కాపు సంక్షేమంపై తీవ్ర నిర్లక్ష్యం
ఎన్నికల సమయంలో కాపులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కాపుల సంక్షేమం విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ముచ్చటగా మూడోసారి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ ఏడాది బడ్జెట్లో కూడా కాపు కార్పొరేషన్కు ఎలాంటి నిధులూ కేటాయించలేదు. కాపు కార్పొరేషన్ అలంకారప్రాయంగా మారింది. కూటమి ప్రభుత్వంపై కాపులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
– కొత్తపల్లి రమేష్నాయుడు, జాతీయ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు/నరసాపురం


