వైఎస్సార్సీపీ నిరసనలు అప్డేట్స్..
- నేడు వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు
- డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలనీ..
- మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
- అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ నిరసన ప్రదర్శనలు
- ఇప్పటికే పలు రూపాల్లో నిరసనలు తెలిపిన వైఎస్సార్సీపీ
- కలెక్టర్లకు వినతి పత్రాలు, టౌన్ హాలు సమావేశాలు, రిలే నిరాహార దీక్షలు నిర్వహణ
- ప్రభుత్వం స్పందించేంత వరకు పోరాటం ఆపేదిలేదంటున్న వైఎస్సార్సీపీ.
ఏపీలో డీఎస్సీ అక్రమాలపై నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టనున్న ర్యాలీలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ర్యాలీ అనుమతి లేదంటూ వైఎస్సార్సీపీ నేతలకు పలుచోట్ల నోటీసులు ఇచ్చారు.
కర్నూలు..
- డీఎస్సీలో జరిగిన అవకతవకలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
- ర్యాలీకి అనుమతి లేదంటూ కర్నూలు టూ టౌన్ పోలీసులు ఆంక్షలు
- అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అంటూ పోలీసుల బెదిరింపులు
- కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎటువంటి ర్యాలీకి అనుమతి లేదంటున్న పోలీసులు
- వైఎస్సార్సీపీ నేతలకు అర్థరాత్రి నోటీసులు అందించిన పోలీసులు.
గుడివాడలో..
గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ర్యాలీ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు వెళ్లిన పోలీసులు నోటీసులు అందజేయడం గమనార్హం. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు.

తాడిపత్రిలోనూ ర్యాలీకి బ్రేక్..
అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ వైఎస్సార్సీపీ చేపట్టనున్న నిరసన ప్రదర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ నిరసన ర్యాలీకి ఏర్పాట్లు చేశారు.
అయితే ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్రెడ్డి పోటీగా మరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో రెండు వర్గాల కార్యక్రమాలకు అనుమతి ఇస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు.. అనుమతి నిరాకరించారు.


