మోసం చేయడం చంద్రబాబు నైజం
హామీలు ఇచ్చి మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం. చంద్రబాబు అధికారం చేపట్టిన ప్రతిసారీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. ఇది చరిత్ర చెప్పే నిజం. ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని నమ్మబలికారు. మేనిఫెస్టోలో ఊదర గొట్టారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఆ పథకం అమలు దరిదాపుల్లోకి రాలేదు. మూడోసారి బడ్జెట్లో అయినా సూపర్ సిక్స్ పథకాల కోసం కేటాయింపులు ఉంటాయని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆశగా ఎదురు చూశారు. ఒక్క పైసా నిధులు కూడా కేటాయించలేదు. – కుక్కల కిరణ్కుమార్, బీసీ సంఘ నాయకుడు, పెనుగొండ


