అధిక ధరలకు కొంటున్నాం
సామాన్యుడికి పోషకాలు అందించేది కందిపప్పు. కొన్ని నెలలుగా రేషన్ షాపుల్లో కందిపప్పు ఇవ్వకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బయట మార్కెట్లో అధిక ధరలకు కొనాల్సి వస్తుంది. ఎన్నికల ముందు రేషన్ షాపుల ద్వారా అన్ని సరుకులు ఇస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం అఽధికారం చేపట్టిన తర్వాత మరిచిపోయింది.
–ఎం.సూర్యారావు, పాలకోడేరు
చంద్రబాబు ప్రభుత్వం పప్పన్నం కూడా తిననివ్వడం లే దు. రేషన్ ద్వారా కందిపప్పు ఇస్తామని చెప్పి చేతులెత్తేడం దారుణం. వారానికి రెండు మూడు రోజులు పప్పుకూర వండుకుందామంటే అధిక ధర పెట్టి కొనాల్సి వస్తుంది. అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ప్రభుత్వం ధరలను నియంత్రించాలి
– ముత్యు విజయ, దుంపగడప, ఆకివీడు మండలం
అధిక ధరలకు కొంటున్నాం


