ఆరోగ్యకరమైన ద్రవ పదార్థాలు తీసుకోవాలి
వచ్చేది వేసవి కాలం కావడంతో ఘన పదార్థాలు శరీరానికి పెద్దగా సహించవు. డీహైడ్రేషన్తో వాంతులు, విరోచనాలతో ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంటుంది. అటువంటి సమయంలో ఆరోగ్యకరమైన ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా మంచినీరు, కొబ్బరి నీరు, పండ్ల రసాలు, మజ్జిగ, రాగిజావ వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అలాగే రోజుకు కనీసం 8 గంటలు గాఢనిద్రకు కేటాయించాలి. ప్రతిరోజూ కొద్ది సమయం యోగ, ధ్యానం సాధనకు కేటాయించాలి.
– డాక్టర్ ఎంఎల్వీ ప్రసాద్, ఆంధ్రా హాస్పిటల్స్ డైరెక్టర్


