సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. పేకాట.. ఒకరి ప్రాణం తీసింది. చిత్తూరు రూరల్ మండలంలోని తుమ్మిందపాళ్యంలో ఘటన జరిగింది. పేకాట ఆడుతున్న సమయంలో ఇద్దరు స్నేహితుల మధ్య పాత బాకీ విషయంలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మాటమాట పెరిగి నాటు తుపాకీతో సాయికుమార్ను ఢిల్లీ బాబు కాల్చి చంపాడు.