భీమవరం (ప్రకాశంచౌక్): 2027 జనాభా లెక్కల సేకరణలో విధివిధానాలపై అధికారులు సంపూర్ణ అవగాహనతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో మంగళవారం ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తహసీల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల కోసం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణ మాదిరిగానే జనాభా లెక్కల సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని వివరించారు.


