సాక్షి, పశ్చిమ గోదావరి: ఏపీలోని ఉండి నియోజకవర్గం టీడీపీలో వర్గపోరు పరాకాష్టకు చేరుకుంది. ఉపసభాపతి, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు దౌర్జన్య కాండపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తురి వెంకటేశ్వర రాజు (బొడ్డియ్య రాజు) ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాల మేరకు.. ఉండి మండలం వెలిపర్రు గ్రామంలో వెంకటేశ్వర రాజు పార్టీ ఆఫీసు, ఇంటిని సర్వే చేసి కూల్చేస్తామంటూ నిన్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయమే ఆయన ఇల్లు, టీడీపీ పార్టీ కార్యాలయాన్ని పోలీసులతో మొహరించి జేసీబీలతో అధికారులు కూల్చేశారు. అయితే, పొత్తూరి వెంకటేశ్వర రాజుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో భీమవరం నీలాద్రి ఆస్పత్రిలో చేరారు. దీంతో, పోలీసులు ఆసుపత్రికి వద్దకు చేరుకున్నారు.


