సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా మహిళా నేతలు ఆర్కే రోజా, వరుదు కల్యాణి, కల్పలతారెడ్డి, మేయర్ భాగ్యలక్ష్మి సహా పార్టీ మహిళా ముఖ్య నేతలు కేట్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, అన్ని జిల్లాల మహిళా అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.



