వెట్టిచాకిరీ నిర్మూలనపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

వెట్టిచాకిరీ నిర్మూలనపై అవగాహన కల్పించాలి

Feb 10 2026 8:16 AM | Updated on Feb 10 2026 8:16 AM

వెట్టిచాకిరీ నిర్మూలనపై అవగాహన కల్పించాలి

వెట్టిచాకిరీ నిర్మూలనపై అవగాహన కల్పించాలి

భీమవరం (ప్రకాశంచౌక్‌): వెట్టిచాకిరీ నిర్మూలన చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలనకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వర్ణోత్సవాల్లో భాగంగా సోమవారం గోడ పత్రికను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెట్టిచాకిరీ నిర్మూలనపై అవగాహన కల్పించి సమాజంలో చైతన్యం పెంచి మానవ హక్కుల పరిరక్షణకు దోహదపడాలన్నారు. వెట్టిచాకిరీ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని వాటిని ప్రోత్సహించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement