్రం ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాకు చెందిన ఖార అర్జున్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ దొంగతనంగా గంజాయి అమ్మేవాడు. ఇతనికి గణపవరం వెలంపేటకు చెందిన రాయపురెడ్డి తరుణ్, ఇందిరమ్మ కాలనీకి చెందినయాళ్ల సాయికిషోర్, ఉండిమండలం కోలమూరుకు చెందిన దగుగ్పల్లి జోగామారిష్ పరిచయం ఆయ్యారు. ఈ ముగ్గురు యువకులు గంజాయి సేవించడమే కాక, చుట్టుపక్కల యువకులకు గంజాయి అమ్మవారు. ఈ ముగ్గురు యువకులు అర్జున్తో కలసి అరకు వెళ్లి గంజాయి కొని తెచ్చి స్థానికంగా అమ్ముతున్నారు. తనకు అందిన సమాచారం ఆధారంగా సీఐ సుభాష్ సిబ్బందితో కలసి మాటువేసి వీరిని పట్టుకున్నారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్టు తాడేపల్లిగూడెం అర్బన్: తాడేపల్లిగూడెం పట్టణంలోని దానమ్మగుడి సమీపంలో ఆటో డ్రైవర్ పద్మాకర్ ఇటీవల ఇంటి ముందు గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. శనివారం ఇది గమనించిన స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎకై ్సజ్ ఎస్సై రాంబాబు, పట్టణ ఎస్సై బాదం శ్రీనివాసు పద్మాకర ఇంటికి వెళ్లి అక్కడి గంజాయి మొక్కలను పరిశీలించి నిర్ధారించారు. పద్మాకర్ను విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అరెస్టు చేసి విచారణ చేపట్టారు. -
చెరువు మట్టి అక్రమార్కుల పాలు
నూజివీడు: పొలంలో మెరక నిమిత్తం మట్టి కావాలని అనుమతులు తీసుకుని చెరువు మట్టిని తవ్వి యథేచ్ఛగా విక్రయిస్తూ టీడీపీ నాయకులు జేబులు నింపుకుంటున్నారు. నూజివీడు పట్టణంలోని పెద్దచెరువులో పొలం మెరక చేసుకోవాలనే ముసుగులో అనుమతులు పొంది మట్టిని వాణిజ్య అవసరాలకు, ఇతర అవసరాలకు అక్రమార్కులు అమ్మేస్తున్నారు. రెండు రోజుల నుంచి అక్రమ మట్టి తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నా ఇటు ఇరిగేషన్ అధికారులు గాని, అటు రెవిన్యూ అధికారులు గాని పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ట్రాక్టరు మట్టిని రూ.1000 నుంచి రూ.1200కు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పొక్లెయిన్కు టక్కులో మట్టిని పోసినందుకు రూ.150 ఇస్తుండగా మిగిలిన మొత్తం ట్రాక్టర్ కిరాయి కింద వసూలు చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇంత రేటు గతంలో ఎన్నడూ లేదని రాజకీయ వర్గాల్లోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెరక నిమిత్తం అనుమతులు తీసుకొని.. పట్టణానికి చెందిన వీవీ కృష్ణారావు నూజివీడులోని సర్వే నెంబరు 871–3లోని ఎకరం విస్తీర్ణం గల వ్యవసాయ భూమిని మెరక చేసుకునే నిమిత్తం అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహసీల్దార్, స్థానిక ఇరిగేషన్ డీఈ సిఫార్సుల మేరకు ఇరిగేషన్ ఈఈ 1000 క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని వారి సొంత ఖర్చులతో తవ్వి తోలుకునేందుకు అనుమతి ఇచ్చారు. అది కూడా ఈనెల 1 వరకు మాత్రమే అనుమతినివ్వగా గత రెండు రోజుల నుంచి పెద్ద చెరువులోని మట్టిని అధికార పార్టీకి చెందిన నాయకులు యథేచ్ఛగా, విచ్చలవిడిగా తోలుతూ విక్రయిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ, ఇంజినీరింగ్ అధికారులు మట్టి తవ్వడానికి మార్కింగ్ ఇచ్చిన చోట నుంచి తవ్వకుండా నాయకులు వేరొక చోట తవ్వుతూ మట్టిని ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీ వరకు మాత్రమే అనుమతి ఉండగా, ఈ నెల 6వ తేదీ నుంచి రెండు జేసీబీలతో మట్టిని తవ్వి తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ ఏఈ, డీఈ ఏమాత్రం పట్టించుకోకుండా టీడీపీ నాయకులకు జీ హుజూర్ అంటున్నారు. అధికార పార్టీ వారు కావడంతో అధికారులు కళ్లు మూసుకొని కూర్చుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెరువులో నుంచి తరలిస్తున్న మట్టిని అనుమతి తీసుకున్న పొలం మెరకకు ఉపయోగించకుండా పట్టణంలో ఎవరు కావాలంటే వారికి అమ్మేసుకుంటున్నారు. ప్రజల ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంటే పట్టించుకోవాల్సిన ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకుండా వదిలేయగా, రెవిన్యూ అధికారులు సైతం ఇరిగేషన్ అధికారుల బాటలోనే నడుస్తున్నారు. పార్కు మెరక పేరుతో పెద్ద దోపిడీకి స్కెచ్ వేశారు. ఎలాంటి నిధులు మంజూరు కాకుండానే కొప్పుల వెలమపేటలో పార్కు అభివృద్ధి పనులను టీడీపీ నాయకుడొకరు చేస్తుండగా ఆ పార్కులోకి మెరక నిమిత్తం పెద్ద ఎత్తున మట్టిని తోలుతున్నారు. వాస్తవంగా నిధులు మంజూరయ్యాక టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ను నిర్ణయించి వర్క్ఆర్డర్ ఇచ్చిన తరువాత పనులు చేయాల్సి ఉండగా, అలాంటివేమీ లేకుండానే పార్కు అభివృద్ధి అంటూ పనులు చేస్తున్నారు. తరువాత మెరక పేరుతో భారీ ఎత్తున బిల్లులు చేసుకోవడానికే ఇదంతా చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పొలం మెరక కోసం అనుమతులు.. వేరే అవసరాలకు తరలింపు ట్రక్కు రూ.1000 నుంచి రూ.1200కు అమ్ముకుంటున్న అక్రమార్కులు -
సింహవాహనంపై గ్రామోత్సవం
అత్తిలి: మండలంలో ఈడూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవరాల వెంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం స్వామికి నిత్యార్చనలు, ప్రత్యేక పూజలు జరిపారు. వేదపారాయణం నిర్వహించారు. సాయంత్రం సింహవాహనంపై శ్రీస్వామి, అమ్మవార్లను ఉంచి మేళతాళాల నడుమ శ్రీస్వామివారి గ్రామోత్సవం వైభవంగా జరిపారు. దండు శ్రీనివాసరాజు, ఉమాలక్ష్మిదేవి దంపతుల సౌజన్యంతో శ్రీవెంకటేశ్వర సంబరం నిర్వహించారు. ఆలయ అర్చకులు వాడపల్లి శేఖరాచార్యులు ఆధ్వర్యంలో పూజాదికాలు జరిపారు. పరిసర ప్రాంతాలనుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. గోదావరిలో పడి యువకుడి మృతి కుక్కునూరు: గోదావరిలో స్నానం చేసేందుకు సరదాగా స్నేహితులతో దిగిన యువకుడు గోదావరిలో మునిగి మృతిచెందిన ఘటన శనివారం మండలంలోని మాధవరం రేవు వద్ద జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వేలేరుపాడు మండలం చాగరపల్లికి చెందిన మొట్టెం చరణ్ (20) శనివారం మధ్యాహ్నం కుక్కునూరు మండలంలోని బంజరుగూడెం గ్రామంలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వివాహానికి హాజరయ్యాడు. భోజనం అనంతరం తిరుగు ప్రయాణంలో మాధవరం గ్రామంలో స్నేహితులు ఉండటంతో ఆగాడు. అక్కడ మరో నలుగురు స్నేహితులతో కలిసి గోదావరిలో ఈత కొట్టేందుకు దిగారు. దిగిన వారెవరికీ ఈత రాకపోవడం, చరణ్ లోతును గమనించకుండా ముందుకు వెళ్లడంతో ఒక్కసారిగా గోదావరిలో మునిగి గల్లంతయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని స్థానిక జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టగా, రాత్రి 8 గంటల సమయంలో చరణ్ మృతదేహం లభ్యమైంది. కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు. వివాహిత ఆత్మహత్య మండవల్లి: భర్తతో గొడవపడి ఇంట్లో ఉరేసుకుని వివాహిత మృతి చెందినట్లు ఎస్సై రామచంద్రరావు తెలిపారు. పోలీసుల కథధనం ప్రకారం గున్ననపూడికి చెందిన సతీష్కు రాజేశ్వరితో వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. శనివారం భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం సతీష్ పనికి వెళ్ళిపోయాడు. మనస్థాపానికి గురైన రాజేశ్వరి మధ్యాహ్నం రేకుల షెడ్డుకు ఉన్న రాడ్డుకు చీరతో ఉరివేసుకుని మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
హోరాహోరీగా హాకీ పోటీలు
భీమవరం: భీమవరం డీఎన్నార్ కళాశాల ఆవరణలో 15వ అంతర్జిల్లాల రాష్ట్ర స్థాయి బాలికల హాకీ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 16 టీంలు పాల్గొంటున్నాయి. శనివారం నిర్వహించిన పోటీల్లో 13 జట్లు పాల్గొన్నాయి. వీటిలో కడప– ఎన్టీఆర్ జిల్లాల జట్ల మధ్య పోటీలో కడప 12 గోల్స్ చేసి విజయం సాధించింది. గుంటూరుపై అనంతపురం, కృష్ణాపై ప్రకాశం, పశ్చిమగోదావరిపై అనకాపల్లి జట్టు విజయం సాధించింది. శ్రీసత్యసాయి– నెల్లూరు మధ్య జరిగిన పోటీలో శ్రీసత్యసాయి జట్టు, తిరుపతి–నంద్యాల మధ్య పోటీలో తిరుపతి, విశాఖపట్నం–మన్యం జిల్లా మధ్య పోటీలో విశాఖపట్నం విజయం సాధించాయి. కాకినాడ–అన్నమయ్య జిల్లాల మధ్య పోటీలో ఎవరూ గోల్ చేయకపోవడంతో డ్రాగా ముగిసింది. 288 మంది క్రీడాకారులకు డీఎన్నార్ కళాశాల యాజమాన్యం వసతి కల్పించగా జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోజనం ఇతర సౌకర్యాలు కల్పించినట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కలిదిండి ఆనందరాజు, కేవీఎస్ భరత్ చెప్పారు. -
పంట మార్పిడితో అధిక దిగుబడి
బుట్టాయగూడెం : ఒకే పొలంలో ఒకే పంట సాగు ద్వారా దిగుబడులు తగ్గుతాయి. పంటల్లో ఎదుగుదల ఉండదు. చీడపీడల ఉధృతి అధికంగా ఉంటుంది. పంటల మార్పిడి ద్వారా భూసారం పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఒకే పొలంలో వేర్వేరు పంటలను ఒక క్రమంలో సాగు చేస్తే అధిక ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. పంట మార్పిడితో ప్రకృతి వనరులు సమర్ధవంతంగా వాడుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో భూసారం నష్టపోకుండా అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ ఏడాది ఖరీఫ్కు సిద్ధమవుతున్న నేపధ్యంలో పంట మార్పిడితో కలిగే ప్రయోజనాలపై వ్యవసాయశాఖ అధికారులు రైతులకు పలు సూచనలు చేశారు. ఒకే పంట సాగుతో నష్టాలు ● వేరు వ్యవస్థ ఒకే లోతుకు పోవడం వల్ల ఆ లోతు వరకు ఉన్న పోషకాలు మాత్రమే మొక్కలు వినియోగించుకుంటాయి. ● ఏటా ఒకే పంట పండించడం వల్ల చీడపీడలు, కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది. పైరు కూడా అభివృద్ది చెందదు. దిగుబడులు తగ్గుతాయి. రైతులకు పెట్టుబడుల భారం పెరుగుతుంది. ● నేల కోతకు గురవుతుంది. పండిన పంట నాణ్యత ఉండదు. ఫలితంగా గిటుబాటు ధర లభించదు. దీంతో రైతులకు నష్టం వచ్చే అవకాశం ఉంది. ● మార్కెట్ సమస్యలు ఎదురవుతాయి. పాటించాల్సిన జాగ్రత్తలు ● ఎక్కువ లోతుకు చొచ్చుకుపోయే వ్యవస్థ ఉన్న పంట, తక్కువ లోతుకు చొచ్చుకు పోయే వేరు వ్యవస్థ ఉన్న పంటలను ఒకదాని తర్వాత ఒకటి సాగు చేయాలి. వరి, అపరాలు, జొన్న, పత్తి వంటి పంటలు వరుసగా వేయడం మంచిది. ● నేలను నిర్వీర్యం చేసే పంటలను సారాన్ని అభివృద్ధి చేసే పంటలను ఒకదాని తర్వాత ఒకటి సాగు చేసుకోవటం మేలు. ఉదాహరణకు మొక్కజొన్న, అపరాలు వంటి పంటలు. పంట మార్పిడితో లాభాలు పంట మార్పిడి విధానం ద్వారా అనేక లాభాలు ఉన్నాయి. వీటిపై రైతులు పూర్తి అవగాహన పెంచుకోవాలి, వరి పంట సాగు చేసే ముందు పచ్చిరొట్ట పైర్లు సాగు చేయడం వల్ల భూసారం పెరుగుతుంది. సేంద్రీయ పదార్థం భూమిలో ఎక్కువగా ఉండడం వల్ల పైరు ఏపుగా పెరుగుతుంది. వరి తర్వాత అపరాలు, వేరుశనగ, సోయా చిక్కుడు తదితర పంటలు సాగు చేయడం వల్ల భూమిలో సేంద్రీయ పదార్థం బాగా వృద్ధి చెందుతుంది. దీంతో పంటలపై వచ్చే శీలీంద్రాల ఉధృతి తగ్గుతుంది. వరి తర్వాత చిక్కుడు జాతికి చెందిన శనగ, పెసర, మినుము, వేరుశనగ సాగు వల్ల వాటి వేర్లలోని రైజోబియన్ బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని తీసుకుంటాయి. వేర్లలో బుడుపుల మాదిరి ఏర్పడి తర్వాత సాగు చేసే పంటలకు మంచి సారాన్ని అందిస్తాయి. పంట మార్పిడితో మంచి దిగుబడులు రైతులు ఏటా ఒకే పంట సాగు చేస్తున్నారు. వరి సాగు తప్ప వేరే పంట సాగు చేసేందుకు ఆశక్తి చూపడం లేదు. దీంతో వరి పంటలో చీడపీడల బెడద ఎక్కువై సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. దీన్ని అధిగమించడానికి పంటల మార్పిడి విధానం ఉత్తమం. ఈ విధానంపై రైతులు పూర్తి అవగాహన పెంచుకోవాలి. పంట మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలు ఒకసారి అనుభవంలోకి వస్తే ఈ విధానాన్ని రైతులు కొనసాగిస్తారు. – డి.ముత్యాలరావు, మండల వ్యవసాయాధికారి, బుట్టాయగూడెం పాడి– పంట భూసారం వృద్ధి, చీడ పీడల నివారణ రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ సిబ్బంది -
చెట్టును ఢీకొని యువకుడి మృతి
భీమడోలు: ఆగడాలలంక చానల్ రోడ్డులోని వడ్డిగూడెం సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతిచెందాడు. ఆగడాలలంక వీఆర్వో సైదు గోపాలకృష్ణ రెండో కుమారుడు సైదు సాయికృష్ణ గంగాప్రసాద్ స్నేహితుడి రిసెప్షన్కు బైక్ ఏలూరు వెళ్లాడు. పార్టీ ముగించుకుని స్వగ్రామానికి వస్తుండగా వడ్డిగూడెం సమీపం మలుపు వద్ద ఒక్కసారిగా అదుపు తప్పింది. ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొట్టాడు. సాయి కృష్ణ ఎగిరి పక్కనే ఉన్న పంటబోదెలో పడ్డాడు. తల రాయికి తగలడంతో మృతిచెందాడు. శనివారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలు గమనించి పోలీసులకు, తండ్రికి సమాచారం అందించారు. ఎస్సై వై.సుధాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. -
అప్పులతో ఇబ్బందులు
గతంలో మా కుటుంబానికి మూడు పథకాల కింద ఏడాదికి రూ.50 వేల వరకూ వచ్చేవి. వాటితో అప్పులు తీర్చడంతో పాటు కొంత పొదుపు చేసుకునే వాళ్లం. ఇంట్లో అవసరమైన సామగ్రిని నెలవారీ వాయిదా పద్ధతిలో తీసుకుని పథకం డబ్బులతో చెల్లించేవాళ్లం. ఇప్పుడు పొదుపు మాట అటుంచి చేసిన అప్పులు తీర్చడానికే ఇబ్బందులు పడుతున్నాం. – గొంతిన ఝాన్సీలక్ష్మి, గృహిణి అవస్థలు పడుతున్నాం కుటుంబ అవసరాల కోసం గతంలో లేదనకుండా అప్పు ఇచ్చేవారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధితో అప్పులు తీర్చేవాళ్లం. ఇప్పుడు పథకాలు అమలు చేయకపోవడంతో మాకు ఆదాయం వచ్చే దారి లేదని గ్రహించి అప్పులు ఇచ్చేవాళ్లు నిరాకరిస్తున్నారు. అవసరానికి అప్పు పుట్టక అవస్థలు పడుతున్నాం. – పోలిశెట్టి ఈశ్వరి, ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయురాలు నమ్మి మోసపోయాం ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్మి మోసపోయాం. మాలాంటి మహిళలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న పథకాలు ఒక్కటి కూడా అమలు చేయకపోవడం బాధాకరం. రాష్ట్రంలోని మహిళల ఆవేదనను గ్రహించి ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అమలు చేస్తారని ఆశిస్తున్నాం. – కె.కనకదుర్గ, చిగురుకోట, ముదినేపల్లి మండలం పథకాలన్నీ ఇవ్వాలి గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలన్నీ మరలా ఇప్పుడు కూడా ఇచ్చేలా చూడాలి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అందించిన పథకాలు పేదలకు ఎంతో వెసులుబాటు కలిగించేవి. అవి నిలిపివేయడంతో చాలా మంది పేదలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తిరిగి పథకాలన్నీ ప్రవేశపెట్టాలి. – నల్గొండ నాంచారమ్మ, మండవల్లి ● -
మధ్యతరగతి.. అధోగతి
మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారింది. ఆర్థిక అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం చేకూరకపోవడంతో అప్పులబాట పడుతున్నారు. ఇదే అదనుగా పల్లెల్లో మైక్రో ఫైనాన్స్ వ్యాపారం కోరలు చాచింది. రూ.5 నుంచి రూ.10 వరకు వడ్డీ వ్యాపారం ఇష్టారాజ్యంగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాది గడిచినా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకపోగా.. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో మధ్యతరగతి వర్గాలు సతమతమవుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి నెలా సంక్షేమ పథకాల రూపంలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమకాగా.. ప్రజలు అప్పుల వైపు వెళ్లని పరిస్థితి. శనివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు : కూటమి ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత సామాన్యుడి కష్టాల తారాస్థాయికి చేరాయి. ఒకవైపు మండుతున్న నిత్యావసరాల ధరలు, మరోవైపు ప్రభుత్వ చేయూత లేకపోవడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సూపర్సిక్స్ అంటూ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నాయకులు చేతులెత్తేశారు. తల్లికి వందనం అందించకుండా ఒక విద్యా సంవత్సరం, అన్నదాత సుఖీభవ సాయం ఇవ్వకుండా ఖరీఫ్, రబీ సీజన్లు గడిపేశారు. తగ్గిన కొనుగోలు శక్తి మార్కెట్లో నగదు లావాదేవీలతో పాటు ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గడంతో వ్యాపారాలు మందగించాయి. గత ప్రభుత్వ హయాంలో సంక్రాంతికి అ మ్మఒడి పథకం కింద ఏలూరు జిల్లాలో 1,78,214 మంది తల్లుల ఖాతాల్లో రూ.267.32 కోట్లు నగదు జమైతే కేవలం పండుగ రోజుల్లోనే జిల్లాలోనే రూ.150 కోట్ల నుంచి రూ.170 కోట్ల టర్నోవర్ జరిగినట్టు అంచనా. అయితే ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో 50 శాతం కూడా కొనుగోళ్లు లేవని వ్యాపార వర్గాలు అంటున్నాయి. గతంలో డీబీటీ పథకాలు కావడంతో మార్కెట్లో నగదు రోటేషన్లో ఉండటం, ప్రజల్లో కొనుగోలు శక్తి ఉండటంతో విక్రయాలు బాగా జరిగి వ్యాపారాలు కళకళలాడటంతో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికీ ఆదాయం సమకూరేది. ఈ ఏడాది మాత్రం జీఎస్టీ మొదలు అన్ని లావాదేవీలు తగ్గిపోయాయి. కొన్ని రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా ఇప్పటికీ తల్లికి వందనంపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ఏటా రూ.1,850 కోట్లకు పైగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా రూ.1,850 కోట్లకు పైగా నగదు జిల్లాలో లక్షలాది మంది బ్యాంకు ఖాతాల్లో జమకాగా.. నేడు ఒక్క రూపాయి కూడా జమ కాని పరిస్థితి. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ పథకాలకు పేర్లు, లబ్ధి నగదు మొత్తాన్ని మార్చి ప్రకటించినా అమలు చేయకపోవడం గమనార్హం. ఈ లెక్కన ఏలూరు జిల్లాలో రూ.2 వేల కోట్లకు పైగా సంక్షేమ పథకాల నగదు ప్రజల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. న్యూస్రీల్గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పథకాల అమలు వైఎస్సార్ రైతు భరోసా 2019–20లో 2,31,061 మంది రైతులకు రూ.311.93 కోట్లు, 2020–21లో రూ.297.73 కోట్లు, 2021–22లో రూ.265.67 కోట్లు, 2022–23లో రూ.262.11 కోట్లు మొత్తంగా రూ.1,137.34 కోట్లు అందజేత జగనన్న విద్యాదీవెన 2019–20లో 36,527 మంది విద్యార్థులకు రూ.95.78 కోట్లు, 2020–21లో రూ.77.97 కోట్లు, 2021–22లో రూ.105.67 కోట్లు, 2022–23లో 56.16 మొత్తంగా రూ.335.58 కోట్ల లబ్ధి చేకూర్చారు. జగనన్న అమ్మఒడి 2019–20లో 1,80,327 మంది మహిళల ఖాతాల్లో రూ. 270.49 కోట్లు, 2020–21లో 266.16 కోట్లు, 2021–22లో 276.36 కోట్లు మొత్తంగా రూ.813.01 కోట్లు అందించారు. వైఎస్సార్ ఆసరా ఏలూరు జిల్లాలో మూడు విడతల్లో రూ.985.82 కోట్లు జమ చేశారు. 3,55,315 మంది మహిళల ఖాతాల్లో 2020–21లో రూ.327.56 కోట్లు, 2021–22లో రూ.329.92 కోట్లు, 2022–23లో రూ.328.34 కోట్లు అందజేశారు. వైఎస్సార్ చేయూత 2020–21లో 94,670 మంది మహిళలకు రూ.177.51 కోట్లు, 2021–22లో రూ.165.60 కోట్లు, 2022–23లో రూ.218.42 కోట్లు మొత్తంగా రూ.561.53 కోట్లు మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అప్పులతో సతమతం ఏడాదిగా నిలిచిన సంక్షేమ పథకాలు పల్లెల్లో కోరలు చాచిన మైక్రో ఫైనాన్స్ వ్యాపారం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఆర్థిక భరోసా జిల్లాలో ఏటా సగటున రూ.1,850 కోట్లు అందజేత నాడు కళకళలాడిన వ్యాపారాలు నేడు కూటమి పాలనలో వెలవెల -
పుస్తకాల వ్యాపారంపై ఫిర్యాదు
ఆకివీడు: స్థానిక చైతన్య విద్యాసంస్థలో పుస్తకాలు విక్రయిస్తున్నట్టు ఎస్ఎఫ్ఐ నాయకుల ఫిర్యాదు మేరకు శుక్రవారం విద్యాశాఖ సిబ్బంది తనిఖీలు చేశారు. అనంతరం పాఠశాలలో పుస్తకాలు ఉండే గదికి తాళం వేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రసాద్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం కాక ముందే పుస్తకాల వ్యాపారం లక్షల్లో జరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థ అయిన చైతన్య స్కూల్లో పుస్తకాల విక్రయాన్ని తమ నాయకులు అడ్డుకున్నారని చెప్పారు. అధికంగా ఫీజుల వసూలుతో పాటు విద్యా సామగ్రి అమ్మకాల ద్వారా కార్పొరేట్ సంస్థలు కోట్లు గడిస్తున్నాయన్నారు. పుస్తకాల విక్రయంపై మండల విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. సిబ్బందిని పంపి చేతులు దులుపుకుంటున్నారని, నోటీసులు ఇచ్చామని చెబుతున్నారన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీలను అరికట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లిప్తంగా ఉంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. జిల్లా సహాయ కార్యదర్శి పి.నాగేంద్ర, కె.గోవింద్, కె.రోహిత్, పట్టణ నాయకులు సాయి, వంశీ, సాయి కృష్ణ పాల్గొన్నారు. -
ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్ జగన్ వెంటే..
మీడియాలో దుష్ప్రచారంపై మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆగ్రహం దెందులూరు: తాను ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే, వైఎస్సార్సీపీ కే పనిచేస్తానని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నారు. కొన్ని మీడియా సంస్థలు తాను పార్టీ మారుతున్నట్టు చేసిన దుష్ప్రచారాన్ని శుక్రవారం ప్రకటనలో ఖండించారు. ప్రాణం ఉన్నంత వరకూ తనకు, తన కుటుంబానికి ఎంతో ఇష్టమైన వైస్ జగన్ తోనే తన పయనం అన్నారు. తనకు వైఎస్సార్ కుటుంబానికి ఉన్న అనుబంధం విడదీయరానిదన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారాన్ని చేయటం బాధ కలిగించిందన్నారు. ఇది సిగ్గుచేటని అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.సీనియర్ సిటిజన్ల పోస్టుకార్డు ఉద్యమం నరసాపురం: సీనియర్ సిటిజన్లకు గతంలో మాదిరిగా రైలు చార్జీల్లో రాయితీ ఇవ్వాలని కోరుతూ అఖిల భారత సీనియర్ సిటిజన్స్ కార్పెడరేషన్ పిలుపులో భాగంగా శుక్రవారం సంఘం నరసాపురం శాఖ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం ప్రారంభించారు. రైలు చార్జీల్లో సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇవ్వాలని ప్రధానికి పోస్టుకార్డులు రాసి పోస్టు చేశారు. పట్టణంలోని తపాలా శాఖ కార్యాలయంలో తపాలా శాఖ అధికారికి మొదటి పోస్టుకార్డు అందించారు. సంఘం నరసాపురం శాఖ అధ్యక్షుడు అందే రంగారావు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్లను తగు విధంగా గౌరవించి, వారి సంక్షేమం చూ డాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైలు చార్జీల్లో రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సంఘ నాయకులు షేక్ సిలార్ సాహెబ్, పెన్మెత్స బాబూజీ, నెక్కంటి సుబ్బారావు, దాసిరి దేవరాజు, పితాని సత్యనారాయణ, కోట్ల చిరంజీవి పాల్గొన్నారు. 12న జాబ్మేళా ఉండి: మండలంలోని ఎన్నార్పీ అగ్రహారం ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 12న అప్రెంటీస్, జాబ్మేళా నిర్వహించనున్నట్టు ఐటీఐ జిల్లా కన్వీనర్ వి.శ్రీనివాసరాజు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఐటీఐ కోర్సు పూర్తి చేసిన వారితో పాటు ఫైనలియర్ విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి గల వారు ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు కన్వీనర్ లేదా అప్రెంటీస్ అడ్వయిజర్ను సంప్రదించాలని కోరారు. పని గంటల పెంపు నిర్ణయం తగదు భీమవరం: రాష్ట్రంలో పని గంటలు పెంచేందుకు మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని సీపీఎం జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి తీవ్రమైన ద్రోహం చేసి కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు 44 చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లకు తెచ్చిందని పేర్కొన్నారు. 50 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్న షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్లో 13 ఏళ్లుగా కనీస వేతనాల సవరణ జరగకపోగా, కనీస వేతనాల బోర్డును నియమించలేదని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను పునరుద్ధరించలేదని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదని వీటిపై సీఎం చంద్రబాబు నోరు మెదపడటం లేదన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త లేబర్కోడ్స్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అలాగే రాత్రి సమయంలో కూడా మహిళలతో పనిచేయించేలా రూల్స్ రూపొందించడం అన్యాయమన్నారు. వీటిని అందరూ వ్యతిరేకించాలని కోరారు. మెడికల్ రీయింబర్స్మెంట్ గడువు పొడిగింపు ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యం గడువును ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 30 వరకూ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు ప్రకటనలో తెలిపారు. ఈ సౌకర్యం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కు సమాంతరంగా కొనసాగుతుందని తెలిపారు. -
ప్రశాంతంగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం
భీమవరం: జిల్లాలో మెగా డీఎస్సీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 30 వరకు జిల్లాలోని ఐదు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనుండగా.. తొలిరోజు భీమవరం డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో మాత్రమే పరీక్షలు జరిగాయి. ఉదయం 110 మంది అభ్యర్థులకు 100 మంది, మధ్యాహ్నం 110 మందికి 97 మంది హాజరయ్యారు. కలెక్టర్ సీహెచ్ నాగరాణి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలోని ఐదు కేంద్రాల్లో సుమారు 16,600 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. 23 రోజుల పాటు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. డీఈఓ ఈ.నారాయణ, చీఫ్ సూపరింటెండెంట్ తంగిరాల హరిఆనంద్ప్రసాద్, కాలేజీ ప్రిన్సిపాల్ ఎం.అంజన్కుమార్ ఉన్నారు. -
9న కొల్లేరుపై కీలక సమావేశం
కై కలూరు: సుప్రీంకోర్టు ఆదేశాలతో కొల్లేరు పరిశీలనకు త్వరలో రానున్న సెంట్రల్ ఎంపవర్ట్ కమిటీ (సీఈసీ)కి నివేదించే అంశాలపై ఈనెల 9న ఉదయం 9 గంటలకు కై కలూరు సీతారామ ఫంక్షన్ హాలులో నిర్వహించనున్న సమావేశానికి కొల్లేరు పెద్దలు తరలిరావాలని రాష్ట్ర చేపల రైతుల సంఘ అధ్యక్షుడు తాడినాడ బాబు శుక్రవారం కోరారు. కొల్లేరు ప్రజల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందన్నారు. కమిటీ దృష్టికి కొల్లేరు గ్రామాలకు సంబంధించిన సమస్యలు, ఇతర అంశాలను రాతపూర్వకంగా గ్రామాల ప్రజలు తీసుకురావాలని చెప్పారు. గ్రామాల జనాభా, విస్తీర్ణం, కొల్లేరుకు సంబంధించిన అంశాలు అందులో ఉండాలన్నారు. సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ హాజరవుతారన్నారు. 9న ఆయిల్పామ్ రైతుల ధర్నా పెదవేగి: కేంద్ర ప్రభుత్వం పామాయిల్పై 10 శాతం దిగుమతి సుంకం తగ్గించడాన్ని నిరసిస్తూ ఈనెల 9న ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆయిల్పామ్ రైతుల ధర్నా, రైతుల సామూహిక రాయబార కార్యక్రమం చేపట్టినట్టు ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం విజయరాయిలో ఆయిల్పామ్ రైతుల సమావేశాన్ని మున్నంగి సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ధర్నా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ దిగుమతి సుంకం తగ్గడంతో ఆయిల్పామ్ గెలల ధరలు తగ్గి రైతులు నష్టపోతున్నారన్నారు. ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. పెదవేగిలో ఆయిల్ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలన్నారు. రైతులు పూసం రామరెడ్డి, రాపర్ల తేజ కృష్ణ, నీలం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
కాలువ పనుల పరిశీలన
ఉండి: గత నెలలో ప్రారంభమై లోపభూయిష్టంగా జరుగుతున్న ఉండి కాలువ పూడికతీత పనులపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించగా అధికారులు ఎట్టకేలకు స్పందించారు. కలిసిపూడి రెగ్యులేటర్ నుంచి కాలువ శివారు వరకు పనులు ఇష్టానుసారం జరగ్గా రైతులు ఆందోళన చెందారు. పూడికతీత పనుల్లో భాగంగా కుంగిన కాలువ గట్లను మరోసారి మరమ్మతులు చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. శుక్రవారం చెరుకువాడ, కలిసిపూడి ప్రాంతాల్లో కుంగిన కాలువ గట్లను ఇరిగేషన్ ఏఈ ఫణిశంకర్ ఆధ్వర్యంలో పరిశీలించారు. కుంగిన గట్లను త్వరలోనే బాగుచేసి సాగునీటి ప్రవాహనికి అడ్డులేకుండా చేస్తామని ఏఈ తెలిపారు. ప్రశాంతంగా పీజీ ఈసెట్ భీమవరం: ఎంటెక్, ఎం ఫార్మసీలో ప్రవేశాలకు పీజీ ఈసెట్ పరీక్షలు భీమవరంలోని డీఎన్నార్ అటానమస్ కళాశాలలో శుక్రవారం నిర్వహించారు. ఉద యం 152 మందికి 139 మంది, మధ్యాహ్నం 146కి 128 మంది అభ్యర్థులు హాజ రైనట్లు పర్యవేక్షకులు తెలిపారు. విష్ణు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉదయం 80కి 80 మంది, మధ్యాహ్నం 80కి 63 మంది హాజరయ్యారు. -
చెస్ విజేతలకు బహుమతుల ప్రదానం
భీమవరం : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీల్లో విజేతలకు శుక్రవారం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం అధ్యక్షుడు వబిలి శెట్టి వెంకటేశ్వరరావు బహుమతులు అందించారు. అనంతరం మాట్లాడుతూ పిల్లలు చదరంగంలో పోటీ పడడమేగాక పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచి పోషించడంలో ముందుండాలన్నారు. చదరంగం నేర్చుకోవడం ద్వారా మేధాశక్తిని పెంపొందించుకుని విద్యలో రాణించవచ్చన్నారు. ప్రథమ బహుమతి డి.సురేష్ (పాలకొల్లు), ద్వితీయ బహుమతి ఎన్.వరుణ్ తేజ్ (భీమవరం), తృతీయ బహుమతి ఎ.రామకృష్ణ (విజయవాడ) అందుకున్నారు. చెస్ పోటీల నిర్వాహకుడు మాదాసు కిషోర్, సురేష్ జైన్, నోముల రామారావు, సునీల్, గౌరవ్ తదితరులు పాల్గొన్నారు. బాలికల హాకీ పోటీలు ప్రారంభం భీమవరం: రాష్ట్ర స్థాయి 15వ అంతర్ జిల్లాల బాలికల హాకీ పోటీలు శుక్రవారం భీమవరం డీఎన్నార్ కళాశాల ఆవరణలో ప్రారంభమయ్యాయి. పోటీలను ప్రారంభించి డీఎన్నార్ కళాశాల ప్రిన్సిపల్ జి.మోజెస్, పీడీ బీవీ నర్సింహరాజు మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుడ్యానికి, మానసిక ప్రశాంతతకే గాకుండా ఉద్యోగ, ఉపాధి కల్పనకు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కలిదిండి ఆనందరాజు, కేవీఎస్ భరత్ మాట్లాడుతూ మూడు రోజులపాటు నిర్వహించే హాకీ పోటీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి 16 జట్లు పాల్గొంటున్నట్లు చెప్పారు. అనంతరం పశ్చిమగోదావరి– కృష్ణా జిల్లా జట్ల మధ్య జరిగిన పోటీల్లో పశ్చిమగోదావరి జట్టు కృష్ణా జట్టుపై విజయం సాధించింది. విద్యుత్ వైర్లు తగిలి లారీకి మంటలు తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలో కడకట్ల శివారు ఖాళీ స్థలాల వద్ద శుక్రవారం లారీకి విద్యుత్ వైర్లు తగిలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది వివరాల ప్రకారం..లారీకి విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ లారీ నుంచి దూకి తప్పించుకున్నాడు. సిమెంట్ పని మీద వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంక్ ఉన్న వైపు మంటలు చెలరేగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఫైర్ ఆఫీసర్ జీవీ రామారావు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలు అదుపు చేశారు. -
లాకర్లో బంగారు ఆభరణం మాయం
ఆకివీడు : ఇంట్లో ఉంటే దొంగల బెడద అని భయపడి బ్యాంక్ లాకర్లో దాచుకున్న బంగారు ఆభరణం మాయమైపోయిన సంఘటనపై బాధితురాలు వల్లభుని శ్రీ పూర్ణ లక్ష్మి శుక్రవారం బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆమెకు మద్దతుగా పలువురు మహిళలు, సీపీఎం నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. గత ఇరవై రోజులుగా లాకర్లో బంగారు వస్తువు మాయమైందని బ్యాంక్ అధికారులకు మొరపెట్టుకున్నా సరైన సమాధానం చెప్పడంలేదని, తమది బాధ్యత కాదని బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆమె వాపోయారు. 27 కాసుల ఆభరణం లాకరులో ఎలా పోతుందని ఆమె బ్యాంక్ అధికారుల్ని నిలదీశారు. సీసీ పుటేజ్ల వివరాలు ఇవ్వమంటే కాలయాపన చేస్తున్నారని ఆమె వాపోయారు. విషయాన్ని మేనేజర్ ఎస్సైకు తెలియజేయడంతో ఆయన వచ్చి మాట్లాడారు. సోమవారం సీపీ పుటేజ్లను సాంకేతిక నిపుణులతో పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు ఎస్సై నాగరాజుకు తెలిపారు. బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ లాకర్లో ఉన్న వస్తువులు ఏం ఉన్నాయో తమకు తెలియదని, బ్యాంక్లో పోయే అవకాశం లేదన్నారు. ఎస్సై నాగరాజు మాట్లాడుతూ బ్యాంక్లోని సీసీ పుటేజ్ సేకరించామని, గతంలో ఓపెన్ కాలేదని.. సాంకేతిక నిపుణుడు సాయంతో సోమవారం పరిశీలిస్తామన్నారు. అక్రమంగా అమ్ముతున్న వరి విత్తనాల సీజ్ కలిదిండి(కై కలూరు): నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న వరి విత్తన బస్తాలను సీజ్ చేసి కేసు నమోదు చేసిన ఘటన కలిదిండి మండలం సానారుద్రవరంలో శుక్రవారం జరిగింది. శ్రీ వేంకటేశ్వర సీడ్స్ విక్రయ దుకాణాన్ని మారుబోయిన సత్యనారాయణ నిర్వహిస్తుండగా.. వ్యవసాయశాఖ జేడీ హబీబ్ బాషా, ఏడీ ఆర్.గంగాధరరావు, ఏఓ కె.విద్యాసాగర్ తనిఖీ చేశారు. దాడుల్లో 710 క్వింటాళ్ల వరి విత్తన బాస్తాలు పట్టుబడ్డాయి. వీటి విలువ మార్కెట్లో రూ.21,63,500 ఉంటుందని అధికారులు చెప్పారు. వరి విత్తనాలు విక్రయించాలంటే 30 కేజీల బస్తాలు కలిగిన లేబుల్ సీల్ ఉండాలి. బ్యాగ్పై తయారీ తేదీ, వివరాలు, ప్యాకింగ్ ప్రాంతం, విత్తన రకం వంటి వివరాలు ఉంటాయి. అవేమీ లేకుండా 40 కేజీల వరి విత్తనాల బస్తాలు రూ.1,200కు విక్రయిస్తున్నాడు. ఎలాంటి బిల్లులు లేకుండా విత్తనాలు విక్రయించడం నేరమన్నారు. స్వాధీనం చేసుకున్న ధాన్యాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపుతామన్నారు. ల్యాబ్ నివేదికను బట్టి విక్రయదారుడిపై కేసు నమోదు చేస్తామన్నారు. -
నేత్రపర్వంగా వరాల వెంకన్న కల్యాణం
అత్తిలి: మండలంలోని ఈడూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవరాల వెంకటేశ్వరస్వామివారి కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. స్వామి, అమ్మవార్లకు గజవాహన సేవ నిర్వహించారు. సుదర్శన సాయిరామాచార్యులు ఆధ్వర్యంలో వాడపల్లి శేఖరాచార్యులు, విఖన్ బాబు, పలువురు వేదపండితుల సమక్షంలో స్వామి కల్యాణం నిర్వహించారు. దారాబత్తుల సత్యనారాయణ దంపతులచే మంగళసూత్రాలు, సమతం వెంకటేశ్వరరావు దంపతులచే ముత్యాల తలంబ్రాలను స్వామి, అమ్మవార్లకు సమర్పించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. శుక్రవారం తీర్ధమహోత్సవం జరిగింది. ఆలయప్రాంగణంలో కోలాట బృందంచే హరే శ్రీనివాస్ భజన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అఖండ అన్నసమారాధన జరిగింది. సాయంత్రం స్వామి,అమ్మవార్లను పుష్పాలతో అలంకరించిన రథంపై ఉంచి మేళతాళాలు, మంగళవాద్యాలు, ఆసాదుల గరగనృత్యాలు నడుమ రథోత్సవం వైభవోపేతంగా జరిపారు. -
మూణ్నాళ్ల ముచ్చటగా రోడ్డు మరమ్మతులు
భీమవరం అర్బన్ : భీమవరం మండలంలోని గూట్లపాడు రేవు నుంచి దొంగపిండి వరకు ఆర్ అండ్ బీ రోడ్డుపై చేపట్టిన రోడ్డు మరమ్మతులు మూడు నెలలు గడవక ముందే పాడయ్యాయిజ గూట్లపాడు రేవు, గూట్లపాడు, కొత్తపూసలమర్రు, దొంగపిండి వరకు సుమారు 10 కిలోమీటర్లు గతంలో రోడ్డు ధ్వంసమవడంతో ఆర్అండ్బీ అధికారులు టెండర్ ప్రక్రియ ద్వారా రోడ్డు మరమ్మతులు చేపట్టారు. కాంట్రాక్టర్ నాసిరకం మెటీరియల్ ఉపయోగించి రోడ్డు మరమ్మతులు చేపట్టడంతో గోతులు ఏర్పడుతున్నాయి. ఈ మార్గం గుండా నిత్యం స్కూల్ బస్సులు, చేపల లారీలు, వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే రోడ్డు వేసేటప్పుడు ఆర్అండ్బీ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో రోడ్డు మరమ్మతులు చేపట్టి మూడు నెలలు గడవకు ముందే ధ్వంసమైంది. దీంతో ఈ రోడ్లపై ప్రయాణమంటేనే ప్రజలు భయపడుతున్నారు. -
వైభవంగా ఏకాదశి ఉత్సవం
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో శుక్రవారం రాత్రి శ్రీవారికి తిరువీధి సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుక భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, సుగంధ భరిత పుష్పమాలికలతో విశేషంగా అలంకరించారు. అనంతరం అర్చకులు పూజాదికాలను జరిపి, హారతులిచ్చారు. ఆ తరువాత స్వామివారి వాహనం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిటా భక్తులు స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. -
మాయమాటలతో ఏటీఎంలో సొమ్ము స్వాహా
ఆకివీడు: సొమ్ము డ్రా చేద్దామని ఏటీఎంకు వెళ్లిన ఇద్దరికి టోకరా వేసి రూ.39,500 డ్రా చేసిన సంఘటన శుక్రవారం జరిగింది. అయిభీమవరం టర్నింగ్ వద్ద ఏటీఎంలో డబ్బు డ్రా చేసేందుకు ఉపాధ్యాయురాలు సూర్యకుమారి, ఆమె భర్త సత్యనారాయణమూర్తి వెళ్లారు. ఏటీఎంలో కార్డు పెట్టి కోడ్ కొట్టినా సొమ్ము రాకపోవడంతో.. అక్కడే ఉన్న మరో వ్యక్తి వచ్చి ఇప్పుడే డ్రా చేశాను కార్డు ఇవ్వండి ట్రైచేస్తానని చెప్పాడు. కార్డు లోపల పెట్టగా సొమ్ము రాకపోవడంతో.. అతని వద్ద ఉన్న వేరే కార్డు వాళ్లకు ఇచ్చి ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఎస్బీఐ మెయిన్బ్రాంచ్ వద్ద ఉన్న ఏటీఎంకు వెళ్లి సూర్యకుమారి కార్డుతో ఆ వ్యక్తి రూ.39,500 డ్రా చేసి పరారయ్యాడు. డబ్బులు డ్రా చేయడం సెల్ఫోన్లో మెసేజ్ రాగా.. వెంటనే మెయిన్ బ్రాంచ్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వెంటనే కార్డు బ్లాక్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదుచేయగా.. ఎస్సై హనుమంతు బాధితులతో మాట్లాడారు. సీసీ పుటేజ్లు పరిశీలించి కేసు నమోదు చేస్తామని చెప్పారు. -
వర్షాకాలంలో పశువులకు వ్యాధుల ముప్పు
బుట్టాయగూడెం: ముందస్తు వర్షాలు కురవడంతో పాటు వానాకాలం రావడంతో పశువులు, గొర్రెలు ఇతర జీవాలకు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. జీవాలకు వచ్చే వ్యాధులను గుర్తించిన వెంటనే సకాలంలో అందుబాటులో ఉన్న పశువైద్యాధికారిని సంప్రదించి సరైన చికిత్స అందించాలని సూచిస్తున్నారు. బ్లూ టంగ్– ఫుట్ రాట్ లక్షణాలు గొర్రెలు, మేకల్లో బ్లూటంగ్ వ్యాధులు సోకితే ఎక్కువగా జ్వరం, మూతివావు, నోటిలోపల పుండ్లు, ముక్కులో చీమిడి, కాళ్లు కుంటడం, ఒంట్లో నీరు చేరడం, పారుకోవడం, మేత మేయకపోవడం, ఈసుకుపోవడం (అబార్షన్లు) వంటి లక్షణాలు ఉంటాయి. వీటి నివారణకు సాయంత్రం సమయంలో గొర్రెల మందలో వేపాకు పొగ పెట్టుకుంటూ అప్పుడప్పుడూ బ్లూటాక్స్/టిక్కిల్ మందులు పిచికారీ చేస్తూ పోడు ప్రాంతాల్లో మేతకు తీసుకెళ్లాలి. కాళ్ల పుండ్ల వ్యాధి జీవాలకు కాళ్ల పుండ్లు వ్యాధి సోకితే కాలి గిట్టల మధ్య చీము చేరి చెడువాసన వస్తుంది. గొర్రెలు కుంటుతూ నడుస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు జీవాలను బురద ప్రాంతంలో మేపకూడదు. పొడి ప్రాంతంలోనే మేసేలా చూడాలి. గొంతు వాపు వ్యాధి పశువులకు సోకే వ్యాధుల్లో గొంతువాపు ప్రమాదకరమైంది. ఈ వ్యాధిని గురక వ్యాధి అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో పశువులకు సూక్ష్మజీవుల వల్ల సంక్రమిస్తుంది. తొలకరి వర్షాలు పడిన సమయంలో కలుషితమైన నీటి ద్వారా, మేత ద్వారా పశువులకు రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ వ్యాధుల బారిన పడతాయి. గొంతువాపు వ్యాధి బారిన పడిన పశువులను మిగిలిన పశువులతో కలిపి ఉంచితే ఈ వ్యాధి మిగిలిన వాటికి కూడా వ్యాప్తి చెందుతుంది. ఒకేపాకలో మిగతావాటితో ఉంచకుండా వేరుగా ఉంచాలి. వర్షాకాలంలో పశువులు వర్షాలకు తడవకుండా చూడాలి. నివారణ చర్యలు జూన్, జులై, ఆగస్టు నెలలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. పౌష్టికాహారం అందించాలి. వ్యాధి సోకిన పశువులను మిగిలినవాటి నుంచి వేరు చేయాలి. వాటి స్థావరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలి. చికిట వ్యాధి ఇది గొర్రెల్లో ఎక్కువగా వస్తుంది. ఎంటరోటాక్సీమియా అనే బ్యాక్టీరియా వల్ల తొలకరి వర్షాలు కురిసే సమయంలో ఈ వ్యాధి గొర్రెలకు సోకుతుంది. ఏడాది వయసున్న గొర్రెల్లో ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి సోకిన గొర్రె తక్కువ సమయానికే మరణిస్తుంది. ఈ వ్యాధి సోకిన గొర్రెలు నీరసిస్తాయి. కొద్దిసేపటికే గొర్రెలు గిలగిలా కొట్టుకుని గాలిలో ఎగిరి కిందపడి మరణిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలను ఉదయం, మధ్యాహ్న వేళల్లో గొర్రెల్లో కనిపిస్తాయి. వర్షాలకు ముందే గొర్రెలకు ఈ వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన గొర్రెలను మంద నుంచి వేరు చేయాలి. పాడి– పంట సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ముందుగానే టీకాలు వేయడం ఉత్తమం: వైద్యులు వ్యాధుల పట్ల జాగ్రత్తలు అవసరం వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నందున ముందుగానే టీకాలు వేయించుకోవడం ఉత్తమం. వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే పశువుల ప్రాణాలకు ముప్పు. వ్యాధులను గుర్తిస్తే దగ్గరలో ఉన్న పశువుల ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించాలి. సకాలంలో వైద్యం అందేలా చూడాలి. – డాక్టర్ మల్లంపల్లి సాయి బుచ్చారావు, సహాయ సంచాలకులు ప్రాంతీయ పశు సంవర్థక శాఖ, జీలుగుమిల్లి -
త్యాగానికి ప్రతీక బక్రీద్
●ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీ బక్రీద్ సందర్భంగా ప్రతి ముస్లిం విధిగా పొట్టేలు మాంసాన్ని ఖుర్బానీ ఇచ్చి పేదలకు పంచడం ఆనవాయితీ. ఈ పండుగ సందర్భంగా ముస్లింలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా అతి పవిత్రమైన మక్కాను సందర్శించి ముక్తి పొందాలి. – మహమ్మద్ అబ్దుల్ వదూద్, జామియా మసీదు ఇమామ్ త్యాగ నిరతికి ప్రతీక బక్రీద్ పండుగ మనిషి దైవ భీతిని, త్యాగ నిరతిని తెలియజేస్తుంది. ఈ పండుగను త్యాగాల పండుగ అంటారు. అంతేకాకుండ చనిపోయిన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని వారి పేరున ఖుర్బానీ ఇవ్వడం ఈ పండుగ ప్రత్యేకత. – సయ్యద్ బాబు, జామియా మసీదు అధ్యక్షుడు, చింతలపూడిచింతలపూడి: ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో బక్రీద్ ఒకటి. ధనిక, పేద తారతమ్యం లేకుండ ప్రతి ముస్లిం బక్రీద్ పండుగను జరుపుకుంటారు. పవిత్ర త్యాగానికి ప్రతిరూపమైన దైవ ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం అల్లా ప్రసన్నం కోసం చేసిన మహోన్నత త్యాగాన్ని ఈ పండుగ సందర్భంగా ముస్లింలు స్మరించుకుంటారు. ఇస్లాం మతంలో రంజాన్ తరువాత అంత ప్రాముఖ్యత ఉన్న పండుగ ఈదుల్ జుహా (బక్రీద్). శనివారం దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఖుర్బానీ ఇవ్వడం అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. గొర్రె పొట్టేలు మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని నిరుపేదలకు పంచి పెడతారు. మిగిలిన భాగాలలో రెండో దాన్ని బంధువులకు, మూడో భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. దీన్నే ఖుర్బానీ అంటారు. ముస్లింలు ఈ మాసంలోనే హజ్ యాత్ర చేస్తారు. పవిత్ర స్థలం మక్కాను సందర్శించడానికి ఇష్టపడతారు. సౌదీ అరేబియాలోని మక్కా వెళ్ళి కాబా చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తారు. బక్రీద్ సందడి జిల్లాలోని ముఖ్యమైన ప్రాంతాల్లో మొదలైంది. పండుగ సందర్భంగా పొట్టేళ్లు, గొర్రెలు, మేకల విక్రయాలు, కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఖుర్బానీ ఇవ్వడం కోసం ఇప్పటికే కొందరు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా పొట్టేళ్లను కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. మరికొద్ది మంది తాడేపల్లిగూడెం, గుంటూరు, మచిలీపట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి ఖుర్బానీ కోసం సిద్ధం చేసుకున్నారు. స్ధానికంగా కొందరు వ్యాపారులు ఏడాది పొడవునా పొట్టేళ్లను పెంచి విక్రయిస్తుంటారు. ఒక్కో పొట్టేలు రూ.10 వేల నుండి రూ. 20 వేల వరకు ధర ఉంటుందని వ్యాపారులు తెలిపారు. జిల్లాలోని ఏలూరు, నూజివీడు, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, ఆకివీడు, పోలవరం తదితర ప్రాంతాల్లో బక్రీద్ను ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 5 కోట్లకు పైగా పొట్టేళ్ళ వ్యాపారం జరుగుతుందని అంచనా. పొట్టేళ్ళకు గిరాకీ బక్రీద్ వస్తుందంటే పొట్టేళ్ళకు గిరాకీ పెరుగుతుంది. వారం రోజుల నుంచి మెట్ట ప్రాంతంలో పండుగ సందర్భంగా కొత్తబట్టలు, పండుగ సామాగ్రి కొనుగోలు చేశారు. ఖుర్బానీ ఇవ్వడానికి గొర్రెలు, మేకలను దూర ప్రాంతాల నుంచి కొనుగోలు చేశారు. పండుగ అయిపోయిన తరువాత నెల మొత్తం ఖుర్బానీ ఇచ్చుకునే అవకాశం ఉండటంతో పొట్టేళ్ల అమ్మకాలు సాగనున్నాయి. నేడు ఖుర్బానీ ఇవ్వనున్న ముస్లింలు ఈ నెలలో పవిత్ర మక్కా సందర్శన -
నిరుద్యోగ భృతి.. భ్రాంతి
యువతను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తామన్నారు.. పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలిస్తామన్నారు.. ఉద్యోగం వచ్చే వరకూ నెలకు రూ.3 వేల నిరుద్యోగభృతి ఇచ్చే బాధ్యత తాము తీసుకుంటామని చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా నిరుద్యోగభృతి హామీపై నోరుమెదపకపోవడం యువతను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. శురకవారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి, భీమవరం: జిల్లాలో దాదాపు ఎనిమిది ఇంజినీరింగ్ కళాశాలలు, 55 వరకు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. పాలిటెక్నిక్, వృత్తివిద్య కోర్సులు కళాశాలలు 20కు పైగా ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులు వీటిలో విద్యాభ్యాసం సాగిస్తున్నారు. ఇప్పటికే డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తిచేసి డీఎస్సీ, గ్రూపు పరీక్షలు, పోలీస్ రిక్రూట్మెంట్, ఏపీపీఎస్సీ తదితర వాటి ద్వారా ప్రభుత్వ కొలువుల కోసం జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లోని కోచింగ్ సెంటర్లు, ఇంటి వద్ద ప్రిపేర్ అవుతున్న వారు వేలల్లో ఉంటారు. జిల్లా నుంచి ఇతర విశాఖ, విజయవాడ, హైదరాబాద్ తదితర నగరాల్లో ఉంటూ ఎంతోమంది పోటీ పరీక్షల కోసం శిక్షణ పొందుతున్నారు. వీరంతా శిక్షణ ఇచ్చే సంస్థలకు వేలు, లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నారు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం అయినకాడికి అప్పులు చేసి శిక్షణ ఇప్పిస్తున్న తల్లిదండ్రులు ఎందరో. హాస్టల్, మెస్ నిమిత్తం నెలకు రూ.6 వేలకు పైనే ఖర్చవుతుంది. మరోపక్క డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర పై చదువులు చదువుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితులతో చాలీచాలనీ జీతంపై వివిధ వ్యాపార, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరిలో తమ చదువుకు తగిన ఉద్యోగం కోసం వేచి చూస్తున్నవారు చాలామంది ఉన్నారు. భృతిపై గంపెడాసలు : ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాల కల్పన, అంతవరకు ప్రతి నెలా ఇస్తామన్న భృతి హామీల అమలుకు జిల్లాలోని 5.17 లక్షల కుటుంబాలు గంపెడాసతో ఎదురుచూస్తున్నాయి. ఏపీపీఎస్సీ ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 42 ఏళ్లు, రిజర్వు కేటగిరీ అభ్యర్థులకు ఐదేళ్లు అదనపు వెసులుబాటు ఉంటుంది. ఈ మేరకు ఇంటర్ నుంచి 47 ఏళ్ల వయసు పరిగణనలోకి తీసుకుని భృతి అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. రూ.3 వేలు తమకు ఎంతో ఆసరా అవుతాయని వారంటున్నారు. ఉన్న వాటికీ కొర్రీ కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాటిని తొలగించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. ఎన్నికల ముందు వలంటీర్ల జీతం రూ.10 వేలు చేస్తామని చెప్పి వారిని విధుల్లోకి తీసుకోకుండా పక్కన పెట్టేసి జిల్లాలో 8,616 మంది వలంటీర్లను సేవలకు దూ రం చేసింది. కూటమి నేతలకు మద్యం షాపులు కట్టబెట్టేందుకు ప్రైవేట్ మద్యం పాలసీ తేవడంతో గతంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన 893 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది రోడ్డున పడ్డారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎంతోమంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు వేశారు. జిల్లాలోని సచివాలయాల్లో 1,066 ఖాళీ పోస్టులు ఉండగా వాటిని భర్తీ చేయకుండా క్లస్టర్ల పేరిట ఉద్యోగులను క్రమబద్ధీకరించి మిగిలిన వారిని ఇతర శాఖల్లో భర్తీ చేసే యోచన చేస్తోంది. భృతి.. భ్రాంతేనా ? 2014 ఎన్నికల్లో రూ.2 వేల చొప్పున భృతి ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాలుగున్నర సంవత్సరాల పాటు ఆ ఊసే ఎత్తలేదు. నాటి విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒత్తిడి తీసుకురావడంతో 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు యువనేస్తం అంటూ తంతు నడిపించారు. 22 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసున్న, డిగ్రీ చదివిని వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించారు. జిల్లాలో లక్ష మందికి పైగా నిరుద్యోగ యువత ఉంటే పలు వడపోతల నడుమ సుమారు ఆరు వేల మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. నిరుద్యోగ భృతి ఎప్పుడు?ఉద్యోగాల మాటేంటి?న్యూస్రీల్బాబు మార్కు టోకరా జాబు కావాలంటే బాబు రావాలన్న కూటమి నిరుద్యోగులకు నెలకు రూ.3,000 ఇస్తామని హామీ ఏడాదైనా నిరుద్యోగ భృతి ఊసెత్తని సర్కారు జిల్లాలో 5.17 లక్షల కుటుంబాల ఎదురుచూపులు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాటి నీ తొలగిస్తున్న వైనం యువతకు అండగా నిలిచిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలోనిరుద్యోగులకు భరోసా 2014–19 వరకు టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 34,108 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తే 2019–24 వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే శాశ్వత, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్లో 15 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించడం గమనార్హం. వీటిలో సచివాలయ ఉద్యోగాలు 4,230 మంది ఉన్నాయి.నిరుద్యోగులకు నిరాశే ఉన్నత చదువులు చదివి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాను. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇచ్చిన హామీని అమలు చేయాలి. కూటమి నాయకులు చెప్పినట్టు నిరుద్యోగులకు భృతి రూ.3 వేలు ఇచ్చి ఆదుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు వేయాలి. – కొప్పిశెట్టి లోవచంద్ర మహేష్, నిరుద్యోగి, భీమవరం భృతి ప్రస్తావనే లేదు కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదు. ఇలా మోసపూరిత వాగ్దానాలతో యువతను మోసగించడం తగదు. చంద్రబాబు 2014 ఎన్నికల్లోనూ నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారు. మరలా 2024 ఎన్నికల్లో అదే హామీ ఇచ్చి మోసం చేస్తున్నారు. – కె.ప్రవీణ్ కుమార్, సీతారాంపురం -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
భీమవరం (ప్రకాశంచౌక్): మొక్కలు నాటడంతో పాటు, ప్రకృతి సమతుల్యతను కాపాడటానికి కాలుష్య కారకంగా ఉన్న ప్లాస్టిక్ నియంత్రణే లక్ష్యంగా కృషి చేస్తున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా అంతట శ్రీవనం–మనం్ఙ పేరిట మొక్కలు నాటడం, కాలువలు, డ్రెయిన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, అధికారులు భీమవరం కలెక్టరేట్లో మొక్కలు నాటారు. అనంతరం విస్సాకోడేరు కాలువ వెంబడి ప్లాస్టిక్ వ్యర్థాలను, జేపీ రోడ్డులోని అడ్డ వంతెన వద్ద కాలువ గట్లపై ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమంలో కలెక్టర్ పాలఒగన్నారు. కాలువల్లో వ్యర్థాల తొలగింపు కార్యక్రమాన్ని పరివీలించారు. జిల్లావ్యాప్తంగా 3.85 లక్షల మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. అటవీశాఖ పర్యవేక్షణలో జిల్లాలోని వెంకటరామన్నగూడెం, సీతారాంపురం, కొణితివాడ గ్రామాల్లో నర్సరీలను అభివృద్ధి చేశామన్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కా ర్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా అదనపు ఎస్పీ వి.భీమారావు, జిల్లా అటవీ శాఖ అధికారి డి.ఆశాకిరణ్, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివన్నారాయణరెడ్డి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ కేసీహెచ్ అప్పారావు, ఆర్డీఓలు కె.ప్రవీణ్కుమార్ రెడ్డి, దాసిరాజు, కతీబ్ కౌసర్ భానో పాల్గొన్నారు. రోగుల నుంచి సొమ్ముల వసూలును ఊరుకోం ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగుల నుంచి సిబ్బంది సొమ్ములు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. భీమవరం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వైద్యాధికారులు, ఏరియా ఆస్పత్రి డాక్టర్లు, సూపరింటెండెంట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు, రోగులకు అందుతున్న సేవలు, మౌలిక సదుపాయాలు కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెంచేలా గర్భిణులను ప్రోత్సహించాలని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ నాగరాణి -
నవధాన్యాల సాగుతో భూసారం పెంపు
భీమవరం: వరి సాగు అనంతరం భూమిలో నవధాన్యాల సాగు చేయడం వల్ల భూసారం పెరుగుతుందని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వై.నూకరాజు తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడారు. నవధాన్యాల సాగు వల్ల భూమిలో సూక్ష్మజీవుల జీవనం పునరుత్థానమవుతుందని, తద్వారా భూమి సారవంతమై ఎరువులు, పురుగు మందుల ఖర్చు తగ్గుతుందన్నా రు. జిల్లా వ్యవసాయశాఖాధికారి జెడ్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీజామృతం, ఘన, ద్రవ జీవామృతం, నీమాస్త్రం, అగ్నాస్త్రం, కోడిగుడ్డు నిమ్మ రసం ద్రావణం, బయో కల్చర్ తయారీ విధానాల వల్ల ప్రయోజనాలను రైతులకు వివరించారు. వైద్య శాస్త్ర విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
వృద్ధులకూ తప్పని పరేషన్
కుక్కునూరు: కూటమి ప్రభుత్వం ఎండీయూ వాహనాలను రద్దు చేయడంతో వృద్ధులు రేష న్ కోసం పాట్లు పడుతున్నారు. 65 ఏళ్లు దాటి న వారికి ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందిస్తామన్న ప్రభుత్వ పెద్దల మాట నీటిమూట లుగా మారాయి. పలువురు రేషన్ డీలర్లు వృద్ధుల ఇళ్లకు వెళ్లి బయోమెట్రిక్ లో వేలిముద్రలు తీసుకోని చౌక డిపోకు వ చ్చి సరుకులు తీసుకువెళ్లాలని చెప్పినట్టు తెలిసింది. దీంతో వృద్ధులు మండుటెండలో రేషన్ కోసం డిపోల కు వెళుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే తమకు ఈ కష్టాలు ఉండేవి కావని గురువారం కుక్కునూరులో బియ్యం మూటలతో వెళుతున్న వృద్ధులు అన్నారు. -
ప్రశాంతంగా ప్రవేశ పరీక్షలు
భీమవరం: భీమవరంలోని నాలుగు కేంద్రాల్లో గురువారం నిర్వహించిన ఎడ్సెట్, లాసెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఎడ్సెట్ పరీక్షకు డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో 110 మందికి 88 మంది, భీమవరం డీఎన్నార్ అటానమస్ కళాశాలలో 87 మందికి 57, భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో 80 మందికి 60 మంది, విష్ణు ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో 80 మందికి 44 మంది హాజరయ్యారు. అలాగే డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన లాసెట్ పరీక్షకు 110 మందికి 22 మంది గైర్హజరు కాగా, డీఎన్నార్ అటానమస్ కళాశాలలో 100 మందికి 84 మంది హాజరయ్యారు. తాడేపల్లిగూడెంలో.. తాడేపల్లిగూడెం: పట్టణంలోని వాసవీ, శశి ఇంజనీరింగ్ కళాశాలల్లో లాసెట్, ఎడ్సెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. వాసవీలో లా సెట్కు 241 మందికి గాను 204 మంది, ఎడ్సెట్కు 240 మందికి 197 మంది హాజరయ్యారు. ప్రిన్సిపాల్ టి.రత్నాకరరావు పర్యవేక్షించారు. శశి ఇంజనీరింగ్లో లాసెట్కు 125 మందికి 96 మంది, ఎడ్సెట్కు 125 మందికి 94 మంది హాజరయ్యారు. మూగజీవాలను హింసిస్తే చర్యలు భీమవరం (ప్రకాశంచౌక్): మూగజీవాలను హింసించినా, అక్రమంగా రవాణా చేసినా చట్టరీత్యా చర్యలు ఉంటాయని డీఆర్వో మొగలి వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా జంతు సంక్షేమ సంఘ సమావేశాన్ని నిర్వహించారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, దూడలను వధించరాదన్నారు. ముందస్తు ప్రవేశాలను అడ్డుకోవాలి తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలు అమ్మడం, ముందుస్తు అడ్మిషన్లు నిర్వహించడం చేస్తున్నారని, వారిని అదుపు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆర్డీఓకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విద్యాహక్కు చట్టం పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరుతూ స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు పతివాడ నాగేంద్రబాబు మాట్లాడుతూ విద్యాసంస్థల్లో పుస్తకాలు అమ్మడం నిషేధమన్నారు. జూన్ 12 వరకు పాఠశాలలు నిర్వహించరాదని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా పలు స్కూళ్లు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు కె.రోహిత్, కె.గోవిందు, ఎన్.సాయి పాల్గొన్నారు. సెలవుల్లో తరగతుల నిర్వహణపై ఆగ్రహం ఏలూరు (ఆర్ఆర్పేట): వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న నగరంలోని విద్యానగర్లోని శ్రీ చైతన్య పాఠశాల గుర్తింపు రద్దుచేయాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో గురువా రం పాఠశాల వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం తరగతులు బాయ్ కాట్ చేయించి విద్యార్థులను ఇంటికి పంపించి వేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని మాట్లాడుతూ వేసవి సెలవుల్ని పక్కన పెట్టి గురువారం నుంచి ఈ పాఠశాలలో తరగతులు నిర్వహించడం అంటే విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘించడమే అన్నారు. అలాగే పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్ష కూడా నిర్వహించడం గుర్తించామన్నారు. విద్యాశాఖ నిబంధనలు ఉల్లంఘించిన ఈ బ్రాంచ్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగర అధ్యక్షుడు వై.యశ్వంత్ పాల్గొన్నారు. -
తోతాపురి.. ధర దిగజారి
నూజివీడు: గత 20 ఏళ్లలో ఎన్నడూలేని సంక్షోభాన్ని మామిడి రైతులు ఎదుర్కొంటున్నారు. పండ్లలో రారాజుగా పేరొందిన మామిడి రైతులను ఈ ఏడాది కోలుకోలేని నష్టాల ఊబిలో ముంచేసింది. తోతాపురి రకం ధర దారుణంగా పతనమవ్వడంతో రైతులు, వ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ ఏడాది మామిడి దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో ధర ఎక్కువగా ఉంటుందను కున్న మామిడి రైతుల ఆశలు అడియాశలు అయ్యాయి. ఏలూరు జిల్లాలో నూజివీడు, చింతలపూడి ప్రాంతాల్లో దాదాపు 50 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. వరి, మొక్కజొన్న పంటల తర్వాత ప్రధాన ఉద్యాన పంటగా విరాజిల్లుతున్న మామిడి రైతులకు చేదునే రుచిచూపుతోంది. మార్చి ప్రారంభం నుంచి మామిడి కోతలు ప్రారంభం కాగా తొలుత ఆశాజనంగా ఉన్న తోతాపురి ధర రానురాను తగ్గుతూ వచ్చి ప్రస్తుతం పూర్తిగా పతనమైంది. టన్ను రూ.3 వేలకు పడిపోవడంతో రైతులకు, వ్యాపారులకు కోత కూలి, కిరాయిలు కూడా రాని పరిస్థితి. దీంతో రైతులు, కాయలు కొనుగోలు చేసిన వ్యాపారులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రారంభంలో తోతాపురి రకం టన్నుకు రూ.15 వేల వరకు ధర వచ్చింది. ఆ తర్వాత క్రమేపీ రూ.9 వేలకు, రూ.5 వేలకు పడిపోయి ప్రస్తుతం రూ.3 వేలు పలుకుతోంది. దీంతో ఈ రకం సాగుచేసిన రైతులు లబోదిబోమంటున్నారు. ప్రారంభంలో కావాలనే ధర పెంచుతూ.. మామిడి కాయలను మార్కెట్కు రప్పించేందుకు సీజన్ ప్రారంభంలో సేట్లు ఎక్కువ రేటు వేస్తున్నా రనేది మామిడి రైతుల వాదన. నూజివీడు, ఆగిరిపల్లి, విస్సన్నపేట, నున్న మార్కెట్లకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి సేట్లు కాయల కొనుగోలు నిమిత్తం వస్తారు. వీరు సీజన్ కొద్దిరోజులు గడిచిన తర్వాత క్రమేణా ధరను తగ్గిస్తూ చివరకు అతి తక్కువ ధరకు తీసుకువస్తున్నారు. దీనికి తోడు చిత్తూరు జిల్లాలో అధిక శాతం జ్యూస్ ఫ్యాక్టరీలు తెరవకపోవడంతో కొనుగోళ్లు అంతగా లేకపోవడం కూడా ధర పతనమవ్వడానికి కారణమని వ్యాపారులు అంటున్నారు. కనీస మద్ధతు ధర ప్రకటిస్తేనే.. మామిడికాయల ధర నిర్ణయం కొనుగోలు చేసే సేట్కు, కమీషన్ దుకాణదారుడికి మధ్య ఉంటోంది తప్పితే కాయలను మార్కెట్కు తోలుకొచ్చిన రైతు సమక్షంలో నిర్ణయిం చడం లేదు. కమీషన్ వ్యాపారి టన్ను ధర ఎంత అంటే అంతే. అలాకాకుండా ప్రభుత్వం మామిడికాయల రకాలను బట్టి టన్నుకు కనీస మద్దతు ధరను ప్రకటించి అంతకంటే తక్కువకు కొనుగోలు చేయడానికి వీల్లేదంటే రైతులకు కొంత మేర ఉపయోగం ఉంటుంది. ఈ ఏడాది 95 శాతానికి పైగా రైతులు నష్టాల పాలైన నేపథ్యంలో తమను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. పెట్టుబడులు కూడా రావు తోతాపురి రకం ధర టన్ను రూ.3 వేలకు పడిపోయింది. ఇలా అయితే కోత కూలి, కిరాయి డబ్బులు కూడా రాని పరిస్థితి. 14 ఎకరాల మామిడి తోట ఉండగా రూ.6 లక్షల పెట్టుబడి పెట్టాను. పెట్టుబడులు కాదు కదా.. సగం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. – లావు ధనకోటేశ్వరరావు, కొత్త రావిచర్ల, నూజివీడు మండలం దారుణంగా ధరల పతనం టన్ను రూ.15 వేల నుంచి రూ.3 వేలకు తగ్గుదల మామిడి రైతుల గగ్గోలు -
వెన్నుపోటు దినం సూపర్ సక్సెస్
యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా కొయ్యలగూడెం మండలంలోని పలు ప్రాంతాలు మట్టి అక్రమార్కులకు అడ్డాగా మారాయి. రాత్రి వేళల్లో సాగునీటి చెరువుల నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. 10లో u● జిల్లావ్యాప్తంగా ప్రభుత్వంపైపెల్లుబికిన వ్యతిరేకత ● అన్ని వర్గాల ప్రజలూ భాగస్వాములయ్యారు ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి నరసాపురం: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో వంచన, మోసాలను ప్రశ్నిస్తూ ప్రజలకు న్యాయం చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విజయవంతమయ్యాయని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నా రు. ప్రత్యేకించి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ నిర్వహించిన నిరసన ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, ఆవేదన పెల్లుబికిందన్నారు. నిరసనల్లో ప్రజలు కూడా పెద్ద ఎత్తున భాగస్వాములయ్యారని వివరించారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వ పెద్దలు కళ్లు తెరవాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలకు, పార్టీ పదవుల్లో వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు, పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు. ఏడాది కాలంగా ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టి, ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై హామీలు అమలు చేసేలా ఒత్తిడి తేవడంలో మున్ముందు కూడా వైఎస్సార్సీపీ పెద్దెత్తున పోరాటాలు చేస్తుందని చెప్పారు. ఈ ఏడాది కాలంగా రైతులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల వారు కూటమి నిర్లిప్త పాలన కారణంగా నలిగిపోతున్నారన్నారు. 2019–24 కాలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి నెలా ఏదో ఒక పథకం రూపంలో ప్రజలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు జమచేసేదని గుర్తు చేశారు. కూటమి పాలనలో పనుల్లేక, చేతిలో చిల్లిగవ్వ లేకుండా పేదలు అప్పులు చేసుకుని జీవిస్తున్నారని ముదునూరి ఆవేదన వ్యక్తం చేశారు. -
సొంత విత్తనాలే శ్రేయస్కరం
పెనుమంట్ర: రైతులు తమ విత్తనాలను తామే పండించుకోవడం వల్ల ప్రభుత్వ సంస్థలపై ఒత్తిడి తగ్గడమే కాకుండా నాణ్యమైన ఆరోగ్యకరమైన విత్తనాలు లభిస్తాయని మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఇన్చార్జి సహా పరిశోధనా సంచాలకులు డా.బి. సహదేవరెడ్డి అన్నారు. సార్వా విత్తన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగిన కార్యక్రమంలో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. మార్టేరు పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడిన ఎంటీయూ 1318 రకం రైతుల మన్ననలు పొంది రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతుందని తెలిపారు. రైతులు స్వర్ణ రకానికి ప్రత్యామ్నాయంగా ఎంటీయూ – 1318ని సాగుచేస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ రకం సాగుచేసే రైతులు ఎకరాకు సిఫారసు చేసిన 36 కిలోల నత్రజనికి బదులుగా 24 కిలోల నత్రజనిని కేవలం రెండు దఫాలుగా నాటే సమయంలోనూ, చిరుపొట్ట దశలోనూ వేసుకోవాలని తెలిపారు. లేని పక్షంలో పంటకాలం పెరిగే అవకాశంతో పాటూ, ఎండు తెగులు, మానుకాయ ఆశించే ప్రమాదముందన్నారు. ఎంటీయూ 1121లో ఎక్కువ నూక శాతం రావడానికి గింజ గట్టిపడే దశలో వర్షాలు కురవడం, ఎక్కువకాలం పంట కోయకుండా చేనుపైనే ఉంచడం కూడా కారణమని తెలిపారు. స్వర్ణకి ప్రత్నామ్నాయంగా ఎంటీయూ 1318 ప్రధాన శాస్త్రవేత్త (వరి) డా.ఎం.గిరిజా రాణి మాట్లాడుతూ ఎంటీయూ 1310 రకం గతేడాది ప్రథమ శ్రేణి ప్రదర్శనా క్షేత్రాల్లో రైతుల మన్ననలు చూరగొందని చెప్పారు. స్వర్ణకి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన ఎంటీయూ 1318 గోదావరి మండలంలోని ఐదు జిల్లాల్లో సుమారు 36 శాతం విస్తీర్ణంలో సాగు చేయబడుతుందని తెలిపారు. అదేవిధంగా సన్న గింజ రకాలైన ఎంటీయూ 1224, ఎంటూ 1262 కృష్ణా జిల్లాలో అధిక విస్తీర్ణంలో బీపీటీ 5204కి ప్రత్యామ్నాయంగా సాగుచేయబడుతుందన్నారు. చౌడు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎంసీఎం 103 రకం మంచి దిగుబడులు ఇస్తుందని తెలిపారు. సన్న గింజ రకాలైన బీపీటీ 2846, 2782 రకాలను మామూలు భూముల్లో సాగుచేయవచ్చని ఆమె వివరించారు. ముంపు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎంటీయూ 1232, 1140, 1172, 1223, పీఎల్ఏ 1100 సాగుచేసుకోవాలని తెలిపారు. దాళ్వాలో ఎంటీయూ 1121, 3626తో పాటుగా పీఆర్ 126కి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన ఎంటీయూ 1010, 1293, 1290, 1156, 1153 రకాలు మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా మన్ననలు పొందాయని తెలిపారు. ఎంటీయూ 1426 కిట్లు రైతులకు అందజేత ఈసందర్భంగా పలువురు రైతులకు ఆర్ఎన్ఆర్ 15048 రకానికి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన చిరుసంచి రకం ఎంటీయూ 1426 కిట్లను అభ్యుదయ రైతులకు అందజేశారు. శాస్త్రవేత్తలు డా.ఎంవీ కృష్ణాజీ డా.ఎస్.దయాకర్, డా.సీహెచ్ శ్రీనివాస్, డా.వి.భువనేశ్వరి, డా.ఎన్.శ్రీనివాస రావు, డా.ఎ.ఆనంద్ కుమార్, డా.ఎన్.వెరోనికా, డా.వి.రోజా పాల్గొన్నారు. మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఇన్చార్జి సహదేవరెడ్డి -
నిండు ప్రాణాన్ని బలిగొన్న అతివేగం
నరసాపురం రూరల్ /పెనుమంట్ర: అతివేగంతో వచ్చిన ఓ ఐస్ కంటైనర్ నిండు ప్రాణాన్ని బలిగింది. ఐస్ కంటైనర్ కారును ఢీకొన్న ఘటనలో ఓ ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం పాలవ్వగా వ్యాన్ నుంచి దూకేసి ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఎస్సై జి.వాసు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం విద్యాశాఖ కార్యాలయంలో సమగ్రశిక్ష విభాగంలో సైట్ ఇంజనీర్గా కర్రి వెంకటరెడ్డి (45) పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా గరువారం వేకువజామున ఆయన రాజమండ్రికి కారులో బయలుదేరారు. మొగల్తూరు మండలం ముత్యాలపల్లి వంతెన పైకి చేరుకున్న సమయంలో బంటుమిల్లి వెళుతున్న ఐస్ కంటైనర్ ఎదురుగా వస్తున్న వెంకటరెడ్డి కారును ఢీకొంది. తీవ్రంగా గాయాలపాలైన వెంకట రెడ్డిని 108 వాహనంలో నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో కారు ముందుబాగం నుజ్జుయింది. ఐస్ కంటైనర్ కారు ఢీకొన్న అనంతరం వంతెన రైలింగ్ ఢీకొని కాల్వ వైపునకు వెళ్లి నిలబడింది. ఆ సమయంలో అప్రమత్తమైన లారీ డ్రైవర్ కవురు లీలాకృష్ణ, ఐస్ ప్యాకింగ్ బాయ్గా పనిచేస్తున్న కోమటితిప్పకు చెందిన శీలం ప్రియాంకవర్మ కాలువలోకి దూకేసి ప్రాణాలు రక్షించుకున్నారు. వీరిద్దరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. వెంటకరెడ్డి భార్య మేఘన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. కాగా మృతుడు వెంకటరెడ్డిది స్వగ్రామం పెనుమంట్ర మండలం నెగ్గిపూడి. ఆయనకు భార్య, నాలుగేళ్ల కుమార్తెతో పాటు ఒక సోదరుడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు గురువారం రాత్రి నెగ్గిపూడి శ్మశానవాటికలో నిర్వహించారు. కారును ఢీకొన్న ఐస్ కంటైనర్ ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం వ్యాన్ నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకున్న డ్రైవర్, మరో వ్యక్తి -
మిగులు భూముల్లో నిరసనగా ఏరువాక
జంగారెడ్డిగూడెం: ముంపు లేని మిగులు భూముల్లో ఏరువాక కార్యక్రమం నిర్వహించి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. మండలంలోని ఏ పోలవరం చిన్నవారిగూడెం గ్రామాల ప్రాజెక్టు ఏరియాలో అకాల వర్షాలు కురవడంతో పేదలందరూ ఐక్యంగా దుక్కు దున్ని విత్తనాలు చల్లి సాగు ప్రారంభించారు. రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం జంగారెడ్డిగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఎం.జీవరత్నం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ.ప్రాజెక్టు ముంపు లేని మిగులు భూముల్లో పేదలందరూ ఐక్యంగా సాగు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ భూమి పేదలు సాగు చేస్తున్నప్పటికీ ఈ ఏడాది వర్షాలు ముందుగా రావడంతో విత్తనాలు నారుమడలు పోసి వరి నాట్లకు సిద్ధం కావాలన్నారు. ఇదే సందర్భంలో ఎరక్రాలువ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూస్వాముల నుంచి వేలాది ఎకరాలు ప్రభుత్వం సేకరించిందని, ఇందుకు లక్షల కోట్ల పరిహారం పొందిన భూస్వాములు అక్రమంగా వరి, మొక్కజొన్న, చెరుకు, అరటి జామాయిల్, పామాయిల్ కొబ్బరి వంటలు సాగు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపు లేని భూముల్లో పేదలకు సాగు చేసేందుకు ఇవ్వమని కోరుతున్నా పట్టించుకోకుండా అధికారులు భూస్వాములతో కుమ్మకై ్క ఇరిగేషన్ చట్టాలను తుంగలో తొక్కుతున్నారని దుయ్యబట్టారు. దీనిపై వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించగా పేదలు ఈ భూములను సాగుచేసుకునేలా కోర్టు తీర్పు ఇచ్చిందని, ఈ తీర్పును అధికారులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు యాగంటి సీతా గుడెల్లి వెంకట్రావు. ఏ ప్రభాకర్ రావు, జి సూర్య కిరణ్. పిల్లి చంటి, కే సుబ్బారావు ఎర్రమాల కుమారి, బత్తుల వెంకన్న, బొక్క వెంకటేష్, రెడ్డి బోయిన సత్యావతి, బెల్లంకొండ శివయ్య, పిల్లి పోతురాజు, పి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
మండుతున్న సూరీడు
అవగాహన కల్పిస్తున్నాం జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు వడ దెబ్బకు గురికాకుండా వారికి అవగాహన కల్పించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు అదేశాలు జారీ చేశాం. వారు గ్రామాల్లోని ఎంఎల్ హెచ్పీ, ఆశ, ఏఎన్ఎంల ద్వారా ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచాం. వడదెబ్బ తగిలిన వారికి మెరుగైన వైద్యం అందిచేందుకు వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాం. – జి.గీతాభాయి, జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారిణి భీమవరం●భీమవరం (ప్రకాశం చౌక్): రొహిణి కార్తె ప్రారంభంలో ముందుగానే వచ్చిన రుతుపవనాల కారణంగా వర్షాలు పడడంతో వాతావరణం చల్లబడి అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే గత నాలుగు రోజులుగా భానుడు తన ప్రతాపం చూపడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం నుంచి తీవ్రమైన ఎండలు, వడగాలులు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రోజూ దాదాపుగా అన్నిచోట్లా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్లాంటేనే భయాందోళన చెందే పరిస్థితి నెలకొని ఉంది. ఉద్యోగాలకు, ఇతర పనులకు వెళ్లే వారు ఉదయం 8 గంటలకే ఆయా పనులకు వెళ్లిపోతున్నారు. ఉదయం నుంచే తీవ్రమైన ఎండ ఉండడంతో జన సంచారం లేక రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం సాగించే ప్రయాణికులు, వాహనదారులు వేడికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్రవాహనదారులు దారి మధ్యలో చెట్ల నీడల్లో సేదతీరుతున్నారు. ఎండ వేడిని తట్టుకోలేక ప్రజలు శీతలపానీయాలను ఆశ్రయిస్తూ సేదతీరుతున్నారు. ఎండ దెబ్బకు పగటి పూట చేయాల్సిన పనులు కొందరు రాత్రులు చేసుకునే పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల టెంట్లు వేసుకుని అత్యవసరమైన పనులు చేసుకుంటున్నారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తాలు తీసుకోవాలి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారి నుంచి రక్షణ పొందడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి జి.గీతాభాయి వివరించారు. ● సాధ్యమైనంత వరకు ఎండలో తిరగరాదు. తప్పనిసరి పరిస్థితుల్లో తలకు టోపి, లేదా టవల్ కట్టుకోవడం, గొడుగు వేసుకుని వెళ్లడం మంచిది. మంచినీళ్లు అందుబాటులో ఉంచుకోవాలి. ● నలుపు, ముదురు రంగు దుస్తులు కాకుండా తెలుపు లేదా లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. ● రోడ్ల మీద విక్రయించే పానీయాలు (రంగునీళ్లు), కూల్డ్రింక్స్ తాగరాదు. ● మాంసాహారం, మసాలాతో తయారుచేసిన ఆహరం తినరాదు. ఆకు కూరలు, కూరగాయలతో తయారు చేసిన ఆహారం మేలు. ● పరిశుభ్రమైన నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఇంటిలో తయారుచేసే పండ్ల జ్యూసులు తీసుకోవాలి. ● మద్యం సేవించడం, పొగ తాగడం వంటివి చేయరాదు. మద్యం సేవించి ఎండలో ప్రయాణించడం మంచిదికాదు. ● వృద్ధులు, గర్భిణీలు, చినపిల్లలు ఇంటిలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలోకి వెళ్లనీయరాదు. ● వేసవి సెలవులు కాబట్టి పిల్లలు బయటకు వెళ్లే ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వారికి ఇంటిలోనే ఆటలు ఆడుకునేలా ఏర్పాట్లు చేసుకుంటే మంచిది. భీమవరంలో నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు ఉదయం నుంచే భానుడి భగభగలు వడగాలులు, ఉక్కపోతలతో అల్లాడుతున్న జనం వృద్ధులు, చినపిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు వడదెబ్బ తగిలితే ప్రథమ చికిత్స ఇలా ఎవరైనా వడ దెబ్బకు గురైతే కళ్లు తిరిగి పడిపోవడం, శరీరం చెమటలు పట్టడం, స్పృహలో లేకపోవడం జరుగుతుంది. అలాంటి వ్యక్తిని ముందుగా నీడకు చేర్చి చల్లనీ నీళ్లతో శరీరాన్ని తుడవాలి. శరీరం సాధారణ స్థితికి వచ్చేవరకు తడి గుడ్డతో తుడుస్తూ చల్లగాలి తగిలేలా చూడాలి. ఉప్పు కలిపిన మజ్జిగ గానీ ఓఆర్ఎస్ ద్రావణాన్ని గానీ తాగించాలి. నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యులకు చూపించాలి. -
విక్టర్బాబుపై పీడీ యాక్ట్
భీమవరం : చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తున్న భీమవరం పట్టణం చిన అప్పారావుతోటకు చెందిన కొత్తపల్లి విక్టర్బాబుపై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి చెప్పారు. గురువారం భీమవరం వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. విక్టర్బాబు భీమవరం వన్టౌన్, టూటౌన్, కాళ్ల, ఉండి పోలీసుస్టేషన్లలో వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించి ముందుస్తు నేర నియంత్రణ చర్యలో భాగంగా రాజమహేంద్రవరం జైలుకు పంపించినట్లు ఎస్పీ తెలిపారు. ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం ఎగసిపడిన అగ్నికీలలు.. భారీ ఆస్తి నష్టం ఏలూరు టౌన్ : ఏలూరు రూరల్ ప్రాంతంలోని ఒక ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. వివరాల ప్రకారం.. ఏలూరు బీడీ కాలనీ ప్రాంతానికి చెందిన మాదాబత్తుల వెంకటేష్ ఏలూరు రూరల్ పరిధిలో జేఎంజే స్కూల్ సమీపంలో గణేష్ సోఫా అండ్ ఫర్నిచర్ వర్క్స్ పేరుతో దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫర్నిచర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఎగసిపడడంతో దుకాణంలో పనిచేస్తున్న కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో అతికష్టం మీద రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ఆస్తి నష్టం అంచనా వేసేందుకు రాత్రివేళ కావటంతో ఆలస్యం అవుతుందని, భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోందని అగ్నిమాపక శాఖ ఏలూరు అధికారి రామకృష్ణ తెలిపారు. ఆస్తి తగాదాలో కత్తులతో ఇరువర్గాల దాడి ఏలూరు టౌన్: అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాల్లో తీవ్ర వివాదం నెలకొనటంతో ఇరు వర్గాలు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. గాయాలపాలైనవారు ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఈ ఘర్షణపై ఏలూరు రూరల్ పోలీస్స్టేషన్లో ఇరువర్గాలు ఫిర్యాదులు చేశారు. శ్రీపర్రు గురకలపేట ప్రాంతానికి చెందిన మండేల గంగరాజు అతని సోదరుడు మండేల రవీంద్రబాబుకు మధ్య ఆస్తి తగాదా ఉంది. ఈ నేపథ్యంలో గురువారం ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ గొడవల్లో గంగరాజు, గంటసాల కుమారస్వామి, గంటసాల పెద్దిరాజు గాయపడగా, రెండవ వర్గం రవీంద్రబాబు, మండల రామరాజుకు గాయాలయ్యాయి. ఏలూరు రూరల్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రాంగ్ రూట్లో వచ్చి..
దెందులూరు: రాంగ్ రూట్లో వస్తున్న కారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం వైపు నుంచి ఏలూరు వైపు ఐదుగురు కుటుంబ సభ్యులు కారులో ప్రయాణిస్తున్నారు. సోమవరప్పాడు గ్రామ శివారు వచ్చేసరికి ఏలూరు వైపు నుంచి రాంగ్ రూట్లో వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో జంగారెడ్డిగూడెం నుంచి వచ్చే కారులో ఐదుగురికి స్వల్ప గాయాలు కాగా రాంగ్ రూట్లో వస్తున్న కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరికి చేయి విరిగింది. క్షతగాత్రులను దెందులూరు పోలీసులు 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఆర్ శివాజీ తెలిపారు. కారును ఢీ కొట్టిన మరో కారు ఆరుగురికి గాయాలు -
ఎస్సై సమయస్ఫూర్తి.. నిలిచిన నిండుప్రాణం
ఆకివీడు: రైలు నుంచి ప్రమాదవశాత్తూ జారి పడిపోయిన వ్యక్తిని సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఎస్సై సమయస్ఫూర్తితో గుర్తించి రక్షించారు. వివరాల ప్రకారం ఆకివీడు మండలం కమతవానిగూడెంకు చెందిన నతానియేలుతో పాటు మరో 8 మంది ఉపాధి నిమిత్తం తిరుపతి వలస వెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి బుధవారం రాత్రి ఆకివీడుకు తిరుమల – నర్సపూర్ రైలు బండిలో వస్తుండగా నతానియేలు ప్రమాదవశాత్తూ కదులుతున్న రైలు నుంచి జారి పడిపోయాడు. చీకట్లో ఏ ప్రాంతంలో పడిపోయాడో కూడా తెలియదు. వెంటనే బంధువులు గమనించి ఆకివీడు ఎస్సై హనుమంతు నాగరాజుకు ఫోన్ ద్వారా విషయం వివరించారు. ఆయన సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా క్షతగాత్రుడు కావలి ప్రాంతంలో పడిపోయినట్లు గుర్తించి సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేసి పోలీసుల్ని అప్రమత్తం చేశారు. ఘటనా స్థలంలో పడిపోయి ఉన్న నతానియేలును గుర్తించి కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా నతానియేలుకు సకాలంలో వైద్యం అందడంతో అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని, కానీ రెండు కాళ్లూ విరిగిపోయి, తలకి బలమైన గాయమైందని పోలీసులు చెప్పారు. ఎస్సై హనుమంతు నాగరాజు సమయస్ఫూర్తిని ఈ సందర్భంగా పలువురు అభినందించారు. -
యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా
కొయ్యలగూడెం: మండలంలోని పలు ప్రాంతాలు మట్టి అక్రమార్కులకు అడ్డాగా మారాయి. రాత్రి వేళల్లో సైతం సాగునీటి చెరువుల నుంచి మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొయ్యలగూడెం సమీపంలోని శ్రీరామ గట్టు చెరువు, కన్నాయిగూడెం సమీపంలోని ఊర చెరువుల నుంచి గురువారం వందల కొద్ది ట్రక్కుల్లో మట్టి అక్రమ రవాణా కొనసాగింది. పంట పొలాలకు వెళ్లే రహదారులు ధ్వంసం అవుతున్నాయని శ్రీరామ గట్టు చెరువు ఆయకట్టు రైతులు ఆందోళన చేపట్టి మట్టి వాహనాలను అడ్డుకున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు ఆరోపించారు. కన్నాయిగూడెం ఊర చెరువు నుంచి రాత్రి వేళల్లో జేసీబీ యంత్రాలతో మట్టి అక్రమ తోలకాలను నిర్వహించారు. మట్టి అక్రమార్కులకు నియోజకవర్గ పెద్దల అండదండలు ఉండడం వల్ల తామేమి చేయలేకపోతున్నామని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. రవాణా అవుతున్న మొత్తం మట్టి ఇటుక బట్టీలకు, కమర్షియల్ లేఅవుట్ల నిర్మాణానికి తరలించి జేబులు నింపుకుంటున్నారు. -
హామీలను అమలు చేయకుండా మోసం
తాడేపల్లిగూడెం (టీఓసీ): కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు విమర్శించారు. స్థానిక హౌసింగ్బోర్డు కాలనీలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత జగన్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తే నేటి కూటమి ప్రభుత్వం పెన్షన్ మినహా ఏదీ నెరవేర్చలేదన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై దాడులు చూస్తుంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ఉన్నట్లుగా ఉందన్నారు. పిఠాపురంలో దళితులను అగ్రవర్ణాలు వారు వెలివేస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించలేదని, ఈ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు కార్యక్రమం విజయవంతంగా జరిగిందన్నారు. సమావేశంలో మాల సంఘాల జేఏసీ నాయకులు గంట సుందర్ కుమార్, కేసీ రాజు, ఎం.ఎస్తేర్ రాణి పాల్గొన్నారు. -
రెచ్చిపోతున్న మట్టి మాఫియా
ఇరగవరం: మండలంలోని పలు గ్రామాల్లో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అధికారులు, అధికార పార్టీ నాయకుల అండ దండలతో విర్రవీగుతూ మట్టిని తరలిస్తున్నారు. ఇరగవరం మండలంలోని కొత్తపాడు, రేలంగి, కత్తవపాడు, అయినపర్రు, పేకేరు, రేలంగి, పొదలాడ గ్రామాల్లో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. వీటిని అదుపు చేయాల్సిన రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడం లేదు. అనుమతుల ఊసే లేదు అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుతున్నాయి. పూడిక పేరుతో చెరువులను లోతుగా తవ్వి అక్కడ మట్టి ని తొలగిస్తున్నారు. కంతేరు గ్రామంలో సుమారు మూడు ఎకరాల చెరువు గట్టు నుంచి సుమారు పది అడుగుల మేర లోతు మట్టిని తవ్వుతున్నారు. కొత్తపాడు సరిహద్దు ఇరగవరం గ్రామంలో సుమారు ఎకరం చెరువును పూడ్చి వేయడం జరిగింది. దాని గుట్టు మీద ఉన్న సుమారు ఇరవై కొబ్బరి చెట్లు తొలగించారు. ఎక్కడా కూడా ఫిషరిష్, రెవెన్యూ అధికారులు అనుమతులు తీసుకోలేదు. చెరువులు పూడ్చడానికి, తవ్వడానికి ఫిషరిష్ అధికారుల అనుమతులు తప్పనిసరి. కానీ అది ఎక్కడా జరగడం లేదు. ట్రాక్టర్లు, లారీతో మట్టి తరలించడం వల్ల రోడ్లు సైతం పాడైపోతుండడంతో గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇరగవరం మండలం నుంచి మట్టిని తణుకు, పెనుగొండ, పెనుమంట్ర, ఆలయూరు, ఇరగవరం గ్రామాల్లో లేఅవుట్లు పూడ్చడానికి తరలిస్తున్నా అక్కడ లే అవుట్లు పూడ్చడానికి ఎకరాకు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు అర్జిస్తున్నారు. దీంతో మట్టి వ్యాపారులు కోట్లు సంపాదిస్తున్నారు. దీని కోసం రైతులకు వేలల్లో డబ్బులు ఇస్తున్నారు. అధికారులు వారికి అన్ని విధాలుగా సహకరిస్తున్నందుకు వారికి లక్షల్లో ముడుపులు అప్పజెప్పుతున్నారు అని రెవెన్యూ అధికారులు మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్సు లేకుండా ద్విచక్ర వాహనం నడిపే వారికి రూల్స్ చెప్పి జరిమానా విధించే పోలీసులు, ఆర్టీవో అధికారులు లైసెన్సులు, ధ్రువపత్రాలు లేకుండా ట్రాక్టర్లు, లారీలు విచ్చలవిడిగా తిరుగుతున్నా అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మట్టి దోపిడికి అడ్డు కట్ట వేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. అధికార పార్టీ అండదండలతో విర్రవీగుతున్న భూబకాసురులు ముడుపుల మత్తులో జోగుతున్న అధికారులు -
చోరీ కేసులో రూ.31.83 లక్షలు స్వాధీనం
ఏలూరు టౌన్: పోలవరం మండలం జగన్నాథపేటలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడి నుంచి చోరీ సొత్తు రూ.31.83 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ బుధవారం వివరాలు వెల్లడించారు. పోలవరం మండలం జగన్నాధపేట గ్రామానికి చెందిన పద్మనాభుని శ్రీనివాసగుప్త తన కుటుంబంతో కలిసి మే 13న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు, నగదను అపహరించుకుపోయారు. చోరీ సొత్తు సుమారుగా రూ.33 లక్షల వరకూ ఉంటుందని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ చోరీ కేసుపై ఎస్పీ ఆదేశాలతో పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ట్రంక్ పెట్టెలో దాచిన చోరీ సొత్తు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈనెల 3న పోలవరం పోలీసులు నిందితుడు ఉసురుమర్తి గంగాజలంను తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ సమీపంలో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. నిందితుడు చోరీ సొత్తు దాచిపెట్టిన ప్రదేశాన్ని చూపించగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కొంత నగదును నిందితుడు గంగాజలం పేకాటలో పోగొట్టగా.. మిగిలిన నగదు, వస్తువులు పాత ఇంట్లో ట్రంక్ పెట్టెలో దాచిపెట్టాడు. రూ.22,12,082 విలువైన 247.16 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2,71,506 విలువైన 2.4 కిలోల వెండి వస్తువులు, రూ.7 లక్షల నగదు కలిపి మొత్తం రూ.31 లక్షల 83 వేల 588 చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన పోలవరం సీఐ బాలసురేష్, ఎస్సై పవన్కుమార్, హెచ్సీ కే.శ్రీనివాస్, జీవీవీఎస్ సత్యనారాయణ, కానిస్టేబుల్ జే.బాబి, కే.కోటేశ్వరరావు, మురళీకృష్ణను ఎస్పీ శివకిషోర్ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇల్లు, షాపుల వద్ద మోషన్ డిటెక్షన్ సీసీ కెమెరాల ఏర్పాటుతో చోరీలను నిరోధించే అవకాశం ఉందని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, పోలవరం డీఎస్పీ, సీఐ పాల్గొన్నారు. జగన్నాధపేటలో భారీ చోరీ కేసు ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ -
కంగారులో రైలు దిగేసిన జార్ఖండ్ మహిళ
ఏలూరు టౌన్: జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ కంగారులో దెందులూరులో రైలుబండి దిగిపోగా, ఆమెను తిరిగి బంధువులకు అప్పగించినట్లు ఏలూరు రైల్వే ఎస్సై పీ.సైమన్ తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రం బిదండి గ్రామానికి చెందిన అనిత ముర్ము అనే మహిళ భర్త రాంలాల్తో కలిసి కేరళ రాష్ట్రానికి పనులు చేసుకునే నిమిత్తం ఈనెల 1వ తేదీన బొకారో ఎక్స్ప్రెస్ రైలులో థన్బాద్ నుంచి ఎర్నాకుళం వెళుతుంది. రైలుబండి దెందులూరు సమీపానికి వచ్చేసరికి భర్త రాంలాల్ కనిపించకపోవడంతో భయంతో అనిత ముర్ము రైలు దిగిపోయింది. ఆమెను గమనించిన రైల్వే సిబ్బంది ఏలూరు రైల్వే పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి అప్పగించారు. అనంతరం రైల్వే ఎస్సై సైమన్ మహిళను వన్స్టాప్ సెంటర్లో ఉంచారు. అనంతరం మహిళ వివరాలు సేకరించి బంధువులను ఏలూరు రప్పించారు. మహిళ భర్త రాంలాల్, అన్నలు ఏలూరు రైల్వే పోలీస్స్టేషన్కు రాగా మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి భర్తకు అప్పగించారు. నిందితుడిపై మూడు కేసులు ఆకివీడు : బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడిపై మూడు కేసులు నమోదు చేసినట్లు ఆకివీడు రూరల్ సీఐ జగదీశ్వరరావు బుధవారం చెప్పారు. కిడ్నాప్, అత్యాచారం, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశామన్నారు. గాయాలైన నిందితుడు షేక్ మీరాకు భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామన్నారు. సంతపేట ప్రాంతంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు భీమవరం: భీమవరం రెండో పట్టణంలోని ఓ బ్యాంకు ఉద్యోగి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఇజ్రాయేల్ చెప్పారు. వివరాల ప్రకారం వీరవాసరం మండలం తోలేరుకు చెందిన ఎస్.భీమరాజు భీమవరంలో ఓ బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఎప్పుటిలానే ఈనెల2న బ్యాంకుకు వెళ్లాడు. మధ్యాహ్నం నుంచి బ్యాంకులో అతని ఆచూకీ లేదు. బుధవారం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
సచివాలయ ఏఎన్ఎం కౌన్సెలింగ్లో రగడ
ఏలూరు టౌన్: జిల్లాలోని సచివాలయాల్లో ఏఎన్ఎంలుగా పనిచేస్తున్న సిబ్బందిని మాతృసంస్థ వైద్య ఆరోగ్యశాఖలోకి నియామకాలు చేపట్టేందుకు నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ ఆకస్మికంగా నిలుపుదల చేయడంతో ఏఎన్ఎంలు ఆందోళనకు దిగారు. ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆర్.మాలిని 4వ తేదీన కౌన్సెలింగ్ చేపడతామని ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న సచివాలయ ఏఎన్ఎంలు ఏలూరులోని డీఎంఅండ్హెచ్ఓ కార్యాలయానికి బుధవారం ఉదయం 10 గంటలకే చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తమకు బదిలీ కౌన్సెలింగ్, పదోన్నతులు ఇచ్చిన అనంతరం మాత్రమే సచివాలయ ఏఎన్ఎంలకు కౌన్సెలింగ్ చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సీనియర్ ఏఎన్ఎంలు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో కౌన్సెలింగ్ అర్ధాంతరంగా నిలిపివేశారు. దీనిపై సాయంత్రం వరకు అధికారుల నుంచి సమాధానం లేకపోవడంతో సచివాలయ ఏఎన్ఎంలు కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. తమకు గత ప్రభుత్వంలో 2022లో 179 జీఓ మేరకు వైద్య ఆరోగ్యశాఖలో నియమాకాలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారని అనంతరం 2024 కూటమి ప్రభుత్వంలోనూ అక్టోబర్లో మరోసారి కౌన్సెలింగ్ చేపట్టి వైద్య ఆరోగ్య శాఖలో నియామకం చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చారని చెబుతున్నారు. దీంతో గందరగోళ వాతావరణం నెలకొనడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాలిని, రెవెన్యూ అధికారులు ఈ అంశంపై ఇరువర్గాల నాయకులతో చర్చించి సానుకూలమైన చర్యలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం రాత్రి 10 గంటల వరకు చర్చలు సాగుతూనే ఉన్నాయి. తొలుత తమకు బదిలీ కౌన్సెలింగ్లంటూ సీనియర్ల పట్టు అర్ధాంతరంగా నిలిచిపోయిన కౌన్సెలింగ్ -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు
తాడేపల్లిగూడెం రూరల్ : మండలంలోని ఎల్.అగ్రహారం రాజీవ్ గృహకల్ప సముదాయంలో బుధవారం రాత్రి జరగాల్సిన బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరపల్లి గ్రామానికి చెందిన బాలికకు, దేవరపల్లి మండలం బంధపురం గ్రామ వాసితో బుధవారం రాత్రి బాలిక అమ్మమ్మ స్వగ్రామం ఎల్.అగ్రహారం రాజీవ్ గృహకల్ప సముదాయంలో వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి 1098 నెంబరుకు కాల్ రావడంతో ఐసీడీఎస్ సూపర్వైజర్ కే దుర్గాభవాని, కే విశాలాక్షి, మహిళా పోలీస్, అంగన్వాడీ కార్యకర్తలు బాలిక అమ్మమ్మ ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం బాలికను తణుకులోని బాలసదన్కు తాత్కాలిక వసతి నిమిత్తం తరలించినట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ కే దుర్గాభవాని తెలిపారు. 6 నుంచి హాకీ పోటీలు భీమవరం: భీమవరం పట్టణంలోని డీఎన్నార్ కళాశాల ఆవరణలో ఈనెల 6వ తేదీ నుంచి 15వ హాకీ ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఉమెన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కలిదిండి ఆనందరాజు, కేవీఎస్ భరత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8వ తేదీ వరకు పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్రంలోని 15 టీమ్లు పాల్గొంటాయని, విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు ఆగస్టులో కాకినాడలో నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు టీమ్ను ఎంపిక చేస్తామన్నారు. సుజుకి న్యూ యాక్సెస్ 125 విడుదల ఏలూరు (టూటౌన్): శ్రీ కృష్ణా సుజుకి ఆధ్వర్యంలో హోటల్ ఎన్ ఏలూరులో న్యూ యాక్సెస్ 125 టీఎఫ్టీ కలర్డ్ డిస్ప్లే వేరియంట్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేశారు. అధునాతన ఫీచర్లతో దీనిని లాంచ్ చేశారని, దీనికి ఏడేళ్ల ఎక్స్టెండెడ్ వారంటీ ఉందని, వంద మంది లక్కీ విన్నర్లతో పాటు గ్యారంటీ రివార్డుగా రూ.5 వేలు అందిస్తున్నామని శ్రీ కృష్ణా గ్రూప్స్ అధినేత నారా శేషు తెలిపారు. కార్యక్రమంలో సుజుకి కంపెనీ సేల్స్ అండ్ సర్వీస్ రీజనల్ మేనేజర్లు శివరామకృష్ణ, సునీల్, ఏరియా సేల్స్ మేనేజర్ అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మద్యం బెల్ట్షాపు నిర్వాహకుడి అరెస్ట్ భీమవరం: భీమవరం మండలం, పట్టణంలో నిర్వహిస్తున్న బెల్ట్షాప్పై ఎకై ్సజ్ అధికారులు దాడి చేశారు. బెల్ట్షాప్ నిర్వాహకుడు సీహెచ్ శ్రీనును అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 6 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ కె.బలరామరాజు బుధవారం తెలిపారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ ఎస్సైలు పి ఉమామహేశ్వరరావు, పి సునీల్ కుమార్ పాల్గొన్నారు. -
వరాల వెంకన్న కల్యాణోత్సవాలు ప్రారంభం
అత్తిలి: మండలంలో ఈడూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీవరాల వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున భక్తులచే గోవింద మాలా దీక్ష స్వీకరణ కార్యక్రమం జరిగింది. సన్నిధి నాగ వెంకట సత్య సూర్య రామలింగేశ్వరరావు, వీర పద్మ, మామిడిపల్లి రాంబాబు, నాగమణి దంపతులచే స్వామివారికి సుప్రభాత సేవ, మేలుకొలుపు, తోమాల సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం వరాల వేంకటేశ్వర స్వామి వారిని పెండ్లి కుమారునిగాను, శ్రీ దేవి భూదేవి అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా అలంకరించారు. పడాల వెంకటేశ్వరరావు దంపతులు శేషవస్త్రాలు సమర్పించారు. అల్లూరి సత్యనారాయణరాజు సుబ్బలక్ష్మి, అల్లూరి సీతారామరాజు, మీనాక్షి దంపతులచే ఆలయ అర్చకులు వాడపల్లి శేఖరాచార్యులు ఆధ్వర్యంలో విష్వక్సేనపూజ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపన, గరుడ హోమం, ప్రధాన హోమ పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల వెంకట నారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పర్యావరణాన్ని కాపాడుకుందాం
●సామాజిక బాధ్యతగా భావించాలి పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలి. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనే పర్యావరణ పరిరక్షణకు మార్గం. ప్రతి ఒక్కరూ ఆ దిశగా అడుగులు వేయాలి. ప్లాస్టిక్ సంచులు వాడటం వాటి వల్ల వచ్చే అనర్థాలను ప్రజల్లో అవగాహన కలిగించాల్సినటువంటి బాధ్యత అందరి పైన ఉంది. విద్యార్థులకు కళాశాల స్థాయిలో అవగాహన కలిగిస్తున్నాం. – డాక్టర్ ఎం.హరిప్రసాద్, అధ్యాపకుడు, వైవీఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కై కలూరు కాటన్ బ్యాగుల వినియోగం బెటర్ జూట్ పేపర్ కాటన్ బ్యాగులు మాత్రమే ఉపయోగించాలి. ప్లాస్టిక్ అనర్థాలపై ప్రధాన కూడళ్ల వద్ద ప్రచార బోర్డులు, బ్యానర్లను ఏర్పాటు చేయాలి. మున్సిపల్, పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. దుకాణదారుల్లో క్యారీ బ్యాగులు వాడటం వల్ల అనర్థాలపై అవగాహన కలిగించాలి. ప్రజలను పూర్తిగా భాగస్వామ్యం చేయాలి. – పి.పవన్కాంత్, స్వీప్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, కై కలూరుకై కలూరు: పర్యావరణాన్ని కాపాడుకుంటే అది మానవాళిని కాపాడుతోంది. దీని ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలు గుర్తించాయి. స్వీడన్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 1972 జూన్ 5న పర్యావరణ పరిరక్షణ అవగాహన సమావేశం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2022 జూన్ 5తో ప్రపంచ పర్యావరణ సంబరాలకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడిద్దాం అనే నినాదంతో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రొగ్రాం(యూఎన్ఈపీ) జరుగుతుంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల వ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలు పర్యావరణంపై అవగాహన సమావేశాలు నిర్వహించనున్నాయి. పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం మొక్కలు నాటే కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ప్లాస్టిక్ బాంబులు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య ప్లాస్టిక్ వాడకం. ప్రతి సంవత్సరం 19–23 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు జల పర్యావరణ వ్యవస్థలో చేరుతున్నాయని అంచనా. 1950లో 2 మిలియన్ టన్నుల నుంచి నేడు 430 మిలియన్ టన్నులకు ప్లాస్టిక్ వాడకం పెరిగింది. ప్రధానంగా మైక్రో ప్లాస్టిక్ సముద్ర జలాల్లో చేరడం వల్ల తాబేళ్లు, తిమింగళాలతో పాటు అరుదైన సముద్ర జీవులు మృత్యువాత పడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మన రాష్ట్రంలో మాత్రం ప్రమాదకర క్యారీ బ్యాగులను నియంత్రించలేకపోతున్నారు. అమలుకు నోచుకోని నిబంధనలు క్యారీ బ్యాగుల నిషేధం చట్టం పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఈ చట్టం అమలు కోసం నియమించిన జిల్లా స్థాయి కమిటీల్లో కలెక్టర్లు, మేయర్లు మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లు, పొల్యూషన్ బోర్డ్ అధికారులు, పరిశ్రమల సంస్థ బాధ్యులు, జిల్లా పంచాయతీ అధికారి సభ్యులుగా ఉంటారు. గ్రామస్థాయిలోనూ కమిటీలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ కమిటీల ఊసే లేదు. దాడులు కూడా స్వల్సంగా జరుగుతున్నాయి. ఎవరైనా కోర్టుల్లో పిల్ వేసినప్పుడు మాత్రం హడావుడి చేసి తర్వాత పట్టించుకోవడం లేదు. క్యారీ బ్యాగుల నిషేధం ఏదీ 120 మైక్రాన్ల మందం కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ సంచులు నిషేధం. తయారీదారులు ప్రతి క్యారీ బ్యాగ్పై చిరునామాతో పాటు రీసైకిల్ చేసిన ప్లాస్టిక్, అసలు ప్లాస్టిక్ వివరాలను ముద్రించాలి. సహజ చాయ తెలుపు రంగులో కవర్లను మాత్రమే వాడాలి, ఈ నిబంధన అతిక్రమించిన తయారీదారులకు రూ.25 వేల నుంచి రూ.50,000, చిల్లర వ్యాపారులకు రూ.2,500 నుంచి రూ.5,000, బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ సంచులను పారవేస్తే రూ.250 నుంచి రూ.500 వరకు జరిమానా విధించాలి. ఇవి నామమత్రంగా అమలవుతున్నాయి. భూమిలో విచ్ఛిన్నమవడానికి ఎంత సమయం.. న్యూస్ పేపర్ 4 నుంచి 6 వారాలు. సిగిరెట్ చివర ఫిల్టర్ మొన ఒకటి నుంచి 5 సంవత్సరాలు. క్యారీ బ్యాగు 10 నుంచి 20 సంవత్సరాలు. స్టీల్ టీం క్యాన్ 50 సంవత్సరాలు. శీతల పానీయాల అల్యూమినియం బాటిల్ 80 నుంచి 200 సంవత్సరాలు. ప్రిజ్లోని ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు 450 సం.లు గాజు బాటిళ్లు (బీరు సీసాలు) మిలియన్ సంవత్సరం. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ ఏడాది నినాదం.. ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడిద్దాం కొల్లేరు అభయారణ్యంలో పర్యావరణం మృగ్యం జిల్లాలో పర్యావరణంపై అవగాహన సదస్సులు కొల్లేరులో పర్యావరణానికి విఘాతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తించిన ఏకై క చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు. ఇక్కడ పర్యావరణం నచ్చడంతో వలస పక్షులు లక్షలాదిగా ప్రతి ఏటా తరలివస్తున్నాయి. కొల్లేరు సరస్సు 901 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. కొల్లేరు అభయారణ్యంగా 5వ కాంటూరు వరకు 77,138 ఎకరాలను గుర్తించారు. కొల్లేరు సరస్సుకు పెలికాన్, పెయింటెడ్ స్టోక్, ఐబీస్, స్టిల్ట్ వంటి 185 రకాల జాతుల పక్షులు సంచరిస్తాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన సరస్సు కాలుష్యపు బారిన పడింది. ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలతో సరస్సు ఉనికిని కోల్పోతుంది. సహజ సిద్ధ చేపలు మృత్యువాత పడుతున్నాయి. అక్రమ చెరువుల్లో రసాయనాల వాడకం కొల్లేరు పర్యావరణానికి విఘాతం కలుగుతోంది. -
గ్యాస్ లీకై పెళ్లింట్లో ప్రమాదం
పెనుగొండ: పెళ్లింట్లో అకస్మాత్తుగా జరిగిన ఓ ప్రమాదంలో ఏడుగురు గాయాలపాలయ్యారు. వివరాల ప్రకారం చెరుకువాడ కొండపల్లి వారి వీధిలో ఇవ్వల నాగేశ్వరరావు కుమారుడు శ్రీనివాసరావు వివాహం బుధవారం జరగనుండడంతో బందువులు, స్నేహితులు అందరూ వచ్చారు. మంగళవారం ఇంటిలో గ్యాస్ వెలిగించి వంట చేస్తుండగా ప్రమాదవ శాత్తు గ్యాస్ లీకై ఆకస్మాతుగా మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమై మంటలు అదుపులోకి తీసుకు రావడానికి ప్రయత్నించడంతో పెండ్లి కుమారుడు శ్రీనివాసరావుతో పాటు, బంధువులు అయినపర్తి లక్ష్మీ, కవిటం నాగమణి, సూర్య హనుమంతరావు, సత్యవతి, నరసింహమూర్తి , మాచవరపు వీరేంద్ర గాయాలపాలయ్యారు. వీరికి కాళ్లు చేతులు, పొట్ట, వీపు మీద గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన పెనుగొండలోని ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పెళ్లింట్లో పెనుప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. పెండ్లి కుమారుడు సహా ఏడుగురికి గాయాలు -
సీ వీడ్.. సో గుడ్
సముద్రపు నాచు విశేషాలివీ! ● భూగోళంపై పండించే కూరగాయల కంటే సముద్రంలో పెరిగే నాచు పరిమాణం 30 శాతం ఎక్కువ. ● సముద్రంలో అదనపు రసాయనాలు, భారీ లోహాలను ఇది గ్రహిస్తుంది. ● పర్యావరణ వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తుంది. ● సముద్రపు నాచును జీరో ఇన్పుట్ ఫుడ్గా పిలుస్తారు. ● సముద్రంలో కార్బన్ డైఆకై ్సడ్ను గ్రహిస్తుంది. ● పశువుల ఆహారం, ఆక్వా కల్చర్లో దీనిని ఫీడ్ సప్లిమెంట్లుగా వినియోగిస్తారు. ● సముద్రపు జీవులకు ఆహారం, ఆశ్రయం అందించి జీవ వైవిధ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది. ● సేంద్రియ ఎరువుగా కార్బోహైడ్రేట్లు, సూక్ష్మ పోషకాలు, ఖనిజాలు అధికం. ● ఆహార పరిశ్రమ, ఔషధ, సౌందర్య రంగం, వ్యవసాయంలో దీనిని వినియోగిస్తారు. ● తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఇస్తుంది. ● మత్స్యకారులు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం. కై కలూరు: సముద్రపు నాచు (సీ వీడ్) తీరప్రాంత మహిళలకు కుటీర పరిశ్రమగా మారుతోంది. మంచినీరు, ఎరువులు, పురుగు మందులు, ఆహారం అవసరం లేకుండా సముద్రంలో తక్కువ కాలంలోనే అధిక దిగుబడులు సాధించే నాచు పెంపకానికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్వా రంగానికి ప్రత్యామ్నాయంగా నాచు సాగు మారనుంది. సెంట్రల్ మైరెన్ ఫిషరీస్ రీసెర్చ్ (సీఎంఎఫ్ఆర్ఐ), కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సీఏఏ) ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్వై) ద్వారా మహిళలకు సబ్సిడీ రుణాలిచ్చేందుకు ప్రభుత్వం ముందుకొస్తోంది. సీ వీడ్పై అవగాహన కల్పించేందుకు ఏటా జూన్ 4న జాతీయ సముద్రపు నాచు దినోత్సవం జరుపుతారు. పోషకాల గని.. సముద్రపు నాచు సముద్రపు నాచు (మైరెన్ ఆల్గే)లో పోషక, ఔషధ విలువలు అధికంగా ఉంటాయి. తెప్పలు, రేస్ వేలు, మోనోలైన్, తాళ్లు వంటి పద్ధతుల్లో సముద్రంలో నాచును సాగు చేస్తున్నారు. తమిళనాడులోని మండపం ప్రాంతం నుంచి కప్పఫైకాస్, గ్రాసిలేరియా అనే జాతుల విత్తనాలను ఏపీకి తెస్తున్నారు. ఒక్కో పంట 45–60 రోజుల సమయం పడుతోంది. సీ వీడ్లో ప్రొటీన్, ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. వీటిని బిస్కెట్లు, పాస్తా, నూడుల్స్, సూప్ పౌడర్లు, పెరుగు వంటి అహార పదార్థాల్లో వినియోగిస్తారు. ఔషధ, సౌందర్య రంగాల్లోనూ సీ వీడ్కు డిమాండ్ ఉంది. దీంతో ఆగార్, కరోజీనాన్ పదార్థాలు తయారవుతాయి. వీటిని టూత్పేస్ట్, స్కిన్ కేర్ ఉత్పత్తుల ఔషధాల్లో వినియోగిస్తారు. వ్యవసాయంలో బయో ఫెర్టిలైజర్లుగా కూడా దీనిని వాడతారు. సీ వీడ్తో తయారు చేసిన తినుబండారాలు, సాల్ట్, ఆయిల్, స్నాక్స్కు డిమాండ్ ఉంది. రాష్టంలో 36 కేంద్రాల గుర్తింపు ఆంధ్రప్రదేశ్లో 1,027 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. సీ వీడ్ సాగుకు అనుకూలమైన 36 ప్రాంతాలను రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ సాల్ట్ అండ్ మైరెన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఐ) గుర్తించింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలు సీ వీడ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయి. నరసాపురం, మొగల్తూరు, సూర్యలంక, విశాఖపట్నం, శ్రీకాకుళంలోని బుడగట్టుపాలెంలో పైలట్ ప్రాజెక్టుగా సీ వీడ్ సాగు చేపట్టనున్నారు. విశాఖపట్నం, బుడగట్టుపాలెంలో ప్రయోగాత్మక సాగు చేపట్టారు. పీఎంఎంఎస్వై ద్వారా వీడ్ సాగుకు కేంద్రం 60 శాతం సబ్సిడీ అందిస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 60 వేల యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కుటీర పరిశ్రమగా నాచు సాగు ప్రయోగాత్మకంగా విశాఖపట్నంలో మొదటి సాగు రాష్ట్రంలో 60 వేల యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం నేడు జాతీయ సముద్రపు నాచు దినోత్సవంఅవగాహన పెంచాలి సముద్రపు నాచుపై తీరప్రాంత ప్రజలకు అవగాహన పెంచాలి. రాష్ట్రంలో ప్రోసెసింగ్ యూనిట్లు, సీడ్ హేచరీలను ఏర్పాటు చేయాలి. సముద్రపు నాచు పరిశ్రమను వ్యవసాయంగా గుర్తించి బీమా సౌకర్యం కల్పించాలి. సాగు పద్ధతులపై శిక్షణ, సాంకేతిక మార్గదర్శకాలను అందించాలి. – డాక్టర్ పి.రామమోహన్రావు, విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్, కాకినాడతొలి విడతలో 2.2 టన్నుల దిగుబడి విశాఖపట్నం ఆర్కే బీచ్ సమీపంలో తొలిసారిగా సీ వీడ్ సాగును 50 యూనిట్ల ద్వారా ధాన్ ఫౌండేషన్ మహిళలు చేపట్టారు. మొదటి విడతలో 2.20 టన్నుల దిగుబడి వచ్చింది. కిలో రూ.23 ధర పలికింది. ఈ ప్రాజెక్టుకు పెట్టుబడి రూ.4.50 లక్షలు అయింది. మొదటిసారి పెట్టుబడితో అమర్చిన సామగ్రి 8 ఏళ్లపాటు ఉపయోగపడతాయి. రెండో సాగు నుంచి పెట్టుబడి వ్యయం బాగా తగ్గుతుంది. ఇది ప్రధానంగా మహిళలకు కుటీర పరిశ్రమగా మారుతుంది. కేంద్రం సబ్సిడీ ఇచ్చి సీ వీడ్ సాగుకు అవకాశం కల్పిస్తోంది. – పి.లక్ష్మణరావు, మత్స్యశాఖ జేడీ, విశాఖ -
● కదిలిన యంత్రాంగం
ట్రాన్స్ఫార్మర్ పరిసరాలు శుభ్రం తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని పాతూరు 12వ వార్డు కనకదుర్గమ్మ గుడి వద్ద ట్రాన్స్ఫార్మర్ పరిసరాలను మంగళవారం శుభ్రం చేశారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతోపాటు చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా ఉండడంతో మే 20వ తేదీన సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనిపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. మునిసిపల్ సిబ్బంది, విద్యుత్ సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం జేసీబీ సహాయంతో పిచ్చిమొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. కాగా ట్రాన్స్ఫార్మర్ వద్ద రక్షణ కల్పించేలా పెన్సింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. నరసాపురంలో రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి రోడ్డు శుభ్రం చేశారు. చెత్త రోడ్డుపై పోరుకుపోయి పూర్తి అశుభ్రంగా ఉన్న ఆ ప్రాంతంలో స్థానికులు పడుతున్న ఇబ్బందులను సాక్షి వెలుగులోకి తెచ్చింది. నరసాపురంలో కానరాని స్వచ్ఛత శీర్షికన మగళవారం కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన మున్సిపల్ సిబ్బంది చెత్తను తొలగించి, ఆ ప్రాంతంలో ముగ్గు చల్లారు. సమస్య పరిష్కారం కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. – నరసాపురం -
తాళ్లకోడు ఇళ్ల రీ–సర్వేపై జేసీ విచారణ
ఆకివీడు: మండలంలోని కుప్పనపూడి శివారు తాళ్లకోడులోని జగనన్న కాలనీలోని ఇళ్ల రీ–సర్వేపై తుది విచారణను జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం చేపట్టారు. కాలనీలో గత వారం రోజులుగా ఆరు బృందాలు రీ–సర్వే చేశాయి. అనంతరం భీమవరం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్రెడ్డి విచారణ చేపట్టారు. కాలనీలో 3,420 మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కేటాయించారు. వారికి పట్టాలు కూడా ఇచ్చారు. ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.1.80 లక్షలు అందజేశారు. దీంతో 1000 మంది గృహ ప్రవేశాలు చేశారు. మరో 1200 ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. మిగిలిన నిరుపేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు పునాదులు వేసి, తగిన సొమ్ములేక ఆగిపోయారు. మరికొంత మంది పునాదులు వేసేందుకు సొమ్ములేక ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇళ్లు నిర్మించుకోలేదనే కారణంగా వారి ఇళ్ల స్థలాలను ప్రభుత్వం వెనక్కి తీసుకునేందుకు రీ సర్వే ఏర్పాటు చేశారు. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిరుపేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ. 4 లక్షలు తక్షణం విడుదల చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసి పేదల ఇళ్ల నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తిచేస్తున్నారు. -
డిపో సీఐ దురుసు ప్రవర్తనపై నిరసన
ఏలూరు (టూటౌన్): ఏపీఎస్ ఆర్టీసీ ఏలూరు డిపో ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి డి.ఆంజనేయులుపై డిపో సీఐ దురుసు ప్రవర్తనకు నిరసనగా మంగళవారం స్థానిక ఆర్టీసీ గ్యారేజీ ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. యూనియన్ ఏలూరు డిపో గౌరవ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంజనేయులు పట్ల సీఐ అలా ప్రవర్తించడం సరైంది కాదన్నారు. యూనియన్ నాయకులు, కమిటీ సభ్యుల పట్ల ఆర్టీసీ అధికారులు సూపర్వైజర్ చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. వెహికల్ కండిషన్ మెరుగుపరచాలని పదేపదే మేనేజ్మెంట్కు చెప్పినా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని తెలిపారు. డిపోలో కనీస మౌలిక వసతులు లేవని అన్నారు. ఆంజనేయులు మాట్లాడుతూ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతామని, బుధవారం నుంచి నాన్ కోపరేషన్ పాటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ డిపో నాయకులు వీఎస్ నారాయణ, ఎండి రమేష్, పీకేబీ రాజు, పి.శ్రీహరి పాల్గొన్నారు. కూలీలు పస్తులుంటే.. యోగాలో నిమగ్నమా! భీమవరం అర్బన్: గత రెండు నెలలుగా ఉపాధి హామీ కూలీలు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. అధికారులందరూ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాలో నిమగ్నమైపోవడం దారుణమని సీఐటీయూ నాయకులు మండిపడ్డారు. భీమవరం మండలంలోని గూట్లపాడు, గొల్లవానితిప్ప గ్రామాల్లో మంగళవారం సీఐటీయూ సంఘం సభ్యులు పర్యటించి ఉపాధి హామీ కూలీలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకుని ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు ఎం.ఆంజనేయులు, ఇంజేటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీ పనులు చేసిన 15 రోజుల్లోనే వేతనాలు చెల్లించాలని చట్టంలో ఉన్నా రెండు నెలలు గడుస్తున్నా వేతనాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే యోగాసనాల్లో అధికారులు నిమగ్నమైపోవడం బాధాకరమన్నారు. ఉపాధి హామీ రోజు కూలీ రూ.600 చేసి ఏడాదికి 200 పనిదినాలకు పెంచాలని డిమాండ్ చేశారు. కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య భీమడోలు: దుద్దేపూడి పంచాయతీ పరిధిలోని అన్నేవారిగూడెం గ్రామానికి చెందిన అన్నేపు దుర్గాప్రసాద్ (35) కడుపు నొప్పి తాళలేక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యానికి బానినైన దుర్గాప్రసాద్ కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. మంగళవారం ఒక్కసారిగా విపరీతంగా కడుపు నొప్పి రావడంతో తట్టుకోలేక పురుగు మందును సేవించి మృతి చెందాడు. ఆతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేస్తున్నట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు. -
వేతనాల కోసం ఉపాధి కూలీల ధర్నా
పెంటపాడు: గత మూడు నెలలుగా ఉపాధి కూలీలకు వేతనాలు అందకపోవడంతో ఉపాధి కూలీలు నిరసన చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి కళింగ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆకుతీగపాడు, బోడపాడు, ముదునూరు గ్రామాలలో నిరసన తెలిపారు. పనిచేస్తున్న ప్రదేశాలలో పలువురు కూలీలు మాట్లాడుతూ ఏప్రిల్ నెల నుంచి ఇంత వరకు వేతనాలు అందలేదన్నారు. పెరిగిన ధరలతో ఒక పక్క ఇబ్బందులు పడుతున్నామని, మరోవైపు కూలి పనులు చేసినా పస్తులు ఉండాల్సి వస్తోందని వాపోయారు. కూటమి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నారు. -
వైఎస్ఆర్ కడప స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలు
ఏలూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ డాక్టర్ వైఎస్ఆర్ కడప స్పోర్ట్స్ స్కూల్లో 4, 5 తరగతుల్లో ప్రవేశాలు నిర్వహిస్తోందని ఏలూరు జిల్లా డీఎస్డీఓ బి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 4వ తరగతి ప్రవేశానికి ఏప్రిల్ 1, 2015 నుంచి మార్చి 31, 2017 మధ్య జన్మించి ఉండాలన్నారు. అలాగే ఏప్రిల్ 1 2014 నుంచి మార్చి 31 2016 మధ్య జన్మించినవారు 5వ తరగతిలో ప్రవేశించవచ్చని వివరించారు. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకూ దరఖాస్తుల పరిశీలన చేసి శాప్ షార్ట్ లిస్ట్ విడుదల చేస్తుందన్నారు. అనంతరం జూలై 1 నుంచి 3వ తేదీ వరకూ జిల్లాస్థాయి, జూలై 10 నుంచి 11వ తేదీ వరకూ రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. వివరాలకు 98663–17326, 99487 79015 నంబర్లలో సంప్రదించాలన్నారు. మట్టి ట్రాక్టర్ ఢీకొని వృద్ధురాలి మృతి ముసునూరు: మట్టి అక్రమ తోలకాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. మట్టి ట్రాక్టర్ ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండలంలోని గోపవరంలో చోటుచేసుకుంది. గ్రామంలో పగలూ రాత్రి తేడా లేకుండా మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మట్టి ట్రిప్పులు అధికంగా వేయాలనే ఆత్రంతో లైసెన్స్లు లేని, డ్రైవింగ్ కూడా సరిగా రాని వారు కూడా గ్రామంలో మట్టి ట్రాక్టర్లు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మట్టి ట్రాక్టరు వెనుక నుంచి ఢీ కొట్టడంతో గ్రామానికి చెందిన వృద్ధురాలు గడ్డం అంజమ్మ (65) అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు. -
సంక్షేమం, అభివృద్ధికి వెన్నుపోటు
సీ వీడ్.. సో గుడ్ సముద్రపు నాచు (సీ వీడ్) తీరప్రాంత మహిళలకు కుటీర పరిశ్రమగా మారుతోంది. తక్కువ కాలంలోనే అధిక దిగుబడులు సాధించే నాచు పెంపకానికి డిమాండ్ పెరుగుతోంది. 8లో uబుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025ఈ హామీల ఊసే లేదు ● జనవరిలో ఆచంటలో టీడీపీ రా కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఆచంట మండలం అయోధ్యలంక–కోడేరు మధ్య గోదావరిపై వారధి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయోధ్యలంకలో తాగునీటి సమస్య పరిష్కరిస్తామన్నారు. ● ఏప్రిల్ 05: పాలకొల్లు సభలో చంద్రబాబు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్రావణ మాసంలో జిల్లాలో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాలు చేయిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని రోడ్డన్నింటిని బాగుచేస్తామన్నారు. ● ఏప్రిల్ 10: తణుకులోని నరేంద్ర సెంటర్ వద్ద బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తణుకులో హైటెక్ టవర్ నిర్మిస్తామన్నారు. ఇంటి వద్ద నుంచే ఉద్యోగాలు చేసుకునే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని తెస్తామని చెప్పారు. తణుకును పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, వలసలు అరికడతామని వాగ్ధానం చేశారు. ● ఏప్రిల్ 21: నరసాపురం, భీమవరం సభల్లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వశిష్ట గోదావరిపై వంతెన పనులు ప్రారంభిస్తామన్నారు. భీమవరంలో డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరిస్తామన్నారు. వీరవాసరం మండలం, భీమవరం మండలాల్లోని శివారు గ్రామాలకు తాగు, సాగునీటి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ● ఏప్రిల్ 29: తాడేపల్లిగూడెం వారాహి సభలో పవన్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంను మార్కెట్ హబ్గా, ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేస్తామన్నారు. మిలటరీ మాధవరం–తాడేపల్లిగూడెం ఎయిర్పోర్టు భూములను అన్యాక్రాంతం నుంచి కాపాడతామన్నారు. మిలటరీ ఉద్యోగుల కోసం క్యాంటీన్ ఏర్పాటు చేయిస్తామన్నారు. ● మే 10: ఉండిలో చంద్రబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో భూగర్భ జలాలు కలుషితమైనందున విజ్జేశ్వరం నుంచి ప్రొజెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా స్వచ్చమైన తాగునీటిని కుళాయిల ద్వారా ఇంటింటికి ఇస్తామన్నారు. యూనిట్ కరెంట్ రూ.1.50కే ఇచ్చి ఆక్వా రంగాన్ని పైకి తెస్తానన్నారు. అవసరమైన చోట్ల 500 టన్నులు కెపాసిటీ కలిగిన కోల్డ్ స్టోరేజీలు కట్టిస్తామన్నారు. ఏరియేటర్స్పై సబ్సిడీ ఇప్పిస్తానన్నారు. ఆకివీడులో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి లేదా ఫ్లై ఓవర్ నిర్మిస్తామని హామీలు గుప్పించారు. ఏడాది పాలన ముగుస్తున్నా.. ఒక్క హామీ అమలుచేసే దిశగా చర్యలు తీసుకోలేదు. టీడీపీ నేతలకు పండుగ గ్రామాల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధి కోసం పల్లె పండుగ పేరిట రూ.46.48 కోట్లు ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులను కూటమి నేతలే దక్కించుకున్నారు. ప్రజావసరాల మేరకు రోడ్లు నిర్మాణం చేయాల్సి ఉండగా చాలాచోట్ల తమ భూముల విలువ పెంచుకునేలా ఖాళీ స్థలాలు, పొలాలు, చెరువులకు రోడ్లు వేయించుకోగా గత టీడీపీ హయాంలో చేసిన రోడ్లకు కొత్తగా మెరుగులు దిద్ది బిల్లులు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరమ్మతుల్లోనూ మోసం రోడ్లను అద్దంలా చేస్తామన్న హామీని అటకెక్కించిన కూటమి ప్రభుత్వం కనీస మరమ్మతులకు చేతులెత్తేసింది. జిల్లాలో 698 కి.మీ మేర మరమ్మతుల కోసం రూ.42.57 కోట్లు మంజూరు చేసింది. సంక్రాంతి నాటికి గుంతలు లేకుండా చేస్తామని చెప్పగా ఇప్పటికి పూర్తికాని పరిస్థితి. నిర్ణీత ప్రమాణాలు పాటించకుండా చాలాచోట్ల నాసిరకంగా పనులు చేని ప్రజాధనాన్ని కాజేశారు. కొన్నిచోట్ల గుంతల్లో కంకర, చిప్స్ వేసి తారు వేయకుండా వదిలేశారు. వాహనాల తాకిడికి రాళ్లు పైకిలేచి మరమ్మతులు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలాయి. అధికారులు న్యాయం చేయాలి ఓఎన్జీసీ అధికారులు న్యాయం చేయాలని రైతులు ఆందోళన చేశారు. రైతులకు కేవలం ఒక పంటకు మాత్రమే డబ్బులు వేశారని ఆరోపిస్తున్నారు. 8లో uఆడబిడ్డకు అన్యాయం మహిళలకు ప్రతీ నెల రూ: 1500 జిల్లాలో రూ.1500 పొందేందుకు అర్హులు – 5,96,313 ఆడబిడ్డ నిధి పథకం కింద ఏడాదిలో నష్టపోయిన మొత్తం రూ. 1073 కోట్లు తల్లికి నష్టం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్ విద్యార్థులు : 2,49,662 అర్హులైన విద్యార్థులు (70 శాతం) సుమారు : 1,74,763 మంది తల్లికి వందనంగా గత విద్యా సంవత్సరంలో తల్లులు నష్టపోయిన మొత్తం రూ. 262.14 కోట్లు అన్నదాత దుఃఖీభవ జిల్లాలో సాగు భూమి : 2.3 లక్షల ఎకరాలు రైతులు : 1,24,645 అన్నదాత సుఖీభవ అందక గత సీజన్లో రైతులు నష్టపోయిన సాయం రూ. 249.29 కోట్లు నిరుద్యోగులకు అందని భృతి జిల్లాలో కుటుంబాలు : 5.17 లక్షలు రూ.3000 ఆర్ధిక సాయం కోసం ఎదురుచూపు మొత్తం రేషన్కార్డులు : 5,67,651 ఒక్కో కార్డుపై ఏడాదికి మూడు చొప్పున ఇవ్వాల్సిన గ్యాస్ సిలెండర్లు : 17,02,953 గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కటి చొప్పున ఇచ్చిన సిలెండర్లు : 5,67,651 లబ్ధిదారులు కోల్పోయిన సిలెండర్లు : 11,35,302 గ్యాస్ ధర రూ. 827.50. ఆ మేరకు గత ఏడాది నష్టపోయిన మొత్తం రూ.93.94 కోట్లు ఉచిత బస్ తుస్సు జిల్లాలో మొత్తం జనాభా 19,00,228 పురుషులు : 9,48,461 మహిళల జనాభా : 9,51,766 ఎన్నికల హామీ మేరకు మహిళలందరికి ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి. న్యూస్రీల్ ఎన్నికల్లో హామీల వరద పారించిన కూటమి నేతలు ఏడాది పాలనలో ఒక్క హామీని అమలు చేయని వైనం కూటమి దగాపై జూన్ 4ను ‘వెన్నుపోటు దినం’గా ప్రకటించిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ కేంద్రాల్లో నేడు నిరసన కార్యక్రమాలు తొలి ఏడాదే నవరత్నాలు అమల్లోకి తెచ్చిన జగన్ సర్కారు ఐదేళ్లలో పేదలకు రూ.11,333.57 కోట్ల లబ్ధి అంతన్నారు.. ఇంతన్నారు.. అధికారంలోకి రావడమే ఆలస్యం.. సూపర్ సిక్స్ అంటూ ఊరూరా ఊదరగొట్టారు. జూన్ నుంచే అమలు.. ఇవిగో బాండ్లు అంటూ కూటమి నేతలు ఏ కుటుంబానికి ఎంత వస్తుందో కరపత్రాలపై రాసి మరీ ఇంటింటికీ ఇచ్చేశారు. కూటమి పాలన చేపట్టి ఏడాదైనా సూపర్ సిక్స్ జాడలేదు. కూటమి వంచనకు నిరసనగా జూన్ 4ను ‘వెన్నుపోటు దినం’గా వైఎస్సార్సీపీ ప్రకటించింది. ప్రజల పక్షాన నియోజకవర్గ కేంద్రాల్లో నేడు నిరసన తెలుపనుంది. – సాక్షి, భీమవరంవిజయవంతం చేయాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించి వంచనతో పాలన సాగిస్తోంది. ప్రజల పక్షాన బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగనున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలి. – ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వంచనకు ఏడాది కూటమి ప్రభుత్వ వంచన పాలన మొదలై అప్పుడే ఏడాది. ఎన్నో వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఈ ఏడాదిలో ఒక్క హామీని అమలుచేయకుండా నమ్మి ఓట్లేసిన ప్రజలను దగా చేశారు. సంక్షేమాన్ని విస్మరించి కూటమి సాగిస్తున్న అరాచక పాలనకు నిదర్శనమే ‘వెన్నుపోటు దినం’. – ముదునూరి మురళీకృష్ణంరాజు, వైఎస్సార్సీపీ నరసాపురం పార్లమెంట్ అబ్జర్వర్ -
జిల్లా స్థాయి కార్యశాల శిక్షణ ప్రారంభం
ఏలూరు (టూటౌన్): స్థానిక సుబ్బమ్మదేవి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మూడు రోజుల జిల్లా స్థాయి కార్యశాల శిక్షణా కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. జిల్లా కో ఆర్డినేటర్గా డీఈఓ వెంకటలక్ష్మమ్మ వ్యవహరించారు. అకడమిక్ కాలెండర్, టీచర్ హ్యాండ్ బుక్, స్టూడెంట్ అసెస్మ్మెంట్ బుక్, కరిక్యులమ్ ఇంటిగ్రేషన్ అనే అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. అసిస్టెంట్ జిల్లా కోఆర్డినేటర్ అంగులూరి సర్వేశ్వరరావు మంగళవారం కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఎస్సీఈఆర్టీ రాజబాబు హాజరయ్యారు. శిక్షణకు 162 మంది డీఆర్పీలు, 12 మంది ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. వీరు క్షేత్ర స్థాయిలో ఉన్న 3,250 స్కూల్ అసిస్టెంట్స్, ప్రధానోపాధ్యాయులకు ఈ నెల 8, 9, 10 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు సర్వేశ్వరరావు తెలిపారు. 6వ తరగతి విద్యార్ధులకు సంసిద్దతా కార్యక్రమాలు, 9వ తరగతి విద్యార్థులకు జనవరిలో పరీక్షలు పూర్తిచేసి 10వ తరగతికి 40 రోజులు బ్రిడ్జి కోర్సు ముఖ్యాంశాలని రాజబాబు తెలిపారు. 1, 2 తరగతులకు, 9, 10 తరగతులకు ప్రత్యేక పాఠ్యపుస్తకాలుగా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయ రామరాజు, డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి నేతృత్వంలో రూపొందాయని వివరించారు. కార్యక్రమంలో డైట్ లెక్చరర్స్ పాల్గొన్నారు. -
నూతన వంగడాల వైపు రైతులు మొగ్గు చూపాలి
ఉండి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ వినయలక్ష్మి భీమవరం అర్బన్: వ్యవసాయంలో సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ నూతన వంగడాల వైపు రైతులు మొగ్గు చూపాలని ఉండి, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ పి. వినయలక్ష్మి అన్నారు. భీమవరం మండలంలోని రాయలం గ్రామంలో మంగళవారం వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు నూతన వంగడాలు, వాటి దిగుబడులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వినయలక్ష్మి మాట్లాడుతూ 2048 వికసిత భారత్లో వివిధ రంగాల రైతులందరూ భాగస్వాములు కావాలన్నారు. వ్యవసాయంలో నూతన వంగడమైన ఎమ్టీయూ 1224 వంగడం గురించి వివరించి దాని బీజం, దిగుబడి గురించి చెప్పారు. ప్రస్తుతం ఖరీఫ్ సాగు సమీపిస్తుందని రైతులు భూసారం పెంచుకునేందుకు పచ్చిరొట్ట, పశువులు, కోళ్ల ఎరువులు చేలల్లో వేసి దున్నాలన్నారు. అంతేకాకండా సాగులో విచక్షణా రహితంగా రసాయన మందులు, ఎరువులు వాడి భూసారాన్ని పాడుచేయవద్దన్నారు. భావి తరాల జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు అందించాలంటే రైతులు నూతన వంగడాలవైపు మొగ్గు చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి సీటీఆర్ఐ టుబాకో, ప్రిన్సిపాల్ శాస్త్రవేత్త డాక్టర్ వై. సుబ్బయ్య, శాస్త్రవేత్త పి. సహదేవరెడ్డి , ఏఈఓ దేవి స్వరూప, రైతు కోళ్ల సీతారామ్, రైతులు పాల్గొన్నారు. -
బీరు సీసాతో వ్యక్తిపై దాడి
తణుకు అర్బన్: పాత కక్షల నేపథ్యంలో ఒక వ్యక్తిని బీరు సీసాతో దాడి చేసిన ఘటన మంగళవారం రాత్రి తణుకు మండలం దువ్వ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొడ్డు కృష్ణ, ముద్దాపురం గ్రామానికి చెందిన గండికోట జాన్ యేసు మధ్య పాత కక్షలున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి దువ్వ దానమ్మ తల్లి ఆర్చి సమీపంలో ఉన్న కృష్ణపై యేసు బీరు సీసాతో దాడి చేసి విచక్షణారహితంగా గాయపరిచాడు. తీవ్రగాయాలపాలైన కృష్ణను స్థానికులు సమాచారంతో 108 వాహనం ద్వారా తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గతంలోనూ ఇలాగే కత్తితో దాడిచేసిన ఘటనలో యేసు జైలులో శిక్ష అనుభవించి ఇటీవలే బెయిల్పై విడుదలై వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. తణుకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నీటి కుంటలో పడి గొర్రెల కాపరి మృతి చాట్రాయి: నీటి కుంటలో పడి గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన చాట్రాయిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సర్నాల మారేశ్వరావు (40) మంగళవారం తన గొర్రెలను మేతకు తోలుకెళ్లాడు. సమీపంలో ఉన్న మందపాటి బసవారెడ్డి తోటలోని నీటి కుంటలో మేక పిల్ల పడిపోవడంతో మారేశ్వరరావు దానిని రక్షించబోయి మునిగి మృతిచెందాడు. అతడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. -
ఓఎన్జీసీ అధికారులు న్యాయం చేయాలి
ఇరగవరం: ఓఎన్జీసీ అధికారులు తమకు న్యాయం చేయాలని రైతులు మంగళవారం ఆందోళన చేశారు. ఇరగవరం, సరిహద్దు ప్రాంతం అర్జునుడుపాలెం గ్రామాలకు చెందిన 21 మంది రైతుల వద్ద నుంచి సుమారు 8 ఎకరాలు లీజు ప్రాతిపదికన 2023వ సంవత్సరంలో పంటకు ఎకరాకు రూ.82,200, చెట్లకు రూ.6,500 చొప్పున నగదు చెల్లించే విధంగా తీసుకున్నారు. అనంతరం ఓఎన్జీసీ డ్రిల్ పనులు ప్రారంభించారు. అయితే అక్కడ ఆయిల్ పడలేదు. దీంతో రైతులకు కేవలం ఒక పంటకు మాత్రమే డబ్బులు వేశారు. తరువాత రైతులకు చెప్పకుండా ఓఎన్జీసీ అధికారులు మొత్తం సామాగ్రిని తరలించుకుపోతున్నారు. దీనిపై ఓఎన్జీసీ అధికారులను ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పకపోవడంతో మంగళవారం ఓఎన్జీసీ డ్రిల్ దగ్గర నుంచి తరలిస్తున్న వాహనాలను రైతులు అడ్డుకుని ధర్నా చేశారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ రాజమండ్రి తహసీల్దార్ జాలి జనార్ధన్, సివిల్ ఇంజనీరు శేషు వచ్చి రైతులతో మాట్లాడారు. వచ్చే జూలై నెలలో ఒక పంట డబ్బులు, తరువాత మరో పంట డబ్బులు అకౌంట్ల్లో వేయడం జరుగుతుందని, లీజు పూర్తయ్యే వరకు రైతులకు లీజు డబ్బులు చెల్లిస్తామని రాతపూర్వకంగా రాసి ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
చేతివృత్తులను ఆదరించాలి
ఏలూరు (టూటౌన్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతివృత్తులకు రక్షణ కల్పించి చేతివృత్తిదారులను ఆదుకోవాలని చేతి వృత్తిదారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఏలూరు స్ఫూర్తి భవనంలో మంగళవారం చేతి వృత్తిదారుల సమాఖ్య ఏలూరు జిల్లా సమావేశం జిల్లా కన్వీనర్ కడుపు కన్నయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రామాంజనేయులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకం సాధారణ చేతి వృత్తి దారులను ఏ మాత్రం ఆదుకోలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ వాగ్దానాల్లో ఇప్పటివరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించలేదన్నారు. ప్రభుత్వాలు ఆదుకోకపోవడంతో చేతి వృత్తిదారులు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల ఉత్పత్తుల నుంచి పోటీ తట్టుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతి వృత్తిదారులకు సాంకేతిక యంత్ర పరికరాలు, సబ్సిడీ రుణ పరపతి, భూమి, మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ గొర్రెల, మేకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొట్టేలు పెంటయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే చేనేత, తదితర వృత్తి సంఘాల నాయకులు పాల్గొన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు -
రాష్ట్రంలో మద్యం, గంజాయి పాలన
ఆకివీడు: రాష్ట్రంలో గంజాయి, మద్యం ఏరులైపారడంతో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. స్థానికంగా చిన్నారిపై అఘాయిత్యాన్ని ఖండిస్తూ మంగళవారం నేతలు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, మండల, పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షులు నంద్యాల సీతారామయ్య, అంబటి రమేష్, మెప్మా మాజీ అధ్యక్షురాలు మోరా జ్యోతిరెడ్డి, కోఆప్షన్ సభ్యురాలు గుండుగొలను సావిత్రి, ధనరాజు మాట్లాడుతూ ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార సంఘటన అమానవీయమన్నారు. టీడీపీకి చెందిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించాలంటే పట్టణ, గ్రామాలకు దూరంగా మద్యం షాపులు ఉండాలన్నారు. బెల్టు షాపుల బెల్టు ఎప్పుడు తీస్తారని ప్రశ్నించారు. గంజాయి అమ్మకాలపై పోలీస్ యంత్రాంగం తీవ్ర నిర్లిప్తతతో ఉందన్నారు. పట్టణంలోని విచ్చలవిడిగా గంజాయి, మద్యం దొరుకుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో నగర పంచాయతీ విప్ పడాల శ్రీనివాసరెడ్డి, గేదెల అప్పారావు, దొడ్డి జగదీష్, తిరుమానేని జగన్, కిషోర్రెడ్డి, మోరా శ్రీనివాసరెడ్డి, కుంకట్ల దానయ్య పాల్గొన్నారు. ఆకివీడులో చిన్నారిపై అఘాయిత్యం దారుణం వైఎస్సార్సీపీ నేతల ఆందోళన -
హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ఏలూరు (టూటౌన్): రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అమలు చేయాల్సిన అధికారులు, ప్రజా ప్రతినిధులు వాటిని కాలరాస్తున్నారని, రక్షించాల్సిన వారే వాటిని భక్షించే పరిస్థితి నెలకొందని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్ కుమార్, ఏఐఆర్డీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.మణిసింగ్ అన్నారు. స్థానిక లేడీస్ క్లబ్లో ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అంశంపై సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు మానవ హక్కులను కాలరాస్తున్నాయన్నారు. ముఖ్యంగా దళితులపై అరాచకాలకు పాల్పడుతూ వారి పట్ల వివక్షతను కొనసాగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో రెవెన్యూ,పోలీస్ వ్యవస్థలు వైఫల్యం చెందాయని.. పిఠాపురం నియోజకవర్గం, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో దళితులపై జరిగిన దాడులే నిదర్శనమన్నారు. సమావేశంలో అటవీ శాఖ మాజీ డైరెక్టర్ పల్లెం ప్రసాద్, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి చాగంటి సంజీవ్ కుమార్, డాక్టర్ నిట్టా ప్రసాద్, దాసరి రమేష్, దోమతోటి అబ్రహాం, సింగవరపు జ్యోతి, విజయ కుమారి, మాముడూరు మహాంకాళి, నూకపెయ్యి కార్తీక్, లాయర్ రాజశేఖర్, కనికెళ్ళి రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
జేఈఈ అడ్వాన్స్డ్లో శశి విద్యార్థుల ప్రతిభ
తాడేపల్లిగూడెం (టీఓసీ) : జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో శశి తాడేపల్లిగూడెం విద్యార్థులు ఆలిండియా ర్యాంక్లు సాధించినట్లు విద్యా సంస్థల ఛైర్మన్ బూరుగుపల్లి వేణు గోపాలకృష్ణ తెలిపారు. ఎస్కే ఆజాం ఖాన్ ఆలిండియా 16వ ర్యాంక్ సాధించినట్లు వెల్లడించారు. ఎ.ప్రసాద్ 4,111, పి.శ్రీలేఖ 4,915, పి.చరణ్ 6,058, కె.దేవిక 6,637, వి.హరిచరణ్ 12,259 ర్యాంక్లు వచ్చాయని చెప్పారు. విజయం సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను, అధ్యాపకులను చైర్మన్తో పాటు విద్యాసంస్థల వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ, అకడమిక్ డైరక్టర్ క్రాంతి సుధలు అభినందించారు. విద్యా శాఖ అధికారుల బాధ్యతల స్వీకరణ ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో నలుగురు అధికారులు సోమవారం విధుల్లో చేరారు. జిల్లా విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్–2గా ఎన్. వెంకటప్పయ్య, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్గా ఏ.జయలక్ష్మి, పరీక్షల విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా వి.సుధాకర్, డీఈఓ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్గా కే.పావని బాధ్యతలు స్వీకరించారు. -
మెట్ట రైతులను ఆదుకోవాలి
జంగారెడ్డిగూడెం : గత 6 నెలలుగా సరైన గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు అన్నారు. సోమవారం జంగారెడ్డిగూడెంలో ఆయన మాట్లాడుతూ పామాయిల్, పొగాకు, కోకో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. పామాయిల్ మార్కెట్లో రూ.20,000 ధర పలుకుతుంటే కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం 26 శాతం నుంచి ఒక్కసారిగా 10 శాతం తగ్గించడం వల్ల ధర తగ్గే పరిస్థితులు కనబడుతున్నాయి. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని, పామాయిల్ ధరలు రూ.15 వేలకు పడిపోయే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. పొగాకు రైతులకు సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారని, వెంటనే పొగాకు రైతులకు గిట్టుబాటు ధర అందించాలని కోరారు. కోకో అంతర్జాతీయ మార్కెట్లో రూ.800 పైగా ఉంటే రాష్ట్రంలో కేవలం కేజీ రూ.400కు మాత్రమే కొంటున్నారని, రైతులను పూర్తిగా నష్టాల పాలు చేస్తున్నారని విమర్శించారు. వెంటనే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని.. అవసరమైతే ఈ ప్రాంతం తీసుకొచ్చి రైతుల దుస్థితిని వివరిస్తామని చెప్పారు. రైతులు అధైర్య పడవద్దని గిట్టుబాటు ధర కోసం కలిసికట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు, మళ్లిడి బాబి, కొయ్యే లీలాధర్ రెడ్డి, ఇర్ల శ్రీనివాస్ రెడ్డి, అట్లూరి రామరాజు, సీతంపేట మాజీ సర్పంచ్ మిరియాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు -
పీఎంఏజీవైలో రూ.1.20 కోట్ల మంజూరు
భీమవరం(ప్రకాశంచౌక్) : ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకంలో జిల్లాలో గుర్తించిన ఆరు గ్రామాలకు రూ.1.20 కోట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పీఎంఏజీవై పథకం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2020–21 సంవత్సరంలో పీఎంఏజీవై పథకం అమలుకు 50 శాతం పైగా ఎస్సీ జనాభా ఉన్న 10 గ్రామాలను, 2022–23 సంవత్సరంలో 40 శాతం పైగా ఎస్సీ జనాభా కలిగిన 11 గ్రామాలను ఎంపిక చేసి ప్రతిపాదనలు సమర్పించామన్నారు. వీటిలో 6 గ్రామాలకు ఒక్కో గ్రామానికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.1.20 కోట్లు మంజూరు చేశారన్నారు. మరో నాలుగు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించినట్లు చెప్పారు. ఇంకా గ్రామ అభివద్ధి ప్రణాళిక సమర్పించాల్సిన 11 గ్రామాలకు కూడా వీడీపీలు సమర్పించాలన్నారు. ఈ నిధులను తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, పౌష్టికాహారం, సామాజిక భద్రత, గ్రామీణ రహదారులు, గృహ నిర్మాణాలు, విద్యుత్ తదితర అవసరాలకు వినియోగించాలన్నారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రామాంజనేయరాజు, ఇన్చార్జి జిల్లా పంచాయతీ అధికారి వై.దోసిరెడ్డి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారి బి.సుజాత రాణి, డీఈవో ఇ.నారాయణ, డీఎం అండ్ హెచ్ జి.గీతాబాయి తదితరులు పాల్గొన్నారు. -
ఆడబిడ్డలకు ద్రోహం
మెట్ట రైతులను ఆదుకోవాలి గత ఆరు నెలలుగా సరైన గిట్టుబాటు ధర లేక మెట్ట రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గురునాథరావు అన్నారు. IIలో uమంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి, భీమవరం: సార్వత్రిక ఎన్నికల నాటికి జిల్లాలో మహిళా ఓటర్లు 7,51,313 మంది ఉన్నారు. వృద్ధాప్య పింఛన్ అందుకుంటున్న లబ్ధిదారులు 1,26,061 మంది ఉండగా వారిలో మహిళలు 60 శాతం ఉంటారని అంచనా. ఈ మేరకు ఓఏపీ లబ్ధిదారులు 75,636 మంది ఉండగా, వితంతు 49,564, ఒంటరి మహిళ 6,926, అభయహస్తం 8,908, దివ్యాంగులు సుమారు 14,000 మంది కలిపి మహిళా లబ్ధిదారులు 1,55,034 మంది ఉన్నారు. వీరిని మినహాయించిన కూటమి మేని ఫెస్టో మేరకు జిల్లాలో ఆడబిడ్డ నిధి పథకానికి 5,96,279 మంది అర్హులు ఉన్నారని అంచనా. ఈ మేరకు నెలకు రూ. 89.44 కోట్లు చొప్పున ఏడాది కాలానికి గాను రూ.1,073 కోట్లు మేర ప్రభుత్వ సాయాన్ని ఆడబిడ్డలు నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పటికీ పథకం మాటెత్తకపోగా ఎప్పటి నుంచి అమలుచేసేది సర్కారు స్పష్టతనీయడం లేదు. గత ప్రభుత్వంలో మహిళలకు పట్టం కులమతవర్గాలు, రాజకీయాలకు అతీతంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆడపడుచులకు అండగా నిలిచింది. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తదితర పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పించింది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా జిల్లాలోని 2,70,380 మంది డ్వాక్రా మహిళలకు రూ.1,107 కోట్ల రుణాలను మాఫీ చేశారు. బీసీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద ఏడాదికి రూ. 18,750 చొప్పున జిల్లాలో సగటున 61,750 మందికి నాలుగేళ్లలో రూ.463.41 కోట్ల సాయాన్ని అందించారు. కాపునేస్తం పథకం కింద కాపు, బలిజ, ఒంటరి, తెలగ సామాజిక వర్గానికి చెందిన సుమారు 28,004 మంది మహిళలకు నాలుగేళ్లలో రూ.168.02 కోట్లు అందజేశారు. ఈబీసీ నేస్తం పథకం కింద రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య తదితర ఓసీ సామాజికవర్గాల్లోని 12,827 మంది మహిళలకు నాలుగేళ్లలో రూ. 57.71 కోట్లు సాయం అందించారు. న్యూస్రీల్కష్టం విలువ తెలిసిన వ్యక్తిని.. సంపద సృష్టి తెలిసిన పార్టీ మా పార్టీ.. ఆడబిడ్డల కోసం మహాశక్తి కార్యక్రమం తీసుకువస్తున్నాం.. ప్రతి మహిళను మహాశక్తిగా తయారుచేయాలన్నదే నా సంకల్పం.. అందుకే ఆడబిడ్డ నిధి పథకాన్ని తెస్తున్నాం.. ఇంటిలో ఇద్దరుంటే.. ఇద్దరి అకౌంట్లకు కూడా ఇస్తాం.. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వారికి నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని ఈ రోజు మీ అన్న మీకు వరం ఇస్తున్నాడు. – ఇవి సార్వత్రిక ఎన్నికల సభల్లో చంద్రబాబు చెప్పిన మాటలు ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు, పవన్కల్యాణ్, కూటమి నేతలు ఎక్కడకు వెళ్లినా ఆడబిడ్డ నిధి అంటూ ఊదరగొట్టారు. తమ ప్రభుత్వం రావడమే ఆలస్యం డబ్బులు ఖాతాల్లోకి వస్తాయంటూ హోరెత్తించారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుండగా ఆడబిడ్డ నిధి అమలు ఊసెత్తడం లేదు. మరోపక్క ఈ పథకం సాయం కోసం పేదింటి మహిళలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మోసం ఇంతింతై! ప్రభుత్వం రాగానే ఆడబిడ్డ నిధి పథకం అమలుకు కూటమి హామీ 19 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ.1,500 పథకం అమలు ఊసెత్తని ప్రభుత్వం జిల్లాలో అర్హులు సుమారు 5.96 లక్షల మంది ఏడాది కాలానికి రూ.1,073 కోట్లు నష్టపోయిన జిల్లాలో మహిళలు ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తంతో మహిళలకు అండగా జగన్ సర్కారు హామీలు నిలబెట్టుకోవాలి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలులోకి తేవాలి. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున బ్యాంకు ఖాతాకు జమచేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ పథకం అమలుకోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నాం. ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు. – బందెల ప్రమీల, గృహిణి, చెరుకువాడ సూపర్ దగా కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ఆడబిడ్డ నిధి పథకం అమలుపై క్లారిటీ లేదు. సూపర్ సిక్స్ అంటూ వచ్చి ప్రజల్ని సూపర్గా దగా చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పేదలందరినీ మాజీ సీఎం జగన్ ఆదుకున్నారు. కూటమి ప్రభుత్వం వంచన తప్ప చేసిందేమీ లేదు. – కోడే విజయలక్ష్మి, వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు, భీమవరం -
నాణ్యమైన పరిష్కారం చూపాలి
భీమవరం(ప్రకాశంచౌక్): ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జేసీ టి.రాహుల్కుమార్ రెడ్డి, డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీల పరిష్కారానికి అధికారులు శ్రద్ధ చూపాలన్నారు. మొత్తం 137 అర్జీలు స్వీకరించారు. అర్జీల్లో కొన్ని.. ● ఆకివీడు మండలం కుప్పనపూడికి చెందిన ఎర్రగోగు రామాంజనేయులు తన భూమిని సర్వే చేయించి హద్దులు చూపాలని కోరారు. ● గణపవరం మండలం కొత్తపల్లికి చెందిన ఆక్వా రైతులు కలవరామ సుబ్బారావు, బొడ్డు అప్పారావు, బి.మధు, తదితరులు గ్రామంలో చేపల చెరువులకు వెళ్లే మార్గం ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేశారు. ● అత్తిలి మండలం కంచుమర్రుకి చెందిన ఎం.జయప్రసాద్ గ్రామంలో పంట బోదె పూడుకుపోయిందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ● తాడేపల్లిగూడెంలోని 35 వార్డు చెందిన బండారు పార్వతి తనకు ఒంటరి మహిళ పింఛన్ ఇప్పించాలని అర్జీ అందించారు. బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి పశ్చిమగోదావరిని బాల కార్మికరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. సోమ వారం కలెక్టరేట్లో జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీతో సమావేశమై బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈనెల 30 వరకు జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నామన్నారు. జూన్ 5న ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ సందర్భంగా చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్లో అధికారు లకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ నాగరాణి -
చట్టపరిధిలో పరిష్కారం
భీమవరం: ప్రజాసమస్యలపై త్వరితగతిన స్పందించి నిర్ణీత సమయంలో చట్టపరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులు ఆదేశించారు. సోమవారం భీమవరం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరి ష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి 17 అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులు ఆదేశించారు. పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా ఉండాలన్నారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐ వి.పుల్లారావు, డీసీఆర్బీ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. భూములిచ్చిన రైతులకు పరిహారం భీమవరం: ఆకివీడు–దిగమర్రు ఎన్హెచ్–165కు సంబంధించి భూములిచ్చిన ఆకివీడు దుంపగడప, అజ్జమూరు తదితర గ్రామాల రైతులకు రూ.7.40 కోట్ల పరిహారాన్ని చెల్లిస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. సోమ వారం కలెక్టరేట్లో కలెక్టర్ సీహెచ్ నాగరాణితో కలిసి విలేకరులతో మాట్లాడారు. అలాగే లక్ష్మణేశ్వరం, సీతారాంపురం, మొగల్తూరు రైతులకు సుమారు రూ.6 కోట్లు చెల్లించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 40 ఆర్యూబీ, ఆర్వోబీలనిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. ఆర్డీవో కె.ప్రవీణ్కుమార్రెడ్డి, ఎన్హెచ్ ఈఈ సంజీవరాయుడు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాల కోసం ధర్నా భీమవరం: హౌస్ ఫర్ ఆల్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓను తక్షణమే అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారామ్ప్రసాద్ డిమాండ్ చేశారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఎన్నికల్లో కూటమి ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఇళ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో భీమవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలిస్తామన్న కూటమి హామీని అమలు చేయా లన్నారు. అనంతరం వినతిపత్రం, అర్జీలను తహసీల్దార్ ఆర్.రాంబాబుకు అందజేశారు. తాడేపల్లిగూడెంలో.. పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని, జీఓ 23ను తక్షణమే అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. సీపీఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద హౌస్ ఫర్ ఆల్ అంటూ ధర్నా నిర్వహించి, అనంతరం తహసీల్దార్ ఎం.సునీల్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఆయిల్పామ్ రైతుల ఆక్రోశం ద్వారకాతిరుమల: కేంద్ర ప్రభుత్వం పామాయిల్ దిగుమతి సుంకాన్ని తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని ఎం.నాగులపల్లిలో ఆయిల్పామ్ గెలల కాటా వద్ద ఆయిల్పామ్ రైతులు సో మవారం ధర్నా నిర్వహించారు. ఆయిల్పామ్ కు గిట్టుబాటు ధర కల్పించాలని, ఫ్యాక్టరీ యాజమాన్యాలు గెలల ఏరివేతను ఆపాలంటూ నినాదాలు చేశారు. సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచన చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, మండల అధ్యక్షుడు బోయపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతుల వినూత్న నిరసన భీమడోలు: కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించాలని, భూ యాజమాని సంతకంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం భీమడోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద కౌలు రైతులు ధర్నా చేశారు. మండుటెండలో మోకాళ్లపై నిలిచి నిరసన తెలిపారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీని వాస్, జిల్లా కన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హామీలను అమలు చేయాలన్నారు. అనంతరం ఎంపీడీఓ సీహెచ్ పద్మావతిదేవి, ఏఓ ఎస్పీవీ ఉషారాణికి వినతిపత్రం అందించారు. -
బాబు మోసం ప్రజలకు అర్థమవుతోంది
తాడేపల్లిగూడెం అర్బన్: చంద్రబాబు ఎన్నికల సందర్భంగా చెప్పిన మోసపు మాటలు, అబద్ధపు హామీలు ప్రజలకు క్రమేపీ అవగతమవుతున్నాయని, ఏడాది పాలనలో ఒక్క హామీని కూడా అమలు చేయని తీరును గమనించి మరోసారి బాబు మోసపు మాటలకు బలయ్యామని భావిస్తున్నారని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. సోమవారం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 4న నిర్వహించనున్న బాబు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆర్థిక లబ్ధిని పొందిందన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. తల్లికి వందనం, నిరుద్యోగభృతి, సీ్త్రశక్తి పథకాలు, ఉచిత బస్సు ప్రయాణం హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఢిల్లీ నుంచి అప్పులు తె చ్చేందుకు అధికారం చేపట్టినట్టు ఉందన్నారు. తీసుకువచ్చిన అప్పులు ఏమి చేశారో తెలియడం లేదన్నారు. ఉద్యోగులకు ఈనెల జీతాలు ఇచ్చేందుకు మరో రూ.7 వేల కోట్లు అప్పు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ రోజుకో ధోరిణితో డైలాగులు చెప్పడమే కాని ఆయన వల్ల ప్రజలకు ఉపయోగం ఏమీ లేదన్నారు. ప్రజలు విసిగిపోయారు నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదు నూరి మురళీకృష్ణంరాజు, నియోజకవర్గ పరిశీలకు డు పప్పుల రామారావు మాట్లాడుతూ చంద్రబాబు ఏడాది పాలనకు ప్రజలు విసిగిపోయారన్నారు. హామీలను గాలికి వదిలేసిన చంద్రబాబు చేసిన అ రాచకాలు, అన్యాయాలపై ఈనెల 4న బాబు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని చెప్పారు. అనంతరం వెన్నుపోటు దినం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు పెండ్ర వీరన్న, నాయకులు కర్రి భాస్కరరావు, కొలుకులూరి ధర్మరాజు, జడ్డు హరిబాబు, ముప్పిడి సంపత్కుమార్, ఎంపీపీ దాసరి హైమావతి, బోణం విజయనిర్మల, పత్సమట్ల సావిత్రి, కై కాల శ్రీనివాస్, తగరం పూడి మరళీ, సిర్రాపు శాంతకుమార్, సగరం ప్రసాద్, అరామిల్లి రవి, కొవ్వూరి విజయభాస్కరరెడ్డి, తాడేపల్లిగూడెం పట్టణ, పెంటపాడు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ 4న వెన్నుపోటు దినం నిరసన జయప్రదానికి పిలుపు -
రేషన్ పాట్లు.. మళ్లీ మొదలు
ఏలూరు (టూటౌన్)/భీమవరం : ఇంటింటికీ రేషన్ సరుకులు పోయి రేషన్ దుకాణాల ద్వారా అందించే వ్యవస్థ రావడంతో ప్రజలకు తిరిగి కష్టాలు ప్రారంభమయ్యా యి. పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం తొలిరోజు చాలా చోట్ల ఈ–పోస్ మెషీన్లు పనిచేయకపోవడంతో కార్డుదారులు పడిగాపులు కాశారు. కొందరు తాము ఏ షాపులో రేషన్ తీసుకోవాలో తెలియక గందరగోళం నెలకొంది. పలుచోట్ల షాపుల వద్ద క్యూలైన్లు కనిపించాయి. భీమవరం మండలం దెయ్యాలతిప్పలో ఒకరిద్దరికి సరుకులు ఇచ్చి రేషన్ షాపును మూసేశారు. యలమంచిలి మండలం మేడపాడు, నరసాపురం మండలం కొప్పర్రులో ఈ–పోస్ యంత్రాలు పనిచేయక పోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు. తాడేపల్లిగూడెం రూరల్, ఆకివీడు తదితర ప్రాంతాల్లో రేషన్ సరుకులను దూర ప్రాంతాల నుంచి వచ్చి వాహనాలపై తీసుకువెళ్లడం కనిపించింది. జిల్లాలో 1,060 రేషన్ షాపుల ద్వారా 5.67 లక్షల కార్డుదారులకు నిత్యావసరాలు అందించాల్సి ఉండగా తొలిరోజు పంపిణీ కార్యక్రమం అభాసుపాలయ్యింది. -
వంచనపై ఉద్యమిద్దాం
సాక్షి, భీమవరం: కూటమి వంచన పాలనకు నిరసనగా ఈనెల 4న వైఎస్సార్సీపీ నిర్వహించతలపెట్టిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణు లు, ప్రజలు విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అధ్యక్షతన ఆదివారం పెదఅమిరంలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. నరసాపురం పార్లమెంట్ అబ్జర్వర్ ముదునూరి మురళీకృష్ణంరాజు, ఏపీ స్టేట్ బీసీ సెల్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ నవుడు వెంకటరమణ, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, పాలకొల్లు ఇన్చార్జి గుడాల గోపి తదితరులు హాజరయ్యారు. వెన్నపోటు దినం కార్యక్రమం విజయవంతానికి సమావేశంలో చర్చించారు. కూటమి వంచనపై ప్రజల గొంతుకగా వారి పక్షాన ఉద్యమించాలని నిర్ణయించారు.ప్రజలను నట్టేట ముంచారుఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నమ్మి ఓట్లేసిన ప్రజలను చంద్రబాబు నట్టేట ముంచారన్నారు. ఏడాది పాలనలో ప్రజలకిచ్చిన వాగ్దానాలను గాలికొదిలేసి సీఎం చంద్రబాబు చేస్తున్న మోసాలు, అరాచకాలు, అన్యాయాలకు నిరసనగా ఈనెల 4న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటు దినం నిర్వహించేందుకు అధిష్టానం నిర్ణయించిందన్నారు. ఆరోజు ఉదయం 10 గంటలకు నియోజకవర్గాల్లోని వైఎస్సార్సీపీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలు భారీ ఎత్తున నియోజకవర్గ కేంద్రాలకు చేరుకుని శాంతియుత ర్యాలీగా తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు చేరుకుని వినతిపత్రాలు అందజేయాలని ప్రసాదరాజు కోరారు.సంక్షేమాన్ని గాలికొదిలేసి..పార్లమెంట్ పరిశీలకుడు మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని గాలికొదిలేసి కేసులు, కక్ష సాధింపులు, డైవర్షన్ పాలిటిక్స్తో ఏడాది కాలం గడిపేశారని మండిపడ్డారు. మాజీ మంత్రి కారుమూరి, ఎమ్మెల్సీ కవురు, మహిళా నేత ఉమాబాల, గోపి తదితరులు మాట్లాడుతూ వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు మరోపేరని, ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి అదే ఆయన మార్క్ అ ని ఎద్దేవా చేశారు. అనంతరం ‘వెన్నుపోటు దినం’ పోస్టర్లను నేతలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కో–ఆర్డినేటర్ బందన పూర్ణచంద్రరావు, పార్టీ నేతలు గుణ్ణం నాగబాబు, ఎడ్ల తాతాజీ, కోడే విజయలక్ష్మి, పాల రాంబాబు, పప్పుల రామారావు, కల్వపూడి ప్రసాద్రాజు, ము ప్పిడి సంపత్ రావు, చినమిల్లి వెంకటరాయుడు, పే రిచర్ల విజయ నరసింహారాజు, గాదిరాజు రా మరాజు తదితరులు హాజరయ్యారు. -
శివారు గ్రామాల సంగతి ఏంటి?
దెందులూరు: జూన్ 1 నుంచి అమలు చేస్తున్న రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల పంపిణీ అనేక మంది లబ్ధిదారులను ఇక్కట్లకు గురిచేస్తోంది. 90 శాతం శివారు గ్రామాల్లో రేషన్ షాపులు లేవు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గడపగడపకు రేషన్ సరుకుల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేశారు. రేషన్ షాపులు లేని శివారు గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో ఇంటి ముంగిట రేషన్ సరుకులు అందాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా ముద్ర కనపడకూడదన్న శివారు గ్రామాల్లో రేషన్ షాపు లేకపోవడంతో రేషన్ షాపులు ఉన్న గ్రామాలకు వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాను పోను రెండు కిలోమీటర్లు దూరంతో పాటు ఒక పూట కూలి పని మానుకొని షాపుకు వెళ్లి రేషన్ తెచ్చుకోవాలి. శివారు గ్రామాల్లో, అటవీ ప్రాంతాల్లో రేషన్ షాపులు లేని చోట ఎవరు తెచ్చి ఇస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .రేషన్ షాపులు లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా కక్షపూరితంగా రద్దు చేసినట్టు ఉందని ప్రశ్నిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో బీసీ ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గ ప్రజలే అధికంగా జీవిస్తున్నారని వారి హక్కులు పరిరక్షించకుండా పథకాన్ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు రేషన్ డీలర్ల సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.60 ఏళ్లు పైబడిన వారందరికీ ఇంటికి వెళ్లి రేషన్ ఎప్పుడు ఇస్తారు.. ఎలా చెల్లిస్తారు అనే విషయంలో లిఖితపూర్వక హామీ ఆదేశాలు లేవు. తమకు స్పష్టమైన ఆదేశాలు లేకపోతే యూనియన్ పరంగా నిర్ణయం తీసుకుంటామని డీలర్ల యూనియన్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరికీ రేషన్ సరుకులు అందకపోయినా, ఏర్పాట్లు చేయకపోయినా దళిత గిరిజన మైనారిటీ బీసీ సంఘాలు ఏకమై భవిష్యత్ ప్రణాళికను ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నారు.తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన :ఏలూరు జిల్లాలో శివారు, అటవీ ప్రాంతాల్లో షాపులు లేకుండా సరుకులు ఎలా ప్రజలకు అందిస్తారని, శివారు గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానికంగా రేషన్ షాపులు తక్షణమే ఏర్పాటు చేయాలి అలా జరగని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఆదివారం దెందులూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద రాష్ట్ర మాలసేన నాయకులు గంటా పండు నిరసన వ్యక్తం చేశారు. -
మొగల్తూరు మామి‘డీలా’
సాక్షి, భీమవరం: చూడచక్కని రంగు.. మధురమైన రుచితో మనసు దోచే పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మామిడి ప్రతికూల వాతావరణం, పండుఈగ దాడితో ధర లేక వెలవెలబోతోంది. స్థానిక అమ్మకాలు, దేశ విదేశాలకు ఎగుమతులతో ఏటా రూ.32 కోట్లకు పైగా వ్యాపారం జరిగితే, ఈ ఏడాది సగం అమ్మకాలు లేని పరిస్థితి. తోటల లీజు, పెట్టుబడి ఖర్చులు రాక తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని మొగల్తూరు, నరసాపురం మండలాల్లోని 1800 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఎకరాకు ఐదు టన్నుల వరకు దిగుబడి వస్తుంది. సారవంతమైన నేలలతో ఈ ప్రాంతంలోని మామిడి కాయలు 500 గ్రాముల నుంచి 700 గ్రాములకు పైగా బరువుతో మంచి రంగు, రుచి కలిగి ఉంటాయి. సహజసిద్ధంగా కాయలు పక్వానికి వచ్చాక మాత్రమే కోసి అమ్మకాలు చేయడం వల్ల ఇక్కడి బంగినపల్లి, రసాలు తదితర మామిడి పండ్లకు గిరాకీ ఎక్కువ. ఎంతోమంది వీటిని కొనుగోలు చేసి దేశ విదేశాల్లోని తమ బంధువులు, స్నేహితులకు పంపిస్తుంటారు. పండు ఈగ దాడికి విలవిల ఏటా ఏప్రిల్ మొదటి వారం నుంచి మొగల్తూరు మామిడి పండ్లు మార్కెట్లోకి రావడం మొదలై జూలై రెండు, మూడు వారాలతో ముగుస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే అకాల వర్షాలతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు పండు ఈగ ఉద్ధృతి పెంచేందుకు దోహదం చేశాయి. మొదట్లో ఈదురుగాలుల ప్రభావంతో కాయలు రాలిపోయి నష్టపోతే తర్వాత పండు ఈగ తమను కోలుకోలేని దెబ్బతీసిందని రైతులు అంటున్నారు. ఈగల వల్ల కాయలపై మచ్చలు ఏర్పడటం, సకాలంలో వినియోగించకపోతే పండు లోపల పురుగు పడుతుండటం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో ఢిల్లీ, రాజస్తాన్, ఒడిశా, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు తోటల వద్దకే వచ్చి టన్నుల్లో ఆర్డర్లు ఇస్తే, ఈ ఏడాది మార్కెట్కు తెచ్చినా కోత కూలి, రవాణా ఖర్చులు కూడా రానంతగా అమ్మకాలు దిగజారాయని చెబుతున్నారు. చిరు వ్యాపారులు, కొనుగోలుదారులతో కిటకిటలాడే మొగల్తూరు, నరసాపురం, సీతారామపురం మార్కెట్లు వెలవెలబోతున్నాయి. సాధారణంగా తెల్లవారుజాము మూడు గంటలకు మార్కెట్లు మొదలై తెల్లవారేసరికి ముగిసిపోతుంటాయి. ప్రస్తుతం తెచ్చిన సరుకు ఉదయం 10 గంటల వరకు కూడా అమ్ముడుపోని పరిస్థితి ఉంటోందని వ్యాపారులు అంటున్నారు. నష్టాల్లో రైతులు గతంలో టన్ను మామిడి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు అమ్మకాలు చేస్తే ఈ ఏడాది రూ.15 వేల నుంచి రూ.25 వేల లోపే ఉంటోందని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. చెట్ల సైజు, సంఖ్యను బట్టి ఎకరాకు లీజు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఉండగా, జూలై, ఆగస్టు నెలల్లో చెట్ల మొదలులో మందులు, ఎరువులు పెట్టడం, డిసెంబరులో పూత మొదలైన నాటి నుంచి జూలైలో కాపు పూర్తయ్యేవరకు రేయింబవళ్లు తోటల వద్ద కాపలా, కోత, మార్కెట్కు తరలింపు తదితర రూపాల్లో రూ.లక్ష వరకు ఖర్చులు అవుతున్నాయంటున్నారు. మార్కెట్లోకి తెచ్చి అమ్మితే పెట్టుబడి ఖర్చులు కూడా రాక తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. గతంలో నాలుగుసార్లు మందులు పిచికారీ చేస్తే సరిపోయేదని, ఈసారి ఏడు సార్లు పిచికారీ చేసినా ఖర్చులు పెరిగాయే తప్ప ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ప్రతికూల వాతావరణం పండు ఈగ వ్యాప్తికి కారణమైందని ఉద్యాన వన శాఖ అధికారులు తెలిపారు. కొందరు రైతులు మొదట్లోనే కాయలపై ఈగలు వాలకుండా కవర్లు (కవర్ కల్చరింగ్) కట్టే విధానాన్ని పాటించి సత్ఫలితాలు పొందారన్నారు. దాదాపు రెండు లక్షల కవర్లు కట్టినట్టు అధికారి ఒకరు తెలిపారు. పూర్తిస్థాయిలో రైతులు అందరూ ఈ విధానాన్ని అవలంబించేలా కార్యాచరణ చేస్తున్నట్టు వివరించారు. పండు ఈగ కాటుకు రైతులు విలవిల గతంలో టన్ను మామిడికి రూ.40 వేలకు పైగా రాబడి టన్ను రూ.15 వేల నుంచి రూ. 25 వేల లోపే అమ్మకాలు లీజు, పెట్టుబడి ఖర్చులు రావడం లేదని వాపోతున్న రైతులు మొగల్తూరు, నరసాపురం మండలాల్లో 1800 ఎకరాల్లో సాగు -
ఆపరేషన్ సిందూర్లో నేను సైతం
ఏలూరు టౌన్/పెదపాడు: దేశం తనకేమి చేసిందనేది కాకుండా... దేశానికి తాను సేవ చేయాలనే దృఢ సంకల్పంతో సైన్యంలో చేరిన హవల్దార్ మేకా శివాజీ ఆపరేషన్ సిందూర్లో పాల్గొని స్వగ్రామం వట్లూరు వచ్చారు. ఆపరేషన్ సిందూర్లో పాల్గొని తొలిసారి స్వగ్రామానికి వచ్చిన శివాజీకి వట్లూరు కబడ్డీ యూత్, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, స్నేహితులు కలపర్రు టోల్ప్లాజా నుంచి ఘనస్వాగతం పలికారు. భారీ ర్యాలీగా గ్రామానికి తీసుకెళ్లారు. వట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శివాజీకి సన్మానం చేశారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన మేకా పోతురాజు, రాజ్యం దంపతుల కుమారుడు శివాజీ. ఆయనకు భార్య స్వాతి, కుమార్తె నిత్య, కుమారుడు భరత్ ఉన్నారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో అమృత్సర్ నుంచి యుద్ధంలో పాల్గొన్నానని శివాజీ తెలిపారు. కోట్లాది మంది భారతీయుల తరపున యుద్ధంలో పాల్గొనటం గర్వంగా ఉందన్నారు. -
వెన్నుపోటుకు కేరాఫ్ చంద్రబాబు
సాక్షి, భీమవరం: వెన్నుపోటు రాజకీయాలకు సీఎం చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి తల్లులు, పిల్లలు, రైతులు, ఉద్యోగులు, కార్మికులతో పాటు అన్ని వర్గాలనూ వంచన చేస్తూ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాధిత, పీడిత ప్రజల పక్షాన ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ ఏమైపోయారో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఆయన కోసం కాపు కాసిన వారికి న్యాయం చేయలేకపోతున్నారన్నారు. కాపు సామాజికవర్గంలో మెజారిటీ వర్గం పేదవారేనని, వారికి కాపు నేస్తం, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి తదితర ఏ పథకం అందడం లేదన్నారు. ప్రజల కోసం సీఎం చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు. అన్ని వర్గాలనూ ఆదుకున్న ఘనత జగన్దే.. అన్ని వర్గాలనూ ఆదుకున్న ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని కారుమూరి చెప్పారు. తమ ప్రభుత్వంలో పేదలకు పథకాలు ఇవ్వబట్టే సంక్షేమం, అభివృద్ధి జరిగిందని తెలిపారు. నేడు వ్యాపారాలే లేవని, టోకుగా సొమ్ము మొత్తం దుబాయికో, సింగపూర్కో తరలించేస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం జగన్ హయాంలో రూ.3.31 లక్షల కోట్లు అప్పుచేశారని అసెంబ్లీలో చెప్పిన మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పుడు రూ.10 లక్షల కోట్లు అంటూ బయట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయనది నోరా? తాటిపట్టా? అని ప్రశ్నించారు. కూటమి పాలనలో మర్డర్లు, ఇళ్లు కూల్చడాలు, ఇష్టానుసారంగా కేసులు పెట్టడాలు, డైవర్షన్ రాజకీయాలు చేయడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. తండేల్ సినిమాలో చూపించినట్లు ఇక్కడ జెట్టీలు లేక మత్స్యకారులు గుజరాత్కు వెళుతుంటే.. 6 జెట్టీలు కట్టించిన మంచి మనసున్న వ్యక్తి మాజీ సీఎం జగన్ అన్నారు. ఆరు పోర్టులు, జిల్లాకు ఒకటి చొప్పున మెడికల్ కళాశాలలు కట్టారని చెప్పారు. మెడికల్ కాలేజీలకు 750 మెడికల్ సీట్లు వస్తే వద్దని లేఖ రాసిన గొప్ప సీఎం చంద్రబాబునాయుడని కారుమూరి ఎద్దేవా చేశారు. మళ్లీ రేషన్ కోసం గంటల తరబడి క్యూ.. తణుకు అర్బన్: సంపద సృష్టిస్తామని ప్రగల్బాలు పలికిన చంద్రబాబు విద్యుత్ బిల్లుల మోత మోగిస్తున్నారని, ఉద్యోగాలిస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలు తొలగించారని కారుమూరి మండిపడ్డారు. తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎండీయూ ఆపరేటర్లందరినీ రోడ్డుకు ఈడ్చారని, రేషన్ దుకాణాల వద్ద మళ్లీ క్యూలో నిల్చునే పరిస్థితితోపాటు బియ్యం మూటలను ఇంటికి మోసుకుని వెళ్లే రోజులను తీసుకువచ్చారన్నారు. ఒక ఎమ్మెల్యేని మించి మరొక ఎమ్మెల్యే మద్యం, పేకాట, క్రికెట్ బుకీలే ఆదాయ వనరుగా మార్చుకుని మహిళల మంగళసూత్రాలను కూడా అమ్మించే పరిస్థితికి తీసుకువచ్చారని విమర్శించారు. ఇంకా ధాన్యం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయలేదని తప్పుపట్టారు. ఏడాదిలో వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేశారన్నారు. 4న వెన్నుపోటు దినం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు ఈనెల 4వ తేదీన వెన్నుపోటు దినంగా గుర్తించి ఆయా నియోజకవర్గాల పరిధిలో తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి పాలన సాగిస్తున్నారు పవన్కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు? మాజీ మంత్రి కారుమూరి ధ్వజం -
5న భీమవరంలో చెస్ టోర్నమెంట్
భీమవరం: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా చెస్ అసోసియేషన్ సహకారంతో ఈ నెల 5న రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు అనసూయ చెస్ అకాడమీ కోచ్ మాదాసు కిషోర్ చెప్పారు. ఆదివారం టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరించారు. ఆర్యవైశ్య యువజన సంఘం భవనంలో నిర్వహించే టోర్నమెంట్లో అండర్–5, 7, 9, అండర్ 11, అండర్ 13, అండర్ 15, బాల, బాలికలకు ప్రత్యేక బహుమతులు అందిస్తామన్నారు. మరిన్ని వివరాలకోసం 90632 24466 నెంబరులో సంప్రదించాలన్నారు. పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మ చల్లంగా చూడమ్మా.. అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తులు రద్దీ ఎక్కువగా కనిపించింది. పవిత్ర కోనేరులో స్నానాలాచరించిన భక్తులు పెద్దింట్లమ్మకు మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయ ఈవో మాట్లాడుతూ ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, గదుల అద్దెలు, ఇలా అన్నీ కలిపి రూ.85,340 ఆదాయం వచ్చిందని చెప్పారు. -
కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధం
ఉండి: ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యారని సీపీఐ నాయకులు తెలిపారు. శనివారం మహదేవపట్నంలో పలువురు మహిళలు సీపీఐ నాయకుల ఆధ్వర్యంలో గ్రామ సచివాలయానికి వచ్చి ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్బంగా సీపీఐ జిల్లా సమితి సభ్యుడు గొల్లయ్య మాట్లాడుతూ అధికారంలోకి రాగానే గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం కేటాయించి, గృహ నిర్మాణానికి రూ.5 లక్షలు రుణం ఇస్తామన్న హామీని కూ టమి నాయకులు అమలు చేయడం లేదన్నారు. దీంతో మండలంలోని ప్రతి గ్రామంలో మహిళలు కూట మి నాయకులపై తిరగబడేందుకు సిద్ధమవుతున్నా రన్నారు. హామీల అమలుకు కూటమి నాయకులు ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రశ్నించారు. హా మీల అమలు కోసం త్వరలోనే ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి కార్యాచరణ రూపొందిస్తున్నామ న్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలుచేస్తేనే ప్రజల గుండెల్లో స్థానం సంపాదిస్తారన్నారు. సీపీఐ నాయకులు కేతా వెంకటసుబ్బారావు, వీరవల్లి పొట్టి శ్రీను, వీరవల్లి మాణిక్యాలరావు, గుత్తుల సత్తిపండు, గుత్తుల సూర్యనారాయణ పాల్గొన్నారు. -
కౌలు రైతు కార్డులు తప్పనిసరి
పెంటపాడు: కౌలు రైతుల వద్ద కౌలు రైతు కార్డు (సీసీఆర్సీ) తప్పనిసరిగా ఉండాలని, దీనిపై రెవెన్యూ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని జేసీ రాహుల్కుమార్రెడ్డి అన్నా రు. ప్రత్తిపాడు సచివాలయం వద్ద శనివారం రైతులు, కౌలురైతులతో సమావేశం నిర్వహించి, సీసీఆర్సీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కౌలు రైతు చట్టం ప్రకారం పంట పండించే వారికి పంటపై మాత్రమే హక్కు ఉంటుందన్నారు. పంట సాగు హక్కు పత్రం పొందిన రైతులకు బీమా, ఇన్పుట్ సబ్సిడీ వర్తిస్తుందన్నారు. కావున భూ యజమాని తన పొలాన్ని సాగుచేసే రైతుకు అంగీకార పత్రాన్ని వీఆర్వో ద్వారా అందించాలన్నారు. తద్వారా ఈక్రాప్ నమోదు చేస్తామన్నారు. అనంతరం రైతులతో మాట్లాడారు. పూర్తిస్థాయిలో కౌలు కార్డులు అందించకపోవ డంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామసభల అవగాహన కల్పించాలన్నారు. డీఏఓ జెడ్. వెంకటేశ్వరరావు, ఆర్డీఓ కౌసర్ బానో, ఏడీఏ పి.మురళీకృష్ణ, ఏఓ కె.పార్థసారథి తదిరులు ఉన్నారు.రహదారులపై సర్వేకొయ్యలగూడెం: కొయ్యలగూడెంలోని మెయిన్ రోడ్ల లో రెవెన్యూ అధికారులు శనివారం సర్వే చేపట్టారు. గతనెల 29న ‘సాక్షి’లో ‘పీజీఆర్ఎస్ తీరు అపహాస్యం’ శీర్షికన ప్రచురించిన కథనానికి కలెక్టర్ స్పందించి పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీంతో రెవెన్యూ, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సర్వేని ప్రారంభించి మార్కింగ్ చేశారు. దాదాపు మూడు నెలల క్రితం మల్లవరపు శ్రీనివాసు అనే వ్యక్తి కొయ్యలగూడెంలో ప్రధాన జాతీయ రహదారులు ఇరువైపులా ఆక్రమణలకు గురయ్యాయని ఫిర్యాదు చేశారు. అయితే ఆన్లైన్లో సమస్యను పరిష్కరించినట్టు సమాచారం రావడంతో ‘సాక్షి’ ద్వారా కలెక్టర్కి విషయం చేరింది. దీంతో కలెక్టర్ వెట్రిసెల్వి ప్రత్యేక శ్రద్ధతో చర్యలకు ఆదేశాలిచ్చారని అధికారులు తెలిపారు. -
నేటినుంచి ప‘రేషన్’!
భీమవరం: రేషన్ కార్డుదారులకు చౌక డిపోల వద్దనే నిత్యావసర సరుకులు తీసుకునే కార్యక్రమాన్ని ఆదివారం కూటమి ప్రభుత్వం ప్రారంభించనుంది. కార్డుదారులు రేషన్ షాపుల వద్ద గంటల తరబడి క్యూల్లో నిలబడి మోయలేని బరువుతో ఎక్కువ దూరం తీసుకువెళ్లాల్సిన పరిస్థితులు పునరావృతం కానున్నాయి. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ నిత్యావసర సరుకులు అందించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జ్ఞాపకాలను చెరిపేసే ఉద్దేశంతో రేషన్ డిపోల వద్దనే సరుకుల పంపిణీకి చేస్తున్న ఏర్పాట్లను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో 5,67,671 రేషన్ కార్డులకు 1,060 డిపోల ద్వారా ద్వారా నెలకు సుమారు 8,700 టన్నుల బియ్యం, 567 టన్ను కందిపప్పు, 300 టన్నుల పంచదార పంపిణీ చేయాల్సి ఉంది. ఇందుకోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 356 ఎండీయూ వాహనాలను ఏర్పాటు చేసి వందలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఇంటి వద్దకే సరుకులు అందించి వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ఊరట కల్పించింది. ఇకపై పడిగాపులే.. సరుకులు పొందాలంటే ఇక నుంచి గంటల పాటు చౌకడిపోల వద్ద పడిగాపులు తప్పవని కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. సర్వర్ పనిచేయడం లేదంటూ, వేలిముద్రలు పడటం లేదంటూ రోజుల తరబడి చౌక డిపోల చుట్టూ తిప్పుతారని వాపోతున్నారు. బియ్యం మూటలతో దూర ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడతామని అంటున్నారు. దివ్యాంగులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ ఇస్తామని కూటమి ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో ఎంతవరకు సాధ్యమని డీలర్లు పెదవి విరుస్తున్నారు. తాము సరుకులు తీసుకువెళ్లిన సమయంలో కార్డుదారులు వారి ఇంటి వద్ద లేకపోతే సమస్యలు తప్పవని డీలర్లు అంటున్నారు. మొత్తంగా ఎండీయూ వ్యవస్థ రద్దు, చౌక డిపోల ద్వారా రేషన్ పంపిణీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక రేషన్ దుకాణాల్లోనే సరుకుల పంపిణీ క్యూలైన్లలో గంటల తరబడి ఎదురుచూపులు తప్పవు దూరాభారమైనా మోయలేని బరువులతో యాతనలే.. సర్వర్ పనిచేయక వేలిముద్రలు పడకపోతే మరింత ఇబ్బందులు -
వైద్యానికి సుస్తీ
●గత ప్రభుత్వంలో పేదల ఆరోగ్యానికి భరోసా గత జగన్ ప్రభుత్వంలో పేదల ఆరోగ్యానికి భరోసా గా ఉండేది. ఆరోగ్యశ్రీలో సేవలు పారదర్శకంగా, ఉచితంగా అన్నిరకాల వ్యాధులకు చికిత్స లభించేది. గ్రామాల్లోకి అన్నిరకాల వైద్యులు వచ్చి వైద్యసేవలు అందించేవారు. 104 వాహనం ద్వారా డాక్టర్లు వచ్చి ఇంటింటికీ వెళ్లి మంచంపై ఉన్నవారికి, అంగన్వాడీ, స్కూల్ పిల్లలకు కూడా వైద్య పరీక్షలు, వైద్య సేవలు అందించేవారు. కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు, ఆరోగ్యశ్రీ సేవలు కూడా నిలిపివేస్తున్నారు. – కాండ్రేగుల శ్రీను, నరసన్న చెర్వుపాలెం, వీరవాసరం మండలం మహిళలకు వరంగా ‘సురక్ష’ శిబిరాలు గత ప్రభుత్వంలో వార్డులు, గ్రామాల వారీగా నిర్వహించిన ఆరోగ్య సురక్ష క్యాంపులు మహిళలకు, పేదలకు వరంగా ఉండేవి. ముఖ్యంగా క్యాంపులకు గైనకాలజిస్టులు, ఇతర సెష్పలిస్టుగా ఉన్న మహిళా వైద్యు లు రావడంతో మహిళల్లో ఆరోగ్య సమస్యలను ఆదిలోనే గుర్తించి సకాలంలో మెరుగైన వైద్యం అందించడం, శస్త్రచికిత్స కోసం ఆరోగ్యశ్రీకి సిఫార్సు చేయడం జరిగేది. ఈ క్యాంపుల్లో మహిళల్లోని గర్భాశయ, బ్రెస్ట్ క్యాన్సర్ కేసులను గుర్తించి సకాలంలో వైద్యం అందించి ప్రాణాలను రక్షించేవారు. కూటమి ప్రభుత్వంలో సీజనల్ వ్యాధులకు మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటుచేయడం లేదు. – పాలవెల్లి మంగ, భీమవరం ఒంట్లో నలత చేసినా ఆందోళన అక్కర్లేదు.. ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ ఫిజీషియన్ రూపంలో వైద్యులు ఊరికే వచ్చి సేవలు అందిస్తారన్న ధీమా.. ఎంత పెద్ద రోగమొచ్చినా ఆరోగ్యశ్రీ కార్డుపై రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యసాయం అందుతుందన్న భరోసా.. కోలుకునే వరకూ జీవన భృతికి ఆరోగ్య ఆసరా ఇస్తారన్న నమ్మకం.. ఇలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల ఆరోగ్యానికి కొండంత అండగా ఉన్న పలు కార్యక్రమాలు కూటమి ప్రభుత్వ పాలనలో కనుమరుగయ్యాయి. సాక్షి, భీమవరం : ప్రజారోగ్య పరిరక్షణకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారు. ఆరోగ్యం ప్రతిఒక్కరి హక్కుగా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో 1,059 చికిత్సల సంఖ్య (ప్రొసీజర్ల)ను 3,257కి పెంచడంతో పాటు కుటుంబానికి రూ.5 లక్షలు ఉన్న వ్యయ పరిమితిని రూ.25 లక్షలకు పెంచారు. జిల్లాలో ఐదేళ్లలో ఈ పథకం కింద 2.05 లక్షల మందికి రూ.436.32 కోట్లు విలువైన శస్త్రచికిత్సలు అందించారు. కాగా ఎన్టీఆర్ వైద్యసేవగా పేరుమార్చిన కూటమి ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకుండా రోగులను ఇబ్బందులకు గురి చేస్తోంది. జిల్లాలోని 30 వరకు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) సేవలు అందిస్తున్నాయి. రోజుకు సుమారు 1,500 వరకు ఓపీ నమోదవుతుండగా ఇన్ పేషెంట్లుగా చేరేవారు 500 వరకు ఉంటున్నారు. జిల్లాలోని నెట్వర్క్ ఆస్పత్రులకు సుమారు రూ.150 కోట్ల మేర బకాయిలు పెట్టడంతో గత ఏప్రిల్ రెండో వారంలో జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురంలోని 19 ఆస్పత్రుల్లో సేవలను నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. ‘ఆరోగ్య ఆసరా’కు ఎసరు ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్స చేయించుకున్న రోగి కోలుకునే వరకూ వైఎస్సార్ ఆరోగ్య ఆసరాగా గత ప్ర భుత్వం జీవన భృతి అందజేసింది. రోజుకు రూ.275 చొప్పున సాయం లెక్కకట్టి అందించేవారు. సాధారణ డెలివరీ, సిజేరియన్లకు రూ.5 వేలు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడి విరిగిన ఎముకల సర్జరీకి రూ.10 వేలు, కాళ్లకు ఇన్ఫెక్షన్ సంబంధించి సెల్యులైటీస్ కేసులు, కొన్ని కణుతుల చికిత్సలకు రూ.1,575.. ఇలా చికిత్సను బట్టి సాయాన్ని రోగి బ్యాంకు ఖాతాలకు జమచేసేవారు. ఐదేళ్లలో 94,000 మంది లబ్ధిదారులకు రూ.53 కోట్ల ఆర్థిక సాయం అందించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య ఆసరా బిల్లులు చెల్లింపును నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరిపోయిన ‘కంటి వెలుగు’ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల ద్వారా జిల్లాలోని ఆచంట, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం సీహెచ్సీల్లో ఉచితంగా కంటి వైద్యసేవలు అందించేవారు. అవసరమైన వారికి కళ్లజోళ్లు పంపిణీ, శస్త్రచికిత్సలు చేసేవారు. ఇలా 1,30,733 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. 1,28,358 మందికి రిఫ్రాక్షన్ చెక్స్, 53,102 మందికి ఫండస్ చెక్స్, 90,059 మందికి కళ్లజోళ్లు అందజేశారు. 884 డీఆర్, 626 గ్లకోమా, 140 మాకులర్ డిజనరేషన్, 14,080 కాటరాక్ట్, 76 హైపర్టెన్సివ్ రెటినోపతి రోగులను గుర్తించి సంబంధిత వైద్యసేవలు, శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ కేంద్రాలను నిర్వహిస్తున్న కాంట్రాక్టు సంస్థతో మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ) గడువు గతేడాది సెప్టెంబరు 4తో ము గియగా కూటమి ప్రభుత్వం రెన్యూవల్ చేయకపోవడంతో సేవలు నిలిచిపోయాయి. కంటి పరీక్షల కోసం పేదలు రూ.వేలు వెచ్చించి ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. మెడికల్ కళాశాలపై కత్తి వైద్య విద్యను పేదలకు చేరువ చేయడం, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే లక్ష్యంతో గత ప్రభుత్వం జిల్లాలోని పాలకొల్లులో చేపట్టిన మెడికల్ కళాశాలకు కూటమి బ్రేక్ వేసింది. 60 ఎకరాల్లో రూ.475 కోట్ల వ్యయంతో రెండేళ్ల క్రితం పనులు ప్రారంభించగా ఎన్నికల సమయం నాటికి రూ.74.5 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. కూటమి వచ్చాక నిధులు విడుదల చేయకపోవడంతో నిర్మాణ సంస్థ దాదాపు పనులు నిలిపివేసింది.గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో అందించిన సేవలు ఉచిత అడ్మిషన్. అవసరమైన ఆధునిక వైద్య పరీక్షలు, మందులు. శస్త్రచికిత్స, అందుకు అవసరమైన మందులు, అల్పాహారం, రెండు పూటలా భోజనం. డిశ్చార్జ్ సమయంలో సరిపడా మందులు. విశ్రాంతి తీసుకునే సమయంలో ఖర్చు నిమిత్తం ఆరోగ్య ఆసరాగా లబ్ధిదారు ఖాతాలో డబ్బులు. ఇంటికి వెళ్లేందుకు అవసరమయ్యే ప్రయాణ చార్జీలు. పది రోజుల తర్వాత ఆస్పత్రికి వచ్చి ఉచితంగా వైద్య సేవలు పొందే అవకాశం. అవసరమైన చికిత్సలకు ఏడాది పాటు డాక్టర్ సంప్రదింపులు, వైద్య పరీక్షలు, మందులు కూడా ఉచితం. వైద్యం పొందే సమయంలో ఆరోగ్య మిత్ర, ఆసుపత్రి సిబ్బంది లేదా మరెవరైనా లంచం అడిగితే 14400 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసే అవకాశం. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం కూటమి పాలనలో పడకేసిన వైద్యం నిలిచిన ఆరోగ్య సురక్ష, ముఖ్యమంత్రి ఈఐ కేంద్రం సేవలు అందని ఆరోగ్య ఆసరా పాలకొల్లులో అటకెక్కిన వైద్య కళాశాల పనులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల వైద్యానికి భరోసా ప్రజలకు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు నాడు సురక్ష.. నేడు శిక్ష గత ప్రభుత్వంలో పైసా ఖర్చు లేకుండా పేదలకు వైద్య భరోసా కల్పించిన ఆరోగ్య సురక్ష శిబిరాల నిర్వహణను కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. గత ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆరోగ్య సురక్ష శిబిరాల్లో 264 మంది స్పెషలిస్ట్ వైద్యులు, 132 మంది మెడికల్ ఆఫీసర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది విధుల్లో పాల్గొనేవారు. రక్తం, మూత్రం, ఈసీజీ తదితర 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచి అవసరమైన వారికి అందజేసేవారు. ఏడాది కాలంగా శిబిరాల నిర్వహణ లేకపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు స్పెషలిస్ట్ వైద్యసేవల కోసం పట్టణాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. -
కూటమి అండదండలతో కబ్జాలు
కొయ్యలగూడెం: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ భూములే కాకుండా ప్రజల భూ ములు కూడా కబ్జాలకు గురవుతున్నాయని అందు కు ఉదాహరణగా కొయ్యలగూడెంలోని సర్వే నంబర్ 311/2 నిలిచిందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. ఆయన శనివారం కొయ్యలగూడెం వచ్చిన సమయంలో సమయంలో టీటీడీ కల్యాణ మండప ప్రాంతవాసులు తమ భూముల కబ్జాపై ఆయన వద్ద మొరపెట్టుకున్నారు. కోట్ల రూపాయల విలువైన భూమి గురించి ఇప్పటికే సమగ్రంగా విషయాలను సేకరించానని, చిన్నపాటి లొసుగులను భూతద్దంలో చూపించి భూముల కబ్జాకు పన్నాగం నడుస్తోందని బాలరాజు అన్నా రు. ఈ విషయంలో ప్రజలను కంగారు పడవద్దని ఓ పక్క చెబుతూ మరోపక్క ఆక్రమణదారులకు కూటమి నాయకులు వెన్ను కాస్తున్నారని ఆరోపించారు. 40 ఏళ్లకుపైగా నివాసముంటున్న స్థానికుల జోలికి వస్తే పర్యవసానం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు కూటమి నేతల ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా సర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ గంజిమాల రామారావు, పార్టీ రాష్ట్ర బీసీ సెల్ సహాయ కార్యదర్శి గంటా శీను, పట్టణ కన్వీనర్ సంకుకొండ, ఘంటసాల సాయి, మారిశెట్టి శ్రీను, చిటికెన నాగార్జున, తొంటా వాసు ఉన్నారు. -
పింఛన్ల కోసం పడిగాపులు
ఆకివీడు: పింఛన్లు మే 31వ తేదీ నుంచే పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పలు చోట్ల ప్రజలు శనివారం ఉదయం నుంచే వీధుల్లో పింఛన్ల కోసం పడిగాపులు పడ్డారు. స్థానిక వడలి వారి వీధి, సంతపేట ప్రాంతాల్లో పింఛన్ల కోసం లబ్ధిదారులు మధ్యాహ్నం వరకూ వేచి చూసినా పంపిణీ చేసే ఉద్యోగులు రాకపోవడంతో తీవ్ర నిరుత్సాహం చెందారు. తిండితిప్పలు లేకుండా, ఉక్కబోత వాతావరణంలో చెమటలు కక్కుతూ పడిగాపులు పడ్డామని వృద్ధులు, దివ్యాంగులు వాపోయారు. ఈ విషయాన్ని సాక్షి ద్వారా కమిషనర్కు తెలియజేయగా సంబంధిత ఉద్యోగి సెలవులో ఉన్నారని, అందువల్ల సంతపేట, ఆనాల చెరువు ప్రాంతాల్లోని పింఛన్దారులకు పింఛన్ పంపిణీ చేయలేదని చెప్పారు. కనీసం ఈ విషయాన్ని బాధితులకు తెలియజేసి అక్కడ నుంచి పంపించివేయండని చెప్పినా వారికి సమాచారం ఇవ్వలేదు. కుప్పనపూడి శివారు తాళ్లకోడులోని 74 ఎకరాల్లో తమకు పట్టాలిచ్చారని, అక్కడే ఇళ్లు కట్టుకున్నామని, ఫించన్, రేషన్కు ఆకివీడు రావాల్సిన దుస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. ఇళ్ల లబ్ధిదారులను బెదిరించడం దారుణం ఆకివీడు: కుప్పనపూడి శివారు తాళ్లకోడులోని జగనన్న కాలనీలో రీ సర్వే పేరుతో లబ్ధిదారుల్ని బెదరించడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ.గోపాలన్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం పెంకి అప్పారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2007, 2019లో పేదల్ని గుర్తించే ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చిందని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ స్థలాలను పేదల నుంచి వెనక్కి లాగేసుకునేందుకు రీ సర్వే నిర్వహిస్తోందని ఆరోపించారు. కాలనీలో ఇళ్ల నిర్మాణం చేపట్టకపోతే స్థలాలు వెనక్కి తీసుకుంటామని పేదలను బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పేదల్ని వేధిస్తే చూస్తూ ఊరుకునేదిలేదని, జిల్లావ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. -
● నరికినా.. కాసింది
బుట్టాయగూడెం మండలం కామవరంలో గ్రామానికి చెందిన కొమరం వెంకన్న అనే రిటైర్డ్ ఉద్యోగి ఇంటి పెరటిలో నరికేసిన చెట్టు మధ్యలో అరటిగెల వచ్చింది. అయితే అలా రావడం మంచిది కాదని కొందరు చెప్పడంతో వెంకన్న రెండుసార్లు ఆ చెట్టును నరికేసినట్లు తెలిపాడు. అయినప్పటికీ మళ్లీ చెట్టు మధ్యలోనుంచే కాపు వస్తుందంటున్నారు. నరికిన చెట్టు మధ్యలో వచ్చిన అరటిగెలను చూసి పరిసర ప్రాంత ప్రజలు ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. – బుట్టాయగూడెం కామవరంలో నరికేసిన చెట్టు మధ్య నుంచి అరటి గెల వచ్చిన దృశ్యం -
ఇండియా రోల్బాల్ టీం విజయంలో తణుకు క్రీడాకారులు
తణుకు అర్బన్: ఇంటర్నేషనల్ ఇన్విటేషనల్ రోల్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో ఇండియా రోల్బాల్ టీం విజయంలో తణుకు క్రీడాకారులు సత్తా చాటారు. ఈ పోటీల్లో తణుకు మునిసిపల్ స్కేటింగ్ రింక్ పశ్చిమ గోదావరి జిల్లా రోల్ బాల్ అసోసియేషన్ క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించినట్లు అసోసియేషన్ సెక్రటరీ లావణ్య, కోచ్ చందు తెలిపారు. శ్రీలంకలో గతనెల 29వ తేదీన నిర్వహించిన ఈ పోటీల్లో సీనియర్ కేటగిరీలో రెడ్డి పవన్ హర్షవర్థన్, జూనియర్ కేటగిరీలో నలమాటి షరత్రావు, గుల్లపూడి రంజిత్కుమార్, సబ్ జూనియర్ కేటగిరీలో రెడ్డి గగన్దీప్ స్వర్ణపతకాలు సాధించారని వివరించారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ క్రీడాకారులను అభినందించారు. -
నవధాన్యాలతో భూమికి జవసత్వాలు
భీమవరం: వ్యవసాయమే జీవనాధారమైన జిల్లాలో రైతన్నలు ఆరుగాలం కష్టపడి ఏటా మూడు పంటలు పండించేవారు. సార్వా, దాళ్వా వరిసాగే కాకుండా దాళ్వా పంట అనంతరం ఆరుతడి పంటలుగా మినుము, పెసర, మొక్కజొన్న, బొబ్బర్లు వంటి వాటితోపాటు పశుగ్రాసానికి పిల్లిపెసర, జనుము, జొన్న వంటివాటిని పండించేవారు. అయితే కొన్నేళ్లుగా వరిసాగులో జాప్యం కారణంగా దాళ్వా వరి పంట ఏప్రిల్, మే నెలల్లో చేతికి రావడంతో మూడవ పంట వేయడానికి సమయం సరిపోవడం లేదు. మూడవ పంటగా అపరాలు, పశుగ్రాసం పండించడం వల్ల భూమికి సహజంగా పోషక పదార్థాలు లభించేవి. మూడవ పంట లేకపోవడంతో రైతులు కేవలం ఎరువులు వేయడం ద్వారానే పంట దిగుబడి పెంచుకోడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సివస్తుంది. అయితే పాత విధానంతో మూడు పంటలు పండించడానికి వ్యవసాయశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సబ్సిడీపై విత్తనాల పంపిణీ జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 2.20 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తుండగా దీనిలో మూడవ పంట పండించేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుత దాళ్వా సీజన్ ముగింపు దశలో జిల్లాలోని 21,150 ఎకరాల్లో రైతులను అపరాల సాగుతోపాటు పశుగ్రాసం పెంచేందుకు రైతులకు 50 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేశారు. దీనికిగాను ప్రత్యేకంగా సేకరించిన మినుము, పెసర, జీలుగు, రాగి, సజ్జలు, నువ్వులు, వేరుశెనగ, ఆవాలు, పిల్లిపెసర, జనుము, మొక్క వంటివాటితోపాటు ఆకుకూరలైన తోటకూర, పాలకూర, మెంతుకూర, చుక్కకూర, గొంగూర, బీర, అనప, దోస వంటి సుమారు 15 రకాలు కలిగిన 12 కిలోల విత్తనాలను కిట్లుగా తయారుచేసి పంపిణీ చేశారు. ప్రయోజనం ఏమిటంటే.. భూమిలో సారాన్ని సహజంగా పెంచడానికి వేరు వ్యవస్థ ఎంతగానో దోహదం చేస్తుంది. అందువల్ల వివిధ రకాల విత్తనాలు కలగలిపి చేలలో వేయడం వల్ల రైతులకు కొంతమేరకు ఆదాయంతోపాటు ఇంటి అవసరాలు తీర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రధానంగా వివిధ రకాల తీగ, ఆకుజాతి మొక్కల వేర్లు వల్ల భూమిలో బ్యాక్టీరియా వృద్ధి చెంది సహజసిద్ధంగా భూసారం పెరుగుతుంది. దీనితో వరి పండించడానికి ఎక్కువ మోతాదులో ఎరువులు వాడనవసరం లేకపోవడమేగాక తెగుళ్లు కూడా తగ్గే అవకాశముంటుంది. భూమిలో బ్యాక్టీరియా వృద్ధి చెందడం వల్ల రైతులు పంటలకు కొద్దిమొత్తంలో ఎరువులు వేసినా వాటి సామర్థ్యం పెరిగి పంటకు ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం కొద్దిమొత్తం విస్తీర్ణం ప్రయోగాత్మకంగా వేసి నవధాన్యాల సాగు రానున్ను రోజుల్లో జిల్లా మొత్తం విస్తీర్ణం వేయడానికి రైతులను సన్నద్ధం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 21 ఎకరాల్లో నవధాన్యాల సాగుకు విత్తన కిట్ల పంపిణీ భూసారం పెరగడంతోపాటు రైతులకు ఆదాయం జిల్లా వ్యాప్తంగా 2.20 లక్షల ఎకరాల్లో నవధాన్యాల సాగుకు ప్రణాళిక నవధాన్యాల సాగు ఎంతో ప్రయోజనం దాళ్వా అనంతరం నవధాన్యాల సాగు ఏడాది ప్రయోగాత్మకంగా చేపట్టాం. దాదాపు 21 వేల ఎకరాల్లో రైతులకు సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేశాం. దీనివల్ల రైతులకు కొంతమొత్తం ఆదాయం రావడమేగాక భూసారాన్ని సహజసిద్ధంగా పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో జిల్లాలోని దాదాపు 2.20 లక్షల ఎకరాల్లో నవధాన్యాలసాగు చేపట్టే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తాం. – జెడ్ వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి, భీమవరం -
భక్తులతో కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు, వేసవి సెలవులు కావడంతో వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. దాంతో ఆలయ పరిసరాలు భక్తులతో పోటెత్తాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కల్యాణకట్ట, నిత్యాన్నదాన సదనం తదితర విభాగాలు భక్తులతో రద్దీగా మారాయి. కొండపైన టోల్గేట్, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దాదాపు 10,500 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. -
ముగిసిన సర్టిఫికెట్ల పరిశీలన
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత నాలుగు రోజుల నుంచి నిర్వహిస్తున్న ప్రత్యేక కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఎన్సీసీ, స్పోర్ట్స్, సైనికోద్యోగుల పిల్లలు, భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ కోటాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 28 నుంచి నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నాలుగు రోజుల సర్టిఫికెట్ల పరిశీలనలో ఎన్సీసీ విభాగంలో మొత్తం 1,454 మందికి గాను 1,101 మంది, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 1,032 మందికి గాను 742 మంది, సైనికోద్యోగుల పిల్లల కోటాకు సంబంధించి 270 మందికి గాను 198 మంది, భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ కోటాకు సంబంధించి 247 మందికి గాను 185 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చిన అభ్యర్థులకు, వారితో పాటు వచ్చిన వారి సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు, ఏఆర్ అర్జునరావు సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
పొగాకు సాగులో విప్లవాత్మక మార్పులు అవసరం
బుట్టాయగూడెం: పొగాకు సాగులో విప్లవాత్మక మార్పులు అవసరమని ఐకార్ ఎన్ఐఆర్సీఏ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. జీలుగుమిల్లి ఐకార్ జాతీయ, వాణిజ్య పంటల పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో శనివారం క్షేత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పొగాకు సాగులో ఉత్తమ నాణ్యత, అధిక దిగుబడికి ఉత్తమ యాజమాన్య పద్ధతుల్లో పొగాకు బేరన్ల నిర్వహణ గురించి రైతులకు వివరించారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిశోధనా కేంద్రం ప్రతినిధి కొడవటి వాసుదేవరావు మాట్లాడుతూ ఐకార్– ఎన్ఐర్సీఎ, ఐఓసీఎల్, ఎమినెన్ట్ గ్యాస్ టెక్నాలజీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన గ్యాస్ అథారిటీ పొగాకు బేరన్ పనిచేయు విధానాన్ని రైతులకు వివరించారు. గడచిన 30 ఏళ్లుగా పొగాకు రైతులు పొగాకు బేరన్లో కలప వాడటం వల్ల అధికంగా వచ్చే కాలుష్యాన్ని నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఓసీఎల్ జనరల్ మేనేజర్ వర్నేకర్, సంస్థ చీఫ్ మేనేజర్ లలిత, పొగాకు బోర్డు ఎక్స్టెన్షన్ మేనేజర్ సురేఖ, బోర్డు ఆర్ఎమ్ ప్రసాద్, ప్రాజెక్టు హెడ్ డాక్టర్ ఎల్కే ప్రసాద్, ఎన్ఐఆర్సీఏ ఆర్ఎస్ హెడ్ డాక్టర్ వైవీ సుబ్బయ్య, టి.వెంకటేష్, టి.రమేష్, దేవానంద్, పొగాకు బోర్డు అధికారులు, ట్రేడ్ ప్రతినిధులు, ఎన్ఐఆర్సీఏ శాస్త్రవేత్తలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఐకార్ ఎన్ఐఆర్సీఏ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ -
వ్యాధుల కాలం.. పశువులు జాగ్రత్త
ఆగిరిపల్లి: వర్షాకాలంలో పశువులు వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. పశువుల పట్ల పాడి రైతులు ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన వాటి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లవచ్చని, పశువులు, గొర్రెలు, మేకల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. జీవాలు ప్రమాదకర పరిస్థితిలో ఉంటే వెంటనే 1962 టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే సంచార పశు ఆరోగ్య సేవ వాహనంతో వైద్యులే ఇంటికి వచ్చి చికిత్స అందిస్తారని తెలిపారు. వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆగిరిపల్లి మండల పశువైద్యాధికారి జి.హనుమంతరావు చేసిన సూచనలు ఇలా ఉన్నాయి. గాలి కుంటు వ్యాధిపై అప్రమత్తం గాలికుంటు వ్యాధి ఎక్కువగా ఆవులు, ఎద్దులు, గేదెలకు సోకుతుంది. వ్యాధి బారిన పడిన పశువు శరీర ఉష్ణోగ్రత 104 నుంచి 105 డిగ్రీలకు పెరుగుతుంది. పశువునోట్లో, గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. ఆహారం సరిగా తీసుకోలేవు. దీంతో నీరసంగా మారి నడిచేందుకు కూడా కష్టపడతాయి. పాడి పశువుల్లో అయితే పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. వ్యాధి నివారణ కోసం వైద్యులు సూచనల మేరకు యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ మందులను వాడాల్సి ఉంటుంది. కలుషిత నీటితో జలగవ్యాధి మురుగునీరు, కలుషిత నీరు తాగడం వల్ల పశువులకు ఎక్కువగా ఈ వ్యాధి వస్తుంది. ముఖ్యంగా గేదెలు, దూడలు, గొర్రెలు, మేకలు వంటి జీవాలకు ఈ వ్యాధి వస్తుంది. వ్యాధి బారిన పడిన పశువులు మేత తినడంలో ఇబ్బందులు పడతాయి. పాల దిగుబడి క్షీణిస్తుంది. జలగ వ్యాధి బారిన పడిన పశువులను మంద నుంచి వేరు చేయాలి. డిస్టోడిన్ 4 మాత్రలు, 100 మిల్లీ లీటర్ల నియోజడ ప్లస్ను అందించాలి. నట్టల వ్యాధితో ఎదుగుదలకు బ్రేక్ పశువులు పచ్చి మేత తిన్నప్పుడు నులిపురుగుల సమస్య వస్తుంది. దీంతో వాటి ఎదుగుదలకు అవకాశం ఉండదు. జీవాలు తిన్న ఆహారం అంతా నులిపురుగులే స్వాహా చేస్తాయి. దీంతో జీవాలు తరచూ రోగాల బారిన పడే అవకాశం ఉంది. ఎక్కువగా గొర్రెలు ఈ వ్యాధి బారిన పడతాయి. పశుసంవర్థక శాఖ ముందుజాగ్రత్త చర్యగా ఆరు నెలలకు ఒకసారి పశువులకు నట్టల నివారణ మందులు ఉచితంగా అందిస్తుంది. ప్రస్తుతం పశువైద్య సిబ్బంది నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తున్నారు. గొంతు వాపు.. ప్రాణాంతకం పశువులకు సంక్రమించే వ్యాధుల్లో గొంతు వాపు వ్యాధి ప్రాణాంతకమైనది. ఈ వ్యాధి బారిన పడిన పశువులు కంటి నుంచి నీరు కారటం, నోటి నుంచి చొంగకారడం, శ్వాస పీల్చడానికి ఇబ్బందులు పడుతుంటాయి. గొంతు కిందకు నీరు దిగి గొంతు వాపు వస్తుంది. తీవ్రత ఎక్కువైతే పశువులు చనిపోయే ప్రమాదం ఉంది. వ్యాధి నివారణకు ముఖ్యంగా జూన్, జులై నెలల్లో (హెచ్ ఎస్) టీకాలు వేయించుకోవాలి. వ్యాధి బారిన పడిన పశువును మిగిలినవాటి నుంచి దూరం చేయాలి. ఈటీ వ్యాక్సిన్తో చిటుకు వ్యాధికి చెక్ వర్షాకాలంలో పశువులకు ఎక్కువగా సోకే మరో వ్యాధి చిటుకు వ్యాధి. ఈ వ్యాధి వచ్చినప్పుడు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీని నివారణ కోసం జూన్, జూలై మాసంలో ఈటీ వ్యాక్సిన్ వేస్తారు. రైతులు పశువులకు సంబంధించిన వ్యాధులను సకాలంలో గుర్తించి తగిన వైద్యం అందించాలి. జి .హనుమంతరావు. పశు వైద్యాధికారి, ఆగిరిపల్లి -
20 రోజుల తర్వాత మృతదేహం అప్పగింత
నరసాపురం రూరల్: ఇరవై రోజుల తర్వాత మృతదేహాన్ని బంధవులకు రైల్వే పోలీసులు అప్పగించారు. వివరాల ప్రకారం.. నరసాపురం మండలం సీతారాంపురం సౌత్ నేతల వారి పేటకు చెందిన నేతల అనిల్ కుమార్ (20) స్థానికంగా ఓ బేకరిలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అయితే ఇటీవల మెరుగైన జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లిన అనిల్ కుమార్ ఇరవై రోజుల క్రితం తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. మృతుని బంధువులు విజయవాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా 20 రోజుల తర్వాత అనిల్కుమార్ మృతదేహాన్ని గుర్తించి శనివారం కుటుంబ సభ్యులకు రైల్వే పోలీసులు అప్పగించారు. మహిళకు గాయాలు పాలకోడేరు: మోటార్సైకిల్ సడన్బ్రేక్ వేయడంతో వెనక కూర్చున్న మహిళ అకస్మాత్తుగా కింద పడి గాయాలపాలైంది. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. అంతర్వేది దేవి(62) అనే మహిళ పింఛన్ తీసుకుని తన కుమారుడి మోటార్సైకిల్పై వస్తుంది. గొల్లలకోడేరు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న కారును తప్పించేందుకు మోటార్సైకిల్ సడన్ బ్రేక్ వేయగా వెనుక కూర్చున్న ఆమె రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయమైంది. అదే సమయంలో కారు డ్రైవర్ కూడా సడన్ బ్రేక్ వేయడంతో కారు అడ్డం తిరిగి పక్కనే ఉన్న పంట బోదెలోకి దూసుకుపోయింది. వెంటనే స్థానికులు స్పందించి కారులో ఉన్న డ్రైవర్ని బయటకు లాగారు. గాయపడిన మహిళను పాలకోడేరు 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స నిమిత్తం భీమవరంలోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారు ఉండి: ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి జీ సుందర్కుమార్ శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. కూటమి ప్రభుత్వం కనీసం టెన్త్ మూల్యాంకనం కూడా సక్రమంగా నిర్వహించలేకపోయిందని ఆరోపించారు. టైన్త్ మూల్యాంకనలో ఫలితాలు అస్తవ్యస్తంగా రావడంతో విద్యార్థులు నష్టపోతున్నారని, ప్రతి విద్యార్థికి ఫీజు చెల్లించకుండానే రీవాల్యూయేషన్ చేయించి మళ్లీ ఫలితాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
టి.నరసాపురం: వ్యాన్, మోటార్ సైకిల్ ఢీకొన్న ఘటనలో మోటార్సైకిలిస్ట్ మృతిచెందాడు. ఎస్సై ఎం జయబాబు తెలిపిన వివరాలివి. చింతలపూడి మండలం బట్టువారిగూడెంకు చెందిన జక్కుల ప్రకాష్ (21) టి.నరసాపురం మండలం కె.జగ్గవరంలో ఓ ఫంక్షన్కు వెళ్లి మోటార్సైకిల్పై తిరిగి వస్తున్నాడు. రాజుపోతేపల్లి అడ్డరోడ్డు వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న వ్యాన్ మోటార్సైకిల్ను ఢీకొనడంతో ప్రకాష్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని తండ్రి జక్కుల నరసింహారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. -
అప్పుల బాధలు తాళలేక..
జంగారెడ్డిగూడెం: పట్టణానికి చెందిన ఓ కుటుంబం అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యాయత్నం చేయగా.. చికిత్స పొందుతూ కుటుంబ యజమాని శుక్రవారం మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. స్థానిక లక్ష్మి ఆస్పత్రి సమీపంలోని అపార్ట్మెంట్లో మంగిన సత్యదుర్గాచంద్రరావు (చంద్రం) (40) భార్య, ఇద్దరు పిల్లల తో జీవిస్తున్నారు. గురువారం వీరు కూల్డ్రింక్ లో కలుపు మందు కలిపి సేవించారు. స్థానికు లు వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చంద్రరావు, భార్య కృష్ణజ్యోతి, కుమారుడు దుర్గాచరణ్, కుమార్తె కోమలికి వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి గుంటూరు తరలించారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ చంద్రరావు శుక్రవారం మృతిచెందారు. భార్య, కుమారుడు, కుమార్తె అక్కడే చికిత్స పొందుతున్నారు. వారికి రక్తం శుద్ధి చేసేందుకు డయాలసిస్ చేస్తున్నట్టు బంధువులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర మాట్లాడుతూ చంద్రరావు కుటుంబం అప్పుల బాధ తాళలేక కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ప్రాథమికంగా తమకు తెలిసిందన్నారు. దీనిపై విచారణ చేస్తున్నట్టు చెప్పారు. కుటుంబం ఆత్మహత్యాయత్నం కుటుంబ యజమాని మృతి చికిత్స పొందుతున్న భార్య, కుమారుడు, కుమార్తె -
ఉద్యోగాల పేరుతో టోకరా
భీమడోలు: నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామ ని నమ్మించి మోసగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఓ వ్యక్తిని భీమడోలు పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న షేక్ రసూల్ కలకాడను భీమడోలు కోర్టులో హాజరుపర్చారు. ఇదిలా ఉండగా ఇదే ముఠాలోని మరో వ్యక్తి అల్తాఫ్ పరారీలో ఉన్నాడు. భీమడోలులో సీఐ యూజే విల్సన్, ఎస్సై వై.సుధాకర్ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లోని తుక్కుగూడ ప్రాంతానికి చెందిన షేక్ రసూల్ కలకాడ, అతడి రెండో కుమారుడు అల్తాఫ్ రంగారెడ్డి జిల్లా గండిపేటలో నివాసముంటున్నారు. కొన్నేళ్లుగా వీరిద్దరూ తమకు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో సాన్ని హిత్యం ఉందని చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఎర వేస్తున్నారు. వారి నుంచి లక్షలాది రూపాయలు కాజేసి నకిలీ అపాయింట్మెంట్లతో మోసం చేస్తున్నారు. ఇలా పోలసానిపల్లికి చెందిన దివ్యాంగుడు కుక్కల నాగమల్లేశ్వరరావుకు ఏపీ సచివాలయంలోని వ్యవసాయ విభాగంలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు. నాగమల్లేశ్వరరావు నుంచి రూ.3 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. ఇది నకిలీ లెటర్ అని తెలిసి మోసపోయినట్టు గ్రహించిన నాగమల్లేశ్వరరావు గతేడాది మే 26న భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా రంగారెడ్డి జిల్లా గండికోటలో ఉన్న రసూల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు చేధించిన బృందంలోని హెచ్సీ ఎస్.శ్రీనినవాసరావు, ఎస్కే బాజీ, ఎం.వెంకటేశ్వరరావులు సీఐ విల్సన్ అభినందించారు. అలాగే పూళ్లకి చెందిన దూలం సాయిబాబా అనే వ్యక్తికి పోలీస్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.20 లక్షలు తీసుకుని మోసం చేసిన కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ద్వారకాతిరుమల మండలం దేవినేనివారిగూడేనికి చెందిన సుంకవల్లి శ్రావణ్కుమార్ అనే వ్యక్తి పొలం కొంటామని నమ్మించి, రెండు చెల్లని చెక్కులు ఇవ్వగా రసూల్, అల్తాఫ్లపై కేసు నమోదైంది. తండ్రి అరెస్ట్.. పరారీలో కుమారుడు -
కూలబడిన చదువులు
పేదల విద్యకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేసింది. పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. అయితే గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు విద్యపై శీతకన్ను వేస్తోంది. తల్లికి వందనం పథకాన్ని తొలి ఏడాది అటకెక్కించి తల్లుల ఆశలపై నీళ్లు చల్లింది. పేదలపై ఫీజుల భారం మోపుతోంది. నాడు–నేడును నీరుగారుస్తోంది. గతంలో అల్లారు ‘ముద్ద’గా.. మధ్యాహ్న భోజనం మెనూలోను జగన్ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఆకర్షణీయ మెనూతో రోజుకో కొత్త రుచిని అందిస్తూ జగనన్న గోరుముద్ద పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. పోషక విలువలు కలిగిన పోర్టిఫైడ్ రైస్తో పాటు రాగిజావ, కోడిగుడ్డు, చిక్కీలతో విద్యార్థులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించింది. కాగా డొక్కా సీత మ్మ మధ్యాహ్న భోజనంగా పేరుమార్చిన కూ టమి ప్రభుత్వం పెరిగిన కాయగూరలు, ని త్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా ధరలు సవరించక ఆహారంలో నాణ్యత లోపించడంతో ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. విద్యారంగం.. అస్తవ్యస్తం ● కూటమి ఏడాది పాలనలో అధోగతి ● అమలు కాని ‘తల్లికి వందనం’ ● రూ.138 కోట్ల మేర ఫీజు బకాయిలతో విద్యార్థుల ఇక్కట్లు ● విద్యారంగానికి పెద్దపీట వేసిన జగన్ సర్కారు ● నాడు–నేడులో రూ.369 కోట్లతో 1,150 పాఠశాలల అభివృద్ధి ● అమ్మఒడి ద్వారా 1,48,342 మంది తల్లులకు రూ.887.9 కోట్ల లబ్ధి ● ప్రపంచంతో పేద విద్యార్థులు పోటీపడేలా సంస్కరణలు సాక్షి, భీమవరం : జిల్లాలో ప్రాథమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,436 ఉన్నాయి. శిథిల భవనాలు, పెచ్చులు ఊడే పైకప్పులు, రాళ్లు పైకిలేచిన ప్లోరింగులు, కలుషిత తాగునీరు, అధ్వానమైన టాయిలెట్లు, రక్షణ గోడలు లేక అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలు.. ఇది 2019లో వైఎస్సార్ ప్రభుత్వం వచ్చేనాటికి ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. నాటి సీఎం వైఎస్ జగన్ నాడు–నేడుతో మొదటి విడతగా 497 పాఠశాలల్లో రూ.116.13 కోట్లు విలువైన డిజిటల్ క్లాస్రూంలు, తాగునీటి వసతి, టాయిలెట్స్, కిచెన్షెడ్లు, ప్రహరీ గోడలు, అదనపు తరగతి గదుల నిర్మాణం, విద్యుదీకరణ, మేజర్, మైనర్ మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులు చేశారు. రెండో విడతగా జిల్లాలోని 764 పాఠశాలల్లో రూ.261.37 కోట్ల విలువైన 1,374 పనులు చేపట్టి ఎన్నికల నాటికి రూ.138.66 కోట్ల విలువైన పనులు పూర్తిచేశారు. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో మిగిలిన పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. అమ్మఒడితో చేయూత పిల్లల చదువులకు పేదరికం అడ్డు కాకూడదని గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద ఏటా రూ.15 వేల చొప్పున తల్లులకు ఆర్థిక సాయం అందిస్తూ వ చ్చారు. కాగా చదువుకుంటున్న పిల్లలందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామంటూ చెప్పిన కూటమి ప్ర భుత్వం తొలి ఏడాది ఆ ఊసే ఎత్తలేదు. జిల్లాలో 1,74,763 మంది విద్యార్థులకు రూ.15 వేల చొప్పున గత విద్యా సంవత్సరంలో రూ.262 కోట్ల తల్లికి వందనం సాయానికి ఎగనామం పెట్టింది. ఉన్నత విద్యకు భరోసా పేద విద్యార్థులు మధ్యలో ఉన్నత చదువులు మానేయకుండా జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాల ద్వారా గత ప్రభుత్వం ఆదుకుంది. గత ఐదేళ్లలో జగనన్న విద్యాదీవెన పథకం కింద 1,77,996 మంది విద్యార్థులకు రూ.485.33 కోట్లు సాయం అందించగా వసతి దీవెన పథకం కింద 1,76,142 మంది విద్యార్థులకు రూ.163.41 కోట్లు అందించారు. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజులు చెల్లించక గత జనవరి నాటికి రూ.138.8 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. యాజమాన్యాల ఒత్తిడితో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. గత ప్రభుత్వంలో అమ్మఒడి సాయం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కార్పొరేట్ను తలదన్నేలా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యావ్యవస్థను తలదన్నే రీతిలో తీర్చిదిద్దారు. మాజీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన నాడు–నేడు ద్వారా సర్కారు బడులు అభివృద్ధి చెందా యి. పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన అందించారు. అలాగే ట్యాబ్లలో, ఐఎఫ్బీ ప్యానెల్స్, బైజూస్ కంటెంట్ అందించారు. జగనన్న విద్యాకానుక వంటి మహత్తర పథకాలు అమలు చేశారు. – ఎస్.జాకబ్ బాబు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు గత ప్రభుత్వంలో చదువుల విప్లవం.. డిజిటల్ తరగతులు దృశ్య, శ్రవణ విద్య ద్వారా విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పెంచేందుకు మాజీ సీఎం జగన్ అడుగులు వేశారు. 2022 డిసెంబరు 21న తన పుట్టినరోజున 8వ తరగతి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు ట్యాబుల పంపిణీని ప్రారంభించారు. జిల్లాలోని 14,353 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి బైజూస్ కంటెంట్తో కూడిన రూ.30 వేల విలువైన ట్యాబ్లు అందజేశారు. తర్వాత ఏడాది 13,790 మందికి పంపిణీ చేశారు. తరగతి గదుల్లో డిజిటల్ విద్యాబోధన కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి పాఠశాలలకు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ (ఐపీపీ), స్మార్ట్ టీవీలు అందజేస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ట్యాబుల పంపిణీని నిలిపివేసింది. -
‘గురుకుల’ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్
భీమడోలు: పోలసానిపల్లి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల కళాశాలలో గురుకుల సొసైటీ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ శుక్ర వారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే కౌన్సెలింగ్కు జోన్–2 పరిధిలోని ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లాల్లోని గురుకుల బాలురు, బాలికల క ళాశాలలకు చెందిన 438 మంది ప్రిన్సిపాల్స్, జూనియర్ అధ్యాపకులు, పీజీటీలు హాజరుకానున్నారు. గురుకుల సొసైటీ సంయుక్త కార్యదర్శి ఎ.మురళీ సమక్షంలో కౌన్సెలింగ్ చేప ట్టారు. తొలిరోజు 73 మందికి బదిలీ ఉత్తర్వులు అందించారు. టీజీటీ, స్పెషల్ టీచర్లు, సూపరిండెంటెంట్, సీనియర్ అసిస్టెంట్ల కేడర్లలోని ఉద్యోగులకు మంగళవారం కౌన్సెలింగ్ జరుగనుంది. డీసీఓ బీపీ ఉమాకుమారి, ఆయా జిల్లాల డీసీఓలు పాల్గొన్నారు. ప్రైవేట్ బస్సులపై 152 కేసుల నమోదు ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని కలపర్రు టోల్గేట్ వద్ద గురువారం రాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కాంట్రాక్టు క్యారేజ్ బస్సులపై 152 కేసులు నమోదు చేసినట్టు జిల్లా ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ తెలిపారు. అలాగే రూ.5,01,500 అపరాధ రుసుం, పన్ను విధించినట్లు తెలిపారు. జిల్లాలోని వాహన తనిఖీ అధికారులను బృందాలుగా ఏర్పాటు చేసి కేసు లు నమోదు చేశామన్నారు. విశాఖ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖ మధ్య తిరిగే కాంట్రాక్టు క్యారేజ్ బస్సులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పర్మిట్ నిబంధనలను ఉ ల్లంఘించిన బస్సులపై కేసులు నమోదు చే శామన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్టీఓలు కేఎస్ఎంఎన్ కృష్ణారావు, ఎండీ మదానీ, వాహన తనిఖీ అధికారులు ఎస్.రంగనాయకులు, జి.ప్రసాదరావు, జి.స్వామి, వై.సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్పై మండిపాటు ఏలూరు (టూటౌన్): ఆపరేషన్ కగార్ ఆపా లని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాల అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ నక్సలైట్ల రహిత భారతదేశాన్ని 2026 నాటికి చూపిస్తామని చెబుతూ అడవి మీద ఆధారపడి జీవిస్తున్న గిరిజనులను అడవి నుంచి దూరంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆపరేషన్ కగార్ పేరిట అటవీ ప్రాంతంలోని విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్రంలోని మోదీ, అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెసు జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్రావు మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. పట్టణ ప్రజలపై ఆస్తి పన్ను భారం ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం పెంచిన ఆస్తి పన్ను ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నును 20 శాతం పెంచాలని నిర్ణయించి ఆ మేరకు కొలతలు వేసే సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఆస్తి పన్ను పెంచబోమని హామీ ఇచ్చిన ఇప్పుడు తుంగలో తొక్కుతున్నారన్నారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
భీమవరం (ప్రకాశంచౌక్): యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భీమవరంలోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం ప్రాంగణంలో యోగ అభ్యసన కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ప్రతిఒక్కరూ యోగాను దిన చర్యగా చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. శారీరక, మానసిక దృఢత్వానికి యోగా సంజీవని అని అన్నారు. మహిళలు తమ జీవిత భాగస్వామికి కూడా యోగాపై అవగాహన కల్పించి యోగా కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, జిల్లా లేబర్ ఆఫీసర్ ఎ.లక్ష్మీ, సాంస్కృతిక కేంద్రం అధ్యక్షుడు సుబ్బరాజు, కార్యదర్శి చెరుకువాడ సుబ్రహ్మణ్యం రాజు పాల్గొన్నారు. -
రేపు వైఎస్సార్సీపీ జిల్లా సమావేశం
సాక్షి, భీమవరం: వైఎస్సార్సీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ఆదివారం పెదఅమిరంలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలు, ఏడాది పాలనలో ప్రజలకు చేసిన వంచనకు నిరసనగా జూన్ 4న ‘వెన్నుపోటు దినం’గా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారన్నారు. సీఎం చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలు, అన్యాయాలపై ఆ రోజు నిరసన తెలపనున్నట్టు ప్రసాదరాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణపై చర్చించేందుకు ఆదివారం ఉద యం సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటుచేశామన్నారు. నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఇతర పెద్దలు సమావేశానికి హాజరువుతారన్నారు. జిల్లాలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సమన్వయ కమిటీ సభ్యులు, నేతలు హాజరుకావాలని ప్రసాదరాజు కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు వెల్లడి -
చిన్నపిల్లలపై పిచ్చి కుక్క దాడి
ద్వారకాతిరుమల: గత నాలుగు రోజుల నుంచి క్షేత్రంలోని చెరువు వీధిలో ఒక పిచ్చికుక్క పిల్లలపై దాడి చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 10 మంది పిల్లలపై ఈ కుక్క దాడి చేసి, తీవ్రంగా గాయపరచింది. శుక్రవారం సాయంత్రం చెరువు వీధిగుండా శ్రీవారి ఆలయానికి వెళుతున్న లింగపాలెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సాయిల రవి అనే భక్తుడి కుమారుడు యశ్వంత్పై ఈ కుక్క దాడి చేసింది. ఈ దాడిలో బాలుడి కాలికి తీవ్ర గాయమైంది. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానిక వైస్సార్ సీపీ నాయకుడు కొల్లిసుబ్బారావు క్షతగాత్రుడిని హుటాహుటీన పీహెచ్సీకి తరలించారు. అదేవిధంగా గ్రామానికి చెందిన గుడాల మదన్మోహన్ కుమారుడు నవదీప్పై కుక్క దాడి చేసి, కొంత దూరం ఈడ్చుకెళ్లింది. స్థానికులు వెంటపడటంతో బాలుడిని విడిచిపెట్టి పరారైంది. వెంటనే తల్లిదండ్రులు అతడిని పీహెచ్సీకి తరలించగా, వైద్య సిబ్బంది చిన్నారులకు యాంటి ర్యాబిస్ వ్యాక్సిన్ వేశారు. సమాచారం అందుకున్న డిప్యూటీ ఎంపీడీవో ఏవీ సుబ్బరాయన్ పిచ్చి కుక్కను పంచాయతీ పారిశుధ్య కార్మికులతో పట్టించి, దూర ప్రాంతానికి తరలించారు. పోక్సో కేసులో లాడ్జి యజమాని అరెస్ట్ భీమవరం: మైనర్ బాలికలను వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్న నేరంలో భీమవరం టూటౌన్ పరిధిలోని శ్రీనిధి లాడ్జి యజమాని అయితం శ్రీనివాస్ను పోక్సో కేసులో శుక్రవారం అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ జి కాళీచరణ్ చెప్పారు. ఈనెల 12న వ్యభిచారం నేరంపై బాలికలను అరెస్ట్ చేయగా వారికి రూమ్స్ అద్దెకిచ్చిన శ్రీనివాస్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చామని, 14 రోజుల రిమాండ్ విధించడంతో నరసాపురం సబ్జైలుకు తరలించినట్లు సీఐ చెప్పారు. బాలిక ఆత్మహత్యాయత్నం పెదవేగి : ప్రేమ పేరుతో లోబరుచుకుని అనంతరం నిర్లక్ష్యం చేస్తుండడంతో మనస్తాపం చెందిన మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన పెదవేగి మండలం రామచంద్రపురంలో చోటు చేసుకుంది. ఏడాది కాలంగా గ్రామానికి చెందిన యువకుడు హెచ్చు గణేష్, మైనర్ బాలిక మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది. ప్రస్తుతం ఆమెను నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఆమె ఫోన్ను గణేష్ బ్లాక్ చేయడంతో మనస్తాపానికి గురైన బాలిక శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిపై ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు పెదవేగి ఎస్సై కె రామకృష్ణ పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని మృతదేహం లభ్యం కాళ్ల: సీసలిలో గుర్తు తెలియని మృతదేహం శుక్రవారం లభ్యమైంది. వివరాల ప్రకారం సీసలి గ్రామంలో అడుగంటిన చెరువులో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు. స్థానిక వీఆర్వో సుధాకర్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి సుమారు 40 నుంచి 50 సంవత్సరాల వయస్సు ఉంటుందని, ఒంటిపై నైట్ ప్యాంటు మాత్రమే ఉండి, కుళ్లిన స్థితిలో మృతదేహం ఉందన్నారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు ఏఎస్సై వీవీఎస్ రామరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మట్టి కోసం టీడీపీలో వర్గపోరు
నూజివీడు: చెరువుల్లో మట్టిని కొల్లగొట్టి జేబులు నింపుకునేందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లుగా ఉంది. చెరువుల్లో మట్టిని తాము తోలుకోవాంటే తాము తోలుకుంటామంటూ నాయకులు పోటీ పడుతున్నారు. పలు గ్రామాల్లో మట్టి కోసం వర్గపోరు తారాస్థాయికి చేరింది. కొన్నిచోట్ల ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ మట్టితోలకాలను యథేచ్ఛగా నిర్వహిస్తుంటే మరికొన్ని చోట్ల చెరువుల్లో మట్టిని అనుమతులు లేకుండా ఎలా తోలతారని టీడీపీ నాయకులే అడ్డుకుంటున్నారు. మట్టి తవ్వకాలను అడ్డుకున్న రైతులు నూజివీడు పట్టణంలోని పెద్దచెరువులో మాజీ కౌన్సిలర్ టీడీపీ నాయకుడు వేమూరి వెంకట కృష్ణారావు ఇరిగేషన్ అధికారుల నుంచి అనుమతులు తీసుకొని మట్టి తోలకాలను శుక్రవారం చేపట్టగా అదే పెద్దచెరువు సాగునీటి సంఘం సభ్యులు, రైతులు తమ చెరువులో మట్టిని తోలడానికి వీల్లేదని మట్టిని తోలకుండా అడ్డుకున్నారు. వేమూరు వెంకట కృష్ణారావుకు ఆర్ఎస్ నెంబరు 871–3లోని ఎకరం భూమిని మెరక చేసుకొనుటకు గాను వెయ్యి క్యూబిక్ మీటర్ల మట్టిని పెద్ద చెరువు నుంచి తవ్వి తీసుకెళ్లేందుకు గాను ఇరిగేషన్ ఈఈ అనుమతి ఇచ్చారు. దీంతో మట్టి తవ్వకాలను చేపట్టగా సాగునీటి సంఘం సభ్యులు, ఆయకట్టు రైతులు అడ్డుకోవడంతో కొంతసేపు వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చెరువుకు నాలుగు చోట్ల గండ్లు పడి దాదాపు 10నెలలు గడిచినా ఇంత వరకు గండ్లు పూడ్చకుండా చెరువులో మట్టిని వేరే వాళ్లు ఎలా తవ్వుకొని తీసుకెళ్తారని రైతులు ప్రశ్నించారు. అసలు అనుమతుల కోసం దరఖాస్తు పెట్టేటప్పుడు కనీసం నీటి సంఘం అధ్యక్ష, కార్యదర్శులను సంప్రదించకుండా ఎలా మట్టిని తవ్వుతారని నిలదీశారు. సాగునీటి సంఘం సభ్యులు ట్రాక్టర్లను అడ్డుకోవడాన్ని టీడీపీకి చెందిన కొందరు మంత్రి కొలుసు పార్థసారథి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ వ్యవహారంపై మంత్రి ఎలా స్పందిస్తారోనని ఆసక్తి నెలకొంది. కొన్నంగుంటలో మట్టి అక్రమ తవ్వకాలు మండలంలోని బోర్వంచ శివారు కొన్నంగుంటలోని గోరింత చెరువులో గురువారం అర్ధరాత్రి నుంచి తెల్లవార్లూ అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగాయి. ట్రాక్టర్లలో మట్టి తరలిపోయింది. గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు మట్టి అక్రమ తవ్వకాలకు తెరలేపి ఇష్టారాజ్యంగా కొనసాగించారు. అక్రమ తోలకాలు చేస్తున్నట్లు తెలుసుకున్న బోర్వంచ పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడు హరికోటి సంగీతరావు ట్రాక్టర్లను ఆపి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని ఎందుకు తోలుతున్నారని నిలదీశారు. అయినప్పటికీ మా ఇష్టం వచ్చినట్లుగా మేము తోలతామని చెప్పి ట్రాక్టర్లలో మట్టిని అడ్డూ అదుపూ లేకుండా తెల్లవార్లు తరలించారు. ఒక వర్గం మట్టి తోలుతుంటే.. అడ్డుకుంటున్న మరో వర్గం నూజివీడు పెద్దచెరువులో మట్టితోలకాలను అడ్డుకున్న నీటి సంఘం సభ్యులు, రైతులు కొన్నంగుంటలో అర్ధరాత్రి మట్టి అక్రమ తవ్వకాలు -
థింక్ ఇండియాతో నిట్ ఎంఓయూ
తాడేపల్లిగూడెం: బెంగళూరుకు చెందిన థింక్ ఇండియా సంస్థతో ఏపీ నిట్ శుక్రవారం ఎంఓయూ చేసుకుంది. ఇన్చార్జి డైరెక్టర్ ఎన్వీ రమణరావు మాట్లాడుతూ దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐఎస్సీ, ఐఐఎం, నింహన్స్, ఎన్ఎల్ఏఐయూ వంటి విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు 2006లో ఈ థింక్ ఇండియా సంస్థను స్థాపించారన్నారు. వారి సలహాలు, సూచనలు నిట్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇంటర్న్ షిప్ చేసుకొనే వెసులుబాటు కూడా ఉందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికలు సిద్ధం చేయడం, పర్యావరణ, సాంస్కృతిక భద్రత అంశాల్లో చైతన్యం తీసుకురావడం, భారతీయ విలువల ప్రోత్సాహం, రాష్ట్ర ఐక్యత, సామాజిక సమతుల్యతను పెంచడం వంటి విషయాలను పంచుకోడానికి ఈఅవగాహన ఒప్పందం ఉపయోగపడుతుందన్నారు. నిట్ రిజిస్ట్రార్ దినేష్ రెడ్డి, ప్రొఫెసర్ రవికిరణ్ శాస్త్రి, అసోసియేట్ డీన్ రాజేశ్వరరెడ్డి, థింక్ ఇండియా రాష్ట్ర కో కన్వీనర్ ప్రణవ్ పాల్గొన్నారు. -
ఘనంగా దర్శకరత్న దాసరి వర్థంతి
పాలకొల్లు సెంట్రల్: తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా అత్యధిక చిత్రాలు తీసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించి పాలకొల్లు కీర్తిని ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేసిన సినీ దిగ్గజం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావుకే దక్కుతుందని పలువురు దాసరి అభిమానులు ఆయన సేవలను కొనియాడారు. శుక్రవారం స్థానిక గాంధీబొమ్మల సెంటర్ నందు పట్టణ నటీనట సంక్షేమ సమాఖ్య, దాసరి నారాయణరావు అభిమానుల ఆధ్వర్యంలో దాసరి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ నటీనట సంక్షేమ సమాఖ్య సభ్యులు, దాసరి అభిమానులు మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో అనేక మైలురాళ్లు దాటిన ఘనత దాసరికే సాధ్యమైందన్నారు. అలాగే పట్టణంలో మహిళా కళాశాలకు భూమి విరాళంగా ఇచ్చి విద్యాదాతగా కీర్తిని పొందారన్నారు. అలాగే పట్టణంలో గాంధీబొమ్మల సెంటర్ వద్ద రాజ్యసభ నిధులతో కాలిబాట వంతెన ఏర్పాటు ఎంతో మందికి మార్గం సుగమం చేశారన్నారు. కార్యక్రమంలో వంగా నరసింహరావు, మేడికొండ శ్రీనివాసరావు. యర్రంశెట్టి వెంకటరత్నం, కొట్టి భాస్కరరావు పాల్గొన్నారు. -
పొగాకు బారిన పడవద్దు
పొగాకు వాడకం వల్ల ప్రజల జీవితాలు నాశనం చేసుకొంటున్నారు. ప్రధానంగా నోటి, స్వరపేటిక, ఊపిరితిత్తులు, క్లోమగ్రంధి, మూత్రాశయ కేన్సర్లు సంభవిస్తాయి. గుండె పోటుతో అకాల మరణాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. జిల్లా సర్వజన ఆస్పత్రిలో పొగాకు విరమణ వైద్యశాల(టీసీసీ) అందుబాటులో ఉంది. పొగాకు ఉత్పత్తులకు అందరూ దూరంగా ఉండండి. – డాక్టర్ ఆర్.మాలిని, జిల్లా వైద్యాధికారి, ఏలూరు పీల్చడమూ ప్రమాదమే సిగిరెట్లులను కాల్చడమే కాదు.. ఆ పొగను పీల్చినా ప్రమాదమే. కొందరు సరదాగా పొగాకునకు అలవాటు పడి వ్యసనపరులుగా మారుతున్నారు. ప్రధానంగా యువత వీటికి ఆకర్షితులవుతున్నారు. గుండె పోటు మరణాల్లో ధూమపానం అలవాటు ఉన్నవారే ఎక్కువగా ఉంటున్నారు. పొగాకు రహిత సమాజానికి అందరూ సహకరించాలి. – డాక్టర్ నరేంద్ర, ప్రొగ్రాం ఆఫీసర్, ఎన్సీడీ, ఏలూరు వ్యసనపరుల్లో మార్పు ఏలూరు సర్వజన ఆస్పత్రిలో టొబోకో ససైషన్ క్లీనిక్(టీసీసీ) అందుబాటులో ఉంది. ఈ సెంటర్లో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 5 వేల మందికి వైద్య సేవలు అందించాం. వ్యసనపరులకు నికోటివ్ రీప్లేస్మెంట్ థెరపీని అందిస్తున్నాం. పూర్తిగా పొగాకు మానివేసిన వాళ్లను ఆరు నెలల వరకు పరిశీలిస్తున్నాం. ధూమపానానికి అలవాటు పడిన వారిని టీసీసీ ద్వారా మామూలు స్థితికి తీసుకొస్తున్నాం. – కె.చిన వీర్రాజు, సైకాలజిస్టు, గవర్నమెంట్ జనరల్ హాస్పటల్, ఏలూరు -
చట్టాన్ని ఎమ్మెల్యేలు హైజాక్ చేస్తున్నారు
ఏలూరు (టూటౌన్): పంచాయతీరాజ్ చట్టాన్ని ఎమ్మెల్యేలు హైజాక్ చేస్తూ సర్పంచ్ల విధులు, హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ సర్పంచ్ల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994 పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకుని ఏలూరు ఎన్ఆర్పేటలోని కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు అధికారులను అడ్డంపెట్టుకుని పంచాయతీల్లో సర్పంచ్లకు ఉన్న హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. పంచాయతీ రాజ్ చట్టాన్ని సక్రమంగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సర్పంచ్ చిలకా సుబ్బారావు, నాయకులు నూకపెయ్యి కార్తీక్, కనికెళ్ళ రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన నూజివీడు: ట్రిపుల్ ఐటీల్లో 2025–26 విద్యాసంవత్సరానికి ప్రవేశాల్లో భాగంగా ప్రత్యేక కేటగిరి సీట్ల భర్తీకి గాను ఆయా కేటగిరికి చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మూడోరోజు శుక్రవారం నిర్వహించారు. దీనిలో భాగంగా స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ నందు వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగా క్రీడా కోటాకు సంబంధించి 467మందికి గాను 344 మంది, ఎన్సీసీ కోటాకు సంబంధించి 452 మందికి గాను 354 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ప్రొఫెసర్ ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు, ఏఆర్ అర్జునరావు పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 31న ఎన్సీసీ కేటగిరికి చెందిన 661మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ఉండి: ద్విచక్రవాహనం అదుపు తప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉండిలో గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం ఆకివీడుకు చెందిన షేక్ రియాజ్ (41) స్థానిక క్రికెటర్. అతను ఓ ప్రైవేటు హాస్పిటల్లో మెడికల్షాపు ఇన్చార్జ్గా పనిచేయడంతోపాటు, క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నాడు. గురువారం అండర్–19 క్రికెట్ సెలక్షన్స్ గురించి మాట్లాడేందుకు ద్విచక్రవాహనంపై భీమవరంలో వెళ్లిన అతను తిరిగి అర్థఽరాత్రి 1.30 గంటలకు ఆకివీడు వస్తుండగా ఉండిలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కరెంటుస్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిక భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. షేక్ రియాజ్ భార్య పర్విన్ ఫిర్యాదు మేరకు ఏఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పొగ.. ఆరోగ్యానికి సెగ
కై కలూరు: పొగాకు వినియోగదారులు వ్యసన చక్రంలో బందీ అవుతున్నారు. పొగాకును ఏ రూపంలో తీసుకున్నా ప్రమాదమే. దీని వల్ల గొంతు కేన్సర్, ఉపిరితిత్తుల వ్యాధులు, గుండెపోటు వంటి సమస్యలు దాపరిస్తున్నాయి. పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఏటా మే 31వ తేదీన ధూమపాన రహిత దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘పొగాకు ఉత్పత్తుల ఆకర్షణలు తగ్గించడం’ అనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కలిగిస్తున్నారు. ఏలూరు జిల్లాలో డీఎంహెచ్వో కార్యాలయంలో పొగాకు వినియోగ అనర్థాలపై శనివారం అవగాహన కలిగించనున్నారు. ఆకర్షితులవుతున్న యువత యుక్తవయస్సులో సిగరెట్కు యువత ఆకర్షితులవుతున్నారు. పొగాకు ఉత్పత్తుల్లో నికోటిన్ ఆనే పదార్థం ఉంటుంది. అందువల్ల వ్యసనం నుంచి త్వరగా బయట పడలేకపోతున్నారు. విద్యార్థి దశ నుంచి కొంతమంది ఫ్యాషన్గా సిగిరెట్కు అలవాటు పడుతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా ధూమపానం వల్ల పురుషులు, సీ్త్రలలో సంతానోత్పత్తి సమస్యలు వస్తున్నాయి. కేన్సర్ల ముప్పు.. సిగిరెట్, బీడి, చుట్టా, జరదా, గుట్కా, తంబాకు వంటి పొగాకు ఉత్పత్తులకు ప్రజలు బానిసలై విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వీటి బారిన పడిన వారికి తల, మెడ, నోరు, ఉపిరితిత్తులు, రక్త, మూత్రపిండాలు, ఫ్లీహము, పేగు, మూత్రసంచి, గర్భాశయ కేన్సర్లు కలుగుతున్నాయి. అదే విధంగా పక్షవాతము, అంధత్వము, చిగురు వాపు, గుండె వ్యాధులు, నిమ్ము, ఆయాసం, రక్తనాళాలు గట్టిపడటం, సంతానోత్పత్తి తగ్గిపోవడం, ఎముకలు బలహీనపడుట వంటి దీర్ఘకాలిక వ్యాధులతో శరీరంలో ప్రతి అవయవం దెబ్బతింటోంది. పొగాకు వల్ల ప్రపంచంలో ప్రతి ఏటా 8 మిలియన్లు పైగా మరణాలు సంభవిస్తున్నాయని అంచనా. జిల్లాలో 2,354 మంది వ్యాధిగ్రస్తులు ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 2,354 మంది పొగాకును వివిధ రూపాల్లో ఉపయోగించిన వ్యాధిగ్రస్తులను గుర్తించారు. వ్యసనపరులకు ఏలూరు సర్వజన ఆస్పత్రిలో రూం నంబరు 15లో టొబోకో ససైషన్ వైద్యశాల(టీసీసీ)లో చికిత్స అందిస్తున్నారు. మొత్తం వ్యాధిగ్రస్తులలో 146 మంది పూర్తిగా కోలుకున్నారు. మరో 955 మంది కోలుకునే దశలో ఉన్నారు. వ్యసనపరులకు వైద్యులు నికోటీవ్ రీప్లేస్మెంట్ థెరఫీతో వ్యసనాన్ని తగ్గిస్తున్నారు. కార్భన్ మోనాకై ్సడ్ అనలైజర్ అనే పరికరం ద్వారా రక్తంలో లెవల్స్ను పరీక్షించి, అనంతరం సైకాలజిస్టుతో కౌన్సిలింగ్ థెరిఫీ అందిస్తున్నారు. నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జిల్లాలో పొగాకు సంబంధ వ్యాధిగస్తులు 2,354 మంది వ్యసనపరులకు టీసీసీ సెంటర్ ద్వారా వైద్య చికిత్స -
చెరుకువాడలో ఆగని మట్టి రవాణా
ఉండి: చెరుకువాడలో మట్టి అక్రమ రవాణా ఆగడం లేదు. మాకు అడ్డు చెప్పేది ఎవరు.. మమ్మల్ని ఆపేది ఎవరు అన్నట్టుంది ఇక్కడి వ్యవహారం. ఒకవేళ గ్రామస్థాయి అధికారులు అడ్డుకుంటున్నా వారిపై మండలస్థాయి అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తుండడంతో మట్టి అక్రమ రవాణాను ఆపడం సాధ్యం కావడం లేదు. మట్టి యథేచ్ఛగా తరలిస్తుండడంతో ప్రజలు ఫిర్యాదు చేస్తున్నా ఉన్నత అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. శుక్రవారం చెరుకువాడ శివారు అర్తమూరు రోడ్డులో డంపింగ్ చేసి భధ్రపరచుకున్న మట్టిని పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో రవాణా చేశారు. దీనిపై ప్రజల ఫిర్యాదుతో క్షేత్రస్థాయికి వెళ్లాల్సిన గ్రామాధికారి తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. కారణం ఒకవైపు ప్రజలు, మరోవైపు మండలాధికారుల సహకారం లేకపోవడంతో కిందిస్థాయి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 19న చెరుకువాడ మీదుగా పెద్ద ఎత్తున వెళుతున్న మట్టి ట్రాక్టర్లను స్థానికులు అడ్డుకుని అధికారులు వచ్చి సమాధానం చెబితేనే గాని వదిలిపెట్టమంటూ పట్టుబట్టారు. దీంతో ఆ ఒక్కరోజు మాత్రమే మట్టి రవాణా ను అడ్డుకున్న అధికారులు ఆ తరువాత నుంచి పట్టించుకోలేదు. దీంతో మట్టి అక్రమ రవాణాదారుల నుంచి ఉన్నత అధికారులకు ఏ స్థాయిలో తాయిలాలు అందుతున్నాయో అంటూ ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. దీంతో ప్రజలు మళ్లీ మట్టి ట్రాక్టర్లను అడ్డుకునేందుకు సమాయత్తం కాగా అధికారులు వాటిని నిలుపుదల చేశామని చెప్పారు. -
సోలాపూర్లో యాత్రికుల లగేజీ దోపిడీ
ఏలూరు: టి.నరసాపురం మండలం మక్కినవారిగూడానికి చెందిన యాత్రికులు సోలాపూర్ సమీపంలో దోపిడీకి గురయ్యారు. యాత్రికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మక్కినవారిగూడానికి చెందిన 24మంది ఈ నెల 27న రైలులో షిర్డీ వెళ్లారు. 29వ తేదీ రాత్రి షిర్డీ నుంచి సోలాపూర్కు చెందిన శివ్బాబా ట్రావెల్స్ బస్సును మాట్లాడుకుని బస్సులో సోలాపూర్ బయలుదేరారు. వారి లగేజీ బ్యాగ్లను బస్సు డిక్కీలో ఉంచారు. 30వ తేదీ ఉదయం సోలాపూర్లో బస్సు దిగి డిక్కీ తెరిచి చూడగా, డిక్కీలో పెట్టిన దాదాపు 24 మందికి చెందిన బ్యాగులు మాయమయ్యాయి. వాటిలో దాదాపు విలువైన బట్టలతో పాటు రూ. 70 వేల నగదు ఉంటుందని యాత్రికులు తెలిపారు. బస్సు ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో డ్రైవర్ పలు చోట్ల ఆపి కిందకు దిగినట్లు యాత్రికులు చెబుతున్నారు. దీంతో బస్సును సోలాపూర్లో పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి యాత్రికులు ఆందోళన చేశారు. ఈ ఘటనపై మక్కినవారిగూడెంకు చెందిన దొంతు లక్ష్మీనారాయణతో పాటు మరికొందరు కలిసి ఫిర్యాదు చేశారు. సాయంత్రానికి పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని యాత్రికులకు ఇచ్చారు. యాత్రికులంతా సోలాపూర్ చుట్టుపక్కల పర్యటించి జూన్ 1వ తేదీన 8 గంటలకు సోలాపూర్ నుంచి విజయవాడకు రైలు ఎక్కాల్సి ఉంది. రిజర్వేషన్ టిక్కెట్లు సైతం ఆ బ్యాగ్లోనే ఉన్నాయని, తిరుగు ప్రయాణానికి తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని యాత్రికులు తెలిపారు. -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికులకు ఉపాధి కల్పించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని ఉల్లిపాయల మార్కెట్ వర్కర్స్ తరఫున గురువారం విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతుగా ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, బంకూరు నాగేశ్వరరావు, దూలం ప్రసాద్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ ఆలోచనలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని, రాష్ట్రంలో ఏకై క పెద్ద పరిశ్రమలో వేలాది మంది కార్మికుల ఉపాధిని దెబ్బ కొట్టడం దారుణమన్నారు. పరిశ్రమకు నిధులు కేటాయించాలని, తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, పరిశ్రమను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉక్కు పరిశ్రమపై ఎటువంటి మాటలు మాట్లాడకపోవడం శోచనీయం అన్నారు. చల్లా చంద్రరావు, బర్ల బాలాజీ, బి.శివ తదితరులు పాల్గొన్నారు. -
కొల్లేరులో అక్రమ తవ్వకాలు
సాక్షి టాస్క్ఫోర్స్: కొల్లేరు అభయారణ్యంలో ఫారెస్ట్ అధికారుల కళ్లు కప్పి గుట్టుచప్పుడు కాకుండా అక్రమ చెరువుల తవ్వకానికి అక్రమార్కులు మరోసారి తెర తీశారు. గురువారం ఏలూరు రూరల్ మండలం మానూరు శివారు హరిపురంలో చెరువు గట్లు ఏర్పాటుచేశారు. కొల్లేరులో చెరువులు తవ్వటానికి అనుమతి లేదని తెలిసినా పనులు ప్రారంభించారు. విషయం తెలిసిన ఫారెస్ట్ అధికారులు ఇక్కడకు చేరుకుని గట్లను యంత్రాలతో ధ్వంసం చేశారు. అయితే గట్లు ఎవరూ వేశారన్నది తెలియదన్నారు. కొల్లేరులో జీఓ 120కు వ్యతిరేకంగా చెరువులు తవ్వితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గిట్టుబాటు ధర కల్పించాలి దెందులూరు: నిమ్మకాయలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం రామారావుగూడెంలో నిమ్మ తోటలను ఆయన పరిశీలించారు. నిమ్మ ధరలు తగ్గిపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ మాట్లాడుతూ నిమ్మకాయల సీజన్లో ధరలు తగ్గడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఆస్పత్రిలో పనిచేయని ఫ్రీజర్ నూజివీడు: నూజివీడు ఏరియా ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో ఏడాదిగా ఫ్రీజర్ పనిచేయడం లేదు. దీంతో అద్దె ఫ్రీజర్ను ఏర్పాటుచేశారు. అయితే అద్దె రోజుకు రూ.5 వేలను మృతదేహానికి సంబంధించిన వారే చెల్లించాల్సి వస్తుంది. అసలే కుటుంబసభ్యులు బాధలో ఉండగా వారితో అద్దె కట్టించడం దారుణమని, పాడైపోయిన ఫ్రీజర్కు మరమ్మతులు చేయించడం లేదా కొత్త ఫ్రీజర్ను ఏర్పాటుచేయడం చేయాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. సహకార సంఘాలు రిటర్నులు దాఖలు చేయాలి ఏలూరు (ఆర్ఆర్పేట): సహకార సంఘాలు, సేవా సంఘాలు ఆదాయ పన్ను శాఖకు క్రమం తప్పకుండా రిటర్నులు దాఖలు చేయాలని ఆ దాయ పన్నుశాఖ జాయింట్ కమిషనర్ ప్రతాప్ సింగ్ భూక్యా సూచించారు. గురువారం స్థాని క డీసీఎంఎస్ హాల్లో జిల్లా కో–ఆపరేటివ్ సొసైటీలు రిటర్నుల దాఖలుపై జిల్లా కో–ఆపరేటివ్ కార్యదర్శులు, పర్సన్ ఇన్చార్జిలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదాయపన్ను శాఖ లాగిన్ ద్వారానే రిటర్నులు దాఖలు చేయాలన్నారు. జిల్లా సహకార శాఖ అధికారి ఆరిమిల్లి శ్రీనివాసు మాట్లాడుతూ జిల్లాలో సొసైటీలన్నీ ఆడిటర్ను సంప్రదిచి రిటర్నులు దాఖలు చేయాలని సూచించారు. ఏలూరు ఆదాయ పన్ను శాఖ అధికారి షేక్ అబ్దుల్ ఖయాం, డివిజనల్ కో– ఆపరేటివ్ అధికారి పి.త్రినాథ్, ఆడి టర్ ఆర్.రాధాకృష్ణ పాల్గొన్నారు. వెదురు సాగుకు సన్నాహాలు బుట్టాయగూడెం: డ్వాక్రా సంఘాల మహిళల ద్వారా వెదురు సాగును ప్రోత్సహించి తద్వారా వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నట్టు మానవ వనరుల అభివృద్ధి పథకం జిల్లా అసిస్టెంట్ మేనేజర్ ఈ.వేణుగోపాల్ తెలిపారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో డ్వాక్రా సంఘాల వీఓఏలకు వెదురు సాగుపై శిక్షణ ఇచ్చారు. వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లాలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాలను వెదు రు సాగుకు పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేశామన్నారు. 500 గ్రామ సంఘాల సభ్యులను ఎంపిక చేసి ఒక్కొక్కరూ 35 సెంట్లలో వెదురు సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. కుటుంబం ఆత్మహత్యాయత్నం జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంలో ఓ కు టుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణానికి చెందిన మంగిన సత్య దుర్గ చంద్రరరావు (చంద్రం), భార్య కృష్ణజ్యోతి, కుమారుడు దుర్గాచరణ్, కు మార్తె కోమలి గురువారం కూల్డ్రింక్లో కలు పు మందు కలిపి తాగారు. చుట్టుపక్కల వారు గమనించి స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి వీరిని మె రుగైన వైద్యం కోసం విజయవాడ తరలించా రు. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు కారణంగా తె లుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నూరు శాతం క్షయ నివారణ లక్ష్యం
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో నూరు శాతం క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టర్ అధ్యక్షతన టీబీ ఫోరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం కింద ఎవరైనా టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకుని ‘నిక్షయ్ మిత్ర’గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరారు. టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం నిమిత్తం నెలకు రూ.600ల విలువైన పోషకాహారం అందజేయాల్సి ఉంటుందన్నారు. తాను కూడా నిక్షయ మిత్ర కింద 25 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు దత్తత తీసుకుని ఆహారాన్ని అందిస్తానని ప్రకటించారు. అనంతరం క్షయ వ్యాధి లక్షణాలపై రూపొందించిన వాల్పోస్టర్లు ఆవిష్కరించారు. డీఎంహెచ్ఓ జి.గీతాబాయి, అడిషనల్ డీఎంహెచ్ఓ బి.భానునాయక్, డీసీహెచ్ఎస్ పి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల.. ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆర్థిక పురోభివృద్ధికి, సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ నాగరాణి తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగిన దాడులకు సంబంధించి నమోదైన కేసులపై విచారణ వేగవంతం చేయాలని, బాధితులకు సత్వర న్యాయం అందించాలన్నారు. యోగాంధ్రకు ప్రణాళిక భీమవరం: జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు భారీ ప్రణాళిక అమలు చేస్తున్నట్టు కలెక్టర్ నాగరాణి తెలిపారు. భీమవరం అల్లూరి సీతారామరాజు స్మృతివనంలో యోగా శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్రపై గ్రామ, మండల, జిల్లాస్థాయిలో విస్తృత అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడానికి కమిటీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. -
సినిమా థియేటర్లలో తనిఖీలు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లావ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు థియేటర్లను పరిశీలిస్తున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో థియేటర్లను గురువారం రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. థియేటర్ల నిర్వహణ, ప్రజలకు సౌకర్యాల ఏర్పాటు, క్యాంటిన్లలో ధరలు తదితర అంశాలు, రికార్డులను పరిశీలించారు. ఏలూరులో అంబికా థియేటర్, సాయి బాలా జీ థియేటర్, సత్యనారాయణ థియేటర్లలో తహ సీల్దార్ జీవీ శేషగిరి తనిఖీ చేశారు. ఓ థియేటర్లోని క్యాంటిన్లో కూల్ డ్రింకులు, వాటర్ బాటిల్స్ అధి క ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. జంగారెడ్డిగూడెంలో థియేటర్లను అక్కడి తహసీల్దార్ తనిఖీ చేశారు. కై కలూరులో విజయలక్ష్మి, వెంకటరమణ థియేటర్లను తహసీల్దార్ ఎండీ ఇబ్రహీం, భీమ డోలులో శ్రీనివాసా ఽథియేటర్ను తహసీల్దార్ ర మాదేవి తనిఖీ చేశారు. బంద్ పిలుపు కారణంగానే.. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఎగ్జిబిటర్లు నిర్మాతలతో సమావేశమై థియేటర్ల నిర్వహణపై పలు నిర్ణ యాలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా థియేటర్లలో ప్రదర్శనలు అద్దె ప్రాతిపదికన కాకుండా సినిమాకు వచ్చే లాభాల ప్రాతిపదికన ఉండాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అలా లాభాల్లో వాటా ఇవ్వని పరిస్థితి వస్తే థియేటర్లను జూన్ 1 నుంచి మూసివేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అలాగే కొత్త సినిమా రిలీజైన వెంటనే ఓటీటీల్లో రిలీజ్ చేయకుండా చూడాలని నిర్మాతల ము ందుకు ప్రతిపాదనలు తీసుకువచ్చినట్టు తెలిసింది. అయితే ఆయా నిర్ణయాల వెనుక కుట్రకోణం ఉందని ఉప ముఖ్యమంత్రి భావించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో థియేటర్ల తనిఖీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు పలువురు ఎగ్జిబిటర్లు విమర్శిస్తున్నారు. ఇదంతా కేవలం కక్ష సాధింపు చర్యగానే పరిగణిస్తున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ప్రముఖ ఎగ్జిబిటర్ స్పష్టం చేశారు. జిల్లాలో 42 థియేటర్లు జిల్లాలో గతంలో 90 థియేటర్లు ఉండగా ప్రస్తుతం 42 థియేటర్లు నడుస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా ఏలూరులో 15, చింతలపూడిలో 9, నూజివీడులో 5, ఉంగుటూరులో 6, కై కలూరులో 4, పోలవరంలో 3 థియేటర్లలో సినిమాలు ప్రదర్శిస్తున్నారు. బంద్ పిలుపే తనిఖీలకు కారణమంటున్న ఎగ్జిబిటర్లు ఏలూరు జిల్లాలో 42 థియేటర్లు నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న అధికారులు బంద్ విరమించారు సినీ పరిశ్రమలో ఎగ్జిబిటర్ల పాత్ర ఎంతో కీలకం. ఇటీవల థియేటర్ల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. నిర్వహణ వ్యయం కూడా రాని పరిస్థితి. దీంతో ఎగ్జిబిటర్లు బంద్ నిర్ణయం తీసుకున్నారు. అయితే పరిశ్రమ పెద్దలు మధ్యవర్తిత్వంతో తెలుగు చిత్రసీమ ప్రయోజనాల కోసం వారు బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. – అంబికా కృష్ణ, సినీ నిర్మాత, ఏలూరు నిర్వహణ సంతృప్తికరం ఏలూరులో థియేటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాం. ఒకటి రెండు అంశాలు తప్ప అంతా సంతృప్తికరంగా ఉంది. కొన్ని థియేటర్లలోని క్యాంటిన్లలో అధిక ధరలకు కూల్డ్రింక్లు విక్రయంచడాన్ని గుర్తించాం. దీనిపై నిర్వాహకులను హెచ్చరించాం. ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. – జీవీ శేషగిరి, ఏలూరు తహసీల్దార్ -
ఇబ్బందులు పెరిగాయి
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నుంచి రేషన్ సరుకులు ఇంటి వద్దనే తీసుకుంటున్నాం. అయితే వచ్చేనెల నుంచి రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సి రానుంది. ఇంట్లోని మగవారు పనిమానుకుని రేషన్ సరుకుల కోసం షాపులకు వెళ్లాల్సిందే. కూటమి ప్రభుత్వంలో పథకాలు మెరుగుపడతాయని అనుకుంటే ఇబ్బందులు పెరుగుతున్నాయి. – కోరం లలిత, గంగడుపాలెం, యలమంచిలి మండలం మా పొట్టకొట్టారు ఎన్నికల సమయంలో కూటమి నాయకులు వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, జీతం రూ.10 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. తీరా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వలంటీర్ వ్యవస్థను రద్దు చేసి నాలాంటి నిరుద్యోగుల పొట్టకొట్టారు. మాకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపకుండా తొలగించేశారు. ఎన్నికల వాగ్దానాన్ని ప్రభుత్వం అమలుచేయాలి. – రాంబాలపు పరమేష్, గ్రామ వలంటీర్, అత్తిలి ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి గత నాలుగేళ్లుగా మొబైల్ వాహనంపై ప్రజలకు ఎంతో కష్టపడి ఇంటింటికీ వెళ్లి రేషన్ సరుకులు అందజేస్తున్నాం. దానిమీద బతికే వాళ్లం ఇప్పుడు హఠాత్తుగా మమ్మల్ని తొలగిస్తే మా కుటుంబాలు ఎలా బతకాలి. ఎండీయూ ఆపరేటర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ప్రభుత్వం వెంటనే చూపాలి. – యామల ఆంజనేయులు, ఎండీయూ ఆపరేటర్, శృంగవక్షం ● -
గడపను వీడిన సేవలు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన పేదింటి తలుపు తట్టింది.. ఇంటికే పింఛన్, జగనన్న ఆరోగ్య సురక్ష, గడపగడపకూ మన ప్రభుత్వం, జగనన్న సురక్ష, ఫ్యామిలీ డాక్టర్.. ఇలా కార్యక్రమం ఏదైనా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగాన్ని ప్రజల చెంతకు చేర్చింది. గతంలో కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కాని పనులను ప్రజలు గడప దాటకుండానే చేసి చూపించింది. ఇదంతా గతం.. ప్రభుత్వం మారింది.. పాలన మారింది.. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన ఏడాదిలోనే గడప చెంతకొచ్చే ఎన్నో సేవలకు మంగళం పాడింది. సాక్షి, భీమవరం: ఆరేళ్లకు పూర్వం ఏ పథకం అందాలన్న జన్మభూమి కమిటీలను ఆశ్రయించాల్సిందే. ఏ సర్టిఫికెట్ కావాలన్నా, ప్రభుత్వ పథకం పొందాలన్నా రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. ఎమ్మెల్యేలు, మంత్రులను కలవడమంటే సామాన్యులకు గగనమయ్యేది. పింఛన్ల కోసం వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు వర్ణనాతీతం. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను కొత్త పుంతలు తొక్కించారు. జిల్లాలో 535 సచివాలయాలు, 8,616 మంది వలంటీర్లతో పాలనను ప్రజలకు చేరువ చేశారు. కులమత వర్గాలు, రాజకీయాలకు అతీతంగా, అవినీతి అక్రమాలకు తావులేకుండా పథకాల అమలులో ఈ వ్యవస్థలు పారదర్శకంగా పనిచేశాయి. ప్రతి నెలా ఇంటి వద్దకే పింఛన్లు అందించడంతో పాటు అనారోగ్యంతో ఇతర రాష్ట్రాల్లో చికిత్స పొందుతున్న లబ్ధిదారుల చెంతకు సైతం వెళ్లి ప్రభుత్వ సాయాన్ని అందజేసేవారు. రేషన్ సరుకుల కోసం కిలోమీటర్ల దూరం వెళ్లి దుకాణాల వద్ద పడిగాపులు పడాల్సిన పనిలేకుండా మొబైల్ (ఎండీయూ) వాహనాలను తెచ్చారు. జిల్లాలోని 356 రేషన్ వాహనాల ద్వారా 5,67,671 మంది కార్డుదారులకు ఇంటి వద్దకే వచ్చి సరుకులు అందించేవారు. ఫ్యామిలీ డాక్టర్తో చేరువ ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేశారు. జిల్లాలోని 20 మండలాల్లోని 41 పీహెచ్సీల పరిధిలోని 366 విలేజ్ హెల్త్ క్లినిక్ (వీహెచ్సీ)ల ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వైద్యసేవలు అందించారు. వైద్యులు ఇళ్ల వద్ద మంచానికే పరిమితమైన రోగుల చెంతకు సైతం వెళ్లి వైద్యసేవలు అందించేవారు. ‘గడపగడపకూ’తో సత్వర పరిష్కారం గతంలో ఎన్నడూ లేనివిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునేలా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలుచేశారు. సమస్యల పరిష్కారం కోసం సచివాలయానికి రూ.20 లక్షలకు పైగా నిధులు మంజూరు చేశారు. జిల్లాలో రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు, విద్యుత్ తదితర రూ.83 కోట్ల విలువైన 1,836 పనులు గుర్తించి ఆయా సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం కృషి చేసింది.కూటమి పాలనలో ఇంటింటికీ సేవలకు మంగళం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేసిన వలంటీర్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టడం ద్వారా గడప చెంతకే సేవలకు మంగళం పాడింది. పింఛన్ల కోసం పేదలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీని రద్దు చేసి మళ్లీ పాత పద్ధతిలో వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితిని తెచ్చింది. పేదలకు వైద్య భరోసా కల్పించిన ఆరోగ్య సురక్ష శిబిరాల నిర్వహణను పక్కన పెట్టేసింది. మొన్నటివరకు తమ సమీప ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ వైద్యసేవల్ని ఉచితంగా పొందిన గ్రామీణ ప్రాంత ప్రజలు ఇప్పుడు వాటి కోసం వ్యయప్రయాసల కోర్చి పట్టణాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఫ్యామిలీ డాక్టర్ పత్తాలేకుండా పోయారు. పేదలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేసి కళ్లజోళ్లను అందజేసే ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాలు సైతం మూతపడ్డాయి. ఏడాది పాలనలోనే ప్రభుత్వ సేవలు కోసం ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నాడు సంక్షేమం.. నేడు సంక్షామం పేదింటి తలుపు తట్టిన జగన్ ప్రభుత్వం ఇంటి వద్దకే పథకాలు, వైద్య సేవలురేషన్ సరుకులు, సర్టిఫికెట్లు ‘గడపగడపకు మన ప్రభుత్వం’తో సమస్యల పరిష్కారం ప్రజలకు ఈ సేవలను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థ తొలగింపు పత్తాలేని ‘ఫ్యామిలీ డాక్టర్’ రేషన్ సరుకుల డోర్ డెలివరీ వ్యవస్థ రద్దు గతంలో సర్టిఫికెట్ల జారీ సులభతరం ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అమలుచేశారు. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు జిల్లాలోని 6.45 లక్షల కుటుంబాలను సర్వే చేసి వారి అవసరాలను గుర్తించారు. 6,05,780 మంది లబ్ధిదారులకు ఎలాంటి సర్వీస్ చార్జ్ లేకుండా కొద్దిరోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో జనన, మరణ, ఆదాయ, కుల తదితర 6,48,807 సర్టిఫికెట్లు జారీ చేశారు. ప్రజారోగ్యమే పరమావధిగా.. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించారు. 264 మంది స్పెషలిస్ట్ వైద్యులు, 182 మంది మెడికల్ ఆఫీసర్లు, ఇతర ఆరోగ్య సిబ్బందితో జిల్లావ్యాప్తంగా 447 వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు. 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచి 3.54 లక్షల మంది పేదలకు అవసరమైన వైద్య సాయం అందించారు. -
రజకుల చెరువులను సర్వే చేసి హద్దులు నిర్ణయించాలి
జంగారెడ్డిగూడెం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అనేక మండలాల్లో రజకుల చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని, దీంతో రజక వృత్తికి ఆటంకం ఏర్పడుతుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రజకజన సంఘ అధ్యక్షుడు, రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రజక చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట పడాలంటే చెరువులను సర్వేయర్లతో సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గురువారం జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో ఆక్రమణలకు గురైన చెరువులను రజక సంఘాలతో కలిసి పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో రజకులకు సుమారు 50 ఏళ్ల క్రితం కేటాయిచిన 3.11 ఎకరాల కోనేరు చెరువు ఆక్రమణలకు గురవ్వడంతో రజక వృత్తి చేసుకునేందుకు రజకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై గ్రామ కార్యదర్శి నాగేశ్వరరావుతో మాట్లాడగా చెరువుని రజకులకు ఉపయోగపడే విధంగా చేస్తామని తెలిపారన్నారు. అలాగే చెరువులో సరిగా నీరు లేనందున లీజు రూ. 11వేలు రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా రజక సంఘ మహిళా అధ్యక్షురాలు మెట్ట లక్ష్మీ ప్రసన్న, గ్రామ రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. -
కాలువలోకి దూసుకెళ్లిన కారు
కాళ్ల: అతివేగంతో వెళ్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన కాళ్ల మండలం కాళ్ళకూరు గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జువ్వలపాలెం వైపు నుంచి వస్తున్న కారు అదుపుతప్పి సచివాలయం ఎదుట విద్యుత్ స్తంభాన్ని కొట్టి కాలువలోకి వెళ్లింది. కారువేగం ధాటికి విద్యుత్ స్తంభం ముక్కలైంది. విద్యుత్ తీగలు ఆధారంతో స్తంభం నిలిచిందని, ప్రమాద సమయంలో కారులో చిన్నపిల్లలు కూడా ఉన్నారని స్థానికులు తెలిపారు. కారుకి బెలూన్ ఓపెన్ కావడంతో ప్రాణనష్టం జరగలేదు. చిన్న చిన్న దెబ్బలతో బయటపడిన వారిని స్థానికులు భీమవరం హాస్పిటల్కి తరలించారు. -
నేత్రపర్వం.. శివ కల్యాణం
ద్వారకాతిరుమల : క్షేత్రపాలకునిగా విరాజిల్లుతున్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం శివదేవుని కల్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుక భక్తులకు కనువిందు చేసింది. మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి, అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేశారు. ఆ తరువాత కల్యాణ తంతును ప్రారంభించి, సుముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల శివనామస్మరణల నడుమ మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను కన్నులపండువగా జరిపి, కల్యాణ మూర్తులకు హారతులిచ్చారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. జేఈఈ మెయిన్స్కు ఉచిత దీర్ఘకాలిక శిక్షణ ఏలూరు (ఆర్ఆర్పేట) : జేఈఈ మెయిన్స్లో అర్హత మార్కులు సాధించి సీట్లు సాధించలేకపోయిన పేద కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా దీర్ఘకాలిక శిక్షణ ఇప్పించాలని నిర్ణయించినట్టు స్పృహ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ తెలిపింది. ఈ మేరకు ట్రస్ట్ ప్రతినిధులు అంగులూరు సర్వేశ్వరరావు, టీటీఎఫ్ రూజ్వెల్ట్ ఏలూరులో గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కుటుంబ వార్షికాదాయం రూ.1.20 లక్షల లోపు ఉండి అత్యుత్తమ మార్కులు సాధిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు ఆ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి జూన్ 21న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నామని, అందులో ప్రతిభ చూపిన సుమారు 10 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 79816 96481, 93900 59900, 99595 07507 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ద్వారకాతిరుమలలో వర్షంతో ఇక్కట్లు ద్వారకాతిరుమల: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ప్రజలను ఇక్కట్లకు గురి చేస్తున్నాయి. ద్వారకాతిరుమలలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి తూర్పువీధిలోని డ్రెయినేజీలు పొంగిపొర్లడంతో రోడ్డుపైకి మురుగు నీరు, చెత్తాచెదారం చేరింది. కాలినడకన రాకపోకలు సాగించిన స్థానికులు, భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాగే టీటీడీ కాంప్లెక్స్ వద్ద ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. గ్రామంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరిలో గల్లంతైన మృతదేహం లభ్యం యలమంచిలి: చించినాడ వశిష్ట గోదావరి వంతెన మీద నుంచి బుధవారం గోదావరిలోకి దూకి గల్లంతైన యువకుడి మృతదేహం గురువారం లభ్యమైనట్లు ఎస్సై కె గుర్రయ్య తెలిపారు. వంతెనపై దొరికిన బైక్, సెల్ ఫోన్ ఆధారంగా అతను భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన షేక్ కాసు (24)గా గుర్తించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. చించినాడ వచ్చిన తల్లిదండ్రులు బైక్, సెల్ఫోన్ తమ కుమారుడివేనని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గోదావరిలో గాలించగా గురువారం మృతదేహం లభ్యమైంది. శవ పంచనామా చేసి, పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై వివరించారు. -
గుర్తు తెలియని వృద్ధురాలి మృతి
భీమవరం: భీమవరం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్సకు వచ్చిన వృద్ధురాలు అకస్మాత్తుగా ప్రాణాలు విడిచిన ఘటన ఇది. గుండె నొప్పితో ఎస్.జయలక్ష్మి (70) పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ నెల 25న చేరినట్లు ఉన్న కాగితంతో ప్రాంతీయ ఆసుపత్రికి బుధవారం రాత్రి 9 గంటల సమయంలో వచ్చింది. చికిత్స అందించేలోపు శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. చిరునామా, ఇతర వివరాలు చెప్పకుండానే ఆమె మృతి చెందింది. వృద్ధురాలి వివరాలు తెలిసిన వారు ఆసుపత్రి అధికారులకుగాని, పోలీసులకు గాని వివరాలు తెలియజేయాలని వన్టౌన్ పోలీసులు తెలిపారు. దాడి చేసిన వ్యక్తి అరెస్టు భీమవరం: డబ్బులు ఇస్తేనే సోడా ఇస్తానన్న దుకాణ యజమానిపై దాడి చేసిన ఉత్తరప్రదేశ్కు చెందిన బబ్లూ యాదవ్ను గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. చినరంగనిపాలెం ప్రాంతంలో సోడా కొట్టు నిర్వహిస్తున్న ఎస్.వీరవెంకట సత్యనారాయణ దగ్గరకు బేతనీపేటలో ఉంటున్న బబ్లూయాదవ్ ఈ నెల 26న వెళ్లి సోడా అడిగాడు. డబ్బులు ఇస్తేనే సోడా ఇస్తానని చెప్పగానే అతనిపై నిందితుడు దాడికి దిగాడు. అంతేకాక అతని వద్ద ఉన్న రూ. 2 వేలు లాక్కెళ్లిపోయాడు. సత్యనారాయణ పోలీసులను ఆశ్రయించగా నిందితుడిని అరెస్ట్ చేశారు. ఎస్సై ఎస్వీవీఎస్ కృష్ణాజీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రిపుల్ ఐటీలో రెండోరోజు సర్టిఫికెట్ల పరిశీలన
నూజివీడు: స్థానిక ట్రిపుల్ ఐటీలో రెండోరోజు గురువారం ప్రత్యేక కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు. దీనిలో భాగంగా సైనికోద్యోగుల పిల్లల కోటా, ఎన్సీసీ, క్రీడా, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాకు చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. క్రీడా కోటాకు సంబంధించి 245 మందికి 171 మంది, సైనికోద్యోగుల పిల్లల కోటాకు సంబంధించి 117 మందికి 79 మంది, ఎన్సీసీ కేటగిరికి సంబంధించి 341 మందికి 277 మంది, భారత్ స్కౌట్స్ గైడ్స్ కేటగిరికి సంబంధించి 247 మందికి 185 మంది హాజరయ్యారు. ఈనెల 30న ఎన్సీసీ, క్రీడా కోటా అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ప్రొఫెసర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు పర్యవేక్షించారు. భారత సైన్యం సత్తాకు ప్రతీక సిందూర్తాడేపల్లిగూడెం: దేశ రక్షణలో సైనికుల పాత్ర అమూల్యమని ఏపీ నిట్ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ రమణరావు అన్నారు. ఏపీ నిట్లో గురువారం జరిగిన తిరంగా యాత్రలో ఆయన మాట్లాడారు. భారత సైన్యం ధైర్య సాహసాలకు, త్యాగనిరతికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక అని అన్నారు. ఈ విజయం భారత జవాన్ల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. మాతృభూమి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి సైనికుడి జీవితం స్ఫూర్తిదాయకమని, విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కన్నవాళ్లకు, కుటుంబాలకు దూరంగా దేశ సరిహద్దుల్లో రాత్రి పగలూ విధులు నిర్వర్తిస్తూ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడుతున్న సైనికుల పోరాటపటిమకు సెల్యూట్ కొట్టాలన్నారు. దేశభక్తిని చాటే నినాదాలతో త్రివర్ణ పతాకాలతో విద్యార్థులతో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. రిజిస్ట్రార్ దినేష్ రెడ్డి, నిట్ అధికారులు పాల్గొన్నారు. -
ఆగడాలు భరించలేకే హతమార్చా
కొడుకును చంపిన కేసులో తండ్రి వెల్లడి జంగారెడ్డిగూడెం: కుమారుడిని హత్యచేసిన కేసులో తండ్రిని అరెస్టు చేశారు. గురువారం జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ యు.రవిచంద్ర వివరాలు వెల్లడించారు. సీతంపేటకు చెందిన కొప్పుల నాగేశ్వరరావు చికెన్షాపు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు కాగా, మృతుడు పవన్కుమార్ (24) పెద్ద కుమారుడు. డిగ్రీ చదువు మధ్యలో మానివేసి చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ప్రతిరోజు తాగి వచ్చి ఆస్తి ఇవ్వాలంటూ తండ్రి, కుటుంబసభ్యులతో గొడవ పడుతూ, 9 నెలల క్రితం హైదరాబాద్ వెళ్లిపోయాడు. మరలా తిరిగి వచ్చి డబ్బులు కావాలని, లేకపోతే తన ఆస్తి తనకివ్వాలని గొడవ పడేవాడు. ఈ క్రమంలో పవన్కుమార్ తండ్రి నాగేశ్వరరావుపై దాడి చేశాడు. దీంతో విసిగిపోయిన నాగేశ్వరరావు ఈ నెల 26న వీరన్నగుడెం గ్రామంలోని నరసయ్య చెరువు గట్టుపై తన స్నేహితుడుకి చెందిన తాటాకింటికి పవన్కుమార్ను తీసుకువెళ్లి మద్యం పట్టించి మత్తులో గొంతు కోసి హత్య చేసి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్టు చేసిన సీఐ వి.కృష్ణబాబును, ఎస్సై షేక్ జబీర్ను, ఏఎస్సై ఎన్వీ సందప్కుమార్, పీసీలు రమేష్, దిలీప్లను డీఎస్పీ అభినందించారు. రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. -
ఉపాధ్యాయులకు బదిలీ కష్టాలు
నిడమర్రు : ఉపాధ్యాయ బదిలీలు ఈనెల 22వ తేదీ నుంచి విద్యాశాఖ ప్రారంభించింది. నేటి వరకూ ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్ వేదికగా కొనసాగుతోంది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల బదిలీలు పూర్తయింది. నియామక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మిగిలిన 94 ఖాళీలకు గురువారం ఏలూరు డీఈఓ కార్యాలయంలో అర్హతగల ఎస్ఏలకు పదోన్నతులు కల్పించి గ్రేడ్–2 హెచ్ఎంలుగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించి భర్తీ చేశారు. తర్వాత పీఎస్ హెచ్ఎంలకు, స్కూల్ అసిస్టెంట్, పండింట్లకు ఆన్లైన్లోనే బదిలీల ప్రక్రియ నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ ఎస్జీటీల బదిలీల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఎస్జీటీలకు ఆఫ్లైన్లో బదిలీలు చేపడతామని పాఠశాల విద్య ఉన్నత అధికారులు ఉపాధ్యాయ సంఘాల నేతల చర్చల సమయంలో అంగీకారం తెలిపారు. దీంతో ఎస్జీటీలకు కొంత సౌలభ్యం లభించిందని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోల్లో మాత్రం అన్ని వర్గాల ఉపాధ్యాయులతోపాటు ఎస్జీటీలకు ఆన్లైన్లో బదిలీలు పూర్తయ్యేలా మార్గదర్శకాలు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి 10 వరకూ ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని 11వ తేదీన నూతన పాఠశాలల బదిలీ ఆర్డర్స్ విడుదలవుతాయంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఎస్జీటీలు గందరగోళంలో పడ్డారు. ఉన్నత అధికారుల హామీ ప్రకారం మాన్యువల్ బదిలీలే చేపట్టాలని ఎస్జీటీలు పట్టుపడుతున్నారు. కానీ అధికారులు మాన్యువల్ బదిలీల వల్ల అనేక సమస్యలు వస్తాయని ఆన్లైన్ బదిలీలే పరిష్కారం అంటూ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ విషయంపై ప్రభుత్వం ఏవిధమైన జీవో ఇంత వరకూ ఇవ్వలేదని సంఘాలు చెబుతున్నాయి. పోస్టుల ఖాళీల స్పష్టతకే ఆఫ్లైన్ జిల్లా విద్యాశాఖాథికారి కార్యాలయంలో జరిగే ఆఫ్లైన్ బదిలీల ప్రక్రియ అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని ఎస్జీటీలు అభిప్రాయపడుతున్నారు. అక్కడే ఉపాధ్యాయుడికి వచ్చిన పాయింట్ల ఆధారంగా మండలాల్లోని పాఠశాలలు ప్రదర్శిస్తారు. అక్కడ పాఠశాల వివరాలు తెలుసుకుని ఐచ్ఛికాలు ఎంపిక చేసుకుంటే. ఎక్కడికి బదిలీ అవుతుందనేది స్పష్టంగా తెలిసిపోతుంది. దీంతో అప్పటికే పోస్టులు క్లోజ్ అయిన పాఠశాలల వివరాలు ప్రదర్శిస్తుండటంతో మారాల్సిన పాఠశాలలను ఎంపిక చేసుకునే వీలుంటుంది. దీంతో ఐచ్ఛికాల ఎంపిక సంఖ్య కూడా చాలా వరకూ తగ్గిపోతుంది. తప్పులు చేసే అవకాశం ఉండదని సంఘాలు ముందు నుంచి అధికారులకు చెబుతున్నారు. మాన్యువల్ చేపడితే ఇబ్బందులు ఇలా.. తాజా బదిలీల్లో జిల్లాలో 2,861 మంది ఎస్జీటీలు బదిలీల జాబితాలో ఉన్నారు. వీరంతా ఐచ్ఛికాలు (ఆప్షన్స్) ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆన్లైన్ విధానంలో ఐచ్ఛికాలు ఎంపిక చేసుకోవడం కష్టతరంగా ఉంటుందని వీరు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా టీచర్లు, సీనియర్ టీచర్లు ఆన్లైన్ విధానం అలవాటు లేకపోవడం, కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఆప్షన్స్ ఎంపిక చేసుకునే క్రమంలో తప్పులు నమోదు చేస్తే దూరంగా పోస్టింగ్ వస్తుందని ఆందోళన వ్యక్త చేస్తున్నారు. దీంతోపాటు ఆన్లైన్ విధానంలో వందల సంఖ్యలో ఆప్షన్లు ఎంపిక చేసుకోవాల్సి వస్తుందని ఈ విధానం వల్ల కనీసం ఆయా మండలాల్లోని పాఠశాల స్థితిగతులు కూడా తెలియవని అంటున్నారు. ఎస్జీటీల బదిలీలపై స్పష్టత కరువు! ఆఫ్లైన్లో చేపడతామని అధికారుల హామీ నేటి వరకూ ఉత్తర్వులివ్వని పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్లో తప్పులు దొర్లుతాయని గురువుల ఆందోళన ఉమ్మడి జిల్లాలో బదిలీల జాబితాలో 2,861 ఎస్జీటీలు ఆఫ్లైన్ బదిలీలపై ఉత్తర్వులు ఇవ్వాలి ఉపాధ్యాయ సంఘాల నేతల చర్చల్లో విద్యాశాఖ ఉన్నత అధికారులు ఎస్జీటీలకు మాన్యువల్ బదిలీలు చేపడతామని హామీ ఇచ్చారు. కానీ ఉపాధ్యాయుల బదిలీల మార్గదర్శకాల ఉత్తర్వుల్లో ఎస్జీటీలంతా ఆన్లైన్లోనే దరఖాస్తులు, వెబ్ ఆప్షన్స్, జాయినింగ్ ఆర్డర్స్ అంటూ ఉత్తర్వులు ఇవ్వడం తగదు. వెంటనే జిల్లా కేంద్రాల్లో మాన్యువల్ బదిలీలకు ఉత్వరులు ఇవ్వాలి. – సీహెచ్ శ్రీధర్, యూటీఎఫ్ అధ్యక్షుడు, ఉంగుటూరుఆన్లైన్ వల్ల నష్టపోతున్నాం ఉంగుటూరు మండలం తల్లాపురం యూపీ స్కూల్లో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తూ 2023 చేపట్టిన ఆన్లైన్ బదిలీల్లో కుక్కునూరు మండలం కమ్మరిగుడెం ప్రాథమిక పాఠశాలకు వెళ్లాల్సి వచ్చింది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చే వరుస క్రమంలో దొర్లిన పొరపాటు కారణంగా అంత దూరం వెళ్లాల్సిన పరిస్థితి. ఆన్లైన్ బదిలీల వల్ల అనేక మంది ఎస్జీటీలు నష్టపోతున్నారు. – కె. కమల్కుమార్, ఎస్జీటీ, ఉంగుటూరు అధికారుల నుంచి స్పష్టత రావాలి ఉన్నత అధికారులు జారీ చేసిన బదిలీల ఉత్తర్వుల్లో జూన్ 7 నుంచి 10వ తేదీ వరకూ ఎస్జీటీలు ఆన్లైన్లోనే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకూ అన్ని కేటగిరి బదిలీలు, వెబ్ ఆప్షన్స్, ఆర్డర్స్ అన్నీ ఆన్లైన్లో పారదర్శకంగా జరుగుతున్నాయి. ఎస్జీటీలకు మాన్యువల్ ట్రాన్సఫర్ విషయంపై ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక సమాచారం లేదు. – ఏవీఎస్ఎస్ భాస్కరకుమార్, ఎంఈవో, నిడమర్రు -
రైతుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి
తాడేపల్లిగూడెం రూరల్ : రైతుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కే.గోపాల్ అన్నారు. గురువారం మండలంలోని పట్టెంపాలెం గ్రామంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ గోపాల్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించి రైతులు ఏ పంట వేస్తే మేలు చేకూరుతుందనే దానిపై కృషి జరగాలన్నారు. రైతులకు మేలైన వరి వంగడాలను అందించాలని, సాగులో పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి, లాభసాటిగా మార్చాలన్నారు. ఆరోగ్యకరమైన పంటలను పండించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ప్రాంతంలో కోకో ప్రొసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. స్థానిక రైతాంగానికి ఏ పంటలు అనుకూలమో శాస్త్రవేత్తలు సూచించాలన్నారు. ఐసీఏఆర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జేవీ.ప్రసాద్ మాట్లాడుతూ సాగులో నూతన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ ఎం. శేషు మాధవ్, భారతీయ ఆయిల్పామ్ పరిశోధన సంస్థ (పెదవేగి) డైరెక్టర్ డాక్టర్ కే.సురేష్, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ కేటీవీ.రమణ మాట్లాడారు. జిల్లా వ్యవసాయాధికారి జడ్. వెంకటేశ్వరరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కే.దేవానంద్, ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ బి.గోవిందరాజులు, ఏడీఏ మురళీకృష్ణ, పశు, మత్స్యశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉద్యాన వర్సిటీ ఉప కులపతి డాక్టర్ గోపాల్ -
నీకు భారం కాలేను.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో..
ఏలూరు టౌన్: అన్నింటికీ నీపై ఆధారపడుతున్నాను.. ఇక నీకు భారం కాలేను.. పిల్లల్ని జాగ్రత్తగా చూస్కోండి అంటూ భర్తకు ఫోన్లో మెసెజ్ పెట్టి ఓ వివాహిత గోదావరిలోకి దూకి తనువు చాలించింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి లాలా చెరువు స్పిన్నింగ్ మిల్లు ప్రాంతానికి చెందిన సుంకరం రామకృష్ణ, కళ్యాణి (32) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఏలూరు శాంతినగర్ 21 వ డివిజన్ సచివాలయంలో కళ్యాణి ఏఎన్ఎంగా పనిచేస్తుండడంతో ఆమె కుటుంబంతో స్థానికంగానే నివాసముంటున్నారు. రెండేళ్ల క్రితం ఆమెకు ఒక రోడ్డు ప్రమాదంలో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె సరిగా నడవలేని పరిస్థితిలో భర్తపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. ఆమె చేస్తున్న ఉద్యోగంలో, కుటుంబ జీవనంలోనూ భర్తపై ఆధారపడుతోంది. ఒకవైపు కరోనా వ్యాప్తి చెందుతుందనే భయం, మరోవైపు పని భారం పెరగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె బుధవారం ఎవరికీ చెప్పకుండా రాజమండ్రి వెళ్లింది. భర్త రామకృష్ణకు ఫోన్లో.. ప్రతి పనికి నీ మీద ఆధార పడి ఉంటున్నా.. నిన్ను ఇబ్బంది పెడుతున్నాను.. నాకు జీవితంపై విరక్తి కలిగింది.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని మెసేజ్ పెట్టింది. దీంతో ఏలూరు త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా సెల్ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేశారు. లొకేషన్ రాజమండ్రిలో చూపించగా అక్కడకు వెళ్లి వెదికారు. తీరా చూస్తే ఆమె గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై రాజమండ్రి త్రీ టౌన్ సీఐ వీ అప్పారావు ఆధ్వర్యంలో మృతదేహాన్ని రాజమండ్రి సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్తకు మెసెజ్ పెట్టి గోదావరిలో దూకి వివాహిత ఆత్మహత్య -
నాడు పల్లె వైద్యానికి పెద్దపీట
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆధునిక వసతులతో హెల్త్ క్లినిక్ల నిర్మాణం చేసింది. వైద్యుడి రూమ్, ల్యాబ్, స్థానికంగా వైద్య సిబ్బంది నివాసం ఉండేందుకు, ఇతర వసతులతో వీటి నిర్మించారు. జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి, మంచాన పట్టిన వారికి ఇంటికి వద్దకే వెళ్లి వైద్యసేవలు అందించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైద్య శిబిరాల నిర్వహణ లేకపోవడంతో వైద్యకోసం పేదలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అన్నదాతలకు అండగా ఆర్బీకేలు అన్నదాతల అండగా ఆర్బీకే వ్యవస్థను తెచ్చి సాగులో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. విత్తు నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకు రైతులకు భరోసా కల్పించారు. సబ్సిడీపై విత్తనాలు, ఎరువులతో పాటు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు, విపత్తుల సమయంలో ఇన్ఫుట్ సబ్సిడీ, బీమా పరిహారం అందించడంలో కీలకపాత్ర పోషించాయి. ఆర్బీకేలను రైతుసేవా కేంద్రాలుగా కూటమి సర్కారు మార్చింది. కొన్ని ఆర్బీకే భవనాలు ఇతర కార్యాలయాలకు వినియోగిస్తుండగా, మరికొన్ని తాళం వేసి కనిపిస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉండిలోని ఆర్బీకేను పోలీస్ స్టేషన్గా మార్చగా పాలకోడేరు సచివాలయ భవనాన్ని తహసీల్దార్ కార్యాలయంగా మార్చారు. -
పడకేసిన పల్లె పాలన
సాక్షి, భీమవరం: ప్రజల వద్దకు పాలన, సంక్షేమానికి శ్రీకారం చుడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ సేవల కోసం ప్రజలు మండల, జిల్లా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలతో పాలనను చెంతకు చేర్చారు. అన్నదాతలకు అండగా రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే), వైద్యసేవల కోసం హెల్త్ క్లినిక్లను తెచ్చింది. వాటికోసం ఊరూరా ప్రత్యేక భవన నిర్మించింది. గ్రామ స్వరాజ్యానికి ఊపిరిలూదిన ఈ వ్యవస్థల్ని కూటమి సర్కారు నిర్వీర్యం చేస్తోంది. సేవలందించలేక సచివాలయాలు అలంకార ప్రాయంగా మారాయి. ఆర్బీకేలు మూతపడుతున్నాయి. హెల్త్ క్లినిక్ల్లో వైద్యసేవలు కుంటుపడ్డాయి. ఆరేళ్ల కిందట పంచాయతీల్లో చాలావరకు సెక్రటరీ, బిల్ కలెక్టర్, అటెండర్ మాత్రమే ఉండేవారు. వివిధ పనుల నిమిత్తం ప్రజలు వ్యయప్రయాసల కోర్చి మండల కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. 2019 అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థకు జీవం పోశారు. గ్రామాల్లో రెండు వేలు, పట్టణాల్లో నాలుగు వేల జనాభా ప్రాతిపదికన జిల్లాలో 535 సచివాలయాలు ఏర్పాటు చేశారు. గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శి, ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఏఎన్ఎం, వెల్ఫేర్ అసిస్టెంట్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, అగ్రికల్చర్ అసిస్టెంట్, పశు సంవర్ధకశాఖ అసిస్టెంట్, ఉద్యానవన అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్ తదితర పోస్టులను ఏర్పాటు చేశారు. తద్వారా జిల్లాలో ఐదు వేల మందికి పైగా నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. 35 శాఖలకు చెందిన 500కు పైగా సేవలను అందుబాటులోకి తెచ్చారు. సచివాలయాలకు అనుబంధంగా 50 కుటుంబాలకు ఒక వలంటీర్ చొప్పున 8,616 మందిని నియమించారు.సచివాలయ ఉద్యోగులకు ఇక్కట్లు : కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయాలను నిర్వీర్యం చేస్తోంది. చాలావరకు సేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. వలంటీర్లను తొలగించగా, సర్వేల పేరిట సచివాలయ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ పనులు పురమాయిస్తోంది. జిల్లాలోని సచివాలయాల్లో 1,066 ఖాళీ పోస్టులు ఉండగా వాటిని భర్తీ చేయకుండా క్లస్టర్ల పేరిట ఉద్యోగులను క్రమబద్ధీకరించి మిగిలిన వారిని ఇతర శాఖల్లో భర్తీ చేసే యోచన చేస్తోంది.సొంత భవనాల నిర్మాణంగ్రామీణ వ్యవస్థల కోసం గత ప్రభుత్వం సొంత భవనాలను సమకూర్చింది. ఉద్యోగులు, ప్రజావసరాలకు అనుగుణంగా వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఒక్కో సచివాలయానికి రూ.40 లక్షలు చొప్పున జిల్లాలో 353 భవన నిర్మాణాలకు సుమారు రూ.141.2 కోట్లు మంజూరు చేసింది. వీటిలో 270 భవనాలు పూర్తి కాగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఆర్బీకేకు రూ. 22 లక్షలు చొప్పున రూ.65 కోట్ల వ్యయంతో 298 భవన నిర్మాణం చేపట్టగా గత ప్రభుత్వంలోనే 211 భవనాలను పూర్తిచేసి వినియోగంలోకి తెచ్చారు. ఒక్కో హెల్త్ క్లినిక్కు సుమారు రూ.25 లక్షల చొప్పున జిల్లాలోని రూ.53.5 కోట్లతో 214 భవనాలు చేపట్టి 96 భవనాలు పూర్తిచేసి వినియోగంలోకి తెచ్చారు. కూటమి వచ్చాక మిగిలిన వాటిని పూర్తిచేయకపోవడంతో అసంపూర్తిగా మిగిలిపోయాయి.గత ప్రభుత్వంలో పార్టీలకతీతంగా పథకాలుగత ప్రభుత్వం కుల మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించింది. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయకపోగా.. గత ప్రభుత్వంలో నిర్మించిన సచివాలయం, ఆర్బీకే భవనాల్లో ఇతర కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు.– గొంతే హరీష్, పాందువ్వ, ఉండి మండలంవైద్య సేవలు బంద్గతంలో వైద్య సేవలు ఇంటి ముందుకు వచ్చేవి. ప్రతి నెల వైద్యులు వచ్చి ఆరోగ్య పరి స్థితులను అడిగి తెలుసుకుని అవసరమైన మందులు ఇచ్చేవారు. అప్పటి మాదిరిగా ఇప్పటి ప్రభుత్వంలో వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నాం.– తామరపల్లి ముసలయ్య, పెద్దిరెడ్డిపాలెం, ఇరగవరం మండలంఇంటింటికి వైద్య సేవలు ఎక్కడ?కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్క ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయలేదు. గతంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటుతోపాటు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ వైద్య సేవలు అందించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.– చిట్టూరి లక్ష్మి, వీరవాసరంఆర్బీకేలు నిర్వీర్యంగతంలో ఆర్బీకే ద్వారానే అన్ని సేవలు అందించేవారు. ఇప్పుడు ఎలాంటి మందులు ఇవ్వడం లేదు. సమాధానం చెప్పేవారు కూడా ఉండటం లేదు. ఎరువులు, పురుగు మందులు కమిషన్ వ్యాపారి వద్ద తెచ్చుకుంటున్నాం.– సేలంశెట్టి నాగేశ్వరరావు, రైతు, ఎల్ అగ్రహారంమాది నరసాపురం మండలం సరిపల్లి గ్రామం. రెండు ఎకరాల సొంత పొలంతో పాటు మరో 3 ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నాను. దాళ్వాలో 1053 రకం సాగుచేయగా ధాన్యం కొనుగోలుకు చాలా ఇబ్బంది పెట్టారు. ఆఖరుకు క్వింటాకు మూడు కిలోలు తగ్గించి కొన్నారు. డబ్బులు ఇప్పటికీ అకౌంట్లో వేయలేదు. మళ్లీ రైతుభరోసాకు దరాఖాస్తు చేయమని చెపితే రెండు రోజుల నుంచి గ్రామంలో సచివాలయానికి తిరుగుతున్నాను. ఎవరూ సమాధానం చెప్పడంలేదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి ఇబ్బంది లేదు. వలంటీర్లు ఉండేవారు, మరోపక్క సచివాలయం, ఇంకో పక్క రైతుభరోసా కేంద్రం ఉండేది.– జొన్నాడ అప్పారావు -
మద్యం అమ్మకాలు పారదర్శకంగా జరగాలి
భీమవరం: మద్యం అమ్మకాలు పారదర్శకంగా ఆన్లైన్ ద్వారా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం భీమవరం కలెక్టరేట్లో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ అధికారులు, లిక్కర్ షాప్ యజమానులతో మద్యం సరఫరా, అమ్మ కాలు వంటి అంశాలపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ముందుగా మద్యం అమ్మకాలపై షాపు యాజమానుల ఇబ్బందులు తెలుసుకున్నారు. లిక్కర్ విక్రయాల్లో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అమ్మకాలు పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. సమీక్షలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి ఆర్ఎస్ కుమరేశ్వరన్, డిపో మేనేజర్ ఎల్.రంగారెడ్డి పాల్గొన్నారు. ఆక్వాకు పంట విరామం యలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన ఆక్వా రైతు, సొసైటీ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు పెన్మెత్స వెంకట సత్యనారాయణరాజు బుధవారం ఆక్వా క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా ఆక్వా చెరువులు సాగు చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల రొయ్య దిగుబడి బాగుంటున్నా ధర పతనం కావడం, మేతలు, మందుల ధరలు పెరిగిపోవడంతో రైతులంతా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దీంతో జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం పిలుపు మేరకు పోడూరు మండలం అప్పనచెరువు పంచాయతీ రాజులగరువులో తాను సాగు చేస్తున్న 30 ఎకరాల ఆక్వా చెరువులకు పంట విరామం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. సబ్ జైలును సందర్శించిన న్యాయమూర్తి తణుకు అర్బన్: రిమాండ్లో ఉన్న ముద్దాయిలు న్యాయవాదిని పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే మండల న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటుచేస్తామని న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ కె.రత్నప్రసాద్ అన్నారు. బుధవారం తణుకు సబ్జైలుతోపాటు మానసిక ఆస్పత్రులైన ప్రియాంక నర్సింగ్హోమ్, భవానీ నర్సింగ్ హోంను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముద్దాయిలంతా రిమాండ్ అనంతరం బెయిల్పై బయటకు వెళ్లాక తమ ప్రవర్తనలో మార్పు వచ్చేలా నడుచుకోవాలన్నా రు. జైలులో ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, ఆహారం, వసతి, వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. మానసిక ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న వైద్యసేవలపై చర్చించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నేరం భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదని ఉప జిల్లా రెవెన్యూ డివిజినల్ అధికారి కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అధ్యక్షతన గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కమిటీ సలహా సంఘం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాల్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆదేశించారు. ఆడ పిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంత ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. యోగా రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలి భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో యోగా రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని జేసీ ఆదేశించారు. బుధవారం యోగా సిటిజన్ రిజిస్ట్రేషన్న్, మాస్టర్ ట్రైనర్స్ టు ట్రైనర్స్ మ్యాపింగ్, యోగా పోటీలు, తదితర అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. -
మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
నూజివీడు: గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ధర లేక మామిడి రైతులు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పేర్కొన్నారు. దీంతో మామిడి రైతులు నష్టాల్లో కూరుకుపోయారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారాన్ని చెల్లించి మామిడి రైతులను ఆదుకోవాలన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బంగినపల్లి, తోతాపురి, రసాలు తదితర రకాలకు ధరలు దారుణంగా పడిపోయాయని, దీంతో కోతకూలి, కిరాయిలు కూడా రాని పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయన్నారు. తోతాపురి కాయలు టన్ను కేవలం రూ.3వేల నుంచి రూ.4వేలు ధర మాత్రమే ఉందని, దీంతో కాయలు కోయడానికి ఎదురు పెట్టుబడి అవుతోందని రైతులు కోతలు కూడా కోయడం లేదన్నారు. చిత్తూరు జిల్లాలో జ్యూస్ ఫ్యాక్టరీలు ఇంత వరకు తెరవకపోవడంతో తోతాపురి కాయలను కొనేవారే లేరని పేర్కొన్నారు. అకాల వర్షాల కారణంగా మామిడి రైతులు నిండా మునిగిపోయారన్నారు. పూతలు, పిందెలు నిలుపుకునేందుకే రైతులు పురుగుమందులు పిచికారీ చేసేందుకు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టారన్నారు. అలాగే ఎరువులు, దుక్కి ఖర్చు, తోటల కాపలా ఖర్చు అన్నీ చూసుకుంటే రూ.50 వేలు పెట్టుబడి అయిందని, ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం చెల్లిస్తేనే రైతులు గట్టెక్కుతారన్నారు. మామిడి రైతులు ఎంతో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారిని పట్టించుకునే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చైన్నె, విజయవాడ, వరంగల్, రాజమండ్రి, విశాఖపట్నం వంటి నగరాల్లో నూజివీడు చిన్నరసం పేరుతో బోర్డులు పెట్టి వేరే ప్రాంతాల్లో కాసిన కాయలను విక్రయిస్తున్నారని, దీనిని బట్టే నూజివీడు ప్రాంతం మామిడికి ఎంతో ప్రసిద్ధో అర్ధమవుతుందన్నారు. అంతటి ప్రాధాన్యం ఉన్న మామిడిని సాగు చేస్తున్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలి మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు -
ధాన్యం మద్దతు ధర కంటి తుడుపే
పెదపాడు: ఖరీఫ్, రబీ పంటలకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటి తుడుపు చర్యేనని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. పెదపాడు మండలంలోని వట్లూరు గ్రంథాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో మద్దతు ధరలపై సమావేశం నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్పత్తి ఖర్చులు తక్కువ చూపి కేంద్ర ప్రభుత్వం ధరలు ప్రకటించడం వల్ల రైతులకు కనీస పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు వాస్తవ ఖర్చులు లెక్కకట్టి ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రైతులు తుమ్మల ధన కోటేశ్వరరావు, కొమ్మన సాంబశివరావు, కొమ్మనేని అచ్యుతరావు, కొల్లిపర కొండలరావు తదితరులు పాల్గొన్నారు. -
దోపిడీ కేసులో నిందితుల అరెస్టు
జంగారెడ్డిగూడెం: పట్టణంలో ఒక మహిళ కంట్లో కారం కొట్టి ఆమె మెడలోని సూత్రాలతో సహా బంగారు గొలుసుని దోపిడీ చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపారు. బుధవారం స్థానిక పోలీసు సర్కిల్ కార్యాలయంలో ఆయన వివరాలను వెల్లడించారు. జంగారెడ్డిగూడెంకు చెందిన మునగాల జానకీ దేవి, ఆమె భర్త శ్రీరామశాస్త్రి ప్రభుత్వ టీచర్లుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఇల్లు మరమ్మతుల నిమిత్తం తాపీ పనివారిని పెట్టుకున్నారు. ఈ నెల 23న తాపీ పనిచేసేందుకు పేరంపేటకు చెందిన చింతపల్లి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు, నక్కా శ్రీను అలియాస్ పండు, యడ్లపల్లి విజయరాజు వచ్చారు. వారు పని ప్రారంభించగా శ్రీరామశాస్త్రి టిఫిన్ తెచ్చేందుకు బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఆ ముగ్గురు జానకీ దేవి కంట్లో కారం కొట్టి నాలుగు కాసుల బంగారు గొలుసు, మంగళసూత్రాలతో సహా దోచుకుపోయారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను సీఐ కృష్ణబాబు అరెస్ట్ చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అరెస్టుకు సంబంధించి ఎస్సై షేక్ జబీర్ ఏఎస్సై ఎన్వీ సంపత్కుమార్, కానిస్టేబుళ్లు ఎన్.రమేష్, రాజశేఖర్ సహకరించగా, వీరిని డీఎస్పీ రవిచంద్ర అభినందించారు. సమావేశంలో సీఐ కృష్ణబాబు, ఎస్సై షేక్ జబీర్ పాల్గొన్నారు. -
ఎంపీపీగా ధనలక్ష్మి బాధ్యతల స్వీకరణ
యలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండల ఎంపీపీగా ఇనుకొండ ధనలక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల కోర్టు ఉత్తర్వులతో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో ఆమె వైఎస్సార్సీపీ తరఫున ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికై న సంగతి తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా మండలంలో అన్ని వర్గాలను కలుపుకుని మండలాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఎంపీపీగా ఈ రోజు బాధ్యతలు స్వీకరించడానికి ప్రధాన కారణం తన వెంట ఉన్న ఎంపీటీసీ సభ్యులన్నారు. వారిని ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన వెరవకుండా తన వెంట నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా ఆమె స్వగ్రామం ఏనుగువానిలంక నుంచి భారీ మోటార్ సైకిల్ ర్యాలీగా మండల పరిషత్ కార్యాలయం చేరుకున్నారు. పూజ కార్యక్రమం అనంతరం ఎంపీపీ కుర్చీలో కూర్చుని బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్తోపాటు పార్టీ మండల కన్వీనర్ ఉచ్చుల స్టాలిన్బాబు, వైస్ ఎంపీపీ కొప్పాడి శ్రీనుబాబు, నాయకులు పొత్తూరి బుచ్చిరాజు, గుడాల సాయి బాలాజీ, చల్లా విశ్వేశ్వరరావు (నల్లయ్య), బోనం బులివెంకన్న, ఓదూరి భాస్కరరావు, చివటపు నాగేశ్వరరావు, ముదునూరి లక్ష్మీపతిరాజు, బొంతు కర్ణారెడ్డి, ఇలపకుర్తి నరసింహరావు, పొత్తూరి రంగరాజు, నిమ్మకాయల రామకృష్ణ, మంద హరికుమార్, మోకా నరసింహరావు, గుడాల సురేష్, మామిడిశెట్టి చిట్టిబాబు, మానుకొండ సోమరాజు, కోరాడ శ్రీనివాసరావు, జోగాడ ఉమామహేశ్వరరావు తదితరులు పూలమాల, శాలువాలతో సత్కరించారు. -
1 నుంచి రేషన్ షాపుల్లోనే సరుకులు
పాలకోడేరు: జూన్ 1 నుంచి రేషన్ షాపుల వద్ద నిత్యావసరాలు పంపిణీ చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ తెలిపారు. బుధవారం పాలకోడేరు మండలం శృంగవృక్షంలో రేషన్ షాపు నెంబర్ 11ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కార్డుదారులందరూ రేషన్ షాపులు వద్దకు వచ్చి నిత్యావసరాలు తీసుకోవాలని అన్నారు. అనుకూలమైన సమయంలో రేషన్ సరుకులు పొందవచ్చన్నారు. వికలాంగులు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దకు వెళ్లి రేషన్ సరుకులను అందజేయాలని డీలర్లను ఆదేశించారు. -
తణుకులో కోవిడ్ కలకలం!
తణుకు అర్బన్: కోవిడ్ అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతున్న తణుకుకు చెందిన వృద్ధురాలికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సమాచారం. పట్టణంలోని పైడిపర్రుకు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు ఇటీవల చార్ధామ్ యాత్రకు వెళ్లి వచ్చాక గత మూడు రోజులుగా అనారోగ్యం బారిన పడ్డారు. ఈ నెల 27న తణుకులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం కోవిడ్ అనుమానిత లక్షణాలతో రాజమండ్రికి తరలించగా అక్కడ చేసిన ర్యాపిడ్ కిట్ పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు సమాచారం. దీంతో మెరుగైన వైద్యసేవలకు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ యాత్రలకు పైడిపర్రు నుంచి 15 మంది వరకు వెళ్లారని ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం. కోవిడ్ పాజిటివ్ అన్న సమాచారంతో బుధవారం ఉదయం మున్సిపల్ శానిటరీ అధికారులు పైడిపర్రులో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ విషయంపై వైద్య శాఖ అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారు. ఈ విషయంపై డీఎంహెచ్ఓ డాక్టర్ గీతాబాయిని వివరణ కోరగా కోవిడ్ లక్షణాలున్న వృద్ధురాలికి తణుకులో ఎలాంటి పరీక్షలు చేయలేదని, ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. పరీక్షకు సంబంధించిన రిపోర్టు గురువారం వస్తుందని చెప్పారు. మునిసిపల్ అధికారులు శానిటేషన్ చేయించారు తప్ప.. వైద్యశాఖ నుంచి ఎలాంటి జాగ్రత్తలు, అవగాహన కల్పించకపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టని యంత్రాంగం కోవిడ్ పాజిటివ్ వచ్చిందనే సంకేతాలు ఉన్నా ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం గమనార్హం. దీంతో జలుబు, దగ్గు, ఆయాసం సమస్యలు ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ పరీక్షలు పశ్చిమగోదావరి జిల్లాలో అందుబాటులో లేవు. పరీక్షలు, సంబంధించిన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ రూపొందించపోవడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో కోవిడ్ కేసు నమోదు కాకుండానే పరీక్షలు నిర్వహించే కిట్లు, జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు, వార్డుల్లో బెడ్స్ అందుబాటులో ఉంచారు. ఆక్సిజన్ వంటి ఏర్పాట్లు చకచకా చేశారు. కడప ప్రాంతంలో కూడా కోవిడ్ కేసులు నమోదయ్యాయనే వార్తలు రాగా.. తణుకు నుంచి మహానాడుకు టీడీపీ శ్రేణులు వెళ్లడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వృద్ధురాలికి పాజిటివ్ వచ్చినట్లు ప్రచారం పైడిపర్రులో ప్రత్యేక శానిటేషన్ -
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
చాట్రాయి: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. మండలంలోని పోలవరం గ్రామానికి చెందిన పరసా ఈశ్వరరావు ఇంటి పక్కన ఉన్న 11 కేవీ వైరు ఇంటి సర్వీస్ వైరుపై పడి ఇల్లంతా విద్యుత్ ప్రసారం అయ్యింది. ఆ సమయంలో గదిలో నిద్రపోతున్న పరసా ప్రభు కిరణ్(18) లేచి బోర్డులో స్విచ్ ఆపుతుండగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతలపూడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఐ రామకృష్ణ తెలిపారు. గోదావరిలో దూకిన యువకుడి గల్లంతు యలమంచిలి: మండలంలోని చించినాడ వశిష్ట గోదావరి వంతెన మీద నుంచి దూకి యువకుడు గల్లంతైనట్లు ఎస్సై కె గుర్రయ్య తెలిపారు. వంతెనపై దొరికిన బైక్, సెల్ఫోన్ ఆధారంగా అతడు భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన షేక్ కాసు (24)గా అనుమానిస్తున్నారు. ఈ మేరకు షేక్ కాసు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. ఎకై ్సజ్ కేసుల్లో నలుగురి బైండోవర్ భీమవరం: ఎకై ్సజ్ కేసులకు సంబంధించి భీమవరం మండలంలోని నలుగురు వ్యక్తులను బుధవారం భీమవరం తహసీల్దార్ ఆర్ రాంబాబు వద్ద బైండోవర్ చేసినట్లు భీమవరం ఎకై ్సజ్ సీఐ కె బలరామరాజు చెప్పారు. బైండోవర్ చేసిన వారిలో ఇళ్ల శ్రీనివాసరావు, యెలుదూటి నాగన్న, యల్ల శేఖర్, బడుగు రవి ఉన్నారన్నారు. వీరు ఏడాది కాలంలో మరోసారి ఎకై ్సజ్ నేరంలో పట్టుబడితే రూ.లక్ష జరిమానా చెల్లించాల్సి ఉంటుందని సీఐ తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ మృతి భీమవరం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు భీమవరం వన్టౌన్ పోలీసులు బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 24వ తేదీన వీరవాసరం మండలం పంజావేమవరం గ్రామానికి చెందిన కొడమంచిలి మేరి(35) భర్తతో కలిసి మోటారు సైకిల్పై భీమవరం వస్తుండగా పోలీసుబొమ్మ సెంటర్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో మేరి తీవ్రంగా గాయపడగా గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. వన్టౌన్ ఎస్సై ఎస్వీవీఎస్ కృష్ణాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అడుగంటిన మంచినీటి చెరువులు
భీమవరం అర్బన్: జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో రక్షిత మంచినీటి చెరువులు అడుగంటాయి. దీంతో ప్రజలు తాగునీటికి ఇక్కట్లు పడుతున్నారు. వేసవి ప్రారంభంలో అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా చెరువులను పూర్తిస్థాయిలో నీటితో నింపకపోవడమే సమస్యకు కారణమని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. భీమవరం మండలంలోని గొల్లవానితిప్ప, కొత్తపూసలమర్రు, దొంగపిండి, గూట్లపాడు, చినఅమిరం, కొవ్వాడ అన్నవరం, పెదగరువు, బేతపూడి తదితర గ్రామాల్లో రక్షిత మంచినీటి చెరువులు అడుగంటాయి. దీంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఫిల్టర్ బెడ్లు పనిచేయకపోవడంతో బురద నీటినే పంచాయతీ సిబ్బంది కుళాయిల ద్వారా అరకొర సరఫరా చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ 15 తరువాత ఎప్పుడైనా పంటకాలువలు కట్టేస్తారు. ముందు జాగ్రత్తచర్యగా ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో మార్చి నెలాఖరు నుంచే రక్షిత మంచినీటి చెరువులు తాగునీటిని నింపాల్సి ఉంది. అయితే ఈ ఏడాది పెదగరువు, బేతపూడి గ్రామాల్లో రక్షిత మంచినీటి చెరువుల్లోను పూడిక తీత పనులు నిర్వహించడం, మిగిలిన గ్రామాల్లో ఏప్రిల్ చివరి వరకు తాగునీటి చెరువులను నింపకపోవడంతో మే నెల గడవకముందునే రక్షిత మంచినీటి చెరువులు అడుగంటాయి. అంతేకాకుండా కొన్ని గ్రామాల్లో వాడుక చెరువులలో నీటిని సైతం నింపకపోవడంతో అటు తాగునీటికి, ఇటు వాడకానికి నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుళాయిల ద్వారా అరకొర సరఫరా పంచాయతీ సిబ్బంది రోజుకు గంట మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారని, ఆ నీరు కూడా బురదమయంగా ఉంటోందని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో 20 లీటర్ల మినరల్ వాటర్ రూ.30 నుంచి రూ.35కు కొనుగోలు చేసి తాగుతున్నామని, స్థోమత లేనివారు కుళాయిల ద్వారా వచ్చే బురదనీటినే తాగి అనారోగ్యాల పాలవుతున్నామని బాహాటంగానే చెబుతున్నారు. గ్రామాల్లో దాహం కేకలు చెరువులను పూర్తిస్థాయిలో నింపకపోవడంతోనే సమస్య బురద నీరు వస్తుంది కుళాయిల ద్వారా రోజుకు ఒక గంట మాత్రమే తాగునీరు ఇస్తున్నారు. అది కూడా బురదగా వస్తుంది. ఇంటి వాడకానికే తప్ప తాగడానికి ఆ నీరు పనికి రావడం లేదు. డబ్బులుంటే మినరల్ వాటర్ కొనుక్కుని తాగుతున్నాం. లేకుంటే ఆ నీటినే తాగాల్సి వస్తుంది. – మేళం సోమన్న, గ్రామస్తుడు, గొల్లవానితిప్ప గంట మాత్రమే ఇస్తున్నారు గ్రామానికి శివారు కావడంతో రోజుకు గంట మాత్రమే తాగునీటిని ఇస్తున్నారు. ఇంటింటికి కుళాయిలు ఇవ్వలేదు. పంచాయతీ కుళాయిల ద్వారా వచ్చే నీటినే తెచ్చుకుంటున్నాం. అవి మురికిగా వస్తున్నాయి. – దేవిరెడ్డి వెంకటలక్ష్మి, గృహి ణి, హౌసింగ్ కాలనీ, గొల్లవానితిప్ప -
సినిమా థియేటర్ల తనిఖీలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని సినిమా థియేటర్లను బుధవారం తహసీల్దార్ ఎం.సునీల్ కుమార్ తనిఖీ చేశారు. థియేటర్లలో సదుపాయాలపై ఆరా తీశారు. హాల్స్ వద్ద విక్రయించే తినుబండారాల ధరల పట్టికను ప్రదర్శించాలని సూచించారు. ప్రేక్షకుల వద్ద అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పెనుగొండలో.. పెనుగొండ: ప్రభుత్వ ఆదేశాల మేరకు పెనుగొండ మినర్వా థియేటర్ను తహాసీల్దారు జి అనితకుమారి బుధవారం తనిఖీ చేశారు. సైకిల్ స్టాండ్, సినిమా హాలులో తినుబండారాల ధరలు, ఇతర సదుపాయాలను పరిశీలించారు. మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వద్దని సూచించారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. -
రావిలంక తీరంలో విషాద ఛాయలు
పెనుగొండ: ఆచంట మండలం రావిలంక గోదావరిలో గల్లంతైన ముగ్గురు బాలుర మృతదేహాలు బుధవారం లభ్యం కాగా తీరప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలానికి చెందిన కేతా ప్రవీణ్ (15), సానబోయిన సూర్యతేజ (12), పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి పెదలంకకు చెందిన నీతిపూడి పాల్కుమార్ (15) మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రావిలంక గోదావరిలో మంగళవారం సరదాగా స్నానానికి వచ్చారు. అమావాస్య కారణంగా గోదావరికి సముద్రపు పోటు తగలడంతో నీటిమట్టం పెరిగి ముగ్గురు బాలురకు ఈత రాకపోవడంతో గల్లంతయ్యారు. బయట పడిన మరో ఇద్దరు బాలురు ఘటనా స్థలం నుంచి హుటాహుటిన వారి తల్లిదండ్రుల వద్దకు చేరి సమాచారం అందించారు. దీంతో మంగళవారం రాత్రి పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపులో తొలుత కేతా ప్రవీణ్ మృతదేహం లభ్యం కాగా అనంతరం సానబోయిన సూర్యతేజ మృతదేహం లభ్యమైంది. అయితే నీతిపూడి పాల్కుమార్ మృతదేహాం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం శ్రమించాల్సి వచ్చింది. చివరకు యలమంచిలి మండలం కనకాయలంక సమీపంలో అతడి మృతదేహం లభ్యమైంది. దీంతో పోలీసులు కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి మృతదేహాలను తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. పెనుగొండ సీఐ రాయుడు విజయభాస్కర్ ఆధ్వర్యంలో ఆచంట, గన్నవరం ఎస్సైలు కేవీ రమణ, శివకృష్ణ, తహాసీల్దారులు జి కనకరాజు, శ్రీపల్లవి మృతదేహాలు లభ్యమయ్యే వరకూ ఘటనా స్థలంలోనే ఉండి పర్యవేక్షించారు. బాలుర మృతితో రావిలంక వద్ద తీరమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మృతదేహాల గాలింపు చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించారు. -
14న అయోధ్య–కాశీ పుణ్యక్షేత్ర యాత్ర
ఏలూరు (టూటౌన్): భారతీయ రైల్వేస్ అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో జూన్ 14 నుంచి 22 వరకు అయోధ్య–కాశీ పుణ్యక్షేత్ర యాత్ర నిర్వహిస్తున్నట్లు సంస్థ విజయవాడ ఏరియా మేనేజర్ ఎం.రాజా తెలిపారు. ఈమేరకు ఈ యాత్రకు సంబంధించిన బ్రోచర్ను బుధవారం స్థానిక రైల్వేస్టేషన్ నందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ అయోధ్య–కాశీ యాత్రలో భాగంగా వారణాసి, ఆయోధ్య, ప్రయాగ్రా, నైమిశారణ్యం ప్రాంతాల్లోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చునన్నారు. యాత్ర మొత్తం ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగలు సాగుతుందన్నారు. ఈ నెల 14న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే రైలు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని మీదుగా వెళుతుందన్నారు. టిక్కెట్ల బుకింగ్ కొరకు ఐఆర్సీటీసీ, రైల్వే రిటైరింగ్ రూమ్ దగ్గర, విజయవాడ రైల్వే స్టేషన్ నందు గాని ఆన్లైన్ నందుగాని చేసుకోవచ్చునన్నారు. వివరాలకు సెల్ నెం.9281495848 నందు సంప్రదించాలని కోరారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం
పెంటపాడు: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు దుర్మరణం పాలైన ఘటన బుధవారం తాడేపల్లిగూడెం– భీమవరం రోడ్డులో ముదునూరు వద్ద జరిగింది. పెంటపాడు ఎస్సై స్వామి తెలిపిన వివరాలివి. గూడెం మండలం ఆరుగొలనుకు చెందిన అడ్డగర్ల సాయి రమేష్ (34) కరెంట్ పని చేస్తుంటాడు. బుధవారం పనినిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లి తిరిగి మోటార్ సైకిల్పై స్వగ్రామం వస్తుండగా ముదునూరు మలుపు వద్ద భీమవరం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.ట్రాక్టర్ను ఢీకొన్న లారీయలమంచిలి: అడవిపాలెం సచివాలయానికి సమీపంలో నిలుపుదల చేసి ఉన్న ట్రాక్టర్ను లారీ ఢీకొనడంతో బోల్తా పడింది. ఆ శబ్థానికి చుట్టుపక్కల వారు భయబ్రాంతులకు గురయ్యారు. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ప్రమాదం జరిగిన సమయానికి ఎవరూ లేకపోవడం వలన పెను ప్రమాదం తప్పింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ విలేకరి ప్రమాద ఘటనను ఫొటో తీయగా లారీ డ్రైవర్ దౌర్జన్యానికి దిగాడు. దీనిపై అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఆ లారీకి కనీసం నెంబర్ ప్లేట్ లేకపోవడం విశేషం. నంబర్ ప్లేట్ లేని లారీతో కూటమి నాయకులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులతో పాటు మైనింగ్, రవాణా శాఖ అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలని కోరుతున్నారు. -
పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలి
ఏలూరు(మెట్రో): జీవో 23 ప్రకారం ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్జీవోస్ నాయకులు కోరారు. బుధవారం కలెక్టర్ వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలుసుకుని బదిలీ ప్రక్రియపై విన్నవించారు. ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్లో ఉన్న ఆఫీస్ బేరర్స్కి అమలులో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోల ప్రకారం బదిలీలు చేసేలా ప్రతి శాఖాధికారులకు ఆదేశాలు ఇవ్వాలని వారు కలెక్టర్ను కోరారు. ఈ మేరకు కలెక్టర్ స్పందిస్తూ జిల్లా రెవెన్యూ అధికారికి ఆదేశాలు జారీ చేసినట్లు నాయకులు తెలిపారు. ఇటీవల గ్రామ, వార్డు సచివాలయంలో పనిచేస్తున్న హెల్త్ సెక్రెటరీలకు పదోన్నతులు కల్పించాలని కోరగా, ఏఎన్ఎంల పదోన్నతుల ఫైల్ను ఆమోదించినందుకు కలెక్టర్కు పూలమొక్క అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు, ఎన్జీవోస్ నాయకులు, హెల్త్ సెక్రటరీలు పాల్గొన్నారు. -
కోకో గింజల విక్రయానికి దరఖాస్తు చేసుకోండి
తాడేపల్లిగూడెం రూరల్: ప్రతి రైతు నుంచి ఎకరానికి 300 కిలోల కోకో గింజలను కొనుగోలు చేస్తామని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఆర్.దేవానంద్ కుమార్ తెలిపారు. బుధవారం తాడేపల్లిగూడెం మండల మహిళా సమాఖ్య భవనంలో వ్యవసాయ, ఉద్యాన సహాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కోకో గింజలు కిలోకు రూ.500 ధర నిర్ణయించిందన్నారు. ఈ ధరకు కంపెనీలు రైతుల నుంచి కొనుగోలు చేస్తాయన్నారు. ఇందులో కిలోకు రూ.50 రాష్ట్ర ప్రభుత్వం కంపెనీ వారికి చెల్లించడం ద్వారా ఈ పథకం అమలు చేస్తుందన్నారు. కోకో రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 30వ తేదీలోగా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వైఎస్సార్ విగ్రహం పాక్షిక ధ్వంసం పెంటపాడు: పెంటపాడులోని వెలంపేట కోనేరు చెరువు వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని బుధవారం వేకువజామున గుర్తుతెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. విగ్రహం ఎడమ చేయి మోచేతి వరకూ విరిగి కింద పడి ఉంది. గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు బర్ల జయ రాంబాబు ఈ విషయాన్ని ముందుగా గుర్తించారు. మంగళవారం రాత్రి వరకూ విగ్రహం బాగానే ఉందని, ఉదయం చూస్తే ఇలా చేయి విరిగి పడి ఉందని వైఎస్సార్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో టీడీపీ మహానాడు జరుగుతున్న సమయంలో ఇక్కడ వైఎస్సార్ విగ్రహం ధ్వంసం కావడం చర్చనీయాంశమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్రెడ్డి జిల్లాలో ఓదార్పు యాత్ర చేసిన సమయంలో ఈ విగ్రహాన్ని స్వయంగా ఆవిష్కరించారు. విగ్రహం జీవ కళ ఉట్టిపడేలా ఉందని శిల్పిని, నిర్వాహకులను అభినందించారు. అప్పటి నుంచి ఇక్కడ పలు కార్యక్రమాలను వైఎస్సార్ అభిమానులు నిర్వహిస్తున్నారు. -
ముగిసిన ఈఏపీ సెట్
భీమవరం: ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. భీమవరం పట్టణంలోని 5 పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 19, 20 తేదీల్లో ఏపీ అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించగా ఈ నెల 21 నుంచి మంగళవారం వరకు ఇంజినీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు జరిగాయి. మంగళవారం పరీక్షకు పట్టణంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 170 మందికి 165 మంది హాజరుకాగా, విష్ణు ఉమెన్స్ కళాశాలలో ఉదయం 87 మందికి 85 మంది, విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 110 మందికి 106 మంది హాజరయ్యారు. డీఎన్నార్ అటానమస్ కళాశాలలో ఉదయం 100 మందికి 94 మంది, డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 100 మందికి 99 మంది హాజరయ్యారు. తాడేపల్లిగూడెంలో.. తాడేపల్లిగూడెం: పెద తాడేపల్లి వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం జరిగిన పరీక్షకు 228 మందికి 221 మంది హాజరయ్యారు. ఈ కేంద్రంలో ఇంతవరకూ 3239 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 3061 మంది పరీక్షకు హాజరయ్యారు. ‘పది’ సప్లిమెంటరీ పరీక్షకు 65 శాతం హాజరు భీమవరం: జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన పది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు 65 శాతం విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ చెప్పారు. 139 మంది విద్యార్థులకు 48 మంది గైర్హాజరయ్యారన్నారు. 7 పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించగా ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని నారాయణ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు భీమవరం (ప్రకాశంచౌక్): విధుల్లో నిర్లక్ష్యం వహి స్తూ సమావేశాలకు గైర్హాజరవుతున్న మున్సిపల్ అధికారుల పై, నిర్ధేశిత లక్ష్యాలను సాధించడంలో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ రీజనల్ డైరక్టర్ సీహెచ్ నాగ నర్సింహరావు హెచ్చరించారు. మంగళవారం భీమవరం మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ హాలులో జిల్లాలోని అన్ని మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆయా మున్సిపాలిటీలకు నిర్ధేశించిన లక్ష్యాలను, విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై ఆరా తీశారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై స్థానికంగా ఉన్న కమిషనర్లు సస్పెండ్ వరకూ చర్యలు తీసుకోవాలన్నారు. భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఆకివీడు మున్సిపాలిటీలకు సంబంధించి కమిషనర్లు, రెవెన్యూ అధికారులు ప్లానింగ్ అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. సమావేశంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, సెక్షన్ హెడ్స్ పాల్గొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి భీమవరం: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం నుంచి జూన్ 1 వరకు జరుగుతాయని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి ఎ. నాగేశ్వరరావు తెలిపారు. జనరల్ కేటగిరిలో 27 మంది, ఒకేషనల్లో 99 మంది హాజరుకానున్నారని. జనరల్ విద్యార్ధులకు శ్రీగ్రంఽధి వెంకటేశ్వరరావు జూనియర్ కళాశాల, ఒకేషనల్ విద్యార్థులకు ప్రశాంతి ఒకేషనల్ జూనియర్ కళాశాల, పెనుగొండలోని ఎస్వీకేపీ అండ్ పీవీ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో ఏర్పాట్లు చేసినట్లు నాగేశ్వరరావు తెలిపారు. నేటి నుంచి ట్రిపుల్ ఐటీలో సర్టిఫికెట్ల పరిశీలన నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2025–26 అడ్మిషన్లలో భాగంగా ప్రత్యేక కేటగిరీ సీట్ల భర్తీకి ఈ నెల 28 నుంచి 31 వరకు సర్టిఫికెట్లు పరిశీలించనున్నారు. ఇందుకోసం నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏర్పాట్లు చేశారు. 28న సైనికోద్యోగుల పిల్లల (సీఏపీ) కోటాలో 153 మంది, క్రీడా కోటాలో 320 మంది కలిపి మొత్తం 473 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. 29న సీఏపీ కోటాలో 117, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో 247, ఎన్సీసీ కోటాలో 341, క్రీడా కోటాలో 245 మొత్తం కలిపి 950 మంది సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. 30న ఎన్సీసీ కోటాలో 452, క్రీడా కోటాలో 467, మొత్తం 919 మంది, 31న ఎన్సీసీ కోటా అభ్యర్థులు 661 మంది సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. -
వ్యాన్ను ఢీకొన్న కంటైనర్
జాతీయ రహదారిపై దెందులూరు హెచ్పీ పెట్రోలు బంకు వద్ద మంగళవారం వ్యాన్ను కంటైనర్ లారీ ఢీకొనడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. 8లో uగ్రామాల్లో చెత్త తొలగింపు ఇరగవరం: ‘గ్రామాల్లో పడకేసిన పారిశుద్ధ్యం’ శీర్షికన గత సోమవారం సాక్షిలో వచ్చిన కథనానికి పంచాయతీ అధికారులు స్పందించారు. గ్రామాల్లోని చెత్తను ట్రాక్టర్లలో డంపింగ్ యార్డులకు తరలించారు. కార్యదర్శులకు ఈవోపీఆర్డీ నరసింహ మూర్తి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని ఆదేశాలిచ్చారు. గ్రామాల్లో చెత్త తొలగించడంతో ప్రజలు హర్షం చేశారు. పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలి భీమవరం (ప్రకాశంచౌక్): పరిశ్రమల కోసం దరఖాస్తులను గడువులోగా పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన చాంబరులో పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో మాట్లాడుతూ యువతకు పారిశ్రామిక యూనిట్ల స్థాపనపై అవగాహన కల్పించాలన్నారు. రైసు మిల్లులు, ఆక్వా, కాయిర్ సెక్టారుకు సంబంధించి ఉత్పత్తులు, ఎగుమతుల అవకాశాలు చర్చించేందుకు వర్క్షాపు నిర్వహించాలన్నారు . -
పూడికతీత తూతూమంత్రమేనా?
తొలకరి సాగుకు ఊతమిస్తూ రుతుపవనాలు వచ్చేశాయి. త్వరలో కాలువలకు నీరు విడుదల కానుంది. కోటి ఆశలతో ఏరువాక సన్నాహాల్లో రైతులను డ్రెయిన్లు గురప్రుడెక్క, కిక్కిస, వ్యర్థాలు, ఆక్రమణలతో కుంచించుకుపోయి కలవరపరుస్తున్నాయి. సాగుకాలం సమీపిస్తున్నా చాలాచోట్ల పూడికతీత పనులు ఇంకా మొదలుకాలేదు. భీమవరంలో గుర్రపుడెక్కతో నిండిపోయిన గునుపూడి సౌత్ డ్రెయిన్ సాక్షి, భీమవరం: జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, ఆకివీడు సబ్డివిజన్లలో బొండాడ, గునుపూడి సౌత్, గొంతేరు, భగ్గేశ్వరం, మొగల్తూరు, కాజా, రుద్రయ్య కోడు తదితర 294 కిలోమీటర్ల పొడవున 13 మేజర్ డ్రెయిన్లు ఉన్నాయి. 330 కిలోమీటర్లు పొడవున 41 మీడియం డ్రెయిన్లు, 956 కిలోమీటర్లు పొడవున 454 మైనర్ డ్రెయిన్లు ఉన్నాయి. వీటిలో గురప్రుడెక్క, తూడు పెరిగిపోయి నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది. తుపాన్లు ఏర్పడినప్పుడు రోజుల తరబడి ముంపునీరు లాగక పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. మంపునీటిని బయటకు పంపేందుకు రైతులు అగచాట్లు పడాల్సి వస్తోంది. ఏటా తొలకరి సాగు ప్రారంభానికి ముందే డ్రెయిన్లలో గురప్రు డెక్క, కిక్కిస తొలగింపు పనులు పూర్తి చేస్తుంటారు. రూ. 14 కోట్లు మంజూరు: రానున్న వ్యవసాయ సీజనన్కు గురప్రుడెక్క తొలగింపు, పూడికతీత నిమిత్తం సుమారు రూ.17 కోట్లు విలువైన 370కు పైగా పనులకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. 349 పనులకు ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసింది. వీటిలో 270 వరకు గురప్రుడెక్క తొలగింపు, మిగిలినవి పూడికతీత పనులు ఉన్నాయి. ఈ నిధులతో సాగుకు ముందే పూడిక సమస్యను పరిష్కరించడంతో పాటు ఏడాదిపాటు డ్రెయిన్ల నిర్వహణ చేయాలి. ప్రాజెక్టు కమిటీ, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, నీటిసంఘాల మాటున నామినేషనన్ పద్దతిపై కూటమి నేతలు పనులు దక్కించుకున్నారు. సాగుకాలం ముంచుకొస్తుండగా చాలామంది ఇంకా పనులు ప్రారంభించకపోవడం గమనార్హం. తూతూమంత్రంగా పనులు చేసేందుకు కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై డ్రెయిన్న్స్ ఈఈ సత్యనారాయణను సంప్రదించగా పూడికతీత పనులు ప్రారంభించినట్టు తెలిపారు. వర్షాల వలన కొన్నిచోట్ల స్ప్రేయింగ్ పనులు ఇంకా మొదలుకాలేదని, త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత ఏడాది వెంటాడిన ముంపు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత ఏడాది నెల రోజులు ఆలస్యంగా పనులు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 2.15 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేపట్టారు. సీజనన్ ప్రారంభంలోనే భారీ వర్షాలతో డ్రెయిన్ల పొంగి ప్రవహించాయి. పూడికతో ముంపునీరు లాగక 14 వేల ఎకరాల్లోని నాట్లు, 30 వేల ఎకరాలకు చెందిన నారుమడులు దెబ్బతినడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. గురప్రుడెక్క, కిక్కిస, వ్యర్థాలతో కుచించుకుపోయిన డ్రెయిన్లు జిల్లాలో 349 పూడికతీత పనులకు రూ.14 కోట్ల మంజూరు నీటి సంఘాలు మాటున కూటమి నేతలకే పనులు సకాలంలో మొదలుపెట్టకుండా నామమాత్రంగా చేసే ఎత్తుగడ పాలకోడేరు, భీమవరం మండలాల్లో ప్రధానమైన గునుపూడి సౌత్ డ్రెయిన్ గురప్రు డెక్క, వ్యర్థాలతో పూడుకుపోయింది. భారీ వర్షాలు కురిసినప్పుడు నీటి ప్రవాహవేగాన్ని గురప్రుడెక్క అడ్డుకుని సకాలంలో ముంపునీరు లాగక రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఏటా ఇదే పరిస్థితి ఉంటున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పూడిక తొలగించాలి బక్లెస్ డ్రెయిన్ ముంపుతో తీవ్రంగా నష్టపోతున్నాం. సార్వాకు ముంపు బెడద లేకుండా డ్రెయిన్లోని ప్రక్షాళన చేయాలి. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నాచు, గురప్రు డెక్క తొలగింపు పనులు చేయించాలి. – తోరం వెంకట సుబ్బయ్య, రైతు, పడమర విప్పర్రు త్వరితగతిన పనులు చేపట్టాలి తొలకరి పనులు మొదలయ్యే నాటికి డ్రెయిన్లలో పూడికతీత పనులు పూర్తిచేయాలి. అలాగే యనమదుర్రు డ్రెయిన్్ పూడిక ప్రధాన సమస్యగా ఉంది. ఆక్రమణలు, పూడిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. – తోలేటి వెంకటేశ్వరరావు, రైతు, తిరుపతిపురం -
గోదావరిలో ముగ్గురు బాలుర గల్లంతు
పెనుగొండ: కోనసీమలో గోదావరిలో ఎనిమిది మంది యువకుల గల్లంతు వార్త మరువక ముందే.. ఆచంట మండలం అయోధ్యలంక శివారు రావిలంక వద్ద స్నానానికి దిగిన బాలురలో ముగ్గురు గల్లంతవడం తీవ్ర విషాదం నింపింది. మంగళవారం సాయంత్రం ముగ్గురు బాలురు గోదావరిలో స్నానానికి దిగి గల్లంతయ్యారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలానికి చెందిన కేతా ప్రవీణ్(15), సానబోయిన సూర్యతేజ(12), పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలికి మండలం పెదలంకకు చెందిన నీతిపూడి పాల్ కుమార్(15) స్నేహితులతో కలసి గత కొన్ని రోజులుగా గోదావరి స్నానానికి వస్తున్నారు. ఇదే కోవలో మంగళవారం మధ్యాహ్నం మరో ఇద్దరు స్నేహితులతో కలిసి స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తు ప్రవీణ్, సూర్యతేజ, పాల్ కుమార్ మునిగిపోవడంతో మిగిలిన ఇద్దరు భయపడి వెంటనే బంధువులకు సమాచారం అందించారు. కేతా ప్రవీణ్, పాల్కుమార్ ఇటీవల పదో తరగతి పరీక్షలు పూర్తిచేశారు. పేద కుటుంబాల్లో పెను విషాదం గల్లంతైన ప్రవీణ్ తండ్రి వెంకటేశ్వరరావు తాపీ మేసీ్త్రగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సూర్యతేజ తండ్రి ఏడుకొండలు వడ్రంగి మేసీ్త్ర.. పాల్కుమార్ తండ్రి మృతి చెందడంతో తల్లి జీవనోపాధి నిమిత్తం గల్ఫ్కు వెళ్లింది. ముగ్గురు బాలురు గల్లంతుతో సంఘటన ప్రాంతంలో విషాదం నెలకొంది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం ఆజ్మీ, నర్సాపురం డీఎస్పీ డాక్టర్ వేద, పెనుగొండ సీఐ రాయుడు విజయకుమార్, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర ఎస్సైలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన ముగ్గురు బాలుర కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆచంట మండలం అయోధ్యలంక శివారు రావిలంక వద్ద ఘటన స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగిన బాలురు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు -
జీలుగ సాగుతో పంటలు బాగు
ముసునూరు: నేల స్వభావానికి అనుగుణంగా పచ్చిరొట్ట ఎరువుల సాయంతో భూమిని సారవంతంగా మార్చుకోవచ్చు. పచ్చిరొట్ట ఎరువు పంటల్లో జీలుగ సాగు చక్కటి ఫలితాలనిస్తుండడంతో చాలా ప్రాంతాల్లో రైతులు జీలుగ సాగుకే మొగ్గు చూపుతున్నారు. నత్రజని, భాస్వరం, పొటాష్, మాంగనీస్ వంటి పోషకాలను పంటలకు విరివిగా అందించే జీలుగను సాగు చేసి లాభాలు పొందాలని ముసునూరు మండల వ్యవసాయాధికారి.కె.చిన సూరిబాబు సూచిస్తున్నారు. మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో జీలుగ విత్తనాల పంపిణీ చేస్తున్నామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రయోజనాలు ● పొలంలో జీలుగను కలియ దున్నితే నేలకు సారం, తదుపరి వేసే పంటలకు లాభాలనిస్తుంది. ● నేలలో ఉండే చౌడును నివారిస్తుంది. ● మొక్కలకు రెండు శాతం నత్రజని, సూపర్ ఫాస్ఫేట్ అదనంగా అందుతుంది. ● జింక్, మాంగనీస్, ఇనుము, కాల్షియం వంటి సూక్ష్మ ధాతువులను పంటకు అందిస్తుంది. ● నేలలో కరగని మూలకాలను పంటకు అనుకూలంగా మారుస్తుంది. ● నేలలో భౌతిక స్థితి మెరుగుపడి, భూమి గుల్లగా మారి, నేలలోకి నీరు ఇంకే గుణాన్ని పెంచుతుంది. ● పంట పొలంలో నీటి నిల్వ సామర్థ్యం పెంచుతుంది. ● పంట పొలంలో వానపాముల అధిక ఉత్పత్తికి తోడ్పడుతుంది. ● లెగ్యూం జాతికి చెందిన మొక్క కావడంతో వేర్లలో నత్రజని స్థిరంగా ఉంటుంది. ● పొలంలో తుంగ, గరిక వంటి కలుపు మొక్కల పెరుగుదలను అడ్డుకుంటుంది. ● నేలలో ఉండే ప్రయోజనకర సూక్ష్మజీవుల సంఖ్యను మెరుగుపరుస్తుంది. ● వేసవిలో సంభవించే భారీ గాలులు, వర్షాల వల్ల జరిగే నేల కోతను నివారిస్తుంది. ● రసాయనిక ఎరువుల వాడకాన్ని 15 నుంచి 25 శాతం వరకు తగ్గిస్తుంది. ● పంటలపై ఖర్చు ఆదా అవుతుంది. జీలుగ సాగుకు అనువైన సమయాలు ● ప్రధాన పంట కోయగానే నేలలో మిగిలిన తేమను సద్వినియోగపర్చుకునే విధంగా జీలుగ విత్తనాలు చల్లుకోవాలి. ● తేమ చాలని ప్రాంతాల్లో వేసవిలోనే దుక్కి దున్ని, తొలకరి వర్షాలు పడగానే విత్తుకోవాలి. ● నీటి వసతులు గల ప్రాంతాల్లో వేసవిలోనే సాగు చేయడం లాభదాయకం. ● రెండు పంటల మధ్య కాల వ్యవధిలో కూడా విత్తుకొని కలియ దున్నవచ్చు. ● ఏప్రిల్, మే నెలల్లో ఖరీఫ్ పంటలు వేసే ముందు, తొలకరి వర్షాలు కురవగానే జీలుగ విత్తనాలు విత్తుకోవాలి. ● విత్తిన తర్వాత ఏపుగా పెంచి, పంట జీవ పదార్థాన్ని కలపడానికి, కుళ్లిపోవడానికి నేలలో కలియ దున్నాలి. చినబాబు, మండల వ్యవసాయాధికారి (ఫైల్) -
వ్యాన్ను ఢీకొన్న కంటైనర్
దెందులూరు: వ్యాన్ను కంటైనర్ లారీ ఢీకొనడంతో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై దెందులూరు హెచ్పీ పెట్రోలు బంకు వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా పామర్రు నుంచి తూర్పుగోదావరి జిల్లా వాడపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఒకే కుటుంబానికి చెందిన 15 మంది వ్యాన్లో వెళ్తున్నారు. దెందులూరు హెచ్పీ పెట్రోలు బంకు వద్దకు వచ్చేసరికి గుండుగొలను వైపు వెళ్తున్న కంటైనర్ లారీ వెనుక నుంచి వ్యాన్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ప్రయాణిస్తున్న 15 మందిలో ఆరుగురికి స్వల్ప గాయాలు కాగా మిలిలిన వారు క్షేమంగా బయటపడ్డారు. క్షతగాత్రులను వెంటనే దెందులూరు సీహెచ్సీకి 108 అంబులెన్స్లో తరలించారు. కాగా వ్యాన్ను ఢీకొట్టి వెళ్లిపోయిన కంటైనర్ను సత్యనారాయణపురం వద్ద గ్రామస్తులు నిలుపుదల చేసి తాళాలు తీసుకున్నారు. అయితే డ్రైవర్ వద్ద మరో తాళం ఉండడంతో కంటైనర్తో పరారయ్యాడని ఎస్సై శివాజి చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. ఆరుగురికి స్వల్పగాయాలు -
రోడ్డు ప్రమాదంలో సబ్ కలెక్టర్ కార్యాలయ అటెండర్ మృతి
నూజివీడు: నూజివీడు సబ్కలెక్టర్ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న బలుమూరి సుబ్బారావు(59) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. సబ్కలెక్టర్కు అటెండర్గా పనిచేస్తున్న ఆయన స్వగ్రామమైన కృష్ణాజిల్లా గన్నవరం మండలం గోపవారిగూడెంలో ఉంటున్నారు. నిత్యం అక్కడి నుంచే విధులకు హాజరై మరలా ఇంటికి వెళ్తారు. రోజూ మాదిరిగానే ఇంటి వద్ద నుంచి నూజివీడులోని సబ్కలెక్టర్ కార్యాలయానికి విధి నిర్వహణ నిమిత్తం మంగళవారం ద్విచక్రవాహనంపై వస్తుండగా ఉదయం 7.45 గంటల సమయంలో కొన్నంగుంట రోడ్డులో అమృతనగర్ స్టేజీ వద్ద వ్యాన్ వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. అటెండర్ సుబ్బారావు మృతి వార్త తెలుసుకున్న సబ్కలెక్టర్ బచ్చు స్మరణ్రాజ్ హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం సుబ్బారావు భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రూరల్ ఎస్సై జీ జ్యోతీబసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలి బుట్టాయగూడెం: ప్రత్యేక డీఎస్సీ ప్రకటించి ఆదివాసీ ప్రాంతంలో నూరుశాతం ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష మంగళవారంతో 14వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఏటీఏ రాష్ట్ర అధ్యక్షుడు జలగం రాంబాబు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో డీఎస్సీలో ఉపాధ్యాయుల పోస్టులను మినహాయించి ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఆదివాసీ అభ్యర్థులతో ఆ పోస్టులను భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో తెల్లం లక్ష్మి, కలుం వెంకటేశ్వరి, ఎం శాంతికుమారి, పి.భవాని, పి.నాగరత్నం, జి. కృష్ణారెడ్డి, సీహెచ్ మల్లీశ్వరి, కె.మల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఎర్ర గ్రావెల్ తవ్వేస్తున్నా.. మొద్దు నిద్రే
ద్వారకాతిరుమల: అవినీతి అధికారులు ఉన్నంత వరకు అక్రమార్కులకు అడ్డేలేదు అనడానికి పోలవరం కుడి కాలువ గట్టుపై జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలే నిదర్శనం. నామమాత్రపు అనమతులను అడ్డం పెట్టుకుని ఏకంగా క్వారీలు ఏర్పాటు చేశారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా భూమిని తవ్వేస్తూ.. ఎంతో విలువైన ఎర్ర గ్రావెల్ను అమ్మేస్తున్నారు. నిత్యం వందలాది టిప్పర్ల మట్టిని తరలించేస్తున్నారు. కొందరు రైతులు తమ పొలాల వద్ద గోతులు తవ్వేస్తున్నారని గగ్గోలు పెడుతున్నా.. పట్టించుకునే నాధుడు లేడు. ముడుపుల మత్తులో జిల్లా అధికార యంత్రాంగం నిద్ర నటించడమే ఇందుకు కారణమని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. ఇంతటి అరాచక పాలనను, లెక్కలేని అధికారుల తీరును ముందెన్నడూ చూడలేదని వాపోతున్నారు. మళ్లీ పూడ్చేస్తాములే.. కాలువ తవ్విన సమయంలో గట్టుపై వేసిన మట్టిని బయటకు తోలుకునేందుకు మూడు కంపెనీలకు ఇరిగేషన్, మైనింగ్ అధికారులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. అయితే గట్టుపై ఉన్న మట్టిని కాకుండా, భూమిని తవ్వి ఎంతో విలువైన ఎర్ర గ్రావెల్ను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. దాంతో తవ్వకాలు జరిగిన ప్రాంతాలు క్వారీలను తలపిస్తున్నాయి. తమ పొలాలకు వెళ్లే మార్గాల్లో గుంతలు తవ్వేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలు జరుపుతున్న వారిని ప్రశ్నిస్తే.. మళ్లీ పూడ్చేస్తాములే అని సమాధానం చెబుతున్నారట. వర్షాలకు గోతులు నిండిపోయి అందులో రైతులు గాని, పశువులు గాని పడి మృత్యువాత పడితే దానికి ఎవరు బాధ్యులు. తవ్వకాలు జరుపుతున్న వారా.. లేక అధికారులా.. అని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. మొక్కుబడిగా పూడిక.. గట్టుపై మట్టి తవ్వకాలు ముసుగులో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై ఇటీవల సాక్షిలో వరుస కథనాలు ప్రచురితం అయ్యాయి. దాంతో ఉలిక్కిపడ్డ అక్రమార్కులు తమ తప్పులను అధికారుల సూచనలతో కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పంగిడిగూడెం వద్ద గ్రావెల్ తవ్వగా ఏర్పడిన గోతులను, గట్టుపై ఉన్న మట్టితో మొక్కుబడిగా పూడ్చుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే గోతులు పూడ్చుతున్నామని చెబుతున్నారు. అసలు గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు ఎవరిచ్చారు, ఇప్పటి వరకు తవ్విన గోతుల సంగతి ఏమిటన్న ప్రశ్నలకు వారి వద్ద సమాదానం లేదు. ముసుగులతో రవాణా.. కూటమి నేతలు ఎంతో విలువైన గ్రావెల్ను అక్రమంగా అమ్మేస్తున్నారని, అధికారులు వారికి కొమ్ము కాస్తున్నారని జిల్లా వ్యాప్తంగా తెలిసిపోయింది. దాంతో టిప్పర్లలోని గ్రావెల్ బయటకు కనబడకుండా గ్రీన్ క్లాత్లు కట్టి మరీ రవాణా చేస్తున్నారు. నిత్యం వందలాది టిప్పర్ల మట్టి ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు తరలిపోతోంది. పోలవరం కుడి కాలువగట్టుపై ఏకంగా గ్రావెల్ క్వారీలు మట్టి ముసుగులో యథేచ్ఛగా ఎర్ర గ్రావెల్ తవ్వకాలు నిద్ర నటిస్తున్న జిల్లా అధికార యంత్రాంగం ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు పంగిడిగూడెం వద్ద నాకు ఉన్న పొలానికి వెళ్లే దారిలో గోతులు తవ్వేస్తున్నారని ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు ఫోన్లో ఫిర్యాదులు చేశాను. అయినా వారు పట్టించుకోలేదు. కూటమి నేతలకు ఎదురు తిరిగి నిలబడలేను. ఎందుకంటే వారి వెనుక ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. నా కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. మిగిలిన రైతుల పరిస్థితి కూడా ఇదే. – భీమడోలుకు చెందిన ఓ రైతు ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు కాలువ గట్టుపై ఉన్న మట్టిని విడిచిపెట్టి, క్వారీలు తవ్వుతూ కూటమి నేతలు కోట్లు గడిస్తున్నారు. ఆ డబ్బుతో అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. అందుకే అధికారులు సైతం అక్రమార్కులకు తొత్తుల్లా మారారు. ఇంత దారుణాన్ని ఎప్పుడూ చూడలేదు. ఎం.నాగులపల్లి, పంగిడిగూడెం వద్ద పచ్చ నేతలు, జనసేన నాయకుడి కనుసన్నల్లో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. – ఎం.నాగులపల్లికి చెందిన ఓ రైతు -
ఉపాధి హామీ పనులను తనిఖీ చేయాలి
నూజివీడు: ఉపాధి హామీ పనుల్లో తప్పుడు మస్తర్ నమోదు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మండలాల్లో ప్రోగ్రాం ఆఫీసర్లు ఉపాధి హామీ పనుల నిర్వహణలో చురుగ్గా వ్యవహరించాలని కలెక్టర్ కే వెట్రిసెల్వి ఆదేశాలు జారీ చేసినట్లు డ్వామా పీడీ వెంకట సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘మస్తర్లలో మాయాజాలం’ పేరుతో ఉపాధిహామీ పనుల్లో జరుగుతున్న అవకతవకలను ‘సాక్షి’ మంగళవారం ప్రచురించడం జరిగింది. దీనిపై కలెక్టర్ స్పందించి ప్రోగ్రాం ఆఫీసర్లు తప్పనిసరిగా మస్తర్లు తనిఖీ చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. నూజివీడు మండలంలో జిల్లా విజిలెన్స్ అధికారి, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సంయుక్తంగా విచారణ నిర్వహించారని, వారి నుంచి నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత పారదర్శకంగా నిర్వహించి ఎక్కువమంది శ్రామికులకు పని కల్పించి వారు ఆశించిన వేతనలు అందేలా కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో ఉపాధిహామీ పథకం విజయవంతంగా నిర్వహించబడుతుందని, గతేడాది కోటి 20 లక్షల పని దినాల లక్ష్యానికి కోటి 23 లక్షల 65 వేల పనిదినాలు కల్పించి 103 శాతం పైగా వృద్ధిని సాధించామన్నారు. గతంలో ఉపాధి హామీ వేతనం సరాసరి రూ.300 కాగా దానిని ప్రభుత్వం రూ.307కు పెంచిందన్నారు. ఈ మేరకు గత ఏడాది రూ.300 వేతన సరాసరికి జిల్లాలో రూ.253 సాధించామన్నారు. ఈ ఏడాది పెరిగిన సరాసరి వేతనానికి అనుగుణంగా కనీసం రూ.290 తగ్గకుండా వేతనం కల్పించి ఉపాధి హామీపై మరింత నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టామన్నారు. ఉపాధిహామీ పనులకు సంబంధించి ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన పనులకు రూ.280 సరాసరి వేతనం చెల్లించడం జరిగిందన్నారు. కలెక్టర్ ఉత్తర్వులు జారీ -
మద్ది అంజన్నకు పూజలు
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో మంగళవారం సందర్భంగా ఆంజనేయస్వామిని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకున్నారు. అంజన్నకు ప్రభాతసేవ, నిత్యార్చనలు అర్చకులు నిర్వహించారు. మధ్యాహ్నం వరకు ఆలయానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,82,553 ఆదాయం వచ్చిందని ఈఓ ఆర్వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో 1500 మంది అన్నప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు. ఏర్పాట్లను కురగంటి రంగారావు పర్యవేక్షించారు. దళితులపై దాడులు దారుణంతాడేపల్లిగూడెం (టీఓసీ): గుంటూరు జిల్లా తెనాలిలో పట్ట పగలు, ప్రజలు చూస్తుండగా ఎస్సీ, మైనారిటీ యువకుల కాళ్లపై సీఐలు రాములు నాయక్, రమేష్ బాబు లాఠీలతో కొట్టడాన్ని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు తీవ్రంగా ఖండించారు. సీఐలను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టణంలో మంగళవారం మంగరాజు విలేకర్లతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో దళిత, ప్రజా సంఘాల తరుఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట విజయ్, ప్రియబాబు, నాగేశ్వరరావు ఉన్నారు. -
నిర్వాసితులను తరలించేందుకు ప్రత్యేక చర్యలు
పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అభిషేక్ బుట్టాయగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న ఫేజ్ బి పరిధిలో ఉన్న నిర్వాసితులకు పునరావాస కాలనీలు ఏర్పాటు చేసి వారిని తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ బి.అభిషేక్ తెలిపారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాటాడారు. రెండో దశలో సుమారు 32 గ్రామాల్లో 13,700 మంది నిర్వాసితులు ఉన్నారన్నారు. వీరందరికీ వీఆర్పురం, కూనవరం పరిధితోపాటు కేఆర్పురం ఐటీడీఏ పరిధిలో నిర్వాసితులకు అనుకూలమైన భూములను సేకరించేలా కృషి చేస్తున్నామని చెప్పారు. వీరికి నిర్వాసిత గ్రామాలు నిర్మించడంతోపాటు భూమికి భూమిగా కూడా భూసేకరణ చేయడం జరుగుతుందని చెప్పారు. నిర్వాసితులు కోరుకున్న ప్రదేశంలో ఇళ్లు నిర్మించడంతోపాటు వ్యవసాయ భూములను కూడా సేకరించేలా కృషి చేస్తామని చెప్పారు. గిరిజనులకు నివాసాలు కల్పించడంతోపాటు భూములను కూడా సేకరించి ఇచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. వారు కోరుకున్న ప్రదేశాల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో భూములను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ ప్రక్రియ నెలరోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణ, తహసీల్దార్ పీవీ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.