breaking news
West Godavari District News
-
ముమ్మరంగా వరి నాట్లు
ఉంగుటూరు: ఏలూరు జిల్లాలోనే అత్యధికంగా వరి సాగు చేసే ఉంగుటూరు మండలంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఈ ఏడాది మండల వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 25,600 ఎకరాల్లో వరి నాట్లు వేస్తున్నారు. దీంతో ఎటు చూసినా రైతులు, కౌలురైతులు, వ్యవసాయ కూలీలు పొలం పనుల్లో నిమగ్నమై బిజీబిజీగా కనిపిస్తున్నారు.మండలంలోని ఏ గ్రామానికి వెళ్లినా వ్యవసాయ సందడే కనిపిస్తోంది. గత పది రోజులుగా సాగునీటి బోదెలు బాగు చేయడం, గట్లు చెక్కడం, పొలాలను దమ్ము చేయడం, తుర్రాలు సరిచేయడం, నారు పీకడం వంటి పనులతో ఆయకట్టు ప్రాంతాలన్నీ కళకళలాడుతున్నాయి. ఈ హడావుడి మరో 20 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. బెంగాల్ కూలీల రాక స్థానిక కూలీల కొరతను అధిగమించడానికి పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వలస కూలీలు ఇక్కడి గ్రామాల్లో, పొలాల వద్దే తాత్కాలిక మకాంలు ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక కూలీలతో పాటు వీరు కూడా నాట్ల ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. మండలంలోని మెట్ట, డెల్టా ప్రాంతాల్లోని రైతులు ఈ ఏడాది అత్యధికంగా సంపద స్వర్ణ రకం వంగడాన్ని సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రస్తుత సీజన్లో సాగు ఖర్చులు భారీగా పెరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్లు వేయడానికి ఎకరాకు రూ.5,000, ట్రాక్టరుతో దమ్ము చేయడానికి రూ.4 వేల నుంచి రూ.4,500, గట్లు వేయడానికి ఎకరాకు రూ.1,200 వరకు ఖర్చవుతోందని చెబుతున్నారు. మెట్ట, డెల్టా పరిధిలో సాగు ఇలా.. మండలంలోని మెట్ట ప్రాంతంలో బోరు బావుల కింద ఆధారపడి పంట సాగు చేస్తుండగా, డెల్టా ప్రాంతంలో ఏలూరు–గోదావరి కాలువ నీటితో సాగు చేస్తున్నారు. మెట్ట ప్రాంత గ్రామాలైన గొల్లగూడెం, నల్లమాడు, యర్రమల్లిపాడు, ఎ.గోకవరం, గోపాలపురం, గోపినాథపట్నం, నీలాద్రిపురం, నాచుగుంట, వెల్లమిల్లిలో సాగు పనులు ఊపందుకున్నాయి. అలాగే డెల్టా ప్రాంత గ్రామాలైన బాదంపూడి, ఉంగుటూరు, నారాయణపురం, చేబ్రోలు, కై కరం, తల్లాపురం, రావులపర్రు, కాగుపాడు, బొమ్మిడి, దొంతవరం, కాకర్లమూడి, వీఏ పురం నాట్లు వేసుకునే పనిలో బిజిగా ఉన్నారు. ఈ గ్రామాల్లోని ఆయకట్టు పరిధిలో వ్యవసాయ పనులు శరవేగంగా సాగుతుండటంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామాల్లో సందడి వాతావరణం -
ఏపీఏఐఎంఎస్ యాప్పై అవగాహన కల్పించాలి
ఏలూరు (టూటౌన్): జిల్లాలో ఎరువులకు ఎలాంటి కొరత లేదని, ఏపీఏఐఎంఎస్ యాప్ పై ప్రతి రైతుకూ అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వ్యవసాయాధికారులు ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఎరువుల పంపిణీపై గురువారం స్థానిక కలెక్టరేట్ నుంచి వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు, గ్రామస్థాయి వ్యవసాయ శాఖ సిబ్బందికి టెలి కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈ–క్రాప్ వివరాల ఆధారంగా రైతులకు అవసరమైన మేరకు రైతులకు ఎరువుల పంపిణీ చేయాలని సూచించారు. ఎరువుల నిల్వలను డీలర్లు తప్పనిసరిగా నోటీస్ బోర్డులపై ప్రదర్శించాలన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్లో జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, వ్యవసాయ, అనుబంధ శాఖలకు చెందిన మండల, గ్రామ స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (ఆర్ఆర్పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్లును గురువారం డీఈఓ కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకట లక్ష్మమ్మ మాట్లాడుతూ 14 సంవత్సరాల వయసు నిండి చదవగలిగిన, రాయగలిగిన పరిజ్ఞానం కలిగిన వారంతా పదో తరగతి ప్రవేశాలకు అర్హులన్నారు. అలాగే పదో తరగతి అనుత్తీర్ణులై, చదువు మధ్యలో ఆపి వేసిన వారికి ఇది సువర్ణ అవకాశమన్నారు. అలాగే 15 సంవత్సరాల వయసు నించి పదో తరగతి పూర్తి చేసుకున్న వారు ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరడానికి అర్హులన్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, ట్రాన్స్జెడర్లు, మాజీ సైనికోద్యోగులకు ఫీజులో రాయితీ లభిస్తుందని తెలిపారు. ప్రవేశాలు పొందడానికి ఈ నెల 31 వరకూ గడువు ఉందన్నారు. ఇతర వివరాలకు తమ సమీపంలోని మండల విద్యాశాఖాధికారులు, డివిజనల్ విద్యాశాఖాధికారులు, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో గానీ లేదా ఆధీకృత కేంద్రాల్లో గానీ సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.ఆశ, అసిస్టెంట్ డైరెక్టర్ ఎంవీ అవధాని తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
జంగారెడ్డిగూడెం: పట్టణంలో బుట్టాయగూడెం రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం గ్రామానికి చెందిన నామాల సాయిపవన్ (26) తాపీ పని చేస్తాడు. బయ్యన్నగూడెం నుంచి జంగారెడ్డిగూడెం మోటార్సైకిల్పై పని నిమిత్తం వచ్చి, పని అయ్యాక తిరిగి బయ్యన్నగూడెం వెళ్తున్నాడు. ఈ సమయంలో బుట్టాయగూడెం రోడ్డులోకి వెళ్లేసరికి ఎదురుగా వస్తున్న ఓమ్నీ వ్యాన్ సాయిపవన్ మోటార్ సైకిల్ను ఢీకొంది. ఈ ఘటనలో సాయి పవన్ అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే ఓమ్నీ వ్యాన్ డ్రైవర్ మానేపల్లి గంటయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెంటపాడు: మండలంలోని అలంంపురంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాచర్ల నుంచి దాలిరెడ్డి (25), కోళ్లశివ, గాడి ప్రసాద్ ముగ్గురూ కలిసి మోటార్సైకిల్పై రాచర్ల నుంచి అలంపురం వెళ్లడానికి రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో గుర్తు తెలియని ఓ వాహనం వీరిని ఢీకొట్టింది. దీంతో బండిపై ఉన్న దాలి రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా వాహనం నడుపుతున్న ప్రసాద్కు, కోళ్ల శివకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని మెరుగైనవైద్యం నిమిత్తం రాజమండ్రి తరలించారు. ప్రమాదంలో రెడ్డి మృతదేహాన్ని గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బందువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చినస్వామి తెలిపారు. -
అప్రమత్తంగా ఉండాలి సర్
● ఒక్కరికి ఒకే ఓటు నినాదంతో సర్ ● బోగస్ ఓట్ల తొలగింపే లక్ష్యం ● జిల్లాలో ఇప్పటికే 48.41 శాతం ఎన్యుమరేషన్ పూర్తి బుట్టాయగూడెం : బోగస్ ఓటర్లకు చెక్ పెట్టడంతో పాటు, ప్రతి ఓటరుకూ ఒకే చోట ఓటు హక్కు ఉండేలా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అనర్హులను తొలగించి, అర్హులతో కూడిన కొత్త జాబితాను రూపొందించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 2002 నాటి సమగ్ర సర్వే ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఇప్పటికే ఇంటింటికీ వెళ్తూ పాత జాబితా ప్రకారం ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. జిల్లాలో 48.41 శాతం ప్రక్రియ పూర్తి జిల్లా వ్యాప్తంగా మొత్తం 16,44,193 మంది ఓటర్లు ఉండగా, 1,744 మంది బీఎల్ఓలు జూన్ 15 నుంచి తమ పరిధిలోని ఇళ్లను సందర్శిస్తున్నారు. ఇప్పటివరకు 16,34,851 మందికి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడంతో ఈ ప్రక్రియ 99.43 శాతం పూర్తయింది. కాగా, పంపిణీ చేసిన ఫారాలలో ఇప్పటివరకు 7,95,931 మందికి సంబంధించిన డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. అంటే జిల్లా వ్యాప్తంగా మొత్తం 48.41 శాతం మ్యాపింగ్ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 15వ తేదీ నాటికి వంద శాతం లక్ష్యాన్ని చేరుకునేలా బీఎల్ఓలు పనులను వేగవంతం చేశారు. ఈ సర్ కార్యక్రమంలో మృతుల కుటుంబాలకు, వలసలు వెళ్లిన వారికి, డబుల్ ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నామని, అనంతరం ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను శాశ్వతంగా తొలగిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏజెన్సీ పరిధిలో ‘సిగ్నల్’ కష్టాలు మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే పోలవరం నియోజకవర్గంలో డిజిటలైజేషన్ ప్రక్రియ కొంత కష్టతరంగా మారింది. ఇక్కడి ఏజెన్సీ గ్రామాల్లో మొబైల్ సిగ్నల్ సమస్య తీవ్రంగా ఉండటమే ఇందుకు కారణం. పోలవరంలో మొత్తం 2,55,122 మంది ఓటర్లు ఉండగా, 254 మంది బీఎల్ఓలు 2,55,121 మందికి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. వీటిలో ఇప్పటివరకు 1,39,271 ఓట్ల మ్యాపింగ్ పూర్తవగా, 54.59 శాతంగా నమోదైంది. సిగ్నల్ లేని గ్రామాల్లో బీఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలను అక్కడికక్కడే మాన్యువల్గా పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత సిగ్నల్ లభించే ప్రాంతాలకు చేరుకుని డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఈ కారణంగానే పని కొంత ఆలస్యమవుతోందని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. అయినప్పటికీ ఈ నెల 15వ తేదీ లోపు వంద శాతం పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. నియోజకవర్గం మొత్తం ఓటర్లు బీఎల్ఓలు పంపిణీ డిజిటలైజేషన్ పూర్తి అయిన చేసిన ఫారాలు అయినవి శాతందెందులూరు 2,25,615 239 2,24,540 94,381 41.83 ఏలూరు 2,34,948 213 2,28,121 99,042 42.15 చింతలపూడి 2,74,003 273 2,73,077 1,23,389 45.03 నూజివీడు 2,40,581 286 2,40,259 1,18,311 49.18 కై కలూరు 2,06,578 235 2,06,387 1,04,946 54.59 ఉంగుటూరు 2,07,346 214 2,07,346 1,16,591 56.23 -
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
నూజివీడు: టీడీపీ ప్రభుత్వం వచ్చిందే మట్టి దోపిడీకి అన్నట్లుగా గ్రామాల్లో పరిస్థితులు తయారయ్యాయి. అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఎంతో విలువైన మట్టి తరలించి అధికార పార్టీ నాయకులు జేబులు నింపుకొంటున్నారు. మండలంలోని దేవరగుంటలోని కోతులగుంట చెరువులో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఇష్టారాజ్యంగా మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. చెరువులో నుంచి మట్టిని కిలోమీటరు దూరం ఉన్న గ్రామంలోకి తోలడానికి రూ.800, దేవరగుంట నుంచి వేంపాడు వద్దకు తోలేందుకు ట్రక్కుకు రూ.1400 చొప్పున వసూలు చేస్తున్నారు. గ్రామంలోకి కిరాయితో కలుపుకుని ట్రక్కు రూ.450కు తోలవచ్చని కానీ ఇక్కడ రూ.800లు వసూలు చేస్తూ దోచుకుంటున్నారని, ఈ దోపిడీని ఆపే అధికారులే లేకపోవడం దారుణమైన పరిస్థితులకు అద్దం పడుతోందని పలువురు గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా అక్రమంగా మట్టిని తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నా వీఆర్ఓ గానీ, తహసీల్దార్ గానీ, ఇరిగేషన్ అధికారులు గానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనర్హం. కొన్ని చెరువుల్లో అయితే తూము లెవెల్ కంటే ఇంకా లోతుకు తవ్వి మట్టిని తరలిస్తుండటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలా తవ్వడం వల్ల అరకొరగా చెరువుకు నీళ్లు వచ్చినా తూము నుంచి బయటకు రావని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని కోరతున్నారు. -
విద్యార్థులు పట్టుదలతో చదువుకోవాలి
నూజివీడు : విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధనకు పట్టుదలతో ముందుకు సాగాలని, అప్పుడే సులువుగా లక్ష్యాన్ని సాధించగలుగుతారని ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్ఐటీకి వచ్చిన పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు గురువారం స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ జీవితంలో వచ్చిన అవకాశాన్ని విద్యార్థులు వృథా చేసుకోవద్దని, చక్కగా చదువుకుని దేశానికి ఉపయోగపడే పౌరులుగా మారాలన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలని, ఏమైనా అర్థం కాకపోతే వెంటనే అడగాలని సూచించారు. క్యాంపస్లోనే అన్ని వసతులు ఉన్నాయని, ఆసుపత్రి సైతం ఉన్నందున విద్యార్థులకు ఎలాంటి భయం అక్కర్లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ బి.లక్ష్మణరావు, డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి, డీఎస్డబ్ల్యూఓలు లంకపల్లి రాజేష్, దుర్గాభవాని, పీయూసీ ఇన్చార్జి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం: ఏపీ నిట్లో స్థానిక ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ విద్యార్థులకు పీహెచ్డీ సీట్లు వచ్చినట్లు ప్రిన్సిపాల్ టి.అశోక్ గురువారం తెలిపారు. పి.తేజస్విని, జీఆర్.సత్యనారాయణకు ఈ సీట్లు వచ్చాయన్నారు. ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థలో తమ విద్యార్థులకు సీట్లు రావడం ఆనందంగా ఉందని ప్రిన్సిపాల్ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో రసాయన శాస్త్ర విభాగం కోర్సు కో–ఆర్డినేటర్ శ్రీరాముడు, అధ్యాపకులు పుత్రయ్య, రమణ, డాక్టర్ ప్రశాంతి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆగిరిపల్లి: మండలంలోని నూగొండపల్లిలో రీసర్వే పేరుతో రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడి తన భూమిని వేరొక వ్యక్తి పేరుపై నమోదు చేశారని రైతు మల్లవల్లి అర్జున్ రావు ఆరోపించాడు. గురువారం బాధితుడు విలేకరులతో మాట్లాడుతూ నూగోండపల్లిలో తనకు వారసత్వంగా 1.94 ఎకరాల పొలం ఉందని, అయితే సంవత్సరం క్రితం గ్రామంలో రీసర్వే నిర్వహించారని, ఆ సర్వేలో అప్పటి సర్వేయర్ మునీర్, తన పొలంలోని 16.05 సెంట్లు స్థలాన్ని వేరొకరి పేరుపై అక్రమంగా నమోదు చేశారని ఆరోపించారు. తన భూమిని తనకు మళ్లీ ఇప్పించి, న్యాయం చేసి, అక్రమాలకు పాల్పడిన సర్వేయర్ పై చర్యలు తీసుకోవాలని ఇటీవల సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశానని బాధితుడు అర్జున్ రావు తెలిపాడు. -
ఏపీ నిట్ విద్యార్థుల ప్రతిభ
తాడేపల్లిగూడెం: ఆసియా బ్రౌన్ బొవేరీ (ఏబీబీ) సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరులో నిర్వహించిన ఏబీబీ యాక్సిలరేటర్–2026 జాతీయస్థాయి పోటీల్లో ఏపీ నిట్ విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారని డైరెక్టర్ ఎన్వీ రమణరావు, రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి గురువారం తెలిపారు. దేశవ్యాప్తంగా 1,600కు పైగా జట్లతో పాటు 14 వేల మంది విద్యార్థులు పాల్గొన్న పోటీల్లో తమ విద్యార్థులు ప్రాజెక్టుతో ప్రతిభ కనబర్చి రూ.1.50 లక్షల నగదు పురస్కారం అందుకున్నారన్నారు. అసోసియేట్ డీన్ పెద్దపాటి శంకర్ టీమ్ మెంటర్గా వ్యవహరించారన్నారు. . ప్రాజెక్ట్ అ‘ద్వితీయ’ం నిట్లో మూడో సంవత్సరం చదువుతున్న సౌమ్యదీప్దాస్, బి.కిసాన్ (ఈఈఈ), శివమ్కుమార్ (మెకానికల్), ఆర్యన్ శ్యామ్ (సీఎస్ఈ) బృందం బియాండ్ మానిటరింగ్ ఏఐ ఏజెంట్స్ ఫర్ రియల్ టైమ్ పాడ్ రీసోర్స్ డిస్కవరీ అండ్ డిపెండెన్సీ మ్యాపింగ్ పేరుతో వినూత్న ప్రాజెక్టును రూపొందించారు. కృత్రిమ మేధస్సు ఆధారంగా క్లౌడ్ వాతావరణంలో పనిచేస్తున్న అతి చిన్న కంప్యూటింగ్ వనరులను తక్షణమే గుర్తించడం, వాటి పరస్పర ఆధారిత సంబంధాలను విశ్లేషించడం ప్రాజెక్టు ప్రత్యేకత. -
6న ఎస్ఎఫ్ఐ ధర్నా
భీమవరం: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈనెల 6న భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్టు జిల్లా కార్యదర్శి టి.ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థులకు నష్టం కలిగించేలా ఉన్న ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేయాలని, హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ధర్నా చేపట్టనున్నామన్నారు. ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ నాయకులు ఎస్.లక్ష్మణ్, పి.సాయికృష్ణ, పి.త్రినాథ్, జి.కౌశిక్, జి.అభి పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్: జిల్లావ్యాప్తంగా 99.5 శాతం ఎన్రోల్మెంట్ ఫారాలు పంపిణీ పూర్తయిందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. గురువారం బంగారుగూడెంలో జరుగుతున్న సర్ కార్యక్రమం పురోగతిని ఆమె పరిశీలించారు. పారదర్శకంగా, స్వచ్ఛంగా ఓటర్ల జాబి తా రూపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈనెల 21 నాటికి డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురిస్తామన్నారు. ప్రతి ఓటరును సరైన పోలింగ్ కేంద్రానికి మ్యాపింగ్ చేయడం కీలకమని, మ్యాపింగ్ శాతాన్ని పెంచడంతో పాటు ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని బీఎల్ఓలను ఆదేశించారు. ఆర్డీవో ఎం.సూర్యారావు, తహసీల్దార్ ఎం.సునీల్కుమార్, బీఎల్వోలు ఉన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా ఇన్చార్జి రెవెన్యూ అధికారిగా పెంచల ప్రభాకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాను ముందంజలో నిలిపేందుకు కృషిచేయాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటివరకు డీఆర్వోగా ఉన్న బి.శివన్నారాయణరెడ్డి గత నెల 30న పదవీ విరమణ చేయడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. ఇన్చార్జి డీఆర్వోగా బాధ్యతలు చేపట్టిన ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఉండి: ఐటీఐ జిల్లా కన్వీనర్, ఎన్నార్పీ అగ్రహారం ప్రభుత్వం ఐటీఐ ప్రిన్సిపాల్గా ఎం.లక్ష్మీసరోజ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఏలూరు ఐటీఐ, డీఎల్టీసీ ఏడీగా విధులు నిర్వహిస్తున్న ఆమె పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. ఐటీఐ అధికారులు, సిబ్బంది ఆమెను అభినందించారు. కై కలూరు: కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చెరువు గట్లను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. కై కలూరు మండలం పెంచికలమర్రులో పట్టపగలు ఎవరికీ అనుమా నం రాకుండా కూలీలతో ఓ వ్యక్తి చేపల చెరువు గట్లును పటిష్ట పరుస్తున్నాడు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో అధికారులు ధ్వంసం చేసిన చెరువుల్లోనే సాగు చేస్తున్నాడు. దీనిపై ఇటీవల సాక్షిలో ‘ఆగని అక్రమ గట్లు పర్వం’ శీర్షికన కథనం వెలువడింది. దీనిపై అటవీశాఖ కైక లూరు రేంజర్ కె.రామంలింగాచార్యులు స్పందించారు. క్షేత్రస్థాయి సిబ్బందిని పంపించారు. గట్లును ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా రేంజర్ మాట్లాడతూ అభయారణ్యంలో అక్రమ సాగు చేసినా, గట్లు ఏర్పాటు చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
ఇంటర్మీడియట్ విద్య అధికారిగా అప్పారావు
యలమంచిలి: పాలకొల్లు కోకోనట్ మర్చంట్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బి. అప్పారావు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా (డీఐఈఓ) పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా చాంబర్స్ కళాశాల యాజమాన్యం గురువారం ఆయ న్ను సత్కరించింది. చైర్మన్ కేవీఆర్ నరసింహారావు మాట్లాడుతూ ఇంటర్ విద్యా ఉపాధి కోర్సులను మరింత అభివృద్ధి చేసి, తీర ప్రాంత విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలోని జూనియర్ కళాశాలలను రాష్ట్రంలో ముందు వరుసలో నిలపాలని ఆకాంక్షించారు. కళాశాల కార్యదర్శి కేవీ సీతారామరాజు, చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కటారి నాగేంద్ర కుమార్, చాంబర్స్ కళాశాలల ప్రిన్సిపాల్ డి.వెంకటేశ్వరరావు అభినందనలు తెలిపారు. -
అడ్డగోలు అక్రమాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పదవీ కాలం కొద్దిరోజుల్లో పూర్తవుతుంది.. కనీసం ఇప్పుడైనా నాలుగు రూపాయలు సంపాదించుకోకపోతే ఎలా.. నిబంధనలు ఎలా ఉన్నా.. ఏఈ నుంచి కమిషనర్ వరకు ఎవరు బలైనా మాకు అనవసరం.. మా పనులు కావాల్సిందే.. మా కమీషన్లు అందాల్సిందే ఇది ఏలూరు నగ రపాలక సంస్థ సభ్యుల తీరు. కౌన్సిల్ తీర్మానం లేకుండా స్థాయి సంఘం సమావేశం రహస్యంగా నిర్వహించి కౌన్సిల్ తీర్మానం చేసినట్టు హడావుడిగా 19 పనులకు రూ.4.03 కోట్ల కేటాయింపు ప్రతిపాదనలు ఖరారు చేశారు. ఇక్కడ మరో ప్రత్యేక విషయమేమింటే.. ఏలూరు మేయర్ భర్తకు చెందిన లేఅవుట్లో మళ్లీ రోడ్లు నిర్మాణానికి రూ.96 లక్షలు కేటాయించుకోవడం గమనార్హం. ఒత్తిళ్లు.. నిబంధనలకు నీళ్లు ఏలూరు నగరపాలక సంస్థలో అడ్డగోలు దందాకు తెరపడటం లేదు. టౌన్ ప్లానింగ్ మొదలు ఇంజనీరింగ్ వరకు అధికారుల ఒత్తిళ్లతో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారు. తాజాగా కొద్ది నెలల క్రితం టౌన్ప్లానింగ్లో భారీ అవతవకలు జరిగాయని, అలాగే అనుమతులకు మించి అక్రమ కట్టడాలు నగరంలో ఉన్నాయనే ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రెండు రోజులపాటు సమగ్రంగా రికార్డులు పరిశీలించడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఇక తాజాగా ఏలూరు నగరంలో జరిగిన రూ.56 కోట్ల విలువైన 1,621 నామినేషన్ పనులపైనా ఆరోపణలు రావడం లోకాయుక్తకు ఫిర్యాదులు అందడంతో లోకాయుక్త నామినేషన్ పనులపై క్షుణ్ణంగా విచారించి నివేదికలు సమర్పించాల్సిందిగా రాష్ట్ర మున్సిపల్ శాఖను ఆదేశించింది. ఈ క్రమంలో రాజమండ్రి మున్సిపల్ ఆర్డీ సీహెచ్ నాగనరసింహారావు, ఏలూరు కమిషనర్ ఎ.భానుప్రతాప్లు వివరాలు అందజేయాలని ఆదేశించారు. ఈ పనుల్లోనూ రూ.2.06 కోట్లు మేయర్ భర్త ఎస్ఎంఆర్ పెదబాబుకు చెందిన ఎస్ఎంఆర్నగర్లో పనులు నిర్వహించారు. లేఅవుట్లో నిబంధనలకు విరుద్ధంగా పనులు ఎలా చేశారు.. ఫైల్ ప్రా సెసింగ్ ఎలా చేశారని.. లేఅవుట్లో ఎన్ని ఇళ్లు ఉ న్నాయి.. కార్పొరేషన్కు ఎంత ఆదాయం వస్తుంద ని కూడా తదితర వివరాలు కోరారు. వీటిపై ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులు ఉక్కిరిబిక్కిరి అ వుతున్న తరుణంలో గత నెల 17న స్థాయి సంఘం సమావేశం నిర్వహించారు. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఏలూరు కార్పొరేషన్లో వింత పరిస్థితి కౌన్సిల్ నిర్వహించకుండానే పనుల ఖరారు 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.4.03 కోట్లతో పనులు మళ్లీ మేయర్ లేఅవుట్కు రూ.96 లక్షల పనులు లోకాయుక్త విచారణ కొనసాగుతున్నా మరోసారి పనుల కేటాయింపు పాలకవర్గం గడువు ముగియనున్న నేపథ్యంలో హడావుడి వ్యవహారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు కౌన్సిల్ సమావేశం నిర్వహించి రూ.4.03 కోట్ల వ్యయంతో 19 పనులు ఖరారు చేసి ప్రతిపాదనలు పంపారు. వీటిల్లో కూడా కొన్ని ఎస్ఎంఆర్ నగర్లోని లేఅవుట్లో రూ.96 లక్షలతో అంచనాతో రెండు పనులను ప్రతిపాదించిన ప నులను ఎస్ఎంఆర్ నగర్ లేకుండా సర్వే నెంబర్, ఫలనా వ్యక్తి ఇంటి నుంచి ఫలానా వ్యక్తి ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణం రూ.24 లక్షలు, మళ్లీ అదే లేఅవుట్లో 50వ డివిజన్ సర్వే నంబబరుతో ఫలానా వ్యక్తి ఇంటి నుంచి ఫలానా ప్లాట్ వరకు రహదారి నిర్మాణం రూ.72 లక్షలు కేటాయింపు ప్రతిపాదనలు పంపారు. సాధారణ లేదా అత్యవసర కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించి పనులు ఖరారు చేస్తారు. అయితే 17న స్టాండింగ్ కౌన్సిల్ నిర్వహించినట్టు చెబుతున్నారు గాని మార్చి 27న బడ్జెట్ సమావేశాల అనంతరం ఇప్పటివరకు ఎలాంటి కౌన్సిల్ సమావేశం జరగలేదు. ఈ నెలాఖరుతో పాలకవర్గం ముగియనుండటంతో హడావుడిగా ప్రతిపాదనలు పెట్టడం, నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మిస్ట్రేషన్కు రిటైర్డ్ ఏఈ కేవీ సాయిప్రసాద్ ఫిర్యాదు చేశారు. -
కూటమిది ధృతరాష్ట్ర పాలన
వైఎస్సార్సీపీ గూడెం కన్వీనర్ రఘురాం తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ధృతరాష్ట్ర పాలన సాగిస్తోందని అప్సడా మాజీ వైస్చైర్మన్, వైఎస్సార్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ వడ్డి రఘురాం విమర్శించారు. గురువారం ఆయన లండన్ నుంచి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేదని, వరి నుంచి కోకో వరకు ఇదే పరిస్థితి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రైతుల సమస్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందిస్తే గానీ ప్రభుత్వంలో చలనం రావడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వ హయాంలో మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ధరల స్థిరీకరణ కోసం నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.7,800 కోట్లు కేటాయించి ఆపద కాలంలో రైతులను ఆదుకున్నారని గుర్తుచేశారు. ఉచిత పంటల బీమా కింద రూ.3,500 కోట్లు కేటాయించాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం ఎందుకు చెల్లించలేదన్నారు. ఆక్వా రంగం కుదేలవుతోందని, ఫీడ్ రేటు కిలోకు రూ.14 వరకు పెరిగితే రూ.2 తగ్గించి చేతులు దులుపుకోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా రైతులకు అన్నిరకాల సేవలు అందేవని, యూరియా విషయంలో కచ్చిత పర్యవేక్షణ ఉండేదన్నారు. అప్పట్లోనే ఆక్వా జోన్ పరిధిలో 50,800 క నెక్షన్లు ఉన్నాయని, చంద్రబాబు ప్రభుత్వం జీఓ 169తో పవర్ ఫ్యాక్టర్ నిబంధనతో రైతులను కొత్త తరహా మోసం చేస్తోందన్నారు. ఈ నిబంధన వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులను అన్నివిధాలా మోసం చేస్తోందని, అయి నా ప్రశ్నిస్తానన్న నాయకుడు నోరు మెదపడం లేదన్నారు. వైఎస్ జగన్ ప్రజాదరణను ఎవరూ అడ్డుకో లేరని, నష్టపోయిన అన్నివర్గాలకు అండగా ఉంటూ వైఎస్సార్సీపీ పోరాడుతుందన్నారు. -
మహిళా సాధికారత ఊసేది?
శురకవారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2026భీమవరం(ప్రకాశం చౌక్): డ్వాక్రా సంఘాల సృష్టికర్తగా చెప్పుకునే చంద్రబాబునాయుడి పాలనలో మహిళలు నిరంతరం మోసపోతూనే ఉన్నారు. గత 2014 ప్రభుత్వ కాలంలో బంగారు రుణాలు మాఫీ చేస్తామని నమ్మించి చివరకు మహిళలను మోసం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ మహిళలను ఆర్థికంగా చైతన్యవంతులను చేస్తామని, ఉపాధి–వ్యాపారాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తా మని హామీలు ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటుతున్నా మహిళలకు ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు. ఈ పాలనలో మహిళా సాధికారత అనే మాటే వినిపించడం లేదు. 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వ ఆర్థిక సాయంతో జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో డ్వాక్రా మహిళలు అనేక వ్యాపారాలు ప్రారంభించారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక మద్దతు లేకపోవడం, బ్యాంకు రుణాలు దొరక్కపోవడంతో పెట్టుబడుల కొరత ఏర్పడి మహిళలు తమ వ్యాపారాలను మూసేసుకుంటున్నారు. కొందరు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యాపారాలు సాగిస్తున్నారు. నిలిచిపోయిన ‘సీ్త్ర నిధి’ రుణాలు చిన్నపాటి వ్యాపారాల పెట్టుబడి కోసం మహిళలు సీ్త్రనిధి రుణాలను ఆశ్రయిస్తుంటే అక్కడ కూడా నిరాశే ఎదురవుతోంది. జిల్లాలోని అనేక గ్రామాల్లో, పట్టణాల్లో సీ్త్ర నిధి రుణాలు మంజూరు కావడం లేదు. గతంలో జరిగిన కొన్ని అవకతవకలను సాకుగా చూపిస్తూ ఈ రుణాలను పూర్తిగా నిలిపివేశారు. పెట్టుబడుల కోసం మహిళల ఎదురుచూపులు కుటుంబానికి ఆసరాగా నిలవాలనే తపనతో చిన్న చిన్న వ్యాపారాలు చేయడానికి మహిళలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పెట్టుబడి లేక, ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. మహిళా సాధికారత అంటే కేవలం మాటలు కాదు, వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే ప్రధాన ఆశయం కావాలి. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం తరహాలోనే వ్యాపారాల కోసం ఆర్థిక సాయం అందించి, బ్యాంకు రుణాలు మంజూరు చేస్తే.. పేద, మధ్యతరగతి కుటుంబాల మహిళలు వ్యాపారాలు చేసుకుంటూ గౌరవంగా జీవించగలుగుతారు. పథకం లబ్ధిదారులు లబ్ధి (రూ.కోట్లలో)చేయూత 1,12,017 168.00 కాపు నేస్తం 1,95,728 366.47 చేదోడు 29,102 29.10 ఈబీసీ నేస్తం 25,457 38.18 బ్యాంకు రుణాలు 15,000 75.00 అందని ఆర్థిక ప్రోత్సాహకాలు నిలిచిన ఉపాధి వ్యాపారాలు సీ్త్ర నిధి రుణాల్లేవు మహిళా సంక్షేమం మరిచిన కూటమి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.615 కోట్ల లబ్ధి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో రూ.615.15 కోట్లు ఖర్చు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల మహిళలకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని విధంగా (ఉచితంగా) ఆర్థిక సాయం అందించారు. ఆ నిధులతో మహిళలు చిన్నపాటి వ్యాపారాలు పెట్టుకుని సొంతంగా ఉపాధి పొందారు. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లలో మహిళలకు పైసా సాయం కూడా చేయలేదు. జిల్లాలో 30,093 డ్వాక్రా సంఘాల్లో 3,00,990 మంది సభ్యులు ఉన్నారు. బ్యాంకులు గ్రూపులపై ఇచ్చే సాధారణ డ్వాక్రా రుణాలు తప్ప, మహిళల సొంత ఉపాధి కోసం కనీసం రూ.25 వేల అప్పు కూడా ఇవ్వడం లేదు. ఏదైనా షూరిటీ (హామీ) ఉంటేనే లోన్ ఇస్తామని బ్యాంకర్లు తెగేసి చెబుతుండటంతో పేద, మధ్యతరగతి మహిళలకు బ్యాంకు అప్పు దొరకడం లేదు. ఫలితంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించలేక మహిళలు ఉపాధికి దూరమవుతున్నారు. కూటమి ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు అందిస్తామని ప్రకటించడంతో.. జిల్లాలో దాదాపు 10 వేల మంది మహిళలు కిరాణా, వస్త్ర, టైలరింగ్, బ్యూటీషియన్, ఫుడ్ బిజినెస్ వంటి వివిధ వ్యాపారాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కూటమి నాయకుల సిఫార్సులు, ఇంటర్వ్యూలు అన్నీ పూర్తయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం బ్యాంకులకు సబ్సిడీ సొమ్ము జమ చేయలేదు. ఏడాదన్నర దాటినా ఈ సబ్సిడీ రుణాలు మంజూరు కాకపోవడంతో మహిళలు మరోసారి మోసపోయారు. -
ఏసీబీకి చిక్కిన డీటీ
జంగారెడ్డిగూడెం: భూమి మ్యూటేషన్ రద్దుకు సంబంధించి కేసు తీర్పు కాపీని ఇచ్చేందుకు సొమ్ములు తీసుకుంటూ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటేషన్పై పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ కె.వెంకటేశ్వరరావు గురువారం ఏసీబీ అధికారులకు చిక్కా రు. వివరాలిలా ఉన్నాయి.. జంగారెడ్డిగూడెం మండలం టెక్కినవారిగూడెం గ్రామానికి చెందిన పోతన సుకుమార్ అనే వ్యక్తికి తండ్రికి చెందిన ఎకరా భూమి ఉంది. నిమ్మలగూడెం రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ భూమి తాత నుంచి వీలునామా ద్వారా ఆయన తండ్రికి సంక్రమించింది. ఈ భూమికి సంబంధించి జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో మ్యూటేషన్ కూడా పూర్తయ్యింది. అయితే కుటుంబ వివాదాల కారణంగా ప్రత్యర్థులు ఆర్డీఓ కోర్టును ఆశ్రయించి ఈ మ్యూటేషన్ను రద్దు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ వివాదంపై విచారణకు హాజరైన సుకుమార్కు కేసు తీర్పు కాపీని ఇచ్చేందుకు వెంకటేశ్వరరావు రూ.50 వేలు డిమాండ్ చేశారు. తాను అంత ఇవ్వలేనని సుకుమార్ రూ.20 వేలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ తహసీల్దార్తో జరిగిన సంభాషణను రికార్డు చేసి ఏలూరు ఏసీబీ అధికారులకు ఇచ్చారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు సుకుమార్ గురువారం డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావుకు రూ.20 వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ జీవీ కృష్ణారావు, సీఐలు బాలకృష్ణ , శ్రీనివాసరావు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేయడంతో పాటు వెంకటేశ్వరరావును అరెస్టు చేసి రాజమండ్రి ఏసీబీ కోర్డులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ అధికారులు చెప్పారు. -
సిరుల తల్లి.. స్వర్ణంతో శోభిల్లి..
గురువారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2026భీమవరం(ప్రకాశం చౌక్): బంగారం చందాల సేకరణ కోసం 12 మందితో ఒక ప్రత్యేక బంగారం కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆలయంలో భక్తులు, దాతల నుంచి బంగారం లేదా నగదు రూపంలో చందాలు సేకరించే పనిని ప్రారంభించింది. ఇందుకోసం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ ద్వారా ఇప్పటివరకు 13 గ్రాముల బంగారం చందాల రూపంలో వచ్చింది. రాబోయే మూడేళ్ల కాలంలో మిగిలిన 27 కిలోల బంగారాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వర్ణమయ కై ంకర్యంలో భాగస్వాములుకండి మావుళ్లమ్మ అమ్మవారిని పూర్తి స్వర్ణమయం చేయడానికి దాతలు, భక్తులు తమ స్తోమతను బట్టి బంగారం లేదా నగదును విరాళంగా అందించవచ్చు. గతంలో కేవలం బంగారం ఉన్నవారే సమర్పించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు, సామాన్య భక్తులు కూడా తమకు తోచిన నగదును చందాగా ఇచ్చి అమ్మవారి స్వర్ణమయ కై ంకర్యంలో భాగస్వాములు కావచ్చు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరుతున్నారు. ఇప్పటివరకు 75 కిలోల బంగారం సేకరణ అమ్మవారిని 100 కిలోల బంగారంతో శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు 2009లోనే ఈ బంగారం సేకరణ ప్రారంభమైంది. అప్పటినుంచి ఇప్పటివరకు భక్తులు, దాతలు స్వచ్ఛందంగా 75 కిలోల బంగారాన్ని సమర్పించారు. దాతలు 2 గ్రాముల నుంచి 46 గ్రాముల వరకు తమ శక్తి కొద్దీ బంగారాన్ని అందించారు. ఈ 75 కిలోల బంగారంలో ఇప్పటికే 52 కిలోల బంగారాన్ని ఆభరణాల రూపంలో అమ్మవారికి అలంకరించారు. మిగిలిన 23 కిలోల బంగారాన్ని కొత్త ఆభరణాల తయారీ కోసం సిద్ధం చేశారు. అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయం కోసం మరో 27 కిలోల బంగారం అవసరం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం అమ్మవారికి బంగారం సమర్పిస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉండేవారు ఆలయ అధికారులను సంప్రదించి, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా నగదు విరాళాలను పంపవచ్చు. దేశవ్యాప్తంగా గుర్తింపు 100 కిలోల బంగారంతో పూర్తి స్వర్ణమయమైన తర్వాత, సంవత్సరంలో 365 రోజులూ భక్తులకు స్వర్ణమయ రూపంలో దర్శనమిచ్చే ఏకై క అమ్మవారిగా మావుళ్లమ్మ ఖ్యాతి గడించనున్నారు. సుమారు రూ.90 లక్షల వ్యయంతో నెల రోజుల పాటు జరిగే అమ్మవారి వార్షిక జాతర, భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులు, నిత్య అన్నదానం, సాంస్కృతిక ప్రదర్శనలు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల సందడితో ఈ ఆలయం ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ స్వర్ణమయ ప్రాజెక్టుతో అమ్మవారి కీర్తి ప్రపంచవ్యాప్తం కానుంది. భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మవారిని 100 కిలోల బంగారంతో స్వర్ణమయం చేసేందుకు దాతలు, భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటివరకు భక్తులు స్వచ్ఛందంగా బంగారం సమర్పిస్తూ వచ్చారు. అయితే, అమ్మవారిని పూర్తి స్వర్ణమయం చేయాలనే లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేసేందుకు దేవదాయ శాఖ మరో అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా బంగారం, నగదు రూపంలో విరాళాలు వసూలు చేసేందుకు ఒక ప్రత్యేక ప్రాజెక్టును తలపెట్టింది. శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి పూర్తి స్వర్ణమయం కోసం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బంగారం, నగదు చందాలను సేకరిస్తున్నాము. ఒక ప్రత్యేక కమిటీ ద్వారా ఈ కార్యక్రమం పారదర్శకంగా సాగుతోంది. ఆలయంలో ప్రత్యేక కౌంటర్ కూడా అందుబాటులో ఉంది. భక్తులు, దాతలు ఈ మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మవారి స్వర్ణమయ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలి – బుద్దా మహాలక్ష్మి నగేష్, సహాయ కమిషనర్, ఈవో, మావుళ్లమ్మ దేవస్థానం పసిడి కాంతులు మావుళ్లమ్మ స్వర్ణమయానికి బంగారం సేకరణ 100 కిలోల సేకరణ లక్ష్యం ఇప్పటికే 75 కిలోల విరాళాలు 52 కిలోలతో ఆభరణాల అలంకరణ కొత్తగా బంగారు కమిటీ ఏర్పాటు -
రూ.96.06 కోట్ల పింఛన్ల పంపిణీ
భీమవరం (ప్రకాశం చౌక్): జిల్లాలో 2,20,625 మంది లబ్ధిదారులకు రూ.96.06 కోట్ల విలువైన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను బుధవారం పంపిణీ చేసినట్లు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని 26వ వార్డు బ్యాంక్ కాలనీ–2లో ఆయన స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్ అందుకున్న వృద్ధురాలు జి.అచ్చయమ్మ ఇంటిని సందర్శించిన జాయింట్ కలెక్టర్ అక్కడ తాగునీటి సరఫరా, నీటి నాణ్యతను పరిశీలించారు. అలాగే ఐ.వెంకట్రావుకు పింఛన్ అందజేస్తూ కుటుంబ సభ్యులు ఎలా చూసుకుంటున్నారో ఆరా తీశారు. అనంతరం అదే ప్రాంతంలోని మురుగు కాలువలను పరిశీలించి కాలువల శుభ్రతపై శానిటేషన్ సెక్రటరీని ప్రశ్నించారు. వీధుల్లో ప్రత్యేక డంపింగ్ పాయింట్ ఏర్పాటు చేసి, ప్రజలు అక్కడే చెత్త వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ఎస్.వేణుగోపాల్, భీమవరం మున్సిపల్ కమిషనర్ కే.రామచంద్రారెడ్డి, ఏపీవో ఎం.శ్రీనివాస ప్రసాద్, వీఆర్వో హారిక, వెల్ఫేర్ అసిస్టెంట్, ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ, శానిటేషన్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. ఎల్పీఎం ఆధారంగా భూముల రిజిస్ట్రేషన్లు జిల్లాలో భూ రీ–సర్వే ప్రక్రియ పూర్తయిన గ్రామాల్లో మాత్రమే కొత్తగా కేటాయించిన ఎల్పీఎం నంబర్ల ఆధారంగా భూముల రిజిస్ట్రేషన్లు చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఆస్తి వివరాల నకళ్లు జారీ చేసే ప్రక్రియకు సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై వస్తున్న వార్తల నేపథ్యంలో బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ తన ఛాంబర్ నుంచి జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లు సర్వే నంబర్ల ఆధారంగా నిర్వహించేవారని, ప్రస్తుతం భూ రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో ఎల్పీఎం నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లా రిజిస్ట్రార్ టి.ప్రసాద్ రెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ ఎన్.మాధవి, జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తూ పంటబోదెలో పడి..
నేడు జ్యేష్ట మాస జాతర భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం మావుళ్లమ్మవారి ఆలయంలో గురువారం జ్యేష్ట మాస జాతర నిర్వహించనున్నారు. గ్రామోత్సవం, ప్రత్యేక పూజలు చేయనున్నారు. తాడేపల్లిగూడెం రూరల్: ప్రమాదవశాత్తు పంట బోదెలో పడి ఓ మోటారుసైక్లిస్ట్ మృతి చెందాడు. రూరల్ ఎస్సై ఎస్.రవికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పట్టెంపాలెం గ్రామానికి చెందిన కట్టా అఖిల్ (31) మంగళవారం రాత్రి కుంచనపల్లిలో ఫంక్షన్కు తన స్నేహితుడు సతీష్తో కలిసి తన మోటారు సైకిల్పై వెళ్లాడు. తిరిగి అదే రోజు అర్ధరాత్రి స్వగ్రామం పట్టెంపాలెం బయల్దేరాడు. చినతాడేపల్లి యింకుల్లు కళ్యాణ మండపం సమీపంలోకి వచ్చేసరికి మలుపును గుర్తించకపోవడంతో ప్రమాదవశాత్తు ఆ పక్కనే ఉన్న పంట బోదెలో పడి మృతి చెందాడు. బుధవారం ఉదయానికి కూడా అఖిల్ ఇంటికి రాకపోవడంతో భార్య సత్యదుర్గ తన బావమరిదికి ఫోన్ చేసి ఆరా తీసింది. అనంతరం చినతాడేపల్లి వద్ద పంట బోదెలో పడి మృతి చెంది ఉన్న అఖిల్ను గుర్తించి కుటుంబ సభ్యులకు విషయం ఫోన్ ద్వారా తెలియజేశాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు రూరల్ పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అఖిల్ భార్య సత్యదుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఎస్సై రవికుమార్ దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. -
ఆ భూమి దేవుడికే చెందాలి
దాత వెంకట సంపత్కుమారాచార్యులు కుటుంబీకులైన, హైదరాబాద్కు చెందిన మంత్రరత్నం ప్రతివాద భయంకర రాధాకృష్ణమాచార్యులు, పార్థసారథి అయ్యంగార్లు సదరు భూమి ఆన్లైన్ రికార్డును కుల సంఘం పేరున మార్చడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఇటీవల కలెక్టర్, ఆర్డీవో, దేవస్థానం ఛైర్మన్, ఈఓ, తహసీల్దార్కు కొద్దిరోజుల క్రితం రిజిస్టర్ పోస్టు ద్వారా ఒక లేఖ పంపారు. దేవస్థానం ఆధీనంలో ఉన్న ఆ భూమి బయట వ్యక్తులకు చెందకూడదని, అవసరమైతే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. దాత కుటుంబీకులు స్పష్టంగా సదరు భూమి దేవస్థానంకు చెందినదని చెబుతున్నప్పటికీ, ఎమ్మెల్యే మద్దిపాటి మాత్రం ఇంకా ఆ భూమి దేవుడిదని ఒప్పుకోకపోవడం గమనార్హం. -
టీడీపీలో భూప్రకంపనలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండతో దేవుడి భూమిని కబ్జా చేసిన అధికార పార్టీ నేతల పరిస్థితి ఇప్పుడు తలకిందులైంది. అక్రమ వ్యవహారాలు వెలుగులోకి రావడంతో పాటు ఆన్లైన్ రికార్డులు, పలు ఆధారాలు బయట పడుతుండటంతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక రెవెన్యూ అధికారులైతే ఇప్పటికే ఆన్లైన్ రికార్డులను మార్పుచేసి, తమ తప్పులను సరిచేసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ భూ వివాదంపై గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మంగళవారం రాత్రి ద్వారకాతిరుమల మండల పరిషత్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మరోవైపు దాతలు భూమిని స్వామివారికి అప్పగించండి అంటూ తహసీల్దార్కు లేఖ పంపడం చర్చగా మారింది. ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం పంచాయతీ, లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని, పూరీ మఠాధిపతులైన మంత్రరత్నం అమ్మాజీ (లక్ష్మీ అమ్మవారు) కుటుంబ సభ్యులు 1992లో చినవెంకన్న దేవస్థానానికి దత్తత ఇచ్చారు. అప్పటి నుంచి ఈ ఆలయానికి సంబంధించిన ఆర్ఎస్ నెంబర్ 38/1 లోని 1.89 ఎకరాల భూమి దేవస్థానం ఆధీనంలోనే ఉంది. స్వామివారి నిత్య సేవలకు వినియోగించే తులసిని అందులోనే సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో కొందరు వ్యక్తులు సదరు భూమిలోకి చొరబడి తులసి మొక్కలను, చెట్లను, చుట్టూ ఉన్న ఫెన్సింగ్ను తొలగించారు. ఇదేంటని స్థానికులు ప్రశ్నించగా కొందరు టీడీపీ నేతలు ఈ భూమిని దాత అమ్మాజీ కుటుంబ సభ్యుడైన మంత్రరత్నం ప్రతివాద భయంకర వెంకట సంపత్కుమారాచార్యులు 1967లో కమ్మ సేవ సంఘం, ద్వారకాతిరుమలకు బహుమతిగా ఇచ్చారని చెప్పారు. రెవెన్యూ ఆన్లైన్ రికార్డును పరిశీలించగా చెల్లుబాటుకాని అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా సంఘం పేరు మీదకు ఆ భూమిని మార్చినట్టు స్పష్టమైంది. సదరు భూమి దేవుడిదని అన్నందుకు శ్రీవారి దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావుపై, ఓ టీడీపీ నేత వాగ్వాదానికి కూడా దిగాడు. జరిగిన పరిణామాలపై సాక్షి దినపత్రికలో గతనెల 25 నుంచి వరుస కథనాలు ప్రచురితం అవుతుండటంతో అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. వివాదాస్పద భూమి సేవ సమితి పేరున అసైన్ అయినట్టు తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి, మళ్లీ రికార్డును రివర్ట్ చేయడం జరిగిందని ఎమ్మెల్యే మద్దిపాటి అన్నారు. ఆ భూమి ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉందని, డాక్యుమెంట్లు పరిశీలించిన తరువాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అప్పటి వరకు ఆ భూమి ఎవరికీ చెందదని వ్యాఖ్యానించారు. జిరాయితీ భూమిపై ప్రభుత్వ పెత్తనం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్ (ఎఫ్ఎల్ఆర్)లో కూడా మంత్రరత్నం ప్రతివాద భయంకర వెంకట సంపత్కుమారాచార్యులు పేరే ఉందని, అడంగల్లో పేర్లు మార్చినంత మాత్రాన సేవ సంఘానికి యాజమాన్య హక్కు రాదన్న విషయం ఎమ్మెల్యేకు తెలియదా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. దేవస్థానం ఆధీనంలో 30 ఏళ్ల క్రితం నుంచి ఉన్న ఈ భూమిని వివాదంలోకి నెట్టింది కేవలం టీడీపీ నాయకులేనని భక్తులు మండిపడుతున్నారు. రోజురోజుకూ ముదురుతున్న లక్ష్మీపురం భూ వివాదం కబ్జాదారులు తమ పార్టీవారు కావడంతో ఎమ్మెల్యే మద్దిపాటి సతమతం విలేకరుల సమావేశంలో పొంతన లేని సమాధానాలు వివాదాస్పద భూమిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న ఎమ్మెల్యే దేవుడికిచ్చిన జిరాయితీ భూమిపై ప్రభుత్వ జోక్యం ఏంటటున్న భక్తులు ఆ భూమి దేవుడికే చెందాలంటూ తహసీల్దార్కు దాత కుటుంబీకుల లేఖ ఎమ్మెల్యే అనుచరుడిదే కీలక పాత్ర ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడిగా ఉన్న తిమ్మాపురంనకు చెందిన ఓ టీడీపీ నాయకుడు ఈ భూ కబ్జాకు సూత్రదారుడిని పలువురు ఆరోపిస్తున్నారు. ఆ నాయకుడి మాట కాదనలేక చేసిన పనులు కారణంగానే ఎమ్మెల్యే ఈ భూ వివాదంలో ఇరుక్కుని, సతమతం అవుతున్నాడని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. నేడు కలెక్టరేట్ వద్ద ఆందోళన దేవుడి భూమి దేవుడికే చెందాలని వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద గురువారం ఆందోళన చేపట్టి, కలెక్టర్కు వినతిపత్రం అందిస్తామని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత తెలిపారు. ఏలూరు, తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజ తదితరులు పాల్గొంటారని చెప్పారు. పార్టీ శ్రేణులు ఉదయం 10 గంటలకు చేరుకోవాలని వనిత పిలుపునిచ్చారు. -
ఎవరి కోసమో ఈ సిమెంట్ రోడ్డు?
● ఇళ్లు లేని చోట రూ.55 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణం ● రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమేనని ప్రజల మండిపాటు భీమవరం: కూటమి ప్రభుత్వ పాలన ‘అయిన వారికే అన్నట్టు’ సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామ పరిధిలో రూ.55 లక్షల ఉపాధి హామీ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డు ప్రజల అవసరాలకు కాకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే వేశారని పలువురు ఆరోపిస్తున్నారు. మండలంలోని అనేక గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నా పట్టించుకోని పాలకులు, అధికారులు.. గొల్లలకోడేరులో ఒక్క ఇల్లు కూడా లేని చోట లక్షలాది రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మించడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా పోలీసు కార్యాలయానికి వెళ్లే దారిలో, పంట కాలువ వెంబడి పలువురు రియల్టర్లు భవన నిర్మాణ స్థలాల విక్రయం కోసం వెంచర్లు వేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఒక్క ఇల్లు కూడా లేదు. అయినప్పటికీ, కాలువ వెంబడి గొల్లలకోడేరు పంచాయతీ పరిధిలో రూ.55 లక్షల వ్యయంతో నూతనంగా సిమెంట్ రోడ్డును నిర్మించారు. ఈ రహదారిని గత నెల 30న కలెక్టర్ నాగరాణి, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. శిలాఫలకంపై ఒకలా... క్షేత్రస్థాయిలో మరోలా... గొల్లలకోడేరు గ్రామంలోని ‘శ్రీనిలయం’ నుంచి ‘అల్లూరి వెంకటనాగార్జున’ ఇంటి వరకు సీసీ రహదారి నిర్మించినట్లు శిలాఫలకంపై పేర్కొన్నారు. కానీ, ఆ మార్గం మధ్యలో ఎక్కడా ఒక్క ఇల్లు కూడా లేకపోవడం గమనార్హం. ప్రజలకు అత్యవసరమైన చోట్ల రోడ్లు వేయకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా ప్రజాధనాన్ని ఎలా కేటాయిస్తారంటూ స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాటుచేసిన శిలాఫలకం గొల్లలకోడేరులో నూతంగా నిర్మించిన సీసీ రోడ్డు -
‘అక్రమ కేసులకు భయపడం’
కామవరపుకోట: ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఎవరూ భయపడే ప్రసక్తే లేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరుముచ్చు గోపాల్ యాదవ్ స్పష్టం చేశారు. కారుమూరి సునీల్ కుమార్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ, మంగళవారం మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరావు నివాసానికి వెళ్లిన ఆయన, కారుమూరి కుటుంబానికి తన పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా గోపాల్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాకుండా శ్రీరెడ్ బుక్శ్రీ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. కారుమూరి సునీల్ కుమార్ అరెస్టు ముమ్మాటికీ రాజకీయ కుట్రేనని, ఈ అక్రమ కేసులను చట్టపరంగా, న్యాయస్థానాల ద్వారా తిప్పికొడతామని స్పష్టం చేశారు. దెందులూరు: జాతీయ రహదారిపై గుండుగొలను నుంచి ఏలూరు వెళుతుండగా కొమురేపల్లి గరుడ హోటల్ వద్ద సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియ వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసకుంది. ఈ ప్రమాదంలో గోలి రమేష్బాబు అనే తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కుటుంబ సభ్యులు, పోలీసులు వైద్యశాలకు తీసుకు వెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. భీమవరం: భీమవరం వన్టౌన్లోని సుంకరపద్దయ్య వీధిలో విద్యుత్ షాక్తో ఏసీ మెకానిక్ మృతి చెందాడు. ఉండి మండలం యండగండి సమీపంలోని రాయనివారిగూడేనికి చెందిన కాలా వెంకటసాయి గణపతి (21) ఏసీ పనిచేస్తుండగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం వెంటనే పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఖాళీ సమయంలో పట్టణంలోని ఓ ప్రైవేటు ఐటీఐ కళాశాలలో పార్టుటైం అధ్యాపకుడిగా పనిచేస్తూనే వృత్తిరీత్యా ఏసీల మరమ్మతుల పనులు చేస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ వద్ద ఉంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. తాడేపల్లిగూడెం రూరల్: పాము కాటు వేయడంతో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందినట్లు రూరల్ ఎస్సై రవికుమార్ మంగళవారం విలేకరులకు తెలిపారు. మండలంలోని పుల్లాయగూడెం గ్రామానికి చెందిన నౌడూరి జ్యోతిబాబు (38) సోమవారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చి స్నానం చేసేందుకు పెరట్లోకి వెళ్లగా, చెట్టుపై నుంచి పాము తలపై పడి కాటు వేసింది. దీంతో అతనిని మోటారు సైకిల్పై తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఉన్నత వైద్యం కోసం ఏలూరు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి భార్య నౌడూరి ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. ఏలూరు టౌన్: జిల్లా పోలీస్శాఖలో విధులు నిర్వర్తిస్తూ పదవీవిరమణ చేసిన ఏడుగురు పోలీసు అధికారులకు మంగళవారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ సమావేశమందిరంలో ఆత్మీయ వీడ్కోలు పలుకుతూ ఘనంగా సత్కరించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పదవీవిరమణ పొందిన వారిని సత్కరించారు. పోలీస్ పీఆర్ఓ, ఎస్సై జి..కేశవరావు, డీఎస్బీ ఎస్సై ఎండీ మక్భూల్, ఏలూరు త్రీటౌన్ పోలీస్స్టేషన్ ఎస్సై జి.అజయ్కుమార్, ఏలూరు సీసీఎస్ ఎస్సై పి..సైమన్, ఏలూరు రూరల్ పోలీస్స్టేషన్ ఏఎస్సై పి.వీరాస్వామి, నిడమర్రు పోలీస్స్టేషన్ ఏఎస్సై డీయూఎస్ ప్రసాద్, ముదినేపల్లి పోలీస్స్టేషన్ ఏఎస్సై ఏ.శ్రీనివాసరావు తమ సర్వీసు కాలాన్ని పూర్తిచేసుకుని పదవీ విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ వై.ప్రసాదరావు, ఏఆర్ అదనపు ఎస్పీ జీ.మునిరాజా, ఆర్ఐ పవన్కుమార్, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, సీసీఎస్ సీఐ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పాలకులతో అధికారుల కుమ్మక్కు
కొయ్యలగూడెం: ఎలక్షన్ ప్రక్రియ నేపథ్యంలో ఓటర్ ఫారాల నమోదులో పాలకులకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. మంగళవారం పొంగుటూరు, చొప్పరామన్నగూడెం, గవరవరం గ్రామాల్లో శ్రీసర్శ్రీ కార్యక్రమం అమలుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ సీపీకి అనుకూల ఓటర్ల ప్రాంతాల్లో ఇప్పటివరకు సర్వే ప్రక్రియ ప్రారంభించలేదన్నారు. అధికార పార్టీ నాయకులు ఇస్తున్న జాబితాకు అనుగుణంగానే బీఎల్వోలు, బీఎల్ఏలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘సర్’ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి బూత్ కన్వీనర్ పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చురుగ్గా పనిచేయాలని సూచించారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగన్ 2.0లో కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని, ప్రతి ఒక్కరు స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సానుభూతిపరులను గెలిపించుకునే విధంగా కృషి చేయాలని కోరారు. చంద్రబాబు పాదం పెడితేనే కరువుకాటకాలు కవల పిల్లలుగా ప్రజలకు ఎదురవుతాయని ఎద్దేవా చేశారు. మండల రైతు విభాగం అధ్యక్షుడు గంటా రమేష్, మండల కో–కన్వీనర్ బిరుదుగడ్డల ప్రేమ్కుమార్, ఎంపీపీ గంజిమాల రామారావు, పొంగుటూరు, చొప్పరామన్నగూడెం, గవరవరం గ్రామాల కన్వీనర్లు గేలం వెంకటేశ్వరరావు, సతుల కిరణ్, పలివెల దుర్గారావు, పార్టీ నాయకులు పసుపులేటి రవీంద్ర, చీమకుర్తి సత్యనారాయణ, గేలం అప్పారావు, బొమ్మ రామకృష్ణ, ప్రగడ శివాజీ, చిరవూరి శ్రీను, ఎర్రమళ్ళ నాగు, పసుపులేటి కాశీరాం, దిరిసిపోము మధు, పలివెల సత్యనారాయణ, గేలం శ్రీను, గుండుమోలు మూర్తి రాజు తదితరులు పాల్గొన్నారు. -
వర్జీనియా ధరల పరిశీలన
కొయ్యలగూడెం: ట్రేడింగ్ కంపెనీలతో చేస్తున్న ప్రయత్నాలు ఆశాజనకంగా ఉన్నాయని వర్జీనియా పొగాకుకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా పొగాకు బోర్డు కృషి చేస్తుందని బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీ పేర్కొన్నారు. మంగళవారం ఆమె ఆక్షన్ మేనేజర్ కె.రామాంజనేయులుతో కలసి కొయ్యలగూడెంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. వేలం విధానాలను, రేటు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. వేలం అనంతరం రైతులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సరాసరి ధర రూ.300 ఉండేలా చూడాలని పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు కాకర్ల నంది కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర తేలిక నేలలు రీజినల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్, కొయ్యలగూడెం వేలం నిర్వహణ అధికారి శివకుమార్, ఎఫ్ఓ దీపక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఎన్సీయూలో వైద్యుల గైర్హాజరు
నూజివీడు: స్థానిక ఏరియా ఆసుపత్రిలోని నవజాత శిశు విభాగం (ఎస్ఎన్సీయూ)లో వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. అప్పుడే పుట్టిన పసిబిడ్డల నుంచి మూడు నెలల వయస్సు ఉన్న చిన్నారులకు అత్యవసర చికిత్స అందించేందుకు మే 23న రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ విభాగ నిర్వహణను ప్రభుత్వం థర్డ్ పార్టీకి అప్పగించగా వారు ఇద్దరు వైద్యులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, నర్సులు, సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. నిబంధనల ప్రకారం వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడే ఉండి సేవలు అందించాల్సి ఉంది. అయితే నూజివీడు, హనుమాన్ జంక్షన్ ప్రాంతాలకు చెందిన ఈ ఇద్దరు వైద్యులకు సొంత క్లినిక్లు ఉండటంతో ప్రభుత్వ విధులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరు ప్రతిరోజూ ఆసుపత్రికి వచ్చి, కేవలం రిజిస్టర్లో సంతకాలు చేసి కొద్దిసేపటికే వెళ్లిపోతున్నారు. అత్యవసరంగా ఏదైనా కేసు వస్తే అక్కడి సిబ్బంది ఫోన్ చేసి పిలిచే వరకు కేంద్రానికి రావడం లేదు. వైద్యులు సకాలంలో అందుబాటులో లేక పసిప్రాణాలకు ముప్పు వాటిల్లితే ఎవరు బాధ్యత వహిస్తారని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి సలహా సంఘం సభ్యులు ప్రశ్నిస్తున్నారు. సిబ్బంది దురుసు ప్రవర్తన మంగళవారం మధ్యాహ్నం ఈ కేంద్రాన్ని పరిశీలించగా ఇద్దరు వైద్యులూ విధుల్లో లేరు. దీనిపై అక్కడి సిబ్బందిని ప్రశ్నించగా కనీస సమాధానం చెప్పకుండా దురుసుగా ప్రవర్తించారు. ఎస్ఎన్సీయూ విభాగాన్ని ఫొటోలు తీస్తున్న క్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ అది తన సొంత ఆసుపత్రి అన్నట్లుగా వ్యవహరిస్తూ ఫొటోలు తీయనివ్వకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. సంతకాలు చేసి వెళ్లిపోతున్న వైనం డ్యూటీ సమయంలో కచ్చితంగా ఎస్ఎన్సీయూలోనే ఉండాలని సదరు వైద్యులను ఇప్పటికే పలుమార్లు ఆదేశించాం. వారి నిర్లక్ష్య వైఖరిపై ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. డాక్టర్ పద్మజారాణి, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ -
ఆన్లైన్ చేసిన ఐదు ఓట్లు
దెందులూరు: ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రులో నాగరాజు కుటుంబంలో ఐదు ఓట్లను ఆన్లైన్ చేశారు. ఆ కుటుంబంలోని ఓట్లు ఆన్లైన్ చేయడానికి బీఎల్ఓ నిరాకరించడంతో ఓటరు జాబితా సవరణలో సమస్యలు ఏంటి సార్ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై ఏలూరు రూరల్ మండల తహశీల్దార్ జి విజయకుమార్ రాజు స్పందించి మంగళవారం ఉదయం శ్రీపర్రు సచివాలయానికి వెళ్లారు. బాధిత నాగరాజు, బీఎల్వో షరీఫ్ను పిలిపించి ఘటనపై విచారణ నిర్వహించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతమైతే భారతీయ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం నాగరాజు కుటుంబంలోని ఐదు ఓట్లను ఆన్లైన్ చేశారు. బీఎల్ఓలు అందరూ విధిగా వారికి ఇచ్చిన ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల ఫారాలు అందజేసి పూర్తి చేసిన తర్వాత వాటిని తీసుకువచ్చి ఆన్లైన్ చేయాలని తహసీల్దార్ ఆదేశించారు. సచివాలయాల్లో కూర్చొని ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శివ ఉన్నారు. ఏలూరు (టూటౌన్): రైతాంగ ఉద్యమాల స్ఫూర్తితో బలమైన రైతు కూలీ ఉద్యమాన్ని నిర్మించాలని ఏఐకేఎంకేఎస్ అఖిలభారత మహాసభ సావనీరు ఆవిష్కరణ సభలో వక్తలు పిలుపునిచ్చారు. ఏఐకేఎంకేఎస్ అఖిలభారత మహాసభల సావనీర్ ఆవిష్కరణ సభ ఏపీ రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరులోని లేడీస్ క్లబ్ నందు జిల్లా కార్యదర్శి షేక్ బాషా అధ్యక్షతన జరిగింది. ముందుగా సావనీరును దారి దీపం పత్రికా సంపాదకులు డీవీఎస్ వర్మ ఆవిష్కరించి మాట్లాడారు. ప్రధాన వక్త ఏఐకేఎంకేఎస్ అఖిల భారత అధ్యక్షులు ఎస్ ఝాన్సీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సామ్రాజ్యవాద అనుకూల విధానాల మూలంగా అన్ని రాష్ట్రాల్లోనూ రైతాంగం తీవ్రమైన సమస్యల్లో కూరుకు పోయారన్నారు సభలో బీకేఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ప్రిన్సిపల్ సంకు మనోరమ, రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యు.వీరబాబు, ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంఎస్ నాగరాజు, దళిత నాయకులు మామిడూరి మహంకాళి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు స్వామివారి చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకుల ఆధ్వర్యంలో తమలపాకుల అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలు జరిపించుకున్నారు. వివిధ సేవల రూపంలో ఆలయానికి రూ. 2,72,533 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 2,473 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ (ఈఓ) ఆర్వీ చందన ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఏలూరు (టూటౌన్): ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసకువచ్చిన వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీ జీరాంజీ) పథకం జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుందని డ్వామా పీడీ కేవీ సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జూలై 1 నుంచి పథకం పనులు ప్రారంభం, 2వ తేదీన గ్రామ పంచాయతీల్లో నిర్వహించే సమావేశానికి ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం సంబంధిత ప్రజాప్రతినిధులను తప్పక ఆహ్వానించాలని పీడీ సుబ్బారావు పేర్కొన్నారు. -
డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి
ఏలూరు (టూటౌన్): జిల్లాను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతున్నాయని కలెక్టర్ కె.వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో జిల్లా పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం మంగళవారం కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.280 కోట్లతో 5,200 ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించామని, వీటి ఏర్పాటుద్వారా జిల్లాలోని 26 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు పూర్తిచేయాలన్నారు. దెందులూరు, నూజివీడు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ సంబంధించి భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిలాల్లో కోకో సిటీ ఏర్పాటుపై పెట్టుబడిదారుల సదస్సు ఏర్పాటుచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిలాల్లో 15 పరిశ్రమలకు పెట్టుబడి రాయితీ, వడ్డీ, విద్యుత్, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ, తదితర రాయితీలుగా రూ.4.96 కోట్లు మంజూరు చేస్తూ సమావేశం తీర్మానించింది. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్.వెంకటరావు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ జోనల్ మేనేజర్ బాబ్జి, ట్రానో్ోస్క ఎస్ఈ బీఎం.అంబేద్కర్, వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ జితేంద్ర, కార్మిక శాఖ సహాయ కమిషనర్ నాగేశ్వరరావు, మత్స్య శాఖాధికారి రాజ్కుమార్, గ్రౌండు వాటరు డీడీ కోదండరామ్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కుక్కునూరు: స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి మృతి పై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రాజీవ్నగర్ గ్రామానికి చెందిన మేడి సత్యనారాయణ (55) గత 17 ఏళ్లుగా కుక్కునూరు అటవీ శాఖ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి పెద్దపులి వేలేరుపాడు మండల అటవీ ప్రాంత సమీపంలోకి ప్రవేశించినట్లు సమాచారం రావడంతో సిబ్బంది అంతా అక్కడికి వెళ్లారు. దీంతో సత్యనారాయణ ఒక్కడే కార్యాలయంలో ఉన్నాడు. మంగళవారం ఉదయం కార్యాలయాన్ని శుభ్రం చేసేందుకు వచ్చిన స్వీపర్కు సత్యనారాయణ అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించి వెంటనే ఇతర సిబ్బందికి సమాచారం అందించింది. వారు సత్యనారాయణను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
విద్యార్థులకు సమగ్ర బోధన అందించాలి
తాడేపల్లిగూడెం : విద్యార్థుల సమగ్ర వికాసంలో ఆచార్యుల పాత్ర ఎంతో కీలకమని ఏపీ నిట్ ఇన్చార్జి డైరక్టర్, ప్రొఫెసర్, డాక్టర్ ఎన్వీ రమణారావు అన్నారు. ఏపీ నిట్ డీన్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో బ్యాలెన్స్డ్ క్లబ్ సహకారంతో ప్రాంగణంలోని సెమినార్ హాల్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్ మంగళవారం ముగిసింది. ఎన్వీ రమణారావు ఆన్లైన్లో మాట్లాడుతూ విద్యార్థుల మోనటరింగ్, మానసిక శ్రేయస్సు, విద్యా మార్గదర్శకత్వం, సానుకూల క్యాంపస్ సంస్కృతి ప్రోత్సాహానికి ఆచార్యులను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఇటువంటి కార్యాక్రమాలు ఎంతగానో దోహద పడతాయని తెలిపారు. విద్యార్థులకు సమగ్ర బోధన అందించడంతో పాటు వారి మానసిక శ్రేయస్సుపై కూడా ఆచార్యులు ప్రత్యేక దృష్టి సారించాలని వెల్లడించారు. ప్రొఫెసర్ అమృతా డేబ్, టీజు ఽథామస్ మెంటల్ వెల్ బీయింగ్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఫ్యాకల్టీ, స్టూడెంట్ మెంటరింగ్ స్కిల్స్ అనే అంశాలపై ఆన్లైన్లో మాట్లాడారు. డాక్టర్ హిమ బిందు, టేకి శ్రీవాణి, మైత్రి సుధాకర్ డాక్టర్ సంతోష్ కుమార్ బెహరా, పి.దినేష్ రెడ్డి, జి.రవికిరణ్ శాస్త్రి తదితరులు మాట్లాడారు. అనంతరం ఆచార్యులను సత్కరించారు. -
రోడ్డున పడేశారొయ్యో
సిండికేటు దోపిడీపై ఆక్వా రైతులు సమరశంఖం పూరించారు. రాష్ట్ర ఆక్వా రైతుల సంఘం పిలుపు మేరకు మంగళవారం పట్టుబడులకు విరామం ఇచ్చి జిల్లా అంతటా ధర్నాలు, మోటారు సైకిల్ ర్యాలీలతో నిరసన తెలిపారు. రైతులకు మద్దతుగా ఫీడ్ కంపెనీల డీలర్లు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్లో పాల్గొన్నారు. బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026గత 30 ఏళ్లుగా రొయ్యల సాగు చేస్తున్నాను. మునుపెన్నడూ లేనివిధంగా ప్రస్తుతం ఆక్వా సాగు తీవ్ర సంక్షోభంలో ఉంది. మూడు నెలలుగా ఫీడ్ కంపెనీలు మేత ధరలను ఇష్టానుసారం పెంచేశాయి. కిలోకు రూ.4 తగ్గించాలని ప్రభుత్వం చెప్పినా రూ.2 తగ్గించడం రైతులను మోసం చేయడమే. – నరసింహస్వామి, పూలపల్లి, ఆక్వా రైతు ధరల నియంత్రణ దిశగా ప్రభుత్వం స్పందించకపోతే ఆక్వా సాగు కనుమరుగమయ్యే ప్రమాదం ఉంది. ఎకరానికి సుమారు రూ.1.50 లక్షల నష్టం వస్తున్నా సాగును కొనసాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి రైతుకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. – బి.శ్రీనివాస్చౌదరి, అండలూరు, ఆక్వా రైతు సాక్షి, భీమవరం: వనామీ సాగులో టన్ను రొయ్యల ఉత్పత్తికి టన్నున్నర, టైగర్ సాగుకు రెండున్నర టన్నుల వరకు మేత అవసరమవుతుంది. టన్నుకు రూ.4 వేల చొప్పున మేత ధరలు పెంచుతున్నట్టు ఫిబ్రవరిలో ఫీడ్ కంపెనీలు ప్రకటించాయి. ముడిసరుకుల ధరలు పెరిగాయంటూ మే 5న మరోసారి వనామీ ఫీడ్పై టన్నుకు రూ.8 వేలు, టైగర్ ఫీడ్పై రూ.10 వేలు పెంచాయి. ఈ నెల 13న వనామీ ఫీడ్ రూ.10 వేలు, టైగర్ ఫీడ్ రూ.12 వేలు పెంచారు. ఫీడ్ కంపెనీలు ఇష్టానుసారం మేత ధరలు పెంచుతూ పోవడంపై రైతులు ఆందోళనల నేపథ్యంలో టన్నుకు రూ.4 వేలు తగ్గిస్తున్నట్టు జూన్ 19న సీఎం చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు ఆదేశాలను బేఖాతరు చేస్తూ టన్నుకు రూ.రెండు వేలు మాత్రమే తగ్గిస్తున్నట్టు ఫీడ్ కంపెనీలు స్పష్టం చేయడం గమనార్హం. మరోపక్క నెలన్నర రోజుల క్రితం కిలోకు వంద కౌంట్కు రూ.265 ఉన్న ధరను రెండు వారాల క్రితం రూ.220కు తగ్గించేశారు. మిగిలిన కౌంట్ల ధరలకు కిలోకు రూ.30 నుంచి రూ.50 వరకు కోత పెట్టారు. టన్ను వంద కౌంట్ రొయ్యల ఉత్పత్తికి రూ.2.6 లక్షలు ఖర్చవుతుంటే రైతు చేతికందేది రూ.2.2 లక్షలు లోపే ఉంటోంది. టన్ను రొయ్యల ఉత్పత్తికి రూ.40 వేలు నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. తాము కష్టనష్టాలకోర్చి ఆక్వా సిండికేట్ను పెంచుతున్న చందాన ప్రస్తుత పరిస్థితి ఉందని రైతులు అంటున్నారు. మేత ధరలు తగ్గించాలని, రొయ్య రేట్లు పెంచాలని ఆందోళనలు చేస్తున్నారు. వారం రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో కొంతమంది రైతులు స్వచ్ఛంద సాగు విరామం పాటిస్తున్నారు. అయినప్పటికి సీడు, ఫీడు, ప్రాసెసింగ్ ప్లాంట్లు దోపిడీని అరికట్టడంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మంగళవారం రాష్ట్ర సంఘం ఆక్వా బంద్కు పిలుపునిచ్చింది ధరలు నియంత్రించాలి ఆక్వా రైతు సంఘం సభ్యులు, ఫీడు కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేసి టన్నుకు రూ.4 వేల చొప్పున ఫీడ్ ధరలు తగ్గించాలని సూచిస్తే కేవలం రూ. 2 వేలు తగ్గించి చేతులు దులుపుకున్నారని ఆక్వా రైతులు ధ్వజమెత్తారు. ముడిసరుకుల ధరలు పెరిగాయనే సాకుతో మేత ధరలను భారీగా పెంచేస్తున్నారని, అంతర్జాతీయ మార్కెట్లో వాటి ధరలు తగ్గినప్పుడు మాత్రం ఫీడ్ ధరలు తగ్గించడం లేదన్నారు. ఉత్పత్తి వ్యయం పెరిగిపోయి రొయ్య ధరలు గిట్టుబాటుకాక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం అయ్యే వరకూ తమ పోరాటం ఆపమని రైతులు స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆక్వా రైతులు తలపెట్టిన బంద్ విజయవంతమైంది. పాలకొల్లు పట్టణంలో ఆక్వా రైతులు పూలపల్లి వై జంక్షన్ నుంచి యడ్ల బజార్ సెంటర్ మీదుగా యాళ్లవానిగరువు వై జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఫీడ్ కంపెనీల డీలర్లు ఆక్వా రైతులకు మద్దతుగా స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. భీమవరం, వీరవాసరంలో రైతులు, ఫీడ్ షాపుల డీలర్లు బంద్ పాటించారు. రైతులు రొయ్య పట్టుబడులను నిలిపివేశారు. ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్ర, పోడూరు, ఆచంట మండలాల్లో మేత దుకాణాలు బంద్ చేశారు. పోడూరు, ఆచంట ఆక్వా రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో పెనుమంట్ర నుంచి మార్టేరు వరకు ర్యాలీ నిర్వహించారు. ఆకివీడులో వైఎస్సార్ సెంటర్ నుంచి ఆక్వా రైతులు పాదయాత్రగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అధికారులకు వినతిపత్రం అందజేశారు. పెంచిన మేత ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు. నరసాపురం పట్టణంలో ఆక్వా రైతులకు మద్దతుగా మేత దుకాణాలను డీలర్లు స్వచ్ఛందంగా మూసివేశారు. సిండికేట్ దోపిడీపై ఆక్వా రైతుల సమరశంఖం జిల్లా అంతటా రొయ్య పట్టుబడులు నిలిపివేసి బంద్లో పాల్గొన్న రైతులు మోటారు సైకిల్ ర్యాలీలు, ధర్నాలతో నిరసన మేత ధరలు తగ్గించాలని.. రొయ్య ధరలు పెంచాలని డిమాండ్ దుకాణాలు మూసివేసి బంద్కు మద్దతు తెలిపిన ఫీడ్ డీలర్లు -
పక్షుల కేంద్రానికి జలకళ
కై కలూరు: పక్షి ప్రేమికుల స్వర్గథామం ఆటపాక పక్షుల విహార కేంద్రం కొత్త కళను సంతరించుకుంటోంది. విదేశీ, స్వదేశీ పక్షులతో కలకలలాడే కేంద్రం చెరువు వేసవిలో ఎడారిని తలపించింది. రెండు నెలల తర్వాత చెరువులో నీటి జాడలు కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పచ్చటి పచ్చిక బయళ్లు ఆకట్టుకుంటున్నాయి. పక్షుల కేంద్రం సందర్శనలో కీలకమైన బోటు షికారు త్వరలో పునఃప్రారంభం కానుంది. అరుదైన పెలికాన్ పక్షుల ఆవాస కేంద్రంగా పేరుగడించిన కేంద్రంలో అతిథి పక్షులుగా ఫ్లెమింగోలు సందడి చేస్తున్నాయి. పెలికాన్(గూడబాతు) పక్షులు అత్యధికంగా వలస వచ్చి సంతానోత్పత్తి చేయడంతో ఆటపాక పక్షుల విహార కేంద్రానికి ‘పెలికాన్ ఫ్యారడైజ్’గా నామకరణం చేశారు. ఇక్కడ పక్షుల విహారానికి 285 ఎకరాల విస్తీర్ణంలో చెరువు అందుబాటులో ఉంది. అటవీశాఖ పక్షుల ఆవాసాల కోసం 150 కృత్రిమ ఇనుప స్టాండ్లను ఏర్పాటు చేశారు. పర్యాటకులు దగ్గర నుంచి పక్షుల కేరింతలను వీక్షించడానికి మూడు బోట్లును అందుబాటులో ఉంచారు. పక్షుల కేంద్రలో పర్యావరణ విద్యాకేంద్రం వద్ద పరుచుకున్న పచ్చటి బయళ్లు ఆకట్టుకుంటున్నాయి. రూ.7 లక్షలతో అభివృద్ధి పనులు ఆటపాక పక్షుల విహార కేంద్రం అభివృద్ధికి అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇటీవల రూ.2 లక్షల నిధులతో టిక్కెట్టు కౌంటర్ నుంచి పర్యావరణ విద్యా కేంద్రం వరకు రోడ్డును ఏర్పాటు చేశారు. అదే విధంగా చెరువు గట్లు దెబ్బతినడంతో మట్టిని పోసి పటిష్ట పర్చారు. కేంద్రంలో పక్షుల ఆవాస కృత్రిమ స్టాండ్లు 32 పాడయ్యాయి. వాటి స్థానంలో రూ.5 లక్షలు వెచ్చించి కొత్తవి తయారు చేయించారు. పర్యావరణ విద్యాకేంద్రం (ఈఈసీ)ని సుందరంగా తీర్చిదిద్దారు. ఆరు బయట గోడలపై పక్షుల చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. మరిన్ని అభివృద్ధి పనులకు ప్రణాళిక సిద్ధం చేశారు. పోల్రాజ్ డ్రెయిన్ నుంచి నీటి విడుదల ఆటపాక పక్షుల విహార కేంద్ర చెరువుకు సమీపంలోని పోల్రాజ్(నాగరాజు) డ్రెయిన్ నుంచి ప్రతి ఏటా నీటిని తోడుతారు. అడుగున తూములను ఏర్పాటు చేశారు. వీటిని తీయడంతో నీరు చెరువులోకి చేరుతోంది. మరో 15 రోజుల్లో చెరువు పూర్తి స్థాయిలో నిండుతుందని భావిస్తున్నారు. చెరువులో 4 అడుగులు నీరు చేరితే బోటు షికారుకు అవకాశం ఉంటుంది. వర్షాలు మరింత విస్తారంగా కురిస్తే త్వరగా నీరు చేరుతోందని అటవీశాఖ సిబ్బంది చెబుతున్నారు. ఆటపాక పక్షుల విహార కేంద్రం గట్లను పూర్తిస్థాయిలో పటిష్టపర్చడానికి ప్రణాళిక రూపొందించాం. అంచనాల నివేదికను ఉన్నతాధికారులకు అందించాం. ఇటీవల రూ.5 లక్షలతో పక్షుల విహార కృత్రిమ ఇనుప స్టాండ్లను తయారు చేయించాం. త్వరలో ఆటపాకలో బోటు షికారు అందుబాటులోకి వస్తుంది. – కే.రామలింగాచార్యులు, రేంజర్, కై కలూరు ఆటపాక పక్షుల విహార కేంద్రం ప్రవేశ ద్వారం ఫ్లెమింగో పక్షులు (ఫైల్) రెండు నెలల తర్వాత చెరువుకు నీరు రూ.5 లక్షలతో స్టాండ్లకు మరమ్మతులు అతిథులుగా ఫ్లెమింగో పక్షుల సందడి త్వరలో బోటు షికారుకు అవకాశం -
పెంచికలమర్రులో విషాదఛాయలు
కై కలూరు: ఆ ముచ్చటైన కుటుంబంపై విధి కన్నెర్రచేసింది. ముద్దుముద్దు మాటలు పలికే నాలుగేళ్ల కుమారుడిని చూసి మురిసిపోతున్న ఆ దంపతుల ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. గర్భిణి అయిన భార్య, కంటిపాపలాంటి కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘోర ప్రమాదం కై కలూరు మండలం పెంచికలమర్రు గ్రామంలో మంగళవారం విషాదఛాయలు నింపింది. గ్రామానికి చెందిన జయమంగళ విజయ్కుమార్, వెంకటరాజు అన్నదమ్ములు. జేసీబీ, పొక్లెయిన్ పనులు చేస్తూ వీరంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. వీరి తల్లి రమాదేవి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మంగళవారం ఆమెను చూసేందుకు కుటుంబ సభ్యులంతా వెళ్లారు. తల్లికి తోడుగా ఉండేందుకు చిన్న తమ్ముడు వెంకటరాజు అతని భార్య లక్ష్మి అక్కడే ఉంచారు. తిరిగి విజయ్కుమార్, అతని భార్య భువనైక నాగదుర్గ (25), కుమారుడు కారుణ్య నాగసాయి (4), వెంకటరాజుతో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. వెంకటరాజు కారు నడుపుతున్నాడు. అయితే కృష్ణా జిల్లా గన్నవరం వెస్ట్ బైపాస్ రహదారి, బీబీగూడెం సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ఓ గూడ్స్ కంటైనర్ లారీ టైర్ పగిలి, వీరి కారుపైకి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన గర్భిణి నాగదుర్గ, ఆమె కుమారుడు నాగసాయి అక్కడికక్కడే మరణించారు. విజయ్కుమార్కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ప్రాణపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు. ఇటీవల పలు దేవాలయాలు సందర్శించి మొక్కులు తీర్చుకుని వచ్చిన ఆ కుటుంబంలో ఈ ఘోర విషాదం జరగడంతో స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. నరసాపురం: మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వద్ద నుంచి బంగారు గొలుసు చోరీ చేసిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఆరుగట్లపాలెంకు చెందిన పాలెపు దుర్గాప్రసాద్ను మంగళవారం అరెస్ట్ చేసినట్టు టౌన్ సీఐ ఆకుల రఘు చెప్పారు. బాధితుడు చీదే ముత్యాలరావుకు ఈ నెల 28న నరసాపురం బస్టాండ్లో దుర్గాప్రసాద్ పరిచయమయ్యాడు. ఆ సమయంలో ముత్యాలరావు మద్యం మత్తులో ఉన్నాడు. కొంతసేపటికి ముత్యాలరావును వద్ద ఉన్న బంగారు గొలుసు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విచారణ చేసి దుర్గాప్రసాద్నును అరెస్ట్ చేసి అతిని వద్ద నుంచి రూ 1.70 లక్షలు విలువైన బంగారు చైన్ను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ చెప్పారు. -
సేంద్రియ సాగుతో అధిక లాభాలు
చింతలపూడి: రైతులు రసాయనిక ఎరువులకు స్వస్తి పలికి, సేంద్రీయ ఎరువుల వైపు మొగ్గు చూపాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో రసాయనిక ఎరువులను విపరీతంగా వాడటం వల్ల సాగు ఖర్చులు పెరిగి రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారని చెబతున్నారు. సేంద్రియ పద్ధతులను పాటిస్తే ఖర్చులు తగ్గడమే కాకుండా నాణ్యమైన, విషరహిత పంటల ద్వారా అధిక లాభాలు సాధించవచ్చని పేర్కొంటున్నారు. సేంద్రియ ఎరువులతో భూసార రక్షణ పశువుల ఎరువు, వానపాముల ఎరువు, గొర్రెలు, కోళ్ల ఎరువులతో పాటు పచ్చిరొట్ట ఎరువులు సేంద్రీయ సాగులో కీలకమైనవి. వీటి వాడకం వల్ల భూమి తన సహజ స్థితిని సంతరించుకోవడమే కాకుండా, పంటకు అవసరమైన ప్రధాన, సూక్ష్మ పోషకాలు అందుతాయి. వీటితో పాటు వేరుశనగ, వేప, పొద్దుతిరుగుడు, ఆముదం పిండిని వాడితే మొక్కలకు మరింత పోషక విలువలు లభిస్తాయి. దిగుబడిని పెంచే పచ్చిరొట్ట ఎరువులు సమగ్ర పోషక యాజమాన్యంలో పచ్చిరొట్ట ఎరువుల పాత్ర అమోఘం. ఇవి పంటల దిగుబడిని గణనీయంగా పెంచుతాయి. పచ్చిరొట్ట పైర్లలో జీలుగ, జనుము, పిల్లిపెసర, అలసంద, పెసర, మినుము వంటివి ముఖ్యమైనవి. జీవ ఎరువులతో అధిక లాభాలు పంటల పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందించే సూక్ష్మజీవ కణాల సముదాయాలనే ‘జీవ ఎరువులు’ అంటారు. ఇవి ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. రైజోబియం, అజటోబాక్టర్, అజోస్పైరిల్లం, నీలి ఆకుపచ్చ నాచు, అజొల్లా వంటివి నత్రజనిని స్థిరీకరిస్తాయి. అయితే ఫాస్ఫో బ్యాక్టీరియా భాస్వరాన్ని కరిగించేవిగా ఉంటాయి. ఇవి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నీలి ఆకుపచ్చ నాచు ఎకరానికి 4 కిలోల నాచు పొడిని ఇసుకతో కలిపి పొలమంతా సమానంగా చల్లాలి. ఆ తర్వాత 7 నుండి 10 రోజుల పాటు మడిలో నీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. ఈ నాచు గాలిలోని నత్రజనిని గ్రహించి భూమిలో స్థిరీకరిస్తుంది. దీనివల్ల ఎకరానికి 8–12 కిలోల నత్రజని పంటకు అందడమే కాకుండా దిగుబడి కూడా పెరుగుతుంది. అజటోబాక్టర్ ఎకరానికి సరిపడే విత్తనానికి 200–400 గ్రాముల కల్చర్ను పట్టించి విత్తుకోవాలి. లేదా ఒక కిలో కల్చర్ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి నేలపై చల్లుకోవచ్చు. వరి, చెరకు, జొన్న, పత్తి, సజ్జ, మిరప పంటలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. దీని ద్వారా ఎకరానికి 8–16 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. అజొల్లా సాగు విధానం పొలం దమ్ములో ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి, పలుచగా నీరు పెట్టాలి. ఆపై 100–150 కిలోల అజొల్లాను వేసి, 2–3 వారాల తర్వాత నేలలో కలియదున్నాలి. దీనివల్ల ఎకరానికి 3 టన్నుల పచ్చిరొట్టతో పాటు 12 కిలోల నత్రజని లభిస్తుంది. భాస్వరపు జీవ ఎరువు ఎకరానికి సరిపడే విత్తనానికి 200–400 గ్రాముల కల్చర్ను పట్టించాలి. లేదా ఒక కిలో కల్చర్ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి నేరుగా పొలంలో చల్లాలి. ఇది భూమిలో కరగని స్థితిలో ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందిస్తుంది. రైతులు సేంద్రియ సాగు వైపు మళ్లితే ఎన్నో లాభాలు పొందవచ్చు. ఒకవేళ రసాయనిక ఎరువులను వాడాల్సి వస్తే, కేవలం సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. పరిమితికి మించి రసాయనాలు వాడితే పురుగులు, తెగుళ్ల ఉధృతి మరింత ఎక్కువవుతుంది. – సుబ్బారావు, ఏడీఏ -
పెనుగొండకు కోర్టు యోగమెప్పుడు?
పెనుగొండ: దశాబ్ద కాలంగా పెనుగొండలో కోర్టు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నా అడుగు ముందుకు పడడం లేదు. ఈ నేపథ్యంలో, స్థానికంగా కోర్టును పునరుద్ధరించాలనే డిమాండ్ను పరిసర ప్రాంతాల న్యాయవాదులు మరోసారి తెరపైకి తెచ్చారు. ఈ లక్ష్య సాధన కోసం ప్రత్యేకంగా సమావేశమైన లాయర్లు.. ఒక కార్యాచరణ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలో బ్రిటిష్ పాలన కాలంలో, అంటే 1802వ సంవత్సరంలోనే ఏలూరు, నరసాపురంతో పాటు పెనుగొండలోనూ కోర్టును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నడుస్తున్న నాటి బ్రిటిష్ భవనంలోనే ఈ కోర్టు కొనసాగేది. ఈ భవనం వెనుక సబ్ జైలు కూడా ఉండేది. అప్పట్లో రూ.80 లోపు విలువైన తగాదాలను ఇక్కడ పరిష్కరించే వారని, దాదాపు 200 సంవత్సరాల పాటు ఈ కోర్టు సేవలందించిందని న్యాయవాదులు గుర్తు చేస్తున్నారు. అయితే స్వాతంత్య్రానంతరం కాలక్రమేణా సమీప పట్టణాలైన తణుకు, పాలకొల్లులలో కోర్టులను ఏర్పాటు చేస్తూ.. పెనుగొండను విస్మరించారు. కక్షిదారులకు తప్పని తిప్పలు ప్రస్తుతం పెనుగొండ జిల్లాలోనే అతిపెద్ద మేజర్ పంచాయతీగా ఉంది. దీనికి తోడు సమీపంలోని ఆచంట, పెనుమంట్ర, ఇరగవరం వంటి ప్రధాన మండలాల్లో సివిల్, క్రిమినల్ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ప్రాంతాలన్నీ తణుకు, పాలకొల్లు కోర్టుల పరిధిలోకి రావడంతో.. కక్షిదారులు, న్యాయవాదులు కేసుల నిమిత్తం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. అదే పెనుగొండలో కోర్టును ఏర్పాటు చేస్తే సమీప మండలాల ప్రజలందరికీ ఎంతో సౌకర్యంగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ప్రతిపాదనల దశలోనే ఫైళ్లు కోర్టు ఏర్పాటు ఆవశ్యకతపై గత దశాబ్ద కాలంగా పాలకులకు, అధికారులకు వినతులు అందుతూనే ఉన్నాయి. గతంలో ఒక దశలో కోర్టు మంజూరవుతుందనుకున్న తరుణంలో ప్రభుత్వాలు మారడంతో ఆ ప్రతిపాదనలు ఫైళ్లకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో కొత్త కోర్టుల ఏర్పాటు జరుగుతుందనే ప్రచారం సాగుతుండడంతో, ఈ సారైనా పెనుగొండకు అవకాశం కల్పించాలని న్యాయవాదులు కోరుతున్నారు. ఈ మేరకు పాలకులు, అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎలాగైనా కోర్టు సాధించుకోవాలనే పట్టుదలతో కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన వైనం -
స్వయం ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలి
వీరవాసరం: మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబ వ్యవస్థ బలపడుతుందని, ప్రభుత్వం కల్పిస్తున్న నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. మంగళవారం వీరవాసరం మండలం తోలేరులోని కామన్ ఫెసిలిటీ సెంటర్లో మహిళలకు నిర్వహిస్తున్న ఇండస్ట్రియల్ కుట్టు మిషన్న్పై నెల రోజుల నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలతో కలెక్టర్ ముచ్చటించి, రుణాలను ఏ విధంగా వినియోగిస్తున్నారు, ఎలాంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళల సాధికారతే కుటుంబాల అభివృద్ధికి పునాది అని అన్నారు. ప్రతి మహిళ తనకు లభించే అవకాశాలను వినియోగించుకొని స్వయం ఉపాధి సాధించి ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.ఎస్.ఎస్. వేణుగోపాల్, తహసీల్దార్ రామాంజనేయులు, లేస్ పార్క్ ఏపీఎం రమేష్, తోలేరు మాజీ సర్పంచ్ కె.లీలా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
టీఏ బకాయిల చెల్లింపుల్లో నిర్లక్ష్యం
● 20 నెలలకుగాను మొక్కుబడిగా 4 నెలల టీఏ చెల్లింపు ● పూర్తిస్థాయిలో అలవెన్సులు చెల్లించాలంటున్న పోలీస్ సిబ్బంది భీమవరం: ప్రజాప్రతినిధులు, రాజకీయనాయకులు, ప్రజలకు రక్షణ ఉండే పోలీసు ఉద్యోగులకు దాదాపుగా రెండేళ్లుగా ట్రావెలింగ్ అలవెన్స్(టీఏ) బకాయిలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో ఎట్టకేలకు జూన్ 30వ తేదీన మొక్కుబడిగా 4 నెలల టీఏ బకాయిలు చెల్లించి చేతులు దులుపుకున్నారు. జిల్లాలో ఏడు పోలీసు సర్కిళ్ల పరిధిలో సుమారు 25 పోలీసుస్టేషన్లు, 3 ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు ఉండగా వాటిలో దాదాపు 1,200 మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. సర్కిల్ ఇన్స్పెకర్ట్ నుంచి కానిస్టేబుల్ వరకూ ప్రతి నెలా జీతంతోపాటు ట్రావెలింగ్ అలవెన్స్లు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో భాగంగా బందోబస్తు నిమిత్తం పోలీసులు జిల్లాలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. ప్రజలకు రక్షణగా రాత్రి, పగలు పనిచేస్తుంటారు. అంతేగాకుండా ప్రజాప్రతినిధులు నిర్వహించే సభలు, సమావేశాలు సక్రమంగా ముగిసేవరకు వీరిదే బాధ్యత. ఎండ, వానలను లెక్క చేయకుండా నిరంతరం పనిచేయాల్సిందే. వీరికి ప్రతినెలా జీతంతోపాటు టీఏ కూడా జమ చేయాల్సిన ప్రభుత్వం గత 20 నెలలుగా నిర్లక్ష్యం చేస్తోంది. దీంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామంటూ పోలీస్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొక్కుబడిగా నాలుగు నెలలకు మాత్రమే టీఏ చెల్లించడం అన్యాయమని వాపోతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో పెద్ద మొత్తంలో విద్యాసంస్థల ఫీజులు, విద్యాసామాగ్రి కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్నామని, ఇటువంటి తరుణంలో ప్రభుత్వం బకాయి ఉన్న మొత్తం టీఏ చెల్లించాలని పోలీసు అధికారులు, సిబ్బంది కోరుతున్నారు. -
ఎద్దులు తరలిస్తున్న వాహనం స్వాధీనం
దెందులూరు: విజయనగరం నుంచి హనుమాన్ జంక్షన్ సంతకు ఎద్దుల తరలిస్తున్న బొలెరో వాహనాన్ని సోమవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నామని దెందులూరు ఎస్సై డి.వెంకట్ కుమార్ అన్నారు. దెందులూరు గ్రామానికి చెందిన జ్యోతుల చంద్రశేఖర్ దెందులూరు చెక్ పోస్ట్ వద్ద విజయనగరం నుంచి హనుమాన్ జంక్షన్ సంతకు వెళుతున్న వాహనాన్ని నిలుపుదల చేసి దెందులూరు పోలీస్స్టేషన్కు తీసుకువచ్చారన్నారు. నీరు, మేత లేకుండా సంతకు తీసుకెళ్తున్నారని చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జలం ప్రదీప్ కుమార్పై కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు. ఆగిరిపల్లి: సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు రాణిమేకల శ్రీనివాసరావు అనే వ్యక్తికి మాయమాటలు చెప్పి సెల్ఫోన్ చోరీ చేశారు. బాధితుడి వివరాలు ప్రకారం శ్రీనివాసురావు ట్రాక్టర్పై ఆగిరిపల్లి వస్తుండగా మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ట్రాక్టర్ టైర్ ఊడిపోతోందని శ్రీనివాసరావుకు చెప్పడంతో, ట్రాక్టర్ ఆపి టైర్లను తనిఖీ చేశాడు. దుండగులు జేబులోని సెల్ఫోను లాక్కొని పరారయ్యారు. బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నూజివీడు: బాకీ నిమిత్తం ఇచ్చిన చెక్కు చెల్లని నేరానికి ఎన్టీఆర్ జిల్లా విజయడలోని గుణదలకు చెందిన జంపని శ్రీసాయి శ్రీజకు ఆరు నెలల జైలుశిక్ష, రూ.40 లక్షలు జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మెజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం కృష్ణాజిల్లా బాపులపాడుకు చెందిన అద్దేపల్లి సురేష్ 2021 సెప్టెంబరులో శ్రీజకు రూ.31 లక్షలు ఆమె వ్యాపార అవసరాల నిమిత్తం అప్పుగా ఇచ్చారు. కొంతకాలం తరువాత సురేష్ తన బాకీ చెల్లించమని అడగగా శ్రీజ 2022 జూన్లో రూ.33.55 లక్షలకు చెక్కును ఇచ్చింది. దీనిని తన బ్యాంకు అక్కౌంట్లో నగదు వసూలు నిమిత్తం వేయగా శ్రీజ అకౌంట్లో నగదు లేదని బ్యాంకు అధికారులు చెక్కును తిప్పిపంపారు. దీనిపై సురేష్ కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం శ్రీజకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. ఏపీ నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్ ఎన్.వి.రమణరావు తాడేపల్లిగూడెం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరూ అందిపుచ్చుకోవాలని నిట్ ఇన్చార్జి డాక్టర్ ఎన్.వి.రమణరావు పిలుపునిచ్చారు. నిట్లోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభమైంది. సవాలుతో కూడిన భౌగోళిక పరిస్థితులలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యాధునిక సాధనాలు, పద్ధతులు అనే అంశంపై పది రోజుల పాటు నిర్వహించనున్న ఆన్లైన్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఎన్.వి.రమణరావు మాట్లాడుతూ జ్ఞాన మార్పిడి, వృత్తిపరమైన అభివృద్ధి, సహకార పరిశోధనలకు ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తుందన్నారు. నిట్ వరంగల్ ఐసీటీ అకాడమీ చీప్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ ఎస్.అనురాధ, నిట్ ఈఐసీటీ అకాడమీ కో ఆర్డినేటర్ పులి కిషోర్లు కార్యక్రమ లక్ష్యాలు, ప్రాధాన్యత రించి వివరించారు. నిట్ డీన్ ప్యాకల్టీ అపైర్స్ జి.రవికిరణ్శాస్త్రి, డాక్టర్ పవన్కుమార్ చమ్లింగ్, డాక్టర్ ప్రత్యూష జయంతి పాల్గొన్నారు. భీమవరం: దాడి చేసి డబ్బులు అపహరించిన కేసులో నిందితుడికి 6 నెలలు జైలు శిక్ష విధించినట్లు భీమవరం వన్టౌన్ సీఐ ఎ.రమేష్ సోమవారం తెలిపారు. గతేడాది మే 25న చినరంగనిపాలెంకు చెందిన సామన వీర వెంకట సత్యనారాయణను బేతనీ పేటకు చెందిన బబ్లు యాదవ్ కత్తితో బెదిరించి దాడి చేసి, బాధితుడి వద్ద ఉన్న రూ.2 వేల నగదును బలవంతంగా లాక్కునాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో భీమవరం సెకండ్ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎన్.జ్యోతి 6 నెలలు జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని సీఐ తెలిపారు. ద్వారకాతిరుమల: స్థానిక విర్డ్ ఆస్పత్రిలో సోమవారం రోబోటిక్ ఆర్థో శస్త్ర చికిత్సలు నిర్వహించిన డాక్టర్ కృష్ణ కిరణ్, తదితరులను ఆస్పత్రి ట్రస్ట్ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ కిరణ్ మాట్లాడుతూ రోబోటిక్ టెక్నాలజీతో శస్త్రచికిత్సలు చేయడం వల్ల రోగికి మెరుగైన, ఖచ్చితమైన, సురక్షితమైన చికిత్స అందుతుందన్నారు. సర్జన్ ఆదేశాల మేరకు రోబో పని చేస్తుందన్నారు. రోబో సాయంతో విర్డ్లో ఆరుగురికి ఆర్థో శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో విర్డ్ ఆస్పత్రి ట్రస్ట్ సభ్యులు వి.నారాయణ మూర్తి, ఎస్వీఎన్ఎన్ నివృతరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ, వైద్యులు తదితరులున్నారు. -
రోదిస్తున్నది
సాక్షి, భీమవరం : జిల్లాలోని ఆచంట నియోజకవర్గం నడిపూడిలో ఇసుకాసురులు పడ్డారు. సీఆర్జెడ్ నిబంధనలు తుంగలోకి తొక్కుతున్నారు. మీటర్లు లోతున వశిష్ట గోదావరి నదీ గర్భానికి తూట్లు పొడుస్తున్నారు. రాత్రంగా తవ్వకాలు చేస్తూ కోట్లాది రూపాయల ఇసుకను కొల్లగొడుతున్నారు. అక్రమార్కులకు ప్రభుత్వ పెద్దల అండదండలుండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. సీఆర్జెడ్ నిబంధనలు మీరి.. వశిష్ట గోదావరి జిల్లాలో ప్రారంభమయ్యే పెనుగొండ మండలం సిద్ధాంతం నుంచి నరసాపురం రూరల్ బియ్యపుతిప్ప వద్ద సముద్రంలో కలిసే వరకు తీరం వెంబడి ఆరు ఓపెన్ రీచ్లు, ఐదు డీసిల్టేషన్ పాయింట్లు ద్వారా గతంలో ఇసుక తవ్వకాలు జరిగేవి. సముద్రపు పోటుతో ఆయా ర్యాంపుల్లోని ఇసుకలో ఉప్పునీటి సాంద్రత ఎక్కువై నిర్మాణ పనులకు అనుకూలంగా లేకపోవడటం, తీర ప్రాంత పరిరక్షణలో భాగంగా ఈ ప్రాంతాన్నంతటిని ప్రభుత్వం కోస్టల్ రెగ్యులేటరీ జోన్గా ప్రకటించడంతో రెండేళ్ల క్రితం ర్యాంపులు మూతపడ్డాయి. ఇక్కడ తవ్వకాలు చేసే వీలులేక జిల్లా అవసరాల కోసం తూర్పుగోదావరి జిల్లాలోని తీపర్రు, పెండ్యాల ర్యాంపులను కేటాయించింది. కూటమి వచ్చాక సీఆర్జెడ్ నిబంధలకు విరుద్ధంగా నడిపూడి, కరుగోరుమిల్లి తదితర చోట్ల అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. స్థానికులు హైకోర్టును ఆశ్రయించగా తవ్వకాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం అధికారులను ఆదేశించింది. రూ.కోట్లల్లో అక్రమార్జన తూర్పుగోదావరి, డా.బీర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని పలు ర్యాంపుల్లో ఐదు యూనిట్ల లోడింగ్కు ప్రభుత్వ నిర్ణీత ధరతో పాటు అదనపు చార్జీల రూపంలో రూ.8 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. కాగా ఈ అనధికార ర్యాంపులో రూ.6 వేలకు ఇసుక లోడింగ్ చేస్తుండడంతో ఉభయ గోదావరి జిల్లాల నుంచి లారీలు ఇక్కడి క్యూ కడుతున్నాయని స్థానికులు అంటున్నారు. రోజూ రెండు వందలకు పైగా లారీలు లోడింగ్ చేస్తుండగా అక్రమార్జన రోజుకు రూ.12 లక్షల పైమాటేనని స్థానికులు అంటున్నారు. కొద్దిరోజులుగా సాగుతున్న తవ్వకాలతో కోట్లాది రూపాయల ఇసుకను కొల్లగొట్టారంటున్నారు. నిర్వహణ ఖర్చులు పోను మిగిలిన సొమ్ములు టీడీపీ అగ్రనాయకత్వానికి చేరుతున్నట్టు సమాచారం. మరోపక్క రానున్న వరదల సమయంలో సొమ్ములు చేసుకునేందుకు సిద్ధాంతం సమీపంలో అనుమతులు లేకుండా స్టాక్ పాయింట్ను ఏర్పాటుచేసి భారీ మొత్తంలో ఇసుకను డంప్ చేస్తున్నారు. సొంత అవసరాల కోసం సామాన్యులు కొద్దిగా ఇసుక తెచ్చుకుంటే నిబంధనలు పేరిట హడావుడి చేసే అధికారులు సీఆర్జెడ్ పరిధిలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. హైవేను ఆనుకుని ఉన్న అనధికార స్టాక్ పాయింట్ అధికారులు దరిదాపుల్లోకి కూడా లేదంటున్నారు. కాగా స్థానికుల ఫిర్యాదులతో గ్రామ, మండల స్థాయిలోని ఉద్యోగులు ఎవరైనా తనిఖీలకు వెళితే.. ఎందుకు వెళ్లారంటూ ఉన్నతాధికారి ఒకరు వారిపై మండిపడుతున్నట్టు సమాచారం. దీంతో ఎవరూ అక్రమ తవ్వకాలు, అనధికార స్టాక్ పాయింట్ వైపు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదంటున్నారు. నడిపూడిలో తవ్వకాలు గురించి మైనింగ్ శాఖ ఏడీ మల్లేశ్వరరావును సంప్రదించగా నడిపూడిలో ఇసుక తవ్వకాలకు, స్టాక్ పాయింట్కు అనుమతి లేదన్నారు. తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తవ్వేయ్.. దోచేయ్ టీడీపీ నేతల బరితెగింపు సీఆర్జెడ్ నిబంధనలు బేఖాతరు నడిపూడిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు పొక్లెయిన్లతో గోదావరి నదీ గర్భానికి తూట్లు రూ.కోట్లల్లో అక్రమార్జన కన్నెత్తి చూడని అధికారులు తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక తవ్వకాలకు పేరొందిన టీడీపీ నేత కన్ను నడిపూడి ర్యాంపుపై పడింది. జట్టు కార్మికుల సమస్య లేకపోవడం, బాట అనుకూలంగా ఉండటంతో అక్రమ తవ్వకాలకు ఈ ర్యాంపును ఎంచుకున్నారు. సాధారణంగా తవ్వకాలు చేయాలంటే ఇరిగేషన్, మైనింగ్, పొల్యూషన్, రెవెన్యూ శాఖల అనుమతులు తప్పనిసరి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మార్గదర్శకాలను అనుసరించి తీరప్రాంతం కోతకు గురికాకుండా ఇసుక మేట వేసిన చోట పరిమిత అడుగుల లోతున జట్టు కార్మికులతో తవ్వకాలు చేయించాలి. పగటిపూట మాత్రమే తవ్వకాలు, లోడింగ్ చేయాలి. ఈ నిబంధనలకు తూట్లు పొడుస్తూ సదరు నేత చక్రం తిప్పారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో నడిపూడి ర్యాంపులో అనధికార తవ్వకాలకు తెరలేపారు. పొక్లెయిన్లతో నదీ గర్భంలోంచి రెండు మూడు మీటర్ల లోతున ఇసుకను పైకితోడి తవ్వకాలు చేస్తున్నారు. రాత్రి మొదలు తెల్లవార్లూ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. -
నేటి నుంచి కళాశాలల్లో సందడి
● నేడే ఈఏపీ సెట్ ఫలితాలు ● ఇప్పటికే కొన్ని కళాశాలల్లో సీట్ల భర్తీ ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యార్థులు తమ కలల కోర్సుల్లో చేరే అవకాశం ఉందా లేదా అనేది మంగళవారంతో తేలిపోనుంది. ఇంటర్ పూర్తి చేసుకుని ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు రాసిన విద్యార్థుల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. ఇటీవల నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల చేయనున్నట్టు ఈఏపీ సెట్ కన్వీనర్ ప్రకటించడంతో విద్యార్థుల్లో ఉత్సాహం రెట్టింపైంది. తమ కలల కోర్సులైన ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో చేరడానికి ఈ ఫలితాలే ఆధారం కావడంతో వారు గత కొంతకాలంగా వేచి చూస్తున్నారు. అనుకున్న ర్యాంకులు వస్తే తాము కోరుకున్న కళాశాలల్లో సీటు సాధించవచ్చనే ఆశతో విద్యార్థులు ఉత్కంఠకు లోనవుతున్నారు. పరీక్షలు రాసిన వారిలో కొంతమంది జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించి ఇప్పటికే ఐఐటీల్లో ప్రవేశాలు పొందడంతో కొంత పోటీ తగ్గింది. కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ ఈఏపీ సెట్ ఫలితాలు వెలువడనుండటంతో జిల్లాలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చరల్ కోర్సులు నిర్వహిస్తున్న కళాశాలల్లో సందడి వాతావరణం నెలకొంది. ఏలూరు నగరంలోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాల, గోపన్నపాలెంలోని హేలాపురి ఇంజనీరింగ్ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులు నిర్వహిస్తున్న మరో నాలుగు కళాశాలలు జిల్లా విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్నింటికంటే ఎక్కువ డిమాండ్ ఉన్న ఇంజనీరింగ్ సీట్లపైనే ఆయా కళాశాలలు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాయి. మంచి ర్యాంకులు సాధించిన వారికి పలు రాయితీలు ఇస్తామంటూ ఇప్పటికే నగరంలోని కొన్ని కళాశాలలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఊరిస్తున్నాయి. గతేడాది కంటే ఫలితాలు ఆలస్యం వాస్తవానికి ఈఏపీ సెట్ ఫలితాలు గత ఏడాది కంటే కొద్దిగా ఆలస్యమయ్యాయి. గత ఏడాది జూలై 1నే ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాగా, ఈ ఏడాది జూన్ 30న ఫలితాలు విడుదల చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల్లోనూ కొంత అసహనం వ్యక్తమైంది. ఫలితాలు ఆలస్యమైనప్పటికీ ప్రవేశాల ప్రక్రియను వేగంగా చేపట్టడానికి ఏపీ ఈఏపీ సెట్ ప్రతినిధులు కార్యాచరణ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఫలితాలు విడుదలైన రెండు మూడు రోజుల్లోనే ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభం కానుంది. ముందుగానే సీట్లు రిజర్వ్ ఇదిలా ఉండగా ఈఏపీ సెట్ ఫలితాలు వెలువడక ముందే కొన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు భర్తీ అయిపోయినట్టు తెలుస్తోంది. కన్వీనర్ కోటా సీట్లను కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేసుకోవాల్సి ఉన్నప్పటికీ, యాజమాన్య కోటా సీట్లను కూడా ఫలితాలు వెలువడిన తర్వాతే భర్తీ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ యాజమాన్యాలు ఇప్పటికే సీట్లను భర్తీ చేసుకుంటున్నాయి. సీఎస్ఈ, ఈసీఈ, ఏఐ, ఏఐఎంఎల్, ఏఐడీఎస్ సీట్లకు పోటీ నెలకొన్న నేపథ్యంలో, కళాశాలల ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులను ఫోన్ల ద్వారా, వ్యక్తిగతంగా కలిసి సీట్లను రిజర్వ్ చేసుకోవాలని సూచిస్తూ ఒప్పిస్తున్నారు. ఫలితాల్లో మంచి ర్యాంకులు వస్తే వారు కట్టిన అడ్వాన్స్ను తిరిగి చెల్లించడానికి కూడా ఒప్పందం చేసుకుంటున్నారని సమాచారం. ర్యాంకు రాకపోతే కోరుకున్న బ్రాంచీల్లో సీట్లు దొరకవేమోనన్న అనుమానంతో కొంతమంది తల్లిదండ్రులు యాజమాన్యాల సూచన మేరకు సీట్లు రిజర్వ్ చేసుకుంటున్నారు. ఇలా మంచి కళాశాలలుగా పేరున్న సంస్థల్లో యాజమాన్య కోటా సీట్లు ఇప్పటికే 95 శాతం పైగా భర్తీ అయిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఏలూరు జిల్లాకు సంబంధించి మొత్తం 4 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా, వాటిలో వివిధ బ్రాంచ్లకు సంబంధించిన 3,150 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 1200 సీట్లు, రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో 1020 సీట్లు, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో 600 సీట్లు, హేలాపురి ఇంజనీరింగ్ కళాశాలలో 330 సీట్లు ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలకు జిల్లాలోని 5598 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 5290 మంది పరీక్షలు రాశారు, -
పగిలిన సత్యసాయి పైప్లైన్
పోలవరం రూరల్: మండలంలోని రేపల్లెవాడ వద్ద శ్రీ సత్యసాయి మంచినీటి పథకానికి సంబంధించిన ప్రధాన పైప్లైన్ మార్గం పగిలిపోయింది. దీనివల్ల ఏజెన్సీ ప్రాంతంలోని పలు గ్రామాలకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం కన్నాపురం నుంచి పోలవరం వరకు నేషనల్ హైవే రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కారణంగా రోడ్డుపై భారీ వాహనాల రాకపోకలు విపరీతంగా సాగుతున్నాయి. భారీ వాహనాల ఒత్తిడికి తట్టుకోలేక ఇక్కడి భూగర్భ పైప్లైన్లు తరచూ పగిలిపోతున్నాయి. దీంతో ఒకవైపు తాగునీరు వృథాగా పోతుండగా, మరోవైపు ఆయా గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తుతోంది. పైప్లైన్ పగిలి నీరంతా రోడ్డుపైకి చేరడంతో రహదారి మొత్తం బురదమయంగా మారింది. నిర్మాణంలో ఉన్న రోడ్డు కావడంతో బురద మరింత ఎక్కువై భారీ వాహనాలు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, పైప్లైన్కు తక్షణమే మరమ్మతులు చేపట్టి, పదే పదే పగలకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఏజెన్సీ గ్రామస్థులు వేడుకుంటున్నారు. -
కార్పొరేట్ కబంధ హస్తాల్లో విద్యాశాఖ
భీమవరం: విద్యాశాఖలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో సోమ వారం స్థానిక డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. భీమవరం విభాగ్ కన్వీనర్ కాయిత డిన్ను చందు మాట్లాడుతూ రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకుని పతనావ్యవస్థకు చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్య సంస్థల్లో పుస్తకా లు, యూనిఫాంలను విక్రయించడమేగాక ఫీజు దోపిడీకి పాల్పడుతున్నారని, వీటిని అరికట్టాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా నడుపుతున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్తాయిలో మౌలిక సదుపాయాలను కల్పనతో పాటు విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలన్నారు. అనంతరం డీఈఓ ఈ.నారాయణకు వినతిపత్రం అందజేశారు. ఏ బీవీపీ జిల్లా కన్వీనర్ రాయి వెంకట, భీమవరం ప ట్టణ ఉపాధ్యక్షుడు ప్రశాంత్, కార్య సమితి సభ్యులు ఆనంద్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు . -
నేడు ఆక్వా ఫీడ్ డీలర్ల బంద్
పాలకొల్లు సెంట్రల్: ఆక్వా రైతులు కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడంలేదు. ఆక్వా రైతులు తమ సమస్యలు పరిష్కారం చేయాలంటూ రోడ్డు ఎక్కినా, ఫీడ్ కంపెనీలు ససేమిరా అంటూ వారి ఇష్టానుసారంగా ధరలు పెంచుకుంటూ పోతున్నా,యి రాష్ట్ర ఆక్వా రైతు సంఘం సభ్యులు ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం ఆక్వా ఫీడ్ డీలర్లు స్వచ్చందంగా బంద్ పాటించనున్నారు. ఆక్వా రైతుల సమస్యకు ఫీడ్ డీలర్లు మద్దతుగా నిలిచి సంఘీభావం తెలపాలని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్రాజు పిలుపు మేరకు ఫీడ్ డీలర్లు ఈ బంద్ పాటిస్తున్నారు. ఆక్వా రైతుల సమస్యలు పరిష్కారం కోసం పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వారిని సముదాయించి వారి పోరాటాన్ని అణగదొక్కుతున్నారే తప్ప ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లపై మాత్రం చర్యలు చేపట్టడం లేదని అన్నారు .కూటమి ప్రభుత్వానికి అధికారం చేతిలో ఉండి కూడా రైతుల పక్షాణ నిలబడి ఫీడ్, ప్రాసెసింగ్ యూనిట్లపై అజమాయిషీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం చేతగానితనం అర్ధమవుతుందని ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పెంచిన ధరలో రూ. 4 లు తగ్గించాలని ప్రభుత్వం సూచించినా, హెచ్చరికలు జారీచేసినా డోంట్కేర్ అన్నట్లు వ్యవహరించాయంటే ప్రభుత్వం చేతగానితనమా అని ఆక్వా రైతులు ప్రశ్నిస్తున్నారు. నేటి బంద్తో రాష్ట్ర ప్రభుత్వంలో కధలిక వస్తుందా లేదా అని ఆక్వా రైతులు వేచి చూస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీభగవాన్రాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా ఫీడ్, మెడిసిన్ షాపులు బంద్ కొనసాగుతుందన్నారు -
సర్టిఫికెట్ల జారీలో జాప్యం
● మీ సేవా కేంద్రాల్లో స్టేషనరీ కొరత ● ఈనెల 10 నుంచి నిలిపివేసిన సర్టిఫికెట్ పేపర్లు భీమవరం : మీ సేవా కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలకు అవసరమైన పేపర్ కొరతతో సర్టిఫికెట్ల జా రీలో ఆలస్యమవుతోంది. దీంతో విద్యార్థులు, ప్రజ లు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు పలు రకాల సర్టిఫికెట్ల అవసరం ఉంటుంది. అయితే ప్రభుత్వం నూతనంగా మీ సేవా కేంద్రాలకు సరఫరా చేసే సర్టిఫికెట్ పేపర్లను మార్పు చేయడంతో సమస్య తలెత్తింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రా మ–వార్డు సచివాలయ శాఖ పేరుతో పేపర్ను స రఫరా చేయగా కూటమి ప్రభుత్వం స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖగా మార్చివేసింది. జిల్లాలో 120 మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. కుల, ఆదాయ, ఈ డబ్ల్యూఎస్, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు రైతులకు అవసరమైన అడంగల్, బీ–1, పోలీసు సర్టిఫికెట్స్ వంటివి మీ సేవా కేంద్రాల ద్వారా ఇస్తుంటారు. ఇందుకు అవసరమైన పేపర్ను రూ.3.34కు ప్రభుత్వం మీ సేవా కేంద్రాలకు సరఫరా చేస్తోంది. మీ సేవా నిర్వాహకులు ఇండెంట్ పెట్టి సొమ్ము చెల్లిస్తుంటారు. గతంలో పెద్ద మొ త్తంలో సొమ్ములు చెల్లించి సర్టిఫికెట్ పేపర్ను తెప్పించుకోగా ప్రస్తుతం అరకొరగా మాత్రమే ప్రభుత్వం సరఫరా చేస్తోందని మీ సేవా నిర్వహకులు చెబుతున్నారు. వీరవాసరం మండలంలోని ఓ మీ సేవా కేంద్రంలో 20 రోజులుగా కుల, ఆదా య సర్టిఫికెట్స్ కోసం 40 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు ఒక్కటి కూడా ఇవ్వలేకపోయామని నిర్వాహకుడు తెలిపారు. పేరు మార్పుతో ఇబ్బందులు సర్టిఫికెట్లకు సంబంధించి పాత పేపర్లు బదులుగా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖగా మార్పు చేసి వాటిని వినియోగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇ చ్చింది. ఈనెల 10న పాత సర్టిఫికెట్ పేపర్లను స్వా ధీనం చేసుకుంది. ఇకపై కొత్త పేపర్లపై మాత్రమే సర్టిఫికెట్లను ప్రింట్ చేసి ఇవ్వాలని ఆదేశించింది. దీంతో సమస్య తలెత్తింది. సర్టిఫికెట్ కోసం మీ సే వా కేంద్రాలకు వెళితే పేపర్ లేదంటూ సమాధానం వినిపిస్తోంది. నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులకు జనన, కులం, ఆదాయం, ఈడబ్ల్యూఎస్ వంటి సర్టిఫికెట్లు అవసరం పడింది. అలాగే వృద్ధాప్య, వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం అవుతున్నాయి. దీంతో ఆయా సర్టిఫికెట్ల కోసం కేంద్రాలకు క్యూకడుతున్నా రు. ఈ నేపథ్యంలో పేపర్ కొరతతో ఇబ్బంది పడుతున్నారు. పలుమార్లు కేంద్రాల చుట్టూ తిరిగినా సర్టిఫికెట్లు మంజూరు చేయడం లేదని పలువురు వాపోతున్నారు. ఆలస్యమైతే విద్యాసంస్థల్లో ఇబ్బందులు తప్పవని విద్యార్థులు, అర్హత కోల్పోతామని పింఛన్ లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. -
కుట్ర రాజకీయాలను ఎదుర్కొంటాం
ఏలూరు టౌన్ : వైఎస్సార్సీపీ రాష్ట్ర నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికి ప్రతి నాయకుడు, కార్యకర్త అండగా నిలుస్తారనీ, మేమంతా మీతోనే అంటూ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. మాజీ మంత్రి కారుమూరిని ఆయన నివాసంలో పార్టీ నేతలంతా కలిసి సంఘీభావం ప్రకటించారు. మద్యం అక్రమ కేసులో అరెస్టయిన ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి, వైఎస్సార్సీపీ యువజన విభాగం జోన్ కో–ఆర్డినేటర్ కారుమూరి సునీల్కుమార్ను చంచల్గూడ జైలులో ములాఖత్లో కలిశారు. మద్యం కుంభకోణం పేరుతో వైఎస్సార్సీపీ నేతలను భయపెట్టాలనే ఉద్దేశంతో అక్రమ కేసుల్లో ఇరికిస్తూ టీడీపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారనీ, చట్టం మేరకు కోర్టుల్లో అక్రమ అరెస్టుగా నిర్ధారణ కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే సునీల్కుమార్ జైలు నుంచి విడుదల అవుతారని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చి న హామీలను నెరవేర్చలేక కేవలం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులను బనాయిస్తున్నారన్నారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ భయపెట్టాలని చూస్తే ఎవరూ బెదిరిపోరని స్పష్టం చేశారు. మరింత ధైర్యంతో ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటామని జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావటం తఽథ్యమని, కూటమి ప్రభుత్వానికి సరైన సమయంలో ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. వైఎస్సార్సీపీ చింతలపూడి సమ న్వయకర్త కంభం విజయరాజు, ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి వమ్మిశెట్టి పరమేశ్వరరావు, కామవరపుకోట మండల అధ్యక్షుడు రాయింకుల సత్యనారాయణ తదితరులు ఉన్నారు. -
214 అర్జీల స్వీకరణ
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లో అందిన ప్రతి ఫిర్యాదును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన, శాశ్వత పరిష్కా రం చూపాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో జేసీ రాహుల్కుమార్రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, కేఆర్ఆర్ ప్రాజెక్టు అధికారి పి.ప్రభాకర్తో కలిసి ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఫిర్యాదుదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని, ఒకే సమస్యపై పునరావృతంగా అర్జీలు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో 160, రెవెన్యూ క్లినిక్లో 54 అర్జీలు స్వీకరించారు. జిల్లా అధికారులు, వృద్ధుల సంక్షేమ ట్రిబ్యునల్ సభ్యుడు మేళం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. భీమవరం : ప్రజా సమస్యలపై త్వరితగతిన స్పందించి, నిర్ణీత గడువులోగా చట్టపరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆదేశించారు. సోమ వారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 19 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యలపై పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. భీమవరం: జిల్లాలో సార్వా సీజన్ నుంచి వ్యవసాయశాఖ అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ అ గ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఏపీఏఐఎంఎస్) సేవలను రైతులు సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఓ ప్రకటనలో కోరారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ దిశగా తీసుకెళ్లడానికి, వేగంగా, పారదర్శక సేవలు అందించేందుకు ఏపీఏఐఎంఎస్ను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రైతులు సాగు చేసిన పంటల వివరాలను ఏపీఏఐఎంఎస్ నమోదు చేయించుకోవడం ద్వారా పథకాల అమలు, ఇన్పుట్ సబ్సి డీ, పంటల వివరాల ధ్రువీకరణ, పంటల కొ నుగోలు వంటి సేవలను సులభంగా పొందే అవకాశముందన్నారు. జిల్లాలో రైతుంతా తప్పనిసరిగా సమీప రైతు సేవా కేంద్రం, వ్యవసాయ అధికారులను సంప్రదించి తమ పంట వివరాలను ఏపీఏఐఎంఎస్లో నమోదు చేయించుకోవాలని సూచించారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో దివ్యాంగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో మంగళవారం భీమవరంలోని ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ప్లేస్మెంట్ డ్రైవ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఎనిమిది కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, దాదాపు 200కు పైగా ఉద్యోగావకాశాలు ఉ న్నాయన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 95020 24765లో సంప్రదించాలని కోరారు. పెనుగొండ: ఏరువాక పౌర్ణమి సందర్భంగా సోమవారం సిద్ధాంతంలో హిందూ ధర్మపరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వశిష్టా గోదావరికి పంచ హారతులు సమర్పించారు. కలగభద్రుడు స్వామి బ్రహ్మత్వంలో కంచర్ల నరసింహమూర్తి, మహాలక్ష్మీ దంపతలు గంగ పూజలు నిర్వహించి నదీమతల్లికి హారతులు ఇచ్చారు. హిందూ ధర్మపరిరక్షణ సమితి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
సౌదీలో చిక్కుకుపోయా.. సాయం చేయండి
కామవరపుకోట: నేను ఇక్కడ నరకం అనుభవిస్తున్నాను.. ప్రభుత్వం స్పందించి ఇంటికి తీసుకువెళ్లే ఏర్పాటు చేయాలి అంటూ పొట్టకూటి కోసం సౌదీ అరేబియా వెళ్లిన ఒక వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని వీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన కళ రామాంజనేయులు ఇటీవల ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. రాజమండ్రికి చెందిన షేక్ జిన్నా షజరత్ అనే వ్యక్తి సౌదీలో హాస్పిటల్ వాచ్మన్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, ప్రయాణ, వీసా ఖర్చుల పేరిట ఫోన్పే ద్వారా రూ.1,35,000, వైద్య పరీక్షల నిమిత్తం రూ.15,000 నగదు తీసుకున్నాడు. అనంతరం రామాంజనేయులును సౌదీ అరేబియా పంపించి, హామీ ఇచ్చిన ఉద్యోగం ఇవ్వకుండా ఎడారి ప్రాంతంలో మేకలు, గొర్రెల కాపరిగా పనిలో పెట్టాడు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన రామాంజనేయులు.. తాను పడుతున్న నరకయాతనను వివరిస్తూ, తనను స్వదేశానికి రప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడి తల్లి కళ కనకలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తడికలపూడి ఎస్సై వల్లి పద్మ తెలిపారు. -
నిరుపయోగంగా పోలీస్ సబ్ కంట్రోల్ యూనిట్
నూజివీడు: నూజివీడు పట్టణంలో ప్రారంభించిన పోలీస్ సబ్ కంట్రోల్ యూనిట్ నిరుపయోగంగా ఉంది. దీనిని ఏ లక్ష్యంతో ఏర్పాటు చేశారో దానిని నేరవేర్చుతున్న దాఖలాలు కనిపించడం లేదు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు, శాంతిభద్రతల పరిరక్షణకు గాను 2013 మార్చి 20న అప్పటి ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభించిన ఈ సబ్కంట్రోల్ యూనిట్ గత పదేళ్లకు పైగా ఖాళీగానే ఉంది. ఇక్కడ ఏనాడు పోలీస్ సిబ్బందిని చూసిన దాఖలాలు లేవు. కనీసం కానిస్టేబుల్ గాని, హోంగార్డులను గాని నియమించిన పరిస్థితి లేదు. పట్టణాలలో నిరంతరం జరిగే చిన్న చిన్న గొడవలు, ఈవ్ టీజింగ్, ట్రాఫిక్ అతిక్రమణ, గొలుసు దొంగతనాలు, చిల్లర నేరాలు తదితర వాటిని అరికట్టేందుకు పట్టణాలలో ఎక్కువ రద్దీ ఉండే కూడళ్ళలో ఏర్పాటు చేయాలని భావించి పట్టణంలోని పండ్లమార్కెట్ సెంటరులో పోలీస్ సబ్ కంట్రోల్ యూనిట్ ఏర్పాటు చేశారు. దీనిలో ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఒక హెడ్కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్లు ఉండి విధులు నిర్వహించాలి. ఇక్కడ వాస్తవ పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయి. ఈ యూనిట్ ప్రారంభించి పదమూడేళ్లు గడిచినా నిరూపయోగంగానే ఉంది. దీంతో యూనిట్ అలంకారప్రాయంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం మొక్కుబడిగా కూడా ఇక్కడ ఎవరిని నియమించడం లేదు. ఇది పనిచేయకపోవడంతో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ఇష్టారాజ్యంగా మారింది. వన్వే నిబంధనలు ఎవరూ పాటించడం లేదు. ఒక్కొక్కసారి చిన్నగాంధీబొమ్మ సెంటర్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపధ్యంలో డీఎస్పీ స్పందించి పోలీస్ సబ్కంట్రోల్ యూనిట్ పనిచేసేలా చూడాలని పట్టణ వాసులు కోరుతున్నారు. వన్వే ఉల్లంఘన పట్టణంలోని పలు రహదారులను వన్వే గా చేశారు. పండ్లమార్కెట్ సెంటర్ నుంచి చిన్నగాంధీబొమ్మ సెంటర్ వైపుకు వచ్చే రోడ్డులో వాహనదారులు యథేచ్ఛగా వన్వే నిబంధనను ఉల్లంఘిస్తున్నారు. బస్టాండు వైపు నుంచి వచ్చే వాహనాలన్నీ వెంకటేశ్వరస్వామి కోవెల, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్ మీదుగా తిరిగి చిన్నగాంధీబొమ్మ సెంటర్కు రావాలి. అలా కాకుండా కార్లు, ఆటోలు, ఒక్కొక్కసారి ఆర్టీసీ బస్సులు సైతం వన్వే నిబంధనలను అతిక్రమిస్తూ నేరుగా చిన్నగాంధీబొమ్మ సెంటర్కు వచ్చేస్తున్నాయి. దీంతో పట్టణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
గూడెం ఎంఈఓ–1పై విచారణ
తాడేపల్లిగూడెం రూరల్: తాడేపల్లిగూడెం జెడ్పీ హైస్కూల్లో సోమవారం ఎంఈవో–1 వి.హనుమపై డీవైఈఓ విచారణ నిర్వహించారు. ప్రధానంగా పాఠశాలలు సందర్శన సమయంలో సొమ్ముల డిమాండ్, మహిళలపై అసభ్య ప్రవర్తన వంటి అంశాలపై అభియోగాలు రావడంతో భీమవరం డీవైఈఓ ఎన్.రమేష్ను విచారణ అధికారిగా నియమించారు. ఆయన ఫిర్యాదుదారుల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తానని చెప్పారు. కాగా హనుమ మాట్లాడుతూ తోటి ఉపాధ్యాయినులను సోదరసమానంగా చూస్తానని, ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని, దానిని తప్పుగా భావించడం సరికాదని అన్నారు. పాఠశాల సందర్శన సమయంలో ఎటువంటి వసూళ్లకు పాల్పడలేదని, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సందర్భంగా ఆడిటర్కు సొమ్ములు చెల్లించాల్సి ఉంటుందని, ఆ మేరకు మాత్రమే చెల్లిస్తారని, తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. -
బెల్ట్ షాపు నిర్వాహకుడి అరెస్ట్
పాలకోడేరు: భీమవరం ప్రోహిబిషన్, ఎకై ్సజ్ స్టేషన్ అధికారులు సోమవారం గొరగనమూడిలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో బెల్ట్షాపు నిర్వహిస్తున్న గొరగనమూడి గ్రామానికి చెందిన జి.ఆంజనేయులను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 10 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ కె. బలరామరాజు స్పష్టం చేశారు. అక్రమ మద్యం అమ్మకాలకు పాల్పడేవారిపై నిఘా కొనసాగిస్తామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద ఖాతాదారుల ధర్నా
జంగారెడ్డిగూడెం: స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో తాకట్టు పెట్టిన బంగారం మాయమైన ఘటనపై బాధితులు సోమవారం ఉదయం బ్యాంకు వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తమ సొమ్ముకు గ్యారెంటీ ఇవ్వాలని, త్వరితగతిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులను నిలదీశారు. అనంతరం బ్యాంకు నుంచి ఏఎస్పీ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి, ఏఎస్పీ సుస్మితను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. బ్యాంకు యాజమాన్యం కేవలం గోల్డ్ అప్రైజర్ రాజుపై మాత్రమే ఫిర్యాదు చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం కేవలం ఒకరి వల్ల సాధ్యం కాదని, ఇందులో బ్యాంకు సిబ్బంది హస్తం కూడా ఉండి ఉంటుందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆ కోణంలోనూ విచారణ జరపాలని కోరారు. అధికారులు సుమారు 4.3 కేజీల బంగారమే మాయమైనట్లు ఫిర్యాదులో పేర్కొనగా, వాస్తవానికి బాధితుల లెక్కల ప్రకారం 6 కేజీలకు పైగా బంగారం పోయిందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఏఎస్పీని వేడుకున్నారు. ఖాతాదారుల వినతిపై ఏఎస్పీ సుస్మిత సానుకూలంగా స్పందించారు. ఈ గోల్డ్ స్కామ్పై పోలీసులు ఇప్పటికే లోతైన దర్యాప్తు మొదలుపెట్టామని స్పష్టం చేశారు. బ్యాంకు సిబ్బంది పాత్రపై సైతం పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని, బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని, ఖాతాదారులు అంతవరకు సంయమనం పాటించాలని ఆమె కోరారు. -
మద్యానికి డబ్బు ఇవ్వలేదని ఆత్మహత్య
ముదినేపల్లి(కై కలూరు): మద్యానికి తల్లి డబ్బులు ఇవ్వలేదని ఫ్యాన్కు ఉరి వేసుకుని ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ముదినేపల్లి పోలీసుల వివరాలు ప్రకారం గురజ గ్రామానికి చెందిన మాగంటి వేణుగోపాలరావుకు గుడివాడకు చెందిన వెంకటలక్ష్మీతో 2010లో వివాహం జరిగింది. వీరికి పాప, బాబు సంతానం. వేణుగోపాలరావు తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఐదు సంవత్సరాలుగా మద్యానికి బానిసై భార్య, పిల్లలను పట్టించుకోకపోవడంపై ఆమె గుడివాడలో తండ్రి వద్ద పిల్లలతో కలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆదివారం వేణుగోపాలరావు గురజలో తన తల్లిని మద్యానికి డబ్బులు అడిగాడు. ఆమె ఇచ్చింది. మళ్లీ వచ్చి డబ్బులు కావాలన్నాడు. లేదని చెప్పడంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదుపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం చండీహోమం నిర్వహించారు. పౌర్ణమి పురస్కరించుకుని ఆలయంలో ఏర్పాటుచేసిన చండీహోమంలో 23 మంది దంపతులు పాల్గొన్నారు. భమిడపాటి వెంకన్న బ్రహ్మత్వంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం మాడ వీధుల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సప్త ప్రదక్షిణాలు చేశారు. రాత్రి స్వామివారికి ధూపసేవ, పంచ హారతులు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, చైర్మన్ మీసాల రామచంద్రరావు పాల్గొన్నారు. -
రఘురామకృష్ణంరాజును ఓడించి తీరుతాం
ఏలూరు (టూ టౌన్) : చర్చిలు కూల్చిన చోటే నీ సమాధి కడతాం.. అంటూ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణంరాజును ప్రముఖ న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ హె చ్చరించారు. దళిత క్రైస్తవ సమర శంఖారావం పేరిట ఏలూరులో నిర్వహించిన సభలో శ్రావణ్కుమార్ మాట్లాడుతూ ఆకివీడు, భీమవరంలో జరిగిన ఘటనలు దళిత క్రైస్తవుల ఆత్మగౌరవానికి భంగం కలిగించాయన్నారు. రఘురామకృష్ణంరాజునుద్దేశించి మాట్లాడుతూ ‘దళిత క్రైస్తవులపై నువ్వు యుద్ధం ప్రకటించావు.. ముగింపు నేనే ఇస్తా’.. అంటూ హెచ్చరించారు. ఆర్టికల్ 25 ప్రకారం ఈ దేశ ప్రజలకు ఎవరికి నచ్చిన మతాన్ని వారు అనుసరించే హక్కు ఉందని, దళిత క్రైస్తవుల హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదన్నారు. మతాలను ద్వేషించి కులాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజు రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోటీ పది లక్షల మంది దళిత క్రైస్తవులున్నారని, వచ్చే ఎన్నికల్లో వీరిలో 10 లక్షల మంది తన వెంట ఉంటే రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. పదో తరగతి చదివిన పవన్కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాగా లేనిది, న్యాయశాస్త్రం చదివిన తాను డిప్యూటీ సీఎం కావాలనుకోవడంలో తప్పు లేదుగా అని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు, పెద్ద సంఖ్యలో దళిత క్రైస్తవులు పాల్గొన్నారు. జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ హెచ్చరిక ఏలూరులో దళిత క్రైస్తవ సమర శంఖారావం -
పోలియోరహిత సమాజానికి కృషి
భీమవరం: పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు అన్నారు. గునుపూడిలోని గుల్లంకివారిపేటలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్కూల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం గుల్లంకివారిపేట, ఎంప్లాయీస్ కాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. వెంటనే క్లీనింగ్ చర్యలు చేపట్టాలని, రోడ్లు, డ్రైనేజీ లేని ప్రాంతాల్లో కొత్త రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు తీసు కోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించా రు. మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్, వైద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్) : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్తో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం కూడా నిర్వహిస్తామన్నారు. ప్రజ లు ఆన్లైన్లోనూ అర్జీలు నమోదు చేసుకోవ చ్చని, టోల్ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చని ఆమె సూచించారు. ముఖ్యంగా నడవలేని, మంచానికే పరిమితమైన, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పీజీఆర్ఎస్ కేంద్రాల వద్దకు తీసుకురావద్దని, అలాంటి వా రి సమస్యలను కుటుంబ సభ్యులు లేదా ప్ర తినిధుల ద్వారా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. అలాగే ప్రతి శుక్రవారం నియోజకవర్గస్థాయిలో నిర్వహిస్తున్న ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తణుకు అర్బన్ : ప్రభుత్వాస్పత్రిలో రోగులకు నాణ్యమైన, సత్వర వైద్యసేవలు అందించేలా వైద్యులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. ఆదివారం తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిని ఆమె సందర్శించారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యసేవలను ఆరా తీశారు. ఆస్పత్రిలో ఓపీ, ప్రసవాలు, ఇత ర శస్త్రచికిత్సల సంఖ్య పెంచాలని సూచించా రు. డీసీహెచ్ఎస్ పగడాల సూర్యనారాయణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ కాకర్లమూడి సా యికిరణ్, ఆర్ఎంఓ ఎల్.సాయిబాలాజీ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. భీమవరం: కనీస వేతనాల చట్టం ప్రకారం ఐదేళ్లకోసారి వేతనాలను సవరించాలని, అయి తే 2006 నుంచి రాష్ట్రంలో వేతనాలను సవరించలేదని ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూయు అనుబంధం) జిల్లా అధ్యక్షుడు మానుకొండ శివరావు అన్నారు. ఆదివారం స్థానిక సీఐటీ యూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీస వేతనాలను సవరించి తక్షణమే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పంచాయతీ కార్మికులు రూ.6 వేల నుంచి రూ.13 వేలు మాత్రమే వేతనాలు పొందుతున్నారని, చట్టప్రకారం కనీస వేతనాలను సవరిస్తే రూ.36 వేలు పొందేవారమన్నా రు. సన్మానాలు, సత్కారాలతో కార్మికుల కడు పు నిండదని, వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా నాయకులు ఎం.ఆంజనేయులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని కార్మికుల వద్దకు తీసుకువెళ్లడానికే వచ్చేనెలలో ఉద్యమం చేపడతామన్నారు. కిరణ్, రమణ తదితరులు పాల్గొన్నారు. -
గాండ్రిస్తూ.. వలయాలను ఛేదిస్తూ..
పెద్దపులి సంచారం సమయంలో దాడి చేసిన సంఘటనలో బుట్టాయగూడెం మండలంలో సుమారు 21 పశువులు బలైపోయాయి. పులి అటవీ ప్రాంతంలో సంచరించినా అక్కడి జంతువులను కాకుండా అటవీ ప్రాంత సమీపంలో కట్టేసి ఉన్న ఆవులపైనే దాడి చేసి చంపేసింది. పులి పర్యటనలో ఎక్కడా కూడా మనుషులపై దాడి చేసిన సంఘటనలు చోటుచేసుకోలేదు. పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ప్రత్యేక బృందాలు శ్రమించాయి. పులి కోసం పలు ప్రాంతాల్లో ప్రత్యేక వలయాలను ఏర్పాటుచేశారు. అయితే అధికారులు పన్నిన వలయాలను సైతం చాకచక్యంగా తప్పించుకుని అటవీ ప్రాంతంలో పులి గ్రామాల్లో యథేచ్ఛగా సంచరించింది. పులిని బంధించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు పలుమార్లు విఫలమయ్యాయి. ప్రస్తుతం ఆంధ్రా నుంచి తెలంగాణ వైపు వెళ్లడంతో ఇక్కడ అధికారులకు ఉపశమనం లభించింది. బుట్టాయగూడెం మండలం నాగులగూడెంలో తొలిసారి కెమెరాకు చిక్కిన పెద్దపులి (ఫైల్) బుట్టాయగూడెం: రాష్ట్రంలోని ఏలూరు, పోలవరం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన పెద్దపులి కదలికలు ముగిశాయి. ఆ పులి ప్రస్తుతం రాష్ట్ర సరిహద్దు దాటి తెలంగాణ వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. అలాగే పెద్దపులికి అమర్చిన రేడియో కాలర్ ద్వారా తెలంగాణ ప్రాంతంలో ప్రవేశించినట్టు గుర్తించిన ఏపీ అటవీ శాఖ అధికారులు అక్కడి అధికారులను అప్రమత్తం చేశారు. అయితే పులి ప్రస్తుతం ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లోనే ఉండటంతో రెండు రాష్ట్రాల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఆదివారం ఉదయంతో జిల్లాలో పులి సంచారం ముగియడంతో అటవీశాఖ అధికారులకు ఊరట లభించింది. దీనితో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడ మొదలైందో అక్కడికే.. సుమారు ఆరు నెలలపాటు గోదావరి జిల్లాల ప్రజలను భయాందోళనకు గురి చేసిన పెద్దపులి ఈ ఏడాది జనవరి 22న తెలంగాణలోని అశ్వారావుపేట మండలం కావిడిగుండ్ల నుంచి ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోకి ప్రవేశించింది. పందిరిమామిడిగూడెం–గుబ్బల మంగమ్మ గుడి మార్గంలో తిరుగుతూ ప్రజలను హడలెత్తించింది. అదేరోజు అంతర్వేదిగూడెం సమీపంలో ఆవు, లేగదూడలపై పంజా విసిరి హతమార్చింది. అయితే పులి ఆచూకీ కోసం అటవీశాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయగా నాగులగూడెం సమీపంలో మొదటిసారిగా పెద్దపులి కెమెరాకు చిక్కింది. అప్పటినుంచి బుట్టాయగూడెం మండలంలో సుమారు 13 పశువులను హతమార్చి జనవరి 31న పోలవరం–పట్టిసీమ పరిసర ప్రాంతాల్లో సంచరించి గోదావరి ఈదుకుంటూ తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఆ పరిసర ప్రాంతాల్లో సంచరించి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న సమయంలో పూనె నుంచి వచ్చిన రెస్క్యూటీమ్ రాయవరం మండలం కూర్మాపురంలో గన్ ద్వారా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పెద్దపులిని బంధించారు. కొద్దిరోజుల తర్వాత మళ్లీకి రేడియో కాలర్ అమర్చి ఆ పులిని పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టారు. మళ్లీ పులి తన సంచారాన్ని ప్రారంభించి పోలవరం జిల్లాలో పలు చోట్ల సంచరిస్తూ ఈనెల 23న ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. పలు గ్రామాల్లో సంచరిస్తూ పశువులపై దాడి చేస్తూ ఆదివారం వేకువజామున బుట్టాయగూడెం మండలం గుబ్బల మంగమ్మగుడి అటవీ ప్రాంతం నుంచి తెలంగాణలోని కంట్లం వైపు వెళ్లినట్టు అటవీ అధికారులు నిర్ధారించారు. తెలంగాణకు పెద్దపులి పయనం సుమారు ఆరు నెలలపాటు గోదావరి జిల్లాల్లో తిష్ట ప్రజలను, అధికారులను హడలెత్తించిన బెబ్బులి ఎట్టకేలకు వచ్చిన మార్గంలోనే తిరుగు ప్రయాణం పులి దాడిలో దాదాపు 21 పశువులు హతం జిల్లావాసులకు ఉపశమనం -
కారుమూరి సునీల్ అరెస్ట్ దారుణం
తణుకు అర్బన్ : వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్ను మద్యం కేసులో అక్రమ అరెస్ట్ చేసి జైలుకు పంపడం దారుణమని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. మాజీ మంత్రి కా రుమూరి వెంకట నాగేశ్వరరావును మాజీ మంత్రి జోగి రమేష్ ఆదివారం హైదరాబాద్లో కలిసి పరామర్శించారు. చంద్రబాబు సర్కారు చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు, విధ్వంస పాలనను ప్రశ్నిస్తున్న వారిపై రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయలేక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో రోడ్డుపైకి వచ్చి నిలదీసే పరిస్థితి వస్తుందన్నారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా ధైర్యంగా ఉండాలని సునీల్కుమార్ నిజాయితీపరుడని, నిస్వార్థంగా రాజకీయాలు చేసే మనిషిగా ప్రజలకు తెలుసని కారుమూరితో అన్నారు. -
దాడులు అమానుషం
ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ వీరవాసరం : రైతుల ఆహ్వానం మేరకు పరిశీలించేందుకు వెళ్లిన సీఆర్డీఏ రైతుల పరిరక్షణ క మిటీపై దాడులకు పాల్పడటం అమానుషమని ఎ మ్మెల్సీ, వైఎస్సార్సీపీ రా ష్ట్ర శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడు కవురు శ్రీనివాస్ ఆదివారం తీవ్రంగా ఖండించారు. ఉండవల్లి ప్రాంతంలో అమరావతి రైతుల ఇబ్బందులు తెలుసుకోవడానికి వెళుతున్న వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ గూండాలు దాడులు చేయడం హేయమన్నారు. రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయం బయటకు వస్తుందనే భయంతోనే టీడీపీ శ్రేణులు ఈ చర్యలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఉండవల్లిలో టీడీపీ నేత లు, కార్యకర్తలు, మట్టిమాఫియా, రౌడీషీటర్లు చేసిన దాడి ఘటన వెనుక బడా నాయకుల పాత్ర ఉందని ఆరోపించారు. రాళ్లు, కర్రలతో రెచ్చిపోవడం, కార్లను ధ్వంసం చేయడం కూట మి ప్రభుత్వ రాక్షస పాలనకు నిదర్శనంగా ఉందన్నారు. ఇటువంటి దాడులకు వైఎస్సార్సీపీ ఎన్నడూ భయపడదని, ప్రజలు రాబోయే కా లంగా కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆ ధ్వర్యంలో ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూనే ఉంటామని శ్రీనివాస్ పేర్కొన్నారు. బుట్టాయగూడెం : ఏజెన్సీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం వర్షం దంచికొట్టింది. గిరిజన గ్రామాల్లో, గుబ్బల మంగమ్మ గుడి వద్ద కుండపోతగా వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో వంట పొయ్యిలు తడిసిపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. సుమారు రెండు గంటలకు పైగా వర్షం కురవడంతో ఎక్కడి సామాన్లు అక్కడ వదిలేసి వ్యాపార దుకాణాల షెడ్డుల్లోకి పరుగులు తీశారు. సాయంత్రానికి వర్షం తగ్గడంతో అక్కడి నుంచి భక్తులు బయటకు తరలివచ్చారు. -
●నృత్యోత్సాహం
ఏలూరులో నృత్యాంజలి కళానికేతన్ 33వ వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం సంగీత, నృత్యార్చనలు ఘనంగా జరిగాయి. స్థానిక వైఎంహెచ్ఏ హాలులో కానాల గురుమూర్తి కళావేదికపై తపన ఫౌండేషన్, సంస్కార భారతి, హిందూ యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న కార్యక్రమాలు ముగిశాయి. ఆఖరిరోజు వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వందనీయ జననీ పేరిట ప్రదర్శనలు నిర్వహించారు. నాట్యాచార్య గండికోట రాజేష్ శిష్య బృందంలోని 150 మంది కళాకారులు నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. – ఏలూరు (ఆర్ఆర్పేట) -
కొల్లేరులో కోడిపందేలపై దాడి
దెందులూరు: కొల్లేరులోని కోడి పందేల స్థావరాలపై ఏలూరు రూరల్ ఎస్సై వి.వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. వారి నుంచి రూ.6,250 నగదు, రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే సహించేది లేదని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అసాంఘిక శక్తుల భరతం పడతామని హెచ్చరించారు. బుట్టాయగూడెం: గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత పెద్దపులి సంచారం నేపథ్యంలో ఆలయ కమిటీ వారు దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. కామవరం సమీపంలోని గేటు, రామచంద్రాపురంలో ఉన్న గేట్లకు తాళం వేసి భక్తులను ఆలయానికి వెళ్లకుండా ఆపారు. పెద్దపులి మంగమ్మ గుడి సమీపం నుంచి కంట్లం వైపు సుమారు రెండున్నర కిలోమీటర్లు వెళ్లిందని గుర్తించిన అధికారులు, భక్తులకు దర్శనానికి అనుమతులు ఇచ్చారు. వర్షం, కారుమబ్బులు ఉన్నప్పటికీ భక్తులు వెనుకాడకుండా మంగమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పాలకొల్లు సెంట్రల్: కళలను, కళాకారులను ప్రోత్సహించడంలో పాలకొల్లుది అగ్రస్థానమని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ అన్నారు. ఆదివారం స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాలులో అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన మొదటి బ్యాచ్ విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ, ఇలాంటి వేదికలు కళాకారుల ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య, సినీ నటి కె.దివ్యవాణి, దర్శకులు కళ్యాణకృష్ణ కె, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రాజా వన్నెంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాళ్ల: గ్యాస్ బుక్ చేసినా నెలల తరబడి ఇవ్వడం లేదని, అడిగితే కంపెనీ సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని పల్లెపాలెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం గ్రామస్తులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మే నెలలో బుక్ చేసినా ఇంతవరకు గ్యాస్ అందలేదని ఆరోపించారు. బుకింగ్ క్యాన్సిల్ అయ్యిందని, ఏజెన్సీ వారు వాడుకున్నారని సిబ్బంది చెబుతున్నారని, దీనిపై అధికారులు స్పందించి డోర్ డెలివరీ జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తిరుమాని మార్రాజు, బస్వాని వడ్డికాసులు, తిరుమల శెట్టి బాలాజీ, మోహన్ రావు పాల్గొన్నారు. నరసాపురం రూరల్: మొగల్తూరు మండలం పాలకమ్మ చెరువు గ్రామంలో ఆక్వా చెరువుపై పనిచేసే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పాలకమ్మచెరువు గ్రామంలోని పెనుమత్స హరిరాజుకు చెందిన ఆక్వా చెరువుపై కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామానికి చెందిన నక్కా దీనబాబు (48) కొంతకాలంగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం చెరువు సమీపంలో ఉన్న బోదెలో పడి మృతి చెందినట్లు ఎస్సై జయలక్ష్మి తెలిపారు. మృతుడి మరణానికి సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి బావ భీమరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
పేరుపాలెం బీచ్లో విషాదం
● స్నానానికి దిగి యువకుడు మృతి ● మరో విద్యార్థి గల్లంతు నరసాపురం రూరల్: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్లో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి దిగి ప్రమాదవశాత్తు ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో పాలిటెక్నిక్ విద్యార్థి అలల తాకిడికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షనన్కు చెందిన జిజ్జువరపు ఉమామహేశ్వరరావు (26) తన స్నేహితులతో కలిసి ఆదివారం సరదాగా గడిపేందుకు పేరుపాలెం బీచ్కు వచ్చాడు. అందరూ కలిసి సముద్రంలో స్నానానికి దిగగా, ప్రమాదవశాత్తు ఉమామహేశ్వరరావు మృతి చెందాడు. మృతుడి తండ్రి ప్రసాద్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బీచ్లో దొరికిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదే బీచ్లో జరిగిన మరో ప్రమాదంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మురమళ్ళ గ్రామానికి చెందిన సీహెచ్ సుభాష్ గల్లంతయ్యాడు. రాజమండ్రిలోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న ఈ యువకుడు, స్నానానికి దిగి అలల ఉధృతికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న సీఐ నాగరాజు, మొగల్తూరు ఎస్సై పోలీసులు సిబ్బంది స్థానిక మత్స్యకారులతో కలిసి గల్లంతైన సుభాష్ కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పేరుపాలెం బీచ్లో ఇలాంటి ప్రాణాంతక ఘటనలు తరచూ చోటుచేసుకుంటూనే ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు నేతలు, అధికారులు ఈ బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా, గోల్ఫ్ కోర్స్గా అభివృద్ధి చేస్తామని గొప్పలు చెబుతున్నా.. కనీస రక్షణ చర్యలు కరువయ్యాయని పలువురు విమర్శిస్తున్నారు. బీచ్లో తరచూ మరణాలు ఎందుకు జరుగుతున్నాయో అధికారులు ముందుగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, పర్యాటకుల భద్రత కోసం హెచ్చరిక బోర్డులు, లైఫ్ గార్డులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. బీచ్ పరిసరాల్లో మద్యం అమ్మకాలను పూర్తిస్థాయిలో నిరోధించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం
జంగారెడ్డిగూడెం/టి.నరసాపురం: భర్త తరపు బంధువులు, మరికొందరి వేధింపులు భరించలేకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఉండి మండలం పాందువ్వ గ్రామానికి చెందిన వీధి నవీన్ కుమార్ భార్య రజిత ఆరోపించారు. ప్రస్తుతం ఆమె జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో కోలుకుంటున్న రజిత తన ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను పోలీసులకు వెల్లడించింది. పెళ్లయిన నాటి నుంచి అదనపు కట్నం కోసం భర్త తల్లి వీధి బుజ్జి, భర్త మేనమామ మాదాసి రవికుమార్, కుటుంబ సభ్యులు వేధించేవారని చెప్పారు. పెళ్ళి సమయంలో రూ.5 లక్షలు కట్నం ఇచ్చారని, అయినా కట్నం సరిపోలేదని వేధిస్తున్నారన్నారు. భర్తకు మోటార్ సైకిల్ కోసం వేధిస్తుండటంతో, పుట్టింటి వారి సహాయంతో నగదు సమకూర్చినప్పటికీ వేధింపులు ఆగలేదన్నారు. నవీన్కుమార్ వ్యవసనాలకు బానిసయ్యాడని, ఈ క్రమంలో గత మే 12న కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడని ఆమె పోలీసులకు తెలిసిన స్టేట్మెంట్లో తెలిపారు. భర్త మరణానికి రజితనే కారణమంటూ అంత్యక్రియల సమయంలో, ఆ తర్వాత కూడా బంధువులు అవహేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నవీన్ చావుకు కారణం నువ్వేనంటూ రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, లేనిపక్షంలో పోలీసు కేసులు పెడతామని భయపెట్టారని ఆరోపించారు. తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు ఆమె తెలిపింది. రజిత వాంగ్మూలం ఆధారంగా టి.నరసాపురం ఎస్సై ఎం.జయబాబు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మొరాయించిన స్మార్ట్ మీటర్
బుట్టాయగూడెం: మండలంలోని సీతప్పగూడెం గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్ అదివారం పంచాయతీ అధికారులను, సిబ్బందిని హైరానాకు గురి చేసింది. గ్రామాల్లో మంచి నీటిని విడుదల చేయడం కోసం నీటిని విడుదల చేసే వ్యక్తి ఉదయం పంచాయతీ మోటరు ఆన్ చేయగా.. అది పని మొరాయించింది. మోటర్ కాలిపోయి ఉంటుందని భావించి ఆ వ్యక్తి పంచాయతీ కార్యదర్శికి మోటర్ పని చేయని విషయాన్ని తెలిపాడు. హుటాహుటిన అక్కడకు వచ్చిన కార్యదర్శి మోటర్ ఆన్ చేసే ప్రయత్నం చేశారు. విద్యుత్ మీటర్లో కరెంటు ఉన్నట్లు కనిపిస్తుంది కానీ మోటర్ తిగడం లేదు. ఏం జరిగిందో తెలియక కార్యదర్శి, సిబ్బంది ఆందోళనకు చెందారు. మోటర్ పని చేయకపోవడాన్ని కార్యదర్శి విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో వారు గ్రామ పంచాయతీలకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేశామని, అది ప్రీపెయిడ్ మీటర్ అని తెలిపాడు. వచ్చే నెల నుంచి మీటర్లకు ప్రీపెయిడ్ విధానంలో డబ్బులు కడితేనే అవి పని చేస్తాయని చెప్పాడు. సీతప్పగూడెం పంచాయతీ సంఘటనతో మిగిలిన పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. బుట్టాయగూడెం మండలంలో 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని పంచాయతీలకు స్మార్ట్ మీటర్లు అమర్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ పద్ధతి కావడంతో ఎప్పుడు ఆగిపోతాయో అని కార్యదర్శులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. 21 పంచాయతీల్లో 136 గ్రామాల్లోని ప్రజలు నీటి కోసం ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు. ఎప్పుడుపడితే అప్పుడు డబ్బులు చెల్లించడానికి అవకాశం ఉండదని అంటున్నారు. ప్రీపెయిడ్ పద్ధతి విధానంలో బాలెన్స్ అయిపోగానే విద్యుత్ సరఫరా ఆటోమేటిక్గా నిలిచిపోయే అవకాశం ఉన్నందున అత్యవసర సమయాల్లో గ్రామ పంచాయతీ సేవలు, వీధి దీపాలు నీటి సరఫరా వంటి సేవలకు తీవ్ర ఆటంకం కలిగే అవకాశం ఉందని అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. డబ్బులు కడితేనే పనిచేస్తాయంటున్న అధికారులు -
ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడి
భీమడోలు: ఆర్టీసీ బస్సులో టికెట్ చెల్లింపు విషయంలో తలెత్తిన వివాదం చివరికి డ్రైవర్పై దాడికి దారి తీసింది. ఈ ఘటన ఆదివారం జాతీయ రహదారి పూళ్ల వద్ద చోటు చేసుకుంది. తణుకు డిపోకు చెందిన అల్టా పల్లె వెలుగు ప్రైవేటు బస్ ఏలూరు నుంచి తణుకు వెళ్లేందుకు బయలు దేరింది. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంకు చెందిన గన్నేపల్లి కృష్ణప్రసాద్ బస్సు నడుపుతున్నాడు. ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో ఓ ప్రయాణికుడు బస్సు ఎక్కగా మహిళా కండక్టర్ టికెట్ తీసుకోవాలని కోరింది. క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లిస్తారని చెప్పగా, నెట్వర్క్ సరిగా పని చేయడం లేదని, నగదు ఇవ్వాలని సృష్టం చేసింది. దీంతో ప్రయాణికుడు వాగ్వావాదానికి దిగాడు. డ్రైవర్ కల్పించుకుని ప్రయాణికుడిని మందలించాడు. అనంతరం ప్రయాణికుడు బస్సు నుంచి దిగిపోయాడు. ఆ బస్సు అక్కడ నుంచి బయలుదేరి తణుకు వైపుగా వెళ్తూ పూళ్ల వద్దకు చేరుకుంది. ఇంతలో ప్రయాణికుడు మరో ఇద్దరితో బైక్లపై వచ్చి బస్ డ్రైవర్ను కొట్టారు. దీంతో డ్రైవర్కు గాయాలయ్యాయి. ఆ తర్వాత డ్రైవర్, కండక్టర్లు బస్సులోని ప్రయాణికులను దింపి మరో ఆర్టీసీ బస్సులో ఎక్కించారు. బస్సు డ్రైవర్ భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి చేసిన వారిలో ఒకరిది ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోపవరం, మరో ఇద్దరిది భీమడోలు మండలం దుద్దేపూడి పంచాయతీ అన్నేవారిగూడెంగా పోలీసులు గుర్తించారు. -
సత్తాచాటుతున్న బాస్కెట్బాల్ క్రీడాకారిణులు
ఏలూరు రూరల్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాలికల బాస్కెట్బాల్ క్రీడకు చిరునామాగా మారిందని జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి గవ్వ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఏలూరు కస్తూర్బా బాలికల పాఠశాల ఆవరణలో ఉమ్మడి జిల్లా యూత్ బాస్కెట్బాల్ జట్టు ఎంపిక పోటీలు జరిగాయి. తాడేపల్లిగూడెం, తణుకు, మార్టేరు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన బాలికలు ఈ పోటీల్లో తలపడ్డారు. మొదట నిర్వాహకులు రన్నింగ్ షాట్స్ ప్రాక్టీస్ చేపట్టారు. అనంతరం వివిద ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారిణులను జట్లుగా విభజించి మ్యాచ్లు నిర్వహించారు. ఈ మ్యాచ్లో ప్రతిభ చాటిన వారి పేర్లును జిల్లా జట్లకు ప్రకటించారు. జులై 9 నుంచి 12 వరకు విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల కోసం జట్టును ఎంపిక చేసినట్లు కోశాధికారి కె.మురళీకృష్ణ తెలిపారు. జట్టు సభ్యులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాలన్నారు. జట్టుకు ఎంపికై న క్రీడాకారిణులు పోటీలకు హాజరుకాకపోతే వారి స్థానంలో స్టాండ్బైగా ఎంపికై న వారిని పోటీలకు పంపిస్తామన్నారు. జట్టు సభ్యులు వీరే.. ఎంపికై న జట్టులో పి.నందిని, పి.ఎస్.సులోచన, ఎస్.సాత్విక, జి.సంజన, టి.ఉదయలక్ష్మి, ఎం.హేమశ్రీ, డి.సాయిశ్రీలాస్య, ఎస్.పి.కుషి, ఎల్.దేవి వెంకట సహస్ర, ఎస్.కె.లాతిఫా, టి.కె.రుచిక, ఏ.మేరీగ్రేసీ ఉన్నారు. వీరితో పాటు స్టాండ్బైగా ఎం.నమృత, ఎస్.వైష్ణవితో పాటు టి.శ్రావణి ఎంపికయ్యారని నిర్వాహకులు వెల్లడించారు. పోటీలను పాఠశాల వ్యాయామ ఉపాధ్యయులు మాధవి, గోపీ పర్యవేక్షించారు. -
నిబంధనలు విరుద్ధంగా ‘సర్’ సర్వే
యలమంచిలి: కేంద్ర ఎన్నికల ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుంది. ఎన్నికల సంఘం ఈ నెల 15న ఈ కార్యక్రమం ప్రారంభించింది. జూలై 14 వరకు 30 రోజుల గడువు ఇచ్చింది. సర్వే చేయడానికి ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక బీఎల్వో నియమించారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో ఒక్కో పోలింగ్ కేంద్రానికి అంటే ఒక్కో బీఎల్వోకు 750 నుంచి వెయ్యి వరకు ఓటర్లు ఉంటారు. బీఎల్వోలు మూడు పర్యాయాలు ఓటరును కలసి సర్వే చేయాలి. క్షేత్రస్థాయిలో ఇవేమీ జరగడం లేదు. ఒక్కో గ్రామంలో ఒక్కో రీతిలో సర్వే చేస్తున్నారు. కొందరు నాయకులతో కలసి బీఆల్వోలు ఒక ఇంటి వద్దనో లేదా ప్రభుత్వ కార్యాలయం వద్దనో కూర్చుని ఓటర్లను తమ వద్దకు రప్పించుకుని అక్కడే సర్వే చేస్తున్నారు. ఇంకొందరైతే నిబంధనలకు విరుద్ధంగా అంగన్వాడీ, డ్వాక్రా సీఏల సహకారం తీసుకుని వారితోనే సర్వే చేయిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం 30 రోజులు గడువునిచ్చి సర్వే పారదర్శకంగా చేయాలని చెబితే అధికారులు హడావుడి చేయడంతో బీఎల్వోలు ప్రత్యామ్నాయ మార్గాలలో సర్వే చేయిస్తున్నారు. ఈ విధంగా మండలంలోని వడ్డిలంక గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద బీఎల్వో డ్వాకా సీఏతో సర్ పత్రాలు పూర్తి చేయించడంపై విమర్శలు వస్తున్నాయి. పంచాయతీ కార్యాలయం వద్దనే సర్ పత్రాలు డ్వాక్రా సీఏతో పూర్తి చేయడం ఎంత వరకు సమంజసమని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ఉచ్చుల స్టాలిన్ ప్రశ్నించారు. -
ట్రిపుల్ఐటీలో భారీగా మిగిలిన సీట్లు
నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలో నిర్వహిస్తున్న నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన కౌన్సెలింగ్ అనంతరం 627 సీట్లు మిగిలిపోయాయి. ఈ నెల 19న ప్రారంభమైన కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 24తో ముగిసింది. మిగిలిన సీట్ల భర్తీకి రెండో విడత కౌన్సెలింగ్ను జూలై తొలి వారంలో నిర్వహించేందుకు ఆర్జీయూకేటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయిన అనంతరం పరిశీలిస్తే నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి 627 సీట్లు మిగలడం గమనర్హం. గతేడాది 598 సీట్లు మిగలగా ఈ ఏడాది అంతకంటే ఎక్కువ సీట్లు మిగలడంపై ట్రిపుల్ ఐటీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రత్యేక కేటగిరీ సీట్లు మినహాయిస్తే నాలుగు ట్రిపుల్ ఐటీలలో కలిపి 4,040 సీట్లకు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఎంపిక చేసిన వారిలోనే 627 మంది ట్రిపుల్ ఐటీలో చేరడానికి నిరాసక్తత చూపడం గమనార్హం. ఎంపికై న అభ్యర్థుల్లో 15.5 శాతం మంది ట్రిపుల్ ఐటీల్లో చేరేందుకు ఇష్టపడలేదు. ఒక్కో ట్రిపుల్ ఐటీలో 1,010 సీట్లకు గాను కౌన్సెలింగ్ నిర్వహించగా నూజివీడు ట్రిపుల్ ఐటీలో 129 సీట్లు, ఇడుపులపాయలో 171 సీట్లు, శ్రీకాకుళంలో 139 సీట్లు, ఒంగోలు ట్రిపుల్ ఐటీలో అత్యధికంగా 188 చొప్పున సీట్లు మిగలడం గమనార్హం. మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ ముందుగా నిర్వహించి పూర్తిచేసినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున సీట్లు భర్తీ కాకుండా ఉండటం ట్రిపుల్ ఐటీ వర్గాల్లో విస్మయాన్ని కలిగిస్తోంది. కారణాలేంటి? రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో తొలి విడత కౌన్సెలింగ్ అనంతరం 627 సీట్లు మిగలడానికి కారణమేంటనేది ట్రిపుల్ ఐటీ వర్గాల్లో అంతుబట్టడం లేదు. పూర్తి రెసిడెన్షియల్ విధానంలో విద్యాబోధన నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ విద్యాసంస్థలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపకపోవడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నూజివీడు ట్రిపుల్ ఐటీలోనే తక్కువ సీట్లు మిగలగా మిగిలిన అన్నింటిలో అంతకంటే ఎక్కువ సీట్లు మిగిలాయి. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు సరైన సదుపాయాలు లేనందున విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపి ఉండకపోవచ్చేమో. అన్ని వసతులున్న ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో కూడా 174 సీట్లు మిగలడం విశేషం. దరఖాస్తు చేసుకున్న వారిలో 80 శాతం మందికి పైగా మొదటి ప్రాధాన్యతగా నూజివీడు ట్రిపుల్ ఐటీని ఎంపిక చేసుకున్నారు. దీంతో అందరికి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు రాదు కాబట్టి ఇతర ట్రిపుల్ ఐటీల్లో చేరేందుకు ఆసక్తి చూపించి ఉండకపోవచ్చంటున్నారు. కేవలం ఒక్క నూజివీడులోనే పర్మినెంట్ ఫ్యాకల్టీ ఉండటం, మిగిలిన చోట్ల అంతా కాంట్రాక్టు ఫ్యాకల్టీ, గెస్ట్ లెక్చరర్లతోనే విద్యాబోధన నిర్వహించడం, ఒంగోలు ట్రిపుల్ ఐటీ పియూసీ తరగతులు ఇడుపులపాయలోనూ, శ్రీకాకుళం పీయూసీ తరగతులు నూజివీడు ట్రిపుల్ఐటీలో నిర్వహిస్తుండటం కూడా కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. వీటన్నింటికీ తోడు ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఇంకా పర్మినెంట్ వసతులు రాకపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయి. చేరిన వారిలో బాలికలే ఎక్కువ నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి చేరిన విద్యార్థుల్లో బాలికలే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 3,413 మంది విద్యార్థులు నాలుగు ట్రిపుల్ ఐటీల్లో చేరగా వీరిలో బాలికలు 2,439 మంది ఉండగా, బాలురు 974 మంది మాత్రమే ఉన్నారు. దీంతో మూడొంతుల్లో రెండు వంతులు మంది బాలికలే ఉండటం గమనార్హం. నాలుగింటిలో కలిపి భర్తీకాని 627 సీట్లు -
కొల్లేటికోట పెద్దింటమ్మా.. దీవించమ్మా
కై కలూరు: అమ్మా.. కొల్లేటికోట పెద్దింట్లమ్మ చల్లంగా చూడమ్మా.. అంటూ భక్తులు ఆర్తీతో వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్క రోజే ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశ ఖండన, పెద్ద, చిన్న తీర్ధాలు, లడ్డూ, గదుల అద్దెలు, వాహన పూజలు, అమ్మవారి చిత్రపటాల అమ్మకం, విరాళాల ద్వారా రూ.71,830 ఆదాయం వచ్చిందని తెలిపారు. ఆకివీడు గ్రామానికి చెందిన కంది ఓంకార్, అర్జున్ సోదరులు అమ్మవారికి 8 గ్రాముల రాణి కాసు బంగారంను బహుకరించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు దాతలను సన్మానించారు. -
శ్రీవారి సేవలో సీఎంఓ కార్యదర్శి
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని ఆదివారం రాత్రి సీఎంఓ కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి ఆర్పీ కజూరియా, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సందర్శించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన వారికి దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు అధికారులకు శ్రీవారి శేష వస్త్రాలను కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఈఓ త్రినాథరావు చినవెంకన్న చిత్రపటాలను, ప్రసాదాలను అందజేశారు. చింతలపూడి: చింతలపూడి మండలం ఊటసముద్రం గ్రామంలో ఒక కుటుంబాన్ని వెలివేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం వదంతులేనని, వాటిని ఎవరూ నమ్మవద్దని చింతలపూడి సబ్–ఇన్స్పెక్టర్ కె.సతీష్ కుమార్ స్పష్టం చేశారు. గ్రామంలో ఇటీవల జరిగిన వివాహం విషయంలో తలెత్తిన వివాదంపై పోలీసులకు ఫిర్యాదు అందిందని, తాము విచారించగా వెలివేత జరగలేదని తేలిందని తెలిపారు. గ్రామానికి చెందిన ఒక ఆకతాయి సృష్టించిన ఆడియో క్లిప్పింగ్ వల్ల ఈ పుకార్లు వ్యాపించాయని వివరించారు. ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మాజీ మంత్రి కారుమూరికి పరామర్శ
తణుకు అర్బన్: ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్ కారుమూరి సునీల్ కుమార్ను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు తరలించడం దుర్మార్గపు చర్య అని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. హామీలను అమలుచేయకపోగా చంద్రబాబు సర్కారు చేస్తున్న విధ్వంస పాలన, అక్రమాలు, దౌర్జన్యాలను ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టే స్థాయికి దిగజా రారని విమర్శిస్తున్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్ కారుమూరి సునీల్ కుమార్ అక్రమ అరెస్టును ఖండిస్తూ పార్టీ నేతలు మాజీమంత్రి కారుమూరికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. హైదరాబాద్లోని కారుమూరి నివాసానికి వెళ్లి ధైర్యంగా ఉండమని పార్టీ అండగా నిలబడుతుందని చెప్పారు. శనివారం మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నరసాపురం పార్లమెంట్ కోఆర్డినేటర్ గూడూరి ఉమాబాల, భీమవరం పార్టీ కోఆర్డినేటర్ చినిమిల్లి వెంకటరాయుడు, పాలకొల్లు పార్టీ ఇన్చార్జ్ గుడాల గోపి, పార్టీ నేత యడ్ల తాతాజీ తదితరులు కారుమూరిని హైదరాబాద్లో కలిసి మద్దతు తెలిపారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై రాష్ట్ర వ్యాప్తంగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు రాక్షస పాలన ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు. -
ముద్రగడను పరామర్శించిన ముదునూరి
నరసాపురం: అనారోగ్యంతో హైదరాబాద్ సింధు హాస్పటల్లో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభంను శనివారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్లు పరామర్శించారు. ముద్రగడ తనయుడు, ప్రత్తిపాడు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ ముద్రగడ గిరితో మాట్లాడారు. పద్మనాభం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ, చిల్డ్రన్స్ హోమ్, వన్స్టాప్ సెంటర్లలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి స్థానిక అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి డి.శ్రీలక్ష్మి తెలిపారు. సోషల్ వర్కర్– 2, ఆయా–1, హౌస్ కీపర్–1, సెంటర్ అడ్మినిస్ట్రేటర్–1, పారా లీగల్ పర్సనల్/లాయర్–1, పారా మెడికల్ పర్సనల్ –1, సైకో సోషల్ కౌన్సిలర్–1, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన ఆఫీస్ అసిస్టెంట్–1 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 29, 2026 నుంచి జూలై 8, 2026 వరకు దరఖాస్తు ఫారాలను సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, నింపి, అవసరమైన ధ్రువపత్రాల గెజిటెడ్ అధికారి అటెస్టెడ్ ప్రతులను జతచేసి జూలై 8, 2026 సాయంత్రం 5 గంటలలోపు భీమవరం కలెక్టరేట్ కాంపౌండ్ జిల్లా మహిళా, శిశు సంక్షేమ – సాధికారిత అధికారిణి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. తాడేపల్లిగూడెం: పండ్ల తోటలతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ కట్టుపల్లి ధనుంజయరావు అన్నారు. అఖిల భారత సమన్వయ పరిఽశోధన పథకం కింద వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన వర్సిటీలో రెండు రోజులుగా జరుగుతున్న శిక్షణా కార్యక్రమం శనివారం ముగిసింది. వీసీ మాట్లాడుతూ నాణ్యమైన మొక్కల వినియోగం ద్వారా పండ్ల పంటలలో అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. రైతులు ధ్రువీకరించిన నర్సరీల నుంచి మాత్రమే మొక్కలు కొనుగోలు చేయాలన్నారు. గిరిజన రైతుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, జీవనోపాధి మెరుగుదల కోసం ఉద్యాన వర్సిటీ ముందుంటుందన్నారు. ఆధునిక శాసీ్త్రయ ప్రవర్తన పద్ధతులను రైతులు అవలంభించాలని ఉద్యాన వర్సిటీ విస్తరణ సంచాలకులు సీహెచ్.రూత్ తెలిపారు. భీమవరం: భీమవరం పట్టణంలోని ప్రత్యేక ఉప కారాగారాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎస్.శ్రీదేవి శనివారం ఆకస్మికంగా సందర్శించి జైలులోని ముద్దాయిలతో మాట్లాడారు. వారికి అందుతున్న వసతుల గురించి ఆరా తీశారు. న్యాయవాదిని నియమించుకోలేకపోతే దరఖాస్తు చేసుకుంటే న్యాయవాదిని నియమిస్తామని, ముద్దాయిలు సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. బెయిల్ మంజూరైన ముద్దాయిలు జామీనులు కోర్టులో దాఖలు చేసుకుంటే విడుదలకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. అనంతరం వంటగదిని సందర్శించి వారికి పెడుతున్న భోజనాన్ని రుచి చూశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి, 2వ అదనపు జ్యుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఎన్.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
భయపెడుతున్న పులి
బుట్టాయగూడెం మండలం గొట్టాలరేగులో పులి జాడ కోసం గిరిజనులు వెతుకుతున్న దృశ్యం తానిగూడెం ప్రాంతంలో పులి ట్రాకర్ సిగ్నల్ కోసం ప్రయత్నిస్తున్న ప్రత్యేక ఫోర్స్ సిబ్బందిబుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీప్రాంతంలోని బుట్టాయగూడెం మండలంలో గత కొద్దిరోజులుగా పెద్దపులి సంచరిస్తూ గిరిజనులను భయాందోళనకు గురి చేస్తుంది. అటవీప్రాంతం శివారులో సంచరిస్తున్న పెద్దపులి గ్రామ శివారులో కట్టేసి ఉన్న పశువులపై దాడి చేసి చంపేస్తుంది. దీంతో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొంది. పులిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు పులికి మత్తు ఇచ్చి బంధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పులిని పట్టుకునేందుకు బెంగుళూరు, విశాఖపట్నం, శ్రీశైలం టైగర్ జోన్కు చెందిన ప్రత్యేక బృందాల వారు పులి సంచరించే ప్రాంతాల్లో కూడా సంచరిస్తూ పులిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చిక్కినట్టే చిక్కి పులి పారిపోతూ అటవీశాఖ అధికారులకు, ప్రత్యేక బృందాలకు చుక్కలు చూపిస్తుంది. రేపల్లె, రేగులపాడుతోపాటు గానుగమామిడి సమీపంలో కూడా పులి దాదాపు దొరికిందనుకునే సమయంలో మళ్లీ తప్పించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. శనివారం సాయంత్రానికి పెద్దపులి చింతకొండ, గొట్టాలరేవు, పూచికగొంది గ్రామాల్లో ఉండగా రాత్రి సమయానికి తానిగూడెం, మోతుగూడెం సమీపానికి వచ్చినట్లు పులికి అమర్చిన రేడియో కాలర్ ద్వారా వచ్చిన సిగ్నల్తో అధికారులు గుర్తించారు. తానిగూడెం, మోతుగూడెం గ్రామాలు గుబ్బల మంగమ్మగుడికి దగ్గరలో ఉండడంతో ఆయా గ్రామాల్లోని ప్రజలను ములగలంపల్లి సెక్షన్ ఆఫీసర్ కుర్సం రాంబాబు ఆధ్వర్యంలో అప్రమత్తం చేశారు. జంగారెడ్డిగూడెం రేంజ్ అధికారి దుర్గాప్రసాద్ బాబు, బీట్ ఆఫీసర్ మూర్తి ఆధ్వర్యంలో ఫారెస్ట్ సిబ్బంది, ప్రత్యేక బృందాలు, పులి జాడ కోసం అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం పులి దట్టమైన అటవీప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో సంచరించడంతో ఫారెస్ట్ అధికారులకు అండగా ఆయా గ్రామాల గిరిజనులు కూడా సహకరిస్తున్నారు. పులి అడుగులను గుర్తించేందుకు అణువణువునా గాలిస్తూ సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు అందిస్తున్నారు. గుబ్బల మంగమ్మ తల్లి దర్శనం నిలిపివేత బుట్టాయగూడెం: పెద్ద పులి సంచారం నేపథ్యంలో ఆదివారం గుబ్బల మంగమ్మతల్లి గుడి దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు కోర్స గంగరాజు, కోర్స రాంబాబులు తెలిపారు. శనివారం రాత్రి వారు మాట్లాడుతూ ఏజెన్సీ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్ద పులి శనివారం రాత్రి సమయానికి మోతుగూడెం సమీపంలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారని చెప్పారు. పులి సంచరించే ప్రాంతం గుబ్బల మంగమ్మతల్లి గుడికి కేవలం రెండు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండటంతో పాటు గుడి పరిసర ప్రాంతాలకు కూడా వచ్చే అవకాశం ఉండని అధికారులు తెలపడంతో ముందు జాగ్రత్త చర్యల్లో దర్శనం నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఉదయం 9 గంటలకు పులి సంచారం ఎటు వైటు ఉందో చూసి అటవీ శాఖ అధికారుల అనుమతితో భక్తులను అనుమతిస్తామని చెప్పారు. -
పల్స్ పోలియోకు పటిష్ట ఏర్పాట్లు
అసభ్యకర వీడియోలతో బెదిరింపులు అసభ్యకర వీడియోలు సృష్టించి వివాహితను బెదిరించిన వ్యక్తిని శనివారం నరసాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. 8లో uకలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేసి, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమంపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ శనివారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జూన్ 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు కార్యక్రమం కొనసాగుతుందని, ఆదివారం బూత్లలో పోలియో చుక్కలు వేయించుకోలేని చిన్నారులకు సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 1,74,756 మంది 0–5 ఏళ్ల వయస్సు గల చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి 1,151 పోలియో బూత్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు 5,520 మంది అధికారులు, సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. భీమవరం (ప్రకాశంచౌక్): పోలియోపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శనివారం భీమవరం ప్రకాష్ చౌక్ నుంచి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీని జేసీ రాహుల్కుమార్ రెడ్డిజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 28 నుంచి 30వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
టీడీపీ నాయకుడి అత్యుత్సాహం
పెంటపాడు: పెంటపాడు మండలంలో కొందరు బీఎల్వోల బాద్యతా రాహిత్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి పారదర్శకంగా ఓట్ల నమోదు చేయాలి. చదువురాని వారికి సహకారంగా వారి వివరాలు అడిగి ఫాం పూర్తి చేయాలి. అలా జరగడం లేదు. పెంటపాడు మండలం మౌంజీపాడులో అక్కడ వీఆర్వోతో పాటు, బీఎల్వోలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వృద్ధురాలి అప్లికేషన్ ఫాంను గ్రామానికి చెందిన రాష్ట్ర తెలుగు రైతు నాయకుడు పాతూరి రాంప్రసాద్ పూర్తి చేశారు. వాస్తవంగా బీఎల్వోలు ఈ డ్యూటీ చేయాలి. ఇంత జరుగుతున్నా మండల రెవిన్యూ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. పలు గ్రామాల్లో ఇలాగే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆరకమణలు తొలగించాలి భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ప్రభుత్వ నీటి వనరులు, చెరువు భూములపై ఆక్రమణలను వేగంగా తొలగించి, భవిష్యత్తులో పునరాక్రమణలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ చాంబర్ నుంచి శనివారం తహసీల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, జలవనరుల శాఖ అధికారులతో జిల్లా వాచ్డాగ్ కమిటీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 362.21 ఎకరాల విస్తీర్ణంలో 7,458 ఆక్రమణలు గుర్తించినట్లు తెలిపారు. ఇంతవరకు 40 ఎకరాల పరిధిలో 1,257 ఆక్రమణలు తొలగించినట్లు తెలిపారు. -
నిధులు మాయం చేసిన వారిని అరెస్ట్ చేయాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య భీమవరం: అయోధ్య రామ మందిరంలో నిధులు మాయం చేసిన ఘటనలో అసలు దోషులను అరెస్టు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. శనివారం భీమవరంలో మీడియాతో మాట్లాడారు. ట్రస్ట్ సొమ్ము దాదాపు రూ.200 కోట్లు మాయం కాగా ముఖ్యమంత్రి యోగి సమాధానం చెప్పకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతికి 54 వేల ఎకరాలు ఎందుకని, తమ భూములు ఇవ్వలేమని వారి గోడు వెళ్ళబోసుకుంటున్న పెనుమాక రైతుల తరఫున మాట్లాడటానికి వెళ్తున్న వైఎస్సార్సీపీ నాయకులపై ఉండవల్లిలో దాడులు చేయడం దారుణమన్నారు. తాడిపత్రి గొడవలు, కృష్ణలంక, దళిత యువకుడి ఘటనలతో రాష్ట్రం ఎటు వెళ్తుందని ఈశ్వరయ్య ప్రశ్నించారు. సర్ పేరుతో ఓట్లు తొలగించేస్తున్నారని కలెక్టర్లు నిబద్ధతతో పని చేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై ఈ నెల 30న తలపెట్టిన ఛలో అమరావతిని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పెన్మెత్స దుర్గాభవాని, జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, చెల్లబోయిన రంగారావు, ఎం సీతారాంప్రసాద్, సికిలే పుష్పకుమారి తదితరులు పాల్గొన్నారు. -
దళిత శంఖారావాన్ని జయప్రదం చేయాలి
ఏలూరు (టూటౌన్): ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఏలూరులో జరిగే దళిత శంఖారావాన్ని జయప్రదం చేయాలని ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఏలూరులో శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్టికల్ 25 ప్రకారం.. ఒక మతాన్ని పాటించే హక్కు, ఒక మతాన్ని ప్రచారం చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉందన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న రఘురామకృష్ణరాజు అనుచిత వాఖ్యలు చేయడం సరికాదన్నారు. భీమవరంలో అన్ని చర్చ్లు పడగొట్టడానికి పూనుకున్నారన్నారు. నెలకు రూ. 25 లక్షలు ప్రభుత్వం రఘురామకృష్ణరాజుకు ఖర్చు పెడుతుందని అదంతా రాష్ట్ర ప్రజల సొమ్మన్నారు. రెండు చెక్కల దేవుడు అని విమర్శించిన మీకు త్వరలో రాజకీయ సమాధి కట్టబోతున్నామని హెచ్చరించారు.ఆదివారం 33 డిమాండ్స్తో లక్షలాది మందితో ఏలూరులో మీటింగ్ నిర్వహిస్తున్నామన్నారు. మీరు క్షమాపణలు అడగకపోతే ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళతామని హెచ్చరించారు. దళిత క్రైస్తవ సమర శంఖారావ సభకు భారీగా ప్రజలు తరలి వచ్చి సంఘీభావం తెలియజేయాలని కోరారు. సమావేశంలో చాగంటి సంజీవ్, నేతల రమేష్ బాబు, మెండెం సంతోష్ కుమార్, పల్లెం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ -
ఉండవల్లి ఘటన ప్రజాస్వామ్యంపై దాడి
తాడేపల్లిగూడెం: ఉండవల్లి ఘటన ప్రజాస్వామ్యంపై దాడని తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపి కన్వీనర్ వడ్డి రఘురాం విమర్శించారు. అమరావతిలోని ఉండవల్లి గ్రామానికి రైతుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లిన ప్రతిపక్ష నాయకులపై రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేయడం టీడీపి అసహన రాజకీయాలకు నిదర్శనమన్నారు. వైఎస్ఆర్సీపీ బృందం రైతుల ఆహ్వానం మేరకే పెనుమాక ప్రాంతానికి వెళ్లిందన్నారు. రైతుల సమస్యలను తెలుసుకొని వారికి అండగా నిలవడమే ఆ పర్యటన ఉద్దేశమన్నారు. రైతుల గోడు వినిపించకుండా దాడులతో భయభ్రాంతులకు గురి చేయాలని టీడీపీ ప్రయత్నించడం అత్యంత దుర్మార్గమన్నారు. పోలీసులపైనా దాడి చేసి గాయపర్చడం టీడీపీ గూండాయిజానికి నిదర్శనమన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా ఉద్యమిస్తున్న పెనుమాక రైతుల ఆవేదనను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందన్నారు. వైఎస్సార్సీపీ బృందంపై దాడి వెనుక ప్రభుత్వ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు గూండాలను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. ఎన్ని దాడులు, బెదిరింపులు చేసినా రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం ఆగదన్నారు. వైఎస్సార్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ వడ్డి రఘురాం -
ఉసూరుమనిపింఛన్
సాక్షి, భీమవరం: పేద వర్గాలకు ఆర్ధిక భరోసానిచ్చే సామాజిక పింఛన్ల మంజూరును కూటమి సర్కారు విస్మరించింది. రెండేళ్ల పాలనలో కొత్త పింఛన్ ఒక్కటీ ఇవ్వలేదు. దరఖాస్తుల ఆన్లైన్్ సైట్ను ఆఫ్లోనే ఉంచి వేల దరఖాస్తులను పెండింగ్లో పెట్టేసింది. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వద్ధాప్య పింఛన్ ఇస్తామన్న ఎన్నికల హామీ ఊసే ఎత్తడం లేదు. గత ప్రభుత్వం ఏటా జనవరి, జూలై నెలల్లో కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. చివరిగా 2024 జనవరిలో జిల్లాలో 4,274 కొత్త పింఛన్లు అందజేశారు. జూలైలో కొత్త మంజూరు రావాల్సి ఉంది. జూన్లో కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త పింఛన్ల మంజూరు నిలిపివేసింది. అందుకు సంబంధించిన వెబ్సైట్ను క్లోజ్ చేయడంతో పాటు దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను నెలల తరబడి నిలిపివేసింది. పింఛన్ల కోసం పేదలు సచివాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా ప్రభుత్వం నుంచి తమకు ఇంకా మార్గదర్శకాలు ఏమీ రాలేదని ఉద్యోగులు వారిని వెనక్కి పంపిస్తున్నారు. స్పౌజ్తో సరి : పేదవర్గాల్లో కుటుంబ యజమాని మృతిచెందితే భార్యకు ఆసరాగా తర్వాతి నెల నుంచి వితంతు పింఛన్ మంజూరు చేయడం పరిపాటి. గత ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు స్పౌజ్ పింఛన్లు మంజూరు చేసేవారు. జిల్లాలో పింఛన్ తీసుకుంటూ దాదాపు నాలుగు వేల మంది లబ్ధిదారులు మృతిచెందగా వారి భార్యలకు మాత్రమే ఇటీవల కూటమి ప్రభుత్వం స్పౌజ్ కోటాలో పింఛన్లు అందజేసింది. వీటినే కొత్త పింఛన్లు మంజూరుచేసినట్టుగా కూటమి నేతలు హడావుడి చేయడం గమనార్హం. భర్తను కోల్పోయిన నిరుపేద మహిళలు ఎంతోమంది వితంతు పింఛన్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హామీ అమలేది : 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛన్ అందజేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు, కూటమి నేతలు ఊరూవాడ ఊదరగొట్టారు. జిల్లాలో 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల పింఛనన్కు అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రెండు లక్షల వరకు ఉంటారని అంచనా. కూటమి ప్రభుత్వం వచ్చి మూడో ఏడాదిలో అడుగుపెట్టినా ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు వేయకపోవడం ఆయా వర్గాల వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా ఇంత వరకూ కొత్త పెన్షన్లపై నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయం. దీనివల్ల మాలాంటి వృద్ధులు పెన్షన్ అందక ఇబ్బంది పడుతున్నాం. వెంటనే కొత్త పెన్షన్ల అందించాలి. – బాలం నాగేశ్వరరావు, పెనుమర్రు ఎన్నికల వాగ్దానంలో సూపర్ సిక్స్ అని ప్రజలను నమ్మించి గొంతు కోశారు. రెండేళ్లు గడిచినా కొత్త పింఛన్ల ఊసేలేదు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అన్నారు. అతీగతీ లేదు. వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగుల పింఛన్లను తొలగిస్తున్నారు. గత ప్రభుత్వంలో నిరంతరం పింఛన్లు ఇస్తే, కూటమి ప్రభుత్వం ఇంతవరకూ కొత్త పింఛన్లు ఇవ్వలేదు. – పాలా రాధాకృష్ణ, గరగపర్రు రెండేళ్లలో కొత్తగా ఒక్కటీ మంజూరు చేయని వైనం కూటమి వచ్చే నాటికి జిల్లాలో 2,32,885 పింఛన్లు జూన్ నాటికి 2,21,843కు తగ్గిన పింఛన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ హామీ గాలికి కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఖజానాపై భారం పడకుండా ఉన్నవాటికి కోత పెడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2024 జూన్ నాటికి జిల్లాలో పింఛన్ లబ్ధిదారులు 2,32,885 మంది ఉండగా ఈ ఏడాది జూనన్ నాటికి వారి సంఖ్య 2,21,843కు తగ్గాయి. ఈ మేరకు ప్రతి నెల వారికి అందించే సాయం తగ్గుతోందంటున్నారు. రెండేళ్ల కాలంలో జిల్లాలో 11,042 పింఛన్లు తగ్గిపోగా సుమారు రూ.23 కోట్లకు పైనే భారం తగ్గించుకుంది. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్లు కోరుతూ ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పేదలు దరఖాస్తు చేసుకునేందుకు వస్తున్నారు. గతంలో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సచివాలయ ఉద్యోగులు వెరిఫికేషన్ చేసి అర్హులైన వారికి ఆన్లైన్ చేసేవారు. ఆ ఆప్షన్ నిలిపివేయడంతో వేల దరఖాస్తులు పెండింగ్లో ఉండిపోయాయి. కొత్త పింఛన్ల కోసం వచ్చే పేదలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నామని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వ తీరుతో పింఛన్ సాయం అందక నష్టపోతున్నామని పేదవర్గాల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆగిన ఆటోను ఢీకొన్న కారు
భీమడోలు: ఆగిన ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన జాతీయ రహదారి కురెళ్లగూడెం పెట్రోలు బంక్ శివారు పూళ్ల వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కొప్పాకకు చెందిన కొమ్మ వీరమణికంఠ తన అక్క కుమారుడి లుంగీల ఫంక్షన్ ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెంలోని మేకల కొనుగోలు నిమిత్తం శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఆటోలో డ్రైవర్ బొలగాని సత్యనారాయణతో పాటు నలుగురు బంధువులు కట్టా హరికృష్ణ, కొమ్మ వీరమణికంఠ, యవర్న సంతోష్కుమార్, వానపల్లి సూరిబాబు బయలుదేరారు. మార్గమధ్యమైన సంఘటన స్థలానికి వచ్చేసరికి ఆటోలో సాంకేతిక లోపం తలెత్తడంతో తెల్లవారుజామున 4.45 నిమిషాలకు రోడ్డు మార్జిన్లో ఆటో ఆపి సిగ్నల్ వేశారు. ఆటోలో నలుగురి కూర్చుని ఉండగా కట్టా హరికృష్ణ ఆటో పక్కనే నిలబడ్డాడు. ఆ సమయంలో తాడేపల్లిగూడెంలోని కడియద్దకు చెందిన ఐదుగురు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం చేస్తుండగా కారుడ్రైవర్ అల్లశెట్టి మణికంఠ నిద్రమత్తు, నిర్లక్ష్యంతో రోడ్డు మార్జిన్లో ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆటో, కారులు పక్కనే లోతైన పంట బోదెలో పడ్డాయి. ప్రమాదంలో ఆటో పక్కనే ఉన్న కట్టా హరికృష్ణ(36) అక్కడిక్కడే మృతి చెందగా ఆటోలోని నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న భీమడోలు సీఐ వి.కృష్ణ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కట్టా హరికృష్ణ మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం ఏలూరు ప్రభుత్వ తరలించారు. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు హరికృష్ణకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. కొమ్మ వీరమణికంఠ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకరి మృతి.. నలుగురికి గాయాలు -
విత్తన వ్యాపారిపై క్రిమినల్ కేసు
కొయ్యలగూడెం: విత్తన వ్యాపారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. మండల వ్యవసాయ అధికారి కేవీఎన్ పోశారావు తెలిపిన వివరాల ప్రకారం కొయ్యలగూడెం మండలం గవరవరం గ్రామంలోని శ్రీ స్వరాజ్య లక్ష్మి రైస్మిల్లు ప్రాంగణంలో గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన శ్రీ బాలాజి సీడ్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు చెందిన రూ.6.24 లక్షల విలువైన 43.45 క్వింటాళ్ల పత్తి విత్తనాలను గతంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి నుంచి సేకరించిన నమూనాలను (శాంపిల్స్) విశ్లేషణకు పంపగా, అవి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. దీంతో, సెంట్రల్ లైసెన్స్లో అనుమతి లేని ప్రదేశంలో నాణ్యత లేని విత్తనాలను ప్యాకింగ్కు సిద్ధంగా ఉంచి రైతులను, పాలనా యంత్రాంగాన్ని మోసగించినందుకు, అలాగే విత్తన చట్టం నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను సదరు సంస్థ ప్రతినిధి చప్పిడి బాలకృష్ణపై పూర్తి విచారణ నిమిత్తం క్రిమినల్ కేసు నమోదు చేశారు. -
అసభ్యకర వీడియోలతో వివాహితకు బెదిరింపులు
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు నరసాపురం: అసభ్యకర వీడియోలు సృష్టించి వివాహితను బెదిరింపులకు గుర్తిచేస్తున్న వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. నరసాపురం టౌన్ సీఐ ఆకుల రఘు టౌన్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. పశ్చి మబెంగాల్కు చెందిన వివాహిత భర్త నరసాపురంలో ఉద్యోగం చేస్తున్నారు. పట్టణంలోని రుస్తుంబాదలో నివాసం ఉంటున్నారు. వివాహితకు కొన్ని నెలల క్రితం ఇన్స్ర్ట్రాగామ్లో ఛత్తీస్గడ్కు చెందిన నిందితుడు దీపక్కుమార్ పరిచయమయ్యాడు. కొద్ది రోజులుగా వివాహితకు సంబందించి ఫేక్ న్యూడ్ వీడియోలు, నకిలీ ఐడీతో సోషల్ మీడియాలో పెట్టి డబ్బు డిమాండ్ చేయడంతో పాటు అసభ్యకరంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడు. దీనిపై వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి, దీపక్ను నరసాపురం రప్పించి మొగల్తూరు రోడ్డులో వలపన్ని పట్టుకున్నట్టు సీఐ వివరించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్టు చెప్పారు. భీమవరం: మాదకద్రవ్యాలు వినియోగించినా, కొనుగోలు, విక్రయం, రవాణా వంటివాటిలో పాల్గొన్నా మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం శిక్షార్హులవుతారని భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ బి లక్ష్మీనారాయణ తెలిపారు. శనివారం భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణాపై ఆటో డ్రైవర్లు, ఆశా వర్కర్లు, సచివాలయ మహిళా పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలకు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తే కలిగే దుష్పరిణామాలు, ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్టపరమైన శిక్షలు వంటి వాటిపై విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) ఎం సుధారాణి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) ఇ రమ్య, ఒకటవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పి హనీష, 2వ అదనపు జ్యుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఎన్ జ్యోతి, భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యేలేటి యోహాన్, మహిళా పోలీస్ సీఐ అహమదున్నీసా, టూటౌన్ సీఐ పి మురళీకృష్ణ, న్యాయవాదులు, ప్యానల్ న్యాయవాదులు పాల్గొన్నారు. ద్వారకాతిరుమల: శ్రీవారి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి ఇద్దరు భక్తులు శనివారం వేరువేరుగా రూ. 2,11,123 విరాళంగా అందజేశారు. కె.జగ్గవరంనకు చెందిన బి.వెంకట సాయి సందీప్ రూ.1,00,007, ఉండ్రాజవరంనకు చెందిన తాతిని అమృత రూ. 1,11116 ఆలయ కార్యాలయంలో జమ చేశారు. దాతలకు ఆలయ విరాళం బాండ్ పత్రాలను అందించారు. శ్రీవారి క్షేత్రంలో శనివారం భక్తులు పోటెత్తారు. వివాదాస్పద భూమిపై కలెక్టర్ ఆరా..ద్వారకాతిరుమల: తిమ్మాపురం పంచాయతీ లక్ష్మీపురంలోని వివాదాస్పద భూమి గురించి కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆరా తీస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం. శ్రీవారి దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావుకు కలెక్టర్ శనివారం ఫోన్ చేసి మాట్లాడారు. లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాధ, వేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని 1992 లో మంత్రరత్నం అమ్మాజీ (లక్ష్మీ అమ్మవారు) కుటుంబ సభ్యుల నుంచి తమ దేవస్థానం దత్తత తీసుకుందని తెలిపారు. అప్పటి నుంచి ఆ ఆలయానికి చెందిన ఆర్ఎస్ నెంబర్ 38/1 లోని 1.89 ఎకరాల భూమిని దేవస్థానమే సాగు చేస్తోందని కలెక్టర్కు ఈఓ చెప్పారు. ఈ భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో అమ్మాజీ కుటుంబ సభ్యుడైన మంత్రరత్నం ప్రతివాద భయంకర వెంకట సంపత్కుమారాచార్యులు పేరు ఉండేదని, అయితే రెవెన్యూ అధికారులు ఇటీవల ఆ పేరును తొలగించి, కమ్మవారి సేవ సంఘం, ద్వారకాతిరుమల మండలం పేరును చేర్చారని తెలిపారు. దీనిపై వివాదం రాజుకోవడంతో సంపత్కుమారాచార్యులు కుటుంబ సభ్యులు స్పందించి, వారి పూర్వీకులు సదరు భూమిని దేవస్థానానికి అప్పగించినట్టు లేఖ ద్వారా తమకు తెలిపారన్నారు. సదరు భూమిలో స్వామివారి సేవలు, అలంకారాల నిమిత్తం తులసిని సాగు చేసేవారమని ఈఓ కలెక్టర్కు వివరించారు. -
స్కూళ్లలో వ్యాపారం.. బుక్స్టాళ్లకు శాపం
● ప్రైవేటు విద్యాసంస్థల్లో అక్రమ వ్యాపారం ● వెలవెలబోతున్న పుస్తకాల షాపులు భీమవరం : ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న విద్యాసామగ్రి విక్రయాలతో బుక్సెల్లర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గతంలో విద్యాసంవత్సరం ప్రారంభంలో జూన్ నెల నుంచి సుమారు మూడు నెలల పాటు పట్టణాలు, గ్రామాల్లోని పుస్తకాల షాపుల్లో విక్రయాలు జోరుగా సాగేవి. పుస్తకాలతో పాటు పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు, పుస్తకాల అట్టలు వంటివి విక్రయించి అనేకమంది జీవనం సాగించేవారు. జిల్లాలో దాదాపు 300కు పైగా పుస్తకాల షాపులుండగా, వాటిలో సుమారు మూడు వేల మంది వరకు పనిచేస్తున్నట్లు అంచనా. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి, షాపులకు అద్దెలు, ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ అనేకమంది వ్యాపారులు జీవిస్తున్నారు. దాదాపు 40 ఏళ్లుగా పుస్తకాలు, విద్యాసామగ్రి వ్యాపారం చేస్తున్న అనేకమంది.. నేడు విక్రయాలు లేక లబోదిబోమంటున్నారు. గతంలో షాపుల్లోనే విక్రయాలు.. గతంలో టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ అన్నీ పుస్తకాల షాపుల్లోనే విక్రయించేవారు. అయితే, 2001 సంవత్సరం నుంచి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఉచితంగా ఇవ్వడం ప్రారంభించింది. ఆ తర్వాత 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాఠ్యపుస్తకాలతో పాటు నోట్బుక్స్, ఇతర విద్యాసామగ్రిని కూడా ఉచితంగా అందించడం మొదలుపెట్టారు. దీనితో పుస్తక వ్యాపారులు కేవలం ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులకు నోట్పుస్తకాలు, ఇతర విద్యాసామగ్రిని విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో పుస్తకాల షాపులతో పాటు యూనిఫామ్స్ విక్రయించే బట్టల షాపులు, షూస్, బెల్టులు, గొడుగులు అమ్మే ఫ్యాన్సీ షాపులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కళకళలాడేవి. ప్రైవేట్ విద్యాసంస్థల ఆంక్షలతో వ్యాపారాలు నిల్.. గత కొంతకాలంగా ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులకు పుస్తకాలతో పాటు యూనిఫామ్, ఇతర విద్యాసామగ్రి మొత్తాన్ని తామే విక్రయించడం ప్రారంభించాయి. అంతటితో ఆగకుండా, తప్పనిసరిగా తమ వద్దనే కొనుగోలు చేయాలనే ఆంక్షలు విధించడంతో వారి వ్యాపారం జోరందుకుంది. యాజమాన్యాలు విద్యాసామగ్రిని అధిక ధరలకు విక్రయిస్తున్నా ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. జిల్లాలో దాదాపు 600 వరకు ప్రైవేట్ విద్యాసంస్థలుండగా, వాటిలో సుమారు 2 లక్షల మంది వరకు విద్యార్థులున్నట్లు అంచనా. వీరంతా ఆయా విద్యాసంస్థల్లోనే పుస్తకాలు, విద్యాసామగ్రి కొనుగోలు చేయాల్సి రావడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. స్కూళ్లలో విద్యాసామాగ్రి విక్రయించకూడదు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థలు పుస్తకాలు, విద్యాసామగ్రిని విక్రయించకూడదు. అయినప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యాసంస్థల పుస్తకాల వ్యాపారం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ అన్న చందంగా సాగిపోతోంది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పుస్తకాల విక్రయాలను అడ్డుకుంటేనే తమకు బతుకుతెరువు ఉంటుందని, మరికొంతమందికి ఉపాధి కల్పించగలుగుతామని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఈ అక్రమ విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని వ్యాపారులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పుస్తకాల విక్రయాల ద్వారా అనేక మంది వ్యాపారులతో పాటు షాపుల్లో పనిచేసే వేలాది మంది కార్మికులు జీవిస్తున్నారు. ఇటీవల ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న వ్యాపారం వల్ల మా షాపులు మూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ విద్యాసంస్థల విద్యాసామగ్రి అమ్మకాలను అడ్డుకోకపోతే, ఆందోళన బాట పట్టాల్సి వస్తుంది. – వి.రాజా, పుస్తకాల షాపు యజమాని, భీమవరం పుస్తకాల షాపుల్లో విక్రయాలు లేక వెలవెలబోతున్నాయి. మేము ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు చెల్లిస్తూ వ్యాపారం చేస్తుంటే, ప్రైవేట్ విద్యాసంస్థలు ఎటువంటి పన్నులు చెల్లించకుండా వ్యాపారాలు చేస్తూ పుస్తక షాపుల యజమానుల పొట్ట కొడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ విద్యాసంస్థల వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలి. – వబిలిశెట్టి వరప్రసాదరావు, వ్యాపారి, భీమవరం -
విద్యుత్ షాక్తో కార్మికుడి మృతి
దెందులూరు: గ్యాస్ పైపులైను వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. విజయవాడ సింగ్ నగర్ కు చెందిన నలుగురు వ్యక్తులు దెందులూరులోని అక్షయపాత్రలో గ్యాస్ పైప్ లైన్ వెల్డింగ్ చేసేందుకు కాంట్రాక్ట్ తీసుకుని గత నాలుగు రోజులుగా పనులు చేస్తున్నారు. గురువారం సాయంత్రం పైభాగంలో పనులు పూర్తి చేసి వెల్డింగ్ మెషీన్ను కిందకు దించుతుండగా, బీరా రవి ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవహిస్తున్న వైర్ల వైపు దాన్ని అందుకున్నాడు. దీంతో అతడు తీవ్ర విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే రవిని దెందులూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం
కాళ్ల : మండలంలోని వేంపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామంలోని తమ్మా మోహనరావుకు చెందిన కొబ్బరి పీచు పరిశ్రమలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు చుట్టుపక్కల వ్యాపించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు భీమవరం నుంచి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. వీఆర్వో షేక్ హుస్సేన్ లాల్ సంఘటనా స్థలాన్ని ఈ ప్రమాదంలో సుమారు లక్ష రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. దీనిపై పూర్తి నివేదికను తహసీల్దార్కు అందించనున్నట్లు వీఆర్వో పేర్కొన్నారు. భీమవరం: ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక భారతీయ విద్యాభవన్ స్కూల్లో సబ్ జూనియర్, జూనియర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ సెలెక్షన్స్ నిర్వహిస్తున్నట్లు స్కూల్ ప్రిన్సిపల్ గౌరవశర్మ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ ఎంపికలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా స్కూల్ చైర్మన్ యుకే విశ్వనాథరాజు, సెక్రటరీ సామంతపూడి శ్రీరామ రాజు హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు. బుట్టాయగూడెం : బయో కల్చర్ను అన్ని రకాల పంటల్లో వచ్చే పురుగులు, తెగుళ్ల నివారణకు సమర్థవంతంగా ఉపయోగించవచ్చని ప్రకృతి వ్యవసాయశాఖ ట్రైనింగ్ అసోసియేటివ్ డి.మధుబాబు అన్నారు. మండలంలోని బండార్లగూడెంలో ప్రకృతి వ్యవసాయంలో సుస్థిర సాగు విధానాన్ని ప్రోత్సహించే దిశగా రైతులు, స్వయం సంఘాల మహిళలకు బయో కల్చర్స్ తయారీ, వాటి వినియోగం, ప్రాముఖ్యతపై శుక్రవారం శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బయో కల్చర్ను రైతులే తక్కువ ఖర్చుతో స్వయంగా తయారు చేసుకుని వినియోగించడం ద్వారా సాగు వ్యయాన్ని గణనీయంగా తగ్గించడంతోపాటు పంటల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎన్ఎఫ్ సిబ్బంది, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్స్ ఎన్.శ్రీను, కె.చలపతి, జీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాలకొల్లు–భీమవరం రోడ్డు బంద్
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని పాలకొల్లు, భీమవరం రోడ్డులో సీసీ రోడ్డు నిర్మాణం సందర్భంగా రహదారిని మూసివేస్తున్నట్లు ఆర్అండ్బీ ఏఈఈ మూర్తి తెలిపారు. శుక్రవారం ఏఈఈ మూర్తి మాట్లాడుతూ రైల్వే గేటు దాటిన అనంతరం ఎఫ్సీఐ రోడ్డు నుంచి పూలపల్లి వంతెన వరకూ సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించినట్లు తెలిపారు. సుమారు రూ.3 కోట్ల వ్యయంతో పది మీటర్ల వెడల్పు, 800 మీటర్ల పొడవుతో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. దాదాపుగా ద్విచక్ర వాహనాలకు ఆటంకం లేకుండా చూస్తామని కార్లు, బస్సులు, భారీ వాహనాలు మాత్రం పూలపల్లి బైపాస్ రోడ్డు నుంచి వెళ్లాలని సూచించారు. భీమవరం వెళ్లే వాహనదారులు రైల్వే గేటు దాటిన అనంతరం ఆంజనేయస్వామి ఆలయం రోడ్డు నుంచి హౌసింగ్ బోర్డు మీదుగా పూలపల్లి బైపాస్ రోడ్డుకు వెళ్లే మార్గం ఉంటుందన్నారు. నరసాపురం: పట్టణంలోని 31వ వార్డులో మత్స్య శాఖ కార్యాలయం పక్కన ఉన్న పశువుల చెరువును ఇదే ప్రాంతానికి చెందిన కొందరు కూటమి నాయకుల పర్యవేక్షణలో శుక్రవారం పూడ్చే ప్రయత్నం వివాదాస్పదమైంది. ఆ వార్డుకు చెందిన వైఎస్సార్సీపీ నేత తోట సుబ్బారావు ఇప్పటికే పలు ధపాలుగా పీజీఆర్ఎస్ కార్యక్రమంలో చెరువును శుభ్రం చేయించాలని ఫిర్యాదులు అందజేశారు. చెరువును శుభ్రం చేయకుండా, మొత్తం ప్రభుత్వ చెరువును పూడ్చే ప్రయత్నం చేయడంతో సుబ్బారావు, మరికొందరు అధికారులను నిలదీశారు. వార్డులో ప్రధాన రహదారికి పక్కన ఎన్నో ఏళ్లుగా చెరువు ఉంది. వార్డుకు చెందిన రైతులు తమ పశువులను అక్కడే శుభ్రం చేయడం, నీళ్లు తాగించడం చేసేవారు. ఇటీవల చెరువు ధ్వంసమైంది. హఠాత్తుగా మొత్తం చెరువును పూడ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారనే అంశం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం చెరువు మత్స్యశాఖ అధీనంలో ఉంది. చెరువు అభివృద్ధికి రూ.25 లక్షలు మంజూరురయ్యాయని చెబుతున్నారు. ఇటీవల కాలువల్లో పూడిక తీసిన మట్టిని తీసుకొచ్చి, చెరువును పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ మార్గంలో రూ.25 లక్షలు దండుకోవడానికి ఇది జరుగుతుందా? లేక చెరువును కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు వస్తున్నాయి. స్థానిక రైతుల అభిప్రాయం తీసుకోకుండా చెరువు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఊరుకునే ప్రసక్తి లేదని వార్డుకు చెందిన వైఎస్సార్సీపీనేతలు బళ్ల తాతాజీ, తోట సుబ్బారావు హెచ్చరించారు. కాళ్ల: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీ–సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నాణ్యతతో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామ సచివాలయాన్ని శుక్రవారం జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి, అక్కడ జరుగుతున్న రీ–సర్వే పనులు, భూ హద్దుల నిర్ధారణ, రికార్డుల నమోదు, ప్రజలకు అందిస్తున్న సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీ–సర్వే రికార్డులను తనిఖీ చేసి, గ్రామ మ్యాప్ను పరిశీలిస్తూ సర్వే పురోగతి, భూ వివరాల నమోదుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భూములు, పోరంబోకు భూముల వివరాలు, వాటి రక్షణకు తీసుకుంటున్న చర్యలపై అధికారుల నుంచి సమగ్ర సమాచారం తెలుసుకున్నారు. గ్రామంలో ప్రతి భూ యజమానికి సంబంధించిన హద్దులు ఖచ్చితంగా నిర్ధారించేలా సర్వే నిర్వహించాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి అంశాన్ని నిబంధనల ప్రకారం పరిశీలించాలని, ప్రజలకు పారదర్శక సేవలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రీ–సర్వే సకాలంలో పూర్తి చేయడంతో పాటు, రికార్డుల నమోదు వేగవంతంగా నిర్వహించాలని సూచించారు. -
చదువుకొనాల్సిందే
● విద్యావ్యాపారానికి అడ్డుకట్ట ఎప్పుడు ? ● అనుమతులు లేకుండానే తరగతుల నిర్వహణ ● అక్రమంగా విద్యాసామగ్రి విక్రయాలు భీమవరం: జిల్లాలో ప్రవేటు విద్యా సంస్థల దందాకు అడ్డుకట్టపడడంలేదు. అనుమతులు లేకుండానే స్కూల్స్ నిర్వహణ, నిబంధనలకు విరుద్ధంగా విద్యాసామగ్రి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వీటిపై విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా లెక్కచేసే పరిస్థితి కానరావడం లేదు. జిల్లాలోని 20 మండలాల్లో సుమారు 1,399 ప్రభుత్వ పాఠశాలలుండగా వాటిలో దాదాపు 90 వేలకుపైగా విద్యనభ్యసిస్తున్నారు. దాదాపు 563 ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో లక్షకు పైగా విద్యార్థులున్నారు. జిల్లాలో 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలు, రెండు ఎయిడెడ్, రెండు సోషల్ వెల్ఫేర్ కళాశాలలున్నాయి. 82 ప్రైవేట్ కళాశాలలు నిర్వహిస్తుండగా ఈ ఏడాది నూతనంగా దాదాపు 12 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు. 12 కొత్త స్కూళ్లకు నాలుగింటికే అనుమతి జిల్లాలోని వివిధ పట్టణాలు, గ్రామాల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో నూతనంగా 12 ప్రైవేట్ స్కూల్స్ ఏర్పాటుచేయడానికి ఆయా స్కూల్స్ యాజమాన్యాలు దరఖాస్తు చేయగా కేవలం భీమవరం, ఆకివీడు, నరసాపురం పట్టణాలు, పెనుమంట్ర మండలంలో ఒక్కొక్కటి చొప్పున స్కూళ్లకు అనుమతులు లభించాయి. అలాగే జూనియర్ కళాశాలలు ఒక్కదానికి కూడా అనుమతిలేదని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న విద్యాసంస్థల యజమానులు విద్యాశాఖకు అనుమతులు కోసం దరఖాస్తు చేసుకుని భవన నిర్మాణాలు ప్రారంభించారు. విద్యాసంవత్సరం ప్రారంభమై 20 రోజులు గడిచిపోతున్నా భవన నిర్మాణాలు పూర్తికాకపోయినా తరగతులు ప్రారంభించడం విశేషం. ఒక పక్క పెద్ద సంఖ్యలో కూలీలు పనిచేస్తుండడం మరొక పక్క యంత్రసామాగ్రి వినియోగిస్తున్నా తరగతులు నిర్వహించడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
తలకెక్కించుకోకపోతే ప్రాణాపాయం
● హెల్మెట్ విషయంలో ద్విచక్ర వాహనదారుల నిర్లక్ష్యం ● ప్రమాదాలకు గురై ప్రాణాలుపోతున్న వైనం ఆగిరిపల్లి : ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న వారిలో అత్యధికులు ద్విచక్ర వాహనదారులే ఉంటున్నారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని తెలిసినా, కొందరు వాహన చోదకులు నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. తలకు ధరించాల్సిన హెల్మెట్ను బైక్కు తగిలించి ప్రయాణిస్తూ, అశ్రద్ధతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో యువతే ఎక్కువగా ఉండటం ఆందోళనకరం. యువత గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలనే ఆరాటంతో అతివేగంగా వాహనాలు నడుపుతున్నారు. దీనికి తోడు హెల్మెట్ లేకపోవడంతో ప్రమాదాల బారిన పడి కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. గతంలో వాహనం కొనుగోలు చేసే సమయంలోనే హెల్మెట్ కూడా కొనాలని పోలీసులు నిబంధన విధించారు. హెల్మెట్ ఉంటేనే వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పోలీసు యంత్రాంగం కూడా హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూనే, నిబంధనలను కఠినతరం చేస్తోంది. హెల్మెట్ ఎందుకు వాడాలంటే..? మానవ శరీరంలో అత్యంత కీలకమైన భాగం మెదడు. ఇది అన్ని శరీర భాగాలను నియంత్రిస్తూ, సమతుల్యతను కాపాడుతుంది. ప్రమాదం జరిగినప్పుడు తలకు దెబ్బ తగిలితే మెదడు కణాలు నశిస్తాయి. న్యూరాన్లు ఒకసారి నశిస్తే తిరిగి పునరుత్పత్తి కావు. ఫలితంగా శరీర అవయవాల పనితీరు దెబ్బతింటుంది. దెబ్బ తీవ్రతను బట్టి కొన్ని అవయవాలు శాశ్వతంగా పక్షవాతానికి గురికావడం లేదా జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటివి జరుగుతాయి. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు తలకు, మెడకు తీవ్ర గాయాలు కాకుండా రక్షణ లభిస్తుంది. అలాగే ప్రయాణంలో దుమ్ము, గాలి నుంచి కూడా ఇది కళ్లను కాపాడుతుంది. పోలీసులు జరిమానా వేస్తారనే భయంతో కాకుండా, తమ ప్రాణాల విలువను, కుటుంబానికి తమకున్న ప్రాధాన్యతను గుర్తించి వాహనదారులు స్వచ్ఛందంగా హెల్మెట్ ధరించాలి. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే హెల్మెట్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. బైక్పై బయటకు వెళ్లే కుటుంబ సభ్యులకు హెల్మెట్ ధారణను గుర్తు చేసే బాధ్యతను ఇంట్లోని వారు కూడా తీసుకోవాలి. – కె. శుభ శేఖర్, ఎస్సై ఆగిరిపల్లి -
విద్యార్థులు సామాజిక స్పృహతో ఆలోచించాలి
తాడేపల్లిగూడెం: విద్యార్థులు సామాజిక స్పృహతో ఆలోచించాలని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కోరారు. వెంకట్రామన్నగూడెంలోని ఉద్యానవర్సిటీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పక్షాన ఆలోచిస్తూ విద్యార్థులు ముందుకెళితే విద్యకు సార్తకత ఏర్పడుతుందన్నారు. ఉద్యాన విద్య ఉపాధి, ఉద్యోగావకాశాలకే కాకుండా ప్రజలకు పౌష్టికాహార భద్రత, ఆహారభద్రత, ఆరోగ్య భద్రత కల్పించే కార్యక్రమంలో భాగస్వాములైనట్టేనన్నారు. విశ్వవిద్యాలయంలో మంచి ఆడిటోరియం నిర్మాణానికి, బీఎస్సీ హార్టీకల్చర్ డిగ్రీకి యూజీసీ నుంచి తగిన గుర్తింపు ఇప్పించడానికి కృషి చేస్తానన్నారు. గడచిన 19 ఏళ్ల కాలంలో ఉద్యానవర్సిటీ సాధించిన ప్రగతిని వీసీ కె.ధనుంజయరావు వివరించారు. 4734 మంది ఉద్యాన విద్యలో బీఎస్సీ ఉద్యాన పట్టభద్రులు, 564 మంది ఎంఎస్సీ. 88 మంది పీహెచ్డీ పట్టభద్రులు వర్సిటీ నుంచి వెళ్లి. ఉపాధి, ఉద్యోగ రంగాల్లో స్ధిరపడ్డారన్నారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 30.136 లక్షల హెక్టార్ల నుంచి 30.15 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి స్థాయికి పెంచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు వీసీ చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స్టాల్స్ను కేంద్ర మంత్రి పరిశీలించారు. రిజిస్ట్రార్ ఎం.మాధవి, వర్సిటీ అధికారులు పాల్గొన్నారు. -
లైట్ తీసుకున్నారు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు ఎంపీని టీడీపీ క్యాడరే కాదు... కూటమి ప్రజాప్రతినిధులు కూడా లైట్ తీసుకున్నారు. కొద్ది నెలల క్రితం వరకు మంత్రి కొలుసు పార్థసారథికి సమాంతరంగా హవా సాగించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ప్రాభవం కోల్పోయారు. మార్చి 14, 15 తేదీల్లో హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం, పార్టీ నుంచి సస్పెన్షన్, కొద్ది రోజుల అజ్ఞాతం అనంతరం రెండు నెలల నుంచి మళ్ళీ జిల్లాకు అడపాదడపా రావడం మొదలుపెట్టారు. తాజా ఎంపీ పర్యటనకు కేడర్తో పాటు లీడర్ల నుంచి స్పందన నిల్. మరోవైపు బుధవారం ఎంపీ అధ్యక్షతన జరిగిన దిశ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు కూటమి ఎమ్మెల్యేలు ఒక్కరూ హాజరుకాకపోవడం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఏడాదిన్నర పాటు హవా జిల్లాలో అధికార పార్టీలో ఎంపీ పుట్టా మహేష్, మంత్రి కొలుసు పార్థసారథిలు అధికారంలోకి వచ్చిన నాటి నుండి హవా సాగించారు. ప్రధానంగా ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ లోకేష్ టీమ్ అంటూ జిల్లాలో బదిలీలు మొదలుకొని అన్ని వ్యవహారాల్లో కేంద్రబిందువుగా మారి నియోజకవర్గాల్లో హడావుడి చేశారు. ఇదంతా ఏడాదిన్నరకే పరిమితమైంది. స్థానిక ప్రజాప్రతినిధులతో అక్కడక్కడ విబేధాలున్నా లోకేష్ టీమ్ కావడం, పార్టీలో పరపతి బలంగా ఉండటంతో ఎమ్మెల్యేలు కూడా అనేక సందర్భాల్లో ఎంపీకి అడ్డు చెప్పని పరిస్ధితి. ఈ పరిణామాల క్రమంలో ఈ ఏడాది మార్చి 14న తెలంగాణాలో డ్రగ్స్ పార్టీలో రెడ్హ్యాండెడ్గా ఎంపీ దొరకడం, అలాగే డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ రిపోర్ట్ రావడం జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది. ఇలాంటి ఘటనల్లో జిల్లాల్లో కీలకనేత దొరకడం రాజకీయ చరిత్రలో ఇదే ప్రథమం కావడంతో పార్టీలోనూ, ప్రజల్లోనూ దీనిపై విస్తృత చర్చ జరిగింది. వెంటనే పార్టీ సస్పెండ్ చేయడం పుట్టా అనుచరులకు మద్ధతుగా జిల్లా అంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హడావుడి చేయడం, టీడీపీ ప్రజాప్రతినిధులే అనేక చోట్ల ఫ్లెక్సీల ఏర్పాటుపై అసహనం వ్యక్తం చేయడం, ఇలా వరుస సంఘటనలతో ఎంపీ ప్రతిష్ట పూర్తిగా మసకబారింది. నెల రోజుల వివాదం తరువాత ఏప్రిల్ 19న గన్నవరం నుంచి ఏలూరుకు ఎంపీ ర్యాలీగా హాజరై ఎమ్మెల్యేలందరినీ కార్యాలయానికి ఆహ్వానిస్తే ఎమ్మెల్యేలు హాజరై ఎంపీకి సంఘీభావం పలికినట్లుగా కనిపించి వెళ్ళిపోయారు. ఆ తరువాత నుంచి ఎంపీని జిల్లాలో ఎవరూ సీరియస్గా తీసుకోని పరిస్థితి. ఏలూరు పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పనులు, ఇతర అంశాలపై ప్రతి నెల ఎంపీ అధ్యక్షతన దిశ పేరుతో జిల్లా సమనస్వయ కమిటీ సమావేశం జరుగుతుంది. దీనికి కలెక్టర్, ఎస్పీ, జడ్పీ చైర్మన్, 7 నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరై అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి నిధులు, ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఇలా అన్నింటిపై విస్తృతంగా చర్చిస్తారు. ఎంపీని ప్రజాప్రతినిధులందరూ లైట్ తీసుకున్నారు. అలాగని ఎమ్మెల్యేలు ఇతర ప్రాంతాలు, వేరే కార్యక్రమాల్లో కాకుండా ఆయా నియోజకవర్గాల్లోనే కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పార్టీ సమస్వయ కమిటీ సమావేశం నిర్వహించడం, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని పెదపాడు, దుగ్గిరాల్లో పర్యటనలు నిర్వహించడం, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఉంగుటూరులో కార్యక్రమాల్లో పాల్గొనడం ఇలా ఏడుగురు ఎమ్మెల్యేలు ముఖం చాటేయడం కూటమిలో చర్చకు దారితీసింది. ఎంపీ సమావేశానికి ఎమ్మెల్యేలు గైర్హాజరు డ్రగ్స్ కేసు ముందు వరకూ జిల్లాలో చక్రం తిప్పిన ఎంపీ పుట్టా పార్టీ సస్పెన్షన్, కేసు తదనంతర పరిణామాలతో మసకబారిన ఇమేజ్ ఏలూరు జిల్లా దిశ సమావేశానికి మొత్తం ఎమ్మెల్యేలు గైర్హాజరు సమావేశంలో మందుబాబులపై కేసులు రాయొద్దంటూ ఎంపీ వ్యాఖ్యలు -
పెదవేగిలో నూతన కర్మాగారం నిర్మించాలి
ఏలూరు (టూటౌన్): పెదవేగిలో నూతన ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని నిర్మించాలని, ఓ.ఈ.ఆర్ పేరుతో ఆయిల్ పామ్ రైతులను కంపెనీలు దోపిడీ చేసే చర్యలను అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరులోని ఉద్దరాజు రామం భవనంలో ఆయిల్ పామ్ రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు. జూలై 3,4,5 తేదీల్లో ఏలూరులో జరిగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల్లో ఆయిల్ పామ్ రైతుల సమస్యలపై చర్చించి తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన 20.5 % ఆయిల్ ఎక్స్ ట్రాక్షన్ రేటు (ఓ.ఈ.ఆర్)కు వ్యతిరేకంగా కోర్టులో ఆయిల్ పామ్ కంపెనీలు కేసు వేసి 17.5%కు తగ్గించాలని కోరడం దుర్మార్గమని విమర్శించారు. జూలై 3న ఏలూరులో జరుగుతున్న హాలో రైతన్న – చలో ఏలూరు కార్యక్రమంలో ఆయిల్ పామ్ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్.లింగరాజు, పి.రామకృష్ణ, పంపన రవికుమార్, ఎం.ఇస్సాకు తదితరులు పాల్గొన్నారు. -
ఏమిటి ‘సర్’ ఇది?
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) వేగవంతంగా చేస్తున్నారు. సర్ పూర్తి చేయడానికి ఇంకా సమయం ఉన్నా తమపై ఒత్తిడి తీసుకొచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని సచివాలయ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ పూర్తయిన అనంతరం జూన్ 15 నుంచి జులై 14 వరకూ బీఎల్వోలు ఇంటింటి సర్వేకు వెళ్లి ఫాంలు అందజేసి వాటిని పూర్తి చేసిన అనంతరం ఆన్లైన్ చేయాలి. జులై 14 లోపు పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ చేయాలి. జులై 21 నాటికి ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించాలి. జులై 21 నుంచి ఆగస్టు 20 వరకూ ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే దరఖాస్తులు స్వీకరిస్తారు. జులై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకూ అభ్యంతరాలు విచారించి వాటిని పరిష్కరించాలి. సెప్టెంబర్ 22న ఓటరు తుది జాబితాను విడుదల చేస్తారు. జిల్లాలో 14.75 లక్షల ఓటర్లు ఉన్నారు. ఇంతవరకూ 13.80 లక్షల వరకూ సర్ ఫారాలు పంపిణీ చేశారు. సర్ ఫారాలు జిల్లాలో 93 శాతం పంపిణీ జరగగా సుమారు 10 శాతం డిజిటలైజేషన్ అయినట్లు సమాచారం. జిల్లాలో ఈ నెలాఖరులోపు పూర్తిచేయాలని ప్రత్యేకించి పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ సర్క్యులర్ రిలీజ్ చేయడంపై బీఎల్వోలు మండిపడుతున్నారు. ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం ఎన్యూమరేషన్ ఫాం పంపిణీ అనంతరం ప్రతి బీఎల్వో రోజుకు సగటున ఎస్ఐఆర్ ఫారాలు 20 శాతం డిజిటలైజేషన్ చేయాలి. ఒక్కో బీఎల్వోకు సుమారు వెయ్యి ఓటర్ల వరకూ నమోదు చేయాల్సి ఉంటుంది. రోజుకు 20 శాతం చొప్పున పూర్తి చేయాలంటే నెలాఖరుకు పూర్తి చేసి అప్పగించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒక్కో ఫారం సేకరించాలంటే ఓటరు అన్ని వివరాలు దగ్గర పెట్టుకుని ఉంటే ఆ ఫారం పూర్తి చేయడానికి దాదాపుగా 15 నిమిషాలు పడుతుంది. అదే పూర్తి వివరాలు లేకపోతే వారి వివరాలు తీసుకోవాలంటే బీఎల్వోలకు తలకు మించిన భారం అవుతుందని వాపోతున్నారు. వారి పుట్టింటి నుంచి తండ్రి లేదా తాతగారి 2002 నియోజకవర్గ ఓటర్ల వివరాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల వారు ఏ నియోజకవర్గంలో ఉన్నారో ఏ మండలం, ఏ గ్రామం, వారి సీరియల్ నెంబర్ను సేకరించాలంటే దాదాపు 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. ఇన్ని వివరాలను సేకరించి నమోదు చేయాలంటే తలకు మించిన భారం అవుతుందని బీఎల్వోలు వాపోతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ.. జులై 14 వరకూ గడువు ఉన్నా తమపై ఒత్తిడి తీసుకువచ్చి జూన్ 30 నాటికే పూర్తి చేయాలని ఒత్తిడి చేయడంపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ సర్ కార్యక్రమాలు పూర్తయ్యే వరకూ సెలవు రోజులు కూడా పనిచేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆదివారాలు కూడా పనిచేయాల్సిందేనని ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కనీసం సెలవు రోజున కూడా కుటుంబ సభ్యులతో ఉండలేకపోతున్నామని వాపోతున్నారు. తమ పిల్లలతో మాట్లాడి సుమారు నెల రోజులు కావస్తుందని కొందరు సచివాలయ సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉదయం 7 గంటలకు వస్తే.. రాత్రి 10 గంటలైనా సరే ఇంటికి వెళ్లే పరిస్థితి కనిపించడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉన్నతాధికారులు తమ టార్గెట్లు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో నిలబడేందుకు తమను ఒత్తిడికి గురిచేస్తున్నారని బీఎల్వోలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గడువు ఉన్నా వేధిస్తున్నారంటూ బీఎల్ఓల ఆవేదన -
కోర్టు ఆర్డర్ను పట్టించుకోని అధికారులు
ఇరగవరం: మండలంలోని అయితంపూడిలో శుక్రవారం వైఎస్సార్ సీపీ నాయకులు పొలాలను ఆనుకుని వేస్తున్న రోడ్డు పనులు నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా రోడ్డు పనులు ఆపకుండా చేస్తున్నారని మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకురాలు ఉప్పులూరు లావణ్య ఆరోపించారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కూటమి నాయకులు, అధికారులు కక్షపూరిత చర్యల్లో భాగంగా మా పొలాలను అనుకుని రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారని పేర్కొన్నారు.. సర్వే పూర్తి చేసి అప్పుడు ప్రభుత్వ భూమి ఎంత వరకు ఉంటే అంతవరకు రోడ్డు వేయండి అని ఎంత చెప్పినా దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్నారని వాపోయారు. దీంతో కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిపేయాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ ఆర్డర్లను ఎంపీడీఓ, తహసీల్దార్, మండల సర్వేయర్లకు వాట్సాప్లో పెట్టామని, అయినా అధికారులు ఆదేశాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఎంపీడీఓ ఎ.శ్రీనివాసును వివరణ కోరగా అధికారికంగా కోర్టు ఆర్డర్ తమకు అందలేదని, పనులు నిలిపేయాలని ఏదైనా ఆర్డర్ అధికారికంగా వస్తే నిలుపుదల చేస్తామన్నారు. -
దళిత శంఖారావాన్ని విజయవంతం చేయాలి
ఏలూరు (టూటౌన్) : నగరంలోని విద్యానగర్లో ఉన్న సెయింట్ జేవియర్స్ హైస్కూల్ గ్రౌండ్స్లో ఆదివారం సాయంత్రం 4 గంటలకు భారీ ఎత్తున నిర్వహించే దళిత క్రైస్తవ సమర శంఖారావాన్ని జయప్రదం చేయాలని మాజీ న్యాయమూర్తి, హైకోర్టు అడ్వకేట్ జై భీమ్ భారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నగరంలో శుక్రవారం దళిత క్రైస్తవ సమర శంఖారావం కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో దళిత క్రైస్తవులపై అనేక దాడులు జరుగుతున్నాయని, మత స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని, అనేక క్రైస్తవ చర్చిలను కూలదోస్తు్ాన్నరని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ క్రైస్తవ సమర శంఖారావాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఆర్ఎస్ మాజీ అధికారి చాగంటి సంజీవ్, నేతల రమేష్ బాబు, జక్కుల బెనర్జీ, డాక్టర్ మెండెం సంతోష్ కుమార్, పళ్లెం ప్రసాద్, దాసరి నాగేంద్ర కుమార్, పెరికే వరప్రసాద్, గొల్లా నరేష్ తదితరు పాల్గొన్నారు. -
సర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి
వీరవాసరం: సర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతున్న తీరును శుక్రవారం ఆయన వీరవాసరం మండలం నందమూరుగరువు గ్రామంలో పర్యటించి, పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. గడువులోగా ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు తిరిగి అందజేయాలన్నారు. పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలను ఎప్పటికప్పుడు డిజిటలైజేషన్ చేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ ఏవీ రామాంజనేయులు, ఎంపీడీఓ కేఎం వైభవనం తదితరులు ఉన్నారు. తణుకు అర్బన్: గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహానికి ఉందుర్తి పాల్ ఫౌండేషన్ తరఫున శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు రోజుల క్రితం మృతి చెందిన 60 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సున్న వృద్ధుడి మృతదేహాన్ని బంధువుల రాక కోసం తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. ఎవరూ రాకపోవడంతో పోలీసుల సూచనలతో ముందుకొచ్చిన ఫౌండేషన్ చైర్మన్ ఉందుర్తి ప్రసన్ననకుమార్ సహకారంతో సభ్యులు అంత్యక్రియలు చేశారు. బీఎల్ఓల బాధ్యతారాహిత్యంతో ఓటర్లకు ఇబ్బందులు కొయ్యలగూడెం: మండలంలో కొందరు బీఎల్ఓల బాధ్యతారాహిత్యంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి రెండు మూడు సార్లు పరిశీలన చేయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా ఓటర్లను సచివాలయాలకే రప్పించి ఫారాలను పూర్తి చేస్తున్నారు. తాజాగా బయ్యన్నగూడెంలో కూడా ఇదే తరహాలో ప్రక్రియ కొనసాగుతుండటం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూలి పనులను కూడా వదులుకుని రెండు మూడు రోజులుగా సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఓటర్లు ఆవేదన చెందుతున్నారు. నియోజకవర్గంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 19 మంది సిబ్బందిపై తహసీల్దార్ ఎన్.నాగరాజు చర్యలు తీసుకున్నప్పటికీ, మిగిలిన వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడం గమనార్హం. -
స్వచ్ఛమైన ఓటర్ల జాబితాయే లక్ష్యం
తాడేపల్లిగూడెం: పారదర్శకమైన ఓటర్ల జాబితాను తయారుచేయడానికి జరుగుతున్న ప్రక్రియ సర్ అని, సర్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం పట్టణంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి బీఎల్ఓలు చేపడుతున్న సర్వేను పరిశీలించారు. ఓటర్లతో నేరుగా మాట్లాడి ఎన్రోల్మెంట్ ఫారాలు అదాయా లేదా అని తెలుసుకున్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సర్ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల వివరాలను 2002 నాటి ఓటర్ల జాబితాతో సరిపోల్చి మ్యాపింగ్ చేస్తున్నామన్నారు. జిల్లాలో సుమారు 70 శాతం వరకు మ్యాపింగ్ పూర్తయ్యిందన్నారు. పట్టణాలు, గ్రామాల్లో 99 శాతం మ్యాపింగ్ పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారన్నారు. ఫారాల పంపిణీ కూడా 90 శాతం పూర్తయ్యిందన్నారు. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. బీఎల్ఏల పాత్ర గృహాలను గుర్తించడం, వ్యక్తులను గుర్తించడంలో సహకరించడం వరకే అన్నారు. జూన్ 15న ప్రారంభమైన జులై 14తో ముగుస్తుందన్నారు. సర్వే, డేటా సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. -
సర్పై అప్రమత్తం
పెనుగొండ: సర్ సర్వేపై వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. శుక్రవారం తూర్పుపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆచంట, పోడూరు, పెనుగొండ, పెనుమంట్ర మండలాలకు చెందిన బీఎల్ఓలతో సమావేశం నిర్వహించారు. బీఎల్ఓలతో పాటు ఇంటింటీకి వెళ్లి సర్వే సక్రమంగా జరిగేలా కృషి చేయాలన్నారు. ఏమాత్రం వెనుకంజ వేసినా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఫలితాలు తారుమారయ్యాయన్నారు. వీటిని అధిగమించడానికి బీఎల్ఓలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వంపై పూర్తి స్థాయి వ్యతిరేకత ఉందన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి కుటిల యత్నాలు చేస్తున్నారని విమర్శించారు. వాటిని తిప్పికొట్టాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. కూటమి పాలనలో అన్నివర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. ఎన్నికల్లో ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించి మొండిచేయి చూపిందన్నారు. అవినీతి అక్రమాలతో కూటమి పాలన నిండిపోయిందన్నారు. సీఆర్జడ్ పరిధిలో తవ్వకాలకు నిషేదం ఉన్నా, కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి తవ్వకాలు జరుపుతున్నారని దుయ్యబట్టారు. ఆచంట నియోజకవర్గంలో మట్టి, ఇసుక మాఫియా విలయ తాండవం చేస్తుందన్నారు. అఽధికారులు సైతం వత్తాసు పలకడం దారుణమన్నారు. కోర్టు దిక్కారణ పై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. అక్రమాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. సమావేశంలో ఆయా మండలాలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, బీఎల్ఓలు పాల్గొన్నారు. మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు -
సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు
తలకెక్కించుకోకపోతే ప్రాణాపాయం హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని తెలిసినా, కొందరు వాహన చోదకులు నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. 8లో uభీమవరం: సాగు, తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా జలవనరుల శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికతో పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అఽధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జలవనరుల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లాలోని ప్రధాన కాలువలు, డ్రెయిన్లు, నీటి పారుదల వ్యవస్థ నిర్వహణ, వర్షాకాల పరిస్థితులు, సాగు నీటి లభ్యత, తాగునీటి సరఫరా తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరసాపురం పరిధిలోని డ్రెయిన్లకు సంబంధించిన సమస్యలను అత్యవసర ప్రాతిపదికన గుర్తించి, తక్షణమే పరిష్కారించాలన్నారు. కోనాయకోడు, దర్భరేవులకు సంబంధించిన ప్రతిపాదనలను ఆలస్యం చేయకుండా సిద్ధం చేసి వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. మురుగు కాలువలు, సాగునీటి కాలువల్లో పేరుకుపోతున్న గుర్రపు డెక్క, తూడు వంటి అవరోధాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాగునీటి పంపిణీతోపాటు తాగునీటి వనరుల పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. -
చిక్కకుండా.. దొరకకుండా..
● ముప్పుతిప్పలు పెడుతున్న పెద్దపులి ● పాపికొండల అభయారణ్యంలోకి వెళ్లిన వైనం ● రేపల్లె, రేగులపాడు గ్రామాలవైపు సంచరిస్తున్నట్లు సమాచారం బుట్టాయగూడెం: గత రెండు రోజులుగా బుట్టాయగూడెం మండలంలో సంచరిస్తున్న పెద్దపులి అటు ఫారెస్ట్ అధికారులు, ఇటు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మండలంలోని పాలకుంట సమీపంలో మంగళవారం రెండు ఆవులపై దాడి చేసిన పెద్దపులి బుధవారం ఒక లేగదూడపై దాడి చేసి చంపింది. పులిని పట్టుకునేందుకు శ్రీశైలం టైగర్ జోన్కు చెందిన ప్రత్యేక టీమ్ బెంగుళూరు, వైజాగ్కు చెందిన ప్రత్యేక నిపుణుల బృందాలు మంగళవారం రాత్రి పాలకుంట సమీపంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ప్రత్యేక బృందాలు ఊహించిన ప్రదేశానికి పెద్దపులి వచ్చి ఒక లేగదూడపై దాడి చేసి చంపి మళ్లీ తప్పించుకుని వెళ్లినట్లు అధికారులు తెలిపారు. పుల్లి చిక్కినట్టే చిక్కి మళ్లీ చేజారిపోవడంతో అటవీశాఖ అధికారులు తీవ్ర నిరాశ చెందారు. ఉదయం నుంచి పులి కదలికల కోసం అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేశారు. పాలకుంట సమీపంలోని సింగారమ్మకొండ మీద నుంచి దండిపూడి మీదుగా పాపికొండల అభయారణ్యంలోని రేగులపాడు, రేపల్లె, తదితర ప్రాంతాల్లో వెళ్లిందని భావించి డ్రోన్ కెమెరాలతో వెతికారు. దట్టమైన అరణ్యం, ఎత్తయిన కొండలు ఉండడంతో పులికి అమర్చిన రేడియో కాలర్ సిగ్నల్ అందడంలేదని అధికారులు తెలిపారు. అందుకనే డ్రోన్లతో సెర్స్ చేస్తున్నట్లు చెప్పారు. రాత్రి 8 గంటల వరకూ అటవీశాఖ అధికారులు రేపల్లె, రేగులపాడు, పరిసర ప్రాంతాల్లో పులి బోనులు సిద్ధం చేసి ఉంచారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పులికి అమర్చిన రేడియో కాలర్ ద్వారా ప్రత్యేక బృందాలకు సిగ్నల్ అందినప్పటికీ తదుపరి పులి సంచారం ఎక్కడా కనిపించలేదని అధికారులు తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతంతోపాటు వాతావరణంలో కూడా మార్పులు రావడంతో సిగ్నల్ కష్టంగా మారిందని తెలిపారు. తదుపరి రేపల్లి, రేగులపాడులో పులి సంచరిస్తున్నట్లు భావిస్తున్నామని చెప్పారు. -
ప్రజా సమస్యలపై పోరాటం
భీమవరం: ప్రజా సమస్యలపై సీపీఎం రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుడు బి బలరామ్ చెప్పారు. గురువారం పట్టణంలోని పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో నిర్వహించిన సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గినా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మునిసిపల్ సంస్కరణలు ప్రజలకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయన్నారు. ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేట్ రంగానికి అప్పగిస్తే ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలను అరికట్టాలని కోరారు. జేఎన్వీ గోపాలన్, కేతా గోపాలన్, కౌరుపెద్దిరాజు, పీవీ ప్రతాప్, కె నాగేశ్వరరావు, బి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): ఈనెల 28వ తేదీన నిర్వహించనున్న పల్స్పోలియో కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం జిల్లా పల్స్ పోలియో టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో మొత్తం ఐదేళ్లలోపు వయసు గల 1,74,756 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి 1,151 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమ నిర్వహణ కోసం 4,518 మంది సిబ్బందికి విధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఏవైనా కారణాల వల్ల పోలియో చుక్కలు వేయించుకోలేని పిల్లలను గుర్తించి, ఈనెల 29, 30 తేదీలలో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ అందించాలని ఆదేశించారు. అనంతరం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. డీఎంహెచ్ఓ గీతాబాయి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ దేవ సుధాలక్ష్మి డీసీహెచ్ఎస్ డాక్టర్ పి.సూర్యనారాయణ, డీపీవో కె.అనురాధ తదితరులు పాల్గొన్నారు. భీమవరం: ప్రజలు పోగొట్టుకున్న తమ మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని భీమవరం వన్టౌన్ సీఐ ఎ.రమేష్ సూచించారు. వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన 14 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు గురువారం అప్పగించారు. స్థానిక పోలీస్ స్టేషన్లలో త్వరితగతిన ఫిర్యాదు నమోదు చేస్తే మొబైల్ ఫోన్లను గుర్తించి తిరిగి అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్ ఐఎంఈఓ నంబర్ వివరాలను భద్రంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల వద్ద నుంచి సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీఈఐఆర్ పోర్టల్లో చేసుకున్న ఫిర్యాదుల ఆధారంగా భీమవరం వన్టౌన్ పోలీసులు మొత్తం 14 మొబైల్ ఫోన్లను విజయవంతంగా రికవరీ చేసి, సంబంధిత యజమానుల వివరాలను ఽధ్రువీకరించిన అనంతరం వారికి అందజేశారు. భీమవరం వన్టౌన్ ఎస్సైలు బి.కిరణ్కుమార్, కృష్ణాజీ, సిబ్బంది పాల్గొన్నారు. నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆరో స్నాతకోత్సవంను ఈనెల 27న నిర్వహిస్తున్నట్లు ట్రిపుల్ఐటీ వర్గాలు తెలిపాయి. నూజివీడు ట్రిపుల్ఐటీలోని స్టూడెంట్ యాక్టి విటీ సెంటర్లో నిర్వహిస్తున్న ఈ స్నాతకోత్సవంలో 2021–22 నుంచి 2024–25 వరకు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్, ఎంటెక్ డిగ్రీలను పూర్తిచేసిన విద్యార్థులకు పట్టాలను అందజేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఛాన్సలర్ ఆచార్య కొత్తా మధుమూర్తి, వీసీ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు, నాలుగు ట్రిపుల్ఐటీల డైరెక్టర్లు, ఏఓలు, డీన్ అకడమిక్స్లు, ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ తదితరులు పాల్గొననున్నారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. -
పోరు తప్పదురొయ్యో
రొయ్య రైతులు మరో పోరుబాటకు సిద్ధమయ్యారు. ఆక్వా ఫీడ్ కంపెనీలు ఎలాంటి సంప్రదింపులు, సమావేశాలు నిర్వహించకుండా అడ్డగోలుగా ధరలు పెంచడంపై రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం భగ్గుమంది. కిలో మేతకు రూ.12 నుంచి రూ.14కు పెంచడం వలన ప్రతి రైతుపై లక్షల్లో అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యలకు గిట్టుబాటు ధర లేని తరుణంలో ఇలా మేత ధరలు పెంచడం ఆక్వా రంగంలో తీవ్ర సంక్షోభానికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో వచ్చే వారం నుంచి నిరసన కార్యక్రమాలతో కార్యాచరణ ప్రారంభించనున్నారు. శురకవారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 2.63 లక్షల ఎకరాలు ఆక్వా సాగు జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగులో సింహభాగం రాష్ట్ర ఉమ్మడి పశ్చిమలోనే ఉంది. కాల్వ, సముద్రనీళ్లు రెండూ ఉండటంతో ఆక్వా సాగుకు జిల్లా అత్యంత అనుకూలంగా ఉంది. ఈ క్రమంలో జిల్లాలో సాగు విస్తీర్ణంతో పాటు 25కు పైగా ఆక్వా ప్లాంట్లు, ఫీడ్ కంపెనీలు, వందలాది ఐస్ ఫ్యాక్టరీలు ఇలా ఆక్వాకు సంబంధించి పెద్ద వ్యవస్థే జిల్లాలో కొనసాగుతూ ఏటా వేల కోట్ల రూపాయల టర్నోవర్తో వ్యాపారం కొనసాగుతుంది. ఈ క్రమంలో గత కొద్ది నెలలుగా ఆక్వా ధరలు నానాటికి పతనమవుతున్నాయి. 100 కౌంట్ కిలో ధర ఈ నెల ప్రారంభంలో రూ.265 ఉండగా మేత ధరలు పెరిగిన తరువాత రూ.210 నుంచి 230కు చేరింది. ఆక్వా ధరలు ఎగుమతి మార్కెట్ బాగాలేదని, ఇతర కారణాలతో రోజురోజుకు తగ్గుతున్నాయి. క్రాప్ హాలిడే దిశగా అడుగులు ఇప్పటికే ధరల పతనంతో ఉమ్మడి పశ్చిమలో క్రాప్ హాలిడే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో మేత ధరల పెంపు అదనపు భారమైంది. దీంతో కంపెనీలు పెంచిన ధరలు తగ్గించేవరకు సాగు చేయమని, మేత ధరల కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలంటూ నినదించారు. ఈ క్రమంలో ఆక్వా రైతులు, ఫీడ్ కంపెనీలు, ప్లాంట్ల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రకటించాయి. అయితే సర్కారు సీరియస్గా తీసుకోకపోవడంతో ఈనెల 16న ఆక్వా రైతులు అన్ని జిల్లాల్లో తహసీల్దార్ కార్యాలయాల వద్ద, కలెక్టరేట్ల వద్ద నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహించి వినతిపత్రాలు అందచేశారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం రూ.12 నుంచి రూ.14 పెరిగిన మేత ధరను కిలో రూ.4 తగ్గిస్తున్నట్లు ప్రకటించి వెంటనే అమల్లోకి వస్తుందన్నారు. అయితే సర్కారు మాట ఫీడ్ కంపెనీలేమి ఖాతరు చేయని పరిస్థితి. కేవలం 2 రూపాయలు మాత్రమే తగ్గిస్తున్నట్లు కంపెనీలు ప్రకటించడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కంపెనీలు రూ.2 తగ్గించి చేతులు దులుపుకోవడంతో మళ్లీ రైతులు ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. తాజా పరిణామాల క్రమంలో గురువారం పశ్చిమగోదావరి జాయింట్ కలెక్టర్ రైతులతో సమావేశం నిర్వహించారు. పెంచిన ధర పూర్తిగా తగ్గించాలని, అదే విధంగా సమావేశాలకు ఆక్వా ప్లాంటు ప్రతినిధులను కూడా పిలవాలని డిమాండ్ చేశారు. మరోవైపు శనివారం సమావేశం నిర్వహించి సోమవారం నుంచి నిరసన కార్యక్రమాలు అన్ని మండలాల్లో నిర్వహించాలని సన్నద్ధమయ్యారు. కేవలం ఫీడ్ పెంపు వల్ల ఒక సీజన్లో జిల్లా రైతాంగంపై రూ.630 కోట్లు అదనపు భారం కానున్నాయి. ఆక్వా మేత ధరలు తగ్గించాలి రొయ్యలకు మద్దతు ధర ఇవ్వాలి సిండికేట్ల మాయాజాలం సహించం నినదిస్తూ.. నిలదీస్తూ.. మరోసారి ఉద్యమానికి ఆక్వా రైతులు సన్నద్ధం మేత ధరలపై మండిపాటు ధరలు తగ్గిస్తున్నట్టు సర్కారు ప్రకటించినా అమలు కాని వైనం ఆక్వా ప్లాంట్ల సిండికేట్ మాయజాలంలో బలవుతున్న రైతులు ఉమ్మడి జిల్లాలో 2.63 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు ధర పెంపుతో ప్రతి రైతు నెత్తిన రూ.5 లక్షల వరకు భారం ఏఐ సృష్టించిన చిత్రం కూటమి ప్రభుత్వం రాకతో ఆక్వా రంగం కనుమరుగవుతున్న పరిస్థితి. ఆక్వాఫీడ్ల ధరలు భారీగా పెరగడంతో ఆక్వా వ్యవస్థ కుదేలవుతుంది. ధరల పెంపు కారణంగా ఆక్వా రంగం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – మలిరెడ్డి కిరణ్కుమార్రెడ్డి, నందివాడ మండల రైతు సంఘం విభాగ అధ్యక్షుడు ఆక్వా రైతు సమస్యల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ప్రభుత్వ సబ్సిడీలు ఇతర పథకాలు రొయ్యల రైతులకు నేరుగా అందజేయాలి. గతంలో జగన్మోహన్రెడ్డి హయాంలో అప్సడా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు పరుస్తూ, ఆక్వా రైతుల సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపించారు. ప్రస్తుతం రొయ్యల మేతల ధరలను ఇష్టానుసారంగా పెంచేస్తూ.. రొయ్యల ధరలు మాత్రం తగ్గిస్తూనే ఉన్నారు. రొయ్యల రైతులకు ఎప్పుడు కష్టాలే మిగులుతున్నాయి. – దాసరి మాణిక్యాలరావు, రొయ్యల రైతు, చింతలకోటిగరువు -
ఉద్యాన రైతులకు ఉపాధి హామీ తోడ్పాటు
నరసాపురం రూరల్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉద్యాన రైతులకు తోడ్పాటు అందిచేందుకు ప్రభుత్వం విస్తృత సహాయం అందిస్తోందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. గురువారం మొగల్తూరు మండలం రామన్నపాలెంలో పండ్ల తోటల పెంపకం, అభివృద్ధి అవకాశాలపై ఉద్యానశాఖ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్తో కలసి కలెక్టర్ నాగరాణి ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రైతులు తమ భూముల్లో పండ్ల మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. అర్హతల విషయంలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం అదే గ్రామంలో నిర్వహించిన ‘రైతన్నా–మీకోసం’ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొని రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, వ్యవసాయాభివృద్ధి పథకాలపై అవగాహన కల్పించారు. మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా వైద్యసేవలు నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థ (ఆర్ఈసీ) సీఎస్ఆర్ నిధులతో అమలు చేస్తున్న ‘‘మీ ఇంటికి – మీ డాక్టర్’’ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎంపికై న 30 రెడ్ క్రాస్ బ్రాంచీలలో పశ్చిమగోదావరి జిల్లా ఒకటిగా ఎంపిక కావడం విశేషమన్నారు. మార్చి 23, 2026న ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ను మూడేళ్లపాటు సుమారు రూ.1.30 కోట్ల వ్యయంతో అమలు చేస్తున్నట్లు తెలిపారు. నరసాపురం మండలంలో ఇప్పటివరకు ఐదు పర్యాయాలు మొబైల్ మెడికల్ యూనిట్ పర్యటించి 5,722 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆర్డీవో దాసిరాజు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కేసీ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, ఉద్యానవన శాఖ అధికారి ప్రియదర్శిని, ఎంపీడీవో త్రిశూలపాణి, తహశీల్దార్ నాగర్జున, ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఊడిన స్కూల్ బస్సు ముందు చక్రం
టి.నరసాపురం: మండలంలోని బొర్రంపాలెం నుంచి వీరభద్రవరం వెళ్లే రహదారిలో గురువారం జంగారెడ్డిగూడేనికి చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సు ముందు టైరు ఊడిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెంకు చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సు మండలంలో బొర్రంపాలెం, వీరభద్రవరం, వెలగపాడు తదితర గ్రామాల నుంచి విద్యార్థులను ప్రతిరోజూ జంగారెడ్డిగూడెం తీసుకెళ్లి, తీసుకొస్తోంది. గురువారం యథావిధిగా విద్యార్థులను తీసుకుని వెళుతుండగా ప్రయాణం మధ్యలో బస్సుకున్న ముందు టైరు ఊడిపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో సుమారు 30 మీటర్ల దూరం వెళ్లి ఆగిపోయింది. దీంతో విద్యార్థులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఫిట్ నెస్ లేని బస్సులపై అధికారులు పర్యవేక్షించాలని పలువురు కోరుతున్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ (అడ్మిన్)గా వై.ప్రసాదరావు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ఎస్పీ కే.ప్రతాప్ శివకిషోర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. జిల్లా పోలీసు కార్యాలయ ఏఓ షేక్ మస్తాన్, ఆఫీస్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, సువర్చల, సిబ్బంది ఏఆర్ ఆర్ఐ పవన్ కుమార్, పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రసాదరావుకు శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం–బాదంపూడి రైల్వే స్టేషన్ల మధ్య సుమారు 50 నుంచి 60 సంవత్సరాలు వయస్సు గల గుర్తు తెలియని వృద్ధురాలిను (ఆడవ్యక్తి)ని ఓ గుర్తు తెలియని రైలు బండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధురాలి మృతదేహం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. సుమారు 5 అడుగులు ఎత్తు, చామన ఛాయ, పచ్చరంగు జాకెట్, పచ్చ, ఎరుపు, నలుపు రంగు డిజైన్ కలిగి కాటన్ చీర ధరించిన మహిళగా గుర్తించామని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మేరకు జీఆర్పీ ఆర్పీ ఎస్ఐ పి.అప్పారావు, హెచ్సీ డి.వెంకటేశ్వరరావులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏలూరు (ఆర్ఆర్పేట) : జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. పల్స్పోలియో ఏర్పాట్లపై రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి ఎస్.సురేష్కుమార్ కలెక్టర్లతో గురువారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 1,80,575 మంది ఐదేళ్లలోపు వయసున్న పిల్లల కోసం 2.52 లక్షల డోసులు సిద్ధం చేశామన్నారు. 28న 1094 బూత్ల ద్వారా, 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామన్నారు. అత్తిలి: మండలంలోని ఈడూరులో ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవరాల వేకజటేశ్వరస్వామివారి కల్యాణం గురువారం నేత్రపర్వంగా సాగింది. ముందుగా శ్రీ స్వామి, అమ్మవార్లను గజవాహనంపై ఉంచి గజవాహన సేవ నిర్వహించారు. సుదర్శన సాయిరామాచార్యులు ఆధ్వర్యంలో వాడపల్లి శేఖరాచార్యులు, విఖన్బాబు, తదితర వేదపండితుల సమక్షంలో స్వామి వారి కల్యాణం నిర్వహించారు. ఈ కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆలయ ప్రాంగణంలో చేసి హరే శ్రీనివాస కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది అనంతరం ఆలయ ప్రాంగణంలో అఖండ అన్నసమారాధన నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను పుష్పాలతో అలంకరించిన రథంపై ఉంచి రథోత్సవం వైభవంగా చేశారు. ముదినేపల్లిలో భారీ వర్షపాతం ముదినేపల్లి(కైకలూరు): నియోజకవర్గంలో కొద్ది రోజులుగా భారీ వర్షాపాతం నమోదవుతుంది. బుధవారం రాత్రి ముదినేపల్లి మండలంలో జిల్లాలోనే అత్యధికంగా 35.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కై కలూరు మండలంలో 29.2, మండవల్లిలో 24.6 మిల్లీమీటర్లుగా నమోదైంది. జిల్లా మొత్తం మీద వర్షపాతం 196.2 మిల్లీమీటర్లుగా ఉందని అధికారులు తెలిపారు. -
మ్యాట్రిమోనియల్ మోసగాడి అరెస్ట్
ఊడిన స్కూల్ బస్సు చక్రం టి.నరసాపురం మండలంలోని బొర్రంపాలెం నుంచి వీరభద్రవరం వెళ్లే రహదారిలో గురువారం జంగారెడ్డిగూడేనికి చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సు ముందు టైరు ఊడిపోయింది. 8లో uఏలూరు (ఆర్ఆర్పేట): మాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా వివాహ సంబంధాల పేరుతో మహిళలను నమ్మిస్తూ, వారి నుంచి నగదు, బంగారం కాజేస్తున్న ఒక అంతర్రాష్ట్ర నేరగాడిని ముదినేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏలూరు ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ గురువారం జిల్లా కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గుంటూరు జిల్లా పాండురంగనగర్కు చెందిన వక్కలగడ్డ సాంబశివరావు (36) అనే వ్యక్తి తాను ఒక మీడియా సంస్థలో సీఈఓగా పనిచేస్తున్నానని, ఆస్ట్రేలియాలో సోదరి ఉందని, తల్లిదండ్రులు ఉన్నత ఉద్యోగులని అబద్ధాలు చెబుతూ మహిళలను నమ్మించేవాడు. ఇలా 2020 నుంచి ఇప్పటివరకు సుమారు 40 మందికిపైగా మహిళలను మ్యాట్రిమోని వెబ్సైట్ల ద్వారా పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి వారి నుంచి నగదు, బంగారాన్ని దోచుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇటీవల ముదినేపల్లి మండలానికి చెందిన ఒక మహిళను నమ్మించి, ఆపై ఆమెను బెదిరించి పది కాసుల బంగారం, రూ.లక్ష నగదు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే తరహాలో తెలంగాణలోని కోదాడకు చెందిన జ్యోతి, జంగారెడ్డిగూడేనికి చెందిన రాజ్యలక్ష్మి, పరవాడకు చెందిన దుర్గ భవానీ తదితర మహిళలను కూడా మోసం చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. సాంకేతిక పరిజ్ఞానంతో.. ఈ కేసులో ముదినేపల్లి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, స్థానిక సమాచారాన్ని విశ్లేషించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నేరస్తుడి నుంచి సుమారు 8 కాసుల బంగారు ఆభరణాలు, ఆరు సెల్ఫోన్లు, 10 సిమ్ కార్డులు, కారు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ఉత్తమ పనితీరు కనబరిచిన కై కలూరు రూరల్ సీఐ వి.రవికుమార్, ముదినేపల్లి ఎస్సై వీఎస్వీ భద్రరావు, సిబ్బంది బి.పెద్దిరాజు, పీవీ సత్యనారాయణ, బి.నాగబాబు, పి.పవన్కుమార్, జి.శివకోటయ్యలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
సార్వాలో ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి
భీమడోలు: సార్వాలో ఎరువుల వినియోగాన్ని తగ్గించుకుని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందాలని భీమడోలు మండల వ్యవసాయాధికారి ఎస్పీవీ ఉషారాణి రైతులను కోరారు. గుండుగొలనులో గురువారం రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా సార్వాలో నారుమడులను రైతులతో కలిసి ఆమె పరిశీలించారు. సార్వాలోని యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సీజన్లో ఎల్నివో ప్రభావం నేపథ్యంలో వర్షాలు తగ్గుతాయని, రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని కోరారు. ఎకరాకు యూరియాను బస్తాన్నర మాత్రమే అందిస్తారని, ఎక్కువ వేస్తే వరి సాగుకు ముప్పు వాటిల్లుతుందన్నారు. మండల వ్యాప్తంగా 13,250 ఏకరాల్లో వరి సాగు చేస్తున్నారని, అందుకు 650 ఎకరాల్లో నారుమడులు అవసరమని, ఇప్పటి వరకు మండలంలో 575 ఏకరాల్లో నారుమడులు వేశారన్నారు. -
త్యాగానికి ప్రతీక మొహర్రం
ఏలూరు (ఆర్ఆర్పేట): అమరవీరుల సంస్మరణార్థం (షహీద్) భక్తిశ్రద్ధలతో నిర్వహించే మొహర్రం నెల ఈ నెల 16 నుంచి ప్రారంభమైంది. ముస్లింల విశ్వాసం ప్రకారం ఇదే రోజున ఇస్లాం నూతన సంవత్సరం కూడా మొదలవుతుంది. అయితే, మొహర్రంను వారు పండుగలా కాకుండా, వర్ధంతిగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ప్రజలంతా సోదరభావంతో, సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ ఈ వేడుకలు నిర్వహిస్తుంటారు. నగరంలో గత కొన్ని దశాబ్దాలుగా ఎంపిక చేసిన పంజాల్లోనే ఈ వేడుకలు సాగుతున్నాయి. గత ఏడాది నగరవ్యాప్తంగా దాదాపు 15 పంజాల్లో ప్రార్థనలు జరగ్గా, ఈ ఏడాది నిధుల లేమి కారణంగా కేవలం 7 పంజాల్లో మాత్రమే పీర్లను నిలిపి, ఏర్పాట్లు చేశారు. భక్తిశ్రద్ధలతో పీర్ల ప్రతిష్ఠ మొహర్రం సందర్భంగా నగరంలోని వివిధ ఆస్థానాల్లో పీర్లను ప్రతిష్ఠించారు. అప్పటివరకు పెట్టెల్లో భద్రపరిచిన వెండి, ఇత్తడి తదితర లోహాలతో చేసిన పీర్లను బయటకు తీసి, వాటికి మెరుగులు దిద్ది, పూలతో సుందరంగా అలంకరించారు. ఈ నెల 16న కుండీ సెంటర్లోని గొలుసుల పంజాతో పాటు, పోణంగి రోడ్డులోని ఖాదర్బాబా ఇమామ్ ఏ ఖాసిం ఆస్థానాల్లో ప్రతిష్ఠాపన మహోత్సవం నిర్వహించారు. కొన్ని ఆస్థానాల్లో ఐదు రోజుల పాటు పీర్లను కొలువుదీర్చారు. నాటి నుంచి భక్తులు నిత్యం పీర్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. సంతానం లేని హిందూ, ముస్లిం భక్తులు ఇక్కడికి వచ్చి పూల అలంకరణ చేసి.. మరమరాలు, అటుకులు, శెనగపప్పు, బూందీ ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. కోరికలు నెరవేరిన వారు మహాత్ముల పీర్లకు వెండి ఊయలలు, హస్తాలను కానుకలుగా సమర్పిస్తుండటం ఇక్కడి ప్రత్యేకత. పవిత్రంగా అగ్నిగుండం ప్రవేశం మొహర్రం వేడుకల్లో అగ్నిగుండం తొక్కే కార్యక్రమాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. ఎంతోమంది భక్తులు నిష్టతో ఈ నిప్పుల గుండంలో నడుస్తారు. నగరంలోని గన్బజారు జల్జలా సాహెబ్ ఆస్థాన, పోణంగిలోని మౌలాలి ఆస్థానాల్లో ప్రతిఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. మొహర్రం నెల ప్రారంభమైన 7వ, 9వ రోజుల్లో ఈ అగ్నిగుండాల కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారు. 7 ఆస్థానాల్లో నిత్య ప్రార్థనలు ఏలూరు పరిసర ప్రాంతాల్లోని 7 ఆస్థానాల్లో మొహర్రం వేడుకల్లో భాగంగా నిత్యం ప్రత్యేక ప్రార్థనలు, దరూదె సలాం, ఫాతెహా ఖానీ నిర్వహిస్తున్నారు. స్థానిక కుండీ సెంటర్లోని మౌలా అలి ముష్కిల్ కుష ఆస్థాన (గొలుసుల పంజా), గన్బజారులోని జల్జలా సాహెబ్ ఆస్థాన, శనగపప్పు బజారులోని ఇమామ్ ఏ ఖాసిం పంజా, చేపల చెట్టు సెంటర్లోని సింగ మహల్లా పంజా, గడియార స్తంభం వద్ద ఉన్న బీబీ ఫాతిమా రజియా అల్లా పంజా, పోణంగిలోని గాజుల పంజా, తంగెళ్లమూడి బీడీ కాలనీ ఏటిగట్టుపై ఉన్న అలీ తల్వార్ (ఏడు కాలువల సెంటర్) పంజాల్లో ఈ ప్రత్యేక ప్రార్థనలు సాగుతున్నాయి. శాంతియుత ఇస్లాం ధర్మ స్థాపన కోసం కర్బలా యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన మహమ్మద్ ప్రవక్త మనుమడు హజరత్ ఇమామ్ ఎ.హుస్సేన్ను స్మరిస్తూ ఈ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. దాదాపు అన్ని పంజాల్లో ముస్లింలతో పాటు హిందువులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు చేయడం ఏలూరు మొహర్రం విశిష్టత. – ఎండీ గాలబ్ అలీ, ముజావరు, గొలుసుల పంజాఏలూరు నగర పరిసర ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన పీర్ల నిమజ్జనంతో ఈ వేడుకలు ముగియనున్నాయి. మొహర్రం నెల 11వ రోజైన శుక్రవారం నిమజ్జనం నిర్వహించేందుకు పీర్ల పంజా కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం నుంచి ఆయా ప్రాంతాల పీర్లను విశేషంగా అలంకరించి స్థానిక కుండీ సెంటర్లోని గొలుసుల పంజా వద్దకు తీసుకువస్తారు. అక్కడి నుంచి భారీ ఊరేగింపుగా నగర వీధుల గుండా ప్రదర్శన సాగుతుంది. సాయంత్రానికి ఈ శోభాయాత్ర పాత బస్టాండు వద్ద ఉన్న కర్బలా మైదానానికి చేరుకుంటుంది. అనంతరం అక్కడి పవిత్ర బావిలో పీర్లను నిమజ్జనం చేయడంతో వేడుకలు ముగుస్తాయి. ప్రతిఏటా మొక్కులు తీర్చుకునే హిందూ, ముస్లింలు పవిత్ర కార్యంగా అగ్నిగుండం తొక్కే కార్యక్రమం -
స్వర్ణ వస్త్ర నిధి ప్రత్యేక కౌంటర్ ప్రారంభం
భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణంలోని శ్రీ మావుళ్లమ్మ వారి దేవస్థానంలో అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయం ప్రాజెక్ట్ ద్వారా భక్తుల నుంచి బంగారం విరాళంగా సేకరించే నిమిత్తం దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను గురువారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు దంపతులు ప్రారంభించారు. తొలిగా వారి సమీప కుటుంబ సభ్యులు హైదరాబాద్కు చెందిన బి.నరసింహారావు పేరు మీద రూ.1.50 లక్షల నగదు కానుకగా అందించారు. ముందుగా అమ్మవారి స్వర్ణవస్త్ర నిధి కమిటీ సభ్యులు, ధర్మకర్తలు అమ్మవారి కి ప్రత్యేక విశేష పూజలు చేశారు. అనంతరం భీమవరానికి కట్టా వెంకటేశ్వరరావు 4 గ్రాముల బంగారం, టి.వెంకట కృష్ణ గుప్తా రామకృష్ణమూర్తి దంపతులు రూ.11,116, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ రూ.1500 కానుకగా సమర్పించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ, మాజీ సభ్యురాలు తోట సీతామహాలక్ష్మి, దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, చైర్మన్ బొండాడ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
వర్షాకాలం.. పాముల భయం
● పొలాల్లో పొంచి ఉన్న ప్రమాదాలు ● అప్రమత్తతే రక్షణ ● పాము కాటుకు గురైన వారు ఆందోళన చెందకూడదు. తీవ్రమైన ఒత్తిడికి గురైతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ● పాము కాటువేయగానే గాయాల పైభాగంలో కట్టుకట్టాలి. కొత్త బ్లేడుతో కాటు వేసిన చోట కొద్దిగా చర్మాన్ని తొలగించి రక్తాన్ని నోటితో లాగివేయాలి. నోట్లో గాయాలు ఉన్నవారు ఇలా చేయకూడదు. ● ఏ పాము కాటు వేసిందో తెలుసుకొని యాంటీ వీనమ్(విషానికి విరుగుడు) తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ● రైతులు రాత్రిపూట పొలాలకు వెళ్లేప్పుడు కాళ్లకు చెప్పులు, టార్చిలైట్లతో పాటు శబ్ధాలు చేసే పరికరాన్ని వెంట తీసుకొని వెళ్లడం వల్ల పాముకాటు నుంచి రక్షించుకోవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు.బుట్టాయగూడెం: వర్షాకాలం ప్రారంభమైంది. అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కాలంలో పాములు ఎక్కడ పడితే అక్కడ సంచరిస్తూ కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతంలోని సరిహద్దు గ్రామాల్లో, దట్టమైన పొదల సమీపంలో పాములు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. రైతులు పొలాలకు నీరు పెట్టేందుకు వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. ఈ సమయంలో అప్రమత్తంగా లేకపోతే పాముల రూపంలో కాలయముడు కాచుకొని ఉంటాడని ఆచి తూచి అడుగులు వేయాలంటూ వైద్యులు చెప్తున్నారు. పోలవరం నియోజకవర్గంలోని వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో గల ప్రభుత్వాస్పత్రుల్లో పాము కాటు కేసులు ప్రతి ఏటా వర్షా కాలంలో అధికంగా నమోదవుతున్నాయి. ఇటీవల బుట్టాయగూడెం మండలంలో పాముకాటుకు గురై మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా మండ్రకప్ప, తేలు కాటుకు గురై పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ పాములు, ఇతర విష కీటకాల బెడద ఉంటుంది. వీటి బారిన పడకుండా తప్పించుకోవడానికి అప్రమత్తతే ప్రధానమని వైద్యులు తెలుపుతున్నారు. అన్ని పాముల వల్ల ప్రమాదం లేదు మనకు కనిపించే అన్ని పాములు విషపూరితం కాదని వైద్య నిపుణులు అంటున్నారు. నాగుపాము, కట్లపాము, రక్తపింజర వంటి పాముల వల్లనే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సాధారణంగా 50 శాతంపైగా పాముల వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు. పాము కాటువేసిన వెంటనే సకాలంలో వైద్యం చేయించుకుంటే ఎటువంటి సమస్య ఉండదని అంటున్నారు. రక్తపింజర ఇది ఎక్కువగా అటవీప్రాంతంలో తిరుగుతూ ఉంటుంది. ఈ పాము కాటు వేస్తే 2 గంటల తర్వాత విషం శరీరానికి ఎక్కుతుంది. వెంటనే అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం అందించాలి. వైద్యుల పర్యవేక్షణలో పాము కాటుకు గురైన వ్యక్తిని ఉంచాలి. నాగుపాము నాగుపాము అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఈ పాము కాటువేస్తే 15 నిమిషాల్లోనే విషం తీవ్రంగా ఎక్కుతుంది. ముందుగా పాముకాటు వేసిన చోట గాయాన్ని తొలగించి, వెంటనే ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించాలి. నాగుపాము విషం ప్రధానంగా నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కట్లపాము కట్లపాము కాటువేసిన వెంటనే విషం రక్తంలో కలుస్తుంది. ప్రాణాపాయం ఎక్కువ. పాము కాటు వేసిన వెంటనే ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించాలి. కట్లపాము విషం రక్తంలోకి చేరకముందే వైద్యం చేయిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. రక్త పింజర కట్లపాము వర్షాకాలంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పొలాల్లోకి నీరు చేరడంతో పాములు, తేళ్లు, విష సర్పాలు, కీటకాలు బయటకు వచ్చి ప్రమాదంగా మారతాయి. పొలాలకు వెళ్లే రైతులు తప్పనిసరిగా ఖచ్చిమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కలుపు తీసే సమయంలో, గడ్డి కోసే సమయంలో నేరుగా చేతులు పెట్టకుండా కర్రలు ఉపయోగించుకోవాలి. ఎవరైనా పాము కాటుకు గురైతే వెంటనే సమీపం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి సకాలంలో వైద్య సేవలు పొందాలి. – డాక్టర్ జె. సురేష్, డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ, కేఆర్పురం, బుట్టాయగూడెం మండలం -
● పసుపు కప్పల సందడి
ఆడకప్పలను ఆకర్షించడానికి కేవలం వర్షాకాలంలో ఒంటిని పసుపు రంగుగా మార్చుకునే కప్ప ఒకటుందని మీకు తెలుసా? దీని పేరు ఇండియన్ బుల్ ఫ్రాగ్. తెలుగులో తవుడు, బోదరు కప్పలు అని పిలుస్తారు. ఇటీవల వర్షాలు పడటంతో ఏలూరు జిల్లా కై కలూరు టౌన్హాలు గ్రౌండ్లో చేరిన నీటిలోంచి గురువారం ఇవి బయటకు వచ్చాయి. మగ కప్పలు రెండు స్వరపేటికలను నీలం రంగులోకి మార్చుతూ వింత శబ్ధాలు చేయడంతో పలువురు ఆసక్తిగా తిలకించారు. బుల్ ఫ్రాగ్ శాసీ్త్రయనామం హూప్లోచాట్రాసస్ టైగిరినస్. ఇవి 17 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. వర్షాకాలంలో జతకట్టే సమయం ముగియగానే సాధారణ రంగులోకి వస్తాయి. వీటి సంతతి నానాటికీ తగ్గడంపై జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. – కై కలూరు -
ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు
భీమవరం (ప్రకాశంచౌక్): ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో ఆక్వా ఫీడ్ డీలర్స్ అసోసియేషన్, ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఆక్వా రైతులతో కలిసి రొయ్యల మేత ధరలు, ఆక్వా రంగంలో ఎదురవుతున్న సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై జేసీ స్పందిస్తూ ఆక్వా ఫీడ్ ధరలు, రొయ్యల కొనుగోలు ధరల అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ సూచనలు, సిఫార్సుల మేరకు తగిన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, ఆక్వా ఫీడ్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరామరాజు, ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తులసి రాంబాబు, ఆక్వా డీలర్లు, రైతులు పాల్గొన్నారు. -
వన్యప్రాణి చట్టం అమలు ముఖ్యం
ఏలూరు (టూటౌన్) : సుకుమార్ కమిటీ సూచనలు, జాతీయ వన్యప్రాణుల బోర్డు 48వ స్థాయి కమిటీ సమావేశం సిఫార్సులు అనుసరించి కొల్లేరు అభయారణ్యం పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు ముఖ్యమైనదని అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి కాంతీలాల్ దండే అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేటులోని గౌతమీ సమావేశపు హాలులో కలెక్టర్ వెట్రిసెల్వి, ప్రిన్సిపల్ చీఫ్ అఫ్ కన్సర్వేటర్ అఫ్ ఫారెస్ట్ డా. పీవీ చలపతిరావు, చీఫ్ కన్సర్వేటర్ అఫ్ ఫారెస్ట్ నాగేశ్వరరావు, జ్యోతిలతో కలిసి కొల్లేరు 5వ కాంటూర్ పరిధిలోని జిరాయితీ, డి.ఫారం భూమిదారుల పునరావాసం కార్యక్రమాలు, సరిహద్దు గుర్తింపు తదితర అంశాలపై కాంతీలాల్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5వ కాంటూర్ పరిధిలోని జిరాయితీ, డి.ఫారం భూములు సుమారు 20 వేల ఎకరాల వరకు ఉంటాయని, కొల్లేరు అభయారణ్య పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు, జిరాయితీ, డి.ఫారం భూమిదారుల సమస్యలు పరిష్కారం, పునరావాస కార్యక్రమాలపై రూపొందించిన ప్రతిపాదనలను సుప్రీంకోర్టు సాధికార కమిటీకి సమర్పిస్తున్నామని, ఆ కమిటీ ఈనెల 29వ తేదీన ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తుందన్నారు. సమీక్ష సమావేశంలో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు అభిషేక్ గౌడ, రాహుల్కుమార్ రెడ్డి, డీఎఫ్ఓ త్రిమూర్తులు రెడ్డి, ఇన్చార్జి డీఆర్ఓ దేవకీదేవి, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, కొల్లేరు ప్రాంతాలకు చెందిన తహసీల్దార్లు, అటవీశాఖ సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు. -
ఇసుక దోపిడీని నిల్వరించేదెలా..?
గోదావరికి వరదల సమయంలో ఇసుక అక్రమ వ్యాపారంపై కూటమి నేతలు కన్నేశారు. ఇసుక స్టాకులు సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్జెడ్) నిబంధనలకు విరుద్ధంగా వశిష్ట గోదావరిలో అక్రమ తవ్వకాలు చేస్తూ కోట్లాది రూపాయల ఇసుకను కొల్లగొడుతున్నారు. గురువారం శ్రీ 25 శ్రీ జూన్ శ్రీ 2026భీమవరం (ప్రకాశంచౌక్): డీపీఓగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కె.అనురాధ బుధవారం కలెక్టర్ సీహెచ్ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభినందిస్తూ ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాల మేరకు సమర్ధవంతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. భీమవరం: ఎన్నికల్లో మున్సిపల్ కార్మికులకు కూటమి నాయకులిచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులపై పాలకులు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను విడనాడాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నెక్కంటి సుబ్బారావు డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం భీమవరం కలెక్టరేట్ వద్ద ఏఐటీయుసీ అధ్వర్యంలో నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడారు. మున్సిపల్ వర్కర్స్ అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం సంఘటిత ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అప్కాస్ వర్కర్స్ను పర్మినెంట్ చేస్తామని, అపరిష్కృత సమస్యలను పరిష్కరిస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారం చేపట్టి రెండేళ్లయినా నేటికీ వాటి అమలు పట్టించుకోవడం లేదన్నారు. ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమరావు మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో వర్కర్స్ యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ కిలారి మల్లేశ్వరరావు, ఏఐటీయుసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగే దాడులకు సంబంధించిన కేసుల విచారణను వేగవంతం చేసి బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల నమోదు, విచారణలో జాప్యానికి తావులేకుండా చూడాలని, ముఖ్యంగా ఎఫ్ఐఆర్ నమోదు, చార్జ్షీట్ దాఖలు దశల్లో వేగవంతమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీలను ఆదేశించారు. డీవీఎంసీ సభ్యులు కె.చిన్నపెద్దిరాజు, కె.రాజశేఖర్, ఎస్.జగపతి రామయ్య, ఎన్జీవో ప్రతినిధి వి.ఆశాజ్యోతి వివిధ సమస్యలను ప్రస్తావించారు. భీమవరం (ప్రకాశంచౌక్): ప్రత్యేక సంక్షిప్త సవరణ సర్ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ చాంబర్లో కలెక్టర్ అధ్యక్షతన డీఆర్ఓ, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులతో సర్ కార్యక్రమం పురోగతిపై సమీక్ష నిర్వహించారు. బూత్ లెవల్ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయాలని, ప్రజలకు ఫారాల ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఆర్టీసీలో ఉన్న 10 వేల పోస్టుల ఖాళీలను వెంటనే భర్తిచేయాలని, సీ్త్ర–శక్తి పథకం విజయవంతంగా నడవాలంటే వెంటనే 4 వేల కొత్త బస్సులను ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలని ఏపీ పీటీడీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం ఏపీ పీటీడీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఏలూరు ఆర్టీసీ డిపో గ్యారేజ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారానే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలీనానికి ముందున్న పాత పద్ధతిలో రిఫరల్ ఆసుపత్రుల ద్వారా వైద్యసౌకర్యాలు అందించాలని కోరారు. సాక్షి, భీమవరం : సాధారణంగా జూలై నుంచి గోదావరికి వరదలు మొదలై దాదాపు నాలుగు నెలల పాటు ర్యాంపులు మూతపడతాయి. ఇసుక లభ్యత తగ్గి డిమాండ్ పెరుగుతుంది. ఇదే అదనుగా సొమ్ము చేసుకునే పనిలో కూటమి నాయకులు ఉన్నారు. జిల్లాలోని వశిష్ట గోదావరి తీరం వెంట సిద్ధాంతం, కరుగోరుమిల్లి, కోడేరు, నడిపూడి ఓపెన్ రీచ్లు, దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, యలమంచిలిలంక, చించినాడ, మాధవాయిపాలెంలోని డీసిల్టేషన్ పాయింట్ల ద్వారా గతంలో ఇసుక తవ్వకాలు చేసేవారు. రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని కోస్టల్ రెగ్యులర్ జోన్ (సీఆర్జెడ్)గా ప్రకటించింది. సముద్రపు పోటుతో ఉప్పునీటి సాంద్రత వల్ల ఈ ర్యాంపుల్లోని ఇసుక నిర్మాణాలకు పనికిరాదని ర్యాంపులు మూసివేశారు. జిల్లా అవసరాల నిమిత్తం తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లోని ర్యాంపుల నుంచి ఇసుకను తెస్తున్నారు. కూటమి వచ్చాక సీఆర్జెడ్ నిబంధలకు విరుద్ధంగా నడిపూడి, కరుగోరుమిల్లి తదితర చోట్ల కూటమి నాయకులు నదీ గర్భానికి తూట్లుపొడుస్తూ అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుండటంపై స్థానికులు హైకోర్టును ఆశ్రయించగా తవ్వకాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పుడూ అదే దోపిడీ పాత స్టాకులు మిగిలిపోవడంతో కొత్తగా స్టాకులు పెట్టడం లేదని మైనింగ్ అధికారులు అంటున్నారు. ఇసుక అవసరాల నిమిత్తం జిల్లాకు కేటాయించిన పెండ్యాల ర్యాంపు వద్దనే ఇసుక నిల్వ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆచంట, పెనుగొండ, పోడూరు, యలమంచిలి తదితర మండలాల్లో భారీ ఎత్తున ఇసుక నిల్వ చేసే పనిలో కూటమి నేతలు ఉన్నారు. ఇప్పటికే సిద్ధాంతం వంతెన వద్ద, ఆచంట మండలంలోను నిల్వలు చేస్తున్నారు. వీటిలో ఎన్నింటికి అనుమతులు ఉన్నాయి?, వేటికి లేవో? తెలీని పరిస్థితి. మరోపక్క హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నడిపూడి వద్ద గోదావరిలో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు లంక భూములు, నక్కల డ్రెయిన్ గట్లు గుల్ల చేసి ఇప్పుడు గోదావరిలో ఇసుకను కొల్లగొడుతున్నారని స్థానికులు అంటున్నారు. రోజూ అధిక సంఖ్యలో లారీల్లో ఇసుకను తరలించుకుపోతున్నారని చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలుండటంతో అధికారులు తవ్వకాలు వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలున్నాయి. ఇసుకను బయట అమ్మకాలు చేయడంతో పాటు వర్షాకాలం నిల్వలకు తరలిస్తున్నారంటున్నారు. నిర్మాణ అవసరాల పేరిట చోటామోటా నాయకులు సైతం వీలైనంత మొత్తంలో స్టాకులు పెట్టుకునే పనిలో ఉన్నారు. ఉప్పు సాంద్రత ఉండే ఈ ఇసుకతో నిర్మాణాలు చేయడం వలన మన్నిక కాలం తగ్గిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నడిపూడి వద్ద తరలింపు కోసం గోదావరిలో సిద్ధం చేసిన ఇసుక గుట్ట నడిపూడి వద్ద అనధికారిక ఇసుక తవ్వకాల కోసం తెచ్చిన పొక్లెయిన్ భీమవరం: రాష్ట్రంలో విద్యావ్యవస్ధ అస్తవ్యస్తంగా మారిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన శాఖను పట్టించుకోకుండా నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ను ప్రోత్సహిస్తున్నారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్నకుమార్ ధ్వజమెత్తారు. భీమవరంలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థలు విచ్చల విడిగా విద్యావ్యాపారం చేస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సక్రమంగా ఇవ్వకపోవడంతో విద్యార్థులను కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్స్ తెరచి పది రోజులు గడిచిపోయినా విద్యార్థులకు యూనిఫాం, షూస్, బ్యాగ్లు పంపిణీ చేయలేదని దీనికి యుద్ధం బూచిగా చూపుతున్నారని ప్రైవేట్ స్కూల్స్లో బ్యాగ్స్ ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. భీమవరం పట్టణంలో నారాయణ స్కూల్ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తుండగా ఆందోళన చేయడంతో సీజ్ చేశారని అధికారం బలంతో మూడు రోజులకే స్కూల్ తెరచి తరగతులు నిర్వహిస్తున్నారన్నారు.తాడేపల్లిగూడెం: సురక్షితమైన పైప్లైన్ గ్యాస్లైన్లను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి కోరారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో పైప్గ్యాస్ గృహ కనెక్షన్ల పంపిణీ, వినియోగంపై సమీక్షించారు. పట్టణంలోని ప్రతి ఇంటికి పైప్లైన్ గ్యాస్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, జీజీపీఎల్ సేల్స్ అధికారులు, వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. గోదావరి గ్యాస్ ద్వారా ఇప్పటికే 80 పైప్లైన్ కనెక్షన్లను పునరుద్ధరించామన్నారు. ఎల్పీజీతో పోలిస్తే 24 గంటల సరఫరా జరుగుతుందన్నారు. ఎప్సీఐ కాలనీలో పీఎన్జీ సేవలపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్డీఓ మన్యం సూర్యారావు, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ హెప్సిబా, డీఎస్ఓ ఎన్.సరోజ, మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో మాట్లాడుతున్న గాంధీభగవాన్రాజు భీమవరం: రొయ్యల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీడ్ ధరలు తగ్గింపు, రొయ్యల ధరల పెంపు విషయంలో ఇచ్చిన హామీని పూర్తిస్ధాయిలో అమలుచేయకుంటే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని రొయ్యల రైతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్రాజు చెప్పారు. భీమవరంలో బుధవారం సంఘం సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫీడ్ ధరను కిలోకు రూ.4 తగ్గించడానికి ఫీడ్ కంపెనీలు అంగీకరించాయని క్షేత్రస్ధాయిలో కేవలం రూ.2 మాత్రమే తగ్గించి రైతులను మోసం చేస్తున్నారన్నారు. కంపెనీలు ధర తగ్గించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి ఉద్యమాలు చేయాలని విషయంపై చర్చించినట్లు చెప్పారు. ఫీడ్ కంపెనీలు ముఖ్యమంత్రి ఆదేశాలను సైతం లెక్కచేయడం లేదన్నారు. రైతు సంఘాలు ఫీడ్ కిలో రూ.8 తగ్గించాలని డిమాండ్ చేయగా రూ.4 మాత్రమే తగ్గిస్తామని చెప్పారని, రొయ్య రైతుల ఇబ్బందులు ఫీడ్ కంపెనీల యజమానులకు పట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రొయ్యల రైతుల సంఘం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. సీఆర్జెడ్ పరిధిలో ఇసుక తవ్వకాలు జరపకూడదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయినా కూటమి నాయకులు విచ్చలవిడిగా సీఆర్జెడ్ పరిధిలో ఇసుక తవ్వి అక్రమాలకు పాల్పడుతున్నారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు. అక్రమార్జనకు కూటమి నాయకులు పాల్పడుతున్నారు. అనుమతులు లేకపోయినా స్టాక్ పాయింట్లు పెడుతున్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తాం. – చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మాజీ మంత్రి కాసుల గుట్టలు వర్షాకాలంలో సొమ్ము చేసుకునే పనిలో నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక నిల్వలు కోర్టు ఆదేశాలు బేఖాతరు సీఆర్జెడ్లో అనధికార తవ్వకాలు ఆచంటలో అక్రమ స్టాకులు ‘స్టాక్’గా దోచేశారు వరదల సమయంలో ఇసుక కొరత లేకుండా గత ఏడాది సాండ్ కమిటీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్టాక్ పాయింట్ ఏర్పాటుచేశారు. ఒక్కో పాయింట్లో 70 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ చేయాలని నిర్ణయించగా జిల్లా అంతటా 1.20 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే స్టాకు పెట్టారు. ర్యాంపు నుంచి స్టాక్ పాయింట్లకు మధ్య దూరాన్ని బట్టి మెట్రిక్ టన్ను ఇసుకకు రూ.306 నుంచి రూ.581 ధరలు నిర్ణయించారు. మరోపక్క కూటమి నాయకులు సిద్ధాంతం వంతెన దిగువన, ఆచంట నియోజకవర్గంలోను నిల్వలు ఏర్పాటుచేశారు. అధికారిక స్టాకు పాయింట్లతో పోలిస్తే తక్కువ ధరకే అమ్మకాలు చేసి రూ.కోట్లల్లో సొమ్ము చేసుకున్నారు. -
కన్న కొడుకే కాలయముడై..
కామవరపుకోట: మద్యానికి బానిసైన కొడుకు కన్న తండ్రి పాలిట కాలయముడయ్యాడు. ఇంటి పత్రాల కోసం తండ్రిపై దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన కామవరపుకోట మండలంలోని పాత గండిగూడెంలో చోటుచేసుకుంది. తడికలపూడి ఎస్సై వల్లి పద్మ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పాత గండిగూడెం గ్రామానికి చెందిన పిండి వెంకటేశ్వరరావు (60) గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తుంటాడు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు పిండి శ్రీనివాసరావు ఉన్నారు. కుమార్తె వివాహం కాగా కుమారుడు శ్రీనివాసరావు మద్యానికి బానిసై డబ్బులు కావాలని కుటుంబ సభ్యులతో తరచూ గొడవపడేవాడు. దీంతో అతడి భార్య ఐదేళ్ల కిత్రం పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి శ్రీనివాసరావు మద్యం తాగి ఇంటికి వచ్చి ఇంటి పత్రాలు ఇవ్వాలని తండ్రిపై వాగ్వివాదానికి దిగాడు. అందుకు తండ్రి వెంకటేశ్వరరావు నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాసరావు తండ్రి వెంకటేశ్వరరావుపై దాడి చేసి హత్య చేశాడు. బుధవారం ఉదయం చింతలపూడి సీఐ పి.క్రాంతి కుమార్, ఎస్సై వల్లి పద్మ ఘటనా స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి భార్య పిండి వెంకటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వెంకటేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
అర్ధరాత్రి అక్రమ తవ్వకాలు
ఆగిరిపల్లి: మండలంలోని చిన్నగిరిపల్లిలోని పులిచెరికుంట చెరువును అక్రమార్కులు రాత్రి వేళల్లో జేసీబీలతో అక్రమంగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా అధికార పార్టీ నాయకుల అండ చూసుకొని రాత్రిపూట పులి చెరుకుంట చెరువును తవ్వేస్తున్నారు. ప్రతిరోజు గుట్టు చప్పుడు కాకుండా చెరువులో మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. అర్ధరాత్రి దాటితే చాలు చెరువులోని మట్టి మండల కేంద్రమైన ఆగిరిపల్లికి తరలించి జేబులు నింపుకుంటున్నారు. చెరువును ఇష్టం వచ్చినట్టు తవ్వేయడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. వర్షాకాలం కావడంతో పశువులు గుంతలలో పడి మృత్యువాత పడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మట్టి అక్రమ దందా చేస్తున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
క్వారీలో ఇష్టారాజ్యంగా బ్లాస్టింగ్లు
ఆగిరిపల్లి: మండలంలోని నరసింగపాలెంలో క్వారీకి అనుమతి తీసుకొని నిబంధనలకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్రమ బ్లాస్టింగ్కు పాల్పడుతున్నారని, దీంతో భయాందోళనగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. నరసింగపాలెం సమీపంలో ఉన్న క్వారీలో గ్రావెల్ తవ్వకాల కోసం కొన్ని రోజులుగా బ్లాస్టింగ్ చేస్తున్నారని, దీంతో గ్రామంలో దుమ్ము, ధూళి వ్యాపించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అంతేకాకుండా పంట పొలాలు సైతం నాశనం అవుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వారీలో నిరంతరం బ్లాస్టింగ్ వల్ల నివాస గృహాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి క్వారీలో జరుగుతున్న బ్లాస్టింగ్పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. -
సింగారమ్మ తల్లి కొండపై పెద్దపులి
మత్తు ఇచ్చి పట్టుకునేందుకు ఏర్పాట్లు బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలంలో పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది జనవరి 21న తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం కావిడిగుండ్ల నుంచి జిల్లాలోకి ప్రవేశించి బుట్టాయగూడెం మండలం గుబ్బల మంగమ్మ గుడి మార్గంలో ప్రారంభమైన పులి యాత్ర మండలంలో సుమారు 13 ఆవులను హతమార్చిన అనంతరం పోలవరం మండలంలో ప్రవేశించి అక్కడి నుంచి గోదావరి ఈదుకుంటూ తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించింది. ప్రత్యేక రెస్క్యూ టీమ్ రాయవరం మండలం కూర్మాపురంలో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పెద్దపులిని బంధించారు. కొద్దిరోజుల తర్వాత మళ్లీ పాపికొండల అభయారణ్యంలో అటవీశాఖ అధికారులు దానిని విడిచిపెట్టడంతో మళ్లీ సంచారం మొదలు పెట్టింది. పులికి అమర్చిన రేడియో కాలర్ ద్వారా దాని సంచారాన్ని అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తూ గ్రామ సమీపాల్లో ప్రజలను హెచ్చరిస్తూ వస్తున్నారు. జిల్లాలోని పోలవరం మండలంలో ప్రవేశించిన పెద్దపులి మళ్లీ కొరుటూరు, సిరివాక, దారావడ దాటుకుంటూ బుట్టాయగూడెం మండలంలో మంగళవారం ప్రవేశించింది. అప్రమత్తమైన అధికారులు పులి కదలికలను గుర్తించి ఆయా గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. తెల్లవారేసరికి మండలంలోని పాలకుంట సమీపంలో 2 ఆవులపై దాడి చేసి చంపేసింది. పులిని పట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు పెద్ద పులిని పట్టుకునేందుకు శ్రీశైలం టైగర్ జోన్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు వచ్చాయి. బృందానికి హెడ్గా ఉన్న కాళీచరణ్ ఆధ్వర్యంలో పులి సంచరించిన ప్రాంతాలు పరిశీలించారు. అటవీ శాఖ అధికారులు, ప్రత్యేక బృందాలు ప్రస్తుతం పులి సింగారమ్మతల్లి కొండ సమీపంలోనే ఉన్నట్లు గుర్తించారు. ఆవును చంపిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే ఉండడంతో మళ్లీ ఇక్కడికి వస్తుందనే నమ్మకంతో పులి సంచరించే ప్రదేశంలో పేడ కళ్లాపిని చల్లడంతో పాటు మూడు మంచెలను ఏర్పాటు చేశారు. మంచెలపై మాటు వేసి మత్తు ఇంజెక్షన్తో పులిని బంధిస్తామని అధికారులు తెలిపారు. బోను, లాజిస్టిక్లు, తదితర సామాగ్రిని కూడా అధికారులు సిద్ధం చేసి ఉంచారు. -
నిర్వాసితులకు నీటి కష్టాలు
జంగారెడ్డిగూడెం: మండలంలోని తాడువాయి పంచాయతీ పరిధిలో గల చల్లవారిగూడెం ఆర్అండ్ఆర్ కాలనీలో నివాసముంటున్న నిర్వాసిత కుటుంబాలకు తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. కనీస అవసరాలకు కూడా నీరు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు బుధవారం తాడువాయి పంచాయతీ సెక్రటరీని కలిసి తమ ఆవేదనను వెళ్లగక్కారు. అంతకుముందు కాలనీలో పనులు చేస్తున్న గుత్తేదారు సంస్థ ‘యూనిక్’ ప్రతినిధులను కూడా గ్రామస్తులు కలిసి సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా తమ సమస్య పరిష్కారం కావడం లేదని వాపోయారు. కాలనీలోని 800 కుటుంబాలకు కేవలం ఒకే ఒక్క నీటి ట్యాంక్ ఏ విధంగా సరిపోతుందని ప్రశ్నించారు. మోటార్ గేట్ వాల్వ్ పాడైపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని, దీనికి పరిష్కారంగా మిగిలిన ట్యాంకుల ద్వారా పైపులైన్ కనెక్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుల సమస్యలను విన్న పంచాయతీ సెక్రటరీ వారం, పది రోజుల్లో మోటార్ రిపేరు చేయిస్తామని హామీ ఇచ్చారు. కాలనీ కమిటీ సభ్యులు బద్దె ప్రేమ్ కుమార్, పెరుమాళ్ళ శ్రీను, నరసింహారావు, గుబ్బల విజయ్ బాబు, ముత్తబోయిన రమణయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక లారీ ఢీకొని భార్యాభర్తలకు తీవ్రగాయాలు
కొత్తపేట: కుమార్తె పెళ్లి శుభలేఖలు పంచి వస్తున్న దంపతులను ఇసుక లారీ ఢీకొంది. ఈ ఘటనలో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం తామరాడ గ్రామానికి చెందిన దాసిరెడ్డి నాగ వెంకట రామకృష్ణ, ధనలక్ష్మి కుమార్తెకు జూలై ఒకటిన వివాహం నిశ్చయించారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ దంపతులు శుభలేఖలు పంచేందుకు మోటార్ సైకిల్పై ముమ్మిడివరంలో బంధువుల ఇళ్లకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో కొత్తపేట బోడిపాలెం సమీపానికి వచ్చేపరికి ఎదురుగా ఇసుక లోడుతో వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స జరిపి, ఉన్నత వైద్యం కోసం తణుకు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
మామిడిపై చిత‘్తశుద్ధి’ కరువు
● మూతబడిన సమగ్ర పండ్ల శుద్ధి కేంద్రం● నూజివీడులో 2007లో ఏర్పాటు ● రెండేళ్లుగా పట్టించుకోని కూటమి ప్రభుత్వంనూజివీడు: ఉద్యానవన పంటల కోసం కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మించిన సమగ్ర పండ్ల శుద్ధి కేంద్రం రెండేళ్లుగా మూతబడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి దీనిని పట్టించుకోకుండా గాలికొదిలేయడంతో ప్లాంట్ ఆవరణంతా పిచ్చిమొక్కలు పెరిగి చిట్టడవిని తలపిస్తోంది. ఏపీ ఆగ్రోస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్లాంట్లో గతంలో మామిడి, అరటి, బొప్పాయి, జామ కాయలను ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేసేవారు. గత ప్రభుత్వం హయాంలో ఈ సమగ్ర పండ్ల శుద్ధి కేంద్రాన్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వడంతో లీజుకు తీసుకున్న వారు మామిడి, బొప్పాయి, జామ పండ్లను ప్రాసెసింగ్ చేసి వాటిని దేశంలోని ఇతర ప్రాంతాలకు, మలేషియా, దుబాయ్ వంటి దేశాలకు ఎగుమతి చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం ఈ ప్లాంట్ను పక్కన పెట్టేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో 2007లో ఈ సమగ్ర పండ్ల శుద్ధి కేంద్రాన్ని నూజివీడులో రూ.12 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం వల్ల నూజివీడు ప్రాంతంలో పండ్ల తోటలను సాగు చేస్తున్న రైతులకు ఎంతో మేలు జరుగుతుందనే లక్ష్యంతో అప్పట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో సాగులో ఉన్న మామిడి, బొప్పాయి, జామతో పాటు టమోట, పలు రకాల కూరగాయలను సైతం ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేసుకోవడం ద్వారా రైతులకు మంచి ధర లభిస్తుందనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. అయితే కూటమి ప్రభుత్వంకు తొలి నుంచి రైతులన్నా, వ్యవసాయం అన్నా అంత శ్రద్ధ చూపని నేపధ్యంలో ఈ కేంద్రాన్ని పట్టించుకోకుండా గాలికొదిలేసింది. పండ్ల తోటల రైతులకు ఎంతో మేలు సమగ్ర పండ్ల శుద్ధి కేంద్రం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. దీనిని వినియోగంలోకి తీసుకువచ్చి రైతుల్లో అవగాహన కల్పిస్తే ఉద్యాన ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర లభించి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కేంద్రంలో వేపర్ హీట్ ట్రీట్మెంట్, ప్రాసెసింగ్, క్లీనింగ్, గ్రేడింగ్, రైపెనింగ్, ప్రీ కూలింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. రైతులు రిలయన్స్, మోర్ వంటి మార్టులకు, విదేశాలకు మామిడి కాయలను ఎగుమతి చేయాలంటే ఇక్కడ ప్రాసెసింగ్ చేయించి మార్కెట్లకు తరలిస్తారు. వేపర్ హీట్ ట్రీట్మెంట్ ద్వారా మామిడి, బొప్పాయి, జామ వంటి కాయలను ఈ విధానంలో పండ్లకు ఎలాంటి హాని కలగకుండా వాటిల్లో ఉండే కీటకాల గుడ్లు, లార్వాలను నాశనం చేస్తారు. నీటి ఆవిరితో క్రిమి సంహారక చర్య జరుగుతుంది. దీనివల్ల పండ్ల నాణ్యత, తాజాదనం దెబ్బతినకుండా లోపల ఉండే పురుగులు నశిస్తాయి. ఎగమతి చేయడానికి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సర్టిఫికెట్ లభిస్తుంది. దీనిలో భాగంగా 2022లో 260 టన్నుల మామిడిని, 500 టన్నుల అరటి కాయలను ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేయడం జరిగింది. వీటిల్లో 22 టన్నుల మామిడికాయలను యూకే, జర్మనీలకు ఎగుమతి చేశారు. 120 టన్నుల మామిడిని రిలయన్స్ మార్టులకు, 115 టన్నుల మామిడి కాయలను మోర్ మార్కెట్కు ఎగుమతి చేశారు. అలాగే అరటి కాయలు 500 టన్నులను ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేయడం జరిగింది. ఇలా రైతులకు ఎంతో ప్రయోజనం కలిగిన కేంద్రాన్ని పట్టించుకోకుండా మూతేసింది. -
ఆక్రమణలపై ఆగ్రహం
పాలకొల్లు సెంట్రల్: ‘ఉదయం బాలభవన్... సాయంత్రం క్లబ్ పార్కింగ్’ శీర్షికతో సాక్షిలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. బుధవారం కలెక్టర్ ఆదేశాలతో అధికారులు బాలభవన్ స్థలాన్ని పర్యవేక్షించారు. మెటీరియల్ వేసిన క్లబ్ నిర్వాహకులను పిలిచి మాట్లాడారు. వారం రోజుల్లో మహిళా మండలి భవనం, బాలభవన్ చుట్టూ ఉన్న భవన నిర్మాణ మెటీరియల్ తొలగించి పడగొట్టిన ప్రహరీగోడను నిర్మించి అప్పగించాలని క్లబ్ నిర్వాహకులను హెచ్చరించారు. వారం రోజుల్లో మెటీరియల్ తీసి బాలభవన్కు అప్పగించాలని లేదంటే కలెక్టర్ ఆదేశాల ప్రకారం క్లబ్ సీజ్ చేసే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. వీఆర్వో పర్యవేక్షణ చేస్తారని తహసీల్దార్ తెలిపారు. -
ఎల్నినో కలకలం
తాడేపల్లిగూడెం: నైరుతి రుతుపవనాలు వెనకడుగు వేస్తున్నాయి. వానలు కురవాల్సిన సమయంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో వరి, ఇతర పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. దీనిని ‘ఎల్నినో’ హెచ్చరికగా ఉద్యాన శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. సూపర్ ఎల్నినో హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న ఎల్నినో పరిస్థితులు సూపర్ ఎల్నినోగా మారి, 2027 జనవరి వరకు ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారత జాతీయ సముద్ర సేవల కేంద్రం ఇచ్చిన హెచ్చరికల ఆధారంగా, విపత్కర పరిస్థితులను తట్టుకునేలా ఉద్యాన రైతులకు శాస్త్రవేత్తలు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం ఎల్నినో వల్ల ఖరీఫ్ పంటలతో పాటు తెలుగు రాష్ట్రా ల్లోని ఉద్యాన పంటల దిగుబడి, నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఉద్యాన అధికారుల సూచనలు ● నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు బిందు సేద్యం, తుంపర సేద్యం పద్ధతులను పాటించాలి. ● నేలలోని తేమ ఆవిరి కాకుండా చెట్ల మొదళ్ల చుట్టూ ఎండుగడ్డి, ఆకులు లేదా ప్లాస్టిక్ షీట్లతో ‘మల్చింగ్’ చేయాలి. ● పండ్ల తోటల్లోని చెట్ల కాండానికి నేల మట్టం నుంచి మూడు అడుగుల ఎత్తు వరకు బోర్డో పేస్ట్ లేదా సున్నం పూయాలి. ● నారుమడులను ఎండల నుంచి రక్షించుకోవడానికి పాలిథిన్ షీట్లు, గ్రీన్ షేడ్ నెట్లను వినియోగించాలి. ● ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వేరు కుళ్లు, రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉంది. వ్యవసాయ అధికారుల సలహాతో మందులను పిచికారీ చేయాలి. ● ఉద్యాన తోటల్లో తక్కువ నీటిని తీసుకునే అంతర పంటలను సాగు చేసుకోవాలి. పండ్ల తోటల్లో జాగ్రత్తలు ● మామిడిలో మల్చింగ్ చేయడం, రసం పీల్చే పురుగుల నుంచి కాండానికి రక్షణ కల్పించడం, బత్తాయిలో నీటి పొదుపు కోసం బాష్పోత్సేక నిరోధకాలను వాడటం, పోషకాలను పిచికారీ చేయడం చేయాలి. ● అరటిలో గాలి నుంచి రక్షణకు కంచె ఏర్పాటు, ఆకుల యాజమాన్యం, గెలల సంరక్షణ, పొటాష్ వాడకంలో అప్రమత్తంగా ఉండాలి. ● బొప్పాయిలో వైరస్ తెగుళ్ల నివారణ, సమతుల్య నీటి తడులు, బొబ్బ తెగులు నివారణ చర్యలు చేపట్టాలి. ● లేత జీడిమామిడిలో మల్చింగ్, కోకో, ఆయిల్ పామ్, తమలపాకు, టమాటా, మిరప, వంగ, సుగంధ ద్రవ్య పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ఆందోళనలో ఉద్యాన రైతులుఎల్నినో హెచ్చరికల నేపథ్యలో ఉద్యాన యూనివర్సిటీ రైతులను అప్రమత్తం చేస్తుంది. శాస్త్రవేత్తల బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి ఉద్యాన రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎల్నినో నుంచి పంటలను ఎలా రక్షించుకోవాలనే విషయాలపై కరపత్రాలను ప్రచురించి పంచుతున్నాం. రైతులు అవగాహనతో ఉంటే ఎల్నినోను అఽధిగమించవచ్చు. – ధనుంజయరావు, వైస్ చానల్సర్, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ -
హార్టీ వెల్కమ్
తాడేపల్లిగూడెం : ఉద్యాన రైతు రాజు కావాలి.. తక్కువ నీటితో అఽధిక దిగుబడులు సాధించాలి.. ఆర్థిక స్వావలంబన సాధించాలి.. ఉద్యాన విద్య, ఉద్యాన పంటల విస్తరణ లక్ష్యాలుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని 19 ఏళ్ల క్రితం ఏర్పాటుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలో 2007 జూన్ 26న ఆంఽధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైఎస్ మానసపుత్రికగా ఏర్పడింది. దేశంలో రెండో ఉద్యాన విశ్వవిద్యాలయం ఇదే. 2012లో వైఎస్ మరణానంతరం ఆయన పేరిట అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి కేబినెట్ ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంగా మార్చింది. గత 19 ఏళ్లుగా విద్య, పరిశోధన, విస్తరణ లక్ష్యాలుగా వర్సిటీ పరుగులు తీస్తుంది. 5 ఉద్యాన కళాశాలలు, 4 ఉద్యాన పాలిటెక్నిక్లు, 20 పరిశోధనా కేంద్రాలు, 4 కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతు లోకానికి సేవలందిస్తోంది. 34 నూతన ఉద్యాన వంగడాలను విడుదల చేసింది. కొబ్బరిచెట్టు ఎక్కే యంత్రం, తాటి ఉత్పత్తుల విలువ జోడింపు సాంకేతికత, జీడిమామిడి, ఆపిల్ జ్యూస్ ప్రాసెసింగ్కు సంబంధించి మూడు పేటెంట్లు వర్సిటీ సాధించింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి నుంచి ఏ–గ్రేడ్ గుర్తింపు పొందింది. వర్సిటీ పరిశోధనా కేంద్రాలు జాతీయ స్థాయిలో ఉత్తమ కేంద్రాలుగా అవార్డులు సాధించాయి. విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉద్యోగులుగా, విదేశాల్లో విద్యను అభ్యసించే స్థాయికి ఎదిగారు. రైతుల కోసం ఉద్యాన మిత్ర, ఉద్యాన వాణి, రైతు సలహా కేంద్రం, డిజిటల్ విస్తరణ కార్యక్రమాలు చేపడుతోంది. వీసీ టు విలేజ్ ద్వారా 127 గ్రామాలను దత్తత తీసుకుని రైతులకు సాంకేతిక సేవలు అందిస్తున్నారు. 20వ వ్యవస్థాపక దినోత్సవానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అతిథిగా హాజరుకానున్నారని ఉద్యాన వర్సిటీ వీసీ కె.ధనుంజయరావు తెలిపారు. 19 ఏళ్లు.. ఎన్నో మైలురాళ్లు 20వ వసంతంలోకి వైఎస్సార్ హర్టీకల్చరల్ వర్సిటీ దివంగత వైఎస్ మానస పుత్రిక వ్యవసాయ, ఉద్యాన రంగాల్లో విశేష సేవలు రేపు వ్యవస్థాపక దినోత్సవం -
చంద్రబాబు పాలనలో బీసీల అణచివేత
భీమవరం: చంద్రబాబు ప్రభుత్వం పాలనలో బీసీ నాయకుల అణచివేత లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని అందులో భాగంగానే వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్ కారుమూరి సునీల్ కుమార్ను అక్రమంగా అరెస్టు చేశారని నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జ్ గూడూరి ఉమాబాల అన్నారు. కక్ష సాధింపు చర్యలు భాగంగానే అక్రమ కేసులు పెట్టి ఆధారాలు లేకున్నా ఇళ్లల్లో సోదాలు చేస్తూ వారి పరువుకు భంగం కలిగిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేసి రాజకీయంగా చైతన్యం చేయాలనే లక్ష్యంగా పనిచేశారన్నారు. సునీల్ కుమార్ ఏలూరు నియోజవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే కక్ష కట్టి, తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేసి అణచివేయాలని చూస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ ఎప్పుడూ బీసీలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో బీసీలను అన్ని రకాలుగా అణచివేయాలని అరాచక పాలన సాగిస్తున్నారన్నారు. సునీల్ కుమార్ క్లీన్చిట్తో బయటకు వస్తారని అన్నారు. పార్టీలోని బీసీ నాయకులపై పెడుతున్న తప్పుడు కేసులు నిలిచే పరిస్థితి ఉండదన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. -
ఉపకారాగారాన్నిసందర్శించిన న్యాయమూర్తి
భీమవరం: పట్టణంలోని ప్రత్యేక ఉపకారాగారాన్ని బుధవారం ఒకటవ అదనపు జ్యుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ పి హనీష సందర్శించారు. ముద్దాయిలతో మాట్లాడి వారి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బెయిల్ మంజూరైన ముద్దాయిలు జామీన్లను కోర్టుకు సమర్పిస్తే విడుదలకు ఆదేశాలు జారీ చేస్తారన్నారు. ఆర్థిక స్థోమత కారణంగా న్యాయవాదిని నియమించుకోలేకపోతే అర్జీ పెట్టుకుంటే ఉచిత న్యాయవాదిని నియమిస్తామన్నారు. అనంతరం జైలు పరిసరాలను, గదులు, వంటగదిని పరిశీలించి ముద్దాయిలకు అందజేస్తున్న ఆహారాన్ని రుచి చూశారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ డి వెంకటగిరి, ప్యానల్ న్యాయవాదులు కె.వెంకటరమణ, ఎస్.నాగబాబు, ఎ.పద్మ, బి.సునీత, ఎం.మాలిక, కె.అమూల్య, పారా లీగల్ వాలంటీర్ కె.నాగేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. పెదవేగి: పెదవేగి మండలం రాట్నాలకుంటలోని శ్రీ రాట్నాలమ్మ తల్లి దేవస్థానంలో హుండీలను బుధవారం లెక్కింపు నిర్వహించినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి రేనా మాధురి తెలిపారు. 58 రోజులకు గాను రూ.12,66,336 ఆదాయం లభించినట్లు వెల్లడించారు. గ్రామ పెద్దల సమక్షంలో ఆలయ చైర్మన్ మన్నే శ్రీనివాసరావు, కార్యనిర్వహణ అధికారి సతీష్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ విడుదల సత్యనారాయణ పర్యవేక్షణలో లెక్కింపు కార్యక్రమం జరిగిందన్నారు. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. బుట్టాయగూడెం : వేపులపాడు రామచంద్రాపురం సమీపంలో బుధవారం ఓ పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా పడింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. వివరాల ప్రకారం బుట్టాయగూడెం సమీపంలోని ఒక గ్రామానికి చెందిన పెళ్లి బృందం 20 మందితో ట్రాక్టర్పై ఖమ్మం జిల్లా కావిడిగుండ్ల వెళ్తుండగా వేపులపాడు రామచంద్రాపురం సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. పెళ్లి బృందం సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముదినేపల్లి (కై కలూరు) : మండలంలోని వడాలి గ్రామంలో లద్దిక నాగేశ్వరరావుకు చెందిన తాటాకిల్లు షార్ట్ సర్క్యూట్తో బుధవారం దగ్ధమైంది. విషయం తెలుసుకున్న కై కలూరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన వచ్చి ఫైర్ ఇంజన్తో మంటలను అదుపు చేశారు. అప్పటికే తాటాకుల షెడ్ పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.70 వేలు ఆస్తి నష్టం వాటిల్లిందని ఫైర్ సిబ్బంది తెలిపారు. సహాయక చర్యల్లో ఫైర్ ఆఫీసర్ కె.క్రాంతికుమార్, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: స్థానిక జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం హెచ్డీఎఫ్సీ బ్యాంకులో పనిచేస్తున్న రెడ్డి గోపాలపోసి (31) మంగళవారం సాయంత్రం పని నిమిత్తం మోటార్సైకిల్పై రాజమండ్రి వెళ్లాడు. తిరిగి బుధవారం తెల్లవారుజామున జంగారెడ్డిగూడెం వస్తుండగా, స్థానిక ఫైర్ స్టేషన్ సమీపంలోని డిస్టలరీ ఫ్యాక్టరీ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని అతడి మోటార్సైకిల్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన గోపాలపోసి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంకా ఏడాదే.. కానరాని ఏర్పాట్లు
నరసాపురంలో పుష్కరాల పనులపై కనీస ప్రతిపాదనలు లేని వైనం నరసాపురం: అఖండ గోదావరి పుష్కరాలకు సమయం ఆసన్నమవుతోంది. 2027 జూలై 27 నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. 12 రోజులపాటు జరిగే ఈ పుణ్య స్నానాలకు దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రాజమండ్రి, కొవ్వూరు తర్వాత అత్యధికంగా భక్తులు స్నానాలు చేసేది నరసాపురంలోనే. వశిష్ట గోదావరి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే ముందు, నరసాపురం సమీపంలో ప్రవహించడం ఇక్కడి ప్రత్యేకత. ఇన్ని విశిష్టతలు ఉన్నా, నరసాపురంలో పుష్కరాల అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు, అధికారుల్లో కనీస స్పందన కరువైంది. మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ తదితర ఏ శాఖ కూడా ఇప్పటివరకు ఎటువంటి నిర్దిష్ట అంచనా ప్రణాళికలు సిద్ధం చేయలేదు. సమయం తక్కువ.. పనుల జాడ సున్నా 2015 పుష్కరాల సమయంలో రెండేళ్ల ముందు నుంచే పనులు ప్రారంభమయ్యాయి. 2012 చివరి నుంచే అంచనాలు, టెండర్ల ప్రక్రియ మొదలైంది. అంతలా ముందస్తు ప్రణాళికలు ఉన్నప్పటికీ, పుష్కరాల సమయానికి పనులు పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాంటిది ఇప్పుడు పుష్కరాలకు కేవలం 13 నెలలు మాత్రమే సమయం ఉంది. వర్షాకాలం, తుఫానుల ముప్పును పరిగణనలోకి తీసుకుంటే, పనులు చేయడానికి క్షేత్రస్థాయిలో ఆరు నుంచి ఏడు నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికిప్పుడు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టినా సకాలంలో పూర్తయ్యే పరిస్థితి లేదని భక్తులు ఆందోళన చెందుతున్నారు. కోటి దాటనున్న భక్తుల రద్దీ గత 2015 పుష్కరాల్లో అంచనాలను మించి సుమారు 60 లక్షల మంది భక్తులు నరసాపురంలో పుణ్య స్నానాలు ఆచరించారు. జిల్లాల విభజన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో పుష్కర స్నానాలకు నరసాపురం ఏకై క పుణ్యక్షేత్రం కావడం, రవాణా సౌకర్యాలు మెరుగుపడటం వంటి కారణాల వల్ల ఈసారి భక్తుల రద్దీ కోటి దాటవచ్చని అంచనా. ఇంతటి భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ యంత్రాంగం నిధుల కేటాయింపు, ఏర్పాట్లపై కనీస బాధ్యత చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. శిథిలావస్థలో పుష్కర ఘాట్లు నరసాపురం పట్టణ పరిధిలో వలంధర్రేవు, లలితాంబ ఘాట్, అమరేశ్వర ఘాట్లు ప్రధానమైనవి. ముఖ్యంగా చారిత్రక నేపథ్యం ఉన్న వలంధర్రేవులో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఘాట్లన్నీ శిథిలావస్థకు చేరాయి. 60 అడుగుల వెడల్పు ఉన్న వలంధర్రేవును కనీసం 150 అడుగులకు విస్తరించాలనే డిమాండ్ ఉంది. అలాగే, గోదావరి బండ్కు వెళ్లే రహదారులు పాడైపోయాయి. గత పుష్కరాల్లో చేసిన పనుల తర్వాత మరమ్మతులు లేకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. అభివృద్ధిని ఒక అవకాశంగా తీసుకోవాలి గోదావరి పుష్కరాలను నరసాపురం అభివృద్ధికి ఒక మంచి అవకాశంగా భావించి, మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్, రహదారుల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సమయం దగ్గరపడుతున్నా అధికారుల నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే పుష్కరాల నిర్వహణ వైఫల్యం చెందే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. -
కౌలుకోలేని దెబ్బ
ఆలయ వార్షికోత్సవం దెందులూరు: కొత్తపల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్వామిని విశేషంగా అలంకరించి పూజలు చేశారు. బుధవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2026సాక్షి, భీమవరం: అన్నదాత సుఖీభవ అమలులో ఎన్నికల హామీని చంద్రబాబు సర్కారు తుంగలోకి తొక్కింది. జిల్లాలో 75 వేల మందికి పైగా కౌలు రైతులు ఉండగా రెండో ఏడాది సాయానికి మొండి చేయి చూపింది. కనీసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా వారి ఆశలపై నీళ్లు చల్లింది. జిల్లాలో 1.5 లక్షల మంది వరకు కౌలు రైతులు ఉండగా వీరిలో దాదాపు 75 వేల మందికి కౌలు గుర్తింపు కార్డులు న్నాయి. సాగులో కష్టం వస్తే ముందుగా కుదేల య్యేది కౌలు రైతులే. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టడం, వచ్చిన పంటలో యజమానికి మిగతా చెల్లించగా వారికి మిగిలేది నామమాత్రమే. పంట తెగుళ్లు, ప్రకృతి విపత్తులతో పంటకు నష్టం కలిగితే అప్పుల ఊబిలో కూరుకుపోయేది వీరే. మరో పని తెలియకపోవడం, పశుపోషణ కోసం కష్టనష్టాలకోర్చి కౌలు సాగుకే మొగ్గుచూపుతుంటారు. కూటమి దగా అసలు రైతుల మాదిరి కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ సాయం, ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు పదేపదే చెప్పుకొచ్చారు. గత ఏడాది మూడు విడతల్లోనూ కూటమి ప్రభుత్వం కౌలు రైతులను పరిగణనలోకి తీసుకోలేదు. 2026–27 సీజన్కు రెండు రోజుల క్రితం తొలివిడతగా జిల్లాలోని 1,03,760 మంది రైతులకు రూ. 68.93 కోట్ల సాయం అందించారు. ఈ ఏడాదైనా తమకు అన్నదాత సుఖీభవ సాయం అందుతుందని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. అన్నదాత సుఖీభవ పోర్టల్లో కనీసం కౌలు రైతులు దరఖాస్తు చేసుకునే ఆప్షన్ ప్రభుత్వం ఇవ్వకపోవడం గమనార్హం. పెట్టుబడి సాయం విడుదల చేయాలని, పంట నష్టపరిహారం ఇవ్వాలని, భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలు రైతులుకు గుర్తింపు కార్డులు జారీచేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కేంద్రాల్లో రెండు రోజుల పాటు నిరసన దీక్షలు నిర్వహించినా కూటమి ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. గత ప్రభుత్వంలో కౌలు గుర్తింపు కార్డు ఇవ్వడంతో పాటు రైతు భరోసాగా ఏటా రూ.13,500 సాయం అందిస్తే ఈ ప్రభుత్వం వచ్చాక సాయం ఆపేశారని కౌలు రైతులు వాపోతున్నారు. కౌలు గుర్తింపు కార్డు ఉన్నా ప్రయోజనం లేదంటున్నారు. రెండేళ్ల కూటమి పాలనలో ప్రచార ఆర్భాటమే తప్ప తమకు ఒరిగిందేమి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం రైతు భరోసా, ఇన్ఫుట్ సబ్సిడీ అందించి కౌలు రైతులను ఆదుకుంది. తాము అధికారంలోకి వస్తే కౌలు రైతులను ఆదుకుంటామని ఎన్నికల్లో కూటమి నాయకులు చెప్పుకొచ్చారు. ఇంతవరకు కౌలు రైతులకు చేసిందేమీ లేదు. గత తొలకరిలో మొంథా తుఫాను వలన జిల్లాలోని 21,236 మంది కౌలు రైతులకు చెందిన రూ. 22.5 కోట్లు మేర పంటనష్టం వాటిల్లితే ఇప్పటికి పరిహారం ఇవ్వలేదు. – రామాంజనేయులు, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏఐ సృష్టించిన చిత్రం కౌలు రైతులకు జగన్ సర్కారు కొండంత అండగా నిలిచింది. అసలు రైతుల మాదిరి రైతుభరోసా, పంటల బీమా పరిహారం, తదితర అన్ని రకాల ప్రయోజనాలను వారికి అందించింది. భూ యజమానుల హక్కులకు భంగం కలుగకుండా కేవలం 11 నెలల కాలానికి సాగు ఒప్పందం చేస్తూ 2011 కౌలు చట్టాన్ని సవరించింది. ఖరీఫ్, రబీ సీజన్కు సంబంధించి ఒకసారి జారీచేసిన కార్డును మళ్లీ యజమాని అంగీకారం మేరకు రెన్యువల్ చేసుకునే వీలు కల్పించారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. భూ యజమానుల్లో అపోహలు తొలగడంతో జిల్లాలో సీసీఆర్సీ కార్డుదారుల జారీ గణనీయంగా పెరిగింది. 2023–24 సీజన్లో జిల్లాలో 84,185 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ లక్ష్యానికి 89,589 కార్డులు జారీచేశారు. జగన్ పాలనలో లక్ష్యానికి మించి కార్డులు జారీ చేస్తే కూటమి పాలనలో కార్డుల సంఖ్య తగ్గించేశారు. గత సీజన్లో జిల్లాలో 1.05 లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా కేవలం 72,259 మందికి మాత్రమే ఇచ్చారు. కౌలు రైతులకు కూటమి దగా ఈ ఏడాది అన్నదాత సుఖీభవ సాయానికి మొండిచేయి కౌలురైతులను పరిగణనలోకి తీసుకోని ప్రభుత్వం జిల్లాలో 75 వేల మంది కౌలురైతుల ఆశలపై నీళ్లు -
రొయ్య రైతులకు వెన్నుపోటు
వీరవాసరంలో ఆక్వా రైతుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, చినమిల్లి వెంకటరాయుడు వీరవాసరం: ఆక్వా రంగాన్ని కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు కానరావడం లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆందోళన వ్యక్తం చేశారు. వీరవాసరం తులసీ ఫంక్షన్ హాలులో మంగళవారం వైఎస్సార్సీపీ శెట్టిబలిజ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రొయ్య రైతుల సమావేశంలో వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ.. ఫీడ్ ధరను కిలో రూ.4 చొప్పున తగ్గిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారని, తీరా కంపెనీలు కేజీకి రూ.2 మాత్రమే తగ్గించి చేతులు దులిపేసుకున్నాయన్నారు. రొయ్యల రైతులకు కూటమి ప్రభుత్వం ఏ మాత్రం న్యాయం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ ఒక్క రోజు ఫీడ్ ధరలు పెంచిన దాఖలాలు లేవన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అప్సడా చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆకివీడు బహిరంగ సమావేశంలో రొయ్య రైతులకు యూనిట్ రూ.1.50కే సబ్సిడీపై విద్యుత్ అందజేస్తానని హామీ ఇచ్చారని, ఎన్నికలైనా తక్షణమే అమలు చేసి 55 వేల విద్యుత్ కనెక్షన్లకు రూ.1.50కే విద్యుత్ అందజేశారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ధీమా వైఎస్సార్సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి చినమిల్లి వెంకటరాయుడు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, పాలకొల్లు ఇన్చార్జి గుడాల శ్రీహరి గోపీలు మాట్లాడుతూ రొయ్య రైతులకు ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే ఆదుకున్న ప్రభుత్వం ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఫీడు ఫ్యాక్టరీ యజమానులకు మాత్రమే కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని విమర్శించారు. రొయ్యల రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించగానే కూటమి ప్రభుత్వం హడావుడిగా రేట్లు తగ్గించినట్లు ప్రకటించి రొయ్యల రైతులను నిలువునా వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. ఫీడ్ రేట్లు వెంటనే తగ్గించాలని, ఎలాంటి షరతులు లేకుండా రూ.1.50 కే విద్యుత్ సబ్సిడీని అందజేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాల్లో నిర్వహించి రొయ్యల రైతులకు మద్దతుగా ఉంటామని పేర్కొన్నారు. సిండికేట్ వ్యవస్థకు కొమ్ముకాస్తున్న కూటమి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడానికి ఎంతో సమయం పట్టదని హెచ్చరించారు. సమావేశంలో చవాకుల సత్యనారాయణ మూర్తి, దొంగ సత్యనారాయణ, వేగేశ్న వెంకటరాజు, గూడూరి ఓంకార్, బొల్లంపల్లి శ్రీనివాస్ చౌదరి, వీరవల్లి శ్రీనివాసరావు, నాగరాజు వెంకట గోపాలకృష్ణంరాజు, మానుకొండ ప్రదీప్ కుమార్, నేతల జ్ఞాన సుందరరాజు, పేరిచర్ల విజయ నరసింహరాజు, నడపన గోవిందరాజులు, కాండ్రేకులు నరసింహరావు, మేడిద జాన్సన్, కాటం స్టాన్లీ రాజు, రొయ్య సంఘాల నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఫీడ్ ధర కేజీకి రూ.2 మాత్రమే తగ్గించడం దారుణం రూ.1.50కే సబ్సిడీ విద్యుత్ ఏమైంది? ఆక్వా రైతుల సమావేశంలో వైఎస్సార్సీపీ నేతల నిలదీత -
అధికారం శాశ్వతం కాదు
● పంతం నానాజీ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ● వైఎస్సార్సీపీ గూడెం కన్వీనర్ వడ్డి రఘురాం తాడేపల్లిగూడెం: అధికారం శాశ్వతం అనే అహంతో వాస్తవ స్థితిని మరిచిపోయి కొందరు జనసేన ఎమ్మెల్యేలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని వారు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని తాడేపల్లిగూడెం వైఎస్సార్సీపీ కన్వీనర్ వడ్డి రఘురాం హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన ఎమ్మెల్యేలు సంస్కారం మరిచి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన అపార స్పందన, కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను చూసి అసహనంతో మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వైఎస్సార్సీపీలోని కాపు సామాజిక వర్గ ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశాన్ని ఉద్దేశించి జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ.. కులంలోని వారిని కుక్కలతో పోల్చి మాట్లాడారని, ఆయన కూడా ఈ గుంపులో ఒక సామాజిక వర్గ కుక్కేనన్న విషయాన్ని గుర్తించాల న్నారు. ఆయనకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి స్వతంత్రంగా పోటీకి దిగుదామని తోట త్రిమూర్తులు విసిరిన సవాల్ను స్వీకరించాలన్నారు. గూడెం మీడియాకు బొలిశెట్టి క్షమాపణ చెప్పాలి తాడేపల్లిగూడెం మీడియాకు గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వడ్డి డిమాండ్ చేశారు. మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్దమన్నారు. వార్తలు రాసినందుకు జర్నలిస్టుల కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడటం అత్యంత హేయమైన చర్య అన్నారు. సభ్య సమాజం తలదించుకొనేలా చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలన్నారు. ప్రజల తరపున ప్రశ్నించే మీడియా తరపున దాడులు, దూషణలు చేయడం ప్రజాస్వామ్యానికి, మీడియా స్వేచ్ఛకు భంగకరమన్నారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మీడియాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏలూరు పార్లమెంటు ఇన్చార్జి కారుమూరి సునీల్ను అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న యువ నాయకుడిని లక్ష్యంగా చేసుకొని రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారన్నారని ఇది సరికాదన్నారు. -
మావుళ్ళమ్మ స్వర్ణ వస్త్రనిధికి ప్రత్యేక కౌంటర్
భీమవరం: పట్టణ ఇలవేల్పు శ్రీమావుళ్ళమ్మ అమ్మవారికి సుమారు 100 కిలోలతో స్వర్ణ వస్త్రాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని, దీనికిగాను ఈనెల 25వ తేదీన ఆలయ ప్రాంగణంలో బంగారు చీర ప్రత్యేక కౌంటర్ను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో దేవస్థానం స్వర్ణ వస్త్ర నిధి కమిటీ సభ్యులతో స్వర్ణవస్త్రం ప్రాజెక్ట్ బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. అమ్మవారికి ఇప్పటి వరకు సుమారు 50 కిలోల బంగారంతో వివిధ ఆభరణాలు చేయించగా మరొక 23 కిలోల బంగారం దేవస్థానం దగ్గర ఉందన్నారు. స్వర్ణవస్త్రానికి ఇంకా 27 కిలోల బంగారం కావాల్సి ఉందని, దాతల సహకారం అవసరమన్నారు. ఆలయ ఈవో, చైర్మన్ పాల్గొన్నారు. పెనుగొండ: దొంగరావిపాలెంలో గోదావరి బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం లభ్యమైంది. కొత్త వంతెన 15వ నంబరు పిల్లరు వద్ద మృతదేహం ఉందంటూ గ్రామ వీఆర్వో సమాచారం అందించడంతో పెనుగొండ పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి సుమారు 55 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉంటుందని, చిన్నగడుల డిజైన్ పొడవు చేతుల చొక్కా, నలుపు రంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడన్నారు. వివరాలు తెలిసిన వారు పెనుగొండ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ఎస్హెచ్ఓ సీహెచ్ రామారెడ్డి కోరారు. సీఐ రాయుడు విజయకుమార్ ఆధ్వర్యంలో పెనుమంట్ర ఎస్సై స్వామి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెనుమంట్ర: బట్టలమగుటూరు గ్రామానికి చెందిన జామి రాజు(28) సోమవారం సాయంత్రం తన ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు రాజు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లేందుకు అదే గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తికి రూ. 20 వేలు డబ్బులు చెల్లించి చైన్నె మెడికల్కు వెళ్లి అన్ఫిట్ కావడంతో తిరిగి వచ్చేశాడు. అనంతరం డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా రాంబాబును కోరగా సరైన సమాధానం చెప్పకపోవడంతో మనస్థాపానికి గురై రాజు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. రాజు తల్లి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. తండ్రి సూరిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జామిరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కొయ్యలగూడెం: గవరవరం గ్రామంలో మంగళవారం పట్టపగలే చోరీ సంభవించింది. వెంకయ్యపాలెం రోడ్డులో రైతు దుగ్గిరాల భాస్కరరావు ఇంట్లో ముగ్గురు దుండగులు ప్రవేశించి 9 కాసుల బంగారం, ఒక కేజీ వెండి అపహరించారు. ఇంటి పక్కనే ఉన్న పొలంలోకి తన భర్తకు టీ ఇవ్వడానికి వెళ్లి వచ్చేలోపే దుండగులు రావడం.. చోరీ చేయడం జరిగిందని భాస్కరరావు భార్య ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలో చిక్కిన ముగ్గురు అగంతకులు ఎవరనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు (టూటౌన్): గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు స్థానిక సత్రంపాడులోని ఏలూరు సర్కిల్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్త ఆందోళనల్లో భాగంగా తపాలా ఉద్యోగులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జనరల్ సెక్రటరీ మహాదేవయ్యను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. గ్రామీణ తపాలా ఉద్యోగులకు డిపార్టుమెంట్ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ పథకాన్ని కొనసాగించాలని, వారికి కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను జీడీఎస్లకు కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐజీడీఎస్యు ఏలూరు డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.దుర్గారావు, ఎస్కె బాజీ పాల్గొన్నారు. -
ప్రజల దృష్టి మళ్లించడానికే అక్రమ అరెస్ట్లు
భీమవరం: చంద్రబాబు పాలనపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి వైఎస్సార్సీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయిస్తున్నారని వైఎస్సార్సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు మండిపడ్డారు. మంగళవారం భీమవరంలోని పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి సునీల్కుమార్ అక్రమ అరెస్ట్ దీనికి నిదర్శనమన్నారు. డ్రగ్స్ పార్టీలో దొరికిన ఏలూరు ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోలేని ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమంగా కేసులు మోపి అరెస్ట్లు చేయిస్తున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అక్రమ కేసులు, అరెస్ట్లకు భయపడరని స్పష్టం చేశారు. మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావును వేధించడానికే ఆయన తనయుడు సునీల్కుమార్పై కేసులన్నారు. ప్రజలు దీనిని గ్రహించి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, మాజీ అధ్యక్షుడు కోడే యుగంధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలుచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలను ప్రశ్నించడం వల్లే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సునీల్కుమార్పై అక్రమంగా పెట్టిన కేసులు ఎట్టి పరిస్థితిలోను నిలబడవన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజల సమస్యలు పరిష్కారం, అభివృద్దిపై దృష్టిపెట్టాలని హితవు చెప్పారు. -
విద్యార్థి మిత్ర ఎక్కడ..?
పాఠశాలలు పునఃప్రారంభమై పది రోజులు దాటినా విద్యార్థులకు టెస్ట్బుక్స్, నోటుపుస్తకాలు తప్ప విద్యార్థి మిత్రలో ఇప్పటివరకు ఏమి అందలేదు. గతేడాది ఇచ్చిన యూనిఫామ్, చినిగిన బ్యాగులతోనే పాఠశాలలకు వస్తున్నారు. కొందరు విద్యార్థులకై తే కాళ్లకు చెప్పులు లేకుండానే హాజరవుతున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు మార్కెట్లో కొనుగోలు చేసిన బ్యాగులను తీసుకువస్తున్నారు. ప్రభుత్వం చెప్పే మాటలు గొప్పగా ఉన్నా.. ఆచరణలో మాత్రం శూన్యం అనడానికి ఈ చిత్రాలే ఉదాహరణ. దెందులూరు మండలం కొవ్వలి జడ్పీహైస్కూల్లో విద్యార్థుల ఇబ్బందులు ఇవి. –సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు -
అక్రమాల్లో సహకారం
నూజివీడు: రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం స్నాతకోత్సవాన్ని ఈనెల 27న నిర్వహించనున్నట్టు వైస్ చాన్సలర్ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు తెలిపారు. నూజివీడు ట్రిపుల్ఐటీలో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే స్నాతకోత్సవంలో ముఖ్య అతిథులుగా నీతి ఆయోగ్ సభ్యుడు ఆచార్య గోవర్ధన్దాస్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారన్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లా సహకార శాఖలో అవినీతి హద్దులు దాటుతోంది. సొసైటీ ఆదాయ వ్యయాలతో సంబంధం లేకుండా కోట్లాది రూపాయలు గోల్మాల్ చేయడం, పక్కదారి పట్టించడం వంటి వ్యవహారాలపై విచారణ జరిగినా చర్యలు మాత్రం ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. పదుల సంఖ్యలో సొసైటీల్లో భారీగా అవకతవకలు గుర్తించి కోట్లాది రూపాయలను కొందరు అధికారులు వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నా చర్యలు తీసుకోకపోవడం అవినీతికి పరాకాష్టగా నిలుస్తోంది. రంగాపురం, టి.నర్సాపురం సొసైటీల్లో అవకతవకలను గుర్తించి చర్యలకు సిఫార్సులు చేసినా నెలల తరబడి పెండింగ్లోనే ఉన్న పరిస్థితి. రూ.కోట్లు నొక్కేసినా.. లింగపాలెం మండలంలోని రంగాపురం సొసైటీలో రుణాలను రైతులు తిరిగి చెల్లించినా కార్యదర్శి వ్యక్తిగతంగా వినియోగించుకోవడంతో పాటు ఎరువుల లోన్లలోనూ అక్రమాలకు పాల్పడ్డారు. సొసైటీ కా ర్యదర్శి సీహెచ్ ప్రసాద్, పాలకవర్గ అధ్యక్షుడు రూ.2,06,16,302 దుర్వినియోగానికి పాల్పడినట్టు గుర్తించి విచారణ అధికారులు కార్యదర్శిని సస్పెండ్ చేశారు. ఇదే వ్యవహారంలో చింతలపూడి బ్రాంచ్ మేనేజర్లు టి.చంద్రశేఖర్, జి.మారేశ్వరరావు, అసిస్టెంట్ మేనేజర్ ఎస్వీ శ్రీనివాసరావు, ఇతర ఫీల్డ్సాఫ్ట్ ప్రమేయం ఉందని విచారణ అధికారి ఏడు నెలల క్రితం నివేదిక సమర్పించినా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. అలాగే ఇక్కడ ఎరువుల విక్రయాల్లో రూ.41.85 లక్షలు, రుణాల్లో రూ.15.65 లక్షల అవకతవకలు జరగ్గా రూ.14.53 లక్షలు రికవరీ, చెల్లించిన రూ.59.94 లక్షల రుణాలను క్యాష్ రూపంలో చూపించకపోవడం, షేర్ క్యాపిటల్ కంటే క్యాష్ బ్యాలెన్స్ ఎక్కువగా చూపడం వంటివి చేశారు. ఈ కోణంలో విచారణ అధికారిగా ఉన్న డిప్యూటీ రిజిస్ట్రార్ డీసీఓకు నివేదిక ఇచ్చి క్రిమినల్ చర్యలకు సిఫార్సులు చేసినా జిల్లా సహకార శాఖ అధికారి ఫైల్ను పెండింగ్లో పెట్టేశారు. రుణాలు జమచేయరు.. డాక్యుమెంట్లు ఇవ్వరు అలాగే టి.నర్సాపురం సొసైటీలో అప్పటి మేనే జర్లు, కుటుంబసభ్యుల పేరుతో రుణాలు తీసుకున్నట్టు విచారణలో నిర్ధారించినా చర్యలు మాత్రం తీసుకోలేదు. ఈ వ్యవహారం కూడా సహకార శాఖ అధికారి వద్దే పెండింగ్లో ఉంది. ఇలా పలు రిపోర్టులు భారీ వ్యవహారాలతో పెండింగ్లో ఉంటా యనేది శాఖాపరమైన టాక్. తాజాగా జంగారెడ్డిగూడేనికి చెందిన ఓ రైతు సొసైటీలో చెల్లించిన రుణాన్ని కార్యదర్శి వ్యక్తిగతంగా వాడుకోవడంతో పాటు డాక్యుమెంట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పె డుతున్నారు. దీంతో బాధిత రైతు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయగా జాయింట్ కలెక్టర్ను విచారణ అధికారిగా నియమించారు. సహకార శాఖ ఉన్నతాధికారుల ప్రమేయంతో రూ.లక్షల నగదు చేతులు మారిందనే ఆరోపణలతో విచారణ కొనసాగుతుంది. ఏఐ సృష్టించిన చిత్రం హద్దుల్లేని అవినీతి సొసైటీల్లో స్వాహాపర్వం రంగాపురం, టి.నర్సాపురం, జంగారెడ్డిగూడెంలో అవకతవకలు క్రిమినల్ చర్యలు, రికవరీలు శూన్యం జిల్లా అధికారి వద్దే పెండింగ్లో ఫైళ్లు రైతు ఫిర్యాదు మేరకు జేసీ విచారణ -
అదుపు తప్పి చెట్టును ఢీకొన్న బస్సు
● డ్రైవర్కు తీవ్రగాయాలు ● నూజివీడు నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఘటన ● ప్రయాణికులకు తప్పిన ప్రమాదం నూజివీడు: నూజివీడు డిపోకు చెందిన శ్రీశైలం వెళ్లే బస్సు ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. మార్కాపురం జిల్లా కుంట సమీపంలో బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ రాంబాబుకి తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను మార్కాపురం ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. విశ్రాంతి లేకుండా డ్యూటీలు చేయించడమే కారణమా? శ్రీశైలం వెళ్లే బస్సు ప్రమాదానికి గురికావడం వెనుక యాజమాన్యం కార్మికులపై చేస్తున్న ఒత్తిడి, నిర్లక్ష్యమే అసలు కారణమనే విమర్శలు కార్మికుల్లో నుంచి వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు సరిపడా విశ్రాంతి లేకుండానే డ్యూటీలు వేయడం వల్లనే ఈ ప్రమాదం జరగడానికి బలమైన కారణమని పేర్కొంటున్నారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ కే రామకృష్ణ ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు నూజివీడు–యర్రగొండపాలెం సర్వీసు డ్యూటీ చేసి డ్యూటీ దిగాడు. అతనిని మరలా వెంటనే రాత్రి 8 గంటలకు సూపర్ లగ్జరీ సర్వీసుకు డ్యూటీ వేసి శ్రీశైలం సర్వీసుకు పంపించారు. దీంతో సరిపడా విశ్రాంతి లేక ప్రమాదం జరిగిందనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది. ఇలా సరిపడా విశ్రాంతి లేకుండా డ్రైవర్లను డ్యూటీకి పంపడమంటే ప్రయాణికుల ప్రాణాలను సైతం రిస్క్లో పెట్టినట్లేనని ఆర్టీసీ కార్మికులు పేర్కొంటున్నారు. నూజివీడు డిపోలో డ్రైవర్లకు సరిపడా విశ్రాంతి ఇవ్వకుండా 16గంటల నుంచి 18గంటల వరకు డ్యూటీ చేయిస్తున్నారని కార్మికులు ఎప్పటి నుంచో ఆందోళనలు చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఇటీవల కాలంలో నాలుగు యాక్సిడెంట్లు చోటుచేసుకోవడం గమనార్హం. ఆ డ్రైవర్ను దూరప్రాంతాలకు ఎలా పంపుతారు? ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ కే రామకృష్ణ గతంలో భీమవరం డిపోలో పనిచేస్తూ అక్కడ ప్రమాదం చేసి పనిష్మెంట్పై నూజివీడు డిపోకు బదిలీ అయ్యారు. అలాంటి డ్రైవర్ను యాజమాన్యం కేవలం పల్లెవెలుగు సర్వీసులకు మాత్రమే పంపాల్సి ఉండగా ఇక్కడ మాత్రం హైదరాబాద్, శ్రీశైలం వంటి దూర ప్రాంత సర్వీసులకు పంపడం గమనార్హం. శ్రీశైలంకు కండక్టర్ సర్వీసులను ఏర్పాటు చేయమని కార్మికసంఘాల నాయకులు పదేపదే యాజమాన్యానికి చెబుతున్నా పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ లాంటి ప్రజా రవాణా సంస్థల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం డ్రైవర్ తప్పు అనడం కంటే, దాని వెనుక ఉన్న అసలు కారణాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. -
అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులను సకాలంలో పరిష్కరించి పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి సూచించారు. భీమవరం కలెక్టరేట్లో సోమవారం జిల్లాస్థాయి అధికారులు, తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రగతి, ఐగాట్ కర్మయోగి కోర్సుల అమలుపై సమీక్షించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలన్నారు. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన పీజీఆర్ఎస్ దరఖాస్తులపై శాఖల వారీగా ఆడిట్ నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. ఐగాట్ కర్మ యోగి కార్యక్రమంపై సమీక్షిస్తూ ప్రభుత్వ ఉద్యోగులంతా వంద శాతం నమోదు చేసుకోవాలని సూ చించారు. డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పారిశుధ్య నిర్వహణపై.. పట్టణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య సంరక్షణ, భూ గర్భ జలాల కాలుష్య నివారణకు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏ ర్పాటుకు అవసరమైన స్థలాలను త్వరితగతిన సే కరించి పనులు ప్రారంభించాలని జేసీ ఆదేశించా రు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన అధికారులతో సమీక్షించారు. -
ఎకై ్సజ్ స్టేషన్ పరిశీలన
నూజివీడు: పట్టణంలోని ఎకై ్సజ్ స్టేషన్ను ఏలూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ బీ శ్రీలత, ఏలూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కేవీ నాగ ప్రభుకుమార్ సోమవారం సందర్శించి రికార్డులను పరిశీలించారు. గతంలో ఐడీ మద్యం కేసుల్లో నిందితులైన వారందరిపై సెక్షన్ 129 బీఎన్ఎస్ఎస్ కింద కేసులు నమోదు చేయాలని, పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. పునరావాస చర్యలతో పాటు వారి కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వ్యక్తులపై నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేయాలన్నారు. ఎకై ్సజ్ సీఐ ఏ మస్తానయ్య పాల్గొన్నారు. భీమవరం: పట్టణంలోని గునుపూడిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న నారాయణ స్కూల్ను అధికారులు సోమవారం సీజ్ చేశారు. స్కూల్ భవన నిర్మాణం పనులు జరుగుతుండగానే విద్యార్థులకు తరగతులు నిర్వహించడంతోపాటు పుస్తకాలు, విద్యాసామాగ్రి అమ్మకాలు చేస్తుండడంపై ఎస్ఎఫ్ఐ నాయకులు గత వారం ఆందోళన చేపట్టగా డీవైఈవో రమేష్ స్కూల్ను సందర్శించి సీజ్ చేశారు. తిరిగి మళ్లీ తరగతులు నిర్వహిస్తుండడంపై ఎస్ఎఫ్ఐ నాయకులు అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎంఈవో శ్రీనివాస్ నారాయణ స్కూల్ను సందర్శించి సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యహరిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ భీమవరం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పి.సాయికృష్ణ, ఎస్.లక్ష్మణ్, సభ్యులు బి సింధు, పి త్రినాథ్, జి కౌశిక్, జి అభి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: మండలంలోని తిరుమలాపురం పంచాయతీ వీరన్నగూడెం గ్రామానికి చెందిన రాజనాల దుర్గ (75) హత్యకు గురైనట్లు కేసు నమోదు చేశామని ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. రాజనాల గౌరయ్య ఈ హత్యకు పాల్పడినట్లు హతురాలి కొడుకు రాజనాల దండియ్య సోమవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. రాజనాల గౌరయ్య ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి, ఇటీవలే విడుదలై వచ్చినట్లు తెలిపారు. గ్రామంలో రాజనాల దుర్గ, కుటుంబసభ్యులతో సహా గౌరయ్య కూడా ఉపాధి పనులకు వెళుత్నుట్లు చెప్పారు. అయితే గౌరయ్య ప్రతి రోజు మద్యం చేవించి రావడంతో దుర్గ మందలించేదన్నారు. దీంతో కక్ష పెట్టుకున్న గౌరయ్య ఈ నెల 13వ తేదీ మధ్యాహ్న సమయంలో దుర్గ నిద్రిస్తుండగా, గొంతు నొక్కి హత్య చేసినట్లు తెలిపారు. అయితే వడదెబ్బ తగిలి దుర్గ మృతిచెందినట్లు భావించిన కుటుంబసభ్యులు, అదే రోజు ఆమె మృతదేహాన్ని దహనం చేసి అంత్యక్రియలు నిర్వహించారన్నారు. అయితే ఈ నెల 21న అనుమానంతో దుర్గ కొడుకు దండియ్య, కుటుంబసభ్యులు, గ్రామ పెద్దలు గౌరయ్యను నిలదీయగా, దుర్గ తనను తిడుతుందని కక్ష పెంచుకుని హత్య చేసినటు ఒప్పుకుని, అక్కడ నుంచి పరారైనట్లు తెలిపారు. కాగా, గౌరయ్య దండియ్యకు బాబాయ్ కొడుకు అవుతాడు. అలాగే హతురాలు దుర్గ పెద్దమ్మ అవుతుంది. -
పెద్దింట్లమ్మను దర్శించి వస్తూ...
● చెట్టును ఢీకొన్న కారు ● ఒకరి మృతి.. ఐదుగురికి గాయాలుఉంగుటూరు: చేబ్రోలు పరిధిలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం.. గణపవరానికి చెందిన ఫణీంద్ర (26)తో పాటు నిడమర్రు గ్రామానికి చెందిన వేగిరెడ్డి షణ్ముఖ తేజ, వేగిరెడ్డి హేమంత్ ఫణిచంద్ర, కట్టుబోయిన వెంకన్న, ప్రవీణ్, మంగరాజు కారులో కై కలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరిగి స్తుండగా, చేబ్రోలు ఆంజనేయస్వామి గుడి సమీపంలో కారు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ఫణీంద్ర తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మిగిలిన ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే జాతీయ రహదారి అంబులెన్స్, 108 వాహనాల ద్వారా క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
32 బ్యాంకులు.. 262 సొసైటీలు
ఉమ్మడి పశ్చిమలో 32 సహకార కేంద్ర బ్యాంకుల పరిధిలో 262 సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. దాదాపుగా 90 శాతానికిపైగా సొసైటీల్లో కూటమి నేతలే చైర్మన్లుగా ఉన్నారు. అలాగే ప్రతి సొసైటీకి సీఈఓ సహకార శాఖ పరిధిలో పనిచేస్తుంటారు. రైతులకు రుణాలు ఇవ్వడం, ఎరువులు విక్రయించడం ప్రధాన విధిగా సంఘాలు పనిచేస్తుంటాయి. అలాగే సహకార శాఖ షేర్ క్యాపిటల్కు అనుగుణంగా, ఎరువుల విక్రయా ల్లోని లాభాలతో సొసైటీల పేరిట కొన్ని వ్యాపారాలు సైతం నిర్వహిస్తుంటారు. కొందరు ఉద్యోగులు వ్యక్తిగత అవసరాలకు కోట్లాది రూపా యలు వాడుకోవడం జిల్లాలో నిత్యకృత్యంగా మారింది. ఎరువుల విక్రయాలు, రుణాల మంజూరులో అవకతవకలు, రైతులు చెల్లించిన రు ణాలు బ్యాంకు ఖాతాల్లో చూపకపోవడం వంటి అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. -
కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం
నూజివీడు: కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం చేస్తున్న తీవ్ర జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు తీవ్ర మానసిక వేదనకు గురై బలవన్మరణాలకు పాల్పడే ప్రమాదం కూడా పొంచి ఉందని నవ్యాంధ్ర కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కోనేరు శ్రీనివాస ప్రసాద్ అన్నారు. నూజివీడులో గుండెపోటుతో మృతి చెందిన కాంట్రాక్టర్ చలసాని సురేష్కుమార్(నాని) కుటుంబ సభ్యులను సోమవారం అసోసియేషన్ నాయకులు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత రెండేళ్లుగా చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లందరూ తీవ్రమైన ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు టైం బాంబుల్లా బతుకుతున్నారని, ప్రత్యక్షంగా 750 మంది కాంట్రాక్టర్లు, వారిపై ఆధారపడిన 15వేల మందికి చెందిన కుటుంబాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయన్నారు. గత రెండేళ్లుగా జలజీవన్ మిషన్ బిల్లులు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్ల ఆత్మస్థైర్యం పూర్తిగా దెబ్బతిందని, వ్యవస్థపై దాదాపు నమ్మకాన్ని కూడా కోల్పోయామన్నారు. గతంలో ప్రభుత్వ కాంట్రాక్టర్ల పరిస్థితి చూస్తే ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పుడల్లా చెల్లింపులు జరుగుతాయనే భరోసా ఉండేదన్నారు. వ్యవస్థను కార్పొరేట్లకు అనుకూలంగా మార్చి కాంట్రాక్టర్ల వెన్ను విరిచేస్తున్నారన్నారు. రుణాల చెల్లింపుపై ఒత్తిడి పెరగడంతో కాంట్రాక్టర్లు బలవన్మరణాలకు పాల్పడే ప్రమాదం పొంచి ఉందన్నారు. మరోవైపు తీవ్ర ఒత్తిడికి గురై చలసాని సురేష్ గుండెపోటుతో ఆసుపత్రి కి తీసుకువెళ్లే సమయం కూడా లేకుండా మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ నేపథ్యంలో మృతి చెందిన కాంట్రాక్టర్ కుటుంబానికి రావాలసిన బిల్లులను తక్షణం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, తమ అసోసియేషన్ సైతం వారికి అండగా నిలుస్తుందన్నారు. ఈ సమావేశంలో సెక్రటరీ ఎన్వీఆర్కే రాజు, కోశాధికారి కే బాలకృష్ణ, సంయుక్త కార్యదర్శి ఏ నరసింహా, స్థానిక కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
బావిలో పూడిక తీస్తూ దుర్మరణం
పోలవరం రూరల్: జీవనోపాధి కోసం పనికి వెళ్లిన ఇద్దరు కూలీలను కాలకూట విషవాయువు బలితీసుకున్న ఘోర విపత్తు ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం పంచాయతీ పరిధిలోని నూతనగూడెంలో చోటు చేసుకుంది. బావిలో పూడికతీసేందుకు దిగిన ఓ కూలీ ఊపిరాడక ఇబ్బంది పడుతుండగా, అతనిని కాపాడేందుకు దిగిన మరో సహచర కూలీ కూడా ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఘటన వివరాలు ఇలా.. స్థానిక పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. పోలవరం బీసీ కాలనీకి చెందిన కదల చిట్టబ్బాయి రెడ్డి అలియాస్ చిట్టిబాబు (35), బండి వీర వెంకట్రావు (56), గుడిసె రాజు అనే ముగ్గురు కూలీలు సోమవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో నూతనగూడెం కనకదుర్గమ్మ గుడి ఎదురుగా ఉన్న బండి మునేశ్వరరావు ఇంటి ఆవరణలోని బావిలో పూడిక తీసేందుకు పని కుదుర్చుకున్నారు. పని ప్రారంభించిన అనంతరం చిట్టబ్బాయి రెడ్డి (చిట్టిబాబు)(35) మొదటగా బావిలోకి దిగాడు. అయితే బావి లోపల తగినంత ఆక్సిజన్ లేకపోవడం లేదా లోపల పేరుకుపోయిన విషవాయువుల ప్రభావం వల్ల అతనికి ఒక్కసారిగా ఊపిరి ఆడలేదు. దీంతో శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతూ పైకి రాలేక బావిలోనే ఉండిపోయాడు. రక్షించబోయి.. రాలేకపోయి.. చిట్టిబాబు ప్రాణాపాయంలో ఉన్నాడని గమనించిన బండి వీర వెంకట్రావు (56) క్షణం కూడా ఆలోచించలేదు. ఎలాగైనా తన సహచరుడిని కాపాడుకోవాలనే తాపత్రయంతో స్థానికుల సహాయంతో నడుముకు తాడు కట్టుకుని బావిలోకి దిగాడు. లోపల స్పృహ తప్పుతున్న చిట్టిబాబును పట్టుకుని పైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండగా, దురదృష్టవశాత్తు తాడుకు వేసిన ముడి ఊడిపోయింది. దీంతో ఇద్దరూ తిరిగి బావిలో పడిపోయారు. లోపల ఊపిరాడకపోవడం, అలాగే బావిలోని నీటిలో మునిగిపోవడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాల వెలికితీత ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలవరం సీఐ బి.కృష్ణకుమార్, ఎస్సై పి.అప్పారావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. తక్షణమే 108 అంబులెన్స్ సిబ్బందికి, కొవ్వూరు అగ్నిమాపక శాఖ రెస్క్యూ బృందానికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు స్థానికుల సహాయంతో శ్రమించి బావిలో నుంచి ఇద్దరి మృతదేహాలను బయటకు వెలికితీశారు. కళ్లెదుటే ఇద్దరు వ్యక్తులు శవాలుగా మారడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా మిన్నంటింది. కాగా, మృతుడు కదల చిట్టబ్బాయి రెడ్డి భార్య ముత్యాలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలవరం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కూలీలు పోలవరం పంచాయతీ నూతనగూడెంలో విషాదం శోకసంద్రంలో కూలీల కుటుంబాలు -
ఆదారం తెగుతోంది
అత్తిలి మండలం శివపురం చేనేతకు ప్రసిద్ధి. గ్రామంలో 200కు పైగా కుటుంబాలు ఉంటే అధికంగా చేనేత కుటుంబాలే. గ్రామంలో 140 వరకు కుటుంబాలు మగ్గం నేస్తుంటే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అర్హత కలిగిన సుమారు 120 కుటుంబాలకు నేతన్న నేస్తం లబ్ధి చేకూరింది. అదనంగా అమ్మఒడి, చేయూత, పింఛన్ తదితర పథకాల ప్రయోజనం అందింది. కూటమి ప్రభుత్వ హయాంలో చేనేతకు తోడ్పాటు లేక, సంక్షేమం కానరాక నేత కార్మికులు ఇతర పనుల్లోకి వెళ్లిపోతుండటంతో మగ్గాలు మూలకు చేరుతున్నాయి. కలెక్టరేట్ వద్ద నేతన్నల నిరసన మంగళవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2026ప్రభుత్వ చేనేత వ్యతిరేక విధానాలతో పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది. కేంద్ర బడ్జెట్లో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడానికి రూ.25 వేల కోట్లు, రాష్ట్ర బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించాలి. ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి చేనేత రంగాన్ని ఆదుకోవాలి. –బళ్ల చినవీరభధ్రరావు, ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఏడాదికి రూ.25 వేలు, 50 ఏళ్లకే పింఛన్ తదితర ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం అమలుచేయాలి. దివంగత వైఎస్ చేనేతను అన్ని విధాలా ఆదుకున్నారు. ఆయన తనయుడు మాజీ సీఎం జగన్ నేతన్న నేస్తం, ఇతర సంక్షేమ పథకాలతో నేత కార్మికులు అండగా ఉన్నారు. – వీరా మల్లికార్జునుడు, వైఎస్సార్సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు సాక్షి, భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పది వేలకు పైగా చేనేత కుటుంబాలు ఉన్నాయి. పాలకొల్లు, అత్తిలి, యలమంచిలి, పెంటపాడు, పోడూరు, ఆచంట మండలాల్లో నేత కార్మికులు అధికంగా ఉన్నారు. దివంగత సీఎం వైఎస్ హయాంలో చేనేత రంగం ఒక వెలుగు వెలిగింది. 50 ఏళ్లకే పింఛన్, రుణమాఫీ, ఆర్టిజన్ క్రెడిట్ కార్డుల ద్వారా పావలా వడ్డీ రుణాలు, చిలప నూలుపై పది శాతం సబ్సిడీ, ఉచిత వైద్య శిబిరాలు, ఇళ్ల నిర్మాణం తదితర ఎన్నో కార్యక్రమాల ద్వారా చేనేతను ఆదుకున్నారు. నేతన్నలకు అండగా మాజీ సీఎం జగన్ తండ్రిని మించిన తనయునిగా నేతన్నలకు అండగా నిలిచారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. సొంత మగ్గం ఉన్న వారికి వైఎస్సార్ నేతన్న నేస్తంగా ఏటా రూ.24 వేలు సాయం అందించారు. ఐదేళ్లలో ఉమ్మడి జిల్లాలో సరాసరి 1,063 కుటుంబాలకు రూ.12.76 కోట్ల లబ్ధి చేకూరింది. దీనికితోడు అమ్మఒడి, చేయూత, పింఛన్, వాహనమిత్ర, ఆరోగ్య శ్రీ వైద్యం తదితర పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి లక్షలాది రూపాయల ప్రభుత్వ సాయం అందింది. కూటమి పాలనలో హామీలు గాలికి.. చీర–ధోవతి పథకాన్ని పునరుద్ధరిస్తానని, చేనేత ఉత్పత్తులపై 30 శాతం రిబేటు ఇస్తానని 2014 ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. 2024 ఎన్నికల్లో కార్మికులకు ఏటా రూ.25 వేలు, 50 ఏళ్లకే పింఛనంటూ ఊదరగొట్టారు. రెండేళ్లుగా ప్రోత్సాహం కరువై చేనేత కుటుంబాలకు పూటగడవడం కష్టంగా మారింది. బతుకుదెరువు కోసం మగ్గాలకు స్వస్తి చెబుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చాలామంది కార్మికులు నేత పని వీడి వేరే పనుల్లోకి వెళ్లిపోతున్నారు. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, జీఎస్టీ మినహాయింపు వంటివి కంటితుడుపు చర్యలుగా కార్మికులు కొట్టిపారేస్తున్నారు. వినతిపత్రం ఇచ్చిన వైఎస్సార్టీయూసీ నాయకులు కొరుటూరు ప్రాంతానికి వెళుతున్న అటవీ శాఖ సిబ్బంది ఆదాయాన్ని లెక్కిస్తున్న దృశ్యం సంవత్సరం లబ్ధిదారులు ప్రభుత్వ సాయం (రూ.కోట్లలో)2019–20 996 2.39 2020–21 1,254 3.01 2021–22 899 2.16 2022–23 988 2.37 2023–24 1,027 2.83 చేనేతపై చిన్నచూపు రెండేళ్లయినా నేతన్నల వైపు కన్నెత్తి చూడని కూటమి సర్కారు ప్రోత్సాహం లేక మూలకు చేరుతున్న మగ్గాలు 50 ఏళ్లకే పింఛన్, నేతన్న నేస్తం హామీలు గాలికి.. హామీల అమలుకు నేత కార్మికుల డిమాండ్ కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో వినతి నేతన్నలకు అండగా నిలిచిన గత జగన్ సర్కారు ఉమ్మడి జిల్లాలోని 1,070 కుటుంబాలకు రూ.12.76 కోట్ల సాయం ఎన్నికల వాగ్దానాలు అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు సోమవారం జిల్లాలోని చేనేత కార్మిక సంఘం నాయకులు భీమవరం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఏడాదికి రూ.25 వేల చొప్పున రెండేళ్లకు ఒక్కో కార్మికునికి రూ.50 వేల సాయం అందించాలని కోరారు. వైఎస్ హయాంలో 50 ఏళ్లకే పింఛన్ జీఓ తెచ్చారని, జగన్ ప్రభుత్వం జీఓను అమలుచేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఈ జీఓను తుంగలోకి తొక్కడంతో 50 ఏళ్లు నిండిన కార్మికులు పింఛన్ అందక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత కలిగిన కార్మికులకు ఏడాదికి పింఛన్ సాయం రూ.48 వేల చొప్పున రెండేళ్లకు రూ.96 వేలు అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ఉపవృత్తుల కార్మికులకు అందజేయాలని, చేనేత రుణాలు మాఫీ చేయాలని తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పీజీఆర్ఎస్లో అధికారులకు అందజేశారు. -
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నేరం
తాడేపల్లిగూడెం (టీఓసీ): బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమని, కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఈ.స్వరాజ్యలక్ష్మి అన్నారు. పట్టణ పరిధిలో ఆదివారం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, కేసులు నమోదు చేశారు. ఆమె మాట్లాడుతూ మద్యం దుకాణాల్లో అనుమతించిన పర్మిట్ రూమ్ల్లో మాత్రమే మద్యం సేవించేందుకు అనుమతి ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టప్రకారం చర్యలు, కేసులు నమోదు ఉంటాయని, శిక్షలు అమలు అవుతాయని వివరించారు. దెందులూరు: గాలాయగూడెం వైపు సైకిల్పై వెళుతున్న మట్ట అంజయ్యను వెనుక నుంచి జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వైపు వస్తున్న కారు శనివారం నాగులదేవునిపాడు శివారులో అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంజయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అంజయ్యను స్థానికులు, బంధువులు ఆటోలో ఏలూరు ఆంధ్ర వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ అంజయ్య ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడని ఎస్ఐ వెంకట్కుమార్ తెలిపారు. మృతి చెందిన అంజయ్య స్వగ్రామం గాలాయగూడెం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఎంటీఎస్ టీచర్ల వినతి
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లావ్యాప్తంగా మిని మం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) డీఎస్సీ 2008, 1998 ఉపాధ్యాయులకు సోమవారం తలపెట్టిన బదిలీల్లో జిల్లాలోని అన్ని ఖాళీలను ప్రదర్శించాలని ఎంటీఎ స్ ఉపాధ్యాయుల సంఘ నాయకులు డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మను కోరారు. ఈ మేరకు డీఈఓకు వినతిపత్రం సమర్పిస్తూ ఎంటీఎస్ ఉపాధ్యాయు లు కొన్నేళ్లుగా సుదూర ప్రాంతాల్లో చాలీచా లని జీతాలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. బదిలీల సందర్భంగా జిల్లాలోని అన్నిరకాల ఖాళీలను చూపడం ద్వారా కొందరికై నా న్యా యం జరుగుతుందన్నారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులు తోట ఎడ్వర్డ్, సీహెచ్ ప్రవీణ్కుమార్, సయ్యద్ బాజీ పాల్గొన్నారు. -
సత్య కేంద్రాన్ని ధ్వంసం చేసిన టీడీపీ నేతలు
ఆగిరిపల్లి: ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కనసానపల్లిలో మాజీ గవర్నర్ కృష్ణకాంత్ చేతుల మీదుగా ప్రారంభించిన సత్య కేంద్రాన్ని గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. గ్రామంలో కుటుంబ తగాదాలు, గ్రామ సమస్యల పరిష్కారం కోసం 1993లో రాష్ట్రంలోనే మొదటిసారిగా కనసానపల్లిలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. దీనిపై గ్రామానికి చెందిన పచ్చ నేతల కన్ను పడింది. సత్య కేంద్రాన్ని పునర్నిర్మాణం చేస్తామంటూ గ్రామస్తులను సంప్రదించకుండానే ఆదివారం ఉదయం ధ్వంసం చేశారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
వామ్మో పిడుగులు.. తస్మాత్ జాగ్రత్త
బుట్టాయగూడెం: వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుంటాయి. ఈ నేపథ్యంలో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిడుగు ఎప్పుడు, ఎలా పడుతుందో తెలియని పరిస్థితిలో ప్రమాదాలు జరిగి ఒక్కోసారి ప్రాణనష్టం కూడా సంభవిస్తుంది. అలాగే, మెరుపుల ధాటికి గృహోపకరణాలు కూడా కాలిపోతుంటాయి. పిడుగులోని కాంతి ప్రభావంతో నష్టం భారీగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పిడుగుల నుంచి రక్షించుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు మెసేజ్ల రూపంలో హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. జాగ్రత్తలు పాటించడం ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఏజెన్సీ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసిన సమయంలో పలు గ్రామాల్లో పిడుగులు పడ్డాయి. పిడుగు అంటే ఏమిటి? వాతావరణంలో చోటు చేసుకునే పరిణామాలతో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, మెరుపు వేగంతో విద్యుత్ కాంతి నేలకు చేరుకుంటుంది. మేఘాల మధ్య విద్యుదావేశం పెరిగి, వాతావరణంలోని తేమ, దుమ్ము కారణంగా స్థిర విద్యుత్ భూమివైపు ప్రవహిస్తుంది. ఒక మిల్లీసెకన్ కాలంలో మెరుపుతో కూడిన పిడుగు 20 వేల ఆంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని విడుదల చేస్తుంది. అప్పుడు ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రత 2 లక్షల ఓల్టులతో సమానం. ఇది భూమి నుంచి 1 నుంచి 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. రెండు మేఘాల మధ్య అయితే 7 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. మెరుపులు భూమి మీద పడినప్పుడు వస్తువులను బట్టి నష్ట తీవ్రత ఉంటుంది. కాపర్ ఎర్తింగ్తో ప్రమాదానికి చెక్ పిడుగుపాటు నుంచి తప్పించుకునేందుకు ఎత్తైన ప్రదేశాల్లో నేరుగా భూమిలోకి శ్రీకాపర్ ఎర్తింగ్శ్రీ (రాగి వైర్ను అనుసంధానం చేస్తూ భూమిలోకి పాతడం) ఏర్పాటు చేయడం ద్వారా, దాదాపు కిలోమీటరు దూరంలో పడిన పిడుగును కూడా ఇది ఆకర్షించుకుని నేరుగా భూమిలోకి పంపిస్తుంది. ఉప్పు, బొగ్గు, నీటి మిశ్రమంతో రాగి వైర్ కలిగిన రాడ్ను భూమిలోకి ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. ఎత్తైన టవర్లు నిర్మించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా పిడుగుపాటు నుంచి రక్షణ పొందవచ్చు. పాటించాల్సిన జాగ్రత్తలు ● వర్షం వచ్చేటప్పుడు చెట్ల కింద ఉండకూడదు. ముఖ్యంగా ఎత్తైన చెట్ల కింద అస్సలు ఉండకూడదు. ● ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తే రైతులు పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. ● లక్షల డిగ్రీల ఉష్ణోగ్రతతో విడుదలయ్యే వేడి ఒక్కసారిగా మనిషిపై పడితే గుండైపె తీవ్ర ప్రభావం చూపుతుంది. ● వర్ష సూచన ఉన్నప్పుడు గొడుగులపై ఇనుప బోల్టులు, కెమెరాలు, సెల్ఫోన్లు దగ్గర లేకుండా చూసుకోవాలి. లేదంటే రేడియేషన్ తరంగాలకు గురై ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ● మెరుపులు, పిడుగుల వల్ల విద్యుత్ ఉపకరణాలు కాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ సమయంలో టీవీలకు ఉన్న విద్యుత్, కేబుల్ కనెక్షన్లను తొలగించాలి. ● వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో ఉండకూడదు. తడి ప్రదేశాలకు దూరంగా ఉండటం మంచిది. అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
జంగారెడ్డిగూడెం: పుట్టినరోజు వేడుకల కోసం ఇంటికి వెళ్తున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన జంగారెడ్డిగూడెం మండలంలో చోటుచేసుకుంది. చల్లవారిగూడెంకు చెందిన అబ్బ దాసరి వంశీ (30)ని శనివారం రాత్రి తాడువాయి గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. తాడువాయి గ్రామ శివారుకు చేరుకోగానే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్ఐ వీరప్రసాద్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఏడాది క్రితం మేనమామ కుమార్తెను వివాహం చేసుకున్న వంశీ భార్య ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి. పుట్టబోయే బిడ్డ ముఖం చూడకముందే వంశీ మృతి చెందడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. తల్లిదండ్రులు, భార్య కావ్య కన్నీరుమున్నీరయ్యారు. కొయ్యలగూడెం: బయ్యన్నగూడెం గ్రామంలో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఐ వి.చంద్రశేఖర్ వివరాల ప్రకారం.. మంగిశెట్టిగూడెం గ్రామానికి చెందిన సింగంశెట్టి నాగరాజు (35) బయ్యన్నగూడెంకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. దంపతుల మధ్య తరచూ కలహాలు జరుగుతుండటంతో, నాగరాజు భార్య గత మూడేళ్లుగా పుట్టింటిలోనే ఉంటోంది. ఆదివారం నాగరాజు తన భార్య, పిల్లలను కలిసేందుకు బయ్యన్నగూడెంలోని అత్తవారి ఇంటికి వెళ్లాడు. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అతని భార్య సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి
ఏలూరు (టూటౌన్): పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలని రిజర్వేషన్ పెంపు సాధన సమితి నాయకులు కోరారు. స్థానిక కలెక్టరేట్ వద్ద ప్రైవేట్ హాలులో ఆదివారం రిజర్వేషన్ పెంపు సాధన సమితి ముఖ్య నాయకుల సమావేశం డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఇన్నాళ్లు గడిచినా ఎస్సీ, ఎస్టీ జనాభా ఇరవై శాతం పైగా పెరిగినా ఇప్పటికి అదే రిజర్వేషన్న్ అమలు చేయడం చాలా అన్యాయం అన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్న్స్ పెంచాలని ప్రైవేటు సెక్టార్లలో కూడా అమలు పరిచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో ఐఆర్ఎస్ చాగంటి సంజీవ్, గంజి మధు, నేతల రమేష్ బాబు, పల్లెం ప్రసాద్, దాసరి నాగేంద్ర కుమార్, సీహెచ్ సాయిరాజ్, పొట్ల సురేష్, ఎరికిపాటి విజయకుమార్, కలపాల రాజ్కుమార్, మతి చంద్రప్రసాద్, పాము రవీంద్ర, పెరియార్ పూలే అంబేడ్కర్, ఉప్పే రాజారావు, దాసి వెంకటేశ్వర్లు, పిట్టా నాగేశ్వరావు, అద్దంకి శ్రీమణి పాల్గొన్నారు. -
‘నీట్’గా పరీక్ష రాశారు
భీమవరం : జిల్లాలో ఆదివారం నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు జరిగిన పరీక్షకు 91.39 శాతం హాజరు నమోదైంది. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెంలో ఐదు పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. మొత్తం 2,475 మంది విద్యార్థులకు 2,262 మంది హాజరయ్యారు. భీమవరంలోని రెండు పరీక్షా కేంద్రాల్లో 1,186 మందికి 1,058 మంది హాజరయ్యారు. తణుకులోని రెండు కేంద్రాల్లో 662 మందికి 624 మంది హాజరయ్యారు. నిబంధనలు కఠినంగా అమలు పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు నిబంధనలను కఠినంగా అమలు చేశారు. ప్రత్యేకమైన దుస్తులతో పాటు కాళ్లకు పట్టీలు, చెవులకు రింగులు, చేతికి తాళ్లు, మెడలో ఆభరణాలు వంటివి ఉండకూడదన్నారు. దీంతో తల్లిదండ్రుల సాయంతో వాటిని విద్యార్థినులు తొలగించారు. ప్రధానంగా జడ వేసుకోకూడదనే నిబంధనతో విద్యార్థినులు జడలు విప్పడం కనిపించింది. పటిష్ట బందోబస్తు భీమవరం, తణుకులోని కేంద్రాలను కలెక్టర్ సీ హెచ్ నాగరాణి తనిఖీ చేశారు. భీమవరంలోని కేంద్రాలను జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్ రెడ్డి, ఆర్డీఓ ప్రసన్నకుమార్రెడ్డి, తహసీల్దార్ ఆర్.రాంబాబు పరిశీలించారు. అలాగే పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసి భీమవరంలోని రెండు కేంద్రాల గేట్ల వద్ద భీమవరం డీఎస్పీ రఘువీర్విష్ణు నేతృత్వంలో సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పర్యవేక్షించారు. జిల్లాలో 91.39 శాతం హాజరు -
ఫీజులు భారం.. బీటెక్ దూరం!
భీమవరం : ఇంజనీరింగ్ చాలా మంది విద్యార్థుల కల. పేద విద్యార్థుల ఉన్నత చదువు లక్ష్యంగా దివంగత సీఎం వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో రాష్ట్రంలో లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఉన్నత కొలువులు సాధించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ను అందించి పేద విద్యార్థుల చదువులకు ఎంతో ఊతమిచ్చారు. అయితే రెండేళ్లుగా పరిస్థితి భిన్నంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ కళాశాల యాజమాన్యాలు ఆంక్షలు విధించడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్య అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. 16 కాలేజీలు.. 8,400 సీట్లు పశ్చిమగోదావరి జిల్లాలో 9 కళాశాలల్లో 5,200 సీట్లు, ఏలూరు జిల్లాలో 7 కళాశాలల్లో 3,200 సీట్లు ఉన్నాయి. మొత్తంగా 16 ఇంజనీరింగ్ కాలేజీల్లో 8,400 సీట్లు ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 12 నుంచి 20 వరకు జరిగిన ఏపీఈఏపీసెట్ పరీక్షలకు సుమారు 20 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం ఫలితాలు విడుదలవుతాయనే వార్తలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. మేనేజ్మెంట్ కోటాలో.. జిల్లాలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీఎస్ఈ, ఈసీఈలోని పలు బ్రాంచ్ల సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో మేనేజ్మెంట్ కోటాలో రూ.3 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఫీజులు ఉన్నాయి. కొందరు తల్లిదండ్రులు ఫలితాలు ఎలా ఉన్నా ముందుగానే పేరొందిన కళాశాలలో సీటు రిజర్వ్ చేసుకోవడంతో మేనేజ్మెంట్ కోటా సీట్ల ధరలకు రెక్కలొచ్చాయి. భీమవరం, ఏలూరు, నరసాపురం, తాడేపల్లిగూడెంలో ప్రముఖ కాలేజీలు ఉన్నాయి. కొన్ని కళాశాలల్లో బాలికలకు వసతి, కట్టుదిట్టమైన రక్షణ ఉండటంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందినవారు ఆసక్తి చూపుతున్నారు. సకాలంలో అందని ఫీజు రీయింబర్స్మెంట్ ఇంజనీరింగ్ చదువుకు వెనుకడుగు! ఉమ్మడి జిల్లాలో 16 కళాశాలలు.. 8,400 సీట్లు -
బీసీలపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు
ఏలూరు టౌన్ : టీడీపీ కూటమి ప్రభుత్వంలో బీసీ నేతలను రాజకీయంగా ఎదగకుండా అణచివేయాలనే కుట్రపూరిత చర్యల్లో భాగంగా వైఎస్సార్సీపీ యువజన విభాగం జోన్ కో–ఆర్డినేటర్, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్యాదవ్ను మద్యం కేసుల్లో ఇరికించారని వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో ఏలూరు జ్యూట్మిల్లు బ్రిడ్జి జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద ఆదివారం పార్టీ నేతలు నిరసన కార్యక్రమం తలపెట్టారు. సునీల్ అక్రమ అరెస్ట్కు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా మద్యం విక్రయాలు జరిగాయనీ, ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించిందని గుర్తుచేశారు. 2014–19 మధ్యకాలంలో (టీడీపీ హయాం) రాష్ట్రంలో 43 వేల బెల్టు షాపులు ఉండేవనీ, ప్రతి గ్రామంలో విచ్చలవిడిగా మద్యం విక్రయించారని గుర్తుచేశారు. గత వైఎస్సార్సీపీ పాలనలో ప్రభుత్వమే మద్యం విక్రయిస్తే అక్రమాలు జరిగాయని ఆరోపించటం వారి అవగాహనలోపాన్ని తేటతెల్లం చేస్తుందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు అప్పగించారనీ, రాత్రీపగలూ ఇష్టారాజ్యంగా మద్యం విక్రయాలు చేస్తున్నారనీ విమర్శించారు. మద్యం బాటిల్పై రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని, ఈ సొ మ్ములు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయో చెప్పాలని నెరుసు చిరంజీవి డిమాండ్ చేశారు. ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే.. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో ఆయన కుమారుడు సునీల్కుమార్ను మద్యం కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు బీసీలంటే కేవలం ఓటు బ్యాంకు మాత్రమేననీ, రాజకీయంగా ఎదిగితే పోటీ వస్తారనే భయంతో అణచివేసే కుట్రలు చే స్తారని ఆరోపించారు. మద్యం రవాణాకు సంబంధించి కేవలం వాహనాలు సరఫరా చేసిన సునీల్ను అరెస్ట్ చేశారనీ, కానీ ఢిల్లీకి చెందిన సిగ్మా సొల్యూషన్స్ కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ముందుగా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కిలారపు బుజ్జి, మోదుగుండు సూర్యనారాయణ, రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి మోరు రామరాజు, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటా మోహనరావు, గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర కార్యదర్శి కట్టా ఏసుబాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, వైఎస్సార్టీయూ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, నగర బీసీసెల్ అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రామాంజనేయులు, నాయకులు తుమ్మగుంట రంగా, జిజ్జువరపు విజయనిర్మల, ఇనపనూరి జగదీష్, సాసుపల్లి యుగంధర్, గంటా సాయిప్రదీప్, పిట్టా ధనుంజయ్, కొల్లిపర భగవాన్, పచ్చిపులుసు సృజన్, అగ్గాల కృష్ణ, మేతర సురేష్, పిల్లంగోళ్ల సత్యదేవ్, కుమారి, బందెల కిరణ్రాజు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కారుమూరి సునీల్ అక్రమ అరెస్ట్పై నిరసన ఏలూరులో పూలే విగ్రహం వద్ద శాంతియుత ధర్నా వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి -
మాడవీధుల స్థలానికి రూ.5 లక్షల విరాళం
కాళ్ల: కాళ్ల మండలం కాళ్ళకూరు గ్రామంలో వెలసిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో మాడవీధుల అభివృద్ధి పనులకు భక్తులు విరాళం అందించినట్లు దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈవో మోకా అరుణ్కుమార్ ఆదివారం తెలిపారు. జక్కరం గ్రామానికి చెందిన సాగిరాజు సుబ్బరాజు, వరలక్ష్మి దంపతుల కుమారుడు అప్పలరాజు (సింగపూర్ అప్పన్న), లక్ష్మీరూప దంపతులు, మనవళ్ళు దినేష్ వర్మ, అక్షిత్ రిషేంద్రవర్మ, సాగిరాజు శ్రీనివాసరాజు, రాధిక దంపతులు, మనవరాలు జాహ్నవి సమిహిత కలిసి రూ.5,01,116లు దేవాలయం చుట్టూ మాడవీధుల విస్తరణలో భాగంగా స్థలం కొనుగోలు నిమిత్తం విరాళంగా అందించినట్లు ఈవో తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి ప్రతిమతో సత్కరించారు. బుట్టాయగూడెం: భక్తుల కోర్కెలు తీర్చే తల్లిగా, వరాలిచ్చే అమ్మగా, గిరిజనుల ఆరాధ్య దేవతగా బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 7 గంటల సమయంలో ఆకాశంలో నల్లని మబ్బులు కమ్మడంతో వర్షం కురుస్తుందేమోనని భక్తులు ఆందోళన చెందారు. అయితే కొద్దిపాటి చినుకులు మాత్రమే పడి వర్షం ఆగిపోవడంతో పాటు వాతావరణం చల్లగా మారడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వీరవాసరం: వీరవాసరం మండలం కొణితివాడ గవరపేట గ్రామంలో ఆదివారం కన్నతల్లికి కుమార్తెలు తలకొరివి పెట్టారు. మళ్ల కృష్ణవేణి– మళ్ల సాంబమూర్తి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. 2015 అక్టోబర్ 20న తండ్రి సాంబమూర్తి మరణించగా ఆయనకు కుమార్తెలు తలకొరివి పెట్టి తండ్రి మీద ఉన్న ప్రేమ, అనురాగాలను చాటుకున్నారు. ఆదివారం తల్లి కృష్ణవేణి (70) మృతి చెందారు. ఆమెకు పెద్ద కుమార్తె అరుణ, చిన్న కుమార్తె విజయ తలకొరివి పెట్టి కొడుకులు లేని లోటును తీర్చారు. కొడుకులు లేరని ఏ రోజూ మా తల్లిదండ్రులు బాధపడకుండా చూసుకున్నాం అని కుమార్తెలు తెలిపారు. కొడుకులకు ఏ విధంగానూ తీసిపోమని నిరూపించుకున్నారని గ్రామస్తులు వారిని అభినందించారు. -
ఆన్లైన్ చేసిన ఓటర్ల జాబితా ప్రకటించాలి
దెందులూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జరుగుతున్న సర్ ప్రోగ్రాంలో ఆన్లైన్లో చేసిన ఓటర్ల జాబితా ప్రకటించాలని వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదుగురు సూర్యనారాయణ ఎలక్ట్రోరల్ అధికారులను డిమాండ్ చేశారు. ఆదివారం దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కార్యాలయంలో మాట్లాడుతూ బీఎల్ఓలు ఓటర్ల సమాచార సేకరణలో భారత ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా పారదర్శకంగా వివరాలు సేకరించాలన్నారు. ఆన్లైన్ చేసిన ఓటర్ జాబితా పోలింగ్ బూత్ల వారీగా పది రోజులకు ఒకసారి ప్రకటించాలన్నారు. ఓటును ఆన్లైన్ చేసిన తర్వాత ఓటు పరిస్థితి తెలుసుకోవడానికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అనుమానాలకు తావివ్వకుండా ఆన్లైన్ చేసిన ప్రతి ఓటును సంబంధిత పోలింగ్ బూత్ వద్ద పది రోజులకు ఒకసారి కచ్చితంగా వివరాలు ప్రకటించాలన్నారు. అక్కడక్కడ ఒక ఇంటి దగ్గర చేసి మిగిలిన కొన్ని ఇళ్ల వద్ద సమాచారం తీసుకోవటం లేదన్న సంఘటనలు తమ దృష్టికి వచ్చాయన్నారు. బీఎల్ఓలు చేస్తున్న ఈ ప్రక్రియను రెవెన్యూ శాఖలో ఎన్నికల విభాగం అన్ని స్థాయి అధికారులు సమీక్ష చేయాలన్నారు. -
యోగాతో ఆరోగ్యం
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రతిఒక్కరూ యోగాను అలవాటుగా చేసుకుని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం భీమవరం కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేశారు. జిల్లావ్యాప్తంగా రెండు వారాలుగా యోగా అభ్యాస కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామన్నారు. భీమవరంలో సుమారు 1,500 మంది యోగా కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. యోగా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మితో కలిసి జేసీ ప్రశంసాపత్రాలు అందజేశారు. అలాగే రాష్ట్రస్థాయిలో జిల్లాకు ద్వితీయ స్థానం సాధించడంలో విశేష కృషి చేసిన జిల్లా అధికారులను సత్కరించారు. యోగా శిక్షకు డు, పీడీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో యోగాసనాలు, ప్రాణాయామం, ధాన్యంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, డీఈఓ ఈ.నారాయణ, ఆయుష్ పీడీ శ్రీరామ్, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఏవీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. యోగాసనాలు వేస్తున్న జిల్లా అధికారులు -
●చెక్ డ్యామ్లు శిథిలం.. షట్టర్లు ఘోరం
వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే పంట కాలువలపై చెక్ డ్యామ్లు, షట్టర్లు శిథిలావస్థకు చేరాయి. దీంతో సాగునీరు వృథాగా పోతోంది. కాళ్ల మండలంలో 10 గ్రామాలకు నీరందించే బొండాడ పంట కాలువపై ఎల్ఎన్పురం వద్ద చెక్డ్యామ్కు ఉన్న షట్టర్లు పూర్తిగా పాడయ్యాయి. అలాగే మెండి వద్ద చెక్డ్యామ్ గోడలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుని చెక్డ్యామ్లను పునరుద్ధరించడంతో పాటు కొత్త షట్టర్లు ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. దీనిపై ఉండి డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ తోట ఫణిబాబును వివరణ కోరగా బొండాడ పంట కాలువను రైతుల ప్రోత్సాహంతో ప్రక్షాళన చేశామన్నారు. శిథిలావస్థకు చేరిన డ్యామ్, షట్టర్ల పునరుద్ధరణకు ప్రతిపాదనలు చేశామని చెప్పారు. – కాళ్లఎల్ఎన్పురం వద్ద షట్టర్లు ఇలా.. -
ఆటకెక్కించారు!
ఏలూరు రూరల్ : ఏలూరు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ (డీఎస్ఏ) తిరోగమిస్తోంది. అభివృద్ధి దేవుడెరుగు.. కనీసం క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు కోచ్లను సైతం నియమించలేని దుస్థితిలో కొట్టుమిట్టాడు తోంది. ఆటస్థలాలు బాగు చేసేందుకు గ్రౌండ్స్మెన్స్ను కూడా ఏర్పాటు చేసుకోలేకపోతోంది. దీంతో జిల్లాలో క్రీడా వ్యవస్థ నిరీర్యమవుతోంది. బాలబాలికలకు ఆటలపై ఆసక్తి సన్నగిల్లుతోంది. పర్యవసానంగా రాష్ట్ర, జాతీయస్థాయిల్లో జిల్లాకు ప్రాతిని ధ్యం క్రమేపీ తగ్గుతోంది. ఒకప్పుడు క్రీడా నర్సరీగా పేర్గాంచిన ఏలూరు జిల్లా ప్రస్తుతం శిక్షణ, పోటీల నిర్వహణ, పతకాల సాధనలో అట్టడుగు స్థాయికి చేరిందని సీనియర్ క్రీడాకారులు, క్రీడాభిమానులు ఆవేదన చెందుతున్నారు. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) నిర్వాకం వల్ల క్రీడా సంఘాలు సైతం నిర్వీర్యమైపోతున్నాయని అంటున్నారు. తక్షణమే శాప్ కోచ్లు, గ్రౌండ్స్మెన్ల నియామకం చేపట్టాని డిమాండ్ చేస్తున్నారు. గ్రౌండ్మెన్స్ లేరు ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియంలో గ్రౌండ్స్మెన్ లేరు. రెండేళ్ల క్రితం ఇద్దరు గ్రౌండ్స్మెన్స్ పదవీ విరమణ చేయగా కనీసం తాత్కాలికంగా అయినా ఎవరినీ నియమించలేదు. ఫలితంగా స్టేడియంలో ఆటస్థలాలు ఎత్తు, పల్లాలుగా మారిపోయాయి. గోతులు, రాళ్లురప్పలు, దుమ్ము, దూళితో కనిపిస్తున్నాయి. మరోపక్క చిన్నపాటి వర్షం కురిసినా స్టేడియంలో రన్నింగ్ ట్రాక్పై నీరు నిలిచి చిత్తడిగా మారుతోంది. పశువుల సంచారంతో ట్రాక్ గోతులమయంగా కనిపిస్తోంది. దీంతో ఉన్న కొద్దిమంది సాధకులు సైతం గాయాలపాలవుతున్నారు. కొన్నిసార్లు క్రీడాకారులే స్వచ్ఛందంగా గ్రౌండ్స్ను బాగు చేసుకుంటున్నారు. క్రీ‘డల్’ జిల్లాలో క్రీడా వ్యవస్థ నిర్వీర్యం కోచ్ల కొరత.. గ్రౌండ్మెన్స్ లేరు పట్టించుకోని అధికారులు కోచ్లను నియమించాలని క్రీడాభిమానుల డిమాండ్ -
కల్తీ విత్తనాలపై అప్రమత్తం
బుట్టాయగూడెం: తొలకరి వర్షాలు ప్రారంభమయ్యాయి. రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు. విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, నాణ్యమైన విత్తనాల ఎంపికలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. కల్తీ విత్తనాల విషయంలో జాగ్రత్త వహించాలని, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయించే డీలర్లు ఎరువుల నియంత్రణ చట్టం–1985 ప్రకారం నిబంధనలను పాటించాలని హెచ్చరిస్తున్నారు. పాటించాల్సిన జాగ్రత్తలు ● వ్యవసాయ శాఖ నుంచి లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద, గుర్తింపు పొందిన సంస్థల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. ● సీలు వేసి, ధ్రువీకరణ పత్రం కలిగిన విత్తన బస్తాలనే ఎంచుకోవాలి. ● విత్తనాల సంచిపై ఉన్న రకం, ల్యాబ్ నంబర్, గడువు తేదీ వంటి వివరాలను తప్పనిసరిగా గమనించాలి. ● కొనుగోలు చేసిన తర్వాత డీలర్ సంతకం ఉన్న ఖచ్చితమైన బిల్లును తీసుకోవడం మర్చిపోకూడదు. ● హైబ్రీడ్ విత్తనాల విషయంలో వాటి రకం, స్వచ్ఛత, మొలకెత్తే సామర్థ్యం, జన్యు నాణ్యత వంటి వివరాలను పరిశీలించాలి. ● పంట మొలకెత్తే దశలో గానీ, పూత దశలో గానీ ఏదైనా లోపం కనిపిస్తే వెంటనే స్థానిక వ్యవసాయాధికారులను లేదా సిబ్బందిని సంప్రదించాలి. మొలక శాతం పరీక్షించే విధానం రైతులు విత్తనం కొనుగోలు చేసిన వెంటనే మొలక పరీక్ష చేసుకోవాలి. కొనుగోలు చేసిన విత్తన సంచి నుంచి 100 గింజలను తీసుకుని వాటిని 24 గంటలపాటు నీటిలో నానబెట్టాలి. అనంతరం ఆ గింజలను ఒక గుడ్డలో కట్టి, గాలి, వెలుతురు తగలని ప్రదేశంలో ఉంచాలి. మరో 24 గంటల తర్వాత చూస్తే, 100 గింజలకు కనీసం 75 గింజలు మొలకెత్తాలి. 75 శాతం కంటే ఎక్కువ మొలక శాతం ఉంటేనే ఆ విత్తనాలు నాణ్యమైనవని నిర్ధారించుకుని నారుమడి సిద్ధం చేసుకోవాలి. గడువు దాటితే కొనుగోలు చేయొద్దు కొనుగోలు చేసే విత్తన ప్యాకెట్, సీసా డబ్బాపై సీలు ఉందా? లేదా? అనేది నిర్థారించుకోవాలి. అరువు పద్ధతిలో విత్తనాలు కొనుగోలు చేసినప్పటికీ బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. రైతులకు వ్యవసాయాధికారుల సూచనలురైతులు సొంతంగా తయారు చేసిన విత్తనాలు నారు పోయడానికి శ్రేయస్కరం. ఒక వేళ కొనుగోలు చేస్తే మంచి విత్తనాలను మాత్రమే ఎంపిక చేసి కొనుగోలు చేయాలి. నారుపోసే ముందు వాటి మొలక శాతం గుర్తించి నారు పోయాలి. నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దు. విత్తనాల కొనుగోలులో ఎలాంటి సమస్యలు ఉన్నా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. –పీజీ బుచ్చిబాబు, సహాయ వ్యవసాయ సంచాలకుడు, కేఆర్పురం, బుట్టాయగూడెం మండలం


