West Godavari District News
-
నూతన వంగడాల వైపు రైతులు మొగ్గు చూపాలి
ఉండి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ వినయలక్ష్మి భీమవరం అర్బన్: వ్యవసాయంలో సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ నూతన వంగడాల వైపు రైతులు మొగ్గు చూపాలని ఉండి, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ పి. వినయలక్ష్మి అన్నారు. భీమవరం మండలంలోని రాయలం గ్రామంలో మంగళవారం వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు నూతన వంగడాలు, వాటి దిగుబడులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వినయలక్ష్మి మాట్లాడుతూ 2048 వికసిత భారత్లో వివిధ రంగాల రైతులందరూ భాగస్వాములు కావాలన్నారు. వ్యవసాయంలో నూతన వంగడమైన ఎమ్టీయూ 1224 వంగడం గురించి వివరించి దాని బీజం, దిగుబడి గురించి చెప్పారు. ప్రస్తుతం ఖరీఫ్ సాగు సమీపిస్తుందని రైతులు భూసారం పెంచుకునేందుకు పచ్చిరొట్ట, పశువులు, కోళ్ల ఎరువులు చేలల్లో వేసి దున్నాలన్నారు. అంతేకాకండా సాగులో విచక్షణా రహితంగా రసాయన మందులు, ఎరువులు వాడి భూసారాన్ని పాడుచేయవద్దన్నారు. భావి తరాల జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు అందించాలంటే రైతులు నూతన వంగడాలవైపు మొగ్గు చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి సీటీఆర్ఐ టుబాకో, ప్రిన్సిపాల్ శాస్త్రవేత్త డాక్టర్ వై. సుబ్బయ్య, శాస్త్రవేత్త పి. సహదేవరెడ్డి , ఏఈఓ దేవి స్వరూప, రైతు కోళ్ల సీతారామ్, రైతులు పాల్గొన్నారు. -
తాళ్లకోడు ఇళ్ల రీ–సర్వేపై జేసీ విచారణ
ఆకివీడు: మండలంలోని కుప్పనపూడి శివారు తాళ్లకోడులోని జగనన్న కాలనీలోని ఇళ్ల రీ–సర్వేపై తుది విచారణను జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం చేపట్టారు. కాలనీలో గత వారం రోజులుగా ఆరు బృందాలు రీ–సర్వే చేశాయి. అనంతరం భీమవరం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్రెడ్డి విచారణ చేపట్టారు. కాలనీలో 3,420 మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కేటాయించారు. వారికి పట్టాలు కూడా ఇచ్చారు. ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.1.80 లక్షలు అందజేశారు. దీంతో 1000 మంది గృహ ప్రవేశాలు చేశారు. మరో 1200 ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. మిగిలిన నిరుపేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు పునాదులు వేసి, తగిన సొమ్ములేక ఆగిపోయారు. మరికొంత మంది పునాదులు వేసేందుకు సొమ్ములేక ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇళ్లు నిర్మించుకోలేదనే కారణంగా వారి ఇళ్ల స్థలాలను ప్రభుత్వం వెనక్కి తీసుకునేందుకు రీ సర్వే ఏర్పాటు చేశారు. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిరుపేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ. 4 లక్షలు తక్షణం విడుదల చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసి పేదల ఇళ్ల నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తిచేస్తున్నారు. -
● కదిలిన యంత్రాంగం
ట్రాన్స్ఫార్మర్ పరిసరాలు శుభ్రం తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని పాతూరు 12వ వార్డు కనకదుర్గమ్మ గుడి వద్ద ట్రాన్స్ఫార్మర్ పరిసరాలను మంగళవారం శుభ్రం చేశారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతోపాటు చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా ఉండడంతో మే 20వ తేదీన సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనిపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. మునిసిపల్ సిబ్బంది, విద్యుత్ సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం జేసీబీ సహాయంతో పిచ్చిమొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. కాగా ట్రాన్స్ఫార్మర్ వద్ద రక్షణ కల్పించేలా పెన్సింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. నరసాపురంలో రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి రోడ్డు శుభ్రం చేశారు. చెత్త రోడ్డుపై పోరుకుపోయి పూర్తి అశుభ్రంగా ఉన్న ఆ ప్రాంతంలో స్థానికులు పడుతున్న ఇబ్బందులను సాక్షి వెలుగులోకి తెచ్చింది. నరసాపురంలో కానరాని స్వచ్ఛత శీర్షికన మగళవారం కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన మున్సిపల్ సిబ్బంది చెత్తను తొలగించి, ఆ ప్రాంతంలో ముగ్గు చల్లారు. సమస్య పరిష్కారం కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. – నరసాపురం -
వేతనాల కోసం ఉపాధి కూలీల ధర్నా
పెంటపాడు: గత మూడు నెలలుగా ఉపాధి కూలీలకు వేతనాలు అందకపోవడంతో ఉపాధి కూలీలు నిరసన చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి కళింగ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆకుతీగపాడు, బోడపాడు, ముదునూరు గ్రామాలలో నిరసన తెలిపారు. పనిచేస్తున్న ప్రదేశాలలో పలువురు కూలీలు మాట్లాడుతూ ఏప్రిల్ నెల నుంచి ఇంత వరకు వేతనాలు అందలేదన్నారు. పెరిగిన ధరలతో ఒక పక్క ఇబ్బందులు పడుతున్నామని, మరోవైపు కూలి పనులు చేసినా పస్తులు ఉండాల్సి వస్తోందని వాపోయారు. కూటమి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నారు. -
జిల్లా స్థాయి కార్యశాల శిక్షణ ప్రారంభం
ఏలూరు (టూటౌన్): స్థానిక సుబ్బమ్మదేవి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మూడు రోజుల జిల్లా స్థాయి కార్యశాల శిక్షణా కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. జిల్లా కో ఆర్డినేటర్గా డీఈఓ వెంకటలక్ష్మమ్మ వ్యవహరించారు. అకడమిక్ కాలెండర్, టీచర్ హ్యాండ్ బుక్, స్టూడెంట్ అసెస్మ్మెంట్ బుక్, కరిక్యులమ్ ఇంటిగ్రేషన్ అనే అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. అసిస్టెంట్ జిల్లా కోఆర్డినేటర్ అంగులూరి సర్వేశ్వరరావు మంగళవారం కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఎస్సీఈఆర్టీ రాజబాబు హాజరయ్యారు. శిక్షణకు 162 మంది డీఆర్పీలు, 12 మంది ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. వీరు క్షేత్ర స్థాయిలో ఉన్న 3,250 స్కూల్ అసిస్టెంట్స్, ప్రధానోపాధ్యాయులకు ఈ నెల 8, 9, 10 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు సర్వేశ్వరరావు తెలిపారు. 6వ తరగతి విద్యార్ధులకు సంసిద్దతా కార్యక్రమాలు, 9వ తరగతి విద్యార్థులకు జనవరిలో పరీక్షలు పూర్తిచేసి 10వ తరగతికి 40 రోజులు బ్రిడ్జి కోర్సు ముఖ్యాంశాలని రాజబాబు తెలిపారు. 1, 2 తరగతులకు, 9, 10 తరగతులకు ప్రత్యేక పాఠ్యపుస్తకాలుగా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయ రామరాజు, డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి నేతృత్వంలో రూపొందాయని వివరించారు. కార్యక్రమంలో డైట్ లెక్చరర్స్ పాల్గొన్నారు. -
చేతివృత్తులను ఆదరించాలి
ఏలూరు (టూటౌన్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతివృత్తులకు రక్షణ కల్పించి చేతివృత్తిదారులను ఆదుకోవాలని చేతి వృత్తిదారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఏలూరు స్ఫూర్తి భవనంలో మంగళవారం చేతి వృత్తిదారుల సమాఖ్య ఏలూరు జిల్లా సమావేశం జిల్లా కన్వీనర్ కడుపు కన్నయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రామాంజనేయులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకం సాధారణ చేతి వృత్తి దారులను ఏ మాత్రం ఆదుకోలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ వాగ్దానాల్లో ఇప్పటివరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించలేదన్నారు. ప్రభుత్వాలు ఆదుకోకపోవడంతో చేతి వృత్తిదారులు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల ఉత్పత్తుల నుంచి పోటీ తట్టుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతి వృత్తిదారులకు సాంకేతిక యంత్ర పరికరాలు, సబ్సిడీ రుణ పరపతి, భూమి, మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ గొర్రెల, మేకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొట్టేలు పెంటయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే చేనేత, తదితర వృత్తి సంఘాల నాయకులు పాల్గొన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు -
బీరు సీసాతో వ్యక్తిపై దాడి
తణుకు అర్బన్: పాత కక్షల నేపథ్యంలో ఒక వ్యక్తిని బీరు సీసాతో దాడి చేసిన ఘటన మంగళవారం రాత్రి తణుకు మండలం దువ్వ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొడ్డు కృష్ణ, ముద్దాపురం గ్రామానికి చెందిన గండికోట జాన్ యేసు మధ్య పాత కక్షలున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి దువ్వ దానమ్మ తల్లి ఆర్చి సమీపంలో ఉన్న కృష్ణపై యేసు బీరు సీసాతో దాడి చేసి విచక్షణారహితంగా గాయపరిచాడు. తీవ్రగాయాలపాలైన కృష్ణను స్థానికులు సమాచారంతో 108 వాహనం ద్వారా తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గతంలోనూ ఇలాగే కత్తితో దాడిచేసిన ఘటనలో యేసు జైలులో శిక్ష అనుభవించి ఇటీవలే బెయిల్పై విడుదలై వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. తణుకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నీటి కుంటలో పడి గొర్రెల కాపరి మృతి చాట్రాయి: నీటి కుంటలో పడి గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన చాట్రాయిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సర్నాల మారేశ్వరావు (40) మంగళవారం తన గొర్రెలను మేతకు తోలుకెళ్లాడు. సమీపంలో ఉన్న మందపాటి బసవారెడ్డి తోటలోని నీటి కుంటలో మేక పిల్ల పడిపోవడంతో మారేశ్వరరావు దానిని రక్షించబోయి మునిగి మృతిచెందాడు. అతడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. -
రాష్ట్రంలో మద్యం, గంజాయి పాలన
ఆకివీడు: రాష్ట్రంలో గంజాయి, మద్యం ఏరులైపారడంతో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. స్థానికంగా చిన్నారిపై అఘాయిత్యాన్ని ఖండిస్తూ మంగళవారం నేతలు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, మండల, పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షులు నంద్యాల సీతారామయ్య, అంబటి రమేష్, మెప్మా మాజీ అధ్యక్షురాలు మోరా జ్యోతిరెడ్డి, కోఆప్షన్ సభ్యురాలు గుండుగొలను సావిత్రి, ధనరాజు మాట్లాడుతూ ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార సంఘటన అమానవీయమన్నారు. టీడీపీకి చెందిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించాలంటే పట్టణ, గ్రామాలకు దూరంగా మద్యం షాపులు ఉండాలన్నారు. బెల్టు షాపుల బెల్టు ఎప్పుడు తీస్తారని ప్రశ్నించారు. గంజాయి అమ్మకాలపై పోలీస్ యంత్రాంగం తీవ్ర నిర్లిప్తతతో ఉందన్నారు. పట్టణంలోని విచ్చలవిడిగా గంజాయి, మద్యం దొరుకుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో నగర పంచాయతీ విప్ పడాల శ్రీనివాసరెడ్డి, గేదెల అప్పారావు, దొడ్డి జగదీష్, తిరుమానేని జగన్, కిషోర్రెడ్డి, మోరా శ్రీనివాసరెడ్డి, కుంకట్ల దానయ్య పాల్గొన్నారు. ఆకివీడులో చిన్నారిపై అఘాయిత్యం దారుణం వైఎస్సార్సీపీ నేతల ఆందోళన -
సంక్షేమం, అభివృద్ధికి వెన్నుపోటు
సీ వీడ్.. సో గుడ్ సముద్రపు నాచు (సీ వీడ్) తీరప్రాంత మహిళలకు కుటీర పరిశ్రమగా మారుతోంది. తక్కువ కాలంలోనే అధిక దిగుబడులు సాధించే నాచు పెంపకానికి డిమాండ్ పెరుగుతోంది. 8లో uబుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025ఈ హామీల ఊసే లేదు ● జనవరిలో ఆచంటలో టీడీపీ రా కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఆచంట మండలం అయోధ్యలంక–కోడేరు మధ్య గోదావరిపై వారధి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయోధ్యలంకలో తాగునీటి సమస్య పరిష్కరిస్తామన్నారు. ● ఏప్రిల్ 05: పాలకొల్లు సభలో చంద్రబాబు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్రావణ మాసంలో జిల్లాలో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాలు చేయిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని రోడ్డన్నింటిని బాగుచేస్తామన్నారు. ● ఏప్రిల్ 10: తణుకులోని నరేంద్ర సెంటర్ వద్ద బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తణుకులో హైటెక్ టవర్ నిర్మిస్తామన్నారు. ఇంటి వద్ద నుంచే ఉద్యోగాలు చేసుకునే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని తెస్తామని చెప్పారు. తణుకును పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, వలసలు అరికడతామని వాగ్ధానం చేశారు. ● ఏప్రిల్ 21: నరసాపురం, భీమవరం సభల్లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వశిష్ట గోదావరిపై వంతెన పనులు ప్రారంభిస్తామన్నారు. భీమవరంలో డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరిస్తామన్నారు. వీరవాసరం మండలం, భీమవరం మండలాల్లోని శివారు గ్రామాలకు తాగు, సాగునీటి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ● ఏప్రిల్ 29: తాడేపల్లిగూడెం వారాహి సభలో పవన్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంను మార్కెట్ హబ్గా, ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేస్తామన్నారు. మిలటరీ మాధవరం–తాడేపల్లిగూడెం ఎయిర్పోర్టు భూములను అన్యాక్రాంతం నుంచి కాపాడతామన్నారు. మిలటరీ ఉద్యోగుల కోసం క్యాంటీన్ ఏర్పాటు చేయిస్తామన్నారు. ● మే 10: ఉండిలో చంద్రబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో భూగర్భ జలాలు కలుషితమైనందున విజ్జేశ్వరం నుంచి ప్రొజెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా స్వచ్చమైన తాగునీటిని కుళాయిల ద్వారా ఇంటింటికి ఇస్తామన్నారు. యూనిట్ కరెంట్ రూ.1.50కే ఇచ్చి ఆక్వా రంగాన్ని పైకి తెస్తానన్నారు. అవసరమైన చోట్ల 500 టన్నులు కెపాసిటీ కలిగిన కోల్డ్ స్టోరేజీలు కట్టిస్తామన్నారు. ఏరియేటర్స్పై సబ్సిడీ ఇప్పిస్తానన్నారు. ఆకివీడులో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి లేదా ఫ్లై ఓవర్ నిర్మిస్తామని హామీలు గుప్పించారు. ఏడాది పాలన ముగుస్తున్నా.. ఒక్క హామీ అమలుచేసే దిశగా చర్యలు తీసుకోలేదు. టీడీపీ నేతలకు పండుగ గ్రామాల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధి కోసం పల్లె పండుగ పేరిట రూ.46.48 కోట్లు ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులను కూటమి నేతలే దక్కించుకున్నారు. ప్రజావసరాల మేరకు రోడ్లు నిర్మాణం చేయాల్సి ఉండగా చాలాచోట్ల తమ భూముల విలువ పెంచుకునేలా ఖాళీ స్థలాలు, పొలాలు, చెరువులకు రోడ్లు వేయించుకోగా గత టీడీపీ హయాంలో చేసిన రోడ్లకు కొత్తగా మెరుగులు దిద్ది బిల్లులు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరమ్మతుల్లోనూ మోసం రోడ్లను అద్దంలా చేస్తామన్న హామీని అటకెక్కించిన కూటమి ప్రభుత్వం కనీస మరమ్మతులకు చేతులెత్తేసింది. జిల్లాలో 698 కి.మీ మేర మరమ్మతుల కోసం రూ.42.57 కోట్లు మంజూరు చేసింది. సంక్రాంతి నాటికి గుంతలు లేకుండా చేస్తామని చెప్పగా ఇప్పటికి పూర్తికాని పరిస్థితి. నిర్ణీత ప్రమాణాలు పాటించకుండా చాలాచోట్ల నాసిరకంగా పనులు చేని ప్రజాధనాన్ని కాజేశారు. కొన్నిచోట్ల గుంతల్లో కంకర, చిప్స్ వేసి తారు వేయకుండా వదిలేశారు. వాహనాల తాకిడికి రాళ్లు పైకిలేచి మరమ్మతులు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలాయి. అధికారులు న్యాయం చేయాలి ఓఎన్జీసీ అధికారులు న్యాయం చేయాలని రైతులు ఆందోళన చేశారు. రైతులకు కేవలం ఒక పంటకు మాత్రమే డబ్బులు వేశారని ఆరోపిస్తున్నారు. 8లో uఆడబిడ్డకు అన్యాయం మహిళలకు ప్రతీ నెల రూ: 1500 జిల్లాలో రూ.1500 పొందేందుకు అర్హులు – 5,96,313 ఆడబిడ్డ నిధి పథకం కింద ఏడాదిలో నష్టపోయిన మొత్తం రూ. 1073 కోట్లు తల్లికి నష్టం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్ విద్యార్థులు : 2,49,662 అర్హులైన విద్యార్థులు (70 శాతం) సుమారు : 1,74,763 మంది తల్లికి వందనంగా గత విద్యా సంవత్సరంలో తల్లులు నష్టపోయిన మొత్తం రూ. 262.14 కోట్లు అన్నదాత దుఃఖీభవ జిల్లాలో సాగు భూమి : 2.3 లక్షల ఎకరాలు రైతులు : 1,24,645 అన్నదాత సుఖీభవ అందక గత సీజన్లో రైతులు నష్టపోయిన సాయం రూ. 249.29 కోట్లు నిరుద్యోగులకు అందని భృతి జిల్లాలో కుటుంబాలు : 5.17 లక్షలు రూ.3000 ఆర్ధిక సాయం కోసం ఎదురుచూపు మొత్తం రేషన్కార్డులు : 5,67,651 ఒక్కో కార్డుపై ఏడాదికి మూడు చొప్పున ఇవ్వాల్సిన గ్యాస్ సిలెండర్లు : 17,02,953 గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కటి చొప్పున ఇచ్చిన సిలెండర్లు : 5,67,651 లబ్ధిదారులు కోల్పోయిన సిలెండర్లు : 11,35,302 గ్యాస్ ధర రూ. 827.50. ఆ మేరకు గత ఏడాది నష్టపోయిన మొత్తం రూ.93.94 కోట్లు ఉచిత బస్ తుస్సు జిల్లాలో మొత్తం జనాభా 19,00,228 పురుషులు : 9,48,461 మహిళల జనాభా : 9,51,766 ఎన్నికల హామీ మేరకు మహిళలందరికి ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి. న్యూస్రీల్ ఎన్నికల్లో హామీల వరద పారించిన కూటమి నేతలు ఏడాది పాలనలో ఒక్క హామీని అమలు చేయని వైనం కూటమి దగాపై జూన్ 4ను ‘వెన్నుపోటు దినం’గా ప్రకటించిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ కేంద్రాల్లో నేడు నిరసన కార్యక్రమాలు తొలి ఏడాదే నవరత్నాలు అమల్లోకి తెచ్చిన జగన్ సర్కారు ఐదేళ్లలో పేదలకు రూ.11,333.57 కోట్ల లబ్ధి అంతన్నారు.. ఇంతన్నారు.. అధికారంలోకి రావడమే ఆలస్యం.. సూపర్ సిక్స్ అంటూ ఊరూరా ఊదరగొట్టారు. జూన్ నుంచే అమలు.. ఇవిగో బాండ్లు అంటూ కూటమి నేతలు ఏ కుటుంబానికి ఎంత వస్తుందో కరపత్రాలపై రాసి మరీ ఇంటింటికీ ఇచ్చేశారు. కూటమి పాలన చేపట్టి ఏడాదైనా సూపర్ సిక్స్ జాడలేదు. కూటమి వంచనకు నిరసనగా జూన్ 4ను ‘వెన్నుపోటు దినం’గా వైఎస్సార్సీపీ ప్రకటించింది. ప్రజల పక్షాన నియోజకవర్గ కేంద్రాల్లో నేడు నిరసన తెలుపనుంది. – సాక్షి, భీమవరంవిజయవంతం చేయాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించి వంచనతో పాలన సాగిస్తోంది. ప్రజల పక్షాన బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగనున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలి. – ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వంచనకు ఏడాది కూటమి ప్రభుత్వ వంచన పాలన మొదలై అప్పుడే ఏడాది. ఎన్నో వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఈ ఏడాదిలో ఒక్క హామీని అమలుచేయకుండా నమ్మి ఓట్లేసిన ప్రజలను దగా చేశారు. సంక్షేమాన్ని విస్మరించి కూటమి సాగిస్తున్న అరాచక పాలనకు నిదర్శనమే ‘వెన్నుపోటు దినం’. – ముదునూరి మురళీకృష్ణంరాజు, వైఎస్సార్సీపీ నరసాపురం పార్లమెంట్ అబ్జర్వర్ -
డిపో సీఐ దురుసు ప్రవర్తనపై నిరసన
ఏలూరు (టూటౌన్): ఏపీఎస్ ఆర్టీసీ ఏలూరు డిపో ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి డి.ఆంజనేయులుపై డిపో సీఐ దురుసు ప్రవర్తనకు నిరసనగా మంగళవారం స్థానిక ఆర్టీసీ గ్యారేజీ ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. యూనియన్ ఏలూరు డిపో గౌరవ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంజనేయులు పట్ల సీఐ అలా ప్రవర్తించడం సరైంది కాదన్నారు. యూనియన్ నాయకులు, కమిటీ సభ్యుల పట్ల ఆర్టీసీ అధికారులు సూపర్వైజర్ చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. వెహికల్ కండిషన్ మెరుగుపరచాలని పదేపదే మేనేజ్మెంట్కు చెప్పినా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని తెలిపారు. డిపోలో కనీస మౌలిక వసతులు లేవని అన్నారు. ఆంజనేయులు మాట్లాడుతూ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతామని, బుధవారం నుంచి నాన్ కోపరేషన్ పాటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ డిపో నాయకులు వీఎస్ నారాయణ, ఎండి రమేష్, పీకేబీ రాజు, పి.శ్రీహరి పాల్గొన్నారు. కూలీలు పస్తులుంటే.. యోగాలో నిమగ్నమా! భీమవరం అర్బన్: గత రెండు నెలలుగా ఉపాధి హామీ కూలీలు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. అధికారులందరూ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాలో నిమగ్నమైపోవడం దారుణమని సీఐటీయూ నాయకులు మండిపడ్డారు. భీమవరం మండలంలోని గూట్లపాడు, గొల్లవానితిప్ప గ్రామాల్లో మంగళవారం సీఐటీయూ సంఘం సభ్యులు పర్యటించి ఉపాధి హామీ కూలీలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకుని ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు ఎం.ఆంజనేయులు, ఇంజేటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీ పనులు చేసిన 15 రోజుల్లోనే వేతనాలు చెల్లించాలని చట్టంలో ఉన్నా రెండు నెలలు గడుస్తున్నా వేతనాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే యోగాసనాల్లో అధికారులు నిమగ్నమైపోవడం బాధాకరమన్నారు. ఉపాధి హామీ రోజు కూలీ రూ.600 చేసి ఏడాదికి 200 పనిదినాలకు పెంచాలని డిమాండ్ చేశారు. కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య భీమడోలు: దుద్దేపూడి పంచాయతీ పరిధిలోని అన్నేవారిగూడెం గ్రామానికి చెందిన అన్నేపు దుర్గాప్రసాద్ (35) కడుపు నొప్పి తాళలేక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యానికి బానినైన దుర్గాప్రసాద్ కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. మంగళవారం ఒక్కసారిగా విపరీతంగా కడుపు నొప్పి రావడంతో తట్టుకోలేక పురుగు మందును సేవించి మృతి చెందాడు. ఆతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేస్తున్నట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు. -
గ్యాస్ లీకై పెళ్లింట్లో ప్రమాదం
పెనుగొండ: పెళ్లింట్లో అకస్మాత్తుగా జరిగిన ఓ ప్రమాదంలో ఏడుగురు గాయాలపాలయ్యారు. వివరాల ప్రకారం చెరుకువాడ కొండపల్లి వారి వీధిలో ఇవ్వల నాగేశ్వరరావు కుమారుడు శ్రీనివాసరావు వివాహం బుధవారం జరగనుండడంతో బందువులు, స్నేహితులు అందరూ వచ్చారు. మంగళవారం ఇంటిలో గ్యాస్ వెలిగించి వంట చేస్తుండగా ప్రమాదవ శాత్తు గ్యాస్ లీకై ఆకస్మాతుగా మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమై మంటలు అదుపులోకి తీసుకు రావడానికి ప్రయత్నించడంతో పెండ్లి కుమారుడు శ్రీనివాసరావుతో పాటు, బంధువులు అయినపర్తి లక్ష్మీ, కవిటం నాగమణి, సూర్య హనుమంతరావు, సత్యవతి, నరసింహమూర్తి , మాచవరపు వీరేంద్ర గాయాలపాలయ్యారు. వీరికి కాళ్లు చేతులు, పొట్ట, వీపు మీద గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన పెనుగొండలోని ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పెళ్లింట్లో పెనుప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. పెండ్లి కుమారుడు సహా ఏడుగురికి గాయాలు -
ఓఎన్జీసీ అధికారులు న్యాయం చేయాలి
ఇరగవరం: ఓఎన్జీసీ అధికారులు తమకు న్యాయం చేయాలని రైతులు మంగళవారం ఆందోళన చేశారు. ఇరగవరం, సరిహద్దు ప్రాంతం అర్జునుడుపాలెం గ్రామాలకు చెందిన 21 మంది రైతుల వద్ద నుంచి సుమారు 8 ఎకరాలు లీజు ప్రాతిపదికన 2023వ సంవత్సరంలో పంటకు ఎకరాకు రూ.82,200, చెట్లకు రూ.6,500 చొప్పున నగదు చెల్లించే విధంగా తీసుకున్నారు. అనంతరం ఓఎన్జీసీ డ్రిల్ పనులు ప్రారంభించారు. అయితే అక్కడ ఆయిల్ పడలేదు. దీంతో రైతులకు కేవలం ఒక పంటకు మాత్రమే డబ్బులు వేశారు. తరువాత రైతులకు చెప్పకుండా ఓఎన్జీసీ అధికారులు మొత్తం సామాగ్రిని తరలించుకుపోతున్నారు. దీనిపై ఓఎన్జీసీ అధికారులను ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పకపోవడంతో మంగళవారం ఓఎన్జీసీ డ్రిల్ దగ్గర నుంచి తరలిస్తున్న వాహనాలను రైతులు అడ్డుకుని ధర్నా చేశారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ రాజమండ్రి తహసీల్దార్ జాలి జనార్ధన్, సివిల్ ఇంజనీరు శేషు వచ్చి రైతులతో మాట్లాడారు. వచ్చే జూలై నెలలో ఒక పంట డబ్బులు, తరువాత మరో పంట డబ్బులు అకౌంట్ల్లో వేయడం జరుగుతుందని, లీజు పూర్తయ్యే వరకు రైతులకు లీజు డబ్బులు చెల్లిస్తామని రాతపూర్వకంగా రాసి ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
వైఎస్ఆర్ కడప స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలు
ఏలూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ డాక్టర్ వైఎస్ఆర్ కడప స్పోర్ట్స్ స్కూల్లో 4, 5 తరగతుల్లో ప్రవేశాలు నిర్వహిస్తోందని ఏలూరు జిల్లా డీఎస్డీఓ బి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 4వ తరగతి ప్రవేశానికి ఏప్రిల్ 1, 2015 నుంచి మార్చి 31, 2017 మధ్య జన్మించి ఉండాలన్నారు. అలాగే ఏప్రిల్ 1 2014 నుంచి మార్చి 31 2016 మధ్య జన్మించినవారు 5వ తరగతిలో ప్రవేశించవచ్చని వివరించారు. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకూ దరఖాస్తుల పరిశీలన చేసి శాప్ షార్ట్ లిస్ట్ విడుదల చేస్తుందన్నారు. అనంతరం జూలై 1 నుంచి 3వ తేదీ వరకూ జిల్లాస్థాయి, జూలై 10 నుంచి 11వ తేదీ వరకూ రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. వివరాలకు 98663–17326, 99487 79015 నంబర్లలో సంప్రదించాలన్నారు. మట్టి ట్రాక్టర్ ఢీకొని వృద్ధురాలి మృతి ముసునూరు: మట్టి అక్రమ తోలకాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. మట్టి ట్రాక్టర్ ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండలంలోని గోపవరంలో చోటుచేసుకుంది. గ్రామంలో పగలూ రాత్రి తేడా లేకుండా మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మట్టి ట్రిప్పులు అధికంగా వేయాలనే ఆత్రంతో లైసెన్స్లు లేని, డ్రైవింగ్ కూడా సరిగా రాని వారు కూడా గ్రామంలో మట్టి ట్రాక్టర్లు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మట్టి ట్రాక్టరు వెనుక నుంచి ఢీ కొట్టడంతో గ్రామానికి చెందిన వృద్ధురాలు గడ్డం అంజమ్మ (65) అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు. -
సీ వీడ్.. సో గుడ్
సముద్రపు నాచు విశేషాలివీ! ● భూగోళంపై పండించే కూరగాయల కంటే సముద్రంలో పెరిగే నాచు పరిమాణం 30 శాతం ఎక్కువ. ● సముద్రంలో అదనపు రసాయనాలు, భారీ లోహాలను ఇది గ్రహిస్తుంది. ● పర్యావరణ వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తుంది. ● సముద్రపు నాచును జీరో ఇన్పుట్ ఫుడ్గా పిలుస్తారు. ● సముద్రంలో కార్బన్ డైఆకై ్సడ్ను గ్రహిస్తుంది. ● పశువుల ఆహారం, ఆక్వా కల్చర్లో దీనిని ఫీడ్ సప్లిమెంట్లుగా వినియోగిస్తారు. ● సముద్రపు జీవులకు ఆహారం, ఆశ్రయం అందించి జీవ వైవిధ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది. ● సేంద్రియ ఎరువుగా కార్బోహైడ్రేట్లు, సూక్ష్మ పోషకాలు, ఖనిజాలు అధికం. ● ఆహార పరిశ్రమ, ఔషధ, సౌందర్య రంగం, వ్యవసాయంలో దీనిని వినియోగిస్తారు. ● తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఇస్తుంది. ● మత్స్యకారులు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం. కై కలూరు: సముద్రపు నాచు (సీ వీడ్) తీరప్రాంత మహిళలకు కుటీర పరిశ్రమగా మారుతోంది. మంచినీరు, ఎరువులు, పురుగు మందులు, ఆహారం అవసరం లేకుండా సముద్రంలో తక్కువ కాలంలోనే అధిక దిగుబడులు సాధించే నాచు పెంపకానికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్వా రంగానికి ప్రత్యామ్నాయంగా నాచు సాగు మారనుంది. సెంట్రల్ మైరెన్ ఫిషరీస్ రీసెర్చ్ (సీఎంఎఫ్ఆర్ఐ), కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సీఏఏ) ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్వై) ద్వారా మహిళలకు సబ్సిడీ రుణాలిచ్చేందుకు ప్రభుత్వం ముందుకొస్తోంది. సీ వీడ్పై అవగాహన కల్పించేందుకు ఏటా జూన్ 4న జాతీయ సముద్రపు నాచు దినోత్సవం జరుపుతారు. పోషకాల గని.. సముద్రపు నాచు సముద్రపు నాచు (మైరెన్ ఆల్గే)లో పోషక, ఔషధ విలువలు అధికంగా ఉంటాయి. తెప్పలు, రేస్ వేలు, మోనోలైన్, తాళ్లు వంటి పద్ధతుల్లో సముద్రంలో నాచును సాగు చేస్తున్నారు. తమిళనాడులోని మండపం ప్రాంతం నుంచి కప్పఫైకాస్, గ్రాసిలేరియా అనే జాతుల విత్తనాలను ఏపీకి తెస్తున్నారు. ఒక్కో పంట 45–60 రోజుల సమయం పడుతోంది. సీ వీడ్లో ప్రొటీన్, ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. వీటిని బిస్కెట్లు, పాస్తా, నూడుల్స్, సూప్ పౌడర్లు, పెరుగు వంటి అహార పదార్థాల్లో వినియోగిస్తారు. ఔషధ, సౌందర్య రంగాల్లోనూ సీ వీడ్కు డిమాండ్ ఉంది. దీంతో ఆగార్, కరోజీనాన్ పదార్థాలు తయారవుతాయి. వీటిని టూత్పేస్ట్, స్కిన్ కేర్ ఉత్పత్తుల ఔషధాల్లో వినియోగిస్తారు. వ్యవసాయంలో బయో ఫెర్టిలైజర్లుగా కూడా దీనిని వాడతారు. సీ వీడ్తో తయారు చేసిన తినుబండారాలు, సాల్ట్, ఆయిల్, స్నాక్స్కు డిమాండ్ ఉంది. రాష్టంలో 36 కేంద్రాల గుర్తింపు ఆంధ్రప్రదేశ్లో 1,027 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. సీ వీడ్ సాగుకు అనుకూలమైన 36 ప్రాంతాలను రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ సాల్ట్ అండ్ మైరెన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఐ) గుర్తించింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలు సీ వీడ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయి. నరసాపురం, మొగల్తూరు, సూర్యలంక, విశాఖపట్నం, శ్రీకాకుళంలోని బుడగట్టుపాలెంలో పైలట్ ప్రాజెక్టుగా సీ వీడ్ సాగు చేపట్టనున్నారు. విశాఖపట్నం, బుడగట్టుపాలెంలో ప్రయోగాత్మక సాగు చేపట్టారు. పీఎంఎంఎస్వై ద్వారా వీడ్ సాగుకు కేంద్రం 60 శాతం సబ్సిడీ అందిస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 60 వేల యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కుటీర పరిశ్రమగా నాచు సాగు ప్రయోగాత్మకంగా విశాఖపట్నంలో మొదటి సాగు రాష్ట్రంలో 60 వేల యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం నేడు జాతీయ సముద్రపు నాచు దినోత్సవంఅవగాహన పెంచాలి సముద్రపు నాచుపై తీరప్రాంత ప్రజలకు అవగాహన పెంచాలి. రాష్ట్రంలో ప్రోసెసింగ్ యూనిట్లు, సీడ్ హేచరీలను ఏర్పాటు చేయాలి. సముద్రపు నాచు పరిశ్రమను వ్యవసాయంగా గుర్తించి బీమా సౌకర్యం కల్పించాలి. సాగు పద్ధతులపై శిక్షణ, సాంకేతిక మార్గదర్శకాలను అందించాలి. – డాక్టర్ పి.రామమోహన్రావు, విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్, కాకినాడతొలి విడతలో 2.2 టన్నుల దిగుబడి విశాఖపట్నం ఆర్కే బీచ్ సమీపంలో తొలిసారిగా సీ వీడ్ సాగును 50 యూనిట్ల ద్వారా ధాన్ ఫౌండేషన్ మహిళలు చేపట్టారు. మొదటి విడతలో 2.20 టన్నుల దిగుబడి వచ్చింది. కిలో రూ.23 ధర పలికింది. ఈ ప్రాజెక్టుకు పెట్టుబడి రూ.4.50 లక్షలు అయింది. మొదటిసారి పెట్టుబడితో అమర్చిన సామగ్రి 8 ఏళ్లపాటు ఉపయోగపడతాయి. రెండో సాగు నుంచి పెట్టుబడి వ్యయం బాగా తగ్గుతుంది. ఇది ప్రధానంగా మహిళలకు కుటీర పరిశ్రమగా మారుతుంది. కేంద్రం సబ్సిడీ ఇచ్చి సీ వీడ్ సాగుకు అవకాశం కల్పిస్తోంది. – పి.లక్ష్మణరావు, మత్స్యశాఖ జేడీ, విశాఖ -
జేఈఈ అడ్వాన్స్డ్లో శశి విద్యార్థుల ప్రతిభ
తాడేపల్లిగూడెం (టీఓసీ) : జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో శశి తాడేపల్లిగూడెం విద్యార్థులు ఆలిండియా ర్యాంక్లు సాధించినట్లు విద్యా సంస్థల ఛైర్మన్ బూరుగుపల్లి వేణు గోపాలకృష్ణ తెలిపారు. ఎస్కే ఆజాం ఖాన్ ఆలిండియా 16వ ర్యాంక్ సాధించినట్లు వెల్లడించారు. ఎ.ప్రసాద్ 4,111, పి.శ్రీలేఖ 4,915, పి.చరణ్ 6,058, కె.దేవిక 6,637, వి.హరిచరణ్ 12,259 ర్యాంక్లు వచ్చాయని చెప్పారు. విజయం సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను, అధ్యాపకులను చైర్మన్తో పాటు విద్యాసంస్థల వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ, అకడమిక్ డైరక్టర్ క్రాంతి సుధలు అభినందించారు. విద్యా శాఖ అధికారుల బాధ్యతల స్వీకరణ ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో నలుగురు అధికారులు సోమవారం విధుల్లో చేరారు. జిల్లా విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్–2గా ఎన్. వెంకటప్పయ్య, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్గా ఏ.జయలక్ష్మి, పరీక్షల విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా వి.సుధాకర్, డీఈఓ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్గా కే.పావని బాధ్యతలు స్వీకరించారు. -
హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ఏలూరు (టూటౌన్): రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అమలు చేయాల్సిన అధికారులు, ప్రజా ప్రతినిధులు వాటిని కాలరాస్తున్నారని, రక్షించాల్సిన వారే వాటిని భక్షించే పరిస్థితి నెలకొందని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్ కుమార్, ఏఐఆర్డీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.మణిసింగ్ అన్నారు. స్థానిక లేడీస్ క్లబ్లో ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అంశంపై సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు మానవ హక్కులను కాలరాస్తున్నాయన్నారు. ముఖ్యంగా దళితులపై అరాచకాలకు పాల్పడుతూ వారి పట్ల వివక్షతను కొనసాగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో రెవెన్యూ,పోలీస్ వ్యవస్థలు వైఫల్యం చెందాయని.. పిఠాపురం నియోజకవర్గం, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో దళితులపై జరిగిన దాడులే నిదర్శనమన్నారు. సమావేశంలో అటవీ శాఖ మాజీ డైరెక్టర్ పల్లెం ప్రసాద్, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి చాగంటి సంజీవ్ కుమార్, డాక్టర్ నిట్టా ప్రసాద్, దాసరి రమేష్, దోమతోటి అబ్రహాం, సింగవరపు జ్యోతి, విజయ కుమారి, మాముడూరు మహాంకాళి, నూకపెయ్యి కార్తీక్, లాయర్ రాజశేఖర్, కనికెళ్ళి రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మెట్ట రైతులను ఆదుకోవాలి
జంగారెడ్డిగూడెం : గత 6 నెలలుగా సరైన గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు అన్నారు. సోమవారం జంగారెడ్డిగూడెంలో ఆయన మాట్లాడుతూ పామాయిల్, పొగాకు, కోకో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. పామాయిల్ మార్కెట్లో రూ.20,000 ధర పలుకుతుంటే కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం 26 శాతం నుంచి ఒక్కసారిగా 10 శాతం తగ్గించడం వల్ల ధర తగ్గే పరిస్థితులు కనబడుతున్నాయి. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని, పామాయిల్ ధరలు రూ.15 వేలకు పడిపోయే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. పొగాకు రైతులకు సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారని, వెంటనే పొగాకు రైతులకు గిట్టుబాటు ధర అందించాలని కోరారు. కోకో అంతర్జాతీయ మార్కెట్లో రూ.800 పైగా ఉంటే రాష్ట్రంలో కేవలం కేజీ రూ.400కు మాత్రమే కొంటున్నారని, రైతులను పూర్తిగా నష్టాల పాలు చేస్తున్నారని విమర్శించారు. వెంటనే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని.. అవసరమైతే ఈ ప్రాంతం తీసుకొచ్చి రైతుల దుస్థితిని వివరిస్తామని చెప్పారు. రైతులు అధైర్య పడవద్దని గిట్టుబాటు ధర కోసం కలిసికట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు, మళ్లిడి బాబి, కొయ్యే లీలాధర్ రెడ్డి, ఇర్ల శ్రీనివాస్ రెడ్డి, అట్లూరి రామరాజు, సీతంపేట మాజీ సర్పంచ్ మిరియాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు -
పీఎంఏజీవైలో రూ.1.20 కోట్ల మంజూరు
భీమవరం(ప్రకాశంచౌక్) : ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకంలో జిల్లాలో గుర్తించిన ఆరు గ్రామాలకు రూ.1.20 కోట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పీఎంఏజీవై పథకం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2020–21 సంవత్సరంలో పీఎంఏజీవై పథకం అమలుకు 50 శాతం పైగా ఎస్సీ జనాభా ఉన్న 10 గ్రామాలను, 2022–23 సంవత్సరంలో 40 శాతం పైగా ఎస్సీ జనాభా కలిగిన 11 గ్రామాలను ఎంపిక చేసి ప్రతిపాదనలు సమర్పించామన్నారు. వీటిలో 6 గ్రామాలకు ఒక్కో గ్రామానికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.1.20 కోట్లు మంజూరు చేశారన్నారు. మరో నాలుగు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించినట్లు చెప్పారు. ఇంకా గ్రామ అభివద్ధి ప్రణాళిక సమర్పించాల్సిన 11 గ్రామాలకు కూడా వీడీపీలు సమర్పించాలన్నారు. ఈ నిధులను తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, పౌష్టికాహారం, సామాజిక భద్రత, గ్రామీణ రహదారులు, గృహ నిర్మాణాలు, విద్యుత్ తదితర అవసరాలకు వినియోగించాలన్నారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రామాంజనేయరాజు, ఇన్చార్జి జిల్లా పంచాయతీ అధికారి వై.దోసిరెడ్డి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారి బి.సుజాత రాణి, డీఈవో ఇ.నారాయణ, డీఎం అండ్ హెచ్ జి.గీతాబాయి తదితరులు పాల్గొన్నారు. -
ఆడబిడ్డలకు ద్రోహం
మెట్ట రైతులను ఆదుకోవాలి గత ఆరు నెలలుగా సరైన గిట్టుబాటు ధర లేక మెట్ట రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గురునాథరావు అన్నారు. IIలో uమంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి, భీమవరం: సార్వత్రిక ఎన్నికల నాటికి జిల్లాలో మహిళా ఓటర్లు 7,51,313 మంది ఉన్నారు. వృద్ధాప్య పింఛన్ అందుకుంటున్న లబ్ధిదారులు 1,26,061 మంది ఉండగా వారిలో మహిళలు 60 శాతం ఉంటారని అంచనా. ఈ మేరకు ఓఏపీ లబ్ధిదారులు 75,636 మంది ఉండగా, వితంతు 49,564, ఒంటరి మహిళ 6,926, అభయహస్తం 8,908, దివ్యాంగులు సుమారు 14,000 మంది కలిపి మహిళా లబ్ధిదారులు 1,55,034 మంది ఉన్నారు. వీరిని మినహాయించిన కూటమి మేని ఫెస్టో మేరకు జిల్లాలో ఆడబిడ్డ నిధి పథకానికి 5,96,279 మంది అర్హులు ఉన్నారని అంచనా. ఈ మేరకు నెలకు రూ. 89.44 కోట్లు చొప్పున ఏడాది కాలానికి గాను రూ.1,073 కోట్లు మేర ప్రభుత్వ సాయాన్ని ఆడబిడ్డలు నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పటికీ పథకం మాటెత్తకపోగా ఎప్పటి నుంచి అమలుచేసేది సర్కారు స్పష్టతనీయడం లేదు. గత ప్రభుత్వంలో మహిళలకు పట్టం కులమతవర్గాలు, రాజకీయాలకు అతీతంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆడపడుచులకు అండగా నిలిచింది. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తదితర పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పించింది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా జిల్లాలోని 2,70,380 మంది డ్వాక్రా మహిళలకు రూ.1,107 కోట్ల రుణాలను మాఫీ చేశారు. బీసీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద ఏడాదికి రూ. 18,750 చొప్పున జిల్లాలో సగటున 61,750 మందికి నాలుగేళ్లలో రూ.463.41 కోట్ల సాయాన్ని అందించారు. కాపునేస్తం పథకం కింద కాపు, బలిజ, ఒంటరి, తెలగ సామాజిక వర్గానికి చెందిన సుమారు 28,004 మంది మహిళలకు నాలుగేళ్లలో రూ.168.02 కోట్లు అందజేశారు. ఈబీసీ నేస్తం పథకం కింద రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య తదితర ఓసీ సామాజికవర్గాల్లోని 12,827 మంది మహిళలకు నాలుగేళ్లలో రూ. 57.71 కోట్లు సాయం అందించారు. న్యూస్రీల్కష్టం విలువ తెలిసిన వ్యక్తిని.. సంపద సృష్టి తెలిసిన పార్టీ మా పార్టీ.. ఆడబిడ్డల కోసం మహాశక్తి కార్యక్రమం తీసుకువస్తున్నాం.. ప్రతి మహిళను మహాశక్తిగా తయారుచేయాలన్నదే నా సంకల్పం.. అందుకే ఆడబిడ్డ నిధి పథకాన్ని తెస్తున్నాం.. ఇంటిలో ఇద్దరుంటే.. ఇద్దరి అకౌంట్లకు కూడా ఇస్తాం.. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వారికి నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని ఈ రోజు మీ అన్న మీకు వరం ఇస్తున్నాడు. – ఇవి సార్వత్రిక ఎన్నికల సభల్లో చంద్రబాబు చెప్పిన మాటలు ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు, పవన్కల్యాణ్, కూటమి నేతలు ఎక్కడకు వెళ్లినా ఆడబిడ్డ నిధి అంటూ ఊదరగొట్టారు. తమ ప్రభుత్వం రావడమే ఆలస్యం డబ్బులు ఖాతాల్లోకి వస్తాయంటూ హోరెత్తించారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుండగా ఆడబిడ్డ నిధి అమలు ఊసెత్తడం లేదు. మరోపక్క ఈ పథకం సాయం కోసం పేదింటి మహిళలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మోసం ఇంతింతై! ప్రభుత్వం రాగానే ఆడబిడ్డ నిధి పథకం అమలుకు కూటమి హామీ 19 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ.1,500 పథకం అమలు ఊసెత్తని ప్రభుత్వం జిల్లాలో అర్హులు సుమారు 5.96 లక్షల మంది ఏడాది కాలానికి రూ.1,073 కోట్లు నష్టపోయిన జిల్లాలో మహిళలు ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తంతో మహిళలకు అండగా జగన్ సర్కారు హామీలు నిలబెట్టుకోవాలి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలులోకి తేవాలి. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున బ్యాంకు ఖాతాకు జమచేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ పథకం అమలుకోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నాం. ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు. – బందెల ప్రమీల, గృహిణి, చెరుకువాడ సూపర్ దగా కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ఆడబిడ్డ నిధి పథకం అమలుపై క్లారిటీ లేదు. సూపర్ సిక్స్ అంటూ వచ్చి ప్రజల్ని సూపర్గా దగా చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పేదలందరినీ మాజీ సీఎం జగన్ ఆదుకున్నారు. కూటమి ప్రభుత్వం వంచన తప్ప చేసిందేమీ లేదు. – కోడే విజయలక్ష్మి, వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు, భీమవరం -
నాణ్యమైన పరిష్కారం చూపాలి
భీమవరం(ప్రకాశంచౌక్): ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జేసీ టి.రాహుల్కుమార్ రెడ్డి, డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీల పరిష్కారానికి అధికారులు శ్రద్ధ చూపాలన్నారు. మొత్తం 137 అర్జీలు స్వీకరించారు. అర్జీల్లో కొన్ని.. ● ఆకివీడు మండలం కుప్పనపూడికి చెందిన ఎర్రగోగు రామాంజనేయులు తన భూమిని సర్వే చేయించి హద్దులు చూపాలని కోరారు. ● గణపవరం మండలం కొత్తపల్లికి చెందిన ఆక్వా రైతులు కలవరామ సుబ్బారావు, బొడ్డు అప్పారావు, బి.మధు, తదితరులు గ్రామంలో చేపల చెరువులకు వెళ్లే మార్గం ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేశారు. ● అత్తిలి మండలం కంచుమర్రుకి చెందిన ఎం.జయప్రసాద్ గ్రామంలో పంట బోదె పూడుకుపోయిందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ● తాడేపల్లిగూడెంలోని 35 వార్డు చెందిన బండారు పార్వతి తనకు ఒంటరి మహిళ పింఛన్ ఇప్పించాలని అర్జీ అందించారు. బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి పశ్చిమగోదావరిని బాల కార్మికరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. సోమ వారం కలెక్టరేట్లో జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీతో సమావేశమై బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈనెల 30 వరకు జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నామన్నారు. జూన్ 5న ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ సందర్భంగా చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్లో అధికారు లకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ నాగరాణి -
బాబు మోసం ప్రజలకు అర్థమవుతోంది
తాడేపల్లిగూడెం అర్బన్: చంద్రబాబు ఎన్నికల సందర్భంగా చెప్పిన మోసపు మాటలు, అబద్ధపు హామీలు ప్రజలకు క్రమేపీ అవగతమవుతున్నాయని, ఏడాది పాలనలో ఒక్క హామీని కూడా అమలు చేయని తీరును గమనించి మరోసారి బాబు మోసపు మాటలకు బలయ్యామని భావిస్తున్నారని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. సోమవారం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 4న నిర్వహించనున్న బాబు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆర్థిక లబ్ధిని పొందిందన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. తల్లికి వందనం, నిరుద్యోగభృతి, సీ్త్రశక్తి పథకాలు, ఉచిత బస్సు ప్రయాణం హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఢిల్లీ నుంచి అప్పులు తె చ్చేందుకు అధికారం చేపట్టినట్టు ఉందన్నారు. తీసుకువచ్చిన అప్పులు ఏమి చేశారో తెలియడం లేదన్నారు. ఉద్యోగులకు ఈనెల జీతాలు ఇచ్చేందుకు మరో రూ.7 వేల కోట్లు అప్పు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ రోజుకో ధోరిణితో డైలాగులు చెప్పడమే కాని ఆయన వల్ల ప్రజలకు ఉపయోగం ఏమీ లేదన్నారు. ప్రజలు విసిగిపోయారు నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదు నూరి మురళీకృష్ణంరాజు, నియోజకవర్గ పరిశీలకు డు పప్పుల రామారావు మాట్లాడుతూ చంద్రబాబు ఏడాది పాలనకు ప్రజలు విసిగిపోయారన్నారు. హామీలను గాలికి వదిలేసిన చంద్రబాబు చేసిన అ రాచకాలు, అన్యాయాలపై ఈనెల 4న బాబు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని చెప్పారు. అనంతరం వెన్నుపోటు దినం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు పెండ్ర వీరన్న, నాయకులు కర్రి భాస్కరరావు, కొలుకులూరి ధర్మరాజు, జడ్డు హరిబాబు, ముప్పిడి సంపత్కుమార్, ఎంపీపీ దాసరి హైమావతి, బోణం విజయనిర్మల, పత్సమట్ల సావిత్రి, కై కాల శ్రీనివాస్, తగరం పూడి మరళీ, సిర్రాపు శాంతకుమార్, సగరం ప్రసాద్, అరామిల్లి రవి, కొవ్వూరి విజయభాస్కరరెడ్డి, తాడేపల్లిగూడెం పట్టణ, పెంటపాడు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ 4న వెన్నుపోటు దినం నిరసన జయప్రదానికి పిలుపు -
చట్టపరిధిలో పరిష్కారం
భీమవరం: ప్రజాసమస్యలపై త్వరితగతిన స్పందించి నిర్ణీత సమయంలో చట్టపరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులు ఆదేశించారు. సోమవారం భీమవరం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరి ష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి 17 అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులు ఆదేశించారు. పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా ఉండాలన్నారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐ వి.పుల్లారావు, డీసీఆర్బీ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. భూములిచ్చిన రైతులకు పరిహారం భీమవరం: ఆకివీడు–దిగమర్రు ఎన్హెచ్–165కు సంబంధించి భూములిచ్చిన ఆకివీడు దుంపగడప, అజ్జమూరు తదితర గ్రామాల రైతులకు రూ.7.40 కోట్ల పరిహారాన్ని చెల్లిస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. సోమ వారం కలెక్టరేట్లో కలెక్టర్ సీహెచ్ నాగరాణితో కలిసి విలేకరులతో మాట్లాడారు. అలాగే లక్ష్మణేశ్వరం, సీతారాంపురం, మొగల్తూరు రైతులకు సుమారు రూ.6 కోట్లు చెల్లించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 40 ఆర్యూబీ, ఆర్వోబీలనిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. ఆర్డీవో కె.ప్రవీణ్కుమార్రెడ్డి, ఎన్హెచ్ ఈఈ సంజీవరాయుడు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాల కోసం ధర్నా భీమవరం: హౌస్ ఫర్ ఆల్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓను తక్షణమే అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారామ్ప్రసాద్ డిమాండ్ చేశారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఎన్నికల్లో కూటమి ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఇళ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో భీమవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలిస్తామన్న కూటమి హామీని అమలు చేయా లన్నారు. అనంతరం వినతిపత్రం, అర్జీలను తహసీల్దార్ ఆర్.రాంబాబుకు అందజేశారు. తాడేపల్లిగూడెంలో.. పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని, జీఓ 23ను తక్షణమే అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. సీపీఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద హౌస్ ఫర్ ఆల్ అంటూ ధర్నా నిర్వహించి, అనంతరం తహసీల్దార్ ఎం.సునీల్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఆయిల్పామ్ రైతుల ఆక్రోశం ద్వారకాతిరుమల: కేంద్ర ప్రభుత్వం పామాయిల్ దిగుమతి సుంకాన్ని తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని ఎం.నాగులపల్లిలో ఆయిల్పామ్ గెలల కాటా వద్ద ఆయిల్పామ్ రైతులు సో మవారం ధర్నా నిర్వహించారు. ఆయిల్పామ్ కు గిట్టుబాటు ధర కల్పించాలని, ఫ్యాక్టరీ యాజమాన్యాలు గెలల ఏరివేతను ఆపాలంటూ నినాదాలు చేశారు. సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచన చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, మండల అధ్యక్షుడు బోయపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతుల వినూత్న నిరసన భీమడోలు: కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించాలని, భూ యాజమాని సంతకంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం భీమడోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద కౌలు రైతులు ధర్నా చేశారు. మండుటెండలో మోకాళ్లపై నిలిచి నిరసన తెలిపారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీని వాస్, జిల్లా కన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హామీలను అమలు చేయాలన్నారు. అనంతరం ఎంపీడీఓ సీహెచ్ పద్మావతిదేవి, ఏఓ ఎస్పీవీ ఉషారాణికి వినతిపత్రం అందించారు. -
రేషన్ పాట్లు.. మళ్లీ మొదలు
ఏలూరు (టూటౌన్)/భీమవరం : ఇంటింటికీ రేషన్ సరుకులు పోయి రేషన్ దుకాణాల ద్వారా అందించే వ్యవస్థ రావడంతో ప్రజలకు తిరిగి కష్టాలు ప్రారంభమయ్యా యి. పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం తొలిరోజు చాలా చోట్ల ఈ–పోస్ మెషీన్లు పనిచేయకపోవడంతో కార్డుదారులు పడిగాపులు కాశారు. కొందరు తాము ఏ షాపులో రేషన్ తీసుకోవాలో తెలియక గందరగోళం నెలకొంది. పలుచోట్ల షాపుల వద్ద క్యూలైన్లు కనిపించాయి. భీమవరం మండలం దెయ్యాలతిప్పలో ఒకరిద్దరికి సరుకులు ఇచ్చి రేషన్ షాపును మూసేశారు. యలమంచిలి మండలం మేడపాడు, నరసాపురం మండలం కొప్పర్రులో ఈ–పోస్ యంత్రాలు పనిచేయక పోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు. తాడేపల్లిగూడెం రూరల్, ఆకివీడు తదితర ప్రాంతాల్లో రేషన్ సరుకులను దూర ప్రాంతాల నుంచి వచ్చి వాహనాలపై తీసుకువెళ్లడం కనిపించింది. జిల్లాలో 1,060 రేషన్ షాపుల ద్వారా 5.67 లక్షల కార్డుదారులకు నిత్యావసరాలు అందించాల్సి ఉండగా తొలిరోజు పంపిణీ కార్యక్రమం అభాసుపాలయ్యింది. -
వంచనపై ఉద్యమిద్దాం
సాక్షి, భీమవరం: కూటమి వంచన పాలనకు నిరసనగా ఈనెల 4న వైఎస్సార్సీపీ నిర్వహించతలపెట్టిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణు లు, ప్రజలు విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అధ్యక్షతన ఆదివారం పెదఅమిరంలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. నరసాపురం పార్లమెంట్ అబ్జర్వర్ ముదునూరి మురళీకృష్ణంరాజు, ఏపీ స్టేట్ బీసీ సెల్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ నవుడు వెంకటరమణ, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, పాలకొల్లు ఇన్చార్జి గుడాల గోపి తదితరులు హాజరయ్యారు. వెన్నపోటు దినం కార్యక్రమం విజయవంతానికి సమావేశంలో చర్చించారు. కూటమి వంచనపై ప్రజల గొంతుకగా వారి పక్షాన ఉద్యమించాలని నిర్ణయించారు.ప్రజలను నట్టేట ముంచారుఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నమ్మి ఓట్లేసిన ప్రజలను చంద్రబాబు నట్టేట ముంచారన్నారు. ఏడాది పాలనలో ప్రజలకిచ్చిన వాగ్దానాలను గాలికొదిలేసి సీఎం చంద్రబాబు చేస్తున్న మోసాలు, అరాచకాలు, అన్యాయాలకు నిరసనగా ఈనెల 4న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటు దినం నిర్వహించేందుకు అధిష్టానం నిర్ణయించిందన్నారు. ఆరోజు ఉదయం 10 గంటలకు నియోజకవర్గాల్లోని వైఎస్సార్సీపీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలు భారీ ఎత్తున నియోజకవర్గ కేంద్రాలకు చేరుకుని శాంతియుత ర్యాలీగా తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు చేరుకుని వినతిపత్రాలు అందజేయాలని ప్రసాదరాజు కోరారు.సంక్షేమాన్ని గాలికొదిలేసి..పార్లమెంట్ పరిశీలకుడు మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని గాలికొదిలేసి కేసులు, కక్ష సాధింపులు, డైవర్షన్ పాలిటిక్స్తో ఏడాది కాలం గడిపేశారని మండిపడ్డారు. మాజీ మంత్రి కారుమూరి, ఎమ్మెల్సీ కవురు, మహిళా నేత ఉమాబాల, గోపి తదితరులు మాట్లాడుతూ వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు మరోపేరని, ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి అదే ఆయన మార్క్ అ ని ఎద్దేవా చేశారు. అనంతరం ‘వెన్నుపోటు దినం’ పోస్టర్లను నేతలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కో–ఆర్డినేటర్ బందన పూర్ణచంద్రరావు, పార్టీ నేతలు గుణ్ణం నాగబాబు, ఎడ్ల తాతాజీ, కోడే విజయలక్ష్మి, పాల రాంబాబు, పప్పుల రామారావు, కల్వపూడి ప్రసాద్రాజు, ము ప్పిడి సంపత్ రావు, చినమిల్లి వెంకటరాయుడు, పే రిచర్ల విజయ నరసింహారాజు, గాదిరాజు రా మరాజు తదితరులు హాజరయ్యారు. -
మొగల్తూరు మామి‘డీలా’
సాక్షి, భీమవరం: చూడచక్కని రంగు.. మధురమైన రుచితో మనసు దోచే పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మామిడి ప్రతికూల వాతావరణం, పండుఈగ దాడితో ధర లేక వెలవెలబోతోంది. స్థానిక అమ్మకాలు, దేశ విదేశాలకు ఎగుమతులతో ఏటా రూ.32 కోట్లకు పైగా వ్యాపారం జరిగితే, ఈ ఏడాది సగం అమ్మకాలు లేని పరిస్థితి. తోటల లీజు, పెట్టుబడి ఖర్చులు రాక తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని మొగల్తూరు, నరసాపురం మండలాల్లోని 1800 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఎకరాకు ఐదు టన్నుల వరకు దిగుబడి వస్తుంది. సారవంతమైన నేలలతో ఈ ప్రాంతంలోని మామిడి కాయలు 500 గ్రాముల నుంచి 700 గ్రాములకు పైగా బరువుతో మంచి రంగు, రుచి కలిగి ఉంటాయి. సహజసిద్ధంగా కాయలు పక్వానికి వచ్చాక మాత్రమే కోసి అమ్మకాలు చేయడం వల్ల ఇక్కడి బంగినపల్లి, రసాలు తదితర మామిడి పండ్లకు గిరాకీ ఎక్కువ. ఎంతోమంది వీటిని కొనుగోలు చేసి దేశ విదేశాల్లోని తమ బంధువులు, స్నేహితులకు పంపిస్తుంటారు. పండు ఈగ దాడికి విలవిల ఏటా ఏప్రిల్ మొదటి వారం నుంచి మొగల్తూరు మామిడి పండ్లు మార్కెట్లోకి రావడం మొదలై జూలై రెండు, మూడు వారాలతో ముగుస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే అకాల వర్షాలతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు పండు ఈగ ఉద్ధృతి పెంచేందుకు దోహదం చేశాయి. మొదట్లో ఈదురుగాలుల ప్రభావంతో కాయలు రాలిపోయి నష్టపోతే తర్వాత పండు ఈగ తమను కోలుకోలేని దెబ్బతీసిందని రైతులు అంటున్నారు. ఈగల వల్ల కాయలపై మచ్చలు ఏర్పడటం, సకాలంలో వినియోగించకపోతే పండు లోపల పురుగు పడుతుండటం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో ఢిల్లీ, రాజస్తాన్, ఒడిశా, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు తోటల వద్దకే వచ్చి టన్నుల్లో ఆర్డర్లు ఇస్తే, ఈ ఏడాది మార్కెట్కు తెచ్చినా కోత కూలి, రవాణా ఖర్చులు కూడా రానంతగా అమ్మకాలు దిగజారాయని చెబుతున్నారు. చిరు వ్యాపారులు, కొనుగోలుదారులతో కిటకిటలాడే మొగల్తూరు, నరసాపురం, సీతారామపురం మార్కెట్లు వెలవెలబోతున్నాయి. సాధారణంగా తెల్లవారుజాము మూడు గంటలకు మార్కెట్లు మొదలై తెల్లవారేసరికి ముగిసిపోతుంటాయి. ప్రస్తుతం తెచ్చిన సరుకు ఉదయం 10 గంటల వరకు కూడా అమ్ముడుపోని పరిస్థితి ఉంటోందని వ్యాపారులు అంటున్నారు. నష్టాల్లో రైతులు గతంలో టన్ను మామిడి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు అమ్మకాలు చేస్తే ఈ ఏడాది రూ.15 వేల నుంచి రూ.25 వేల లోపే ఉంటోందని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. చెట్ల సైజు, సంఖ్యను బట్టి ఎకరాకు లీజు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఉండగా, జూలై, ఆగస్టు నెలల్లో చెట్ల మొదలులో మందులు, ఎరువులు పెట్టడం, డిసెంబరులో పూత మొదలైన నాటి నుంచి జూలైలో కాపు పూర్తయ్యేవరకు రేయింబవళ్లు తోటల వద్ద కాపలా, కోత, మార్కెట్కు తరలింపు తదితర రూపాల్లో రూ.లక్ష వరకు ఖర్చులు అవుతున్నాయంటున్నారు. మార్కెట్లోకి తెచ్చి అమ్మితే పెట్టుబడి ఖర్చులు కూడా రాక తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. గతంలో నాలుగుసార్లు మందులు పిచికారీ చేస్తే సరిపోయేదని, ఈసారి ఏడు సార్లు పిచికారీ చేసినా ఖర్చులు పెరిగాయే తప్ప ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ప్రతికూల వాతావరణం పండు ఈగ వ్యాప్తికి కారణమైందని ఉద్యాన వన శాఖ అధికారులు తెలిపారు. కొందరు రైతులు మొదట్లోనే కాయలపై ఈగలు వాలకుండా కవర్లు (కవర్ కల్చరింగ్) కట్టే విధానాన్ని పాటించి సత్ఫలితాలు పొందారన్నారు. దాదాపు రెండు లక్షల కవర్లు కట్టినట్టు అధికారి ఒకరు తెలిపారు. పూర్తిస్థాయిలో రైతులు అందరూ ఈ విధానాన్ని అవలంబించేలా కార్యాచరణ చేస్తున్నట్టు వివరించారు. పండు ఈగ కాటుకు రైతులు విలవిల గతంలో టన్ను మామిడికి రూ.40 వేలకు పైగా రాబడి టన్ను రూ.15 వేల నుంచి రూ. 25 వేల లోపే అమ్మకాలు లీజు, పెట్టుబడి ఖర్చులు రావడం లేదని వాపోతున్న రైతులు మొగల్తూరు, నరసాపురం మండలాల్లో 1800 ఎకరాల్లో సాగు -
ఆపరేషన్ సిందూర్లో నేను సైతం
ఏలూరు టౌన్/పెదపాడు: దేశం తనకేమి చేసిందనేది కాకుండా... దేశానికి తాను సేవ చేయాలనే దృఢ సంకల్పంతో సైన్యంలో చేరిన హవల్దార్ మేకా శివాజీ ఆపరేషన్ సిందూర్లో పాల్గొని స్వగ్రామం వట్లూరు వచ్చారు. ఆపరేషన్ సిందూర్లో పాల్గొని తొలిసారి స్వగ్రామానికి వచ్చిన శివాజీకి వట్లూరు కబడ్డీ యూత్, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, స్నేహితులు కలపర్రు టోల్ప్లాజా నుంచి ఘనస్వాగతం పలికారు. భారీ ర్యాలీగా గ్రామానికి తీసుకెళ్లారు. వట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శివాజీకి సన్మానం చేశారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన మేకా పోతురాజు, రాజ్యం దంపతుల కుమారుడు శివాజీ. ఆయనకు భార్య స్వాతి, కుమార్తె నిత్య, కుమారుడు భరత్ ఉన్నారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో అమృత్సర్ నుంచి యుద్ధంలో పాల్గొన్నానని శివాజీ తెలిపారు. కోట్లాది మంది భారతీయుల తరపున యుద్ధంలో పాల్గొనటం గర్వంగా ఉందన్నారు. -
వెన్నుపోటుకు కేరాఫ్ చంద్రబాబు
సాక్షి, భీమవరం: వెన్నుపోటు రాజకీయాలకు సీఎం చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి తల్లులు, పిల్లలు, రైతులు, ఉద్యోగులు, కార్మికులతో పాటు అన్ని వర్గాలనూ వంచన చేస్తూ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాధిత, పీడిత ప్రజల పక్షాన ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ ఏమైపోయారో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఆయన కోసం కాపు కాసిన వారికి న్యాయం చేయలేకపోతున్నారన్నారు. కాపు సామాజికవర్గంలో మెజారిటీ వర్గం పేదవారేనని, వారికి కాపు నేస్తం, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి తదితర ఏ పథకం అందడం లేదన్నారు. ప్రజల కోసం సీఎం చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు. అన్ని వర్గాలనూ ఆదుకున్న ఘనత జగన్దే.. అన్ని వర్గాలనూ ఆదుకున్న ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని కారుమూరి చెప్పారు. తమ ప్రభుత్వంలో పేదలకు పథకాలు ఇవ్వబట్టే సంక్షేమం, అభివృద్ధి జరిగిందని తెలిపారు. నేడు వ్యాపారాలే లేవని, టోకుగా సొమ్ము మొత్తం దుబాయికో, సింగపూర్కో తరలించేస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం జగన్ హయాంలో రూ.3.31 లక్షల కోట్లు అప్పుచేశారని అసెంబ్లీలో చెప్పిన మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పుడు రూ.10 లక్షల కోట్లు అంటూ బయట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయనది నోరా? తాటిపట్టా? అని ప్రశ్నించారు. కూటమి పాలనలో మర్డర్లు, ఇళ్లు కూల్చడాలు, ఇష్టానుసారంగా కేసులు పెట్టడాలు, డైవర్షన్ రాజకీయాలు చేయడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. తండేల్ సినిమాలో చూపించినట్లు ఇక్కడ జెట్టీలు లేక మత్స్యకారులు గుజరాత్కు వెళుతుంటే.. 6 జెట్టీలు కట్టించిన మంచి మనసున్న వ్యక్తి మాజీ సీఎం జగన్ అన్నారు. ఆరు పోర్టులు, జిల్లాకు ఒకటి చొప్పున మెడికల్ కళాశాలలు కట్టారని చెప్పారు. మెడికల్ కాలేజీలకు 750 మెడికల్ సీట్లు వస్తే వద్దని లేఖ రాసిన గొప్ప సీఎం చంద్రబాబునాయుడని కారుమూరి ఎద్దేవా చేశారు. మళ్లీ రేషన్ కోసం గంటల తరబడి క్యూ.. తణుకు అర్బన్: సంపద సృష్టిస్తామని ప్రగల్బాలు పలికిన చంద్రబాబు విద్యుత్ బిల్లుల మోత మోగిస్తున్నారని, ఉద్యోగాలిస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలు తొలగించారని కారుమూరి మండిపడ్డారు. తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎండీయూ ఆపరేటర్లందరినీ రోడ్డుకు ఈడ్చారని, రేషన్ దుకాణాల వద్ద మళ్లీ క్యూలో నిల్చునే పరిస్థితితోపాటు బియ్యం మూటలను ఇంటికి మోసుకుని వెళ్లే రోజులను తీసుకువచ్చారన్నారు. ఒక ఎమ్మెల్యేని మించి మరొక ఎమ్మెల్యే మద్యం, పేకాట, క్రికెట్ బుకీలే ఆదాయ వనరుగా మార్చుకుని మహిళల మంగళసూత్రాలను కూడా అమ్మించే పరిస్థితికి తీసుకువచ్చారని విమర్శించారు. ఇంకా ధాన్యం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయలేదని తప్పుపట్టారు. ఏడాదిలో వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేశారన్నారు. 4న వెన్నుపోటు దినం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు ఈనెల 4వ తేదీన వెన్నుపోటు దినంగా గుర్తించి ఆయా నియోజకవర్గాల పరిధిలో తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి పాలన సాగిస్తున్నారు పవన్కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు? మాజీ మంత్రి కారుమూరి ధ్వజం -
శివారు గ్రామాల సంగతి ఏంటి?
దెందులూరు: జూన్ 1 నుంచి అమలు చేస్తున్న రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల పంపిణీ అనేక మంది లబ్ధిదారులను ఇక్కట్లకు గురిచేస్తోంది. 90 శాతం శివారు గ్రామాల్లో రేషన్ షాపులు లేవు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గడపగడపకు రేషన్ సరుకుల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేశారు. రేషన్ షాపులు లేని శివారు గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో ఇంటి ముంగిట రేషన్ సరుకులు అందాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా ముద్ర కనపడకూడదన్న శివారు గ్రామాల్లో రేషన్ షాపు లేకపోవడంతో రేషన్ షాపులు ఉన్న గ్రామాలకు వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాను పోను రెండు కిలోమీటర్లు దూరంతో పాటు ఒక పూట కూలి పని మానుకొని షాపుకు వెళ్లి రేషన్ తెచ్చుకోవాలి. శివారు గ్రామాల్లో, అటవీ ప్రాంతాల్లో రేషన్ షాపులు లేని చోట ఎవరు తెచ్చి ఇస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .రేషన్ షాపులు లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా కక్షపూరితంగా రద్దు చేసినట్టు ఉందని ప్రశ్నిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో బీసీ ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గ ప్రజలే అధికంగా జీవిస్తున్నారని వారి హక్కులు పరిరక్షించకుండా పథకాన్ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు రేషన్ డీలర్ల సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.60 ఏళ్లు పైబడిన వారందరికీ ఇంటికి వెళ్లి రేషన్ ఎప్పుడు ఇస్తారు.. ఎలా చెల్లిస్తారు అనే విషయంలో లిఖితపూర్వక హామీ ఆదేశాలు లేవు. తమకు స్పష్టమైన ఆదేశాలు లేకపోతే యూనియన్ పరంగా నిర్ణయం తీసుకుంటామని డీలర్ల యూనియన్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరికీ రేషన్ సరుకులు అందకపోయినా, ఏర్పాట్లు చేయకపోయినా దళిత గిరిజన మైనారిటీ బీసీ సంఘాలు ఏకమై భవిష్యత్ ప్రణాళికను ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నారు.తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన :ఏలూరు జిల్లాలో శివారు, అటవీ ప్రాంతాల్లో షాపులు లేకుండా సరుకులు ఎలా ప్రజలకు అందిస్తారని, శివారు గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానికంగా రేషన్ షాపులు తక్షణమే ఏర్పాటు చేయాలి అలా జరగని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఆదివారం దెందులూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద రాష్ట్ర మాలసేన నాయకులు గంటా పండు నిరసన వ్యక్తం చేశారు. -
5న భీమవరంలో చెస్ టోర్నమెంట్
భీమవరం: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా చెస్ అసోసియేషన్ సహకారంతో ఈ నెల 5న రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు అనసూయ చెస్ అకాడమీ కోచ్ మాదాసు కిషోర్ చెప్పారు. ఆదివారం టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరించారు. ఆర్యవైశ్య యువజన సంఘం భవనంలో నిర్వహించే టోర్నమెంట్లో అండర్–5, 7, 9, అండర్ 11, అండర్ 13, అండర్ 15, బాల, బాలికలకు ప్రత్యేక బహుమతులు అందిస్తామన్నారు. మరిన్ని వివరాలకోసం 90632 24466 నెంబరులో సంప్రదించాలన్నారు. పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మ చల్లంగా చూడమ్మా.. అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తులు రద్దీ ఎక్కువగా కనిపించింది. పవిత్ర కోనేరులో స్నానాలాచరించిన భక్తులు పెద్దింట్లమ్మకు మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయ ఈవో మాట్లాడుతూ ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, గదుల అద్దెలు, ఇలా అన్నీ కలిపి రూ.85,340 ఆదాయం వచ్చిందని చెప్పారు. -
కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధం
ఉండి: ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యారని సీపీఐ నాయకులు తెలిపారు. శనివారం మహదేవపట్నంలో పలువురు మహిళలు సీపీఐ నాయకుల ఆధ్వర్యంలో గ్రామ సచివాలయానికి వచ్చి ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్బంగా సీపీఐ జిల్లా సమితి సభ్యుడు గొల్లయ్య మాట్లాడుతూ అధికారంలోకి రాగానే గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం కేటాయించి, గృహ నిర్మాణానికి రూ.5 లక్షలు రుణం ఇస్తామన్న హామీని కూ టమి నాయకులు అమలు చేయడం లేదన్నారు. దీంతో మండలంలోని ప్రతి గ్రామంలో మహిళలు కూట మి నాయకులపై తిరగబడేందుకు సిద్ధమవుతున్నా రన్నారు. హామీల అమలుకు కూటమి నాయకులు ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రశ్నించారు. హా మీల అమలు కోసం త్వరలోనే ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి కార్యాచరణ రూపొందిస్తున్నామ న్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలుచేస్తేనే ప్రజల గుండెల్లో స్థానం సంపాదిస్తారన్నారు. సీపీఐ నాయకులు కేతా వెంకటసుబ్బారావు, వీరవల్లి పొట్టి శ్రీను, వీరవల్లి మాణిక్యాలరావు, గుత్తుల సత్తిపండు, గుత్తుల సూర్యనారాయణ పాల్గొన్నారు. -
కూటమి అండదండలతో కబ్జాలు
కొయ్యలగూడెం: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ భూములే కాకుండా ప్రజల భూ ములు కూడా కబ్జాలకు గురవుతున్నాయని అందు కు ఉదాహరణగా కొయ్యలగూడెంలోని సర్వే నంబర్ 311/2 నిలిచిందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. ఆయన శనివారం కొయ్యలగూడెం వచ్చిన సమయంలో సమయంలో టీటీడీ కల్యాణ మండప ప్రాంతవాసులు తమ భూముల కబ్జాపై ఆయన వద్ద మొరపెట్టుకున్నారు. కోట్ల రూపాయల విలువైన భూమి గురించి ఇప్పటికే సమగ్రంగా విషయాలను సేకరించానని, చిన్నపాటి లొసుగులను భూతద్దంలో చూపించి భూముల కబ్జాకు పన్నాగం నడుస్తోందని బాలరాజు అన్నా రు. ఈ విషయంలో ప్రజలను కంగారు పడవద్దని ఓ పక్క చెబుతూ మరోపక్క ఆక్రమణదారులకు కూటమి నాయకులు వెన్ను కాస్తున్నారని ఆరోపించారు. 40 ఏళ్లకుపైగా నివాసముంటున్న స్థానికుల జోలికి వస్తే పర్యవసానం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు కూటమి నేతల ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా సర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ గంజిమాల రామారావు, పార్టీ రాష్ట్ర బీసీ సెల్ సహాయ కార్యదర్శి గంటా శీను, పట్టణ కన్వీనర్ సంకుకొండ, ఘంటసాల సాయి, మారిశెట్టి శ్రీను, చిటికెన నాగార్జున, తొంటా వాసు ఉన్నారు. -
వైద్యానికి సుస్తీ
●గత ప్రభుత్వంలో పేదల ఆరోగ్యానికి భరోసా గత జగన్ ప్రభుత్వంలో పేదల ఆరోగ్యానికి భరోసా గా ఉండేది. ఆరోగ్యశ్రీలో సేవలు పారదర్శకంగా, ఉచితంగా అన్నిరకాల వ్యాధులకు చికిత్స లభించేది. గ్రామాల్లోకి అన్నిరకాల వైద్యులు వచ్చి వైద్యసేవలు అందించేవారు. 104 వాహనం ద్వారా డాక్టర్లు వచ్చి ఇంటింటికీ వెళ్లి మంచంపై ఉన్నవారికి, అంగన్వాడీ, స్కూల్ పిల్లలకు కూడా వైద్య పరీక్షలు, వైద్య సేవలు అందించేవారు. కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు, ఆరోగ్యశ్రీ సేవలు కూడా నిలిపివేస్తున్నారు. – కాండ్రేగుల శ్రీను, నరసన్న చెర్వుపాలెం, వీరవాసరం మండలం మహిళలకు వరంగా ‘సురక్ష’ శిబిరాలు గత ప్రభుత్వంలో వార్డులు, గ్రామాల వారీగా నిర్వహించిన ఆరోగ్య సురక్ష క్యాంపులు మహిళలకు, పేదలకు వరంగా ఉండేవి. ముఖ్యంగా క్యాంపులకు గైనకాలజిస్టులు, ఇతర సెష్పలిస్టుగా ఉన్న మహిళా వైద్యు లు రావడంతో మహిళల్లో ఆరోగ్య సమస్యలను ఆదిలోనే గుర్తించి సకాలంలో మెరుగైన వైద్యం అందించడం, శస్త్రచికిత్స కోసం ఆరోగ్యశ్రీకి సిఫార్సు చేయడం జరిగేది. ఈ క్యాంపుల్లో మహిళల్లోని గర్భాశయ, బ్రెస్ట్ క్యాన్సర్ కేసులను గుర్తించి సకాలంలో వైద్యం అందించి ప్రాణాలను రక్షించేవారు. కూటమి ప్రభుత్వంలో సీజనల్ వ్యాధులకు మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటుచేయడం లేదు. – పాలవెల్లి మంగ, భీమవరం ఒంట్లో నలత చేసినా ఆందోళన అక్కర్లేదు.. ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ ఫిజీషియన్ రూపంలో వైద్యులు ఊరికే వచ్చి సేవలు అందిస్తారన్న ధీమా.. ఎంత పెద్ద రోగమొచ్చినా ఆరోగ్యశ్రీ కార్డుపై రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యసాయం అందుతుందన్న భరోసా.. కోలుకునే వరకూ జీవన భృతికి ఆరోగ్య ఆసరా ఇస్తారన్న నమ్మకం.. ఇలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల ఆరోగ్యానికి కొండంత అండగా ఉన్న పలు కార్యక్రమాలు కూటమి ప్రభుత్వ పాలనలో కనుమరుగయ్యాయి. సాక్షి, భీమవరం : ప్రజారోగ్య పరిరక్షణకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారు. ఆరోగ్యం ప్రతిఒక్కరి హక్కుగా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో 1,059 చికిత్సల సంఖ్య (ప్రొసీజర్ల)ను 3,257కి పెంచడంతో పాటు కుటుంబానికి రూ.5 లక్షలు ఉన్న వ్యయ పరిమితిని రూ.25 లక్షలకు పెంచారు. జిల్లాలో ఐదేళ్లలో ఈ పథకం కింద 2.05 లక్షల మందికి రూ.436.32 కోట్లు విలువైన శస్త్రచికిత్సలు అందించారు. కాగా ఎన్టీఆర్ వైద్యసేవగా పేరుమార్చిన కూటమి ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకుండా రోగులను ఇబ్బందులకు గురి చేస్తోంది. జిల్లాలోని 30 వరకు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) సేవలు అందిస్తున్నాయి. రోజుకు సుమారు 1,500 వరకు ఓపీ నమోదవుతుండగా ఇన్ పేషెంట్లుగా చేరేవారు 500 వరకు ఉంటున్నారు. జిల్లాలోని నెట్వర్క్ ఆస్పత్రులకు సుమారు రూ.150 కోట్ల మేర బకాయిలు పెట్టడంతో గత ఏప్రిల్ రెండో వారంలో జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురంలోని 19 ఆస్పత్రుల్లో సేవలను నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. ‘ఆరోగ్య ఆసరా’కు ఎసరు ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్స చేయించుకున్న రోగి కోలుకునే వరకూ వైఎస్సార్ ఆరోగ్య ఆసరాగా గత ప్ర భుత్వం జీవన భృతి అందజేసింది. రోజుకు రూ.275 చొప్పున సాయం లెక్కకట్టి అందించేవారు. సాధారణ డెలివరీ, సిజేరియన్లకు రూ.5 వేలు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడి విరిగిన ఎముకల సర్జరీకి రూ.10 వేలు, కాళ్లకు ఇన్ఫెక్షన్ సంబంధించి సెల్యులైటీస్ కేసులు, కొన్ని కణుతుల చికిత్సలకు రూ.1,575.. ఇలా చికిత్సను బట్టి సాయాన్ని రోగి బ్యాంకు ఖాతాలకు జమచేసేవారు. ఐదేళ్లలో 94,000 మంది లబ్ధిదారులకు రూ.53 కోట్ల ఆర్థిక సాయం అందించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య ఆసరా బిల్లులు చెల్లింపును నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరిపోయిన ‘కంటి వెలుగు’ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల ద్వారా జిల్లాలోని ఆచంట, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం సీహెచ్సీల్లో ఉచితంగా కంటి వైద్యసేవలు అందించేవారు. అవసరమైన వారికి కళ్లజోళ్లు పంపిణీ, శస్త్రచికిత్సలు చేసేవారు. ఇలా 1,30,733 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. 1,28,358 మందికి రిఫ్రాక్షన్ చెక్స్, 53,102 మందికి ఫండస్ చెక్స్, 90,059 మందికి కళ్లజోళ్లు అందజేశారు. 884 డీఆర్, 626 గ్లకోమా, 140 మాకులర్ డిజనరేషన్, 14,080 కాటరాక్ట్, 76 హైపర్టెన్సివ్ రెటినోపతి రోగులను గుర్తించి సంబంధిత వైద్యసేవలు, శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ కేంద్రాలను నిర్వహిస్తున్న కాంట్రాక్టు సంస్థతో మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ) గడువు గతేడాది సెప్టెంబరు 4తో ము గియగా కూటమి ప్రభుత్వం రెన్యూవల్ చేయకపోవడంతో సేవలు నిలిచిపోయాయి. కంటి పరీక్షల కోసం పేదలు రూ.వేలు వెచ్చించి ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. మెడికల్ కళాశాలపై కత్తి వైద్య విద్యను పేదలకు చేరువ చేయడం, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే లక్ష్యంతో గత ప్రభుత్వం జిల్లాలోని పాలకొల్లులో చేపట్టిన మెడికల్ కళాశాలకు కూటమి బ్రేక్ వేసింది. 60 ఎకరాల్లో రూ.475 కోట్ల వ్యయంతో రెండేళ్ల క్రితం పనులు ప్రారంభించగా ఎన్నికల సమయం నాటికి రూ.74.5 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. కూటమి వచ్చాక నిధులు విడుదల చేయకపోవడంతో నిర్మాణ సంస్థ దాదాపు పనులు నిలిపివేసింది.గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో అందించిన సేవలు ఉచిత అడ్మిషన్. అవసరమైన ఆధునిక వైద్య పరీక్షలు, మందులు. శస్త్రచికిత్స, అందుకు అవసరమైన మందులు, అల్పాహారం, రెండు పూటలా భోజనం. డిశ్చార్జ్ సమయంలో సరిపడా మందులు. విశ్రాంతి తీసుకునే సమయంలో ఖర్చు నిమిత్తం ఆరోగ్య ఆసరాగా లబ్ధిదారు ఖాతాలో డబ్బులు. ఇంటికి వెళ్లేందుకు అవసరమయ్యే ప్రయాణ చార్జీలు. పది రోజుల తర్వాత ఆస్పత్రికి వచ్చి ఉచితంగా వైద్య సేవలు పొందే అవకాశం. అవసరమైన చికిత్సలకు ఏడాది పాటు డాక్టర్ సంప్రదింపులు, వైద్య పరీక్షలు, మందులు కూడా ఉచితం. వైద్యం పొందే సమయంలో ఆరోగ్య మిత్ర, ఆసుపత్రి సిబ్బంది లేదా మరెవరైనా లంచం అడిగితే 14400 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసే అవకాశం. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం కూటమి పాలనలో పడకేసిన వైద్యం నిలిచిన ఆరోగ్య సురక్ష, ముఖ్యమంత్రి ఈఐ కేంద్రం సేవలు అందని ఆరోగ్య ఆసరా పాలకొల్లులో అటకెక్కిన వైద్య కళాశాల పనులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల వైద్యానికి భరోసా ప్రజలకు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు నాడు సురక్ష.. నేడు శిక్ష గత ప్రభుత్వంలో పైసా ఖర్చు లేకుండా పేదలకు వైద్య భరోసా కల్పించిన ఆరోగ్య సురక్ష శిబిరాల నిర్వహణను కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. గత ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆరోగ్య సురక్ష శిబిరాల్లో 264 మంది స్పెషలిస్ట్ వైద్యులు, 132 మంది మెడికల్ ఆఫీసర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది విధుల్లో పాల్గొనేవారు. రక్తం, మూత్రం, ఈసీజీ తదితర 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచి అవసరమైన వారికి అందజేసేవారు. ఏడాది కాలంగా శిబిరాల నిర్వహణ లేకపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు స్పెషలిస్ట్ వైద్యసేవల కోసం పట్టణాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. -
కౌలు రైతు కార్డులు తప్పనిసరి
పెంటపాడు: కౌలు రైతుల వద్ద కౌలు రైతు కార్డు (సీసీఆర్సీ) తప్పనిసరిగా ఉండాలని, దీనిపై రెవెన్యూ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని జేసీ రాహుల్కుమార్రెడ్డి అన్నా రు. ప్రత్తిపాడు సచివాలయం వద్ద శనివారం రైతులు, కౌలురైతులతో సమావేశం నిర్వహించి, సీసీఆర్సీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కౌలు రైతు చట్టం ప్రకారం పంట పండించే వారికి పంటపై మాత్రమే హక్కు ఉంటుందన్నారు. పంట సాగు హక్కు పత్రం పొందిన రైతులకు బీమా, ఇన్పుట్ సబ్సిడీ వర్తిస్తుందన్నారు. కావున భూ యజమాని తన పొలాన్ని సాగుచేసే రైతుకు అంగీకార పత్రాన్ని వీఆర్వో ద్వారా అందించాలన్నారు. తద్వారా ఈక్రాప్ నమోదు చేస్తామన్నారు. అనంతరం రైతులతో మాట్లాడారు. పూర్తిస్థాయిలో కౌలు కార్డులు అందించకపోవ డంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామసభల అవగాహన కల్పించాలన్నారు. డీఏఓ జెడ్. వెంకటేశ్వరరావు, ఆర్డీఓ కౌసర్ బానో, ఏడీఏ పి.మురళీకృష్ణ, ఏఓ కె.పార్థసారథి తదిరులు ఉన్నారు.రహదారులపై సర్వేకొయ్యలగూడెం: కొయ్యలగూడెంలోని మెయిన్ రోడ్ల లో రెవెన్యూ అధికారులు శనివారం సర్వే చేపట్టారు. గతనెల 29న ‘సాక్షి’లో ‘పీజీఆర్ఎస్ తీరు అపహాస్యం’ శీర్షికన ప్రచురించిన కథనానికి కలెక్టర్ స్పందించి పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీంతో రెవెన్యూ, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సర్వేని ప్రారంభించి మార్కింగ్ చేశారు. దాదాపు మూడు నెలల క్రితం మల్లవరపు శ్రీనివాసు అనే వ్యక్తి కొయ్యలగూడెంలో ప్రధాన జాతీయ రహదారులు ఇరువైపులా ఆక్రమణలకు గురయ్యాయని ఫిర్యాదు చేశారు. అయితే ఆన్లైన్లో సమస్యను పరిష్కరించినట్టు సమాచారం రావడంతో ‘సాక్షి’ ద్వారా కలెక్టర్కి విషయం చేరింది. దీంతో కలెక్టర్ వెట్రిసెల్వి ప్రత్యేక శ్రద్ధతో చర్యలకు ఆదేశాలిచ్చారని అధికారులు తెలిపారు. -
నేటినుంచి ప‘రేషన్’!
భీమవరం: రేషన్ కార్డుదారులకు చౌక డిపోల వద్దనే నిత్యావసర సరుకులు తీసుకునే కార్యక్రమాన్ని ఆదివారం కూటమి ప్రభుత్వం ప్రారంభించనుంది. కార్డుదారులు రేషన్ షాపుల వద్ద గంటల తరబడి క్యూల్లో నిలబడి మోయలేని బరువుతో ఎక్కువ దూరం తీసుకువెళ్లాల్సిన పరిస్థితులు పునరావృతం కానున్నాయి. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ నిత్యావసర సరుకులు అందించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జ్ఞాపకాలను చెరిపేసే ఉద్దేశంతో రేషన్ డిపోల వద్దనే సరుకుల పంపిణీకి చేస్తున్న ఏర్పాట్లను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో 5,67,671 రేషన్ కార్డులకు 1,060 డిపోల ద్వారా ద్వారా నెలకు సుమారు 8,700 టన్నుల బియ్యం, 567 టన్ను కందిపప్పు, 300 టన్నుల పంచదార పంపిణీ చేయాల్సి ఉంది. ఇందుకోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 356 ఎండీయూ వాహనాలను ఏర్పాటు చేసి వందలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఇంటి వద్దకే సరుకులు అందించి వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ఊరట కల్పించింది. ఇకపై పడిగాపులే.. సరుకులు పొందాలంటే ఇక నుంచి గంటల పాటు చౌకడిపోల వద్ద పడిగాపులు తప్పవని కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. సర్వర్ పనిచేయడం లేదంటూ, వేలిముద్రలు పడటం లేదంటూ రోజుల తరబడి చౌక డిపోల చుట్టూ తిప్పుతారని వాపోతున్నారు. బియ్యం మూటలతో దూర ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడతామని అంటున్నారు. దివ్యాంగులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ ఇస్తామని కూటమి ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో ఎంతవరకు సాధ్యమని డీలర్లు పెదవి విరుస్తున్నారు. తాము సరుకులు తీసుకువెళ్లిన సమయంలో కార్డుదారులు వారి ఇంటి వద్ద లేకపోతే సమస్యలు తప్పవని డీలర్లు అంటున్నారు. మొత్తంగా ఎండీయూ వ్యవస్థ రద్దు, చౌక డిపోల ద్వారా రేషన్ పంపిణీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక రేషన్ దుకాణాల్లోనే సరుకుల పంపిణీ క్యూలైన్లలో గంటల తరబడి ఎదురుచూపులు తప్పవు దూరాభారమైనా మోయలేని బరువులతో యాతనలే.. సర్వర్ పనిచేయక వేలిముద్రలు పడకపోతే మరింత ఇబ్బందులు -
ముగిసిన సర్టిఫికెట్ల పరిశీలన
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత నాలుగు రోజుల నుంచి నిర్వహిస్తున్న ప్రత్యేక కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఎన్సీసీ, స్పోర్ట్స్, సైనికోద్యోగుల పిల్లలు, భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ కోటాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 28 నుంచి నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నాలుగు రోజుల సర్టిఫికెట్ల పరిశీలనలో ఎన్సీసీ విభాగంలో మొత్తం 1,454 మందికి గాను 1,101 మంది, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 1,032 మందికి గాను 742 మంది, సైనికోద్యోగుల పిల్లల కోటాకు సంబంధించి 270 మందికి గాను 198 మంది, భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ కోటాకు సంబంధించి 247 మందికి గాను 185 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చిన అభ్యర్థులకు, వారితో పాటు వచ్చిన వారి సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు, ఏఆర్ అర్జునరావు సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
భక్తులతో కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు, వేసవి సెలవులు కావడంతో వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. దాంతో ఆలయ పరిసరాలు భక్తులతో పోటెత్తాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కల్యాణకట్ట, నిత్యాన్నదాన సదనం తదితర విభాగాలు భక్తులతో రద్దీగా మారాయి. కొండపైన టోల్గేట్, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దాదాపు 10,500 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. -
పొగాకు సాగులో విప్లవాత్మక మార్పులు అవసరం
బుట్టాయగూడెం: పొగాకు సాగులో విప్లవాత్మక మార్పులు అవసరమని ఐకార్ ఎన్ఐఆర్సీఏ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. జీలుగుమిల్లి ఐకార్ జాతీయ, వాణిజ్య పంటల పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో శనివారం క్షేత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పొగాకు సాగులో ఉత్తమ నాణ్యత, అధిక దిగుబడికి ఉత్తమ యాజమాన్య పద్ధతుల్లో పొగాకు బేరన్ల నిర్వహణ గురించి రైతులకు వివరించారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిశోధనా కేంద్రం ప్రతినిధి కొడవటి వాసుదేవరావు మాట్లాడుతూ ఐకార్– ఎన్ఐర్సీఎ, ఐఓసీఎల్, ఎమినెన్ట్ గ్యాస్ టెక్నాలజీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన గ్యాస్ అథారిటీ పొగాకు బేరన్ పనిచేయు విధానాన్ని రైతులకు వివరించారు. గడచిన 30 ఏళ్లుగా పొగాకు రైతులు పొగాకు బేరన్లో కలప వాడటం వల్ల అధికంగా వచ్చే కాలుష్యాన్ని నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఓసీఎల్ జనరల్ మేనేజర్ వర్నేకర్, సంస్థ చీఫ్ మేనేజర్ లలిత, పొగాకు బోర్డు ఎక్స్టెన్షన్ మేనేజర్ సురేఖ, బోర్డు ఆర్ఎమ్ ప్రసాద్, ప్రాజెక్టు హెడ్ డాక్టర్ ఎల్కే ప్రసాద్, ఎన్ఐఆర్సీఏ ఆర్ఎస్ హెడ్ డాక్టర్ వైవీ సుబ్బయ్య, టి.వెంకటేష్, టి.రమేష్, దేవానంద్, పొగాకు బోర్డు అధికారులు, ట్రేడ్ ప్రతినిధులు, ఎన్ఐఆర్సీఏ శాస్త్రవేత్తలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఐకార్ ఎన్ఐఆర్సీఏ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ -
వ్యాధుల కాలం.. పశువులు జాగ్రత్త
ఆగిరిపల్లి: వర్షాకాలంలో పశువులు వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. పశువుల పట్ల పాడి రైతులు ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన వాటి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లవచ్చని, పశువులు, గొర్రెలు, మేకల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. జీవాలు ప్రమాదకర పరిస్థితిలో ఉంటే వెంటనే 1962 టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే సంచార పశు ఆరోగ్య సేవ వాహనంతో వైద్యులే ఇంటికి వచ్చి చికిత్స అందిస్తారని తెలిపారు. వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆగిరిపల్లి మండల పశువైద్యాధికారి జి.హనుమంతరావు చేసిన సూచనలు ఇలా ఉన్నాయి. గాలి కుంటు వ్యాధిపై అప్రమత్తం గాలికుంటు వ్యాధి ఎక్కువగా ఆవులు, ఎద్దులు, గేదెలకు సోకుతుంది. వ్యాధి బారిన పడిన పశువు శరీర ఉష్ణోగ్రత 104 నుంచి 105 డిగ్రీలకు పెరుగుతుంది. పశువునోట్లో, గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. ఆహారం సరిగా తీసుకోలేవు. దీంతో నీరసంగా మారి నడిచేందుకు కూడా కష్టపడతాయి. పాడి పశువుల్లో అయితే పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. వ్యాధి నివారణ కోసం వైద్యులు సూచనల మేరకు యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ మందులను వాడాల్సి ఉంటుంది. కలుషిత నీటితో జలగవ్యాధి మురుగునీరు, కలుషిత నీరు తాగడం వల్ల పశువులకు ఎక్కువగా ఈ వ్యాధి వస్తుంది. ముఖ్యంగా గేదెలు, దూడలు, గొర్రెలు, మేకలు వంటి జీవాలకు ఈ వ్యాధి వస్తుంది. వ్యాధి బారిన పడిన పశువులు మేత తినడంలో ఇబ్బందులు పడతాయి. పాల దిగుబడి క్షీణిస్తుంది. జలగ వ్యాధి బారిన పడిన పశువులను మంద నుంచి వేరు చేయాలి. డిస్టోడిన్ 4 మాత్రలు, 100 మిల్లీ లీటర్ల నియోజడ ప్లస్ను అందించాలి. నట్టల వ్యాధితో ఎదుగుదలకు బ్రేక్ పశువులు పచ్చి మేత తిన్నప్పుడు నులిపురుగుల సమస్య వస్తుంది. దీంతో వాటి ఎదుగుదలకు అవకాశం ఉండదు. జీవాలు తిన్న ఆహారం అంతా నులిపురుగులే స్వాహా చేస్తాయి. దీంతో జీవాలు తరచూ రోగాల బారిన పడే అవకాశం ఉంది. ఎక్కువగా గొర్రెలు ఈ వ్యాధి బారిన పడతాయి. పశుసంవర్థక శాఖ ముందుజాగ్రత్త చర్యగా ఆరు నెలలకు ఒకసారి పశువులకు నట్టల నివారణ మందులు ఉచితంగా అందిస్తుంది. ప్రస్తుతం పశువైద్య సిబ్బంది నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తున్నారు. గొంతు వాపు.. ప్రాణాంతకం పశువులకు సంక్రమించే వ్యాధుల్లో గొంతు వాపు వ్యాధి ప్రాణాంతకమైనది. ఈ వ్యాధి బారిన పడిన పశువులు కంటి నుంచి నీరు కారటం, నోటి నుంచి చొంగకారడం, శ్వాస పీల్చడానికి ఇబ్బందులు పడుతుంటాయి. గొంతు కిందకు నీరు దిగి గొంతు వాపు వస్తుంది. తీవ్రత ఎక్కువైతే పశువులు చనిపోయే ప్రమాదం ఉంది. వ్యాధి నివారణకు ముఖ్యంగా జూన్, జులై నెలల్లో (హెచ్ ఎస్) టీకాలు వేయించుకోవాలి. వ్యాధి బారిన పడిన పశువును మిగిలినవాటి నుంచి దూరం చేయాలి. ఈటీ వ్యాక్సిన్తో చిటుకు వ్యాధికి చెక్ వర్షాకాలంలో పశువులకు ఎక్కువగా సోకే మరో వ్యాధి చిటుకు వ్యాధి. ఈ వ్యాధి వచ్చినప్పుడు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీని నివారణ కోసం జూన్, జూలై మాసంలో ఈటీ వ్యాక్సిన్ వేస్తారు. రైతులు పశువులకు సంబంధించిన వ్యాధులను సకాలంలో గుర్తించి తగిన వైద్యం అందించాలి. జి .హనుమంతరావు. పశు వైద్యాధికారి, ఆగిరిపల్లి -
● నరికినా.. కాసింది
బుట్టాయగూడెం మండలం కామవరంలో గ్రామానికి చెందిన కొమరం వెంకన్న అనే రిటైర్డ్ ఉద్యోగి ఇంటి పెరటిలో నరికేసిన చెట్టు మధ్యలో అరటిగెల వచ్చింది. అయితే అలా రావడం మంచిది కాదని కొందరు చెప్పడంతో వెంకన్న రెండుసార్లు ఆ చెట్టును నరికేసినట్లు తెలిపాడు. అయినప్పటికీ మళ్లీ చెట్టు మధ్యలోనుంచే కాపు వస్తుందంటున్నారు. నరికిన చెట్టు మధ్యలో వచ్చిన అరటిగెలను చూసి పరిసర ప్రాంత ప్రజలు ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. – బుట్టాయగూడెం కామవరంలో నరికేసిన చెట్టు మధ్య నుంచి అరటి గెల వచ్చిన దృశ్యం -
ఇండియా రోల్బాల్ టీం విజయంలో తణుకు క్రీడాకారులు
తణుకు అర్బన్: ఇంటర్నేషనల్ ఇన్విటేషనల్ రోల్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో ఇండియా రోల్బాల్ టీం విజయంలో తణుకు క్రీడాకారులు సత్తా చాటారు. ఈ పోటీల్లో తణుకు మునిసిపల్ స్కేటింగ్ రింక్ పశ్చిమ గోదావరి జిల్లా రోల్ బాల్ అసోసియేషన్ క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించినట్లు అసోసియేషన్ సెక్రటరీ లావణ్య, కోచ్ చందు తెలిపారు. శ్రీలంకలో గతనెల 29వ తేదీన నిర్వహించిన ఈ పోటీల్లో సీనియర్ కేటగిరీలో రెడ్డి పవన్ హర్షవర్థన్, జూనియర్ కేటగిరీలో నలమాటి షరత్రావు, గుల్లపూడి రంజిత్కుమార్, సబ్ జూనియర్ కేటగిరీలో రెడ్డి గగన్దీప్ స్వర్ణపతకాలు సాధించారని వివరించారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ క్రీడాకారులను అభినందించారు. -
పింఛన్ల కోసం పడిగాపులు
ఆకివీడు: పింఛన్లు మే 31వ తేదీ నుంచే పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పలు చోట్ల ప్రజలు శనివారం ఉదయం నుంచే వీధుల్లో పింఛన్ల కోసం పడిగాపులు పడ్డారు. స్థానిక వడలి వారి వీధి, సంతపేట ప్రాంతాల్లో పింఛన్ల కోసం లబ్ధిదారులు మధ్యాహ్నం వరకూ వేచి చూసినా పంపిణీ చేసే ఉద్యోగులు రాకపోవడంతో తీవ్ర నిరుత్సాహం చెందారు. తిండితిప్పలు లేకుండా, ఉక్కబోత వాతావరణంలో చెమటలు కక్కుతూ పడిగాపులు పడ్డామని వృద్ధులు, దివ్యాంగులు వాపోయారు. ఈ విషయాన్ని సాక్షి ద్వారా కమిషనర్కు తెలియజేయగా సంబంధిత ఉద్యోగి సెలవులో ఉన్నారని, అందువల్ల సంతపేట, ఆనాల చెరువు ప్రాంతాల్లోని పింఛన్దారులకు పింఛన్ పంపిణీ చేయలేదని చెప్పారు. కనీసం ఈ విషయాన్ని బాధితులకు తెలియజేసి అక్కడ నుంచి పంపించివేయండని చెప్పినా వారికి సమాచారం ఇవ్వలేదు. కుప్పనపూడి శివారు తాళ్లకోడులోని 74 ఎకరాల్లో తమకు పట్టాలిచ్చారని, అక్కడే ఇళ్లు కట్టుకున్నామని, ఫించన్, రేషన్కు ఆకివీడు రావాల్సిన దుస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. ఇళ్ల లబ్ధిదారులను బెదిరించడం దారుణం ఆకివీడు: కుప్పనపూడి శివారు తాళ్లకోడులోని జగనన్న కాలనీలో రీ సర్వే పేరుతో లబ్ధిదారుల్ని బెదరించడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ.గోపాలన్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం పెంకి అప్పారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2007, 2019లో పేదల్ని గుర్తించే ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చిందని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ స్థలాలను పేదల నుంచి వెనక్కి లాగేసుకునేందుకు రీ సర్వే నిర్వహిస్తోందని ఆరోపించారు. కాలనీలో ఇళ్ల నిర్మాణం చేపట్టకపోతే స్థలాలు వెనక్కి తీసుకుంటామని పేదలను బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పేదల్ని వేధిస్తే చూస్తూ ఊరుకునేదిలేదని, జిల్లావ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. -
నవధాన్యాలతో భూమికి జవసత్వాలు
భీమవరం: వ్యవసాయమే జీవనాధారమైన జిల్లాలో రైతన్నలు ఆరుగాలం కష్టపడి ఏటా మూడు పంటలు పండించేవారు. సార్వా, దాళ్వా వరిసాగే కాకుండా దాళ్వా పంట అనంతరం ఆరుతడి పంటలుగా మినుము, పెసర, మొక్కజొన్న, బొబ్బర్లు వంటి వాటితోపాటు పశుగ్రాసానికి పిల్లిపెసర, జనుము, జొన్న వంటివాటిని పండించేవారు. అయితే కొన్నేళ్లుగా వరిసాగులో జాప్యం కారణంగా దాళ్వా వరి పంట ఏప్రిల్, మే నెలల్లో చేతికి రావడంతో మూడవ పంట వేయడానికి సమయం సరిపోవడం లేదు. మూడవ పంటగా అపరాలు, పశుగ్రాసం పండించడం వల్ల భూమికి సహజంగా పోషక పదార్థాలు లభించేవి. మూడవ పంట లేకపోవడంతో రైతులు కేవలం ఎరువులు వేయడం ద్వారానే పంట దిగుబడి పెంచుకోడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సివస్తుంది. అయితే పాత విధానంతో మూడు పంటలు పండించడానికి వ్యవసాయశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సబ్సిడీపై విత్తనాల పంపిణీ జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 2.20 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తుండగా దీనిలో మూడవ పంట పండించేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుత దాళ్వా సీజన్ ముగింపు దశలో జిల్లాలోని 21,150 ఎకరాల్లో రైతులను అపరాల సాగుతోపాటు పశుగ్రాసం పెంచేందుకు రైతులకు 50 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేశారు. దీనికిగాను ప్రత్యేకంగా సేకరించిన మినుము, పెసర, జీలుగు, రాగి, సజ్జలు, నువ్వులు, వేరుశెనగ, ఆవాలు, పిల్లిపెసర, జనుము, మొక్క వంటివాటితోపాటు ఆకుకూరలైన తోటకూర, పాలకూర, మెంతుకూర, చుక్కకూర, గొంగూర, బీర, అనప, దోస వంటి సుమారు 15 రకాలు కలిగిన 12 కిలోల విత్తనాలను కిట్లుగా తయారుచేసి పంపిణీ చేశారు. ప్రయోజనం ఏమిటంటే.. భూమిలో సారాన్ని సహజంగా పెంచడానికి వేరు వ్యవస్థ ఎంతగానో దోహదం చేస్తుంది. అందువల్ల వివిధ రకాల విత్తనాలు కలగలిపి చేలలో వేయడం వల్ల రైతులకు కొంతమేరకు ఆదాయంతోపాటు ఇంటి అవసరాలు తీర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రధానంగా వివిధ రకాల తీగ, ఆకుజాతి మొక్కల వేర్లు వల్ల భూమిలో బ్యాక్టీరియా వృద్ధి చెంది సహజసిద్ధంగా భూసారం పెరుగుతుంది. దీనితో వరి పండించడానికి ఎక్కువ మోతాదులో ఎరువులు వాడనవసరం లేకపోవడమేగాక తెగుళ్లు కూడా తగ్గే అవకాశముంటుంది. భూమిలో బ్యాక్టీరియా వృద్ధి చెందడం వల్ల రైతులు పంటలకు కొద్దిమొత్తంలో ఎరువులు వేసినా వాటి సామర్థ్యం పెరిగి పంటకు ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం కొద్దిమొత్తం విస్తీర్ణం ప్రయోగాత్మకంగా వేసి నవధాన్యాల సాగు రానున్ను రోజుల్లో జిల్లా మొత్తం విస్తీర్ణం వేయడానికి రైతులను సన్నద్ధం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 21 ఎకరాల్లో నవధాన్యాల సాగుకు విత్తన కిట్ల పంపిణీ భూసారం పెరగడంతోపాటు రైతులకు ఆదాయం జిల్లా వ్యాప్తంగా 2.20 లక్షల ఎకరాల్లో నవధాన్యాల సాగుకు ప్రణాళిక నవధాన్యాల సాగు ఎంతో ప్రయోజనం దాళ్వా అనంతరం నవధాన్యాల సాగు ఏడాది ప్రయోగాత్మకంగా చేపట్టాం. దాదాపు 21 వేల ఎకరాల్లో రైతులకు సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేశాం. దీనివల్ల రైతులకు కొంతమొత్తం ఆదాయం రావడమేగాక భూసారాన్ని సహజసిద్ధంగా పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో జిల్లాలోని దాదాపు 2.20 లక్షల ఎకరాల్లో నవధాన్యాలసాగు చేపట్టే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తాం. – జెడ్ వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి, భీమవరం -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
టి.నరసాపురం: వ్యాన్, మోటార్ సైకిల్ ఢీకొన్న ఘటనలో మోటార్సైకిలిస్ట్ మృతిచెందాడు. ఎస్సై ఎం జయబాబు తెలిపిన వివరాలివి. చింతలపూడి మండలం బట్టువారిగూడెంకు చెందిన జక్కుల ప్రకాష్ (21) టి.నరసాపురం మండలం కె.జగ్గవరంలో ఓ ఫంక్షన్కు వెళ్లి మోటార్సైకిల్పై తిరిగి వస్తున్నాడు. రాజుపోతేపల్లి అడ్డరోడ్డు వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న వ్యాన్ మోటార్సైకిల్ను ఢీకొనడంతో ప్రకాష్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని తండ్రి జక్కుల నరసింహారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. -
20 రోజుల తర్వాత మృతదేహం అప్పగింత
నరసాపురం రూరల్: ఇరవై రోజుల తర్వాత మృతదేహాన్ని బంధవులకు రైల్వే పోలీసులు అప్పగించారు. వివరాల ప్రకారం.. నరసాపురం మండలం సీతారాంపురం సౌత్ నేతల వారి పేటకు చెందిన నేతల అనిల్ కుమార్ (20) స్థానికంగా ఓ బేకరిలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అయితే ఇటీవల మెరుగైన జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లిన అనిల్ కుమార్ ఇరవై రోజుల క్రితం తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. మృతుని బంధువులు విజయవాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా 20 రోజుల తర్వాత అనిల్కుమార్ మృతదేహాన్ని గుర్తించి శనివారం కుటుంబ సభ్యులకు రైల్వే పోలీసులు అప్పగించారు. మహిళకు గాయాలు పాలకోడేరు: మోటార్సైకిల్ సడన్బ్రేక్ వేయడంతో వెనక కూర్చున్న మహిళ అకస్మాత్తుగా కింద పడి గాయాలపాలైంది. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. అంతర్వేది దేవి(62) అనే మహిళ పింఛన్ తీసుకుని తన కుమారుడి మోటార్సైకిల్పై వస్తుంది. గొల్లలకోడేరు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న కారును తప్పించేందుకు మోటార్సైకిల్ సడన్ బ్రేక్ వేయగా వెనుక కూర్చున్న ఆమె రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయమైంది. అదే సమయంలో కారు డ్రైవర్ కూడా సడన్ బ్రేక్ వేయడంతో కారు అడ్డం తిరిగి పక్కనే ఉన్న పంట బోదెలోకి దూసుకుపోయింది. వెంటనే స్థానికులు స్పందించి కారులో ఉన్న డ్రైవర్ని బయటకు లాగారు. గాయపడిన మహిళను పాలకోడేరు 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స నిమిత్తం భీమవరంలోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారు ఉండి: ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి జీ సుందర్కుమార్ శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. కూటమి ప్రభుత్వం కనీసం టెన్త్ మూల్యాంకనం కూడా సక్రమంగా నిర్వహించలేకపోయిందని ఆరోపించారు. టైన్త్ మూల్యాంకనలో ఫలితాలు అస్తవ్యస్తంగా రావడంతో విద్యార్థులు నష్టపోతున్నారని, ప్రతి విద్యార్థికి ఫీజు చెల్లించకుండానే రీవాల్యూయేషన్ చేయించి మళ్లీ ఫలితాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
భీమవరం (ప్రకాశంచౌక్): యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భీమవరంలోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం ప్రాంగణంలో యోగ అభ్యసన కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ప్రతిఒక్కరూ యోగాను దిన చర్యగా చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. శారీరక, మానసిక దృఢత్వానికి యోగా సంజీవని అని అన్నారు. మహిళలు తమ జీవిత భాగస్వామికి కూడా యోగాపై అవగాహన కల్పించి యోగా కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, జిల్లా లేబర్ ఆఫీసర్ ఎ.లక్ష్మీ, సాంస్కృతిక కేంద్రం అధ్యక్షుడు సుబ్బరాజు, కార్యదర్శి చెరుకువాడ సుబ్రహ్మణ్యం రాజు పాల్గొన్నారు. -
ఉద్యోగాల పేరుతో టోకరా
భీమడోలు: నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామ ని నమ్మించి మోసగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఓ వ్యక్తిని భీమడోలు పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న షేక్ రసూల్ కలకాడను భీమడోలు కోర్టులో హాజరుపర్చారు. ఇదిలా ఉండగా ఇదే ముఠాలోని మరో వ్యక్తి అల్తాఫ్ పరారీలో ఉన్నాడు. భీమడోలులో సీఐ యూజే విల్సన్, ఎస్సై వై.సుధాకర్ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లోని తుక్కుగూడ ప్రాంతానికి చెందిన షేక్ రసూల్ కలకాడ, అతడి రెండో కుమారుడు అల్తాఫ్ రంగారెడ్డి జిల్లా గండిపేటలో నివాసముంటున్నారు. కొన్నేళ్లుగా వీరిద్దరూ తమకు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో సాన్ని హిత్యం ఉందని చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఎర వేస్తున్నారు. వారి నుంచి లక్షలాది రూపాయలు కాజేసి నకిలీ అపాయింట్మెంట్లతో మోసం చేస్తున్నారు. ఇలా పోలసానిపల్లికి చెందిన దివ్యాంగుడు కుక్కల నాగమల్లేశ్వరరావుకు ఏపీ సచివాలయంలోని వ్యవసాయ విభాగంలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు. నాగమల్లేశ్వరరావు నుంచి రూ.3 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. ఇది నకిలీ లెటర్ అని తెలిసి మోసపోయినట్టు గ్రహించిన నాగమల్లేశ్వరరావు గతేడాది మే 26న భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా రంగారెడ్డి జిల్లా గండికోటలో ఉన్న రసూల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు చేధించిన బృందంలోని హెచ్సీ ఎస్.శ్రీనినవాసరావు, ఎస్కే బాజీ, ఎం.వెంకటేశ్వరరావులు సీఐ విల్సన్ అభినందించారు. అలాగే పూళ్లకి చెందిన దూలం సాయిబాబా అనే వ్యక్తికి పోలీస్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.20 లక్షలు తీసుకుని మోసం చేసిన కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ద్వారకాతిరుమల మండలం దేవినేనివారిగూడేనికి చెందిన సుంకవల్లి శ్రావణ్కుమార్ అనే వ్యక్తి పొలం కొంటామని నమ్మించి, రెండు చెల్లని చెక్కులు ఇవ్వగా రసూల్, అల్తాఫ్లపై కేసు నమోదైంది. తండ్రి అరెస్ట్.. పరారీలో కుమారుడు -
కూలబడిన చదువులు
పేదల విద్యకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేసింది. పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. అయితే గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు విద్యపై శీతకన్ను వేస్తోంది. తల్లికి వందనం పథకాన్ని తొలి ఏడాది అటకెక్కించి తల్లుల ఆశలపై నీళ్లు చల్లింది. పేదలపై ఫీజుల భారం మోపుతోంది. నాడు–నేడును నీరుగారుస్తోంది. గతంలో అల్లారు ‘ముద్ద’గా.. మధ్యాహ్న భోజనం మెనూలోను జగన్ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఆకర్షణీయ మెనూతో రోజుకో కొత్త రుచిని అందిస్తూ జగనన్న గోరుముద్ద పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. పోషక విలువలు కలిగిన పోర్టిఫైడ్ రైస్తో పాటు రాగిజావ, కోడిగుడ్డు, చిక్కీలతో విద్యార్థులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించింది. కాగా డొక్కా సీత మ్మ మధ్యాహ్న భోజనంగా పేరుమార్చిన కూ టమి ప్రభుత్వం పెరిగిన కాయగూరలు, ని త్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా ధరలు సవరించక ఆహారంలో నాణ్యత లోపించడంతో ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. విద్యారంగం.. అస్తవ్యస్తం ● కూటమి ఏడాది పాలనలో అధోగతి ● అమలు కాని ‘తల్లికి వందనం’ ● రూ.138 కోట్ల మేర ఫీజు బకాయిలతో విద్యార్థుల ఇక్కట్లు ● విద్యారంగానికి పెద్దపీట వేసిన జగన్ సర్కారు ● నాడు–నేడులో రూ.369 కోట్లతో 1,150 పాఠశాలల అభివృద్ధి ● అమ్మఒడి ద్వారా 1,48,342 మంది తల్లులకు రూ.887.9 కోట్ల లబ్ధి ● ప్రపంచంతో పేద విద్యార్థులు పోటీపడేలా సంస్కరణలు సాక్షి, భీమవరం : జిల్లాలో ప్రాథమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,436 ఉన్నాయి. శిథిల భవనాలు, పెచ్చులు ఊడే పైకప్పులు, రాళ్లు పైకిలేచిన ప్లోరింగులు, కలుషిత తాగునీరు, అధ్వానమైన టాయిలెట్లు, రక్షణ గోడలు లేక అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలు.. ఇది 2019లో వైఎస్సార్ ప్రభుత్వం వచ్చేనాటికి ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. నాటి సీఎం వైఎస్ జగన్ నాడు–నేడుతో మొదటి విడతగా 497 పాఠశాలల్లో రూ.116.13 కోట్లు విలువైన డిజిటల్ క్లాస్రూంలు, తాగునీటి వసతి, టాయిలెట్స్, కిచెన్షెడ్లు, ప్రహరీ గోడలు, అదనపు తరగతి గదుల నిర్మాణం, విద్యుదీకరణ, మేజర్, మైనర్ మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులు చేశారు. రెండో విడతగా జిల్లాలోని 764 పాఠశాలల్లో రూ.261.37 కోట్ల విలువైన 1,374 పనులు చేపట్టి ఎన్నికల నాటికి రూ.138.66 కోట్ల విలువైన పనులు పూర్తిచేశారు. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో మిగిలిన పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. అమ్మఒడితో చేయూత పిల్లల చదువులకు పేదరికం అడ్డు కాకూడదని గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద ఏటా రూ.15 వేల చొప్పున తల్లులకు ఆర్థిక సాయం అందిస్తూ వ చ్చారు. కాగా చదువుకుంటున్న పిల్లలందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామంటూ చెప్పిన కూటమి ప్ర భుత్వం తొలి ఏడాది ఆ ఊసే ఎత్తలేదు. జిల్లాలో 1,74,763 మంది విద్యార్థులకు రూ.15 వేల చొప్పున గత విద్యా సంవత్సరంలో రూ.262 కోట్ల తల్లికి వందనం సాయానికి ఎగనామం పెట్టింది. ఉన్నత విద్యకు భరోసా పేద విద్యార్థులు మధ్యలో ఉన్నత చదువులు మానేయకుండా జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాల ద్వారా గత ప్రభుత్వం ఆదుకుంది. గత ఐదేళ్లలో జగనన్న విద్యాదీవెన పథకం కింద 1,77,996 మంది విద్యార్థులకు రూ.485.33 కోట్లు సాయం అందించగా వసతి దీవెన పథకం కింద 1,76,142 మంది విద్యార్థులకు రూ.163.41 కోట్లు అందించారు. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజులు చెల్లించక గత జనవరి నాటికి రూ.138.8 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. యాజమాన్యాల ఒత్తిడితో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. గత ప్రభుత్వంలో అమ్మఒడి సాయం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కార్పొరేట్ను తలదన్నేలా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యావ్యవస్థను తలదన్నే రీతిలో తీర్చిదిద్దారు. మాజీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన నాడు–నేడు ద్వారా సర్కారు బడులు అభివృద్ధి చెందా యి. పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన అందించారు. అలాగే ట్యాబ్లలో, ఐఎఫ్బీ ప్యానెల్స్, బైజూస్ కంటెంట్ అందించారు. జగనన్న విద్యాకానుక వంటి మహత్తర పథకాలు అమలు చేశారు. – ఎస్.జాకబ్ బాబు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు గత ప్రభుత్వంలో చదువుల విప్లవం.. డిజిటల్ తరగతులు దృశ్య, శ్రవణ విద్య ద్వారా విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పెంచేందుకు మాజీ సీఎం జగన్ అడుగులు వేశారు. 2022 డిసెంబరు 21న తన పుట్టినరోజున 8వ తరగతి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు ట్యాబుల పంపిణీని ప్రారంభించారు. జిల్లాలోని 14,353 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి బైజూస్ కంటెంట్తో కూడిన రూ.30 వేల విలువైన ట్యాబ్లు అందజేశారు. తర్వాత ఏడాది 13,790 మందికి పంపిణీ చేశారు. తరగతి గదుల్లో డిజిటల్ విద్యాబోధన కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి పాఠశాలలకు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ (ఐపీపీ), స్మార్ట్ టీవీలు అందజేస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ట్యాబుల పంపిణీని నిలిపివేసింది. -
అప్పుల బాధలు తాళలేక..
జంగారెడ్డిగూడెం: పట్టణానికి చెందిన ఓ కుటుంబం అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యాయత్నం చేయగా.. చికిత్స పొందుతూ కుటుంబ యజమాని శుక్రవారం మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. స్థానిక లక్ష్మి ఆస్పత్రి సమీపంలోని అపార్ట్మెంట్లో మంగిన సత్యదుర్గాచంద్రరావు (చంద్రం) (40) భార్య, ఇద్దరు పిల్లల తో జీవిస్తున్నారు. గురువారం వీరు కూల్డ్రింక్ లో కలుపు మందు కలిపి సేవించారు. స్థానికు లు వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చంద్రరావు, భార్య కృష్ణజ్యోతి, కుమారుడు దుర్గాచరణ్, కుమార్తె కోమలికి వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి గుంటూరు తరలించారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ చంద్రరావు శుక్రవారం మృతిచెందారు. భార్య, కుమారుడు, కుమార్తె అక్కడే చికిత్స పొందుతున్నారు. వారికి రక్తం శుద్ధి చేసేందుకు డయాలసిస్ చేస్తున్నట్టు బంధువులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర మాట్లాడుతూ చంద్రరావు కుటుంబం అప్పుల బాధ తాళలేక కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ప్రాథమికంగా తమకు తెలిసిందన్నారు. దీనిపై విచారణ చేస్తున్నట్టు చెప్పారు. కుటుంబం ఆత్మహత్యాయత్నం కుటుంబ యజమాని మృతి చికిత్స పొందుతున్న భార్య, కుమారుడు, కుమార్తె -
రేపు వైఎస్సార్సీపీ జిల్లా సమావేశం
సాక్షి, భీమవరం: వైఎస్సార్సీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ఆదివారం పెదఅమిరంలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలు, ఏడాది పాలనలో ప్రజలకు చేసిన వంచనకు నిరసనగా జూన్ 4న ‘వెన్నుపోటు దినం’గా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారన్నారు. సీఎం చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలు, అన్యాయాలపై ఆ రోజు నిరసన తెలపనున్నట్టు ప్రసాదరాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణపై చర్చించేందుకు ఆదివారం ఉద యం సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటుచేశామన్నారు. నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఇతర పెద్దలు సమావేశానికి హాజరువుతారన్నారు. జిల్లాలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సమన్వయ కమిటీ సభ్యులు, నేతలు హాజరుకావాలని ప్రసాదరాజు కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు వెల్లడి -
‘గురుకుల’ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్
భీమడోలు: పోలసానిపల్లి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల కళాశాలలో గురుకుల సొసైటీ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ శుక్ర వారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే కౌన్సెలింగ్కు జోన్–2 పరిధిలోని ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లాల్లోని గురుకుల బాలురు, బాలికల క ళాశాలలకు చెందిన 438 మంది ప్రిన్సిపాల్స్, జూనియర్ అధ్యాపకులు, పీజీటీలు హాజరుకానున్నారు. గురుకుల సొసైటీ సంయుక్త కార్యదర్శి ఎ.మురళీ సమక్షంలో కౌన్సెలింగ్ చేప ట్టారు. తొలిరోజు 73 మందికి బదిలీ ఉత్తర్వులు అందించారు. టీజీటీ, స్పెషల్ టీచర్లు, సూపరిండెంటెంట్, సీనియర్ అసిస్టెంట్ల కేడర్లలోని ఉద్యోగులకు మంగళవారం కౌన్సెలింగ్ జరుగనుంది. డీసీఓ బీపీ ఉమాకుమారి, ఆయా జిల్లాల డీసీఓలు పాల్గొన్నారు. ప్రైవేట్ బస్సులపై 152 కేసుల నమోదు ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని కలపర్రు టోల్గేట్ వద్ద గురువారం రాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కాంట్రాక్టు క్యారేజ్ బస్సులపై 152 కేసులు నమోదు చేసినట్టు జిల్లా ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ తెలిపారు. అలాగే రూ.5,01,500 అపరాధ రుసుం, పన్ను విధించినట్లు తెలిపారు. జిల్లాలోని వాహన తనిఖీ అధికారులను బృందాలుగా ఏర్పాటు చేసి కేసు లు నమోదు చేశామన్నారు. విశాఖ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖ మధ్య తిరిగే కాంట్రాక్టు క్యారేజ్ బస్సులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పర్మిట్ నిబంధనలను ఉ ల్లంఘించిన బస్సులపై కేసులు నమోదు చే శామన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్టీఓలు కేఎస్ఎంఎన్ కృష్ణారావు, ఎండీ మదానీ, వాహన తనిఖీ అధికారులు ఎస్.రంగనాయకులు, జి.ప్రసాదరావు, జి.స్వామి, వై.సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్పై మండిపాటు ఏలూరు (టూటౌన్): ఆపరేషన్ కగార్ ఆపా లని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాల అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ నక్సలైట్ల రహిత భారతదేశాన్ని 2026 నాటికి చూపిస్తామని చెబుతూ అడవి మీద ఆధారపడి జీవిస్తున్న గిరిజనులను అడవి నుంచి దూరంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆపరేషన్ కగార్ పేరిట అటవీ ప్రాంతంలోని విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్రంలోని మోదీ, అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెసు జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్రావు మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. పట్టణ ప్రజలపై ఆస్తి పన్ను భారం ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం పెంచిన ఆస్తి పన్ను ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నును 20 శాతం పెంచాలని నిర్ణయించి ఆ మేరకు కొలతలు వేసే సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఆస్తి పన్ను పెంచబోమని హామీ ఇచ్చిన ఇప్పుడు తుంగలో తొక్కుతున్నారన్నారు. -
ఘనంగా దర్శకరత్న దాసరి వర్థంతి
పాలకొల్లు సెంట్రల్: తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా అత్యధిక చిత్రాలు తీసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించి పాలకొల్లు కీర్తిని ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేసిన సినీ దిగ్గజం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావుకే దక్కుతుందని పలువురు దాసరి అభిమానులు ఆయన సేవలను కొనియాడారు. శుక్రవారం స్థానిక గాంధీబొమ్మల సెంటర్ నందు పట్టణ నటీనట సంక్షేమ సమాఖ్య, దాసరి నారాయణరావు అభిమానుల ఆధ్వర్యంలో దాసరి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ నటీనట సంక్షేమ సమాఖ్య సభ్యులు, దాసరి అభిమానులు మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో అనేక మైలురాళ్లు దాటిన ఘనత దాసరికే సాధ్యమైందన్నారు. అలాగే పట్టణంలో మహిళా కళాశాలకు భూమి విరాళంగా ఇచ్చి విద్యాదాతగా కీర్తిని పొందారన్నారు. అలాగే పట్టణంలో గాంధీబొమ్మల సెంటర్ వద్ద రాజ్యసభ నిధులతో కాలిబాట వంతెన ఏర్పాటు ఎంతో మందికి మార్గం సుగమం చేశారన్నారు. కార్యక్రమంలో వంగా నరసింహరావు, మేడికొండ శ్రీనివాసరావు. యర్రంశెట్టి వెంకటరత్నం, కొట్టి భాస్కరరావు పాల్గొన్నారు. -
చెరుకువాడలో ఆగని మట్టి రవాణా
ఉండి: చెరుకువాడలో మట్టి అక్రమ రవాణా ఆగడం లేదు. మాకు అడ్డు చెప్పేది ఎవరు.. మమ్మల్ని ఆపేది ఎవరు అన్నట్టుంది ఇక్కడి వ్యవహారం. ఒకవేళ గ్రామస్థాయి అధికారులు అడ్డుకుంటున్నా వారిపై మండలస్థాయి అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తుండడంతో మట్టి అక్రమ రవాణాను ఆపడం సాధ్యం కావడం లేదు. మట్టి యథేచ్ఛగా తరలిస్తుండడంతో ప్రజలు ఫిర్యాదు చేస్తున్నా ఉన్నత అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. శుక్రవారం చెరుకువాడ శివారు అర్తమూరు రోడ్డులో డంపింగ్ చేసి భధ్రపరచుకున్న మట్టిని పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో రవాణా చేశారు. దీనిపై ప్రజల ఫిర్యాదుతో క్షేత్రస్థాయికి వెళ్లాల్సిన గ్రామాధికారి తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. కారణం ఒకవైపు ప్రజలు, మరోవైపు మండలాధికారుల సహకారం లేకపోవడంతో కిందిస్థాయి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 19న చెరుకువాడ మీదుగా పెద్ద ఎత్తున వెళుతున్న మట్టి ట్రాక్టర్లను స్థానికులు అడ్డుకుని అధికారులు వచ్చి సమాధానం చెబితేనే గాని వదిలిపెట్టమంటూ పట్టుబట్టారు. దీంతో ఆ ఒక్కరోజు మాత్రమే మట్టి రవాణా ను అడ్డుకున్న అధికారులు ఆ తరువాత నుంచి పట్టించుకోలేదు. దీంతో మట్టి అక్రమ రవాణాదారుల నుంచి ఉన్నత అధికారులకు ఏ స్థాయిలో తాయిలాలు అందుతున్నాయో అంటూ ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. దీంతో ప్రజలు మళ్లీ మట్టి ట్రాక్టర్లను అడ్డుకునేందుకు సమాయత్తం కాగా అధికారులు వాటిని నిలుపుదల చేశామని చెప్పారు. -
పొగాకు బారిన పడవద్దు
పొగాకు వాడకం వల్ల ప్రజల జీవితాలు నాశనం చేసుకొంటున్నారు. ప్రధానంగా నోటి, స్వరపేటిక, ఊపిరితిత్తులు, క్లోమగ్రంధి, మూత్రాశయ కేన్సర్లు సంభవిస్తాయి. గుండె పోటుతో అకాల మరణాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. జిల్లా సర్వజన ఆస్పత్రిలో పొగాకు విరమణ వైద్యశాల(టీసీసీ) అందుబాటులో ఉంది. పొగాకు ఉత్పత్తులకు అందరూ దూరంగా ఉండండి. – డాక్టర్ ఆర్.మాలిని, జిల్లా వైద్యాధికారి, ఏలూరు పీల్చడమూ ప్రమాదమే సిగిరెట్లులను కాల్చడమే కాదు.. ఆ పొగను పీల్చినా ప్రమాదమే. కొందరు సరదాగా పొగాకునకు అలవాటు పడి వ్యసనపరులుగా మారుతున్నారు. ప్రధానంగా యువత వీటికి ఆకర్షితులవుతున్నారు. గుండె పోటు మరణాల్లో ధూమపానం అలవాటు ఉన్నవారే ఎక్కువగా ఉంటున్నారు. పొగాకు రహిత సమాజానికి అందరూ సహకరించాలి. – డాక్టర్ నరేంద్ర, ప్రొగ్రాం ఆఫీసర్, ఎన్సీడీ, ఏలూరు వ్యసనపరుల్లో మార్పు ఏలూరు సర్వజన ఆస్పత్రిలో టొబోకో ససైషన్ క్లీనిక్(టీసీసీ) అందుబాటులో ఉంది. ఈ సెంటర్లో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 5 వేల మందికి వైద్య సేవలు అందించాం. వ్యసనపరులకు నికోటివ్ రీప్లేస్మెంట్ థెరపీని అందిస్తున్నాం. పూర్తిగా పొగాకు మానివేసిన వాళ్లను ఆరు నెలల వరకు పరిశీలిస్తున్నాం. ధూమపానానికి అలవాటు పడిన వారిని టీసీసీ ద్వారా మామూలు స్థితికి తీసుకొస్తున్నాం. – కె.చిన వీర్రాజు, సైకాలజిస్టు, గవర్నమెంట్ జనరల్ హాస్పటల్, ఏలూరు -
థింక్ ఇండియాతో నిట్ ఎంఓయూ
తాడేపల్లిగూడెం: బెంగళూరుకు చెందిన థింక్ ఇండియా సంస్థతో ఏపీ నిట్ శుక్రవారం ఎంఓయూ చేసుకుంది. ఇన్చార్జి డైరెక్టర్ ఎన్వీ రమణరావు మాట్లాడుతూ దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐఎస్సీ, ఐఐఎం, నింహన్స్, ఎన్ఎల్ఏఐయూ వంటి విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు 2006లో ఈ థింక్ ఇండియా సంస్థను స్థాపించారన్నారు. వారి సలహాలు, సూచనలు నిట్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇంటర్న్ షిప్ చేసుకొనే వెసులుబాటు కూడా ఉందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికలు సిద్ధం చేయడం, పర్యావరణ, సాంస్కృతిక భద్రత అంశాల్లో చైతన్యం తీసుకురావడం, భారతీయ విలువల ప్రోత్సాహం, రాష్ట్ర ఐక్యత, సామాజిక సమతుల్యతను పెంచడం వంటి విషయాలను పంచుకోడానికి ఈఅవగాహన ఒప్పందం ఉపయోగపడుతుందన్నారు. నిట్ రిజిస్ట్రార్ దినేష్ రెడ్డి, ప్రొఫెసర్ రవికిరణ్ శాస్త్రి, అసోసియేట్ డీన్ రాజేశ్వరరెడ్డి, థింక్ ఇండియా రాష్ట్ర కో కన్వీనర్ ప్రణవ్ పాల్గొన్నారు. -
చిన్నపిల్లలపై పిచ్చి కుక్క దాడి
ద్వారకాతిరుమల: గత నాలుగు రోజుల నుంచి క్షేత్రంలోని చెరువు వీధిలో ఒక పిచ్చికుక్క పిల్లలపై దాడి చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 10 మంది పిల్లలపై ఈ కుక్క దాడి చేసి, తీవ్రంగా గాయపరచింది. శుక్రవారం సాయంత్రం చెరువు వీధిగుండా శ్రీవారి ఆలయానికి వెళుతున్న లింగపాలెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సాయిల రవి అనే భక్తుడి కుమారుడు యశ్వంత్పై ఈ కుక్క దాడి చేసింది. ఈ దాడిలో బాలుడి కాలికి తీవ్ర గాయమైంది. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానిక వైస్సార్ సీపీ నాయకుడు కొల్లిసుబ్బారావు క్షతగాత్రుడిని హుటాహుటీన పీహెచ్సీకి తరలించారు. అదేవిధంగా గ్రామానికి చెందిన గుడాల మదన్మోహన్ కుమారుడు నవదీప్పై కుక్క దాడి చేసి, కొంత దూరం ఈడ్చుకెళ్లింది. స్థానికులు వెంటపడటంతో బాలుడిని విడిచిపెట్టి పరారైంది. వెంటనే తల్లిదండ్రులు అతడిని పీహెచ్సీకి తరలించగా, వైద్య సిబ్బంది చిన్నారులకు యాంటి ర్యాబిస్ వ్యాక్సిన్ వేశారు. సమాచారం అందుకున్న డిప్యూటీ ఎంపీడీవో ఏవీ సుబ్బరాయన్ పిచ్చి కుక్కను పంచాయతీ పారిశుధ్య కార్మికులతో పట్టించి, దూర ప్రాంతానికి తరలించారు. పోక్సో కేసులో లాడ్జి యజమాని అరెస్ట్ భీమవరం: మైనర్ బాలికలను వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్న నేరంలో భీమవరం టూటౌన్ పరిధిలోని శ్రీనిధి లాడ్జి యజమాని అయితం శ్రీనివాస్ను పోక్సో కేసులో శుక్రవారం అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ జి కాళీచరణ్ చెప్పారు. ఈనెల 12న వ్యభిచారం నేరంపై బాలికలను అరెస్ట్ చేయగా వారికి రూమ్స్ అద్దెకిచ్చిన శ్రీనివాస్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చామని, 14 రోజుల రిమాండ్ విధించడంతో నరసాపురం సబ్జైలుకు తరలించినట్లు సీఐ చెప్పారు. బాలిక ఆత్మహత్యాయత్నం పెదవేగి : ప్రేమ పేరుతో లోబరుచుకుని అనంతరం నిర్లక్ష్యం చేస్తుండడంతో మనస్తాపం చెందిన మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన పెదవేగి మండలం రామచంద్రపురంలో చోటు చేసుకుంది. ఏడాది కాలంగా గ్రామానికి చెందిన యువకుడు హెచ్చు గణేష్, మైనర్ బాలిక మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది. ప్రస్తుతం ఆమెను నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఆమె ఫోన్ను గణేష్ బ్లాక్ చేయడంతో మనస్తాపానికి గురైన బాలిక శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిపై ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు పెదవేగి ఎస్సై కె రామకృష్ణ పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని మృతదేహం లభ్యం కాళ్ల: సీసలిలో గుర్తు తెలియని మృతదేహం శుక్రవారం లభ్యమైంది. వివరాల ప్రకారం సీసలి గ్రామంలో అడుగంటిన చెరువులో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు. స్థానిక వీఆర్వో సుధాకర్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి సుమారు 40 నుంచి 50 సంవత్సరాల వయస్సు ఉంటుందని, ఒంటిపై నైట్ ప్యాంటు మాత్రమే ఉండి, కుళ్లిన స్థితిలో మృతదేహం ఉందన్నారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు ఏఎస్సై వీవీఎస్ రామరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పొగ.. ఆరోగ్యానికి సెగ
కై కలూరు: పొగాకు వినియోగదారులు వ్యసన చక్రంలో బందీ అవుతున్నారు. పొగాకును ఏ రూపంలో తీసుకున్నా ప్రమాదమే. దీని వల్ల గొంతు కేన్సర్, ఉపిరితిత్తుల వ్యాధులు, గుండెపోటు వంటి సమస్యలు దాపరిస్తున్నాయి. పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఏటా మే 31వ తేదీన ధూమపాన రహిత దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘పొగాకు ఉత్పత్తుల ఆకర్షణలు తగ్గించడం’ అనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కలిగిస్తున్నారు. ఏలూరు జిల్లాలో డీఎంహెచ్వో కార్యాలయంలో పొగాకు వినియోగ అనర్థాలపై శనివారం అవగాహన కలిగించనున్నారు. ఆకర్షితులవుతున్న యువత యుక్తవయస్సులో సిగరెట్కు యువత ఆకర్షితులవుతున్నారు. పొగాకు ఉత్పత్తుల్లో నికోటిన్ ఆనే పదార్థం ఉంటుంది. అందువల్ల వ్యసనం నుంచి త్వరగా బయట పడలేకపోతున్నారు. విద్యార్థి దశ నుంచి కొంతమంది ఫ్యాషన్గా సిగిరెట్కు అలవాటు పడుతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా ధూమపానం వల్ల పురుషులు, సీ్త్రలలో సంతానోత్పత్తి సమస్యలు వస్తున్నాయి. కేన్సర్ల ముప్పు.. సిగిరెట్, బీడి, చుట్టా, జరదా, గుట్కా, తంబాకు వంటి పొగాకు ఉత్పత్తులకు ప్రజలు బానిసలై విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వీటి బారిన పడిన వారికి తల, మెడ, నోరు, ఉపిరితిత్తులు, రక్త, మూత్రపిండాలు, ఫ్లీహము, పేగు, మూత్రసంచి, గర్భాశయ కేన్సర్లు కలుగుతున్నాయి. అదే విధంగా పక్షవాతము, అంధత్వము, చిగురు వాపు, గుండె వ్యాధులు, నిమ్ము, ఆయాసం, రక్తనాళాలు గట్టిపడటం, సంతానోత్పత్తి తగ్గిపోవడం, ఎముకలు బలహీనపడుట వంటి దీర్ఘకాలిక వ్యాధులతో శరీరంలో ప్రతి అవయవం దెబ్బతింటోంది. పొగాకు వల్ల ప్రపంచంలో ప్రతి ఏటా 8 మిలియన్లు పైగా మరణాలు సంభవిస్తున్నాయని అంచనా. జిల్లాలో 2,354 మంది వ్యాధిగ్రస్తులు ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 2,354 మంది పొగాకును వివిధ రూపాల్లో ఉపయోగించిన వ్యాధిగ్రస్తులను గుర్తించారు. వ్యసనపరులకు ఏలూరు సర్వజన ఆస్పత్రిలో రూం నంబరు 15లో టొబోకో ససైషన్ వైద్యశాల(టీసీసీ)లో చికిత్స అందిస్తున్నారు. మొత్తం వ్యాధిగ్రస్తులలో 146 మంది పూర్తిగా కోలుకున్నారు. మరో 955 మంది కోలుకునే దశలో ఉన్నారు. వ్యసనపరులకు వైద్యులు నికోటీవ్ రీప్లేస్మెంట్ థెరఫీతో వ్యసనాన్ని తగ్గిస్తున్నారు. కార్భన్ మోనాకై ్సడ్ అనలైజర్ అనే పరికరం ద్వారా రక్తంలో లెవల్స్ను పరీక్షించి, అనంతరం సైకాలజిస్టుతో కౌన్సిలింగ్ థెరిఫీ అందిస్తున్నారు. నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జిల్లాలో పొగాకు సంబంధ వ్యాధిగస్తులు 2,354 మంది వ్యసనపరులకు టీసీసీ సెంటర్ ద్వారా వైద్య చికిత్స -
సోలాపూర్లో యాత్రికుల లగేజీ దోపిడీ
ఏలూరు: టి.నరసాపురం మండలం మక్కినవారిగూడానికి చెందిన యాత్రికులు సోలాపూర్ సమీపంలో దోపిడీకి గురయ్యారు. యాత్రికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మక్కినవారిగూడానికి చెందిన 24మంది ఈ నెల 27న రైలులో షిర్డీ వెళ్లారు. 29వ తేదీ రాత్రి షిర్డీ నుంచి సోలాపూర్కు చెందిన శివ్బాబా ట్రావెల్స్ బస్సును మాట్లాడుకుని బస్సులో సోలాపూర్ బయలుదేరారు. వారి లగేజీ బ్యాగ్లను బస్సు డిక్కీలో ఉంచారు. 30వ తేదీ ఉదయం సోలాపూర్లో బస్సు దిగి డిక్కీ తెరిచి చూడగా, డిక్కీలో పెట్టిన దాదాపు 24 మందికి చెందిన బ్యాగులు మాయమయ్యాయి. వాటిలో దాదాపు విలువైన బట్టలతో పాటు రూ. 70 వేల నగదు ఉంటుందని యాత్రికులు తెలిపారు. బస్సు ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో డ్రైవర్ పలు చోట్ల ఆపి కిందకు దిగినట్లు యాత్రికులు చెబుతున్నారు. దీంతో బస్సును సోలాపూర్లో పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి యాత్రికులు ఆందోళన చేశారు. ఈ ఘటనపై మక్కినవారిగూడెంకు చెందిన దొంతు లక్ష్మీనారాయణతో పాటు మరికొందరు కలిసి ఫిర్యాదు చేశారు. సాయంత్రానికి పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని యాత్రికులకు ఇచ్చారు. యాత్రికులంతా సోలాపూర్ చుట్టుపక్కల పర్యటించి జూన్ 1వ తేదీన 8 గంటలకు సోలాపూర్ నుంచి విజయవాడకు రైలు ఎక్కాల్సి ఉంది. రిజర్వేషన్ టిక్కెట్లు సైతం ఆ బ్యాగ్లోనే ఉన్నాయని, తిరుగు ప్రయాణానికి తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని యాత్రికులు తెలిపారు. -
మట్టి కోసం టీడీపీలో వర్గపోరు
నూజివీడు: చెరువుల్లో మట్టిని కొల్లగొట్టి జేబులు నింపుకునేందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లుగా ఉంది. చెరువుల్లో మట్టిని తాము తోలుకోవాంటే తాము తోలుకుంటామంటూ నాయకులు పోటీ పడుతున్నారు. పలు గ్రామాల్లో మట్టి కోసం వర్గపోరు తారాస్థాయికి చేరింది. కొన్నిచోట్ల ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ మట్టితోలకాలను యథేచ్ఛగా నిర్వహిస్తుంటే మరికొన్ని చోట్ల చెరువుల్లో మట్టిని అనుమతులు లేకుండా ఎలా తోలతారని టీడీపీ నాయకులే అడ్డుకుంటున్నారు. మట్టి తవ్వకాలను అడ్డుకున్న రైతులు నూజివీడు పట్టణంలోని పెద్దచెరువులో మాజీ కౌన్సిలర్ టీడీపీ నాయకుడు వేమూరి వెంకట కృష్ణారావు ఇరిగేషన్ అధికారుల నుంచి అనుమతులు తీసుకొని మట్టి తోలకాలను శుక్రవారం చేపట్టగా అదే పెద్దచెరువు సాగునీటి సంఘం సభ్యులు, రైతులు తమ చెరువులో మట్టిని తోలడానికి వీల్లేదని మట్టిని తోలకుండా అడ్డుకున్నారు. వేమూరు వెంకట కృష్ణారావుకు ఆర్ఎస్ నెంబరు 871–3లోని ఎకరం భూమిని మెరక చేసుకొనుటకు గాను వెయ్యి క్యూబిక్ మీటర్ల మట్టిని పెద్ద చెరువు నుంచి తవ్వి తీసుకెళ్లేందుకు గాను ఇరిగేషన్ ఈఈ అనుమతి ఇచ్చారు. దీంతో మట్టి తవ్వకాలను చేపట్టగా సాగునీటి సంఘం సభ్యులు, ఆయకట్టు రైతులు అడ్డుకోవడంతో కొంతసేపు వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చెరువుకు నాలుగు చోట్ల గండ్లు పడి దాదాపు 10నెలలు గడిచినా ఇంత వరకు గండ్లు పూడ్చకుండా చెరువులో మట్టిని వేరే వాళ్లు ఎలా తవ్వుకొని తీసుకెళ్తారని రైతులు ప్రశ్నించారు. అసలు అనుమతుల కోసం దరఖాస్తు పెట్టేటప్పుడు కనీసం నీటి సంఘం అధ్యక్ష, కార్యదర్శులను సంప్రదించకుండా ఎలా మట్టిని తవ్వుతారని నిలదీశారు. సాగునీటి సంఘం సభ్యులు ట్రాక్టర్లను అడ్డుకోవడాన్ని టీడీపీకి చెందిన కొందరు మంత్రి కొలుసు పార్థసారథి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ వ్యవహారంపై మంత్రి ఎలా స్పందిస్తారోనని ఆసక్తి నెలకొంది. కొన్నంగుంటలో మట్టి అక్రమ తవ్వకాలు మండలంలోని బోర్వంచ శివారు కొన్నంగుంటలోని గోరింత చెరువులో గురువారం అర్ధరాత్రి నుంచి తెల్లవార్లూ అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగాయి. ట్రాక్టర్లలో మట్టి తరలిపోయింది. గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు మట్టి అక్రమ తవ్వకాలకు తెరలేపి ఇష్టారాజ్యంగా కొనసాగించారు. అక్రమ తోలకాలు చేస్తున్నట్లు తెలుసుకున్న బోర్వంచ పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడు హరికోటి సంగీతరావు ట్రాక్టర్లను ఆపి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని ఎందుకు తోలుతున్నారని నిలదీశారు. అయినప్పటికీ మా ఇష్టం వచ్చినట్లుగా మేము తోలతామని చెప్పి ట్రాక్టర్లలో మట్టిని అడ్డూ అదుపూ లేకుండా తెల్లవార్లు తరలించారు. ఒక వర్గం మట్టి తోలుతుంటే.. అడ్డుకుంటున్న మరో వర్గం నూజివీడు పెద్దచెరువులో మట్టితోలకాలను అడ్డుకున్న నీటి సంఘం సభ్యులు, రైతులు కొన్నంగుంటలో అర్ధరాత్రి మట్టి అక్రమ తవ్వకాలు -
చట్టాన్ని ఎమ్మెల్యేలు హైజాక్ చేస్తున్నారు
ఏలూరు (టూటౌన్): పంచాయతీరాజ్ చట్టాన్ని ఎమ్మెల్యేలు హైజాక్ చేస్తూ సర్పంచ్ల విధులు, హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ సర్పంచ్ల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994 పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకుని ఏలూరు ఎన్ఆర్పేటలోని కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు అధికారులను అడ్డంపెట్టుకుని పంచాయతీల్లో సర్పంచ్లకు ఉన్న హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. పంచాయతీ రాజ్ చట్టాన్ని సక్రమంగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సర్పంచ్ చిలకా సుబ్బారావు, నాయకులు నూకపెయ్యి కార్తీక్, కనికెళ్ళ రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన నూజివీడు: ట్రిపుల్ ఐటీల్లో 2025–26 విద్యాసంవత్సరానికి ప్రవేశాల్లో భాగంగా ప్రత్యేక కేటగిరి సీట్ల భర్తీకి గాను ఆయా కేటగిరికి చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మూడోరోజు శుక్రవారం నిర్వహించారు. దీనిలో భాగంగా స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ నందు వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగా క్రీడా కోటాకు సంబంధించి 467మందికి గాను 344 మంది, ఎన్సీసీ కోటాకు సంబంధించి 452 మందికి గాను 354 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ప్రొఫెసర్ ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు, ఏఆర్ అర్జునరావు పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 31న ఎన్సీసీ కేటగిరికి చెందిన 661మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ఉండి: ద్విచక్రవాహనం అదుపు తప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉండిలో గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం ఆకివీడుకు చెందిన షేక్ రియాజ్ (41) స్థానిక క్రికెటర్. అతను ఓ ప్రైవేటు హాస్పిటల్లో మెడికల్షాపు ఇన్చార్జ్గా పనిచేయడంతోపాటు, క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నాడు. గురువారం అండర్–19 క్రికెట్ సెలక్షన్స్ గురించి మాట్లాడేందుకు ద్విచక్రవాహనంపై భీమవరంలో వెళ్లిన అతను తిరిగి అర్థఽరాత్రి 1.30 గంటలకు ఆకివీడు వస్తుండగా ఉండిలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కరెంటుస్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిక భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. షేక్ రియాజ్ భార్య పర్విన్ ఫిర్యాదు మేరకు ఏఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కొల్లేరులో అక్రమ తవ్వకాలు
సాక్షి టాస్క్ఫోర్స్: కొల్లేరు అభయారణ్యంలో ఫారెస్ట్ అధికారుల కళ్లు కప్పి గుట్టుచప్పుడు కాకుండా అక్రమ చెరువుల తవ్వకానికి అక్రమార్కులు మరోసారి తెర తీశారు. గురువారం ఏలూరు రూరల్ మండలం మానూరు శివారు హరిపురంలో చెరువు గట్లు ఏర్పాటుచేశారు. కొల్లేరులో చెరువులు తవ్వటానికి అనుమతి లేదని తెలిసినా పనులు ప్రారంభించారు. విషయం తెలిసిన ఫారెస్ట్ అధికారులు ఇక్కడకు చేరుకుని గట్లను యంత్రాలతో ధ్వంసం చేశారు. అయితే గట్లు ఎవరూ వేశారన్నది తెలియదన్నారు. కొల్లేరులో జీఓ 120కు వ్యతిరేకంగా చెరువులు తవ్వితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గిట్టుబాటు ధర కల్పించాలి దెందులూరు: నిమ్మకాయలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం రామారావుగూడెంలో నిమ్మ తోటలను ఆయన పరిశీలించారు. నిమ్మ ధరలు తగ్గిపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ మాట్లాడుతూ నిమ్మకాయల సీజన్లో ధరలు తగ్గడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఆస్పత్రిలో పనిచేయని ఫ్రీజర్ నూజివీడు: నూజివీడు ఏరియా ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో ఏడాదిగా ఫ్రీజర్ పనిచేయడం లేదు. దీంతో అద్దె ఫ్రీజర్ను ఏర్పాటుచేశారు. అయితే అద్దె రోజుకు రూ.5 వేలను మృతదేహానికి సంబంధించిన వారే చెల్లించాల్సి వస్తుంది. అసలే కుటుంబసభ్యులు బాధలో ఉండగా వారితో అద్దె కట్టించడం దారుణమని, పాడైపోయిన ఫ్రీజర్కు మరమ్మతులు చేయించడం లేదా కొత్త ఫ్రీజర్ను ఏర్పాటుచేయడం చేయాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. సహకార సంఘాలు రిటర్నులు దాఖలు చేయాలి ఏలూరు (ఆర్ఆర్పేట): సహకార సంఘాలు, సేవా సంఘాలు ఆదాయ పన్ను శాఖకు క్రమం తప్పకుండా రిటర్నులు దాఖలు చేయాలని ఆ దాయ పన్నుశాఖ జాయింట్ కమిషనర్ ప్రతాప్ సింగ్ భూక్యా సూచించారు. గురువారం స్థాని క డీసీఎంఎస్ హాల్లో జిల్లా కో–ఆపరేటివ్ సొసైటీలు రిటర్నుల దాఖలుపై జిల్లా కో–ఆపరేటివ్ కార్యదర్శులు, పర్సన్ ఇన్చార్జిలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదాయపన్ను శాఖ లాగిన్ ద్వారానే రిటర్నులు దాఖలు చేయాలన్నారు. జిల్లా సహకార శాఖ అధికారి ఆరిమిల్లి శ్రీనివాసు మాట్లాడుతూ జిల్లాలో సొసైటీలన్నీ ఆడిటర్ను సంప్రదిచి రిటర్నులు దాఖలు చేయాలని సూచించారు. ఏలూరు ఆదాయ పన్ను శాఖ అధికారి షేక్ అబ్దుల్ ఖయాం, డివిజనల్ కో– ఆపరేటివ్ అధికారి పి.త్రినాథ్, ఆడి టర్ ఆర్.రాధాకృష్ణ పాల్గొన్నారు. వెదురు సాగుకు సన్నాహాలు బుట్టాయగూడెం: డ్వాక్రా సంఘాల మహిళల ద్వారా వెదురు సాగును ప్రోత్సహించి తద్వారా వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నట్టు మానవ వనరుల అభివృద్ధి పథకం జిల్లా అసిస్టెంట్ మేనేజర్ ఈ.వేణుగోపాల్ తెలిపారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో డ్వాక్రా సంఘాల వీఓఏలకు వెదురు సాగుపై శిక్షణ ఇచ్చారు. వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లాలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాలను వెదు రు సాగుకు పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేశామన్నారు. 500 గ్రామ సంఘాల సభ్యులను ఎంపిక చేసి ఒక్కొక్కరూ 35 సెంట్లలో వెదురు సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. కుటుంబం ఆత్మహత్యాయత్నం జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంలో ఓ కు టుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణానికి చెందిన మంగిన సత్య దుర్గ చంద్రరరావు (చంద్రం), భార్య కృష్ణజ్యోతి, కుమారుడు దుర్గాచరణ్, కు మార్తె కోమలి గురువారం కూల్డ్రింక్లో కలు పు మందు కలిపి తాగారు. చుట్టుపక్కల వారు గమనించి స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి వీరిని మె రుగైన వైద్యం కోసం విజయవాడ తరలించా రు. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు కారణంగా తె లుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నూరు శాతం క్షయ నివారణ లక్ష్యం
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో నూరు శాతం క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టర్ అధ్యక్షతన టీబీ ఫోరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం కింద ఎవరైనా టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకుని ‘నిక్షయ్ మిత్ర’గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరారు. టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం నిమిత్తం నెలకు రూ.600ల విలువైన పోషకాహారం అందజేయాల్సి ఉంటుందన్నారు. తాను కూడా నిక్షయ మిత్ర కింద 25 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు దత్తత తీసుకుని ఆహారాన్ని అందిస్తానని ప్రకటించారు. అనంతరం క్షయ వ్యాధి లక్షణాలపై రూపొందించిన వాల్పోస్టర్లు ఆవిష్కరించారు. డీఎంహెచ్ఓ జి.గీతాబాయి, అడిషనల్ డీఎంహెచ్ఓ బి.భానునాయక్, డీసీహెచ్ఎస్ పి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల.. ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆర్థిక పురోభివృద్ధికి, సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ నాగరాణి తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగిన దాడులకు సంబంధించి నమోదైన కేసులపై విచారణ వేగవంతం చేయాలని, బాధితులకు సత్వర న్యాయం అందించాలన్నారు. యోగాంధ్రకు ప్రణాళిక భీమవరం: జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు భారీ ప్రణాళిక అమలు చేస్తున్నట్టు కలెక్టర్ నాగరాణి తెలిపారు. భీమవరం అల్లూరి సీతారామరాజు స్మృతివనంలో యోగా శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్రపై గ్రామ, మండల, జిల్లాస్థాయిలో విస్తృత అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడానికి కమిటీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. -
ఇబ్బందులు పెరిగాయి
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నుంచి రేషన్ సరుకులు ఇంటి వద్దనే తీసుకుంటున్నాం. అయితే వచ్చేనెల నుంచి రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సి రానుంది. ఇంట్లోని మగవారు పనిమానుకుని రేషన్ సరుకుల కోసం షాపులకు వెళ్లాల్సిందే. కూటమి ప్రభుత్వంలో పథకాలు మెరుగుపడతాయని అనుకుంటే ఇబ్బందులు పెరుగుతున్నాయి. – కోరం లలిత, గంగడుపాలెం, యలమంచిలి మండలం మా పొట్టకొట్టారు ఎన్నికల సమయంలో కూటమి నాయకులు వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, జీతం రూ.10 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. తీరా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వలంటీర్ వ్యవస్థను రద్దు చేసి నాలాంటి నిరుద్యోగుల పొట్టకొట్టారు. మాకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపకుండా తొలగించేశారు. ఎన్నికల వాగ్దానాన్ని ప్రభుత్వం అమలుచేయాలి. – రాంబాలపు పరమేష్, గ్రామ వలంటీర్, అత్తిలి ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి గత నాలుగేళ్లుగా మొబైల్ వాహనంపై ప్రజలకు ఎంతో కష్టపడి ఇంటింటికీ వెళ్లి రేషన్ సరుకులు అందజేస్తున్నాం. దానిమీద బతికే వాళ్లం ఇప్పుడు హఠాత్తుగా మమ్మల్ని తొలగిస్తే మా కుటుంబాలు ఎలా బతకాలి. ఎండీయూ ఆపరేటర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ప్రభుత్వం వెంటనే చూపాలి. – యామల ఆంజనేయులు, ఎండీయూ ఆపరేటర్, శృంగవక్షం ● -
సినిమా థియేటర్లలో తనిఖీలు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లావ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు థియేటర్లను పరిశీలిస్తున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో థియేటర్లను గురువారం రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. థియేటర్ల నిర్వహణ, ప్రజలకు సౌకర్యాల ఏర్పాటు, క్యాంటిన్లలో ధరలు తదితర అంశాలు, రికార్డులను పరిశీలించారు. ఏలూరులో అంబికా థియేటర్, సాయి బాలా జీ థియేటర్, సత్యనారాయణ థియేటర్లలో తహ సీల్దార్ జీవీ శేషగిరి తనిఖీ చేశారు. ఓ థియేటర్లోని క్యాంటిన్లో కూల్ డ్రింకులు, వాటర్ బాటిల్స్ అధి క ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. జంగారెడ్డిగూడెంలో థియేటర్లను అక్కడి తహసీల్దార్ తనిఖీ చేశారు. కై కలూరులో విజయలక్ష్మి, వెంకటరమణ థియేటర్లను తహసీల్దార్ ఎండీ ఇబ్రహీం, భీమ డోలులో శ్రీనివాసా ఽథియేటర్ను తహసీల్దార్ ర మాదేవి తనిఖీ చేశారు. బంద్ పిలుపు కారణంగానే.. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఎగ్జిబిటర్లు నిర్మాతలతో సమావేశమై థియేటర్ల నిర్వహణపై పలు నిర్ణ యాలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా థియేటర్లలో ప్రదర్శనలు అద్దె ప్రాతిపదికన కాకుండా సినిమాకు వచ్చే లాభాల ప్రాతిపదికన ఉండాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అలా లాభాల్లో వాటా ఇవ్వని పరిస్థితి వస్తే థియేటర్లను జూన్ 1 నుంచి మూసివేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అలాగే కొత్త సినిమా రిలీజైన వెంటనే ఓటీటీల్లో రిలీజ్ చేయకుండా చూడాలని నిర్మాతల ము ందుకు ప్రతిపాదనలు తీసుకువచ్చినట్టు తెలిసింది. అయితే ఆయా నిర్ణయాల వెనుక కుట్రకోణం ఉందని ఉప ముఖ్యమంత్రి భావించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో థియేటర్ల తనిఖీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు పలువురు ఎగ్జిబిటర్లు విమర్శిస్తున్నారు. ఇదంతా కేవలం కక్ష సాధింపు చర్యగానే పరిగణిస్తున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ప్రముఖ ఎగ్జిబిటర్ స్పష్టం చేశారు. జిల్లాలో 42 థియేటర్లు జిల్లాలో గతంలో 90 థియేటర్లు ఉండగా ప్రస్తుతం 42 థియేటర్లు నడుస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా ఏలూరులో 15, చింతలపూడిలో 9, నూజివీడులో 5, ఉంగుటూరులో 6, కై కలూరులో 4, పోలవరంలో 3 థియేటర్లలో సినిమాలు ప్రదర్శిస్తున్నారు. బంద్ పిలుపే తనిఖీలకు కారణమంటున్న ఎగ్జిబిటర్లు ఏలూరు జిల్లాలో 42 థియేటర్లు నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న అధికారులు బంద్ విరమించారు సినీ పరిశ్రమలో ఎగ్జిబిటర్ల పాత్ర ఎంతో కీలకం. ఇటీవల థియేటర్ల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. నిర్వహణ వ్యయం కూడా రాని పరిస్థితి. దీంతో ఎగ్జిబిటర్లు బంద్ నిర్ణయం తీసుకున్నారు. అయితే పరిశ్రమ పెద్దలు మధ్యవర్తిత్వంతో తెలుగు చిత్రసీమ ప్రయోజనాల కోసం వారు బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. – అంబికా కృష్ణ, సినీ నిర్మాత, ఏలూరు నిర్వహణ సంతృప్తికరం ఏలూరులో థియేటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాం. ఒకటి రెండు అంశాలు తప్ప అంతా సంతృప్తికరంగా ఉంది. కొన్ని థియేటర్లలోని క్యాంటిన్లలో అధిక ధరలకు కూల్డ్రింక్లు విక్రయంచడాన్ని గుర్తించాం. దీనిపై నిర్వాహకులను హెచ్చరించాం. ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. – జీవీ శేషగిరి, ఏలూరు తహసీల్దార్ -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికులకు ఉపాధి కల్పించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని ఉల్లిపాయల మార్కెట్ వర్కర్స్ తరఫున గురువారం విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతుగా ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, బంకూరు నాగేశ్వరరావు, దూలం ప్రసాద్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ ఆలోచనలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని, రాష్ట్రంలో ఏకై క పెద్ద పరిశ్రమలో వేలాది మంది కార్మికుల ఉపాధిని దెబ్బ కొట్టడం దారుణమన్నారు. పరిశ్రమకు నిధులు కేటాయించాలని, తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, పరిశ్రమను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉక్కు పరిశ్రమపై ఎటువంటి మాటలు మాట్లాడకపోవడం శోచనీయం అన్నారు. చల్లా చంద్రరావు, బర్ల బాలాజీ, బి.శివ తదితరులు పాల్గొన్నారు. -
గడపను వీడిన సేవలు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన పేదింటి తలుపు తట్టింది.. ఇంటికే పింఛన్, జగనన్న ఆరోగ్య సురక్ష, గడపగడపకూ మన ప్రభుత్వం, జగనన్న సురక్ష, ఫ్యామిలీ డాక్టర్.. ఇలా కార్యక్రమం ఏదైనా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగాన్ని ప్రజల చెంతకు చేర్చింది. గతంలో కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కాని పనులను ప్రజలు గడప దాటకుండానే చేసి చూపించింది. ఇదంతా గతం.. ప్రభుత్వం మారింది.. పాలన మారింది.. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన ఏడాదిలోనే గడప చెంతకొచ్చే ఎన్నో సేవలకు మంగళం పాడింది. సాక్షి, భీమవరం: ఆరేళ్లకు పూర్వం ఏ పథకం అందాలన్న జన్మభూమి కమిటీలను ఆశ్రయించాల్సిందే. ఏ సర్టిఫికెట్ కావాలన్నా, ప్రభుత్వ పథకం పొందాలన్నా రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. ఎమ్మెల్యేలు, మంత్రులను కలవడమంటే సామాన్యులకు గగనమయ్యేది. పింఛన్ల కోసం వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు వర్ణనాతీతం. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను కొత్త పుంతలు తొక్కించారు. జిల్లాలో 535 సచివాలయాలు, 8,616 మంది వలంటీర్లతో పాలనను ప్రజలకు చేరువ చేశారు. కులమత వర్గాలు, రాజకీయాలకు అతీతంగా, అవినీతి అక్రమాలకు తావులేకుండా పథకాల అమలులో ఈ వ్యవస్థలు పారదర్శకంగా పనిచేశాయి. ప్రతి నెలా ఇంటి వద్దకే పింఛన్లు అందించడంతో పాటు అనారోగ్యంతో ఇతర రాష్ట్రాల్లో చికిత్స పొందుతున్న లబ్ధిదారుల చెంతకు సైతం వెళ్లి ప్రభుత్వ సాయాన్ని అందజేసేవారు. రేషన్ సరుకుల కోసం కిలోమీటర్ల దూరం వెళ్లి దుకాణాల వద్ద పడిగాపులు పడాల్సిన పనిలేకుండా మొబైల్ (ఎండీయూ) వాహనాలను తెచ్చారు. జిల్లాలోని 356 రేషన్ వాహనాల ద్వారా 5,67,671 మంది కార్డుదారులకు ఇంటి వద్దకే వచ్చి సరుకులు అందించేవారు. ఫ్యామిలీ డాక్టర్తో చేరువ ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేశారు. జిల్లాలోని 20 మండలాల్లోని 41 పీహెచ్సీల పరిధిలోని 366 విలేజ్ హెల్త్ క్లినిక్ (వీహెచ్సీ)ల ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వైద్యసేవలు అందించారు. వైద్యులు ఇళ్ల వద్ద మంచానికే పరిమితమైన రోగుల చెంతకు సైతం వెళ్లి వైద్యసేవలు అందించేవారు. ‘గడపగడపకూ’తో సత్వర పరిష్కారం గతంలో ఎన్నడూ లేనివిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునేలా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలుచేశారు. సమస్యల పరిష్కారం కోసం సచివాలయానికి రూ.20 లక్షలకు పైగా నిధులు మంజూరు చేశారు. జిల్లాలో రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు, విద్యుత్ తదితర రూ.83 కోట్ల విలువైన 1,836 పనులు గుర్తించి ఆయా సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం కృషి చేసింది.కూటమి పాలనలో ఇంటింటికీ సేవలకు మంగళం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేసిన వలంటీర్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టడం ద్వారా గడప చెంతకే సేవలకు మంగళం పాడింది. పింఛన్ల కోసం పేదలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీని రద్దు చేసి మళ్లీ పాత పద్ధతిలో వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితిని తెచ్చింది. పేదలకు వైద్య భరోసా కల్పించిన ఆరోగ్య సురక్ష శిబిరాల నిర్వహణను పక్కన పెట్టేసింది. మొన్నటివరకు తమ సమీప ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ వైద్యసేవల్ని ఉచితంగా పొందిన గ్రామీణ ప్రాంత ప్రజలు ఇప్పుడు వాటి కోసం వ్యయప్రయాసల కోర్చి పట్టణాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఫ్యామిలీ డాక్టర్ పత్తాలేకుండా పోయారు. పేదలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేసి కళ్లజోళ్లను అందజేసే ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాలు సైతం మూతపడ్డాయి. ఏడాది పాలనలోనే ప్రభుత్వ సేవలు కోసం ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నాడు సంక్షేమం.. నేడు సంక్షామం పేదింటి తలుపు తట్టిన జగన్ ప్రభుత్వం ఇంటి వద్దకే పథకాలు, వైద్య సేవలురేషన్ సరుకులు, సర్టిఫికెట్లు ‘గడపగడపకు మన ప్రభుత్వం’తో సమస్యల పరిష్కారం ప్రజలకు ఈ సేవలను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థ తొలగింపు పత్తాలేని ‘ఫ్యామిలీ డాక్టర్’ రేషన్ సరుకుల డోర్ డెలివరీ వ్యవస్థ రద్దు గతంలో సర్టిఫికెట్ల జారీ సులభతరం ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అమలుచేశారు. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు జిల్లాలోని 6.45 లక్షల కుటుంబాలను సర్వే చేసి వారి అవసరాలను గుర్తించారు. 6,05,780 మంది లబ్ధిదారులకు ఎలాంటి సర్వీస్ చార్జ్ లేకుండా కొద్దిరోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో జనన, మరణ, ఆదాయ, కుల తదితర 6,48,807 సర్టిఫికెట్లు జారీ చేశారు. ప్రజారోగ్యమే పరమావధిగా.. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించారు. 264 మంది స్పెషలిస్ట్ వైద్యులు, 182 మంది మెడికల్ ఆఫీసర్లు, ఇతర ఆరోగ్య సిబ్బందితో జిల్లావ్యాప్తంగా 447 వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు. 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచి 3.54 లక్షల మంది పేదలకు అవసరమైన వైద్య సాయం అందించారు. -
నేత్రపర్వం.. శివ కల్యాణం
ద్వారకాతిరుమల : క్షేత్రపాలకునిగా విరాజిల్లుతున్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం శివదేవుని కల్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుక భక్తులకు కనువిందు చేసింది. మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి, అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేశారు. ఆ తరువాత కల్యాణ తంతును ప్రారంభించి, సుముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల శివనామస్మరణల నడుమ మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను కన్నులపండువగా జరిపి, కల్యాణ మూర్తులకు హారతులిచ్చారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. జేఈఈ మెయిన్స్కు ఉచిత దీర్ఘకాలిక శిక్షణ ఏలూరు (ఆర్ఆర్పేట) : జేఈఈ మెయిన్స్లో అర్హత మార్కులు సాధించి సీట్లు సాధించలేకపోయిన పేద కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా దీర్ఘకాలిక శిక్షణ ఇప్పించాలని నిర్ణయించినట్టు స్పృహ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ తెలిపింది. ఈ మేరకు ట్రస్ట్ ప్రతినిధులు అంగులూరు సర్వేశ్వరరావు, టీటీఎఫ్ రూజ్వెల్ట్ ఏలూరులో గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కుటుంబ వార్షికాదాయం రూ.1.20 లక్షల లోపు ఉండి అత్యుత్తమ మార్కులు సాధిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు ఆ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి జూన్ 21న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నామని, అందులో ప్రతిభ చూపిన సుమారు 10 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 79816 96481, 93900 59900, 99595 07507 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ద్వారకాతిరుమలలో వర్షంతో ఇక్కట్లు ద్వారకాతిరుమల: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ప్రజలను ఇక్కట్లకు గురి చేస్తున్నాయి. ద్వారకాతిరుమలలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి తూర్పువీధిలోని డ్రెయినేజీలు పొంగిపొర్లడంతో రోడ్డుపైకి మురుగు నీరు, చెత్తాచెదారం చేరింది. కాలినడకన రాకపోకలు సాగించిన స్థానికులు, భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాగే టీటీడీ కాంప్లెక్స్ వద్ద ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. గ్రామంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరిలో గల్లంతైన మృతదేహం లభ్యం యలమంచిలి: చించినాడ వశిష్ట గోదావరి వంతెన మీద నుంచి బుధవారం గోదావరిలోకి దూకి గల్లంతైన యువకుడి మృతదేహం గురువారం లభ్యమైనట్లు ఎస్సై కె గుర్రయ్య తెలిపారు. వంతెనపై దొరికిన బైక్, సెల్ ఫోన్ ఆధారంగా అతను భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన షేక్ కాసు (24)గా గుర్తించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. చించినాడ వచ్చిన తల్లిదండ్రులు బైక్, సెల్ఫోన్ తమ కుమారుడివేనని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గోదావరిలో గాలించగా గురువారం మృతదేహం లభ్యమైంది. శవ పంచనామా చేసి, పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై వివరించారు. -
రైతుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి
తాడేపల్లిగూడెం రూరల్ : రైతుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కే.గోపాల్ అన్నారు. గురువారం మండలంలోని పట్టెంపాలెం గ్రామంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ గోపాల్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించి రైతులు ఏ పంట వేస్తే మేలు చేకూరుతుందనే దానిపై కృషి జరగాలన్నారు. రైతులకు మేలైన వరి వంగడాలను అందించాలని, సాగులో పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి, లాభసాటిగా మార్చాలన్నారు. ఆరోగ్యకరమైన పంటలను పండించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ప్రాంతంలో కోకో ప్రొసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. స్థానిక రైతాంగానికి ఏ పంటలు అనుకూలమో శాస్త్రవేత్తలు సూచించాలన్నారు. ఐసీఏఆర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జేవీ.ప్రసాద్ మాట్లాడుతూ సాగులో నూతన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ ఎం. శేషు మాధవ్, భారతీయ ఆయిల్పామ్ పరిశోధన సంస్థ (పెదవేగి) డైరెక్టర్ డాక్టర్ కే.సురేష్, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ కేటీవీ.రమణ మాట్లాడారు. జిల్లా వ్యవసాయాధికారి జడ్. వెంకటేశ్వరరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కే.దేవానంద్, ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ బి.గోవిందరాజులు, ఏడీఏ మురళీకృష్ణ, పశు, మత్స్యశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉద్యాన వర్సిటీ ఉప కులపతి డాక్టర్ గోపాల్ -
కాలువలోకి దూసుకెళ్లిన కారు
కాళ్ల: అతివేగంతో వెళ్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన కాళ్ల మండలం కాళ్ళకూరు గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జువ్వలపాలెం వైపు నుంచి వస్తున్న కారు అదుపుతప్పి సచివాలయం ఎదుట విద్యుత్ స్తంభాన్ని కొట్టి కాలువలోకి వెళ్లింది. కారువేగం ధాటికి విద్యుత్ స్తంభం ముక్కలైంది. విద్యుత్ తీగలు ఆధారంతో స్తంభం నిలిచిందని, ప్రమాద సమయంలో కారులో చిన్నపిల్లలు కూడా ఉన్నారని స్థానికులు తెలిపారు. కారుకి బెలూన్ ఓపెన్ కావడంతో ప్రాణనష్టం జరగలేదు. చిన్న చిన్న దెబ్బలతో బయటపడిన వారిని స్థానికులు భీమవరం హాస్పిటల్కి తరలించారు. -
ఆగడాలు భరించలేకే హతమార్చా
కొడుకును చంపిన కేసులో తండ్రి వెల్లడి జంగారెడ్డిగూడెం: కుమారుడిని హత్యచేసిన కేసులో తండ్రిని అరెస్టు చేశారు. గురువారం జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ యు.రవిచంద్ర వివరాలు వెల్లడించారు. సీతంపేటకు చెందిన కొప్పుల నాగేశ్వరరావు చికెన్షాపు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు కాగా, మృతుడు పవన్కుమార్ (24) పెద్ద కుమారుడు. డిగ్రీ చదువు మధ్యలో మానివేసి చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ప్రతిరోజు తాగి వచ్చి ఆస్తి ఇవ్వాలంటూ తండ్రి, కుటుంబసభ్యులతో గొడవ పడుతూ, 9 నెలల క్రితం హైదరాబాద్ వెళ్లిపోయాడు. మరలా తిరిగి వచ్చి డబ్బులు కావాలని, లేకపోతే తన ఆస్తి తనకివ్వాలని గొడవ పడేవాడు. ఈ క్రమంలో పవన్కుమార్ తండ్రి నాగేశ్వరరావుపై దాడి చేశాడు. దీంతో విసిగిపోయిన నాగేశ్వరరావు ఈ నెల 26న వీరన్నగుడెం గ్రామంలోని నరసయ్య చెరువు గట్టుపై తన స్నేహితుడుకి చెందిన తాటాకింటికి పవన్కుమార్ను తీసుకువెళ్లి మద్యం పట్టించి మత్తులో గొంతు కోసి హత్య చేసి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్టు చేసిన సీఐ వి.కృష్ణబాబును, ఎస్సై షేక్ జబీర్ను, ఏఎస్సై ఎన్వీ సందప్కుమార్, పీసీలు రమేష్, దిలీప్లను డీఎస్పీ అభినందించారు. రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. -
రజకుల చెరువులను సర్వే చేసి హద్దులు నిర్ణయించాలి
జంగారెడ్డిగూడెం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అనేక మండలాల్లో రజకుల చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని, దీంతో రజక వృత్తికి ఆటంకం ఏర్పడుతుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రజకజన సంఘ అధ్యక్షుడు, రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రజక చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట పడాలంటే చెరువులను సర్వేయర్లతో సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గురువారం జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో ఆక్రమణలకు గురైన చెరువులను రజక సంఘాలతో కలిసి పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో రజకులకు సుమారు 50 ఏళ్ల క్రితం కేటాయిచిన 3.11 ఎకరాల కోనేరు చెరువు ఆక్రమణలకు గురవ్వడంతో రజక వృత్తి చేసుకునేందుకు రజకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై గ్రామ కార్యదర్శి నాగేశ్వరరావుతో మాట్లాడగా చెరువుని రజకులకు ఉపయోగపడే విధంగా చేస్తామని తెలిపారన్నారు. అలాగే చెరువులో సరిగా నీరు లేనందున లీజు రూ. 11వేలు రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా రజక సంఘ మహిళా అధ్యక్షురాలు మెట్ట లక్ష్మీ ప్రసన్న, గ్రామ రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వృద్ధురాలి మృతి
భీమవరం: భీమవరం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్సకు వచ్చిన వృద్ధురాలు అకస్మాత్తుగా ప్రాణాలు విడిచిన ఘటన ఇది. గుండె నొప్పితో ఎస్.జయలక్ష్మి (70) పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ నెల 25న చేరినట్లు ఉన్న కాగితంతో ప్రాంతీయ ఆసుపత్రికి బుధవారం రాత్రి 9 గంటల సమయంలో వచ్చింది. చికిత్స అందించేలోపు శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. చిరునామా, ఇతర వివరాలు చెప్పకుండానే ఆమె మృతి చెందింది. వృద్ధురాలి వివరాలు తెలిసిన వారు ఆసుపత్రి అధికారులకుగాని, పోలీసులకు గాని వివరాలు తెలియజేయాలని వన్టౌన్ పోలీసులు తెలిపారు. దాడి చేసిన వ్యక్తి అరెస్టు భీమవరం: డబ్బులు ఇస్తేనే సోడా ఇస్తానన్న దుకాణ యజమానిపై దాడి చేసిన ఉత్తరప్రదేశ్కు చెందిన బబ్లూ యాదవ్ను గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. చినరంగనిపాలెం ప్రాంతంలో సోడా కొట్టు నిర్వహిస్తున్న ఎస్.వీరవెంకట సత్యనారాయణ దగ్గరకు బేతనీపేటలో ఉంటున్న బబ్లూయాదవ్ ఈ నెల 26న వెళ్లి సోడా అడిగాడు. డబ్బులు ఇస్తేనే సోడా ఇస్తానని చెప్పగానే అతనిపై నిందితుడు దాడికి దిగాడు. అంతేకాక అతని వద్ద ఉన్న రూ. 2 వేలు లాక్కెళ్లిపోయాడు. సత్యనారాయణ పోలీసులను ఆశ్రయించగా నిందితుడిని అరెస్ట్ చేశారు. ఎస్సై ఎస్వీవీఎస్ కృష్ణాజీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రిపుల్ ఐటీలో రెండోరోజు సర్టిఫికెట్ల పరిశీలన
నూజివీడు: స్థానిక ట్రిపుల్ ఐటీలో రెండోరోజు గురువారం ప్రత్యేక కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు. దీనిలో భాగంగా సైనికోద్యోగుల పిల్లల కోటా, ఎన్సీసీ, క్రీడా, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాకు చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. క్రీడా కోటాకు సంబంధించి 245 మందికి 171 మంది, సైనికోద్యోగుల పిల్లల కోటాకు సంబంధించి 117 మందికి 79 మంది, ఎన్సీసీ కేటగిరికి సంబంధించి 341 మందికి 277 మంది, భారత్ స్కౌట్స్ గైడ్స్ కేటగిరికి సంబంధించి 247 మందికి 185 మంది హాజరయ్యారు. ఈనెల 30న ఎన్సీసీ, క్రీడా కోటా అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ప్రొఫెసర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు పర్యవేక్షించారు. భారత సైన్యం సత్తాకు ప్రతీక సిందూర్తాడేపల్లిగూడెం: దేశ రక్షణలో సైనికుల పాత్ర అమూల్యమని ఏపీ నిట్ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ రమణరావు అన్నారు. ఏపీ నిట్లో గురువారం జరిగిన తిరంగా యాత్రలో ఆయన మాట్లాడారు. భారత సైన్యం ధైర్య సాహసాలకు, త్యాగనిరతికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక అని అన్నారు. ఈ విజయం భారత జవాన్ల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. మాతృభూమి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి సైనికుడి జీవితం స్ఫూర్తిదాయకమని, విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కన్నవాళ్లకు, కుటుంబాలకు దూరంగా దేశ సరిహద్దుల్లో రాత్రి పగలూ విధులు నిర్వర్తిస్తూ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడుతున్న సైనికుల పోరాటపటిమకు సెల్యూట్ కొట్టాలన్నారు. దేశభక్తిని చాటే నినాదాలతో త్రివర్ణ పతాకాలతో విద్యార్థులతో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. రిజిస్ట్రార్ దినేష్ రెడ్డి, నిట్ అధికారులు పాల్గొన్నారు. -
నీకు భారం కాలేను.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో..
ఏలూరు టౌన్: అన్నింటికీ నీపై ఆధారపడుతున్నాను.. ఇక నీకు భారం కాలేను.. పిల్లల్ని జాగ్రత్తగా చూస్కోండి అంటూ భర్తకు ఫోన్లో మెసెజ్ పెట్టి ఓ వివాహిత గోదావరిలోకి దూకి తనువు చాలించింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి లాలా చెరువు స్పిన్నింగ్ మిల్లు ప్రాంతానికి చెందిన సుంకరం రామకృష్ణ, కళ్యాణి (32) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఏలూరు శాంతినగర్ 21 వ డివిజన్ సచివాలయంలో కళ్యాణి ఏఎన్ఎంగా పనిచేస్తుండడంతో ఆమె కుటుంబంతో స్థానికంగానే నివాసముంటున్నారు. రెండేళ్ల క్రితం ఆమెకు ఒక రోడ్డు ప్రమాదంలో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె సరిగా నడవలేని పరిస్థితిలో భర్తపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. ఆమె చేస్తున్న ఉద్యోగంలో, కుటుంబ జీవనంలోనూ భర్తపై ఆధారపడుతోంది. ఒకవైపు కరోనా వ్యాప్తి చెందుతుందనే భయం, మరోవైపు పని భారం పెరగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె బుధవారం ఎవరికీ చెప్పకుండా రాజమండ్రి వెళ్లింది. భర్త రామకృష్ణకు ఫోన్లో.. ప్రతి పనికి నీ మీద ఆధార పడి ఉంటున్నా.. నిన్ను ఇబ్బంది పెడుతున్నాను.. నాకు జీవితంపై విరక్తి కలిగింది.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని మెసేజ్ పెట్టింది. దీంతో ఏలూరు త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా సెల్ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేశారు. లొకేషన్ రాజమండ్రిలో చూపించగా అక్కడకు వెళ్లి వెదికారు. తీరా చూస్తే ఆమె గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై రాజమండ్రి త్రీ టౌన్ సీఐ వీ అప్పారావు ఆధ్వర్యంలో మృతదేహాన్ని రాజమండ్రి సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్తకు మెసెజ్ పెట్టి గోదావరిలో దూకి వివాహిత ఆత్మహత్య -
ఉపాధ్యాయులకు బదిలీ కష్టాలు
నిడమర్రు : ఉపాధ్యాయ బదిలీలు ఈనెల 22వ తేదీ నుంచి విద్యాశాఖ ప్రారంభించింది. నేటి వరకూ ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్ వేదికగా కొనసాగుతోంది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల బదిలీలు పూర్తయింది. నియామక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మిగిలిన 94 ఖాళీలకు గురువారం ఏలూరు డీఈఓ కార్యాలయంలో అర్హతగల ఎస్ఏలకు పదోన్నతులు కల్పించి గ్రేడ్–2 హెచ్ఎంలుగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించి భర్తీ చేశారు. తర్వాత పీఎస్ హెచ్ఎంలకు, స్కూల్ అసిస్టెంట్, పండింట్లకు ఆన్లైన్లోనే బదిలీల ప్రక్రియ నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ ఎస్జీటీల బదిలీల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఎస్జీటీలకు ఆఫ్లైన్లో బదిలీలు చేపడతామని పాఠశాల విద్య ఉన్నత అధికారులు ఉపాధ్యాయ సంఘాల నేతల చర్చల సమయంలో అంగీకారం తెలిపారు. దీంతో ఎస్జీటీలకు కొంత సౌలభ్యం లభించిందని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోల్లో మాత్రం అన్ని వర్గాల ఉపాధ్యాయులతోపాటు ఎస్జీటీలకు ఆన్లైన్లో బదిలీలు పూర్తయ్యేలా మార్గదర్శకాలు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి 10 వరకూ ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని 11వ తేదీన నూతన పాఠశాలల బదిలీ ఆర్డర్స్ విడుదలవుతాయంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఎస్జీటీలు గందరగోళంలో పడ్డారు. ఉన్నత అధికారుల హామీ ప్రకారం మాన్యువల్ బదిలీలే చేపట్టాలని ఎస్జీటీలు పట్టుపడుతున్నారు. కానీ అధికారులు మాన్యువల్ బదిలీల వల్ల అనేక సమస్యలు వస్తాయని ఆన్లైన్ బదిలీలే పరిష్కారం అంటూ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ విషయంపై ప్రభుత్వం ఏవిధమైన జీవో ఇంత వరకూ ఇవ్వలేదని సంఘాలు చెబుతున్నాయి. పోస్టుల ఖాళీల స్పష్టతకే ఆఫ్లైన్ జిల్లా విద్యాశాఖాథికారి కార్యాలయంలో జరిగే ఆఫ్లైన్ బదిలీల ప్రక్రియ అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని ఎస్జీటీలు అభిప్రాయపడుతున్నారు. అక్కడే ఉపాధ్యాయుడికి వచ్చిన పాయింట్ల ఆధారంగా మండలాల్లోని పాఠశాలలు ప్రదర్శిస్తారు. అక్కడ పాఠశాల వివరాలు తెలుసుకుని ఐచ్ఛికాలు ఎంపిక చేసుకుంటే. ఎక్కడికి బదిలీ అవుతుందనేది స్పష్టంగా తెలిసిపోతుంది. దీంతో అప్పటికే పోస్టులు క్లోజ్ అయిన పాఠశాలల వివరాలు ప్రదర్శిస్తుండటంతో మారాల్సిన పాఠశాలలను ఎంపిక చేసుకునే వీలుంటుంది. దీంతో ఐచ్ఛికాల ఎంపిక సంఖ్య కూడా చాలా వరకూ తగ్గిపోతుంది. తప్పులు చేసే అవకాశం ఉండదని సంఘాలు ముందు నుంచి అధికారులకు చెబుతున్నారు. మాన్యువల్ చేపడితే ఇబ్బందులు ఇలా.. తాజా బదిలీల్లో జిల్లాలో 2,861 మంది ఎస్జీటీలు బదిలీల జాబితాలో ఉన్నారు. వీరంతా ఐచ్ఛికాలు (ఆప్షన్స్) ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆన్లైన్ విధానంలో ఐచ్ఛికాలు ఎంపిక చేసుకోవడం కష్టతరంగా ఉంటుందని వీరు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా టీచర్లు, సీనియర్ టీచర్లు ఆన్లైన్ విధానం అలవాటు లేకపోవడం, కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఆప్షన్స్ ఎంపిక చేసుకునే క్రమంలో తప్పులు నమోదు చేస్తే దూరంగా పోస్టింగ్ వస్తుందని ఆందోళన వ్యక్త చేస్తున్నారు. దీంతోపాటు ఆన్లైన్ విధానంలో వందల సంఖ్యలో ఆప్షన్లు ఎంపిక చేసుకోవాల్సి వస్తుందని ఈ విధానం వల్ల కనీసం ఆయా మండలాల్లోని పాఠశాల స్థితిగతులు కూడా తెలియవని అంటున్నారు. ఎస్జీటీల బదిలీలపై స్పష్టత కరువు! ఆఫ్లైన్లో చేపడతామని అధికారుల హామీ నేటి వరకూ ఉత్తర్వులివ్వని పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్లో తప్పులు దొర్లుతాయని గురువుల ఆందోళన ఉమ్మడి జిల్లాలో బదిలీల జాబితాలో 2,861 ఎస్జీటీలు ఆఫ్లైన్ బదిలీలపై ఉత్తర్వులు ఇవ్వాలి ఉపాధ్యాయ సంఘాల నేతల చర్చల్లో విద్యాశాఖ ఉన్నత అధికారులు ఎస్జీటీలకు మాన్యువల్ బదిలీలు చేపడతామని హామీ ఇచ్చారు. కానీ ఉపాధ్యాయుల బదిలీల మార్గదర్శకాల ఉత్తర్వుల్లో ఎస్జీటీలంతా ఆన్లైన్లోనే దరఖాస్తులు, వెబ్ ఆప్షన్స్, జాయినింగ్ ఆర్డర్స్ అంటూ ఉత్తర్వులు ఇవ్వడం తగదు. వెంటనే జిల్లా కేంద్రాల్లో మాన్యువల్ బదిలీలకు ఉత్వరులు ఇవ్వాలి. – సీహెచ్ శ్రీధర్, యూటీఎఫ్ అధ్యక్షుడు, ఉంగుటూరుఆన్లైన్ వల్ల నష్టపోతున్నాం ఉంగుటూరు మండలం తల్లాపురం యూపీ స్కూల్లో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తూ 2023 చేపట్టిన ఆన్లైన్ బదిలీల్లో కుక్కునూరు మండలం కమ్మరిగుడెం ప్రాథమిక పాఠశాలకు వెళ్లాల్సి వచ్చింది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చే వరుస క్రమంలో దొర్లిన పొరపాటు కారణంగా అంత దూరం వెళ్లాల్సిన పరిస్థితి. ఆన్లైన్ బదిలీల వల్ల అనేక మంది ఎస్జీటీలు నష్టపోతున్నారు. – కె. కమల్కుమార్, ఎస్జీటీ, ఉంగుటూరు అధికారుల నుంచి స్పష్టత రావాలి ఉన్నత అధికారులు జారీ చేసిన బదిలీల ఉత్తర్వుల్లో జూన్ 7 నుంచి 10వ తేదీ వరకూ ఎస్జీటీలు ఆన్లైన్లోనే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకూ అన్ని కేటగిరి బదిలీలు, వెబ్ ఆప్షన్స్, ఆర్డర్స్ అన్నీ ఆన్లైన్లో పారదర్శకంగా జరుగుతున్నాయి. ఎస్జీటీలకు మాన్యువల్ ట్రాన్సఫర్ విషయంపై ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక సమాచారం లేదు. – ఏవీఎస్ఎస్ భాస్కరకుమార్, ఎంఈవో, నిడమర్రు -
మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
నూజివీడు: గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ధర లేక మామిడి రైతులు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పేర్కొన్నారు. దీంతో మామిడి రైతులు నష్టాల్లో కూరుకుపోయారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారాన్ని చెల్లించి మామిడి రైతులను ఆదుకోవాలన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బంగినపల్లి, తోతాపురి, రసాలు తదితర రకాలకు ధరలు దారుణంగా పడిపోయాయని, దీంతో కోతకూలి, కిరాయిలు కూడా రాని పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయన్నారు. తోతాపురి కాయలు టన్ను కేవలం రూ.3వేల నుంచి రూ.4వేలు ధర మాత్రమే ఉందని, దీంతో కాయలు కోయడానికి ఎదురు పెట్టుబడి అవుతోందని రైతులు కోతలు కూడా కోయడం లేదన్నారు. చిత్తూరు జిల్లాలో జ్యూస్ ఫ్యాక్టరీలు ఇంత వరకు తెరవకపోవడంతో తోతాపురి కాయలను కొనేవారే లేరని పేర్కొన్నారు. అకాల వర్షాల కారణంగా మామిడి రైతులు నిండా మునిగిపోయారన్నారు. పూతలు, పిందెలు నిలుపుకునేందుకే రైతులు పురుగుమందులు పిచికారీ చేసేందుకు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టారన్నారు. అలాగే ఎరువులు, దుక్కి ఖర్చు, తోటల కాపలా ఖర్చు అన్నీ చూసుకుంటే రూ.50 వేలు పెట్టుబడి అయిందని, ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం చెల్లిస్తేనే రైతులు గట్టెక్కుతారన్నారు. మామిడి రైతులు ఎంతో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారిని పట్టించుకునే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చైన్నె, విజయవాడ, వరంగల్, రాజమండ్రి, విశాఖపట్నం వంటి నగరాల్లో నూజివీడు చిన్నరసం పేరుతో బోర్డులు పెట్టి వేరే ప్రాంతాల్లో కాసిన కాయలను విక్రయిస్తున్నారని, దీనిని బట్టే నూజివీడు ప్రాంతం మామిడికి ఎంతో ప్రసిద్ధో అర్ధమవుతుందన్నారు. అంతటి ప్రాధాన్యం ఉన్న మామిడిని సాగు చేస్తున్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలి మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు -
ఎంపీపీగా ధనలక్ష్మి బాధ్యతల స్వీకరణ
యలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండల ఎంపీపీగా ఇనుకొండ ధనలక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల కోర్టు ఉత్తర్వులతో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో ఆమె వైఎస్సార్సీపీ తరఫున ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికై న సంగతి తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా మండలంలో అన్ని వర్గాలను కలుపుకుని మండలాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఎంపీపీగా ఈ రోజు బాధ్యతలు స్వీకరించడానికి ప్రధాన కారణం తన వెంట ఉన్న ఎంపీటీసీ సభ్యులన్నారు. వారిని ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన వెరవకుండా తన వెంట నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా ఆమె స్వగ్రామం ఏనుగువానిలంక నుంచి భారీ మోటార్ సైకిల్ ర్యాలీగా మండల పరిషత్ కార్యాలయం చేరుకున్నారు. పూజ కార్యక్రమం అనంతరం ఎంపీపీ కుర్చీలో కూర్చుని బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్తోపాటు పార్టీ మండల కన్వీనర్ ఉచ్చుల స్టాలిన్బాబు, వైస్ ఎంపీపీ కొప్పాడి శ్రీనుబాబు, నాయకులు పొత్తూరి బుచ్చిరాజు, గుడాల సాయి బాలాజీ, చల్లా విశ్వేశ్వరరావు (నల్లయ్య), బోనం బులివెంకన్న, ఓదూరి భాస్కరరావు, చివటపు నాగేశ్వరరావు, ముదునూరి లక్ష్మీపతిరాజు, బొంతు కర్ణారెడ్డి, ఇలపకుర్తి నరసింహరావు, పొత్తూరి రంగరాజు, నిమ్మకాయల రామకృష్ణ, మంద హరికుమార్, మోకా నరసింహరావు, గుడాల సురేష్, మామిడిశెట్టి చిట్టిబాబు, మానుకొండ సోమరాజు, కోరాడ శ్రీనివాసరావు, జోగాడ ఉమామహేశ్వరరావు తదితరులు పూలమాల, శాలువాలతో సత్కరించారు. -
పడకేసిన పల్లె పాలన
సాక్షి, భీమవరం: ప్రజల వద్దకు పాలన, సంక్షేమానికి శ్రీకారం చుడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ సేవల కోసం ప్రజలు మండల, జిల్లా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలతో పాలనను చెంతకు చేర్చారు. అన్నదాతలకు అండగా రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే), వైద్యసేవల కోసం హెల్త్ క్లినిక్లను తెచ్చింది. వాటికోసం ఊరూరా ప్రత్యేక భవన నిర్మించింది. గ్రామ స్వరాజ్యానికి ఊపిరిలూదిన ఈ వ్యవస్థల్ని కూటమి సర్కారు నిర్వీర్యం చేస్తోంది. సేవలందించలేక సచివాలయాలు అలంకార ప్రాయంగా మారాయి. ఆర్బీకేలు మూతపడుతున్నాయి. హెల్త్ క్లినిక్ల్లో వైద్యసేవలు కుంటుపడ్డాయి. ఆరేళ్ల కిందట పంచాయతీల్లో చాలావరకు సెక్రటరీ, బిల్ కలెక్టర్, అటెండర్ మాత్రమే ఉండేవారు. వివిధ పనుల నిమిత్తం ప్రజలు వ్యయప్రయాసల కోర్చి మండల కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. 2019 అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థకు జీవం పోశారు. గ్రామాల్లో రెండు వేలు, పట్టణాల్లో నాలుగు వేల జనాభా ప్రాతిపదికన జిల్లాలో 535 సచివాలయాలు ఏర్పాటు చేశారు. గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శి, ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఏఎన్ఎం, వెల్ఫేర్ అసిస్టెంట్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, అగ్రికల్చర్ అసిస్టెంట్, పశు సంవర్ధకశాఖ అసిస్టెంట్, ఉద్యానవన అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్ తదితర పోస్టులను ఏర్పాటు చేశారు. తద్వారా జిల్లాలో ఐదు వేల మందికి పైగా నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. 35 శాఖలకు చెందిన 500కు పైగా సేవలను అందుబాటులోకి తెచ్చారు. సచివాలయాలకు అనుబంధంగా 50 కుటుంబాలకు ఒక వలంటీర్ చొప్పున 8,616 మందిని నియమించారు.సచివాలయ ఉద్యోగులకు ఇక్కట్లు : కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయాలను నిర్వీర్యం చేస్తోంది. చాలావరకు సేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. వలంటీర్లను తొలగించగా, సర్వేల పేరిట సచివాలయ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ పనులు పురమాయిస్తోంది. జిల్లాలోని సచివాలయాల్లో 1,066 ఖాళీ పోస్టులు ఉండగా వాటిని భర్తీ చేయకుండా క్లస్టర్ల పేరిట ఉద్యోగులను క్రమబద్ధీకరించి మిగిలిన వారిని ఇతర శాఖల్లో భర్తీ చేసే యోచన చేస్తోంది.సొంత భవనాల నిర్మాణంగ్రామీణ వ్యవస్థల కోసం గత ప్రభుత్వం సొంత భవనాలను సమకూర్చింది. ఉద్యోగులు, ప్రజావసరాలకు అనుగుణంగా వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఒక్కో సచివాలయానికి రూ.40 లక్షలు చొప్పున జిల్లాలో 353 భవన నిర్మాణాలకు సుమారు రూ.141.2 కోట్లు మంజూరు చేసింది. వీటిలో 270 భవనాలు పూర్తి కాగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఆర్బీకేకు రూ. 22 లక్షలు చొప్పున రూ.65 కోట్ల వ్యయంతో 298 భవన నిర్మాణం చేపట్టగా గత ప్రభుత్వంలోనే 211 భవనాలను పూర్తిచేసి వినియోగంలోకి తెచ్చారు. ఒక్కో హెల్త్ క్లినిక్కు సుమారు రూ.25 లక్షల చొప్పున జిల్లాలోని రూ.53.5 కోట్లతో 214 భవనాలు చేపట్టి 96 భవనాలు పూర్తిచేసి వినియోగంలోకి తెచ్చారు. కూటమి వచ్చాక మిగిలిన వాటిని పూర్తిచేయకపోవడంతో అసంపూర్తిగా మిగిలిపోయాయి.గత ప్రభుత్వంలో పార్టీలకతీతంగా పథకాలుగత ప్రభుత్వం కుల మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించింది. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయకపోగా.. గత ప్రభుత్వంలో నిర్మించిన సచివాలయం, ఆర్బీకే భవనాల్లో ఇతర కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు.– గొంతే హరీష్, పాందువ్వ, ఉండి మండలంవైద్య సేవలు బంద్గతంలో వైద్య సేవలు ఇంటి ముందుకు వచ్చేవి. ప్రతి నెల వైద్యులు వచ్చి ఆరోగ్య పరి స్థితులను అడిగి తెలుసుకుని అవసరమైన మందులు ఇచ్చేవారు. అప్పటి మాదిరిగా ఇప్పటి ప్రభుత్వంలో వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నాం.– తామరపల్లి ముసలయ్య, పెద్దిరెడ్డిపాలెం, ఇరగవరం మండలంఇంటింటికి వైద్య సేవలు ఎక్కడ?కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్క ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయలేదు. గతంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటుతోపాటు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ వైద్య సేవలు అందించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.– చిట్టూరి లక్ష్మి, వీరవాసరంఆర్బీకేలు నిర్వీర్యంగతంలో ఆర్బీకే ద్వారానే అన్ని సేవలు అందించేవారు. ఇప్పుడు ఎలాంటి మందులు ఇవ్వడం లేదు. సమాధానం చెప్పేవారు కూడా ఉండటం లేదు. ఎరువులు, పురుగు మందులు కమిషన్ వ్యాపారి వద్ద తెచ్చుకుంటున్నాం.– సేలంశెట్టి నాగేశ్వరరావు, రైతు, ఎల్ అగ్రహారంమాది నరసాపురం మండలం సరిపల్లి గ్రామం. రెండు ఎకరాల సొంత పొలంతో పాటు మరో 3 ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నాను. దాళ్వాలో 1053 రకం సాగుచేయగా ధాన్యం కొనుగోలుకు చాలా ఇబ్బంది పెట్టారు. ఆఖరుకు క్వింటాకు మూడు కిలోలు తగ్గించి కొన్నారు. డబ్బులు ఇప్పటికీ అకౌంట్లో వేయలేదు. మళ్లీ రైతుభరోసాకు దరాఖాస్తు చేయమని చెపితే రెండు రోజుల నుంచి గ్రామంలో సచివాలయానికి తిరుగుతున్నాను. ఎవరూ సమాధానం చెప్పడంలేదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి ఇబ్బంది లేదు. వలంటీర్లు ఉండేవారు, మరోపక్క సచివాలయం, ఇంకో పక్క రైతుభరోసా కేంద్రం ఉండేది.– జొన్నాడ అప్పారావు -
మద్యం అమ్మకాలు పారదర్శకంగా జరగాలి
భీమవరం: మద్యం అమ్మకాలు పారదర్శకంగా ఆన్లైన్ ద్వారా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం భీమవరం కలెక్టరేట్లో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ అధికారులు, లిక్కర్ షాప్ యజమానులతో మద్యం సరఫరా, అమ్మ కాలు వంటి అంశాలపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ముందుగా మద్యం అమ్మకాలపై షాపు యాజమానుల ఇబ్బందులు తెలుసుకున్నారు. లిక్కర్ విక్రయాల్లో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అమ్మకాలు పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. సమీక్షలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి ఆర్ఎస్ కుమరేశ్వరన్, డిపో మేనేజర్ ఎల్.రంగారెడ్డి పాల్గొన్నారు. ఆక్వాకు పంట విరామం యలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన ఆక్వా రైతు, సొసైటీ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు పెన్మెత్స వెంకట సత్యనారాయణరాజు బుధవారం ఆక్వా క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా ఆక్వా చెరువులు సాగు చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల రొయ్య దిగుబడి బాగుంటున్నా ధర పతనం కావడం, మేతలు, మందుల ధరలు పెరిగిపోవడంతో రైతులంతా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దీంతో జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం పిలుపు మేరకు పోడూరు మండలం అప్పనచెరువు పంచాయతీ రాజులగరువులో తాను సాగు చేస్తున్న 30 ఎకరాల ఆక్వా చెరువులకు పంట విరామం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. సబ్ జైలును సందర్శించిన న్యాయమూర్తి తణుకు అర్బన్: రిమాండ్లో ఉన్న ముద్దాయిలు న్యాయవాదిని పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే మండల న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటుచేస్తామని న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ కె.రత్నప్రసాద్ అన్నారు. బుధవారం తణుకు సబ్జైలుతోపాటు మానసిక ఆస్పత్రులైన ప్రియాంక నర్సింగ్హోమ్, భవానీ నర్సింగ్ హోంను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముద్దాయిలంతా రిమాండ్ అనంతరం బెయిల్పై బయటకు వెళ్లాక తమ ప్రవర్తనలో మార్పు వచ్చేలా నడుచుకోవాలన్నా రు. జైలులో ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, ఆహారం, వసతి, వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. మానసిక ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న వైద్యసేవలపై చర్చించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నేరం భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదని ఉప జిల్లా రెవెన్యూ డివిజినల్ అధికారి కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అధ్యక్షతన గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కమిటీ సలహా సంఘం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాల్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆదేశించారు. ఆడ పిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంత ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. యోగా రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలి భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో యోగా రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని జేసీ ఆదేశించారు. బుధవారం యోగా సిటిజన్ రిజిస్ట్రేషన్న్, మాస్టర్ ట్రైనర్స్ టు ట్రైనర్స్ మ్యాపింగ్, యోగా పోటీలు, తదితర అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. -
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
చాట్రాయి: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. మండలంలోని పోలవరం గ్రామానికి చెందిన పరసా ఈశ్వరరావు ఇంటి పక్కన ఉన్న 11 కేవీ వైరు ఇంటి సర్వీస్ వైరుపై పడి ఇల్లంతా విద్యుత్ ప్రసారం అయ్యింది. ఆ సమయంలో గదిలో నిద్రపోతున్న పరసా ప్రభు కిరణ్(18) లేచి బోర్డులో స్విచ్ ఆపుతుండగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతలపూడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఐ రామకృష్ణ తెలిపారు. గోదావరిలో దూకిన యువకుడి గల్లంతు యలమంచిలి: మండలంలోని చించినాడ వశిష్ట గోదావరి వంతెన మీద నుంచి దూకి యువకుడు గల్లంతైనట్లు ఎస్సై కె గుర్రయ్య తెలిపారు. వంతెనపై దొరికిన బైక్, సెల్ఫోన్ ఆధారంగా అతడు భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన షేక్ కాసు (24)గా అనుమానిస్తున్నారు. ఈ మేరకు షేక్ కాసు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. ఎకై ్సజ్ కేసుల్లో నలుగురి బైండోవర్ భీమవరం: ఎకై ్సజ్ కేసులకు సంబంధించి భీమవరం మండలంలోని నలుగురు వ్యక్తులను బుధవారం భీమవరం తహసీల్దార్ ఆర్ రాంబాబు వద్ద బైండోవర్ చేసినట్లు భీమవరం ఎకై ్సజ్ సీఐ కె బలరామరాజు చెప్పారు. బైండోవర్ చేసిన వారిలో ఇళ్ల శ్రీనివాసరావు, యెలుదూటి నాగన్న, యల్ల శేఖర్, బడుగు రవి ఉన్నారన్నారు. వీరు ఏడాది కాలంలో మరోసారి ఎకై ్సజ్ నేరంలో పట్టుబడితే రూ.లక్ష జరిమానా చెల్లించాల్సి ఉంటుందని సీఐ తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ మృతి భీమవరం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు భీమవరం వన్టౌన్ పోలీసులు బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 24వ తేదీన వీరవాసరం మండలం పంజావేమవరం గ్రామానికి చెందిన కొడమంచిలి మేరి(35) భర్తతో కలిసి మోటారు సైకిల్పై భీమవరం వస్తుండగా పోలీసుబొమ్మ సెంటర్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో మేరి తీవ్రంగా గాయపడగా గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. వన్టౌన్ ఎస్సై ఎస్వీవీఎస్ కృష్ణాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ధాన్యం మద్దతు ధర కంటి తుడుపే
పెదపాడు: ఖరీఫ్, రబీ పంటలకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటి తుడుపు చర్యేనని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. పెదపాడు మండలంలోని వట్లూరు గ్రంథాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో మద్దతు ధరలపై సమావేశం నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్పత్తి ఖర్చులు తక్కువ చూపి కేంద్ర ప్రభుత్వం ధరలు ప్రకటించడం వల్ల రైతులకు కనీస పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు వాస్తవ ఖర్చులు లెక్కకట్టి ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రైతులు తుమ్మల ధన కోటేశ్వరరావు, కొమ్మన సాంబశివరావు, కొమ్మనేని అచ్యుతరావు, కొల్లిపర కొండలరావు తదితరులు పాల్గొన్నారు. -
దోపిడీ కేసులో నిందితుల అరెస్టు
జంగారెడ్డిగూడెం: పట్టణంలో ఒక మహిళ కంట్లో కారం కొట్టి ఆమె మెడలోని సూత్రాలతో సహా బంగారు గొలుసుని దోపిడీ చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపారు. బుధవారం స్థానిక పోలీసు సర్కిల్ కార్యాలయంలో ఆయన వివరాలను వెల్లడించారు. జంగారెడ్డిగూడెంకు చెందిన మునగాల జానకీ దేవి, ఆమె భర్త శ్రీరామశాస్త్రి ప్రభుత్వ టీచర్లుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఇల్లు మరమ్మతుల నిమిత్తం తాపీ పనివారిని పెట్టుకున్నారు. ఈ నెల 23న తాపీ పనిచేసేందుకు పేరంపేటకు చెందిన చింతపల్లి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు, నక్కా శ్రీను అలియాస్ పండు, యడ్లపల్లి విజయరాజు వచ్చారు. వారు పని ప్రారంభించగా శ్రీరామశాస్త్రి టిఫిన్ తెచ్చేందుకు బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఆ ముగ్గురు జానకీ దేవి కంట్లో కారం కొట్టి నాలుగు కాసుల బంగారు గొలుసు, మంగళసూత్రాలతో సహా దోచుకుపోయారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను సీఐ కృష్ణబాబు అరెస్ట్ చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అరెస్టుకు సంబంధించి ఎస్సై షేక్ జబీర్ ఏఎస్సై ఎన్వీ సంపత్కుమార్, కానిస్టేబుళ్లు ఎన్.రమేష్, రాజశేఖర్ సహకరించగా, వీరిని డీఎస్పీ రవిచంద్ర అభినందించారు. సమావేశంలో సీఐ కృష్ణబాబు, ఎస్సై షేక్ జబీర్ పాల్గొన్నారు. -
నాడు పల్లె వైద్యానికి పెద్దపీట
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆధునిక వసతులతో హెల్త్ క్లినిక్ల నిర్మాణం చేసింది. వైద్యుడి రూమ్, ల్యాబ్, స్థానికంగా వైద్య సిబ్బంది నివాసం ఉండేందుకు, ఇతర వసతులతో వీటి నిర్మించారు. జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి, మంచాన పట్టిన వారికి ఇంటికి వద్దకే వెళ్లి వైద్యసేవలు అందించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైద్య శిబిరాల నిర్వహణ లేకపోవడంతో వైద్యకోసం పేదలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అన్నదాతలకు అండగా ఆర్బీకేలు అన్నదాతల అండగా ఆర్బీకే వ్యవస్థను తెచ్చి సాగులో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. విత్తు నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకు రైతులకు భరోసా కల్పించారు. సబ్సిడీపై విత్తనాలు, ఎరువులతో పాటు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు, విపత్తుల సమయంలో ఇన్ఫుట్ సబ్సిడీ, బీమా పరిహారం అందించడంలో కీలకపాత్ర పోషించాయి. ఆర్బీకేలను రైతుసేవా కేంద్రాలుగా కూటమి సర్కారు మార్చింది. కొన్ని ఆర్బీకే భవనాలు ఇతర కార్యాలయాలకు వినియోగిస్తుండగా, మరికొన్ని తాళం వేసి కనిపిస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉండిలోని ఆర్బీకేను పోలీస్ స్టేషన్గా మార్చగా పాలకోడేరు సచివాలయ భవనాన్ని తహసీల్దార్ కార్యాలయంగా మార్చారు. -
తణుకులో కోవిడ్ కలకలం!
తణుకు అర్బన్: కోవిడ్ అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతున్న తణుకుకు చెందిన వృద్ధురాలికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సమాచారం. పట్టణంలోని పైడిపర్రుకు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు ఇటీవల చార్ధామ్ యాత్రకు వెళ్లి వచ్చాక గత మూడు రోజులుగా అనారోగ్యం బారిన పడ్డారు. ఈ నెల 27న తణుకులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం కోవిడ్ అనుమానిత లక్షణాలతో రాజమండ్రికి తరలించగా అక్కడ చేసిన ర్యాపిడ్ కిట్ పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు సమాచారం. దీంతో మెరుగైన వైద్యసేవలకు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ యాత్రలకు పైడిపర్రు నుంచి 15 మంది వరకు వెళ్లారని ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం. కోవిడ్ పాజిటివ్ అన్న సమాచారంతో బుధవారం ఉదయం మున్సిపల్ శానిటరీ అధికారులు పైడిపర్రులో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ విషయంపై వైద్య శాఖ అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారు. ఈ విషయంపై డీఎంహెచ్ఓ డాక్టర్ గీతాబాయిని వివరణ కోరగా కోవిడ్ లక్షణాలున్న వృద్ధురాలికి తణుకులో ఎలాంటి పరీక్షలు చేయలేదని, ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. పరీక్షకు సంబంధించిన రిపోర్టు గురువారం వస్తుందని చెప్పారు. మునిసిపల్ అధికారులు శానిటేషన్ చేయించారు తప్ప.. వైద్యశాఖ నుంచి ఎలాంటి జాగ్రత్తలు, అవగాహన కల్పించకపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టని యంత్రాంగం కోవిడ్ పాజిటివ్ వచ్చిందనే సంకేతాలు ఉన్నా ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం గమనార్హం. దీంతో జలుబు, దగ్గు, ఆయాసం సమస్యలు ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ పరీక్షలు పశ్చిమగోదావరి జిల్లాలో అందుబాటులో లేవు. పరీక్షలు, సంబంధించిన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ రూపొందించపోవడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో కోవిడ్ కేసు నమోదు కాకుండానే పరీక్షలు నిర్వహించే కిట్లు, జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు, వార్డుల్లో బెడ్స్ అందుబాటులో ఉంచారు. ఆక్సిజన్ వంటి ఏర్పాట్లు చకచకా చేశారు. కడప ప్రాంతంలో కూడా కోవిడ్ కేసులు నమోదయ్యాయనే వార్తలు రాగా.. తణుకు నుంచి మహానాడుకు టీడీపీ శ్రేణులు వెళ్లడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వృద్ధురాలికి పాజిటివ్ వచ్చినట్లు ప్రచారం పైడిపర్రులో ప్రత్యేక శానిటేషన్ -
1 నుంచి రేషన్ షాపుల్లోనే సరుకులు
పాలకోడేరు: జూన్ 1 నుంచి రేషన్ షాపుల వద్ద నిత్యావసరాలు పంపిణీ చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ తెలిపారు. బుధవారం పాలకోడేరు మండలం శృంగవృక్షంలో రేషన్ షాపు నెంబర్ 11ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కార్డుదారులందరూ రేషన్ షాపులు వద్దకు వచ్చి నిత్యావసరాలు తీసుకోవాలని అన్నారు. అనుకూలమైన సమయంలో రేషన్ సరుకులు పొందవచ్చన్నారు. వికలాంగులు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దకు వెళ్లి రేషన్ సరుకులను అందజేయాలని డీలర్లను ఆదేశించారు. -
14న అయోధ్య–కాశీ పుణ్యక్షేత్ర యాత్ర
ఏలూరు (టూటౌన్): భారతీయ రైల్వేస్ అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో జూన్ 14 నుంచి 22 వరకు అయోధ్య–కాశీ పుణ్యక్షేత్ర యాత్ర నిర్వహిస్తున్నట్లు సంస్థ విజయవాడ ఏరియా మేనేజర్ ఎం.రాజా తెలిపారు. ఈమేరకు ఈ యాత్రకు సంబంధించిన బ్రోచర్ను బుధవారం స్థానిక రైల్వేస్టేషన్ నందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ అయోధ్య–కాశీ యాత్రలో భాగంగా వారణాసి, ఆయోధ్య, ప్రయాగ్రా, నైమిశారణ్యం ప్రాంతాల్లోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చునన్నారు. యాత్ర మొత్తం ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగలు సాగుతుందన్నారు. ఈ నెల 14న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే రైలు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని మీదుగా వెళుతుందన్నారు. టిక్కెట్ల బుకింగ్ కొరకు ఐఆర్సీటీసీ, రైల్వే రిటైరింగ్ రూమ్ దగ్గర, విజయవాడ రైల్వే స్టేషన్ నందు గాని ఆన్లైన్ నందుగాని చేసుకోవచ్చునన్నారు. వివరాలకు సెల్ నెం.9281495848 నందు సంప్రదించాలని కోరారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం
పెంటపాడు: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు దుర్మరణం పాలైన ఘటన బుధవారం తాడేపల్లిగూడెం– భీమవరం రోడ్డులో ముదునూరు వద్ద జరిగింది. పెంటపాడు ఎస్సై స్వామి తెలిపిన వివరాలివి. గూడెం మండలం ఆరుగొలనుకు చెందిన అడ్డగర్ల సాయి రమేష్ (34) కరెంట్ పని చేస్తుంటాడు. బుధవారం పనినిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లి తిరిగి మోటార్ సైకిల్పై స్వగ్రామం వస్తుండగా ముదునూరు మలుపు వద్ద భీమవరం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.ట్రాక్టర్ను ఢీకొన్న లారీయలమంచిలి: అడవిపాలెం సచివాలయానికి సమీపంలో నిలుపుదల చేసి ఉన్న ట్రాక్టర్ను లారీ ఢీకొనడంతో బోల్తా పడింది. ఆ శబ్థానికి చుట్టుపక్కల వారు భయబ్రాంతులకు గురయ్యారు. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ప్రమాదం జరిగిన సమయానికి ఎవరూ లేకపోవడం వలన పెను ప్రమాదం తప్పింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ విలేకరి ప్రమాద ఘటనను ఫొటో తీయగా లారీ డ్రైవర్ దౌర్జన్యానికి దిగాడు. దీనిపై అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఆ లారీకి కనీసం నెంబర్ ప్లేట్ లేకపోవడం విశేషం. నంబర్ ప్లేట్ లేని లారీతో కూటమి నాయకులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులతో పాటు మైనింగ్, రవాణా శాఖ అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలని కోరుతున్నారు. -
అడుగంటిన మంచినీటి చెరువులు
భీమవరం అర్బన్: జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో రక్షిత మంచినీటి చెరువులు అడుగంటాయి. దీంతో ప్రజలు తాగునీటికి ఇక్కట్లు పడుతున్నారు. వేసవి ప్రారంభంలో అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా చెరువులను పూర్తిస్థాయిలో నీటితో నింపకపోవడమే సమస్యకు కారణమని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. భీమవరం మండలంలోని గొల్లవానితిప్ప, కొత్తపూసలమర్రు, దొంగపిండి, గూట్లపాడు, చినఅమిరం, కొవ్వాడ అన్నవరం, పెదగరువు, బేతపూడి తదితర గ్రామాల్లో రక్షిత మంచినీటి చెరువులు అడుగంటాయి. దీంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఫిల్టర్ బెడ్లు పనిచేయకపోవడంతో బురద నీటినే పంచాయతీ సిబ్బంది కుళాయిల ద్వారా అరకొర సరఫరా చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ 15 తరువాత ఎప్పుడైనా పంటకాలువలు కట్టేస్తారు. ముందు జాగ్రత్తచర్యగా ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో మార్చి నెలాఖరు నుంచే రక్షిత మంచినీటి చెరువులు తాగునీటిని నింపాల్సి ఉంది. అయితే ఈ ఏడాది పెదగరువు, బేతపూడి గ్రామాల్లో రక్షిత మంచినీటి చెరువుల్లోను పూడిక తీత పనులు నిర్వహించడం, మిగిలిన గ్రామాల్లో ఏప్రిల్ చివరి వరకు తాగునీటి చెరువులను నింపకపోవడంతో మే నెల గడవకముందునే రక్షిత మంచినీటి చెరువులు అడుగంటాయి. అంతేకాకుండా కొన్ని గ్రామాల్లో వాడుక చెరువులలో నీటిని సైతం నింపకపోవడంతో అటు తాగునీటికి, ఇటు వాడకానికి నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుళాయిల ద్వారా అరకొర సరఫరా పంచాయతీ సిబ్బంది రోజుకు గంట మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారని, ఆ నీరు కూడా బురదమయంగా ఉంటోందని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో 20 లీటర్ల మినరల్ వాటర్ రూ.30 నుంచి రూ.35కు కొనుగోలు చేసి తాగుతున్నామని, స్థోమత లేనివారు కుళాయిల ద్వారా వచ్చే బురదనీటినే తాగి అనారోగ్యాల పాలవుతున్నామని బాహాటంగానే చెబుతున్నారు. గ్రామాల్లో దాహం కేకలు చెరువులను పూర్తిస్థాయిలో నింపకపోవడంతోనే సమస్య బురద నీరు వస్తుంది కుళాయిల ద్వారా రోజుకు ఒక గంట మాత్రమే తాగునీరు ఇస్తున్నారు. అది కూడా బురదగా వస్తుంది. ఇంటి వాడకానికే తప్ప తాగడానికి ఆ నీరు పనికి రావడం లేదు. డబ్బులుంటే మినరల్ వాటర్ కొనుక్కుని తాగుతున్నాం. లేకుంటే ఆ నీటినే తాగాల్సి వస్తుంది. – మేళం సోమన్న, గ్రామస్తుడు, గొల్లవానితిప్ప గంట మాత్రమే ఇస్తున్నారు గ్రామానికి శివారు కావడంతో రోజుకు గంట మాత్రమే తాగునీటిని ఇస్తున్నారు. ఇంటింటికి కుళాయిలు ఇవ్వలేదు. పంచాయతీ కుళాయిల ద్వారా వచ్చే నీటినే తెచ్చుకుంటున్నాం. అవి మురికిగా వస్తున్నాయి. – దేవిరెడ్డి వెంకటలక్ష్మి, గృహి ణి, హౌసింగ్ కాలనీ, గొల్లవానితిప్ప -
సినిమా థియేటర్ల తనిఖీలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని సినిమా థియేటర్లను బుధవారం తహసీల్దార్ ఎం.సునీల్ కుమార్ తనిఖీ చేశారు. థియేటర్లలో సదుపాయాలపై ఆరా తీశారు. హాల్స్ వద్ద విక్రయించే తినుబండారాల ధరల పట్టికను ప్రదర్శించాలని సూచించారు. ప్రేక్షకుల వద్ద అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పెనుగొండలో.. పెనుగొండ: ప్రభుత్వ ఆదేశాల మేరకు పెనుగొండ మినర్వా థియేటర్ను తహాసీల్దారు జి అనితకుమారి బుధవారం తనిఖీ చేశారు. సైకిల్ స్టాండ్, సినిమా హాలులో తినుబండారాల ధరలు, ఇతర సదుపాయాలను పరిశీలించారు. మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వద్దని సూచించారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. -
రావిలంక తీరంలో విషాద ఛాయలు
పెనుగొండ: ఆచంట మండలం రావిలంక గోదావరిలో గల్లంతైన ముగ్గురు బాలుర మృతదేహాలు బుధవారం లభ్యం కాగా తీరప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలానికి చెందిన కేతా ప్రవీణ్ (15), సానబోయిన సూర్యతేజ (12), పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి పెదలంకకు చెందిన నీతిపూడి పాల్కుమార్ (15) మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రావిలంక గోదావరిలో మంగళవారం సరదాగా స్నానానికి వచ్చారు. అమావాస్య కారణంగా గోదావరికి సముద్రపు పోటు తగలడంతో నీటిమట్టం పెరిగి ముగ్గురు బాలురకు ఈత రాకపోవడంతో గల్లంతయ్యారు. బయట పడిన మరో ఇద్దరు బాలురు ఘటనా స్థలం నుంచి హుటాహుటిన వారి తల్లిదండ్రుల వద్దకు చేరి సమాచారం అందించారు. దీంతో మంగళవారం రాత్రి పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపులో తొలుత కేతా ప్రవీణ్ మృతదేహం లభ్యం కాగా అనంతరం సానబోయిన సూర్యతేజ మృతదేహం లభ్యమైంది. అయితే నీతిపూడి పాల్కుమార్ మృతదేహాం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం శ్రమించాల్సి వచ్చింది. చివరకు యలమంచిలి మండలం కనకాయలంక సమీపంలో అతడి మృతదేహం లభ్యమైంది. దీంతో పోలీసులు కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి మృతదేహాలను తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. పెనుగొండ సీఐ రాయుడు విజయభాస్కర్ ఆధ్వర్యంలో ఆచంట, గన్నవరం ఎస్సైలు కేవీ రమణ, శివకృష్ణ, తహాసీల్దారులు జి కనకరాజు, శ్రీపల్లవి మృతదేహాలు లభ్యమయ్యే వరకూ ఘటనా స్థలంలోనే ఉండి పర్యవేక్షించారు. బాలుర మృతితో రావిలంక వద్ద తీరమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మృతదేహాల గాలింపు చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించారు. -
కోకో గింజల విక్రయానికి దరఖాస్తు చేసుకోండి
తాడేపల్లిగూడెం రూరల్: ప్రతి రైతు నుంచి ఎకరానికి 300 కిలోల కోకో గింజలను కొనుగోలు చేస్తామని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఆర్.దేవానంద్ కుమార్ తెలిపారు. బుధవారం తాడేపల్లిగూడెం మండల మహిళా సమాఖ్య భవనంలో వ్యవసాయ, ఉద్యాన సహాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కోకో గింజలు కిలోకు రూ.500 ధర నిర్ణయించిందన్నారు. ఈ ధరకు కంపెనీలు రైతుల నుంచి కొనుగోలు చేస్తాయన్నారు. ఇందులో కిలోకు రూ.50 రాష్ట్ర ప్రభుత్వం కంపెనీ వారికి చెల్లించడం ద్వారా ఈ పథకం అమలు చేస్తుందన్నారు. కోకో రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 30వ తేదీలోగా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వైఎస్సార్ విగ్రహం పాక్షిక ధ్వంసం పెంటపాడు: పెంటపాడులోని వెలంపేట కోనేరు చెరువు వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని బుధవారం వేకువజామున గుర్తుతెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. విగ్రహం ఎడమ చేయి మోచేతి వరకూ విరిగి కింద పడి ఉంది. గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు బర్ల జయ రాంబాబు ఈ విషయాన్ని ముందుగా గుర్తించారు. మంగళవారం రాత్రి వరకూ విగ్రహం బాగానే ఉందని, ఉదయం చూస్తే ఇలా చేయి విరిగి పడి ఉందని వైఎస్సార్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో టీడీపీ మహానాడు జరుగుతున్న సమయంలో ఇక్కడ వైఎస్సార్ విగ్రహం ధ్వంసం కావడం చర్చనీయాంశమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్రెడ్డి జిల్లాలో ఓదార్పు యాత్ర చేసిన సమయంలో ఈ విగ్రహాన్ని స్వయంగా ఆవిష్కరించారు. విగ్రహం జీవ కళ ఉట్టిపడేలా ఉందని శిల్పిని, నిర్వాహకులను అభినందించారు. అప్పటి నుంచి ఇక్కడ పలు కార్యక్రమాలను వైఎస్సార్ అభిమానులు నిర్వహిస్తున్నారు. -
పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలి
ఏలూరు(మెట్రో): జీవో 23 ప్రకారం ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్జీవోస్ నాయకులు కోరారు. బుధవారం కలెక్టర్ వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలుసుకుని బదిలీ ప్రక్రియపై విన్నవించారు. ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్లో ఉన్న ఆఫీస్ బేరర్స్కి అమలులో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోల ప్రకారం బదిలీలు చేసేలా ప్రతి శాఖాధికారులకు ఆదేశాలు ఇవ్వాలని వారు కలెక్టర్ను కోరారు. ఈ మేరకు కలెక్టర్ స్పందిస్తూ జిల్లా రెవెన్యూ అధికారికి ఆదేశాలు జారీ చేసినట్లు నాయకులు తెలిపారు. ఇటీవల గ్రామ, వార్డు సచివాలయంలో పనిచేస్తున్న హెల్త్ సెక్రెటరీలకు పదోన్నతులు కల్పించాలని కోరగా, ఏఎన్ఎంల పదోన్నతుల ఫైల్ను ఆమోదించినందుకు కలెక్టర్కు పూలమొక్క అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు, ఎన్జీవోస్ నాయకులు, హెల్త్ సెక్రటరీలు పాల్గొన్నారు. -
పూడికతీత తూతూమంత్రమేనా?
తొలకరి సాగుకు ఊతమిస్తూ రుతుపవనాలు వచ్చేశాయి. త్వరలో కాలువలకు నీరు విడుదల కానుంది. కోటి ఆశలతో ఏరువాక సన్నాహాల్లో రైతులను డ్రెయిన్లు గురప్రుడెక్క, కిక్కిస, వ్యర్థాలు, ఆక్రమణలతో కుంచించుకుపోయి కలవరపరుస్తున్నాయి. సాగుకాలం సమీపిస్తున్నా చాలాచోట్ల పూడికతీత పనులు ఇంకా మొదలుకాలేదు. భీమవరంలో గుర్రపుడెక్కతో నిండిపోయిన గునుపూడి సౌత్ డ్రెయిన్ సాక్షి, భీమవరం: జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, ఆకివీడు సబ్డివిజన్లలో బొండాడ, గునుపూడి సౌత్, గొంతేరు, భగ్గేశ్వరం, మొగల్తూరు, కాజా, రుద్రయ్య కోడు తదితర 294 కిలోమీటర్ల పొడవున 13 మేజర్ డ్రెయిన్లు ఉన్నాయి. 330 కిలోమీటర్లు పొడవున 41 మీడియం డ్రెయిన్లు, 956 కిలోమీటర్లు పొడవున 454 మైనర్ డ్రెయిన్లు ఉన్నాయి. వీటిలో గురప్రుడెక్క, తూడు పెరిగిపోయి నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది. తుపాన్లు ఏర్పడినప్పుడు రోజుల తరబడి ముంపునీరు లాగక పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. మంపునీటిని బయటకు పంపేందుకు రైతులు అగచాట్లు పడాల్సి వస్తోంది. ఏటా తొలకరి సాగు ప్రారంభానికి ముందే డ్రెయిన్లలో గురప్రు డెక్క, కిక్కిస తొలగింపు పనులు పూర్తి చేస్తుంటారు. రూ. 14 కోట్లు మంజూరు: రానున్న వ్యవసాయ సీజనన్కు గురప్రుడెక్క తొలగింపు, పూడికతీత నిమిత్తం సుమారు రూ.17 కోట్లు విలువైన 370కు పైగా పనులకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. 349 పనులకు ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసింది. వీటిలో 270 వరకు గురప్రుడెక్క తొలగింపు, మిగిలినవి పూడికతీత పనులు ఉన్నాయి. ఈ నిధులతో సాగుకు ముందే పూడిక సమస్యను పరిష్కరించడంతో పాటు ఏడాదిపాటు డ్రెయిన్ల నిర్వహణ చేయాలి. ప్రాజెక్టు కమిటీ, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, నీటిసంఘాల మాటున నామినేషనన్ పద్దతిపై కూటమి నేతలు పనులు దక్కించుకున్నారు. సాగుకాలం ముంచుకొస్తుండగా చాలామంది ఇంకా పనులు ప్రారంభించకపోవడం గమనార్హం. తూతూమంత్రంగా పనులు చేసేందుకు కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై డ్రెయిన్న్స్ ఈఈ సత్యనారాయణను సంప్రదించగా పూడికతీత పనులు ప్రారంభించినట్టు తెలిపారు. వర్షాల వలన కొన్నిచోట్ల స్ప్రేయింగ్ పనులు ఇంకా మొదలుకాలేదని, త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత ఏడాది వెంటాడిన ముంపు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత ఏడాది నెల రోజులు ఆలస్యంగా పనులు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 2.15 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేపట్టారు. సీజనన్ ప్రారంభంలోనే భారీ వర్షాలతో డ్రెయిన్ల పొంగి ప్రవహించాయి. పూడికతో ముంపునీరు లాగక 14 వేల ఎకరాల్లోని నాట్లు, 30 వేల ఎకరాలకు చెందిన నారుమడులు దెబ్బతినడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. గురప్రుడెక్క, కిక్కిస, వ్యర్థాలతో కుచించుకుపోయిన డ్రెయిన్లు జిల్లాలో 349 పూడికతీత పనులకు రూ.14 కోట్ల మంజూరు నీటి సంఘాలు మాటున కూటమి నేతలకే పనులు సకాలంలో మొదలుపెట్టకుండా నామమాత్రంగా చేసే ఎత్తుగడ పాలకోడేరు, భీమవరం మండలాల్లో ప్రధానమైన గునుపూడి సౌత్ డ్రెయిన్ గురప్రు డెక్క, వ్యర్థాలతో పూడుకుపోయింది. భారీ వర్షాలు కురిసినప్పుడు నీటి ప్రవాహవేగాన్ని గురప్రుడెక్క అడ్డుకుని సకాలంలో ముంపునీరు లాగక రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఏటా ఇదే పరిస్థితి ఉంటున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పూడిక తొలగించాలి బక్లెస్ డ్రెయిన్ ముంపుతో తీవ్రంగా నష్టపోతున్నాం. సార్వాకు ముంపు బెడద లేకుండా డ్రెయిన్లోని ప్రక్షాళన చేయాలి. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నాచు, గురప్రు డెక్క తొలగింపు పనులు చేయించాలి. – తోరం వెంకట సుబ్బయ్య, రైతు, పడమర విప్పర్రు త్వరితగతిన పనులు చేపట్టాలి తొలకరి పనులు మొదలయ్యే నాటికి డ్రెయిన్లలో పూడికతీత పనులు పూర్తిచేయాలి. అలాగే యనమదుర్రు డ్రెయిన్్ పూడిక ప్రధాన సమస్యగా ఉంది. ఆక్రమణలు, పూడిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. – తోలేటి వెంకటేశ్వరరావు, రైతు, తిరుపతిపురం -
వ్యాన్ను ఢీకొన్న కంటైనర్
జాతీయ రహదారిపై దెందులూరు హెచ్పీ పెట్రోలు బంకు వద్ద మంగళవారం వ్యాన్ను కంటైనర్ లారీ ఢీకొనడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. 8లో uగ్రామాల్లో చెత్త తొలగింపు ఇరగవరం: ‘గ్రామాల్లో పడకేసిన పారిశుద్ధ్యం’ శీర్షికన గత సోమవారం సాక్షిలో వచ్చిన కథనానికి పంచాయతీ అధికారులు స్పందించారు. గ్రామాల్లోని చెత్తను ట్రాక్టర్లలో డంపింగ్ యార్డులకు తరలించారు. కార్యదర్శులకు ఈవోపీఆర్డీ నరసింహ మూర్తి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని ఆదేశాలిచ్చారు. గ్రామాల్లో చెత్త తొలగించడంతో ప్రజలు హర్షం చేశారు. పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలి భీమవరం (ప్రకాశంచౌక్): పరిశ్రమల కోసం దరఖాస్తులను గడువులోగా పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన చాంబరులో పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో మాట్లాడుతూ యువతకు పారిశ్రామిక యూనిట్ల స్థాపనపై అవగాహన కల్పించాలన్నారు. రైసు మిల్లులు, ఆక్వా, కాయిర్ సెక్టారుకు సంబంధించి ఉత్పత్తులు, ఎగుమతుల అవకాశాలు చర్చించేందుకు వర్క్షాపు నిర్వహించాలన్నారు . -
ముగిసిన ఈఏపీ సెట్
భీమవరం: ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. భీమవరం పట్టణంలోని 5 పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 19, 20 తేదీల్లో ఏపీ అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించగా ఈ నెల 21 నుంచి మంగళవారం వరకు ఇంజినీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు జరిగాయి. మంగళవారం పరీక్షకు పట్టణంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 170 మందికి 165 మంది హాజరుకాగా, విష్ణు ఉమెన్స్ కళాశాలలో ఉదయం 87 మందికి 85 మంది, విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 110 మందికి 106 మంది హాజరయ్యారు. డీఎన్నార్ అటానమస్ కళాశాలలో ఉదయం 100 మందికి 94 మంది, డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 100 మందికి 99 మంది హాజరయ్యారు. తాడేపల్లిగూడెంలో.. తాడేపల్లిగూడెం: పెద తాడేపల్లి వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం జరిగిన పరీక్షకు 228 మందికి 221 మంది హాజరయ్యారు. ఈ కేంద్రంలో ఇంతవరకూ 3239 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 3061 మంది పరీక్షకు హాజరయ్యారు. ‘పది’ సప్లిమెంటరీ పరీక్షకు 65 శాతం హాజరు భీమవరం: జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన పది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు 65 శాతం విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ చెప్పారు. 139 మంది విద్యార్థులకు 48 మంది గైర్హాజరయ్యారన్నారు. 7 పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించగా ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని నారాయణ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు భీమవరం (ప్రకాశంచౌక్): విధుల్లో నిర్లక్ష్యం వహి స్తూ సమావేశాలకు గైర్హాజరవుతున్న మున్సిపల్ అధికారుల పై, నిర్ధేశిత లక్ష్యాలను సాధించడంలో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ రీజనల్ డైరక్టర్ సీహెచ్ నాగ నర్సింహరావు హెచ్చరించారు. మంగళవారం భీమవరం మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ హాలులో జిల్లాలోని అన్ని మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆయా మున్సిపాలిటీలకు నిర్ధేశించిన లక్ష్యాలను, విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై ఆరా తీశారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై స్థానికంగా ఉన్న కమిషనర్లు సస్పెండ్ వరకూ చర్యలు తీసుకోవాలన్నారు. భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఆకివీడు మున్సిపాలిటీలకు సంబంధించి కమిషనర్లు, రెవెన్యూ అధికారులు ప్లానింగ్ అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. సమావేశంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, సెక్షన్ హెడ్స్ పాల్గొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి భీమవరం: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం నుంచి జూన్ 1 వరకు జరుగుతాయని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి ఎ. నాగేశ్వరరావు తెలిపారు. జనరల్ కేటగిరిలో 27 మంది, ఒకేషనల్లో 99 మంది హాజరుకానున్నారని. జనరల్ విద్యార్ధులకు శ్రీగ్రంఽధి వెంకటేశ్వరరావు జూనియర్ కళాశాల, ఒకేషనల్ విద్యార్థులకు ప్రశాంతి ఒకేషనల్ జూనియర్ కళాశాల, పెనుగొండలోని ఎస్వీకేపీ అండ్ పీవీ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో ఏర్పాట్లు చేసినట్లు నాగేశ్వరరావు తెలిపారు. నేటి నుంచి ట్రిపుల్ ఐటీలో సర్టిఫికెట్ల పరిశీలన నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2025–26 అడ్మిషన్లలో భాగంగా ప్రత్యేక కేటగిరీ సీట్ల భర్తీకి ఈ నెల 28 నుంచి 31 వరకు సర్టిఫికెట్లు పరిశీలించనున్నారు. ఇందుకోసం నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏర్పాట్లు చేశారు. 28న సైనికోద్యోగుల పిల్లల (సీఏపీ) కోటాలో 153 మంది, క్రీడా కోటాలో 320 మంది కలిపి మొత్తం 473 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. 29న సీఏపీ కోటాలో 117, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో 247, ఎన్సీసీ కోటాలో 341, క్రీడా కోటాలో 245 మొత్తం కలిపి 950 మంది సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. 30న ఎన్సీసీ కోటాలో 452, క్రీడా కోటాలో 467, మొత్తం 919 మంది, 31న ఎన్సీసీ కోటా అభ్యర్థులు 661 మంది సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. -
గోదావరిలో ముగ్గురు బాలుర గల్లంతు
పెనుగొండ: కోనసీమలో గోదావరిలో ఎనిమిది మంది యువకుల గల్లంతు వార్త మరువక ముందే.. ఆచంట మండలం అయోధ్యలంక శివారు రావిలంక వద్ద స్నానానికి దిగిన బాలురలో ముగ్గురు గల్లంతవడం తీవ్ర విషాదం నింపింది. మంగళవారం సాయంత్రం ముగ్గురు బాలురు గోదావరిలో స్నానానికి దిగి గల్లంతయ్యారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలానికి చెందిన కేతా ప్రవీణ్(15), సానబోయిన సూర్యతేజ(12), పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలికి మండలం పెదలంకకు చెందిన నీతిపూడి పాల్ కుమార్(15) స్నేహితులతో కలసి గత కొన్ని రోజులుగా గోదావరి స్నానానికి వస్తున్నారు. ఇదే కోవలో మంగళవారం మధ్యాహ్నం మరో ఇద్దరు స్నేహితులతో కలిసి స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తు ప్రవీణ్, సూర్యతేజ, పాల్ కుమార్ మునిగిపోవడంతో మిగిలిన ఇద్దరు భయపడి వెంటనే బంధువులకు సమాచారం అందించారు. కేతా ప్రవీణ్, పాల్కుమార్ ఇటీవల పదో తరగతి పరీక్షలు పూర్తిచేశారు. పేద కుటుంబాల్లో పెను విషాదం గల్లంతైన ప్రవీణ్ తండ్రి వెంకటేశ్వరరావు తాపీ మేసీ్త్రగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సూర్యతేజ తండ్రి ఏడుకొండలు వడ్రంగి మేసీ్త్ర.. పాల్కుమార్ తండ్రి మృతి చెందడంతో తల్లి జీవనోపాధి నిమిత్తం గల్ఫ్కు వెళ్లింది. ముగ్గురు బాలురు గల్లంతుతో సంఘటన ప్రాంతంలో విషాదం నెలకొంది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం ఆజ్మీ, నర్సాపురం డీఎస్పీ డాక్టర్ వేద, పెనుగొండ సీఐ రాయుడు విజయకుమార్, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర ఎస్సైలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన ముగ్గురు బాలుర కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆచంట మండలం అయోధ్యలంక శివారు రావిలంక వద్ద ఘటన స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగిన బాలురు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు -
వ్యాన్ను ఢీకొన్న కంటైనర్
దెందులూరు: వ్యాన్ను కంటైనర్ లారీ ఢీకొనడంతో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై దెందులూరు హెచ్పీ పెట్రోలు బంకు వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా పామర్రు నుంచి తూర్పుగోదావరి జిల్లా వాడపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఒకే కుటుంబానికి చెందిన 15 మంది వ్యాన్లో వెళ్తున్నారు. దెందులూరు హెచ్పీ పెట్రోలు బంకు వద్దకు వచ్చేసరికి గుండుగొలను వైపు వెళ్తున్న కంటైనర్ లారీ వెనుక నుంచి వ్యాన్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ప్రయాణిస్తున్న 15 మందిలో ఆరుగురికి స్వల్ప గాయాలు కాగా మిలిలిన వారు క్షేమంగా బయటపడ్డారు. క్షతగాత్రులను వెంటనే దెందులూరు సీహెచ్సీకి 108 అంబులెన్స్లో తరలించారు. కాగా వ్యాన్ను ఢీకొట్టి వెళ్లిపోయిన కంటైనర్ను సత్యనారాయణపురం వద్ద గ్రామస్తులు నిలుపుదల చేసి తాళాలు తీసుకున్నారు. అయితే డ్రైవర్ వద్ద మరో తాళం ఉండడంతో కంటైనర్తో పరారయ్యాడని ఎస్సై శివాజి చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. ఆరుగురికి స్వల్పగాయాలు -
ఎర్ర గ్రావెల్ తవ్వేస్తున్నా.. మొద్దు నిద్రే
ద్వారకాతిరుమల: అవినీతి అధికారులు ఉన్నంత వరకు అక్రమార్కులకు అడ్డేలేదు అనడానికి పోలవరం కుడి కాలువ గట్టుపై జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలే నిదర్శనం. నామమాత్రపు అనమతులను అడ్డం పెట్టుకుని ఏకంగా క్వారీలు ఏర్పాటు చేశారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా భూమిని తవ్వేస్తూ.. ఎంతో విలువైన ఎర్ర గ్రావెల్ను అమ్మేస్తున్నారు. నిత్యం వందలాది టిప్పర్ల మట్టిని తరలించేస్తున్నారు. కొందరు రైతులు తమ పొలాల వద్ద గోతులు తవ్వేస్తున్నారని గగ్గోలు పెడుతున్నా.. పట్టించుకునే నాధుడు లేడు. ముడుపుల మత్తులో జిల్లా అధికార యంత్రాంగం నిద్ర నటించడమే ఇందుకు కారణమని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. ఇంతటి అరాచక పాలనను, లెక్కలేని అధికారుల తీరును ముందెన్నడూ చూడలేదని వాపోతున్నారు. మళ్లీ పూడ్చేస్తాములే.. కాలువ తవ్విన సమయంలో గట్టుపై వేసిన మట్టిని బయటకు తోలుకునేందుకు మూడు కంపెనీలకు ఇరిగేషన్, మైనింగ్ అధికారులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. అయితే గట్టుపై ఉన్న మట్టిని కాకుండా, భూమిని తవ్వి ఎంతో విలువైన ఎర్ర గ్రావెల్ను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. దాంతో తవ్వకాలు జరిగిన ప్రాంతాలు క్వారీలను తలపిస్తున్నాయి. తమ పొలాలకు వెళ్లే మార్గాల్లో గుంతలు తవ్వేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలు జరుపుతున్న వారిని ప్రశ్నిస్తే.. మళ్లీ పూడ్చేస్తాములే అని సమాధానం చెబుతున్నారట. వర్షాలకు గోతులు నిండిపోయి అందులో రైతులు గాని, పశువులు గాని పడి మృత్యువాత పడితే దానికి ఎవరు బాధ్యులు. తవ్వకాలు జరుపుతున్న వారా.. లేక అధికారులా.. అని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. మొక్కుబడిగా పూడిక.. గట్టుపై మట్టి తవ్వకాలు ముసుగులో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై ఇటీవల సాక్షిలో వరుస కథనాలు ప్రచురితం అయ్యాయి. దాంతో ఉలిక్కిపడ్డ అక్రమార్కులు తమ తప్పులను అధికారుల సూచనలతో కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పంగిడిగూడెం వద్ద గ్రావెల్ తవ్వగా ఏర్పడిన గోతులను, గట్టుపై ఉన్న మట్టితో మొక్కుబడిగా పూడ్చుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే గోతులు పూడ్చుతున్నామని చెబుతున్నారు. అసలు గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు ఎవరిచ్చారు, ఇప్పటి వరకు తవ్విన గోతుల సంగతి ఏమిటన్న ప్రశ్నలకు వారి వద్ద సమాదానం లేదు. ముసుగులతో రవాణా.. కూటమి నేతలు ఎంతో విలువైన గ్రావెల్ను అక్రమంగా అమ్మేస్తున్నారని, అధికారులు వారికి కొమ్ము కాస్తున్నారని జిల్లా వ్యాప్తంగా తెలిసిపోయింది. దాంతో టిప్పర్లలోని గ్రావెల్ బయటకు కనబడకుండా గ్రీన్ క్లాత్లు కట్టి మరీ రవాణా చేస్తున్నారు. నిత్యం వందలాది టిప్పర్ల మట్టి ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు తరలిపోతోంది. పోలవరం కుడి కాలువగట్టుపై ఏకంగా గ్రావెల్ క్వారీలు మట్టి ముసుగులో యథేచ్ఛగా ఎర్ర గ్రావెల్ తవ్వకాలు నిద్ర నటిస్తున్న జిల్లా అధికార యంత్రాంగం ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు పంగిడిగూడెం వద్ద నాకు ఉన్న పొలానికి వెళ్లే దారిలో గోతులు తవ్వేస్తున్నారని ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు ఫోన్లో ఫిర్యాదులు చేశాను. అయినా వారు పట్టించుకోలేదు. కూటమి నేతలకు ఎదురు తిరిగి నిలబడలేను. ఎందుకంటే వారి వెనుక ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. నా కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. మిగిలిన రైతుల పరిస్థితి కూడా ఇదే. – భీమడోలుకు చెందిన ఓ రైతు ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు కాలువ గట్టుపై ఉన్న మట్టిని విడిచిపెట్టి, క్వారీలు తవ్వుతూ కూటమి నేతలు కోట్లు గడిస్తున్నారు. ఆ డబ్బుతో అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. అందుకే అధికారులు సైతం అక్రమార్కులకు తొత్తుల్లా మారారు. ఇంత దారుణాన్ని ఎప్పుడూ చూడలేదు. ఎం.నాగులపల్లి, పంగిడిగూడెం వద్ద పచ్చ నేతలు, జనసేన నాయకుడి కనుసన్నల్లో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. – ఎం.నాగులపల్లికి చెందిన ఓ రైతు -
రోడ్డు ప్రమాదంలో సబ్ కలెక్టర్ కార్యాలయ అటెండర్ మృతి
నూజివీడు: నూజివీడు సబ్కలెక్టర్ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న బలుమూరి సుబ్బారావు(59) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. సబ్కలెక్టర్కు అటెండర్గా పనిచేస్తున్న ఆయన స్వగ్రామమైన కృష్ణాజిల్లా గన్నవరం మండలం గోపవారిగూడెంలో ఉంటున్నారు. నిత్యం అక్కడి నుంచే విధులకు హాజరై మరలా ఇంటికి వెళ్తారు. రోజూ మాదిరిగానే ఇంటి వద్ద నుంచి నూజివీడులోని సబ్కలెక్టర్ కార్యాలయానికి విధి నిర్వహణ నిమిత్తం మంగళవారం ద్విచక్రవాహనంపై వస్తుండగా ఉదయం 7.45 గంటల సమయంలో కొన్నంగుంట రోడ్డులో అమృతనగర్ స్టేజీ వద్ద వ్యాన్ వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. అటెండర్ సుబ్బారావు మృతి వార్త తెలుసుకున్న సబ్కలెక్టర్ బచ్చు స్మరణ్రాజ్ హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం సుబ్బారావు భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రూరల్ ఎస్సై జీ జ్యోతీబసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలి బుట్టాయగూడెం: ప్రత్యేక డీఎస్సీ ప్రకటించి ఆదివాసీ ప్రాంతంలో నూరుశాతం ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష మంగళవారంతో 14వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఏటీఏ రాష్ట్ర అధ్యక్షుడు జలగం రాంబాబు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో డీఎస్సీలో ఉపాధ్యాయుల పోస్టులను మినహాయించి ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఆదివాసీ అభ్యర్థులతో ఆ పోస్టులను భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో తెల్లం లక్ష్మి, కలుం వెంకటేశ్వరి, ఎం శాంతికుమారి, పి.భవాని, పి.నాగరత్నం, జి. కృష్ణారెడ్డి, సీహెచ్ మల్లీశ్వరి, కె.మల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
నిర్వాసితులను తరలించేందుకు ప్రత్యేక చర్యలు
పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అభిషేక్ బుట్టాయగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న ఫేజ్ బి పరిధిలో ఉన్న నిర్వాసితులకు పునరావాస కాలనీలు ఏర్పాటు చేసి వారిని తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ బి.అభిషేక్ తెలిపారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాటాడారు. రెండో దశలో సుమారు 32 గ్రామాల్లో 13,700 మంది నిర్వాసితులు ఉన్నారన్నారు. వీరందరికీ వీఆర్పురం, కూనవరం పరిధితోపాటు కేఆర్పురం ఐటీడీఏ పరిధిలో నిర్వాసితులకు అనుకూలమైన భూములను సేకరించేలా కృషి చేస్తున్నామని చెప్పారు. వీరికి నిర్వాసిత గ్రామాలు నిర్మించడంతోపాటు భూమికి భూమిగా కూడా భూసేకరణ చేయడం జరుగుతుందని చెప్పారు. నిర్వాసితులు కోరుకున్న ప్రదేశంలో ఇళ్లు నిర్మించడంతోపాటు వ్యవసాయ భూములను కూడా సేకరించేలా కృషి చేస్తామని చెప్పారు. గిరిజనులకు నివాసాలు కల్పించడంతోపాటు భూములను కూడా సేకరించి ఇచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. వారు కోరుకున్న ప్రదేశాల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో భూములను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ ప్రక్రియ నెలరోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణ, తహసీల్దార్ పీవీ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
మద్ది అంజన్నకు పూజలు
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో మంగళవారం సందర్భంగా ఆంజనేయస్వామిని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకున్నారు. అంజన్నకు ప్రభాతసేవ, నిత్యార్చనలు అర్చకులు నిర్వహించారు. మధ్యాహ్నం వరకు ఆలయానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,82,553 ఆదాయం వచ్చిందని ఈఓ ఆర్వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో 1500 మంది అన్నప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు. ఏర్పాట్లను కురగంటి రంగారావు పర్యవేక్షించారు. దళితులపై దాడులు దారుణంతాడేపల్లిగూడెం (టీఓసీ): గుంటూరు జిల్లా తెనాలిలో పట్ట పగలు, ప్రజలు చూస్తుండగా ఎస్సీ, మైనారిటీ యువకుల కాళ్లపై సీఐలు రాములు నాయక్, రమేష్ బాబు లాఠీలతో కొట్టడాన్ని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు తీవ్రంగా ఖండించారు. సీఐలను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టణంలో మంగళవారం మంగరాజు విలేకర్లతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో దళిత, ప్రజా సంఘాల తరుఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట విజయ్, ప్రియబాబు, నాగేశ్వరరావు ఉన్నారు. -
ఉపాధి హామీ పనులను తనిఖీ చేయాలి
నూజివీడు: ఉపాధి హామీ పనుల్లో తప్పుడు మస్తర్ నమోదు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మండలాల్లో ప్రోగ్రాం ఆఫీసర్లు ఉపాధి హామీ పనుల నిర్వహణలో చురుగ్గా వ్యవహరించాలని కలెక్టర్ కే వెట్రిసెల్వి ఆదేశాలు జారీ చేసినట్లు డ్వామా పీడీ వెంకట సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘మస్తర్లలో మాయాజాలం’ పేరుతో ఉపాధిహామీ పనుల్లో జరుగుతున్న అవకతవకలను ‘సాక్షి’ మంగళవారం ప్రచురించడం జరిగింది. దీనిపై కలెక్టర్ స్పందించి ప్రోగ్రాం ఆఫీసర్లు తప్పనిసరిగా మస్తర్లు తనిఖీ చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. నూజివీడు మండలంలో జిల్లా విజిలెన్స్ అధికారి, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సంయుక్తంగా విచారణ నిర్వహించారని, వారి నుంచి నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత పారదర్శకంగా నిర్వహించి ఎక్కువమంది శ్రామికులకు పని కల్పించి వారు ఆశించిన వేతనలు అందేలా కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో ఉపాధిహామీ పథకం విజయవంతంగా నిర్వహించబడుతుందని, గతేడాది కోటి 20 లక్షల పని దినాల లక్ష్యానికి కోటి 23 లక్షల 65 వేల పనిదినాలు కల్పించి 103 శాతం పైగా వృద్ధిని సాధించామన్నారు. గతంలో ఉపాధి హామీ వేతనం సరాసరి రూ.300 కాగా దానిని ప్రభుత్వం రూ.307కు పెంచిందన్నారు. ఈ మేరకు గత ఏడాది రూ.300 వేతన సరాసరికి జిల్లాలో రూ.253 సాధించామన్నారు. ఈ ఏడాది పెరిగిన సరాసరి వేతనానికి అనుగుణంగా కనీసం రూ.290 తగ్గకుండా వేతనం కల్పించి ఉపాధి హామీపై మరింత నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టామన్నారు. ఉపాధిహామీ పనులకు సంబంధించి ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన పనులకు రూ.280 సరాసరి వేతనం చెల్లించడం జరిగిందన్నారు. కలెక్టర్ ఉత్తర్వులు జారీ -
కై కలూరు టౌన్ పోలీసు స్టేషన్లో అగ్నిప్రమాదం
కై కలూరు: స్థానిక టౌన్ పోలీసు స్టేషన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆరుబయట విద్యుత్ మీటరు నుంచి ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలీయక అందరూ ఆయోమయంలో పడ్డారు. మంటలు వ్యాపించిన మీటరు సమీపంలో పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. మరో వైపున పోలీసుశాఖ నిర్వహిస్తున్న పెట్రోల్ బంకు ఉంది. తేరుకున్న పోలీసులు వెంటనే మంటలను ఆదుపు చేశారు. ప్రమాదం విషయమై విద్యుత్శాఖ లైన్మెన్ ఆనందరావును వివరణ కోరగా పోల్ నుంచి వచ్చిన మెయిన్ సర్వీసు వైరులో ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ఏసీలు వంటివి అధిక లోడ్ తీసుకుంటే ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. విద్యుత్ మీటరు కాలిపోవడంతో స్టేషన్ అంధకారమైంది. సమీప మీటరు నుంచి తాత్కలికంగా విద్యుత్ను పునరుద్ధరించారు. -
జీలుగ సాగుతో పంటలు బాగు
ముసునూరు: నేల స్వభావానికి అనుగుణంగా పచ్చిరొట్ట ఎరువుల సాయంతో భూమిని సారవంతంగా మార్చుకోవచ్చు. పచ్చిరొట్ట ఎరువు పంటల్లో జీలుగ సాగు చక్కటి ఫలితాలనిస్తుండడంతో చాలా ప్రాంతాల్లో రైతులు జీలుగ సాగుకే మొగ్గు చూపుతున్నారు. నత్రజని, భాస్వరం, పొటాష్, మాంగనీస్ వంటి పోషకాలను పంటలకు విరివిగా అందించే జీలుగను సాగు చేసి లాభాలు పొందాలని ముసునూరు మండల వ్యవసాయాధికారి.కె.చిన సూరిబాబు సూచిస్తున్నారు. మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో జీలుగ విత్తనాల పంపిణీ చేస్తున్నామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రయోజనాలు ● పొలంలో జీలుగను కలియ దున్నితే నేలకు సారం, తదుపరి వేసే పంటలకు లాభాలనిస్తుంది. ● నేలలో ఉండే చౌడును నివారిస్తుంది. ● మొక్కలకు రెండు శాతం నత్రజని, సూపర్ ఫాస్ఫేట్ అదనంగా అందుతుంది. ● జింక్, మాంగనీస్, ఇనుము, కాల్షియం వంటి సూక్ష్మ ధాతువులను పంటకు అందిస్తుంది. ● నేలలో కరగని మూలకాలను పంటకు అనుకూలంగా మారుస్తుంది. ● నేలలో భౌతిక స్థితి మెరుగుపడి, భూమి గుల్లగా మారి, నేలలోకి నీరు ఇంకే గుణాన్ని పెంచుతుంది. ● పంట పొలంలో నీటి నిల్వ సామర్థ్యం పెంచుతుంది. ● పంట పొలంలో వానపాముల అధిక ఉత్పత్తికి తోడ్పడుతుంది. ● లెగ్యూం జాతికి చెందిన మొక్క కావడంతో వేర్లలో నత్రజని స్థిరంగా ఉంటుంది. ● పొలంలో తుంగ, గరిక వంటి కలుపు మొక్కల పెరుగుదలను అడ్డుకుంటుంది. ● నేలలో ఉండే ప్రయోజనకర సూక్ష్మజీవుల సంఖ్యను మెరుగుపరుస్తుంది. ● వేసవిలో సంభవించే భారీ గాలులు, వర్షాల వల్ల జరిగే నేల కోతను నివారిస్తుంది. ● రసాయనిక ఎరువుల వాడకాన్ని 15 నుంచి 25 శాతం వరకు తగ్గిస్తుంది. ● పంటలపై ఖర్చు ఆదా అవుతుంది. జీలుగ సాగుకు అనువైన సమయాలు ● ప్రధాన పంట కోయగానే నేలలో మిగిలిన తేమను సద్వినియోగపర్చుకునే విధంగా జీలుగ విత్తనాలు చల్లుకోవాలి. ● తేమ చాలని ప్రాంతాల్లో వేసవిలోనే దుక్కి దున్ని, తొలకరి వర్షాలు పడగానే విత్తుకోవాలి. ● నీటి వసతులు గల ప్రాంతాల్లో వేసవిలోనే సాగు చేయడం లాభదాయకం. ● రెండు పంటల మధ్య కాల వ్యవధిలో కూడా విత్తుకొని కలియ దున్నవచ్చు. ● ఏప్రిల్, మే నెలల్లో ఖరీఫ్ పంటలు వేసే ముందు, తొలకరి వర్షాలు కురవగానే జీలుగ విత్తనాలు విత్తుకోవాలి. ● విత్తిన తర్వాత ఏపుగా పెంచి, పంట జీవ పదార్థాన్ని కలపడానికి, కుళ్లిపోవడానికి నేలలో కలియ దున్నాలి. చినబాబు, మండల వ్యవసాయాధికారి (ఫైల్) -
మున్సిపల్ టీచర్లపై సవతి తల్లి ప్రేమ
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల త్వరలో జరిగే బదిలీల్లో అర్హతలుండీ తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఒకే చోట పని చేస్తూ తమ సొంత ప్రాంతాలకు బదిలీ చేయించకునే అవకాశాలు లేక అల్లాడుతున్నారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ను విస్మరించిన పాఠశాల విద్యాశాఖ విధానాలపై నిరసన గళం వినిపిస్తున్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులను జిల్లా పరిషత్ ఉపాధ్యాయులతో సమానంగా పరిగణించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ పాఠశాల విద్యాశాఖ చేస్తున్న చర్యలు, ప్రకటనలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 2022లో మున్సిపల్ పాఠశాలల పరిపాలన, ఉపాధ్యాయుల సేవలను పాఠశాల విద్యాశాఖకు బదలాయిస్తూ జీఓ 84 విడుదల చేశారు. పాఠశాల విద్యా శాఖ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ముసాయిదా తయారుచేసి, ఉపాధ్యాయ సంఘాల సూచనలు, న్యాయశాఖ, జీఏడీ అభిప్రాయాల ఆధారంగా చివరి రూపకల్పన చేయాల్సిఉండగా దానిని ఆమోదించకుండా పాత నియమావళిని కొనసాగిస్తోంది. ఎన్నో సంవత్సరాల నుంచి బదిలీలు లేక వేచి చూస్తున్న సీనియర్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆశనిపాతంగా మారింది. మున్సిపల్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక ఉమ్మడి సర్వీస్ రూల్స్ వెంటనే ఆమోదించాలని, పదోన్నతులు, బదిలీలల్లో జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా వ్యవహరించాలని, అన్ని నియామకాల్లో పారదర్శకత, న్యాయం పాటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు కార్పొరేషన్ను కూడా ఇతర మున్సిపాలిటీలో సమానంగా పరిగణించి, అర్హులైన వారికి ఏలూరు కార్పొరేషన్కు, ఏలూరు కార్పొరేషన్ నుంచి ఇతర మున్సిపాలిటీలకు బదిలీ చేయడానికి వీలుగా నిబంధనలు సడలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమలో 763 మంది మున్సిపల్ ఉపాధ్యాయులు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మున్సిపల్ పాఠశాలల్లో ప్రస్తుతం 763 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని అన్ని నగరపాలక సంస్థ పాఠశాలల్లో అన్ని కేటగిరీల్లో కలిపి 417 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. జిల్లా యూనిట్గా ప్రమోషన్లు ఇవ్వాలి మున్సిపల్ ఉపాధ్యాయుల ఎంపిక జిల్లా యూనిట్గా జరుగుతుంది. జిల్లా యూనిట్గా పదోన్నతులు, బదిలీలు జరగాలి. పదోన్నతుల అవకాశాల కోసం మున్సిపల్ ఎడ్యుకేషనల్ యూనిఫైడ్ సర్వీసు రూల్సు విడుదల చేయాలి. మున్సిపల్ ఏరియాలలోని ఇతర యాజమాన్యంలోని పాఠశాలలను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో విలీనం చేయాలి. – సోమరౌతు శ్రీనివాసరావు, ప్రోగ్రెసివ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పదోన్నతులు కల్పించాలి మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో ప్లస్ –2 ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలి. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులకు పదోన్నతులు ఇవ్వాలి. 1965 మున్సిపల్ చట్టం ప్రకారం మున్సిపల్ పాఠశాలల పర్యవేక్షణ కోసం మున్సిపల్ స్కూళ్ల సూపర్వైజర్ పోస్టులను గ్రేడు 2 హెచ్ఎం స్థాయిలో మంజూరు చేసి పదోన్నతులు ఇవ్వాలి. – పోలిమెట్ల సుమంత్, ప్రోగ్రెసివ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలుకాక నష్టపోతున్న టీచర్లు -
జగనన్న కాలనీకి నీటి సరఫరా
ఆకివీడు: మండలంలోని కుప్పనపూడి శివారు తాళ్లకోడులోని జగనన్న కాలనీలో గత మూడు రోజులుగా ఆగిన కుళాయి నీటిని ఎట్టకేలకు సోమవారం వదిలారు. మూడు రోజులుగా కుళాయిల ద్వారా నీరు రాకపోవడంతో కాలనీలోని సుమారు 1000 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాలనీవాసుల నీటి ఇబ్బందులపై ‘సాక్షి’లో కథనానికి జిల్లా, మండల రెవెన్యూ అఽఽధికారులు స్పందించారు. నీటి ఇబ్బందిని కలెక్టర్కు తెలియజేయడంతో తక్షణం నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో ఉదయం 10 గంటల ప్రాంతంలో కుళాయిలకు నీరు వదిలారు. స్పందన -
అర్జీల పరిష్కారంలో శ్రద్ధ చూపాలి
భీమవరం (ప్రకాశంచౌక్): అర్జీలకు నిర్ణీత సమయంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేటు పీజీఆర్ఎస్ సమావేశం మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీలను జేసీ స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారుడి ఇంటికి వెళ్ళి స్వయంగా పరిశీలించి పరిష్కారం చూపిస్తే ప్రజలకు నమ్మకం, అధికారులపై గౌరవం కలుగుతుందని అన్నారు. సోమవారం 192 అర్జీలు అందాయి. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కెసీహెచ్ అప్పారావు, వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్లపై ‘రెడ్బుక్’ వేధింపులు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో కూటమి నేతల రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని.. తప్పుడు ఫిర్యాదులతో వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన సర్పంచ్లపై వేధింపులకు పాల్పడుతున్నారని శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నాని ఆవేదన వ్యక్తం చేశారు. తన చెక్పవర్ రద్దు చేస్తూ నోటీసులు జారీ చేశారని, దీనిపై వారం రోజుల్లో కలెక్టర్కు అప్పీలు చేసుకోవాలని పంచాయతీ అధికారి చెప్పడం కూటమి నాయకులు రాజకీయ కుట్రలో భాగం అన్నారు. ఏలూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం వైఎస్సార్సీపీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తప్పుడు ఫిర్యాదులు చేయించి.. సమావేశంలో శ్రీరామవరం కామిరెడ్డి నాని మాట్లాడుతూ... పంచాయతీలో టీడీపీ మెంబర్లు వీఎన్వీ త్రినాథ్, ఆళ్ళ విజయలక్ష్మితో పాటు కొందరితో తప్పుడు ఫిర్యాదు చేయించారని, వాటిపై డీపీవో ఆధ్వర్యంలో 8 నెలల పాటు విచారణ చేయించారని తెలిపారు. విచారణలో ఒక్కరూపాయి దుర్వినియోగం కాలేదని, బిల్లులు ఉన్నాయని చెబుతూనే.. మరోవైపు వేధింపులకు పాల్పడడం దారుణం అన్నారు. 2021 డిసెంబర్లో రూ.20,875 నిధులు దుర్వినియోగం అయ్యాయని చూపిస్తున్నారని, కానీ ఈ నిధులకు సంబంధించి అధికారుల విచారణలో ఓచర్లు, ఎన్ఎంఆర్ ఉన్నాయని తెలిసినా.. రూ.17 వేలకు తీర్మానం లేదని, బిల్లులను ఏఈ సర్టిఫై చేయలేదని, మిగిలిన రూ.4875కు బిల్లులు ఉన్పప్పటికీ స్టాక్ రిజిస్టర్లో నమోదు కాలేదని చెబుతున్నారని తెలిపారు. ఎల్ఈడీ లైట్ల కొనుగోలుకు రూ.1.31 లక్షల నిధులకు సైతం బిల్లులు, తీర్మానం ఉండగా స్టాక్ రిజిస్టర్లో లేవంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కామిరెడ్డి నాని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం సర్పంచ్ విధులకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తీసుకోకుండా, సర్పంచ్లను ఇబ్బందులకు గురిచేయటం దారుణమని ఎస్సీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మెండెం సంతోష్కుమార్ అన్నారు. కామిరెడ్డి నానిపై వేధింపులు ఆపకపోతే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మేక లక్ష్మణరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్ మాట్లాడుతూ.. దెందులూరు నియోజకవర్గంలో అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై చట్టపరంగా పోరాటం చేస్తామని తెలిపారు. బిల్లులున్నా.. నిధుల దుర్వినియోగమంటూ చెక్ పవర్ రద్దు న్యాయపోరాటం చేస్తానంటున్న కామిరెడ్డి నాని ఇవి రాజకీయ వేధింపులు కావా? : నాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీలో సాధారణ సమావేశం నిర్వహించలేదని, దీని ఆధారంగా ఎందుకు డిస్ క్వాలిఫై చేయకూడదంటూ డీపీవో నోటీస్ జారీ చేయటం రాజకీయ వేధింపులు కాదా? అని నిలదీశారు. సమావేశం పెడితే అధికారపార్టీ నేతల కనుసన్నల్లో ఇతర ప్రాంతాలకు చెందిన రౌడీలు, అసాంఘిక శక్తులను సమావేశాలకు తీసుకువచ్చి గొడవలు సృష్టించేందుకు ప్రయత్నించటం నిజం కాదా అన్నారు. పోలీస్ రక్షణ కావాలని అడిగితే మీ భద్రత బాధ్యత నాది కాదని డీపీవో చెప్పడం నిజం కాదా అన్నారు. దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన 7 మందికి పైగా సర్పంచ్ల చెక్ పవర్ రద్దు చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. -
ఏడాదైనా రోడ్డెక్కని ప్రగతి
పొలమూరు– నవుడూరు జంక్షన్ మధ్య 60 మీటర్ల మేర భారీ గోతులతో ప్రయాణికులు ప్రమాదాలు పాలవుతున్నారు. గత ప్రభుత్వంలో 500 మీటర్ల మేర సీసీ రోడ్డు, 500 మీటర్ల బీటీ రోడ్డు నిర్మించారు. 60 మీటర్లు మేర సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్టు అధికారులు చెబుతున్నారు. సాక్షి, భీమవరం: అధికారంలోకి రావడమే ఆలస్యం.. రోడ్లను అద్దంలా మారుస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన కూటమి నేతలు తర్వాత ఆ ఊసే మరిచారు. ప్యాచ్ వర్కులు, అత్యవసర పనుల పేరిట జిల్లాలోని స్టేట్ హైవే, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లలో తూతూమంత్రంగా మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారు. రూ.42.57 కోట్ల విలువైన 181 పనులకు బిల్లులు రాక 70 శాతం పనులు పూర్తికాలేదని అంచనా. నిర్ణీత ప్రమాణాలు పాటించకుండా చాలాచోట్ల నాసిరకంగా పనులు చేయడంతో గోతులు యథాస్థితికి చేరుతున్నాయి. కొన్ని చోట్ల గుంతల్లో కంకర, చిప్స్ వేసి తారు వేయకుండా వదిలేశారు. వాహనాల తాకిడికి రాళ్లు పైకిలేచి రోడ్డంతా చెల్లాచెదురై ప్రమాదభరితంగా తయారయ్యాయి. దీంతో ఈ రోడ్లు మీదుగా రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గతంలోనే రోడ్ల అభివృద్ధి గత ప్రభుత్వం రోడ్లను అభివృద్ధి చేయకపోవడంతో గుంతలమయంగా మారాయంటూ అప్పట్లో కూటమి నేతలు విషం చిమ్మారు. ప్రాధాన్య క్రమంలో రోడ్లను అభివృద్ధి చేస్తూ వచ్చిన విషయాన్ని కప్పిపుచ్చారు. చివరి ఏడాదిలోనూ గత ప్రభుత్వం సుమారు రూ.131.2 కోట్లతో 16 రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. వీటిలో అల్లంవారిలంక, కేపీపాలెం బీచ్ రోడ్డు, బియ్యపుతిప్ప– కేపీ పాలెం నార్త్, ఏలేటిపాడు బ్రిడ్జి అప్రోచ్, మార్టేరు– ప్రక్కిలంక రోడ్డు పనులు అప్పట్లోనే దాదాపు పూర్తయ్యాయి. మిగిలినవాటిలో కొత్తోట–దెయ్యాలతిప్ప, వెంప–కాళీపట్నం, కాళీపట్నం–జగన్నాథపురం, లక్ష్మణేశ్వరం–పెదమైనవానిలంక, తణుకు– వేల్పూరు, దువ్వ–ఆరుళ్ల, ఐతంపూడి–కొత్తపాడు, ఉరదాళ్లపాలెం–దువ్వ, కొమరవరం– ఈస్ట్ విప్పర్రు, సీతారాంపురం– పేరుపాలెం, నర్సాపురం– అశ్వారావుపేట రోడ్లు ఉన్నాయి. గత ప్రభుత్వం మంజూరుచేసి దాదాపు పూర్తిచేసిన రోడ్లను తామే చేసినట్టుగా చెప్పుకునే పనిలో కూటమి నేతలు ఉన్నారు. రోడ్ల అభివృద్ధికి చొరవ చూపని ప్రభుత్వం అరకొర మరమ్మతులతో సరి అధ్వానంగా తయారైన రోడ్లతో ప్రజలు అవస్థలు కాళ్ల మండలంలో కోలనపల్లి నుంచి కుప్పనపుడి వరకు కొంతమేర మరమ్మతులు చేయక 2 కిలోమీటర్ల మేర రోడ్డు అధ్వానంగా ఉంది. గోతులు పడి వర్షపు నీటితో చెరువును తలపిస్తుంది. ఈ రోడ్డుపై రాకపోకలకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకివీడు మండలం చెరుకుమిల్లి నుంచి ఏలూరుపాడు వరకు రోడ్డు ప్రమాదభరితంగా ఉంది. భీమవరం–శృంగవృక్షం నుంచి వేండ్ర మీదుగా అటు కొండేపూడి ఇటు పాలకోడేరు వెళ్లే పైపుల చెరువు రోడ్డు అధ్వానంగా తయారైంది. విస్సాకోడేరు లాకుల నుంచి భీమవరం వరకు కిలోమీటరు మేర ఇటీవల నల్ల చిప్స్ వేసి వదిలేశారు. భీమవరం నుంచి వేండ్ర రైల్వే గేటు వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఈ రోడ్డు మీదుగా జిల్లా కేంద్రానికి రోజు వందలాది మంది ప్రయాణిస్తుంటారు. -
ప్రశాంతంగా ఈఏపీ సెట్
భీమవరం: ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష భీమవరం పట్టణంలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో సోమవారం ప్రశాంతంగా నిర్వహించారు. ఎస్ఆర్కేఆర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఉదయం 179 మందికి 163 మంది హాజరుకాగా మధ్యాహ్నం 170 మందికి 165 మంది హాజరయ్యారు. విష్ణు ఉమెన్ కళాశాల కేంద్రంలో ఉదయం 87 మందికి ముగ్గురు, మధ్యాహ్నం 87 మందికి ఆరుగురు, విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 110 మందికి 3, మధ్యాహ్నం 110 మందికి 3 విద్యార్థులు గైర్హాజరయ్యారు. డీఎన్నార్ అటానమస్ కళాశాలలో ఉదయం 100 మందికి 95 మంది, మధ్యాహ్నం 100 మందికి 100 మంది హాజరయ్యారు. డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాల పరీక్షాకేంద్రంలో ఉదయం102 మంది ఏడుగురు, మధ్యాహ్నం 101 మందికి ఏడుగురు గైర్హాజరయ్యారు. తాడేపల్లిగూడెంలో.. తాడేపల్లిగూడెం: పట్టణంలోని వాసవీ ఇంజినీరింగ్ కాలేజీలో రెండు పూటలా పరీక్ష నిర్వహించగా 450 మందికి 438 మంది హాజరయ్యారు. శశి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన పరీక్షకు 442 మందికి 430 మంది హాజరయ్యారు. అమెరికాలో మెరిసిన గోదావరి అమ్మాయి వీరవాసరం: గోదావరి అమ్మాయి చూర్నిక ప్రియ కొత్తపల్లి, మిస్ తెలుగు యూఎస్ఏ 2025 పోటీలో రన్నరప్గా నిలిచింది. దీంతో ఆమె స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు శివారు నడపనవారి పాలెంలో ఆనందోత్సాహం నెలకొంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె పీపుల్స్ చాయిస్ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ విజయానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కొత్తపల్లి భాస్కర్రావు సేవా ట్రస్ట్ అధినేత కొత్తపల్లి రాంబాబు తెలిపారు. ‘పది’ సప్లిమెంటరీ పరీక్షకు 71 శాతం హాజరు భీమవరం: జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షకు 71 శాతం విద్యార్ధులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ చెప్పారు. సోషల్ పరీక్షకు 2,329 మంది హాజరుకావాల్సివుండగా 666 మంది గైరహాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని నారాయణ తెలిపారు. -
మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ
భీమవరం: యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయడంలో మాస్టర్ ట్రైనర్ల పాత్ర కీలకమని జేసీ టి.రాహుల్ కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం జాయింట్ కలెక్టరు ఎస్ఆర్కెఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండో రోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఢిల్లీ ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కొనసాగింది. విద్యా, ఆయుష్ శాఖలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణా కార్యక్రమంలో మొదటి రోజు సుమారు 100 మంది మాస్టర్ ట్రైనర్లకు యోగాసనాలపై శిక్షణ ఇచ్చారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సుమారు 200 మంది యోగా ట్రైనర్లకు మెరుగైన శిక్షణ ఇచ్చి నెలరోజులపాటు గ్రామ, వార్డు స్థాయిలోని ప్రజలకు యోగా ప్రాధాన్యత తెలియజేసేలా కార్యక్రమాలు రూపొందించారు. యోగా గురువులు ఉప్పలపాటి వెంకటేశ్వరరాజు, బీహెచ్ఇ సత్యనారాయణ రాజు, పీఎస్డీ భవాని శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, టూరిజం శాఖ అధికారి ఎ.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
ఖరీఫ్కు ఆదిలోనే ఆటంకం
గత 10 నుంచి 15 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు ఖరీఫ్ నారుమడి పనులకు ఆటంకంగా మారాయి. విత్తనాలు కొట్టుకుపో తున్నాయని రైతులు వాపోతున్నారు. 8లో uపారిజాతగిరిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు జంగారెడ్డిగూడెం: గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరిరోజు ఆదివారం స్వామికి జరిగిన ధ్రువమూర్తి విశేషాభిషేకం, సాయంత్రం ద్వాదశ ఆరాధన, ద్వాదశ ప్రదక్షిణలు శ్రీ పుష్పయాగ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం నిత్య ఆరాధన అనంతరం స్వామివారి ధ్రువమూర్తికి పంచామృతాలతో, విశేష అభిషేక ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం కల్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడిని ప్రత్యేక వేదికపై అలంకరించి ద్వాదశరాధన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడిని తొళక్కం వాహనంపై తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఉత్సవ కార్యక్రమం నిర్వహించిన రిత్విక్కులను సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరిచర్ల జగపతిరాజు, సభ్యులు రెడ్డి రంగప్రసాద్, దండు ధనరాజు, కంది బాలకృష్ణారెడ్డి, వాసవి సాయి నగేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
ఆక్వాకు వాతావరణ ముప్పు
గణపవరం: ఆక్వా రైతులు వేసవి పంటపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో చెరువులలో రొయ్య సీడ్ వేస్తే జూన్లో పట్టుబడికి సిద్ధమవుతుంది. ఏప్రిల్, మే నెలల్లో సాగుకు అనుకూలంగా ఉండటంతో రైతులు ఎక్కువగా వేసవి సాగుపై గంపెడాశలు పెట్టుకుంటారు. ఈ వేసవి ఆక్వా రైతులకు చుక్కలు చూపిస్తుంది. వేసవి ఆరంభం నుంచి ఎండా, వానల సయ్యాటలతో ఆక్వా సాగు దినదినగండంగా సాగుతుంది. ఏప్రిల్ నెలలో సాగు సవ్యంగానే సాగినా మే నెలలో మాత్రం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. వాతావరణంలో విపరీతమైన మార్పులతో వందల ఎకరాలలో సాగు అర్ధాంతరంగా ముగిసిపోయింది. కౌంట్కు రాకుండానే మృత్యువాత పూటకో రకంగా మారుతున్న వాతావరణం ఆక్వా సాగుకు గండంగా మారింది. ఇరవై రోజులుగా వాతావరణంలో తీవ్ర మార్పులు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఒకే రోజులో విపరీతమైన ఎండలు ఒకపక్క, మరోపక్క ఉన్నట్టుండి ఆకాశం మేఘావృత్తమై వర్షాలు కురుస్తూ ఆక్వా సాగును కుదేలు చేస్తున్నాయి. గతంలో లేని విధంగా ఈ వేసవిలో సగం రోజులు వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఎండకాస్తే విపరీతమైన వేడి, ఉక్కబోతతో ఆక్వా సాగు తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. పిల్ల వేసిన 30 రోజులలోపుగానే వాతావరణ మార్పులకు వైట్స్పాట్, విబ్రియో వంటి పలు వ్యాధులు వ్యాపించడంతో కౌంట్కు రాకుండానే రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. రాత్రి వర్షం కురుస్తూ, పగలు ఎండలు కాయడంతో పీహెచ్లో హెచ్చుతగ్గుల కారణంగా రొయ్యలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా మందులు చల్లడానికి చెరువుల వద్ద రేయింబవళ్లు కాపలా కాస్తున్నారు. విద్యుత్ కోతలు ఆక్వా రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. విద్యుత్ కోతల కారణంగా ఏరియేటర్లు తిరగడానికి ఆయిల్ ఇంజిన్ల వినియోగానికి రోజూ వేలల్లో ఖర్చుపెడుతున్నారు. ఆక్సిజన్ కోసం అవస్థలు అప్పటికప్పుడు ఎండ మాయమై, మబ్బులు కమ్మి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి పోవడంతో ఆక్సిజన్ సమస్య తలెత్తి చేపలు, రొయ్యలు నీటి ఉపరితలంపై తిరుగాడుతున్నాయి. కొన్ని చోట్ల చనిపోయి నీటిపై తేలుతున్నాయి. ఆక్సిజన్ లోటు పూడ్చడానికి రసాయనాలు చల్లుతున్నారు. ఆక్సిజన్ అందక చేపలు, రొయ్యలు మేతలు సరిగా తినలేక నీరసించి పోతుండటంతో రైతులు యుద్ధ ప్రాతిపదికన పట్టేసి అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 1.25 లక్షల ఎకరాలలో రొయ్య, మరో 1.50లక్షల ఎకరాలలో చేపల సాగు జరుగుతుంది. వాతావరణం ప్రతికూలంగా మారడంతో ఉంగుటూరు నియోజకవర్గంలోనే వారం రోజుల వ్యవధిలో దాదాపు 4 వేల ఎకరాల్లో కౌంట్కు రాకుండానే రొయ్యలు పట్టివేసినట్లు అంచనా. దీనికి తోడు రొయ్య ధర కూడా పదిరోజులలో కేజికి రూ.10 నుంచి రూ.15 మేర పడిపోవడంతో రైతులకు నష్టాలు తప్పడంలేదు. మత్స్యశాఖ అధికారుల సూచనలు ఉష్ణోగ్రతలు తగ్గకుండా నిరంతరం ఏరియేటర్లు తిప్పుతూ నీటిని రీసైక్లింగ్ చేయాలి. ఆక్సిజన్ నివారణకు పొటాషియం పర్మాంగనేటు సిద్ధంగా ఉంచుకుని, పీహెచ్ స్థాయిని బట్టి అవసరం మేరకు చెరువులో చల్లుతుండాలి. ఆక్సిజన్ సరిపడా అందకపోవడంతో చేపలు, రొయ్యలు మేతలు సరిగా తినకపోతే పరిమితంగా మేతలు వేస్తుండాలి. ఆక్సిజన్ సమస్య ఉన్న సమయంలో మేత, సేంద్రీయ ఎరువులు వేయడం పూర్తిగా మానేయాలి. ఎండలు, అకాల వర్షాలతో నష్టాలు -
ప్రభుత్వ ఉద్యోగుల సంఘ కార్యవర్గం ఎన్నిక
భీమవరం (ప్రకాశంచౌక్): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా యూనిట్ సమావేశం ఆదివారం నిర్వహించారు. జిల్లా యూనిట్ కార్యవర్గ కమిటీకి ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా వై.మోహనరావు, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎస్కె ఉమర్ ఆలీ షా, ఉపాధ్యక్షులుగా జీవీ రామనాగు, ఎస్.మానస, ఎంవీ లక్ష్మీనారాయణ, ఎం.సదాశివ ప్రసాద్, కే.కనకరాజు, ఎం.వెంకటేష్, ఎం.సాయిబాబా, వి.రాజేష్ కుమార్ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా జి.జక్కరయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్వీఎస్ వాసు పులగండం, సహాయ కార్యదర్శులుగా ఎండీ అస్గర్ అలీ, కే మాణిక్యాలరావు, సీహెచ్ రాజేష్, జి.నారాయణ, జి.ప్రసాద్, ఎం.పద్మిని, కోశాధికారిగా పి.నాగభూషణం ఎన్నికయ్యారు. మహిళల క్రికెట్ జట్ల ఎంపికకు సన్నాహాలు ఏలూరు రూరల్: మే 31, జూన్ 1న భీమవరం డీఎన్నార్ కళాశాల గ్రౌండ్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాలికల క్రికెట్ జట్ల ఎంపిక చేపట్టనున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అడహక్ కమిటీ సభ్యులు ఆర్ఎస్ఆర్ మూర్తి, ఈ.అశోక్కుమార్, ఎస్కె సాఖీర్ హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–15 విభాగంలో బాలికలు సెప్టెంబర్ 1, 2010 తర్వాత పుట్టి ఉండాలన్నారు. అండర్–19 విభాగంలో మహిళలు సెప్టెంబర్ 1, 2006 తర్వాత, అండర్–23 విభాగంలో సెప్టెంబర్ 1 2002 తర్వాత పుట్టిన వారై ఉండాలన్నారు. ఆసక్తి గల క్రీడాకారిణులు తమ వయసు ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్, ఆధార్తో పాటు సొంత క్రికెట్ కిట్తో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. జట్లకు ఎంపికై న వారు ఏసీఓ పర్యవేక్షణ జరిగే అంతర జిల్లా క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని వివరించారు. మరింత సమాచారం కోసం 70136–33143 నెంబర్కు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు. కిటకిటలాడిన రాట్నాలమ్మ దేవస్థానం పెదవేగి: రాట్నాలమ్మ అమ్మవారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి, విశేష రీతిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కుబడులు తీర్చుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ వారం అమ్మవారికి మొత్తం రూ.1,01,960 ఆదాయం లభించిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్.సతీష్కుమార్ తెలిపారు. -
నత్తనడకన రీ సర్వే
ఇండోర్ స్టేడియం.. నిండా నిర్లక్ష్యం ఏలూరు ఇండోర్ స్టేడియం గత వైభవాన్ని కోల్పోతోంది. ప్రభుత్వ ఉదాసీనత, నిధుల కొరతతో పాటు అధికారుల నిర్లక్ష్యానికి నిలువటద్దంగా మారుతోంది. 8లో uసోమవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2025భీమవరం(ప్రకాశం చౌక్): భూ వివాదాల పరిష్కారంతో పాటు.. ప్రభుత్వ భూముల్ని అక్రమణల నుంచి రక్షించడానికి గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూముల రీ సర్వే చేపట్టారు. నూరేళ్ల తర్వాత భూముల రీసర్వే చేసే మహన్నోత కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చారు. రాష్ట్రంలోనే జిల్లా రీ సర్వేలో ప్రథమ స్థానంలో నిలిచింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో రీ సర్వే మందకొడిగా సాగుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో రీ సర్వే కొనసాగిస్తున్నా.. వేగంగా జరిగేలా మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఈ 12 నెలల కాలంలో 20 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని కేవలం 35 వేల ఎకరాలల్లో భూ సర్వే పూర్తి చేశారు. ఇంతరకు ఒక రైతుకు కూడా భూ హక్కు పత్రాలు ఇవ్వలేదు. గతంలో 100 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తే.. ఈ ప్రభుత్వం కేవలం 60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. దాంతో రీసర్వే నాణ్యత లేకుండా తప్పుల తడకగా సాగే అవకాశం ఉంది. కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్కు జిల్లా నలుమూల నుంచి రైతులు, ఇతరులు భూ సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నారు. రీసర్వే జరగని గ్రామాల నుంచి ఎక్కువ సంఖ్యలో ఈ ఫిర్యాదులు వస్తున్నాయి. భూ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను అధికారులు పరిష్కరించ లేకపోతున్నారు. క్లస్టర్ విధానంతో కష్టాలు ప్రభుత్వం రెవెన్యూ గ్రామాల రేషలైజేషన్ పేరిట రెండు మూడు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్ చేయడానికి చర్యలు చేపట్టింది. దానికి తోడు క్లస్టర్కు ఒక సర్వేయర్, ఒక వీఆర్వో ఉండేలా ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో సిబ్బంది తక్కువగా ఉండడం గ్రామంలో భూ విస్తరణ ఎక్కువగా ఉండడంతో భూ రీ సర్వే వేగంగా జరగడం కష్టంగా మారింది. ఇదే విషయాన్ని రెవెన్యూ అధికారులు, ఆ సంఘం నాయకులు కూడా చెబుతున్నారు. ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేశారు. సర్వేయర్, వీఆర్వోపై పని ఒత్తిడి పెరిగిపోతోందని సర్వేకు తగిన సిబ్బంది ఉండాలని అసలు క్లస్టర్ విధానంలో అనేక లోపాలు ఉన్నాయని వాపోతున్నారు. న్యూస్రీల్ ఏడాదిలో 20 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తి ఒక్క రైతుకూ అందని భూ హక్కు పత్రాలు గత ప్రభుత్వంలో మూడేళ్లలో 2.2 లక్షల ఎకరాల్లో రీ సర్వే పూర్తి 70 వేల మంది రైతులకు పత్రాలు అందజేత ఆక్రమణలోని దేవదాయ భూమి గుర్తింపుజిల్లాలో భూ రీసర్వే ద్వారా దేవస్థానాలకు చెందిన 301 ఎకరాల భూమిని ఆక్రమణ చెర నుంచి రక్షించారు. జిల్లా వ్యాప్తంగా 8095.74 ఎకరాల దేవదాయ శాఖ భూములు ఉండగా నాడు అధికారుల లెక్కల ప్రకారం 301.81 ఎకరాల భూములు అక్రమణల్లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో 2.2 లక్షల ఎకరాల సర్వే గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో జిల్లాలో మూడేళ్లలో 2,22,934 ఎకరాల్లో భూ రీసర్వే పూర్తి చేశారు. 70 వేల మంది రైతులకు భూహక్కు పత్రాలు అందజేశారు. జిల్లా మొత్తం 5.15 లక్షల ఎకరాల సర్వే లక్ష్యం కాగా మూడు దశల్లో 2.2 లక్షల ఎకరాల్లో సర్వే పూర్తి చేశారు. 1,15,354 ఎకరాల్లో సరిహద్దు రాళ్లు పాతించారు. సర్వే చేసిన భూవిస్తరణ, హద్దులతో ఆన్లైన్ కూడా చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో కేవలం 35 వేల ఎకరాలు సర్వే చేసింది. సర్వే పూర్తిచేసిన భూమికి సంబంధించి ఒక రైతుకు కూడా భూహక్కు పత్రాలు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ఏడాది కాలంలో 64 వేల ఎకరాల్లో సర్వే పూర్తి చేసి 36,400 మంది రైతులకు భూహక్కు పత్రాలు అందించారు. -
మద్దిలో తెప్పోత్సవం
జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో నిర్వహిస్తున్న హనుమద్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో ఆఖరి రోజైన ఆదివారం అంజన్నకు ప్రభాత సేవ, నిత్య అర్చన, ప్రధాన హోమాలు, మహాపూర్ణాహుతి, దీక్షా విరమణ కార్యక్రమాలు అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం మద్ది ఆంజనేయస్వామికి పంచామృతాభిషేకం, ధ్వజావరోహణ, చక్రస్నానం నిర్వహించారు. పెద్దెత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామి వారికి ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించారు. కార్యక్రమాలను దేవస్థానం ఈవో ఆర్వీ చందన పర్యవేక్షించారు. వనదేవతకు జన హారతి బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఆదివారం రోహిణీ కార్తె ప్రారంభం కావడంతో ఉదయం తీవ్రమైన ఎండ ఉన్నా మధ్యాహ్న సమయానికి ఒక్కసారిగా మబ్బులు కమ్మి కొద్దిసేపు వర్షం కురిసింది. భక్తులు వర్షంలోనే అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద భక్తుల రద్దీ కై కలూరు: వేసవి సెలవుల నేపథ్యంలో ఆదివారం సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కొల్లేటికోట పెద్దింట్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలు అచరించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్క రోజు ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల విక్రయం ద్వారా రూ.63,261 ఆదాయం వచ్చిందని చెప్పారు. బెల్టు షాపు నిర్వాహకుడి అరెస్టు తాడేపల్లిగూడెం రూరల్: మాధవరంలో ఆదివారం ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బెల్టు షాపు నిర్వహిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి ఆరు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ ఇ.స్వరాజ్యలక్ష్మి వివరించారు. తనిఖీల్లో ఎకై ్సజ్ ఎస్సైలు మురళీమోహన్, దొరబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
అ‘పూర్వ’ ఆత్మీయ కలయిక
భీమవరం: ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాం .. చదువులమ్మ చెట్టు నీడలో .. అంటూ పూర్వ విద్యార్థులు ఒకే చోట కలిశారు. గడచిన ఆనాటి బాల్యాన్ని గుర్తు చేసుకుని సందడి చేశారు. లూథరన్ హైస్కూల్ 1975 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు 50 ఏళ్ల తరువాత ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సత్కరించుకున్నారు. ఒకరిని ఒకరు పలరించుకుంటూ చిన్ననాటి మన స్నేహబంధం.. చిరకాలపు మధుర స్మతులుగా పంచుకున్నారు. పూర్వ విద్యార్థులు తటవర్తి భాస్కరరావు, నంబూరి మాధవ, సుజ్ఞానరాజు, బెల్తాజర్, గోపా సత్యనారాయణ కొందరు మిత్రులు కలిసి గత కొన్ని నెలలుగా అందరినీ కలుపుకుని పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించామని తెలిపారు. 20 మంది ఉపాధ్యాయులను సత్కరించినట్లు చెప్పారు. -
శాశ్వత పనులకు నోచుకోని తమ్మిలేరు కాజ్వే
చాట్రాయి: వరద వచ్చినపుడల్లా తరుచూ కొట్టుకుపోతున్న చిన్నంపేట తమ్మిలేరు కాజ్వేతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు ద్వారా మండలంలోని తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టుకు వరద వచ్చినపుడల్లా చిన్నంపేట కాజ్వే కొట్టుకుపోతుంది. దీంతో రెండు వారాల పాటు మండలంలోని చిన్నంపేట, చింతలపూడి మండలం శివాపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయి ఆయా గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ రెండు గ్రామాల వారికి ఇరువైపులా వ్యవసాయ భూములు ఉండడం, నిత్యావసర వస్తువులు కొనుగోలుకు శివాపురం గ్రామస్తులు చిన్నంపేట రావాల్సి ఉంది. అంతేగాక శివాపురం నుంచి చిన్నంపేటకు పాఠశాలలకు విద్యార్థులు వస్తుంటారు. కాజ్వే కొట్టుకుపోయినపుడల్లా మరమ్మతుల కోసం లక్షల్లో నిధులు వెచ్చిస్తున్నారు. తరుచూ ఈ విధమైన మరమ్మతులు చేపట్టి నిధులు ఖర్చు పెట్టడం కన్నా వాగుకు శాశ్వతమైన కాంక్రీట్తో కూడిన కాజ్వే నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
చిరుద్యోగులే బలి!
నూజివీడు: గృహనిర్మాణ శాఖకు సంబంధించి నూజివీడు మండలం సుంకొల్లులో మెటీరియల్ పంపిణీలో చోటు చేసుకున్న అవినీతి, అవకతవకలపై అవుట్సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకోవడంపై గృహనిర్మాణశాఖతో పాటు రాజకీయ వర్గాల్లో సైతం విస్మయం వ్యక్తమవుతోంది. సుంకొల్లులో జరిగిన కుంభకోణంపై విచారణ జరపగా 2,450 బస్తాల సిమెంట్, 11,952 కిలోల స్టీలు లబ్ధిదారులకు అందలేదని తేలింది. వీటి విలువ రూ.16,52,895గా ధ్రువీకరించారు. దీంతో ఐదుగురు అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లపై వేటు వేశారు. అయితే లబ్ధిదారుడికి మెటీరియల్ ఇచ్చే విషయంలో వర్క్ ఇన్స్పెక్టర్ల పాత్ర ఏమీ ఉండదనేది అందరికి తెలిసిందే. గృహనిర్మాణ శాఖ అధికారులకు ఈ విషయం తెలిసినప్పటికీ అధికారులపై చర్యలు తీసుకోకుండా వర్క్ ఇన్స్పెక్టర్లను బలిపశువులను చేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మెటీరియల్ను ఎలా జారీ చేస్తారంటే.. ఇల్లు కట్టుకునే లబ్ధిదారుడికి మెటీరియల్ను అందజేసే విషయంలో ఆ గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఏఈలదే కీలకపాత్ర. అయితే వాళ్లను వదిలేసి ఎలాంటి సంబంధం లేని వర్క్ ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకోవడమేమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎంబుక్ నమోదు చేసి సిమెంట్, ఐరన్, ఇసుకకు సంబంధించిన మెటీరియల్ రిలీజ్ ఆర్డర్ జారీ చేసేది సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ కాగా, ఆ కూపన్లను తీసుకొని వచ్చిన లబ్ధిదారులకు రిలీజ్ ఆర్డర్లో పేర్కొన్న మేరకు మెటీరియల్ను హౌసింగ్కు చెందిన స్టాకు పాయింట్ ఇన్చార్జి అందజేస్తారు. స్టాక్ పాయింట్ ఇన్చార్జిగా ఏఈ స్థాయి అధికారి ఉంటారు. ఈ నేపథ్యంలో అధికారులపై చర్యలు తీసుకోకుండా వర్క్ ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకోవడం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది. 42 ఇళ్లకు సంబంధించి మెటీరియల్ పక్కదారి సుంకొల్లులో 42 గృహాలకు సంబంధించి ఇళ్లు ప్రారంభించకుండానే మెటీరియల్ను డ్రా చేసేశారు. ఒక్కొక్క గృహానికి ఒక్కో విధంగా మెటీరియల్ను జారీ చేసేశారు. కొన్ని ఇళ్లకు 10 సిమెంట్ కట్టలు, మరికొన్ని ఇళ్లకు 20 సిమెంట్ కట్టలు ఇలా వారిష్టమొచ్చినట్లు రిలీజ్ ఆర్డర్ ఇచ్చేశారు. ఈ 42 గృహాలకు సంబంధించి మెటీరియల్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన ఇంజినీరింగ్ అసిస్టెంట్పైన గాని, పర్యవేక్షణ అధికారులైన ఏఈ, డీఈలపైన గాని ఇంత వరకు చర్యలు లేవు. మెటీరియల్ను జారీ చేసిన తరువాత లబ్ధిదారులు గృహాలను నిర్మిస్తున్నారా, లేదా అనే విషయాన్ని ఏఈ, డీఈలు పర్యవేక్షించాలి. అలా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే దుర్వినియోగం జరిగింది. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ అసలు దోషులపై చర్యలు తీసుకోకుండా దీనికి ఎలాంటి సంబంధం లేని వర్క్ ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకొని మమ అనిపించేశారు. ఇళ్ల నిర్మాణ సామగ్రి మాయం అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై వేటు అధికారులను వదిలేసి.. వర్క్ ఇన్స్పెక్టర్లపై చర్యలా! హౌసింగ్ ఉన్నతాధికారుల తీరుపై విస్మయం -
ఖరీఫ్కు ఆదిలోనే ఆటంకం
తాడేపల్లిగూడెం రూరల్: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత 15 రోజులుగా తాడేపల్లిగూడెం మండలంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఖరీఫ్ వరి నారుమడి పనులకు ఆటంకంగా మారింది. ఇప్పటికే ఎల్.అగ్రహారం, పుల్లాయగూడెం, నీలాద్రిపురం, కృష్ణాపురం, మోదుగ గుంట, గొల్లగూడెం, అప్పారావుపేట తదితర గ్రామాల్లో దుక్కి దున్ని ఆకుమడి కోసం సంపద స్వర్ణ, పీఆర్.126 రకాల విత్తనాలను వేశారు. వర్షాలు విస్తారంగా కురవడంతో వేసిన విత్తనాలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఎండాకాలంలో వర్షాలు మే నెలలో మెండుగా ఎండలు కాయాల్సింది పోయి వర్షాలు కురవడంతో ఖరీఫ్ ఆకుమడి పనులకు ఆటంకంగా మారాయి. ఏటా ఖరీఫ్ పనులను మే నెలలో ప్రారంభించి, జూన్ నెలాఖరు నాటికి మెట్ట రైతులు పూర్తి చేస్తారు. తద్వారా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసే భారీ వర్షాల నుంచి పంట గట్టెక్కే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. ఇప్పటికే వేసిన నారుమడి విత్తనాలు కొట్టుకుపోవడంతో వర్షాలు తగ్గిన తర్వాత మరలా విత్తనాలు వేసుకోవలసిన పరిస్థితి తలెత్తింది. దీనివల్ల ఖరీఫ్ సాగు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసే వర్షాల బారిన పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో అయోమయంలో రైతులు ఇప్పటికే వేసిన నారుమడి విత్తనాలు వర్షార్పణం అకాల వర్షాలతో నష్టం మే నెలలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల ఖరీఫ్ ప్రారంభంలోనే నష్టాలు తప్పడం లేదు. ఈ వర్షాలకు పోసిన నారు నీటి పాలవుతుంది. దీనివల్ల మరలా విత్తనాలు చల్లుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికై నా వర్షాలు తగ్గుముఖం పడితే విత్తనాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మరలా పెట్టుబడులు తప్పవు. – మైలవరపు చంద్రరావు, రైతు, పుల్లాయగూడెం, తాడేపల్లిగూడెం మండలంమరింత ఆలస్యం ఏడెకరాల విస్తీర్ణానికి విత్తనాలు చల్లి ఇప్పటికే 15 రోజులు కావస్తుంది. మరో ఆరు రోజుల్లో నాట్లు వేయవలసి ఉంది. అయితే, వర్షాల కారణంగా కొంత విత్తనం కొట్టుకుపోగా, మరికొంత నారుమడి తయారై పోగులుగా తయారైంది. దీనివల్ల నారుమడి సరిపోతుందో లేదో అర్థం కాని పరిస్థితి. – మతుకుమిల్లి రామారావు, రైతు, కృష్ణాపురం, తాడేపల్లిగూడెం మండలం -
పేరుపాలెం బీచ్లో యువకుడి గల్లంతు
నరసాపురం రూరల్: స్నేహితులతో కలసి విహారయాత్రకు వచ్చిన ఒక యువకుడు పేరుపాలెం బీచ్లో గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాలివి. దేవరపల్లి మండలం చిన్నాయగూడెంకు చెందిన యాదాల అజయ్ (27) మరో ఆరుగురు స్నేహితులతో కలిసి పేరుపాలెం బీచ్కు వచ్చారు. తీరంలో సరదాగా ఆడుకుంటూ ఉండగా భారీ అలలు రావడంతో అజయ్ గల్లంతైనట్లు తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గాలింపు చర్యలు చేపట్టారు. అజయ్ మేనమామ పాలపాటి శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వాసు తెలిపారు. సైబర్ నేరం.. వ్యాపారికి రూ.85 వేలకు టోకరా నరసాపురం రూరల్: సైబర్ నేరగాళ్లు ఓ వ్యాపారికి రూ.85 వేలకు టోకరా వేసిన ఘటన ఆదివారం మొగల్తూరులో చోటుచేసుకుంది. వివరాలు ఇవి. మామిడిపండ్ల వర్తకుడు దూసనపూడి రాజుకు ఆదివారం మధ్యాహ్నం ఒక ఫోన్ కాల్ వచ్చింది. తాను మొగల్తూరు ఏఎస్ఐ ఆనందరావునని, తన మేనకోడలుకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, ఆసుపత్రికి డబ్బు అర్జంటుగా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పాడు. తన దగ్గర డబ్బులు ఉన్నాయని, కానీ బ్యాంకు ఖాతాలో లేకపోవడంతో ఫోన్ చేసినట్లు వివరించాడు. అయితే తన ఖాతాలో కూడా నగదు లేదని దూసనపూడి రాజు చెప్పడంతో ఇంకా ఎవరికై నా పురమాయించమని ఆ వ్యక్తి కోరాడు. విషయం నిజమనుకున్న రాజు మొగల్తూరు కూరగాయల మార్కెట్ వ్యాపారి ముక్కు పురుషోత్తంకు పురమాయించాడు. పురుషోత్తం స్టేషన్ వద్దకు వెళ్లి బయట నుంచే ఆ వ్యక్తికి ఫోన్ చేయగా నేను సినిమా హాల్ సెంటర్లో ఉన్నాను.. ఈ 7993014578 నంబర్కు రూ.85 వేలు ఫోన్ పే చేయాలని సూచించాడు. పురుషోత్తం వెంటనే రూ.85 వేలను ఆ నంబర్కు ఫోన్ పే చేశాడు. తర్వాత ఎంత సేపటికీ ఆ వ్యక్తి స్టేషన్కు రాకపోవడంతో మోసపోయినట్టు గ్రహించిన పురుషోత్తం పోలీసులకు, సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశాడు. -
బెల్టుషాపులపై 456 కేసులు
ఏలూరు టౌన్: జిల్లాలో బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఏలూరు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఏ.అవులయ్య హెచ్చరించారు. స్థానిక ఎకై ్సజ్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకూ 456 కేసులు నమోదు చేయడంతోపాటు బెల్టు షాపులు నిర్వహిస్తున్న 478 మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్న ఏలూరు రూరల్, పెదవేగి మండలం, భీమడోలులోని 5 ప్రైవేటు మద్యం షాపులను సీజ్ చేశామని ఆయన తెలిపారు. వీరిపై రూ.5 లక్షల అపరాధ రుసుము విధించామన్నారు. చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో ఎమ్మార్పీ కంటే అదనంగా మద్యం అమ్ముతున్న కనకదుర్గ వైన్స్పై కేసు నమోదు చేశామని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే 70 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే జిల్లాను నెలాఖరు నాటికి నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని అవులయ్య తెలిపారు. జిల్లాలోని 140 గ్రామాల్లో సారా తయారీ కేంద్రాలు ఉన్నాయని, ఈ గ్రామాల్లో విస్తృతంగా దాడులు చేస్తూ నాటుసారా తయారీని నిరోధించామన్నారు. నవోదయం –2 పథకంలో భాగంగా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపిస్తున్నామని తెలిపారు. జిల్లాలో మద్యం అక్రమ విక్రయాలు, నాటు సారాపై 14405 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అవులయ్య కోరారు. ఏలూరు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అవులయ్య -
లారీ డ్రైవర్ మృతి
ముదినేపల్లి రూరల్: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లారీ డ్రైవర్ ఆదివారం మృతి చెందాడు. ముదినేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంచికచెర్ల గ్రామానికి చెందిన షేక్ నాగూల్ మీరా(29) శనివారం శ్రీహరిపురం గ్రోవెల్స్ ఫ్యాక్టరీ గోడౌన్ వద్దకు లారీ లోడ్ దించడానికి వచ్చాడు. గోడౌన్ ప్రాంగణంలో లారీ నుంచి తలను బయటకు పెట్టి లారీ రివర్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ లారీ, గోడౌన్ గోడ మధ్య అతని తల నలిగిపోయింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం షేక్ నాగూల్ మీరా మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇండోర్ స్టేడియం.. నిండా నిర్లక్ష్యం
ఏలూరు రూరల్: ఏలూరు ఇండోర్ స్టేడియం గత వైభవాన్ని కోల్పోతోంది. ప్రభుత్వం ఉదాసీనత, నిధుల కొరతతో పాటు అధికారుల నిర్లక్ష్యానికి నిలువటద్దంగా మారుతోంది. గతంలో అభివృద్ధి చేసిన మౌలిక వసతులు నేడు ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. దీనికి తోడు చినుకు పడితే స్టేడియం చిత్తడిగా మారిపోతోంది. డ్రెయినేజీ వ్యవస్థ పని చేయడం లేదు. ఫలితంగా సాధన చేసే క్రీడాకారుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. నిరుపయోగంగా ఫ్లడ్లైట్లు గతంలో అధికారులు లక్షల రూపాయలు వెచ్చించి స్టేడియం చుట్టూ ఆరు చోట్ల భారీ స్తంభాలతో ఏర్పాటుచేసిన ఫ్లడ్లైట్లు నేడు నిరుపయోగంగా మారాయి. అవసరానికి అనుగుణంగా దిశ మార్చుకునేందుకు, ఎత్తు సైతం పెంచుకుని స్టేడియం మొత్తం వెలుగులు విరజిమ్మేలా లైట్లు ఏర్పాటుచేశారు. ఇందుకోసం స్తంభాల కింద ఒక మోటార్ సైతం బిగించారు. ప్రత్యేక ఫీజ్ బాక్సులు సిద్ధం చేశారు. నేడు ఈ ఫీజు బాక్సులు కానరావడం లేదు. మోటార్లు మరమ్మతు పాలయ్యాయి. వైరింగ్ ప్రమాదకరంగా మారింది. ఈ మొత్తం వ్యవస్థను మరమ్మతులు చేయకుండా వదిలేశారు. స్టేడియం అంతటా చీకట్లు కమ్ముకుంటున్నాయంటూ వాకర్స్, క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు తాత్కాలిక లైట్లు ఏర్పాటు చేశారు. ఫ్లడ్లైట్లు గురించి పట్టించుకోలేదు. మూతబడిన జిమ్ స్టేడియంలో ఇండోర్ కూలిపోవడంతో క్రీడాకారులు సాధన చేసే జిమ్ సైతం మూతపడింది. ఈ జిమ్లో ఏర్పాటుచేసిన తాగునీటి సరఫరా ప్లాంట్ సైతం నిరుపయోగంగా మారింది. దీంతో క్రీడాకారులు జిమ్ కోసం స్టేడియం వదిలి, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. కంపు కొడుతున్న మరుగుదొడ్డి క్రీడాకారులు, వాకర్స్ సౌలభ్యం కోసం గతంలో స్టేడియం పరిసరాల్లో నిర్మించిన మరుగుదొడ్డి సైతం కంపుకొడుతోంది. ఆకతాయిలు దొడ్డి తలుపులు విరగ్గొట్టడంతో బాలికలు ఉపయోగించేందుకు భయపడుతున్నారు. కొన్నిసార్లు వాటర్, కరెంట్ సరఫరా లేకపోవడంతో మరుగుదొడ్డి ఉపయోగించుకోలేక పోతున్నామని క్రీడాకారులు వాపోతున్నారు. చిందరవందరగా స్టేజీ ఆటల పోటీల సమయంలో క్రీడాకారులకు బహుమతులు అందించేందుకు నిర్మించిన స్టేజీ సైతం మరమ్మతులకు నోచుకోలేదు. గతంలో స్టేజీపై విద్యుత్ లైట్లతో పాటు సౌండ్ సిస్టమ్ ఏర్పాటుచేశారు. కొంతకాలంగా స్టేజీ నిర్వహణపై పర్యవేక్షణ కొరవవడంతో సౌండ్ సిస్టమ్, లైట్లు పనికి రాకుండాపోయాయి. ఎక్కడపడితే అక్కడ వైర్లు వేలాడుతూ పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పిల్లలు లేక వెలవెలబోతున్న ఇండోర్స్టేడియం అక్కరకు రాని ఫ్లడ్లైట్లు నిరుపయోగంగా మరుగుదొడ్లు తెరుచుకోని జిమ్, వాటర్ ప్లాంట్ పర్యవేక్షణ కొరవడింది సాయంత్రమైతే స్టేడియం అంతటా చీకట్లు కమ్ముకునేవి. చీకట్లో వాకింగ్ చేసి వెళ్లిపోవడమే. ఇప్పుడు తాత్కాలికంగా లైట్లు ఏర్పాటు చేశారు. కానీ గతంలో మాదిరిగా ఆట స్థలాలు అభివృద్ధి చేయడం లేదు. గతంలో ఉదయం, సాయంత్రం ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటెన్ ఆడుకునేవారు. కూలిపోయిన ఇండోర్ స్థానంలో కొత్తది నిర్మించాలి. మరుగుదొడ్డి, తాగునీరు అందుబాటులో ఉండేలా ఏర్పాటుచేయాలి. – ఎస్ సత్యనారాయణ ప్రత్యామ్నాయాలు చేస్తున్నాం గతంలో నిర్మించిన ఫ్లడ్లైట్ల మెయింటెనెన్స్ కష్టంగా మారింది. పెద్ద ఎత్తున విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. అందుకోసం వాటిస్థానంలో అవసరం మేరకు లైట్లు ఏర్పాటుచేశాం. ఇండోర్ కూలిపోవడంతో వాటర్ప్లాంట్, జిమ్ మూసేశాం. త్వరలో ఎస్బీఐ సౌజన్యంతో వాటర్ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. వెయిట్లిఫ్టింగ్ హాల్లో మంచినీరు ఏర్పాటుచేశాం. మరుగుదొడ్డి మెయింటెనెన్స్ ప్రైవేటు సంస్థకు అప్పగించేలా చూస్తున్నాం. – బి శ్రీనివాసరావు, డీఎస్డీఓ -
జ్యూయలరీ షాపుల్లో తనిఖీలు
ఏలూరు (ఆర్ఆర్పేట): రీజినల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారి వి.శ్రీరాంబాబు ఆదేశాల మేరకు శుక్రవారం విజిలెన్స్, జీఎస్టీ, తూనికలు–కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా బంగారం, వెండి దుకాణాల్లో తనిఖీలు చేశారు. నగరంలోని సరస్వతి సిల్వర్ ప్యాలెస్, శుభం జ్యూయలరీ షాపుల్లో తనిఖీ చేయగా.. సరస్వతి సిల్వర్ ప్యాలెస్లో 160 గ్రాముల బంగారం, 5,400 గ్రాముల వెండి స్టాక్ రిజిస్టర్ కన్నా ఎక్కువగా ఉన్నట్టు గుర్తించి జీఎస్టీ అధికారులు రూ.1,15,468 అపరాధ రుసుం విధించారు. అలాగే సరస్వతి సిల్వర్ ప్యాలెస్లో ఎటువంటి ధ్రువీకరణ లేని రెండు ఎలక్ట్రానిక్ కాటాలు గు ర్తించి తూనికలు కొలతల శాఖ అధికారులు కేసు న మోదు చేశారు. విజిలెన్స్ సీఐ పి.శివరామకృష్ణ, ఎస్సై కె.సీతారాము, తహసీల్దార్ బి.కన్యాకుమారి, తూనికలు, కొలతల శాఖ అధికారి ఈశ్వరరామ్, జీఎస్టీ అధికారి వినోదరావు పాల్గొన్నారు. -
రేషనలైజేషన్లో లోపాలతో గందరగోళం
భీమవరం (ప్రకాశంచౌక్): రెవెన్యూ గ్రామాల రేషనలైజేషన్లో లోపాలు ఉన్నాయని, దీంతో గందర గోళ పరిస్థితి నెలకొందని గ్రామ రెవెన్యూ అధికా రుల (వీఆర్వోల) సంఘ రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జేసీ రాహుల్కుమార్రెడ్డికి వీఆర్వోల తో కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే సీపీఎస్ ఉద్యోగుల చైతన్య యాత్రకు మద్దతు తెలిపా రు. అనంతరం రవీంద్రరాజు మీడియాతో మాట్లాడుతూ వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లను క్లస్టర్ విధానంలో రేషనలైజేషన్ చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. అయితే రెండు, మూడు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేస్తే వీఆర్వోలపై పని ఒత్తిడి పెరుగుతుందన్నారు. క్లస్టర్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,500 మంది వీఆర్వోలు, 4,722 మంది విలేజ్ సర్వేయర్లను తగ్గిస్తూ ఏ సచివాలయానికి కేటాయించారో చెప్పలేదన్నారు. ప్రభుత్వం భూ హక్కు సర్వేను 100 రోజు లు లేదా 60 రోజుల్లోనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో రెండు మూడు గ్రామాలకు ఒక వీఆర్వో ఉంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇప్పటికే రేషనలైజేషన్ ప్రక్రియలో లోపాలను రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిరియాల లక్ష్మీ నారాయణ, జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ గుమ్మల జక్రయ్య, నాయకులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఈఏపీసెట్
భీమవరం: భీమవరంలోని ఐదు కేంద్రాల్లో ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్లో ఉదయం 170 మందికి 166 మంది, మధ్యాహ్నం 170 మందికి 164 మంది హాజరయ్యారు. విష్ణు ఇంజనీరింగ్లో ఉదయం 107 మందికి 104 మంది, మధ్యాహ్నం 107 మందికి 104 మంది హాజరయ్యారు. విష్ణు ఉమెన్స్ కళాశాలలో ఉదయం 86 మందికి 85 మంది, మధ్యాహ్నం 87 మందికి 86 మంది హాజరయ్యారు. డీఎన్నార్ అటానమస్ కళాశాలలో ఉదయం 101 మందికి 101 మంది, మధ్యాహ్నం 101 మందికి 99 మంది, డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 100 మందికి 93 మంది, మధ్యాహ్నం 100 మందికి 95 మంది విద్యార్థులు హాజరయ్యారు. తాడేపల్లిగూడెంలో.. తాడేపల్లిగూడెం: వాసవీ ఇంజనీరింగ్ కళాశా లలో ఏపీఈఏపీ సెట్ పరీక్షలకు 449 మందికి 435 మంది హాజరయ్యారు. ప్రిన్సిపాల్ రత్నాకరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. టెన్త్ సప్లిమెంటరీకి 71 శాతం హాజరు భీమవరం: జిల్లాలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు శుక్రవారం 71 శాతం విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. 3,037 మంది విద్యార్థులకు 876 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే ఎస్ఎస్సీ (ఏపీఓఎస్ఎస్) పరీక్షకు 299 మందికి 219 మంది, ఇంటర్ (ఏపీఓఎస్ఎస్) పరీక్షకు 376 మందికి 324 మంది విద్యార్థులు హాజరయ్యారని ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమో దు కాలేదని డీఈఓ చెప్పారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలి పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించలేక అవస్థలు పడుతున్నారని, జీతాలు పెంచాలంటూ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు పాలకొల్లు పురపాలక సంఘ వాటర్ సప్లయ్ వర్కర్స్ వినతిపత్రం అందజేశారు. ఔట్ సోర్సింగ్ లో పదేళ్లుగా పనిచేస్తున్న వారిని పర్మినెంట్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలన్నారు. నాన్ పీ హెచ్ (వాటర్ సప్లయ్ వర్కర్స్)కు వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని, ఏటా 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు. హెచ్ఆర్ పాలసీ కల్పించాలని, ఔట్ సోర్సింగ్ వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఔట్ సో ర్సింగ్లో సుమారు 3 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు తాడేపల్లిగూడెం (టీఓసీ): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో శుక్రవారం వేకువ జామున పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. తాడేపల్లిగూడెం, పెంటపాడు, భీమడోలు, ద్వారకాతిరుమల, దెందులూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు మూడు దుక్కుల వర్షం కురిసిందని, ఇటీవల కాలంలో ఇంత భారీ వర్షం కురియలేదని స్థానికులు తెలిపారు. తాడేపల్లిగూడెంలో 19.8 మి.మీ, పెంటపాడులో 28.2 మి.మీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. కోవిడ్పై అప్రమత్తం దెందులూరు: కోవిడ్ బారిన పడకుండా ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని దెందులూరు సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ సుందర్కుమార్ అన్నారు. శుక్రవారం దెందులూరులో ఆయన మాట్లాడుతూ కోవిడ్ నివారణకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేసిందన్నారు. ప్రార్థనా, సామా జిక సమావేశాలు, పార్టీలు వంటివి వాయిదా వేసుకోవాలని, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విమా నాశ్రయాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలని, చలి జ్వరం, దగ్గు, అలసట, గొంతునొప్పి, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలన్నారు. -
ఉపాధ్యాయుల బదిలీలపై అవగాహన
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని యూటీఎఫ్ జిల్లా కేంద్ర కార్యాలయంలో ఉపాధ్యాయుల బదిలీలు, సర్దుబాట్లపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ హనుమంతరావు పాల్గొని బదిలీల జీఓలపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయుల సందేహాలు, సమస్యలపై పరిష్కారాలు తెలిపారు. కార్యాలయంలో హెల్ప్డెస్క్ను ప్రారంభించారు. హెల్ప్డెస్క్లో ఉపాధ్యాయులతో ఆన్లైన్ దరఖాస్తులు చేయించడంలో జిల్లా సాంకేతిక బృందం పనిచేస్తుందని నాయకులు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రాక్షి రవికుమార్ మాట్లాడుతూ ప్రధాన నాయకులు జిల్లా కార్యాలయంలో అందుబాటులో ఉంటూ ఉపాధ్యాయుల సమస్యలను డీఈఓ కార్యాలయ అధికారుల దృష్టికి తీసుకువెళుతున్నారన్నారు. రాష్ట్రస్థాయిలో సమస్యలపై రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళుతున్నామన్నారు. బదిలీల ప్రక్రియ పూర్తయ్యే వరకూ హెల్ప్డెస్క్ కొనసాగుతుందన్నారు. జిల్లా అధ్యక్షుడు షేక్ ముస్తఫా ఆలీ, రాష్ట్ర కార్యదర్శి బి.సుభాషిణి, జిల్లా కోశాధికారి జీవీ రంగమోహన్, జిల్లా కార్యదర్శులు నంబూరి రాంబాబు, జి.అంజన, కె.కమల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎండీయూ వాహనాల రద్దుపై మండిపాటు
భీమవరం: ప్రభుత్వం ప్రజలకు నిత్యావసర సరుకులను ఎండీయూ వాహనాల ద్వారానే సరఫరా చేయాలని సీపీఎం పట్టణ కార్యదర్శి బి.వాసుదేవరావు డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని 38వ వార్డు లంకపేటలో ఎండీయూ వ్యవస్థ రద్దును ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని, పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ రేషన్ వాహనాల ద్వారా అవినీతి జరుగుతుందనే నెపంతో ప్రజలకు ఇంటి వద్ద బియ్యం అందించకుండా డిపోల వద్దే రేషన్ తెచ్చుకోవాల నడం అన్యాయమన్నారు. పట్టణ నాయకుడు ఎం. వైకుంఠరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని, సన్న బియ్యంతో పాటు కందిపప్పు, చింతపండు, నూనె, పంచదార వంటి నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు. నాయకులు చెల్లబోయిన వెంకటేశ్వరరావు, డి.త్రిమూర్తులు, కుమారి సాయ మ్మ, రమేష్, మరియమ్మ పాల్గొన్నారు. వాహనాల తొలగింపు దారుణం భీమవరం అర్బన్: రేషన్ వాహనాల నిలిపివేత నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుని ప్ర జాపంపిణీ వ్యవస్థను మరింత మెరుగు పరచాలని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఇంజేటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండలంలోని వెంప గ్రామంలో పెదపేటలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. గతంలో ప్రజలు మానుకుని రేషన్ దుకాణాలకు వెళ్లి క్యూలైన్లో రేషన్ తీసుకునేవారని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ప్రజల ఇబ్బందుల దృష్ట్యా రేషన్ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ సరుకులు సరఫరా చేసిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రేషన్ వాహనాలు తొలగించడం దారుణమన్నారు. -
పారిశుద్ధ్య కార్మికుల వేతన వెతలు
తణుకు అర్బన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల 4 నెలల వేతన బకాయిలు, 36 నెలల పీఎఫ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో 50 మందికి తగ్గకుండా పారిశుద్ధ్య కార్మికు లను నియమించాలని ఏపీ మెడికల్ కాంటాక్టు ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ ఎం.కృపావరానికి అందజేశారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ కార్మికులు అతి త క్కువ వేతనంతో పనిచేస్తున్నారని, అవి కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్ సొమ్ము సైతం కార్మికుల పీఎఫ్ ఖాతాలకు జమ చేయడం లేదని విమర్శించారు. ఆస్పత్రిలో 150 పడకల స్థాయికి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులను నియమించి పనిభారం తగ్గించాలని కోరారు. సంఘ నాయకులు ధర్మాని పుష్పలత, నేకూరి లక్ష్మి, పి.విజయలక్ష్మి, ఎన్.వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ తీగలు.. యమపాశాలు
ఆదమరిస్తే అంతే! ● ఆక్వా చెరువుల వద్ద అస్తవ్యస్తంగా విద్యుత్ వ్యవస్థ ● నిర్లక్ష్యంగా విద్యుత్ తీగల ఏర్పాటు ● విద్యుదాఘాతాలతో ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు ● వర్షాకాలంలో సమస్య మరింత జటిలం ● రెండు రోజుల క్రితం ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు సాక్షి, భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2.63 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. ఏరి యేటర్లు ద్వారా చెరువుల్లోని చేపలు, రొయ్యలకు నిరంతరంగా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు త్రీఫేస్ విద్యుత్ను వినియోగిస్తారు. చెరువు చుట్టూ ఉండే ఈ వైర్లను అందరికీ కనిపించేలా కర్రలకు కట్టాలి. ఏరియేటర్ కనెక్షన్ వద్ద టేపు ఎక్కువగా వేయాలి. చెరువుల చుట్టూ ఉండే వైర్లకు ఎక్కువగా జాయింట్లు లేకుండా చూసుకోవాలి. వైర్లను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ కాలం చెల్లిన వాటిని తొలగించి కొత్త వాటిని ఏర్పాటుచేయాలి. ఎలక్ట్రీషియన్ను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. అయితే ఇలాంటి జాగ్రత్తలేమీ తీసుకోవడం లేదు. ఎలాపడితే అలా వైర్లు.. రెండు ఎకరాల నుంచి వంద ఎకరాలకు పైగా ఆక్వా సాగు చేస్తుంటారు. సాగు విస్తీర్ణం పెరిగే కొద్దీ వైర్లు ఎలా పడితే అలా లాగేస్తున్నారు. కొందరు ప్రభుత్వ స్థలాలు, రహదారులు, కాలువ గట్లపై జాగ్రత్తలు పాటించకుండా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. వైర్లను కొబ్బరి చెట్లకు వేలాడదీయడం, రోడ్డుపైన, చెరువు గట్లపై నుంచి లాగేస్తున్నారు. కొంతకాలానికి మట్టి, గడ్డి కప్పేయడంతో అవి కనిపించని పరిస్థితి. కొత్తగా వచ్చిన కూలీలకు గట్టుపై ఉన్న వైర్లలో జాయింట్లు ఎక్కడ ఉన్నాయో తెలియక షాక్కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఏరియేటర్లు, మెటార్లు మొరాయిస్తుంటాయి. ఎలక్ట్రీషియన్ అందుబాటులో లేక కూలీలే మరమ్మతులు చేసే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఎందరో.. జిల్లావ్యాప్తంగా ఏటా చెరువుల వద్ద ఎందరో విద్యుత్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండగా వారి కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి. కొన్ని కేసులు వరకు వస్తే మరికొన్ని గుట్టుచప్పుడు కాకుండా సర్దుబాటు చేస్తున్నారు. చెరువుల వద్ద పనిచేసే వారిలో ఒడిసా, పశ్చిమ బెంగాళ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఎక్కువ. స్థానిక పరిస్థితులపై అవగాహన లేక ప్రమాదాలు బారిన పడే వారిలో వారే అధికంగా ఉంటున్నారు. చెరువుల వద్ద విద్యుత్ వ్యవసపై తనిఖీలు చేసేందుకు విద్యుత్శాఖ చర్య లు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాగా ట్రాన్స్ఫార్మర్లు వరకే తమకు బాధ్యత అనే ధోరణిలో విద్యుత్ అధికారులు ఉంటున్నారు.అప్రమత్తత అవసరం వర్షాకాలం దృష్ట్యా ఇళ్ల వద్ద కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. భారీ వర్షాలు, గాలులు వీచే సమయంలో విద్యుత్ లైన్ల కింద నిల్చోకూడదు. ఇంటి గృహోపకరణాల స్విచ్లను ఆఫ్ చేసుకోవాలి. తడి చేతులతో స్విచ్చ్లను ఆన్, ఆఫ్ చేయకూడదు. చిన్న పిల్లలను కరెంటు వస్తువుల వద్దకు వెళ్లనివ్వకూడదు. ఇంటి సర్వీసు వైరు తెగినా, జాయింట్లు కట్ అయినా వెంటనే విద్యుత్ సిబ్బందికి స మాచారం ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో వాటిని తాకకూడదు. వర్షం పడుతున్నపుడు విద్యుత్ స్తంభాలు, స్టే వైర్లను తాకరాదు. చెట్లు, విద్యుత్ స్తంభాలు పడినా, వాలినా, కరెంటు వైర్లు తెగినా వెంటనే విద్యుత్ సిబ్బంది లేదా టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం అందించాలి. మోటార్లు తడిసి షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉన్నందున రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలి. మృత్యు ఘంటికలు గతంలో భీమవరం రూరల్ గొల్లవానితిప్పలో ఒక రైతు తమ చెరువులో మేత వేసేందుకు వెళుతుండగా హైటెన్షన్ విద్యుత్ వైరు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. గూట్లపాడు రేవులో రొయ్యల చెరువు వద్ద విద్యుత్ వైరు తగిలి మరో రైతు మృతిచెందాడు. తాడేరులో రొయ్యల చెరువు వద్ద గట్టుపై గడ్డి కోస్తుండగా కొడవలికి విద్యుత్ వైరు తగిలి కూలీ కన్నుమూశాడు. దొంగపిండిలో చెరువు వద్ద పనిచేసే వ్యక్తి చెరువులో ఏరియేటర్ను రిపేరు చేసేందుకు దిగి మృత్యువాత పడ్డాడు. ఉండి మండలం వెలిపర్రులోని ఆక్వా చెరువుల వద్ద బుధవారం బోదెలో చేపలు పట్టేందుకు దిగిన యువకుడు పక్కనే విద్యుత్ స్తంభం నుంచి వేలాడుతున్న వైరు తగిలి విద్యుత్ షాక్తో మృతిచెందాడు. అదే రోజున ఏలూరు రూరల్ లింగారావుగూడెం చెరువు వద్ద విద్యుదాఘాతానికి గురై ఒకరు మృతిచెందగా మరొకరు గాయపడ్డారు. రొయ్యలు, చేపలకు ఆక్సిజన్ అందించేందుకు ఆక్వా చెరువుల వద్ద విద్యుత్ వైర్లు ఏర్పాటులో అధికారులు, నిర్వాహకుల నిర్లక్ష్యం అమాయకుల ఉసురు తీస్తోంది. వర్షాకాలంలో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. -
ఆదివాసీ గిరిజనులపై అమానుషం
భీమవరం: ఆదివాసీ గిరిజనులను కగార్ పేరుతో ఊచకోత కోస్తున్నారని నక్సలైట్లు పేరుతో అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం దారుణమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరం సీపీఐ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ జిల్లా సమితి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే వంకతో నక్సలైట్లను నిర్ధాక్షిణ్యంగా కాల్చిచంపడం దుర్మార్గమన్నారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇచ్చిన అర్జీలపై తక్షణం చర్యలు తీసుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తేదిన తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు ముప్పాళ్ళ చెప్పారు. పార్టీ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ సీపీఐ జిల్లా మహాసభలు ఆగస్టు 6, 7 తేదీల్లో ఉండిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముందుగా పహల్గాం ఘటనలో మృతులకు, ఇటీవల మృతి చెందిన సీపీఐ నాయకులు జక్కంశెట్టి నాగేశ్వరరావు, మొల్లేటి చినవెంకటరెడ్డి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పాల్గొన్నారు. రొయ్యల పట్టుబడికి వెళ్లనివ్వడం లేదు సాక్షి టాస్క్ఫోర్స్: తన రొయ్యల చెరువులో రొయ్యల పట్టుబడికి వెళ్లనీయకుండా టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో వారితో ఏర్పడిన ఘర్షణలో స్పృహ తప్పి ఆస్పత్రి పాలయ్యాడు పెదపాడు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన ఘంటసాల సుబ్బారావు. దీంతో అతడిని ఏలూరులోని ఆయుష్ ఆసుపత్రికి అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులమనే నెపంతోనే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సుబ్బారావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజకీయ కక్షల నేపథ్యంలో చెరువుల్లో చేపలు, రొయ్యలు పట్టనీయకుండా అడ్డుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సుబ్బారావుకు చెందిన చెరువుల్లో చేపలను పట్టనీయలేదు. దీనిపై అధికారులను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోవడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు చెరువులో చేపలు పట్టుకున్నారు. మరలా రొయ్యలను పట్టుకోనివ్వకుండా అడ్డుకోవడంతో సుబ్బారావు ఆందోళనకు లోనై ఆస్పత్రిపాలయ్యాడని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం విరమించుకోవాలి భీమవరం: రేషన్షాపుల నుంచి మొబైల్ డిస్సెన్సింగ్ యూనిట్లు (ఎండీయూ) ద్వారా నిత్యావసర సరుకులు సరఫరా చేసే వ్యవస్థను రద్దు చేయకుండా మరింత మెరుగుపర్చి ఇంటింటికీ రేషన్ సరుకులు సరఫరా చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జేవీ గోపాలన్ డిమాండ్ చేశారు. గురువారం భీమవరంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎండీయూ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇంటి వద్ద బియ్యం అందించడంతోపాటు వాహనాల వద్ద రేషన్న్ తీసుకోలేకపోయనవారికి రేషన్న్ డిపో వద్ద సరుకులు తీసుకునేట్లుగా ఏర్పాటు చేయాలన్నారు. -
భయాందోళనలో ఆస్పత్రి వర్గాలు
తణుకు అర్బన్: తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని వైద్యవర్గాలు విధి నిర్వహణ చేయాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో విధులంటే హడలెత్తిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యవసర విభాగానికి రాత్రి వేళల్లో రోగులు, క్షతగాత్రుల కోసం వచ్చేవారు అలజడి సృష్టిస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 19వ తేదీ రాత్రి చిన్నపాటి గాయంతో ఆస్పత్రి అత్యవసర విభాగానికి వచ్చిన పాతవూరుకు చెందిన ఇద్దరు సోదరులు వైద్యవర్గాలను అసభ్యపదజాలంతో విరుచుకుపడడమే కాకుండా దాడికి సైతం ప్రయత్నించి భయబ్రాంతులకు గురిచేశారు. దీంతో ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ సత్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇటీవల ఇటువంటి చిన్నాపెద్దా ఘటనలు చోటుచేసుకుంటుండగా పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను వేడుకున్నా పట్టించుకోవడంలేదని వైద్యవర్గాలు ఆందోళన చెందుతున్నారు. 100 గ్రామాలకు పెద్దాసుపత్రి తణుకు నియోజకవర్గానికి సంబంధించి సుమారు 10 కిలోమీటర్లుపైగా జాతీయ రహదారి ఉండడంతో ఇటు అలంపురం నుంచి సిద్ధాంతం పైవరకు జరిగే రోడ్డు ప్రమాదాలన్నీ తణుకు ఆస్పత్రికే తరలిస్తుంటారు. అంతేకాకుండా చుట్టుపక్కల 100 గ్రామాలకు పెద్దాసుపత్రిగా సేవలందిస్తుండడంతో అధికశాతం ఈ ఆస్పత్రికి వైద్యసేవల కోసం వస్తుంటారు. నిత్యం 150 పడకలు నిండి ఉండగా, 600పైగా ఓపీ సంఖ్య ఇక్కడ నమోదవుతోంది. ఇంతటి ప్రాధాన్యత ఈ ఆస్పత్రికి ఉండడంతో పగలు, రాత్రి కూడా రోగులు, సహాయకులతో రద్దీగానే ఉంటుంది. అటువంటి ఆస్పత్రిలో వైద్యవర్గాలకు రక్షణ కల్పించకపోగా పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటుచేయమంటే ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా అత్యవసర విభాగం జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి ప్రతిరోజూ రాత్రి సమయంలో వివిధ కారణాలతో వైద్యంకోసం వస్తుంటారు. ముఖ్యంగా ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, కొట్లాటల్లో గాయపడిన వారు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఆ సమయంలో వారితోపాటు సహాయకులు, బంధువులు మద్యం మత్తులో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారని సిబ్బంది వాపోతున్నారు. రాత్రి సమయంలో అత్యవసర విభాగంలో ఉండే ఒక వైద్యుడితోపాటు సిబ్బంది, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో ఉంటారు. అయితే వారికి నచ్చినట్లుగా వైద్యం చేయకపోయినా, లోపలకు అనుమతించకపోయినా దాడులకు దిగే పరిస్థితులు ఇక్కడ జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులతోపాటు పదుల సంఖ్యలో లోపలకు రావడం వలన వైద్యసేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అందరూ లోపలకు రావద్దంటున్న సిబ్బందిపై మందుబాబులు బీభత్సం చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో మహిళా వైద్యులు విధుల్లో ఉండాలంటనే భయంతో వణికిపోతున్నారని వైద్యవర్గాలు చెబుతున్నారు. ముఖ్యంగా ఏరులై పారుతున్న మద్యానికి బానిసలైన మందుబాబులు ఆస్పత్రికి వస్తే చాలు వైద్యవర్గాల గుండెల్లో రైళ్లు పరిగెట్టే పరిస్థితి ఇక్కడ నెలకొంది. అత్యవసర విభాగమా అమ్మ బాబోయ్.. రాత్రి వేళల్లో మందుబాబుల వీరంగంతో హడల్ నైట్ డ్యూటీ అంటే బెంబేలెత్తిపోయే పరిస్థితి పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ -
సొసైటీలు ఆడిట్ చేయించుకోవాలి
తణుకు అర్బన్: కో–ఆపరేటివ్ సొసైటీలు ఐటీ చట్టం నిబంధనల ప్రకారం అకౌంట్స్ను సరైన సమయానికి ఆడిట్ చేయించుకోవాలని, క్రమం తప్పకుండా ఐటీ రిటన్లు దాఖలు చేయాలని ఇన్కమ్ ట్యాక్స్ రాజమండ్రి రేంజ్ జాయింట్ కమిషనర్ ప్రతాప్ సింగ్ భుక్యా అన్నారు. తణుకు రోటరీ క్లబ్లో గురువారం సొసైటీల సభ్యులకు అకౌంట్స్ ఆడిట్ తదితర విషయాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిర్ణీత సమయానికి ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేయడం వలన ఐటీ చట్టం 1961 ప్రకారం సెక్షన్ 80పి డిడక్షన్ పొందవచ్చని స్పష్టం చేశారు. అనంతరం సీఏ కారుమూరి ధనసాయి ఆదాయపు పన్ను చట్టంలో నూతన నిబంధనలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆదాయపు పన్ను అధికారి సీపీకే దొర, జిల్లా ఆడిట్ అధికారి మానేపల్లి సాయిబాబా, డీసీవో శ్రీనివాస్, డీసీఏవో అంబేడ్కర్, ఆదాయపు పన్ను శాఖ అధికారులు, సొసైటీల సభ్యులు పాల్గొన్నారు. -
పశువుల్లో గురక వ్యాధి నివారణ ఇలా..
చింతలపూడి: వర్షాకాలంలో గేదెలు, గేదె దూడలు, గొర్రెలు, మేకల్లో ఎక్కువగా వచ్చే వ్యాధి గురక వ్యాధి. దీనినే గొంతు వాపు వ్యాధి అని కూడా పిలుస్తారు. పశువుల్లో వచ్చే వ్యాధుల్లో ఇది అత్యంత ప్రమాదకరమైనది. గురకవ్యాధి సోకిన పశువులకు అందించాల్సిన చికిత్సను గురించి పశుసంవర్థక శాఖ ఏడీ డా జె. లింగయ్య వివరించారు. ఎలా సంక్రమిస్తుంది పాశ్చురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియ వల్ల పశువులు, గొర్రెలు, మేకల్లో వచ్చే ఈ వ్యాధి క్రిములు ఎడతెరపి లేని ముసురు వాతావరణంలో వేగంగా వృద్ధి చెందుతాయి. కలుషితమైన నీరు, మేత, పరికరాలు, విసర్జకాలు, స్రావాలు, కళేబరాలు, మాంసం ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇందుకు ఈగలు, దోమలు, ఇతర కీటకాలు కూడా దోహదపడతాయి. వ్యాధి క్రిములు శ్వాస, జీర్ణ వ్యవస్థ, దోమ కాట్ల ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఎర్ర రక్త కణాలను ధ్వంసం చేసి రక్తం ప్రాణవాయువు ప్రక్రియను దెబ్బ తీస్తుంది. దీంతో ప్రాణ వాయువు సరిగా అందక పశువులు గురక పెట్టడం, రొప్పడం, ఆయాశపడటం వంటి లక్షణాలను ప్రదర్శిస్తుంది. పశువుల శరీర ఉష్ణోగ్రత 106 నుంచి 108 ఫారిన్ హీట్ వరకు పెరగడం, కనుపాపలు ఎర్రగా మారిపోవడం, మేత నెమరు నిలిచి పోవడం, మెడ గొంతు వాయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన 12 నుంచి 36 గంటలకు వ్యాధి లక్షణాలు కనిపించి, సకాలంలో సరియైన వైద్యం అందకపోతే మరో 12 నుంచి 24 గంటల్లో పశువు మరణిస్తుంది. గురక వ్యాధికి చికిత్స వ్యాధిని గుర్తించిన మరుక్షణం రక్త పరీక్షలు నిర్వహించాలి. వ్యాధి సోకిన పశువును ఇతర పశువుల నుంచి వేరు చేయాలి. పశువులను నిలబెట్టి మాత్రమే వైద్యం చేయడం శ్రేయస్కరం. యాంపిసిల్లిన్, క్లోక్సా సిలిన్, జెంటా మైసిన్, సెఫలాక్సిన్ వంటి యాంటి బయోటిక్ మందుల్ని సరియైన మోతాదులో అవసరాన్ని బట్టి రక్తంలోకి ఎక్కిస్తే వేగంగా ఉపశమనం కలుగుతుంది. సాంబ్రాణి ధూపం వేయడం కూడా మంచిదే. వ్యాధి నిరోధక శక్తిని పెంచే మోమెజోల్ ఇంజక్షన్లు, బి–కాంప్లెక్స్ ఇంజక్షన్లు బాగా నీరసించిన పశువుౖకైతే డెక్ట్స్రోజ్ సైలెన్లు అవసరం కూడా ఉంటుంది. నివారణ ఇలా.. గురకవ్యాధి సోకిన పశువులకు రోగ క్రిములను కలిగిన కలుషిత మేత, నీరు, కళేబరాలను దూరంగా తరలించాలి. కళేబరాలను లోతుగా పూడ్చి వేయడం మంచిది. పరిసరాల్లో క్రిమి కీటకాలు వృద్ధి చెందకుండా పొడిగా ఉంచాలి. డీడీటీ, గమాక్సిన్, సైపర్ మెధ్రిన్, కార్పొరిల్ వంటి క్రిమి సంహారకాలతో క్రిమి రహితం చేయాలి. పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన పశువులను కనీసం వారం రోజులన్నా వేరుగా ఉంచి వ్యాధి లేదని నిర్ధారించుకున్నాక మిగిలిన పశువులతో కలవనివ్వాలి. గురకవ్యాధి నివారణకు ప్రభుత్వం ఏటా ఉచితంగా టీకాలు వేయిస్తుంది. ప్రస్తుతం గురకవ్యాధి, జబ్బవాపు, గాలికుంటు వ్యాధుల నిర్మూలనకు ఒకే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. పశువైద్యుల సూచనల మేరకు ఈ టీకాలను తొలకరి తొలి దశలో లేదా ఎండలు ముదరక ముందు వేయిస్తే మంచిది. పాడి–పంట -
ఏలూరు రైల్వేస్టేషన్లో మొబిలైజేషన్ డ్రిల్
ఏలూరు (టూటౌన్): ఏలూరు రైల్వేస్టేషన్లో గురువారం సాయంత్రం రైల్వే ఎస్పీ పి.సైమన్, ఏలూరు ఆర్పీఎఫ్ సీఐ, ఎస్సై ఇతర సిబ్బందితో మొబిలైజేషన్ డ్రిల్ నిర్వహించారు. బెదిరింపులు, ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, వరదలు వంటి అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తత, ప్రతిస్పందనను తనిఖీ చేయడం ఈ డ్రిల్ లక్ష్యం అని వివరించారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ప్రస్తుత భద్రతా పరిస్థితులపై కూడా సిబ్బందికి వివరించారు. ఆంజనేయస్వామికి లక్ష తమలపాకుల పూజ జంగారెడ్డిగూడెం: హనుమద్ జయంతిని పురస్కరించుకుని గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో గురువారం ఆంజనేయస్వామికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి లక్ష తమలపాకులతో ప్రత్యేక పూజ జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం విశేష పూజల అనంతరం శ్రీ సువర్చలా హనుమద్ కల్యాణం, సాయంత్రం గుర్వాయిగూడెం, చక్రదేవరపల్లి గ్రామాల్లో స్వామి వారి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి ఆర్వీ చందన తెలిపారు. నిందితుడికి రిమాండ్ భీమవరం: భీమవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయలంలో కర్రి మాణిక్యం (79) అనే వృద్ధురాలిని కొట్టడంతో మృతి చెందిన కేసులో నిందితుడైన మృతురాలి మనవడు తోట మధును పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని భీమవరం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండు విధించి తణుకు ఉప కారాగారానికి పంపించారని సీఐ జి.కాళీచరణ్ తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ను 22 శాతానికి పెంచాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ) : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ను 22 శాతానికి పెంచాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు డిమాండ్ చేశారు. పట్టణంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 60 లక్షల మంది మాలలు ఉన్నారని తెలిపారు. మాలలకు 7.5 శాతం రిజర్వేషన్ సరికాదని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. హైకోర్టులో మాల సంఘాలు పిల్ వేయడం, కోర్టు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చెల్లదని తీర్పు రావడం ఖాయమన్నారు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మాల సంఘాల జేఏసీ నాయకులు గంటా సుందర్ కుమార్, కేసీ రాజు, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. అద్యశ్యమైన యువకుడి హత్య..? భీమవరం: భీమవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసులోని ఓ యువకుడు హత్యకు గురైనట్లు తెలిసింది. ఈనెల 4వ తేదీన కనిపించకుండా పోయిన యువకుడిని పట్టణానికి చెందిన ఒక కుటుంబం హత్య చేసి మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ ప్రాంతంలో విడిచినట్లు సమాచారం. యువకుడి కుటుంబ సభ్యులకు ఆకాశరామన్న ఉత్తరం ద్వారా హత్య జరిగినట్లు తెలియడంతో యువకుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా యువకుడిని హత్య చేసినట్లు ఆ కుటుంబం అంగీకరించినట్లు తెలిసింది. దీనితో జొన్నాడ ప్రాంతానికి వెళ్లిన పోలీసులు గోనె సంచిలో ఉన్న మృత దేహాన్ని గుర్తించి హత్యకు కారణమైన వ్యక్తులను విచారిస్తున్నట్లు సమాచారం. కన్నాయగూడెంలో చోరీ కొయ్యలగూడెం : మండలంలోని పొంగుటూరు పంచాయతీ పరిధిలోని కన్నాయగూడెం గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. బాధితురాలు గద్దే రాణి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గద్దే రాణికి చెందిన పాత పెంకుటిల్లును రేకుల షెడ్డుగా మారుస్తున్నారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న పూరి గుడిసెలో సామాన్లు పెట్టుకుని కుటుంబసభ్యులతో అక్కడే నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మెలకువ వచ్చి చూసినప్పుడు, పెట్టెను కోసి ఉండటాన్ని గుర్తించింది. వెంటనే పెట్టెను పరిశీలించగా, ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన రూ.5 లక్షల నగదు, 9 కాసుల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, చోరీపై ఆధారాలు సేకరిస్తున్నారు. -
బ్లడ్బ్యాంక్ సౌకర్యం అందని ద్రాక్షేనా!?
నూజివీడు: రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడులోని 100 పడకల ఏరియా ఆసుపత్రిలో బ్లడ్బ్యాంకు సదుపాయం అందని ద్రాక్షగా తయారైంది. శస్త్రచికిత్సలు, కాన్పులు, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు చికిత్స చేసే సమయంలో రక్తం అవసరం ఎంతో ఉంటుంది. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లేకపోవడంతో ప్రథమ చికిత్స చేసి విజయవాడకు తరలించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయమనే డిమాండ్ గత రెండు దశాబ్దాల కాలంగా ఉన్నప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. గుడివాడ, విజయవాడ నుంచి తెస్తున్నారు నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, విస్సన్ననపేట, రెడ్డిగూడెం, మైలవరం, బాపులపాడు తదితర మండలాల నుంచి నూజివీడు ఏరియా ఆసుపత్రికి ప్రతిరోజూ 450 మంది వరకు రోగులు చికిత్స నిమిత్తం వస్తుంటారు. ప్రతినెలా కాన్పులతో పాటు జనరల్ సర్జన్స్, ఆర్ధోతో పాటు ఇతర శస్త్రచికిత్సలు 320 వరకు జరుగుతాయి. కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలైన క్షతగాత్రులకు ఎక్కించేందుకు రక్తం అందుబాటులో లేకపోవడంతో విజయవాడకు రిఫర్ చేయాల్సి వస్తోంది. అలా కాకుంటే విజయవాడ, గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్బ్యాంకు నుంచి రక్తాన్ని తెప్పించి ఆ తరువాత ఆపరేషన్లు చేస్తున్నారు. బ్లడ్బ్యాంకు వస్తే ఎన్నో లాభాలు ఏరియా ఆసుపత్రిలో బ్లడ్బ్యాంకు ఏర్పాటు చేసినట్లయితే ఎన్నో లాభాలు చేకూరతాయి. కాన్పులకు సంబంధించిన శస్త్రచికిత్సలు గాని, జనరల్ శస్త్రచికిత్సలు గాని, ప్రమాదాల్లో తీవ్ర గాయాలైన వారికి సంబంధించిన చికిత్సను గాని ఇక్కడ నిర్వహించడానికి వీలుంటుంది. అంతేగాకుండా రక్తదాతల నుంచి రక్తాని ఇక్కడే స్వీకరించవచ్చు. అలాగే పట్టణంలో, చుట్టుపక్కల గ్రామాల్లో, కళాశాలల్లో రక్తదాన శిబిరాలను నిర్వహించి రక్తాన్ని అందుబాటులో ఉంచుకోవచ్చు. పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులకు కూడా అవసరమైన రక్తాన్ని ఇవ్వడానికి సైతం వీలుంటుంది. బ్లడ్బ్యాంక్ ఏర్పాటుకు అవసరమైన పరికరాలు సైతం ఇక్కడ సిద్ధంగా ఉన్నప్పటికీ బ్లడ్బ్యాంక్ను మాత్రం ఏర్పాటు చేయడం లేదు. నూజివీడు ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ స్టోరేజీ సెంటర్కే పరిమితం రక్తం కావాలంటే విజయవాడ, గుడివాడలకు పరిగెత్తాల్సిందే ప్రతిపాదనలు పంపాం బ్లడ్బ్యాంకు ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అధికారులు తనిఖీలు పూర్తి చేసిన అనంతరం బ్లడ్ బ్యాంక్ను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ స్టోరేజీ సెంటర్ మాత్రమే ఉంది. రక్తం కావాలంటే గుడివాడ ఏరియా ఆసుపత్రి బ్లడ్బ్యాంకు నుంచి, విజయవాడలోని రెడ్క్రాస్కు చెందిన బ్లడ్బ్యాంకు నుంచి తీసుకొస్తున్నాం. – డా.ఆర్ నరేంద్రసింగ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
చిన వెంకన్న హుండీ ఆదాయం రూ.3.92 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు ప్రమోద కల్యాణ మండపంలో బుధవారం కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగింది. లెక్కింపులో శ్రీవారికి భారీగా ఆదాయం సమకూరింది. గత 34 రోజులకు నగదు రూపేణా స్వామికి రూ. 3,92,94,035 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 556 గ్రాముల బంగారం, 8.100 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2000, రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ.66,500 లభించినట్టు చెప్పారు. -
నిమ్మల జైలుకు వెళ్లలేదా?
పాలకొల్లు సెంట్రల్: ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిని ఎలా గౌరవించి మాట్లాడాలో తెలియని దుస్థితిలో మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారని పాలకొల్లు వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ గుడాల గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ .. ‘ఆ మంత్రి గారు ఎన్నికల ముందు నీకు 15, నీకు 18, నీకు 45 వేలు అంటూ కనిపించిన ప్రతి ఒక్కరికీ నగదు పంపిణీ చేస్తామని అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు’ అని జగన్మోహన్రెడ్డి మాట్లాడింది మంత్రి నిమ్మల రామానాయుడు గురించేనని, ఈ వీడియో నేటికి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుందని గోపి అన్నారు. మంత్రి నిమ్మల సహనం కోల్పోయి జగన్మోహన్రెడ్డిని ఏకవచనంతో సంభోదించడం అతని అహంకారానికి, గర్వానికి నిదర్శనమన్నారు. కోర్టులో కేసులున్న వారంతా నేరగాళ్లు కాదనే విషయం తెలుసుకోవాలన్నారు. రామానాయుడు గర్వం చూస్తుంటే రాష్ట్రంలో సెకండ్ సీఎంలా ఫీల్ అవుతున్నట్లున్నారని విమర్శించారు. మంత్రి నిమ్మల గతంలో సెంట్రల్ జైలుకు వెళ్లిన విషయం మర్చిపోయారా.. మంత్రి నిమ్మల ఎన్ని ఒత్తిళ్లకు గురిచేసినా యలమంచిలి మండలం ఎంపీటీసీలంతా జగన్కు మద్దతుగా ఎంపీపీని గెలిపించుకున్నారన్నారు. రౌడీయిజం చేసి సోషల్ మీడియా, వైఎస్సార్సీపీ నాయకులు, మీడియా ప్రతినిధులపై కేసులు బనాయించి బెదిరింపులకు దిగే కొత్త సంస్కృతిని మంత్రి నిమ్మల తీసుకువస్తున్నారన్నారు. ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు చెల్లెం ఆనందప్రకాష్ మాట్లాడుతూ.. మీరు జైలుకి వెళ్లివచ్చారు, మీ నాయకుడు చంద్రబాబు 52 రోజులు జైలులో గడిపారు. అంటే మీరిద్దరూ నేరస్తులేనా అని నిమ్మలను ప్రశ్నించారు. సూపర్ 6 అమలు చేయాలని.. అంతే గాని ఇలా బెదిరించి కేసులు పెట్టడం సమంజసం కాదని హెచ్చరించారు. సీనియర్ నాయకులు కుమార దత్తాత్రేయవర్మ మాట్లాడుతూ నియోజకవర్గంలో పేకాట శిబిరాలు, కోడి పందేలు, మద్యం సిండికేట్ల నుంచి నెలకు సుమారు రూ.కోటి ఏటీఎంలా మంత్రి నిమ్మలకు ఆదాయం వస్తుందని ఆరోపించారు. జెడ్పీటీసీ నడపన గోవిందరాజులు నాయుడు, యడ్ల తాతాజీ, కర్రా జయసరిత పట్టణ, యలమంచిలి, పోడూరు మండలాల అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు, ఉచ్చుల స్టాలిన్, కొర్రపాటి వీరాస్వామి, పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. కోర్టులో కేసులున్న వారంతా నేరగాళ్లు కాదు వైఎస్సార్సీపీ పాలకొల్లు ఇన్చార్జి గుడాల గోపి -
టీచర్ల బదిలీలకుహెల్ప్ డెస్క్ ఏర్పాటు
భీమవరం: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) భీమవరం కార్యాలయంలో బుధవారం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి హెల్ప్డెస్క్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పీఎస్ విజయ రామరాజు, ఏకేవీ రామభద్రం మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్స్ విషయంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సహాయ కేంద్రంలో ఉపాధ్యాయులు ఆన్లైన్ అప్లికేషన్స్ ఉచితంగా చేయించుకోవడమేగాక ఏమైనా అనుమానాలు ఉంటే నివృతి చేసుకోవచ్చనన్నారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు సీహెచ్ పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శులు కె.రామకృష్ణ ప్రసాద్, జి.రామకృష్ణంరాజు, అబ్రహం తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష భీమవరం: భీమవరంలో బుధవారం ఏపీ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష 5 కేంద్రాల్లో నిర్వహించారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 170 మందికి 164 మంది విద్యార్ధులు, మధ్యాహ్నం 170 మందికి 165 మంది హాజరయ్యారు. విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 110 మందికి 104, మధ్యాహ్నం 110 మందికి 106 మంది హాజరు కాగా.. విష్ణు ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 87 మందికి 83, మధ్యాహ్నం 87 మందికి 84 మంది హాజరయ్యారు. డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 100 మందికి 96 మంది, మధ్యాహ్నం 100 మందికి 96 మంది హాజరు కాగా డీఎన్నార్ అటానమస్ కళాశాలలో ఉదయం 100 మందికి 98 మంది, మధ్యాహ్నం 100 మందికి 98 మంది హాజరయ్యారు. ‘దీపం’తో పేదింట వెలుగులు భీమవరం (ప్రకాశంచౌక్): దీపం పథకం పేదింట మహిళల్లో వెలుగులు నింపిందని పర్యాటక, గృహ నిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. బుధవారం ఆయన భీమవరం దుర్గాపురంలో దీపం పథకం లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి దీపం పథకం ప్రయోజనాలు అడిగి తెలుసుకున్నారు. పేద మహిళలకు ఆర్థిక ప్రయోజనం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఆయన వెంట కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఐరన్, సిమెంట్ బస్తాల చోరీ వాస్తవమే దెందులూరు: జిల్లాలో పేదల గృహ నిర్మాణ కాలనీల్లో ఇళ్ల నిర్మాణ సామగ్రి దొంగతనాలు, దుర్విని యోగం జరిగాయని జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.సత్యనారాయణ చెప్పారు. బుధవారం ఏలూరులో తన కార్యాలయంలో సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై స్పందించారు. దెందులూరు గృహ నిర్మాణ శాఖ గొడౌన్ నుంచి స్టీల్, నూజివీడు గోడౌన్లో డోర్స్, కిటికీలు, స్టీల్, ఎలక్ట్రికల్ సామాన్లు చోరీకి గురయ్యాయాన్నారు. ఏలూరులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నూజివీడు: ఏలూరులో బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనుండటం ఈ ప్రాంతానికి వరమని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. నూజివీడులో మాట్లాడుతూ దూరవిద్య ద్వారా చదువుకునేలా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. -
కోకోకు మద్దతు ధర కల్పించాలి
ఏలూరు (టూటౌన్): కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఏలూరు అన్నే భవనంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ్ణ అధ్యక్షతన బుధవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కోకో రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మోండలీజ్ కంపెనీ ఎదుట చేసిన మహాధర్నా, దీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈనెల 23న ఏలూరు కలెక్టరేట్కు చర్చలకు పిలవడాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా రైతులకు మద్దతు ధర ఇచ్చి కోకో రైతులను ఆదుకోవాలని కోరారు. కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంతవరకు కంపెనీలు, ట్రేడర్లు కొనుగోలు చేసిన కోకో గింజలకు కూడా అంతర్జాతీయ మార్కెట్ ధర వర్తింపజేసి వ్యత్యాసపు ధర చెల్లించాలన్నారు. రైతుల నుంచి కోకో గింజలు సక్రమంగా కొనుగోలు చేయకుండా కంపెనీలు చేస్తున్న మోసాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. విదేశీ కోకో గింజలు దిగుమతులు వెంటనే నిలుపుదల చేయాలని కోరారు. కోకో రైతుల సంఘం గౌరవాధ్యక్షుడు సింహాద్రి గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ల వెంకట సుబ్బారావు, పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శులు గుదిబండి వీరారెడ్డి, కొసరాజు రాధాకృష్ణ, ఉప్పల కాశీ తదితరులు పాల్గొన్నారు. -
రూ.175 కోట్లు తాగించాల్సిందే!
మద్యాన్ని ఏరులై పారించి సంపదను సృష్టించుకునే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. జిల్లాకు రూ.175 కోట్ల నెలవారీ లక్ష్యం నిర్ణయించి ఆ మేరకు అమ్మకాలు పెంచుకునే పనిలో పడింది. లక్ష్యాన్ని చేరుకునేందుకు నిబంధనలకు నీళ్లొదిలేసింది. అనధికార పర్మిట్ రూంలు, బెల్టు షాపులు, నైట్ పాయింట్ల పేరిట పగలూ రాత్రీ తేడా లేకుండా ప్రజల్ని మద్యం మత్తులో ముంచుతోంది. గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025సాక్షి, భీమవరం: జిల్లాలో 193 మద్యం దుకాణాలు ఉండగా రోజుకు సుమారు రూ.4 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. గతేడాది అదే నెలలో జరిగిన మద్యం అమ్మకాలపై 20 శాతం పెంచేలా టార్గెట్లు విధించగా ఇప్పుడు భారీగా పెంచేసింది. పశ్చిమగోదావరి జిల్లాకు నెలకు రూ.175 కోట్ల అమ్మకాలు చేయాలని నిర్ధేశించింది. ఈ మేరకు రోజుకు రూ.6 కోట్ల వరకు మద్యం అమ్మకాలు చేయాలి. లక్ష్యాన్ని చేరుకునేలా ఎకై ్సజ్ అధికారులపై ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. రోజువారీ సమీక్షలతో ఉక్కిరిబిక్కిరవుతున్న అధికారులు లక్ష్యాన్ని చేరేందుకు నిబంధనల అమలులో చూసీచూడనట్లు ఉంటున్నారు. సిండికేట్ల ఇష్టారాజ్యంగా మారింది. ఎకై ్సజ్ పాలసీకి విరుద్ధంగా ఇప్పటికే మద్యం బాటిల్పై అదనంగా రూ.10 వరకు ఎమ్మార్పీకి మించి అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. ఒక్కో షాపు పరిధిలో రెండు నుంచి ఐదు వరకు బెల్టులు నిర్వహిస్తున్నారు. షాపుల వద్దనే మద్యం సేవించేందుకు టేబుళ్లు, కుర్చీలతో సిట్టింగ్ ఏర్పాట్లు, మంచింగ్ కోసం ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, సోడా, డ్రింక్, వాటర్ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. లూజ్ సేల్స్, నైట్ పాయింట్ల పేరిట చాలా చోట్ల మద్యం అమ్మకాలు చేస్తున్నారు. భారీగా పెరిగిన అమ్మకాలు కూటమి పాలనలో జిల్లాలోని ఆరు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగిపోయాయి. ప్రైవేట్ పాలసీ వచ్చిన గత ఏడాది అక్టోబరు 16 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకూ 9,42,129 కేసుల లిక్కర్, 3,86,035 కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి. గత ప్రభుత్వంలో 2023 అక్టోబరు 16 నుంచి 2024 మార్చి నెలాఖరు వరకూ 7,60,837 కేసుల లిక్కర్, 2,16,535 కేసుల బీర్ల అమ్మకాలు మాత్రమే జరగడం గమనార్హం. గతంతో పోలిస్తే ప్రైవేట్ పాలసీ వచ్చాక 24 శాతం మేర లిక్కర్, 80 శాతం మేర బీర్ల అమ్మకాలు పెరిగాయి. వీటిని మరింత పెంచుకునేందుకు భారీగా టార్గెట్లను నిర్దేశిస్తోంది. శాంతి భద్రతలకు విఘాతం అమ్మకాలు పెంచుకునేందుకు ప్రభుత్వం నిబంధనలకు గాలికొదిలేస్తుండటంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. ఇటీవల తణుకు ఉండ్రాజవరం గణేష్చౌక్ ప్రాంతంలోని మద్యం దుకాణం వద్ద నైట్పాయింట్ పేరిట అనధికారికంగా తెల్లవార్లు మద్యం అమ్మకాలు చేశారు. అర్థరాత్రి మద్యం కోసం వచ్చిన వ్యక్తికి సిబ్బంది మధ్య వివాదం చోటుచేసుకుంది. మద్యం కొనుగోలుకు వచ్చిన వ్యక్తి సిబ్బందిపై రాడ్తో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. వేల్పూరులోని మద్యం దుకాణం కాంపౌండ్లో అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతిచెందడం వివాదస్పదమైంది. గతంలో ఊరికి దూరంగా ఉన్న దుకాణాలు ఇప్పుడు జనావాసాల మధ్యలోకి వచ్చాయి. మందుబాబుల ఆగడాలతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. న్యూస్రీల్ మద్యంతో సంపద సృష్టి జిల్లాల వారీగా ఎకై ్సజ్ శాఖకు నెలవారీ టార్గెట్లు తాగించాల్సిందేనంటూ ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడి అనధికార పర్మిట్ రూంలు, విచ్చలవిడిగా బెల్టుల ఏర్పాటు 6 నెలల్లో 24 శాతం లిక్కర్, 79 శాతం పెరిగిన బీర్ల అమ్మకాలు గత ప్రభుత్వంలో.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ప్రభుత్వ మద్యం పాలసీని తెచ్చి నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు చేసేవారు. బెల్టుషాపులు పూర్తిగా అరికట్టారు. షాపుల వద్ద కొనుగోలు చేసి తీసుకెళ్లడమే తప్ప తాగేందుకు వీలు లేకుండా చేశారు. ఎమ్మార్పీకి మించి అధిక ధరల ఊసే లేదు. నాడు మద్యంపై వచ్చే ఆదాయం మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరి ప్రజావసరాలకు ఉపయోగపడితే.. నేడు అధిక ధరలు, బెల్టు షాపుల రూపంలో కూటమి నేతలు, సిండికేట్ల జేబుల్లోకి వెళ్తుండడం గమనార్హం. అప్పట్లో ఊరి చివర ఎక్కడో ఉన్న మద్యం దుకాణాలు ఇప్పుడు జనావాసాల్లోకి వచ్చేశాయి. -
రెండు కిలోమీటర్లు వెళ్లాలి
ఇంటింటికి రేషన్ సరుకుల వాహనాలు నిలిపివేస్తే రేషన్ షాఫునకు రెండు కిలోమీటర్లు నడిచివెళ్లి బియ్యం తెచ్చుకోవాలి. కూలి పనులు చేసుకుని జీవించే మాలాంటి వాళ్లకు రేషన్ కోసం ఒక రోజు పని మానేయాలి. క్యూలైన్లో ఎక్కువ మంది ఉంటే మరో రోజు వెళ్లక తప్పదు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇబ్బందులు తప్పవు. మెరిపే లక్ష్మీపార్వతి, కోమటిచెరువు, పెనుమంట్ర మండలం అనారోగ్యంతో ఎలా తెచ్చుకోగలం? ఇంటికి వచ్చి రేషన్ ఇవ్వడం వల్ల ఐదేళ్లుగా ఎలాంటి ఇబ్బందిలేదు. ఇప్పుడు పాత పద్దతిలో రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవాలంటే అనారోగ్యంతో బాధపడే నాలాంటి వారికి పరిస్థితి కష్టం. కష్టపడి వెళ్తే వేలిముద్రలు పడడం లేదంటూ మళ్లీ రమ్మనడం పరిపాటే. దీనితో రెండు రోజులు రేషన్ కోసం పడిగాపులు కాయాల్సివస్తుంది. – కొండేటి మోహన్రావు, ఆలమూరు, పెనుమంట్ర మండలం ఉపాధి కోల్పోతాం గత ఐదేళ్లుగా ఎండీయూ వాహనంతో రేషన్ సరుకులను మండలంలోని మేడపాడు, అడవిపాలెం గ్రామాల్లో పంపిణీ చేస్తున్నాను. ప్రభుత్వం ఎండీయూ వాహనాలను నిలిపేవయడంతో మాకు ఉపాధికరువై కుటుంబపోషణ దుర్బరంగా మారే అవకాశముంది. ప్రభుత్వం ఎండీయూ వాహన నిర్వాహకులకు ఉపాధి కల్పించాలి. – పెదపాటి ప్రవీణ్కుమార్, మట్లపాలెం, యలమంచిలి మండలం మా పరిస్థితి ఏంటి? ఇంతకాలం ప్రజలకు ఇంటింటికీ ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకులు ఇస్తే ఇప్పుడు ఉన్నట్టుండి వాహనాలను నిలిపి వేస్తామనడం దారుణం. రేషన్ సరుకుల పంపిణీ ద్వారానే జీవనం సాగించాం. అకస్మాత్తుగా మమ్మల్ని రోడ్డుమీద వదిలేస్తే మా పరిస్థితి ఏంటి. మాకు ఉపాధి చూపించాలి. – యామల ఆంజనేయులు, శృంగశృక్షం, ఎండీయూ నిర్వహకుడు ● -
హడలెత్తిన భీమడోలు
భీమడోలు: మంగళవార అర్ధరాత్రి భీమడోలు హడలిపోయింది. క్షతగాత్రులు, ప్రయాణికుల ఆర్తనాదాలతో, అంబులెన్స్లు, పోలీసుల సైరన్లతో ఆ ప్రాంతం దద్ధరిల్లింది. వరుస ప్రమాదాలతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఆగి ఉన్న వ్యాన్ను మరో వ్యాన్ ఢీకొనడంతో తణుకుకు చెందిన కోడూరి వెంకట రామచరణ్ (17) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా గుంటూరు జిల్లా తిమ్మలపాలెంకు చెందిన వ్యాన్ డ్రైవర్ మామిడి జయరామ్, భార్య మామిడి ప్రశాంతి క్యాబిన్లో ఇరుక్కుపోయారు. ఎస్సై వై.సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వ్యాన్లో ఇరుక్కున దంపతులను బయటకు తీసి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఢీకొన్న మూడు ప్రైవేట్ బస్సులు అదే సమయంలో వస్తున్న ట్రావెల్ బస్సు ట్రాఫిక్ కోన్లను గుర్తించకుండా సడన్ బ్రేక్ కొట్టి ఢీకొంది. దాని వెనుక మరో రెండు బస్సులు రాగా మొత్తం మూడు బస్సులు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. మధ్యలో ఉన్న బస్సు డ్రైవర్తో పాటు 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యలో ఇరుక్కున్న బస్సు ముందు, వెనుక భాగాలు నుజ్జయ్యాయి. మూడో బస్సుల్లోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు పెదపట్నం బాపన్న, అదే జిల్లాలోని ద్రాక్షారామలోని వనుం రామారావు, రావులపాలెంలోని లక్ష్మీపురంనకు చెందిన కొట్టింగ నాగరాజు, కొట్టింగ మీరమ్మలకు గాయాయ్యాయి. మరో బస్సులో అమలాపురంలోని నడిపూడి విత్తనాల నాగరాజు, హైదరాబాద్కు చెందిన కేసినకుర్తి చంటిబాబు, విత్తనాల పవన్కుమార్, పీసకాయల మోగవల్లిక, శ్రీపూర్ణ దీప్తి గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్లో భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి, అనంతరం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో భార్యాభర్తలు కొట్టింగ నాగరాజు, కొట్టింగ మీరమ్మలు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అర్ధరాత్రి వరుస ప్రమాదాలు యువకుడి మృతి, పది మందికి తీవ్ర గాయాలు అన్నకు బై చెబుదామని వచ్చి.. తణుకుకు చెందిన కోడూరి దుర్గాలోకేష్, వెంకట రామచరణ్ (17) అన్నదమ్ములు. వీరు అమ్మమ్మ ఊరైన పోలసానిపల్లి వచ్చారు. తండ్రి లేకపోవడంతో దుర్గాలోకేష్ చేపల ప్యాకింగ్ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వెంకట రామచరణ్ ఇంటర్ చదువుతున్నాడు. లోకేష్ గుంటూరు జిల్లా వినుకొండలోని చేపల ప్యాకింగ్కు రాత్రి బయలుదేరాడు. అన్నను భీమడోలు రైల్వేగేటు వద్ద డీసీఎం వాహనం ఎక్కించి రామచరణ్ బై చెబుతుండగా వెనుక నుంచి అశోక్ లేలాండ్ వ్యాన్ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామచరణ్ అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. తన కళ్లముందే తమ్ముడు మృతి చెందడంతో దుర్గాలోకేష్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. తల్లి, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
మనవడి దాడి.. అమ్మమ్మ మృతి
భీమవరం: మనవడు కొట్టడంతో అమ్మమ్మ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఇది. భీమవరం టూటౌన్ సీఐ జి.కాళీచరణ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్రి మాణిక్యం (79) అనే వృద్ధురాలు రాయలం ప్రాంతానికి చెందిన భూదేవి తోటలో తన కుమార్తె ఇంట్లో ఉంటుంది. కాగా ఆమె కుమార్తెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో పెద్ద మనవడికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఆ చిన్నారి ఇంటి ఆవరణలోని పూల మొక్కలు లాగేస్తుండగా మృతురాలు ఆగ్రహం వ్యక్తం చేసి తిట్టింది. అమ్మమ్మ తీరుపై ఆమె రెండో మనవడు తోట మధు ప్రశ్నించగా ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆవేశానికి గురైన మధు కొట్టడంతో అమ్మమ్మ మాణిక్యం కింద పడి మృతి చెందింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి దెందులూరు: విద్యుత్ షాక్తో ఒక వ్యక్తి మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఎలా ఉన్నాయి. బుధవారం ఏలూరు రూరల్ మండలం లింగారావు గూడెం చెరువు వద్ద పనికి వచ్చిన పెరుమాళ్ళ తాతారావు (50) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఈ ప్రమాదంలో చెరువు యజమాని మార్త శివకుమార్ కూడా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. -
రెండో మత్స్యకార సంఘం వద్దు
టి.నరసాపురం: బొర్రంపాలెంలో రెండో మత్స్యకార సంఘాన్ని ఏర్పాటు చేయవద్దు అంటూ అమలులో ఉన్న మత్స్యకార సహకార సంఘ నాయకులు బత్తుల రమేష్, గుండె చిన్న చిట్టయ్య పలువురు సభ్యులు బుధవారం ఉన్నతాధికారులకు వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు బత్తుల రమేష్, నాయకులు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా బొర్రంపాలెంలో ఒకే మత్స్యకార సంఘం ఉందన్నారు. ఆ సంఘంలో 300 మంది సభ్యులు ఉండి కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలవ జలాశయంలో బొర్రంపాలెం రేవులో చేపల వేటకు వెళ్లి జీవనోపాధి సాగిస్తున్నామన్నారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం మరో మత్స్యకార సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒక మత్స్యకార సంఘం అమలులో ఉండగా మరో సంఘం ఏర్పాటు చట్ట ప్రకారం తప్పని వివరించారు. కొత్త సంఘం ఏర్పాటును వ్యతిరేకిస్తూ జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, మత్స్య శాఖ జెడీ, పంచాయతీరాజ్ కమిషనర్లకు ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదులను సమర్పించామని వివరించారు. -
పొట్టకూటి కోసం వెళ్లి.. ప్రాణాలు వదిలి
ఉండి : పొట్టకూటి కోసం వెళ్లిన వ్యక్తికి విద్యుత్ షాక్ తగలడంతో మృతి చెందాడు. ఈ ఘటన ఉండి మండలం వెలిపర్రులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం బొజ్జా రవి(23), నాగరాజు అనే ఇద్దరు బోదెల్లో, కాలువల్లో చేపలు పట్టి కుటుంబాలను పోషించుకుంటున్నారు. బుధవారం వెలివర్రులోని ఆక్వా చెరువుల వద్ద ఉన్న బోదెలో చేపలు పట్టేందుకు వెళ్లారు. రవి తన వద్ద ఉన్న వలతో చేపలను పట్టేందుకు బోదెలోకి దిగగా విద్యుత్ పోల్ నుంచి కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగ కాలికి చుట్టుకుని విద్యుత్ షాక్కు గురయ్యాడు. స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించడంతో వారు విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు. అయితే అప్పటికే రవి మృతి చెందాడు. ఎస్సై ఎండీ నసీరుల్లా ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుడు రవికి ఏడాది క్రితం భీమవరం లంకపేటకు చెందిన మావుళ్ళుతో వివాహమైంది. వారికి నెల రోజుల క్రితం మగబిడ్డ పుట్టాడు. తమకు దిక్కెవ్వరూ రవి భార్య, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ద్వారకాతిరుమల: స్థానిక లింగయ్య చెరువు వద్ద పడిపోయిన గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఎస్సై టి.సుధీర్ తెలిపిన వివరాలు ప్రకారం. లింగయ్య చెరువు వద్ద సుమారు 50 సంవత్సరాల వయస్సుగల వ్యక్తి మంగళవారం ఉదయం పడిపోయాడు. వెంటనే దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తిని స్థానిక పీహెచ్సీకి, అక్కడి నుంచి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు సెల్ నెంబర్ 94407 96653కు సమాచారం అందించాలని ఆయన కోరారు. చికిత్స పొందుతూ జట్టు కూలీ మృతి భీమడోలు: గుండుగొలను శివారు బీసీ కాలనీ వద్ద తవుడు లారీ బోల్తా ఘటనలో జట్టు కూలీ గొర్జి శ్రీనివాసరావు(52) బుధవారం మృతి చెందాడు. ఈనెల 20వ తేదీ సాయంత్రం రత్నాపురంలోని ఆక్వా చెరువుల వద్దకు తవుడు బస్తాలను దిగుమతి చేసేందుకు ఏడుగురు జట్టు కూలీలు లారీ ఎక్కారు. గుండుగొలను నుంచి రత్నాపురం వెళ్తుండగా మార్గమధ్యమైన గుండుగొలను బీసీ కాలనీ వద్ద లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కూలీలకు గాయాలయ్యాయి. వారిలో తీవ్ర గాయాలైన గొర్జి శ్రీను ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెల్ఫోన్ల రికవరీ తాడేపల్లిగూడెం (టీఓసీ): రైలు ప్రయాణికులు పొగొట్టుకున్న సెల్ఫొన్లను సీఈఐఆర్ వెబ్సైట్ ద్వారా రైల్వే పోలీసులు దొంగల వద్ద నుంచి రికవరీ చేశారు. వీటి విలువ రూ.1,50,000గా నిర్థారించారు. ఫొన్లు పొగొట్టుకున్న ప్రయాణికులను బుధవారం పట్టణంలోని రైల్వే పోలీస్ స్టేషన్కి పిలిపించి సెల్ఫొన్లను అందజేశారు. కార్యక్రమంలో రైల్వే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఈ.అప్పారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి సాగుపై లెక్కలు చెప్పండి
ఉండి : లెక్కాపత్రాలు లేకుండా ప్రకృతి సాగు ఎక్కువగా చేస్తున్నారని చెబితే నమ్మేదెలా అంటూ రాష్ట్ర అడిషినల్ సీఎస్ అజయ్జైన్ రైతుల ఎదుటే వ్యవసాయాధికారులను ప్రశ్నించారు. బుధవారం మండల పర్యటనలో భాగంగా జేసీ రాహూల్కుమార్రెడ్డితో కలసి ముందుగా మహదేవపట్నం గ్రామంలో పర్యటించిన ఆయన సచివాలయం, అంగన్వాడీ తదితర ప్రదేశాలను పరిశీలించి స్థానికులతోను, అధికారులతో సమావేశమై మాట్లాడారు. అనంతరం ఎన్నార్పీ అగ్రహారంలో ప్రకృతి సాగు నిర్వహిస్తున్న ఓ రైతు క్షేత్రాన్ని పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయంపై చేపట్టిన కార్యక్రమాలపై ప్రదర్శించిన బ్యానర్లను పరిశీలించా అధికారులను లెక్కలు అడిగారు. దానికి వారి నుంచి కొంత ఆలస్యంగా జవాబు వచ్చినా చివరకు 563 ఎకరాలు అంటూ సిబ్బందిలో ఒకరు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు, లెక్కలు లేకుండా ఎలా నమ్మేది అంటూ వారిని ఆయన ప్రశ్నించారు. దీంతో వ్యవసాయాధికారులు నీళ్లు నమిలారు. అనంతరం బ్యానర్లలో ప్రదర్శిస్తున్న డ్రోన్ల గురించి ఆరా తీశారు. ప్రస్తుతం మీ వద్ద ఎన్ని డ్రోన్లు ఉన్నాయని ఆరా తీయగా రెండు ఉన్నాయని.. అవి పనిచేయడం లేదని సమాధానమివ్వడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. డ్రోన్ పైలట్ సరిగా ఆపరేట్ చేయకపోవడంతో అది కాస్త చెట్టుకు ఢీకొని పాడైందని సమాధానమివ్వడంతో ఎందుకు బాగు చేయించలేదంటూ ఆరా తీశారు. అనంతరం నిర్వహించిన ఓ చిరుధాన్యాల స్టాల్ను కూడా ఆయన పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం లాభసాటి అయితే ఎందుకు ఎక్కువమంది రైతులు సాగుచేయడం లేదంటూ ప్రశ్నించారు. మార్కెట్లో ఆర్గానిక్ పేరు చెప్పి సాధారణ పంటలు కూడా అమ్మేస్తున్న కారణంగా వినియోగదారులు నమ్మలేకపోతున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వమే నయం కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఓ రైతు ఈ ప్రభుత్వంలో ధాన్యం అమ్మిన వెంటనే రైతు ఖాతాలో సొమ్ము పడిపోతుందంటూ నమ్మబలికాడు. అయితే దానికి రైతు కవురు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పలువురు రైతులు ఎదురుదాడికి దిగారు. గత ప్రభుత్వంలోనే వెంటనే సొమ్ములు వచ్చేవని ఎవరో కొందరికి మాత్రమే ఆలస్యం అయ్యాయని ఏ ప్రభుత్వంలో అయినా అలాగే జరుగుతుందని రైతులు అడిషినల్ సీఎస్కు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ధాన్యం అమ్మకం చేసి చాలా రోజులైనా ఇంతవరకు తమకు సొమ్ములు ఖాతాల్లో పడలేదని కోటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ప్రవీణ్కుమార్రెడ్డి, ఏడీఏ శ్రీనివాస్, తహసీల్దార్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయాధికారులను ప్రశ్నించిన రాష్ట్ర అడిషినల్ సీఎస్ డ్రోన్లు సైతం పనిచేయకపోవడంపై అసహనం -
అలరించిన నాటిక పోటీలు
ఉద్యాన పంటల సాగుపై శ్రద్ధ ఉద్యాన పంటల సాగుపై వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలో అధికారులు, రైతులతో ఏపీఎంఐపీ పీడీ, ఉద్యాన శాఖ జేడీ సమీక్షించారు. 8లో uఏలూరు (ఆర్ఆర్పేట): అంబికా సంస్థల వ్యవస్థాపకుడు ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం, హేలాపురి కళా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి నాటిక పోటీలు మంగళవారంతో ముగిశాయి. నాలుగో రోజు కొలకలూరు శ్రీ సాయి ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రదర్శించిన జనరల్ బోగీలు, రెండో ప్రదర్శనగా వీరన్నపాలెం కళానికేతన్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన రుతువు లేని కాలం నాటికలకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. అద్భుతమైన కథాంశాలతో నటీనటుల హృద్యమైన నటనతో నాటికలు రక్తికట్టించాయి. అంబికా సంస్థ ఛైర్మన్ అంబికా కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. నాటిక, నాటకాల ప్రదర్శనలో కళాకారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటారని వాటిని గుర్తించి సహకరించాలన్నారు. వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు యర్రా సోమలింగేశ్వరరావు, సెక్రటరీ కళారత్న కేవీ సత్యనారాయణ, ఎగ్జి క్యూటివ్ కమిటీ అధ్యక్షుడు ఇరదల ముద్దుకృష్ణ, సెక్రటరీ మజ్జి కాంతారావు, అంబికా ప్రసాద్, అంబికా రాజా, డెంటల్ కాలేజీ కరస్పాండెంట్ జీ.మోజెస్ తదితరులు పాల్గొన్నారు.