West Godavari District News
-
మానసిక దివ్యాంగుల సంరక్షణకు చర్యలు
భీమవరం(ప్రకాశంచౌక్): తల్లిదండ్రులు లేని మానసిక, బహుళ వైకల్యాలు గల బిడ్డల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్లో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ట్రస్ట్ యాక్ట్ పై ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మానసిక, బహుళ వైకల్యాలు ఉన్న పిల్లల పెంపకం, ఆహారం తదితర అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని ఏడుగురు విభిన్న ప్రతిభావంతులకు ఒక్కోటి రూ.38 వేల విలువైన ల్యాప్టాప్లను అందజేశారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకుడు బి.రామ్కుమార్, కమిటీ సభ్యులు అంజలి ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిటేషన్ ప్రతినిధి ప్రసాద్, దివ్యాంగ మహా సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఎస్ఎస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. వడగాల్పులపై అప్రమత్తం జిల్లాలో ఎండ తీవ్రత కారణంగా వడగాల్పును తట్టుకునేందుకు ముందస్తుగా తీసుకోవలసిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి గూగుల్ మీట్ ద్వారా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై సమీక్షించారు. ఈనెల 17న ‘బీట్ ద ఈట్’ థీమ్తో కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. -
ఎకై ్సజ్ ఏసీ తనిఖీలు
తణుకు అర్బన్: తణుకు ఎకై ్సజ్ శాఖ పరిధిలో పెండింగ్లో ఉన్న అన్ని కేసుల్లోను తక్షణమే చార్జ్షీట్స్ వేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ కె.నాగ ప్రభుకుమార్ ఆదేశించారు. గురువారం తణుకు ఎకై ్సజ్ కార్యాలయంలో ఆయన తనిఖీలు చేశారు. గంజాయి, డ్రగ్స్ తదితర కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం తణుకు శివారులోని ఆంధ్రా డిస్టిలరీస్, వాన్బెర్రీ ప్రైవేట్ లిమిటెడ్లోని మిథనాల్, ఆర్ఎస్ యూనిట్లను పరిశీలించారు. రసాయనాల వాడకంలో లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. పెండింగ్ కేసుల రిజిస్టర్లను పరిశీలించారు. ఎకై ్సజ్ సీఐ సత్తి మణికంఠరెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు. ఐటీఐ ప్రవేశాలకు 24 వరకు గడువు ఉండి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశానికి ఈనెల 24న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఐటీఐ జిల్లా కన్వీనర్, ఎన్నార్పీ అగ్రహారం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ వి.శ్రీనివాసరాజు తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లను (ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం, ఆచంట) సమీపంలోని ప్రభుత్వ ఐటీఐల్లో వెరిఫికేషన్ చేయించుకుని రశీదు పొందాలని, వారు మాత్రమే కౌన్సెలింగ్కు అర్హులని తెలిపారు. వివరాలకు నేరుగా లేదా ఫోన్ 08816 297093, 9676099988 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈసెట్లో ఆకివీడు విద్యార్థినికి ఫస్ట్ ర్యాంక్ ఆకివీడు: జేఎన్టీయూ అనంతపురం నిర్వహిం చిన ఏపీఈసెట్– 2025 పరీక్షలో బీఎస్సీ స్ట్రీమ్లో ఆకివీడు మండలం తరటావకు చెందిన కొట్టి గంగా భవానీ రాష్ట్రస్థాయిలో 95 మార్కులతో ప్రథమ ర్యాంకు సాధించింది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే దళిత కుటుంబానికి చెందిన కొట్టి కాశీ విశ్వనాథం, ధనలక్ష్మి దంపతుల కుమార్తె గంగాభవానీ మండలంలోని తరటావ, చినకాపవరం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల్లో పదో తరగతి వరకు చదివింది. ఇంటర్ హనుమాన్ జంక్షన్లోని జేఎన్జీ జూనియర్ బాలికల కాలేజీలో పూర్తిచేసి, డిగ్రీ ఏలూరులోని సీహెచ్ఎస్డీ థెరిస్సా అటానమస్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్, మ్యా థ్స్లో 93 శాతం మార్కులు సాధించింది. ఈసెట్ కోసం ఇంటి వద్ద నుంచి ప్రీపెర్ కాగా 95 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. బీటెక్ కంప్యూటర్స్ చదవాలనే ఆశయంతో ముందుకు వెళుతున్నట్టు ఆమె తెలిపింది. తల్లిదండ్రులు ఇద్దరూ నిర్లక్ష్యరాస్యులు కాగా ఆమె సోదరుడు అంధుడు. ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ భీమవరం: జిల్లాలో గురువారం ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఫస్టియర్ జనరల్ కేటగిరీలో 8,281 మందికి 7,925 మంది, ఒకేషనల్ కేటగిరీలో 594 మందికి 535 మంది హాజరయ్యారు. సెకండియర్ జనరల్ కేటగిరీలో 1,049 మందికి 963 మంది, ఒకేషనల్ కేటగిరీలో 192 మందికి 173 మంది హాజరయ్యారని, ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు తెలిపారు. ఏలూరు జిల్లాలో.. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లాలో ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు 6,067 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్ పరీక్షలకు 5,059 మందికి 4,830 మంది, ఒకేషనల్ పరీక్షలకు 390 మంది హాజరయ్యారు. సెకండియర్ జనరల్ పరీక్షలకు 650 మందికి 601 మంది, ఒకేషనల్ పరీక్షలకు 269 మందికి 246 మంది హాజరయ్యారు. విద్యాహక్కుకు విఘాతం ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా విద్యాశాఖాధికారుల తీరుతో 98 మంది పేద విద్యార్థుల విద్యాహక్కుకు విఘాతం కలిగించారని ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జీజేఏ స్టీవెన్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాటి వెంకటరమణ, తోట ప్రసాద్ ప్రకటనలో ధ్వజమెత్తారు. ఏలూ రు రూరల్ మండలంలోని కండ్రికగూడెం ఎంపీయూపీ పాఠశాల పునర్వ్యవస్థీకరణలో భా గంగా 241 మంది విద్యార్థులుండగా ప్రాథమి క పాఠశాలలో 98 మంది విద్యార్థులున్నారని పేర్కొన్నారు. అయితే 98 మంది విద్యార్థులను కిలోమీటరుకు పైగా దూరమున్న మరో పాఠశాలకు తరలించడంతో వీరంతా చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. -
కొల్లేరులో తుపాకుల మోత
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పక్షులను తోలే సంప్రదాయ వలస కూలీలు నాటు తుపాకులను వినియోగించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దశాబ్దాలుగా కొల్లేరులో నాటు తుపాకుల సంస్కృతి కొనసాగుతుండగా ఏటా పలువురు మృత్యువాతపడటం, గాయాల పాలవడం షరా మాములుగా తయారైంది. పెద్ద పక్షులు చెరువుల్లోని చేపలను ఆహారంగా తీసుకోవడానికి వచ్చినప్పుడు నల్లమందు వినియోగించి తుపాకీ పేలుళ్ల శబ్ధం చేస్తే కొన్ని గంటల పాటు చెరువు దరిదాపుల్లోకి రావు. దీంతో ఎక్కువ చెరువుల వద్ద గన్కల్చర్ను కొనసాగిస్తున్నారు. తాజాగా గత నెలలో మందుగుండు పేలి పది మంది గాయాలపాలై నలుగురు మరణించడం, అలాగే రెండు రోజుల క్రితం మిస్ఫైర్తో ముగ్గురు గాయాలైన ఘటన కొల్లేరులో చోటు చేసుకుంది. చెరువుల కాపలా పనులు చేస్తూ.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలో 901 చదరపు కిలోమీటర్ల పరిధిలో 2,22,300 ఎకరాల్లో కొల్లేరు విస్తరించి ఉంది. 12 మండలాల్లో 3.50 లక్షల మంది ప్రజలు కొల్లేరుపై ఆధారపడి జీవిస్తున్నారు. మంచినీటి సరస్సుగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. విదేశాల నుంచి శీతాకాలంలో లక్షల సంఖ్యలో పక్షులు వలస వచ్చి కొల్లేరులో గుడ్లు పొదిగి తిరిగి వెళ్తుంటాయి. ఏటా కొల్లేరుకు విదేశాల నుంచి లక్షన్నరకు పైగా వివిధ జాతుల పక్షులు వీటిలో అత్యధికంగా పెలికాన్ పక్షులు వస్తుంటాయి. కొల్లేరులో ఆక్రమణల పర్వం దశాబ్దాలుగా యథేచ్ఛగా సాగుతోంది. ప్రజాప్రతినిధుల అండదండలతో అక్రమ సాగు అనేది ఇక్కడ నిత్యకృత్యం. ఈ క్రమంలో కొల్లేరులో చేపల చెరువుల కాపలా పనులకు నెల్లూరు, తమిళనాడుకు చెందిన వలస కూలీల కుటుంబాలు నిర్వహిస్తుంటాయి. ప్రధానంగా పులికాట్ సరస్సు ప్రాంతం వద్ద ఉండే వీరు సీజన్లో ఇక్కడకు వచ్చి పనులు చూసుకుని వెళ్తుంటారు. గన్ కల్చర్ పక్షులను తోలటానికి నాటు తుపాకుల వాడకం నల్లమందు వినియోగించి పేలుళ్లు నెల్లూరు, తమిళనాడు నుంచి వలస కూలీల రాక తుపాకుల మిస్ఫైర్తో తరచూ ప్రమాదాలు కొల్లేరు అక్రమ చెరువులన్నింటి వద్ద ఇదే పరిస్థితి గత నెలలో మందుగుండు పేలి నలుగురు మృతి రెండు రోజుల క్రితం ముగ్గురికి గాయాలు ప్రమాదం అంచున పని స్థానికంగా కొల్లేరు ప్రాంతంలో నాటు తుపాకులు అద్దెకు ఇస్తుంటారు. కేవలం చెరువుల వద్దకు కాపలాకు మాత్రమే వీటిని వినియోగిస్తుంటారు. కొందరు వలస కూలీలు రోజూ కూలి కోసం ప్రమాద అంచున నిత్యం పనిచేస్తున్నారు. తుపాకుల పేలుళ్లు ప్రమాదమని తెలిసినా గత్యంతరం లేక ఇదే పని చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక కులానికి చెందిన వారే నాటు తుపాకులతో పక్షులను వేటాడుతుంటారు. గత నెలలో కై కలూరు నియోజకవర్గం భైరవపట్నంలో ఇవే కుటుంబాలకు చెందిన ఒక ఇంట్లో మందుగుండు పేలి పది ఇళ్లు తగలబడి నలుగురు మృత్యువాతపడగా ముగ్గురికి గాయాలయ్యాయి. అలాగే రెండు రోజుల క్రితం కై కలూరు మండలం రామవరంలో మందుగుండు పేలి చరణ్, మణి సతీష్, కందాపుల మణికి తీవ్ర గాయాలయ్యాయి. నల్లమందుతో నాటు తుపాకులు భాస్వరం, పొటాషియం వంటి పేలుడు పదార్థాలను నూరి నల్లమందును తయారు చేస్తారు. చిన్నపాటి రాపిడి జరిగితేనే పేలే స్వభావం ఉంటుంది. వీటిని నాటు తుపాకుల్లో నింపి గాల్లో పక్షులు వచ్చినప్పుడు కాల్పులు చేస్తుంటారు. ప్రధానంగా తమిళనాడు, రాష్ట్రంలోని సూళ్ల్లూరుపేటకు చెందిన 150 కుటుంబాలు కై కలూరు, ఉండి నియోజకవర్గాల్లో నివాసం ఉన్నాయి. ఆక్వా చెరువుల యజమానులు రోజు కూలికి వీరిని తీసుకు వెళ్తుంటారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు చెరువు వద్ద నాటు తుపాకీతో కాపలా ఉంటే పెద్ద పక్షిని తోలితే రూ.200 నుంచి రూ.300 వరకు ఇస్తుంటారు. అలా కొందరు రూ.1,000 నుంచి రూ.3 వేల వరకు సంపాదించే పరిస్థితి. వీరు చెరువుల వద్దే తాత్కాలిక పాకలు వేసుకుని నివాసం ఉంటారు. -
తనిఖీలు నామమాత్రం.. తవ్వకాలు నిత్యకృత్యం
ద్వారకాతిరుమల: పోలవరం కుడి కాలువ గట్టుపై జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై ‘సాక్షి’లో ప్రచురించిన వరుస కథనాలకు ఎట్టకేలకు మైనింగ్ విజిలెన్స్ అధికారుల్లో చలనం కలిగింది. అయితే గురువారం అధికారులు చేపట్టిన తనిఖీలు విమర్శలకు తావిచ్చాయి. ద్వారకాతిరుమల మండలంలోని పంగిడిగూడెం, ఎం.నాగులపల్లి వద్ద పోలవరం కుడి కాలువ గట్టుపై గ్రావెల్ను అక్రమంగా తవ్వుతూ కూటమి నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై వరుస కథనాలు ప్రచురించగా అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉదయం కాలువ గట్టుపైకి వచ్చిన విజిలెన్స్ అధికారులు ఒక్కచోట మాత్రమే కారు దిగి పరిశీలించారు. అది కూడా అనుమతులు ఇచ్చిన ప్రాంతంలోనే పరిశీలించి.. మిగిలిన రెండు పాయింట్లను పట్టించుకోలేదు. అధికారులు వెళ్లిన కొద్దిసేపటికే అక్రమార్కులు పొక్లెయిన్లు తీసుకువచ్చి యథేచ్ఛగా గ్రావెల్ తవ్వి తరలించారు. గ్రావెల్ను కై కలూరు–పామర్రు హైవే రహదారి నిర్మాణం, నారాయణపురంలో చేపల చెరువుల గట్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. అధికారుల తనిఖీల సంగతి కూటమి నేతలకు ముందే తెలిసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా కాలువ గట్టును తవ్విన ప్రాంతాల్లో భారీ గోతులు కనిపిస్తున్నా అధికారులు ఏమీ లేనట్టు వెళ్లిపోవడం రైతులను విస్మయానికి గురిచేసింది. ఇక పచ్చ నేతలు ఇచ్చే రిపోర్టే.. అధికారుల తుది నివేదిక అవుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చక్రం తిప్పుతున్న ముగ్గురు పచ్చ నేతలు ప్రధానంగా గ్రావెల్ దందాలో ముగ్గురు పచ్చ నేతలు చక్రం తిప్పుతున్నారు. అన్ని వ్యవహారాలను వారు మేనేజ్ చేస్తున్నట్టు సమాచారం. పోలవరం కుడి కాలువ గట్టుకు తూట్లు నామమాత్రంగా అధికారుల పరిశీలన -
రూ.75 కోట్ల పనులు రద్దు!
సాక్షి, భీమవరం: ఏళ్ల తరబడి పట్టి పీడిస్తున్న సమస్యలకు త్వరలో పరిష్కారం లభిస్తుందన్న ప్రజల ఆశలపై కూటమి నీళ్లు చల్లింది. టెండర్ల దశకు చేరిన రూ.75.28 కోట్ల విలువైన ఏడు పనులకు బ్రేక్ వేసింది. ఆ పనులు మొదలు పెట్టాలని కూటమి నేతలు కోరినా ఫలితం లేదు. సమస్యను ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పనులు జరిగేట్టు చూడాలని కోరినట్టు సమాచారం. అప్రోచ్లకు మోక్షం కలిగేనా? డెల్టా ఆధునికీకరణలో భాగంగా దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలో భీమవరం నియోజకవర్గంలోని యనమదుర్రు డ్రెయిన్పై వంతెనల నిర్మాణానికి రూ.110 కోట్లు మంజూరు చేశారు. గొల్లవానితిప్ప, దొంగపిండి, పట్టణంలో రెస్ట్హౌస్ రోడ్డు వద్ద వంతెనలు నిర్మించారు. నిధులు చాలక అప్పట్లో అప్రోచ్ రోడ్ల నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో రాకపోకలకు ఆయా గ్రామాల ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు అదుపుతప్పి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో స్థానిక నాయకులు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి సమస్యను తీసుకువెళ్లగా ఆయన స్పందించి అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి రూ.36.71 కోట్లు మంజూరు చేశారు. వీటిలో కాళీపట్నం–భీమవరం వంతెన వద్ద రూ.9.22 కోట్లు, భీమవరం–దొంగపిండి వంతెన వద్ద రూ.16.58 కోట్లు, దెయ్యాలతిప్ప–నాగిడిపాలెం వంతెన వద్ద రూ.10.91 కోట్లు మంజూరై టెండర్ ప్రక్రియ ప్రారంభం కాగా ఈలోపు ఎన్నికలు రావడంతో పనులకు బ్రేక్ పడింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టేసింది. అవసరమని చెప్పినా.. ఆయా పనుల ఆవశ్యకత దృష్ట్యా పనులు రద్దు కాకుండా కొనసాగించాలని కూటమి నేతలు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఇటీవల జిల్లాకు వచ్చిన ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి ప్రజాప్రతినిధులు ఈ విషయం తీసుకువెళ్లారు. రద్దు చేయకుండా వాటిని కొనసాగించాలని కోరగా ప్రభుత్వంతో మాట్లాడతానని ఆయన చెప్పినట్టు సమాచారం. కాగా ఆ పనులకు మరలా అంచనాలు రూపొందించి, ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపితే సాంకేతిక, పాలన అనుమతులు వచ్చి, టెండర్ ప్రక్రియ మొదలయ్యేసరికి చాలా సమయం పడుతుందని పలువురు అంటున్నారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ఆశలు ఆవిరి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్రోచ్లు, రోడ్లకు నిధులు టెండర్ల దశకు చేరిన పనులకు బ్రేక్ వేసిన కూటమి సర్కారు ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యేలు పనులు కొనసాగించాలని వినతి అటకెక్కిన పనులు గత ప్రభుత్వంలో ఉండి నియోజకవర్గంలోని చినమిల్లిపాడు, సిద్ధాపురం, రాజులపేట, రాజుల కొట్టాడ, ధర్మాపుర అగ్రహారం, నల్లమిల్లిపాడు గ్రామాలు, కొల్లేరు తీర ప్రాంత ప్రజలు, రైతులు చినమిల్లిపాడు–ఆకివీడు మెయిన్రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదభరితంగా ఉన్న ఈ రోడ్డును 11.6 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు చేపట్టి అభివృద్ధి చేసేందుకు రూ.25 కోట్లు మంజూరయ్యాయి. భీమవరం నుంచి కలిదిండి మీదుగా గుడివాడ వెళ్లే రోడ్డులోని బొండాడ డ్రెయిన్లపై వంతెన నిర్మాణానికి రూ.12 కోట్లు మంజూరు చేశారు. ఆచంట నియోజకవర్గంలో నెగ్గిపూడి, తాడేపల్లిగూడెంలో ఆర్అండ్బీ ఇన్స్పెక్షన్ బంగ్లాల ఆధునికీకరణ నిమిత్తం రూ.1.57 కోట్లు మంజూరు చేశారు. ఆయా పనులు దాదాపు టెండర్ల దశకు చేరుకోగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. -
డీఎస్సీలో క్రీడా కోటాపై తలోమాట
ఏలూరు రూరల్ : కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో క్రీడా కోటా విఽధి, విధానాలపై క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్లో మార్గదర్శకాలు అయోమయానికి గురి చేస్తున్నాయంటున్నారు. ప్రభుత్వ పెద్దలు క్రీడా కోటాలో ఉద్యోగాలను అమ్ముకునేందుకు తప్పుడు విధానాలు రూపొందించారని అనుమానిస్తున్నారు. ఇందుకోసం తమకు అనుకూలంగా క్రీడల విభజన, అర్హతలతో ఆన్లైన్ దరఖాస్తు విధానం రూపొందించారని ఆరోపిస్తున్నారు. స్పోర్ట్స్ డీఎస్సీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 421 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రైనింగ్ లేకుండా ఉద్యోగాలు ఎలా? ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ (బీపీఈడీ) పూర్తి చేయని క్రీడాకారులను సైతం స్పోర్ట్స్ కోటాలో వ్యాయామ ఉపాధ్యాయులుగా నియమిస్తామని కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్లో వెల్లడించడంపై క్రీడా పండితులు, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం ఇతర శాఖలకు మాత్రమే సరిపోతుందని, ఉపాధ్యాయ వృత్తికి మాత్రం సరికాదంటున్నారు. ట్రైనింగ్ పూర్తి చేయకుండా క్రీడాకారుడు పిల్లలకు వ్యాయామ విద్య ఎలా బోధిస్తాడు? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఉపాధ్యాయ కోటాలో ఇలాంటి నియమాలు పెట్టలేదని గుర్తు చేస్తున్నారు. దీని వల్ల ట్రైనింగ్ పూర్తి చేసిన క్రీడాకారులకు అన్యాయం జరుగుతుందని మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో పక్కాగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకంలో స్పోర్ట్స్ కోటా అమలు చేశారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేల మందికి పైగా క్రీడాకారులు సచివాలయ ఉద్యోగాలు సాధించారు. నాడు ఒక్క క్రీడాకారుడు కూడా విధి, విధానాలపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే నేడు కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ నియామకాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జూనియర్ ఇండియా, ఎస్జీఎఫ్కు ప్రాధాన్యత లేదా? స్పోర్ట్స్ కోటాలో జూనియర్ ఇండియా చాంపియన్షిప్, నేషనల్ స్కూల్గేమ్స్ సర్టిఫికెట్స్కు ప్రభుత్వం అవకాశం కల్పించకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులతో నిర్వహించే ఈ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులకు ఉద్యోగాల కల్పనలో ప్రాధాన్యత కల్పించకపోవడంపై క్రీడా విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి పక్కా విధి విధానాలతో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పాయింట్ల విధానంపై గందరగోళం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా చేపట్టేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాప్) ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా క్రీడల ప్రాధాన్యత, క్రీడాకారుడు సాధించిన సర్టిఫికెట్ల స్థాయిని బట్టి పాయింట్లు కేటాయించి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పూరిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం శాప్ విధానాలకు విరుద్ధంగా క్రీడలను ఏ,బీ అనే రెండు కేటగిరీలుగా విభజించింది. ఎటువంటి క్రీడల సర్టిఫికెట్లు ఉంటే ఎన్ని పాయింట్లు కేటాయిస్తారో? వెల్లడించలేదు. ఒలింపిక్స్, ఏషియా గేమ్స్, కామన్వెల్త్, నేషనల్ గేమ్స్, యూనివర్సిటీ స్థాయిలో ప్రతిభ చాటిన వారితో పోస్టులు పూరిస్తామని చెబుతున్నారు. అయితే ఇందులో ప్రాధాన్యత లేని పలు క్రీడలను సైతం ఏ–కేటగిరీలో చేర్చడం వల్ల అత్యంత పోటీ ఉన్న క్రీడల్లో ప్రతిభ చాటిన వారికి అన్యాయం జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్రీడాకారుల్లో అసంతృప్తి నియామక ప్రక్రియపై అనుమానాలు క్రీడల వర్గీకరణతో నిరాశ పారదర్శకత లేదు ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ ఉద్యోగాల స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ పారదర్శకంగా లేదు. ఇందులో పక్కా విధి, విధానాలు వెల్లడించాలి. ఇతర ప్రభుత్వ శాఖల్లో సైతం స్పోర్ట్స్ కోటాతో ఉద్యోగాలు పూరించాలి. అప్పుడే ప్రతిభ ఉన్న క్రీడాకారులకు న్యాయం చేసినట్టు అవుతుంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. లేదంటే డీఎస్సీ మొత్తం ప్రక్రియ కోర్టు మెట్లు ఎక్కుతుంది. – టి.కొండలరావు, శాయ్ సెంటర్ రిటైర్డ్ ఇన్చార్జితప్పుల తడక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పోర్ట్స్ కోటా విధానం తప్పుల తడకగా ఉంది. బీపీఈడీ ట్రైనింగ్ చేయకుండా వ్యాయామ ఉపాధ్యాయ ఉద్యోగం ఎలా కేటాయిస్తారు? దీనివల్ల పాఠశాల స్థాయిలో ఫిజికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థ దెబ్బ తింటుంది. క్రీడల వర్గీకరణ సైతం సరిగా లేదు. అంతర్జాతీయ, జాతీయస్థాయిలో అత్యధిక పోటీ కల్గిన క్రీడాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందులో ప్రతిభ చాటిన వారికి పాయింట్లు విధానం అమలు చేయాలి. –కేటీఎస్ఆర్ ఆంజనేయులు, రిటైర్డ్ డీఎస్డీఓ -
జలాశయంలోనూ అక్రమ తవ్వకాలు
జంగారెడ్డిగూడెం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయా పార్టీల నేతలు మట్టి, ఇసుక అక్రమ రవాణాకు తెరతీశారు. చెరువుల్లో మట్టిని అక్రమంగా తరలించుకుపోతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా జలాశయంలో అక్రమ తవ్వకాలు చేయడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంలో అక్రమంగా తవ్వకాలు చేయడంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. చక్రదేవరపల్లికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఈ గ్రావెల్ను తవ్వేసి, అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం నుంచి వయా చక్రదేవరపల్లి మీదుగా వేగవరానికి ఇటీవల రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డుకు ఇరువైపులా బెర్ములను నిర్మించేందుకు ఈ మట్టినే ఉపయోగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలపై ఎర్రకాలువ జలాశయం ఏఈ ఆర్.శ్రీనివాస్ను వివరణ కోరగా జలాశయం సమీపంలో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. తవ్వకాల విషయం తమ దృష్టికి రాలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. -
‘ధాన్యంలో తేమ 17 శాతం ఉండాల్సిందే’
అత్తిలి: రైతులు పంట కోసిన వెంటనే తేమ తనిఖీ చేసి 17 శాతం ఉన్నప్పుడే మిల్లులకు తరలించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి డి శివరాంప్రసాద్ చెప్పారు. గురువారం అత్తిలి మండలంలో ఆయన పర్యటించి ధాన్యం రాశులను పరిశీలించి, ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ధాన్యం ఎక్కువగా ఎండబెడితే నూక శాతం పెరుగుతుందని, 17 శాతం ఉన్నప్పుడే మిల్లులకు పంపే ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయశాఖ అధికారి టీకే రాజేష్ ఉన్నారు. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి తాడేపల్లిగూడెం అర్బన్ : విద్యుత్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలో కలకలం రేపింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సరవ సూరిబాబు (38) అనే వ్యక్తి పట్టణంలోని స్వీట్స్ దుకాణానికి సంబంధించిన స్వీట్స్ తయారు చేసే యూనిట్లో రోజు కూలీగా పనిచేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ఆ ప్రాంతంలో గ్రైండర్ స్విచ్ వేస్తుండగా విద్యుత్ షాక్తో పడిపోయాడు. ఇది గమనించిన తోటి పనివారు బాధితుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి సూరిబాబు మృతి చెందినట్లు నిర్దారించారు. సూరిబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈదురు గాలుల బీభత్సం
ఎండలు మండుతున్న వేళ పెనుగొండ, పెనుమంట్ర మండలాల్లో గురువారం భారీ వర్షం కురవడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. పెనుగొండలో ఈదురుగాలులు, భారీ వర్షం భీభత్సం సృష్టించింది. పెనుగొండ, వడలి, వెంకట్రామపురం గ్రామాల్లో ఈదురుగాలులకు భారీ వృక్షాలు నెలకొరిగాయి. మార్టేరు– పెనుమంట్ర స్టేట్హైవే రోడ్డుపై కొన్ని చోట్ల చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. అయితే భారీ వర్షం నేపథ్యంలో రైతులు కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని రక్షించుకోవడానికి అవస్థలు పడ్డారు. – పెనుగొండ/పెనుమంట్ర -
వేప ఉత్పత్తులు.. కీటక నాశకాలు
బుట్టాయగూడెం : తరతరాల నుంచి వేప చెట్లుకు ఒక ప్రత్యేకత ఉంది. వేప చెట్టులో ప్రతి భాగం ఒక్కో విశిష్టత కలిగి ఉంటుంది. వేప చెట్టులోని భాగాలు వైద్యంతోపాటు వ్యవసాయ సాగులో, పంటల్లో చీడ పీడల నివారణలో ఎంతగాలో ఉపయోగపడతాయని వ్యవసాయాధికారులు చెబున్నారు. ప్రకృతిపరంగా లభించే వేపపిండి, వేప నూనె, కొమ్మలను సేంద్రీయ ఎరువుల పద్ధతిలో రైతులు వాడుతుంటారు. వేప పిండి, కొమ్మలు భూమిని సారవంతం చేయడంతో పాటు పంట దిగుబడి పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి పలు రకాల వేప ఉత్పత్తులను వాటి ఉపయోగాలను వ్యవసాయాధికారులు రైతులకు ముందుగానే వివరిస్తున్నారు. ప్రయోజనాలివీ ● వేప ఆకులు లేదా ఆకు కొనలు పొడి చేసి నిల్వ చేసి ధాన్యంలో కలిపితే పురుగులు పట్టవు. ● వేప ఆకుల కషాయంలో ముంచి ఆరబెట్టిన గోనుసంచులకు పురుగులు దరిచేరవు. ● ఎరువుగా వేపాకులు పొలంలో వేస్తే సేంద్రియ పదార్థం, పోషకాలతోపాటు నిరోధక శక్తి కలిసి వస్తాయి. ● వేప నూనె పంటలపై పిచికారీ చేస్తే కాయ తొలుచు పురుగు, రసం పీల్చు పురుగు, ఆకు తినే పురుగులను అదుపు చేయవచ్చు. ● ఒక లీటర్ వేప నూనెకు 200 లీటర్ల నీరు, 200 గ్రాముల సబ్బుపొడి(సర్ఫ్)ను కలిపి ద్రవణం తయారు చేసుకోవాలి. ఇది ఒక ఎకరంలో స్ప్రేయింగ్ చెయ్యడానికి సరిపోతుంది. నూనె, నీరు కలువదు కనుక ముందుగా సబ్బుపొడి బాగా కలిపి నురగ వచ్చిన తర్వాత నీటిలో కలపాలి. ● వేప పిండి మేలైన చిక్కటి సేంద్రీయ ఎరువు. గింజ నుంచి తీసి వేసిన వేప పిండిలో 5.2 శాతం నత్రజని, 11 శాతం భాస్వరం, 1.5 శాతం పొటాషియం ఉంటుంది. ఇది ఎరువుగానే కాకుండా సస్య రక్షణకు ఉపయోగపడుతుంది. పాడి–పంట వేప నూనె, పిండితో పంటలకు రక్షణ సేంద్రియ పద్ధతుల్లో వాడుతున్న రైతులు వేప ఉత్పత్తులతో పర్యావరణ ప్రయోజనాలు వ్యవసాయంలో వేప ఆధారిత ఉత్పత్తులను వినియోగించడం వల్ల అనేక పర్యావరణ ప్రయోజనాలు లభిస్తాయి. వేప జీవనాధారణ పొందుతుంది. పర్యావరణ వ్యవస్థలో పేరుకుపోదు. కాలుష్య ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వేప నేల నాణ్యతను పెంచుతుంది. ఆరోగ్యకరమైన, స్థితి స్థూపక వ్యవసాయ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. – డి.ముత్యాలరావు, ఏఓ, బుట్టాయగూడెం -
నూతన ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు చర్యలు
పాలకోడేరు : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా నూతన ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామంలో రూ.10.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఫ్లాటెడ్ కాంప్లెక్స్ (ఇండస్ట్రియల్ పార్క్) నిర్మాణానికి రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ చర్యలతో దూదేకుల ముస్లింలకు అన్యాయం తాడేపల్లిగూడెం (టీఓసీ): కూటమి ప్రభుత్వ అసమర్థత వల్ల దూదేకుల ముస్లిం మైనార్టీలు నష్టపోతున్నారని నూర్ భాషా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు షేక్ హుస్సేన్ బీబీ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలో గురువారం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల పైబడి జనాభా ఉన్నటువంటి నూర్ భాషా ముస్లిం మైనారిటీల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలిపారు. మైనార్టీ కార్పొరేషన్లో బీసీ–బి దూదేకుల ఆప్షన్ లేని కారణంగా మైనార్టీ సబ్సిడీ రుణాలు, మైనార్టీ కోటాలో వచ్చే ఇతర ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నూర్ బాషా ముస్లింలపై కేవలం ఓట్లు కోసమే ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుందని మండిపడ్డారు. కొల్లేరు సరస్సు పరిరక్షణపై సమీక్ష ఏలూరు(మెట్రో): సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చేపట్టిన లిడార్ సర్వే ఆధారంగా అక్రమ నిర్మాణాల తొలగింపునకు చర్యలు వేగవంతం చేయాలని జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అధికారులకు సూచించారు. మంగళవారం జెడ్పీ కార్యాలయంలో కొల్లేరు సరస్సు పరిసరాలలో జరుగుతున్న అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు, డ్రెయిన్స్ డిపార్ట్మెంట్ అధికారులు వారి శాఖల ద్వారా చేపట్టిన ముందస్తు చర్యల గురించి వివరించారు. కొల్లేరులో 67 మినీ డ్రెయిన్ చానల్స్ ఉన్నాయని, అందువల్ల ముంపు బారిన పడకుండా వాటి పూడికతీత పనుల ప్రతిపాదనలు తయారు చేసి అటవీశాఖ ద్వారా ప్రభుత్వ అనుమతి కోసం పంపాలని కోరారు. సమావేశంలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీస్ బి.విజయ, డ్రెయిన్స్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదు
భీమవరం (ప్రకాశంచౌక్) : జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జి.గీతాబాయి అన్నారు. గురువారం ఆమె అధ్యక్షతన జిల్లా స్థాయి గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కమిటీ సలహా సంఘం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గీతాబాయి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆడ పిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. రేపు ఏలూరులో ప్రత్యేక ఉద్యోగ మేళా ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లాలోని ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) సంయుక్త భాగస్వామ్యంతో శనివారం ఉదయం 10:30 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయం, ఏలూరులో ప్రత్యేక ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సి. మధుభూషణ్ రావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగాల నిమిత్తం ఇంటర్వ్యూలలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఫార్మల్ డ్రెస్ కోడ్లో, రెజ్యూమ్, సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను కోసం 88868 82032 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. చికిత్స పొందుతూ యువతి మృతి దెందులూరు: పెద్దలు కుదిర్చిన పెళ్లి సంబంధం చేసుకోవడం ఇష్టం లేక ఆత్మహత్యాయత్నం చేసిన మౌనిక అనే యువతి చికిత్స పొందుతూ మృతి చెందిందని దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ తెలిపారు. వీరభద్రపురం గ్రామానికి చెందిన గొట్టికల మౌనిక అదే గ్రామానికి చెందిన యువకుడితో కుటుంబ సభ్యులు పెళ్లి కుదిర్చారు. అయితే ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఈ నెల 12న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలలో చేర్పించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న యువతి గురువారం మృతి చెందింది. ఈ మేరకు ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారంతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
వేసవిలో చిన్నారులకు ఆటవిడుపు
బాస్కెట్ బాల్లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులువేసవి శిక్షణా తరగతుల్లో భాగంగా ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియంలో బాస్కెట్బాల్లో శిక్షణ ఇస్తున్నారు. చిన్నారులకు బాస్కెట్బాల్లో మెలకువలు, పోటీపడేతత్వాన్ని నేర్పిస్తున్నారు. 12 ఏళ్ల నుంచి పెద్ద వయస్సు ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఉచితంగా ఈ శిక్షణ ఉంటుందని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోచ్ ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, ఏలూరు -
ఆస్థాన విద్వాంసుడిగా కేవీ సత్యనారాయణ
ద్వారకాతిరుమల : శ్రీవారి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా తనను ప్రకటించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు ఏలూరుకు చెందిన ప్రముఖ కూచిపూడి నాట్య గురువు, సినీ నృత్య దర్శకుడు, నాట్య కళా విశారద కేవీ సత్యనారాయణ అన్నారు. ఎన్నో ఏళ్లుగా తన నాట్యం ద్వారా శ్రీవారిని సేవిస్తున్నట్టు చెప్పారు. అందరికీ ఇళ్లు పథకంలో స్థలాలు భీమవరం (ప్రకాశంచౌక్): ‘అందరికీ ఇళ్లు’ (హౌసింగ్ ఫర్ ఆల్) పథకం కింద జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు భూమిని ఇంటి స్థలంగా కేటాయించేందుకు ప్రభుత్వం మార్గదర్శక, నిబంధనలు జారీ చేసినట్లు జాయింట్ కలెక్టర్ రాహుల్కుమార్రెడ్డి తెలిపారు. పథకానికి సంబంధించి సందేహాలను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నివృత్తి చేసికొవచ్చు. ఈ పథకాన్ని అర్హత ఉన్న లబ్ధిదారులు వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 574 మంది గైర్హాజరు భీమవరం: జిల్లా వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం సప్లమెంటరీ పరీక్షల్లో 574 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి ఎ.నాగేశ్వరరావు చెప్పారు. మొదటి సంవత్సరం పరీక్షలను 40 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించగా జనరల్ కేటగిరిలో 9,525 మందికి 9,111 మంది హాజరుకాగా ఒకేషనల్ కేటగిరిలో 557 మందికి 58 మంది గైర్హాజరయ్యారన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష 18 కేంద్రాల్లో నిర్వహించగా జనరల్ కేటగిరిలో 1,300 మందికి 1,214 మంది హాజరుకాగా ఒకేషనల్ కేటగిరిలో 180 మందికి 162 మంది విద్యార్థులు హాజరయ్యారని ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని నాగేశ్వరరావు తెలిపారు. పాలిసెట్లో 6,169 మంది ఉత్తీర్ణత భీమవరం: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో జిల్లాల్లో 95 శాతం విద్యార్థులు హాజరయ్యారని పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ ఫణీంద్ర ప్రసాద్ చెప్పారు. పాలిసెట్ పరీక్షకు 7,271 మంది పరీక్ష ఫీజులు చెల్లించగా 6,489 మంది పరీక్షకు హాజరయ్యారని వీరిలో 6,169 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. పాసైన వారిలో 3,634 మంది బాలురు, 2,535 మంది బాలికలు ఉన్నారన్నారు. రాష్ట్ర స్థాయిలో బి.శేఖర్ 4వ ర్యాంకు సాధించగా, వి.ప్రవల్లిక 6వ ర్యాంకు, కె.కృష్ణ ప్రణయ్ 9వ ర్యాంకు సాధించారని ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. రెవెన్యూ పిటిషన్లు సత్వరం పరిష్కరించాలి భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఫేజ్ –1 రీసర్వే మే నెలాఖరునాటికి పూర్తిచేసి గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరం జాయింట్ కలెక్టర్ చాంబరులో జాయింట్ కలెక్టర్ రీ సర్వే, పీజీఆర్ఎస్, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, తదితర అంశాలపై గూగుల్ మీట్ ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సర్వే అధికారులతో సమీక్షించారు. ఫేజ్ 2 రీసర్వే పనులను వేగవంతం చేయాలన్నారు. పీజీఆర్ఎస్ సమస్యల పరిష్కారంలో ఏఐ టెక్నాలజీని వాడి సమస్యలు నాణ్యతతో పరిష్కరించుకోవచ్చన్నారు. అందరికీ ఇళ్ల పథకం కింద గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమిని కేటాయించేందుకు మార్గదర్శకాలతో ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. వర్క్ ఇన్స్పెక్టర్ల తొలగింపు నూజివీడు: మండలంలోని సుంకొల్లులో గృహనిర్మాణలకు సంబంధించి సిమెంట్, స్టీలు అవకతవకల విషయంలో గృహనిర్మాణ శాఖలో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఐదుగురు వర్క్ ఇన్స్పెక్టర్లను విధుల నుంచి తొలగిస్తున్నట్లు గృహనిర్మాణ శాఖ జిల్లా అధికారి జీవీవీ సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. లబ్ధిదారులకు సంబంధించిన మెటీరియల్ పక్కదారి పట్టిందని వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని గృహ నిర్మాణశాఖ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. విచారణలో 2,450 బస్తాల సిమెంట్, 11,952 కిలోల స్టీలు లబ్ధిదారులకు అందలేదని తేలింది. -
మాక్డ్రిల్తో అప్రమత్తం
భీమవరం (ప్రకాశంచౌక్): మాక్డ్రిల్ అవగాహన అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడంతోపాటు, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఉపయోగంగా ఉంటుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా తమను తాము రక్షించుకోవాలి అనే అంశాలపై ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖలు సంయుక్తంగా బుధవారం భీమవరం కొత్త బస్టాండ్ ఆవరణలో కలెక్టర్, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సమక్షంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిలెండర్ నుంచి గ్యాస్ లీకేజీని, మంటలను ఎలా కట్టడి చేయిచ్చో కలెక్టర్ స్వయంగా చేసి చూపించారు. ఎస్పీ మాట్లాడుతూ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అనేక అనర్ధాలు జరుగుతాయని, ఇలాంటి మాక్డ్రిల్స్ ద్వారా ప్రజలకు అవగాహన కలిగించి ప్రమాదాల బారి నుంచి బయటపడవచ్చన్నారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఏ.శ్రీనివాసరావు ప్రతి అంశాన్ని ప్రజలకు వివరించారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, ఆర్డీవో కే ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రకాలువ తవ్వేశారు
జంగారెడ్డిగూడెం: మట్టి మాఫియా ఎర్రకాలువ జలాశయం గర్భంలో భారీగా తవ్వేసి మట్టిని తరలించేశారు. జలాశయం గర్భాన్ని తెగ తవ్వేశారు. దీంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. ఈ మట్టి మాఫియా ప్రధాన సూత్రదారి జంగారెడ్డిగూడెం మండలం వేగవరానికి చెందిన టీడీపీ నాయకుడు. అంతా తానై ఎర్రకాలువ జలాశయం గర్భాన్ని తవ్వేసి మట్టిని అమ్మేసుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా రాత్రి సమయాల్లో జేసీబీ పెట్టి తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. పగలు జేసీబీని సమీపంలోని పొలాల్లో పెట్టి.. రాత్రి మట్టి తవ్వేసి యథేచ్ఛగా తరలించేస్తున్నారు. ఎర్రకాలువ జలాశయం గర్భంలో మట్టిని తవ్వేసి తరలించేస్తున్నారని సంబంధిత శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా అధికారులు స్పందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కొంతమంది దీనిపై ఆయా శాఖల అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదు. ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా దీనిపై స్పందించడం లేదు. మట్టి తరలిస్తున్నారని ఇరిగేషన్ కింది స్థాయి అధికారికి చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు. క్షేత్రస్థాయిలో నిత్యం జలాశయాన్ని పరిశీలించాల్సిన అధికారి జలాశయం పరిధిలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. చేపలు పట్టేందుకు మత్స్యకారులు, పశువుల్ని కడిగేందుకు పశువుల కాపరులు ఈ జలాశయంలోకి దిగుతుంటారు. భారీ గోతులు వీరి ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయి. -
వైభవంగా వసంతోత్సవం
ముగిసిన వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ద్వారకాతిరుమల: శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు బుధవారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఉదయం కల్యాణ మండపంలో అర్చకులు శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చనాది కార్యక్రమాలు జరిపి, హారతులిచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు వసంతాలు సమర్పించి, చూర్ణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అందులో భాగంగా స్వామిని కీర్తిస్తూ అర్చకులు, మహిళా భక్తులు వడ్లు దంచారు. ఆ తరువాత రాజాదిరాజ వాహనంపై శ్రీవారికి తిరువీధి సేవను నిర్వహించి, భక్తులకు వసంతాలు అందజేశారు. అలాగే రాత్రి ఆలయంలో స్వామి వారికి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగోత్సవాన్ని అర్చకులు, పండితులు వైభవోపేతంగా నిర్వహించారు. ఉభయ దేవేరులతో శ్రీవారికి రాత్రి ఆలయంలో 12 ప్రదక్షిణలు, 12 సేవా కాలాలు, 12 రకాల పిండి వంటలతో నివేదనలు జరిపారు. శ్రీపుష్ప యాగోత్సవాన్ని వైభవోపేతంగా జరిపారు. ఆలయ ముఖ మండపంలో శయన మహావిష్ణువు అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. ఈ వేడుకలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. నేటి నుంచి ఆర్జిత సేవలు శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో రద్దు చేసిన నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను గురువారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి తెలిపారు. -
అక్రమార్కులకు భీమవరం
సాక్షి, భీమవరం: పట్టణంలోని 9వ వార్డు చినరంగనిపాలెంలో రూ.కోట్లు ఖరీదు చేసే ఖాళీ స్థలానికి సంబంధించి సరైన రికార్డు లేకుండా వేరొకరి పేరు మీద మున్సిపల్ అధికారులు పన్ను సృష్టించేశారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. స్థల యజమానుల ఫిర్యాదుపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు సరైన పరిశీలన చేయకుండా పన్ను వేసినట్టు తేల్చారు. అందుకు బాధ్యులుగా మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన ఎస్.శివరామకృష్ణ, రెవెన్యూ అధికారి డి.సోమశేఖర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎస్.కృష్ణమోహన్, వార్డు సెక్రటరీ పి.చంద్రశేఖర్లపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశిస్తూ ఏప్రిల్ 17న ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీచేశారు. కోవిడ్ సమయంలో బాధితులకు వైద్యం సాయం అందించేందుకు గత ప్రభుత్వం పట్టణంలో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటుచేసింది. వీటి నిర్వహణ పేరిట కొందరు మున్సిపల్ అధికారులు అక్రమాలకు తెరలేపారు. కోవిడ్ బాధితులకు సదుపాయాలు కల్పించినట్టుగా నకిలీ బిల్లులు, ఫోర్జరీ సంతకాలతో నిధులను స్వాహా చేశారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు గత ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. రూ.91.06 లక్షలు అవినీతి జరిగినట్టు తాజాగా విచారణలో తేలింది. అవినీతికి పాల్పడిన నాటి మున్సిపల్ కమిషనర్ కె.రమేష్కుమార్ (రిటైర్డ్), ఎఫ్1 సీహెచ్ కామేష్బాబు, జూనియర్ అసిస్టెంట్ జీవీఎన్ చంద్రశేఖర్, హెల్త్ అసిస్టెంట్ ఎస్.చంటిబాబు, ఏఈలు వీవీఎస్ శివకోటేశ్వరరావు, కె.రాజ్కుమార్, కాంట్రాక్టర్లు జీవీ సురేష్, ఏ.భగవాన్పై క్రిమినల్ చర్యలకు ఆదేశిస్తూ రెండు రోజుల క్రితం డీఎంఏ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు వారిపై మున్సిపాల్టీ నుంచి పట్టణ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు విభాగాల్లో అవినీతి టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్, శానిటేషన్, పబ్లిక్ హెల్త్ తదితర విభాగాల్లో అవినీతి రాజ్యమేలుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా నిర్మాణాలు చేస్తున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటం, పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన సామగ్రి కొనుగోళ్లు, వాహనాలకు డీజిల్, మెయింటినెన్స్లో అవకతవకలు, చేయని పనులకు చేసినట్టుగా బిల్లులు పెట్టుకుని ప్రజాధనాన్ని కాజేయడం, పనుల అంచనాలు పెంచేయడం, వేసవి సందర్భంగా పట్టణ ప్రజలకు ట్యాంకర్లు ద్వారా తాగునీటి సరఫరా పేరిట బయట అమ్మకాలు చేసుకోవడం తదితర అవినీతి వ్యవహారాలపై ఇప్పటికే స్థానికుల నుంచి పలు ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది. అవి వెలుగుచూస్తే మరిన్ని అక్రమాలు బయటపడతాయని అంటున్నారు. పన్నుల్లో అక్రమాలపై ఇటీవల నలుగురిపై క్రమశిక్షణ చర్యలు కోవిడ్ నిధుల స్వాహాపై గతంలోనే విచారణకు ఆదేశించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.98 లక్షలు కాజేసినట్టు తాజాగా తేల్చిన విజిలెన్స్ అధికారులు ఆరుగురు ఉద్యోగులపై క్రిమినల్ చర్యలకు డీఎంఏ ఆదేశం పాలకవర్గం లేక పెచ్చుమీరుతున్న అవినీతి భీమవరం మున్సిపాలిటీ ఘన చరిత్రను కొందరు ఉద్యోగులు తమ అవినీతి వ్యవహారాలతో మసకబారుస్తున్నారు. ప్రత్యేక పాలన, ప్రశ్నించేవారు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని దొరికినకాడికి దోచేస్తున్నారు. 2014లో చివరిగా మున్సిపాల్టీకి ఎన్నికలు జరిగాయి. తర్వాత 2019లో ఎన్నికలు జరగాల్సి ఉంది. పట్టణ సమీపంలోని చిన అమిరం, రాయలం, కొవ్వాడ అన్నవరం, విస్సాకోడేరు, తాడేరు తదితర గ్రామాల విలీన ప్రతిపాధనపై ఆయా గ్రామాల వారు కోర్టుకు వెళ్లడం తదితర కారణాలతో ఎన్నికలు జరగలేదు. నాటి నుంచి ప్రత్యేక పాలన కొనసాగుతోంది. కౌన్సిలర్లు, పాలకవర్గం, సమస్యలపై గళమెత్తే ప్రతిపక్షం లేకపోవడంతో ఉద్యోగుల ఇష్టారాజ్యంగా మారింది. కొందరు ఉద్యోగులు స్థానికంగా పాతుకుపోయారు. రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకుని ఎక్కడికి బదిలీ అయినా వారి సిఫార్సులతో తిరిగి ఇక్కడ వాలిపోతున్నారు. వారి అండదండలతో ‘లోకల్’ అంటూ పెత్తనం చెలాయిస్తూ పై అధికారుల ఆదేశాలను ఖాతరుచేయడం లేదని తెలుస్తోంది. -
సైబర్ కేసును చేధించిన పోలీసులు
తాడేపల్లిగూడెం: సైబర్ మోసం కేసును గూడెం పట్టణ పోలీసులు చేధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని కొబ్బరితోటకు చెందిన పోపూరి సాంబశివప్రసాద్ ను కొందరు డిజిటల్ అరెస్టు అంటూ ఫోన్లో బ్లాక్మెయిల్ చేశారు. ప్రసాద్ వద్ద నుంచి రెండు బ్యాంకు శాఖల ద్వారా రూ.50 లక్షలు బదిలీ చేయించుకున్నారు. తనను కొందరు మోసం చేశారని గ్రహించిన ప్రసాద్ గూడెం పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ ఎ.సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఎస్సై బాదం శ్రీనివాసు, సిబ్బంది రాజస్థాన్ వెళ్లి నిందితులను అరెస్టు చేశారు. రాజస్థాన్లోని జలోర్ జిల్లా బాగోడా మండలం బాలనికి చెందిన హనుమాన్రామ్, బార్మర్ జిల్లా సోనారి గ్రామానికి చెందిన దినేష్ను అరెస్టు చేశారు. నిందితులు రాజస్థాన్లోని ఒక పెట్రోలు బంకు ఓనర్ పీఓఎస్ మిషన్ నుంచి రూ.7 లక్షలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో అప్రమత్తమైన పోలీసులు బ్యాంకు అధికారుల ద్వారా రూ.10 లక్షలు హోల్డ్లో పెట్టించి, రూ.20 లక్షల ఎఫ్డీలు బ్రేక్ అవ్వకుండా చేశారు. ఈ విషయంలో కీలకంగా వ్యవహరించిన హెచ్డీఎఫ్సీ మేనేజర్ను ఎస్పీ అభినందించారు. -
భారీగా సెల్ఫోన్ల రికవరీ
సింగిల్ బృందం సందడి సింగిల్ చిత్ర బృంద సభ్యులు మంగళవారం ఏలూరులో సందడి చేశారు. నగరంలోని ఎస్వీసీ థియేటర్లో ప్రేక్షకులను కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. 8లో u15వ విడతలో 594 సెల్ఫోన్లు బాధితులకు అందజేత ఏలూరు టౌన్: జిల్లా పోలీసులు శ్రమించి వందలాది సెల్ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద రికవరీ చేసిన సెల్ఫోన్లు మంగళవారం ఎస్పీ చేతులమీదుగా బాధితులకు అందజేశారు. 15వ విడతలో 594 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. వాటి విలువ మార్కెట్లో సుమారు రూ.71.28 లక్షలు ఉంటుందని అంచనా. ఏలూరు జిల్లాలో మొత్తంగా 15 విడతల్లో 2,976 మొబైల్ ఫోన్లు పోలీస్ అధికారులు రికవరీ చేశారు. ఈ సెల్ఫోన్ల విలువ ఏకంగా రూ.4.75 కోట్లు ఉంటుందని అంచనా.. ఈ సందర్భంగా ఎస్పీ కేపీ శివకిషోర్ మాట్లాడుతూ... చోరీ వస్తువులు కొనడం, విక్రయించటం రెండూ నేరమేనని స్పష్టం చేశారు. సైబర్ నేరాలు, చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ ఇళ్లు, షాపులు, ఇతర రద్దీ ప్రాంతాల్లోని దుకాణ సముదాయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఏదైనా నేరం జరిగితే నిందితులను పట్టుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. సెల్ఫోన్ పోయిన వెంటనే ఫిర్యాదు చేయటంతోపాటు సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. సైబర్ నేరాల నిరోధానికి 1930కి కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్.జీవోవీ.ఇన్కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, బీ.ఆదిప్రసాద్, సైబర్ క్రైమ్ ఎస్ఐ రాజా, తదితరులు పాల్గొన్నారు. -
వాట్సాప్ గవర్నెన్స్ సద్వినియోగం చేసుకోవాలి
భీమవరం (ప్రకాశంచౌక్): మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ చేతుల మీదుగా మనమిత్ర స్టాండ్లు మండలాల వారీగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ధ్రువపత్రాలు వాట్సప్ ద్వారానే ప్రజలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనమిత్రను అందుబాటులో తీసుకొచ్చిందన్నారు. సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండానే, వాట్సాప్లోనే అప్లై చేసుకోవచ్చని అన్నారు. దేవదాయ, రెవెన్యూ, మున్సిపల్, తదితర శాఖలలో చెల్లింపులు, జనన, మరణాల ధ్రువీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు, వివిధ రకాల ధ్రువపత్రాలు జారీ సేవలు పొందవచ్చన్నారు. పౌరులకు లభించే సేవలపై ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల అధికారి వై.దోసి రెడ్డి, వివిధ మండలాల ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల సిబ్బంది, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. -
మాపై ఉదాసీనత ఎందుకు?
విజయరాయిలో 20 ఎకరాల్లో కోకో సాగు చేస్తున్నాను. సీజన్లో 100 గ్రాములకు 80 నుంచి 100 గింజలు వస్తాయి. అన్ సీజన్లో 100 గ్రాములకు 120 నుంచి 140 గింజలు వస్తాయి. రెండూ కలిపి సంక్రాంతి తరువాత అమ్ముకునే వాళ్ళం. హఠాత్తుగా ధర తగ్గించేశారు. ప్రస్తుతం రూ 350 నుంచి రూ.450 మధ్య కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో రూ.750 నుంచి రూ.800 వరకు కొనుగోలు చేస్తున్నారు. – కొనేరు సతీష్బాబు, విజయరాయి నష్టాల్లో మునిగిపోయాం చిన్న సన్నకారు కోకో రైతులు నష్టాల్లో మునిగిపోయారు. గతేడాది రూ.1040 వరకు కోకోకు గిట్టుబాటు ధర ఇచ్చారు. నేడు రూ.400 మాత్రమే ఇస్తున్నారు. రైతులు చాలా పెట్టుబడి పెట్టారు. మండలీజ్ వ్యాపారస్తులందరూ సిండికేట్గా మారి రైతులను ముంచేశారు. మండలీజ్ కంపెనీ బయట వ్యాపారస్తులని రానివ్వకుండా చేసి, చిన్న రైతులకు నష్టం చేస్తున్నారు. – వంకినేని లక్ష్మీనారాయణ, వంగూరు, లక్ష్మీపురం గ్రామం ● -
పట్టుబడిన మద్యం ధ్వంసం
భీమవరం: భీమవరం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కేసుల్లో పట్టుబడిన మద్యం సీసాలను మంగళవారం భీమవరం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆవరణలో ధ్వంసం చేశారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఆదేశాలతో మద్యం సీసాలను ధ్వంసం చేసినట్లు ఎకై ్సజ్ సీఐ కె.బలరామరాజు చెప్పారు. గతంలో మద్యం కేసుల్లో పట్టుబడిన ఐదుగురిని భీమవరం తహసీల్దార్ ఆర్.రాంబాబు ముందు బైండోవర్ చేసినట్లు చెప్పారు. ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు భీమవరం: ఇంటర్ సంప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా మంగళవారం ఫస్టియర్ ఇంగ్లీష్ పరీక్షకు 95 శాతం విద్యార్ధులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి ఎ.నాగేశ్వరరావు చెప్పారు. జనరల్ కేటగిరిలో 7,630 మందికి 7,320 మంది, ఒకేషనల్లో 444 మందికి 398 మంది హాజరయ్యారన్నారు. సెకండ్ ఇయర్ ఇంగ్లీషు పరీక్షకు 89 శాతం విద్యార్థులు హాజరుకాగా జనరల్ కేటగిరిలో 294 మందికి 270 మంది, ఒకేషనల్లో 102 మందికి 86 మంది హాజరయ్యారన్నారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి అత్తిలి: మహిళలు తమ కాళ్ల మీద నిలబడి ఆర్థికాభివృద్ధి సాధించాలనే ధ్యేయంతో మహిళలకు కుట్టు శిక్షణ ఇస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అత్తిలిలో బీసీ సంక్షేమ ఫైనాన్స్ కార్పోరేషన్న్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం కోసం కుట్టు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారన్నారు. పాలూరులో సీసీ రోడ్డు, రక్షిత మంచినీటి పధకాన్ని హోం మంత్రి ప్రారంభించారు. మైక్రో ఫిల్టర్లు, పైపులైన్ పనులకు శంకుస్ధాపన చేసారు. అత్తిలిలో నిర్మించే రక్షిత మంచినీటి పధకం ట్యాంకు, పైపులైన్ విస్తరణకు భూమిపూజ చేశారు. కె సముద్రపుగట్టులో రక్షిత మంచినీటి పథకం, పైపులైన్లకు శంకుస్ధాపన చేసారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఎంపీపీ సుంకర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సరస్వతి నది పుష్కరాలకు ప్రత్యేక బస్సు సర్వీస్ భీమవరం (ప్రకాశంచౌక్): ఈనెల 15 నుంచి జరిగే కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలకు భీమవరం డిపో నుంచి స్పెషల్ సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ పీ.ఎన్.వీ.ఎం.సత్యనారాయణ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఏదైనా గ్రామం నుంచి 35 మంది ప్రయాణికులు ఉంటే అదనపు చార్జీలు లేకుండా ఆ గ్రామం నుంచి మీరు కోరిన సమయంలో సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. టిక్కెట్ ధర ఒక్కొక్కరికీ రూ.2,200 అని.. మరిన్ని వివరాలకు 7382924754, 96660 89036 నెంబర్లలో సంప్రదించాలన్నారు. సీహెచ్ఓల సమస్యలు పరిష్కరించాలి ఏలూరు (టూటౌన్): గత 20 రోజులు నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద సమ్మె శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం తక్షణమే యూనియన్తో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించి సమ్మె విరమణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. -
బడి బస్సు భద్రమేనా?
బుధవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2025సాక్షి, భీమవరం / భీమవరం (ప్రకాశంచౌక్) : జిల్లాలో 463 ప్రైవేట్ విద్యాసంస్థల పరిధిలో 1,566 స్కూల్ బస్సులు ఉన్నాయి. విద్యార్థుల ప్రయాణ భద్రత దృష్ట్యా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు రవాణ శాఖ స్కూల్ బస్సుల సామర్థ్యాన్ని పరీక్షించి పూర్తి సామర్థ్యంతో ఉన్న వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు(ఎఫ్సీ) జారీచేయాలి. ఎఫ్సీ లేనివాటిని సీజ్ చేయాలి. గత ఏడాది ఎఫ్సీ గడువు ముగియడంతో రానున్న విద్యాసంత్సరానికి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెంలోని రవాణశాఖ కార్యాలయాల్లో బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేపట్టి సోమవారం నాటికి 849 బస్సులకు పూర్తి చేశారు. తూతూమంత్రంగా తనిఖీలు బస్సు బ్రేక్, హ్యాండ్ బ్రేక్, స్టీరింగ్, టైర్లు, స్పీడో మీటర్, లైట్లు, గ్లాసులు, అత్యవసర ద్వారం, మంటలను ఆర్పే పరికరం తదితర వాటి కండిషన్ను మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు స్వయంగా పరీక్షించాలి. బస్సుకు నాలుగు వైపులా రిఫ్లెక్టివ్ టేపు అతికించి ఉందా? లేదా? ఫస్ట్ ఎయిడ్ బాక్స్, బస్సు బయలుదేరే సమయం, ఆగే స్థలాలు, రూట్ ప్లాన్ వివరాలు వంటివి పరిశీలన చేయాలి. ఆ బాధ్య తను కిందిస్థాయి సిబ్బందికి అప్పగించి తూతూమంత్రంగా తనిఖీలు చేయిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ చూసీచూడనట్లు వదిలేస్తున్నట్టు తెలుస్తోంది. కొరవడిన పర్యవేక్షణ స్కూల్ బస్సుల వేగం గంటకు 60 కిలోమీటర్లు మాత్రమే ఉండేలా స్పీడ్ గవర్నర్స్ తప్పనిసరి. కాగా కొందరు డ్రైవర్లు ఇరుకు సందుల్లో వేగంగా పోనిస్తూ దారిన వెళ్లే వారిని హడలెత్తిస్తున్నారు. కొందరు విధుల్లో మద్యం సేవించి ఉంటున్నారని, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. గతంలో జరిగిన పలు ప్రమాదాలకు నిర్లక్ష్య డ్రైవింగ్, వాహనాలు కండీషన్లో లేకపోవడం కారణమన్న విమర్శలున్నాయి. అధికారులు, స్కూల్ యాజమాన్యాల పర్యవేక్షణ కొరవడటం డ్రైవర్ల ఇష్టారాజ్యంగా మారుతోంది. పేరెంట్స్ కమిటీ పరిశీలించాలి బస్సులోని ఫస్ట్ఎయిడ్ బాక్స్ను నెలకోసారి పేరెంట్స్ కమిటీ పరిశీలించాలి. సీటింగ్ కెపాసిటికి మించి విద్యార్థులను ఎక్కించకూడదు. ప్రతి నెల బస్సు కండిషన్ను యాజమాన్యాలు, పాఠశాల పేరెంట్స్ కమిటీ తనిఖీ చేయాలి. బస్సులో ఫిర్యాదుల పుస్తకం ఉంచి ప్రతి నెలా యాజమాన్యం తనిఖీ చేసి ఫిర్యాదులను పరిశీలించాలి. రవాణా, పోలీస్, విద్యా శాఖల సౌజన్యంతో విద్యార్థులకు రోడ్ సేఫ్టీ తరగతులు నిర్వహించాలి. న్యూస్రీల్ ఆందోళన కలిగిస్తున్న ప్రమాదాలు గతేడాది వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి, పలువురికి గాయాలు సిబ్బంది చేతివాటం, తూతూమంత్రంగా తనిఖీలు సెప్టెంబరు 20 : తణుకులోని ఒక ప్రైవేట్ స్కూల్కు చెందిన బస్సు జాతీయ రహదారిలోని డీమార్టు సమీపంలో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపునకు దూసుకువెళ్లి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో లిప్టు కోసం ఎక్కిన మరో బస్సు క్లీనర్ మృతిచెందాడు. డిసెంబరు 2 : ఇరగవరం మండలం అర్జునుడుపాలెం రోడ్డులో విద్యార్థులతో ఉన్న రెండు స్కూల్ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆ వేగానికి అందులోని చిన్నారులు సీట్లలోంచి చెల్లాచెదురుగా పడిపోయారు. అదృష్టవశాత్తు స్వల్పగాయాలతో బయటపడ్డారు. హుటాహుటిన చిన్నారులను 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. సెప్టెంబరు 10 : పెనుమంట్ర మండలం మాముడూరు నుంచి భీమవరం వస్తున్న ప్రైవేట్ కళాశాల బస్సు పాలకోడేరులో అదుపుతప్పి పంటబోదెలోకి దూసుకుపోయి మట్టిలో కూరుకుపోయింది. ప్రమాద సమయానికి బస్సులో 20 మంది విద్యార్థులు ఉండగా వారిలో ఒకరికి కాలు, చేయి విరిగిపోయింది. 11 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. పక్కాగా ఫిట్నెస్ పరీక్షలు అక్రమాలకు తావులేకుండా జిల్లాలో ఫిట్నెస్ పరీక్షలు పక్కాగా నిర్వహిస్తున్నాం. గత ప్రమాదాలకు కారణాలను విశ్లేషించి అవసరమైన చర్యలు తీసుకున్నాం. ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తాం. ఉమా మహేశ్వరరావు, జిల్లా రవాణ శాఖ అధికారి, భీమవరం రవాణ శాఖ స్కూల్ ఫిట్నెస్ కార్యాలయం బస్సులు పరీక్షలు పూర్తయినవిభీమవరం 557 298 పాలకొల్లు 331 166 తణుకు 234 142 తాడపల్లిగూడెం 444 243 -
కోకో రైతుకు సిండికేట్ దెబ్బ
● రోజురోజుకూ ధరల తగ్గింపు ● అంతర్జాతీయ మార్కెట్లో కిలోకు రూ.750కి పైగానే ధర ● స్థానికంగా రూ.450 మాత్రమే ఇస్తున్న వైనం ● ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నెలకు రూ.100 చొప్పున తగ్గుదల ● ఉమ్మడి జిల్లాలో 50 వేల ఎకరాల్లో కోకో సాగు సాక్షి ప్రతినిధి, ఏలూరు : జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లతో మాకు సంబంధం లేదు. మేం చెప్పిందే రేటు.. లేకపోతే ఏ కంపెనీ కోకో గింజలు కొనదు. ఇది కోకో వ్యాపారులు సిండికేట్ అయ్యి ఇస్తున్న అల్టిమేటం. అంతర్జాతీయ మార్కెట్లో కిలో గింజలు రూ.700 నుంచి రూ.800 పలుకుతుంటే ఏలూరు జిల్లాలో మాత్రం సిండికేట్ వ్యాపారుల వల్ల కేవలం రూ.450కే కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక కోకో సాగు ఏలూరు జిల్లాలోనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ధరను ప్రామాణికంగా తీసుకుని గతేడాది వరకు అదే ధరలు చెల్లించిన వ్యాపారులు పూర్తిగా సిండికేట్ అయ్యి స్థానికంగా ధరలు నిర్ణయించడంతో కోకో రైతులు తీవ్ర సంక్షోభంలో పడ్డారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 50 వేల ఎకరాల విస్తీర్ణంలో కోకో విస్తరించింది. కొబ్బరి, పామాయిల్లో అంతర్ పంటగా సాగుచేస్తున్నారు. 2018 నుంచి కోకో సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. ఏలూరు జిల్లాలో 2020లో 18,483 ఎకరాలు, 2021లో 20,350 ఎకరాలు ఉన్న కోకో సాగు, 2025 నాటికి 36,290 ఎకరాలకు చేరింది. గతేడాది పోటీపడి కొనుగోలు గతేడాది ఏప్రిల్, మే నెలలో కిలో కోకో గింజలు అత్యధికంగా రూ.1000కి పైగా పోటీ పడి మరీ కొనుగోలు చేశారు. గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం ఇక్కడ కోకో సాగుకు భాగా కలిసివచ్చే అంశం. ఒక్క ఏలూరు జిల్లా నుంచే ఏటా 12 వేల మెట్రిక్ టన్నుల కోకో దిగుబడి ఉంది. గత మూడేళ్లుగా సగటున రూ.350 ధరతో ప్రారంభమై, 2024 ఏప్రిల్ నాటికి రూ.1040కి చేరింది. మరో 30 ఏళ్ల పాటు కోకోకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. దేశీయ అవసరాలకు ఏటా 1.10 లక్షల టన్నుల డిమాండ్ ఉన్నప్పటికీ దేశంలో 30 వేల మెట్రిల్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మిగిలింది విదేశాల నుంచి దిగుమతి చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు రూ.40 వేల నుంచి రూ.50 వేల ఉన్న ఎకరం పొలం కౌలు ధర రూ.లక్ష నుంచి అత్యధికంగా రూ.1.20 లక్షలకు చేరింది. గతంలో నాణ్యతతో సంబంధం లేకుండా ఎలాంటి కోకో గింజలనైనా ఒకే ధరకు కొనుగోలు చేశారు. ఇప్పుడు వ్యాపారులు పూర్తిగా సిండికేట్గా మారి ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారు. 70 శాతం మండలీజ్ కంపెనీ కొనుగోలు కోకో గింజలను స్థానంగా మండలీజ్, జిందాల్, హెరిటేజ్, డీపీ చాక్లెట్, సూర్య ట్రేడర్స్తో పాటు కొందరు వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. వీటిలో 70 శాతానికి పైగా కొనుగోళ్లు మండలీజ్ కంపెనీ చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ వారం రూ.750 నుంచి రూ.800 ధరకు కోకోను కొనుగోలు చేస్తున్నారు. స్థానికంగా 5 నుంచి 10 శాతం వ్యత్యాసంలో అదే ధర చెల్లించాలి. వ్యాపారులు సిండికేట్గా మారి రూ. 450 ధరకు కొనుగోలు చేస్తున్నారు. అది కూడా ఈ ఏడాది జనవరిలో రూ.650తో ప్రారంభమైన లోకల్ మార్కెట్ ధర మే నాటికి రూ.450కు చేరింది. దీనిపై కోకో రైతు సంఘం పోరు బాట పట్టి కమిషనరేట్ ముట్టడి మొదలుకుని అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. కోకో రైతుల మొర పట్టని సర్కారు గత నెలలో వ్యవసాయ శాఖ మంత్రి వద్ద సమావేశం నిర్వహించి, వ్యవసాయశాఖ మంత్రి అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించాలని కోరింది. చివరకు కంపెనీలు రూ.550కు కొనుగోలు చేస్తాయని చెప్పి మాట తప్పారు. దీంతో పాటు ఎంపిక చేసిన రైతుల వద్ద మాత్రమే కొనుగోలు చేయడం, పూర్తి ప్రాసెసింగ్ రైతే చేయాలని షరతులు విధించడం, అంతర్జాతీయ మార్కెట్ వర్తించదు, మేం ఇచ్చిన రేటే తీసుకోవాలని నిర్ణయించి మరీ మార్కెట్ను శాసిస్తున్నారు. దీంతో ఈ ఏడాది కోకో సాగుదారులు పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయారు. -
వైభవంగా శ్రీచక్ర స్నానం
● నేత్రపర్వంగా తొళక్కం, అశ్వ వాహన సేవలు ● నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు ద్వారకాతిరుమల: శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం శ్రీచక్ర స్నానాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లు తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. అనంతరం అర్చకులు ఆలయ యాగశాలలో శ్రీవారు, అమ్మవార్లు, శ్రీచక్ర పెరుమాళ్ల ఉత్సవ మూర్తులను ఒక వేదికపై వేంచేపు చేశారు. పూజాధికాల అనంతరం సుగంధ ద్రవ్యాలు, పంచపల్లవులు, శ్రీచందనం, పసుపు, మంత్ర పూత అభిషేక తీర్ధంతో శ్రీచక్ర స్వామిని అభిషేకించారు. సాయంత్రం నిత్యహోమ బలిహరణలు, పూర్ణాహుతి, అనంతరం ధ్వజ అవరోహణ వేడుకలను అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో శ్రీవారి కాళీయమర్ధనం అలంకారం భక్తులకు కనువిందు చేసింది. రాత్రి అశ్వవాహనంపై తిరువీధి సేవను నిర్వహించారు. బుధవారం రాత్రి జరిగే శ్రీపుష్ప యాగోత్సవంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో నేడు : ● ఉదయం 9 గంటల నుంచి – చూర్ణోత్సవం ● సాయంత్రం 6 గంటల నుంచి – కూచిపూడి నృత్య ప్రదర్శనలు ● రాత్రి 7 గంటల నుంచి – ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగం–పవళింపు సేవ ● 9 గంటల నుంచి – రామాంజనేయ యుద్ధం నాటకం ● ప్రత్యేక అలంకారం : శయన మహావిష్ణువు -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
జంగారెడ్డిగూడెం: మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హెచ్సీ ఎన్.ఉమామహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాసపురానికి చెందిన రాజులపాటి అప్పారావు, ప్రియాంకలకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పారావు చికెన్ షాపు పెట్టి జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన అప్పారావును ప్రియాంక పలుమార్లు వారించి, పెద్దలలో సైతం పెట్టినా అతడు మద్యాన్ని విడిచిపెట్టలేదు. దీంతో 15 రోజుల క్రితం పిల్లలను తీసుకుని ప్రియాంక అక్కంపేటలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పారావు ఎన్నిసార్లు ఫోన్చేసినా ఆమె రాకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లోని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ప్రియాంక ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు హెచ్సీ తెలిపారు. డివైడర్ను ఢీకొన్న ట్రాక్టర్.. డ్రైవర్ మృతి పెదవేగి: ట్రాక్టర్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ఎస్సై కె రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం భోగాపురం గ్రామానికి చెందిన మట్టా నాగరాజు (36) మంగళవారం ఉదయం స్వగ్రామం నుంచి దుగ్గిరాల ట్రాక్టర్పై వెళుతుండగా అమ్మపాలెం జాతీయ రహదారి సమీపంలో ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్పై నుంచి నాగరాజు రోడ్డు మీద పడిపోవడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ చెప్పారు. మృతదేహాన్ని శవపంచనామ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
డీఎంహెచ్వోకు వినతి
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పేరుతో ఒక వ్యక్తి అనధికార దందాలకు పాల్పడుతున్నారని, చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఎంహెచ్వో డాక్టర్ మాలినికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తామంతా ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చదువుకొని, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ప్రైవేట్ ల్యాబ్లు నిర్వహించుకుంటూ జీవనం గడుపుతున్నామన్నారు. అయితే గత కొంత కాలంగా 70326 72067 నెంబర్ తో కాల్ చేస్తూం. మేము జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసు నుంచి మీనాక్షి నీ మాట్లాడుతున్నాను.. మీ లాబ్ పై మాకు కంప్లయింట్ వచ్చింది.. ఈ ఫిర్యాదును జిల్లా ఉన్నతాధికారులకు పంపమంటారా లేదా.. సెటిల్ చేసుకుంటారా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. రూ.20,000 చెల్లిస్తే సమస్య పరిష్కారం అవుతుందని డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వీటిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఎస్వి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కొసరాజు శ్రీ నాగ సతీష్, కోశాధికారి సత్యకుమార్, సభ్యులు సురేష్, హరికృష్ణ, దుర్గారావు, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, సింహాద్రి ఉన్నారు. -
హద్దు మీరిన మట్టి దందా
ద్వారకాతిరుమల: కూటమి నేతల అక్రమాలు హద్దులు మీరాయి. మట్టి ముసుగులో అడ్డగోలుగా ఎర్ర గ్రావెల్ అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. అనుమతులు ఉన్నాయంటూ తమకు నచ్చిన చోట యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఈ మట్టి మాఫియాలో ఖద్దరు చొక్కా పెద్దలకు, కొందరు ఉన్నతాధికారులకు సైతం వాటాలు అందుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ద్వారకాతిరుమల మండలంలోని పోలవరం కుడి కాలువ గట్టుపై జరుగుతున్న మట్టి దందాపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. మూడు పాయింట్లలో అనుమతులు పంగిడిగూడెం వద్ద ఒక పాయింట్, ఎం.నాగులపల్లి వద్ద రెండు పాయింట్లలో తవ్వకాలకు ఇరిగేషన్, మైనింగ్ శాఖలు అనుమతులు ఇచ్చాయి. ఒక క్యూబిక్ మీటర్కు ఇరిగేషన్ శాఖకు జీఎస్టీతో కలిపి రూ.170, మైనింగ్ శాఖకు రూ.106 చెల్లించాల్సి ఉంది. అయితే భీమడోలు మండలం సూరప్పగూడెంకు చెందిన నవ్య ఎర్త్మూవర్స్ వారు ఇరిగేషన్ శాఖకు 2 వేల క్యూబిక్ మీటర్లకు నగదు చెల్లించగా మైనింగ్ శాఖకు మాత్రం వెయ్యి క్యూబిక్ మీటర్లకు మాత్రమే నగదు చెల్లించి అనుమతులు పొందారు. మిగిలిన వెయ్యి క్యూబిక్ మీటర్ల మట్టి ఏమైనట్టు. ఇదిలా ఉంటే ఏలూరుకు చెందిన లెవలప్ ప్రాజెక్ట్స్ వారు 2,500 క్యూబిక్ మీటర్లకు, కై కలూరు మండలం ఆటపాకకు చెందిన బీకేఎం కనస్ట్రక్షన్స్ వారు 5 వేల క్యూబిక్ మీటర్లకు నగదు చెల్లించి అనుమతులు పొందారు. అన్ని రోజులు అనుమతి ఎందుకో.. రోజుకి ఒక్కో పాయింట్ నుంచి 70 నుంచి 80 టిప్పర్ల గ్రావెల్ మట్టి బయటకు వెళుతోంది. ఒక్కో టిప్పర్లో 15 క్యూబిక్ మీటర్ల మట్టి పడుతుంది. దీన్ని బట్టి నవ్య ఎర్త్ మూవర్స్ వెయ్యి క్యూబిక్ మీటర్ల మట్టిని 67 ట్రిప్పుల్లో, లెవలప్ ప్రాజెక్ట్స్ 2,500 క్యూబిక్ మీటర్ల మట్టిని 167 ట్రిప్పుల్లో, బీకేఎం కనస్ట్రక్షన్స్ 5 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని 334 ట్రిప్పుల్లో తోలుకోవాలి. ఇందులో ఒకరికి 30 రోజులు, ఇంకొకరికి 40, మరొకరికి 90 రోజుల పాటు అనుమతులు ఇచ్చారు. వెయ్యి క్యూబిక్ మీటర్లు (67 టిప్పర్లు)మట్టిని 30 రోజులు తోలుకోవడానికి మైనింగ్ అధికారులు అనుమతులు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. రైతుల ప్రాణాలతో చెలగాటాలు అనుమతులు పొందిన పాయింట్లలో కాకుండా తమకు నచ్చిన పాయింట్లలో మట్టిని తవ్వేస్తున్నారు. అది కూడా గట్టుపై ఉన్న మట్టిని కాకుండా, అక్కడే తాడి చెట్టు లోతున భూమిని తవ్వి, ఎర్ర గ్రావెల్ను అమ్ముకుంటున్నారు. ఇటీవల ఎం.నాగులపల్లి వద్ద కొందరు రైతులు ఈ తవ్వకాలను అడ్డుకుని, ఓ కంపెనీ వ్యక్తిని నిలదీశారు. అయితే తవ్వకాలు పూర్తయ్యాక పూడ్చి వెళతామని సమాధానమిచ్చి వారిపని వారు చేసుకోవడం మొదలు పెట్టారు. గట్టిగా అడిగితే కూటమి నేతలు ఏం చేస్తారోనన్న భయంతో వారు నిమ్మకుండిపోయారు. అధికారులకు ఫిర్యాదు చేస్తుంటే వారికి అనుమతులు ఉన్నాయంటున్నారని, తవ్వకాలు జరిగిన ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే తమ బాధ అర్థమవుతుందని అంటున్నారు. గ్రావెల్ తవ్వకాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఖద్దరు చొక్కా పెద్దలకూ వాటాలు ఇరిగేషన్, మైనింగ్ శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించి, హద్దులను నిర్ణయించి, రాళ్లు పాతిపెట్టిన తరువాత ఆ పరిధిలో మాత్రమే తవ్వకాలు జరపాలి. అయితే ఆ నిబంధనలేవీ ఇక్కడ అమలు కాలేదు. ఈ తవ్వకాల్లో ఖద్దరు చొక్కా పెద్దలకు, అధికారులకు వాటాలు ఉండటమే కారణంగా తెలుస్తోంది. క్యాష్ చేసుకుంటున్న నేతలు ఎర్ర గ్రావెల్కు మంచి డిమాండ్ ఉండటంతో నేతలు క్యాష్ చేసుకుంటున్నారు. కాలువ పక్కన సమాంతరంగా మరో కాలువలా ఎర్ర గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. టిప్పర్ గ్రావెల్ మట్టిని దూరాన్ని బట్టి రూ.7 నుంచి 12 వేలకు విక్రయించి, సొమ్ము చేసుకుంటున్నారు. కై కలూరు–పామర్రు హైవేకి, చుట్టుపక్కల ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్ల చదునుకు ఈ గ్రావెల్ను తరలిస్తున్నారు. పరిశీలిస్తాం.. కాలువ గట్టుపై గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నట్టు, తమ దృష్టికి రాలేదని ఇరిగేషన్ ఏఈ బాపూజీ తెలిపారు. వెంటనే పరిశీలిస్తామని చెప్పారు. మట్టి ముసుగులో యథేచ్ఛగా ఎర్ర గ్రావెల్ తవ్వకాలు పోలవరం కాలువ గట్టుపై అడ్డగోలుగా తవ్వకాలు ఖద్దరు చొక్కా పెద్దలకు, ఉన్నతాధికారులకూ వాటాలు సాక్షి పరిశీలనలో బట్టబయలు -
ఎండు గడ్డి ప్రియం
ఉండి: వ్యవసాయం అధునాతన సాంకేతిక వైపు అడుగులు వేస్తుండడం రైతులకు వరం కాగా పాడి రైతులకు మాత్రం శాపంగా పరిణమించింది. వరికోతల్లో ఎక్కువగా యంత్రాలనే వినియోగిస్తుండడంతో పశుగ్రాసం లభించక పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కూలీలు వరికోతలను కోయడం వలన కుప్పనూర్పులు చేసి ఎండుగడ్డిని జాగ్రత్త చేసి పశువులకు మేత వేసేవారు. ప్రస్తుతం యంత్రాలతో కోతకోసిన తరువాత ఆ వరి గడ్డి పిప్పిలా మారుతుండడంతో పశువులు తినేందుకు ఆసక్తి కనబరచడం లేదు. దీంతో ఎండుగడ్డి కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎక్కడా ఎండుగడ్డి దొరుకుతుందా అని రైతులు వెదికి అధిక ధర చెల్లించి మరీ కొనుగోలు చేసేందుకు పోటీ పడే పరిస్థితి నెలకొంది. దీంతో ఎండుగడ్డి ధర విపరీతంగా పెరిగింది. గతంలో ఎకరాకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు వరకు పలుకగా ప్రస్తుతం రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు పలుకుతుంది. డెల్టా ప్రాంతం నుంచి అధిక ధరలకు కొని మధ్యవర్తులు మరింత ఎక్కువ ధరకు ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తుండటంతో ఎండుగడ్డి మరింత ప్రియంగా మారింది. ముఖ్యంగా మెట్టప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో మధ్యవర్తులు ఎండుగడ్డిని కొనేందుకు పోటీపడతున్నారు. మార్టేరు తదితర ప్రాంతాల్లో ఫారంలు అధికంగా ఉండడంతో ఆ ప్రాంతాల్లో ఎకరా ఎండుగడ్డి రూ.5 వేల ధర పలుకుతుండటంతో పశువుల రైతులు ఘొల్లుమంటున్నారు. సబ్సిడీపై దాణాను అందజేయాలి గతంలో ఎక్కడబడితే అక్కడ దొరికే ఎండుగడ్డి ఇప్పుడు చాలా అరుదుగా లభిస్తోంది. ప్రభుత్వం పశువుల దాణాను అధిక సబ్పిడీపై అందజేసి పాడి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పశుగ్రాసం లభించక పాడి రైతుల ఇబ్బందులు యంత్రాలతో వరికోతలే ప్రధాన కారణమంటూ ఆవేదన ఎండు గడ్డి ధర చూసి ఆందోళన -
పాడి రైతులకు ఇబ్బందులు
పశువులకు మేత వేసేందుకు ఎండుగడ్డి దొరక్క పాడి రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పశువుల దాణాను సబ్సిడీపై అందజేసి పాడి రైతులను ఆదుకోవాలి. అంతే కాకుండా ప్రభుత్వం కూడా ఎండుగడ్డిని సేకరించి పాడిపరిశ్రమ అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టాలి. – పీవీఆర్కే ఆంజనేయరాజు, రైతు, వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు, వాండ్రం ప్రభుత్వం ఆదుకోవాలి ప్రస్తుతం ఎండుగడ్డికీ చాలా గిరాకీ ఏర్పడింది. గతంలో రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు ఉండే ఎకరా ఎండుగడ్డి ప్రస్తుతం ఏరియాను బట్టి రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు పలుకుతోంది. దీంతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులను ఆదుకోవాలి. – నిమ్మల కేశవకుమార్, రైతు, ఉప్పులూరు, ఉండి మండలం పశువులకు మేత కష్టంగా ఉంది పశువులకు మేత వేసేందుకు ఎండుగడ్డి దొరకడం లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎండుగడ్డిని పాడిరైతులకు అందజేయాలి. పాడిని మనం బతికించుకుని ఆరోగ్యమైన పాలుతాగడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో నిండునూరేళ్లు జీవిస్తాం. పాడిరైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలి. వర్రే పైడియ్య, రైతు, పాములపర్రు, ఉండి మండలం -
వాహనంలో రేడియేటర్ పేలి బాలికకు గాయాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన జంటగోపురాల ప్రాంతంలో మంగళవారం ఓ భక్తుడి పాల వాహనంలోని రేడియేటర్ పేలి అందులోని బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం. దెందులూరు మండలం పోతునూరుకు చెందిన ఒక వ్యక్తి సెకండ్ హ్యాండ్ పాల వ్యాన్ను కొనుగోలు చేశాడు. దానికి పూజలు చేసేందుకు భార్య, ఇద్దరు పిల్లలతో కలసి శ్రీవారి క్షేత్రానికి వచ్చాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి వాహనంలోని రేడియేటర్ ఒక్కసారిగా పేలింది. దాంతో బాలికపై రేడియేటర్లోని వేడి నీరు పడి ఆమెకు గాయాలయ్యాయి. ఆ సమయంలో వాహనం డోర్లు తెరచుకోక పోవడంతో అందులో ఉన్నవారంతా పెద్దపెద్ద కేకలు వేశారు. దాంతో స్థానికులు, భక్తులు వాహనం వద్దకు చేరుకుని, ఎంతగానో శ్రమించి డోర్లు తెరిచారు. గాయపడిన బాలికను ఆలయ ఆవరణలోని ప్రథమచికిత్సా కేంద్రానికి తరలించి, కాలికి చికిత్స చేయించారు. -
ఏలూరులో సింగిల్ చిత్ర బృందం సందడి
ఏలూరు (ఆర్ఆర్పేట): గీత ఆర్ట్స్ బ్యానర్పై తెరకెక్కిన సింగిల్ చిత్ర బృంద సభ్యులు మంగళవారం ఏలూరులో సందడి చేశారు. హీరో శ్రీ విష్ణు, హీరోయిన్లు కేతిక శర్మ, ఇవానా నటించిన సింగిల్ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమౌతున్న నేపథ్యంలో చిత్ర బృందం నగరంలోని ఎస్వీసీ థియేటర్లో ప్రేక్షకులను కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా చిత్రంలోని డైలాగులను చెప్పి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. తమ చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేసిన ప్రేక్షకులకు చిత్ర యూనిట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో శ్రీ విష్ణు, దర్శకుడు కార్తీక్ రాజు మాట్లాడారు. మంచి కామెడీతో పాటు కుటుంబ సమేతంగా చూసే విధంగా చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. సమావేశంలో హాస్య నటుడు వెన్నెల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
21 మంది ఎక్సైజ్ పాత నేరస్తుల బైండోవర్
నూజివీడు: మండలంలోని దేవరగుంట, ఓగిరాల తండాలకు చెందిన ఎక్సైజ్ పాత నేరస్తులు 21 మందిని తహసీల్దార్ గుగులోతు భద్రూ నాయక్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ ఏ మస్తానయ్య మంగళవారం తెలిపారు. దేవరగుంటకు చెందిన 19 మంది, ఓగిరాల తండాకు చెందిన ఇద్దరు వీరిలో ఉన్నారన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ భద్రూ మాట్లాడుతూ ఏడాది పాటు బైండోవర్ అమలులో ఉంటుందని, ఈ సమయంలో ఎక్సైజ్ నేరాలకు పాల్పడినట్లయితే రూ.లక్ష వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు.ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడి మహిళ మృతిఏలూరు టౌన్: ఏలూరు సత్రంపాడు ప్రాంతంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరానికి చెందిన బొమ్మేతి కుమారి హైదరాబాద్లోని తన చెల్లిని చూసేందుకు తల్లిదండ్రులతో కలిసి సోమవారం రాత్రి ద్వారపూడిలో ట్రైన్ నెంబర్ 12737 గౌతమీ ఎక్స్ప్రెస్ ఎక్కారు. మహిళా కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తున్న కుమారి రైలు బండి ఏలూరు సత్రంపాడు సమీపంలోకి వచ్చే సరికి ప్రయాణికుల రద్దీతో ప్రమాదవశాత్తు రైలునుంచి జారిపడింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను 108 అంబులెన్స్లో ఏలూరు జీజీహెచ్కు తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. ఏలూరు రైల్వే ఎస్సై పీ.సైమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు.అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు దగ్ధంకుక్కునూరు: అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. బర్లమడుగు గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు తాటి చెట్టుకు నిప్పంటించడంతో ఆ నిప్పు రవ్వలు ఎగసి గ్రామానికి చెందిన రేసు రాజు, సోయం బుల్లెమ్మ ఇళ్లపై పడడంతో అగ్నికి ఆహూతయ్యాయి. స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. కాగా ఈ ప్రమాదంలో ఇంట్లో సామాన్లతో సహా అన్ని కాలి బూడిద కావడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలామని కన్నీటి పర్యంతమయ్యారు. బర్లమడుగు అగ్ని ప్రమాద బాధితులకు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు తాండ్ర రాజేష్ ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు చొప్పున రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. -
జనసేనకు టీడీపీ షాక్!
మంగళవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు : నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో జనసేనకు టీడీపీ షాకిచ్చింది. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పదవుల్లో కీలక ప్రాధాన్యం ఉంటుందని పదే పదే ప్రకటించి చివరికి జిల్లా స్థాయిలో కూడా చోటు కల్పించకపోవడంతో జనసేన కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదన్న బాధలో ఉన్న వారిని తాజా నియామకాలు మరింత నిరాశకు గురిచేస్తున్నాయి. జనసేన నుంచి నలుగురే.. జనసేన పట్టున్నట్టు చెప్పుకునే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇంతవరకు రాష్ట్ర స్థాయిలో 12 మందికి నామినేటెడ్ పదవులు దక్కగా వారిలో జనసేన నుంచి కేవలం నలుగురే ఉన్నారు. జిల్లా నుంచి తొలి విడతలో ఇద్దరికి, రెండో విడతలో నలుగురుకి, తాజాగా ఏడుగురికి పదవులు దక్కాయి. మొదటి విడతలో ఏపీ వినియోగదారుల కౌన్సిల్ చైర్పర్సన్గా నియమించిన టీడీపీ మాజీ మంత్రి పీతల సుజాతకు ఈ సారి రాష్ట్ర మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్్ చైర్పర్సన్ పదవి వరించింది. మిగిలిన వారిలో ఆప్కాబ్ డీసీసీబీ చైర్మన్గా ఉంగుటూరు టీడీపీకి చెందిన గన్ని వీరాంజనేయులు, డీసీఎంఎస్ చైర్మన్గా జనసేనకు చెందిన చాంగటి మురళీకృష్ణ, భవన, ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్గా తాడేపల్లిగూడెం టీడీపీకి చెందిన వలవల బాబ్జీ, టైలర్స్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్గా తాడేపల్లిగూడెం టీడీపీకి చెందిన ఆకాశపు స్వామి, మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడిగా నరసాపురం టీడీపీకి చెందిన కొల్లు పెద్దిరాజు, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఏలూరు టీడీపీ నగర అధ్యక్షుడు పెన్నుబోయిన వాణి వెంకట శివ ప్రసాద్ ఉన్నారు. మూడో విడతలోని ఏడుగురిలో ఆరుగురు టీడీపీకి చెందిన వారే ఉండటం జన సైనికులకు మింగుడు పడటం లేదు. చినబాబుకు భంగపాటు భీమవరం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయకపోవడంతో ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షుడు, భీమవరానికి చెందిన కొటికలపూడి గోవిందరావు(చినబాబు) బరిలో ఉంటారని భావించారు. అనూహ్యంగా టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు జనసేనలో చేరి సీటు తెచ్చుకున్నారు. కూటమి ధర్మానికి కట్టుబడి భీమవరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పార్టీ ఎమ్మెల్యేల గెలుపునకు పనిచేశారు. ఆయన సేవలకు ఎమ్మెల్సీ పదవి ఆశించారు. పదవి దక్కక ప్రభుత్వ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్న తరుణంలో డీసీసీబీ చైర్మన్గా నియమిస్తారంటూ అధినాయకత్వం నుంచి సమాచారం వచ్చిందని రెండు నెలల క్రితం హడావుడి చేశారు. అమరావతి వెళ్లి సీఎం చంద్రబాబును కలవడంతో డీసీసీబీ చైర్మన్గా చినబాబు ఖాయం అంటూ వార్తలు వచ్చాయి. అదే సమయంలో చినబాబు అనుచరులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. ఆదివారం ప్రకటించిన పదవుల్లో డీసీసీబీ చైర్మన్ రాకపోగా, ఎక్కడా ఆయనకు చోటు దక్కక అనుచరుల్లో అసంతృప్తి నెలకొంది. నియోజకవర్గంలో, ఉమ్మడి జిల్లాలో పార్టీని నెట్టుకుని వస్తే అధికారంలోకి వచ్చాక పదవులను వేరొకరు ఎంజాయ్ చేస్తున్నారని మథనపడుతున్నారు. న్యూస్రీల్తీవ్ర అసంతృప్తిలో జనసేన కేడర్ గత ఎన్నికల్లో జనసేన నుంచి భీమవరం సీటు ఆశించిన వీరవాసరం జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్నాయుడు నామినేటెడ్ పదవి దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. ఇప్పటికే భీమవరంలో పేరుకు జనసేన ఎమ్మెల్యే అయినా పెత్తనమంతా టీడీపీ నాయకుల చేతుల్లోనే ఉంది. ఆచంట, పాలకొల్లు, తణుకు, ఉండి నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తిలో జనసేన కేడర్ ఉంది. ఏలూరు నుంచి రెడ్డి అప్పలనాయుడుకు ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా రెండో విడత నామినేటెడ్ పదవుల్లో చోటు కల్పించగా కై కలూరు, చింతలపూడి, పోలవరం తదితర నియోజకవర్గాల్లో కేడర్ తమను ద్వితీయ శ్రేణి నేతలుగానే చూస్తున్న పరిస్థితి ఉందని మండిపడుతున్నారు. నామినేటెడ్ పదవుల్లో దక్కని ప్రాధాన్యత పశ్చిమ జిల్లా అధ్యక్షుడు చిన్నబాబుకు మరో‘సారీ’ అసంతృప్తిలో అనుచరులు -
15వ రోజుకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ సమ్మె
భీమవరం: భీమవరం కలెక్టరేట్ సమీపంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం 15వ రోజుకు చేరుకుంది. ఏపీ ఎంసీఏ జిల్లా అధ్యక్షురాలు పి.శిరీష రాణి, సెక్రటరీ కె.విజయ సీతారామరాజు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఆరేళ్లు పూర్తి చేసుకున్న సీహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ చేయాలని, నిర్దిష్టమైన జాబ్ కార్డులు అందించాలని, హెచ్ఆర్ పాలసీ ఇంక్రిమెంట్ ట్రాన్స్ఫర్ తదితర డిమాండ్లతో గత 15 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. -
దళితుల ఇళ్లకు కరెంటు తొలగింపు అన్యాయం
కాళ్ల: ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా దళితుల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ తొలగించడం అన్యాయమని, వెంటనే పునరుద్ధరించకపోతే ఉద్యమిస్తామని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి హెచ్చరించారు. సోమవారం కాళ్ల మండల కేంద్రంలో లంక రోడ్డులో ఉన్న దళితుల ఇళ్లను కేవీపీఎస్ బృందం పరిశీలించి, బాధితులను పరామర్శించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కెవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ కాళ్ల మండల కేంద్రం లంక రోడ్డులో ఉన్న పది దళిత కుటుంబాలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దుర్మార్గంగా కరెంటు కట్ చేయడం అన్యాయమన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు చీకట్లో ఉంటూ కొవ్వొత్తుల వెలుగులో చదువుకుని పరీక్షలకు వెళ్లడం సిగ్గుచేటు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారమే దళితుల ఇళ్ళకు కరెంట్ కట్ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆదేశాలను పాటించాల్సి వస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పంచాయతీ, ఆర్ అండ్ బీ అధికారులు ఎమ్మెల్యే ఆదేశాలతోనే కరెంట్ కట్ చేసినట్లు చెప్పారన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలక్ట్రికల్ ఏఈ, పంచాయతీ అధికారులు కుమ్మకై ్క కరెంటు కట్ చేశారని తక్షణం వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దళితులు కాబట్టే ఆధిపత్యాన్ని చూపించి అన్యాయంగా కరెంటు కట్ చేశారన్నారు. తక్షణం కరెంటు ఇవ్వకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రత్యామ్నాయం చూపించే ఇళ్లు తొలగిస్తున్నామని చెపుతున్న ఎమ్మెల్యే అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో తొలగించాలనుకుంటున్న ఇళ్ళకు వచ్చి బాధితులతో మాట్లాడాలన్నారు. కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి కె.క్రాంతి బాబు మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో తొలగిస్తున్న పేదల ఇళ్ళకు ప్రత్యామ్నాయం చూపుతున్నారని ఎమ్మెల్యే చెపుతున్నారని ప్రత్యామ్నాయం అంటే ఇళ్ల స్థలాలు చూపి పట్టాలు చేతికివ్వడం మాత్రమే కాదని పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూల్చిన ఇళ్లకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇల్లు కట్టుకొనే వరకు అద్దె కూడా ప్రభుత్వమే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో కేవిపీఎస్ జిల్లా అధ్యక్షులు బత్తుల విజయకుమార్, సీఐటీయు జిల్లా నాయకుడు గొర్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి -
వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే
తాడేపల్లిగూడెం: వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని వైఎస్సార్సీపీ నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు అన్నారు. పార్లమెంటులోని నియోజకవర్గాల పర్యటనలో భాగంగా సోమవారం గూడెం నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. కొట్టు సత్యనారాయణ నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారి పక్షాన పోరాడాలన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్ని పథకాలు కొనసాగుతాయని, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని.. ప్రతి ఇంటికి తెలియజేయాలని సూచించారు. నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
నేత్ర పర్వం.. రథోత్సవం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో జరుగుతున్న వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామికి జరిగిన రథోత్సవం నేత్రపర్వమైంది. చినవెంకన్న తిరుకల్యాణ మహోత్సవం జరిగిన మరుసటి రోజు రాత్రి రథత్సవం జరపడం సంప్రదాయంగా వస్తోంది. అధిక సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొన్నా రు. ముందుగా ఆలయంలో అర్చకులు స్వామి, అమ్మవార్లను తొళక్క వాహనంపై ఉంచి, పూజాదికాలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మగళ వాయిద్యాలు, కోలాట భజనలు, అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్ధుల వేద మంత్రోచ్ఛరణల నడుమ వాహనాన్ని రథం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కల్యాణ మూర్తులను ఉంచి, విశేష పుష్పాలంకారాలు చేసి, హారతులిచ్చారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఆలయ అనువంశిక ధర్మకర్త నివృతరావు, ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి తదితరులు రథం వద్ద పూజలు నిర్వహించి, బలిహరణను సమర్పించగా, రథోత్సవం ప్రారంభమైంది. డప్పు వాద్యాలు, కళాకారుల వేషధారణలు, కోలాట భజనలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ శ్రీవారి దివ్య రథం క్షేత్ర పురవీధుల్లో తిరుగాడింది. ఆలయ ముఖ మండపంలో ప్రత్యేక అలంకరణలో భాగంగా స్వామివారు రాజమన్నార్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీహరి కళాతోరణ వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బ్రహ్మోత్సవాల్లో నేడు : ● ఉదయం 7గంటల నుంచి–భజన కార్యక్రమాలు ● 8 గంటల నుంచి – భక్తిరంజని ● 9 గంటల నుంచి–కూచిపూడి నృత్య ప్రదర్శనలు ● 10.30 గంటల నుంచి–చక్రవారి–అపభృధోత్సవం ● మధ్యాహ్నం 3 గంటల నుంచి – వేద సభ ● సాయంత్రం 4 గంటల నుంచి–నాదస్వర కచేరీ ● 5 గంటల నుంచి – సంగీత విభావరి ● రాత్రి 7 గంటల నుంచి–కూచిపూడి నృత్య ప్రదర్శన ● 8 గంటల నుంచి – పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజావరోహణ ● 9 గంటల నుంచి–అశ్వవాహనంపై గ్రామోత్సవం ● శ్రీవారి ప్రత్యేక అలంకారం – కాళీయమర్దనం -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
భీమవరం: ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని, గ్రామాల్లో వలసలు నివారించి వ్యవసాయ కూలీలందరికీ 200 పని దినాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కలిశెట్టి వెంకట్రావు, కార్యదర్శి కళింగ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన సొమ్ము కోట్లాది రూపాయలు పెండింగ్ ఉండడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని, రాజకీయ నాయకుల జ్యోక్యాన్ని పూర్తిగా నివారించాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయి సిబ్బందిపై కక్ష సాధింపులు, వేధింపులు నివారించాలని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి భీమవరం: ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతులు, పాఠశాలల పునర్వ్యవస్థీకరణ సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీయూటీఎఫ్ ఆధ్వర్యంలో భీమవరంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి మాట్లాడుతూ ఉన్నత పాఠశాలల్లో 1:45 నిష్పత్తి ప్రకారం బదిలీలు జరపాలన్నారు. ఏపీయూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె శ్రీదేవి మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి ఏకేవీ రామభద్రం మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలన్నింటిలో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించి నాణ్యమైన విద్య అందించాలన్నారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్, విద్యాశాఖాధికారికి అందించారు. ప్రిన్సిపల్ అనుచిత ప్రవర్తనపై కలెక్టర్కు ఫిర్యాదు భీమవరం/పాలకోడేరు: ఇంటర్ చదువుతున్న తన కుమార్తెను భీమవరం పట్టణంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె.కృష్ణారావు మానసికంగా, శారీరకంగా వేధించాడంటూ భీమవరం రూరల్ మండలం చినఅమిరం గ్రామానికి చెందిన బాలిక తండ్రి సోమవారం కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఫిర్యాదు చేశారు. తన కుమార్తె ప్లస్ 2 చదువుతోందని.. ప్రిన్సిపల్ బాలికను తన చాంబర్కు పిలిపించుకుని అసభ్యకరంగా ప్రవర్తించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను చెప్పినట్లు వినకపోతే పరీక్షలో ఫెయిల్ చేస్తానని, చంపుతానని బెదిరించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. భయపడి ఈ విషయాలను ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే బాధపడేదని.. ఎన్నిసార్లు అడిగినా ఏమీ చెప్పలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఆ స్కూల్ మూసి వేస్తున్నట్లు, ఆ స్కూల్ యాజమాన్యంలో గొడవలు ఉన్నట్లు సమాచారం రావడంతో ధైర్యం తెచ్చుకుని తనకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పిందని.. తమ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్ కృష్ణారావుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని ఫిర్యాదులో కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. 19న అత్తిలి ఎంపీపీ ఎన్నిక అత్తిలి: ఈ నెల 19న అత్తిలి ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అత్తిలి మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 16 స్థానాల్లో వైఎస్సార్సీపీ, 4 స్థానాల్లో కూటమి పార్టీలు గెలుపొందాయి. ఎంపీపీగా మక్కా సూర్యనారాయణ రెండున్నరేళ్లు పని చేసి ఆ పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. మార్చి 27న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు జరగాల్సి ఉండగా వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను ఓటు వేయకుండా నిర్భందించడంతో ఎన్నిక నిలిచింది. మరుసటి రోజు ఎన్నిక జరగకుండా కూటమి నాయకులు అడ్డుపడ్డారు. 19న యలమంచిలి ఎంపీపీ ఎన్నిక యలమంచిలి: ఈ నెల 19న యలమంచిలి ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నుంచి సోమవారం ఉత్తర్వులు వచ్చినట్లు ఎంపీడీఓ నందిపాటి ప్రేమాన్విత తెలిపారు. 15న సభ్యులకు ఎన్నికల నోటీసులు అందజేసి 19న ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తామని ఆమె వివరించారు. -
రెవెన్యూ రికార్డుల్లో అవకతవకలు
కాళ్ల: కాళ్లలో రెవెన్యూ రికార్డు ట్యాంపరింగ్ చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కాళ్ళ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద కాళ్ళ గ్రామానికి చెందిన రైతులు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో జరిగిన సర్వే ప్రకారం కాళ్ళ వ్యవసాయ భూముల విస్తీర్ణం సుమారు 3,862 ఎకరాలని.. రీసర్వేలోనూ వ్యవసాయ భూమి విస్తీర్ణం 3,862 ఎకరాలుగా చూపారని.. భూమిలో ఏవిధమైన మార్పు లేదన్నారు. భూములను ఆన్లైన్ చేసిన సందర్భంలో రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని తహసీల్దార్ సుందర్సింగ్కు వివరించారు. అనర్హులను 1బీలో నమోదు చేయటం వల్ల అర్హులు రోడ్డున పడ్డామన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది సక్రమంగా పనిచేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కాళ్ళలో రీసర్వే జరిగి చాలాకాలం అయినా.. ఆ వివరాలు నోటీసు బోర్డులో ప్రదర్శించకుండా గోప్యత ఎందుకు పాటిస్తున్నారు అని ప్రశ్నించారు. ఒక్కొక్క రైతుకు ఎకరాకు 2 సెంట్ల నుంచి 40 సెంట్లు భూమి వ్యత్యాసం చూపిస్తున్నారని వాపోయారు. -
నాటు తుపాకులతో హల్చల్
ఆక్వా చెరువులపై పిట్టలు కొట్టేందుకు వేటగాళ్లు నాటు తుపాకులు విచ్చలవిడిగా వాడుతున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. 8లో uపీజీఆర్ఎస్కు ఫిర్యాదుల వెల్లువ భీమవరం: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించి పీజీఆర్ఎస్కు బాధితులు పోటెత్తారు. వివిధ గ్రామాలకు చెందిన వృద్ధులు, వికలాంగులతోపాటు వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ను కోరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 187 ఆర్జీలను అందచేశారు. భార్య, ఇద్దరు కుమార్తెలు తనను ఇంటి నుంచి గెంటేశారని పెంటపాడు మండలం ప్రత్తిపాడు పంచాయతీ కాగులంపాడుకు చెందిన గజ్జరపు శంకరనారాయణ ఫిర్యాదు చేశారు. తాను 90 శాతం ఆర్ధోపెడిక్ సమస్యతో బాధపడుతున్నానని.. వికలాంగుల ఫించన్ సరిపోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నానని భీమవరం పట్టణం బలుసుమూడికి చెందిన రమణ కాత్యాయినిదేవి ఫిర్యాదు చేశారు. రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని కోరారు. 2024 –25 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఉన్నతి రుణాలు మంజూరు రూ.7.75 కోట్లు లక్ష్యం కాగా, రూ.8.32 కోట్లు రుణాలను మంజూరు చేశారని.. రుణాల రికవరీ 99.91 శాతం ఉందని.. కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో డీఆర్డీఏ ఉన్నతి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ తిరుమాని మురళీకృష్ణను పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ అభినందించారు. -
కోకో రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలి
ఏలూరు (టూటౌన్): కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించాలని, ఇప్పటివరకు కొనుగోలు చేసిన కోకో గింజలకు కూడా వ్యత్యాసపు ధర చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం డిమాండ్ చేసింది. మోండలీజ్ కంపెనీ ప్రతినిధులు రైతులను అవమానపరచడాన్ని నిరసిస్తూ, అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15వ తేదీన ఉదయం 10 గంటలకు సోమవరప్పాడు సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న మోండలీజ్ కంపెనీ కార్యాలయం, గోడౌను వద్ద కోకో రైతుల ధర్నా నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఏలూరు అన్నే భవనంలో సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించకుండా కంపెనీలు కోకో రైతులను నిలువు దోపిడీ చేయడం దారుణమని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ సమావేశంలో విశ్రాంత డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోకో రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం, కంపెనీలు చర్యలు చేపట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎస్. గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోళ్ల వెంకట సుబ్బారావు, పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర నాయకులు కోనేరు సతీష్ బాబు, ఏబీఎస్ ప్రకాశరావు, యలమాటి విశ్వేశ్వరరావు, ఏ.శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
మట్టి తీసి గట్టు మీద పెట్టు
ఉండి: ఉండి సబ్ డివిజన్ పరిధిలో కొత్తగా ఏడు కాలువల పూడికతీత పనులు, గత ప్రభుత్వంలో మంజూరైన రెండు పనులు చేపట్టేందుకు ఇటీవల హడావిడిగా అధికారులు సమాయత్తమయ్యారు. పనులు చేసే విధానం చూస్తుంటే రైతులకు మేలు జరగటం పొరపాటే అని అర్ధం అవుతుంది. కాలువల్లో పూడిక తీసి ఆ మట్టిని వేరే ప్రాంతానికి తరలిస్తే కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డులేకుండా ఉంటుంది. కానీ కాలువల్లో తీసే పూడిక మట్టిని పొక్లెయినర్ సహాయంతో గట్లపైనే వేసి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకుంటున్నారు. కాలువల్లో నీరు ఉన్నాగాని పొక్లెయినర్ల సహాయంతో వారికి నచ్చిన ప్రాంతంలో మట్టిని తీసి గట్లపై వేసి పూడిక తీసేసినట్లు మసిపూసి మారేడు కాయచేస్తున్నారు. అంతే కాకుండా చాలా పని చేసేసినట్లు గట్లపైనా, కాలువ అంచున ఉండే గడ్డిని పొక్లెయినర్ సహాయంతో తొలగించి ఆ ప్రాంతంలో పూడికను చాలా బాగా తొలగించినట్లు చెప్పడం విశేషం. అంతే కాకుండా ఆయా ప్రాంతాల్లో కాలువగట్ల వెంబడి ఉండే సీసీరోడ్లపైనా పూడిక తీసిన మట్టిన వేసి సీసీరోడ్లను మట్టిరోడ్లుగా మార్చేస్తున్న విధానంపై స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదేంటి అని అడిగితే దానికి సమాధానం చెప్పేవారు లేరంటే పనులు జరుగుతున్న తీరు అర్థం చేసుకోవచ్చు. కాలువల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించేందుకు అధికారులు కూడా కంటికి కనిపించడం లేదంటే.. పనులు ఎవరికి లాభం చేకూరుస్తున్నాయో తెలుస్తోంది. ఉండి సబ్ డివిజన్లో మొత్తం 9 పనులు మంజూరు ఉండి ఇరిగేషన్ సబ్ డివిజన్లో మొత్తం 9 పూడికతీత పనులు ఈ వేసవిలో ప్రారంభిస్తున్నారు. వీటిలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.94 లక్షలతో ఏడు పనులు, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరైన రెండు పనులు రూ.12.16 లక్షల అంచనాలతో పనులు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. వీటిలో మొదటిగా ఉండి మండలం కలిసిపూడి రెగ్యులేటర్ నుంచి శివారు ప్రాంతం అజ్జమూరు సరిహద్దు వరకు రూ.33 లక్షల అంచనాలు కాగా అగ్రిమెంట్ రూ.22 లక్షలు (వీటిలో లష్కర్ జీతాలు కూడా ఉంటాయని అధికారులు తెలిపారు)గా పనిని ప్రారంభించారు. వాండ్రం కాలువ రూ.7.06 లక్షల విలువైన పనులు ప్రారంభమయ్యాయి. మిగిలినవి యండగండి సెక్షన్లో లోసరి మెయిన్ కాలువ, బాపనకోడు, యండగండి అప్పర్పేర్లల్ కాలువ, చిలకంపాడు సెక్షన్లో రావిపాడు కాలువ, వీఎండబ్ల్యూ కాలువ పరిమెళ్ళ లాకుల వద్ద లీడింగ్ కాలువ పూడిక తీత పనులు రూ.62 లక్షలతో చేపట్టాల్సిన ఐదు పనులు రెండు లేదా మూడు రోజుల్లో ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. అలాగే గత ప్రభుత్వంలో రూ.12.16 లక్షల అంచనాలతో మంజూరైన అర్తమూరు, పాములపర్రు కాలువ, జక్కరం బొర్రకోడుల పనులు చేపట్టాల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రారంభించిన రెండు పనుల్లో ఇంతటి దారుణం జరుతుంటే చేపట్టాల్సిన మొత్తం ఏడు పనుల్లోను ఎంతటి దారుణాలు చోటుచేసుకుంటాయో అని రైతులు వాపోతున్నారు. తూతూమంత్రంగా కాలువల ఆధునికీకరణ? కాలువలో మట్టి తీసి వేరే ప్రాంతానికి తరలించకుండా గట్టుపైనే వేస్తున్న వైనం పనులు పారదర్శకంగా జరుగుతున్నాయి కలిసిపూడి, వాండ్రం కెనాల్ పూడిక తీత పనులు పారదర్శకంగా జరుతున్నాయి. అనుకున్న విధంగానే పనులు చేపట్టి పూర్తి చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో నీరు ఉండడం వల్ల రెండు లేదా మూడు రోజుల్లో మిగిలిన పనులు ప్రారంభిస్తాము. – డీఈ పీఎన్వీవీఎస్ మూర్తి, ఉండి -
లక్ష్మీనారాయణుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పాలకొల్లు సెంట్రల్ : పట్టణంలోని చతుర్భుజ లక్ష్మీతాయార్లు సమేత శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణస్వామివారి (చినగోపురం) బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం సాయంత్రం 6 గంటలకు విశాఖ జిల్లా పెందుర్తి వాస్తవ్యులు, కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రధానార్చకులు ముప్పిరాల అనంతాచార్యస్వామి, వారి శిష్య బృందంచే విశ్వక్సేనారాథన, పుణ్యాహవాచనము, రక్షాబంధనం, బుత్విగరుణము, మృత్సంగ్రహణము, అంకురార్పణ, కుంబావాహన, నివేదన, మంగళాశాసనము, తీర్థప్రసాద వినియోగముతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి బిరుదుకోట శంకర్ తెలిపారు. దేశంలోనే రెండో క్షేత్రం స్వామివారు అష్టబాహువులతో దేశంలో మొత్తం రెండు ప్రాంతాల్లో మాత్రమే కొలువై ఉన్నారని.. ఒకటి కంచి, రెండవది పాలకొల్లులో మాత్రమేనని స్థల పురాణాలు చెబుతున్నాయి. ఆలయంలో మూలవిరాట్ స్వామివారికి కుడివైపున లక్ష్మీతాయారు, ఎడమ భాగంలో ఆండాళ్లవారి ఉపాలయాలు, వెనుక భాగంలో ఆళ్వార్లు ఉపాలయాలు ఉన్నాయి. ఆలయంలో స్వామివారికి ఎడమ వైపు భాగంలో శ్రీరామక్రతువు స్తూపం, ఆగ్నేయంలో స్వామివారి హోమ మండపం, ఉత్తర భాగంలో స్వామివారి కళ్యాణోత్సవ మండపాలు ఉన్నాయి. అలాగే స్వామివారికి స్థానిక బంగారువారి చెరువుగట్టున తోటోత్సవం నిర్వహించే మండపం ఉంది. ఇక్కడ సుమారు 70 అడుగుల ఎత్తులో ఉన్న గాలిగోపురం నేడు చినగోపురంగా ప్రసిద్ధి చెందినది. శ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి (పెద్దజీయరుస్వామి) విశ్వకళ్యాణముకై ప్రతిష్టించిన 108 శ్రీరామ క్రతువు స్తంభాల్లో 85వ స్థంభం 1968లో ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించారు. ఉత్సవాలు ఇలా.. 13వ తేదీన ఉదయం అలంకార తిరుమంజనం, రాత్రి ఊంజల్ సేవ, చంద్రవాహనసేవ, తిరువీధి ఉత్సవం 14న రాత్రి శేషవాహనసేవ 15న హనుమంత వాహనసేవ 16న గరుడ వాహనసేవ, అనంతరం పటికబెల్లంతో శ్రీ కృష్ణ తులాభారాం 17న ఉదయం శ్రీవారికి పూలంగి సేవ, రాత్రి ఎదురు సన్నాహ మహోత్సవము, అనంతరం శ్రీవారి తిరు కల్యాణం 18న ఉదయం శ్రీవారికి చందనోత్సవం, రాత్రి రథోత్సవం 19న ఉదయం వసంతోత్సవం అనంతరం ధ్రువమూర్తుల తిరుమంజనం, మధ్యాహ్నం మహా పూర్ణాహుతి, రాత్రి ప్రణయ కలహం (ఏడు ముసుగుల ఉత్సవము), దివ్య మంగళ దర్శనం 20న ఉదయం సుదర్శన మహాయజ్ఞం, మధ్యాహ్నం తిరుప్పావడై ఉత్సవం, రాత్రి పండిత సత్కారం అనంతరం శ్రీ పుష్పయాగం నిర్వహించనున్నారు. -
విద్యాసంస్థల పేరుతో ఘరానా మోసం
లింగపాలెం: గంధం సాంబశివరావు అనే వ్యక్తి విద్యా సంస్థలను అప్పజెప్పినట్లుగా చూపి రూ.70 లక్షలు వసూలు చేసి తనను మోసం చేశారని సాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ కోసూరి సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం లింగపాలెం మండలం ధర్మాజీగూడెం శివారులో బాధితురాలు సుజాత విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు ఆమె మాటల్లోనే.. బాబా ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో గంధం సాంబశివరావు కాలేజీ నడిపే వారు. ఆ కళాశాలలో సరైన వసతులు లేకపోవడంతో ప్రభుత్వం అనుమతితో ధర్మాజీగూడెం శివారు వలసపల్లి అడ్డరోడ్డులో ఉన్న బిల్డింగ్లో ఏర్పాటు చేశారు. అమెరికాలో ఉంటున్న తన కుమారుడి వద్దకు తాను వెళ్లిపోతున్నాని, కాలేజీ తీసుకోమని నన్ను అడిగారు. బాబా ఎడ్యుకేషన్ సొసైటీ అనుమతులను సాయి జూనియర్ కళాశాలగా ధర్మాజీగూడెం శివారులో కొత్తగా నిర్మించిన బిల్డింగ్, ఫర్నీచర్తో సహ ఐదేళ్లు వాడుకునే విధంగా పెద్దల సమక్షంలో సాంబశివరావుకు రూ.70 లక్షలకు లీజు అగ్రిమెంట్ చేసుకున్నాం. ఏడాదికి రూ.11 లక్షలు అద్దె చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నాం. అగ్రిమెంట్ సమయంలో రూ. 40 లక్షలు సాంబశివరావుకు ఇవ్వగా మిగిలిన రూ. 30 లక్షల నిమిత్తం డిగ్రీ కాలేజీ అనుమతులు వేరే వారికి ఇచ్చి ఆ వచ్చిన సొమ్మును సాంబశివరావుకు చెల్లించాను. కాగా సాంబశివరావు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి వేరే పేర్లతో బినామీగా వనిత జూనియర్ కళాశాల, క్రిసైల్స్ ఇంటర్నేషనల్ స్కూల్కు అనుమతులు తీసకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తనను మోసం చేసిన గంధం సాంబశివరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేసినట్లు సుజాత తెలిపారు. రూ.70 లక్షలు తీసుకుని నన్ను బురిడీ కొట్టించారు సాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ సుజాత ఆవేదన -
ప్రొటోకాల్పై జనసైనికుల ఫైర్
పవన్ కళ్యాణ్కు సరైన గౌవరం దక్కడం లేదంటూ ఆవేదన నరసాపురం రూరల్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 164 స్థానాలు గెలుపొందేందుకు ముఖ్య కారకుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రొటోకాల్ విషయంలో సరైన గౌరవం దక్కడం లేదంటూ జనసైనికులు ఆవేదన వ్యక్తం చేశారు. నరసాపురం మండలంలోని లిఖితపూడి గ్రామంలో సోమవారం జరిగిన ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన కార్యక్రమం వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫొటో మంత్రుల ఫొటోలతో సమానంగా వేయడంపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు కోటిపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి ఫోటోను ఆ స్థానంలో పెట్టడం కరెక్టుకాదన్నారు. ఆలా చేయడం జనసైనికులందరినీ బాధిస్తుందన్నారు. ఇక మీదట నరసాపురం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలన్నింటిలో సీఎం చంద్రబాబు ఫొటోతో సమానంగా పవన్ కళ్యాణ్ ఫొటో వేయాలని అధికారులకు సూచించారు. యువతి అదృశ్యంపై కేసు నమోదు ఉండి: యువతి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం ఉండి మండలం పెదపుల్లేరు గ్రామానికి చెందిన యువతి సోమవారం తెల్లవారుజాము నుంచి అదృశ్యమైనట్లు ఆమె మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ఎండీ నసీరుల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కోళ్ల వ్యర్థాల వాహనం సీజ్ పెదపాడు: మండలంలోని వీరమ్మకుంట గ్రామానికి కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న వ్యాన్ను సోమవారం సీజ్ చేసినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. డ్రైవర్, యజమాని, చేపల చెరువు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. -
భూవివాదంలో జనసేన శ్రేణులు
స్థానికుల ఫిర్యాదుతో ఎమ్మెల్యే మందలింపు కొయ్యలగూడెం: భూవివాదంలో జనసేన పార్టీ శ్రేణుల వ్యవహారంపై స్థానికులు ఎమ్మెల్యేని చుట్టుముట్టి తమపై జరిగిన దౌర్జన్యాన్ని వివరించిన ఘటన కొయ్యలగూడెంలో సోమవారం జరిగింది. దీంతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జనసేన శ్రేణులను మందలించడం కనిపించింది. తహసీల్దార్ కే చెల్లన్న దొరతో కలసి కొయ్యలగూడెంలోని వివాదాస్పద భూమి వద్దకు వచ్చిన ఆయన జాతీయ రహదారికి పక్కన ఉన్న కోట్ల రూపాయల విలువైన ఆ భూమి వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థలం తమదంటూ బయటి వ్యక్తులు వచ్చారని, వారికి మద్దతుగా జనసేన, టీడీపీ నాయకులు ఉన్నారని స్థానికులు ఎమ్మెల్యేకి వివరించారు. తమ పార్టీలోని కొందరు తనకు తెలియకుండా వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వివాదాస్పద ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఇబ్బంది కలిగించబోమని ఎమ్మెల్యే చెప్పారు. అదే సమయంలో వివాదానికి సంబంధించిన వ్యక్తుల్లో ఒకరు ఎమ్మెల్యే సమక్షంలో అక్కడే ఉండటం.. అతనిపై మహిళలు దాడికి యత్నించడం గమనార్హం. ఈ క్రమంలో ఎస్సై వి.చంద్రశేఖర్ సిబ్బందితో కలసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి
నరసాపురం రూరల్: మొగల్తూరు మండల పరిధిలో దారితిప్ప 216 జాతీయ రహదారి మలుపు వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై వై నాగలక్ష్మి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోనసీమ అంబేడ్కర్ జిల్లా అంతర్వేదిలో నివాసం ఉంటున్న రామాని దుర్గా ప్రసాద్ (32) తన అత్తవారి ఇంటికి కలవపూడి వద్ద మోడి గ్రామానికి వెళుతున్నాడు. జాతీయ రహదారి మలుపు వద్ద చేపలలోడు వ్యాన్ దుర్గాప్రసాద్ బైక్ను ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దుర్గాప్రసాద్కు భార్య జ్యోతి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నాగలక్ష్మి తెలిపారు. -
నాటు తుపాకులతో వేటగాళ్ల హల్చల్
ఉండి: నాటుతుపాకులతో వేటగాళ్లు హల్చల్ చేస్తున్నారు. ప్రతిరోజు ఆక్వా చెరువులపై పిట్టలు కొట్టేందుకు తుపాకులను విచ్చలవిడిగా వాడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి, అర్తమూరు తదితర గ్రామాలతోపాటు ఆకివీడు, కాళ్ళ, పాలకోడేరు, భీమవరం రూరల్ మండలాలు, ఏలూరు జిల్లాలోని గణపవరం, నిడమర్రు మండలాల్లోను ఇదే విధంగా నాటు తుపాకులు దర్శనమిస్తున్నాయి. పట్టపగలే వాహనాలపై తుపాకులను చేతపట్టుకుని తిరుగుతున్నా పోలీసులు గానీ, ఇతర అధికారులు గానీ ఎవరూ పట్టించుకోడం లేదంటూ సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. తుపాకీ గురితప్పితే తమ పరిస్థితి ఏంటని ఆయా మండలాల్లోని ప్రజలు, వ్యవసాయ కూలీలు ఆందోళన చెందుతున్నారు. ఇది నేరం కాదా? నాటు తుపాకీలతో కేవలం పిట్టలనే కాలుస్తున్నారా.. లేక మరేదైనా జరుగుతుందా.. తుపాకుల సరఫరా ఎక్కడ నుంచి జరుగుతుంది అంటూ పలువురు వీటిపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఈ నాటు తుపాకులతో ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వేటగాళ్లు ఇంత బహిరంగంగా ఎలా వస్తున్నారు? వారికి రూ.30 వేలు నుంచి రూ.40 వేలు జీతాలు ఎలా ఇస్తున్నారు?ఇదేమీ నేరం కాదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో నాటుతుపాకీతో దారుణాలు గతంలో నాటుతుపాకీతో జరిగిన దారుణాలు గుర్తు తెచ్చుకుని ప్రజలు భయపడుతున్నారు. గతంలో సరిగ్గా పంచాయతీ ఎన్నికల సమయంలో మండలంలోని ఎన్నార్పీ అగ్రహారంలో నాటుతుపాకీతో ఓ హత్య జరగడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పుడు కూడా ఆక్వా చెరువులపై పిట్టలు కొట్టేందుకు తెచ్చిన నాటుతుపాకీగా పోలీసులు గుర్తించినట్లు పలువురు చెబుతున్నారు. అలాగే చెరువుకువాడ గ్రామంలో నాటు తుపాకీతో ఓ వ్యక్తి కోతి(వానరం)ని కాల్చడం కూడా సంచలనానికి దారి తీసింది. ఇంతటి భయంకరమైన ఘటనలు చోటుచేసుకుంటున్నా అధికారులు పట్టంచుకోకపోవడంపై ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వెంటనే వీటిపై చర్యలు తీసుకుని ప్రజల ప్రశాంత జీవనానికి అండగా నిలవాలని వారు కోరుతున్నారు. విచ్చలవిడిగా ఆక్వా చెరువులపై నాటు తుపాకుల వినియోగం పట్టించుకోని అధికారులు -
గూడెంలో మట్టి అక్రమ తవ్వకాలు
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. చేలు, చెరువులు అనే తేడా లేకుండా మట్టిని తవ్వి తరలిస్తున్నారు. ప్రధానంగా జగన్నాథపురం, మాధవరం, కొమ్ముగూడెం తదితర గ్రామాల్లోని చెరువులను టార్గెట్ చేసుకుని జేసీబీల సాయంతో మట్టి తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్ లారీల్లో తరలిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. తద్వారా మట్టి బకాసురులు సొమ్ము చేసుకుంటున్నారు. చేలు, చెరువుల్లో మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలించాలంటే సంబంధిత శాఖ అనుమతులు తీసుకోవాలి. అయితే మట్టి బకాసురులు మాత్రం అవేమీ లేకుండానే మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్న వారిని ప్రశ్నిస్తే నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి పేరును ప్రస్తావించడం గమనార్హం. గతంలో కొమ్ముగూడెం గ్రామంలోని చెరువులో మట్టి అక్రమ తవ్వకాలను స్థానికులు అడ్డుకున్న ఘటనలు ఉన్నాయి. ఇవేమీ పట్టనట్లుగా బకాసురులు తిరిగి యథావిధిగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఉదయం, రాత్రి సమయాల్లో మట్టి అక్రమ తవ్వకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని సమాచారం. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు మిన్నకుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం -
మద్యం మత్తులో యువకుడి హత్య
కాళ్ల: మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో యువకుడు హత్యకు గురైన ఘటన కాళ్ల మండలం ఎల్ఎన్ పురం గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కాళ్ళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా కోమటిలంకకు చెందిన చెన్నకేశవ అరవింద్(22), ప్రత్తికోళ్లలంక కు చెందిన బండి జాన్ యేసు ఇద్దరూ బంధువులు. కొంతకాలం క్రితం కాళ్ళ మండలం ఎల్ఎన్ పురం గ్రామంలోని చెరువుల వద్దకు జీవనోపాధి నిమిత్తం వచ్చారు. వీరు పనిచేసే చెరువుల వద్ద కిరణ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి వీరు ముగ్గురు పనిచేస్తున్న చెరువుపై మద్యం సేవించారు. మద్యం మత్తులో బంధువులైన జాన్ యేసు, అరవింద్ ఘర్షణకు దిగారు. అనంతరం జరిగిన దాడిలో జాన్ యేసు మేతబస్తాలపై ఉన్న చాకుతో అరవింద్ ఛాతీపై పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన అరవింద్ని పక్కనే ఉన్న కిరణ్ వేరే వ్యక్తి సహాయంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆకివీడు రూరల్ సీఐ జగదీశ్వరరావు, ఎస్సై శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు అరవింద్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేయగా సీఐ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.వ్యక్తిపై హత్యాయత్నంతాడేపల్లిగూడెం అర్బన్ : ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగిన ఘటన తాడేపల్లిగూడెంలో సోమవారం చోటుచేసుకుంది. పట్టణ ఎస్సై బాదం శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిర్రా నాగేశ్వరరావు మున్సిపాల్టీలో కారు డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి 16 ఏళ్ల క్రితం రామతులసీతో వివాహం కాగా కొన్నాళ్ల క్రితం విడిపోయారు. అనంతరం రామతులిసీ బాదంపూడి డేవిడ్ అనే వ్యక్తిని మరో వివాహం చేసుకొంది. రెండో పెళ్లి చేసుకుందనే అక్కసుతో రామతులసీపై సిర్రా నాగేశ్వరరావు లేనిపోని మాటలను ప్రచారం చేస్తున్నాడని బాదంపూడి డేవిడ్ కొన్ని రోజుల క్రితం గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి నాగేశ్వరరావును స్థానిక మసీదు సెంటరులోని అంబేద్కర్ కమ్యూనిటీ హాలు వద్ద చూసిన డేవిడ్ కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటనలో సిర్రా నాగేశ్వరరావుకు మెడపై గాయాలు కాగా అతడిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. పట్టణ ఎస్సై బాదం శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.యథేచ్ఛగా కంకర తరలింపుఉంగుటూరు: ఉంగుటూరు మండలంలోని మెత్తప్రాంతంలో మట్టి, కంకర మాఫియా ముఠా పడగ విప్పింది. రెండు రోజులనుంచి వందలాది లారీలతో యథేచ్ఛగా కంకరను లంబాడీ గూడెం నుంచి పెంటపాడు మండలం అలంపురంనకు తరలిస్తున్నారు. అలాగే బాదంపూడికి చెందిన కూటమి నాయకుడు పోలవరం కాలవగట్టు కంసాలిగుంట నుంచి పోలవరం కాలవగట్టు తవ్వి కంకరను తరలిస్తున్నుట్ల ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గొల్లగూడెం ప్రాంతంలో కుడిగట్టు కంకర గుట్టలు, నాచుగుంట అయకట్టులో మట్టి తరలింపు పనులు జరుగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా ఇవన్నీ జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై తహసీల్దార్ రవికుమార్ను ప్రశ్నించగా కంకర తరలింపు పనులు నిలుపుదల చేసినట్లు తెలియజేశారు. -
కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు
కాళ్ల: కూటమి ప్రభుత్వ పాలనలో మాతృమూర్తులకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో మహిళలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని పెదఅమిరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో ఎమ్మెల్సీ కవురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందోని మండిపడ్డారు. దేశంలో ఓ పక్క యుద్ధ వాతావరణం నెల కొంటే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాత్రం ప్ర తిపక్ష పార్టీ నాయకులపై కేసులు పెట్టి అరెస్టులు చేయడానికి చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్సిక్స్ హామీలను అమలు చేయడం లేదన్నా రు. మాజీ మంత్రి, బీసీ మహిళపై ఓ సీఐ దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని అందరూ గమనించాలన్నారు. అలాగే ఓ దళిత మహిళను వేకువజామున నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేయడం దుర్మార్గపు చ ర్యని ఖండించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ కర్ర జయచరిత మాట్లాడుతూ ఎస్సీ మహిళ కల్పనను కనీసం బట్టలు మా ర్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా వేకువ జామున పోలీసులు స్టేషన్కు తీసుకువెళ్లడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉందని, మాజీ మంత్రి విడుదల రజిని ప్రశ్నిస్తే ఆమైపె కూడా కేసు పెడతానని అనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మహిళల ను గౌరవిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఎక్కడికి వె ళ్లారని, మహిళలకు రక్షణ కల్పిస్తానన్న డిప్యూటీ సీ ఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీసీ మహిళ, మాజీ మంత్రి విడదల రజినీపై దౌర్జన్యం చేసిన సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. పార్టీ రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ పాలవెల్లి మంగ, జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడె విజయలక్ష్మి, పసుపులేటి కుమారి, కోడె యుగంధర్, బి.ఉమామహేశ్వరరావు, ఎం.చిట్టిబాబు, వీర మల్లికార్జునరావు, చిన్న మధు, భీమవరం పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ -
పంచాయతీ ఆస్తుల పరిరక్షణ
భీమవరం(ప్రకాశం చౌక్): ఆక్రమణల చెరలో ఉన్న గ్రామ పంచాయతీల భూములు, ఆస్తుల పరిరక్షణకు హైకోర్టు ఉత్తర్వులు అమలు చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగనుంది. ఇటీవల కలెక్టర్ సీహెచ్ నాగరాణి జిల్లాలో హైపర్ కమిటీ ఏర్పాటు చేసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పంచాయతీ భూమి, ఆస్తులు ఆక్రమణలను గుర్తించడం, వాటిని తొలగించడం, బాధ్యులపై కేసులు నమోదు తదితర చర్యలపై హైపర్ కమిటీకి సృష్టమైన అదేశాలు ఇచ్చారు. పంచాయతీ భూమి ఆక్రమణను గుర్తించిన వెంటనే పోలీసుల సహకారంతో పంచాయతీ అధికారులు ఆక్రమణలు తొలగిస్తారు. సమస్యలు తలెత్తితే హైపర్ కమిటీలోని అధికారులు చర్యలు తీసుకుంటారు. ప్రతి మూడు నెలలకోసారి హైపర్ కమిటీ సమావేశమై ఆక్రమణల గుర్తింపు, తొలగింపు పురోగతిని సమీక్షిస్తుంది. అలాగే ప్రతినెలా డివిజన్ పంచాయతీ అధికారి సమీక్షిస్తారు. వీరిచ్చే నివేదిక ఆధారంగా రెండు నెలలకు ఓసారి జిల్లా పంచాయతీ అధికారి కేసులను సమీక్షిస్తారు. జిల్లాలోని 409 పంచాయతీల్లో.. పశ్చిమగోదావరి జిల్లాలో 409 పంచాయతీలు ఉండగా.. పలు ప్రాంతాల్లో పంచాయతీల ఆస్తులు ఆక్రమణలకు గురయ్యాయి. పంచాయతీ భూములు, చెరువులు, డ్రెయిన్లను ఆక్రమించుకుని ఇళ్లు, షాపుల నిర్మాణం, లేఅవుట్లలోని పంచాయతీ భూమిని కలుపుకుని ప్లాట్ వేసి విక్రయించడం, పంచాయతీకి చెందిన భూమి పాడుకుని పాట చెల్లించకుండా స్వాధీనం చేసుకోవడం వంటి అతిక్రమణలు ఉన్నాయి. పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు ప్రతి సోమవారం భీమవరం కలెక్టరేట్లో జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పంచాయతీల్లో ఆక్రమణలపై పలు ఫిర్యాదులు అందుతున్నాయి. జిల్లాలోని 20 మండలాల్లో ప్రతివారం మూడు, నాలుగు పంచాయతీల ఆక్రమణలపై ఫిర్యాదులు వస్తున్న క్రమంలో హైకోర్టు ఉత్తర్వులతో జిల్లా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. పంచాయతీకి చెందిన ఆస్తులు, భూములను మూడు వర్గాలుగా విభజించారు. పంచాయతీ ఆస్తుల వర్గీకరణ ఏ కేటగిరీ : సొంత, భూసేకరణలోని ఆస్తులు, సాధారణ రోడ్లు, డ్రెయిన్లు, పశువుల షెడ్లు, సాధారణ మార్కెట్ ప్రాంతాలు, లేఅవుట్లలోని 10 శాతం ఖాళీ స్థలాలు, పార్కులు, పంచాయతీ కొనుగోలు చేసిన భూములు. బీ కేటగిరీ : బహమతులు, విరాళాలు, పంచాయతీలకు భూముల బదిలీ ద్వారా వచ్చిన ఆస్తులు తదితరాలు. సీ కేటగిరీ : పంచాయతీల్లోని వాటర్ వర్క్స్, రిజర్వాయర్లు, ట్యాంకులు, సిస్టర్న్లు, ఫౌంటేన్లు, బావు లు, పైపులు, పంచాయతీరాజ్ చట్టంలోని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, ట్యాంక్ బండ్లు, నీటివనరులు, పోరంబోకు భూములు (మేత భూములు, నూర్పిడి అంతస్తులు), శ్మశాన వాటికలు, పశువుల స్టాండ్లు, బండి స్టాండ్లు. ఏ, బీ కేటగిరీల రక్షణ బాధ్యత పంచాయతీలది కాగా.. సీ కేటగిరీ రక్షణ బాధ్యత పంచాయతీతో పాటు రెవెన్యూ శాఖది. రోడ్లు, కాలువ గట్ల ఆక్రమణలపై సర్వే పంచాయతీ పరిధిలోని ఆర్అండ్బీ రోడ్లకు ఇరువైపులా, కాలువలు, డ్రెయిన్ల ఆక్రమణలపై సర్వే చేసి జాబితా రూపొందించాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు అధికారులు సర్వే పనులు చేపట్టారు. హైపర్ కమిటీ హైపర్ కమిటీలో కలెక్టర్ చైర్మన్గా ఉంటారు. జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి, ఇరిగేషన్, సర్వే, ఆర్ అండ్ బీ, మైనింగ్ తదితర శాఖల జిల్లా అధికారులు కమిటీ సభ్యులుగా ఉంటారు. పారదర్శకంగా సాధ్యమేనా? పంచాయతీల్లో ఆక్రమణలు తొలగింపు అధికారులకు సాధ్యమవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు తొలగింపులకు అడ్డుపడితే అధికారులు ముందుకు వెళ్లగలరా అన్నది అనుమానమే. పంచాయతీ ఆస్తుల పరిరక్షణలో కలెక్టర్, హైపర్ కమిటీ ఈ మేరకు విజయవంతం అవుతారో వేచి చూడాలి. హైకోర్టు ఆదేశాలతో చర్యలు కేటగిరీ వారీగా ఆస్తుల విభజన ఆక్రమణల తొలగింపు.. కేసుల నమోదు జిల్లాలో హైపవర్ కమిటీ ఏర్పాటు జిల్లా 409 గ్రామ పంచాయతీలు -
మాజీ మంత్రి రజినీపై పోలీసుల తీరు దారుణం
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు అర్బన్: మాజీ మంత్రి, బీసీ మహిళ, వైఎస్సార్సీపీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జి విడుదల రజినీపై చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బరాయుడు ప్రవర్తించిన తీరు దారుణమని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన రజినీని కనీస గౌరవం ఇవ్వకుండా, మహిళ అని చూడకుండా చేయిపట్టుకుని పక్కకు తోసేయడం దుర్మార్గమన్నారు. రెండు రోజుల క్రితం కంతేరులో ఎస్సీ మహిళా ఎంపీటీసీ సభ్యురాలిని కూడా అర్ధరాత్రి అరెస్టు చేశారని, దుస్తులు మార్చుకోవడానికి రెండు నిమిషాలు సమయం అడిగినా పోలీసులు నిరాకరించి ఆమెను బలవంతంగా పోలీసు జీపు ఎక్కించారన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అ మలు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని దుయ్యబట్టారు. మహిళల విషయంలో ఎలా ప్రవర్తించాలో తెలియని కూటమి ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని కారుమూరి అన్నారు. మీడియా వ్యవస్థపై దాడులు మానాలి భీమవరం: సాక్షి మీడియాపై కక్ష సాధింపు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ ఇంటలెక్చువల్స్ ఫోరం విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఈద జాషువా అన్నారు. సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసంలో నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు చేసిన సోదాలు పత్రికా స్వాతంత్య్రంపై జరిగిన దాడిగా పరిగణించాలన్నారు. మీడియా వ్యవస్థలపై రాజకీయ కక్ష పూరిత దాడులను మానాలని డిమాండ్ చేశారు. మురళీ నాయక్ త్యాగం మరువలేం పాకిస్తాన్ కాల్పుల్లో మరణించిన భారత ఆర్మీ జవాన్ మురళీ నాయక్ దేశ భద్రత కోసం వీరమరణం పొందడం విషాదకరమని జాషువా అన్నా రు. మురళీనాయక్ ప్రాణాలను ప్రాణంగా పెట్టి దేశ రక్షణ కోసం చేసిన త్యాగం ఎన్నటికీ నిలిచిపోతుందన్నారు. మురళీనాయక్ వీరత్వం దేశ పౌరులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. అరటి రైతులకు మాజీ సీఎం జగన్ చేయూత హర్షణీయందెందులూరు: కడప జిల్లాలో 2024 మార్చిలో కురిసిన వర్షాలు, వరదలకు నష్టపోయిన 670 మంది అరటి రైతులకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.1.14 కోట్ల ఆర్థిక సాయం అందించడం వైఎస్ కుటుంబానికి రైతులపై ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఏలూరు జిల్లా అరటి రైతు సంక్షేమ సంఘం నేత, వైఎస్సార్సీపీ నేత ఉప్పలపాటి సత్తిబాబు అన్నారు. ఆదివారం సంక్షేమ సంఘ నాయకులు విలేకరులతో మాట్లాడారు. అరటి రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోకపోవడంతో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి హెక్టారుకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లా అరటి రైతు సంక్షేమ సంఘం తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు సంఘ నేత సత్తిబాబు తెలిపారు. 14న ఏపీటీఎఫ్ ధర్నా ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 14న విజయవాడలో నిర్వహించనున్న భారీ ధర్నాకు టీచర్లు పెద్దఎత్తున హాజరై జయప్రదం చేయాలని జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.రామారావు, బి.రెడ్డి దొర ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం అమలు చేయనున్న 9 రకాల పాఠశాలల వ్యవస్థ అసంబద్ధంగా ఉందని, ప్రాథమిక పాఠశాల వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని మూడు రకాల పాఠశాల వ్యవస్థను అమలు చేయాలని, 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించి, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు పెండింగ్లో ఉన్న మూడు డీఏలను మంజూరు చేయాలని, సంపాదిత సెలవుల నగదును ఖాతాల్లో జమ చేయాలని, 11వ పీఆర్సీ ఆర్థిక బకాయిలతో పాటు అన్నిరకాల ఆర్థిక బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆప్కాబ్ చైర్మన్గా గన్ని భీమడోలు: ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు రాష్ట్ర కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) చైర్మన్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్గా నియమితులయ్యారు. జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనకు అభినందనలు తెలిపారు. భీమడోలులోని పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. -
కమనీయం.. శ్రీవారి కల్యాణం
నేత్రపర్వంగా చిన వెంకన్న కల్యాణోత్సవం ద్వారకాతిరుమల: సర్వాభరణ భూషితుడైన శ్రీవా రు నుదుటున కల్యాణ తిలకం, బుగ్గన చుక్కలతో సిగ్గులొలుకుతున్న అమ్మవార్లను పెండ్లాడారు. ద్వా రకాతిరుమల చినవెంకన్న బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన తిరుకల్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ తూ ర్పు రాజగోపురం వద్ద కల్యాణ వేదికపైకి శ్రీవారు, అమ్మవార్లను వేర్వేరు వాహనాల్లో తీసుకువచ్చి రజిత సింహాసనంపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు కల్యాణ తంతును ప్రారంభించి, పలు ఘట్టాలను పూర్తిచేసి శుభముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేసి, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను జరిపించారు. దేవస్థానం తరఫున శ్రీవారికి ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు కుమారుడు నివృతరావు పట్టువస్త్రాలను సమర్పించగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవార్లకు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పట్టువస్త్రాలను అందించారు. పాంచాహ్నిక దీక్షతో వైఖానస ఆగమాన్ని అనుసరించి జరిపిన వేడుక భక్తజనులను పరవశింపజేసింది. కల్యాణోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్లు వెండి గరుడ వాహనంపై క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. ఆలయ ముఖ మండపంలో ప్రత్యేక అలంకరణలో భాగంగా స్వామివారు మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నేడు రథోత్సవం ఆదివారం రాత్రి 8 గంటల నుంచి శ్రీవారి దివ్య రథోత్సవం నిర్వహించనున్నారు. శ్రీవా రి ప్రత్యేక అలంకారం రాజమన్నార్. దుర్గగుడి నుంచి పట్టువస్త్రాలు చినవెంకన్న బ్రహ్మోత్సవాలకు విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం వా రు పట్టువస్త్రాలు సమర్పించారు. దుర్గగుడి ఈ ఓ వీకే శీనానాయక్ దంపతులు పట్టువస్త్రాల ను ఇక్కడి ఈఓ సత్యనారాయణమూర్తి చేతులమీదుగా అర్చకులకు అందజేశారు. -
గూడుకట్టుకున్న నిర్లక్ష్యం
సాక్షి, భీమవరం : పేదల సొంతింటి కలను సాకా రం చేసే పక్కా ఇళ్ల నిర్మాణం జిల్లాలో నత్తనడకన సాగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడా ది కాలంలో 9,107 ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు 3,434 మాత్రమే పూర్తయ్యాయి. నిర్మాణ వ్యయం పెరిగిపోవడం, ప్రభుత్వ సాయం చాలక ఇళ్ల నిర్మాణానికి పేదవర్గాల వారు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. లక్ష్యం ఆమడ దూరం గత ఏడాది జూన్లో అధికారంలోకి వచ్చిన కూ టమి ప్రభుత్వం ఈ ఏడాది మే నెలాఖరు నాటికి పునాది, లింటల్ తదితర దశల్లోని 9,107 ఇళ్లను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. రూ.1.80 లక్షలకు గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు అ దనంగా రూ.50 వేలు సాయాన్ని ప్రకటించింది. కా గా సిమెంట్, ఐరెన్, ఇటుక తదితర నిర్మాణ సా మగ్రి ధరలు పెరిగిపోవడంతో రూ.5 లక్షలు ఉంటేనే గాని ఇంటి నిర్మాణం పూర్తికాని పరిస్థితి. ప్రభుత్వ సాయం చాలడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. మరోపక్క సంక్షేమ పథకాల అమలు నిలిచిపోవడంతో పేదల దగ్గర డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. త్వరితగతిన ఇళ్లను నిర్మించుకోవాలని హౌసింగ్ అధికారులు ఒత్తిడి తెస్తున్నా ఆర్థిక ఇబ్బందులతో చాలామంది లబ్ధిదారులు ముందుకురాక ఇప్పటివరకు కేవలం 3,434 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. నిర్ణీత లక్ష్యంలో అత్యధికంగా భీమవరంలో 60 శాతం పూర్తి కాగా తాడేపల్లిగూడెం అర్బన్, పోడూరు, పాలకోడేరు, పెంటపాడులో 30 శాతంలోపే పూర్తయ్యాయి. నెలాఖరుకు పూర్తి చేయాలి రెండు రోజుల క్రితం ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణి హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. ఇళ్ల నిర్మాణంలో జిల్లా రాష్ట్రంలో 14వ స్థానంలో ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. మిగిలిన 5,721 ఇళ్లను నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు అధికారులు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో ఉద్యమంలా.. సొంతిల్లు లేని పేదలు ఉండకూడదన్న లక్ష్యంతో మునుపెన్నడూ లేనివిధంగా జిల్లాలోని 626 లేఅవుట్లలో 47,362 మందికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. సొంతంగా స్థలం ఉన్న పేదలకు 22,757 మందితో మొత్తం 70,119 మందికి ఇళ్లను మంజూరు చేసింది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు సాయం అందించడంతో పాటు ఇంటి నిర్మాణంలో వారికి అండగా నిలిచింది. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న లబ్ధిదారులకు అదనంగా రూ.35,000 రుణ సాయాన్ని అందించింది. సబ్సిడీపై ఐరెన్, సిమెంట్, ఉచితంగా ఇసుకను అందజేసింది. పేదలపై రవాణా చార్జీల భారం పడకుండా లే అవుట్ల సమీపంలోనే వీటి స్టాక్ పాయింట్లను ఏర్పాటుచేసింది. పనుల వేగవంతానికి కోట్లాది రూపాయలు వెచ్చించి జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేసింది. అప్పట్లో దాదాపు 28 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయి. పడకేసిన ఇళ్ల నిర్మాణం పెరిగిన వ్యయం.. చాలని సాయం ముందుకు సాగని పనులు మే నెలాఖరుకు 9,107 ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యం ఏడాదిలో పూర్తయినవి కేవలం 3,434 గృహాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భారీగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ జిల్లాలో 626 లేఅవుట్లలో 47,362 మందికి స్థలాల అందజేత జిల్లాలో ఇళ్ల నిర్మాణ ప్రగతి మండలం లక్ష్యం నిర్మించినవి నిర్మించాల్సినవి భీమవరం 274 165 109 కాళ్ల 177 105 72 పెనుగొండ 429 224 205 ఇరగవరం 254 127 127 మొగల్తూరు 282 134 148 ఆచంట 379 175 204 తాడేపల్లిగూడెం 628 287 341 తణుకు అర్బన్ 273 119 154 అత్తిలి 187 80 107 ఆకివీడు అర్బన్ 272 114 158 తణుకు 581 227 354 ఉండి 399 155 244 గణపవరం 300 112 188 నరసాపురం 412 149 263 యలమంచిలి 359 124 235 ఆకివీడు 314 108 206 వీరవాసరం 260 89 171 పాలకొల్లు అర్బన్ 94 31 63 పాలకొల్లు 200 64 136 నర్సాపురం అర్బన్ 172 55 117 పెనుమంట్ర 512 161 351 పాలకోడేరు 376 113 263 భీమవరం అర్బన్ 332 99 233 పెంటపాడు 443 117 326 పోడూరు 549 138 411 తాడేపల్లిగూడెం అర్బన్ 649 162 487 -
కేసులతో భయపెట్టలేరు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి యలమంచిలి: వైఎస్సార్ సీపీ నాయకులను తప్పుడు కేసులతో భయపెట్టలేరని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అన్నారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీపై నెల రోజుల వ్యవధిలో ఐదు కేసులు పెట్టడంతో ఆదివారం ఆయన్ను ప్రసాదరాజు కలిసి సంఘీభావం తెలిపారు. కూటమి నాయకులు అధికారం అడ్డం పెట్టుకుని పోలీసు కేసులు పెట్టగలరేమో కానీ, న్యాయస్థానంలో వాటిని రుజువు చేయలేరని ముదునూరి అన్నారు. ఇటువంటి కేసులకు వైఎస్సార్ సీపీ శ్రేణులు భయపడరని స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, కోర్టులో చివరికి న్యాయమే గెలుస్తుందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట పార్టీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి), పాలకొల్లు పట్టణ అధ్యక్షుడు కోరాడ శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు కొరగింజల హనుమంతరావు, దిద్దే చిట్టిబాబు, చోడగిరి రమేష్, చెన్ను విజయ్, పాలపర్తి కృపనాథ్, రావి పృధ్వీ తదితరులు ఉన్నారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం
పాలకొల్లు సెంట్రల్ : ఆర్థిక సమస్యలతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పాలకొల్లులో జరిగింది. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్న మాదు శ్రీనివాస్ దంపతులు శుక్రవారం మధ్యాహ్నం పెళ్లికి వెళ్తున్నామని చెప్పి ఆగర్తిపాలెంలో తమ పొలం వద్దకు వెళ్లి పురుగుమందు తాగేశారు. బంధువుల కథనం ప్రకారం కుమార్తెకు కూడా పురుగుల మందు కలిపిన గ్లాస్ ఇవ్వగా వాసన వస్తుంది.. తాగలేను అనడంతో భార్యాభర్తలిద్దరూ పురుగుమందు తాగారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు వారిద్దరిని పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యా యత్నానికి ముందు శ్రీనివాస్ వీడియో రికార్డు చేశారు. ‘నాకు అప్పులున్నాయి.. నేను జనం వద్ద తెచ్చుకున్న నగదు సుమారు రూ.10 లక్షల వరకూ తీర్చాలి. వాటిని తీర్చాలంటే నేను అప్పు ఇచ్చిన వ్యక్తి తిరిగి ఇవ్వాల్సి ఉంది. అతను ఇవ్వడం లేదు. అడుగుతుంటే కక్ష గట్టి నా సంగతి చూస్తానంటున్నాడు. నాకు న్యాయం జరగాలంటే ఆత్మహత్య ఒక్కటే శరణ్యం. నేను, నా భార్య, కుమార్తె విషం తీసుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నాం. మా చావు తరువాతైనా రావాల్సిన నగదు తీసుకుని బాకీలు సెటిల్ చేసి మిగిలింది మా అక్క, బావలకు ఇప్పించాలని కోరుతున్నాం’అంటూ వీడియోలో పేర్కొన్నాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం దగ్గర బంధువైన కిట్టుకు 20 ఏళ్ల క్రితం శ్రీనివాసు రూ.2.50 లక్షలు ఇచ్చాడు. ఆ నగదుతో పొలం కొన్నారని, ఇప్పుడు తన వాటాగా ఎంత వస్తే అంత ఇవ్వాలని శ్రీనివాసు కోరుతున్నాడని చెప్పారు. -
జాగా కనిపిస్తే చేపల చెరువులే
సాక్షి టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమంగా ఆక్వా చెరువులు వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో చెరువుల జాతర ప్రారంభమైంది. శ్మశాన వాటిక స్థలాలను సైతం చేపల చెరువుల్లో కలిపేసుకుంటున్నారు. ఎప్పటి నుంచే అమలవుతున్న ప్రభుత్వ నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. రాజకీయ నాయకుడి మాటే చట్టంగా మారుతోంది. తప్పు జరుగుతోందని తెలిసినప్పుటికీ అధికారులు నోటీసిచ్చి పనైపోయిందని చేతులు దులుపేసుకుంటున్నారు. ఈలోపు అనుమతులు లేకుండానే చేపల చెరువులు వెలుస్తున్నాయి. కై కలూరు మండల శివారు గ్రామం వేమవరప్పాడులో 10 వార్డులు ఉన్నాయి. మొత్తం 3,000 మంది జనాభా ఉన్నారు. కూలీ పనులపై ఎక్కువగా ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామంలో బస్టాప్ వెనుక 3 ఎకరాల్లో శ్మశాన వాటిక ఉంది. సమీపంలో బుర్ల సత్యనారాయణకు చెందిన సర్వే నంబరు 177/1, 2, 3, 13లో 2.99 ఎకరాల భూమిని చేపల చెరువుగా తవ్వుతున్నాడు. చెరువు రూపంలో వచ్చిన మట్టిని మైనింగ్కు విక్రయిస్తున్నారు. ఆక్వా చెరువు తవ్వకానికి ఎలాంటి అనుమతులు లేవు. సర్పంచ్ మాటకు విలువ లేదు గ్రామ ప్రథమ పౌరుడు, సర్పంచ్ నున్న రాంబాబు శ్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమించుకుని చెరువు తవ్వుతున్నారని, ప్రభుత్వ అనుమతులు లేవని ఏప్రిల్ 28న ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. శ్మశానంలో హిందూ సాంప్రదాయతో పాటు క్రైస్తవమతం తీసుకున్న కొందరు సమాధి చేస్తారు. ఆ సమయంలో సమీప చేపల చెరువులో ఊట నీరు బయటకొస్తే సమాధులకు ఇబ్బందులుంటాయని పేర్కొన్నారు. ఇదే కాకుండా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం నిర్వీర్యమవుతోందన్నారు. దీంతో ఈ నెల 6న ఫిషరీష్ ఏడీ రాజ్కుమార్ బుర్ల సత్యనారాయణకు నోటీసులు ఇచ్చారు. పనులు మాత్రం ఇప్పటికీ ఆగలేదు. నిబంధనలకు పాతర కొత్త చెరువు తవ్వాలంటే 2019 మార్చి 16న విడుదలైన జీవో నంబరు7ను అమలు చేయాలి. 2020లో వచ్చిన అప్సడా యాక్టు నిబంధనలు పాటించాలి. నాన్ ఆక్వా జోన్లో రెవెన్యూ, ఫిషరీష్, వ్యవసాయం, ఇరిగేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వంటి శాఖల అనుమతివ్వాలి. మండల స్థాయి తర్వాత జిల్లా స్థాయి కమిటీ అధికారులు డీఎల్సీలో అనుమతులు అందిస్తారు. వ్యవసాయ భూములు, తాగునీటి చెరువులు, దేవాలయాలు, పాఠశాలలు, శ్మశానాలు వంటి వాటికి 3 నుంచి 5 మీటర్ల దూరంలో చెరువులు తవ్వుకోవాలి. ఇలాంటి నిబంధనలు ఉన్నా కేవలం రాజకీయ నాయకుడి అండతో చెరువులు తవ్వేస్తున్నారు. వేమవరప్పాడు విషయంలో వీఆర్వో రంగనాయకమ్మను వివరణ కోరగా.. చెరువు తవ్వకానికి ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. షిషరీష్ సిబ్బంది మాత్రం రెవెన్యూ అధికారులు సహకరిస్తే అక్రమ పనులు అడ్డుకుంటామంటున్నారు. వేమవరప్పాడులో శ్మశానాన్ని ఆక్రమించి తవ్వకం ఎలాంటి అనుమతులూ లేకుండా పనులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఆగని వైనం నోటీసులు ఇచ్చాం అనుమతులు లేకుండా వేమవరప్పాడులో చేపల చెరువు తవ్వుతున్న బుర్ల సత్యనారాయణకు మత్స్యశాఖ నుంచి నోటీసులు అందించాం. ప్రభుత్వ నిబంధనలు అందరూ పాటించాలి. వేమవరప్పాడులో అక్రమ చెరువు తవ్వకం పనులు నిలుపుదలకు సిబ్బందిని పంపుతాం. – బి.రాజ్కుమార్, మత్స్యశాఖ ఏడీ, కై కలూరు -
పెండ్లి కుమారుడిగా మీసాల వెంకన్నస్వామి
కై కలూరు: మీసాల వెంకన్న వార్షిక బ్రహోత్సవాలు కై కలూరులో అత్యంత వైభవంగా శనివారం ప్రారంభమయ్యాయి. స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యాహవచన, పంచామృత అభిషేకాలు చేశారు. స్వామివారిని పెండ్లికుమారుడు, అమ్మవారిని పెండికుమార్తెగా అలంకరించారు. సుదర్శన హోమం నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మాడ వీధులలో గజ వాహనంపై స్వామిని ఊరేగించారు. ఆలయ ఈవో వీఎన్కే.శేఖర్ మాట్లాడుతూ ఆదివారం రాత్రి 7.10 గంటలకు స్వామి దివ్య కల్యాణం జరుగుతుందన్నారు. మద్దిలో అభిషేక సేవ జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెంలో తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభూగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించున్నారు. -
కమర్షియల్ ట్యాక్సెస్ నాన్ గెజిటెడ్ కార్యవర్గం ఎన్నిక
తణుకు అర్బన్: కమర్షియల్ ట్యాక్సెస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ ఏలూరు డివిజన్ నూతన కార్యవర్గ ఎన్నికలు శనివారం తణుకులో నిర్వహించారు. రాజమండ్రి డివిజన్ అధ్యక్షుడు టి.రాము ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఏలూరు డివిజన్ అధ్యక్షుడిగా పి.రాజేష్బాబు ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు భవనారి వెంకటేష్బాబు, జనరల్ సెక్రటరీ కె.సుధాకర్ ఆదేశాల మేరకు నూతన కార్యవర్గం ఏర్పడినట్లు చెప్పారు. కార్యదర్శిగా వై.నాగేంద్రప్రసాద్, కోశాధికారిగా బీవీ బాబు, అసోసియేట్ అధ్యక్షుడిగా కె.ప్రశాంత్కుమార్, ఆఫీస్ సెక్రటరీగా వై.జయశ్రీ, ఉపాధ్యక్షులుగా జి.సతీష్కుమార్, సీహెచ్ నరేష్, సహాయ కార్యదర్శులుగా కేఎన్ఎస్ యాదవ్, ఎం.రాజేష్ను ఎన్నుకున్నారు. మట్టి ట్రాక్టర్ల అడ్డగింపు ఉండి: ఉండి మండలం మహాదేవపట్నం గ్రామం రామచంద్రపురంలో అనుమతులు లేకుండా చెరువులో మట్టి తవ్వి ప్రైవేటు భూములు పూడుస్తున్న సుంకర శివ (వార్డు సభ్యుడు), సుంకర శ్రీనుకు చెందిన ట్రాక్టర్లను అడ్డుకున్నట్లు వీఆర్వో చిన్నారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ అనుమతులు లేకుండా మట్టిని తీసుకువెళ్లి ప్రైవేట్ స్థలాన్ని పూడుస్తున్నారని ట్రాక్టర్లు అతివేగంతో తిరుగుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయనే ఫిర్యాదు మేరకు అడ్డుకున్నట్లు చెప్పారు. అనుమతులు లేకుండా తోలకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
బతుకు పోరులో.. పీకల్లోతు మురుగులో !
బతుకు పోరులో నిజమైన హీరోలు వీరే.. డ్రైనేజీ పక్క నుంచి వెళ్లడానికే మనం చిరాకుపడతాం. రోడ్డుపై మురుగు కనిపిస్తే ఆ చాయలకు వెళ్లేందుకు ఇష్టపడం.. అలాంటిది తీవ్ర దుర్వాసన వెదజల్లే మురుగులో దిగి శుభ్రం చేసే వీరిని చూస్తే బతుకు పోరు ఎంత విచిత్రమో అనిపిస్తుంది. వారు ఒక్క రోజు పనిచేయకపోతే మన జీవనం ఎంత దుర్భరమో.. అందుకు ఈ చిత్రమే నిదర్శనం. ద్వారకాతిరుమలలోని రాణిచిన్నయమ్మారావుపేటలో మురుగుతో నిండిపోయిన డ్రైనేజీని శుభ్రం చేసేందుకు ఓ కార్మికుడు శనివారం అందులో దిగి ఎంతగానో శ్రమించాడు. మురుగు ముందుకు కదలకపోవడంతో పీకల్లోతున మునిగి డ్రైనేజీని శుభ్రం చేశాడు. – ద్వారకాతిరుమల -
ఇంటి పరిహారం ఎప్పుడు?
కుక్కునూరు: పోలవరం పరిహారం చెల్లింపులో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు నిర్వాసితులను అయోమయానికి గురిచేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక గత జనవరిలో ప్రాజెక్ట్ 41.15 కాంటూర్ పరిధి బ్యాక్ వాటర్లో ముంపునకు గురవుతున్న గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ వ్యక్తిగత, ఇంటి విలువకు ప్యాకేజీ చెల్లించింది. వ్యక్తిగత ప్యాకేజీ దాదాపు అందరికీ జమ కాగా ఇంటి విలువకు సంబంధించిన పరిహారం మాత్రం కొందరికి మాత్రమే జమచేశారు. చాలా మంది నిర్వాసితులకు ఇంటి విలువలకు సంబంధించిన పరిహారం జమ కాలేదు.ఇ ఈ సంవత్సరం పరిహారం చెల్లింపు ఉంటుందా లేదా అన్న మీమాంసలో నిర్వాసితులు ఉన్నారు. పోలవరం సర్వేలో భాగంగా నిర్వాసితుల ఇళ్లకు సంబంధించి సర్వే చేసి కొలతలు సేకరించిన సిబ్బంది వాటిని కంప్యూటరైజ్డ్ చేశారు. అనంతరం ప్రదర్శించిన రెండు జాబితాల్లో ఉన్న నిర్వాసితుల పేర్లు మూడో జాబితాలో లేకుండా పోయాయి. తమ పేర్లు జాబితా నుంచి గల్లంతైన విషయం తెలిసిన నిర్వాసితులు అధికారులను కలిసి వివరించారు. అధికారులు సిబ్బందిని నిర్వాసితుల ఇళ్లకు పంపి ఇంటి కొలతలు, తగిన ఆధారాలు, ఇంటి ఫొటోలు సేకరించారు. అయితే జాబితాలో వారి పేర్లు నమోదు చేశారా? లేదా అనేది నిర్వాసితులకు చెప్పలేదు. మండల స్థాయి అధికారులు నిర్వాసితులకు సంబంధించిన వివరాలు నిజమేనని ధ్రువీకరించి జిల్లా అధికారులకు పంపినప్పటికీ జిల్లా స్థాయి అధికారులు నిర్వాసితులకు న్యాయం చేయడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పేర్లు గల్లంతైన నిర్వాసితులు ఎప్పటికి న్యాయం జరుగుతుందోనని ఎదురుచూస్తున్నారు. పోలవరం నిర్వాసితుల ఎదురుచూపులు -
అనాథ మృతదేహానికి అంతిమ సంస్కారం
భీమవరం: పట్టణంలో అనాథ మృతదేహానికి శనివారం మానవత సంస్ధ ఆధ్వర్యంలో అంతిమ సంస్కారం నిర్వహించారు. పట్టణంలోని కొత్తబస్టాండ్ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందగా అనాథ మృతదేహంగా గుర్తించిన పోలీసులు మానవత సంస్థకు సమాచారం ఇచ్చారు. దీంతో సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, కో–చైర్మన్ కారుమూరి నర్సింహమూర్తిబాబు, అల్లు శ్రీనివాస్ స్పందించి మృతదేహాన్ని ఖననం చేశారు. చోరీకి గురైన బంగారం స్వాధీనం ముదినేపల్లి రూరల్ : చోరీకి గురైన బంగారు వస్తువులను స్థానిక పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని చిగురుకోటకు చెందిన గుబిలి సుబ్బారావు భార్యకు అనారోగ్యంగా ఉండడంతో ఈ నెల 6న విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి తిరిగి రాగా గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి బీరువాలో ఉంచిన 45 గ్రాముల బంగారు నగలు, 50 గ్రాముల వెండి చోరీ చేశారు. దీనిపై స్థానిక పోలీసుస్టేషన్లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేయగా కై కలూరు రూరల్ సీఐ వి రవికుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది దర్యాప్తు చేసి చిగురుకోటకు చెందిన పిండి శ్రీనును శనివారం అరెస్టు చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో చొరవ చూపిన సిబ్బంది బి.నాగబాబు, సీహెచ్ లక్ష్మీ శ్రీకాంత్, బి.పవన్ను సీఐతో పాటు ఎస్సై వీరభద్రరావు అభినందించారు. లారీ ఢీకొని వ్యక్తి మృతి తణుకు అర్బన్: లారీ ఢీకొన్న ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు మృతిచెందిన ఘటన తణుకు జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామానికి చెందిన మట్టా సత్యనారాయణ (35) స్నేహితుడితో కలిసి తాడేపల్లిగూడెం నుంచి మోటారుసైకిల్పై స్వగ్రామానికి వెళ్తుండగా ఉండ్రాజవరం జంక్షనన్ వద్ద టిప్పర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో సత్యనారాయణ లారీ కింద ఇరుక్కుని అక్కడిక్కడే మృతిచెందగా స్నేహితుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ గాదిరెడ్డి దుర్గాప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వరుస చోరీలు.. నిందితుడి అరెస్ట్ చింతలపూడి: వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని చింతలపూడి పోలీసులు శనివారం పట్టుకున్నారు. సీఐ సీహెచ్ రాజశేఖర్ వివరాలు వెల్లడిస్తూ.. స్థానిక ఫాతిమాపురం చెక్పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం, పాత రేపూడి గ్రామానికి చెందిన కొప్పుల వెంకటేశ్వరరావు అనుమానాస్పదంగా కనిపించడంతో అప్రమత్తమైన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో వెంకటేశ్వరరావుపై 35 దోపిడీ, దొంగతనాలు, కేసులు ఉన్నట్లు గుర్తించారన్నారు. నిందితుడు పామర్రు ప్రాంతంలో ఒక వ్యక్తిని మోసం చేసి అతని నుంచి బైక్ దొంగిలించినట్లు విచారణలో తేలిందన్నారు. చింతలపూడి మండలంలోని ఒక వ్యక్తిని జేసీబీ పని పేరుతో నమ్మించి, దాడి చేసి, అతని వద్ద రూ.7,500 నగదు, ఫోనన్ దొంగిలించినట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సీఐ తెలిపారు. శ్రీవారి క్షేత్రంలో వీధి కుక్కల పట్టివేత ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో సంచరిస్తున్న వీధి కుక్కలను దేవస్థానం అధికారులు శనివారం పట్టించి, అటవీ ప్రాంతానికి తరలించారు. ద్వారకాతిరుమల గ్రామం, ఆలయ పరిసరాల్లో వీధి కుక్కల సంచారం ఎక్కువగా ఉంది. దీంతో క్షేత్రానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీన్ని గమనించిన ఆలయ అధికారులు తాడేపల్లిగూడెంకు చెందిన సిబ్బందితో వాటిని పట్టించారు. మొత్తం 70 శునకాలను పట్టుకుని, దూర ప్రాంతానికి తరలించారు. వాటిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టమని చెప్పినట్టు అధికారులు తెలిపారు. -
భారత సైన్యానికి సంఘీభావం
భీమవరం (ప్రకాశంచౌక్): భారత సైన్యానికి మనోధైర్యం కల్పించేందుకు భీమవరం, ఉండి నియోజకవర్గాల స్థాయిలో శనివారం భీమవరంలో భారీ సమైక్యతా ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదాన్ని తుద ముట్టించడమే లక్ష్యంగా పోరాడుతున్న సైన్యానికి అందరూ సంఘటితంగా ఉంటూ సంపూర్ణ మద్దతు ప్రకటిద్దామని డిప్యూటీ స్పీక్టర్ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. జువ్వలపాలెం రోడ్డులోని అడ్డ వంతెన మూర్తి రాజు విగ్రహం నుంచి టాటా విగ్రహం వరకు పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కలెక్టర్ సీహెచ్ నాగరాణి, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ దేశంపై ఎలాంటి దాడులను ఉపేక్షించేది లేదన్నారు. పీఏసీ చైర్మన్ రామాంజనేయులు మాట్లాడుతూ తీవ్రవాదాన్ని అంతమొందించడంలో ప్రధాని మోదీకి అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. అడిషనల్ ఎస్పీ వి.భీమరావు, ఎకై ్సజ్, అగ్నిమాపక శాఖ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
జై జవాన్.. జై భారత్
ఏలూరు (ఆర్ఆర్పేట): ఆపరేషన్ సిందూర్లో వీర మరణం పొందిన ఎం.మురళీనాయక్, సైనికులకు ఏలూరు దత్తాశ్రమం, అశోక్నగర్ నమస్తే పార్కు వద్ద బంజారా భజరంగీ భేరి సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండాలు, కొవ్వొత్తులతో శనివారం నివాళులర్పించారు. సంఘ జిల్లా నాయ కుడు ధరావత్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ యుద్ధభూమిలో వీరమరణం పొందిన మురళీ నాయక్ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారన్నారు. భూక్యా నాగరాజు నాయక్ మాట్లాడుతూ భారత సైన్యంలో ఆత్మస్థైర్యం నింపడానికి దేశ ప్రజలంతా ఏకమై అండగా నిలవాలని కోరారు. జరభల వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మురళీనాయక్ వంటి సైనికుల ప్రాణాలకు విలువ కట్టలేమన్నారు. స్థానికులు, విద్యార్థులు, చిన్నారులు పాల్గొన్నారు. -
సర్దుపోటు!
విద్యుత్ బిల్లుల షాక్ ● టీడీపీ కూటమి పాలనలో మినిమం చార్జీలకు కాలం చెల్లు ● ఎఫ్పీపీసీఏ చార్జీల పేరిట ఇష్టారాజ్యంగా వడ్డన ● ఒక యూనిట్ వినియోగానికి రూ.737.33 బిల్లు ● భీమవరంలో సర్కారు వీర బాదుడు ● ఒక్కో కనెక్షన్పై రూ.400కు పైగా దోపిడీ ● జిల్లావాసులపై దాదాపు రూ.27.97 కోట్ల అదనపు భారం భీమవరంలోని బుధవారం మార్కెట్ సమీపంలో సుబ్బారావు అనే వ్యక్తికి రెండు పోర్షన్ల ఇల్లు ఉంది. మరమ్మతుల కోసమని రెండు నెలల నుంచి దానిని ఖాళీగా ఉంచారు. గత నెలకు గాను ఒక పోర్షన్లోని మీటరుకు ఒక్క యూనిట్, మరో పోర్షన్లోని మీటరుకు మూడు యూనిట్ల రీడింగ్ మాత్రమే వచ్చింది. నిజానికి.. ఈ వినియోగానికి రూ.100 నుంచి రూ.150 లోపు మినిమమ్ చార్జీలతో బిల్లులు రావాల్సి ఉండగా ఒక్క యూనిట్ కు గాను రూ.737.33, మూడు యూనిట్లకు రూ.609.26 చొప్పున బిల్లులు వచ్చాయి. ఎఫ్పీపీసీఏ, ఎఫ్పీపీసీఏ–2, ఎఫ్పీపీసీఏ–3 పేరిట అర్థం కాని లెక్కలతో అదనపు చార్జీలు బాదేశారని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో విద్యుత్ కనెక్షన్లు, వినియోగం విభాగం కనెక్షన్లు వినియోగం (మి.యూ.) గృహావసరాలు 6,18,238 77.67 కమర్షియల్ 81,192 17.86 పరిశ్రమలు 2,096 38.45 పంచాయతీ, మున్సిపల్ 14,685 12.96 వ్యవసాయ సంబంధిత 17,753 88.22పేదలంటే కనికరం లేదు విద్యుత్ బిల్లు వస్తోందంటేనే భయమేస్తోంది. కరెంటు ఎంత పొదుపుగా వాడుకున్నా సరే బిల్లు మాత్రం తగ్గడం లేదు. పేదలంటే ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. ఏవో చార్జీలంటూ వినియోగదారులపై భారం మోపుతున్నారు. – కోరం లలిత, గంగడుపాలెం, యలమంచిలిసర్దుబాటు చార్జీల పేరుతో.. విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు కూటమి నాయ కులు హామీ ఇచ్చారు. ఇప్పుడు సర్దుబాటు పేరుతో పేదలపై అదనపు భారాన్ని మోపుతున్నారు. పెరిగిన చార్జీలు ఆక్వా రైతులకు భారంగా మారాయి. – పీవీఆర్కే ఆంజనేయరాజు, వాండ్రం, ఉండిసాక్షి, భీమవరం : మాకే ఓటెయ్యండి తమ్ముళ్లూ.. ‘అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామే తప్ప.. పెంచే ప్రసక్తే లేదు. నేను గ్యారంటీ’ అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించారు. వినియోగదారులకు వరుస షాకులిస్తున్నారు. ట్రూఅప్, ఎఫ్పీపీసీఏ చార్జీల పేరిట అర్థంకాని లెక్కలతో అదనపు బాదుడు షురూ చేశారు. జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం డివిజన్లలో మొత్తం 6.18 లక్షల గృహావసరాల కనెక్షన్లు ఉన్నాయి. ఎఫ్పీపీపీఏ పేరిట బాదుడు ఫ్యూయల్ పవర్ పర్చేజ్ కార్డు అడ్జస్ట్మెంట్ (ఎఫ్పీపీసీఏ) పేరుతో ప్రస్తుత, పాత సంవత్సరానికి ఫిక్స్డ్, కస్టమర్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, సర్చార్జీలను సర్దుబాటు పేరిట వినియోగించిన దానికన్నా రెండు మూడురెట్లు బిల్లులు రావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎండలు మండుతున్నా బిల్లులకు భయపడి ఏసీలు కూడా ఆన్ చేయడంలేదని, అయినా రెట్టింపు బిల్లులు వస్తున్నాయని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఖాళీగా ఉన్న ఇళ్లకు మినిమం రూ.100 నుంచి రూ.150లోపు బిల్లు రావాల్సి ఉండగా రూ.600కు పైబడి బిల్లులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో డొమెస్టిక్, కమర్షియల్ విద్యుత్ కనెక్షన్లు 6,99,430 ఉండగా ఒక్కో బిల్లుపై సగటున రూ.400 చొప్పున సుమారు రూ.27.97 కోట్ల అదనపు భారం పడుతున్నట్లు అంచనా. సోషల్ మీడియాలో సైటెర్లు విద్యుత్ బిల్లులు భారీగా పెరిగిపోవడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు టీడీపీ కూటమి ప్రభుత్వంపై సైటెర్లు వేస్తున్నారు. విద్యుత్ బిల్లులు పెంచబోమంటూ కూటమి పార్టీల అధినాయకులు ఇచ్చిన హామీలు, గత ప్రభుత్వంలో తక్కువగా ఉన్న విద్యుత్ బిల్లులు, నేడు పెరిగిన బిల్లులను చూపిస్తూ పోస్టులు పెడుతున్నారు. వీటికి అధిక సంఖ్యలో లైకులు, షేర్లు వస్తున్నాయి. -
రైతులను సర్వనాశనం చేస్తున్న కూటమి
తణుకు అర్బన్: పంట దిగుబడి అధికంగా వచ్చిందన్న ఆనందాన్ని ఆవిరి చేసేలా గోనె సంచుల కొర త సృష్టించి కూటమి ప్రభుత్వం రైతులను నిట్టనిలువునా ముంచేసిందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తణుకులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం గోనె సంచులు సరఫరా చేయకపోవడం వల్లే రైతులు పండించిన ధాన్యం నీటిపాలైందని మండిపడ్డారు. సాక్షాత్తూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం కొనుగోలు చేయలేమన్నారంటే.. ఈ కూటమి ప్రభుత్వంలో రైతులు ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారో అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క ధాన్యం మొత్తం కొనుగోలు చేయకుండా టార్గెట్ పూర్తయిందంటూ కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ముందుచూపుతో పంటను ఆన్లైన్లో నమోదు చేయించేవారని, బీమా చేయించేవారని, చివరి గింజ వరకూ ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసేవారని, ఏ పంట నష్టానికి ఆ సీజన్లో పరిహా రం అందించారని గుర్తుచేశారు. ఇప్పుడు అన్నిరకా లుగా రైతులను సర్వనాశనం చేసే పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. గ తంలో పీడీఎస్ బియ్యం రవాణాపై నిఘా పెట్టి లారీలను సీజ్ చేస్తూ కఠినంగా వ్యవహరించే పరిస్థితులు ఉండేవని, అయితే నేడు కూటమి ప్రభుత్వ నేతలు మట్టి, ఇసుక, పీడీఎస్ బియ్యం వంటి అంశాలను ఆర్థిక వనరుగా మార్చుకున్నారని విమర్శించారు. తణుకులో పేకాటలు యథేచ్ఛగా జరుగుతున్నాయని, పోలీసులు, పేకాటరాయుళ్లు పేకముక్కల్లా కలిసిపోయారని ధ్వజమెత్తారు. మద్యం దుకాణాల తీరును రానున్న రోజుల్లో ఎండగడతామని, నిబంధనల ప్రకారం దుకాణాలు నడవకపోతే ఉద్యమం చేస్తామని కారుమూరి హెచ్చరించారు. యథేచ్ఛగా పర్మిట్ రూములు, బెల్టుషాపులు రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్లు, బెల్టు షాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యుడు వెలగల సాయిబాబారెడ్డి విమర్శించారు. ముఖ్యంగా తణుకులో ప్రతి మద్యం దుకాణం వద్ద పర్మిట్ రూమ్ నడుస్తోందని చెప్పారు. ఈ విషయంపై తణుకు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ సీఐ సత్తి మణికంఠరెడ్డిని సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగితే తణుకు స్టేషన్ పరిధిలో 33 మద్యం దుకాణాలు ఉన్నాయని, ఇటీవల కాలంలో నమో దు చేసిన కేసుల వివరాలు తెలిపారని వివరించారు. రానున్న రోజుల్లో మద్యం దుకాణాల వద్ద ఉన్న పర్మిట్ రూమ్లను సందర్శించి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పొట్ల సురేష్, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, బెజ్జవరపు హేమశ్రీ తదితరులు పాల్గొన్నారు. సంచుల కొరత.. టార్గెట్ల పేరుతో ఆంక్షలు మాజీ మంత్రి కారుమూరి విమర్శలు -
కల్యాణోత్సవానికి భారీ ఏర్పాట్లు
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టం తిరుకల్యాణోత్సవాన్ని ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ తూర్పు రాజగోపురం వద్ద భారీ వేదికను నిర్మిస్తున్నారు. ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. కల్యాణ మండప ప్రాంతం, క్షేత్ర పరిసరాలను సుందరీకరించారు. స్వామివారు ఆలయం నుంచి తూర్పు రాజగోపురం మీదుగా కల్యాణ వేదిక వద్దకు రాత్రి 7.30 గంటల సమయంలో చేరుకుంటారు. అలాగే సోమవారం రాత్రి చినవెంకన్న రథోత్సవం నిర్వహించనున్నారు. -
ధాన్యం కొనుగోలు లక్ష్యం పెంచాలి
భీమవరం: ప్రభుత్వం లక్ష్యం పెంచి దాళ్వా ధాన్యం కొనుగోలు చేయాలని, నూక శాతం పేరుతో మిల్లర్ల దోపిడీని అరికట్టాలని ఏపీ కౌలు రైతుల సంఘం డిమాండ్ చేసింది. శనివారం సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు ధాన్యం పట్టుబడులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. పూర్తిస్థాయిలో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వా రా వెళ్లిన ధాన్యాన్ని టార్గెట్ పూర్తయిందంటూ మిల్లర్లు దింపుకోవడం లేదని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. కొందరు మిల్లర్లు ఎంటీయూ 1156 రకం కొనుగోలు చేయడం లేదని, కొనుగోలు చేసినా 75 కిలోల బస్తాకు అదనంగా రెండు నుంచి నాలుగు కిలోలు తీసుకుంటున్నారన్నారు. అధికారులు ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరారు.12 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలుభీమవరం: ఇంటర్మీడియెడ్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 12న ప్రారంభం కానున్నాయని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాఽధికారి ఎ.నాగేశ్వరరావు శనివారం విలేకరులకు తెలిపారు. జిల్లాలోని 40 కేంద్రాల్లో 18,265 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. ఫస్టియర్ జనరల్ కేటగిరీలో 13,494, ఒకేషనల్ కేటగిరీలో 1,020, సెకండియర్ జనరల్ కేటగిరీలో 3,201, ఒకేషనల్ కేటగిరీలో 550 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు. ఫస్టియర్ పరీక్షలు ఉద యం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయన్నారు. రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్, రెండు సిట్టింగ్ స్క్వాడ్స్, 13 స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్టు నాగేశ్వరరావు చెప్పారు. పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయన్నారు.జూలై 5న లోక్ అదాలత్నరసాపురం: జూలై 5న జరిగే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని నరసాపురం 10వ అదనపు జిల్లా జడ్జి ఎ.వాసంతి అన్నారు. ఈ నెల 10న జరగాల్సిన జాతీయ లోక్అదాలత్ ను జూలై 5కు వాయిదా వేశామన్నారు. కార్యక్రమం నిర్వహణకు మరో రెండు నెలల సమ యం వచ్చినందున ఈసారి మరిన్ని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా న్యాయవాదులు, పోలీసులు ప్రయత్నించాలని సూచించారు. కక్షిదారులకు అవగాహన కల్పించి, లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించాలని తెలిపారు.యుద్ధ పరిస్థితులపై అవగాహన తప్పనిసరిభీమవరం: యుద్ధాన్ని ఎవరు కోరుకోవడం లేదని తప్పనిసరి పరిస్థితిలో, అనివార్యమైతే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తగిన అవగాహనతో పౌరులంతా సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. మినిస్టరీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ఇన్ ఇండియా రూపొందించిన సమాచారాన్ని క్రోడీకరించి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ తయారుచేసిన ‘యుద్ధం మాకు వద్దు.. అనివార్యమైతే ఎదుర్కొనేందుకు మేం సిద్ధం’ అనే పుస్తకాన్ని శనివారం క్యాంపు కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యుద్ధం అనివార్యమైతే త్రివిధ దళాలతో పాటు పౌరులు కూడా సైనికులుగా మారాల్సి ఉంటుందన్నారు. శిక్షణ లేకున్నా అవగాహన ద్వారా యుద్ధ సమయంలో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వీలవుతుందనే లక్ష్యంతో ఈ పుస్తకాన్ని రూపొందించినట్టు చెప్పారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ అధికారి ఆర్.కుమరేశ్వరన్ పాల్గొన్నారు. -
నేత్రపర్వం.. ఎదుర్కోలు ఉత్సవం
● అట్టహాసంగా శ్రీవారి తిరువీధి సేవ ● నేడు చిన వెంకన్న కల్యాణోత్సవం ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న వై శాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గో రోజు శనివారం రాత్రి జరిగిన ఎదుర్కోలు ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యమున్న ఈ వేడుకను శ్రీవారి కల్యాణోత్సవం ముందు రోజు జరిపించడం ఆనవాయితీ. ముందుగా స్వామి, అమ్మవార్ల కల్యాణ మూర్తుల ను ఆలయం నుంచి తొళక్క వాహనంపై తీసుకువచ్చి నిత్య కల్యాణ మండపంలో వెండి శేష వాహనంపై వేంచేపు చేసి హారతులిచ్చారు. అనంతరం ఎదుర్కోలు ఉత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ అధికారులు, అర్చకులు, పండితులు, భక్తులు రెండు జట్లుగా విడిపోయి ఒక జట్టు శ్రీవారి గుణగణాలను, ఆయన విశిష్టతను, రెండో జట్టు అమ్మవార్ల గుణగణాలను కొనియాడారు. వివాహానికి ముందు రోజు వధూవరుల తరఫు బంధువులు శుభలేఖను పఠించేందుకు జరిపే కార్యక్రమమే ఎదుర్కోలు ఉత్సవమని పండితులు తెలిపారు. ఉదయం హనుమద్వాహనంపై శ్రీవారి తిరువీధి సేవ శోభాయ మానంగా సాగింది. ఆలయ ముఖ మండపంలో శ్రీ మురళీ కృష్ణ అలంకారంలో ఉన్న శ్రీవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించారు. శ్రీహరి కళాతోరణ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో నేడు ● ఉదయం 7 గంటల నుంచి.. సింహ వాహనంపై తిరువీధి సేవ. ● రాత్రి 8 గంటల నుంచి.. శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహనంపై తిరువీధి సేవ. ● శ్రీవారి ప్రత్యేక అలంకారం.. మోహిని -
మళ్లీ జగనన్న పాలన రావాలని..
జంగారెడ్డిగూడెం: మళ్లీ జగనన్న పాలన వచ్చి పేదల మోముల్లో చిరునవ్వు నిలవాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్రెడ్డి రావాలని కోరుకుంటూ శనివారం ఆమె ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించి పూజలు చేయించారు. దక్షిణా ముఖంగా ఉన్న శ్రీవారి మెట్లకు బొట్లు పెట్టుకుంటూ ఆలయానికి చేరుకుని, ప్రదక్షిణలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమం అందక పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎటువంటి అభివృద్ధి, సంక్షేమం కానరాకపోగా, ఆర్భాటాలు, ప్రచారాలు, హడావుడి కనిపిస్తున్నాయన్నారు. కూటమి పాలన నుంచి విముక్తి కలిగి మళ్లీ జగనన్న రాజ్యం రావాలని ఆమె ఆకాక్షించారు. -
సూర్య, చంద్ర ప్రభలపై మెరిసిన శ్రీవారు
ద్వారకాతిరుమల: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆ దేవదేవుడు సూర్య, చంద్ర ప్రభలపై మెరవగా.. కనులారా వీక్షించిన భక్తజనులు పులకించారు. ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో జరుగుతున్న వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాల్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా పంచాయుధాలను ధరించి, నారాయణమూర్తి అలంకరణలో సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించిన శ్రీవారికి అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేసి హారతులిచ్చారు. ఆ తరువాత గ్రామోత్సవాన్ని నిర్వహించారు. వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించిన భక్తులకు సూర్యదేవుడి అనుగ్రహంతో సకల విద్యా, ఆరోగ్య, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. రాత్రి ఉభయ దేవేరులతో శ్రీవారు చంద్రప్రభ వాహనంపై క్షేత్ర పురవీదుల్లో ఊరేగారు. మేళతాళాలు, మంగళ వాద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, గజ, అశ్వ సేవలు, చిరుగాలుల నడుమ చల్లనయ్య విశేష పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీహరి కళాతోరణ వేదికపై ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఆలయ ముఖ మండపంలో శ్రీరామ అలంకారణలో దర్శనమిచ్చిన శ్రీవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు.. ఉదయం 7 గంటల నుంచి – హనుమద్వాహనంపై శ్రీవారి తిరువీధి సేవ, భజన కార్యక్రమాలు ● 8 గంటల నుంచి – భక్తిరంజని ● 9 గంటల నుంచి – కూచిపూడి నృత్య ప్రదర్శనలు ● సాయంత్రం 4 గంటల నుంచి – నాదస్వర కచేరి ● 5 గంటల నుండి – కూచిపూడి నృత్య ప్రదర్శనలు ● 6 గంటల నుంచి – ప్రవచనాలు ● రాత్రి 7 గంటల నుంచి – ఎదుర్కోలు ఉత్సవం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ● 8.30 గంటల నుంచి – వెండి శేషవాహనంపై తిరువీధి సేవ ● 9 గంటల నుంచి – మోహినీ భస్మాసుర నాటకం ● శ్రీవారి ప్రత్యేక అలంకారం : మురళీకృష్ణచిన్ని కృష్ణుడితో నృత్య ప్రదర్శనలు పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ ద్వారకాతిరుమల: శ్రీవారికి, అమ్మవార్లకు తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించింది. ఉదయం అర్చకుల వేద మంత్రోచ్ఛరణల నడుమ టీటీడీ అధికారి పట్టువస్త్రాలను శిరస్సుపై పెట్టుకుని ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి దేవస్థానం ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి చేతుల మీదుగా అర్చకులకు అందజేశారు. శ్రీరామ అలంకారంలో దర్శనం అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు -
మనిషి మనిషిగా ఉంటే శత్రువులు ఉండరు
ద్వారకాతిరుమల: మనిషి మనిషిగా ఉంటే అతడికి శత్రువులు ఉండరని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి అన్నారు. ద్వారకాతిరుమల విర్డ్ ఆస్పత్రిని శుక్రవారం సాయంత్రం ఆయన సందర్శించారు. ముందుగా ఆస్పత్రికి విచ్చేసిన చిన్న జీయర్ స్వామికి శ్రీవారి దేవస్థానం ఈఓ, అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు, ఆస్పత్రి ట్రస్టీ ఐవీఆర్ సుధాకర్, వి.నారాయణమూర్తి, డాక్టర్ భవ్యచంద్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రి ఆవరణలో కొలువైన చినవెంకన్న విగ్రహానికి హారతులిచ్చారు. అనంతరం ఆస్పత్రిని పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. ఆ తరువాత ఆస్పత్రి ఆవరణలో భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఏలూరు (ఆర్ఆర్పేట): సమస్త సృష్టిని నడిపించే చైతన్య స్వరూపమే భగవత్ తత్వమని చినజీయర్ స్వామిజీ అన్నారు. ఏలూరు ఆర్ఆర్ పేట వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న సుదర్శన కలశ ప్రతిష్ఠోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రతువును ముందుకు నడిపించారు. దేవస్థానంలో 36వ వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవ సహిత చతుర్వేద హవన ప్రయుక్త విమాన సుదర్శన కలశ ప్రతిష్ఠోత్సవం, మహాకుంభాభిషేక మహోత్సవం ఈ నెల 3 నుంచి కొనసాగుతున్నాయి. శుక్రవారం విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, చతుఃస్థానార్చన తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. చినజీయర్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నాటుసారా స్థావరంపై దాడి
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం సమీపంలో శుక్రవారం నాటుసారా స్థావరాలపై ఎకై ్సజ్ అధికారులు దాడి చేశారు. దాడిలో సారా తయారీకి సిద్ధంగా ఉన్న 200 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసినట్లు జంగారెడ్డిగూడెం ఎకై ్సజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనుబాబు తెలిపారు. 5 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. ట్రిపుల్ ఐటీలో ముగిసిన వర్క్షాప్ నూజివీడు: ఆర్జీయూకేటీ, వాద్వానీ ఫౌండేషన్ సంయుక్తంగా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఐదు రోజుల పాటు ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎడ్యుకేషన్పై నిర్వహించిన వర్క్షాప్ శుక్రవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థుల్లో వ్యవస్థాపక నైపుణ్యాలు వెలికితీసి, సృజనాత్మక ఆలోచనలతో ముందుకెళ్లేలా ప్రోత్సహించడమే శిక్షణా కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. అధ్యాపకులు శిక్షణలో నేర్చుకున్న అంశాలకనుగుణంగా తరగతి గదిలో విద్యార్థులకు బోధించి స్టార్టప్లు ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీలను స్టార్టప్లకు కేంద్రంగా మార్చాలన్నారు. ఈఈఐటీపీ డీన్ పీ శ్యామ్, యూనివర్శిటీ డీన్ శ్రావణి, ఆర్జీయూకేటీ సీఏఓ బండి ప్రసాద్, ఏఓ బీ లక్ష్మణరావు పాల్గొన్నారు. -
వైద్య విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించాలి
ఏలూరు టౌన్: ఏలూరులోని ప్రభుత్వ వైద్యకళాశాల విద్యార్థులకు వసతి గృహాలు నిర్మించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో, ఆయుష్మాన్ భారత్ విభాగం వద్ద, సాంఘిక సంక్షేమ వసతి గృహాల సముదాయాల వద్ద ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల నిర్మాణ పనులను శుక్రవారం కలెక్టర్ కె.వెట్రిసెల్వి, రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ నరసింహం, సహాయ సంచాలకుడు వెంకటేష్, ఎమ్మెల్యే బడేటి చంటి, వివిధ శాఖల అధికారులతో కలిసి కృష్ణబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైద్య కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, వివిధ వైద్య విభాగాలలో స్పెషలిస్ట్ కోర్స్లు 750 మంది పైగా అభ్యసిస్తారని, ఆ సామర్థ్యానికి తగినట్లు ప్రస్తుతం ఉన్న భవనాలకు అదనంగా హాస్టల్ భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు వెంటనే పంపాలన్నారు. వసతి గృహ భవనాలు వైద్య కళాశాలకు దగ్గరలో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. హాస్టల్ నిర్మాణానికి అందుబాటులో ఉన్న స్థలం వివరాలు స్పెషల్ సీఎస్కు వివరించారు. ఏలూరులోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న వైద్య కళాశాల నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలిని, డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, ఎిస్సీ కార్పొరేషన్ ఈడీ ముక్కంటి, వైద్యారోగ్య శాఖ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజనీర్ కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సీనియార్టీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ ఏలూరు (ఆర్ఆర్పేట): పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు, పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు తీసుకోని వాటిని సరిచేశామని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాలు పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో, నోటీసు బోర్డుల్లో శుక్రవారం నుంచి అందుబాటులో ఉన్నాయన్నారు. అభ్యంతరాలు ఉంటే ఈ నెల 10 నుంచి 12వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సరైన ఆధారాలతో విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. సమ్మె విజయవంతం చేయాలి ఏలూరు (టూటౌన్): కేంద్రం కార్మిక హక్కులను హరించి వేస్తోందని ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ పిచ్చుక ఆదిశేషు, కో కన్వీనర్ వెంకట కృష్ణారావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 20న నిర్వహించే సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా చేతి వృత్తిదారులు పాల్గొనాలని వారు కోరారు. -
నేటి నుంచి మీసాల వెంకన్న బ్రహ్మోత్సవాలు
కై కలూరు: కై కలూరులో శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామికి బొడ్డులో కత్తి, ముఖంపై మొనతేలిన మీసాలు ఉండటం ఓ వింత. అందుకే స్వామిని మీసాల వెంకన్నగా పిలుస్తారు. పౌరుషానికి ప్రతీకగా వెలిసిన స్వామివారి దేవాలయం అత్యంత పురాతనమైనది. ఈ నెల 10 నుంచి 12 వరకు స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. త్రయోహ్నిక దీక్షతో వైఖానస ఆగమోక్తం పద్ధతిలో స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. శ్రీనివాసుల లక్ష్మీ ప్రవీణ్, బృందావనం లక్ష్మీ నృసింహచార్యులు, అగ్రిహోత్నం మిథునాచార్యులు, బృందావనం గోపీ కృష్ణమాచార్యులు బ్రహ్మత్సోవాల క్రతువును చేపడతారు. ఈ నెల 10న స్వామి, అమ్మవారిని పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెను చేస్తార. మాడ వీధుల్లో గజవాహనంపై స్వామి ఊరేగింపు జరుగుతుంది. 11న మాడ వీధుల్లో శేష వాహనంపై ఊరేగింపు, రాత్రి 7 గంటలకు భూ సమేత శ్రీ వేంకటేశ్వరుని దివ్య కల్యాణం, 12న స్వామివారి గ్రామోత్సవం జరగనుంది. బ్రహ్మోత్సవాలు మూడు రోజులు కై కలూరు శ్రీమన్నారాయణగోష్టి సీహెచ్.హేమలత బృందంతో విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది. 11న స్వామివారి కల్యాణం ఏర్పాట్లు పూర్తి చేసిన దేవదాయ శాఖ -
కూటమిలో కుట్టు రగడ
సాక్షిప్రతినిధి,ఏలూరు: కూటమి పార్టీలో కుట్టుమెషీ న్ల పంచాయితీ షురూ అయ్యింది. బీసీ కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గానికి 3 వేల కుట్టుమెషీన్లు పంపిణీకి సిద్ధం చేశారు. ఈ క్రమంలో తమ పార్టీలకు వాటా ఇవ్వాలని జనసేన, బీజేపీ నేతలు నియోజకవర్గాల్లో కోరుతుంటే మొత్తం తమకే లేదంటే ఇచ్చిన నాలుగైదు తీసుకోండి అంటూ టీడీపీ నేతలు హుకుం జారీ చేయడంతో పల్లెల్లో రగడ మొదలైంది. ఇప్పటికే కూటమి పార్టీలో పదవుల పందారాలు, అక్రమ గ్రావెల్ దందా అన్నింటిలోనూ వాటాల విషయంలో ఘర్షణ కొనసాగడంతో పాటు ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ముఖ్యుల వద్ద సెటిల్మెంట్లు జరిగినా పరిష్కారం కాని పరిస్థితి. ఈ తరుణంలో కుట్టుమెషీన్ల వ్యవహారం మరోసారి అలజడి రేపింది. రూ.60 కోట్లకు పైగా పక్కదారి బీసీ కార్పొరేషన్ ద్వారా కుట్టుమెషీన్ల పంపిణీ పేరుతో సర్కారు భారీ స్కామ్కు తెరతీసింది. రూ.4 వేల నుంచి రూ.5 వేలు విలువ చేసే కుట్టుమెషీన్, 45 రోజుల శిక్షణ అన్నీ కలిపి ఒకరికి రూ.21,500లు ధరగా నిర్ణయించారు. మెషీన్ ఖరీదు రూ.5 వేలు కాగా 75 శాతానికిపైగా స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా కుట్టుమెషీన్ల శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాయి. లేదంటే శిక్షణకు మనిషికి రూ.2 వేలకు మించి తీసుకోరు. అయితే ప్రభుత్వం ఏకంగా ఒక లబ్ధిదారుకు రూ.21,500 చొప్పున ఉమ్మడి జిల్లాలో రూ.90.30 కోట్లు ఖర్చుగా చూపించారు. దీనిలో సుమారు రూ.60 కోట్లకుపైగా పక్కదారి పట్టే అవకాశం ఉంది. గత నెలలో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించి ఏప్రిల్ 25 వరకు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తులు ఎంపీడీఓల ద్వారా బీసీ కార్పొరేషన్కు అందుతాయి. అర్హులను ఎంపిక చేసి ప్రతి నియోజకవర్గంలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేసి 45 రోజులు శిక్షణ ఇచ్చి అందులో 75 శాతం హాజరు ఉంటేనే లబ్ధిదారులకు మెషీన్లు పంపిణీ చేసేలా నిబంధనలు రూపొందించారు. ఎమ్మెల్యే చెబితేనే ఫైనల్ ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎంపీడీఓ కార్యాలయాలకు చేరిన దరఖాస్తులను ఎమ్మెల్యే కా ర్యాలయంతో సంప్రదించడం, లేదంటే జాబితా ఎ మ్మెల్యేకు పంపి వాళ్లు ఫైనల్ చేసిన వాటినే ఆమోదిస్తున్నారు. అది కూడా మండల, గ్రామ నాయకులు చెప్పిన వారికే ఇస్తూ జనసేన, బీజేపీ నాయకులను విస్మరిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఉన్నచోట అయితే కనీసం ఆ పార్టీ వారిని నామమాత్రంగా పట్టించుకోని పరిస్థితి. ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, నరసాపురంలో రెండు పార్టీల ముఖ్యుల మధ్య తర్జనభర్జనలు, వివాదాలు కొనసాగుతున్నాయి. పోలవరం, ఉంగుటూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపు రంలో జనసేన ఎమ్మెల్యేలున్నా టీడీపీ నేతలే మండల, గ్రామస్థాయిలో తమకు యూనిట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఏలూరు, దెందులూరు, చింతలపూడి, నూజివీడు, తణుకు, పాలకొల్లు వంటి నియోజకవర్గాల్లో జనసేనకు అతికష్టం మీద ఐదో, పదో యూనిట్లు కేటాయిస్తున్నారు. జిల్లాలో 40 శాతం జనసేన నాయకులు చెప్పిన వారికి రావాల్సి ఉన్నా ప్రతిచోటా టీడీపీ ఉద్దేశపూర్వకంగా తమను విస్మరిస్తుందని ఇన్చార్జి మంత్రికి జనసేన ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పల్లెల్లో కుమ్ములాట ఉమ్మడి జిల్లాకు 42 వేల కుట్టుమెషీన్లు నియోజకవర్గానికి 3 వేల యూనిట్ల మంజూరు ఎమ్మెల్యే చెప్పిందే ఫైనల్ అంటూ అధికారుల పరోక్ష ఆదేశాలు సింహభాగం తమకే అంటున్న టీడీపీ వర్గాలు జనసేన, బీజేపీకీ వాటా కావాలంటూ పంచాయితీలు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోటా టీడీపీకే ప్రాధాన్యం దరఖాస్తుల దశలోనే తీవ్రమవుతున్న రగడ -
ఇబ్బందులు పెట్టడం సరికాదు
పత్రికలు ప్రభుత్వాలు అనుసరించే లోపభూయిష్ట విధానాలపై కథనాలు ఇవ్వడం పరిపాటి. వాటిని దృష్టిలో పెట్టుకుని లోపాలను సరిచేసుకుని సుపరిపాలన అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అంతేకాని లోపాలు, అవినీతిపై కథనాలు రాసిన వారిని ఇబ్బందులు పెట్టడం సరికాదు. ఇటువంటి చర్యలతో ప్రభుత్వం ప్రజాదరణకు దూరమవుతుంది. – కోలా భాస్కరరావు, వివేకానంద ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు పత్రికా స్వేచ్ఛకు విఘాతం పత్రికా విలేకరులు, ఎడిటర్లపై ప్రభుత్వమే దాడులు చేస్తూ, కక్ష సాధింపులకు పాల్పడుతూ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇటువంటి చర్యల ద్వారా సాధారణ పౌరులు కూడా ప్రతి దాడులకు తెగించవచ్చనే మెసేజ్ వెళుతుంది. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించే ఇటువంటి చర్యలు మంచిది కాదు. –చిక్కా భీమేశ్వరరావు, సీనియర్ న్యాయవాది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు పత్రికలపై దాడులు అమానుషం, ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. పత్రికలపై పోలీసులే దాడులకు దిగడం దుర్మార్గ చర్య. దీనికి బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే అక్కసుతో రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ దాడులకు దిగడం తగదు. – మెండెం సంతోష్కుమార్, ఎస్సీ సర్పంచ్ల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తీవ్రంగా ఖండిస్తున్నాం సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంపై దాడులను ఏపీ యూడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తోంది. పత్రికా రంగంపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయనే నెపంతో పత్రికలు, పాత్రికేయులపై వేధింపులు, అక్రమ కేసులకు పాల్పడితే సహించం. సాక్షి ఎడిటర్పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. దాడులు వెంటనే ఆపాలి. – వాసా సత్యనారాయణ, జాతీయ కౌన్సిల్ సభ్యుడు, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ కక్ష సాధింపు తగదు సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లోకి పోలీసులు చొరబడటం, తొలుతగా ఎటువంటి నోటీసులివ్వకుండా ఇంట్లో సోదాలు నిర్వహించడం కూటిమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలుగా భావించాలి. వీటిని తాము ఖండిస్తున్నాం. పోలీసులు చట్టపరంగా వ్యవహరించకుండా ప్రభుత్వాలకు కొమ్ము కాస్తున్నాయి. – మెరిపో జాన్ రాజు, కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు అందరూ ఖండించాలి ప్రభుత్వ లోపాలను ప్రశ్నించేవారిని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదు. చట్టప్రకారం, ప్రజాస్వామ్య పద్ధ్దతిలో పోలీస్ అధికారులు వ్యవహరించాలి. కక్ష సాధింపు చర్యలను ప్రభుత్వం వీడాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. ప్రభుత్వ దుశ్చర్యలను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని కోరుతున్నాం. – గెడ్డం రవీంద్రబాబు, కుల నిర్మూలన పోరాట సమితి ప్రధాన కార్యదర్శి -
‘సాక్షి’పై దాడులు అమానుషం
ఏలూరు (టూటౌన్): ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియాపై దాడులకు దిగడం అమానుషమని సీపీఐ కార్యదర్శివర్గ సభ్యుడు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగ ప్రభాకరరావు అన్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి ఇంటిపై పోలీసుల దాడులు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమే అని అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వాలు–ప్రజలకు మధ్య వారధిగా ఉండే మీడియా, దాని ప్రతినిధులపై కక్ష పూరితమైన చర్యలకు దిగడం తగదన్నారు. తమకు వ్యతిరేకంగా వార్తలు రాశారనో, అవినీతిని బయట పెడుతున్నారనో అక్కసుతో సోదాల పేరుతో పత్రికా ప్రధాన సంపాదకుడి ఇంటిపై దాడులకు తెగబడటం అత్యంత హేయమైన చర్య అని అభివర్ణించారు. ఇటువంటి చర్యలకు దిగిన పోలీసులను నియంత్రించాల్సిన కూటమి ప్రభుత్వం వారిని ఉసిగొల్పేలా వంత పాడటం సరికాదన్నారు. మూల్యం చెల్లించుకోక తప్పదు మీడియా సంస్థలు, వాటి ప్రతినిధులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రభాకర్ మండిపడ్డారు. రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాయడం తగదని, ఇందుకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైన పొరపాటు జరిగితే న్యాయబద్ధంగా వ్యవహరించాలే తప్ప దౌర్జన్యకర చర్యలకు దిగడం ఎంతమాత్రం సరికాదన్నారు. ఇది జర్నలిజానికే మాయని మచ్చ అని, ఇలాంటి సంఘటనలు మున్నెన్నడూ చూడలేదన్నారు. ఇది పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగానే భావించాల్సి ఉంటుందని, మేధావులు, వివిధ సంఘాల నాయకులు, పార్టీలు ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. పాలకులు పోలీసు వ్యవస్థను చేతిలోకి తీసుకుని తమకు నచ్చని వారిపై సోదాలు, కేసుల పేరుతో వేధింపులకు దిగడం సరైన చర్య కాదని, రాష్ట్రంలోని ప్రజలంతా కూటమి ప్రభుత్వ చర్యలను గమని స్తున్నారని, సరైన సమయంలో గుణపాఠం చెబుతారని ప్రభాకర్ అన్నారు. -
కుట్టుమెషీన్ల పేరుతో కూటమి దోపిడీ
తణుకు అర్బన్ : కూటమి ప్రభుత్వం ప్రజలకు స్కీమ్లు అందించడం మానేసి రకరకాల స్కామ్ల పేరుతో ప్రజాధనాన్ని దోచుకుంటోందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. బీసీ వర్గాలకు కుట్టుమెషీన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం భారీ స్కామ్కు తెరతీసిందని దుయ్యబట్టారు. శుక్రవారం తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కుట్టుమెషీన్ల కొనుగోళ్లు, శిక్షణకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల్లో భారీ వ్యత్యాసం ఉందని, ఇది రూ.150 కోట్లకుపైగా స్కామ్గా తెలుస్తుందన్నారు. ఒక్కో లబ్ధిదారుకు మెషీన్ కొనుగోలు, శిక్షణకు సంబంధించి రూ.23 వేల చొప్పున కేటాయించడం దోపిడీకి నిదర్శనంగా నిలుస్తోందన్నారు. ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని వదిలేసి దోచుకో దాచుకో అనే రీతిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ విద్యుత్ యూనిట్ను రూ.2.49లకు కొనుగోలు చేస్తే నేడు చంద్రబాబు రూ.4.60 కొనుగోలు చేయడం కూడా అతి పెద్ద కుంభకోణమని మండిపడ్డారు. అమరావతిలో కూడా ఇదే తరహాలో నిర్మాణ పనుల్లో కోట్లాది రూపాయలు దోపిడీకి దిగారని విమర్శించారు. అందినకాడికి ప్రజాధనాన్ని దోచుకుని సంపద సృష్టించుకునే పనిలో చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందని దుయ్యబట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవికి కుట్టుమెషీన్ల స్కామ్పై సీబీఐతో విచారణ చేయించాలని వినతిపత్రాన్ని అందజేశారు. ముందుగా సజ్జాపురంలోని పార్టీ కార్యాలయం నుంచి మోటారు సైకిళ్లపై ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, ఎంపీపీ రుద్రా ధనరాజు, లీగల్ సెల్ సభ్యులు వెలగల సాయిబాబారెడ్డి, పెన్మెత్స సుబ్బరాజు, పొట్ల సురేష్, జల్లూరి జగదీష్, మెహర్ అన్సారీ, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, నూకల కనకదుర్గ, ఉండవల్లి జానకి, జంగం ఆనంద్కుమార్, పెనుమాక రాజేష్, గెద్దాడ శ్రీకాంత్, వడ్డి మార్కండేయులు, పుల్లెపు సూర్యచంద్రరావు, రంభ నాగేశ్వరరావు, బిరుదుకోట చింతన్న, చింతాడ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కారుమూరి -
ప్రభుత్వ అసంబద్ధ విధానాలపై గళం
భీమవరం: పాఠశాల విద్యారంగంలో ప్రభుత్వం అవలంబిస్తున్న అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం భీమవరం కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి.ప్రకాశం మాట్లాడుతూ 1 నుంచి 5వ తరగతి వరకు ప్రతి ప్రాథమిక పాఠశాలను బేసిక్ ప్రాథమిక పాఠశాల లేదా మోడల్ ప్రాథమిక పాఠశాలగా కొనసాగించాలన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలో మరిన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలకు 6 నుంచి 10వ తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్లతో పాటు ప్రధానోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బీవీ నారాయణ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బకాయి ఉన్న మూడు డీఏలను విడుదల చేయాలని, 12వ పీఆర్సీ కమిషన్ను నియమించి మధ్యంతర భృతి కింద 30 శాతం ఇవ్వాలన్నారు. ఓపీఎస్ను అమలు చేయాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ నాగరాణికి అందజేశారు. ధర్నాలో గౌరవాధ్యక్షుడు పీఎన్వీ ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు లంక రాజు, కండిబోయిన రాంబాబు, పోతురాజు, దేవదాసు కార్యదర్శులు పి.జనార్దనస్వామి, వి.రామ్మోహన్, పీవీ రాఘవులు పాల్గొన్నారు. -
అసత్య ప్రచారాలను ఉపేక్షించం
చింతలపూడి: యుద్ధ సంబంధిత అంశాలపై అసత్య ప్రచారాలను సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ హెచ్చరించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా చింతలపూడి పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఆయన సందర్శించారు. స్టేషన్లో రికార్డులు పరిశీలించారు. ఆపరేషన్ సిందూర్ను పురస్కరించుకుని అన్ని ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని, కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలని సూచించారు. డ్రోన్ కెమెరాల పర్యవేక్షణ ద్వారా నేరాల గుర్తించి, ట్రాఫిక్ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. హైస్కూల్, కాలేజీలు, రద్దీ ప్రదేశాల్లో శక్తి యాప్పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి పౌరుడు భాగస్వామిగా ఉండాలని, దేశ సమగ్రతకు భంగం కలిగించే మత విద్వేషాలు, అసత్య ప్రచారాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. హెల్మెట్ ధరించడం బాధ్యత అని అన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులను గుర్తిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. డీఎస్పీ యు.రవిచంద్ర, సీఐ సీహెచ్ రాజశేఖర్, ఎస్సై కుటుంబరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజా గొంతును నొక్కొద్దు
ప్రజల పక్షాన పోరాడే పత్రికల గొంతును నొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో పోలీసుల నిర్బంధ సోదాలను ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛకు ఎవరూ భంగం కలిగించకూడదు. ఇటువంటి చర్యలు పత్రికా స్వేచ్ఛను హరించినట్లుగానే భావించాల్సి వస్తోంది. పత్రికా ఎడిటర్ స్థాయి వ్యక్తిని భయభ్రాంతులకు గురిచేయడం బాధాకరం. – దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్), వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు జర్నలిజంపైనా దాడులు ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాయకపోతే జర్నలిజంపైనా దాడులు చేసే పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది. రాజకీయ ఒత్తిళ్లతోనే బెదిరింపులకు పాల్పడినట్టుగా ఉంది. కూటమి పాలనలో అనుకూలంగా లేని పత్రికలు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా నిర్వాహకులపై దాడులకు దిగడం పరిపాటిగా మారింది. రానున్న రోజుల్లో ఇవన్నీ మీకు రిటర్న్ గిఫ్ట్లుగా వస్తాయి. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ మంత్రి ప్రశ్నిస్తే కేసులు పెడతారా ? ‘సాక్షి’ ఎడిటర్ ఇంటిపై పోలీసులు దాడి ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమే. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సోదాలు సరి కాదు. ‘సాక్షి’పై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు మానాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్న కూటమి ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఇటువంటి చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలి. – తెల్లం రాజ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ పోలవరం సమన్వయకర్త ● -
ధ్వజారోహణం.. దేవతాహ్వానం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న బ్రహ్మోత్సవాలకు చరాచర సృష్టిని ఆహ్వానిస్తూ గురువారం రాత్రి నిర్వహించిన ధ్వజారోహణ వే డుక నేత్రపర్వమైంది. అర్చకులు శ్రీవారి ఆలయ ప్రాకారంలోని ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఎగురవేశారు. ఉదయం ఆలయంలో ఉత్సవ నిత్యహోమ గ్రామ బలిహరణలు, వేద స్వస్తి, సాయంత్రం రుత్విగ్వరణ, మృద్గ్రహణ, అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు జరిగాయి. రాత్రి హంస వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో స్వామివారు మ త్స్యావతార అలంకారంలో దర్శనమిచ్చారు. శ్రీ హరి కళాతోరణ వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అంకురార్పణ జరిగిందిలా.. సాయంత్రం ఆలయంలో ఒక వాహనంపై విష్వక్సేనుని ఉంచి అలంకరించారు. అనంతరం అర్చ కులు పుట్టమన్నును తెచ్చి, ఆలయ ఆవరణలో ఏ ర్పాటు చేసిన పాలికల్లో ఉంచారు. అనంతరం అంకురార్పణ జరిపించారు. గరుడ పటాన్ని ఎగురవేసి ధ్వజారోహణ వేడుకలు నిర్వహించి భక్తులకు గరుడ ప్రసాదాన్ని పంచిపెట్టారు. అట్టహాసంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు -
కలం గళంపై కక్ష సాధింపు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కూటమి ప్రభుత్వం జర్నలిస్టులపై కక్ష సాధింపులకు తెరతీసింది. పత్రికా స్వేచ్ఛను కాలరాసేలా నియంతృత్వ ధోరణితో అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులు, దౌర్జన్యాలను ప్రోత్సహిస్తోంది. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి నివాసంపై గురువారం జరిపిన పోలీసుల దాడిని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టులు, రాజకీయపక్షాలు, మేధావులు ముక్తకంఠంతో ఖండించారు. నిరసనలు తెలిపి కూటమి తీరుపై భగ్గుమన్నారు. ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంతో సహా ప్రధాన నియోజకవర్గాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపి అధికారులకు వినతిపత్రాలు అందించారు. ఏలూరు జిల్లాలో.. ఏలూరులో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనగా డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని డీఎస్పీ డి.శ్రావణ్కుమార్కు వినతిపత్రాన్ని అందించారు. సిట్ బృందం పేరుతో అక్రమ దాడులు చేయించి భయభాంత్రులకు గురిచేసేలా కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం నీతిమాలిన చర్య అని ధ్వజమెత్తారు. జిల్లా అధ్యక్షుడు కె.కిషోర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్, యూనియన్ సభ్యులు, సాక్షి పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ● చింతలపూడిలో ప్రెస్క్లబ్, ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేసి సీఐ రాజశేఖర్కు వినతిపత్రం అందించారు. ● ఉంగుటూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద విలేకరులు నిరసన తెలిపి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో.. భీమవరంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పాత్రికేయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, కక్ష సాధింపు చర్యలు ఆపాలంటూ తహసీల్దార్ రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. ● నరసాపురం నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నరసాపురంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద విలేకరులు నిరసన తెలిపి సబ్ కలెక్టర్ కార్యాలయ ఏఓ సాయికృష్ణకు వినతిపత్రం అందజేశారు. ● ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండలో జర్నలిస్టులు నిరసన తెలిపి తహసీల్దార్ డి.అనితకుమారికి వినతిపత్రం అందించారు. ● తణుకులో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపి తహసీల్దార్ బి.అశోక్వర్మకు వినతిపత్రం అందజేశారు. ● తాడేపల్లిగూడెంలో ‘సాక్షి’ విలేకరులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తహసీల్దార్ ఎం.సునీల్ కుమార్కు వినతిపత్రం ఇచ్చారు. ● ఉండి నియోజకవర్గం ఆకివీడులో పాత్రికేయులు నిరసన తెలిపి తహసీల్దార్ ఎ.వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు అంబటి రమేష్ సంఘీభావం తెలిపారు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు ‘సాక్షి’ ఎడిటర్ నివాసంపై పోలీసుల దాడి సిగ్గు సిగ్గు విలేకరుల స్వేచ్ఛను హరిస్తే తీవ్ర పరిణామాలు ఉమ్మడి పశ్చిమలో కదం తొక్కిన జర్నలిస్టు సంఘాలు, పాత్రికేయులు కొయ్యలగూడెంలో మాజీ ఎమ్మెల్యే బాలరాజు భారీ నిరసన ప్రదర్శన మీడియా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు కొయ్యలగూడెం: మీడియా స్వేచ్ఛకి కూటమి ప్రభుత్వం గొడ్డలి పెట్టులా మా రిందని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు. ‘సాక్షి’ ఎ డిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై ప్రభుత్వం పోలీసు దాడులను చేయించడాన్ని నిరసిస్తూ గురువారం బయ్యనగూడెంలోని జాతీయ ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి సేవ్ ఫోర్త్ ఎస్టేట్, సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో వైఎస్సార్సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని ప్రారంభమైన దాడులు ఇప్పుడు మీడియా వ్యవస్థ మీదకి పురికొల్లేలా మారాయన్నారు. కూటమిలో పార్టీలు బీజేపీ, టీడీపీ, జనసేనలు కక్ష, పగ, ప్రతీకారాలను పంచుకున్నాయని ఎద్దేవా చేశారు. చర్యకు ప్రతి చర్య తప్పనిసరిగా ఉంటుందని అది ప్రజాక్షేత్రం ద్వారానే కూటమి ప్రభుత్వానికి జగన్ 2.0 పాలనలో రుచి చూపిస్తామని బాలరాజు హెచ్చరించారు. -
కుట్టు మెషీన్ల పంపిణీలో అవినీతి
యలమంచిలి: మహిళలకు కుట్టుమెషీన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం రూ.245 కోట్ల అవినీతికి పాల్పడుతోందని వైఎస్సార్సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) ఆరోపించారు. ఈ మేరకు గు రువారం పార్టీ నాయకులతో కలిసి పాలకొల్లు డిప్యూటీ తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడుతూ బహిరంగ మార్కెట్లో కుట్టుమెషీన్ ధర రూ.4,300, శిక్షణకు రూ.3 వేలు మొత్తం రూ.7,300 ఖర్చవుతుండగా, ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుడి నిమిత్తం రూ.23,000 చొప్పున కాంట్రాక్టర్కు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇలా రూ.245 కోట్లు కొట్టేసే పనిలో ఉందని ఆరోపించారు. అవినీతిలో అధికారు లు, నాయకులు, కాంట్రాక్టర్ల పాత్ర ఉందని, విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ నాయకులు యడ్ల తాతాజీ, పార్టీ పాలకొల్లు పట్టణ, యలమంచిలి, పోడూరు మండలాల కన్వీనర్లు కోరాడ శ్రీనివాసరావు, ఉచ్చుల స్టాలిన్బాబు, కొర్రపాటి వీరాస్వామి, యలమంచిలి ఎంపీపీ గొల్లపల్లి శ్రీనివాసరావు, నాయకులు వినుకొండ రవి, రావూరి బుజ్జి, మద్దా చంద్రకళ, శంకరపు శ్రీను, దేవ రాజేష్, గుడాల సురేష్, రావి నాగేశ్వరరావు, పెదపాటి పెద్దిరాజు తదితరులు ఉన్నారు. తలసేమియా సేవలు విస్తృతం భీమవరం అర్బన్: జిల్లాలో తలసేమియా సేవలను విస్తృతం చేస్తున్నామని కలెక్టర్, ఐఆర్ సీఎస్ అధ్యక్షురాలు సీహెచ్ నాగరాణి అన్నా రు. రాయలం గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖ భవనంలో ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా గురువారం ఆరు పడకల డేకేర్ సెంటర్ను ఆమె ప్రారంభించామన్నారు. ఉచిత సేవలకు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎం.మౌనిక ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం రక్తదానం చేసిన యూఎన్ఓ ఫీడ్స్ కంపెనీ సిబ్బందికి సర్టిఫికెట్లు అందించారు. తలసేమి యా సెంటర్కు రూ.లక్ష చొప్పున విరాళం ఇ చ్చిన తిరుపతిరాజు, కె.రాధాకృష్ణమూర్తిలను కలెక్టర్ సన్మానించారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖ చైర్మన్ ఎంఎస్వీ శివ రామభద్రిరాజు, వైస్ చైర్మన్ కె.కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ఆక్వాలో సాంకేతికతతో అధిక ఉత్పత్తి ఉండి: ఆక్వాకు మారు పేరుగా పశ్చిమగోదావరి జిల్లా నిలిచిందని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్రెడ్డి లన్నారు. మూడు రోజులుగా ఎన్నార్పీ అగ్రహారం మత్స్య పరిశోధనా కేంద్రంలో ఆ క్వాలో సాంకేతిక తదితర అంశాలపై జరుగుతున్న అవగాహన, శిక్షణ కార్యక్రమం గురువా రం ముగిసింది. ముఖ్య అతిథిగా జేసీ మట్లాడుతూ ఆక్వాలో సాంకేతిక పరిజ్ఞానం, రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆక్వా లో ఆధునిక సాంకేతిక పద్ధతుల వినియోగంతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఆక్వా సాగులో మెలకువలు నేర్చుకుని ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. జిల్లాలో 1.33 లక్షల ఎకరాలకు గాను 49 వేల ఎకరాలు మా త్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అన్నారు. రైతులు సాగులో నూతన పద్ధతులు తెలుసుకునేందుకు నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (హైదరాబాద్) సహకారంతో అవగాహ న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అ నంతరం ఆక్వా రైతులకు సర్టిఫికెట్లు అందజే శారు. జిల్లా మత్స్యశాఖాధికారి నాగలింగాచారి, డైరెక్టర్ ఫిషరీస్ అభిషేక్, ఫిషరీస్ యూనివర్సిటీ ఓఎస్డీ డాక్టర్ సుగుణ, ఎంపెడా ఫీల్డ్ అధికారి దుర్గారావు పాల్గొన్నారు. సీపెట్ కోర్సులకు దరఖాస్తులు నూజివీడు: విజయవాడలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డైరెక్టర్ అండ్ హెడ్ సీహెచ్ శేఖర్ గురువారం ప్రకటనలో తెలిపారు. పదో తరగతి విద్యార్హతతో మూడేళ్ల వ్యవధి గల డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ (డీపీటీ), డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ), బీఎస్సీ అర్హతతో మూడేళ్ల కాలపరిమితి గల పీజీ డిప్లొమా ఇన్ ప్లాస్టింగ్ ప్రాసెస్సింగ్ అండ్ టెస్టింగ్ కోర్సుల్లో చేరవచ్చని పేర్కొన్నా రు. సీపెట్ వెబ్సైట్లో ఈనెల 29లోపు దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
శాంతి, భద్రతల పరిరక్షణే లక్ష్యం
భీమవరం: శాంతి, భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనే ప్రథమ కర్తవ్యంగా పోలీ సు అధికారులు, సిబ్బంది పనిచేయాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా గురువారం భీమవరం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన శాంతి భద్రతలపై సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కీలకమైన కేసులు, పాత నేరస్తులు, సస్పెక్ట్ షీట్స్ తదితర అంశాలపై సమీక్షించారు. రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. పోక్సో వంటి కేసుల్లో 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ను కోర్టులో దాఖలు చేయాలన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. ముందుగా ఐజీ అశోక్కుమార్కు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అదనపు ఎస్పీ వి.భీమారావు, డీఎస్పీలు ఆర్.జయసూర్య, జి.శ్రీవేద, డి.విశ్వనాథ్, ట్రైనీ డీఎస్పీ కె.మానస, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దేశింశెట్టి వెంకటేశ్వరరావు, ఏఆర్ ఇన్స్పెక్టర్లు డి.సురేష్, కె.వెంకట్రావు పాల్గొన్నారు. ఐజీ అశోక్కుమార్ -
ఆపరేషన్ సిందూర్.. సరైన నిర్ణయమే
ఉండి: పాకిస్థాన్లోని తీవ్రవాదులపై భాతర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సరైన చర్య అని మాజీ సైనికోద్యోగి హవల్ధార్ దంగేటి రామలింగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. పహల్గాం ఘటన తనను ఎంతగానో కలచివేసిందని, పాకిస్థాన్ ఉగ్రమూకలు అభాగ్యులను నిర్ధాక్ష్యిణ్యంగా చంపడం చాలా చాలా దారుణమన్నారు. దీనికి బదులుగా ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు తన సెల్యూట్ తెలియజేశారు. టెర్రరిజంపై భారత్ పోరాటం నిజమైనదని అందుకే ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయని అన్నారు. రిటైర్డ్ అయిన మా సేవలు అవసరమైతే మేమంతా సిద్ధంగా ఉంటామని, ఇది మాజీ సైనికోద్యోగుల పక్షంగా తాను చెబుతున్నానని తెలిపారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ఎక్కువగా జనం ఎక్కడైతే వుంటారో ఆక్కడే టార్గెట్ చేసే అవకాశం ఉంటుందని జాగ్రత్తగా ఉండాలన్నారు. గేటెడ్ కమ్యూనిటీ వారంతా అప్రమత్తంగా వుండాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎవరైనా కొత్తవారు అనుమానితులుగా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మాజీ హవల్ధార్ తెలిపారు. -
ప్రయాణికురాలికి బ్యాగ్ అప్పగింత
తణుకు అర్బన్: తణుకు రైల్వే స్టేషన్లో పోగొట్టుకున్న బ్యాగ్ను వృద్ధురాలికి రైల్వే పోలీసులు అప్పగించిన ఘటన ఇది. తమిళనాడుకు చెందిన అంబిక గురువారం సాయంత్రం సర్కారు ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు తణుకు రైల్వే స్టేషన్కు వచ్చారు. అదే సమయంలో తన బ్యాగ్ కనిపించకపోవడంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే ఎస్సై సుబ్రహ్మణ్యం ఆదేశాలతో రైల్వే కానిస్టేబుల్ ముద్దే బాల వెంటనే బ్యాగ్తోపాటు నగదును కూడా గుర్తించి బాధితురాలికి అప్పగించారు. సకాలంలో స్పందించిన రైల్వే పోలీసులపై బాధితురాలితోపాటు ప్రయాణికులు ప్రశంసల జల్లు కురింపించారు. మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య భీమడోలు: మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం పోలసానిపల్లి గ్రామానికి చెందిన కోటా రాము (45) మద్యానికి బానిసై పనికి వెళ్లడం లేదు. దీంతో భార్య అతడిని మందలించగా వారిద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన రాము గురువారం తన ఇంటలోని రేకుల షెడ్డు దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రామును కిందకు దింపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్మార్టమ్ నిమిత్తం తరలించారు. భీమడోలు పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు. మృతుడు రాముకి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. తమ సర్టిఫికెట్లు ఇప్పించాలని పూర్వ విద్యార్థుల ధర్నా జంగారెడ్డిగూడెం: తమ సర్టిఫికెట్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం వేగవరం నోవా కళాశాల ప్రాంగణంలో పూర్వ విద్యార్థులు ధర్నా కు దిగారు. వారు తెలిపిన వివరాలివి. వేగవరం నోవా కళాశాలలో 2015 నుంచి 2020 మధ్యకాలంలో చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలకు చెందిన సుమారు 30 మంది విద్యార్థులు టీటీసీ, బీఈడీ, బీపీడీ, డిగ్రీ తదితర కోర్సులు అభ్యసించారు. అడ్మిషన్ సమయంలో విద్యార్థుల నుంచి ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ ఒరిజినల్స్ తీసుకున్నారు. కోర్సులు పూర్తయిన తరువాత సదరు సర్టిఫికెట్లను విద్యార్థులకు తిరిగి ఇవ్వలేదు. అప్పటి నుంచి సర్టిఫికెట్ల కోసం కాలేజ్ చుట్టూ తిరుగుతూనే ఉన్నామని పూర్వ విద్యార్థులు విజయలక్ష్మి, సత్యనారాయణ, దుర్గారావు, అవినాశ్, సాగర్, సుధీర్, సాయి, అనూష తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో తమ సర్టిఫికెట్లు తమకు ఇవ్వాలని గురువారం విద్యార్థులు విద్యాసంస్థల కార్యాలయం ఎదుట బైటాయించి ధర్నాకు దిగారు. ధర్నా అనంతరం జంగారెడ్డిగూడెం ఆర్డీవో, డీఎస్పీ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. -
అభయారణ్యంలో అక్రమ పట్టుబడులు
సాక్షి, టాస్క్ఫోర్స్: కొల్లేరు అభయారణ్యంలో అక్రమ సాగు యథేచ్ఛగా సాగుతోంది. సుప్రీం కోర్టు ఒక పక్క అక్రమ చేపల చెరువులను ధ్వంసం చేయాలని అటవీశాఖకు ఆదేశాలు ఇస్తున్న తూతూమంత్రంగా అక్రమ చెరువులకు గండ్లు కొట్టి మమా అనిపిస్తున్నారు. కై కలూరు మండలం చటాకాయి గ్రామంలోని కొల్లేరు అభయారణ్యంలో 355 ఎకరాల విస్తీర్ణంలో 9 చెరువుల్లో అక్రమ సాగు చేస్తున్నారు. వీటిలో నిషేధిత కోడి వ్యర్థాలతో సైతం సాగు జరుగుతోంది. చటాకాయి అక్రమ చెరువుల్లో గురువారం నుంచి పట్టుబడులు యథేచ్ఛగా ప్రారంభమయ్యాయి. సాధారణంగా చేపల చెరువుల కంటే రొయ్యల చెరువుల్లో రసాయనాలు అధికంగా వాడతారు. దీంతో కొల్లేరు పర్యావరణం మరింతగా పాడవుతోంది. చటాకాయిలో ఏకంగా చేపలు, రొయ్యలను కలపి అభయారణ్యంలో సాగు చేస్తున్నారు. తూతూమంత్రంగా చెరువులకు గండ్లు కై కలూరు మండలం చటాకాయి గ్రామంలో 1500 మంది జనాభా ఉన్నారు. పామర్రు–దిగమర్రు జాతీయ రహదారి(165) నుంచి దాదాపు రెండు కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తే చటాకాయి చేరుకోవచ్చు. ఇటీవల అక్రమ చేపల చెరువులకు గండ్లు పెట్టడానికి అటవీశాఖ అధికారులు వస్తే చటాకాయి గ్రామం ప్రారంభంలోనే గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులతో చర్చలు జరిపి ఏదో విధంగా ఓ రెండు చెరువులకు అటవీ సిబ్బంది గండ్లు పెట్టారు. ఉన్నతాధికారులకు నివేదించడానికి చెరువు గట్టు గండ్లును ఫొటోలు తీసుకున్న తర్వాత తిరిగి చెరువు యథాస్థితికి చేరటం ఇక్కడ పరిపాటిగా మారింది. లీజుల వాటాలు తీసేస్తున్నారు గ్రామ పరిధిలో అక్రమ సాగు ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామంలో పురుషులు పంచుకుంటారు. ఏడాదికి ఒక్కో తలకు రూ.10,000 వస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామంలో వారి మాటకు ఎదిరించినవారిని, బయట ఊరి నుంచి వచ్చి స్థిరపడిన వారిని, పూర్వం మాజీ ముఖ్యమంత్రి జలగళం వెంగళరావు ఇచ్చిన సొసైటీ భూముల్లో పేర్లు లేవనే వంకతో దాదాపు 300 మందికి కొన్ని చెరువుల్లో లీజులు తీసివేశారు. ఇదే కాకుండా ఒకరికి రూ.10,000 లీజు వస్తేంటే మరొకరికి కేవలం రూ.1000 అందిస్తున్నారు. గ్రామ సర్పంచ్ కూడా బాధితుల లిస్టులో ఉండటం గమనార్హం. ఈ విషయమై గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు లిఖిత పూర్వంగా ఫిర్యాదు సైతం చేశారు. అక్రమ చెరువుల్లో లీజులు సమానంగా పంచకపోతే, సుప్రీం కోర్టు తీర్పును అమలు చేసి చెరువుల మొత్తాన్ని ధ్వంసం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు గ్రామస్తుల ఫిర్యాదుపై అతీగతి లేదు. అమాయక ప్రజల జీవితాలతో ఆటలు కొల్లేరు అమాయక ప్రజల జీవితాలతో నాయకులు ఆటలాడుతున్నారు. ఇదిగో కొల్లేరు ఇచ్చేస్తున్నారు? అదిగో కొల్లేరు కాంటూరు కుదించేస్తున్నారు? అంటూ చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు సుప్రీం నిబంధనల మేరకు గండ్లు కొట్టడానికి వెళితే గ్రామంలో మహిళలతో ధర్నాలు చేయించి, ఆత్మహత్యలు చేసుకుంటామని బెదిరిస్తున్నారు. ఈ గ్యాప్లో కొల్లేరులో పాత చెరువుల రిపేర్లు పేరుతో అందినకాడికి తవ్వేస్తున్నారు. ఇదేంటనీ అడిగే నాథుడే కనిపించడం లేదు. రెవెన్యూ, ఫారెస్టు అధికారులు అక్రమ పట్టబడులు, అనుమతులు లేని రిపేర్లు వైపు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు. రాజకీయ నేతల అండతో బరితెగింపు కొల్లేరు గర్భానికి తూట్లు చటాకాయి గ్రామంలో అక్రమ సాగుకు అంతే లేదు అమలు కాని సుప్రీం కోర్టు నిబంధనలు అక్రమ చెరువులకు గండ్లు కొట్టాం కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చేపల చెరువులకు సుప్రీం కోర్టు ఆదేశాలతో గండ్లు కొట్టించాం. కొల్లేరు గ్రామాల ప్రజలకు ముందుగా సుప్రీం కోర్టు నిబంధనలపై అవగాహన కల్పించాం. కొల్లేరు అభయారణ్య చట్టాలను పరిరక్షించుకోవడం అందిరి బాధ్యత. కొల్లేరులో అక్రమ సాగు వివరాలను ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించాం. – కె.రామలింగాచార్యులు, అటవీశాఖ రేంజర్, ఏలూరు -
త్రైమాసిక పన్ను చెల్లించని వాహనాలపై కేసులు
ఏలూరు (ఆర్ఆర్పేట): రవాణా వాహనాలకు చెల్లించాల్సిన పన్ను గడువు ఏప్రిల్ 30వ తేదీతో ముగిసినప్పటికీ, కొందరు రవాణా వాహన యజమానులు త్రైమాసిక పన్ను చెల్లించకుండా వాహనాలను రహదారులపై తిప్పుతున్నారని డీటీసీ షేక్ కరీమ్ తెలిపారు. దీనిపై ఈ నెల ఒకటవ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రవాణా వాహనాలపై 115 కేసులు నమోదు చేసి, రూ.7.53 లక్షలను అపరాధ రుసుముగా విధించినట్లు చెప్పారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు. వాహనంపై కేసు నమోదు చేస్తే పన్నుతో పాటు 200 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తుందని, స్వచ్ఛందంగా పన్ను చెల్లిస్తే పన్నుతో పాటు 50 శాతం మాత్రమే అదనంగా చెల్లిస్తే సరిపోతుందని కరీమ్ తెలిపారు. రవాణా వాహనాలకు క్రమం తప్పకుండా టాక్స్, బీమా చెల్లిస్తూ, పర్మిట్, పొల్యూషన్, ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలని అయన వాహన యజమానులకు సూచించారు. పోక్సో కేసు నమోదు భీమవరం: పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ జి.కాళీచరణ్ తెలిపారు. వివరాల ప్రకారం రెండో పట్టణానికి చెందిన ఆరో తరగతి చదువుతున్న బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా ఆమెను 64 ఏళ్ల వయసున్న బాబూరావు ఇంట్లోకి తీసుకువెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం బయటకు చెబితే చంపుతానని బెదిరించినట్లు బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొనగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. ధాన్యం లారీ బోల్తా ఉంగుటూరు: ధాన్యం లారీ బోల్తా పడి ధాన్యం బస్తాలు తడిసిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాకర్లమూడికి చెందిన రైతులు మార్నిడి వందనాదేవి, చేదునూరి శివపార్వతి, ఉర్రింకల వీరవెంకట సత్యవరప్రసాద్లకు చెందిన 500 సార్ల ధాన్యం ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామంలోని చంద్రావతి రైస్ అండ్ ఫ్లోర్మిల్లుకు తరలించేందుకు లారీలో లోడ్ చేశారు. బుధవారం రాత్రి 11 గంటలకు కాకర్లమూడి నుంచి బయలుదేరిన ఈ లారీ కొద్దిసేపటికే రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. -
ఆయుర్వేద ఆసుపత్రికి కేంద్ర గుర్తింపు
ఉంగుటూరు: ఉంగుటూరు గ్రామంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రికి కేంద్ర గుర్తింపు(నేషనల్ అక్రెడిషన్) లభించిందని, త్వరలో సర్టిఫికెట్ జారీ కానుందని వైద్యాధికారి కస్తూరి శిరీష గురువారం విలేకరులకు తెలిపారు. అనేక దీర్ఘ కాలిక, మొండి వ్యాధులకు ఆయుర్వేద వైద్యంలో ఉపశమనం లభిస్తుందన్నారు. ఆయుర్వేద వైద్యశాల ఆవరణలో 25 పైగా ఔషధ మొక్కలు ఉన్నాయని, కటి వస్తి, జాను వస్తి, మొదలైన పంచకర్మ చికిత్సలు అందుబా టులో ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంగా అప్గ్రేడ్ అయ్యిందని, పంచకర్మ సెంటర్గా ప్రభుత్వం గుర్తించిందని డా.శిరీష పేర్కొన్నారు. తద్వారా ఖరీదైన, నాణ్యమైన ఔషధాలు, పంచకర్మ చికిత్సలను ఉచితంగా ప్రజలకు అందించడమే ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొన్నారు. -
పేరుకే కూటమి పెత్తనం టీడీపీదే
శోభాయమానం వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలకు ద్వారకాతిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయాన్ని, పరిసరాలను శోభాయమానంగా అలంకరించారు. 8లో uఒప్పందాలకు పాతర బుధవారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమలో భీమవరం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో టీడీపీ దెబ్బకు జనసేన ఎమ్మెల్యేలు విలవిల్లాడుతున్నారు. పేరుకు ఎమ్మెల్యే అయినా పెత్తనమంతా టీడీపీ నేతలదే కావడంతో చేసేది లేక సైలెంట్గా ఉంటున్నారు. చెల్లుబాటు కాని ధర్మరాజు మాట ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన అభ్యర్ధి పత్సమట్ల ధర్మరాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే నియోజకవర్గంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఉన్నారు. నియోజకవర్గంలోని ఉంగుటూరు, గణపవరం, నిడమర్రు మండలాలు ధర్మరాజు చూసుకునేలా, భీమడోలు మండలం గన్ని వీరాంజనేయులు చూసు కునేలా గెలుపొందిన అనంతరం మాట్లాడుకున్నారు. కట్చేస్తే.. అన్ని మండలాల్లోనూ టీడీపీ కేడర్ ఎమ్మె ల్యేను ఉక్కిరిబిక్కిరి చేయడంతో పాటు పనుల్లో పర్సంటేజీలు తీసుకుంటున్నారు. అవినీతికి పాల్పడ్డారంటూ సోషల్ మీడియా వేదికగా హడావుడి చేయడంలో టీడీపీది కీలక పాత్ర. తాజాగా నియోజకవర్గంలో 50 శాతం పనులు, పదవులు, బెల్టు షాపు ఆదాయాలు, కొల్లేరు అక్రమ సాగు అంతా టీడీపీకి కట్టపెట్టాలని డిమాండ్తో దాదాపు సగం సొంతం చేసుకున్నారు. మిగిలిన 50 శాతంలో 40 శాతం జనసేన, 10 శాతం బీజేపీ తీసుకోవాలని ప్రతిపాదన పెట్టారు. ఉదాహరణకు రూ.11.99 కోట్ల విలువైన స్వయం ఉపాధి పథకం రుణాలు 240 టీడీపీకి ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేకు అల్టిమేటం ఇచ్చారు. నియోజ కవర్గంలో 17 సొసైటీలు ఉంటే, 9 సొసైటీలు టీడీపీ తీసుకుని, 7 జనసేనకు, ఒకటి బీజేపీ పంచుకోవాలని టీడీపీ నేతలే తీర్మానం చేశారు. జనసేన కోసం పనిచేసిన కేడర్ ఎమ్మెల్యే కార్యాలయానికి పనుల కోసం వచ్చినప్పటికీ ఏమీ చేయలేని పరిస్ధితి. ఏం చేయాలన్నా టీడీపీతో సంప్రదింపులు అనివార్యం.న్యూస్రీల్ ఉంగుటూరులో షాడో ఎమ్మెల్యేగా గన్ని వీరాంజనేయులు భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో షాడోగా టీడీపీ నేతలు పనులు, పర్సంటేజీలు, లిక్కర్, గ్రావెల్లో టీడీపీదే అగ్రభాగం గూడెంలో పట్టుకోసం టీడీపీ పాకులాట జనసేన ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి మధ్య మాటల యుద్ధం కూటమి గెలుపొందాక ముఖ్య నేతల మధ్య పదవుల పంపకాల్లో మౌఖిక ఒప్పందాలు జరిగాయి. ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నచోట ఆ పార్టీకి తొలి ప్రాధాన్యం.. మిగిలిన రెండు పార్టీలకు తదుపరి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. కట్ చేస్తే... జనసేన ఎమ్మెల్యేలకు టీడీపీ చుక్కలు చూపిస్తోంది. ఉంగుటూరులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు షాడో ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా, భీమవరంలో ఇద్దరు టీడీపీ నేతలతో మాట్లాడిన తరువాతగాని ఎమ్మెల్యేను కలిసే పరిస్థితి లేదనే చర్చ బలంగా సాగుతుంది. తాడేపల్లిగూడెంలో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్చార్జి వలవల బాబ్జిల మధ్య ఆదిపత్య పోరులో భాగంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఇద్దర్ని పిలిచి సెటిల్మెంట్ చేసినప్పటికీ గొడవ సద్దుమణిగినట్లు లేదు. -
ధాన్యం కొనుగోలులో చిత్తశుద్ధి లేదు
ప్రశాంతంగా ఏపీ ఈ సెట్ పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలోకి అవకాశం కల్పించే ఏపీ ఈ సెట్ ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రశాంతంగా జరిగింది. 8లో uపీవీఎల్ నర్సింహరాజు ఆకివీడు: కూటమి ప్రభుత్వం రైతుల్ని నిండా ముంచిందని.. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి తడిసి ముద్దయ్యాయని వైఎస్సార్సీపీ ఉండి ఇన్చార్జి పీవీఎల్ నర్సింహరాజు అన్నారు. చెరుకుమిల్లి గ్రామంలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఈ దుస్థితి వచ్చిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రైతుల కోసం ఒక్క సంచి కూడా కొనుగోలు చేయలేదన్నారు. చిల్లుల సంచులతో ధాన్యాన్ని ఎగుమతులు చేసి మిల్లులకు తోలాల్సి వస్తుందన్నారు. దాళ్వా ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వల్లే రైతులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. నియోజకవర్గంలో రైతులవద్ద 30 శాతం ధాన్యం ఉందన్నారు. కొంత పంటమీద ఉంటే, మరి కొంత కళ్లాల్లో, నెట్లుపైనా ఉందన్నారు. జగన్ ప్రభుత్వంలో రైతుల వద్ద ప్రతి గింజ కొనుగోలు చేశామని చెప్పారు. సంచుల విషయంలో జేసీకి వినతి పత్రం అందజేశామని చెప్పారు. మండల వైసీపీ అధ్యక్షులు నంద్యాల సీతారామయ్య మాట్లాడుతూ తడిసిన ధాన్యానికి మద్దతు ధర లభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ కమిటీ అధ్యక్షుడు అంబటి రమేష్, మంతెన సునీల్కుమార్ వర్మ, సర్పంచ్ నందమూరి ప్రకాశం, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు సైదాల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పేరుకే కూటమి ప్రభుత్వం.. పెత్తనమంతా టీడీపీ నేతలదే.. జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన చోట కూడా టీడీపీ నేతలే హవా సాగిస్తున్నారు. బెల్టు షాపులు మొదలుకొని అక్రమ గ్రావెల్ దందా వరకు, చిన్న స్థాయి నామినేటెడ్ పదవులు మొదలుకొని జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు, పల్లెల్ల
జనసేన కార్యాలయంలో టీడీపీ హవా భీమవరం నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలుపొందిన పులపర్తి రామాంజనేయులు కార్యాలయంలో టీడీపీ నేతలు హవా సాగిస్తున్నారు. ఎమ్మెల్యే కార్యాలయం కేంద్రంగా టీడీపీ నేతలు కోళ్ళ నాగేశ్వరరావు, పొత్తూరి బాపిరాజులు నియోజకవర్గ వ్యవహారాలు చక్కదిద్దుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని కలిసిన తరువాతే ఎమ్మెల్యేను కలిసేలా సిస్టం సెట్ చేశారు. కొద్ది రోజులు క్రితం మత్స్యపురి గ్రామానికి చెందిన జనసేన నాయకులు ఎమ్మెల్యేను కలవడానికి వస్తే టీడీపీ నేత నాగేశ్వరరావే మాట్లాడటం, దానిపైన మత్స్యపురి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి కలవకుండా వెళ్ళిపోయా రు. తరువాత ఎమ్మెల్యే సమాచారం తెలుసుకుని పిలిపించుకుని మాట్లాడారు. టీడీపీ నేతకు సంబంధించిన వ్యవహారంలో చెరువు రైతులకు టీడీపీ నేత బకాయి ఉండటంతో సెటిల్మెంట్ చేయడంపైన జనసేనలో అసంతృప్తి ఉంది. నియోజకవర్గంలోని మద్యం షాపులు మొదలుకొని అన్ని వ్యవహారాలు జనసేన ఎమ్మెల్యే పేరుతో టీడీపీ నేతలే చక్కదిద్దడం గమనార్హం. -
కదం తొక్కిన సీహెచ్ఓలు
ఏలూరు (టూటౌన్): తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న సీహెచ్ఓలు మంగళవారం ఏలూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తమకు ఉద్యోగ, ఆర్థిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ నుంచి గిరిజన భవన్, కొత్త బస్టాండ్, జిల్లా పరిషత్ సెంటర్, ఫైర్ స్టేషన్ సెంటర్, డీఈఓ కార్యాలయం, ఎస్బీఐ సెంటర్ మీదుగా తిరిగి కలెక్టరేట్కు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా సీహెచ్ఓల సంఘం జిల్లా అడ్వయిజర్ కురెళ్ల సురేంద్ర, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సొంగా సిద్ధయ్య మాట్లాడుతూ ఆరేళ్లుగా సీహెచ్ఓలుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ, ఆర్థిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్లో ప్రభుత్వ వాటాను జమ చేయాలని, అదనపు పనిభారం తగ్గించాలని కోరారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించేంతవరకు సమ్మె కొనసాగించనున్నట్టు స్పష్టం చేశారు. -
దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలి
భీమవరం: త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి, నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చేయడానికి దర్యాప్తు అధికారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సూచించారు. భీమవరంలో పోలీసు అధికారులకు శ్రీఫోరెన్సిక్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్ఙ్పై ఏర్పాటు చేసిన ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. నార్కోటిక్స్, మత్తు పదార్థాలు, వివిధ రకాల ప్రాణాంతకమైన విషాలు, డీఎన్ఏ, రక్త నమూనాలు, మానవ అవయవాలకు సంబంధించిన సాక్ష్యాల సేకరణ, సైబర్ నేరాలలో పాటించవలసిన అంశాలు, ఆడియో, వీడియో, ముఖ్యమైన పత్రాల సేకరణలో పాటించవలసిన మెలకువల గురించి తెలిపారు. సాక్ష్యాధారాలు ఏ విధంగా భద్రపరచాలి, భద్రపరిచిన వాటిని ల్యాబ్కు పంపే సమయంలో ఎలా ప్యాకింగ్ చేయాలి అనే అంశాలను వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) వి. భీమారావు, డీఎస్పీలు ఆర్.జయసూర్య, జి.శ్రీ వేద, డి.విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల ఇళ్ల కూల్చివేత ఆపాలి
భీమవరం: ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్లు దౌర్జన్యంగా కూల్చడాన్ని తక్షణం విరమించుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో భీమవరం పాత బస్టాండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పి–ఫోర్ పేరుతో పేదరిక నిర్మూలన అంటుంటే.. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పేదలను నిర్మూలించే చర్యలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ స్పీకర్గా గౌరవ స్థానంలో ఉన్న రఘురామకృష్ణరాజు పేదల ఇళ్లు కూలుస్తామని బహిరంగంగా ప్రకటిస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఉండిలో రఘురామకృష్ణరాజే కోర్టు, పోలీసు, అధికారిగా వ్యవహరిస్తుంటే అధికారులు ఎమ్మెల్యేకి శిరస్సు వంచుతున్నారన్నారు. కూల్చిన పేదల ఇళ్లు తిరిగి నిర్మించి ఇవ్వాలని, పేదల ఇళ్ల కూల్చివేతను ఆపితే ఇది ముగింపు సభ.. లేకుంటే ప్రారంభ సభగా మారుతుందని శ్రీనివాసరావు ఈ సందర్భంగా హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ మాట్లాడుతూ మాట్లాడుతూ రఘురామ కృష్ణరాజు గద్దెనెక్కిన రోజు నుంచి పేదల ఇళ్లను కూల్చే కార్యక్రమం చేపట్టారని విమర్శించారు. సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి.బలరాం, జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పాతపాటి హరికుమార్రాజు, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రత్నరాజు, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్, పీవీ రావు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మాపు సూర్య వర ప్రసాద్, ఏపీ బహుజన జేఏసీ చైర్మన్ తాళ్లూరి మధు, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజు, కోనా జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు -
మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలి
ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ వీరవాసరం: రైతుల నుంచి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వీరవాసరం మండలంలోని రాయకుదురు, బొబ్బనపల్లి, మెంటేపూడి తదితర గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. రహదారి పక్కన ధాన్యం ఆరబెట్టుకుంటున్న రైతులతో మాట్లాడారు. సీజన్లో 9 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం పంట దిగుబడి వస్తుందని అంచనా వేశారని, ప్రస్తుతం 6 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అనుమతులు ఇచ్చారని, మిగిలిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో రైతుల నుంచి కొనుగోలు చేయాలని కోరారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని తేమ శాతం బట్టి కాకుండా కొనుగోలు చేయాలని కోరారు. దళారీ వ్యవస్థను లేకుండా ప్రభుత్వం తీసుకోవాలన్నారు. పంట నష్టం వల్ల కౌలు రైతు ఆర్థికంగా నష్టపోతున్నాడని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క గింజ కూడా మిగలకుండా ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. -
ఆక్వాలో యాంటీ బయోటిక్స్ వాడొద్దు
ఉండి: రొయ్యలు, చేపల సాగులో యాంటీ బయోటిక్ మందులు వాడరాదని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. మంగళవారం ఎన్నార్పీ అగ్రహారంలోని మత్స్య పరిశోధన కేంద్రంలో ఆక్వా రైతులకు సాగు పద్ధతులు, నిర్వహణ, నైపుణ్యంపై మంగళవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆక్వా కల్చర్లో మంచి యాజమాన్య పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యామ్నాయ జాతుల పెంపకంపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఫిషరీస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, ఎంపెడా అధికారులు, కేవీకే శాస్త్రవేత్తలు, సాంకేతిక సంస్థ ప్రతినిధులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొని ఆక్వా సాగులో అవలంభించే సాంకేతిక పద్ధతులను గురించి పలు సూచనలు సలహాలను వివరించాలని అన్నారు.అనంతరం రొయ్యలకు మేతను వేసేందుకు వినియోగించే డ్రోన్ టెక్నాలజీని కలెక్టర్ నాగరాణి పరిశీలించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి కేఎస్వీ నాగలింగాచార్యులు, ఫిషరీష్ యూనివర్సిటీ శాస్త్రవేత్త సుగుణ, కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ధాన్యం దిగుబడి లెక్కల్లో తేడాలు
భీమవరం: అకాల వర్షాలకు రైతన్నలు తీవ్రంగా నష్టపోయిన ఉన్న సమయంలో ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తప్పుడు లెక్కలతో రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుత దాళ్వా సీజన్లో 2.20 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా పంట చేతికి వచ్చే సమయంలో వ్యవసాయశాఖ దాదాపు 9.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. దీనిలో సుమారు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు తమ సొంత ఆహార అవసరాలకు వినియోగించుకున్నా 7.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం కేవలం 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అనుమతిచ్చింది. భీమవరం కలెక్టరేట్లో మంగళవారం ధాన్యం కొనుగోలుపై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మంత్రి చెప్పిన లెక్కలకు గతంలో వ్యవసాయశాఖ తెలిపిన లెక్కలకు పొంతన లేదు. జిల్లాలో 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని ఇప్పటికే 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. అధికారులు అంచనా 9.25 లక్షల మెట్రిక్ టన్నులకు మంత్రి చెప్పిన 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడికి పొంతనలేదు. ధాన్యం కొనుగోలు చేయలేక చేతులెత్తేసే ప్రక్రియలో భాగంగా మంత్రి లెక్కల్లో తేడాలు చూపించారని రైతుల సంఘాల నాయకులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 9.25 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిగా వ్యవసాయ శాఖ అంచనా మంత్రి మనోహర్ అంచనా కేవలం 7.50 లక్షల మెట్రిక్ టన్నులే -
ప్రతి గింజా కొంటాం
సివిల్ సప్లయిస్ ఎండీ మన్జీర్ జిలానీ పెంటపాడు: రాష్ట్రంలో అకాల వర్షం వల్ల తడిసిన ప్రతి గింజను సివిల్ సప్లయిస్ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడవద్దని పౌరసరఫరాల సంస్థ ఎండీ డాక్టర్ మన్జీర్ జిలానీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన పెంటపాడు మండలంలోని దర్శిపర్రు రైతు సేవాకేంద్రాన్ని సందర్శించారు. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి, సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ టి. శివరామ్ప్రసాద్లతో కలిసి పలు రైస్మిల్లుల్లో గోనె సంచులు తనిఖీ చేశారు. అనంతరం దర్శిపర్రు ఆర్బీకే వద్ద జిలానీ మాట్లాడుతూ.. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఫోన్ నెంబర్ ఏర్పాటు చేశామన్నారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా రైతులకు తప్పక గిట్టుబాటు ధర దక్కుతుందన్నారు. ఆకాల వర్షం వల్ల పెద్దగా నష్టం జరగకపోయినా తడిచిన ధాన్యం కొనుగోలుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంతవరకూ ఎంత ధాన్యం కొన్నారో, సంచుల కొరత తదితర వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఆర్డీవో కౌసర్ బానో, వ్యవసాయాధికారి కె.పార్థసారథి తదితరులు పాల్గోన్నారు. -
రెండు నెలలుగా జీతాలు అందక విలవిల
నూజివీడు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇస్తాం.. ఇదీ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన మాటలు. కానీ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. రెండు నెలలుగా జీతాలు లేక నాలుగు ట్రిపుల్ ఐటీల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో పనిచేస్తున్న దాదాపు 750 మంది కాంట్రాక్టు బోధనా సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు లేవు. మార్చి నెలకు చెందిన వేతనాలు, ఏప్రిల్కు సంబంధించిన వేతనాలు ఆరో తేదీ గడిచినప్పటికీ రాకపోవడంతో సిబ్బంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దీంతో కుటుంబ ఖర్చులకు, ఇతర అవసరాలకు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. మరోపక్క ఆ అప్పులపై వడ్డీల భారం అదనమని వారు వాపోతున్నారు. సకాలంలో జీతాలు ఇస్తే ఈ తలనొప్పి ఉండదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. అవుట్సోర్సింగ్ సిబ్బందికే ఇవ్వలేదు నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కాంట్రాక్టు పద్ధతిలో మెంటార్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, గెస్ట్ ఫ్యాకల్టీలు, ల్యాబ్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఐటీ మెంటార్లు పనిచేస్తున్నారు. పర్మినెంట్ ఫ్యాకల్టీకి జీతాలు రాగా, అవుట్సోర్సింగ్ సిబ్బందికి మాత్రం గత నెల, ఈ నెలలో ఇప్పటివరకు జీతాలు ఇవ్వకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం వల్ల ఆసుపత్రి ఖర్చులు, పిల్లల ఫీజుల చెల్లింపు, నెలవారీ మందుల ఖర్చులు, పాల బిల్లులు, సరకుల బిల్లులు, రుణ ఇన్స్టాల్మెంట్లు చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. జీతాలు నెలకు రూ.3 కోట్లు నాలుగు ట్రిపుల్ ఐటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు నెలకు రూ.3 కోట్లు జీతాల కింద చెలిస్తారు. రెండు నెలలకు కలిపి రూ.6 కోట్లు చెల్లించాల్సి ఉంది. రెండు నెలలుగా సకాలంలో చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలోనే బడ్జెట్ మంజూరైందని స్థానిక ట్రిపుల్ ఐటీ అధికారులు చెబుతుండగా, ఇంతవరకు ఎందుకు జీతాలు రాలేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ట్రిపుల్ ఐటీల్లోని కాంట్రాక్టు బోధనా సిబ్బంది దుస్థితినేడో రేపో జమ అవుతాయి కాంట్రాక్టు సిబ్బంది వేతనాలు నేడో, రేపో జమవుతాయి. జీతాల బిల్లులను అప్లోడ్ చేశాం. ప్రాసెస్లో ఉన్నాయి. పర్మినెంట్ ఉద్యోగులకు మూడు రోజుల క్రితమే వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. పర్మినెంట్, కాంట్రాక్టు సిబ్బందికి హెడ్లను వేరువేరుగా పెట్టడంతో జాప్యం జరిగింది. ప్రతినెలా సకాలంలోనే జీతాలను ప్రభుత్వం విడుదల చేస్తోంది. – సండ్ర అమరేంద్రకుమార్, ఆర్జీయూకేటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ -
12వ వేతన సవరణ కమిషన్ను తక్షణమే నియమించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లకు 12వ వేతన సవరణకు సంబంధించిన కమిషన్ను తక్షణమే నియమించాలని, అప్పటివరకు 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) 1938 రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ గుగ్గులోతు కృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం ఏపీటీఎఫ్ 1938 జిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక పంచాయతీరాజ్ మినీస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఈ రామ్మోహన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గుగ్గులోతు కృష్ణ మాట్లాడుతూ 11వ వేతన సవరణ కమిషన్ గడువు ముగిసి రెండేళ్లు పూర్తయినా ఇప్పటివరకు 12వ వేతన సవరణ కమిషన్ను ఏర్పాటు చేయకపోవడం సరైన విధానం కాదన్నారు. పెండింగ్లో ఉన్న మూడు డీఏలతో పాటు దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న అన్ని రకాల ఆర్థిక బకాయిలను ఉద్యోగ, ఉపాధ్యాయులకు తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు, మైనర్ మాధ్యమాలను కొనసాగించాలని కోరారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఆన్లైన్ విధానంతో కూడిన మాన్యువల్ పద్ధతిలో బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను కోరారు. 40 మంది విద్యార్థులు దాటితే రెండో సెక్షన్ను ప్రకటించాలని 6, 7, 8 తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు స్కూల్ అసిస్టెంట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జీ మోహన్, ఉపాధ్యక్షుడు డీ శ్రీనివాసరావు, కార్యదర్శులు జీ వెంకటరమణ, పీ ఉమామహేశ్వరరావు, పీ నాగరాజు, గుంటూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మంచిలి వద్ద ఇసుక లారీ బీభ్సతం
అత్తిలి: మంచిలి గ్రామంలో ఓ ఇసుక లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ మోటార్సైక్లిస్టు తీవ్రంగా గాయపడగా, రెండు విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. వివరాల ప్రకారం.. అత్తిలి మండలం కంచుమర్రు గ్రామానికి చెందిన కోరుకొల్లు కుమార్జోషిబాబు మంచిలి గ్రామంలో తాగునీటిని తీసుకువచ్చేందుకు యాక్టివా బండిపై వస్తున్నాడు. మంచిలి వంతెన వద్దకు వచ్చే సరికి భీమవరం నుంచి పెండ్యాల వైపు వెళుతున్న ఇసుక లారీ అదుపు తప్పి యాక్టివా బండిని వెనుకనుంచి ఢీకొట్టి, కొద్దిదూరం వెళ్లి రోడ్డుమార్జిన్లో ఉన్న రెండు విద్యుత్ స్థంభాలపైకి దూసుకెళ్లి పంటబోదెలోకి దిగబడింది. దీంతో విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. విద్యుత్వైర్లు ఒకటికొకటి తాకడంతో ట్రిప్అయి విద్యుత్ సరఫరా నిలిచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. ఘటన జరిగిన ప్రదేశంలో ప్రజలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద స్థలానికి పోలీసులు చేరుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. విద్యుత్ అధికారులు వచ్చి విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. గాయపడిన మోటార్సైక్లిస్టు కోరుకొల్లు కుమార్జోషిబాబును అత్తిలి ఎంపీపీ సుంకర నాగేశ్వరరావు తన కారులో తణుకు ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వ్యక్తికి గాయాలు.. ధ్వంసమైన విద్యుత్ స్తంభాలు -
శ్రీవారి క్షేత్రం.. శోభాయమానం
చినవెంకన్న వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలకు ద్వారకాతిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు ఈనెల 14తో ముగియనున్నాయి. ఆలయాన్ని, పరిసరాలను విద్యుద్దీప తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయ రాజగోపురాల సముదాయం, అనివెట్టి మండపం, జంటగోపురాల ప్రాంతం విద్యుద్దీప కాంతులతో మిరమిట్లు గొలుపుతున్నాయి. అలాగే ఆలయ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన స్వామివారి భారీ విద్యుత్ కటౌట్, కొండపైన స్వాగత ద్వారం చూపరులను ఆకట్టుకుంటున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదికను సుందరీకరించారు. – ద్వారకాతిరుమల -
ప్రశాంతంగా ఏపీ ఈసెట్
ఏలూరు (ఆర్ఆర్పేట): పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల్లో నేరుగా ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించడానికి అవకాశం కల్పించే ఏపీ ఈ సెట్ ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మంగళవారం ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 2,345 మంది విద్యార్థులకు గాను 2,306 మంది హాజరయ్యారు. చెల్లని చెక్కు కేసుల్లో ఇద్దరికి జైలు శిక్ష, జరిమానా నూజివీడు: చెల్లని చెక్కు కేసులకు సంబంధించి ఇద్దరికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మేజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం పట్టణానికి చెందిన పడిశాల హరీష్ 2019 డిసెంబరు 29న దయాసాగర్కు రూ.5 లక్షలు అప్పుగా ఇచ్చారు. కొంతకాలం తరువాత బాకీ చెల్లింపు నిమిత్తం దయాసాగర్ హరీష్కు రూ.5 లక్షలకు చెక్ ఇచ్చాడు. ఆ చెక్ను హరీష్ బ్యాంకులో వేయగా సంబంధిత ఖాతాలో నగదు లేదని తిప్పి పంపారు. దీంతో హరీష్ కేసు వేయగా విచారణ అనంతరం దయాసాగర్కు ఆరు నెలల జైలుశిక్ష, రూ. 7 లక్షల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. అలాగే మరో కేసులో పట్టణానికి చెందిన బెజవాడ రామారావు 2016 అక్టోబర్ 16న బొల్లిగర్ల పుల్లారావుకు రూ.2.50 లక్షలు అప్పుగా ఇచ్చారు. కొంతకాలం తరువాత బాకీ చెల్లింపు నిమిత్తం పుల్లారావు రూ.3.60 లక్షలకు చెక్కు ఇవ్వగా ఖాతాలో నగదు లేదని తిప్పి పంపారు. దీంతో రామారావు కేసు వేయగా విచారణ అనంతరం పుల్లారావుకు ఆరు నెలల జైలుశిక్ష, రూ.4 లక్షల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. బైక్ను ఢీకొన్న కారు.. ముగ్గురికి గాయాలు ద్వారకాతిరుమల: స్థానిక సొసైటీ పెట్రోల్ బంకు వద్ద మంగళవారం బైక్ను కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. తిరుమలంపాలెంకు చెందిన మిడతా నాగ సత్యన్నారాయణ బైక్లో పెట్రోలు కొట్టించుకునేందుకు వెళుతూ సొసైటీ బంకు వద్ద రోడ్డు దాటుతుండగా లక్ష్మీపురంలోని తమ పెట్రోల్ బంకు (భీమడోలు వైపు) నుంచి ఓం ప్రకాష్ చౌదరి వెళుతున్న కారు ఢీకొంది. నాగ సత్యన్నారాయణకు తీవ్ర గాయాలుకాగా. కారులోని ఓం ప్రకాష్ చౌదరికి, ఆయన భార్య శ్రావణికి సైతం గాయాల య్యాయి. క్షతగాత్రులను విజయవాడ తరలించారు. -
ఎద్దుల అక్రమ రవాణా.. అడ్డుకున్న పోలీసులు
ద్వారకాతిరుమల: మండలంలోని గుణ్ణంపల్లి జాతీయ రహదారిపై ఎద్దుల అక్రమ రవాణాను పోలీసులు మంగళవారం అడ్డుకుని ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఎస్సై టి.సుధీర్ తెలిపిన వివరాలు ప్రకారం. పార్వతీపురం మార్కెట్ నుంచి ఒక కంటైనర్లో 48 ఎద్దులను తమిళనాడులోని పోలచ్చి మార్కెట్కు తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్ద కాపు కాసి, కంటైనర్ను అదుపులోకి తీసుకుని డ్రైవర్ మురుగానందంను అరెస్టు చేసి, వివరాలు రాబట్టారు. పట్టుబడ్డ కంటైనర్లో తరచూ ఆవులు, గేదెలను రవాణా చేస్తామని, ప్రస్తుతం పట్టుబడ్డ ఈ ఎద్దులను విజయనగరం జిల్లా, పెద్ద మానాపురం గ్రామానికి చెందిన రాజనా రామారావు సూచనల మేరకు పోలచ్చి మార్కెట్కు తీసుకెళ్తున్నట్టు చెప్పాడు. అక్కడ కుంకుమరాజు అనే వ్యక్తికి ఫోన్ చేసి ఈ ఎద్దులను అప్పగించాల్సి ఉందన్నారు. ఇంతలో ఇక్కడ పట్టుబడినట్టు తెలిపాడు. దాంతో మురుగానందంతో పాటు, తమిళనాడులోని వట్టం సత్రం గ్రామానికి చెందిన కంటైనర్ యజమాని దండపాణి వెంకటాచలం, రాజనా రామారావు లపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఎద్దులను నున్న గ్రామంలోని గోసంరక్షణ కేంద్రానికి తరలించినట్టు చెప్పారు. -
నాలుగు నెలల తరువాత తల్లి చెంతకు..
భీమడోలు: మతిస్థిమితం లేక ఇంటి నుంచి వెళ్లిపోయిన మానసిక వికలాంగున్ని పోలీసులు నాలుగు నెలల అనంతరం పట్టుకుని తన తల్లి చెంతకు చేర్చిన ఉదంతమిది. సూరప్పగూడెం పంచాయతీ పరిధిలోని పాతూరుకు చెందిన కొప్పుశెట్టి వెంకన్న(36) మానసిక వికలాంగుడు. అతడిని తల్లి గంగమ్మ కంటికి రెప్పలా కాస్తోంది. అయితే జవనరి 7వ తేదీన మతిస్థిమితం లేక ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంకన్న ముంబైకి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో గంగమ్మ తన కుమారుడు వెంకన్న ఆచూకీ కోసం జిల్లా వికలాంగుల సంఘం అధ్యక్షుడు మామిడిపల్లి నాగభూషణంను సంప్రదించించగా ఆయన సహకారంతో భీమడోలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్సై వై.సుధాకర్ వెంకన్న ఆచూకీ కోసం తనదైన శైలిలో కృషి చేశారు. రాష్ట్రంలోని దివ్యాంగుల గ్రూపులో ఫొటోను ఉంచి ఆచూకీ తెలిస్తే తెలియజేయాలని కోరారు. కొన్ని రోజుల తర్వాత ముంబైలోని శరభ ఫౌండేషన్ వారు ముంబై రోడ్లపై తిరుగుతున్న వెంకన్నను పట్టుకుని ఆతనికి వైద్యం చేయించి మందులు అందించారు. కోలుకున్న తర్వాత వెంకన్న శరభ ఫౌండేషన్ వారికి తన అడ్రస్ చెప్పాడు. దీంతో వారు భీమడోలు పోలీసులకు సమచారం అందించారు. మంగళవారం భీమడోలు పోలీస్స్టేషన్లో తల్లి గంగమ్మకు వెంకన్నను అప్పగించారు. -
మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆంజనేయస్వామి వారికి ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు జరిపారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులుదీరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు 108 ప్రదక్షణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానమునకు వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,94,262 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. సుమారు 1500 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేసినట్లు చెప్పారు. సబ్సిడీ విత్తనాల సీజ్ ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు బైపాస్ రోడ్డులో మంగళవారం విజిలెన్సు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఎటువంటి బిల్లులు లేకుండా వ్యాన్లో తరలిస్తున్న 43.60 క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను గుర్తించి వ్యాన్తో సహ సీజ్ చేసినట్లు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ పీ శివరామకృష్ణ తెలిపారు. సబ్సిడీ విత్తనాలు బాపట్ల నుంచి కిర్లంపూడి రవాణా చేస్తున్నట్లు తెలిసిందన్నారు. వీటి విలువ రు.4,80,280 ఉంటుందన్నారు. ఈ కేసుకు సంబంధించి కల్లపురెడ్డి వీరరాఘవ అలియాస్ నాని, కల్లపురెడ్డి జయీశ్వర రావులపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ తనిఖీలో విజిలెన్సు ఏఓ జీ. మీరయ్య, పెదవేగి మండల వ్యవసాయ శాఖాధికారి ప్రియాంక, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారని తెలిపారు. యువతిని మోసగించిన వ్యక్తిపై కేసు నమోదు జంగారెడ్డిగూడెం: నమ్మించి మోసగించిన యువకుడిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై షేక్ జబీర్ తెలిపిన వివరాల ప్రకారం.. తన సోదరి విద్యాభ్యాసం నిమిత్తం జంగారెడ్డిగూడెం రాజుల కాలనీలో తల్లితో కలిసి ఓ యువతి అద్దెకు ఉంటోంది. ఈ క్రమంలో స్థానిక బాలాజీనగర్కు చెందిన ఊసా ప్రశాంత్కుమార్ పరిచయం అయ్యాడు. 2023 నవంబర్ 16న యువతి పుట్టిన రోజు సందర్భంగా ఆమెను స్థానిక శేషాద్రి నగర్లోని ఓ బిల్డింగ్ వద్దకు తీసుకువెళ్లి యువతి మెడలో పసుపుతాడు కట్టి, లైంగిక దాడి చేశాడు. కొన్ని రోజుల తరువాత వివిధ కారణాలు చెప్పి ఆమె నుంచి ఒకసారి 3 ఉంగరాలు, 1 బ్రాస్లెట్, మరోసారి 2 గాజులు, చెవి జాలార్లు తీసుకున్నాడని యువతి ఫిర్యాదుతో పేర్కొంది. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించుకోకపోతే చంపుతానని ప్రశాంత్కుమార్ బెదిరిస్తున్నాడని, దీనికి మరికొందరు సహకరిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. -
రెండు బైక్ల ఢీ.. ఒకరి మృతి
ముసునూరు: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన కాట్రేనిపాడు – చిల్లబోయినపల్లి రహదారిలో చోటుచేసుకుంది. ఎస్సై ఎం చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం.. తాపీ పని పురమాయించుకునేందుకు శనివారపు పేటకు చెందిన బయ్యారపు జమాల్(39), మణికంఠ బైక్ మీద కాట్రేనిపాడు వైపునకు వస్తుండగా ఎదురుగా వస్తున్న నూజివీడు మండలం అన్నవరంకు చెందిన వ్యక్తి మోటార్సైకిల్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బయ్యారపు జమాల్ అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఏలూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఏలూరు ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
సీహెచ్ఓలకు వైఎస్సార్సీపీ సంఘీభావం
ఏలూరు (టూటౌన్): సీహెచ్ఓల న్యాయమైన కోర్కెలను తక్షణం పరిష్కరించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన కొనసాగిస్తున్న సీహెచ్ఓల శిబిరాన్ని వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ మంగళవారం సందర్శించి సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ సీహెచ్ఓల సమస్యలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. వారి డిమాండ్లన్నీ న్యాయబద్ధమైనవేనని, తక్షణం స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీహెచ్ఓల సమస్యను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ కారుమూరి సునీల్ కుమార్, పార్టీ నియోజకవర్గాల ఇన్చార్జు వాసుబాబు, జేపీ, కంభం విజయరాజు తదితరులు పాల్గొన్నారు. చెట్టున్నపాడు చోరీ కేసులో ఇద్దరికి రిమాండ్ భీమడోలు: చెట్టున్నపాడు గ్రామంలో జరిగిన చోరీ కేసులో మంగళవారం ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. గ్రామంలోని పాస్టర్ కొండపల్లి మధుబాబు ఇంట్లో ఈనెల 2వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసి రూ.1.7లక్షల విలువ గల బంగారు అభరణాలు, కొంత నగదును చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై వై.సుధాకర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితులు గ్రామానికి చెందిన నేతల రామలింగం, కొత్తపల్లి రత్నాకర్లను పట్టుకుని వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను భీమడోలు కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు. -
రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మాజీ మంత్రి కొట్టుపెంటపాడు: రైతుల విషయంలో కూటమి ప్రభు త్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని, వర్షాలతో దెబ్బతిన్న రైతులను తక్షణం ఆదుకోవాలని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. సోమవారం మండలంలోని కొండేపాడు, మీనవిల్లూరు, రామచంద్రపురం గ్రామాల్లో ఆయన పర్యటించారు. వర్షంతో ధాన్యం తడిసి ఆరబెట్టుకున్న రైతులను పరామర్శించారు. మాసూళ్లు ఆఖరిలో గోనె సంచులు అందించకుండా ప్రభుత్వం తాత్సారం చేయడంతో ధాన్యం తడిసిపోయిందని, పొలాల్లోని ధాన్యాన్ని మిల్లులకు తోలలేకపోయామని చెప్పుల ప్రసాద్, షరాబు తదితర రైతులు వాపోయారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొట్టు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించకుండా తాత్సారం చేస్తోందన్నారు. ప్రధానంగా గోనె సంచుల కొరత తీర్చాలన్నారు. మాసూళ్ల చివరిలో వచ్చిన వర్షం వల్ల రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా రైతులను ఆదుకున్న ఘనత జగన్కే దక్కుతుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఇసుక, మద్యంతో టీడీపీ అక్రమ దోపిడీ చేస్తోందని ఆరోపించారు. దేశానికి అన్నం పెట్టే రైతులపై శ్రద్ధ చూపాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు కై గాల శ్రీనివాస్, బండా రు నాగు, మాజీ ఎంపీటీసీ సభ్యులు పాలా గణపతి, గూడూరి సూర్యనారాయణ, చేనేత సొసైటీ మాజీ అధ్యక్షుడు చల్లా లింగమూర్తి, గోకా వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ
భీమవరం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. సోమ వారం భీమవరంలోని జిల్లా పోలీస్ కార్యాల యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. మొత్తం 8 ఫిర్యాదులు అందాయి. అదనపు ఎస్పీ వి.భీమారావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దేశింశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పోడూరులో అత్యధిక వర్షపాతం భీమవరం: జిల్లాలో ఆదివారం పోడూరులో అత్యధికంగా 80.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా పాలకోడేరులో 9.6 మి.మీ వర్షం కురిసింది. సోమవారం జిల్లా సమా చార శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మండ లాల వారీగా.. పాలకొల్లులో 73.4, తాడేపల్లి గూడెంలో 33.6, పెంటపాడులో 35, తణుకులో 16.6, అత్తిలిలో 31.6, గణపవరంలో 51.4, ఆకివీడులో 37.6, ఉండిలో 21.6, పెనుమంట్రలో 28.4 వర్షం పడింది. ఇరగవరంలో 34.8, పెను గొండలో 26.8, ఆచంటలో 44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వీరవాసరంలో 24.2, భీమవరంలో 31.4, కాళ్లలో 23.8, మొగల్తూరు లో 33.8, నరసాపురంలో 30.2, యలమంచిలిలో 20.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెన్షన్ బిల్లుతో ఇబ్బందులు నూజివీడు: కేంద్ర ప్రభుత్వం మార్చిలో తీసుకువచ్చిన పెన్షన్ బిల్లు వల్ల పెన్షనర్లు ఆర్థికంగా ఇబ్బంది పడతారని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వంగల గోవింద రావు అన్నారు. సోమవారం స్థానిక సంఘ కా ర్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని గోవిందరావు డిమాండ్ చేశారు. సంఘ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమోదించారు. ఉపాధ్యక్షుడు ఈమని శేషయ్య, కార్యదర్శి సోమయాజులు, ఆర్గనైజింగ్ కార్యదర్శి అబ్దుల్ ఖాదర్, కోశాధికారి కేఎస్ఎస్ఆర్కే ప్రసాదరావు పాల్గొన్నారు. కనీస వేతనాల కోసం ధర్నా ఏలూరు (టూటౌన్): కార్మికులకు కనీస వేతన సలహా బోర్డును వెంటనే నియమించాలని కనీస వేతనం నెలకు రూ.35 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని రామారావు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్ డాంగే అధ్యక్షతన జరిగిన ధర్నాలో రామారావు మాట్లాడారు. కార్మిక శాఖ ఎన్ఫోర్స్మెంట్ యంత్రాంగాన్ని పటిష్టం చేసి కనీస వేతన చట్టాల అమలుకు భరోసా కల్పించా లని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి కె.బుచ్చిబాబు, జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.కృష్ణమాచార్యులు, జిల్లా నాయకులు పి.కిశోర్ మాట్లాడారు. అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించాలి ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలకు సాగు పట్టాలను మంజూరు చేయాలని, అట్రాసిటీ చట్టా న్ని పరిరక్షించాలని, అర్హులైన చర్మకారులకు పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ దళిత సేన ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేశారు. దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడు రవిప్రకాష్ మాట్లాడారు. ముందుగా ఏలూరు ఓవర్బ్రిడ్జి పక్కనున్న బాబూ జగ్జీవన్రామ్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. దళిత సేన నాయకులు కాకర్ల మూడి వెంకటరావు, స్టాలిన్, చీలి మోహన రా వు, మాణిక్యాలరావు, దిరుసు పాముల పుష్ప, బేతాళ జయసుధ పాల్గొన్నారు. -
ఆలస్యంగా ఇచ్చారు
మూడు ఎకరాలు కౌలు సాగు చేశాను. పంట కోసి ధాన్యం ఆరబెట్టుకున్నా సకాలంలో సంచులు ఇవ్వలేదు. సంచులు వచ్చాక పట్టుబడి చేశాం. మిల్లుకు తరలిద్దామనుకునే లోపు అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయింది. ఇబ్బంది పడ్డాం. – సి.సుందరరావు, కౌలురైతు, ఇలపర్రు సంచులు లేకే సమస్య మూడు ఎకరాల్లో కౌలు సాగు చేశాను. వారం క్రితమే కోసి ధాన్యం ఆరబెట్టుకున్నాను. సంచుల కోసం సచివాలయానికి వెళితే లేవన్నారు. సంచులుంటే ఈపాటికే ధాన్యాన్ని మిల్లుకు తరలించుకునే వాణ్ణి. నిన్న కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో మరలా ఆరబెట్టాల్సి వస్తోంది. – డి. శ్రీను, కౌలు రైతు, ఆలమూరు వర్షానికి తడిసిపోయింది వరి కోతలు పూర్తయిన తర్వాత ధాన్యాన్ని మిల్లులకు తోలడానికి సంచుల కోసం ఎదురు చూస్తున్నాను. సంచులు ఇదిగో వస్తాయి అదిగో వస్తాయంటూ అధికారులు కాలయాపన చేశారు. వర్షానికి ధాన్యం పంట తడిసిపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. – కుడిపూడి నాగ సత్యనారాయణ, రైతు, ఇరగవరం అవస్థలు పడుతున్నాం సుమారు 90 బస్తాల వరకూ ధాన్యం పండింది. అడిగిన వెంటనే అధికారులు గోనె సంచులు ఇచ్చి ఉంటే బాగుండేది. నాలుగు రోజులు గడిచినా గోనె సంచులు ఇవ్వలేదు. దీంతో ధాన్యం పంటను వర్షాల నుంచి కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. – ఆలం సత్యనారాయణ, రైతు, తణుకు● -
సెంట్రల్ బ్యాంకులో రుణాల కుంభకోణం
నరసాపురం: పట్టణంలోని కోటిపల్లివారి వీధిలోని సెంట్రల్ బ్యాంకు బ్రాంచీలో భారీ రుణాల కుంభకోణం సోమవారం వెలుగుచూసింది. పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వేములదీవిలో 19 ఎకరాల రొయ్యల చెరువుకు సంబంధించి నకిలీ లీజు అగ్రిమెంట్లు సృష్టించి బ్యాంకులో సుమారు రూ.4 కోట్లు రుణాలు తీసుకున్నారు. చెరువు అసలు యజమానులు రుణం కోసం వేరే బ్యాంకుకు వెళ్లగా ఈ చెరువులపై ఇప్పటికే రుణాలు తీసుకున్నట్టు తెలియడంతో కుంభకోణం బయటపడింది. దీంతో అసలు యజమానులు తిరుమాని నాగరాజు, శ్రీనివాసరావు సెంట్రల్ బ్యాంకుకు వచ్చి మేనేజర్ టి.ప్రకాశంను నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చి రాత్రి 9 గంటల వరకు బ్యాంకులో తనిఖీలు చేసి వివరాలు సేకరించారు. కుంభకోణం జరిగిందిలా.. వేములదీవిలో తిరుమాని వడ్డికాసులు, పద్మ దంపతులకు 19 ఎకరాల రొయ్యల చెరువులు ఉన్నాయి. వడ్డికాసులు 2020లో మృతి చెందగా ఆయన ఇద్దరు కుమారులు నాగరాజు, శ్రీనివాసరావు ఆస్తి పంచుకున్నారు. ఇదిలా ఉండగా 2024లో పట్టణానికి చెందిన ప్రముఖుడు కూనపరెడ్డి ప్రసాద్, మరో వ్యక్తి దూడే చంద్రశేఖర్లు వడ్డికాసులు 19 ఎకరాల చెరువును తమకు లీజుకు ఇచ్చినట్టుగా నకిలీ అగ్రిమెంట్లు సృష్టించి సెంట్రల్ బ్యాంకులో రుణం పొందారు. బ్యాంకు అధికారులు ప్రసాద్ పేరున రూ. 2.36 కోట్లు, చంద్రశేఖర్ పేరున రూ.1.63 కోట్లు రుణాలు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో వడ్డికాసులు కుమారుడు నాగరాజు మరో బ్యాంకులో రుణం నిమిత్తం సదరు చెరువుల డాక్యుమెంట్లు తీసుకువెళ్లగా మోసం బయటపడింది. దీంతో నాగరాజు, కొందరు గ్రామస్తులు సెంట్రల్ బ్యాంకుకు వెళ్లి మేనేజర్ను నిలదీశారు. తన తండ్రి 2020లో చనిపోతే 2024లో లీజు అగ్రిమెంట్ ఎలా రాశారని, రుణం ఎలా ఇచ్చారంటూ గొడవపడ్డాడు. బ్యాంకు వద్ద ఉద్రిక్తత ఏర్పడగా టౌన్ ఎస్సైలు ముత్యాలరావు, జయలక్ష్మి సిబ్బందితో వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బాధితుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ముత్యాలరావు చెప్పారు. చక్రం తిప్పిన బ్రోకర్! రుణాల కుంభకోణంలో మాధవ్ అనే బ్రోకర్ చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం బ్యాంకు అధికారుల పాత్రతోనే సాగినట్టుగా సమాచారం. భారీగా పర్సంటేజ్లు చేతులు మారినట్టు తెలిసింది. సదురు బ్రోకర్ పట్టణంలోని మిగిలిన కొన్ని బ్యాంకుల్లో కూడా చాలా మందికి ఈ తరహా రుణాలు ఇప్పించినట్టు వార్తలు వస్తున్నాయి. నకిలీ అగ్రిమెంట్లతో రూ.4 కోట్లు గోల్మాల్ -
సర్కారు నిండా ముంచేను
ఆలమూరులో 807 ఎకరాల ఆయకట్టుకు దాళ్వా ధాన్యం అంచనా దిగుబడి సుమారు 3,147 టన్నులు. రైతులు ఓపెన్ మార్కెట్ నిమిత్తం 15 శాతం (472 టన్నులు) మినహాయించగా దాదాపు 2,674 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అయితే 2,196 టన్నుల ధాన్యం మాత్రమే లక్ష్యంగా నిర్ణయించారు. సోమవారం నాటికి 1,934.76 టన్నులు సేకరించగా మరో 262 టన్నులు మిగిలి ఉంది. వారం క్రితమే ధాన్యం కోసి ఆరబెట్టామని, సకాలంలో సంచులు అందక మిల్లుకు తరలించలేకపోయామని గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. మంగళవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2025సాక్షి, భీమవరం: జిల్లాలోని 2.20 లక్షల ఎకరాల్లో దాళ్వా వరి సాగు చేయగా 9.25 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. దీనిలో రైతులు ఓపెన్ మార్కెట్లో విక్రయాలు, నిల్వ నిమిత్తం 1.50 లక్షల టన్నులు మినహాయించగా.. 7.75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే 6 లక్షల టన్నుల సేకరణకు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 4.8 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్టు అధికార వర్గాలు అంటున్నాయి. లక్ష్యానికి మించి మరో 1.5 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు ప్రభుత్వాన్ని కోరినట్టు చెబుతున్నాయి. రైతులను ముంచిన సంచుల కొరత జిల్లాకు 1.49 లక్షల గోనె సంచులను సిద్ధం చేయగా ఇప్పటికే 1.12 లక్షల సంచులను వినియోగించినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 37 లక్షల సంచులు ఆర్ఎస్కేల్లో ఉన్నాయని, సంచులకు కొరత లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే సంచుల కు కొరత ఉందని రైతులు వాపోతున్నారు. వారం, పది రోజుల క్రితం కోతలు కోసి ధాన్యం ఆరబెట్టుకున్నామని, సంచుల కోసం రైతు సేవా కేంద్రాలు (ఆర్ఎస్కే) చుట్టూ తిరిగినా ఫలితం లేదని పలు గ్రామాల్లో రైతులు తెలిపారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించలేక రోడ్లు పక్కన, కళ్లాల్లోనూ రాశులు పోసి నిల్వ ఉంచామంటున్నారు. మరలా ఆరబెట్టాల్సిందే.. జిల్లావ్యాప్తంగా ఆదివారం కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసిపోయి మరలా ఆరబెట్టేందుకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని రైతులు వాపోతు న్నారు. సకాలంలో సంచులు అందజేసి ఉంటే ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదంటున్నారు. మరోపక్క వ స్తున్న సంచుల్లో చీకిపోయినవి, చిరిగిపోయిన ఉంటున్నాయనే విమర్శలున్నాయి. ప్రస్తుతం మా సూళ్లు ముమ్మరమైన ఆచంట, తణుకు, పాలకొల్లు తదితర నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఇటువంటి పరిస్థితి ఉందంటున్నారు. కొరత లేకుండా నాణ్యమైన సంచులను అందించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. న్యూస్రీల్ధాన్యం.. వర్షార్పణం పట్టుబడులకు సంచుల కొరత ఆర్ఎస్కేల చుట్టూ రైతుల ప్రదక్షిణలు వారం క్రితం ధాన్యం ఆరబెట్టినా సంచుల్లేక ఇబ్బందులు అకాల వర్షానికి తడిసిన ధాన్యం మరలా ఆరబెట్టాల్సి వస్తోందని ఆవేదన -
అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి
భీమవరం (ప్రకాశం చౌక్): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో భాగంగా జేసీ టి.రాహుల్కుమార్ రెడ్డితో కలిసి అర్జీలు స్వీకరించారు. అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలన్నారు. మొత్తంగా 149 అర్జీలు స్వీకరించారు. డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, సచివాలయాల అధికారి వై.దోసిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● భీమవరం మండలం తుందుర్రుకి చెందిన చింతలపాటి సూర్యనారాయణరాజు తనకున్న 3.5 ఎకరాల రొయ్యల చెరువు ఆనుకుని పుంత రోడ్డు ఉందని, అయితే ఈ రోడ్డును గ్రామానికి చెందిన పొత్తూరి వెంకటరాజు అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని, దీంతో నడక మార్గం లేక ఇబ్బంది పడుతున్నామంటూ అర్జీ అందించారు. ● వీరవాసరం మండలం రాయకుదురుకి చెందిన దుండి మంగమ్మ తనకు 52 సెంట్ల పొలం ఉందని సరిహద్దు రైతు పంట బోదె పూడ్చడంతో రెండు సెంట్లు కోల్పాయానని, తన భూమికి హద్దులు చూపించాలని కలెక్టర్కు వినతిపత్రం అందించారు. నీరు లేక.. పంట సాగు చేయలేక.. అత్తిలి మండలం కంచుమర్రుకి చెందిన రైతు మాండ్రుమాక జయప్రసాద్ వ్యవసాయ భూమికి సాగు నీరందించే పంటో బోదె పూడిపోయింది. చెత్తాచెదారం, డ్రెయినేజీ నీళ్లు బోదెలో వదలడంతో సాగుచేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖరీఫ్, రబీ సీజన్లలో పంట విరామం ఇచ్చి నష్టపోయాయని, సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు అర్జీ అందించారు. కలెక్టర్ నాగరాణి -
ఎంటర్ప్రెన్యూర్లు దేశాభివృద్ధికి అవసరం
నూజివీడు: విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఎంటర్ప్రెన్యూర్షిప్ విద్యపై నిర్వహిస్తున్న ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఎంతో దోహదపడుతుందని ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ పేర్కొన్నారు. స్థానిక ట్రిపుల్ ఐటీలో ఆర్జీయూకేటీ, వాధ్వానీ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు ట్రిపుల్ ఐటీల నుంచి ఎంపిక చేసిన 49 మంది అధ్యాపకులకు శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దే బదులుగా వారినే వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దినట్లయితే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి విద్యార్థి స్టార్ట్అప్ ప్రారంభించేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యవక్తగా హాజరైన నవీన్ అహ్మద్ మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు విద్యార్థుల్లా నేర్చుకొని తరువాత విద్యార్థులకు శిక్షణనివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ ఈఐపీటీ పీ శ్యామ్, ఏఓ బీ లక్ష్మణరావు, సుజాత, ఫైనాన్స్ ఆఫీసర్లు నాగార్జునాదేవి, శ్రీనాఽథ్ డీన్ అకడమిక్స్ చిరంజీవి, డీన్ ఎవాల్యూషన్ రియాజ్హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న సీహెచ్ఓల నిరసన
భీమవరం (ప్రకాశం చౌక్): విలేజ్ క్లినిక్ల సీహెచ్ఓల నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. గత 8 రోజులుగా వారు తమ సమస్యలపై నిరసన గళం వినిపిస్తున్నారు. భీమవరం కలెక్టరేట్ వద్ద టెంట్ వేసుకుని ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉద్యోగ భద్రత, న్యాయమైన డిమాండ్లపై పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిత్యం గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించే వారు రోజుల తరబడి నిరసన కార్యక్రమంలో ఉండడం వల్ల గ్రామాల్లో స్థానిక వైద్య సేవలు నిలిచిపోయాయి. పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామం విలేజ్ క్లినిక్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ వెళ్లి వైద్య సేవలు అందించినట్లు సీహెచ్ఓల యూనియన్ నాయకులు మీడియా దృష్టికి తీసుకువచ్చారు. అతడు వైద్యం చేస్తున్న ఫొటోలు సేకరించి, వారు లేని విలేజ్ క్లినిక్లలో పరిస్థితి ఏ విధంగా ఉందో మీడియాకు తెలియజేశారు. అలాగే పలు చొట్లు ఆరోగ్య మిత్రలు వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. వైద్యా ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరితో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శిస్తున్నారు. -
దళిత కుటుంబం ఆమరణ నిరాహార దీక్ష
బుట్టాయగూడెం: తమకు న్యాయం చేయాలని కోరుతూ ఓ దళిత కుటుంబం సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ కుటుంబానికి చెందిన బాషా శ్యామ్బాబు, బాషా రాజేష్ మాట్లాడుతూ బుట్టాయగూడెం మండలం మర్రిగూడెం సమీపంలో సర్వే నంబర్ 415లో 10–58 సెంట్లు, సర్వే నంబర్ 415లో 4 ఎకరాల 28 సెంట్లు, సర్వే నంబర్ 417/1లో 8–50 సెంట్లు మొత్తం 23 ఎకరాల 36 సెంట్ల భూములు తమ తాతల కాలం నాటివని అన్నారు. 2002, 2006 సంవత్సరాల్లో బుట్టాయగూడెం రెవెన్యూ అధికారులు పంచనామా చేసి ఆ భూములను తమకు అప్పగించారని, అప్పటి నుంచి ఆ భూముల్లో తామే సాగు చేసుకుని జీవిస్తున్నామని తెలిపారు. అయితే ఈ భూముల్లో కొందరు ప్రవేశించి తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆ భూముల్లో ఉన్న జీడిమామిడి, మామిడి పంటలను దౌర్జన్యంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేసే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ దీక్షలో వెంకాయమ్మ, వేములూరి నాగేంద్ర, వేములూరి వెంకటలక్ష్మి, వేములూరి ముకుంద, బాషా నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
కుసుమ ధర్మన్న సాహిత్యం నేటి తరానికి ఆదర్శం
పాలకొల్లు సెంట్రల్: జాతీయ ఉద్యమకారుడు, 19వ శతాబ్ధపు తొలితరం దళిత కవి కుసుమ ధర్మన్న ఉద్యమ సమరంతో పాటు సామాజిక సేవలో ఎంతో విశిష్టత సాధించారని, ఆయన సాహిత్యం నేటితరానికి ఆదర్శనీయమని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపారాణి అన్నారు. సోమవారం స్థానిక మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లెల్ల సత్య సుధామ (సామాజిక సేవా), ఉన్నమాటి శ్యాంసుందర్ (కార్టూన్ జర్నలిజం), డాక్టర్ పెంకి విజయ్ కుమార్, వాసంశెట్టి దుర్గా శంకర్ (కళారంగం), మామిడిశెట్టి శ్రీనివాస్ (తెలుగు సాహిత్యం) లకు కుసుమ ధర్మన్న ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అలాగే వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు కవులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించారు. బత్తుల మురళీకృష్ణ రచించిన జముకు, దీర్ఘ కవితను, తంగిరాల సోనీ సంపాదకత్వంలో వెలువడిన ప్రజాకాంక్ష ప్రత్యేక సంచికను అతిథులు ఆవిష్కరించారు. కుసుమ ధర్మన్న సాహిత్య వేదిక రాష్ట్ర నూతన అధ్యక్షునిగా కోలాటి చిన పెద్దిరాజు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో నేలపూరి రత్నాజీ, పేరూరి మురళీకుమార్, గొల్లపల్లి అంబేద్కర్, డా అలుగు ఆనంద్, రచయితలు, సాహితీవేత్తలు, కళాకారులు పాల్గొన్నారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వేళాయె..
ద్వారకాతిరుమల: చిన్నతిరుమలేశునికి జరిగే బ్రహ్మోత్సవాలు ఇలలో ఓ అద్భుతం.. వర్ణనాతీతం. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఈనెల 7 నుంచి 14 వరకు (8 రోజుల పాటు) ద్వారకాతిరుమల దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఈ ఉత్సవాలు శ్రీవారి వైభవాన్ని చాటనున్నాయి. క్షేత్రంలో ప్రతి ఏటా (రెండు సార్లు) వైశాఖ మాసంలో వెలసిన స్వామికి, ఆశ్వయుజ మాసంలో ప్రతిష్ఠ స్వామికి ఈ బ్రహ్మోత్సవాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. వీటితో పాటు నిత్యోత్సవ, వారోత్సవ, మాసోత్సవాలను అట్టహాసంగా జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 7 నుంచి శ్రీవారి వైశాఖమాస బ్రహ్మోత్సవాలను కన్నులపండువగా నిర్వహించనున్నారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో స్వామివారు ఉభయ దేవేరులతో కలసి ఉదయం, సాయంత్రం వేళల్లో పలు వాహనాలపై తిరువీధుల్లో విహరించనున్నారు. అలాగే ఆలయ ముఖ మండపంలో రోజుకో విశేష అలంకారంలో శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదికపై ఉదయం నుంచి రాత్రి వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఉత్సవాలు జరిగేదిలా.. ● ఈనెల 7న ఉదయం శ్రీవారిని పెండ్లికుమారునిగా, అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా చేసి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి గజ వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. ● 8న రాత్రి 7 గంటల నుంచి అంకురార్పణ, రుత్విగ్వరణ అనంతరం బ్రహ్మోత్సవాల వీక్షణకు సర్వాది దేవతలను ఆహ్వానించే క్రమంలో ధ్వజారోహణను నిర్వహిస్తారు. రాత్రి 9 గంటల నుంచి హంస వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. ● 9న ఉదయం 7 గంటల నుంచి సూర్యప్రభ, రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనాలపై గ్రామోత్సవాలు జరుగుతాయి. ● 10న ఉదయం 7 గంటల నుంచి హనుమద్వాహనంపై గ్రామోత్సవం, రాత్రి 7 గంటల నుంచి ఎదుర్కోలు ఉత్సవం, రాత్రి 8.30 గంటల నుంచి వెండి శేష వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. ● 11న రాత్రి 8 గంటల నుంచి శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం, అదే రోజు ఉదయం 7 గంటల నుంచి సింహ వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. ● 12న రాత్రి 8 గంటల నుంచి క్షేత్ర పురవీధుల్లో రథోత్సవం జరుగుతుంది. ● 13న ఉదయం 10.30 గంటల నుంచి చక్రవారి–అపభృధోత్సవము, మధ్యాహ్నం 3 గంటల నుంచి వేద సభ, రాత్రి 8 గంటల నుంచి పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజావరోహణ, రాత్రి 9 గంటల నుంచి అశ్వ వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. ● 14న ఉదయం 9 గంటల నుంచి చూర్ణోత్సవం, వసంతోత్సవ వేడుకలు జరుగుతాయి. అలాగే రాత్రి 7 గంటల నుంచి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగము – పవళింపు సేవ కార్యక్రమాలతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి. దాదాపుగా పూర్తయిన ఏర్పాట్లుబ్రహ్మోత్సవాలకు సమయం దగ్గర పడటంతో స్వామివారి వాహనాలను సిబ్బంది ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు నిర్మించారు. అలాగే ఆలయ రాజగోపురాలు, పరిసరాలకు విద్యుద్దీప అలంకారాలు చేశారు. దాంతో ఉత్సవ ఏర్పాట్లకు సంబంధించిన పనులు దాదాపుగా పూర్తయ్యాయి. రేపటి నుంచి ద్వారకాతిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు 11న రాత్రి తిరుకల్యాణం, 12న రాత్రి రథోత్సవం రోజుకో ప్రత్యేక అలంకారంలో దర్శనమివ్వనున్న శ్రీవారు ఉత్సవాలు ముగిసే వరకు ఆర్జిత సేవలు రద్దు ప్రత్యేక అలంకారాలు ఇలా.. ఈనెల 7న శ్రీ మహావిష్ణువు 8న మత్స్యావతారం 9న శ్రీరామ 10న మురళీకృష్ణ 11న మోహిని 12న రాజమన్నార్ 13న కాళీయమర్థనం 14న శయన మహావిష్ణువు భక్తులు తరలిరావాలి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉత్సవాల్లో పాల్గొనే సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తాం. 8 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలి. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 7 నుంచి 14 వరకు ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నాం. భక్తులు గమనించాలి. – ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి, శ్రీవారి దేవస్థానం ఈఓ -
మల్లఖాంబ్ జాతీయ పోటీలకు భీమవరం క్రీడాకారులు
భీమవరం: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మల్లఖాంబ్ పోటీలకు భీమవరం పట్టణానికి చెందిన క్రీడాకారులు 9 మంది ఎంపికయ్యారని ఎస్సీహెచ్బీఆర్ఎమ్ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు జీపీసీ శేఖర్రాజు చెప్పారు. బీహార్ రాష్ట్రం బుద్ధగయలో జరిగే పోటీలకు రాష్ట్ర జట్టులో 12 మంది పాల్గొంటుండగా భీమవరం పట్టణానికి చెందిన పి.రోహిత్కుమార్, ఆర్.మనీషా, ఎ.భువనచంద్రిక, వైష్ణవి, బి.కీర్తి, జి.దివ్యజ్యోతి, ఎం.ఆదిత్యవెంకటదుర్గ, డి.ప్రసాద్, పి.గోపీకృష్ణ ఉన్నారని తెలిపారు. మల్లఖాంబ్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను శేఖర్రాజు, పీఈటీ ఎం.లక్ష్మి అభినంధించారు. మోటార్సైకిల్ చోరీపై కేసు నమోదు భీమవరం: మోటార్సైకిల్ చోరీపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్సై రెహమాన్ తెలిపారు. పట్టణంలోని ఏఎస్ఆర్ నగర్లో పి జ్యోతి తన ఇంటి వద్ద ఆదివారం రాత్రి బండి పార్కింగ్ చేయగా సోమవారం తెల్లవారేసరికి కన్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ముద్దాడ పాలకొల్లు సెంట్రల్: జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పాలకొల్లుకు చెందిన ముద్దాడ గణేష్ భవానీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకూ నియోజకవర్గ, డివిజన్, జిల్లాకు అధ్యక్షుడిగా, రాష్ట్ర పదవుల్లో ప్రధాన కార్యదర్శి, ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి, ప్రచార కమిటీ చైర్మన్, వర్కింగ్ అధ్యక్షుడిగా పనిచేశానన్నారు. ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా సంఘం మరింత అభివృద్ధి చెందడానికి తనవంతు కృషి చేస్తానని గణేష్ భవానీ చెప్పారు. గణేష్ నియామకం పట్ల రాష్ట్ర బీసీ నాయకులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. -
ధాన్యం దళారుల పాలయ్యేలా ఉంది
తణుకు అర్బన్: గోనె సంచులు లేక రైతులు ధాన్యా న్ని రోడ్లపైనే ఉంచాల్సిన పరిస్థితి దాపురించిందని, ధాన్యం దళారుల పాలయ్యేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. మండలంలోని దువ్వ గ్రామంలో ఆదివారం జాతీయ రహదారి పక్కనే ఉన్న ధాన్యం రాశులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని చివ రి గింజ వరకు ప్రభుత్వం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే రైతులకు మద్దతుగా రోడ్డెక్కేందుకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పండించిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రానికి తోలుదామంటే ప్రభుత్వం గోనె సంచులు అందించలేదన్నారు. దీంతో రైతులు ధాన్యా న్ని రాశులుగా పోసి టార్పాలిన్లతో కప్పాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ధాన్యం కొనలేమని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పడం రైతుల దౌర్భా గ్యమని కారుమూరి విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రైతులను ఉద్ధరిస్తామని ఎన్నికల ముందు నానా హంగామా చేసిన కూటమి ప్రభుత్వం, నేడు ధాన్యం కొనుగోలు చేయడం లేదని, గోనె సంచులు ఇవ్వకపోవడమేమిటని నిలదీశారు. ఇప్పటికే దళారులు ప్రవేశించి భారీగా ధర తగ్గించి కొనుగోలు చేసే కుట్ర జరుగుతోందన్నారు. ధాన్యాన్ని తడవకుండా కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే గాని, వ్యవసాయ శాఖాధికారులు గాని స్పందించకపోవడం శోచనీయమన్నారు. దువ్వలో తడిసిన ధాన్యం పరిశీలించి రైతులతో మాట్లాడిన కారుమూరి -
నీట్ పరీక్షలకు 97.5 శాతం హాజరు
తాడేపల్లిగూడెం : జిల్లాలో నీట్–యూజీ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. తాడేపల్లిగూడెంలోని రెండు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సీహెచ్ నాగరాణి తనిఖీ చేశారు. 97.5 శాతం విద్యార్థులు హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు. ఏపీ నిట్ కేంద్రంలో 1,128 మందికి 1,108 మంది, శశి ఇంజనీరింగ్ కళాశాలలో 758 మందికి 739 మంది హాజరయ్యారన్నారు. పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు. ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పర్యవేక్షించారు. కలెక్టర్ వెంట డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణరెడ్డి, ఆర్డీఓ కతీబ్ ఖౌసర్ భానో, పరీక్షల కో–ఆర్డినేటర్ ఎన్.జయరామ్ ఉన్నారు. ఏలూరులో ప్రశాంతంగా.. ఏలూరు (ఆర్ఆర్పేట) : జిల్లాలోని ఐదు కేంద్రాల్లో నీట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. కేంద్రాల్లోకి విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచి అనుమతించారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కేంద్రాల్లోకి పంపించారు. మొత్తం 1,200 మంది విద్యార్థులకు 1,162 మంది హాజరయ్యా రు. ఏలూరు కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 240 మందికి 232 మంది, కస్తూరిబా నగరపాలక బాలికల ఉన్నత పాఠశాల కేంద్రంలో 360 మందికి 347 మంది, ఆర్ఆర్పేట సుబ్బమ్మదేవి హైస్కూల్ కేంద్రంలో 240 మందికి 234 మంది, గోపన్నపాలెం కేంద్రీయ విద్యాలయ కేంద్రంలో 240 మందికి 235 మంది, గోపన్నపాలెం హైస్కూల్ కేంద్రంలో 120 మందికి 114 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫిజిక్స్ ప్రశ్నలు క్లిష్టంగా, బయోలజీ సులువుగా, కెమిస్ట్రీ ప్రశ్నలు మోస్తరుగా ఉన్నట్టు విద్యార్థులు అన్నారు. -
తడిసిన ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
పెనుగొండ: అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం కురిసిన వర్షం కారణంగా తడిసిన ధాన్యం రాశులను, బస్తాలను ఆచంట, పెనుగొండ మండలం ములపర్రులో ఆయన పర్యటించి పరిశీలించారు. తడిసిన ధా న్యాన్ని వేరే రైసు మిల్లులకు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. అలాగే గోనె సంచులు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సంబంధిత అధికారులు రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఆర్డీఓ దాసి రాజు, తహసీల్దార్ కనకరాజు, ఏఓలు పి.స్పందన, బి.నాగరాజు, వీఆర్వో సీతారామ్, కోట వెంకటేశ్వరరావు ఆయన వెంట ఉన్నారు. జాయింట్ కలెక్టర్ రాహుల్కుమార్ రెడ్డి -
వర్షం ధాటికి కూలిన ఇంటి శ్లాబు
తణుకు అర్బన్: అకాల వర్షానికి ఇంటి శ్లాబు కూలిపోయిన ఘటన మండలంలోని వేల్పూ రులో చోటు చేసుకుంది. గ్రామంలోని చింతలదొడ్డిలో ఆదివారం ఉదయం వర్షం వస్తున్న సమయంలో అకస్మాత్తుగా రెండు పోర్షన్ల డా బా ముందు భాగం శ్లాబు కూలిపోవడంతో స న్సైడ్, మెట్ల ల్యాండింగ్ నేలకొరిగాయి. ఒక పోర్షన్లో నివసించే తాళ్ల స్వామి కుటుంబం ఊరు వెళ్లగా, మరో పోర్షన్లో ఉండే తాళ్ల కోటమ్మ పక్కింటికి వెళ్లింది. దీంతో ఎలాంటి ప్రా ణనష్టం వాటిల్లలేదు. శ్లాబుతో పాటు ముందు భాగం ఽపూర్తిగా ధ్వంసమైంది. రెవెన్యూ అధికారులు వచ్చి వివరాలు సేకరించారు. ఇంటిని సీపీఎం గ్రామ కార్యదర్శి బళ్ల చినవీరభద్రరా వు, శాఖ కార్యదర్శి వాసా వెంకటేశ్వరరావు, నాయకులు తాడిశెట్టి కోటివెంకటేశ్వరరావు, గణేష్, తిప్పా శివ పరిశీలించారు. బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులు రోజువారీ కూలీ చేసుకుని జీవించే పేదలని, వారికి న్యాయం చేయాలని కోరారు. విద్యుత్ అధికారులకు పదోన్నతులు, బదిలీలు ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్లో పలువురు అధికారులకు పదోన్నతులు, బదిలీలు చేస్తూ సంస్థ సీఎండీ పృధ్వీతేజ్ ఇమ్మడి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరులో టెక్నికల్/ఎంఆర్టీ విభాగంలో ఏఈఈగా పనిచేస్తున్న ఎన్.ఉషారాణికి డిప్యూటీ ఈఈగా పదోన్నతి కల్పించి ఆమెను ఏలూరులోనే ఎల్టీఎం అండ్ ఎస్పీఎం విభాగానికి బదిలీ చేశారు. ఏలూరు ఎల్టీఎం అండ్ ఎస్పీఎం విభాగంలో డిప్యూ టీ ఈఈగా పనిచేస్తున్న కె.రమేష్ను జీలుగుమిల్లి ఆపరేషన్ డిప్యూటీ ఈఈగా బదిలీ చేశారు. జీలుగుమిల్లి ఆపరేషన్ డిప్యూటీ ఈఈ గా పనిచేస్తున్న ఎన్.పద్మినిని అనకాపల్లి ప్రొటెక్షన్ విభాగానికి బదిలీ చేశారు. నేడు పీజీఆర్ఎస్ భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. అలాగే డివిజన్, మండల స్థాయిల్లో కూడా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. పాఠ్య పుస్తకాల సరఫరాతాడేపల్లిగూడెం (టీఓసీ): ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 48 మండల కేంద్రాలకుగాను 41 మండలాలకు ఫస్ట్ స్పెల్ పాఠ్యపుస్తకాల పంపిణీ జరిగినట్టు తాడేపల్లిగూడెం జిల్లా పాఠ్య పుస్తక విక్రయ కార్యాలయం మేనేజర్ భాస్కరరావు తెలిపారు. మొదటి సెమిస్టర్కు 12,44,861 పుస్తకాలు అవసరం కాగా 9,31,957 పుస్తకాలు వచ్చాయన్నారు. వీటిలో ఇప్పటివరకు 6,44,126 పుస్తకాలను ఆయా మండలాలకు తరలించామన్నారు. రెండో రోజుల్లో ఏలూరు, లింగపాలెం, కుక్కునూరు, ఏలూరుపాడు, ని డదవోలు, దెందులూరు, భీమడోలు మండలాలకు పుస్తకాలు సరఫరా చేస్తామన్నారు. 9, 10 తరగతుల హిందీ సిలబస్ మారడంతో కొత్త పుస్తకాలు వచ్చాయన్నారు. డీఈఓ నారాయణ ఆదివారం పాఠ్య పుస్తక విక్రయ కార్యాలయాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల కట్టడి ఆగిరిపల్లి : గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు, చోరీలను అరికట్టవచ్చని డీఎస్పీ కేఎన్వీ ప్రసాద్ అన్నారు. స్థాని క పోలీస్స్టేషన్లో ఆదివారం వ్యాపారస్తులకు సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. డీఎస్పీ మాట్లాడుతూ జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. వ్యాపారులు తమ దుకాణాల ముందు తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దుకాణాల ముందు వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలపకుండా, ట్రాఫిక్కు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. ఎస్సై శుభశేఖర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అకాల కష్టం.. అపార నష్టం
భీమవరం: జిల్లాలో ఆదివారం వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. పిడుగులు, ఉరుములతో భయపెట్టడంతో కళ్లాల్లోని పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. పలు చోట్ల చేలల్లోనే ధాన్యం రాశులు ఉండటంతో బరకాలు కప్పినా బస్తాలు తడిచిపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు వాహన రాకపోకలు స్తంభించాయి. 60 వేల ఎకరాల్లో పంట చేలలోనే.. జిల్లాలో దాళ్వా సీజన్లో దాదాపు 2.20 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయగా ఇప్పటివరకు సుమారు 1.60 లక్షల ఎకరాల్లో పంట మాసూళ్లు చేశారు. జిల్లావ్యాప్తంగా 9.20 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుదని అధికారులు అంచనా వేయగా వాతావరణం అనుకూలించడంతో ధాన్యం దిగు బడి 10 లక్షల టన్నులకు పైగా ఉంటుందని రైతు లు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం 6 లక్షల ట న్నుల ధాన్యం కొనుగోలుకు అనుమతి ఇవ్వడంతో ఇప్పటివరకు కేవలం సుమారు 4.40 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. దీనితో ఇంకా దాదాపు 5.50 లక్షల టన్నుల ధాన్యం రైతుల వద్దనే ఉంది. సంచులు లేకపోవడం, తేమ శాతం పేరుతో మిల్లర్లు ధాన్యం సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం కళ్లాలోనే మిగిలిపోయి భారీ వర్షానికి తడిచి రైతులు నష్టపోతున్నారు. ధాన్యం పట్టుబడికి మరో 30 లక్షల సంచులు సరఫరా చేయాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించినా ఇప్పటికీ స్పందన లేదు. పంట కోసం పాట్లు ధాన్యం పట్టుబడులు లేకపోవడంతో ఎక్కడి ధాన్యం అక్కడే కళ్లాలు, రోడ్లు వెంబడి రాశులు చేసి రైతులు బరకాలు కప్పి కాపాడుకుంటున్నారు. పల్లపు ప్రాంతాల్లోని ధాన్యాన్ని గట్టుకు తెచ్చుకోవడం, మైకా బరకాలు కప్పి తడవకుండా కాపాడుకోడానికి ఇబ్బందులు పడుతున్నారు. దిగుబడులు బాగున్నా పంటను అమ్ముకోలేకపోతున్నామనే ఆవేదనలో రైతులు ఉన్నారు. ఏకాధాటిగా.. కుండపోతగా.. ఆకాశం మేఘావృతమే ఉద యం 8 గంటల సమయంలో ఏకధాటిగా వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, పిడుగులు, భీకర గాలులతో కుండపోత వర్షం పడింది. పలు ప్రాంతాల్లో దాదాపు 3 గంటలకు పైగా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. భీమవరంలోని నర్సయ్య అగ్రహారంలో చెట్టుకూలడంతో ఆటో ధ్వంసమైంది. పలు ప్రాంతాల్లో డ్రెయిన్లు పొంగిపొర్లాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, తీగలపై చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ స్తంభాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. నరసాపురం : జలమయమైన రోడ్డు జడిపించిన వాన జిల్లాలో గాలివాన బీభత్సం నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు లోతట్టు ప్రాంతాలు జలమయం పంటను కాపాడుకునేందుకు రైతుల పాట్లు 60 వేల ఎకరాల్లో పంట చేలల్లోనే.. రైతుల వద్దే 5.50 లక్షల టన్నుల ధాన్యం -
ధాన్యం మొత్తం కొనాల్సిందే
ఉంగుటూరు: ధాన్యం మొత్తం కొనుగోలు చేయండి.. లారీల్లో లోడు చేసిన ధాన్యం మిల్లులకు పంపండి.. ధాన్యం కొనుగోలు లక్ష్యాలు పెంచండి.. గోనె సంచులు ఇవ్వండి అంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో బొమ్మిడి సొసైటీ వద్ద ఆదివారం రైతులు, కౌలు రైతులు ఆదివారం ధర్నాకు దిగారు. లారీల్లో లోడు చేసిన ధాన్యం మూడు రోజులుగా మిల్లులకు తరలించకపోవడంపై ఆగ్ర హం వ్యక్తం చేస్తూ లారీల వద్ద బైఠాయించారు. రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ టార్గెట్ల పేరుతో ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడం అన్యాయమన్నారు. ఏలూరు జిల్లాలో 4 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా 2.20 లక్షల టన్నుల ఉమాత్రమే కొనుగోలు చేస్తా మని ప్రభుత్వం అనడం దారుణమన్నారు. ప్రతి గింజా కొంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బొమ్మిడిలో నిలిచిపోయిన 10 లారీల ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని కోరారు. మండల నాయకులు దూడే కేశవ, వానపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ అకాల వర్షాలకు ధాన్యం తడిచిపోయి కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు ఊడిమూడి దానియేలు, మరుకుర్తి ధనంజయరావు, లంక వెంకటేశ్వరరావు, నక్కా సత్యనారాయణ, సాధనాలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మల్కాపురంలో గళమెత్తి.. దెందులూరు: ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ ఏలూరు రూరల్ మండలం మల్కాపురంలో రైతు సేవా కేంద్రం వద్ద రైతులు ధర్నాకు దిగా రు. ముందుగా బరకాలు కప్పి ఉన్న ధాన్యాన్ని పరిశీలించి, బరకాలపై పడిన వర్షం నీళ్లను తోడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక్క మల్కాపురం రైతు సేవా కేంద్రం పరిధిలో 1,500 టన్నుల ధాన్యం కళ్లాల్లో ఉండిపోయిందన్నారు. ధాన్యం కొనలేం.. అంటూ ప్రభుత్వం చేతులెత్తేయడం దారుణమని విమర్శించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ని బంధనలు సడలించాలని కోరారు. మల్కాపురం పరిధిలో 700 టన్నుల కొనుగోలుకు టార్గెట్ ఇచ్చినట్టు రైతు సేవా కేంద్రం అసిస్టెంట్ చెప్పడంతో రైతులు ధర్నాను విరమించారు. రైతులు ఆదాడ శ్రీనివాసరావు, లంకా వెంకటరమణ, గొర్రెల రొయ్యా రావు, గుర్రాల శోభన్బాబు, కండిబోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు. ధర్నాలకు దిగిన అన్నదాతలు -
బాలికకు ఆర్థిక సాయం
కొయ్యలగూడెం: కొయ్యలగూడెంకు చెందిన కంచర్ల జ్యోత్స్నకు వైద్య చికిత్స నిమిత్తం రూ.30 వేలు ఉడుత స్వచ్ఛంద సంస్థ అందజేసిందని పాప తండ్రి కంచర్ల రాజేష్ ఆదివారం తెలిపారు. సాక్షిలో ఏప్రిల్ 29న ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు శీర్షికకు స్పందించిన హైదరాబాద్కు చెందిన ఉడుత స్వచ్ఛంద సంస్థ సహకారం అందించిందన్నారు. సుమారు పన్నెండు లక్షల రూపాయల వరకు వైద్య చికిత్సకు ఖర్చు అవుతుందని వైద్యులు అనడంతో దాతలపై ఆధారపడి ఉన్నామని రాజేష్ తెలిపారు. ఆటో డ్రైవర్పై దాడి కేసు నమోదు భీమవరం: భీమవరం టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి ఆటో డ్రైవర్ను కొట్టడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రెహమాన్ ఆదివారం చెప్పారు. పట్టణంలోని రాజులవీధికి చెందిన కాసాని సత్యనారాయణ ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. టౌన్ రైల్వేస్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి పట్టణంలోని లాడ్జిలో దిగడానికి ఆటో మాట్లాడుకున్నాడు. మూడు లాడ్జిలు తిరిగిన తరువాత ఆటో దిగిపోవడంతో డబ్బులు అడగగా రూ.150 ఇచ్చాడు. మరో రూ. 50 ఇవ్వాలని సత్యనారాయణ అడగడంతో ఆతనిపై దాడిచేసి గాయపర్చి వెళ్లిపోయాడు. బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రెహమాన్ చెప్పారు. పేరిచర్లకు లయన్స్ ఇంటర్నేషనల్ అవార్డు తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్స్ అడ్మినిస్ట్రేటర్ పేరిచర్ల మురళీ కృష్ణంరాజు లయన్స్ ఇంటర్నేషనల్ స్పెషల్ అప్రిసియేషన్ అవార్డు అందుకున్నారు. పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో క్లబ్ ఉప గవర్నర్ విజయ్కుమార్ రాజు పర్యవేక్షణలో ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, రాజకుమారిలు అవార్డు అందజేశారు. లయన్స్ క్లబ్ డైమండ్స్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని పలువురు కొనియాడారు. ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి ఏలూరు (టూటౌన్): గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ డిమాండ్ చేశారు. అదివారం స్థానిక అన్నే వెంకటేశ్వరరావు భవనంలో మే 20న ఉపాధి పనులు బంద్ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ముద్రించిన కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 11 కాసుల బంగారం చోరీ ఉండి: గ్రామంలోని శేషాద్రి మధుసూధనరావు చెందిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు ఆదివారం తెల్లవారుజామున దోపిడీకి పాల్పడ్డారు. చోరీలో 11 కాసుల బంగారం, రూ.35 వేల నగదు దోచుకుపోయారు. ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేరుపాలెం బీచ్లో యువకుడి గల్లంతు
యలమంచిలి: మండలంలోని అబ్బిరాజుపాలెం గ్రామానికి చెందిన వలవల పవన్కుమార్ (21) పేరుపాలెం వద్ద సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం భీమవరంలో హాస్టల్లో ఉంటూ డీఎన్నార్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో భీమవరం నుంచి ఎనిమిది మంది స్నేహితులు కలసి పేరుపాలెం బీచ్కు వెళ్లాడు. తెల్లవారుజామునే సముద్రం వద్దకు వెళ్లి స్నానానికి లోనికి వెళ్లారు. లోపలకు వెళ్లడంతో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. స్థానికులు చూసి తాడు సహాయంతో ఇద్దరిని రక్షించారు. పవన్కుమార్ గల్లంతయ్యాడు. పవన్కుమార్ గల్లంతుతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. వలవల రాముడు, రామ తులసి దంపతులకు ఇద్దరు కుమారులు. ఆస్తి లేకపోయిన ఇద్దరు కుమారులను కష్టపడి ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతి చాలా బాధాకరమని అబ్బిరాజుపాలెం సర్పంచ్ కామిశెట్టి సాయిబాబు చెప్పారు. -
● బొండం కొట్టండి ప్లీజ్!
నాకో కొబ్బరి బొండం కొట్టండి.. అంటూ భక్తులు ట్రాక్టర్ వద్ద ఎగబడ్డారు. చింతలపూడికి చెందిన జల్లిపల్లి రామకృష్ణ, సులోచన దంపతులు వారి పెళ్లిరోజు సందర్భంగా ఆదివారం భక్తుల కోసం 1,600 కొబ్బరి బొండాలు ట్రాక్టర్లో తీసుకొచ్చారు. వాటిని ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదిక వద్ద భక్తులకు పంపిణీ చేశారు. కొబ్బరి బొండాలు కొట్టివ్వడం ప్రహసనంగా మారింది. ఈ క్రమంలోనే బొండాలు అందుకున్న భక్తులు నాకో బొండం కొట్టివ్వండి అంటూ ట్రాక్టర్ వద్ద ఎగబడ్డారు. –ద్వారకాతిరుమల -
రాట్నాలమ్మకు ప్రత్యేక పూజలు
పెదవేగి: పెదవేగి మండలం రాట్నాలకుంటలో రాట్నాలమ్మను ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వారం పూజా టిక్కెట్లపై రూ.48,000, లడ్డూ ప్రసాదంపై రూ 23,250 ఆదాయం లభించిందని ఈవో చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ కై కలూరు: సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కొల్లేటికోట పెద్దింట్లమ్మను అమ్మను ఆదివారం దర్శించుకున్నారు. కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మవారికి వేడి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్క రోజు ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూల అమ్మకం, గదుల అద్దెలు, అమ్మవారి ఫొటోల ద్వారా మొత్తం రూ.61,105 ఆదాయం వచ్చిందని తెలిపారు. గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు బుట్టాయగూడెం: మండలంలోని కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువైన గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 8 గంటల సమయంలో భారీ వర్షం కురవడంతో మంగమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు తడిసి ముద్దయ్యారు. యోగా చాంపియన్కు సత్కారం తాడేపల్లిగూడెం (టీఓసీ): రెండో ఆసియా యోగాసన చాంపియన్షిప్ పోటీలలో ఇటీవల బంగారు పతకం సాధించిన భీమవరానికి చెందిన బాలం శిరీషను ఆదివారం తాడేపల్లిగూడెం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో ఆరా పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, నేషనల్ యోగాసన కోచ్ కరిబండి రామకృష్ణ, యోగా సభ్యులు ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ బాలం శిరీష కఠోరమైన దీక్షతో బంగారు పతకం సాధించడం పలువురికి ఆదర్శప్రాయం అన్నారు. జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి రామాంజనేయులు, గ్రంధి ప్రసాద్, యోగా సభ్యులు, మహిళా సభ్యులు తదితరులు శిరీషను శాలువలతో సత్కరించారు. -
శ్రీవారి క్షేత్రంపై గాలివాన ఎఫెక్ట్
ద్వారకాతిరుమల: ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఈదురు గాలులు, భారీ వర్షం కారణంగా శ్రీవారి ఆలయ ఆవరణలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పాక్షికంగా దెబ్బతింది. ద్వారకాతిరుమల–భీమడోలు ప్రధాన రహదారిలో పలు చోట్ల వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. కుంకుళ్లమ్మ ఆలయ సమీపంలో, గొల్లగూడెం, పంగిడిగూడెం వద్ద రోడ్డుపై నీరు నిలిచింది. వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. ద్వారకాతిరుమలలో వర్షం దాటికి డ్రైనేజీలు పొంగిపొర్లడంతో మురుగు, చెత్తా, చెదారం రోడ్డుపైకి చేరింది. దాంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సొసైటీ పెట్రోల్ బంకు ఎదురుగా, లక్ష్మీపురం నిర్మిత కేంద్రం, దొరసానిపాడు శివారులో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ వైర్లపై పడ్డాయి. దాంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మార్కెట్ యార్డులో కూరగాయల దుకాణాలు గాలులకు అతలాకుతలమయ్యాయి. -
కోడికత్తి తగిలి ముగ్గురికి గాయాలు
నూజివీడు: మండలంలోని దేవరగుంటలో నిర్వహిస్తున్న కోడిపందేలపై దాడి చేసేందుకు పోలీసులు వెళ్లగా కత్తికట్టిన కోడిపుంజులు వదిలి ఒక్కసారిగా అందరూ పరిగెత్తడంతో కోడికత్తులు తగిలి ముగ్గురికి గాయాలయ్యాయి. గ్రామంలో ఆదివారం సాయంత్రం కోడిపందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు రూరల్ పోలీస్స్టేషన్కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు పందేలు ఆపేందుకు సాయంత్రం ఐదు గంటల సమయంలో వెళ్లారు. కోడిపుంజులకు కత్తులు కట్టి పందేం వేసేందుకు బరిలోకి దించుతుండగా పోలీసులు వెళ్లడంతో అక్కడి వాళ్లు పుంజులను వదిలేసి పారిపోతుండగా పుంజులు బెదిరి జనంపైకి పడ్డాయి. దీంతో దేవరగుంటకు చెందిన పల్నాటి ప్రసాద్కు మోకాలి వద్ద, నూజివీడు పట్టణంలోని రామాయమ్మరావుపేటకు చెందిన మాళావతు అశోక్కు చేతిమీద, కానిస్టేబుల్కు కాలుపైన కోడికత్తి తెగింది. ప్రసాద్కు దాదాపు 14కుట్లు పడ్డాయి. అశోక్కు నరం తెగడంతో విజయవాడ రిఫర్ చేశారు. అధికార పార్టీ అండ చూసుకొని గ్రామంలో ప్రతిరోజూ కోడిపందేలు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. కోడిపందేలు నిర్వహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
రైతులకు కూటమి ప్రభుత్వం దగా
భీమవరం: ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని వైఎస్సార్సీపీ జి ల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. దాళ్వా ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని, దళారుల ప్రమేయం అరికట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో జేసీ రాహుల్కుమార్రెడ్డికి వినతిపత్రం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో పంట దిగుబడులు బాగున్నా దళారులు, మిల్లర్ల ప్రమేయంతో రైతులు బస్తాకు రూ.400 వరకు నష్టపోతున్నారన్నారు. సంచుల కొరత, అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల వద్దకు అధికారులు వెళ్లి ధాన్యం కొనుగోలు చేసేవారని ప్రసాదరాజు, కారుమూరి అన్నారు. అయితే ప్రస్తుతం దళారులు, మిల్లర్ల ప్రమేయంతో పట్టుబడులు ముందు కు సాగడం లేదన్నారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెంనాయుడు ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ప్రకటించడంతో రైతుల్లో ఆందోళనలు రేకెత్తించి దళారులు అయినకాడికి దో చుకుంటున్నారని విమర్శించారు. సీఎం చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు రైతుల గో డు పట్టడం లేదని దుయ్యబట్టారు. సంచుల కొరత, తేమశాతం పేరుతో రైతులు దోపిడీకి గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, దీంతో రైతు లు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారన్నారు. తక్షణమే చర్యలు తీసుకోకుంటే రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పోరుబాట పడుతుందని హెచ్చరించారు. మొత్తం ధాన్యం ప్రభుత్వమే కొనాలి జిల్లాలో సుమారు 10 లక్షల టన్నుల ధాన్యాన్ని పూ ర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, తేమ శా తం, ముక్క పేరుతో రైతులను వేధించకుండా చ ర్యలు తీసుకోవాలని, ధాన్యం డబ్బులు వెంటనే చె ల్లించేలా చర్యలు తీసుకోవాలని నాయకులు డి మాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, ఉండి, పాలకొల్లు సమన్వయకర్తలు పీవీఎల్ నర్సింహరాజు, గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి), పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, భీమవరం ఎంపీపీ పేరిచర్ల విజయ నర్సింహరాజు, నాయకులు బంధన పూర్ణచంద్రరావు, గాదిరాజు రామరాజు, చవాకులు సత్యనారాయణ, జల్లా కొండయ్య, చిగురుపాటి సందీప్, కోడే యుగంధర్, ఇంటి సత్యనారాయణ, గుంటి ప్రభు, పెనుమాల నర్సింహస్వామి, రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయం రైతుల ఇబ్బందులు జేసీకి వివరించిన వైఎస్సార్సీపీ నేతలు -
పేదల ఇళ్ల తొలగింపు అన్యాయం
పాలకోడేరు: ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్ల్లను అన్యాయంగా తొలగిస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మండిపడ్డారు. అభివృద్ధికి వైఎస్సార్సీపీ అడ్డు కాదని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు మానుకోవాలని అన్నారు. మండలంలోని గొల్లలకోడేరులో ఇటీవల తొలగించిన వ్యాపార సముదాయాల ప్రాంతాన్ని వైఎస్సార్ సీపీ నాయకుల బృందం శనివారం పరిశీలించింది. అనంతరం పార్టీ నేత చేకూరి రాజా నరేంద్రరాజు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ముదునూరి మాట్లాడుతూ కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు తొలగించడంపై పేదలు ఆవేదన చెందుతున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో లక్షలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి ఇళ్లు ఇచ్చారని ప్రశ్నించారు. ఇళ్లు తొలగించిన బాధితులకు మూడు సెంట్ల చొప్పున స్థలం ఇచ్చి గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అధికార బలం ఉందని పేదలపై జులుం సరికాదన్నారు. పలు నియోజకవర్గాల్లో సమస్యలు చాలా ఉన్నాయని, పలుచోట్ల ప్రజలు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, డెల్టా ఆధునికీకరణకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేదని విమర్శించారు. ధాన్యానికి గిట్టుబాటు ధర లేదని, ఆక్వా ఫీడ్, సీడ్ ధరలు విపరీతంగా పెరగ్గా నియంత్రించాల్సిన ప్ర భుత్వం పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాడుతుందన్నారు. సూపర్ సిక్స్పై ముఖం చాటేసిన సర్కారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ముఖం చాటేసిందని విమర్శించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్పై బురద చల్లి తిరిగి అదే కొనసాగిస్తున్నారంటే కూటమి నాయకులు అబద్ధాలు చెప్పి ఎలా అధికారం చేపట్టారో అర్థమవుతుందన్నారు. డెల్టా ప్రాంతంలో కాలువలు, డ్రె యిన్లు, రోడ్ల వెంబడి ఆక్రమణలు ఉండటం సహజమని, అయితే ఉండి నియోజకవర్గంలో ఇళ్లు ధ్వంసం సరికాదన్నారు. పేదలకు మూడు సెంట్లు స్థలం ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితికి వచ్చారంటే ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రత్యామ్నాయం చూపకుండా తొలగింపా? ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నరసింహరాజు మాట్లాడుతూ పేదలకు ఎటువంటి సమయం ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు తొలగిస్తున్నారని విమర్శించారు. ఉండి నియోజకవర్గంలో అవసరం లేకపోయినా పేదల ఇళ్లను తొలగిస్తున్నారని అన్నారు. బాధితులకు కూటమి మేనిఫెస్టో ప్రకారం మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. పేదలకు అన్యాయం జరిగితే వారి పక్షాన పోరాడటానికి వైఎస్సార్సీపీ ముందుంటుందన్నారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల గోపి, పేరిచర్ల విజయ్ బాబు యూత్ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, బంధన పూర్ణచంద్రరావు, నాయకులు చేకూరి రాజా నరేంద్ర రాజు, ఆవుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
శవాలు కుళ్లిపోతున్నా పట్టించుకోరా?
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగం ఆధ్వర్యంలో శవ పరీక్ష కేంద్రం(మార్చురీ) పనిచేస్తోంది. నిత్యం జిల్లా పరిధిలో రోడ్డు, రైలు ప్రమాదాల్లో మరణించినవారు, అనుమానాస్పద మృతులు, హత్యలు, ఆత్మహత్యలు, చికిత్స పొందుతూ మృతిచెందిన వారి మృతదేహాల్ని మార్చురీలో భద్రపరుస్తారు. మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగానికి చెందిన వైద్య నిపుణులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగిస్తుంటారు. మార్చురీలోని ఫ్రీజర్ బాక్సులు పనిచేయక బంధువుల మృతదేహాలు పాడవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా సరిగా అంతిమ సంస్కారాలు చేయలేని పరిస్థితి నెలకొందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఐదు ఫ్రీజర్లే దిక్కు ఏలూరు జిల్లా వ్యాప్తంగా రోజూ రెండు, మూడు లేదా ఒక్కోసారి నాలుగైదు మృతదేహాలు జీజీహెచ్లోని మార్చురీకి వస్తాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణించినవారు, గుర్తు తెలియని మృతదేహాలు, రైల్వే డెత్స్ మృతదేహాలు మార్చురీలో రోజుల తరబడి భద్రపరచాల్సిన అవసరం ఉంటుంది. మార్చురీలో కేవలం రెండు పాత ఫ్రీజర్ బాక్సులు, మరో మూడు స్వచ్ఛంద సంస్థకు చెందిన ఫ్రీజర్ బాక్సులు ఏర్పాటు చేసిన అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే.. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన కొత్తలో 12 మృతదేహాలను భద్రపరిచేలా ఫ్రీజర్ బాక్సులు అందుబాటులో ఉంచారు. మొదటి నుంచి ఈ ఫ్రీజర్ బాక్సులు పనిచేయటంలేదు. మరో రెండు పాత ఫ్రీజర్ బాక్సులు పూర్తిగా పాడైపోవటంతో బయో మెడికల్ ఇంజనీర్ విభాగం వాటిని పక్కన పెట్టేసింది. ఫ్రీజర్ బాక్సులు సక్రమంగా పనిచేయటం లేదని ఉన్నతాధికారులకు మొదట్లోనే నివేదించారని మెడికల్ కాలేజీ అధికారులు చెబుతున్నారు. జీజీహెచ్లో పరిష్కారం కాని ఫ్రీజర్ల సమస్యఆవేదనలో మృతుల బంధువులు ఏలూరు జీజీహెచ్లోని మార్చురీలో ప్రస్తుతం మరమ్మతులు చేసిన రెండు పాత ఫ్రీజర్ బాక్సులు, మరో మూడు స్వచ్చంద సంస్థకు చెందిన ఫ్రీజర్ బాక్సులు అందుబాటులో ఉన్నాయని మెడికల్ కాలేజీ అధికారులు చెబుతున్నారు. ఏలూరు జిల్లా పరిధిలో రోజూ మూడు నుంచి నాలుగు మృతదేహాలు మార్చురీకి వస్తాయి. రైల్వే ప్రమాదాల్లో మృతదేహాలకు వారం రోజులకు పైగా పోస్టుమార్టం నిర్వహించే పరిస్థితి ఉండదు. సరాసరి రోజుకు మూడు నుంచి నాలుగు మృతదేహాలు మార్చురీలో భద్రపరుస్తారు. ఒక్కోసారి ఐదారు మృతదేహాలు మార్చురీకి వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2 పాత ఫ్రీజర్ బాక్స్ లు, స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన 3 ఫ్రీజర్ బాక్స్లు మాత్రమే ఉంటే మృతదేహాలను భద్రపర్చడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ఫ్రీజర్ బాక్సులు లేకుంటే బంధువుల మృతదేహాలు పాడై దుర్గంధం వెదజల్లితే వారి కుటుంబ సభ్యులు ఎంత ఆవేదనకు గురవుతారనేది అధికారులకు పట్టదా? అని ప్రశ్నిస్తున్నారు. -
సీహెచ్ఓల సమ్మెకు మద్దతు
భీమవరం: తమ సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (సీహెచ్ఓ) అసోసియేషన్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళనకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భీమవరం కలెక్టరేట్ వద్ద ఆరు రోజులుగా సమ్మె చేస్తున్న సీహెచ్ఓల శిబిరం వద్దకు శనివారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ వెళ్లి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సీహెచ్ఓలకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సమస్యలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వంతో పోరాడి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఉండి, పాలకొల్లు సమన్వయకర్తలు పీవీఎల్ నర్సింహరాజు, గుడాల గోపి, ఎంపీపీ పేరిచర్ల విజయ నర్సింహరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, నాయ కులు తదితరులు పాల్గొన్నారు. -
అంజన్నకు అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో ఆంజనేయస్వామికి శనివారం అభిషేక సేవ నిర్వహించారు. ఆలయ ముఖమండపంపై స్వామి ఉత్సవ మూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. మద్యాహ్నం వరకు వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,41,401 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. స్వామి నిత్యాన్నదాన సత్రంలో అధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులతో పోటెత్తిన శ్రీవారి క్షేత్రం ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ వేసవి సెలవులను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. తూర్పురాజగోపుర ప్రాంతం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణ కట్ట తదితర విభాగాలు భక్తులతో కిక్కిరిసాయి. ఆలయ అనివేటి మండపంలో ఒడుగు వేడుకలు అధిక సంఖ్యలో జరిగాయి. రాత్రి వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు తెలపండి ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను పాఠశాల విద్యా శాఖ ఆర్జేడీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, దీనిపై ఎవరికై నా అభ్యంతరాలున్నా తెలపాలని పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జీ.నాగమణి ఒక ప్రకటనలో కోరారు. ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టీఐఎస్) ఆధారంగా రూపొందించి గత ఏప్రిల్ 22వ తేదీ వరకూ అభ్యంతరాలకు గడువు ఇచ్చామని, అనంతరం తమకు అందిన అభ్యంతరాల ప్రకారం జాబితాను తయారు చేసి ఆర్జేడీ కాకినాడ వెబ్సైట్లో, ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణ జిల్లా విద్యాశాఖల వెబ్సైట్లో, నోటీస్ బోర్డుల్లో అందుబాటులో ఉంచామన్నారు. -
సంక్షోభంలో మామిడి పరిశ్రమ
చింతలపూడి: మామిడి పరిశ్రమ ఈ సంవత్సరం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అకాల వర్షాలు, వడగళ్లు, మంగుతెగులు వంటి అనేక కారణాలతో మామిడి దిగుబడి తగ్గింది. మామిడి ఎగుమతుల్లో ఏలూరు జిల్లాలో నూజివీడు తరువాత స్థానం చింతలపూడిదే.. ఈ ప్రాంతంలో ప్రస్తుతం వ్యాపారం మందగించింది. సీజన్ ప్రారంభమై నెలన్నర కావస్తున్నా ఇంతవరకూ ఆశించిన స్థాయిలో ఎగుమతులు లేవు. కాయ దిగుబడి లేకపోవడం, కోతకు వచ్చిన కొద్దిపాటి కాయ నాణ్యత లోపించడంతో ఎగుమతులు మందగించాయని వ్యాపారులు చెబుతున్నారు. కాయ మంచి సైజుకు ఎదిగే వరకూ చెట్టుమీదే ఆపడానికి రైతులకు ధైర్యం చాలడంలేదు. అకస్మాత్తుగా గాలి దుమ్మో, వడగళ్ల వానో వస్తే మరింత నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇదే సమయానికి రోజుకు 25 లారీల సరుకు ఎగుమతి చేసేవారు. ఈ ఏడాది ఐదు లారీలు కూడ ఎగుమతి చేయలేక పోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. ఇంతవరకు చింతలపూడి ప్రాంతం నుంచి 300 లారీల సరుకు మాత్రమే ఎగుమతి చేసినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో టన్ను రూ.70 వేలు ఉన్న మామిడి ధర ఇటీవల హఠాత్తుగా పడిపోయింది. ప్రస్తుతం టన్ను ధర రూ.20 వేల నుంచి రూ.25 వేలుగా ఉంది. ప్రస్తుత ధర రైతుకు ఏమాత్రం గిట్టుబాటు కాదు. నాలుగేళ్లుగా మార్కెట్లో మామిడి ధరలు చూస్తే 2022లో ప్రారంభంలో టన్ను రూ.లక్షకు అమ్ముడైంది. సీజన్ చివరికి వచ్చేసరికి టన్ను రూ.25 వేలకు పడిపోయింది. 2023లో ప్రారంభంలో టన్ను రూ.80 వేలు అమ్మగా సీజన్ చివరిలో రూ.20 వేలకు చేరింది. 2024లో టన్ను రూ.90 వేలు అమ్మగా సీజన్ చివరిలో టన్ను రూ.30 వేలకు పడిపోయింది. ఇక్కడి నుంచి ముంబయ్, కోల్కతా, నాగపూర్, గుజరాత్, హైదరాబాద్, పూనే, అహ్మదాబాద్, ఢిల్లీ, కాన్పూర్, ఒడిశా వంటి ప్రాంతాలకు వ్యాపారులు మామిడి ఎగుమతి చేస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన మామిడిని రవాణా చేయడం వ్యాపారులకు భారంగా మారింది. ఈ ప్రాంతం నుంచి నాగపూర్ ఎక్కువగా ఎగుమతవుతుంది. విడికాయలు గ్రేడింగ్, ప్యాకింగ్ చేస్తే టన్నుకు రూ.5 వేల వరకూ ఖర్చవుతుందని వ్యాపారులు వాపోతున్నారు. దీంతో పాటు కిరాయి రూ 50,000 అవుతుందంటున్నారు. ఈ దశలో అటు రైతుల్లో, ఇటు వ్యాపారుల్లో ఇకపై మామిడి లాభసాటి కాదన్న అభిప్రాయం నెలకొంది. జిల్లాలో తగ్గిన విస్తీర్ణం జిల్లాలో అన్ని రకాల ఉద్యాన పంటలు కలిపి 1,08,300 హెక్టార్లలో ఉన్నాయి. ఒకప్పుడు జిల్లాలో లక్షలాది ఎకరాల్లో విస్తరించి ఉండే మామిడి తోటలు ప్రస్తుతం 40,000 ఎకరాలకు తగ్గిపోయాయి. అధిక భాగం మామిడి తోటలు తొలగించి రైతులు పామాయిల్ తోటలు వేసుకున్నారు. మామిడి స్థానంలో పామాయిల్ 44 వేల హెక్టారుల్లో ఆక్రమించింది. జిల్లాలో నూజివీడు నియోజకవర్గంతో పాటు చింతలపూడి, ద్వారకా తిరుమల, నల్లజర్ల, టి.నరసాపురం ప్రాంతాల్లో మాత్రమే మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. మామిడి తోటల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులకు ప్రోత్సాహం అందించక పోతే భవిష్యత్తులో మామిడి అంతరించిపోయే ప్రమాదం ఉంది. భారీగా తగ్గిన దిగుబడి గిట్టుబాటు ధర లేక దిగాలు మెట్ట ప్రాంతంలో ఏటా రూ.10 కోట్ల వ్యాపారం మామిడి రైతులను ఆదుకోవాలి ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలి. ఏటా సకాలంలో సరైన వర్షాలు కురవకపోవడం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా దిగుబడులు లేవు. ఏటా మామిడి వల్ల నష్టాలను తట్టుకోలేక నాకున్న 4 ఎకరాల తోటను తొలగించాల్సి వచ్చింది. – చేపూరి ఖాదర్బాబు, రైతు, చింతలపూడి మండలం నష్టం తప్పేలా లేదు ఈ ఏడాది నష్టం వచ్చేలా ఉంది. నాణ్యత లేని కారణంగా ఎగుమతులు మందగించాయి. ధర పెరిగితేనే కాని నష్టాల నుంచి బయటపడడం కష్టం. ప్రారంభంలో టన్ను రూ.70 వేల వరకూ ఉన్న ధర ప్రస్తుతం రూ.20 వేలు అమ్ముతుంది. ప్రస్తుతం ధర ఇలాగే కొనసాగితే రైతులు, వ్యాపారులు నష్టపోవాల్సిందే. – చిక్కాల నాగేశ్వర్రావు, మామిడి కమిషన్ వ్యాపారి, చింతలపూడి -
రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులకు గాయాలు
ద్వారకాతిరుమల: మండలంలోని రాళ్లకుంట సెయింట్ గ్జేవియార్ పాఠశాల వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కధనం ప్రకారం.. రాళ్లకుంటకు చెందిన పరసా జనార్ధన్, సరోజిని దంపతులు ద్వారకాతిరుమలలోని సొసైటీ పెట్రోల్ బంకు సమీపంలో నిమ్మకాయలు, కొబ్బరి కాయలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వ్యాపారం ముగించుకుని సాయంత్రం టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై స్వగ్రామానికి వెళ్తున్నారు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి జి.కొత్తపల్లి నుంచి ద్వారకాతిరుమల వైపుకు వెళుతున్న ఆటోను వీరి వాహనం ఎదురుగా ఢీకొట్టింది. దాంతో జనార్ధన్, సరోజిని దంపతులు రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. 108 ఆంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో స్థానికులు శ్రీవారి దేవస్థానం ఆంబులెన్స్లో పీహెచ్సీకి తరలించారు. ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి తణుకు అర్బన్: వాహనం ఢీకొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన తణుకు పట్టణంలో చోటు చేసుకుంది. 55 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తిని శుక్రవారం తణుకు ఆర్యోబీపై వాహనం ఢీకొట్టింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. -
అమరావతి సభకు వెళ్లొస్తుండగా ప్రమాదం
నరసాపురం రూరల్: మండలంలోని సీతారామపురంలో 216 జాతీయ రహదారిపై శనివా రం వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అమరావతిలో ప్రధాని సభకు వెళ్లి వస్తున్న రాజోలు డిపో బస్సు బ్రేక్ డౌన్ కావడంతో సంఘటనా స్థలంలో నిలిపివేశారు. అదే సభకు వెళ్లి తిరిగి వస్తున్న రాజోలు డిపో మరో బస్సు ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్, సిబ్బందికి గాయాలు కాగా 108లో నరసాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీల్లో నియామకాలు భీమవరం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో నియమిస్తూ కేంద్ర కమిటీ కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర వాణిజ్య విభాగం వైస్ ప్రెసిడెంట్గా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన ఉనికిలి శ్రీను, రాష్ట్ర ఎంప్లాయీస్, పెన్షనర్స్ వింగ్ సెక్రటరీగా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన చామన సూర్యచంద్రరావు నియమితులయ్యారు. వేసవి సెలవులను నిరోధించేలా ప్రొసీడింగ్స్ భీమవరం: రెమిడియల్ తరగతుల పేరుతో ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఉపాధ్యాయుల వేసవి సెలవులను నిరోధించడమేనని ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి శనివారం ప్రకటనలో తెలిపారు. టెన్త్ పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన 18.86 శాతం మంది పిల్లల కోసం సప్లిమెంటరీ పరీక్షలకు ఇప్పటికే చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఫెయిలైన పిల్లల కోసం ఉపాధ్యాయులను మండు వేసవిలో వేధించకుండా ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్ను ఉపసంహరించుకుని, టీచర్లు వేసవి సెలవులు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని గోపిమూర్తి కోరారు. దళిత క్రైస్తవుల ర్యాలీ భీమవరం: ఎస్సీలు చర్చిలకు వెళితే ఎస్సీ హో దాను కోల్పోతారని హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దళిత క్రైస్తవుల ఆధ్వర్యంలో స్థాని క అంబేడ్కర్ సెంటర్ వద్ద శనివారం రాత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధన కమిటీ కన్వీనర్ కోనా జోసెఫ్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం దేశంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా ఏ మతాన్ని అయినా స్వీకరించవచ్చని, హైకో ర్టు తీర్పును పునః పరిశీలించాలని కోరారు. గంటా సుందర్కుమార్, ఈది రవికుమార్, గాతల సందీప్, కమలాకర్, ఈది రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 12న అప్రెంటీస్ మేళా ఉండి: మండలంలోని ఎన్నార్పీ అగ్రహారం ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 12న ప్రధానమంత్రి అప్రెంటీస్ మేళా నిర్వహించన్నుట్టు ఐటీఐ జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ వి.శ్రీనివాసరాజు శనివారం తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2021 నుంచి 2024 మధ్య వివిధ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్ల జెరాక్సులతో హాజరుకావాలని సూచించారు. మున్సిపల్ కార్మికుల సమ్మె నోటీసు ఏలూరు (టూటౌన్): దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 20 నుంచి సమ్మె లోకి వెళుతున్నట్టు ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎ. అప్పరాజు తెలిపారు. శనివారం సమ్మె నోటీసును ఏలూరు అడిషనల్ కమిషనర్ చంద్రయ్యకు అందజేశారు. ఏలూరు కార్పొరేషన్లో ప నిచేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎన్ఎంఆర్ కార్మికుల సర్వీసులను రెగ్యులరైజ్ చే యాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని, సరెండర్ లీవ్ బకాయిలు, డీఏలు, 11వ పీఆర్సీ బకాయిలు తక్షణమే చెల్లించాలని సిబ్బందికి కనీస వేతనం రూ.35 వేలు ఇవ్వాలని కోరారు. -
ట్రిపుల్ ఐటీలో ఉత్తరం కలకలం
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆకాశ రామన్న ఉత్తరంతో కలకలం రేగింది. కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీ, మెంటార్లందరికి ఈ ఉత్తరం శనివారం పోస్టులో వచ్చింది. యూనివర్సిటీ యాజమాన్యం కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీ పట్ల ఒక విధంగా వ్యవహరిస్తూ , పర్మినెంట్ ఉద్యోగులకు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా దోచిపెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. తాము జీతాలు పెంచమని, గతంలో నెట్, సెట్ లేకుండా పీహెచ్డీకి ఇచ్చిన ఇంక్రిమెంట్లను ఇవ్వమని అడిగితే నిబంధనలంటూ అడ్డుపడుతున్న యాజమాన్యం, పర్మినెంట్ అధ్యాపకులకు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్ తేదీలను మూడేళ్లు ముందుకు జరుపుకుంటున్నారని అందులో పేర్కొన్నారు. వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వమని అడిగితే జీవో నెంబరు 110ని బూచిగా చూపిస్తున్నారని, అదే శాశ్వత అధ్యాపకులకు మాత్రం జీవో నెంబరు 14, జీవో నెంబరు 20లో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా పెయిడ్ జర్నల్స్, కాన్ఫరెన్స్ పేపర్లను చూపించి పదోన్నతుల తేదీలు జరిపించుకుంటున్నట్లు లేఖలో వివరించారు. ఇలా పలు ఆరోపణలు చేశారు. లోతైన విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అర్జీయూకేటీ కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీ పేరుతో లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో ఉన్నవన్నీ సత్యాలేనని, పీహెచ్డీ చేసిన మెంటార్లు, కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ.5 వేలు అదనపు ఇంక్రిమెంట్ కొన్నాళ్లు ఇచ్చి జీవో నెంబరు 110ను సాకుగా చూపించి ఆపేశారని, దీనివల్ల ఎంతో నష్టపోయామని వాపోతున్నారు. -
సీజనిల్ సేల్స్
ఎన్నో ఏళ్లుగా హోమ్నీడ్స్ వ్యాపారం చేస్తున్నాను. ఏటా సమ్మర్ సీజన్లో 150 వరకు ఏసీ యూనిట్లు అమ్మేవాళ్లం. ఈ ఏడాది సరిగా అమ్మకాలు జరగడం లేదు. అప్పుడే రెండు నెలలు గడిచిపోయినా ఇంకా 25 యూనిట్లు కూడా అమ్మలేదు. ఫ్రిజ్లు, కూలర్ల సేల్స్ కూడా పడిపోయాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. ఇదీ భీమవరానికి చెందిన ఓ వ్యాపారి ఆవేదన. సాక్షి, భీమవరం: వేసవి వస్తుందంటే వినియోగదారులతో కిటకిటలాడుతూ కనిపించే ఏసీ, ప్రిజ్, కూలర్లు తదితర హోమ్నీడ్స్ షాపులు ఈ సమ్మర్ సీజన్లో వెలవెలబోతున్నాయి. సమ్మర్ సేల్లో రెండు నెలలు గడిచిపోగా 50 శాతం కూడా అమ్మకాలు జరగలేదని వ్యాపార వర్గాలంటున్నాయి. జనం దగ్గర డబ్బులు లేకపోవడం, విద్యుత్ చార్జీలు పెరిగిపోవడం సేల్స్ పడిపోవడానికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో 60 వరకు షాపులు : జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో స్థానిక వ్యాపారులకు చెందిన ఎలక్ట్రికల్ హోమ్నీడ్స్ దుకాణాలు 60 వరకు ఉన్నాయి. సోనోవిజన్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ తదితర ప్రముఖ కంపెనీలకు చెందిన బ్రాంచీలు, కార్పొరేట్ షోరూమ్లు 25 వరకు ఉంటాయి. ఆయా సంస్థలు, ఈ–కామర్స్లో సమ్మర్ సేల్స్ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మార్చి నుంచే మొదలు ఎండల తీవ్రత పెరగడం వలన ఏసీలు, ఫ్రిజ్లు, కూలర్లు, ఇన్వెర్టర్ల సమ్మర్ సేల్స్ మార్చి నుంచే మొదలవుతాయి. మున్ముందు మరింత పెరిగే ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం ఆయా గృహోపకరణాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తారు. కొత్తగా కొనేవారు కొందరైతే, ఎక్ఛేంజీ ఆఫర్లో పాత వాటిని ఇచ్చేసి కొత్త వస్తువులను తీసుకునే వారు మరి కొందరు. ఆన్లైన్తో పాటు షాపుల్లోనూ ఈఎంఐల పద్ధతిలో ఫైనాన్స్ సదుపాయం ఉండటంతో పేద, మధ్య తరగతి వర్గాల వారు నెలనెలా వాయిదాలు కట్టుకోవచ్చన్న భావనలో ఏసీలు, ఫ్రిజ్ల కొనుగోలుకు ప్రాధాన్యమిస్తున్నారు. సమ్మర్ సీజన్లో జిల్లావ్యాప్తంగా నెలకు 8,000 నుంచి 10,000 ఏసీలు, 3,000 వరకు ఫ్రిజ్లు, 5,000 వరకు కూలర్లు, 4,000 వరకు ఇన్వెర్టర్లు అమ్ముడవుతుంటాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఎన్నికల ప్రభావం వలన గతేడాది అనుకున్నదాని కంటే దాదాపు రెట్టింపు అమ్మకాలు జరిగినట్టు తణుకుకు చెందిన ఓ వ్యాపారి తెలిపారు. సమ్మర్ సీజన్ కోసం మార్చికి ముందే వ్యాపారులు స్టాకులు పెట్టుకున్నారు. చుక్కలు చూపిస్తున్న విద్యుత్ చార్జీలు కూటమి పాలనలో విద్యుత్ చార్జీలు సామాన్యు లకు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణ వినియోగమే అయినా గతంతో పోలిస్తే రెట్టింపు బిల్లులు వస్తున్నాయని వినియోగదారులు వాపో తున్నారు. అప్పు చేసి ఏసీ కొందామన్న విద్యుత్ చార్జీలు మరింత పెరిగిపోతాయని, వీటిని సాకుగా చూపించి ప్రభుత్వం భవిష్యత్లో తమకు సంక్షేమ పథకాలు రాకుండా చేస్తుందన్న భయంతో పేద, మధ్యతరగతి వర్గాలు వెనుకడుగేస్తున్నాయి. దీంతో వినియోగదారులు లేక షాపులు వెలవెలబోతున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో సగం అమ్మకాలు కూడా జరగలేదని వ్యాపారులు అంటున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నా అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయని, గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి చూడలేదని చెబుతున్నారు. షాపులు వెలవెల కొద్దినెలలుగా మార్కెట్ డల్ అయిపోవడం సమ్మర్ సేల్స్ పైనా పడింది. గత ప్రభుత్వంలో ప్రతి నెలా పథకాలు పేదవర్గాల తలుపు తట్టేవి. కూటమి పాలనలో సంక్షేమం జాడ లేకుండా పోయింది. పనులు కూడా సరిగా లేకపోవ డం, నిత్యావసరాల ధరలకు రెక్కలు రావడం పేద, మధ్యతరగతి వర్గాల జీవన ప్రమాణాలను దుర్భరంగా మార్చేశాయి. సమ్మర్ మార్కెట్ డల్ పడిపోయిన ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్ల అమ్మకాలు గతంలో వేసవి ప్రారంభానికి ముందు నుంచే సమ్మర్ సేల్స్ జోరు ఏటా సమ్మర్ సీజన్లో జిల్లాలో రూ.100 కోట్లకు పైగా అమ్మకాలు గత రెండు నెలల్లో 50 శాతం కూడా అమ్మకాలు లేవంటున్న వ్యాపారులు ఎండలు మండుతున్నా.. సంక్షేమం జాడలేక జనం జేబులు ఖాళీ బెంబేలెత్తిస్తున్న విద్యుత్ బిల్లులు -
గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్య
భీమవరం: భీమవరం పట్టణంలో మతిస్థిమితం లేని వ్యక్తి చాకుతో గొంతుకోసుకుని మృతిచెందాడు. ఉండి గ్రామం పెదపేటకు చెందిన గాతల క్రాంతికుమార్(35) కొంతకాలంగా మానసికంగా ఇబ్బందిపడుతున్నాడు. శుక్రవారం పనికి వెళ్లిన క్రాంతికుమార్ అక్కడ పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి శనివారం భీమవరం ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం కుటుంబసభ్యులు తీసుకువెళ్లగా.. దెయ్యాలు వస్తున్నాయంటూ వైద్యానికి సహకరించలేదు. దీంతో ఇంటికి తీసుకు వెళ్తుండగా అంబేడ్కర్ సెంటర్కు వచ్చే సరికి యనమదుర్రు డ్రెయిన్లోకి దూకాడు. వెంటనే బయటకు తీయగా అక్కడే పండ్లు అమ్ముతున్న వ్యక్తి నుంచి చాకు తీసుకుని పరుగులు పెడుతూ ఒంటిపై గాయాలు చేసుకున్నాడు. ఉండి రోడ్డులోని మల్టీఫ్లెక్స్ వద్దకు వెళ్లేసరికి గొంతు కోసుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి జాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్సై ఇజ్రాయిల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్తో బస్సు దగ్ధం కై కలూరు: బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ వల్ల స్కూల్ బస్సు దగ్ధమైన ఘటన కై కలూరు మాత ఇంగ్లీషు మీడియం స్కూల్ గ్రౌండ్లో శనివారం మధ్యాహ్నం జరిగింది. వేసవి సెలవులు కావడంతో బస్సు గ్రౌండ్లో ఉంచారు. బస్సు నుంచి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఫైర్ ఆఫీసర్ క్రాంతికుమార్ సిబ్బందితో హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. రూ.3 లక్షలకు పైగా నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. కొబ్బరి చెట్టుకు మంటలు కై కలూరు: మండవల్లి మండలం చావలిపాడు రైల్వేగేటు సమీపంలో జమ్ము గడ్డికి నిప్పంటుకుని కొబ్బరి చెట్టు మొదలు వరకు మంటలు వ్యాపించాయి. సమీపంలో ఇళ్లతో పాటు ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కై కలూరు అగ్నిమాపక అధికారి సకాలంలో మంటలు అదుపు చేశారు. కలిదిండి పోలీసు స్టేషన్ వెనక భాగంలో కిక్కిస పొదలలో మంటలు వ్యాపించగా.. అగ్నిమాపక అధికారులు మంటలను ఆర్పివేశారు. -
సంచుల కోసం రైతుల ధర్నా
కుళ్లిపోతున్నా పట్టించుకోరా? ఏలూరు సర్వజన ఆస్పత్రి ప్రాంగణంలోని శవ పరీక్ష కేంద్రం (మార్చురీ)లో ఫ్రీజర్ బాక్సులు పనిచేయక మృతదేహాలు పాడవుతున్నాయి. IIలో uపెనుమంట్ర: ధాన్యం మాసూళ్లు చేసి రోజులు గడుస్తున్నా రైతు సేవా కేంద్రాల్లో గోనె సంచులు సరఫరా చేయడం లేదని, మిల్లుల వద్ద తూకా ల్లో మోసాలను అరికట్టాలంటూ శనివారం జుత్తిగ రైతు సేవా కేంద్రం వద్ద రైతులు ధర్నాకు దిగారు. వీరికి జిల్లా కౌలు రైతు సంఘం మద్దతు తెలిపింది. తహసీల్దార్, వ్యవసాయ అధికారి ఇక్కడకు వచ్చి ఆదివారం నాటికి జు త్తిగ గ్రామానికి 25 వేల సంచులు అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. అనంతరం జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షుడు కూసంపూడి సుబ్బరాజు మాట్లాడుతూ వాతావరణంలో మార్పులు, సంచుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పీఆర్ 126 రకం ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని, బయట అమ్ముకోవాలని చెబుతున్నారన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ సంచికి అదనంగా ధాన్యం తూకం వేయడం, తేమ శాతం, నూక శాతం పేరుతో రైతులను మిల్లర్లు దోచుకుంటున్నారని విమర్శించా రు. ధాన్యం తూకంలో తాము మోసపోయిన విషయాన్ని అధికారుల దృష్టికి రైతులు తీసుకువచ్చారు. సంచికి అదనంగా 600 గ్రాముల తరుగు మిల్లర్లు మినహాయిస్తున్నారన్నారు.