breaking news
West Godavari District News
-
ముంచుతున్న ముసురు
పెనుగొండ : వరుస ముసుర్లు సార్వా సాగును నిండా ముంచుతున్నాయి. గత వారం కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 21 వేల ఎకరాలు ఇంకా వర్షపు నీటి ముంపులోనే ఉన్నాయి. మరోవైపు ఆదివారం తెల్లవారుజాము నుంచి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలకు పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటికే ఎకరాకు రూ.15 వేల వరకూ పెట్టుబడి పెట్టారు. జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో సార్వా సాగుకు సన్నద్ధం కాగా, ఇప్పటికి 1.84 ఎకరాల్లో నాట్లు పూర్తి చేశారు. ఆచంట దిగువ, యలమంచిలి, నర్సాపురం మండలాల్లో నాట్లు పూర్తి చేయాల్సి ఉంది. ఈ తరుణంలో ముసుర్లు ప్రారంభం కావడంతో నాట్లు వేయడం మరింత ఆలస్యమవుతోంది. ఇదిలా ఉండగా, వరినాట్లు పూర్తి చేసిన 16 మండలాలకుగాను 164 గ్రామాల్లో సుమారు 21 వేల ఎకరాలు నీటి మునిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అత్తిలి, పెనుమంట్ర, ఆచంట, పెనుగొండ, పోడూరు, తణుకు, తాడేపల్లిగూడెంలో ముంపు తీవ్ర త అధికంగా ఉంది. మురుగు డ్రెయిన్ల ఆక్రమణలతో మురుగు కిందకు ప్రవహించే అవకాశం లేకుండా పోవడంతో రెండు మూడు రోజులుగా ముంపులోనే వరిచేలు ఉన్నాయి. దీంతో నాట్లు కుళ్లుపోయే అవకాశం ఉందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఏటా ముంపే.. ఈ ఏడాది రైతన్నల దుస్థితి అయోమయంగా మారింది. నిన్న మొన్నటి వరకూ అధిక ఎండ తీవ్రతతో సాగునీటి కొరతను ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా వారంలోనే పరిస్థితి తారుమారైంది. సార్వా సాగు ఆదిలోనే ముసుర్లు ముంచుకొచ్చాయి. ఒక్కసారిగా భారీగా కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఏపుగా ఎదిగిన వరిచేలు ముంపునకు గురి కావడంతో ఆవేదనకు గురవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నాట్లు ముందుగా వేసిన రైతులు మొదటి దఫా ఎరువులు సైతం పూర్తి చేశారు. ముఖ్యంగా జిల్లాలో నక్కల డ్రయిన్, తాడేరు డ్రయిన్, గోస్తనీ నదుల ప్రాంతంలో ఉన్న వరిచేలు ఏటా ముంపునకు గురవుతూ తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వలనే మురుగు డ్రెయిన్ల వెంట ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముంపునకు గురైన వరిచేలను గుర్తించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముసురుతో వరిచేలు మునగడంతో కౌలు రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టాం. రెండు, మూడు రోజులుగా ముంపులోనే వరి చేలు ఉన్నాయి. ప్రభుత్వం కౌలు రైతును గుర్తించి నష్టపరిహారం అందించాలి. – రాపాక మోజేస్, కౌలు రైతు, పెనుగొండ నక్కల డ్రెయిన్లో ఆక్రమణలతో వరిచేలు మునుగుతున్నాయి. నక్కల డ్రెయిన్ ప్రక్షాళన ఇప్పటి వరకూ చేపట్టలేదు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకొన్నా పట్టించుకొన్న నాథుడే కరువయ్యాడు. 15 ఏకరాలు కౌలుకు చేస్తున్నా. పూర్తిగా నక్కల డ్రెయిన్ ముంపులోనే ఉన్నాయి. – నరసన్న, కౌలు రైతు,పెనుగొండ వరుస ముసుర్లుతో వరిచేలన్నీ ముంపునకు గురయ్యాయి. గోస్తనీ నదీ పరివాహక ప్రాంతమంతా నీట మునిగింది. ఏటా ఇదే పరిస్థితి నెలకొంటుంది. నాట్లు వేసిన తరువాత ముంపుతో వరి నాట్లు కుళ్లిపోతున్నాయి. మరోసారి నాటుకోవాల్సి వస్తోంది. – అంగర నాగరాజు, రైతు, పెనుమంట్ర ఇప్పటికీ ముంపులోనే 21 వేల ఎకరాలు తాజాగా మరోసారి ముసురుతో ఆందోళన డ్రెయిన్ల ఆక్రమణలతో ఏటా నష్టపోతున్న రైతులు -
గుగాంపునకు మెర్లిన్ అవార్డు
పెనుగొండ: అంతర్జాతీయ ఇంద్రజాలికుడు గుగాంపునకు ప్రతిష్టాత్మకమైన అమెరికన్ మెర్లిన్ అవార్డు వరించింది. ఈ మేరకు డాక్టర్ గుగాంపు వివరాలు వెల్లడించారు. అమెరికాలోని లాస్ వెగాస్లో ఆగస్టు 7న జరిగిన కార్యక్రమంలో మెర్లిన్ అవార్డును అందుకున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా దేశవిదేశాల నుంచి ఈ అవార్డుకు 37 మంది అంతర్జాతీయ ఇంద్రజాలికులు ఎంపికయ్యారని తెలిపారు. 2016లో మొదటిసారి ఈ అవార్డు తీసుకున్నట్లు తెలిపారు. ఆకివీడు: దివ్యాంగులకు రీ–అసెస్మెంట్లో కొత్త సదరం ధ్రువపత్రాలు ఇవ్వకుండా పింఛన్లు తొలగించడం దారుణమని వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అల్లాడి నటరాజు ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ సదరం ఇచ్చేంతవరకూ పింఛన్లపై జారీ చేసిన నోటీసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేంతవరకూ పింఛన్లు మంజూరు చేయాలన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజులు అధిక వర్షాల నేపథ్యంలో నేడు నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేశామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): నిబంధనలకు విరుద్ధంగా పెదవేగి మండలం రామచంద్రపురం జెడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్పై పెదవేగి పాఠశాలకు పంపిన ఎంఈఓ–1పై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 అకడమిక్ కమిటీ కన్వీనర్ గుగ్గులోతు కృష్ణ, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామ్మోహన్ రావు, మోహన్ రావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రామచంద్రపురం పాఠశాలలో 100 మంది విద్యార్థులకు సోషల్ బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఏలూరు(మెట్రో): రైతులకు ఎరువులు విక్రయించిన తరువాత ఆ వివరాలను ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా అన్నారు. ఆదివారం పెదవేగి, కామవరపుకోట మండలాల్లో ఎరువుల షాపులను తనిఖీ చేశారు. డీలర్లు యూరియా, ఇతర ఎరువులను విక్రయించిన తక్షణమే పోర్టల్లో నమోదు చేయాలన్నారు. -
పెన్షనర్లపై ప్రభుత్వం చిన్నచూపు
భీమవరం: రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్న్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సత్తిరాజు ఆరోపించారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో టి.గంగరాజు అధ్యక్షతన జరిగిన జిల్లా సదస్సులో మాట్లాడుతూ పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రతి సంవత్సరం వడ్డీ కింద రూ.54 వేల కోట్లు వస్తుంటే కేవలం రూ.14 వేల కోట్ల రూపాయలతో పెన్షన్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికుల్ని మోసం చేయడమేనని ఆయన వివరించారు. రిటైర్డ్ ఉద్యోగులకు డీఏ ఇతర సౌకర్యాన్ని ఆపాలని నిర్ణయం తీసుకోవడం దారుణమని విమర్శించారు. ఈపీఎఫ్ పెన్షన్దారులకు కనీసం రూ.9000 పెన్షన్ ఉండాలని దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం నీరెత్తినట్టుగా ఉండడం పాలకుల విధానాలను తెలియజేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే ఎన్నికల ముందు వాగ్దానాలు చేసిన పాలకులు ఎన్నికల అనంతరం విస్మరించడం తగదని పేర్కొన్నారు. పెన్షనర్స్ సమస్యలపై ఈ నెల 25న కలెక్టరేట్ల వద్ద జరిగే నిరసన కార్యక్రమాన్ని, సెప్టెంబర్ 13న విజయవాడలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ ఫంక్షన్ హాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జి.జేమ్స్, అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
●బండి కాదు.. మొండి
ఆర్టీసీ బస్సులు ఎక్కడపడితే అక్కడ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వెళ్తున్న ప్యాసింజర్ బస్సు కామవరపుకోట మండలం కొత్తూరు బస్టాండ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక్కసారిగా ఆగిపోయింది. ప్రభుత్వం ఉచిత బస్సు అంటూ కాలం చెల్లిన బస్సులు తిప్పడమేంటని మహిళలు విమర్శిస్తున్నారు. ప్రయాణికులు ఎంత తోసినా బస్సు ముందుకు కదలకపోవడంతో చేసేది లేక, అక్కడే వదిలిపెట్టి, ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు. – కామవరపుకోట -
సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): భవన నిర్మాణ కార్మికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేశారు. వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరిస్తామని, కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు తప్పక అందజేస్తామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. అప్పటి నుంచి నేటి వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పైనే అవుతున్నా, ఎన్నికల హామీలు నేటి వరకు అమలు చేయలేదని, ఇబ్బందులలో ఉన్నామని నిర్మాణ రంగ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుండగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 5 లక్షల మంది కార్మికులు ఉన్నారు. వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారుగా 1.20 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఒక వైపు పనులు లేకపోవడం, మరో వైపు నిత్యావసర ధరలు, అన్ని రకాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపధ్యంలో ఇప్పటికే కార్మికులు ఆవేదనలో ఉన్నారు. దీంతో చేసేది లేక భవన నిర్మాణ కార్మిక సంఘాలు హక్కుల సాధన కోసం పోరుబాట పట్టాయి. ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని, బోర్డును క్రియాశీలం చేసి పటిష్ట పరచాలని, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సొమ్మును భవన కార్మికులకు ఖర్చు పెట్టాలని, బోర్డులో నెంబర్లును నియమించాలని కార్మికులు కోరుతున్నారు. ఆందోళనలు ఉధృతం ఇప్పటికే వార్డు సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలు, అసిస్టెంట్ లేబర్ కార్యాలయాలు వద్ద, జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ధర్నాలు నిర్వహించి అధికారులకు సమస్యలు పరిష్కరించాలని వినతులు ఇచ్చారు. రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలకు, వెల్ఫేర్ బోర్డు చైర్మన్కు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విన్నవించారు. పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. త్వరలో సమస్యల పరిష్కారం చూపుతామని అంటున్నారు తప్ప సమస్యలు తీర్చే పరిస్థితి కానరావడం లేదని నిర్మాణ రంగ కార్మికులు వాపోతున్నారు. కార్మికుల డిమాండ్లు ● భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును క్రియాశీలం చేసి పటిష్ట పరచాలి. ● బోర్డులో కార్మికుల నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు వార్డు, గ్రామ సచివాలయంలో నమోదు చేయడానికి అవకాశం కల్పించాలి. ● పెండింగ్లో ఉన్న క్లైయిమ్స్ పరిష్కరించాలి, వెల్ఫేరు బోర్డులో నమోదైన కార్మికులకు వెంటనే గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి ● వయోభారం లేదా అనారోగ్యం కారణంగా పని నుంచి విరమించుకున్న కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా పెన్షన్ మంజూరు చేయాలి ● ప్రమాదాలు వల్ల అనారోగ్యం వల్ల మంచాన పడిన కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా ఈఎస్ఐ తరహాలో ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలి. ● భవన నిర్మాణ కార్మికులకు ఐదు రోజులు ఆసుపత్రిలో ఉండాలనే నిబంధన తొలగించాలి. ఆందోళన బాటలో భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణ కార్మికులకు అందించే ఏకై క విభాగం వెల్ఫేర్ బోర్డు. బోర్డు ప్రస్తుతం అందుబాటులో లేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించి, పెండింగ్ క్లైయింలు పరిష్కారం చేస్తామని చెప్పారు. బోర్డును తక్షణమే పునఃప్రారంభించాలి. వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. – మైలవరపు శ్రీరాంబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందించాల్సిన సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. బోర్డు నిధులను కార్మికుల సంక్షేమానికి, భద్రతకు, బీమాకు ఖర్చుచేయాలి. చేతినిండా పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. సంక్షేమాలు అమలు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తాం. – సింగవరపు సునీల్, ప్రధాన కార్యదర్శి నవాబుపాలెం భవన నిర్మాణ కార్మిక సంఘం -
భారీ వర్షాలతో అప్రమత్తం
భీమవరం (ప్రకాశంచౌక్): భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గంటకు 30–40 కి.మీ. వేగంతో తీరం వెంట ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కలెక్టర్ సూచించారు. గోదావరికి వరద ఉధృతి దృష్ట్యా నదిలోకి వెళ్లవద్దని, ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం వంటివి చేయవద్దన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణ, ధన నష్టం జరగకుండా చూడాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అత్యవసర మందులు, క్లోరిన్, బ్లీచింగ్ తదితర సామగ్రితో సిద్ధంగా ఉండాలన్నారు. వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్ అధికారులు వర్షాలు తగ్గే వరకు జాగ్రత్తగా ఉండాలన్నారు. అత్యవసర సమయంలో వినియోగం నిమిత్తం మోటార్ బోట్లు, గత ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. అధికారులంతా ప్రధాన కేంద్రాల్లోనే ఉండాలని, ఎవరికీ సెలవులు లేవని చెప్పారు. కలెక్టరేట్లో 08816 299181 నెంబరుతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. -
ఆక్వాకు వాయు‘గండం’
గణపవరం: వాతావరణంలో తీవ్రమైన మార్పులు ఆక్వా సాగుకు గండంగా మారాయి. భారీవర్షాలు, చల్లబడిన వాతావరణం ఆక్వా సాగుకు ప్రతికూలంగా మారింది. ట్రంప్ సుంకాల దెబ్బతో విలవిల్లాడుతున్న రొయ్య రైతులు ప్రస్తుత వాతావరణ మార్పులతో బెంబేలెత్తిపోతున్నారు. వేసవిలో ఆదుకోవాల్సిన రొయ్యసాగు రైతును కుదేలు చేసింది. ఎడాపెడా తెగుళ్లు ఆశించడంతో రొయ్యల చెరువులు ఖాళీ అయ్యాయి. మరోవైపు చేప ధర తగ్గిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవల రొయ్యల ధర ట్రంప్ సుంకాల పెంపుతో పతనమయ్యాయి. చేప ధర కూడా కిలోకు రూ.10 నుంచి రూ.15 వరకూ పడిపోయింది. రెండు నెలలుగా వాతావరణం ఆక్వా సాగుకు ఏమాత్రం కలిసి రావడం లేదు. మే నెలలో అకాల వర్షాలతో పూర్తిగా చల్లబడగా, జూన్లో వాతావరణం వేసవిని తలపించింది. జూలైలో కూడా రెండు వారాల పాటు విపరీతమైన ఎండలు, ఉక్కబోతతో వేసవిని మించిన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజులుగా వాతావరణం చల్లబడింది. పూటకో రకంగా మారుతున్న వాతావరణం వల్ల ఆక్సిజన్ సమస్య తలెత్తుతుంది. చేపలు, రొయ్యలకు సరిపడ ఆక్సిజన్ అందకపోవడంతో నీటి ఉపరితలంపై తిరుగాడుతూ నీరసించిపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి రైతులు నిరంతరం ఏరియేటర్లు తిప్పుతున్నారు. తెగుళ్ల బారిన చేపలు, రొయ్యలు చెరువులలో ఆక్సిజన్ లోటు పూడ్చడానికి రసాయనాలు చల్లుతున్నారు. రెండు రోజులుగా వాతావరణం పూర్తిగా చల్లబడి, ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయి చేపలు, రొయ్యలు తెగుళ్ల బారిన పడుతున్నాయి. దీంతో మేతలు సరిగా తినలేక నీరసించి పోతుండటంతో రైతులు చేపలు, రొయ్యలు అర్ధంతరంగా పట్టేసి అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 1.25 లక్షల ఎకరాలలో రొయ్య, మరో 1.50 లక్షల ఎకరాలలో చేపల సాగు జరుగుతుంది. వాతావరణం ప్రతికూలంగా మారడంతో రొయ్యలకు వైరస్ వ్యాధులు, చేపలకు మొప్పతెగులు వంటివి సోకుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో రొయ్య రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆక్సిజన్ అందక చేపలు, రొయ్యలు ఉక్కిరిబిక్కిరి -
శ్రీవారి క్షేత్రం.. భక్త జనసంద్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి భక్తులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆదివారం పెద్దఎత్తున ఆలయానికి వచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు భక్తజనంతో కళకళలాడాయి. దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అనివేటి మండపం, కల్యాణ కట్ట ఇలా అన్ని విభాగాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. వరుస సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో వేలాదిగా భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించినట్టు దేవస్థానం అధికారులు తెలిపారు. బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కాపవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చి మ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాల్లో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉదయం నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు వర్షంలోనే తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఆలయ కమిటీ వారు, పోలీసులు ప్రత్యేక చర్యలు చేట్టారు. కై కలూరు: కొల్లేటికోట శ్రీపెద్దింటి అమ్మవారిని భక్తులు ఆదివారం భారీఎత్తున దర్శించుకున్నారు. శ్రావణమాసం కావడంతో అనేకమంది భక్తులు వివిధప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు కృష్ణాజిల్లాకు చెందిన అనేక ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఈ సందర్భంగా లడ్డూ ప్రసాదం, రూమ్ల అద్దె, ఇతర మార్గాల ద్వారా ఆలయానికి రూ.40,405 ఆదాయం సమకూరినట్లు కార్యనిర్వహణాధికారి కూచిపూడి శ్రీనివాస్ తెలిపారు. -
ఎరువుల షాపుల్లో తనిఖీలు
కామవరపుకోట: వ్యవసాయ శాఖ జిల్లా అధికారి షేక్ హబీబ్ బాషా కాపువరపుకోట మండలంలో ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు దుకాణాల్లో ఎరువుల నిల్వల్లో తేడాలున్నట్లు గుర్తించారు. కామవరపుకోటలోని కొండూరు రామ్మోహనరావు ఎరువుల దుకాణం వద్ద రూ.2,56,471 విలువచేసే 5 టన్నుల ఎరువులు, కొండూరు నాగేశ్వరరావు ఎరువుల షాపు వద్ద రూ.3,73,168 విలువచేసే 26.850 టన్నులు, శ్రీ సూర్య ఆగ్రోస్ షాప్లో రూ.20 వేలు విలువ చేసే 2 టన్నుల ఎరువుల నిల్వల్లో వ్యత్యాసాలు ఉండడంతో వాటి విక్రయాలను నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రైవేటు డీలర్ల వద్ద యూరియా 98 మెట్రిక్ టన్నులు, సొసైటీల వద్ద 37.5 టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, కావలసిన రైతులు అవసరం మేరకు వ్యవసాయంలో వినియోగించుకోవాలన్నారు. డీలర్లు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో చింతలపూడి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు వై. సుబ్బారావు, మండల వ్యవసాయ అధికారి డి.ముత్యాలరావు పాల్గొన్నారు. -
టెంకాయ అ‘ధర’హో
ద్వారకాతిరుమల: కొబ్బరికాయల ధరలు టాపు లేపుతున్నాయి. ఆలయాల వద్ద సైజును బట్టి రూ.25 నుంచి రూ.40కు విక్రయిస్తుండడంతో భక్తులు షాక్ అవుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తారు. అందులో అధిక శాతం మంది భక్తులు ఆలయంలో కొబ్బరికాయలు కొడతారు. అయితే కొబ్బరి కాయల ఉత్పత్తి తగ్గడంతో గత మూడు నెలల క్రితం వాటి ధరలు రెట్టింపయ్యాయి. ప్రస్తుత శ్రావణమాసంలో వివాహాది శుభకార్యాలు జరుపుకునేవారు, ఆలయాల్లో మొక్కులు తీర్చుకునే సాధారణ భక్తులు కొబ్బరికాయలు కొనేందుకు ఇబ్బంది పడుతున్నారు. ధరలు పెరగక ముందు వ్యాపారులు దళారుల వద్ద రూ.10 లకు కొన్న కొబ్బరి కాయను రూ.15కు, రూ.15 కాయను రూ.20 నుంచి రూ.25కు విక్రయించేవారు. ప్రస్తుతం దళారుల వద్ద రూ.20కు కొన్న కాయను రూ.25కు, రూ.25 కాయను రూ.30 నుంచి రూ.40కు అమ్ముతున్నారు. దాదాపు అన్ని ఆలయాల వద్ద ఇదే పరిస్థితి ఉంది. నెలకు 50 వేలకు పైగా విక్రయాలు శ్రీవారి క్షేత్రంలో చిన్నాపెద్దా మొత్తం 15 వరకు కొబ్బరికాయల దుకాణాలు ఉన్నాయి. వాటి ద్వారా వ్యాపారులు నెలకు 50 వేలకు పైగా కొబ్బరి కాయలు విక్రయిస్తారు. అయితే కొబ్బరికాయలు ధరలు బాగా పెరగడంతో గత మూడు నెలల నుంచి విక్రయాలు బాగా తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో అవసరమైన వారు తప్పక కొబ్బరికాయలు కొంటున్నారు. కొందరు భక్తులైతే కొబ్బరికాయలు కొనకుండా ఆ డబ్బులను స్వామివారి హుండీల్లో వేసి దండం పెట్టుకుంటున్నారు. ఎండు కొబ్బరి, నూనె ధరలకు రెక్కలు కొబ్బరి కాయల ధరలు పెరగడంతో ఎండు కొబ్బరి, నూనె ధరలు సైతం అమాంతం పెరిగాయి. గత మూడు నెలల క్రితం కిలో ఎండు కొబ్బరి రూ.240 పలికితే, ప్రస్తుత మార్కెట్లో రెట్టింపై రూ.400కు చేరింది. కిలో కొబ్బరి నూనె గతంలో రూ.360 కాగా, ప్రస్తుత మార్కెట్లో రూ.500 పలుకుతుండటం విశేషం. కొబ్బరికాయల ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. టాపు లేపుతున్న కొబ్బరికాయ ధర సైజును బట్టి రూ.25 నుంచి రూ.40 వరకు విక్రయాలు శ్రీవారికి మొక్కు చెల్లించేందుకు క్షేత్రానికి వచ్చాను. కొండ కింద చిన్న కొబ్బరికాయను రూ.25కు కొన్నాను. ఆలయం వద్ద ఉన్న దుకాణంలో అడిగితే రూ.30, పెద్ద కాయ రూ.40 చెప్పారు. శివాలయం వద్ద షాపులో రూ.40కు అమ్ముతున్నారు. ఇదేంటని వ్యాపారులను అడిగితే మార్కెట్లో కొబ్బరికాయల ధరలు పెరిగాయని అంటున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – తమ్మిరెడ్డి కృష్ణ, భక్తుడు, కై కలూరు దళారుల వద్ద మేము చిన్నకాయను రూ.20కు కొంటున్నాము. వాటిని అమ్మడం చాలా కష్టంగా ఉంది. సామాన్య భక్తులు అంత ధర పెట్టి కొనడానికి ఇష్టపడటం లేదు. మొక్కులు తీర్చేవారు మాత్రమే కొబ్బరి కాయలు కొంటున్నారు. పెద్ద కాయ రూ.30 చెబుతుంటే వారు హడలిపోతున్నారు. విపరీతంగా పెరిగిన ధరల వల్ల విక్రయాలు బాగా తగ్గాయి. – యండపల్లి వీరయ్య, కొబ్బరికాయల వ్యాపారి, ద్వారకాతిరుమల -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ మృతి
కొయ్యలగూడెం: కొయ్యలగూడెం– జంగారెడ్డిగూడెం జాతీయ ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పాలకొల్లు నుంచి తెలంగాణ రాష్ట్రం బైసంకి వెళుతుండగా పవర్ గ్రిడ్ వద్దకు వచ్చేసరికి కొబ్బరికాయల లోడు ఒక వైపునకు ఒరిగింది. దీంతో డ్రైవర్ నవ్వుండ్రి రాజేష్ (30), తొడ దాసి లక్ష్మణరావు (35) లారీని రోడ్డు మార్జిన్ వైపునకు ఆపి లోడును సరి చేస్తుండగా కలకత్తా నుంచి హైదరాబాదు వెళుతున్న మరో లారీ మితిమీరిన వేగంతో వచ్చి ఢీకొట్టింది. దీంతో డ్రైవర్, క్లీనర్ల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రం అయ్యాయి. మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వి చంద్రశేఖర్ తెలిపారు. దెందులూరు: ద్విచక్రవాహనంపై వెళుతుండగా ప్రమాదవశాత్తూ ఓ మహిళ జారి పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం ఆదివారం ద్విచక్రవాహనంపై ఏలూరు వైపు భార్యభర్తలు వెళుతుండగా జాతీయ రహదారిపై కొవ్వలి వద్దకు వచ్చేసరికి ద్విచక్రవాహనం నుంచి మహిళ ప్రమాదవశాత్తూ పడిపోవడంతో గాయాలపాలైంది. అంబులెన్స్కు ఫోన్ చేసినా సకాలంలో రాకపోవడంతో వారిని ఆశ్రమ వైద్యశాలకు తరలించి వైద్య సేవలు అందించినట్లు దెందులూరు ఎస్సై ఆర్ శివాజీ తెలిపారు. యలమంచిలి: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన గోకవరపు కృష్ణ (32) అదృశ్యంపై అతని సోదరుడు నాగ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ శాంసన్రాజు తెలిపారు. కృష్ణ ఒక ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. కృష్ణాష్టమి పండుగ సందర్భంగా శనివారం రాత్రి ఉట్టి వేడుక చూడడానికి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. రాత్రి ఇంటికి వెళ్లకపోవడంతో సోమవారం ఉదయం నుంచి గాలిస్తుండగా కృష్ణ బైక్, చెప్పులు చించినాడ వంతెనపై కనిపించాయి. దీంతో అతడి అన్న నాగ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి కృష్ణ కోసం గోదావరిలో గాలిస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ శాంసన్రాజు తెలిపారు. -
పశ్చిమాన అందాల కోన
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో అటవీ ప్రకృతి అందాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. అరకు అందాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. చెట్ల లేలేత పచ్చదనం.. పక్షుల కిలకిలరావాలు ఇక్కడ నిత్యం వసంతాన్ని తలపిస్తాయి. కొండ వాగుల నీటి ప్రవాహాలు, ప్రకృతి వడిలో జలపాతాల హోయలు ప్రకృతి ప్రేమికుల హృదయాల్లో చిరు సవ్వడి చేస్తాయి. బుట్టాయగూడెం మండంలోని పులిరామన్నగూడెం నుంచి గోగుమిల్లి, గిన్నెపల్లి, గడ్డపల్లి, దారావాడ, చిలకలూరు మారుమూల అటవీ ప్రాంతంలో గల గ్రామాలు, ఆయా గ్రామాలకు వెళ్లే ప్రయాణంలో ప్రకృతి అందాలు ఎంతో కనువిందు చేస్తాయి. ప్రస్తుతం ఈ గ్రామాలకు సరైన రహదారి లేదు. ద్విచక్రవాహనాలు మాత్రం ప్రయాణించే సమయంలో రోడ్డుకు ఇరువైపులా పొడవైన పచ్చని చెట్లు, ఎత్తయిన కొండలు మైమరపింపజేస్తాయి. దట్టమైన అటవీప్రాంతంలో సెలయేర్లు, కనువిందుచేసే వాగులు, ఆహ్లాదాన్ని పంచే జలపాతాలు అణువణువు అందం తొణికిసలాడుతుంది. అలాగే గుబ్బల మంగమ్మ గుడి దర్శనం కూడా ఎంతో అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్రాంతాలను అభివృద్ధి చేస్తే అరకు అందాలకు ఏ మాత్రం తీసిపోదు. -
రన్నరప్గా బాలుర బాస్కెట్బాల్ జట్టు
ఏలూరు రూరల్: రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాలుర జట్టు ద్వితీయస్థానంలో నిలిచింది. ఈ నెల 14వ తేదీ నుంచి 17 వరకూ పిఠాపురంలో ఓబీసీ హైస్కూల్ గ్రౌండ్లో 10వ రాష్ట్రస్థాయి బాలబాలికల జూనియర్ బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీలు జరిగాయి. లీగ్ దశలో జిల్లా బాలురు జట్టు శ్రీకాకుళం జట్టుపై 25–08, విజయనగరంపై 31–11, కర్నూల్పై 58–45, గుంటూరుపై 47–31 స్కోర్ తేడాతో గెలిచి సెమీఫైనల్కు చేరింది. ఆదివారం వర్షం కురవడంతో మ్యాచ్లు జరగలేదు. దీంతో నిర్వాహకులు పూర్తిస్థాయి మ్యాచ్కు బదులుగా 5 ఫ్రీ త్రో బాస్కెట్స్ నిర్వహించి విజేతలను ప్రకటించారు. ఇందులో జిల్లా బాలుర జట్టు సెమీఫైనల్లో కృష్ణ జట్టుతో తలపడి 3–2 స్కోర్తో గెలిచింది. తర్వాత ఫైనల్లో అనంతపురం జట్టు చేతిలో 3–4 స్కోర్తో ఓటమి పాలై రన్నరప్గా నిలిచింది. అసోసియేషన్ సభ్యులు కృష్ణారెడ్డి, గవ్వ శ్రీనివాసరావు, కె మురళీకృష్ణ జట్టును అభినందించారు. బాలికల జట్టు లీగ్ దశలో ప్రకాశంపై 32–02, చిత్తూరుపై 39–13 స్కోర్తో గెలిచి, క్వార్టర్ఫైనల్లో విశాఖ జట్టు చేతిలో 57–48 స్కోర్తో ఓడి తిరుగుముఖం పట్టింది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన బాలికల జట్టు -
జోరుగా రేషన్ బియ్యం అక్రమ రవాణా
నూజివీడు: రేషన్ బియ్యం అక్రమ రవాణాకు నూజివీడు అడ్డాగా మారింది. రేషన్ మొబైల్ వాహనాలను ఎత్తేసి నెల రోజులు గడిచిందో లేదో రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరందుకుంది. మొబైల్ వాహనాల వల్ల రేషన్ బియ్యం అక్రమ రవాణా పెరిగిందని సాకు చూపిస్తూ వాటిని రద్దు చేసిన ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నోరు మెదపడం లేదు. నూజివీడు ప్రాంతంలో గత నెలరోజుల వ్యవధిలోనే అక్రమంగా తరలిస్తున్న 118 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని నూజివీడు, ముసునూరు మండలంలో పట్టుకోవడం సంచలనంగా మారింది. జూలై 3వ తేదీన నూజివీడు బైపాస్ రోడ్డులో తరలిస్తున్న 51 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, 5న నూజివీడు మండలం మొర్సపూడిలో 26 క్వింటాళ్లు, ఆగస్టు 7న ముసునూరు మండలం గుళ్లపూడిలో రేషన్ బియ్యంను అక్రమ రవాణా చేస్తుంటే విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. దీంతో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో తెలుస్తోంది. పట్టణానికి చెందిన కొందరు వ్యాపారులు, మండలంలోని బత్తులవారిగూడెంకు చెందిన ప్రజాప్రతినిధి భర్త, టీడీపీకి చెందిన కార్యకర్త పెద్ద ఎత్తున బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్నాడు. అలాగే ఆగిరిపల్లికి చెందిన అధికార పార్టీకి చెందిన ఒక రేషన్ డీలరే యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణాను నిర్వహిస్తున్నాడు. అధికార పార్టీకి చెందిన వీరందరూ తమకు అడ్డుకునే వారెవరూ ఉండరనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తమ అక్రమ వ్యాపారాన్ని మూడు లారీలు.. ఆరు ఆటోలుగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రతి నెలా పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని వీరు కొందరు ఏజంట్ల ద్వారా సేకరించి తమ అడ్డాకు చేర్చుకొని అక్కడ నుంచి లోడులు ఎత్తుతున్నారు. కార్డుదారుల వద్ద రూ.10కు కొనుగోలు చేస్తున్న రేషన్ డీలర్లు డీలర్లు కార్డుదారుల వద్ద నుంచి రేషన్ బియ్యాన్ని కిలో రూ.10కు కొనుగోలు చేస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా లాభాలు ఎక్కువగా ఉండటంతో కొందరు డీలర్లు ఏకంగా కార్డుదారుడి వద్దకే వెళ్లి బయోమెట్రిక్ వేయించుకొని కిలోకు రూ.10 చొప్పున చెల్లించి వెళ్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని డీలర్ల వద్ద నుంచి అక్రమ రేషన్ బియ్యం వ్యాపారులు కిలో రూ.17కు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇక్కడ డీలర్కు కిలోకు రూ.7 లాభం వస్తోంది. డీలర్ల వద్ద కొనుగోలు చేసిన బియ్యాన్ని అక్రమార్కులు కాకినాడ పోర్టుకు తరలించే మరొక పెద్ద వ్యాపారికి కిలో రూ.25 నుంచి రూ.27కు విక్రయించి కిలోకు రూ.7 నుంచి రూ.10 కు సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో పట్టుబడి కేసులు పెట్టినా అక్రమ రేషన్ బియ్యం వ్యాపారాన్ని మానకుండా మళ్లీ అదే దందా నడుపుతున్నారు. బియ్యం దందాను అడ్డుకోవాల్సిన అధికారులు మొక్కుబడిగా 6ఏ కేసు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో బియ్యం మాఫియా యథేచ్ఛగా అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. దందాకు అడ్డాగా మారిన నూజివీడు -
వైఎస్సార్సీపీ బీసీ విభాగం కార్యదర్శిగా ధర్మరాజు
చింతలపూడి: వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన కుక్కల ధర్మరాజును నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తనకు రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్సీసీ బీసీ సెల్ కార్యదర్శిగా సూరిబాబు పెంటపాడు: వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ విభాగ కార్యదర్శిగా పెంటపాడుకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు రెడ్డి సూరిబాబు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తనకు ఈ పదవి ఇచ్చినందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డికి, మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. చింతలపూడి: వైఎస్సార్సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శులుగా చింతలపూడి మండలానికి చెందిన చిలుకూరి జ్ఞానారెడ్డి, జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన మల్నీడి మోహనకృష్ణ(బాబి)లను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ సేవలను గుర్తించి రాష్ట్ర కార్యదర్శులుగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తణుకు అర్బన్ : పార్కింగ్ చేసిన కారులో మంటలు చెలరేగిన ఘటన శనివారం తణుకు పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఇరగవరం మండలం కంతేరు గ్రామానికి చెందిన రుషి తన కుటుంబ సభ్యులతో తణుకు బ్యాంకు కాలనీలోని ఒక ప్రెవేటు ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రి సమీపంలోని ఖాళీ స్థలంలో నానో కారు పార్కింగ్ చేసి ఆసుపత్రిలోకి వెళ్లారు. కొద్దిసేపటికే కారు నుంచి పొగలు వ్యాపించి నిమిషాల వ్యవధిలోనే మంటలు అంటుకున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్థమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. చింతలపూడి: రాష్ట్ర స్థాయి ఆర్టిస్టిక్ యోగా పోటీలకు నాగిరెడ్డిగూడెం బాలికల గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థిని ఎస్.జాస్మిత ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్.హేమలత తెలిపారు. ఈ సందర్భంగా శనివారం పాఠశాల ఆవరణలో విద్యార్థులను సత్కరించి వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ ఈనెల 10న ఏలూరు లోని ఓల్డేజ్ హోంలో జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి ఆర్టిస్టిక్ పోటీల్లో ఎస్.జాస్మిత ఉత్తమ ప్రతిభ చూపి మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించిందని చెప్పారు. మరో విద్యార్థిని అమలారాణి ట్రెడిషనల్ జూనియర్ యోగా పోటీలలో మూడో స్థానంలో నిలిచి మెడల్ సాధించిందన్నారు.మల్నీడి మోహనకృష్ణ(బాబి) చిలుకూరి జ్ఞానారెడ్డి -
పాములపర్రులో దళితులకు న్యాయం చేయాలి
ఉండి: పాములపర్రు దళితులకు న్యాయం చేయాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మాపు చిత్రసేను అన్నారు. పాములపర్రులో దళితుల శ్మశాన ప్రాంతాన్ని బీఎస్పీ నాయకులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా చిత్రసేను మాట్లాడుతూ పూర్వీకుల ఆస్తికలున్న శ్మశాన వాటికను కాపాడుకునేందుకు ప్రాణాలైనా అర్పిద్దామని అన్నారు. శ్మశానంలో రోడ్డు వేయడానికి తెగించడమే కాకుండా వారిపైనే దాడికి తెగబడతారా అని ప్రశ్నించారు. శ్మశానంపై దళితులకు హక్కులున్నా అధికార పక్షం ఇష్టానుసారం వ్యవహరిస్తుందన్నారు. అధికారులంతా ఏకపక్షంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా మంచి ప్రభుత్వం అయితే దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కొల్లాబత్తుల ఏలియా రాజు, ఇన్చార్జి ఆలూరి చిన్నారావు, తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జి చల్లాబత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్టు
భీమడోలు: గంజాయిని తరలిస్తున్న నలుగురు యువకులను భీమడోలు పోలీసులు అరెస్ట్ చేశారు. భీమడోలు సీఐ యూజే విల్సన్ శనివారం కేసు వివరాలను వెల్లడిస్తూ.. శుక్రవారం సాయంత్రం ద్వారకాతిరుమల నుంచి భీమడోలు వైపుగా వస్తున్న వాహనాలను భీమడోలు పోలీసులు తనిఖీ చేస్తున్నారన్నారు. రెండు బైక్లపై ఉంగుటూరు మండలం చేబ్రోలుకు చెందిన మోటూకూరి శామ్యూల్, కై కరానికి చెందిన దొడ్డి లక్ష్మీనారాయణలు, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడుకు చెందిన దిరిసిపాము నిషాంత్, ముసళ్లకుంటకు చెందిన చీర రవిబాబు అనుమానాస్పద స్థితిలో పారిపోతుండగా పోలీసులు పట్టుకుని తనిఖీలు చేశారు. వారి నుంచి రూ. 40 వేల విలువ గల 2.13 కిలోల గంజాయిని పట్టుకున్నారు. రెండు బైక్లు, నాలుగు సెల్ఫోన్లను స్వానం చేసుకుని వారిని అరెస్ట్ చేసారు. వారిని భీమడోలు సివిల్ కోర్టులో హాజరుపర్చగా నిందితులకు రిమాండ్ విధించినట్లు సీఐ పేర్కొన్నారు. నిందితులంతా 19 నుంచి 23 ఏళ్ల లోపు వారేనని సీఐ తెలిపారు. -
శ్రీవారి భక్తులకు ‘సెల్’ కష్టాలు
ద్వారకాతిరుమల: దైవ దర్శనార్ధం ఏదైనా ఆలయానికి వెళ్లినప్పుడు దేవుడి దర్శనం కోసం క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండటం సహజం. కానీ ద్వారకాతిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు తమ సెల్ఫోన్లను డిపాజిట్ కౌంటర్లో భద్రపరచుకునేందుకు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే కౌంటర్లో ఇచ్చిన ఫోన్లు భద్రంగా ఉన్నాయో లేదోనన్న ఆందోళన భక్తులను వెంటాడుతోంది. వివరాల్లోకి వెళితే.. శ్రీవారి దర్శనం నిమిత్తం ఆలయంలోకి వెళ్లే భక్తులు ముందుగా తమ సెల్ఫోన్లను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఉన్న సెల్ఫోన్ డిపాజిట్ కౌంటర్లో అప్పగించాలి. భద్రపరచినందుకు ఒక్కో ఫోన్కు రూ.5 వసూలు చేస్తారు. శుక్రవారం వరకు ఒక కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో నడిచిన ఈ కౌంటర్ నిర్వహణ బాధ్యతను, శనివారం నుంచి దేవస్థానమే స్వయంగా చేపట్టింది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ఆరుగురు సిబ్బంది భక్తుల సెల్ఫోన్లను భద్రపరిచారు. ఇదిలా ఉంటే ఒక భక్తుడు తన రూ.1.50 లక్షలు విలువ చేసే సెల్ ఫోన్ పగిలిపోయిందని, దానికి సమాధానం చెప్పాలని గొడవ చేశాడు. సీసీ కెమెరాలను పరిశీలించిన అధికారులు సెల్ఫోన్ తమ వద్ద డ్యామేజ్ కాలేదని చెప్పారు. దాంతో ఆ భక్తుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సెల్ఫోన్ కౌంటర్ నిర్వహణకు రెండు నెలల క్రితం దేవస్థానం బహిరంగ వేలం నిర్వహించగా, ఒక కాంట్రాక్టర్ ఏడాదికి రూ.కోటి 20 లక్షలు దేవస్థానానికి చెల్లించేలా పాటను దక్కించుకున్నాడు. కౌంటర్ ప్రారంభించకుండానే చేతులెత్తేశాడు. దాంతో ఆ కాంట్రాక్టర్ పాట సమయంలో డిపాజిట్ చేసిన రూ.5 లక్షలను అధికారులు దేవస్థానం అకౌంట్కు జమ చేశారు. ఇదిలా ఉంటే మళ్లీ పాట నిర్వహించే వరకు కౌంటర్ నిర్వహణ బాధ్యతను చేబోలు రాజేష్ అనే కాంట్రాక్టర్కు అప్పగించారు. అతడు నష్టం వస్తోందని వదిలేశాడు. దాంతో భక్తుల సౌకర్యార్ధం, భద్రతా దృష్ట్యా ఆలయంలోకి సెల్ఫోన్లు అనుమతించ కూడదని దేవస్థానమే స్వయంగా ఈ సెల్ఫోన్లు భద్రపరిచే పనిని చేపట్టింది. అనుభవం లేక.. సిబ్బంది చాలక సెల్ ఫోన్ కౌంటర్ నిర్వహణలో దేవస్థానం సిబ్బందికి అనుభవం లేదు. శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో సిబ్బంది కూడా చాల్లేదని తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక కంప్యూటర్ మీదే టికెట్లు కొట్టారు. ఆ తరువాత రెండో కంప్యూటర్ను ఏర్పాటు చేశారు. ఈ సమస్యల వల్ల భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. స్వామివారి దర్శనానికి కంటే సెల్ఫోన్ భద్రపరచుకోవడానికే ఎక్కువ సమయం పట్టిందని భక్తులు వాపోయారు. కార్లలో దర్శనానికి వచ్చిన భక్తులు తమ ఫోన్లను వారి వాహనాల్లోనే వదిలేశారు. బైక్లపై వచ్చిన వారు క్యూలైన్లలో నిలబడక తప్పలేదు. సెల్ఫోన్లు భద్రపరిచేందుకు కౌంటర్ వద్ద క్యూ గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో దేవస్థానమే స్వయంగా చేపట్టిన వైనం అనుభవం లేక.. సిబ్బంది చాలక సమస్యలు -
నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు
ఏలూరు టౌన్: నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పదనే రీతిలో కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బంది చిత్తశుద్దితో పనిచేయాలని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో జిల్లాలోని కోర్టు మానిటరింగ్ సెల్ టీమ్ అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్షించారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం పోలీస్ సబ్ డివిజన్కు చెందిన కోర్టు మానిటరింగ్ సెల్ టీమ్ సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. నిందితులకు శిక్షలు పడేలా... బాధితులకు సత్వర న్యాయం జరిగేలా మరింత శ్రద్ధగా, సమర్ధవంతంగా పనిచేయాలని సూచించారు. నేరస్తులు తప్పించుకోకూడదని, బాధితులు పోలీస్, న్యాయస్థానాలపై నమ్మకం పెరిగేలా కృషి చేయాలని చెప్పారు. ప్రతి రోజూ కోర్టులో జరిగిన ప్రక్రియను డాక్యుమెంట్ రూపంలో స్టేషన్ అధికారికి నివేదించాలని తెలిపారు. ఏలూరు జిల్లాలో కోర్టు మానిటరింగ్ సెల్ మరింత సమర్ధవంతంగా పనిచేయాలని సూచించారు. సమీక్షలో టీడీసీ డీఎస్పీ ప్రసాదరావు, కోర్టు మానిటరింగ్ సెల్ సీఐ యం.సుబ్బారావు, డీసీఆర్బీ సీఐ హబీబ్ భాషా, సిబ్బంది ఉన్నారు. ఏలూరు (టూటౌన్): ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమావేశం శ్రీకాకుళంలో నిర్వహించనున్నట్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్లు శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్లకు కూటమి ప్రభుత్వం న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో పలు సమస్యలపై తీర్మానాలు చేసి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నామని పేర్కొన్నారు. -
నిర్వాసితుల సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడతా
బుట్టాయగూడెం: సీపీఎం ఫ్లోర్ లీడర్, కేరళ ఎంపీ జాన్ బ్రిట్టాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తులసీదాస్, సీపీఎం నాయకుల బృందం శనివారం ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించింది. బృంద సభ్యులు టేకూరు నిర్వాసిత కాలనీని సందర్శించారు. నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రెడ్డిగణపవరం వద్ద సభలో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నట్లు కనిపించిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల లక్ష ఆరువేల గిరిజన కుటుంబాలు ముంపునకు గురువుతున్నాయన్నారు. నిర్వాసితులకు పునరావాసం, వసతులపై ఉత్సాహం చూపించడం లేదన్నారు. 80 శాతం గిరిజనులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ ఉనికిని కోల్పోతున్నారని వారికి సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు పూర్తి స్థాయిలో పునరావాసం, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యలను పార్లమెంట్లో మాట్లాడతానని చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. బలరామ్, తదితరులు పాల్గొన్నారు. -
నీరు లాగక.. వేదన తీరక
గణపవరం: సార్వా పైరు ఇంకా ముంపులోనే ఉంది. బుధవారం రాత్రి కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో సార్వా పైరు నీట మునిగింది. సుమారు 650 హెక్టార్ల విస్తీర్ణంలో పైరు నీట మునిగినట్లు ప్రాథమికంగా అంచనావేశారు. ఈ నష్టం దాదాపు రెట్టింపు ఉంటుందని రైతులు చెబుతున్నారు. కొందేపాడు, పిప్పర, కేశవరం, కోమర్రు, వెంకట్రాజపురం, సరిపల్లె, కొత్తపల్లి, గణపవరం తదితర గ్రామాలలో వరినాట్లు నీటమునిగాయి. చినరామచంద్రపురంలోని పల్లపుభూములలో నాట్లు మొత్తం నీటమునిగాయి. పిప్పర పరిసర గ్రామాలలో వరిపైరు చివరలు కనిపిస్తున్నాయి. పొలాలలో నీరు బయటకు పంపడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. చుక్కనీరు బయటకుపోయే మార్గం కనిపించడంలేదు. ఇంజిన్లు వేసి నీటిని బయటకు తోడుకుంటున్నారు. కాలువగట్లు పల్లంగా, బలహీనంగా ఉన్న చోట్ల గట్లను రైతులే మట్టి, కంకరతో పటిష్టం చేసుకుంటున్నారు. శుక్ర, శనివారాలలో వర్షం కురియక పోవడంతో పరిస్థితి కొంత కలిసివచ్చింది. -
గౌతు లచ్చన్న ఆదర్శనీయులు
భీమవరం(ప్రకాశంచౌక్): స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న ఆదర్శనీయులని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లచ్చన్న జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్, జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌతు లచ్చన్న మార్గం అనుసరణీయమ న్నారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కె.వెంకటేశ్వరరావు, హాస్టళ్ల అధికారులు సీహెచ్ మోహనరావు, కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడిగా కవురు
పాలకొల్లు సెంట్రల్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యుడు కవురు శ్రీనివాస్ను నియమించారు. శనివారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియామకం జరిగినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ తనకు పలు పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పించిందన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన పార్టీ అధినేత జగన్ మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కమ్యూనిటీ సంఘ పెద్దలు, సభ్యులను కలుపుకుని పార్టీన మరింత బలో పేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): న్యాయవాదులకు ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇవ్వాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. యూనియన్ జిల్లా కమిటీ సమావేశం శనివారం స్థానిక బార్ అసోసియేషన్ హాల్లో జరిగింది. సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దిగుపాటి రాజగోపాల్ మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికల ముందు మ్యాచింగ్ గ్రాంట్ కింద మృతి చెందిన న్యాయవాదుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఇస్తానని వాగ్దానం చేశారని, అయితే రాష్ట్రంలో 1,275 మంది న్యాయవాద వృత్తిలో మృతి చెందితే 103 మందికి మాత్రమే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదుల రక్షణకు చర్యలు తీసుకోవాలని, కొత్తగా వచ్చిన న్యాయవాదులకు స్టయిఫండ్ ఇవ్వాలని అన్నారు. లా నేస్తం పథకాన్ని కొనసాగించాలని కోరారు. సమస్యలు పరిష్కారం కాకుంటే పోరాటాలే శరణ్యమన్నారు. లక్ష్మి, కౌరు వెంకటేశ్వర్లు, కామన మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. భీమవరం(ప్రకాశంచౌక్): సనాతన ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత అని, రాగద్వేషాలకు అతీతంగా జీవనం సాగిస్తే మానవ జన్మకు సార్థకత అని హరేరామ మూమెంట్ అక్షయ పాత్ర అధ్యక్షుడు వంశీధర్ దాసు అన్నారు. స్థానిక ఆనంద ఫంక్షన్ హాల్లో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను కలెక్టర్ నాగరాణి హాజరై ప్రారంభించారు. హరేరామ హరేకృష్ణ నామమే సుఖాల రుగ్మతలకు పరిష్కారమని దాసు అన్నారు. భగవద్గీత మానవుని మనుగడకు మార్గదర్శకమన్నారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథ్రాజు, విజయవాడ గోకుల క్షేత్రం సభ్యుడు మహత్రవ దాసు, వేడుకల కమిటీ సభ్యుడు కంతేటి వెంకటరాజు తదితరులు హాజరయ్యారు. చిన్నారులకు శ్రీకృష్ణుని వేషధారణ, చిత్రలేఖనం, స్వామి కీర్తనలు, సంప్రదాయ నృత్యాలు, శ్లోకాలు, చిత్రలేఖనం పోటీ లు నిర్వహించగా జిల్లానలుమూలల నుంచి 350 మంది హాజరయ్యారు. ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు నూజివీడుకు చెందిన దాత నక్కా సత్యనారాయణ శనివారం 3 టన్నుల కూరగాయలను విరాళంగా అందజేశారు. దొండ, బెండ, దోస, సొర, టమోటాలు వంటి పలు రకాల కూరగాయలను అందజేసి, స్వామివారి అన్నప్రసాదంలో వినియోగించాలని కోరారు. -
ఉధృతంగా వరద గోదావరి
ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరిలో మళ్లీ వరద మొదలైంది. ఈ సీజన్లో ముచ్చటగా మూడోసారి వరద తీవ్రత ప్రారంభమై నదిలో ఉధృతంగా ప్ర వహిస్తోంది. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలతో గోదావరి, శబరి నదులు రెండు రోజుల నుంచి ఉధృతంగా మారాయి. శనివారం పోలవరం ప్రాజెక్టు నుంచి 4.31 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. మరో మూడు రోజులపాటు వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉంది. భద్రాచలం వద్ద 29.80 అడుగులు భద్రాచలం వద్ద శనివారం 29.80 అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు స్పిల్వే 29.680 మీటర్ల ఎత్తు నుంచి దిగువకు 4,31,813 క్యూసెక్కుల నీటిని సాయంత్రం 6 గంటల సమయానికి విడుదల చేశారు. ఆదివారం రాత్రికి 6 లక్షల క్యూసెక్కులు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే మరో నాలుగు రోజుల పాటు మహారాష్ట్ర, తెలంగాణలో అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు అధికంగా కురుస్తాయని అంచనా వేశారు. దానికి అనుగుణంగా సోమవారం భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది. తర్వాత రెండు రోజుల పాటు 6 నుంచి 7 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం ప్రాజెక్టుకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయితే వేలేరుపాడులో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. మళ్లీ వరద హెచ్చరికలతో ముంపు గ్రామాల్లో భయం నెలకొంది. 30 టీఎంసీలు నిల్వ చేస్తూ.. ఏటా జూలై, ఆగస్టు నెలల్లో రెండు సార్లు వరదలు వస్తుంటాయి. అయితే ఈ ఏడాది ఇప్పటికే జూలైలో రెండుసార్లు వరద రాగా తాజాగా మూడోసారి మొదలైంది. గత నెలలో గోదావరి, శబరి మాత్రమే ఉధృతంగా ప్రవహించి 13, 14వ తేదీల్లో 7 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల కావడంతో ఏజెన్సీతో పాటు యలమంచిలిలోని లంక గ్రామాలకు నీరు చేరిన పరిస్థితి. ఈసారి గోదావరి, శబరితో పాటు తమ్మిలేరు, మున్నేరు కూడా భారీ వరద నీటితో ఉధృతంగా మారుతున్నాయి. దీంతో తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో 30 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ ఉంచి, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటిని యథాతథంగా విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాకాలం సీజన్లో గోదావరికి ముచ్చటగా మూడోసారి వరద ప్రారంభమైంది. గత నెలలో రెండుసార్లు వరదలు వచ్చాయి. మళ్లీ శుక్రవారం నుంచి వరద తీవ్రత ప్రారంభమైంది. ఏటా వర్షాకాలం సీజన్లో వరదల నేపథ్యంలో సగటున 1,900 టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నట్టు అధికారిక అంచనా. గత నెలలో రెండుసార్లు వచ్చిన వరదలతో ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరులో రాకపోకల్లో కీలకంగా ఉండే ఎద్దులవాగు, గుండేటి వాగు వంతెనలు కొన్ని రోజల పాటు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలేరుపాడులో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. అలాగే 270 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు కూడా తరలించిన పరిస్థితి. దీంతో పాటు జూలై నెలలో వచ్చిన రెండు వరదలకు రోజుకు సగటున 4 లక్షలకు పై గా క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలై మొత్తంగా 420.26 టీఎంసీల నీరు కడలిపాలయ్యింది. నదిలో పెరుగుతున్న ఉధృతి 4.31 లక్షల క్యూసెక్కులు దిగువకు.. గత నెలలో 420 టీఎంసీలు కడలిపాలు ముంపు గ్రామాల్లో భయం.. భయం 18 నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం -
● శ్రీవారి కొండ.. భక్తజనమే నిండా
భక్తులతో మాట్లాడుతున్న ఈఓ మూర్తి ఉచిత బస్సు వద్ద భక్తులు శ్రీనివాసా గోవిందా.. వేంకట రమణా గోవిందా.. నామస్మరణలు మార్మోగాయి. వేలాదిగా వచ్చిన భక్తులు, నవ దంపతులతో చిన వెంకన్న క్షేత్రం భక్త సాగరాన్ని తలపించింది. శనివారం వేకువజాము నుంచి భక్తుల రాక మొదలైంది. ఆలయ ప్రాంగణం, దర్శనం క్యూలైన్లు, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కల్యాణ కట్ట ఇలా అన్ని విభాగాలూ కిటకిటలాడాయి. భక్తులకు అందుతున్న సౌకర్యాల ను ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి స్వయంగా పరిశీలించారు. నిత్యాన్నదాన భవనంలో అన్నప్రసాదంపై భక్తులను ఆరా తీశారు. స్వామివారి నిత్య కల్యాణ మండపంలో 192 కల్యాణాలు జరిగాయి. ఆదివారం సైతం భక్తుల రద్దీ కొనసాగనుంది. –ద్వారకాతిరుమల -
నక్కల కాలువతో పొలాలకు ముంపు
పెనుగొండ: జిల్లాలో 30 వేల ఎకరాల ఆయకట్టు పరిధిలో ముంపునకు కారణమవుతున్న నక్కల కాలువ మురుగు డ్రెయిన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఆచంట, పెనుగొండ మండలాల్లో భారీ వర్షాలతో ముంపు బారిన పడిన చేలను శనివారం ఆయన పరిశీలించారు. అధిక వర్షాలు, నక్కల కాలువ వల్ల శేషమ్మ చెరువు, మార్టేరు, తూర్పుపాలెం, నెగ్గిపూడి, కొఠాలపర్రు, సోమరాజు చెరువు గ్రామాల్లో పొలాలు ముంపు బారిన పడ్డాయన్నారు. వీటిని ఎక్కువగా కౌలు రైతులే సాగుచేస్తున్నారని, ఇప్పటికే ఎకరాకు రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టారన్నారు. పద్నాల చెరువు, తూర్పుపాలెం వద్ద కాలువపై ఉన్న వంతెన చిన్నగా నిర్మించి రెండు తూములే ఏర్పాటు చేయడంతో ముంపు నీరు లాగడం లేదన్నారు. దీనికి శాశ్వత పరిష్కారంగా వడ్డిలంక డ్యామ్ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ మోటర్లను ఆధునీకరించి, డ్యామ్ అవతలి వైపునకు పైపులు నిర్మించి ముంపునీరు బయటకు తోడేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పంట కోల్పోయిన రైతులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులు కేతా పద్మారావు, గుత్తుల ఏడుకొండలు, దొంగ సోమేశ్వరరావు, చింతపల్లి కొండయ్య పాల్గొన్నారు. -
ఉండి.. బస్టాండ్లో సమస్యలు దండి
ఉండి: ఉండి నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పదేపదే చెబుతున్న కూటమి పాలకులు ఒక్కసారి ఉండి బస్టాండ్పై లుక్కేయండని ప్రయాణికులు అంటున్నారు. నియోజకవర్గాన్ని తలమానికంగా చేస్తామంటే ఏంటో అనుకున్నాం కానీ బస్టాండ్ ప్రాంగణాన్ని చెరువుగా మా ర్చడమా అని ఎద్దేవా చేస్తున్నారు. బస్టాండ్ ప్రాంగణమంతా భారీ గోతులు పడి కొద్దిపాటి వర్షానికీ మునిగిపోతోంది. నెలల తరబడి ప్రాంగణం ఇలా ఉన్నా కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదు. బస్టాండ్ ఆవరణలో రోడ్డు కనీసం 100 మీటర్లు కూడా లేదని, దీనిని సీసీ రోడ్డుగా నిర్మించే ఆలోచన కూడా పాలకులకు లేదని అంటున్నారు. ఉండి బస్టాండ్కు విజయవాడ, ఏలూరు, గుడివాడ, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాలకు జంక్షన్గా ఉంది. బస్టాండ్లో కనీసం కూర్చునేందుకు కుర్చీలు, బల్ల లు లేవు. తాగునీటి సౌకర్యం లేదు. ప్రయాణికులు బస్టాండ్ లోనికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికుల ఇ బ్బందులను ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రజలపై ఎందుకింత కక్ష అని వైఎస్సార్సీపీ నాయకులు జంపా నాగేశ్వరరావు, అంగర రాంబాబు, పీవీఆర్కే ఆంజనేయరాజు మండిపడుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడమే కాదు బస్టాండ్లో కనీస వసతులు కల్పించాలని అంటున్నారు. కూటమి ప్రభుత్వం కనీసం బస్టాండ్లో రోడ్లు కూడా వేయించలేని దుస్థితిలో ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఉండి బస్టాండ్ ప్రాంగణంలో చెరువులను తలపిస్తున్న గోతులు చెరువును తలపిస్తున్న ప్రాంగణం పాలకులూ పట్టించుకోరా? -
ఉండలేక.. కట్టుకోలేక..!
కుక్కునూరు: పోలవరం ప్రాజెక్ట్లో ముంపునకు గురవుతున్న నిర్వాసిత గ్రామాల్లో ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, పునరావాస ప్రక్రియను చేపట్టకపోవడంతో నిర్వాసితులు అవస్థలు పడుతున్నారు. పరిహారం ఎప్పటిలోగా చెల్లిస్తారన్నది స్పష్టత ఇవ్వకపోవడంతో శిథిలావస్థకు చెందిన ఇళ్లలో ఉండలేక, కొత్త ఇంటి నిర్మాణం చేపట్టలేక నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారు. విలీన మండలాల్లో ప్రభుత్వం ఇటీవల ప్రాజెక్ట్ 41.15 కాంటూర్ పరిధిలో ముంపునకు గురవుతున్న గ్రామాలకు ఆర్అండ్ఆర్ వ్యక్తిగత, ఇంటి నిర్మాణాలకు పరిహారం చెల్లించింది. అయితే ఇంకా కొందరికి పరిహారం రావాల్సి ఉంది. ప్రభుత్వం 41 కాంటూర్ అంటూ పరిహారం చెల్లించిన గ్రామాలను 2022లో వచ్చిన గోదావరి వరదలకు గిరిజనులు కనీసం ఖాళీ చేసింది లేదు. అయితే అదే వరదలో 45 కాంటూర్ అని పేర్కొన్న గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. అలా వరదలో దెబ్బతిన్న ఇళ్లనే నిర్వాసితులు బాగుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొందరు వాటి స్థానంలో తాత్కాలికంగా కర్రలు, రేకులతో షెడ్డు వేసుకుని చుట్టూ బరకాలు కట్టుకుని బతుకుతున్నారు. స్పష్టత లేకపోవడంతో.. ప్రభుత్వం 45 కాంటూర్ పరిధి గ్రామాలకు పరిహారంపై స్పష్టత ఇస్తే ఇంటి నిర్మాణంపై ఓ నిర్ణయం తీసుకోవచ్చనే భావనలో నిర్వాసితులు వేచి చూస్తున్నారు. కొత్త ఇళ్లు నిర్మించుకుంటే, కొత్త వాటిని కాదని పాత ఇంటి విలువ ప్రకారం పరిహారం ఇస్తే నష్టపోవాల్సి వస్తుందని నిర్వాసితులు ఆవేదన చెందతున్నారు. ఇలానే 41 కాంటూర్ పరిధిలోని నిర్వాసితులు ఇప్పటికే నష్టాన్ని చవిచూశారు. అదీ కాక పరిహారం ఎప్పుడిస్తారు, గ్రామాలను ఎప్పుడు ఖాళీ చేయిస్తారు, అసలు చేయిస్తారా లేదా అనే విషయాలపై స్పష్టత లేనప్పుడు ఇంటి నిర్మాణాలపై ఎలా ముందుకు వెళతామని అంటున్నారు. 45 కాంటూర్ పరిధికి చెందిన నిర్వాసిత గ్రామాల పరిహారం విషయమై ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. 2022 గోదావరి వరదకు మా గుడిసె దెబ్బతింది. దీంతో ఆ ఇంటిని సరిచేసుకుని దాని పక్కనే తాత్కాలికంగా రేకుల షెడ్డు వేసుకుని బరకాలు కట్టుకుని కుటుంబంతో నివసిస్తున్నా. ఇకనైనా ప్రభుత్వం మాకు ఆర్అండ్ఆర్ పరిహారం ఇవ్వాలి. – వేల్పుల రాజయ్య, సీఎం కాలనీ, కుక్కునూరు మండలంలో 45 కాంటూర్లో ఉన్న గ్రామాలకు పరిహారం ఎప్పడిస్తారనే విషయమై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలి. పరిహారం ఇస్తారనే ఉద్దేశంతో నిర్వాసితులు పాత ఇళ్లలోనే ఉంటున్నారు. నిర్వాసితులకు త్వరితగతిన పరిహారం అందించాలి. – వీరమళ్ల ప్రవీణ్, వింజరం ముంపు గ్రామాల్లో తాత్కాలిక ఆవాసాలు పరిహారం చెల్లింపులో ప్రభుత్వ తాత్సారం నిర్వాసితులకు తప్పని అవస్థలు -
పాపికొండల్లో వైల్డ్ డాగ్స్
బుట్టాయగూడెం: అరుదైన జంతు జాలానికి నిలయమైన పాపికొండల అభయారణ్యంలో క్రూర జంతువులైన అడవి కుక్కలు (వైల్డ్ డాగ్స్) గుంపులుగా సంచరిస్తున్నాయి. ఇవి అటవీ ప్రాంతంలోని అనేక జంతువులను వేటాడుతుంటాయి. పులిని సైతం అడవి కుక్కలు భయపెట్టగలవని చెబుతుంటారు. అడవి కుక్కలు సంచరించే ప్రదేశాల్లో పులులు కూడా సంచరించవని.. వాటి ఉనికిని కనిపెట్టి తప్పించుకుని తిరుగుతాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. పరిమాణంలో ఊరకుక్కల కంటే కొంచెం పెద్దవిగా ఉండే వైల్డ్డాగ్స్ వాటి కంటే బరువు, శక్తి కలిగిన పెద్ద పులులను సైతం సమూహ శక్తితో తరిమికొట్టగలవు. అడవిలో సంచరించే అడవి పందిని ఈ వైల్డ్డాగ్స్ చిటికెలో వేటాడి ఆహారంగా మార్చుకుంటాయి. వాటి బరువుతో పోల్చుకుంటే ఎన్నో రెట్లు పెద్దవైన కణితి(సాంబార్ డీర్), మనిమేగం లాంటి పెద్ద జింక జాతి జంతువులను కూడా ఈ అడవి కుక్కల సమూహం వెంటాడి వేటాడతాయి. ఈ వైల్డ్డాగ్ గుంపులు ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండకుండా నిరంతరం వేర్వేరు ప్రాంతాలకు తిరుగుతూనే ఉంటాయి. ఇవి ఊర కుక్కల కంటే కాస్త పెద్దవిగా ఉంటాయి. వీటి తోకకు వెంట్రుకలు కుచ్చుగా ఉంటాయి. ఇవి యూరప్ దేశాల్లో నల్ల మచ్చలతో కనిపిస్తాయి. అభయారణ్యాల్లో అధికంగా సంచారం అభయారణ్యాలుగా ఉన్న పాపికొండలు, నాగార్జున సాగర్, శ్రీశైలం అభయారణ్యం, గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యంలో అడవి కుక్కల సంచారం ఎక్కువగా ఉందని వైల్డ్లైఫ్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో కూడా అడవి కుక్కల సంచారం అధికంగా ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పాపికొండల అభయారణ్యంలో సుమారు 200 కుక్కలకు పైగా గుంపులుగా సంచరిస్తున్నట్లు గుర్తించామని ప్రస్తుతం వాటి జాడ అల్లూరి సీతారామరాజు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో గ్రామాలు ఖాళీ అవుతున్న నేపద్యంలో ఇవి స్వేచ్ఛగా సంచరించడానికి మరింత అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సమతుల్యతకు ప్రధాన భూమిక వైల్డ్ డాగ్స్ జీవావరణ సమతుల్యతలో ప్రధాన భూమిక పోషిస్తుంటాయి. మాంసాహార జంతువులైన చిరుత పులి, పెద్దపులి, అడవి కుక్కల సంఖ్య తగ్గిపోతే వాటి ఆహార జంతువులైన వివిధ జంతువులు, జింకల సంఖ్య అమాంతంగా పెరిగి అడవిలోని వృక్షాలు తగ్గిపోతాయి. రైతులకు ఇబ్బంది కలిగించే అడవి పందులు, జింకల సంఖ్య పెరుగుదల ప్రమాదకరంగా మారకుండా నియంత్రణలో ఈ అడవి కుక్కలు ప్రధాన భూమిక పోషిస్తాయని అధికారులు అంటున్నారు. అడవిలో సంచరించే వైల్డ్ డాగ్స్ పెద్ద పులులను సైతం ఎదిరించే ధైర్యం ఈ కుక్కల సొంతం ఆహారం కోసం నిరంతరం సంచారం -
కన్నాపురంలో వ్యక్తి ఆత్మహత్య
కొయ్యలగూడెం: ఇచ్చిన బాకీలు వసూలు కాకపోవడంతో మనస్తాపానికి గురైన కన్నాపురం గ్రామానికి చెందిన మజ్జి నరసింహారావు (40) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొందరికి నరసింహరావు అప్పు ఇవ్వగా, అవి వసూలు కాకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించాడు. గురువారం రాత్రి వాట్సప్లో తన కుటుంబ సభ్యులకు ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్ చేశాడు. మృతుడు తండ్రి సత్యనారాయణ, బంధువులు నరసింహరావు కోసం వెతుకుతుండగా గ్రామ శివారులోని ఓ రైతుకు చెందిన బావి వైపు వెళ్ళినట్లు తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లేసరికి వారిని చూసిన నరసింహారావు వెంటనే బావిలోకి దూకేశాడు. దీంతో స్థానికుల సాయంతో బయటకు తీసుకొచ్చి హాస్పటల్ కు తీసుకువెళ్లగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉంగుటూరు: ఉంగుటూరు మండలం కై కరంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఎంఎం.పురం గ్రామానికి చెందిన బూర్ల మహేష్కుమార్(35) అక్కడికక్కడే చనిపోయాడు. మహేష్కుమార్ బైక్పై తణుకు వెళ్తుండగా కై కరం శివారులో వెనుక నుంచి తాడేపల్లిగూడెం వైపు వెళుతున్న కారు బలంగా ఢీకొనడంతో అక్కడకక్కడే మరణించాడు. కారు డ్రైవరు నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరుకు చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కై కలూరు: స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్యం విక్రయాలు నిషేధం. అయినప్పటికీ బెల్టు దుకాణాల ద్వారా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని ఎకై ్సజ్ ప్రత్యేక బృందం దాడులు చేసి శుక్రవారం పట్టుకుంది. అధికారుల వివరాల ప్రకారం ముదినేపల్లి మండలం కాకరవాడకు చెందిన కాగిత నాగేశ్వరరావు నుంచి 9 క్వార్టర్ బాటిల్స్, మండవల్లి మండలం భైరవపట్నంలో వలపుల చంద్రరావు నుంచి 7 క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆగస్టు 15 సందర్భంగా గురువారం రాత్రి 10 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు నియోజకవర్గంలో 22 మద్యం దుకాణాలకు సీజ్ వేశామన్నారు. -
యువకుడిని కాపాడిన పోలీసులు
భీమడోలు: మనో వైకల్యంతో బాధపడుతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువకుడిని శుక్రవారం సాయంత్రం భీమడోలు పోలీసులు కాపాడారు. పూళ్ల గ్రామానికి చెందిన గురువెల్లి రాజు తాపీ పని చేసేవాడు. ఇటీవల మద్యానికి బానిస కావడంతో తల్లి మందలించింది. దీనితో రాజు చనిపోతానంటూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించారు. భీమడోలు ఎస్సై వై.సుధాకర్, ఏఎస్సై వెంకటేశ్వరరావు హుటాహుటిన పూళ్ల వెళ్లి అతని ఆచూకీ కోసం ప్రయత్నించారు. రైల్వే స్టేషన్లో ఆత్మహత్యయత్నానికి సిద్ధంగా ఉన్న రాజును వారు పట్టుకున్నారు. అతనికి భోజనం పెట్టించి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. ఉంగుటూరు: మండలంలోని వెల్లమిల్లిలో పాఠశాల వద్ద జెండా ఆవిష్కరణకు ఉపయోగించిన ఐరన్ పైపు శుక్రవారం సాయంత్రం దించబోతుండగా.. పక్కనే ఉన్న విద్యుత్త్ వైర్లు మీద పడటంతో షాక్కు గురై ఉసురుమర్తి భీమరాజు(49) అక్కడకక్కడే మృతిచెందాడు. భీమరాజుకు కుమరుడు, కుమార్తె ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఘర్షణలో వ్యక్తి మృతి
నూజివీడు: గేదెలు కట్టేయడానికి గుంజ పాతే విషయమై ఇద్దరు ఘర్షణ పడగా అందులో ఒకరు మృతి చెందిన సంఘటన నూజివీడు మండలం జంగంగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జంగంగూడెం ఎస్సీ ఏరియాలో తొమ్మండ్రు ఏసోబు(64), ముళ్లపూడి దేవసహాయం(62) కుటుంబాలు పక్కపక్కనే నివసిస్తున్నాయి. ఉదయం 9 గంటల సమయంలో దేవసహాయం స్థలం సరిహద్దులో గుంజను పాతుతుంటే అక్కడ పాతడానికి వీల్లేదంటూ ఏసోబు అడ్డు వెళ్లాడు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. దేవసహాయం భార్య కూడా వచ్చి ఘర్షణకు దిగింది. దేవసహాయం తన చేతిలో ఉన్న గడ్డపలుగును వెనకకు తిప్పి ఏసోబు డొక్కలో పొడవడంతో కింద పడిపోయాడు. ఇదే సమయంలో ఏసోబు భార్య అక్కడికి వచ్చి తన భర్తను ఇంటిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టగా వెంటనే మృతిచెందాడు. ఈ విషయం తెలిసి రూరల్ ఎస్ఐ జ్యోతిబసు సిబ్బందితో గ్రామంలోకి వెళ్లి సంఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. తన భర్తను గడ్డపలుగుతో పొడవడంతో మృతిచెందాడని రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రూరల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిండా ముంచిన గోస్తనీ
పెనుమంట్ర: బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పెనుమంట్ర మండలంలోని గోస్తిని, గొంతేరు, భగ్గేశ్వరం మురుగు కాల్వలు పొంగి ప్రవహించడంతో వరి నాట్లు నీట మునిగాయి. గోస్తనీ పరివాహక ప్రాంతంలో నత్తారామేశ్వరంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం నీట మునగగా, జుత్తిగలో శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయాల్లోకి వరదనీరు ప్రవేశించింది. గోస్తనీ మురుగు కాలువలో కిక్కిస, గురప్రు డెక్క పెరిగిపోవడంతో మురుగు నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడి ఎస్.ఇల్లిందలపర్రు, మల్లిపూడి, జుత్తిగ, నత్తా రామేశ్వరం వెలగలవారి పాలెం, పెనుమంట్ర, మాముడూరు గ్రామాలకు చెందిన సుమారు 1000 ఎకరాల్లోని వరినాట్లు నీట మునిగాయి. గోస్తినిలో చెత్త తొలగింపు కార్యక్రమాన్ని 20 రోజుల క్రితం ప్రారంభించినప్పటికీ నత్త నడకన సాగుతోంది. దీంతో దిగువ భాగంలోని నత్త రామేశ్వరం, జుత్తిగ, వెలగలవారిపాలెం, పెనుమంట్ర, గరువు గ్రామాల మధ్య చెత్త పేరుకుపోయి మురుగునీరు వెళ్లకపోవడంతో పల్లపు ప్రాంతాల్లోని పంట పొలాలు నీటమునిగాయి. వరినాట్లు నీట మునిగడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. చెత్త తొలగింపు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భగ్గేశ్వరం మురుగు కాలువ కూడా ఆక్రమణకు గురై పూడుకుపోవడంతో ఆలమూరు, వెలగలేరు గ్రామాలకు చెందిన పల్లపు పొలాలు నీట మునిగాయి. నత్తారామేశ్వరంలో ముంపులో శ్రీరామలింగేశ్వర ఆలయం జుత్తిగ–పెనుమంట్ర మధ్య గోస్తనీలో పేరుకుపోయిన కిక్కిస, గుర్రపు డెక్క -
నీటమునిగిన వరిచేలు
ఉంగుటూరు: ఉంగుటూరు మండలంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. మేజరు మురుగుకోడు, పందికోడు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మీడియం డ్రెయిన్లు రంగారావు కోడు, రాచకోడు, సంతకోడు, లింగం కోడు, ఆస్మాకోడు నిండుగా ప్రవహిస్తున్నాయి. దాంతో వేలాది ఎకరాలు నీటమునిగాయి. వీఏ పురం, కాగుపాడు, కాకర్లమూడి, దొంతవరం, రావులపర్రు, రామన్నగూడెం, కై కరం ఆయకట్టులో పంటపొలాలు నీటమునిగి ఉన్నాయి. పంటచేల నుంచి నీరు కొల్లేరు వైపు ప్రవహిస్తోంది. నారాయణపురం ఆర్అండ్బీ రోడ్డు, యర్రమళ్ల, వెల్లమిల్లి, ఎ.గోకవరం రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. మెట్ట ప్రాంతంలోని 22 మైనర్ ఇరిగేషన్ చెరువులు నిండిపోయాయి. నాచుగుంట పట్టెమ చెరువు, ఉంగుటూరు ఎర్ర చెరువు, వెల్లమిల్ల చెరువు, నల్లమాడు చెరువు, గోపినాథపట్నం పెద్ద చెరువు నిండి పొంగి పొర్లుతున్నాయి. రెండు రోజుల్లో నీరు లాగితే రైతులు ఊపిరి పీల్చుకుంటారు. లేకుంటే నష్టపోయే పరిస్థితి నెలకొంది. -
డివైడర్ను ఢీకొని యువకుడి మృతి
ద్వారకాతిరుమల: బైక్పై వేగంగా వెళుతున్న యువకుడు ముందు వెళుతున్న టీవీఎస్ మోపెడ్ను, ఆ తరువాత డివైడర్ను ఢీకొట్టి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మోపెడ్ నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ద్వారకాతిరుమల మండలం సూర్యచంద్రరావుపేటలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. భీమడోలు గ్రామానికి చెందిన మీసాల జగదీష్(25)కు ఏడాది క్రితం వివాహమైంది. జగదీష్, అతని అన్నయ్య ద్వారకాతిరుమలలోని స్వీట్లు తయారు చేసే పని చేస్తున్నారు. ఉదయం పనికి వెళ్లిన జగదీష్ తరువాత కడుపులో నొప్పిగా ఉందని చెప్పి, రూంకి వెళ్లి పడుకున్నాడు. మధ్యాహ్నం ఇంటికి వెళ్లేందుకు భీమడోలు బయల్దేరాడు. ముందు వెళ్తున్న మోపెడ్ను తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో మోపెడ్తో సహా దానిపై వెళ్తున్న ఫణి, అతని తాతయ్య రోడ్డుపై పడిపోయారు. తీవ్రంగా గాయపడ్డ జగదీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఫణికి తీవ్ర గాయాలుపాలు కాగా, అతని తాతయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ యుజే విల్సన్, ఎస్సై టి.సుధీర్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
మువ్వన్నెల రెపరెపలు
నిండా ముంచిన గోస్తనీ భారీ వర్షాలకు పెనుమంట్ర మండలంలో గోస్తనీ న ది, గొంతేరు, భగ్గేశ్వరం మురుగు కాలువలు పొంగి పొర్లడంతో వందలాది ఎకరాలు నీటమునిగాయి. 8లో u● అంబరాన్నంటిన సంబరాలు ● పంద్రాగస్టు వేడుకల్లో చిన్నారులు శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025భీమవరం: భీమవరం కలెక్టరేట్ వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ సీహెచ్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి పరేడ్ కమాండర్ ఆధ్వర్యంలో పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అవార్డుల ప్రదానం జిల్లాలో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వారి కుటుంబాలను సత్కరించారు. ప్రజాసేవలో నిమగ్నమైన స్వచ్ఛంద సంస్థలు, దాతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. పలు రంగాల్లో ప్రతిభ కనబర్చిన సేవకులు, అధికారులు, సిబ్బందికి అవార్డులు, ప్రశంసా పత్రాలు, సర్టిఫికెట్లను అందజేశారు. ఉత్తమ ప్రతిభను చూపిన పోలీసుల కు పతకాలను బహూకరించారు. స్టాల్స్ సందర్శన : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ శాఖ, మత్స్యశాఖ, విద్యాశాఖ–సమగ్ర శిక్ష, సహిత విద్యా–సమగ్రశిక్ష, వ్యవసాయశాఖ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, ఉద్యాన శాఖ, రాష్ట్ర సూక్ష్మ సేద్య పథకం, ఎస్ఈఆర్పీ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పరిశ్రమల కేంద్రం, యూనియన్ బ్యాంకు లీడ్ బ్యాంకు డిపార్ట్మెంట్, రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) తదితర శాఖలు స్టాల్స్ ఏర్పాటుచేయగా మంత్రి నిమ్మల పరిశీలించారు. ఆకట్టుకున్న శకటాలు ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు ఆకట్టుకున్నాయి. వైద్యారోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, అగ్నిమాపక శాఖ, విద్యాశాఖ, ఎస్ఈఆర్పీ–జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, గృహ నిర్మాణ శాఖ, రవాణా శాఖల శకటాల ప్రదర్శన, పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జంతు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తిని చాటేలా పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, గీతాలు ఉత్తేజాన్ని రేకెత్తించాయి. వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, ఆరిమిల్లి రాధాకృష్ణ, జేసీ టి.రాహుల్కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, ఆర్డీఓ ప్రసన్నకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి లక్ష్యం : జిల్లాలో మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం వంటి పలు పనులు చేయాల్సి ఉందని, భవిష్యత్తులో జిల్లాకు అవసరమైన వనరులు కల్పించి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కంకణం కట్టుకుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి స్థిరమైన అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. -
ప్రజాస్వామ్యం అపహాస్యం
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం అర్బన్ : పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్ర భుత్వం దౌర్జన్యంగా ఓట్లు వేసుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. శుక్ర వారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ఓటమి చెందితే ప్రజలకు సమాధానం చెప్పుకోలేమన్న భయంతో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. అ క్కడి కలెక్టర్, డీఐజీ, డీఎస్పీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని విమర్శించారు. జ మ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం గుండాలను తీసుకువచ్చి స్థానిక ఓటర్ స్లిప్పులను లాక్కుని ఓట్లు వే యించారన్నారు. ఓటర్లు ప్రశ్నిస్తే వారిని పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారన్నారు. గూడెంలో ఏబీసీడీ ట్యాక్స్ : తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో శాసనసభ్యుడి ఆధ్వర్యంలో ఏబీసీడీ ట్యాక్స్లు వసూలు చేస్తున్నారని కొట్టు ఆరోపించారు. ఏ అంటే అబ్బాయి ట్యాక్స్, బీ అంటే బొలిశెట్టి ట్యాక్స్, సీ అంటే కమిషనర్ ట్యాక్స్, డీ అంటే డెలప్మెంట్ ట్యాక్స్ అని అ న్నారు. ఏ పని కావాలన్నా ఏదో ఒక ట్యాక్స్ క ట్టాల్సిందే అన్నారు. ఇటీవల అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకుంటే అబ్బాయి ట్యాక్స్ కట్టి వారు తప్పించుకున్నారన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేనకి చెందిన నాదెండ్ల మనోహర్ చర్యలు తీసుకోవా ల ని కోరారు. వైఎస్సార్సీపీకి చెందిన కొందరిని పే కాట క్లబ్బులు పెట్టుకునేందుకు అనుమతిస్తామని ఎర చూపి జనసేనలో చేర్చుకున్నారని విమర్శంచారు. జెడ్పీటీసీ సభ్యులు రావాల్సిన బకాయి లు ఇస్తారన్న ఆశతోనే జనసేనలో చేరారని తెలి పారు. కొలుకులూరి ధర్మరాజు, ముప్పిడి సంపత్కుమార్, కర్రి భాస్కరరావు, జిడ్డు హరిబాబు, బండారు నాగు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): మహిళలకు ఉచిత బస్సులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సీ్త్ర శక్తి పథకాన్ని ప్రారంభించింది. భీమవరం కొత్త బస్టాండ్ ఆవరణలో పథకాన్ని రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ, కలెక్టర్ సీహెచ్ నాగరాణి, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రా మాంజనేయులు ప్రారంభించారు. రాష్ట్ర మ హిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు టౌన్: దేశ సమైక్యత, సమగ్రతకు ప్రతిఒక్కరూ పాటుపడాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. ఏలూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పోలీసులు కృషి చేయాలని అన్నారు. ఏలూరు (టూటౌన్): యువత దేశభక్తితో పా టు స్ఫూర్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. ఏలూరులోని జిల్లా కోర్టు కార్యాలయంలో ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సైనికులు నిరంతరం కృషి చేస్తున్నారని, కాని దేశంలో అంతర్గతంగా భద్రత, అభివృద్ధి మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉందన్నారు. -
తాగునీటికి ఇక్కట్లు
భీమవరం కలెక్టరేట్ వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తాయి. ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో హాజరుకాకపోగా.. పథకాలను ప్రదర్శించే శకటాల సంఖ్య బాగా తగ్గింది. అలాగే విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇదిలా ఉండగా ప్రాంగణం వద్ద మంచినీటి కోసం ఇబ్బందులు తప్పలేదు. వాటర్ టిన్నులు కొద్దిసేపటికే ఖాళీ అయ్యాయి. ప్లాస్టిక్ నిషేధం అని పెద్ద ఎత్తున ప్రచారం చేసినా అధికారులకు మాత్రం ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు అందించారు. అలాగే ఓ పక్క వేడుకలు జరుగుతుండగానే.. ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మొక్కలను వాహనంలోకి ఎక్కించి తరలించడం విశేషం. వేడుకలకు పెద్దగా ప్రజలు హాజరుకాలేదు. -
త్యాగధనుల స్ఫూర్తి.. స్వాతంత్య్ర దీప్తి
నరసాపురం/తాడేపల్లిగూడెం అర్బన్/తణుకు అర్బన్: ఎందరో మహానుభావుల బలిదానాలు, ప్రాణత్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న స్వాతంత్య్ర భార తాన్ని వారి స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాల్సిన బా ధ్యత అందరిపై ఉందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. నరసాపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ ప తాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం 70 అడుగుల జాతీయ పతాకంతో పట్టణంలో వైఎస్సార్సీపీ శ్రే ణులతో కలిసి ర్యాలీ చేశారు. స్వాతంత్య్ర నాయకులను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తణుకులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. స్వాతంత్య్ర స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. తాడేపల్లిగూడెం అర్బన్: తాడేపల్లిగూడెంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తణుకు అర్బన్: తణుకులో జాతీయ పతకానికి సెల్యూట్ చేస్తున్న మాజీ మంత్రి కారుమూరి -
కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ
భీమవరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నిరంకుశ పాలన సాగిస్తోందని వైఎస్సార్సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి చినమిల్లి వెంకటరాయుడు విమర్శించారు. శుక్రవారం రాయలంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి అరాచక పాలనకు పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలే నిదర్శనమన్నారు. అడ్డగోలు హామీలతో అధికారం చేపట్టిన చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత హామీలు అమలుచేయాలని అడిగిన వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారన్నారు. ఓటర్లను పోలింగ్ బూత్లకు రానీయకుండా రిగ్గింగ్ చేసి గెలవడం హేయమన్నారు. సామాన్యులు ఓటు వేసే పరిస్థితి లేకుండా చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కూటమి ప్రజావ్యతిరేక పాలనను ప్రజలంతా గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. పార్టీ నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జి గూడూరి ఉమాబాల మట్లాడుతూ పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన ఉప ఎన్నికల్లో కూ టమి నాయకుల తీరును ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని తెలిపారు. పార్టీ నాయకులు కామన నాగేశ్వరరావు, చిరుగుపాటి సందీప్, మానుకొండ ప్రదీప్, గాదిరాజు రామరాజు, కోడే యుగంధర్, గంటా సుందరకుమార్, పాలవెల్లి మంగ, పెచ్చెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మా పొట్ట కొట్టొద్దు
గళమెత్తిన ఆటో కార్మికులు భీమవరం/తణుకు అర్బన్/తాడేపల్లిగూడెం (టీఓసీ)/పాలకోడేరు/అత్తిలి/పెనుమంట్ర/ఆకివీడు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఉచిత బస్సు పథకంతో తాము జీవనోపాధి కోల్పోతామంటూ గురువారం జిల్లావ్యాప్తంగా ఆటో డ్రైవర్లు, కార్మికులు నిరసన తెలిపారు. బంద్లు, ధర్నాలతో ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరంలో ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు యింటి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది, జిల్లాలో 16 వేల మంది ఆటోలనే ఆధారంగా జీవనం సాగిస్తున్నారన్నారు. వారంతా రోడ్డున పడతారన్నారు. తణుకులో రాష్ట్రపతి రోడ్డు, సొసైటీ రోడ్డు, వేల్పూరు రోడ్డు, ఉండ్రాజవరం రోడ్డుతోపాటు రైల్వేస్టేషన్ ప్రాంతంలోని ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలోని భారతమాత ఆటోయూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు పంగం రాంబాబు, కంచుమర్తి విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తాడేపల్లిగూడెంలో సుమారు 22 యూనియన్ల నాయకులు, ఆటో డ్రైవర్లు టెంట్లు వేసి నిరసన తెలిపారు. పట్టణంలో 24 గంటల పాటు ఆటోలను నిలుపుదల చేశారు. పాలకోడేరులోని రావిచెట్టు సెంటర్ వద్ద మహాత్మా గాంధీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అత్తిలి బస్స్టేషన్ సెంటర్లో ఆటో కార్మికులు నిరసన తెలిపారు. పెనుమంట్ర మండలంలో ఆటో డ్రైవర్లు బంద్ పాటించి తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఆకివీడులో అంబేడ్కర్ ఆటో యూనియన్ నాయకులు నిరసన తెలిపారు. ఆటోలను నిలుపుదల చేసి బంద్ పాటించారు. -
ముంపు చేల పరిశీలన
అత్తిలి: మండలంలోని తిరుపతిపురం, వరిఘేడు ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలను గురువారం కలెక్టర్ సీహెచ్ నాగరాణి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బుధవారం ఒక్కరోజు 1799.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. దీంతో సుమారు 400 నుంచి 500 ఎకరాల వరకు పొలాలు ముంపు బారిన పడ్డాయన్నారు. ప్రస్తుతం వ ర్షం ఆగినందున నీరు తొలగితే ఇబ్బంది ఉండదని, వ్యవసాయాధికారులు పంట నష్టం వివరాలు నమోదు చేస్తారన్నారు. తహసీల్దార్ దశిక వంశీ, సిబ్బంది ఉన్నారు. భీమవరం: జిల్లాలో గురువారం ఉదయం వర కు 20 మండలాల్లో సగటున 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తణుకులో 236.6 మి.మీ., అత్యల్పంగా మొగల్తూరులో 8.6 మి.మీ. వర్షం పడింది. మండలాల వారీ గా వర్షపాతం ఇలా.. తాడేపల్లిగూడెంలో 162.2 మి.మీ, పెంటపాడులో 189, అత్తిలిలో 85.4, గణపవరంలో 144.4, ఆకివీడులో 77.2, ఉండిలో 54.4, పాలకోడేరులో 76.2, పెనుమంట్రలో 75.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇరగవరంలో 196.6, పెనుగొండలో 193.8, ఆచంటలో 40.2, పోడూరులో 82.6, వీరవాసరంలో 22.2, భీమవరంలో 27.6, కాళ్లలో 42.6, నరసాపురంలో 32.4, పాలకొల్లులో 35.2, యలమంచిలిలో 17.4 మి.మీ వర్షపాతం నమోదైంది. భీమవరం (ప్రకాశంచౌక్): భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ, నీటి నిర్వహణ తదితర అంశాలపై అమరావతి నుంచి గురువారం కలెక్టర్లు, సాగునీటి సంఘాల, ప్రాజెక్ట్ సంఘాల ప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సీహెచ్ నాగరాణి, జేసీ టి.రాహుల్కుమార్ రెడ్డి, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, అధికారులు హాజరయ్యారు. నీటి సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మండవల్లి: మండవల్లిలోని స్టేషన్ రోడ్డులో తా గునీటి సమస్య పరిష్కరించాలంటూ గురువా రం జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నాకు దిగారు. 20 రోజుల నుంచి కుళాయిల నుంచి తాగునీరు రావడం లేదని, తమను పట్టించుకునే నాథుడే లేడంటూ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. సర్పంచ్, అధికారులు వచ్చి సమాధానం చెప్పాలంటూ భీష్మించారు. కొద్దిసేపటికి పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని, ఎన్ని రోజులు ఓపిక పట్టాలని మహిళలు పోలీసుల వద్ద వాపోయారు. బుట్టాయగూడెం: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం సమీపంలోని రోడ్డు గురువారం ఉదయం కొట్టుకుపోయింది. దీనితో పై గ్రామాలకు రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్లో గురువారం వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా స్కూలింగ్–బిల్డింగు బ్లాక్స్ అనే అంశంపై విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి వర్క్షాప్ నిర్వహించారు. దేశం మొదటి స్థానంలో నిలిచే లక్ష్యంగా అన్ని రంగాల్లో నిరంతర లక్ష్యాలు, నిర్దేశం, సాధన చాలా అవసరమన్నారు. మానవ వనరుల అభివృద్ధి యువత, వయోజనులు, మహిళలపై నిర్మించబడి ఉందన్నారు. -
గవర్నర్తో మీట్ ఎట్కు నాగేంద్రసింగ్
ఏలూరు (ఆర్ఆర్పేట): స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ కార్యాలయంలో గవర్నర్ అబ్దుల్ నజీర్తో జరిగే మీట్ ఎట్ కార్యక్రమానికి ఏలూరు జిల్లా నుంచి నాగేంద్ర సింగ్ ఎంపికయ్యారు. నాగేంద్రసింగ్ ఏలూరు శ్రీరామ్నగర్లోని ఎంపీయూపీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. అంతర్జాతీయస్థాయి దివ్యాంగుల క్రికెట్ పోటీలకు అంపైర్గా కూడా సేవలందిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం గవర్నర్ ఇచ్చే తేనీటి విందులో పాల్గొని గవర్నర్ నుంచి సన్మానం అందుకోనున్నారు. తాడేపల్లిగూడెం: వెంకట్రామన్నగూడెంలోని ఉద్యా న వర్సిటీలో డిప్లమో హార్టీకల్చర్, డిప్లమో ల్యాండ్ స్కేపింగ్, నర్సరీ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు తుది విడత స్పాట్ కౌన్సెలింగ్ను ఈనెల 20న నిర్వహించనున్నారు. ఈ మేరకు రిజిస్ట్రార్ బి.శ్రీనివాస్ ప్రకటన విడుదల చేశారు. నాలుగు ప్రభుత్వ, మూడు గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి గతంలో దరఖాస్తు చేసుకున్నా, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఉద్యాన వర్సిటీ ప్రాంగణంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలతో స్వయంగా హాజరుకావాలని సూచించారు. -
సేవకులకు వంచన
ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాకా బోడి మల్లన్న చందాన ఉంది కూటమి తీరు. వలంటీర్లను కొనసాగిస్తాం, పారితోషికం నెలకు రూ.10 వేలకు పెంచుతామని చెప్పిన కూటమి పెద్దలు ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడంతో వలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ మొదలై శుక్రవారానికి ఆరేళ్లు కాగా కూటమి ప్రభుత్వ నిర్వాకంతో 16 నెలలుగా వీరి సేవలు నిలిచిపోయాయి. సాక్షి, భీమవరం: కులమతాలు, రాజకీయాలకు అతీ తంగా అర్హుల చెంతకే సంక్షేమ పథకాలు చేరవేసే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో 50 ఇళ్లకు, పట్టణాల్లో 75 నుంచి 100 ఇళ్లకు ఒకరు చొప్పున జిల్లాలో 8,616 మంది వలంటీర్లను నియమించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా 2019 ఆగస్టు 15న వలంటీర్ వ్యవస్థను ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల లబ్ధిని అందేలా చూడటం, అవసరమైన సర్టిఫికెట్లు మంజూరు చేయించడం, విద్యు త్ బిల్లుల చెల్లింపులు తదితర సేవలందించేవారు. కరోనాకు జడిసి సొంతవాళ్లు, చుట్టుపక్కల వారు దగ్గరకు రాలేని పరిస్థితుల్లో బాధితులకు బాసటగా నిలిచారు. హోం క్వారంటైన్లో ఉన్న వారికి ప్రభు త్వం ద్వారా ఆహారం, నిత్యావసర సరుకులు, మందులు అందజేసేవారు. కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియలో వీరు ఎనలేని సేవలందించారు. గోదావరి వరదల సందర్భంగా నీట మునిగిన లంక గ్రామాల ప్రజలకు ప్రభుత్వం నుంచి అవసరమైన సరుకులు, మందులు ఇంటింటికి వెళ్లి అందజేస్తూ వలంటీర్లు అందించిన సేవలు చిరస్మరణీయం. అనారోగ్యంతో ఇతర రాష్ట్రాల్లో చికిత్స పొందుతున్న లబ్ధిదారుల చెంతకు సైతం వెళ్లి ప్రభుత్వ సాయాన్ని అందజేస్తూ ఆదర్శంగా నిలిచిన వారెందరో ఉన్నారు. కేవలం రూ.5 వేల గౌరవ వేతనంతో పారదర్శకంగా సేవలందించిన వలంటీర్ వ్యవస్థ దేశవ్యాప్తంగా ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. వలంటీర్ వ్యవస్థపై మొదల్లో ‘గోనె సంచులు మోసే అవేం ఉద్యోగాలు’ అంటూ చిన్నచూ పు చూసిన చంద్రబాబు, మహిళల మిస్సింగ్కు వ లంటీర్లే కారణమంటూ విషం కక్కిన పవన్ కళ్యాణ్లు ఎన్నికలు వచ్చేసరికి మాట మార్చారు. ఎన్నికల సంఘానికి కూటమి అనుకూల వర్గాల ఫిర్యాదుల నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ నుంచి వలంటీర్ల సేవలు నిలిచిపోయాయి. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు హామీలు గుప్పించారు. మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చారు. కూటమి పాలన చేపట్టి ఏడాది పైబడినా హామీ అమలు దిశగా చర్యలు చేపట్టకపోగా వలంటీర్లను నిబంధనలు మేరకు తీసుకోలేదంటూ ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేయడం గమనార్హం. ప్రభుత్వ తీరుతో తమ భవితవ్యం అగమ్యగోచరంగా మారిందని వలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. కూటమి ఎన్నికల వాగ్ధానం అమలుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కూటమి వెన్నుపోటు ప్రభుత్వానికీ ప్రజలకు వారధిలా పనిచేసిన వలంటీర్లు పారదర్శకంగా పథకాల అమలుకు దోహదం గౌరవ వేతనం రూ.10 వేలు చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ అధికారంలోకి వచ్చాక ఆ ఊసెత్తని కూటమి పెద్దలు నేటితో వలంటీర్ వ్యవస్థకు ఆరేళ్లు జిల్లాలో 8,616 మంది వలంటీర్ల సేవలు ‘వలంటీర్లలో చాలా సమర్థత ఉంది. మేం అధికారంలోకి వస్తే వారిని ఉద్యోగాల నుంచి తీయబోం. వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం. వారికి ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచే బాధ్యత నేను తీసుకుంటాను’. – ఎన్నికల్లో చంద్రబాబు హామీ ‘వలంటీర్లు నా అక్కాచెల్లెళ్లు. ఏ రోజూ కూడా నాకు వారి పొట్టకొట్టాలన్న ఉద్దేశం లేదు. మీకు రూ.5 వేలు వస్తే.. మరో రూ.5 వేలు అదనంగా ఇచ్చే మనసున్న వాణ్ణి’. – ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ హామీ ప్రజలకు నిస్వార్థంగా సేవలందించాం. కోవిడ్కు జడిసి ఎవరూ బయటకురాని సమయంలో ఇంటింటికీ వెళ్లి మందులు అందజేశాం. వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, పారితోషికం రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలుపుకోవాలి. – హెచ్వీకే చక్రవర్తి, వెలగలేరు, పెనుమంట్ర మండలం వలంటీర్ల పొట్టకొట్టబోమని, తాము అధికారంలోకి వస్తే పారితోషికం రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల్లో పదేపదే చెప్పిన కూటమి నాయకులు తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. ఎన్నికల వాగ్దానం అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. – దిడ్ల సత్యానందం, తణుకు జగనన్న వలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి స్థానికంగా ఉపాధి కల్పించారు. అయితే కూటమి నాయ కులు అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారు. మా ఉద్యోగాలు ఊడగొట్టి నోటికాడ కూడు లాగేసుకున్నారు. – ఎన్.లీలా ప్రియ, కుముదవల్లి -
స్వాతంత్య్ర దినోత్సవాలకు సర్వం సిద్ధం
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరంలోని కలెక్టరేట్ వద్ద పరేడ్ గ్రౌండ్స్ స్వాతంత్య్ర దినోత్సవాలకు సిద్ధమైంది. ఐదు వేదికలు, గ్యాలరీ, స్టాల్స్, శకటాలను గురువారం జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి పరిశీలించారు. వేడుకల నిర్వహణ సందర్భంగా ప్రభుత్వ పథకాలను ప్రతిబింబించేలా శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రొటోకాల్ను అనుసరించి సిట్టింగ్, స్టేజీ ఏర్పాట్లు, తాగునీటి సరఫరా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్కు పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. విద్యుత్లో సరఫరాలో ఆటంకం లేకుండా చూడాలన్నారు. వైద్య శిబిరం, అంబులెన్స్ సిద్ధంగా ఉంచాలన్నారు. ఉపరితల ద్రోణి కారణంగా భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏర్పాట్లను పరిశీలిస్తున్న జేసీ రాహుల్కుమార్రెడ్డి త్రివర్ణ కాంతులతో కలెక్టరేట్ భవనం -
మన్యం వీరుల పోరు అజరామరం
దేశం కోసం ప్రాణాలర్పించిన ధీరులుగిరిజన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను గుర్తించి ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలి. కేఆర్పురం ఐటీడీఏకు కారుకొండ సుబ్బారావు పేరు పెట్టాలి. గిరిజన స్వాతంత్య్ర పోరాట యోధులకు తగిన గౌరవం ఇవ్వాలి. – అయినారపు సూర్యనారాయణ, ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు నేను గిరిజన వీరుడు కారుకొండ సుబ్బారెడ్డి ముని మనవడను. మాది పోలవరం మండలం కోండ్రుకోట. తెల్ల దొరలపై మా తాత చేసిన పోరాటాన్ని మా పెద్దలు మాకు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. సమరయోధుల కుటుంబానికి చెందిన మాకు ఎటువంటి గుర్తింపు లేదు. ప్రభుత్వం ఇప్పటికై నా గుర్తించి మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి. – కారుకొండ అబ్బాయిరెడ్డి, కోండ్రుకోట బుట్టాయగూడెం: బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసి ఉరి కొమ్మలకు వేలాడి ప్రాణాలు విడిచిన గిరిజన పోరాట వీరులు ఎందరో ఉన్నారు. వారి పోరాటాలు, త్యాగాలకు చారిత్రక ఆధారాలు లేకపోయినా ఆనాటి శిథిల భవనాల్లో ఆ జ్ఞాపకాలు నేటికీ సజీవంగానే ఉన్నాయి. ఆ అమర వీరులను దేశ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా స్మరించుకుందాం. వెలుగులోకి రాని వీరుల త్యాగం తెల్లదొరలను ఎదురించి ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో నలుగురు అజ్ఞాత స్వాతంత్య్ర పోరాట వీరులు పశ్చిమ మన్యానికి చెందిన వారు ఉన్నారు. అల్లూరి సీతారామరాజుకి ముందే వీరు పోరాటం చేసి మృతి చెందినప్పటికీ ఆ గిరిజన వీరుల త్యాగాలు వెలుగులోకి రాలేదు. ఆ నలుగురు వీరులు కారుకొండ సుబ్బారెడ్డి, కుర్ల సీతారామయ్య, కుర్ల వెంకట సుబ్బారెడ్డి, గురుగుంట్ల కొమ్మురెడ్డి. వీరు 1858లో బ్రిటిష్ పాలనకు ఎదురు తిరిగి తమ ప్రాణాలను తృణప్రాయంగా విడిచినట్లు చరిత్ర తెలిసిన పూర్వీకులు చెబుతున్నారు. తిరుగుబాటులో కారుకొండ సుబ్బారెడ్డి కీలకం 1857లో యావత్ భారతదేశంలో స్వాతంత్య్ర సమరం ప్రారంభమైనప్పుడు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బ్రిటీష్ వారిపై తిరుగుబాటు జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం కొరుటూరుకు చెందిన కొండరెడ్డి గిరిజన తెగకు చెందిన కారుకొండ సుబ్బారెడ్డి పోలవరం పరిసరాల ప్రాంతంతో పాటు బుట్టాయగూడెం నుంచి యర్నగూడెం వరకూ ఉన్న గిరిజన గ్రామాలకు జమిందారుగా ఉండేవారు. ఆయన స్వాతంత్య్ర సమరం జరుగుతున్న సమయంలో యర్నగూడెంలో ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశాడు. ఆ సమయంలో గోదావరి దిగువ ప్రాంతంలో ఉన్న సుమారు 40 గ్రామాలతో బ్రిటీష్ వారిపై దండయాత్ర చేసి విజయం సాధించారు. సుబ్బారెడ్డికి ముఖ్య అనుచరుడిగా కుర్ల సీతారామయ్య ఉండేవారు. అలాగే గురుగుంట్ల కొమ్మురెడ్డి, అప్పటి తూర్పుగోదావరి జిల్లా కొండమొదలు గ్రామానికి చెందిన కుర్ల వెంకటరెడ్డి కలిసి తెల్లదొరలపై వీరోచిత పోరాటం చేశారు. ఆ సమయంలో సుబ్బారెడ్డి తలకు బ్రిటిష్ వారు రూ.2,500 వెల కట్టారు. చివరకు కొందరు గిరిజనులు వెన్నుపోటు పొడిచి కారుకొండ సుబ్బారెడ్డితోపాటు అతని అనుచరులను, మరికొందరు విప్లవ వీరులను 1858 జూన్ 11వ తేదీన బ్రిటీష్ వారికి పట్టించారు. 1858 అక్టోబర్ 7వ తేదీన కోర్టు విచారణ అనంతరం 8 మందిని అండమాన్ జైలుకు పంపారు. 35 మంది గిరిజన వీరుల్ని గుంటూరు దగ్గరున్న జైలులో యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. కారుకొండ సుబ్బారెడ్డి, కుర్ల సీతారామయ్యలను బుట్టాయగూడెంలో ఉరి తీశారు. మిగిలిన ఆరుగురిని పోలవరం సమీపంలో ఉన్న దివానం వద్ద ఉరి తీశారు. కారుకొండ సుబ్బారెడ్డి చేసిన పోరాటానికి కోపోద్రిక్తులైన బ్రిటీష్వారు సుబ్బారెడ్డి మరణించిన తర్వాత అతడి మృతదేహాన్ని చిన్న బోనులో పెట్టి రాజమండ్రి దగ్గర ఉన్న కోటగుమ్మం వద్ద ప్రజలు చూసేవిధంగా వేలాడదీశారు. స్వాతంత్య్రం రావడానికి కొన్నేళ్ల ముందు వరకూ కూడా సుబ్బారెడ్డి మృతదేహం కోటగుమ్మం వద్ద వేలాడుతూ ఉండేదని పాతతరం వారు చెబుతున్నారు. బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసి ఉరి కొమ్మలకు వేలాడిన ఆ అమర వీరుల పోరు అజరామరం. బ్రిటీష్ వారిపై పోరాటం చేసి మరణించిన వీరుల గ్రామం కొరుటూరు ముంపునకు గురై శిథిలావస్థలో ఉన్న దృశ్యం పాత పోలవరంలో బ్రిటీష్ వారు స్వాధీనం చేసుకున్న రెడ్డిరాజుల భవనం శిథిలావస్థలో ఉన్న దృశ్యం తెల్ల దొరలను గడగడలాడించిన మన్యం బిడ్డలు బ్రిటీష్ వారికి పోరాటయోధులను పట్టించిన వెన్నుపోటుదారులు 8 మంది వీరులను ఉరితీసిన బ్రిటీష్ పాలకులు -
రాష్ట్రపతి విశిష్ట పురస్కారానికి పెద్దిరాజు ఎంపిక
పాలకోడేరు: సీబీఐ అధికారి పాలకోడేరు మండలం శృంగవృక్షం (బంటుమిల్లి) గ్రామానికి చెందిన బండి పెద్దిరాజు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అందించే రాష్ట్రపతి పోలీస్ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం న్యూఢిల్లీలోని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రధాన కార్యాలయం సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డివిజన్లో ఆయన అదనపు పోలీసు సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. 1993లో సీబీఐలో కానిస్టేబుల్గా చేరిన ఆయన తన 32 ఏళ్ల సర్వీసులో ఇప్పటివరకు 150 పైబడి రివార్డులు అందుకున్నారు. 2008లో ఇండియా ఉత్తమ దర్యాప్తు అధికారి గోల్డ్ మెడల్, 2017లో ఇండియన్ పోలీస్ మెడల్ – ఐపీఎం, 2014, 2018లో రెండుసార్లు అత్యుత్తమ దర్యాప్తు అధికారి అవార్డులు, 2019లో ‘డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవార్డు – ఇండియా సైబర్ కాప్ ఆఫ్ ది ఇయర్’ పొందారు. 1997లో సబ్ ఇన్స్పెక్టర్, 2003లో ఇన్స్పెక్టర్, 2016లో డిప్యూటీ ఏఎస్పీ, 2023లో అడిషనల్ ఎస్పీగా ఉద్యోగోన్నతులు పొందారు. కేసుల దర్యాప్తులో కీలకపాత్ర రామర్ హెర్బల్ ఫ్యూయల్ కేసు, పరిటాల రవి హత్య కేసు, న్యాయవాది సతీష్ హత్య అండ్ అంతర్రాష్ట్ర నారాయణన్ హత్య కేసులను మద్రాస్ హైకోర్టు ఆయనకు అప్పగించింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై అసభ్యకరమైన సోషల్ మీడియా పోస్టుల కేసులు, బిట్స్ పిలానీ ఆన్లైన్ పరీక్ష కుంభకోణం, అంతర్జాతీయ ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపుల కేసు, మైక్రోసాఫ్ట్, అమెజాన్లను అనుకరిస్తూ అంతర్జాతీయ టెక్ సపోర్ట్ స్కామ్లు వంటి హై ప్రొఫైల్ కేసులను ఆయన దర్యాప్తు చేశారు. ఇటీవల ఆయన నీట్ 2024 ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో చీఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా పనిచేశారు. అక్కడ ఆయన ప్రయత్నాలు 45 మంది నిందితులను అరెస్టు చేయడానికి, సమగ్ర చార్జిషీట్లను దాఖలు చేయడానికి ఉపయోగపడ్డాయి. బండి పెద్దిరాజుకు రాష్ట్రపతి పోలీసు పతకం లభించడంపై శృంగవృక్షం శ్రీ వాసవీ ఆర్య వైశ్య సంఘం, వాసవీ క్లబ్, గ్రామాభివృద్ధి కమిటీ హర్షం వ్యక్తం చేశాయి. -
ద్వారకాతిరుమలలో లారీ బీభత్సం
● రెండు కార్లను, ఒక ఆటోను ఢీకొట్టిన లారీ ● ఆటో డ్రైవర్కు గాయాలు ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో గురువారం తెల్లవారుజామున ఒక లారీ బీభత్సాన్ని సృష్టించింది. గుడి సెంటర్లో రెండు కార్లను, గరుడాళ్వార్ సెంటర్లో రోడ్డు మధ్యలోని డివైడర్ మీద నుంచి దూసుకెళ్లి ఒక టాటా ఏస్ ఆటోను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం. ద్వారకాతిరుమల క్షేత్రంలో బుధవారం రాత్రి భారీగా వివాహాలు జరిగాయి. పెదపాడు మండలం అప్పన్నవీడు గ్రామానికి చెందిన మాతంగి వెంకటేష్ తన ఆటోలో పెళ్లి బృందాన్ని క్షేత్రానికి తీసుకొచ్చాడు. వారిని కల్యాణ మండపం వద్ద దింపిన తరువాత గరుడాళ్వార్ సెంటర్లోని దేవస్థానం బస్స్టేషన్ వద్ద ఆటోను నిలిపి, అందులో నిద్రిస్తున్నాడు. అలాగే మచిలీపట్నం, విశాఖపట్నంకు చెందిన పెళ్లి బృందాలు వేసుకొచ్చిన రెండు కార్లను గుడి సెంటర్లో నిలిపి, కల్యాణ మండపాల్లోకి వెళ్లారు. గురువారం తెల్లవారుజాము 2 గంటల సమయంలో చింతలపూడి నుంచి కాకినాడకు వెళుతున్న ఒక లారీ గుడి సెంటర్లో నిలిపి ఉన్న రెండు కార్లను ఢీకొట్టింది. అక్కడి నుంచి ఆగకుండా వెళ్లిన లారీ గరుడాళ్వార్ సెంటర్ వద్ద డివైడర్పైకి దూసుకెళ్లి రోడ్డుకు అవతల వైపు దేవస్థానం బస్ షెల్టర్ వద్ద నిలిపి ఉన్న ఆటోను ఢీకొట్టింది. ఆటో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి తగలడంతో స్తంభం కాస్తా విరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో నిద్రిస్తున్న డ్రైవర్ వెంకటేష్కు గాయాలయ్యాయి. రెండు కార్లు, ఆటో ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ మద్యం మత్తే కారణమని పోలీసులు గుర్తించారు. వర్షం వల్ల తప్పిన పెను ప్రమాదం.. క్షేత్రంలో వివాహాలు జరిగే ప్రతిసారి రహదారులు పెళ్లి జనాలతో రద్దీగా ఉంటాయి. అయితే బుధవారం రాత్రి కుండపోత వర్షం కురవడంతో పెళ్లివారు ఎవరూ రోడ్లపైకి రాలేదు. దాంతో ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. గురువారం ఉదయం విద్యుత్శాఖ అధికారులు, సిబ్బంది విరిగిపోయిన విద్యుత్ స్తంభాన్ని తొలగించి, కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. ప్రమాదానికి కారణమైన కాకినాడకు చెందిన లారీ డ్రైవర్ చెరుకూరి లక్ష్మీపతిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. -
ఉపాధ్యాయులకూ పరీక్షే
● విద్యార్థి సామర్థ్యానికి మించి ప్రశ్నలు ● సిలబస్లో లేని ప్రశ్నలు ఇస్తుండటంతో తలలు పట్టుకుంటున్న ఉపాధ్యాయులు ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్ఏ–1 పరీక్షల గురించి ఆరా తీస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..’ ‘ఎఫ్ఏ1 పరీక్షల స్ట్రాటజీని చూసి హార్వర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల డీన్స్ సైతం ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకున్న వైనం..’ ఇవీ ఉపాధ్యాయుల, ఉపాధ్యాయుల సంఘాల వాట్సాప్ గ్రూపుల్లో, వాట్సాప్ ఛానల్స్లో చక్కర్లు కొడుతున్నాయి. నూజివీడు : కూటమి ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వ విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే పాఠశాలల విలీనం చేసి తొమ్మిది రకాల పాఠశాలలను తీసుకురావడమే కాకుండా క్లస్టర్ విధానంను తీసుకువచ్చి అస్తవ్యస్తం చేసిన ప్రభుత్వం ఇప్పుడు పరీక్షల తీరు చూస్తుంటే పరిస్థితులు అత్యంత దారుణంగా ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సిలబస్లో చెప్పిన పాఠాలు ఒకటైతే పరీక్షల్లో ఇస్తున్న ప్రశ్నలు వేరేగా ఉన్నాయని, గణితం గాని, ఇంగ్లిష్ గాని సిలబస్లో పాఠ్యపుస్తకంలో చెప్పిన లెక్కలు నుంచి ఒక్క ప్రశ్న కూడా ఇవ్వలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇలా ఇస్తే విద్యార్థులు ఎలా పరీక్షలు రాయగలరని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ పరీక్షలు చూస్తుంటే విద్యార్థులకు పెట్టినట్లు లేదని, ఉపాధ్యాయులకు పరీక్షలు అన్నట్లు ఉందని వాపోతున్నారు. ఈనెల 11 నుంచి నిర్వహిస్తున్న ఎఫ్ఏ–1 పరీక్షల తీరు, ప్రశ్నాపత్రాల రూపొందించిన విధానం పరిశీలిస్తే ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు మార్కులు రాకుండా ప్రభుత్వ పాఠశాలలను మరింత బలహీనం చేసేందుకే ఇలా చేస్తున్నారా అనే అనుమానాలను ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివించిన, ప్రభుత్వం నిర్ధేశించిన సిలబస్ ఒకటైతే ప్రశ్నాపత్రాలలో ఇచ్చింది మరొకటి కావడం గమనార్హం. దీనిపై ఉపాధ్యాయ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనివల్ల చదివే పిల్లలు కూడా ఉపాధ్యాయులు చెప్పే ప్రశ్నలు చదివినా పరీక్షల్లో రావని చదవకుండా ఉండే అవకాశం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నాపత్రాలు తయారు చేసే వారు ఒకసారి ఆలోచించి చదివినవి, సిలబస్లోనుంచి ఇస్తే కనీసం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల చదువులు ముందుకు వెళ్తాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. అన్ని ప్రశ్నలు కూడా అప్లికేషన్ మెథడ్లో ఇవ్వడం వల్ల చదివే వాళ్లు కూడా చదవకుండా పోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. పరీక్షలనేవి విద్యార్థులు నేర్చుకున్న అంశాలను, వివిధ ప్రశ్నల ద్వారా అంచనా వేసే విధంగా ఉండాలే తప్ప భయపెట్టే విధంగా వారి స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉండకూడదని అంటున్నారు. ఒకటో తరగతి విద్యార్థికి ఏప్రిల్ నెలలో నేర్చుకోబోయే సిలబస్లో ప్రశ్నలు ఆగస్టులో జరిగే యూనిట్ పరీక్షలు ఇవ్వడంపై ఉపాధ్యాయులు విస్మయానికి గురవుతున్నారు. పరీక్షల్లో ఇచ్చిన కొన్ని ప్రశ్నలు ఇలా.. ఒకటో తరగతి పిల్లలు ఇప్పుడిప్పుడే పాఠశాలలకు అలవాటు అవుతున్నారు. ఇంకా కొందరు పాఠశాలకు రావడానికి మొరాయిస్తున్నారు. వీరు ఇప్పుడిప్పుడే తెలుగు, ఇంగ్లిష్ అక్షరాలను గుర్తు పడుతున్నారు. అలాంటి పిల్లలకు ఇంగ్లిష్లో పేరాగ్రాఫ్ ఇచ్చి దానిని విని ఇంగ్లిష్లోని ప్రశ్నలకు సమాధానాలు రాయడం, పదాలు తయారు చేయడం చేయాలి. అలాగే మూడో తరగతి విద్యార్థి తెలుగులో పుస్తక సమీక్ష చేసి, ఆ సమీక్షను సమర్పణ చేయాలి. అలా చేసినప్పుడే వాటికి మార్కులు ఇవ్వాలి. మూడో తరగతి ఆంగ్ల భాష పరీక్షకు నాలుగో తరగతిలోని పాఠాల నుంచి ప్రశ్నలు ఇచ్చారు. ఎస్సీఈఆర్టీలో ప్రశ్నాపత్రాలు రూపొందించే వారికి విద్యార్థి స్థాయి, సామర్థ్యంపై కనీస అవగాహన ఉండటం లేదని ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు. ఉపాధ్యాయులను, విద్యార్థులను ఇబ్బంది పెట్టడానికి తప్ప ఈ పరీక్షలు దేనికి ఉపయోగమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న పరీక్షలపై వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతున్న కార్టూన్లు -
పార్టీ కాకినాడ జిల్లా మహిళా విభాగం ఇన్చార్జిగా జయసరిత
పాలకొల్లు సెంట్రల్: వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా మహిళా విభాగం ఇన్చార్జిగా పాలకొల్లుకు చెందిన రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి క్రరా జయసరితను నియమించారు. ఈ సందర్భంగా తనకు పదవి కల్పించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుది కళ్యాణి, ఉభయగోదావరి జిల్లాల కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్ర సాదరాజు, నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీ హరిగోపాలరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అత్తిలి: మంచిలి గ్రామానికి చెందిన దివ్యాంగ సంఘటన సంఘ నాయకుడు నండూరి రమేష్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ప్రముఖులతో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా దివ్యాంగుల కోట కింద మంచిలి గ్రామానికి చెందిన నండూరి రమేష్ను జిల్లా అధికారులు ఎంపిక చేశారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రమేష్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు కూడా గతంలో పొందారు. నూజివీడు: దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో హుండీలను చోరీ చేసిన దొంగను చాట్రాయి పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ గురువారం నూజివీడులో వివరాలు వెల్లడించారు. ఈనెల 13న సాయంత్రం చాట్రాయి ఊరి చివర పోలవరం వెళ్లే రోడ్డు మలుపులో ఉన్న ఆంజనేయస్వామి గుడి వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా చాట్రాయి వైపు నుంచి పోలవరం వైపునకు మోటార్సైకిల్పై వెళ్తూ అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న పటాన్ సలార్ఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఏలూరు నగరంలోని పడమట వీధికి చెందిన పటాన్ సలార్ఖాన్(56)పై ఇప్పటి వరకు 51 దొంగతనం కేసులు ఉండగా ఏలూరు జిల్లాలో 25, నెల్లూరు జిల్లాలో 23, ఎన్టీఆర్ జిల్లాలో 3 చొప్పున కేసులు ఉన్నాయి. ఇతని వద్ద నుంచి రూ.5,900 నగదు, మోటర్ సైకిల్ను రికవరీ చేశారు. నిందితుడిని అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన నూజివీడు సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ, చాట్రాయి ఎస్సై డీ రామకృష్ణ, హెడ్కానిస్టేబుళ్లు ఎం విజయ్భాస్కర్, జీ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లను అభినందించారు. టి.నరసాపురం: ఒంటరి జీవితాన్ని భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం కె.జగ్గవరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి హెచ్సీ కె.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం కె.జగ్గవరం గ్రామానికి చెందిన బర్రి రాజేష్ (35) పదేళ్ల క్రితం తన పెద్దక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన నెల రోజులకే ఆమె రాజేష్ను విడిచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో రాజేష్ తల్లి వద్ద ఉంటున్నాడని అతనికి చిన్నప్పటి నుంచి కొంచెం మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్ల అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చేదన్నారు. ఈ నేపథ్యంలో ఒంటరి జీవితాన్ని భరించలేక ఈనెల 13న గుర్తు తెలియని మందు తాగి ఇంటివద్ద ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో, స్థానికులు గుర్తించి చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేష్ మృతి చెందాడు. రాజేష్ అన్న ఏలియా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ తెలిపారు. -
నిండా ముంచేను
గణపవరం: భారీ వర్షంతో గణపవరం, కొత్తపల్లి, చినరామచంద్రపురం, కేశవరం, పిప్పర, మొయ్యేరు, కొందేపాడు తదితర గ్రామాల్లో వరి చేలు ముంపుబారిన పడ్డాయి. బుధవారం రాత్రి భారీ వర్షం కురవగా గణపవరం, చినరామచంద్రపురం ప్రాంతాల్లో చేలల్లో మోకాలి లోతు నిలిచిపోయింది. మండల వ్యవసాయ అధికారి ఆర్ఎస్ ప్రసాద్, వ్యవసాయ సిబ్బంది నష్టం అంచనాలు తయారుచేస్తున్నారు. మండలంలో 650 హెక్టార్ల విస్తీర్ణంలో వరి నాట్లు నీటమునిగినట్టు అంచనా వేశారు. అలాగే మండలంలోని పంట, మురుగు కాల్వలు నిండుకుండల్లా ప్రవహిస్తున్నాయి. గట్లు బలహీనంగా ఉన్న చోట్ల రైతులు మట్టితో గట్లను పటిష్టం చేసుకుంటున్నారు. పలుచోట్ల కాలువలకు గండ్లు పడగా రైతులు చేలు మునగకుండా కాపాడుకుంటున్నారు. భారీ వర్షంతో గణపవరం నుంచి భీమవరం వెళ్లే రోడ్డు గోతులమయంగా మారి ప్రయాణం ప్రమాదకరంగా తయారైంది. -
సత్యనారాయణపురంలో చోరీ
ఆకివీడు: మండలంలోని పెదకాపవరం శివారు సత్యనారాయణపురం గ్రామంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది. గ్రామంలోని ఇందుకూరి సూర్యనారాయణరాజు బుధవారం ఉదయం తన ఇంటికి తాళం వేసి పిప్పర గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి గురువారం ఉదయం ఇంటికి వచ్చేసరికి తాళం బద్దలుకొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా తాళాలు తెరిచి ఉండడం, సుమారు రూ.1.60 లక్షల విలువైన ఆరు కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై హనుమంతు నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు టౌన్: టిప్టాప్ దుకాణంలో కూలీగా పనిచేస్తున్న ఓ యువకుడిపై గోడ కూలిపోవటంతో మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఏలూరు నగరానికి చెందిన కోన సాయి (22) బాలబాలాజీ అనే టిప్టాప్ కంపెనీలో టెంట్లు వేసే కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తంగెళ్ళమూడి ప్రాంతంలో నూతన భవన నిర్మాణానికి భూమిపూజ కోసం బుధవారం టెంట్లు వేశారు. అనంతరం గురువారం టెంట్లు తొలగించేందుకు సాయి అక్కడికి వెళ్లాడు. బుధవారం రాత్రి భారీ వర్షంతో గోడలు పూర్తిగా నానిపోయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెంట్లు తీస్తూ ఉండగా ఆకస్మికంగా గోడ అతనిపై కూలిపోవడంతో సాయి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో అతని బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమకు న్యాయం చేయాలంటూ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న ఏలూరు టూటౌన్ సీఐ అశోక్కుమార్ ఘటనా స్థలానికి వెళ్లి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వాగులు పొంగి.. పొలాలు నీటమునిగి
దెందులూరు: భారీ వర్షాలకు కొవ్వలిలో మొండికోడు, బుడమేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి. రెండు వాగుల వరద ఉద్ధృతికి కొవ్వలిలో 100 ఎకరాలు వరి పంట ముంపునకు గురైంది. ఈ రెండు వాగులు వరద పెరిగినా, వర్షాలు ఆగకపోయినా కొవ్వలిలో మరింత ముంపునకు గురయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దెందులూరులో ౖసైఫెన్పై నీటి ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. పెరుగుతున్న నీటి ప్రవాహాన్ని అంచనా వేసి దెందులూరు తహసీల్దార్ బీ.సుమతి, ఎస్సై ఆర్ శివాజీ సైఫన్ పై రాకపోకలను నిలుపుదల చేశారు. స్టాప్ బోర్డులను ఏర్పాటు చేశారు. సైఫన్లో బ్రిడ్జిల వద్ద కాపలాగా గ్రామస్థాయి ఉద్యోగులను ప్రత్యేక డ్యూటీలు వేసి రెండు వైపులా పెట్టారు. చిన్న దళిత వాడ వద్ద పైనుంచి వచ్చే వర్షపు నీరు సీతంపేట కాలువ నుంచి బయటకు రాకుండా ముందుగానే అధికారులు, రైతులు సంయుక్తంగా ఇసుక బస్తాలను రక్షణ గోడగా రెండుచోట్ల ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్లో పొలాలకు వెళ్లే దారి గండి పడింది. పైనుంచి వర్షపు నీరు అధికంగా రావటంతో పొలాలకు వెళ్లే రైతులకు అసౌకర్యం కలిగింది. రోడ్డు పక్కన 10 ఎకరాలు వరి పొలం నీట మునిగింది. -
వైఎస్ ముద్రను చెరిపేసే కుట్ర
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలో ఏర్పాటుచేసిన డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ముఖద్వారం వద్ద యోగముద్రలో ఉన్న వైఎస్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఏర్పాటును అడ్డుకునేందుకు వర్సిటీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి 2023లో ఇక్కడ విగ్రహం ఏర్పాటుచేయాల్సి ఉంది. దీని తయారీకి అప్పటి డిప్యూటీ సీఎం శిల్పికి రూ.10 లక్షలు బయానాగా ఇచ్చారు. వర్సిటీ ముఖద్వారం వద్ద విగ్రహం ఏర్పాటుకు అప్పటి పాలకమండలి తీర్మానం చేసింది. ఇది కార్యరూపంలోకి తేకుండా అక్కడ ఒక రైతు, అతని భార్య బొమ్మలను ఏర్పాటుచేశారు. దీంతో వర్సిటీలో వైఎస్ ముద్రను చెరిపే కుట్ర మరోసారి తేటతెల్లమైంది. ఈ విషయంపై మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కోర్టును ఆశ్రయించారు. విషయాన్ని పరిశీలించాల్సిన కోర్టు దీనికి సంబంధించిన వివరాలు అందచేయాల్సిందిగా ఉద్యాన వర్సిటీ అధికారులను ఆదేశించింది. రైతు ఉద్యాన పంటలతో ఆర్థిక స్వయం సమృద్ధి సాధించాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకాంక్షించారు. దక్షిణ భారత దేశంలో మొదటిది.. దేశంలో రెండవదిగా ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని వెంకట్రామన్నగూడెంలో ఏర్పాటుచేశారు. తాడేపల్లిగూడెం ప్రాంతం వర్సిటీ ఏర్పాటుకు ఎందుకు అనుకూలమో కొట్టు సత్యనారాయణ అంకెలతో అసెంబ్లీలో విపులీకరించారు. గూడెంలో వర్సిటీని అడ్డుకొనే ప్రయత్నం చేసిన కొంతమంది నోటికి తాళం వేశారు. గూడెంలో రాజీవ్ గృహకల్ప సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన దివంగత సీఎం రాజశేఖరరెడ్డి అదే వేదికపై నుంచి గూడెంలో ఉద్యాన వర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అనంతరం 2007లో వెంకట్రామన్నగూడెంలో ఏర్పాటుచేశారు. 2014లో టీడీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. 2015లో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పేరును మార్చాలని జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది. తాజాగా రెండో కుట్ర : వైఎస్ విగ్రహాన్ని ఆయన స్మృతిచిహ్నంగా ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేయడానికి ప్లాట్ఫాం కట్టించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శిల్పికి తయారీ బాధ్యత అప్పగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ విగ్రహం ఏర్పాటుచేయాల్సిన ప్రాంతంలో రైతు దంపతుల బొమ్మను ఏర్పాటుచేసింది. దీంతో కొట్టు సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఉద్యాన వర్సిటీ ముఖ ద్వారం వద్ద వైఎస్ విగ్రహం ఏర్పాటుకు అడ్డుపుల్ల కోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి కొట్టు మాట తప్పారు వైఎస్ కృషితో ఇక్కడ ఉద్యాన వర్సిటీ వచ్చింది. ఆయన సేవలకు గుర్తింపుగా వర్సిటీ ముఖద్వారం వద్ద యోగ ముద్రలో వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని 2023లో నిర్ణయం తీసుకున్నాం. ఈ మేరకు విగ్రహం తయారీకి బయానా ఇచ్చాం. నిర్ణయించిన ప్రాంతంలో విగ్రహం ఏర్పాటుకు అప్పటి పాలకమండలి తీర్మానం చేసింది. అది కాదని రైతు దంపతుల బొమ్మను పెట్టారు. దీనిపై న్యాయస్ధానాన్ని ఆశ్రయించా. విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. – కొట్టు సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం కోర్టు ఆదేశాలు అందలేదు వైఎస్ విగ్రహం ఏర్పాటులో హైకోర్టు ఆదేశాలు ఇంకా మాకు అందలేదు. అందిన తర్వాత గత విషయాలు పరిశీలించి ఉన్నతాధికారి నిర్ణయం తీసుకుంటారు. – బి.శ్రీనివాసులు. రిజిస్ట్రార్, ఉద్యాన వర్సిటీ -
దంచికొట్టిన వాన
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ వర్షం ముంచెత్తింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి, ఆచంట, నియోజకవర్గాల్లో కుండపోత వర్షంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో మోస్తరు వర్షం కురిసింది. భారీ వర్షం కురిసిన ప్రాంతాల్లో ఽప్రధాన రహదారులపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. కొద్దిరోజులుగా ఎండ వేడి, ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు భారీ వర్షంతో వాతావరణం చల్లబడి సేదతీరినా.. లోతట్టు ప్రాంతాల్లోని నీరు నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజల అవస్థలు పడ్డారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి భీమవరం(ప్రకాశం చౌక్): రానున్న 3 జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమతంగా ఉండాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. అందరూ ప్రధాన కేంద్రాల్లోనే ఉండాలని, ఎవరికీ సెలవులు మంజూరు చేయమని స్పష్టం చేశారు. నరసాపురం, మొగల్తూరు, ఆచంట మండలాల్లో ఎక్కువ దృషి్ట్ పెట్టాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. ఎలాంటి ప్రాణ, ధన నష్టం జరగకుండా చూడాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర మందులు, క్లోరిన్, బ్లీచింగ్ తదితర సామగ్రితో సిద్ధంగా ఉండాలని తెలిపారు. వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్ అధికారులు వర్షాలు తగ్గే వరకు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కలెక్టరేట్లో 08816 299181 నెంబరుతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు : భారీ వర్షాల నేపథ్యంలో 14న జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఆదేశాలను ప్రైవేటు విద్యాసంస్థలు తప్పకుండా పాటించాలని, లేనిపక్షంలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇరగవరంలో భారీ వర్షం జలమయమైన రహదారులు నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు యంత్రాంగం అప్రమత్తం నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు -
అధినేతకు నీరాజనం
భీమవరంలో హెలీప్యాడ్ వద్ద మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు స్వాగతం పలుకుతున్న శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రి తానేటి వనిత, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జి గూడూరి ఉమాబాల, పార్టీ భీమవరం, ఉండి సమన్వయకర్తలు చినమిల్లి వెంకటరాయుడు, పీవీఎల్ నరసింహరాజు జోరువానలోనూ అదే అభిమానం ● భీమవరంలో మాజీ సీఎం వైఎస్ జగన్కు ఘన స్వాగతం ● వర్షాన్ని సైతం లెక్కచేయకుండాపోటెత్తిన అభిమానులు ● తరలివచ్చిన ఉమ్మడి పశ్చిమ, తూర్పుగోదావరి నాయకులు ● హెలీప్యాడ్ నుంచి కల్యాణ మండపం వరకూ భారీ జనసందోహం భీమవరం/భీమవరం(ప్రకాశం చౌక్): పశ్చిమగోదావరి జిల్లా భీమవరం విచ్చేసిన మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అ భిమానులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకకు బుధవారం సాయంత్రం వైఎస్ జగన్ విచ్చేశారు. భీమవరంలో హెలీప్యాడ్కు చేరుకున్న జగన్ను మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు, పార్టీ ముఖ్య నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల నాయకులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడి నుంచి వైఎస్ జగన్ భీమవరంలోని వీఎస్ఎస్ గార్డెన్స్లో జరుగుతున్న వివాహ వేడుక వద్దకు వెళ్లారు. ఆయన కాన్వాయ్ వెంట అభిమానులు బైక్ ర్యాలీ గా తరలివెళ్లారు. జై జగన్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా.. వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి రాక ముందే భీమవరంలో వర్షం ప్రారంభమైంది. అప్పటికే జగన్ను చూసేందుకు భీమవరంలో హెలీప్యాడ్, కల్యాణ మండపానికి వెళ్లే దారిలో పార్టీ నాయకులు, కా ర్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. భీమవరంలో జగన్ హెలీకాప్టర్ దిగే సమయంలోనూ భారీ వర్షం కురుస్తున్నా అభిమానులు అలా గే వేచి ఉన్నారు. ఆయన వెంట ఉత్సాహంగా కేరింతలు కొడుతూ కల్యాణ మండపం వరకూ తరలి వెళ్లారు. వర్షంలోనూ అభిమానులకు అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకుసాగారు. కల్యాణ మండపం వద్ద.. వీవీఆర్ గార్డెన్స్లో వేదికపైకి వచ్చిన జగన్ను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. సోపాలు, కుర్చీలు ఎక్కి మరీ ఆయన్ను చూడటంతో పాటు తమ అభిమాన నేతను సెల్ఫోన్లలో బంధించారు. వైఎస్ జగన్ను కలిసిన ప్రముఖులు : వైఎస్ జగన్కు హెలీప్యాడ్ వద్ద నాయకులు ఘన స్వాగతం పలి కారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, నరసాపురం పార్లమెంట్ ఇన్ చార్జ్ గూడూరి ఉమాబాల, మాజీ మంత్రులు చెరు కువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి వెంకటనాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, వంక రవీంద్రనాథ్, భీమవరం, ఉండి, చింతలపూడి, కైకలూరు, పోలవరం, ఉంగుటూరు, ఏలూరు, కొవ్వూరు, రామచంద్రాపురం, అమలాపురం ఇన్చార్జ్లు చినమిల్లి వెంకట్రాయుడు, పీవీఎల్ నర్సింహరాజు, కంభంపాటి విజయరాజు, దూలం నాగేశ్వరరావు, తెల్లం బాలరాజు, పుప్పాల వాసుబాబు, మామిళ్లపల్లి జయప్రకాష్, తలారి వెంకట్రావు, పిల్లి సూర్యప్రకాష్, పినిపే శ్రీకాంత్, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్ కుమార్, పార్టీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నవు డు వెంకటరమణ, సంచార జాతుల విభాగం అధ్యక్షుడు పెండ్ర వీరన్న, పార్టీ నేతలు పేరిచర్ల విజయ నరసింహరాజు, మేడిది జాన్సన్, వేండ్ర వెంకటస్వామి, పాతపాటి శ్రీనివాసరాజు, కోడి విజయలక్ష్మి యుగంధర్, ఏఎస్ రా జు, చిగురుపాటి సందీప్, గాదిరాజు రామరాజు తదితరులు జగన్ను కలిసిన వారిలో ఉన్నారు. -
వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి
భీమవరం: కార్పొరేట్ల చెర నుంచి వ్యవసాయ రంగాన్ని దేశ సంపదను కాపాడుకోవాలని ఎస్కేఎం జిల్లా కన్వీనర్ ఆకుల హరే రామ్ పిలుపునిచ్చారు. క్విట్ కార్పొరేట్ కార్యక్రమంలో గొరగనమూడి రైస్ మిల్ నుంచి బైక్ ర్యాలీ ప్రకాశం చౌక్ చేరుకున్నాక అక్కడ సభ నిర్వహించారు. సభకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. హరేరామ్ మాట్లాడుతూ దేశ ప్రజల సంపదను నల్ల కార్పొరేట్లకు దోచిపెట్టే మోదీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి మరో స్వాతంత్ర పోరాటం చేయాలన్నారు. సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు బి.వాసుదేవరావు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ల అమలుకు ప్రయత్నించి కార్మిక హక్కులను కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్నారన్నారు. టీయూసీసీ జిల్లా నాయకులు దండు శ్రీనివాసరాజు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.రామాంజనేయులు, ప్రజా సంఘాల నాయకులు ఎం.ఆంజనేయులు, బాతిరెడ్డి జార్జి, ఎస్.ఆశ్రీయ్య, బొర్రా అలమహారాజు, చల్లబోయిన వెంకటేశ్వరరావు, బి. నాగు. డి.త్రిమూర్తులు పాల్గొన్నారు. ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం భీమవరం: విద్యాహక్కు చట్టం–2009 పరిధిలో ప్రవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యాంసుందర్ తెలిపారు. 25 శాతం శాతం కోటాలో అర్హత గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలు, అనాథలు, హెచ్ఐవీ బాధితులు, విభిన్న ప్రతిభావంతుల పిల్లలకు అర్హత ఉన్నవారికి ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. వివరాలకు 86391 33614, 95533 80179 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. కూటమి సంబరం వెలవెల భీమవరం: భీమవరంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో కూటమి పార్టీల నాయకులు బుధవారం నిర్వహించిన రైతు సంబరం రైతులు లేక వెలవెలబోయింది. రైతులకు ఏటా రూ.20 వేలు అందిస్తామని హామీ ఇచ్చిన నాయకులు తొలి ఏడాది ఎగ్గొట్టారు. దీనికితోడు దాళ్వా ధాన్యం సొమ్ములను రైతులకు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేయడం, ప్రస్తుత సార్వా సీజన్లో యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో కూటమి నాయకులు నిర్వహించిన కార్యక్రమానికి మొహం చాటేశారు. -
నెత్తురు మరిగితే.. ఎత్తరా జెండా..
కై కలూరు: బ్రిటీష్ సామ్రాజ్యాన్ని అహింస అనే ఆయుధంతో గడగడలాడించిన మహాత్ముని మనోనిబ్బరాన్ని కసిగా చూసిన కళ్లు అవి.. తెల్లదొరల లాఠీ దెబ్బలకు తట్టకున్న శరీరాలు అవి.. స్వాతంత్య్ర సమరోధ్యమంలో జైలు గోడలను తడిమిన చేతులు అవి.. ఆంగ్లేయుల ఫిరంగిలకు దమ్ముగా రొమ్ము చూపు పోరాట పఠిమను చూపిన తెగువ వీరి సొంతం.. అప్పటి స్వాతంత్య్ర సమరయోథులు జీవించిలేకున్నా.. వారి ఆశయాలు సజీవం. గోదావరి నదీ పాయల చుట్టూ ఉద్యమాన్ని ఉరకలేయించారు.. కృష్ణమ్మ చెంత పౌరుషంతో నురగలు కక్కించారు.. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి పశ్చిమతీరంలో ఉద్యమ తీరుపై అలనాటి అలవోకనం ఏలూరు.. సమరహోరు... బ్రిటిష్ పాలనలో ఏలూరు ఒక మిలటరీ స్టేషన్గా ఉండేది. రాజమండ్రి గోదావరి జిల్లాల ప్రధాన కేంద్రంగా ఏలూరు పేరు గడించింది. ఈ పట్టణానికి 1937లో మహాత్మా గాంధీ, 1940లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విచ్చేసి స్వాతంత్య్ర సమరోత్సవాన్ని ప్రజల్లో రేకెత్తించారు. ఉమ్మడి జిల్లాలో గారపాటి సత్యనారాయణ, చింతలపాటి మూర్తిరాజు, మంగళంపల్లి చంద్రశేఖర్, ఉప్పాల కోదండరామయ్య వంటి ఎందరో స్వాతంత్య్ర పోరాటంలో ప్రతిభ చూపారు. భీమవరం, నరసాపురం, పాలకొల్లు, నూజివీడు, ఆచంట ప్రాంతాలు స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించాయి. కదం తొక్కిన కై కలూరు స్వాతంత్య్ర పోరాటంలో కై కలూరు ప్రాంతం కదం తొక్కింది. విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని మహాత్మా గాంధీ నుంచి ఆదేశాలు రావడంతో కై కలూరు తాలూకా నడిరోడ్డుపై విదేశీ వస్త్రాలను ధైర్యంగా తగలబెట్టారు. దీంతో బ్రిటీష్ పాలకులు లాఠీలకు పని చెప్పారు. తుపాకులను ఎక్కుపెట్టారు. అయినా దమ్ముగా రొమ్ము చూపి వారిని ఎదిరించారు. ఎంతోమందిని జైల్లో నెట్టేశారు. స్వాతంత్య్రం సిద్ధించి 25 సంవత్సరాలు గడిచిన సందర్భంగా అప్పట్లో కై కలూరు పాఠశాల వద్ద సమరవీరులు సేవలకు గుర్తుగా స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేశారు. కై కలూరు పంచాయతీ తాలూకా పరిధికి చెందిన ఘంట పేరయ్య, కంతేటి కాశీవిశ్వనాథం, మాగంటి నాయుడమ్మ, గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, మాగంటి సత్యనారాయణ, రుద్రరాజు సూర్యనారాయణరాజు, చిర్రవూరి అచ్యుత రామయ్య, పొన్నాడ శ్రీరామచంద్రుడు, మేక తిరుపతయ్య, గుంటూరు రామదాసు, ఉన్నూరి నరసింహరాజు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లును లిఖించారు. బ్రిటీష్ పాలకుల అడ్డా.. పూర్వం కై కలూరుని కై ంకర్యపురి అని పిలిచేవారు. కొల్లేరు సరస్సు కారణంగా ప్రముఖంగా పేరు గడిచింది. కై కలూరు తాలూకాగా ఉండేది. ఇక్కడి నుంచి బ్రిటీష్ పాలకులు కార్యక్రమాలను కొనసాగించేవారు. కై కలూరు మండలం వింజరం లాకుల వద్ద బ్రిటీష్ పాలనలో పడవలపై కూరగాయల సంత జరిగేది. ఆ గ్రామ సమీపంలో బ్రిటీష్ పాలకులు సేద తీరడానికి కట్టడాలు నిర్మించుకున్నారు. ఇక ప్రధాన పరిపాలన కై కలూరు నుంచి సాగేది. అందుకే కోర్టు, రెవెన్యూ కార్యాలయం, పోలీస్ స్టేషన్, సబ్ ట్రెజరీ, ఆస్పత్రి, సబ్జైలు బ్రిటీష్ పాలకులు ఒకే వరుసలో నిర్మించారు. అప్పట్లో స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ఆందోళన చేసిన వారిని అరెస్టు చేసి కై కలూరు జైలుకు తరలించేవారు. శుక్రవారం ప్రంద్రాగస్టు సందర్భంగా అలనాటి స్వాతంత్య్ర సమరయోధుల వారసుల మనోభావాలు వారి మాటల్లోనే.. బ్రిటీష్ పాలకులపై గర్జించిన అలనాటి యోధులు ఉమ్మడి పశ్చిమలో ఉవ్వెత్తున ఎగసిన స్వాతంత్య్ర కసి కై కలూరులో కదం తొక్కిన ఉద్యమ వీరులు పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమవుతున్న పల్లెలు -
గంజాయి కేసులో ఇద్దరి అరెస్ట్
మండవల్లి: గంజాయి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ వి.రవికుమార్ చెప్పారు. మండపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన వివరాలను వెల్లడించారు. కైకలూరు వెలమపేటకు చెందిన షేక్ ఫరీద్ అబ్బాస్, ముదినేపల్లి మండలం చైతన్యపురంనకు చెందిన ఎలికే రాజేష్ కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయి క్రయ, విక్రయాలకు పాల్పడుతున్నారు. బుధవారం చావలిపాడు వద్ద వీరిని పోలీసులు అరెస్ట్ చేసి నిందితుల నుంచి 755 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఎన్డీపీఎస్ చట్టం ననుసరించి కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు సీఐ చెప్పారు. సమావేశంలో రూరల్ ఎస్సై సీహెచ్ఎస్ రామచంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు. హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణకు సేవా పతకం దెందులూరు: దెందులూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఎన్వీఆర్ సత్యనారాయణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ సేవా పతకం ప్రకటించింది. సత్యనారాయణ పోలీస్ శాఖలో 1993లో కానిస్టేబుల్గా చేరారు. ఆయనకు పోలీస్ సేవా పథకం రావడంపై ఎస్సై ఆర్.శివాజీ, హెడ్ కానిస్టేబుల్, ఇతర కానిస్టేబుళ్లు హర్షం వ్యక్తం చేశారు -
నియోజకవర్గ విలీనంపై రచ్చ
ద్వారకాతిరుమల: ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా జిల్లాల సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పులపై ఏడుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. నెలరోజుల్లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ఆదేశించింది. అయితే ఈ మార్పుల్లో గోపాలపురం నియోజకవర్గం పేరు తెరమీదకొచ్చింది. గతంలో రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విభజన ద్వారా ఆ జిల్లాల సంఖ్యను 26కు పెంచింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఆ జిల్లాల సంఖ్యను 32కు పెంచడంతో పాటు, ప్రస్తుతం ఉన్న జిల్లాల సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పునకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న గోపాలపురం నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలోకి మార్చేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా జిల్లా కేంద్రాల దూరాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ మార్పులు చేస్తోంది. గతంలో ప్రజల అభిప్రాయం మేరకే.. గోపాలపురం నియోజకవర్గంలో ద్వారకాతిరుమల, నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం మండలాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో జిల్లాల విభజన జరిగిన సమయంలో గోపాలపురం నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని నిర్ణయించినప్పుడు, ద్వారకాతిరుమల మండల ప్రజలు తమ మండలాన్ని ఏలూరు జిల్లాలో కలపాలని రాజకీయ పార్టీలకు అతీతంగా ఆందోళనలు చేశారు. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు చినవెంకన్న కొలువైన ద్వారకాతిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలో చేర్చాలని పట్టుబట్టారు. ప్రజాభీష్టం మేరకు అప్పటి ప్రభుత్వం ద్వారకాతిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలో, మిగిలిన మూడు మండలాలు(గోపాలపురం నియోజకవర్గాన్ని) తూర్పుగోదావరి జిల్లాలోకి మార్చారు. ఆ రెండు మండలాల వారికి ఇబ్బందే గోపాలపురం, దేవరపల్లి మండలాల వారికి తూర్పుగోదావరి జిల్లా కేంద్రం ప్రస్తుతం దగ్గరగా ఉంది. దేవరపల్లి నుంచి రాజమండ్రికి 33 కిలోమీటర్లు, గోపాలపురం నుంచి 39 కిలోమీటర్లు, నల్లజర్ల నుంచి 52 కిలోమీటర్లు దూరం. అదే ఈ మూడు మండలాలను ఏలూరు జిల్లాలోకి మారిస్తే దూరం పెరుగుతుంది. దేవరపల్లి నుంచి ఏలూరుకు 66 కిలోమీటర్లు, గోపాలపురం నుంచి 75 కిలోమీటర్లు, నల్లజర్ల నుంచి 45 కిలోమీటర్లు దూరం ఉంది. మండల శివారు గ్రామాల వారికి దూరం మరింత పెరుగుతుంది. సోషల్ మీడియాలో మొదలైన రచ్చ దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల మండలాలను ఏలూరు జిల్లాలో మార్చేప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో ఆ మండలాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను బహిర్గతం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా జిల్లాలు మార్చడం సరికాదని, గోపాలపురం నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంచాలని పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆలోచన చేయాలని కోరుతున్నారు. మరి కొందరు పార్టీలకు అతీతంగా ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలపాలని పోస్టులు పెడుతున్నారు. పరిగణనలోకి తీసుకుంటారా.. జిల్లాల సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పులు చేసేటప్పుడు ప్రజాభిప్రాయాలను కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా.? లేక సబ్ కమిటీ సూచనలనే అమలు చేస్తుందా.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా గోపాలపురం నియోజ కవర్గాన్ని ఏలూరు జిల్లాలో కలిపే అంశంపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.గోపాలపురం నియోజకవర్గ ముఖచిత్రం తెరమీదకొచ్చిన గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం, దేవరపల్లి మండలాలను ఏలూరు జిల్లాలో కలపొద్దని డిమాండ్ నల్లజర్ల మండలం ఎటున్నా ఓకే.. -
పొట్టి శ్రీరాములుతో కలిసి జైలు జీవితం
మా నాన్న పేరు కంతేటి కాశీ విశ్వనాథం. 4గురు మగ, 4గురు ఆడ సంతానం. మా నాన్న గుడ్లవల్లేరులో ఉండగా ఉద్యమంలో పాల్గొన్నందుకు బాపట్ల జైలులో పెట్టారు. అక్కడ పొట్టి శ్రీరాములు, నాన్న పక్కపక్కనే జైలు జీవితం అనుభవించారు. నాన్నకు ప్రభుత్వం తామ్రపత్రం అందించింది. కలిదిండి మండలంలో 5 ఎకరాలు పొలం ఇచ్చారు. కై కలూరులో కాశీరాజు కిరాణాకొట్టుగా నడిపారు. – కంతేటి శ్యామ్ సుందర జగన్నాథరావు, భీమవరం ఆదర్శవాది అచ్యుతరామయ్య మా నాన్న పేరు చిర్రవూరి అచ్యుతరామయ్య. ముగ్గురు ఆడ, ఒక మగ సంతానం. స్వాతంత్య్ర ఉద్యోమంలో అనేక పోరాటాలు చేశారు. మెడికల్ రిప్రజంటేటీవ్గా అప్పట్లో పనిచేశారు. ఆయన మాకు ఎన్నో స్వాతంత్య్ర ఘట్టాలను వివరించేవారు. కై కలూరు ప్రాంతంలో అనేక ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన 1966లో మరణించారు. ఆయన కుమారుడిగా పుట్టడం గర్వంగా ఉంది. – చిర్రవూరి శివరామశాస్త్రి, హైదరాబాద్ ఆచార్య ఎన్జీ రంగా శిష్యుడు మా నాన్న పేరు ఉప్పాల కోదండరామయ్య. ఆచార్య ఎన్జీ రంగా ప్రియశిష్యులు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయనకు ఏడుగురు మగపిల్లలు, ముగ్గరు ఆడపిల్లలు సంతానం. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్లి అక్కడ జైళ్లు నిండటంతో తెనాలిలో బంధించారు. ఆయన 101 సంత్సరాలు జీవించారు. ఆయన చూపిన మార్గం మాకు ఎంతో ఆదర్శం. – ఉప్పాల రవీంద్రబాబు, కై కలూరు -
విద్యుత్ విజిలెన్స్ దాడులు
కై కలూరు: విద్యుత్ మీటర్ల వినియోగంపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు కై కలూరు మండలంలో బుధవారం చేశారు. విజిలెన్స్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు చాగంటి వాసు నేతృత్వంలో 43 బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. మండలంలో కై కలూరు, ఆటపాక, గోపవరం, రాచపట్నం, తామరకొల్లు, వింజరం, వేమవరప్పాడు గ్రామాల్లో మొత్తం 3,009 వివిధ కేటగిరీల సర్వీసులను విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేశాయి. వీటిలో మొత్తం 525 సర్వీసుల నిబంధనలు అతిక్రమించినట్లు నిర్థారించి వారి వద్ద నుంచి రూ.11,40,600 జరిమానాలు వసూలు చేశారు. కార్యక్రమాల్లో గుడివాడ ఈఈ జీబీ శ్రీనివాసరావు, కైకలూరు డీఈఈ బి.రామ య్య, కై కలూరు టౌన్ సెక్షన్ ఏఈ కె.శ్రీనివాసమూర్తి, గుడివాడ డివిజన్ ఏఈలు, డీఈఈలు, ఏ ఈఈ లు, జేఈలు,లైన్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుడి మృతి నరసాపురం: దీర్ఘకాలంగా మున్సిపాలిటీలో పర్మినెంట్ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న ఉల్లంపర్తి కృష్ణమూర్తి (59) గుండెపోటుతో బుధవా రం మృతి చెందారు. పట్టణంలోని అరుంధతి పేటకు చెందిన ఉల్లంపర్తి కృష్ణమూర్తి ప్రతి రోజూ మాదిరిగానే బుధవారం ఉదయం 4 గంటలకు వచ్చి 6వ వార్డులో విధులు నిర్వహిస్తున్నాడు. 11 గంటల ప్రాంతంలో కోవెలగుడి వీధిలో పనిచేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. సహచర కార్మికులు వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కృష్ణమూర్తికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కృష్టమూర్తి విధుల్లో అంకితభావంతో పనిచేస్తూ వార్డు ప్రజలతో తలలో నాలుకలా ఉంటాడని, అతడి మరణం బాధాకరమని పలువురు పేర్కొన్నారు. కృష్ణమూర్తి మృతిపట్ల మున్సిపల్ చైర్పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ, కమిషనర్ అంజయ్య సంతాపం తెలిపారు. -
ఎకై ్సజ్ స్టేషన్పై దాడి
చింతలపూడి: చింతలపూడి ఎకై ్సజ్ పోలీస్స్టేషన్పై నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పలువురు బుధవారం దాడి చేశారు. గ్రామంలో సారా తయారు చేస్తున్న వడిత్యా రామదాసు అనే వ్యక్తిని ఎకై ్సజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పీడీ యాక్టు నమోదు చేస్తున్నారన్న అనుమానంతో బంధువులు, కుటుంబ సభ్యులు దాడి చేసినట్లు ఎకై ్సజ్ సిబ్బంది చెప్పారు. దాడిలో కార్యాలయంలోని కుర్చీలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయన్నారు. ఆ సమయంలో అధికారులు ఎవరూ కార్యాలయంలో లేరు. జరిగిన ఘటనపై అధికారులకు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సిబ్బంది చెప్పారు. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి కాళ్ల: కూలి పనికి వెళ్లి విద్యుత్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై ఎన్. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం కాళ్ళకూరు గ్రామానికి చెందిన ఉబ్బా వెంకన్న(36) బుధవారం కూలి పని నిమిత్తం దొడ్డనపూడి గ్రామం వెళ్లాడు. అక్కడ పనిచేస్తుండగా వర్షపు చినుకుల వల్ల కరెంటు షాక్ కొట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడ్ని వైద్యం నిమిత్తం కాళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. మృతుని అన్నయ్య రాంబాబు ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అథ్లెటిక్స్లో పతకాలు ఏలూరు రూరల్: ఈ నెల 9 నుంచి 11 వరకూ చీరాలలో జరిగిన 36వ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో సత్తా చాటిన ఏలూరు జిల్లా బాలికలకు డీఎస్డీఓ బి శ్రీనివాసరావు ఓ ప్రకనటలో అభినందనలు తెలిపారు. డీఎస్ఏ కోచ్ గంటా కృష్ణకుమారి వద్ద శిక్షణ పొందుతున్న వి రంజని 400 మీటర్ల పరుగు పందెంలో సిల్వర్, 200 మీటర్ల పరుగులో బ్రాంజ్ మెడల్ సాధించిందని వివరించారు. మిడిల్ రిలే విభాగంలో జె పల్లవితో పాటు రంజని సైతం బ్రాంజ్ మెడల్ సాధించారన్నారు. అండర్–20 విభాగంలో బి నీలిమ 400 మీటర్ల పరుగులో బ్రాంజ్ మెడల్, ఎం దొరబాబు పెంఠధలోన్లో బ్రాంజ్ మెడల్ చేజిక్కించుకున్నారని వివరించారు. -
● బాలయోగి వంతెనకు పరదాలు
ఏలూరులోని తమ్మిలేరుపై నిర్మించిన బాలయోగి వంతెనపై కార్పొరేషన్ అధికారులు వంతెనకు ఇరువైపులా పరదాలు కట్టారు. బాలయోగి వంతెన తమ్మిలేరులో వ్యర్థాలు వేస్తున్నారని ‘సాక్షి’ మీడియాలో వస్తున్న వరుస కథనాలకు అధికారులు స్పందించి వ్యర్థాలు వేయకుండా ఇరువైపులా ఇదిగో ఇలా పరదాలు ఏర్పాటు చేశారు. అయినా చుట్టుపక్కల వారు చెత్త, వ్యర్థాలు వేయడం మాత్రం మానలేదు. స్థానికులకు అవగాహన కల్పించి తమ్మిలేరులో చెత్త, వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు -
సేంద్రియ ఎరువుల తయారీపై శిక్షణ
ద్వారకాతిరుమల: రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత సంవత్సరంలో 3.5 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రైతు సాధికార సంస్థ పనిచేస్తోందని ఆ సంస్థ ప్రకృతి వ్యవసాయ విభాగం ప్రాజెక్ట్ అధికారి రాథోడ్ ప్రవీణ్ తెలిపారు. మండలంలోని గుండుగొలనుకుంట గ్రామంలోని బయో రిసోర్స్ సెంటర్ యూనిట్లో ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన 50 మంది బయో రిసోర్స్ సెంటర్ యజమానులకు బుధవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాథోడ్ ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయంలో సాగు విస్తీర్ణాన్ని పెంచే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మరిన్ని బయో రిసోర్స్ సెంటర్లను ఏర్పాటుచేసి, రాష్ట్రస్థాయి నిపుణులతో రిసోర్స్ ట్రైనర్లకు శిక్షణ అందించి, వారి ద్వారా బయో రిసోర్స్ సెంటర్ యజమానులకు ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఎరువుల వినియోగంలో శిక్షణ అందిస్తామన్నారు. ఏలూరు ప్రకృతి వ్యవసాయం డీపీఎం వెంకటేష్, బయో రిసోర్స్ సెంటర్ యజమానులు గోపాల్ కృష్ణ, వెంకటరత్నాజీ, డీపీఎంయూ నుంచి జతిన్ (కమ్యూనికేషన్ ఇంటర్న్), ఎస్పీఎంయూ బృంద సభ్యులు పాల్గొన్నారు. వారు జీవ ఉత్పత్తుల నాణ్యత, బీఆర్సీ యూనిట్ల నిర్వహణ, ప్రకృతి వ్యవసాయం వల్ల నేల, మానవ ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై మార్గనిర్దేశం చేశారు. -
అనవసర పెట్టుబడితో నష్టపోవద్దు
గణపవరం: రైతులు అవసరం లేకుండా ఎరువులు, పురుగుమందులు వాడటం ద్వారా అనవసర పెట్టుబడితో నష్టపోతున్నారని, వ్యవసాయ నిపుణుల సూచనలు పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన గణపవరం మండలం కేశవరంలో వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ఈపంట నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా రైతులను కలిసి ఏ రకాల పంటలు వేసి, పెట్టుబడి, ఎరువుల లభ్యత వంటి అంశాలపై రైతుల నుంచి ఆరా తీశారు. వ్యవసాయ సిబ్బంది తాము ఎదుర్కొంటున్న సమస్యలను జేసీకి వివరించారు. సర్వే నంబరులో ఉన్న పొలానికి 20 మీటర్ల దగ్గరకు వెళ్తే కాని ఈపంట నమోదు కావడం లేదని తెలిపారు. కార్యక్రమంలో ఏవో ఆర్ఎస్ ప్రసాద్, రైతులు యాళ్ల పెద్దిరాజు, దండు గజపతిరాజు, దండు రామచంద్రరాజు పాల్గొన్నారు. -
‘వికసిత్ భారత్’పై వర్క్షాప్
భీమవరం (ప్రకాశంచౌక్): వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసుకోవడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వికసిత్ భారత్ లక్ష్యంగా పాఠశాల విద్య అనే అంశంపై వర్క్ షాప్లో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వికసిత్ భారత్ లక్ష్యాలను వివరించారు. ఈ వర్క్ షాప్లో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్, విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ పాల్గొన్నారు. నులిపురుగులను నులిమేద్దాం భీమవరం అర్బన్: పిల్లలు, విద్యార్థులు నులిపురుగుల నివారణ మాత్రలను వేసుకుని కడుపులోనే నులి పురుగులను నులివేద్దామని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మండలంలోని చినఅమిరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం నులిపురుగు నివారణ మాత్రలను పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ప్రారంభించి మాట్లాడారు. 19 ఏళ్ల లోపు వారందరూ తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు. తప్పనిసరిగా నులి పురుగుల నివారణ మాత్రలను వేసేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, అధికారులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. -
పుంత రోడ్లు ఎక్కడ?
పొలాలకు వెళ్లే దారిలేక ఆక్వా, వరి రైతుల అవస్థలు ఉండి: చోట్ల పుంత రోడ్లు ఆక్వా, వరి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో పుంతలు, కాలువ గట్లపై రోడ్లు లేకపోవడంతో చేలకు వెళ్లాలన్నా, పొలాలకు ఎరువులు, పురుగు మందులు, ఆక్వా చెరువులకు మేత తీసుకుపోవాలన్నా రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పుంతలు లేని చోట్ల రోడ్లు వేసి రైతులకు అండగా నిలబడతామని చెప్పే ప్రజా ప్రతినిధులు ఉండి నియోజకవర్గంలో వందలాది పుంతలు, కాలువ గట్లపై రోడ్లు లేక రైతులు ఇక్కట్లు పడుతుంటే పట్టించుకోవట్లేదు. వందలాది పుంతలపై రోడ్లు వేయాల్సి ఉండగా.. పాములపర్రులో శ్మశాన వాటికను పుంతగా చూపిస్తూ రోడ్డు వేయడానికి మాత్రం హడావుడి చేస్తున్నారు. అడుగు వేస్తే జారిపడిపోయే పరిస్థితుల్లో పుంతరోడ్లు ఉండగా వరి పొలాలకు ఎరువులు, ఆక్వా చెరువులకు మేతలు వంటివి తీసుకువెళ్ళేందుకు రైతులు అదనపు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదనపు ఖర్చుతో రైతుల ఇక్కట్లు చేపలు, రొయ్యలు పట్టుబడి చేసేందుకు అదనపు ఖర్చుతో రైతులు భయపడిపోతున్నారు. వేసవి సమయంలో చెరువుల వద్దకు వెళ్ళే వాహనాలు ఇప్పుడు మెయిన్రోడ్డు కూడా దిగలేకపోవడంతో పట్టుబడి పట్టిన సరుకును మెయిన్రోడ్డుకు చేర్చేందుకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఆక్వా రైతులు మరింత నష్టాల్లోకి వెళ్లిపోతున్నారు. అమెరికా సుంకాల భయాలతో ఇప్పటికే రైతులు తీవ్ర నిరాశలో ఉండగా.. పట్టిన సరుకు ఒడ్డుకు చేర్చేందుకు అదనపు ఖర్చుచేయాల్సి రావడంతో మరింత ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. పుంత రోడ్లు ఎప్పుడు వేస్తారు? నియోజకవర్గంలో వందలాది పుంతల్లో రోడ్ల నిర్మాణం చేయాలని రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. రైతుల ప్రయోజనం కోసం పుంత రోడ్డు నిర్మిస్తున్నామంటూ కబుర్లు చెబుతున్నారు. రైతులు గగ్గోలు పెడుతున్న పుంతల్లో, కాలువ గట్లపై రోడ్లు వేయాలి. – దానం విద్యాసాగర్, న్యాయవాది, పాములపర్రు దళితుల ప్రాంతమే కావాలా? పుంతరోడ్ల నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు. పుంతలేని ప్రాంతంలో ఉందని చెప్పి కేవలం ఇద్దరు ఆక్వారైతుల కోసం అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి రోడ్డు వేస్తారా? దళితుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించి రోడ్డు వేయడం ఏంటి? – తాళ్ళూరి మధు, బహుజన జేఏసీ కన్వీనర్ మా శ్మశానం జోలికి రావద్దు రైతులు మా జోలికి రాలేదు. మేం వారి జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని కొందరు స్వార్థపరులు అవకాశమే లేని చోట రోడ్డు వేయమంటున్నారు. మా శ్మశానం జోలికి ఎవ్వరూ రావద్దు. ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగుదాం. – దర్శి సాల్మన్, వార్డు సభ్యుడు, పాములపర్రు -
అద్దె యజమానుల హడల్
సాక్షి, భీమవరం: ఊహించినట్టే మహిళలకు ఫ్రీ బస్సు హామీని చంద్రబాబు సర్కారు తుస్సుమనిపించింది. జిల్లాలోని పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులకు మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేసింది. ఈ సర్వీసులు జిల్లాలో 197 ఉండగా వీటిలో 40 శాతం అద్దె బస్సులే ఉన్నాయి. ప్రయాణీకుల రద్దీ పెరిగితే తమ బస్సుల మైలేజీ పడిపోయి మెయింటినెన్స్ పెరిగిపోతుందన్న ఆందోళనలో హైర్ బస్సుల యజమానులు ఉన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్రమంతటా ప్రయాణం ఉచితమంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన కూటమి ప్లేటు ఫిరాయించింది. ఈ హామీ అమలుకు ఏడాదికి పైగా ఎగనామం పెట్టింది. ఇప్పుడు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులకు మాత్రమే ఫ్రీ అంటూ చేతులెత్తేసింది. ఏసీ, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, నాన్స్టాప్ సర్వీసుల్లో టిక్కెట్ తీసుకోవాల్సిందేనని స్పష్టంచేసింది. జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం డిపోల పరిధిలో డిపోల పరిధిలో వెన్నెల, స్టార్లైనర్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, పల్లె వెలుగు తదితర బస్సులు 295 ఉన్నాయి. ఇవి మొత్తం రోజుకు లక్ష కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుండగా, 90 వేల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తున్నారు. 40 శాతం హైర్ బస్సులే ఉచిత ప్రయాణానికి నిర్ణయించిన పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు 197 ఉన్నాయి. వీటిలో 73 సర్వీసులను అద్దెకు తీసుకుని నడుపుతున్నారు. హైర్ బస్సులకు 56 సిటీంగ్ కెపాసిటీ ఉండాలి. లీటరు డీజిల్కు 5.6 కిలోమీటర్లు ప్రయాణించాలి. మైలేజ్ షార్టేజ్ వస్తే ఆ భారాన్ని తామే భరించాలని యజమానులు అంటున్నారు. మెయింటినెన్స్ కింద ఒప్పందం మేరకు కిలోమీటరుకు రూ.12 నుంచి రూ.13 చొప్పున ఇస్తున్నారు. ఫ్రీ బస్సు వలన ప్రయాణీకుల రద్దీ పెరుగుతుందని వారంటున్నారు. ఓవర్లోడ్ వలన టైర్లు అరుగుదల, ఇంజన్ సంబంధిత సమస్యలు తలెత్తి మెయింటినెన్స్ పెరిగిపోతుంది. ఆయిల్ షార్టేజీ వస్తుందని యజమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆయిల్ షార్టేజీ వల్ల నెలకు రూ.5 వేల వరకు నష్టపోతుండగా రద్దీతో ఈ నష్టం రూ.20 వేలకు పెరిగే అవకాశముందంటున్నారు. మెయింటినెన్స్ నెలకు రూ.30 వేలు వరకు ఖర్చవుతుంటే రెట్టింపు అవుతుందని చెబుతున్నారు. రవాణశాఖ నిబంధనలు మేరకు సిటీంగ్ కెపాసిటీ 56 మందికే ప్రీమియం చెల్లిస్తామని, ఓవర్ లోడ్తో అనుకోని ప్రమాదం జరిగితే బీమా కొందరికే వర్తిస్తుందని చెబుతున్నారు. నిర్ణీత సమయం కంటే ఆలస్యమైతే తమకు పెనాల్టీలు వేస్తున్నారని, రద్దీ వల్ల జరిగే జాప్యానికి తమనే బాధ్యుల్ని చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అగ్రిమెంట్లో ఫ్రీ బస్సు ప్రస్తావన లేదని, ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు మైలేజీ లీటరుకు 5.6 కి.మీ నుంచి 4.6 కి.మీ తగ్గించాలని, మెయింటినెన్స్ కి.మీ రూ.13 నుంచి రూ. 18కు పెంచాలని యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు జిల్లాకు చెందిన నాయకులు తెలిపారు. ఇప్పటికే నష్టపోతున్నాం ఎంఎస్ఎంఈలో బస్సు తీసుకుని ఆర్టీసీలో హైర్కు నడుపుతున్నాను. నెలకు రూ.1.4 లక్షల వరకు వస్తుంది. బస్సు ఫైనాన్స్ రూ.90 వేలు, డ్రైవర్ల జీతం రూ.40 వేలు, క్లీనర్కు రూ.6 వేలు, మెయింటినెన్స్ రూ.30 వేలు పోగా నెలకు రూ.30 వేలు నష్టం వస్తుంది. ఫ్రీ బస్సు వల్ల రద్దీ పెరిగి మైలేజీ షార్టేజీ, మెయింటినెన్స్ పెరిగిపోతాయి. ఈ మేరకు చార్జీల్లో మార్పులు చేయాలి. – రాపాక మహేష్, హైర్ బస్ యజమాని, సిద్ధాంతం జిల్లాలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులు 197 వీటిలో 40 శాతం అద్దె బస్సులే 56 సీటింగ్ కెపాసిటీతో నడిపేందుకు ఆర్టీసీతో ఒప్పందం ఇప్పుడు ఉచితంతో రద్దీ పెరుగుతుందంటున్న బస్సు యజమానులు మైలేజీ పడిపోయి, నిర్వహణ పెరుగుతుందని ఆందోళన మైలేజీ పరిమితి తగ్గించాలని, నిర్వహణ ఖర్చు పెంచాలని డిమాండ్ సర్వీసులు మొత్తం అద్దె బస్సులు బస్సులు వెన్నెల 1 1 స్టార్ లైనర్ 4 – ఇంద్ర 11 – సూపర్ లగ్జరీ 33 – అల్ట్రా డీలక్స్ 26 1 ఎక్స్ప్రెస్ 20 9 అల్ట్రా పల్లెవెలుగు 19 17 పల్లెవెలుగు 158 47 స్పేర్ 23 – -
ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి
భీమవరం: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో జీవనోపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించాలంటూ మంగళవారం భీమవరం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు యింటి సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పట్టణాల ఆటో యూనియన్ల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్కు చేరుకుని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు యింటి సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ఈ నెల 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్ అమలుచేయడం వల్ల జిల్లాలో 16 వేల మంది ఆటో కార్మికులు ఉపాధిని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు కారణంగా వీరంతా రోడ్డున పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో వర్కర్స్కు ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పించాలని, కార్మికులకు తగిన న్యాయం చేసేంతవరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కట్రెడ్డి వెంకటేశ్వరరావు, తలారి వాసు, టివీకే రాంబాబు, పంపన గోపీ, చెన్నెంశెట్టి వాసు, సంజీవరావు, దుర్గారావు, ములుగుర్తి కృష్ణ, పాలవలస జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మీయ కలయిక
తణుకు అర్బన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ మంత్రి, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ను కలిశారు. వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన సాక్షి, భీమవరం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం భీమవరం రానున్న నేపథ్యంలో హెలీప్యాడ్ ప్రాంతాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి చినమిల్లి వెంకటరాయుడు మంగళవారం పరిశీలించారు. వీఎస్ఎస్ గార్డెన్స్లో జరగనున్న ఉంగటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యేందుకు జగన్ వస్తున్న విషయం తెలిసిందే. జననేతకు స్వాగతం పలుకుతూ పార్టీ శ్రేణులు, అభిమానులు హెలీపాడ్ నుంచి వేదిక వరకూ ఫ్లెక్సీలతో ముంచెత్తారు. -
డిప్యూటీ స్పీకరైతే.. చట్టాలు మీరి వ్యవహరిస్తారా?
ఉండి: డిప్యూటీ స్పీకరైతే చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తారా? అని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుపై మాజీ ఎమ్మెల్యే దిగుబాటి రాజగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని పాములపర్రు దళితుల శ్మశానంలో నుంచి ఇద్దరు ఆక్వా రైతుల కోసం రోడ్డు వేసే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అడ్డుకున్న దళితులపై పోలీసులు దాడులు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ వ్యవహారం రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) నాయకుల బృందం మంగళవారం పాములపర్రులో పర్యటించింది. మాజీ ఎమ్మెల్యే దిగుబాటి రాజగోపాల్ దాడులు చేసిన ప్రాంతాన్ని, రోడ్డు వేయాలని భావిస్తున్న శ్మశాన భూమిని స్థానిక దళితులు, బృంద సభ్యులతో కలసి పరిశీలించారు. రాజగోపాల్ మాట్లాడుతూ దళితులకు రక్షణగా ఉన్న చట్టాలు, జీవోలను పక్కన పెట్టి, వారి జోలికిరావడం చాలా దారుణమని అన్నారు. శ్మశాన భూమి హద్దులు మార్చాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎలా కోరతారని ఆయన ప్రశ్నించారు. తహసీల్దారు పంచాయతీ కార్యదర్శి ద్వారా ఎలా తీర్మానం తీసుకుంటారని నిలదీశారు. నాలుగో తేదీన కార్యదర్శి లేఖ రాస్తే ఐదో తేదీన శ్మశాన సరిహద్దులు మారుస్తూ తహసీల్దారు ఆర్డర్ ఇచ్చేస్తారా? అంటూ మండిపడ్డారు. పేదవారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే అధికారులకు వారాలు, నెలలు పడతాయి కానీ.. భూస్వాములకు కొమ్ముకాస్తే మాత్రం ఒక్కరోజు కూడా సమయం అవసరం లేకుండానే ఆర్డర్లు ఇచ్చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా ఎమ్మెల్యే, అధికారులు కలసి ఆడిన నాటకమని తీవ్రంగా మండిపడ్డారు. అందుకే అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. దమ్ముంటే ఆక్రమణలు బయటపెట్టాలి డిప్యూటీ స్పీకర్, రఘురామకృష్ణరాజుకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గంలో ఎంత ఆక్రమణ ఉందో తెలుసుకునేందుకు సర్వే చేయించి దాని వివరాలు పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలని రాజగోపాల్ సవాల్ చేశారు. పేదల శ్మశానం ఆక్రమణ అంటారా.. ఎవరు ఆక్రమణదారులో తెలుస్తుంది అంటూ మండిపడ్డారు. కేవీపీఎస్ జిల్లా బృందం సభ్యులు క్రాంతి బాబు, విజయ్లతో కలసి ఈ ఘటనపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇంతటితో ముగించకపోతే నియోజకవర్గమంతా ఇదే సమస్య తలెత్తుతుందని చెప్పారు. రోడ్డు వేసేందుకు ముందుకు వెళితే అన్ని రాజకీయ పార్టీలు, దళిత సంఘాలతో కలసి ముందుకు వెళ్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కోర్టులో కేసులు వేస్తామన్నారు. ఇప్పటికై నా రోడ్డు నిర్మాణం విరమించుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాం, చలో పాములపర్రుకు పిలునిస్తాం.. కలెక్టర్ను కలుస్తాం.. ఇలా పాములపర్రు దళితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తేల్చిచెప్పారు. తాను పదేళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశానని గుర్తుచేశారు. ఉండి నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే వెంటనే శ్మశానంలో రోడ్డు వేసే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే దిగుబాటి రాజగోపాల్ పాములపర్రు ఘటనపై గ్రామంలో పర్యటన భూస్వాములకు అండగా ఉండి దళితులను వేధిస్తారా? అని ఆగ్రహం -
యోగా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
నూజివీడు: యోగాసన పోటీల్లో నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈ నెల 10న ఏలూరులోని ప్రేమాలయ ఓల్డేజ్ హోంలో జరిగిన ఈ పోటీలో 14 మంది విద్యార్థులు వేర్వేరు ఆసనాలలో 16 పతకాలను సాధించారు. 9 మంది గోల్డ్ మెడల్స్, ఆరుగురు సిల్వర్ మెడల్స్, ఒకరు బ్రాంజ్ మెడల్ సాధించడం విశేషం. జూనియర్స్ విభాగంలో తనూష, హరిత, దివాకర్లు గోల్డ్ మెడల్స్ సాధించగా, సీనియర్స్ విభాగంలో అశోక్, అభిషేక్, దీపక్ నాయుడు గోల్డ్ మెడల్స్ సాధించారు. హరిత, అశోక్, దీపక్ నాయుడులు యోగాసనాలలోని వివిధ ఈవెంట్లలో రెండేసి చొప్పున గోల్డ్ మెడల్స్ సాధించడం విశేషం. జూనియర్స్ విభాగంలో దేవిశ్రీ, స్పందన, ప్రమీల, వెంకటలక్ష్మి, యుగంధర్, దామోదర్లు సిల్వర్ మెడల్స్ సాధించగా, గీతిక అనే విద్యార్థిని బ్రాంజ్ మెడల్ సాధించింది. యోగాసనాలలో పతకాలు సాధించిన విద్యార్థులను ఇన్చార్జి డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఏఓ లక్ష్మణరావు, అకడమిక్ డీన్ చిరంజీవి, అకడమిక్ అసోసియేట్ డీన్ రఘు, యోగా టీచర్ పి. చంద్రశేఖర్ లు అభినందించారు. అభయాంజనేయ స్వామి హుండీ ఆదాయం లెక్కింపు పెదపాడు: మండలంలోని అప్పనవీడులోని వేంచేసియున్న శ్రీ అభయాంజనేయస్వామి హుండీ ఆదాయం 10,32,522 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మండలంలోని మొండూరు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి ఎం.రాంబాబు పర్యవేక్షణలో హుండీ లెక్కించారు. 76 రోజులకు ఈ లెక్కింపు చేసినట్లు తెలిపారు. ఆక్వా రంగ సమస్యల పరిష్కారానికి కృషి భీమవరం: ఆక్వా రంగ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేస్తానని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. సోమవారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో వెస్ట్ గోదావరి ప్రాన్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ మంత్రిని కలిసి ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిపై అమెరికా 50 శాతం పన్ను విధించడంతో ధరల్లో తీవ్ర వ్యత్యాసం వచ్చిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.జగపతిరాజు, గాదిరాజు వెంకట సుబ్బరాజు వినతిపత్రం అందించారు. శ్రీనివాసవర్మ మాట్లాడుతూ రొయ్యల రైతుల కష్టాలు తనకు తెలుసుని ఆక్వా సాగుకు గతంలో ఉన్న మంచి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. రైతుల ఇబ్బందులను కేంద్ర మంత్రి పియూష్ గోయల్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని శ్రీనివాసవర్మ చెప్పారు. -
డిగ్రీ కళాశాలల్లో బదిలీలు చేపట్టాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సాధారణ బదిలీలను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బదిలీలతో పాటు అధ్యాపకుల రీ డిజిగ్నేషన్, సీఏఎస్ వంటి విషయాలపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్, గవర్నమెంట్ కాలేజ్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఇచ్చిన పిలుపుమేరకు ఈ నిరసన ప్రదర్శన చేశారు. జీసీటీఏ జిల్లా అధ్యక్షుడు ఎం. రాంబాబు, ట్రెజరర్ టీవీ దుర్గాప్రసాద్, జీజీటీఏ జిల్లా ట్రెజరర్ కే. రమేష్, ఇతర అధ్యాపకులు కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బుట్టాయిగూడెంలో.. బుట్టాయగూడెం: భోజన విరామ సమయంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అద్యాపకులు నిరసన కార్యక్రమం చేశారు. నిరసన కార్యక్రమం అనంతరం ప్రిన్సిపాల్ డాక్టర్ మహేంద్రరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. గుడాల గోపికి వైఎస్ జగన్ పరామర్శ వీరవాసరం: వైఎస్సార్సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) సోదరుడు గుడాల వెంకట సుబ్బయ్య (చిన్న) (49) అనారోగ్యంతో సోమవారం ఉదయం వీరవాసరంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో గోపిని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. అందరితో కలుపుగోలుగా ఉండే చిన్న మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. చిన్నకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. యడ్ల తాతాజీ, కర్రా జయసరిత, గాదిరాజు రామరాజు, జుత్తిగ నాగరాజు, డీవీడీ ప్రసాద్, పార్టీ నాయకులు గోపిని పరామర్శించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో 13 మందికి జరిమానా భీమవరం: భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ సెంటర్, గరగపర్రురోడ్డులోని బీవీ రాజు విగ్రహం ప్రాంతాల్లో మద్యం సేవించి బైక్ నడుపుతున్న 13 మందిని అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ జి.కాళీచరణ్ సోమవారం చెప్పారు. పట్టుబడిన వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారని, అతి వేగంగా బైక్ నడిపిన వ్యక్తికి రూ.3 వేల జరిమానా విధించారని సీఐ కాళీచరణ్ చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో జరిమానా ఉండి: ఈ నెల 11న ఉండి పోలీస్స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో నమోదైన 15 కేసుల్లో ముద్దాయిలను కోర్టుకు తరలించగా సోమవారం వారికి జరిమానాలు విధించినట్లు ఉండి ఎస్సై నసీరుల్లా తెలిపారు. వ్యాసరచన పోటీల్లో విజేతలు వీరే భీమవరం: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వోదయ మండలి ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్థాయిలో గాంధీజీ ఆశించిన స్వరాజ్యం అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేత వివరాలను సోమవారం ప్రకటించారు. సీనియర్స్ విభాగంలో ఎం.నాగలక్ష్మి(గోపాలపురం), ఎండీ సుమయ్య(నరసాపురం), ఎ.పూజిత(చినఅమిరం), పి.మంజుశ్రీ(గూట్లపాడు), కేఎస్.అమూల్య(వైఎస్ పాలెం), కె.రిషిత(కేఎస్ రామవరం), కె.దివ్య(మండపాక), ఎస్.అమృత లక్ష్మీసాయి(చిననిండ్రకొలను) విజేతలుగా నిలిచారు. జూనియర్స్ విభాగంలో కె.కుషాలి(బొర్రంపాలెం), డి.కోమలశ్రీ(వేగివాడ కల్లచెరువు), కె.యామిని ఐశ్వర్య(నరసాపురం), ఎన్.అక్షిత(చినఅమిరం), ఎ.సరసాదేవి(అరట్లకట్ట), కె.వర్షిత(భీమవరం), పి.ఆనందిత(పెదనిండ్రకొలను), కళాశాల స్థాయిలో ఎం.విజయమణి(తాడేపల్లిగూడెం), ఇ.వరుణ్(పెన్నాడ), వై.అవినాష్(భీమవరం) విజేతలుగా నిలిచారని వీరికి 13న పెదఅమిరం మహాత్మాగాంధీ ట్రస్ వద్ద, ఏలూరులో 14న పెదనిండ్రకొలను మహాత్మాగాంధీ భవనంలో బహుమతులు అందజేస్తారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం భీమవరం అర్బన్: మండలంలోని దెయ్యాలతిప్ప వద్ద కాళీపట్నం చానల్లో సోమవారం గుర్తు తెలియని మహిళ మృత దేహం కొట్టుకువచ్చింది. స్థానికులు గమనించి వీఆర్వోకు సమాచారం అందించారు. రూరల్ ఐ.వీర్రాజు అక్కడికి చేరుకుని బయటకు తీయించారు. ఆమె వయసు 35 నుంచి 40 మధ్య ఉండవచ్చని నీలం టవల్ కట్టుకుని పైన తెల్లటి జాకెట్ ఉందని ఎస్సై తెలిపారు. కాలువలో ఎక్కువ రోజులు ఉండటం వల్ల గుర్తుపట్టలేని విధంగా ఉందన్నారు. -
●ఎమ్మెల్యే తాలూకా..
ఏలూరు నగరంలో ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు లారీలు, ఇతర భారీ వాహనాల రాకపోకలు నిషేధం. ఈ సమయంలో వాహనాలు పొరపాటున ప్రవేశిస్తే రూ.2 వేలు అంతకుమించి అపరాధ రుసుం చెల్లించాల్సిందే.. ఇదంతా కేవలం సామాన్యులకే వర్తించే రూల్స్.. జూట్మిల్లు సమీపంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు వరుసగా నాలుగు లారీలు రావటంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు ఆపారు. కానిస్టేబుల్ సీఐకు సమాచారం ఇచ్చారు. మేం ఎమ్మెల్యే గారి తాలుకా మా వాహనాలే అపుతారా.. అంటూ డ్రైవర్ ఏవరికో ఫోన్ చేసి ట్రాఫిక్ పోలీసులకు ఇచ్చాడు. వెంటనే ఆ లారీలను నగరంలోకి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
బాస్కెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
ఏలూరు రూరల్: ప్రభుత్వం స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటల పోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని డీఎస్డీఓ బి.శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా జట్ల ఎంపిక పోటీలు జరిగాయి. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు అండర్–22 విభాగంలో మహిళలు, పురుషులకు 10 క్రీడాంశాల్లో ఆటల పోటీలు నిర్వహించనున్నామన్నారు. జిల్లా జట్లకు ఎంపికై న వారు జోనల్ పోటీల్లో తలపడతారన్నారు. పరిశీలకురాలిగా హాజరైన శాప్ డైరక్టర్ కొవ్వాసు జగదీశ్వరి మాట్లాడుతూ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు శాప్ పోటీలు చేపడుతోందన్నారు. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్, హాకీ క్రీడాంశాల్లో పోటీలు చేపట్టి జట్ల ఎంపిక పూర్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం తాడేపల్లిగూడెం (టీఓసీ): రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 59 షెడ్యూల్డ్ కులాలను జనాభా ఆధారంగా మూడు గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు కేటాయించడం సరికాదని కలెక్టర్కు సోమవారం వినతిపత్రం అందించినట్లు చెప్పారు. షెడ్యూల్ కులాల జాబితాలో మార్పులు చేసే అధికారం కేంద్రానికే ఉందని, రాష్ట్రానికి లేదన్నారు. ఆర్డినెన్స్ను రద్దు చేయాలని కోరారు. -
వర్షాభావంతో రైతు దిగాలు
ఏలూరు (మెట్రో): పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో వర్షాభావ సమస్య నెలకొంది. భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. సాగు పనులు 60 శాతం పూర్తి కావాల్సి ఉండగా సరైన వర్షాలు లేక ప్రస్తుతం 30 నుంచి 40 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.పూర్తిస్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఈ సంవత్సరం సాగు చేసుకోవాలా, వద్దా అన్న సందిగ్ధంలో రైతు ఉన్నాడు. పశ్చిమగోదావరి జిల్లాలో గత నెలలో 246.5 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 128.88 మీ.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. జూన్ నెల నుంచి ఆగస్టు 4 నాటికి 365.99 మిమి వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 254.04 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. మెట్ట ప్రాంతంగా ఉన్న ఏలూరు జిల్లాలోనూ ఇదే దుస్థితి నెలకొంది. గత జూలైలో 242.52 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 179.81 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఆగస్టు నెల ఆరంభం నుంచి గత 10 రోజులుగా సాధారణ వర్షపాతం 81.45 మిమి నమోదు కావాల్సి ఉండగా కేవలం 21.54 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. సరాసరి జూన్ నెల నుంచి ఆగస్టు 10 నాటికి పరిశీలిస్తే 438.28 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 274.69 మి.మీ వర్షపాతం నమోదైంది. పూర్తిగా మెట్ట ప్రాంతం, బోర్లు, వర్షాధారంపైనే ఏలూరు జిల్లా రైతులు ఆధార పడ్డాడు. భారీ వర్షాలను ఏలూరు జిల్లా రైతులు ఆశిస్తారు. భారీ వర్షాలు కురిస్తేనే మెట్ట ప్రాంతంలో జలాశయాలు, చెరువులు పూర్తిస్థాయిలో నిండుతాయి. ప్రస్తుతం వర్షాలు కురవకపోవడంతో పంటలు వేసేందుకు రైతులు జంకుతున్నారు. అడుగంటుతున్న భూగర్భ జలాలు భూగర్భ జలాలు రోజురోజుకూ కిందికి వెళ్లిపోతున్నాయి. డెల్టా ప్రాంతంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో గతేడాది జూలైలో 8.9 మీటర్ల స్థాయిలో ఉన్న భూగర్భ జలాలు 9.54 మీటర్ల లోతుకు వెళ్లాయి. ఏలూరు జిల్లాలో గతేడాది జూలైలో 20.26 మీటర్లుగా ఉన్న భూగర్భ జలాలు ప్రస్తుత జూలైలో 21.98 మీటర్ల లోతుకు చేరాయి. వర్షాకాలం ఆరంభంలోనే ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవిని తలపిస్తున్న ఎండలు సరైన వానలు లేక మరింత లోతుకు భూగర్భ జలాలు ఇలాగైతే సాగు ఎలా? వర్షాలు కురవక సాగుకు వీలు లేకుండా పోతుంది. వర్షాకాలం ఆరంభంలోనే సమృద్ధిగా కురిస్తే సాగు పనులకు వీలుంటుంది. ప్రస్తుతం వర్షాకాలం వేసవిని తలపిస్తోంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలవుతున్నా.. సమృద్ధిగా వర్షాలు కురిసిన పాపాన పోలేదు. – దేవళ్లరాజు రాజశేఖర్, రైతు, కొండలరావుపాలెం ఉక్కబోతతో ఇక్కట్లు ఎండలు వేసవిలో మండినట్లు మండిపోతున్నాయి. దీనికి తోడు ఉక్కబోత. పగలు ఎండలు మండిపోతుంటే రాత్రి సమయంలో ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. వర్షాలు కురిస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది. – శ్రీరామ శ్రావణి, కొవ్వలి, గృహిణి -
అసభ్యకర పోస్టులపై చర్యలు తీసుకోవాలి
తూర్పుగోదావరి ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలు ద్వారకాతిరుమల: మాజీ హోం మంత్రి, వైఎస్సార్సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనితపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాలి వేణు సోమవారం జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ద్వారకాతిరుమల మండలానికి చెందిన పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు. దళిత మహిళ అని కూడా చూడకుండా నల్లజర్ల గ్రామానికి చెందిన సవలం రామకృష్ణ ఈ నెల 7న రాత్రి తన ఫేస్బుక్ అకౌంట్ నుంచి వనితను అవమానపరిచేలా పోస్టు పెట్టాడన్నారు. ఈ పోస్ట్ను వేళ్లచింతలగూడెంకు చెందిన మద్దిపాటి మహేష్, నేకూరి చంద్రం, దేవరపల్లి మండలం లక్ష్మీపురానికి చెందిన నగ్గిన నాగేంద్రలు షేర్లు చేశారన్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని ఎస్పీని కోరినట్టు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ద్వారకాతిరుమల మండల కన్వీనర్ ప్రతాపనేని వాసు, పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు మల్లిపూడి నాగమణి, మండల ఎస్సీసెల్ అద్యక్షుడు దాసరి రాంబాబు, బంకా అప్పారావు, పొనమాల ఉమామహేశ్వరరావు, పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ సెక్రటరీ వామిశెట్టి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రోల్బాల్ జట్టు ఎంపిక
తణుకు అర్బన్: ఆంధ్రప్రదేశ్ రోల్ బాల్ స్టేట్ సెలక్షన్ క్యాంప్ ఈనెల 7 నుంచి 10 వరకు తణుకు సిల్వర్ జూబ్లీ కాలనీలోని మునిసిపల్ స్కేటింగ్ పార్కులో నిర్వహించారు. వివిధ విభాగాల్లో జాతీయస్థాయి పోటీలకు జట్టు ఎంపిక చేశారు. మొత్తం 100 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ క్యాంపులో 60 మందిని ఎంపిక చేసినట్లు రోల్బాల్ స్టేట్ సెక్రటరీ అనిల్కుమార్రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 13, 14 తేదీల్లో కేరళలోని కొల్లాంలో నిర్వహించే సౌత్ జోనల్స్కి జట్టును సంసిద్ధం చేశామని చెప్పారు. 60 మంది ఎంపిక కాగా.. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తణుకుకు చెందిన 9 మంది క్రీడాకారులు ఉన్నట్లుగా వివరించారు. కార్యక్రమంలో స్టేట్ టెక్నికల్ చైర్మన్ వీజీ ప్రేమ్నాథ్, స్టేట్ ఆర్గనైజింగ్ డైరెక్టర్ తోట లలిత ప్రియ, కోచెస్ కమిటీ డైరెక్టర్ పూసర్ల సంతోష్ కుమార్, ఉమెన్ కమిషన్ డైరెక్టర్ వానపల్లి లావణ్య, కోచెస్ కమిటీ అసిస్టెంట్ డైరెక్టర్ మధుబాబు, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కోచ్లు పాల్గొన్నారు. -
వీధి కుక్కల దాడిలో గాయాలు
భీమడోలు: భీమడోలు మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేసి దాడి చేశాయి. వేర్వేరు గ్రామాలకు చెందిన వీధి కుక్కల బాధితులు సోమవారం భీమడోలు ఆసుపత్రికి వచ్చారు. వారికి వైద్యులు యాంటీ రాబీస్ వ్యాక్సిన్ వేసి ఇళ్లకు పంపారు. పోలసానిపల్లికి చెందిన నాలుగేళ్ల చిన్నారి షేక్ అమ్మన్, భీమడోలు పంచాయతీ శివారు ఆర్జావారిగూడెంకు చెందిన పాము సుశాంత్(24), ఉమర్(9), మాధవరానికి చెందిన మడిచారాల ఆదిలక్ష్మీ(41), ఎం.నాగులపల్లికి చెందిన తులసి రామ్(34), సండ్రగుంటకు చెందిన కె.రాజు(66), గుణ్ణంపల్లికి చెందిన నక్కా చంద్రవతి(70) వీధి కుక్కల దాడిలో గాయపడ్డారు. కుటుంబ సభ్యులు భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆసుపత్రి సూపరిండెంటెంట్ ఆనంద్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ వేశారు. ఇటీవల భీమడోలు సమీపంలోని ఎం.నాగులపల్లి పంచాయతీ పరిధిలో ఓ ప్రైవేటు పాఠశాలలోకి కుక్కలు చొరబడి ముగ్గురు విద్యార్థులను కరిచాయి. గ్రామాల్లో వీధి కుక్కల సంచారం పెరిగి పోయిందని, వాటి నుంచి ప్రజలను రక్షించాలని గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. -
వైద్యానికి నిర్లక్ష్య రోగం
సాక్షి, భీమవరం: ప్రభుత్వ ఆస్పత్రులకు కూటమి సర్కారు నిర్లక్ష్య రోగం పట్టింది. సమ య పాలన పాటించని వైద్యులు.. అరకొర మందులు.. వైద్య సిబ్బంది కొరత.. సౌకర్యాల లేమి.. రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి.. ఓపీ వద్ద నుంచే పడిగాపులు మొదలవుతున్నాయి. అడుగడుగునా సమస్యలతో అత్యవసర వైద్యం గగనమవుతోంది. సోమవారం జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో సకాలంలో వైద్యులు రాక రోగుల పడిగాపులు, సిబ్బంది కొరతతో వారంలో మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటున్న ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, దీర్ఘ కాల వ్యాధులకు చెందిన మందులు సైతం అందుబాటులో లేని పరిస్థితులు, పారిశుద్ధ్య లేమి తదితర వెతలెన్నో వెలుగుచూశాయి. తణుకు.. ‘ఓపి’క పట్టలేక : తణుకులోని జిల్లా కేంద్ర ఆస్పత్రి 200 పడకలతో సేవలందిస్తున్నా 100 పడకలకు చెందిన వైద్య సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఓపీ వద్ద నుంచే రోగులను కష్టాలు వెంటాడుతున్నాయి. డేటా ఆన్లైన్ ప్రక్రియ ఆలస్యమై క్యూలైన్లో నిల్చోలేక కూలబడిపోతున్నారు. హెల్ప్డెస్క్ లేక ఏ పరీక్షకు ఎక్కడకు వెళ్లాలనే విషయం తెలియక తికమకపడుతున్నారు. పూర్తిస్థాయిలో చీపుర్లు, బ్లీచింగ్ పౌడర్, చేటలు, బయోమెడికల్ కవర్స్, శానిటరీ సామగ్రి సరఫరా లేక తరచూ పారిశుద్ధ్య లేమి పరిస్థితులు తలెత్తుతు న్నాయి. ఇరగవరం, రేలంగి పీహెచ్సీల్లోని వైద్యులు వేళకు రావడం లేదనే ఆరోపణలున్నాయి. అత్తిలి పీహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియన్ లేక రేలంగి పీహెచ్సీ నుంచి వారానికి మూడు రోజులు వస్తున్నారు. మంచిలి పీహెచ్సీలో ఫార్మాసిస్ట్ లేక అత్తిలి పీహెచ్సీ నుంచి మూడు రోజులు వస్తున్నారు. భీమవరం.. సౌకర్యాలు గగనం జిల్లా కేంద్రం భీమవరంలోని ఏరియా ఆస్పత్రిలో జనరల్, బాలింతల వార్డుల్లో తాగడానికి మంచి నీటి సౌకర్యం లేదు. నాలుగు ఏసీలు ఉండగా ఒకటి పనిచేయడం లేదు. టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయి. ఎక్స్రే, స్కానింగ్ల్లో ఇద్దరు టెక్నీషియన్లకు ఒక్కరే ఉన్నారు. ఈసీజీ టెక్నీషియన్ లేడు. ఓపీ వద్ద కూర్చునేందుకు సరిగా బల్లలు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. పాలకొల్లు.. రోగుల ఘొల్లు : పాలకొల్లు ఏరియా ఆస్పత్రిలో సమయానికి వైద్యులు రాకపోవడంతో రోగులు క్యూలైన్లో బారులు తీరి పడిగాపులు కాస్తున్న పరిస్థితి. గర్భిణులు, బాలింతల వార్డు అధ్వానంగా ఉంది. 23 మంది వైద్యులకు 21 మంది వైద్యులు ఉన్నారు. ఎక్స్రే, ఈసీజీలు ఉన్నా స్కానింగ్ కోసం బయటకు వెళ్లాల్సిందే. కొందరు వైద్యులు సెలవుపై వెళ్లడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. తాడేపల్లిగూడెం.. మందుల కొరత తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రిలో మందుల కొ రత తీవ్రంగా ఉంది. స్కానింగ్లు బయటకు రాస్తున్నారు. దంత వైద్యానికి వచ్చే వారికి పళ్లు చెక్ చేయడానికి సరైన పరికరాలు లేవు. వెంకట్రామన్నగూ డెం, మాధవరం పీహెచ్సీల్లో ల్యాబ్ టెక్నీషియన్లు వారానికి మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. పెంటపాడు మండలంలో షుగర్, బీపీ మాత్రలు అందుబాటులో ఉండటం లేదు. నాలుగు నెలలుగా 104 ద్వారా సరఫరా నిలిచిపోయినట్టు రోగులు చెబుతున్నారు. నరసాపురం.. సిబ్బంది లేమి నరసాపురం పట్టణంలోని రెండు పీహెచ్సీల్లో అసౌకర్యాలు వెంటాడుతుండటంతో రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రూరల్లోని ఎల్బీచర్ల, తూర్పుతాళ్లు పీహెచ్సీల్లో పార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, వాచ్మెన్ పోస్టులు ఖాళీగా ఉ న్నాయి. మొగల్తూరు పీహెచ్సీలో 19 మంది ఏఎన్ ఎంలకు 12 మంది మాత్రమే ఉన్నారు. ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గర్భి ణులకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాల్సిన స్టాఫ్ నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉండి.. సమస్యలు దండి ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు సీహెచ్సీలో షు గర్ మాత్రలు, ఇన్సులిన్ కొరత ఎక్కువగా ఉంది. సీహెచ్సీతో పాటు పెదకాపవరం, ఉండి, యండగండి పీహెచ్సీల్లో వైద్యుల కొరత వేధిస్తోంది. పాలకోడేరు పీహెచ్సీకి అధిక సంఖ్యలో రోగులు రాగా ఇద్దరు వైద్యులకు ఒక్కరే విధులకు హాజరయ్యారు. దీంతో గర్భిణులు, రోగులు వేచి ఉండాల్సి వచ్చింది. ఆచంట.. క్షీణించిన పారిశుద్ధ్యం ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండ సీహెచ్సీలో పారిశుద్ధ్యం లోపించింది. సీహెచ్సీ చుట్టూ రోడ్డు సరిగాలేక బురదమయంగా మారడంతో రాకపోకలకు రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలో లేని మందులను బయటి నుంచి తెప్పించి ఇస్తుండటంతో అప్పటివరకు రోగులు వేచి ఉండాల్సి వస్తుంది. జనరల్ మెడిసిన్ ఆఫీసర్, జనరల్ డ్యూటీ సిబ్బంది కొరతతో మిగిలిన వైద్య సిబ్బందిపై పనిభారం పడుతోంది. ఆస్పత్రులకు సుస్తీ వేళకు విధులకు హాజరు కాని వైద్యులు పూర్తిస్థాయిలో సరఫరా అవ్వని మందులు సేవల కోసం రోగుల పడిగాపులు ఓపీ నమోదుకు తప్పని తిప్పలు వేధిస్తున్న వైద్య సిబ్బంది కొరత గగనంగా అత్యవసర వైద్యం పట్టించుకోని కూటమి ప్రభుత్వం వైద్యుల కొరత ఇలా.. ఆస్పత్రి మంజూరు పనిచేస్తున్నవారు ఖాళీలు తణుకు జిల్లా ఆస్పత్రి 34 27 7 నరసాపురం ఏరియా ఆస్పత్రి 23 18 5 పాలకొల్లు ఏరియా ఆస్పత్రి 23 21 2 భీమవరం ఏరియా ఆస్పత్రి 23 18 5 తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రి 23 16 7 ఆచంట సీహెచ్సీ 8 6 2 ఆకివీడు సీహెచ్సీ 8 6 2 పెనుగొండ సీహెచ్సీ 8 7 1 ఇన్సులిన్ ఇవ్వడం లేదు ఆకివీడు సీహెచ్సీలో రెండు నెలల నుంచి సుగర్ మాత్ర ఒక్కటే ఇస్తున్నారు. రెండో మాత్ర లేదంటున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇన్సులిన్ ఇవ్వడం లేదు. బయట కొనుగోలు చేయాలంటే ఖరీదు ఎక్కువ, ఆర్థిక భారంగా ఉంది. పేదలకు ఇన్సులిన్ అందుబాటులోకి తీసుకురావాలి. – కె.భాగ్యలక్ష్మి, షుగర్ బాధితురాలు, ఆకివీడు చాలా ఇబ్బంది పడుతున్నా.. మాది నరసాపురం. నాకు షుగర్. ఉదయం, రాత్రి ఇన్సులిన్ చేసుకోవాలి. నరసాపురం ప్రభుత్వాస్పత్రిలో ఇంజక్షన్ బాటిల్ అడిగితే లేవంటున్నారు. దీంతో పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి వస్తున్నా. ఇంజక్షన్ కోసం మూడు రోజులకోసారి ఇక్కడకు రావడం చాలా ఇబ్బందిగా ఉంది. – దేవి నాగేశ్వరరావు, షుగర్ బాధితుడు, నరసాపురం జిల్లాలో ఆస్పత్రులు జిల్లా ఆస్పత్రి 1 సీహెచ్సీలు 3 ఏరియా ఆస్పత్రి 5 పీహెచ్సీలు 34 యూపీహెచ్సీలు 18 రోజుకు సగటున ఓపీ 15,285 -
రేపు వైఎస్ జగన్ పర్యటన షెడ్యూల్ ఇలా..
సాక్షి, భీమవరం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం భీమవరం విచ్చేయనున్నారు. ఉంగటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. జగన్ పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను సోమవారం పార్టీ కేంద్ర కా ర్యాలయం విడుదల చేసింది. 13న మ ధ్యాహ్నం 3.15 గంటలకు తాడేపల్లిలోని నివాసం వద్ద నుంచి 3.20 గంటలకు హెలీప్యాడ్కు వస్తారు. 3.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4.15 గంటలకు భీమవరంలోని వీఎస్ఎస్ గార్డెన్స్ సమీపంలోని హెలీప్యాడ్కు చేరుకుంటారు. రోడ్డు మార్గం గుండా 4.35 గంటలకు వివాహ వేదిక వీఎస్ఎస్ గార్డెన్కు చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం 5.10 గంటలకు హెలీప్యాడ్ నుంచి తాడేపల్లి బయలుదేరి వెళతారు. పాములపర్రు సమస్యను పరిష్కరించాలి ఉండి: మండలంలోని పాములపర్రులో జరుగుతున్న శ్శశాన వాటికలో రోడ్డు నిర్మాణ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నర్సింహరాజు అన్నారు. సోమవారం పెదఅమిరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పాములపర్రులో దళితులపై దాడి ఘటన బాధాకరమన్నారు. శ్మశాన వాటిక వంటి సున్నిత అంశాల్లో అధికారులు మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేదని అన్నారు. ఎవరి మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతినకుండా నిర్ణయం తీసుకోవాలన్నారు. దళితుల సమస్య పరిష్కారానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని కోరారు. దళితులకు న్యాయం జరిగేలా వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. ఘటనను నిశితంగా పరిశీలిస్తున్నామని, పార్టీ అధినాయకులకు సమాచారం అందించామన్నారు. అధికార పార్టీ వారు ముందుకు వస్తే తాము కూడా ముందుకు వస్తామని, సమస్యను పరిష్కరించేలా కృషి చేద్దామని పీవీఎల్ అన్నారు. గుంతలు పూడ్చివేత కాళ్ల: రాష్ట్రీయ రహదారిపై కాళ్ల పరిధిలో హై స్కూల్ సమీపంలో గుంతలను పూడ్చారు. ‘గుంతలు పూడ్చండి.. చింతలు తీర్చండి’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. హైస్కూల్ సమీపంలోని టర్నింగ్లో గుంతలను సోమవారం పూడ్పించారు. పరిష్కారంలో జాప్యం తగదు భీమవరం: పోలీసు శాఖకు వచ్చే ప్రజా ఫిర్యా దుల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పో లీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా 12 మంది నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ఆయా సమ స్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు పాల్గొన్నారు. నులి పురుగుల నివారణతో ఆరోగ్యం భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యాక్రమం పోస్టర్ను కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆవిష్కరించారు. నులి పురుగులతో పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుందని, వీటిని నివారించడం ద్వారా ఆరోగ్యం సమకూరుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా పిల్లలకు మాత్రల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. డీఎంహెచ్ఓ జి.గీతాబాయి, ఆర్బీఎస్కే పీఓ సీహెచ్ భావన తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ శాఖలో సిఫార్సు బదిలీలలు!
ఏలూరు (ఆర్ఆర్పేట): తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో త్వరలే జరిగే పదోన్నతులు, బదిలీలపై ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉండటంతో వారు పనిచేసే స్థానాలను ఆశిస్తూ ఇప్పటికే కొందరు అధికారులు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్కు సమర్పించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వ్యూహాత్మకంగా పావులు ఏలూరు ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ పి.సాల్మన్రాజుకు రానున్న జనవరిలో చీఫ్ జనరల్ మేనేజర్గా పదోన్నతి లభించనుంది. దీంతో ఈ పోస్టు ఖాళీ కానుంది. అలాగే భీమవరం సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.ఝాన్సీకి ఇప్పటికే ఎస్ఈగా పదోన్నతి కల్పించాల్సి ఉంది. అయితే కొన్ని సమీకరణాల కారణంగా ఆమె స్వయంగా పదోన్నతిని వాయిదా వేసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. భీమవరం ఎస్ఈ ఎ.రఘునాథబాబు ఈనెల 24 వరకూ సెలవు పెట్టారు. దీంతో ఈ స్థానానికి ఏలూరు ఎస్ఈని ఇన్చార్జిగా నియమిస్తూ సీఎండీ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. కాగా ఏలూరు ఎస్ఈ సాల్మన్ రాజు ఏలూరు స్థానానికి వచ్చి మూడేళ్లు ముగుస్తున్నందున ఆయన్ను తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంది. దీంతో ఆయనకు తొలుత భీమవరం సర్కిల్కు ఎఫ్ఏసీగా బాధ్యతలు ఇచ్చి, అనంతరం భీమవరం స్థానాన్ని కేటాయించడానికే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. సీఎండీకి సిఫార్సు లేఖలు ఏలూరు ఎస్ఈ స్థానం ఖాళీ అయితే భీమవరం సర్కిల్ ఈఈ (టెక్నికల్) ఝాన్సీని అక్కడికి బదిలీ చేస్తారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఆమె స్థానంలోకి (భీమవరం) కాకినాడ జిల్లా జగ్గంపేటలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను బదిలీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. ఇదిలా ఉండగా సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఎస్ఈ హోదాలో పనిచేస్తున్న ఓ అధికారి సైతం ఏలూరు ఎస్ఈ స్థానానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఆయన గతంలో ఏలూరు సర్కిల్ పరిధిలో వివిధ హోదాల్లో పనిచేసినందున సర్కిల్పై పట్టు ఉండటంతో కొందరు కూటమి ఎమ్మెల్యేలు ఆయన్ను ఇక్కడ నియమించాలని పట్టుపడుతున్నట్టు తెలిసింది. అలాగే భీమవరం టౌన్ ఏఈఈగా పనిచేస్తున్న అధికారికి ఈఈ గా పదోన్నతి కల్పించి ఆయన్ను జగ్గంపేట ఈఈగా నియమించే అవకాశం ఉందంటున్నారు. ఈ మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలువురు కూటమి ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలను కూ డా సీఎండీకి పంపినట్టు చర్చించుకుంటున్నారు. వేధింపులతో.. కూటమి ఎమ్మెల్యేల వేధింపులతో ఓ అధికారి బలి అవుతున్నాడనే చర్చ ఉద్యోగవర్గాల్లో జోరుగా సాగుతోంది. వారం క్రితం టెలీ కాన్ఫరెన్స్లో భీమవరం ఎస్ఈ రఘునాథబాబు పనితీరుపై సీఎండీ అందరి ముందు మందలించడంతో ఆయన కినుక వహించి సెలవు పెట్టారనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు భీమవరం సర్కిల్లో అధిక శాతం ఓ సామాజిక వర్గానికి చెందిన అధికారులే పనిచేస్తుండటం, వారంతా రఘునాథబాబుపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేస్తూ వేధిస్తున్నారని అంటున్నారు. వీటిని భరించలేక ఆయన సీఎండీ కార్యాలయంలో స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందంటూ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. బదిలీలు, పదోన్నతులపై చర్చ ఇప్పటికే ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలంటూ గుసగుసలు వేధింపులు భరించలేక భీమవరం ఎస్ఈ వీఆర్ఎస్కు దరఖాసు ్త! -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించం
కలెక్టర్ నాగరాణి భీమవరం (ప్రకాశం చౌక్): ప్రజాసమస్యల పరి ష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో అర్జీల పరిష్కారంలో జిల్లా వెనుకబడి ఉండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టా లని అధికారులకు సూచించారు. మొత్తం 180 అర్జీలను స్వీకరించారు. డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, డ్వా మా పీడీ కేసీహెచ్ అప్పారావు, సచివాలయాల అధికారి వై.దోసిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● భీమవరం 12 వార్డు బ్రిడ్జి పేట పంట కాలువ పక్క రోడ్డును ఆనుకుని 40 ఏళ్లగా నివాసం ఉంటున్నామని, రోడ్డు విస్తరణలో మా ఇళ్లు తొలగించారని ఈ ప్రాంత వాసులు కలెక్టర్ వద్ద మొరపెట్టుకున్నారు. ● పాలకోడేరు మండలం కొరుకోల్లులోని దళితపేటలో ప్రభుత్వానికి చెందిన 2 సెంట్ల భూమి ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించగా అధికారులు ఇంటి స్థలంగా పట్టాలు ఇచ్చారని దళితపేటవాసులు ఫిర్యాదు చేశారు. ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని, మాలల హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్, దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్కుమార్ అ న్నారు. కలెక్టరేట్ వద్ద మాల సంఘాల జేఏసీ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందించారు. దేశ సమైక్యతకు పాటుపడాలి భీమవరం: యువత దేశ సమగ్రత, సమైక్యతకు పాటుపడాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. సోమవారం ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీని స్థానిక ఎస్ఆర్కేఆర్ కళాశాల వద్ద ఆమె ప్రారంభించారు. ఈనెల 13 నుంచి 15 వరకు ఇళ్లు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో జెండాలను ఎగురవేయాలని ఆమె అన్నారు. అనంతరం సుమారు 2 వేల మంది విద్యార్థులతో 200 మీటర్ల భారత త్రివర్ణ పతాకాన్ని చేతబూని ర్యాలీ నిర్వహించారు. -
ఏపీలో ఉన్నది ప్రజాస్వామ్యమా? రాచరికమా?
మాజీ మంత్రి కారుమూరి మండిపాటు తణుకు అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా.. రాచరిక వ్యవస్థ నడుస్తోందా అనే సందే హాలు ప్రజల్లో సైతం వ్యక్తమవుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికల్లో పట్టు కోసం కూటమి నేతలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీతో పాటు పార్టీ శ్రేణులపై దాడికి దిగి నీచపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిప డ్డారు. ఒక గ్రామానికి చెందిన ఓటర్లు మరో గ్రా మం వెళ్లి ఓటేయాల్సిన పరిస్థితులను ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఓట్ల శాతాన్ని తగ్గించేందుకు ఇటువంటి కుట్రలకు దిగుతోందని మండిపడ్డారు. పోలీసులు వారికి తొత్తులుగా మారారని, డీఐజీ స్థాయి అధికారి వెటకారంగా మాట్లాడటం హేయమన్నారు. పులివెందులలో బ్యాలెట్ పేపర్ ఓటింగ్తో చంద్రబాబుకు భ యం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఈవీఎం ముఖ్యమంత్రి.. ఈవీఎం ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజలంతా కూటమి ప్రభుత్వాన్ని ఈవీఎం ప్ర భుత్వంగా భావిస్తున్నారని, ఈవీఎం సీఎం గాను, ఈవీఎం ఎమ్మెల్యేలు గాను అంటున్నారని కా రుమూరి అన్నారు. ఈవీఎం స్కామ్ గురించి వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ముందుగానే అనుమానం వ్యక్తం చేశారన్నారు. ఈవీఎం మిషన్లు చూపించిన ఓటింగ్కు, ఈవీఎం ప్యాడ్ల సంఖ్యకు భారీగా తేడా వచ్చినా ఎన్నికల అధికారులు పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వానికి వంతపాడారని విమర్శించా రు. వీటన్నింటిపై పార్టీ తరఫున న్యాయస్థానానికి వెళ్లినట్టు చెప్పారు. 45 ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు తనకు ఓట్లు వచ్చినచోట అభివృద్ధి చేయాల్సింది గాను, వైఎస్సార్సీపీ వాళ్లకు ఏ పనులూ చేయరాదని అధికారులకు సూచించడం దుర్మార్గమన్నారు. ఎన్నికల ముందు సంపద సృష్టించి సంక్షేమం అందిస్తామని చెప్పి, ఇప్పుడు పీ4 విధా నాన్ని అమలుచేస్తున్నామంటూ చేతులెత్తేశారన్నా రు. ఆ పీ4 ప్రక్రియను మీ పచ్చ చానల్లోనే ఉతికి ఆరేశారంటూ గుర్తుచేశారు. తణుకులో ఆవులు, గే దెల కోతలు, బెల్టు దుకాణాలు, సెటిల్మెంట్లతో దోపిడీ జరుగుతుందని విమర్శించారు. పంచాయ తీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ యిండుగపల్లి బలరామకృష్ణ, నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు మెహర్ అన్సారీ, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ పాల్గొన్నారు. -
శ్శశాన భూమి హద్దులు మార్చేందుకు కుట్ర
దళిత మహిళల నిరసన ఉండి: పాములపర్రు ఘటనలో శ్శశాన వాటిక భూ మి రికార్డుల తారుమారుపై పంచాయతీ కార్యదర్శి అప్పారావును నిలదీసేందుకు వెళ్లిన దళిత మహిళలకు నిరాశ ఎదురైంది. శ్శశాన భూమిపై వాదోపవాదాలు, దళితులపై దాడి జరిగిన ఘటనల నేపథ్యంలో గ్రామానికి కొత్తగా వచ్చిన పంచాయతీ కార్యదర్శి శ్శశాన భూమి సరిహద్దులు మార్చాలంటూ పంచాయతీ పాలకవర్గానికి, దళితులకు సమాచారం లేకుండా తహసీల్దార్కు లేఖ రాశారు. దీంతో అధికారులు ఆఘమేఘాలపై శ్శశాన భూమి సరిహద్దులు మార్చేయడంపై దళితులు ఉలిక్కిపడ్డారు. దీనిపై ఆరా తీసేందుకు సోమవారం ఉదయం పంచాయతీ కార్యాలయానికి వెళ్లగా పంచాయతీ కార్య దర్శి రాలేదు. కార్యాలయంలో ఉన్న సచివాలయ ఉద్యోగులు తమకేమీ తెలియదని చెప్పారు. కార్యదర్శికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో సాయంత్రం వరకు కార్యాలయం వద్దనే కూర్చుని దళిత మహిళలు తిరిగి వెళ్లిపోయారు. పంచాయతీ కార్యాలయంలో తమకు సమాధానం చెప్పేవారే లేరని, అధికారులు చిన్నచూపు చూస్తున్నారంటూ దళిత మహిళలు ఆరోపించారు. శ్మశానంలో రోడ్డు వే యాలని పట్టుదలకు పోవడంతో రికార్డులు తారుమారుతో కుట్ర జరుగుతుందనే అనుమానం కలుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎంపీడీఓ శ్రీనివాస్ను ఆరా తీయగా పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్కు కలిసిపూడి, పాములపర్రు రెండు పంచాయతీల బాధ్యతలు ఉన్నాయని, సోమవారం కలిసిపూడిలో ఉన్నారన్నారు. ఎంపీడీ ఓ కార్యాలయానికి కూడా వచ్చి వెళ్లారని చెప్పారు. -
ఆటో డ్రైవర్ల ఆక్రందన
కూటమి ఏకపక్ష నిర్ణయం తమ ఉపాధిని దెబ్బతిసేలా ఉచిత బస్సు పథకం అమలుపై కూటమి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆటో యూనియన్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఆటో యూనియన్లతో కనీసం చర్చించలేదని అంటున్నారు. ఆటోల ద్వారా ప్రభుత్వానికి పలురకాలుగా ఆదాయం వస్తుందని చెబుతున్నారు. డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి, ఆర్థిక సాయం వంటి వాటిపై మాట్లాడకపోవడం దారుణమని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తమను ఆదుకోవాలని కోరుతూ జిల్లాలోని ఆటో కార్మికులు మంగళవారం కలెక్టర్కు వినతిపత్రం అందించడానికి సన్నద్ధమవుతున్నారు. భీమవరం(ప్రకాశం చౌక్): కూటమి ప్రభుత్వం అ మలు చేయనున్న ఉచిత బస్సు (సీ్త్ర శక్తి) పథకంతో తాము ఉపాధి కోల్పోతామంటూ ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేసి, ఫైనాన్స్లపై ఆటోలు కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నామని, ఉచిత బస్సుతో ప్రయాణికులు లేక, ఆటోలు నడవక తాము బతికేదెలా అంటూ ఆవేదన చెందుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి, ఆర్థిక సాయంపై మాట్లాడకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదని అంటున్నారు. ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. ఉమ్మడి పశ్చిమలో 20 నుంచి 60 ఏళ్ల వయసున్న సుమారు 47 వేల మంది కార్మికులు ఆటోలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తమ పొట్ట కొట్టడానికి ఈ పథకాన్ని తీసుకువచ్చారని వీరు మండిపడుతున్నారు. ఇప్పటికే ఉచిత బస్సుపై పలు రూపాల్లో ఆందోళనలు తెలుపుతున్నారు. ఫైనాన్స్లో కొనుగోలు జిల్లాలో నడుస్తున్న 90 శాతం ఆటోలను డ్రైవర్లు ఫైనాన్స్లో కొనుగోలు చేశారు. ఆటో ధర రూ.4 లక్షల వరకు ఉండగా.. నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు వాయిదా కడుతున్నారు. అలాగే నెలకు ఆటో నిర్వహణకు రూ.2 వేలు, మరమ్మతులకు రూ.3 వేలు మొత్తంగా రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతుంది. వీటితో పాటు రవాణా శాఖ అధికారుల కేసులు, ఏడాదికి బ్రేక్, ఫిట్నెస్స్ కోసం ఖర్చులు అదనం. ఈ పరిస్థితుల్లో రోజుకు డీజిల్ ఖర్చులు కాకుండా వీటి కోసమే రూ.800కు పైగా వెచ్చించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఉచిత బస్సుతో ప్రయాణికులు లేక ఆటోలు నడపకపోతే జీవ నం ఎలా సాగుతుందని డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. అప్పు లు తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. మాకు న్యాయం చేయాలి ఇప్పటికే ఆటోలు పెరిగి డ్రైవర్లకు ఉపాధి అంతంతమాత్రంగా ఉంది. ఉచిత బస్సు తో పూర్తిగా ఉపాధి కోల్పో యి ఆటోలను ఫైనాన్స్ కంపెనీలకు అప్పగించాల్సిందే. డ్రైవర్లంతా ఆటోలు వదిలి కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకోవాలి. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలి. – డి.నరేష్, ఆటోడ్రైవర్, పొలమూరు చాలా ఆందోళనగా ఉంది ఉచిత బస్సుపై చాలా ఆందోళన చెందుతున్నాం. ఆటో లు ఎక్కేవారి సంఖ్య బాగా తగ్గిపోతుంది. ట్రిప్పులు లేక, ఆదాయం లేక కుటుంబా లను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదు. మాకు ప్రత్యామ్నాయ ఉపాధి లేదా మరేదైనా ఆదాయ మార్గం చూపించిన తర్వాత కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. – పి.జగన్, ఆటోడ్రైవర్, భీమవరం మహిళా ప్రయాణికులే ఎక్కువ ఆటోలో 90 శాతం మహిళలే ప్రయాణిస్తారు. వారి ద్వారానే మేం ఉపాధి పొందుతున్నాం. ఇప్పుడు ఉచిత బస్సుతో ఆటోలు ఎక్కేవారు తగ్గిపోతే మా పరిస్థితి ఏంటి. కూలీ పనులకు, ఆక్వా పరిశ్రమలకు మహిళలను తీసుకువెళుతూ ఉపాధి పొందుతున్నా. ఉచిత బస్సుతో అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం. – పి.గోపి, ఆటోడ్రైవర్, భీమవరం ఉపాధికి ఇబ్బందులు ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు తప్పవు. ఆటోలకు ఫైనాన్స్లు కట్టలేక, కు టుంబాలను పోషించుకోలేక అవస్థలు పడాల్సిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల కష్టాలు గురించి ఆలోచన చేసి మాకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకోవాలి తప్ప ఏకపక్షంగా ఉచిత బస్సు పథకాన్ని అమలుచేయడం తగదు. – సీహెచ్ రామకృష్ణ, ఆటోడ్రైవర్, వేండ్ర ప్రత్యామ్నాయం చూపాలి ఉచిత బస్సుకు మేం వ్యతిరేకం కాదు గానీ ఆటో కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని యూనియన్లతో చర్చించాల్సింది. ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. ఆటో కార్మికులను ఆదుకునేలా ప్రకటన చేయాలి. నెలనెలా ఆటో కార్మికులకు భృతి ఇవ్వాలి. చాలా మంది అప్పులు చేసి ఆటోలు కొన్నారు. వారందరినీ ఆదుకోవాలి. – ఇంటి సత్యనారాయణ, జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు ●ఆటో.. భవిత ఎటో ఉచిత బస్సుతో ఉపాధికి ముప్పు ఫైనాన్స్లపై 90 శాతానికి పైగా ఆటోల కొనుగోలు నెలనెలా వాయిదాలతో ఇప్పటికే ఇబ్బందులు ప్రత్యామ్నాయ ఉపాధికి డ్రైవర్ల డిమాండ్ కూటమి ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో కష్టకాలం ఉమ్మడి జిల్లాలో 40 వేల మంది డ్రైవర్లు40 వేల ఆటోలు.. 47 వేల మంది కార్మికులు ఉమ్మడి పశ్చిమలో సుమారు 40 వేల ఆటోలు ఉన్నాయి. ఏలూరు జిల్లాలో 24 వేలు, పశ్చిమగోదావరి జిల్లాలో 16 వేల వరకు ఆటోలు ఉండగా మొత్తంగా 40 వేల ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వీరితో పాటు ఆటో మెకానిక్, సీటు వర్క్, స్పేర్ పార్ట్స్ విక్రయదారుల కుటుంబాలు మరో 7 వేల వరకు ఉంటాయి. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు తీసుకురావడం ద్వారా ఆటోలు నడపటం కష్టం కాగా ఉపాధి లేక సుమారు 47 వేల కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తవచ్చు. -
గుబ్బల మంగమ్మతల్లి గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: కాపవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు ముదినేపల్లి రూరల్: సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామివారి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామివారి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపుకుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. మద్దిలో హనుమద్ హోమం జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమద్ హోమం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆద్వర్యంలో వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈవో ఆర్వీ చందన మాట్లాడుతూ స్వామి వారి సన్నిధిలో ఈ హోమం ప్రతీ ఆదివారం భక్తులకు ఆర్జిత సేవగా దేవస్థానం నిర్ణయించిందన్నారు. హోమ కార్యక్రమం పర్యవేక్షణ ఆలయ పర్యవేక్షకుడు జవ్వాది కృష్ణ నిర్వహిస్తారని ఈవో తెలిపారు. పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. దేవస్థానం సమీప పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మకు వేడి నైవేద్యాలు, పొంగళ్లు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చుకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున మొత్తం రూ.38,9085 ఆదాయం వచ్చిందని చెప్పారు. -
పవిత్రోత్సవం.. పరిపూర్ణం
ద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయంలో నా లుగు రోజులపాటు జరిగిన శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఉదయం ఆలయంలో పవిత్రావరోహణ, శ్రీ మహా పూ ర్ణాహుతి హోమం అనంతరం మహదాశీర్వచనాన్ని అర్చకులు, పండితులు వైభవంగా నిర్వహించారు. శ్రీవారి ములవిరాట్, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు, ఉత్సవమూర్తులపై ఉంచిన దివ్య పవిత్రాలను అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ తొలగించారు. అనంతరం వి విధ దినుసులతో మహాపూర్ణాహుతి హోమాన్ని జరిపించారు. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని నాలుగు రోజులుగా ఆలయంలో నిలిపివేసిన నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను సోమవారం నుంచి పునరుద్ధరిస్తామని ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి తెలిపారు. -
కూర్మ విలాపం
కై కలూరు: తాబేళ్ల అక్రమ రవాణాకు కొల్లేరు ప్రాంతం కేంద్రంగా మారింది. పర్యావరణానికి వెలకట్టలేని మేలు చేస్తున్న నల్లచిప్ప తాబేళ్లను కాసులకు కక్కుర్తిపడి రాత్రి సమయంలో సరహద్దులు దాటించేస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలో తాబేలు మాంసానికి మంచి గిరాకీ ఉండటంతో అడ్డదారుల్లో గుట్టు చప్పుడు కాకుండా తరలించి అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. తాబేళ్ల స్మగ్లర్ కుమార్ రెండేళ్లుగా ఒడిశాలో ఉంటూ కొల్లేరు ప్రాంతం నుంచి వచ్చే తాబేళ్లను మార్కెట్ చేస్తున్నాడు. అతనిపై తాబేళ్ల అక్రమ రవాణాలో పలు కేసులున్నాయి. అక్రమ రవాణా ఇలా.. ఉమ్మడి జిల్లాలో చేపలు 1.80 లక్షలు, రొయ్యలు 1.10 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. చేపల పట్టుబడుల వలలో తాబేళ్లు చిక్కుకుంటాయి. వలల మేసీ్త్ర సమాచారంతో కొందరు వీటిని సేకరిస్తున్నారు. ఎక్కువ మంది కొల్లేరు డ్రెయిన్లు, పంట బోదెలలో వీటిని పట్టుకుంటున్నారు. ఏజంట్లు సేకరించిన తాబేళ్ళను గోనె సంచులు, నీటి డ్రమ్ములలో దాస్తున్నారు. సేకరించిన వీటిని సైజును బట్టి కేజీ రూ.30 నుంచి రూ.40 వరకు ఇక్కడ కొనుగోలు చేసి ఒడిశాలో కేజీ రూ.300పైగా విక్రయిస్తోన్నారు. ఉదాహరణకు వాహనంలో సుమారు 5 టన్నుల తాబేళ్లు రవాణా చేస్తే రూ.15 లక్షలు ముడుతోంది. అన్ని ఖర్చులు పోయి అక్రమార్కులకు మినిమం రూ.10 లక్షల వరకు మిగులుతోంది. దీంతో అక్రమ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కేంద్ర బిందువుగా భీమవరం ఆక్వా హబ్గా పేరొందిన భీమవరం అక్రమ తాబేళ్లకు స్టాకింగ్ పాయింట్గా మారింది. కై కలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో సేకరించిన తాబేళ్లను కోరుకొల్లు, కలిదిండి, కాళ్ళ మీదుగా భీమవరం తరలిస్తున్నారు. అక్కడ నుంచి పెద్ద వాహనాల్లో ఒడిశా చేర్చుతున్నారు. కొల్లేరు ప్రాంతం నుంచి బొలోరో వాహనాల్లో అడుగున తాబేళ్లను పరిచి పైన చేప గురక పిల్లలను ఉంచుతున్నారు. ఎవరైన చెకింగ్కు వస్తే చేపలు కనిపిస్తాయి. అడుగున తాబేళ్లను గుర్తించలేకపోతున్నారు. మండవల్లి మండలం కొవ్వాడలంక, కలిదిండి మండలం బొబ్బిలిగూడెంకు చెందిన ఇద్దరు గతంలో తాబేళ్ళ రవాణాలో కీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో కలిదిండి, వెంకటాపురం, ఏలూరు రోడ్, ముదినేపల్లి ప్రాంతాల్లో అటవీ, పోలీసు అధికారులు అక్రమ తాబేళ్ల రవాణాను పలుమార్లు అడ్డుకున్నారు. కొల్లేరు చుట్టూ తాబేళ్ల అక్రమ రవాణా అంతరించిపోతున్న నల్లచిప్ప తాబేళ్లు గుట్టుచప్పుడు కాకుండా ఒడిశాకు తరలింపు అంతరించిపోతున్న నల్లచిప్ప తాబేలు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్(ఐయూసీఎన్) 2002లోనే అంతరించిపోతున్నా జాతులలో నల్లచిప్ప తాబేలును చేర్చింది. ఇండియాలో అసోం, త్రిపుర, బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ తదితర ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఇవి 31 అంగుళాల వెడల్పు, 28 అంగుళాల పొడవు పెరుగుతాయి. సాధారణంగా 38 గుడ్లు పెడతాయి. మొక్కలు, చేపలు, పురుగులతో పాటు నీటిలో హనికర క్రిములను తింటాయి. అంతరించిపోతున్న తాబేలు జాతిని అన్ని దేశాలు షెడ్యూల్ –1 కేటగిరిలో చేర్చాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం తాబేలును వేటాడడం, రవాణా చేయడం నేరం. ఏడేళ్లు కారగార శిక్ష విధించవచ్చు. అటవీ శాఖ చట్టాల సెక్షన్లు 27, 29, 31బీల ప్రకారం కేసులు నమోదు చేయొచ్చు. నిఘా ముమ్మరం చేశాం తాబేళ్ళ రవాణా నేరం. కొల్లేరు పరివాహక ప్రాంతాలు కాకుండా బయట ప్రాంతాల్లో వీటి రవాణా జరిగితే టెరిటోరియల్ ఫారెస్టు అధికారులు కేసులు నమోదు చేస్తారు. కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో రవాణా చేస్తే అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాలి – కేపీ రామలింగాచార్యులు, ఫారెస్టు రేంజర్, కై కలూరు -
దోమ తెరలు ఎక్కడ?
బుట్టాయగూడెం: జిల్లాలోని మన్య ప్రాంతంలో మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నా కూటమి ప్రభుత్వంలో ఏమాత్రం చలనం కనిపించడంలేదని గిరిజన సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. సీజనల్ జ్వరాలతో పాటు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమల నియంత్రణలో కీలకమైన దోమ తెరల పంపిణీని గతేడాది గాలికి వదిలేసిన ప్రభుత్వం ఈ ఏడాది కూడా అదే ధోరణిలో వ్యవహరిస్తుందనే విమర్శలు విల్లువెత్తుతున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అత్యధికంగా మలేరియా కేసులు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జనవరి నుంచి ఆగస్టు నెలాఖరు నాటికి కేవలం 93 మలేరియా కేసులు నమోదు కాగా ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 10 నాటికి సుమారు 570 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 477 కేసులు అధికంగా నమోదయ్యాయి. గిరిజన గ్రామాల్లో దోమల నివారణకు ప్రస్తుతం మూడో దశలో మలాథియన్ స్పేయింగ్ పనులు జరుగుతున్నటు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే మలేరియా కేసులు అధికంగా పెరుగుతునే ఉన్నాయి. దోమలను నివారించాలంటే దోమ తెరలతోనే సాధ్యమని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో దోమతెరల పంపిణీ పశ్చిమ ఏజెన్పీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో మలేరియా నియంత్రణకు గత వైస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో కృషి చేసింది. గ్రామాల్లో దోమలను అరికట్టేందుకు అధికారులు పగడ్బందీగా చర్యలు చేపట్టారు. 2021లో అప్పటి మఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం సంస్థ (ఎన్విబీడీసీపీ) నుంచి సుమారు 2 లక్షల 50 వేల దోమ తెరలను రప్పించి బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఉన్న గిరిజన గ్రామాల్లో ప్రజలకు పంపిణీ చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు దోమ తెరలు పంపిణీ చేశారు. దోమ తెరల కాలపరిమితి మూడేళ్ల లోపు కావడంతో మళ్లీ 2024 జనవరిలో దోమ తెరల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రతిపాదనలు పంపింది. కానరాని దోమ తెరల పంపిణీ కూటమి ప్రభుత్వం దోమ తెరల పంపిణీపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. గత ఏడాది దోమ తెరల పంపిణీ జరగలేదు. ఈ ఏడాది వేసవిలో వర్షాలు కురవడం, వర్షా కాలంలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులు ఉక్కపోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సీజనల్ జర్వాలతో పాటు మలేరియా జ్వరాలు అధికంగా ఉన్నాయి. ఇప్పటికై న ప్రభుత్వం దోమ తెరలు పంపిణీ చేసి మలేరియా జ్వరాల నివారణకు కృషి చేయాలని గిరిజన సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. మన్యంలో విజృంభిస్తున్న మలేరియా జ్వరాలు గతేడాది కంటే అధికంగా పెరుగుతున్న కేసులు మొక్కుబడిగా నియంత్రణ చర్యలు గత ఏడాది నుంచి పంపిణీ చేయని దోమ తెరలు జిల్లాలో మలేరియా సమసాత్మక గ్రామాలు – 153 బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి మండలాల్లో – 117 వీలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాగు మండలాల్లో – 36 గ్రామాలు -
అయ్యవార్లపై మూల్యాంకన భారం
నిడమర్రు: కూటమి ప్రభుత్వం సంస్కరణల పేరుతో విద్యావ్యవస్థలో తీసుకువస్తున్న పరీక్షల విధానాన్ని చూసి ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి జరిగే సెల్ఫ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ–1) పరీక్షలు అటు విద్యార్థికి, ఇటు ఉపాధ్యాయులకు పరీక్షే అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలలకు అందించిన మూల్యాంకన పుస్తకాలతో మరో బోధనేతర పనికి సిద్ధమవ్వాలని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. పొందుపరిచి.. స్కాన్ చేసి.. ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించే ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షల మొ త్తం సమాచారాన్ని విద్యాశాఖ అందించిన మూల్యాంకన పుస్తకంలో ఉపాధ్యాయులు పొందుపరచాలి. అలాగే విద్యార్థుల సా మర్థ్యాలకు సంబంధించిన 15 మార్కుల అంశాలను ఉపాధ్యాయుడే స్వయంగా నమోదుచేయాలి. ఆయా సబ్జెక్టుల్లో ఆయా సామర్థ్యంలో ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయి.. ఎక్కువ వస్తే ఎలా గుర్తించావు.. అనే విషయం వివరంగా రాయల్సి ఉంటుంది. అనంతరం వాటిని స్కాన్ చేసి యాప్లో అప్లోడ్ చేయాలి. ఇప్పటికే పెరుగుతున్న బోధనేతర పనులకు తరగతికి దూరమవుతున్న ఉపాధ్యాయులు ప్రభుత్వం తాజాగా మూల్యాంకన భారం మోపడంపై తలలు పట్టుకుంటున్నారు. ఉరుకులు.. పరుగులు మూల్యాంకన పుస్తకాలు ఆటోలో తెచ్చుకోవడం, బ్యాలెన్స్ పుస్తకాల కోసం ఎంఈఓ కార్యాలయాల చుట్టూ తిరగడం, మూ ల్యాంకన పుస్తకాల్లో విద్యార్థుల ప్రతిస్పందనలు రాయడం ఒక ఎత్తయితే.. విద్యార్థులతో ఓఎంఆర్ షీట్లో జవాబులు రాయించడం మరో ఎత్తు. 1వ తరగతి విద్యార్థి కూడా ఓఎంఆర్ షీట్స్లోనే పరీక్షలు రాయడం ఆ ఉపాధ్యాయులకు పరీక్షే. అలాగే మొత్తం అంశాలు, ఓఎంఆర్ షీట్స్ను స్కాన్ చేసి యాప్లో అప్లోడ్ చేయడం, ఆన్లైన్లో మార్కులు నమోదు చేయడం వంటి పనులకే సమయం సరిపోతుందని టీచర్లు ఆవేదన చెందుతున్నారు. గురువులకే పరీక్ష ! ప్రభుత్వ ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ప్రతి తరగతి, సబ్జెక్టుకు మూల్యాంకన పుస్తకాల పంపిణీ ఆ పుస్తకాల స్కానింగ్తో సమయం వృథా నేటి నుంచి ఎఫ్ఏ–1 పరీక్షలు ఉపాధ్యాయ సంఘాల నేతల ఆందోళన బోధనేతర భారం పెరిగి.. మూల్యాంకన పుస్తకాలతో ఉపాధ్యాయులకు బోధనేతర భారం మరింత పెరుగుతుంది. విద్యార్థి ప్రతిస్పందనలతో పాటు ఓఎంఆర్ షీట్లో కోడ్లు, అపార్ ఐడీలు, పెన్ ఐడీలను తప్పులు లేకుండా రాసేలా చూడటం, జవాబులను దిద్దిన తర్వాత స్కోరింగ్ ఇవ్వడం, దీనికి వివరణ రాయడంతో పాటు పేజీలన్నింటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. వీటి కోసం అవుట్ సోర్సింగ్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. – లంకలపల్లి సాయిశ్రీనివాస్, స్టేట్ ఫ్యాప్టో చైర్మన్ సమయం హరిస్తుంది సంస్కరణలు విద్యార్థులకు మేలు చేయాలే తప్ప కీడు కాదు. మూల్యాంకన పుస్తకం వి ధానంతో ఉపాధ్యాయులకు అదనపు భారం తప్ప విద్యార్థులకు ప్రయోజనం కనిపించడం లేదు. కొత్త విధానంలో తరగతి గదిలోనే విద్యార్థుల ప్రతిస్పందనలు పరిశీలించి మూల్యాంకన పుస్తకంలో నమోదు చే యాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లో పదుల సంఖ్యలో వి ద్యార్థులు ఉంటారు. దీంతో బోధనా కాలం హరిస్తుంది. దీంతో విద్యా ప్రమాణాలు తగ్గే ప్రమాదముంది. – బొర్రా గోపీ మూర్తి, టీచర్స్ ఎమ్మెల్సీశిక్షణ లేదు.. స్పష్టత లేదు మూల్యాంకనంలో మార్పులపై ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా ఎఫ్ఏ–1 పరీక్షలకు విద్యాశాఖ సిద్ధం చేసింది. దీంతో వాట్సాప్లో వస్తున్న సమాచారం ఆధారంగానే పరీక్షలు నిర్వహించేందుకు ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నా రు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈనెల 4 నుంచి ఎఫ్ఏ–1 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా మూల్యాంకన పుస్తకాలు మండలాలకు అందకపోవడంతో వాయిదా వేశారు. అయితే ఈ పుస్తకాలను ఎలా నిర్వహించాలి, ఏఏ అంశాలు పూరించాలనే విషయాలపై కేవలం వాట్సాప్లో వస్తున్న మెసేజ్లే తప్ప ఏ అధికారి సమగ్రంగా వివరించే అవకాశం లేకుండానే పరీక్షలు ప్రారంభించడాన్ని ఉపాధ్యాయులు తప్పుపడుతున్నారు. -
పశువుల్లో ఈనిక సమస్యలు
జంగారెడ్డిగూడెం: ఆవులు, గేదెల్లో ఈనికకు ముందు, సమయంలో, తర్వాత జరిగే వ్యాధులు పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి, రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తాయి. ముందుగా గుర్తించడం, నివారించడం, తగిన చికిత్స ఇవ్వడం ద్వారా పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పశువుల రైతులకు ఈ వ్యాధులను ఎలా నివారించాలో, ఎలా నిర్వహించాలో పశువైద్యాధికారి బీఆర్ శ్రీనివాసన్ వివరించారు. ఈనికకు ముందు వ్యాధులు ● పాల జ్వరం: పాల జ్వరం అనేది రక్తంలో కాల్షియం స్థాయి తగ్గడంతో కలిగే వ్యాధి. ఇది సాధారణంగా ఆవులు, గెదెలలో ఈనికకు ముందు లేదా తరువాత కనిపిస్తుంది. లక్షణాలు: కాళ్ళలో బలహీనత, నిలబడలేకపోవడం, చల్లని పాదాలు, తీవ్రమైన పరిస్థితిలో పశువు పడిపోయే ప్రమాదం ఉంటుంది. చికిత్స: వెంటనే కాల్షియం ఐవీ చుక్కల రూపంలో ఇవ్వాలి. పశువైద్యుడి సలహా మేరకు అధిక ప్రమాదం ఉన్న పశువులకు ముందస్తుగా కాల్షియం అందించాలి. నివారణ: ఆహారంలో సరైన పరిమాణంలో కాల్షియం, ఫాస్ఫరస్ ఉండేలా చూసుకోవాలి. ఈనికకు ముందు కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల కాల్షియం స్థాయిలను కాపాడుకోవచ్చు. ● కీటోసిస్: కీటోసిస్ అనేది పశువు శక్తి లోటుతో కలిగే వ్యాధి, ఇది ఈనికకు ముందు ఎక్కువగా జరుగుతుంది. లక్షణాలు: పాల ఉత్పత్తి తగ్గిపోవడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం. మూత్రంలో ఎసిటోన్ వాసన చికిత్స: ప్రొపైలీన్ గ్లైకాల్ రూపంలో ఇచ్చి గ్లూకోజ్ స్థాయిని పెంచాలి. నివారణ: ముఖ్యంగా అధిక పాల ఉత్పత్తి చేసే పశువులకు సమతుల్య ఆహారం అందించాలి. శరీరంలో తగిన శక్తి నిల్వల కోసం సరైన ఆహారం ఇవ్వాలి. ఈనిక సమయంలో వ్యాధులు ● కష్ట సాధ్యం: కష్టసాధ్యమైన ఈనిక సమయంలో.. లక్షణాలు: సుదీర్ఘ ఈనిక సమయంలో పిల్లలు బయటకు రాకపోవడం. చికిత్స: అవసరమైనపుడు ఈనికకు సహాయం చేయాలి. తీవ్ర పరిస్థితుల్లో సిజేరియన్ చేయవచ్చు. నివారణ: పెద్ద పిల్లలను ఈనే అవకాశం ఉన్న ఆవులకు తగిన ఆహారం, శ్రద్ధ తీసుకోవాలి. సరైన సమయానికి పశువైద్యుడి సలహాలు తీసుకోవాలి. ● గర్భపాతాల నిలుపు గర్భపాతం 12 గంటలలోపు బయటకు రాకపోతే ఇది ఒక సమస్యగా మారుతుంది. లక్షణాలు: జనన మార్గం నుండి చెడిపోయిన వాసన రావడం చికిత్స: పశువైద్యుడు సూచించిన విధంగా యాంటీబయోటిక్స్ ఇవ్వాలి. నివారణ: సరైన పోషకాహారం ఇవ్వడం, ముఖ్యంగా విటమిన్–ఇ, సెలీనియం తగిన మోతాదులో ఉండాలి. ఈనిక తరువాత వ్యాధులు ● మెట్రిటిస్: ఇది ఒక బాక్టీరియా ఇన్ఫెక్షన్. సాధారణంగా కష్ట్రపసవం లేదా గర్భపాతం తర్వాత కలుగుతుంది. లక్షణాలు: చెడు వాసన, జ్వరం, ఆకలి తగ్గడం. చికిత్స: యాంటీబయోటిక్స్, పశువైద్యుడి సూచనలతో సరైన చికిత్స చేయాలి. నివారణ: ఈనిక సమయంలో పరిశుభ్రత పాటించడం. ● మస్తిటిస్: మస్తిటిస్ అనేది పాలు ఉత్పత్తి చేసే గ్రంథులలో ఇన్ఫెక్షన్ ద్వారా కలిగే వ్యాధి. లక్షణాలు: ఉబ్బిన, వేడిగా ఉండే పొట్ట, మరియు పాలు అసాధారణంగా ఉండటం (గడ్డలు, రక్తం). చికిత్స: పశువైద్యుని సూచన మేరకు యాంటీబయోటిక్స్ ఇవ్వాలి. నివారణ: పాల యంత్రాల పరిశుభ్రత, పశువుల శుభ్రతతో పాటించాలి. సమతుల ఆహారాన్ని అందించాలి ఈనికకు ముందు, సమయంలో, తర్వాత వ్యాధులు పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి నివారించడం ద్వారా పశువుల పాల ఉత్పత్తిని పెంచి, వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా సమతుల ఆహారం, ముఖ్యంగా ఈనికకు ముందు, తర్వాత అందించాలి. పశువులు ఉండే వాతావరణం పరిశుభ్రంగా ఉంచాలి. పశువైద్యుడి పర్యవేక్షణలో వ్యాధులు గుర్తించడం, చికిత్స చేయడం చేయించాలి. – డా. బి. ఆర్. శ్రీనివాసన్, పశు వైద్యాధికారి, -
13న మాజీ సీఎం జగన్ రాక
భీమవరం : ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పు ప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకకు ఈనెల 13న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భీమవరం రానున్నారు. ఆదివారం హెలీప్యాడ్ ప్రాంతాన్ని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు పరిశీలించారు. భీమవరం శివారు వీఎస్ఎస్ గార్డెన్స్లో వివాహ వేడుక జరుగనున్నందున సమీపంలో హెలీప్యాడ్ ఏర్పాటుకు అనుకూల పరిస్థితులను పరిశీలించారు. ఆయన వెంట వాసుబాబు, వైఎస్సార్సీపీ భీమవరం ని యోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, భీమవరం పట్టణ అధ్యక్షుడు గా దిరాజు రామరాజు తదితరులు ఉన్నారు. టోల్గేట్ క్రాంటాక్టర్కు నోటీసులు ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీవారి కొండపైన టోల్గేట్ నిర్వహిస్తున్న కాంట్రాక్టర్కు దేవస్థానం ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి ఆదివారం నోటీసు జారీ చేశారు. బైక్లు, మోపెడ్లకు రూ.10ల రుసుం వసూలు చేయాల్సి ఉండగా రూ.20లు వ సూలు చేస్తున్నారు. దీనిపై ఆదివారం ‘సాక్షి’లో ‘శ్రీవారి కొండపై టోల్ బాదుడు’ శీర్షికన కథనం ప్రచురించగా ఈఓ స్పందించారు. మూడు రోజుల్లోపు సంజాయిషీ ఇవ్వాలని కాంట్రాక్టర్కు నోటీసు ఇచ్చారు. 16న ప్రైవేట్ పాఠశాలల సమస్యలపై చర్చ ఏలూరు (ఆర్ఆర్పేట): చీరాలలో ఈనెల 16న జరిగే అపుస్మా (ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రైవేట్ పాఠశా లల యాజమాన్యాల సమస్యలపై చర్చిస్తా మని అపుస్మా రాష్ట్ర అధ్యక్షుడు కె.తులసీ ప్ర సాద్ తెలిపారు. ఆదివారం స్థానిక శ్రీశ్రీ పా ఠశాలలో నిర్వహించిన జిల్లా కార్యనిర్వాహక కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వి ద్యాహక్కు చట్టం ప్రకారం అడ్మిషన్ పొందిన వారికి ప్రభుత్వం కొత్త బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసుకోమనడం సరికాదదన్నారు. స్టార్ రేటింగ్ ప్రకారం కేవలం రూ.8 వేలు ఫీజులుగా ఇస్తామంటున్నారని, తల్లికి వందనం ఉచిత విద్యలో భాగమే కాబట్టి విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రవేశాలు పొందిన వారికి కనీసం రూ.13 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఎంబీఎస్ శర్మ మా ట్లాడుతూ యాప్లు, బోధనేతర పనులను ఉ పాధ్యాయులకు కేటాయించడం, ట్రాన్స్పోర్ట్, గ్రీన్ టాక్స్ వంటి సమస్యలపై చర్చించి ప్ర భుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. -
సీసీ కెమెరా ఏర్పాటుపై మండిపాటు
ఉండి: మేమేమైనా నేరస్తులమా? లేక తీవ్రవాదులమా.. మా ప్రాంతంలో పోలీసులు సీసీ కెమెరా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని పాములపర్రులో దళితులు ఆదివారం నిరసన తెలిపారు. ఇప్పటికే దళితపేట వద్ద పోలీసులు పహారా కాస్తూ తమ స్వేచ్ఛను హరిస్తున్నారని, ఇప్పుడే ఏకంగా సీసీ కెమెరా ఏర్పాటు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతల కోసం అయితే గ్రామంలోని సెంటర్లో కెమెరాలు పెట్టాలని, దళితులను కించపరిచేలా ఇక్కడ ఏర్పాటుచేయడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా సీసీ కెమెరా ఓ ప్రైవేట్ వ్యక్తి పోలీసులకు ఇచ్చారని, అతడి మ నుషులే పాములపర్రుకు తెచ్చారని వార్డు సభ్యుడు దర్శి సాల్మన్రాజు, దళిత యువకులు మామిడిపల్లి ఏసేబు, దర్శి పరదేశి, తేలి మహేష్,శ్రీనివాస్, ఊబా రమేష్ ఆరోపించారు. దీనిపై ఎస్సై ఎండీ నసీరుల్లాను వివరణ కోరగా సీసీ కెమెరాను తామే ఏర్పాటు చేశామన్నారు. శాంతిభద్రతలకు విఘా తం కలిగించేలా ఎవరైనా అల్లర్లకు పాల్పడినా, లేదా రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా, ఇతర ప్రాంతాల వారు వచ్చి ఇబ్బందులు తలెత్తేలా వ్యవహరించినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకే కెమెరా ఏర్పాటు చేశామన్నారు. -
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు క్షీ ణించాయని, పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో రెడ్బుక్ను అమలుచేసే పనిలో ఉన్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ కా రుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. త ణుకులోని ఆయన నివాసంలో ఆదివారం పార్టీ శ్రేణులతో సమావేశమై మాట్లాడారు. కూటమి నా యకులు తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతాల్లో రౌడీయిజం చేయిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా ఏకంగా వందలాది మంది పచ్చ గూండాలు బీసీ వర్గీయులపై దాడికి దిగడం, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఖాకీలు తప్పులమీద తప్పులు చేసుకుంటూ పోతున్నారని, ఒక పక్క న్యాయస్థానాలు తప్పుపడుతున్నా వీరి తీరు మారడం లేదని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతలపై ఐటీడీపీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోకపోగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసి వేధిస్తున్నారని అన్నారు. రోజులు ఎప్పుడూ ఒకలానే ఉండవని, మీరు చూపిస్తున్న మార్గం ఎదుటివారికి కూడా కనిపిస్తుందనే విషయాన్ని మరచిపోవద్దని కారుమూరి హెచ్చరించారు. ఇది వంచన ప్రభుత్వంనా రాజకీయ జీవితంలో ఇంతటి అరాచకం, అఘాయిత్యాలు, మోసం, దాడులు, వంచన చేసిన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని, మొదటిసారి ఇప్పుడే చూస్తున్నానని కారుమూరి అన్నారు. కూటమి ప్రభుత్వం తన పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మార్చేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై, నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం 13 నెలల కాలంలో సుమారు రూ.2 లక్షల కోట్లు అప్పులు చేసిందని, దీంతో ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ ఎప్పుడు అమలుచేస్తారని ప్రజలే ప్రశ్నిస్తున్నారని కారు మూరి నాగేశ్వరరావు అన్నారు. -
వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
తణుకు అర్బన్: ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రచార బోర్డును ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇరగవరం కాలనీ శివారు ప్రాంతంలో శనివారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన కత్తుల చక్రధరరావు అలియాస్ చక్రి (32) ఉపాధి నిమిత్తం కొన్నేళ్లుగా కువైట్లో ఉంటూ 20 రోజుల క్రితం సొంతూరుకు వచ్చాడు. తూర్పు విప్పర్రులోని అత్తవారింటి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఇరగరం రోడ్డులో వాహనం అదుపుతప్పి బోర్డును ఢీకొట్టగా తలకు తీవ్రగాయమై ఘటనా ప్రాంతంలోనే కన్నుమూశాడు. బంగారు ఆభరణాల చోరీ ఆకివీడు: ఇంట్లో దొంగలు చొరబడి తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు దోచుకుపోయిన ఘటన కాకరపర్తి చెంచయ్య వీధిలో జరిగింది. ఈ నెల 7న ఉదయం ఇంటికి తాళం వేసి నర్సాపురంలో వివాహ వేడుకకు విశ్రాంతి ఉపాధ్యాయుడు పులవర్తి వెంకటేశ్వరరావు కుటుంబం వెళ్లింది. ఆదివారం తిరిగి వచ్చే సరికి తాళాలు బద్ధలుకొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ సీఐ జగదీశ్వరరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. 9 తులాల బంగారం చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారని ఏఎస్ఐ బీ.సత్యనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి తణుకు అర్బన్: తణుకు పైడిపర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రాంతంలో ఆర్టీసీ బస్సు కిందపడి తీవ్రగాయాలపాలైన తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన యార్లగడ్డ రవి (50) శనివారం రాత్రి రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. తణుకు కోర్టులో గుమస్తాగా విధులు నిర్వర్తిస్తున్న రవి ఈనెల 9వ తేదీన ఉదయం పైడిపర్రు ప్రాంతంలో ఏలూరుకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో కాలు నుజ్జునుజ్జయ్యింది. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో పంచానామా అనంతరం పోస్టు మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు రూరల్ ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలో చోరీ జంగారెడ్డిగూడెం: పట్టణంలో గుండాబత్తుల వారి వీధిలో ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న డి.శిరీష ఇంట్లో చోరీ జరిగింది. ఈనెల 8న ఇంటికి తాళం వేసి స్వగ్రామమైన టి.నరసాపురం మండలం ప్రకాశ్నగర్ వెళ్లింది. ఆదివారం ఉదయం వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు పగలకొట్టి ఉన్నాయి. అల్మరాలో ఉంచిన బంగారం ఉగరం, రూ.3 వేల నగదు చోరీకి గురయ్యాయి. వృద్ధుడి ఆత్మహత్య ఏలూరు టౌన్: అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి గురైన వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు రూరల్ రంగారావు కాలనీకి చెందిన పిల్లా తాతారావు (67) రెండేళ్ళుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మనస్థాపానికి గురై శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఏలూరు జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందాడు. -
పాత తెరలు చిరిగిపోయాయి
గత రెండు సంవత్సరాల నుంచి మాకు దోమ తెరలు పంపిణీ చేయలేదు. గతంలో ఇచ్చిన దోమ తెరలు చిరిగిపోయాయి. మా గ్రామాల్లో దోమలు విపరీతంగా ఉన్నాయి. దోమ తెరల కోసం ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం దోమ తెరలు పంపిణీ చేయాలి. నడపల ముక్కారెడ్డి, గడ్డపల్లి, పోలవరం మండలం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కూటమి ప్రభుత్వానికి దోమ తెరల పంపిణీపై చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు. గతేడాది పంపిణీ చేయలేదు. ఈ ఏడాది పంపిణీ చేస్తారో లేదో అనే అనుమానం వస్తుంది. ప్రస్తుతం గిరిజన గ్రామాల్లో మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. కారం రాఘవ, ఏఐకేఎంఎస్ నాయకుడు, అలివేరు, బుట్టాయగూడెం మండలం ప్రత్యేక దృష్టి పెట్టాం జిల్లాలో మలేరియా నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాం. దీని కోసం సుమారు 2 లక్షల 50 వేలు దోమ తెరలు అవసరమని ప్రతిపాదనలు పంపించారు. అవి వచ్చిన వెంటనే మలేరియా సమస్యత్మక గ్రామాల్లో పంపిణీ చేస్తాం. ఎన్ఎస్ఎస్ ప్రసాద్, జిల్లా మలేరియాధికారి, కేఆర్పురం, బుట్టాయగూడెం మండలం -
వాణిజ్య ఒప్పందాలతో వ్యవసాయానికి తీవ్ర నష్టం
ఏలూరు (టూటౌన్): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేసుకుంటున్న విదేశీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో దేశ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం జరుగుతున్నదని రైతు సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ జిల్లా కమిటీ, కార్మిక సంఘాల జిల్లా సమన్వయ కమిటీ సంయుక్త సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ ఈ నెల 13న సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఏలూరులో నిర్వహించే క్విట్ కార్పొరేట్స్ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహనరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస డాంగే, జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ పాల్గొన్నారు. -
హుండీ దొంగతనం కేసులో నిందితుల అరెస్ట్
నిడమర్రు: గత నెల 26న పెదనిండ్రకొలను, పత్తేపురం గ్రామాల్లో దేవాలయాల్లో హుండీలు బద్దలుగొట్టి నగదు దోచుకున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు నిడమర్రు సీఐ ఎన్.రజనీ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఉండి మండలం అరేడు గ్రామానికి చెందిన ప్రత్తిపాటి మహిమ కుమార్, గణపవరానికి చెందిన యంబల జోషి, పాలకొల్లు మండలం లంకలకోడేరుకు చెందిన మరొకరిని హుండీ దొంగతనం కేసులో నిందితులుగా గుర్తించినట్లు తెలిపారు. సీసీ కెమెరాల సాయంతో నిందితులను అరెస్ట్ చేసామన్నారు. వీరు గతంలో ద్వారకా తిరుమల్లో షాపు దొంగతనంలో, దెందులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హుండీ దొంగతనం కేసులో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. వీరిని ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేసి బైక్, రూ.5,721 నగదు, రెండు రాడ్లు స్వాదీనం చేసుకున్నామని, సోమవారం తాడేపల్లిగుడెం కోర్టులో హాజరుపరుస్తామన్నారు. -
తప్ప తాగించేందుకు పర్మిట్
శనివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాక్షి, భీమవరం: మద్యం నుంచి సంపద సృష్టి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే బెల్టులు, సమయ పాలన లేకుండా విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తూ మద్యాన్ని ఏరులై పారి స్తోంది. మందుబాబుల్ని మరింత తప్పతాగించి ఆదాయాన్ని పెంచుకునే పనిలో ఉంది. షాపులకు అనుబంధంగా పర్మిట్ రూంల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. గీత కార్మికులకు చెందిన 18 షాపులతో కలిపి జిల్లాలో 193 మద్యం షాపులు ఉన్నాయి. నెలకు రూ.120 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతున్నాయని అంచనా. మునుపటి ఏడాది ప్రామాణికంగా 20 శాతం అమ్మకాలు పెంచాలంటూ మొదట్లో ఎకై ్సజ్ అధికారులకు టార్గెట్లు విధించేవారు. ప్రైవేట్ పాలసీ తెచ్చిన గత ఏడాది అక్టోబరు 16 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి లిక్కర్, బీర్లు అమ్మకాల్లో 30 శాతం నుంచి 80 శాతం పెరుగుదలను గుర్తించింది. మరింత ఆదాయాన్ని రాబట్టేందుకు నెలవారీ టార్గెట్ మొత్తాన్ని రూ. 175 కోట్లకు పెంచేసినట్టు సమాచారం. లక్ష్యాన్ని చేరేందుకు ఉన్నతస్థాయి నుంచి రోజువారీ సమీక్షలతో ఎకై ్సజ్ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చూసీచూడనట్టుగా.. షాపుల వద్దనే మద్యం సేవించేందుకు వీలుగా టేబుళ్లు, కుర్చీలతో సిట్టింగ్ ఏర్పాట్లు, మంచింగ్ కోసం ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, సోడాలు, కూల్డ్రింక్స్, లూజ్ సేల్స్తో మద్యం దుకాణాలను ‘బార్’ల మాదిరి నిర్వహిస్తున్నారు. నైట్పాయింట్లు పేరిట తెల్లవార్లూ అమ్మకాలు చేస్తున్నారు. ఒక్కో షాపు పరిధిలో పది వరకు బెల్టు విక్రయాలు షరామామూలే. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేస్తున్నా కూటమి నేతల ఒత్తిళ్లు, టార్గెట్ల కోసం అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. బెల్టుషాపులు లేవని ప్రభుత్వం చెబుతుండగా జిల్లాలో ఇప్పటి వరకు 370 మంది బెల్టుషాపుల నిర్వాహకులను అరెస్టుచేసి 800 లీటర్ల మద్యాన్ని ఎకై ్సజ్ అధికారులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. పర్మిట్కు పచ్చజెండా సిండికేట్కు మేలుచేస్తూ 2014–19 మధ్య కాలంలో లిక్కర్ విధానాన్ని చంద్రబాబు సర్కారు మళ్లీ ఆచరణలో పెడుతోంది. అందులో భాగంగా మద్యాన్ని ప్రైవేట్ పరం చేసింది. షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్లు తెరిచే పనిలో ఉంది. సెప్టెంబరు 1 నుంచి కొత్త బార్లకు లైసెన్సులు అమలుల్లోకి వచ్చాక పర్మిట్ రూమ్ల ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. జిల్లాలోని దాదాపు అన్ని షాపులకు పర్మిట్ రూమ్ల ఏర్పాటుకానున్నట్టు ఎకై ్సజ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం మద్యం దుకాణాల వద్ద మద్యం సేవించడం నిబంధనలకు విరుద్ధం. అయినప్పటికి సిండికేట్లు పర్మిట్ రూంల మాదిరి ఏర్పాట్లతో మద్యం, గ్లాసులు, వాటర్ బాటిల్స్, ఫాస్ట్ఫుడ్స్ తదితర అన్నిటి ధరలను పెంచేసి మందబాబులను దోచేస్తున్నారు. వీటిని అధికారికం చేయడం ద్వారా సిండికేట్ దోపిడీకి అడ్డుండదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం చాలావరకు దుకాణాలు జనావాసాల మధ్యలో ఉండగా మందుబాబుల ఆగడాలతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. పర్మిట్ రూమ్తో వారు మరింత రెచ్చిపోయి స్థానికంగా ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తమవుతోంది. న్యూస్రీల్ మద్యం నుంచి సంపద సృష్టిలో చంద్రబాబు సర్కారు షాపుల వద్ద పర్మిట్ రూంలకు గ్రీన్సిగ్నల్ త్వరలో వెలువడనున్న ఆదేశాలు ఇప్పటికే విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు నాడు వైఎస్సార్సీపీ హయాంలో మద్యం దుకాణాలు ఊరికి దూరంగా ఉండేవి. ప్రభుత్వమే నిర్వహించడం వలన నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేవి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు చేసేవారు. షాపు వద్ద మద్యం కొనుగోలు చేసి తీసుకుపోవడమే తప్ప అక్కడే కూర్చుని తాగే వీలుండేది కాదు. బెల్టుషాపులు, పర్మిట్ రూమ్లకు ఆస్కారమే లేదు. ఎమ్మార్పీకి మించి అధిక ధరల ఊసే లేదు. మద్యంపై వచ్చే ఆదాయం మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరేది. నేడు కూటమి తెచ్చిన పైవేట్ పాలసీతో మద్యం దుకాణాలు జనావాసాలు, రద్దీ ప్రాంతాల్లోకి వచ్చేశాయి. ఊరురా బెల్టుషాపులు వెలిశాయి. క్వార్టర్ బాటిల్కు ఎమ్మార్పీపై మద్యం దుకాణాల్లో రూ.10, బెల్టుషాపుల్లో రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతుండటంతో మందుబాబులు మత్తులో ఒకరిపై ఒకరు దాడులకు తెగబడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఒక్కోసారి హత్యలకు సైతం దారితీస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. -
నేత్రపర్వం.. పవిత్రాదివాసం
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నార. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి ఆలయ యాగశాలలో అర్చకులు పవిత్రాదివాసాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయం విశ్వక్సేనపూజ, పుణ్యహవాచనం, అగ్నిప్రతిష్టాపన కార్యక్రమాలను అర్చకులు, రుత్వికులు అట్టహాసంగా చేశారు. అనంతరం పవిత్రాలకు పంచగవ్య ప్రోక్షణ, అభిమంత్రణలను నిర్వహించారు. అనంతరం శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవమూర్తుల వద్ద పవిత్రాలను ఉంచి పంచ శయనాదివాసాన్ని వేద మంత్రోచ్ఛరణతో అర్చక స్వాములు నిర్వహించారు. ఆ తర్వాత మహాశాంతి హోమాలు, చతుర్వేద పారాయణ చేశారు. -
●రాఖీ.. సందడి
సోదర, సోదరీమణుల ఆప్యాయతానురాగాలకు ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి శనివారం కావడంతో తాడేపల్లిగూడెం పట్టణ, రూరల్ మండలంలో రాఖీల కొనుగోలులో యువతులు నిమగ్నమయ్యారు. పట్టణంలోని ప్రధాన రహదారికిరువైపులా ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్దకు యువతులు, మహిళలు చేరుకుని రాఖీలను కొనుగోలు చేశారు. రూ.20 నుంచి రూ.280 వరకు విలువైన రాఖీలను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచారు. అయితే స్టాల్స్ విరివిగా పెరగడంతో కొనుగోళ్ళు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని వ్యాపారులు పేర్కొన్నారు. – తాడేపల్లిగూడెం రూరల్ -
ఇంటింటా శ్రావణ శోభ
●శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం పూజలు వైభవంగా, ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. పూజ అనంతరం మహిళలు చేతికి తోరణాలు కట్టుకుని ముత్తైదువులకు తోరణాలు కట్టి వాయినాలు, తాంబూళాలు అందజేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. సాయంత్రం సమీపంలో ఉన్న అమ్మవారి ఆలయాలకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకుని కుంకుమ పూజలు నిర్వహించారు. భీమవరంలో మావుళ్లమ్మ వారికి 9 లక్షల గాజులతో అలంకరణ చేశారు. మావుళ్లమ్మకు అజ్ఞాత భక్తులు సుమారు రూ. 11 లక్షల విలువ చేసే 108 బంగారు పుష్పాలను సమర్పించారు. – సాక్షి నెట్వర్క్ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి తాడేపల్లిగూడెం (టీఓసీ): పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన డీఆర్, పీఆర్సీ బకాయిలు తక్షణమే చెల్లించాలని, తాత్కాలిక భృతి 30 శాతం వెంటనే ప్రకటించాలని గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన సలహాదారు వీకే వీరారావు, ప్రధాన కార్యదర్శి వైవీఎస్ మూర్తి, జిల్లా కోశాధికారి వి.రామ్మోహన్లు డిమాండ్ చేశారు. పెన్షనర్ల జిల్లా కార్యవర్గ సమావేశం తాడేపల్లిగూడెం పట్టణంలో బ్రాంచ్ అధ్యక్షుడు బి.హరికుమార్ అధ్యక్షతన జరిగింది. వక్తలు మాట్లాడుతూ మూడు డీఆర్ బకాయిలతో సహ అన్ని బకాయిలు ప్రకటించాలని, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఆర్థిక నివేదిక, కార్యదర్శి నివేదికలను సభలో ఏకగ్రీవంగా అమోదించారు. నరసాపురం యూనిట్ కోశాధికారి స్వామి నాయుడు, తాలూకా యూనిట్ అధ్యక్షుడు ఎం.మార్కండేయులు, ఆర్.రామకృష్ణరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.హరనాథ కృష్ణ, పెన్షనర్లు పాల్గొన్నారు. -
పాములదిబ్బలో ఉద్రిక్తత
ఏలూరు (ఆర్ఆర్పేట): స్థానిక పాములదిబ్బలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు నెలల క్రితం పాములదిబ్బకు చెందిన ముంగి యర్రబాబు ఏలూరు జాతీయ రహదారిపై హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పాములదిబ్బ ప్రాంతానికి చెందిన కొందరు నిందితులుగా ఉండటంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేశారు. హత్యకు గురైన వ్యక్తిని దహన సంస్కారానికి తీసుకువెళ్లే సమయంలోనే హతుడి కుటుంబ సభ్యులు నిందితుల ఇంట్లో సామాన్లు ధ్వంసం చేసి గందరగోళం సృష్టించారు. అప్పట్లో ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ప్రత్యేక నిఘా, పోలీసు పికెట్ ఏర్పాటు చేసి శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు చేపట్టారు. ఈ విషయం సద్దుమణిగినా నివురుగప్పిన నిప్పులా ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున హత్య కేసులో నిందితుడిగా ఉన్న దాసరి కుమార్ రాజా ప్రత్యర్థులు ఇంటికి నిప్పుపెట్టారు. దీంతో మళ్లీ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఏలూరు టూటౌన్ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పాములదిబ్బలో మళ్లీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఇంటికి నిప్పు పెట్టిన ఘటనకు సంబందించి హత్యకు గురైన యర్రబాబు తల్లి పెద్దింట్లుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అడవి తల్లి బిడ్డలు.. కొండరెడ్డి గిరిజనులు
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ గిరిజన తెగల్లో కొండరెడ్డి గిరిజనుల తెగ ఒకటి. వీరు నేటికీ కొండలపై ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. అక్కడే వారి సాంప్రదాయ పంటలైన జొన్న, సామలు, మొక్కజొన్న వంటి పంటలను పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. అలాగే పలు గ్రామాల్లో వెదురు అల్లికలు, తేనె, చింతపండు, ఇప్ప పువ్వు వంటి అటవీ ఉత్పత్తులను సేకరిస్తుంటారు. వారాంతపు సంత, ఇతర ప్రభుత్వ కార్యాలయ పనుల మీద మాత్రమే కొండ దిగి కిందకు వస్తుంటారు. వీరికి ప్రధానంగా పోడు వ్యవసాయమే జీవనాధారం. సాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు కావొస్తున్నా నేటికీ కొండరెడ్డి గిరిజనులు కొండ ప్రాంతంలోనే జీవనం సాగిస్తూ వస్తున్నారు. ప్రకృతి మాత వడిలోనే జీవిస్తున్నారు. నేటికీ చెక్కుచెదరని సాంప్రదాయం నేటి ఆధునిక ప్రపంచంలో ఎవరి బ్రతుకులు వారివే, ఎవరి పనులు వారివే. అయితే కొండరెడ్డి గిరిజనులు నేటికీ నాటి సాంప్రదాయాలు, ఆచారాలకు కట్టుబడి ఉన్నారు. వ్యవసాయమే కాదు పెళ్లిళ్లు, పేరంటాలు ప్రతిదీ సమష్టిగా చేసుకునే సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. శుభకార్యాల్లో ఒకరికి ఒకరు సహకరించుకోవడం వంటివి నేటికీ చేస్తుంటారు. ప్రకృతే గిరిజనుల ఆరాధ్య దైవం ఆదివాసీ గిరిజనులు ప్రకృతినే ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. రావి, వేప చెట్లను ముత్యాలమ్మగా భావిస్తారు. ముఖ్యంగా బాట పండుగ, పప్పుల పండుగ, మామిడికాయ పండుగ వంటి పండుగలను ఎంతో వైభవంగా చేస్తారు. అయితే గిరిజనుల్లోనే కోయ తెగ వారు భూదేవి పండుగను తొలకరి సమయంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. నేటికీ ఈ పండుగ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. గత ప్రభుత్వ పాలనలో గిరిజన సంక్షేమానికి పెద్దపీట గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో పెద్దపీట వేశారు. సుమారు 3,220 మంది గిరిజనులకు 69814.72 ఎకరాల్లో పోడు భూములకు పట్టాలిచ్చారు. అదేవిధంగా రైతు భరోసా పథకంలో రైతులకు ప్రతీ ఏటా రూ. 15000 పెట్టుబడి సాయం అందేలా కృషి చేశారు. అలాగే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానంతో కొండ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు సైతం మెరుగైన వైద్యసేవలు అందించే విధంగా కృషి చేశారు. అలాగే వలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్లు కూడా కొండపైన ఉన్నవారికి కూడా ఇంటికే అందే విధంగా చర్యలు తీసుకున్నారు. గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందేలా సుమారు రూ. 50 కోట్లతో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి పూనుకున్నారు. అయితే ప్రస్తుతం నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అలాగే మారుమూల గ్రామాల నుంచి డోలి కష్టాలు కూడా లేకుండా బైక్ అంబులెన్స్ సేవలను అందించారు. ప్రకృతే వారి ఆరాధ్య దైవం నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గిరిజనులకు మళ్లీ కష్టాలు మొదలు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పథకాలకు ఒక్కొక్కటిగా మంగళం పలకుతుంది. గతంలో ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ అందించేవారు. అయితే ప్రస్తుతం దానిని తొలగించడంతో మళ్లీ గిరిజనులకు వాగులు దాటుతూ తలపై బియ్యం పెట్టుకుని మైళ్ల దూరం నడిచే పరిస్థితులు వచ్చాయి. గతంలో వలంటరీ వ్యవప్థ ద్వారా కోడి కూయక ముందే మారుమూల కొండ ప్రాంతాల్లో ఉన్న వారికి సైతం అన్ని రకాల పింఛన్లు అందేవి. ప్రస్తుతం ఆ పింఛన్లు వారం రోజులు దాటితేకానీ అందే పరిస్థితి లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వైద్యసేవలపై కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ పాలకులు తమకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా పాలన సాగించాలని గిరిజనులు కోరుతున్నారు. -
ఎఫెక్ట్
జాతీయ రహదారి మరమ్మతులు ప్రారంభంకొయ్యలగూడెం: స్థానిక జాతీయ ప్రధాన రహదారి అభివృద్ధికి నేషనల్ హైవే అధికారులు శుక్రవారం పనులను ప్రారంభించారు. జూలై 26న సాక్షిలో ‘అధ్వాన రహదారులతో ఇక్కట్లు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు ఇటీవల చెక్ పోస్ట్ సెంటర్ నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకు వరకు ప్రమాదకరంగా ఉన్న రోడ్డు మార్జిన్ను పరిశీలించారు. అనంతరం పొక్లెయిన్తో రహదారిపై ఏర్పడిన మార్జిన్ను క్రమబద్ధీకరించే పనులను ప్రారంభించారు. రెండు రోజులలో పనులను పూర్తి చేసి రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు పేర్కొన్నారు. అప్పటివరకు డివైడర్కి ఒక పక్కనే రాకపోకలను సాగించడానికి ప్రయాణికులు సహకరించాలని కోరారు. పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు చర్యలు తాడేపల్లిగూడెం రూరల్: భారీ వర్షాలు కురిస్తే రహదారులపై నీళ్లు నిలిచిపోతుండటం, పారిశుద్ధ్యం లోపిస్తుండటంపై ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. మండలంలోని మోదుగ గుంట, ఉప్పరగూడెం గ్రామాల్లో రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని మోటార్లు ఏర్పాటు చేసి, బయటకు పంపించే ఏర్పాటు చేశారు. ఇన్చార్జ్ ఎంపీడీఓ ఎం.వెంకటేష్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం రహదారులపై బ్లీచింగ్, ముగ్గు చల్లించారు. -
యాసిడ్ మీద పడి మహిళ మృతి
పెదపాడు: రోడ్డు ప్రమాదంలో యాసిడ్ మీద పడి ఓ మహిళ మృతి చెందగా భర్తకు గాయాలైన సంఘటన పెదపాడు మండలంలోని తాళ్లమూడిలో శుక్రవారం చోటు చేసుకుంది. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు నుంచి ఏలూరుకు యాసిడ్ లోడుతో వెళ్తున్న ట్రక్కు ఆటోలో అల్లాబక్సు అనే వ్యక్తి తన భార్య షంషేర్తో కలిసి వెళ్తున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారు మార్గమధ్యలో పెదపాడు మండలంలోని తాళ్లమూడి వద్దకు వచ్చేసరికి టైర్ పంక్చర్ కావడంతో ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న యాసిడ్ మీదపడి భార్య షంషేర్(46) అక్కడికక్కడే చనిపోయింది. యాసిడ్ గాయలైన భర్తను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మేజిస్ట్రేట్ వద్ద బాధితుడి వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలిపారు. బాధితులు నెలకు రెండు సార్లు ఈ విధంగా యాసిడ్ తీసుకువచ్చి ఏలూరులో దుకాణాలకు సరఫరా చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారని చెప్పారు. ఈ మేరకు పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తృటిలో తప్పిన పెనుప్రమాదం కై కలూరు: కేవలం 10 నిమషాలు అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా వస్తే భారీ ప్రమాదం జరిగేది. కై కలూరు వెలంపేట మరిపి నాగేశ్వరరావు ఇంటి వద్ద వంట చేస్తున్న సమయంలో ఎల్పీజీ సిలిండర్ గ్యాస్ పైప్ను నుంచి ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. మంటలను అదుపు చేసినా ప్రయోజనం లేకపోవడంతో సమీప నివాసితులు భయంతో అరుస్తూ పరుగులు తీశారు. కొంతమంది ఫైర్ ఆఫీస్కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి సిలిండరు నుంచి వచ్చే మంటలను అదుపు చేశారు. అప్పటికే సిలిండర్ పేలడానికి సిద్ధంగా ఉంది. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బందిని స్థానికులు అభినందించారు. -
గతంలో ఇక్కడే పరీక్ష రాశాను
నేను తితిదే వేదపాఠశాల ప్రధానాచార్యుడిగా పదవీ విరమణ చేశాను. 35 ఏళ్లుగా ఇక్కడ వేద పరీక్షలకు పరీక్షాధికారిగా వస్తున్నాను. వేదాల పరిరక్షణకు అందరూ కృషి చేయాలి. ప్రస్తుతం 30 మంది వేద విద్యార్థులను కృష్ణ యజుర్వేదంలో పరీక్షించాను. –గుళ్లపల్లి విశ్వనాధ ఘనాపాఠీ, హైదరాబాద్ శుక్ల యజుర్వేద ప్రొఫెసర్గా.. మాది నేపాల్. చిన్నతనంలోనే అస్సాం వచ్చి వేద పాఠశాలలో వేద విద్యనభ్యసించాను. ప్రస్తుతం తిరుపతిలోని వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో శుక్లయజుర్వేదంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. పది మంది వేద విద్యార్థులకు పరీక్ష నిర్వహించాను. – గోవిందప్రసాద్ అధికారి, శుక్ల యజుర్వేద పరీక్షాధికారి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాను వేదపరీక్షలకు దశాబ్దకాలంగా పరీక్షాధికారిగా వస్తున్నాను. విశాఖపట్నంలో శుక్ల యజుర్వేదంలో శిక్షణ ఇస్తున్నాను. ఏటా ఒక బ్యాచ్ చొప్పున ఎంపిక చేసుకుంటాను. ఒక్కో బ్యాచ్కు పదకొండు సంవత్సరాలు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. – రాపర్తి నరేంద్రకుమార్ ఘనాపాఠీ, విశాఖపట్నం ఇక్కడి సర్టిఫికెట్లకు ప్రాధాన్యత మాది రాజస్థాన్. అక్కడ రెండేళ్లు వేద విద్య, హైదరాబాద్లో రెండేళ్లు, కుంభకోణంలో ఏడాది, విశాఖపట్నం వేదపాఠశాలలో మూడేళ్లు సామవేదం అభ్యసించాను. ఇక్కడ ఉత్తీర్ణత సాఽధిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడంతో పరీక్ష రాయడానికి వచ్చాను. – రోహిత్శర్మ, రాజస్తాన్ ● -
12న వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ సమావేశం
కై కలూరు: వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశ పోస్టర్ను పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) శుక్రవారం అవిష్కరించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తేర ఆనంద్ మాట్లాడుతూ ఈ నెల 12న కండ్రికగూడెం సుఖీభవ కల్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. సమావేశానికి పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్.సుధాకర్బాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మరి కనకారావు, ఇతర రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు విచ్చేస్తారన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్ బాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్ గురునాథం, దేవదాసు ప్రేమబాబు, యూత్ నాయకులు కోడిచుక్కల నాగశేషు తదితరులు పాల్గొన్నారు. విద్యాశక్తిపై నిర్బంధం తగదు ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యాశక్తి కార్యక్రమాన్ని నిర్బంధం చేయడం తగదని స్కూల్ టీచర్స్ అసోసియేషన్(ఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కాడిశెట్టి శ్రీనివాసులు అన్నారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జీజేఏ స్టీవెన్తో కలిసి ఏలూరులోని జీజె రెసిడెన్సీలో జరిగిన ఏలూరు జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాశక్తి కార్యక్రమం ఐచ్ఛికంగా నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ తెలిపారని, కొన్ని జిల్లాల్లో విద్యాశక్తి కార్యక్రమాన్ని నిర్బంధంగా నిర్వహించమనడం సబబు కాదన్నారు. విద్యార్థులు సాయంత్రం నాలుగు గంటలకు అలసిపోతారని, ఆ సమయంలో విద్యాశక్తి అని చెప్పి అదనంగా తరగతులు నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. విద్యాశక్తిపై ఎవరినీ నిర్బంధం చేయవద్దన్నారు. చాలామంది ఉపాధ్యాయులు అదనపు తరగతులు నిర్వహించి వారి సిలబస్ను పూర్తి చేసి వెనుకబడిన విద్యార్థులకు రెమిడియల్ తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం దాటినా పీఆర్సీ, డీఏల ఊసెత్తకపోవడం దారుణమన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లీవ్ ఎన్క్యాష్మెంట్ బిల్లులు పెట్టి సంవత్సరాలు గడుస్తున్నా చెల్లింపులు చేయకపోవడం సమంజసం కాదన్నారు. కార్యక్రమానికి ఏలూరు జిల్లా అధ్యక్షుడు కాటి వెంకటరమణ అధ్యక్షత వహించగా, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట ప్రసాద్, గౌరవ అధ్యక్షుడు ఉర్ల గంధర్వరావు, అసోసియేట్ అధ్యక్షుడు పిట్ట ఫెడ్రిక్ బాబు, మహిళా అధ్యక్షురాలు జీ సంధ్యారాణి, సీనియర్ నాయకులు కే బాలరాజు, టీ అంజిబాబు, దాసరి యేసు పాదం, కే జేమ్స్, డీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ బియ్యం పట్టివేత ద్వారకాతిరుమల: మండలంలోని జి.కొత్తపల్లిలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసిన ఓ ఇంటిపై సివిల్ సప్లై అధికారులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. దాడిలో రూ. 1.50 లక్షలు విలువైన 3,750 కేజీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన మాటూరి దుర్గారావు జి.కొత్తపల్లి గ్రామంతో పాటు, చుట్టుపక్కల గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి.. బియ్యాన్ని జి.కొత్తపల్లిలోని ఉపాధిహామీ కూలి దాసరి రాజు ఇంట్లో నిల్వ చేస్తున్నాడు. రాత్రి సమయాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఆ బియ్యాన్ని బయటకు తరలిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం సివిల్ సప్లై డిప్యుటీ తహసీల్దార్లు నాగరాజు, వెంకటేశ్వరరావు, వీఆర్ఏ బ్రహ్మయ్యలు ఆ ఇంటిపై దాడి చేశారు. అనంతరం పోలీసుల సమక్షంలో గది తలుపులు తెరచి 75 రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. -
టేబుల్ టెన్నిస్లో విద్యార్థి ప్రతిభ
ఆగిరిపల్లి : రాష్ట్ర స్థాయిలో జరిగిన టేబు ల్ టెన్నిస్ పోటీల్లో ఆగిరిపల్లి మండల విద్యార్థి కాంస్య పతకం సాధించాడు. చొప్పరమెట్లలోని కేకేఆర్ హ్యాపీ వ్యాలీ పాఠశాల విద్యార్థి గోపాలకృష్ణ అండర్ 19 సింగిల్ విభాగంలో పాల్గొని ప్రతిభ చాటాడు. ఈ విజయం ద్వారా సీబీఎస్ఈ నేషనల్ లెవెల్ టేబుల్ టెన్నిస్ పోటీలకు అర్హత సాధించాడు. విద్యాసంస్థల చైర్మన్ కొసరాజు కోటేశ్వరరావు, సిబ్బంది విద్యార్థిని అభినందించారు.వరకట్నం వేధింపులపై కేసు నమోదుభీమవరం: అదనపు కట్నం కోసం వేదిస్తున్నారంటూ భీమవరం పట్టణానికి చెందిన గోడి అనిత శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. వివరాల ప్రకారం అనితకు రాజమహేంద్రవరం మండలం మారంపూడికి చెందిన కోడి జాషువాజైకుమార్తో సుమారు ఆరేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.5లక్షల నగదు, బంగారం కట్నంగా ఇచ్చారు. కొంతకాలం తరువాత భర్త కోడి జాషువాజైకుమార్ అతని కుటుంబ సభ్యులు రూ.10 లక్షలు అదనపు కట్నం తీసుకొని రావాలంటూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. ఈ మేరకు అనిత ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్కుమార్ చెప్పారు.బావిలో పడిన ఎద్దుకై కలూరు: ప్రమాదవశాస్తూ బావిలో పడిన ఎద్దును స్థానిక అగ్రిమాపక సిబ్బంది చాకచక్యంగా రక్షించిన ఘటన కై కలూరు రైతు బజారు ఎదురుగా శుక్రవారం జరిగింది. ఉదయం ఓ బలమైన ఎద్దు పాడుబడిన నూతిలో పడింది. భారీ శబ్ధం రావడంతో ఓ వ్యక్తి గమనించి సమీపంలోని ఫైర్ ఆఫీస్లో సమాచారం అందించారు. హుటాహుటీన వచ్చిన సిబ్బంది శ్రీనివాసరావు, రాజేష్బాబు, రవీంద్రబాబు మరో కొందరి స్థానికుల సాయంతో తాళ్లు కట్టి ఎద్దును రక్షించారు. ఇదే నూతిలో కొద్ది రోజుల క్రితం దూడ పడితే రక్షించామని స్థానికులు చెప్పారు. బావిపై మూత ఏర్పాటు చేయాలని యజమానికి సూచించారు.ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న పోలీసులుకైకలూరు: క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటానని బంధువులకు సెల్ ఫోన్ మెసేజ్ పెట్టిన యువకుడిని కై కలూరు టౌన్ ఎస్సై ఆర్.శ్రీనివాస్ చాకచక్యంగా శుక్రవారం పట్టుకుని తండ్రికి అప్పిగించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఏలూరు జిల్లా తడికలపూడి గ్రామానికి చెందిన అందుగుల థామస్(20) కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ నెల 4న కుటుంబ సభ్యులతో చిన్నపాటి గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏలూరు నుంచి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మావుళ్లమ్మ దేవాలయం వరకు కారుకు ఆప్టింగ్ డ్రైవర్గా వెళ్ళాడు. అక్కడ నుంచి సమీప సోదరుడు రత్నారావుకు తాను ఇటీవల జరిగిన గొడవకు మనస్థాపం చెందానని తనువు చాలిస్తోన్నానని మెసేజ్ పెట్టాడు. దీంతో వెంకటరత్నం టోల్ఫ్రీ నంబర్ 112కు పోన్ చేసి పోలీసులకు వివరాలు చెప్పాడు. సెల్ సిగ్నిల్ ఆధారంగా ఆకివీడు నుంచి కై కలూరు మీదుగా ఏలూరు వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కిన థామస్ను కై కలూరులో టౌన్ ఎస్సై శ్రీనివాస్ గుర్తించి స్టేషన్కు తీసుకొచ్చారు. యువకుడి తండ్రి లక్ష్మణరావును పిలిపించి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం యువకుడిని గుర్తించడంలో చొరవ చూపిన హెడ్కానిస్టేబుల్ నాగరాజును అభినందించారు. -
వేదంతో పులకించిన సరిపల్లె
గణపవరం: గణపవరం మండలం సరిపల్లె గ్రామం వేదపండితులు, ఘనాపాఠీలు, వేద విద్యార్థుల పాదస్పర్శతో పులకరించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన వేదవిద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇక్కడ నిర్వహించే వేద పరీక్షలకు హాజరయ్యారు. వీరిని పరీక్షించడానికి వేదపారాయణం, పాండిత్యంలో ఆరితేరిన వేదపండితులు, ఘనపాఠీలు పరీక్షాధికారులుగా విచ్చేశారు. సరిపల్లెలోని సఖ్యాభివర్ధక నిలయంలో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో 105వ వేదశాస్త్ర పరిషత్ మహా సభలు మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. గణపవరానికి చెందిన సాగిరాజు సుబ్బరాజు ఆర్థిక సహకారంతో గత మూడు దశాబ్దాలుగా సరిపల్లె టీటీడీ కల్యాణమండపంలోని ఈ వేదశాస్త్ర పరిషత్ మహాసభలు నిర్వహిస్తున్నారు. వేదవిద్యార్ధులకు ఇక్కడ రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలలో పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు అందచేస్తారు. ఏటా శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజును నిర్వహించే వేదపరిషత్ సభలో ఉత్తీర్ణులైన వేద విద్యార్థులకు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. గురు, శుక్రవారాలలో నాలుగు వేదాలలో నిర్వహించిన పరీక్షలకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతోపాటు, బిహార్, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర తదితర 10 రాష్ట్రాల నుంచి 130 మంది వేద విద్యార్థులు హాజరయ్యారు. -
న్యాయం జరిగే వరకూ పోరాటం
ఉండి: మండలంలోని పాములపర్రు దళిత శ్మశాన వాటికలో ఆక్వా రైతుల కోసం రోడ్డు వేయాలనే నిర్ణయంపై వివాదం రోజు రోజుకు ముదురుతోంది. శుక్రవారం మాల మహానాడు సంఘాలు, కేవీపీఎస్, సీపీఎం, అంబేడ్కర్ ఎంప్లాయిస్ యూనియన్, అంబేడ్కర్ మిషన్ వంటి సంఘాల నాయకులు పాములపర్రు దళితులను పరామర్శించి శ్మశాన వాటికను పరిశీలించారు. పాములపర్రు ఘటనపై పోలీసుల దౌర్జన్యాన్ని వారు తీవ్రంగా ఖండించారు. శ్మశానం జోలికి ఎవరు వచ్చినా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఎమ్మెల్యేకు ఎందుకింత కక్ష?: దళిత సంఘాల నేతలు స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు దళితులపై ఎందుకంత కక్ష అని వారు ప్రశ్నించారు. కార్యాలయంలో కూర్చుని ఆదేశాలివ్వడం కాదని శ్మశాన వాటికకు వచ్చి చూస్తే రోడ్డు ఎవరికోసం వేస్తున్నారో అర్థమవుతుందని అన్నారు.ఎవరో ఇద్దరు ఆక్వారైతుల కోసం రోడ్డు వేయిస్తూ వందల మంది దళితులను ఎందుకు బాధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 150 ఏళ్ల నుంచి గ్రామంలో దళితుల శ్మశాన వాటిక భూమిని ఇప్పుడు కాదంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రతి దళిత పేటకు రెండెకరాల వరకు భూమి ఇవ్వాలని ప్రభుత్వ జీవో చెబుతుంటే ఇప్పుడు ఆ భూమిలో రోడు వేస్తామనడంపై మండిపడ్డారు. ప్రభుత్వ రికార్డులను మాలమహానాడు నాయకులు అడుగుతుంటే సర్వే, రెవెన్యూ శాఖాధికారులు ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరు ఇలాగే ఉంటే ఉద్యమం తీవ్రతరం కాక తప్పదని వివిధ సంఘాల నాయకులు హెచ్చరించారు. సామరస్యంగా సమస్య పరిష్కారం కావాలంటే ముందుగా 144 సెక్షన్ ఎత్తేసి పోలీసులు వెళ్లిపోవాలని వారు డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్, జిల్లా అధ్యక్షుడు గుండు నగేష్, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్కుమార్, దానం విద్యాసాగర్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే క్రాంతిబాబు, జిల్లా అధ్యక్షుడు విజయ్, సీపీఎం జిల్లా నాయకుడు ధనికొండ శ్రీనివాస్, అంబేడ్కర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మధు, ఉపాధ్యక్షుడు రాజ్కుమార్, అంబేడ్కర్ మిషన్ నియోజవకర్గ నాయకులు ఉన్నారు. మండల వ్యాప్తంగా 144 సెక్షన్ దళితులపై దాడులే జరగలేదంటూ స్థానిక ఎమ్మెల్యే బుకాయిస్తున్నా ఉద్యమ తీవ్రతను ముందుగానే పసిగట్టిన పోలీసు ఉన్నతాధికారులు పాములపర్రు గ్రామంలోనే కాకుండా మండల వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు మండలంలో ప్రచారం చేయించారు. పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను కూటమి నాయకులు చేస్తున్నారని దళితులు ఆరోపిస్తున్నారు. దళితులకు వేధింపులు 144 సెక్షన్ సాకుతో ఇతర గ్రామాల నుంచి దళితులు పాములపర్రు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై పోలీసులు, కూటమి నాయకులు దృష్టి సారించారు. పాములపర్రు దళితుల ఫోన్ నెంబర్లు సంపాదించి వారికి ఫోన్లు చేస్తూ మీ మీద ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారు.. ఇక మీ పని అయిపోయిందని భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా కొందరు దళితులకు ఫోన్ చేసి ఎవరివైనా పది పేర్లు చెప్పాలని.. లేదంటే ఏ1గా నీ పేరు పెట్టాల్సి ఉంటుందని ఇబ్బందిపెడుతున్నారంటూ గ్రామానికి చెందిన కొందర దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళిత శ్మశాన వాటికలో రోడ్డు వేస్తారా? పాములపర్రులో దళిత సంఘాల నేతల ఆగ్రహం కూటమి నాయకులు, పోలీసుల మైండ్గేమ్ -
వరలక్ష్మీ వ్రతం పేరిట ధరల దోపిడీ
భీమవరం(ప్రకాశం చౌక్): వరలక్ష్మీ వ్రతం అంటేనే ఏడాదిలో తొలి పండగా భావించి ఏంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. భక్తుల సెంటిమెంట్ను ఆసరాగా తీసుకొని పూజకు అవసరమైనన పండ్లు, పూలు, అరటి పండ్లు, కొబ్బరికాయల ధరలను పెంచి వ్యాపారస్తులు దోపిడీ చేశారు. జిల్లా వ్యాప్తంగా పూజా సామగ్రి ధరలు గురువారం మధ్యాహ్నం నుంచి అనూహ్యంగా పెరిగిపోయాయి. సాధారణ రోజుల్లో డజను అరటి పండ్లు రూ.50 నుంచి రూ.60 ఉంటే రూ.100 రూపాయలకు విక్రయించారు. లక్ష్మీదేవి అమ్మవారికి పూజకు ఎక్కువగా చామంతి పూలు వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో చామంతి పూల రేటు పెంచి కేజీ చామంతులు రూ.600 వరకు విక్రయించారు. కనకాంబరాలను కూడా మర రూ.150 నుంచి రూ.200, మల్లెపూలు రూ.100 నుంచి రూ.150 వరకు అమ్మకాలు చేశారు. తమలపాకులు మోద రూ.50 నుంచి 70 రూపాయలు, కొబ్బరి కాయలు చిన్నవి రూ.30, పెద్దవి రూ.40 రూపాయలు చొప్పున అమ్మకాలు చేశారు. వరలక్ష్మీ వ్రతం పండుగ పేరట ధరల బాగా పెంచడంతో సామాన్యుల వరలక్ష్మీ పూజ ఖర్చుకు ఇబ్బందులు పడ్డారు. -
ఓటరు జాబితా సవరణ ఆపాలి
సాక్షి కథనాలకు స్పందన తాడేపల్లిగూడెం, కొయ్యలగూడెంలో పారిశుద్ధ్య లోపం, రహదారుల మరమ్మతులపై ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనాలకు అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. 8లో uభీమవరం: ప్రత్యేక సమగ్ర సర్వే (ఎస్ఐఆర్) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న ఓటర్ల జాబితా సవరణను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలలో తన పెత్తనం కోసం ప్రతిపక్షాల ఓటు బ్యాంక్ను తొలగించడానికే సవరణను ఆయుధంగా చేసుకుందని, దానికి ఎన్నికల సంఘం వత్తాసు పలుకుతుందని విమర్శించారు. గతంలో ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులను కూడా ఈ సవరణలో పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ సర్వేను దేశమంతా అమలు చేయాలని చూస్తుందని ఒక పక్క ఎన్నికల ప్రక్రియలో ఉన్న లోపాలపై చర్చ జరుగుతుండగా మరోపక్క సర్వే పేరుతో ఓటర్లను గందరగోళపర్చడం, తొలగించడం అన్యాయమన్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని స్వతంత్ర సంస్థగా కాకుండా కేంద్ర ప్రభుత్వం తన జేబు సంస్థగా మార్చేసిందని గోపాలన్ దుయ్యబట్టారు. తక్షణమే ఎస్ఐఆర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించాలని నినాదాలు చేశారు. సీపీఎం జిల్లా నాయకులు జక్కంశెట్టి సత్యనారాయణ, ఇంజేటి శ్రీనివాస్, ఎం.ఆంజనేయులు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణంరాజు, త్రిమూర్తులు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సచివాలయం.. సేవలు నిర్వీర్యం
శురకవారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాక్షి, భీమవరం: ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు సర్కారు శీతకన్ను వేసింది. కంప్యూటర్లు, ప్రింటర్లు, బ్యాటరీలు తదితర వాటికి నిర్వహణ కరువైంది. మరమ్మతులతో కొన్ని షట్డౌన్ కాగా.. మిగిలినవి తరచూ మొరాయిస్తుండటంతో సచివాలయ సేవల కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విప్లవాత్మకంగా.. గత ప్రభుత్వం జిల్లాలో 398 గ్రామ, 137 వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసింది. ఒక్కో సచివాలయానికి సచివాలయ సెక్రటరీ, ఇంజినీరింగ్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, హార్టీకల్చర్, వెటర్నరీ, డిజిటల్ అసిస్టెంట్లు, ఏఎన్ఎం, విలేజ్ సర్వేయర్ తదితర 10 నుంచి 11 పోస్టులను నియమించింది. రేషన్ కార్డులు, పింఛన్లు, సర్టిఫికెట్లు, ఆరోగ్యశ్రీ, భూరికార్డులు తదితర 500లకు పైగా సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆయా సేవలను బట్టి తక్షణ పరిష్కారం, కొన్ని 72 గంటలు, మరికొన్ని వారం నుంచి రెండు వారాల వ్యవధిలో పరిష్కరించేలా టైం బాండ్ సైతం పెట్టింది. సేవలు సక్రమంగా అందేలా.. సేవల్లో పారదర్శకత, సమయ పాలన, వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు ఒక్కో సచివాలయానికి రెండు నుంచి మూడు వరకు కంప్యూటర్లు, ప్రింటర్లు, బ్యాటరీలు తదితర సామగ్రిని అందజేశారు. అప్పటికే పంచాయతీల్లో ఉన్న కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర సామగ్రిని మినహాయించి మిగిలిన పరికరాలను ఇచ్చారు. మొత్తం 535 సచివాలయాలకు గా ను గత ప్రభుత్వంలో కొత్తగా 1,070 సీపీయూలు, 1,070 మోనిటర్లు, 535 ప్రింటర్లు, 535 యూపీఎస్ లు, 1,605 బ్యాటరీలు కలిపి మొత్తం 4,815 పరికరాలను అందజేశారు. పంచాయతీలు, పురపాలక సంస్థలు వీటి నిర్వహణను పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఆయా పరికరాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తితే సేవలకు ఆటంకం కలగకుండా వెంటనే మరమ్మతులు చేయించే పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో ఉండేది. న్యూస్రీల్కూటమి శీతకన్ను నిర్వహణ లేక మూలన పడుతున్న కంప్యూటర్లు, సామగ్రి జిల్లాలో 535 సచివాలయాలు అందించిన పరికరాలు 4,815 పనిచేస్తున్నవి 2,088 మాత్రమే ప్రజలు, ఉద్యోగుల అవస్థలు పరికరాలు మొత్తం పని పని చేస్తున్నవి చేయనివి సీపీయూలు 1,070 749 321 మోనిటర్లు 1,070 857 213 ప్రింటర్లు 535 284 251 యూపీఎస్లు 535 69 466 బ్యాటరీలు 1,605 129 1,476 -
కూటమి పాలనలో రక్షణ కరువు
భీమవరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నివర్గాల ప్రజలకు రక్షణ లేదని, రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శివకుమార్ గౌడ్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్యాదవ్, పార్టీ నేత వేల్పుల రామలింగారెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా గురువారం భీమవరం ప్రకాశం చౌక్లో ధర్నా నిర్వహించారు. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని వస్తున్న నాయకులపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయలేని కూటమి ప్రభుత్వం, అడ్డదారిలో గెలవడానికి ఓటర్లను భయాందోళనకు గురిచేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వ అ రాచకాలను వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రజల ముందుంచడంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ప్రభుత్వం పద్ధతి మార్చుకుని సూ పర్సిక్స్ హామీలను తక్షణం అమలుచేయాలని లే కుంటే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. వైఎస్సార్సీపీ ఎంబీసీ విభాగ అధ్యక్షుడు పెండ్ర వీరన్న, యూత్వింగ్ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రక్షణ లేదన్నారు. బలహీన వర్గాల ప్రజాప్రతినిధులపై వరుస దాడులతో వైఎస్సార్సీపీని బలహీనపర్చలేరన్నారు. పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్య క్షుడు జహంగీర్, పట్టణ శాఖ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, పార్టీ నాయకులు బాలాజీ, గంటా సుందరకుమార్, కమతం మహేష్, పాలా లక్ష్మీచక్రధర్, గేదెల నర్సింహరావు, పతివాడ మార్కండేయులు, ఈద జాషువ, రుద్రాక్షల శ్రీను, తుంపాల శ్రీను, షేక్ రబ్బాని, రాయవరపు శ్రీనివాసరావు, పాలా నాగరాజు, వీరవల్లి ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
రాజ్యాంగానికి రఘురామ వరకభాష్యం
ఉండి: రాజ్యాంగం కల్పించిన హక్కులకు వక్రభా ష్యం చెబుతూ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఏపీ బహుజన జేఏసీ రాష్ట్ర నా యకులు అన్నారు. పాములపర్రులో జరిగిన ఘటనపై వివరణ ఇస్తూ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పాములపర్రు దళితులు, జేఏసీ రాష్ట్ర నాయకులు గురువారం నిరసన తెలిపారు. ఏపీ బహుజన జేఏసీ ఫౌండర్, కన్వీనర్ తాళ్లూరి మధు మాట్లాడుతూ మత స్వేచ్ఛ రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని, దీనిని కాదని క్రైస్తవ మతానికి చెందిన వారు దళితులు కారని ఎమ్మెల్యే ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. రాష్ట్రంలో వివిఽ ద కులాలకు చెందిన వారు క్రీస్తును నమ్ముకున్నారు వారిని క్రైస్తవులుగా మార్చేస్తారా? వారి కులాన్ని కాదంటారా? అంటూ ప్రశ్నించారు. కూటమి నాయకుల తప్పుడు సమాచారంతోనే ఎమ్మెల్యే రఘురామ మాట్లాడుతున్నారన్నారు. గతంలో అధికారులు ఇచ్చిన శ్శశాన భూమి రికార్డులు పరిశీలించడంతో పాటు 150 ఏళ్ల నుంచి ఇక్కడ సమాధులున్నాయని గమనించాలన్నారు. స్థానికంగా వరి చేలు లేవని, ఉన్నవి రొయ్యల చెరువులేనన్నారు. నలుగురు రైతుల సంక్షేమం కోసం వందల మంది మనోభావాలు దెబ్బతినేలా దళితులకు ప్రత్యేకమైన శ్శశాన భూమిని పాడుచేసేలా రోడ్డు నిర్మాణం చేస్తారా అని మండిపడ్డారు. పాములపర్రులో దళితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని చెప్పారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మాజీ సీఎం జగన్, జాతీయ మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా ఉండిలో ఓ కూటమి నేత ఇంటికి రాత్రి వేళలో ఓ పోలీస్ అధికారి వెళ్లడం, వారితోపాటు శ్శశానంలో రోడ్డు కావాలంటూ ప్రేరేపించిన కూటమి నాయకులు ఉండటం అనుమానాలకు తావిస్తోందని దళితులు చెబుతున్నారు. ఏపీ బహుజన జేఏసీ -
ఇసుక దందా
స్నాతకోత్సవానికి నిట్ సిద్ధం తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్ 7వ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. శనివారం ఉదయం వేడుకలు ప్రారంభం కానున్నాయని ఇన్చార్జి డైరెక్టర్ తెలిపారు. 8లో uపెనుగొండ: ఇసుక అక్రమ నిల్వలు కాసులు కురిపిస్తున్నాయి. ఆచంట మండలంలో కూటమి నాయకులు భారీ ఎత్తున ఇసుకను అక్రమంగా నిల్వ చే శారు. గోదావరికి వరద నీరు రావడంతో నెమ్మదిగా అమ్మకాలకు తెరలేపారు. ఇసుక అమ్మకాలు జో రుగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజులుగా ఆచంట మండలంలో ఇసుక అమ్మకాలు వి చ్చలవిడిగా సాగుతున్నాయి. ఐదు యూనిట్ల ఇసుక రూ.9 వేలకు విక్రయిస్తున్నారు. సిద్ధాంతం నుంచి నరసాపురం వరకూ ఇసుక తవ్వకాలకు గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరంతో ర్యాంపు తెరుచుకోలేదు. అయినా పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా నిర్వహించి మండలంలో పలుచోట్ల నిల్వ ఉంచారు. వైఎస్సార్సీపీ సర్పంచ్ల ఫిర్యాదు ఆచంట మండలంలో ఇసుక అక్రమల నిల్వలపై వైఎస్సార్ సీపీ సర్పంచ్లు కొందరు ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేశారు. తక్షణం ఇసుకను స్వాధీ నం చేసుకోవాలని డిమాండ్ చేసినా అధికారుల నుంచి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఇసుక నిల్వ చేసిన కూటమి నేతలు అమ్మకాలు ప్రారంభించా రు. గుట్టలు త్వరగా ఖాళీ చేసి ఎలాంటి నిల్వలు లే వని నమ్మించాలని చూస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు అంటున్నారు. అక్రమార్కులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శిస్తున్నారు. సత్వరం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
అంగన్వాడీలతో సెల్గాటం
ఏలూరు (టూటౌన్): ‘సిగ్నల్స్ పని చేయవు.. యాప్స్ సపోర్టు చేయవు.. గతంలో 2జీ ఫోన్లు ఇచ్చారు.. ప్రస్తుతం 5జీ యాప్స్ అప్లోడ్ చేయమంటున్నారు.. యాప్ల సాకుతో ఫేస్ రికగ్నైజ్ కాకపోతే రేషన్ కట్ చేస్తామంటున్నారు.. ఇలాగైతే అంగన్ వాడీ కేంద్రాలను నడిపేది ఎలా.. తాము విధులు నిర్వర్తించేది ఎలా..’ అంటూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఫోన్లు అయినా ఇవ్వండి లేదా యాప్లను రద్దయినా చేయండి అంటూ అంగన్వాడీలు అధికారులను వేడుకుంటున్నారు. యాప్లపై కనీస శిక్షణ ఇవ్వకుండా, యాప్లను సపోర్టు చేసే ఫోన్లను అందించకుండా మెడపై కత్తి పెట్టి మరీ పనిచేయంటే ఎలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్ర మంలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల వ్యాప్తంగా అంగన్వాడీలు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో సెల్ఫోన్లను అప్పగిస్తూ నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను ఐసీడీఎస్ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని పలు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రెండు జిల్లాల పరిధిలో 3,851 మంది అంగన్వాడీ కార్యకర్తలు, అదే సంఖ్యలో సహాయకులు పనిచేస్తున్నారు. యాప్లలో అప్లోడ్ తిప్పలు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి కార్యకలాపాలను బాల సంజీవని, పోషణ ట్రాకర్ యాప్ల ద్వారా నిర్వహించాలి. ఫేస్ యాప్, ఫేస్ క్యాప్చర్, కేవైసీ, ఓటీపీ వంటి పనులు చేసేందుకు ప్రస్తుతం ఉన్న ఫోన్లు సహకరించడం లేదు. ఫేస్ క్యాప్చర్ అయితేనే.. యాప్లలో ఫేస్ క్యాప్చర్ అయితేనే అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు ఆహారం ఇవ్వాలి. దీంతో లబ్ధిదారులకు ముఖ ఆధారిత గుర్తింపుతో ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో కుటుంబంలో ఎవ రూ వచ్చినా రేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు లబ్ధిదారుడు తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్కు నిధులు తగ్గిస్తోంది. దీంతో అరకొర సౌకర్యాలతో సెంటర్లు నడుస్తున్నారు. నాణ్యమైన ఆహారం అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు యాప్లతో ఇబ్బంది పడుతున్నామని, సిగ్నల్స్ సరిగా లేక, సర్వర్ పనిచేయక తిప్పలు పడుతుంటే.. అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని అంగన్వాడీలు అంటున్నారు. పదో తరగతి చదివిన తమను యాప్లలో పనిచేయాలంటే ఎలా అని అంగన్వాడీలు ప్రశ్నిస్తున్నా రు. ఒక లబ్ధిదారుడి ఫేస్ క్యాప్చర్ చేయాలంటే రెండు, మూడు గంటల సమయం పడుతుందంటున్నారు. ఒక్కో కేంద్రంలో సగటున మూడేళ్లలోపు పిల్లలు 50 నుంచి 60 మంది, గర్భిణులు, బాలింతలు 10 నుంచి 15 మంది వరకు, ప్రీ స్కూల్ పిల్లలు 10 నుంచి 20 మంది, కిశోర బాలికలు 10 నుంచి 50 మందిలోపు ఉంటారని అంటున్నారు. వీరందరికీ ప్రతినెలా ఈకేవైసీ, ఓటీపీ, ఫేస్ క్యాప్చర్ చేయాలంటే సమయం సరిపోవడం లేదని అంగన్వాడీలు ఆవేదన చెందుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలు ఏలూరు పశ్చిమగోదావరి జిల్లా జిల్లా మెయిన్ కేంద్రాలు 1,959 1,556 మినీ కేంద్రాలు 206 70 మొత్తం 2,165 1,626 అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులు పశ్చిమగోదావరి ఏలూరు ఆరేళ్లలోపు పిల్లలు 43,783 41,116 మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 19,672 19,909 గర్భిణులు 8,596 7,889 బాలింతలు 6,170 5,606 మొత్తం 78,221 74,520 యాప్ల కత్తి సపోర్టు చేయని ఫోన్లతో ఇబ్బందులు ముఖ ఆధారిత గుర్తింపుతోనే రేషన్ పనిచేయని యాప్లు.. అధికారుల ఒత్తిళ్లు ఐసీడీఎస్ కార్యాలయాల్లో ఫోన్ల అప్పగింత ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలు -
షోకాజ్ నోటీసుల ఉపసంహరణ
భీమవరం(ప్రకాశం చౌక్): పీ4 సర్వేకు సంబంధించి భీమవరంలో 26 మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై ఇటీవల ‘సాక్షి’లో ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు. విషయాన్ని ఉద్యోగుల సంఘ నాయకులు రాష్ట్రస్థాయి అధికారులు దృష్టికి తీసుకువెళ్లడంతో వారు స్పందించారు. 26 మంది సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు విత్డ్రా చేసుకోవాలని ఆదేశించడంతో మున్సిపల్ కమిషనర్ ఈ దిశగా చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. మందకొడి సర్వేతోనే.. పట్టణంలో పీ4 సర్వే మందకొడిగా జరగడంతో కొందరు సచివాలయ ఉద్యోగులకు నోటీసులు ఇచ్చామని మున్సిపల్ కమిషన్ కె.రామచంద్రారెడ్డి తెలిపారు. మున్సిపాలిటీలో కేవలం 12 శాతం మాత్రమే సర్వే జరిగిందని, 12 సచివాలయాల్లో సర్వే కనీసం మొదలు కాలేదన్నారు. ఈ క్రమంలోనే నోటీసులు ఇచ్చామని, ఉద్యోగులపై ఎలాంటి ఒత్తిడి లేదని పేర్కొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం భీమవరం: గురు పూజోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయులకు అవార్డులు అందించనున్నామని, ఈనెల 8లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఈ.నారాయణ గురు వారం ఓ ప్రకటనలో తెలిపారు. కనీసం పదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నవారు అర్హులన్నారు. 16న తుది జాబితా రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తామని, 21 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రస్థాయిలో ఎంపికై న ఉపాధ్యాయులకు ఇంటర్వ్యూలు నిర్వహించి 25న ఎంపికై న వారి తుది జాబితాను విడుదల చేస్తారని డీఈఓ నారాయణ తెలిపారు. చేనేత వస్త్రాలను ఆదరించాలి భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలో చేనేత వస్త్రాలకు విస్తృత ప్రచారం కల్పించి, మార్కెటింగ్ను పెంపొందించాలని ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి సూచించారు. గురు వారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో ప్రకా శం చౌక్ నుంచి మున్సిపల్ కార్యాలయం వర కు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకం ప్రారంభం, నేత కార్మికులకు సత్కారం కార్యక్రమాల్లో ఇన్చార్జి కలెక్టర్, రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత పాల్గొన్నారు. ఆర్డీఓ కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి కె.అప్పారావు, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, నేత కార్మికులు పాల్గొన్నారు. మార్గదర్శిగా నమోదు స్వచ్ఛందమే.. పీ4పై అవగాహన లేకుండా ప్రజలకు వక్రభాష్యం చెప్పే ప్రచారాన్ని ఉపేక్షించేది లేదని ఇన్చార్జి కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. బంగారు కుటుంబాలను ఆదుకోవడంలో మార్గద ర్శుల ఎంపిక పూర్తిగా స్వచ్ఛందంగానే జరుగుతోందన్నారు. మార్గదర్శుల నమోదుకు ఒత్తిడి లేదన్నారు. బంగారు కుటుంబాలను మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టర్లకు స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి ఇన్చార్జి కలెక్టర్, అధికారులు హాజరయ్యారు. బ్యాంకు ఏజెంట్ల పేరుతో మోసం భీమవరం: బ్యాంకు రికవరీ ఏజెంట్లుమంటూ ఇద్దరు వ్యక్తులు భీమవరం ఏడో వార్డుకు చెందిన కె.రామలక్ష్మి నుంచి రూ.2 లక్షలు తీసు కుని మోసగించినట్టు పోలీసులు తెలిపారు. పట్టణంలోని మారుతీనగర్లో భవనానికి మార్టిగేజ్ రుణం తీసుకున్నారు. వాయిదా చెల్లించాల్సి ఉండగా హైకోర్టులో స్టే వేద్దామని చెప్పి నగదు తీసుకుని ఇప్పటివరకు సమాధానం చెప్పడం లేదని రామలక్ష్మి ఫిర్యాదులో పేర్కొనగా ఎస్సై బీవై కిరణ్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హుండీ ఆదాయం లెక్కింపు భీమవరం(ప్రకాశం చౌక్): పంచారామ క్షేత్రం గునుపూడి ఉమాసోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రూ.10,50,655 లభించిన్నట్లు ఈఓ డి.రామకృష్ణంరాజు తెలిపారు.. స్వామి వారి నిత్యాన్నదానానికి రూ.18,886 లభించిందన్నారు. కార్యనిర్వహణాధికారి కర్రి శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
వేధింపులు ఆపాలి
పనిచేయని ఫోన్లను తిరిగి అప్పగించిన అంగన్వాడీలపై అధికారుల వేధింపులు మానాలి. టార్గెట్ల పేరుతో అధికారులు తీవ్రంగా వేధిస్తున్నారని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు ఆపకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తాం. – డీఎన్వీడీ ప్రసాద్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి, ఏలూరు వెసులుబాటు కల్పించాలి ఫేస్ క్యాప్చర్తో నిమిత్తం లేకుండా మాన్యువల్గా రేషన్ ఇచ్చే వెసులుబాటు కల్పించాలి. యాప్ల వల్ల మాతో పాటు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లబ్ధిదారులు ఓటీపీ చెప్పేందుకు సంబంధిత ఫోన్లు అందుబాటులో ఉండటం లేదు. – పి.సుజాత, జిల్లా అధ్యక్షురాలు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏలూరు జిల్లా అప్లోడ్ కావడం లేదు మాకిచ్చిన ఫోన్లలో యాప్లు అప్లోడ్ అవడం లేదు. పీడీఎఫ్ ఫైల్స్ ఓపెన్ కావడం లేదు. దీనికితోడు స్వర్ణాంధ్ర యాప్ పనులు చేయమంటున్నారు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. అయినా అధికారులు టార్గెట్లు పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. – పి.భారతి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏలూరు జిల్లా 5జీ ఫోన్లు ఇవ్వాలి తక్షణమే అంగన్వాడీలకు 5జీ ర్యామ్ ఉన్న ఫోన్లను ఇవ్వాలి. పాత ఫోన్లలో న్యూవెర్షన్ యాప్లను అప్లోడ్ చేయమంటే ఎలా. ఐసీడీఎస్ అధికారులు అర్థం చేసుకోవాలే తప్ప మాపై కక్ష సాధింపులకు దిగడం సరికాదు. అన్ని యాప్లను కలిపి ఒకే యాప్గా మార్చాలి. – టి.మాణిక్యం, జిల్లా కోశాధికారి,ఏపీ అంగన్వాఢీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏలూరు జిల్లా ● -
జోరుగా చేపనారు ఉత్పత్తి
ఉంగుటూరు: రాష్ట్రంలోనే పేరుగాంచిన బాదంపూడి ప్రభుత్వ మత్స్య కేంద్రంలో చేపనారు ఉత్పత్తి జోరుగా సాగుతోంది. ఇక్కడ చేపనారు ఉత్పత్తి జూలై నుంచి ప్రారంభించి నవంబరు వరకు కొనసాగిస్తారు. ఈ ఏడాది చేపనారు ఉత్పత్తి లక్ష్యం 24 కోట్లుగా ప్రభుత్వం నిర్ధేశించగా జూలైలో 4 కోట్ల 40 లక్షలు చేపనారు ఉత్పత్తి పూర్తి చేశారు. రాహు, కట్ల, మ్రిగాలా, కామన్ రకాలు పిల్లలు ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తి చేసిన చేపనారు పిల్లలను కొవ్వలి, ఏలూరు, తణకు, కర్నూలు, గాజుల దిన్నె, మోటూరు, తదితర ప్రభుత్వ ఫారాలకు సరఫరా చేశారు. ఫారంలో ఒక ఫీల్ట్మేన్, ఒక ఫిషర్మేన్, ఇద్దరు కూలీలు పనిచేస్తున్నారు. రెండు అంగుళాలు ఉన్న చేపపిల్లలు ఫింగర్ లింగ్సు టార్గెట్ ఒక కోటిగా ఉంది. 90 లక్షలు ఇప్పటికే నిల్వ చేసి ఉంచారు. చైనీస్ విధానంలోనే ఉత్పత్తి చేపనారు ఉత్పత్తి చైనీస్ హేచరీస్లోనే ఉత్పత్తి చేయడం జరుగుతోంది. మేలుజాతి తల్లిచేపలను ముందుగానే సేకరించి చెరువుల్లో పెంచుతారు. వాటిలో ముందురోజు సాయంత్రం తల్లి చేపలు మగ, ఆడకు ఓవ సీస్ (తల్లి చేపలకు హర్మోన్) ఇంజక్షన్ ఇస్తారు. ఆ రెండు చేపలు సంయోగ పక్రియ ద్వారా గుడ్లును విడుదల చేస్తాయి. ఈరెండు బాహ్యఫలదీకరణ చెందిన గుడ్డు ఏర్పడుతాయి. ఇవి నీటిని షోచించుకుని ఉబ్బి ఉదయానికి గుడ్లు మధ్యలో స్పష్టమైన కేంద్రకుము ఏర్పడుతుంది. ఈ గుడ్లు తరువాత సమవిభజనతో అబివృద్ధి చెంది వివిధ దశలగా రూపాంతరం చెందుతూ స్పాన్గా తయారవుతుంది. బ్రీడింగును సాయంత్రం వేళలో నిర్వహిస్తారు. తరువాత రోజు ఉదయానికి గుడ్లు ఏర్పడతాయి. ఈ గుడ్లు మరుసటి రోజు సాయంత్రానికి ఒక వయస్సు కలిగిన స్పాన్గా ఉత్పత్తి అవుతాయి. ఇలా అభివృద్ధి చెందిన స్పాన్ మరో రెండురోజులు హేచరీ నందు ఉంచడం జరుగుతుంది. మెత్తంగా మూడురోజులు కలిగిన స్పాన్ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. 6 గంటల సమయంలో చైనీస్ హేచరీలో వేస్తారు. ఇలాచేపనారు ఉత్పత్తిచేసి ప్రభుత్వ ఫారాలకు సరఫరా చేస్తారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచింది రాష్ట్రంలోనే పేరు గాంచిన ఈ చేపల ఉత్పత్తి కేంద్రానికి అనుబంధంగా శిక్షణా కళాశాల నడుస్తోంది. ఇందులో మూడు నెలలు కోర్సు ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇక్కడ చదువుకున్న వారికి ఫిషర్మేన్ ఇతర ప్రభుత్వ ప్రైవేట్ ఫారాల్లో పోస్టులు కూడా చేస్తున్నారు. అందువల్ల ఈశిక్షణా కేంద్రానికి ఉమ్మడి రాష్ట్రంలోనే పేరుంది. కాగా బాదంపూడి మత్య్స కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ క్షేత్రంలో నూతన భవనాలు లేకపోవడంతో తల్లి చేపలు పెంచడంలేదు. సమయానికి కొనుగోలు చేసి కాలం వెళ్లదీస్తున్నారు. తగినంతమంది సిబ్బంది లేకపోవడం, జిల్లా, రాష్ట్ర స్థాయి మత్స్య శాఖ అధికారుల పర్యవేక్షణా లోపం కూడా ఇక్కడ ఉంది. ఈ ఏడాది ఉత్పత్తి లక్ష్యం 24 కోట్లు ఇప్పటివరకు 4.40 కోట్ల ఉత్పత్తి పూర్తి ఉత్పత్తి చేసిన చేపనారు ప్రభుత్వ ఫారాలకు సరఫరా -
కూటమి ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం
జంగారెడ్డిగూడెం : కూటమి ప్రభుత్వంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని వైఎస్సార్సీపీ బీసీ నాయకులు, బీసీ ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం స్థానిక పీపీఎన్ చంద్రరావు స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి, పట్టణ వైఎస్సార్సీపీ మాజీ అధ్యక్షుడు, కౌన్సిలర్లు పీపీఎన్చంద్రరావు, చిటికెల అచ్చిరాజు, చనమాల శ్రీనివాస్, బత్తిన చిన్న, భావన రుషి తదితరులు మాట్లాడారు. 50 సంవత్సరాలకు బీసీలకు పింఛన్ ఇస్తానని చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. తల్లికి వందనం అందరికీ ఇవ్వలేదన్నారు. బీసీలను ఆకాశానికెత్తేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి చంద్రబాబు మరోసారి మోసం చేశారన్నారు. 2014లో కూడా బీసీలకు ప్రాతినిధ్యం లేదని, ప్రాధాన్యత సీట్లు కూడా ఇవ్వలేదన్నారు. బీసీ మహిళలకు నెలకు రూ.1500 ఇస్తానని చెప్పి ఇవ్వలేదని, బీసీల్లో చేతివృత్తులకు రుణం ఇస్తామని మొండి చేయి చూపించారన్నారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక చేతులు ఎత్తేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కూడా నిలకడలేని మనస్తత్వం అని, పొంతనలేని మాటలు మాట్లడతారని విమర్శించారు. ఈవీఎంల అక్రమాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 53 శాతం ఉన్న బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటుందన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ అంటే హత్యలు, అత్యాచారాలు, అవినీతి, అరాచకాలు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు కేసులు పెట్టడమేనా అని ప్రశ్నించారు. చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. లోకేష్ మంగళగిరిలో చేనేత కార్మికులకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. పథకాల అమలు జగన్కే సాధ్యం మాటిస్తే మడమ తిప్పని వైఎస్ జగన్మోహన్రెడ్డికే పథకాలు అమలు సాధ్యమని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు. గత వైఎస్సార్ సీపీ పాలనలో బీసీలకు పట్టం కట్టారని, డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు ఆరుగురు, రాజ్యసభ సభ్యుల నలుగురికి పదవులు కల్పించారన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పదవిని బీసీ మహిళకు కేటాయించడంతో జగన్మోహన్రెడ్డి బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత తెలుస్తుందన్నారు. ఒక్క జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరిగిందన్నారు. చేనేత సొసైటీలకు నూలు, రంగులు సబ్సిడీపై ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎల్.వెంకటేశ్వరరావు, కేమిశెట్టి మల్లిబాబు, చిప్పాడ వెంకన్న, నేట్రు గణేష్, పెసరగంటి త్రిమూర్తులు, పెప్సీ శ్రీను, చిటికెల అచ్చిరాజు, ఆదినారాయణ, మాధవ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బూజు పట్టిన పరోటాల విక్రయంపై కేసు నమోదు
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం విజేత స్టోర్ను జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఆర్ రెడ్డి తనిఖీ చేసి బూజు పట్టిన పరోటాలను విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. భీమవరానికి చెందిన పడమటి దిలీప్కుమార్ ఈనెల 5వ తేదీన విజేత స్టోర్లో ప్రెస్ బెల్ కంపెనీ మలబార్ పరోటాలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్లి చూడగా బూజు పట్టి ఉన్నాయి. దీంతో ఆయన వాటిని స్టోర్కు తీసుకువచ్చి అసిస్టెంట్ సేల్స్ మేనేజర్కు చూపించారు. అదే బ్యాచ్లో ఉన్న మరో ప్యాకెట్ కూడా ఓపెన్ చేసి చూడగా ఆ ప్యాకెట్లోని పరోటాలూ బూజు పట్టి ఉండడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఆర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం ఆయన స్టోర్ను తనిఖీ చేసి పరోటాలు బూజు పట్టి ఉండడాన్ని గుర్తించి జేసీ కోర్టుకు కేసు నమోదు చేశారు. రాజమండ్రికి చెందిన ప్రెస్ బెల్ కంపెనీ నుంచి పరోటాలు సరఫరా అవుతున్నాయని, మిగిలిన వాటిని కూడా పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్కు పంపిస్తామని ఏఎస్ఆర్ రెడ్డి చెప్పారు. -
వారం రోజుల తర్వాత ఇంటికి మృతదేహం
కై కలూరు: చేపల లోడ్తో వెళుతూ మధ్యప్రదేశ్ రాష్ట్ర జబ్బల్పూర్ వద్ద వ్యాన్ బోల్తా పడటంతో పందిరిపల్లిగూడెంకు చెందిన వ్యాన్ డ్రైవర్ కర్ణం చిరంజీవి చంద్రమౌళి (27) జూలై 31న మరణించాడు. ఇదే ప్రమాదంలో నత్తగుళ్ళపాడుకు చెందిన క్లీనర్ దావీదుకు తీవ్ర గాయాలయ్యాయి. ఫంగస్ చేపల లోడుతో వెళుతున్నా వ్యాన్ అక్కడ డివైడర్ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు వెళ్లగా పోస్టుమార్టం అనంతరం చిరంజీవి మృతదేహాన్ని బుధవారం గ్రామానికి తీసుకొచ్చారు. చిరంజీవికి భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రాష్ట్ర వడ్డీ సాధికారిత కమిటీ చైర్మన్ బలే ఏసురాజు, పలువురు కొల్లేరు పెద్దలు చిరంజీవి భౌతికకాయానికి నివాళి అర్పించారు. చిరంజీవి మరణంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
రేషన్ బియ్యం పట్టివేత
ముసునూరు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకుని సీజ్ చేసినట్లు నూజివీడు సివిల్ సప్లయి స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ గుండుబోయిన వెంకటేశ్వరరావు తెలిపారు. బాపులపాడు మండలం కాకులపాడు ప్రాంతం నుంచి వాహనంలో మండలంలోని గుళ్ళపూడి మీదుగా అక్రమంగా తరలిస్తున్న 41 క్వింటాళ్ల రేషన్ బియ్యంను ఏలూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున దాడి చేసి పట్టుకున్నామన్నారు. బియ్యాన్ని తరలిస్తున్న కడలి లక్ష్మణరావు, ధనికొండ గోపిరాజు, బండారు నాగబాబు, కొల్లి కాసులు, షేక్ ఖాసింబాబులపై ముసునూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.నేడు ఏలూరులో కోకో రైతుల రాష్ట్ర సమావేశంఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం ఏలూరు పవర్పేటలోని అన్నే భవనంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కోకో గింజల ధర కిలోకు రూ. 500 నుంచి రూ. 350కు క్రమంగా తగ్గించివేయడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. కోకో రైతుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని శ్రీనివాస్ తెలిపారు.బైక్ దొంగల అరెస్టుఆకివీడు: ఇద్దరు దొంగలను పట్టుకుని వారి నుంచి తొమ్మిది మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆకివీడు రూరల్ సీఐ జగదీశ్వరరావు, ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపారు. నిందితులు కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన కూనసాని నాగాంజనేయులు, ఆకివీడు మండలం చినకాపవరం గ్రామానికి చెందిన కుప్పల రమేష్లను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచామన్నారు. డీఎస్పీ జయ సూర్య పర్యవేక్షణలో ఉండి ఎస్సై నజీరుల్లా, విజయ్, శివ, శంకర్, రత్నంల సహకారంతో కేసును ఛేదిచామన్నారు.22న సీజీఆర్ఎఫ్ క్యాంపు కోర్టుసీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ సత్యనారాయణసాక్షి, విశాఖపట్నం: ఏపీఈపీడీసీఎల్ శ్రీకాకుళం, అనకాపల్లి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పాడేరు సర్కిళ్ల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 11 నుంచి క్యాంపు కోర్టులు నిర్వహించనున్నట్లు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) చైర్మన్ విశ్రాంతి జడ్జి బి.సత్యనారాయణ వెల్లడించారు. ఇందులో భాగంగా ఈనెల 22న భీమవరం డివిజన్ ఉండి సెక్షన్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగే క్యాంపు కోర్టులో వినియోగదారులు పాల్గొనవచ్చని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గులు, బిల్లుల సమస్యలు, కొత్త సర్వీసుల జారీలో జాప్యం తదితర సమస్యలపై వినియోగదారులు నేరుగా సీజీఆర్ఎఫ్ కమిటీకి తెలియజేయవచ్చన్నారు. సదస్సుల్లో చైర్పర్సన్ బి.సత్యనారాయణతో పాటు సీజీఆర్ఎఫ్ కమిటీ సభ్యులు ఎస్.రాజబాబు, ఎస్.సుబ్బారావు, ఎన్.మురళీకృష్ణ పాల్గొననున్నారు. -
ఇంటికి వెళ్లే దారేది!
ఏజెన్సీప్రాంతంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దొరమామిడి, అలివేరు, లంకపాకల, ఎర్రాయిగూడెం, అంతర్వేదిగూడెం, కామవరం, తదితర గ్రామాల్లో భారీగా వర్షం కురవడంతో కొండవాగులు పొంగిపొర్లాయి. చింతకొండ వాగుతోపాటు రెడ్డిగణపవరం సమీపంలో ఉన్న జల్లేరువాగు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సాయంత్రం సమయానికి పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, కూలీలు, రైతులు ఇంటికి చేరే మార్గం లేక జల్లేరు వాగుకు ఇరువైపులా నిలబడిపోయారు. రాత్రి వరకూ వాగులు పొంగుతూనే ఉన్నాయి. – బుట్టాయగూడెం -
ట్రావెల్ బస్సును ఢీకొన్న లారీ
ఒకరి మృతి, బస్సు డ్రైవర్కు గాయాలు భీమడోలు: పొలసానిపల్లి ఫ్లై ఓవర్ వంతెనపై బుధవారం ఆర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లికి చెందిన కె.గణేష్ (28) కుటుంబ పోషణ నిమిత్తం నెల్లూరులోని ఓ రైస్ మిల్లులో కూలీగా పని చేస్తున్నాడు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో స్వగ్రామంలోని కుటుంబ సభ్యులను చూసేందుకు గణేష్, తులసి ప్రైవేటు ట్రావెల్ బస్సు టికెట్ను రిజర్వేషన్ చేయించుకున్నాడు. బుధవారం రాత్రి నెల్లూరు నుంచి అనకాపల్లికి బస్లో వెళ్తుండగా మార్గమధ్యమైన పొలసానిపల్లి ఫ్లై ఓవర్ వంతెన వద్దకు వచ్చేసరికి ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా లారీని నడుపుతూ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ వెనుక సీటులో కూర్చుని నిద్రిస్తున్న కె.గణేష్ రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్కు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ సిబ్బంది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కె.గణేష్ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం దెబ్బతింది. ఈ బస్సులో 30 మంది ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిన వెంటనే వారంతా బెంబేలెత్తిపోయారు. అదృష్టవశాత్తూ వారికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. భీమడోలు ఎస్సై వై.సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జరిమానా భీమవరం: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వ్యక్తులకు కోర్టు జరిమానా విధించినట్లు సీఐ జి కాళీచరణ్ చెప్పారు. భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ సెంటర్, పద్మాలయ థియేటర్, బీవీ రాజు విగ్రహం ఏరియాల్లో మద్యం సేవించి వాహనాలు నడుతున్న ఆరుగుర్ని అరెస్ట్ చేసి భీమవరం, స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ వద్ద హాజరుపర్చగా రూ.10 వేల చొప్పున జరిమానా విధించారన్నారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న ముగ్గురికి రూ.500 చొప్పున జరిమానా విధించారని చెప్పారు. -
స్నాతకోత్సవానికి నిట్ సిద్ధం
తాడేపల్లిగూడెం: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏపీ నిట్) ఏడవ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 9వ తేదీ ఉదయం నిట్లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ఈ వేడుక జరుగనుంది. ఈ వేడుకలో 2021–25 బ్యాచ్ విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. ముఖ్యఅతిథిగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రెసిడెంటు వి.రాజన్న హాజరవుతున్నారని ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ.రమణరావు తెలిపారు. రవీంద్ర కళాభారతి ఆడిటోరియంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. 2015లో ఏపీ నిట్ ఏర్పాటుకాగా, ఇప్పటి వరకు నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సును ఏడు బ్యాచ్ల విద్యార్థులు పూర్తి చేసుకున్నారు. ఏడో స్నాతకోత్సవంలో 506 మంది బాలురు, 161 మంది బాలికలకు డిగ్రీలు పట్టాలు ప్రదానం చేస్తారు. వీరితో పాటు పీహెచ్డీ పూర్తి చేసిన 29 మంది పరిశోధక విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలను అందచేయనున్నారు. సంస్థలో మొత్తం ఎనిమిది కోర్సులను నిర్వహిస్తుండగా ఆయా కోర్సుల్లో అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన ఒక్కొక్క విద్యార్థి చొప్పున మొత్తం ఎనిమిది మంది విద్యార్థులకు బంగారు పతకం అందిస్తారు. స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నిట్ అకడమిక్ డీన్ డాక్టర్ ఎన్.జయరామ్ తెలియచేశారు. బంగారు పతకాలు అందుకొనేది వీరే బయో టెక్నాలజీ – శశాంక్, కెమికల్ ఇంజనీరింగ్ –సంగెపు అభినవ్, సివిల్ ఇంజనీరింగ్ – తమ్ము హరిత, సీఎస్ఇ– కలిదిండి పవన్ తేజ సత్యవర్మ, ఈఈఈ– ఆదిత్య ప్రతాప్ సింగ్, ఈసీఇ– చిత్తిడి ధనుషాలక్ష్మి దుర్గ, మెకానికల్ ఇంజనీరింగ్ – వుడుమూడి ప్రియాంక, ఎంఎంఇ– జయస్మిత కే ప్రధాన్ బంగారు పతకాలు అందుకుంటారు. బ్యాచ్లో అత్యధిక గ్రేడ్పాయింట్లు సాధించిన కలిదిండి పవన్ తేజ సత్యవర్మ ఇనిస్టిట్యూట్ తరపున కోర్సు వారీగానే రెండు బంగారు పతకాలను అందుకోనున్నారు. -
ఆంధ్రా చేపల సాగు అదుర్స్
జార్ఖండ్ ఆక్వా రైతుల కితాబు కై కలూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొల్లేరు ప్రాంతంలో ఆక్వా సాగు ఆచరణాత్మకంగా ఉందని జార్ఖండ్ రాష్ట్ర ఔత్సాహిక చేపల రైతులు కితాబిచ్చారు. మూడు రోజుల క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా కై కలూరు పరిసర ప్రాంతాల్లో రైతుల బృందం గురువారం పర్యటించింది. కై కలూరు మత్స్యశాఖ సహాయ సంచాలకులు బి.రాజ్కుమార్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సీహెచ్.గణపతి ఆక్వా సాగు మెలకువలను రైతులకు వివరించారు. ఆటపాక గ్రామంలో ముదునూరి సీతారామరాజు చేపల చెరువును పరిశీలించి సాగు విధానాలను రైతుల నుంచి సేకరించారు. కై కలూరులో పలు ఆక్వా మందుల దుకాణాలను సందర్శించి చేపల సాగులో ఎదురవుతున్నా వ్యాధులు, ఎటువంటి మందులు వినియోగిస్తారు అనే విషయాలు నమోదు చేసుకున్నారు. అక్కడ నుంచి ఆచవరంలో చేపల ప్యాకింగ్ చేసే విధానాన్ని పరిశీలించారు. చివరిగా మండవల్లి మండలం కొర్లపాడులో కొరమేను చేపల సాగును పరిశీలించి రైతు నుంచి సాగు పద్ధతులు, పెట్టుబడి, కొరమేను విత్తనం, మార్కెట్లో రేటు, నీటి వనరులు వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. బృందానికి నాయకత్వం వహించిన జార్ఖండ్ ఫిషరీష్ ఫిల్డ్ ఆఫీసర్ ప్రశాంత్కుమార్ దీపక్ మాట్లాడుతూ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు(ఎన్ఎఫ్డీఏ), హైదరాబాదు సౌజన్యంతో జార్ఖండ్ ప్రభుత్వ మత్స్య, పశుసంవర్థక, కోఆపరేటివ్శాఖ ఆధ్వర్యంలో 15 మంది రైతులు బృందం వచ్చామన్నారు. ఇక్కడ సేకరించిన ఆక్వా సాగు పద్ధతులను జార్ఖండ్ ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. శుక్రవారం కొల్లేరు ప్రాంతంలో మరింతగా చేపల సాగు పద్ధతులను తెలుసుకుని, శనివారం మచిలీపట్నం వెళతామన్నారు. కార్యక్రమంలో గ్రామ మత్స్యశాఖ సహాయకుడు గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల భూములతో ‘కూటమి’ వ్యాపారం
ఏలూరు (ఆర్ఆర్పేట): రైతుల భూములతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ విమర్శించారు. గురువారం ఏలూరు నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా 70 వేల ఎకరాలు తీసుకుందని మండిపడ్డారు. రైతుల భూములతో, రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని, ఒకాయన బయట రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులకు ఫోన్లు చేస్తూ మీకు 100 ఎకరాలు ఇస్తాం.. మాకేం ఇస్తారు అని అడుగుతున్నారన్నారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగలేదని, రైతులను దగా చేశారని, ఒక రైతు 90 ఎకరాలు ఇచ్చాడని, ఎందుకిచ్చావయ్యా అని అడిగితే, మా ఖర్మకొద్దీ ఇచ్చామని బాధతో వాపోయాడని తెలిపారు. అభివృద్ధి కుంటుపడింది రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ఏడాదిన్నరలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని చింతా మోహన్ అన్నారు. గ్రామాల్లో పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయని, వీధిలైట్లు, రోడ్లు వేసుకునేందుకు డబ్బులేక, సర్పంచ్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పారు. లిక్కర్ అమ్మకాల వల్ల కుటుంబాల్లో విభేదాలు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందా, ఈ చర్యతో ఓబీసీలకు పెద్దపీట వేసినట్టేనా అని చింతా మోహన్ ప్రశ్నించారు. ఏడాదిన్నరలోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శలు -
టీడీపీ గూండాల దాడి హేయం
భీమడోలు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్యాదవ్, నాయకులపై పులివెందులలో టీడీపీ గుండాలు చేసిన దాడి అత్యంత హేయమని పార్టీ రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ అధ్యక్షుడు నౌడు వెంకటరమణ ఓ పత్రికా ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తెగబడడం హేయమైన చర్య అన్నారు. టీడీపీలో పెదబాబు, చినబాబుకు భయం పట్టుకుందన్నారు. జగన్మోహనరెడ్డి రోడ్డుపైకి వస్తే చాలు టీడీపీకి భయమని, అందుకే పార్టీ శ్రేణులపై పచ్చ గుండాలు దాడులు చేస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం తీరును మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. దాడి చేసిన గుండాలను కఠినంగా శిక్షించాలని కోరారు. దాడికి నిరసనగా నేడు బీసీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. విద్యాసంస్థల బస్సులపై కేసుల నమోదు ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లావ్యాప్తంగా మోటారు వాహనాల తనిఖీ అధికారులు బుధవారం విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేశారు. వివిధ ఉల్లంఘనలకు పాల్పడినందుకు 15 కేసులు నమోదు చేసి, రూ.26 వేలు జరిమానా విధించినట్లు ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ తెలిపారు. వాహనదారులు లైసెనన్స్తో పాటు సంబంధిత వాహన పత్రాలను ఉంచుకోవాలని, రహదారి భద్రతా నియమాలను తప్పక పాటించాలన్నారు. నిబంధనలు పాటించని విద్యాసంస్థల బస్సులను, ప్రైవేటు వాహనాలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. -
ఉంగుటూరు కూటమిలో కుంపట్లు
నీకు సగం.. నాకు సగం సాక్షి ప్రతినిధి, ఏలూరు: పైకి ఆప్యాయంగా పలకరించుకుని కౌగిలించుకుంటారు.. లోపల మాత్రం కత్తులు దూస్తారు. ఎమ్మెల్యే అధికారిక హోదాలో ఒక కార్యక్రమం చేస్తే.. ఆప్కాబ్ చైర్మన్ ప్రొటోకాల్ హోదాతో మరో కార్యక్రమం నిర్వహిస్తారు. సుపరిపాలన తొలి అడుగు పేరుతో ఉంగుటూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్చార్జి, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు హడావుడి చేస్తుంటే.. పల్లె పల్లెకు పత్సమట్ల పేరుతో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మరో కార్యక్రమానికి తెరతీసి పోటాపోటీగా హడావుడి చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు సమాంతరంగా హడావుడితో పార్టీ కేడర్ మొదలుకొని అధికారుల వరకు ఇద్దరు నేతల మధ్య నలిగిపోతున్నారు. నిత్యం కూటమిలోని జనసేన, టీడీపీ నేతల మధ్య అసంతృప్తి, అసహనాలతో ఉంగుటూరు రాజకీయం వేడెక్కుతోంది. ఎమ్మెల్యేతో చనువుగా ఉంటే వేటే.. పైకి ప్రేమగా కనిపించినా.. లోపల మాత్రం ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు కత్తులు దూసుకుంటున్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో బలపడితే భవిష్యత్లో తన రాజకీయ మనుగడ కష్టమవుతుందనే రీతిలో గన్ని చెక్ పెడుతూ వస్తున్నారు. ఆప్కాబ్ చైర్మన్ పదవి రావడంతో మరింత వేగం పెంచి నియోజకవర్గంలో మండలాల్లో పెత్తనం సాగించడంతో పాటు ఎమ్మెల్యేతో సన్నిహితంగా మెలిగే టీడీపీ నేతలపై వేటు కొనసాగిస్తున్నారు. ఉంగుటూరు మండల అధ్యక్షుడు పాతూరి విజయ్కుమార్ ఎన్నికల సమయంలో ధర్మరాజుకు సహకరించారనే కారణంతో మండల అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఎన్నికల ప్రచార సమయంలోనే నారాయణపురంలో విజయ్కుమార్పై టీడీపీ వ్యక్తులే దాడి చేయడం గమనార్హం. భీమడోలు మండల అధ్యక్ష పదవిని సీనియర్లను కాదని నామినేట్ పదవి ఉన్న వ్యక్తికే కేటాయించడంపైన టీడీపీ కేడర్ రగులుతున్నారు. ఖర్చుతో కూడిన భీమడోలు మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని తొలుత బీసీ మహిళకు కేటాయించారు. గన్ని వీరాంజనేయులు బీసీ మహిళ నుంచి దాన్ని బీసీ జనరల్ చేసి తన వర్గానికి చెందిన శేషగిరికి దక్కేలా చేశారు. మార్కెట్ యార్డుకు స్థానిక ప్రజాప్రతినిధి గౌరవ చైర్మన్గా వ్యవహరిస్తారు. ప్రొటోకాల్ ఉల్లంఘించి ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యేను పిలవకపోవడం వివాదమైంది. సుపరిపాలన తొలి అడుగు పేరుతో రాష్ట్ర మంత్రులు, జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించి గన్ని హడావిడి చేస్తున్నారు. మరోవైపు పల్లె పల్లెకు పత్సమట్ల పేరుతో అధికార యంత్రాంగాన్ని మొత్తం తీసుకుని ఎమ్మెల్యే పోటీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంపుతో టచ్లో ఉండే సీనియర్ నేతలను వ్యూహాత్మకంగా పక్కన పెట్టేలా గన్ని వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేసే దిశగా అసంతృప్తి నేతలు పావులు కదుపుతున్నారు. జనసేన ఎమ్మెల్యే వర్సెస్ ఆప్కాబ్ చైర్మన్ సుపరిపాలన తొలి అడుగు పేరుతో గన్ని హడావుడి పల్లె పల్లెకు పత్సమట్ల పేరుతో ఎమ్మెల్యే పోటీ కార్యక్రమం ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉండే టీడీపీ నేతలపై గన్ని వేటు గన్ని తీరుపై టీడీపీలో రగులుతున్న అసంతృప్తి ఉంగుటూరులో జనసేన వర్సెస్ టీడీపీ రగడ తారాస్థాయికి చేరింది. నిన్న మొన్నటి వరకు పనులు, పంపకాలు పర్సంటేజీల మధ్య చాప కింద నీరులా కొనసాగిన అంతర్యుద్ధం నేడు ప్రొటోకాల్ వ్యవహారాలకు పాకింది. మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులను కాదని జనసేన ఇన్చార్జి ధర్మరాజుకు టిక్కెట్ కేటాయించడం, ఎన్నికల్లో ధర్మరాజు గెలవడంతో నియోజకవర్గంలో రగడకు తెరలేచింది. టీడీపీకే ఉంగుటూరు టిక్కెట్ ఇవ్వాలని ఎన్నికలకు ముందు గన్ని వర్గం భారీ ర్యాలీతో టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద హడావుడి చేసింది. టీడీపీ అధిష్టానం గట్టిగా చెప్పడంతో సైలెంట్ అయిపోయారు. ధర్మరాజు గెలవడంతో నియోజకవర్గంలో పూర్తి స్థాయి పెత్తనం కోసం హడావుడి మొదలైంది. నీకు సగం.. నాకు సగమంటూ పంచాయితీలకు తెరతీశారు. నామినేట్ పదవులు, వర్క్లు, మద్యం షాపుల ఇలా అన్నింటిని పంపకాలు చేసేలా టీడీపీ కీలక నేతలు ఒత్తిడి తెచ్చి నియోజకవర్గంలో ప్రతి దాంట్లో గన్నికి వాటాలు ఏర్పాటు చేశారు. ఉదాహరణకు నియోజకవర్గంలో 17 సొసైటీలు ఉంటే 8 జనసేన, 8 టీడీపీ, 1 బీజేపీకి కేటాయించారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి సొసైటీ చైర్మన్లుగా ఎంపికై న వారికి చాలా ఖర్చయిందనేది నియోజకవర్గంలో అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. -
విద్యా శక్తి కార్యక్రమం బహిష్కరణ
భీమవరం: పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టిన విద్యాశక్తి కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు బహిష్కరిస్తున్నట్లు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ విజయరామరాజు, జనరల్ సెక్రటరీ జి.ప్రకాశం చెప్పారు. బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు విజయరామరాజు, ప్రకాశం మాట్లాడుతూ విద్యాశక్తి కార్యక్రమం ఐచ్ఛికం మాత్రమేనని నిర్బంధం కాదని ప్రభుత్వం తెలిపినా కొంతమంది అధికారులు నిర్బంధంగా చేయాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. దీనితో విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కో చైర్మన్ సాయివర్మ, ఎన్.శ్రీనివాస్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ రమణ, కోశాధికారి పట్టాభిరామయ్య తదితరులు పాల్గొన్నారు. -
తిరగని రాట్నం
మధ్యాహ్నం.. అందని వైద్యం ప్రభుత్వాసుపత్రుల్లో సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిన కొందరు వైద్యులు మధ్యాహ్నం ఇంటికో, ప్రైవేటు ఆస్పత్రులకో పరిమితమవడంతో వైద్యసేవలు అందడం లేదు. 8లో uకూటమి పాలనలో చేనేత రంగానికి ప్రోత్సాహం కరువైంది. ఆదరణ లేక మగ్గాలు మూలకు చేరుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చంద్రబాబు సర్కారు నేతన్నల వైపు కన్నెత్తి చూసింది లేదు. నేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంటూ ఇప్పుడు కంటితుడుపు చర్యలతో సరిపెడుతోంది. గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాక్షి, భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆరు వేల వరకు చేనేత కుటుంబాలున్నాయి. పాలకొల్లు, అత్తిలి, యలమంచిలి, పెంటపాడు, పోడూరు, ఆచంట మండలాల్లో నేత కార్మికులు అధికంగా ఉన్నారు. దివంగత వైఎస్ హయాంలో చేనేత రంగం ఒక వెలుగు వెలిగింది. నేత కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్, రుణ మాఫీ, అధిక వడ్డీలతో కార్మికులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఆర్టిజన్ క్రెడిట్ కార్డుల ద్వారా పావలా వడ్డీకే కొత్తగా రుణ సాయం, చిలపనూలుపై పదిశాతం సబ్సిడీ, ఉచిత వైద్య శిబిరాలు, ఇళ్ల నిర్మాణం తదితర ఎన్నో కార్యక్రమాల ద్వారా చేనేత రంగాన్ని ఆయన ఆదుకున్నారు. తర్వాత పట్టించుకున్న వారు లేక సంక్షోభంలో కూరుకుపోయింది. నేతన్నకు అండగా తండ్రిని మించిన తనయునిగా చేనేత రంగానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. సొంత మగ్గం ఉన్న నేత కుటుంబాలకు వైఎస్సార్ నేతన్న నేస్తంగా నెలకు రూ. 2000 చొప్పున ఏడాదికి రూ.24,000 ఆర్థిక సాయం అందించారు. గత ప్రభుత్వంలోని ఐదేళ్లలో ఈ పథకం కింద ఉమ్మడి జిల్లాలో సరాసరి 1,063 కుటుంబాలకు రూ.12.76 కోట్ల లబ్ధి చేకూరింది. ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లాలో 920 కుటుంబాలకు రూ.10.96 కోట్లు, ఏలూరు జిల్లాలో 150 కుటుంబాలకు రూ. 1.8 కోట్ల సాయం అందించారు. అమ్మఒడి, చేయూత, పింఛన్, వాహనమిత్ర, ఆరోగ్య శ్రీ వైద్యం తదితర పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి లక్షలాది రూపాయల ప్రభుత్వ సాయం అందింది. కంటి తుడుపు చర్యలే : గురువారం జాతీయ చేనేత దినోత్సవంగా సందర్భంగా చేనేతకు వరాల జల్లంటూ కూటమి ప్రచారం విమర్శలకు తావిస్తోంది. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, జీఎస్టీ మినహాయింపు కంటితుడుపు చర్యలుగా కార్మికులు కొట్టిపారేస్తున్నారు. వీటివల్ల చేనేత రంగానికి ఒనగూరేదేమి లేదంటున్నారు. జిల్లాలో కేవలం 677 నేత మగ్గాలకు మాత్రమే ఈ సాయం పరిమితం కానుంది.న్యూస్రీల్ ఏడాదిగా నేతన్నల వైపు కన్నెత్తి చూడని కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం లేక మూలకు చేరిన మగ్గాలు గతంలోనూ చీర–ధోవతి హామీని అటకెక్కించిన చంద్రబాబు నేతన్న నేస్తంతో అండగా నిలిచిన జగన్ సర్కారు ఉమ్మడి జిల్లాలోని 1,070 కుటుంబాలకు రూ. 12.76 కోట్ల సాయం నేడు జాతీయ చేనేత దినోత్సవం చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే చేనేత అంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే. చేనేత అభివృద్ధికి ఆయన చేసిందేమీ లేదు. నేత కార్మికులను నిజంగా ప్రోత్సహించింది దివంగత వైఎస్సార్. తండ్రిని మించిన తనయుడిగా నేతన్న నేస్తం, సంక్షేమ పథకాలతో మాజీ సీఎం జగన్ నేత కార్మికులను ఆదుకున్నారు. – వీరా మల్లిఖార్జునుడు, వైఎస్సార్సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు, పాలకొల్లు ఎన్నికల హామీలు అమలుచేయాలి చేనేత కార్మికుల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం వల్ల నేత కార్మికులకు పెద్దగా మేలు జరిగేది లేదు. చేనేతను ప్రోత్సహించే విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని అమలుచేయాలి. గత ప్రభుత్వంలో మాదిరి సంక్షేమ పథకాలను అందజేయాలి. నిల్లా బాలవీరయ్య, చేనేత కార్మికుడు, శివపురం మళ్లీ చిన్నచూపే చీర–ధోవతి పథకాన్ని పునరుద్ధరిస్తానని, చేనేత ఉత్పత్తులపై 30 శాతం రిబేటు ఇస్తామంటూ 2014 ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు. ప్రతామ్నాయ ఉపాధి చూసుకోవాలని నేతన్నలను చిన్నచూపు చూశారు. కూటమి ప్రభుత్వంలోనూ అదే తీరుగా ఉన్నారన్న విమర్శలున్నాయి. ఏడాదిగా ప్రోత్సాహం కరువై చేనేత కుటుంబాలకు పూటగడవడం కష్టంగా మారింది. బతుకుదెరువు కోసం మగ్గాలకు స్వస్తి చెబుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చాలామంది కార్మికులు నేత పని వీడి వ్యవసాయ కూలీలుగా, ఇతర పనుల్లోకి వెళ్లిపోతున్నారు. ఏడాది క్రితం ఉమ్మడి జిల్లాలో 1187 మగ్గాలు ఉండగా ప్రస్తుతం 677కు తగ్గిపోయినట్టు తెలుస్తోంది. -
వృద్ధురాలి మృతదేహం లభ్యం
తాడేపల్లిగూడెం (టీఓసీ): స్థానిక శివాలయం వద్ద కాలువలో పడిపోయి గల్లంతైన చంద్రవతి (70) వృద్ధురాలి మృతదేహాన్ని బుధవారం కనుగొన్నారు. ఈనెల 4వ తేదీన ఆమె కాలువలో పడిపోగా, అధికారులకు అందిన సమాచారం మేరకు 5వ తేదీన ఫైర్, పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కాలువలో బోట్ సహాయంతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. కడకట్ల సమీపంలో బుధవారం మధ్యాహ్నం చంద్రవతి మృతదేహాన్ని బయిటకు తీశారు. ఫైర్ సిబ్బందిచే మృతదేహాన్ని పోలీస్ శాఖకు అప్పగించారు. మృతురాలి బంధువులు హాజరయ్యారు. -
నేటి నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం నుంచి స్వామివారి దివ్య పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 10 వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసీ, తెలియక జరిగిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం నాలుగు రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. అందులో భాగంగా 7న అంకురార్పణ, 8న పవిత్రాధివాసం, 9న పవిత్రావరోహణ, 10న మహా పూర్ణాహుతి వేడుకలను నేత్రపర్వంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. ఉత్సవాలు జరిగే ఈ నాలుగు రోజులు ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నామని, భక్తులు గమనించాలని ఆయన కోరారు. -
సీతంపేట వద్ద లారీ బోల్తా
కొయ్యలగూడెం : సీతంపేట సబ్ స్టేషన్ సమీపంలో జాతీయ ప్రధాన రహదారిపై బుధవారం ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. రాజమండ్రి వైపు వెళుతున్న లారీ ఎదురుగా వస్తున్న మరో లారీని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు మార్జిన్ వైపు పల్టీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. రోడ్డు పక్కనే ఉన్న చెత్తకి నిప్పు పెట్టడం వల్ల రోడ్డుపై భారీగా పొగ అలుముకోవడంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడం ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆట్యా పాట్యా జిల్లా జట్ల ఎంపిక భీమవరం: పట్టణంలోని ఎస్సీహెచ్బీఆర్ఎం స్కూల్లో బుధవారం ఆట్యా–పాట్యా జిల్లా జట్ల ఎంపిక జరిగింది. క్రీడాకారులు పి గోపీకృష్ణ, డి మోహన్కుమార్, జి యశ్వంత్రమణ, కె సాయిధనుష్, జె అభిషేక్పాల్, వి జయసంతోష్, పి రోహిత్ కుమార్, వి మణికంఠ గణేష్, ఎం తేజమహిమ, ఎం అభిరామ్, బి వెంకన్న, పి ప్రేమ్కుమార్, పి భాస్కరతేజ జిల్లా జట్లకు ఎంపికయ్యారని ఆట్యాపాట్యా జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మంతెన రామచంద్రరాజు, జి కిరణ్వర్మ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 9వ తేదీ నుంచి ఒంగోలులో నిర్వహించే రాష్ట్రస్థాయి జూనియర్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారన్నారు. వైభవం.. శోభనాచలుడి పవిత్రోత్సవం ఆగిరిపల్లి: స్థానిక శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి వైభవంగా పవిత్రములు సమర్పించారు ఉదయం స్వామివారికి స్నపన, ప్రత్యేక అలంకరణ, శ్రీ లక్ష్మీ నరసింహ సుదర్శన మూలా మంత్ర హోమం, దిగువ సన్నిధిలో ఉన్న స్వామివారికి పవిత్రములు సమర్పణ, నవ కుంభారాధన, శాంతి హోమం ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంత కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ కార్యనిర్వణాధికారి సాయి కార్యక్రమాలను పర్యవేక్షించారు. నకిలీ డెత్ సర్టిఫికెట్ వ్యవహారంపై విచారణ కుక్కునూరు: నకిలీ డెత్ సర్టిఫికెట్ వ్యవహారంపై భద్రాచలం పోలీసులు విచారణ చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం సారాపాక గ్రామానికి చెందిన భూక్యా శ్రీరాములు పేరిట ఓ ఎల్ఐసీ ఏజెంట్ రూ.10 లక్షల పాలసీకి ఏడేళ్లుగా ప్రీమియం చెల్లిస్తున్నాడు. ఆ వ్యక్తి బతికుండగానే మరణించినట్లుగా కుక్కునూరు పంచాయతీ నుంచి డెత్ సర్టిఫికెట్ పోంది ఎల్ఐసీ నుంచి రూ.10 లక్షలు క్లయిమ్ చేశాడు. ఈ విషయాన్ని గత ఫిబ్రవరి 10వ తేదీన ‘సాక్షి’ దినపత్రిక బహిర్గతం చేసింది. కాగా ఈ వ్యవహారంలో డబ్బును రికవరీ చేసిన ఎల్ఐసీ కార్యాలయ అధికారులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా భద్రాచలం పోలీసులు విచారణ చేపట్టారు. కుక్కునూరులో నకిలీ సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారన్న విషయమై గత నాలుగు రోజులుగా కొందరిని స్టేషన్కు పిలిపించి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
పాలకొల్లు సెంట్రల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి నెలా పదిహేను రోజులుగా చికిత్స పొందుతున్న వ్యక్తి బుధవారం మృతి చెందాడు. వివరాల ప్రకారం.. మండలంలోని ఉల్లంపర్రు గ్రామానికి చెందిన దోస నరసింహస్వామి (56) జూన్ 19వ తేదీన గ్రామం నుంచి పాలకొల్లు పట్టణానికి వస్తుండగా కెనాల్ రోడ్డులో వాటర్ వర్క్స్ ప్రాంతంలో వెనుక నుంచి మినీ వ్యాన్ ఢీకొట్టడంతో తలకు తీవ్రమైన గాయమైంది. స్థానికులు వెంటనే స్పందించి పట్టణ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి గుంటూరు తరలించగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బ్రెయిన్కు చికిత్స చేశారు. అప్పటి నుంచి అపస్మారకస్థితిలోనే ఉన్న స్వామి బుధవారం ఉదయం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. నరసింహస్వామికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇతను పట్టణంలో ఓ ఎడ్యుకేషన్ కోచింగ్ సెంటర్ను నడుపుతుండేవారు. పట్టణ ఎస్సై పృధ్వీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పంచనామా నిర్వహించారు. -
మధ్యాహ్నం.. అందని వైద్యం
ప్రైవేటుయాజమాన్యాలే టార్గెట్..? సర్కారు దవాఖానాలకు వచ్చే పేదలకు వైద్యసేవలు అందుతున్నాయా లేదా అని పర్యవేక్షణ చేయాల్సిన ఉన్నతాధికారులు ఇటీవల కేవలం ప్రైవేటు ఆస్పత్రులు, ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు మాత్రమే తనిఖీలు చేయడం వెనుక గూడార్ధం ఏంటా అనేది వైద్యవర్గాల్లోను చర్చనీయాంశమైంది. తరచూ వైద్యశాఖ ఉన్నతాధికారులు కేవలం ప్రైవేటు యాజమాన్యాలనే కలుస్తుండడంపై కూడా పలువురు పెదవి విరుస్తున్నారు. ఇక డైరెక్టరేట్ ఆప్ సెకండరీ హెల్త్కు సంబంధించి ఉన్నతాధికారులు సంబంధిత ఆస్పత్రుల్లో ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో జిల్లాలో కొందరు వైద్యులు తమ ఇస్టానుసారంగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఈ సమస్యలపై డీఎంహెచ్వో డాక్టర్ గీతాబాయిని ‘సాక్షి’ వివరణ కోరగా ఆస్పత్రుల్లో వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిందేనని, కొందరు వైద్యులు అదనంగా మరికొన్ని ఆస్పత్రుల్లో ఇన్చార్జులుగా ఉంటున్నారని, వైద్యుల తీరుపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తానని చెప్పారు. తణుకు అర్బన్ : గత ఐదేళ్లపాటు పేదలపాలిట సంజీవనిలా సత్వర వైద్యసేవలందించిన ఆస్పత్రులు నేడు వేళకు రాని వైద్యులతోపాటు, ఆస్పత్రిలో కాలు నిలవక బయటకు వెళ్లే వైద్యుల కారణంగా పేదలకు వైద్యసేవలు కునారిల్లుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రుల్లో ఉండాల్సిన వైద్యులు నేడు విధులకు ఆలస్యంగా కొందరు, ఎఫ్ఆర్ఎస్ వేసేసి ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రాక్టీస్ కోసం వెళ్లే వారు కొందరు, మధ్యాహ్నం పూర్తిగా ఇంటికో, ప్రైవేటు ఆస్పత్రులకో పరిమితమయ్యే మరి కొందరు వైద్యుల కారణంగా ప్రభుత్వ ఆసుప్రతుల్లో వైద్యసేవలు అందడం లేదు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ తరహా పరిస్థితులు అధికంగా కనిపిస్తున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ విభాగాల్లో వైద్యులు 80 శాతం మంది ఒంటిపూట వైద్యానికి అలవాటుపడ్డారని వైద్య సిబ్బంది బాహాటంగానే చెబుతున్నారు. దూర ప్రాంతాల నుంచి క్యారేజీలు పట్టుకుని వచ్చే వైద్యులు మాత్రమే పూర్తిస్థాయిలో ఆస్పత్రిని అంటిపెట్టుకుని ఉంటుండగా, భోజనానికి ఇంటికెళ్లి వచ్చే వైద్యులు చాలా మంది తిరిగి ఎఫ్ఆర్ఎస్ వేసేందుకు మాత్రమే వస్తున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు వైద్యులైతే ఉదయం పూట కూడా ప్రైవేటు వైద్యానికి వెళ్లే పరిస్థితులు తలెత్తాయని రోగులు, వైద్య సిబ్బంది చెబుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల మాదిరిగానే పట్టణాల్లో కూడా పేదలకు వైద్యసేవలు మరింత చేరువ చేసే ఉద్దేశ్యంతో అర్బన్ హెల్త్ సెంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పట్టణ ప్రాంతాల్లోని పేదలు సైతం దూర ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లే అవసరం లేకుండానే సమీపంలోని అర్బన్ హెల్త్ సెంటర్లలో వైద్యసేవలు పొందుతున్నారు. దూరమైన సత్వర వైద్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయా ఆస్పత్రుల్లో ఉండి రోగులకు సత్వర వైద్యం అందించాల్సి ఉండగా ప్రస్తుతం ఆ తరహా సేవలు అందడంలేదని రోగులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఉదయం ఏదోలా వైద్యం అందుతున్నా ఇక మధ్యాహ్నం 1 గంట తరువాత జిల్లా వ్యాప్తంగా వైద్యులు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండడంలేదనేది వాస్తవమని రోగులు స్వయంగా చెబుతున్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం నుంచి పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లకు వచ్చే రోగులకు అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది వైద్యం అందిస్తున్నారని తెలుస్తోంది. మధ్యాహ్నం వచ్చిన రోగులను మరుసటి రోజు రావాలని, ఇబ్బంది ఎక్కువగా ఉంటే వైద్యులకు ఫోన్ చేస్తామని అప్పుడు సదరు వైద్యుడు వస్తారని వైద్యసిబ్బంది చెబుతుండడం శోచనీయం. జిల్లాలో ప్రభుత్వ ఆస్ప్రతులు ఇలా.. వైద్య ఆరోగ్య శాఖ.. పీహెచ్సీలు 34 యూపీహెచ్సీలు 18 పీపీ యూనిట్ 1 లెప్రసీ వార్డు 1 డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ జిల్లా ఆస్పత్రి 1 ఏరియా ఆస్పత్రులు 5 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 3 వైద్యులు 200లకుపైగా.. నిత్యం 16 వేలకుపైగా రోగులు.. మధ్యాహ్నం ఇళ్లు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉంటున్న వైద్యులు వైద్యులు లేకపోవడంతో సొంత వైద్యం చేస్తున్న సిబ్బంది కునారిల్లుతున్న సర్కారు దవాఖానాలు అర్బన్ హెల్త్ సెంటర్కు ఓ వృద్ధుడు కర్ర చేతపట్టుకుని మధ్యాహ్నం పూట వచ్చాడు. అక్కడే ఉన్న నర్సు ఆ వృద్ధుడిని చూసి.. డాక్టర్ మధ్యాహ్నం ఉండరు తాతా.. రేపు ఉదయం రా అని చెప్పింది. సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిన డాక్టర్ ఉండకపోతే అడిగేవారే లేకుండా పోయారు అంటూ సణుగుతూ వెనుదిరిగాడు. జ్వరంతో వణుకుతూ ఓ పెద్దావిడ పీహెచ్సీకి మధ్యాహ్నం సమయంలో వచ్చింది. ఆమెను చూసిన నర్సు ఇప్పుడు వచ్చావేంటి డాక్టర్ ఉండరు కదా.. ఉదయం రాకపోయావా అన్నారు. ఉన్నట్టుండి చలిజ్వరం రావడంతో వచ్చానమ్మ అని ఆ పెద్దావిడి సమాధానమిచ్చింది. దీంతో ఆ నర్సు డాక్టర్కు ఫోన్ చేసి విషయం చెప్పగా.. పారాసెట్మాల్, యాంటీబయాటిక్ ఇచ్చి పంపించేయ్.. రేపు ఉదయం రమ్మని చెప్పు.. అని కటువుగా వైద్యుడు చెప్పాడు. -
సబ్ కలెక్టర్ స్మరణ్రాజ్కు సత్కారం
ఏలూరు (మెట్రో): బదిలీపై వెళుతున్న నూజివీడు సబ్ కలెక్టర్ బి.స్మరణ్రాజ్ను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఘనంగా సత్కరించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం రెవెన్యూ అధికారుల సమావేశం అనంతరం నూజివీడు సబ్ కలెక్టర్ బి.స్మరణ్రాజ్ను దుశ్శాలువ, మెమొంటోతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్ఓ వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ, ఎస్డీసీ భాస్కర్, సర్వే శాఖ ఏడీ అన్సారీ, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్య, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు చల్లన్న దొర, విజయ్కుమార్రాజు, జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు. -
మూల్యాంకన పుస్తకాలపై వ్యతిరేకత
ఇప్పటికే విద్యాశక్తిని బహిష్కరించిన ఉపాధ్యాయులు విద్యాశక్తి నిర ్బంధంగా అమలుపై నిరసన నూజివీడు: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నిర్వహించే పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ ద్వారా పాఠశాలలకు పంపిన మూల్యాకంన పుస్తకాలపై ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇస్తున్న పనులను చేయడానికే ఎక్కువ సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో మూల్యాంకన పుస్తకం ఇచ్చింది. దీంతో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి ఆరు మూల్యాంకన పుస్తకాలు ఇవ్వగా, ఫార్మేటివ్ అసిస్మెంట్, సమ్మేటివ్ అసిస్మెంట్ పరీక్షలను ఆ పుస్తకాల్లోనే విద్యార్థులతో రాయించాలి. విద్యార్థులు రాసిన తరువాత పరీక్షలను దిద్ది అందులోనే ఇచ్చిన ఓఎమ్మార్ షీట్లో మార్కులు వేయడంతో పాటు వారి పరీక్ష రాసిన పేజీలను స్కాన్ చేసి విద్యాశాఖ ఇచ్చిన యాప్లో ఆప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేటప్పుడు సర్వర్ బిజీగా ఉన్నా, నెట్ స్లోగా ఉన్నా అప్లోడ్ చేయడం తీవ్ర జాప్యమయ్యే అవకాశాలున్నాయి. బడిలో దిద్దడానికి సమయమేది : గతంలో విద్యార్థి రాసిన పరీక్ష పేపర్లను ఉపాధ్యాయులు వారి వెసులుబాటును బట్టి బడిలో దిద్దేవారు. సమయం సరిపోకపోతే ఇళ్లకు తీసుకెళ్లి పేపర్లు దిద్దుకొని తీసుకొచ్చేవారు. ఇప్పుడు మూల్యాంకనం పుస్తకాలను ఇంటికి మోసుకొని వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారు. ఆరో తరగతిలో 40 మంది విద్యార్థులుంటే వారందరి మూల్యాకనం పుస్తకాలు ఇంటికి తీసుకెళ్లి దిద్దడానికి వీలవ్వదు. బడిలోనే దిద్ది ప్రతి సబ్జెక్టుకు సంబంధించి విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఒక్కొక్క విద్యార్ధి మూడు పేజీలు రాస్తే వంద నుంచి 120 పేజీలను ఒక సబ్జెక్టుకు స్కాన్ చేయాల్సి ఉంటుంది. హైస్కూల్లో ఒక ఉపాధ్యాయుడు నాలుగు తరగతులకు వెళ్లినట్లయితే వారం రోజుల పాటు ఇదే పనిని చేస్తే పూర్తవుతుంది. ఇంత చేసినా విద్యార్థికి ఒనగూడే ప్రయోజనం శూన్యం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మూల్యాంకనం పుస్తకాలను ఏ సబ్జెక్టుకు ఆ సబ్జెక్టు ఉపాధ్యాయుడు భద్రపరుచుకోవాలి. హైస్కూల్ల్లో సాయంత్రం 4 గంటల తరువాత విద్యాశక్తి కార్యక్రమాన్ని విద్యాశాఖ అమలు చేస్తోంది. ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తప్పనిసరిగా విద్యాశక్తి కార్యక్రమాన్ని అమలు చేయాల్సిందేనని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇది ఉపాధ్యాయులకు కొత్త తలనొప్పిలా మారింది. ఉపాధ్యాయ సంఘాలు అడిగినప్పుడు నిర్భంధం కాదని చెబుతున్న ఉన్నతాధికారులు ఆ తరువాత ఉపాధ్యాయులపై మండల స్థాయి అధికారులతో మేం వస్తున్నాం.. తనిఖీ చేస్తాం.. అంటూ ఒత్తిడి చేస్తూ పనిచేయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవని ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు గత రెండు రోజులుగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో డీఈవోలకు వినతిపత్రాలను సైతం అందజేస్తున్నారు. ప్రశాంతంగా సాగాల్సిన విద్యారంగ కార్యక్రమాలను హడావుడిగా మార్చేసి తీవ్ర ఒత్తిడికి గురయ్యేలా ప్రభుత్వం చేస్తుండటంతో ఎంతో మంది ఉపాధ్యాయులు నేడు అనారోగ్యం పాలవుతున్నారనే ఆందోళన ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతోంది. -
యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా కారుమూరి సునీల్
ఏలూరు (ఆర్ఆర్పేట): వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జోన్ –2 వర్కింగ్ ప్రెసిడెంట్గా సునీల్ కుమార్ను నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఈ మేరకు జోన్ –2 పరిధిలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో సునీల్ పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించనున్నారు. ఆయన నియామకంతో పార్టీ యువజన విభాగం మరింత బలోపేతమవుతుందని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఆపాలి నరసాపురం: స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వెంటనే నిలుపుదల చేయాలంటూ ప్రజా వేదిక నరసాపురం ఆధ్వర్యంలో నరసాపురం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ప్రజా వేదిక జిల్లా కమిటీ సభ్యుడు మామిడిశెట్టి రామాంజనేయలు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని చెప్పిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక విద్యుత్ భారాలతో ప్రజల నడ్డి విరగ్గొడుతుందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 14 నెలలకే రూ.15,485 కోట్లు ప్రజల నుంచి దోపిడీ చేసిందన్నారు. అదానీ కంపెనీ లాభాల కోసం కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల విషయంలో ప్రజలను తీవ్రంగా మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. స్మార్ట్ మీటర్లు రద్దు చేయకపోతే ప్రజా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పి.నారాయణరావు, కె.శ్రీనివాసు, బి.జోగేశ్వరావు, జి.నాగేశ్వరరావు, ఎన్.కొండ, పి.కామేశ్వరరావు, పి.అప్పల నాయుడు, కె.రవి,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అసమానతలు తొలగించడం పీ4 లక్ష్యం భీమవరం (ప్రకాశంచౌక్): సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించడమే పీ4 ప్రధాన లక్ష్యమని ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. పీ4లో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో 10 శాతంగా ఉన్న ధనవంతులు, అట్టడుగు స్థాయిలో ఉన్న 20 శాతం మంది నిరుపేదలకు చేయూత నివ్వడమే పి4 లక్ష్యమన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న పూర్వపు విద్యార్థులకు కూడా పీ4 పై అవగాహన కల్పించి వారు మార్గదర్శకులుగా చేరి బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. ఉపాధ్యాయులు కూడా స్వచ్ఛందంగా మార్గదర్శకులు కావచ్చన్నారు. సమావేశంలో డీఈఓ ఇ.నారాయణ తదితరులు పాల్గొన్నారు. చట్టంపై విద్యార్థులకు అవగాహన ఏలూరు (టూటౌన్): నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం శ్రీజాతీయ న్యాయ సేవాధికార సంస్థ–బాలల స్నేహ పూర్వక న్యాయ సేవల పథకం 2024పై అవగాహన కల్పించేందుకు ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ స్కూలు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కె.రత్నప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలుసుకుని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయరాదని, గుడ్ టచ్ బాడ్ టచ్ పైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. -
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
మండవల్లి : భార్యాభర్తల నడుమ చిన్నపాటి విభేదాల కారణంగా మనస్తాపంతో విషం తాగి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం ప్రత్తిపాడులో బుధవారం చోటుచేసుకుంది. మృతురాలు ప్యారా సుధారాణి(35)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని ఏలూరు ఆస్పత్రిలో భద్రపరిచారు. గ్యాస్ బండ మీద పడి.. డెలివరీ బాయ్ మృతి చింతలపూడి: స్థానిక బోయగూడెం గ్రామానికి చెందిన బందెల హానోక్ (30) గ్యాస్ బండ మీదపడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హానోక్ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ గ్యాస్ కంపెనీలో గ్యాస్ డెలివరీ బాయ్గా పని చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం ఊటసముద్రం గ్రామానికి గ్యాస్ బండలు డెలివరీ చేయడానికి వెళ్లి వాహనం నుంచి గ్యాస్ బండలు దించుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. దీంతో తలకు బలమైన గాయాలు అవ్వడంతో వెంటనే స్థానికులు చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హానోక్ మృతి చెందడంతో బోయగూడెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు గ్యాస్ కంపెనీ నిర్వాహకులను కోరగా నిరాకరించడంతో దళిత సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఆందోళనకు దిగుతున్నట్లు తెలిపారు. -
చెట్లకు చేటు
జంగారెడ్డిగూడెం: విద్యుత్ లైన్ పేరు చెప్పి భారీ వృక్షాలను అక్రమంగా నరకివేసి కలప తరలించుకుపోయారు. ఈ ఘటన జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం శివారు మార్కండేయపురంలో పంచాయతీ రాజ్ రోడ్డు వెంబడి భారీ వృక్షాలు ఉన్నాయి. వీటిని కొందరు అక్రమార్కులు బుధవారం నరికివేశారు. స్థానికులు ఇదేంటని ప్రశ్నిస్తే విద్యుత్ లైన్ల నిర్మాణం నిమిత్తం చెట్లను నరికినట్లు తెలిపారు. దీంతో అనుమానం వచ్చి ప్రజా సంఘాల నాయకులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీపీఐ నాయకులు జేవీ రమణరాజు, రాధాకృష్ణ చెట్ల నరికివేతపై పంచాయతీ రాజ్ డీఈ సాజుద్దీన్కు ఫిర్యాదు చేయగా చెట్ల నరికివేతకు సంబంధించి ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. ఈ విషయంపై విద్యుత్ శాఖ డీఈ యు.సుబ్బారావును వివరణ కోరగా, తాము ఆ ప్రాంతంలో ఎటువంటి విద్యుత్ లైన్లు వేసే పనులు నిర్వహించడం లేదని చెప్పారు. అక్రమార్కులు యథేచ్ఛగా చెట్లను నరికివేస్తూ శాఖల పేర్లు చెప్పి వాటిని తరలించుకుపోవడంపై ప్రజాసంఘాల నాయకులు అభ్యంతరం తెలిపారు. దీనిపై సాజుద్దీన్ స్పందిస్తూ పూర్తి స్థాయి విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
పశువుల్లో గురక వ్యాధికి చికిత్స ఇలా..
చింతలపూడి: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాడి పశువుల పెంపకానికి ప్రసిద్ధి. ఇక్కడి రైతులు పాడి పశువులను పెంచుకుంటూ ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అయితే వర్షాకాలంలో పశువులు రకరకాల అంటు రోగాల బారినపడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కొత్త నీరు మురుగు నీటితో కలిసి కలుషితం కావడం కారణంగా పశువులు ఆ నీటిని తాగడంతో అంటురోగాలు సోకి విలువైన పశు సంపద కోల్పోయే ముప్పు ఉంది. వర్షాకాలంలో గేదెలు, గేదె దూడలు, పడ్డలకు ఎక్కువగా వచ్చే వ్యాధి గురక వ్యాధి. దీనినే గొంతు వాపు వ్యాధి అని కూడా పిలుస్తారు. పశువుల్లో వచ్చే వ్యాధుల్లో ఇది అత్యంత ప్రమాదకరమైనది. గురకవ్యాధి సోకిన పశువులకు అందించాల్సిన చికిత్సను గురించి పశుసంవర్థక శాఖ ఏడీ డా కె లింగయ్య వివరించారు. ఎలా సంక్రమిస్తుంది పాశ్చురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియ వల్ల పశువులు, గొర్రెలు, మేకల్లో వచ్చే ఈ వ్యాధి క్రిములు ఎడతెరపి లేని ముసురు వాతావరణంలో వేగంగా వృద్ధి చెందుతాయి. కలుషితమైన నీరు, మేత, పరికరాలు, విసర్జకాలు, స్రావాలు, కళేబరాలు, మాంసం ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇందుకు ఈగలు, దోమలు, ఇతర కీటకాలు కూడా దోహదపడతాయి. వ్యాధి క్రిములు శ్వాస, జీర్ణ వ్యవస్థ, దోమ కాట్ల ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఎర్ర రక్త కణాలను ధ్వంసం చేసి రక్తం ప్రాణవాయువు ప్రక్రియను దెబ్బ తీస్తుంది. దీంతో ప్రాణ వాయువు సరిగా అందక పశువులు గురక పెట్టడం, రొప్పడం, ఆయాసపడటం వంటి లక్షణాలను ప్రదర్శిస్తుంది. పశువుల శరీర ఉష్ణోగ్రత 106 నుంచి 108 ఫారిన్ హీట్ వరకు పెరగడం, కనుపాపలు ఎర్రగా మారిపోవడం, మేత నెమరు నిలిచిపోవడం, మెడ గొంతు వాయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన 12 నుంచి 36 గంటలకు వ్యాధి లక్షణాలు కనిపించి, సకాలంలో సరైన వైద్యం అందకపోతే మరో 12 నుంచి 24 గంటల్లో పశువు మరణిస్తుంది. గురక వ్యాధి చికిత్స వ్యాధిని గుర్తించిన మరుక్షణం రక్త పరీక్షలు నిర్వహించాలి. వ్యాధి సోకిన పశువును ఇతర పశువుల నుంచి వేరు చేయాలి. ప్రశాంత వాతావరణంలో పశువులకు పరీక్షలు చేయిస్తే మంచిది. ఈ పరిస్థితుల్లో పశువులను నిలబెట్టి మాత్రమే వైద్యం చేయడం శ్రేయస్కరం. యాంపిసిల్లిన్, క్లోక్సా సిలిన్, జెంటా మైసిన్, సెఫలాక్సిన్ వంటి యాంటి బయోటిక్ మందుల్ని సరైన మోతాదులో అవసరాన్ని బట్టి రక్తం లోకి ఎక్కిస్తే వేగంగా ఉపశమనం కలుగుతుంది. సాంబ్రాణి ధూపం వేయడం కూడా మంచిదే. వ్యాధి నిరోధక శక్తిని పెంచే మోమెజోల్ ఇంజక్షన్లు, బి–కాంప్లెక్స్ ఇంజక్షన్లు బాగా నీరశించిన పశువుకై తే డెక్ట్స్రోజ్ సైలెన్లు అవసరం కూడా ఉంటుంది. నివారణ గురకవ్యాధి సోకిన పశువులకు రోగ క్రిములను కలిగిన కలుషిత మేత, నీరు పరికరాలు, కళేబరాలను దూరంగా తరలించాలి. కళేబరాలను లోతుగా పూడ్చి వేయడం మంచిది. పరిసరాల్లో క్రిమి కీటకాలు వృద్ధి చెందకుండా పొడిగా ఉంచాలి. డిడిటి, గమాక్సిన్ ,సైపర్ మెధ్రిన్, కార్పొరిల్ వంటి క్రిమి సంహారకాలతో క్రిమి రహితం చేయాలి. పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన పశువులను కనీసం వారం రోజులన్నా వేరుగా ఉంచి వ్యాధి లేదని నిర్ధారించుకున్నాక మిగిలిన పశువులతో కలవనీయ్యాలి. గురకవ్యాధి నివారణకు ప్రభుత్వం ఏటా ఉచితంగా టీకాలు వేయిస్తోంది. ప్రస్తుతం గురకవ్యాధి, జబ్బవాపు, గాలికుంటు వ్యాధుల నిర్మూలనకు ఒకే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. పశువైద్యల సూచనల మేరకు ఈ టీకాలను తొలకరి తొలి దశలో లేదా ఎండలు ముదరక ముందు వేయిస్తే మంచిది. డా కె లింగయ్య, పశు సంవర్థక శాఖ ఏడీ, చింతలపూడి పాడి–పంట -
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
భీమవరం: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్వో ఎం వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వీఎస్ సాయిబాబా, ఎలక్ట్రానిక్స్ మీడియా అధ్యక్షుడు జక్కంశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యుడు యర్రంశెట్టి గిరిజాపతి మాట్లాడుతూ గత ఏడాది కాలంగా జర్నలిస్టు అక్రిడిటేషన్లను మూడు నెలలకు ఒకసారి పొడిగించడంతో కొత్తగా అక్రిడిటేషన్లు తీసుకునేవారికి అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే అర్హత గల జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులందరకీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని, హెల్త్ ఇన్యూరెన్స్ స్కీమ్ అమలు వంటి డిమాండ్స్ తక్షణం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ నాయకులు వంగల లింగమూర్తి, కేఎస్ఆర్కే గోపాలకృష్ణ, బి రామాంజనేయులు, పట్టణ కార్యదర్శి కమ్మిలి హనుమంతరావు, ఎన్ సత్యనారాయణ, విజయరాజు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో ఎలక్ట్రీషియన్ మృతి
తణుకు అర్బన్: విద్యుత్ షాక్తో ఎలక్ట్రీషియన్ మృతి చెందిన ఘటన మంగళవారం తణుకు మండలం కొమరవరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉండ్రాజవరం మండలం చివటం గ్రామానికి చెందిన పిప్పిరిశెట్టి మణికంఠ (24) కొమరవరం గ్రామంలోని లక్ష్మీ గణేష్ నగర్లో ఒక ఇంట్లో విద్యుత్ లైన్ల పనుల్లో ఉండగా తెగిపడి ఉన్న విద్యుత్ వైరు గమనించకుండా తాకడంతో అతడికి విద్యుత్ షాక్ తగిలింది. దీంతో గాయాలపాలైన మణికంఠను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. తణుకు పట్టణానికి చెందిన బిల్డర్ వాసుకూరి వెంకట సుబ్బారావు నిర్మిస్తున్న భవనానికి సంబంధించి ప్లంబింగ్, ఎలక్ట్రిషన్ పనుల నిమిత్తం చివటం గ్రామానికి చెందిన కోలా ప్రసాద్ అనే వ్యక్తికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. అతని వద్ద పనిచేస్తున్న మణికంఠ విధుల్లో ఉండగా విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు. దీంతో బాధిత కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. తణుకు రూరల్ ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం కేసులో వ్యక్తి అరెస్ట్ భీమవరం: పాతమద్యం కేసులో ఎండీపీఎల్ ముద్దాయి కాకినాడ జిల్లా తుని పట్టణం సీతారాంపురానికి చెందిన వీర్ల దుర్గా ప్రసాద్ను మంగళవారం అరెస్ట్ చేసినట్లు భీమవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ కె.బలరామరాజు చెప్పారు. అతడిని ఫస్ట్ ఏజేఎఫ్సీఎం కోర్టులో హాజరుపర్చగా నరసా పురం సబ్జైల్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
సీతారాముని ఆలయంలో చోరీ
జంగారెడ్డిగూడెం: పట్టణంలోని శ్రీసీతారామస్వామి ఆలయంలో చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని బుట్టాయగూడెం రోడ్డులోని సీతారామస్వామి ఆలయ తలుపులు తెరిచేందుకు మంగళవారం ఉదయం అర్చకులు శ్రీనివాసులు వెళ్లగా తలుపులు తాళాలు పగులగొట్టి ఉండడం, సీసీ కెమెరాలు ధ్వంసం కావడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. హుండీ కోసం వెతకగా ఆలయానికి ఆనుకుని కున్న ఎంపీయూపీ పాఠశాల ఆవరణలో లభించింది. అలాగే పాఠశాలలోని పలు గదుల తాళాలు సైతం పగులగొట్టి ఉన్నాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలాన్ని ఎస్సై జబీర్ పరిశీలించారు. ఆలయ ఈవో కలగర శ్రీనివాస్ మంగళవారం ఫిర్యాదుచేశారు. కాగా, చోరీ చేసిన హుండీపై వేలి ముద్రలు పడకుండా దొంగలు కోడిగుడ్లు పగులగొట్టి వేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆలయ వాచ్మన్ను ఈవో తన వాహనానికి డ్రైవర్గా వినియోగించుకోవడంతో సోమవారం రాత్రి అతడు విధులకు హాజరు కాలేదని తెలిసింది. ద్విచక్ర వాహనాల చోరీపై ఫిర్యాదు ఉండి: రెండు ద్విచక్ర వాహనాల చోరీపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోడూరు మండలం జగన్నాధపురానికి చెందిన కడలి బాబీ జూన్ 10వ తేదీన మహదేవపట్నలో రొయ్యల పట్టుబడికి వచ్చాడు. పని ముగించుకుని మద్యం దుకాణం వద్ద వాహనాన్ని నిలిపి లోనికి వెళ్లి బయటకు వచ్చేసరికి ద్విచక్రవాహనం కనిపించలేదు. ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం ఉండి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై హెడ్కానిష్టేబుల్ కేసు నమోదు చేశారు. అలాగే పెదపుల్లేరులో గత నెల 19వ తేదీ రాత్రి నిచ్చెనకొలను కృష్ణ తన ఇంటివద్ద ద్విచక్రవాహాన్ని పెట్టాడు. మరోసటి రోజు ఉదయానికి వాహనం కనిపించలేదు. ఎస్సై ఎండీ నసీరుల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.