breaking news
West Godavari District News
-
అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు
తణుకు అర్బన్: దువ్వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో నలుగురికి స్వల్పగాయాల య్యాయి. తణుకు సజ్జాపురం ప్రాంతానికి చెందిన నలుగురు పల్నాడు జిల్లా కోటప్పకొండ దేవాలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో భాగంగా దువ్వ సమీపంలోని వ్యవసాయ చెక్ పోస్టు వద్దకు వచ్చే సరికి కారు అదుపు తప్పి పల్టీలు కొట్టుకుంటూ విశాఖ–విజయవాడ రోడ్డుపైకి వచ్చి బోల్తా కొట్టింది. అప్పటికే కారు నుజ్జు అయినప్పటికీ కారులోని ప్రయాణికులకు ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తణుకు రూరల్ పోలీసులు తెలిపారు. క్షతగాత్రులకు కారుమూరి పరామర్శ చలో గుంటూరు కార్యక్రమానికి వెళ్లేందుకు అదే ప్రాంతంలోని వేచి ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కారు బోల్తా పడడాన్ని గమనించి వెంటనే పరుగున వెళ్లి క్షతగాత్రులను కారులో నుంచి జాగ్రత్తగా బయటకులాగారు. అక్కడే ఉన్న జర్నలిస్టులు సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కాసేపటికి ఘటనా స్థలానికి వచ్చిన మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు బాధితులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను ఆరా తీశారు. నరసాపురం రూరల్: మోటార్ బైక్ అదుపు తప్పిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. మొగల్తూరు హెడ్ కానిస్టేబుల్ సుబానీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉండి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ చల్లా పవన్ కుమార్ (27) తన స్నేహితుడు చంద్రగిరి దుర్గారావుతో కలిసి మోటార్బైక్పై ఆదివారం పేరుపాలెం బీచ్కి వచ్చారు. తిరిగి ఉండి వెళ్లే క్రమంలో మోడి గ్రామానికి చేరుకునేసరికి వారి బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పవన్ కుమార్ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుని సోదరి బత్తుల పెద్దింట్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్పై గల మరో వ్యక్తి దుర్గారావుకు గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నారన్నారు. కై కలూరు: వరకట్న వేధింపులపై కై కలూరు రూరల్ పోలీసు స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. కై కలూరు మండలం పెంచికలమర్రుకు చెందిన ప్రశాంతికి ఏలూరు జిల్లా గుడివాకలంకకు చెందిన బలే రామారావుతో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇరువురు సంతానం. కొద్ది రోజులుగా అధికకట్నం తీసుకురావాలని వేధిస్తుడటంతో భర్త, అతని కుటుంబ సభ్యులపై ప్రశాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూరల్ ఎస్సై వి.రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆక్వా ఆశలపై నీళ్లు చల్లి..
ఆకివీడు ఆక్వా రంగానికి బడ్జెట్లో అరకొర మాత్రమే నిధులు కేటాయించి చంద్రబాబు ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఆక్వా రంగం అభివృద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రొయ్యల ఎగుమతుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డాలర్ల రూపంలో వందల కోట్ల రూపాయాల్ని ఆదాయంగా గడిస్తున్నా, ఆ రంగానికి తగిన ప్రాతినిధ్యం, నిధుల కేటాయింపు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్వా రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి సైతం బడ్జెట్లో ఏ విధమైన నిధులూ కేటాయించలేదు. నర్సాపురం తీరంలో ఆక్వా యూనివర్సిటీ నిర్మాణానికి మాత్రం మొక్కుబడిగా రూ. 20 కోట్లు కేటాయించారు. విపత్తులు, ధరలు పడిపోయినప్పుడు, తెగుళ్ల బెడదతో మూకుమ్మడిగా పట్టుబడులు పట్టిన సమయంలో రైతులు రొయ్యలు నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్ల ఏర్పాటుకు బడ్జెట్లో స్థానం లేకపోయింది. విద్యుత్ రాయితీ గాలికే ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య విద్యుత్. అప్సడాలో నమోదు కాకుండా ఉన్న చెరువులకు కూడా విద్యుత్ యూనిట్ ధర రూపాయిన్నరకు ఇస్తానని ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం అప్సడా అంటూనే డప్పుకొడుతోందని రొయ్య రైతులు ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆక్వా రైతులు వేల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్ రూ.1.50 పైసలకే విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గతేడాది ఇదే సమస్యపై రైతులు ఆందోళన చేస్తే చంద్రబాబు పాలనలోని ప్రజాప్రతినిధులు నీళ్లు చల్లి ఉద్యమాన్ని నీరుగార్చారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. పేరుకే రూ.1.50 విద్యుత్ ఆక్వా రైతులు మళ్లీ మోసానికి గురవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన యూనిట్ ధర రూ.1.50 పేరుకేనని, బిల్లు వచ్చే సరికి మూడు రూపాయల వరకూ పడుతోందని పలువురు రైతులు వాపోతున్నారు. పది ఎకరాల లోపు రైతులకు, అప్పడాలో నమోదు కాని రైతులకు, నాన్జోన్లోని రైతులకు యూనిట్ ధర రూ.4.25 పైగా వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాలర్ల పంట పండించే రొయ్యల సాగును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మళ్లీ పెరిగిన మేత ధర.. తగ్గిన రొయ్య ధర రొయ్యల మేత ధరల్ని మళ్లీ పెంచివేశారని రైతులు వాపోతున్నారు. ఇటీవల రైతులు ఉద్యమించడంతో మేత తయారీ యజమానులు దిగివచ్చి రూ.4 తగ్గించారు. అయితే ప్రస్తుతం రొయ్యల మేత భారీగా పెంచివేశారని ఆవేదన చెందుతున్నారు. రొయ్యల చెరువుల్లో పెంపకం తగ్గిపోతే ధర స్వల్పంగా పెంచుతున్నారని, చెరువుల్లో నిండుగా రొయ్యల పెంపకం, తెగుళ్లు వచ్చిన సమయంలో ధర పతనమైపోతుందంటున్నారు. ఈ విధానంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆక్వా జోన్ల వారీగా విద్యుత్ బిల్లుల వివరాలు ఆక్వా జోన్ మొత్తం రైతులు సబ్సిడీ కలిగిన వారు నాన్జోన్ భీమవరం జోన్న్ 9,929 8,278 1,651 నర్సాపురం జోన్ 4,314 3,993 321 తాడేపల్లిగూడెం జోన్ 2,099 1,979 120 అధిక ఆదాయాన్ని ప్రభుత్వాలకు సమకూర్చే రొయ్యల సాగుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి దృష్టి పెట్టాలి. ప్రపంచ దేశాల్లో మార్కెట్ సౌకర్యం, అధిక ధరలు లభించే విధంగా కృషి చేయాలి. స్థానికంగా విద్యుత్ సబ్సిడీలు, మేతలు, మందుల సబ్సిడీల సౌకర్యం కల్పించాలి. రైతులు సాగులో ఆటుపోటులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. – నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ ఆకివీడు మండల కమిటీ, కుప్పనపూడి ఎన్నికల ముందు చేసిన వాగ్ధానం ప్రకారం రొయ్య రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ కల్పించాలి. ఆక్వా జోన్ల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. విద్యుత్ సబ్సిడీ కల్పిస్తే తెగుళ్లతో నష్టపోయిన రైతుకు కొంత ఉపశమనం దొరుకుతుంది. రూ.1.50 పైసల సబ్సిడీతోపాటు, ట్రాన్స్ఫార్మర్ల సబ్సిడీలు, అదనపు ఛార్జీల వడ్డన వంటివి తొలగించాలి. – పీవీఆర్కే ఆంజనేయరాజు, వైఎస్సార్సీపీ ఉండి మండల అధ్యక్షుడు, వాండ్రం బడ్జెట్లో ఆక్వాకు అరకొర కేటాయింపులు ఆక్వా యూనివర్సిటీకి మొక్కుబడిగా నిధులు విద్యుత్ రాయితీలపై ఊసెత్తని వైనం ధరల స్థిరీకరణ నిధులూ అటకెక్కినట్లే -
ప్రణాళికాబద్ధంగా మాత్రల పంపిణీ
ఈ నెల 17న ఆల్బెండజోల్ మాత్రలను ఒకటి నుంచి 19 ఏళ్లలోపు పిల్లలచే మింగిస్తాం. ఆ రోజు కుదరని వారికి ఈ నెల 24న స్పెషల్ డ్రైవ్ పెట్టి మాత్రలు ఇస్తాం. నూరు శాతం లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశాము. – డాక్టర్ వాకా ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్ఓ, నరసాపురం ఏడాది నుంచి రెండేళ్లలోపువారికి ఆల్బెండజోల్ సగం మాత్రను నీళ్లలో కలిపి ఇవ్వాలి. 2 నుంచి 19 ఏళ్లలోపు వారు మధ్యాహ్నం భోజనం తరువాత మాత్రను చప్పరించేలా చూడాలి. టీచర్లు, వైద్య సిబ్బంది పర్యవేక్షణలో మాత్రలు నమిలి మింగించేలా చూడాలి. – డాక్టర్ కె.అశ్వని, వైద్యాధికారి, మేడపాడు పీహెచ్సీ -
ఆల్బెండజోల్తో నులిమేద్దాం!
యలమంచిలి: నులి పురుగులు చిన్నారుల్లో రక్తహీనతకు దారితీస్తాయి. కడుపులో చేరి నొప్పి, మంట, వికారం కలుగుజేస్తాయి. దీనివల్ల ఆకలి ఉండదు. పిల్లలు నీరసపడతారు. శారీరక, మానసిక ఎదుగుదల లోపాలను కలిగి ఉంటారు. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వాంతులు, మలంలో రక్తం, అతిసారం వంటి సమస్యలు ప్రబలుతాయి. ఏడాది నుంచి 19 ఏళ్లలోపు వారిలో ప్రధానంగా నులి పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఏడాది నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు 3,51,125 మంది ఉన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా వీరికి ఈనెల 17 నుంచి ఆల్బెండజోల్ మాత్రలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పాటించాల్సిన జాగ్రత్తలు ● అపరిశుభ్రత వల్ల నులి పురుగుల సమస్య తలెత్తుతుంది. కావున చిన్నారులు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ● చేతి గోళ్లలో పేరుకున్న మట్టి వల్ల నులి పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. పెరిగిన గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. ● మల విసర్జన తరువాత, భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. కాళ్లకు చెప్పులు ధరించాలి. ● శుభ్రమైన నీటిని తాగాలి, పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగాక మాత్రమే వినియోగించాలి. చిన్నారుల జీవితాన్ని నులి పురుగులు నులి మేస్తున్నాయి. పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అలాంటి నులి పురుగులను కేవలం ఒకే మాత్ర ఆల్బెండజోల్తో నులిమేయవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 19 ఏళ్ల లోపు వారందరికీ ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ ఈ నెల 17న ప్రారంభమవుతుంది. -
కరుణించమ్మా.. కొల్లేరు పెద్దింట్లమ్మా
● ఈనెల 18 నుంచి అమ్మవారి జాతర ● వేంగి చాళుక్యుల కాలం నుంచి పెద్దింట్లమ్మకు పూజలు ● తెలంగాణ బోనాల తరహాలో మొక్కులు కైకలూరు: కొల్లేటి మహాపట్టమహిషి పెద్దింట్లమ్మ జాతర ద్వీపకల్పమైన కొల్లేరు సరస్సు మధ్యన అంగరంగ వైభవంగా జరగనుంది. రాష్ట్రంలో అత్యంత పురాతన చరిత్ర కలిగిన దేవాలయాల్లో ఏలూరు జిల్లా, కైకలూరు మండలం కొల్లేటి కోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఒకటి. ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకూ జాతర జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి మార్చి 3 వరకు అమ్మవారి జాతర (తీర్థం) నిర్వహిస్తున్నారు. జాతరలో అత్యంత కీలకఘట్టమైన జలదుర్గా గోకర్ణేశ్వరుల కల్యాణం ఈనెల 28 శనివారం రాత్రి జరుగుతుంది. కొల్లేరు సరస్సు మధ్యలో కోట దిబ్బపై పెద్దింట్లమ్మతల్లి 9 అడుగుల ఎత్తులో, విశాల నేత్రాలతో వీరాసన భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు. కాలాలతో పాటు కోటలు మాయమైనప్పటికీ పెద్దింట్లమ్మ తల్లి విగ్రహం చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. సామాన్యంగా ఒక గ్రామానికి ఒక దేవత ఉంటుంది. కానీ పెద్దింట్లమ్మను ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 44 కొల్లేరు దిబ్బలపై నివ సించేవారందరూ కులదైవంగా ఆరాధిస్తారు. కొల్లేరుకు తెలంగాణ బోనాల సంప్రదాయం తెలంగాణలో ఉజ్జయిని మహంకాళి, మైసమ్మ, పోచమ్మ.. పెద్దమ్మ, మారెమ్మలకు జూలై నెలలో బోనాలు సమర్పిస్తారు. అదేవిధంగా 2020 నుంచి కొల్లేటికోట పెద్దింట్లమ్మకు బోనాలు సమర్పిస్తున్నారు. అమ్మవారి దేవస్థానానికి 2 కిలోమీటర్ల దూరంలోని పందిరిపల్లిగూడెం నుంచి ప్రభల ఊరేగింపుతో పాటు బోనాలు ప్రతి ఏటా తీసుకొస్తున్నారు. బోనాలు, 7 కావిళ్లలో అమ్మవారి పుట్టించి నైవేద్యం పసుపు, కుంకుమ, నెయ్యి, వేప రొట్టలు, నిమ్మకాయలు, పానకం, కల్లుతో పెద్దింట్లమ్మ దేవస్థానం తీసుకువస్తారు. 3 మైళ్ల దూరంలోని గోకర్ణేశ్వరపురంలో గోకర్ణేశ్వరస్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారితో అంగరంగ వైభవంగా కల్యాణం జరిపిస్తారు. జాతరలో కొల్లేరు భక్తజన సంద్రంగా మారిపోతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి, జిల్లాల నుంచి భక్తులు విరివిగా విచ్చేసి అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ప్రయాణం సులభతరం పూర్వం కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరకు వెళ్లాలంటే ప్రయాణం కష్టతరంగా ఉండేది. అటువంటిది ఆలపాడు నుంచి అమ్మవారి దేవస్థాఽనం 7 కిలోమీటర్ల రోడ్డుకు మరమ్మతులు చేశారు. కొన్ని ప్రాంతాల్లో నూతన రోడ్డు ఏర్పాటు చేశారు. దేవస్థానం ఎదురుగా దాతల సాయంతో శివపార్వతుల విగ్రహాం ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) దాతల సాయంతో నిర్మించిన అతిపెద్ద అనివేటి మండపం ఆకర్షణీయంగా మారింది. చలువ పందిర్లు, భక్తులకు కావల్సిన అన్ని వసతులు సిద్ధం చేశారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారి దేవాలయం వరకు ప్రభుత్వం సీసీ రోడ్లు ఏర్పాటు చేసింది. భక్తులకు జల్లు స్నానాలు, చలువ పందిర్లు, వంట ప్రాంగణాలు, కోనేరులో నీరు ఇలా అన్ని సౌకర్యాలు కల్పించాం. జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గాగోకర్ణేశ్వరుని కల్యాణం ఈ నెల 28న జరుగుతుంది. భక్తులు అమ్మను దర్శించుకోవాలి. – కూచిపూడి శ్రీనివాసు, పెద్దింట్లమ్మ ఆలయ కార్యనిర్వహణాధికారి, కొల్లేటికోట -
ఫ్రీజర్ లేదు.. కావాలంటే తెచ్చుకోండి
● మృతదేహంపై ప్రభుత్వాస్పత్రి అధికారుల నిర్లక్ష్యం ● భీమవరంలో ఘటన ● దళితుడనే ఇంత నిర్లక్ష్యమా అంటూ కేవీపీఎస్ ఆగ్రహం భీమవరం (ప్రకాశంచౌక్): చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఫ్రీజర్లో ఉంచాల్సి ఉండగా, తమ వద్ద అలాంటి సౌకర్యాలేమీ లేవని, కావాలంటే ఫ్రీజర్ తెచ్చుకోవాలని భీమవరం ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం అత్తిలి మండలం వరిఘేడుకి చెందిన కన్నెపా ముల రాంబాబు (49) భీమవరం అంబేడ్కర్ సెంటర్లో సొంత ఆటోలో కూర్చొని ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఫిట్స్ ద్వారా మృతిచెందినట్టు నిర్ధారించారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశా రు. పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని అప్పగిస్తా మని వైద్యులు తెలిపారని, అయితే మృతదేహా న్ని ఫ్రీజర్లో పెట్టకుండా బయటే వదిలేశారని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో ఫ్రీజర్ లేదని, అలాంటి సౌకర్యాలు ఇ క్కడ లేవని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాడీని ఇవ్వకుండా.. ఫ్రీజర్లో పెట్టకుండా.. దళిత వ్యక్తి మృతదేహం పట్ల భీమవరం ప్రభు త్వ ఆసుపత్రి అధికారులు, సిబ్బంది తీరు దారుణమని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతి బాబు అన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో ఫ్రీజర్ లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మృతదేహాన్ని ఫ్రీజర్లో పెట్టకుండా బయటే పెట్టడంతో బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కనీసం బాడీని తమకు అప్పగించండని వేడుకుంటున్నా ఇవ్వకుండా.. అటు ఫ్రీజర్లో పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్లే జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో కనీస సదుపాయాలు లేవని అర్థమవుతోందన్నారు. సౌకర్యాలు లేకనా లేదా చనిపోయిన వ్యక్తి దళితుడు కాబట్టే ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. పెనుమంట్ర: మహాశివరాత్రి సందర్భంగా నత్తారామేశ్వరంలో జరిగిన రథోత్సవంలో ఓ భక్తుడి కాలిపై నుంచి రథం వెళ్లడంతో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎం.జయభరత్రెడ్డి (తణుకు) అనే వ్యక్తి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ర థోత్సవాన్ని చూడటా నికి వచ్చా రు. రథం పక్క నుంచి నడిచి వెళుతుండగా రథచక్రం ఆయన ఎ డమ కాలి వేళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్రగాయమైంది. 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి తణుకులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్ నాగరాణి భీమవరం (ప్రకాశంచౌక్) : మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలను ఆదివారం సుమారు 3.50 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ఆలయాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. భీమవరం సోమేశ్వర స్వామి, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి, ఆచంట రామేశ్వర స్వామి, లక్ష్మణ్యేశ్వరం లక్ష్మణ్యేశ్వరస్వామి, న త్తారామేశ్వరం రామలింగేశ్వర స్వామి, శివదే వుని చిక్కాల శివదేవుని స్వామి, వీరంపాలెం విశ్వేశ్వరస్వామి, జుత్తిగ ఉమా వాసఖి రవి సోమేశ్వర స్వామి, యనమదుర్రు శక్తిశ్వర స్వామి తదితర క్షేత్రాలకు భక్తులు పోటెత్తారన్నారు. క్యూలైన్లలో పిల్లలకు పాలు, పెద్దలకు అల్పాహారం, తాగునీరు అందించారన్నారు. అ న్నిశాఖల అధికారుల సమష్టి కృషితో ఉ త్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కృషి చేశామన్నారు. భీమవరం(ప్రకాశంచౌక్) : జిల్లా కలెక్టరేట్తో పా టు మండల, మున్సిపల్ కార్యాలయాల్లో సో మవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీ జీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. అలాగే ప్రజలు 1100 టోల్ఫ్రీ నంబర్కు సంప్రదించి సమస్యలను తెలియజేయవచ్చని సూచించారు. -
వీఆర్ఏల సమస్యలపై ముఖం చాటేసిన ప్రభుత్వం
ఉండి: గత ఎన్నికల సమయంలో వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని మాటిచ్చిన కూటమి ప్రభు త్వం అధికారం చేపట్టిన తర్వాత ముఖం చాటేసిందని వీఆర్ఏల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 18న వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోరుతూ సంఘ ఆధ్వర్యంలో కలెక్టర్కు రాయబారం పంపే కార్యక్రమంపై ఆదివారం ఉండిలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు 18న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు రాయబారం కార్యక్రమం నిర్వమించనున్నామన్నారు. సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు వినతులు ఇచ్చినా ఫలితం లేదన్నారు. కనీసం సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన కూడా చేయడం లేదన్నారు. తెలంగాణ మాదిరి పే స్కేలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. భీమవరంలో జరిగే రాయబార కార్యక్రమాన్ని జిల్లాలోని వీఆర్ఏలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వీఆర్ఏలు పాల్గొన్నారు. -
ఫైళ్లు కదలవు.. సమస్యలు తీరవు
భీమవరం(ప్రకాశం చౌక్) : పాలనా సౌలభ్యం, ప్రజ లకు పరిపాలన అందుబాటులో ఉండటంతో పా టు సమస్యలను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలను పునర్విభజన చేశారు. దీనిలో భాగంగా భీమవరం కేంద్రంగా నూతన పశ్చిమగోదావరి జిల్లా ఏర్పడింది. ఈ ప్రాంత ప్రజలకు కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చింది. అయినా ప్రజల సమస్యలు తీరడం లేదు. అర్జీలు అందించి నెలలు గడుస్తున్నా భూసమస్యలు పరిష్కారం కావడం లేదు. నెలల తరబడి పెండింగ్లోనే.. కలెక్టరేట్కు వచ్చే రెవెన్యూ శాఖకు సంబంధించి ఫైళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. రెవెన్యూ సమస్యలపై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ అందిస్తే తర్వాత ఫైల్ సిద్ధం చేయడానికి నెల రోజులు, అక్కడ నుంచి ఆర్డీఓ కార్యాలయానికి పంపించడానికి మరో నెల రోజులు, అక్కడ నుంచి కలెక్టరేట్కు పంపించడానికి మరో నెల రోజులు ఇలా మూడు నెలలు సమయం పడుతుంది. అలాగే కొన్ని తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లోనే నెలల తరబడి పెండింగ్లోనూ ఉండిపోతున్నాయి. చివరకు కలెక్టరేట్ కు వచ్చినా ఫైల్ జాయింట్ కలెక్టర్, కలెక్టర్ లా గిన్కు వెళ్లడానికి మరో మూడు నుంచి ఆరు నెలలు సమయం పడుతుంది. అది కూడా అర్జీదారులు కలెక్టరేట్కు వచ్చి అధికారులు చూట్టూ తిరిగితే గానీ ఫైల్ ముందుకు కదలని పరిస్థితి. కలెక్టర్, జేసీ లాగిన్కు వెళ్లిన ఫైల్ కూడా ఎప్పుడు క్లియర్ చేస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి. పైసలిస్తేనే ముందుకు..! భూ సమస్యల, మార్పులు చేర్పులపై దరఖాస్తులు ముందుకు కదలలాంటే వసూళ్ల పర్వం కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. తహసీల్దార్, ఆర్డీ ఓ కార్యాలయాల్లో పైసలిస్తేనే ఫైళ్లు కలెక్టరేట్కు చేరుతున్నాయని, లేకుంటే నెలల తరబడి నిరీక్షణ తప్పదనే విమర్శలు వస్తున్నాయి. సమస్యలు వేగంగా పరిష్కారం కాకపోవడంతో ప్రతి సోమ వారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో మళ్లీ మళ్లీ అవే అర్జీలు వస్తున్నాయి. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పట్టించుకుని అర్జీలను వేగంగా పరిష్కరించాలని అర్జీదారులు కోరుతున్నారు. భీమవరం మండలం గుట్లపాడుకు చెందిన ఓ రైతు తన భూమిని 22ఏ నుంచి తొలగించాలని కోర్టు ఆర్డర్ ఉందని ఏడాది క్రితం తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ అందజేశారు. ఆర్డీఓ కార్యాలయం ద్వారా కలెక్టరేట్కు దరఖాస్తు చేసుకోగా.. నెలల తరబడి సదరు రైతును తిప్పుకుని చివరకు ఆ పని చేయలేమని కలెక్టర్, జేసి చేతులు ఎత్తేశారు. దీంతో సదరు రైతు కోర్టు ఆర్డర్ అమలు చేయలేదని మరలా కోర్టును ఆశ్రయించాడు. ఆకివీడుకు చెందిన ఓ మహిళ తన అడంగల్లో భూ విస్తీర్ణానికి సంబంధించి సరిచేయాలని దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి అక్కడి నుంచి కలెక్టరేట్కు చేరడానికి మూడు నెలలు పట్టింది. కలెక్టరేట్కు చేరి ఆరు నెలలు గడిచింది. మహిళ కుటుంబసభ్యులు నెలల తరబడి కలెక్టరేట్లోని అధికారుల చుట్టూ తిరిగితే ఇటీవల జాయింట్ కలెక్టర్ లాగిన్కు వెళ్లింది. అయినా ఇప్పటికీ ఫైల్ క్లియర్ కాలేదు. ముందుకు కదలని భూ సమస్యల దస్త్రాలు నెలల తరబడి లాగిన్లలోనే.. అధికారుల తీరుతో అర్జీదారుల అసంతృప్తి కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు కలెక్టర్, జేసీ సమీక్షా సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్లు, పర్యటనల కారణంగానే ఫైల్స్ క్లియర్ చేయడంలో ఆలస్యమవుతోందని తెలుస్తోంది. తమ ఫైళ్ల పరిస్థితిపై అడిగితే కలెక్టరేట్ అధికారులు ఇదే సమాధానమిస్తున్నారని అర్జీదారులు ఆవేదన చెందుతున్నారు. నరసాపురం, భీమవరం ఆర్డీఓ కార్యాలయాల నుంచి కలెక్టరేట్ వరకు సుమారు 500 నుంచి 1,500 వరకు ఫైళ్లు పెండింగ్లో ఉన్నట్టు అంచనా. వాటిలో 22 ఏ, భూ విస్తరణ, వర్గీకరణ తదితర భూ సమస్యల ఫైళ్లు ఉన్నాయి. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
శివోహం.. భజేహం
పెనుగొండ : ఆచంటలో రథోత్సవం భీమవరం(ప్రకాశం చౌక్) : హరోంహర.. శంభో శంకర స్మరణలు మార్మోగాయి. జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిశాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని భీమవరం గునుపూడిలోని పంచారామక్షేత్రం ఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆలయంలో ఆదివారం వేకువజాము నుంచి ప్రత్యేక అభిషేకాలు చేశారు. నిర్విరామంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చేకూరి రామకృష్ణ, కందుకూరి సోంబాబు ఆధ్వర్యంలో స్వామివారికి లక్షపత్రి పూజ, ప్రత్యేక అలంకరణలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ బంగార్రాజు, కార్యనిర్వహణాధికారి డి.కృష్ణంరాజు, ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మో షన్రాజు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వచ్ఛంద, వ్యాపార సంస్థల ప్రతినిధులు భక్తులకు మజ్జిగ, తాగునీరు, అల్పాహారం అందజేశారు. క్షీరారామం.. మోక్షధామం పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీ రారామలింగేశ్వరస్వామి ఆలయం (క్షీరారామం)కు వేకువజాము నుంచి భక్తులు పోటెత్తారు. ఆలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, విశేష అభి షేకాలు జరిగాయి. సర్వ దర్శనం కోసం శరవణ హోటల్ వరకూ భక్తులు వేచి ఉన్నారు. రూ.50, రూ.100 ప్రత్యేక దర్శనాలు కల్పించారు. ఆలయంలో వైద్య క్యాంపులు ఏర్పాటుచేశారు. ఆలయంలో రాత్రి 8.35 గంటలకు జగజ్జ్యోతి వెలిగించారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో ఆలయం గాలిగోపురం నుంచి స్వామి ప్రధానాలయ శిఖరం వరకూ వరదా సోమేశ్వరరావు ఆధ్వర్యంలో పాగా ఏర్పాటు చేశారు. ఆచంటలో రథోత్సవం పెనుగొండ : ఆచంటలోని ఆచంటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో విశేష పూ జలు జరిగాయి. సాయంత్రం 4 గంటలకు ఆచంటేశ్వరుని రథోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. సుమారు 25 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు అంచనా. ముక్తిమార్గం.. నత్తారామేశ్వరం పెనుమంట్ర: నత్తారామేశ్వరంలోని రామేశ్వరస్వా మి, జుత్తిగలోని సోమేశ్వర స్వామి ఆలయాలకు భ క్తులు పోటెత్తారు. నత్తారామేశ్వరంలో వేకువజా మున కల్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు గో స్తనీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వా మివార్లను దర్శించుకున్నారు. మధ్యాహ్నం రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. లక్ష్మణేశ్వరంలో.. నరసాపురం రూరల్: లక్ష్మణేశ్వరంలోని దుర్గాలక్ష్మణేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో విశేష పూజలు జరిగాయి. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. హరహర మహాదేవ శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు పంచారామాల్లో జనసందోహం వేకువజాము నుంచి బారులు ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు -
స్కేటింగ్లో సత్తా
తణుకు అర్బన్: స్కేటింగ్లో సత్తాచాటి తణుకుకు చెందిన కాకిలేటి గేయ దీపిక అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. 8 ఏళ్ల వయసులోనే స్కేటింగ్లో కఠోర సాధన చేసి ఇంత వరకు 25 పతకాలు సాధించి సంచలనం రేకెత్తిస్తోంది. 3వ తరగతి చదువుతున్న చిన్నారి ప్రతిరోజూ తణుకు స్కేటింగ్ రేంజర్స్ అకాడమీలో శిక్షణ పొందుతూ తన ప్రతిభను చాటుతోంది. ఈవెంట్స్ ఉన్న రోజుల్లో ముందు నుంచి ఉదయం సమయంలో కూడా ప్రాక్టీస్ చేస్తుంది. అంతర్జాతీయ స్థాయికి చేరిన దీపికతో క్రీడాభిమానులు ఫొటోలు దిగి కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం విశేషం. పతకాల ప్రయాణమిలా.. ఈ నెల 7, 8 తేదీల్లో పూనేలో జాతీయస్థాయి ఎండ్యూరెన్స్ స్కేటింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొన్న దీపిక అండర్–8 బాలికల విభాగంలో మూడు ఈవెంట్స్లో మూడు బంగారు పతకాలు సాధించి మాల్దీవుల్లో జరగనున్న అంతర్జాతీయ స్కేటింగ్ పోటీలకు అర్హత సాధించింది. ఇంతవరకు పూనే, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ ప్రాంతాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని రాష్ట్ర, జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో 14 బంగారు, 7 సిల్వర్, 4 కాంస్య పతకాలు సాధించింది. -
రెండు నెలలుగా జీతాల్లేవు
భీమవరం(ప్రకాశం చౌక్): విద్యుత్ శాఖలో స్పాట్ మీటర రీడర్లు జీవితాలతో కూటమి ప్రభుత్వం అడుకుంటుంది. ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకుని కాంట్రాక్టర్లు గత రెండు నెలలగా జీతాలు చెల్లించడం లేదు. జిల్లాలోని పెద తాడేపల్లి, నర్సాపురం, తణుకు సబ్ డివిజన్లోని 100 మందికి రెండు నెలలగా జీతాలు ఇవ్వకుండా మీటర్ రీడింగ్ పనులు చేయిస్తున్నారు. పెద తాడేపల్లి, తణుకు నర్సాపురం సబ్ డివిజన్లో.. పెద తాడేపల్లి, నర్సాపురం, తణుకు సబ్ డివిజన్ల్లో మీటర్లు రీడర్లు 100 మంది ఉన్నారు. వారికి గత రెండు నెలలగా జీతాలు బ్యాంకు ద్వారా చెల్లించకుండా కాంట్రాక్టరు ఇబ్బందులు పెడుతున్నారు. దాంతో రీడర్లు నర్సాపురం, తాడేపల్లి డీఈల వద్ద మొరపెట్టకున్నారు. ఇప్పటికే రీడర్లుకు రెండు నెలల జీతాలు లేవు. మరో వారం రోజుల మూడో నెల వస్తుంది. పీఎఫ్, ఈఎస్ఐ మినహాయింపు లేదు జీతాలతో పాటు ప్రతి నెల పీఎఫ్, ఈఎస్ఐ కూడా కాంట్రాక్టర్ చెల్లించాలి. ఈ రెండు నెలలు జీతాలు చెల్లించకపోవడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ కూడా చెల్లించడం లేదు. దాంతో మీటర్ రీడర్కు ప్రమాదం జరిగితే అతను, అతనిపై ఆధారపడిన కుటుంబం నష్టపోతారు. ఈ విషయం తెలిసి కూడా కూటమి ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వంలో సకాలంలో జీతాలు గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖలోని స్పాట్మీటర్ రీడర్లుకు ప్రతి నెల ఒకటో తేదీ జీతాలు బ్యాంకు ద్వారా జమ చేసేవారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లు, విద్యుత్ శాఖ అధికారులను సమన్వయం చేసి మీటర్ రీడింగ్ సకాలంలో జరిగేలా, మీటర్లు రీడర్లుకు జీతాలు పెడింగ్ లేకుండా సకాలంలో అందేలా పనిచేసేవారు. కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య అవినీతి జగరకుండా చర్యలు తీసుకుని మీటర్ రీడర్లకు ఇబ్బందులు లేకుండా చూసేవారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న రీడర్లు గత రెండు నెలలగా జీతాలు రాక మీటర్ రీడర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కరి సుమారు రూ.50 వేల వరకు జీతాలు చెల్లించాల్సి ఉంది. జీతాలు రాక ఈఎంఐలు, ఇంటి అద్దెకు, కుటుంబ పోషణకు మీటర్ రీడర్లు అప్పులు చేస్తున్నారు. ఒక్కొక్క మీటర్ రీడర్ 5 వేల సర్వీసులు బిల్లింగ్ చేసి వియోగదారులకు సకాలంలో బిల్లు అందిస్తారు. దాంతో వినియోగదారులు సకాలంలో బిల్లు చెల్లిస్తారు. మూడు డివిజన్ల్లో మీటర్ రీడర్లుకు పెడింగ్లో ఉన్న జీతాలు వెంటనే బ్యాంకు ద్వారా జమ చేయాలని కాంట్రాక్టర్లు అదేశించాం. నిబంధనలకు విరుద్దంగా కాంట్రాక్టర్లు మీటర్లు రీడర్లుకు నగదు రూపంలో జీతాలు చెల్లించకూడదు. – పి.ఉషారాణి, విద్యుత్ శాఖ ఎస్ఈ వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకోవాలి. దిద్దుబాటు, గజిబిజి ఉండకూడదు. పదానికి పదానికి మద్య దూరం ఉండాలి చేతి రాత గుండ్రంగా, అర్థమయ్యేలా ఉండాలి. సమాధాన పత్రంలో పేజీకి 15– 16 లైన్లు ఉండాలి. పేజీకి పైన, కింద మార్జిన్ విడిచి పెట్టాలి. మొదటి వరుసలో ఎంత బాగా రాసారో చివరి వరకు అదే దస్తూరి కొనసాగించాలి. తెలుగు, ఆంగ్లం, హిందీ సబ్జెక్టులలో లెటర్ రైటింగ్ ఒకే పేజీలో వచ్చేలా రాయాలి. అక్షర దోషాలు, దిద్దుబాట్లు లేకుండా చూసుకోవాలి గణితంలో అంకెలు స్పష్టంగా ఉండాలి. కొట్టివేతలు వస్తే మార్కులు తగ్గుతాయి. సాంఘికశాస్త్రంలో సమాధానాలు పాయింట్ల వారీగా రాయాలి. శీర్షికలు, ఉప శీర్షికలు కింద అండర్లైన్ చేయాలి. -
మృతదేహంతో ధర్నా
ఉండి: సుమారు మూడు నెలల క్రితం ఒమన్ దేశంలో మృతి చెందిన ఓ మహిళ మృతదేహంతో ఆదివారం కుటుంబీకులు ఏజెంట్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. మృతురాలి కుమార్తె వివరాల ప్రకారం నర్సాపురం మండలం చిట్టవరానికి చెందిన పిట్ట రాజమణిని ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం గ్రామానికి చెందిన ఏజెంట్ విమల ఒమన్కు పంపించింది. వెళ్ళినప్పటి నుండి ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గత ఏడాది డిసెంబర్ 4న ఆమె మృతి చెందింది. తన తల్లి మరణించినట్లు ఏజెంట్ ఫోన్ చేసి చెప్పిందని మృతదేహాన్ని తీసుకురావాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని తెలిపారు. స్థానికంగా ఉన్న భారతీయుల సాయంతో తల్లి మృతదేహాన్ని తీసుకొచ్చామని ఆమె తెలిపారు. మృతురాలి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించారు. కై కలూరు: పక్షి ప్రేమికుల స్వర్గధామంగా పేరుపొందిన ఆటపాక పక్షుల విహార కేంద్రంలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. శివరాత్రి పర్వదినం కావడంతో విజయవాడ – నరసాపురం రూట్లో శైవ క్షేత్రాలను సందర్శించే యాత్రకులు ఆటపాక పక్షుల కేంద్రాన్ని సందర్శించారు. బోటు షికారులో ప్రయాణించి పెలికాన్, పెయింటెడ్ స్ట్రార్క్ పక్షుల కేరింతలను దగ్గర నుంచి వీక్షించారు. భీమడోలు: మానసిక స్థితి బాగోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ద్వారకాతిరుమలకు చెందిన చీమకుర్తి జ్యోతికృష్ణ గణపతి(50) శనివారం రాత్రి భీమడోలు రైల్వే గేటు సమీపాన రైలు కింద పడి మృతి చెందాడు. జ్యోతికృష్ణ గణపతి ఆలయం వద్ద దుకాణాన్ని నిర్వహించేవాడు. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనితో ఇంట్లో ఎవరి చెప్పకుండా శనివారం సాయంత్రం బయటకు వచ్చేసాడు. భీమడోలు రైల్వే గేటు వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని పట్టెంపాలెం వై.జంక్షన్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు రూరల్ ఎస్సై జేవీఎన్ ప్రసాద్ సిబ్బందితో ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.3200, మూడు కోడి పుంజులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రసాద్ వివరించారు. హెడ్ కానిస్టేబుల్ ఎండీ జిలాని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆకివీడు: పాత కక్షల నేపథ్యంలో ఆదివారం స్థానిక సంతపేట వద్ద ఇరువర్గాలు దాడికి పాల్పడిన ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. స్థానిక సాలిపేటకు చెందిన చుండూరు సాయిబాబు అతని స్నేహితులు పోలిశెట్టి చక్రధరరావు, గోపిశెట్టి ప్రసన్నకుమార్ సంతమార్కెట్లోని రామాలయం వద్ద కూర్చుని మాట్లాడుకొంటుండగా బొట్టా చైతన్య, మోహన్ వచ్చి తిట్టారు. ఎందుకు తిడుతున్నారని అడిగినందుకు ఇటుక రాయితోనూ, బీర్ బాటిల్తో దాడి చేయడంతో ప్రసన్నకుమార్, సాయిబాబు గాయపడి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు చెప్పారు. కుక్కునూరు: అనుమానస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైన ఘటన ఆదివారం మండలంలోని గుండేటివాగు సమీపంలో జరిగింది. కుక్కునూరు మండల కేంద్రంలోని కిష్టారం గ్రామానికి చెందిన సోడే సంకురు(40) మృతదేహం గుండేటివాగు సమీపంలో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. -
వైభవంగా నృసింహ మహా యజ్ఞం
ద్వారకాతిరుమల: ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై స్వయంభూగా కొలువైన శ్రీ కనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అతి రుద్ర సహిత శ్రీ సుదర్శన, నృసింహ ధన్వంతరీ 32వ మహా యజ్ఞం ఆదివారం రాత్రి కనుల పండువగా జరిగింది. హైదరాబాద్కు చెందిన కొచ్చెర్లకోట సత్యవేంకట లక్ష్మీనరసింహం గురుజీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన రుత్వికులు, పండితులు పాల్గొని, ఈ యజ్ఞ క్రతువును వైభవోపేతంగా నిర్వహించారు. స్వయంభూ శ్రీ లక్ష్మీ నారసింహుడికి ఈ యజ్ఞం జరపడం వల్ల లోకశాంతి చేకూరుతుందని పండితులు తెలిపారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో జరిగిన పలు కార్యక్రమాలతో సుందరగిరి పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఉదయం విఘ్నేశ్వర పూజ, మండపారాధనలు, అనంతరం శాలిగ్రామ అభిషేకం, లక్ష బిల్వార్చన, సూర్య నమస్కారాలు, మృత్తిక లింగార్చన, ఏక బిల్వార్చన, సహస్ర లింగార్చన, మహా లింగార్చన, 365 లింగాలకు పార్ధివ మహాలింగార్చన, 121 పార్ధివ లింగార్చన, కలశారాధన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం హోమగుండ ప్రతిష్ఠ, అగ్ని ప్రతిష్ఠాపనా కార్యక్రమాలను వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో అశేష భక్తజనంతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఫలితాన్ని మార్చే చేతిరాత
ఏలూరు (ఆర్ఆర్పేట): పబ్లిక్ పరీక్షలు దగ్గరకు వచ్చేశాయి. ప్రశ్నాపత్రంలో ఇచ్చిన వాటికి సరైన మాధానాలు రాయడం ఒక్కటే మార్కులు సంపాదించడానికి ఉపయోగపడుతుందనుకుంటే పొరపాటే. జవాబు పత్రాలు మూల్యాంకనం చేసే వారికి విద్యార్థులు రాసిన జవాబులు పూర్తిగా అర్థమైతేనే వారు ఆశించిన మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. పరీక్షల సమయం దగ్గరకు వచ్చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లల చదువు ఎలా సాగుతోంది అనే అంశంపైనే శ్రద్ధ చూపుతున్నారు. చదువుతో పాటు దస్తూరీ పైనా దృష్టి సారిస్తే చక్కటి మార్కులు సొంతమంటున్నారు నిపుణులు. అక్షర దోషాలు, గజిబిజి చేతిరాత వల్ల ఒకటి, రెండు మార్కులు కోల్పోయే ప్రమాదముందంటున్నారు. విద్యార్థి కోల్పోయే ఆ ఒకటి, రెండు మార్కులే ర్యాంకును వేలల్లో తగ్గించేస్తుందనే విషయాన్ని గుర్తెరిగి దస్తూరీపై కూడా శ్రద్ధ చూపాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమాధాన పత్రాన్ని దిద్దే ఉపాధ్యాయుడికి మంచి దస్తూరి కనిపిస్తే ఆ ప్రభావం ఆయన వేసే మార్కులపై సానుకూలంగా ఉంటుందని, ఈ క్రమంలో చక్కటి దస్తూరితో పరీక్షలు రాస్తే మంచి మార్కులు అందుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జవాబు సూటిగా, అక్షరాలు పొందికగా ఉంటే పత్రాలను మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులు మంచి మార్కులు వేసే అవకాశముంటుందంటున్నారు. పరీక్షలు ప్రారంభమయ్యే లోపు ప్రతి రోజూ కొద్ది సేపు రాతపై కూడా శ్రద్ధ పెట్టి సాధన చేస్తే పరీక్షల్లో ఆందోళన లేకుండా సాఫీగా రాయవచ్చంటున్నారు. విద్యార్థులు చేసే పొరపాట్లు కొందరు విద్యార్థులు ఒక జవాబు పత్రంపై 25–30 లైన్లు రాస్తారు. గజిబిజిగా ఉంటే జవాబు పత్రం చూడగానే ఆకట్టుకోదు. ఒక్కోపేజీలో 16–18 లైన్లకు మించకూడదు. లైన్లు సమాంతరంగా ఉండాలి. చాలా మంది విద్యార్థులు ఒత్తిపట్టి రాస్తుంటారు. పెన్నును వేళ్లతో బిగుతుగా పట్టుకుంటారు. దీంతో పేజీ రెండో వైపు అక్షరాలు కనిపిస్తూ చివరికి జవాబుపత్రం గజిబిజిగా తయారవుతుంది. హ్యాండ్ రైటింగ్పై దృష్టి పెట్టాలంటున్న అధ్యాపకులు -
సంక్షోభంలో ఉప్పు సాగు
● నిరాశతో సాగుకు సమాయత్తం ● తీరంలో కనిపించని ఒకప్పటి జోరు ● 200 ఎకరాలకు పడిపోయిన సాగు విస్తీర్ణం నరసాపురం: జిల్లాలోని నరసాపురం తీరంలో ఈ ఏడాది ఉప్పు సాగు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. గత ఏడాది వరస ప్రకృతి విపత్తులు, అధిక వర్షాలు నిండా ముంచాయి. పెట్టుబడులు రాక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ఏడాది దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీంతో ఈ ఏడాది సాగుకు బ్రేక్ వేశారు. సాగు గణనీయంగా తగ్గిపోయింది. ఇదే పరిస్థిఽతి కొనసాగితే భవిష్యత్లో తీరంలో ఉప్పుసాగు కనిపించే పరిస్థితి ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి. వేసవి ప్రారంభం కావడంతో ప్రస్తుతం తీర గ్రామాల్లో ఉప్పు సాగు ముమ్మరంగా ప్రారంభమైంది. నరసాపురంలో 19 కిలోమీటర్లు ఉన్న తీరప్రాంతంలో 200 ఎకరాల్లో ఉప్పు సాగు చేపట్టారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని వేములదీవి, తూర్పుతాళ్లు, చినమైనవానిలంక, పెదమైనవానిలంక, పేరుపాలెం, కేపీపాలెం తదితర 8 గ్రామాల్లో ఉప్పుసాగు మొదలైంది. గిట్టుబాటు ధరలేక.. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఉప్పుకు గిట్టుబాటు ధరలేక రైతులు విలవిల్లాడారు. తుపాన్లు, వర్షాల కారణంగా అసలు పంట దిగుబడి రావడమే తగ్గిపోవడంతో సాగు చేపట్టిన రైతులు అప్పులపాలయ్యారు. ప్రస్తుతం తీరంలో పండించే ఉప్పు బస్తా(50కిలోలు) రైతుల వద్ద దళారులు రూ.200కు కొనుగోలు చేస్తున్నారు. కనీసం బస్తా రూ.300 ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. కష్టపడి పంట పండించే రైతుకు ఏళ్ల తరబడి అదే ధర దక్కుతోంది. ఏటేటా తగ్గుతున్న విస్తీర్ణం.. 2022, 2023 సంవత్సరాల్లో తీరంలో 1500 ఎకరాల్లో ఉప్పు సాగు జరిగింది. ఏటా సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. గత ఏడాది 900 ఎకరాల విస్తీర్ణంలో జరిగింది. ఈ ఏడాది 200 ఎకరాలకు పడిపోయింది. తీరంలో ఉప్పుమడులు చేపలు, రొయ్యల చెరువులుగా మారుతున్నాయి. రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే తీరంలో దాదాపు 15 గ్రామాల్లో 4 వేల ఎకరాల్లో ఉప్పు సాగు జరిగేది. రోజుల తరబడి కష్టం ఉప్పు సాగు కష్టంతో కూడుకున్నది. ఒక్కసారి మడి కడితే దాదాపు ఆ మడి నుంచి 6 నెలల వరకూ ఉప్పు దిగుబడి వస్తూనే ఉంటుంది. దీంతో ఉప్పుసాగు లాభాలు తెచ్చిపెడుతుంది. వేసవి ప్రారంభంలో ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉప్పుసాగు ప్రారంభం అవుతుంది. మండే ఎండల్లో చిన్న చిన్న మడులను ఏర్పాటు చేసి ఉప్పు సాగు చేస్తారు. ఒక్కో ఎకరానికి సంబంధించి 60 నుంచి 70 మడులు కడతారు. ముందుగా మడుల్లో మట్టిని కాళ్లతో తొక్కి చదును చేసి తరువాత సముద్రంలోని ఉప్పు నీటిని ఆ మడుల్లో నింపుతారు. సాగు ప్రారంభమైన నాటి నుంచి మడుల్లో 60 రోజుల పాటు 6 నుంచి 10 మంది విపరీతంగా శ్రమిస్తేనే కానీ ఉప్పు తయారీ కాదు. ఎకరానికి పెట్టుబడి రూ.30 వేల వరకు ఉంటుంది. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు రోజుకు 100 కిలోల వరకూ ఉత్పత్తి వస్తుందని రైతులు చెబుతున్నారు. గిడ్డంగుల సమస్యపై దృష్టి పెట్టని ప్రభుత్వం ఉప్పును భద్రపరచుకోవడానికి గిడ్డంగులు సదుపాయం పెద్ద సమస్య. ప్రభుత్వం గిడ్డంగులను నిర్మించాలనే కనీస ఆలోచన కూడా చేయకపోవడం గమనార్హం. గిడ్డంగులు ఉంటే వర్షాలు వచ్చినప్పుడు పండించిన ఉప్పును వాటిలో భద్రపరుచుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. అకస్మాత్తుగా వర్షాలు పడినా, తుఫాన్లు వంటి విపత్తులు వచ్చి పడినా ఉప్పు కుప్పలు ద్వంసమయిపోతాయి. రైతు కష్టం మొత్తం కరిగిపోతుంది. అధికార పంటగా గుర్తింపు లేదు ఉప్పు సాగుకు అధికార పంటగా ఇంతవరకూ గుర్తింపు లేదు. ఉప్పు పంట ప్రకృతి విపత్తుల కారణంగా ధ్వంసమైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్ట పరిహారం రాదు. బీమా లాంటి సదుపాయాలు ఉండవు. ఉప్పుసాగును అధికార పంటగా గుర్తించాలని, మిగిలిన పంటలకు మాదిరిగా అందించే సదుపాయాలు కల్పించాలని రైతులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎండలు ప్రారంభం కాగానే ఉప్పు సీజన్ మొదలవుతుంది. ఈ ఏడాది సాగుపై రైతులకు శ్రద్ధ లేదు. ఎన్నో ఏళ్లుగా ఉప్పు పంట సాగు చేస్తున్న రైతులు ఈ ఏడాది సాగుకు స్వస్తి చెప్పారు. వరుసగా నష్టాలు రావడమే కారణం. గత ఏడాది తుఫాన్లు, వర్షాలతో పెట్టుబడులు కూడా రాలేదు. రైతులు అప్పుల పాలయ్యారు. ఒకప్పుడు తీరం అంతా ఉప్పుమడులతో కళకళలాడేది. మైలా రాధాకృష్ణ, ఉప్పు రైతు, పీఎం లంక, నరసాపురం మండలం 50 కేజీల బస్తా రూ 200 పలుకుతోంది. దళారుల మా వద్ద కొన్న ధరకు బయట మార్కెట్లో ఉప్పు ధరకు సంబంధం లేదు. దాదాపు మూడేళ్ల నుంచి ఇదే ధర. గిట్టుబాటు కావడం లేదు. పెట్టుబడులు బాగా పెరిగాయి. గిట్టుబాటు ధర లేకపోతే సాగు కష్టం. గిడ్డంగులు లేకపోవడం వల్ల వర్షాలు పడితే దళారులు అడిగినంతకు అమ్ముకోవాలి. ఉప్పు సాగు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి –మైలా శ్రీనివాస్, పెదమైనవానిలంక, నరసాపురం మండలం -
బురిడీ.. అంకెల గారడీ
కొత్త పథకాలు, ప్రాజెక్టుల ఊసేలేదు.. పాత ప్రాజెక్టులకు అరకొరగా కేటాయింపులు.. పోలవరం నిర్వాసితుల గోడు పట్టని తీరు.. ఆక్వా వర్సిటీ, వశిష్ట గోదావరి వంతెన నిర్మాణాలు, కొల్లేరు వంటి సమస్యలను విజయవంతంగా అటకెక్కించిన వైనం.. గతేడాది మాదిరిగానే ఈ ఏడాదీ రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చంద్రబాబు ప్రభుత్వం మొండిచేయి చూపింది. నిధుల కేటాయింపులు, కీలక అంశాలపై కనీసం ప్రస్తావన కూడా లేకపోవడం విచారకరం. రాష్ట్ర బడ్జెట్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాకు లెక్కకు మించిన హా మీలను కూటమి నాయకులు గుప్పించారు. వందల కోట్లతో పథకాలు, ప్రాజెక్టులతో అద్భుతాలు చేస్తామని ఊరూవాడా ప్రచారం చేశారు. తీరా అధికారం చేపట్టిన తర్వాత జిల్లా అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టారు. ఏటా రాష్ట్ర బడ్జెట్లో అరకొర కేటాయింపులతో సరిపెడుతున్నారు. ‘కౌలు’కునేదెలా..? ఉమ్మడి జిల్లాలో 2.45 లక్షల మందికిపైగా కౌలు రైతులు ఉన్నారు. కౌలు వ్యవసాయం ఒడిదొడుకులతో సాగుతోంది. కౌలు రైతుల రక్షణ కోసం ప్రత్యే క చట్టంతో గుర్తింపు ఇచ్చి కౌలురైతులకు కూడా రైతుభరోసా మొదలు అన్ని పథకాల వర్తింపు, గుర్తింపు కార్డుల జారీ, పంట నష్ట పరిహరం వంటివి అందేలా చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హా మీలు ఇచ్చారు. అయితే బడ్జెట్ కౌలురైతుల ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. ‘ఆక్వా’ంక్షలు ఫలించేనా..! గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నరసాపురంలో ఆక్వా యూనివర్సిటీని ఏర్పాటుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ యూనివర్సిటీని అటకెక్కించింది. రూ.332 కోట్లతో జరగాల్సిన భవన నిర్మాణానికి అరకొర నిధులను మంజూరు చేయడంతో పాటు వాటిని కూడా పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేని పరిస్థితి. గత బడ్జెట్లో రూ.36 కోట్లు కేటాయించినా పనులకు అనుమతులు రాలేదు. ప్రస్తుత బడ్జెట్లో రూ.20 కోట్లు మాత్రమే కేటాయించారు. వంతెన.. యాతన నరసాపురం ప్రాంతంలో తలమానికంగా ఉండే వశిష్ట గోదావరి వంతెన నిర్మాణానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి అనుమతులతో శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు. అయితే చంద్రబాబు పాలనలో రాష్ట్ర బడ్జెట్లో రెండేళ్లుగా నిధులు కేటాయించకపోవడంతో ప్రాజెక్టు శంకుస్థాపనకే పరిమితమైంది. కీలక ప్రాజెక్టులకు రిక్తహస్తం జిల్లాలో కీలకమైన పోలవరం ప్రాజెక్టు, పునరావాసం, చింతలపూడి ఎత్తిపోతల పథకం, గోదావరి డె ల్టా ఆధునికీకరణ, ఎర్రకాల్వ, కొల్లేరు ఏ ఒక్క దాని కీ న్యాయం జరగలేదు. సుమారు రూ.5 వేల కోట్లు కేటాయించాల్సిన చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ.435 కోట్లతో సరిపెట్టారు. గత బడ్జెట్లో రూ.220 కోట్లు కేటాయించినా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ● డెల్టా ఆధునికీకరణకు వందల కోట్లు అవసరం కాగా మొక్కుబడిగా రూ.100 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయింపులతోనూ పనులు జరగని పరిస్థితి. ● ఎన్నికల సమయంలో నల్లజర్ల నుంచి తాడేపల్లిగూడెం వరకు ఎర్రకాల్వ ముంపునకు శాశ్వత ప రిష్కారం చూపుతామని కూటమి నాయకులు ప్రకటించారు. అయితే బడ్జెట్లో నామమాత్రంగా సాధారణ మెయింటినెన్స్కు రూ.10 లక్షలు మాత్రమే కేటాయించారు. ● 122 గ్రామాల ప్రజల జీవనస్థితితో ముడిపడి ఉన్న కొల్లేరుకు సంబంధించి బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదు. కొల్లేరును 3వ కాంటూరుకు కు దించి జిరాయితీ భూములిస్తాం, కొల్లేరు గ్రామా ల్లో రోడ్లు, తాగునీరు, మౌలిక సదుపాయాలన్ని కల్పిస్తామని ఎన్నికల్లో ప్రకటించి సుప్రీంకోర్టు సాకుతో గాలికి వదిలేశారు. ● పోలవరం ప్రాజెక్టు పరిధిలో నిర్వాసితులకు పరిహారం అలానే పెండింగ్లో ఉంది. పరిహారం గురించి బడ్జెట్లో ప్రస్తావన కూడా లేదు. పథకాల ఊసేదీ.. సూపర్ సిక్స్ హామీల పేరుతో కూటమి ప్రభుత్వం నిండా వంచించింది. ఈ బడ్జెట్లోనూ ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, రెండు సెంట్ల స్థలాలు వంటి హామీలను ప్రస్తావించలేదు. ఏలూరు జిల్లాలో 6.71 లక్షలు, పశ్చిమగోదావరి జిల్లాలో 6 లక్షల మందికి పైగా మహిళలు ఆడబిడ్డ నిధి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మోసాల పద్దు నిధుల్లేవ్.. పథకాల్లేవ్ పాత ప్రాజెక్టులకు అరకొర కేటాయింపులు అటకెక్కిన వశిష్ట గోదావరి వంతెన కనిపించని ఫుడ్, ఆక్వా క్లస్టర్లు ఉమ్మడి జిల్లాకు మరోసారి మొండిచేయి రాష్ట్ర బడ్జెట్పై విమర్శల వెల్లువ -
అలంకరణలు కూడా చేయలేరా?
క్షీరారామంలో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల మండపాల్లో గుమ్మాలకు కనీసం పూల అలంకరణ కూడా చేయించలేని స్థితిలో క్షేత్రం ఉందా అని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శనివారం ఆమె ఆలయానికి సందర్శించారు. స్వామి, అమ్మవార్లను దర్శించి అనంతరం ఆలయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆలయ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయంలో ఈనెల 12 నుంచి శివరాత్రి ఉత్సవాలు జరుగుతుండగా, ఆలయంలో ఎక్కడా ఉత్సవాల సందడి కనిపించడం లేదన్నారు. ఆలయంలో కనీసం పూల అలంకరణ చేసేందుకు ఆదాయం లేదా అని అసహనం వ్యక్తం చేశారు. ఆలయంలో ఆహ్లాదకరంగా, ప్రశాంత వాతావరణం కనిపించాలని, ఇంత దారుణంగా ఉంచుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాను హెచ్చరించినా అధికారుల పనితీరులో ఏమాత్రం మార్పు లేదన్నారు. శివరాత్రికి ఆలయంలో అన్నదానం ఏర్పాటుచేయకపోవడం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాతలు ఎవరైనా అన్నదానం చేస్తే వారికి సరైన ప్రదేశం ఏర్పాటుచేయాలని సూచించారు. మహాశివరాత్రికి క్యూలైన్లు, ట్రాఫిక్, శానిటేషన్పై ప్రత్యేక దృష్టికి సారించి పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్డీఓ దాసి రాజు, డీఎస్పీ శ్రీవేద, తహసీల్దార్ యడ్ల దుర్గాకిషోర్, కమిషనర్ బి. విజయసారథి, సీఐ కె.రజనీకుమార్, డీఈఓ హరి సూర్యప్రకాశరావు, ఎస్సై పృద్వీ, ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు ఉన్నారు. సోమారామంలో పక్కా ఏర్పాట్లు భీమవరం(ప్రకాశం చౌక్): పంచారామక్షేత్రం భీమవరం గునుపూడిలోని ఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆలయం (సోమారామం)లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్లర్ నాగరాణి ఆదేశించారు. శనివారం ఆమె ఆలయాన్ని సందర్శించి శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించారు. క్యూలైన్లు, శానిటేషన్ ఏర్పాట్లను పరిశీలించి అన్నదానం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగార్రాజు, సభ్యులు ఆమెకు స్వామి చిత్రపటం, శేషవస్త్రం అందజేశారు. ఏలూరు (టూటౌన్): మెడికల్, ఫార్మా మా ఫియాను అరికట్టాలని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో చేస్తున్న ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ సీపీఐ ఏలూరు ఏరి యా సమితి ఆధ్వర్యంలో శనివారం ఏలూరు పాతబస్టాండ్, అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయాలని, మెడికల్, ఫార్మా మాఫియాను అరికట్టాలని, మందుల అధిక ధరలను తగ్గించాలని, నకిలీ మందులను అరికట్టాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని నినాదాలు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలందరికీ అవసరమైన విద్య, వై ద్యాన్ని ప్రైవేటుపరం చేయడం ద్వారా కూట మి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 60 వేల మెడికల్ షాపుల్లో అర్హత లేని వారు ఫార్మసీ సర్టిఫికెట్లు కొనుగోలు చేసి ప్రజలకు అవసరమైన మందులను అధిక ధరలకు విక్రయిస్తూ నకిలీ మందులను సరఫరా చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. కార్పొరేట్ ఆస్పత్రులు సొంత మెడికల్ షాపుల నిర్వహణ ద్వారా అధిక ధరలకు మందులు విక్రయిస్తున్నారన్నారు. ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దెందులూరు: ప్రభుత్వ వ్యాయామ కళాశాలలో ప్రవేశాల కోసం ఏపీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీసెట్)కు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.నతానియేలు తెలిపారు. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులకు గడువు ఉందని, రూ.1,000 అపరాధ రుసుంతో మే 15 వరకు, రూ.2 వేల అపరాధ రుసుంతో మే 25లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 24 నుంచి 28 వరకు దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించారని చెప్పారు. -
బడ్జెట్లో దళితులకు అన్యాయం
కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు భీమవరం : రాష్ట్ర బడ్జెట్లో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో 9 వేల కోట్లతో దళితులను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. లక్షలాది మంది దళిత నిరుద్యోగులు, యువత ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారని గుర్తుచేశారు. ఇవి కాకుండా దళిత పేటల అభివృద్ధికి ఇవి ఎలా సరిపోతాయో ప్రభుత్వమే చెప్పాలన్నారు. ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్ గత సంవత్సరం బడ్జెట్ కంటే సుమారు 10 శాతం పెంచినట్లు ప్రభుత్వం చెబుతుందని గతంలో రూ.18,497 కోట్లు కేటాయిస్తే ఖర్చు చేసింది మాత్రం రూ.16,830 కోట్లు అని మిగిలిన నిధులు 1,667 కోట్లు కూడా ఈ బడ్జెట్ లో కలపాలని అవి కలిపితే కేవలం రూ.480 కోట్లు మాత్రమే అదనంగా ఇచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం 2013 ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం దళితులకు 17 శాతం అంటే సుమారు 55 వేల కోట్ల పైనే బడ్జెట్ నిధులు కేటాయించాలని కేవలం 6 శాతం మాత్రమే కేటాయించారని తెలిపారు. మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం అంతా కేవలం కార్పొరేట్లు, పెట్టుబడి దారులు, ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించడానికే సరిపోయిందన్నారు. ద్వారకాతిరుమల: సుందరగిరిపై స్వయంభూగా కొలువైన శ్రీ కనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించనున్న అతి రుద్ర సహిత శ్రీ సుదర్శన, నరసింహ ధన్వంతరీ 32వ మహా యజ్ఞానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏటాలాగే ఈ ఏడు కూడా మహా శివరాత్రి నాడు సాయంత్రం మొదలుగా తెల్లవార్లు ఈ మహా యజ్ఞాన్ని ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా హైదరాబాద్కు చెందిన కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యజ్ఞ ఏర్పాట్లను సీహెచ్ కుటుంబరావు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆలయ యాగశాలలో యజ్ఞ క్రతువుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ముందుగా నరసింహ గురూజీ గర్భాలయంలో కొలువైన స్వామివారి మూలవిరాట్ వద్ద కంకణధారణ చేశారు. అనంతరం యాగశాలలో మహాగణపతి పూజ, హోమాన్ని నిర్వహించారు. ఆ తరువాత కలశ పూజ చేశారు. అలాగే పండితులు, రుత్వికులు వేద మంత్రోచ్ఛరణలతో సహస్ర లింగార్చన, మహా లింగార్చన, మృత్తిక లింగాలకు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. లోకశాంతి కోసం పలు వనమూలికలు, భక్ష్యాలు, వివిధ రకాల ద్రవ్యాలు, సమిదులు, ఖరీదైన ద్రవ్యాలతో ఆదివారం రాత్రి నిర్వహించనున్న మహా యజ్ఞం భక్తులను పరవశింప జేయనుంది. -
సంక్షేమాన్ని విస్మరించి..
రాష్ట్ర బడ్జెట్లో కార్పొరేట్ల అభివృద్ధి తప్ప ప్రజల సంక్షేమం ఎక్కడా కనిపించలేదు. రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి, సామాజిక న్యాయానికి తోడ్పడేలా లేదు. ప్రచారం మిన్న.. చేతల్లో సున్నా అన్నట్టుగా ఉంది. నెలకు మహిళలకు రూ.1,500, నిరుద్యోగి భృతిపై నిర్దిష్టంగా చెప్పకపోవడం అన్యాయం. పేదలు ఎదురుచూస్తున్న 3 సెంట్లు, 2 సెంట్ల ఇళ్ల స్థలాలకు నిధులు కేటాయించకపోవడం మోసం చేయడమే. –జేఎన్వీ గోపాలన్, సీపీఎం జిల్లా కార్యదర్శి కూటమి నాయకులు ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు అమలుకు నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరం. పట్టణ ప్రాంతాల్లో 3 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్లు నిర్మించి పేదల సొంతింటి కల నెరవేరుస్తామన్న హామీ అమలుకు నిధులు కేటాయించలేదు. నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1,500 హామీలను పట్టించుకోకపోవడం ఏరుదాటాక.. తెప్పతగలేసిన చందంగా ఉంది. –కోనాల భీమారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి రాష్ట్ర బడ్జెట్లో కౌలు రైతులకు మొండిచేయి చూపారు. అన్నదాత సుఖీభవ సాయంపై స్పష్టత ఇవ్వలేదు. పంట నష్టపోయిన రైతులకు పంటల బీమా పరిహారానికి ఎలాంటి కేటాయింపులు జరగలేదు. ధరలు పడిపోయి రైతులు నష్టపోతున్నా పంటలకు కనీసం మద్దతు ధరలు కూడా అందడం లేదు. కౌలు రైతులపై ఈ ప్రభుత్వానికి ఎలాంటి దయ లేదు. వ్యవసాయ రంగానికి కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయి. – కె.శ్రీనివాస్, ఏపీ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి -
నూతన విద్యుత్ చట్టాలతో నష్టం
భీమవరం : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యుత్ చట్టంతో ప్రజలకు ముప్పు వాటిల్లుతుందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బలవంతపు భూ సేకరణ తక్షణం ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం డిమాండ్ చేశారు. శనివారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ, విస్తృత సమావేశం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం మాట్లాడుతూ చారిత్రాత్మకంగా నిర్వహించిన దేశవ్యాప్త సమ్మెను దేశంలో ఉన్న కార్మిక వర్గం, వ్యవసాయ కూలీలు, పేద రైతులు, కౌలు రైతులు, వృత్తిదారులు, గ్రామీణ పేదలు విజయవంతం చేశారని ఈ సమ్మె భవిష్యత్ పోరాటాలకు నాంది అని అన్నారు. ఉపాధి హామీ చట్టం మార్పు వల్ల వ్యవసాయ కూలీలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తక్షణం పాత చట్టాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. -
ప్రజలకు నిరాశే..
కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవు. ముఖ్యంగా సూపర్ సిక్స్లోని నిరుద్యోగభృతి, ఆడబిడ్డ నిధి ఈ ఏడాదైనా అమలు చేస్తారని ప్రజలు ఆశించారు. అయితే వారికి నిరాశే ఎదురైంది. గత ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేస్తుందని ఆరోపించిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు మించి అప్పులు చేసి రాష్ట్ర ద్రవ్యలోటు రూ.75,868 కోట్లకు తీసుకెళ్లడం రాష్ట ఆర్థిక పరిస్థితికి ఆందోళన కల్గించే విషయం. రాష్ట్రంలోని రెవెన్యూలో రూ.34,998 కోట్లు కేవలం వడ్డీలకు చెల్లించాల్సి ఉంది. రెవెన్యూ లోటు రూ.21,935 కోట్లు ఉండటంతో నెలవారీ ఖర్చులకు కూడా తప్పకుండా అప్పులు చేయాలి. ఈ భారం ప్రజలపై పడుతుంది. ప్రభుత్వం అనవసరపు ఖర్చులు చేయకుండా, పొదుపు చర్యలు చేపట్టాలి. – వంక రవీంద్రనాథ్, ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బడ్జెట్లో ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ సుద్ధ అబద్ధాలు. రైతు వెన్ను విరిచేలా వ్యవసాయ బడ్జెట్ ఉంది. పురుగు మందులు, ఎరువులు లేకుండా పంటలు పండిస్తారనడం విడ్డూరం. గతేడాది మాదిరిగానే అరకొరగా కేటాయింపులు చేశారు. అన్నదాత సుఖీభవలో రైతుల సంఖ్యను కుదించడం అన్యాయం. రూ.10 వేల కోట్లకు రూ.6,600 కోట్లే ఇస్తామంటున్నారు. కౌలు రైతుల గురించి ప్రస్తావన లేదు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. చిత్తూరు రైతులకు మామిడి సాయం ఇప్పటివరకు అందలేదు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీపైనా అబద్ధాలు చెప్పారు. ప్రధాన బడ్జెట్ ప్రసంగంలో రూ.890 కోట్లు ఇచ్చామన్నారు. అయితే వ్యవసాయ బడ్జెట్లో రూ.627 కోట్లు అని చెప్పారు. – వడ్డి రఘురాం, వైఎస్సార్సీపీ గూడెం కన్వీనర్, ఏపీ రైతు విభాగం ఆక్వాకల్చర్ వర్కింగ్ ప్రెసిడెంటు -
కట్టలు తెగిన వివాదం
● స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్ల మధ్య పోరు ● ఏడీఏ టేబుల్పై నోట్ల కట్టల వీడియో హల్చల్ ● అధికారులకు తలనొప్పిన వ్యవహారం తణుకు అర్బన్: తణుకు విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో విద్యుత్ బిల్లుల రీడర్లకు సంబంధించి ఇద్దరు కాంట్రాక్టర్ల మధ్య తలెత్తిన వివాదం అధికారులకు తలనొప్పిగా మారింది. ఈనెల 13న సాయంత్రం కార్యాలయంలోని ఏడీఈ టేబుల్పై రూ.500 నోట్ల కట్టలు (సుమారు రూ.7.50 లక్షలు) ఉంచి.. ‘రీడర్లు అంతా డీఈఈ కార్యాలయానికి వచ్చి మీ జీతాలు తీసుకువెళ్లండి.. ఇప్పుడు రాకపోతే మిమ్మల్ని తొలగిస్తాం’.. అంటూ, తాను విజయవాడకు చెందిన కాంట్రాక్టరునంటూ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఏడీఈ చాంబర్లో ఏడీఈ బోడపాటి దివాకర్ సీటులో ఉండగానే కాంట్రాక్టరు నోట్ల కట్టలు పేర్చి వీడియో తీసి వైరల్ చేయడం వివాదాస్పదంగా మారింది. స్పాట్ బిల్లింగ్ టెండర్లో గందరగోళం స్పాట్ బిల్లింగ్కు సంబంధించి గత నవంబరులో జరిగిన టెండర్ల వ్యవహారం గందరగోళంగా మారింది. విజయవాడకు చెందిన శంకర్ ఇన్ఫ్రా పేరుతో వేసిన టెండరు ఎల్ 1గా క్వాలిఫై కాగా, తణుకుకు చెందిన పోతుల మాధురి పేరుతో వేసిన టెండరు ఎల్ 2గా రెండో స్థానంలో నిలిచింది. ఎల్ 1 కాంట్రాక్టరును వర్కుకు సంబంధించి అగ్రిమెంట్కి పిలిచినా రాకపోగా రీడర్లతో బిల్లులు తీయించే నిర్వహణ చేయలేదని, దీంతో నోటీసులు కూడా ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్ 2 కాంట్రాక్టర్ సదరు నిర్వహణను డిసెంబరు నుంచి చేస్తున్నారు. అయినా సాంకేతిక కారణాలతో వర్కుకు బిల్లు చేయలేదు. ఎల్ 2 కాంట్రాక్టర్ బిల్లు కోసం అడుగుతున్నా బిల్లు ఇవ్వలేమని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరితో కలిపి సబ్ డివిజన్ కు సంబంధించిన 30 మంది రీడర్లకు మూడు నెలల జీతాల బకాయిలు ఉన్నాయి. తాజాగా అధికారుల చొరవతో ఎల్ 1 కాంట్రాక్టర్ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తణుకు ఏడీఈ కార్యాలయానికి వచ్చి రీడర్లకు జీతాలు ఇస్తానని.. ముందురోజు వాట్సాప్ గ్రూపు ద్వారా తెలిపినా రీడర్లు రాకపోవడంతో.. రీడర్లు అంతా రావాలని, జీతాలు ఇస్తానంటూ డబ్బు కట్టలతో వీడియో చేశారు. అయితే రీడర్లు మాత్రం తమకు గతంలో మాదిరిగా మాధురి ఇన్ఫ్రా ద్వారానే బ్యాంకు ద్వారా జీతాలు వేయాలని కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకరు చినబాబు పేషీ.. మరొకరు లోకల్ పేషీ ఇద్దరు కాంట్రాక్టర్లలో ఒకరు చినబాబు పేషీ కాగా, మరొకరు లోకల్ పేషీగా వ్యవహారం నడుస్తోందనే గుసుగుసలు వినిపిస్తున్నాయి. దీంతో టెండరు వ్యవ హారం అధికారులకు తలనొప్పిగా మారింది. నిబంధనల ప్రకారం అధికారులు ఎల్ 1 వైపు మొగ్గుచూపుతుండగా, స్థానికంగా ఉన్న సిఫార్సులతో తనకే ఇవ్వాలనే దిశగా ఎల్ 2 పోరాటం చేస్తున్నట్టుగా గుప్పుమంటోంది. ఈ నేపథ్యంలో నోట్ల కట్టల వ్యవహారం అధికారులను మరింత ఇరకాటంలో పడేసింది. గతే డాది డిసెంబరు ముందు వరకు ప్రస్తుత ఎల్ 2 కాంట్రాక్టరు అయిన పోతుల మాధురి టెండరు ద్వారా నిర్వహణ చేశారు. అయితే తాజాగా టెండరు దక్కకపోవడం, ఎల్ 1 కాంట్రాక్టరు నిర్వహణకు ముందు కు రాకపోవడంతో ఎల్ 2 కాంట్రాక్టరు రీడర్లను మే నేజ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బుల వ్యవహారం తెలియదు స్పాట్ బిల్లింగ్కు సంబంధించి రీడర్లకు జీతాలు ఇచ్చేందుకు వచ్చిన కాంట్రాక్టర్ ఆ డబ్బులు రీడర్లకు ఇచ్చేందుకు తెచ్చినవని, టేబుల్పై పెట్టి లెక్కపెట్టుకుంటున్నారని అనుకున్నానని ఏడీఈ బోడపాటి ది వాకర్ వివరణ ఇచ్చారు. డబ్బులను వీడియో తీసిన విషయం తనకు తెలియదని అంటున్నారు. -
జిల్లాకు తీవ్ర అన్యాయం
చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పసలేని పద్దుల బడ్జెట్గా ఉంది. జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. బడ్జెట్లో ఆక్వా యూనివర్సిటీ ప్రస్తావన లేదు. కోటిపల్లి రైల్వేలైన్ ఊసే ఎత్తలేదు. నిరుద్యోగభృతి ఎండమావిగా ఉంది. బీసీ మహిళలకు పింఛన్, ఇతర సంక్షేమ పథకాలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు. సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ తీవ్ర అన్యాయం చేశారు. రాష్ట్రాన్ని అమావాస్య చీకటిగా మార్చే విధంగా బడ్జెట్ రూపొందించడం దురదృష్టకరం. – పీవీఎల్ నరసింహరాజు, వైఎస్సార్సీపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ -
అంతర్రాష్ట్ర బైక్ దొంగ అరెస్టు
నరసాపురం: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామానికి చెందిన మాన్యం వంశీ మణికంఠను శనివారం నరసాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.14 లక్షలు విలువచేసే 21 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో నర్సాపురం డీఎస్పీ జి.శ్రీవేద కేసు వివరాలు వెల్లడించారు. వ్యసనాలకు అలవాటుపడిన మణికంఠ కొంతకాలంగా బైక్ దొంగతనాలు చేస్తున్నాడు. ఈ నెల 7న నరసాపురం పట్టణం చినమామిడిపల్లిలో సర్రా శ్యాంబాబు ఇంటి గేటు తాళాలు పగులగొట్టి బైక్ దొంగతనం చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం నరసాపురం సీఐ తనిఖీలు చేస్తుండగా పాలకొల్లు రోడ్డు వీరభవానీ గుడి వద్ద మణికంఠ అనుమానాస్పదంగా కనిపించడంతో విచారించారు. నరసాపురం టౌన్లో 8 చోట్ల, తెలుగు రాష్ట్రాలో పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసినట్టు నిందితుడు అంగీకరించాడని చెప్పారు. -
మానవత నాగేశ్వరరావు అనుమానాస్పద మృతి
ఏలూరు టౌన్: అనేక మందికి సేవలు అందించిన ఆలపాటి నాగేశ్వరరావు అలియాస్ మానవతా నాగేశ్వరరావు అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. ఈ నెల 9న ఏలూరు నగరంలోని వసంతమహాల్ సెంటర్లోని ఆయన నిర్వహిస్తోన్న గాయత్రి ఫైనాన్స్ కార్యాలయం నుంచి ఒంటరిగా బైక్పై బయటకు వెళ్ళారు. ఆరు రోజుల అనంతరం ఆగిరిపల్లి ప్రాంతంలో పెద్ద చెరువులో విగతజీవిగా కనిపించారు. మానవత స్వచ్చంద సంస్థ ద్వారా అనేక మందికి సేవలు అందిస్తుండగా... ఆకస్మికంగా మృతిచెందటం ఏలూరు, పరిసర ప్రాంతాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. శనివారపుపేట శాతవాహన నగర్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలపాటి నాగేశ్వరరావు ఉంటున్నారు. ఈనెల 9న ఉదయం 11గంటల సమయంలో వసంతమహాల్ సెంటర్లోని తాను నిర్వహిస్తోన్న గాయత్రి ఫైనాన్స్ కంపెనీ కార్యాలయం నుంచి బైక్పై బయటకు వచ్చారు. ఆ తరువాత ఆచూకీ దొరకలేదు. ఆయన భార్య టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నగరంలోని సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా గాలింపు చేపట్టగా... నూజివీడు వైపు వెళుతున్నట్లు గుర్తించారు. అనంతరం ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ కావటంతో ఆచూకీ కనిపెట్టటం క్లిష్టంగా మారింది. గన్నవరం, ఆగిరిపల్లి మద్య ప్రాంతంలో బ్రహ్మలింగయ్య చెరువు వద్ద డ్రోన్లతో పరిశీలించగా ఆయన మోటారు సైకిల్ను గుర్తించారు. శనివారం చెరువు ప్రాంతం తుప్పల వద్ద నాగేశ్వరరావు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలి
పాలకొల్లు సెంట్రల్ : ఆక్వా రైతులు కష్టాలు ప్రభుత్వానికి తెలియడం లేదా అని జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్రాజు ప్రశ్నించారు. ఓ పక్క ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతుంటే.. ఫీడ్ కంపెనీలు తమ స్వార్ధంగా వ్యవహరిస్తూ ఫీడ్ ధరలు పెంచడం బాధాకరమైన విషయమని అన్నారు. ఫీడ్ ధరలు పెంచుతున్నా మత్స్య శాఖ మంత్రి, అప్సడా సభ్యులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమైన విషయమన్నారు. ఫీడ్ కంపెనీలు పెంచిన ధరలకు వ్యతిరేకంగా జిల్లా స్థాయిలో ఉన్న అన్ని ఆక్వా సంఘాల నేతలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి కొన్ని నిర్ణయాలు తీసుకుందన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆక్వా రైతు సంఘ నాయకులు అందరూ కలెక్టర్కు వినతిపత్రం అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వినతిపత్రాలు సమర్పించిన అనంతరం ఫీడ్ కంపెనీలు, ప్రాసెస్ యూనిట్లు, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూసి అనంతరం జిల్లా వ్యాప్తంగా మళ్లీ ఆక్వా రైతులతో సమావేశం ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఆ తదుపరి మిగతా జిల్లాల సంఘాలతోనూ చర్చించి అందరితో ఏ చర్యలు తీసుకోవాలో, ఎలా ముందుకు వెళ్లాలో కార్యాచరణ చేస్తామన్నారు. -
మార్చి 13 నుంచి జాతీయ స్థాయి నాటికల పోటీలు
పాలకొల్లు సెంట్రల్: సాంఘిక నాటక రంగానికి పుట్టినిల్లు అయిన పాలకొల్లులో కళా రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నాటిక పోటీలను నిర్వహిస్తున్నామని పాలకొల్లు కళాపరిషత్ అధ్యక్షుడు కేవీ కృష్ణవర్మ అన్నారు. ఈ మేరకు శుక్రవారం కళాపరిషత్ ఆధ్వర్యంలో మార్చి 13, 14, 15 తేదీల్లో 17వ జాతీయ స్థాయి నాటికల పోటీల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణవర్మ మాట్లాడుతూ అడబాల థియేటర్ వెనుక భాగంలో ఉన్న స్థలంలో నాటిక పోటీలు నిర్వహించనున్నామన్నారు. అనంతరం మొదటి పత్రికను సంస్థ గౌరవ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావుకు అందజేశారు. కార్యక్రమంలో కేఎస్పీఎన్ వర్మ, మానాపురం సత్యనారాయణ, జక్కంపూడి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముదినేపల్లి రూరల్ : మట్టి లారీల వల్ల రోడ్లు ధ్వంసమవుతున్నాయంటూ మండలంలోని పెదగొన్నూరు గ్రామస్తులు లారీలను నిలిపివేసిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని రోజులుగా ప్రజాప్రయోజనాల కోసమంటూ టిప్పర్లతో గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు మట్టిని తరలిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల ఇటీవలనే నూతనంగా వేసిన రోడ్లు ధ్వంసమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ టిప్పర్లతో కాకుండా ట్రాక్టర్లతో మట్టిని తరలించాలని చెప్పినప్పటికీ టిప్పర్లతో తరలిస్తున్నందున రోడ్లు పాడైపోతున్నట్లు శ్రవణం బాలాజీ అనే గ్రామస్తుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికై నా ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ట్రాక్టర్లతోనే మట్టిని తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తణుకు అర్బన్: పూనేలో ఈ నెల 7,8 తేదీల్లో నిర్వహించిన జాతీయస్థాయి ఎండ్యూరెన్స్ స్కేటింగ్ పోటీల్లో తణుకుకు చెందిన క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. తణుకు స్కేటింగ్ రేంజర్స్ అకాడమీలో శిక్షణ పొందిన తణుకుకు చెందిన కాకిలేటి గేయ దీపిక అండర్–8 బాలికల విభాగంలో మూడు బంగారు పతకాలు, అండర్–19 బాలుర విభాగంలో రెడ్డి పవన్ హర్షవర్థన్ రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకం, అండర్–7 విభాగంలో ఖండవల్ల మయాంక్ కాంస్య, అండర్–5 బాలికల విభాగంలో మండల నిహస్వి కాంస్య పతకం సాధించినట్లు కోచ్ లావణ్య శుక్రవారం విలేకరులకు తెలిపారు. వీరు త్వరలో మాల్దీవుల్లో నిర్వహించే అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. తాడేపల్లిగూడెం : కోస్తా ప్రాంత ముస్లింల ఆధ్యాత్మిక సదస్సు శని, ఆదివారాల్లో తాడేపల్లిగూడెంలో నిర్వహించనున్నట్టు నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తబ్లీఘీ జమాత్ పేరిట నిర్వహించే ఈ సదస్సు దావతుల్ హక్ రెలిజియల్ ట్రస్టు (ఏపీ) ఆధ్వర్యంలోని పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం శాఖ పర్యవేక్షణలో జరుగుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ముస్లింలు హాజరుకానున్నారని వివరించారు. శనివారం ఉదయం ఐదు గంటల నుంచి సదస్సు ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. ద్వారకాతిరుమల: శ్రీవారి సన్నిధిలో మార్చి 20 నుంచి 23 వరకు రాష్ట్ర స్థాయిలో ఒంగోలు, పుంగనూరు జాతి ఆవుల అందాలు, పాల పోటీలను నిర్వహించనున్నట్టు గోజాతి సంరక్షణ రాష్ట్ర అధ్యక్షులు యు.చక్రపాణి తెలిపారు. ఈ మేరకు పోటీలు జరిగే మార్కెట్ యార్డు స్థలాన్ని శుక్రవారం ఆయన ఏఎంసీ చైర్మన్ వై.బ్రహ్మరాజుతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ద్వారకాతిరుమలలో గోసమ్మేళనం పేరుతో కొంత కాలంగా ఒంగోలు, పుంగనూరు జాతి గోవులకు అందాలు, పాల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. రైతులకు, పశువులకు అన్ని సౌకర్యాలను కల్పించి, పోటీల్లో గెలుపొందే గోవులకు బహుమతులను అందిస్తామన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ధర్నా
భీమవరం: పీఆర్సీ కమిటీపై తక్షణం నిర్ణయం తీసుకోకుంటే ఈనెల 25న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం భీమవరం కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. 12వ పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏ బకాయిలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు సాయివర్మ మాట్లాడుతూ పదవీ విరమణచేసిన ఉపాధ్యాయ, ఉద్యోగులందరికీ పెన్షనరీ బెనిఫిట్స్ను పదవీ విరమణ చేసిన రోజునే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన కార్యదర్శి కేవీ రామచంద్రరావు మాట్లాడుతూ ప్రస్తుతమున్న హెల్త్ కార్డుల వల్ల ఉపాధ్యాయులకు వైద్య సదుపాయాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దావీదు, జిల్లా ఆర్థిక కార్యదర్శి పీవీడీ ప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పప్పాల సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): దేశవ్యాప్తంగా విశ్వ విద్యాలయాలలోను, ఉన్నత విద్యాసంస్థలలో కొనసాగుతున్న కుల ఆధారిత వివక్షను నిర్మూలించి సమానత్వాన్ని నిర్ధారించేందుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించిన ఈక్విటీ నిబంధనలను 2026 తక్షణమే అమలు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి డిమాండ్ చేశారు. ఏఐఎస్ఏ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం పట్టణంలోని ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ సబ్ సెంటర్ వద్ద ఏఐఎస్ఏ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పోస్టర్స్ విడుదల చేశారు. అప్పలస్వామి మాట్లాడుతూ యూజీసీ నిబంధనలపై నడుస్తున్న సుప్రీంకోర్టు స్టేను ఎత్తివేయాలని, విశ్వ విద్యాలయాలల్లో జరుగుతున్న హింసను అరికట్టేందుకు రోహిత్ చట్టంను తక్షణమే అమలు చేయాలన్నారు. పాలకొల్లు సెంట్రల్: అనధికార కట్టడాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిల్డింగ్ ప్లీనరైజేషన్ స్కీమ్ (బీపీఎస్)పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని రాజమండ్రి రీజనల్ డైరెక్టర్ (ఆర్డీ) జి.సుబ్బారావు అన్నారు. శుక్రవారం స్థానిక మునిసిపల్ కార్యాలయం చైర్మన్ చాంబర్లో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సచివాలయ సిబ్బంది, ఎల్టీపీలతో ఆయన సమావేశం నిర్వహించారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్లపై ప్రజల్లో ఇంకా స్పష్టత లేదన్నారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్పై ఎలా ముందుకు వెళ్లాలో తెలియని ప్రజలు ఉన్నారని అలాంటి వారికి కూడా అర్థమయ్యేలా టౌన్ప్లాన్ సిబ్బంది కృషి చేయాలన్నారు. ఏ వార్డుల్లో ఎంత మంది బీపీఎస్, ఎల్ఆర్ఎస్ల పరిధిలో ఉంటారో వారికి గ్రూపు క్రియేట్ చేసి సమాచారం ఇవ్వడం లేదా వారి వద్దకు వెళ్లి వారికి అర్థమయ్యేలా వివరించాలన్నారు. బిల్డింగ్ క్రమబద్దీకరణలో భాగంగా ఎవరైనా బీపీఎస్కు వర్తించి భారీ స్థాయిలో నగదు చెల్లించే పరిస్థితి ఉంటే వారికి ఈఎంఐ పద్ధతిలో అవకాశం కల్పిస్తామన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): వాణిజ్య పన్నుల పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ సకాలంలో పన్నులు చెల్లించడం ద్వారా ప్రజలకు మరింత సంక్షేమం అందించడానికి దోహదపడుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జీఎస్టీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రంగాల నుంచి అందే ఆదాయంతో పాటు నిబంధనల మేరకు వాణిజ్య పన్నులు చెల్లింపుల ద్వారా అందే ఆదాయం జిల్లా, రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. -
వైఎస్సార్సీపీలోకి ఆటో యూనియన్ సభ్యులు
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ పరిపాలన చూసిన ప్రజలు వైఎస్సార్సీపీకి పట్టం కట్టడానికి ఎదురుచూస్తున్నారని జిల్లా పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల గోపి అన్నారు. పట్టణంలోని రైల్వేగేటు సెంటర్కు చెందిన 30 మంది ఆటో యూనియన్ సభ్యులు శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతనంగా పార్టీలో చేరిన సభ్యులకు నరసాపురం పార్లమెంటు పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్ గుడాల గోపి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రజలు ఛీ కొడుతున్నారని గుర్తించాలి రాష్ట్రంలో కూటమి పాలన అరాచకాలు, అక్రమాలు చూసిన ప్రజలు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారని గుడాల గోపి చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఛీకొడుతున్నారనే విషయాన్ని కూటమి ప్రభుత్వం గ్రహించాలన్నారు. కూటమి నేతలు ఇప్పటికై నా బుద్ధి తెచ్చుకొని రెడ్బుక్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజలకు సక్రమమైన పాలన అందించాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో ఉప్పే సత్యనారాయణ, కుక్కల కృష్ణ, ఉన్నమట్ల శ్రీధర్, చేరుగొండి నాగబాబు, శోడదాశి చిట్టిబాబు, ముళ్లపర్తి సాయికుమార్, నెవురి శంకర్, చొప్పల రాజేష్, సాకా ఆనందరావు, బొంద ప్రసాద్, లికితపూడి పెద్దిరాజు, విప్పర్తి రంగబాబు, మైలే మోషే, నక్కా నరేష్కుమార్, శిడగం శ్రీను, యింజమూరి రాకేష్, దాకే నాగరాజు, సాగా నర్సింహమూర్తి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి యడ్ల తాతాజీ, నేతలు కోరాడ శ్రీనివాసరావు, జోగాడ ఉమామహేశ్వరరావు, వీరా మల్లిఖార్జునుడు, ఉండ్రాజవరపు రవి, ఉప్పే పండు, పడ్డా అంతర్వేది తదితరులు పాల్గొన్నారు. -
మహాశివరాత్రికి బలివే సిద్ధం
ముసునూరు: దేవదాయశాఖ ఆధీనంలో ఉన్న బలే శ్రీరామ లింగేశ్వర ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఏలూరు జిల్లాగా ఏర్పడిన తర్వాత నాలుగో ఏడాది ఈ నెల 14 నుంచి 18 వరకు ఐదు రోజులు పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న ప్రత్యేక అధికారిగా, సర్పంచ్ రావు ప్రవీణ సుధాకర్, ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మకంటి శ్యామలరావు, ఈఓ పామర్తి సీతారామయ్య నేతృత్వంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పిండ ప్రదానాలకు, అమావాస్య స్నానాల కోసం బలివే క్షేత్రంలో ఈ ఏడాది శాశ్వత జల్లు స్నానాలు, మహిళలకు ప్రత్యేక స్నాన ఘట్టాలు, రహదారుల వెడల్పుతో వన్ వే తరహా రాకపోకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే రెండు జిల్లాల సరిహద్దులో ఉన్న బలే రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న దృష్ట్యా మొత్తం 5 విభాగాలుగా నూజివీడు, ఏలూరు, సత్తుపల్లి ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. -
ముగిసిన మావుళ్లమ్మ వార్షిక మహోత్సవాలు
● అమ్మవారికి మహానివేదన సమర్పణ ● అన్నసమారాధనకు పోటెత్తిన భక్తులు భీమవరం(ప్రకాశం చౌక్): దాదాపు నెల రోజుల నుంచి నీరుల్లి కూరగాయపండ్లు వర్తక సంఘం, అమ్మవారి ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీమావుళ్లమ్మ వారి 62వ వార్షిక మహోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారికి మహానైవేద్యం సమర్పించి, అన్నసమారాధన నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు, ఉత్సవ నిర్వాహకులు అమ్మవారికి పలు రకాల పిండి వంటలు, స్వీట్స్,పులిహోర తదితర వాటిని మహా నివేదనగా సమర్పించారు. రూ.1.45 లక్షలు పలికిన లడ్డూ ఉత్సవాలు సందర్భంగా అమ్మవారికి సమర్పించిన 36 కిలోల లడ్డును వేలం వేయగా భీమవరానికి చెందిన బోడపాటి చినబాబు అనే భక్తుడు రూ 1.45 లక్షలకు వేలం పాటలో దక్కించుకున్నారు. లక్ష మందికిపైగా అన్నప్రసాదం ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు అమ్మవారి ఆలయం వద్ద అన్నదాన ప్రసాదం వితరణ నిర్వీరామంగా కొనసాగింది. భీమవరం పట్టణంతో పాటు జిల్లా నలుమూలు నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి అన్నదాన ప్రసాదం స్వీకరించారు. ప్రత్యేక క్యూలైన్లు ద్వారా భక్తులు అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని అన్నదాన ప్రసాదం స్వీకరించారు. మిగిలిన వారికి అమ్మవారి ఆలయం ముందు ఖాళీ ప్రదేశంలో భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయం పడమటివైపు తాలూకాఫీసు సెంటర్, దక్షిణంవైపు వేణుగోపాల స్వామి ఆలయం సెంటర్, ఆదివారం బజారు రోడ్డు, అన్నదానానికి వచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయాయి. దాదాపు లక్ష మంది అన్నప్రసాదం తీసుకున్నట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. -
సంచలనం రేకెత్తించిన విజిలెన్స్ దాడులు
తణుకు అర్బన్/ఇరగవరం: ఇరగవరం మండలం కంతేరు గ్రామంలో గురువారం నిర్వహించిన విజిలెన్స్ దాడుల్లో ఎరువులు, పురుగుమందుల అనధికార నిల్వల వ్యవహారం జిల్లాలో సంచలనం రేకెత్తించింది. సరుకు కొనుగోళ్లు చేసి ఎక్కడైనా అమ్మేసుకుంటాం అనే రీతిలో అనధికారిక గోడౌన్లో నిర్వహిస్తున్న బ్లాక్ వ్యాపారాన్ని విజిలెన్స్ అధికారులు బట్టబయలు చేశారు. ఈ దాడిలో కంతేరు గ్రామంలో దీవెన ఆగ్రో కెమికల్స్ పేరుతో నడుస్తున్న అనధికార గోడౌన్లో రూ. 80,01,059 విలువైన 22,893 కిలోల పురుగుమందులు, రూ. 14,34,142 విలువైన 26,474 మెట్రిక్ టన్నుల ఎరువుల బస్తాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎరువులు, పురుగుమందుల వ్యాపారం నిర్వహణ, అవసరమైన లైసెన్స్లు ఉన్నప్పటికీ గోడౌన్కు ఎటువంటి అనుమతి లేదని, వ్యవసాయాధికారుల నుంచి డోర్ నంబరుతో సహా తీసుకోవాల్సిన ధ్రువపత్రాలు లేవని గుర్తించారు. అలాగే ఎరువుల నిల్వల్లో తేడాలు ఉండడం వంటి కారణాలతో దీవెన ఆగ్రో కెమికల్స్ సంస్థ ప్రొప్రైటర్ గంటా సురేంద్రపై 6ఏ కేసు నమోదు చేశారు. వ్యవసాయాధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో గత సీజన్లో ఎరువుల కొరతతోపాటు అరకొర పంపిణీలో సైతం తమకు కావాల్సిన వారికి మాత్రమే ఇచ్చారంటూ రైతుల ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా తణుకు మండలం ముద్దాపురం సొసైటీలో టీడీపీ నాయకులు తమకు అనుకూలమైన వారికి ముందుగానే ట్రాక్టర్లలో ఎరువుల బస్తాలు ఎక్కించి వారి ఇళ్లలో నిల్వలు చేశారు. ఈ వ్యవహారాన్ని రైతులు నిలదీయడంతో గతేడాది అక్టోబరు నెలలో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. నాయకులు వ్యవసాయాధికారులను సైతం ప్రసన్నం చేసుకుని అధికంగా నిల్వలు చేసుకుంటారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అనధికార నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పూర్తి స్థాయిలో అమలు కాలేదు
తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయ లేదు. ఎన్నికల సమయంలో ఇంటిలో ఎంత మంది చదివితే అంత మందికి ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున అందచేస్తామని ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించారు. పథకం అమలులో మాత్రం దారుణంగా కోతపెట్టారు. మా ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకాన్ని హమీ ఇచ్చిన మేరకు అమలు చేశాం. ఎన్నికల్లో మేము అబద్దపు హామీలు ఇవ్వలేదు. శాసన మండలిలో తప్పుడు లెక్కలు చెప్పడం దారుణం. – ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు గుండు సున్నా పెట్టారు. ముఖ్యంగా తల్లికి వందనం పేరుతో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ 15,000 చొప్పున ఇస్తామంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టేసారు. తీరా ఇచ్చే సమయంలో నిబంధనల పేరుతో అర్హులను తగ్గించేసి అరకొరగా కేవలం 13,000 చొప్పున ఇవ్వడం దుర్మార్గం. జగన్ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పేరుతో అర్హులందరికీ రూ.15,000 చొప్పున ఇవ్వడాన్ని తల్లులంతా స్వాగతిస్తున్నారు. – కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి -
ఆరోగ్యశ్రీ వైద్యానికి డబ్బులా!?
తణుకు అర్బన్ : ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవల్లో తమ నుంచి డబ్బు దండుకున్నారంటూ పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామానికి చెందిన దొడ్డిపట్ల మల్లిఖార్జున గంగా ప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తన సోదరి బొప్పే విజయలక్ష్మి ఈనెల 9న పడిపోయి కాలు విరగడంతో తణుకులోని ఆపిల్ ఆస్పత్రికి అదే రోజు సాయంత్రం 5 గంటలకు తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వగా రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం లోపలకు తీసుకెళ్లిన సిబ్బంది స్ట్రెచర్పైనే ఉంచి ఎక్స్రే, రక్త పరీక్షలు చేశారు. ఇందుకు రూ.1,200, రక్త పరీక్షలకు రూ. 4,540తో పాటు మరో రూ.1,000 కట్టించుకున్నారు. ఆరోగ్యశ్రీలోనే కదా.. డబ్బులు ఎందుకని ప్రశ్నిస్తే ఆరోగ్యశ్రీ అప్రూవల్ వచ్చేవరకు మీరు ఖర్చులు పెట్టుకోవాలని బదులిచ్చారు. దీంతో బాధితులు చెల్లించారు. కాసేపటికి రూంకి పంపిస్తామని చెప్పిన ఆస్పత్రి సిబ్బంది.. రూ.15 వేలు చెల్లించాలన్నారు. తాము చెల్లించలేమని బాధితులు చెప్పగా.. రూ.10 వేలు చెల్లించమన్నారు. దీంతో వెళ్లిపోతామని బాధితులు చెప్పి తణుకు సాయిశ్వేత ఆస్పత్రిలో చేరారు. అక్కడ అన్ని పరీక్షలు, శస్త్రచికిత్స ఉచితంగానే చేశారు. ఆపిల్ ఆస్పత్రి తీరుపై 104 నంబరుకు ఫిర్యాదుచేస్తే విజయలక్ష్మి పేరు సాయిశ్వేత ఆస్పత్రిలో మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యిందని, ఆపిల్లో కాలేదన్నారు. ఆపిల్ ఆస్పత్రి సిబ్బంది రిజిస్ట్రేషన్ను పెండింగ్లో పెట్టి అందినకాడికి దోచేయాలని చూశారని బాధితుడు గంగా ప్రసాద్ తెలిపారు. ఇలాంటి ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య తన దృష్టికి రాలేదని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కీర్తి ‘సాక్షి’కి చెప్పారు. ఆపిల్ ఆస్పత్రి రసీదులు, ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్ చూపిస్తున్న బాధితుడు గంగా ప్రసాద్ ఆపిల్ ఆస్పత్రిలో విజయలక్ష్మి పేరుతో ఆరోగ్యశ్రీలో రిజిస్ట్రేషన్ చేసిన పత్రం కాలు విరగడంతో తణుకులోని ఆపిల్ ఆస్పత్రికి బాధితురాలు పరీక్షలంటూ స్ట్రెచర్ పైనే రూ.6,740 వసూలు రూం చార్జీలకు రూ.15 వేలు చెల్లించాలంటూ డిమాండ్ -
ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా సేవలు
తాడేపల్లిగూడెం: ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా సేవలను విస్తరించడమే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యమని బ్యాంకు ముంబై సెంట్రల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ డాక్టర్ జి.భాస్కర్ తెలిపారు. బ్యాంకు ఆధ్వర్యంలో శుక్రవారం మాగంటి కల్యాణ మండపంలోని మెగా అగ్రికల్చరల్ క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బాస్కర్ మాట్లాడుతూ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రుణాలను అందిస్తున్నామన్నారు. అనంతరం రైతులకు రూ.80 కోట్ల విలువైన రుణ మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో విజయవాడ రీజినల్ మేనేజర్ పి.సతీష్బాబు, డాల్ఫిన్స్ గ్రూపు సీఈఓ డి.లీలాకృష్ణ, స్థానిక బ్యాంకు మేనేజర్ షేక్ కరీం పాల్గొన్నారు. అలాగే ఈ నెల 21న రిటైల్ క్రెడిట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్టు తెలిపారు. -
తల్లికి వంచన
నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టారు. ఆనక తొలి ఏడాదికి ఎగనామం పెట్టి.. ఇప్పుడు మండలి వేదికగా తల్లికి వందనం అందరికీ ఇచ్చామంటూ చంద్రబాబు ప్రభుత్వం అసత్యాలు వల్లించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సాక్షి, భీమవరం: అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తల్లికి వందనం పథకానికి ఎగనామం పెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రస్తుత విద్యాసంవత్సరానికి జిల్లాలో 1,920 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, 121 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లోని 3,16,328 మంది విద్యార్థుల్లో 2,29,106 మందిని అర్హులుగా గుర్తించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కో విద్యార్థికి రూ.15,000 చొప్పున రూ. 343.81 కోట్లను తల్లుల ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. రూ.2,000 కోత పెట్టి గతేడాది జూన్ 12న తొలి విడతగా 1,76,574 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.229.55 కోట్లను జమచేసింది. తర్వాత వచ్చిన గ్రీవెన్న్స్లో 12,553 మందికి అందించగా, ఫోర్ వీలర్, స్థలం, ఇన్కంటాక్స్, విద్యుత్ బిల్లులు తదితర వాటిని సాకుగా చూపించి పక్కనపెట్టేసిన వారు ఎంతోమంది ఉన్నారు. కొందరు లబ్ధిదారులకు రూ.13 వేలు కూడా పూర్తిగా ఇవ్వకుండా రూ.8000 వేల నుంచి రూ.8850 మాత్రమే జమచేశారు. అందరికి ఇచ్చేశామంటూ గురువారం శానస మండలిలో కూటమి ప్రజాప్రతినిధులు చెప్పడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలి వేదికగా సర్కారు అవాస్తవాలు తల్లికి వందనం అందరికీ ఇచ్చామంటూ బుకాయింపు జిల్లాలో పూర్తిస్థాయిలో అర్హులకు అందని సాయం జిల్లాలో అర్హులైన విద్యార్థులు 2,29,106 మొదటి విడతలో 1,76,574 మంది, గ్రీవెన్స్లో 12,553 మందికి లబ్ధి కొందరికి రూ. 8 వేల నుంచి రూ. 9 వేలు మాత్రమే జమ వీరవాసరం మండలం రాయకుదురుకు చెందిన తోట పెద్దిరాజు వ్యవసాయ పనులు చేస్తుంటారు. ఆయన ఇద్దరు కుమార్తెలు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. పెద్దిరాజుకు సెంటు భూమి లేదు. ఆయన పేరిట 46 ఎకరాలు భూమి ఉన్నట్టు చూపిస్తోందంటూ, అతని భార్యకు తల్లికి వందనం సాయం అందించలేదు. కార్యాలయాల చుట్టూ తిరిగి సాంకేతిక లోపాన్ని సరిచేయించుకున్నా సాయం అందలేదని చెబుతున్నారు. పాలకోడేరు మండలం కుముదవల్లికి చెందిన కె. మరియమ్మ తనయుడు ఇంటర్ చదువుతున్నాడు. తల్లికి వందనం పథకం కింద గత ఏడాది రూ.8,850 మాత్రమే అకౌంట్కు జమచేశారు. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ వాటా అని, త్వరలో కేంద్ర ప్రభుత్వ వాటా జమవుతుందంటూ మెసేజ్ వచ్చింది. ఎనిమిది నెలలు కావస్తున్నా మిగిలిన సొమ్ము రాలేదని ఆమె తెలిపారు. కుముదవల్లికి చెందిన సాయిబాబా, వెంకటరమణ దంపతులు.. తల్లి లేని మనువరాలు మేఘనను తమ వద్దే ఉంచుకుని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. అర్హత ఉన్నప్పటికి కార్డులో పేరు లేదని చెప్పి వారికి సాయం అందించలేదు. సాంకేతిక లోపాన్ని సరిచేయించుకుంటే తర్వాతి ఏడాది వస్తుందని అధికారులు చెప్పినట్టు సాయిబాబా తెలిపారు. -
నో స్టాక్.. కార్డుదారులకు షాక్
● రేషన్ షాపుల ముందు నోస్టాక్ బోర్డులు ● గడువు ముగియక ముందే రేషన్ దుకాణాలు క్లోజ్ తాడేపల్లిగూడెం: రేషన్ షాపుల ముందు నోస్టాక్ బోర్డులు కార్డుదారులను వెక్కిరిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కక్షగట్టి ఇంటింటికీ రేషన్ అందించే వాహనాలను నిలుపుదల చేయించి, రేషన్ షాపుల ముందు క్యూ వ్యవస్థను మళ్లీ అమల్లోకి తీసుకొచ్చింది. అయితే పేదలు తమ కోటా సరుకులను తెచ్చుకునేందుకు చౌక దుకాణాల వద్దకు వెళ్లినా సరుకు లేదంటూ తిప్పి పంపించేస్తున్నారు. జిల్లాలో చాలా రేషన్ షాపుల వద్ద మొదటి వారంలోనే నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అయితే లెక్కల ప్రకారం కార్డుదారులందరికీ బియ్యం సరఫరా అవుతున్నట్టు అధికారులు చెబుతుండడం గమనార్హం. అయితే 15వ తేదీ సాయంత్రం వరకు ఇవ్వాల్సిన సరుకులు వారం ముందే అయిపోతున్నాయని, ఈ బియ్యం నల్లబజారుకు తరలిపోతున్నాయని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులకు అడ్డా ఒకప్పుడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉంగుటూరు, తాడేపల్లిగూడెం ప్రాంతాలు రేషన్ మాఫియాకు అడ్డాగా ఉండేవి. ఇక్కడి నుంచే కాకినాడ యాంకరేజ్ పోర్టుకు బియ్యం తరలివెళ్లిపోయేవి. అయితే ఈ మాఫియా కొంతకాలం ఆగినా ఇటీవల కాలంలో మళ్లీ యాక్టివ్ అయ్యిందని సమాచారం. ఇటీవల కొందరు డీలర్లు రాజీనామా చేయడం, సస్పెండ్లు వంటి కారణంగా ఖాళీగా ఉన్న దుకాణాలను చేజిక్కించుకున్న డీలర్లు సరుకును అడ్డదారులకు పంపిస్తున్నట్టు సమాచారం. తాడేపల్లిగూడెంలో ఇద్దరు అధికారం ఉన్న వ్యక్తుల అండ చూసుకొని ఎరువుల గోదాములనే అక్రమ బియ్యం గోదాములుగా మార్చుకుని బియ్యాన్ని హద్దులు దాటిస్తున్నారు. అయితే విజిలెన్సు అధికారులు దాడులు తర్వాత కొంత ఆగినట్టు కనిపించినా, వెళ్లాల్సిన సరుకు దొడ్డిదారిన వెళుతోందని సమాచారం. ఇన్చార్జిల ఇష్టారాజ్యం ఇటీవల కాలంలో చౌక దుకాణాల ఖాళీలు వచ్చినా, ఇన్చార్జిలే నియామకమే తప్ప పూర్తిస్థాయిలో కొత్త డీలర్లను నియమించలేదు. ఇప్పటికే ఉన్న డీలర్లనే ఇన్చార్జిలుగా నియమిస్తూ ఉండడంతో రెండు మూడు దుకాణాలకు ఒకే డీలర్ గుప్పిట్లోనే ఉంటున్నాయి. దీంతో అక్రమ వ్యాపారం మూడు పూలు ఆరుకాయలుగా విరాజిల్లుతుంది. అలాగే కొందరు రెవెన్యూ అధికారులు మ్యాపింగ్ పేరుతో కార్డులను హద్దులు దాటించి పట్టణంలో కార్డులను పల్లె డీలర్లకు, గ్రామ కార్డులను పట్టణంలోని రేషన్ దుకాణాలకు మ్యాపింగ్లో మార్చడంతో బియ్యం తెచ్చుకోవడం భారమై చాలా మంది సరుకులు తెచ్చుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా 551332 రేషన్ కార్డులున్నాయి. 1052 రేషన్ దుకాణాలున్నాయి. ఉన్న కార్డుదారులందరికి బియ్యం ఇవ్వాలి. కానీ ఏ నెలా కూడా పూర్తిస్థాయిలో పంపిణీ చేయడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఉదాహరణకు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో, తాడేలప్లిగూడెం పట్టణం, తాడేపల్లిగూడెం మండలం కలిపి మొత్తం 81 రేషన్ దుకాణాలున్నాయి. పెంటపాడు మండలంలో ఫిబ్రవరి కోటాగా 309 మెట్రిక్ టన్నుల బియ్యం, పది టన్నుల పంచదార వచ్చింది. తాడేపల్లిగూడెం పట్టణంలో 44 రేషన్ దుకాణాలున్నాయి. మండలంలో 37దుకాణాలున్నాయి. మొత్తం 55 వేల 800 మెట్రిక్ టన్నుల బియ్యం, పంచదార 23 టన్నులు, పట్టణంలో మాత్రం గోధుమపిండి 12 టన్నులు వచ్చింది. అయితే 12వ తేదీ నుంచే చాలా షాపుల వద్ద నోస్టాక్ బోర్డులు దర్శమిచ్చాయి. ఇప్పటికై నా సివిల్ సప్లయిస్ అధికారులు స్పందించి రేషన్ను పూర్తి స్థాయిలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
22న చేనేత గర్జన
పాలకొల్లు సెంట్రల్: చేనేత వృత్తి నేడు దారుణమైన కష్టాల్లో ఉందని చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకుడు పిల్లలమర్రి బాలకృష్ణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని వీవర్స్ కాలనీలో రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రాల్లో గత 78 ఏళ్లుగా పరిపాలించిన ప్రభుత్వాలు అనుసరించిన చేనేత వ్యతిరేక జౌళి పరిశ్రమ అనుకూల విధానాలే ఆ పరిస్థితికి కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో చేనేత రంగానికి కనీసం రూ.2000 కోట్లు కేటాయించాలని అన్నారు. సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.203 కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనేక చేనేత సమస్యలపై ఈ నెల 22న చేనేత గర్జన నినాదంతో చలో మంగళగిరి కార్యక్రమం చేపట్టనున్నట్లు సూచించారు. మంగళగిరిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి నేతన్న సర్కిల్ వరకూ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. -
అత్త వేధింపులతో కోడలు ఆత్మహత్య
ముదినేపల్లి రూరల్: అత్త వేధింపులు భరించలేక కోడలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని దేవపూడిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం గురిండి గ్రామానికి చెందిన సింధుపురం సంతోషిని(27) దేవపూడికి చెందిన చేడు మహేష్ను ప్రేమించి 2023లో వివాహం చేసుకుంది. ఈ వివాహానికి సంతోషిని బంధువులు అంగీకరించినప్పటికీ మహేష్ తల్లి ఒప్పుకోలేదు. అయినప్పటికీ వీరిరువురు వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కూతురు ఉండగా తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. దీంతో అత్త అప్పలనరసమ్మ తరచూ కోడలైన సంతోషిని అనారోగ్యవంతురాలైన కూతురిని కన్నావంటూ వేధిస్తోంది. అయితే ఇటీవల మళ్లీ సంతోషిని గర్భం దాల్చింది. అయినప్పటికీ అత్త వేధింపులు ఆపకపోవడంతో పడక గదిలో ఫ్యాన్కి ఉరి వేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి సంతోషిని గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై సంతోషిని సోదరుడు సింగుపురం శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై వీరభద్రరావు గుడివాడ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆకివీడు: స్థానిక శ్రీరామ్పురంలో నివసిస్తున్న రాజనాల మంగతాయారు(48) ప్రమాదవశాత్తూ శుక్రవారం కాలువలో పడి మృతి చెందింది. గత కొంతకాలంగా ఆమె మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. కాలువలో నీళ్లు తీసుకువచ్చేందుకు వెళ్లగా ఫిట్స్ రావడంతో కాలువలో పడి మునిగిపోయింది. స్థానికులు వెంటనే గమనించి ఆమెను రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. ెపనుగొండ: వశిష్టా గోదావరిలో దొంగరావిపాలెం వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు పెనుగొండ ఎస్సై కె.గంగాధర్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గురువారం సాయంత్రం దొంగరావిపాలెం ఇన్చార్జి వీఆర్ఓ వంకా వెంకటేశ్వరరావు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడు 35–45 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉండి: మండలంలోని ఆరేడులో చోరీకి గురైన కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గణపవరం గ్రామానికి చెందిన ముత్తిరెడ్డి రవితేజ రొయ్యల చెరువుల గట్లపై పెంచుతున్న కోళ్లను బుధవారం రాత్రి చోరీ చేసిన ఘటన పాఠకులకు విధితమే. గురువారం సాయంత్రం ఆ కోళ్లను ఆటోలో తరలిస్తున్న వీరవాసరం మండలం వడ్డిగూడేనికి చెందిన సైదు మోహన్రావును ఎన్నార్పీ అగ్రహారం వద్ద పోలీసులు అరెస్టు చేసి, కోళ్లను స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్ చేశారు. శుక్రవారం నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై ఎండీ నసీరుల్లా తెలిపారు. -
భారీగా అక్రమ మద్యం ధ్వంసం
నరసాపురం రూరల్: అక్రమ మద్యం తయారీ, విక్రయం, రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి హెచ్చరించారు. శుక్రవారం మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్లో రూ.24 లక్షల విలువైన మద్యం, సారాను ధ్వంసం చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత ఎస్పీ స్వయంగా రోడ్ రోలర్ను నడిపి మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు ఆదేశాల మేరకు నరసాపురం సబ్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో సీజ్ చేసిన 4,550 బాటిళ్ల డ్యూటీ పెయిడ్ లిక్కర్ (డీపీఎల్), 2,136 బాటిళ్ల నాన్–డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్), 620 లీటర్ల అక్రమ సారాను వివిధ శాఖల అధికారుల పర్యవేక్షణలో ధ్వంసం చేశామన్నారు. కార్యక్రమంలో నరసాపురం ఆర్డీఓ దాసి రాజు, అదనపు ఎస్పీ వి.భీమారావు, నరసాపురం సబ్ డివిజన్ డీఎస్పీ డాక్టర్ జి.శ్రీవేద తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు, లోకేష్ను ఏమనాలి ?
ప్రతి తల్లి తమ పిల్లల్ని చదివించుకోవాలన్న సంకల్పంతో అమ్మ ఒడి పథకం తెచ్చింది మాజీ సీఎం జగన్. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి టాయిలెట్స్ మెయింటినెనన్స్ కోసం రూ. వెయ్యి తగ్గిస్తే సైకో అంటూ టీడీపీ, జనసేన నాయకులు విమర్శలు చేశారు. ఇప్పుడు వారు ఏం అభివృద్ధి చేశారని రూ.2 వేలు కోత పెట్టారు. చంద్రబాబు, లోకేష్ను ఏమని పిలవాలి. – కవురు శ్రీనివాస్, ఎమ్మెల్సీ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చాక చేస్తున్న పనులకు పొంతన లేదు. అర్హులందరికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పి కొందరికే ఇచ్చింది. రకరకాల కారణాలు చెప్పి ఎంతోమంది అర్హులకు సాయం అందించలేదు. వాస్తవాలు కప్పి పుచ్చి అందరికి ఇచ్చినట్టు శాసన మండలిలో కూటమి నాయకులు చెప్పడం సిగ్గుచేటు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. – కొట్టు సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం, తాడేపల్లిగూడెం ఎన్నికల్లో నీకు పదిహేను వేలు, నీకు పదిహేను వేలు అంటూ ఊదరగొట్టారు. అమల్లోకి వచ్చేసరికి రూ. 2 వేలు కోతపెట్టి రూ.13 వేలు మాత్రమే జమచేశారు. అది కూడా కొందరికి రూ.9 వేలు లోపే ఇచ్చారు. ఏవేవో కారణాలు చెప్పి అర్హులకు అన్యాయం చేశారు. మా ప్రభుత్వంలో పాఠశాల అభివద్ధికి తల్లిదండ్రుల అభీష్టం మేరకు రూ. వెయ్యి తగ్గిస్తే నానా రాద్దాంతం చేసిన కూటమి నేతలు ఇప్పుడు నోరుమెదపడం లేదు. – చెరుకువాడ శ్రీరంగనాధరాజు, మాజీ మంత్రి, ఆచంట సాంకేతిక కారణాలు, కరెంటు బిల్లులు, ఫోర్ వీలర్స్ సాకుగా చూపించి చాలా మంది అర్హులకు తల్లికి వందనం ఇవ్వలేదన్నది సుస్పష్టం. లబ్ధి పొందిన వారిలోనే కొందరికి రూ.9 వేల లోపే సాయం పొందిన వారు ఉన్నారు. వీటన్నింటిని కప్పిపుచ్చుతూ అందరికీ ఇచ్చేశామంటూ కూటమి నాయకులు మండలి సాక్షిగా అసత్యాలు వల్లె వేస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే మండలిలో మా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. – వంకా రవీంద్రనాథ్, ఎమ్మెల్సీ -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
కాళ్ల: తాళం వేసి ఉన్న ఇంటి తలుపులు పగులగొట్టి విలువై వెండి, బంగారం, నగదు అపహరించుకుపోయిన సంఘటన మండలంలోని సీసలిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అరవ సత్యనారాయణ ఈ నెల 9న కుటుంబంతో కలసి తిరుపతి వెళ్లారు. తిరిగి 12న ఇంటికి వచ్చేసరికి తాళం పగలకొట్టి ఉండటాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా ఇల్లంతా చిందరవందరగా ఉంది. బీరువా తలుపులు తీసి ఉండడంతో తనిఖీ చేయగా అందులో ఉన్న రూ. లక్ష నగదుతో పాటు నాలుగు కిలోల వెండి, ఒకటిన్నర కాసుల బంగారం పోయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై శ్రీనివాసరావు పరిశీలించి వివరాలు సేకరించారు. భీమవరం క్లూస్ టీం సీఐ రాజేష్ తన బృందంతో ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు. -
మహా ప్రసాదం.. వితరణకు సిద్ధం
భీమవరం (ప్రకాశం చౌక్) : భీమవరం శ్రీమావుళ్లమ్మ వారి 62 వార్షిక మహోత్స వాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారి ఆలయం వద్ద అఖండ అన్నసమారాధన నిర్వహించనున్నారు. భీమవరం పట్టణంతో పాటు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చే సుమారు లక్ష మంది భక్తులకు అమ్మవారి అన్నప్రసాదాన్ని అందించేందుకు ఉత్సవాల నిర్వాహకులు నీరుల్లి కూరగాయ పండ్లు వర్తక సంఘం, అమ్మవారి ఉత్సవ కమిటీ ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ మేరకు అన్నదానం కోసం అవసరమైన కూరగాయలు, బియ్యం ఇతర వస్తువులను గురువారం ఉదయమే అమ్మవారి ఆలయం వద్దకు చేర్చి గురువారం సాయంత్రం నుంచే వంటలను తయారు చేయడం ప్రారంభించారు. శుక్రవారం ఉదయం నుంచీ అన్నదానం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మావుళ్లమ్మకు మహా నైవేద్యం శ్రీమావుళ్లమ్మ వారికి శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ప్రత్యేక పూజల నడుమ మహా నైవేద్యం సమర్పిస్తారు. పలు రకాల పిండి వంటలు, స్వీట్లు, పులిహోర ఇతర ప్రత్యేక ప్రసాదాలతో అమ్మవారికి మహానైవేద్యం సమర్పిస్తారు. అనంతరం అన్నదాన ప్రసాదం వితరణ ప్రారంభిస్తారు. చక్ర పొంగలి, పులిహోర, అన్నం, బంగాళదుంప కుర్మా, వంకాయ కూర, ఆవకాయ పచ్చడి, సాంబారు, పెరుగుతో భక్తులకు అన్నదానం చేస్తారు. వాటితో పాటు భక్తులు తీసుకువచ్చే పలు రకాల పిండి వంటలు, స్వీట్లు ఉంటాయి. పోలీసు బందోబస్తు అమ్మవారి అన్నదాన ప్రసాదం స్వీకరించడానికి భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదుగురు సీఐలు, పది మంది ఎస్సైలు, 150 మంది పోలీసు సిబ్బంది సేవలు అందించనున్నారు. భోజనం చేసే ప్రాంతాల వద్ద, జనం లోపలికి, బయటకు వెళ్లే మార్గాల వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. శ్రీధనలక్ష్మీ వారి అలంకరణ అమ్మవారి 62 వార్షిక మహోత్సవాల్లో భాగంగా గురువారం మావుళ్లమ్మ అమ్మవారు ధనలక్ష్మీ అమ్మవారి అలంకరణలో దర్శమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. నేడు మావుళ్లమ్మకు మహా నైవేద్యం సమర్పణ లక్షమందికి అన్నసమారాధన ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు అన్నదానం -
కదం తొక్కిన కార్మిక లోకం
భీమవరం/భీమవరం (ప్రకాశం చౌక్): దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం జిల్లాలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. స్థానిక సీఐటీయూ కార్యాలయం వద్ద కార్మిక, కర్షక సంఘాల ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. శ్రామిక హక్కులపై జరుగుతున్న దాడిని ఐక్య పోరాటాల ద్వారా తిప్పుకొట్టాలని సీఐటీయూ జిల్లా పూర్వ కార్యదర్శి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి.బలరాం పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాసేలా లేబర్ కోడ్లు తీసుకువచ్చిందన్నారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏపీ ఎన్జీజీఓస్ నిరసన : మధ్యాహ్న భోజన విరామ సమయంలో భీమవరం కలెక్టరేట్ వద్ద ఏపీ ఎన్జీజీఓస్ ఉద్యోగులు నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు యూవీ పాండు రంగారావు మాట్లాడుతూ నూతన కార్మిక చట్టాల రద్దు, వేతన సవరణ, పీఎఫ్ఆర్డీఏ చట్టం రద్దు, పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ అమలు, పీఎం స్కూల్, సొసైటీ ఉద్యోగులకు 62 ఏళ్ల పదవీ విరమణ, సీపీఎస్ ఉద్యోగుల కోసం మెమో–57 అమలు తదితర డిమాండ్లు చేశారు. కార్యదర్శి పోతన సుకుమార్, సహధ్యక్షుడు శ్రీనివాసరాజు, కోశాధికారి కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల మూసివేత సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లాలోని 1,620 అంగన్వాడీ కేంద్రాలను మూసివేసి కార్యకర్తలు సమ్మె లో పాల్గొన్నారు. భీమవరంలో సీఐటీయూ తదితర యూనియన్లు చేపట్టిన నిరసనలు, ర్యాలీల్లో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
శివరాత్రికి ప్రత్యేక బస్సులు
భీమవరం(ప్రకాశం చౌక్): మహాశివరాత్రి ఉ త్సవాలకు జిల్లాలోని నా లుగు ఆర్టీసీ డిపోల నుంచి 46 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎస్.గిరిధర్కుమార్ తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ పట్టిసీమ, వీరపాలెం, ఆచంట, శ్రీశైలం క్షేత్రా లకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామ న్నారు. శ్రీశైలానికి భీమవరం నుంచి 3, నరసాపురం నుంచి 2, తాడేపల్లిగూడెం నుంచి 2, తణుకు నుంచి 2, పట్టిసీమకు తణుకు వయా నిడదవోలు, పంగిడి, కాపవరం మీదుగా 5 బస్సులు, తాడేపల్లిగూడెం, నల్లజర్ల, కొయ్యలగూడెం మీదుగా 10 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. వీరంపాలేనికి తాడేపల్లిగూడెం నుంచి 12, ఆచంటకు తాడేపల్లిగూడెం నుంచి పిప్పర, అత్తిలి, మార్టేరు మీదుగా 3, నరసాపురం నుంచి వయా పాలకొల్లు, మార్టేరు మీదుగా 2 బస్సులు నడుపుతామన్నారు. కళాశాల బస్సు డ్రైవర్లు, క్లీనర్కు దేహశుద్ధి ద్వారకాతిరుమల: ఓ ప్రైవేట్ కళాశాల బస్సులో ఇంటర్ విద్యార్థినితో బస్సు డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని తిరుమలంపాలెం పంచాయతీ పావులూరివారిగూడేనికి చెందిన ఓ బాలిక కామవరపుకోట మండలంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ప్రైవేట్ క్లాసుల కారణంగా బస్సు ఆలస్యంగా గ్రామానికి చేరుతోంది. ఈ నేపథ్యంలో ఈనెల 7న రాత్రి కళాశాల బస్సులో విద్యార్థిని ఇంటికి బయలుదేరింది. ఇదిలా ఉండగా ఇదే బస్సులో గతంలో డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి మార్గమధ్యలో ఈ బస్సు ఎక్కాడు. క్లీనర్తో ముచ్చటిస్తుండగా.. విద్యార్థిని దిగే స్టేజీ రాగా, బస్సును ముందుకు తీసుకువెళ్లి తిప్పుకొస్తామని చెప్పాడు. బస్సు ముందుకు వెళ్లగానే పాత డ్రైవర్ విద్యార్థిని పక్కన కూర్చుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక బస్సులోంచి కిందకు దూకి, ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా పలువురు గ్రామస్తులతో కలిసి వెళ్లి బస్సును అడ్డగించారు. గొల్లగూడెం వద్ద బస్సును ఆపి బస్సుతో సహా ప్రస్తుత, పాత డ్రైవర్లను, క్లీనర్ను తిరుమలంపాలెం గ్రామానికి తీసుకొచ్చారు. ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ను బస్సులోంచి దింపి దేహశుద్ధి చేశారు. విషయాన్ని కళాశాల యాజమాన్యానికి తెలియజేసినా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. పోలీస్ కేసు పెడతామని అనగా ఎట్టకేలకు యాజమాన్యం దిగివచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు శాంతించారు. ఇద్దరు డ్రై వర్లు, క్లీనర్ను యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. విద్యాశాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పోలవరం రూరల్: పట్టిసంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు 550 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ అన్నారు. పట్టిసీమలో మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయం, ఇసుక తిన్నెలు, రేవులో ఏర్పాట్లపై సూచనలిచ్చారు. ఆయన వీరేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏటిగట్టు రోడ్డులో ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ఎప్పుటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. బుట్టాయగూడెం: బుట్టాయగూడెం ఎంపీపీగా ఎన్నికై న వైఎస్సార్సీపీ ఎంపీటీసీ తెల్లం రమణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమీపంలో కేటాయించిన ప్రత్యేక గదిలో ఆమె పూజా కార్యక్రమాలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీఓ కె.జ్యోతి, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏఓ బేబీ సరోజిని, జెడ్పీటీసీ మొడియం రామతులసి, వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్ రావు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైఎస్సార్సీపీ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. -
పల్లె పోరుకు సన్నాహాలు
శురకవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026యలమంచిలి: గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. గతేడాది సెప్టెంబర్ 3న తాత్కాలిక షెడ్యూల్ను ప్రతిపాదించి, ఈ మేరకు కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రతి జిల్లా నుంచి ముగ్గురికి సాంకేతిక అంశాలపై శిక్షణ కూడా ఇచ్చారు. ఈ శిక్షణకు జిల్లా నుంచి ఒక ఈఓపీఆర్డీ, ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. అనంతరం ఎన్నికలపై ఎలాంటి ఉత్తర ప్రత్యుర్తతాలు జరపని ఎన్నిక సంఘం తాజాగా (ఈనెల 6న) మార్చి 9వ తేదీ నాటికి పంచాయతీల ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. డీపీఓ కార్యాలయాల్లో.. నిర్ణీత సమయంలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా చేపట్టాల్సిన ప్రక్రియలను పూర్తి చేసుకునేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టినట్టు తెలిసింది. గతనెల 1 వరకు ఉన్న అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు భీమవరంలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో ఎన్ని పంచాయతీల్లో ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది? ఆయా గ్రామ పంచాయతీల్లో వార్డుల వివరాలు ? జనాభా, సామాజిక వర్గాల వివరాల సేకరణ తదితర పనులు మొదలయ్యాయి. ప్రభుత్వం.. సంశయం రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుముఖంగా ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్సిక్స్ హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉచిత గ్యాస్ సిలెండర్ పథకానికి సంబంధించి చాలా మంది వినియోగదారులకు సొమ్ములు జమకావడం లేదు. దీనిపై సమాధానం చెప్పే నాథుడే లేడు. అలాగే ఉచిత బస్సు పథకం వచ్చిన తర్వాత చాలా గ్రామాల్లో బస్సులు ఆగడం లేదు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి (రూ.1,500) పథకాల ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ హామీ అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు వెళ్తుందా అనేది వేచి చూడాలి. పశ్చిమగోదావరి జిల్లాలో 409 పంచాయతీ ఉండగా.. భీమవరం మున్సిపాలిటీలో నాలుగు, పాలకొల్లు మున్సిపాలిటీలో ఏడు, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఐదు పంచాయతీలను విలీనం చేయడంతో 2021లో ఈ 16 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో మిగిలిన 393 పంచాయతీలకు అప్పట్లో ఎన్నికల నిర్వహించగా పాలకవర్గాలు ఏర్పడ్డాయి. ఈ సారి ఆ 16 గ్రామాలపై స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాలోని 393 పంచాయతీల్లో 2021 ఏప్రిల్ 3న పాలన మొదలు కాగా, పాలకవర్గాల పదవీ కాలం వచ్చే ఏప్రిల్ 2తో ముగియనుంది. సంగ్రామానికి సై పంచాయతీ ఎన్నికలకు కసరత్తు ఏప్రిల్ 2తో ముగియనున్న పదవీ కాలం వచ్చేనెల 9 నాటికి ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలు జిల్లాలో 393 పంచాయతీలు -
శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమై, క్షేత్రపాలకునిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు స్వామివారిని పెండ్లి కుమారునిగాను, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేసే వేడుక కన్నులపండువగా జరిగింది. ముందుగా ఆలయ ముఖ మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై గంగా, పార్వతీ సమేత శివదేవుని ఉత్సవ మూర్తులను ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం అర్చకులు, పండితులు శైవ ఆగమోక్తంగా వేడుకను ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ శివయ్యను పెండ్లి కుమారునిగా, గంగా, పార్వతీ అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేశారు. ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ, ఏఈఓ ఐ.రమణరాజు, సూపరింటిండెంట్ కేవీ దుర్గాప్రసాద్ దంపతులు స్వామి వారికి పూజాధికాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయంలో అంకురార్పణ, ధ్వజారోహణ తదితర కార్యక్రమలు జరుగుతాయని ఆలయ ఈఓ తెలిపారు. -
ఆదాయం మితం.. ఖర్చు అధికం
● పట్టిసం ఉత్సవాల నిర్వహణ తీరు ● సరిపడా నిధులు లేవంటున్న పంచాయతీ ● ఐదేళ్లుగా టెండర్దారులకు రూ.29 లక్షల బకాయిలు పోలవరం రూరల్ : పట్టిసం మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణలో పంచాయతీకి వచ్చే ఆదాయానికి చేసే ఖర్చుకు పొంతన లేకుండా ఉంది. దీంతో ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం గ్రామ పంచాయతీకి ఏర్పాట్లు చేయడం కష్టతరంగా మారింది. ఈ విషయాన్ని సమావేశాల్లో అధికారుల దృష్టికి తీసుకు వస్తూనే ఉన్నారు. గత ఐదేళ్లుగా ఉత్సవాల నిర్వహణకుగాను టెండర్దారులకు రూ.29 లక్షలు బకాయిలు ఉన్నట్లు పంచాయతీ అధికారులు చెబుతున్నారు. సగం కూడా రాని ఆదాయం 2020 నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో లాంచీలు లేకపోవడం, నీటి ప్రవాహం మారిపోయి ఉత్సవాల సమయంలో నీరు తగ్గడంతో అధికార యంత్రాంగం పరిశీలించి నది మధ్యలో పంట్లు ఏర్పాటు చేసి భక్తులు కాలినడకన వెళ్లి వచ్చే విధంగా ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీ, పట్టిసం ఫెర్రీ, సైకిల్ స్టాండ్ల వేలం నిర్వహిస్తారు. అలాగే ఉత్సవాల సమయంలో ఇసుక తిన్నెలపై ఏర్పాటు చేసే దుకాణదారుల నుంచి అశీలు వసూలు చేస్తుంటారు. ఉత్సవాల సమయంలో ఈ సొమ్ము ఖర్చు చేస్తుంటారు. ఏటా రూ.18 నుంచి రూ.20 లక్షల వరకు గ్రామ పంచాయతీ ఏర్పాట్లకు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఆదాయం మాత్రం అందులో సగం కూడా రావడం లేదంటున్నారు. ఫెర్రి కాంట్రాక్టర్ చేపట్టే పనులివే.. ప్రతి సంవత్సరం ఇసుక తిన్నెలపై దుకాణదారుల నుంచి సమారు రూ. 75వేలు ఆశీలు వసూలు అవుతుంటాయి. ఫెర్రీ కాంట్రాక్టర్ భక్తులను నదిదాటించేందుకు అవసరమయ్యే ర్యాంపులు, క్యూలైన్లు, టిక్కెట్ కౌంటర్లు, చలువ పందిళ్ళు, ప్లాట్ఫారాలు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేస్తుంటారు. గ్రామపంచాయతీ ఇసుక తిన్నెలపై చలువపందిళ్ళు తాత్కాలిక మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, పలు శాఖల అధికారుల క్యాంపు కార్యాలయాల, లైటింగ్, జనరేటర్లు, చేతిపంపులు ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా కొన్ని పనులు పంచాయతీ, కొన్ని పనులు ఫెర్రీ కాంట్రాక్టర్ చేపడుతారు. వీరు చేసే తాత్కాలిక పనులకు వెదురుకర్రలు, బాదులు, తాటాకు, ఎవదురుకంప వినియోగిస్తారు. వీరిని అధికారుల ఆదేశాల మేరకు అటవీప్రాంతం నుంచి తెచ్చుకుంటారు. ఉత్సవాల్లో సమయంలో వీటిని వినియోగించి, తదుపరి వీటిని అమ్మి, సొమ్ము చేసుకుంటారు. లాంచీ టికెట్ రేటు పెంచినా.. గత సంవత్సరం లాంచీ టిక్కెట్ ధర రూ. 30 ఉండగా, అదనంగా రూ.10 పెంచి వసూలు చేయగా, రూ.8 లక్షలు ఆదాయం వచ్చింది. మరలా ఈ ఏ డడాది కూడా రూ.10 పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే ఆదాయానికి, ఖర్చులకు ఎక్కడా పొంతన లేకుండా పోతోందని, ఉత్సవాలు అనంతరం ఖర్చుల వివరాలపై అధికారులు దృష్టి సారించి ఆలయానికి వచ్చే వాస్తవ ఆదాయాన్ని పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. పట్టిసం శివక్షేత్రం సంవత్సరం ఫెర్రి ఆదాయం సైకిల్ స్టాండ్ ద్వారా.. 2021–2022 రూ. 5 లక్షలు రూ.70 వేలు 2022–2023 రూ.15 లక్షలు రూ.1.40 లక్షలు 2023–2024 రూ.10.05 లక్షలు రూ.1.43 లక్షలు 2024–2025 రూ.11.70 లక్షలు రూ.1.90 లక్షలు 2025–2026 రూ.11.85 లక్షలు రూ.1.91 లక్షలు -
అపచారం.. దురాచారం
● ఏలూరు గంగానమ్మ జాతరలో నిర్వాహకుల తీరుపై విమర్శలు ● అడ్డగోలు వసూళ్లపై తీవ్ర ఆగ్రహం ఏలూరు (ఆర్ఆర్పేట): గత అక్టోబర్ నెల నుంచి నగరంలో నిర్వహించిన శ్రీ గంగానమ్మ జాతర సందడి ముగిసింది. అయితే ఈ ఏడాది నిర్వహించిన జాతరలో వివిధ కమిటీలు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మవార్ల దర్శనానికి టిక్కెట్లు పెట్టి భక్తులను దోచుకున్నారని పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జాతర రోజున అమ్మవార్లకు జీవాలను చూపడానికి కూడా రూ.50 నుంచి రూ.500 వరకూ వసూలు చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీనికి తోడు అమ్మవారి ఘటాలను కొంతమంది భక్తుల ఇంటి వద్ద దింపి వారి ఇంట్లో భోజనాలకు ఏర్పాటు చేయడం కోసం కమిటీ ప్రతినిధులు సదరు భక్తుల నుంచి రూ. 5 వేల నుంచి రూ. 15 వేల వరకూ వసూలు చేశారని తెలుసుకుని కొంతమంది వృద్ధులు ఇదెక్కడి దురాచారమని మండిపడుతున్నారు. గతంలో అమ్మవారి ఘటాలను తలకు ఎత్తుకున్న అనంతరం ఊరంతా తిరిగే వరకూ కిందకు దింపే వారు కాదని, గంటకు ఒకరు చొప్పున డ్యూటీలు వేసుకుని ఒకరి తరువాత ఒకరు ఘటాలను దింపకుండా తిప్పుతూనే ఉండాలనేది సంప్రదాయంగా వస్తోందని, అయితే జాతర కమిటీల ప్రతినిధులు డబ్బుకు ఆశపడి భక్తుల ఇళ్ల వద్ద అమ్మవార్ల ఘటాలను దింపి వారి ఇంట్లోకి తీసుకువెళ్లడం సంప్రదాయానికి వ్యతిరేకమనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి సంప్రదాయ వ్యతిరేక చర్యలు నగరానికి ఏమి అరిష్టాన్ని తెచ్చి పెడతాయో? అని కొందరు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ స్థితికి నగరం జాతర సందడి ఇప్పుడిప్పుడే నగరం సాధారణ స్థితికి చేరుకుంటుంది. నగరంలోని తూర్పు వీధి మొదలు తంగెళ్ళ మూడి వరకూ ఏడు ప్రాంతాల్లో శ్రీ గంగానమ్మ వారి జాతర సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవార్లకు ముడుపు కట్టడం నుంచి అమ్మవార్ల పాదం భూమిపై మోపడం, అమ్మవారిని నగరంలోకి ఘనంగా స్వాగతించడం, అమ్మవార్లను మేడల్లో ప్రవేశపెట్టడం, అక్కడి నుంచి ప్రతీ నిత్యం అమ్మవార్లకు భక్తులు నైవేథ్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం, నగరంలోని ప్రతి వీధిలో అమ్మవారిని ఊరేగించి అమ్మవార్ల దర్శనాన్ని ప్రజలకు కల్పించడం వంటి కార్యక్రమాలతో నాలుగు నెలల పాటు నగరంలో సందడి వాతావరణం నెలకొంది. గత నెల 26వ తేదీ నుంచి జాతర ముగింపు దశకు చేరుకుని ఈ నెల 9వ తేదీతో అమ్మవార్లను సాగనంపే ప్రక్రియ వరకూ అంతా సజావుగా సాగిపోయింది. శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర ముగిసినా ఇప్పటికీ నగరంలోని భక్తులు అమ్మవారి జాతర ముచ్చట్లే చెప్పుకుంటున్నారు. జాతర విశేషాలను సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లు విశేషంగా ప్రచారం చేయడంతో ఏలూరు నగరంలోనే కాక పరిసర ప్రాంతాల ప్రజలు సైతం జాతర విశేషాలపై ఎంతో ఆసక్తి కనబరిచారు. ఉత్సాహంగా అన్న సమారాధనలు నగరంలోని తూర్పువీధి, దక్షిణపు వీధి, పవర్ పేట, లక్ష్మీవారపు పేట, ఆదివారపు పేట, పడమర వీధి, తంగెళ్లమూడి ప్రాంతాల్లో జాతర ముగిసిన నేపథ్యంలో జాతర కమిటీల ప్రతినిధులు భారీ ఎత్తున అన్న సమారాధనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే తంగెళ్ళమూడి, దక్షిణపు వీధి కమిటీలు అన్న సమారాధన ముగించగా మరికొన్ని కమిటీల ప్రతినిధులు తాము త్వరలో అన్న సమారాధన నిర్వహిస్తామని ప్రచారం చేస్తున్నారు. -
నేడు మెగా క్రెడిట్ అవుట్ రీచ్
ఏలూరు (ఆర్ఆర్పేట): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త మెగా వ్యవసాయ రుణ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహిస్తోందని ఆ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సతీష్బాబు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తమ బ్యాంక్ రైతులకు, వ్యవసాయానికి, వ్యాపారాలకు అనుకూలమైన ఆర్థిక పరిష్కారాల నిమిత్తం రుణాలు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. రైస్మిల్, దాల్ మిల్, ఆయిల్ మిల్ ఏర్పాటుకు రూ.100 కోట్ల వరకు, కోల్డ్ స్టోరేజ్, గోదాం ఏర్పాటు కోసం రూ.50 కోట్ల వరకు, రివాల్వింగ్ క్యాష్ క్రెడిట్ లేదా టర్మ్ లోన్ సపోర్ట్ కింద రూ.20 లక్షల వరకు రుణాలు అందిస్తామని వివరించారు. సోలార్ ప్లాంట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, పౌల్ట్రీ వ్యాపారం లేదా విస్తరణకు రుణాలు మంజూరు చేయనున్నట్టు పేర్కొన్నారు. రుణ సహాయం కోసం 92239 01111 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చని, టోల్ ఫ్రీ నంబర్ 1800 30 30లో కూడా సంప్రదించవచ్చని సూచించారు. -
అధిక ధరలకు కొంటున్నాం
సామాన్యుడికి పోషకాలు అందించేది కందిపప్పు. కొన్ని నెలలుగా రేషన్ షాపుల్లో కందిపప్పు ఇవ్వకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బయట మార్కెట్లో అధిక ధరలకు కొనాల్సి వస్తుంది. ఎన్నికల ముందు రేషన్ షాపుల ద్వారా అన్ని సరుకులు ఇస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం అఽధికారం చేపట్టిన తర్వాత మరిచిపోయింది. –ఎం.సూర్యారావు, పాలకోడేరు చంద్రబాబు ప్రభుత్వం పప్పన్నం కూడా తిననివ్వడం లే దు. రేషన్ ద్వారా కందిపప్పు ఇస్తామని చెప్పి చేతులెత్తేడం దారుణం. వారానికి రెండు మూడు రోజులు పప్పుకూర వండుకుందామంటే అధిక ధర పెట్టి కొనాల్సి వస్తుంది. అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ప్రభుత్వం ధరలను నియంత్రించాలి – ముత్యు విజయ, దుంపగడప, ఆకివీడు మండలం -
పెనుగొండ ఎంపీడీఓపై విచారణ
పెనుగొండ: పెనుగొండ ఎంపీడీఓ టి.సూర్యనారా యణ మూర్తిపై వచ్చిన ఆరోపణలపై నరసాపురం డీఎల్డీఓ జి.రాణి గురువారం విచారణ చేపట్టారు. 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం, అభివృద్ధి పనులు, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకున్నారంటూ పెనుగొండకు చెందిన కాకి ప్రభాకర్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఎంపీటీసీలకు నిధుల కేటాయింపులో వివక్ష చూపారని, నిధులను సరిగా ఖర్చు చేయలేదని ఆరోపించారు. అలాగే కాంట్రాక్టర్ల నుంచి నేరుగా యాప్లలో కమీషన్లు తీసుకున్నారని, గ్రామ కార్యదర్శుల నుంచి సైతం వసూళ్ల పర్వం ఉందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో జెడ్పీ సీఈఓ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలంటూ డీఎల్డీఓను ఆదేశించారు. మండలంలోని గ్రా మ కార్యదర్శులు, కాంట్రాక్టర్లు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బందిని ఆమె విచారించారు. ఓచర్లు, ఎంబుక్లు, తీర్మానాలు పరిశీలించారు. వివాదాస్పదంగా తీరు ఎంపీడీఓ తీరు వివాదాస్పదంగా ఉంది. ప్రొటోకాల్ పాటించడంలోనూ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తుందని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇటీవల వెంకట్రామపురంలో నిర్వహించిన శంకుస్థాప న కార్యక్రమాల్లో సర్పంచ్ను కించపరిచేలా వ్యవహరించారన్న విమర్శలు వున్నాయి. దీనికి తోడు వడలిలో శంకుస్థాపనలు, అభివృద్ధి పనుల వివరాలు తెలియకుండానే నిర్వహిస్తున్నారని అధికార పక్షం నుంచే ఆరోపణలు రావడంతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వాయిదా వేశారు. వడలి గ్రా మంలో ఎంపీటీసీలకు సమాచారమే ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. భేదాభిప్రాయాలతోనే.. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపీల మధ్య వ్యతిరేక పార్టీల వలన వచ్చిన భేదాభిప్రాయాలు ఎంపీడీఓకి కలిసి వచ్చాయని ఎంపీటీసీలు అంటున్నారు. దీంతో నిధులను విచ్చలవిడిగా వెచ్చిస్తున్నారని ఆరోపించారు. విచారణలో ఎంపీటీసీలకు అవకాశం కల్పించకపోవడం దురదృష్టకరమని, మరింత లోతుగా విచారణ నిర్వహించాలని పలువురు డిమాండ్ చేశారు. విచారణ అనంతరం నివేదికను సీఈఓకు సమర్పిస్తామని, నివేదిక ఆధారంగా తుది నిర్ణయం ఉంటుందని డీఎల్డీఓ రాణి తెలిపారు. -
పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు
కై కలూరు: రోడ్డు మలుపు తప్పించే క్రమంలో ఓ కారు పంట కాలులో దూసుకెళ్లడంతో తండ్రీకూతురికి గాయాలైన ఘటన కై కలూరు మండలం పామర్రు–దిగమర్రు జాతీయ రహదారి పల్లెవాడ మలుపు వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు, క్షతగాత్రుల వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా వెంప గ్రామానికి చెందిన ఇంజేటి సువర్ణరాజు(45) డయాలసిస్ చేయించుకునేందుకు తన కుమార్తె అర్పిత(19)తో కలసి తన కారులో కై కలూరు మీదుగా ఏలూరు వెళ్తున్నాడు. అయితే పల్లెవాడ మలుపు వద్ద అదుపుతప్పి కారు పంట కాలువలోకి దూసుకుపోయింది. నీరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమీప గ్రామస్తులు గమనించి కారు అద్దాలు పగలగొట్టి అతికష్టం మీద తండ్రీకూతురిని బయటకు తీసుకొచ్చారు. సువర్ణరాజుకు స్టీరింగ్ కడపు భాగంలో గుచ్చుకుంది. కుమార్తెకు తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరినీ 108లో కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఏలూరు సర్వజన ఆస్పత్రికి పంపారు. తండ్రీకూతుళ్లకు గాయాలు -
కందిపోయిన సంక్షేమం
ఆకివీడు: బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలకు రెక్కలు రావడంతో కొనుగోలు చేయడం భారంగా మారింది. దీనికితోడు రేషన్ షాపుల్లో చంద్రబాబు ప్రభుత్వం కందిపప్పు సరఫరా నిలిపివేయడంతో పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో నిత్యావసర సరుకుల ధరలపై బాదుడే బాదుడు అంటూ ప్రచారం చేసిన కూటమి నేతలు నేడు అధికారంలో ఉన్నా, జీఎస్టీ తగ్గినా ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు. కనీసం రేషన్ దుకాణాల ద్వారా కూడా కందిపప్పును సరఫరా చేయడం లేదు. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ.150కు చేరింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ వాహనాల ద్వారా కిలో రూ.67కు కందిపప్పును అందించేవారు. ఇది పేదలకు ఉపయుక్తంగా ఉండేది. సరఫరాకు మంగళం : కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రెండు, మూడు నెలలు మాత్రమే కందిపప్పును రేషన్ షాపుల్లో విక్రయించారు. తర్వాత సరఫరా నిలిచిపోయింది. మరలా ఎప్పటినుంచి ఇస్తారనే స్పష్టత కూడా లేదు. దీంతో బహిరంగ మార్కెట్లో కందిపప్పు కొనాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వంలో ఇంటికే రేషన్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతినెలా బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమ పిండిని ఎండీయూ వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే అందించేవారు. కరోనా వంటి విపత్తు సమయంలోనూ పక్కాగా సరుకులు పేదలకు చేరాయి. ప్రస్తుతం ఇంటికే రేషన్ సరఫరా నిలిచిపోగా, సరుకుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం కోత పెట్టింది. రేషన్ షాపుల్లో కందిపప్పు సరఫరాకు మంగళం బహిరంగ మార్కెట్లో ధరలకు రెక్కలు పేదలకు తప్పని ఇబ్బందులు గత ప్రభుత్వంలో ఇంటికే రేషన్ -
శివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు
భీమవరం: రానున్న మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ ఆదేశించారు. గురువారం ఆయన జిల్లాలో పర్యటించి భీమవరం వన్టౌన్, కాళ్ల పోలీస్స్టేషన్ల పనితీరుపై సమీక్షించారు. పంచారామక్షేత్రం భీమవరంలో సోమేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, క్యూలైన్ల నిర్వహణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘాపై సూచనలు ఇచ్చారు. వార్షిక తనిఖీల్లో భాగవంగా ఆయా పోలీస్స్టేషన్లను పరిశీలించి రికార్డులు, కేసుల దర్యాప్తుపై ఆరా తీశారు. ప్రజలకు పోలీసు సేవలపై నమ్మకం కలిగించేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్–1 ఫలితాల్లో ప్రతిభ చూపిన భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ రైటర్ (హెడ్ కానిస్టేబుల్) గురుజు దివాకర్ కుమార్తె లక్ష్మీ అంజనను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఏఎస్పీ వి.భీమారావు, డీఎస్పీ రఘువీర్ విష్ణు, సీఐలు, ఎస్సైలు ఉన్నారు. -
ముద్దాపురంలో టీడీపీ శ్రేణుల విధ్వంసం
● అర్ధరాత్రి సమయంలో శిలాఫలకం ధ్వంసం ● అడ్డుకున్న వైఎస్సార్సీపీ నాయకులపై దౌర్జన్యం తణుకు అర్బన్: తెలుగుదేశం పార్టీ శ్రేణులు సృష్టిస్తున్న విధ్వంసం, వివాదాలు, కవ్వింపుల పరంపర తణుకు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఫ్లెక్సీ వివాదాలతో గొడ వలు రేకెత్తించిన టీడీపీ శ్రేణులు తాజాగా తణు కు మండలం ముద్దాపురంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ప్రాంతంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డు నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని ధ్వంసంతో మరోసారి కవ్వింపులకు దిగారు. బుధవారం రాత్రి శిలాఫలకాన్ని ధ్వంసం చే స్తున్న వ్యవహారాన్ని అడ్డుకున్న వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రావడం, వారు వెళ్లిన తర్వాత అనుకున్న విధంగానే టీడీపీ శ్రేణులు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఓ సమయంలో గ్రామంలో ఉద్రిక్తంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో పోగైన టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టే ధోరణితో ప్రవర్తించినా వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనం పాటించడంతో ఎటువంటి ఘర్ష ణలు జరగలేదు. అయితే అర్థరాత్రి వరకు కొనసాగిన ఈ వ్యవహారంలో శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.5 కోట్ల నిధులతో రోడ్డు నిర్మాణానికి మా జీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారని, నిధులు కూడా కేటాయించారని పార్టీ నాయకులు చెబుతున్నారు. గురువారం రాత్రి తణుకు రూరల్ పోలీసులకు ముద్దాపురం వైఎస్సార్సీపీ నాయకులు ఫిర్యా దు చేశారు. శిలాఫలకాన్ని పడగొడుతుండగా అడిగినందుకు తమపై దౌర్జన్యానికి దిగారని, శిలాఫలకం ధ్వంసం చేసిన వారి పేర్లతో సహా 10 మందిపై ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. -
పెద్దింట్లమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష
కై కలూరు: జిల్లాలో అతిపెద్ద జాతరల్లో ఒకటైన కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఆర్డీఓ ఎం.అచ్యుత అంబరీష్ సూచించారు. గురువారం జాతరకు సంబంధించిన సమన్వయ సమావేశాన్ని ఆలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అంబరీషన్ మాట్లాడుతూ జాతర ఈ నెల 18 నుంచి మార్చి 3 నిర్వహిస్తారని పేర్కొన్నారు. భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యం వంటి సౌకర్యాల కల్పనలో ముందుండాలన్నారు. ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ జాతర అన్ని రోజులు పూర్తి పోలీసు బందోబస్తు చేపడతామన్నారు. అనంతరం జాతర బుక్లెట్ను అవిష్కరించారు. కార్యక్రమంలో ఘంటసాల వెంకటలక్ష్మీ, తహసీల్దారు రామకృష్ణ, ఆలయ ఈఓ కూచిపూడి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని ఏపీ దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కో–కన్వీనర్, జిల్లా అధ్యక్షులు మేడపాటి వీర వెంకట రాఘవేంద్రరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ మెంబర్ సర్వే(యూఎఫ్ఎంఎస్) వల్ల దివ్యాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రత్యేక యూనిట్గా గుర్తించాలని, కుటుంబంలో ఇతరులు ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నప్పటికీ, దివ్యాంగులు మాత్రం శారీరక, ఆర్ధిక పరిమితుల వల్ల బలహీనంగానే ఉంటారని తెలిపారు. దివ్యాంగులను వారిని కుటుంబంతో సంబంధం లేకుండా విడిగా సర్వే చేయాలని, సంక్షేమ పథకాల కోత నివారించాలని, కుటుంబ ఆదాయాన్ని ప్రామాణీకంగా తీసుకుంటే దివ్యాంగులకు అందే ఫించన్లు, ఇతర ప్రభుత్వ రాయితీలు రద్దయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవీయకోణంతో ఆలోచించి దివ్యాంగుల ఆర్ధిక స్థితిగతులను విడిగా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇరగవరం: మండలంలోని కె.ఇల్లింద్రపర్రు గ్రామంలో గురువారం విద్యుత్ షాక్తో యువ కుడు మృతి చెందాడు. ఎస్సై జానా సతీష్ తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న గ్రామానికి చెందిన గోపిశెట్టి సతీష్ కుమార్ (28) తన స్వగ్రామంలో సొంత ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నాడు. అయితే విద్యుత్ తీగలకు ప్లాస్టిక్ గొట్టం బిగిస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలింది. దీంతో సతీష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు. -
పంచాయతీ కార్యదర్శుల మెడపై కత్తి
● 15లోగా 50 శాతం పన్నులు వసూలు చేయాలని హుకుం ● లేదంటే సస్పెండ్ చేస్తామని ఉన్నతాధికారుల బెదిరింపులు నరసాపురం: పంచాయతీ కార్యదర్శుల మెడపై పన్నుల వసూళ్ల కత్తి వేలాడుతోంది. గ్రామాల్లో ఆస్తి, ఇతర పన్నులు ఈ నెల 15 లోగా 50 శాతం వసూలు చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. దీంతో వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వచ్చే నెలలో గానీ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాదు. ఏటా మార్చిలో పన్నుల వసూళ్లు ముమ్మరం చేసి ఏప్రిల్ నెలలో ముమ్మరంగా వసూళ్లపై పంచాయతీ కార్యదర్శులు దృష్టిపెడతారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాకుండానే తమపై ఒత్తిడి ఏంటని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 శాతం వసూలు చేయకుంటే సస్పెండ్ 15వ తేదీ కల్లా 50 శాతం పన్నులు వసూలు చేయకుంటే సస్పెండ్ చేస్తామనే హెచ్చరికలు అందాయి. పన్నుల వసూళ్లలో బాగా వెనుకబడ్డ వారిలో మండలానికి ఒకరి చొప్పున కార్యదర్శులను గుర్తించి వారిని సస్పెండ్ చేయడం ద్వారా మిగిలిన సెక్రటరీలకు హెచ్చరికలు పంపించే దిశగా ఉన్నతాధికారులు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఎన్నడూలేని విధంగా ప్రభుత్వ ఆదేశాలతో ఉన్నతాధికారులు తమపై కత్తిపెట్టారని కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు .అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.3 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసిన ప్రభుత్వం ఆ సొమ్ము సక్రంగా ఖర్చు చేయడం చేతకాక ముందస్తుగా పన్నులు వసూలు చేయమనడంపై బహిరంగగానే విమర్శిస్తున్నారు. గత రెండేళ్ల నుంచి జేబులో పైసాలేకుండా ప్రజలు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని ఒత్తిడి చేసి పన్నులు ఎలా వసూలు చేస్తాం? అని ప్రశ్నిస్తునఆనరు. ఇప్పటికీ జిల్లాలో మొత్తం 20 శాతం కూడా వసూళ్లు జరగలేదు. మరోవైపు ప్రభుత్వ సూచనలతో అధికారులు పెట్టిన 50 శాతం పన్నుల వసూళ్ల డెడ్లైన్కు మరో నాలుగురోజులే గడువుంది. దీంతో చేసేదిలేక సెక్రటరీలు పన్నుల వసూళ్ల కోసం పరుగులు పెడుతున్నారు. రిటైర్మెంట్కు దగ్గరున్న వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కార్యదర్శుల వెతలు వర్ణనాతీతం. కార్యదర్శులపై పెరిగిన పని ఒత్తిడి పంచాయతీ కార్యదర్శులకు కేవలం పన్నుల వసూలు మాత్రమే కాకుండా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ రకాల పీ–4 సర్వే, కుల గణన, సంక్షేమ పథకాల లబ్ధిదారుల వెరిఫికేషన్ వంటివి నిర్వహించాల్సి వస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సర్వేలలో నిమగ్నం కావాల్సి రావడం, మరో వైపు పన్నుల వసూళ్లకు పరుగులు పెట్టడం చేస్తున్నారు. కొందరు బకాయిలకు రాజకీయ పలుకుబడి ఉండటంతో బలవంతంగా వసూలు చేయలేకపోతున్నారు. దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో బిల్ కలెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్ల కొరత ఉంది. పన్ను వసూలు చేయాల్సిన బాధ్యత క్షేత్ర స్థాయిలో సిబ్బందికి ఉన్నప్పటికీ, ఖాళీలు ఎక్కువగా ఉండటంతో ఆ భారం అంతా పంచాయతీ కార్యదర్శులపైనే పడుతోంది. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన శ్రీస్వర్ణ పంచాయతీ పోర్టల్ఙ్ ఆనన్లైన్ వ్యవస్థ ద్వారా పన్నుల చెల్లింపు చేయించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యలు, సర్వర్ లోపాల వల్ల డేటా ఎంట్రీ ఇబ్బందిగా మారుతోంది. సంక్షేమ పథకాలు అందడంలో ఏమైనా జాప్యం జరిగితే గ్రామస్థులు పంచాయతీ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య తిరిగి వారి వద్దకు వెళ్లి పన్నులు అడగడం పంచాయతీ కార్యదర్శులకు ఇబ్బందిగా మారింది. -
తీరంలో తాబేళ్ల మృత్యుఘోష
● నరసాపురం, పేరుపాలెం బీచ్ల్లో విషాద దృశ్యాలు ● సుమారు 50 తాబేళ్ల మృత్యువాత నరసాపురం రూరల్: నరసాపురం నియోజకవర్గ తీర ప్రాంతంలో ఏటా వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ఆలివ్ రెడ్లీ తాబేళ్లు, వేటగాళ్ల నిర్లక్ష్యానికి బలైపోతున్నాయి. గతేడాది కూడా ఇదే సమయంలో తాబేళ్లు మృత్యువాత పడిగా కలెక్టర్ చొరవతో తాబేళ్ల గుడ్లను సేకరించి సంరక్షించి పిల్లలు బయటకు వచ్చాకా సముద్రంలో విడిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పేరుపాలెం, పెదమైనవానిలంక, చినమైనవానిలంక వంటి తీరప్రాంత గ్రామాల్లో ఈ ఏడాది జనవరి నుంచే తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు ఒడ్డుకు రావడం ప్రారంభించాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో వీటి గుడ్లను సేకరించి హ్యాచరీల ద్వారా సంరక్షించే పనులు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ, సముద్రంలో జరుగుతున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు రోజులుగా భారీ సంఖ్యలో తాబేళ్లు మృతి చెంది తీరానికి కొట్టుకొస్తున్నాయి. పోయిన సంవత్సరం కూడా ఇదే సమయంలో సుమారు 100కు పైగా తాబేళ్లు ప్రాణాలు కోల్పోయాయి. తాజాగా మంగళవారం 29, బుధవారం 20 తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. వీటితోపాటు రెండున్నర మీటర్ల పొడవు, 240 కిలోల బరువు ఉన్న హేంపర్ బ్యాక్ డాల్ఫిన్ కూడా తీరానికి కొట్టుకు వచ్చింది. కేవలం తూర్పుతీరానికి దగ్గరలో నదీముఖ తీర ప్రాంతాల్లో 30 మీటర్ల కంటే తక్కువ లోతులో ఇవి సంచరిస్తుంటాయి. ప్రమాదపుటంచున ఉన్న ఈ తరహా డాల్పిన్లు ప్రస్తుతం పరిరక్షించాల్సిన జాతిగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. తాబేళ్ల కళేబరాలకు అధికారులు పోస్టుమార్టం నిర్వహించి, మరణానికి కారణాలు విశ్లేషించారు. దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న సందర్శకులు చనిపోయిన తాబేళ్ల కళేబరాలు తీరం వెంబడి కుళ్లిపోతుండటంతో ఆ ప్రాంతమంతా తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోంది. దీనివల్ల బీచ్కు వచ్చే పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సముద్ర తాబేళ్లకు సంబంధించి పోస్టుమార్టంలో అధిక శాతం వాటి పాదాలు నరికివేసి ఉండటం, కళ్లు పీకేసి ఉండటంతో పాటు, బలమైన దెబ్బతగిలిన గాయలతో పాటు వలల్లో చిక్కుకున్న అవశేషాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించిట్లు అఽధికారులు చెబుతున్నారు. వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.చంద్రశేఖర రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అటవీ అధికారి డీఏ కిరణ్, ఫారెస్ట్ రేంజర్ మురాల కరుణాకర్ పర్యవేక్షణలో మృత కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి ఏయస్ఆర్ మూర్తి, మత్స్యశాఖ అభివృద్ది అధికారి ఏడుకొండలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాంప్రసాద్, మైరెన్ ఏఎస్సై ఫాతిమా పాల్గొన్నారు. మృత కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్న దృశ్యం సముద్ర జీవుల సంరక్షణ కోసం ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడమే ఈ మరణాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మత్స్యకారులు తీరం నుంచి 8 నాటికల్ మైళ్ల అవతల మాత్రమే వేట సాగించాలి. చాలా మంది ఈ నిబంధనను అతిక్రమించి తీరానికి దగ్గరగా వేటాడుతున్నారు. సంతానోత్పత్తి కోసం తీరానికి వచ్చే క్రమంలో, ఈ తాబేళ్లు మత్స్యకారుల వలల్లో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందుతున్నాయి. తాజాగా తాబేళ్లతో పాటు డాల్ఫిన్ వంటి అరుదైన జీవులు కూడా మృతి చెందడం కలిచివేస్తోంది. -
దేవుడితో రాజకీయాలు వద్దు
యలమంచిలి: కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా దేవుడితో చేసే రాజకీయాలకు స్వస్తి పలకాలని వైఎస్సార్సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) హితవు పలికారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చడానికి తిరుపతి లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందంటూ విష ప్రచారానికి తెరలేపిందని ఆయన విమర్శించారు. ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి రాష్ట్రంలోని ఇతర దేవాలయాల ప్రసాదాలకు ఇదే నెయ్యి వాడినట్లు విష ప్రచారం చేస్తున్నారన్నారు. నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నివేదికలు వచ్చినా కూటమి నాయకులు దానిని జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. పవన్ కల్యాణ్పై ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకుని కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసారన్నారు. కనీసం ఆయనైనా స్పందించి ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నంత మాత్రాన పవన్ తన శైలిని మార్చుకోవలసిన అవసరం లేదన్నారు. ఆయన ధైర్యంగా ఈ విషయంలో ప్రభుత్వాన్నీ నిలదీసి తన పారదర్శకతను నిరూపించుకోవాలని కోరారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్లపై దాడులు చేయడం అరాచక పాలనకు పరాకాష్టని గోపి విమర్శించారు. -
స్వామి భూములు ఎక్కడ?
గురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి, భీమవరం/ నరసాపురం రూరల్: నరసాపురం రూరల్ కొప్పర్రు శ్రీసీతారామస్వామి దేవస్థానం భూముల కౌలుహక్కుల కోసం గురువారం నిర్వహించ తలపెట్టిన బహిరంగ వేలానికి బ్రేక్ పడింది. ప్రైవేట్ వ్యక్తుల చెరువులో కలిపేసుకున్న ఈ భూములకు సరిహద్దులు నిర్ణయించిన తర్వాత వేలం వేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. కొప్పర్రులోని శ్రీసీతారామస్వామి ఆలయానికి మాన్యం దొడ్డిలో 468/2 సర్వే నంబరులో 1.32 ఎకరాలు, 456/1లో 1.52 ఎకరాలు, 458/1లో 1.60 ఎకరాల సాగు భూమి ఉంది. వీటిని ముగ్గురు రైతులు కౌలు సాగుచేస్తున్నారు. చుట్టుపక్కల సుమారు 35 ఎకరాల పంట పొలాల్ని ఆక్వా సాగు కోసం గత ఏడాది యజమానులు ప్రైవేట్ వ్యక్తికి లీజుకు ఇచ్చుకున్నారు. మే నెలలో ఈ పొలాలతో పాటు దేవుడి భూముల్ని సైతం కలిపేసుకుని ఏకమొత్తం చెరువుగా మార్చేశారు. ఆలయ అధికారులు ఇటీవల హడావుడిగా గతంలోని వారి కౌలు లీజును రద్దుచేయడంతో పాటు ఈనెల 12న కొత్తగా కౌలు నిమిత్తం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. చెరువులో ఆలయ భూములు ఎక్కడున్నది సరిహద్దు గట్లు లేకుండా ఏ విధంగా వేలం వేస్తారంటూ ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు యాదంరెడ్డి సూరిబాబు, రావి బ్రహ్మాజీలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. చర్యలు తీసుకుంటున్నాం.. ఈ వ్యవహరంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. చెరువు తవ్విన వారికి నోటీసులు ఇచ్చామని, కౌలుదారుల లీజును రద్దుచేశామని, పోలీసులకు ఫిర్యాదుచేసినట్టు ఆలయ ఈఓ రామచంద్రకుమార్ తెలిపారు. చెరువు సాగుచేస్తున్న వారు ప్రస్తుత పంట ముగిసేవరకు సమయం కోరారని, త్వరలో ఆలయ భూములకు సరిహద్దులు నిర్ణయించి వేలం నిర్వహించనున్నట్టు తెలిపారు. నిబంధనలు పాటించకుండా ఆలయ భూముల్లో అక్రమంగా చెరువులు తవ్వేశారు. దాదాపు 40 ఎకరాల ఏక చెరువులో ఆలయ భూములు ఎక్కడున్నాయో కూడా తెలీని పరిస్థితి. అధికారులకు తెలిసే అంతా జరిగింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆలయ భూముల సరిహద్దు గట్లు వేసిన తర్వాతనే బహిరంగ వేలం వేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశాం. – యాదంరెడ్డి సూరిబాబు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కొప్పర్రు సీతారామస్వామి ఆలయ భూముల బహిరంగ వేలానికి బ్రేక్ పొలాలు లీజుకు తీసుకుని చెరువు తవ్విన ప్రైవేట్ వ్యక్తులు సమీపంలోని స్వామి భూములు 4.44 ఎకరాలు స్వాహా తెరవెనుక చక్రం తిప్పిన కూటమి నేతలు హడావుడిగా 12న బహిరంగ వేలం ప్రకటించిన అధికారులు చెరువు పరిధిలోని మిగిలిన పొలాలు ఆక్వాజోన్లో ఉన్నప్పటికి ఆలయ భూములు మాత్రం ఆక్వాజోన్లో లేవని ఫిషరీష్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వీటిలో చెరువులు తవ్వడంతో ఆక్వాజోన్ అనుమతుల కోసం హడావుడిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఆలయ భూముల్ని చెరువులో కలపడం వెనుక కూటమికి చెందిన కొందరు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ఒక్క పంట సాగుతో నష్టాలు చవిచూస్తున్న కౌలు రైతులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పొలాలు అప్పగించినట్టు సమాచారం. ఈ వ్యవహారం వెనుక దేవదాయ శాఖ అధికారుల పాత్రపైనా గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మే నెలలోనే చెరువులు తవ్వేసి ఆక్వా సాగు చేస్తున్నా ఇంతకాలం ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ చెరువులో భూములకు ఏడాదికి ఎకరాకు సుమారు రూ.60 వేల చొప్పున లీజు ఒప్పందం కుదిరినట్టు చెబుతున్నారు. ఈ మేరకు గతంతో పోలిస్తే ఆలయ ఆదాయం రెట్టింపు కానున్నా అది రికార్డు పరంగా ఇప్పటి వరకు ఎందుకు చూపలేదంటున్నారు. ఆలయ భూముల్ని చుట్టుపక్కల పొలాలతో కలిపి ఏకచెరువు చేయడం వలన ప్రైవేట్ వ్యక్తుల భూముల్ని లీజుకు తీసుకున్న వారు తప్ప ఇతరులు వేలంలో స్వామివారి భూముల్ని దక్కించుకునే వీలుకాదంటున్నారు. భవిష్యత్తులో ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా గట్లు ఏర్పాటుచేసి బహిరంగ వేలం నిర్వహించే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పంచాయతీ కార్యదర్శిపై దాడి
బుట్టాయగూడెం : ఇంటి పన్ను కట్టమని అడిగినందుకు పంచాయతీ కార్యదర్శిపై ఒక వ్యక్తి దాడి చేశాడు. దీనిపై బుధవారం రాత్రి కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొరమామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి గుండేపల్లి సోమరాజు బుధవారం సాయంత్ర సిబ్బందితో కలిసి ఇంటి పన్నులు వసూలు చేసేందుకు వెళ్లారు. గ్రామంలోని ఒక టీస్టాల్ వద్ద పవన్కుమార్ అనే వ్యక్తిని ఇంటి పన్ను చెల్లించమని అడుగగా ఆ వ్యక్తి వివాదస్పదంగా మాట్లాడినట్లు కార్యదర్శి తెలిపారు. అసభ్య పదజాలంతో మాట్లాడుతూ పలుమార్లు తనపై దాడి చేసి కొట్టినట్లు కార్యదర్శి చెప్పారు. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయ్యాలని కోరుతూ స్థానిక పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. కార్యదర్శి సోమరాజుపై జరిగిన దాడిని డిప్యూటీ ఎంపీడీఓ, వీఎస్ఎస్ శ్రీనివాసరావు, కార్యదర్శిలు రామకృష్ణ, కిరణ్, తదితరులు తీవ్రంగా ఖండించారు. -
ఆరోగ్యం భద్రం.. ప్రణాళికతో విజయం
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. 10వ తరగతి, ఇంటర్మీడియెట్తో పాటు అన్ని తరగతులకు పరీక్షలు దగ్గర పడ్డాయి. ఏడాదంతా చదివింది ఒక ఎత్తు అయితే ఈ రెండు మూడు నెలలు చదివేది మరో ఎత్తుగా చెప్పవచ్చు. ఈ సమయంలో కేవలం చదువు ఒక్కటే కాదు. ఈ సమయంలో ఆరోగ్యమూ ముఖ్యమే అని వైద్యులు, సైకాలజిస్టులు చెబుతున్నారు. ఒత్తిడి.. పెను ప్రభావమే పబ్లిక్ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్థులపై సహజంగానే ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలా ఒత్తిడి చేయడం విద్యార్థుల శారీరక, మానసిక పరిస్థితులపై పెను ప్రభావమే చూపుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. పరీక్షల సమయంలో వినోదం, క్రీడలకు దూరమై విద్యార్థులు మానసికంగా అధిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అదే జరిగితే ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని హెచ్చరిస్తున్నారు. వారికి కొంత ఆటవిడుపు సమయం ఇవ్వాలని, సూచిస్తున్నారు. ఆహారం, విశ్రాంతిపై ప్రత్యేక శద్ధ అవసరం చదువు ధ్యాసలో పడి సమయానికి ఆహారం, విశ్రాంతి తీసుకోకపోయినా ప్రమాదమే అని, అటువంటి వారికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. కొందరు పిల్లలను రాత్రి 11 గంటల వరకూ చదివించి, తిరిగి తెల్లవారుజామునే 5 గంటలకు నిద్రలేపి మళ్లీ చదివిస్తుంటారని అలా చేయడం వల్ల విద్యార్థికి తగిన విశ్రాంతి దొరకక తొందరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుందంటున్నారు. విద్యార్థులకు ఇచ్చే ఆహారంలో తేలికగా జీర్ణం అయ్యే ఇడ్లీ, చారుతో భోజనం మంచిందంటున్నారు. అలాగే అందుబాటులో ఉండే సీజనల్ పండ్లు, మెదడు చురుకుగా పని చేయడానికి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలి. పరీక్షలు పూర్తయ్యే వరకూ మాంసాహారాలకు, మసాలాలు, ఉప్పు, కారాలు అధికంగా ఉండే ఆహారాలు పెట్టకపోవడమే మంచిది. రాత్రి సమయాల్లో నిద్రకు ఉపక్రమించే ముందు టీలు, కాఫీలు తీసుకోకూడదు. రాత్రి పొద్దుపోయే వరకూ చదవకూడదు. కనీసం 8 గంటలు నిద్రపోవాలి. తెల్లవారుజామున చదివితే పాఠ్యాంశాలు బాగా గుర్తుంటాయి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులు (ఫైల్) చదువుతో పాటు ఆరోగ్యమూ ముఖ్యమే.. పరీక్షల సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి ఆహారం, విశ్రాంతిపై శ్రద్ధ అవసరం తల్లిదండ్రులూ ఒత్తిడి పెట్టొద్దు త్వరలో టెన్త్, ఇంటర్ పరీక్షలు జిల్లాలో 58 వేల మందికి పైగా విద్యార్థులు త్వరలోనే ఇంటర్మీడియెట్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రాంభం కానున్నాయి. ఇంటర్మీడియెట్కు సంబంధించిన ప్రయోగ పరీక్షలు ముగిశాయి. పదో తరగతి విద్యార్థులకు ప్రస్తుతం ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. మార్చి 2వ తేదీ నుంచి గ్రాండ్ టెస్ట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అనంతరం ఈ నెల 23వ తేదీ నుంచి ఇంటర్మీడియెట్ విద్యార్థులకు, మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వారి పరీక్షలు ముగిసిన అనంతరం డిగ్రీ, పీజీ, 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు కూడా పరీక్షలు జరుగుతాయి. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
బుట్టాయగూడెం: మోటార్సైకిల్ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం సమీపంలోని కనకదుర్గమ్మ అమ్మవారి గుడి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అశ్వారావుపేటకు చెందిన నరాలశెట్టి నాగేశ్వరరావు (52) బుధవారం సొంత పనిమీద ద్విచక్రవాహనంపై జీలుగుమిల్లి వెళ్లి తిరిగి వస్తుండగా తాటాకులగూడెం సమీపంలోని కనకదుర్గమ్మ అమ్మవారి గుడి సమీపంలో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై క్రాంతికుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి నాగేశ్వరరావు భార్య నాగమల్లేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నాగేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుడి స్వగ్రామం బాపట్ల జిల్లా అని ఉద్యోగ రీత్యా అశ్వారావుపేటలో హార్టికల్చడ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్లు నాగమల్లేశ్వరి ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఆరోగ్యకరమైన ద్రవ పదార్థాలు తీసుకోవాలి
వచ్చేది వేసవి కాలం కావడంతో ఘన పదార్థాలు శరీరానికి పెద్దగా సహించవు. డీహైడ్రేషన్తో వాంతులు, విరోచనాలతో ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంటుంది. అటువంటి సమయంలో ఆరోగ్యకరమైన ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా మంచినీరు, కొబ్బరి నీరు, పండ్ల రసాలు, మజ్జిగ, రాగిజావ వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అలాగే రోజుకు కనీసం 8 గంటలు గాఢనిద్రకు కేటాయించాలి. ప్రతిరోజూ కొద్ది సమయం యోగ, ధ్యానం సాధనకు కేటాయించాలి. – డాక్టర్ ఎంఎల్వీ ప్రసాద్, ఆంధ్రా హాస్పిటల్స్ డైరెక్టర్ -
అక్రమ కలప స్వాధీనం
కొయ్యలగూడెం: రేంజర్ భాను ప్రకాష్కి అందిన సమాచారంతో బుధవారం దిప్పకాయల పాడులో దాడులు నిర్వహించి అక్రమ కలపతో రవాణా అవుతున్న వాహనాన్ని స్వాధీనం చేసుకొని కన్నాపురం అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు ఎఫ్ఎస్ఓ పి.మణికుమారి పేర్కొన్నారు. వాహనంలో సుమారు యాభైకి పైగా దిమ్మలతో ఉన్న టేకు దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. కలప విలువను లెక్కించాల్సి ఉందన్నారు. బీట్ ఆఫీసర్ కె.నవీన్, కె.వెంకన్నబాబు, రాంబాబు పాల్గొన్నారు. పంట కాలువలో శిశువు మృతదేహం పెదపాడు: పెదపాడు ఎస్సీ ఏరియాలోని కమ్యూనిటీ హాలు వద్ద పంట కాలువలో శిశువు మృతదేహం లభ్యమైంది. స్థానికులు బుధవారం సాయంత్రం మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ఆర్.శ్రీనివాస్ అక్కడకు చేరుకుని శిశువు మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి పంపించారు. వీఆర్వో అనకాపల్లి నర్సింహరావు ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జన్మనిచ్చిన బిడ్డను ఎవరు పడేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
పది సూత్రాలు పాటిస్తే విజయం మీదే
పరీక్షల్లో విజయం సాధించాలంటే విద్యార్థులు పది సూత్రాలు పాటించాలి. రోజు, వారం, నెల వారీగా చదువుకు ప్రణాళిక రూపొందించుకోవాలి. తెలియని విషయాలను ఉపాధ్యాయల నుంచి తెలుసుకోవాలి. అర్థమైనవి పదేపదే చదవాలి. గతంలో నమూనా పరీక్షల ఆధారంగా ప్రణాళిక వేసుకోవాలి. పునశ్చరణ చేసుకోవాలి. మంచి దస్తూరీ అలవరుచుకుని నిర్ణీత సమయంలో పరీక్ష ముగించడానికి కృషి చేయాలి. సెల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం, సరైన నిద్ర ఉండాలి, అన్ని సబ్జెక్టులకు సమాన సమయాన్ని కేటాయించాలి. వ్యక్తిగత లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటిని సాధించాలనే కసితో చదవాలి. – అక్కింశెట్టి రాంబాబు, సైకాలజిస్ట్ -
విధులకు హాజరై.. తిరిగి వెళుతూ..
● ఆర్ఎంవో డాక్టర్ తాతారావు గుండెపోటుతో మృతి ● శోకసంద్రంలో తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్య సిబ్బంది తణుకు అర్బన్ : తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ అందే వెంకట రమా సత్య తాతారావు (56) గుండెపోటుతో మృతిచెందారు. బుధవారం ఉదయం విధుల్లోకి వచ్చిన ఆయన ఓపీలో రోగులకు వైద్యసేవలందించారు. అనంతరం వైద్య సిబ్బందికి సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. అనంతరం గుండెల్లో కొంచెం మంటగా ఉందంటూ ఆస్పత్రిలో ఈసీజీ తీయించుకుని నార్మల్గా ఉందని నిర్ధారించుకుని ఇంటికి వెళ్లిపోతానని నిడదవోలుకు కారులో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరారు. ఉండ్రాజవరం దాటిన తర్వాత గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా కారు అదుపు తప్పి రోడ్డు మార్జిన్లోని పిల్లకాలువ పక్కకు వెళ్లి నిలిచిపోయింది. స్థానికులు వెంటనే కారు అద్దాలు పగులగొట్టి కిందకు దించి సీపీఆర్ చేసి అక్కడ నుంచి నేరుగా ఆయన్ను తణుకులో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన కన్నుమూసినట్టు వైద్యులు నిర్ధారించారు. గతేడాది జూన్లో సాధారణ బదిలీల్లో భాగంగా తాడేపల్లిగూడెం ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా ఉన్న ఆయన తణుకు ఆర్ఎంఓగా విధుల్లో చేరారు. శోకసంద్రంలో ఆస్పత్రి వర్గాలు తాతారావు ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేక ఆస్పత్రి వర్గాలు శోకసంద్రంలో నిలిచారు. తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణలో ఉంచిన ఆయన భౌతికకాయాన్ని వైద్యవర్గాలు సందర్శించాయి. తాడేపల్లిగూడెం ఆర్టీవో కౌసర్ భానో ఆస్పత్రికి వచ్చి తాతారావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.సాయికిరణ్తోపాటు తహసీల్దార్ దండు అశోక్వర్మ, వైద్యులు, సిబ్బంది డాక్టర్ తాతారావుకు నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులు నిడదవోలులోని ఆయన నివాసానికి తాతారావు భౌతికకాయాన్ని అంబులెన్స్లో తరలించారు. ఆయనకు భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలోను, చిన్న కుమార్తె వైజాగ్ ఆస్పత్రిలో మెడిసిన్ విద్యనభ్యసిస్తున్నారు. ఆస్పత్రికి వెళ్దామన్నా వద్దన్న వైనం తణుకులో కార్డియాలజిస్ట్కు చూపించుదామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్ పట్టుబట్టినా.. మా డాక్టరు దగ్గరకు వెళ్తానని బలవంతంగా బయలుదేరినట్లుగా ఆస్పత్రి వైదులు చెబుతున్నారు. గతంలోనే గుండెకు రెండు స్టంట్స్ పడటంతో అశ్రద్ధ వద్దని అన్నా వినలేదని వాపోయారు. ‘మనిషి ప్రాణం ఎంతో విలువైనది. ఆస్పత్రికి వచ్చే రోగికి అత్యవసర వైద్యం అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు విలువైన వైద్యం సత్వరమే అందించగలిగితే ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వారవుతారు. అందుకోసం ప్రతి ఒక్కరూ వైద్యసేవలో అప్రమత్తంగా ఉండాలి.’ బుధవారం మధ్యాహ్నం వైద్య సిబ్బందికి నిర్వహించిన సమావేశంలో ఆయన ఇచ్చిన చివరి సందేశం. -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం పి. అంకంపాలెం సమీపంలోని కోళ్లఫారమ్లో ఒక యువతి ఆనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సా రాష్ట్రం రాయ్ఘడ్ జిల్లా బీఎల్ఓడీ మండలం ఓయ్పంగు గ్రామానికి చెందిన పతిక రష్మిక (19) నాలుగు రోజుల క్రితం పి. అంకంపాలెం సమీపంలోని కోళ్లఫారం వద్ద జీవనోపాధి కోసం వచ్చి పనిలో చేరింది. అయితే ఆ యువతి షెడ్లో అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందింది. రష్మిక అదే కోళ్లఫారమ్లో పనిచేస్తున్న ప్రశాంత్ అనే యువకుడితో గత 8 నెలలుగా పరిచయం ఉండి ఒరిస్సాలోనే సహజీవనం చేసినట్లు సమాచారం. అయితే ప్రశాంత్కు ఇప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల ప్రశాంత్ తన భార్యతో కలిసి కోళ్ల ఫారమ్లో పనిచేస్తుండగా రష్మిక కూడా నాలుగు రోజుల క్రితం ఇక్కడికి వచ్చినట్లు పలువురు చెబుతున్నారు. ముగ్గురూ ఒకే గదిలో నివసిస్తున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం ప్రశాంత్, అతని భార్య పని నిమిత్తం కోళ్లఫారమ్కు వెళ్లగా రష్మిక షెడ్లో ఉరివేసుకున్నట్లు చెబుతున్నారు. యువతి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందో తమకు తెలియదని అంటున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముద్దాపురంలో శిలాఫలకం ధ్వంసం
తణుకు అర్బన్: తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో టీడీపీ శ్రేణులు కయ్యానికి కాలు దువ్వారు. గత వైఎస్సార్సీపీ హయాంలో స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో 2024లో రోడ్డు శంకుస్థాపన కోసం ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని బుధవారం రాత్రి ధ్వంసం చేశారు. ధ్వంసం చేస్తున్న కార్మికులను వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నించగా తణుకు నుంచి పనికి వచ్చామని గ్రామ మాజీ సర్పంచ్ ముళ్లపూడి శ్రీనివాస్ పని పురమాయించినట్లు చెప్పారు. అప్పట్లో రూ.5 కోట్లు నిధులతో రోడ్డు నిర్మాణం కోసం మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారని, నేడు అర్ధాంతరంగా రాత్రి సమయంలో ఆ శిలాఫలకాన్ని తొలగించే పనులు చేపట్టారని వైఎస్సార్ సీపీ నాయకులు తుమ్మగంటి నాగ సత్యనారాయణ (నాగు) విమర్శించారు. ఇదేమిటని మళ్లపూడి శ్రీనివాస్ను ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా ఇంటి లోపలకు వెళ్లిపోయారని నాగు తెలిపారు. ద్వారకాతిరుమల: ఐఎస్ జగన్నాథపురంలో సుందరగిరిపై స్వయంభూ కనకవల్లీ సమేత లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ద్వితీయ దివస మోదక హవన ప్రారంభ వేడుకలు బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా ఆలయ యాగశాలలో మహా గణపతి లక్షమోదక హోమాన్ని జరిపారు. మహాశివరాత్రి నాడు జరిపే అతిరుద్రప్రయోగ సహిత సుదర్శన నృశింహ మహాయజ్ఞం నిర్వహణలో భాగంగా ఈ వేడుకను నిర్వహించారు. ఉదయం ఆలయ యాగశాలలో నారసింహుని ఉపాసకులు కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ ఆధ్వర్యంలో, సీహెచ్ కుటుంబరావు పర్యవేక్షణలో పలు కార్యక్రమాలను వైభవంగా జరిపారు. రుత్వికులు, పండితులు మోదకాలను, పలురకాల దినుసులను హోమగుండంలో వేస్తూ క్రతువును నిర్వహించారు. లోక శాంతి కోసం ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ముదినేపల్లి రూరల్: ఇటీవల అదృశ్యమైన తల్లీపిల్లల ఆచూకీ తెలుసుకుని స్ధానిక పోలీసులు కుటుంబ సభ్యులకు బుధవారం అప్పగించారు. బొమ్మినంపాడుకు చెందిన వాసుపల్లి పెద్దిరాజులుకు భార్య శిరీషతోపాటు రాజేశ్వరి, శాంతిప్రియ, నాగదుర్గ కుమార్తెలున్నారు. వీరంతా ఈనెల 8న ఆధార్కార్డు సవరణలు చేసుకునేందుకు బయటకు వెళ్లారు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో పెద్దిరాజులు పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు పెద్దిరాజులు భార్య శిరీష, కుమార్తెలు కలిదిండి మండలం కోరుకొల్లులో ఉన్నట్లు గుర్తించి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. ఎస్సై వీరభద్రరావు వీరిని కుటుంబసభ్యులకు అప్పగించారు. తణుకు అర్బన్: గుర్తు తెలియని మృతదేహం తణుకు మండలం వేల్పూరు గ్రామ పరిధిలోని కంపోస్టు యార్డులో బుధవారం లభ్యమైంది. కంపోస్టు యార్డులోని చెత్తకు నిప్పుపెట్టిన స్థలంలో మృతదేహం కొంతభాగం కాలిపోయి ఉంది. మృతుడి వయస్సు సుమారుగా 40 నుంచి 50 మధ్య ఉండవచ్చని, తెలుపురంగు చొక్కా, నీలం రంగు జీన్స్ ఫ్యాంటు ధరించి ఉన్నారని, జుట్టు కొంతమేర తెలుపు రంగుతో ఉందని, నాలుగు రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. తణుకు రూరల్ పోలీసులు మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి పంచనామా అనంతరం అంత్యక్రియలు జరిపించారు. రూరల్ స్టేషన్ ఏఎస్సై అనుమానాదస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మండవల్లి: ఓ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం లింగాల గ్రామానికి చెందిన సాయిలక్ష్మి ఈ నెల 10వ తేదీన ఇంట్లో దేవుడికి దీపారాధన చేస్తుండగా, దీపం వత్తు ఆమె చీరకు అంటుకుని మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. సమాచారం తెలుసుకున్న భర్త వెంకటేశ్వరరావు వెంటనే వచ్చి ఆమెను కై కలూరు ప్రభుత్వాసుపత్రికి అనంతరం మెరుగైన వైద్య సేవల నిమితం గన్నవరం సిద్ధార్ధ మెడికల్ కాలేజీకి తరలించారు. బుధవారం ఉదయం ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడు సాయిల శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సస్యరక్షణతో మామిడిలో అధిక దిగుబడులు
నూజివీడు: రైతులు మామిడి తోటల్లో సస్యరక్షణ చర్యలను చేపట్టడం ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవ్చని ఉద్యాన అధికారి ఆర్ హేమ పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో మామిడి తోటలను సందర్శించిన ఆమె మామిడి తోటల సస్యరక్షణపై రైతులకు పలు సూచనలు చేశారు. మామిడి తోటల్లో పూతమీద తేనెమంచు పురుగు ఆశించినట్లయితే, నివారణకు అజారక్టిన్ 3000 పీపీఎం 2ఎంఎల్ లీటరు నీటికి, బుప్రోపెజన్ 25 ఈసీ 1.5 ఎంఎల్ లీటరు నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 ఎంఎల్ లేదా థయామిథాక్సాన్ 25 శాతం 0.3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. తామర పురుగుల నివారణకు నీలి రంగు జిగురు అట్టలు 40 నుంచి 50 వరకు తోటల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. వేపనూనె 3000 పీపీఎం 2ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. పోంగామియా సోప్ 7.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని, ఎసిఫేట్ 75 ఎస్పీ 1.5 గ్రాములు లీటర్ నీటికి లేదా ఫిప్రోనిల్ 5 ఈసీ 2ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా తామర పురుగులను నివారించుకోవచ్చన్నారు. బూడిద తెగులు నివారణ ఇలా.. నీటిలో కరిగే గంధకం 3 గ్రా లేదా హెక్సాకొనజోల్ 2 ఎంఎల్ లేదా అజాక్సిస్ట్రోబిన్ 1ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పక్షికన్ను తెగులు సోకితే.. నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా కార్బండిజమ్ 1 గ్రాము, మాంకోజబ్ 2.5 గ్రాములు కలిపి లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మసిమంగు నివారణకు ఎమామెక్టిన్ బెంజీయేటర్ 0.4 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకులపై మసిని తొలగించుటకు 2 కిలోల గంజి పొడిని గోరువెచ్చని 3 నుంచి 4 లీటర్ల నీటిలో కలిపి ఉడికంచిన తరువాత మిగులు నీరుపోసి 100 లీటర్ల గంజి ద్రావకం తయారు చేసి తెగులు కనిపించిన భాగాలపై ఎండ బాగా ఉన్న రోజల్లో పిచికారీ చేయాలి. 4–5 రోజుల తరవాత నీటిని పిచికారీ చేస్తే చాలా వరకు మసి రంగు పోతుందని ఉద్యాన అధికారి హేమ తెలిపారు. పాడి–పంట -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ముదినేపల్లి రూరల్: విద్యుత్షాక్కు గురై చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని బొమ్మినంపాడులో జరిగింది. గ్రామానికి చెందిన యర్రా బిందుమాధవసాయి (30) రొయ్యల చెరువు సాగు చేస్తుంటాడు. గత నెల 28న చెరువు వద్దకు వెళ్లగా ఫ్యాన్ సెట్లు పనిచేయడం లేదని గుర్తించాడు. దీనితో ఎలక్ట్రీషియన్ను రప్పించి ఫ్యాన్సెట్లకు సంబంధించిన మోటార్ను బాగుచేస్తుండగా ప్రమాదవశాత్తూ బిందుమాధవసాయి విద్యుత్షాక్కు గురయ్యాడు. షాక్కు గురైన వెంటనే నీటిలో పడిపోగా ఒడ్డుకు తీసుకునివచ్చి నీళ్లు కక్కించి గుడివాడ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికత్స కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. బింధుమాధవసాయికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఈ ప్రమాద ఘటనపై తండ్రి శ్రీరాములు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నూజివీడు: పట్టణంలో యువతిపై దాడిచేసి గాయపరిచిన నిందితుడు బండారు సురేష్కుమార్ను పట్టణ సీఐ పీ సత్యశ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నారు. యువతిపై దాడి చేసిన అనంతరం నిందితుడు విస్సన్నపేట, చాట్రాయి ప్రాంతాలకు పరారయ్యాడు. అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలోని వేంసూరుకు వెళ్లగా అక్కడ నిందితుడిని సోమవారం రాత్రి సీఐ అదుపులోకి తీసుకుని నూజివీడుకు తరలించారు. దాడికి గల కారణాల గురించి విచారిస్తున్నట్లు తెలిసింది. -
నృసింహ మహా యజ్ఞానికి ఏర్పాట్లు
శ్రీవారి ఆలయానికి దత్తత ఆలయమైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో శ్రీ సుదర్శన, నరసింహ ధన్వంతరీ మహాయజ్ఞానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. 8లో uతణుకు అర్బన్: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలు అందచేశారు. రూ.35 వేల కోట్ల బకాయిలు, మధ్యంతర భృతి, పే రివిజన్ కమిషన్పై సిట్టింగ్ జడ్జి, రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలనే అంశాల్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాని కోరుతూ మంగళవారం తణుకులో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ను కలిసి వినతిపత్రం అందచేశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను కలిసి వినతిపత్రం అందచేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్య నారాయణ ఆదేశాల మేరకు వినతిపత్రాలు అందచేశామని, వారు సానుకూలంగా స్పందించినట్లు సంఘ సభ్యులు వివరించారు. కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షుడు ఉమర్ అలీషా, జిల్లా ఉపాధ్యక్షుడు రామనాగు, భీమవరం ఉపాధ్యక్షులు, ఆదిత్య జిల్లా మహిళా విభాగం అసోసియేట్ ప్రెసిడెంట్ నిర్మల, తాడేపల్లిగూడెం తాలూకా అధ్యక్షుడు ప్రసాద్ బాబు, కోశాధికారి రామకృష్ణ, తణుకు తాలూకా అధ్యక్షులు అరవింద్, ఆర్గనైసింగ్ సెక్రటరీ ధర్మతేజ, ట్రెజరర్ మధు తదితరులు పాల్గొన్నారు. -
అంతా గప్చుప్
హరహర మహాదేవ శివరాత్రి ఉత్సవాలకు శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు ఉత్సవాల నేపథ్యంలో శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. 8లో uబుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి, భీమవరం/తణుకు అర్బన్: తణుకు పోలీస్ సర్కిల్స్లో అసలు ఏం జరుగుతోంది? హఠాత్తుగా రెండు రోజుల వ్యవధిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు మెడికల్ లీవ్పై వెళ్లిపోయిన ఘటన మరువకముందే మరో సీఐ, ఎస్సైను రేంజ్ వీఆర్కు పంపడం హాట్ టాఫిక్గా మారింది. అవినీతి ఆరోపణలు, విధి నిర్వహణలో వైఫల్యాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రెండు సర్కిళ్ల పరిధిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో పోలీసులు, స్థానికులు ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా కూటమి వచ్చాక తణుకులో శాంతిభద్రతలు లోపించాయన్న ఆరోపణలున్నాయి. ఏడాది క్రితం పైడిపర్రు ప్రధాన సెంటర్లోని లాడ్జిలో స్పెషల్ టీం జరిపిన దాడుల్లో భారీ ఎత్తున జరుగుతున్న కోతాట గుట్టు రట్టయ్యింది. గత జనవరిలో రూరల్ స్టేషన్లో ఎస్సై సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. తేతలిలో పశువధకు వ్యతిరేకంగా స్థానికుల చేస్తున్న ఉద్యమం, పెచ్చుమీరుతున్న హింసాత్మక ఘటనలు తరచూ తణుకు పేరును తెరపైకి తెస్తున్నాయి. అత్తిలి ఎంపీపీ ఉప ఎన్నికలో మాజీ మంత్రి కారుమూరి నివాసాన్ని అల్లరి మూకలు ముట్టడించి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు ఎన్నికకు హాజరుకాకుండా అడ్డుకున్నప్పుడు పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారన్న విమర్శలున్నాయి. తణుకు వై జంక్షన్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద కూటమి నేతల ఫొటోలతో టీడీపీ సానుభూతిపరుడు ఫ్లెక్సీ ఏర్పాటుచేయడం వివాదస్పదమైంది. దాదాపు నెలన్నర రోజులుగా ఇక్కడ పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. గత నెలలో ఉదరాళ్లపాలెంలో మాజీమంత్రి కారుమూరిని కించపర్చేలా అపరిచితులు పెట్టిన ఫ్లెక్సీల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసనకు దిగడంతో ఫ్లెక్సీలను తొలగించారు. అత్తిలిలో విగ్రహం ఏర్పాటు ప్రయత్నాలు వివాదస్పదం కావడంతో కొద్ది రోజులుగా ఇక్కడ కూడా పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా గత నెల 25వ తేదీన రూరల్ సీఐ బి.కృష్ణకుమార్, ఎస్సై కె.చంద్రశేఖర్, 27న అత్తిలి ఎస్సై పి.ప్రేమ్రాజ్ లీవ్పై వెళ్లిపోయారు. రెండు రోజుల వ్యవధిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు సెలవుపై వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. భీమవరం క్రైం విభాగంలో సీఐగా పనిచేసిన దేశంశెట్టి వెంకటేశ్వరరావు ఈనెల 7న తణుకు రూరల్ సీఐగా విధుల్లో చేరారు. ఫ్లెక్సీలు, ఇతర వివాదాలకు స్థానిక పోలీస్ యంత్రాంగం వైఫల్యంగా గుర్తించిన ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వారిని సెలవుపై పంపినట్టు తెలుస్తోంది.తణుకు టౌన్ స్టేషన్లో ఏసీబీ దాడులు సంచలనమయ్యాయి. నాలుగు రోజుల క్రితం ఒక కేసు విషయమై తణుకు టౌన్ స్టేషన్ రైటర్ రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ వ్యవహరంలో మరికొందరికి వాటాలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. విచారణలో వాస్తవాలు తెలుస్తాయని ఏసీబీ అధికారులు మీడియాకు తెలిపారు. ఏసీబీ దాడులు జరిగిన తరువాత కూడా కొన్ని కేసుల్లో లావాదేవీలు నిర్వహించినట్లుగా సమాచారం. ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగా సీఐ ఎన్.కొండయ్య, ఎస్సై ప్రసాద్ను ఉన్నతాధికారులు రేంజ్ వీఆర్కు పంపడం సర్కిళ్లలోని పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. తణుకు రూరల్ సీఐ వెంకటేశ్వరరావుకు టౌన్ ఇన్చార్జి సీఐగా బాధ్యతలు అప్పగించారు. కింది సిబ్బందిపై పర్యవేక్షణ లోపం, ఇతర ఆరోపణలతో వీరిని వీఆర్కు పంపినట్టు తెలుస్తోంది. తణుకు సర్కిళ్ల పరిధిలోని కొందరు సిబ్బంది పనితీరుపైనా విమర్శలు వస్తున్నాయి. ఏళ్ల తరబడి కొందరు పోలీసులు ఈ రెండు సర్కిళ్ల పరిధిలోని స్టేషన్లు మారుతూ ఇక్కడే తిష్టవేసి అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. తణుకు టౌన్, రూరల్ సర్కిళ్లలో వరుస ఘటనలు గత నెలలో లీవ్పై వెళ్లిపోయిన రూరల్ సీఐ, రూరల్, అత్తిలి ఎస్సైలు తాజాగా రేంజ్ వీఆర్కు టౌన్ సీఐ, ఎస్సై అవినీతి ఆరోపణలు, విధి నిర్వహణలో వైఫల్యాలే కారణమా? -
నృసింహ మహాయజ్ఞానికి ఏర్పాట్లు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత ఆలయమైన ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై స్వయంభూగా కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో అతి రుద్ర సహిత శ్రీ సుదర్శన, నరసింహ ధన్వంతరీ 32వ మహాయజ్ఞ నిర్వహణకు మంగళవారం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఉదయం గర్భాలయంలో కొలువైన స్వామివారి మూలవిరాట్కు వేద పండితులు, రుత్వికులు వేద మంత్రోచ్ఛరణలతో విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్కు చెందిన కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ ఆధ్వర్యంలో, సీహెచ్ కుటుంబరావు పర్యవేక్షణలో ప్రధాన యజ్ఞం ప్రారంభానికి సూచికగా మహా గణపతి లక్షమోదక హోమాన్ని ఆలయ యాగశాలలో వైభవంగా జరిపారు. సాయంత్రం వరకూ నిర్విరామంగా కొనసాగిన ఈ హోమ క్రతువుతో సుందరగిరి ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. మహాశివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ యజ్ఞ క్రతువులో భాగంగా ఈనెల 13న అంకురార్పణం, ధ్వజారోహణం, శ్రీ నృసింహ హోమం, 14న కలశప్రతిష్ఠ, మహా గణపతి హోమాన్ని నిర్వహించనున్నారు. 15న మహా శివరాత్రిని పురస్కరించుకుని మహా లింగార్చన, రాత్రి అతి రుద్ర సహిత శ్రీ సుదర్శన, నరసింహ ధన్వంతరీ మహా యజ్ఞాన్ని వైభవంగా జరుపనున్నారు. అలాగే 16న నిర్వహించే కలశాభిషేకం, శాంతి కల్యాణంతో యజ్ఞ క్రతువు ముగియనుంది. ప్రతి రోజూ శాలిగ్రామ ఆరాధన, లక్ష బిల్వార్చన, లలితా సహస్ర నామార్చన కార్యక్రమాలను నిర్వహిస్తామని నరసింహ గురూజీ తెలిపారు. ఈనెల 15న మహాయజ్ఞం -
రెచ్చిపోతున్న మట్టి మాఫియా
● పంట బోదెలో తవ్విన మట్టి అమ్మకం ● సర్వే రాళ్లను తవ్విపారేస్తున్న వైనం ఉండి: ఉండి మండలంలో పుంతలు, పంట బోదెలు కావేవీ మట్టి దోపిడీకి అనర్హం అన్నట్లుగా వుంది. మండలంలోని కలిసిపూడి పుంతలో గతంలో పూడికతీత పేరుతో పనులు నిర్వహించారు. తవ్విన మట్టిని పుంతలో వేసి ఆరబెట్టారు. ఇప్పుడు దానిపై మట్టిమాఫియా కన్నుపడింది. పొక్లెయినర్తో పాటు టిప్పర్ లారీలను సిద్ధం చేసుకుని మట్టిని తరలించుకుపోతున్నారు. పనిలో పనిగా పుంతను కూడా తవ్వేస్తున్నారు. దీంతో పుంత కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. పుంతను అనుకుని వున్న పొలాల్లో మట్టిని తవ్విన ప్రతీసారి పుంతను సరిచేస్తున్నామని చెబుతూ పుంతను కూడా తవ్వేసుకుంటున్నారు. ప్రస్తుతం పుంతలో జరుగుతున్న అక్రమ మట్టి తరలింపులో భాగంగా మట్టి తవ్వుకునే నెపంతో పుంతను కూడా తవ్వుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో రెచ్చిపోతున్న వైనం పుంతను తవ్వుకునేందుకు అడ్డుగా వున్న సర్వే రాళ్ళను తీసిపారేస్తున్నారు. రీ సర్వేలో భాగంగా సర్వే రాళ్లు పాతి సరిహద్దులు నిర్ణయించారు. అవి అడ్డే కాదు అన్నట్లు వాటిని పీకిపారేస్తూ మట్టిని తవ్వుతున్నారు. అడ్డుచెప్పేవారు లేకపోవడంతో దోపిడీదారులు సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలు, ట్రాక్టర్లను అధికారులు నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతూ విడిచిపెడుతున్నారు. ప్రభుత్వ అఽనుమతులు లేకుండా ప్రభుత్వాదాయానికి గండి కొడుతూ సాగుతున్న అక్రమ మట్టి రవాణాకు అధికారుల అండదండలు ఉంటున్నాయి. మట్టి అక్రమ రవాణా చేసే వాహనాలకు మైనింగ్ అధికారులు కొద్దో గొప్పో ఫైన్ విధించి వెంటనే వాహనాలను విడిచిపెడుతున్నారు. ఇబ్బంది పడుతున్న రైతులు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పుంతలు, పంట బోదెలు తవ్వుకుని దోచేస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు. స్థానికంగా అధికారులు మాఫియాతో లాలూచీ పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టి అక్రమ రవాణాతో పుంత స్వరూపం మారిపోతోంది. ఇతర వాహనాలు వెళ్ళేందుకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆక్వా రైతులు, వరి రైతులు పొలాలకు వెళ్ళాలన్నా, ఎరువులు, మేత తీసుకువెళ్ళాలన్నా ఒకపక్క టిప్పర్ లారీలు, మరో పక్క దిగబడిపోతున్న పుంతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వే రాళ్లను కూడా తవ్వేస్తున్న వైనం పుంతలో తవ్వకాలు కొద్ది రోజుల క్రితం స్థానిక నీటిసంఘం ఆధ్వర్యంలో మంచినీటి కోడులో పూడిక తీశాం. పుంతగట్టుపై వేసిన మట్టిని ఎవరు తరలించుకుపోతున్నారో తెలియదు. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి ఆరాతీస్తాం. – ఫణిశంకర్, ఇరిగేషన్ ఏఈ, ఉండి పుంత తవ్వుతున్న విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై సిబ్బందిని అప్రమత్తం చేస్తాం. రెవెన్యూ అధికారి దృష్టిలో పెట్టి పుంత తవ్వకాలు జరిగితే వాటిని వెంటనే నిలుపుదల చేస్తాం. సర్వేరాళ్ళ తొలగింపు అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – కార్తీక్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఉండి -
టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలలో వేగం పెంచాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో మంగళవారం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో ఆయా పట్టణాల్లో చేపట్టిన టిడ్కో గృహాల నిర్మాణం, డంపింగ్ యార్డులు, పబ్లిక్ టాయిలెట్లు, బరియల్ గ్రౌండ్స్, పార్కులు, రోడ్లు, డ్రైన్లు, తదితర ఇంజినీరింగ్ పనులపై సమీక్షించారు. టిడ్కో ఈఈ టి.వి.నారాయణరావు, జిల్లా పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ విజయ్, మున్సిపాలిటీ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఫైలు ఉన్నతాధికారులకు ఈ–ఆఫీస్ ద్వారా పంపేందుకు అధికారులు, ఉద్యోగులు సన్నద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్న్స్ హాలు నుంచి మంగళవారం ఈ–ఆఫీస్ నిర్వహణపై రెవెన్యూ అధికారులు, ఉద్యోగులకు గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జేసీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. -
కాలువ గట్టుపై ఆగని ‘పచ్చ’ దందా
ద్వారకాతిరుమల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొందరు పచ్చ నేతల దందాలకు, దౌర్జన్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. సంపాదనే ధ్యేయంగా ప్రకృతి వనరులను సైతం దోపిడీ చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ దోపిడీకి ద్వారకాతిరుమల మండల పరిధిలోని పోలవరం కుడి కాలువ గట్టు కేంద్రంగా మారింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఎర్ర మట్టిని యథేచ్ఛగా తవ్వుకుని, అమ్ముకుంటున్నారు. అయినా అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. నిత్యం మట్టి అక్రమ తవ్వకాలే.. పంగిడిగూడెం నుంచి గుణ్ణంపల్లి వరకు పోలవరం కుడి కాలువ గట్టుపై నిత్యం అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. మండలంలోని నారాయణపురం పంచాయతీ గుళ్లపాడు గ్రామ పరిధిలోని పోలవరం కుడి కాలువ గట్టుపై కొద్ది రోజులుగా మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఓ పచ్చ ముఠా రాత్రి, పగలు అనే తేడా లేకుండా జేసీబీ సహాయంతో ఎంతో విలువైన ఎర్ర మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా చుట్టుపక్కల గ్రామాలకు తరలిస్తోంది. ఈ మట్టిని ఆయిల్పామ్ తోటల్లో రోడ్ల నిర్మాణానికి వినియోగిస్తున్నట్టు పలువురు చెబుతున్నారు. అలాగే టిప్పర్ల ద్వారా పెద్ద ఎత్తున మట్టి కాలువ కింద రొయ్యలు, చేపల చెరువులకు తరలిపోతోంది. ఒక్కో ట్రాక్టర్ గ్రావెల్ రూ.800కు, ఒక్కో టిప్పర్ మట్టిని రూ.10 వేలకు విక్రయించి, సొమ్ము చేసుకుంటున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులెవరూ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. పునాదుల పేరుతో.. ఇంటి పునాదులకంటూ కొందరు పచ్చ నేతలు ఇష్టానుసారంగా మట్టిని కొళ్లగొట్టి, అమ్ముకుని, జేబులు నింపుకుంటున్నారు. పైకి గ్రామ అభివృద్ధికి, ప్రజల అవసరాలకని పెద్దపెద్ద మాటలు చెబుతున్నారు. కానీ వేలాది రూపాయలకు మట్టిని అమ్ముకుంటున్నారు. వాస్తవానికి సామాన్య ప్రజల అవసరాలకు ఈ మట్టి ఉపయోగపడటం లేదని స్థానికులు అంటున్నారు. ఈ మట్టి అక్రమ తవ్వకాలపై కాలువ జేఈ బాపూజీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ద్వారకాతిరుమల మండలం గుళ్లపాడు వద్ద పోలవరం కుడి కాలువ గట్టుపై అక్రమంగా జరుగుతున్న ఎర్ర మట్టి తవ్వకాలు, ట్రాక్టర్లో తరలిపోతున్న గ్రావెల్ పోలవరం కుడి కాలువ గట్టుపై యథేచ్ఛగా ఎర్ర మట్టి తవ్వకాలు ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలింపు ఆ వైపు కన్నెత్తి చూడని అధికారులు -
శ్రీశైలం మల్లన్నకు శ్రీవారి దేవస్థానం పట్టువస్త్రాలు
ద్వారకాతిరుమల: శ్రీశైలం శ్రీ మల్లిఖార్జున స్వామివారికి ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం అధికారులు సోమవారం రాత్రి పట్టు వస్త్రాలను సమర్పించారు. శివరాత్రిని పురస్కరించుకుని మల్లన్నకు నిర్వహించే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ వస్త్రాలను అందజేశారు. ముందుగా శ్రీవారి దేవస్థానం ఈఓ యర్రంశెట్టి భద్రాజీ, ఏఈఓ పి.నటరాజారావు పట్టు వస్త్రాలను శిరస్సుపై పెట్టుకుని అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ మల్లన్న సన్నిధికి చేరుకున్నారు. అనంతరం అక్కడి అధికారులకు వాటిని అందజేశారు. ఆ తరువాత మల్లన్నను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఏటా బ్రహ్మోత్సవాల్లో మల్లన్నకు చినవెంకన్న దేవస్థానం పట్టు వస్త్రాలను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో శ్రీవారి దేవస్థానం సూపరింటిండెంట్ హయగ్రీవాచార్యులు, ఆచారి తదితరులున్నారు. నూజివీడు: పశువుల కొవ్వు నుంచి నూనెను తయారు చేస్తున్న వ్యక్తిని మంగళవారం పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 60 కిలోల గడ్డకట్టిన నూనెను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ ఎస్సై నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని అజరయ్యపేటకు చెందిన కంచిపోగు అజయ్ అలియాస్ మస్తాన్ గత 20 ఏళ్లకు పైగా పశువులను కోసి మాంసాన్ని విక్రయిస్తూ ఉంటాడు. అంతేగాకుండా పశువుల కొవ్వును కరిగించి నూనెను తయారు చేసి విక్రయిస్తూ ఉంటాడు. దీంతో పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఉదయం 7గంటల సమయంలో ఎస్సై తన సిబ్బందితో వెళ్లి అతడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు గడ్డకట్టి ఉన్న నూనె టిన్నులను, కొవ్వు మాంసాన్ని స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించారు. మాంసం కొవ్వునుంచి నూనె తయారు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొయ్యలగూడెం: నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా నిర్మాణ ప్రక్రియ పూర్తి చేసి తీరుతామని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేర్కొన్నారు. మంగళవారం సరిపల్లి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నేవీ డిపో నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఆయుధ డిపో నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తే ఎందాకై నా వెళ్లడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎంపీ పుట్టా మహేష్యాదవ్, తానూ ఆయుధ డిపో నిర్మాణంలో కృత నిశ్చయంతో ఉన్నామన్నారు. చోడి పిండి సుబ్రహ్మణ్యం, ఏఎంసీ మాజీ చైర్మన్ పారేపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. 17న చెస్, 24 సైక్లింగ్ జట్లు ఎంపిక ఏలూరు రూరల్: రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాప్ లీగ్స్ పేరిట ఆటల పోటీలు నిర్వహించనున్నామని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తంగా 31 క్రీడాంశాల్లో జిల్లాస్థాయిలో పోటీలు చేపట్టి జిల్లా జట్లను ఎంపిక చేస్తుందన్నారు. ఈనెలలో లీగ్స్ ప్రారంభమై, 11 నెలల పాటు కొనసాగి డిసెంబర్లో ముగుస్తాయన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 17వ తేదీన ఏలూరు ఇండోర్ స్టేడియం వెయిట్ లిఫ్టింగ్ హాల్లో జిల్లాస్థాయి చెస్ పోటీలు చేపట్టనున్నామని వివరించారు. అండర్ 13, 15, 17, 19 విభాగంలో పురుషులు, మహిళలకు పోటీలు చేపడతామని వెల్లడించారు. జిల్లా జట్లకు ఎంపికై న వారు ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఇదే క్రమంలో ఈ నెల 24వ తేదీన ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయి సైక్లింగ్ పోటీలు చేపడతామన్నారు. ఇందులో ఎంపికై న వారు ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 1 వరకూ విజయవాడలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన క్రీడాకారులు శాప్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం 90594 85538 నెంబర్కు ఫోన్ చేసి సంప్రదించాలని సూచించారు. -
నాటు పడవలపై జోరుగా వేట
నరసాపురం: ప్రస్తుతం అటు సముద్రంలో, ఇటు గోదావరిలో చేపలు అధికంగా పడే సీజన్. దీంతో మత్స్యకారులు విరామం లేకుండా వేట సాగిస్తుంటారు. సముద్రంలో వేట సాగించే పెద్ద బోట్లను పక్కన పెడితే గోదావరిలో చెక్క నావలపై వేట సాగించే సంప్రదాయ మత్స్యకారుల సంఖ్య కూడా నరసాపురం ప్రాంతంలో తక్కువేమీ కాదు. ప్రస్తుత సీజన్లోనే మత్స్యకారులు గోదావరిలో వల కట్లు కట్టుకుంటారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. సంప్రదాయ మత్స్యకారులు వేటలో బిజీగా ఉన్నారు. ఎక్కువగా గోదావరిలో చెక్కనావపై వేట సాగుతోంది. దీంతో చెక్కనావలను వేటకు సిద్ధం చేయడం, నావల్లో వలలు సర్ధుకోవడం చేస్తున్నారు. దీంతో గోదావరి తీరంలో చెక్కనావలు సందడి చేస్తున్నాయి. గోదావరిలో వలకట్లు కూడా ముమ్మరంగా కడుతున్నారు. భీమవరం: రాష్ట్రంలో పీజీ, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. భీమవరంలో మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బి.గణేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు ఎలాంటి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయలేదన్నారు. దీనివల్ల ఎంతోమంది పేద విద్యార్థులు కాలేజీల్లో ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు రావాల్సిన రూ.7,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బి.గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.లక్ష్మణ్, పి.సాయి కృష్ణ, బి.సింధు తదితరులు పాల్గొన్నారు. నరసాపురం రూరల్: ఒక మాజీ సైనికుడిని ఓ అధికారి లంచం డిమాండ్ చేశాడు. నరసాపురం పట్టణానికి చెందిన మాజీ సైనిక ఉద్యోగి పత్తి రాధాకృష్ణ మొగల్తూరు మండలం పేరుపాలెంలో తనకు చెందిన ఆక్వా సాగు భూమికి సంబంధించి అప్సడాలో నమోదు కోసం వెళ్తే వీఆర్వో దుర్గారావు రూ.3 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఆ మాజీ సైనిక ఉద్యోగి ఈ వ్యవహారానికి సంబంధించిన సంభాషణలు తన ఫోన్లో రికార్డు చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. వాటిని పరిశీలించిన తహసీల్దార్ సదరు వీఆర్వోను ఆర్డీవోకు సరెండర్ చేశారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్–2026 ముసాయిదాలోని అంశాలు ఉపాధ్యాయ, ఉద్యోగులకు తీవ్ర నష్టం చేకూర్చేలా ఉన్నాయని, ఆయా అంశాలను ఏమాత్రం అంగీకరించేది లేదని ఉపాధ్యాయ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం స్పష్టం చేసింది. స్థానిక పవర్పేట నగరపాలక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంగళవారం జిల్లా స్థాయి ఉపాధ్యాయ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కొత్త ముసాయిదా పెన్షన్ నిబంధనలపై ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఈ అంశంపై సమష్టిగా చర్చించి, ప్రభుత్వానికి తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేస్తామన్నారు. ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ –1980ను దెబ్బతీసే ఏ మార్పులనైనా ఉపాధ్యాయులు, ఉద్యోగులు సహించబోమని, ప్రభుత్వం వెంటనే ఈ ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. -
తపాలా సేవల్లో సాంకేతిక పరిజ్ఞానం జోడించండి
కై కలూరు: తపాలా సేవల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బీపీ.శ్రీదేవి సూచించారు. ఆటపాక బ్రాంచి పోస్టాఫీస్ను మంగళవారం ఆమె సందర్శించారు. అనంతరం కై కలూరు, పల్లెవాడ పోస్టాఫీసుల పరిధిలోని 20 బ్రాంచి పోస్టాపీసుల గ్రామీణ్ డాక్ సేవక్(జీడీఎస్) సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తపాలశాఖ ఐవీ 2.0 అనే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందిస్తోందన్నారు. సిబ్బంది పోస్టల్ పథకాలకు అత్యధిక ప్రచారం కల్పించాలన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన పథకాలు తపాలశాఖ అందిస్తోందని తెలిపారు. అనంతరం ఆటపాక పక్షుల విహార కేంద్రంలో బోటు షికారులో పక్షుల కేరింతలను ఆశ్వాదించారు. కార్యక్రమంలో గుడివాడ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎస్.కృష్ణమూర్తి, ఏఎస్పీ సీహెచ్.శ్రీనివాసరావు, కై కలూరు సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ కందగిరి సురేష్కుమార్, ఇన్స్పెక్టర్ బి.విజయ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ శ్రీదేవి -
ముగిసిన కర్మయోగి శిక్షణ
తాడేపల్లిగూడెం: భారత ప్రభుత్వ ఆధీనంలోని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో నిట్లో గత రెండు రోజులుగా సాగుతున్న రాష్ట్రీయ కర్మయోగి లార్జ్ స్కేల్ జన్ సేవా కార్యక్రమం మంగళవారం ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగులను సృజనాత్మకంగా, వృత్తి నిపుణులుగా, సేవా దృక్పథం కలిగిన వారిగా తీర్చిదిద్దడమే ఈ కర్మయోగి మిషన్ ముఖ్య ఉద్దేశమని వక్తలు పేర్కొన్నారు. కొత్త విషయాలను ఉద్యోగులకు విశదీకరించారు. రెండు రోజుల్లో 122 మంది ఉద్యోగులు హాజరయ్యారు. ముగింపు కార్యక్రమంలో రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి, ఆచార్యులు ఎన్.జయరామ్, ఐఐటీ హైద్రాబాద్ సీనియర్ జాయింట్ రిజిస్ట్రార్ ఎం.బద్రీనాధ్, నిట్ వరంగల్ డిప్యూటీ రిజిస్ట్రార్ మణికాంత్, తిరుపతి ఐఐటీ సీనియర్ అసిస్టెంటు రిజిస్ట్రార్ అరుణ్ కల్యాణ్, విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ ఇంచార్జ్ రిజిస్ట్రార్ శ్యామ్ కుమార్ మాస్టర్ ట్రైనర్లుగా వ్యవహరించారు. -
వృద్ధురాలిపై దాడి కేసులో నిందితుడి అరెస్ట్
జంగారెడ్డిగూడెం: ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి మెడలో బంగారుగొలుసు చోరీ చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పోలీస్స్టేషన్లో ఆమె మంగళవారం వివరాలు వెల్లడించారు. కామవరపుకోట పాతూరు బీసీ కాలనీకి చెందిన వృద్ధురాలు కలకోటి వెంకట సత్యవతి ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ నెల 7వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఇంటి తలుపులు కొట్టిన శబ్ధం విని తలుపు తీసింది. ముఖానికి గుడ్డకట్టుకుని ఉన్న వ్యక్తి ఆమైపె దాడి చేసి, ఇనుప రాడ్డుతో తలపై కొట్టి, వృద్ధురాలి మెడలోని 2 కాసుల బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు. దీనిపై తడికలపూడి ఎస్సై టి.చెన్నారావు కేసు నమోదు చేశారు. సీఐ సుభాష్ ఆధ్వర్యంలో జరిపిన దర్యాప్తులో నిందితుడు కామవరపుకోట మండలం పాతూరుకు చెందిన అడవికొట్టు వెంకటేశ్వరరావు అలియాస్ చక్రి అలియాస్ అంజిగా గుర్తించారు. కామవరపుకోట చింతలపూడి వెళ్లే రోడ్లో ఆర్ఆర్జీకే డైరీ వద్ద నిందితుడిని అరెస్టు చేసి, రూ.1.40లక్షలు విలువైన బంగారు గొలుసు, మోటార్సైకిల్, ఇనుప రాడ్డు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ చెప్పారు. కేసును చేధించిన సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై టి.చెన్నారావు, క్రైం పార్టీ ఏఎస్సై ఎన్వీ సంపత్కుమార్, పీసీలు ఎస్కే షాన్, ఎన్.రమేష్, ఎ.సుధీర్లను ఏఎస్పీ అభినందించారు. -
అండర్–12 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు
ఏలూరు రూరల్: ఈ నెల 13, 14 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్–12 బాలుర క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు చేపట్టనున్నామని క్రికెట్ అసోసియేషన్ త్రిసభ్య కమిటీ సభ్యుడు ఎస్కే షాకిర్హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూరు సీఆర్ఆర్ కళాశాల గ్రౌండ్లో ఉదయం 8 గంటలకు ఎంపిక పోటీలు ప్రారంభమౌతాయని వివరించారు. ఇందులో పాల్గొనే క్రీడాకారులు 01–09–2013 తర్వాత పుట్టిన వారై ఉండాలన్నారు. ఆసక్తి గలవారు పుట్టినతేదీ ధ్రువీకరణ, ఆధార్తో పాటు స్టడీ సర్టిఫికెట్ల ఒరిజినల్స్తో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 70136 33143 నంబర్లో సంప్రదించాలన్నారు. తణుకు అర్బన్: తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు తణుకు రూరల్ ఇన్చార్జి ఎస్సై జానా సతీష్ తెలిపారు. ఈనెల 9న తణుకు మండలం యర్రాయిచెర్వు గ్రామంలోని వినాయకుడి విగ్రహం వద్ద సుమారు 60 ఏళ్లు వయసు కలిగిన వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయారు. స్థానికులు 108 ద్వారా వృద్ధుడిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 94407 96681, 94411 44789 నంబర్లలో తెలియజేయాలని ఆయన కోరారు. భీమడోలు: గుండుగొలను గ్రామంలోని మెయిన్ రోడ్డులోని వినాయకుని ఆలయం, రామాలయం, గంగానమ్మ ఆలయాల్లో చోరీకి విఫలయత్నం జరిగింది. ఆలయాల్లో హుండీ అపహారణ, వస్తువులను చెల్లాచెదురుగా పడేయడం, తలుపులు పగలగొట్టి ఉండడాన్ని ఆలయ కమిటీ సభ్యులు గుర్తించారు. రామాలయంలోని హుండీని అపహరించి, అందులోని రూ.15 వేలు నగదు చోరీ చేసినట్లు రామాలయం కమిటీ సభ్యుడు వెలివెల సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సీసీ ఫుటేజీ, వేలిముద్రలను సేకరించారు. జంగారెడ్డిగూడెం: ట్రాక్టర్ ట్రక్కు బోల్తా పడి కూలీ మృతిచెందిన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన జాలా ప్రసాద్ (49) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 9న ఓ రైతుకు చెందిన పొగాకు తోటలో పనికి వెళ్లిన ప్రసాద్, అక్కడ నుంచి ట్రాక్టర్లో పొగాకు లోడు వేసుకుని వస్తున్నాడు. పట్టణంలోని బుట్టాయగూడెం రోడ్డులో ఉన్న రాజారాణి కళ్యాణ మండపం వద్దకు వచ్చేసరికి ట్రాక్టర్, ట్రక్కు తిరగబడటంతో ప్రసాద్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై మృతుని భార్య రత్నకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ప్రసాదాల తయారీ టెండర్ రద్దుకు నిర్ణయం
ద్వారకాతిరుమల: శ్రీవారి ప్రసాదాల తయారీ కాంట్రాక్ట్ టెండర్ను రద్దు చేయాలని అధికారుల కమిటీ నిర్ణయించింది. మొత్తం నలుగురు కాంట్రాక్టర్లు టెండర్లు వేయగా, అందులో సరైన పత్రాలు సమర్పించని కారణంగా టెక్నికల్ బిడ్లో మూడు టెండర్లను డిస్ క్వాలిఫై చేశారు. ప్రైజ్ బిడ్ ఓపెన్ చేయాలంటే కనీసం రెండు టెండర్లు ఉండాలి. సింగిల్ టెండర్ ఉండటంతో పూర్తిగా టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని అధికారుల కమిటీ నిర్ణయించి, నివేదికను ఆలయ ఈఓకు సమర్పించింది. నిబంధనల ప్రకారం సరైన పత్రాలు సమర్పించని కారణంగా విజయవాడకు చెందిన ఎం.విజయచంద్ సప్లయర్స్, ఎం.రవికుమార్, జీకే మ్యాన్ పవర్ టెండర్లను కమిటీ డిస్ క్వాలిఫై చేసింది. ద్వారకాతిరుమలకు చెందిన రవికృష్ణ మ్యాన్ పవర్ ఏజన్సీస్ టెండర్ ప్రైజ్ బిడ్కు అర్హత పొందింది. అధికారులు పారదర్శకంగా టెండర్ ప్రక్రియను నిర్వహించడంతో ముగ్గురు కాంట్రాక్టర్లు డిస్ క్వాలిఫై అయ్యారు. కొత్త టెండర్ ప్రక్రియలో అర్హత పొందిన రవికృష్ణ మ్యాన్ పవర్ ఏజన్సీస్పై, అంబరుఖానా అధికారులపై అసత్య ఆరోపణలు చేస్తూ రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్కు, ఆలయ ఛైర్మన్, ఈఓలకు గుర్తు తెలియని వ్యక్తులు ఈనెల 8న వాట్సప్ల ద్వారా మెసేజ్లు పంపారు. ఆ ఆరోపణలు అవాస్తవమని అధికారులు తమ విచారణలో తేల్చారు. దేవస్థానం అధికారులు మళ్లీ కొత్తగా పిలిచే టెండర్లో, ప్రస్తుతం ఉన్న షరతులే ఉంచుతారా.. లేక అధికార పార్టీ నాయకుల కోసం వాటిని సడలిస్తారా.. అన్న దానిపై శ్రీవారి క్షేత్రంలో జోరుగా చర్చ జరుగుతోంది. -
హరహర మహాదేవ.. శంభో శంకర
భీమవరం (ప్రకాశం చౌక్): మహాశివరాత్రి మహోత్సవాలకు జిల్లాలోని శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు జరగనున్న శివరాత్రి మహోత్సవాల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. జిల్లాలో దేవాదాయశాఖ నిర్వహణలో 30కు పైగా ప్రసిద్ధి శివాలయాలు ఉన్నాయి. ఆలయ కమిటీల ద్వారా నిర్వహించే శివాలయాలు మరో 15 వరకు ఉంటాయి. ముఖ్యంగా జిల్లాలో భీమవరం, పాలకొల్లులో పంచారామ క్షేత్రాలు, ఆచంట రామేశ్వరస్వామి, నత్తారామేశ్వరం రామలింగేశ్వరస్వామి వారి దేవస్థానాల్లో 5 రోజుల పాటు నిర్వహించే శివరాత్రి మహోత్సవాలకు జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది భక్తులు వస్తుంటారు. చురుగ్గా ఏర్పాట్లు జిల్లాలోని పంచారామక్షేత్రాలు, ప్రముఖ శివాలయాల్లో శివరాత్రి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ అలంకరణలు, సెట్గింగ్లు, డెకరేషన్ల పనులు చేస్తున్నారు. భక్తులకు మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ఆలయాల్లో దేవదాయ శాఖ, పోలీసులు, పంచాయతీ, మున్సిపల్, ఆరోగ్య శాఖ, రెవెన్యూ, ఫైర్ తదితర శాఖలతో ఉత్సవాలపై సమన్వయ మీటింగ్లు పూర్తి చేశారు. 13, 15 తేదీల్లో స్వామి వారి కల్యాణం మహాశివరాత్రి మహోత్సవాల్లో స్వామి వారి కల్యాణ తంతు అద్భుతమైన ఘట్టం. స్వామి వారి కల్యాణాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు వారికి అందుబాటులో ఉన్న శివాలయాలకు చేరుకుంటారు. ఈనెల 13వ తేదీన ఆచంటలోని శ్రీరామేశ్వరస్వామి వారి కల్యాణం కాగా మిగిలిన శివాలయాల్లో ఈనెల 15వ తేదీన స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నారు. స్వామి వారి కల్యాణం అనంతరం రథోత్సవం, తెప్సోత్సం నిర్వహిస్తారు. ప్రసిద్ధ ఆలయాలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన శివాలయాలు ఉన్నాయి. మహాశివరాత్రి ప్రత్యేక పూజలు అందుకునే ప్రముఖు శివక్షేత్రాలు ఇవి. భీమవరం మండలం యనమదుర్రులోని పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి, భీమవరంలో భీమేశ్వర స్వామి, ఆచంట రామేశ్వరస్వామి, నత్తారామేశ్వరంలో రామేశ్వరస్వామి, జుత్తిగ ఉమాసోమేశ్వరస్వామి, లక్ష్మణేశ్వరంలో దుర్గా లక్ష్మణేశ్వరస్వామి, శివదేవుని చిక్కాలలో శివదేవస్వామి, పెనుగొండలో నగరేశ్వరస్వామి తదితర శివాలయాలు మహా శివరాత్రి మహోత్సవాలకు ముస్తాబవుతున్నాయి. ఉమాసోమేశ్వర స్వామి వారు భీమవరంలో పంచారామక్షేత్రంజిల్లాలోని భీమవరం, పాలకొల్లు పంచారామక్షేత్రాల్లో 5 రోజుల పాటు నిర్వహించే మహాశివరాత్రి మహోత్సవాలకు భారీగా భక్తులు వస్తుంటారు. రోజుకు 10 వేలు నుంచి 30 వేలమంది వరకు భక్తులు పంచారామ క్షేత్రాలను దర్శిస్తారు. పంచారామ క్షేత్రాల్లో స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు, విశేష అలంకరణలు నిర్వహిస్తారు. రధోత్సవాలు, తెప్పోత్సవాలు జరుపుతారు. అలాగే పలు సాంస్కృతికి కార్యక్రమాలు ఏర్పాటుచేయడం జరుగుతుంది. భీమవరం పంచారామక్షేత్రంలో ఉమాసోమేశ్వరుడు చంద్రుడి ప్రతిష్ఠాపన కావడంతో శివలింగం అమావాస్యకు గోధుమ వర్ణంలో, పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోకి మారడం ఇక్కడి ప్రత్యేకత. క్షేత్ర పాలకుడు శ్రీజనార్థన స్వామి వారు. మహాశివరాత్రి మహోత్సవాలకు జిల్లాలోని దేవదాయ శాఖ పరిధిలోని పంచారామక్షేత్రాలతోపాటు అన్ని శివాలయాల్లో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. భక్తులు రద్ధీగా ఉండే శివాలయాల వద్ద ప్రత్యేక దృష్టి పెట్టి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అన్ని శాఖల అధికారులతో సమన్వయ మీటింగ్ నిర్వహించి మహాశివరాత్రి మహోత్సవాలను విజయవతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. – వి.సూర్యప్రకాష్ జిల్లా దేవాదాయ శాఖ అధికారి 13 నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు జిల్లావ్యాప్తంగా శివాలయాల్లో ఆధ్యాతిక శోభ జిల్లాలోని రెండు పంచారామాలు, శివాలయాల్లో ఏర్పాట్లు 5 రోజులపాటు విశేష పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు -
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ డిమాండ్వీరవాసరం: తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో చంద్రబాబు కచ్చితంగా ప్రజలకు ,శ్రీవారి భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ శెట్టిబలిజ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కవురు శ్రీనివాస్ మంగళవారం డిమాండ్ చేశారు. తిరుమల ప్రసాదం అంటే సందేహించే స్థాయికి చంద్రబాబు తన తప్పుడు ప్రచారంతో తీసుకెళ్లారని ఇంతకన్నా ఘోరం ఏముంటుందని తీవ్రంగా ఆక్షేపించారు. లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతు కొవ్వు లేదని దేశంలోనే ప్రతిష్టాత్మక ల్యాబ్లు చెప్పాయన్నారు. ప్రజల దృష్టిలో పూర్తిగా కిందకు పడిపోయిన చంద్రబాబు మళ్లీ ఏదో రకంగా తన అబద్ధాలు నిజాలని చెప్పడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలంతా దీన్ని గమనిస్తున్నారని వివరించారు. అన్ని రకాల రిపోర్టులను చూసిన తర్వాతే చార్జిషీట్ వేశారని.. మరి ఎందుకు చంద్రబాబు కుట్రలు మీద కుట్రలు చేస్తున్నారని ప్రశ్నించారు. పరిపాలనలో ఘోరంగా విఫలమయ్యారని, ప్రజలంతా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. -
మద్యంపై సిండికేట్ బాదుడు
మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి, భీమవరం: ఎకై ్సజ్ శాఖ ప్రకటనలకు క్షేత్రస్థాయిలో మద్యం ధరలకు పొంతన ఉండటం లేదు. జిల్లాలో ఎమ్మార్పీ నిబంధనలు అమలవుతున్న దాఖలాలు లేవు. చంద్రబాబు ప్రభుత్వం బాటిల్పై రూ.10 చొప్పున ఏడాది వ్యవధిలో రెండు పర్యాయాల్లో రూ.20 పెంచితే లిక్కర్ వ్యాపారులు అదనంగా మరో రూ. 10 పెంచి అమ్మకాలు చేస్తున్నారు. బీర్లపై రూ.20 చొప్పున వసూలు చేస్తూ మందుబాబుల జేబులు గుల్ల చేస్తున్నారు. మందుబాబులపై మార్జిన్ భారం జిల్లాలో 194 మద్యం దుకాణాలు ఉన్నాయి. గతంలో మద్యం అమ్మకాలపై వ్యాపారులకు పది శాతం మార్జిన్ ఉండేది. లిక్కర్ సిండికేటుకు మేలు చేస్తూ గత ఫిబ్రవరిలో 14 శాతంకు పెంచిన ప్రభుత్వం తాజాగా జనవరిలో 15 శాతం చేసింది. బార్లలో మద్యం అమ్మకాలపై ఉన్న 15 శాతం అదనపు రిటైల్ ఎకై ్సజ్ సుంకాన్ని (ఏఆర్ఈటీ)ని పూర్తిగా రద్దుచేసింది. వ్యాపారులకు మార్జిన్ పెంపు ప్రభావం ప్రభుత్వ ఆదాయంపై పడకుండా ఆ భారాన్ని మందుబాబులపై మోపుతోంది. గతంలో మార్జిన్ పెంచినప్పుడు బాటిల్పై రూ.10 పెంచినట్టే, మళ్లీ ఇప్పుడు మరో రూ.10 పెంచింది. పేద, మధ్యతరగతి వర్గాల వారు ఎక్కువగా కొనుగోలు చేసే రూ.120, రూ.130, రూ. 150, రూ.180, రూ.190 క్వార్టర్ బాటిళ్ల ధరలు ఏడాదికాలంలో రూ.20 చొప్పున పెరిగిపోయాయి. మద్యం ధరలు తగ్గిస్తామంటూ ఎన్నికల్లో చెప్పిన ప్రభుత్వం ఆచరణలోకి వచ్చేసరికి పూర్తి విరుద్ధంగా పనిచేస్తోందని మందుబాబులు మండిపడుతున్నారు. సిండికేటు సెప‘రేటు’ జిల్లాలో రోజుకు దాదాపు రూ.4 కోట్ల విలువైన రెండు వేలకు పైగా లిక్కర్ కేస్లు, 600 వరకు బీరు కేస్లు అమ్మకాలు జరుగుతాయని అంచనా. లిక్కర్ కేస్లో క్వార్టర్ బాటిళ్లు 48, హాఫ్ బాటిళ్లు 24, ఫుల్స్ 12 చొప్పున ఉంటాయి. బీర్లు 12 వరకు ఉంటాయి. ఈ మేరకు ప్రతి బాటిల్పైనా రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. ధరలు పెంచకుండా మినహా యింపు ఇచ్చిన రూ.99 క్వార్టర్, బీరు, వైన్, రెడీ టూ డ్రింక్ బాటిళ్లపైనా ఎమ్మార్పీపై రూ.10 నుంచి రూ. 20 వరకు అదనంగా అమ్మకాలు చేస్తున్నారంటున్నారు. బెల్టుషాపుల్లో రూ.40 నుంచి రూ.50 వరకు పెంచి అమ్మకాలు చేస్తున్నారు. అనధికారకంగా మందుబాబుల నుంచి రోజుకు సుమారు రూ.10 లక్షలు పైనే వసూలు చేస్తున్నట్టు అంచనా. ఏడాదిక్రితంతో పోలిస్తే ప్రభుత్వం, సిండికేట్ బాదుడుతో బాటిల్పై రూ.30 అదనంగా పెరిగిందని మద్యపాన ప్రియులు వాపోతున్నారు. ఎమ్మార్పీ ధరల పట్టికలు ఏర్పాటుచేసినట్టు అధికారులు చెబుతుండగా అవి ఎక్కడా కనిపించడం లేదంటున్నారు. అమ్మకాలు పెంచాలంటూ ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడితో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బాటిల్కు రూ. 10,బీరుపై రూ.20 వరకు పెంపు కనిపించని ధరల పట్టికలు బెల్టుల్లో సెప‘రేటు’ దందా జిల్లాలో ధరల దోపిడీ రోజుకు రూ.10 లక్షల పైమాటే ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మకాలు జరిగేలా మద్యం దుకాణాల వద్ద డెకాయి ఆపరేషన్లు చేస్తున్నాం. కొత్త ధరల పట్టికను, 14405 టోల్ఫ్రీ నెంబర్ను అన్ని మద్యం దుకాణాల వద్ద ప్రదర్శిస్తున్నాం. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు మద్యం అమ్మకాలు చేస్తున్న ఐదు షాపులపై కేసులు నమోదుచేశాం. బెల్టు షాపులపై దాడులుచేసి 698 కేసులు నమోదుచేశాం. 702 మందిని అరెస్టుచేసి 1183 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాం. – జిల్లా మద్యనిషేధ అబ్కారీశాఖ అధికారి ప్రకటన పేద మందుబాబుల కోసం అంటూ చంద్రబాబు ప్రకటించిన రూ.99 క్వార్టర్ బాటిళ్లు మద్యం దుకాణాల్లో కనిపించడం లేదు. ఒకటీ అరా కేసులు షాపుల్లో విక్రయించి చాలా వరకు బెల్టులకు తరలించేస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ వీటిని రూ.140 నుంచి రూ.150 వరకు అమ్మకాలు చేస్తున్నారు. మద్యం షాపుల్లో అమ్మకాలు చేసే బాటిళ్లతో పోలిస్తే బెల్టుషాపుల్లో విక్రయించే మద్యం బాటిళ్ల మూతలపై ప్రత్యేక స్టిక్కర్లు ఉంటుండటం గమనార్హం. జిల్లాలోని పాలకొల్లుతో పాటు రాష్ట్రంలోని పలుచోట్ల కల్తీ మద్యం తయారీ ఘటనలు వెలుగుచూడటంతో బెల్టుషాపుల్లో మద్యం నాణ్యతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అభివృద్ధి పేరిట దోపిడీ
జిల్లాలో అడ్డగోలుగా గ్రావెల్, మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణం. డీఆర్సీ సమావేశంలో ద్వారకాతిరుమల మండలం రావులచెరువులో జరుగుతున్న అక్రమ దందాపై సభలో ప్రస్తావించి అధికారులను నిలదీశాం. బహిరంగంగా అందరికి తెలిసేలా గ్రావెల్ దందా జరుగుతున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, చెరువులు ఎందుకు అభివృద్ధి చేయడం లేదని, మంజూరు చేసిన నిధులను ఏం చేశారంటూ ప్రశ్నించాం. రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ మూడు విభాగాలు సంయుక్తపాత్ర ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు. – ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: తెలుగు తమ్ముళ్ళు కొత్త రకం దందాకు తెరతీశారు. అభివృద్ధి పనులు, మరమ్మతుల ముసుగులో గ్రావెల్ దందా చేస్తూ నిత్యం లక్షలు గడిస్తున్నారు. చెరువు పూడికతీత పేరుతో ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ద్వారా నిధులు మంజూరు చేయించి పనులు పక్కన పెట్టి గ్రావెల్తో సొమ్ము చేసుకుంటున్న పరిస్ధితి జిల్లాలో నెలకొంది. ద్వారకాతిరుమల మండలం రామన్నగూడెంలోని రావులచెరువులో ఈ తరహా దందాను ప్రజాప్రతినిధి అనుచరగణం కొన్ని నెలలుగా సాగిస్తున్నా అధికారులు స్పందించడం లేదు. రెండు రోజులు క్రితం జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ప్రభుత్వాన్ని నిలదీస్తే చర్యలు తీసుకుంటామన్నా పురోగతి లేదు. జిల్లాలో తెలుగు తమ్ముళ్ళు కొత్త దందాకు తెరదీశారు. ప్రధానంగా కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, దెందులూరు, భీమడోలు, ద్వారకాతిరుమల మండలాల్లో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. అన్ని చోట్ల ప్రజాప్రతినిధుల ముఖ అనుచర గణం గ్రావెల్ దందా సాగిస్తోంది. అన్నిచోట్ల ఇరిగేషన్ మొదలుకుని రెవెన్యూ అధికారుల వరకు సాగుతున్న అక్రమ దందాపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ మొక్కుబడిగానైనా స్పందించని పరిస్థితి. ద్వారకాతిరుమల మండలంలోని రామన్నగూడెంలోని రావులచెరువు 43.77 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చెరువు ఆయకట్టు పరిధిలో 114.98 ఎకరాల సాగు భూమి ఉంది. చెరువు పూడికతీసిన మట్టితో కరకట్టను పటిష్టం చేసి, మరమ్మత్తులకు గురైన సప్లయ్ చానళ్లు, షట్టర్లను బాగు చేసి, మొక్కలు నాటేందుకు, చెరువుకు సంబంధించి అభివృద్ధి పనులు నిర్వహించడానికి కలెక్టర్ వెట్రిసెల్వి ఆమోదంతో మినరల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.94.30 లక్షల నిధులు మంజూరు చేశారు. జిల్లా మొత్తం మీద సుమారు కోటి రూపాయలు మైనింగ్ నగదును మంజూరు చేసిన ఏకై క చెరువు ఇది. వాస్తవానికి పూడికతీసి కరకట్టల అభివృద్ధి పనులు 3 నుంచి 6 నెలల కాలంలో అన్నింటిని పూర్తి చేయాల్సి ఉంది. తెలుగు తమ్ముళ్లు దీనిని ఆదాయ వనరుగా మలుచుకుని పనులు పక్కనపెట్టి సరికొత్త దోపిడీకి శ్రీకారం చుట్టారు. వందల ట్రాక్టర్ల గ్రావెల్ విక్రయం ప్రజాప్రతినిధి ప్రధాన అనుచరుల కనుసన్నల్లో చెరువు గ్రావెల్ దందా మొదలైంది. దాదాపు 6–7 నెలల నుంచి 15 క్యూబిక్ మీటర్ల టిప్పర్కు రూ.2500, మూడు క్యూబిక్ మీటర్ల ట్రాక్టర్ గ్రావెల్కు సుమారు రూ.500 వరకు ప్రజాప్రతినిధులు వసూలు చేస్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లతో గ్రావెల్ను లోడ్ చేస్తుంటారు. ప్రత్యేకంగా పొక్లెయిన్ ఏర్పాటు చేసి మరీ పగలూ రాత్రి తేడా లేకుండా చెరువును ధ్వంసం చేస్తున్నారు. ఇంతవరకు వేలాది ట్రిప్ల గ్రావెల్ను తవ్వేసి కోట్లు గడించారు. ఇదిలా ఉంటే జిల్లాలో ప్రధానంగా కామవరపుకోట, తడికలపూడి, భీమడోలు, ఏలూరు తదితర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లకు గ్రావెల్ను విక్రయిస్తున్నారు. ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్లు పొంది రోడ్ల నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లకు సైతం ఇదే గ్రావెల్ను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. భీమడోలు మండలం లింగపాడులో రోడ్డు నిర్మాణం, తిమ్మాపురం నుంచి తిరుమలపాలెం వరకు, అలాగే కొన్ని చోట్ల చేపల చెరువు కరకట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈ గ్రావెల్ను విక్రయించినట్లు స్థానికులు చెబుతున్నారు. రావులచెరువు పూడికతీత ముసుగులో గ్రావెల్ దందా చెరువు కరకట్ట పటిష్టానికి రూ.95 లక్షల మంజూరు పూడిక తీస్తున్నామంటూ వందల ట్రాక్టర్ల గ్రావెల్ అమ్మకం స్పందించని అధికార యంత్రాంగం డీఆర్సీలో నిలదీసిన ఎమ్మెల్సీ వంకా రవీంద్ర -
గంగానమ్మకు ఘనంగా వీడ్కోలు
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలో గత మూడు నెలలుగా భక్తుల విశేష పూజలందుకున్న శ్రీ గంగానమ్మ అమ్మవారికి సోమవారం నగర ప్రజలు అత్యంత వైభవంగా వీడ్కోలు పలికారు. తూర్పు వీధి, దక్షిణపువీధి, పవరుపేట, లక్ష్మివారపుపేట, ఆదివారపుపేటలతో పాటు పడమరవీధి ప్రాంతాల్లో గత వంద రోజులకు పైగా భక్తిశ్రద్ధలతో కొలిచి గత నెల 26, ఈ నెల 2 తేదీల్లో అమ్మవారిని సాగనంపగా తంగెళ్ళమూడి ప్రాంతంలో చివరిసారిగా అమ్మవారికి సోమవారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. భారీ ఎత్తున ఊరేగింపు తంగెళ్ళమూడిలో ఏర్పాటు చేసిన శ్రీ గంగానమ్మ అమ్మవారి మేడల నుంచి అమ్మవారిని కొర్లబండిపై నగర శివార్లకు సాగనంపే ప్రక్రియ నేత్రపర్వంగా జరిగింది. ఊరేగింపులో కొర్లబండిపై అమ్మవారి వేషధారణలో పంబల వారు కూర్చొని భక్తులకు కుంకుమబొట్లు పెడుతూ ఆశీర్వదిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా తీన్మార్ డప్పులు, డీజేలు, నృత్యాలు, బుట్టబొమ్మలు, శక్తి వేషధారులతో ఊరేగింపు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఊరేగింపు సాగిందిలా.. తంగెళ్ళమూడి జాతర మేడల వద్ద నుంచి సోమవారం అమ్మవారి కొర్ల బండి ఊరేగింపు ప్రారంభమై అక్కడి నుంచి మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయం మీదుగా వేణుగోపాల స్వామి ఆలయం, స్వాతి టవర్స్, అంగడాల ప్లాట్స్, చెరువుగట్టు రోడ్డు, బీడీ కాలనీలోని కనకదుర్గమ్మ ఆలయం, ఆర్కే ఫ్యాషన్స్ వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి చింతలపూడి రోడ్డులోకి ప్రవేశించి బాబూ జగజ్జీవన్ రామ్ కమిటీ హాలు మీదుగా రాణీ నగర్లోని రామాలయం వద్దకు చేరుకుని జంగారెడ్డిగూడెం రోడ్డులోకి ప్రవేశించింది. చివరిగా జంగారెడ్డిగూడెం రోడ్డులోని టాటా మోటార్స్ షోరూం సమీపంలో అమ్మవారిని పొలిమేరలు దాటించి అక్కడ అమ్మవారిని విడిచి వచ్చారు. నగరంలో భారీ ఊరేగింపు -
ముస్లిం సమాజానికి వెన్నుపోటు
భీమవరం: ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల్లో వక్ఫ్ ఆస్తులను కాపాడుతానని హామీ ఇచ్చి ఇప్పుడు ముస్లిం సమాజానికి వెన్నుపోటు పొడుస్తున్నారని వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రెసిడెంట్ ఎండీ జహంగీర్ బాషా అన్నారు. భీమవరం కలెక్టర్ కార్యాలయం డీఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డికి ముస్లిం వక్ఫ్ ఆస్తులను కాపాడాలంటూ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు జహంగీర్ బాషా, సభ్యులు వినతిపత్రం అందజేశారు. ముస్లిం ఆస్తులు కాపాడాలంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం వారు మాట్లాడుతూ వక్ఫ్ భూములను అన్యాక్రాంతం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ముస్లిం సమాజ ప్రయోజనాల కోసం దాతలు అల్లా పేరుతో ఇచ్చిన వక్ఫ్ ఆస్తుల భూములను కొల్లగొట్టేందుకే కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రను అడ్డుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎస్కే నౌషద్ మొహిద్దీన్, ఎస్కే వలీబాషా, మెహర్ అన్సారీ, ఫహీమా, బాజీ, జిలాని, ఎండీ సిద్దిక్, రషీద్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. నరసాపురం: బీజీబీఎస్ మహిళా కళాశాల యాజమాన్యం చేస్తున్న అకృత్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చూడాలని కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులు టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తిని కోరారు. సోమవారం ఎమ్మెల్సీని కలిసి వినతిపత్రం ఇచ్చారు. కళాశాల సెక్రటరీ నూలి శ్రీనివాస్, యాజమాన్య పెద్దలు కళాశాల నుంచి నిబంధనలకు విరుద్ధగా తొలగించి, కళాశాల ఆస్తులు ఇష్టానుసారం అమ్ముకుంటున్నారన్నారు. గత 8 నెలలుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను వేధిస్తున్నారని పేర్కొన్నారు. కొందరు మహిళా అధ్యాపకులను శ్రీనివాస్ లైంగికంగా వేధిస్తున్నారని, కేసు పెట్టినా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. భీమవరం: ఫిర్యాదిదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించి, పూర్తిస్థాయి విచారణ జరిపి చట్టపరిధిలో శాశ్వత పరిష్కారం అందిస్తామని అడిషనల్ ఎస్పీ వి.భీమారావు అన్నారు. భీమవరం వన్టౌన్ పోలీస్స్టేసన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అడిషనల్ ఎస్పీ పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదులు పూర్తిస్థాయిలో విచారించి శాశ్వత పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. సోమవారం నిర్వహించిన మొత్తం 18 అర్జీలు స్వీకరించారు. ఏలూరు (టూటౌన్): ఈ నెల 12న కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నగరంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్మిక, వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఈనెల 12న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని కార్మికులు వందలాది మందితో మున్సిపల్ ఆఫీసు నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికులకు ఉరి తాళ్ల లాంటివని, వీటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో గ్రామీణ పేదలు, అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
వెట్టిచాకిరీ నిర్మూలనపై అవగాహన కల్పించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): వెట్టిచాకిరీ నిర్మూలన చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలనకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వర్ణోత్సవాల్లో భాగంగా సోమవారం గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెట్టిచాకిరీ నిర్మూలనపై అవగాహన కల్పించి సమాజంలో చైతన్యం పెంచి మానవ హక్కుల పరిరక్షణకు దోహదపడాలన్నారు. వెట్టిచాకిరీ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని వాటిని ప్రోత్సహించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. -
కొవ్వు లేదని తేల్చి చెప్పినా దుష్ప్రచారమా?
యువతిపై కత్తితో దాడి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తి పెళ్లిచేసుకోవాలని వేధిస్తూ యువతిపై కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం నూజివీడు పట్టణంలో జరిగింది. 8లో uపెనుగొండ: తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సిట్ తేల్చి చెప్పినా చంద్రబాబు ఇంకా దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు విమర్శించారు. సోమవారం తూర్పుపాలెంలో విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల ప్రసాదాలకు లింకులు పెడుతున్నారని దుయ్యబట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బ కొట్టి, వాటిని పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పైకి మరల్చడానికి విఫలయత్నం చేస్తున్నారన్నారు. లడ్డూలో పంది కొవ్వు, ఇతర జంతువుల కొవ్వూ అంటూ చేసిన దుష్ప్రచారం వారి మెడకే చుట్టుకొందన్నారు. ప్రసాదాలు సంప్రదాయ పద్ధతిలో ఆయా ఆలయాల్లో సంబంధీకులు చేస్తారని, చైర్మన్లకు, సీఎంలకు సంబందం ఉండదన్నారు. చంద్రబాబు జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం చేయడానికే ప్రాధాన్యత నిస్తున్నారన్నారు. ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత, లోకేష్ తోడల్లుడు గీతం యూనివర్శిటీకి భూపందేరం, మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణ అంశాలనుంచి ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు ఆడుతున్నారన్నారు. చంద్రబాబు తీరు మార్చుకుని హిందువుల మనోభావాలకు గౌరవం ఇవ్వాలని హితవు పలికారు. సమావేశంలో ఎంపీపీలు పూతినీడి వెంకటేశ్వరరావు(పెద్ద), కర్రి వెంకట నారాయణ రెడ్డి (వాసు), మండల కన్వీనర్లు జక్కంశెట్టి శ్రీరాములు, పిల్లి నాగన్నలు, మండల కమిటి నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
గూడెంలో జనసేనకు షాక్
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం మండలంలో జనసేన పార్టీకి షాక్ తగిలింది. మారంపల్లిలో జనసేన, టీడీపికి చెందిన 25 మంది సోమవారం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కన్వీనర్ వడ్డి రఘురాం సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. మారంపల్లి జనసేన పార్టీ అధ్యక్షుడు మంగిన బాలాజీ( బాలు) తన అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిని కండువాలు వేసి ఆహ్వానించారు. వైఎస్సార్సీపీ ఆశయాలు నచ్చి పార్టీలో చేరినట్టు బాలు చెప్పారు. రఘురాం మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు సముచిత స్ధానం ఉంటుందన్నారు. మిద్దే శివ, మేకా సాయి, కారింకి దుర్గాప్రసాద్, కనపర్తి సురేష్, కనపర్తి వెంకన్న, ఆదిరెడ్డి దుర్గారావు, పసలపూడి నాగేశ్వరరావు, సుంకర చంద్రశేఖర్, కొండపల్లి కనకం, ఇందుకూరి శ్రీనివాసరాజు, సారిక సత్యనారాయణ, ఉత్తరవల్లి నాగు, నందమూరు మాజీ సర్పంచ్ కోనేటి దానయ్య తదితరులు పాల్గొన్నారు. -
బలుసులమ్మ తల్లికి జాతర కళ
● పుష్కరం తరువాత జాతర మహోత్సవం ● మార్చి 12 నుంచి 27 వరకు జాతర ఉత్సవాలు ● మార్చి 22న ఆడపడుచుల సందడి, నైవేద్యాలు ● తాడేపల్లిగూడెంలో జాతరకు మొదలైన ఏర్పాట్లు తాడేపల్లిగూడెం: కోరిక కోర్కేలు తీర్చే తల్లి.. కల్పవల్లి.. గూడేం పట్టణ ఇలవేల్పు బలుసులమ్మ తల్లికి జాతర కళ వచ్చింది. పుష్కరం తరువాత జాతర నిర్వహిస్తుండడంతో అంగరంగ వైభవంగా అమ్మవారికి జాతర మహోత్సవం జరిపించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పుట్టిల్లు పాశం వారి ఇంటి వద్ద నుంచి అత్తిల్లు కర్రి వారి ఇంటికి చేరే ప్రక్రియల మధ్య జాతరకు శ్రీకారం చుడతారు. అమ్మవార్ల ప్రతిరూపాలుగా భావించే గణాచారులకు గుగ్గిలపు ధూపాలతో జాతర వేడుక అంబరాన్ని తాకేలా సాగనుంది. శతాబ్ధాలుగా బలుసులమ్మ తల్లి పట్టణంలో శతాబ్ధాల క్రితం వెలిసినట్టు చెబుతారు. మునిసిపల్ కార్యాలయానికి సమీపంలో అనంతమ్మ చెర్వు వద్ద చిన్న గుడిగా ఉన్న ప్రాంతంలో అమ్మవారు కొలువయ్యారు. పాతూరుకు చెందిన కర్రి నర్సయ్య జమీందారు సారథ్యంలో ఆలయ నిర్వహణ సాగేదని ప్రతీతి. ఆ తర్వాత విశ్వాసం కలిగిన రజక కుటుంబాలు, ఆలయ అభివృద్దికి రావూరి పాండురంగారావు లాంటి దాతల ఆర్థిక చేయూతతో అమ్మవారి పూజాధికాలు సాగాయి. పట్టణంలో వివాహానికి ముందు పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె బలుసులమ్మ తల్లికి చలిమారు పోయాలి. చలిమిడి, వడపప్పు ప్రసాదంగా ఇవ్వాలి. పానకం పోయాలి. ఇలా చేస్తే వధూవరులు జీవితాంతం చల్లగా ఉంటారని విశ్వాసం. పాలకుల చొరవతో మరింత శోభ దేవదాయ ధర్మాదాయశాఖా మంత్రిగా పనిచేసిన దివంగత పైడికొండల మాణిక్యాలరావు, మాజీ డిప్యూటీ సీఎం, దేవదాయశాఖా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, 12 ఏళ్ల క్రితం అప్పటి మునిసిపల్ చైర్మన్, ప్రస్తుత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసుల పర్యవేక్షణలో అమ్మవారి ఆలయం దినదిన ప్రవర్థమానం చెందుతోంది. పైడికొండల ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణానికి రూ.కోటి నిధులు, అమ్మవారి కల్యాణ మండపం నిర్మాణానికి అదనంగా నిధులు తీసుకొచ్చారు. ఈ నిధులతో ఆలయ రూపురేఖలు పూర్తిగా మారాయి. భీమవరం మావుళ్లమ్మ దేవతామూర్తికి రూపమిచ్చిన శిల్పి ఆధ్వర్యంలో బలుసులమ్మ రూపం మావుళ్లమ్మ, పెద్దింట్లమ్మ, రూపాలకు ప్రతిరూపం మాదిరిగా బలుసులమ్మ దేవతామూర్తి సాక్షాత్కరించింది. కొట్టు సారథ్యంలో అమ్మవారికి వెండి మకరతోరణం, వెండి ఊయల వంటి ఆభరణాలు అమరాయి. కల్యాణ మండపం పనిని పూర్తి చేశారు. ఆలయ ఆవరణలో మౌలిక వసతులు కల్పించారు. బొలిశెట్టి చైర్మన్గా ఉన్న సమయంలో తొలిసారి 2014లో జాతరకు శ్రీకారం చుట్టారు. సంయుక్త సహకారంతో అంగరంగ వైభవంగా ఈ జాతర అప్పట్లో జరిగింది. అయోధ్యలో రాముని ప్రతిమను చెక్కిన మైసూర్కు చెందిన అరుణ్యోగిరాజ్ బలుసులమ్మ ఆలయంలో ప్రాణప్రతిష్ట చేసి, యంత్రస్ధాపన చేసిన దేవతామూర్తికి రూపం ఇచ్చారు. ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో.. బలుసులమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్గా శ్రీరంగం అంజి ఆధ్వర్యంలో 2014 జూన్ 18 నుంచి 24వ తేదీ వరకు తొలి జాతర జరిగింది. ఉత్సవ కమిటీ చైర్మన్గా కొట్టు అంజిబాబు సారథ్యంలో అమ్మవారి ఆలయానికి రజత వైభవం వచ్చింది. వసతులు ఒనగూరాయి. 12 ఏళ్ల తర్వాత శ్రీరంగం అంజి ఆధ్వర్యంలో మలి జాతర మార్చి 12 నుంచి జరుగనుంది. మార్చి 12 నుంచి జాతర మార్చి 12 నుంచి 27వ తేదీ వరకు జాతర మహోత్సవం నిర్వహించనున్నారు. మార్చి 22న ఆడపడుచులను గౌరవించడం, బంధువులను పిలుచుకొని నైవేద్యాలు పెట్టడం లాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 27న మహాకుంభ నివేదన జరుగనుంది. ఇప్పటికే జాతర ఏర్పాట్లు మొదలయ్యాయి. -
పిల్ల కాలువలోకి దూసుకెళ్లిన కారు
తణుకు అర్బన్: కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన దువ్వ గ్రామ పరిధిలోని జాతీయరహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వద్దిపర్రుకు చెందిన కుటుంబ సభ్యు లు బొమ్మిడిలో ఫంక్షన్ చూసుకుని కారులో తిరుగు ప్రయాణమయ్యారు. దువ్వ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వెళ్తున్న మరో కారును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి కారు పిల్లకాలువలోకి జారిపోయింది. కారులో జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విప్పర్తి అశోక్కుమార్తో పాటు కుటుంబసభ్యులు వీరవల్లి సురేంద్ర, నరేంద్ర, పల్లెకొండ ప్రవీణ్, వీరవల్లి చంద్రమౌళి, 8 సంవత్సరాల బాలిక విప్పర్తి అస్మిత ఉన్నారు. పిల్ల కాలువ , నీరు తక్కువగా ఉండడంతో వీరంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు. వీరిని 108 వాహనంలో తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా వైద్యసేవలు పొందుతున్నారు. ఈ ఘటనపై ఏ ఫిర్యాదు రాలేదని రూరల్ పోలీసులు తెలిపారు. -
పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి
తణుకు అర్బన్: విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు సూచించారు. తణుకులోని తిరుమల విద్యా సంస్థల ప్రాంగణంలో 5 నుంచి 10వ తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ జేఈఈ పరీక్షల్లో తమ విద్యా సంస్థలో ప్రతి ఐదుగురిలో ఒకరికి సీటు లభిస్తుందని చెప్పారు. మెడికల్లో తమ సంస్థలో ప్రతి ముగ్గురిలో ఒకరికి సీటు వస్తుందని వివరించారు. సంస్థ వైస్ చైర్పర్సన్ రష్మి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు రోల్మోడల్గా ఉండాలని కోరారు. పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు ఎస్.మురళీకృష్ణారెడ్డి, సంతోషి, విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సతీష్బాబు, తణుకు కాలేజ్ ప్రిన్సపాల్ కె.దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
లడ్డూపై దుష్ప్రచారాన్ని దేవుడు క్షమించడు
భీమవరం: తిరుపతి లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చేసిన తప్పులకు క్షమాపణ చెప్పి లెంపలేసుకుని పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే వేంకటేశ్వరస్వామి చూస్తూ ఊరుకోడని మాజీ మంత్రి కారుమూరి వెంకట నా గేశ్వరరావు హెచ్చరించారు. ఆదివారం భీమవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్ను టార్గెట్ చేస్తూ తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకోవాలనే దుర్బుద్ధితోనే ఏడాదిన్నరగా అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు, పవన్కల్యాణ్ ఆరోపణలపై సాక్షాత్తూ సుప్రీంకోర్టు ఆదేశాలతో నిర్వహించిన దర్యాప్తు సంస్థలు లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని స్పష్టం చేసిన విషయాన్ని ప్రజల ముందుకు తీసుకువెళుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేయడం హేయమైన చర్యగా కారుమూరి అభివర్ణించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. సనాతన ధర్మమంటూ ప్రవచనాలు చేసే పవన్కల్యాణ్ గతంలో తాను కమ్యూనిస్టునంటూ, తనకు భక్తి లేదని బహిరంగ సభల్లో చెప్పిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. లడ్డూలో కల్తీపై సాక్షాత్తూ టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. లడ్డూ ప్రసాదం కోసం మాట్లాడే కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మకు తణుకులో యథేచ్ఛగా సాగుతున్న గోహత్య, గోవు మాంసం విక్రయాలు కనిపించడం లేదా అని సూటిగా ప్రశ్నించారు. తణుకు నుంచి తరలిస్తున్న గోవు మాంసాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలే పట్టుకున్నా ఎటువంటి చర్యలూ లేకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన నిలదీశారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా నెయ్యిని సరఫరా చేసిన డెయిరీలే జగన్ ప్రభుత్వంలోనూ సరఫరా చేశాయి తప్ప కొత్త సంస్థలు లేవనే విషయాన్ని ప్రజలు గ్రహించారన్నారు. ఇప్పటికై నా లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త వెంకటరాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పేరిచర్ల విజయనర్సింహరాజు, ఏఎస్ రాజు, జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, భీమవరం పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, జల్లా కొండయ్య, ఇంటి సత్యనారాయణ, పాలవెల్లి మంగ, కోడే యుగంధర్, గంటా రాహుల్, బడుగు అశోక్బాబు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కారుమూరి -
జిల్లా యాదవ సంఘ ప్రమాణ స్వీకారం
భీమవరం: కుల సంఘాలు రాజకీయాలకు అ తీతంగా సంఘ సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని శాసనమండలి చైర్మన్ కొ య్యే మోషేన్రాజు అన్నారు. ఆదివారం జిల్లా యాదవ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా భీమవరంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. మాజీ మంత్రి, అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ సంఘాన్ని మరింత పటిష్టం చేయడానికి గ్రామస్థాయిలో సమస్యలను తెలుసుకుని సంఘ సభ్యుల సమన్వయంతో పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సంఘం నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా కందుల భానుప్రసాద్ యాదవ్, కర్రి గంగాధర అ ప్పారావు, కోశాధికారిగా తానింకి జోగేశ్వర రావు, కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా పాలకొల్లు రోడ్డులో ని రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా సంఘ భవన కార్యా లయాన్ని మాజీ మంత్రి కారుమూరి ప్రారంభించి అనంతరం భారీ ర్యాలీగా సభా స్థలికి చేరుకున్నారు. రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయు డు, యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు, ఉపాధ్యక్షుడు ఉక్కుసూరి గోపాలకృష్ణ, జిల్లా మాజీ అధ్యక్షుడు గొలగాని సత్యనారాయణ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్: పెదతాడేపల్లి వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం పీజీ కోర్సుల్లో ప్రవేశానికి గేట్ పరీక్షలు నిర్వహించారు. ఉదయం 150 మందికి 131 మంది, సాయంత్రం 150 మందికి 124 మంది హాజరైనట్టు కేంద్రం ప్రిసైడింగ్ అధికారి రాంబాబు తెలిపారు. తుది పరీక్షలు ఈనెల 15, 16వ తేదీల్లో జరుగనున్నాయన్నారు. కో–ఆర్డినేటర్ నటరాజ్, సిస్టమ్స్ అడ్మిన్ కొల్లా సురేష్, టీసీఎస్ ప్రతినిధులు పర్యవేక్షించారు. తణుకు అర్బన్: మహాశివరాత్రి పర్యదినం సందర్భంగా తణుకు డిపో నుంచి శ్రీశైలంకు ఈనెల 12, 13, 14 తేదీల్లో సూపర్లగ్జరీ, పుష్బ్యాక్ 2 ప్లస్ 2 ఆడియో వీడియో కోచ్ బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ సుధారాణి తెలిపారు. టికెట్ ధర పెద్దలకు రూ.820, పిల్లలకు రూ.450 అని, శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ, చినకాకాని, మంగళగిరి క్షేత్రాలు దర్శించేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీ రూ పొందించామన్నారు. ఈనెల 14న సాయంత్రం 7 గంటలకు బస్సు బయలుదేరి 16న తణుకు చేరుతుందన్నారు. పుష్బ్యాక్ బస్సు టికెట్ ధర రూ.2,200గా నిర్దేశించామన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 9440419144 నంబర్లో సంప్రదించాలని ఆమె కోరారు. భీమవరం : రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు తీ వ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని రాష్ట్ర అ మరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్ర రాజు అన్నారు. భీమవరంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ ఏర్పాటుచేశారు. జిల్లా చైర్మన్గా ఎం.సన్యాసిరావు, సెక్రటరీ జనరల్గా జి.పెద్దిరాజు, కన్వీనర్గా ఎం.లక్ష్మీనారా యణ, కో–చైర్మన్గా ఎం.మోషే, ట్రెజరర్గా కె.సుబ్రహ్మణ్యస్వామి, ప్రచార కార్యదర్శిగా పి.సంధ్యారాణి, క్రీడ, సాంస్కృతిక కార్యదర్శిగా కె.ఠాగూర్, ఉప చైర్మన్లుగా ఈ.నాగా ర్జున, ఎం.నాగరాజు, జి.గోపాలకృష్ణ, బీఎన్వీ రత్నారావు, జి.జక్కయ్య ఎన్నికయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా జిల్లా కార్యవర్గం పనిచేస్తుందని వారు అన్నారు. -
ముగిసిన నాటకోత్సవాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): స్థానిక వైఎంహెచ్ఏ హాలులో జరుగుతున్న గరికపాటి కళాపరిషత్ నాటకోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. రెండు ప్రదర్శనలు సందేశాత్మకంగా ఉన్నాయి. కళాహారతి తిరుమాలి సంస్థ (కాకినాడ) కళాకారులు ప్రియమైన శత్రువు నాటిక ప్రదర్శించా రు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలను యువత ఎలా నిర్లక్ష్యం చేస్తుందో చక్కగా ప్రదర్శించారు. గ్రామీణ నాటక సమాఖ్య (పిఠాపురం) వారి సహృదయ ఆర్ట్స్ (పి.రాయవరం) కళాకారులు పున్నామ నరకం నాటికను ప్రదర్శించారు. సీనియర్ రంగస్థల నటుడు కేపీ రాజు, సీనియర్ రంగస్థల నటి యు.విజయలక్ష్మిలను అక్కినేని స్మారక రంగస్థల పురస్కారాలతో సత్కరించారు. సినీ నటుడు సుబ్బరాయ శర్మ, రచయిత గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, ఎస్ బీఐ రీజనల్ మేనేజర్ పి.కాళిదాసు, కళారత్న ఎస్వీ రామారావు, డాక్యుమెంటరీ నిర్మాత జమలాపురం రాధాకృష్ణ, రచయిత పి.రాజేంద్రకుమార్ తదిరులు హాజరుకాగా గరికపాటి ఆర్ట్స్ థియేటర్ డైరెక్టర్ గరికపాటి కాళిదాసు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
నూనెలు సలసల
తణుకు అర్బన్ : మార్కెట్లో వంట నూనెలు ధర లు మండిపోతున్నాయి. ఒక్కసారిగా పెరిగి సామా న్య, మధ్యతరగతి ప్రజలకు షాకిస్తున్నాయి. ము ఖ్యంగా కిలో వేరుశనగ నూనె రూ.180, సన్ఫ్లవర్ ఆయిల్ రూ.165కు చేరాయి. కొద్దిరోజుల క్రితం వరకూ ధరలు తక్కువగా ఉండగా ఒక్కసారిగా ఎగబాకాయి. వీటితో పాటు పప్పుదినుసుల ధరలు పెరగడంతో ప్రజలకు వంట భారంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం వంట నూనెలు, నిత్యావసర సరుకుల ధరల నియంత్రణలో విఫలమైందని ప్రజలు బహిరంగంగానే విమర్శస్తున్నారు. ఒక్కసారిగా పెరిగి.. గత నెలలో కిలోకు రూ.145లు ఉన్న వేరుశనగ నూనె అమాంతం కిలో ధర రూ.30 పెరిగి రూ.175 పలుకుతోంది. కంపెనీలను బట్టి కిలో రూ.180 వరకు విక్రయిస్తున్నాయి. సన్ఫ్లవర్ ఆయిల్ కిలోకు రూ.20లు పెరిగి రూ.165 నుంచి రూ.170లకు చేరింది. పామాయిల్ రూ.115 నుంచి రూ.130కి పెరిగింది. అలాగే వేరుశనగ గుళ్లు ఫిబ్రవరి మొ దట్లో కిలోకు రూ.50లు పెరగ్గా ప్రస్తుతం రూ.180కు విక్రయిస్తున్నారు. కిలో కందిపప్పు రూ.125, మినప్పప్పు రూ.110లకు, ఎండు మిర్చి రూ.250 నుంచి రూ.350కు విక్రయిస్తున్నారు. ఇది లా ఉండగా వంటనూనెల ప్యాకింగ్లో గోల్మాల్ జరుగుతుందని వినియోగదారులు అంటున్నారు. లీటరు పేరుతో 910 గ్రాముల నుంచి 800 గ్రా ముల వరకు ప్యాకింగ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రోజుకు 70 వేల కిలోలు జిల్లాలో సుమారు రోజుకు 70 టన్నుల (70 వేల కిలోలు) వంట నూనెలు విక్రయిస్తున్నట్టు అంచనా. తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, ఆచంట, నరసాపురం, పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల్లోని రిటై ల్ మార్కెట్లో రోజూ పలు రకాల కంపెనీల వేరుశనగ, సన్ఫ్లవర్, పామాయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటివి అమ్మకాలు జరుగుతున్నాయి. హోల్సేల్, రిటైల్ షాపులతో పాటు మాల్స్లో సైతం ప్రజలు వీటిని కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం ఎలాంటి పండుగలు లేకపోయినా ధరలు పెరగడం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. ధరలు పెరుగుతున్నా ప్రభుత్వం ఎటువంటి నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు నిట్టూరుస్తున్నారు. వంటకు తంటా వంట నూనెల ధరలకు రెక్కలు అదే బాటలో పప్పు దినుసులు సామాన్యులతో పాటు చిరు వ్యాపారులకు భారం జిల్లాలో రోజుకు 70 టన్నుల వంట నూనెల విక్రయాలు మార్కెట్లో వంట నూనెల ధరలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. గత నెలకు ఇప్పటికీ భారీగా ధరలు పెరిగిపోయాయి. దీంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. కిలోకు గరిష్టంగా రూ.30ల వరకూ ధరలు పెరి గాయి. అలాగే నిత్యావసర సరుకుల ధరలూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు సైడ్లో తోపుడుబండ్లు, చిన్నపాటి దుకాణాలు నిర్వహించే చిరు వ్యాపారులు నూనెలు కొనుగోలులో ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారాలు నష్టాలబారిన పడే పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం ధరల పెరుగుదలను నియంత్రించాలి. –జల్లూరి జగదీష్, తణుకు ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి వర్గాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులపై భారం పడింది. చిరువ్యాపారులు తమ వంటకాల్లో ముఖ్యంగా వంట నూనెలు అధికంగా వినియోగిస్తుంటారు. ధరల పెరుగుదలతో ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిపోతుందని వీరు గగ్గోలు పెడుతున్నారు. నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయని ఆహార పదార్థాల ధరలు పెంచితే వినియోగదారులు అయిష్టత చూపుతారని అంటున్నారు. ముఖ్యంగా నిత్యావసర సరుకులు, వంట నూనెలకు సంబంధించి రైతుకు లేని లా భం మార్కెట్లో రిటైలర్స్కు వస్తుందనే ఆరోపణలూ ఉన్నాయి. -
ఆధునిక పద్ధతులు మేలు
ఉండి: వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, టెక్నాలజీని వినియోగిస్తే తక్కువ ఖర్చులు అధిక దిగుబడులు సాధించవచ్చని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. ఆదివారం ఉండి ఏఎంసీలో హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో ఎస్సీ సబ్ప్లాన్కు సంబంధించి రూ.28 లక్షల విలువైన బ్యాటరీ స్ప్రేయర్లను డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణరాజుతో కలిసి కలెక్టర్ ఎస్సీ రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ, పంటల నమోదు, మార్కెంటింగ్ విలువలు జోడించాలన్నారు. సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయశాఖ జేడీ జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయశాఖ చైర్మన్ జుత్తిగ నాగరాజు, ఏడీఏ ప్రతాప్జీవన్, ఏఎంసీ చైర్మన్ కలిదిండి రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
అలలపై ఆశల వల
నరసాపురం: వేటకు అనుకూల వాతావరణం ఉండటంతో నరసాపురం తీరం పొడవునా సముద్రంలో వేట ముమ్మరంగా జరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో సముద్రంలో చేపలు భారీగా లభించే వీలుంటుంది. దీంతో పలు జిల్లాలకు చెందిన మెకనైజ్ట్ బోట్లు తీరంలో వేట సాగిస్తున్నాయి. మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు, విశాఖ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 70 వరకూ బోట్లు నరసాపురం తీరంలో సంచరిస్తున్నాయి. ప్రస్తుత వాతావరణం చేపల వేటకు పూర్తి అనుకూలంగా ఉండటం, పైగా ఎక్కువగా చేపలు దొరికే సీజన్ కూడా కావడంతో మత్స్యకారులు బిజీగా ఉన్నారు. ప్రస్తుత సంవత్సరం (2025–26) వేట కష్టనష్టాలతో సాగుతోంది. వరుస విపత్తులు వేటకు ఆటంకంగా మారాయి. దీనికితోడు వేటబోట్లకు ప్రభు త్వం ఇచ్చే డీజిల్ సబ్సిడీ నిలిపివేయడం మత్స్యకారులను కుంగదీసింది. గతేడాది జూన్ నుంచి నవంబర్ వరకు తుపానులు, అల్పపీడనాల హెచ్చరికలతో వేట సవ్యంగా సాగలేదు. వేటబోటుకు లీటరుకు రూ.9లు చొప్పున నెలకు 300 లీటర్ల డీజిల్ను ప్రభుత్వం సబ్సిడీపై అందించాలి. అయితే ఈ ఏడాది డీజిల్ సబ్సిడీకి ప్రభుత్వం ఎసరు పెట్టడంతో వేట నష్టాల్లో కూరుకుపోయింది. జనవరి నుంచి సీజన్ ప్రతికూల వాతావరణంతో నరసాపురం తీరంలో మత్స్య సంపద అంతగా లభించలేదు. గతేడాది జూన్ 15 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.200 కోట్ల మత్స్య ఎగుమతులు జరిగాయి. వాస్తవంగా రూ.300 కోట్ల వరకూ ఎగుమతులు జరగాల్సి ఉండగా.. రూ.100 కోట్ల మేరకు తగ్గాయి. ఏటా వేట నిషేధం గడువు తర్వాత జూన్ 15 నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటను నిర్వహిస్తారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకూ సీజన్ నడుస్తోంది. జనవరి నుంచి చేపలు పెద్ద సంఖ్యలో పడటం, ఆశించిన మేర ఆదాయం రావడంతో మత్స్యకారుల్లో కొంతమేర ఉల్లాసం కనిపిస్తుంది. ముంచుకొస్తున్న వేట నిషేధం గడువు చేపల పునరుత్పత్తి సీజన్ కావడంతో ఏటా ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సముద్రంలో వేట నిషేధం అమలు చేస్తుంది. మరో రెండు నెలల్లో వేట నిషేధం అమలు కానుంది. వేట నిషేధ గడువు దగ్గపడుతుండటం, ప్రస్తుత అనుకూల వాతావరణం, కలిసొస్తున్న సీజన్ను మత్స్యకారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆటు‘బోట్లు’ సముద్రంలో ముమ్మరంగా వేట వరుస విపత్తులతో మత్స్యకారుల విలవిల ఈ ఏడాది కలిసిరాని ఫిషింగ్ రూ.100 కోట్లకు పైగా ఎగుమతులు తగ్గుదల ముంచుకొస్తున్న వేట నిషేధం గడువు సముద్రంలో ముమ్మరంగా వేట సాగుతోంది. స ముద్రంలోకి వెళ్లిన బోటు వారంలోపే సరుకుతో ఒడ్డుకు చేరుతోంది. మాకు బోటు యజమానులు పడి న సరుకుకు బట్టి డబ్బులు ఇస్తారు. కాబట్టి ఆనందంగా ఉంది. ఇప్పుడే నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి. మళ్లీ రెండు నెలలు గడిస్తే వేట నిషేధం అమలవుతుంది. – మల్లాడి సాయిబాబా, బోటు కార్మికుడువేట సాగించే మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి. చంద్రబాబు ప్రభు త్వం మత్స్యకార భరోసా సొమ్ములను జూలైలో ఇస్తోంది. గత ప్రభుత్వంలో మే నెలలోనే జమచేసేవారు. ప్రస్తుతం డీజిల్ సబ్సిడీ సవ్యంగా ఇవ్వకపోవడంతో పెట్టుబడు లు పెరిగిపోయాయి. డీజిల్ సబ్సిడీ రూ.15లకు పెంచి సకాలంలో అందించాలి. –బర్రి శంకరం, మత్స్యకార నేత -
కొల్లేరులో పక్షుల కనువిందు
● పూర్తయిన లెక్కింపు.. తుది జాబితా తయారు ● సుమారు 50 లక్షల పక్షులు ఉన్నట్లు ప్రాథమిక అంచనా కై కలూరు : కొల్లేరు అభయారణ్యంలో ఏషియన్ బర్డ్ సెన్సస్ 2025–2026 ఫిబ్రవరి 4తో ముగిసింది. రాజమండ్రి సర్కిల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు(పీసీసీఎప్) బీఎన్ఎన్ మూర్తి, జిల్లా ఫారెస్టు డీఎఫ్వో బి.విజయ ఆధ్వర్యంలో 5 జట్లుగా పక్షుల గణన చేశారు. పీసీసీఎఫ్ మూర్తి అంచనా ప్రకారం ఈ ఏడాది కొల్లేరు అభయారణ్యంలో 40 లక్షల నుంచి 50 లక్షల పక్షులు శీతాకాలంలో సంచరించినట్లు సమాచారం. దాదాపు 30,000 కిలోమీటర్ల నుంచి విదేశాల నుంచి పక్షులు వస్తాయి. ఈ ఏడాది 200 జాతుల పక్షులు కొల్లేరులో ఉన్నట్లు భావిస్తున్నారు. సెన్సస్ బృందాల సమాచారం మేరకు నార్తర్న్న్ పిన్టైల్ పక్షులను ఎక్కువగా గుర్తించారు. ప్లేమింగోస్, కామన్టీల్, గార్కానీ, గాడ్వీట్, శాండ్ పైపర్స్, జకానా, ఫిన్ టైల్, రఫ్ వంటి పక్షులను గమనించారు. మరి కొద్ది రోజుల్లో తుది పక్షుల గణన నివేదిక వెలువడనుంది. గణన జరిగిన ప్రాంతాలు ఇవే.. కొల్లేరు అభయారణ్య పరిధిలో మాదాపురం, మొండికోడు, గుడివాకలంక, ప్రత్తికోళ్ళలంక, కొక్కిరాల లంక, బొమ్మిలి లంక, ఆగడాల లంక, చెట్నెంపాడు, మల్లవరం, దోసపాడు, క్రొవ్వలి, కేదవరం, పోతులూరు, కొల్లేటికోట, పైడిచింతపాడు, గోకర్ణపురం, గుమ్మళ్లపాడు, ఆలపాడు, పల్లెవాడ, అడవికొలను, పెదనిండ్రకొలను, డీ.గోపవరం, సిద్ధాపురం, పల్లెవాడ, ఆటపాక, పెదఎడ్లగాడి, శ్రీపర్రులో కొల్లేరు పక్షుల సర్వే జరిగింది. -
మద్దిలో అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం స్వామి వారికి అభిషేక సేవ నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో స్వామి ఉత్సవ విగ్రహానికి అర్చకులు, వేద పండితులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆలయానికి వివిధ సేవల రూపేణా రూ.1,28,350 ఆదాయం సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో 1450 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఈవో తెలిపారు. ఏలూరు టౌన్: ఏలూరు పాతబస్టాండ్ పరిసర ప్రాంతాల్లో శక్తి టీమ్ పెట్రోలింగ్ విధుల్లో ఉండగా... ఒక స్కూటీపై వెళుతున్న ఇద్దరు యువకులు పోలీసులను గమనించి భయంతో పారిపోయేందుకు ప్రయత్నింగా శక్తి టీం వారిని అదుపులోకి తీసుకుని తనికీ చేసింది. గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు యువకులతో పాటు మరో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి గంజాయి, రూ.2.02 లక్షల రెండు స్కూటీలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళా స్టేషన్ డీఎస్పీ యూ.రవిచంద్ర పర్యవేక్షణలో సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో శక్తి టీమ్ సభ్యులు అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచారు. శనివారం శక్తి టీం సభ్యులు పాతబస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 300 గ్రాముల గంజాయి, రెండు స్కూటీలు స్వాధీనం చేసుకున్నారు. భీమవరం: భీమవరం రూరల్ చినఅమిరం గ్రామానికి చెందిన వివాహిత ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందింది. సీఐ జి.కాళీచరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉయ్యాల స్తంభం సమీపంలో ఉంట్ను తుమ్మల భాగ్యలక్ష్మి(30)కి మూడేళ్ల క్రితం సుబ్రహ్మణ్యంతో వివాహమైంది. వీరికి ఇది రెండో వివాహం. భర్త, అత్త వేధింపులు భరించలేక కొన్నినెలలు ఆమె పుట్టింట్లోనే ఉంది. శనివారం మధ్యాహ్నం చినఅమిరం నుంచి ఫోన్ చేసి భాగ్యలక్ష్మి చనిపోయిందని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన వచ్చారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నమో వేంకటేశా..
ద్వారకాతిరుమల: నమో వేంకటేశా.. అంటూ వేలాది మంది భక్తులు శనివారం శ్రీవారిని దర్శించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. దర్శనం క్యూలైన్లు, ఉచిత ప్రసాద వితరణ క్యూలైన్లు, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కల్యాణకట్ట, నిత్యాన్నదాన భవనం తదితర విభాగాలు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఆకివీడు నుంచి భద్రాచలానికి పాదయాత్రగా వెళ్తున్న రామ భక్తులు మద్యలో శ్రీవారి క్షేత్రాన్ని సందర్శించారు. దాంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. వారంతా కాషాయ జెండాలను పట్టుకుని ఆలయంలోకి వెళ్లి స్వామి, అమ్మవార్లను దర్శించారు. -
పోక్సో కేసులో నిందితుల అరెస్టు
నరసాపురం రూరల్: సోషల్ మీడియాలో పరిచయమైన బాలికలను నమ్మించి, వారిపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నరసాపురంలో సీఐ దుర్గాప్రసాద్ వివరాలు వెల్లడించారు. యలమంచిలి మండలానికి చెందిన ఇద్దరు బాలికలపై గత నెల 22న మొగల్తూరులోని లాడ్జిలో అఘాయిత్యానికి పాల్పడినట్లు బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరైన పెదమైనవానిలంక గ్రామానికి చెందిన తిరుమాని దుర్గాప్రసాద్కు బాధితుల్లో ఒక బాలికతో ఏడాదికాలంగా ఇనన్స్ట్రాగామ్లో పరిచయం ఉంది. సదరు యువకుడు బాలికను నరసాపురం రమ్మని కోరాడు. దీంతో ఆ బాలిక మరో స్నేహితురాలిని కూడా తీసుకుని నరసాపురం వెళ్లగా.. నిందితుడు స్నేహితుడు తిరుమాని రాజేంద్రతో కలిసి వారిని మొగల్తూరులోని జీఎన్ఆర్ కాంప్లెక్స్కు తీసుకెళ్లారు. అక్కడ అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో మొగల్తూరు ఎస్సైలు జి.వాసు, వై.నాగలక్ష్మి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఉండి: ప్రభుత్వోద్యోగులను ప్రభుత్వమే పట్టించుకోకపోతే ఎవరితో చెప్పుకోవాలని వీఆర్ఏలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఉండి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సుబ్బారావు, గౌరవాధ్యక్షుడు ఎం.ఆంజనేయులు, డిప్యూటీ తహసీల్దారు సూర్యనారాయణరాజుకు ఈ నెల 12న సీఐటియు ఆధ్వర్యంలో నిర్వహించే దేశవ్యాప్త సమ్మైపె వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చిరుద్యోగులైన వీఆర్ఏలు కనీస వేతనం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వీఆర్ఏల సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చినా కనీస స్పందన లేకపోవడం బాధాకరమని అన్నారు. భీమవరం: ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని సంస్థ సీఎండి పృథ్వీతేజ్ ఇమ్మడి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని ఈ నెల 9 నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. 8688400499 నెంబరులో విద్యుత్ సమస్యలను తెలియజేయవచ్చని వెల్లడించారు. విశాఖపట్నం ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. ఆగిరిపల్లి: ఆగిరిపల్లి కి చెందిన బెజవాడ రామారావు (65) ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడు. ఎస్సై శుభ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం ఆగిరిపల్లికి చెందిన రామారావు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. శనివారం సాయంత్రం మల్లిబోయినపల్లి వద్ద పొలంలో ఉన్న గేదెల కోసం ఆగిరిపల్లి నుంచి ట్రాక్టర్ ఎక్కగా బస్టాండ్ వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. కింద పడిపోయిన రామారావుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రామారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని బొలెరో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. -
గేటు పడితే ట్రాఫిక్ కష్టాలు
భీమడోలు: జాతీయ రహదారి, రాష్ట్రీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న భీమడోలు రైల్వే గేటు మీదుగా వాహనాల రాకపోకలు వాహనదారులకు చుక్కలు చూపుతోంది. రైల్వే గేటును ఒక్కసారి మూస్తే భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో ఈ గేటు మీదుగా రాకపోకలు సాగించాలంటే భయపడుతున్నారు. ఏలూరు నుంచి భీమడోలు వచ్చే వారు, తాడేపల్లిగూడెం నుంచి భీమడోలు వైపుగా వచ్చే వాహనాలు అడ్డుగా రావడం సమస్యగా మారింది. భీమడోలు నుంచి జాతీయ రహదారికి వచ్చే వాహనాలతో గేటు వద్ద రద్దీగా మారుతుంది. ఇష్టానుసారంగా రాకపోకలు సాగిస్తుండడంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గేటు తెరిస్తే వాహనాలు వేగంగా దూసుకెళ్తుండడంతో ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఫ్లైఓవర్తో ట్రాఫిక్కు చెక్ భీమడోలు రైల్వే గేట్లో రోజుకు పదుల సంఖ్యలో గేటు వేస్తున్నారు. ఈ గేటు మీదుగానే ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తాయి. మెట్ట ప్రాంతాలకు, రాష్ట్రీయ రహదారి వైపు వెళ్లాలన్నా ప్రధాన మార్గం ఇదే. ఒక్కసారి వేసిన గేటు 2 నుంచి 3 రైళ్లు వెళ్లే వరకూ తీసే పరిస్థితి లేదు. దీంతో భారీ వాహనాలు, ద్విచక్రవాహనాలతో రద్దీ ఏర్పడుతుంది. గేటు వద్ద ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ వంతెన వేసి గేటు మూసి వేయాలని నిర్ణయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్డి నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. -
ఎస్పీ రావు సేవలు చిరస్మరణీయం
దెందులూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను పుణికి పుచ్చుకున్న మహోన్నత వ్యక్తి దివంగత ఇన్కం ట్యాక్స్ కమిషనర్ ఎస్పీ రావు అని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు అన్నారు. శనివారం కొవ్వలి అంబేడ్కర్ పార్కులో ఎస్పీ రావు 25 వర్ధంతి సభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మోషేన్రాజు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు హాజరై ఎస్పీ రావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోషేన్రాజు మాట్లాడుతూ ఎస్పీ రావు వంటి వ్యక్తులు అరుదుగా ఉంటారన్నారు. అందరూ చదవాలి.. అందరూ ఎదగాలి.. అందరూ అభివృద్ధి చెందాలనే ఆయన ఆశయం మహోన్నతం అన్నారు. కొవ్వలి గ్రామ దళితుల జీవనోపాధిగా ఉన్న 150 ఎకరాల సమస్య పరిష్కారానికి సమష్టిగా కృషి చేద్దామని అన్నారు. ఎమ్మెల్సీ రవీంద్రబాబు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి, దళితుల జీవనోపాధికి ఎస్పీ రావు సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. దశాబ్దాల కిందట కొవ్వలి గ్రామ దళితుల జీవనోపాధి కోసం 150 ఎకరాల భూమిని కల్పించిన వ్యక్తి ఆయన అని కొనియాడారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు తనయుడు సాయి కార్తిక్ మాట్లాడారు. మండలి చైర్మన్ మోషేన్రాజు -
సీపీఎస్ రద్దు కోరుతూ వినతి
భీమవరం: ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ అయిన సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యాళ్ల మోహనరావు, గుమ్మల్ల జకరయ్య కోరారు. శనివారం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, ఎమ్మెల్సీ గోపిమూర్తిని కలిసి వినతిపత్రాలు అందజేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 14 నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాలు అందజేశామన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, ఆర్థిక ప్రయోజనాలు, వేతన సవరణ కమిషన్ ఏర్పాటు, మధ్యంతర భృతి తదితర అంశాలపై రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు చేయాలని కోరారు. కూటమి పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో హామీ మేరకు సీపీఎస్/జీపీఎస్ విధానాలపై పునః సమీక్ష చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని, సభలో ప్రస్తావిస్తామని మోషేన్రాజు, గోపి మూర్తి హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు. సంఘ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎస్. మానస, భీమవరం తాలూకా అధ్యక్షుడు రవిచంద్ర ప్రసాద్, తాలూకా కార్యదర్శి కె.అప్పారావు, అసోసియేట్ అధ్యక్షురాలు ప్రియదర్శిని, జిల్లా జాయింట్ సెక్రటరీ అస్గర్ అలీ, ఉపాధ్యక్షులు స్వర్ణలత, సునీత, భవానీ, జాయింట్ సెక్రటరీలు ఉన్నారు. -
అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు
కొల్లేరులో కనువిందు కొల్లేరు అభయారణ్యంలో పక్షుల గణన పూర్తయ్యింది. శీతాకాలంలో సుమారు 40 వేల నుంచి 50 వేల పక్షులు సంచరించినట్టు సమాచారం. 8లో uపెనుగొండ: ఆచంట మండలం పెదమల్లం పరిధిలోని అనగారలంకలో ఇసుక అక్రమ త వ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద మల్లం గ్రామస్తులు డిమాండ్ చేశారు. శనివా రం ఆచంట తహసీల్దార్ కార్యాలయంలో, ఆచంట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఆర్జెడ్ పరిధిలో ఉన్నా అక్రమ తవ్వకాలు చేస్తున్నారని, నాలుగు రోజులుగా ర్యాంపు పనులు చేస్తూ, తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణం తనిఖీలు నిర్వహించి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని కోరారు. అలాగే అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంతో పాటు లారీలు, ట్రాక్టర్లు, ఇతర యంత్రాలను సీజ్ చేయాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు జరగకుండా కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని కోరారు. నదీ పరీవాహక ప్రా ంతాన్ని, పర్యావరణాన్ని, ప్రజల జీవనాధా రాన్ని కాపాడటంలో రెవెన్యూ అధికారులు బా ధ్యత వహించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామస్తులు బోడపాటి సూరిబాబు, రాజమహేంద్రవరపు శివ, కొండేటి భవానీప్రసాద్, మాతా వినయ్, మాతా గణేష్, నక్కా శ్రీను, బల్ల రాంబాబు, మట్టా సన్నీ, మట్టాధనుష్ వినతిపత్రం అందించగా కొడమంచిలి సర్పంచ్ సుంకర సీతారామ్, కోట వెంకటేశ్వరరావు, పెచ్చెట్టి సత్యనారాయణ, కొంబోత్తుల దుర్గాప్రసాద్ తదితరులు మద్దతు తెలిపారు. -
తీరం.. దోచేద్దాం
గోదావరి తీరమంతా మనదే.. ఇసుక, లేకుంటే మట్టి ఏదోకటి దోచేద్దాం.. ఇవీ కొంతమంది టీడీపీ నాయకుల ఆగడాలు. పది రోజులుగా మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలకు చేయని ప్రయత్నాలు లేవు. పెనుగొండ: పెనుగొండ మండలం సిద్ధాంతం నుంచి మొదలై బియ్యపుతిప్ప వరకూ గోదావరి తీరం ఉంది. దీనిలో సిద్ధాంతం నుంచి దొడ్డిపట్ల వరకూ ఓపెన్ ర్యాంపులు, ఆపైన పడవ ర్యాంపులు ఉన్నాయి. అయితే ఇవన్నీ సీఆర్జెడ్ పరిధిలోకి రావడంతో నాణ్యత లేని ఇసుక తవ్వకాలకు అనుమతులు నిరాకరించారు. దీంతో రెండేళ్లుగా ఇసుక తవ్వకాలకు బ్రేక్ పడింది. అయినా గతేడాది టీడీపీ నాయకులు నిబంధనలను తుంగలో తొక్కి ఇసుక తవ్వకాలు చేపట్టారు. అయినా అధికారులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఇదే అలుసుగా ఈ ఏడాది ఆచంట నియోజకవర్గం కోడేరులో తొలుత శ్రీకారం చుట్టారు. కోడేరులో ఇసుక అక్రమ తవ్వకాలకు బాటలు వేస్తుండగా వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుపడటంతో బాట పనులు నిలిపి వేశారు. దీంతో సిద్ధాంతం మ ధ్యలంక మట్టిపై టీడీపీ నాయకుల దృష్టి పడింది. మధ్యలంక నుంచి నేరుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గోపాలపురం ర్యాంపునకు మార్గం ఉండటంతో మట్టి తవ్వకాలు రెండు రోజుల పాటు యథేచ్ఛగా కొనసాగించారు. ఎస్సీ భూములు పాడైపోతున్నాయంటూ ఎస్సీలు గగ్గోలు పెట్టి వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి నిరసన గళమెత్తారు. దీంతో అధికారులు మట్టి తవ్వకాలకు బ్రేక్ వేశారు. ఇక్కడ కాకపోతే మరోచోట..! అక్రమ ఇసుక తవ్వకాలకు కొందరు టీడీపీ నాయకులు పట్టువదలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆచంట నియోజకవర్గంలో దొంగరావిపాలెం నుంచి మొదలుపెట్టి భీమలాపురం వరకూ గోదావరి తీ రం ఉంది. వీటిలో సిద్ధాంతం, నడిపూడి, కోడేరు, ముత్యాలవారిపాలెం, భీమలాపురంలో ర్యాంపులు ఉన్నాయి. అలాగే గుట్టుచప్పుడు కాకుండా ఇసుక, మట్టి తరలించేందుకు అనువైన మార్గాలు సిద్ధాంతం మధ్యలంక, పెదమల్లం, అణగారలంక, రావిలంక, పుచ్చల్లంకలు ఉన్నాయి. సిద్ధాంతం మధ్యలంక నుంచి గోపాలపురం, అణగారలంక నుంచి యర్రంశెట్టివారిపాలెం, రావిలంక, పుచ్చల్లంకల నుంచి గన్నవరం వెళ్లే మార్గాలు ఉండటంతో టీడీపీ నాయకులు తమకు కలిసి వచ్చిన దారిని మార్గంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా అణగారలంకలో ఇసుక తవ్వకా లకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ శుక్రవారం రాత్రి నుంచి యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇదే ఊపులో రావిలంక, పుచ్చల్లంకల్లోనూ తవ్వకాలు జరిపి కోనసీమ జిల్లా మీదుగా అక్రమార్జనకు శ్రీకారం చుట్టారు. ఇష్టారాజ్యంగా నదీగర్భంలో నుంచి ఇసుక బాటలు వేస్తున్నా, తవ్వకాలు జరుపుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకుండా కా లయాపన చేస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో తీరం మనదే.. మద్దతూ మనకే, తవ్వుకో దోచుకో అన్న చందాన కొందరు టీడీపీ నాయకుల తీరు ఉందంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తవ్వేయ్.. తరలించేయ్ గోదావరిలో ఇసుక, మట్టిపై టీడీపీ నేతల కన్ను కోడేరు, సిద్ధాంతంలో విఫల యత్నాలు అణగారలంక, రావిలంకలో తవ్వకాలకు సన్నాహాలు కోనసీమ జిల్లా వైపు మార్గానికి టీడీపీ నాయకుల యత్నాలు -
ఉపాధ్యాయుల పోస్టు కార్డుల ఉద్యమం
ఆకివీడు: యూటీఎఫ్ ఆధ్వర్యంలో పోస్టు కార్డుల ఉద్యమం యలమంచిలి: కార్డులు పోస్ట్ చేస్తున్న పోడూరు మండల ఉపాధ్యాయులు యలమంచిలి/ఆకివీడు: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉపాధ్యాయులు శనివారం ముఖ్యమంత్రికి సామూహికంగా పోస్టు కార్డులు రాసి శనివారం పోస్టు చేశారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎంవీ రాజశేఖర్ మాట్లాడుతూ ఇప్పటికే 12వ పీఆర్సీ ఏర్పాటుకు 30 నెలల కాలయాపన జరిగిందని, పీఎఫ్ లోన్స్, డీఏలు, ఫైనల్ చెల్లింపులు సైతం సకాలంలో రావడం లేదని విమర్శించారు. పెండింగ్ ఆర్థిక బకాయిలు వెంటనే విడుదల చేయాలని, 12వ వేతన కమిషన్ నియమించాలని, ఈ లోపు మధ్యంతర భృతి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. యలమంచిలి మండల శాఖ అధ్యక్షుడు కె.నాగరాజు, ప్రధాన కార్యదర్శి కె.పెద్దిరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉద్యమం తీవ్రతరం : ఉపాధ్యాయ సమస్యలపై పోస్టు కార్డు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నట్లు ఆకివీడు మండల యూటీఎఫ్ అధ్యక్షుడు ఆర్వీఎస్ నా రాయణ (విక్రమ్) తెలిపారు. ఆకివీడులో చేపట్టిన పోస్టు కార్డుల ఉద్యమంలో పలువురు హెచ్ఎంలు పాల్గొన్నారు. ప్రభుత్వం డీఏలు, మెరుగైన పీఆర్సీ వంటివి అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఈనెల 17న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. -
కోకో ధర తగ్గింపు అన్యాయం
పెదవేగి: కొనుగోలు కంపెనీలు కోకో గింజల ధర లు తగ్గించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధరల పాలసీ ప్రకటించాలని, కంపెనీల మోసాలు అరికట్టాలని ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం డిమాండ్ చేసింది. శనివారం విజయరాయిలోని గాంధీనగర్ సీతారామ కల్యాణ మండలపంలో రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ధర నిర్ణయంపై ఈనెల 9న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమావేశంలో తీసుకోవాల్సిన చర్య లు గురించి చర్చించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం కోకో రైతులతో సమావేశం నిర్వహిస్తున్న తరుణంలో కంపెనీలు ధరలు ఎలా తగ్గిస్తాయని ప్రశ్నించారు. కిలో గింజలకు ధరను రూ.400 నుంచి రూ.380కు తగ్గించారని, దీనిపై ప్రశ్నిస్తే అంతర్జాతీయ మార్కెట్ ధర తగ్గిందని చెప్పడం అన్యాయమన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో జనవరిలో రూ.550 ధర ఉంటే రూ.350లకే కొనుగోలు చేశారన్నారు. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా రైతులకు ధరలు చెల్లించడం లేదన్నారు. ధరలు తగ్గించడం సరికాదని దీనిపై ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు భ విష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పర్వతనేని సుబ్రహ్మణ్యేశ్వరరావు, పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదిబండి వీరారెడ్డి, కోనేరు సతీష్బాబు, పాలడుగుల నరసింహారావు, నాయకులు బొప్పన పూర్ణచంద్రరావు, కూరపాటి ధర్మారావు, బొప్పన శివరాం పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): మార్చి 16 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుందని డీఈఓ ఎం. వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 20న నిర్వహించాల్సిన ఇంగ్లిష్ పరీక్షను మార్చి 21కు మార్చినట్టు పేర్కొన్నారు. 20న ఈద్ ఉల్ ఫితర్ పండుగ ఉన్నందున ఈ మార్పు చేసినట్టు స్పష్టం చేశారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం శనివారం పరీక్షలు నిర్వహించినట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. 9వ తరగతి ప్రవేశ పరీక్షకు 639 మందికి 233 మంది, 11వ తరగతిలో ప్రవేశాలకు 677 మందికి 151 మంది హాజరయ్యారన్నారు. ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ నాలుగు కేంద్రాలను సందర్శించారని తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఉచితంగా ప్రవేశాల నిమిత్తం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ కె.పంకజ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఐదేళ్లు నిండిన పిల్లలకు 1వ తరగతిలో ప్రవేశాలను అందిస్తామన్నారు. ఈనెల 20 నుంచి మార్చి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల దరఖాస్తులను సంబంధిత గ్రామ సచివాలయాలు, మండల విద్యావనరుల కేంద్రం లేదా సంబంధిత పాఠశాల ద్వారా సమర్పి ంచవచ్చన్నారు. దరఖాస్తు చేసే పిల్లలు 2020 ఏప్రిల్ 2 నుంచి 2021 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు ఏలూరులోని సమగ్ర శిక్ష కార్యాలయంలో సీఎంఓ, ఏఎస్ఓలను సంప్రదించవచ్చన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రభుత్వం ఏపీ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్–2026 అమలుచేయాలనే ఉద్దేశంతో రూపొందించిన ముసాయిదా నిబంధనలు ఉద్యోగులు, ఉపాధ్యాయుల భద్రతకు ముప్పుగా పరిణమించనున్నాయని ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ గుగులోతు కృష్ణ, జిల్లా అధ్యక్షుడు ఈ. రామ్మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మోహన్ ప్రకటనలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలపై అభిప్రాయాలు, సూచనలు, సలహాలు పంపాలని రాష్ట్రంలోని 14 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను ప్రభుత్వం కోరిందని, ఈ నిబంధనలు తీవ్రనష్టం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఎక్స్ట్రార్డినరీ లీవ్, 33 ఏళ్ల సేవ పూర్తయితే బలవంతపు రిటైర్మెంట్ వంటి పలు నిబంధనలు ప్రమాదకంగా ఉన్నాయని తెలిపారు. -
అక్రమాలకు అండగా.. అవినీతి మెండుగా..!
కొయ్యలగూడెం: ‘కంచే చేను మేసిన’ చందంగా ఉంది కన్నాపురం అటవీ శాఖ కార్యాలయంలో అధికారుల తీరు. రేంజ్ పరిధిలో అటవీ ప్రాంతాన్ని సంరక్షించాల్సిన అధికారులు అక్రమార్కులతో కలిసి కలప అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొండ, కోనల్లోని చెట్లను యథేచ్ఛగా నరికి కలపను తరలిస్తున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. వర్జీనియా పొగాకు బ్యారన్ క్యూరింగ్ పనులు ప్రారంభం కానుండటంతో కలప అక్రమ రవాణా ఊపందుకుంది. నిత్యం రేంజ్ పరిధిలో 40 ట్రక్కులకు పై గా కలపను అక్రమార్కులు పోలవరం, చింతలపూ డి, గోపాలపురం నియోజకవర్గాల్లోని గ్రామాలకు తరలిస్తున్నారు. టన్ను కలపను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు విక్రయిస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా, అక్రమార్కులను పట్టుకు న్నా కేసులు నమోదు చేయకుండానే అధికారులు ముగించేస్తున్నారు. ఇందుకు పలు సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కార్యాలయంలోనే రాజీ : గతేడాది నవంబర్ 16న నాలుగు బైక్లతో కొందరు కలపను తరలిస్తుండగా అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఒక వ్యక్తి బైక్ను మాత్రమే స్వాధీనం చేసుకుని కార్యాలయానికి తరలించి మిగిలిన మూడు వాహనాలను వదిలేసినట్టు సమాచారం. ఈ విషయం ఉన్నతాధికారులకు ఆధారాలతో సహా తెలిసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో పట్టుబడిన వ్యక్తి మరికొందరితో కలిసి వెళ్లి రేంజ్ కార్యాలయంలో వాగ్వాదానికి కూడా దిగాడు. అధికారులు మిగిలిన వాహనాలపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పారే తప్ప అ మలు కాలేదు. పట్టుబడిన వ్యక్తి గొడవకు దిగడంతో అధికారులే రాజీ కుదిర్చారు. పట్టుబడిన మో టార్ సైకిల్కు బదులు పనిచేయని మరో బైక్ను సీజ్ చేసి అసలు వాహనాన్ని అక్రమార్కుడికి తిరిగి ఇచ్చేశారు. అలాగే గతేడాది సెప్టెంబర్ 20న మో టార్ బైక్లపై తరలిస్తున్న కలపను డీఆర్వో ప ట్టుకుని సెల్ఫీ కూడా తీశారు. అయితే దీనికి సంబంధించి కేసు కూడా నమోదు కాలేదు. పెద్ద ఎత్తున తరలింపు అక్రమార్కులు సిండికేట్గా వ్యవహరిస్తూ పలు బీట్లలో చెట్టను నరికి కలప తరలించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. అతి విలువైన వృక్షజాతికి చెందిన దుంగలను రవాణా చేసి రూ.20 లక్షలకు పైగా దండుకున్నారు. సమాచారం అందుతున్న సమయాల్లో స్క్వాడ్ సిబ్బందికి దొరుకుతున్న అక్రమ కలప, వాహనాలు.. రేంజ్ కార్యాలయ అధికారులు, సిబ్బందికి దొరక్కపోవడం గమనార్హం. నెల రోజుల వ్యవధిలో పదికి పైగా కలప తరలిస్తున్న ఫోర్ వీలర్స్ వాహనాలను స్క్వాడ్ బృందం పట్టుకోవడం మినహా కార్యాలయ అధికారులు, సిబ్బంది ఎలాంటి వాహనాలను పట్టుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అడవికి అన్యాయం కన్నాపురం అటవీ శాఖ కార్యాలయంలో అవినీతి జాఢ్యం అటవీ కలపను యథేచ్ఛగా తరలిస్తున్న అక్రమార్కులు అక్రమ రవాణాకు అధికారుల సహకారంపై ఆరోపణలు రూ.3 లక్షలకు పైనే నెలవారీ మామూళ్లు ఉన్నతాధికారుల వద్ద ఉన్న పలుకుబడితో కార్యాలయంలోని ఓ అధికారి మొత్తం కలప అక్రమ రవాణా కు ప్రధాన కేంద్రంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కార్యాలయానికి సంబంధించి ఉన్నతాధికారిని నియమించాల్సి ఉన్నా దానిని నిలుపుదల చేయిస్తూ అన్నీ తానై వ్యవహరిస్తున్నారని, కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని సైతం తన గుప్పిట్లో పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఇద్దరు రేంజ్ అధికారులు కన్నాపురం కార్యాలయానికి బదిలీపై రావాల్సి ఉన్నా సదరు అధికారి ఆ ప్రక్రియను ఆపడానికి వెనకాడలేదని తెలిసింది. కలప అక్రమ రవాణాకు సంబంధించి మీడియాలో వార్తలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు వెనుకటి తేదీలతో కేసులు నమోదు చేసినట్టు రికార్డులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దళారులను కూడా వీరే ఎంపిక చేసుకుని వారి ద్వారా 50 కిలోమీటర్లలోపు కలప అక్రమ రవాణా అయ్యేలా చూస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి కలప అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
కేంద్రీకరణతో సమస్యలు
ఆటోమేషన్ విధానంతో పరిపాలన పూర్తిగా కేంద్రీకరణకు దారి తీస్తుంది. సాధారణంగా వికేంద్రీకరణ మార్గంలో పాలన సాగిస్తుంటారు. ఆటోమేషన్ ద్వారా పాలన కేంద్రీకరించబడితే ఎటువంటి సమస్య వచ్చినా పై స్థాయిలోనే పరిష్కరించుకోవాలి. అదే జరిగితే సమస్య పరిష్కారానికి ఎక్కువ సమయం పట్టి అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉంది. – గుగులోతు కృష్ణ, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ విధానపరమైన సంస్కరణలు తీసుకువచ్చేటప్పుడు ఉద్యోగులకు ఆమోదయోగ్యమా, ఆచరణాత్మకమా అని ఆలోచించాలి. ఆటోమేషన్ వంటి సంస్కరణలు అమలు చేసే ముందు ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తే లోటుపాట్లు తెలుస్తాయి. ఇప్పటికై నా ప్రభుత్వం ఆటోమేషన్పై పునః సమీక్షించి, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. – వి.రామ్మోహనరావు, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రెడ్బుక్ని విడిచి ప్రైవేట్ విద్యాసంస్థల వైపు చూడాలని, ఫీజుల దందాను అరికట్టాలని ఎస్ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మోహన్బాబు విద్యాసంస్థల్లో జరుగుతున్న దోపిడీని ప్రశ్ని స్తే కిడ్నాప్ చేయటం, చిత్రహింసలు పెట్టడం సరికాదన్నారు. మోహన్బాబు, ఆయన తనయుడు విష్ణు విద్యావ్యవస్థలో రాక్షస పాలన నడుస్తోందన్నారు. ఏఐఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి.శివ మాట్లాడుతూ మోహన్బాబు యూనివర్సిటీలో బౌన్సర్లు ఎందుకున్నారని, యూజీసీ విచారణకు వెళ్లినప్పుడు ఏం చేసిందంటూ ప్రశ్నించారు. పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు సీహెచ్ శివాజీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సీపీఎం నగర కార్యదర్శి పి.రవికుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
బలివే ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలన
బలివే( ముసునూరు): మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తుల సౌకర్యాలు, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఉత్సవాలను విజయవంతం చేయనున్నట్లు ఉత్సవాల ప్రత్యేక అధికారి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న అన్నారు. బలివేలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద దేవదాయ శాఖ జిల్లా అధికారి కే.శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించామని, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖల సహాయంతో భక్తుల పుణ్యస్నానాలు, దైవ దర్శనానికి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం ఆలయం ప్రాంగణంలో క్యూలైన్ల కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను, ఉత్సవ ప్రాంగణంలో ఏర్పాట్లు, జల్లుస్నానాల ఏర్పాట్లు పరిశీలించారు. -
గ్రామాల్లో అనధికార లే అవుట్లు
● పంచాయతీ అనుమతి లేకుండానే ఏర్పాటు ● ప్రభుత్వ ఆదాయానికి గండి కాళ్ల: గ్రామాల్లో రియల్ వ్యాపారుల ఆగడాలు రో జురోజుకూ పెరిగిపోతున్నాయి. పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా లోపాయికారి ఒప్పందాలతో లే అవుట్లు ఏర్పాటు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. వ్యవసాయ భూమిని వ్యవసా యేతర భూమిగా మార్చాలంటే అనుమతులు తప్పనిసరి. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్వర్షన్ కూడా కట్టకుండా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మారుస్తున్నారు. అనంతరం భూమిని పూడ్చి లేఅవుట్లు వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇలానే మండలంలోని దొడ్డనపూడిలో ఓ లే అవుట్ను ఏర్పాటుచేశారు. సెంటు రూ.లక్షల్లో ధర నిర్ణయించి విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అయినా పంచాయతీ అధికారులు ఇటుగా కన్నెత్తి చూడటం లేదని గ్రామస్తులు అంటున్నారు. లే అవుట్కు అనుమతులు లేకపోతే కనీసం బోర్డు కూడా పెట్టకపోతే తమకు ఎలా తెలుస్తుందని కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి ఎ.పోలయ్యని వివరణ కోరగా గ్రామంలో ఎలాంటి లే అవుట్లకు అనుమతులు ఇవ్వలేదన్నారు. అనధికార లేఅవుట్లలో స్థ లాలు కొని మోసపోవద్దన్నారు. ఆ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి
జంగారెడ్డిగూడెం: శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ నాణ్యమైన పొగాకును ఉత్పత్తి చేయాలని పొగాకు బోర్డు ఆర్ఎం జీఎల్కే ప్రసాద్ అన్నారు. మండలంలోని తాడువాయి, చల్లావారిగూడెం, మంగిశెట్టిగూడెం, బుట్టాయగూడెం, మార్కండేయపురం, సూరపువారిగూడెంలో వ్యవసాయక్షేత్రాలను ఆయన శాస్త్రవేత్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ నాణ్యమైన పొగాకు ఉత్పత్తికి, మంచి దిగుబడికి రైతులు సకాలంలో తొలి మొగ్గ దశలో తల తుంచి పిలక నివారణ మందు వాడాలన్నారు. మందులు వాడిన 17 రోజుల తర్వాత మాత్రమే ఆకు కొట్టు చేయాలని, లేదంటే పురుగు మందు అవశేషాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. మెగ్నీషియం లోపం ఎక్కువగా ఇసుక నేలల్లో ఉంటుందని, ఎకరాకు 15 కిలోల మెగ్నీషియం ఆకై ్సడ్ శాస్త్రవేత్తలు సూచించిన విధంగా భూమిలో వేయాలన్నారు. ఇనుము లోపం గుర్తిస్తే 0.5శాతం ఫెర్రస్ సల్ఫేట్ లీటరు నీటికి 5 గ్రాములు పిచికారీ చేయాలన్నారు. సూక్ష్మ పోషకాల సమగ్ర యాజమాన్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశన్, వేలం అధికారులు జె.సురేంద్రకుమార్, బి.శ్రీహరి, గ్రేడింగ్ అధికారి వై.ప్రశాంత్, ఐటీసీ లీఫ్ మేనేజర్ కొట్రేష్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో మొదలై.. ‘తూర్పు’లో ముగిసి..
● ముగిసిన పెద్దపులి ప్రయాణం ● 17 రోజులపాటు పంజా విసిరిన వైనం ● పట్టిసీమ మీదుగా గోదావరి దాటి.. ● కూర్మాపురంలో బంధించిన అధికారులు బుట్టాయగూడెం: తెలంగాణలోని కావిడిగుండ్లలో మొదలైన పెద్దపులి ప్రయాణం తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురంలో ముగిసింది. దాదాపు 17 రోజులపాటు ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల ప్రజలను హడలెత్తించిన పులిని ఎట్టకేలకు రెస్క్యూ టీమ్ సురక్షితంగా బంధించింది. గతనెల 21న తెలంగాణలోని అశ్వారావుపేట మండలం కావిడిగుండ్లలో రెండు ఆవులపై దాడి చేసి చంపిన పులి 22న ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. బుట్టాయగూడెం మండలం పందిరిమామిడిగూడెం, గుబ్బల మంగమ్మ గుడి మార్గం వైపు తిరుగుతూ హడలెత్తించింది. అదేరోజు అంతర్వేదిగూడెం సమీపంలో ఆవు, లేగ దూడలపై పంజా విసిరి హతమార్చింది. 23న నాగులగూడెం సమీపంలో మూడు ఆవులపై దాడి చేసి చంపేసింది. అటవీ అధికారులు ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాల్లో చిక్కిన పెద్దపులిని చూసి అందరూ వణికిపోయారు. సుమారు 4 అడుగుల ఎత్తు, మీటన్నర పొడవు ఉండటంతో బెంబేలెత్తారు. అదే రోజు మధ్యాహ్నం అంతర్వేదిగూడెం సమీపంలో, రాత్రి కొండ ప్రాంతంలోని గాడిదబోరు సమీపంలో సంచరించింది. 24న బుట్టాయగూడెం మండలం గుర్రప్పగూడెంలో గేదైపె, కోట నాగవరంలో లేగ దూడలపై దాడి చేసింది. అక్కడి నుంచి కంసాలికుంట, అల్లికాల్వ మీదగా రాయిగూడెం వెళ్లి అక్కడ మరో గేదె దూడను హతమార్చింది. 13 పశువులను హతమార్చి.. రాయిగూడెం నుంచి కొయ్యలగూడెం మండలం బిల్లుమిల్లి చేరుకుని ఆవులను హతమార్చింది. రెండు రోజులపాటు అక్కడే మకాం వేసిన పెద్దపులి 26న మళ్లీ రావిగూడెం చేరుకుని గేదె దూడను చంపింది. అక్కడి నుంచి కండ్రికగూడెం, అమ్మపాలెం వెళ్లి రెండు గేదెలను చంపి తినేసింది. 27న బుట్టాయగూడెం మండలం లంకపల్లి రామ నర్సాపురం మీదుగా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే 30న అటవీ ప్రాంతంలో మాటేసిన పెద్దపులి అక్కడికి వచ్చిన ఆవుపై దాడి చేసి చంపేసింది. 31న పోలవరం మండలం ఇటుకులకోటలో లేగ దూడలను హతమార్చి పట్టిసీమ ఎత్తిపోతల పథకం పరిసర ప్రాంతాల నుంచి గోదావరి ఈదుకుంటూ అటుగా వెళ్లింది. మొత్తంగా ఏలూరు జిల్లాలో 13 పశువులను పులి హతమార్చింది. పోలవరం జిల్లా చిన్నకొండేపూడి, పెద్ద కొండేపూడి పంట పొలాల్లో పెద్దపులి పాదముద్రలను అక్కడి అధికారులు గు ర్తించారు. అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించిన పెద్దపులి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఫారెస్ట్ అధికారులు, పూనే నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్ రాయవరం మండలం కూర్మాపురంలో గన్ ద్వారా మత్తు ఇంజక్షన్లు ఇచ్చి శుక్రవారం సాయంత్రం పెద్దపులిని బంధించారు. అక్కడి నుంచి పులిని రాజమండ్రి తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
క్యాన్సర్ కలవరం
శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి, భీమవరం: మారిన జీవనశైలి, ఆహార అలవాట్లతో క్యాన్సర్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. సర్వైకల్, రొమ్ము, నోటి క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి వంద మందిలో ఐదుగురికి పైనే ఆయా క్యాన్సర్ల లక్షణాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో జరుగుతున్న నాన్ కమ్యూనికేబుల్ డిసీజస్ (ఎన్సీడీ) సర్వేలో ఈ విషయాలు వెలుగు చూస్తున్నాయి. చిన్న పరీక్షతో పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే గుర్తించి తగిన చికిత్స అందించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఎన్సీడీ సర్వే : క్యాన్సర్ రోగులను గుర్తించి వైద్య సాయం అందించేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎన్సీడీ సర్వే నిర్వహిస్తోంది. సర్వైకల్, రొమ్ము, నోటి క్యాన్సర్ పరీక్షలతో పాటు బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ పరీక్షలు ఉచితంగా చేస్తోంది. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వచ్చి 18 ఏళ్లు నిండిన వారికి అవసరమైన ఆయా పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలో 15,12,258 మందికి వైద్య పరీక్షల నిర్వహణ లక్ష్యం కాగా ఇప్పటివరకు 5,09,807 మందికి చేశారు. 8,761 మంది బీపీ, 22,995 మంది షుగర్, 27,076 మందిలో క్యాన్సర్ లక్షణాలను గుర్తించారు. వీరిలో నోటి క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారు 11,496 మంది, బ్రెస్ట్ క్యాన్సర్ 6,953, సర్వైకల్ క్యాన్సర్ అనుమానితులు 8,627 మంది ఉన్నారు. క్యాన్సర్ అనుమానితుల్ని తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని అంకాలజీ విభాగానికి సిఫార్సు చేస్తున్నారు. పాజిటివ్ లక్షణాలు వస్తే వారికి ప్రత్యేకంగా చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా పరీక్ష చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు సహకరించాలి ఎన్సీడీ సర్వే నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి ప్రజలు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్యాన్సర్ దశలను గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స అందించే వీలుంటుందని వైద్యులు చెబుతున్నారు. సర్వే సిబ్బందికి మహిళలు తమలో తలెత్తుతున్న లక్షణాలు చెప్పుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనం సాగించేందుకు వీలుంటుందని సూచిస్తున్నారు. మహిళల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లలో వచ్చే మార్పులు రొమ్ము క్యాన్సర్కు ప్రధాన కారణంగా చెబుతున్నారు. కొవ్వు అధికంగా కలిగిన ఆహారం తీసుకోవడం, జంక్ ఫుడ్, పోషకాహార లోపం, అబార్షన్ కిట్లు, స్టెరాయిడ్ల వాడకం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, తల్లి పాలు ఇవ్వకపోవడం వంటి కారణాలతో రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందంటున్నారు. 30 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వైరస్ సోకిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాతే లక్షణాలు బయటపడతాయి. 30 ఏళ్ల తర్వాత మహిళలు స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా దీని బారి నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు. పొగతాగడం, పొగాకు ఉత్పత్తులు, గుట్కా నమలడం, నోటి పరిశుభ్రత పాటించకపోవడం తదితర కారణాలతో నోటి క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ముందస్తు జాగ్రత్తలే రక్ష బాధితులను గుర్తించేందుకు కేంద్రం ఎన్సీడీ సర్వే జిల్లాలో 15,12,258 మందికి వైద్య పరీక్షల నిర్వహణ లక్ష్యం ఇప్పటివరకు 5,09,807 మందికి పరీక్షలు వారిలో 5.3 శాతం మంది ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ రోగులుగా అనుమానం తదుపరి పరీక్షల కోసం ఏలూరు జనరల్ ఆస్పత్రికి సిఫార్సు చిన్న పరీక్ష.. పెద్ద రక్ష అంటున్న వైద్యులు ప్రజావైద్యానికి పెద్దపీట వేస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష అమలుచేసిన విషయం విదితమే. బీపీ, షుగర్, హెపటైటీస్–బి, హిమోగ్లోబిన్, మలేరియా, హెచ్ఐవీ, డెంగ్యూ, విజువల్ ఇన్ఫెక్షన్, తదితర అనారోగ్య సమస్యలున్న వారిని గుర్తించేందుకు ఇంటింటా సర్వేలో 14 రకాల వైద్య పరీక్షలు చేసేవారు. హెల్త్ డైరీ రూపొందించి ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా స్పెషలిస్ట్ వైద్యులతో వైద్యసేవలు, మందులు అందజేసేవారు. 172 రకాల మందులను అందుబాటులో ఉంచి నడవలేని వారు, దీర్ఘ్ఘకాల వ్యాధులతో బాధపడే వారికి ప్రతి నెలా ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు, ఆరోగ్య సిబ్బంది మందులు అందజేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇలా జిల్లాలో కేవలం రెండు విడతల్లో ఐదు లక్షల మందికి పైగా రోగులకు సేవలు అందించారు. -
నిమ్మ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
ఏలూరు(ఆర్ఆర్పేట) : నిమ్మ రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు అన్నే భవనంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిమ్మ, పౌల్ట్రీ రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు. నిమ్మకాయ ధరలు పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. నిమ్మకాయలకు కనీస ధరలు రాకపోవడంతో జిల్లాలో చాలా చోట్ల రైతులు నిమ్మ తోటలు తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నిమ్మ తోటలు కౌలుకు తీసుకుని తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుడ్డు ధర తగ్గి నష్టపోతున్న పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. దెందులూరు: ప్రతిభ ప్రతి ఒక్కరికి గుర్తింపు తీసుకొస్తుందని ఏలూరు జిల్లా డీఎస్డీఓ అజీజ్ అన్నారు. శుక్రవారం ఏలూరు రూరల్ మండలం మల్కాపురం ఆశ్రం వైద్యశాల ఆడిటోరియంలో దివ్యాంగుల క్రికెట్ పోటీలు జరిగాయి. దివ్యాంగుల క్రికెట్ పోటీల్లో విజేతగా ఏపీ జట్టు నిలిచింది. విజేతను రూ.50 వేల నగదు ట్రోఫీతో సత్కరించారు. మూడు రోజుల దివ్యాంగుల క్రికెట్లో భాగంగా ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులకు ప్రోత్సాహక నగదుతో పాటు ప్రశంసా పత్రం అందజేశారు. ఏలూరు జిల్లా డీఎస్డీఓ అజీజ్ మాట్లాడుతూ దివ్యాంగుల క్రికెట్ క్రీడను ప్రోత్సహించేలా అన్ని చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆశ్రం కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్ రాజు, గుప్తా ఫౌండేషన్ కార్యదర్శి శ్రీనివాసరావు, ఎన్ ఫౌండేషన్ అధినేత నారా శేషు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రవీంద్రబాబు, అర్జున అవార్డు గ్రహీత మెన్ అండ్ ఉమెన్ బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అజయ్ కుమార్ రెడ్డి, క్రికెట్ అకాడమీ సెక్రటరీ మదన్ పాల్గొన్నారు. -
నకిలీ లెటర్లతో మోసం.. ఇద్దరి అరెస్టు
నూజివీడు : ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో లోను క్లియర్ కాకుండానే క్లియర్ అయినట్లు నకిలీ పత్రాలను పెట్టి తనఖా పెట్టిన పత్రాలను రిలీజ్ చేయించడానికి ప్రయత్నించగా.. వారిని పోలీసులకు అప్పగించారు. శ్రీరామ్ ఫైనాన్స్ తాడేపల్లిగూడెం బ్రాంచ్లో అద్దేపల్లి వెంకటరత్నం కోటి రూపాయల లోను తీసుకున్నాడు. ఆ లోను క్లియర్ అయిపోయిందని చెప్పి బ్రాంచ్కి చెందిన వ్యక్తి అని చెబుతూ దొడ్డి నాగరాజు అనే అతనిని తీసుకొచ్చి నకిలీ సర్టిఫికెట్ సమర్పించి తనఖా రిజిస్ట్రేషన్ రిలీజ్కు ప్రయత్నించారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ ఎన్.ఫణిసీతారామరాజుకు అనుమానమొచ్చి శ్రీరామ్ ఫైనాన్స్ అధికారులకు తెలియజేయగా వారు వచ్చి ఫేక్ లెటర్లుగా తెలిపారు. దీంతో వారిని పోలీసులకు అప్పగించారు. ద్వారకాతిరుమల: రైతులకు తీవ్ర నష్టం కలిగించే అమెరికాతో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని ఎం.నాగులపల్లిలో శుక్రవారం పాడి, మొక్కజొన్న రైతులు నిరసన వ్యక్తం చేశారు. మోదీ, ట్రంప్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి ఏకపక్షంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుందని, ఇది అమలైతే అమెరికా నుంచి మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, పండ్లు, కూరగాయలు తదితర పంటలు, పాలు, పాల పదార్థాలు ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా పెద్ద ఎత్తున మన దేశంలోకి దిగుమతి అవుతాయని వివరించారు. దీంతో మన పంటలు అమ్ముకునే దారి లేక రైతులు దివాలా తీస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో వ్యవసాయ రంగానికి 50 శాతం సబ్సిడీ ఇస్తుంటే, ఇక్కడి ప్రభుత్వం 3 శాతం మాత్రమే ఇస్తోందని అన్నారు. రైతు సంఘం మండల కార్యదర్శి గుర్రం రాంబాబు, పాల రైతులు, మొక్కజొన్న రైతులు గారపాటి సత్యనారాయణ, మద్దిపాటి వెంకటేశ్వరరావు, భీమడోలు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. -
గురువులపై ఆటోమేషన్ కత్తి
ఏలూరు (ఆర్ఆర్పేట): చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులను ముప్పుతిప్పలు పెడుతోంది. తాజాగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇన్విజిలేషన్ బాధ్యతలకు సంబంధించి కొత్తగా ఆటోమేషన్ విధానాన్ని తీసుకువచ్చింది. దీంతో ఇన్విజిలేషన్ విధులు భారం కానున్నాయని ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఈ విధానం వల్ల పరీక్షల నిర్వహణే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల ప్రమేయం లేకుండా ఆటోమేషన్ ద్వారా ఇన్విజిలేషన్ విధులు కేటాయించడం అనే ప్రక్రియ పూర్తిగా అసంబద్ధమని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వెసులుబాటు సాధారణంగా జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులు టెన్త్ పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేషన్ విధులకు అర్హులైన ఉపాధ్యా యులను ఎంపిక చేసి కేటాయిస్తారు. ఇందులో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, గర్భిణులు, బాలింతలు, దివ్యాంగ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చేవారు. అలాగే పిల్లల పరీక్షల నిమిత్తం లేదా తల్లిదండ్రులను ఆస్పత్రులకు తీసుకువెళ్లాల్సి వచ్చే వారికి కూడా అభ్యర్థన మేరకు వెసులుబాటు ఉండేది. అలాగే ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్న వారికి కూడా మినహాయింపు లభించేది. అయితే ఆటోమేషన్ ప్రక్రియ ద్వారా ఆయా వర్గాలకు మినహాయింపు లభించే పరిస్థితి లేదు. సాఫ్ట్వేర్ పరిధిలోకి.. ఆటోమేషన్ ప్రక్రియ వల్ల ఇన్విజిలేషన్ విధులన్నీ సాఫ్ట్వేర్ పరిధిలోకి వెళతాయని ఉపాధ్యాయులు అంటున్నారు. టీచర్ల జాబితా సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేస్తే సబ్జెక్టు, కేంద్రాలను బట్టి ఉపాధ్యాయులకు ఇన్విజిలేషన్ విధులను కేటాయిస్తుంది. దీని వల్ల ఉపాధ్యాయులు దూరంగా ఉన్న కేంద్రానికి వెళ్లి విధులు నిర్వహించాల్సి ఉంటుందని, ప్రత్యేక మినహాయింపులు, వెసులుబాటులు ఉండవని టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రభుత్వ కక్ష సాధింపు అని ఉపాధ్యాయ సంఘాలు గళమెత్తుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలతో ఏమాత్రం చర్చించకుండా కూటమి ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని అంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయన్నారు. గతంలో బలవంతపు శిక్షణల పేరుతో కొందరు ఉపాధ్యాయులను బలి తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు సాఫ్ట్వేర్ నిర్దేశిత ఇన్విజిలేషన్ విధుల రూపంలో మరికొందరిని బలి కోరుకుంటుందా అని ప్రశ్నిస్తున్నారు. టెన్త్ పరీక్షలకు ఆటోమేషన్లో ఇన్విజిలేషన్ బాధ్యతలు ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులకు అతీతంగా విధులు దూర ప్రాంతాలను కేటాయించే అవకాశం ఉపాధ్యాయుల్లో ఆగ్రహ జ్వాలలు విధులను బహిష్కరించే ఆలోచన -
సుజుకీ ఈ–ఆక్సిస్ స్కూటర్ విడుదల
భీమవరం: భీమవరంలోని శ్రీకృష్ణ సుజుకీ షోరూంలో బ్యాటరీ వెహికల్ ఈ–ఆక్సిస్ టూవీలర్ విడుదల కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా రవాణాశాఖాధికారి కెఎస్ఎంవీ కృష్ణారావు, వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ వెహికల్ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ సుజుకి షోరూం సిబ్బంది పాల్గొన్నారు. ఆకివీడు: హాస్టల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంపై కలెక్టర్ సీహెచ్.నాగరాణి ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక బీసీ హాస్టల్ను గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంపై అసంతృప్తి తెలిపారు. బాత్రూమ్ తలుపులు విరిగిపోవడం పరిశీలించి ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అరుణ తదితరులు పాల్గొన్నారు. తొలుత స్థానిక గాలిబ్ చెరువు ప్రాంతంలో వరి సాగును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా రైతు గంధం మధు కలెక్టర్కు యూరియాతో పాటు ఇతర ఎరువులు ఇవ్వడంలేదని ఫిర్యాదు చేశారు. జింక్ లోపం అధికంగా ఉందని జింక్ మందులు సబ్సిడీపై అందజేయాలని విజ్ఞప్తి చేశారు. కొయ్యలగూడెం: చింతలపూడి ఎత్తిపోతల కాలువ గట్టు నుంచి అక్రమార్కులు మట్టిని యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. వారం రోజులుగా కన్నాపురం పులిరామన్నగూడెం గ్రామాల మధ్య ఉన్న ఎత్తిపోతల కాలువ గట్టు నుంచి మట్టి రవాణా చేస్తున్నప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రేయింబవళ్లు మట్టి తోలకాలు సాగుతున్నా చర్యలు తీసుకోకపోవడంతో భవిష్యత్తులో కాలువకు గండ్లు పడే ప్రమాదం ఉందని రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం మండలాలలోని పరిసర గ్రామాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల నిమిత్తం నిబంధనలకు విరుద్ధంగా కాలువ గట్టు ఎత్తిపోతల మట్టిని వినియోగిస్తున్నట్లు తెలిసింది. అభివృద్ధి పనులకు వినియోగించాల్సిన గ్రావెల్ మట్టికి బదులు నాణ్యతలేని మట్టిని వినియోగించడం వలన భవిష్యత్తులో నిర్మాణాలు సుదీర్ఘ కాలం ఉండవని ప్రజలు పేర్కొంటున్నారు. -
రొయ్య ధరలు పతనం
● 100 కౌంట్ రూ.270 నుంచి రూ.250కు పడిపోయిన వైనం ● అమెరికా సుంకాలు తగ్గినా రైతులకు దక్కని ఫలితం అమెరికా టారిఫ్ 25 నుంచి 18 శాతానికి తగ్గించడంతో రొయ్యల ధరలు పెరుగుతాయని రైతులు ఆశించారు. దీనికి భిన్నంగా కౌంట్ ధరలు రూ.20 నుంచి రూ.40 వరకూ తగడం దారుణం. రొయ్యల ట్రేడర్స్, ఏజెన్సీలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. ప్రభుత్వం పర్యవేక్షించి రైతులకు గిట్టుబాటు ధరలు అందించాలి – కొరుపోలు అప్పారావు, ఆక్వా రైతు ప్రస్తుతం వాతావరణ మార్పులతో మంచు, వైరస్ ప్రభావం తగ్గలేదు. ప్రతికూల వాతావరణంతో తెగుళ్లు పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో నిరంతరం ఏరియేటర్లు తిరగాల్సిన పరిస్థితి ఉంది. గతంతో పోల్చితే రైతులకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. 100 కౌంటు ధర రూ.280 వద్ద నిలకడగా ఉంటే రైతుకు మేలు జరుగుతుంది. – జె.రవీంద్ర, సీనియర్ ఆక్వా టెక్నీషియన్ నిడమర్రు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రొయ్య ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. ఒకప్పుడు సిరులు కురిపించిన ఈ సాగు గత కొంత కాలంగా వాతావరణ మార్పులతో వైరస్, నాణ్యమైన సీడ్ అందకపోవడం, మేతల ధరలు, పెట్టుబడులు పెరగడం, టారిఫ్ల పెరుగుదలతో ధరలు గణనీయంగా పడిపోయాయి. ప్రభుత్వం ధరలు నియంత్రించలేకపోవడం వంటి కారణాలతో ఆక్వా సాగు రైతులు నేల చూపులు చూస్తున్నారు. గత రెండు రోజులుగా రొయ్య ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఓ పక్క వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పడిపోవడం, మరోవైపు తగ్గని వైరస్తో పోరాటం చేస్తున్న రైతులను ధరలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నెల 3 వరకు 100 కౌంట్ ధర రూ.270 ఉండగా బుధవారం నుంచి రూ.250కి పడిపోయింది. మిగిలిన కౌంట్ ధర రూ.20 నుంచి రూ.40 వరకూ తగ్గడంతో ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిలకడలేని ధరలతో ఆక్వా సాగు చేయడంతో కనీసం పెట్టుబడులు రాని పరిస్థితి ఉందని రొయ్య రైతులు చెబుతున్నారు. మరోవైపు అమెరికా సుంకాలను 25 నుంచి 18 శాతానికి తగ్గించినట్లు ప్రకటించినా రొయ్య ధరలు పతనం అవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రొయ్య ధరలు, మేతల ధరలు నియంత్రించాల్సిన కూటమి సర్కారే సిండికేట్లకు కొమ్ము కాస్తోందని ఆక్వా రైతులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 1.20 లక్షల ఎకరాల్లో రొయ్య సాగు చేస్తున్నారు. వీటిలో 90 శాతం పైగా వనామినే. అమెరికా ప్రకటించిన రోజే రొయ్య ఽకౌంట్ ధరలు తగ్గడంపై ఆక్వా రైతులు నేల చూపులు చూస్తున్నారు. మేత, ఇతర ఖర్చులు పెరుగుతుంటే రొయ్యల ధరలు మాత్రం తగ్గతుండటం ఆక్వా సాగు రంగాన్ని కుదిపేస్తోంది. సాగు సమస్యలు ఎదుర్కొని పంట చేతికొచ్చే సమయంలో పట్టుబడులకు దిగిన రోజే ధరలు పడిపోవడంతో టన్ను రొయ్యకు రూ.20 నుంచి రూ.50 వేల వరకూ నష్టపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. దీంతో నికర ఆదాయం తగ్గి రైతులు నష్టాల బారిన పడుతున్నామని, పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్లో ఆక్వా సాగు ప్రశ్నార్థకమే అని చెబుతున్నారు. ఽకూటమి ప్రభుత్వంలో గడ్డు పరిస్థితి రొయ్య ధరల నియంత్రణలో కూటమి సర్కారు తీవ్రంగా విఫలమైందని ఆక్వా రైతులు విమర్శిస్తున్నారు. రొయ్య ధరలు నియంత్రించలేక పోవడం, మేతల ధరలు కంపెనీలు పెంచుతున్నా వారిని అదుపు చేయలేక పోవడంపై ఆక్వా రైతులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆక్వా సాఽఽధికారిత కమిటీని ఏర్పాటు చేసి ప్రతి వారం సీడ్, ఫీడ్ రేట్లు, ఆక్వా ఉత్పత్తుల ధరలపై మంత్రుల కమిటీ సమీక్షించే పద్ధతిని కూటమి సర్కారు పక్కన పెట్టిందని రైతులు విమర్శిస్తున్నారు. అమెరికా పెంచిన సుంకాల పేరుతో వ్యాపారులు రొయ్య ధరలు అప్పట్లో అమాంతం తగ్గించేశారు. పెరిగిన టారిఫ్ ప్రకటనతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. అంతర్జాతీయ మార్కెట్లో టారిఫ్లను చూపి మధ్య దళారీలు ఇష్టారాజ్యంగా రొయ్య రేట్లు తగ్గించుకుంటూ పోతుండటంతో 100 కౌంట్ రొయ్యకు కనీస ధర కూడా లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆక్వా సాఽఽధికారత కమిటీ, ప్రతివారం సీడ్, ఫీడ్ రేట్లు, ఆక్వా ఉత్పత్తుల ధరలపై మంత్రుల కమిటీ సమీక్షించి స్థిరీకరణ కోసం చర్యలు తీసుకునేది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ సాధికారత కమిటీకి మంగళం పాడింది. తమ పార్టీలకు చెందిన ప్రాసెసింగ్ ప్లాంట్, హేచరీ, ఫీడు కంపెనీల నుంచి ప్రతినిధులతో ఆక్వా కమిటీ ఏర్పాటు చేస్తే, ఈ కమిటీ రైతుల సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తుంది? – పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్యే -
ఫైరింగ్లో నైపుణ్యం సాధించాలి
కామవరపుకోట: పోలీస్ సిబ్బంది ఫైరింగ్లో మరింత నైపుణ్యాన్ని సాధించాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్, జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ సూచించారు. వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ వార్షిక నేర సమీక్ష సమావేశాన్ని పురస్కరించుకుని తడికలపూడిలో గురువారం ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్కుమార్ మాట్లాడుతూ ఫైరింగ్ ప్రాక్టీస్ వల్ల పోలీసు సిబ్బందిలో ఆత్మ విశ్వాసం, నైపుణ్యం, అప్రమత్తత పెరుగుతాయని, అత్యవసర పరిస్థితుల్లో ఆయుధాల వినియోగంపై పూర్తి అవగాహన కలుగుతుందని అన్నారు. ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది శారీరకంగా, మానసికంగా ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని, దీని కోసం ఫైరింగ్ ప్రాక్టీస్ను వినియోగించుకుని వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయన్నారు. జిల్లాలో అన్ని సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు శిక్షణకు హాజరయ్యారు. ఏఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, ఏఆర్ అదనపు ఎస్పీ జి.మునిరాజా పాల్గొన్నారు. నేర సమీక్షా సమావేశం ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా వార్షిక నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్, కలెక్టర్ వెట్రిసెల్వి హాజరయ్యారు. -
పట్టిసం శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు
పోలవరం రూరల్: మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టిసం రేవులో క్షేత్రానికి వెళ్ళేందుకు వీలుగా క్యూలైన్లు, టిక్కెట్ కౌంటర్లు, ర్యాంపు పనులు సాగుతున్నాయి. ఈ నెల 14 నుంచి 16 వరకు ఇసుక తిన్నెలపై జరిగే ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. కొంత దూరం నడుచుకుంటూ వచ్చి అక్కడి నుంచి పంట్ల మీద, తడికల బాదులతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ర్యాంపుపై నడుచుకుంటూ ఇసుక తిన్నెలపై చేరేలా పనులు చేపట్టారు. ఇసుక తిన్నెలపై నడుచుకుంటూ మరో వైపు నదిలో ఏర్పాటుచేసిన ప్లాట్ఫాం దాటాల్సి ఉంది. అక్కడి నుంచి క్షేత్రానికి నడచుకుంటూ వెళ్ళేందుకు వీలుగా గోనె సంచుల్లో ఇసుక నింపి బస్తాలతో ప్లాట్ఫాం పనులు చేపట్టాల్సి ఉంది. క్షేత్రానికి దిగువ నుంచి క్యూలైన్లో నడుచుకుని శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకుని వచ్చేలా పనులు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టిసం పంచాయతీ దేవస్థానం అధికారులు ఇరువైపులా పనులు చేపట్టారు. టిక్కెట్ కౌంటర్లు, క్యూలైన్ల కోసం చలువ పందిళ్ళు గోదావరి వైపు నడిచి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ర్యాంపు -
ఉద్యాన పంటలపై దృష్టి సారించాలి
కలెక్టర్ నాగరాణి భీమవరం: వరికి ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. భీమవరం టౌన్హాల్లో శుక్రవారం జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జరిగిన హార్టికల్చర్ కాన్క్లేవ్–2026 సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆధునిక పద్ధతుల్లో అధిక విలువ గల కూరగాయలు, పూల రక్షిత సాగు, కోకో, కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు లక్ష్యంగా రైతులకు అవగాహన కల్పించారు. వెంకట్రామన్నగూడెం ఉద్యాన యూనివర్సిటీ, కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ ప్రధాన కార్యాలయ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఉద్యాన పంటల మార్పిడిపై దృష్టి సారిస్తే అధిక లాభాలు గడించవచ్చన్నారు. ఈ దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి మాట్లాడుతూ ఉద్యాన పంటల సాగుకు అనుకూల వాతావరణం జిల్లాలో ఉందన్నారు. సదస్సులో ఏర్పాటుచేసిన ఫల, పుష్ప ప్రదర్శన ఆకట్టుకుంది. ఉద్యాన శాఖ డీడీ జి.ప్రభా కర్ రావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎం.హరిప్ర సాద్, ఉద్యాన శాఖ అధికారి పి.శ్రీలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ ఎ.నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కై కలూరు సర్పంచ్ను కొనసాగించాలంటూ తీర్పు
కై కలూరు: నిధుల దుర్వినియోగం అంశంపై వైఎస్సార్సీపీ పాలనలో ఎన్నిౖకైన కైకలూరు సర్పంచ్ దానం మేరీ నవరత్నకుమారిని గతేడాది జూన్ 19న కలెక్టర్ కె.వెట్రిసెల్వి సస్పెండ్ చేశారు. అంతకు ముందు 2025 జనవరి 18న సర్పంచ్ చెక్ పవర్ను కూడా రద్దు చేశారు. దీనిపై సర్పంచ్ న్యాయపోరాటం చేశారు. న్యాయవాది జడ శ్రావణ్కుమార్ పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ను విధు ల్లో కొనసాగించాలంటూ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్, ఏలూరు కలెక్టర్కు హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. కేవలం రాజకీయ కారణాలతోనే సర్పంచ్ పదవి నుంచి పిటిషనర్ను తొలగించారని, ఎలాంటి ప్రామాణికమైన విచారణ పాటించలేదని న్యాయవాది వాదించారు. దీంతో ఏకీభవించిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా సర్పంచ్ మేరీ నవరత్నకుమారి మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాలతో సర్పంచులు, జెడ్పీటీసీలను వేధిస్తున్న నాయకులకు ఈ తీర్పు గుణపాఠం కావాలన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనుల బిల్లులను ఈనెల 28 నాటికి అప్లోడ్ చేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. పథకాన్ని వచ్చేనెల 31తో ముగించి ఆ స్థానంలో వీబీ జీ రాంజీ పథకం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుందన్నారు. ఈ మేరకు జిల్లాలో మంజూరైన 345 పనులు వెంటనే ప్రారంభించి సంబంధిత బిల్లులు అప్లోడ్ చేయాలన్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించిన కోర్టు కేసులను వారం రోజుల్లో విచారణ పూర్తిచేయాలని ఆదేశించారు. చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి గోపీచంద్, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు తదితరులతో ఆమె సమీక్షించారు. ఏకీకృత కుటుంబ సర్వే, అప్సడా రిజిస్ట్రేషన్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి కుటుంబ సర్వే, అప్సడా రిజిస్ట్రేషన్, ఈకేవైసీ, అక్షరాంధ్ర, ఈపీటీఎస్ ప్రగతిపై మండలాల వారీగా సమీక్షించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని 52 కేంద్రాల్లో శుక్రవారం జరిగిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 3,924 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 2,242 మందికి 2,124 మంది, మధ్యాహ్నం 1,842 మందికి 1,800 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాను ప్రకటనలో తెలిపారు. ఏలూరు(మెట్రో): ప్రభుత్వ కార్యాలయాల్లోని రికార్డులన్నింటినీ డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో పొందుపరచాలని జేసీ ఎంజే అభిషేక్ గౌడ ఆదేశించారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ నుంచి రికార్డుల డిజిటలైజేషన్పై అధికారుల తో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. చింతలపూడి: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కాపు సామాజికవర్గంపై సాగిస్తున్న వివక్షాపూరిత చర్యలను వైఎస్సార్సీపీ జిల్లా మున్సిపల్ విభా గం అధ్యక్షుడు, కాపు నేత బొడ్డు వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. కాపు నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయించడం, భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ప్రకటనలో తెలిపారు. రాజకీయంగా ఎదుర్కోలేక, నేతల కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం అత్యంత హేయమన్నారు. టీడీపీ, జనసేనలో ఉన్న కాపు నేతలు కేవలం ఆయా పార్టీలకు ‘కాపలా’ కాయడానికే పరిమితమా? అని ఆయన ప్రశ్నించారు. కాపు నేతలపై అరాచకాలను సహించబోమని, ప్రభుత్వం వైఖరి మార్చుకోకుంటే ఐక్యంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ ఎల్లవేళలా కాపులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పెదవేగి: విజయరాయి గాంధీనగర్లోని సీతారామ కల్యాణ మండపం వద్ద శనివారం కోకో రైతుల సమావేశం నిర్వహిస్తున్నట్టు ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొల్లు రామకృష్ణ, కె.శ్రీనివాస్ శుక్రవా రం ప్రకటనలో తెలిపారు. కోకో గింజల ధర తగ్గింపుపై ఈ సమావేశంలో చర్చిస్తారని, ప్రభుత్వం ఇంతవరకూ ధరల పాలసీ ప్రకటించలేదని, ధర నిర్ణయం కాకపోవడంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, ఫలితంగా రైతులు నష్టపోతున్నారని ఆందోళన చేశారు. సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు. -
జననేతకు నీరాజనం
జన తరంగం ఎగసింది.. అభిమాన నేతను చూసి మురిసింది.. సంక్షేమ ప్రదాతకు ఆత్మీయ స్వాగతం పలికింది.. అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది.. ‘సీఎం.. సీఎం.. జై జగన్’ నినాదాలతో హోరెత్తించింది.. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వెల్లువలా వచ్చిన జనకెరటం జననేతకు నీరాజనాలు అర్పించింది.. యువత, అభిమానుల కేరింతలు, ఉత్సాహం నడుమ భీమవరం జనసంద్రాన్ని తలపించింది. వివాహ వేడుకకు హాజరైన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. 8లో uశురకవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి, భీమవరం/భీమవరం (ప్రకాశం చౌక్): శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు కుమారుడు ఐపీఎస్ అధికారి చిట్టిరాజు, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గొర్రెముచ్చు కిషోర్కుమార్ కుమార్తె తేజ రిషితల వివాహం గురువారం పెద అమిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాలులో వైభవంగా జరిగింది. నూతన జంటను ఆశీర్వదించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారన్న సమాచారంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు భీమవరం చేరుకున్నారు. ఉదయం నుంచే జువ్వలపాలెం, క న్వెన్షన్ హాలు రోడ్లలో హడావుడి మొదలైంది. పార్టీ శ్రేణులు, యువత పార్టీ జెండాలు, జగన్ ఫ్లెక్సీలతో సందడి చేశారు. దారిపొడవునా ఫ్లెక్సీలతో రోడ్డును ముంచెత్తారు. ఉదయం 11.30 గంటలకు పెద అమిరం రోడ్డులోని హెలీప్యాడ్కు జగన్ చేరుకోగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ నేతలు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. హెలీప్యాడ్ నుంచి కల్యాణవేదిక వరకూ పార్టీ శ్రేణులు, యువతతో రోడ్డు కిక్కిరిసిపోయింది. భారీ ఎత్తున బాణాసంచా కాల్పులతో అధినేతకు పార్టీ వ్రేణులు స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను దగ్గరగా చూసేందుకు యువకులు బారికేడ్లు, ప్రహరీ గోడలను లెక్కచేయకుండా కాన్వాయ్ వెంట పరు గులు తీశారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి హెలీప్యాడ్ నుంచి తిరుగు పయనమయ్యే వరకూ జగన్ను చూసేందుకు, ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబర్చారు. కిక్కిరిసిన కన్వెన్షన్ కల్యాణ వేదిక వద్ద మోషేన్రాజు, అన్నామణి దంపతులు వైఎస్ జగన్కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. వధూవరులు చిట్టిరాజు, తేజ రిషితలను జగన్ ఆశ్వీరించారు. వేదిక వద్ద జగన్ను చూసేందుకు జనం పోటీపడ్డారు. ఆయన వధూవరులను ఆశీర్వదిస్తున్న దృశ్యాలను చిన్నాపెద్దా తేడాలేకుండా సోఫాలు, కుర్చీలు ఎక్కీ మరీ తమ సెల్ఫోన్లలో బంధిస్తూ మురిసిపోయారు. అభిమా న నేతతో కరచాలనం కోసం పోటీపడ్డారు. భీమవరం.. అభిమాన సంద్రం వైఎస్ జగన్కు ఘన స్వాగతం మండలి చైర్మన్ మోషేన్రాజు తనయుని వివాహ వేడుకకు హాజరు పెదఅమిరం రోడ్డులో ప్రభంజనం ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి వెల్లువలా పార్టీ శ్రేణులు -
టీడీపీ అరాచకాలకు భయపడం
మాజీ మంత్రుల కుటుంబాలకు జిల్లా నేతల పరామర్శ ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, కాపు నాయకుడు అంబటి రాంబాబుపై దాడి, ఇల్లు, కార్యాలయాలపై దాడు లు, విధ్వంసం చేసిన టీడీపీ గుండాలపై ప్ర భుత్వం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) డిమాండ్ చేశారు. జిల్లాకు చెందిన పార్టీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు, నూజివీడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అ ప్పారావు, ఏలూరు కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) పార్టీ నేతల బృందం గురువా రం అంబటి కుటుంబాన్ని పరామర్శించారు. దాడుల ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందనే భరోసా కల్పించారు. ధ్వంసమైన కారు, ఇంటి పరిసరా లు, కార్యాలయాన్ని పరిశీలించారు. పార్టీ నేత లు మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయలేని చంద్రబాబు ప్రభుత్వం శ్రీవారి ల డ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందనే ఆ రోపణలు చేసిందని, అయితే సీబీఐ, సిట్ నివేదికతో సీఎం చంద్రబాబు, పవన్కల్యాణ్ చేసిన ఆరోపణలు అవాస్తవాలు అని తేలిందన్నారు. అలాగే ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. -
వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నేత
ఇరగవరం: రేలంగికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దిరిశిపో రాజేష్ వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆయనకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. అనంతరం గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో కారుమూరి కమిటీలను నియమించారు. పార్టీ బలోపేతం కోసం సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దీనిని బలంగా తీసుకువెళ్లాలన్నారు. కేసులు, దాడులతో ప్రతిపక్ష పార్టీ నాయకులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, మనోధైర్యంతో ముందుకు సాగుదామన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ లేదని సీబీఐ రిపోర్టు ఇవ్వగా, దానిని పక్కదారి పట్టించేలా కూటమి నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీదే అధికారం అని కారుమూరి అన్నారు. పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పులుపు అనిల్, రాష్ట్ర ఎగ్జిక్యూటి మెంబర్ పెన్మెత్స సుబ్బరాజు, మండల ఎస్సీ సెల్ నాయకులు తాతపూడి బోస్, ఉప సర్పంచ్ పులుపు అక్కమాంబ, మండల అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, వడ్డే మార్కండేయులు, మెట్ల కిరణ్మయి మైనం పాము, తణుకు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మోహర్ అన్సారీ, నియోకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు జగన్ తదితరులు పాల్గొన్నారు. -
మూడు బార్ల కేటాయింపు
భీమవరం: జిల్లాలో మద్యం బార్ల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకు రాని పరిస్థితి. నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెంలో 8 బార్లు ఏర్పాటుకు గురువారం లాటరీ నిర్వహించగా మూడు బార్లకు మాత్రమే కేటాయింపులు జరిగాయి. కలెక్టరేట్లో కలెక్టర్ సీహెచ్ నాగరాణి లాటరీ ద్వారా బార్లను కేటాయించారు. నరసాపురం, తణుకు పరిధిలో జనరల్ కేటగిరీలో బార్లకు లాటరీ తీసి నరసాపురం బార్ను అంగర వరప్రసాద్కు కేటాయించారు. రిజర్వ్ వన్ అండ్ టు అభ్యర్థులుగా శ్రీరామకృష్ణ, బొలిశెట్టి నాగ వెంకట సత్యనారాయణ ఎంపికయ్యారు. తణుకు పరిధిలో రెండు బార్లకు రెడ్డి వీర వెంకటరత్నం, జుజ్జువరపు సత్యనారాయణ ఒక్కొక్కరు నాలుగు దరఖాస్తులు చేయడంతో వారిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. తాడేపల్లిగూడెంలో నాలుగు, తణుకులో ఒక బార్కు ఎవరు దరఖాస్తు చేయలేదని కలెక్టర్ చెప్పారు. డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ అధికారి ఆర్వీ ప్రసాద్ రెడ్డి, సీఐలు కె.బలరామరాజు, కళ్యాణ్ చక్రవర్తి, రమేష్, మణికంఠ రెడ్డి, స్వరాజ్యలక్ష్మి పాల్గొన్నారు. భీమవరం: టెన్త్, ఓఎస్ఎస్సీ, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు ఫీజులు చెల్లింపునకు రూ.1,000 పెనాల్టీతో ఈనెల 12 వరకు గడువు పొడిగించినట్టు డీఈఓ ఈ.నారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చిలో నిర్వహించే పరీక్షల ఫీజు చెల్లింపునకు, ఎస్ఆర్ డేటా ఆన్ లైన్కు 12 వరకు గడువు ఇచ్చామన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో అప్సడా రిజిస్ట్రేషన్ను వేగవంతం చేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. భీమవరంలో క్యాంపు కార్యాలయం నుంచి గురువారం అ ప్సడా రిజిస్ట్రేషన్ల ప్రగతిపై మండలాల వారీగా గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ప్రక్రియను ఈనెల 10లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్లో వెనుకబడిన గణపవరం, వీరవాసరం, ఆకివీడు, పాలకొల్లు మండలాల ఎంపీడీఓలు, ఎఫ్డీఓలతో మాట్లాడారు. శ్రద్ధ చూపని రైతులకు నోటీసులు ఇచ్చి అవగాహన కల్పించాలన్నారు. మత్స్యశాఖ జేడీ సురేష్, సహాయ సంచాలకుడు ఎల్ఎల్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. చాట్రాయి: మండలంలోని గుడిపాడులో ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట సిద్ధార్థ స్కూల్, కాలేజీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబో యి రోడ్డు పక్కనున్న పంట బోదెలోకి బోల్తా కొ ట్టింది. దీంతో బస్సులోని ఎనిమిది మంది వి ద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా ఒక విద్యార్థినికి పళ్లు కదిలి ఊడిపోయాయి. క్షతగ్రాతులను విస్సన్నపేటలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటన విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై డి.రామృష్ణ తెలిపారు. వేగంగా బస్సులు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఆకివీడు: పోరాట ఫలితంగా ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు ఎట్టకేలకు విధుల్లోకి హాజరయ్యారు. అనర్హులుగా ఉన్నారని కొందరు కోర్టుకు వెళ్లడంతో 2024 డిసెంబర్ 5న వీరిని తొలగించారు. రాష్ట్రవ్యాప్తంగా బాధితులంతా సుప్రీంకోర్టుకు వెళ్లారు. గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ ద్వారా నియమించిన పో స్టులు కావడంతో వీరిని తొలగించడానికి హక్కు లేదని, పోస్టులు తిరిగి ఇవ్వాలని మూడు నెలల క్రితం కోర్టు తీర్పు ఇచ్చింది. తమ అర్హతలను నిరూపించుకోవడంతో కోర్టు తీర్పు ప్రకారం ఉమ్మడి జిల్లా డీఎంహెచ్ఓ అమృత చేతులమీదుగా 41 మంది బుధవారం రాత్రి జాయినింగ్ ఆర్డర్లు అందుకున్నారు. వీరిలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 21 మంది విధుల్లో చేరేలా గురువారం భీమవరంలో డీఎంహెచ్ఓ గీతాబాయి అనుమతులు ఇచ్చారు. -
పక్కా ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి నిల్
● గృహ నిర్మాణశాఖను వేధిస్తున్న సిబ్బంది కొరత ● ఏఈలు, డీఈలు లేరు ● అన్ని పనులు ఈఈనే చేసుకోవాలి నూజివీడు: రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గంలో గృహ నిర్మాణ శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. వర్క్ ఇన్స్పెక్టర్ల నుంచి ఏఈ, డీఈల వరకు సిబ్బంది కొరతతో ఆశాఖ ఉన్నతాధికారైన ఈఈ సతమతమవుతోన్నారు. గృహ లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేయాలంటే లబ్ధిదారులకు తానే సమాచారం ఇచ్చి వారిని రప్పించి సమావేశాన్ని నిర్వహించుకుంటున్నారు. నూజివీడు డివిజన్లో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, లింగపాలెం, చింతలపూడి మండలాలతో పాటు నూజివీడు మున్సిపాలిటీ, చింతలపూడి నగర పంచాయతీలున్నాయి. ఈ మండలాల్లో జగనన్న కాలనీల్లో గృహాలు త్వరితగతిన నిర్మాణం జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత వర్క్ ఇన్స్పెక్టర్లు, ఏఈలపై ఉంది. అయితే 8 ఏఈ పోస్టులు ఖాళీగా ఉండటంతో గ్రామ, వార్డు సచివాలయాలకు చెందిన ఇంజినీరింగ్ అసిస్టెంట్లను ఇన్చార్జి ఏఈలుగా నియమించి కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వారి రెగ్యులర్ వర్కులకు, సర్వేలు చేసేందుకు ప్రాధాన్యతనిస్తుండటం, గృహ నిర్మాణ శాఖ పనులనుపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో గృహాల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. అంతేగాకుండా పలు వార్డు, గ్రామ సచివాలయాల్లో సైతం ఇంజినీరింగ్ అసిస్టెంట్ల కొరత నెలకొంది. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభించి బేస్మెంట్ లెవెల్ నుంచి రూఫ్ లెవెల్ వరకు పలు స్థాయిల్లో ఉన్న గృహాల నిర్మాణాలను మార్చి నెలాఖరు వరకు పూర్తిచేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలంటే సిబ్బంది లేక ఉన్నతాధికారులు సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం ఎలా చేయాలా అని కూడా తలలు పట్టుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. పట్టణంలో విఽవిధ దశల్లో 957 గృహాలు నూజివీడు పట్టణ పరిధిలో 12 జగనన్న కాలనీ లేఅవుట్లుండగా 2,737 గృహాలను మంజూరు చేయగా వాటిలో 1,401 గృహాలు నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి. మిగిలిన వాటిలో 341 గృహాలకు అసలు నిర్మాణ పనులు ప్రారంభించలేదు. బేస్మెంట్ లెవెల్లో 828 గృహాలు, రూఫ్ లెవెల్లో 129 గృహాలు చొప్పున మొత్తం 957 గృహాల నిర్మాణ పనులను మార్చి నెలాఖరు కల్లా పూర్తిచేయాల్సి ఉంది. దీనికి గాను ఆయా లబ్ధిదారులతో సమావేశాలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల్లో చైతన్యం తీసుకువచ్చి నిర్మాణం జరుపుకునేలా చేయాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత వేధిస్తుండటంతో పనులు ఏమీ జరగడం లేదు. ఈఈ ఒక్కరే లబ్ధిదారులకు సమాచారం ఇవ్వడం, సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించి గృహాలను నిర్మించుకునేలా చైతన్యపరచడం, ఉన్నతాధికారులు నిర్వహించే టెలీ కాన్ఫరెన్స్లు, సమావేశాలకు హాజరవ్వడం వంటి పనులతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో రెగ్యులర్ సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డివిజన్లో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వ లక్ష్యాల మేరకు పనిచేస్తున్నాం. వచ్చే నెలాఖరు నాటికి పట్టణంలో 957 గృహాల నిర్మాణాన్ని పూర్తిచేయాలని లబ్ధిదారులను చైతన్య పరుస్తున్నాం. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు ప్రభుత్వం అదనంగా అందిస్తున్న సాయాన్ని సైతం తెలియజేసి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. – మూడు రామోజీ నాయక్, హౌసింగ్ ఈఈ, నూజివీడు -
అటకెక్కిన కార్పొరేషన్ రుణాలు
భీమవరం(ప్రకాశం చౌక్): ఎన్నికల హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేషన్ రుణాల పేరిట హడావుడి చేసి తీరా నిధుల విడుదల చేయకుండా జాప్యం చేస్తోంది. బీసీ, కాపు తదితర కార్పొరేషన్ల ద్వారా అర్హులైన యువతకు రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రుణంలో 50 శాతం సబ్సిడీ ప్రభుత్వం భరిస్తుందని దరఖాస్తులు స్వీకరించి ఇంటర్వ్యూలు సైతం చేశారు. ఇదంతా జరిగి దాదాపు ఏడాది కావస్తుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం కనీసం ఇంటర్వ్యూలు కూడా నిర్వహించలేదు. అయినా ఇప్పటికీ రుణాల ఊసెత్తకపోవడంతో దరఖాస్తుదారులు ఎన్నాళ్లీ ఎదురుచూపులు అంటూ నిట్టూరుస్తున్నారు. మరోసారి కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయామంటూ రుణాలపై ఆశలు వదులుకుంటున్నారు. నిధుల ఊసేది? కార్పొరేషన్ రుణాలకు సంబంధించి ప్రభుత్వం సబ్సిడీ 50 శాతం సొమ్మును బ్యాంకులకు విడుదల చేస్తే మిగిలిన 50 శాతం కలిపి బ్యాంకులు లబ్ధిదారులకు రుణంగా మంజూరు చేస్తాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకూ రుణాలకు సంబంధించిన సబ్సిడీ సొమ్ములు విడుదల చేయలేదు. దీంతో బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనుకాడుతున్నాయి. వచ్చిన దరఖాస్తులు బ్యాంకుల్లో మూలన పడ్డాయి. 79 వేల మందికి పైగా.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో బీసీ, ఎస్సీ, కాపు తదితర కార్పొరేషన్ల రుణాల కోసం ఏలూరు జిల్లాలో 40,156, పశ్చిమగోదావరిలో 38,893 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా బీసీ కార్పొరేషన్కు ఏలూరులో 21,838, పశ్చిమగోదావరిలో 17,686 దరఖాస్తులను స్వీకరించారు. పచ్చ నేతల సమక్షంలోనే.. ఉమ్మడి జిల్లాలో బీసీ, కాపు కార్పొరేషన్ రుణాలకు సంబంధించి ఇంటర్వ్యూలు కూటమి నాయకులు ముఖ్యంగా తెలుగుదేశం నేతల సమక్షంలోనే జరిగాయి. 90 శాతం యూనిట్లను కూటమికి చెందిన, కూటమి నాయకులు సిఫార్సు చేసిన వారికి మంజూరు చేసేలా బ్యాంకు మేనేజర్లపై ఒత్తిళ్లు కూడా చేశారు. మీకు రుణం రాదంటూ పలువురు అర్హులైన అభ్యర్థులను టీడీపీ శ్రేణులు ఆందోళనకు కూడా గురిచేశాయి. ఇంతా హడావుడి చేసి రుణాలు మంజూరు చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. నిధుల కేటాయింపు.. మళ్లింపు 2024–25 బడ్జెట్లో బీసీ, కాపు కార్పొరేషన్ రుణాలకు సబ్సిడీ నిధులు కేటాయించామని నాడు విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు. అయితే నిధులను ప్రభుత్వం బ్యాంకులకు రిలీజ్ చేయకుండా మళ్లించిందనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి నిమ్మల తీరు మరీ విడ్డూరం చంద్రబాబు సబ్సిడీ రుణాలు అందిస్తారంటూ ప్రచారం చేసిన జిల్లా మంత్రి నిమ్మల రామానాయుడు ఒక్క అడుగు ముందుకు వేసి మరీ పాలకొల్లులో లబ్ధిదారులకు సబ్సిడీ రుణాల చెక్కు సైతం అందించారు. తీరా లబ్ధిదారులకు బ్యాంకులకు వెళితే అసలు నిజం తెలిసింది. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సబ్సిడీ నిధులు విడుదల చేయలేదని తెలుసుకుని ప్రభుత్వ తీరుపై ముక్కున వేలేసుకున్నారు. జిల్లాలో మంత్రి నిమ్మల, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు ఉన్నా కార్పొరేషన్ రుణాల ఊసే ఎత్తడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీలకు మొండిచేయి చూపింది. ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం 9 నెలల క్రితం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం కనీసం ఇంటర్వ్యూలు కూడా నిర్వహించలేదు. ఏలూరు జిల్లాలో 111 యూనిట్లకు 6,826, పశ్చిమగోదావరి జిల్లాలో 742 యూనిట్లకు 3,181 దరఖాస్తులు వచ్చాయి. ఎన్నాళ్లీ ఎదురుచూపులు? ఊసేలేని బీసీ, ఎస్సీ తదితర కార్పొరేషన్ల రుణాలు దరఖాస్తులు స్వీకరించి ఏడాది విడుదల కాని నిధులు.. నిలిచిన యూనిట్లు బడ్జెట్లో కేటాయించిన సొమ్ములు మళ్లింపు! రుణాల పేరుతో చంద్రబాబు సర్కారు మోసం ఉమ్మడి జిల్లాలో 79 వేలకు పైగా దరఖాస్తులు -
రూ.4.94 లక్షల విలువైన పీడీఎస్ రైస్ పట్టివేత
తణుకు అర్బన్: తణుకులో అక్రమంగా నిల్వచేసిన పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలోని షెడ్డులో పట్టణానికి చెందిన కొల్లి బాబు నిల్వ ఉంచిన 12 టన్నుల బియ్యంతోపాటు ఒక వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. ముందుగా హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని గోస్తనీ కాలువ గట్టు రోడ్డులో వ్యాన్ ద్వారా రవాణా చేస్తున్న బియ్యాన్ని అధికారులు గుర్తించి ఆరా తీసి విచారణలో భాగంగా ఒక షెడ్డులో బియ్యం నిల్వలను గుర్తించారు. రూ.4,94,520 విలువైన 7,363 టన్నుల రేషన్ బియ్యం (12,363 కిలోలు)తోపాటు వ్యాన్ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తణుకు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో పీడీఎస్ బియ్యాన్ని సేకరించి కాలనీలోని షెడ్డులో నిల్వచేసి పెద్ద మొత్తంలో తూర్పుగోదావరి జిల్లాకు తరలిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. నిర్వాహకుడు కొల్లి బాబుపై 6 ఏ కేసు నమోదుచేసినట్లు తణుకు తహసీల్దార్ కార్యాలయ డీటీ శ్రీదేవి తెలిపారు. నూజివీడు: విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించాలనే లక్ష్యంతో ‘విద్యార్థులు–నైతిక విలువలు’ అనే అంశంపై ఈనెల 8న నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రిపుల్ ఐటీలోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. దీనిలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు పాల్గొని ఉపన్యసిస్తారన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్, ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య కొత్తా మధుమూర్తి, ఉప కులపతి ఆచార్య ఎం విజయ కుమార్ హాజరుకానున్నారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): స్థానిక పాతూరు తాడేపల్లి చెరువులో ఇటీవల వ్యర్థాలు, చెత్త చెదారాలు, ఎండిపోయిన ఆకులు, గడ్డి, గుర్రపు డెక్క బాగా పేరుకుపోయాయి. గురువారం సాయంత్రం అవి అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ ఆఫీసర్ కేవీ మురళీ కొండబాబు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు ఎగిసిపడటంతో చెరువును ఆనుకుని ఇళ్లు నిర్మించుకున్న స్థానికులు ఆందోళన చెందారు. మంటలు అదుపులోకి రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. తాడేపల్లిగూడెం రూరల్: కుమార్తైపె అఘాయిత్యానికి పాల్పడిన తండ్రికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నీలాద్రిపురం గ్రామానికి చెందిన సురగాని రంగారావు, అతని తమ్ముడు సురగాని బుచ్చిరాజు కలిసి కుమార్తైపె అఘాయిత్యానికి పాల్పడ్డారని తల్లి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన 2022 సంవత్సరంలో చోటు చేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను ఏలూరు ఓపెన్ కోర్టులో హాజరుపర్చగా, బాలిక తండ్రి రంగారావుపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు విధించడంతో రూ.10వేలు జరిమానా విధించారు. దీనితో, పాటు బాలికకు ముద్దాయి రూ.2 లక్షలు, ప్రభుత్వం రూ.3 లక్షలు చెల్లించాలని మేజిస్ట్రేట్ తీర్పునిచ్చినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. తాడేపల్లిగూడెం రూరల్: కొట్లాట కేసులో నలుగురికి జరిమానా విధించినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. మండలంలోని జగన్నాథపురం గ్రామంలో 2021 ఫిబ్రవరి 23వ తేదిన కొట్లాట, గొడవ జరిగింది. అప్పట్లో అడ్డాల సూర్యచంద్రరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులు రాటాల సత్యనారాయణ, రాటాల వీరవెంకట మణికంఠ దుర్గావరప్రసాద్, రాటాల వెంకట దుర్గారావు, రాటాల నారాయణస్వామిలకు ఒక్కొక్కరికీ రూ.11 వేలు చొప్పున మొత్తం రూ.44 వేలు జరిమానా విధిస్తూ రెండవ అదనపు మొదటి తరగతి కోర్టు జడ్జి అన్నామణి తీర్పు వెల్లడించారన్నారు. విచారణకు ఏపీపీ ఎ.రవిప్రసాద్, కోర్టు కానిస్టేబుల్ ఎస్.సుబ్బారావు సహకరించినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. -
ఎవరెస్టు ఎక్కేటంత సంకల్పం
● లడక్లో ట్రెక్కింగ్ ట్రైనింగ్ పూర్తి చేసిన కలిదిండి ఎస్సై ● 2027లో ఎవరెస్టు ఆధిరోహణకు సన్నాహాలు కై కలూరు: ఖాకీలంటే కాఠిన్యం కాదని, ఎవరెస్టు ఎక్కే అంత సంకల్పానికి సైతం నెరవకుండా ముందుకెళతారని నిరూపిస్తున్నారు ఏలూరు జిల్లా కలిదిండి ఎస్సై వి.వెంకటేశ్వరరావు. గణపవరం ప్రాంతం నుంచి ఆయన రెండేళ్ల క్రితం కలిదిండి ఎస్సైగా విధుల్లో చేరారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎవరెస్టు అధిరోహణ ముందస్తు సన్నాహాల్లో భాగంగా జనవరి 21న ఆయన లడక్లో ట్రెక్కింగ్కు వెళ్లారు. నేపాల్కు చెందిన ట్రైనర్ దేవదాయసర్ ఆధ్వర్యంలో 12 రోజులు మైనస్ 25 డిగ్రీల సెల్సియస్లో 5 వేల మీటర్ల ఎత్తు వరకు వెళ్లారు. ట్రైనింగ్ పూర్తి చేసుకుని తిరిగి కలిదిండిలో ఎస్సైగా విధుల్లో చేరారు. ఆయన సాహసోపేత నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తూ ఎస్సైకు అభినందనలు తెలిపారు. ఎవరెస్టు శిఖరాన్ని 2027 అధిరోహించడానికి ప్రణాళికతో శిక్షణ పొందుతున్నాను. లడక్ శిక్షణ ముందు భువనగిరిలో రాక్క్లైమింగ్లో శిక్షణ తీసుకున్నాను. ఇప్పుడు శరీరంపై 15 కేజీల బరువుతో ట్రెక్కింగ్ చేయగలుగుతున్నాను. పోలీసుశాఖ నుంచి ఎవరెస్టు అధిరోహించి జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ధృడసంకల్పంతో ఉన్నాను. ఖర్చుతో కూడినది కావడంతో దాతలు ముందుకొస్తారని భావిస్తున్నాను. – వి.వెంకటేశ్వరరావు, ఎస్సై, కలిదిండి -
విద్యాంజలి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని 1,728 పాఠశాలలు విద్యాంజలి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పాఠశాలలకు కావాల్సిన అవసరాలను విద్యాంజలి పోర్టల్లో నమోదు చేయాలని సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ కే. పంకజ్ కుమార్ సూచించారు. గురువారం స్థానిక ఈదర సుబ్బమ్మ దేవి మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి విద్యాంజలి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాఠశాలలకు అవసరమైన సదుపాయాలను సర్వీస్ రూపంలో, వస్తు రూపంలో అవసరాలుగా నమోదు చేయాలని సూచించారు. విద్యాంజలి కార్యక్రమం ద్వారా ప్రతి పాఠశాలకు అవసరమైన సదుపాయాలు దాతల ద్వారా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాంజలి పోర్టల్ ద్వారా వాలంటీర్గా పాఠశాలల్లో సర్వీస్ చేయడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులను ప్రోత్సహించి రిజిస్ట్రేషన్ చేసేటట్టు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యాంజలి కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 7వ తేదీన జిల్లాలోని అన్ని మండలాల్లో ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని, వాటికి అవసరమైన నిధులు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, ఎన్న్జీవోలు, ఎస్ఎంసీ సభ్యులు, రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చారు. అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ రెడ్డి రామారావు, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ యెహోషువ, ఆల్టర్నేటివ్ స్కూల్ కోఆర్డినేటర్ ఎస్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కబ్జా కోరల్లో గ్రంథాలయ భవనం?
● జేసీబీతో కొంత భాగం పడగొట్టిన వైనం ● పోలీసులకు ఫిర్యాదు చేసిన సెక్రటరీ, లేదంటున్న పోలీసులు తణుకు అర్బన్: మండపాక గ్రంథాలయ భవనాన్ని కబ్జా చేసేందుకు ఆక్రమణదారులు యత్నించారు. పంచాయితీ కార్యాలయం సరిహద్దుకు చేర్చి ఉన్న గ్రంథాలయ భవనం చాలా కాలంగా శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారింది. దీంతో ఆ భవన స్థలంపై కన్నేసిన అక్రమార్కులు ఈనెల 2వ తేదీన రాత్రి సమయంలో జేసీబీని తీసుకువచ్చి భవనం కూల్చివేత పనులు చేస్తుండగా స్థానికులు, అధికారులు అడ్డుకోవడంతో పనులు నిలిపివేశారు. ఈ ఘటనపై పంచాయితీ సెక్రటరీ శేఖర్ తణుకు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు. విలువైన స్థలం మండపాక నడిబొడ్డు, కాలువ పక్కనే ఉన్న ఈ గ్రంథాలయ భవనం అత్యంత ఖరీదైన భూమిగా స్థానికులు చెబుతున్నారు. సుమారుగా 200 గజాల్లో ఉండే ఈ భవనం చాలా కాలంగా నిరుపయోగంగా ఉండడంతో ఆ స్థలంపై కన్నేసిన వారు పడగొట్టి కలుపుకునే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ఈ స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా భవనాన్ని కొంతమేర పడగొట్టారని సమాచారం. ఈ వ్యవహారంలో పంచాయతీ సెక్రటరీ శేఖర్ తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశానని మీడియాకు తెలిపారు. అయితే తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ రైటర్ శ్రీనివాస్ మాత్రం సెక్రటరీ ఫోన్ ద్వారా తెలిపారే కానీ ఇంతవరకు ఎటువంటి రాతపూర్వకంగా ఫిర్యాదుచేయలేదని చెబుతుండడం వివాదాస్పదంగా మారింది. కేసు పెట్టానని సెక్రటరీ అనడం, లేదని పోలీసులు చెబుతుండడం వెనుక ఏదో అదృశ్య శక్తి ఉందని, ఈ స్థలం ఎవరికీ కలుస్తుంది, దీని వెనుక ఎవరున్నారనే విషయం తేలాల్సి ఉంది. గ్రామంలో అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు దీని వెనుక ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి. -
మోగనున్న పెళ్లి బాజాలు
తణుకు అర్బన్: మూడుముళ్లతో ఏడడగులు నడుస్తూ అగ్ని సాక్షిగా వేదమంత్రోచ్ఛరణతో ఏర్పడే వివాహ బంధం కోసం ముహుర్తాలు ముంచుకొచ్చే వేళ దగ్గరపడింది. నిండు నూరేళ్లు విడదీయలేని జన్మజన్మల బంధాన్ని కలిపే మంచి ముహూర్తం కోసం వధూవరులు ఉవ్విళ్లూరుతున్నారు. ముహూర్తాల జాతర మూఢం అనంతరం వివాహాల వేడుకకు పండితులు ముహుర్తాలు సిద్ధం చేశారు. గత నాలుగు నెలలుగా ముహూర్తాలు లేకపోవడంతో కల్యాణాలు పెండింగ్లో పడ్డాయి. ఈనెల 17వ తేదీతో మూఢం ముగుస్తుండడంతోపాటు 2026 ఏడాది పొడవునా ముహూర్తాల జాతర ఉన్న నేపథ్యంలో వేల సంఖ్యలో వివాహాలు జరిగే పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి. ఇప్పటికే కల్యాణ మండపాల కోసం వధూవరుల పెద్దలు వెతుకులాట చేపట్టారు. భారీ స్థాయిలో ముహుర్తాలు ఉన్న సందర్భంగా ఆలయాలు, కల్యాణ మండపాలు బుకింగ్ చేసుకుంటున్నారు. ముహూర్తం ఫిక్స్ అవ్వకపోయినా ముందస్తుగానే కల్యాణ మండపాలకు సిఫార్సులతో బుకింగ్లు చేసేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో సుమారుగా మూడు వేలకు పైగా వివాహాలు జరగనున్నట్లు పండితులు చెబుతున్నారు. ఈనెల 20 నుంచి కల్యాణ వైభోగం ఈ ఏడాదిలో ఫిబ్రవరి నెలలో ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. ఏడాది పొడవునా శుభ ముహూర్తాలు ఉండడంతోపాటు ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అధిక సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 20, 21, 24, 25, 26 తేదీల్లోను, మార్చిలో 1, 3, 4, 7, 8, 9, 11, 12 తేదీల్లోను, ఏప్రిల్లో 15, 20, 21, 25, 26,27, 28, 29 తేదీల్లోను, మే లో 1, 3, 7, 11 తేదీల్లోను, జూన్లో 21, 22, 23, 24, 25, 26, 27, 29, తేదీల్లోను, జూలైలో 1, 6, 7, 11 తేదీల్లోను, నవంబరులో 21, 24, 25, 26, 27, 30 తేదీల్లోను, డిసెంబరులో 1, 2, 3, 4, 6, 11, 12, 13 తేదీల్లో అధిక సంఖ్యలో పెళ్లిళ్లు ఉండనున్నాయి. కల్యాణ మండపాలకు డిమాండ్ రానున్న శుభ ముహూర్తాలకు కల్యాణ మండపాలు, హోటళ్లకు డిమాండ్ నెలకొంది. జిల్లాలో వందకుపైగా ఉన్న కల్యాణ మండపాల్లో భారీగా వివాహాలు జరిగేందుకు సిద్ధంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే కల్యాణ మండపాలు ముందస్తు బుకింగ్లు అయిపోయాయి. మండపం స్థాయిని బట్టి రూ.50 వేలు నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతున్నట్లుగా తెలుస్తోంది. గిరాకీగా అనుబంధ వ్యాపారాలు పెళ్లిళ్ల కోసం జిల్లాకు వచ్చే బంధువులు, అతిథుల కోసం లాడ్జీలు, హోటళ్లు సైతం ముహుర్తాలున్న తేదీల్లో బుక్ అవుతున్నాయి. ఇక పెళ్లిళ్లకు అత్యంత ముఖ్యమైనది డెకరేషన్. వీటిలో ఫ్లవర్ డెకరేషన్కు రూ.30 వేలు నుంచి రూ.5 లక్షల వరకు ధరలు పలుకుతుండగా, జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా, కడియం ప్రాంతంతోపాటు చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి సైతం తాజా పూల రకాలను తెప్పిస్తారు. సినీ హంగులతో భారీ సెట్టింగ్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మూఢం కారణంగా గిరాకీ లేకుండా ఖాళీగా ఉన్న ఫొటోగ్రాఫర్లకు డిమాండ్ పెరగనుంది. వీడియో గ్రాఫర్స్, మిక్సింగ్ యూనిట్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. సుమారుగా రూ.50 వేలు నుంచి లక్షల్లో బేరాలు జరుగుతున్నాయి. పురోహితులకు క్రేజ్ వివాహాల ముహూర్తాలు దగ్గరపడడంతో పురోహితులు కూడా ముందస్తుగానే బుక్ అయిపోతున్నారు. వారికి కూడా విపరీతమైన డిమాండ్ నెలకొంది. అలాగే మంగళ వాయిద్యాలు వాయించే భజంత్రీలు, ఆర్కెస్ట్రాలు, ట్రావెల్స్కు సైతం కార్లు, బస్సుల కోసం ముందస్తుగానే రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. షామియానా వ్యాపారాలు కూడా ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా క్యాటరింగ్ సంస్థలు బిజీగా ఉండనున్నాయి. క్యాటరింగ్ కార్మికులకు డిమాండ్ పెరిగింది. మూఢం కారణంగా గత నాలుగు నెలలుగా పెళ్లి ముహుర్తాలు లేవు. ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి మొదలవుతున్న ముహుర్తాలు ఏడాది పొడవునా ఉన్నాయి. ఈ ఏడాది ప్రతి మాసంలోనూ ముహుర్తాలు ఉండడంతోపాటు భారీ ముహుర్తాలు ఉండడంతో వేల సంఖ్యలో పెళ్లిళ్లు సంబరంలా జరుగుతాయి. వివాహాలకు అనుబంధంగా ఉండే వ్యాపారాలు ఆశాజనకంగా ఉండే పరిస్థితి ఉంది. – తంగిరాల ప్రదీప్ సిద్ధాంతి, శ్రీపంచముఖి హనుమద్ పీఠం, ఇరగవరం ఈనెల 20 నుంచి ముహూర్తాలు ఏడాది పొడవునా ముహూర్తాల జాతర వేల సంఖ్యలో జరగనున్న కల్యాణాలు పెళ్లి మండపాలకు, ఫొటోగ్రాఫర్లకు, పురోహితులకు గిరాకీ -
అదరగొట్టిన ఆంధ్రా జట్టు
ఏలూరు రూరల్: అంధుల క్రికెట్ పోటీలో ఆంధ్ర జట్టు విజయం సాదించింది. తెలంగాణ జట్టుపై 2 వికెట్ల తేడాతో గెలిచింది. బుధవారం ఏలూరు ఆశ్రం వైద్య కళాశాల ఆవరణలో అంధుల టి20 క్రికెట్ పోటీ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు నిర్ణీత ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. బ్యాట్స్మెన్ ఏ రవి 118 పరుగులతో సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. లక్ష్య ఛేదనకు దిగిన తెలంగాణ జట్టు 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. హతిక్ 75 పరుగులతో రాణించాడు. మూడు మ్యాచ్ల సీరిస్లో భాగంగా ఆశ్రంలో మొదట మ్యాచ్ జరిగింది. పోటీల ప్రారంభోత్సవంలో ఆశ్రం సీఈఓ డాక్టర్ కె హనుమంతురావుతో పాటు సంగీత్ దర్శకుడు సందీప్రాజ్ క్రీడాకారులను అభినందించారు. పోటీలకు సహకరించిన ఆశ్రం యాజమాన్యానికి క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్బాబు, నిర్వాహకులు కె మధన్, జయరాజు ధన్యవాదాలు తెలిపారు. అంధుల క్రికెట్లో పైచేయి -
జింకు లోపం.. రైతులకు శాపం
● పసుపు, ఎరుపు రంగుల్లో వరి ఆకులు ● లబోదిబోమంటున్న రైతులుఆకివీడు: రబీ సాగులో జింక్ లోపం అధికంగా కనిపిస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వివిధ గ్రామాల్లోని వరి నాట్లు వేసిన కొద్ది రోజులకే మొక్కలు లేత ఆకుపచ్చ రంగులోకి వచ్చి, తుప్పు మచ్చలు కలిగి ఉంటున్నాయని వాపోతున్నారు. జింకు లోపాల లక్షణాలు, నివారణ చర్యలను ఆకివీడు ఏడీఏ ప్రతాప్ జీవన్ వివరించారు. నీటిలో సెలనిటీ ప్రభావం, వాతావరణ ప్రభావం వంటి వాటిద్వారా జింక్ధాతులోపం ఏర్పడుతుందన్నారు. జింక్ లోపానికి రైతులు ఇష్టానుసారం మందులు పిచికారీ చేయడం వల్ల ఇతర నష్టాలకు గురికావలసి వస్తుందంటున్నారు. రబీ సాగు అనంతరం వరి చేలల్లో జీలుగ సాగు చేసి, పచ్చిరొట్ట దుక్కిదున్నడం, దమ్ములో కలియదున్నడంతో భూమికి పోషకాలు అందుతాయని తెలిపారు. భూమిలో అనేక థాతువులు పుట్టుకువచ్చి వరి మొక్కకు రోగనిరోధక శక్తిని పెంచుతాయన్నారు. ఈ విధంగా రైతులు పచ్చిరొట్ట సాగు చేయకపోవడంతో వరికి అనేక రకాల తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయని, దీంతో రైతుల అధిక పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. జింక్ లోపం లక్షణాలు జింకులోపం కలిగిన మొక్కలపై లేత పసుపు రంగు కలిగిన ఆకులు, లోపల ముదురాకు రంగులుంటాయి. తుప్ప(ఎర్ర) మచ్చలుంటాయి. ఆకులు చిన్నవిగా, పెలుసుగా ఉండి విరిగిపోతాయి. మొక్క గిడసబారిపోతుంది. దుబ్బులు చేయకుండా ఉంటాయి. ఈ లక్షణాలున్న చేలల్లో కాంప్లెక్స్ ఎరువులు, నత్రజని ఎరువులు వాడినా ఫలితం ఉండదు. నివారణ చర్యలు జింకులోప నివారణకు కొద్ది రోజులు కాంప్లెక్స్, నత్రజని ఎరువుల వాడకాన్ని ఆపాలి. జింక్ 12 శాతం కలిగిన ఈడీటీఏ ఒకలీటరు నీటికి 2 గ్రాములు కలిపి, 200 లీటర్ల మందు ద్రావణాన్ని 5 నుంచి 7 రోజుల వ్యవధిలో మూడు పర్యాయాలు చల్లాలి. జింక్ స్ప్రేయింగ్ చేసే సమయంలో మొక్క బాగా తడిసే విధంగా చర్యలు చేపట్టాలి. నీరు పలచగా ఉండే విధంగానూ, పొలాన్ని ఆరబెట్టాలి. -
తేనెటీగల పెంపకంతో స్వయం సమృద్ధి
తాడేపల్లిగూడెం: ఆదాయ వనరుగా తేనెటీగల పెంపకాన్ని ఎంచుకుంటే ఆర్థిక స్వయం సమృద్ధి సాధించవచ్చని వక్తలు పేర్కొన్నారు. వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న తేనెటీగల పెంపకం శిక్షణ ముగింపు కార్యక్రమం బుధవారం ముగిసింది. ఏడు రోజుల పాటు సాగిన శిక్షణలో తేనెటీగల పెంపకంలో జాగ్రత్తలు, ఎలాంటి ప్రాంతాల్లో పెంచాలి, మెళకువలు ఎలా తీసుకోవాలనే విషయాలను విశదీకరించారు. విస్తరణ సంచాలకులు డాక్టర్ రూత్ మాట్లాడుతూ రైతులు, ఆకాంక్ష కలిగిన వారు ఇలాంటి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు తేనెటీగల పెంపకాన్ని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలన్నారు. తేనెటీగల నుంచి తేనెతో పాటు మైనం, ఇతర ఉప ఉత్పత్తులు వస్తాయన్నారు. సంప్రదాయ పెంపకం గానే కాకుండా, వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. శిక్షణలో నేర్చుకున్న శాసీ్త్రయ అంశాలను వ్యవసాయ కార్యకలాపాల్లో వినియోగించుకోవాలన్నారు. కేవీకె సమన్వయకర్త డాక్టర్ పి.విజయలక్ష్మి, శాస్త్రవేత్తలు డాక్టర్ ఇమ్మానియేల్, డాక్టర్ ఆదర్శ, డాక్టర్లు ఉదయశ్రీ, బి.పెదబాబు పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్లను అందజేశారు. -
అవమానం తట్టుకోలేక యువతి ఆత్మహత్య
తాడేపల్లిగూడెం: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసచేయడంతో పాటు, అతని కుటుంబం చేసిన అవమానం తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన బండారు సురేష్ కుమార్, ఏలూరు జిల్లా మండవల్లి మండలం లోకుమూడిగరువు ప్రాంతానికి చెందిన తమ్మిరెడ్డి వసంత (22) విజయవాడలోని లింగయ ఇనిిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇద్దరికి ఏర్పడిన పరిచయం కాస్తా, ప్రేమగా మారింది. దీంతో వసంత దగ్గర నుంచి సురేష్కుమార్ రూ.లక్ష తీసుకున్నాడు. ఆ తరువాత పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు. దీంతో ఈ నెల ఒకటో తేదీన వసంత గూడెం వచ్చి అతని ఇంటికి వెళ్లగా సురేష్ కుమార్, తల్లి సూర్యప్రభ ఆమెను దుర్భాషలాడుతూ కొట్టారు. దీంతో అవమానం తట్టుకోలేక వసంత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలుసుకున్న ఆమె బంధువులు ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. దీనిపై వసంత సోదరి స్వప్న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ ఇన్చార్జి సీఐ బీబీ రవికుమార్ పర్యవేక్షణలో ఎస్సై పి.నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం
భీమవరం: అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, దేశ ప్రయోజనాలకై ఐక్యంగా పోరాడుదామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక డా.బీఆర్.అంబేద్కర్ భవనంలో సీపీఎం ఆధ్వర్యంలో అమెరికా ట్రంప్ సుంకాలు, యుద్దోన్మాదం, ప్రపంచ శాంతి, సవాళ్లు అంశంపై సదస్సు జరిగింది. సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ అధ్యక్షత వహించిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా శ్రీనివాసరావు మాట్లాడారు. అమెరికా ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చలాయించాలని చూస్తోందని ఆరోపించారు. గతంలో అమెరికా సుంకాలు 5 శాతం మాత్రమే ఉండేవని, నేడు 18 శాతం పెంచిందన్నారు. ఇప్పటికే అమెరికా పేటెంట్ పేరుతో కోట్ల రూపాయలు ప్రపంచ దేశాల నుంచి దోచేస్తున్నారని గుర్తుచేశారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా, దేశ ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పక్షాలు ఒకే వేదిక పైకి వచ్చి మోడీని ప్రశ్నించాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కొనాల భీమరావు, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, అంకెం సీతారాం, బి.బలరాం, దండు శ్రీనివాసరాజు, మెంటే పార్థసారథి, బి.వాసుదేవరావు, కేతా గోపాలన్, కర్రినాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
భీమవరం: పదో తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో పదో తరగతి పరీక్షల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుఫై బుధవారం ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కచ్ఛితంగా అమలు చేయాలన్నారు. పాఠశాలలకు విద్యార్థులు సక్రమంగా హాజరయ్యేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నది తల్లిదండ్రులు గమనించాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, ఎంతమంది రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్ ఉన్నారు, మార్కులు ఎలా వస్తున్నాయి అనే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ పరిశీలన చేశారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల హాజరు, సబ్జెక్టుల వారీగా పురోగతిపై మండలాల వారీగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, డిప్యూటీ విద్యాశాఖ అధికారులు ఎన్.రమేష్, ఎం.మురళి సత్యనారాయణ, ఎంఈఓలు, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
సాగునీటి చెరువుల్లో మట్టి అక్రమ రవాణా
కొయ్యలగూడెం: యర్రంపేట–రాజవరం గ్రామాల మధ్య ఉన్న పులపాకుల చెరువు నుంచి బుధవారం మట్టి అక్రమ తరలింపు యథేచ్ఛగా కొనసాగింది. ఇప్పటివరకు రాత్రి వేళల్లో కొనసాగించిన మట్టి రవాణాపై సంబంధిత శాఖాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులు పట్టపగలే రెచ్చిపోయారు. దీంతో రైతులకు మట్టి తోలకందార్లకు వాగ్వివాదం చోటుచేసుకుంది. మట్టి తోలకాలతో చెరువు గర్భం నాశనం అవుతుందని, భారీ గోతులు ఏర్పడి పశువులకు ప్రమాదకరంగా మారుతున్నాయని అక్రమార్కులతో ఘర్షణకు దిగారు. అంతేకాకుండా చెరువు నుంచి ఖరీఫ్ సీజన్లో పంట పొలాలకు సాగునీరు అందించే కాలువ గట్లు, కళింగ ప్రాంతం ధ్వంసమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుదకు తాము అనుకున్న కాడికి మట్టి తోలకలు పూర్తి అయిన తర్వాత జేసీబీలను, టిప్పర్లను తరలించుకు వెళ్లారని తతంగమంతా గంటల తరబడి ఉన్నప్పటికీ అధికార గణం అటువైపు చూడలేదని రైతులు ఆరోపించారు. -
నైపుణ్యాలతోనే ఉద్యోగాలు
ఏలూరు (టూటౌన్): నైపుణ్యాలతో యువత ఉద్యోగాలు సాధించి తమ జీవితాలను మెరుగు పర్చుకోవాలని సీడాప్ సీఈఓ పి.నారాయణ స్వామి పిలుపునిచ్చారు. పరిశీలనలో భాగంగా ఆయన బుధవారం ఏలూరు జిల్లాలోని పలు శిక్షణా కేంద్రాలను సందర్శించారు. అనంతరం ఏలూరులో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సందర్శనలో భాగంగా సీడాప్–డీడీయూజికేవై ఆధ్వర్యంలో నడుస్తున్న వివాస్, సీడాప్, ముండ్రు ఇన్ఫ్రా ప్రాజెక్టు, భూమిక మహిళా గిరిజన సొసైటీ శిక్షణ కేంద్రాలను ఆయన పరిశీలించారు. శిక్షణా కేంద్రంలోని మౌలిక సదుపాయాలు, వసతి, భోజన సౌకర్యాలను స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. శిక్షణ నాణ్యతను అంచనా వేసే క్రమంలో ప్రాక్టికల్ ల్యాబ్లను సందర్శించిన నారాయణ స్వామి, తంగెళ్ళమూడిలోని డీడీయూజికేవై శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న శిక్షణార్ధులకు యూనిఫార్మ్లు, వెల్కమ్ కిట్లను పంపిణీ చేశారు. స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ రాధాకృష్ణ, వి.సురేష్, జేడీఎం, డీఆర్డీఏ పీడీ టీవీ విజయలక్ష్మి పాల్గొన్నారు. నరసాపురం: ట్రాఫిక్ నిభంధనలు ఉల్లంఘించిన ఆరుగురు యువకులకు కోర్టు ఉత్తర్వుల ప్రకారం డీఎస్పీ డాక్టర్ శ్రీవేద ఆధ్వర్యంలో బుధవారం నరసాపురం అంబేడ్కర్ సెంటర్లో సామాజిక శిక్ష అమలు చేశారు. శిక్షపడ్డ వారిలో నలుగురిచే మైక్లో ట్రాఫిక్ నిబంధనలు చదివించారు. మరో ఇద్దరిచే ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మూడు గంటల పాటు ఈ కార్యక్రమం సాగింది. పట్టణ పరిధిలో ట్రాపిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఆరుగురు వ్యక్తులను నరసాపరం మేజిస్ట్రేట్ కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా భారతీయ న్యాయ సంహిత నూతన నిబంధన సెక్షన్ 4(ఎఫ్) కింద వారికి సామాజిక సేవ శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చారని డీఎస్పీ చెప్పారు. ఒక్కొక్కరికి రూ.200 జరిమానాతో పాటు, బస్టాండ్ ఏరియా వంటి రద్దీ ప్రాంతాల్లో పోలీసులతో కలిసి మూడు గంటల పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విధుల్లో పాల్గొనాలని కోర్టు ఆదేశించిందని తెలిపారు. దీంతో శిక్షను అమలు చేసినట్టు వివరించారు. సీఐ బి.యాదగిరి తదితరులు పాల్గొన్నారు. తణుకు అర్బన్: తణుకు రైల్వే అవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సుమారు 45 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి పైడిపర్రు డ్రైవర్స్ కాలనీ సమీపంలో రైలు పట్టాలపై పడి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందజేశారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా తల భాగం నుజ్జుయింది. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడా అనేది తెలియాల్సి ఉంది. రైల్వే ఎస్సై సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసినవారు 99084 48729, 90140 99132 నంబర్లలో సమాచారం ఇవ్వాలని కోరారు. మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. పాలకొల్లు సెంట్రల్: పోడూరు మండలం కవిటం శివారు ప్రాంతం నల్ల వెంకయ్య చెరువు ఏరియాలో 50 క్వింటాళ్లు పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ ఎస్సై కే సీతారాములు తెలిపారు. బుధవారం మండలంలో తనిఖీలు చేయగా గ్రంది కేశవరావు కిరాణా షాపులో 35 క్వింటాళ్లు, గ్రంధి నరసింహమూర్తి షాపులో 15 క్వింటాళ్లు మొత్తం 50 క్వింటాళ్లు పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తులో మండల సివిల్ సప్లయి డీటీ నాగదేవి, వీఆర్వో కుమార్ తదితరులు పాల్గొన్నారు.


