రైతులను నిండాముంచిన చంద్రబాబు
చంద్రబాబు రైతులను నిండా ముంచాడు. రైతుభరోసా సక్రమంగా ఇవ్వకపోవడం, యూరియా కొరత తీర్చకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.పది వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. బడ్జెట్లో తప్పడు లెక్కలు చెబుతూ అన్నదాతలను మళ్లీ భయపెట్టే యత్నం చేశారు. చంద్రబాబు చెబుతున్న రైతన్నలకు నిజాలు తెలిసిపోయాయి. చంద్రబాబు ఇక నీ అబద్ధాల్ని కట్టిపెట్టు.
– మంద జయలక్ష్మి, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి, ఉంగుటూరు


