జిల్లాకు తీవ్ర అన్యాయం
చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పసలేని పద్దుల బడ్జెట్గా ఉంది. జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. బడ్జెట్లో ఆక్వా యూనివర్సిటీ ప్రస్తావన లేదు. కోటిపల్లి రైల్వేలైన్ ఊసే ఎత్తలేదు. నిరుద్యోగభృతి ఎండమావిగా ఉంది. బీసీ మహిళలకు పింఛన్, ఇతర సంక్షేమ పథకాలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు. సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ తీవ్ర అన్యాయం చేశారు. రాష్ట్రాన్ని అమావాస్య చీకటిగా మార్చే విధంగా బడ్జెట్ రూపొందించడం దురదృష్టకరం.
– పీవీఎల్ నరసింహరాజు,
వైఎస్సార్సీపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్


