చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి లేఖ | Undavalli Arun Kumar Writes A Letter To CM Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి లేఖ

Mar 5 2026 3:19 PM | Updated on Mar 5 2026 4:40 PM

Undavalli Arun Kumar Writes A Letter To CM Chandrababu

రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ బహిరంగ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టులోని GAP-2 ఎర్త్ కోర్ రాక్ ఫిల్ (ECRF) డ్యామ్ రూపకల్పనలో వ్యత్యాసాలు, భద్రతా పరమైన ముప్పు గురించి లేఖలో ప్రస్తావించారు.సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) నివేదికలను పరిశీలించిన తర్వాతే ఈ అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళుతున్నట్టు  ఉండవల్లి స్పష్టం చేశారు.

ఉండవల్లి లేఖలో ప్రధాన అంశాలు..

  • పూర్తి సాంకేతిక, డిజైన్ అనుమతులు లేకుండా పనులు కొనసాగించడం డ్యామ్ పటిష్టతకు, ప్రజా భద్రతకు ముప్పు
  • నది మట్టం కంటే 7.18 మీటర్ల ఎత్తులో నిర్మాణం జరుగుతోంది 
  • ​డ్యామ్ కింద ఉండే డయాఫ్రమ్ వాల్ కేవలం నీటి సీపేజీని అడ్డుకోవడానికి (Cut-off wall) మాత్రమే, అది డ్యామ్‌కు పునాది కాదు .
  • పునాది లోపభూయిష్టంగా ఉంటే భవిష్యత్తులో ఇసుక కోతకు గురై ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది .  
  • ఎటువంటి సరైన కారణం లేకుండా టెయిల్ వాటర్ లెవల్‌ను +25 మీటర్ల నుండి +16.0 / +13.5 మీటర్లకు మార్చడంపై CWC అసంతృప్తి వ్యక్తం చేసింది. 
  • ​ అంతర్జాతీయ కన్సల్టెంట్ AFRY నుండి రావాల్సిన ఫిల్టర్ డిజైన్, స్లోప్ స్టెబిలిటీ వంటి కీలక పత్రాలు ఇంకా CWCకి అందలేదు. ఇవి లేకుండా పనులు ముందుకు తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధం 
  • భూకంపాలను తట్టుకునే సామర్థ్యం (Seismic resilience) విషయంలో పాత మరియు కొత్త ప్రమాణాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి, వీటిని సరిచేయాల్సి ఉంది
  • భవిష్యత్తులో సరిదిద్దలేని నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది .  

  • చంద్రబాబు, పవన్‌కు ఉండవల్లి లేఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement