న్యూస్రీల్
డ్యూటీలో ఉన్న ఎస్సై కాలర్ పట్టుకున్న అధికార పార్టీ నాయకుడు
ఉన్నతాధికారులకు
సమాచారం ఇచ్చిన పోలీసులు
ఓ ప్రజాప్రతినిధి ఆదేశాలతో కేసు నమోదుకు వెనకడుగు!
ఘటనతో అట్టుడికిపోతున్న
కరీంనగర్ పోలీసులు
నేతల తీరుతో ఆత్మగౌరవం
మంటగలుస్తుందని ఆవేదన
పోలీసులు అంటే కొందరు రాజకీయ నాయకులకు చులకనగా మారింది. అధికారంలో ఉన్నాం కదా.. ఏం చేసిన చల్తా అంటూ జులం చూపిస్తున్నారు. అధికార, ప్రతిపక్షం అనే భేదం లేకుండా ఖద్దర్ చొక్కా ఒంటిమీద ఉంటే చాలు నాలుగో సింహాన్ని చిన్నగా చూస్తున్నారు. ఇటీవల ఓ ప్రజాప్రతినిధి పోలీస్బాస్ను టార్గెట్ చేస్తూ ఆరోపణలకు దిగగా.. తాజాగా
ఓ గ్రామస్థాయి లీడర్ ఎస్సై కాలర్ పట్టుకొని దాడి చేయడం కలకలం సృష్టించింది. ఇంత జరుగుతున్నా.. పాలకులు సైలెన్స్గా ఉండడంతో పోలీస్శాఖలో చర్చకు దారితీసింది. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో విధులు
నిర్వహించడం కష్టమనే డిబేట్ మొదలైంది.


