ముగిసిన నాటకోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన నాటకోత్సవాలు

Feb 9 2026 8:22 AM | Updated on Feb 9 2026 8:22 AM

ముగిసిన నాటకోత్సవాలు

ముగిసిన నాటకోత్సవాలు

ముగిసిన నాటకోత్సవాలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక వైఎంహెచ్‌ఏ హాలులో జరుగుతున్న గరికపాటి కళాపరిషత్‌ నాటకోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. రెండు ప్రదర్శనలు సందేశాత్మకంగా ఉన్నాయి. కళాహారతి తిరుమాలి సంస్థ (కాకినాడ) కళాకారులు ప్రియమైన శత్రువు నాటిక ప్రదర్శించా రు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలను యువత ఎలా నిర్లక్ష్యం చేస్తుందో చక్కగా ప్రదర్శించారు. గ్రామీణ నాటక సమాఖ్య (పిఠాపురం) వారి సహృదయ ఆర్ట్స్‌ (పి.రాయవరం) కళాకారులు పున్నామ నరకం నాటికను ప్రదర్శించారు. సీనియర్‌ రంగస్థల నటుడు కేపీ రాజు, సీనియర్‌ రంగస్థల నటి యు.విజయలక్ష్మిలను అక్కినేని స్మారక రంగస్థల పురస్కారాలతో సత్కరించారు. సినీ నటుడు సుబ్బరాయ శర్మ, రచయిత గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, ఎస్‌ బీఐ రీజనల్‌ మేనేజర్‌ పి.కాళిదాసు, కళారత్న ఎస్‌వీ రామారావు, డాక్యుమెంటరీ నిర్మాత జమలాపురం రాధాకృష్ణ, రచయిత పి.రాజేంద్రకుమార్‌ తదిరులు హాజరుకాగా గరికపాటి ఆర్ట్స్‌ థియేటర్‌ డైరెక్టర్‌ గరికపాటి కాళిదాసు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement