breaking news
West Godavari District News
-
గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
బుట్టాయగూడెం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, వసతిగృహాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బుజ్జిరెడ్డి అన్నారు. తొలిసారి బుట్టాయగూడెం మండలంలోని గిరిజన గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కేఆర్పురం ఐటీడీఏను సందర్శించి పథకాలపై ఆరా తీశారు. అదేవిధంగా మండలంలోని రాజానగరం ఆశ్రమ పాఠశాలను సందర్శించి 10వ తరగతి విద్యార్థులతో పాఠ్యాంశాల వివరాలను, మెనూ అమలుపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేఆర్పురం సచివాలయంను సందర్శించారు. అలాగే ఐటీడిఏ సమీపంలో ఉన్న గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరిగే పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. అలాగే వసతిగృహాల్లో ఏఎన్ఎంల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. వసతిగృహాల్లో పాఠశాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కేఆర్పురం ఐటీడిఏ డీడీ పి.జగన్నాథరావు, డీవైఈఓ కె.రవిప్రసన్న కుమార్, సీఎంఓ సున్నం శ్రీనివాస్, ఏటీడబ్ల్యూఓ జి.జనార్థన్ పాల్గొన్నారు. ఎస్టీ కమిషనర్ చైర్మన్ రాత్రి ఐటీడీఏలోని గెస్ట్హౌస్లో బస చేశారు. గురువారం కూడా బుట్టాయగూడెం మండలంలోని గురుకుల పాఠశాల, తెల్లంవారిగూడెం, దొరమామిడి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శిస్తారని అధికారులు తెలిపారు. మౌలిక వసతులు సక్రమంగా అందాలిపోలవరం రూరల్: గిరిజన విద్యార్థులకు వసతి గృహాల్లో మౌలిక వసతులు సక్రమంగా అందాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి అన్నారు. బుధవారం పోలవరం మండలంలోని ఇటికలకోట, బోడిగూడెం, చేగొండిపల్లి గిరిజన సంక్షేమ వసతి గృహాలను ఆయన సందర్శించారు. ఆయన్ను ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. -
‘కౌశల్’ విజేతలకు బహుమతులు
భీమవరం: భీమవరం ఏఆర్కేఆర్ మున్సిపల్ హైస్కూల్లో భారతీయ విజ్ఞాన మండలి, ఏపీ సైన్స్ సిటీ అప్ కాస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కౌశల్– 2025 రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతిభ అన్వేషణ పోటీల్లో విజేతలకు బుధవారం బహుమతులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఆన్లైన్లో నిర్వహించిన పోటీల్లో 12 మంది విద్యార్థులు విజేతలకు జిల్లా విద్యాశాఖ అధికారి ఇ నారాయణ ప్రశంసా పత్రాలు, జ్ఞాపిక, నగదు పురస్కారాలను అందజేశారు. కౌశల్ జిల్లా కోఆర్డినేటర్ రేపాక వెంకన్నబాబు మాట్లాడుతూ జిల్లాలో విజేతలైన విద్యార్థులు ఈనెల 27వ తేదీన తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో కౌశల్ జిల్లా జాయింట్ కోఆర్డినేటర్ జి శ్రీనివాస వర్మ, టెక్నికల్ కోఆర్డినేటర్ ఏసీ వరప్రకాష్, డీసీఈబీ సెక్రెటరీ జీవీవీ శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి వి పూర్ణచంద్రరావు, అప్ కాస్ట్ జిల్లా సమన్వయ అధికారి మల్లుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పశువుల సంచారం.. ప్రాణ సంకటం
● విచ్చలవిడిగా సంచరిస్తున్న మూగజీవాలు ● నిత్యం ఏదో మూల వాహన ప్రమాదాలు ● పట్టించుకోని ప్రభుత్వం ఉండి: గోవులను పూజించడం మన ఆచారం. గృహప్రవేశాలకు సైతం మనిషికంటే ముందు గోమాత ఉండాలి. అలాంటి గోవుల సంరక్షణపై ఎవ్వరూ శ్రద్ధ వహించకపోవడం విచారకరం. ప్రభుత్వం సైతం పశువుల సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం లేదు. దీంతో పశువులు విచ్చలవిడిగా రోడ్లపై సంచరిస్తున్నాయి. వాటి వల్ల కూడా నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాహనాల వల్ల పశువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. రోడ్లపైనే సంచారం.. నియోజకవర్గంలోని ఎన్నార్పీ అగ్రహారం నుంచి ఆకివీడు శివారు వరకు అలాగే కాళ్ల మండలం పెదఅమిరం మొదలుకొని జువ్వలపాలెం వరకు ఇలా ఎక్కడ చూసినా రోడ్లపై పదుల సంఖ్యలో ఆవులు దయనీయ పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారి 165తో పాటు పలు గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో నడిరోడ్డుపైనే జీవిస్తున్నాయి. దీంతో ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆవులను ఢీకొని పలువురు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఆయా ప్రమాదాల్లో ఆవులు కూడా మృత్యువాత పడుతున్నాయి. వాటిని ఆయా పంచాయతీల వారు ఖననం చేయడం తప్ప వాటిని తీసుకువచ్చి వదిలేసిన వారు గానీ, జంతు ప్రేమికులు గానీ పట్టించుకోకపోవడంతో వాటి పరిస్థితి దారుణంగా ఉంది. మరికొన్ని గోవులు రోడ్డు ప్రమాదాల్లో గాయపడి అవయవాలు కోల్పోవడంతో వాటిని చూసేందుకు కూడా భయపడేంత దారుణ పరిస్థితుల్లో గోవులు ఉంటున్నాయి. ఆహారం లభించక ప్లాస్టిక్ కవర్లు తిని మృత్యువాత పడుతున్నాయి. పశువులకు హాస్టళ్లు ఎక్కడ? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పశువులకు హాస్టళ్లు ఏర్పాటు చేస్తామని గతంలో ఓమాట చెప్పి ఊరకున్నారే తప్ప.. పశువుల కోసం చేసిందేమీ లేదు. ఇప్పటికై నా పశువుల కోసం హాస్టళ్లు ఏర్పాటు చేస్తే ఇలా బహిరంగ ప్రదేశాల్లో ఉండే పశువులను, గోమాతలను హాస్టళ్లలో ఉంచి కనీసం కడుపునిండా మంచి ఆహారం పెట్టే అవకాశం ఉంటుందని పలువురు సేవాసంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఖాళీగా ఉండే ప్రభుత్వ స్థలాల్లో షెడ్లు ఏర్పాటు చేస్తే వాటికి నివాసస్థానమైనా ఏర్పడి ఎవరైనా వాటి ఆలనాపాలనా చూస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. గోవులను రోడ్లపై విడిచిపెట్టే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మూగజీవాలను బాధించడం మానవత్వం కాదు. పెంచుకోలేకపోతే మరెవ్వరికై నా అప్పగించాలే తప్ప ఇలా నడిరోడ్డుపై విడిచిపెట్టి అపచారం చేయకూడదు. లయన్స్క్లబ్, మానవత సేవాసంస్థ ఆధ్వర్యంలో అప్పుడప్పుడు గోవులకు మేతపెట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాతల సహకారం దొరికితే మరింతగా కార్యక్రమాన్ని చేడతాం. – డాక్టర్ గాదిరాజు రంగరాజు, ఉండి మానవత సేవాసంస్థ అధ్యక్షుడు, చెరుకువాడ ఉండి సెంటర్, బస్టాండ్, ఆకివీడు రోడ్డులో పదుల సంఖ్యలో గోవులు, పశువులు దర్శనమిస్తాయి. వీటి సంఖ్య రోజురోజుకు పెరగడంతో రోడ్డు ప్రమాదాలు కూడా అధికంగా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల లారీ ఢీ కొట్టడంతో గాయపడిన అవు దూడకు వైద్యం చేయించి సాధారణ స్థితికి తీసుకువచ్చాను. గోసంరక్షకులు పశువులను పట్టించుకోవాలి. – గుండాబత్తుల సుబ్బారావు, సీనియర్ రాజకీయవేత్త, ఉండి -
జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ పోటీలకు ఎంపిక
భీమవరం: కర్ణాటకలోని మంగళూరులో నిర్వహించే 69వ జాతీయస్థాయి అండర్–19 స్కూల్ గేమ్స్ నిర్మల్ పోటీలకు రాష్ట్ర జట్టుకు భీమవరం బ్రౌనింగ్ కళాశాల విద్యార్థినులు జి లిఖిత, ఎన్ వర్షితలక్ష్మీ భద్ర ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ కె నవీన్ కుమార్ బుధవారం తెలిపారు. ఈనెల 24 నుంచి ఆరు రోజులపాటు జరగనున్న నెట్ బాల్ అండర్–19 జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లా జట్టు ద్వితీయ స్థానం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఈ సందర్భంగా ఎంపికై న క్రీడాకారులను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ విద్యాసంస్థల అధ్యక్ష, కార్యదర్శులు మేడిది జాన్సన్, మేడిది ఎస్తేరు ప్రియాంక అభినందించారు. కార్యక్రమంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ దావూద్ ఖాన్, విద్యాసంస్థల వైస్ ప్రెసిడెంట్ అబ్రహం తదితరులు పాల్గొన్నారు. భీమవరం: భీమవరం పట్టణంలోని ఏవీజీ సినిమాస్లో బుధవారం మోగ్లీ చిత్ర యూనిట్ సందడి చేసింది. నటీనటులు రోషన్ కనకాల, సాక్షి మండోల్కర్, హర్ష ప్రేక్షకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రోషన్, సాక్షి మాట్లాడుతూ మూడు రోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం విశేష ఆదరణ పొందుతుండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముందుగా చిత్రబృందం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) నివాసానికి వెళ్లి కొద్దిసేపు గడిపారు. కుక్క దాడిలో చిన్నారికి గాయాలు జంగారెడ్డిగూడెం: కుక్క దాడిలో ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక శిఖామణి చర్చి సమీపంలో సాయిబాబ, పూర్ణిమ దంపతులు నివసిస్తున్నారు. వీరు బుధవారం పశువుల ఆసుపత్రి సమీపంలో ఉన్న చర్చి వద్ద ప్రేయర్ చేసుకుంటున్నారు. వారి మూడేళ్ల చిన్నారి శ్రీహరిత బయట ఆడుకుంటుండగా, ఆమైపె కుక్క దాడిచేసింది. దీంతో శ్రీహరిత ముఖంపై కంటి భాగంలోను తీవ్రంగా గాయాలయ్యాయి. చిన్నారి కేకలు విని బయటకు వచ్చి కుక్క దాడి నుంచి కాపాడారు. వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లి మెరుగైన వైద్యం అందించారు. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు మృతి తాడేపల్లిగూడెం రూరల్: ఆరుగొలను గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భార్యభర్తలు రోజు వ్యవధిలోనే మృతి చెందారు. గ్రామానికి చెందిన మలకా అబద్దం – లక్ష్మి భార్యాభర్తలు. రెండ్రోజుల క్రితం భర్త అబద్దం బాత్ రూమ్లో పడిపోవడంతో తణుకు ఆసుపత్రికి తరలించారు. తదుపరి అతని భార్య లక్ష్మి సైతం అనారోగ్యంతో తణుకు ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఉదయం మలకా అబద్దం (75) మృతి చెందగా, అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం అతని భార్య లక్ష్మి (65) ఇంటి వద్ద తనువు చాలించింది. ఈ ఘటన అందరినీ విస్మయానికి గురి చేసింది. వీరికి వివాహమైన ఒక కుమార్తె ఉంది. రోజు వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందడం గ్రామస్తులను కలచివేసింది. భీమవరం: జాతీయ ఉపాధి హామీ పథకానికి గాంధీజీ పేరు తొలగించడం జాతిపితను అవమానించడమేనని గాంధీ స్మారక నిధి జిల్లా ప్రతినిధి ఇందుకూరి ప్రసాదరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం గాంధేయవాదులు, గ్రామాభివృద్ధికి తోడ్పడే దాతలు, స్వచ్ఛంద సంస్థలకు ఆమోదయోగ్యం కాదని దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ప్రసాదరాజు కోరారు. చింతలపూడి: ఎరగ్రుంటపల్లి అడవి ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై చింతలపూడి పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన కటారి కోటేశ్వరరావు, గొల్ల మంగరావు, వనం కొండలరావులను అదుపులోకి తీసుకుని, 40 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. -
పారా గేమ్స్లో ప్రతిభ
జంగారెడ్డిగూడెం: ఇటీవల దుబాయ్లో జరిగిన ఏషియన్ యూత్ పారా గేమ్స్–2025లో జంగారెడ్డిగూడెంకు చెందిన బుడిగిన రవి కార్తీక్ ఆరు పతకాలు సాధించారు. బుధవారం స్థానిక సాయిబాలాజీ టౌన్ షిప్లో రవి కార్తీక్, తండ్రి నాగేంద్ర కుమార్ వివరాలు వెల్లడించారు. స్విమ్మింగ్ 100 మీటర్ల బ్రెస్ట్, బ్యాక్ స్ట్రోక్, 200 మీటర్ల ఐఎం విభాగాల్లో మూడు గోల్డ్ మెడల్స్, 50, 100 మీటర్ల ఫ్రీ స్టైల్, 100 మీటర్ల బ్యాక్ స్ట్రో విభాగాల్లో వెండి పతకాలను రవికార్తీక్ సాధించాడన్నారు. పెనుగొండ: సిద్ధాంతం గోదావరిలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జారి పడి మృత్యువాత పడ్డాడు. పెరవలి మండలం పిట్టవేమవరంనకు చెందిన పడాల రఘునాథరెడ్డి (35) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ సొంత గ్రామానికి సెలవుల నిమిత్తం వచ్చారు. స్నేహితులతో కలసి మంగళవారం సాయంత్రం సిద్ధాంతం బ్రిడ్జి వద్దకు వెళ్లారు. కాలకృత్యాలు తీర్చుకొని గోదావరి ఒడ్డుకు వెళ్లగా ప్రమాదవశాత్తు జారిపడిపోయాడు. జాలర్ల సహాయంతో వెతకగా మృతదేహం లభించింది. మృతుడి సోదరుడు పడాల ఫణీంద్ర పెనుగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై కే గంగాధర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. రఘునాథరెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు. -
33 సబ్సిడీ సిలిండర్లు స్వాధీనం
తణుకు అర్బన్: గృహావసరాలకు వినియోగించాల్సిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో అక్రమంగా విక్రయాలు జరుపుతున్న నివాసంపై విజిలెన్స్ అధికారులు దాడి చేసి రూ.83,232 విలువైన 33 గృహ అవసరాలకు సంబంధించిన సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ ఎస్పీ కె.నాగేశ్వరరావుకు వచ్చిన సమాచారం మేరకు తణుకులోని పైడిపర్రు రాజీవ్ గాంధీనగర్ ప్రాంతంలోని గవర వెంకటేశ్వరరావు నివాసంలోను, ఆటోలోను ఉన్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లుగా విజిలెన్స్ ఎస్సై కె.సీతారాము తెలిపారు. గ్యాస్ వినియోగదారుల కార్డుల ద్వారా గ్యాస్ బుక్ చేసి వాటిని అధిక లాభానికి హోటళ్లు, ఇతర వ్యాపారాలకు విక్రయిస్తున్నట్లుగా తేలిందని చెప్పారు. సిలిండర్లను సీజ్ చేసి సదరు గవర వెంకటేశ్వరరావుపై నిత్యావసరాల చట్టం 1955 ప్రకారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు. తనిఖీల్లో తణుకు డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
శ్రీవారి క్షేత్రం.. హిమ శోభితం
కొండపైన జంట గోపురాల ప్రాంతంలో మంచు తెరలుహిమ వర్షంలో.. సప్తగోకుల ప్రాంతం హిమ వర్షంలో ద్వారకాతిరుమలలోని శ్రీవారి క్షేత్రం తడిసి ముద్దవుతోంది. మంచు తెరల్లో క్షేత్రంలోని ప్రకృతి సోయగాలు చూపరుల మనస్సును హత్తుకుంటున్నాయి. బుధవారం ఉదయం 9 గంటల వరకు కూడా మంచు తెరలు వీడకపోవడంతో క్షేత్రానికి వివిధ వాహనాలపై విచ్చేసిన భక్తులు వాహన లైట్ల వెలుగుల్లోనే రాకపోకలు సాగించారు. పొగ మంచులోనే భక్తులు ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించారు. ఆలయ రాజగోపురాలు, కొండపైన సప్తగోకులం, జంట గోపురాల ప్రాంతం, సెంట్రల్ పార్కింగ్, శివాలయం, ఘాట్ రోడ్లు మంచు తెరలు కమ్ముకోవడంతో భక్తులు ఆ సోయగాలను చూసి ఆనంద పరవశం చెందారు. – ద్వారకాతిరుమల కొండపైన లైట్ల వెలుగుల్లో వాహనాల రాకపోకలువాహన పూజల వద్ద మంచు పరదా -
శ్రీవారి ఉత్తర ద్వార దర్శనానికి చురుగ్గా ఏర్పాట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30న జరగనున్న చినవెంకన్న ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆలయ తూర్పు ప్రాంతంలోని షాపింగ్ కాంప్లెక్స్ వెనుక చేపట్టిన తాత్కాలిక క్యూలైన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రాంతంలో ఈ క్యూలైన్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ బుధవారం భీమడోలు సీఐ యూజే విల్సన్, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్తో కలసి ఏర్పాట్లను పరిశీలించారు. -
బైక్ల చోరీ ముఠా అరెస్ట్
ద్వారకాతిరుమల: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో బైక్లను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్టేషన్లో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్, ఎస్సై టి.సుధీర్ బుధవారం వివరాలను వెల్లడించారు. ద్వారకాతిరుమలకు చెందిన పెద్దింటి రామ కిషోర్ ఈనెల 12న రాత్రి పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న తన వెల్డింగ్ షాపు ముందు బైక్ను పార్క్ చేశాడు. అది చోరీకి గురవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఎస్సై సుధీర్ భీమడోలు సీఐ యూజే విల్సన్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా భీమడోలుకు చెందిన అడ్డాల ప్రవీణ్ కుమార్, పాగోలు శివ నాగు, భీమవరం మండలం గొల్లవానితిప్పకు చెందిన దోనాద్రి సాయి వంశీ ద్వారకాతిరుమల పోలీస్టేషన్ పరిధిలో 3 బైక్లు, ఏలూరు వన్టౌన్, దెందులూరు, పెదపాడు, చేబ్రోలు, నిడమర్రు, తాడేపల్లిగూడెం, ఆకివీడు పోలీస్టేషన్ల పరిధిలో మరో 9 బైక్లు చోరీ చేసినట్టు గుర్తించారు. ఆ ముగ్గురిని అరెస్టు చేసి, రూ.9 లక్షలు విలువైన 12 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా దోనాద్రి వంశీపై భీమవరం పోలీస్స్టేషన్లో పలు కొట్లాట కేసులు, ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్టు నిర్ధారించారు. కేసు దర్యాప్తుకు సహకరించిన సీఐ విల్సన్, ఎస్సై సుధీర్, సిబ్బంది సీహెచ్ లక్ష్మీనారాయణ, ఎం.వెంకటేశ్వరరావు, వి.జయప్రకాష్ బాబులను డీఎస్పీ శ్రావణ్ కుమార్ అభినందించారు.రూ.9 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం -
వైద్య విద్య ప్రైవేటీకరణ నష్టాలపై సెమినార్
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో వైద్య విద్య ప్రైవేటీకరణ – సమాజంపై దాని ప్రభావం అనే అంశంపై విజయవాడలో జరిగే రాష్ట్ర సెమినార్ను విజయవంతం చేయాలని కోరుతూ పీడీఎస్ఓ నాయకులు మంగళవారం నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, జిల్లా ఆసుపత్రి వద్ద ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇటీవల 17 కొత్త వైద్య కళాశాలల్లో పదింటిని పీపీపీ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించడం దారుణమన్నారు. గత ప్రభుత్వం రూ.8,500 కోట్లతో 17 కళాశాలల నిర్మాణాన్ని ప్రారంభించిందని, అందులో ఐదు మాత్రమే ప్రారంభమయ్యాయన్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం హామీలను తుంగలో తొక్కి, ప్రజాధనంతో నిర్మిస్తున్న మెడికల్ కళాశాలలను పీపీపీ పేరిట ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించేందుకు పూనుకుందని, దీని వల్ల ప్రభుత్వ కళాశాలలో కేవలం రూ.5 లక్షలతో పూర్తయ్యే కోర్సుకు రూ. 27.5 లక్షల నుంచి రూ.1.10 కోట్ల వరకు ఖర్చవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 21వ తేదీన విజయవాడలోని బాలోత్సవ్ భవన్లో ఈ అంశంపై పీడీఎస్ఓ రాష్ట్ర సెమినార్ను నిర్వస్తుందన్నారు . -
22ఏ భూ సమస్యల పరిష్కారం
ఏలూరు(మెట్రో): రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏలూరు జిల్లాలో 22 ఏ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారని, ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఏలూరు జిల్లా మార్గదర్శకం అవుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో మంగళవారం శ్రీమెగా 22ఏ భూ సమస్యల పరిష్కార వేదికశ్రీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలు, రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మంత్రితో పాటు కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జేసి అభిషేక్ గౌడ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ జిల్లాలోని 27 మండలాలకు చెందిన రైతులు, ప్రజలు 22 ఏ జాబితాలో పొరపాటుగా నమోదైన భూముల వివరాలను సదరు యజమానుల నుంచి స్వీకరించేందుకు మంగళవారం కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని, ప్రతి అర్జీని పరిశీలించి 90 శాతం వరకు అదేరోజు పరిష్కరిస్తున్నామన్నారు. సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో 1 లేదా 2 వారాలలో తప్పనిసరిగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. ఒక్కరోజులోనే 1,147 కేసులు పరిష్కరించాం కార్యక్రమం అనంతరం పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ సుపరిపాలన అంటే సామాన్య ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించడమన్నారు. రాష్ట్రంలో 22 ఏ భూ సమస్యల పరిష్కారానికి ఏలూరు జిల్లా కేంద్రంగా మొదటి అడుగు పడిందన్నారు. ఒక్కరోజులోనే 1,199 దరఖాస్తులు అందగా, వాటిలో 1,147 దరఖాస్తులను పరిష్కరించి 142.04 ఎకరాల భూములను 22 ఏ జాబితా నుండి తొలగించామన్నారు. మరో 32 ఎకరాలకు సంబంధించి 11 కేసులు పెండింగ్ ఉన్నాయని, వాటిలో 8 కేసులను వారంలోగా, 2 కేసులు 2 వారాలలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను ఆదేశించామన్నారు. దేవాదాయ శాఖకు సంబంధించి ఒక కేసును రికార్డులు పరిశీలించి నెలరోజులలోగా తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కేసులు పరిష్కారమైన ప్రజలకు పరిష్కార ఉత్తర్వులను మంత్రి అందించారు. సమస్యల పరిష్కారానికి కృషిచేసిన కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ఎంజె అభిషేక్ గౌడ, రెవెన్యూ అధికారి, ఆర్డీఓలు, రెవెన్యూ సిబ్బందిని మంత్రి అభినందించారు.ఏలూరు(మెట్రో): రానున్న రబీ సీజన్లో సాగునీటికి, వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాగునీటి సలహా మండలి సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది. తాగునీటి కొరత లేకుండా సీలేరు నుంచి నీటి సరఫరా, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ, పట్టిసీమ, తాడిపూడి, తదితర ఎత్తిపోతల పథకాల నుంచి సాగు, తాగునీటి సరఫరాకు సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని మంత్రి ఆదేశించారు. -
పండక్కి రోడ్ షో
భరోసా ప్రాజెక్టు రీస్టోర్ స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు కోసం బాధితులు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఏలూరు ఎస్పీ ప్రాజెక్ట్ రీస్టోర్కు రూపకల్పన చేశారు. 8లో uబుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం: రోడ్ల అభివృద్ధి పేరిట చంద్రబాబు ప్రభుత్వం కనికట్టు చేస్తోంది. పండక్కి జిల్లాకు వచ్చే వారి ముందు రోడ్లు బాగుచేస్తున్నట్టు షో చేసేందుకు ఆపసోపాలు పడుతోంది. నాబార్డ్, ప్లాన్, ఎస్సీసీ వర్క్స్, అడిషనల్ ఫండ్స్ రూ.141 కోట్లతో జిల్లాలో 37 పనులు మంజూరు చేయగా 16 మాత్రమే పట్టాలెక్కాయి. గత ఏడాది సంక్రాంతికి ముందు హడావుడిగా చేసిన పనులు నాణ్యతలేక మూన్నాళ్ల ముచ్చటయ్యాయి. జిల్లాలో ఆర్అండ్బీ పరిధిలో స్టేట్ హైవే, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు 1,568 కిలోమీటర్లు పొడవున విస్తరించి ఉన్నాయి. రోడ్లను అభివృద్ధి చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి గత ఏడాది ప్యాచ్ వర్క్లతో సరిపెట్టింది. విద్య, ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం దేశ విదేశాల్లో ఉంటున్న వారు సంక్రాంతి పండుగలకు జిల్లాకు రావడం పరిపాటి. బంధుమిత్రులను వెంట తీసుకువస్తుంటారు. ఇక్కడ జరిగే కోడిపందేలు, అమ్మవార్ల జాతరలను చూసేందుకు ఇతర జిల్లాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. వేలాదిగా జిల్లాకు వచ్చే సందర్శకులతో రోడ్లన్ని కిక్కిరిసిపోతాయి. పండుగ చుట్టాల ముందు తమ పాలనను గొప్పగా చూపించుకునేందుకు గత ఏడాది రూ.42.57 కోట్లతో ప్యాచ్ వర్కులు, అత్యవసర మరమ్మతులు చేపట్టారు. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు చూస్తారంటూ ప్రకటనలు గుప్పించి కేవలం రూ.18.5 కోట్ల విలువైన 45 శాతం పనులు మాత్రమే పూర్తిచేయగలిగారు. కొన్నిచోట్ల పండుగల మూడు రోజులు మన్నితే చాలన్నట్టు ప్రమాణాలు పాటించకుండా నాసిరకంగా పనులు చేయగా, మరికొన్నిచోట్ల గుంతల్లో మెటల్, చిప్స్ వేసి తారు వేయకుండా వదిలేయడంతో కొద్ది రోజులకే రాళ్లుపైకి లేచిపోయి ప్రమాదభరితంగా తయారయ్యాయి. కాగా గత సంక్రాంతి సీజన్లో చేసిన పనులకు సంబంధించి సుమారు రూ.20 కోట్ల మేర కాంట్రాక్టర్లకు బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పనులు చేసేందుకు వారు వెనుకడుగేస్తున్నారు. ఇప్పటికే మొదలైన పనులు త్వరితగతిన పూర్తిచేయాలని, మిగిలిన వాటిని త్వరగా ప్రారంభించాలని ఉన్నతస్థాయి నుంచి ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. కాంట్రాక్టర్లను ఒప్పించి పనులు చేపట్టేందుకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో మరోమారు షో ప్రయత్నాలు మొదలయ్యాయి. నాబార్డ్, ప్లాన్, ఎస్సీసీ వర్క్స్, అడిషనల్ ఫండ్స్ రూ.141 కోట్లతో జిల్లాలో మార్టేరు–పక్కిలంక, పాలకొల్లు –దొడ్డిపట్ల, పెనుమంట్ర–వీరవాసరం, పాలకొల్లు– ఆచంట, దువ్వ–ఆరుళ్ల, ఉద్దలపాలెం–దువ్వ, నరసాపురం–మేడపాడు, తాడేపల్లిగూడెంలోని విజయవాడ–విశాఖ తదితర రోడ్ల అభివృద్ధికి సంబంధించి 37 వర్క్లు మంజూరు చేసింది. వీటిలో రూ.53 కోట్లు విలువైన 16 వర్క్లు మాత్రమే టెండర్లు పూర్తిచేసుకుని పనులు మొదలయ్యాయి. రూ.46 కోట్ల విలువైన 12 పనులు టెండర్ల దశలో, మిగిలిన వాటికి టెండర్లు పిలిచారు. యాన్యువల్ మెయింటినెన్స్ నిధులు రూ.మూడు కోట్లుతో 650 కిలోమీటర్లు మేర ప్యాచ్ వర్క్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే వారికి రోడ్లు బాగుచేశామని చెప్పుకునే ప్రయత్నం రూ.141 కోట్లుతో జిల్లాలో 37 పనులు టెండర్ల దశలో 21, నిర్మాణంలో 16 పనులు రూ. 3 కోట్లతో ప్యాచ్ వర్క్లు త్వరితగతిన పూర్తిచేయాలని ఉన్నతస్థాయి నుంచి ఒత్తిడి గతేడాది సంక్రాంతికి ముందు రూ.42 కోట్లతో హడావుడి పనులు మూన్నాళ్ల ముచ్చటైన ప్యాచ్ వర్క్లు -
రిజిస్ట్రేషన్లపై అవగాహన సదస్సు
భీమవరం (ప్రకాశంచౌక్): రిజిస్ట్రేషన్లపై అవగాహన సదస్సును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరం, గునుపూడి సబ్ రిజిస్టర్ కార్యాలయం–1లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై మంగళవారం ప్రజలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభలో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా ఏ విధమైన సేవలు ప్రజలకు అందుతాయి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ విధంగా చేసుకోవాలి సంబంధిత అంశాలను ఈ సదస్సుల ద్వారా వివరిస్తారన్నారు. భీమవరం గునుపూడి గ్రామంలోని ఇళ్ళు, ఖాళీ స్థలాలకు రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే పన్ను రసీదు మ్యుటేషన్ జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో దళారులు ప్రమేయం లేకుండా స్వయంగా రిజిస్ట్రేషన్లు చేసుకునే విధంగా ఈ అవగాహన సదస్సుల ద్వారా తెలుసుకోవాలన్నారు. భీమవరం: జిల్లాలో ఏపీ టెట్ పరీక్షకు మంగళవారం 89.65 శాతం హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ తెలిపారు. జిల్లాలో రెండు షిప్ట్ల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించగా 734 మందికి 658 మంది హాజరయ్యారని ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని నారాయణ తెలిపారు. పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్గా ఎంపికై ంది. ఇంతవరకూ ఫస్ట్ గ్రేడ్ ఉన్న పాలకొల్లును స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఎంపిక చేస్తున్నట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మంగళవారం జీవో విడుదల చేసింది. ఏలూరు (టూటౌన్): నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లకు ఫుల్ టైం వేతనాలు ఇవ్వాలని కోరుతూ స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్ల యూనియన్(ఐఎఫ్టీయు) ఆధ్వర్యంలో మంగళవారం ఇన్చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్కు వినతిపత్రం సమర్పించారు. స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లు నెలంతా పనిచేసినా రూ.4 వేలు, రూ.6 వేలు మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. చాలీచాలని జీతాలతో తాము బతకలేక పోతున్నామని, ఫుల్ టైం వర్కర్లుగా గుర్తించి, ఫుల్ టైం వేతనాలు ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. దానిపై మంత్రి అధికారులతో మాట్లాడి మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నగర అధ్యక్షుడు బి.సోమయ్య, మున్సిపల్ యూనియన్ నాయకులు దేవరపల్లి రత్నబాబు తదితరులున్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు నగరానికి సంగీత, నృత్య కళాశాల మంజూరుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్థానిక వన్టౌన్లో రూ. 5.25 కోట్లతో ఏర్పాటు చేసిన పురావస్తు ప్రదర్శన శాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర గొప్పతనాన్ని తెలిపేలా మ్యూజియం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. మ్యూజియంకు సంపూర్ణ సహకారం అందిస్తామని, 3వ అంతస్తు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ జిల్లా ఘన చరిత్రను ఈ మ్యూజియం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యతను నగర ప్రజలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జాయింటు కలెక్టరు ఎంజే అభిషేక్ గౌడ, మేయరు షేక్ నూర్జహాన్, ఆర్టీసీ రీజినల్ –2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, వడ్డీలు కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మీ, సామాజిక కార్యకర్త బీకేఎస్ఆర్ అయ్యంగార్ తదితరులు పాల్గొన్నారు. -
డ్వాక్రా మహిళల ఆందోళన
ఆకివీడు: నష్టపోయిన డ్వాక్రా బాధితులు తమకు న్యాయం చేయాలని యూనియన్ బ్యాంక్కు క్యూ కడుతున్నారు. స్థానిక సంతపేట, సమతానగర్ ప్రాంతంలోని యానిమేటర్లు డ్వాక్రా మహిహిళల సొమ్ము కొట్టేశారు. విషయం తెలుసుకున్న ఆయా సంఘాల మహిళలు బ్యాంకుల వద్ద పడుగాపులు పడుతున్నారు. యానిమేటర్ల ఇంటికి వెళ్లి ఆందోళన చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. మంగళవారం స్థానిక సమతానగర్లోని యానిమేటర్ ఇంటికి వెళ్లి ఆందోళన చేస్తుండగా ఆమె పోలీస్స్టేషన్కు పరారయ్యారని మహిళలు పేర్కొన్నారు. స్థానిక యూనియన్ బ్యాంకు విజిలెన్స్ అధికారి గంగాధరరావు మాట్లాడుతూ బ్యాంక్ పరిధిలో 32 గ్రూపులకు చెందిన డ్వాక్రా సంఘాల నిధులు దుర్వినియోగం అయ్యాయని, ఫిర్యాదుల మేర విచారణ చేస్తున్నామని చెప్పారు. -
19న సర్టిఫికెట్ల పరిశీలన
ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఏలూరు టౌన్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పోలీస్ కానిస్టేబుళ్లుగా ఎంపికై న సివిల్ మెన్ అండ్ విమెన్ అభ్యర్థులు ఈనెల 19న ఏలూరు అమీనాపేటలోని పోలీస్ కల్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చెప్పారు. ముఖ్యమైన సర్టిఫికెట్లు, పత్రాలతో హాజరుకావాలనీ, సివిల్ కానిస్టేబుల్స్గా ప్రత్యేక శిక్షణకు వెళ్ళేందుకు ఈనెల 20న ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కేంద్రం ప్రాంగణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్కు హాజరుకావాలని ఎస్పీ చెప్పారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అభ్యర్థులు విజయనగరం, అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్కు ఈ నెల 21న రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. పోలీస్ శిక్షణ కేంద్రాలకు వెళ్ళేందుకు ఏలూరు పోలీస్పరేడ్ గ్రౌండ్స్ నుంచి రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. 9 నెలలపాటు కొనసాగే ఇండక్షన్ శిక్షణ తరగతులు ఈ నెల 22 నుంచి ప్రారంభం అవుతాయని ఎస్పీ తెలిపారు. నిర్ణీత తేదీల్లో శిక్షణకు హాజరుకాని అభ్యర్థులు పేర్లు పోలీస్ శాఖ నిబంధన మేరకు ఎంపిక జాబితా నుంచి తొలగిస్తారన్నారు. ప్రతి అభ్యర్థి రూ.5 వేల భద్రతా బాండ్, సెక్యూరిటీ బాండ్ను రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్పై సమర్పించాలన్నారు. అభ్యర్థులు శిక్షణకు వెళ్ళేందుకు దిండు, ప్లాస్టిక్ బకెట్, మగ్, అరోగ్య భద్రత కార్డుల కోసం 3 పాస్ పోర్ట్సైజు ఫొటోలు తీసుకువెళ్ళాలని చెప్పారు. విజయవాడకు కానిస్టేబుళ్లుపెదవేగి: కానిస్టేబుళ్ల ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించేందుకు పెదవేగి జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం నుంచి మంగళవారం పంపించారు. బుధవారం సాయంత్రం యువగళం కార్యక్రమంలో వీరికి విజయవాడలో నియామక పత్రాలు అందిస్తారు. -
నెలగంట మోగింది
● శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు ● నెలరోజులపాటు తిరుప్పావై సేవలుద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో మంగళవారం నెలగంట మోగింది. అర్చకులు, పండితులు ధనుర్మాస ఉత్సవాలను మధ్యాహ్నం 1.27 గంటలకు ఘనంగా ప్రారంభించారు. ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ముందుగా దేవస్థానం సిబ్బంది ఆలయాన్ని, పరిసరాలను శుభ్రం చేసి, మామిడి తోరణాలు, అరటి బోదెలు, పుష్పమాలికలతో అలంకరించారు. ఆలయ ప్రధాన కూడలిలోని ధనుర్మాస మండపాన్ని రంగులతో సుందరీకరించారు. ఈ పనులు అర్థరాత్రి వరకు సాగాయి. శ్రీవారి పాదుకా మండప ప్రాంతాన్ని రంగవల్లులతో తీర్చిదిద్దారు. పలువురు మహిళా భక్తులు ఆలయ ప్రధాన రాజగోపురమెట్లకు పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. రంగవల్లులతో మెట్లదారిని అలంకరించి, దీపారాధన చేశారు. నెలరోజుల పాటు ధనుర్మాస ఉత్సవాలను నేత్రపర్వంగా క్షేత్రంలో నిర్వహించనున్నారు. ప్రతినిత్యం ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై సేవా కాలాలను జరుపనున్నారు. అలాగే బుధవారం నుంచి స్వామివారి గ్రామోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా ఉదయం స్వామివారు ఉభయ దేవేరులు, గోదాదేవితో కలసి క్షేత్ర పురవీదుల్లో అట్టహాసంగా ఊరేగి, ధనుర్మాస మండపం వద్దకు చేరుకుంటారు. అక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్లను మండపంలో ఉంచి పూజాధికాలను జరిపి, భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందిస్తారని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. -
దాళ్వాకు నీటి ఎద్దడి ముప్పు
● సాగునీటి సంఘాల నిర్లక్ష్యంపై ఆరోపణలు ● రైతుల ఇక్కట్లు పట్టని ప్రభుత్వం పెంటపాడు: డెల్టాలో దాళ్వాకు ఆదిలోనే హంసపాదు ఎదురైందా అన్న ప్రశ్న రైతుల్లో వ్యక్తమవుతోంది. నారుమడులకు సైతం నీరు లేక రైతన్నలు అయోమయంలో పడుతున్నారు. పలు గ్రామాల్లో నారుమడులకు సిద్ధమై దుక్కిలు చేపడుతున్నా కొన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి వల్ల సరిపడా నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా వంతులవారీ విధానం కూడా చేపట్టలేదు. నారుమడుల సమయంలోనే ఇలా ఉంటే రానురాను ఎలా ఉంటుందోనని రైతులు బెంబేలెత్తుతున్నారు. దీనికి ప్రధాన కారణం కాలువలు పూడిక తీత లేకపోవడమే అని చెబుతున్నారు. కాలువలు శుభ్రం చేసేదెప్పుడో? ప్రధానంగా పెంటపాడు మండలంలోని అలంపురం, ప్రత్తిపాడు, రాచర్ల, రావిపాడు, వల్లూరుపల్లి, బోడపాడు, దర్శిపర్రు, జట్లపాలెం, పెంటపాడు, కె. పెంటపాడు, విప్పర్రుతో పాటు, తణుకు ప్రాంతంలోని కోనాల, గూడెం మండలంలోని కృష్ణాయపాలెం, ఉంగుటూరు మండలంలోని బొమ్మిడి, బాదంపూడి ప్రాంతాల మీదుగా ప్రధాన పంట కాలువలైన మిడ్లెవిల్, లోలెవిల్ కాలువలు ప్రవహిస్తున్నాయి. అయితే ఈ రెండు కాలువల ద్వారా వేలాది ఎకరాలు పంట సాగవుతున్నాయి. ఎన్నో గ్రామాలకు తాగునీరు అందుతోంది. ఇదిలా ఉంటే ఆ కాలువల్లో కిలోమీటర్ల మేర గుర్రపుడెక్క, కర్రనాచు, తూడు పేరుకుపోయింది. గత దాళ్వా సమయంలో ఈ సమస్య ఉన్నా వంతుల వారీ విధానం, రైతులు స్వచ్ఛందంగా కాలువలు బాగుచేత కారణంగా నీటి ఎద్దడి లేకుండా ఏదోలా గట్టెక్కారు. అయితే రాబోయే పంట విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. సార్వాలో ఆధునికీకరణ లేక ముంపు సమస్య ఏర్పడింది. పంట నష్టం జరిగింది. కాగా దాళ్వా సమయంలో సాగునీటి విడుదల కావాలంటే కాలువలు శుభ్రంగా ఉండాలి. అడ్డులు, అవాంతరాలు లేకుండా చూడాలి. ఈ పని సాగునీటి యాజమాన్యాలదే. అయితే సాగునీటి సంఘాల సమావేశాలు ఎక్కడా కానరావడంలేదు. ప్రస్తుతం దాళ్వా ప్రారంభంలో సాగునీటి ఇబ్బందులు లేకుండా సాగునీటి యాజమాన్యాలు చూడాల్సి ఉంది. పంట కాలువలు డ్రెయినేజీలు పూడిక తీత తీయాల్సి ఉంది. తూడు, గుర్రపుడెక్క తీయించాలి. ఈ విషయంపై సాగునీటి సంఘాల యజమానులు సమావేశాలు నిర్వహించుకొని ఉపాది, డ్రెయినేజీ, ఇరిగేషన్ శాఖల అధికారుల సమన్వయంతో పూడిక తీత తీయించుకొంటే రాబోయే ముప్పునుంచి గట్టేక్కే అవకాశం ఉంది. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని రైతులు, ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. తాగునీటికీ ఇబ్బందే ఇటీవల కాలువలు కాలుష్య కాసారాలుగా తయారవుతున్నారు. సమీప గ్రామాల్లో చెత్తను కాలువల్లో వేస్తున్నారు. జంతు కళేబారాలు ఈ కాలువల్లో కొట్టుకువస్తున్నాయి. కాలువల సమీప గ్రామాల్లో డ్రెయినేజీలు, సెప్టిక్ ట్యాంకుల మురుగు నేరుగా ఈ కాలువలో కలుపుతున్నారు. ప్రధానంగా మిడ్లెవిల్ సమీప గ్రామాలైన అలంపురం, రాచర్ల, వల్లూరుపల్లి, దర్శిపర్రు, లో లెవిల్ కాలువ సమీప గ్రామాలైన కె.పెంటపాడు గ్రామాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈ వేసవిలో డ్రెయినేజీ, ఇరిగేషన్ శాఖల అధికారులు దీనిపై ఏమేరకు తనిఖీలు చేపడతారో చూడాలి. -
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్
జంగారెడ్డిగూడెం: బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడిని 36 గంటల్లో అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. మంగళవారం కేసుకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు. మండలంలోని నాగులగూడెం గ్రామానికి చెందిన పదేళ్ల బాలికపై మారుటి తండ్రి బోడ రవి లైంగిక దాడికి పాల్పడ్డాడన్నారు. గత మూడు నెలలుగా తల్లి లేని సమయంలో బాలికపై మారు తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడుతూ, ఎవరికై నా చెబితే చంపుతానని బెదిరించాడన్నారు. ఈ విషయం తెలిసి బాలిక తల్లి, మేనమామ సోమవారం ఫిర్యాదు చేయడంతో లక్కవరం పోలీస్స్టేషన్లో కేసు నమోదుచేసి విచారణ చేశామన్నారు. సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై జబీర్, సిబ్బందితో కలిసి దర్యాప్తు చేస్తుండగా, స్థానిక రామచంద్రాపురం సాయిబాబ స్థూపం వద్ద నిందితుడు బోడ రవిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా విశేష పూజలు చేశారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2,53,844 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఆర్వీ చందన తెలిపారు. భక్తులు 2,227 మంది స్వామి వారి అన్నప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏ మృతి
జంగారెడ్డిగూడెం: రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏ మృతి చెందిన ఘటన జంగారెడ్డిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇవి. బుట్టాయగూడెం మండలం అంతర్వేదిగూడెం గ్రామానికి చెందిన పట్టెల మంగ (50) బుట్టాయగూడెం రెవెన్యూ కార్యాలయంలో వీఆర్ఏగా పనిచేస్తోంది. మంగళవారం బుట్టాయగూడెంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పాల్గొంది. అంతర్వేదిగూడెం సచివాలయ గుమస్తా, మృతురాలికి మరిది అయిన తగరం వెంకట్రావు కూడా జనవాణిలో పాల్గొన్నాడు. కార్యక్రమం అనంతరం పంచాయతీ మోటార్కు సంబంధించి సామాగ్రి కొనేందుకు వెంకట్రావు మోటార్సైకిల్ జంగారెడ్డిగూడెం వస్తుండగా, మంగ కూడా వచ్చింది. పని ముగించుకుని తిరిగి వెళుతుండగా, స్థానిక బుట్టాయగూడెం రోడ్డులోని ఎస్బీఐ వద్దకు వచ్చే సరికి వీరి మోటార్సైకిల్ను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఆమైపె లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. వెంకట్రావుకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా మంగ భర్త మృతిచెందడంతో కారుణ్య నియామకం కింద బుట్టాయగూడెం వీఆర్ఏగా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. మృతురాలికి డిగ్రీ చదువుతున్న కుమార్తె సౌజన్య ఉంది. తల్లిదండ్రులను కోల్పోడంతో ఆమె అనాథగా మిగిలింది. కాగా, ప్రమాద ఘటన తెలుసుకున్న ట్రాఫిక్ ఎస్సై కుటుంబరావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించి, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ద్వారకాతిరుమల: మండలంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన బైక్ల చోరీలపై స్థానిక పోలీస్టేషన్లో మంగళవారం కేసులు నమోదయ్యాయి. లక్ష్మీనగర్ జాతీయ రహదారిపై, ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న రాజమండ్రికి చెందిన ఏలూరి విజయభాస్కర్ తన బైక్ను ఈనెల 15న బంకు వద్ద పార్క్ చేశాడు. 16 న ఉదయం చూస్తే బైక్ కనిపించలేదు. అలాగే ద్వారకానగర్కు చెందిన నన్నపనేని వెంకటేశ్వరరావు తన బైక్ను ఈనెల 14న రాత్రి గ్రామంలోని రామాలయం వద్ద పార్క్ చేయగా మరుసటి రోజు ఉదయం కనిపించలేదు. బాధితులు స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసిన ఎస్సై టి.సుధీర్ దర్యాప్తు చేపట్టారు. -
విశాఖ ఉక్కును కాపాడుకోవాలి
భీమవరం: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరణ చేసేవిధంగా అడుగులు వేస్తోందని, ఎందరో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలుగు జాతి హక్కు విశాఖ ఉక్కును మనమంతా కాపాడుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి.బలరామ్ అన్నారు. మంగళవారం భీమవరంలో బి వాసుదేవరావు అధ్యక్షతన జరిగిన సీపీఎం విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా సెయిల్లో విలీనం చేస్తే రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. మెడికల్ కళాశాలల నిర్మాణం, నిర్వహణ ప్రభుత్వమే చేపట్టాలని, పీపీపీ పద్ధతిని వెంటనే రద్దుచేయాలని బలరామ్ డిమాండ్ చేశారు. రైతుల పంటలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. డెల్టా ఆధునికీకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని, ఇళ్లు, ఇళ్ళస్థలాల సమస్యని, శ్మశానవాటికల సమస్యను తక్షణం పరిష్కరించాలన్నారు. పార్టీ రాష్ట్ర నాయకుడు మంతెన సీతారామ్ మాట్లాడుతూ లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి జేఏవీ గోపాలన్, జిల్లా సెక్రేరియట్ సభ్యులు కౌరు పెద్దిరాజు, కర్రా నాగేశ్వరరావు, పీవీ ప్రతాప్, పార్టీ జిల్లా సీనియర్ నాయకులు జుత్తిగ నర్సింహమూర్తి, కె రాజారామ్మోహన్రాయ్ తదితరులు పాల్గొన్నారు. -
చైన్ స్నాచర్ల అరెస్ట్
ముదినేపల్లి రూరల్: చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను స్థానిక పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి చోరీ సొత్తు రికవరీ చేశారు. ఏలూరు డీఎస్పీ డి శ్రావణకుమార్ స్థానిక పోలీసుస్టేషన్లో మంగళవారం వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మత్స వెంకటేష్, పటాస్ సలీంబాషా కలిసి మండలంలోని వడాలి, పెయ్యేరు, గురజ గ్రామాల్లో ద్విచక్ర వాహనంపై వెళుతూ మహిళల మెడల్లోని గొలుసులు తెంపుకుపోయారన్నారు. వీరిని కై కలూరు రూరల్ సీఐ వి రవికుమార్ ఆధ్వర్యంలో ముదినేపల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి చోరీ సొత్తు 6.5 కాసుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గతంలో మత్స వెంకటేష్పై 18 కేసులు, సలీంబాషాపై 9 కేసులు ఉన్నాయన్నారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన సీఐ రవికుమార్తో పాటు ఎస్సై వీఎస్ వీరభద్రరావు, కానిస్టేబుళ్లు బి పెద్దిరాజు, బి నాగబాబు, ఎ నాగరాజు, బి పవన్కుమార్, జి శివకోటయ్యలను ఎస్పీ అభినందించినట్లు చెప్పారు. -
నారసింహునికి పంచామృతాభిషేకాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాధపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో మంగళవారం విశేష కార్యక్రమాలు జరిగాయి. నారసింహుని జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని ముందుగా ఆలయ యాగశాలలో వేద పండితులు విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనం, మండపారాధనను నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛరణల నడుమ సుదర్శన నారసింహ, ధన్వంతరీ, గరుడ, ఆంజనేయ, అనంత సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమాలను జరిపారు. గర్భాలయంలో కొలువైన స్వామివారి మూలవిరాట్కు పంచామృతాభిషేకాలు నిర్వహించి, నక్షత్ర హారతులిచ్చారు. అనంతరం అన్నసమారాధనలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ద్వారకాతిరుమల: గుంటూరు జిల్లా పెదనందిపాడులో గత శనివారం జరిగిన 45వ మాస్టర్ అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో తిరుమలంపాలెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయురాలు పైడి రాజేశ్వరమ్మ సత్తా చాటారు. 60 ప్లస్ ఏజ్ గ్రూప్లో జరిగిన 100 మీటర్ల పరుగు పందెంలో రాజేశ్వరమ్మ ప్రథమ బహుమతి, 800 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ బహుమతి, 3 కిలో మీటర్ల నడక పోటీలో ప్రథమ బహుమతిని సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శేషు కుమారి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది రాజేశ్వరమ్మను అభినందించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) 2026లో డ్రాయింగ్ లోయర్, డ్రాయింగ్ హయ్యర్, టైలరింగ్ లోయర్, హయ్యర్ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైందని, ఇందుకు గాను అభ్యర్థులు ఈనెల 27వ తేదీలోగా ఫీజులు చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో వచ్చే జనవరి 3వ తేదీ వరకూ, రూ.75 అపరాధ రుసుముతో జనవరి 6వ తేదీ వరకూ గడువు ఉందన్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు కనీసం 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, ఫీజు చెల్లించిన చలానా కాపీతో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలని సూచించారు. తాడేపల్లిగూడెం: ఇస్రో ఆధ్వర్యంలో గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పోటీల్లో ఏపీ నిట్ విద్యార్థులు సత్తా చాటారు. 36 గంటలపాటు నిర్విరామంగా జరిగిన ఈ పోటీల్లో ఏపీ నిట్ విద్యార్థుల బృందం అద్భుత ప్రతిభను కనబర్చి మూడోస్థానాన్ని కై వసం చేసుకుని రూ.50వేల నగదు బహుమతిని అందుకున్నారు. ఫైనల్ పోటీలకు అర్హత సాధించిన 55 టీమ్లలో ఏపీ నిట్కు చెందిన దక్షిణ లోకోవర్స్టీమ్ ఒకటిగా నిలిచింది. ఈ టీమ్లో మొహమ్మద్ నవీద్, బి.సంజయ్, జేకే.సంతోష్, అరవ శివతేజ సత్యశ్రీ, శ్రీహరిసతీష్, లిఖిత రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ టీమ్కు మెంటార్లుగా ఆచార్యులు డాక్టర్ కార్తీక్ శేషాద్రి, డాక్టర్ శ్రీఫణి, డాక్టర్ కార్తికేయశర్మ వ్యవహరించారు. విద్యార్థులను నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్వీ రమణరావు, రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి తదితరులు అభినందించారు. బుట్టాయగూడెం: ఇటీవల అంకన్నగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలిక గర్భవతి అయ్యిందనే నెపంతో బాధ్యులు కాని ప్రధానోపాధ్యాయిని, డిప్యూటీ వార్డెన్లను సస్పెండ్ చేయడం సరైన చర్య కాదని, వెంటనే వారి సస్పెన్షన్ను రద్దు చేసి విధుల్లోకి తీసుకోవాలని ఏటీఏ రాష్ట్ర అధ్యక్షుడు జలగం రాంబాబు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వేసవి సెలవుల్లో పాఠశాల బయట జరిగిన ఘటనకు బాధ్యులను చేస్తూ ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న వారిని సస్పెండ్ చేయడం సబబు కాదన్నారు. -
హ్యాకథాన్ పోటీల్లో ఎస్ఆర్కేఆర్ విజయకేతనం
భీమవరం: కేంద్ర ప్రభుత్వం, ఏఐసీటీఈ సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పోటీల్లో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. హైదరాబాద్ వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇనిస్ట్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో రెండు విభాగాల్లో ఎస్ఆర్కేఆర్ విద్యార్థులు ప్రథమ స్థానం సాధించినట్లు కళాశాల సెక్రటరీ అండ్ కర్సపాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ చెప్పారు. ఒక్కొక్క టీం రూ.75 వేల నగదు, ఉత్తరప్రదేశ్లో జరిగిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు రూ.25 వేల నగదు బహుమతిని సాధించారన్నారు. అనధికారికంగా విద్యుత్ తీగలతో వేసిన ఫినిషింగ్ను డిటెక్ట్ చేసే విధానాన్ని హార్డ్వేర్ రూపంలో రూపొందించారని, అలాగే రెన్యుబుల్ ఎనర్జీ ద్వారా పవర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనే అంశాలపై రూపొందించిన హార్డ్వేర్ ప్రాజెక్టుకు కేరళ ప్రభుత్వం రూ.75 వేలు నగదు అందించిందన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో మంగళవారం విజేతలను నిశాంత్ వర్మ, ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు, డైరెక్టర్ ఎం.జగపతిరాజు, ఎస్ఎస్ మోహన్రెడ్డి, బీఆర్కె వర్మ, పి.రవికిరణ్వర్మ, సీహెచ్ దిలీప్ చక్రవర్తి, ఎన్ గోపాలకృష్ణమూర్తి తదితరులు అభినందించారు. -
బాధితులకు భరోసాగా ప్రాజెక్ట్ రీస్టోర్
● రికవరీ చేసిన చోరీ సొత్తు బాధితులకు అప్పగింత ● ఏలూరు జిల్లాలో రూ.2.93 కోట్ల ఆస్తి అందజేత ఏలూరు టౌన్: ప్రజలకు సంబంధించిన నగదు, బంగారం, వెండి ఆభరణాలు, వస్తువులు, సెల్ఫోన్లు, మోటార్సైకిళ్లు చోరీలకు గురైతే పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తుంటారు. ఆయా కేసులను దర్యాప్తు చేసిన పోలీసులు నేరగాళ్ల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుంటారు. కానీ వాటిని తిరిగి బాధితులకు అందించేందుకు న్యాయస్థానంలో మరో ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. చివరిదశలోని ఆ అంతరానికి ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్ చెక్పెట్టారు. బాధితులు పోలీస్స్టేషన్లు, కోర్టులకు తిరగాల్సిన ఇబ్బందులను తగ్గిస్తూ ప్రాజెక్ట్ రీస్టోర్కు రూపకల్పన చేశారు. నేరస్తుల నుంచి రికవరీ చేసిన చోరీ సొత్తును మంగళవారం జిల్లాలోని పోలీసులు బాధితులకు అప్పగించారు. 729 మంది బాధితులకు అప్పగింత ఏలూరు జిల్లాలో ఏకంగా 729 మంది బాధితులకు రూ.2 కోట్ల 93 లక్షల 60 వేల విలువైన ఆస్తిని పోలీసులు బాధితులకు ఇళ్లకు వెళ్లి అప్పగించారు. వీటిలో 1,020 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.కోటి 32 లక్షల నగదు, 30 మోటారు సైకిళ్లు, 2 నాలుగు చక్రాల వాహనాలు, 647 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. వీటిని బాధితులకు అప్పగించడంతో వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. టి.నరసాపురం మండలంలోని మధ్యాహ్నపువారిగూడెం, బొర్రంపాలెం గ్రామాల్లో జరిగిన చోరీలకు సంబంధించి నిందితుల నుంచి రికవరీ చేసిన 2.5 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి, ఎల్ఈడీ టీవిలను రికవరీ చేసి బాధితులకు నేరుగా అప్పగించారు. నిడమర్రు మండలంలోని గుణపర్రులో 48 గ్రాముల బంగారు ఆభరణాలను బాధితుతులకు అందించారు. అలాగే 7 స్మార్ట్ఫోన్లు పోగొట్టుకున్న తోకలపల్లి, మందలపర్రు, బువ్వనపల్లి, పత్తేపురం గ్రామాల్లోని ఫిర్యాదుదారులకు అప్పగించారు. గణపవరం మండలంలోని ఎస్.కొందేపాడులో 11 కాసుల బంగారు ఆభరణాన్ని అప్పగించగా, ఆ మండలంలో వివిధ కేసుల్లో రికవరీ చేసిన 11 మోటార్సైకిళ్లు, 13 సెల్ఫోన్న్లను బాఽధితులకు వారి ఇళ్లవద్దనే పోలీసులు అందజేశారు. భీమడోలు మండలంలోని పూళ్ల, దుద్దేపూడి గ్రామాల్లోని బాధితులకు 17 కాసుల బంగారం, వెండి ఆభరణాలను అప్పగంచారు. ద్వారకాతిరుమలలో బాధితులకు 7 కాసుల బంగారు ఆభరణాలను, రూ. 2 లక్షల నగదును అప్పగించారు. అదేవిధంగా 28 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. పోలీసులపై విశ్వాసం పెంచడమే లక్ష్యంగా... ప్రజల్లో పోలీస్ వ్యవస్థ పట్ల విశ్వాసం, గౌరవాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రాజెక్ట్ రీస్టోర్ను చేపట్టినట్లు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. నేరస్తులు చోరీ చేసిన ఆస్తి బాధిత కుటుంబాల జీవనోపాధి, సంక్షేమంలో ఎంతో కీలకమైందిగా ఉంటుందన్నారు. బాధితులు పోలీస్స్టేషన్లకు, కోర్టులకు పదేపదే తిరుగుతూ మోసగాళ్ల బారిన పడకుండా, నష్టాన్ని భర్తీ చేస్తూ భరోసా కల్పించటం ప్రథమ లక్ష్యం అని చెప్పారు. బాధితులు మానవీయ కోణంలో పోలీసింగ్ను రుచిచూస్తే... పోలీస్, న్యాయవ్యవస్థపై ఉన్న భయాన్ని విడిచిపెట్టి ఆయా కేసుల్లో విచారణకు సహకరిస్తాన్నారు. నేరస్తులకు కఠిన శిక్షలు పడే శాతం మెరుగుపడుతుందన్నారు. -
రీసర్వేలో అవకతవకలపై రైతుల అసహనం
కాళ్ల: రీ సర్వేలో అవకతవకలపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భూముల్లో విస్తీర్ణం తగ్గడంపై ఉన్నత అధికారులను ఆశ్రయించడంతో వారి ఆదేశాల మేరకు వచ్చిన సర్వే సిబ్బందికి తమగోడును వెళ్లబుచ్చుకున్నారు. రీసర్వేలో తమ పొలాల విస్తీర్ణం తగ్గిందని, ఇది భూమి యాజమాన్య హక్కులను ప్రభావితం చేస్తోందని మండల కేంద్రమైన కాళ్ల గ్రామానికి చెందిన తోట కృష్ణారావుతో పాటు పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. వాస్తవంగా తమ భూమి క్షేత్రస్థాయిలో సక్రమంగానే ఉందని, తమ దగ్గర అన్ని రికార్డులు ఉన్నా, భూమిలో కొంతభాగం తగ్గించి చూపిస్తున్నారని, ఇది ముమ్మాటికీ అధికారుల తప్పిదమేనని ఆరోపించారు. గత 30 ఏళ్లుగా తగ్గని భూమి ఇప్పుడు ఎలా తగ్గిందని ప్రశ్నించారు. తాము ప్రైవేటు సర్వే చేయించుకుంటే తమ భూమి ఖచ్చితంగానే ఉందని, అప్పుడు లోపం ఎక్కడుందో తెలపాలన్నారు. ఏ సర్వే నెంబర్లో విస్తీర్ణం తగ్గితే ఆ సర్వే నెంబర్కు మాత్రమే ఇది వర్తింపజేయాలని మిగతా వారికి ఎలా వర్తింప చేస్తారని ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు ఉన్నత అధికారులకు తమ సమస్యలను విన్నవించుకున్నామని, వారి ఆదేశాల మేరకు విచారణకు వచ్చిన అధికారులు సైతం తూతుమంత్రంగా వచ్చి మమ్మల్ని మభ్యపెట్టేందుకు చూస్తున్నారే తప్ప సమస్య పరిష్కారానికి కృషి చేయడం లేదన్నారు. గతంలో ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నట్లుగా తమ భూమి తమకు ఉండే విధంగా చేయాలని, లేనిపక్షంలో న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. -
సైబర్ నేరంలో నిందితుడి అరెస్ట్
భీమవరం: డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధ దంపతులను వేధించి రూ.99 లక్షలు మోసం చేసిన కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు భీమవరం వన్టౌన్ సీఐ ఎం నాగరాజు చెప్పారు. మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్లో ఎస్సై కే మోహనవంశీతో కలసి వివరాలను వెల్లడించారు. మహరాష్ట్రకు చెందిన 19 ఏళ్ల యువకుడు ప్రీతమ్ ధర్మేంద్రమౌర్య ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన భీమవరంలోని గంధం అపార్ట్మెంట్కు చెందిన వృద్ధ దంపతులకు ఫోన్ చేసి మీ పిల్లలను తీవ్రమైన కేసుల్లో ఇరికిస్తామంటూ బెదిరించాడు. డిజిటల్ అరెస్ట్ పేరుతో సుమారు రూ.99 లక్షలు కాజేశాడు. దీనితో సెప్టెంబర్ 10వ తేదీన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు ప్రీతమ్ ధర్మేంద్రమౌర్యను ఈనెల 15వ తేదీన అరెస్ట్ చేసి విచారించగా అంతర్జాతీయ సైబర్ నేరాల్లో కీలకంగా పనిచేసినట్లు తేలిందని సీఐ నాగరాజు చెప్పారు. ఈ కేసులో వివిధ బ్యాంక్ ఖాతాల్లో సుమారు రూ.14.11 లక్షలు ఫ్రీజ్ చేశామన్నారు. కేసు ఛేదనలో డీఎస్పీ ఆర్జీ జయసూర్య నేతృత్వంలో భీమవరం, ఉండి ఎస్సైలు కె మోహనవంశీ, నసీరుల్లా, రహమాన్, సిబ్బంది పి శ్రీనివాసరావు, ఎం.రామకృష్ణ, యోహోషువ కీలకంగా వ్యవరించినట్లు నాగరాజు చెప్పారు. -
పీజీఆర్ఎస్లో 197 అర్జీల స్వీకరణ
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం కలెక్టరేట్లో సోమవారం జరిగిన జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు అర్జీలు పోటెత్తా యి. జిల్లా నలుమూలల నుంచి 197 మంది ఫి ర్యాదులు అందించారు. అర్జీలను నిశితంగా పరిశీ లించి గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అధికారులకు సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత, సమర్థతను పెంచడమే లక్ష్యమన్నారు. కింది స్థాయి అధికారులు పనితీరుపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. కలెక్టర్తో కలిసి జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, జిల్లా సర్వే అధికారి కె.జాషువా, కలెక్టరేట్ ఏఓ ఎన్.వెంకటేశ్వర్లు ఫిర్యాదులు స్వీకరించారు. క్లస్టర్ విధానాన్ని విరమించాలి స్కూల్ కాంప్లెక్స్లోని ఏ,బీ క్లస్టర్ విధానాన్ని విరమించాలని, 2106లో పీఏబీ ఆమోదించిన వేతనాలను చెల్లిస్తున్నా పెరిగిన ధరలకు అనుగుణంగా సీఆర్ఎంపీల అర్హతలకు ఆధారంగా వేతనాలు పెంచాలని ఏపీసీఆర్ఎం టీచర్స్ యునైటెడ్ ఫోరం జిల్లా కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. సోమ వారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి వారి సమస్యలపై కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్సీ గోపీమూర్తి మాట్లాడుతూ సీఆర్ఎంటీల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. యానిమేటర్ల అవినీతిపై గళం ఆకివీడు పంచాయతీ పరిధిలోని సంత మార్కెట్, సమతా నగర్ డ్వాక్రా యానిమేటర్లు సుమారు రూ.2 కోట్లు వరకు అవినీతి చేశారని వారిపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని ఐద్వా ఆధ్వర్యంలో భీమవరం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. సరైన చదువు లేని యానిమేటర్ చెప్పిన మాటలు నమ్మి మహిళలు మోసపోయారని, ఈ విషయం మెప్మా అధికారులకు తెలిసినా వారి నుంచి ఎటువంటి స్పందన లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా సంఘాల మహిళల నిరసన నినాదాలు చేస్తున్న ఏపీసీఆర్ఎం టీచర్లు -
విద్యుత్ ఆదా తప్పనిసరి
భీమవరం (ప్రకాశంచౌక్): విద్యుత్ పొదుపు లక్ష్యంగా కృషి చేయాలని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా విద్యుత్ ఆదా తప్పనిసరి అని కలెక్టర్ సీహెచ్ నా గరాణి అన్నారు. ఇందన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సోమవారం పట్టణంలోని ప్రకాశం చౌక్ వద్ద ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం మీదుగా తిరిగి ప్రకాశం చౌక్కు చేరుకుంది. ఇంధన పొదుపుపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ఈనెల 20 వరకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. సోలార్ రూఫ్ టాప్స్ ఏర్పాటుకు ముందుకు రావాలని ప్రజలను కోరారు. జిల్లా విద్యుత్ శాఖ అధికారి పి.ఉషారాణి, ఈఈ వెంకటేశ్వరరావు, డీఈలు మధుకుమార్, నరసింహమూర్తి, విద్యుత్ శాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అమరజీవికి ఘన నివాళి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యులు అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని కలెక్టర్ నాగరాణి అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లో అమరజీవి చిత్రపటం వద్ద ని వాళులర్పించారు. అలాగే కలెక్టరేట్ ప్రాంగణంలోని శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేశారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులపై నిర్లక్ష్యం తగదు
భీమవరం: ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ని ర్లక్ష్యం వద్దని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం బాధితుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. నిర్ణీత గడువులోపు బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. భీమవరం: జిల్లాలో సోమవారం నిర్వహించిన ఏపీ టెట్ పరీక్షలకు 96 శాతం అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. ఉదయం 95 మందికి 90 మంది, మధ్యాహ్నం 100 మందికి 97 మంది హాజరయ్యారన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని చెప్పారు. ఏలూరులో 66 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో జరుగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సోమవారం 66 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో మధ్యాహ్నం పరీక్షకు 66 మందికి 66 మంది హాజరయ్యారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. తాడేపల్లిగూడెం : డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈనెల 17, 18వ తేదీల్లో పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు తెలిపారు. వర్సిటీ అనుబంధ కళాశాలల్లో ప్రవేశం కోసం ఇంతకు ముందు నమోదు చేసుకున్న దరఖాస్తుదారులకు మాన్యువల్ కౌన్సెలింగ్ వెంకట్రామన్నగూడెంలో జరుగుతుందన్నారు. విద్యార్థులు తగిన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలన్నారు. కౌన్సెలింగ్లో సీటు పొందిన వారు ఏ కళాశాలలో సీటు వస్తే అక్కడకు వెళ్లి చేరాల్సి ఉంటుందని తెలిపారు. ఏలూరు (టూటౌన్): సీఆర్ఎంటీలను విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ సీఆర్ఎం ఉపాధ్యాయు లు సోమవారం కలెక్టరేట్ వద్ద ఆత్మ గౌరవ దీక్ష నిర్వహించారు. ఏపీసీఆర్ఎం టీచర్స్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో వక్తలు మాట్లాడుతూ కచ్చితమైన జాబ్చార్ట్ అమలు చేయాలని, తమకు ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న సీఆర్ఎం, ఎంటీఎస్ పోస్టులను భర్తీ చేయాలని, వేతనాలు పెంచాలని కోరారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో సీఆర్ఎంలు తరలివచ్చారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాటంలో భాగంగా మంగళవారం ఏలూరు జిల్లా సహకార అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు రాష్ట్ర స హకార సంఘాల ఉద్యోగుల సంఘం జిల్లా అ ధ్యక్షుడు కాళంగి వీరవెంకట సత్యనారాయణ ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న స హకార సంఘాల ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని వీర వెంకట సత్యనారాయణ కోరారు. ఏలూరు(మెట్రో): జిల్లాలో 22ఏ కేసుల పరిష్కారానికి ఈనెల 16న ఏలూరులో మెగా పరి ష్కార వేదికను నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లో ఉదయం 9 గంటల నుంచి రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. ఇన్చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. -
కదం తొక్కిన సంతకం
పేదలకు వైద్య విద్యను, ఆధునాతన వైద్యాన్ని చేరువ చేసేలా గత వైఎస్సార్సీపీ సర్కారు దేశంలో ఎక్కడా లేనివిధంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా వీటిని ప్రైవేటీకరించేందుకు పూనుకుంది. దీనిపై వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం మహోద్యమంలా సాగింది. ‘నిరసన సంతకం’ పోటెత్తింది. జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి ప్రజల సంపూర్ణ మద్దతు తెలిపారు. జిల్లావ్యాప్తంగా సేకరించిన సంతకాల ప్రతులను భారీ ర్యాలీగా తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలించారు. సాక్షి, భీమవరం/కాళ్ల : వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రం భీమవరంలో జనం కదం తొక్కారు. ప్రజా ఆకాంక్షను నెరవేర్చా లని, ప్రభుత్వమే నడపాలన్న నినాదాలతో హో రెత్తించారు. ప్రజలు సంతకాలు చేసిన ప్రతులతో భారీ ర్యాలీ చేశారు. జిల్లావ్యాప్తంగా వేలాదిగా వ చ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు, యువతతో పెద అమిరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నుంచి జువ్వలపాలెం రోడ్డు, ప్రకాశ్నగర్ వరకు కిలోమీటర్లు పొడవునా రోడ్డు మోటారు సైకిళ్లు, కార్లతో నిండిపోయింది. 4.50 లక్షల సంతకాల సేకరణ తొలుత పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి వెంకటనాగేశ్వరరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, భీమవరం, పాలకొల్లు, ఉండి సమన్వయకర్తలు చిన మిల్లి వెంకటరాయుడు, గుడాల శ్రీహరిగోపాలరా వు, పీవీఎల్ నరసింహరాజు, పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు జిల్లాలో అనూహ్య స్పందన వచ్చిందని ప్రసాదరాజు తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా 4.50 లక్షల మంది సంతకాలను సేకరించామన్నారు. అత్యధికంగా తణుకులో 80 వేలకు పైగా సంతకాలు సేకరించగా ఆచంటలో 72లకు పైగా, మిగిలిన నియోజకవర్గాల్లో 55 వేలకు పైగా సంతకాలు సేకరించామన్నారు. వాటిన్నంటినీ ప్రత్యేక వాహనంలో భద్రపరిచి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన సంతకాలను ఈనెల 18న పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి గవర్నర్కు అందజేస్తారన్నారు. లక్ష్యానికి మించి జిల్లాలో సంతకాల సేకరణ ప్రజాఉద్యమాన్ని విజయవంతం చేయడంపై నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ కేడర్, ప్రజలకు ప్రసాద రాజు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో లక్షలాది మంది.. వైద్య కళాశాలలను ప్రైవేటీరణ చేయాలన్న చంద్రబాబు సర్కారు నిర్ణయాన్ని నిరసిస్తూ పేదల పక్షాన వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం చివరి దశకు చేరింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునందుకుని జిల్లాలో లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా సంతకాల సేకరణలో పాల్గొన్నారు. ఈనెల 10న నియోజకవర్గాల్లో ర్యాలీలు అనంతరం సంతకాల ప్రతులను పెదఅమిరంలోని జిల్లా కార్యాలయానికి తరలించారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమం సోమవారం ఉత్సాహంగా సాగింది. ఈ ఉద్యమం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. గర్జించిన జన‘కోటి’ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మండిపాటు వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు, యువత సంతకాల ప్రతులతో భీమవరంలో భారీ ర్యాలీ జిల్లాలో 4.50 లక్షల సంతకాలుసేకరించామన్న జిల్లా అధ్యక్షుడు ముదునూరి పసాదరాజు సంతకాల పత్రాలు కేంద్ర కార్యాలయానికి తరలింపు -
గళమెత్తిన భవన నిర్మాణ కార్మికులు
ఏలూరు (టూటౌన్): భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద సోమవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఫైర్స్టేషన్ సెంటర్ నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. ధర్నానుద్దేశించి ఇఫ్టూ అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ రమణ మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు గద్దెనెక్కి 17 నెలలు గడుస్తున్నా ఎన్నికల హామీలను అమలు చేయలేదన్నారు. సంక్షేమ బోర్డును పునర్నిర్మాణం చేయాలని, 25 లక్షల మంది కార్మికులకు ప్రయోజనాలు చేకూర్చాలని డిమాండ్ చేశారు. తన సొంత డబ్బులు రూ.కోటి (బీఓసీ) బోర్డుకు విరాళంగా ఇస్తానని ఎన్నికల సభలో ప్రకటించిన డిప్యూ టీ సీఎం ఇప్పటివరకు బోర్డుకు జమ చేయలేదన్నారు. ఇఫ్టూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్,రామ్మోహన్, నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బి. సోమయ్య, యర్రా శ్రీనివాసరావు, ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్ష, కార్యదర్శులు కాకర్ల శ్రీనివాస్, నవడు నెహ్రూ బాబు తదితరులు పాల్గొన్నారు. -
బాల కార్మికుల గుర్తింపునకు ప్రత్యేక డ్రైవ్
ఏలూరు (టూటౌన్): బాల కార్మికుల గుర్తింపునకు మంగళవారం నుంచి 22 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలిపారు. స్థానిక న్యాయసేవా సదన్ భవన్లో ప్రత్యేక డ్రైవ్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు ప్రత్యేక తనిఖీలు చేపడతారన్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీనివాసరావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ పుచ్చల వెంకటేశ్వరరావు మా ట్లాడుతూ పశ్చిమబెంగాల్, ఒడిసా, చత్తీస్గఢ్ నుంచి బాల కార్మికులను గుర్తించి వారికి విద్యపై అవగాహన కల్పించాలన్నారు. క్రాప్ జిల్లా కో–ఆర్డినేటర్ ఆర్.వినోద్కుమార్ మాట్లాడుతూ జిల్లాని బా ల కార్మికరహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ జి.నాగేశ్వరరావు, లేబర్ ఆఫీసర్ జీవీ రమణ, జె.గోపాలృష్ణ, ఏఎల్ఎస్ కో–ఆర్డినేటర్ ఎస్.నాగేశ్వరరావు చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ వై.వెంకట్ రాజు, జి.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. -
జాతీయ పోటీలకు పెదవేగి విద్యార్థులు
పెదవేగి: రాష్ట్ర స్థాయి అండర్–17 సాఫ్ట్బాల్ పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రథమ స్థానం సాధించింది. దీనిలో పెదవేగి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు తొమ్మిది మంది పాల్గొన్నారు. దుర్గారావు, సంపత్లు జాతీయ స్థాయి పోటీలకు, రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికయ్యారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ ఎం.రమేష్బాబు, వైస్ ప్రిన్సిపాల్ నిర్మలకుమారి, జేసీ వై.శ్రీనివాసరావు, పీడీ కె.జయరాజు అభినందించారు. కొయ్యలగూడెం: అతి వేగం, నిర్లక్ష్యం రెండు ప్రాణాలను బలిగొంది. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం – జంగారెడ్డిగూడెం జాతీయ రహదారిపై కొత్తూరు క్రాస్ రోడ్డు (పులి వాగు శివాలయం) వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గాడాల గ్రామానికి చెందిన ప్రత్తి జయరాజు (50), అతని భార్య సత్య (42) బైక్పై జంగారెడ్డిగూడెంలోని తమ కుమార్తె బిడ్డ బారసాలకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రక్ ఆటో ఢీకొట్టింది. భార్యాభర్తలు ఇద్దరికీ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ట్రక్ డ్రైవర్ మితిమీరిన వేగంతో పాటు నిర్లక్ష్యంగా ఆటోను నడపడం వల్ల ప్రమాదం సంభవించిందని చెబుతున్నారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
ఇండోర్ కళకళలు ఏనాటికో?
ఏలూరు ఇండోర్ స్టేడియం పేరు చెబితే బాలబాలికలు, సీనియర్ క్రీడాకారుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. రెండేళ్ల క్రితం వరకు పిల్లలు, పెద్దల ఆటలతో ఇండోర్ కళకళలాడేది. పదుల సంఖ్యలో బాలబాలికలు బ్యాడ్మింటన్, జూడో ఇతర క్రీడల్లో సాధన చేసేవారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలతో స్డేడియం సందడిగా ఉండేది. ఇక్కడ నిర్వహించిన జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో జిల్లా పిల్లలు రాణించారు. మెడల్స్, షీల్డ్స్, పతకాలతో పాటు పేరు, ప్రఖ్యాతలు తీసుకువచ్చారు. ఇదంతా గతం. సుమారు 70 ఏళ్ల క్రితం నిర్మించిన ఇండోర్ గత ఏడాది వర్షాలకు తడిచి రాత్రివేళ పైకప్పు కూలిపోయింది. అప్పటి నుంచి ఇందులో పోటీల నిర్వహణ, సాధన నిలియిపోయాయి. అధికారులు స్టేడియం శిథిలాలు తొలగించి మిన్నుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తి కావస్తున్నా నేటికీ స్టేడియం నిర్మాణం చేపట్టకపోవడంపై క్రీడాభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు. ఇప్పటికై నా ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. – ఏలూరు రూరల్ మా సీనియర్స్ ఇండోర్లో ఆడుకుని మంచి ప్లేయిర్స్ అయ్యారు. మా ఇంటి దగ్గరి స్టేడియంకు వెళ్లి ఆడుకోమంటున్నారు. ఆదివారం, సెలవు రోజుల్లో ఆరుబయటే ఆడుకుంటున్నాను. బయట షటిల్ కాక్ గాలికి అటు, ఇటు పోతోంది. ఇండోర్లో చక్కగా ఆడుకోవచ్చు. – పగ్నేష్ఇండోర్ స్టేడియం పునర్నిర్మించకపోవడం విచారకరం. ప్రభుత్వం ఆటలకు ప్రాధాన్యత ఇస్తాం అంటుంది కాని, పనులు కనిపించడం లేదు. నేనే ప్రతిరోజూ వాకింగ్ చేసేన తర్వాత ఇందులో ఉన్న జిమ్లో కొద్దిసేపు సాధన చేసేవాడిని. జిమ్ కూడా మూసివేశారు. ఇక గత్యంతరం లేక ఇతర ప్రాంతాల్లో వాకింగ్ చేస్తున్నాను. – సుభాని, వాకర్ -
ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేయాలి
ఏలూరు (టూటౌన్): కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని మరింత పటిష్ట పరచాలని, చట్టాన్ని చట్టంగానే కొనసాగించాలని, పథకంగా మార్పు చేయరాదని, సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం చట్టాన్ని ఇప్పుడు పూజ్య బాపుజీ గ్రామీణ రోజ్ గారి యోజన పథకంగా పేరు మార్చి పేదలు, వ్యవసాయ కార్మికుల పొట్ట కొట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కేవలం పేరు మాత్రమే మారుస్తున్నారని అనుకుంటే పొరపాటేనని, చట్టంగా ఉన్న దానిని కేవలం పథకంగా మార్పు చేయడం వల్ల భవిష్యత్తులో ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నీరు గారే ప్రమాదం ఉందన్నారు. ఈ చట్టానికి కేంద్ర ప్రభుత్వం రూ.2,50,000 కోట్ల కేటాయింపులు చేయాల్సి ఉండగా కేవలం రూ.60,000 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంటుందని విమర్శించారు. సంవత్సరానికి 100 రోజులు పనులు చూపించాల్సి ఉండగా ఏలూరు జిల్లాలో కేవలం 38 నుంచి 50 రోజుల మధ్య మాత్రమే పనులు చూపించారని తెలిపారు. భవిష్యత్తులో ఉపాధి హామీలో కూడా కొలతలను గంటల పద్ధతితో ముడివేసి పని భారాన్ని పెంచే ప్రమాదం ఉందన్నారు. కామవరపుకోట: మండలంలోని గుంటుపల్లి పంచాయతీకి చెందిన ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగం నేత కొమ్మిన నరేష్(46) సోమవారం ఉదయం చెరువులో పడి మృతి చెందారు. గుంటుపల్లి పక్కనే ఉన్న చెరువులో చేపలకు మేత వేసేందుకు వెళ్లిన నరేష్ ప్రమాదవశాత్తు తెప్ప తిరగబడడంతో మృతిచెందారు. అందరితోనూ కలివిడిగా ఉండే నరేష్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. పంచాయతీలో కీలక నాయకుడిగా ఉండడంతో పాటు జిల్లా స్థాయిలో పార్టీ పరంగా యాక్టివ్గా ఉంటున్నాడు. పోస్టుమార్టం అనంతరం నరేష్ మృతదేహాన్ని కొల్లివారిగూడెంలోని స్వగృహానికి తరలించారు. నరేష్ మృతదేహానికి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కీసరి సరితా విజయ్ భాస్కర్రెడ్డి, దెందులూరు మండల అధ్యక్షుడు, శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నానితో పాటు పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు నివాళులు అర్పించారు. జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విజయవాడ నుంచి జంగారెడ్డిగూడెం మీదుగా వేలేరుపాడు మృతదేహంతో వెళ్తున్న కేఆర్పురం ఐటీడీఏ అంబులెన్స్ ఎదురుగా మోటార్సైకిల్పై వస్తున్న చింతలపాటి శంకర్ వాహనాన్ని ఢీకొంది. దీంతో శంకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే జంగారెడ్డిగూడెం ఎస్సై ఎన్వీ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ట్రాఫిక్ను అదుపు చేశారు. మృతిచెందిన శంకర్కు భార్య కరుణకుమారి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాభర్తలు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. తాడువాయి నుంచి జంగారెడ్డిగూడెం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. కామవరపుకోట: జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెందిన విద్యార్థిని ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు గవర్రాజు తెలిపారు. పాఠశాలకు చెందిన విద్యార్థిని బోల్లిబోయిన శ్రావణి ఇటీవల వీరవాసరంలో జరిగిన అండర్–17 విభాగం సాఫ్ట్బాల్ పోటీలో విశేష ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. శ్రావణిని, శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయురాలు, శ్యామలాదేవిని పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు అభినందించారు. -
గంట సేపు నిలిచిన ప్యాసింజర్
ఆకివీడు: నర్సాపురం నుంచి చైన్నె వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కోసం ఆకివీడు రైల్వేస్టేషన్లో ప్యాసింజర్ రైలును సుమారు గంటసేపు ఆపారు. భీమవరం నుంచి విజయవాడ వెళ్లే పాసింజర్ రైలు ఇటీవల సకాలంలో గమ్యానికి చేరుతుంది. అయితే సోమవారం వందేభారత్ రైలు కోసం ప్యాసింజర్ రైలును గంటపైగా ఆపడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసం సమీపంలో యనమదుర్రు డ్రైన్ నుంచి పంట పొలాలకు నీరు తోడే తూములో భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇన్చార్జ్ డీఎఫ్ఓ ప్రభాకర్ ఆదేశాలతో అటవీ శాఖ అధికారులు స్నేక్ క్యాచర్స్ కలిసి రెండు గంటల శ్రమించి 12 అడుగుల భారీ కొండ చిలువను పట్టుకున్నారు. భీమవరం రేంజ్ అటవీ శాఖ అధికారి ఎం.కరుణాకర్ మాట్లాడుతూ కొండచిలువ 12 అడుగుల పొడవు 80 కిలోల బరువు ఉందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్కు కొండచిలువను తరలించినట్లు ఆయన తెలిపారు. -
ప్రియుడి ఇంటి ముందు నిరసన
ఉండి: పెళ్ళి చేసుకుంటానని నమ్మించి అనంతరం ముఖం చాటేయడంతో యువతి కుటుంబంతో కలిసి ప్రియుడి ఇంటిముందు న్యాయం చేయాలంటూ సోమవారం నిరసన తెలిపారు. ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలోని రామచంద్రాపురం ప్రాంతాని చెందిన యువతి అదే ప్రాంతానికి చెందిన కరణం భానుప్రకాష్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఎనిమిది నెలల క్రితం యువతికి చేబ్రోలు గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమై కట్నకానుకలు ఇచ్చి పుచ్చుకున్నారు. అయితే తాను వివాహం చేసుకుంటానని చెప్పి యువకుడు ఆ పెళ్ళి చెడగొట్టాడు. దీంతో విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల వారు పెద్దల సమక్షంలో యువతీ, యువకుడికి దండలు మార్చి సంబంధం ఖాయం చేసుకున్నారు. యువకుడికి అన్నయ్య ఉండటంతో అతనికి వివాహమైన అనంతరం చిన్నవాడైనన భానుప్రకాష్కు వివాహం చేస్తానని యువకుడి తండ్రి చెప్పడంతో పెద్దలు ఆరునెలల గడువిచ్చారు. ఈ ఆరు నెలల్లో పెద్దకుమారుడికి వివాహం చేయకపోగా అతనిని గల్ఫ్ దేశం పంపించేసారు. పరిస్థితిని గమనించిన యువతి గత కొంతకాలంగా యువకుడిని నిలదీస్తుంది. యువకుడు ముఖం చాటేయడంతో చేయిదాటిపోతుందని ఆమె కుటుంబ సభ్యులు సోమవారం యువకుడి ఇంటికి వెళ్ళి మాట్లాడటంతో వారంతా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో ప్రియుడి ఇంటిముందే యువతి కుటుంబంతో సహా నిరసనకు దిగింది. పెద్దల సమక్షంలో దండలు మార్చి వివాహం ఖాయం చేసారని తనకు న్యాయం చేయాలంటూ యువతి కన్నీటి పర్యంతమైంది. -
జిల్లా చరిత్రకు సజీవ సాక్ష్యం
● నేడు ఏలూరులో పురావస్తు మ్యూజియం ప్రారంభం ● పురావస్తు సంపద అంతా ఒకే చోట ● రూ.5 కోట్లతో నిర్మాణం ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు నగరంతో పాటు జిల్లాకూ గొప్ప చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వమే మన జిల్లాలో ఆదిమానవుడు నడయాడినట్టు చరిత్ర చెబుతోంది. దానిని పురావస్తు శాఖ నిరూపించింది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఆదిమానవుడి ఆనవాళ్లకు స్పష్టమైన ఆధారాలు దొరికాయి. ఆదిమానవుడు వినియోగించిన అనేక ఉపకరణాలను శోధించి సాధించింది. అవి ఇప్పుడు మన కళ్ళముందే ప్రత్యక్షమయ్యాయి. అక్కడి నుంచి రాచరికపు వైభవాన్ని చవిచూసిన ఈ ప్రాంతానికి చెందిన గురుతులను కూడా వెతికిపట్టుకుంది. వాటినీ మన కళ్ళముందుకు తీసుకువచ్చింది. నగరంలో ఏర్పాటు చేసిన పురావస్తు ప్రదర్శన శాలలో ఇవన్నీ సాక్షాత్కరిస్తున్నాయి. పోలవరం సమీపంలోని రుద్రమకోట ప్రాంతంలో 10 లక్షల సంవ్సరాల నాటి ఆదిమానవుడి సమాధుల్లో లభ్యమైన పనిముట్ల నుంచి పురాతన పూసలు, రాజులు వాడిన కత్తులు, డాళ్ళు, శిరస్త్రాణాల వరకూ ఈ మ్యూజియంలో ఆకర్షిస్తున్నాయి. పురాతన కాలం నాటి రాతి చెక్కడాలు, దేవతా మూర్తుల ప్రతిమలు, వేల ఏళ్ళనాటి బంగారు, వెండి నాణేలు, టెర్రకోట పాత్రలు, పింగాణి పాత్రలు, ఇలా పాత రాతి యుగం నుంచి నవీన శిలా యుగం వరకూ మన చారిత్రక ఆనవాళ్ళు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. దీనితో పాటు మన ప్రాంత సాహిత్య సంపదగా చెప్పుకోవడానికి తామ్ర పత్రాలు, తాళపత్ర గ్రంథాలు, లోహాలతో చేసిన వంట పాత్రలు, కాంస్యంతో చేసిన దేవతామూర్తుల ప్రతిమలు ఇలా అనేక పురాతన వస్తువులు కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రదర్శన శాల మనను విష్ణుకుండినులు, ఇక్ష్వాకులు, వేంగి చాళుక్యులు, రెడ్డి రాజులు, నిజాం పాలకుల కాలానికి తీసుకు వెళ్తుందనడంలో సందేహం లేదు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ ప్రదర్శన శాలలో బంగారు అక్షరాలతో లిఖించిన ఖురాన్ గ్రంథం ఆకర్షిస్తోంది. రూ.5 కోట్లతో నిర్మాణం ఈ మ్యూజియం ఏర్పాటుకు అప్పటి ఎమ్మెల్యే బడేటి బుజ్జి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ స్థానిక అగ్రహారంలోని నగరపాలక సంస్థకు చెందిన సుమారు 1500 గజాల స్థలాన్ని కేటాయించగా అప్పటి చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు, ఆర్కియాలజీ శాఖ కమిషనర్ జీ. వాణీమోహన్ సహకారంతో రూ.5 కోట్ల నిధులతో నిర్మించారు. కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కాక మొదటి అంతస్తులో సైతం పలు వస్తువులను ఏర్పాటు చేశారు. రాజమండ్రి, కాకినాడల్లోని మ్యూజియంలలో ఉన్న కొన్ని వస్తువులను జిల్లా ప్రజల కోసం ఇక్కడికి తరలించారు. నేడు అధికారికంగా ప్రారంభం ఏడాది క్రితమే నిర్మాణం పూర్తి చేసుకున్నా వివిధ సాంకేతిక కారణాలతో అప్పటి నుంచి ఈ పురావస్తు ప్రదర్శన శాల ప్రారంభానికి నోచుకోలేదు. ప్రజలు, విద్యార్థుల అవగాహన కోసం ఏడాది నుంచే సందర్శకులను ఈ ప్రదర్శన శాలకు అనుమతిస్తున్నారు. ఎట్టకేలకు సాంకేతిక ఇబ్బందులన్నింటినీ తొలగించుకుని ఈ మ్యూజియం అధికారికంగా ప్రారంభోత్సవానికి సిద్ధమయింది. ఈ నెల 16 రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మ్యూజియంను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఏలూరు జిల్లా చరిత్రను, ప్రాచీనత్వాన్ని ప్రజలకు వివరించే ఏకై క సాధనమైన మ్యూజియంను ఏలూరులో ఏర్పాటు చేయడానికి పలువురు సామాజికవేత్తలు ఎన్నో ఏళ్ళుగా విశేష కృషి చేశాం. పురావస్తు శాఖాధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపి, మ్యూజియం నిర్మాణానికి నిధులు విడుదల చేయించడంతో పాటు, వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏలూరుకు చెందిన పురాతన వస్తువులను ఇక్కడకు రప్పించడంలో అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారం మరువలేనిది. ఇప్పుడు ఈ ప్రాంతానికి చేరువగానే మ్యూజియం అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. బీకేఎస్ఆర్ అయ్యంగార్, సామాజిక వేత్త ఏలూరులో మంగళవారం ప్రారంభించనున్న మ్యూజియం నగర ప్రజలకు పండుగగా, విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచే ఆలయంగా నిలువనుంది. ఈ మ్యూజియంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం. మ్యూజియంలో ఏర్పాటు చేసిన కొన్ని చిత్రపటాలను క్యూఆర్కోడ్ ద్వారా స్కాన్ చేస్తే ఆ పటానికి సంబంధించిన చరిత్ర మన అరచేతిలోకి వస్తోంది. ఈ మ్యూజియంతో ఏలూరు కూడా పర్యాటక ప్రాంతంగా అబివృద్ధి చెందుతుంది. కే.తిమ్మరాజు, పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ -
నత్తాలోవ డ్రైన్ వెంటనే తవ్వాలి
నరసాపురం రూరల్: నరసాపురం మండలంలోని సరిపల్లి, లిఖితపూడి, రుస్తుంబాద గ్రామాల్లోని పంటపొలాల్లో నీరులాగే ప్రధాన కాలువ నత్తాలోవ డ్రైన్ వెంటనే తవ్వాలని సోమవారం రైతులు, కౌలు రైతులు సరిపల్లి వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ నత్తాలోవ డ్రైన్ ఏళ్లుగా తవ్వడం లేదన్నారు. ఈ డ్రెయిన్పై మూడు గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల్లో పంట సాగవుతుందని ఏళ్ళ తరబడి కాలువ తవ్వకపోవడంతో ప్రతి సార్వా పంటకు పంట వేయకుండా నిరుపయోగంగా వదిలేసి తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వరద సమయంలో పోటు నీరు పొలాల్లోకి వెళ్లి తిరిగి బయటకు లాగక పోవడంతో ప్రస్తుతం కనీసం దాళ్వా సాగు చేపట్టే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారన్నారు. ప్రభుత్వం, నీటిసంఘాల కమిటీలు పట్టించుకోకపోవడంతో ఇప్పటికే పంటలు కోల్పోయి కష్టాల్లో ఉన్న రైతులు సొంతంగా చందాలు వేసుకుని కాలువ తవ్వుకునే దుస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వం, నీటి సంఘాలున్నా నిధులు కేటాయించి తవ్వకపోవడం దారుణమన్నారు. సమస్యపై డ్రైనేజీ డీఈ మోహన్ కృష్ణ, నీటి సంఘం డైరెక్టర్ అందే రామకృష్ణతో మాట్లాడగా వెంటనే వర్క్ అంచనా వేసి తీర్మానం చేసి త్వరలోనే కాలువను తవ్వుతామని హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో రైతులు మండా రమేష్, గన్నాబత్తుల ఏడుకొండలు, గన్నాబత్తుల నాగేశ్వరరావు, గమిడి మధుబాబు, కొక్కిరిమెట్టి వెంకటేష్, రాంబాబు, యర్రంశెట్టి సత్యనారాయణ, కేదాసు వీరన్న తదితరులు పాల్గొన్నారు. -
కోటి సంతకాల ఉద్యమానికి తరలిరావాలి
గణపవరం: మెడికల్ కాలేజిల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల పత్రాలను తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలంతా తరలిరావాలని పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పిలుపునిచ్చారు. ఈ నెల 15 సోమవారం ఉదయం 9.30 గంటలకు ఏలూరులో పెద్ద రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోవాలని, అక్కడి నుంచి జిల్లా వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల పత్రాల బండిల్స్ ర్యాలీగా గన్బజార్, ఫ్లై ఓవర్ వంతెన మీదుగా తాడేపల్లికి తరలిస్తారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అఽధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, జిల్లా పరిశీలకుడు ఎమ్మెల్సీ వంకా రవీంద్ర, అన్ని నియోజకవర్గాల కన్వీనర్లు, పార్టీ ప్రముఖులు పాల్గొంటారని ఉంగుటూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి పార్టీ శ్రేణులంతా ఏలూరు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. కై కలూరు: అమ్మా.. కొల్లేటికోట పెద్దింట్లమ్మ నీ చల్లని దీవెనలు అందించమ్మా అంటూ భక్తులు ఆర్తీతో వేడుకున్నారు. అమ్మవారిని సమీప జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు ఆదివారం సందర్శించారు. ఆలయ ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రూ.52,355 ఆదాయం వచ్చిందని ఈవో చెప్పారు. జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం హనుమద్ హోమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా హోమ కార్యక్రమాన్ని జరిపించినట్లు ఆలయ ఈవో ఆర్వీ చందన తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. -
ముగిసిన స్కూలుగేమ్ పోటీలు
వీరవాసరం: వీరవాసరం ఎమ్మార్కే జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా ఆవరణలో ఈ నెల 12 నుంచి 14 వరకు జరిగిన 69వ రాష్ట్ర స్థాయి స్కూలు గేమ్స్ సాఫ్ట్బాల్ అండర్–17 బాలబాలికల పోటీలు దిగ్విజయంగా ముగిశాయి. ఈ సందర్భంగా ముగింపు పురస్కరించుకొని గేమ్ కార్యదర్శులు మల్లేశ్వరరావు, దాసరి సునీత మాట్లాడుతూ అండర్ 17 బాలికల పోటీలో విజయనగరం జిల్లా ప్రథమ, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించినట్లు తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు గుద్దటి స్వామీజి, పరిశీలకుడు బండారు ప్రసాద్, కార్యదర్శి కె.జయరాజు, ఎంవీ కుద్దూస్, హెచ్ఎం జుత్తిగ శ్రీనివాస్, టోర్నమెంట్ ఆర్గనైజర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 13న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 10,798 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 34 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. 10798 పెండింగ్ కేసులు, 238 ప్రీ లిటిగేషన్ కేసులు రాజీ చేశామని, పెండింగ్ కేసులలో 10,351 క్రిమినల్ కేసులు, 153 మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, 294 సివిల్ కేసులను రాజీ చేశామన్నారు. ఏలూరులో 1,988, భీమవరంలో 974, చింతలపూడిలో 1,248 జంగారెడ్డిగూడెంలో 971, కొవ్వూరులో 1,092, నర్సాపురంలో 434, పాలకొల్లులో 458, తాడేపల్లిగూడెంలో 1,433, తణుకులో 1,082, నిడదవోలులో 919, భీమడోలు 153 పెండింగ్ కేసులను పరిష్కరించామని తెలిపారు. కేసుల పరిష్కారానికి తోడ్పడిన న్యాయవాదులకు, పోలీస్ అధికారులకు, రెవెన్యూ సిబ్బందికి, బీమా, బ్యాంకు అధికారులు, ఇతర విభాగాల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కొయ్యలగూడెం: అచ్యుతాపురం గ్రామ సరిహద్దులలో నిర్వహిస్తున్న డీజిల్ అక్రమ విక్రయాలలో ఓ రెవెన్యూ అధికారి పాత్ర ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. డిసెంబర్ మూడున సాక్షిలో ప్రచురితమైన డీజిల్ అక్రమ విక్రయాలపై అధికారులు దృష్టి పెట్టి విచారణ చేశారు. గోపాలపురం మండలంలోని రెవెన్యూ అధికారి ఒకరు విచారణకు వెళ్లిన అధికారులను పక్కదోవ పట్టిస్తున్నట్లు తెలిసింది. ఏలూరు జిల్లాకు చెందిన అధికారులు వెళ్లినప్పుడు పరిధి తూర్పుగోదావరి జిల్లాలోకి వస్తుందని, తూర్పుగోదావరి అధికారులు వెళ్ళినప్పుడు పరిధి మనది కాదు ఏలూరు జిల్లా పరిధిలోనిదని తప్పుదోవ పట్టిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి కారణాలతోనే సుమారు రెండు సంవత్సరాల నుంచి అక్రమ డీజిల్ విక్రయదారులపై ఏ విధమైన కేసులు నమోదు కాలేదని తెలుస్తోంది. భీమవరం: ఏపీ రిటైర్డ్ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీఆర్ఎంఈయూ) నూతన కార్యవర్గం భీమవరంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. రాష్ట్ర అసోసియేషన్ నూతన కమిటీ అధ్యక్షుడిగా రేవూరి గోగురాజు(భీమవరం), ప్రధాన కార్యదర్శిగా డీవీఎస్ఎన్ మూర్తిమురళి(కాకినాడ), ఉపాధ్యక్షులుగా సీహెచ్ హరిబాబు(గుంటూరు), ఎంవీ నారాయణరెడ్డి(రాజమండ్రి), డి.మునుస్వామి(అనంతపురం), పీవీటీ రమణరావు(విశాఖపట్నం), కోశాధికారిగా జి.వేణుగోపాలస్వామి(తుని), ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె.సత్యనారాయణ (కాకినాడ), జె.శ్యామ్రాజ్(అనంతపురం), రీజినల్ సెక్రటరీలుగా ఎంవీ రామారావు(రాజమండ్రి), బి.వెంకటరామయ్య ఎన్నికయ్యారు. ద్వారకాతిరుమల: స్థానిక విర్డ్ ఆస్పత్రిలో ఈనెల 11 నుంచి 14 వరకు అమెరికా, ఇండియాకు చెందిన వైద్యుల బృందం నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరంలో 56 మంది రోగులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్టు ఆస్పత్రి ట్రస్ట్ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు ఆదివారం తెలిపారు. అందులో భుజం, మోచేయి, తుంటి సమస్యలతో బాదపడుతున్న 20 మంది రోగులకు ఉచితంగా, అత్యాధునిక పద్ధతిలో విజయవంతంగా శస్త్ర చికిత్సలు చేసినట్టు చెప్పారు. ఇవి తమ వైద్య సాఫల్యానికి ఉదాహరణగా నిలుస్తాయన్నారు. ఈ సందర్భంగా వైద్యుల బృందాన్ని చైర్మన్ అభినందించారు. ఈ శిబిరంలో వైద్యులు శ్రీనాధ్ కామినేని (యూఎస్ఎ), భవ్య చాంద్, కృష్ణ కిరణ్, శ్రీనివాస్ కంభంపాటి (ఇండియా), విర్డ్ ఆస్పత్రి ట్రస్ట్ సభ్యులు వి.నారాయణ మూర్తి, ఎస్వీఎన్ఎన్ నివృతరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి, వైద్యులు హమీద్, బాలాజీ, పీవీ నాగేంద్ర బాబు, సింధు, రమ్య, మహిత తదితరులు పాల్గొన్నారు. -
భయం పోయేలా.. భవితకు బాట వేసేలా
● ఆంగ్ల భాషపై పట్టుకు స్పెల్బీ దోహదం ● ‘సాక్షి’ ఆధ్వర్యంలో స్పెల్బీ సెమీఫైనల్స్ ● ఉత్సాహంగా పాల్గొన్న 490 మంది విద్యార్థులు రాజమహేంద్రవరం రూరల్: ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్బీ సెమీ ఫైనల్స్ పరీక్షలు ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. రాజమహేంద్రవరంలోని ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన ఈ పరీక్షకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి 490 మంది విద్యార్థులు నాలుగు కేటగిరీల్లో పరీక్షలు రాశారు. తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ‘సాక్షి’ స్పెల్బీ పరీక్షలు ఎంతగానో దోహదపడతామని తల్లిదండ్రులు పేర్కొన్నారు. స్పెల్బీ ద్వారా ఆంగ్ల భాషపై మంచి పట్టు సాధించడానికి అవకాశం ఏర్పడిందని ఆనందం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జరిగింది. కేటగిరీలుగా విభజించి.. కేటగిరీ–1లో 1, 2 తరగతులకు చెందిన విద్యార్థులు, కేటగిరీ–2లో 3, 4 తరగతులు, కేటగిరీ–3లో 5, 6, 7 తరగతులు, కేటగిరీ–4లో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా పరీక్షల్లో పాల్గొనడం ద్వారా నూతనోత్తేజం తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. స్పెల్బీ నిర్వహించిన ‘సాక్షి’ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరీక్షలను ‘సాక్షి’ రీజినల్ మేనేజర్ (అడ్మిన్) ఎస్.రమేష్రెడ్డి, ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కోఆర్డినేటర్ వి.రాజేష్, ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ లీజా పర్యవేక్షించారు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్పెల్బీకి డ్యూక్స్ వేఫీస్ మెయిన్ స్పాన్సరర్గా, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (రాజమహేంద్రవరం) అసోసియేట్ స్పాన్సరర్గా వ్యవహరిస్తున్నాయి. ఆదిత్య ఇంటర్నేషనల్ స్కూల్ సహకారం అందించింది.స్పెల్బీ పరీక్ష ద్వారా ఇంగ్లిష్పై అవగాహన పెరిగింది. గతంలో ఈ భాష అంటే భయంగా ఉండేది. చదవాలన్నా, రాయాలన్నా అయిష్టంగా ఉండేది. స్పెల్బీ ద్వారా ఇంగ్లిష్ పదాలను స్పెల్లింగ్తో సహా నేర్చుకున్నాను. ప్రస్తుతం ఏ సబ్జెక్టయినా సునాయసంగా చదవగలుగుతున్నా. –ఎన్ఎస్ఎస్ ఆరాధ్య, 8వ తరగతి, దిప్యూచర్ కిడ్స్ స్కూల్, రాజమహేంద్రవరం విద్యార్ధుల భవిష్యత్తును నిర్దేశించడానికి ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష ఉపయోపడుతుంది. ఇంగ్లిష్ భాషంటే భయం దూరం చేస్తోంది. పోటీతత్వం అలవాటు పడుతుంది. ఇంగ్లిష్లో ఒకాబులరీ చాలా ముఖ్యం. దీనిపై అవగాహన పెరుగుతుంది. ‘సాక్షి’ యాజమాన్యం ఇలాంటి పరీక్షలు మరిన్ని నిర్వహించాలి. –డాక్టర్ టీవీ ప్రసాద్, విద్యార్థిని తండ్రి, రాజమహేంద్రవరం ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రాధాన్యం పెరిగింది. విద్యార్థుల్లో చిన్నతనం నుంచి ఆంగ్లంపై పట్టు సాధించేందుకు స్పెల్బీ పరీక్ష దోహదపడుతుంది. ‘సాక్షి’ స్పెల్బీ ద్వారా ఇంగ్లిష్లో ఒకాబులరీ, లాంగ్వేజ్ స్కిల్స్ పెంపొందుతాయి. విద్యార్థులు ఆంగ్ల భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. –డాక్టర్ దీప్తి చిగుళ్లపల్లి, విద్యార్థి తల్లి, రాజమహేంద్రవరం స్పెల్బీ పరీక్ష విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఈ పరీక్షతో స్పెల్లింగ్లు, పదాలకు అర్థాలు చెప్పే సామర్థ్యం పెరుగుతుంది. ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ గత పదేళ్లుగా స్పెల్బీ పరీక్షల్లో పాల్గొంటున్నాయి. అలాగే తమ ఆదిత్య విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ‘సాక్షి’ స్పెల్బీ ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుతోంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి దోహదపడుతుంది. –వి.రాజేష్, కో–ఆర్డినేటర్, ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష రాయడం ఆనందంగా ఉంది. ఇంగ్లిష్ భాషపై సంపూర్ణ అవగాహన ఏర్పడింది. పోటీ పరీక్షలు అంటే భయం పోయింది. స్పెల్లింగ్, వ్యాకరణంలో చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇది నా భవిష్యత్కు బాటలు వేస్తోంది. –వేగుంట నమస్వి, ఆరో తరగతి, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, రాజమహేంద్రవరం ఇంగ్లిష్ భాషలో ఒకాబులరీ పట్ల అవగాహన ముఖ్యం. ఇది ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష ద్వారా అవగతం చేసుకున్నాను. పరీక్ష ద్వారా తర్ఫీదు పొందాను. వర్డ్స్, స్పెల్లింగ్స్ పట్ల అవగాహన కలిగింది. ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంది. –గారపాటి రుద్రనాగ్ చౌదరి, 9వ తరగతి, లారల్ హైగ్లోబల్ స్కూల్, గాడాల విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష బాట వేస్తోంది. ఇంగ్లిష్లో స్పెల్లింగ్, ఒకాబులరీ చాలా ముఖ్యం. దీనిని నేర్చుకోవడానికి ఈ పరీక్ష దోహదపడుతుంది. పరీక్ష బాగా రాశాను. దీనివల్ల ఎంతో ఉత్సాహం వచ్చింది. –కాసర ప్రతిభ, 8వ తరగతి, ప్రతిభ స్కూల్, జంగారెడ్డిగూడెం విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేలా ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష ఉంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి ఇదో మంచి మార్గం. ఈ పరీక్షతో అనేక అంశాలు తెలుసుకున్నాను. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే అనేక పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటడానికి మార్గం సుగమమైంది. –పెన్మెత్స సాత్విక, 8వ తరగతి, ఆదిత్య స్కూల్, తాడేపల్లిగూడెం ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష రాయడం ద్వారా ఇంగ్లిష్ భాష అంటే భయం పోయింది. పలకడం, రాయడం సులభతరం అయ్యింది. ఇక నుంచి సులభంగా ఇంగ్లిష్ నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఈ పరీక్ష రాయడంతో ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. –కఠారి చరిష్మా, 9వ తరగతి, కోనసీమ విద్యాశ్రమ్, ముక్తేశ్వరం నేను ముందుగా స్పెల్బీ నిర్వహిస్తున్న ‘సాక్షి’ యాజమాన్యానికి థ్యాంక్స్ చెబుతున్నా. నాలో ఉన్న నైపుణ్యాలను బయటకు తీసేందుకు ఈ పరీక్ష దోహదపడింది. నేను స్పెల్బీ పరీక్ష రాశాను. సెమీ ఫైనల్లో మంచి మార్కులు వస్తాయని ఆశిస్తున్నాను. పరీక్ష నా భవిష్యత్తుకు పునాది లాంటిది. –దాట్ల దీక్షిత, 7వ తరగతి -
పాపికొండలకు రోడ్డు మార్గం
బుట్టాయగూడెం: పాపికొండల విహార యాత్రకు గతంలో పట్టిసీమ, పోలవరం, సింగన్నపల్లి, వాడపల్లి గ్రామాల సమీపంలో లాంచీల బోటు పాయింట్లు ఉండేవి. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులు ఈ గ్రామాల నుంచే బోటులో పాపికొండల విహార యాత్రకు వెళ్లేవారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు చేపట్టడంతో పై గ్రామాలలో ఉన్న బోటు పాయింట్లను తీసివేసి దేవిపట్నం మండలం గండి పోచమ్మతల్లి గుడి సమీపం నుంచి విహార యాత్రకు బోటు పాయింటు ఏర్పాటు చేశారు. పాపికొండల విహార యాత్రకు వెళ్లాలంటే రాజమండ్రి మీదగా గండిపోచమ్మ తల్లి గుడికి చేరుకుని అక్కడ నుంచి గోదావరి నదిపై లాంచీలు, బోటుపై ప్రయాణం చేస్తూ పాపికొండల అందాలను చూసే అవకాశం ప్రస్తుతం ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఆ అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తుంది. పాపికొండల విహారయాత్రకు వచ్చే పర్యాటకులు బోటుపాయింటు దూర భారంగా ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఏలూరు జిల్లాలో పశ్చిమ ఏజెన్సీ అటవీ ప్రాంతం మీదగా పాపికొండలు సమీపంలోని కొరుటూరు వరకూ సుమారు 83 ఏళ్ల క్రితం బ్రిటీష్ కాలంలో రాళ్లను పేర్చి నిర్మించిన దాసన్ రోడ్డు మార్గాన్ని అభివృద్ధి చేసేలా ప్రభుత్వం కృషి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. ఈ మార్గం అభివృద్ధి చేస్తే అడవి అందాలను ఆస్వాదిస్తూ పాపికొండల సందర్శనకు వెళ్లొచ్చు. పాపికొండల సందర్శనకు ఇలా.. బుట్టాయగూడెం మండలం పులిరామన్నగూడెం నుంచి ముంజులూరు మీదుగా చింతపల్లి వరకూ సుమారు 6.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు ఉంది. ఈ రోడ్డు పాడైపోయింది. గడ్డపల్లి నుంచి రాళ్లు పరిచిన దారి ఉంటుంది. ఇదే మార్గం ధారవాడ, కొరుటూరు వరకు వెళ్తుంది. గడ్డపల్లి దాటిన తర్వాత కొట్రుపల్లి మీదుగా చిలకలూరు, రావిగూడెం బంగ్లా రహదారి మీదుగా కొరుటూరు వరకూ సుమారు 15.49 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ మార్గాన్ని 3.5 మీటర్ల వెడల్పున నిర్మించాలని ప్రతిపాదన ఉంది. ఈ దాసన్ రోడ్డు మార్గాన్ని అభివృద్ధి చేస్తే అన్ని రకాల వాహనాలతో ప్రయాణం చేస్తూ అడవి అందాలు ఆస్వాదిస్తూ నేరుగా కొరుటూరు చేరుకుని అక్కడ పాపికొండలను చూడొచ్చు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన రోడ్డు మార్గం బ్రిటిష్ కాలంలో దాసన్ అనే ఇంజనీరు ఈ రహదారిని నిర్మించారు. గడ్డపల్లి దాటిన తర్వాత కొట్రుపల్లి మీదగా కొరుటూరు వరకూ సమారు 15.49 కిలోమీటర్ల మేర రాళ్లను పేర్చి 1936–37 సంవత్సరంలో ఈ రహదారిని నిర్మించారు. ఎత్తయిన కొండలపై నుంచి 13 మలుపులతో ఉండే ఈ మార్గం మీదుగా ప్రయాణం ఎంతో మధురానుభూతి కలిగిస్తుంది. ఈ మలుపులు తిరుమల కొండపై ప్రయాణాన్ని తలపిస్తాయి. ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకంగానే కాకుండా అటవీ ప్రాతంలో జీవనం సాగిస్తున్న గిరిపుత్రులకు జీవనోపాధి మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. ఈ మార్గంలో జలతారు వాగు కనువిందు చేస్తుంది. రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రతి ఒక్కరూ జలపాతాన్ని చూసే అవకాశం ఉంటుంది. వైఎస్సార్సీపీ పాలనలో రూ.10 కోట్లతో ప్రతిపాదన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ప్రాజెక్టు నుంచి కొరుటూరు వరకూ ఉండే రోడ్డు మార్గం పూర్తిగా నిలిచిపోయింది. రోడ్డు మార్గంలో ఉన్న 19 గ్రామాల్లోని ప్రజలకు బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో పునరావాస గ్రామాలు ఏర్పాటు చేసి వారిని అక్కడకు తరలించారు. కొరుటూరు, పాపికొండలు చేరుకోవడానికి ప్రస్తుతం దాసన్ రోడ్డు ఒక్కటే మార్గం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు పర్యాటకంగా అటు అటవీ ప్రాతంలో జీవిస్తున్న గిరిజనులు జీవనోపాధి మెరుగుపర్చేలా వైఎస్సార్సీసీ పాలనలో నాటి కలెక్టర్ రేవు ముత్యాలరావు ఆధ్వర్యంలో ఐటీడీఏ, అటవీశాఖ, పోలవరం ప్రాజెక్టు పోలీసు అధికారులతో పాటు అప్పటి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దాసన్ రోడ్డు మార్గాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే వెనుకబడి ఉన్న గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందుతాయని గిరిపుత్రులకు జీవనోపాధి కూడా లభిస్తుందని భావించి సుమారు రూ.10 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బ్రిటీష్ కాలంలోనే కొండపై దాసన్ రోడ్డు ఈ రోడ్డు అభివృద్ధికి గతంలో రూ.10 కోట్లతో ప్రతిపాదనలు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలంటున్న స్థానికులు -
రాట్నాలమ్మకు ప్రత్యేక పూజలు
పెదవేగి: రాట్నాలమ్మ దేవస్థానం భక్తులతో కళకలలాడింది. పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వేంచేసిన శ్రీ రాట్నాలమ్మకు ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి మొక్కుబడులను తీర్చుకున్నారు. ఈ వారం పూజా రుసుం వల్ల రూ.35,980, విరాళంపై రూ.1,664, లడ్డూ ప్రసాదంపై రూ.18,945, ఫోటోల అమ్మకంపై రూ.1,445 , మొత్తం రూ.58,034 ఆదాయం లభించిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్.సతీష్కుమార్ తెలిపారు. బుట్టాయగూడెం: కోర్కెలు తీర్చే తల్లిగా, వరాలిచ్చే అమ్మగా, గిరిజన ఆరాధ్య దేవతగా పూజలందుకుంటున్న గుబ్బల మంగమ్మ తల్లి గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయ కమిటీ గుబ్బల మంగమ్మ తల్లిని పూలతో ప్రత్యేక అలంకరణ చేయగా.. భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. చలికాలం అయినప్పటికీ మంచు కురుస్తున్నప్పటికీ తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు మంగమ్మ తల్లి గుడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ జిల్లాల నుంచి ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, బస్సుల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఏలూరు టౌన్: ఏలూరు ఆర్ఆర్పేటలోని నిత్య డార్మిటరీలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో టూటౌన్ ఇన్చార్జ్ సీఐ, నగర ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు తన సిబ్బందితో ఆకస్మికంగా దాడి చేశారు. ఆదివారం సాయంత్రం పోలీసులు చేసిన దాడుల్లో పేకాట ఆడుతున్న 15 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. పేకాట రాయుళ్ల నుంచి రూ.52,233 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్మును డార్మిటరీ బాత్రూమ్లో పేకాటరాయుళ్ళు దాచే ప్రయత్నం చేయగా పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. -
కాపులకు మంచి చేసింది జగనే
తణుకు అర్బన్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో కాపు సామాజిక వర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారని, ఎన్నో సంక్షేమ పథకాల్లో కాపు వర్గాలకు లబ్ధి చేకూర్చారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తణుకు సీఎం ఫంక్షన్ హాలులో ఆదివారం నిర్వహించిన కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కేఆర్పీఎస్) ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యాదవ కులస్థుడైన నన్ను రెండు పర్యాయాలు తణుకులో ఎమ్మెల్యేగా గెలవడంలో కాపులంతా సహకరించారని, అదే కాపుల ప్రోత్సాహంతోనే మంత్రిగా పదవి దక్కిందని అన్నారు. కాపులపై ఉన్న గౌరవంతోనే కాపు నేత వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని తణుకులో ఏర్పాటుచేయగలిగానని అన్నారు. వంగవీటి రంగా విప్లవాత్మక మార్పు కోసం ఉద్యమిస్తే ఆ ఉద్యమం కొనసాగితే రాష్ట్రంలో తమ పెత్తనం, దోపిడీ అంతమవుతుందనే ఆయనను హత్య చేశారని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) అధినేత బోడె రామచంద్రయాదవ్ అన్నారు. సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బీసీల మాదిరిగానే కాపు సామాజిక వర్గం కూడా దశాబ్ధాలుగా వివక్షకు, అణచివేతకు గురవుతుందని అన్నారు. భవిష్యత్తులో బీసీలు, కాపులు, దళితులు ఏకంకావాల్సిన చారిత్రాత్మక సమయం ఆసన్నమైందని అన్నారు. కేఆర్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు, కాపు నాడు జాతీయ అధ్యక్షుడు గల్లా సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. మాజీ మంత్రి కారుమూరి -
నేటి నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు
భీమవరం: జిల్లాలో సోమవారం నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించనున్నామని, తొ లిరోజు భీమవరంలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తామని ఈపీడీసీఎల్ ఎస్ఈ పులి ఉషారాణి ఆదివారం ప్రకటనలో తెలిపారు. 16న విద్యుత్ పొ దుపు ఆవశ్యకతపై పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖన పోటీలు, 17న కళాశాల విద్యార్థులకు ఇంధన సంరక్షణ అవసరం, నూతన సాంకేతికతలపై అవగాహన సదస్సులు, 18న విద్యుత్ పొదుపు ప్రాధాన్యత, బీఈఈ స్వరర్ రేటెడ్ గృహోపకరణాలు వాడకం వల్ల ప్రయోజనాలపై స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 19న గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఆక్వా రైతు సంఘాల భాగస్వామ్యంతో డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్పై అవగాహన కార్యక్రమం, 20న పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం ఉంటుందని పేర్కొన్నారు. -
కాపాడితేనే మనుగడ
పశువుల ఆస్పత్రుల్లో మందులు లేకపోవడంతో వైద్యు లు ప్రైవేటు దుకాణాలకు మందులు రాస్తున్నారు. గేదెను ఆస్పత్రికి తీసుకువెళితే వందలాది రూపాయలు ఖర్చవుతున్నాయి. తరచూ పారుడు, అజీర్తి, జ్వరం సమస్యలతో గేదెలను ఆస్పత్రికి తోలుకెళ్తుంటే కనీసం యాంటీ బయోటిక్ మందులు కూడా లేవని, బయట కొనుక్కొని తెచ్చుకోమంటున్నారు. మందులు లేనప్పుడు ఆస్పత్రులు ఎందుకు మూసేయండి. గేదెను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు కిరాయిలు దండగని చిన్న డాక్టర్ను ఇంటికి పిలిచి వైద్యం చేయించుకుంటున్నాం. – దొంగ శ్రీను, పాడి రైతు, కొత్తపాడు, ఇరగవరం మండలం తణుకు అర్బన్ : ప్రభుత్వ పశు వైద్యశాలలను మందుల కొరత వేధిస్తోంది. దీంతో పశువులకు వైద్యం అందించడం తమకు భారంగా మారిందని పాడి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆస్పత్రిలో వైద్యు లు పరీక్షలు చేసినా మందుల కోసం ప్రైవేటు మందుల దుకాణాలకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. గత నాలుగు నెలలుగా పశు వైద్యశాలల్లో మందుల కొరత తీవ్రంగా ఉందని అంటున్నారు. ప్రభుత్వం ఏడాదిలో క్వార్టర్కు ఓసారి అంటే మూడు నెలలకోసారి మందుల సరఫరా చేయాల్సి ఉండగా ఈ ఏడాది మే నెలలో మాత్రమే మందులు సరఫరా చేసింది. తర్వాత రెండు క్వార్టర్స్ మందులు ఇప్పటికీ సరఫరా కాకపోవడంతో కొరత ఎక్కువగా ఉంది. ఇప్పటికే వ్యవసాయ రంగానికి మొండి చేయి చూపిస్తున్న చంద్రబాబు సర్కారు తాజాగా పశువుల వైద్యంపై సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని వెటర్నరీ హాస్పిటల్స్, వెటర్నరీ డిస్పెన్సరీలు, రూరల్ లైవ్ స్టాక్ యూనిట్లు, రైతు సేవా కేంద్రాల్లో పశు వైద్య మందులు అందుబాటులో లేవు. ఆస్పత్రులకు వస్తున్న పాడి రైతులకు మందుల్లేవని, బయట నుంచి తెచ్చుకోమని చెప్పలేక వైద్యులు, సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. కనీసం గాజుగుడ్డ, దూది లేదు చంద్రబాబు సర్కారులో పశు వైద్యశాలకు కనీసం దూది, గాజుగుడ్డ, టించర్, అయోడిన్ వంటి సాధారణ మందులు కూడా సరఫరా చేయడం లేదని పాడి రైతులు ఆరోపిస్తున్నారు. మూగజీవాలను పశువుల ఆస్పత్రికి తీసుకువెళ్లడం కూడా దండగ అని స్థానికంగా ఉండే చిన్నపాటి వైద్యులతో ఇంటి వద్దే వైద్యం చేయిస్తున్నాయి. కనీసం మూగజీవాలకు గాయాలు, పుండ్లు వంటి వాటికి కట్టుకట్టే గాజుగుడ్డ కూడా లేదంటే ప్రభుత్వ పనితీరు ఎంత అధ్వానంగా అర్థమవుతుందని పాడి రైతులు మండిపడుతున్నారు. సుమారు 40 వేల మంది.. జిల్లాలో పశుపోషణపై ఆధారపడి సుమారు 40 వేల మంది పాడి రైతు కుటుంబాలు ఉన్నాయి. వీరంతా గేదెలు, ఆవులను పోషిస్తూ పాలు, వెన్న, నెయ్యి విక్రయాలతో జీవనం సాగిస్తున్నారు. అయితే ఆస్పత్రుల్లో మందుల కొరత కారణంగా పశువులకు చిన్నపాటి అనారోగ్యం వచ్చినా మందులు కొనుగోలు చేయాల్సి రావడం వీరికి భారంగా మారింది. పశుసంపద ద్వారా వచ్చే ఆదాయం పశువుల ఆరోగ్యానికే వెచ్చించాల్సి వస్తుందని వీరు వాపోతున్నారు. ఇండెంట్ పంపాం మందుల కొరతపై జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి డాక్టర్ ఆర్.కోటిలింగరాజును ‘సాక్షి’ వివరణ కోరగా మందుల సరఫరా లేకపోవడం వాస్తవమేనని, మందులకు సంబంధించిన ఇండెంట్ ఉన్నతాధికారులకు పంపించామని, నెలాఖరుకు రావచ్చని చెప్పారు. దూదికీ దిక్కులేదు పశువుల ఆస్పత్రుల్లో మందుల కొరత రెండు త్రైమాసికాలుగా నిలిచిన మందుల సరఫరా గతంలో ఎన్నడూ ఇలా లేదంటున్న రైతులు జిల్లాలో 2.70 లక్షల పశువులు జిల్లాలో పశువులు (2019 లెక్కల ప్రకారం) గేదెలు 1,76,957 ఆవులు 45267 మేకలు 38,662 గొర్రెలు 22,921 జిల్లాలో 2019 లెక్కల ప్రకారం గేదెలు, ఆవులు కలిపి 2,22,224, మేకలు, గొర్రెలు కలిపి 61,583 ఉన్నాయి. 2019 తర్వాత పశుగణన పూర్తయినా అధికారిక గణాంకాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే తాజాగా పశువుల సంఖ్య తగ్గిందని, జిల్లాలో గేదెలు, ఆవులు కలిపి సుమారుగా 2 లక్షలు ఉండగా మేకలు, గొర్రెలు కలిపి 70 వేలు వరకు ఉన్నట్టు తెలుస్తోంది. పశు వైద్యశాలల్లో సుమారు 40 రకాల మందులు అందుబాటులో ఉండాలి. పశువులకు సాధారణంగా అజీర్తి, పారుడు వ్యాధి, జ్వరం, పొదుపు వాపు జబ్బు, గర్భకోశ వ్యాధులు వంటివి తరచూ వస్తుంటాయి. వీటి కోసం యాంటీ బయోటిక్స్తోపాటు ఇతర మందులు ఉండాలి. అయితే ఇవేమీ లేకపోవడంతో వైద్య పరీక్షల అనంతరం పాడి రైతులు బయట దుకాణాల్లో కొనుగోలు చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా దూడ పుట్టిన వెంటనే పాముల మందు మొదటి వారంలో ఒక డోసు ఆపై 6 నెలలపాటు నెలకు ఒక డోసు చొప్పున వేయాలి. గేదెలకు 6 నెలలకోసారి ఈ మందు వేయాల్సి ఉంటుంది. కనీసం ఇవి కూడా ఆస్పత్రుల్లో లేకపోవడంతో ప్రైవేటు మందులే దిక్కయ్యాయి. -
30న ఉత్తర ద్వార దర్శనం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో వైకుంఠ (ముక్కోటి) ఏకా దశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 30 న శ్రీవారి ఉత్తర ద్వార దర్శనాన్ని నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి ఆ దివారం తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తామన్నారు. రూ.100, రూ.200, రూ.500ల ప్రత్యేక దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే ముక్కోటి ముందు రోజు ఈనెల 29న గిరి ప్రదక్షిణను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఆ రోజు మ ధ్యాహ్నం 2.30 గంటలకు స్వామి వారి తొలిమెట్టు (పాదుకా మండపం) వద్ద గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. గిరి ప్రదక్షిణ అ నంతరం భక్తులకు స్వామివారి నిజరూప దర్శనాన్ని కల్పిస్తామన్నారు. ఈనెల 30 నుంచి వచ్చేనెల 9 వరకు ఆలయంలో అధ్యయనోత్సవాలను నిర్వహిస్తామని, ఆయా రోజుల్లో సా యంత్రం వేళ ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 15న స్వామివారి నిత్యార్జిత కల్యాణా న్ని రద్దు చేస్తున్నట్టు ఈఓ వివరించారు. భీమవరం: జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఏపీ టెట్ పరీక్షలకు 87.58 శాతం అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ ప్రకటనలో తెలిపారు. ఉదయం 1,101 మందికి 981 మంది, మధ్యాహ్నం 735 మందికి 627 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్లో ప్రత్యేక కోర్సులతో ఎంటెక్లో ఎనిమిది బ్రాంచీలను తొమ్మిది బ్రాంచీలుగా విభజించారు. 2025–26 విద్యాసంవత్సరానికి 95 సీ ట్లను కేటాయించారు. ప్రస్తుతం బీటెక్లో ఎ నిమిది బ్రాంచీలతో పాటు ఎంఎస్ బైరీసెర్చ్ కోర్సులు, పీహెచ్డీ ఫుల్టైం, పార్ట్టైం ప్రాతిపదికన కోర్సులను నిట్ అందిస్తోంది. ఈ వి ద్యాసంవత్సరంలో ఎంటెక్ కోర్సుకు గాను ఇంజనీరింగ్ బ్రాంచీలకు స్పెషలైజ్డ్ కోర్సులుగా రూపకల్పన చేసి కోర్సులను ప్రవేశపెట్టారు. సీట్ మ్యాట్రిక్స్లో ఎనిమిది బ్రాంచీలను తొ మ్మిది బ్రాంచీలుగా విభజించి, డిమాండ్ ఉన్న సీఎస్ఈ బ్రాంచీలో 15 సీట్లు, మిగిలిన ఎని మిది బ్రాంచీలకు పదేసి వంతున సీట్లు కేటాయించారు. ప్రత్యేక కోర్సులు ఇలా.. బయోటెక్నాలజీలో బయోప్రాసెసెసింగ్ ఇంజనీర్ కోర్సుగా మార్చారు. కెమికల్ ఇంజనీరింగ్ను అలానే ఉంచారు. సివిల్ ఇంజనీరింగ్లో జియోటెక్నిక్ ఇంజనీర్ కోర్సును ఉంచారు. సీఎస్ఈలో కంప్యూటర్ సైన్స్ డాటా ఎనలిటిక్స్ కో ర్సుగా రూపకల్పన చేశారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పవర్ ఎలక్ట్రానిక్స్ డ్రైవ్స్ ప్రత్యేక కోర్సు ను చేర్చారు. ఈసీఈలో అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, సిగ్నల్ ప్రోసెసింగ్గా మార్చారు. ధర్మల్ ఇంజనీరింగ్, మాన్యు ఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ ప్రత్యేక కోర్సును మెకానికల్ ఇంజనీరింగ్లో చేర్చారు. ఎంఎంఈని మెటీరియల్స్ టెక్నా లజీ ప్రత్యేక కోర్సును ఎంటెక్లో చేర్చారు. మెరిట్ ప్రాతిపదికన ఏపీ నిట్లో బీటెక్ చదివిన విద్యార్థులు ఎంటెక్లో ఇక్కడే సీటు పొందవచ్చు.నిడమర్రు: కూటమి ప్రభుత్వంలో తాము ఇ బ్బందులు పడుతున్నామంటూ గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వద్ద కొల్లేరు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తోకలపల్లిలో జరిగిన సమావేశంలో పలువురు కొల్లేరు రైతులు మంత్రి వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. రైతు బలే ఆదినారాయణతోపాటు ప లువురు మాట్లాడుతూ 3వ కాంటూరులో తా తల కాలం నుంచి హక్కుగా వస్తున్న భూము ల్లో సంప్రదాయబద్ధంగా వ్యవసాయం చేసు కుంటున్నామని, ఇప్పటివరకూ ఏ ప్రభుత్వంలో తమకు ఇబ్బందులు లేవన్నారు. అయితే ఇ టీవల అటవీ శాఖ అధికారులు సంప్రదాయ వ్యవసాయం చేసుకుంటున్న రైతులపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి రైతుల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్తానని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ వీరాంజనేయులు ఉన్నారు. -
ప్రజల్ని దోచుకునేందుకు ‘మాస్టర్ ప్లాన్’
● తణుకు మాస్టర్ ప్లాన్ కుట్రపూరితం ● మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు అర్బన్ : తణుకులో ఇటీవల ప్రకటించిన మాస్టర్ ప్లాన్ కుట్రపూరితంగా ఉందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించా రు. తణుకు మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఈ మాస్టర్ ప్లాన్ను విడుదల చేశారని, ఇది పూర్తిగా విరుద్ధంగా ఉండడమే కాకుండా దొంగదారిలో రాజకీయ కుట్రతో ప్రజాభిప్రా యం లేకుండానే నిర్ణయించేశారని మండిపడ్డారు. తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తణుకు మున్సిపాలిటీలో కౌన్సిల్ లేదని అటువంటప్పుడు ప్రజాభిప్రాయాన్ని సేక రించకుండా మాస్టర్ ప్లాన్ను ఎలా తయారుచేస్తా రని నిలదీశారు. ప్రతి వార్డులోనూ ప్రజాభిప్రాయం సేకరించకుండా, ఆయా గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటుచేయకుండా దొడ్డిదారిన మాస్టర్ ప్లాన్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ప్రజావసరాల కోసం చేసే ప్రతి చర్యలోనూ ప్రజల అభిప్రాయానికి పెద్దపీట వేయాలని, ఏదో పేపర్లో చిన్న ప్రకటన చేసేసి కార్యాచరణ చేయడం కుట్రపూరితమన్నారు. ప్రజాభిప్రాయం లేకుండా ఎలా మాస్టర్ ప్లాన్ ప్రకటిస్తారు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్టా అని ప్రశ్నించారు. ఏకపక్ష ధోరణితో.. మాస్టర్ ప్లాన్ అమలుచేస్తే అది ప్రజలకు ఆమోదయోగ్యం ఉండేలా అభివృద్ధి చేయాలని, ఏకపక్ష నిర్ణయాలతో నిర్ణయాలతో మీ స్వార్థ్యం కోసం మాస్టర్ ప్లాన్ అమలుచేయడం ప్రజావ్యతిరేక చర్య గా పరిగణించాల్సి ఉంటుందని మాజీ మంత్రి కారుమూరి అన్నారు. 2000లో 20 కిలోమీటర్లలోపు మాత్రమే మాస్టర్ ప్లాన్ ఉండగా, 2025లో సుమారు 101.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో చేశారని, దీని వల్లన ఆయా గ్రామాల్లోని ప్రజలతోపా టు రైతులు అన్యాయమైపోతారని అన్నారు. తమ ఆస్తి అమ్ముకోడానికి ఉండదని, పిల్లలకు ఇవ్వడానికి కూడా కాకుండా పోతుందని విమర్శించారు. ఈ ప్లాన్తో తణుకు మున్సిపాలిటీ పరిధిలోని టి. వేమవరం, సజ్జాపురం, పైడిపర్రు, వెంకటరాయపురం, వీరభద్రపురం, తణుకు మండలం వేల్పూరు, కొమరవరం, మండపాక, తేతలి, ఇరగవరం మండలం రేలంగి, గోటేరు, కె.ఇల్లింద్రపర్రుతోపాటు తణుకు శివారు గ్రామాలైన వడ్లూరు, పాలంగి, చివటం, ఉండ్రాజవరం, కె.సావరం ప్రాంతాలకు సై తం ఇబ్బందులు తప్పవన్నారు. ముఖ్యంగా రేలంగిలో జనావాసాలు ఉన్న ప్రాంతాన్ని ఇండస్ట్రీయల్ జోన్గా ప్రకటించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. వెంటనే గ్రామాల్లో, వార్డుల్లో ప్రజాభిప్రాయం తీసుకోవాలని, ప్రజల నిర్ణయానికి అనుగుణంగా అవసరమైతే చట్టపరంగా వెళ్లి ప్రజలకు సహకరిస్తానని అన్నారు. ఇప్పటికే తణుకులో ఆవులు, గేదెలు కోయిస్తున్నా రని పేకాటలు, గంజాయి, మద్యం విక్రయాలు, బెల్టు దుకాణాలు విచ్చలవిడిగా నడిపిస్తున్న కారణంగా ప్రజలు అప్పులపాలైపోతున్నారని కారు మూరి అన్నారు. ముఖ్యంగా పేకాటలకు వచ్చేవారిని నిర్వాహకులు వారి సెల్ఫోన్లు తీసుకుని మరీ కార్లు ఎక్కించుకుని తీసుకువెళ్తున్నారన్నారు. గంజాయి పిల్లలకు చేతికందేలా చేశారని విమర్శించారు. అత్తిలిలో పూర్తిగా పేకాట జరుగుతోందని, తాజాగా ప్రజల్ని దోచుకునేందుకు ఇదో మాస్టర్ ప్లాన్ లాంటి మాస్టర్ ప్లాన్ అని విమర్శించారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయతీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారామ్, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ యిండుగపల్లి బలరామకృష్ణ, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు గెల్లా జగన్, నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు మెహర్ అన్సారీ, దువ్వ గ్రామ పార్టీ అధ్యక్షుడు శిరిగిశెట్టి గోపాలకృష్ణ, పట్టణ కమిటీ ఉపాధ్యక్షుడు యారబాటి రామకృష్ణ, నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడు షేక్ జిలానీ పాల్గొన్నారు. -
ధనుర్మాసం.. ఆధ్యాత్మిక శోభితం
విష్ణుమూర్తికి ప్రీతికరమైన ధనుర్మాసం ఎంతో శుభప్రదమైంది. విష్ణు, వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో నెల రోజుల పాటు తిరుప్పావై పాశురాలను పఠిస్తారు. ధనుర్మాస ఉత్సవాలు నిర్వహిస్తారు. పెళ్లికాని యు వతులు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేస్తే కోరుకున్న వరుడు దొరుకుతాడని ప్రతీతి. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన వారికి అంతా శుభం జరుగుతుంది. – సుదర్శనం శ్రీనివాసాచార్యులు, ఆగమ పండితుడుద్వారకాతిరుమల: శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన ధనుర్మాస ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. విష్ణుచిత్తుని కుమార్తె గోదాదేవి సాక్షాత్తు శ్రీరంగనాథుడిని వివాహం చేసుకుంటానని దీక్ష పూనుతారు. తన అనుభూతిని, భావాలను పాశురం రూపంలో రచించి 30 పాశురాలను విష్ణువుకు అంకితం చేస్తారు. ఆమె భక్తికి ముగ్ధుడైన శ్రీరంగనాథుడు గోదాదేవిని పరిణయమాడతారు. ఈ ఉత్సవాల కోసం జిల్లాలో వైష్ణవ ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ధనుర్లగ్న ప్రవేశాన్ని అనుసరించి ఈనెల 16న మధ్యాహ్నం 1.27 గంటలకు ఘంటానాదం (నెలగంట) జరుగుతుంది. పవిత్ర మాసం వేదాల్లో సామవేదం, మాసాల్లో మార్గశిరం అత్యంత పవిత్రమైనవని భగవద్గీత చెబుతోంది. ఈ మాసంలో రంగనాథుడిని గోదాదేవి వరించి, తన భక్తిని చా టుకుంది. సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనురాశిలోకి ఈ నెలలోనే ప్రవేశిస్తాడు. ఈ 30 రోజుల కాలాన్ని ధనుర్మాసంగా పిలుస్తూ, విష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు గోదాదేవి రోజుకో రీతిలో తిరుప్పావై పాశురాలను ఆలపించడం విశేషం. రోజుకో విన్నపం శ్రీవైష్ణవులకు తిరుప్పావై వ్రతం ముఖ్యమైంది. వ్రత నిర్వహణలో భాగంగా నెలరోజుల పాటు రోజుకో పాశురం చొప్పున విన్నపం చేస్తారు. ఒకటి నుంచి 5 పాశురాల్లో వ్రత విధానం, 6 నుంచి 15 పాశురాల్లో తన తోటి చెలికత్తెలను నిద్రలేపి నందగోపుని గృహానికి వెళ్లడం, 16, 17, 18 పాశురాల్లో నందగోపుడు, యశోద, బలరాములను మేల్కొలపడం, 23వ పాశురంలో మంగళాశాసనం, 25, 26 పాశురాల్లో స్వామికి అలంకారాలైన ఆయుధాల్లో పరా అనే వాయిద్యాన్ని తమ శరణాగతి అనుగ్రహించి, తమ సంకల్పాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తారు. ఆఖరి రోజున గోదా రంగనాథుల కల్యాణాన్ని అట్టహాసంగా నిర్వహిస్తారు. నూతన అనివేటి మండపంలో విష్ణుమూర్తి, గోదాదేవి శిల్పాలు ద్వారకాతిరుమల క్షేత్ర ప్రధాన కూడలిలో ధనుర్మాస మండపం రేపటి నుంచి శ్రీవారి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు 17 నుంచి ఆలయంలో సుప్రభాత సేవ రద్దు తిరుప్పావై సేవాకాలాలు, గ్రామోత్సవాలు ప్రారంభం వచ్చేనెల 14న గోదా, రంగనాథుల కల్యాణం 17 నుంచి గ్రామోత్సవాలు శ్రీవారి ఆలయంలో ఈనెల 16న మధ్యాహ్నం నె లపట్టడంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు, జన వరి 14 వరకు సాగుతాయి. నిత్యం ఆలయంలో తిరుప్పావై గానం, ఆండాళ్ కోవెల సేవలను నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం గోదాదేవికి కుంకుమా ర్చన చేస్తారు. 17 నుంచి రోజూ ఉదయం స్వామి, అమ్మవార్లు, గోదాదేవికి గ్రామోత్సవాలు నిర్వహిస్తారు. ఆలయ ప్రధాన కూడలిలోని మండపంలో పూజలు చేస్తారు. జనవరి 14న భోగి పండుగ నాడు శ్రీవారి నిత్య కల్యాణంతో పాటు, గోదా రంగనాథు కల్యాణాన్ని అర్చకులు అట్టహాసంగా నిర్వహిస్తారు. ఈనెల రోజులు ఆలయంలో సుప్రభాత సేవను రద్దు చేసి, ఆ సమయంలో తిరుప్పావై సేవను అర్చకులు నిర్వహిస్తారని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి వెల్లడించారు. -
రేపటి నుంచే వందే భారత్ పరుగులు
● మధ్యాహ్నం 1.30కు ప్రారంభం ● నరసాపురం–చైన్నె మధ్య రాకపోకలు నరసాపురం: చైన్నె నుంచి విజయవాడ వరకూ నడుస్తున్న ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్ రేపటి నుంచి జిల్లాలో పరుగులు పెట్టనుంది. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు నరసాపురం రైల్వేస్టేషన్లో ఈ రైలును కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ ప్రారంభించనున్నారు. విజయవాడ రైల్వే డివిజన్కు చెందిన పలువురు ఉన్నతాధికారులు, రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతున్నారు. నరసాపురం–చైన్నె మధ్య ఈ రైలు ప్రతి రోజు రాకపోకలు సాగించనుంది. 20678 నెంబరుతో రైలు నరసాపురంలో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి రాత్రి 12.45 గంటలకు చైన్నె చేరుకుంటుంది. 20677 నెంబరుతో చైన్నెలో ఉదయం 5.35 గంటలకు చైన్నెలో బయలుదేరి మధ్యాహ్నం 2.10 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. నరసాపురం, భీమవరం టౌన్, గుడివాడ స్టేషన్లో మాత్రమే ఆగుతుంది. పశ్చిమ డెల్టా వాసులు ఎంతోకాలంగా ఈ రైలు కోసం ఎదురు చూస్తున్నారు. -
ఉచిత వైద్యానికి సర్కారు తూట్లు
రాజీ మార్గం.. రాజమార్గం రాజీ మార్గమే.. రాజ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. 8లో uవైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు కాళ్ల: పేదవాడికి అందించాల్సిన ఉచిత వైద్యాన్ని కూటమి ప్రభుత్వం నీరుగార్చుతుందని, ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ప్రతులను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లనున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు తెలిపారు. కాళ్ల మండలం పెదఅమిరం జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ నెల 15న జరిగే కార్యక్రమంలో జిల్లా కార్యాలయం నుంచి పార్టీ కేంద్రం కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరి కోటి సంతకాల ప్రతులను తాడేపల్లి పార్టీ కేంద్రం కార్యాలయంలో అందజేస్తామన్నారు. పేదవాడికి అందించే ఉచిత వైద్యాన్ని ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కోరుతూ పేద ప్రజల మద్దతుతో కోటి సంతకాలను సేకరించి ప్రతులను జగన్మోహన్ రెడ్డి ద్వారా అందించినట్లు స్పష్టం చేశారు. జిల్లాలో నాలుగు లక్షలకు పైగా సంతకాలు పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. ఈ ప్రతులను ఈ నెల 15న పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. జిల్లా నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్తామని ఆయన చెప్పారు. సమావేశంలో పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఉండి పార్టీ ఇన్చార్జి పీవీఎల్ నరసింహ రాజు, భీమవరం ఇన్చార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు, పార్టీ నాయకులు పేరిచర్ల నరసింహరాజు, గాదిరాజు రామరాజు, కోడే యుగంధర్ పాల్గొన్నారు. -
సందడిగా బాలోత్సవం
భీమవరం: భీమవరంలో నిర్వహిస్తున్న బాలోత్సవం రెండో రోజు శనివారం సందడిగా సాగింది. ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ ముఖ్య అతిధులుగా హాజరై మాట్లాడుతూ బాలోత్సవాలు విద్యార్థుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతాయని, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఒకచోట చేరి తమ అభిప్రాయాలు పంచుకోవడం వల్ల వారిలో సమాజం పట్ల అవగాహన, మనుషుల ప్రవర్తన తెలుస్తాయన్నారు. ప్రస్తుతం సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని విద్యార్థుల్ని చైతన్యవంతంగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి బాలోత్సవాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. కళాశాల సెక్రటరీ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థుల ప్రగతికి ఉపయోగపడే అన్ని అంశాల్లోనూ అండగా నిలుస్తుందన్నారు. అనంతరం విద్యార్దులకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో బాలోత్సవ కమిటీ అధ్యక్షుడు ఇందుకూరి ప్రసాదరాజు, ప్రధాన కార్యదర్శి సీహెచ్ పట్టాభిరామయ్య, పి.సీతారామరాజు, గాతల జేమ్స్, ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ జగపతిరాజు, ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
వ్యాపారం విలవిల
సైబర్ నేరగాళ్ల అరెస్ట్ ఆకివీడుకు చెందిన మహిళను డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి, ఆమె ఖాతాల నుంచి సుమారు రూ.93 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. 8లో uఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం: భీమవరంలోని జువ్వలపాలెం రోడ్డు, పీపీ రోడ్డు, మల్టీఫ్లెక్స్ ఏరియా, నరసాపురంలోని స్టీమర్ రోడ్డు, తణుకులోని వేల్పూర్ రోడ్డు, రాష్ట్రపతి రోడ్డు, పాలకొల్లులోని బస్టాండ్ సెంటర్, టెంపుల్ రోడ్డు, తాడేపల్లిగూడెం కేఎన్ రోడ్డు, తాలుకా ఆఫీస్ రోడ్లు వ్యాపారాలకు పేరొందాయి. దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి, రంజాన్, పెళ్లిళ్ల సీజన్లలో రెడీమేడ్, ఫ్యాన్సీ, కిరాణ, బంగారం, హోంగూడ్స్ తదితర వాటిపై రూ.2 వేల కోట్లకు పైనే వ్యాపారం జరుగుతుందని అంచనా. చిన్న వ్యాపారులు సైతం ఆయా సీజన్లకు నెల ముందే ఢిల్లీ, ముంబై, చైన్నె తదితర నగరాల నుంచి స్టాకులు పెట్టుకునేవారు. కొంతకాలంగా మార్కెట్లో వినియోగదారులు లేక అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. అద్దెలు కట్టలేని పరిస్థితుల్లో నష్టాలతో నడపలేక కొందరు వ్యాపారాలను మూసివేస్తుండటంతో షాపులు ఖాళీ అవుతున్నాయి. ప్రధాన సెంటర్లలో సైతం షాపుల ముందు టు–లెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. మరోపక్క ఉపాధి కోసం రోడ్లు పక్కన చిరు వ్యాపారాలు పెరుగుతున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సీజన్ మొదలుకానుండగా వ్యాపార వర్గాల్లో ఆ జోష్ కనిపించడం లేదు. జనం దగ్గర డబ్బుల్లేక మార్కెట్లో మనీ ట్రాన్సాక్షన్న్ తగ్గడం వ్యాపారాలపై ప్రభావం చూపిందని, మునుపటితో పోలిస్తే గత ఏడాది సీజన్లో 60 శాతం వ్యాపారం తగ్గినట్టు తాడేపల్లిగూడెం చాంబర్ ఆఫ్ కామర్స్కు చెందిన నేత ఒకరు తెలిపారు. జగన్ ప్రభుత్వంలో అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, చేయూత, రైతు భరోసా, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నేతన్న నేస్తం.. అన్ని వర్గాల వారికి మేలు చేస్తూ ప్రతీనెల ఏదొక సంక్షేమ పథకం చేతికంది మార్కెట్లో మనీ రొటేషన్ జరిగేది. ఉదాహరణకు 2023 జనవరి నుంచి డిసెంబరు వరకు సంక్షేమం రూపంలో రూ. 1,191 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమచేశారు. గ్రామగ్రామాన జగనన్న కాలనీల్లో రూ.1263 కోట్లతో చేపట్టిన పక్కా ఇళ్లు, రూ.260 కోట్లతో సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్లు నిర్మాణాలు, నాడు–నేడులో రూ. 369 కోట్లతో పాఠశాలల అభివృద్ధి, రూ. వందల కోట్లతో జిల్లాలో ఆక్వా వర్శిటీ, మెడికల్ కళాశాల, ఆస్పత్రుల అభివృద్ధి పనులు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీతో విద్య, వైద్యానికి భరోసా, మరోపక్క రియల్ ఎస్టేట్ జోరుతో భవన నిర్మాణం, అనుబంధ రంగాల్లోని కార్మికులు, వ్యాపారులకు ఏడాది పొడవునా పని దొరికి చేతినిండా డబ్బులతో వ్యాపారాలు కళకళలాడేవి. సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది సంక్షేమాన్ని విస్మరించింది. 2025 జనవరి నుంచి డిసెంబరు వరకు ఏడాది కాలంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, గ్యాస్ సబ్సిడీ, మత్య్సకార భృతి, వాహన సేవ పథకాల ద్వారా జిల్లా వాసులకు జమచేసింది కేవలం రూ.409 కోట్లు మాత్రమే. గత ప్రభుత్వం చేసిన మేలులో ఇది కేవలం మూడో వంతు మాత్రమే. మరోపక్క విద్యుత్ చార్జీలు, ఇంటిపన్నులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. మార్కెట్లో తగ్గిపోయిన మనీ రొటేషన్ బేరాల్లేక షాపులు ఖాళీ చేస్తున్న వ్యాపారులు బిజినెస్ ఏరియాల్లోనూ షాపుల ముందు టు–లెట్ బోర్డులు గత ప్రభుత్వంలో సంక్షేమ పరవళ్లతో వ్యాపారాల జోరు 2023లో పేదలకు చేకూరిన సంక్షేమ లబ్ధి రూ.1,191 కోట్లు 2025లో చేకూరిన లబ్ధి కేవలం రూ.409 కోట్లు నరసాపురం–పాలకొల్లు రోడ్డులో గతంలో అక్కడక్కడ శీతల పానీయాలు, పండ్లు, కూరగాయల దుకాణాలు కనిపించేవి. కొంతకాలంగా రోడ్డుకు ఇరువైపులా దారిపొడవునా గృహోపకరణాలు, సీజనల్ పండ్లు, కాయలు తదితర చిరువ్యాపారాలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. జిల్లాలోని భీమవరం–తణుకు, ఉండి – ఏలూరు, తణుకు–తాడేపల్లిగూడెం హైవే, తదితర రద్దీ రోడ్లలో పదుల సంఖ్యలో చిరు వ్యాపారాలు వెలుస్తున్నాయి. -
ఎందుకింత కడుపుమంట?
బాబు తీరుపై డిప్యూటీ సీఎం కొట్టు ఆగ్రహంపెంటపాడు: ప్రభుత్వ కళాశాలల ద్వారా పేద ప్రజలకు వైద్యం అందితే చంద్రబాబుకు ఎందుకింత కడుపు మంట అని, చంద్రబాబు ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. తాడేపల్లిగూడెంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. 18 నెలల పాటు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అరాచకాలు, దుర్మార్గాన్ని ప్రజలు ఎండగట్టాలన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉండగా ప్రతి జిల్లాకూ మెడికల్ కళాశాల వచ్చేలా ఏర్పాటు చేశారని జగన్కు పేరు రాకుండా చంద్రబాబు ప్రభుత్వం కడుపు మంటతో పీపీపీ విధానం పెట్టి పేదలకు అన్యాయం చేస్తోందన్నారు. ఈ నెల 15న భీమవరంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి కోటి సంతకాల ప్రతులు కేంద్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొట్టు సత్యనారాయణ పిలుపునిచ్చారు. 18న రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గవర్నర్కు కోటి సంతకాల ప్రతులను అందించే బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు ధారాదత్తం చేసేలా వేల ఎకరాల ప్రభుత్వ భూములు చంద్రబాబు లీజుకు అప్పగించేలా చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారని, ఇవన్నీ తెలిసినా.. పవన్ కల్యాణ్ చంద్రబాబు చేస్తున్న మోసంపై నోరెత్తకపోవడం విడ్డూరమన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం పట్టించుకునేలా గవర్నర్కు కోటి సంతకాలు ప్రతులు అందించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్నవారి ఆశలను నెరవేర్చాలని కొట్టు సత్యనారాయణ కోరారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు ముప్పిడి సంపత్కుమార్, కొలుకులూరి ధర్మరాజు, బండారు నాగు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ 18 నెలల కాలంలో గూడెం అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే ఏం చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. గూడెం నియెజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ గ్రాంట్ ద్వారా నిధులు మంజూరు చేయించారో ప్రజలకు చెప్పాలన్నారు. తాను ప్రత్తిపాడు రోడ్డుకు రూ.6.90 కోట్లతో టెండర్లు మంజూరు చేయించానని, ప్రత్తిపాడు, విప్పర్రు రోడ్డుతో పాటు, 5 ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయిస్తే.. నిధులు తెచ్చానని గొప్పలు చెప్పకోవడం ఎమ్మెల్యే మానుకోవాలన్నారు. -
చలికాలం.. జాగ్రత్తలు ఇలా
భీమడోలు: శీతల గాలులు ప్రజలను వణిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి ఉదయం పొద్దుపోయినా చలి పులి ప్రజలను భయపెడుతోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎక్కువగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. జిల్లాలోని ఆసుపత్రుల్లో రోగుల తాకిడి అధికంగా ఉంది. గతం కన్నా ఓపీ పెరగడంతో ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్త ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఊహించని స్థాయిలో పడిపోతున్నాయి. గుండె జబ్బులు, బీపీ, మధుమేహం, ఆస్తమా వ్యాధిగ్రస్తులకు శీతాకాలం శత్రువే. శరీరం వ్యాధుల బారిన పడేది ఈ సీజన్లోనే. ఎప్పుడైనా గుండె నొప్పిగా ఉందని చెప్పినా వెంటనే సమీపంలోని వైద్యులు వద్దకు తీసుకుని వెళ్లాలి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఉదయం, రాత్రి వేళల్లో పిల్లలకు బయటకు వెళ్లనివ్వకుండా చూడాలి. పెంపుడు జంతువులకు దూరంగా.. ఈ సీజన్లో పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. వైరస్ల వ్యాప్తికి పెంపుడు జంతువులు ప్రధాన కారణంగా వైరాలజీ నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో వాటిని బెడ్రూమ్, వంట గదిలోకి రానివ్వకుండా అదుపు చేయడం మంచిది. పిల్లలు, వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు పెంపుడు జంతువులను దరి దాపుల్లోకి కూడా వెళ్లకూడదని వైద్యులు సూచిస్తున్నారు. బయట ఆహారం తినొద్దు : వాతావరణం చల్లగా ఉంటే వేడి వేడిగా ఉండే పకోడి, బుజ్జీలు, బొండాలను విపరీతంగా అరగిస్తుంటాం. ఈ సీజన్లో అలాంటి ఆహారపదార్థలకు కొన్ని రోజులు విరామం ఇవ్వాలి. లేనిపక్షంలో ఆరోగ్యానికి చేటును తెస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే కూరగాయాలు, ఆకుకూరలు, ఏ, సీ, కే, విటమిన్లు పుష్కలంగా లభించే పదార్థాలనే తినాలి. బీటా కెనోటిన్, నైట్రస్ వంటివి ఉండే బీట్రూట్, క్యారెట్లను, నైట్రస్ వంటివి తినాలి. మసాలా ఫుడ్కు దూరంగా ఉంటే మేలు. గోరువెచ్చని నీటితో ఉపశమనం చల్లదనంతో ఊపిరితిత్తుల్లోని పొరలు అతిగా స్పందిస్తాయి. కూల్డ్రింక్స్లు, ఫ్రిజ్ల్లో పెట్టిన వాటిని తాగడం ప్రమాదకరం. జలుబు, దగ్గు, జ్వరం బారిన పడిన వారు గోరు వెచ్చని నీటిని తాగితే కాస్త ఉపశమనం కలుగుతుంది. అలాగే ధూమపానానికి దూరంగా ఉండడం ఎంతో శ్రేయస్కరం. వేడి, తాజా ఆహారం తీసుకోవాలి. కూరగాయాలు, పప్పులు మంచివి, నీరు తక్కువ కాకుండా తాగాలి. గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలి. చలిలో పిల్లలను బయటకు తీసుకు వెళ్లవద్దు. పాలు, గుడ్లు, పండ్లు, కూరగాయాలు ఇవ్వాలి. వయస్సుకు తగిన టీకాలు పూర్తి వేసి ఉండాలి. శీతాకాలంలో దీర్ఘకాలిక రోగులు, సాధారణ ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. సరైన నిద్ర, సమయానికి భోజనం అవసరం. చల్లని వాతావరణంలో ఎక్కువ సమయాన్ని గడపకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలి. వేకువ జామున, సాయంత్రం వేళల్లో బయటకు రాకుండా ఉండాలి. ఏమాత్రం ఆనారోగ్యం తలెత్తినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరింత అప్రమత్తంగా ఉండాలి. శ్వాస తీసుకోవడంంలో తీవ్ర ఇబ్బంది, బీపీ, షుగర్ ఎక్కువగా రావడం, మాట తడబడటం, చేతి కాలి బలహీనత, తీవ్ర దగ్గు లేదా జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ యాసం జేఎం సాయి, జనరల్ మెడిసిన్, సీహెచ్సీ, భీమడోలు -
క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం
కలెక్టర్ నాగరాణి భీమవరం: ఉద్యోగులు తమ విధి నిర్వహణతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని శారీరక, మానసిక దృఢత్వానికి, ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం గోదావరి క్రీడోత్సవాల్లో భీమవరం డివిజన్ ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. గతంలో క్రీడా పోటీలు కేవలం రెవిన్యూ, పోలీస్ శాఖల్లో మాత్రమే జరిగేవని నేడు జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులతో క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా 3,500 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వివరించారు. పోటీలలో క్రికెట్, వాలీబాల్, షటిల్, చదరంగం, క్యారమ్స్, షాట్ఫుట్, టెన్నికాయిట్, త్రోబాల్ వంటి క్రీడలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీలతో ఉద్యోగులలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్రెడ్డి మాట్లాడుతూ పోటీల్లో 35 శాఖలకు చెందిన 3,500 మంది అధికారులు, ఉద్యోగులు పాల్గొంటున్నారన్నారు. ముందుగా కలెక్టర్ డివిజన్ క్రీడా పోటీలలో పాల్గొనే క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. డీఆర్ఓ బి.శివన్నారాయణరెడ్డి, ఆర్డీవో కె.రామచంద్రారెడ్డి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎన్.మోహన్దాస్, డీపీఓ ఎం.రామనాథరెడ్డి, డీఈవో ఇ.నారాయణ, పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతిరావు పాల్గొన్నారు. -
రాజీ మార్గం.. రాజమార్గం
ఏలూరు (టూటౌన్): రాజీ మార్గమే.. రాజ మార్గమని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి అన్నారు. శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కేసుల పరిష్కారం కోసం 34 బెంచీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నెల రోజుల నుంచి నిర్వహిస్తున్న ఫ్రీ లోక్ అదాలత్ సిటింగ్స్, మధ్యవర్తిత్వం వల్ల 5 కేసుల్లో 50 లక్షల పైబడి వాహన ప్రమాద బీమా కేసుల్లో పరిహారంగా కక్షిదారులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అత్యధికంగా రూ.73 లక్షలను చోళ జనరల్ ఇన్సూరెనన్స్ కంపెనీకి సంబంధించి రాజీచేయడం జరిగిందని తెలియజేశారు. కావున కక్షిదారులు సత్వర పరిష్కారం కోసం లోక్అదాలత్ను వినియోగించుకోవాలన్నారు. జాతీయ లోక్ అదాలత్ నందు 10361 పెండింగ్ కేసులు 165 ప్రీలీటిగేషన్ కేసులను రాజీ చేసినట్లుగా డీఎల్ఎస్ఏ జిల్లా కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలియజేశారు. వీటిలో 147 వాహన ప్రమాద బీమా కేసులను రాజీ చేసి సుమారుగా రూ.14 కోట్ల వరకు పరిహారంగా కక్షిదారులకు అందించినట్లు చెప్పారు. ఇంకా కొన్ని కోర్టులలో కేసుల పరిష్కారం జరుగుతూ ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. న్యాయమూర్తులు, లోక్ అదాలత్ సభ్యులు న్యాయవాదులు పాల్గొన్నారు. 987 కేసుల రాజీ భీమవరం: మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షుడు, 3వ అదనపు జిల్లా జడ్జిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి బి.లక్ష్మీనారాయణ అధ్యక్షతన శనివారం భీమవరం అన్ని కోర్టుల ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. 42 సివిల్, 931 క్రిమినల్, 14 బ్యాంకు, బీఎస్ఎన్ఎల్ మొండిబాకీ కేసులు మొత్తం 987 కేసులు పరిష్కరించారు. రాజీ మొత్తం విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుందన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం నిమిత్తం నాలుగు బెంచ్లు ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులుగా ఎం.సుధారాణి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జి.సురేష్ బాబు, 1వ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పి.హనీషా వ్యవహరించారు. బెంచ్ కోర్టు మేజిస్ట్రేట్ నాగరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యేలేటి యోహాన్ (న్యూటన్), బార్ అసోసియేషన్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. జాతీయ లోక్అదాలత్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి -
సైబర్ నేరగాళ్ల అరెస్ట్
ఆకివీడు: సైబర్ నేరగాళ్ల ముఠాలోని నలుగుర్ని పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి కోర్టుకు హాజరపర్చారు. ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ బీ.భీమారావు శనివారం వివరాలు వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు ఆకివీడుకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు కాకర్ల రాజరాజేశ్వరిని డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి, ఆమె బ్యాంక్ ఖాతాల నుంచి దపదపాలుగా సుమారు రూ.93 లక్షలు కాజేశారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నాలుగు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీశ్వరరావు నాయకత్వంలోని బృందం బ్యాంక్ లావాదేవీలను విశ్లేషించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించింది. నిందితులు తమ బ్యాంక్ ఖాతాలను మనీ మ్యూల్ అకౌంట్లుగా ఉపయోగించారని అదనపు ఎస్పీ తెలిపారు. సైబర్ నేరగాళ్ల బృందంలో మొదటి స్టెప్లో పనిచేస్తున్న వ్యక్తులు నలుగురిని అరెస్టు చేసినట్లు వివరించారు. విశాఖపట్నం మధురవాడకు చెందిన జబ్బి జగదీష్ రెడ్డి ఖాతాకు రూ.5 లక్షలు జమ చేయగా, మహారాష్ట్రలోని ముంబాయి ప్రాంతంలోని గాడి అడ్డ కు చెందిన ఆరీఫ్ మహ్మద్ ఖాతాకు రూ.5 లక్షలు, హైదరాబాద్ దిల్షుక్ నగర్కు చెందిన పూసునూరి రాధారాణి ఖాతాకు రూ.11 లక్షలు, మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా, రామానంద్ నగర్కు చెందిన షాహిద్ లతీఫ్ షేక్ ఖాతాకు రూ.10 లక్షలు బదిలీ కావడంతో వారిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఆయా ఖాతాల్లో ఉన్న సొమ్ము రూ. 7,34,240 రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్బంగా సీఐ జగదీశ్వరరావు, ఎస్సై హనుమంతు నాగరాజు, భీమవరం వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఎం.నాగరాజు, ఉండి ఎస్సై ఎండీ.నజీరుల్లా, కాళ్ల ఎస్సై ఎన్.శ్రీనివాసరావు, భీమవరం టౌన్ ఎస్సై వంశీ, రెహ్మన్, వీర్రాజు, కానిస్టేబుళ్లను అభినందించారు. -
శ్రీవారి క్షేత్రంలో పోటెత్తిన భక్తులు
ద్వారకాతిరుమల: శ్రీనివాసా గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా, జై భవానీ.. జైజై భవానీ నామస్మరణలతో చిన్నతిరుపతి క్షేత్రం శనివారం మార్మోగింది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాది మంది భక్తులు క్షేత్రానికి విచ్చేశారు. అలాగే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో జరుగుతున్న చంఢీ హోమంలో పాల్గొని, ఇరుముడులు సమర్పించి, దీక్షలు విరమించిన భవానీ మాలదారులు పెద్ద ఎత్తున తిరుగు ప్రయాణంలో ద్వారకాతిరుమలకు చేరుకున్నారు. దాంతో ఆలయ పరిసరాలు భక్తులు, భవానీ దీక్షాదారులతో కళకళలాడాయి. దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అనివేటి మండపం, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనార్థం భక్తులు ఆలయ ఆవరణలో బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని వేదికపై అమలాపురంనకు చెందిన గోకవరపు సూర్యకిరణ్ సతీమణి సులేఖ, భగవద్వాణి శిష్య బృందం చేసిన భగవద్గీత పారాయణతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. -
●మంచు కురిసే వేళలో..
మెట్ట ప్రాంతంలో ఉదయం విపరీతమైన పొగ మంచు కురుస్తోంది. ఉదయం 8 గంటలకు కూడా మంచు తెరలు వీడడం లేదు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మెట్ట ప్రాంతంలో గత కొద్ది రోజులుగా చలిగాలుల తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే దిగువకు పడిపోవడం, దీనికి తోడు చల్లటి గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు వణికిపోతున్నారు. చలి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చింతలపూడిలో శనివారం ఉదయం మంచు తెరలు వీడని దృశ్యాలివి. – చింతలపూడి -
మద్దిలో అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలోని ఆలయ ముఖ మండపంపై శనివారం స్వామి వారికి పంచామృత అభిషేకం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు వివిధ సేవల రూపేణా రూ.1,58,432 ఆదాయం సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. అలాగే, స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 2,127 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారన్నారు. భక్తులు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. తణుకు అర్బన్: తణుకు మండలం ముద్దాపురం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి కొయ్యలమూడి బృహతి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. మహాభారతానికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతోపాటు మహాభారతంలోని పాత్రలను గుర్తుచేసుకోవడం, అనర్ఘళంగా సంస్కృత శ్లోకాలు, తెలుగు నర్సరీ రెయిమ్స్ పఠించడం, గృహోపకరణాలను, శరీరంలోని భాగాలు, క్రియలు, జంతువులు, ఆకారాలు, కూరగాయలు గుర్తించి వాటి పేర్లు చెప్పడం, ఆంగ్లం, తెలుగులో 1 నుంచి 10 వరకు సంఖ్యలను లెక్కించడం వంటివి చిన్న వయసులోనే చేసినందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్చే ‘ఐబీఆర్ అచీవర్’ గా నవంబర్ 17, 2025న గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈనెల 10వ తేదీన తమ వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ సందర్భంగా చిన్నారి బృహతితోపాటు తల్లిదండ్రులు అనూష, గోవర్థన్లను పలువురు అభినందించారు. అప్పుల బాధ తాళలేక అంబులెన్స్ డ్రైవర్ ఆత్మహత్య జంగారెడ్డిగూడెం: అప్పుల బాధ తట్టుకోలేక ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. ఎస్సై ఎన్.వీరప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామానికి చెందిన పప్పవరపు శివ (32) జంగారెడ్డిగూడెంలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఈ నెల 6వ తేదీన ఆసుపత్రుల్లో క్లీన్ చేసే పారాగాట్ లిక్విడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా, అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. శివకు భార్య, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. భీమడోలు: జాతీయ రహదారి భీమడోలులోని అయ్యప్ప స్వామి గుడి వద్ద గురువారం ఆర్ధరాత్రి లారీలోని నగదు చోరీకి గురైంది. తెలంగాణ రాష్ట్రం నందివాడ మండలం పాలకొండ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ కమ్ గుమాస్తా బొమ్మనపల్లి శ్రీనివాస్ లారీ క్లీనర్లతో కలిసి తూర్పు గోదావరి జిల్లా మల్కీపురం నుంచి గుడివాడకు లారీలో వెళ్తున్నారు. మార్గమధ్యమైన భీమడోలు అయ్యప్ప స్వామి ఆలయం వద్దకు వచ్చేసరికి నిద్ర వస్తుండడంతో లారీ ఆపి వారి వద్ద గల రూ.1.50 లక్షల నగదును సీటు కింద పెట్టుకుని నిద్రించారు. ఉదయం లేచి చూసేసరికి ఆ నగదు కనిపించలేదు. దీనిపై లారీ డ్రైవర్ శ్రీనివాస్ భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెనుగొండ: సిద్ధాంతం జాతీయ రహదారిలో అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యంను, వాహనాన్ని స్వాధీనం చేసుకొన్నట్లు విజిలెన్స్ ఎస్సై కే.నాగరాజు తెలిపారు. శనివారం రీజనల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారి కే నాగేశ్వరరావుకి అందిన సమాచారంతో స్థానిక రెవెన్యూ, పౌర సరఫరా అధికారులతో కలసి ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. పీడీఎస్ రైన్ యజమాని గెల్లి విశ్వనాథగుప్తా, నేతేటి వెంకటేష్, లంక వెంకట్రావు, చోడపనేని సాయి దుర్గ ప్రవీణ్, గోవరపు అవినాష్లపై నిత్యవసర వస్తువుల చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
మెటీరియల్ నాణ్యత పరిశీలన
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వినియోగించే మెటీరియల్ నాణ్యత పరిశీలన కార్యక్రమం రెండవ రోజు కొనసాగింది. సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్) శాస్త్రవేత్తల బృందం హరేంద్ర ప్రకాష్, ఉదయ్భాను చక్రబోర్తి, సిద్దార్ద్ పి.హెడవూలు శనివారం ప్రాజెక్టులోని మట్టి, రాతి నాణ్యత పరీక్షలను నిర్వహించారు. గ్యాప్–1, –2 ప్రాంతాలు, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాంలో వినియోగించే మట్టి, రాతి నాణ్యత ప్రమాదాలను వారు పరిశీలన చేశారు. అలాగే నిర్మాణ ప్రాంతంలోని నీటి ఇంకుడు స్వభావాన్ని, మట్టి సాంద్రత పరీక్షలు చేశారు. అదేవిధంగా ఆయా మెటీరియల్స్ శాంపిల్స్ను సేకరించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తల బృందం మాట్లాడుతూ ప్రాజెక్టు ప్రాంతంలో నిర్వహించిన పరీక్షలతో పాటు, మరికొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున శాంపిల్స్ సేకరించిట్లు చెప్పారు. ఇదే విషయాన్ని వారు ఇంజనీరింగ్ చీఫ్ ఎన్.నరసింహమూర్తికి తెలియజేశామన్నారు. కాగా, శాస్త్రవేత్తల బృందం ఆదివారం ఢిల్లీ వెళ్లనుంది. తమ పర్యటనలో భాగంగా నిర్వహించిన పరీక్షల వివరాల నివేదికను జలవనరుల శాఖకు నివేదించనుంది. ఈ కార్యక్రమంలో ఈఈలు డి.శ్రీనివాస్, బాలకృష్ణ, మేఘా ఇంజనీరింగ్ జనరల్ మేనేజర్ ఎ.గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి, మేనేజర్లు వెంకటేష్, గణపతి తదితరులు పాల్గొన్నారు. భీమడోలు, పొలసానిపల్లి గ్రామాల్లో దొంగతనాలు భీమడోలు: భీమడోలు, పొలసానిపల్లి గ్రామాల్లో తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు చోరీలకు పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున మూడు ఇళ్లలో చొరబడి 9 కాసులకు పైగా బంగారు అభరణాలు, రూ.2 లక్షల నగదును అపహరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పొలసానిపల్లిలోని జీవీ హోమ్స్లోని గంజి సుబ్బారావు కుటుంబ సభ్యులు తన ఇంటికి తాళాలు వేసి విజయవాడలోని కుమారుడి ఇంటికి వెళ్లారు. అలాగే పక్క ఇంటిలోని పాస్టర్ వాసే యోషయా క్రైస్తవ సభలకు వెళ్లారు. ఈ రెండు ఇళ్లలోకి చొరబడిన దొంగలు లాకర్స్ను సైతం పగల కొట్టారు. గంజి సుబ్బారావు ఇంటిలోని 9 కాసుల బంగారు అభరణాలు, రూ.50వేల నగదు దొంగిలించగా, పాస్టర్ వాసే యోషయా ఇంటిలో బంగారు చెవిదిద్దులు, జత పట్టీలను అపహరించారు. ఇదే తరహాలో భీమడోలు గొలుసు గేటులోని తవ్వా రత్న ప్రభాకరావుకు చెందిన బంధువులు తమ ఇంటికి తాళాలు వేసి అమెరికా వెళ్లారు. అదును చూసిన దొంగలు ఆ ఇంట్లోకి ప్రవేశించి లాకర్ను ధ్వంసం చేసి రూ.1.5 లక్షల నగదుతో పరారయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై ఎస్కే మదీనా బాషా ఘటనా స్థలాలను పరిశీలించారు. క్లూస్ టీంలు తనిఖీ చేశాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై ఎస్కే మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దండగలా మారిన వ్యవసాయం
● ఓ వైపు ప్రకృతి నష్టం.. మరోపక్క దిగుబడి శూన్యం ● తీవ్రంగా నష్టపోయిన కౌలు రైతు ● మోంథా నష్టపరిహారం ఎప్పుడో?తణుకు అర్బన్: వ్యవసాయం పండుగలా జరిగిన రోజుల నుంచి వ్యవసాయం దండగ మాదిరిగా మారిన నేటి రోజుల్లో అన్నంపెట్టే రైతాంగం అతలాకుతలమైపోయింది. ప్రకృతి వైపరీత్యాలు, దిగుబడి తగ్గడం వంటి కారణాలతో రైతు పరిస్థితి దీనంగా మారింది. ఈ ఖరీఫ్ సీజన్లో వచ్చిన మోంథా తుపాను తాకిడికి పంట నీట మునిగి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. స్వర్ణరకం పూర్తిగా నేలకొరగగా, 1318 రకం మాత్రం నిలబడి ఉన్నా గింజ నూకతోపాటు పలు సమస్యలు తలెత్తి నష్టపోయామని రైతులు చెబుతున్నారు. అన్నం పెట్టే రైతు కష్టంలో ఉన్నప్పుడు కనీసం పరామర్శలకు కూడా ప్రజాప్రతినిధులు వెళ్లకపోగా వ్యవసాయ శాఖ అధికారులు సైతం పంట నష్టాన్ని సరిగ్గా నమోదు చేయలేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయామని అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. తణుకు నియోజకవర్గంలోని తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలకు సంబంధించి 39,876 ఎకరాల్లో రైతులు వరిసాగు చేయగా సుమారుగా 3,321 ఎకరాల్లో పంట నష్టం నమోదు చేసినట్లుగా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మోంథా నష్టపరిహారం ఏదీ? మోంథా తుపాను నష్టాన్ని వ్యవసాయ అధికారులు ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం అంటూ అరకొరగా నమోదుచేశారని పంట దిగుబడి పూర్తిస్థాయిలో రాలేదని ఆరోపిస్తున్నారు. నష్టం పూర్తిగా నమోదు చేయమంటే శాటిలైట్ అదీ ఇదంటూ కారణాలు చెప్పారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నష్టం నమోదుచేసిన దానికి కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని, వ్యవసాయాధికారులను అడిగినా పట్టించుకోవడంలేదని రైతులు చెబుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ఏ పంట నష్టం ఆ పంట సమయంలోనే రైతుకు అందేదని, బీమా చెల్లించకుండానే నష్టపరిహారం బ్యాంకు ఖాతాల్లో జమయ్యే పరిస్థితి ఉండేదని నేడు రైతును పట్టించుకునే నాధుడే లేడని వాపోతున్నారు. ఖరీఫ్ సీజన్లో వచ్చిన మోంథా తుపాను తాకిడికి రైతు పూర్తిగా నష్టపోయాడు. చేలు నేరకొరిగిపోయి తడిచిపోవడంతో దిగుబడి తగ్గిపోయి రైతు నష్టాల ఊబిలో కూరుకుపోయాడు. ముఖ్యంగా కౌలు రైతుకు గింజ కూడా మిగలని దుస్థితి నెలకొంది. ఎకరాకు రూ. 30 వేలు పెట్టుబడి పెట్టి 25 బస్తాలు దిగుబడి వచ్చిన పరిస్థితిలో మగతాకు ఏమివ్వాలి, కౌలు రైతుకు ఏం మిగలాలి. తడిచిన ధాన్యం నష్టంగా నమోదుచేయమంటే వ్యవసాయశాఖ అధికారులు చొరవ చూపలేదు. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పెట్టుబడిగా ముందే అందించడంతోపాటు ఏ పంట నష్టం ఆ పంట సమయంలోనే అందించి రైతును ఆదుకున్నారు. – ఆడారి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ రైతు విభాగం అత్తిలి మండల అధ్యక్షుడు వ్యవసాయరంగంలో వ్యవసాయం చేసేది అధికశాతం కౌలు రైతులే కావడంతో ఈ మోంథా తుపాను దెబ్బకి భారీగా నష్టపోయామని కౌలు రైతులు చెబుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో పంట దిగుబడి తగ్గడంతోపాటు ధాన్యం తడిచిపోయి చివరి గింజ వరకు చేతికి అందకపోగా రైతుకు మగతా ఇచ్చేయగా చేతికి ధాన్యం గింజ రాలేదని వాపోతున్నారు. అన్నదాతా సుఖీభవా పథకం కౌలు రైతుకు కూడా అందిస్తామని ఎన్నికల ముందు కూటమి నేతలు హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయలేదని కౌలు రైతులు ఆరోపిస్తున్నారు. గత ప్రభ్వుతంలో ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టం వెంటనే అందేవని నేడు రైతుకు ఎటువంటి ప్రోత్సాహ ం లేకుండా పోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. -
నాకౌట్ దశకు సాఫ్ట్బాల్ పోటీలు
వీరవాసరం : వీరవాసరం ఎంఆర్కే జడ్పీహెచ్ఎస్ పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 17 సాఫ్ట్ బాల్ పోటీలు నాకౌట్ దశకు చేరుకున్నాయని పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి పీఎస్ఎన్ మల్లేశ్వరరావు, దాసరి సునీత తెలిపారు. రెండవ రోజు బాలికల జట్ల ఫలితాలు విజయనగరం జిల్లా బాలికల జట్టు గుంటూరు జట్టుపై 02:01 తేడాతో, ప్రకాశం జిల్లా జట్టు విశాఖపట్నం జట్టుపై 11:01 తేడాతో, అనంతపురం జట్టు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జట్టుపై 11:01 తేడాతో, వైఎస్సార్ కడప జట్టు శ్రీకాకుళం జట్టుపై 08:04 తేడాతో, పశ్చిమగోదావరి జిల్లా జట్టు తూర్పుగోదావరి జిల్లా జట్టుపై 02–01 తేడాతో, విజయనగరం జట్టు కృష్ణా జిల్లా జట్టుపై 04–01 తేడాతో గెలుపొందాయి. బాలికల క్వార్టర్ ఫైనల్ ఫలితాలు పశ్చిమగోదావరి జిల్లా జట్టు ప్రకాశం జట్టుపై 19– 09 తేడాతో , విజయనగరం జట్టు శ్రీకాకుళం జట్టుపై 12–01 తేడాతో, తూర్పుగోదావరి జిల్లా జట్టు అనంతపురం జట్టుపై 05–01 తేడాతో , కడప జట్టు గుంటూరు జట్టుపై విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. బాలుర ఫలితాలు విజయనగరం జట్టు విశాఖ జట్టుపై 03–00 తేడాతో, తూర్పుగోదావరి జిల్లా జట్టు నెల్లూరు జట్టుపై 02–00 తేడాతో, గుంటూరు జట్టు కర్నూలుపై 13–00 తేడాతో, పశ్చిమగోదావరి జిల్లా జట్టు అనంతపురం జట్టుపై 07–01 తేడాతో, కడప జట్టు కృష్ణా జిల్లా జట్టుపై 01–00 తేడాతో , విజయనగరం జట్టు చిత్తూరు జట్టుపై 05–00 తేడాతో విజయం సాధించాయి. బాలుర క్వార్టర్ ఫైనల్ ఫలితాలు విజయనగరం జట్టు ప్రకాశంపై, గుంటూరు జట్టు కడప జట్టుపై, పశ్చిమగోదావరి జిల్లా జట్టు విశాఖ జట్టుపై గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. ఆదివారం ముగింపు కార్యక్రమం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ బాల బాలికల జట్లను ఎంపిక చేయడం జరుగుతుందని పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు పీఎస్ఎన్ మల్లేశ్వరరావు, దాసరి సునీత, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాచింకి శ్రీనివాస్ తెలిపారు. -
ఉద్యాన వర్సిటీ తాత్కాలిక వీసీగా ధనుంజయరావు
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం తాత్కాలిక వీసీగా డాక్టర్ కె.ధనుంజయరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. యూనివర్సిటీలో డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీయల్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ గా ధనుంజయరావు పనిచేస్తున్నారు. కొత్త వీసీ నియామకం జరిగే వరకూ ఆయన ఉద్యోగంలో ఉంటారు. ఈ ఏడాది ఆగస్టు 31న వీసీగా పనిచేస్తున్న డాక్టర్ కె.గోపాల్ ఉద్యోగ విరమణ చేశారు. తర్వాత వీసీ వ్యవహారం న్యాయపరమైన వ్యాజ్యాలతో సాగింది. యూజీసీ నిబంధన లు వ్యవసాయశాఖ పరిఽధిలోని ఉద్యాన వర్సి టీ ప్రొఫెసర్లకు వర్తించకపోవడంతో, ఉద్యోగ విరమణ వయసు గడువు పొడిగించడం వంటివి హైకోర్టు ఆదేశాలతో చెల్లలేదు. దీంతో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ద్వారా ప్రభుత్వానికి పంపించిన పేర్లు, న్యాయపరమైన అంశాలు తదితర వాటిని పరిశీలించిన ప్రభుత్వం తా త్కాలిక వీసీని నియమించింది. దీంతో వీసీ కుర్చీపై పీఠముడి వీడింది. భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం కలెక్టరేట్లో శుక్రవారం జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్లతో స మీక్షించారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు రాకుండా పనిచేయాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలన్నారు. అలాగే పీజీఆర్ఎస్లో వస్తు న్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలన్నారు. వేర్వేరు జిల్లాల నుంచి వచ్చిన రిజిస్ట్రేషన్లు సక్రమంగా నిర్వహించాలన్నారు. దళారుల ప్రమే యం లేకుండా చూడాలని, కార్యాలయాల్లో హెల్ప్డెస్క్లు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏలూరు (టూటౌన్): సంక్రాంతి రద్దీ దృష్ట్యా జనవరిలో అనకాపల్లి–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్–అనకాపల్లి మధ్య 07041 గల రైలు ప్రతి ఆదివారం (4, 11, 18 తేదీల్లో) ప్ర త్యేక సర్వీసుగా నడుపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే అనకాపల్లి–సికింద్రాబాద్ మధ్య 07042 గల రైలు ప్రతి సోమవారం (5, 12, 19 తేదీ ల్లో) మధ్య నడుస్తుందన్నారు. ఈనెల 21న 07274 గల రైలు మచిలీపట్నం–అజ్మీర్కు, 07275 గల రైలు ఈనెల 28న అజ్మీర్–మచిలీపట్నంకు నడుపుతున్నట్టు పేర్కొన్నారు. భీమవరం: జిల్లాలో ఏపీ టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) శుక్రవారం ఆరు కేంద్రాల్లో నిర్వహించగా 91.88 శాతం అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. ఉదయం 640 మందికి 585 మంది, మధ్యాహ్నం 640 మందికి 591 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. ఏలూరులో 333 మంది హాజరు భీమవరం: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పశ్చిమగోదావరి జిల్లా కమిటీ ఎన్నికలను స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్లో శుక్రవారం నిర్వహించారు. ఐవీవీ సత్యనారాయణ (డి ప్యూటీ తహసీల్దార్, నరసాపురం) జిల్లా అధ్యక్షుడిగా, మంతెన రామ్ప్రసాద్ రాజు (డిప్యూటీ తహసీల్దార్, ఉండి) అసోసియేట్ అధ్యక్షుడిగా, పీడీ జగన్మోహన్ జిల్లా సెక్రటరీగా ఎన్నిక య్యారు. వీరితోపాటు ఆర్గనైజింగ్ సెక్రటరీలు గా సీహెచ్ రవిరాజు, ఎం.మహేశ్వరరావు, ఎగ్జి క్యూటివ్ మెంబర్లను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా ఏలూరు జిల్లా ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.రమేష్కుమార్ తదితరులు వ్యవహరించారు. -
కదం తొక్కి.. ప్రభుత్వంపై గళమెత్తి..
గర్జించిన అంగన్వాడీలు భీమవరం: సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు గళమెత్తారు. భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో వేతనాల పెంపు తప్పదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా అంగన్వాడీలకు వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు. మాత శిశు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలకు నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటుచేయాలని, అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యకర్తల్లో అధిక మంది పేద మహిళలే ఉన్నారని, వారిని ఆదుకోవాలన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు సిద్ధమని గోపిమూర్తి అన్నారు. ఐసీడీఎస్ జిల్లా అధికారి పీడీ, డీఆర్వో వచ్చి ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడి వారి నుంచి విన తిపత్రం స్వీకరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వాసుదేవరావు, కోశాధికారి పీవీ ప్రతాప్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.రాజారామ్మోహన్రాయ్, ఎం.ఆంజనేయులు, అంగన్వాడీల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.కల్యాణి, ఎండీ హసీనా, ఉషారాణి, తులసి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రకమశిక్షణకు బాలోత్సవం దోహదం
కలెక్టర్ నాగరాణి భీమవరం: బాలల్లో క్రమశిక్షణకు బాలోత్సవాలు దోహదపడతాయని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. స్థానిక ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం బాలోత్సవాలు ప్రారంభమయ్యాయి. భీమవరం బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మూడో ఏడాది నిర్వహిస్తున్న బాలల సంబరానికి కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్సీ గోపిమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ వినోదం, మానసిక వికాసం కోసం విద్యార్థులు బా లోత్సవాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఆటవిడుపుగా సామాజిక, సాంస్కృతిక అంశాలు, క్రమశిక్షణ, శ్రమ, దేశభక్తి, అభ్యుదయ భావాలు, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెంపొందించడంలో బాలోత్సవాలు ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. ఎమ్మెల్సీ గోపిమూర్తి మాట్లాడుతూ బాలోత్సవాల నిర్వహణ ద్వారా బాలల్లో సత్ప్రవర్తన, సృజనాత్మకత పెంపొందుతాయన్నారు. అలరించిన ప్రదర్శనలు బాలోత్సవాల్లో భాగంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శాసీ్త్రయ నృత్యం బృందం, సోలో విచిత్ర వేషధారణ, ఏకపాత్రాభిన యం, జానపద నృత్యం బృందం, సోలో జానపద గీతాలు ఆలాపన సోలో, బృందం సీనియర్స్ జూనియర్స్, చిన్నపిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్సెస్, అకడమిక్ అంశాల్లో చిత్రలేఖనం, జనరల్ నాలెడ్జ్ క్విజ్, పద్యం–భావం, రైమ్స్, వ్యాసరచన, కథలు చెప్పడం, కవితారచన,క్లేతో బొమ్మలు బెస్ట్ ఫ్రం వేస్ట్, కార్టూన్స్ వేయడం, జ్ఞాపకశక్తి పరీక్షలు సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్స్ కేటగిరీల్లో ప్రారంభమయ్యాయి. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంతవర్మ, డీఈఓ ఈ.నారాయణ, కళాశాల డైరెక్టర్లు ఎం.జగపతిరాజు, ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు, బాలోత్సవం అధ్య క్షుడు ఇందుకూరి ప్రసాదరాజు, ప్రధాన కార్యదర్శి సీహెచ్ పట్టాభిరామయ్య, కోశాధికారి పి.సీతారామరాజు అసోసియేట్ అధ్యక్షుడు గాతల జేమ్స్ తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ కార్మికులకు పని భారం
భీమవరం: ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, వారి అపరిష్కృత సమస్యలను పరిష్కారించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు డిమాండ్ చేశారు. మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్త పిలుపులో భా గంగా శుక్రవారం స్థానిక ప్రభుత్వాస్పత్రి వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మణ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చెల్లబోయిన మాట్లాడుతూ పారిశుద్ధ్య కా ర్మికులకు పెండింగ్ వేతనాలను జమచేయకపోవ డం దారుణమని, కనీస వేతనం రూ.26 వేలు ఇ వ్వాలని, ఈస్ఐ, పీఎఫ్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పడకల స్థాయికి అనుగుణంగా కార్మికులను నియమించాలన్నారు. ఫినాయిలు, గ్లౌజులు, చీపుర్లు, మాస్కులు అందించాలని డిమాండ్ చేశా రు. ఏఐటీయూసీ నాయకులు వైవీ ఆనంద్, ఎం. లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్ బ్యాగ్.. లేదు బాగు
నేడు నవోదయ పరీక్ష జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతికి ప్రవేశ పరీక్ష 11 కేంద్రాల్లో శనివారం ఉదయం 11.30 గంటల నుంచి నిర్వహించనున్నారు. 10లో uశనివారం శ్రీ 13 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం: విద్యాసంవత్సరం మధ్యలోనే స్కూల్ బ్యాగుల డొల్లతనం బయటపడింది. నాణ్య త లేక కొద్దికాలానికే చిరిగిపోవడం ప్రారంభించాయి. మళ్లీమళ్లీ కుట్లు వేయించుకుంటూ కొందరు విద్యార్థులు వీటినే వినియోగిస్తుండగా మరికొందరు బయటి మార్కెట్లో కొత్త బ్యాగులు కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటున్న పరిస్థితి. శుక్రవారం ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో పలుచోట్ల విద్యార్థులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని జగనన్న విద్యాకానుక బ్యాగులు వినియోగిస్తుండటం, అవి చెక్కుచెదరకుండా ఉండటం కనిపించింది. ఈ ఏడాది ఇచ్చిన బ్యాగులు చిరిగిపోవడంతో జగన్ మామ ఇచ్చిన బ్యాగులు తెచ్చుకుంటున్నట్టు విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. జిల్లాలో 93 వేల మంది.. 2025–26కి గాను జిల్లాలోని 1,395 పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు 93,458 మంది విద్యార్థులు ఉన్నారు. సర్వశిక్షణ అభియాన్ ద్వారా విద్యార్థులకు మూడు జతల యూనిఫామ్స్, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత షూ, రెండు జతల సాక్స్లు, స్కూల్ బ్యాగు, ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు అధనంగా డిక్షనరీలతో ఒక్కో విద్యార్థికి రూ.2,300 విలువ చేసే కిట్లను ప్రభుత్వం అందజేస్తోంది. విద్యాకానుకను సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర (ఎస్ఆర్కేవీఎం)గా పేరు మార్చిన చంద్రబాబు సర్కారు విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి పూర్తిస్థాయిలో కిట్లు పంపిణీలో విఫలమైంది. జూన్లో స్కూల్స్ రీఓపెన్ రోజుకు బుక్స్ మి నహా షూలు 43 శాతం రాగా, యూనిఫాంలు 53 శాతం, బ్యాగులు 65 శాతం మాత్రమే పాఠశాలలకు చేరుకున్నాయి. కొద్దిరోజుల తర్వాత మిగిలినవి వచ్చాయి. నాసిరకంగా బ్యాగులు ఎస్ఆర్కేవీఎంగా విద్యార్థులకు అందజేసిన బ్యా గులు నాసిరకంగా ఉన్నాయి. ఒక్కో బ్యాగుకు దా దాపు రూ.700 చొప్పున రూ.6.54 కోట్ల వరకు ప్రజాధనం వెచ్చించినట్టు తెలుస్తోంది. నాణ్యత లేకపోవడంతో పంపిణీ చేసిన కొద్దికాలానికే చిరిగిపోవడం, జిప్పులు ఊడిపోవడం, భుజాలకు తగిలించుకునే బెల్టులు తెగిపోవడం మొదలయ్యాయి. ఈ బ్యాగుల్లో పుస్తకాలు ఎక్కడ జారిపడిపోతాయో నని భయపడాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. కొందరు పేద విద్యార్థులు తరచూ వీటిని కుట్టించుకుంటూ వినియోగిస్తుండగా మరికొందరు కొత్తవి కొనుగోలు చేసుకుంటున్నారు. పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన బ్యాగులతో ఏడాది పొడవునా ఇబ్బంది ఉండేది కాదని, పూర్తికాలం మన్నేవని అంటున్నారు. ఈ ఏడాది ఇచ్చిన బ్యాగులు రెండు నెలలకే చిరిగిపోగా జగనన్న విద్యాకానుక బ్యాగులు ఇప్పటికీ చెక్కుచెదరలేదని కొందరు పిల్లలు ఇప్పటికీ వాటినే వినియోగిస్తున్నట్టు చెబుతున్నారు. ఏం బ్యాగున్నాయని..! నాసిరకంగా ఎస్ఆర్కేవీఎం బ్యాగులు జిల్లాలో 93,458 మంది విద్యార్థులకు పంపిణీ ఇచ్చిన రెండు నెలలకే చిరిగిపోతున్న వైనం ప్రజాధనం దుర్వినియోగం కుట్టించుకుంటున్న కొందరు విద్యార్థులు కొత్తవి కొనుక్కున్న మరికొందరు నేటికీ వినియోగంలో జగనన్న విద్యాకానుక బ్యాగులు ఈ చిత్రాన్ని గమనించారా ఈ విద్యా సంవత్సరానికిగాను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం కింద ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం పంపిణీ చేసిన స్కూల్ బ్యాగు ఇది. ఇచ్చిన రెండు నెలలకే జిప్లు వదిలేసి చిరిగిపోవడంతో కుట్లు వేయించగా చివరికి ఇలా తయారయ్యాయి. తాడేపల్లిగూడెం రూరల్ ఎల్.అగ్రహారంలో ఈ బ్యాగ్లతో విద్యార్థులు స్కూల్కు వెళుతూ కనిపించారు. ఈ చిత్రాన్ని గమనించారా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగనన్న విద్యాకానుకగా విద్యార్థులకు అందజేసిన స్కూల్ బ్యాగ్ ఇది. ఉండి ప్రభుత్వ హైస్కూల్కు చెందిన విద్యార్థి ఈ బ్యాగ్తోనే స్కూల్కు వస్తూ కనిపించాడు. ఆరా తీస్తే ఈ ఏడాది జూన్లో ఇచ్చిన బ్యాగు చిరిగిపోవడంతో ఈ బ్యాగ్ను వినియోగిస్తున్నట్టు చెప్పాడు. రెండేళ్ల క్రితం అందజేసిన ఈ బ్యాగ్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం గమనార్హం. మా అబ్బాయి ఏడో తరగతి, మా అమ్మాయి 10వ తరగతి మోగల్లు హైస్కూల్లో చదువుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు నాణ్యత లేవు. ఇచ్చిన కొన్ని రోజులకే పాడై తెగిపోయాయి. దీంతో మార్కెట్లో కొత్త బ్యాగులు కొనాల్సి వచ్చింది. – బేతాళ యేసు, విద్యార్థుల తండ్రి, మోగల్లు గతంలో టీడీపీ హయాంలో సగం విద్యాసంవత్సరం ముగిసినా పాఠశాలలకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు చేరక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. అప్పట్లో టెక్ట్స్ బుక్స్, యూనిఫాం, షూస్ మాత్రమే ఇచ్చేవారు. 2019 సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల విద్యకు పెద్దపీట వేశారు. విద్య వైపు వారిని మరింత ప్రోత్సహించే దిశగా జగనన్న విద్యాకానుకను అమలుచేశారు. గతంలో మాదిరి పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, షూస్తో పాటు అదనంగా నోట్ బుక్స్, బెల్టు, బ్యాగు, ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు డిక్షనరీలు జోడించారు. ఏడాది పొడవునా విద్యార్థులకు ఉపయోగపడేలా నాణ్యతకు ప్రాధాన్యమిచ్చేవారు. పాఠశాలలు తెరిచిన రోజునే పూర్తిస్థాయిలో విద్యార్థులు అందరికీ విద్యాకానుక కిట్లు అందజేస్తూ వచ్చారు. బ్యాగుల నాణ్యతను అప్పట్లో స్వయంగా ముఖ్యమంత్రి పరిశీలించడంతో అధికారులు సైతం అప్రమత్తంగా ఉండేవారు. -
జాడలేని అప్రోచ్ రోడ్లు
● గత ప్రభుత్వంలో రూ.36 కోట్ల మంజూరు ● ఎన్నికల కోడ్తో నిలిచిన టెండర్లు ● చంద్రబాబు ప్రభుత్వంలో అటకెక్కిన వైనం ● కేంద్ర మంత్రి ఉన్నా ఫలితం శూన్యం భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలోని యనమదుర్రు డ్రెయిన్పై నిర్మించిన వంతెనలు అప్రోచ్ రోడ్లు లేక నిరుపయోగంగా మారాయి. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో (2004 నుంచి 2009 వరకు) డెల్టా ఆధునికీకరణలో భాగంగా భీమవరంలో చేపల మార్కెట్, భీమవరం మండలంలోని గొల్లవానితిప్ప, తోకతిప్ప ప్రాంతాల్లో వంతెనలు మంజూరు చేసి నిర్మాణాలు పూర్తిచేశారు. ఆయన అకాల మరణంతో వంతెనల అప్రోచ్ రోడ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. అనంతరం వచ్చిన పాలకులు వీటిని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్రోచ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. అయితే ఎన్నికల కోడ్తో టెండర్ల ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అప్రోచ్లపై దృష్టి సారించకపోవడంతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. గత ప్రభుత్వంలో రూ.36 కోట్లు జిల్లాలో తీర, భీమవరం ప్రాంతాల ప్రజల ఇబ్బందుల దృష్ట్యా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.36 కోట్లు మంజూరు చేసింది. తొలుత ప్రాథమిక అంచనాల ప్రకారం మాజీ సీఎం జగన్ రూ.15.30 కోట్లను మంజూరు చేశారు. డిజైన్లను పూర్తి చేసి శాశ్వత ప్రాతిపదికన అప్రోచ్ల నిర్మాణానికి సిద్ధమవుతున్న తరుణంలో డిజైన్లను మార్పు చేయాల్సి వచ్చింది. దీంతో కొత్త డిజైన్లతో అప్రోచ్లను నిర్మించాలని మరోసారి జగన్కి వివరించగా ఆయన రూ.36 కోట్లు నిధులను మంజూరు చేశారు. ఆర్అండ్బీ అధికారులు పరిశీలించి పంపించిన డిజైన్లను గత ప్రభుత్వం ఖరారు చేసి పనులకు టెండర్లు కూడా పిలిచింది. అయితే ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఎన్నికల కోడ్ రావడంతో టెండర్లు నిలిపోయాయి. నిధులు నిర్మాణం కోసం అలాగే ఉండిపోయాయి. 17 నెలలుగా ప్రస్తావనే లేదు చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కి 17 నెలలు గడుస్తున్నా వంతెనల అప్రోచ్ల నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదు. వీటి గురించి స్థానిక ప్రజాప్రతినిధి, అధికారులు ప్రస్తావించిన దాఖలాలు లేవు. నిధు లు మంజూరై నిర్మాణాలు చేపట్టకపోవడంపై సర్వ త్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కు ట్రలతోనే నిర్మాణాలు చేపట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర మంత్రి ఉన్నా.. నరసాపురం ఎంపీ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాజ్యసభ ఎంపీ పాకా సత్యనారాయణ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఈ ప్రాంతానికి చెందిన వారైనా అప్రోచ్ల నిర్మాణాలు అడుగు ముందుకు పడటం లేదు. కూ టమి నాయకులు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని విమర్శించడం తప్ప మంజూరైన రూ.36 కోట్ల నిధుల వినియోగంపై దృష్టి పెట్టడం లేదనే వి మర్శలు ఉన్నాయి. ప్రభుత్వం, అధికారులు అప్రోచ్లపై నిర్లక్ష్యం వీడి పనులు త్వరితగతిన చేపట్టాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
సోలార్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి
సాక్షి, విశాఖపట్నం : ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ కార్యక్రమం ప్రారంభానికి, వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబు చేపట్టబోయే శంకుస్థాపన కార్యక్రమాలకు ఈ నెలాఖరులోపు ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాలు సిద్ధం కావాలని చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు. సాగర్నగర్లోని సీఓఈఈటీ భవనంలో పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకం, ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, ఎస్సీ, ఎస్టీ రూఫ్ టాప్ సోలార్, పీఎం ఈ డ్రైవ్ పథకాలతో పాటు ఎంఎన్ఆర్ఈ, ఆర్డీఎస్ఎస్ ప్రాజెక్టులపై ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, నెడ్ క్యాప్ ఎండీ ఎం.కమలాకరబాబు, కలెక్టర్లు, ఈపీడీసీఎల్ అధికారులతో కలసి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈపీడీసీఎల్ చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని సీఎండీ పృథ్వీతేజ్ వివరించారు. నెలకు 10 మెగావాట్ల చొప్పున జరుగుతున్న ఇన్స్టాలేషన్లను రోజుకు ఒక మెగావాట్ సామర్థ్యానికి పెంచేలా పీఎం సూర్యఘర్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. ఈపీడీసీఎల్ పరిధిలో 2 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి వచ్చే ఏడాది మార్చిలోగా సమ్మతి తీసుకొని వారి ఇళ్లపై రెండు కిలోవాట్ల చొప్పున మొత్తం 400 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ పనులను పూర్తి చేయాలన్నారు. పీఎం కుసుమ్ పథకం కింద ఫీడర్ సోలరైజేషన్లో సంస్థ పరిధిలోని 8 జిల్లాల్లో 220 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్లకు భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్లు విజయ కె.ఎస్.రామసుందర రెడ్డి, స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎన్.ప్రభాకర రెడ్డి, ఈపీడీసీఎల్ డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, ఎస్.హరిబాబు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా అటవీ కలప తరలింపు
కొయ్యలగూడెం: అటవీ సంపదను అక్రమంగా తరలిస్తున్న అక్రమార్కులకు అద్దూఅదుపు లేకుండాపోతోంది. కన్నాపురం అటవీ శాఖ రేంజ్ కార్యాలయానికి ఎదురుగానే అక్రమంగా అడవిలో నుంచి నరికి వేసిన కలపను ట్రాక్టర్ పై శుక్రవారం అక్రమార్కుల యథేచ్ఛగా తరలించారు. ఇప్పటికే కన్నాపురం రేంజ్ పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ యథేచ్చగా నరికి వేస్తుండడంతో అక్రమ కలప రవాణా నిరోధించాల్సిన అటవీశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అటవీ సంపదను అక్రమంగా రాత్రులు మాత్రమే తరలించేవారు. అయితే అధికారుల నైరాస్యం, అలసత్వం, అవినీతి వల్ల పట్టపగలే ట్రక్కుల్లో అక్రమ కలప తరలిపోతున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బ్యారన్ క్యూరింగ్ కోసం అటవీ సంపదను తరలిస్తున్నప్పటికీ నామమాత్రంగా కూడా కేసులు నమోదు చేయకపోవడం గమనార్హం. అక్రమార్కులు సందిట్లో సడేమియా అన్నట్లుగా రిజర్వ్ ఫారెస్ట్లోని విలువైన కలపను కూడా యంత్రాలతో నరికి గృహోపకరణాలకు విక్రయిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. కేవలం నాలుగు నెలల వ్యవధి కాలంలో ఒక్కో బీట్ పరిధిలో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అటవీ శాఖ అధికారులకు, సిబ్బందికి మామూళ్లు అందుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు అక్రమ కలప నిరోధం, చెట్ల నరికివేతను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
14 వరకు విర్డ్లో ప్రత్యేక వైద్య శిబిరం
ద్వారకాతిరుమల: స్థానిక విర్డ్ ట్రస్ట్ ఆసుపత్రిలో ఈ నెల 11న ప్రారంభమైన ప్రత్యేక వైద్య శిబిరం 14 వరకు కొనసాగుతుందని ట్రస్ట్ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు శుక్రవారం విలేకరులకు తెలిపారు. తొలి రోజు మొత్తం 45 మంది రోగులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, అందులో 10 మందికి శస్త్ర చికిత్సలు చేసినట్టు చెప్పారు. 13, 14న ప్రముఖ వైద్య నిపుణులు భుజం, మోకాళ్ల సమస్యలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ శిబిరంలో వైద్యులు శ్రీనాథ్, భవ్యచంద్, శ్రీనివాస్ కంభంపాటి ప్రత్యేక సేవలను అందిస్తున్నారని పేర్కొన్నారు. -
అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ ప్రారంభం
వీరవాసరం: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అంతర్ జిల్లాల 69వ స్కూల్ గేమ్స్ అండర్ 17 బాల బాలికల సాఫ్ట్బాల్ టోర్నమెంట్ కం సెలక్షన్స్ శుక్రవారం వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఏసీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడా పోటీలను ప్రారంభించారు. శాసనమండలి సభ్యులు కవురు శ్రీనివాస్ వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం పరిచయం చేసుకున్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, మానసిక ఉత్తేజం కలుగుతాయన్నారు. అనంతరం క్రీడా పోటీల నిర్వాహక కమిటీ సభ్యులను, క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయ ప్రకాష్ ఎంపీపీ వీరవల్లి దుర్గ భవాని, సర్పంచ్ చికిలే మంగతాయారు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పిఎస్ఎన్ మల్లేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి బీవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణతో ముందుకు సాగాలి
నూజివీడు: మట్టిలో ఉన్న మాణిక్యాలను వెలికితీసే విద్యాసంస్థ ట్రిపుల్ఐటీలని, విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఏలూరు ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిషోర్ అన్నారు. నూజివీడు ట్రిపుల్ఐటీలో గూగుల్ డెవలపర్స్ గ్రూప్స్ ఆధ్వర్యంలో శుక్రవారం డెవ్ఫెస్ట్ను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్పీ జ్యోతీప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రమశిక్షణతో ముందుకు సాగితే పెద్ద పెద్ద లక్ష్యాలను సైతం సమర్ధవంతంగా సాధించవచ్చన్నారు. ప్రభుత్వం ప్రజాధనాన్ని విద్యకోసం ఖర్చు చేస్తోందని, విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధన కోసం పట్టుదలగా ముందుకు సాగాలన్నారు. గూగుల్ డెవలపర్స్ గ్రూప్స్ నిర్వహిస్తున్న డెవ్ ఫెస్ట్ ద్వారా తమ విజ్ఞానాన్ని మరింత పెంచుకోవాలని విద్యార్థులకు ఎస్పీ సూచించారు. ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పరిశ్రమల అవసరాలకనుగుణంగా నైపుణ్యాలను పెంచేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. అనంతరం గూగుల్ డెవలపర్స్ గ్రూపు ప్రతినిధులు విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ రీజనల్ ఉపాధి అధికారి తెంటు అనిల్, సైబర్ సెక్యురిటీ కన్సల్టెంట్ కల్యాణ్ దీక్షిత్, ఎంటర్ప్రైజెస్ మైండ్స్ ఏఐ ప్రాక్టీస్ లీడర్ వడ్లమాని మధు, డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్, ఏఓ బీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
మెట్టలో అంతరిస్తున్న జీడి తోటలు
● సాగుకు రైతన్న నిరాసక్తత ● ఇప్పటికే వేలాది ఎకరాలు కనుమరుగు చింతలపూడి: ఒకప్పుడు మెట్ట ప్రాంతంలో వేల ఎకరాల్లో సాగయ్యే జీడి మామిడి తోటలు క్రమ,క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఆశించినస్థాయిలో పంట చేతికి రాక, వచ్చినా సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కూడా అంతంత మాత్రమే. ఈ ప్రాంతంలో పంట సాగుకు అనువైన వాతావరణం ఉన్నప్పటికీ రైతులకు సూచలను అందించే వారు కరువవ్వడంతో ఏటేటా విస్తీర్ణం తగ్గుముఖం పడుతుంది. ఏటా మెట్ట రైతులకు కోట్లాది రూపాయల రాబడిని ఆర్జించి పెట్టిన జీడి మామిడి తోటలు ప్రస్తుతం అంతరించిపోతున్నాయి. ఓ ఏడాది లాభం, రెండేళ్ల నష్టం వస్తుండడంతో పదేళ్లుగా జీడి తోటలను తొలగించి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించారు. పెరిగిన భూగర్భ జలాల వినియోగం మెట్ట ప్రాంతంలో ఇటీవల ముఖ్యంగా పామాయిల్, మొక్కజొన్న, వేరుశెనగ, అరటి పంటలను ఎక్కువగా పండిస్తున్నారు. అదీకాక మెట్ట ప్రాంతంలో భూగర్భ జలాల వినియోగం పెరిగాక వాణిజ్య పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. చింతలపూడి సబ్ డివిజన్లో ఒకప్పుడు వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న జీడి తోటలు ప్రస్తుతం 2,000 హెక్టార్లకు చేరుకున్నాయి. గత కొన్నేళ్లు గా జీడి పిక్కల బస్తా రూ. 8 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుంది. ఈ ఏడాది ఇంత వరకు ధర అధికారికంగా వెల్లడి చేయలేదు. జీడి తోటల పెంపకం వల్ల రైతులకు రక,రకాలుగా ఆదాయం లభిస్తుంది. మన ప్రాంతంలో రైతులు జీడి పిక్కలను మాత్రమే సేకరిస్తారు. జీడి పండ్లను చెట్ల కిందే వదిలేస్తారు. అదే ఇతర రాష్ట్రాల్లో అయితే అక్కడి రైతులు పండ్లను కూడ సేకరించి ఆదాయం పొందుతున్నారు. వీటితో జామ్, పండ్ల రసాలు, తయారు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఏటా ఇక్కడి నుంచి కమీషన్ దారులు లారీల్లో జీడి పిక్కలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. మొత్తం మీద మెట్లలో ఓ వెలుగు వెలిగిన జీడి తోటలు ప్రస్తుతం కనుమరుగైపోతున్నాయి. ప్రభుత్వం జీడితోటల పెంపకం చేపట్టే రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించాలి. ముఖ్యంగా రైతులు పండించిన జీడి పిక్కలను ప్రభుత్వమే గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి. జీడి పరిశ్రమ అభివృద్ధి కోసం అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. – యర్రంశశెట్టి రామకృష్ణారావు, రైతు, నామవరం నాకు గ్రామంలో 4 ఎకరాల జీడిమామిడి తోట ఉండేది. జీడి పంటకు సరైన ప్రోత్సహం లేకపోవడం, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సస్యరక్షణ చర్యలు చేపట్టి సాగు చేస్తే పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర ఉండటం లేదు. దీంతో జీడి తోటను తొలగించి పామాయిల్ తోట నాటాను. – మాగసాని గురుబ్రహ్మం, జీడి మామిడి రైతు, కనిపెడ -
పోలవరంలో సీఎస్ఎంఆర్ఎస్ బృందం పర్యటన
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో సీఎస్ఎంఆర్ఎస్ బృందం పర్యటిస్తోంది. కేంద్ర జలవనరుల శాఖ పరిధిలోని మట్టి, పదార్థాల పరిశోధనా కేంద్రం (సీఎస్ఎంఆర్ఎస్) శాస్త్రవేత్తలు హరేంద్ర ప్రకాష్, ఉదయ్ భాను చక్రబోర్తి, సిద్దార్థ్ పీ హెడవూ ప్రాజెక్ట్ ప్రాంతంలో శుక్రవారం పర్యటించారు. పోలవరం ప్రాజెక్టులోని ప్రధాన ఎర్త్ కం రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ నిర్మాణంలో వినియోగించే మట్టి, రాళ్లు, ఇతర పదార్థాలను ఈ బృందం పరిశీలించి పరీక్షిస్తుంది. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉపయోగించే మట్టి నిల్వల నుంచి మట్టి నమూనాలను సేకరించి, వాటి లక్షణాల నిర్ధారణ కోసం ప్రయోగశాలలో ఈ బృందం పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ బృందం గ్యాప్–1, 2 ప్రాంతాల్లో నాణ్యతా పరీక్షలు కూడా నిర్వహించనుంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో వినియోగించే మట్టి, రాళ్లు, కంకర తదితరాలను వారు పరిశీలించి అక్కడికక్కడే పరీక్షించారు. కొంత పరిమాణాన్ని మరిన్ని పరీక్షల కోసం సేకరించారు. ఈ బృందం వెంట జలవనరుల శాఖ ఈఈలు డి.శ్రీనివాస్, బాలకృష్ణ, ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ ఎ.గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి, మేనేజర్లు వెంకటేష్, గణపతిరావు ఉన్నారు. -
వరి పొలాలకు నిప్పు ముప్పు
● అవగాహన లోపంతో నిప్పు పెడుతున్న రైతులు ● పట్టించుకోని అధికారులుపెనుమంట్ర : జిల్లాలోని వరి పొలాలకు నిప్పు ముప్పు ఏర్పడింది. కూలీల కొరత అధిగమించడానికి, సాగులో ఖర్చులను తగ్గించుకోవడానికి రైతులు కోత యంత్రాలతో వరి కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని మాసూళ్లు చేస్తున్నారు. అయితే కొందరు రైతులు కోతలు పూర్తయిన అనంతరం అవగాహన లోపంతో ఆ గడ్డిని పంట పొలాల్లో ఉంచి నిప్పు పెడుతున్నారు. గతంలో ఒకరిద్దరు ఇలాంటి పద్ధతులను అనుసరిస్తే వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచనల మేరకు రైతులకు అవసరం లేని గడ్డిని చేలోనే ట్రాక్టర్ తో మురగ దమ్ము చేసి దాళ్వా నాట్లు వేసేవారు. అయితే ఈ ఏడాది కోతల ముందు తుఫాన్ కారణంతో సాగునీటి సరఫరాను నెల రోజులుగా నిలిపేశారు. దీంతో పూర్తిస్థాయిలో ఇంకా సాగినీటి సరఫరా జరగపోవడంతో కొందరు రైతులు అవగాహన లోపంతో పంట పొలాల్లో నిప్పు పెట్టి గడ్డిని ధ్వంసం చేస్తున్నారు. భూసారానికి దెబ్బ పంట చేలో గడ్డికి నిప్పు పెడితే నేలలో భూసారం దెబ్బతినడమే కాకుండా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు ముందుకు రావడం లేదు. దీంతో రైతులు ఒకరిని చూసి ఇంకోకరు అన్నట్లు విచ్చలవిడిగా పంటపొలాల్లో గడ్డిని తగలబెడుతున్నారు. నాలుగు రోజులుగా పెనుమంట్ర మండలంలో అనేక మంది రైతులు మంట పెట్టడంతో పంట పొలాలు మసిబారిపోయాయి. శుక్రవారం సాయంత్రం కూడా చాలా మంది రైతులు పంట పొలాలకు నిప్పు పెట్టి గడ్డిని ధ్వంసం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రైతుల్లో అవగాహన కల్పించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. -
14 నుంచి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు
లేగ దూడల అందాల పోటీలు చూడు కట్టని పశువులకు గర్భస్థ పరీక్షలు, లేగ దూడల అందాల పోటీలను గురువారం కొణితివాడ వెటర్నరీ పశువుల ఆసుపత్రి వద్ద నిర్వహించారు. 8లో uభీమవరం (ప్రకాశంచౌక్): జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు 2025 గోడపత్రికను గురువారం కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి చేతుల మీదుగా విద్యుత్ శాఖ ఇంజనీర్లతో కలిసి ఆవిష్కరించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి మాట్లాడారు. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు బీఈఈ వారి సౌజన్యంతో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు మహోద్యమంగా నిర్వహించాలన్నారు. ఇంధన పరిరక్షణ ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పట్టణ, గ్రామాల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లా విద్యుత్ శాఖ అధికారి పి.ఉషారాణి, విద్యుత్ శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు. పల్ప్పోలియోను విజయవంతం చేయాలి ఈనెల 21న నిర్వహించనున్న పల్స్పోలియో కార్యక్రమాన్ని అన్ని శాఖలు అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. గురువారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా పల్స్పోలియో టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు 1,87,204 మందికి పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఇందుకు 1,315 పోలియో బూత్లను ఏర్పాటు చేశామన్నారు. -
లస్కర్లకు బకాయి వేతనాలు చెల్లించాలి
పెనుగొండ: జలవనరుల శాఖలో గోదావరి కుడి ఏటిగట్టుపై లస్కర్లకు ఏడు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులకు గురవతున్నారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సిద్ధాంతం సెక్షన్ పరిధిలోని లస్కర్లతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ వరదలు వస్తే నిద్రాహారాలు మాని ఏటిగట్టుపై కాపలా కాసే లస్కర్లకు నెలనెలా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏడాదిలో 365 రోజుల పనిచేయించుకుంటున్నా వారికి 10 నెలలకు మాత్రమే జీతాలు చెల్లించడం దారుణమన్నారు. సిద్ధాంతంలో అయిదుగురు లస్కర్లకుగాను కేవలం నలుగురుతోనే కాలం గడుతున్నారన్నారు. లస్కర్లకు పనిభారం తగ్గించాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకులు కే రత్నంరాజు, లస్కర్లు కడలి చింతారావు, దాసిరెడ్డి పెదకాపు, జాస్తి ప్రభాకర్, యాతం మాధవ రాయుడు పాల్గొన్నారు. -
రెండో శనివారం సెలవు ప్రకటించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయులపై అదనపు పని భారం తగ్గించడానికి రెండవ శనివారం ఈ నెల 13వ తేదీన పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. ఈమేరకు గురువారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. విద్యా క్యాలెండర్ ప్రకారం 220 పనిదినాలకు మించి పనిచేసిన పాఠశాలలకు మాత్రమే ఈ సెలవును అనుమతించాలని కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి, ఫ్యాప్టో చైర్మన్ జీ.మోహన్, సెక్రటరీ జనరల్ ఎం.ఆదినారాయణ, కో–చైర్మన్ జీ. వెంకటేశ్వరరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఆర్.రవికుమార్, ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి జే.రవీంద్ర, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల పోరుబాట
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు పోరు బాట పట్టారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గతంలో ఏలూరు కలెక్టరేట్, ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టారు. అయినా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వీరి సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోవడంతో మరోసారి తమ గొంతు వినిపించేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా ఈ నెల 12న ఏలూరు కలెక్టరేట్ వద్ద మూడు కార్మిక సంఘాలు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నాకు దిగుతున్నారు. అంగన్వాడీల జీతాలను పీఆర్సీకి అనుసంధానం చేయాలని, ఇటీవల గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా జీతాలను పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల హామీలను అమలు చేయాలి ఎన్నికల ముందు అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా వాటి ఊసే ఎత్తడం లేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న అంగన్వాడీలకు అమ్మకు వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్ఆర్ఎస్(ముఖ గుర్తింపు) విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నారు. టేక్ హోం రేషన్కు రిజిస్ట్రేషన్ మెలిక కూటమి ప్రభుత్వం టేక్ హోం రేషన్కు రిజిస్ట్రేషన్ మెలిక పెట్టింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల ద్వారా టేక్ హోమ్ రేషన్(టీహెచ్ఆర్) సేవలు పొందాలటే ఎఫ్ఆర్ఎస్ ముఖ గుర్తింపు యాప్ తప్పని చేశారు. యాప్లో రిజిస్టర్ కాకుంటే లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తారు. ఈ నెల ఒకటో తేదీనుంచే దీనిని అమలు చేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో అంగన్వాడీలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. జీతాలను పీఆర్సీకి అనుసంధానం చేయాలని డిమాండ్ ఎఫ్ఆర్సీని రద్దు చేయాలంటూ ఆందోళన నేడు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా -
13న జాతీయ లోక్ అదాలత్
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జాతీయ లోక్ అదాలత్ నందు రాజీయోగ్యమైన క్రిమినల్ కేసులు, సివిల్ తగాదాలు, కుటుంబ వివాదాల కేసులు, వాహన ప్రమాద బీమా కేసులు, బ్యాంకు లావాదేవీలు తదితర కేసులను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 13,800 కేసులను రాజీయోగ్యమైనవిగా గుర్తించడం జరిగిందని, అలాగే 33 బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ పాల్గొన్నారు. భీమవరం: భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నుంచి రెండు రోజులపాటు నిర్వహించే బాలోత్సవం కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భీమవరం పట్టణం, రూరల్, కాళ్ళ, ఆకివీడు, ఉండి, పాలకోడేరు, వీరవాసరం మండలాలకు చెందిన సుమారు 3 వేల మంది పాల్గొనే బాలోత్సవంలో కల్చరల్, అకడమిక్, డ్రాయింగ్ అంశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని బాలోత్సవం అధ్యక్షుడు ఇందుకూరి ప్రసాదరాజు, ప్రధాన కార్యదర్శి సీహెచ్ పట్టాభిరామయ్య తెలిపారు. 10 గంటలకు ప్రారంభ సభ అనంతరం బాలోత్సవాల ఈవెంట్స్ జరుగుతాయన్నారు. భీమవరం: జిల్లాలో అయిదు పరీక్షా కేంద్రాల్లో గురువారం నిర్వహించిన ఏపీ టెట్ పరీక్షకు 91.98 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ నారాయణ తెలిపారు. ఉదయం పరీక్షకు 506 మందికిగాను 466 మంది హాజరుకాగా, మధ్యాహ్నం పరీక్షకు 541 మందికి 497 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదుకాలేదని డీఈవో తెలిపారు. ఏలూరులో 327 మంది ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు రెండవ రోజు గురువారం 327 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం జరిగిన పరీక్షకు 176 మందికి గాను 166 మంది హాజరు కాగా, మధ్యాహ్నం నుంచి జరిగిన పరీక్షకు 174 మందికి గాను 161 మంది హాజరయ్యారు. పరీక్షల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. కై కలూరు: కై కలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నాయకులు బుసనబోయిన వెంకటేశ్వరరావు(బీవీ రావు), దాసరి అబ్రహం లింకన్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇరువురు నేతలను సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు పార్టీ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఏలూరు (టూటౌన్): పట్టణ ఎస్హెచ్జీ కుటుంబాల్లోని నిరుద్యోగ యువత కోసం శుక్రవారం జాబ్మేళా నిర్వహించనున్నట్టు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ పి.మాధవి గురువారం ప్రకటనలో తెలిపారు. ఏలూరు సీఆర్ రెడ్డి అటానమస్ కాలేజ్ ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు జాబ్మేళా ప్రారంభమవుతుందన్నారు. జంగారెడ్డిగూడెం, చింతలపూడి, నూజివీడు, ఏలూరు మునిసిపాలిటీల నుంచి యువత హాజరుకానున్నారని, 15 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు. -
రిజర్వు ఫారెస్ట్లో విధ్వంసం
శురకవారం శ్రీ 12 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: రిజర్వ్ ఫారెస్ట్లో పచ్చని విధ్వంసం ప్రారంభమైంది. అడ్డగోలుగా కలపను నరికి బహిరంగంగానే అక్రమ రవాణా చేశారు. అటవీ శాఖ బీట్ మీదుగానే నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు అడవి నుంచి కలప లోడుతో వస్తున్నాయి. గిరిజనులను కూలీలుగా మార్చి కొందరు గిరిజనేతరులు తెగబడిన ఈ విధ్వంసానికి అటవీశాఖా ఽఅధికారులు కూడా సహకరం అందిస్తుండటంతో 20 ఏళ్ల పైబడిన చెట్లు నేలకొరుగుతున్నాయి. పొగాకు బేరన్ క్యూరింగ్ కోసం ఈ కలపను వినియోగించడం, స్థానికంగా మార్కెట్ ఉండటంతో అక్రమార్కులు అందరికీ ఇవ్వాల్సిందిచ్చి బహిరంగంగా విక్రయిస్తున్నారు. జిల్లాలో పోలవరం నియోజకవర్గంలో ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉంటుంది. పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల వెంబడి వేలాది ఎకరాలు అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ప్రధానంగా పోలవరంలో అభయారణ్యం ఉండగా మిగిలిన రెండు మండలాల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ప్రధానంగా కన్నాపురం రేంజ్లో 17 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంది. ఈ క్రమంలో సంక్రాంతి నుంచి పొగాకు కోతలు పూర్తయితే బ్యారన్లల్లో క్యూరింగ్ ప్రక్రియ నిర్వహిస్తుంటారు. దీనికి అత్యధికంగా మారుజాతి కలపను వినియోగిస్తుంటారు. దీంతో కొందరు గిరజనేతరులు గిరిజనులను కూలీలుగా మార్చి అటవీ ప్రాంతంలో 20 నుంచి 25 సంవత్సరాల మారుజాతి చెట్లను ఎంపిక చేసి మెషీన్లతో నేలకూల్చి కలపను అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కొక్క లోడ్ కలప రూ.4 నుంచి 6 వేల ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కన్నాపురం రిజర్వ్ ఫారెస్ట్ రేంజ్లో మారుజాతి, వేగిస, సండ్ర, మద్ది, బండారు తదితర రకాల కలప వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. వందేళ్ల పైబడిన వృక్షాలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి. ఇవి కాకుండా అటవీశాఖ ప్రతి ఏటా విత్తనాలను సీజన్లో చల్లుతుంటారు. హోమ్ ఫర్నీచర్కు ఈ కలపను వినియోగిస్తుండటంతో అధిక డిమాండ్ ఉంటుంది. భారీ వృక్షాల మానులను ఫర్నీచర్కు, మిగిలిన మొత్తాన్ని క్యూరింగ్కు వినియోగిస్తుంటారు. అదే 25 ఏళ్ల పైబడిన మానులకు మంచి డిమాండ్ కూడా ఉంది. ఈ క్రమంలో బుట్టాయగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెంలో పొగాకు సాగు విస్తీర్ణం అధికంగా ఉంటుంది. ఒక్కొక్క బేరన్లో పొగాకు కాల్చడానికి 5 నుంచి 6 టన్నుల కలపను వినియోగిస్తుంటారు. ప్రతి సీజన్లో ఇదే తరహాలో అడవి నుంచి 500 నుంచి 800 టన్నులను అధికారకంగా నరికి విక్రయిస్తుంటారు. ఈ నెల 8న కన్నాపురం అటవీ శాఖ రేంజ్లోని కోపల్లె బీట్లో 3 హెక్టార్లలో అడవిలో నరికేసి ఉన్న కలప చెట్లు మొదళ్లను కొట్టేసి..అటవీ శాఖ అధికారులకు తెలిసే అక్రమ నరికివేతలు, రవాణా జరుగుతున్నాయనేది బహిరంగ రహాస్యం. ప్రధానంగా కన్నాపురం రేంజ్లో కన్నాపురం మెయిన్ రోడ్డు వద్దే ఫారెస్ట్ బీట్, అలాగే దొండపూడి వద్ద మరో బీట్ ఉంటుంది. నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు ఈ బీట్ల మీదుగానే రాకపోకలు సాగిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఒకే రోజు 40 ట్రక్కుల రిజర్వ్ ఫారెస్ట్ కలప యుద్ధ ప్రాతిపదికన తరలించారు. దీనిలో కోపల్లె బీట్ ఏరియాలో 3 హెక్టార్ల విస్తీర్ణంలో చెట్లను మెషీన్లతో నేలకూల్చి 40 ట్రక్కుల్లో తరలించినా కనీసం ఫారెస్ట్ అధికారులు తొంగిచూడని పరిస్థితి. మరోవైపు పొగాకు బేరన్లకు కలప రవాణా చేసే అక్రమార్కుల నుంచి భారీ ప్యాకేజీలు అటవీ శాఖాధికారులకు అందుతాయనే విమర్శ ఉంది. స్థానిక అధికారులు మొదలుకొని ఒక స్థాయి అధికారి వరకు అందరికీ మాముళ్లు ఉంటాయనే ఆరోపణలున్నాయి. దీంతో పొగాకు బేరన్ సీజన్ సమయంలో రెండు నెలల పాటు ఏం జరిగినా అన్నీ తెలిసి కూడా పట్టించుకోరనే అపవాదు ఉంది. కార్యాలయం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ కేసులు గత సంవత్సరం నమోదు కావడం గమనార్హం. కన్నాపురం అటవీ రేంజ్లో అడ్డగోలుగా కలప నరికివేత పొగాకు బేరన్ క్యూరింగ్ పనులకు కలప అక్రమ రవాణా ఫారెస్ట్ బీట్ మీదుగా నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు అడ్డగోలుగా దందా కొనసాగిస్తున్న మాఫియా అటవీశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోని వైనం -
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.26 వేలు కనీస వేతనం అందించాలి. ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత, గ్రాట్యూటీ అందించాలి. అంగన్వాడీలపై రాజకీయ వేధింపులను తక్షణం నిలుపుదల చేయాలి. – డీఎన్వీడి ప్రసాద్, ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ అంగన్వాడీలకు భారంగా మారిన ఎఫ్ఆర్ఎస్ (ముఖ కవళికల గుర్తింపు) విధానాన్ని తక్షణం రద్దుచేయాలి. నాణ్యమైన సెల్ ఫోన్లు, నెట్ కనెక్షన్లు అందించాలి. ఇతర కారణాల వల్ల రిజిస్టర్ కాని లబ్ధిదారులకు మాన్యూవల్గా రేషన్ అందించేందుకు అవకాశం కల్పించాలి. – పి.సుజాత, అధ్యక్షురాలు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీల వేతనాలను పీఆర్సీకి అనుసంధానం చేయాలి. అంగన్వాడీల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదు. కేంద్రంతో మాట్లాడి ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయించాలి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలి. – పి.భారతి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇటీవల గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా అంగన్వాడీల వేతనాలు పెంపుదల చేయాలి. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. తల్లికి వందనం పథకం అంగన్వాడీలకు అమలు చేయాలి. మినీ సెంటర్లను మెయిన్సెంటర్లుగా మార్చాలి. – టి.మాణిక్యం, కోశాధికారి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ -
ఏలూరులో పోలీస్ ఫుట్ పెట్రోలింగ్
ఏలూరు టౌన్: ఏలూరులో ట్రాఫిక్ సమస్యలపై ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ స్వయంగా రంగంలోకి దిగారు. నగరంలోని ప్రధాన రోడ్లపై నడుచుకుంటూ వెళుతూ ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు. ప్రధాన రద్దీ ప్రాంతాలైన ఫైర్స్టేషన్ సెంటర్, ఆర్ఆర్పేట, కొత్తబస్టాండ్ ప్రాంతాలను డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్తో కలిసి ఆయన పర్యవేక్షించారు. పుట్పాత్లపై వ్యాపారులను సైతం ఆరా తీశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై ఆయన పోలీస్ అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఇష్టారాజ్యంగా రోడ్లపై మోటారు సైకిళ్లు పెట్టడం, వ్యాపారాలు సాగిస్తే తీవ్ర ఇబ్బందులు తప్పవనే హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు భద్రతా భావం పెంపొందించటం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా పోలీస్ ఫుట్పెట్రోలింగ్ చేపట్టినట్లు చెప్పారు. రద్దీ ప్రాంతాలు, స్కూల్స్, కాలేజీలు, బస్టాండ్లు వంటి ప్రాంతాల్లోనూ నిఘా మరింత పెంచుతామని ఎస్పీ స్పష్టం చేశారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ ఫుట్పెట్రోలింగ్లో ఏలూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మణబాబు, త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. స్వయంగా రంగంలోకి ఎస్పీ శివకిషోర్ -
ఉత్సాహంగా లేగ దూడల అందాల పోటీలు
వీరవాసరం: తరచూ శీతకాలంలో చూడు కట్టని పశువులకు ఉచితంగా చికిత్స అందిస్తామని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ ఆర్.కోటలింగరాజు అన్నారు. గురువారం కొణితివాడ వెటర్నరీ పశువుల ఆసుపత్రి వద్ద రాష్ట్ర గోకుల్ మిషన్ క్యాంపులో కేంద్ర ,రాష్ట్ర పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రస్తుగణభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా చూడు కట్టని పశువులకు గర్భస్థ పరీక్షలు, లేగ దూడల అందాల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కోటలింగరాజు మాట్లాడుతూ పశువులు దీర్ఘకాలికంగా చూడు కట్టని, గర్భస్వావంతో బాధపడే పశువులకు ఉచితంగా చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా లేగ దూడల పోషణ సౌకర్యం , ఎదుగుదల ఉన్న దూడలకు అందాల పోటీలు నిర్వహించి గెలుపొందిన యజమానికి బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. వెటర్నరీ అధికారి బి.వరలక్ష్మి మాట్లాడుతూ 40 పశువులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి యజమానులకు మందులను అందించినట్లు తెలిపారు. లేగ దూడల ప్రదర్శనలో మొదటి బహుమతి నాగరాజు, రెండో బహుమతి వాడపల్లి సుబ్బరాజు, మూడో బహుమతి యరకరాజు సత్య హరిహర రాజు పొందారు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్లు ఎల్కే సుధాకర్, డాక్టర్ జావన్ హుస్సేన్, పెనుమంట్ర వెటర్నరీ డాక్టర్ జి.రవికాంత్ పాల్గొన్నారు. -
కోటి సంతకాలే ప్రజాగ్రహానికి నిదర్శనం
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు జంగారెడ్డిగూడెం: సీఎం చంద్రబాబుపై ప్రజాగ్రహానికి కోటి సంతకాలే నిదర్శనమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథరావు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు కార్పొరేట్ జపం చేస్తూ రాష్ట్రాన్ని ప్రైవేట్వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని ధ్వజమెత్తారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేయడమే చంద్రబాబు లక్ష్యమన్నారు. అదే రీతిలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి విశేష స్పందన లభించిందన్నారు.కోటి సంతకాల సేకరణలో పాల్గొని విజయవంతం చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేసిన ప్రజలకు గురునాథరావు కృతజ్ఞతలు తెలిపారు. -
కోయభారతి.. గిరిపుత్రులకు విద్యాధాత్రి
బుట్టాయగూడెం: కేంజాటి (వినండి).. తిరియాటి (మాట్లాడండి).. చదవాటి (చదవండి).. రాసాటి (రాయండి).. అందోరు కలియి కెత్కాటి(అందరూ కలిసి చెప్పండి)... లిపిలేని కోయ భాషలోని పదాలివి. ప్రాథమిక పాఠశాలల్లో చేరే గిరిజన విద్యార్థులకు మాతృ భాషలో తప్ప తెలుగు, ఇతర భాషల్లో ఏ మాత్రం ప్రావీణ్యం ఉండదు. దీనితో వారికి విద్యాబోధన ప్రతిబంధకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కొండ కోనల్లో అంతరించిపోతున్న అరుదైన కోయ భాషకు తెలుగులోనే అక్షర రూపం ఇచ్చి మన్యం ప్రాంతంలోని గ్రామాల్లోని గిరిపుత్రులకు విద్యా బుద్దులు నేర్పిస్తూ వారిని పాఠశాలలకు ఆకర్షితులనే చేసే విధంగా ఐటీడీఏ అధికారులు కృషి చేస్తున్నారు. గిరిజనులు విద్యకు దూరమై సమాజంలో వెనుకబాటుకు గురవుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకువచ్చి వారి జీవితాల్లో విద్య సుగంధాలు నింపేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. గిరిజనుల మాతృభాషను కొనసాగిస్తూనే తెలుగు భాషను అభ్యసించేలా వినూత్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చి గిరిపుత్రులను విద్యలో తీర్చిదిద్దేలా కోయభారతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. 101 పాఠశాలలో కోయభారతి అమలు ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన మండలాలైన బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల పరిధిలో 101 గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలు, కోయభారతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కేఆర్పురం ఐటీడీఏలోని ప్రాజెక్టు మోనిటరింగ్, రిసోర్స్ కేంద్రం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. 101 పాఠశాలల పరిధిలో 321 మంది బాలురు, 429 మంది బాలికలు, కోయభాషలో విద్యను అభ్యసిస్తున్నారు. విద్యా వలంటీర్లతో మాతృభాష విద్యాబోధన 101 గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు విద్యాబోధన చేసేందుకు 101 మంది మాతృభాష వలంటీర్లను నియమించి విద్యాబోధన అందిస్తున్నారు. సర్వశిక్షా అభియాన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో 1, 2 తరగతులు చదివే విద్యార్థులకు మాతృభాష అయిన కోయ భాష ద్వారా పాఠ్యాంశాలను పరిచయం చేసి విద్యాబోధన చేస్తున్నారు. తెలుగు, లెక్కలు, పరిసరాల విజ్ఞానం, తదితర పాఠ్య పుస్తకాలు రూపొందించి పంపిణీ చేస్తున్నారు. గిరిజన భాషను తెలుగు పదాల్లో రూపొందించిన పుస్తకాలతో మాతృభాష విద్యావలంటీర్లు విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నారు. ఇదిలా ఉండగా బుట్టాయగూడెం మండలంలోని కోయరాజమండ్రి పాఠశాలలో లంబాడీ భాషలో కూడా భాషా వలంటీర్లు విద్యాబోధన చేస్తున్నారు. కోయ భాషలో గిరిపుత్రులకు ప్రాథమిక విద్యా బోధన 101 పాఠశాలల్లో కోయ భారతి అమలు తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం పుస్తకాలు కోయ భాషలో రూపకల్పన మాతృ భాషా విద్యా వలంటీర్లతో విద్యా బోధన ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గిరిజన విద్యార్థులకు మాతృభాషలో తప్ప తెలుగు, ఇతర భాషల్లో ఏ మాత్రం ప్రావీణ్యం ఉండదు. ఈ పరిస్థితుల్లో ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కోయభాషలో పదాలను తెలుగు అక్షరాలతో రాసేలా బోధిస్తున్నాం. సుమారు 101 పాఠశాలల్లో కోయభారతి కార్యక్రమం ద్వారా మాతృభాష బోధన అందిస్తున్నాం. – తెల్లం బాబూరావు, ఎంఈఓ, బుట్టాయగూడెం మాతృభాషలో బోధన చేయడం చాలా సంతోషంగా ఉంది. 1, 2 తరగతులు చదివే పిల్లలకు కోయభాష పదాలతో రూపొందించిన పాఠ్యపుస్తకాలను చదివిస్తూ పిల్లలకు పాఠశాలల పట్ల ఆసక్తి పెరిగేలా చూస్తున్నాం. – తెల్లం చెల్లమ్మ, మాతృభాష విద్యావలంటీర్, తూర్పురేగులకుంట -
ఏఓ శ్రీనివాస్పై ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు
పెనుగొండ: విచారణల పేరుతో రికార్డులను దౌర్జన్యంగా డీఎల్పీఓ కార్యాలయానికి తీసుకెళ్లి దళిత సర్పంచ్లను వేధిస్తున్న ఏఓ శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని కొడమంచిలి సర్పంచ్ సుంకర సీతారామ్, వైఎస్సార్ సీపీ నాయకుడు కోట వెంకటేశ్వరరావులు ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. గురువారం విజయవాడలోని ఎస్సీ కమిషన్ రాష్ట్ర కార్యదర్శికి ఫిర్యాదును అందించారు. పంచాయతీ రికార్డులను, ఓచర్లను తీసుకెళ్లి ఓచర్లు తారుమారు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా సీతారామ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో దళిత సర్పంచ్లను టార్గేట్ చేస్తూ రాజకీయ కక్ష సాధింపులకు తెరలేపారన్నారు. టీడీపీ నాయకుడు రాంబాబు చేస్తున్న ఇసుక అక్రమ దందాపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో పంచాయతీ అధికారులను బెదిరించి కొడమంచిలి, ఆచంట, పండిత విల్లూరు, జగన్నాథపురం, మార్టేరు తదితర పంచాయతీలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే రికార్డులు తారుమారు చేసి వేధింపులకు గురిచేస్తున్న మాజీ సర్పంచ్ సీహెచ్ శ్రీను, బి.వెంకట రమణ, రాంబాబు, ఏఓ శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యలమంచిలి: మండలంలోని ఏనుగువానిలంక గ్రామానికి చెందిన మందా ఏసురాజు (41) ఈ నెల 9వ తేదీ సాయంత్రం అతని స్నేహితుడు పాలపర్తి సుధాకర్ చించినాడ వద్ద వశిష్ట గోదావరి నదికి స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తూ ఏసురాజు నీటిలో మునిగిపోయాడు. వెంటనే సుధాకర్ ఇంటికి వెళ్లి ఏసురాజు కుటుంబ సభ్యులకు ప్రమాద విషయం తెలిపాడు. దీంతో ఏసురాజు భార్య స్వరూపరాణి పోలీసులకు ఫిర్యాదు అప్పటి నుంచి గాలించగా గురువారం చించినాడ వద్ద వశిష్ట గోదావరి నదిలో నిర్మాణంలో ఉన్న రైలు వంతెన సమీపంలో ఏసురాజు మృతదేహం పైకి తేలింది. దీంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి పంచనామా, పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై కర్ణీడి గుర్రయ్య తెలిపారు. బుట్టాయగూడెం: జీసీసీ సేల్స్ డిపోల్లో ఏడాదికి ఇచ్చిన టార్గెట్ను సేల్స్మెన్లు మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్ అన్నారు. మండలంలోని కేఆర్పురం జీసీసీ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జీసీసీ పరిధిలో ఉన్న 26 మంది సేల్స్మెన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ నిత్యవసర సరుకులు, గిరిజన ఉత్పత్తుల అమ్మకాలను పెంచాలని ఆదేశించారు. -
పార్క్ చేసిన కారుకు మంటలు
చింతలపూడి: పార్క్ చేసిన కారు నుంచి మంటలు చెలరేగిన ఘటన చింతలపూడి మోడల్ కాలనీలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం మోడల్ కాలనీలో రోడ్డు పక్కన గత కొంతకాలంగా పార్కు చేసి ఉంచిన కారుకు మంటలు అంటుకున్నాయి. కారు ఉన్న ప్రదేశంలో చుట్టూ చెట్లు ముళ్ళ కంపలు పెరిగి ఉన్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది వాటిని తొలగించి మంట పెట్టడంతో మంటలు కారుకు అంటుకుని ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు అటవీ అభివృద్ధి సమాఖ్య సమావేశం చైర్మన్, ముఖ్య అటవీ సంరక్షణాధికారి బీఎన్ఎన్ మూర్తి అధ్యక్షతన జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఉన్న విలువైన చెట్లను నరుకుటకు, వేలం వేసేందుకు, సదరు వేలం వేయగావచ్చిన ఆదాయం నుంచి 50 శాతం సొమ్ము వన సంరక్షణ సమితులకు ఇచ్చేందుకు, 50 శాతం సొమ్ము ప్లాంటేషన్ పెంచేందుకు తీర్మానం చేశారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖాధికారి పీవీ సందీప్ రెడ్డి, అటవీశాఖ సిబ్బంది, వన సంరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. నరసాపురం రూరల్: మండలంలోని పేరుపాలెం సౌత్ గ్రామంలో కొబ్బరితోటలో ఈనులు చీరుకుంటున్న వృద్ధురాలిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు గురువారం మధ్యాహ్న సమయంలో గ్రామంలోని కొబ్బరితోటలో ఈనులు తీసుకుంటుండగా ఆ ప్రాంతంలో సంచరిస్తున్న గుబ్బల పెద్దిరాజు (30) అనే వ్యక్తి ఆమె మూతికొరకడంతో పాటు శరీరం, వంటిపై గాయాలు చేసి లైంగికదాడికి యత్నించాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి పెద్దిరాజును పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని వైద్యం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. ఆమె నుంచి మొగల్తూరు ఎస్సై నాగలక్ష్మి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై విలేకరులకు తెలిపారు. ఉంగుటూరు: మండలంలోని గొల్లగూడెం పంచాయతీ పరిధిలో తిమ్మయ్యపాలెంలో కోర్లేపర్ల శ్రీను అనే వ్యక్తికి చెందిన పందెం కోళ్ల పెంపకం స్థావరంలో గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి పందెం చోరీ చేశారు. కోళ్ల పెంపకం ప్రాంతం వద్ద ఉన్న కాపలాదారుడిని బెదిరించి సుమారు 45 కోళ్లను పట్టుకుపోయారు. వీటి విలువ సుమారు రూ.6 లక్షలు వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం పై చేబ్రోలు ఎస్సై సూర్యభగవానుని ప్రశ్నించగా సుమారు 12 కోళ్లు మాత్రమే పోయాయని,కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మెట్టలో మామిడి పూతకు మంచు దెబ్బ
చింతలపూడి: వాతావరణ ప్రతికూల ప్రభావంతో ఏటా జిల్లాలోని మామిడి రైతులకు మామిడి పూత, పిందెలను రక్షించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య చర్యలన్నీ ఒక ఎత్తయితే ఇప్పుడు పూత సమయంలో పాటించే యాజమాన్యం ఒక ఎత్తు. పూత సమయంలో తోటల్లో పురుగులు, తెగుళ్లు ఆశించకుండా రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితేనే మంచి దిగుబడులు సాధించవచ్చని ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు. సాధారణంగా 25–30 డిగ్రీల సెంటీ గ్రేడ్ ఉష్ణోగ్రత, పొడి వాతావరణం మామిడి తోటలకు మెరుగ్గా ఉంటుంది. ఈ దశలో పూత ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో మామిడి తోటల విస్తీర్ణంలో కృష్ణా జిల్లా తరువాత చింతలపూడి ప్రాంతం ద్వితీయ స్థానంలో నిలుస్తుంది. ఈ ఏడాది మెట్ట ప్రాంతంలో మామిడి తోటలు చాలా చోట్ల పూతలు వస్తున్నాయి. అయితే గత రెండు వారాలుగా విపరీతమైన మంచు కురుస్తుండటంతో పూత పూసిన ప్రాంతంలో మామిడి పంట మంచు దెబ్బకు విలవిల్లాడుతూంది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. సంవత్సరం అంతా సస్యరక్షణ చేపట్టి పంటను కాపాడుకుంటూ వస్తుంటే మంచు కారణంగా పూత మాడిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూతను కాపాడుకోవాలి మామిడికి వచ్చిన పూతను కాపాడుకోవడానికి రైతులు ఇప్పటి నుంచీ సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా 50 గ్రాముల యూరియా ఒక లీటరు నీటిలో కలిపి చెట్లకు స్ప్రే చేస్తే ఫలితం ఉంటుందని ఉద్యానవన అధికారిణి ఎండి షాఫియ ఫర్హీన్ తెలిపారు. ఈ సీజన్లో మామిడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తేనె మంచు పురుగు నివారణ ఇలా ప్రస్తుతం మామిడి పూత వచ్చే సమయంలో తేనె మంచు పురుగు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. లేత పూమొగ్గలు ప్రారంభంలో తేనె మంచు పురుగు ఆసిస్తుంది. దీని నివారణకు ఇమిడాక్లోప్రిడ్(కాన్ఫిడార్) ద్రావణం 10 లీటర్ల నీటికి 3 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. లేదా ధయో మిటాక్జిమ్ 10 లీటర్ల నీటికి 3 గ్రాములు కలిపి పిచికారీ చేసినట్లయితే పురుగు ఉధృతి తగ్గుతుంది. తామర పురుగులు ఇవి కొత్త చిగురు, పుష్ప గుచ్ఛాలు, పిందెలపైన అసంఖ్యాకంగా చేరి గోకి రసం పీలుస్తాయి. వీటి నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీ లీటర్లు, లేదా 03 మిల్లీ లీటర్ల ఇమిడా క్లోప్రిడ్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు చల్లని రాత్రులు, పగటి వాతావరణంలో పూత, పిందెలపై తెల్లని పొడిలాంటి బూజు ఏర్పడుతుంది. ఈ శిలీంద్రం ఆశించడం వల్ల పూత, పిందెలు రాలిపోతాయి. వీటి నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా ట్రైడీమార్ఫ్ 1 మిల్లీ లీటర్ లేదా డైనోకాప్ 1 మిల్లీ లీటర్, లేదా హెక్సాకోనజోల్ 2 మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చే యడం వల్ల బూడిద తెగులును నివారించవచ్చు . మెట్ట ప్రాంతంలో పూతమీద ఉన్న లేత మామిడి తోట ఎండీ షాఫియ ఫర్హీన్, ఉద్యానవన శాఖాధికారిణి -
కమిషనర్పై చర్యలు తీసుకోండి
నరసాపురం: నరసాపురం మున్సిపల్ కమిషనర్ ఎం.అంజయ్యపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ కోరారు. బుధవారం విజయవాడలో మున్సిపల్ సీఎండీ సంపత్కుమార్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కమిషనర్ మున్సిపల్ యాక్ట్కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కౌన్సిల్ ఆమోదం లేకుండా అభివృద్ది పనులు చేయడం, అవినీతికి పాల్పడుతున్నారని వివరించారు. ఈ నెల 6న జరిగిన కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. -
రైతుల సమస్యల పరిష్కారం కోసం ధర్నా
భీమవరం: కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. బుధవారం రైతు సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో భీమవరం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో దళారులు, మిల్లర్లు చేస్తున్న మోసంతో రైతులు బస్తాకు రూ.400 పైగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు, కలిశెట్టి వెంకట్రావు, ఎం.సీతారాం ప్రసాద్, సికిలే పుష్పకుమారి తదితరులు పాల్గొన్నారు. -
నేరాలు చేశారు.. చిక్కారు
ఏలూరు జిల్లాలో నేరాలకు పాల్పడిన దొంగల ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను నుంచి రూ.35 లక్షల సొత్తు రికవరీ చేశారు. 8లో uషార్ట్ సర్క్యూట్తో తణుకు సజ్జాపురంలో ఓ ఇంట్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన తండ్రి పిల్లలను కాపాడి బయటకు తీసుకువచ్చారు. 8లో uగురువారం శ్రీ 11 శ్రీ డిసెంబర్ శ్రీ 2025భీమవరం: జిల్లాలో టెట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్ రెడ్డి అన్నారు. భీమవరం విష్ణు కళాశాలలో టెట్ పరీక్ష కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం పట్టణాల్లోని 8 పరీక్షా కేంద్రాల్లో 12,985 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉందన్నారు. ఈ నెల 21 వరకు టెట్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు.బుధవారం జిల్లాలోని 5 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 67 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం పరీక్షకు 540 మందికి 494 మంది హాజరుకాగా మధ్యాహ్నం పరీక్షకు 289 మందికి 268 మంది హాజరయ్యారన్నారు. భీమవరం: టెట్ పరీక్షపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేయాలని, విద్యా హక్కు చట్టానికి తగు సవరణలు చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీఎస్ విజయరామరాజు డిమాండ్ చేశారు. భీమవరం యూటీఎఫ్ కార్యాలయం నుంచి బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు. విజయరామరాజు మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సుప్రీంకోర్టులో టెట్పై రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సీహెచ్ పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శులు జి.రామకృష్ణంరాజు, కె.రామకృష్ణ ప్రసాద్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు జి.అబ్రహం తదితరులు పాల్గొన్నారు. పెదవేగి: కోటి సంతకాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరిని కొంతసేపు పోలీసులు అడ్డుకున్నారు. పెదవేగి మండలం కొండలరావుపాలెంలోని తన నివాసం నుంచి దెందులూరులో పార్టీ శ్రేణులతో కలసి ఏలూరు పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు సిద్ధమవ్వగా పెదవేగి సీఐ సీహెచ్ రాజశేఖర్ తన పోలీస్ సిబ్బందితో కొంతసేపు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారని అని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని రూల్ దెందులూరులోనే ఎందుకు అని పోలీసులను అబ్బయ్యచౌదరి ప్రశ్నించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కోటి సంతకాల సేకరణ ర్యాలీ కార్యక్రమానికి అబ్బయ్యచౌదరి తరలివెళ్లారు. భీమవరం: భీమవరం పట్టణంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థ బస్సు బుధవారం రాత్రి అదుపు తప్పి కాలువలోకి ఒరిగిపోయింది. విద్యా సంస్థ నుంచి విద్యార్థులను తీసుకువెళుతుండగా అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో బస్సులోని విద్యార్థులు బస్సు అద్దాలు పగలకొట్టుకుని బయటపడ్డారు. ప్రమాదంలో విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): షాపులు, హోటల్స్, మార్కెట్ ప్రాంతాలలో తనిఖీలు చేపట్టి, ప్లాస్టిక్ నిషేధం పూర్తిస్థాయిలో అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం జాయింట్ కలెక్టర్ డోర్ టు డోర్ చెత్త సేకరణ, దోమల నివారణ, పూడికతీత, ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య లోపంపై పలు ఫిర్యాదులు వస్తున్నాయని ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్లాస్టిక్ వాడకం నిషేధంపై ప్రజల అవగాహనకు ముఖ్యమైన ప్రాంతాలలో హోర్డింగులు ఏర్పాటు చేయాలన్నారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. కుట్రలపై కోటి గర్జన సాక్షి, భీమవరం: పేదలకు వైద్య విద్య, నాణ్యమైన వైద్యాన్ని దూరం చేసే చంద్రబాబు సర్కారు కుట్రలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ జిల్లాలో విజయవంతమైంది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునందుకుని లక్షలాది మంది ప్రజలు వెల్లువలా తరలివచ్చి ఉద్యమానికి మద్దతు తెలిపారు. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నడపాలని కోరుతూ సంతకాలు చేశారు. నియోజకవర్గాల నుంచి ఆ ప్రతులను వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయానికి తరలించే కార్యక్రమం బుధవారం జిల్లా అంతటా ఘనంగా జరిగింది. బాక్సుల్లో ఉంచిన ప్రతులను ప్రత్యేక వాహనాల్లో ఉంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలతో నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేశారు. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నడిపేలా కూటమి పెద్దల బుద్దిని మార్చాలని కోరుతూ పలుచోట్ల సంతకాల ప్రతులకు మహిళలు మంగళహారతులిచ్చి సాగనంపారు. ● తణుకులో.. మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున సేకరించిన సంతకాల ప్రతులతో తణుకు నుంచి రూరల్, అత్తిలి మండలాల మీదుగా పెదఅమిరంలోని జిల్లా కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వేల్పూరు, అత్తిలి గ్రామాల్లో మహిళలు ప్రత్యేక వాహనానికి మంగళహారతులతో స్వాగతం పలికారు. చంద్రబాబు ప్రభుత్వం బుద్ధి మారాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా 17 వైద్య కళాశాలలు తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం జగనన్కే దక్కుతుందన్నారు. ● తాడేపల్లిగూడెంలో.. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో సంతకాల ప్రతులను పార్టీ కార్యాలయం నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో పెంటపాడు, పిప్పర మీదుగా జిల్లా కార్యాలయానికి ర్యాలీగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పేదల సంక్షేమం పట్ల చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అందుకు నిదర్శనమే వైద్యకళాశాలల ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన అన్నారు. ● ఆచంటలో.. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో పార్లమెంట్ అబ్జర్వర్ ముదునూరి మురళీకృష్ణంరాజు, ఆచంట నియోజకవర్గ పరిశీలకుడు ఖండవల్లి వాసు, భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో తూర్పుపాలెంలోని పార్టీ కార్యాలయం నుంచి మార్టేరు మీదుగా జిల్లా కార్యాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వలన పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రంగనాథరాజు మాట్లాడుతూ కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. ● భీమవరంలో.. నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో సంతకాల ప్రతులతో రాయలం నుంచి భీమవరం పాతబస్టాండ్ మీదుగా పెదఅమిరంలోని పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీగా చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ కోటి సంతకాల ఉద్యమానికి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. వెంకటరాయుడు మాట్లాడుతూ మెడికల్ కళాశాల ప్రవేటీకరణ వల్ల విద్యార్థులు ప్రజలకు కలిగే ఇబ్బందులను గుర్తించారన్నారు. రాష్ట్ర కార్యదర్శి పేరిచర్ల విజయనర్సింహరాజు, జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి గంటా రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ● నరసాపురంలో.. పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్, మత్స్యపురి మీదుగా జిల్లా కార్యాలయం వరకు భారీగా ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న చంద్రబాబు సర్కార్ ఇప్పటికై నా కళ్లు తెరవాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ బర్రే శ్రీవెంకటరమణ, పార్టీ సీజీసీ సభ్యుడు పీ.డీ రాజు, పెంట్ర వీరన్న, ఎస్ఈసీ సభ్యుడు పెండ్ర వీరన్న తదితరులు పాల్గొన్నారు. ● పాలకొల్లులో.. నియోజకవర్గ సమన్వయకర్త గుడాల శ్రీహరిగోపాలరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి పూలపల్లి వై.జంక్షన్ మీదుగా జిల్లా కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా గుడాల గోపి మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రవేటీకరణ చేస్తుంటే స్థానిక మంత్రి నిమ్మల రామానాయుడు ఏం చేస్తున్నారని, ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకుంటే ప్రజల కోసం ఏం చేస్తారని ప్రశ్నించారు. పార్టీ నేతలు చెల్లెం ఆనంద ప్రకాష్, యడ్ల తాతాజి పాల్గొన్నారు. ఉండిలో.. నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో పెదఅమిరంలోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. సంతకాల ప్రతుల బాక్సులను జిల్లా కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా పీవీఎల్ మాట్లాడుతూ తమ పిల్లల భవిష్యత్కు భరోసాగా కోటి సంతకాల ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముప్పిడి సంపత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం అర్బన్: మండలంలోని గొల్లవానితిప్ప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు సుధీర్బాబుపై భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం అతను విద్యార్థులను అసభ్యకరంగా తాకడంతో పాటు వేధించడంతో జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. ప్రధానోపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి నరసాపురం: వైద్య విద్యను అంగట్లో పెట్టి పేద మధ్య తరగతి వారికి అందకుండా చేయడం హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గంలో సేకరించి సంతకాల ప్రతులను బుధవారం భీమవరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ర్యాలీగా వెళ్లి అందజేశారు. ఈ సందర్బంగా అంబేడ్కర్ సెంటర్లో నిర్వహించిన సభలో ముదునూరి చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ హయంలో అప్పటి ముఖ్యమంత్రి వెస్ జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాలలు, వాటికి అనుబంధంగా ఉండే ఆసుపత్రులు ప్రజలకు చేరువగా ఉండాలని పరితపించారని చెప్పారు. 7 మెడికల్ కళాశాలల నిర్మాణాలు పూర్తయ్యాయని, పెండింగ్లో ఉన్న 10 మెడికల్ కళాశాలల పనులు పూర్తిచేయడం చేతకాక, అడ్డగోలుగా ప్రైవేట్ పరం చేస్తూ జీవో తీసుకొచ్చారన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు అర్బన్: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయొద్దంటూ కోటి సంతకాల కార్యక్రమంలో ప్రజలు వెల్లువలా వచ్చి సంతకాలు చేశారని చంద్రబాబు సర్కారుకు దిగి రావాల్సిందేనంటూ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. తణుకులో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రభుత్వం నడిపితేనే పేదలకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందుతుందన్నారు. వైద్య సీట్లు సైతం ఉచితంగానే అర్హులైన పేదలందరికీ చేరువవుతాయని, ప్రైవేటుపరం అయితే లక్షలాది రూపాయిలు వెచ్చించి మెడికల్ సీట్లు కొనుక్కోవాల్సిందేనని ప్రజలు గ్రహించే సంతకాలు చేశారని అన్నారు. తణుకు నియోజవర్గంలో 80,235 సంతకాలు చేశారన్నారు. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు తాడేపల్లిగూడెం అర్బన్: అమ్మకానికి ఆంధ్రప్రదేశ్.. టెండరు వేసుకోండి అన్నట్టుగా చంద్రబాబు పాలన ఉందని మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెంలో ఆయన మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు నష్టం, కష్టం కలిగితే ఎవరిౖనైనా ప్రశ్నిస్తానని రాష్ట్రమంతా ఎలుగెత్తి చెప్పిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నోరు మెదపడం లేదన్నారు. చట్ట సభల్లో కూర్చోవడమే గాని ప్రజల గురించి మాట్లాడరా? అని ప్రశ్నించారు. వివిధ దశల్లో ఉన్న వైద్య కళాశాలల భవనాలను నిర్మాణం పూర్తి చేయకుండా ప్రైవేటీకరణకు సిద్దపడుతున్న చంద్రబాబుకు మళ్ళీ గట్టిగా గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయవంతంగా సంతకాల సేకరణ నియోజకవర్గాల నుంచి ర్యాలీలుగా జిల్లా కేంద్రానికి ప్రతులు 15న భీమవరంలో భారీ ర్యాలీ అదేరోజు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి తరలింపు -
కక్ష సాఽధింపులను తిప్పికొడదాం
పెనుగొండ: నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులపై జరుగుతున్న కక్షసాధింపులను ఐక్యతతో తిప్పి కొడదామని వైఎస్సార్ సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పిలుపు నిచ్చారు. బుధవారం తూర్పుపాలెంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో సర్పంచులను, నాయకులను వేధింపులకు గురి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. విచారణలు, ఫిర్యాదులు పేరుతో భయపెడితే భయపడే వారు ఎవరూ లేరన్నారు. కోటి సంతకాల సేకరణలో ఆచంట నియోజకవర్గం జిల్లాలో ముందంజలో ఉందన్నారు. కక్ష సాధింపులు మాని, అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు. కేవలం కక్ష సాధింపులు, డైవర్షన్ రాజకీయాలతో కాలం గడుపుతుందన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. నియోజవర్గ పరిశీలకుడు ఖండవల్లి వాసు, ఎంపీపీ సబ్బితి సుమంగళి, జడ్పీటీసీ కర్రి గౌరీ సుభాషిణీ వేణు బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి దంపనబోయిన బాబూరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చిన్నం ఏడుకొండలు, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమనంపూడి సూర్యారెడ్డి, మండల కన్వీనర్లు నల్లిమిల్లి వేణుప్రతాపరెడ్డి, జక్కంశెట్టి చంటి, పిల్లి నాగన్న, గూడూరి దేవేంద్రుడు, సర్పంచ్లు బుర్రా రవికుమార్, ఇళ్ల లక్ష్మీ చంద్రిక, పూర్ణిమ, ముదునూరి నాగరాజు, నాయకులు పాల్గొన్నారు. -
వ్యాన్ ఢీకొని వృద్ధుడి మృతి
నరసాపురం రూరల్: సైకిల్పై వెళుతున్న వృద్ధుడిని వ్యాన్ ఢీకొట్టడంతో మృతి చెందాడు. మొగల్తూరు ఎస్సై వై.నాగలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం పేరుపాలెం సౌత్ గ్రామానికి చెందిన బోణం నర్సింహరావు (75) గ్రామంలో సైకిల్పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సింహరావు అక్కడికక్కడే మృతి చెందాడు. నర్సింహరావు కుమారుడు వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నట్లు చెప్పారు. -
నేరాలు చేశారు.. పోలీసులకు చిక్కారు
ఏలూరు టౌన్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక నేరాలకు పాల్పడిన నలుగురు దొంగల ముఠాను భీమడోలు సర్కిల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.35 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వివరాలు వెల్లడించారు. ద్వారకాతిరుమలలో చోరీలు ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన కనిగొళ్ళ లక్ష్మీ కాశీవిశ్వనాథం తన కుటుంబంతో అశ్వారావుపేటలోని తన చెల్లెలు ఇంటికి వెళ్లగా ఈనెల 2న తెల్లవారుజామున దొంగలు ఇంటిలో ప్రవేశించి రూ.1.70 లక్షల నగదు, రెండు కాసుల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. అదేరోజు అదే గ్రామంలోని పోలుబోయిన లక్ష్మయ్య ఇంటిలోనూ జొరబడి సుమారు 7 కాసుల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. వీటిపై ద్వారకాతిరుమల పోలీస్స్టేషన్లో కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ కేపీ శివకిషోర్ ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ శ్రావణకుమార్ పర్యవేక్షణలో భీమడోలు సీఐ యూజే విల్సన్ ఆధ్వర్యంలో ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్ తన సిబ్బందితో దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు వీరే.. జంగారెడ్డిగూడెం డాంగే నగర్కు చెందిన పోలవరపు నాగదుర్గాప్రసాద్.. ఇతనిపై గతంలో 90 చోరీ కేసులు, 3గంజాయి కేసులు ఉన్నాయి. తాడేపల్లిగూడెం వీవర్స్కాలనీకి చెందిన యర్రసాని లక్ష్మణ్.. ఇతనిపై గతంలో 80 చోరీ కేసులు, 3 గంజాయి కేసులు ఉన్నాయి. తాడేపల్లిగూడెం రామారావుపేటకు చెందిన గుత్తుల రవికుమార్.. ఇతనిపై గతంలో 26 చోరీ కేసులు, 3 గంజాయి కేసులు ఉన్నాయి. ఇక ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతానికి చెందిన చోరీ సోత్తు రిసీవర్ విశాఖ వసంత అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరివద్ద నుంచీ రూ.22 లక్షల విలువైన 184.37 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.11 లక్షలు విలువైన మూడు కేటీఎం బైక్లు, ఒక బుల్లెట్ వాహనం, రూ. 2 లక్షల నగదు.. మొత్తంగా రూ.35 లక్షల విలువైన చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ చూపిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ ఉన్నారు. చెడు వ్యసనాలకు బానిసగా మారి.. గణపవరంలో చెడు వ్యసనాలకు బానిసైన బల్లారపు శ్యాంబాబు, పోలిమాటి కృష్ణకిషోర్ తమ ఇంటి సమీపంలోని నక్కల కృష్ణ ఇంటిలో చోరీకి పాల్పడి బంగారు, వెండి వస్తువులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నిడమర్రు సీఐ ఎన్.రజనీకుమార్ ఆధ్వర్యంలో ఎస్సై ఏ.మణికుమార్ తన సిబ్బందితో కేసును దర్యాప్తు చేశారు. గణపవరం చాణక్య కాలేజీ సమీపంలో బుధవారం నిందితులు శ్యాంబాబు, కృష్ణకిషోర్లను అరెస్ట్ చేసి రూ.2.40 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తు బాధితులకు అప్పగింత జంగారెడ్డిగూడెం: ఈ ఏడాది సెప్టెంబర్ 22న ఓ ఇంట్లో అర్ధరాత్రి జరిగిన దోపిడీ లక్కవరంలో కలకలం రేపింది. ఆ దొంగల ముఠాను జంగారెడ్డిగూడెం పోలీసులు పట్టుకుని బాధితులకు సొమ్ము అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. లక్కవరం గ్రామంలోని లక్ష్మీ అంజనికుమారి, రుక్కయ్య దంపతులు సెప్టెంబర్ 22న ఇంట్లో నిద్రిస్తుండగా, అర్ధరాత్రి సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి, వారిపై దాడి చేసి, బీరువాలో ఉన్న 40 కాసుల బంగారం, 2 కిలోల వెండిని చోరీ చేశారు. ఈ కేసును అప్పటి ఇన్చార్జి సీఐ టి.క్రాంతికుమార్ దర్యాప్తు చేసి నలుగురు నిందితులు అంగడి విల్సన్బాబు, గజ్జెలవాసు, దేవర శ్రీరామమూర్తి, షేక్ బాజీను అరెస్టు చేశారు. ఇదే కేసులో మరో నిందితుడు కావేది ప్రసాద్ని నవంబర్ 12, 2025న ప్రసుత్త సీఐ ఎంవీ సుభాష్ అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.40 లక్షలు విలువైన బంగారు వస్తువులు, రూ.3 లక్షలు విలువైన వెండి వస్తువులు, నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్డు, రెండు కర్రలు, మోటార్సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ సుస్మిత రామనాథన్ బాధితులకు చోరీ సొత్తు అప్పగించారు. శ్రీవారి దేవస్థానం ఈఓ పోస్టుకు పైరవీలు ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరినోట వినిపిస్తున్న మాట.. నెక్ట్స్ దేవస్థానం ఈఓ ఎవరూ. ఎందుకంటే చినవెంకన్న దేవస్థానం ఈఓ సీటుకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. అయితే రోజుకో అధికారి పేరు తెరమీదకు వస్తుండటంతో దీనిపై చర్చ విస్తృతంగా సాగుతోంది. వివరాల్లోకి వెళితే. ప్రస్తుతం శ్రీవారి దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న ఎన్వీఎస్ఎన్ మూర్తి ఈనెలాఖరున పదవీ విరమణ పొందనున్నారు. అయితే ఆ పోస్టును దక్కించుకునేందుకు కొందరు అధికారులు ఇప్పటికే పైరవీలు మొదలుపెట్టారు. ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ తిరుగుతూ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఆ పోస్టు ఎవరిని వరిస్తుందనే దానిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే తెరమీదకొచ్చిన అధికారులు ఇద్దరు, ముగ్గురు కాగా.. తెరవెనుక మరి కొందరు ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అద్దయ్యకు అదృష్టం అందేనా.. ఈఓ సీటు కోసం ప్రయత్నిస్తున్న వారిలో అద్దయ్య పేరు బలంగా వినిపిస్తోంది. ఈయన గతంలో జంగారెడ్డిగూడెం ఆర్డీవోగా పనిచేశారు. ఆలయంలో కొందరు అధికారుల సహాయంతో అద్దయ్య ఇప్పటికే చురుగ్గా అడుగులు ముందుకేసినట్టు తెలుస్తోంది. గోపాలపురం ఎమ్మెల్యే సైతం అద్దయ్యను సిఫార్సు చేస్తూ దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు లేఖ పంపినట్టు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే అద్దయ్య కాకుండా వాడపల్లి దేవస్థానం ఈఓ చక్రధరరావు, మరో ఆర్డీవో సైతం ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే అన్నవరం దేవస్థానం ఈఓగా పనిచేసి మంగళవారం బదిలీ అయిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వీర్ల సుబ్బారావు సైతం ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఇటీవల ద్వారకాతిరుమలలోని ఓ టీడీపీ నేతను కలసి, చర్చించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు ఆశీస్సులు ఉన్న వారే ఈఓగా వచ్చే అవకాశం ఉందనేది బహిరంగ రహస్యం. శ్రీవారి దేవస్థానంపైనే మక్కువ.. రాష్ట్రంలోని పలు ప్రముఖ దేవాలయాల్లో ఈఓగా పనిచేయడానికి ఇష్టపడని అధికారులు.. ద్వారకాతిరుమల దేవస్థానం ఈఓగా పనిచేయడానికి మక్కువ చూపుతున్నారు. దానికి కారణం.. రాజకీయ నాయకులు, అధికారుల ఒత్తిళ్లు ఇక్కడ తక్కువ. ఈఓగా ఎవరొచ్చినా దేవస్థానం సిబ్బంది తమ సహకారాన్ని పూర్తిగా అందిస్తారు. ఇతర దేవాలయాల్లో ఆ పరిస్థితి లేదు. ఉదాహరణకు అన్నవరం, సింహాచలం, విజయవాడ దేవస్థానాలపై రాజకీయ ఒత్తిళ్లు తీవ్ర స్థాయిలో ఉంటాయి. అక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పేదే శాసనం. దాంతో రాజకీయ నాయకులు చెప్పే మాట అధికారులు వినక తప్పదు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రుల అండదండలతో రెచ్చిపోయే కొందరు సిబ్బందిని కూడా ఈఓలు భరించక తప్పదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఒత్తిళ్లను తట్టుకుని సమర్థవంతంగా పనిచేయగలరనే పేరున్న వేండ్ర త్రినాథరావు బుధవారం అన్నవరం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా బాధ్యతలు చేపట్టారు. నిన్న మొన్నటి వరకు ద్వారకాతిరుమల దేవస్థానం ఈఓగా త్రినాథరావు వస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. ఇప్పటికీ కొందరు సిబ్బంది ఆయనే ఈఓగా వస్తారని అంటున్నారు. మరో పదిహేను రోజుల్లో ఈఓ ఎవరనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వీరవాసరం: ఆంధ్రప్రదేశ్ 69వ స్కూల్ గేమ్స్ అండర్ 17 బాలబాలికల సాఫ్ట్ బాల్ అంతర జిల్లాల టోర్నమెంట్ పోటీలు ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ అధ్యక్షుడు జుత్తిగ శ్రీనివాస్, కార్యదర్శులు పీఎస్ఎన్ మల్లేశ్వరరావు, బాజీంకి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ పోటీల్లో ఉమ్మడి 13 జిల్లాల బాల బాలికల జట్లు నుంచి సుమారు 416 మంది క్రీడాకారులు పాల్గొంటారన్నారు. వీరందరికీ భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో నేరాలకు పాల్పడిన దొంగల ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి చోరీ సొత్తు రికవరీ చేశారు. ద్వారకాతిరుమలలో జరిగిన చోరీల్లో నలుగురు సభ్యుల దొంగల ముఠాను అరెస్ట్ చేసి రూ.35 లక్షల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నేరస్తులకు వణుకు పుట్టించేలా వీరిని భీమడోలు జంక్షన్ నుంచి భీమడోలు కోర్టు వరకు ద్వారకాతిరుమల పోలీసులు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో జరిగిన చోరీకి సంబంధించి నిందితులను అరెస్ట్ చేసి బాధితులకు సొమ్ము అప్పగించారు. గణపవరంలో మరో చోరీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. భీమడోలు సర్కిల్ పరిధిలో దొంగల ముఠా అరెస్ట్ రూ.35 లక్షల చోరీ సొత్తు స్వాధీనం లక్కవరంలో మరో చోరీ కేసులో నిందితుల అరెస్ట్ రూ.43 లక్షల విలువైన చోరీ సొత్తు బాధితులకు అప్పగింత నెలాఖరున రిటైర్డ్ కానున్న ప్రస్తుత ఈఓ మూర్తి ఆ పోస్టు కోసం ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చైర్మన్ ఆశీస్సులు ఎవరికీ దక్కేనో.. -
ఇంట్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
తణుకు అర్బన్: విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా తణుకు సజ్జాపురంలో ఓ ఇంట్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన తండ్రి పిల్లలను క్షేమంగా కాపాడి బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సజ్జాపురం శివాలయం వంతెన సమీపంలో ఆకుల రత్తయ్య కుటుంబంతో సహా ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి 3.30 గంటల సమయంలో ఇంట్లో మంటలు వ్యాపించి ఇళ్లంతా పొగపట్టి ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన రత్తయ్య ఇంట్లో నిద్రిస్తున్న తన భార్యతోపాటు కుమారులను బయటకు తీసుకువచ్చారు. అప్పటికే పొగ ధాటికి పిల్లలకు స్వల్ప అస్వస్థత ఏర్పడింది. ఈ ప్రమాదంలో కిచెన్లోని సామాగ్రితోపాటు వరండాలో ఉన్న వాషింగ్మెషిన్, ఫ్రిజ్ తదితర సామాగ్రి అగ్నికి ఆహుతైపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉంటుందని, నష్టం రూ.1.50 లక్షలుగా అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. కాగా గత 40 రోజులుగా లారీ కిరాయికి వెళ్లిన రత్తయ్య సరిగ్గా ఆదేరోజు రాత్రి ఇంటికి రావడంతో తామంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. పిల్లలను క్షేమంగా కాపాడిన తండ్రి -
ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్కు టీచర్ కళ్యాణి
దెందులూరు: హర్యానాలో పంచకులలో జరుగుతున్న ఆల్ ఇండియా సైన్స్ ఫెస్టివల్కు దెందులూరు గారపాటి హైమావతి దేవి ఉన్నత పాఠశాల సైన్స్ టీచర్ కళ్యాణి డెలిగేట్గా ఎంపికయ్యారు. గురువారం హర్యానా సైన్స్ ఫెస్టివల్లో ఆమె పాల్గొన్నారు. విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచిని పెంచేందుకు వినూత్న ప్రణాళికలతో, విధానాలతో శిక్షణ పొంది రావడం గొప్ప అనుభూతి అని ఆమె అన్నారు. దేశ, విదేశాల శాస్త్రవేత్తలు హర్యానా ముఖ్యమంత్రి, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి, ఇతర ప్రముఖ విశ్వవిద్యాలయాల పరిశోధకులు, విజ్ఞాన భారతి అధ్యక్ష కార్యదర్శుల మధ్య కార్యక్రమం వైభవంగా జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా 200 మంది సైన్స్ టీచర్లు ఎంపికై న ఈ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామి కావడం సంతోషం కలిగించిందన్నారు. జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి దేవాలయ హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. జిల్లా దేవదాయ శాఖ అధికారికి కూచిపూడి శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆదాయాన్ని లెక్కించారు. 63 రోజులకు గాను రూ.48,82,724, అన్నదానం హండీ ద్వారా రూ. 2,08,802 మొత్తం రూ. 50,91,526 ఆదాయం సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. భీమవరం: పోలీసులకు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంలో క్రీడా కార్యక్రమాలు ఒత్తిడిని తగ్గించి నాయకత్వం, పరస్పర గౌరవం, జట్టు భావనను పెంపొందిస్తాయని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. భీమవరం డీఎన్నార్ కళాశాల ఆవరణలో బుధవారం ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాల ప్రతినిధులతో ఏర్పడిన జట్లు క్రీడాస్ఫూర్తితో పోటీపడి ఆకట్టుకున్నారు. క్రికెట్ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగగా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నేతృత్యంలో ఎస్పీ ఎలెవన్ టీమ్, తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ టీంపై విజయం సాధించింది. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, నర్సాపురం డీఎస్పీ జి.శ్రీవేద, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ, ఆర్మర్డ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె.వెంకట్రావు, భీమవరం టూటౌన్, రూరల్ సీఐలు జి.కాళీచరణ్, బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అధికారి వస్తున్నారని సెంటు చల్లి..
తేతలి పశు వధ కేంద్రంపై ఫిర్యాదుల నేపథ్యంలో పొల్యూషన్ శాఖ అధికారి వస్తున్నారని తెలుసుకున్న యాజమాన్యం సెంటు చల్లించిందని బాధితులు చెబుతున్నారు. 8లో uపేద పిల్లోడు డాక్టర్ కాకూడదనే దురుద్దేశంతో మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారు. ప్రైవేటు కాలేజీల్లో లక్షలు, కోట్లు ఫీజులుగా వసూలు చేస్తారు. ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి, సొంత భవనాలు నిర్మించుకుంటున్న తరుణంలో వాటిని అభివృద్ధి చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం కుంటి సాకుతో పీపీపీకి అంటగడుతున్నారు. – పోతురాజు , ఎన్నార్పీ అగ్రహారం, ఉండి మండలం పేద వాళ్ల పిల్లలు డాక్టర్లు కాకూడదా? గతంలో డాక్టర్ చదవాలంటే ఇతర రాష్ట్రాలు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా జగన్ మోహన్రెడ్డి 17 కాలేజీల్ని స్థాపిస్తే, వాటిని అడ్డగోలుగా అమ్ముకోవాలనుకోవడం దారుణం. ప్రభుత్వమే మెడికల్ కాలీజీలు నడిపితే పేదల పిల్లలకు భవిష్యత్ ఉంటుంది. రాష్ట్ర ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటుంది. – పెరుమాళ్ల సుధీర్, పెద ఉప్పరగూడెం, ఆకివీడు మండలం పేద, మద్య తరగతి విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలంటే డబ్బుతో సీటు కొనుక్కోవాలి. చంద్రబాబు ధనార్జన కోసమే వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. జగన్ పథకాలను అమలు చేస్తే ఆయనకు పేరు వస్తుందని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. – తాడిపర్తి రజని, తాడేపల్లిగూడెం ప్రభుత్వానికి పేద ప్రజలంటే ప్రేమ లేదు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం నియంతృత్వ పోకడ అవలంభిస్తుంది. ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ ప్రతిపక్షం అనుకుంటే ఎలా. ప్రభుత్వం ఏం చేసినా ప్రభుత్వానికి వత్తాసు పలకాలా? – ఎల్.చిరంజీవి, తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం అధ్యక్షుడు, పాలకొల్లు -
ఉచిత వైద్యం నిర్వీర్యం
పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించేందుకు వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే వాటిని చంద్రబాబు ప్రైవేటుపరం చేసి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ వ్యతిరేకించకుండా మద్దతిస్తున్నారు. – బొద్దాని శ్రీనివాస్, తాడేపల్లిగూడెం వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని అందరూ ఖండిచాలి. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే అవి దోపిడీ కేంద్రాలుగా మారి పేద బిడ్డల చదువకు తలుపులు మూసినట్లే. ప్రభుత్వ విధానాలను కలిసికట్టుగా తిప్పికొట్టాలి –పేరూరి మురళీకుమార్, తణుకు వైద్య విద్యను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి నెట్టేలా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. భవిష్యత్తులో సీట్లు లక్షల రూపాయలకు అమ్ము కుంటారు. ఈ విధానం వల్ల పేద సామాన్య, మధ్య తరగతి విద్యార్థులు వైద్య విద్యకు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. – జి.అప్పలస్వామి, తణుకు మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నడిపించాలి. ప్రైవేటుపరమైతే పేద విద్యార్థులకు వైద్య విద్య భారమవుతుంది. అలాగే పేద ప్రజలకు వైద్యం కూడా భారమవుతుంది. ప్రభుత్వం పేదలను దృష్టిలో పెట్టుకుని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను విరమించుకోవాలి. – బి అశోక్, ఎంబిఏ, విద్యార్థి, పాలకొల్లు -
స.హ.చట్టం దరఖాస్తులను పరిష్కరించాలి
ఏలూరు (టూటౌన్): సమాచార హక్కు చట్టం కింద అందిన దరఖాస్తులను పరిష్కరించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం ముక్కంటి అన్నారు. స్థానిక ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాచార హక్కు చట్టం, 2005 అమలులోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయినా, ఇంకా అనేక పబ్లిక్ అథారిటీలు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు, ఫస్ట్ అప్పిలేట్ అథారిటీలు చట్టంలోని నిబంధనలపై పూర్తి అవగాహన లేదన్నారు. ఈ సందర్భంగా సమాచారం తెలుసుకొవడం పౌరుల హక్కు, సమాచారం కల్పించుట ప్రభుత్వ బాధ్యత అనే నినాదంతో జిల్లా ఎస్సీ సొసైటీ, ఏలూరు కార్యాలయం నుంచి ఇండోర్ స్టేడియం రోడ్డు మీదుగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. భీమవరం (ప్రకాశంచౌక్): నూతన పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బ్యాంకు రుణాలు మంజూరుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి, ఇన్వెస్టర్లతో ముఖాముఖి సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయం, ఆక్వా రంగాలలో అభివృద్ధి సంతృప్తికరంగానే ఉందని, పారిశ్రామికంగా అభివృద్ధికి మరింత కృషి చేయాలన్నారు. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనేకమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, నూతన పరిశ్రమల స్థాపనకు అనుమతులు, బ్యాంకు రుణాల మంజూరు, మౌలిక వసతుల కల్పనలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ రంగాలకు సంబంధించిన ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న పరిశ్రమల వివరాలు, కొత్తగా ప్రారంభించబోయే పరిశ్రమలు, వ్యాపారాలు గురించి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలో పరిశ్రమల శాఖ ప్రగతిపై సమీక్షించారు ఏలూరు (మెట్రో): జిల్లాలో ఈనెల 10 నుంచి 21 వరకు జరగనున్న ‘టెట్’ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ‘టెట్’ నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులపై మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పరీక్ష ఈనెల 10 నుంచి 21 వరకు రెండు కేంద్రాలలో నిర్వహిస్తామని చెప్పారు. పరీక్ష సమయంలో విద్యుత్కు అంతరాయం లేకుండా ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం ఉండేలా చూడాలని, వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణ సమయంలో అభ్యర్థుల సందేహాల నివృత్తికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలనీ జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. ఏలూరు(మెట్రో): జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ప్రగతిని సాధించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో మంగళవారం రైతు ఉత్పత్తిదారుల సంఘాలు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయం, అనుబంధ రంగాలలో ప్రగతిని సాగిస్తున్నామని, ఆయిల్ పామ్ అధిక విస్తీర్ణంలో సాగవుతుందన్నారు. కోకో అంతర పంటగా సాగవుతుందన్నారు. ఏలూరు జిల్లాలో కోకో, ఆయిల్ పామ్, కొబ్బరి, మామిడి, తదితర ఉత్పత్తులతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, వ్యవసాయ ఉత్పత్తులకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లలో జిల్లా మంచి పురోగతి సాధించేలా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు చర్యలు తీసుకోవాలని జేసీ అభిషేక్ గౌడ సూచించారు. -
చెదిరిపోతున్న మెడిసిన్ కల
ఎంత కష్టపడైనా సరే తమ పిల్లలను బాగా చదివించుకోవాలని అనుకుంటారు. మెడిసిన్ చదవాలనుకుంటున్న పేద, మధ్య తరగతి విద్యార్థులు కల ప్రైవేటీకరణ వల్ల మధ్యలోనే చెదిరిపోతుంది. ఆర్థిక స్తోమత లేక చదువు ఆగిపోతుంది. ప్రభుత్వ కళాశాలల్లో అయితే మెరిట్ విద్యార్థులు సీటు సాధించుకోగలుగుతారు. – జుత్తుగ సీతామహాలక్ష్మీ, గృహిణి, పాలకొల్లు చంద్రబాబు ప్రభుత్వం స్వార్థం కోసమే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వ హయాంలో నిర్మించిన 17 మెడికల్ కళాశాలలు ప్రైవేటుపరం అయితే పేద ప్రజలు వైద్య విద్య చదువుకోవడం కలగానే మిగిలిపోతుంది. ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఫీజులు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. – నిడుమోలు ఉమామహేశ్వరరావు, నరసాపురం మెడికల్ కళాశాలలు ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకున్నట్లు అవుతుంది. పేదలకు ఉచిత వైద్య సేవలు అందని పరిస్థితి ఏర్పడుతుంది. పేద, మధ్య తరగతి వైద్య విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుంది. ప్రభుత్వ వైద్య కళాశాలలు తక్కువ ఫీజుతో వైద్య విద్యను అందిస్తాయి. – ఆర్సీవీ రాజు, సింగరేణి కాలరీస్ రిటైర్డ్ జనరల్ మేనేజర్, నరసాపురం -
కన్ను పడితే కబ్జా
● నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో రూ.50 కోట్ల భూములు హాంఫట్ ● కూటమి పెద్దల దురాక్రమణలో ప్రభుత్వ భూములు ● నిర్మాణాలు చేసి అద్దెలకు ఇస్తున్న వైనం నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపాలిటీని ఆనుకుని ఉన్న లక్ష్మణేశ్వరం గ్రామంలో విలువైన కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములు కొందరు పెద్దల దురాక్రమణలోకి వెళ్లిపోతున్నాయి. కొందరు రాజకీయ నేతలు ప్రభుత్వ భూములపై కన్నేసి యథేచ్ఛగా వ్యవహారాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే లక్ష్మణేశ్వరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని కోట్లలో సొమ్ములు చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారాలపై గ్రామస్తులు కొందరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా.. ముడుపుల మత్తు, అధికార పార్టీ భయంతో పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఒకపక్క ప్రభుత్వ అవసరాలకు, అభివృద్ధి పనులకు కనీసం ఓ 10 సెంట్ల భూమి కావాలన్న లభించని స్థితి ఉండగా, మరోపక్క విలువైన ఇలాంటి ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం లేదు. ఆక్రమించుకుని అమ్ముకుంటూ.. నరసాపురం పట్టణ పరిధిలో పీచుపాలెంకు ఆనుకుని ఉన్న లక్ష్మణేశ్వరం గ్రామంలో పెద్ద విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ ప్రాంతం మున్సిపాలిటీలో విలీనమయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాంత భూములపై కొందరు రాజకీయ పార్టీల నేతల కళ్లు పడ్డాయి. దీంతో సదరు భూములను ఎవరి శక్తి మేరకు వారు ఆక్రమించుకుని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. రియల్టర్లు కొందరు వెంచర్లు వేసి అమ్మేస్తున్నారు. ఆక్రమణకు గురైన భూములపై బ్యాంకుల్లో రుణాలు కూడా భారీగా తీసుకుంటున్నట్టు సమాచారం. పక్కా భవన నిర్మాణాలు, కమర్షియల్ భవన నిర్మాణాలు చేసి, నెలనెలా భారీగా అద్దెలు కూడా దండుకుంటున్నా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. మురుగు కాలువను మాయం చేశారు రోడ్డు పక్కన ఆర్అండ్బీ స్థలాలతో పాటు, ఇరిగేషన్కు చెందిన భూములు పెద్ద విస్తీర్ణంలో ఆక్రమణకు గురైనట్టు తెలుస్తోంది. వేములదీవి ఛానల్కు అనుసంధానంగా ఉన్న ఓ మురుగు కాల్వను కబ్జాదారులు పూర్తిగా పూడ్చేసి అక్కడ ఒకప్పుడు కాలువ ఉండేదన్న సంగతి కూడా తెలియకుండా చేశారు. ఓ రియల్ ఎస్టేట్ వెంచర్కు దారిగా మార్చేసి.. ప్లాట్లు మొత్తం అమ్మేసుకున్నా అధికారుల్లో చలనం లేకపోవడానికి కారణం దీని వెనుక అధికార జనసేన నాయకుల అండ ఉండటమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని నెలలుగా ఆర్అండ్బీ స్థలాల్లో అక్రమ కట్టడాలు సాగుతున్నాయి. జనసేనకు చెందిన ఓ మత్స్యకార నేత స్వయంగా నిర్మిస్తున్న కట్టడాలు కొన్ని ఉండగా, మొత్తం అక్రమ కట్టడాల్లో ఎక్కువ కొందరు జనసేన నాయకుల కనుసన్నల్లో సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి విలువైన ప్రభుత్వ భూముల కబ్జాల పర్వం ఇంకెంత కాలం సాగుతుందోనని చర్చ నరసాపురం ప్రాంతంలో విస్తృతంగా సాగుతోంది. గ్రామానికి చెందిన బిళ్లు వెంకట సత్యనారాయణమూర్తి, బిళ్లు నర్సింహరావు సోదరులు ప్రభుత్వ భూముల ఆక్రమణ, అమ్మకాలపై ఏడాది క్రితం కలెక్టర్కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో 70, 70–1, 70–2ఎ, 70–3బి, 72–3, 70–3ఎ, 95–1, 95–2, 96–1బి, 96–2ఎ తదితర 21 సర్వే నంబర్లలో ఉన్న దాదాపు రూ.50 కోట్ల విలువైన 10 ఎకరాల భూములు కబ్జా కోరల్లో ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. జేసీ రాహుల్కుమార్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. అంత పెద్ద స్థాయిలో లేదని, చిన్నపాటి అక్రమ కట్టడాలు 21 గుర్తించామని పేర్కొని చేతులు దులుపుకున్నారు. ప్రస్తుత తహసీల్దార్ అయితం సత్యనారాయణ, అంతకుముందు పనిచేసిన రాజరాజేశ్వరి హయాంలో ఒకటి రెండు సార్లు తూతూమంత్రంగానే సర్వే జరిగినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఈ ఏడాది ఆగస్టు 14న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఇంతవరకు అధికారులు చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. -
సంతకాలకు కోటెత్తారు
సాక్షి, భీమవరం: వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చిన కోటి సంతకాల ఉద్యమానికి జిల్లాలో అనూహ్య స్పందన వచ్చింది. పేదలకు వైద్య విద్య, నాణ్యమైన వైద్యాన్ని దూరం చేసే చంద్రబాబు సర్కారు కుట్రలను నిరసిస్తూ ఊరువాడ ఏకమయ్యాయి. విద్యార్థులు, యువత, మేధావులు, మహిళలు, సామాజిక కార్యకర్తలు, ప్రజాసంఘాల నేతలు స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొని జిల్లాలో లక్ష్యానికి మించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, ఆచంటలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నరసాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, భీమవరంలో సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, పాలకొల్లులో గుడాల శ్రీహరిగోపాలరావు, తాడేపల్లిగూడెంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, ఉండిలో సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు ప్రధాన కూడళ్లు, విద్యాసంస్థలు, గ్రామగ్రామాన రచ్చబండలు ఏర్పాటుచేసి ప్రైవేటీకరణ నష్టాలను వివరిస్తూ ప్రజల నుంచి సంతకాలు సేక రించారు. పార్లమెంట్ అబ్జర్వర్ ముదునూరి మురళీకృష్ణంరాజు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనుబంధ విభాగాల వారు ఉత్సాహంగా సంతకాల సేకరణలో పాల్గొన్నారు. మంగళవారం భీమవరంలో జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు కోడి విజయలక్ష్మీ, యుగంధర్ దంపతులు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు తమ అనుచరులతో భీమవరంలోని విద్యాసంస్థలతో పాటు పలుచోట్ల సంతకాల సేకరణ చేశారు. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో సంతకాల ప్రతులను నేతలు మీడియా ముందు ప్రదర్శించారు. కార్యక్రమం విజయవంతం చేయడం పట్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు కుట్రలకు ప్రజాస్పందన చెంపపెట్టని ఈ సందర్భంగా పలువురు నేతలు పేర్కొన్నారు. బుధవారం సంతకాల ప్రతులతో నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు అనంతరం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయానికి తరలించనున్నారు. ఈనెల 15వ తేదీన భీమవరంలో భారీ ర్యాలీ అనంతరం గవర్నర్కు అందజేసేందుకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. జిల్లాలో విజయవంతంగా కోటి సంతకాల సేకరణ చంద్రబాబు సర్కారు ప్రైవేటీకరణ కుట్రలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం లక్ష్యానికి మించి అనూహ్య స్పందన నేడు నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు -
నాయకులు, కార్యకర్తల కృషి అమోఘం
భీమవరం: అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12న కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.కళ్యాణి తెలిపారు. మంగళవారం భీమవరంలో ఎండీ హసీనా బేగం అధ్యక్షతన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆమె మాట్లాడారు. గత సమ్మె సందర్భంగా వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని, కూటమి పార్టీలు ధర్నాలకు మద్దతునిచ్చి అధికారంలోకి రాగానే వేతనాలు పెంచుతామన్నారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా జీతాల సమస్య పరిష్కారం దిశగా ఆలోచించడం లేదన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, 164 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని, కొత్త ఫోన్లు ఇవ్వాలని, యాప్ల పని భారాన్ని తగ్గించాలని తదితర డిమాండ్లతో ధర్నా చేస్తున్నట్లు చెప్పారు.తణుకు అర్బన్: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసే చంద్రబాబు సర్కారు కుట్రకు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు నిర్వహించిన కోటి సంతకాల సేకరణలో సంతకాలు చేసిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. కోటి సంతకాల సేకరణలో పూర్తి సహకారం అందించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. తణుకు పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు సంపద సృష్టించి సంక్షేమాన్ని అందరికీ అందిస్తానని మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు నేటికి రూ. 2.66 లక్షల కోట్ల అప్పులు చేశారని, కేవలం రూ.5 వేల కోట్లు వెచ్చిస్తే పూర్తిగా అందుబాటులోకి వచ్చే ప్రభుత్వ వైద్య కళాశాలలను దుర్మార్గంగా ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రావడం వల్ల జగన్మోహన్రెడ్డికో, కారుమూరికో మంచి జరగడానికి కాదని పేదలకు అందాలనే ప్రధాన ఉద్దేశంతోనే ఈ వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకువచ్చారని స్పష్టం చేశారు. తణుకు నియోజకవర్గంలో 78,235 సంతకాలు సేకరించామని, అనుకున్న దానికంటే ఎక్కువ సంతకాలు చేయించగలిగినందుకు సంతోషంగా ఉందన్నారు. బుధవారం ఉదయం ర్యాలీగా వెళ్లి భీమవరంలో ఈ సంతకాల ప్రతులను అందచేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయితీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, లీగల్ సెల్ సభ్యుడు వెలగల సాయిబాబారెడ్డి, ఇరగవరం మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, ఏఎంసీ మాజీ చైర్మన్లు బుద్దరాతి భరణీప్రసాద్, ఉండవల్లి జానకి, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కారుమూరి -
టెట్ సందేహాలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఏలూరు (ఆర్ఆర్పేట): టెట్ పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించిన సందేహాలు, సలహాలు, సూచనలు, ఫిర్యాదులు ఇచ్చేందుకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చన్నారు. అవసరమైన వారు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ 90523 91111, 95056 44555, 96036 57499 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. తాడేపల్లిగూడెం: ఏపీ నిట్లో విశేష సేవలు అందించిన ఆచార్యులు ఇటీవల హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్శర్మ చేతులమీదుగా అవార్డులను అందుకున్నారు. ఏపీ నిట్లో ఎంఎంఈ విభాగానికి చెందిన ఆచార్యులు డాక్టర్ రఫీ మహమ్మద్ ఐఐఎంలో జరిగిన కార్యక్రమంలో బెస్ట్ స్టూడెంట్స్ అప్లియేటెడ్ చాప్టర్ అవార్డును అందుకున్నారు. ఇదే విభాగానికి చెందిన విద్యార్థిని జయస్మితా కె.ప్రతాన్ బెస్ట్ స్టూడెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ గుగులోతు సంతోష్ కుమార్ ఎంఎస్ స్వామినాథన్ గ్రీన్ ఎక్స్లెన్సీ అవార్డును అందుకున్నారు. అవార్డు గ్రహీతలను నిట్ ఇన్చార్జి, రిజిస్ట్రార్ అభినందించారు. -
రతన్టాటా ఇన్నోవేషన్ హబ్తో ఉద్యాన వర్సిటీ ఎంఓయూ
తాడేపల్లిగూడెం: ఉద్యాన పంటల్లో సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు గాను రాజమహేంద్రవరంలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవర్సిటీ మంగళవారం ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఉద్యాన వర్సిటీ వెంకట్రామన్నగూడెంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఉద్యాన వర్సిటీ రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ ఉద్యాన పంటల్లో సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. దీనిలో భాగంగానే ఈ ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఉద్యాన ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించేందుకు తూర్పుగోదావరి జిల్లా ఈ రంగంలో అభివృద్ధి సాధించడానికి ఎంఓయూ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అరటి ఆకుల ఎకో పైబర్, కొబ్బరి పాలు, కొబ్బరి నూనె, జీడిపప్పు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు స్థానిక పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. ఉద్యానవర్సిటీ రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు, కె.ధనుంజయరావు, తదితరులు పాల్గొన్నారు. -
కర్రసాములో ఏపీ చాంపియన్షిప్
దెందులూరు: కర్రసాములో ఏపీ చాంపియన్షిష్ – 2025 సింగల్ స్టిక్ (కర్ర) పోటీ విభాగంలో వేగవరం గ్రామానికి చెందిన మోర్ల భగత్ సామ్రాట్ గోల్డ్ మెడల్ సాధించాడు. గుంటూరు జిల్లాలో బుధవారం జరిగిన ఏపీ సౌత్ జోన్ సేలాంబం చాంపియన్షిప్–2025 లో భగత్ తన అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించి చాంపియన్షిప్ సాధించడం పట్ల కోచ్ వెంకన్న పలువురు అతడిని అభినందించారు. భీమడోలు: స్థానిక భీమడోలు పోలీస్స్టేషన్లో మంగళవారం రాత్రి వివాహిత ఫిర్యాదు మేరకు గృహహింస కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. సూరప్పగూడెంకు చెందిన వినీలకు, ఖమ్మం జిల్లా ఆశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన నిర్మల సురేష్తో 15 ఏళ్ల కితం వివాహమైంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. అయితే ఈ ఏడాది జనవరి 28వ తేదీన సురేష్ అనుమానంతో వేధిస్తూ చిత్రహింసలకు గురిచేశాడని, ఇందుకు కుటుంబ సభ్యులు కూడా సహకరించారని వినీల ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ఆమె అక్కడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మంగళవారం భీమడోలు పోలీస్స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడంతో సురేష్తో పాటు అతని కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్కే మదీనా బాషా తెలిపారు. -
బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
బుట్టాయగూడెం: స్థానిక బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.3 లక్షలు విలువ గల ఎలక్ట్రికల్ పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో బుట్టాయగూడెం మండలంలోని సుమారు 25 బీఎస్ఎన్ఎల్ టవర్ల పరిధిలో సేవలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అనంతరం సేవల పునరుద్ధరణకు బీఎస్ఎన్ఎల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో కాలిపోయిన పరికరాలను ఆర్జీఎమ్, ఏజీఎంతోపాటు ఇతర అధికారులు పరిశీలించారు. రూ. 3 లక్షలు విలువ గల ఎలక్ట్రానిక్స్ పరికరాలు దగ్ధం -
గిరిజన గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు సైతం బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు అందించేలా కృషి చేస్తున్నామని బీఎస్ఎన్ఎల్ ఆర్జీఎం ఎల్. శ్రీను తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన బుట్టాయగూడెంలో విలేకర్లతో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల ప్రాంతాల్లో 49 బీఎస్ఎన్ఎల్ టవర్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ టవర్లు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యాయని చెప్పారు. బుట్టాయగూడెం మండలంలోని అటవీప్రాంతంలో ఉన్న తానిగూడెం, వీరన్నపాలెం, రేగులపాడు, రేపల్లె, ఇనుమూరు, తదితర గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మరో 35 టవర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విలీన మండలాలను సైతం కలుపుకుని అన్ని ప్రాంతాల్లో కూడా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను మరింత విస్తృతంగా అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సేవలను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీజీఎం నలిని, పీజిఎం, డీఈఓపీ, డీఈ 4జీ ఎస్పీ తదితర అధికారులు పాల్గొన్నారు. బీఎస్ఎన్ఎల్ ఆర్జీఎం శ్రీను -
మద్ది క్షేత్రంలో విశేష పూజలు
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకుల (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహనం పూజలను ఆలయ అర్చకులచే నిర్వహించుకున్నారు. స్వామి వారి దర్శనార్థం వచ్చిన భక్తుల్లో సుమారు 2,295 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఆలయ ఈవో ఆర్వీ చందన తెలిపారు. అలాగే స్వామి వారి దేవస్థానానికి వివిధ సేవల రూపేణా రూ.2,20,160 ఆదాయం వచ్చిందన్నారు. సామర్లకోట: జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ ఓపెన్ మీట్లో సామర్లకోటకు చెందిన యాతం నాగబాబు 3 పతకాలు సాధించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆది, సోమవారాల్లో ఈ పోటీలు జరిగాయి. ఇందులో 1,500 మీటర్ల పరుగులో ఒక రజతం, 800, 400 మీటర్ల పరుగులో రెండు కాంస్య పతకాలు సాధించారు. ఈ పోటీల్లో 22 రాష్ట్రాల నుంచి 1,254 మంది అథ్లెట్లు పాల్గొన్నారని నాగబాబు ఈ సందర్భంగా తెలిపారు. 2013 నుంచి ఈ ఏడాది వరకూ జరిగిన వివిధ జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ ఓపెన్ మీట్ పరుగు పందెంలో 100, 200, 400, 800, 1,500 మీటర్లతో పాటు రిలే విభాగాల్లో 68 పతకాలు సాధించానని వివరించారు. వీటిలో 20 బంగారు, 23 రజత, 25 కాంస్య పతకాలున్నాయని తెలిపారు. 55 ఏళ్ల వయస్సులోను పతకాలు సాధిస్తున్న నాగబాబును పలువురు అభినందించారు. ఆయన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైద్య, ఆరోగ్య శాఖ మలేరియా విభాగంలో పని చేస్తున్నారు. -
అధికారి వస్తున్నారని సెంటు చల్లి..
● లాహం ఫుడ్ ఫ్యాక్టరీ పర్యవేక్షణకు వచ్చిన ఒకే ఒక్క అధికారి ● ముందుగానే తెలిసి ఫ్యాక్టరీ ప్రాంతంలో సెంటుకొట్టిన యాజమాన్యంతణుకు అర్బన్: తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలోని లాహం ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేటు లిమిటెట్ సంస్థలో అక్రమ గో పశువధపై కొన్నాళ్లుగా నెలకొన్న వివాదం సంగతి తెలిసిందే. దీనిపై ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ‘సాక్షి’ పత్రిక పలుమార్లు ప్రచురించింది కూడా. తణుకు సజ్జాపురానికి చెందిన బీజేపీ నాయకుడు, ఎలక్ట్రీషియన్ రేపాక సూర్య రామారావు కూడా స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీనిని పర్యవేక్షణ చేసేందుకు మంగళవారం పొల్యూషన్ శాఖ అధికారి వస్తున్నారని ముందుగానే సమాచారం తెలుసుకున్న ఫ్యాక్టరీ యాజమాన్యం ఫ్యాక్టరీ లోపల, బయట కూడా శుభ్రం చేయించడమే కాకుండా సెంటు చల్లించారని బాధితులు చెబుతున్నారు. రాత్రి, పగలు ఇక్కడ వస్తున్న దుర్వాసనకు ఇళ్లలో కూడా ఉండలేకపోతున్నామని, అధికారులు, ప్రజాప్రతినిధులు రెండురోజులు తమతో వారి ఇళ్లలో కలిసి ఉండాలని, అందుకు అయ్యే ఖర్చంతా తామే భరిస్తామని వేడుకొంటున్నారు. పర్యవేక్షణ మొక్కుబడిగా ముఖ్యమంత్రి కార్యాలయానికి అందిన ఫిర్యాదుతో ఏలూరు నుంచి పొల్యూషన్ శాఖ ఫీల్డ్ అసిస్టెంట్ అధికారి ఎన్.వెంకటరమణ వచ్చి ఫిర్యాదుదారుతోపాటు బాధితుల నుంచి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ వెనుకభాగంలోని పొలాలు, ఫ్యాక్టరీ వెనుక గేటు ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధితుల సమస్య తెలుసుకున్నానని, ఫ్యాక్టరీ యాజమాన్యానికి 15 రోజుల గడువు ఇచ్చి సమస్యను పరిష్కరించుకునే దిశగా వెళ్లాలని చెప్పనున్నట్లు వివరించారు. కాగా ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదుచేస్తే కేవలం మొక్కుబడిగా ఒకేఒక్క పొల్యూషన్ అధికారిని పంపించారని బాధితులు విమర్శించారు. రాత్రి సమయాల్లో తీవ్ర దుర్వాసన ఫిర్యాది రామారావు మాట్లాడుతూ 6 నెలల క్రితం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు పంపానని, నెలరోజుల తరువాత అధికారులు వచ్చి వెళ్లాక సమస్య పరిష్కారం చేసినట్లుగా తనకు సమాచారం వచ్చిందని అన్నారు. సమస్య పరిష్కారం కాకుండా పరిష్కారం అయినట్లుగా మెసేజ్ పంపడంతో మరలా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో పొల్యూషన్ అధికారి వచ్చారని, రాత్రి సమయాల్లో తేతలితోపాటు పైడిపర్రు, తణుకు సజ్జాపురం ప్రాంతాల్లో కూడా దుర్వాసన వస్తుందని చెప్పారు. -
నూతన విద్యుత్ లైన్ మంజూరు
కుక్కునూరు: కుక్కునూరు మండలానికి విద్యుత్ కష్టాలు తీర్చే దిశగా ప్రభుత్వం నూతన విద్యుత్ లైన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనం అయిన నాటి నుంచి ఈ మండలాలకు జంగారెడ్డిగూడెం 132 కేవీ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరుగుతుంది. కాగా విద్యుత్ సరఫరా కుక్కునూరు వరకు చేరాలంటే మైసన్నగూడెం, పి నారాయణపురం, రాచన్నగూడెం, వేలేరుపాడు గ్రామాల్లోని 33 కేవీ సబ్స్టేషన్లను దాటుకుని రావాల్సి ఉండడంతో చిన్న గాలికే గంటల తరబడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి విలీన మండలాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయమై అల్లూరి జిల్లాలోని ఎటపాక 132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నుంచి గోదావరి మీదుగా నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు చేసి కరెంట్ సమస్యను పరిష్కరించాలని ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. దీంతో స్పందించిన ప్రభుత్వం ట్రాన్స్కో సర్వేయర్లను మండలానికి పంపి సర్వే చేయించింది. సర్వే రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం అల్లూరి జిల్లాలోని నెల్లిపాక సబ్స్టేషన్ నుంచి కొత్త 33 కేవీ లైన్ను మంజూరు చేసింది. కాగా ఈ పనులకు త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. -
విద్యార్థినులపై లైంగిక వేధింపులు
భీమవరం అర్బన్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు వికృత చేష్టలకు పాల్పడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఉండి, భీమవరంలో కీచక ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన సంఘటనలు మరువక ముందే మండలంలోని గొల్లవానితిప్ప జెడ్పీ హైస్కూల్లో మరో ఉపాధ్యాయుడు సస్పెన్షన్కు గురయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. గొల్లవానితిప్ప హైస్కూల్లో 192 విద్యార్థులు ఉండగా వారిలో 106 మంది విద్యార్థినులే. 9,10 తరగతులకు గణితం బోధించే ఉపాధ్యాయుడు బోడ సుధీర్బాబు గత 27 రోజుల క్రితం తరగతి గదిలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగికంగా వేధించాడు. విషయాన్ని తల్లిదండ్రులు హెచ్ఎం మల్లికార్జునరావు దృష్టికి తీసుకువెళ్లగా అప్పటినుంచి సుధీర్బాబు విధులకు హాజరు కా వడం లేదు. అయితే ఈ విషయాన్ని జనసేన నాయకులు గుట్టుగా రాజీ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సుఽధీర్బాబుపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ చిల్లే వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ సురేష్, గ్రామ పెద్దలు డీవైఈఓకు వినతిపత్రం అందించారు. ఇటీవల జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్లో తల్లిదండ్రులు ఈ విషయాన్ని లేవనెత్తారు. దీంతో డీఈఓ ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. ఈనెల 6న నివేదిక అందించడంతో సోమవారం ఉపాధ్యాయుడు సుధీర్బాబును సస్పెండ్ చేసినట్టు డీవైఈఓ రమేష్ తెలిపారు.ఉపాధ్యాయుడి సస్పెన్షన్ -
లక్ష్యానికి మించి కోటి సంతకాలు
రేపు నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు సాక్షి, భీమవరం: వైద్య క ళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద రాజు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉద్యమంలో పాల్గొనడంతో లక్ష్యానికి మించి జిల్లాలో సంతకాల సేకరణ విజయవంతం అయ్యిందన్నారు. కార్యక్రమంలో భా గంగా బుధవారం సంతకాల ప్రతులతో నియో జకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి జిల్లా కేంద్రం భీమవరం పంపించాలని పార్టీ శ్రేణులను కోరారు. 15న తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి సంతకాల ప్రతులను పంపే సందర్భంగా భీమవరంలో నిర్వహించే భారీ ర్యాలీకి జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సోమ వారం ప్రకటనలో ప్రసాదరాజు విజ్ఞప్తి చేశారు. అత్తిలి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను చంద్రబాబు సర్కారు ప్రైవేటీకరణకు పూనుకోవడం దారుణమని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనా థ్ అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా సోమవారం అత్తిలి ఎస్వీఎస్ఎస్ డిగ్రీ కళాశాల వద్ద శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లా డుతూ వైద్య కళాశాలలను ప్రభుత్వం నడిపితే పేదలకు వైద్య విద్య, వైద్య సేవలు అందుతాయన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, మాజీ ఏఎంసీ చైర్మన్ బుద్దరా తి భరణీప్రసాద్, మద్దాల బాపిరాజు, కంకటా ల సతీష్, బుడితి సుజన్కుమార్ పాల్గొన్నారు. భీమవరం: స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి 19 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దని, నిర్ణీత గడువులోపు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు తదితరులు పాల్గొన్నారు. నరసాపురం: కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి తమను నిర్బంధించిన మున్సిపల్ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని నరసాపురం ము న్సిపల్ చైర్పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ, వైఎ స్సార్సీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. సోమ వారం నరసాపురం డీఎస్పీ జి.శ్రీవేదను కలిసి వినతిపత్రం అందించారు. వైఎస్సార్సీపీ పట్ట ణ అధ్యక్షుడు కామన బుజ్జి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కామన నాగిని, కౌన్సిలర్లు ఉన్నారు. నరసాపురం: తనను కొందరు చంపుతామని బెదిరిస్తున్నారని వైఎస్సార్సీపీనేత చెరుకూరి సత్యవర ప్రసాదరాజు నరసాపురం ఆర్డీఓ దాసి రాజుకు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. నరసాపురం మండలంలోని సీతారామపురం సౌత్ గ్రామం, రాజులపాలెంలో నిషేధిత వా టర్ ట్యాంక్ ప్రభుత్వ పోరంబోకు స్థలంలో, ఓవర్ హెడ్ ట్యాంక్ కింద అక్రమంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను తొలగించాలని తాను హై కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకువచ్చిన క్రమంలో బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. భీమవరం: జిల్లాలో ఏపీ టెట్ (ఉపాధ్యాయల అర్హత పరీక్ష)కు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో టెట్ నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈనెల 10 నుంచి 21 వరకు భీమవరం విష్ణు ఇంజనీరింగ్, డీఎన్నార్ ఇంజనీరింగ్, ఎస్ఆర్కేఆర్, విష్ణు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, డీఎన్నార్ అటామస్ కళాశాల, నరసాపురం స్వర్ణాంధ్ర, తాడేపల్లిగూడెం వాసవి, శశి ఇంజనీరింగ్ కళాశాలల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 12,985 మంది అభ్యర్థులు హాజరుకాను న్నారని చెప్పారు. అలాగే టెన్త్ విద్యార్థులకు వంద రోజుల కార్యాచరణ అమలు ద్వారా నూ రు శాతం ఫలితాలు సాధించాలన్నారు. -
నరసాపురం కమిషనర్ మాకొద్దు
నరసాపురం: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, కౌన్సిల్కు కూడా తెలియకుండా బాక్స్ టెండర్ల రూపంలో అవినీతి వ్యవహారాలు సాగిస్తున్న నరసాపురం మున్సిపల్ కమిషనర్ ఎం.అంజయ్యపై చర్యలు తీసుకోవాలని నరసాపురం మున్సి పల్ చైర్పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కోరారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ వెంకటరమణ మాట్లాడుతూ ఈనెల 6న జరిగిన కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు మూకుమ్మడిగా కమిషనర్ అవినీతి వ్యవహారాలను ఎండగట్టారన్నారు. అలాగే కమిషనర్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ తీర్మానం చేశారని చెప్పారు. ఈ మేరకు తీర్మానం కాపీని జేసీకి అందించారు. ఈ అంశంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. చైర్పర్సన్తో పాటు వైస్ చైర్పర్సన్ కామన నాగిని,కౌన్సిల ర్లు కావలి రామసీత, యర్రా శ్రీను, ద్వారా ప్రసాద్, మల్లాడి శేషవేణి, అడిదల శ్యామల, వంగా శ్రీకాంత్కన్నా, సఖినేటిపల్లి సురేష్, సిర్రా కాంత, సోమరాజు దుర్గాభవాని ఉన్నారు. అర్జీల స్వీకరణ భీమవరం (ప్రకాశం చౌక్ ): భీమవరం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో జేసీ రాహుల్కుమార్రెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గడువులోపు సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఉండి మండల వెలివర్రుకు చెందిన కోనాల రాజీ అనే యువతి ఈనెల 6న రాత్రి నుంచి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని, 8న హైదరాబాద్ సంతోషనగర్ స్టేషన్ నుంచి పోలీసులు ఫోన్ చేసి చోరీ కేసులో జైలుకు పంపా మని తెలిపారని, విచారణ చేసి న్యాయం చేయాలని తండ్రి సురేష్, బంధువులు జేసీని కోరా రు. అలాగే నరసాపురం జిల్లా కేంద్రం చేయాలని పలు సంఘాల నాయకులు జేసీకి వినతిపత్రం సమర్పించారు. ధాన్యం తూకాల్లో మోసాలు ధాన్యం తూకాల్లో మోసాలు అరికట్టి రైతు సేవా కేంద్రంలో వచ్చిన తేమశాతమే ఫైనల్ చేయాలని, కొత్త గోనె సంచులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జేసీకి వినతిపత్రం అందించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 12న రక్తదాన శిబిరం భీమవరం కలెక్టరేట్లో ఈనెల 12న రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్టు, ఉద్యోగులకు రక్తదానంపై అవగాహన కల్పించాలని జేసీ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో 2026 వార్షిక రక్తదాన శిబిరాల ఏర్పాటు వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. సరెండర్ చేస్తూ కౌన్సిల్ తీర్మానాన్ని జేసీకి అందించిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు -
గళమెత్తిన సహకార ఉద్యోగులు
భీమవరం: రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల యూ నియన్ జేఏసీ పిలుపు మేరకు భీమవరంలో జిల్లా సహకార కేంద్ర బ్యాం మెయిన్ బ్రాంచ్ వద్ద సో మవారం ఉద్యోగులు ధర్నా చేశారు. యూనియన్ నాయకులు నందమూరి సుబ్బారావు, ఎస్.వరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల ఉద్యోగుల దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని, వేతన సవరణ కమిటీ వేయాలని, చట్టం ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. 2019 తరువాత నియమించిన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. అనంతరం డీసీసీబీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ దు ర్గారావుకు వినతిపత్రాలు అందజేశారు. ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని పలు ప్రాంతాల్లో డీసీసీబీ బ్రాంచీల వద్ద ఉద్యోగులు ధర్నా చేశారు. యలమంచిలి, వీరవాసరం, తణకు, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో ఆయా కార్యాలయాల వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. -
డ్వాక్రా మహిళల ఆందోళన
ఆకివీడు: తమకు తెలియకుండా తమ గ్రూపుల పే రున లక్షలాది రూపాయలు కాజేసి, మోసం చేసిన యానిమేటర్పై చర్యలు తీసుకోవాలంటూ డ్వాక్రా మహిళలు సోమవారం స్థానిక జాతీయ రహదారిపై యూనియన్ బ్యాంక్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. 32 గ్రూపులకు చెందిన ఖాతాల్లో సుమారు రూ.62 లక్షలు విత్డ్రా చేసి మోసగించారని, న్యా యం చేయాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో ఎస్సై హనుమంతు నాగరాజు ఇక్కడకు వ చ్చి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నామని రీజనల్ మేనేజర్ వచ్చి విస్తృత స్థాయి లో విచారణ చేపట్టిన తర్వాత బాధితులకు ఎలా న్యాయం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఎస్సైకు బ్యాంక్ మేనేజర్ వివరించారు. ఇదే తరుణంలో స్థానిక సమతానగర్లోని యానిమేటర్ కూడా తమ ఖాతాల్లో సొమ్మును డ్రా చేశారని ఆరోపిస్తూ పలు సంఘాల మహిళలు బ్యాంకు వద్దకు వచ్చారు. -
కోటి సంతకాలకు అనూహ్య స్పందన
పెనుగొండ: చంద్రబాబు సర్కారు కుట్రపూరిత నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభించిందని వైఎస్సార్ సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. సోమ వారం తూర్పుపాలెంలోని కార్యాలయంలో పెను గొండ, ఆచంట, పెనుమంట్ర, పోడూరు మండలాల్లో సేకరించిన జాబితాలను పార్టీ నాయకులు మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజులకు అందించారు. ఈ సందర్భంగా శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో బడుగు, బలహీన, దళిత వర్గాలతో పాటు, అగ్రవర్ణాల్లోని పేదలకు అన్యాయం జరుగుతుందని ప్రజలు గ్రహించారన్నారు. దీంతో సంతకాలు చేయడానికి అన్నివర్గాల నుంచి మద్దతు లభించిందన్నారు. చంద్రబాబు అధికారం చేపట్టిన 18 నెలల్లోనే రెండు వేలకు పైగా మెడికల్ సీట్లు కోల్పోయామన్నారు. దీనిని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ రాజకీయాలు చేయడం ప్రారంభించారన్నా రు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ధనికవర్గాలకే విద్య అందుబాటులో ఉంచుతున్నారని, ప్రజలంతా వ్యతిరేకించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. మండల కన్వీనర్లు పిల్లి నాగన్న, జక్కంశెట్టి చంటి, నల్లిమిల్లి వేణుప్రతాపరెడ్డి(బాబీ), గూడూరి దేవేంద్రుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి దంపనబోయిన బాబూరావు, విద్యార్థి విభా గం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమనంపూడి సూర్యరెడ్డి, నాయకులు వెలగల శ్రీనివాస రెడ్డి,తిక్కిరెడ్డి పవన్, కుడిపూడి సుబ్రహ్మణ్యం, గుబ్బల వీర బ్రహ్మం, పడాల అబ్బు, కర్రి వేణుబాబు, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు -
ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు నష్టం
భీమవరం: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని, ప్రజలంతా నిలదీయాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి చినమిల్లి వెంకట్రాయుడు అన్నా రు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని ప్రకాశంచౌక్ సెంటర్లో నిర్వహించిన కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభించింది. చినమిల్లి నేతృత్యంలో శిబిరాన్ని ఏర్పాటుచేయగా వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు, కా ర్మికులు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేసి మ ద్దతు తెలిపారు. ప్రధాన కూడలి కావడంతో ప్రయాణికులు సైతం మేముసైతం అన్నారు. ఈ సంద ర్భంగా వెంకటరాయుడు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు మాట్లాడుతూ పేద వి ద్యార్థులు సైతం వైద్యవిద్యను అభ్యసించేలా మాజీ సీఎం జగన్ గత వైఎస్సార్సీపీ పాలనలో 17 మెడికల్ కళాశాల నిర్మాణం ప్రారంభించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వీటిని ప్రైవేటుపరం చేసి తన అనుయాయులకు అప్పగించాలని చూస్తోందన్నా రు. ప్రైవేటీకరణపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమవరం ఎంపీపీ పేరిచర్ల విజయనర్సింహరాజు, పార్టీ నాయకులు ఏఎస్ రాజు, కోడే యుగంధర్, గాదిరాజు రామరాజు, ఇంటి సత్యనారాయణ, గుంటి ప్రభు, జంగం మాణిక్యాలరావు, కనుమూరు విజయదుర్గ, భుద్రరాజు సత్య, ఎండీ వసీం, తాళ్లపూడి పరమేశ్వరరావు, పతివాడ శేషు, పెచ్చెటి ప్రసాధ్, బొత్స ధర్మా, భుద్రరాజు వర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులకు నరకవేతన
ఏలూరు (మెట్రో)/భీమవరం (ప్రకాశం చౌక్ ) : గతనెల 5వ తేదీ.. ఈనెల 8 వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు జమకాలేదు. ప్రతినెలా 1వ తారీఖునే జీతాలు జమచేస్తామన్న కూటమి నాయకుల హామీ లు అమలుకావడం లేదు. నెలంతా కష్టపడినా ప్రతినెలా జీతాల కోసం ఎదురుచూడటం ప్రభుత్వ ఉద్యోగులకు పరిపాటిగా మారింది. దీంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు అవస్థలు తప్పడం లేదు. ప్రతి నెలా నిర్లక్ష్యమే.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 67 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. ఏలూరు జిల్లా లో 38 వేలు, పశ్చిమగోదావరి జిల్లాలో 29 వేల మంది పలు శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు సుమారు 20 వేల మందికి పైగా పెన్షనర్లు ఉన్నారు. అలాగే సుమారు 15 వేల మంది అవుట్ సోర్సింగ్, 17 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతినెలా వీరికి ఒకటో తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లించాల్సి ఉంది. అయితే చంద్రబాబు సర్కారు జీతాల చెల్లింపుల్లో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఒక్కో శాఖకు ఒక్కోలా.. 1వ తేదీన జీతాల చెల్లింపు ప్రక్రియకు చంద్రబాబు ప్రభుత్వం వక్ర భాష్యం చెబుతోంది. అవుట్ సోర్సింగ్, న్యాయశాఖ, పెన్షనర్లకు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి 1, 3వ తేదీల్లో చెల్లింపులు చేశారు. అయితే రెవెన్యూ, ఇరిగేషన్, జిల్లాపరిషత్, కో–ఆపరేటివ్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ ఉద్యోగులు, న్యాయశాఖలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానాల సిబ్బంది ఇలా పలు శాఖల ఉద్యోగులకు సోమవారం (8వ తేదీ) రాత్రి వరకూ జీతాలు జమ కాలేదు. ఒక్కోశాఖకు ఒక్కో తేదీన చెల్లింపులు చే యడం ఏమిటో ఉద్యోగులకు అర్థం కావడం లేదు. సిబిల్ స్కోర్పై ప్రభావం ప్రస్తుతం ప్రతి వ్యక్తికీ ఆర్థిక క్రమశిక్షణ కీలకంగా మారింది. బ్యాంకులు ఖాతాదారుల పాన్కార్డు ఆధారంగా సిబిల్ స్కోర్ అనేది పరిశీలిస్తున్నారు. రుణాల మంజూరు, ఈఎంఐల చెల్లింపులు, చెక్ బౌన్స్ల తదితరాల ద్వారా సిబిల్ స్కోర్ లెక్కి స్తారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు నిర్వాకంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు సిబిల్ స్కోర్ పడిపోతోంది. ఈఎంఐలకు ఇచ్చిన చెక్లు, రుణాల చెల్లింపులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో సిబిల్ స్కోర్పై ప్రభావం చూపుతుందని ఉద్యోగులు అంటున్నారు. జీతాలు జమకాక ఖాతాలు ఖాళీగా ఉండటంతో రుణాలకు సంబంధించి బ్యాంకుల్లో ఇచ్చి న చెక్కులు బౌన్స్ అవుతున్నాయని వాపోతున్నా రు. సంవత్సరం చివరి నెల కావడం, క్రిస్మస్ వంటి ప్రధాన పండుగ ఉండటంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగులకు డీఏల చెల్లింపులు, ఇతర ప్ర యోజనాలు అందించడంలో చంద్రబాబు స ర్కారు విఫలమైంది. ఈ నేపథ్యంలో వాటిని ప్రశ్నించడానికి వీలు లేకుండా జీతాలు వస్తే చాలురా ‘బాబూ’ అనే ధోరణికి ప్రభుత్వం తీసుకొస్తోంది. ప్రతి నెలా జీతాల చెల్లింపులో ఆలస్యం కావడం, ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయంలో ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులపై కక్షపూరిత ధోరణిని ప్రభుత్వం అవలంబిస్తోందని ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. ఇదేం ఖర్మరా బాబూ ! 8వ తేదీ వచ్చినా జీతాలు జమ కాలేదు చరిత్రలో ఎన్నడూ లేదంటున్న ఉద్యోగ సంఘాలు డిఫాల్టర్లుగా మారుతున్న ఉద్యోగులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది మంది ఎదురుచూపులు ఉద్యోగులు ప్రతి నెలా రుణాలకు ఈఎంఐలు పెట్టుకుంటారు.జీతాలు జమ చేయడంలో ఇలా ఆలస్యం చేయడంతో వారి సిబిల్ స్కోర్పై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో భవిష్యత్లో రు ణాలు కూడా లభించని పరిస్థితి ఉద్యోగులకు ఎదురవుతుంది. ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి. –ఆర్ఎస్ హరనాథ్, పీఏఓ రాష్ట్ర అధ్యక్షుడురుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో ఉ ద్యోగులు డిఫాల్ట్గా మారిపోతున్నారు. బ్యాంకులు ఉద్యోగులకు భవిష్యత్లో రుణాలు మంజూరు చేసే అవకాశమే లేకుండా ప్రభుత్వం చేస్తుంది. గత నెల 6 వచ్చినా జీతాలు జమ కాలేదు. ఈనెల ఇప్పటివరకూ లేవు. నా 33 ఏళ్ల ఉద్యోగ చరిత్రలో ఎన్నడూ ఇలా లేదు. –జి.శ్రీధర్రాజు, జిల్లాపరిషత్ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు ఈనెల 8వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు చెల్లించపోవడం దారుణం. ప్రతి నెలా జీతాల చెల్లింపులో మాత్రం ప్రభుత్వం ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికే పలు రూపాల్లో ఉద్యోగులకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వాటి కోసం అడగకుండానే జీతాలు కోసం అడగాల్సిన పరిస్థితి. – కె.రమేష్కుమార్, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు -
ఉపాధ్యాయులకు వేధింపులు
భీమవరం: ఉపాధ్యాయులు సెలవు రోజున కూడా పనిచేయాలని వేధించడం సరికాదని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.సాయిశ్రీనివాస్ అన్నారు. సోమవారం అంబేడ్కర్ భవన్లో ఎస్టీయు జిల్లా శాఖ 79వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడితో బోధనేతర పనులు పనిచేస్తున్నప్పటికీ ఆదివారం కూడా పాఠశాలలో పనిచేయాలని వంద రోజుల షెడ్యూల్ అమలు చేయాలని వేధింపులకు గురి చేయడం మానుకోవాలని సాయి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు రూ.30 వేల కోట్లు చెల్లించడానికి తక్షణం రోడ్ మ్యాప్ ఇవ్వాలని, 12వ పీఆర్సీ కమిటీని నియమించాలన్నారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పీఆర్విఎస్ సాయివర్మ, కెవీ రామచంద్రరావు, ఆర్థిక కార్యదర్శిగా పీవీడి ప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వహకులుగా గుత్తుల శ్రీనివాస్, డి దావీదు, తదితరులను ఎన్నుకున్నారు. -
జనం చెంతకు గిరిజన ఉత్పత్తులు
బుట్టాయగూడెం: అటవీ ప్రాంతంలో గిరిజనులు సేకరించిన సహజ సిద్ధమైన అటవీ ఉత్పత్తులను ప్రజల చెంతకు చేర్చేందుకు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ప్రత్యేక కృషి చేస్తుంది. అడవుల్లో గిరిజనులు సేకరించిన ముడి సరుకులను జీసీసీ అధికారులు కొనుగోలు చేసి వాటి ద్వారా రకరకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. తయారు చేసిన ఉత్పత్తులను జీసీసీ ద్వారా ఏర్పాటు చేసిన షాపుల్లో, మొబైల్ వ్యాన్, వారాంతపు సంతల్లో విక్రయిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు లేని సరుకులు కావడంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ శాతం మంది ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గిరిజన ఉత్పత్తులకు దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. ప్రధానంగా అరకు కాఫీతో పాటు గిరిజన తేనె, త్రిఫల పౌడర్, ఆయిల్, గిరిజన సబ్బులకు మంచి గిరాకీ ఉంది. గిరిజన సహకార సంస్థ కోటరామచంద్రపురం పరిధిలో 26 జీసీసీ చౌక డిపోల్లో గిరిజన ఉత్పత్తులు అమ్మకాలు ఎక్కువగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అటవీ ఉత్పత్తుల విక్రయాలు ఇలా అటవీ ప్రాంతం నుంచి గిరిపుత్రులు సేకరించిన చింతపండు, పుట్ట తేనె, చెట్ల తేనె, నరమామిడి చెక్క, కరక్కాయలు, నల్ల జీడిగింజలు, ముసిడి గింజలు, అడవి ఉసిరి కాయలు, శీకాయలు, కుంకుడు కాయలు వివిధ రకాల పండ్లు సుమారు 30 రకాల వరకూ చిన్న తరహా ఉత్పత్తులు గిరిజన సహకార సంస్థ(జీసీసీ) సేకరిస్తుంది. అరకు కాఫీకి పెరిగిన డిమాండ్ జీసీసీ ద్వారా విక్రమిస్తున్న అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ఉండడంతో ఈ కాఫీకి డిమాండ్ పెరిగింది. అరకు కాఫీ పశ్చిమ మన్యం ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో జీసీసీ అధికారులు కేఆర్పురం ఐటీడీఏ, బుట్టాయగూడెంలో అరకు కాఫీ విక్రయ షాపులను ఏర్పాటు చేశారు. తాటి బెల్లంతో తయారు చేసిన ఆర్గానిక్ బిస్కెట్లు, ఉండలు ఏర్పాటు చేయడంతో ప్రజలు ఎంతో ఇష్టంగా వాటిని కోనుగోలు చేస్తున్నారు. రూ.19.50 కోట్ల అమ్మకాలు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కేఆర్పురం పరిధిలో గల బుట్టాగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాలతో పాటు సుమారు 26 అటవీ ఉత్పత్తులు, నిత్యవసర సరుకులు విక్రయించే డిపోలు ఉన్నాయి. వీటితో పాటు జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, ఏలూరు, నర్సాపురం, పాలకొల్లు, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ప్రాంతాల్లో గిరిజన అటవీ ఉత్పత్తులు షాపుల్లో విక్రయించేలా అధికారులు ఏర్పాటు చేశారు. వీలిలో 2025 –26 ఆర్థిక సంవత్సరానికి రూ.32.54 కోట్ల అమ్మకాలు టార్గెట్ కాగా 2025 డిసెంబర్ వరకూ సుమారు రూ.19.5 కోట్ల అమ్మకాలు జరిగినట్లు జీసీసీ అధికారులు తెలిపారు. మిగిలిన టార్గెట్ మార్చి నెలాఖరుకు పూర్తి చేస్తామని చెబుతున్నారు. అటవీ వస్తువులకు మంచి గిరాకీ జీసీసీ ద్వారా విక్రయిస్తున్న ఉత్పత్తులను ప్రజల చెంతకు చేరేలా కృషి చేస్తున్నాం. కోటరామచంద్రాపురం జీసీసీ పరిధిలోని 26 డిపోల్లో విక్రయాలు చేస్తున్నాం. గిరిజన ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. ఈ ఏడాది సుమారు కేఆర్పురం జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తులు, పెట్రోలు, గ్యాస్ తదితర అన్ని రకాల అమ్మకాలు సుమారు రూ. 19 కోట్ల 50 లక్షల వరకూ జరిగాయి. చెరుకూరి రాజయోగి, కేఆర్పురం జీసీసీ మేనేజర్, బుట్టాయగూడెం మండలం -
రావిపాడులో వైద్య శిబిరం
పెంటపాడు: సాక్షి పత్రికలో శనివారం ప్రచురితమైన శ్రీపారిశుద్ధ్యం ఇలా.. ఆరోగ్యం ఎలాశ్రీ వార్తకు ఽఅధికారులు స్పందించారు. ముదునూరు వైద్యాధికారులు పూజిత, పవన్కుమార్ ఆధ్వర్యంలో సోమవారం సర్పంచ్ పెన్నాడ సూరిబాబు ఇంటి వద్ద పెన్నాడ, తోట వారి వీధుల్లో వైద్య శిబిరం నిర్వహించారు. జ్వరం అనుమానితుల నుంచి రక్త నమూనాలు సేకరించారు. డ్రెయినేజీ నీటితో కలుషితమైన తాగునీటిని తాగొద్దని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని గ్రామంలో ప్రచారం చేశారు. గ్రామంలో ఇంటింటి వైద్య సర్వే కోసం 4 బృందాలను పంపించారు. -
హ్యాండ్బాల్ పోటీలకు ఎంపిక
కామవరపుకోట: జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఆడమిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంటా రవిచంద్రమోహన్ సోమవారం తెలిపారు. నవంబర్ 28 నుంచి 30 వరకు చిత్తూరు జిల్లా కలికిరిలో జరిగిన రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలలో అండర్ 14 విభాగంలో పాఠశాలకు చెందిన 9 వ తరగతి విద్యార్థిని కొండపర్తి పూజిత విశేష ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఈ విద్యార్థిని త్వరలో రాజస్థాన్లో జరగబోయే జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలలో పాల్గొననట్లు తెలిపారు. తణుకు అర్బన్: పశ్చిమగోదావరి జిల్లా అండర్ 16, 18, 20 బాలురు, బాలికలు, పురుషులు, సీ్త్రల క్రాస్ కంట్రీ (రోడ్ రన్) జట్ల ఎంపికలు సోమవారం తణుకు డీమార్ట్ ప్రాంతంలో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 200 మంది హాజరుకాగా వారిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన 22 మందిని ఎంపిక చేసినట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంకు సూర్యనారాయణ తెలిపారు. పోటీలను అసోసియేషన్ అధ్యక్షుడు చింతకాయల సత్యనారాయణ ప్రారంభించారు. ఎంపికై న జట్లు ఈ నెల 24న పెద్దాపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని వివరించారు. ఎంపిక పోటీలను అసోసియేషన్ కోశాధికారి కె.బాబురావు, వ్యాయామ ఉపాధ్యాయురాలు కె.ఈశ్వరి పర్యవేక్షించారు. భీమవరం: ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం శంభాల చిత్ర బృందం సందడి చేసింది. శంభాల సినిమా ఈనెల 25న విడుదలను పురస్కరించుకొని ప్రమోషన్లో భాగంగా కళాశాలకు వచ్చిన చిత్ర బృందం విద్యార్థులతో డ్యాన్స్ చేసింది. కార్యక్రమంలో హీరో, హీరోయిన్స్ ఆది సాయికుమార్, అర్చన, దర్శకుడు యుగంధర్ ముని, చిత్ర నిర్మాత రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మావుళ్లమ్మ అమ్మవారిని చిత్ర బృందం దర్శించుకుంది. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు . నిడమర్రు: ఇటీవల గుణపర్రులో వరుస చోరీల కేసును నిడమర్రు పోలీసులు ఛేదించారు. సోమవారం నిడమర్రు పీఎస్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐ ఎన్.రజనీకుమార్, ఎస్సై ఎస్ఎన్వీవీ రమేష్ కేసు వివరాలు తెలిపారు. గుణపర్రులో సెప్టెంబరు 29 రాత్రి వరుస చోరీలు జరిగాయని, సీసీ పుటేజీ, ఆధునిక సాకేంతికత సహాయంతో నిందితుడిని గుర్తించామన్నారు. అదే గ్రామానికి చెందిన కాకులపాటి పూర్ణ సుభాష్ (26)గా నిందితుడిని గుర్తించారు. సుమారు 6 లక్షల విలువైన 48 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాఽధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో జరిగిన హత్య కేసులో నిందితుడు బత్తిన బ్రహ్మయ్య అలియాస్ రాంబాబుకు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా 2వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ న్యాయమూర్తి ఇందిరా ప్రియదర్శిని సోమవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చింతమనేని రమేష్ వాదనలు వినిపించారు. ద్వారకాతిరుమల: తన జీవితం ఆలయ అభివృద్ధికే అంకితమని చినవెంకన్న దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు అన్నారు. సోమవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి, ఈఈ డీవీ భాస్కర్, డిప్యూటీ ఈవో భద్రాజీ తదితరులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
టీడీపీ నేతల శంకుస్థాపనపై ఫిర్యాదు
ద్వారకాతిరుమల: కొందరు టీడీపీ నాయకులు ప్రొటోకాల్ను ఉల్లంఘించి, ఇష్టానుసారంగా పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడంపై వైఎస్సార్సీపీకి చెందిన సత్తాల సర్పంచ్ కొండాబత్తుల సుభద్ర సోమవారం పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్కు ఫిర్యాదు చేశారు. పంచాయతీ సండ్రకుంటలో గత శనివారం ఎంపీడీవో పీవీవీ ప్రకాష్, పంచాయతీ కార్యదర్శి సందీప్ల సమక్షంలో టీడీపీ మండల అధ్యక్షుడు లంకా సత్యనారాయణ, మరికొందరు పంచాయతీ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, తనకు ముందు రోజు రాత్రి మొక్కుబడిగా ఫోన్ చేసి ఆహ్వానం పలికారని, ఎంపీపీ బొండాడ మోహినీ వెంకన్నబాబుకు గాని, వార్డు సభ్యులకు గాని కనీసం సమాచారం ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను బలహీన వర్గానికి చెందిన సర్పంచ్ని కావడం వల్లే ఇలా చేశారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్ ఎంపీడీవో, పంచాయితీ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, విచారణ జరపాలని డీపీఓని ఆదేశించినట్టు సర్పంచ్ తెలిపారు. గ్రామసభ ద్వారానే స్థలాన్ని నిర్ణయించాలన్న జేసీ -
డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడ్డ కారు
ద్వారకాతిరుమల: అడ్డొచ్చిన బైక్ను తప్పించే క్రమంలో ఓ భక్తుడి కారు రోడ్డు మధ్యలోని డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. స్థానిక సంగం డెయిరీ వద్ద సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆకివీడుకు చెందిన ఓ భక్తుడు సోమవారం ద్వారకాతిరుమల చినవెంకన్నను దర్శించి, మొక్కుబడులు తీర్చుకున్నాడు. అనంతరం తన కారులో స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి ఒక బైక్ అడ్డొచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి, రోడ్డు మద్యలో బోల్తా పడింది. జంగారెడ్డిగూడెం: గోకుల తిరుమల పారిజాతగిరి ఈవో కలగర శ్రీనివాస్ అపాయింట్మెంట్, ప్రమోషన్లు తప్పుల తడకగా ఉందని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అన్నంరెడ్డి వేణుగోపాలరావు ఆరోపించారు. ఆ మేరకు ఈవోపై దేవదాయ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు కాపీలను విడుదల చేశారు. శ్రీనివాస్ అపాయింట్మెంట్ నుంచి ప్రమోషన్ వరకు అంతా తప్పల తడకగా ఉందని, శ్రీనివాస్ను 2002లో అప్పటి ఆలయ చైర్మన్ పేరిచర్ల జగపతిరాజు జూనియర్ అసిస్టెంట్గా నియమించుకున్నారన్నారు. సర్వీసు రిజిస్టర్లో 1993లో క్లర్క్గా జాయిన్ అయినట్లు నమోదు చేసుకున్నారన్నారు. అప్పటి నుంచి పనిచేస్తున్నట్లుగా జీతం పెంచుకుంటూ వచ్చారన్నారు. శ్రీనివాస్ సర్వీసు రిజిస్టర్లో జగపతిరాజు తప్ప మిగిలిన వారి ఎవరి సంతకాలు లేకపోవడం గమనించాల్సిన విషయమన్నారు. ఆయన సర్వీసుపై విచారణ జరిపించాలన్నారు. ఫిర్యాదు కాపీలను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ తదితరులకు పంపినట్లు తెలిపారు. -
కోటి ఆశలతో వర్జీనియా సాగు
జంగారెడ్డిగూడెం: కోటి ఆశలతో వర్జీనియా పొగాకు సేద్యానికి రైతన్న సిద్ధమయ్యారు. గతేడాది, ఈ ఏడాది వర్జీనియా పొగాకు చరిత్రలోనే రికార్డు ధరలు లభించడంతో ఉత్సాహంతో సాగుకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది ధర మరింత ఎక్కువ లభించింది. దీంతో రైతులు ఈ ఏడాది మరింత విస్తీర్ణంలో సాగుకు సన్నద్ధమయ్యారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఐదు పొగాకు వేలం కేంద్రాలు ఉన్నాయి. జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటికే రైతులు వర్జీనియా నాట్లు పూర్తి చేసే దశకు చేరుకున్నారు. 2024–2025 సీజన్కు కేజీ అత్యధిక ధర రూ.456 లభించింది. ఎన్ఎల్ఎస్ పరిధిలో సరాసరి ధర రూ. 297.50 కేజీకి లభించింది. 2023–2024 సీజన్కు కేజీకి అత్యధిక ధర రూ.411 లభించగా, సరాసరి ధర రూ.300 లభించింది. రాబోయే సీజన్కు మరింత మంచి ధర లభిస్తుందనే ఆశతో రైతులు వర్జీనియా సాగు చేపట్టారు. వాస్తవానికి ఈ పాటికే నాట్లు పూర్తి కావాల్సి ఉండగా, ఈ ఏడాది వేలం ప్రక్రియ దీర్ఘకాలం కొనసాగడంతో ఆలస్యమైంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్ఎల్ఎస్ పరిధిలో 9267 మంది వర్జీనియా రైతులు 10,516 బ్యారన్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 16,824 ఎకరాల్లో సేద్యం చేసేందుకు నడుం బిగించారు. ఎన్ఎల్ఎస్ పరిధిలో 2526 సీజన్కు 36.96 మి.కిలోల పంటకు పొగాకు బోర్డు అనుమతించింది. ఇప్పటి వరకు 16,524 హెక్టార్లలో నాట్లు పూర్తి చేశారు. దేవరపల్లి వేలం కేంద్రం పరిధిలోకి వచ్చే తూర్పుగోదావరి జిల్లాలోని తొర్రేడు ప్రాంతంలో నల్లరేగడి భూముల్లో పండే పంట కోసం 724 మంది రైతులు 775 బ్యారన్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 852 హెక్టార్లలో పంట పండించేందుకు సమాయాత్తమయ్యారు. ఇక్కడ 1.63 మిలియన్ కిలోల పంటకు అనుమతించారు. ఇప్పటి వరకు తొర్రేడు ప్రాంతంలో 418 హెక్టార్లలో నాట్లు వేశారు. వర్జీనియా సాగుకు సేద్యపు ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది కన్నా 10 శాతం ఖర్చులు పెరిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. పొలం దుక్కిదున్నిన నాటి నుంచి పచ్చిరొట్ట విత్తనం, దుక్కి, లైనింగ్, నారు, తోట వేసేందుకు కూలీలు, పురుగుమందులు, ఎరువులు, అంతర్గత యాజమాన్యం, కలుపు తీత, కలుపు మందు, ఆకు రెలుపు, బ్యారన్ క్యూరింగ్, కలప, రవాణా, అన్ని రకాల కూలీల ఖర్చులు, బ్యారన్ లీజు అన్ని కలుపుకుని ఏటా ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఈ ఖర్చు మరింత పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. ఎకరానికి సరాసరిన 10 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. విపరీతంగా పెరిగిన కౌలు, బ్యారన్ లీజు 2025–2026 పంట కాలానికి పొలం కౌలు, బ్యారన్ లీజులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ఏడాది వర్జీనియా ధర రికార్డు స్థాయిలో లభించడంతో రైతులు పోటీపడి మరీ కౌలు, బ్యారన్ లీజులు పెంచి మరీ వర్జీనియా సేద్యానికి దిగారు. పొలం కౌలు ఎకరానికి రూ.70 వేలు, రూ.90 వేలు, నేర సారవంతాన్ని బట్టి ఉండగా, బ్యారన్ లీజు రూ.3 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు పలికింది. వర్జీనియా రైతులంతా ఈ ఏడాది ధరను చూసి కోటి ఆశలతో రానున్న సీజన్కు పంట పండించేందుకు సిద్ధమయ్యారు. వర్జీనియా రైతులు పొగాకు బోర్డు నిర్ణయించిన పంట పరిమితికి మించి పండించరాదు. విదేశాల్లో కూడా వర్జీనియా ఉత్పత్తి పెరిగింది. వినియోగం మాత్రం పెరగలేదు. ఈ ఏడాది ఎక్కువ పంట పండినా విదేశీ ఆర్డర్లు రావడంతో మంచి ధర వచ్చింది. కానీ జింబాబ్వే, బ్రెజిల్ దేశాల్లో వర్జీనియా పంట పెరుగుతోంది. తక్కువ విస్తీర్ణంలో నాణ్యత గత పంట ఎక్కువ దిగుబడి ఇచ్చేలా పండిస్తే లాభదాయకం. ఆర్గానిక్ పద్దతిలో సమతుల ఎరువులు వాడి లోగ్రేడ్ పొగాకు రాకుండా పంట పండిస్తే లాభదాయకం. జీఎల్కే ప్రసాద్, పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ద్వారకాతిరుమల: క్వారీ రాళ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఎదురుగా వచ్చిన బైక్ను ఢీకొన్న ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని గుండుగొలనుకుంట శివారులో సోమవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కామవరపుకోట మండలం వడ్లపల్లికి చెందిన కంచర్ల తనోజ్ కుమార్ (27) ద్వారకాతిరుమల నుంచి బైక్పై స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి గుండుగొలనుకుంట నుంచి ద్వారకాతిరుమల వైపునకు వెళ్తున్న క్వారీ రాళ్ల లోడు ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తనోజ్ కుమార్ తీవ్ర గాయాలు పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలంలో మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ద్వారకాతిరుమల పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే మృతుడు కామవరపుకోటలోని పామాయిల్ కాటా వద్ద గెలలు లోడింగ్ చేసే పని చేస్తున్నాడు. -
మన్యంలో చలి పంజా
● దట్టంగా కమ్ముతున్న పొగ మంచు ● క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు బుట్టాయగూడెం: పొడి వాతావరణం ఏర్పడడంతో పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు దట్టమైన మంచు కమ్ముకుంటుంది. ఆకాశంలో పాక్షికంగా మేఘావృతమై శీతల గాలులు వీస్తున్నాయి. తెల్లవారుజామున సుమారు 15 నుంచి 17 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత వాతం రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలితీవ్రతతో ఏజెన్సీ ప్రజలు వణికిపోతున్నారు. ఉన్ని దుస్తులు, స్వెటర్లు, మంకీ క్యాప్లు లేకుండా బయట తిరగలేకపోతున్నారు. సాయంత్ర వేళల్లో చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ఉదయం 10 గంటల వరకూ చలితీవ్రత ఎక్కువగా ఉండడంతో పాఠశాలలకు వెళ్ళే చిన్నారులు కూడా చలికి అవస్థలు పడుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్ళే రైతులు, కూలీలు కూడా పొగమంచు, చలి గాలి తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలిగాలుల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కొండప్రాంతాల్లో పెరిగిన చలిప్రభావం కొండ ప్రాంతాల్లోని గ్రామాలైన రేగులపాడు, రేపల్లి, డోలుగండి, లంకపాకల, అలివేరు, దొరమామిడి డ్యామ్, చింతకొండ, గొట్టాలరేవు, తానిగూడెం, మోతుగూడెం, కామవరం, గుబ్బల మంగమ్మతల్లి పరిసర ప్రాంతం, పులిరామన్నగూడెం, ముంజులూరు, ఉప్పరిల్ల, చింతకొండ, దారావాడ, చిలకలూరు, గడ్డపల్లి, గిన్నేపల్లి గ్రామాల్లో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలు నమోదవుతుండడంతో అక్కడ చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఉదయం 11 గంటల వరకూ ఆయా గ్రామాల్లో గిరిజనులు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయం, సాయంత్రం చలిమంటలు వేసుకుంటూ చలినుంచి కాపాడుకుంటున్నారు. -
ఉపాధి హామీ పథకంలో అవినీతి
● అవకతవకలు సరిచేయడానికి వసూళ్లు ● పట్టించుకోని ఉన్నత అధికారులు భీమవరం(ప్రకాశం చౌక్): జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి నిర్వహించే ఆడిట్ అవినీతి అధికారులకు వరంగా మారింది. ఏడాదిలో జరిగిన పనులకు సంబంధించి ఆడిట్ను ప్రభుత్వం చేపడుతుంది. ఈ ఆడిట్ చేసే కొందరు అధికారులు వసూళ్లు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. గత ఏడాది జిల్లాలో జరిగిన ఉపాధి పనులపై జరిగిన సోషల్ ఆడిట్లో కొందరు డీఆర్పీల అవినీతిపై విచారణ చేసి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. దాంతో ఈ ఏడాది కూడా కొందరు ఆడిట్ అధికారులు చేతివాటం చూపుతూ అక్రమ వసూళ్లు మొదలు పెట్టారు. ఆడిట్ సక్రమంగా ఉంటేనే ఉద్యోగం లేకపోతే ఇబ్బంది పడతారంటూ ఫీల్డ్ అసిస్టెంట్లను భయపెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. 2024–25 ఏడాదికి సంబంధించి జిల్లాలో ఉపాధి హమీ పనులపై సోషల్ ఆడిట్ ప్రారంభించారు. పాలకోడేరు, పెనుగొండ, పోడూరు, పెంటపాడు మండలాలలో ఆడిట్ జరుగుతోంది. ఫీల్డ్ అసిస్టెంట్లు వేసిన మస్తర్లలో తేడాలు, కొట్టివేతలు, పనులు కొలతలు, కూలీల వివరాలు సక్రమంగా లేకపోవడం ఒకరి జాబ్కార్డుపై మరొకరు పనిచేయడం వంటివి అధికారులు గుర్తించి వాటిని సాకుగా చూపించి సరిచేసి సక్రమంగా ఉన్నట్లు చూపడానికి కొందరు అధికారులు ఒక్కో ఫీల్డ్ అసిస్టెంట్ వద్ద రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆయా మండలాల్లో రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగం లేకుండా చేస్తారని భయపడి ఫీల్డ్ అసిస్టెంట్లు అడిగినంతా ఇచ్చుకుంటున్నారు. ఉపాధి పనుల్లో అవకతకల్లో మండల స్థాయిల్లో పనిచేసే కొందరు టీఏల హస్తం కూడా ఉందని, దాంతో వారు కూడా సోషల్ ఆడిట్ అధికారుల అవినీతికి సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉపాధి హమీ పనుల్లో అవకతవకలు ఉపాధి హమీ పనుల్లో 60 శాతం కూలీలతో పనులు చేసే కార్యక్రమం జరుగుతుంది. కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు పనికి రాని వారి పేరిట మస్తర్లు వేసి డబ్బులు వారి ఖాతాల్లో పడ్డాక పంచుకుంటున్నారు. కొలతల ప్రకారం కాకుండా తక్కువ కొలతలు ఉన్న పనులకు ఎక్కువ కొలతలు చూపించి పనిచేయించడం వల్ల కూలీల సంఖ్య పెంచి మస్తర్లు వేస్తున్నారు. తక్కువ మంది కూలీలు వచ్చినా ఎక్కువ మస్తర్లు వేస్తున్నారు. ఉపాధి పనులు సంబంధించి జరిగే ఆడిట్ సమయంలో గ్రామ సభ నిర్వహించి అక్కడ కూలీల వివరాలు, పనులు గురించి గ్రామస్తుల మధ్య ప్రస్తావిస్తారు. గ్రామ సభల్లో మస్తర్లలో తేడాలు, పెంచిన కొలతలు, ఎక్కువ మస్తర్ల గురించి ప్రస్తావించకుండా రహస్యంగా ఉంచి గ్రామ సభ ముగిస్తున్నారు. జిల్లాలో ఏడాది కాలంలో జరిగిన ఉపాధి హామీ పనులకు సంబంధించి నాలుగు మండలాల్లో ఆడిట్ జరుగుతోంది. ఆడిట్ అధికారులు సక్రమంగా ఆడిట్ చేశారా లేదా ఎక్కడైనా అవినీతికి పాల్పడితే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటాం. –కేసీసీహెచ్ అప్పారావు, డ్వామా పీడీ, భీమవరం -
పోలీసులు అన్యాయంగా కొట్టారు
సాక్షి టాస్క్ఫోర్స్: తన తప్పు లేకపోయినా పోలీసులు స్టేషన్కు పిలిపించి కొట్టారని దళిత యువకుడు సోషల్ మీడియాలో ఆవేదన వెలిబుచ్చాడు. కుక్కునూరు గ్రామం సంజయ్నగర్ కాలనీకి చెందిన మాచర్ల సాయి డీజేను రెంట్కు ఇస్తాడు. గత శుక్రవారం గొమ్ముగూడెంలో వేడుకకు డీజేను పెట్టాడు. ఆ కార్యక్రమానికి హాజరైన వారు వైఎస్సార్సీపీ పాటలు పెట్టి డీజే నృత్యాలు చేశారు. ఈ విషయంపై శనివారం జనసేన మండల అధ్యక్షుడు ములిశెట్టి యుగంధర్ కాల్ చేసి వైఎస్సార్సీపీ పాటలు ఎందుకు పెట్టావని ప్రశ్నించినట్టు తెలిపాడు. డీజేను రెంట్కు మాత్రమే ఇచ్చానని పాటలకు తనకు ఏ సంబంధం లేదని చెప్పినట్టు బాధితుడు వివరించాడు. ఇలా చేస్తే ఇబ్బంది పడతావని అతను చెప్పాడని, ఫోన్ పెట్టేశాక కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చినట్టు తెలిపాడు. తాను కుక్కునూరు సీఐ అని స్టేషన్కు రమ్మని చెప్పారని వీడియోలో పేర్కొన్నారు. స్టేషన్కు వెళ్లగా అక్కడ ఉన్న సిబ్బందిలో ఒకరు నీది ఏ కులమని ప్రశ్నించగా.. మాల అని బదులిచ్చానని, ఇలాంటివి మీకు ఎందుకు అని తనపై అరిచారన్నాడు. తరువాత ఎస్సై లోపలికి పిలిచి తనపై దాడి చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తన తప్పు లేకుండా ఎందుకు కొడుతున్నారు సార్ అని అడగగా ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తడం లేదు, నీకు అంత పొగరేంటని సమాధానం ఇచ్చినట్లు చెప్పాడు. దెబ్బలకు చేతిపై బొబ్బలు వచ్చాయని. దళితుడన్న చులకనతో ఏ కారణం లేకుండా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, జనసేన మండల అధ్యక్షుడు ఏం చేస్తాడోనని భయపడుతున్నట్టు చెప్పాడు. -
మామిడి పూతల కోసం ఎదురుచూపులు
● మామిడి పూతలు సకాలంలో వచ్చేనా...! ● మామిడిపైనే రైతుల ఆశ నూజివీడు: పండ్లలో రారాజుగా ప్రసిద్ధి చెందిన మామిడిపై రైతులు ఆశలు పెట్టుకుని పూతల కోసం ఎదురు చూస్తున్నారు. అకాల వర్షాలు, నల్లతామర, తెగుళ్ల దాడితో గత ఏడాది తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులకు ఈ ఏడాదైనా మామిడి తీపిని పంచుతుందేమోననే ఆశాభావంతో ముందుకు సాగుతున్నారు. డిసెంబరు తొలివారం గడిచినప్పటికీ ఇంకా ఎక్కడా మామిడి పూతలు కనిపించడం లేదు. జిల్లాలోని నూజివీడు డివిజన్లోని 6 మండలాల్లో కలిపి దాదాపు 45 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించాయి. నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, చింతలపూడి, లింగపాలెం మండలాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఎక్కువగా బంగినపల్లి, కలెక్టర్(తోతాపురి), చిన్న, పెద్ద రసాలు వంటి రకాలను రైతులు సాగుచేస్తున్నారు. మామిడి పూతలు సాధారణంగా డిసెంబర్ నెల ప్రారంభం నుంచి ఫిబ్రవరి వరకు వస్తాయి. మామిడి పూతలు రావడానికి రాత్రిపూట అధిక చలి, పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు ఉండాలి. ప్రస్తుత వాతావరణం గమనిస్తే మామిడికి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో పూతలు బాగానే ఉండవచ్చని రైతులు భావిస్తున్నారు. అయితే ఈ ఏడాది నవంబరు నెలాఖరు వరకు అధిక వర్షాలు కురవడంతో పూతలు వస్తాయో, లేదోననే ఆందోళన రైతులను వెంటాడుతోంది. ఎందుకంటే మామిడికి బెట్ట పరిస్థితులైతే ఎంతో అనుకూలం. గత ఏడాది మామిడి దిగుబడి పెద్దగా లేని నేపథ్యంలో ఈ ఏడాదైనా బాగుంటుందని ఆశతో ఉన్న రైతులు గత పది రోజుల నుంచే పూతల కోసం రసాయన మందులు పిచికారీ చేస్తున్నారు. దీనిలో భాగంగా సల్ఫర్, ఇమిడాక్లోప్రిడ్, బోరాన్ వంటి వాటిని పిచికారీ చేస్తున్నారు. 5 నుంచి 10శాతం తోటల్లో పూతలు కనిపిస్తున్నాయి. పూత కనిపిస్తున్న తోటల్లో పూత కాడలపై తేనెమంచు పురుగులు కనిపిస్తున్నాయని వాపోతున్నారు. గతేడాది నష్టపోయినా నష్టపరిహారం చెల్లించలేదు గతేడాది ప్రారంభంలో పూతలు ఆశాజనంగానే వచ్చినప్పటికీ జనవరి ప్రథమార్ధంలో నల్లతామర ఉధృతంగా ఆశించడంతో వచ్చిన మామిడి పూతంతా మాడిపోయి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. సంక్రాంతి తర్వాత వచ్చిన పూత కొంతమేర నిలవడంతో దిగుబడులు అంతంత మాత్రంగా వచ్చాయి. అయితే ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో మామిడికి ధర పూర్తిగా పడిపోవడంతో రైతులు నష్టాల పాలయ్యారు. తోతాపురి రకం టన్ను రూ.3 వేలకు పడిపోయి కోత ఖర్చులు, కిరాయిలు సైతం రాని పరిస్థితులు నెలకొనడంతో రైతులు కాయలను కోయకుండా చెట్లకే వదిలేశారు. బంగినపల్లి సైతం టన్ను ధర రూ.8 వేలకు పడిపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రభుత్వం చిత్తూరు జిల్లాలోని మామిడి రైతాంగానికి నష్టపరిహారం చెల్లించి ఏలూరు జిల్లాలోని నూజివీడు ప్రాంతంలోని రైతాంగానికి రూపాయి కూడా చెల్లించలేదు. వాతావరణం అనుకూలమే పగటిపూట అధిక ఉష్ణోగ్రత, రాత్రిపూట అధిక చలి ఉండే వాతావారణం మామిడి పూత రావడానికి అనుకూలం. ప్రస్తుతం చూస్తే పగలు ఎండతో పాటు రాత్రిపూట చలి అధికంగానే ఉండడంతో వాతావరణం కలిసి వస్తోందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. కొన్నితోటల్లో పూతలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ఇకముందు కూడా ఎలాంటి తుపాన్లు లేకుండా, పురుగులు, నల్లతామర వంటి పురుగుల దాడి లేకుండా ఉంటే మామిడికి మరింత అనుకూలంగా ఉన్నట్లేనని మామిడి రైతులు పేర్కొంటున్నారు. మామిడి పూతలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. పది శాతం తోటల్లో పూతలు వస్తున్నాయి. పూతల కోసం రైతులు ఇప్పటికే ఒక కోటా రసాయన మందులు పిచికారీ చేశారు. గతేడాది నష్టాలు వచ్చినందున ఈ ఏడాదైనా మామిడి ఆదుకుంటుందని ఆశతో ఉన్నాం. బాణావతు రాజు, లైన్తండా, నూజివీడు మండలం గత పది రోజులుగా వాతావరణం మామిడి పూతలు రావడానికి అనుకూలంగా ఉంది. వర్షాలు పడకుండా ఇదే వాతావరణం కొనసాగితే తోటలన్నింటిలో పూతలు వస్తాయి. తోటల్లో అక్కడక్కడ తేనెమంచు పురుగులు కనిపిస్తున్నాయి. వాటి నివారణకు ఇమిడాక్లోప్రిడ్ను 0.5 గ్రాములను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆర్.హేమ, ఉద్యాన అధికారి, నూజివీడు -
జ్వరంతో విద్యార్థిని మృతి
వీరవాసరం: ప్లేట్లెట్స్ పడిపోవడంతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని చనిపోవడంతో ఆదివారం వీరవాసరంలో విషాద చాయలు అలుముకున్నాయి. వీరవాసరంలోని జెడ్పీ పాఠశాల విద్యార్థిని నాలం భాగ్యశ్రీ (13) కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ప్రైవేటు ఆర్ఎంపీ వద్ద, పాలకొల్లులోని ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య చికిత్స చేశారు. పరిస్థితి విషమంగా మారడంతో శనివారం విజయవాడ తీసుకెళ్తుండగా మధ్యలోనే మృతి చెందింది. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, దోమల ఉధృతి ఎక్కువగా ఉండడంతో తీవ్ర జ్వరాల బారిన పడుతున్నారని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. దోమకాటు ప్రభావంతోనే ప్లేట్లెట్స్ పడిపోయి భాగ్యశ్రీ మృతి చెందిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బైకులను ఢీకొన్న లారీ
కొయ్యలగూడెం: మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన లారీ పలు బైకులను ఢీకొట్టడంతో వాహనదారులు కొందరు గాయపడ్డాడు. ఆదివారం రాత్రి జాతీయ ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మార్జిన్ పక్కన పార్కింగ్ చేసి ఉండగా జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న వాహనం ఢీ కొట్టింది. ఈ నేపథ్యంలో సుమారు 10 మోటార్ బైకులు, స్కూటీల మీదుగా లారీ దూసుకుపోయింది. బైక్, స్కూటీలపై ఉన్న వాహనదారులు పలువురు గాయపడ్డాడు. వారిని సమీపంలోని ఆస్పత్రికి స్థానికులు తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ ఆగకుండా వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. వీరవాసరం: ఈ నెల 27న హైదరాబాద్లో జరగనున్న జాతీయ స్థాయి ఈత పోటీలకు వీరవాసరం మండలానికి చెందిన కోరశిఖ జ్యోత్స్న ఎంపికై నట్లు ఆమె తండ్రి వీర్రాజు ఆదివారం తెలిపారు. స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధర్యంలో నరసారావుపేటలో 7న నిర్వహించిన వాటర్ పోల్లో పాల్గొని ఆమె అర్హత సాధించనట్టు తెలిపారు. -
బకాయిలు వెంటనే చెల్లించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయులకు బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డెమోక్రటిక్ పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ. వెంకటేశ్వర రావు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక డెమోక్రటిక్ పీఆర్టీయూ కార్యాలయంలో ఏలూరు జిల్లా శాఖ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా తలపంటి శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శిగా శేషపు శ్రీనివాసు, కోశాధికారిగా ఎన్వీకే వీరబాబు, జిల్లా కేంద్రం అధ్యక్షుడిగా రెడ్డి నాగ వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తిరుపతి సందీప్, రాష్ట్ర కార్యదర్శిగా కొత్తపల్లి సూర్యచంద్రరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఆర్.నాగేంద్ర సింగ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా గుంపిన గోపి కిషోర్ ఎంపికయ్యారు. -
కరుణించు మంగమ్మ తల్లీ
బుట్టాయగూడెం: కోర్కెలు తీర్చే తల్లిగా, వరాలిచ్చే అమ్మగా, గిరిజన ఆరాధ్య దేవతగా పూజలందుకుంటున్న గుబ్బల మంగమ్మ తల్లి గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. చలికాలం అయినప్పటికీ మంచు కురుస్తున్నప్పటికీ తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు మంగమ్మ తల్లి గుడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ జిల్లాల నుంచి ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, బస్సుల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మా.. నీ ఆశీస్సులు అందించమ్మా.. అంటూ భక్తులు ఆర్తీతో వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు. మహిళలు పాల పొంగళ్లు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ రూ.49,660 ఆదాయం వచ్చిందని చెప్పారు. నూజివీడు: శ్రీకాకుళంలోని ట్రిపుల్ ఐటీలో నిర్వహించిన ఆర్జీయూకేటీ ఇంటర్ యూనివర్శిటీ స్పోర్ట్స్ టోర్నమెంట్లో భాగంగా నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వాలీబాల్ విభాగంలో ప్రతిభ కనబరిచారు. బాలుర విభాగంలో వాలీబాల్లో నూజివీడు ట్రిపుల్ఐటీ విద్యార్థులు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ జట్టుపై విజయం సాధించి ట్రోఫీని గెలుచుకుంది. వాలీబాల్ బాలికల విభాగంలో నూజివీడు ట్రిపుల్ ఐటీ బాలికల జట్టు ఫైనల్లో శ్రీకాకుళం చేతిలో ఓటమి పాలైంది. విజేతగా నిలిచిన బాలుర జట్టును, ద్వితీయ స్థానంలో నిలిచిన బాలికల జట్టును నూజివీడు ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ అభినందించారు. ద్వారకాతిరుమల: శ్రీనివాసా గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా అంటూ శ్రీవారి భక్తులు చేసిన గోవింద నామస్మరణలతో ఆదివారం క్షేత్ర పరిసరాలు మారు మ్రోగాయి. సెలవుదినం కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు భక్తజన సంద్రమయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, కల్యాణకట్ట, ఇతర విభాగాలు భక్తులతో కిక్కిరిసాయి. అలాగే తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపంలో భక్తులు పోటెత్తారు. ఆలయ ఆవరణలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. -
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పట్టవా?
ఏలూరు టౌన్: రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలనీ, ప్రభుత్వం విశ్రాంత న్యాయమూర్తితో పే రివిజన్ కమిషన్ వెంటనే వేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్ఎస్వీ రామకృష్ణారావు, జిల్లా కార్యదర్శి ఎ.బంగారయ్య డిమాండ్ చేశారు. ఏలూరులోని ప్రభుత్వ ఉద్యోగుల సంఘ భవనంలో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి డీఏలను చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. పీఆర్సీ ఏరియర్స్, ఏళ్ల తరబడి బకాయి ఉన్న సరెండర్ లీవులు, జీపీఎఫ్, ఏపీజీ ఎల్ఐ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగుల హెల్త్ కార్డులను మరింత మెరుగైన రీతిలో అప్డేట్ చేసి నగదు రహిత వైద్యసేవలు అందించాలని కోరారు. వైద్యారోగ్యశాఖలో చాలాకాలంగా పదోన్నతులు లేవనీ, గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారానికి జిల్లాస్థాయి స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ జె.గోవిందరావు, ఏలూరు తా లూకా అధ్యక్షురాలు నీలిమదేవి, వి.పెద్దిరాజు, షేక్ ఖలీల్, పీ.శ్రీనివాసరావు, ఎం.వెంకటేశ్వరరావు, ఎన్.శ్రీనివాసరావు ఉద్యోగుల సమస్యలపై మా ట్లాడారు. సమావేశంలో ఏలూరు, భీమడోలు, నూ జివీడు, జంగారెడ్డిగూడెం, పోలవరం, కై కలూరు, కొయ్యలగూడెం తాలూక అధ్యక్ష, కార్యదర్శులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. -
స్క్రబ్ టైఫస్ కలకలం
● ఏలూరు జిల్లాలో మూడు కేసులు ● అవగాహన కల్పించని వైద్యాధికారులు ఏలూరు టౌన్: రాష్ట్రవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో మూడు కే సులు నమోదు కావటంతో కలకలం రేగింది. అయితే దీనిపై ఏలూరు జిల్లా వైద్యాధికారులు నో రు మెదపటం లేదు. కనీసం ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో తాజాగా నమోదైన కేసుతో బాధితుల సంఖ్య మూడుకు చేరింది. ఏలూరు సర్వజన ఆస్పత్రిలో పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన ఒక మహిళ స్క్రబ్ టైఫస్తో చికిత్స పొందింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుందని వెద్య నిపుణులు చెబుతున్నారు. ఆమె శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఇక నూజివీడుకు చెందిన 35 ఏళ్ల వ్యక్తి తీవ్ర జ్వరం, మలబద్దకం సమస్యతో గతనెల 29న నూజివీడు ఏరియా హాస్పిటల్లో చేరాడు. ఆయనకు కిడ్నీలో రాళ్ల సమస్య ఉండటంతో జ్వరం అదుపులోకి రా కపోవటంతో రెండు రోజులక్రితం ఎలీసా టెస్ట్ చేశారు. రిపోర్ట్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్గా నిర్ధారణయ్యింది. ఆరోగ్యం క్షీణించటంతో మెరుగైన చికి త్స నిమిత్తం విజయవాడ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. బాధితుడి ఇంటి ఆవరణలో పశువుల షెడ్డు, మురుగు ఉండటంతో నల్లిపురుగు వ్యాప్తి చెంది ఉండవచ్చని వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇప్పటికే జిల్లాలోని టి.నర్సాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్క్రబ్ టైఫస్ పాజిటివ్తో చికిత్స పొందగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. చిన్నపాటి పురుగు ద్వారా.. స్క్రబ్ టైఫస్ ఒరియంటియా సూసుగముషి అనే బ్యాక్టీరియాతో మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. పొదలు, భారీగా చెట్లు, పచ్చిక బయళ్లలో ఉండే నల్లుల వంటి పురుగు (చిగర్ మైట్స్) ద్వారా వ్యాపిస్తుంది. ఈ కీటకం మనిషికి తెలియకుండానే కాటు వేయగా శరీరంలోకి బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు, వాంతు లు, పొడిదగ్గు, నీరసం, కుట్టిన చోట నల్లటి మచ్చ లు, దద్దుర్లు వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి ముదిరితే కాలేయం దెబ్బతిని కామెర్లు రావటం, ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి వ్యాధి తీవ్రత ఆధారంగా ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యలు ఉత్పన్నమవుతాయి. చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే హృదయకండరాల వాపు, అంతర్గత రక్తస్రావం, తె ల్ల రక్తకణాలు తగ్గిపోవటం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పతాయని వైద్య నిపుణులు చెబుతున్నా రు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. -
వాసవీ మాత సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
పెనుగొండ: పెనుగొండలో నగరేశ్వర మహిషాసురమర్దనీ, వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి టి.మల్లికార్జునరావు, శైలజ దంపతులు సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చే యించారు. ముందుగా ఈఓ గుబ్బల పెద్దింట్లురావు, అర్చకులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం అఖిల భారత వాసవీ పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని వాసవీ శాంతి థాంలో 102 అడుగుల రుషీ గోత్రమందిరాన్ని వారు సందర్శించి, 90 అడుగుల వాసవీ మాతను దర్శించుకున్నారు. మరకత శిల వాసవీ మాతకు పూజలు చేశారు. తహసీల్దార్ జి.అనితకుమారి ఉన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం పట్టణంలో వీరమ్మ పార్కు రైతు బజార్, కొత్త బస్టాండ్, రైల్వే జంక్షన్, ప్రకాశంచౌక్, జేపీ రోడ్డు ప్రాంతాల్లో ఆదివారం జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఫుడ్ కోర్ట్ల ఏర్పాటు, ఆక్రమణలు తొలగింపు, పారిశుద్ధ్య నిర్వహణ, కూరగాయల ధరల నియంత్రణ విషయాల్లో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. వీరమ్మ పార్కులో లైటింగ్ ఏర్పాట్లు చేసి అభివృద్ధి చేయాలన్నారు. కొత్త బస్టాండ్ ప్రాంతంలో రోడ్డు మీ దకు షెడ్డులు నిర్మించి ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ము న్సిపల్ అధికారులను ఆదేశించారు. రైల్వే జంక్షన్ ఫ్లై ఓవర్ వద్ద డంపింగ్ చేస్తున్న చెత్తను తొ లగించాలన్నారు. బజారును పరిశీలించి కూరగాయలు ధరలు తెలిపే బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఆర్డీఓ కె.ప్రవీణ్కుమార్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎం.రామచంద్రారెడ్డి, ఏసీ పీఎం శ్రీలక్ష్మి, టౌన్ సర్వే ఎస్.రమబాయి ఉన్నారు. భీమవరం: జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్ఎంఎంఎస్) 2025–26 ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. 12 కేంద్రాల్లో పరీక్షలు జరగ్గా 2,835 మంది విద్యార్థులకు 2,559 మంది హాజరయ్యారు. ఆయా కేంద్రాలను అ ధికారులు తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎటువంటి మాల్ప్రాక్టీస్ కేసు లు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లాలో.. ఏలూరు (ఆర్ఆర్పేట): ఎన్ఎంఎంఎస్ 2025–26కు ఏలూరు జిల్లాలో 2,568 మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ మూడు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించామన్నారు. మొ త్తం 2,654 మంది విద్యార్థులకు గాను 86 మ ంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 12 కేంద్రాల్లో, తాను ఒక కేంద్రంలో తనిఖీ చేసినట్టు పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు. నూజివీడు: నూజివీడు ట్రిపుల్ఐటీ నుంచి శుక్రవారం రాత్రి బయటకు వెళ్లిపోయిన బాలిక (16)ను పోలీసులు ఆదివారం తల్లిదండ్రులకు అప్పగించారు. పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న బాలిక ట్రిపుల్ఐటీ నుంచి బ యటకు వెళ్లిన తరువాత ఇక్కడి నుంచి నేరుగా విజయవాడలోని కనకదుర్గమ్మవారి ఆలయానికి వెళ్లిందని సీఐ పి.సత్యశ్రీనివాస్ తెలిపారు. ట్రిపుల్ఐటీ అధికారులు ఫిర్యాదు చేయగానే పట్టణ పోలీస్స్టేషన్ సిబ్బంది బాలిక ఆచూకీ కోసం అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారమందించి సిబ్బందిని పలు ప్రాంతాలకు పంపించామన్నారు. చదువు విషయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ప్రశాంతత కోసం అమ్మవారి ఆలయానికి వెళ్లిందని, అక్కడి నుంచి తీసుకొచ్చిన తరువాత కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. అనంతరం బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించినట్టు సీఐ చెప్పారు. -
ఆందోళన అవసరం లేదు
స్క్రబ్ టైఫస్ వ్యాధి బాధితులు ఆయా లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటే ఎలాంటి ప్రాణాపాయం లేదు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్క్రబ్ టైఫస్ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన ఏడు రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. జ్వరం, తలనొప్పి, ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కొందరిలో మాత్రమే శ్వాసకోశ ఇబ్బందులు, కిడ్నీ సమస్యలు, లివర్ దెబ్బతినటం వంటి తీవ్ర అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, చెట్లు, పొదలు ఉండే ప్రాంతంలోకి వెళ్లే సమయంలో జాగ్రత్తలు వంటివి పాటించాలి. – డాక్టర్ కీర్తి ప్రియాంక, జనరల్ మెడిసిన్, అసోసియేట్ ప్రొఫెసర్, ఏలూరు జీజీహెచ్ -
ఉధృతం.. నిరసన సంతకం
సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం: వైద్య విద్యను ప్రైవేట్పరం చే యాలన్న చంద్రబాబు సర్కారు చర్యలను నిరసిస్తూ ప్రజా ఉద్యమం జిల్లాలో ఉధృతంగా సాగుతోంది. వైఎస్సార్సీపీ పిలుపునందుకుని ఇప్పటికే చలో మెడికల్ కళాశాల, రణభేరి కార్యక్రమాలు విజయవంతం కాగా కోటి సంతకాల సేకరణ జిల్లాలో జోరుగా జరుగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తుండటంతో లక్ష్యానికి మించి సాగుతోంది. జిల్లాకు తలమానికంగా.. పేదలకు వైద్య విద్యను చేరువచేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో జగన్ సర్కారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను మంజూరు చేసింది. రాష్ట్రంలో కొత్తగా శ్రీకారం చుట్టిన 17 వైద్య కళాశాలల్లో పాలకొల్లు రూరల్ దగ్గులూరులో నిర్మిస్తున్న కళాశాల ఒకటి. 60 ఎకరాలు సేకరించి రూ.475 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు. రూ.83 కోట్లు వెచ్చించి పునాదులు నిర్మించారు. ఎమ్మెల్యే హోదాలో అప్పట్లో నిమ్మల రామానాయుడు తరచూ స్థలం వద్దకు వెళ్లి చేసిన హడావుడి అందరికీ తెలిసిందే. కూటమి వచ్చాక మంత్రి అయిన నిమ్మల 18 నెలల కాలంలో కళాశాల వైపు కన్నెత్తి చూసింది లేదు. చంద్రబాబు ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసే కుట్రలు చేయడంతో పేదలకు వైద్య విద్య అందనంత దూరం కానుంది. ఉచిత సూపర్ స్పెషాల్టీ సేవలు దూరమవుతాయి. రూ.లక్ష కోట్లు విలువచేసే ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోనున్నాయి. పోరుబాటకు ప్రజామద్దతు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునందుకు సెప్టెంబరులో చలో మెడికల్ కళాశాలలు, గత నెలలో రణభేరి కార్యక్రమాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. వేలాదిగా ప్రజలు తరలివచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. మరోపక్క వైద్య కళాశాలలను ప్రభుత్వమే కొనసాగించాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ జిల్లా అంతటా ఉధృతంగా సాగుతోంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సంతకాలు చేస్తున్న మహిళలు. చిత్రంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ (ఫైల్) ఆచంట నియోజకవర్గంలో సంతకాలు చేస్తున్న ప్రజలు. చిత్రంలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు (ఫైల్) పండ్లలో రారాజుగా ప్రసిద్ధి చెందిన మామిడిపై రైతులు ఆశలు పెట్టుకుని పూతల కోసం ఎదురు చూస్తున్నారు. పేదలకు మేలు చేయడం మాని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనను ప్రజలు గమనిస్తున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటిసంతకాల సేకరణ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. జిల్లాలో లక్ష్యానికి మించి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతోంది. – ముదునూరి మురళీకృష్ణంరాజు, వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకుడు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం పేద విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లడమే. ప్రతిభ ఉన్నా ప్రైవేట్ యాజమాన్యాలు అడిగిన కోట్లాది రూపాయలు వెచ్చించి సీట్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని వలన పేద విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రభుత్వమే వైద్య కళాశాలలు నిర్వహించాలి. – ఎడ్వర్డ్పాల్, తణుకు పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్లమెంట్ సమన్వయకర్త గూడూరి ఉమాబాల, ఎమ్మెల్సీలు వంక రవీంద్ర, కవురు శ్రీనివాస్లు కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొంటూ కార్యక్రమం విజయవంతానికి కృషి చేస్తున్నారు. నరసాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, తాడేపల్లిగూడెంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, ఆచంటలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, భీమవరంలో నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, ఉండిలో సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు, పాలకొల్లులో సమన్వయకర్త గుడాల శ్రీహరిగోపాలరావులు పార్టీ నేతలతో కలిసి గ్రామ, వార్డుల్లో రచ్చబండలు నిర్వహించి ప్రైవేటీకరణ అనర్థాలను ప్రజలకు వివరిస్తున్నారు. రద్దీ ప్రదేశాల్లో ప్రత్యేక క్యాంపెయిన్లు చేస్తున్నారు. ప్రజలు, విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేస్తూ మద్దతు తెలుపుతున్నారు. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నడపాలని, ప్రజా నిధులతో నిర్మించిన భవనాలు, ఆస్పత్రులు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలని, జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన వైద్య విద్య, వైద్య సేవలు అందించాలనే లక్ష్యానికి భంగం కలగకూడదని డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గాల నుంచి వచ్చిన సంతకాలను ఈనెల 10న జిల్లా కేంద్రం భీమవరంలో ఉంచి 15న పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు. అదేరోజున భీమవరంలో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కోటెత్తుతున్నారు వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్ సీపీ ప్రజా ఉద్యమానికి అనూహ్య స్పందన చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా ప్రజల మద్దతు జిల్లాలో జోరుగా కోటి సంతకాల ఉద్యమం లక్ష్యానికి మించి సాగుతున్న సంతకాల సేకరణ -
మద్దతు ధరకు కోత
సాక్షి, భీమవరం : మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన ఉంది ఖరీఫ్ రైతుల పరిస్థితి. సాగు చివరిలో మోంథా, దిత్వా తుపాన్లు పంటకు నష్టం కలిగిస్తే.. ఎఫ్సీఐ కోటాలో బ్రోకెన్ (నూకల) పర్సంటేజీని 10 శాతానికి తగ్గించిన సీఎంఆర్ కొత్త నిబంధనలు రైతుకు గిట్టుబాటు ధర దక్కకుండా చేస్తున్నాయి. రైతుల నుంచి పౌరసరఫరాలశాఖ సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం మిల్లులకు అప్పగిస్తుంది. క్వింటాల్ ధాన్యానికి 67 కిలోల బియ్యాన్ని తిరిగి అప్పగించాలి. దీనిలో కొంత ఎఫ్సీఐకి ఇచ్చి మిగిలిన బియ్యాన్ని ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కోసం పౌరసరఫరాలశాఖ తీసుకుంటుంది. ఎఫ్సీఐకి ఇచ్చే బియ్యంలో నూకల పర్సంటేజీ గతంలో 25 శాతం ఉండేది. ఈ సీజన్ నుంచి 10 శాతం నూకలు మాత్రమే ఉండాలన్న నిబంధన తెచ్చారు. మిగిలిన 15 శాతం నూకలకు తిరిగి టెండర్ ప్రక్రియ నిర్వహించే వరకు మిల్లర్ల వద్దే భద్రపరచాలి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో 770 వరకు రైస్మిల్లులున్నాయి. వీటిలో గంటకు ఐదు టన్నుల నుంచి 10 టన్నులకు పైగా మిల్లింగ్ కెపాసిటీ కలిగిన పెద్ద మి ల్లులు 45 శాతం ఉండగా, మిగిలినవి ఐదు టన్నులలోపు సామర్థ్యంతో నడిచే చిన్న మిల్లులు. ఇవి ఎ క్కువగా సీఎంఆర్పైనే ఆధారపడతాయి. వీటికి గో డౌన్, బాయిల్డ్ సదుపాయం అంతంత మాత్రమే. ఈ తరుణంలో నూకలు నిల్వ చేయడం తలకు మించిన భారం కానుంది. ఇవి త్వరగా తుట్టెలు కట్టి పాడయ్యే అవకాశం ఉండటం వలన సకాలంలో టెండర్లు పూర్తయి తరలించకపోతే నష్టపోవాల్సి వస్తుందని మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు, చలిగాలులతో తగ్గని తేమ శాతం ప్రభుత్వం క్వింటాల్కు కామన్ వైరెటీ రూ.2,369, ఏ గ్రేడ్ రకానికి రూ.2,389 ధర నిర్ణయించింది. ఈ ధర పొందేందుకు ధాన్యంలో తేమశాతం 17 లోపు ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే నూకలు పెరుగుతాయి. మాసూళ్లు ముమ్మరంగా జరుగుతు న్న తరుణంలో దిత్వా తుపాను కారణంగా వర్షాలు పడ్డాయి. చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండి ధాన్యంలో తేమ శాతం 20కి పైగా ఉంటోంది. సాధారణంగా 17 శాతానికి మించి తేమ ఉన్నప్పుడు రైతులు, మిల్లర్లు నష్టపోకుండా పైన ఒక శాతానికి క్వింటాల్కు కిలో చొప్పున ధాన్యాన్ని తరుగుగా మినహాయిస్తారు. ప్రస్తుతం 19 నుంచి 22 వరకు తేమశాతం ఉంటున్న నేపథ్యంలో అదనంగా ఉన్న ఒక్కో శాతానికి మద్దతు ధర మేరకు కిలో చొప్పున ధర తగ్గించి మిగిలిన మొత్తం రైతుకు చెల్లించాలి. మద్దతు ధర ప్రకారం కిలో ధాన్యం ధర రూ.23.29. ఈ మేరకు 19 శాతం తేమ ఉంటే క్వింటాల్కు రెండు కిలోల సొమ్ము తగ్గించి రూ.2,282, తేమ 20 శాతం ఉంటే 2,259, తేమ 22 శాతం ఉంటే రూ.2,212 చొప్పున చెల్లించాలి. నూకల పర్సంటేజీ 25 నుంచి 10 శాతానికి తగ్గింపు తుపానుల ప్రభావంతో దెబ్బతిన్న ధాన్యం నాణ్యత తేమ పెరిగి 40 శాతం వరకు ఉంటున్న నూకలు క్వింటాల్కు రూ.400 నుంచి రూ.500 వరకు నష్టపోతున్న రైతులు ఎఫ్సీఐ నూకల నిబంధనల నేపథ్యంలో తేమ ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని కొనేందుకు మిల్లర్లు వెనుకడుగేస్తున్నారు. నూకల పర్సంటేజీ పెరిగి నష్టపోవాల్సి వస్తుందని ఉబ్బడాల పేరిట బస్తాకు రూ.400 నుంచి రూ.500 వరకు కోత పెడుతున్నట్టు తెలుస్తోంది. తేమ 17 శాతానికి రావాలంటే రెండు మూడు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టాలి. పశ్చిమగోదావరి జిల్లాలో 1.12 లక్షల మంది రైతులు 2.11 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగుచేశారు. 6.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా కాగా స్థానిక వినియోగం, బహిరంగ మార్కెట్లో అమ్మకాలు పోను ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. 215 ఆర్ఎస్కేల ద్వారా దాదాపు 1.7 లక్షల టన్నులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రతికూల వాతావరణానికి జడిసి చాలామంది రైతులు ధాన్యాన్ని అయినకాడికి అమ్ముకుంటున్నారు. రవాణా, హమాలీ ఖర్చులకు బస్తాకు సుమారు రూ.50 కాగా ప్రస్తుతం ఎవరికివారు ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునే పనిలో ఉండటంతో జట్టు కొరత పేరిట రూ.80 నుంచి రూ.90 వరకు వసూలు చేస్తున్నారు. ఈ మేరకు బస్తాకు రూ.30 నుంచి రూ.40 వరకు రైతులు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. -
టిడ్కో రుణమాఫీ కోరుతూ ధర్నా
తాడేపల్లిగూడెం: టిడ్కో ఇళ్ల కోసం బ్యాంకులు ఇచ్చిన రుణాలను మాఫీ చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో ఆదివారం తాడేపల్లిగూడెంలో ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికల్లో కనీస అవసరాలు తీరుస్తా మని కూటమి నాయకులు ఇచ్చిన హామీలను అ మలు చేయాలని డిమాండ్ చేశారు. ఐద్వా సెక్రటరీ పొగాకు పూర్ణ మాట్లాడుతూ ఏ బ్లాక్ వారికి రుణమాఫీ జరిగిందని, గత ప్రభుత్వంలో రుణాలు చెల్లించడానికి లబ్ధిదారులు ముందుకు వస్తే, కూటమి నాయకులు అడ్డుకుని, తమ ప్రభుత్వం రాగానే మాఫీ చేస్తామని చెప్పారన్నారు. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని ఆ నాయకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బ్యాంకుల నుంచి రికవరీ బృందాలు వచ్చి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, వీరిని అడ్డుకోవాలన్నారు. అలాగే టిడ్కో గృహాల సముదాయంలో పాముల బెడద అధికంగా ఉందని, చెత్తను కూడా శుభ్రం చేయడం లేదన్నారు. పట్టణ కార్యదర్శి బి.యశోద, ఎం.పావని, మండల కార్యదర్శి పి.సత్యవతి, మహిళలు పాల్గొన్నారు. -
స్ఫూర్తిప్రదాత అంబేడ్కర్
భీమవరం: అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ నడుచుకోవాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శనివారం అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏఎస్పీ వి.భీమా రావు, డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, ఆర్డీఓ కె.ప్రవీణ్కుమార్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్వీ అరుణకుమారి, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.వీరయ్య తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనపై ఎస్హెచ్జీ మహిళలు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. భీమవరం కలెక్టరేట్లో శనివారం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, డీఆర్డీఏ సంయుక్తంగా నిర్వహించిన ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబద్ధీకరణ పథకం ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు నిర్వహించిన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. డీఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం: స్థానిక బీవీ రాజు విగ్రహం వద్ద శనివారం ట్రాఫిక్పై అవగాహన, త్రీకే రన్ ర్యాలీని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ప్రారంభించారు. యువతే దేశానికి దిశా నిర్దేశమని, ట్రాఫిక్ ని బంధనలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జేసీ కె.రాహుల్కుమార్రెడ్డి పాల్గొన్నారు. భీమవరం: పోలీసు శాఖలో హోంగార్డుల సేవలు ప్రశంసనీయమని, వారి సంక్షేమానికి కృషి చేస్తూ అన్నివిధాలా అండగా ఉంటామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. శనివారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక జడ్డు బ్రహ్మాజీ కల్యాణ మండపంలో జరిగిన 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోంగార్డులు పోలీస్ బలగాలకు నిజమైన వెన్నెముకగా నిలుస్తున్నారన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు తావులేదు జిల్లాలో రానున్న పండుగల నేపథ్యంలో ఎ లాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లే కుండా ముందస్తు భద్రతా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎస్పీ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసులు, చోరీల రికవరీ తదితర అంశాలపై చర్చించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, డీఎస్పీలు జి.శ్రీవేద, డి.విశ్వనాథ్ పాల్గొన్నారు. తణుకు అర్బన్: తణుకు రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే తణుకు రోడ్ రన్ కార్యక్రమంలో విద్యార్థుల నుంచి సైతం టికెట్ రూపంలో డబ్బులు వసూలు చేయడం విమర్శలకు తావిచ్చింది. తణుకు రోడ్రన్ పేరుతో వెబ్సైట్లో 3కే, 5కే, 10కే విభాగాల్లో రూ.250, రూ.300, రూ.350ల చొప్పున వసూలు చేయడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ముందుగా ఆసక్తి ఉన్నవారు వెబ్సైట్లో నమోదు చేసుకున్నారు. అయితే శనివారం ఎన్టీఆర్ పార్కులో ఏర్పాటుచేసిన శిబిరంలో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల నుంచి సంస్థ ప్రతినిధులు డబ్బులు తీసుకుని టీషర్ట్ అందజేశారు.స్థానిక ఎమ్మెల్యే స్పాన్సర్గా ఉన్న రోడ్రన్ కార్యక్రమంలో అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేయడం దారుణమని మాజీ మంత్రి కారు మూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. గతంలో రోడ్ రన్లు నిర్వహించిన సమయంలో ఎప్పుడూ వసూళ్లకు పాల్పడలేదన్నారు. ఒక ఎమ్మెల్యే, జిల్లా అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యే కార్యక్రమాలను సంస్థలు డబ్బులు తీసుకుని నిర్వహిస్తుండడం బాధాకరమని అన్నారు. తమ హయాంలో నిర్వహించిన రన్ కార్యక్రమాల్లో అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పించామన్నారు. -
పేదల బతుకుల్లో చెత్త పోస్తారా?
నరసాపురం: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంగళగుంటపాలెంలో 8 వేల మందికి జగన న్న కాలనీలో ఇళ్ల స్థలాలు ఇస్తే.. ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చెత్తను డంప్ చేయాలని నిర్ణయించడం దారుణమని వైఎస్సార్సీపీ నరసాపురం పట్టణ అధ్యక్షుడు కామన బుజ్జి ధ్వజమెత్తారు. పేదల బతుకుల్లో చెత్తను పోసే దారుణానికి ఎలా ఒడిగట్టారని ప్రశ్నించారు. నరసాపురం ము న్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రగడ, వైఎస్సార్సీపీ సభ్యుల నిర్బంధం తరువాత శనివారం రాత్రి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుజ్జి మాట్లాడుతూ జగనన్న కాలనీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది ఇళ్లు నిర్మించుకున్నారని, కొన్ని ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని చె ప్పారు. అక్కడ మౌలిక వసతులు, పెండింగ్ పనులు పూర్తిచేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానిదన్నారు. అది చేయకుండా అక్కడ చెత్తను వేయాలని చూడటం జగన్ సంకల్పాన్ని దెబ్బతీయాలనే దురుద్దేశంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదల బతుకులు బాగుచేయాలని అన్నారు. కౌన్సిల్ చరిత్రలో చీకటి రోజు బయట గేట్కు తాళాలు వేసి తమను గంటల తరబడి మున్సిపల్ కార్యాలయంలో నిర్బంధించడం దారుణమని మున్సిపల్ చైర్పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ అన్నారు. కౌన్సిల్లో వారు సంతకం పెట్టమ న్న అంశంపై మళ్లీ చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నా వినకుండా దారుణంగా ప్రవర్తించారని వి మర్శించారు. కౌన్సిలర్ భర్త అయిన మున్సిపల్ కా ంట్రాక్టర్ వద్దకు మున్సిపల్ కార్యాలయం తాళాలు ఎలా వెళ్లాయని ప్రశ్నించారు. అసలు తాళం వేయడానికి అతనెవరని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని దౌర్జన్యంగా వ్యవహరించడం సరికాద న్నారు. నరసాపురం చరిత్రలో ఇది చీకటి రోజన్నారు. దాడికి తెగబడ్డారు వైస్ చైర్పర్సన్ కామన నాగిని మాట్లాడుతూ అతికష్టం మీద నిర్బంధాన్ని దాటుకుని వచ్చిన తరువా త బయట కూడా తమపై దాడికి తెగబడ్డారన్నారు. కౌన్సిలర్ సఖినేటిపల్లి మాట్లాడుతూ ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశానికి వస్తే, మధ్యాహ్నం 2 గంటల నుంచి నిర్బంధంలో ఉంచారన్నారు. 30 వ వార్డు కౌన్సిలర్ అడిదల శ్యామల మాట్లాడుతూ మహిళా చైర్పర్సన్ అని చూడకుండా, చైర్లో ఉన్న ఆమె మీదకు వెళ్లి మినిట్స్ బుక్పై సంతకం పెట్టా లని బెదిరించారన్నారు. తాము నిర్బంధంలో మలమల మాడిపోతూ భయపడుతూ ఆందోళనలో ఉంటే బయట వారు అధికార పార్టీ అండతో టిఫిన్లు తింటూ, మమ్మల్ని హేళన చేస్తూ నీచంగా ప్రవర్తించారని మహిళా కౌన్సిలర్లు సిర్రా కాంతమ్మ, పతివడ పద్మ, సోమరాజు దుర్గాభవానీ, యర్రా లక్ష్మి ఆ గ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు బర్రి జయరాజు, కావలి రామసీత, బొంతు రాజశేఖర్, వంగా శ్రీకాంత్ కన్నాచ బుడితి తిలీప్, ద్వారా ప్రసాద్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ మహిళా కౌన్సిలర్ల ఆగ్రహం -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను సహించం
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇరగవరం: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ను సహించబోమని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. రేలంగిలో శనివారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భా గంగా ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏ ముఖ్యమంత్రీ తీసుకురాలేదని, జగన్మోహన్రెడ్డి మాత్రమే తన హయాంలో 17 మెడికల్ వైద్య కళాశాలలను తీసుకువచ్చి చరిత్ర సృష్టించారని తెలిపారు. అటువంటి కాలేజీలను నిర్వహించలేక చంద్రబాబు సర్కారు చేతులెత్తేయడమే కాకుండా ప్రైవేటీకరణ చేసి పేదలను ప్రైవేటు వైద్యం వైపు మళ్లించాలని చూస్తోందని మండిపడ్డారు. జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుచేసి వాటి ద్వారా ఖరీదైన వైద్యంగా పరిగణించే కిడ్నీ, లివర్, గుండె తదితర శస్త్రచికిత్సలు పేదలకు ఉచితంగా అందించాలని, వైద్య విద్యను కూడా పేదలకు ఉచి తంగా వైద్య కళాశాలల ద్వారా అందించవచ్చని జ గన్మోహన్రెడ్డి కలలుగన్నారని కారుమూరి చెప్పా రు. ఏదేమైనా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నడపాలనే తమ నినాదంతో ఎంతవరకు అయినా వెళ్తామని ఆయన తేల్చిచెప్పారు. వెల్లువలా సంతకాల సేకరణ గ్రామంలో చీకటి పడినా సంతకాల కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎక్కడ శిబిరం పెట్టినా ప్రజలు వెల్లువగా వచ్చి సంతకాలు చేస్తున్నారని కారుమూరి అన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గా ప్రసాద్, నాయకులు పెన్మెత్స సుబ్బరాజు, పులుపు అనిల్, మాజీ సర్పంచ్ మైనం పాము, నడుంపల్లి రామారాజు, మెట్ల డాడి, చేబ్రోలు పెద్దిరాజు, మోషే, సబ్బితి రాజేష్, తాతపూడి బోస్ తదితరులు పాల్గొన్నారు.


