ప్రొద్దుటూరులో వైఎస్‌ జగన్‌.. కొత్త జంటకు ఆశ్వీరాదం | YS Jagan Attend rachamallu daughter marriage At prodduturu | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరులో వైఎస్‌ జగన్‌.. కొత్త జంటకు ఆశ్వీరాదం

Mar 5 2026 1:22 PM | Updated on Mar 5 2026 1:31 PM

YS Jagan Attend rachamallu daughter marriage At prodduturu

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరయ్యారు. ఈ క్రమంలో నవ దంపతులు కృష్ణ కావ్య, వినీత్ రెడ్డిలను వైఎస్ జగన్ ఆశ్వీరదించారు.

ఇక, వైఎస్‌ జగన్‌ ప్రొద్దుటూరు వస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు హెలీప్యాడ్‌, కల్యాణ మండపం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. తమ అభిమాన నేతలకు స్వాగతం పలికారు. దారి పొడవునా పూల వర్షం కురిపించారు. దీంతో, అభిమానులకు అభివాదం చేస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు కదిలారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement