రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ బహిరంగ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టులోని GAP-2 ఎర్త్ కోర్ రాక్ ఫిల్ (ECRF) డ్యామ్ రూపకల్పనలో వ్యత్యాసాలు, భద్రతా పరమైన ముప్పు గురించి లేఖలో ప్రస్తావించారు.సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) నివేదికలను పరిశీలించిన తర్వాతే ఈ అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళుతున్నట్టు ఉండవల్లి స్పష్టం చేశారు.
ఉండవల్లి లేఖలో ప్రధాన అంశాలు..
- పూర్తి సాంకేతిక, డిజైన్ అనుమతులు లేకుండా పనులు కొనసాగించడం డ్యామ్ పటిష్టతకు, ప్రజా భద్రతకు ముప్పు
- నది మట్టం కంటే 7.18 మీటర్ల ఎత్తులో నిర్మాణం జరుగుతోంది
- డ్యామ్ కింద ఉండే డయాఫ్రమ్ వాల్ కేవలం నీటి సీపేజీని అడ్డుకోవడానికి (Cut-off wall) మాత్రమే, అది డ్యామ్కు పునాది కాదు .
- పునాది లోపభూయిష్టంగా ఉంటే భవిష్యత్తులో ఇసుక కోతకు గురై ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది .
- ఎటువంటి సరైన కారణం లేకుండా టెయిల్ వాటర్ లెవల్ను +25 మీటర్ల నుండి +16.0 / +13.5 మీటర్లకు మార్చడంపై CWC అసంతృప్తి వ్యక్తం చేసింది.
- అంతర్జాతీయ కన్సల్టెంట్ AFRY నుండి రావాల్సిన ఫిల్టర్ డిజైన్, స్లోప్ స్టెబిలిటీ వంటి కీలక పత్రాలు ఇంకా CWCకి అందలేదు. ఇవి లేకుండా పనులు ముందుకు తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధం
- భూకంపాలను తట్టుకునే సామర్థ్యం (Seismic resilience) విషయంలో పాత మరియు కొత్త ప్రమాణాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి, వీటిని సరిచేయాల్సి ఉంది
భవిష్యత్తులో సరిదిద్దలేని నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది .



