DSC
-
‘డీఎస్సీలో అక్రమాలపై చర్చకు సిద్ధం.. మీరు సిద్ధమా?’
సాక్షి, తాడేపల్లి: తాత పెట్టిన పార్టీ, తండ్రి ద్వారా సంక్రమించిన అధికారంతో నారా లోకేష్ విర్రవీగి ప్రవర్తిస్తున్నాడని, డీఎస్సీ అవకతవకలపై చర్చను పక్కదారి పట్టించడానికే ఆయన సవాల్ చేసి పారిపోయాడని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ–2025 పై లోకేష్ సవాల్ని వైఎస్సార్సీపీ స్వీకరిస్తుందని.. బహిరంగ చర్చకు ఎక్కడికి రమ్మన్నా తాము సిద్ధంగా ఉన్నామని, మా వెంట దగా పడ్డ అభ్యర్థులను కూడా తీసుకొస్తామని చెప్పారు.డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలను వైఎస్ జగన్ ఆధారాలతో సహా బయట పెడితే ఇంతవరకు నారా లోకేష్ ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే డీఎస్సీలో అక్రమాలు జరగలేదని వారికి చెప్పి నమ్మించాలని సవాల్ చేశారు. డీఎస్సీలో అక్రమాలు జరగలేదనేది నిజమైతే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించవచ్చు కదా అని ప్రశ్నించారు.కాపు యువకుడు గాదె సాయికృష్ణను విజయవాడ నడిబొడ్డున కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ చేసి చంపేస్తే దానికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం, ఎల్లో మీడియా హోంమంత్రి మేకప్ గురించి మాట్లాడుతోందని విమర్శించారు. హోంమంత్రి మేకప్కి ఉన్న విలువ బిడ్డను కోల్పోయిన తల్లి కడుపుకోతకు లేదా అని కురసాల కన్నబాబు ప్రశ్నించారు. గురువారం (18వ తేదీ) శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైఎస్సార్సీపీ నాయకులు గవర్నర్ని కలిసి డీఎస్సీ నిర్వహణలో అవకతవకలపై విచారణకు ఆదేశించాలని కోరబోతున్నట్టు చెప్పారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏమన్నారంటే..:దమ్ముంటే డీఎస్సీ నిర్వహణపై మాట్లాడు లోకేష్:డీఎస్సీ–2025 నిర్వహణపై ప్రజల్లో ఉన్న అనుమానాలను లేవనెత్తుతూ వైఎస్ జగన్ చాలా ప్రశ్నలు సంధిస్తే దానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంతవరకు కనీసం సమాధానం చెప్పిన పాపానపోకుండా సవాల్ విసిరి పారిపోయాడు. ప్లేస్ ఆయన చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, డీఎస్సీ పై బహిరంగ చర్చకు మేం సిద్ధమే. మాతోపాటు దగా పడ్డ అభ్యర్థులను కూడా తీసుకొస్తాం. అధికారం ఉంది కదా అని విర్రవీగిపోతే సరికాదు. డీఎస్సీ నిర్వహణలో తప్పే జరగలేదనుకుంటే మేం అడిగినట్టు సీబీఐ విచారణ కోరాలి.సీబీఐ అంటే చంద్రబాబు ఎంక్వయిరీ అని మాత్రం అనుకోవద్దు. తాత పెట్టిన పార్టీ, తండ్రి ద్వారా సంక్రమించిన అధికారంతో విర్రవీగిపోతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కవ్వింపు చర్యలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమే 200 మీటర్ల దూరంలో ఉన్నానని నారా లోకేష్ ఛాలెంజ్. స్పోర్ట్స్ కోటాలో అడ్డదారిలో ఉద్యోగాలిచ్చిందే కాకుండా ఎన్ని జన్మలెత్తినా మీరు డీఎస్సీ నిర్వహించలేరని వాగడం సిగ్గుమాలినతనం తప్ప మరోటి కాదు.సొంత ఛానెళ్లలో తొడలు కొట్టడం, భజన చేయంచుకోవడం కాదు:పరీక్ష నిర్వహణలో ఉద్దేశపూర్వకంగానే కాంప్రమైజ్ అయ్యారని పలు విధాలుగా ఆధారాలతో వైఎస్ జగన్ నిరూపించారు. పరీక్ష నిర్వహణ దగ్గర నుంచి ఫలితాలు వెల్లడించే వరకు పారదర్శకత లేదని జీవొలతో సహా నిరూపించారు. 1:1 రేషియోలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి పిలిచి సెలెక్ట్ అయ్యారని పంపిన వారికి ఉద్యోగం ఇవ్వలేదు. పరీక్ష కూడా రాయకుండా డిగ్రీ ఉత్తీర్ణత కావాల్సిన అవసరమే లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చారని తేలింది.ఇవన్నీ కాదని నిరూపించండి చూద్దాం. ఇంతపెద్ద స్కామ్ జరిగిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే ఎందుకు సమాధానం చెప్పడం లేదు? కొంతమంది అధికారులను పంపించి మాట్లాడించడమే తప్ప, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు భయపడిపోతున్నాడు? టీచర్ పోస్టులు వచ్చిన వారిని భయపెట్టి పిలిచి, టీడీపీ నాయకుల సమక్షంలో వైఎస్ జగన్ని తిట్టించడం కాదు. దమ్ముంటే, మెరిట్ ఉన్నా ఉద్యోగం రాలేదని కోర్టులు చుట్టూ, మీ చుట్టూ తిరుగుతున్న అభ్యర్థులతో మీటింగ్ పెట్టండి. వారడిగే ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పడం లేదు. తప్పు జరగలేదని వారిని ఒప్పించండి. సొంత ఛానెల్లో తొడలు కొట్టించుకోవడం కాదు.. ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితులు తెచ్చుకోవద్దు.లోకేష్ని మందలించే ధైర్యం చంద్రబాబుకే లేదు:బెంగళూరులో కాపురం ఉంటాడని జగన్ని విమర్శించడం కాదు.. నారా లోకేష్ ఎక్కడ కాపురం ఉంటున్నాడు. వీకెండ్ వస్తే ఎక్కడుంటున్నాడు. తెలంగాణలో ఆధార్ కార్డు పెట్టుకుని ఆంధ్రాలో రాజకీయాలు చేస్తే ఎలా? 2019–24 ఎప్పుడైనా లోకేష్ ఆంధ్రాలో ఉన్నాడా? ప్రతిపక్ష నాయకుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత చంద్రబాబుకి లేదా? లేక ఆయన్ను నోరెత్తనీయకుండా లోకేష్ అడ్డుకుంటున్నాడా? డీఎస్సీ నిర్వహణలో అవకతవకలు జరిగిన ఈ సందర్భంలో ఒకవేళ నారా లోకేష్ స్థానంలో విద్యాశాఖ మంత్రిగా మరెవరైనా ఉండుంటే.. వారిపై చంద్రబాబు సీరియస్ అని ఎల్లో మీడియాలో హెడ్లైన్స్ వచ్చి ఉండేవి.విద్యాశాఖ మంత్రిని త్వరలోనే మార్చేస్తున్నారని బ్రేకింగ్లు వేసేవాళ్లు. కానీ లోకేష్ని పిలిచి మందలించే ధైర్యం చంద్రబాబుకి కూడా లేదని టీడీపీ నాయకులే చెబుతున్నారు. డీఎస్సీపై చర్చకు ఏ ఛానెల్కి రమ్మన్నా వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో డీఎస్సీ అక్రమాలను నిగ్గుతేల్చకుండా వదిలిపెట్టం. వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ గా వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుంది. ఎవరి బెదిరింపులకు, కేసులకు భయపడటం అనేది జరగదు.గవర్నర్కి ఫిర్యాదు చేస్తాం:శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు గురువారం (18వ తేదీ) గవర్నర్ని కలిసి డీఎస్సీ నిర్వహణపై విచారణకు ఆదేశించాలని కోరబోతున్నారు. కాపు యువకుడు సాయికృష్ణను పోలీసులు అన్యాయంగా లాకప్లో చంపేశారని లాకప్ డెత్ గురించి రాష్ట్రమంతా చర్చిస్తుంటే దాన్ని పక్కనపెట్టి ప్రభుత్వం, ఎల్లో మీడియా మేకప్ మీద చర్చిస్తోంది.రాజధానిలో శాంతిభద్రతలు గాడితప్పి ప్రశ్నార్థకంగా మారితే దానికి సమాధానం చెప్పకుండా మేకప్ పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేయడం కూటమి ప్రభుత్వానికే చెల్లింది. తన బిడ్డ కోసం తల్లి కన్నీరుమున్నీరుగా రోదిస్తుంటే దాన్ని పక్కనపెట్టి మేకప్ ఉద్యమం చేపట్టారు. హోంమంత్రి, డీజీపీ, సిటీ కమిషనర్ ఎక్కడున్నారు?. అసలు లాకప్ డెత్ జరగలేదని చెప్పై ధైర్యం కూడా ప్రభుత్వానికి లేదా? మహిళల గురించి లోకేష్ ఎంత నీచంగా మాట్లాడిన మాటలన్నీ తీస్తే ఆయన తల ఎక్కడ పెట్టుకుంటాడు?ఇలాంటి వ్యక్తి నీతులు చెబితే రాష్ట్ర ప్రజలు వినాలా? సాయికృష్ణ తల్లి కూడా మహిళ కాదా? ఎల్లో మీడియా హోంమంత్రి మేకప్కి ఇచ్చిన విలువ సాయికృష్ణ తల్లి కడుపుకోతకు ఇవ్వలేదా? సాయికృష్ణ ఆచూకీ గురించి తల్లి రోదిస్తుంటే రౌడీ షీటర్ అని ప్రచారం చేస్తున్నారు. రౌడీ షీటర్ అయితే చంపేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు నిలదీశారు. -
మాకు CCTV ఫ్యూటేజ్ చూపించండి అంటే వాళ్ళు చెప్పిన సమాధానం..
-
దమ్ముంటే చర్చకు రండి...! లోకేష్ పై డీఎస్సీ విద్యార్థుల ఫైర్!
-
చంద్రబాబు ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంతో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఇవాళ(ఆదివారం, జూన్ 14) వైఎస్సార్సీపీ కార్యాలయానికి వచ్చిన డీఎస్సీ బాధితులు.. టీడీపీ నేతలు ఫేక్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడా కోటా పేరుతో జరిగిన అక్రమాలను బాధితులు వివరించారు. అధికారులు చెప్పేవన్ని అబద్ధాలేనని మండిపడ్డారు.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అవకతకవలు జరిగాయని.. డీఎస్సీలో జరిగిన అవినీతిపై వైఎస్సార్సీపీ గట్టిగా నిలదీస్తుందన్నారు. యువత భవిష్యత్తో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆయన మండిపడ్డారు. బెదిరింపులను అడ్డుకోవడానికి అండగా ఉంటామని.. అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని సజ్జల డిమాండ్ చేశారు.‘‘డీఎస్సీలో కుట్ర పూరితంగా వ్యవహరించారు. విద్యాశాఖ మంత్రి తప్పు ఒప్పుకుని సీబీఐ విచారణ జరిపించాలి. డీఎస్సీ రాసి క్వాలిఫై అయితేనే ఉద్యోగం ఇవ్వాలి. డీఎస్సీ అభ్యర్థుల పోరాటంలో న్యాయ సహాయం అందిస్తాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
డీఎస్సీ.. మంత్రులు సమాధానం చెప్పలేరా: పర్వతనేని
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ స్థాయిలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. అక్రమాలపై ప్రతిపక్షంగా తాము నిరంతరం పోరాడుతున్నామని, అయితే ప్రభుత్వం, మంత్రులు.. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అధికారులను ముందుకు నెడుతున్నారని విమర్శించారు. అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ తాడేపల్లిలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఏపీలో డీఎస్సీ పరీక్ష రాసిన 3.50 లక్షల మంది అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం, మంత్రులు ఎందుకు సమాధానం చెప్పడం లేదు. అధికారులను ఎందుకు ముందు పెడుతున్నారు. డీఎస్సీ నిర్వహణపై మంత్రులు కాకుండా అధికారులు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఎస్సీఈఆర్టీ (SCERT)లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి సోషల్ స్టడీస్ విభాగంలో ఫస్ట్ ర్యాంకు రావడం, అలాగే టీజీటీ తెలుగులో ఆరో ర్యాంకు సాధించడం అనేక అనుమానాలకు కారణమైంది.ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియలో నవీన్ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నవీన్ ద్వారానే అనేక మందికి ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఈ అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అధికారుల నుంచి సరైన స్పందన లేదు. ఈవిషయం కోర్టులో ఉంది, చెప్పలేం అంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ దాటవేత ధోరణి ఉంది. ఆయన ఎప్పుడూ స్పోర్ట్స్ డీఎస్సీ గురించి మాట్లాడ్డానికి ఇష్టపడడం లేదు. ఫలితాలు మొత్తం ప్రక్రియను పాఠశాల విద్యాశాఖే విడుదల చేసింది. పరీక్ష నిర్వహణలోనే అనేక అవకతవకలు జరిగాయి. రిజర్వేషన్ల ఉల్లంఘన వల్ల వేలాది మంది అర్హులైన అభ్యర్థులు నష్టపోయారు. సీబీఎస్ఈ, నవోదయ ఇంగ్లిషు మీడియం విద్యార్థులను డీఎస్సీకి దూరం పెట్టడం అన్యాయం.టెట్ రాసినా కూడా వేలాది మంది ఇంగ్లిషు మీడియం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనే నార్మలైజేషన్ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు. జిల్లా స్థాయి పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం నార్మలైజేషన్ ప్రక్రియను ఎందుకు తెచ్చింది?. నార్మలైజేషన్ పేరుతో నచ్చిన సెషన్స్లో 7, 8 మార్కులు కలిపి అక్రమాలకు పాల్పడ్డారు. రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు కుమ్మక్కై నిరుద్యోగుల పొట్టకొట్టారు. సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులను మానసికంగా వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వ సోషల్ మీడియా వింగ్ నిరుద్యోగులపై రకరకాల ముద్రలు వేస్తూ అవమానిస్తోంది. కష్టపడి చదువుకున్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మానసిక వ్యధకు గురిచేస్తున్నారు. -
మెగా డీఎస్సీ పేరుతో 'మెగా స్కామ్'
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం పెట్టిన మెగా డీఎస్సీ–2025 మోసం, దగా, స్కామ్ డీఎస్సీగా మారిందంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఈనెల 11న ఆయన మీడియా సమావేశం ద్వారా సాక్ష్యాధారాలతో సహా ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ మెగా స్కామ్ జరిగిన తీరుకు ఆధారాలు జత చేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శనివారం పోస్టు చేశారు. ఈ మెగా స్కామ్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హస్తం ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన మెగా డీఎస్సీ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారుల ముసుగు తొలగాలంటే స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతుండటాన్ని వైఎస్ జగన్ ఆ పోస్టులో ప్రస్తావించారు. లక్షలాది మంది ప్రతిభావంతులైన అభ్యర్థుల జీవితాలతో సీఎం చంద్రబాబు, ఆయన సుపుత్రుడు నారా లోకేశ్ చెలగాటమాడిన తీరును కళ్లకు కట్టినట్లు వివరిస్తూ చేసిన పోస్టు సంచలనం రేపింది. ఈ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. ప్రతిభావంతుల జీవితాలతో చెలగాటం‘మెగా డీఎస్సీ పేరుతో సీఎం చంద్రబాబు, ఆయన సుపుత్రుడు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్.. ప్రతిభావంతులైన అభ్యర్థుల జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తూ, అత్యంత చాకచక్యంగా మెగా స్కామ్కు తెర తీసి.. చీకటి దందాకు పాల్పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ అవకతవకలు, మోసాల వల్ల నేడు లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆవేదనతో కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంతటి దారుణమైన నియామక ప్రక్రియను ఎన్నడూ చూడలేదు. 16,000 డీఎస్సీ పోస్టుల నియామక ప్రక్రియలో పారదర్శకతను పూర్తిగా తుంగలో తొక్కారు. డీఎస్సీ నియామకాలను డబ్బులు గుంజే కుంభకోణంగా మార్చాలన్న దుర్బుద్ధితో అత్యంత పకడ్బందీగా, సంస్థాగతంగా తనిఖీ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇంతటి దారుణమైన అక్రమాలు, అవతవకలు చోటుచేసుకున్న నియామక ప్రక్రియ గతంలో ఎన్నడూ జరగలేదు. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక డీఎస్సీ. నారా లోకేశ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విద్యా శాఖ నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలు, అవినీతి అత్యంత తీవ్రంగా ఖండించదగినవి. ఈ కుంభకోణంపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అనేక పర్వాలు (మల్టీ లేయర్)గా సాగిన ఈ మెగా స్కామ్లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..వ్యవస్థల ధ్వంసం.. కుట్రకు తొలి అడుగు!డీఎస్సీ నిర్వహణలో దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. పరీక్షల గోప్యతను కాపాడటం కోసం గతంలో ప్రశ్నపత్రాల తయారీని ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్)కి, పరీక్ష నిర్వహణ బాధ్యతను డీఎస్సీ కన్వీనర్కు వేర్వేరుగా అప్పగించేవారు. కానీ.. ఈ ప్రక్రియను పూర్తిగా అపహాస్యం చేస్తూ డీఎస్సీ కన్వీనర్ను పక్కనబెట్టారు. ఈ రెండు కీలక బాధ్యతలను ఒకే వ్యక్తికి.. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే కట్టబెట్టారు. తద్వారా పారదర్శకతను ఉద్దేశ పూర్వకంగా దెబ్బతీసి, అక్రమాలకు దారి సుగమం చేస్తూ ఈ మెగా స్కామ్కు తొలి అడుగు వేశారు.అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు బాధ్యతలు.. పేపర్ లీక్పరిస్థితిని మరింత దిగజారుస్తూ, అత్యంత రహస్యంగా ఉంచాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, ఆన్లైన్లో అప్లోడ్ చేసే బాధ్యతలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు. ఒకవేళ వ్యవహారం బయటపడితే వారిని బలిపశువులను చేయవచ్చనే ఉద్దేశంతోనే ఇలా చేశారు. ఈ అక్రమాలకు పరాకాష్టగా ప్రశ్నపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే బాధ్యతలో భాగస్వామిగా ఉన్న ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగే ఈ డీఎస్సీ పరీక్షలో ఏకంగా మొదటి ర్యాంక్ సాధించడం గమనార్హం. ఇది పేపర్ లీక్ కుంభకోణానికి ప్రత్యక్ష నిదర్శనం కాదా? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలు వ్యవస్థ ఎంత బలహీన పడిందో స్పష్టం చేస్తున్నాయి. మొదటి ర్యాంక్ సాధించినప్పటికీ ఆ వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? మెరిట్ జాబితా నుండి అతడి ఐడీ, డేటాను ఎందుకు రాత్రికి రాత్రే తొలగించారు? సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు అతడిని ఎందుకు పిలవలేదు? ఆ బాధితుడు కోర్టును ఆశ్రయించడానికి ఇవే కారణాలు కాదా? ఎస్సీఈఆర్టీలో ఉంటూ ప్రశ్నపత్రాలను అప్లోడ్ చేసే ప్రక్రియలో పాలుపంచుకున్న వ్యక్తికి టాప్ ర్యాంక్ రావడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, పేపర్ లీక్ లోతును వెలికి తీయాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గం.ఫలితాల ప్రకటనలో లోపించిన పారదర్శకతడీఎస్సీ ఫలితాల ప్రకటనలో పారదర్శకత పూర్తిగా మృగ్యమైంది. గతంలో మెరిట్, రోస్టర్ జాబితాలను కలెక్టరేట్ నోటీస్ బోర్డులపై ఉంచే సంప్రదాయం ఉండేది. దాన్ని పక్కనబెట్టి, కేవలం ఆన్లైన్ డిస్ప్లే, మొబైల్ మెసేజ్లకే పరిమితం చేస్తూ కేంద్రీకరించారు. దీనివల్ల అభ్యర్థులు తీవ్ర అనిశ్చితికి లోనై, తమ ఫిర్యాదులు చెప్పుకోవడానికి కలెక్టరేట్ల చుట్టూ, హెడ్ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చింది. అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటంటే.. 1ః1 నిష్పత్తిలో కాల్ లెటర్లు అందుకుని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న పలువురు అభ్యర్థుల పేర్లు తుది ఎంపిక జాబితా నుంచి మాయమయ్యాయి. ‘స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ రూల్స్ 2025’ లోని రూల్ 20ని కచ్చితంగా పాటిస్తే.. మార్కులు, కటాఫ్, స్పోర్ట్స్, వికలాంగుల కోటా వంటి అన్ని హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకున్నాక, వెరిఫికేషన్ పూర్తయిన ప్రతి ఒక్కరికీ తుది జాబితాలో చోటు దక్కాలి. కానీ, అర్హులైన ఎంతో మంది అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది.సీబీఐ దర్యాప్తే శరణ్యంలక్షలాది మంది నిరుద్యోగుల ఆశలను, కలలను కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా సమాధి చేసింది. ఈ కుంభకోణం వెనుక ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వంటి అత్యున్నత స్థానాల్లో ఉన్న పెద్దల హస్తం ఉంది. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు వారి పరిధిలోనే పనిచేస్తాయి కాబట్టి, వారు నిజాలు నిగ్గు తేల్చలేరు. అందుకే, బాధితులకు న్యాయం జరగాలన్నా, ఈ మెగా స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల ముసుగు తొలగాలన్నా స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతోనే సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.స్పోర్ట్స్ కోటా మళ్లింపు.. దొడ్డిదారి నియామకాలకు బ్లూప్రింట్!ఈ కుంభకోణంలో అత్యంత వివాదాస్పదమైనది స్పోర్ట్స్ కోటా వ్యవహారమే. నియామక ప్రక్రియలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీలుగా జీవోలను మార్చేసిన తీరు క్రీడాలోకాన్ని విస్మయానికి గురి చేసింది. 2012 నాటి జీవో నంబర్ 74 ప్రకారం క్రీడాకారులు కూడా పరీక్ష రాసి అర్హత సాధించాలనే నిబంధన ఉండేది. కానీ, చంద్రబాబు, లోకేశ్ ద్వయం ఈ నిబంధనను తొలగిస్తూ 2024 డిసెంబర్లో కొత్తగా జీవో నంబర్ 8, జీవో నంబర్ 4, 47లను తీసుకొచ్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు డీఎస్సీ రాత పరీక్ష నుంచే మినహాయింపు ఇచ్చారు. అంటే, తమకు కావాల్సిన వారిని దొడ్డిదారిలో (బ్యాక్ డోర్ ఎంట్రీ) చొప్పించడానికి ముందే ఒక పక్కా బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నారు. తీరా అనుకున్న విధంగా రాత పరీక్ష లేకుండా నియామకాలు పూర్తి కాగానే.. మళ్లీ పాత పద్ధతిని పునరుద్ధరిస్తూ జీవో నంబర్ 23, 25, 56లను జారీ చేశారు. క్రీడాకారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, ఇబ్బందులు ఎదురయ్యాయని సాకులు చెబుతూ.. పని పూర్తయ్యాక దొడ్డి దారిని మూసి వేయడం వీరి కపట నీతికి అద్దం పడుతోంది. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ‘ఉపాధ్యాయ పోస్టు బేరసారాల’ వీడియోపై అధికారులు నామమాత్రంగా స్పందించారు. నిందితుడి ఫోన్ నంబర్ స్పష్టంగా తెలిసినప్పటికీ, ఎఫ్ఐఆర్లో పేరు కూడా చేర్చకుండా, కేవలం స్టేషన్ బెయిల్పై వదిలేయడం వెనుక ఉన్న హస్తమెవరిదో అర్థమవుతూనే ఉంది. -
15 లక్షలు ఇస్తే జాబ్ మీ చెల్లికే.. సంచలన ఆడియోతో బయటపడ్డ లోకేష్ బండారం
-
DSC పేపర్ లీక్కు ఇదే సాక్ష్యం..ఆధారాలతో బయటపెట్టిన YS జగన్
-
వైఎస్ జగన్ సంచలన ట్వీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఏపీ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా డీఎస్సీ రిక్రూట్మెంట్ను అభివర్ణిస్తూ కూటమి ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు, నారా లోకేశ్లు కలిసి ఓ మెగా స్కామ్కు రూపకల్పన చేసిన పాలసీ ప్రాజెక్ట్ అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. అలాగే.. ఈ వ్యవహారంపై థర్డ్ పార్టీ ఏజెన్సీతోనే విచారణ జరిపించాలంటూ ఆయన డిమాండ్ చేశారు.వైఎస్ జగన్ ఎక్స్లో ఇలా ట్వీట్ చేశారు.. ఏపీలో 16,000 టీచర్ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకతను కాపాడే పాత వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసింది. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ వంటి కీలక బాధ్యతలను వేర్వేరు విభాగాల నుంచి తొలగించి, SCERT డైరెక్టర్కు కేంద్రీకరించడం ద్వారా ఒకే చోట అధికారం కేంద్రీకృతమైంది. దీని వల్ల అక్రమాలకు దారి తీసింది.అలాగే, అత్యంత గోప్యంగా ఉండాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, అప్లోడ్ పనులను ఔట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగించడం తీవ్రమైన లోపమని జగన్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి అదే పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించడం “పేపర్ లీక్కు స్పష్టమైన సంకేతం” అని ఆయన ప్రస్తావించారు. ఆ వ్యక్తికి తరువాత ఉద్యోగం ఇవ్వకపోవడం, అతని వివరాలను మెరిట్ లిస్టు నుంచి తొలగించడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు.మరోవైపు ఫలితాల ప్రకటనలో కూడా పారదర్శకత లేకపోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా కలెక్టర్ కార్యాలయాల్లో మెరిట్ లిస్టులు ప్రదర్శించకుండా, కేవలం ఆన్లైన్లో మాత్రమే ప్రకటించడం వల్ల అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ తుది జాబితాలో పేర్లు లేకపోవడం “వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం” అని వ్యాఖ్యానించారు.క్రీడా కోటా నియామకాల విషయంలో కూడా పెద్ద మార్పులు చేసి, పరీక్ష రాయకుండానే నియామకాలు జరిపేలా విధానాలను మార్చారని, తరువాత ఆ విధానాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం ద్వారా “బ్యాక్డోర్ ఎంట్రీకి దారి తీసిన విధాన ప్రయోగం” జరిగిందని జగన్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే.. వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. టీచర్ పోస్టు కోసం జరిగిన బేరసారాల వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోపై కేవలం టోకెన్ కేసు నమోదు చేసి, సరైన దర్యాప్తు జరిపించలేదని జగన్ పేర్కొన్నారు.ఈ మొత్తం డీఎస్సీ ప్రక్రియను “దశలవారీగా జరిగిన బడా స్కామ్”గా అభివర్ణించిన వైఎస్ జగన్.. ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకతను కోల్పోయిందని అన్నారు. రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నందున నిజాలు వెలికితీయడానికి స్వతంత్ర సంస్థ అయిన సీబీఐ విచారణ తప్పనిసరి అని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ అంశాల్నే ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం.The so-called 'Mega' DSC was a carefully engineered policy sketch for a 'Mega' scam, a dark operation by CM Chandrababu and his son Nara Lokesh as Minister-in-charge, grievously damaging the lives of meritorious aspirants. Lakhs of aspirants are in anguish today, shedding tears… pic.twitter.com/8yZ6jvhPwb— YS Jagan Mohan Reddy (@ysjagan) June 13, 2026 -
DSC స్కామ్ లో లోకేష్ అడ్డంగా ఇరుక్కుపోయాడు.. బాబులో టెన్షన్..
-
సెకండ్ ర్యాంక్ వచ్చిన నాకు కాకుండా.. 5వ ర్యాంక్ వచ్చిన అమ్మాయికి ఎలా వచ్చింది?
-
దగా ‘డీఎస్సీ’.. ‘మెగా’ స్కామ్!. చంద్రబాబు సర్కారుపై మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు
-
దగా డీఎస్సీ.. మెగా స్కామ్
ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ.. రెండు బాధ్యతలు కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే అప్పగించారు. స్కామ్కు ఇక్కడే మొట్టమొదటిగా బీజం పడింది. ఎంతో రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ బాధ్యతలను అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదు. ఈ విషయం తెలిసి కూడా.. అవసరమైతే నేరాన్ని వారిపై నెట్టి వేయవచ్చనే ముందస్తు వ్యూహంతోనే, గోప్యంగా జరగాల్సిన ప్రక్రియను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు.కీలక బాధ్యతను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వడం.. అతడికి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత పోస్టు ఇవ్వకపోవడం... అతడి వివరాలను మాయం చేయడం..! ఇవన్నీ గోల్మాల్ కాక మరేంటి? దీనం తటికి అర్థం పేపర్ లీక్ అయిందని మీరు అంగీకరించినట్లే కదా? ఈ లీక్ ఇంకా ఎంత లోతుల్లోకి వెళ్లింది? ఎంత మందికి లీక్ అయిన పేపర్ చేరింది? దీన్ని పొందిన వాళ్లు ఎంతమంది పరీక్షలు రాశారు? వీటన్నింటికీ సమాధానం రావాల్సి ఉంది.గతంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. ప్రస్తుత డీఎస్సీలో కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్ లిస్టులు లేవు.. మార్కులు, ర్యాంకులు, కటాఫ్లు ప్రదర్శించలేదు.. పబ్లిక్గా డిస్ప్లేలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపించే కొత్త పద్ధతి తీసుకు వచ్చారు. అసలు పారదర్శకత అనేది ఎక్కడ ఉంది?ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1 : 1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. దీని ప్రకారం సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలితే అభ్యర్థికి ఉద్యోగం వచ్చినట్టే. ఇలా వెరిఫికేషన్కు పిలిచి సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నాయని రుజువైనా ఉద్యోగం ఇవ్వలేదు. పైగా వారిని రిజెక్ట్ లిస్ట్లో కూడా చూపలేదు. దీనిపై ప్రశ్నిస్తే ‘సర్దుబాటు’ అంటున్నారు. ఎవరి కోసం ఈ ‘సర్దుబాటు?’ అంటే సమాధానం లేదు.పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తి.. అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు దక్కించుకోవడం అతి పెద్ద స్కామ్కు ప్రత్యక్ష సాక్ష్యం కాదా? ఇది లీక్ కాదా? ఈ లీక్ ఇంకా ఎక్కడి వరకూ వెళ్లిందో? దీనిపై సీబీఐ విచారణ వద్దా? ఆ వ్యక్తి (నవీన్) నిజంగానే మెరిట్తో ర్యాంక్ సాధించి ఉంటే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? దీని అర్థం.. తప్పు జరిగిందనేగా?ఈ రాష్ట్రంలో.. చంద్రబాబే పోలీసు.. ఆయనే లాయరు..! ఆయనే ఆదేశాలు ఇస్తారు.. ఆయనే పర్యవేక్షిస్తారు..! అధికారంలో ఉన్నది ఆయనే. పైగా ఆయన కుమారుడే విద్యా శాఖ మంత్రి. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది? విచారణ నిజాయితీగా జరిగే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? నిష్పక్షపాతంగా విచారణ జరిగి నిజాలు వెలుగు చూడాలంటే థర్డ్ పార్టీ విచారణ జరగాలి. అందుకే సీబీఐతో విచారణకు డిమాండ్ చేస్తున్నాం..చంద్రబాబు రాజకీయ జీవితం.. గత రెండేళ్ల పాలన.. సూపర్ సిక్స్లు.. మేనిఫెస్టో హామీలు.. టీచర్ పోస్టుల భర్తీ.. ఇలా దేన్ని చూసినా మోసం, దగా, స్కామ్లే కనిపిస్తాయి...!– వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం పెట్టిన ‘మెగా డీఎస్సీ 2025’.. మోసం, దగా, స్కామ్గా మారిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. డీఎస్సీ నిర్వహణకు సంబంధించి ప్రతి దశలోనూ అవకతవకలే కనిపిస్తున్నాయని, లక్షల మంది అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్కామ్కు పాల్పడ్డారని, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారని.. ఇంత ఘోరంగా నియామక ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా? అంటూ నిప్పులు చెరిగారు. డీఎస్సీ ప్రక్రియలో తప్పులను ఎత్తి చూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తోందని ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కామ్.. అసలు పరీక్షే లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి? కేవలం పార్టిసిపేట్ చేస్తే చాలంటారా? ఆ సర్టిఫికెట్లు ఇచ్చేదీ మీరే.. ధ్రువీకరించేది కూడా మీరే..! అని మండిపడ్డారు. కొత్తగా జీవో నంబర్ 4, జీవో 47 ఎందుకు ఇచ్చారు..? మీ పని పూర్తయ్యాక మళ్లీ ఆ జీవోలు ఎందుకు మార్చారు? మెరిట్ లిస్టులు ఎందుకు డిస్ప్లే చేయలేదు? అని సూటిగా ప్రశ్నించారు. మెగా డీఎస్సీ స్కామ్పై సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ కింద చేపట్టిన 16 వేల టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను గమనిస్తే ఎంతో మంది అభ్యర్థులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ప్రభుత్వం చేసిన గోల్మాల్తో ఎంతోమంది కన్నీళ్లు పెడుతున్నారు. ప్రభుత్వం అంటే ఓ భరోసా. అలాంటిది ఆ భరోసా పోయిన పరిస్థితుల్లో మన జెన్జీ పిల్లలు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారు..’ అని చంద్రబాబు సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మెగా డీఎస్సీలో అవకతవకలను వైఎస్ జగన్ బట్టబయలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారు..డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా చేపట్టే టీచర్ ఉద్యోగాల భర్తీలో కొన్ని లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. అంత కీలకమైన డీఎస్సీ పరీక్షలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన విధానం తీవ్ర విస్మయానికి గురి చేస్తోంది. లక్షల మంది అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్కామ్కు పాల్పడ్డారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారు. ఇంత ఘోరంగా నియామక ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా? సాక్షాత్తూ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇద్దరూ కలిసి ఎంతో దారుణానికి ఒడిగట్టారు. అబద్ధం.. మోసం.. వెన్నుపోటు.. దగా.. స్కామ్కు చొక్కా, ఫ్యాంట్ తగిలిస్తే చంద్రబాబే కనిపిస్తారు. ఆయన రాజకీయ జీవితం, గత రెండేళ్ల పాలన, సూపర్ సిక్స్లు, మేనిఫెస్టో ద్వారా ఇచ్చిన హామీలు, టీచర్ పోస్టుల భర్తీ.. ఇలా దేన్ని చూసినా మోసం, దగా, స్కామ్లే కనిపిస్తాయి. అధికారం చేపట్టగానే చంద్రబాబు ఐదు సంతకాలు చేశారు. అందులో మెగా డీఎస్సీ అనేది తొలి సంతకం. వాస్తవానికి మెగా డీఎస్సీలోని 6,100 పోస్టులు గతంలో మేం ఇచ్చిన నోటిఫికేషన్లోనివే. మేమిచ్చిన ఆ నోటిఫికేషన్ను రద్దు చేసి నియామక ప్రక్రియను ఆలస్యం చేశారు. ఆ 6,100 పోస్టులతో కలిపి 16 వేల పోస్టులకు చంద్రబాబు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో లీకులు, అక్రమాలు, స్కామ్లు, అవకతవకలు చూస్తున్నాం. పేపర్ లీక్ దాచేందుకు చెవిలో పూలు..!కీలక బాధ్యతను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వడం.. అతడికి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత పోస్టు ఇవ్వకపోవడం... అతడి వివరాలను మాయం చేయడం..! ఇవన్నీ గోల్మాల్ కాక మరేంటి? దీనంతటికి అర్థం పేపర్ లీక్ అయిందని మీరు అంగీకరించినట్లే కదా? ఈ లీక్ ఇంకా ఎంత లోతుల్లోకి వెళ్లింది? ఎంత మందికి లీక్ అయిన పేపర్ చేరింది? దీన్ని పొందిన వాళ్లు ఎంతమంది పరీక్షలు రాశారు? వీటన్నింటికీ సమాధానం రావాల్సి ఉంది. అభ్యర్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న కారణాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ‘ఫస్ట్ ర్యాంకు సాధించిన వ్యక్తి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాలేదు. కాబట్టే పోస్టు ఇవ్వలేదు..’ అని సమర్థించుకుంటున్నారు. మెరిట్ లిస్టులో పేరు తీసేసి, అభ్యర్థి డేటాను మాయం చేసి, కాల్లెటర్ ఇవ్వనప్పుడు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఎలా వస్తాడు? మీరు చెప్పేవి కాకమ్మ కబుర్లు కావా? ఆ వ్యక్తి (నవీన్) కోర్టులో వేసిన అఫిడవిట్ చూస్తే మీ కాకమ్మ కబుర్లన్నీ బయటపడతాయి. పేపర్ లీక్లు దాచిపెట్టడానికి చెవిలో పూలు పెడుతూ నానా తంటాలు పడుతున్నారు. అవన్నీ తేలాలంటే సీబీఐతో విచారణ చేపట్టాలి..పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది? ఎంతమందికి లీక్ వెళ్లింది? ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవన్నీ తేలాలి. అందుకే సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికి కారణం.. ఈ రాష్ట్రంలో చంద్రబాబే పోలీసు, ఆయనే లాయరు, ఆయనే ఆదేశాలు ఇస్తారు. ఆయనే పర్యవేక్షిస్తారు. అధికారంలో ఉన్నది ఆయనే. పైగా ఆయన కుమారుడే విద్యా శాఖ మంత్రి. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది? మరి విచారణ నిజాయితీగా జరిగే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? నిష్పక్షపాతంగా విచారణ జరిగి నిజాలు వెలుగు చూడాలంటే «థర్డ్ పార్టీ విచారణ జరగాలి. అప్పుడే రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం కలుగుతుంది.స్కామ్ల కంపు కనిపించడం లేదా? ఉద్యోగాలకు సంబంధించి ఏ పోటీ పరీక్ష ఫలితాలనైనా తీసుకోండి. ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ పరీక్షలను పరిశీలిస్తే పారదర్శకంగా మెరిట్ జాబితాలు ప్రకటిస్తారు. యూపీఎస్సీ సహా ఎక్కడైనా సరే అదే విధానం అవలంభిస్తారు. కానీ చంద్రబాబు డీఎస్సీ దీనికి పూర్తిగా విరుద్ధంగా సాగింది. గతంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. ప్రస్తుత డీఎస్సీలో కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్ లిస్టులు లేవు.. మార్కులు, ర్యాంకులు, కటాఫ్లు ప్రదర్శించలేదు.. పబ్లిక్గా డిస్ప్లేలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపించే కొత్త పద్ధతి తీసుకు వచ్చారు. అసలు పారదర్శకత అనేది ఎక్కడ ఉంది? ఇందులో స్కామ్ల కంపు కనిపించడం లేదా? ఆన్లైన్ పేరిట మొత్తం ప్రక్రియను దాదాపుగా కేంద్రీకృతం చేశారు. ఇలా ఎందుకు చేశారు? దీనికి కారణం.. మీ ఉద్దేశాలు వేరే కాబట్టే కదా! సమస్యలు ఎదుర్కొన్న అభ్యర్థులు కలెక్టరేట్కు వెళితే పైకి వెళ్లండని సమాధానం చెప్పారు. అష్టకష్టాలు పడి వాళ్లు వస్తే.. మాకు సంబంధం లేదు.. కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లమని చెప్పారు. ఇలా ఎంతో మంది అభ్యర్థులు అవస్థలు పడ్డారు. పారదర్శకంగా జాబితాలు ప్రకటించకుండా అభ్యర్థులను ఎంపిక చేసి వారికి మెసేజ్లు పంపారు. ఎవరికి మేలు చేయడానికి ఈ సర్దుబాటు?ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1 : 1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. దీని ప్రకారం సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలితే అభ్యర్థికి ఉద్యోగం వచ్చినట్టే. డీఎస్సీ నిబంధనలు కూడా అవే చెబుతున్నాయి. అన్ని నిబంధనలు, జీవోలను పరిగణనలోకి తీసుకుని డీఎస్సీ కమిటీ మెరిట్, రోస్టర్ను సిద్ధం చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని రూల్ నంబర్ 20 చెబుతోంది. ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకుని కాల్ లెటర్ పంపి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టారు. అంటే.. అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయి? వారు ఓపెన్లోకి వస్తారా? లేక రిజర్వేషన్లోకి వస్తారా? వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్.. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్, స్పోర్ట్స్, ఎక్స్సర్వీస్ మెన్ ఇలా వివిధ కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ముందుగానే మీకు తెలుసు. అందుకే 1 : 1 పద్ధతిలో పిలిచారు. కానీ ఇలా వెరిఫికేషన్కు పిలిచి సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నాయని రుజువైన వారికి ఉద్యోగం ఇవ్వలేదు. పైగా వారిని రిజెక్ట్ లిస్ట్లో కూడా చూపలేదు. దాని అర్థం ఏమిటి? ఎవరి కోసం వీరికి అన్యాయం చేశారు? ఇది దగా, మోసం, దోపిడీ, స్కామ్ కాదా? ఇప్పుడేమో కాల్లెటర్ జారీ చేస్తే ఉద్యోగం వచ్చినట్లు కాదని అంటున్నారు. మరి 1:1 పద్ధతికి అర్థమేమిటి? మీరు పిలిచింది 1:5 లేదా 1:3 అయితే మీరు చెప్పిన వాదన కరెక్టు. 1:1 పద్ధతిలో పిలిచి అన్నీ సక్రమంగా ఉన్నా కూడా సర్దుబాట్లు చేశారంటే ఎవరి కోసం చేశారు?ముందస్తు వ్యూహంతోనే గోప్యతకు తూట్లు..ఏ పరీక్షకైనా ప్రశ్నాపత్రం తయారీ, ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ.. ఇవన్నీ కూడా అత్యంత గోప్యంగా (కాన్ఫిడెన్షియల్) జరగాలి. కానీ ఈ ప్రభుత్వంలో గోప్యతకు పూర్తిగా తూట్లు పొడిచారు. డీఎస్సీ ప్రశ్నాపత్రాలను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) రూపొందిస్తుంది. పరీక్ష నిర్వహణ బాధ్యతను డీఎస్సీ కన్వీనర్ చూస్తారు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో డీఎస్సీ కన్వీనర్ను పక్కన పెట్టేశారు. ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ.. రెండు బాధ్యతలు కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే అప్పగించారు. స్కామ్కు ఇక్కడే మొట్టమొదటిగా బీజం పడింది. ఎంతో రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ చేసే బాధ్యతలను అవుట్సోర్స్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదు. ఈ విషయం తెలిసి కూడా.. అవసరమైతే నేరాన్ని వారిపై నెట్టి వేయవచ్చనే ముందస్తు వ్యూహంతోనే, గోప్యంగా జరగాల్సిన ప్రక్రియను అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు. ఇందులో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్.. కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్లో ఫస్ట్ ర్యాంకర్గా నిలిచాడు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) తెలుగు పరీక్షలో కూడా జోన్–2లో ఆరో ర్యాంక్ సాధించాడు. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు దక్కించుకోవడం అతి పెద్ద స్కామ్కు ప్రత్యక్ష సాక్ష్యం కాదా? ఇది లీక్ కాదా? ఈ లీక్ ఇంకా ఎక్కడి వరకూ వెళ్లిందో..! దీనిపై సీబీఐ విచారణ వద్దా? ఆ వ్యక్తి (నవీన్) నిజంగానే మెరిట్తో ర్యాంక్ సాధించి ఉంటే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఇది ఇంకొక మిస్టరీ. దీని అర్థం తప్పు జరిగిందనేగా? మరోవైపు అతడి లాగిన్ ఐడీ కనిపించకుండా, డేటాను ఎందుకు మాయం చేశారు? మెరిట్ లిస్టు నుంచి పేరు ఎందుకు తొలగించారు? కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? -
పరీక్ష లేకుండానే పోస్టులిచ్చేశాం
సాక్షి, అమరావతి : మెగా డీఎస్సీ–2025లో తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం పలాయనం చిత్తగించింది. వాస్తవాలు చెప్పాల్సిన విద్యాశాఖ, క్రీడా శాఖల మంత్రులు అధికారులతో ప్రెస్మీట్లు పెట్టించి తప్పుకున్నారు. దగా డీఎస్సీపై గత 20 రోజులుగా ఆధారాలతో సహా వస్తున్న వరుస కథనాలపై నేరుగా సమాధానం చెప్పకుండా చెప్పిన కథలనే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే రెండుసార్లు విలేకరుల సమావేశాలు నిర్వహించిన విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్, రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గురువారం సంయుక్తంగా మరోసారి మీడియా ముందుకొచ్చారు. నిజానికి స్పోర్ట్స్ డీఎస్సీలో పతకాలు సాధించిన వారికే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా, పోటీల్లో పాల్గొన్న వారికి ఇవ్వాల్సి వచ్చిందని, అది ప్రభుత్వ నిర్ణయం అని స్పష్టం చేశారు. పరీక్ష లేకుండా పోస్టులు ఇవ్వడం ప్రభుత్వం నిర్ణయం మేరకు జరిగిందని, క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో డీఎస్సీ లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. నియామక ప్రక్రియ ముగిశాక మళ్లీ తన నిర్ణయం మార్చుకుని స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించాలని జీవో ఇచ్చిందన్నారు. ఇది ప్రభుత్వ నిర్ణయమని, ఆ మేరకు తాము పని చేశామని వివరణ ఇచ్చారు. కీలక ఆరోపణలపై సమాధానం దాటవేత కృష్ణా జిల్లాకు చెందిన నవీన్ ఎస్సీఈఆర్టీలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తూ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో జిల్లా మొదటి ర్యాంకు, టీజీటీలో ఆరో ర్యాంకు ఎలా వచ్చిందనే అంశంపై అధికారులు సమాధానం దాటవేశారు. నవీన్ సర్టిఫికెట్ల పరిశీలనకు రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదని సమర్థించుకున్నారు. వాస్తవానికి నవీన్కు కాల్ లెటర్ రాకుండా అతడి లాగిన్ ఐడీని ప్రభుత్వం బ్లాక్ చేసింది. కాల్ లెటర్ లేకుండా ఎలా హాజరు కాగలడన్న ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం లేదు. డీఎస్సీ కన్వీనర్ను తొలగించి ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ను నియమించడం, ప్రశ్నావళిని రూపొందించే వారికే పగ్గాలు అప్పగించడాన్ని కూడా అధికారులు సమర్థించుకున్నారు. ఈ రెండు విభాగాలు విద్యా శాఖలోనే ఉండడంతో ఆ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. వాస్తవానికి పతకాలు సాధించిన క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా, ప్రభుత్వ పాలసీ మేరకు పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చిందని మరోమారు వెల్లడించారు. పరీక్ష లేకుండా పోస్టు.. ప్రభుత్వ పాలసీ స్పోర్ట్స్ డీఎస్సీలో దేశంలో ఎక్కడా జరగని రీతిలో అత్యంత నిర్భీతిగా అక్రమాలు జరిగాయి. పరీక్ష లేకుండా ఉపాధ్యాయ ఉద్యోగం ఎలా ఇస్తారన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదు. స్పోర్ట్స్ కోటా పోస్టులకు పరీక్ష లేకపోగా, అభ్యర్థుల అర్హతలు సైతం అస్తవ్యస్తంగా నిర్ణయించారు. కనీస అర్హత లేకపోయినా డిగ్రీ పొందేందుకు ఐదేళ్ల వరకు సమయం ఇచ్చారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే అది ప్రభుత్వ పాలసీగా చెప్పడం గమనార్హం. తమిళనాడులో పరీక్ష లేకుండానే ఉద్యోగాలు ఇస్తున్నారని, స్పోర్ట్స్కు ప్రోత్సాహం ఇచ్చేందుకు అర్హత లేకపోయినా ఉద్యోగంలోకి తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించడం విస్తుగొలుపుతోంది. మళ్లీ క్రీడా పాలసీ జీవో మార్చి.. ఇకపై పరీక్షలు ఉంటాయని ఎందుకు పెట్టారన్న అంశంపైనా సరైన సమాధానం రాలేదు. అది ప్రభుత్వ పాలసీ అని, తామేమీ చేయలేమన్నారు. అంతా పారదర్శకంగానే చేశామంటూ.. 1:1 నిష్పత్తి డైనమిక్ థింగ్ అని చెప్పుకొచ్చారు. హారిజాంటల్ రిజర్వేషన్ను అర్థం చేసుకోవడం కష్టమన్నారు. అన్ని రకాల రిజర్వేషన్లు పరిశీలించిన తర్వాతే 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్లు పంపినప్పుడు.. దానిని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారని అధికారులు చెప్పడం చూస్తుంటే ఉద్దేశ పూర్వకంగానే అక్రమాలను దాస్తున్నారని ఇట్టే తెలుస్తోంది. వాస్తవానికి మెరిట్లో ఉండి కాల్ లెటర్లు అందుకున్న అభ్యర్థుల్లో మొదటి విడత సర్టిఫికెట్ పరిశీలనకు తొలిరోజు హాజరైన వారే అధికంగా ఉన్నారు. వారంతా రిజర్వేషన్ పరిధిలో ఉన్నప్పటికీ, లేరని చెప్పడం విస్తుగొల్పుతోంది. -
రికార్డు అంటే మాదే..
సాక్షి, అమరావతి: అక్రమాలు, అవకతవకలతో డీఎస్సీ నియామక ప్రక్రియ చేపట్టి దాన్నే రికార్డుగా చంద్రబాబు సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటున్నారని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దునుమాడారు. మెగా డీఎస్సీ అని పేరుపెట్టి డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. అసలు రికార్డు అంటే ఏమిటో చరిత్ర తెరిచి చూస్తే అర్థం అవుతుందన్నారు. రాష్ట్ర, దేశ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా వైఎస్సార్సీపీ హయాంలో కేవలం నాలుగు నెలల వ్యవధిలో సచివాలయాల్లో కొత్తగా 1.30 లక్షల ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు. ఒక్క తప్పు, ఎలాంటి లోపం లేకుండా నియామక ప్రక్రియ చేపట్టి చరిత్ర సృష్టించామన్నారు.ఒకే నోటిఫికేషన్ ద్వారా..2019 మే 30న నేను సీఎంగా ప్రమాణం చేస్తే.. ఆ తర్వాత 50 రోజుల్లోనే అంటే జూలై 19న జీవో ఇచ్చాం. జూలై 25 నుంచి 27 మధ్య నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 27 నుంచి ఆగస్టు 10వరకూ అప్లికేషన్లు తీసుకున్నాం. సెప్టెంబరు 1 నుంచి 8 వరకూ పరీక్షలు నిర్వహించాం. 2,800 సెంటర్లలో 19 లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా ఒక్క తప్పు కూడా జరగలేదు. ఎలాంటి లోపం లేకుండా, అందరి విశ్వాసాన్ని నిలబెడుతూ 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాం. అక్టోబరు రెండో తేదీ గాంధీ జయంతి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేశాం.మే 30 నుంచి అక్టోబర్ రెండో తేదీ మధ్య నాలుగు నెలల్లో అత్యంత పారదర్శకంగా, ఒక్క తప్పు జరక్కుండా, ఎలాంటి లోపం లేకుండా ఒక చరిత్ర సృష్టించాం. ఆ ఉద్యోగాలు పొందిన వాళ్లంతా ఇవాళ ప్రజలకు గ్రామంలోనే, మన ఇంటికే సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర, దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒకే నోటిఫికేషన్ ద్వారా ఏకకాలంలో 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన చరిత్ర మాదే అని గర్వంగా చెబుతున్నాం. అసలు రికార్డు అంటే అదీ. గ్రామ స్వరాజ్యం, సుపరిపాలన లక్ష్యంగా ఉద్యోగాల చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం రాశాం. ఎవరూ బద్దలు కొట్టలేని ఓ రికార్డును సృష్టించాం. -
డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా అతిపెద్ద స్కామ్
స్పోర్ట్స్ కోటా అన్నది పెద్ద కుంభకోణం. నిజంగా కష్టపడ్డ క్రీడాకారులకు అన్యాయం జరిగింది. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లతో చంద్రబాబు, ఆయన కొడుకు ముందుగానే వేసిన ‘స్కామ్ల పాలసీ స్కెచ్’ ఇది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవ్వరూ డీఎస్సీ పరీక్ష, టెట్ రాయాల్సిన అవసరం లేకుండా, బ్యాక్ డోర్ ద్వారా వారిని లోపలికి తీసుకున్నారు. దీనికోసం కొత్త జీవోలు తెచ్చారు. అనుకున్న వారితో పోస్టులు నింపాక, మళ్లీ పాలసీ మార్చారు. స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కు పెంచి బ్యాక్ డోర్ ద్వారా లోపలికి తీసుకున్నారు. కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఆధారంగా.. అదీ పతకాలు లేకపోయినా పర్వాలేదు.. పాల్గొంటే చాలంటూ ఉద్యోగాలు ఇచ్చేలా నిబంధనను మార్చారు. ఇందుకోసం జీవోల జారీకి ముందుగానే వసూళ్ల కార్యక్రమం మొదలైపోయింది. కొన్ని పోస్టులకు అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికెట్ ఇవ్వొచ్చని మినహాయింపు ఇవ్వడం దారుణం. స్పోర్ట్స్లో ఆటగాళ్ల ప్రతిభను చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. బ్యాకప్ సర్టిఫికెట్స్ లేవు.. ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్స్లోనూ పోస్టులు ఇచ్చేశారు. ఆయా గేమ్స్లో పాల్లొన్నట్లు సర్టిఫికెట్స్ కూడా వాళ్లే ఇచ్చారు. ఇలా బాల్ బాడ్మింటన్లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్ బాల్లో 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి ఉద్యోగాలు వచ్చాయి.డీఎస్సీ స్కామ్కు సంబంధించి ఆధారాలు సహా ఫ్యాక్ట్స్, ఫిగర్స్ ఇంత క్రిస్టల్ క్లియర్గా కన్పిస్తున్నప్పుడు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పకపోగా, ఎదురుదాడి చేస్తూ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తోంది. పోలీసులు, అధికారులు వీళ్ల మనుషులే.. సీఎం కుమారుడు నారా లోకేశ్ విద్యా శాఖ మంత్రి. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విచారణలో న్యాయం ఎలా జరుగుతుంది? థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. సీబీఐతో విచారణ జరిపించాలి. ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అలాగని నిర్దాక్షిణ్యంగా నలిపేస్తే ఆటోమేటిక్గా కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. -వైఎస్ జగన్సాక్షి, అమరావతి : డీఎస్సీలో మోసపోయిన ప్రతి విద్యార్థి ఒక కాక్రోచ్ (బొద్దింక)గా మారి చంద్రబాబును కాటేస్తారని.. ఈ జెన్ జెడ్, జెన్ ఆల్ఫా కాలంలో విద్యార్థులను ఎవరూ నియంత్రించలేరని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై అన్నట్లు దగాపడ్డ యువత కాక్రోచ్లై బాబును కాటేయడం ఖాయమని నిప్పులు చెరిగారు. గురువారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్పోర్ట్స్ కోటా రూపంలో చంద్రబాబు సర్కారు డీఎస్సీలో భారీ స్కామ్ చేసిందని, దొడ్డిదారిన తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి జీవోల పేరిట స్కామ్కు స్కెచ్ వేశారని మండిపడ్డారు. డీఎస్సీ పరీక్ష రాయకుండానే, ఎటువంటి డిగ్రీ అర్హత లేకుండానే.. ఆటల్లో ఎటువంటి ప్రతిభ కనపర్చకుండానే మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లిష్, హిందీ టీచర్లుగా చంద్రబాబు సర్కారు వందలాది మందిని నియమించేసిందని ఎత్తి చూపారు. జిల్లా, కాలేజీ, విశ్వవిద్యాలయ స్థాయి పోటీల్లో పతకాలు గెలవకపోయినా కేవలం పాల్గొన్నారని వీళ్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు అధ్యక్షులుగా ఉన్న క్రీడా సంఘాల చేత సర్టిఫికెట్లు ఇప్పించి ఉద్యోగాలు ఇచ్చేశారని ఆధార సహితంగా వివరించారు. ఇందుకోసం జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లను తీసుకొచ్చిన చంద్రబాబు సర్కారు.. నియామక ప్రక్రియ పూర్తికాగానే వాటిని రద్దు చేసి, కొత్త జీవోలు తీసుకొచ్చిందని నిప్పులు చెరిగారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు పక్కా సాక్ష్యాలతో కనపడుతున్నా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రశ్నించిన వారిపై ఎదురు దాడికి దిగుతోందని, మొత్తం డీఎస్సీ నియామక ప్రక్రియపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో దగాపడ్డ అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వం దిగిరాకపోతే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమిషన్ వేసి మోసపోయిన విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..నిజమైన క్రీడాకారులకు అన్యాయం» ‘‘స్పోర్ట్స్ కోటా అన్నది ఇంకో పెద్ద కుంభకోణం. ప్రతిభ ఉన్న వారికే కాదు, నిజంగా కష్టపడ్డ క్రీడాకారుడికి కూడా అన్యాయం జరిగింది. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లతో చంద్రబాబు, ఆయన కొడుకు ముందుగానే వేసిన ‘స్కామ్ల పాలసీ స్కెచ్’ ఇది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవ్వరూ డీఎస్సీ పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా, ఒక బ్యాక్ డోర్ పెట్టి.. దాని ద్వారా వారిని లోపలికి తీసుకున్నారు. దీనికోసం కొత్త జీవోలు తెచ్చారు. పని అయిపోయాక, అనుకున్న వారితో నింపాక, మళ్లీ పాలసీ మార్చారు. తెచ్చిన జీవోలను తీసేశారు. » గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ రిక్రూట్మెంట్లోనైనా క్రీడాకారులకు 2% రిజర్వేషన్ ఉంది. అయితే ఆ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్లో మిగతా అభ్యర్థులతోపాటు వీరు కూడా ఎగ్జామ్స్ రాసి కచ్చితంగా క్వాలిఫై కావాలన్న నిబంధన ఉండేది. అలాంటి నిబంధనను చంద్రబాబు మొత్తం మార్చేశారు. » స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కు పెంచి బ్యాక్ డోర్ ద్వారా లోపలికి తీసుకువచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొత్త జీవోలు నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చారు. గతంలో జీవో నంబర్ 74 ప్రకారం డీఎస్సీ తప్పకుండా ఉత్తీర్ణత కావాలి. ఈ నిబంధనను రద్దు చేస్తూ స్పోర్ట్స్ కోటా రెండు శాతం నుంచి మూడు శాతానికి పెంచారు. డీఎస్సీ ఎగ్జామ్ రాత పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఆధారంగా ఇచ్చేలా నిబంధనను మార్చారు.» ఇంగ్లిష్, హిందీ, మాథ్స్, సోషల్ సైన్స్ సబ్జెక్టులకు డీఎస్సీ ఎగ్జామ్ రాయకుండానే ఉద్యోగాలిచ్చారు. ఇందుకోసం జీవోలు జారీకి ముందుగానే వారి దగ్గర నుంచి వసూళ్ల కార్యక్రమం మొదలైపోయింది. ఆ తర్వాత జీవోలు జారీ చేయడం మొదలు పెట్టారు. ఇంకా కొన్ని పోస్టులకు అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికెట్ ఇవ్వొచ్చని మినహాయింపు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన ఆటగాళ్ల ప్రతిభకు గౌరవం. దీన్ని ఉద్యోగాల దళారీ వ్యవస్థగా ఈ ప్రభుత్వం మార్చేసింది. డీఎస్సీ 2025 ప్రక్రియ ముగియగానే స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎత్తివేస్తూ ఆయా శాఖలు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని జారీ చేసిన జీవో నెం.23 క్రీడాకారుల పేరుతో చేస్తున్న స్కామ్స్పోర్ట్స్లో ఆటగాళ్ల ప్రతిభను చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. బ్యాకప్ సర్టిఫికెట్స్ లేవు.. ఎటువంటి పతకాలు, సర్టిఫికెట్స్ లేకుండా కేవలం ఆటల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్ ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చేశారు. ఆ స్పోర్ట్స్ కూడా ఏమిటంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ (అంతర్ జిల్లా), ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో పాల్గొంటే చాలు. అక్కడ కూడా మెడల్స్ అవసరం లేదు. కేవలం పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్స్తో పోస్టులు ఇచ్చేశారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆయా గేమ్స్లో పాల్లొన్నట్లు సర్టిఫికెట్స్ కూడా వాళ్లే ఇచ్చారు. బాల్ బాడ్మింటన్లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్బాల్లో 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి.. కేవలం ఆయా గేమ్స్లో పాల్గొన్నందుకే ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు టీడీపీ నేత, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్. జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్. అంటే వీళ్లే పాల్గొన్న వారికి సర్టిఫికెట్స్ ఇస్తారు.. వీళ్లే ధ్రువీకరిస్తారు. క్రీడల్లో పాల్గొంటే చాలు ఉద్యోగంవివిధ కాలేజీల మధ్య ఆటల పోటీల్లో పాల్గొన్నందుకు 99 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో పతకాలు, ట్రోఫీలు రాని 86 మందికి ఉద్యోగాలు ఇచ్చేశారు. వీళ్లకు పతకాలు రాలేదు, చెప్పకోదగ్గ టోర్నమెంట్లలో విజయాలు లేవు. జస్ట్ పార్టిసిపేట్ (పాల్గొన్నారు) చేశారంతే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన జాబితా చూస్తే.. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 37, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి 31, నాగార్జున యూనివర్సిటీ నుంచి 28, ఆది కవి నన్నయ యూనివర్సిటీ నుంచి 19, రాయలసీమ యూనివర్సిటీ నుంచి 15, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి 14, యోగి వేమన వర్సిటీ నుంచి 7, డాక్టర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నుంచి 4, సంస్కృత యూనివర్సిటీ నుంచి 2, మిగతా యూనివర్సిటీల నుంచి ఒక్కో సర్టిఫికెట్ ఉన్నాయి. ఇంటర్ కాలేజియేట్ పోటీల్లో.. అంటే వివిధ కాలేజీల మధ్య జరిగే పోటీల్లో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దక్కాయి. మెడల్స్, ట్రోఫీలు రాకపోయినా కేవలం పార్టిసిపేట్ చేసినందుకే 86 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలకు సంబంధించి 59 మందికి ఉద్యోగాలు వస్తే, అందులో పార్టిసిపేట్ చేసినందుకే 18 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. జిల్లా తరఫున ఆడితే చాలు.. గెలుపుతో సంబంధం లేకుండా, డీఎస్సీ పరీక్షలు రాయాల్సిన వసరం లేకుండా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు టీచర్ ఉద్యోగం ఇచ్చేశారు.నా పక్కనే ఉన్న (వైఎస్ జగన్ పక్కన కూర్చున్నారు) పోలవరానికి చెందిన గిరిజన క్రీడాకారుడు నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ అనిగి దుర్గయ్యకు ఉద్యోగం రాలేదు. 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్ వచ్చిన తర్వాత కూడా ఇవ్వలేదు. డేటా అప్లోడ్లో సిల్వర్ మెడల్ అని రాయడంతో ఇవ్వలేదంటున్నారు. గోల్డ్ మెడల్ వచ్చినవాడు ఎవడైనా సిల్వర్ మెడల్ అని రాస్తాడా? అయినా ఆటల్లో పాల్గొంటేనే ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు, ఇక్కడ ఏదో మెడల్ వచ్చినా ఎందుకు ఇవ్వలేదు? ఆయన 2002లో విశాఖ, హైదరాబాద్లో జరిగిన నేషనల్ గేమ్స్లో ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడలిస్ట్. తర్వాత సీనియర్స్ నేషనల్స్, జార్ఖండ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, యూత్ స్పోర్ట్స్ కలకత్తాలో మూడు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అయినా ఉద్యోగం ఇవ్వలేదు.అయినా ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీ ఆటల్లో పాల్గొంటేనే ఇస్తున్నావు కదా.. అదే జాతీయ స్థాయిలో పతకం సాధించినవాడికి ఎందుకు ఇవ్వలేదు? ఇదెక్కడి న్యాయం? నిజంగా ఇది కచ్చితమైన క్రీడాకారులకు జరిగిన అవమానం కాదా? ఇది క్రీడాకారుల పేరుతో చేస్తున్న స్కామ్ కాదా? ముందు తన వాళ్లకు ఉద్యోగాలు వచ్చే విధంగా జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చి గేట్లు తెరిచాడు. వాళ్ల వాళ్లకి ఉద్యోగాలు ఇచ్చేశాక జీవో నంబర్ 23, జీవో 25, జీవో 56లతో పాత జీవోలను రద్దు చేస్తూ గేట్లు మూసేశారు. ఇదిస్కాం కాకపోతే ఏమిటి స్వామీ?నీ బుద్ది పుట్టినప్పుడు జీవోలు ఇస్తున్నావు.. నీ బుద్ది పుట్టినట్లు జీవోలు రద్దు చేస్తున్నావు. ఇవి అంత మంచి జీవోలు అని నువ్వు అనుకున్నట్లయితే జీవో నంబర్ 4, జీవో నంబర్ 47ని ఎందుకు రద్దు చేశావు చంద్రబాబూ? సెలక్టయిన అభ్యర్థుల జాబితా పరిశీలిస్తే ఇంకో ఆశ్చర్చకరమైన విషయం కనిపిస్తోంది. ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీల్లో కేవలం పాల్గొన్నందుకు 270 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్లకు పతకాలు లేవు, చెప్పుకోదగ్గ టోర్నమెంట్స్లో పాల్గొనలేదు. కేవలం పార్టిసిపేట్ చేశారంతే.ఒక్కో ఉద్యోగానికి రూ.15–20 లక్షలు» స్పోర్ట్స్ కోటా పోస్టులను ఒక్కొక్కటి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు చేసినట్లు వీడియోలు కూడా బయటకు వచ్చాయి (ఆ వీడియో, ఆడియోను ప్రదర్శించారు). ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోను డీపీ (డిస్ప్లే పిక్చర్)గా పెట్టుకొని ఒక అభ్యర్థితో జరిగిన సంభాషణ కూడా బయట పడింది. విషయం బయటకు రాగానే నామమాత్రంగా కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్తో వదిలేశారు. » ఇవన్నీ చూస్తుంటే స్పోర్ట్స్ కోటా పేరుతో జరిగింది పారదర్శక నియామక ప్రక్రియ కాదు. ఇది ఒక వ్యవస్థీకృత స్కామ్ అని ప్రజలు భావిస్తున్నారు. ఆ కేసులో చేసిన విచారణ శూన్యం. ఏ విషయాలు కూడా బయటకు రాకుండా దాచిపెట్టారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ గమనించండి. వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు తల్చుకుంటే ఆ నంబర్ ఎవరిదో నిమిషాల్లో కనిపెట్టేస్తారు. కానీ, ఎఫ్ఐఆర్ కాపీలో ఆ నంబర్ ఎవరిదో చెప్పకుండా, పేరు కూడా తెలపకుండా అనుమానిత వ్యక్తి అని మాత్రమే రాశారు. ఆ అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి. దీంతో ఆ కేసు ప్రక్రియ కూడా చాలా ఆలస్యం చేశారు. » ఇలా ఎందుకు అయ్యిందంటే.. ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల ఆలస్యం అయ్యిందంట. దీని అర్థం ఈ వీడియో కాల్ ఆషామాషీది కాదని, అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి అని తేలిపోతుంది. స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాల భర్తీ వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మరో పక్క ఎమ్మెల్యేలు, ఎంపీలే డీల్ చేస్తున్నారు.. అది వేరే విషయం అనుకోండి. ఇంకా అన్నింటి కంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? బలమైన సెక్షన్లు పెట్టి గట్టిగా విచారణ చేయకుండా, కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఇది అన్నింటికంటే దారుణం. కోట్లాది కాక్రోచ్ల్లో నేనూ ఒకడినవుతా... కాక్రోచ్ పార్టీనా, ఇంకోటా అనేది పక్కన పెడితే.. వీళ్లంతా యువత. వీళ్లకు న్యాయం చేయకపోతే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. జెన్ జీ ఇందులో భాగమే. వారి ఆశలను నువ్వు నిర్దాక్షిణ్యంగా నలిపేస్తే ఆటోమేటిక్గా, కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో నేనూ ఒకడినవుతా.ఇది జెన్జెడ్ కాలం» చంద్రబాబూ.. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇది జెన్జెడ్, జెన్ ఆల్ఫా కాలం. దేన్నీ నువ్వు ఆపలేవు. నువ్వు ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై అన్నట్లు పెరుగుతుంది. దగాపడ్డ యువత నిన్ను విడిచిపెట్టదు. నీకు తగిన గుణపాఠం తప్పకుండా చెప్తారు. కాక్రోచెస్ లేస్తాయి. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేం సీబీఐ దర్యాప్తునకు పట్టుబడుతున్నాం. లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు తప్పకుండా బయటకు వస్తాయి. » విద్యా శాఖ మంత్రిగా సాక్షాత్తు చంద్రబాబు కొడుకు ఉన్నాడు కాబట్టి, ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు సరికదా, ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే వారం రోజుల క్రితం డీఎస్సీ అభ్యర్థులంతా నా వద్దకు వచ్చినప్పుడు వారికి ఒక్కటే చెప్పాను. వారి తరఫున న్యాయ పోరాటం చేస్తానని. ఒకవేళ అప్పటికీ కాకపోతే, మేం అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేసి, రీ వెరిఫై చేసి, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం అని చెప్పా. » రేపు (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నాం. దగాపడ్డ రైతులు, మహిళలు, నిరుద్యోగులు, పిల్లలు.. ఇలా దగాపడ్డ ప్రతి వర్గాన్ని కలుపుకొంటూ ప్రజల తరఫున నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయి. చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కామ్లను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతాం. దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతాం. » ఎవర్నీ వ్యక్తిగతంగా విమర్శించాలనో.. ఎవరినో ఎత్తిచూపాలనో కాదు. ప్రతి విషయంలో ఆధారాలతో సహా ఫ్యాక్ట్స్, ఫిగర్స్తో వివరించడం జరిగింది. ఇంత క్రిస్టల్ క్లియర్గా కన్పిస్తున్నప్పుడు సరైన సమాధానం చెప్పకపోగా, ఎదురుదాడి చేస్తూ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తే అది ఏరోజుకైనా దేవుడు, ప్రజలు హర్షించరు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు మొట్టికాయలు వేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఎంక్వైరీలో న్యాయం ఎలా జరుగుతుంది? పోలీసులు, అధికారులు వీళ్ల మనుషులే. సీఎం కుమారుడు నారా లోకేశ్ విద్యా శాఖ మంత్రి. అలాంటప్పుడు న్యాయం ఎలా జరుగుతుంది? థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. సీబీఐ లాంటి ఎంక్వైరీ సంస్థ దర్యాప్తుతోనే న్యాయం, ధర్మం జరుగుతుంది. -
డీఎస్సీలో ఆరోపణలపై బాబు సర్కార్ పలాయనం
సాక్షి, విజయవాడ: ఏపీ డీఎస్సీలో ఆరోపణలపై ప్రభుత్వం పలాయనం చిత్తగించింది.. అధికారులతో మంత్రులు ప్రెస్మీట్ పెట్టించారు. అయితే, నవీన్కి మొదటి ర్యాంక్పై సమాధానం దాటవేశారు. నవీన్.. సోషల్లో ఫస్ట్ ర్యాంక్, టీజీటీలో ఆరో ర్యాంక్ పొందగా.. వెరిఫికేషన్కి రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదని ప్రభుత్వం సమర్థించుకుంది. నవీన్ లాగిన్ బ్లాక్ చేసిన ప్రభుత్వం.. లాగిన్ బ్లాక్పై సమాధానం చెప్పలేదు. డీఎస్సీ కన్వీనర్, ఎస్సీఈఆర్ టి కన్వీనర్ ఒక్కరినే నియమించడంపై ప్రభుత్వం సమర్థించుకుంది.అన్ని విభాగాలు విద్యాశాఖ కమిషనర్ ఆధీనంలో ఉన్నాయంటూ కవరింగ్ ఇచ్చింది. స్పోర్ట్స్ కోటా పోస్టులకు పరీక్ష ఎందుకు పెట్టలేదంటూ మీడియా ప్రశ్నించింది. క్వాలిఫికేషన్ లేకుండా ఎలా అర్హత కల్పించారంటూ మీడియా నిలదీయగా.. అది పాలసీ నిర్ణయం అంటూ చంద్రబాబు సర్కార్ తప్పించుకుంది. తమిళనాడులో పరీక్ష లేకుండా ఇస్తున్నారంటూ సమర్థించుకుంది. స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం క్వాలిఫికేషన్ లేకపోయినా తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు.ఐదేళ్ల సమయం వాళ్లకి క్వాలిఫికేషన్ సాధించడానికి ఇచ్చామంటూ అధికారులు చెప్పుకొచ్చారు. మళ్లీ ఎందుకు పాలసీ మార్చారంటూ మీడియా ప్రశ్నించగా.. అది ప్రభుత్వం పాలసీ అంటూ సమాధానం దాటవేశారు. అది డీఎస్సీ కోసం మారిన పాలసీ కాదు.. సాధారణంగా మార్చిన పాలసీ అంటూ అధికారులు బుకాయించారు. -
మా సపోర్ట్ వల్లనే గెలిచారు మాట మీద నిలబడకపోతే... బాబు ప్రభుత్వంపై ఉద్యోగులు ఫైర్
-
వైఎస్ జగన్ ప్రెస్ మీట్ .. దుర్గయ్య ఏం అన్నారో విన్నారా
సాక్షి,తాడేపల్లి: డీఎస్సీ అభ్యర్థి, నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAAP) అధికారులకు సవాల్ విసిరారు. ‘నేను గోల్డ్ మెడల్ సాధించాను. ఎవరైనా వచ్చి నిరూపించమంటే నిరూపిస్తాను. నేను డీఎస్సీకి గోల్డ్ మెడల్ సర్టిఫికెట్లతో అప్లై చేశాను. కానీ ఎస్ఏఏపీ ఎండీ అబద్ధం చెబుతూ నేను సిల్వర్ మెడల్ పెట్టానని అన్నారు’ అని దుర్గయ్య మండిపడ్డారు.డీఎస్సీ రిక్రూట్మెంట్లో జరిగిన కుంభకోణంపై గురువారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో దుర్గయ్య కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. దుర్గయ్య నేషనల్ మెడలిస్ట్ (పక్కనే ఉన్నారు). డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 1:1 రేషియోలో దుర్గయ్యకు కాల్ లెటర్ వచ్చింది. సర్టిఫికెట్లు సరిగా ఉన్నా ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కాం. స్పోర్ట్స్మెన్కు అన్యాయం చేశారు. చంద్రబాబు లోకేష్ కలిసి స్కీమ్ను స్కామ్ చేశారు..చరిత్రలో లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయనక్కర్లేదని జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 74 చూస్తే స్పోర్ట్ కోటా పోస్టుల అంశం తెలుస్తుంది. స్పోర్ట్స్ కోటా వాళ్లు డీఎస్సీకి ఉత్తీర్ణత సాధించాల్సిందే. స్పోర్ట్స్ సర్టిఫికెట్ చూపించి సబ్జెక్ట్ టీచర్లుగా ఉద్యోగాలిచ్చేందుకు జీవోలు తెచ్చారు. కొన్ని పోస్టులకు డీఎస్సీ పరీక్ష లేదు. డిగ్రీ కూడా అక్కర్లేదట. ఉద్యోగం వచ్చిన ఐదేళ్లలో డిగ్రీ పాస్ కావొచ్చట. క్రీడాప్రతిభతో సంబంధం లేదు.. జస్ట్ ఆటలో పాల్గొంటే చాలట. నేషనల్ గోల్డ్మెడలిస్ట్ అయిన దుర్గయ్యకు ఉద్యోగం ఎందుకు రాలేదు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగింది’ అన్నారు. -
Gen-Z అన్నీ చూస్తోంది... బాబూ జాగ్రత్త...
-
స్కాం కాకపోతే ఆ జీవోలు ఎందుకు రద్దు చేశారు?
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ పోస్టుల్లో సర్దుబాటు ఎవరి కోసం చేశారని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నిలదీశారు. డీఎస్సీ రిక్రూట్మెంట్ కుంభకోణంపై పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన ప్రెస్మీట్లో మాట్లాడారు. దుర్గయ్య నేషనల్ మెడలిస్ట్ (పక్కనే ఉన్నారు). డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 1:1 రేషియోలో దుర్గయ్యకు కాల్ లెటర్ వచ్చింది. సర్టిఫికెట్లు సరిగా ఉన్నా ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కాం. స్పోర్ట్స్మెన్కు అన్యాయం చేశారు. చంద్రబాబు లోకేష్ కలిసి స్కీమ్ను స్కామ్ చేశారు.. చరిత్రలో లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయనక్కర్లేదని జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 74 చూస్తే స్పోర్ట్ కోటా పోస్టుల అంశం తెలుస్తుంది. స్పోర్ట్స్ కోటా వాళ్లు డీఎస్సీకి ఉత్తీర్ణత సాధించాల్సిందే. స్పోర్ట్స్ సర్టిఫికెట్ చూపించి సబ్జెక్ట్ టీచర్లుగా ఉద్యోగాలిచ్చేందుకు జీవోలు తెచ్చారు. కొన్ని పోస్టులకు డీఎస్సీ పరీక్ష లేదు. డిగ్రీ కూడా అక్కర్లేదట. ఉద్యోగం వచ్చిన ఐదేళ్లలో డిగ్రీ పాస్ కావొచ్చట. క్రీడాప్రతిభతో సంబంధం లేదు.. జస్ట్ ఆటలో పాల్గొంటే చాలట. నేషనల్ గోల్డ్మెడలిస్ట్ అయిన దుర్గయ్యకు ఉద్యోగం ఎందుకు రాలేదు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందిబ్యాక్డోర్ ద్వారా ఉద్యోగాలిచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని పోస్టులకు డిగ్రీ కూడా అవసరం లేదన్నారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల వ్యవస్థను దళారి కేంద్రంగా మార్చారు. మెడల్స్తో సంబంధం లేకుండా.. ఆటల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు చూపించినవాళ్లకు ఇచ్చారు. ఆ సర్టిఫికెట్లు కూడా వాళ్లే ఇచ్చారు. జూడో అసోషియేషన్ గౌరవ అధ్యక్షుడు లోకేశ్ తోడల్లుడు భరత్. సాఫ్ట్బాల్ అసోషియేషన్ అధ్యక్షుడు కూన రవికుమార్. వీళ్లే సర్టిఫికెట్లు ఇస్తారు. వీళ్లే ఉద్యోగాలు ఇస్తారు. గోల్డ్మెడల్ అనే వ్యక్తి.. సిల్వర్ మెడల్ అని అప్లోడ్ చేశారట. ఆటల్లో పాల్గొన్న వారికే ఉద్యోగాలు ఇచ్చినప్పుడు.. మెడల్ వచ్చిన వారికి ఇవ్వరా?.. నిజమైన క్రీడాకారులకు ఇది అవమానం కాదా?. క్రీడాకారుల పేరుతో జరిగిన స్కామ్ కాదా ఇది? తమ వాళ్లకు ఉద్యోగుల వచ్చేలా జీవో నెంబర్ 4, జీవో 47 తెచ్చారు. వాళ్లకు ఉద్యోగం ఇచ్చి.. జీవో 23, 25, 26తో గేట్లు మూసేశారు.అసలు మీరిచ్చిన జీవో నెంబర్ 4, 47 ఎందుకు రద్దు చేశారు. ఇది స్కామ్ కాకపోతే ఇంకేంటి? కేవలం పాల్గొన్నందుకే 270 మందికి ఉద్యోగాలిచ్చారు. ఉద్యోగాలు ఇచ్చినవారికిఎలాంటి మెడల్స్ రాలేదు. ఇంటర్ కాలేజీ స్పోర్ట్స్లో 99 మంది టీచర్ ఉద్యోగాలొస్తే.. మెడల్ రాకపోయినా పాల్గొనందుకే 86 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని వైఎస్ జగన్ లెక్కలతో సహా వివరించారు.డీఎస్సీలో ఒక్కో ఉద్యోగాన్ని రూ.15.26 లక్షలు అమ్ముకుంటున్న బేరసారాల వీడియో బయటకు వచ్చింది. ప్రభుత్వ డీపీ లోగో ఉంది. పైగా ఆ వీడియోలో కాల్ చేసిన నెంబర్ స్పష్టంగా కనిపిస్తుంది. అయినా తూతు మంత్రంగా కేసులు పెట్టారు. స్టేషన్బెయిల్ ఇచ్చి బయటకు వదిలేశారు. ఆ వ్యక్తి ఎంత ముఖ్యమైన వ్యక్తో ఇక్కడే అర్థమవుతుంది. ఈ ఆధారం చాలదా స్కామ్ జరిగిందని చెప్పడానికి అని వైఎస్ జగన్ అన్నారు. -
పేపర్ లీక్ ఎలా చేశారంటే...? DSC స్కామ్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే...
-
చంద్రబాబే పోలీస్.. చంద్రబాబే లాయర్
సాక్షి,తాడేపల్లి: డీఎస్సీ పరీక్ష పేపర్ తయారీ దగ్గరి నుంచి.. ఫలితాల వెల్లడిదాకా ప్రతీ దశలోనూ నిబంధలను మీరి ప్రవర్తించారని.. ఇక్కడే అవకతవకలు జరిగాయని స్పష్టమవుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. మెగా డీఎస్సీ స్కామ్పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారాయన.డీఎస్సీ మాత్రమే కాదు, ఏ పరీక్షకైనా పేపర్ తయారీ, ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ ఇవన్నీకూడా అత్యంత గోప్యంగా జరగాలి. కానీ ఈ ప్రభుత్వంలో ఆ రహస్య ప్రక్రియకు పూర్తిగా తూట్లు పొడిచారు. డీఎస్సీ క్వశ్చన్ పేపర్లను SCERT (State Council of Educational Research and Training) తయారు చేస్తుంది. పరీక్ష నిర్వహణను డీఎస్సీ కన్వీనర్ చూస్తారు. కాని ఈ చంద్రబాబు ప్రభుత్వం ఆ కన్వీనర్ను పక్కనపెట్టి, క్వశ్చన్ పేపర్ల తయారీ.. నిర్వహణ, ఈ రెండు కీలక బాధ్యతలను కూడా SCERT డైరెక్టర్కు అప్పగించింది. డీఎస్సీ పరీక్షల్లో పారదర్శకతను దెబ్బతీసింది, అక్రమాలకు ఉద్దేశపూర్వకంగానే ఆజ్యం పోసింది. ఇక్కడ నుంచే మొదలైంది స్కెచ్..రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడింగ్ పని పనిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో చేయించారు. ఎక్కడైనా పరీక్షల ఫలితాలను పారదర్శకంగా ప్రకటిస్తారు. కానీ బాబు పెట్టిన డీఎస్సీ మాత్రం ఎక్కడా డిస్ప్లే లేదు. సెలెక్టెడ్ అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపారు. మార్కులు, కటాఫ్, ర్యాంకులు ఎక్కడా డిస్ప్లే చేయలేదు. ఆన్లైన్ పేరుతో మొత్తం ప్రక్రియ సెంట్రలైజ్ చేశారు. 1:1 రేషియోలో కాల్ లెటర్లు పంపారు.. .. నవీన్ అనే వ్యక్తి మెరిట్ సాధించాడు. అతను సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాలేదని ఉద్యోగం ఇవ్వలేదట. మెరిట్ లిస్టులో పేరు తీసేసి, ఆ కేండిడేట్ డేటాను మాయం చేసి, కాల్లెటర్ ఇవ్వనప్పుడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఎలా వస్తాడు?. నిజంగా మెరిట్ వస్తే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు. తప్పు జరగకపోతే నవీన్ డేటా ఎందుకు తొలగించారు. అంటే తప్పు జరిగినట్లు ఒప్పుకున్నట్లే కదా. మీరు చెప్పేవి కాకమ్మ కబుర్లు కావా? అందుకే కదా అతను కోర్టుకు పోయింది?. ఒక కేండిడేట్కు ఫస్ట్ ర్యాంకు వస్తే, అందులోనూ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వస్తే, సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాడా?. మీరు ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు. చంద్రబాబు చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. పేపర్ లీక్ దాచిపెట్టడానికి నానా అగచాట్లు పడుతున్నారు. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సిస్ ఎవరి చేతుల్లో ఉంది. పేపర్ ఎంత మందికి లీక్ అయింది.. ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవి తేలాలి కదా?. అన్నీ తేలాలి. ఇలాంటి తప్పులు ఇంకెన్నో, అందుకే మేం సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం.రాష్ట్రంలో చంద్రబాబు పోలీస్.. ఆయనే లాయర్. అధికారం మీదే.. అధికారులు రిపోర్ట్ చేసేది మీకే. అధికారంలో ఉన్నది ఆయనే.. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది?. రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఉందా?. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం. చంద్రబాబు కొడుకు విద్యాశాఖ మంత్రి కాబట్టే థర్డ్ పార్టీ ఏజెన్సీ వస్తేనే నిజాలు బయటకు వస్తాయి అని వైఎస్ జగన్ అన్నారు. -
ఒక్క తప్పు జరగకుండా గర్వాంగా చెప్తున్నా ...
-
చంద్రబాబు తొలి సంతకమే పెద్ద మోసం.. స్కామ్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ రిక్రూట్మెంట్లో ఎన్నో అక్రమాలు జరిగాయని.. ఆ అవకతవకలు దిగ్భ్రాంతికి గురి చేశాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. ఈ అంశంపై గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనంతా దగా, స్కాములు, అబద్దాలు, మోసాలే. వెన్నుపోటు, మోసానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అది చంద్రబాబే. మెగా డీఎస్సీ పేరుతో పెద్ద స్కామ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం పేరుతో డ్రామాలు చేశారు. ఇది కూడా పెద్దమోసమే. లక్షల మంది నమ్మకాన్ని చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ వమ్ము చేశారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారు. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ ఏపీ చరిత్రలోనే జరగలేదు. వాస్తవంగా మా హయాంలో 6,100 పోస్టులకు నోటిఫికేషం ఇచ్చాం. వాటిని భర్తీ చేయకుండా రిక్రూట్మెంట్ ఆలస్యం చేశారు. ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదీ చంద్రబాబుగారి మొదటి సంతకం పరిస్థితి. మెగా డీఎస్సీ అని చంద్రబాబు ఒకటే డబ్బా కొట్టుకున్నారు. నీకు నువ్వుగా సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా? అసలు రికార్డు ఏంటో ఇప్పుడు చెప్తా అంటూ వైఎస్ జగన్ అసలు రికార్డు చెప్పుకొచ్చారు.. 👇 👉16 వేల పోస్టులకే ఇన్ని స్కామ్లు, లీకులు కనిపిస్తున్నాయి. మెగా డీఎస్సీలో మెగా అంటే ఏంటో అర్థం కావడం లేదు. అసలు దీనిని అలా పిలవడానికి అర్హతే లేదు. వైఎస్సార్సీపీ హయాంలో లక్షల మంది ఉద్యోగ పరీక్షలు రాస్తే.. ఒక్క తప్పు జరగలేదని జగన్ గుర్తు చేశారు.👉రాష్ట్ర చరిత్రలో కాని, దేశ చరిత్రలో కాని ఎప్పుడూ లేని రీతిలో ఒకే ఏడాది, ఒకే నోటిఫికేషన్తో, ఒకే టైంలో 1లక్షా 3౦వేల ఉద్యోగాల భర్తీ జరిగిందీ అంటే.. అది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే. అదీ రికార్డు అంటే. గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన లక్ష్య సాధన దిశగా ఆరోజు మేం వేసిన గొప్ప అడుగు, ఉద్యోగాల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఎవ్వరూ బద్దలు కొట్టలేని ఓ రికార్డు. 👉మే 30, 2019న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే, ఆ తర్వాతి యాభై రోజుల్లోనే అంటే జులై 19న జీవో ఇచ్చాం. జులై 25 - 27 మధ్య నోటిఫికేషన్లు ఇచ్చాం. జులై 27 నుంచి ఆగస్టు 10వరకూ అప్లికేషన్లు తీసుకున్నాం. సెప్టెంబరు 1 నుంచి 8వరకూ పరీక్షలు నిర్వహించాం. 👉మొత్తం 2,800 సెంటర్లలో 19లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా ఒక్క తప్పుకూడా జరగకుండా, ఎలాంటి లోపం లేకుండా, అందరి విశ్వాసాన్ని నిలబెడుతూ, 1.౩ లక్షల కొత్త ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాలు పొందిన వాళ్లంతా ఇవాళ ప్రజలకు వారి గ్రామంలోనే, మన ఇంటికే సేవలు అందిస్తున్నారు. అక్టోబరు 2, గాంధీ జయంతి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తిచేశాం. అంటే నాలుగు నెలల్లోనే, అత్యంత పారదర్శకంగా, ఒక తప్పు జరక్కుండా, ఎలాంటి లోపం లేకుండా ఒక చరిత్ర సృష్టించాం.కానీ, మెగా డీఎస్సీ పేరుతో మీరు నిర్వహించిన 16వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు? మీరు చేసిన గోల్మాల్ వ్యవహారాలతో ఎంతమంది కన్నీళ్లు పెడుతున్నారు? ఎంతమంది రోదిస్తున్నారు? అని చంద్రబాబును వైఎస్ జగన్ నిలదీశారు. -
మెగా డీఎస్సీ బాధితులకు అండగా వైఎస్సార్సీపీ పోరుబాట
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ–2025లో జరిగిన అవకతవకలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని, బాధిత నిరుద్యోగులకు వైఎస్సార్సీపీ అండగా నిలవాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల ఇన్చార్జి ఆలూరు సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు. వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాలపై యూత్, స్టూడెంట్ వింగ్ రాష్ట్ర కమిటీ సభ్యులు, జోనల్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ, మండల అధ్యక్షులతో ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.సాంబశివారెడ్డి మాట్లాడుతూ వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాల్లో భాగంగా సోమ, మంగళవారాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే టౌన్హాల్ ఇండోర్ సమావేశాల్లో డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలు ప్రధాన చర్చాంశంగా ఉండాలని సూచించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఉద్యోగాల కల్పనలో వైఫల్యం, నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. -
అర్హత ఉన్నా డీఎస్సీలో పోస్టు రాలేదు
విజయనగరం అర్బన్: నిబంధనల ప్రకారం డీఎస్సీ–2025లో దరఖాస్తు చేసుకుని మెరిట్లో నిలిచిన అభ్యర్థులను నట్టేట ముంచేశారని, అదే తప్పుడు సమాచారంతో వ్యవస్థను మోసం చేసేవారికి రెడ్కార్పెట్ పరిచి ఉద్యోగం ఇచ్చారంటూ విజయనగరం జిల్లాకు చెందిన డీఎస్సీ అభ్యర్థి నరసయ్య ఆవేదన వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ పీఈటీ పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలతో పోస్టుకు దూరమయ్యాయని వాపోయారు. ఆయన ఏమన్నారంటే... ‘‘విజయనగరం జిల్లాలో స్పోర్ట్స్ కోటా కింద కేవలం ఒకే ఒక్క పీఈటీ పోస్టు ఉంది. ఈ పోస్టు కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ రేసులో ముందు వరుసలో ఓ యువతి, నేను ఉన్నాం. వెయిట్లిఫ్టింగ్ క్రీడాంశంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించిన ట్రాక్ రికార్డు ఉండడంతో ఆ యువతికి పోస్టు దక్కింది. అయితే, ఇక్కడ ఒక పెద్ద అక్రమమే చోటుచేసుకుంది. ఆమెది పాఠశాల రికార్డు ప్రకారం పుట్టిన తేదీ 1992 సెప్టెంబర్ 20. పోటీలకు సరిపోయేందుకు సృష్టించిన తప్పుడు పుట్టిన రోజు 1992 మార్చి 10. పాఠశాల విద్య రికార్డుల్లో ఉన్న అసలు పుట్టిన రోజు ప్రకారం చూస్తే... ఆమె పాల్గొన్న సదరు జాతీయ, అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఆమెకు అసలు వయస్సే సరిపోదు (అర్హత లేదు). ఆ పోటీల్లో పాల్గొనేందుకు వీలుగా వయసును మార్చుతూ పుట్టిన తేదీ ధ్రువపత్రాన్ని సృష్టించారు. ఆ తప్పుడు పత్రంతోనే రిజ్రస్టేషన్ చేయించుకుని పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఇప్పుడు అవే పతకాలను చూపి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డీఎస్సీలో పీఈటీ కొలువును దక్కించుకున్నారు. ఆమె ఒరిజినల్ సర్టిఫికెట్లలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్... స్పోర్ట్స్ సర్టిఫికెట్లలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్పై స్పష్టమైన ఆధారాలతో సహా డీఎస్సీ నిర్వహణ ఉన్నతాధికారులకు, స్పోర్ట్స్ అథారిటీ వారికి ఫిర్యాదు చేశాను. కానీ లాభం లేకుండా పోయింది. దానిపై ఎలాంటి విచారణ చేయలేదు. వేర్వేరు పుట్టిన రోజులతో ఎలా చలామణి అవుతుందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కనీసం ఆ పత్రాన్ని పరిశీలించే ప్రయత్నం కూడా ఏ స్థాయిలోనూ చేయలేదు. ఆమె తప్పుడు పత్రాలతో పతకాలు కొట్టి, ఆ అర్హతతోనే డీఎస్సీ పోస్టుకు ఎంపికైంది. దీంతో తర్వాత స్థానంలో ఉన్న నాకు పోస్టు దూరమైంది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్పేందుకు నాకు జరిగిన నష్టమే నిదర్శనం’’ అని నరసయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.డీఎస్సీ అక్రమాలపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం» వైఎస్సార్సీపీ డీఎస్సీ పోరాట కమిటీ వెల్లడి» డీఎస్సీ– 2025లో ప్రతి అక్రమంపై సీబీఐతో సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలి» కృష్ణా జిల్లా టాపర్ నవీన్ ఉద్యోగం పొందకపోవడం వెనుక కారణాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి» డీఎస్సీలో అక్రమాలపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఎందుకు స్పందించడం లేదు?» ప్రభుత్వానికి అనుకూలంగా ఉపాధ్యాయులతో రాజకీయ సమావేశాలు నిర్వహించి విమర్శలు చేయించడం తగదుసాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై గవర్నర్కు ఫిర్యాదు చేయాలని వైఎస్సార్సీపీ డీఎస్సీ పోరాట కమిటి నిర్ణయించింది. అక్రమాలపై సీబీఐతో సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేయాలని నిర్ణయించింది. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన డీఎస్సీ పోరాట కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కల్పలత, పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ–2025 పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, అభ్యర్థుల అభ్యంతరాల పరిష్కారంలో చోటుచేసుకున్న అనేక అవకతవకలపై విస్తృతంగా చర్చించారు. డీఎస్సీలో అక్రమాల కారణంగా నష్టపోయిన అభ్యర్థుల తరపున న్యాయ పోరాటం కొనసాగించాలని, ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తి, దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేయాలని నిర్ణయించారు. బాధిత అభ్యర్థులతో త్వరలోనే మరోసారి ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కూడా నిర్ణయించారు. డీఎస్సీలో అక్రమాలపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఎందుకు స్పందించడం లేదని కమిటీ సభ్యులు ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి మించిన స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వారు ఆరోపించారు. ఎస్సీఈఆర్టీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నవీన్ అనే కాంట్రాక్ట్ ఉద్యోగి కృష్ణా జిల్లా టాపర్గా నిలవడం, అయినా డీఎస్సీలో ఉద్యోగం పొందకపోవడం వెనుక కారణాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ఫలితాలపై 30 వేలకుపైగా గ్రీవెన్సులు వచ్చినప్పటికీ, అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. అక్రమాలపై ప్రశ్నిస్తున్న బాధిత అభ్యర్థులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కొందరు ఉన్నతాధికారులు వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఇప్పటికే పదుల సంఖ్యలో కోర్టులో రిట్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉపాధ్యాయులతో రాజకీయ సమావేశాలు నిర్వహించి, డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తున్న వారిపై విమర్శలు చేయించడం కూడా ప్రజాస్వామ్య విరుద్ధ చర్యేనని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. డీఎస్సీ– 2025లో వెలుగులోకి వచ్చిన ప్రతి అక్రమంపై సీబీఐతో సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డీఎస్సీ పోరాట కమిటీ డిమాండ్ చేసింది.నా ఉద్యోగం వేరే వాళ్లకు ఎలా కేటాయించారు ? » మార్కాపురం జిల్లా పాతచెరువు తండాకు చెందిన క్రాంతి » ఎస్టీ ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్లో » అర్హత ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదు » న్యాయం చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్కు వినతి యర్రగొండపాలెం: చంద్రబాబు ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూస్తూనే ఉంది. మెగా డీఎస్సీ–2025లో ఉమెన్స్ కోటాలో అర్హత ఉన్నప్పటికీ ఓ ఎస్టీ మహిళకు పోస్టు దక్కలేదు. ఎస్టీ ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్లో తనకు దక్కాల్సిన పోస్టు ఇతరులకు ఏ విధంగా కేటాయించారని మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువు మండలంలోని పాతచెరువు తండాకు చెందిన మూడ క్రాంతి ప్రశ్నిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్కు మెయిల్ ద్వారా శనివారం వినతి పత్రం పంపింది. అందులో.. ‘‘నేను డీఎస్సీ–25లో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమేటిక్స్) పోస్టుకు ప్రకాశం జిల్లాలో ఎస్టీ (ఉమెన్) కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్నాను. ఏపీ మెగా డీఎస్సీ ప్రకారం మహిళల రిజర్వేషన్ హారిజాంటల్ రిజర్వేషన్ రూపంలో అమలు చేయాల్సి ఉంది. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమేటిక్స్)గా ఎస్టీ కేటగిరిలో 5 పోస్టులు కేటాయించినా ఎస్టీ ఉమెన్ అభ్యర్థులకు తగిన విధంగా హారిజాంటల్ రిజర్వేషన్ అమలైందా? అనే అంశంపై సందేహం ఉంది. నేను ఎస్టీ ఉమెన్ కేటగిరీలో మెరిట్ జాబితాలో 2వ ర్యాంక్ సాధించినా నాకు ఉద్యోగం రాలేదు’’ అని పేర్కొంది. రోస్టర్, హారిజాంటల్ రిజర్వేషన్ అమలులో సరైన విధానం అనుసరించారో లేదో పరిశీలించాలని, ప్రకాశం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమేటిక్) పోస్టులకు పూర్తి రోస్టర్ వివరాలు వెల్లడించాలని, ఎస్టీ ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ అమలును పరిశీలించి ఆ రోస్టర్ పాయింట్ల ప్రకారం తనకు న్యాయం చేయాలని క్రాంతి కోరింది. ప్రతి 100 రోస్టర్ సైకిల్లో ఎస్టీలకు మొత్తం 6 రోస్టర్ పాయింట్లు ఉంటాయని, వాటిలో 2 పాయింట్లు ఎస్టీ ఉమెన్గా గుర్తించబడ్డాయని క్రాంతి తెలిపారు. జిల్లాలో ఉన్న 92 పోస్టుల్లో 8, 58వ రోస్టర్ పాయింట్ ఎస్టీ ఉమెన్కు దక్కాల్సి ఉండగా 58వ పాయింట్(తనకు దక్కాల్సిన పోస్టు) ఓపెన్ కేటగిరీలో చేర్చి ఎస్టీ అభ్యరి్థకి పోస్టు ఇచ్చారని ఆమె తెలిపింది. -
పదే పదే ‘మెగా’ అబద్ధం!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025లో తప్పులను కప్పిపుచ్చి కూటమి ప్రభుత్వం నష్టపోయిన అభ్యర్థులను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆధారాలతో సహా అక్రమాలు బయటపడినా, ఎక్కడా తప్పు జరగలేదని, తప్పంతా అభ్యర్థులదే అన్నట్టుగా బుకాయిస్తోంది. ‘ఒక పోస్టుకు ఒక అభ్యర్థిని (1:1 నిష్పత్తి) మాత్రమే’ సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచి, ఇప్పుడు ఆ విధానానికే వక్రభాష్యం చెబుతోంది. ఒక పోస్టుకు ఒక్కరినే పిలవడం అంటే అర్థం ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కాల్ లెటర్లు పంచారంటే ఉద్యోగం వచ్చినట్లే కదా.. అని నిలదీస్తున్నారు.మెరిట్ అభ్యర్థులకు మాత్రమే కాల్లెటర్లు పంపామని చెబుతున్నప్పుడు.. ఎంపిక జాబితా లేదా తిరస్కరణ జాబితాలో ఏదో ఒకదాంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన వారిని ఆ రెండు లిస్టుల్లోనూ ఎందుకు చూపలేదన్న ప్రశ్నకు అటు ప్రభుత్వం గాని, ఇటు అధికారులు గాని సరైన సమాధానం చెప్పడం లేదు. అంతా వదిలేసి హారిజాంటల్ రిజర్వేషన్ అమలును అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పడంపై నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి రెండు టాప్ ర్యాంకులు ఎలా వచ్చాయి?, అతన్ని ఎందుకు కౌన్సెలింగ్కు రాకుండా అడ్డుకున్నారో తేల్చడం లేదు. చేసిన తప్పులను వదిలేసి బాధిత అభ్యర్థులదే తప్పు అన్నట్టు దుష్ప్రచారం చేయడం విస్తుగొల్పుతోంది. జరిగిన తప్పులపై విచారణ చేయాల్సిన ప్రభుత్వం అభ్యర్థులపై ఎదురుదాడి చేయడం ఆందోళన కలిగిస్తోంది. వీరందరినీ ఎందుకు పిలిచారు? కూటమి ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ వివిధ ఉద్యోగాల భర్తీకి 1:1 నిష్పత్తిలోనే ఫలితాలు విడుదల చేస్తోంది. పరీక్షల అనంతరం ఆ అభ్యర్థుల మెరిట్, వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ పరిశీలించిన తర్వాతనే 1:1 నిష్పత్తిలో ఫలితాలను ప్రకటిస్తుంది. అంటే.. ఫలితాల్లో ఉన్న అభ్యర్థులంతా దాదాపు ఎంపికైనట్లే. సర్టిఫికెట్ల పరిశీలనలో ఏమైనా పొరపాట్లు ఉంటే సరైన పత్రాలు అందించేందుకు నిర్ణీత గడువు ఇస్తారు. ఆలోగా సదరు అభ్యర్థి అన్ని పత్రాలు సరైనవేనని నిరూపించుకుంటే ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. లేదంటే అతని తర్వాత ఉన్నవారిని పిలుస్తారు. 1:1 నిష్పత్తి ఇలాగే కొనసాగుతుంది. కానీ డీఎస్సీలో మాత్రం ఈ విధానం పాటించకుండా విచ్చలవిడిగా తప్పులు చేసి ఇప్పుడు నష్టపోయిన అభ్యర్థులదే తప్పు అని బుకాయిస్తున్నారు. డీఎస్సీ ప్రక్రియలో 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చి అన్నీ సక్రమంగా ఉండి కూడా అటు ఎంపిక జాబితాలో ఇటు తిరస్కరణ జాబితాలోనూ లేకుండా ఉన్నవారు దాదాపు 1,500 మంది అభ్యర్థులు ఉన్నారు. మెరిట్లో లేకుంటే వీరందరినీ ఎందుకు సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు? పై రెండు జాబితాల్లోనూ ఎందుకు చూపలేదు? ఈ ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం వద్ద సమాధానం లేదు.వైఎస్సార్ కడప జిల్లా రాయచోటికి చెందిన పుష్పాంజలికి ప్రభుత్వం పంపిన కాల్ లెటర్ వైఎస్సార్ కడప జిల్లా రాజుపాలేనికి చెందిన హైమావతికి ప్రభుత్వం పంపిన కాల్ లెటర్ ఆ ర్యాంకర్ వివరాలు తొలగించి.. డీఎస్సీ ఫలితాలు విడుదలలో భాగంగా తొలుత సబ్జెక్టు వారీగా, జిల్లాల వారీగా మెరిట్ లిస్టు ప్రకటిస్తారు. మెగా డీఎస్సీ–2025లోనూ ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్గా డీఎస్సీ నిర్వహణలో కీలకపాత్ర పోషించిన ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు ఉద్యోగి నవీన్ నిలిచాడు. ఇతను సోషల్ స్టడీస్లో మొదటి ర్యాంకు, టీజీటీ (తెలుగు) జోన్–2లో ఆరో ర్యాంకు సాధించాడు. అయితే, తొలుత అతడి వివరాలతో మెరిట్ లిస్టు విడుదల చేశారు. అనంతరం ఈ విషయం బయటకు రాకూడదని ఆ లిస్టులను రద్దు చేసి, రెండో ర్యాంకు నుంచి రెండో లిస్టు విడుదల చేశారు. ఎంపిక జాబితాలో తన పేరు లేకపోవడంతో నవీన్ ఆధారాలతో సహా హైకోర్టును ఆశ్రయించాడు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను కీలకమైన డీఎస్సీ నిర్వహణలో నియమించరాదు. కానీ ఇక్కడ మాత్రం ఆన్లైన్ ప్రశ్నలు అప్లోడ్ చేసే బాధ్యతను కాంట్రాక్టు ఉద్యోగికే అప్పగించినట్టు తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఫలితాల్లో అతడు టాపర్గా నిలిచినా పోస్టు ఇవ్వకుండా, అతడి క్యాండిడేట్ లాగిన్ ఐడీని బ్లాక్ చేశారు. వాస్తవానికి ఎస్సీఈఆర్టీ నుంచి ప్రశ్నలు బయటకు వెళ్లిపోయాయన్న ఆరోపణలపైనా చంద్రబాబు ప్రభుత్వం దర్యాప్తు చేయకపోగా తప్పుడు ఆరోపణలు చేయడం అనుమానాలకు తావిస్తోంది.సీబీఐ విచారణ చేయాలిమెగా డీఎస్సీ–2025 నియామకాల్లో అనేక అవకతవకలు జరిగినట్టు నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. అధికారులు మాత్రం పారదర్శకంగా జరిగినట్టు వివరణ ఇవ్వడం హాస్యాస్పదమని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంబేటి రామచంద్ర విమర్శించారు. డీఎస్సీ–2025 చాలా మందికి చివరి అవకాశంగా కష్టపడి చదివి మెరిట్ సాధించారని, అలాంటి వారికి సైతం ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. డీఎస్సీలో జరిగిన దారుణాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.హారిజాంటల్లో ఒక్కటి.. నింపింది రెండుచిత్తూరు జిల్లాకు చెందిన బాధిత అభ్యర్థి ఎం.ఏకాంబరం (బీసీ–డీ 125 ర్యాంకు) ఘటనను తీసుకుంటే.. ఈ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పోస్టులు బీసీ–డీ కేటగిరిలో 7 ఉన్నాయి. ఇందులో రెండు ఓపెన్లోను, 5 పోస్టులు లోకల్ మెరిట్కు కేటాయించారు. హారిజాంటల్లో ఐదింటిలో ఒకటి ఉమెన్కు కేటాయించారు. బీసీ–డీ విభాగం మెరిట్లో చివరి ర్యాంక్ 114 అని ఒకసారి, 116 అని మరోసారి అధికారులు ప్రకటించారు. దీనిప్రకారం చూస్తే్త 114 ర్యాంకు అభ్యర్థి ఎస్టీ అయినప్పటికీ బీసీ–డీలో చూపించారు. 116 ర్యాంకు ఉమెన్, ఈమె మెరిట్ లిస్టులో ఎంపికైంది కాబట్టి ఇక హారిజాంటల్ రిజర్వేషన్లో కేటాయించిన ఒక పోస్టును తర్వాత మెరిట్లో ఉన్న ర్యాంకుకు కేటాయించాలి, అంటే 125 ర్యాంకు అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వాలి. కానీ, జనరల్ మెరిట్లో ఉన్న ఏకాంబరాన్ని కాదని, రెండు పోస్టులను హారిజాంటల్లో స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు ఇచ్చారు. వాస్తవానికి బీసీ–డీలో ప్రకటించిన 7 పోస్టుల్లో వీరికి ఒక్క పోస్టు కూడా చూపలేదు. కానీ చట్ట ప్రకారం ఒక్క పోస్టునే ఇవ్వాల్సి ఉన్నా రెండు పోస్టులు ఇవ్వడం గమనార్హం.చట్టాన్ని కాదని ఎస్టీ అభ్యర్థికి అన్యాయంకడప జిల్లాలకు చెందిన ఎం.జగదీష్ నాయక్ విషయంలో ప్రభుత్వం చట్టానికి కొత్త అర్థం చెబుతోంది. ఎస్టీ కేటగిరీకి చెందిన జగదీష్ డీఎస్సీలో 363 ర్యాంకు సాధించారు. జిల్లాలో ఎస్జీటీ ఉర్దూ మీడియం (బ్యాక్లాగ్) 4 పోస్టులు ఉన్నాయి. ఇందులో 2 జనరల్, మరో 2 ఉమెన్ అభ్యర్థులకు కేటాయించారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం ముగ్గురిని మాత్రమే పిలిచారు. ఇందులో రెండు పోస్టులను మాత్రమే భర్తీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఒకరు మేల్, ఇంకొకరు ఫీమేల్గా పేర్కొన్నారు. ‘మిగిలిన రెండు పోస్టులను అర్హులైన ఎస్టీ ఉమెన్ అభ్యర్థులు లేక భర్తీ చేయలేదని’ ప్రకటించారు. » గతేడాది కూటమి ప్రభుత్వం మైన్స్ అండ్ జియాలజీ శాఖలో రాయల్టీ ఇన్స్పెక్టర్ పోస్టు ఒకటి భర్తీకి (క్యారీఫార్వర్డ్) నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టును ఎస్టీ మహిళకు కేటాయించారు. 1996లో జీఏడీ ఇచ్చిన జీవో 436 ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్లో అర్హత గల మహిళా అభ్యర్థి లేకపోతే తర్వాత మెరిట్లో ఉన్న పురుష ఎస్టీ అభ్యర్థిని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతం డీఎస్సీలో అర్హత గల పురుష ఎస్టీ అభ్యర్థి జగదీష్ నాయక్ ఉన్నా, అతనికి ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారు. ఓసీ–ఈడబ్లు్యఎస్ పోస్టు బీసీకి ఎలా ఇస్తారు? అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన సయ్యద్ జమీల్ డీఎస్సీ ఎస్ఏ బయలాజికల్ సైన్స్ (ఉర్దూ మీడియం)లో 11వ ర్యాంకు సాధించారు. బయోలాజికల్ సైన్స్లో 2 పోస్టులు ఉండగా, ఒకటి ఓసీ–ఈడబ్ల్యూఎస్కు రిజర్వ్ చేశారు. ఇతనికంటే ముందున్న మరో అభ్యర్థి 7వ ర్యాంకులో ఉండటంతో పోస్టుకు అతన్ని ఎంపిక చేశారు. వాస్తవానికి పోస్టుకు ఎంపికైన అభ్యర్థి (బీసీ–ఈ) ముస్లిం. ఇదే కేటగిరీలో 2008, 2012, 2014, 2018 డీఎస్సీలకు హాజరయ్యాడు. 2025లో అతడు ఓసీ–ఈడబ్ల్యూఎస్గా నమోదు చేసుకుని తప్పుడు కులధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం పొందాడు. ఇతనివి తప్పుడు పత్రాలని ఆధారాలతో సయ్యద్ జమీల్ నిరూపించినా అధికారులు పట్టించుకోలేదు. బాధితుడు ఆధారాలతో పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేయగా ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థి సర్టిఫికెట్లు తప్పుడువని తహసీల్దార్తో రద్దు చేయించి రా.. అప్పుడు నీ ఉద్యోగం గురించి ఆలోచిస్తా’ అని ఓ అధికారి మాట్లాడారని వాపోయాడు. -
జగన్ ను కలిసిన DSC అభ్యర్థులే టార్గెట్?
-
అబద్ధాలు నిజమవుతాయా?
సాక్షి, అమరావతి: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ–2025 పోస్టుల భర్తీలో అక్రమాలు వెలుగు చూడటంతో ప్రభుత్వం నిండా మునిగిపోయింది. ‘సాక్షి’లో కథనాల నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకూ తీవ్రం అవుతుండటంతో తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అధికారుల చేత నోటికొచ్చిన అబద్ధాలు, వక్రభాష్యాలు పలికిస్తోంది. సాధారణ పరిపాలన శాఖ(సర్వీసెస్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా, శాప్ ఎండీ భరణితో కూడిన అధికారుల బృందం శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా శాప్ ఎండీ భరణి మీడియాతో మాట్లాడుతూ.. అక్రమాలు, అవినీతి లేకుండా స్పోర్ట్స్ కోటాలో 382 పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేసినట్టు ప్రకటించారు. వాస్తవానికి విరుద్ధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం క్రీడాకారులను ఆందోళనకు గురి చేస్తోంది. భరణి చెప్పిన అంశాలు... ఇందుకు విరుద్ధంగా ఉన్న వాస్తవాలను పరిశీలిస్తే..1 శాప్ ఎండీ: కేంద్ర ప్రభుత్వ శాఖల్లోనూ కొన్ని చోట్ల ఏ, బీ కేటగిరీలుగా క్రీడలను విభజించారు. మేము కేంద్ర ప్రభుత్వ క్రీడలనే ఏపీలో పెట్టాం.వాస్తవం: కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ (మయాస్)లో ఈ విభజన ఎక్కడా లేదు. 65 క్రీడాంశాలను సమానంగానే పరిగణిస్తున్నారు. కానీ, ఏపీలో 65 క్రీడాంశాల్లో కేవలం 63 మాత్రమే కేంద్ర ప్రభుత్వంలోనివి ఉంచారు. కుడో, ఈక్వెస్టారియాన్(గుర్రపుస్వారీ)లను తొలగించి వాటి స్థానంలో మెట్రన్ పెంటాథ్లాన్, సెయిలింగ్ను తీసుకొచ్చి.. వాటిని ‘ఏ’ కేటగిరీలో పెట్టారు. ఈ వాస్తవాన్ని దాచేసి మొత్తం మయాస్ను అనుసరిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. ఎక్కువ మంది ఆడే క్రీడలను ‘ఏ’ కేటగిరీలో పెట్టామన్నారు. ఏపీలో గోల్ఫ్, సైలింగ్ ఎంత మంది ఆడుతున్నారు? దానిని ‘ఏ’ కేటగిరీలో ఎందుకు పెట్టారు? అన్నది పాలకులకే అర్థం కావాలి.2 శాప్ ఎండీ: అనిగి దుర్గయ్య దరఖాస్తు సమయంలో తప్పులు చేశారు. దీంతో ఉద్యోగాన్ని కోల్పోయారు. దరఖాస్తులో నేషనల్ గేమ్స్కు కాకుండా నేషనల్ చాంపియన్షిప్కు ప్రాధాన్యం ఇచ్చారు. నేషనల్ గేమ్స్లో బంగారు పతకం ఉన్నా ఉద్యోగం రాలేదు.వాస్తవం: దేశవ్యాప్తంగా సీనియర్ నేషనల్ చాంపియన్షిప్కు ప్రాధాన్యత తర్వాత నేషనల్ గేమ్స్ ను పరిశీలిస్తారు. కానీ, ఏపీలో క్రీడా పాలసీ సమయంలో అక్రమాలకు బీజం వేశారు. మాస్టర్మైండ్ చక్రం తిప్పడంతో నేషనల్ గేమ్స్ ముందు వరసలోకి వచ్చి నేషనల్ చాంపియన్ షిప్ కిందికి పోయింది. వాస్తవానికి భారత జట్టు ఎంపిక మొత్తం సీనియర్ నేషనల్స్, జూనియర్ నేషనల్స్ ఆధారంగానే జరుగుతుంది. వాటి ఆధారంగానే కేంద్రప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇస్తారు. కానీ ఏపీలో పతకం రాకున్నా నేషనల్ గేమ్స్లో పాల్గొంటే చాలు ఉద్యోగం ఇచ్చేసేలా పాలసీ తెచ్చి కావాల్సిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. దుర్గయ్యకు నేషనల్ చాంపియన్షిప్లో సిల్వర్, నేషనల్ గేమ్స్లో బంగారు పతకం ఉంది. తప్పుగా అప్లై చేయడంతో ఉద్యోగం ఇవ్వలేదని చెప్పడం దారుణం.3 శాప్ ఎండీ: సౌత్ జోన్, ఆలిండియా ఇంటర్ వర్సిటీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందాలంటే బ్యాకప్ ఇంటర్ కాలేజియేట్ సర్టిఫికెట్ ఉండాలి. అనంతపురంలో ఎస్ఏ హిందీ ఉద్యోగం వచ్చిన వ్యక్తి ఇంటర్ కాలేజియేట్ బ్యాకప్ సబ్మిట్ చేశారు. ఉద్యోగం ఇచ్చాం.వాస్తవం: వాస్తవానికి సదరు వ్యక్తి సౌత్ జోన్లో వాలీబాల్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ సమర్పించాడు. దానికి బ్యాకప్గా వార్షిక స్పోర్ట్స్ మీట్ సర్టిఫికెట్ పెట్టారు. ఇది ఇంటర్ యూనివర్సిటీ/కాలేజియేట్ ఎలా అవుతుంది? ఒక వర్సిటీకి అనుబంధ కళాశాలలు లేనప్పుడు, స్పోర్ట్స్ డే జరుపుకుని అందించే సర్టిఫికెట్ను ఎలా బ్యాకప్గా పరిగణిస్తారు? ఒక వర్సిటీ జట్టును ఎంపిక చేసి సౌత్ జోన్కు పంపిస్తే వర్సిటీ తరఫున ఆడొచ్చు గానీ, ఆ బ్యాకప్ సర్టిఫికెట్తో ఎలా ఉద్యోగం ఇస్తారు? దీనిని కేంద్ర ప్రభుత్వ శాఖలు గుర్తిస్తాయా? ఈ విషయాన్ని శాప్ ఎండీ చాలా చాకచక్యంగా మాట్లాడి తప్పించుకోవడం గమనార్హం.4 శాప్ ఎండీ: స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ప్రభుత్వం ఇచ్చేవి కావు. నేషనల్ ఫెడరేషన్, వర్సిటీలు, రాష్ట్ర అసోసియేషన్లు ఇస్తాయి. ఎవరైనా ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తే, అభ్యర్థులు వాటితో ఉద్యోగాలు పొందితే కఠిన చర్యలు తీసుకుంటాం. మేము జెన్యూనిటీని పరిశీలించిన తర్వాతే ఉద్యోగాలు ఇచ్చాం.వాస్తవం: ప్రభుత్వం డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల అక్రమాలను అసోసియేషన్లపై నెట్టేసే ప్రయత్నం చేస్తోంది. పైగా జెన్యూనిటీ సర్టిఫికెట్లు పరిశీలించినట్టు చెబుతున్న ఎండీ.. సాఫ్ట్బాల్ ఫెడరేషన్కు మయాస్లో, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్లో గుర్తింపు లేనప్పుడు దానికి అనుబంధంగా ఏపీలో ఉండే సాఫ్ట్ అసోసియేషన్ ఇచ్చిన జెన్యూనిటీని ఎలా వాస్తవమని నిర్ధారిస్తారో చెప్పలేదు.5 శాప్ ఎండీ: ఒలింపిక్స్ నుంచి స్టేట్ చాంపియన్షిప్ వరకు ప్రాధాన్యత ప్రకారం 382 పోస్టులు భర్తీ చేశాం. స్టేట్ పార్టిసిపేషన్ పెడితేనే చాలా పోస్టులు మిగిలిపోయాయి. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇంటర్ డిస్ట్రిక్ట్ ను చేర్చాం. గతంలో స్కూల్స్ గేమ్స్, డిస్ట్రిక్ట్ ఫెస్టివల్స్కు ప్రాధాన్యత ఇచ్చారు. వాస్తవం: ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఒలింపిక్స్ పెట్టినప్పటికీ పోస్టుల భర్తీలో మాత్రం అన్నీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లే. పతకాలు గెలిచిన వారిని వేళ్లపై లెక్కించొచ్చు. పథకం ప్రకారమే క్రీడా పాలసీ, జీవోలను తీసుకొచ్చి ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. స్కూల్స్ గేమ్స్కు, డిస్ట్రిక్ట్ ఫెస్టివల్స్కు గతంలో ఎక్కడా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలం కాలేజీ అడ్మిషన్లలో మాత్రమే క్రీడా ప్రతిభ ఆధారంగా వెయిటేజీ ఉండేది. -
దగా డీఎస్సీపై మెగా కవరింగ్..
సాక్షి, అమరావతి: మొత్తం మోసాలతో సాగిన దగా డీఎస్సీ–2025పై చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ పాత పాటే పాడుతోంది. తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన అభ్యర్థులపై పెయిడ్ వీడియోలతో మానసిక దాడులకు దిగుతోంది. ముఖ్యంగా డీఎస్సీలో సర్టిఫికెట్ల పరిశీలన కోసం 1:1 నిష్పత్తి (ఒక పోస్టుకు ఒక్క అభ్యర్థి) ప్రకారం కాల్ లెటర్లు అందుకుని మోసానికి గురైన అభ్యర్థులు ఇటీవల వివిధ సామాజిక మాధ్యమాల్లో గోడు వెళ్లబోసుకున్నారు. అలాగే, ‘సాక్షి’ పత్రికను ఆశ్రయించారు. అన్యాయానికి గురైన అభ్యర్థులు స్వయంగా వచ్చి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి న్యాయం చేయాల్సిందిగా కోరారు. వీరి గురించి పత్రికల్లో రాగానే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో టీడీపీ పెయిడ్ ఫ్యాక్టరీ ఆర్టిస్టులు చెలరేగి ‘ఫేక్’ ప్రచారానికి దిగారు. అలాగే, నష్టపోయిన అభ్యర్థులదే తప్పు అన్న చందంగా ప్రభుత్వం వ్యవహరించడంతో పాటు 1:1 నిష్పత్తికి కొత్త అర్థం చెప్పింది. కాల్ లెటర్లు వచ్చినంత మాత్రాన ఉద్యోగాలు వచ్చినట్టు భావించవద్దని ఆ లెటర్లలోనే ఉందని అధికారులు చెప్పడం విస్తుగొల్పుతోంది. రెండు జాబితాల్లోనూ వీరి పేర్లెందుకు లేవు? డీఎస్సీలో అభ్యర్థులకు పంపిన కాల్ లెటర్లకు ప్రభుత్వం కొత్త అర్థం చెబుతోంది. మెరిట్ లిస్టు ప్రకటించే ముందే అన్ని రిజర్వేషన్లు.. వర్టికల్, హారిజాంటల్ (ఉమెన్, స్పోర్ట్సు, ప్రత్యేక అవసరాలు, ఎక్స్ సర్వీస్మెన్) పరిశీలించి తుది మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఆ జాబితాలో మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను 1:1 నిష్పత్తిలో అంటే.. ఒక పోస్టుకు ఒక అభ్యర్థిని సర్టిఫికెట్ల పరిశీలన కోసం పిలుస్తారు. సర్టిఫికెట్ల పరిశీలనలో అన్నీ సక్రమంగా ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికవుతారు. సర్టిఫికెట్లు సరిగా లేనివారిని ‘తిరస్కరణ’ జాబితాలో పెట్టి, వీరి స్థానంలో తర్వాత మెరిట్ (ఓపెన్ లేదా అదే రిజర్వేషన్) అభ్యర్థికి కాల్ లెటర్ పంపుతారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీలోనూ ఇదే సూత్రం అనుసరించినట్టు విద్యా శాఖ చెప్పడం లేదు. ప్రస్తుతం అన్యాయానికి గురై, ఉద్యోగం రాక ఆందోళన చేస్తున్న దాదాపు 1,500 మంది అభ్యర్థులు కాల్ లెటర్లు అందుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన వారే. వారి సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో తిరస్కరణకు గురవలేదు. జిల్లాల్లో ప్రదర్శించిన ‘రిజెక్ట్’ జాబితాలోనూ వీరు లేరు. అంటే వారు ఎంపిక జాబితాలో తప్పనిసరిగా ఉండాలి. అందులోనూ లేరు. వీరిని ఈ రెండు జాబితాల్లోనూ ఎందుకు చూపలేదో అధికారులు చెప్పడంలేదు. అలాగే, ‘కాల్ లెటర్ సర్టిఫికెట్ల పరిశీలనకు మాత్రమే.. ఉద్యోగానికి ఎంపికైనట్టు కాదు’ అని ముందే చెప్పామని భాష్యం చెబుతున్నారు. 1:1 నిష్పత్తిలో పంపిన అన్ని కాల్ లెటర్లకు ఇదే వర్తిస్తుంది. మరి కొందరే ఎందుకు అన్యాయానికి గురయ్యారనేది పెద్ద ప్రశ్న!డీఎస్సీ మెరిట్ బాధిత అభ్యర్థులను ‘ఫేక్’ అంటూ తప్పుడు పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా బాధిత అభ్యర్థులపై దుష్ప్రచారంకాల్ లెటర్లు అందుకుని సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యి ఎంపిక, తిరస్కరణ జాబితాల్లో పేర్లు లేని అభ్యర్థులు ఇదేమి అన్యాయమని ప్రశ్నిస్తే ఎక్కడ తప్పు జరిగిందో పరిశీలించి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం.. వారిపై ఎదురు దాడికి దిగుతోంది. పత్రికల్లో, సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా అభ్యర్థులపై దుష్ప్రచారం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్ వద్ద గోడు వెళ్లబోసుకున్న అభ్యర్థులపై పెయిడ్ ఆర్డిస్టులు తీవ్రమైన ట్రోలింగ్కు దిగారు. మరోపక్క అభ్యర్థుల మెరిట్ను సైతం అధికారులు రోజుకోలా మార్చేస్తున్నారు.» చిత్తూరు జిల్లాకు చెందిన ఎం.ఏకాంబరం బీసీ–డి కేటగిరీకి చెందినవారు. ఇతనిది మెరిట్ జాబితాలో 125వ ర్యాంకు. జిల్లాలో బీసీ–డి కేటగిరిలో 7 పోస్టులు ఉండగా, 5 మెరిట్, 2 హారిజాంటల్ రిజర్వేషన్లో భర్తీ చేశామని అధికారులు చెప్పారు. ఈ మెరిట్ (5 పోస్టులు)లో చివరి ర్యాంకు 114లో ఉన్న అభ్యర్థికి ఇచ్చామని గత శనివారం పాత్రికేయుల సమావేశంలో అధికారులు ధ్రువీకరించారు. కానీ శుక్రవారం ఈ మెరిట్ 116 అభ్యర్థికి ఇచ్చినట్టు ప్రకటించారు. ఇందులో ఏది సరైనది? వాస్తవానికి అధికారులు చెబుతున్న 114 ర్యాంకు అదే జిల్లాకు చెందిన ఎస్టీ అభ్యర్థిది. ఈ ర్యాంకును బీసీ–డిలో చూపడం విస్తుగొల్పుతోంది. అలాగే, 116 ర్యాంకు మహిళది.» అంకాని నాగవేణి (బీసీ–ఎ) విషయంలోనూ ఇలాగే చెప్పుకొచ్చారు. ఈ కేటగిరీలో 7 పోస్టులు ఉంటే అంతే సంఖ్యలో మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. మరి 8వ అభ్యర్థిగా ఉన్న నాగవేణికి ఎందుకు కాల్లెటర్ పంపారన్న ప్రశ్నకు సమాధానం లేదు. ప్రకటించిన ఏడుగురు మెరిట్ అభ్యర్థుల్లో ఎవరికైనా సరైన సర్టిఫికెట్లు లేక, రిజెక్ట్ అయిన సమయంలోనే 8వ అభ్యర్థికి కాల్లెటర్ పంపాలి. అలా ఎందుకు చేయలేదు? » ఉన్న పోస్టులకు అంతే సంఖ్యలో మెరిట్ ప్రకారం కాల్లెటర్లు పంపితే.. అదనపు అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చారు? వారికి కాల్ లెటర్లు ఎందుకు పంపినట్టు? సర్టిఫికెట్లు ఎందుకు పరిశీలించినట్టు? ఇలా సమాధానాలు దొరకని ప్రశ్నలెన్నో ఉన్నాయి. అయినప్పటికీ అంతా సక్రమమే అనే కలరింగ్ ఇస్తూ చేసిన తప్పును ఒప్పు అని భ్రమింపజేసేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. -
‘డీఎస్సీలో అక్రమాలు నిజం’
తాడేపల్లి : ఏపీ ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగింది నిజమేననడానికి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే ఉదాహరణ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పకపోవడం డీఎస్సీలో అక్రమాలు జరిగాయనడానికి నిదర్శమన్నారు. అసలు తమ ప్రశ్నలకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. ఈరోజు(శుక్రవారం, జూన్ 5వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘డీఎస్సీ పరీక్షలు రాసిన విద్యార్ధులకు అన్యాయం జరిగింది. విద్యా శాఖ ఉన్నతాధికారులు అసత్యాలు మాట్లాడుతున్నారు. కాల్ లెటర్స్ 1:1 రేషియోలో పంపాము అంటున్నారు. అసలు దానికి అర్థం ఏంటి..?, వారి మాటలు చాలా అసంబద్ధంగా ఉన్నాయి. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్స్ యధాతథంగా అమలు చేయాలి. స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వారిని హారిజాంటల్ రిజర్వేషన్ లో ఇచ్చాం అంటున్నారు. ఏ కేటగిరీలో స్పోర్ట్స్ కోటా వాళ్ళు వస్తారో మీకు తెలియదా ?, స్పోర్ట్స్ కోటాలో కొందరికి ఇవ్వటానికి పిలిచిన వాళ్లలో కొంతమందిని బలిచేసినట్లుగా కనిపిస్తుంది. మీరు చెప్పిన విధంగా ఎక్కడా జరగదు. మీరు చేసింది కరెక్టేనా అనేది పునః సమీక్ష చేసుకోవాలి. ఇప్పటివరకు రిక్రూట్మెంట్ విధానంలో చేయని విధంగా మీరు చేశారు. మీరు సెలెక్షన్ లిస్ట్ విడుదల చేయనిది వాస్తవమా.. కాదా ?, కొన్ని ప్రశ్నలకు అధికారులు సమాధానాలు కూడా చెప్పలేక పోతున్నారు. టీచర్, డాక్టర్ పోస్టులు ఇష్టం వచ్చినట్లు ఇవ్వటం కుదరదు. విద్యా హక్కు చట్టం సెక్షన్ 4 ప్రకారం టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. దాన్ని వైలెట్ చేయడానికి లేదు. ఆర్డర్స్ తయారు చేసిన వాళ్లు, అమలు చేసిన వాళ్లు కోర్టులకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. డీఎస్సీ, టెట్ రాయకుండా.. బీఎడ్, డీఎడ్ చదవకుండా వారికి ఎలా పోస్ట్స్ ఇస్తారు. శాప్ ధృవీకరణ ఆధారంగా ఉద్యోగాలు ఎలా ఇస్తారు ?, క్వాలిఫై అయిన కొందరు అభ్యర్థులతో మా పార్టీ వారిని తిట్టిస్తున్నారు. అన్యాయం అయినవారి పట్ల సానుభూతి చూపించాలి..పోస్టులు అమ్ముకున్న ఉదంతాలపై విచారణ చేపట్టాలి. నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ వచ్చిన అభ్యర్థికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. సెల్ఫ్ డిక్లరేషన్ రాయటం రాని వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారు. సర్టిఫికెట్స్ అప్లోడ్ కాని వారికి ఉద్యోగాలు ఎలా ఇస్తారు ?, ఇలాంటి వారికి ఉద్యోగాలు ఇచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారు’ అని ప్రశ్నించారు. -
ఫస్ట్ ర్యాంకర్ కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు..?
-
‘వేళ్లన్నీ లోకేష్వైపే.. రాజీనామా చేయాల్సిందే’
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? లేక ఉత్తరకొరియా పాలన చేస్తున్నారా? అని ప్రశ్నించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. డీఎస్సీ అవకతవకలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేయటం దారుణమని మండిపడ్డారు. ఏపీలో అన్ని వేళ్లు విద్యాశాఖ మంత్రివైపు చూస్తున్నాయి. నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వమే ఉండదు అని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘డీఎస్సీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఎందుకు జాబ్ ఇవ్వలేదు?. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డీఎస్సీ అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో గాని సీబీఐతో గానీ పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలి. డీఎస్సీలో స్పోర్ట్స్ కోట పేరిట ఎలా ఉద్యోగాలు ఇస్తారు. నీట్లో జరిగిన అక్రమాలు బయటపడి దేశవ్యాప్తంగా ఎలా కలకలం రేపాయో.. ఏపీలో డీఎస్సీ వ్యవహారం కూడా అదే స్థాయిలో బయటపడుతోంది. చంద్రబాబు ముందే అప్రమత్తమై హుకుం జారీ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే ఉద్యమం ఊపందుకుంటుంది. అన్ని వేళ్ళు విద్యాశాఖ మంత్రి వైపే చూపిస్తున్న తరుణంలో ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలి. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వమే ఉండదు. డైవర్షన్ పాలిటిక్స్కు ఆద్యుడు చంద్రబాబే. రష్యాలో లోకేష్ మాట్లాడిన మాటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్లు ఎకానమీ చేస్తామంటున్నారు. అందులో పదో వంతు కూడా రాష్ట్ర ఎకానమీ లేదు. సంపద సృష్టి అని చెప్పిన చంద్రబాబు మాటలు ఎక్కడికి వెళ్ళిపోయాయి. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది. దారుణమైన విధానాలు అవలంబిస్తున్న ఈ ప్రభుత్వానికి ఇంకా ప్రజలు ఓటేస్తున్నారంటే మనల్ని మనం ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అనుసరిస్తారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
జీవితాంతం అబద్ధాలతోనే బతుకుతారా?
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ పూర్తిగా భ్ర బ్రష్టుపట్టాయని, ఏ ఒక్క వర్గానికీ మేలు జరగలేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘మెగా డీఎస్సీ పేరుతో నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారు. ఆఖరికి క్రీడల కోటా కింద 52 ముక్కల పేకాట (బ్రిడ్జ్) గేమ్ను కూడా చేర్చి అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల యువత భవిష్యత్తులో క్లబ్బుల బాట పట్టే ప్రమాదం ఉంది. మాజీ సీఎం వైఎస్ జగన్ డీఎస్సీలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హోంమంత్రి అనిత దానికి సమాధానం చెప్పకుండా, గత ప్రభుత్వం టీచర్లను వైన్షాప్ల వద్ద కాపలా పెట్టిందని అబద్ధాలు మాట్లాడారు. దీనికి ఆధారాలు చూపిస్తారా? ఇలా జీవితాంతం అబద్ధాలతోనే బతుకుతారా? ఇలా అబద్ధాలతో ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారు? దమ్ముంటే డీఎస్సీ అక్రమాలపై సూటిగా సమాధానం చెప్పండి. నిజానికి మరుగుదొడ్లు, పార్కింగ్ స్థలాలు, పెట్రోల్ బంకులు, రేషన్ షాపుల వద్ద ఉద్యోగులతో అడ్డదిడ్డమైన పనులు చేయించింది చంద్రబాబు సర్కారే. ఇందుకు సహకరించని ఉద్యోగులను అక్రమ కేసులు పెడతామని బెదిరించిన చరిత్ర కూడా చంద్రబాబు ప్రభుత్వానిదే’ అని విమర్శించారు. ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హతే లేదు చంద్రబాబు సర్కార్కు ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హతే లేదని కాకర్ల స్పష్టం చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం తడిగుడ్డతో ఉద్యోగుల గొంతు కోస్తోంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వేధింపులకు గురి చేస్తోంది. ప్రభుత్వంలో ఒత్తిడి భరించలేక 100కు పైగా ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గత జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, చేసిన మేలు, చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఏవి అమలు చేశారో బేరీజు వేసుకుంటే ఎవరు ఉద్యోగులకు మేలు చేశారో తెలుస్తుంది. చంద్రబాబు ప్రభుత్వంలో ఐఆర్, పీఆర్సీ, డీఏలు లేవు. ప్రమోషన్లు లేవు. గత ప్రభుత్వం మొదలు పెట్టిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు. పైగా రెగ్యులరైజేషన్ కోసం లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఎల్లో మీడియాలోనే వచ్చింది. ఇలా అడ్డగోలు పనులు చేస్తూ వాటిని ప్రశ్నిస్తే నాలాంటి వారిని డిస్మిస్ చేస్తారా? ప్రజాస్వామ్యంలో ఇలా ఎక్కడైనా.. ఎప్పుడైనా జరిగిందా?’ అని ప్రశ్నించారు. ఉద్యోగులను అడ్డగోలు పనులకు వినియోగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను మీడియాకు కాకర్ల చూపించారు. వీటిని హోం మంత్రి అనిత చూడాలని అన్నారు. -
'కోఎంప్ట్'కు కోట్ల ఫలహారం!
సాక్షి, అమరావతి: మంత్రి నారా లోకేశ్ మంత్రిత్వ శాఖలో అడ్డగోలు అవినీతి బాగోతాలు విభ్రాంతి కలిగిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భారీ దోపిడీకి పాల్పడుతున్న వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఇప్పటికే డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలతో యావత్ రాష్ట్రం విస్మయానికి గురైంది. ఇక లోకేశ్ పేషీ అవినీతి మకిలి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకూ పాకింది. ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షా పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియలో భారీ అవకతవకలతో కోఎంప్ట్ ఎడ్యూటెక్ సంస్థ నిర్వాకంతో యావత్ దేశం అవాక్కయింది. కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి సీబీఎస్ఈ బోర్డ్ చైర్మన్, కార్యదర్శులను తొలగించిన విషయం తెలిసిందే. అదే కోఎంప్ట్ సంస్థ నిర్వాకంతో గతంలో తెలంగాణలో 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం గమనార్హం. అటువంటి ట్రాక్ రికార్డు ఉన్న కోఎంప్ట్ సంస్థతో మంత్రి లోకేశ్ పేషీ సాగించిన అవినీతి జుగల్బందీ తాజాగా బట్టబయలైంది. ఉన్నత విద్యా మండలి అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఏటా రూ.172 కోట్ల చొప్పున రానున్న మూడేళ్లలో దాదాపు రూ.520 కోట్ల కాంట్రాక్టును అడ్డగోలుగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 30 లక్షల మంది యూనివర్సిటీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ లోకేశ్ పేషీ సాగించిన అవినీతి నిర్వాకం విస్తుగొలుపుతోంది. డిజిటల్ మూల్యాంకనం ముసుగులో దోపిడీ హైదరాబాద్కు చెందిన కోఎంప్ట్ ఎడ్యూటెక్ సంస్థ ద్వారా మంత్రి లోకేశ్ పేషీ దోపిడీకి తెగబడింది. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల విద్యార్థుల పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం ముసుగులో అవినీతికి తెరతీసింది. ఉన్నత విద్యా మండలి అభ్యంతరాలను కూడా బేఖాతరు చేస్తూ అడ్డగోలుగా వ్యవహారం సాగించింది. విశ్వవిద్యాలయాలతో నిమిత్తం లేకుండా ఏపీటీఎస్ ద్వారా కథ నడిపించి.. కోఎంప్ట్ సంస్థకు టెండరు కట్టబెట్టేయడం విస్మయ పరుస్తోంది. నిధుల దోపిడీకి కోఎంప్ట్ ఎడ్యూటెక్ మూడు కేటగిరీల ముసుగులో ప్రతిపాదనలకు లోకేశ్ పేషీ ద్వారా ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఒక్కో విద్యార్థి పరీక్షా పత్రం మూల్యాంకనం కోసం రూ.32, ఒక్కో పరీక్షా పత్రం ఆన్స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) కోసం రూ.25.75 చొప్పున కోట్ చేసింది. మొత్తం అన్ని ఫీచర్లతో డిజిటలైజేషన్ సేవల కోసం రూ.115 చొప్పున కోట్ చేయడం గమనార్హం. అంతేకాదు కోఎంప్ట్ ఎడ్యూటెక్కు కంప్యూటర్లు, ఇతర మౌలిక వసతులను విశ్వవిద్యాలయాలే సమకూర్చాలి. అంటే ఎటువంటి మూల ధన వ్యయం లేకుండానే కేవలం డిజిటల్ ప్రక్రియను మాత్రమే కోఎంప్ట్ సంస్థ నిర్వహిస్తుందని నిబంధన పెట్టడం విడ్డూరంగా ఉంది. ఆ ప్రతిపాదనలను లోకేశ్ పేషీ ఆమోదించి ఆ మేరకు కోంఎప్్టతో ఒప్పందం చేసుకోవాలని విశ్వవిద్యాలయాలపై ఒత్తిడి తెస్తోంది. త్వరలో విశ్వవిద్యాలయాలు అందుకు పచ్చజెండా ఊపనున్నాయి. ఏకంగా మంత్రి లోకేశ్ పేషీ నుంచి ఒత్తిడి వస్తుండంతో తమకు మరోమార్గం లేకుండా పోయిందని విశ్వవిద్యాలయాల అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. ఏటా రూ.172 కోట్ల ప్రాజెక్టుకు ఎత్తుగడ విశ్వవిద్యాలయాల పరీక్షా పత్రాల డిజిటలైజేషన్ ముసుగులో కోఎంప్ట్ సంస్థకు భారీ కాంట్రాక్టు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో కలిపి మొత్తం 30 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. సెమిస్టర్ విధానంలో మొత్తం విద్యార్థులు అన్ని పరీక్షలకు కలిపి 1.50 కోట్ల బుక్లెట్లు (పరీక్షా పత్రాలు) రాస్తారు. ఒక్కో బుక్లెట్కు రూ.115 చొప్పున ఏడాదికి మొత్తం రూ.172 కోట్ల కాంట్రాక్టును కోఎంప్ట్ కు అడ్డగోలుగా కట్టబెట్టేందుకు లోకేశ్ పేషీ మంత్రాంగం వేగవంతం చేసింది. ఆ ప్రకారం రానున్న మూడేళ్లలో దాదాపు రూ.520 కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ముసుగులో కమీషన్ల రూపంలో భారీ అవినీతికి పన్నాగం పన్నింది. వాస్తవానికి రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలల పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం కాంట్రాక్టును కోఎంప్ట్ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ డిజిటల్ మూల్యాంకనం ప్రక్రియ కూడా మొదలు పెట్టింది. ఇంతలో సీబీఎస్ఈ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో కోఎంప్ట్ సంస్థ నిర్వాకం బట్టబయలైంది. దాంతో సాంకేతిక విద్యా మండలి ప్రస్తుతానికి పాలిటెక్నిక్ పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం నిలుపుదల చేసింది. కోఎంప్ట్ సంస్థ కొన్ని నెలల క్రితం వరకు రాయలసీమ విశ్వవిద్యాలయంలో డిజిటల్ మూల్యాంకనం చేట్టింది. సీబీఎస్ఈ వ్యవహారంతో ప్రస్తుతం నిలిపివేసింది. అయినా సరే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు డిజిటల్ మూల్యాంకనం కోసం కోఎంప్ట్ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని లోకేశ్ పేషీ తీవ్ర ఒత్తిడి తెస్తుండటం గమనార్హం. విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లను పిలిపించి మరీ కోఎంప్ట్ సంస్థతో ఒప్పందం చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. అందుకు టైమ్ లిమిట్ పెట్టి మరీ ఒప్పందం చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. తెలంగాణాలో 20 మంది ఆత్మహత్య కోఎంప్ట్ నిర్వాకం గతంలో తెలంగాణను హడలెత్తించింది. 2019లో గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్గా ఉన్న ఆ సంస్థ ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం కాంట్రాక్టు దక్కించుకుంది. అడ్డగోలుగా మూల్యాంకనం చేసింది. మొత్తం 9.70 లక్షల మంది విద్యార్థుల్లో 3.80 లక్షల మంది అంటే 40 శాతం మంది ఫెయిల్ అయ్యారు. అది తట్టుకోలేక 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. దాంతో గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ను తెలంగాణ ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది. ఆ తర్వాత ఆరు నెలలకు ఆ సంస్థ తన పేరును కోఎంప్ట్ ఎడ్యూటెక్గా మార్చుకోవడం గమనార్హం.అప్పట్లోనే వెనకేసుకొచ్చిన టీడీపీ ప్రభుత్వం 2013లో అదే గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ జేఎన్టీయూలో రూ.230 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులను దక్కించుకుంది. నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ టెండర్గా అప్పటి జేఎన్టీయూ ఉన్నతాధికారులు కాంట్రాక్టు కట్టబెట్టారు. గ్లోబెరేనా టె క్నాలజీస్ ఇ–కంటెంట్ కోసం మలేషియాకు చెందిన ఓ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఆ కాంట్రాక్టు కింద జేఎన్టీయూ గ్లోబెరేనా టెక్నాలజీస్కు రూ.20 కోట్లు చెల్లించింది. అడ్డగోలుగా టెండరు కట్టబెట్టడం, నిబంధనలకు విర్దుద్ధంగా నిధుల చెల్లింపుపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 2014లో టీడీపీ ప్రభుత్వం విచారణ కమిటీ పేరుతో కనికట్టు చేసింది. కానీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపించి అవినీతిని నిగ్గు తేల్చింది. బిల్లుల చెల్లింపును నిలిపివేసింది. దీనిపై గ్లోబెరేనా టెక్నాలజీస్.. కాంట్రాక్టు మేరకు రూ.230 కోట్లు చెల్లించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.పేరుమార్చుకుని ఏమార్చిన కోఎంప్ట్ సీబీఎస్ఈ పరీక్ష పత్రాల మూల్యాంకనం, డిజిటలైజేషన్ ప్రక్రియలో అవకతవకలతో కోఎంప్ట్ ఎడ్యూటెక్ బాగోతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్గా ఉన్న ఆ సంస్థను బ్లాక్లిస్టు్టలో పెట్టారు. కానీ అదే సంస్థ కోఎంప్ట్ ఎడ్యూటెక్గా పేరుమార్చుకుని ఏకంగా కేంద్ర ప్రభుత్వానికే మస్కా కొట్టింది. పరీక్షా పత్రాలను ఆన్లైన్లో మూల్యాంకనం చేసేందుకు సీబీఎస్ఈ ఈ ఏడాది ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ (ఓఎస్ఎం) విధానం చేపట్టింది. ఆ కాంట్రాక్టును హైదరాబాద్కు చెందిన కోఎంప్ట్ సంస్థ దక్కించుకుంది.సీబీఎస్ఈ పరీక్షా ఫలితాల వెల్లడితో ఆ సంస్థ నిర్వాకం బట్టబయలైంది. విద్యార్థుల మార్కుల్లో భారీ వ్యత్యాసాలు బయటపడ్డాయి. ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా పరీక్షా పత్రాలను పబ్లిక్ క్లౌడ్ (ఏడబ్ల్యూఎస్) బకెట్లలో భద్రపరచడం పట్ల సైబర్ నిపుణులు విస్మయం వ్యక్తం చేశారు. డిజిటల్ లీకేజీ బయట పడింది. ఇక పరీక్షా పత్రాలు కంప్యూటర్ స్క్రీన్ మీద సరిగా కనిపించక పోవడం, విద్యార్థులు రాసిన జవాబులకు.. వచ్చిన మార్కులకు పొంతన లేకపోవడం, విద్యార్థులకు రావాల్సిన మార్కుల కంటే తక్కువ మార్కులు వేయడం తదితర లోపాలు వెల్లడయ్యాయి. అంతేకాదు కోఎంప్ట్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా సీబీఎస్ఈ ఓఎస్ఎం కాంట్రాక్టు దక్కించుకున్న వ్యవహారాన్ని సార్థక్ సిద్ధాంత్ అనే 17 ఏళ్ల విద్యార్థి పరిశోధించి మరీ వెలుగులోకి తెచ్చారు. గతంలో బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థలకు ఈ టెండర్లలో పాల్గొనడానికి అర్హత లేదనే నిబంధనను కోఎంప్్టకు అనుకూలంగా మార్చారు. ప్రస్తుతం బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థలకే అర్హత లేదని మార్చడం గమనార్హం. కోఎంప్ట్ కు అడ్డగోలుగా కాంట్రాక్టు కట్టబెట్టేందుకు ఇలా అడ్డగోలుగా వ్యవహరించారు. గతంలో గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్గా ఉన్న ఈ సంస్థ బ్లాక్ లిస్టులో ఉన్న విషయాన్ని మరుగున పరిచేందుకే కోఎంప్ట్ ఎడ్యూటెక్గా పేరుమార్చుకుందన్న విషయం వెలుగులోకి వచ్చింది. సీబీఎస్ఈ బోర్డ్, కోఎంప్ట్ నిర్వాకంపై యావత్ విద్యార్థి లోకం, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దాంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. సీబీఎస్ఈ బోర్డ్ చైర్మన్, కార్యదర్శిని పదవుల నుంచి తొలగించింది. -
కాపీ కొట్టి దొరికిపోయిన ‘శాప్’ చైర్మన్?
సాక్షి, అమరావతి: పరీక్షల్లో కాపీ కొట్టి దొరికిపోయిన వ్యక్తి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్గా ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ.. ఇది నిజమంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు బల్లగుద్ది చెబుతున్నారు. అంతేకాదు. వారు చెబుతున్న దానికి సాక్ష్యంగా టీడీపీకి నిత్యం బాకా ఊదే ఈనాడులో అప్పట్లో ప్రచురితమైన వార్తా కథనాలను సాక్ష్యంగా చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ అంశం నెట్టింట వైరల్గా మారింది. 2013లో తిరుపతిలో నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం రీసెర్చ్ ఎంట్రన్స్ టెస్ట్లో భాగంగా జరిగిన మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ప్రవేశ పరీక్షకు ప్రస్తుత శాప్ చైర్మన్ అనిమి రవికుమార్ (రవినాయుడు) హాజరయ్యారు.ఆ సమయంలో ఆయన పరీక్షా కేంద్రంలో కాపీ కొడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించినట్టు ఈనాడు సహా అప్పటి మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ కథనాల ప్రకారం.. పరీక్ష చివరి దశలో విద్యార్థి సంఘాల నాయకులు పరీక్షా హాల్లోకి వెళ్లి ఇన్విజిలేటర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం రవినాయుడు కాపీ కొడుతూ పట్టుబడ్డారని వార్తలు వెలువడ్డాయి. క్రీడాకారుల భవిష్యత్కు సంబంధించిన కీలక పదవిలో ఉన్న వ్యక్తి వెనుక ఇలాంటి గతం ఉండటం ఇప్పుడు రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పుడేమంటారో!! డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికలపై తీవ్ర ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో అవన్నీ నిరాధార ఆరోపణలని, బాధితులు కూడా లేరని, దీనిపై ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమని శాప్ చైర్మన్ ప్రగల్బాలు పలికారు. ఆయన సవాల్కు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు గట్టి సమాధానం ఇస్తున్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు సంబంధించి బాధితులు బయటకు వచ్చి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ గోడు చెప్పుకున్నారు. ఆ సమయంలో బంగారు పతకం సాధించిన వారికి ఉద్యోగం ఇవ్వకుండా కాంస్య పతకం, పార్టిసిపేషన్ సరి్టఫికెట్ ఉన్న వారికి స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టులు ఇచ్చేశారంటూ ఆధారాలతో సహా చూపించి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ వీడియోలను రవికుమార్ సవాల్కు చెంపపెట్టుగా నెటిజన్లు చూపిస్తున్నారు. -
స్పెషల్ కమిషన్ వేస్తా.. మీ ఉద్యోగం మీకు వచ్చేలా చేస్తా..! DSC అభ్యర్థులకు జగన్ హామీ
-
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.
-
మా ఉద్యోగాలు అనర్హులకు ఇచ్చేశారు.. మా జీవితాలను రోడ్డున పడేశారు
-
లోకేష్ గుట్టురట్టు.. పరీక్ష లేకుండానే టీచర్ పోస్టులు.. మెగా DSCలో లీకులు
-
సీబీఐతో విచారించాలి
పోరాడితేనే నిలబడగలుగుతాం. దేవుడి దయ వల్ల మూడేళ్ల తర్వాత మనం అధికారంలోకి వస్తాం. మనం రాగానే కమిషన్ ఏర్పాటు చేసి మీ కేసులన్నీ విచారించి అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం. 1998, 2008 డీఎస్సీలో కూడా అన్యాయం అయిపోయిన వారికి మనం న్యాయం చేశాం. డీఎస్సీ 2025లో అన్యాయానికి గురైన అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తాం. -డీఎస్సీ బాధిత అభ్యర్థులకు వైఎస్ జగన్ భరోసా సాక్షి, అమరావతి: ఒక పోస్టుకు ఒక్కరు (1:1) నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలిచి అన్నింటా సక్సెస్ అయిన అనేక మంది డీఎస్సీ 2025 అభ్యర్థులకు ఉద్యోగాలు రాకపోవడం అత్యంత హేయం.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్షేపించారు. పరీక్ష నిర్వహణ, ఎంపికలో అంతులేని అక్రమాలు చోటు చేసుకున్నట్లు అభ్యర్థులు చెబుతున్న విషయాలను బట్టి తెలుస్తోందని, అందుకే డీఎస్సీ 2025పై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన డీఎస్సీ 2025 అభ్యర్థులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు. పరీక్ష నిర్వహణ, ఎంపికలో చోటు చేసుకున్న అక్రమాలను వైఎస్ జగన్ దృష్టికి తెచ్చి తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ అభ్యర్థుల ఆవేదన, బాధలను సావధానంగా విన్న వైఎస్ జగన్ వారికి న్యాయం జరిగేలా పోరాడతామని భరోసా ఇచ్చారు. ఇష్టారాజ్యంగా జీవోలు జారీ చేసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని, దీనివల్ల అర్హులైన ఎందరో అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. వారి తరఫున న్యాయ పోరాటం చేస్తామన్నారు. అందుకోసం పార్టీ నుంచి లీగల్ ప్యానెల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే ఈ డీఎస్సీపై కమిషన్ వేసి విచారణ జరిపిస్తామని చెప్పారు. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని.. తప్పు చేసిన వారిని శిక్షిస్తామని చెప్పారు. వైఎస్ జగన్ ఏమన్నారంటే.. నాడు పారదర్శకంగా ఒకేసారి 1.30 లక్షల ఉద్యోగాలు.. వైఎస్సార్సీపీ హయాంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే 2019లో గాంధీ జయంతి నాటికి 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడా, ఏ వివాదం రాలేదు. అంత పారదర్శకంగా పరీక్ష నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇచ్చాం. అదే చంద్రబాబు కేవలం 16 వేల ఉద్యోగాల్లో ఇన్ని అక్రమాలు, అవకతవకలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకే మీ తరఫున న్యాయపోరాటం చేస్తాం. మీకు ఖర్చు లేకుండా మేమే భరించి, కోర్టులో పోరాడతాం. పని పూర్తి కాగానే మళ్లీ నియమావళిని మార్చేసి.. స్పోర్ట్స్ కోటా పేరిట మొదట ఒక జీవో ఇచ్చారు. ఎలాంటి పరీక్ష అవసరం లేదని, కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా ఇస్తామని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు భర్తీ చేసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత మరో జీవో జారీ చేసి.. ఆ కోటాలో అభ్యర్థులు ఇక నుంచి పరీక్ష రాయాలని, ఇతర అర్హతలు కూడా కలిగి ఉండాలని నిర్దేశించారు. అంటే తమ పని పూర్తి కాగానే మళ్లీ నియమావళిని మారుస్తూ మరో జీవో ఇచ్చారు. డీఎస్సీ నిర్వహణలో ఎక్కడా పారదర్శకత లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఉద్యోగాలు అమ్ముకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పుల మీద తప్పులు.. 1:1 పద్ధతిలో పిలిచి సర్టిఫికెట్ పరిశీలన కూడా పూర్తి చేసి, రిజెక్ట్ చేయడం ఒక తప్పు. రెండో అనైతికం ఏమిటంటే.. ఏ పరీక్షా రాయకుండా స్పోర్ట్స్ కేటగిరీ అని చెప్పి వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం మీకు అన్యాయం చేశారు. ఆ పని పూర్తి చేయగానే గేట్లు మూసి మరో జీవో ఇచ్చారు. ఇంతకంటే దగా, మోసం మరొకటి ఉంటుందా? ఓ జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వ చ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వలేదు. ఎందుకంటే.. అతడు సర్టిఫికెట్ వెరిఫికేషన్కు రాలేదని చెప్పారు. కానీ అదే అభ్యర్థి తనకు ఉద్యోగం ఇవ్వలేదని కోర్టుకు వెళ్లాడు. పరీక్షకు ముందే పేపర్లు లీక్ చేయడం.. ఆ తర్వాత ఇష్టానుసారంగా జీవోలు జారీ చేయడం.. 1:1 పద్ధతిలో సర్టిఫికెట్లు వెరిఫై చేసి అన్నీ కరెక్టుగా ఉన్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడం... ఆ తర్వాత మెరిట్ వాళ్లకు కాకుండా కింద ఉన్నవారికి ఇవ్వడం... వీటిపై గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేస్తే స్పష్టమైన సమాధానాలు చెప్పలేదు. మీరంతా క్వాలిఫైడ్ కాబట్టే మీకు కాల్ లెటర్స్ కూడా వచ్చాయి. మిమ్మల్ని 1:1 నిష్పత్తిలో పిలిచి అన్యాయం చేశారు. రెండు జీవోలు జారీ చేసి ఇష్టానుసారంగా ఉద్యోగాలు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఏ అర్హత లేకపోయినా, టెట్ క్వాలిఫై కాకపోయినా ఉద్యోగాలు ఇచ్చారు. అలా వారు అనుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మళ్లీ ఇంకో జీవో ఇచ్చి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి అన్ని అర్హతలు ఉండాలని, పరీక్ష కూడా రాయాలంటూ జీవో జారీ చేశారు. మీకు అండగా న్యాయ పోరాటం చేస్తాం.. మావైపు నుంచి మీకు పూర్తి అండగా ఉంటాం. మాకు ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నారు. విద్యార్థి విభాగం ఉంది. లీగల్ టీమ్ ఉంది. వారితో ఒక ప్యానెల్ ఏర్పాటు చేసి మీ తరఫున కోర్టులో పిటిషన్ వేసి పోరాడతాం. మూడేళ్ల తర్వాత మన ప్రభుత్వం రాగానే ఒక కమిషన్ వేసి పూర్తి విచారణ జరిపించి మీకు న్యాయం జరిగేలా చూస్తాం. అప్పటి వరకు ఈ మూడేళ్లూ మీ తరఫున న్యాయపోరాటం కొనసాగిస్తాం. మీ అందరికీ ఒకటే హామీ..! పోరాడితేనే నిలబడగలుగుతాం. దేవుడి దయ వల్ల మూడేళ్ల తర్వాత మనం అధికారంలోకి వస్తాం. మనం అధికారంలోకి రాగానే కమిషన్ ఏర్పాటు చేసి మీ కేసులన్నీ విచారించి న్యాయం చేస్తాం. 1998, 2008 డీఎస్సీలో కూడా అన్యాయం అయిపోయిన వారికి మనం న్యాయం చేశాం. డీఎస్సీ 2025లో అన్యాయానికి గురైన అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తాం. మన ప్రభుత్వం రాగానే విచారణ జరిపిస్తాం..రేపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే డీఎస్సీ 2025 అక్రమాలపై విచారణ జరిపిస్తాం. కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడు సీబీఐ విచారణకు గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మూడేళ్ల తర్వాత మన ప్రభుత్వం రాగానే మీ స్పెసిఫిక్ కేసుల మీద ఒక కమిషన్ వేసి విచారణ జరిపిస్తాం. మీకు న్యాయం జరిగేలా చూస్తాం. పోరాడితేనే న్యాయం జరుగుతుంది. న్యాయం ఆలస్యం కావొచ్చు. కానీ జరగకుండా ఉండదు. -
మా భవిష్యత్తు మట్టి కొట్టుకుపోయింది.. మెరిట్తో సర్కారు ‘ఆటలు’!
సాక్షి, అమరావతి: ‘‘మంత్రి నిర్వాకంతో మా భవిష్యత్తు మట్టి కొట్టుకుపోయింది. తమ వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఇష్టానుసారంగా నియమాలు మార్చారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీలో అంతులేని అక్రమాలు చేశారు..! ఎన్నిసార్లు లోకేశ్ను కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు..! 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసినట్లు మాకు న్యాయం చేయండి...! మెగా డీఎస్సీ మెరిట్ లిస్టులో నా పేరొచ్చింది. 1:1 రేషియోలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయింది. తీరా సెలక్షన్ లిస్టులో నా పేరు లేదు. కారణం అడిగితే.. ఆ పోస్టు స్పోర్ట్స్ కేటగిరీలో ఇచ్చామని.. హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల పోస్టు మిస్సయ్యిందని చాలా తేలిగ్గా సమాధానం చెబుతున్నారు. వెరిఫికేషన్కి వచ్చినంత మాత్రాన జాబ్ ఇస్తామన్నట్లు కాదని అంటున్నారు..! కోర్టు ఆర్డర్ కాపీ పట్టుకుని తిరుగుతున్నా లెక్క చేయడం లేదు..! నేషనల్ గేమ్స్లో బంగారు పతకం సాధించినా నాకు పోస్టు ఇవ్వలేదు.. రజతం, కాంస్య పతకం ఉన్నవారికి మాత్రం ఉద్యోగాలిచ్చారు.. సర్టిఫికెట్లు పరిశీలించకుండా పోస్టులు ఇచ్చేశారు...! అసలు ఏ పరీక్షా రాయని వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం ఇచ్చి మెరిట్లో ఉన్న మాకు అన్యాయం చేశారు..! మెరిట్ లిస్టులో వచ్చిన వారికి రిజర్వేషన్ కేటగిరీలో ఉద్యోగం ఇవ్వడంతో నాకు రావాల్సిన ఉద్యోగం రాకుండా పోయింది...! కటాఫ్ మార్కులు ప్రకటించకపోవడం వల్ల చాలా గందరగోళంగా ఉంది...! ఉన్నది 3 పోస్టులు... ముగ్గురమే ఉన్నాం... కానీ ఫైనల్ జాబితాలో నా పేరు లేదు. కారణం అడిగితే స్పోర్ట్స్ కోటాలో ఆ జాబ్ ఇవ్వాల్సి వచ్చిందని చెబుతున్నారు..! నిబంధనలకు విరుద్ధంగా టీచర్ పోస్టులను భర్తీ చేశారని మా బాధ ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోవడం లేదు..! ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు.. మాకు మీరు మాత్రమే న్యాయం చేయగలరు..!!’’ ఇదీ మెగా డీఎస్సీ 2025 వేలాది మంది బాధిత అభ్యర్థుల ఆక్రందన!! మెరిట్లో ఉండి అన్యాయానికి గురైన అభ్యర్థులు బుధవారం పెద్ద ఎత్తున తరలివచ్చి తాడేపల్లిలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ గోడు చెప్పుకున్నారు. డీఎస్సీ నిర్వహణ, టీచర్ పోస్టుల ఎంపికలో జరిగిన అనేక అక్రమాలను ఆయనకు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారంతా కలిసి మీడియాతో మాట్లాడారు.తమకు జరిగిన అన్యాయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరిస్తున్న డీఎస్సీ–2025 బాధిత అభ్యర్థులు నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ను పక్కనబెట్టారు నేను నేషనల్ గేమ్స్లో బంగారు పతకం విజేతను. మా జిల్లా నుంచి 6 పోస్టులు ఉంటే రజతం, కాంస్య పతక విజేతలకు ఉద్యోగాలు ఇచ్చి నాకు బంగారు పతకం ఉన్నా ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. – అనిగి దుర్గయ్య, పోలవరం మండలం, ఏలూరు జిల్లా లోకేశ్ వద్దకు వెళితే.. మెగా డీఎస్సీలో ర్యాంక్ తెచ్చుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు కూడా హాజరయ్యా. ఎస్జీటీ ఉర్దూ మీడియంలో పరీక్ష రాసింది నలుగురం మాత్రమే. అందులో ముగ్గురిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. ఎస్టీ వర్గానికి చెందిన నా పేరు తుది జాబితాలో లేదు. రోస్టర్ నంబర్లు అటూ ఇటూ చేసి నన్ను కాదని ఒక మహిళకు ఇచ్చారు. క్యారీ ఫార్వర్డ్ పోస్టు కాబట్టి నాకు కచ్చితంగా రావాలి. నాకు జాబ్ ఎందుకు రాలేదో వివరాలు చెప్పమని అప్లికేషన్ రాసిస్తే పక్కన పడేశారు. దానిపై స్టాంప్ వేసి ఇస్తే కోర్టుకు వెళ్తారని, అందుకే ఆ పని చేయబోమని అధికారులు చెప్పారు. మంత్రి నారా లోకేశ్ను కలవడానికి ఛాంబర్కు వెళ్తే అనుమతి లేదంటూ ఓఎస్డీ నా అప్లికేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ శాఖకు పంపించారు. చివరకు ఎస్టీ కమిషన్ను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది.– ఎం.జగదీష్ నాయక్, వైఎస్సార్ కడప జిల్లాఇష్టారీతిన నియమాలు మార్చారు నేను ఉర్దూ మీడియంలో చదువుకున్నా. పదో తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ కాగా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. ఇంటర్ నుంచి ఇంగ్లిష్ మీడియం. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సందర్భంగా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉండాలన్నారు. ఈ డీఎస్సీలో గతంలో లేని విధంగా నియమాలు మార్చారు. – ఎండీ షాబుద్దీన్, విశాఖ జిల్లాచాలా అన్యాయం.. నేను ఎస్సీని. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చక్కగా జరిగింది. నాకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత డీఈవో ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మళ్లీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ అడిగితే పంపా. మాకు 3 పోస్టులు ఉన్నాయి. మేము ముగ్గురమే ఉన్నాం. కానీ ఫైనల్ జాబితాలో మాత్రం నా పేరు లేదు. కారణం అడిగితే స్పోర్ట్స్ కోటాలో ఆ జాబ్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. నాకు చాలా అన్యాయం జరిగింది. – ఇందిర, కృష్ణా జిల్లాఅన్నీ బాగున్నా జాబ్ రాలేదు.. నేను కరాటే బ్లాక్బెల్ట్ ఛాంపియన్ను. మా ఊరిలో 37 మంది డీఎస్సీ రాస్తే నేను ఒక్కదాన్నే పాస్ అయ్యా. నేను ఓపెన్ కేటగిరీలో ఉన్నా రిజర్వేషన్ కేటగిరీలో పిలిచారు. నా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ బాగా జరిగింది. కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. కారణం అడిగితే అప్పటికే అన్ని పోస్టులు భర్తీ అయ్యాయని చెప్పారు. గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. నాది బీసీ–డీ అయితే నన్ను ‘బీసీ–సి’గా చూపారు. కోర్టుకు వెళ్లినా ఎలాంటి విచారణ జరిపించడం లేదు. మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎందుకు చేశారంటే సమాధానం చెప్పలేదు. – నాగలక్ష్మి, గుంటూరు జిల్లాఇవన్నీ చంద్రబాబుకు తెలియదా? బీసీ–ఈ వర్గానికి చెందిన నేను సెకండ్ ప్లేస్లో ఉన్నా. ఎస్ఏ పోస్టు సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లా. అధికారులు కంగ్రాట్స్ కూడా చెప్పారు. కానీ సెలక్షన్ లిస్టులో నా పేరు లేదు. కారణాలు చెప్పలేదు. ఎన్నిసార్లు లోకేశ్ను కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిల్చినప్పుడు ఉద్యోగం రావాలి కదా? ఇవన్నీ చంద్రబాబుకు తెలియదా? వెరిఫికేషన్ చేసినంత మాత్రాన జాబ్ ఇవ్వాలా? అని మాట్లాడారు. మెగా డీఎస్సీలో జరిగిన అన్యాయానికి న్యాయం చేయగలిగేది మీరు ఒక్కరు మాత్రమే. మీపై ఎంతో విశ్వాసం ఉంది. – షర్మిల, మదనపల్లె. అన్నమయ్య జిల్లాజీవో 77 ప్రకారం ఓపెన్ కేటగిరీలో మెరిట్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేయాలి. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం మహిళలు, పీహెచ్సీ, ఎక్స్సర్వీస్మెన్, స్పోర్ట్స్కోటా పోస్టులు భర్తీ చేయాలి. అయితే ప్రభుత్వం అలా చేయలేదు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారట.. నాకు డీఎస్సీలో 75 మార్కులు వచ్చాయి. తొలి జాబితాలోనే నా పేరు వచ్చింది. సర్టిఫికెట్ల పరిశీలన కూడా బాగా జరిగింది. కానీ ఉద్యోగం రాలేదు. ఎందుకు అని అడిగితే.. మీ కులంలో స్పోర్ట్స్ కోటాలో ఇంకొకరికి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. మరి ముందే అతడు ఉన్నాడని తెలిసీ నన్ను ఎందుకు పిలిచారు? 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసినట్లు ఇప్పుడు కూడా న్యాయం చేయండి. – బాలకృష్ణ, కాకినాడ, జిల్లాఅవకాశం ఉన్నా పోస్టు ఇవ్వలేదు డీఎస్సీ మెరిట్లో నాకంటే ముందు ఒక అమ్మాయి ఉంది. ఆమె కానిస్టేబుల్. ఆమెది ఫేక్ సర్టిఫికెట్. మేం ఫిర్యాదు చేస్తే ఆమెను క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత నేను ఉన్నా నాకు అవకాశం ఇవ్వలేదు. విజయనగరానికి చెందిన అమ్మాయికి జాబ్ ఇచ్చారు. ఒక పోస్టు క్యాన్సిల్ అయితే తర్వాత అభ్యర్థికి ఇవ్వబోమని, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. – దుర్గామల్లిక, అమలాపురం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లామా గోడు చెబుతుంటే ‘ఫేక్’ అంటున్నారు.. మాది పేద మత్స్యకార కుటుంబం. కోచింగ్కు వెళ్లలేదు. కష్టపడి చదివా. ఫిజికల్ సైన్స్ బీసీ–సీలో నాది మూడో ర్యాంక్. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఓవరాల్ మెరిట్లో నాది 53వ ర్యాంక్. 10వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి ఓపెన్లో కాకుండా బీసీ–సీ కేటగిరీలో పోస్టు ఇచ్చారు. అతడిని ఓపెన్లో పంపించి ఉంటే నాకు మా కేటగిరీలో జాబ్ వచ్చి ఉండేది. నాకు జాబ్ ఎందుకు రాలేదని అధికారులను అడిగితే ఒక అమ్మాయి స్పోర్ట్స్ సర్టిఫికెట్తో వచ్చిందని చెప్పారు. మా గోడు ‘సాక్షి’లో ప్రచురిస్తే మమ్మల్ని ఫేక్ అని ప్రచారం చేస్తున్నారు. – శ్రావణ్కుమార్, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లాతీరని అన్యాయం.. నాది బీసీ–ఏ. ఇందులో ఒకటే పోస్టు ఉంది. నేను ఒక్కదాన్నే ఉన్నా. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినా చివరకు ఉద్యోగం రాలేదు. మహిళా రిజర్వేషన్లో ఒక పోస్టు ఉంది. అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నా. ఫిజికల్ సైన్స్లో మాకు అర్హత ఉంది. ఎమ్మెస్సీ చదివా. నాకు స్పోర్ట్ సర్టిఫికెట్ ఉన్నా జనరల్ కేటగిరీలో దరఖాస్తు చేశా. కానీ నాకు తీరని అన్యాయం చేశారు. – లక్ష్మీపార్వతి, వైఎస్సార్ కడప జిల్లా మెరిట్లో ఉన్నా అన్యాయం.. నాది జనరల్ కేటగిరిలో 76వ ర్యాంక్. ఓహెచ్లో ఫస్ట్ ర్యాంక్. జిల్లాలో ఫస్ట్ వచ్చా. కానీ నాకు మొదటి విడతలో కాకుండా రెండో దశలో కాల్ లెటర్ పంపారు. మెడికల్ టెస్టు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా జరిగింది. కానీ జాబ్ రాలేదు. రోస్టర్లో మరొకరు ముందు ఉన్నారని చెప్పారు. 137వ ర్యాంక్ వచ్చిన ఆమెకు జాబ్ ఇచ్చారు. మెరిట్లో ఉన్నా నాకు ఇవ్వకుండా అన్యాయం చేశారు. – నరసింహారావు, ప్రకాశం జిల్లాఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిటోరియస్ క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 4 ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదు నేను ఎస్ఏ సోషల్లో డీఎస్సీ రాశా. మా బీసీ–డీ కేటగిరీలో 7 పోస్టులు ఉంటే 5 పోస్టులు జనరల్లో మిగిలిన రెండు మా కేటగిరీలో ఉన్నాయి. నన్ను సర్టిఫికెట్ పరిశీలనకు పిలిచినా జాబ్ ఇవ్వలేదు. నా పోస్టు హారిజాంటల్ రిజర్వేషన్లో మరొకరికి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. డీఈవో ఆఫీస్లో అడిగితే తమకేమీ తెలియదని విజయవాడ వెళ్లమన్నారు. అక్కడకు వెళ్తే తమకు సంబంధం లేదంటున్నారు. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు. మాకు మీరు మాత్రమే న్యాయం చేయగలరు. – ఏకాంబరం, మాదిరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా జీరో ర్యాంకు వారికి ఉద్యోగం ఇచ్చారు నా సర్టిఫికెట్ వెరిఫికేషన్ బాగా జరిగింది. నాది బీసీ–బీలో మూడో పోస్టు. కానీ జాబ్ రాలేదు. నాకు ఇవ్వకుండా స్పోర్ట్స్ కేటగిరీలో ఇచ్చామని చెప్పారు. నాపేరు రిజెక్ట్ లిస్ట్లో కూడా లేదు. అదేమని అడిగితే సమాధానం చెప్పడం లేదు. నాకు అన్యాయం చేసి జీరో ర్యాంక్ ఉన్న వ్యక్తికి స్పోర్ట్స్ కోటా కింద జాబ్ ఇచ్చారు. – రాణి, కృష్ణా జిల్లాడిగ్రీ లేకున్నా పోస్టు ఇచ్చారు మాకు (మహిళలకు) ఓపెన్ కేటగిరీలో 30 పోస్టులు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటా కింద అందులోకి ఒకరిని తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు డిగ్రీ లేదు కాబట్టి అది పూర్తి చేసుకోవడానికి మూడేళ్ల సమయం ఇచ్చారు. అంటే.. అర్హత లేకున్నా ఉద్యోగం ఇచ్చి, ఆ తర్వాత చదువుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఆమెది ఓసీ. ఆమెను తీసుకొచ్చి మా కేటగిరీలో వేశారు. దాంతో నా ఛాన్స్ పోయింది. – వీరవేణి, తూర్పు గోదావరి జిల్లా కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. నాకంటే ముందు ఒకరికి ఉద్యోగం ఇచ్చారు. అతడిది ఫేక్ సర్టిఫికెట్ అని తేలడంతో పోస్టింగ్ ఆపారు. జాబితాలో ఆ తర్వాత ఉన్న నాకు ఉద్యోగం ఇవ్వకుండా క్యారీ ఫార్వర్డ్ చేశామని చెప్పారు. ఇక్కడ అన్ని అర్హతలున్న నేను ఉన్నా, నాకు జాబ్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. – సతీష్, పశ్చిమ గోదావరి జిల్లాఅన్నీ సరిగా ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదు ఎస్సీ వర్గానికి చెందిన నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురిని ఓపెన్లో చూపారు. గ్రీవెన్స్ సెల్లో దరఖాస్తు చేస్తే నావన్నీ కరెక్టుగా ఉన్నాయని, జాబ్ ఎక్కడివ్వాలో తెలియడం లేదని సమాధానం చెప్పారు. ఆశ్చర్యం ఏమిటంటే నాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారిని మా కేటగిరీలో చూపారు. నాకంటే తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురిని ఓపెన్లో చూపారు. ఎవరిని కలిసినా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. – కె.శరత్బాబు, కాకినాడ, తూ.గో జిల్లా స్పోర్ట్స్ కోటాలో ఆయా శాఖలు నిర్వహించే అర్హత పరీక్షల్లో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలని సవరించిన జీవో వైకల్యం సర్టిఫికెట్ ‘రిజెక్ట్’.. గెరివి అంజనప్పకు ఒక కన్ను పూర్తిగా లేదు. మరో కంటికి రక్త సరఫరా లేదు. ఆయనకు కంటి చూపు లేదని ధ్రువీకరిస్తూ మెడికల్ బోర్డు (అనంతపురం జీజీహెచ్) 40 శాతం వైకల్యంతో సర్టిఫికెట్ ఇచ్చినా పట్టించుకోకుండా రిజెక్ట్ చేశారు. విజయవాడ వచ్చి కమిషనరేట్లో కలిసినా తామేమీ చేయలేమంటున్నారు. – హెచ్.వసంత్కుమార్, అనంతపురం జిల్లా (అభ్యర్థి గెరివి అంజనప్ప తరపున మాట్లాడారు)ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది... నిబంధనలకు విరుద్ధంగా అడుగడుగునా అవినీతి, అక్రమాలతో డీఎస్సీ –2025 ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. 1 : 1 పద్ధతిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి హాజరై ఉద్యోగం వస్తుందన్న భరోసాతో ఇంటికెళ్లిన వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. స్పోర్ట్స్ కేటగిరీ పేరుతో అర్హులైన అభ్యర్థుల పొట్టగొట్టారు. అర్హులకు అన్యాయం చేసి పోస్టులను అమ్ముకోవడంపై సీబీఐతో విచారించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. – ఎ.రవిచంద్ర, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
సెలక్షన్.. అంతా కలెక్షన్!
డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో సాఫ్ట్బాల్ విభాగంలో 38 పోస్టులు భర్తీ చేశారు. వీటిల్లో అత్యధికంగా 18 పోస్టుల వరకు కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లకు ఇచ్చేశారు. ఆ తర్వాత నేషనల్ గేమ్స్ సర్టిఫికెట్తో ఆరు మందికి పోస్టులు దక్కాయి. మిగిలినవి సౌత్ జోన్ చాంపియన్ షిప్, సీనియర్ నేషనల్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్కు కట్టబెట్టేశారు. ఒకరిద్దరు మాత్రమే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ 38 మంది క్రీడా సర్టిఫికెట్లలో ఆరింటికి ఏపీలోని వర్సిటీలు జెన్యూనిటీ ఇచ్చాయి. మిగిలిన వాటికి సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ), ఏపీ సాఫ్ట్బాల్ అసోసియేషన్ జెన్యూనిటీ నిర్ధారించాయి. జెన్యూనిటీని నిర్ధారించాలంటే ఆయా ఫెడరేషన్లకు కేంద్ర యువజన సర్వీసుల శాఖ (మయాస్), ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ)లో కచ్చితంగా గుర్తింపు ఉండాలి. కానీ, కొన్నేళ్లుగా ఎస్ఏఐకు మయాస్లో గానీ, ఐఓఏలో గానీ గుర్తింపు లేదు. ఎస్ఏఐపై దేశ వ్యాప్తంగా క్రీడాకారులు ఫిర్యాదులు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే ఐఓఏలో గుర్తింపు లేనప్పటికీ, ఎస్ఏఐ తమకు తాము ఐఓఏ గుర్తించినట్టు ప్రకటించుకోడంపై ఐఓఏ లీగల్ నోటీసులు జారీ చేసింది. సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకే గుర్తింపు లేనప్పుడు రాష్ట్రంలోని సాఫ్ట్బాల్ అసోసియేషన్కు ఎలా గుర్తింపు వచ్చింది? సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఏపీ సాఫ్ట్బాల్ అసోసియేషన్లు ఇచ్చిన జెన్యూనిటీని రాష్ట్ర ప్రభుత్వం, క్రీడా ప్రాధికార సంస్థ ఎలా అంగీకరిస్తుంది? ఇందులో దొంగ సర్టిఫికెట్లు లేవని ఎవరు గ్యారంటీ ఇస్తారు? అనంతపురంలో 2021-22లో సాఫ్ట్బాల్ నేషనల్స్ స్పోర్ట్స్ మీట్లో ఆడకుండానే సర్టిఫికెట్టు తెచ్చుకుని, న్యాయస్థానంలో ఉద్యోగం పొందిన వ్యక్తిపై ఇప్పటికీ కేసులు నడవట్లేదా? ఇందులో శాప్ అధికారులు 2024 సెప్టెంబర్లో ముందుగా సర్టిఫికెట్ను ధ్రువీకరించి.. ఆ తర్వాత కాదని కోర్టుకు చెప్పలేదా? అలాంటప్పుడు ఇప్పుడు మాత్రం ఇందులో పారదర్శకత ఎక్కడుంది? టీడీపీ ఎమ్మెల్యే ఏపీ సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండటమే అన్నింటికంటే పెద్ద అర్హతా?జూడో విభాగంలో 39 పోస్టులు భర్తీ చేశారు. ఇందులో 23 మందికి కేవలం ఇంటర్ డిస్ట్రిక్ట్, స్టేట్ మీట్ సర్టిఫికెట్లకు పోస్టులు వచ్చేశాయి. వారు రాష్ట్రం దాటి వెళ్లలేదు. మరో 16 మందికి ఆలిండియా ఇంటర్ వర్సిటీ, స్టేట్ మీట్లో కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్కు సైతం పోస్టులు ఇచ్చేశారు. ఇందులో పీఈటీ, పీడీ పోస్టులు కాదు ఏకంగా స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ కింద బోధన పోస్టులు ఇచ్చేశారు. ఒక్కరు కూడా జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు లేరా? అత్యంత దారుణంగా జిల్లా జట్లకు ప్రాతినిధ్యం వహించిన వారికి పతకం రాకపోయినా పాల్గొంటే చాలని ఉద్యోగాలు ఇచ్చేస్తారా? జిల్లా స్థాయిలో ఆడటమేనా క్రీడా మెరిట్? పైగా 2018 నవంబర్లో నిర్వహించిన సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో చాంపియన్ షిప్లో పతకాలు గెలిచిన క్రీడాకారులకు.. తాజాగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన క్రీడాకారులకు పొంతనే లేదు. ఒరిజినల్ రిజల్ట్ లిస్టులోని వ్యక్తుల స్థానంలో కొత్తవారు వచ్చి ఉద్యోగాలు పొందారు.సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డీఎస్సీ క్రీడా కోటా పోస్టుల భర్తీ అక్రమాలను సెలక్షన్ లిస్టు మరింత బలపరుస్తోంది. డీఎస్సీ నియామకాలు ముగిసిన ఎనిమిది నెలల తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్టును రెండు రోజుల కిందట ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో బయట పెట్టింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలో పాల్గొన్న వారికి ఉపాధ్యాయ ఉద్యోగం కట్టబెట్టేసింది. పతకంతో సంబంధం లేకుండా ఉద్యోగాలు ఇచ్చి ‘మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటా’(ఎంఎస్క్యూ)కు సరికొత్త అర్థం చెప్పింది. దాదాపు 24 ఏళ్ల కిందట సర్టిఫికెట్లు ఉన్న వారికి రాత పరీక్ష లేకుండానే డీఎస్సీలో ఉపాధ్యాయులుగా నియమించడం సర్వత్రా విస్తుగొలుపుతోంది.విచిత్రంగా ఇంటర్ డిస్ట్రిక్ట్, ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ వార్షిక క్రీడా పోటీల్లో పాల్గొన్న సర్టిఫికెట్లతో ఉద్యోగాలు దక్కడం క్రీడాలోకాన్ని కలవరపరుస్తోంది. క్రీడా కోటా డీఎస్సీలో 421 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా 382 పోస్టులను భర్తీ చేసింది. ఫైనల్ లిస్టులో 36 క్రీడాంశాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. పదికిపైగా పోస్టులతో నింపిన 14 క్రీడాంశాల్లో మొత్తం 308 పోస్టులను భర్తీ చేస్తే.. ఇందులో కేవలం నాలుగు క్రీడాంశాల్లో 174 పోస్టులు నింపడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే, మిగిలిన 22 క్రీడాంశాల్లో భర్తీ చేసినవి కేవలం 74 పోస్టులు మాత్రమే. ఇలా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిన 382 మంది జాబితాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను వేళ్లపై లెక్కపెట్టొచ్చంటే ఎంత దారుణంగా నియామకాలు చేశారో అర్థమవుతోంది. జాతీయ స్థాయిలో కేంద్ర యువజన సర్వీసుల శాఖ (మయాస్), ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ)లో గుర్తింపు లేని సంఘాలు, కోర్టు కేసుల్లో ఉన్న సంఘాల నుంచి క్రీడా సర్టిఫికెట్ల జెన్యూనిటీ తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గపు విధానాలను అవలంభిస్తున్నట్టు స్పష్టమవుతోంది. మెరిట్కు అర్థం మార్చేసిన ప్రభుత్వంకేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీఎస్సీ నియామకాలు చేసినట్టు ప్రభుత్వం పచ్చి అబద్ధాలు వల్లెవేస్తోంది. దేశ చరిత్రలో పతకాలు సాధించిన వారిని కాదని పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేకపోయినా, ఏపీ క్రీడా కోటా డీఎస్సీలో మాత్రం 90 శాతం పార్టిసిపేషన్, ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్టిఫికెట్లకే ఉద్యోగాలు కట్టబెట్టేశారు. ఇందుకు తగ్గట్టుగా క్రీడా పాలసీ రూపకల్పనలోనే దీనికి బీజం పడింది. ఒలింపిక్ మొదలకొని ఏషియన్ గేమ్స్, వరల్డ్కప్ (4ఏళ్లు), కామన్ వెల్త్, నేషనల్ గేమ్స్, నేషనల్ చాంపియన్షిప్, ఖేలో ఇండియా వర్సిటీ గేమ్స్/యూత్ గేమ్స్/ఆలిండియా ఇంటర్ వర్సిటీ చాంపియన్ షిప్, సౌత్ జోన్ చాంపియన్ షిప్, జోనల్ ఇంటర్ వర్సిటీ చాంపియన్షిప్, స్టేట్ చాంపియన్ షిప్ల ద్వారా వరుస క్రమంలో పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొంది. వీటిల్లో పతకాలతో పాటు పార్టిసిపేషన్ ఉంటే ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. ఇలా 12 స్థాయిల్లో క్రీడా అర్హతల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. కేవలం ఇంటర్ డిస్ట్రిక్ట్, స్టేట్ చాంపియన్ షిప్లో అత్యధికంగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లకే ఉద్యోగాలు కల్పించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ స్థాయిలో పతకం గెలిచిన క్రీడాకారులందరూ ఏమైపోయారు? కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నేషనల్ చాంపియన్ షిప్లకు ప్రాధాన్యం ఇస్తే.. ఇక్కడ నేషనల్ గేమ్స్ను ముందు వరుసలో ఎందుకు పెట్టారు? అనేదానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. 65 క్రీడాంశాలను ఎందుకు విభజించారు?కేంద్ర ప్రభుత్వ క్రీడా విధానాల ప్రకారం 65 క్రీడాంశాలను పెట్టినట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే, కేంద్రంలో 65 క్రీడాంశాలను రెండుగా విభజించలేదు. ఏపీలో మాత్రం విభజించారు. 65లో రెండు, మూడు క్రీడలను మార్చి.. ‘మాస్టర్ మైండ్’ (శాప్లో పెద్ద తలకాయ తనకు తానుగా పెట్టుకున్న పేరు) సొంతంగా క్రీడలను చేర్చారు. ఇలా ఏ–కేటగిరీలో 36, బీ–కేటగిరీలో 29 పోస్టులను ఎందుకు విభజించారో చెప్పలేదు. ఏ–కేటగిరీలో స్టేట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం ఇవ్వగా.. బీ–కేటగిరీలో జాతీయ స్థాయిలో పతకం సాధించిన వారికి ఉద్యోగాలు దక్కలేదని స్పష్టంగా తెలుస్తోంది. రాత పరీక్షకు కూడా హాజరు కాని వారికి డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చి రూ.కోట్లు కొట్టేశారు. ఆ తర్వాత తీరిగ్గా జీవోను సవరించారు. క్రీడా కోటా 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్లో పోస్టు పొందాలంటే కచ్చితంగా డిపార్ట్మెంట్ పెట్టే రాత పరీక్ష రాయాలని పేర్కొనడం దోపిడీకి సాక్ష్యంగా నిలుస్తోంది. చిత్తురు జిల్లా స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లతో భారీ అవకతవకలు జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది.క్రీడా ట్రయల్స్ ఎందుకు పెట్టలేదు?కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు క్రీడా కోటాలో ఉద్యోగాలను భర్తీ చేసే క్రమంలో కచ్చితంగా క్రీడా ట్రయల్స్ నిర్వహిస్తాయి. అందులో ప్రతిభను చూసి పోస్టులకు ఎంపిక చేస్తాయి. కానీ, డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో ఎక్కడా రాత పరీక్ష లేకపోగా, కనీసం క్రీడా ట్రయల్స్ను నిర్వహించక పోవడం గమనార్హం. తాజాగా హైకోర్టు సైతం డీఎస్సీకి సంబంధించిన కేసులో సర్టిఫికెట్ నిర్ధారణకు సాఫ్ట్బాల్లో ట్రయల్స్ పెట్టమని ఆదేశించింది. 20– 24 ఏళ్ల కిందటి క్రీడా సర్టిఫికెట్లతో..అది కూడా కేంద్ర ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని ఆలిండియా ఇంటర్ వర్సిటీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. బాల్ బ్యాడ్మింటన్లో 48 పోస్టులు భర్తీ చేస్తే 34 పైగా, ఖోఖో 49కి గాను 24కుపైగా, హ్యాండ్బాల్ 18 పోస్టులు ఉంటే 14 పోస్టులకుపైగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో ఇచ్చేశారు. ఫొటోలు, మెడల్స్ను పరిశీలించిన దాఖలాలు కూడా లేవు.సారూ.. వీటినేమంటారు?» అనంతపురంలో వాలీబాల్/బీచ్ వాలీబాల్లో ఓ క్రీడాకారుడికి ఎస్ఏ హిందీ పోస్టు వచ్చింది. సదరు వ్యక్తి 2011-12లో హైదరాబాద్ వర్సిటీలో వార్షిక క్రీడా పోటీల్లో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత అదే ఏడాది కోయంబత్తూరులో సౌత్ జోన్ వర్సిటీ టోర్నీలో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్తో డీఎస్సీ ఉద్యోగం దక్కింది.» చిత్తూరు జిల్లాలో హ్యాండ్ బాల్ కోటాలో ఓ మహిళకు ఎస్ఏృజీవశాస్త్రం ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చింది. ఆమె 6వ ఇంటర్ డిస్ట్రిక్ట్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్ (2021 మార్చి 5-7)లో పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన 49వ సీనియర్ ఉమెన్ నేషనల్ హ్యాండ్బాల్ చాంపియన్ షిప్ (2021 మార్చి17-21)లో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్తో ఉద్యోగం పొందింది. ఇక్కడ 6వ ఇంటర్ డిస్ట్రిక్ట్ మీట్కి.. అదే ఏడాది 49వ సీనియర్ ఉమెన్ నేషనల్ మీట్కి మధ్య ఉన్న వ్యత్యాసం ఆశ్చర్యం కలిగిస్తోంది.» పశ్చిమగోదావరి జిల్లా ఖోఖో కోటాలో ఓ మహిళకు ఎస్ఏృఫిజికల్ ఎడ్యుకేషన్ ఉద్యోగం వచ్చింది. ఆమె 2022 డిసెంబర్ 13-22 మధ్య హైదరాబాద్లో జరిగిన 32వ నేషనల్ గేమ్స్లో మొదటి స్థానం దక్కినట్టు సర్టిఫికెట్ చూపించారు. దీనికి తోడు 2001లో డిసెంబర్ 19-23 మధ్య పుణెలో 37వ సీనియర్ నేషనల్ ఖోఖో చాంపియన్ షిప్లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ పొందుపరిచారు. వాస్తవానికి 2022 సెప్టెంబర్లోనే గుజరాత్లో 36వ నేషనల్ గేమ్స్ జరిగాయి. ఈ లెక్కన ఏది నిజం? సదరు క్రీడాకారిణి జెన్యూనిటీ పరిశీలించారా? » చిత్తూరు జిల్లాలో బ్యాడ్మింటన్ విభాగంలో ఓ మహిళకు ఎస్ఏృఇంగ్లిష్ పోస్టు వచ్చింది. సదరు క్రీడాకారిణికి ఇంటర్ వర్సిటీ సౌత్ జోన్ (2008-09)లో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్తో ఉద్యోగం ఇచ్చారు. 2008-09లో తిరుచ్చిలో ఇంటర్ వర్సిటీ సౌత్ జోన్ టోర్నీలో బాల్ బాడ్మింటన్లో పాల్గొన్నట్టు బ్యాకప్ సర్టిఫికెట్ చూపించారు. అసలు బ్యాడ్మింటన్లో బ్యాకప్ సర్టిఫికెట్ చూపించాలి కదా?» చిత్తూరు జిల్లాలో ఖోఖోలోనే ఓ క్రీడాకారిణికి ఎస్జీటీ ఉద్యోగం వచ్చింది. ఆమె 2019-20లో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో వార్షిక స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత అదే ఏడాది శ్రీకాకుళం అంబేడ్కర్ వర్సిటీలో సౌత్జోన్ ఇంటర్ వర్సిటీ టోర్నీలో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్తో ఉద్యోగం పొందారు. ఇక్కడ అండర్ ఏజ్, సీనియర్ చాంపియన్ షిప్లలో పాల్గొనకుండానే ఉద్యోగం వచ్చేసింది.» తూర్పుగోదావరి జిల్లాలో బాక్సింగ్ విభాగంలో ఓ క్రీడాకారిణికి ఎస్జీటీ ఉద్యోగం వచ్చింది. ఆమెకు 2006 అక్టోబర్లో 7వ సీనియర్ స్టేట్ ఉమెన్ బాక్సింగ్ చాంపియన్ షిప్(విశాఖ)లో 2వ స్థానం దక్కింది. అంతకు ముందు ఆమె గెలిచిన ఒక్క పతకానికి సంబంధించి ఎటువంటి సర్టిఫికెట్లు పొందుపరచలేదు. జూనియర్ స్థాయిలో ఆడకుండానే సీనియర్ చాంపియన్ షిప్కు వెళ్లిపోయారా? -
మెగా డీఎస్సీ ఒక ‘మెగా స్కామ్’: సాకే శైలజానాథ్
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వ బ్రాండ్ పాలనలో అన్యాయాలు, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని.. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సాకే శైలజానాధ్ మాట్లాడారు.రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన డీఎస్సీ బాధితులు మాజీ సీఎం వైఎస్ జగన్ని కలిసి తమ ఆవేదనను పంచుకున్నారని తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత పూర్తిగా లోపించిందని, దీనిపై తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..మెగా డీఎస్సీ పేరుతో భారీ కుంభకోణం:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, అన్యాయాలు జరిగాయి. పారదర్శకత లేని వన్ ఈస్ట్ వన్ (1:1) విధానంలో.. పరీక్ష మెరిట్ లిస్ట్ ప్రకటించకుండానే నేరుగా 1:1 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవడం వెనుక పెద్ద మతలబు ఉంది. వెరిఫికేషన్ పూర్తయ్యాక కొందరి పేర్లు సెలక్షన్ లిస్ట్లో కానీ, రిజెక్షన్ లిస్ట్లో కానీ లేకుండా మాయం చేశారు.స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు:పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటా పోస్టులు భర్తీ చేస్తామని మొదట చెప్పి, ఆ తర్వాత పరీక్ష పెట్టాలంటూ జీవోలు మార్పు చేశారు. మన్యం జిల్లాకు చెందిన ఒక నేషనల్ గోల్డ్ మెడలిస్ట్కు ఉద్యోగం రాలేదు.. అసలు పరీక్షే రాయనటువంటి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. బ్రిడ్జ్ గేమ్స్ ఆడిన వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలిచ్చి.. వారు స్కూళ్లలో మ్యాథ్స్, సైన్స్ ఎలా బోధిస్తారని ప్రశ్నించారు.రూల్ ఆఫ్ రిజర్వేషన్కు పాతర: ఓపెన్ కాంపిటేషన్ మార్కులు సాధించిన రిజర్వేషన్ అభ్యర్థులను జనరల్ కోటాలో భర్తీ చేయకుండా, రిజర్వేషన్ కేటగిరీ కింద చూపడం దళిత, బహుజన, మైనారిటీ వర్గాలకు చేస్తున్న ద్రోహమే. డీఎస్సీ నియామకాల వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని వార్తలు వస్తున్నందున, రాష్ట్ర ప్రభుత్వ సిట్ (SIT)ల మీద నమ్మకం లేదు, తక్షణమే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐ చేత నిష్పాక్షపాత విచారణ జరిపించాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎలాంటి అల్లర్లు, ఆందోళనలు లేకుండా 1.30 లక్షల మందికి పైగా సచివాలయ ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశాం.సూపర్ సిక్స్ మోసం:ఎన్నికల హామీలైన 'సూపర్ సిక్స్'లో ఒక్కటీ అమలు చేయకుండానే, హఠాత్తుగా 'సూపర్ సిక్స్ సూపర్ హిట్' అని ప్రకటించుకోవడం హాస్యాస్పదం. దీనిపై ప్రశ్నిస్తే ప్రజలను బెదిరిస్తున్నారు.విద్యార్థులపై నిర్లక్ష్యం:జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభం కానున్నప్పటికీ.. విద్యార్థులకు ఇంతవరకు పుస్తకాలు, యూనిఫామ్లు, బెల్టులు, బ్యాగులు, షూస్ అందించని దద్దమ్మ ప్రభుత్వం ఇది. 'బాబు వస్తే జాబు వస్తుంది' అని గోడల మీద రాసుకున్నారని, మరి 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే వైఎస్ జగన్కు సన్నిహితంగా ఉన్న కేఎన్నార్ లాంటి వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారు.గతంలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ రూ. 2 వేల కోట్ల ఐటీ నోటీసుల వ్యవహారంలో అమెరికా పారిపోయి, మళ్లీ బాబు అధికారంలోకి వచ్చాకే తిరిగి వచ్చాడు. మరోవైపు ఉచిత ఇసుక లేదు.. లిక్కర్ దోపిడీ, విద్యుత్ కొనుగోళ్లలో భారీ స్కామ్ ఇ లా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన అన్ని రంగాల్లోనూ దోపిడీ పర్వంగా మారింది.రాష్ట్రంలో 'ఉచిత ఇసుక' అనేది కేవలం బోర్డులకే పరిమితమైంది. ఎక్కడా ఉచితంగా దొరకడం లేదు. ఎలాంటి బిల్లులు లేకుండా ప్రతి దశలోనూ భారీగా కలెక్షన్లు చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలసీ వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 750 కోట్లు ఆదాయం వచ్చేది, ఇప్పుడు అటు ప్రభుత్వానికి రాబడి లేకుండా, ఇటు ప్రజలకు ఇసుక దక్కకుండా చేస్తున్నారు.బెల్ట్ షాపుల విజృంభణ:బెల్ట్ షాపులు లేకుండా చేస్తామన్న హామీని తుంగలో తొక్కారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. మద్యం సీసాపై రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.3.49లకే విద్యుత్ కొనుగోలు చేస్తే గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. నేడు తన హయాంలో ఏకంగా రూ. 4.65 ల అధిక ధరలకు కరెంట్ కొనుగోలు చేస్తూ పెద్ద స్కామ్కు తెరలేపారు.రూ. 5 వేల కోట్ల భూముల బంధుప్రీతి – అమరావతిపై ప్రశ్నలుచంద్రబాబు నాయుడు తన కుమారుడి తోడల్లుడు, ఎంపీ భరత్కు చెందిన విద్యాసంస్థలకు ఏకంగా రూ. 5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా కట్టబెట్టారని శైలజానాధ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 'సత్వా' వంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు కేవలం 99 పైసలకే భూములను ధారాదత్తం చేశారు. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని కాదు, అది కేవలం దేవతల రాజధానిగా మిగిలింది. అత్యంత క్లిష్ట పరిస్థితులున్న ప్రాంతాల్లో కూడా చదరపు అడుగు రూ. 18 వేలు, రూ. 19 వేలకు కడుతున్నారు, కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు."కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఇసుక, లిక్కర్, భూముల పందేరం మరియు అవినీతిపై చర్చకు మేము సిద్ధం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు వారి కూటమి నాయకులు సిద్ధమా?" అని మాజీ మంత్రి సాకే శైలజానాధ్ సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, కేవలం బంధుప్రీతి, అవినీతి, దోపిడీలకే పరిమితమైందని సాకే శైలజానాధ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెగా డియస్సీ పేరుతో నిరుద్యోగ పేద కుటుంబాల ఆశలను అడియాసలు చేయడం దుర్మార్గమన్నారు. బాధితులు ఇప్పటికే కోర్టులను ఆశ్రయించారని, ప్రభుత్వం ఇప్పటికైనా తన తప్పులను ఒప్పుకుని విద్యాశాఖ కార్యదర్శికి తగిన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
అన్నా నువ్వే మాకు దిక్కు... బాధపడకు అమ్మా.. ఎలా న్యాయం జరగదో నేనూ చూస్తా..!
-
జగన్ ముందే జీవోలన్నీ గుక్కతిప్పుకోకుండా చెప్పిన.. డీఎస్సీ అభ్యర్థి!
-
మీ ఉద్యోగం మీకు వచ్చేలా చేసే బాధ్యత నాది.. జగన్ భరోసా
-
డీఎస్సీ అభ్యర్థులతో వైఎస్ జగన్, కంటతడి పెట్టుకున్న మహిళా
-
డీఎస్సీ అభ్యర్థులకు తోడుగా నేనుంటా : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: కూటమి ప్రభుత్వ డీఎస్సీ స్కాంకు బలైన డీఎస్సీ అభ్యర్థులకు తోడుగా ఉంటానని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హమీ ఇచ్చారు. చంద్రబాబు సర్కార్ తమను అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ పలువురు డీఎస్సీ అభ్యర్థులు బుధవారం తాడేపల్లిలో వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో అర్హత ఉన్నా తమకు ఉద్యోగం రాని తీరును వివరించారు. తెర వెనుక ‘డార్క్ ఆపరేషన్’ జరిగిందనీ.. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారాయని డీఎస్సీ అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు తోడుగా నేనుంటా డీఎస్సీ అభ్యర్థుల ఆవేదనపై వైఎస్ జగన్ స్పందించారు. అభ్యర్థులకు న్యాయపరమైన సహాయం అందిస్తాం. అన్యాయం జరిగిందంటున్న అభ్యర్థులకు తోడుగా నిలుస్తాం. అభ్యర్థుల న్యాయ పోరాటాలకు తోడుగా ఉంటాం. పార్టీకి చెందిన లీగల్ విభాగం ఈ పోరాటంలో మీకు సహాయపడుతుంది. ఆ లీగల్ ఖర్చులను మేమే భరిస్తాం.డీఎస్సీ అక్రమాలు, ఉల్లంఘనలపై సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలని ఇప్పటికే డిమాండ్ చేశాం. ఇప్పుడు అన్యాయం జరిగిందని చెప్తున్న కేసులన్నింటి మీద రీ ఎంక్వైరీ చేయిస్తాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కచ్చితంగా రీ ఎంక్వైరీ చేయిస్తాం. ఈ ప్రత్యేక కేసులమీదే కమిషన్కూడా వేయిస్తాం. స్పోర్ట్స్ కోటా పేరిట ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా సర్టిఫికెట్ ఆధారంగా ఇస్తామని జీవో ఇచ్చారు.ఉద్యోగాలు పూర్తిచేశాక, మళ్లీ ఆ జీవోను మార్పు చేసి మళ్లీ కొత్త జీవో తీసుకొచ్చారు. ఎవరికోసం మొదట జీవో తీసుకొచ్చారు. ఎవరికి మేలు చేయడానికి తీసుకొచ్చారు. చంద్రబాబు తన వాళ్లకోసం గేట్లు తెరిచారు. వాళ్ల పని అయిపోయిన తర్వాత మళ్లీ జీవోను ఉప సంహరించుకున్నారని చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైఎస్ జగన్ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను తాజాగా డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవినీతిని అభ్యర్థులు.. వైఎస్ జగన్కు వివరించారు. టీడీపీ నేతలు స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకున్నట్టు తెలిపారు. కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు చెప్పుకొచ్చారు. నిజమైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం ఆవేదన వ్యక్తం చేశారు. -
డీఎస్సీలో కప్పిపుచ్చుకునే ‘గేమ్స్’
సాక్షి, అమరావతి: క్రీడా కోటా డీఎస్సీ పోస్టుల భర్తీలో అక్రమాలు చోటుచేసుకోవడంతో అర్ధరాత్రి వేళ శాప్లో హైడ్రామా నడిచింది. సోమవారం ఉదయం విధులకు హాజరైన ఉద్యోగులు (సెక్షన్ ఆఫీసర్లు) మురుసటి రోజు మంగళవారం ఉదయం 7 గంటల తర్వాతే ఇళ్లకు వెళ్లారు. శాప్ ఉన్నతాధికారి సైతం సోమవారం అర్ధరాత్రి 3 గంటల తర్వాత కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లగా.. తిరిగి ఉదయం 7 గంటలకే కార్యాలయానికి తిరిగి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉద్యోగులకు షిప్టులు వేసి మరీ కార్యాలయం పని వేళల కంటే ముందుగా రప్పించి.. అర్ధరాత్రి వరకు పని చేయించడం గమనార్హం. తాము చెప్పిన సమయానికి రాకపోతే.. చెప్పిన పని చేయకపోతే సస్పెషన్ వేటు వేయడంతోపాటు బదిలీ చేస్తామని సాక్షాత్తూ శాప్ చైర్మన్ బెదిరింపులకు పాల్పడినట్టు ఉద్యోగులు వాపోతున్నారు. మంగళవారం రాత్రి వరకూ ఇదే తంతు నడిచింది. డీఎస్సీ ముగిసి 8 నెలల దాటిన తర్వాత ఇప్పుడు శాప్లో కూర్చుని డేటాను తయారు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.జాబితా ఎందుకు మారింది?రాత్రంతా క్రీడా కోటా డీఎస్సీలో అభ్యర్థుల డేటాపై మల్లగుల్లాలు పడినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల ఫోన్లు సైతం సదరు అధికారి వద్దనే పెట్టుకుని పని చేయించడం చర్చనీయాంశమైంది. డీఎస్సీలో రాత పరీక్ష లేకుండా పోస్టులు పొందిన 382 మంది జాబితాను మంగళవారం ఉదయానికి ఓ ప్రత్యేక లింక్ ద్వారా విడుదల చేశారు. దీంతో కొద్ది గంటల్లోనే ఆ లింక్లోని డేటాలో మార్పులు కనిపించాయి. 382 మంది సెలక్షన్ లిస్టులో తొలుత ట్రయథ్లాన్లో ముగ్గురు క్రీడాకారులు ఉద్యోగాలకు ఎంపికైనట్టు చూపించారు. ఇందులో జరుబుల రాము అనే వ్యక్తి పేరును సవరించిన జాబితా నుంచి తొలగించారు. అతనికి ఉద్యోగం రాలేదా? ఒకవేళ వచ్చి ఉంటే ఎందుకు తొలగించారు? ఉద్యోగం రాకపోతే ఎందుకు జాబితాలోకి పేరు చేరింది? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో విచిత్రం ఏమంటే.. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో స్కూల్ అసిస్టెంట్ పీఈటీగా పని చేస్తున్న వ్యక్తి పేరు ముందుగా అప్లోడ్ చేసిన జాబితాలో లేకపోవడం గమనార్హం. సదరు క్రీడాకారిణి ఏషియన్ ఉమెన్ చాంపియన్ షిప్లో పతకం సాధించారు. నియామక సమయంలో తొలుత ఆమెకు పోస్టు ఇవ్వడానికి నిరాకరిస్తే ఏకంగా హైకోర్టులో కేసు వేసి ఆధారాలతో సహా సమర్పించగా కోర్టు ఆదేశాలతో పోస్టింగ్ ఇచ్చారు. ఇలా జాతీయ స్థాయిలో రాణించి క్రీడా కోటాలో ఉద్యోగం దక్కని అర్హులైన ఎందరో క్రీడాకారులు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. కానీ, 382 మంది జాబితా చూస్తే క్రీడల్లో పతకాలు సాధించిన వారి కంటే పార్టిసిపేషన్, ఇంటర్ డిస్ట్రిక్, స్టేట్ చాంపియన్ షిప్లో పాల్గొన్న వ్యక్తులకు మాత్రమే పోస్టులు రావడంపై క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తామంతా పాదర్శకంగా చేశామని చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వంలో అర్ధరాత్రి హడావుడి పడుతూ డేటాను మార్చాల్సిన అవసరం ఏమిటని క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. ముందుగా పబ్లిక్ డొమైన్లో జాబితాలు పెట్టకుండా ఇప్పుడు ఉరుకుల పరుగులపై విడుదల చేయడాన్ని వారంతా తప్పుపడుతున్నారు. ఇక్కడ ఎంపిక జాబితా ఇచ్చారే తప్ప 1:5 నిష్పత్తిలో ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపిక చేసిన 2వేల మంది క్రీడాకారుల జాబితాను ఎందుకు ప్రదర్శించడం లేదని ఉద్యోగాలు దక్కని అర్హులైన క్రీడాకారులు నిలదీస్తున్నారు. -
'తొలి సంతకం' మోసం గురూ!
సాక్షి, అమరావతి: టీచర్ పోస్టుల భర్తీపైనే సీఎం తొలి సంతకం... మెగా డీఎస్సీ–2025.. అంటూ ఆశలు రేకెత్తించిన చంద్రబాబు సర్కారు నయ వంచనకు పాల్పడిందని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభకు పాతరేసి నచ్చినట్లు ఉద్యోగాలు ఇచ్చారని మండిపడుతున్నారు. కటాఫ్ మార్కులు ప్రకటించకుండా.. వారిచ్చిందే ర్యాంకు, చెప్పిన వారికే ఉద్యోగం అన్న చందంగా డీఎస్సీని మార్చేశారని అర్హులు ఆవేదన చెందుతున్నారు. జీవో నం.77 ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్ అమలును సరిగా అర్థం చేసుకోవడం లేదని ప్రభుత్వం చెబుతుండటాన్ని తప్పుబడుతున్నారు. నిజానికి పాలకులే ఈ జీవో అమలును తుంగలో తొక్కేశారని అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. ఓపెన్ మెరిట్లో కటాఫ్ మార్కులు లేకుండా, రిజర్వేషన్ ప్రకారం కటాఫ్ ప్రకటించకుండా ఉద్యోగాలు ఇచ్చేశారని పేర్కొంటున్నారు. నిరుద్యోగులను దగా చేసి డీఎస్సీపై న్యాయస్థానాలను సైతం ప్రభుత్వం తప్పుదోవ పట్టించడంపై విస్తుపోతున్నారు. నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే తప్పుడు ప్రచారాలకు వంత పాడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నోటిఫికేషన్ ప్రకారం జరగాల్సిన ప్రక్రియను ప్రభుత్వ పెద్దలకు నచ్చినట్లు మార్చేశారని, హారిజాంటల్ రిజర్వేషన్ అమలులో యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడ్డారని అభ్యర్థులు చర్చించుకుంటున్నారు.కటాఫ్ మార్కులు ఎందుకు ప్రకటించలేదు? మెగా డీఎస్సీ–2025 నిర్వహణను అడుగడుగునా దారి తప్పించారు. జిల్లా ఎంపిక కమిటీలను నీరుగార్చి ప్రక్రియను పూర్తిగా రాష్ట్ర స్థాయిలో తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. పరీక్ష ముగిశాక రాసిన అభ్యర్థులందరితో కామన్ మెరిట్ లిస్టు విడుదల చేయాల్సి ఉన్నా పలు దఫాలు ‘టెట్’ మార్కులు ‘ఎడిట్’ చేశారు. డీఎస్సీలో వచ్చిన మార్కులతో కలిపి మార్పులు చేర్పులు చేశారు. దీంతో మొదట మెరిట్లో ఉన్న ర్యాంకులు తలకిందులైపోయాయి. చివరిగా ఇచ్చిన మెరిట్ లిస్టుల్లోనూ ఓపెన్ ‘కటాఫ్’, సామాజిక వర్గాల ఆధారంగా మెరిట్ కటాఫ్ మార్కులు ఎక్కడా ప్రకటించిన దాఖలాలు లేవు. వివిధ సామాజిక వర్గాల రిజర్వేషన్లలో కేటగిరీల వారీగా నోటిఫికేషన్లో ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్లు్యఎస్, ఓసీ అభ్యర్థుల మెరిట్ను సైతం విడుదల చేయాలి. తర్వాత ‘లోకల్ మెరిట్’ ఎంపిక చేపట్టాలి. ఓపెన్ కటాఫ్ కంటే పైన ఉన్న ప్రతిభావంతులను ఓపెన్లోనే భర్తీ చేయాలని పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశాన్ని జీవో నం.77లోనూ పేర్కొన్నారు. కానీ ఏ విధానం అనుసరించారో, ఎలా చేశారో పరీక్ష రాసిన ఒక్క అభ్యర్థికి కూడా అర్థం కాకుండా చేశారు. రిజర్వేషన్ వర్తింపులోనూ అన్యాయమే..!డీఎస్సీలో పోస్టుల ఆధారంగా అమలు చేయాల్సిన వివిధ సామాజిక రిజర్వేషన్లనూ దారి తప్పించారు. మెరిట్లో ఉన్న అభ్యర్థులకు రిజర్వేషన్ కేటగిరీలో పోస్టులు ఇవ్వడంతో ఆ మేరకు రిజర్వుడు కేటగిరీలోని మెరిట్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ఇక హారిజాంటల్ రిజర్వేషన్ అమలులోనూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వంద శాతం పోస్టుల్లో కచ్చితంగా 33 శాతం పోస్టులను మహిళలకు కేటాయించాలి. 33 శాతం కంటే మహిళలు తగ్గితే ‘హారిజాంటల్ రిజర్వేషన్’ను పరిశీలించి తగ్గిన మహిళల సంఖ్య ఆధారంగా అంతే సంఖ్యలో అత్యంత కిందనున్న పురుష అభ్యర్థులను తొలగించి వారిస్థానంలో మెరిట్లో ఉన్న మహిళలను ఎంపిక చేయాలి. ఒకవేళ మహిళా అభ్యర్థులు 33 శాతానికి మించి ఉంటే ‘హారిజాంటల్ రిజర్వేషన్’ వర్తించదు. హారిజాంటల్ రిజర్వేషన్లో ఒకటి ఉమెన్, రెండోది స్పెషల్ రిజర్వేషన్. స్పెషల్ రిజర్వేషన్లో డిసేబుల్ (4 శాతం), మెరిట్ స్పోర్ట్స్ (3), ఎక్స్ సర్వీస్మెన్ (2) శాతం ఎంపిక చేయాలి. వీరిని సామాజిక రిజర్వేషన్లో లోకల్ పోస్టులకు మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఆయా సామాజిక కేటగిరీలో ఎన్ని పోస్టులు కేటాయించారో చివరిలో ఉన్న అభ్యర్థులను తొలగించి వారి స్థానంలో స్పెషల్ రిజర్వేషన్ అభ్యర్థులను చేర్చాలి. ఒకవేళ స్పెషల్ కేటగిరీ అభ్యర్థి మెరిట్లో ఉంటే.. మరో స్పెషల్ కేటగిరీ (హారిజాంటల్) అభ్యర్థికి అవకాశం ఉండదు. ఇవన్నీ పూర్తి చేశాక మాత్రమే అభ్యర్థులకు 1 : 1 నిష్పత్తిలో కాల్ లెటర్లు పంపాలి. ఓపెన్ మెరిట్, రిజర్వేషన్ మెరిట్, హారిజాంటల్ రిజర్వేషన్ల వర్తింపు పూర్తి చేశాక మెరిట్ ప్రకారం కాల్ లెటర్లు అందుకున్న వారికి అన్ని సర్టిఫికెట్లు పరిశీలన పూర్తిచేసి ఉద్యోగం ఇవ్వాలి. అత్యంత అరుదుగా మాత్రమే తిరస్కరించే ఆస్కారం ఉంటుంది. సర్టిఫికెట్లలో లోటుపాట్లు ఉంటే సరిచేసుకునేందుకు గడువునివ్వాలి. కానీ ఈ డీఎస్సీలో మాత్రం చేసిన తప్పులు, నిబంధనల ఉల్లంఘనను కప్పిపుచ్చేందుకు అత్యంత వేగంగా 148 రోజుల్లో ప్రక్రియను ముగించారు. 1,500 మంది రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం!సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పుల మేరకు, నిబంధనల ప్రకారం.. ‘కటాఫ్’కు పైన ఉన్న అభ్యర్థులను తప్పనిసరిగా ఓపెన్ కేటగిరీలోనే భర్తీ చేయాలి. వారిని ఎట్టి పరిస్థితిల్లోనూ రిజర్వేషన్ కేటగిరీలో చేర్చేందుకు ఆస్కారం లేదు. కానీ డీఎస్సీ – 2025లో ప్రభుత్వం ప్రకటించిన మెరిట్ లిస్టునే తీసుకుంటే.. అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరీలో ఎంపిక కావాల్సిన వారిని వివిధ సామాజిక రిజర్వేషన్లోని లోకల్ పోస్టుల్లో (80 శాతం) నింపారు. దీంతో రిజర్వేషన్ అభ్యర్థులు మెరిట్లో ఉన్నా అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. ఇలాంటి వారు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,500 మంది ఉన్నట్టు అంచనా! విజయనగరం జిల్లాలో ఎస్జీటీ పోస్టుల భర్తీలో ఈ అక్రమాలు కొట్టొచ్చినట్టు బయటపడ్డాయి. 88వ ర్యాంకు నుంచి 101వ ర్యాంకు వరకు ఉన్న అభ్యర్థులను ‘ఓపెన్ కేటగిరీ’ లోకల్లో ఎంపిక చేస్తే.. 87వ ర్యాంకు అభ్యర్థిని ‘బీసీ–ఏ’ లోకల్ పోస్టులో భర్తీ చేశారు. దీంతో బీసీ–ఏ రిజర్వు కేటగిరీ అభ్యర్థి పోస్టు కోల్పోయారు. ఈ జిల్లాలో ఎస్జీటీ పోస్టులు బీసీ–ఏ లోకల్లో 15 ప్రకటించారు. ఈ పోస్టుల్లో హారిజాంటల్ స్పెషల్ రిజర్వేషన్కు ఒక్క పోస్టు కేటాయించారు. మిగిలిన 14 బీసీ– ఏలోని మెరిట్ అభ్యర్థులకు ఇవ్వాలి. ఇదే తరహాలో అన్ని సామాజిక కేటగిరీలకు ఇవ్వాలి. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం ఎక్కడా పాటించలేదని అభ్యర్థులు, గతంలో డీఎస్సీ నిర్వహణలో పాల్గొన్న అధికారులు చెబుతున్నారు. ఒక్క విజయనగరం జిల్లాలోనే ఎస్జీటీ కేటగిరీలో నలుగురు రిజర్వుడు అభ్యర్థులు నష్టపోయారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులను రిజర్వుడు పోస్టులో భర్తీ చేయరాదని 2007లో సుప్రీంకోర్టు రాజేశ్కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో తీర్పు ఇచ్చింది. అలాగే 2025 డిసెంబర్లో రజత్యాదవ్ వర్సెస్ రాజస్థాన్ హైకోర్టు కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే రకమైన తీర్పు వెల్లడించింది. కానీ వీటిని తుంగలో తొక్కి డీఎస్సీ–2025లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని అభ్యర్థులు పేర్కొంటున్నారు. -
‘డీఎస్సీలో అక్రమాలపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం’
సాక్షి,విశాఖ: యువత భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అయ్యిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. విశాఖలో మంగళవారం బొత్స మీడియాతో మాట్లాడారు.‘డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. డీఎస్సీలో అక్రమాలపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం. చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. వ్యవస్థను కూటమి ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోంది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే సమాధానం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పదివేల ఉద్యోగాలు భర్తీ చేశామ’ని గుర్తు చేశారు. -
చంద్రబాబు సర్కారుపై సమరభేరి. డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన యువతరం. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి
-
చంద్రబాబు సర్కారుపై 'సమరభేరి'
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సమరభేరి మోగింది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం యువతరం కదంతొక్కింది. చంద్రబాబు సర్కారుపై గళమెత్తి గర్జించింది. వినూత్న నిరసనలు, ప్రదర్శనలతో రణన్నినాదమై రగిలింది. డీఎస్సీ పేపర్ లీక్, అడుగడుగునా చోటుచేసుకున్న అవకతవకలు స్పోర్ట్స్ కోటా పోస్టుల అమ్మకంపై దుమ్మెత్తిపోసింది. మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. తక్షణం అర్హులకు న్యాయం చేయాలని, లేకుంటే మెగా డీఎస్సీ పేరుతో దగా చేసిన చంద్రబాబు సర్కారుకు ఘోరీ ఖాయమని ధ్వజమెత్తింది. ప్రతిభకు పాతరేయడం, రిజర్వేషన్లకు గండికొట్టడంపై భగ్గుమంది. కాసులిచ్చిన వారికే పోస్టులు దక్కడంపై మండిపడింది. తక్షణం సీబీఐ విచారణ జరపాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని నినదించింది. ఈ సందర్భంగా విద్యార్థి, యువజన సంఘాల నేతలు, వైఎస్సార్ సీపీ నాయకులు కలెక్టర్లు, ఆర్డీవోలకు వినతిపత్రాలు సమర్పించారు. సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టారని గుర్తుచేశారు. ముందే మెరిట్ లిస్టు ప్రకటించి అర్హులకు వైఎస్ జగన్ ఉద్యోగాలిచ్చారని ప్రశంసించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అనకాపల్లిలో మానవహారం చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, కృష్ణాజిల్లా మచిలీపట్నంలోనూ యువత ఆందోళన చేశారు. కలెక్టర్లకు వినతిపత్రాలిచ్చారు. బందరులో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లా నరసరావుపేట, బాపట్లలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో యువత కదంతొక్కారు. కలెక్టరేట్ల వద్ద దర్నాలు నిర్వహించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు. ప్రకాశం జిల్లాల్లోనూ ఆందోళనలు జరిగాయి. నెల్లూరులో పోలీసులు కలెక్టరేట్కు తాళాలు వేశారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోనూ యువకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ యువకులు ర్యాలీలు నిర్వహించారు. పోలీసులు అడ్డుకోవడంతో వైఎస్సార్సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ ఆందోళనలు సాగాయి. చిత్తూరు కలెక్టరేట్ వద్ద యువకులు మెడకు ఉరితాళ్లు బిగించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా కలెక్టరేట్లను యువకులు ముట్టడించారు. వైఎస్సార్ కడప జిల్లాలో యువత బైక్ ర్యాలీలు నిర్వహించారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా యువత కదంతొక్కింది. డీఎస్సీ అక్రమాల బాధ్యుల్ని శిక్షించాల్సిందే: జక్కంపూడి రాజాసాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకొంటున్న మెగా డీఎస్సీ అడుగడుగునా అక్రమాలు, అవకతవకలతో దగా డీఎస్సీగా మారిందని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఫలితాల్లో జరిగిన భారీ కుంభకోణానికి పూర్తి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. డీఎస్సీ బాధితులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు భారీ నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేసి, అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం విశాఖ మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన అత్యంత పారదర్శకమైన డీఎస్సీ నోటిఫికేషన్ను అడ్డగోలుగా రద్దుచేసి, ధనార్జనే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇచ్చిందని విమర్శించారు. ‘అర్హులకు కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో బేరాలు కుదుర్చుకున్న వారికే కాల్ లెటర్లు ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్పోర్ట్స్ కోటా జీవోలను ఇష్టారాజ్యంగా మార్చి తాడాట, బొంగరం ఆటలు ఆడేవారికి ఉద్యోగాలిచ్చి అర్హులైన ప్రతిభావంతులను ముంచేశారు. లోకేశ్ను వెంటనే కేబినెట్ నుంచి తప్పించి, ఈ వ్యవహారంలో ఆయన్ని ఏ–1గా చేర్చి అరెస్టు చేయాలి’ అని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు మాట్లాడుతూ డీఎస్సీ కుంభకోణంపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే తమ పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. -
‘యువగళం’ బ్యాచ్కు డీఎస్సీలో దొడ్డిదారిన పోస్టులు
సాక్షి, అమరావతి: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో జరిగిన డీఎస్సీ–2025 నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతి, నిర్వహణ లోపాలున్నాయని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారని, కలెక్టరేట్లలో కనీసం మెరిట్ లిస్టులు కూడా పెట్టకుండా జీఎస్టీ చట్టం తరహాలో నియామక ప్రక్రియను అత్యంత గందరగోళంగా మార్చేశారని మండిపడ్డారు.లోకేశ్ యువగళం పాదయాత్రలో తన వెంట నడిచిన వారికి సొంత సంస్థ హెరిటేజ్లో ఉద్యోగాలిచి్చనంత సులభంగా స్పోర్ట్స్ కోటా కింద చివరకు ‘పేకాట’ (బ్రిడ్జ్) ఆడేవారికి కూడా దొడ్డిదారిన టీచర్ పోస్టులు కట్టబెట్టారని ఆరోపించారు. డీఎస్సీపై లోకేశ్ ట్విట్టర్లో సొల్లు కబుర్లు ఆపి తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టెట్, డీఎస్సీ నిర్వహణతో పాటు స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు తదితర 16 రకాల అంశాలపై ప్రజలకు వివరాలు వెల్లడించాలని కోరుతూ సోమవారం సచివాలయంలో ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసిన అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. మెరిట్ లిస్టు మాయం ‘మెగా డీఎస్సీ’ అని ఊదరగొట్టి అభ్యర్థులను దగా చేశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను మార్కులు, కులం, ర్యాంకులతో సహా ప్రతి జిల్లా కలెక్టరేట్లో ప్రదర్శించడం సంప్రదాయం. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా మెరిట్ లిస్టు డిస్ప్లే చేయలేదు. ఆన్లైన్లో పెట్టామని అబద్ధాలు చెబుతున్నారు. ఆన్లైన్ జాబితాలో ప్రతిసారీ అభ్యర్థుల పేర్లు మారిపోతుండటంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియను సంక్లిష్టంగా మార్చేశారు. టీడీపీలో అంతర్గత కలహాలతో హత్యలకు పాల్పడితే చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇస్తారు?’ అని పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. ఆర్టీఐతో కోరిన 16 రకాల కీలక అంశాలివీ... 2025 డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా కింద ఏ జీవో ప్రకారం, ఏ కేటగిరీలో, ఏ జిల్లాలో ఎంత మందిని నియమించారు? ఎంపికైన అభ్యర్థుల అర్హత పత్రాలు.. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో సాధించిన స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ వివరాలు ఏమిటి? స్పోర్ట్స్ కోటా అభ్యర్థులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం నియమించిన సెలక్షన్ కమిటీలో ఉన్న పెద్దలు ఎవరు? వారి అర్హతలేమిటి? స్పోర్ట్స్ కోటాలో రిజెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరు? ఎందుకు తిరస్కరించారు? అభ్యంతరాలను పరిశీలించారా? టెట్ , డీఎస్సీ పరీక్షా పత్రాలను ఎవరు తయారు చేశారు? ఈ ప్రక్రియలో లేదా మూల్యాంకనంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైనా పాల్గొన్నారా? దానికి సంబంధించి ప్రభుత్వ అనుమతులు, జీవోల కాపీల వివరాలు వెల్లడించాలి. -
అర్హులను తొక్కేసి.. అడ్డగోలు డ్రామాలు!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ –2025లో అక్రమాలను కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు పడరాని పాట్లు పడుతోంది! అడ్డదారిలో ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా అవన్నీ సక్రమమే అంటూ అడ్డగోలుగా అబద్ధాలు చెబుతోంది. ఓ అభ్యర్థి గతంలో తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో (రెండు వేర్వేరు పుట్టిన తేదీలు) సంపాదించిన క్రీడల సర్టిఫికెట్తో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోస్టల్ శాఖ నిర్ద్వందంగా తిరస్కరించింది. అలాంటి అభ్యర్థికి ఈ డీఎస్సీలో ఏకంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టు కట్టబెట్టేసి ఎలాంటి తప్పులేదంటూ రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకోవడం విస్తుగొలుపుతోంది.సోమవారం సచివాలయంలో పర్యాటక, యుజవన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్, శాప్ ఎండీ భరణిని ముందుపెట్టి ప్రభుత్వం తన తప్పులను ఒప్పులుగా చిత్రీకరించేందుకు యత్నించి భంగపడింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మభ్యపెట్టే యత్నం చేసింది. క్రీడా సర్టిఫికెట్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది, శాప్ అధికారులది కాదని.. క్రీడా సంఘాలు మాత్రమే ఇస్తాయంటూ అర్థంలేని వాదన వినిపించింది. డీఎస్సీ క్రీడా కోటాలో ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను వెబ్సైట్లో, బహిరంగంగా ప్రదర్శించకుండా దాచిపెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు ‘క్రిడయ్’ యాప్లో పెట్టామంటూ సమర్థించుకోవడం దుర్నీతిని బట్టబయలు చేస్తోంది.కోర్టు కేసులను ఎదుర్కొని పారదర్శకంగా నియామకాలు చేపట్టినట్లు స్పెషల్ సీఎస్ అజయ్జైన్ గొప్పగా ప్రకటించారు. అయితే, అంతర్ జిల్లా స్థాయిలో సర్టిఫికెట్లు తెచ్చుకున్న క్రీడాకారులకు యథేచ్ఛగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసిన ప్రభుత్వం.. అంతర్జాతీయ క్రీడాకారులకు మాత్రం పోస్టులు ఇచ్చేందుకు ఎందుకు నిరాకరించిందో మాత్రం చెప్పడం లేదు. ఆయా అంతర్జాతీయ క్రీడాకారులు హైకోర్టును ఆశ్రయించగా అధికారుల తీరును తప్పుబట్టి అక్షింతలు వేసిన తరువాతే డీఎస్సీలో ఉద్యోగం ఇచ్చారు.మరి పారదర్శకత ఎక్కడ పాటించారు? హైకోర్టు ఆదేశాలతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిష్కరించామని చెప్పుకొచ్చారు. మరి నియామకాల సమయంలోనే తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందుతున్న వారి వివరాలతో సహా అర్హులైన అభ్యర్థులు శాప్కు ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోలేదో చెప్పలేక నీళ్లు నమిలారు. ఇక ఈ డీఎస్సీ తర్వాత క్రీడా కోటాలో రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ జీవోను సవరించడంపై అధికారులు వివరణ ఇస్తూ.. ప్రభుత్వ పాలసీ పర్మినెంట్గా ఉండదని సమర్థించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ప్రభుత్వానికి పాలసీ పర్మినెంట్గా ఉండదట!మీడియా: డీఎస్సీ ముగిసిన తర్వాత స్పోర్ట్స్ కోటా 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ జీవోను ఎందుకు సవరించారు? మళ్లీ రాత పరీక్షను ఎందుకు తప్పనిసరి చేశారు? క్రీడా సర్టిఫికెట్లు, డిగ్రీల జెన్యూనుటీని ఎలా పరిశీలించారు?స్పెషల్ సీఎస్, శాప్ ఎండీ: ప్రభుత్వానికి పాలసీలు పర్మినెంట్గా ఉండవు. క్రీడా పాలసీ కూడా అంతే. క్షేత్రస్థాయి ఫీడ్ బ్యాక్ను బట్టి పాలసీ మారిపోతుంది. అప్పటి పాలసీ ప్రకారం రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చాం. కొన్నిసార్లు చట్టాలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. శాప్లో ప్రత్యేక స్రూ్కటినీ బృందాలను పెట్టి ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీ ద్వారా 1 : 5 నిష్పత్తిలో జాబితా తయారు చేశాం. వాటిని వారం రోజులు వెబ్సైట్లో పెట్టి అభ్యంతరాలు స్వీకరించి తర్వాత తుది జాబితాను సిద్ధం చేశాం. 421 పోస్టులకుగాను 382 పోస్టులు భర్తీ చేశాం. క్రీడా సంఘాలు, ఫెడరేషన్ల నుంచి జెన్యూనుటీ సర్టిఫికెట్లు తీసుకొచ్చాం. స్రూ్కటినీ కమిటీలో ఆయా వర్సిటీల అధికారులు పరిశీలించి ఓకే చేశారు.ఇదీ వాస్తవం: ప్రభుత్వం చెబుతున్నట్లుగా క్రీడా సంఘాలు, ఫెడరేషన్ల నుంచి క్రీడాకారుల జెన్యూనుటీ సర్టిఫికెట్లను తీసుకుంటే ఒక్కటి కూడా మీడియాకు చూపించలేదు. వాస్తవానికి ధ్రువపత్రాల పరిశీలన సమయంలో క్రీడా సంఘాల ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించాలి. జాతీయ స్థాయిలో అయితే ఫెడరేషన్ సభ్యులు ప్రభుత్వ నియామకాల్లో కచ్చితంగా పాల్గొంటారు. గత ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగాల భర్తీ సమయంలో తొలుత జిల్లా స్థాయిలో ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో వడపోత చేపట్టారు. పైగా అçప్పుడు రాత పరీక్షల్లో అర్హత సాధిస్తే ఉద్యోగం కల్పించారు. డీఎస్సీ మాదిరిగా క్రీడా సర్టిఫికెట్ చూసి ఉద్యోగం ఇవ్వలేదు. 1.34 లక్షల మందితో సచివాలయాల ఉద్యోగాల భర్తీ నిర్వహించినప్పుడు రాని ఆరోపణలు ఇప్పుడు 2025 డీఎస్సీలో మాత్రమే ఎందుకు వస్తున్నాయో ఈ ప్రభుత్వం చెప్పలేకపోతోంది. పైగా ఇతర రాష్ట్రాల్లో చదివిన ఉద్యోగార్థుల వివరాలను ఆయా వర్సిటీల్లో పరిశీలించకుండానే చేసేసినట్టు చెబుతోంది.శాప్.. పూటకో మాట!డీఎస్సీ ఉద్యోగార్థుల క్రీడా సర్టిఫికెట్లను పారదర్శకంగా స్రూ్కటీని చేసినట్లు స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ బల్లగుద్ది చెప్పారు. సర్టిఫికెట్ల పరిశీలనలో ‘శాప్’ పారదర్శకత ఏపాటిదో చెప్పేందుకు ఈ ఉదంతమే ఓ నిదర్శనం. 2024 సెప్టెంబర్లో న్యాయస్థానాల్లో ఉద్యోగాల భర్తీ సందర్భంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఓ క్రీడాకారుడు ‘ప్రాసెస్ సర్వర్ పోస్టు’ కోసం క్రీడా కోటాలో దరఖాస్తు చేసుకున్నారు. 2021 డిసెంబర్ 24–28 వరకు అనంతపురంలో జరిగిన సాఫ్ట్బాల్ నేషనల్ మీట్లో పాల్గొని తన టీమ్ రజత పతకం సాధించినట్లు అతడు పేర్కొన్నారు.ఈ క్రీడా సర్టిఫికెట్లు శాప్ పరిశీలనకు రావడంతో ‘మాస్టర్మైండ్’ తన వాటా కింద రూ.3 లక్షలు వసూలు చేసి అంతా సక్రమమేనంటూ అధికారులతో చెప్పించడంతో సదరు క్రీడాకారుడికి ఉద్యోగం వచ్చేసింది. అయితే దీనిపై ఓ అభ్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగానికి ఎంపికైన సదరు క్రీడాకారుడు ఆ సమయంలో సాఫ్ట్బాల్ నేషనల్ మీట్లో పాల్గొనలేదని, ఆ సమయంలో అతడు ఓ కళాశాలలో బీపీఈడీ కోర్సు చదువుతున్నట్లు ఆధారాలు సమర్పించారు.దీనిపై సింగిల్ బెంచ్ ధర్మాసనం ఆదేశాల మేరకు మరోసారి సర్టిఫికెట్లను పరిశీలించిన శాప్ అధికారులు అవి సరైనవి కాదని తేల్చారు. దీనిపై సదరు క్రీడాకారుడు డివిజనల్ బెంచ్ను ఆశ్రయించగా శాప్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. తాము ఆ క్రీడాకారుడికి నోటీసులు ఇచ్చినప్పటికీ ఫిజికల్ టెస్టుకు హాజరు కాలేదని, ఆటలో నైపుణ్యం లేదని పేర్కొంది. దీనిపై తాజాగా హైకోర్టు శాప్ అధికారులతో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో స్పెషల్ సీఎస్ చెబుతున్నట్లుగా శాప్ నిజంగానే అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తుంటే కోర్టు ఉద్యోగాల భర్తీకి సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలనపై పూటకో మాట ఎందుకు చెబుతోంది? ఏ రాజకీయ శక్తి చేతుల్లో శాప్ బందీగా మారిపోయింది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.తొలుత సదరు సాఫ్ట్బాల్ క్రీడాకారుడి సర్టిఫికెట్ సరైనదే అంటూ ధ్రువీకరించిన శాప్.. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో మరోసారి ఆ సర్టిఫికెట్లు నిజమైనవి కావంటూ మాట మార్చినట్లు స్పష్టం చేస్తున్న హైకోర్టు ఆర్డర్ సర్వీసు రూల్స్కు ముందు జీవో సవరణ?కూటమి ప్రభుత్వం తన తప్పులను సమర్థించుకునే క్రమంలో అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. డీఎస్సీ 2025 ముగియడమే ఆలస్యం.. స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వటాన్ని ఎత్తివేసింది. తొలుత డీఎస్సీకి ముందు ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు రూల్స్ను సవరిస్తూ 19–04–2025న అప్పటి సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారం డీఎస్సీలో పరీక్ష లేకుండా క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు.డీఎస్సీ ముగిసిన తర్వాత ఈ ఏడాది మే 15న ఏపీ సబార్డినేట్ అండ్ సర్వీసు రూల్స్ను మళ్లీ సవరిస్తూ సీఎస్ సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కచ్చితంగా డిపార్ట్మెంట్ పెట్టే రాత పరీక్షలో అర్హత సాధించాలని పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే.. ఈ ఏడాది మే 15న సబార్డినేట్ అండ్ సర్వీసు రూల్స్ సవరణ కంటే ముందే.. మే 14 క్రీడా శాఖలో జీవోను సవరిస్తూ స్పెషల్ సీఎస్ అజయ్జైన్ ఉత్తర్వులు ఇవ్వడం!నేషనల్ గేమ్స్కు ప్రాధాన్యమా?క్రీడా పాలసీ 2024–29 రూపకల్పనలో కూటమి ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరించింది. ‘మాస్టర్మైండ్’ చెప్పినట్టే పాలసీ పురుడు పోసుకుంది. డీఎస్సీలో అక్రమాలకు మార్గం సుగమం అయింది. పాలసీ రూపకల్పన సమయంలోనే క్రీడా సంఘాలను ప్రభుత్వం సంప్రదించి ఉంటే.. సీనియర్ నేషనల్స్కు ప్రాధాన్యం దక్కాల్సిన చోట నేషనల్ గేమ్స్ పెట్టడంపై క్రీడా సంఘాలు ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తాయి? పదేపదే జీవోలను సవరించామని ఎందుకు డిమాండ్ చేస్తాయి? వీటికి ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేదు.గొప్పగా 65 క్రీడలకు అవకాశం కల్పించాలని చెబుతున్న ప్రభుత్వం.. ఏపీలో అంతగా ప్రాచుర్యంలో లేని క్రీడలను ఎందుకు చేర్చింది? ఫెడరేషన్లలో గుర్తింపు పొందిన ఏపీ క్రీడా సంఘాలకు కచ్చితంగా శాప్ గుర్తింపు ఇవ్వాల్సి ఉండగా వాటిని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తోంది? మాస్టర్మైండ్ మాట వింటేనే క్రీడా సంఘాలు మనుగడ సాగించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఇవన్నీ పరిశీలిస్తుంటే అర్హులకు పోస్టులు ఇవ్వకుండా అన్యాయం చేసినట్లు స్పష్టమవుతోంది.పోస్టల్ శాఖలో రిజెక్ట్.. డీఎస్సీలో పోస్టింగ్మీడియా: విజయనగరం జిల్లాలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి ఒకరు తప్పుడు డేట్ ఆఫ్ బర్త్లతో ఉద్యోగం పొందారని ప్రభుత్వానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే ఏం చేశారు? గతంలో పోస్టల్ శాఖ ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది కదా? పోలీసులు సైతం ఆమె తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో మోసం చేసినట్టు ధ్రువీకరించారు?స్పెషల్ సీఎస్, శాప్ ఎండీ: విజయనగరం జిల్లా వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణిపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఆ జిల్లా ఎస్పీ సైతం దీన్ని ధ్రువీకరిస్తూ పత్రం ఇచ్చారు. సదరు క్రీడాకారిణి నేషనల్ గేమ్స్లో కాంస్య పతకం సాధించారు. ఆమె 20–5–1992 డేట్ ఆఫ్ బర్త్తో క్రీడల్లో పాల్గొంది. ఆమె స్కూల్లో డేట్ ఆఫ్ బర్త్ కూడా అదే. మేం క్రీడా సంఘాలు, ఫెడరేషన్ నుంచి సైతం జెన్యూనుటి తీసుకున్నాం.ఇదీ వాస్తవం: విజయనగరం జిల్లాకు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి రెండు పుట్టిన తేదీలతో చలామణి అయినట్లు జిల్లా ఎస్పీకి 08–4–2016న స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ నివేదిక సమర్పించారు. ఎస్వీఆర్ మూర్తి అనే వ్యక్తి సదరు క్రీడాకారిణిపై విశాఖ రేంజ్ డీఐజీకి ఆధారాలతో సహా 19–02–2016లో ఫిర్యాదు చేశారు. దీనిపై డీఐజీ ఆదేశాలతో విజయనగరం ఎస్పీ విచారణ చేపట్టారు. విచారణ చేసిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు 08–04–2016న సదరు క్రీడాకారిణి 20–05–1992, 10–05–1993 డేట్ ఆఫ్ బర్త్లతో చలామణి అయినట్టు ధ్రువీకరిస్తూ నివేదిక సమర్పించారు.తొలుత 10–05–1993 పుట్టిన తేదీతో (10–11–2010న) పాస్పోర్టు పొందగా, తర్వాత 06–08–2015న రూ.ఐదు వేలు జరిమానా చెల్లించి పుట్టిన తేదీ 20–05–1992తో కొత్త పాస్పోర్టు పొందినట్టు వెల్లడించారు. అయితే 10–05–1993 (తప్పుడు పుట్టిన తేదీ)తోనే ఆమె 2012లో కామన్వెల్త్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో 53 కిలోల మహిళల విభాగంలో ప్రాతినిధ్యం వహించింది. ఇలా అండర్ ఏజ్లో తప్పుడు డేట్ ఆఫ్ బర్త్తో జాతీయ పోటీల్లోనూ పాల్గొంది. ఇక 2015 సమయంలో 20–05–1992 పుట్టిన తేదీతో నేషనల్ గేమ్స్లో పాల్గొని పతకం సాధించింది.డీఎస్సీ నోటిఫికేషన్కు ముందు సదరు క్రీడాకారిణి పోస్టల్ శాఖలో ‘పోస్టల్ అసిస్టెంట్’ (రిజిస్టర్ నం, ఎస్పీ3ఈ153ఏ149బీఈ5ఎఫ్) ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలపై ఫిర్యాదులు అందడంతో పోస్టల్ శాఖ విచారించి ఆమెను ఉద్యోగానికి ఎంపిక చేయకుండా తిరస్కరించింది. అలా పోస్టల్ శాఖ సదరు అభ్యర్థి మోసాన్ని గుర్తించి ఎంపికకు నిరాకరిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నేషనల్ గేమ్స్లో 20–05–1992 తేదీతో ఆడారని, ఎటువంటి పోలీసు కేసులు లేవని చెబుతూ తన తప్పిదాన్ని సమర్థించుకుంటోంది.ఈ ఏడాది ఏప్రిల్ 24న ‘డీఎస్సీ డీల్స్’ కథనంలో సదరు క్రీడాకారిణి నియామకంపై ఆధారాలతో ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. అప్పటి నుంచి ఆమె క్రీడా సర్టిఫికెట్ జెన్యూనుటీ నిజమైనదేనని చెప్పాలంటూ క్రీడా సంఘాలపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం వాస్తవం కాదా? 2025 ఆగస్టు 11న ఓ క్రీడాకారుడు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే అప్పుడు పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడు తప్పును దాచేందుకు మల్లగుల్లాలు పడుతోంది. 2016లో విజయనగరం జిల్లాకు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి వేర్వేరు పుట్టిన తేదీలతో చలామణి అయినట్టు ధ్రువీకరించిన నివేదిక -
పేకాటలో ఫస్ట్ వస్తే టీచర్ ఉద్యోగం, సొల్లు కబుర్లు చెప్పడం కాదు
-
సిగ్గుండాలి లోకేష్..! పోస్టుకో రేటు చొప్పున అమ్ముకుంటావా..
-
ఇదే నాకు లాస్ట్ ఛాన్స్.... లోకేష్ వల్ల నా జీవితం నాశనం అయింది
-
‘హెరిటేజ్ పాలు అమ్మినట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్మకం’
విశాఖ: ఏపీ ఎన్నికల సమయంలో బాబు వస్తే జాబ్ వస్తుందనే మోసపూరిత హామీలతో ఓట్లు దండుకున్నారని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. కూటమి ప్రభుత్వం.. మెగా డీఎస్సీ పేరిట దగా డీఎస్సీ నిర్వహించిందని ధ్వజమెత్తారు. హెరిటేజ్ పాలు అమ్ముకున్నట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆయన మండిపడ్డారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడిందని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘లక్షలు ఖర్చుచేసి రోజు 20 గంటలు చదువుకున్న నిరుద్యోగులకు అన్యాయం చేశారు. రాష్ట్రంలో లోకేష్ చేయని దోపిడి అవినీతి అంటూ ఏది లేదు. హెరిటేజ్లో పాలు అమ్ముకునట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారు. నిరుద్యోగుల కన్నీళ్లు మీకు కనిపించడం లేదా?, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి డీఎస్సీ ఉద్యోగాలకు వేలం పాట పెట్టారు. లోకేష్ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలి. ఈ మోసంలో లోకేష్ను ఏ-1గా అరెస్ట్ చేయాలి. సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. వైఎస్సార్సీపీ ధర్నాల్లో వేలాది మంది డీఎస్సీ బాధితులు హాజరయ్యారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’ అని హెచ్చరించారు. దీనిపై పవన్ కళ్యాణ్కు నిజాయితీ ఉంటే వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ఉద్యోగాల భర్తీ.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచే..డీఎస్సీ ఉద్యోగాల భర్తీ కార్యక్రమం . ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచే జరిగిందన్నారు. ఒక్కొక్క పోస్ట్ను రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ అమ్ముకున్నారన్నారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారు. సచివాలయ ఉద్యోగాల భర్తీని పారదర్శకంగా వైఎస్ జగన్ నియమించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు లోకేష్ జిల్లాకు లక్ష ఉద్యోగాలు చొప్పున ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించడం లేదు’ అని స్పష్టం చేశారు. -
లోకేష్ వస్తే యువత బతుకులు మారతాయి అంటే ఏంట్లో అనుకున్న ఈ రేంజ్ లో మారుస్తావ్ అనుకోలేదు నాయన
-
DSCలో దగా.. లోకేష్ను వెంటనే బర్తరఫ్ చేయండి
-
YSRCP vs POLICE గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
-
మెగా డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన!
-
మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ: వైఎస్సార్సీపీ నిరసన
ఏపీ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలంటూ వైఎస్సార్సీపీ యూత్ వింగ్ నిరసనలు చేపట్టింది రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాగా, డీఎస్సీ పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడంపై అభ్యర్థులు, యూత్ వింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ:కూటమి సర్కారు తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్విద్యాశాఖలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్లో మరిన్ని పోస్టులు కలిపి మెగా డీఎస్సీ ఇచ్చారు.మెగా డీఎస్సీలో తప్పులే కనిపిస్తున్నాయి.ప్రభుత్వంలో అన్ని పారదర్శకం అని చెబుతారు.. కానీ అన్ని గుట్టుగానే జరుగుతుంది.కలెక్టర్ కార్యాలయంలో పేర్లు, ర్యాంకులతో లిస్టులు పెట్టాలి.కలెక్టర్ కార్యాలయంలో మెరిట్ లిస్ట్ లు పెట్టాలి.ఆన్ లైన్ లో చూసిన ప్రతిసారి లిస్టులు మారిపోతున్నాయి.చదువు రానివాడు చూసినా అర్థమయ్యే రితీలో ఆన్ లైన్లో ఉండాలి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:డీఎస్సీలో అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అమలాపురంలో భారీ ర్యాలీవిద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన నేతలుజరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలన్న వైఎస్సార్సీపీ నేతలుకార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ అనురాధ , కో-ఆర్డినేటర్లు పి.రాజేశ్వరి, సూర్యప్రకాశ్ గన్నవరపు శ్రీనివాస్, ఇతర వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలునెల్లూరు:మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ నెల్లూరు నగరంలో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీ .500 మంది యువత , నిరుద్యోగులతో వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించిన యువత .యువత, నిరుద్యోగుల నిరసనలతో అట్టుడికిన కలెక్టరేట్ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి , వైస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఇన్ చార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డిమెగా డీఎస్సీ అక్రమాలతో అభ్యర్థులు తీవ్రంగా దగాపడ్డారు:ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిబాబు వస్తే జాబ్ వస్తుందని ఓట్లు దండుకున్నారు: జక్కంపూడి రాజామెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీలక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారులక్షలు ఖర్చుచేసి రోజు 20 గంటలు చదువుకున్న నిరుద్యోగులకు అన్యాయం చేశారు.రాష్ట్రంలో లోకేష్ చేయని దోపిడి అవినీతి అంటూ ఏది లేదు..హెరిటేజ్ లో పాలు అమ్ముకునట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారునిరుద్యోగుల కన్నీళ్లు మీకు కనిపించడం లేదా?లోకేష్ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలిపవన్ కళ్యాణ్ కు నిజాయితీ ఉంటే వెంటనే స్పందించాలిడీఎస్సీ ఉద్యోగాల భర్తీ.. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి జరిగింది: కేకే రాజుఒక్కొక్క పోస్ట్ ను రూ. 15 లక్షల నుంచి 20 లక్షల వరకు అమ్ముకున్నారు.డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలిలోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి.డీఎస్సీపై చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారుప.గో జిల్లా:కూటమి ప్రభుత్వం నిర్వహించిన దగా డీఎస్సీ మెగా కాదు.. దగా డీఎస్సీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను వెంటనే బర్త్ రఫ్ చేయాలి వైఎస్సార్సీపీ మహాధర్నా చలో కలెక్టరేట్ ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులుమహాధర్నా చలో కలెక్టరేట్ ర్యాలీలో పాల్గొన్న ఆచంట నియోజకవర్గ పరిశీలకులు శ్రీమతి మేడపాటి షర్మిళ రెడ్డి తదితర పార్టీ శ్రేణులుఅనంతరం జిల్లా కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రం అందజేసిన నేతలురాజమండ్రి:స్థానిక రాజమండ్రి రూరల్ వైఎస్సార్సీపీ ఆఫీసు నుండి చలో కలెక్టరేట్ ఆఫీస్ వరకు మెగా కాదు-దగా డీఎస్సీ మహాధర్నా కార్యక్రమం మాజీ మంత్రివర్యులు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన దగా డీఎస్సీ మెగా కాదు-దగా డీఎస్సీపై నిరసనవిద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను వెంటనే బర్త్ రఫ్ చేయాలి మహాధర్నా చలో కలెక్టరేట్ ర్యాలీలో జక్కంపూడి విజయలక్ష్మి మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు,, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి , రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితర నేతలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు.తూర్పుగోదావరి జిల్లా...రాజమండ్రిలో భారీ ర్యాలీబొమ్మూరులో పార్టీ ఆఫీసు నుండి జిల్లా కలెక్టరేట్ వరకు కొనసాగిన నిరసన ర్యాలీవేణు గోపాలకృష్ణ కామెంట్స్..ఇది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ.పోస్టులను అమ్ముకున్నారుడీఎస్సీ నిర్వహణలో అనేక అవకతవకలు జరిగాయి. వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలిస్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇస్తామని అభ్యర్థులను దారుణంగా మోసం చేశారుడీఎస్సీ నిర్వహణపై పూర్తిస్థాయిలో సీబీఐతో విచారణ జరిపించాలిగుంటూరు..వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్య కామెంట్స్మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీ అయిందిఅనేక అవకతవకలు జరిగాయి.డీఎస్సీలో భారీ అవినీతి జరిగిందినిరుద్యోగులకు న్యాయం చేయాలిడీఎస్సీలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలిమాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్డీఎస్సీపై లోకేష్ ఎందుకు సమాధానం చెప్పడం లేదు?ముఖ్యమంత్రి, లోకేష్ సమాధానం చెప్పాలి.లోకేష్కు సిగ్గుంటే సమాధానం చెప్పి రాజీనామా చెప్పాలిదగా డీఎస్సీ నిర్వహించిందుకు సీఎంగా ప్రమోషన్ ఇస్తారేమో చూడాలి.లోకేష్ రాజీనామా చేయాలిమిస్టర్ లోకేష్ నోరు విప్పి మాట్లాడాలిఅక్రమాలు జరిగాయని చెబితే మాట్లాడితే దాడులు చేసే పరిస్థితి ఉంది.డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి.కృష్ణా జిల్లా..డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతూ మచిలీపట్నంలో ఛలో కలెక్టరేట్లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకూ ర్యాలీ..ర్యాలీలో పాల్గొన్న కృష్ణాజిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్ని కిట్టుజిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చిన యువజన విభాగం నాయకులుపేర్ని కిట్టు కామెంట్స్..సకల శాఖా మంత్రి లోకేష్ తన చేతవాటం ప్రదర్శిస్తున్నాడుడబ్బులిస్తే ఏ ఉద్యోగమైనా అమ్ముకోవచ్చని లోకేష్ ను చూస్తే తెలుస్తోందిడీఎస్సీలో ఉద్యోగాలు కొనుక్కోవచ్చని లోకేష్ నిరూపించారుముందు మీ శాఖలో అవినీతి తగ్గించు లోకేష్తర్వాత ఎదుటి వారి గురించి వెటకారంగా మాట్లాడొచ్చుస్పోర్ట్స్ కోటాలో డబ్బులిచ్చిన వారికి ఉద్యోగాలిచ్చారురాత్రికి రాత్రి సర్టిఫికెట్లు పుట్టించడం ఉద్యోగాలు తీసుకోవడంనీపేరు లోకేష్ కాదు లో క్యాష్డీఎస్సీ అక్రమాల పై మా పోరాటం ఆగదునిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతాంవిశాఖ..జక్కంపూడి రాజా కామెంట్స్..డీఎస్సీ మోసాలపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు?.పవన్ కాపులకు ఎందుకు వ్యతిరేకమో చెప్పాలి.చంద్రబాబు, లోకేష్ దగ్గర మార్కులు కోసమే పవన్ వ్యాఖ్యలు.డీఎస్సీ మోసాల గురించి మాట్లాడి పవన్ రియల్ హీరో అనిపించుకోవాలి.విద్యా శాఖ మంత్రి లోకేష్ కాబట్టి పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదు..డీఎస్సీ అవకతవకలపై నోరు మెదపకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు.వైఎస్ జగన్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే పబ్లిసిటీ కోసం దాన్ని రద్దు చేశారు.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దగా డీఎస్సీ తీశారు.లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యారు.నిరుద్యోగుల ఆకలి కేకలు లోకేష్కు వినిపించలేదా?.డీఎస్సీ పేరుతో లోకేష్ కొట్లాది రూపాయలు సంపాదించారు ..స్పోర్ట్స్ కోట పేరుతో లక్షల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకున్నారు.హెరిటేజ్లో పాలు పెరుగు అమ్ముకున్నట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారులోకేష్ సీబీఐకు విచారణకు ఒప్పుకోవాలి.లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి..టీచర్ పోస్టులు అమ్ముకున్నట్లు ఆడియో వీడియోలు బయటికి వచ్చాయి..నిరుద్యోగ భృతి పేరుతో మోసం చేశారు..వాలంటీర్లకు జీతాలు పెంచుతామని చెప్పి ఉద్యోగాల నుంచి తీసేశారు.ఎన్నికల ముందు కాపులు సంఖ్య బలం గురించి మాట్లాడిన పవన్ ఇప్పుడూ కాపులతో నాకేం పనిలేదు అంటున్నాడు.కోట్లు ఖర్చు పెట్టడానికి కాపులు కావాలి కానీ ఎన్నికల తర్వాత వాళ్ళు అవసరమే లేదా?.అధికారంలోకి వచ్చిన తర్వాత నీ విధానం చూసి కాపులు ఆవేదనలో ఉన్నారు.అనంతపురం..డీఎస్సీ అక్రమాలపై కొనసాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటవైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిభారీగా తరలి వచ్చిన విద్యార్థులు, యువజన విభాగం నేతలుడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్డీఎస్సీ అక్రమాలకు కారణమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను భర్తరఫ్ చేయాలని డిమాండ్టీడీపీ కూటమి సర్కార్ వ్యతిరేకంగా నినాదాలుఉపాధ్యాయ పోస్టులు అమ్ముకున్నారని ఆగ్రహంతిరుపతి..తిరుపతి కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనతిరుపతి కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ముట్టడిపార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసనపద్మావతిపురం నుంచి కలెక్టరేట్ వరకు భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో బైక్ ర్యాలీ, నిరసనడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ పదవికి రాజీనామా చేయాలని నినాదాలు.టీచర్ పోస్టులను అమ్ముకుని మెరిట్లో ఉన్న నిరుద్యోగులకు అన్యాయం చేశారు అంటూ ఆగ్రహంసీఎం చంద్రబాబు రాజీనామా చేయాలి.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు, -
లోకేష్ DSC స్కాంను ఆధారాలతో బయటపెట్టిన పర్వతరెడ్డి..!
-
జీవో ఒకలా.. అమలు ఇంకోలా!
సాక్షి, అమరావతి: హారిజాంటల్ రిజర్వేషన్ అమలు ప్రక్రియను తప్పుగా అర్థం చేసుకుంటూ మెగా డీఎస్సీ–2025పై ఆరోపణలు చేస్తున్నారని పాఠశాల విద్యా శాఖ బుకాయిస్తోంది. డీఎస్సీలో అక్రమాలు బట్టబయలు అవుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఏదోలా ఈ స్కామ్ నుంచి బయట పడాలని విద్యా శాఖ ద్వారా పొంతనలేని రీతిలో సమాధానాలిప్పిస్తోంది. డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలపై ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో వెలుగులోకి తెస్తున్న నేపథ్యంలో శనివారం విద్యా శాఖ ఉన్నతాధికారి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా తప్పు జరగలేదంటూనే పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాక్షి దినపత్రికలో ‘తప్పుపై తప్పు.. స్పోర్ట్సు డీఎస్సీపై మాకు తెలియదు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై వివరణ ఇస్తూ విద్యా శాఖ డైరెక్టర్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ‘సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్లు జారీ చేసినప్పటికీ, వెరిఫికేషన్కు హాజరైన పలువురు అభ్యర్థులకు తుది ఎంపిక జాబితాలో చోటు దక్కలేదన్న ఆరోపణ సరికాదు. ఇది హారిజాంటల్ రిజర్వేషన్ను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వచ్చింది.అర్హత, దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను పరిశీలించే ఉద్దేశంతో, నోటిఫై చేసిన ఖాళీల సంఖ్యకు అనుగుణంగా ఆయా వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ వర్గాల పరిధిలో 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కాల్ లెటర్లు జారీ చేశాం. ఆ తర్వాత తుది ఎంపిక జాబితాలను సిద్ధం చేసే సమయంలో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కు వర్తించే హారిజాంటల్ రిజర్వేషన్ సర్దుబాట్లను జీవో ఎంఎస్ నం.77 ప్రకారం వర్తింపజేశాం. ఇది అర్థం చేసుకోలేక సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరైన వారిలో కొందరు తమకు ఉద్యోగాలు రాలేదంటున్నారు’ అని పేర్కొన్నారు. 1:1 నిష్పత్తి అంటే అర్థమేంటి మరి?జీవో77 ప్రకారం 1:1 జాబితా ఎప్పుడు తయారవుతుందంటే హారిజాంటల్ రిజర్వేషన్లను (మహిళలు, వికలాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులు) మొదట మార్కుల మెరిట్ ఆధారంగా ఓసీ, తర్వాత సామాజిక వర్గాల (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్లు్యఎస్) వారీగా జాబితాలను సిద్ధం చేయాలి. ఆ తర్వాతే మహిళలు, ఇతర హారిజాంటల్ కోటాలో లోటును తనిఖీ చేసి, అవసరమైతే జాబితా చివరన ఉన్న అభ్యర్థులను తొలగించి, నిర్దేశిత ప్రత్యేక వర్గాల అభ్యర్థులను చేర్చి ‘తాత్కాలిక ఎంపిక జాబితా’ ఖరారు చేయాలి.ఇలా హారిజాంటల్ రిజర్వేషన్లు అప్లై చేసి పూర్తి స్థాయిలో సర్దుబాటు చేసిన తర్వాతే, కచ్చితంగా ఉద్యోగానికి ఎంపికయ్యే అవకాశం ఉన్న వారితోనే 1:1 (ఒక పోస్టుకు ఒకరు) జాబితాను ప్రకటించాలి. హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత అర్హులైన అభ్యర్థుల తాత్కాలిక ఎంపిక జాబితా (1:1) సిద్ధం చేయాలి. అందులో ఉన్న అభ్యర్థుల సర్టిఫికెట్లు తనిఖీ చేయడానికి కాల్ లెటర్లు పంపాలి.సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయ్యాక, ఎటువంటి లోపాలు లేని వారితో తుది జాబితాను ప్రకటించాలి. మెగా డీఎస్సీ–2025లో ఇలా చేయకుండా కొందరు అభ్యర్థులకు అన్యాయం చేయడం వాస్తవమని బాధిత మెరిట్ అభ్యర్థులు వాపోతున్నారు. దీన్ని ఒప్పుకోకుండా అధికారులు వింత వాదనను వినిపిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనలో పాల్గొన్నంత మాత్రాన పోస్టు ఎంపికకు గ్యారంటీ లేదని ముందే పేర్కొన్నామంటూ ‘కండీషన్స్ అప్లై’ అన్న రీతిలో చెప్పడం కొసమెరుపు. -
అంతర్ జిల్లా క్రీడా సర్టిఫికెట్తో టీచర్ పోస్టా?
సాక్షి, అమరావతి: డీఎస్సీ నియామక ప్రక్రియపై రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు మండిపడుతున్నారు. ముఖ్యంగా క్రీడా కోటాలో రాత పరీక్ష అవసరం లేకుండా భర్తీ చేసిన టీచర్ పోస్టుల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అత్యంత దారుణంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ (అంతర్ జిల్లా) క్రీడా పోటీల సర్టీ ఫికెట్లతో ఉపాధ్యాయ పోస్టులు కట్టబెట్టేయడం విస్తుగొల్పుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు మొండిచెయ్యి చూపించి కేవలం ఒక జిల్లాకు క్రీడల్లో ప్రాతినిథ్యం వహించిన వారి సర్టీ ఫికెట్లకు ప్రాధాన్యం ఇవ్వడం డీఎస్సీ క్రీడా కోటా పోస్టుల భర్తీలో పారదర్శకతకు పాతరగా నిలుస్తోంది. ‘ముఖ్య’నేత బంధువు, మాస్టర్ మైండ్ అవినీతి వ్యూహంలో భాగంగానే పోస్టుల భర్తీలో ప్రాధాన్యతలు మారిపోయినట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు. మెరిట్ జాబితా ఎక్కడ? క్రీడా కోటా డీఎస్సీలో 421 పోస్టుల్లో 97 శాతం భర్తీ చేశారు. అయితే ఎక్కడా మెరిట్ జాబితాను ప్రదర్శించలేదు. తొలుత టెంటేటివ్ (తాత్కాలిక) జాబితాను పెట్టిన శాప్ దానిపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు కోర్టులను ఆశ్రయిస్తుండటంతో వెంటనే తొలగించింది. ఆ తర్వాత తుది జాబితాను ఎక్కడా ప్రదర్శించకుండా కొందరు అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం చేరవేసింది. విచిత్రం ఏమిటంటే.. తాత్కాలిక జాబితాలో ఉన్న చాలా మంది అభ్యర్థుల పేర్లు తుది జాబితాలో లేకపోవడం.అంతా పారదర్శకంగా చేశామని, పబ్లిక్ డొమైన్లో ప్రతి డేటాను అందుబాటులో ఉంచామని శాప్ చైర్మన్ రవినాయుడు ప్రకటించారు. అయితే శాప్ వెబ్సైట్ మొత్తం జల్లెడ పట్టినా ఎక్కడా ఎంపికైన ఒక్క అభ్యర్థి వివరాలు కానరాలేదు. శాప్కు వచి్చన దరఖాస్తులను తొలుత స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి జాబితాను రాష్ట్ర స్థాయి కమిటీకి పంపగా సమీక్షించి తుది జాబితాను ఆమోదించింది. ఇదంతా లోపాయికారిగా చేయడంలో మాస్టర్మైండ్ కీలక చక్రం తిప్పినట్టు తెలుస్తోంది! బ్యాక్గ్రౌండ్ జల్లెడ పడుతున్న అభ్యర్థులు.. క్రీడా కోటా డీఎస్సీలో అవినీతి బాగోతాన్ని కప్పిపుచ్చేందుకు ‘మాస్టర్మైండ్’ ఉద్యోగాలు పొందిన కొందరు ఉపాధ్యాయులను రంగంలోకి దించి వీడియోలతో ప్రజల దృష్టిని దారి మళ్లించేందుకు చేసిన యత్నం బెడిసికొడుతోంది. వారి బ్యాక్ గ్రౌండ్ను నిరుద్యోగ అభ్యర్థులు జల్లెడ పడుతున్నారు. అన్ని అర్హతలు ఉండి కూడా ఉద్యోగం దక్కని క్రీడాకారులు దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీంతో వీడియోలు చేస్తే తమ గుట్టు రట్టవుతుందని ఫేక్ సర్టీ ఫికెట్లతో ఉద్యోగం పొందిన వారు బెంబేలెత్తుతున్నారు. ఇదిలా ఉంటే డీఎస్సీ గురించి చిన్న పేపర్ కూడా బయటకు వెళ్లడానికి వీల్లేదంటూ తమపై మాస్టర్మైండ్ విరుచుకుపడటాన్ని శాప్ వర్గాలు జీరి్ణంచుకోలేకపోతున్నాయి. మూటలు దోచుకుని తమపై చిందులేయడం ఏమిటని చర్చించుకుంటున్నాయి. సర్టీ ఫికెట్ల పరిశీలన ఏది? పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ క్రీడాకారిణి ఖోఖోలో జాతీయ స్థాయిలో రాణించారు. ఆమెకు డిగ్రీ సర్టీ ఫికెట్ లేకున్నా స్పోర్ట్స్ కోటా డీఎస్సీలో ఉద్యోగం వచ్చింది. తొలుత జిల్లా జాబితాలో 10వ స్థానంలో ఉన్న ఆమె తర్వాత టాప్లోకి వచ్చేసింది. పొరుగు రాష్ట్రంలో డిగ్రీ చదివినట్లు ఓ ఫేక్ సర్టీ ఫికెట్ను సృష్టించి పోస్టు అమ్మేశారు. అదే శాప్.. క్రీడా సర్టీ ఫికెట్తోపాటు అభ్యర్థి డిగ్రీ సర్టీ ఫికెట్ నిజమైనదేనా? అని పరిశీలించి ఉంటే అక్రమాలు జరిగేవి కావని అవకాశం కోల్పోయిన అర్హులైన అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో బీపీఈడీ, బీఈడీలు చేసినట్లు బోగస్ సర్టీ ఫికెట్లతో ఉద్యోగాలిచ్చారని, ఒక్క అభ్యర్థి విషయంలో కూడా శాప్ ఆయా వర్సిటీలకు వివరాలను పంపించి వాస్తవాన్ని ధ్రువీకరించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రీడా సర్టీ ఫికెట్లే కాదు.. దొంగ డిగ్రీలతోనూ టీచర్ ఉద్యోగాలు అమ్మేయడం ‘మాస్టర్మైండ్’ స్కెచ్కు నిదర్శనమని పేర్కొంటున్నారు.సర్టిఫికెట్కు రూ.5 లక్షలు.. పోస్టుకు రూ.15–20 లక్షలు!క్రీడా కోటా డీఎస్సీలో ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి టీచర్ ఉద్యోగాలను అంగట్లో సరుకుల మాదిరిగా అమ్మేశారని తొలి నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.5 లక్షలకు ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్టిఫికెట్లను విక్రయించడంతో పాటు పోస్టుకు రూ.15–20 లక్షలు చొప్పున వసూలు చేసినట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఇలా మూడొంతులు పోస్టులు అమ్ముకుని రూ.40–50 కోట్లు వసూలు చేసినట్లు క్రీడాకారులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అందుకే ఎక్కడా తుది మెరిట్ లిస్టును ప్రదర్శించ లేదని.. దొడ్డి దారిన ఉద్యోగాలు పొందిన వారి గుట్టు, మాస్టర్మైండ్ బండారం బయటపడుతుందనే భయంతోనే దాన్ని దాచేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
అంతులేని నిర్లక్ష్యం.. అర్హులకు అన్యాయం!
సాక్షి, అమరావతి: పేద, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు టీచర్ పోస్టులపై ఎంతో ఆరాటంతో అహోరాత్రులు డీఎస్సీ–2025 కోసం శ్రమిస్తే చంద్రబాబు సర్కారు అక్రమాలతో నింపేసిందని నిప్పులు చెరుగుతున్నారు. మెరిట్.. వెర్టికల్.. హారిజాంటాల్ రిజర్వేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా సర్టిఫికెట్ల పరిశీలనకు ఒక పోస్టుకు ఒక్కరినే పిలవడం, ధ్రువపత్రాల్లో లోపాలుంటే సరిచేసుకునే అవకాశం ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారని అభ్యర్థులు వాపోతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కీలక పాత్ర పోషిస్తుంది. పోస్టుల భర్తీ విధివిధానాలను అత్యంత జాగరూకతతో రూపొందిస్తుంది. ఆ విధానాలను మెగా డీఎస్సీ 2025లో ఒక్కటీ అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ అభ్యర్థులకు తీరని నష్టం వాటిల్లిందని పేర్కొంటున్నారు. జిల్లా ఎంపిక కమిటీలు చేయాల్సిన పనిని కేంద్ర కార్యాలయమే చక్కబెట్టడం.. తాము ఇచ్చిన జాబితాలోని అభ్యర్థులనే సర్టిఫికెట్ల పరిశీలనకు పిలవటాన్ని చూస్తుంటే గూడుపుఠాణి బోధపడుతోందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘నేను 25 ఏళ్లుగా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నా. ఎన్నో డీఎస్సీలు నిర్వహించినా ఈ తరహా ప్రక్రియ ఎన్నడూ చూడలేదు. ఏం జరిగిందో చెప్పలేని పరిస్థితి..’ అని విద్యాశాఖ కీలక అధికారి ఒకరు వ్యాఖ్యానించడం మెగా డీఎస్సీ నిర్వహణలో లొసుగులకు అద్దం పడుతోంది. అవకాశం ఇవ్వకుండా అక్కడికక్కడి రిజెక్ట్..! ఏపీపీఎస్సీ ప్రస్తుతం వివిధ ఉద్యోగాల భర్తీకి 1:1 నిష్పత్తిలో ఫలితాలు విడుదల చేస్తోంది. పరీక్షల అనంతరం సర్టిఫికెట్ల పరిశీలనకు ముందు అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్లు, వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ పరిశీలించిన తర్వాతనే 1:1 నిష్పత్తిలో ఫలితాలను ప్రకటిస్తోంది. సర్టిఫికెట్ల పరిశీలనకు ఏవి తేవాలో ప్రచురిస్తుంది. విడుదల చేసిన ఫలితాల్లో హాల్టికెట్ నంబర్ ఉన్నవారు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరవుతారు. నిర్ణీత సర్టిఫికెట్లు లేకుంటే సమర్పించేందుకు అవసరాన్ని బట్టి 3 రోజుల వరకు గడువునిస్తారు. ఈలోగా సదరు అభ్యర్థి పరిస్థితిపై ప్రత్యేక ఫైల్ అంతర్గతంగా సిద్ధం చేస్తారు. ఎలాంటి సర్టిఫికెట్లు లేవు..? ఎన్ని రోజులు గడువు ఇచ్చారు..? ఒకవేళ సర్టిఫికెట్లు తేలేకపోతే తర్వాత మెరిట్ అభ్యర్థి ఎవరు..? అనేది అందులో ఉంటుంది. ఇచ్చిన గడువులోగా బోర్డు సంతృప్తి చెందితే ఎంపిక చేస్తారు. లేదంటే రెండో స్థానంలో ఉన్న అభ్యర్థిని పిలుస్తారు. కానీ మెగా డీఎస్సీ–2025లో అంతా తారుమారుగా చేశారు. 1:1 నిష్పత్తిలో అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపినా మెరిట్ కమ్ రిజర్వేషన్ (వర్టికల్/హారిజాంటాల్) ప్రకారం చేయలేదని తేటతెల్లమవుతోంది. ఇలా చేస్తే అన్ని విధాలుగా అర్హులైన వారికి మాత్రమే కాల్ లెటర్లు వెళతాయి. అన్నీ సక్రమంగా ఉన్న అభ్యర్థులకు తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది. కానీ డీఎస్సీ 2025 కాల్ లెటర్ల విడుదలకు ముందు ఎలాంటి రిజర్వేషన్లను పరిశీలించిన దాఖలాలు లేవు. నిర్ణీత తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన డీఎస్సీ అభ్యర్థుల పత్రాలకు సంబంధించి చిన్న లోపం కనిపించినా ఒక్కరోజు కూడా గడువు ఇవ్వకుండా అక్కడే తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఇదేం రిజర్వేషన్ లెక్కో? 1:1 నిష్పత్తి ప్రకారం జోన్ ఆఫ్ కన్సిరడేషన్, పోస్ట్ పరిధిలోకి వచ్చిన వారికి మాత్రమే కాల్ లెటర్లు పంపి సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచినట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. హారిజాంటాల్ రిజర్వేషన్ ప్రకారం ఒక కేటగిరీలో 10 పోస్టులు ఉంటే అందులో 7 పోస్టులు మెరిట్ ద్వారా, 3 పోస్టులు హారిజాంటాల్ ద్వారా (ఉమెన్/ స్పోర్ట్సు/ఎక్స్ సర్వీస్మెన్/ పీడబ్లు్యడీ (ప్రత్యేక అవసరాలు) భర్తీ చేయాలని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన బాధిత అభ్యర్థి ఏకాంబరం (బీసీ–డీ) వివరాలను ఉదహరించారు. చిత్తూరు జిల్లాలో బీసీ–డీ కేటగిరిలో 7 పోస్టులు ఉండగా ఒకటి హారిజాంటాల్లో ఉమెన్కు కేటాయిస్తూ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. భర్తీ ప్రక్రియలో 5 పోస్టులను మెరిట్ ప్రకారం, 2 పోస్టులను హారిజాంటల్లో భర్తీ చేసినట్లు అధికారులు చెప్పారు. మెరిట్లో చివరి ర్యాంకర్ 114కి ఇచ్చామని (వాస్తవానికి 114వ ర్యాంకు అభ్యర్థి ఎస్టీ అయినా బీసీ–డీలో చూపించారు), కానీ ఏకాంబరం ర్యాంకు 125 కాబట్టి అతడికి పోస్టు వచ్చే అవకాశం లేదని చెప్పారు. మెరిట్లో ఉమెన్ లేకపోతే హారిజాంటాల్ ప్రకారం కింద ర్యాంకు ఎంత ఉన్నా పైకి తెచ్చి భర్తీ చేయాలని పేర్కొన్నారు. అర్హత ఉన్నా ఏకాంబరానికి అన్యాయం! వాస్తవానికి మెరిట్లో భర్తీ చేసిన ఐదు పోస్టుల్లో చివరి అభ్యర్థి ఉమెన్. ఆమె ఓవరాల్ ర్యాంకు 116. దీంతో హారిజాంటల్ పోస్టు భర్తీ అయిపోయింది. ఇక మిగిలిన రెండు పోస్టులను మెరిట్లో భర్తీ చేయాలి. 116వ ర్యాంకు అభ్యర్థి తర్వాత... ఆరో స్థానంతో 125వ ర్యాంకు సాధించిన ఎం.ఏకాంబరం ఉన్నారు. అతడికి ఒక పోస్టు ఇస్తే, మరో పోస్టును 133వ ర్యాంకులో ఉన్న మరో అభ్యర్థికి (బీసీ–డీలో 7వ ర్యాంకు) ఇవ్వాలి. కానీ చివరి రెండు పోస్టులను పీహెచ్ అభ్యర్థులతో నింపారు. వాస్తవానికి జిల్లాలో ఎస్ఏ సోషల్కు 113 పోస్టులు ఉన్నాయి. వీటిని అన్ని కేటగిరీల (బీసీ, ఎస్సీ,ఎస్టీ, ఓసీ) అభ్యర్థులకు వర్టికల్ రిజర్వేషన్లో చూపించారు. అయితే స్పోర్ట్సు, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్లు్యడీ వారికి వర్టికల్ రిజర్వేషన్లో కాకుండా హారిజాంటల్లో చూపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీల్లో ఏ కేటగిరీలో ఎవరిని భర్తీ చేస్తారో నోటిఫికేషన్లో చెప్పకుండా బీసీ–డీ కేటగిరీలోని రెండు పోస్టులను పీడబ్లు్యడీ అభ్యర్థులకు ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మొత్తం అన్ని పోస్టులోనూ హారిజాంటల్లో పీడబ్లు్యడీ అభ్యర్థులకు నాలుగు పోస్టులు కేటాయిస్తే.. వాటిలో రెండు బీసీ–డీలోనే భర్తీ చేయడంతో ఆ వర్గంలో మిగతా అభ్యర్థులకు అన్యాయం జరిగింది. దీంతో అర్హుడైనప్పటికీ ఏకాంబరం పోస్టు కోల్పోవాల్సి వచ్చింది. డిలీట్.. అప్లోడ్.. డిలీట్! వెబ్సైట్లో డీఎస్సీ జాబితాపై దాగుడుమూతలు మెగా డీఎస్సీ 2025లో తప్పులు జరిగాయనేందుకు ఇది మరో ఉదాహరణ. డీఎస్సీ ప్రక్రియ ముగియగానే వాస్తవాలను దాచి పెట్టేందుకు వెబ్సైట్ నుంచి మొత్తం డేటా తొలగించిన అధికారులు.. తాజాగా డేటాను మళ్లీ అప్లోడ్ చేశారు. శనివారం మీడియాతో సమావేశం నిర్వహణకు కొద్ది గంటల ముందు వివరాలను హడావుడిగా అప్లోడ్ చేసి అంతా సక్రమంగానే చేశామని చెప్పుకునేందుకు యత్నించారు. ఈసారి కొత్తగా ఎంపిక జాబితాలను సైతం అప్లోడ్ చేసి మళ్లీ వాటిని తొలగించడం కొసమెరుపు. డీఎస్సీలో అక్రమాలను ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో సహా వెలుగులోకి తెస్తున్న విషయం తెలిసిందే. దీంతో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోంది. డీఎస్సీ డేటాతో పాటు అభ్యర్థుల ఎంపిక జాబితాలను పలువురు శనివారం డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ఆదివారం రోజు తుది ఎంపిక జాబితాలను అధికారులు మళ్లీ తొలగించారు. -
‘డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి’
రాజమండ్రి: మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో టీచర్ రిక్రూట్మెంట్ స్కాం జరిగినట్టు ఆధారాలతో సహా వెలుగులోకి రావడంతో దానికి సమాధానం చెప్పుకునే ధైర్యం లేక గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలు అంటూ మరో డైవర్షన్ పాలిటిక్స్కి కూటమి ప్రభుత్వం తెరలేపిందని వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇసుక అక్రమాల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నాయకులకు లేదని చెప్పారు.వైఎస్సార్సీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్ధ ద్వారా అత్యంత పాదర్శకంగా ఈ టెండర్లు నిర్వహించి ప్రభుత్వ ఖజానాకి రూ.4 వేల కోట్లు వచ్చేలా చేశామని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో ఉచిత ఇసుక అంటూ ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకి రాకుండా నాయకులు జేబులు నింపుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మూలనైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా అని ఆయన ప్రశ్నించారు. 2014-19 మధ్య గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఐదేళ్లలో ఇసుక పేరుతో 19 జీవోలు ఇచ్చి రకరకాలుగా ఇసుక దోపిడీకి పాల్పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వానికి రూ.4 వేల కోట్ల ఆదాయం తీసుకొచ్చినవైఎస్సార్సీపీ ఇసుక విధానంలోనే దోపిడీ జరిగి ఉంటే, ఉచిత ఇసుక అంటూ ఖజానాకి ఒక్క రూపాయి కూడా లేకుండా చేస్తున్న కూటమి వల్ల ఇంకెంత నష్టం జరిగి ఉండాలని ప్రశ్నించారు. గోదావరి జిల్లాల పరిధిలో ఒక్కో ఎమ్మెల్యే ఇసుక ద్వారా నెలకు రూ. కోటి సంపాదిస్తున్నారని,వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వారి బాగోతాలన్నీ బయటపెట్టి చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని మార్గాని భరత్ హెచ్చరించారు.ఆయన ఇంకా ఏమన్నారంటే.. 80 లక్షల టన్నుల ఇసుక నెలరోజుల్లో లేపేశారుఒకపక్క డీఎస్సీ అక్రమాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంటే దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీ అంటూ మరో డైవర్షన్ పాలిటిక్స్కి కూటమి ప్రభుత్వం తెరలేపింది. గత ప్రభుత్వంలో 5.08 కోట్ల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వేశారంటూ ఈనాడు పత్రిక రాయించి ఒక అక్రమ కేసును సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇసుక అక్రమాల గురించి చంద్రబాబు అండ్ కో మాట్లాడటమే పెద్ద జోక్. ఉచిత ఇసుక అని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం, రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక దొరుకుతుందేమో చూపించాలి. మా ప్రభుత్వంలో ఏడాదికి రూ.750 కోట్ల చొప్పున, ఐదేళ్లలో నాలుగువేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. కానీ ఇప్పుడు మరి ఆ డబ్బంతా ఎక్కడకు పోయింది? ఎవరి జేబులోకి వెళ్లిందో చెప్పాలి. మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అదికూడా లేదు. అధికార దుర్వినియోగంతో ఇసుక చుట్టూ ఒక మాఫియాను ఏర్పాటు చేసి మొత్తం దోచేస్తున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి స్టాక్ యార్డుల్లో నిల్వ ఉంచిన 80 లక్షల టన్నుల ఇసుకను కూటమి ప్రభుత్వం వచ్చి నెలరోజులు గడవక ముందే సగం ఇసుకను టీడీపీ నాయకులు కాజేశారు. గోదావరి జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్యే కేవలం ఇసుక ద్వారానే నెలకు రూ. కోటి సంపాదిస్తున్నారు.ఇసుక విధానంపై రోజుకో మాటచంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా వాదించినట్టుగా గత ఐదేళ్లవైఎస్సార్సీపీ పాలనలో 5.08 కోట్ల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వేశారనేది వారి దృష్టిలో నిజమే అయినా, ప్రభుత్వానికి ఇసుక ద్వారా రూ. 4 వేల కోట్ల ఆదాయం వచ్చింది. అదే ఉచిత ఇసుక అని ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం ద్వారా ఇంకెన్ని వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగి ఉండాలి? ఈ రెండేళ్లలో ఎంత ఇసుకను దోచేశారు. ఆ డబ్బంతా ప్రభుత్వ ఖజానాకి చేరకుండా ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టు? ఇప్పుడే కాదు, 2014-19లో కూడా మధ్య ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రానీయకుండా పక్కా అవినీతి పథక రచనతో ఇసుకను దోచేశారు. అదే వ్యవహారం ఇప్పుడు కూడా నడుస్తోంది. ఆరోజుల్లో ఇసుక బాధ్యతలను మొదట ఏపీఎండీసీకి అప్పగించారు. ఆ తర్వాత డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. 2 నెలలు కాకుండానే దాన్నీ రద్దు చేసి టెండర్లు నిర్వహిస్తామన్నారు. చివరకు ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఉచిత ఇసుక పేరుతో ఒకే ఒక్క మెమో ఇచ్చి అప్పనంగా వారి మనుషులకు అప్పగించారు. మొత్తంగా 19 జీవోలు ఆ ఐదేళ్లలో ఇచ్చారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూటమి నాయకుల ఇసుక దందాను ఖచ్చితంగా వెలుగులోకి తీసుకొచ్చి అందుకు కారకులైన వారిని చట్టపరంగా శిక్షించేదాకా పోరాడుతాం. నాడు పారదర్శకంగా ఇసుక ఈ టెండర్లు.. ఖజానాకి రూ.4 వేల కోట్ల ఆదాయంగత వైయస్సార్సీపీ ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేశాం. దోపిడీలకు అడ్డుకట్ట వేసి ఇటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, అటు వినియోగదారునికీ సరసమైన ధరకు అందేలా కేంద్ర ప్రభుత్వ ఫ్లాట్ పాం మీద ఈ-టెండర్లు నిర్వహించాం. రీచ్ల వద్ద ఆపరేషన్ ఖర్చులతో కలిపి టన్ను ఇసుకను రూ.475కే సరఫరా చేయడం జరిగింది. ఇందులో రూ.375లు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి చేరేది. రవాణా ఛార్జీలతో కలిపి ప్రతి నియోజకవర్గానికీ ఇసుక రేట్లను ప్రకటించాం. వైయస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిరంతరం దుమ్మెత్తిపోసే పత్రికల్లో కూడా నియోజకవర్గాల వారీగా పారదర్శకంగా రేట్లపై ప్రకటనలు ఇచ్చాం. ప్రజలకు ఒకవైపు తక్కువ ధరకు ఇస్తూనే మరోవైపు రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చేట్టుగా చేశాం. రేట్లపై సెబ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేసి తప్పులకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకున్నాం. తద్వారా ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయాన్ని ఖజానాకు వచ్చేలా చేశాం.డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలిసంక్షేమం, అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో చర్చించడానికి నారా లోకేష్ చేసిన సవాల్నువైఎస్సార్సీపీ జాతీయ మీడియా అధికార ప్రతినిధిగా నేను స్వీకరిస్తున్నా. దీనిపై బహిరంగ చర్చకు ఎప్పుడు, ఎక్కడికి రమ్మన్నా రావడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. డీఎస్సీలో మొదటి ర్యాంకు తెచ్చుకున్న నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూటిగా చెప్పగలరా? సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి రాలేదని చెబుతున్నారు. కానీ, ఇదే నవీన్ ప్రభుత్వం తన ఐడీని బ్లాక్ చేసి కాల్ లెటర్ రాకుండా చేసిందని హైకోర్టును కూడా ఆశ్రయించారు. మంత్రి నారా లోకేష్ స్వయంగా మీడియా ముందుకొచ్చివైఎస్సార్సీపీ, డీఎస్సీ రాసి ఉద్యోగం కోల్పోయిన అభ్యర్థుల ప్రశ్నలకు సమాధానాలు చెబితే డీఎస్సీలో ఎలాంటి మోసం జరగలేదని ప్రజలు నమ్ముతారు. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికి ఉద్యోగాలు కేటాయించారు? ఏ నిబంధనల ప్రకారం వారికి ఉద్యోగాలిచ్చారో బయటపెట్టాలి. టీచర్ ఉద్యోగం కోసం రూ. 15 లక్షలు వసూలు చేశారని బయటకొచ్చిన ఆడియో టేపుల ద్వారా స్పష్టంగా తేలిపోయింది. దీనికి కూడా మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. నిరుద్యోగులకు వివరణ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. -
డీఎస్సీలో అక్రమాలు ముమ్మాటికీ వాస్తవం
తాడేపల్లి: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై తాము సంధిస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలు సమాధానమివ్వకుండా తప్పించుకుని, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తో రాజకీయ ప్రసంగాలు చేయించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వరుదు కల్యాణి మండిపడ్డారు. కోన శశిధర్ తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగడం ఏంటని ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై తాము రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేస్తుంటే.. బైజూస్ ట్యాబ్ ల్లో అవినీతి అంటూ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు దిగుతున్నారని ఆక్షేపించారు. డీఎస్సీలో అక్రమాలు ముమ్మాటికీ నిజమని, వాటిపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై తేలిపోయిన కోన శశిధర్ వివరణ::లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీరాష్ట్రంలో విద్యాశాఖతో పాటు సకల శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ లేదా ఆయన తండ్రి చంద్రబాబు డీఎస్సీ అక్రమాలపై మాట్లాడతారని అనుకున్నాం. లక్షలాది మంది జీవితాలతో ఆడుకున్న వ్యవహారంలో ఓ స్పష్టత వస్తుందని భావించాం. కానీ విద్యాశాఖ కార్యదర్శితో మాట్లాడించారు. ఆయన ఏకపక్షంగా మాట్లాడి, విలేఖరుల ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. మాకు సమాధానం చెప్పకపోయినా ఫర్వాలేదు, లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధులకు, ప్రజలకు మాత్రం సమాధానం చెప్పాల్సిందే. మీరు మాట్లాడే పారదర్శకత ఎక్కడుంది ? మెరిట్ లిస్ట్ ఎందుకు పదే పదే మార్చారని అడుగుతున్నాం, ఎక్కడైనా ఫలితాలు వచ్చాక పారదర్శకంగా ఎవరెవరు అర్హత సాధించారో జిల్లా కేంద్రాల్లో మార్కులతో సహా ప్రకటిస్తారు. కానీ ఇక్కడ మెసేజ్ ల ద్వారా కాల్ లెటర్స్ వ్యక్తిగతంగా పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది?డీఎస్సీ కోసం ప్రత్యేకంగా కోటా తీసుకొచ్చారు. ఏపీలో ఎప్పుడూ వినని అత్యా, పత్యా వంటి క్రీడల్ని ఇందులో చేర్చారు. గూగుల్ లో కొడితే 9 మంది సభ్యులు ఉంటారని, ఆట ప్రాంతంలో ఓ కందకం ఉంటుందని వచ్చింది. టెన్ పిన్ బౌలింగ్ అని మరో క్రీడ. చెక్క మీద పిన్నులు అమరుస్తారట. ఇంకొకటి బ్రిడ్జి గేమ్ అట. ఇదో పేకాట లాంటి ఆట. టగ్ ఆఫ్ వార్ గేమ్ ను కూడా డీఎస్సీ స్పోర్ట్ కోటాలో పెట్టారు. బలంగా ఉన్న వారు ఓవైపు తాడు లాగేస్తే గెలిచే ఆట ఇది. ఇలాంటి ఆటలకు కూడా ఉద్యోగాలు ఇచ్చేస్తారా ? సభ్య సమాజానికి మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ? వీళ్లు పీఈటీలుగా మాత్రమే పనిచేయరు, సెలెక్ట్ అయితే సబ్జెక్టులు కూడా చెప్తారట.నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దుమీకన్నా రాజకీయ అనుభవం తక్కువగా ఉన్న వైఎస్ జగన్ ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేస్తే రాష్ట్రంలో స్కూళ్ల రూపురేఖలే మారిపోయాయి, ప్రపంచంతో పోటీ పడాలని, ఆంధ్రప్రదేశ్ ను అక్షర క్రమంతో పాటు ఆభివద్ధిలోనూ ముందుంచాలని ఇంగ్లీష్ విద్యను అమలు చేశారు. ఎన్నో సంస్కరణలు అమలు చేసి నేటి విద్యార్ధులే భవిష్యత్ ఆస్తి అని చెప్పి పాలన చేశారు. మీరు మాత్రం డీఎస్సీలో ఉద్యోగాలు ఇవ్వడానికి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతారా ? మాట్లాడితే కేసులు పెడతారా ? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వంలో ఉన్నామా? కాపీలు ఎక్కడా జరగవంటున్నారు, ఈ మధ్య జరిగిన నీట్ లో కాపీలు జరిగాయనే కదా పరీక్షలు రద్దు చేసింది. అక్కడా సీబీటీయే కదా. తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించండి, నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దు. ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుంటారా లేక విద్యామంత్రి బాధ్యత తీసుకుంటారా చెప్పండి. తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిందే. ఈ రాష్ట్రంలో జరిగిన పెద్ద కుంభకోణంగా దీన్ని భావిస్తున్నాం. అధికారం ఉందని మేం ఏ విధంగా చెప్పినా ముందుకు సాగుతుందని అనుకుంటే సరికాదు. ప్రజాస్యామ్యంలో ప్రజల గొంతుకగా ప్రజల కోసం ఉద్యమించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉంది. ఎమ్మెల్సీలు వెళ్లి విద్యాశాఖ కమిషనర్ ను కలిశాం, రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చాం, రేపు ఛలో కలెక్టరేట్ నిర్వహించబోతున్నాం.రాజకీయ నేతగా కోన శశిధర్ వ్యాఖ్యలు:పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రెస్మీట్లో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సీనియర్ ఐఏఎస్ అధికారి అని మర్చిపోయి రాజకీయ నాయకుడిలా మాట్లాడారు. వైఎస్సార్సీపీ నాయకుల మీద సివిల్, క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేస్తామని మాట్లాడుతున్నారు. మీ పాత్ర ఏంటి? అసలేం జరిగింది, దాని మీద మేమేం మాట్లాడాం ? వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ మీరు ఆ బాధ్యత తీసుకోకపోతే అధికారంలో ఉన్న నాయకులు మాట్లాడతారు. కానీ మీరు వాళ్ల పాత్రను తీసుకుని బెదిరింపులకు దిగడం నిరుద్యోగులు, ప్రజలు హర్షించలేదు. నిరుద్యోగుల వేదనపై కోన శశిధర్ గారి నుంచి సమాధానం వస్తుందని భావించాం, కానీ తెలియదు, అవగాహన లేదు, తన దృష్టిలో లేదని చెప్పేశారు. సరైన సమాధానం చెప్పలేక బెదిరింపులకు దిగి ప్రెస్ మీట్ ముగించారు. డీఎస్సీలో ఎస్సీఈఆర్టీలో పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తి సోషల్ స్టడీస్, తెలుగు మెథడాలజీలో పరీక్షలు రాస్తే సోషల్ లో ఫస్ట్ ర్యాంక్, తెలుగులో ఆరో ర్యాంక్ వచ్చింది. దీనిపై ప్రశ్నిస్తే కోన శశిధర్.. ఆయన మా దగ్గర ఉద్యోగిగా ఉన్నాడు, పరీక్ష రాసేటప్పుడు ఎన్వోసీ ఇవ్వలేదు కాబట్టి పక్కనబెట్టామన్నారు. తర్వాత అడిగితే సర్టిఫికెట్ల «ధృవీకరణకు రాలేదని పక్కనబెట్టామన్నారు. ఈ రెండింటిలో ఏది నిజమో ఆయన చెప్పాలి. నవీన్ ఫస్ట్ ర్యాంక్ ఉన్నట్లు వెబ్ సైట్ లో పెట్టాక, ఆరోపణలు రావడంతో మెరిట్ లిస్ట్ తీసేసి, దాని స్ధానంలో రివైజ్డ్ లిస్ట్ పెట్టారు. ‘బైజూస్’ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్జగన్మోహన్రెడ్డి విద్యార్ధులకు బైజూస్ ట్యాబ్స్ ఇస్తే అందులో అవినీతి జరిగిందని వార్తలు రాయిస్తున్నారు. విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు చేసిన వ్యక్తి.. బైజూస్ ట్యాబ్స్ విషయంలో అవినీతి చేశాడని చెప్తారా ?, డీఎస్సీ అక్రమాలు బయటపడుతుంటే తట్టుకోలేక, వాటిని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఆరోపణలతో బురద జల్లే యత్నం చేస్తున్నారు. ప్రపంచ స్దాయిలో నాణ్యమైన విద్య అందించేందుకు 8వ తరగతి పిల్లలకు ఉచితంగా ట్యాబ్స్ ఇస్తే.. ఈ ప్రభుత్వం దాన్ని కూడా నాశనం చేసింది. ట్యాబులు ఇవ్వకపోగా.. మళ్లీ మాపై బురద జల్లుతున్నారు. మా మీద చేస్తున్న కక్షపూరిత రాజకీయాల్ని పిల్లల మీద కూడా చేస్తున్నారు. జగనన్నలా ట్యాబులు ఎందుకు ఇవ్వడం లేదని పిల్లలు ప్రశ్నిస్తుంటే.. సమాధానం చెప్పలేక ఇలా బురద జల్లుతున్నారు. కోవిడ్ లాంటి సమయాల్లో ఈ ట్యాబులు పిల్లలకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇప్పుడు వాటిని ఇవ్వకపోగా.. అవినీతి అంటూ బురద జల్లడం మీకే చెల్లింది.ఒక్క నవీన్ విషయంలోనే ఎన్నో అనుమానాలు:వెబ్ సైట్ లో ఆగస్టు 26న అతని పేరు మెరిట్ లిస్ట్ లో నుంచి తొలగించాక, అతని లాగిన్ కూడా బ్లాక్ చేశారు. సెప్టెంబర్ 2న సర్టిఫికెట్ల ధవీకరణ ఉంది. అతని పేరు ముందుగా బ్లాక్ చేశాక కూడా అతనికి కాల్ లెటర్ ఎలా పంపించారు. ఏ విధంగా అతను సెప్టెంబర్ 2 సర్టిఫికెట్ల ధవీకరణకు వచ్చే అవకాశం ఉంటుంది ? నా లాగిన్ బ్లాక్ చేశారు, నాకు కాల్ లెటర్ రాలేదని మీ దగ్గరికి వచ్చాక అతను కోర్టుకు కూడా వెళ్లాడు. మీరు వ్యూహాత్మకంగా బెదిరించి పక్కనబెట్టారా, అతను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం రాలేదా ఇందులో ఏది నిజమో చెప్పాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు రాలేదని అంటే అతని లాగిన్ ఎందుకు బ్లాక్ చేశారో, అతని ఫస్ట్ ర్యాంక్ ను ఎందుకు డిలీట్ చేశారో చెప్పాలి. ఇది ఆ ఒక్క వ్యక్తికే పరిమితం కాలేదు. ఆ ప్రశ్నాపత్రం కోచింగ్ సెంటర్లకు వెళ్లింది. ఒక్క వ్యక్తిని తొలగిస్తే సమస్య పరిష్కారం కాదు. సమగ్రంగా విచారణ జరిపించాలి. అందులో ఈ వ్యవహారం ఒక్కరికే పరిమితం అయిందా లేక చాలా మందికి వెళ్లిందా అనేది తేల్చాలి. ఇది వైఎస్సార్సీపీ డిమాండ్ మాత్రమే కాదు కొన్ని లక్షల మంది నిరుద్యోగుల కోరిక.డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందేలక్షా 36 వేల ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. 3.50 లక్షల మందికి పరీక్షలు సక్రమంగా నిర్వహించలేక అక్రమాలకు పాల్పడ్డారు. డీఎస్సీలో ప్రతిసారీ మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు. అందరి మార్కుల్నీ వెల్లడిస్తారు. మొదటి మార్కు నుంచి చివరి మార్కు వరకూ పాసైన అందరి వివరాలు ఇందులో ఉంటాయి. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ సిస్టమ్ ల ప్రకారం సెలెక్షన్ లిస్ట్ తయారు చేయాలి. ఆ తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఉద్యోగాల భర్తీ ఉంటుంది. కానీ అభ్యర్ధులకు కాల్ లెటర్స్ వ్యక్తిగతంగా పంపించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత కూడా వందల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎందుకని ప్రశ్నిస్తే మీ ఉద్యోగాల్ని స్పోర్ట్స్, పీహెచ్ కోటా కింద ఇచ్చామని అధికారులు చెప్పారు. నిన్న కోన శశిధర్ కూడా 1:1లో ఉద్యోగాలు ఇచ్చామన్నారు. హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతి ప్రకారం కొత్తగా స్పోర్ట్స్, పీహెచ్, మహిళా కోటాలో ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి కొందరిని తొలగించామన్నారు. కాల్ లెటర్స్ పంపాక ఈ కోటాలు కొత్తగా ఎందుకు అమలు చేసారు. ఈ విషయం కాల్ లెటర్స్ పంపక ముందు చూసుకోలేదా ? హారిజాంటల్ కేటగిరీలో చూసుకుంటే ఉదాహరణకు కడపలో ఉర్దూ పోస్టులు 3 ఉంటే, ఇందులో మొదటి పోస్టు మహిళకు ఇవ్వాలి. రోస్టర్ పాయింట్స్ 58–75–83 లో ఎస్టీలకు ఇవ్వాలి. ఓ అమ్మాయిని, ఇద్దరు అబ్బాయిల్ని పిలిచారు. వీరికి ఉద్యోగాలు ఇచ్చేయాలి. కానీ మెరుగైన ర్యాంక్ ఉన్న అమ్మాయిని కాస్తా 58లో ఇవ్వకుండా 75లో ఇచ్చేశారు. మహిళా రిజర్వేషన్ ప్రకారం కాకుండా జనరల్ లో ఇవ్వాలని భావించారు. దీని వల్ల ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు మిగిలిపోయారు. ఇది హారిజాంటల్ సిస్టమ్ కు వ్యతిరేకం. దీని మీద సదరు ఎస్టీ అభ్యర్ధి ప్రశ్నించినా ఫలితం లేక కోర్టుకు వెళ్లాడు. స్పోర్ట్ కోటాలో కూడా గోల్డ్ మెడల్ వచ్చిన వారికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. అందుకే సీబీఐ దర్యాప్తు జరిగి వాస్తవాలు బయటికి రావాలి. ఇలాంటి తప్పులు పునరావతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం.డీఎస్సీ కాదు ముమ్మాటికీ దగా డీఎస్సీ:వరుదు కల్యాణి, ఎమ్మెల్సీఎంతో పారదర్శకంగా చేపట్టాల్సిన డీఎస్సీని ఇవాళ దగా డీఎస్సీగా మార్చేశారు. నిరుద్యోగుల తరఫున వైఎస్సార్సీపీ ముందు నుంచీ చాలా ప్రశ్నలు అడుగుతోంది. స్పోర్ట్స్ కోటాను తీసుకుంటే 2012లో ఓ జీవో విడుదల చేశారు. 29 క్రీడలకు 2 శాతం రిజర్వేషన్ కల్పించారు. 2025 ఏప్రిల్ 18న ఇంకో 36 గేమ్స్ కలిపి మొత్తం 65 క్రీడలకు అవకాశం కల్పిస్తూ జీవో ఇచ్చారు. ఈసారి డీఎస్సీలో 421 మందికి స్పోర్ట్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు. 2026 మేలో టెట్, డీఎస్సీ లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన వారికి పరీక్ష పెట్టాలని మళ్లీ ఇంకో జీవో ఇచ్చారు. పాత జీవోను రద్దు చేశారు. ఇన్ని మార్పులు ఎందుకు చేస్తున్నారు? అక్రమాలు జరిగినందుకేగా?, టెట్, డీఎస్సీ లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి ? ఈ కోటాలో ఇచ్చిన ఉద్యోగాల్లో క్రీడల అర్హతల ప్రాతిపదిక కూడా మార్చేశారు. మెడల్స్ కొట్టిన వారికి కాకుండా ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న వారికి ప్రాధాన్యం ఇచ్చారు. డీఎస్సీ పేపర్ తయారీలో భాగమైన వ్యక్తికే ఫస్ట్ ర్యాంక్ వచ్చే ఉద్యోగం నుంచి తొలగించారు. కోన శశిధర్ కూడా మా ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదు. కేవలం దాటవేత ధోరణి ప్రదర్శించారు. నవీన్ గురించి మూడు రకాలుగా సమాధానాలు చెప్పారు. కొన్ని లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారని అర్దమవుతోంది. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం’ అని డిమాండ్ చేశారు. -
DSC పేపర్ అప్లోడ్ చేసే కంప్యూటర్ ఆపరేటర్ కు స్టేట్ ఫస్ట్ ఎలా వచ్చింది?
-
డీఎస్సీలో తప్పుల మీద తప్పులు.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి
-
డీఎస్సీలో అక్రమాలపై రేపు వైఎస్సార్సీపీ ధర్నా
రాజమహేంద్రవరం సిటీ: డీఎస్సీ–2025లో అవకతవకలు, మోసాలపై జూన్ 1న వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయనున్నట్లు వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. డీఎస్సీపై సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు.డీఎస్సీ నిర్వహణలో ప్రతిభ కలిగిన అర్హులకు అన్యాయం చేయడం, హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత లోపించడం, విస్తుగొలిపే అక్రమాలు వెలుగు చూడడం, మెరిట్ లిస్టులు వెబ్సైట్ నుంచి మాయం చేయడం, రోల్ ఆఫ్ రిజర్వేషన్ సక్రమంగా పాటించకపోవడం, పోస్టులు అమ్ముకోవడం వంటి ఆరోపణలు బయటికి రావడం, స్పోర్ట్స్ కోటా పోస్టుల నియామకంలో అక్రమాలు వెలుగు చూడడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. -
ఏపీ మెగా డీఎస్సీలో అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి సర్కార్ యత్నాలు... తప్పు జరగలేదంటూనే సమాధానాలు దాటవేసిన విద్యా శాఖ
-
తప్పుపై తప్పు.. స్పోర్ట్స్ డీఎస్సీ మాకు తెలీదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మెగా డీఎస్సీ–2025లో అవకతవకలకు పాల్పడి ఉక్కిరి బిక్కిరి అవుతున్న చంద్రబాబు ప్రభుత్వం కొత్త కథలు చెబుతూ తప్పుపై తప్పు చేస్తూ దొరికిపోతోంది. ఈ కుంభకోణంపై ఎట్టకేలకు ఆలస్యంగా స్పందించింది. పోస్టుల భర్తీలో తీవ్ర అవకతవకలకు పాల్పడటాన్ని ‘సాక్షి’ ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. చేసిన స్కామ్లో అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వం ఎనిమిది రోజుల తర్వాత ఈ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. శనివారం విద్యాశాఖ అధికారులను ముందుకు నెట్టి, తూతూ మంత్రంగా వివరణ ఇప్పించే ప్రయత్నం చేసి.. అందులోనూ అడ్డంగా బుక్కయింది. శనివారం సాయంత్రం విద్యాభవన్లో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు పొంతన లేని జవాబులిస్తూ.. కొన్నింటికి సమాధానం దాటవేశారు. స్పోర్ట్స్ డీఎస్సీ గురించి తనకు తెలియదని చెప్పడం కుంభకోణం జరిగిందనడానికి మరింత బలం చేకూరుస్తోంది. ఈ సమావేశంలో మెగా డీఎస్సీ–2025ను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ చెప్పుకొచ్చారు. డీఎస్సీ నిర్వహణకు సంబంధించి 241 కేసులు నమోదైనప్పటికీ, రికార్డు సమయం 148 రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేశామన్నారు. మెగా డీఎస్సీ–2025 నిర్వహణ ప్రక్రియను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ ర్యాంకుపై పొంతన లేని సమాధానాలు చెప్పారు. అలాగే, స్పోర్ట్సు కోటా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో జరిగిన తప్పులపై తనకు తెలియదని, అది తన పరిధికాదన్నట్టు జవాబు దాటవేశారు. నవీన్ విషయంలో 3 సమాధానాలుమీడియా: మెగా డీఎస్సీలో ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్గా, టీజీటీలో ఆరో ర్యాంకు సాధించారు. టాప్ ర్యాంక్ సాధించిన అతనికి పోస్టు ఎందుకు నిలిపివేశారు? ఎలాంటి తప్పు జరక్కుంటే ఇలా ఎందుకు చేశారు. అసలు ఆయనకు టాప్ ర్యాంకు ఎలా వచ్చింది?కార్యదర్శి: శాఖలో పనిచేసే ఏ ఉద్యోగి అయినా పరీక్ష రాయాలన్నా, కోర్సులు చదవాలన్నా ఆ శాఖ అనుమతి తప్పనిసరి. నవీన్ ముందస్తు అనుమతి తీసుకోలేదు. అందుకే అతడి పోస్టును నిలిపివేశాం. నవీన్ రెండు పరీక్షలు రాశారు. పరీక్ష రాసేంత వరకు ఇక్కడ పనిచేశాడు. ఓ దాంట్లో 1వ ర్యాంక్, రెండో దాంట్లో 6వ ర్యాంక్ వచ్చింది. అతను సెలెక్షన్ లిస్టులో ఉన్నారు. కానీ వెరిఫికేషన్ కోసం రాలేదు. దీంతో నిబంధన ప్రకారం అతన్ని రిక్రూట్మెంట్ చేయలేకపోయాం. నవీన్ కోర్టుకు వెళ్లాడు. కోర్టుల్లో మా వాదనలు వినిపించాం. అతను వెరిఫికేషన్ ప్రక్రియకు ఎందుకు రాలేదో అతనికే తెలియాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్కు రాకపోవడంతో అతని పోస్టు పక్కన పెట్టాం. వాస్తవం: నవీన్ రెండు పోస్టులకు ఉత్తమ ర్యాంకులు సాధించాక అతనితో తన కాంట్రాక్టు ఉద్యోగానికి రాజీనామా చేయించారు. అనంతరం అతడి డీఎస్సీ లాగిన్ ఐడీని బ్లాక్ చేశారు. అతను కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకునేందుకు ఆస్కారం లేకుండా పోయింది. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించారు. 1:1 పద్ధతిలో సర్టిఫికెట్ల పరిశీలన కార్యదర్శి: గత అనుభవాల దృష్ట్యా వెయిటింగ్ లిస్టు కాకుండా 1ః1 పద్దతిలో సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచాం. వెరిఫికేషన్లో ఎవరైనా ఫెయిల్ అయితే ఆ తర్వాత వారిని వెరిఫికేషన్కు పిలిచాం. హారిజాంటల్ రిజర్వేషన్లు స్పోర్ట్స్, మహిళ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్కు ఇవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రస్తుతం పేపర్లలో వస్తున్న కథనాలన్నీ హారిజాంటల్ రిజర్వేషన్లకు సంబంధించినవే. వాస్తవం: 1:1 పద్దతిలో సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిస్తే.. కాల్ లెటర్లు వచ్చిన వారంతా మెరిట్ లేదా హారిజాంటల్ రిజర్వేషన్లో ఉన్నవారే. వీరందరికీ ఉద్యోగం రావాలి. సర్టిఫికెట్లు సరిగా లేకపోతే వారిని రిజెక్ట్ చేసి, రెండో స్థానంలో ఉన్న వారికి అవకాశం ఇవ్వాలి. ఇక్కడ కాల్ లెటర్లు వచ్చిన వారంతా మెరిట్ లేదా హారిజాంటాల్ రిజర్వేషన్లో ఉన్నవారే. అలాంటి వారికి పోస్టింగ్ ఇవ్వలేదు. స్పోర్ట్సు కోటా వారిచ్చిందే చేశాం కార్యదర్శి: డీఎస్సీ స్పోర్ట్సు కోటా అంశంలో శాప్ ఇచ్చిన అంశాలనే పరిగణనలోకి తీసుకున్నాం. అక్కడేం జరిగిందో మాకు తెలియదు. పరీక్ష లేకుండా పోస్టులు ఇవ్వాలన్నది డీఎస్సీ భర్తీ నాటి పాలసీ. ప్రభుత్వంలో పాలసీలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు పాలసీ మారితే మాకు సంబంధం లేదు. జీఏడీ ఇచ్చిన జీవో ప్రకారం మేం చేశాం. స్పోర్ట్స్ సెపరేట్గా హ్యాండిల్ చేద్దాం. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు దక్కించుకున్న వారు కూడా కష్టపడి ఉద్యోగాన్ని సాధించారు. వాస్తవం: డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో రెండు విధానాలు అనుసరించారు. ఒకటి రెగ్యులర్ డీఎస్సీలో స్పోర్ట్స్ సర్టిఫికెట్లకు క్రీడల ప్రాధాన్యం ప్రకారం వెయిటేజీ ఇచ్చి పోస్టులు భర్తీ చేస్తారు. కానీ, ఈ ప్రభుత్వం కొత్తగా రెండో విధానం ఈ డీఎస్సీ వరకు అమలు చేసింది. ప్రత్యేకంగా క్రీడా పాలసీ–2024–29ను డీఎస్సీకి ముందు తీసుకొచ్చింది. ఇందులో ఎటువంటి రాత పరీక్ష (టెట్/డీఎస్సీ) లేకుండా క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేసింది. భర్తీ ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ పాలసీని సవరించి, రాత పరీక్ష తప్పనిసరి చేసింది. ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదుకార్యదర్శి: డీఎస్సీలో లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తే ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. తప్పు పట్టలేదు.వాస్తవం: డీఎస్సీ నిర్వహణలో 33,830 గ్రీవెన్సెస్ వచ్చాయి. ఈ విషయాన్ని అధికారులు రాత పూర్వంగా ప్రకటించారు. జిల్లా, జోనల్ స్థాయిలో తమకు సంబంధం లేదు.. రాష్ట్ర కార్యాలయంలో తేల్చుకోండి అని, మరికొందరికి నిర్లక్ష్యంగా సమాధానం పంపించారు. మరి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని చెప్పడంలో అర్థం లేదు. కాపీయింగ్, లీకేజీకి ఆస్కారం లేదుకార్యదర్శి: డీఎస్సీలో కాపీయింగ్, లీకేజీకి ఆస్కారం లేదు. అంతా ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. వాస్తవం: తూర్పు గోదావరి జిల్లాలో ఓ సెంటర్లో మాస్ కాపీయింగ్ చేశారని 11 మంది డీఎస్సీ అభ్యర్థులను అధికారులే స్వయంగా అనర్హులుగా ప్రకటించారు. వారంతా కోర్టుకు పోగా అధికారులు నేరం రుజువు చేయలేకపోయారు. దాంతో వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. (కాపీయింగ్పై మరోసారి ప్రశ్నించగా అలా అనలేదని సమాధానం చెప్పారు)వాస్తవాలు దాచి సమాధానం దాటవేతడీఎస్సీ అక్రమాలలో కీలకమైన ఆరోపణలపై విద్యా శాఖ సమాధానం దాటవేసింది. ఎస్సీఈఆర్టీలో పనిచేసే నవీన్కు టాప్ ర్యాంక్ రావడంపై కార్యదర్శి కోన శశిధర్ మూడు రకాలుగా సమాధానం చెప్పారు. అనుమతి తీసుకోలేదు కాబట్టి పక్కనపెట్టామని ఒకసారి.. కౌన్సిలింగ్కు రాలేదు కాబట్టి పక్కన పెట్టామని మరోసారి చెప్పారు. వాస్తవానికి నవీన్కు కాల్ లెటర్ వెళ్లకుండా అభ్యర్థి డీఎస్సీ లాగిన్ ఐడీని అధికారులు బ్లాక్ చేశారు. ఆ విషయం బాధిత నవీన్ హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొన్నాడు. పైగా కాంట్రాక్టు ఉద్యోగి పరీక్ష రాసేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరి అనే అంశంపై సమాధానం దాటవేశారు. అలాగే, అతను ఎస్సీఈఆర్టీలో పనిచేస్తూ టాప్ ర్యాంకులు సాధించడం యాదృచ్ఛికమా లేక ఏమైనా తప్పు జరిగిందా అనే అంశంపైనా సరైన సమాధానం ఇవ్వలేదు.గ్రీవెన్స్లోనూ తప్పులేకాల్ లెటర్లు అందుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లిన తర్వాత అన్నీ సక్రమంగానే జరిగాయని చెప్పిన అధికారులు ఎంపిక లిస్టులో అభ్యర్థుల పేర్లను గల్లంతు చేశారు. ఈ విషయమై బాధిత అభ్యర్థులు విద్యా శాఖ ఏర్పాటు చేసిన గ్రీవెన్సెస్ రిడ్రెసెల్ సెల్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో చాలా మంది అభ్యర్థులకు సరైన సమాధానం లభించలేదని వాపోయారు. మరికొందరికి రాత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో అధికారుల నిర్లక్ష్యం కనిపించింది.దొంగ సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగం!డీఎస్సీ స్పోర్ట్స్ కోటా డైరెక్టు నియామకాలే కాదు.. రాత పరీక్షల్లో స్పోర్ట్స్ సర్టిఫికెట్ వెయిటేజీల్లోనూ అక్రమాలు జరిగాయి. అసలు ఆటే రాని వ్యక్తులు దొంగ సర్టిఫికెట్లు పెట్టి పోస్టులు కొట్టేశారు. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో ఓ మహిళకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. రాత పరీక్షకు తోడు స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ జత చేయడంతో పోస్టు కట్టబెట్టారు. అయితే సదరు మహిళ ఎన్నడూ క్రీడా మైదానంలో కాలు పెట్టింది గానీ, జిల్లా, రాష్ట్ర, స్థాయిలో ఆడింది గానీ లేకుండా ఏకంగా జాతీయ స్థాయి సర్టిఫికెట్ పుట్టించి మరీ పోస్టు కొట్టేశారు. సదరు వ్యక్తి భర్త పీఈటీ కావడంతో మాస్టర్ మైండ్ ఏజెంట్లతో కలిసి ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి పోస్టు తెచ్చుకున్నారు. దీనిపై పలువురు అభ్యర్థులు శాప్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు ఆర్టీఐ ద్వారా సమాచారం కోరితే ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తూ పిటిషనర్లను బెదిరించడం గమనార్హం.ఇదో అవినీతి క్రీడ⇒ విజయనగరం జిల్లాకు చెందిన ఓ వెయిట్ లిఫ్టర్ను కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టల్ శాఖ క్రీడా కోటా ఉద్యోగానికి అనర్హురాలిగా ప్రకటించింది. అనూహ్యంగా ఆమెకు ఏపీ డీఎస్సీ క్రీడా కోటాలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పోస్టు ఇచ్చారు. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో పోస్టల్ శాఖను మోసగించే ప్రయత్నం చేయడంతో ఆమెపై గతంలో అనర్హత వేటు వేశారు. అలాంటి ఈమెకు ఏపీలో ఎలా ఉద్యోగం ఇచ్చారు? ఆమె రెండు వేర్వేరు ఏజ్ గ్రూప్స్లో ఆడినట్టు విజయనగరం జిల్లా పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఆధారాలతో గతేడాది ఆగస్టులోనే శాప్కు ఫిర్యాదులు చేశారు. అప్పుడు ఆ ఫిర్యాదును పట్టించుకోలేదు. నెల క్రితం ‘సాక్షి’లో కథనం వచ్చాక విచారణ చేస్తామని శాప్ అధికారులు ప్రకటించారు. కానీ ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఆమె ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ⇒ విజయనగరానికి చెందిన మరో క్రీడాకారుడు జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ చూపించి పతకాలు పొందారు. ఏపీ డీఎస్సీలో క్రీడా కోటా ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే అతన్ని నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆ తర్వాత అతను కేంద్ర ప్రభుత్వ పోస్టల్ శాఖలో ఇదే క్రీడా కోటాలోనే ఉద్యోగం పొందారు. ఇక్కడ పోస్టల్ శాఖ అనర్హులుగా తేల్చిన వ్యక్తికి ఏపీలో ఉద్యోగం ఇస్తే.. ఏపీలో తిరస్కరించిన వ్యక్తికి పోస్టల్ శాఖలోనే ఉద్యోగం వచ్చింది. ఇలాంటి ఘటనలే డీఎస్సీ క్రీడా కోటాలో ఎంపికల పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి.⇒ కర్నూలు జిల్లాలో స్థానికంగా మెరిట్ అభ్యర్థులను పక్కన పెట్టి నాన్–లోకల్ కోటాలో వేరే జిల్లా వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారు. ఇక్కడ నాన్–లోకల్లోకి వచ్చేవారు స్థానికుల కంటే మెరిట్ జాబితాలో అగ్రస్థానంలో ఉండాలి. కానీ, సదరు ఉద్యోగి స్థానికుల కంటే రెండు స్థానాలకు దిగువన ఉన్నా నాన్లోకల్ కోటాలో అక్కడ పోస్టును భర్తీ చేశారు. పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులకు ఇది తప్పు అని తెలిసినా పట్టించుకోలేదు. అసలు ఓపెన్ కేటగిరీలో ఓ పోస్టు భర్తీ చేశాక, నాన్ లోకల్లో మరో పోస్టును ఎలా భర్తీ చేస్తారు? -
లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలి
నెల్లూరురూరల్: డీఎస్సీ–2025 నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, విద్యాశాఖ మంత్రి లోకేశ్ వెంటనే బాధ్యత వహించి రాజీనామా చేయాలని శ్రీపొట్టిశ్రీరాములు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో సహా బయట పెట్టామని, ఆ ఆరోపణలకు తూతూమంత్రంగా అధికారులు ఖండన ఇచ్చారని, మేం లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇవ్వలేదన్నారు.డీఎస్సీ అక్రమాలపై జూన్ 1న కలెక్టరేట్ల ముట్టడిని నిర్వహిస్తున్నామని, ఈ స్కాంపై ప్రభుత్వం సీబీఐతో దర్యాప్తు జరిపించే వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా పోస్టులు అమ్ముకుందన్నారు. అర్హులైన అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపి, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యాక కూడా తుది జాబితాలో వారి పేర్లు గల్లంతయ్యాయని, మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్టు రెండూ ప్రకటించకుండా ఎంపిక చేసిన అభ్యర్థులకు నేరుగా మెసేజ్ల ద్వారా సమాచారం ఇచ్చారన్నారు. ఒక పోస్టుకు ఒక్కరినే ఎంపిక చేసి సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రభుత్వం పిలిచిందని, కానీ వారికి ఉద్యోగాలు ఇవ్వలేదని, అటు వారిని రిజెక్టెడ్ జాబితాలోనూ చూపలేదని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.అభ్యర్థులు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేస్తే అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని తెలిపారు. అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా, బేఖాతరు చేస్తూ అప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసినట్లు కోర్టుకు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. డీఎస్సీ ఫలితాల ప్రకటన వరకు ఒక విధానం, సర్టిఫికెట్ల పరిశీలనకు మరో విధానం, తుది ఎంపిక జాబితా విడుదల సమయంలో మరో విధానాన్ని అమలు చేశారన్నారు. అలా పరీక్ష రాసిన అభ్యర్థులకు మెరిట్ లిస్ట్ పరిశీలించే వీలు లేకుండా చేశారన్నారు.మామూలుగా ఏ పరీక్షలో అయినా, మెరిట్ లిస్ట్ ప్రకటించిన తర్వాత సెలక్షన్ లిస్టు తయారు చేసి కౌన్సెలింగ్ నిర్వహిస్తారని, కానీ, ఈ డీఎస్సీ–2025లో మాత్రం మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా సెలెక్టెడ్ అభ్యర్థులకు ఒక పోస్టుకు ఒకరిని చొప్పున మాత్రమే ఎంపిక చేసి, సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారని, చివరకు వారికి కూడా మొండిచేయి చూపారన్నారు. అందుకే డీఎస్సీ–2025పై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. -
సర్కారు ఉక్కిరిబిక్కిరి!
తిరుపతి టాస్క్ఫోర్స్: డీఎస్సీ–2025లో అవకతవకలు బట్టబయలు కావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. దాన్నుంచి బయట పడేందుకు కొత్తగా ఉపాధ్యాయులైన వారిని పావులుగా వాడుకునేందుకు స్కెచ్ వేసింది. మెరిట్ కలిగి ఉండీ, ఉద్యోగం రాని బాధితుల తరఫున పోరాడుతున్న వైఎస్సార్సీపీ పైకి వారిని ఉసిగొల్పేందుకు శక్తి వంచన లేకుండా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో తిరుపతి వేదికగా బాలాజీ కాలనీలోని లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో ‘నిరుద్యోగులపై గొడ్డలి వేటు’ అంటూ సమావేశం నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది.స్వచ్ఛందంగా ఉపాధ్యాయులు ఈ సమావేశానికి వచ్చే పరిస్థితి ఉండదని భావించి డీఈవోను అడ్డం పెట్టుకుని మార్గ నిర్దేశం చేసింది. దీంతో డీఈవో కాస్తా టీడీపీ నేతగా పరకాయ ప్రవేశం చేశారు. ప్రభుత్వ పెద్దల సూచన మేరకు.. శనివారం మీటింగ్ ఉందని డీఎస్సీ–2025లో పోస్టింగ్ పొందిన ప్రతి ఉపాధ్యాయుడు మీటింగ్కు హాజరు కావాలని డీఈవో కేవీఎన్ కుమార్ తన సిబ్బందితో ఫోన్లు చేయించారు. ఓ దశలో వచ్చి తీరాల్సిందేనని బెదిరించారు. తీరా ఆ సమావేశానికి హాజరైన ఉపాధ్యాయులు.. అక్కడ టీడీపీ నేతలు ఉండటం చూసి బిత్తర పోయారు.డీఎస్సీ కుంభకోణంపై గళమెత్తిన వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సమావేశానికి తమను మభ్యపెట్టి రప్పించడం తగదని అసహనం వ్యక్తం చేశారు. అధికారిక సమావేశం అని చెప్పి ప్రతిపక్ష పార్టీలను విమర్శించమని నిర్దేశించడం తగదని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో వారికి ఎదురు చెబితే దాడులు చేస్తారని జడిసి మిన్నకుండిపోయారు. ఈ సమావేశంలో శాప్ చైర్మన్ రవి నాయుడు, టీడీపీ ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, రాంభూపాల్రెడ్డి 2 గంటల పాటు టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు.టీడీపీ కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కాగా, పార్టీ సమావేశాన్ని తలపించేలా రాజకీయ నేతలు ఉపన్యాసాలు ఇవ్వడం ఏమిటని ఉపాధ్యాయులు తలలు పట్టుకున్నారు. తుదకు తమను పార్టీ కార్యకర్తలుగా చేశారని వాపోయారు. ‘ప్రభుత్వం ఇలా చేయడం తగదు. మమ్మల్ని ఇలా పిలిపించడం ఏమాత్రం సరికాదు. తప్పు జరిగింది కాబట్టే ప్రభుత్వం ఇంతగా భయపడుతోందని అర్థమవుతోంది.లేకుంటే ఇంత దొంగచాటుగా సమావేశం నిర్వహించడం ఏమిటి? పొరపాట్లు జరిగి ఉంటే హూందాగా ఒప్పుకుని సరిచేయాలి. అర్హత ఉన్న వారికి ఉద్యోగం రాకపోవడం నిజంగా నేరమే’ అని ఈ సమావేశానికి హాజరైన పలువురు ఉపాధ్యాయులు వ్యాఖ్యానించారు. ఈ విషయమై మీడియా ప్రతినిధులు డీఈవోను సంప్రదిస్తే.. ఆ సమావేశంతో తనకు సంబంధం లేదని విచిత్ర సమాధానం చెప్పడం కొసమెరుపు. అసలు ఏ అధికారంతో శాప్ చైర్మన్ రవి నాయుడు ఈ సమావేశం నిర్వహించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని బాధిత డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు.సీన్ 1 : ‘డీఎస్సీ కుంభకోణంతో మన పరువుపోతోంది. మనమేమో గొప్పగా నిర్వహించామని ఇన్నాళ్లూ చెప్పుకున్నాం.. ఇలాగే సైలెంట్గా ఉంటే మన గ్రాఫ్ తగ్గిపోతుంది.. ఏదో ఒకటి చేయాలి.. లేదంటే ప్రజల్లో పలుచనైపోతాం.. చేసేదేదో త్వరగా చేయండి’ అని ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆందోళనతో దిశా నిర్దేశం చేశారు.సీన్ 2 : డీఎస్సీ కుంభకోణాన్ని అంతా తానై నడిపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శాప్ చైర్మన్ రవి నాయుడు రంగంలోకి దిగారు. తిరుపతి డీఈవోపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వ పరువు కాపాడటం కోసం తమకు సహకరించాలని, ఇది ‘పెద్దల’ నిర్ణయం అని చెప్పారు.సీన్ 3 : ‘హలో.. మేము డీఈవో కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. 2025 డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శనివారం తిరుపతిలో డీఈవోతో సమావేశం ఉంది. ఉదయం 10 గంటలకు బాలాజీ కాలనీలోని లక్ష్మీనారాయణ కళ్యాణ మండపం వద్దకు కచ్చితంగా చేరుకోవాలి. ఎట్టిపరిస్థితిలో మిస్ కాకూడదు. మీటింగ్కు హాజరుకాని వారిపై కఠిన చర్యలు ఉంటాయి’ అని ఫోన్ ద్వారా హుకుం జారీ.సీన్ 4 : అఫీషియల్ సమావేశం అని చెప్పడంతో కొత్త ఉపాధ్యాయులంతా పనులు మానుకుని శనివారం హుటాహుటిన తిరుపతి చేరుకున్నారు. సమావేశం ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలోకి వెళ్లగానే అక్కడి వాతావరణం చూసి భయపడ్డారు. ఏమైనా మాట్లాడితే స్టేజి పైనున్న టీడీపీ నేతల అనుచరులు తన్నేలా ఉన్నారని నోరు మూసుకుని కూర్చున్నారు. ఈ గోలంతా తనకెందుకని అనుకున్న డీఈవో గైర్హాజరయ్యారు.సీన్ 5 : ‘మీరంతా కష్టపడి టీచర్ ఉద్యోగాలు సంపాదించారు. కానీ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కాదంటోంది. వారికి తగిన విధంగా మీరు సమాధానం ఇవ్వాలి. లేదంటే మీకు ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంపై మరక పడుతుంది’ అని శాప్ చైర్మన్ రవినాయుడు దిశానిర్దేశం చేశారు. ఇందుకు ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, రాంభూపాల్రెడ్డి వంత పాడారు. రాజకీయ సభకు ఉపాధ్యాయులా!?విద్యాభివృద్ధి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన డీఈవో, అధికార పార్టీ రాజకీయ కార్యక్రమాలకు ఉపాధ్యాయులను సమీకరించే పనిలో నిమగ్నం కావడం దారుణం. డీఎస్సీలో జరిగిన అవకతవకలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు అధికార పార్టీ కొత్తగా నియమితులైన టీచర్లతో రాజకీయ సభ నిర్వహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఆ సభకు డీఈవో కార్యాలయం నుంచి టీచర్లకు ఫోన్లు చేసి రప్పించడం ఇంకా దారుణం. విద్యా కార్యక్రమమని భావించి హాజరైన ఉపాధ్యాయులకు రాజకీయ ఉపన్యాసం వినిపించడం ఏమాత్రం సబబు కాదు. ఈ అంశంపై కలెక్టర్ వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. – వందవాసి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి, తిరుపతిటీడీపీ అడ్డాగా డీఈవో ఆఫీస్జిల్లా విద్యా శాఖ అధికారి అధికార పార్టీకి ఏజెంట్గా వ్యవహరిస్తూ తన పదవికి మచ్చ తెచ్చారు. ఈయన్ను తక్షణం విధుల నుంచి తొలగించాలి. జిల్లా విద్యా శాఖ కార్యాలయం అధికార పార్టీకి అడ్డాగా మారింది. అధికార పార్టీ ఏర్పాటు చేసే సభలకు కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులను సమీకరించే సాధనంగా డీఈఓ కార్యాలయాన్ని ఉపయోగించడం దారుణం. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ఉద్దేశంతో డీఈవో ఉపాధ్యాయులకు ఫోన్లు చేసి సభకు హాజరు కావాలని ఆదేశించడం దుర్మార్గం. ఆయన ఆ పదవికి అనర్హుడు. తక్షణం తొలగించాలి. లేని పక్షంలో ఉద్యమిస్తాం. – అక్బర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, తిరుపతిడీఈఓను సస్పెండ్ చేయాలిడీఈవో స్థాయి అధికారి ఓ పార్టీకి కొమ్ము కాయడం దారుణం. పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటం సహించరాని విషయం. డీఎస్సీలో జరిగిన అవినీతిపై వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసనలకు భయపడి ఉపాధ్యాయులను ఉసిగొల్పాలనుకోవడం దారుణం. అధికారిక మీటింగ్ అని చెప్పి, ఉపాధ్యాయులను మభ్యపెట్టి పార్టీ మీటింగ్లకు హాజరు కావాలని హుకుం జారీ చేసిన డీఈఓను తక్షణం సస్పెండ్ చేయాలి. – డాక్టర్ ఓబుల్రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తిరుపతిఎవరు చెబితే ఇలా చేశారు?డీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డీఈవో తీరు విమర్శలకు తావిస్తోంది. విద్యా వ్యవస్థను రాజకీయాలకు ముడిపెట్టి పబ్బం గడుపుకుంటున్నారు. జిల్లా విద్యాశాఖలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న తరుణంలో, వాటిపై దృష్టి సారించకుండా పార్టీ మీటింగ్లకు ఉపాధ్యాయులను పంపే కార్యక్రమంలో ఉండటం దారుణం. ఇలాంటి వ్యక్తులు ఆ పదవికి అనర్హులు. ఇలాంటి వ్యవహారాలతోనే ‘పది’ ఫలితాలపై ప్రభావం పడుతోంది. ఇంతకూ ఎవరు చెబితే డీఈవో ఈ సమావేశం నిర్వహించారో వెల్లడించాలి. – సుందరరాజు, ఎన్ఎల్ఎస్ఏ జాతీయ అధ్యక్షుడుఅబ్బే.. మేం పిలవలేదు..డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు తిరుపతిలో శనివారం మీటింగ్కు హాజరు కావాలని మేము ఎవరికీ చెప్పలేదు. డీఈవో ఆఫీస్ నుంచి తాను చెప్పినట్లు ఎవరూ కాల్స్ చేయలేదు. కొత్తగా ఎంపికైన టీచర్లను మీటింగ్ పేరుతో పిలిపించి.. టీడీపీ వాళ్లు నిర్వహించిన మీటింగ్కు హాజరు కావాలని మేము చెప్పలేదు. నాకు ఈ అంశంతో సంబంధం లేదు. పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శనివారం నేను పిచ్చాటూరు, సత్యవేడు ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాల పరిశీలనలో ఉన్నాను. నా పేరు చెప్పి, డీఈవో ఆఫీస్ నుంచి ఎవరైనా ఫోన్లు చేసి ఉపాధ్యాయులను పిలిపించారేమో విచారిస్తాను. – కేవీఎన్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి -
డీఎస్సీ అక్రమాలపై ఆధారాలతోనే ప్రశ్నిస్తున్నాం
సాక్షి, నెల్లూరు: కూటమి సర్కార్ ఆర్బాటంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో ముమ్మాటికీ అక్రమాలు జరిగాయని, గతేడాది క్రీడాకారుల కోటాపై ఇచ్చిన జీవోలు, ఈ ఏడాది వాటిని ఉపసంహరించి, మళ్లీ కొత్త జీవోలు ఇవ్వడమే దీనికి నిదర్శనమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని తాము పదే పదే ప్రశ్నిస్తుంటే అధికారులు ఇచ్చిన ఖండనలోనూ తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకున్నారని కాకాణి ఆక్షేపించారు. అక్రమాలు జరగకపోతే డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్డితో విచారణ చేయించడానికి ఎందుకు భయపడుతున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన ఇంకేమన్నారంటే..డీఎస్సీపై ఆధారాలతోనే ప్రశ్నిస్తున్నాండీఎస్సీలో జరిగిన అక్రమాలపై మేం కేవలం ఆరోపణలు చేయట్లేదు, ఆధారాలతో సహ మీడియా ముందుకు వస్తున్నాం. మెగా డీఎస్సీలో అంతులేని అక్రమాలు జరిగాయి. ఓ పక్క టీచర్ ఉద్యోగాలపై నిరుద్యోగుల్ని ఊరించి, ఎన్నికలకు ముందు నుంచీ మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చి, చివరికి 2025లో నోటిఫికేషన్ ఇచ్చారు. పరీక్ష నిర్వహణపై అనేక అనుమానాలు ఉన్నాయి. దీనిపై మేం చేసిన ఆరోపణల మీద అధికారులు ఖండన కూడా ఇచ్చారు. అయితే ఈ ఖండనలో అంతా మీరు చెప్పినవి కరెక్ట్ కాదని చెప్పారు కానీ, తప్పు జరగలేదని పాయింట్ల వారీగా చెప్పలేకపోయారు. నిరుద్యోగులకు డీఎస్సీలో జరిగిన దగాపై వైఎస్ జగన్ పిలుపు మేరకు ఇప్పటికే ఆందోళనలు చేశాం.జూన్ 1వ తేదీన యువత ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి కూడా చేయబోతున్నాం. మీరు అర్హులుగా ఎంపిక చేసిన అభ్యర్ధుల పేర్లు తుది జాబితాలో ఎందుకు గల్లంతయ్యాయో చెప్పగలరా ? మెరిట్ లిస్ట్ లేదు, సెలక్టెడ్ లిస్ట్ కూడా లేకుండా ఎంపికైన వారికి మెసేజ్ లు మాత్రమే పంపించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా ? ఒక పోస్టుకు ఒక్కరినే పిలిచి, అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు, తిరస్కరించలేదు. అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని హైకోర్టు చెప్పినా, ఆదేశాలు బేఖాతరు చేస్తూ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు.డీఎస్సీ ఫలితాలు ప్రకటించేటప్పుడే రూల్ ఆఫ్ రిజిస్టర్ రోస్టర్ ప్రకారం అభ్యర్ధులకు ఎన్ని మార్కులు వచ్చాయో మెరిట్ లిస్ట్ విడుదల చేయాల్సి ఉంది. కానీ విడుదల చేశాక దాన్ని డిలీట్ చేయాల్సి అవసరం ఎందుకొచ్చింది ? ఎప్పుడూ లేని విధంగా డీఎస్సీని ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది ? సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చే సరికి మరో కొత్త విధానం అమలు చేశారు. తుది ఎంపిక జాబితాకు వచ్చేటప్పటికి వీటన్నింటినీ పక్కనబెట్టి మరో కొత్త విధానం తెచ్చి, మీ అజెండాను అమలు చేసి అర్హులైన నిరుద్యోగుల కడుపు కొట్టే ప్రయత్నం చేశారు.నైతిక విలువల్లేని విద్యామంత్రి లోకేష్ఎప్పుడైనా పరీక్ష రాసిన అభ్యర్ధులకు మెరిట్ లిస్ట్ పరిశీలించుకునే హక్కు ఉంది. మెరిట్ లిస్ట్ లో తాము ఎక్కడ ఉన్నాం, తమకన్నా ముందూ వెనుక ఎవరున్నారనే అంశాల్ని తెలుసుకునే అవకాశం అభ్యర్ధులకు ఇవ్వాలి. మెరిట్ లిస్ట్ తయారు చేశాక పారదర్శకంగా సెలెక్టెడ్ లిస్ట్ ప్రకటిస్తారు. అది చేయలేదు కాబట్టి అక్రమాలు జరిగాయని కచ్చితంగా నమ్ముతున్నాం. అందుకే ఈ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని పదే పదే కోరుతున్నాం.చదువూ, సంధ్యా లేని మొద్దబ్బాయి లోకేష్ ను తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా చేయడం ఈ సమాజానికి తీరని ద్రోహం చేయడమే. అందుకే ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిపై కేసులు పెడతానంటున్నారు తప్ప నా వల్ల పొరబాటు జరిగిందని, కాబట్టి తాను విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పడం లేదు. నైతిక విలువలు లేవు కాబట్టే లోకేష్ ఇలా వ్యవహరిస్తున్నారు. డీఎస్సీలో 16347 పోస్టుల్లో 421 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో నింపారు. అందులో మీరు నింపిన విధానం చూస్తే ఎంత భయంకరమైన వాస్తవాలు వెలుగుచూస్తున్నాయో మేం వివరిస్తాం.స్పోర్ట్ కోటా జీవోల్లో మార్పులతో అక్రమాలుక్రీడల్లో ప్రతిభ చూపిన వారికి 2 శాతం రిజర్వేషన్ ఎప్పటి నుంచో అమలు ఉంది. స్పోర్ట్స్ కోటాపై ఉమ్మడి ఏపీలోనే 2012 ఆగస్టు 9న జీవో ఎంఎస్ నంబర్ 74 విడుదల చేసారు. అప్పుడు ఉన్న జీవోలో క్రీడల్లో రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తెచ్చిన వారికి 29 క్రీడల్లో ఈ రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. దీని ప్రకారం పోటీ పరీక్ష రాసిన తర్వాత క్రీడాకారులకు క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. కానీ చంద్రబాబు తన పుట్టినరోజుకు ఒక్క రోజుకు ముందు ఏప్రిల్ 19న జీవో 47, జీవో 4 కూడా తెచ్చారు. 2025 ఏప్రిల్ 19న విడుదల చేసిన జీవో 4లో 2 శాతంగా ఉన్న క్రీడా రిజర్వేషన్లను 3 శాతానికి పెంచారు. కానీ క్రీడల సంఖ్యను 29 నుంచి 65కు పెంచారు.గతంలో ఉన్న క్రీడల్లో స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు వీల్లేదు కాబట్టి దానికి మార్పులు చేశారు. అందుకే క్యారమ్స్, టెన్నికాయిట్, టగ్ ఆఫ్ వార్, యోగాసనాలు, బీచ్ వాలీవాల్ వంటి క్రీడల్ని చేర్చారు. జీవోడీ ఇచ్చిన మరో జీవో 47లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు పోటీ పడే వారు అసలు పోటీ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని చెప్పేశారు. అంటే క్రీడా ప్రతిభ ఉన్న వారితో పాటు ఉపాధ్యాయ అర్హత ఉన్న వారికీ ద్రోహం జరిగింది. ఈ నెల 26న తిరిగి పోటీ పరీక్ష రాసిన వారికే డీఎస్సీలో ప్రాధాన్యం ఇవ్వాలని మరో జీవో ఇచ్చారు. అంటే గతంలో అర్హులుగా ఉన్న వారికి అవకాశం లేకుండా చేయడానికి, మీకు అనుకూలంగా ఉన్న వారికి ఉద్యోగాలు ఇప్పించేందుకు ఇలాంటి జీవో ఇచ్చారు. అందుకే మళ్లీ జీవోలో మార్పులు చేశారు.జీవో మార్పులతో అర్హులకు తీవ్ర అన్యాయంజీఏడీ ద్వారా గతేడాది ఏప్రిల్ 19న ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ను సవరిస్తూ జీఏడీ ద్వారా రెండు జీవోలు ఇప్పించారు. ఇందులో గతంలో క్రీడాకారులు కూడా పోటీ పరీక్ష రాయాల్సి ఉండగా.. ఈ నిబంధనల్ని మార్చారు. దీంతో భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఈ నెలలో ఆ జీవోల్ని రద్దు చేశారు. గతేడాది ఇచ్చిన జీవోల్లో జాతీయ ఛాంపియన్ షిప్ సాధించిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది, ఆటలో పాల్గొంటున్న వారికి తర్వాత ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. దాన్ని మార్చి తాజాగా ఇచ్చిన జీవోలో జాతీయ స్దాయిలో ఆడిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ఛాంపియన్ షిప్ వస్తే తర్వాతి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.ఇలా ఎందుకు మార్చారో సమాధానం చెప్పగలరా ? ముందుగా ఇచ్చిన జీవో కరెక్ట్ అనుకుంటే, ఆ తర్వాత ఎందుకు ఉపసంహరించారు ? ఈ రెండు పరిణామాల మధ్య నష్టపోయిన వారికి ఎవరు బాధ్య త వహిస్తారు ? డీఎస్సీలో పరీక్ష రాసిన అభ్యర్ధుల పరిస్ధితి ఏంటి ? వీటికి సమాధానాలు చెప్పకుండా ప్రశ్నించిన వారిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. అందుకే సీబీఐ దర్యాప్తు జరగాలని కోరుతున్నాం. ఇది లోకేష్ శాఖలో జరిగిన డార్క్ సీక్రెట్ ఆపరేషన్ అంటున్నాం. మీరు ఎంత మందిని అరెస్టు చేసుకుంటారో చేసుకోండి, దగాపడిన నిరుద్యోగులతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, విద్యార్ధి, యువజన విభాగాలు సిద్దంగా ఉన్నాయి. కానీ దయచేసి ప్రతిభ ఉన్న వారికి మాత్రం అన్యాయం చేసి వారి ఉసురుపోసుకోకండి.డీఎస్సీలో జిల్లా కమిటీల పాత్ర ఉంటే అక్రమాలు సాధ్యం కావు కాబట్టి వీటిని నిర్వీర్యం చేశారు. అందుకే రాష్ట్ర స్దాయిలోనే ఈ పరీక్ష నిర్వహించారు. టెట్, డీఎస్సీకి సంబంధించి ఒకే వ్యక్తికి బాధ్యతలు కూడా అప్పగించారు. ప్రశ్నాపత్రం తయారు చేసిన వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్ అని మీరే ఒప్పుకుంటున్నారు. అతనే తిరిగి పరీక్ష రాసి కృష్ణాజిల్లాలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే అతని వివరాలు డిలీట్ చేశారు. అతను కోర్టుకు వెళ్తే బెదిరించి కేసు వెనక్కి తీసుకోమంటున్నారు. అందుకే డబ్బులు చేతులు మారాయని మీరు ఇచ్చిన జీవోల ద్వారానే అర్థమవుతోంది. మీరు అక్రమార్కులపై చర్యలు తీసుకునే పరిస్ధితుల్లో లేరు.ఒకే కేటగిరీలో ముందు ఉన్న వాళ్లకు, తర్వాత ఉన్న వాళ్లకూ ర్యాంకులు వచ్చాయి, కానీ ఆమ్యామ్యాలు సమర్పించకపోవడం వల్ల మధ్యలో ఉన్న వారికి ర్యాంకులు రాలేదు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా ? టెస్ట్ మెసేజ్ ల పేరుతో ఉద్యోగాల జీవితాలతో ఆడుకున్నారు. మూడు పోస్టులకు అర్హత సాధిస్తే ఒకటే పోస్టుకు కాల్ లెటర్ ఇవ్వడం అన్యాయం కాదా ? ఈ మూడు పోస్టుల్లో హయ్యర్ గ్రేడ్ పోస్టు ఇవ్వాలని హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని అడుగుతుంటే మా మీద క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మా మీద కాదు అక్రమాలతో యువత భవిష్యత్తును నాశనం చేసిన అధికారులపై ఈ కేసులు పెట్టండి. అలాగే ఎస్సీఈఆర్టీ నుంచే ప్రశ్నాపత్రాల లీక్ జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.ఈ ప్రశ్నాపత్రాలు అప్ లోడ్ చేసిన వ్యక్తి పరీక్ష ఎలా రాస్తాడు ? ఫస్ట్ ర్యాంక్ ఎలా తెచ్చుకుంటాడు, అతన్ని మీరు ఎందుకు తొలగించారో బయటపెట్టాలి. ఓపెన్ కేటగిరీలో రావాల్సిన పోస్టును వేరే వ్యక్తికి ఎలా ఇస్తారు ? అడిగితే వేరే వ్యక్తికి ఇచ్చామని చెప్పారని అధికారులు చెప్పినట్లు అభ్యర్ధులు కూడా బయటపెట్టారు. మీరు బేరసారాలు ఆడిన ఆడియోలు బయటికి వచ్చినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? దీని మీద ముఖ్యమంత్రి, విద్యామంత్రి సమాధానం చెప్పాల్సిందే. దీంతో పాటు అక్రమాలకు బాధ్యత వహించి విద్యామంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. దీంతో పాటు సీబీఐ దర్యాప్తు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాల్సిందేనని కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. -
ఏపీ డీఎస్సీ అక్రమాలు.. ఈ ప్రశ్నలకు బదులేదీ?
సాక్షి, విజయవాడ: డీఎస్సీపై మీడియా సమావేశం నిర్వహించిన విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్.. డీఎస్సీ అక్రమాల ఆరోపణలపై సమాధానాలు దాటవేశారు. కీలకమైన ఆరోపణలకు ఆయన సమాధానం ఇవ్వలేదు. ఎస్ఈఆర్టీలో పనిచేసే నవీవ్కి టాప్ ర్యాంక్పై మీడియా ప్రశ్నించగా.. కోన శశిధర్ మూడు రకాలుగా సమాధానం చెప్పారు. అనుమతి తీసుకోలేదు కాబట్టి పక్కనపెట్టామన్న శశిధర్.. మరోసారి కౌన్సిలింగ్కి రాలేదు కాబట్టి పక్కన పెట్టామంటూ చెప్పుకొచ్చారు. అతను రెండు పరీక్షలు రాశాడంటూ మరో సమాధానం చెప్పారు. 6 వేల ప్రశ్నలు గుర్తుపెట్టుకుని చేసేశాడంటే నమ్మశక్యమా? అంటూ కోన శశిధర్ వింత సమాధానం ఇచ్చారు.నవీన్ లాగిన్ని ఎందుకు బ్లాక్ చేశారని మీడియా ప్రశ్నించగా.. దానిపై కూడా కోన శశిధర్ సమాధానం చెప్పలేదు. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లపై తప్పించుకునే ధోరణి ప్రదర్శించారు. స్పోర్ట్స్ కోటా అంతా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్నే అడగండంటూ దాటవేశారు. రెగ్యులర్, స్పోర్ట్స్ కోటా ఒకేసారి ఎందుకు చేయలేదో స్పష్టత ఇవ్వని శశిధర్.. స్పోర్ట్స్ కోటా జీవోలు మార్పుపై తనకు సంబంధం లేదని దాటవేశారు.స్పోర్ట్స్ పాలసీ ప్రకారం మేము అనుసరించాం. ఆ రోజు స్పోర్ట్స్ పాలసీ ప్రకారం పరీక్ష లేకపోయినా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నాం. తర్వాత పాలసీని మార్చారు. స్పోర్ట్స్ పాలసీపై చర్చ వాళ్లనే అడగాలి. స్పోర్ట్స్ ది సెపరేట్గా హ్యాండిల్ చేద్దాం. జీఏడీ ఇచ్చిన జీవో ప్రకారం మేం చేశాం’’ అంటూ శశిధర్ చెప్పుకొచ్చారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాల ఆరోపణలపై ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు. టెట్, డీఎస్సీకి ఒకే కన్వీనర్ నియమాకాన్ని శశిధర్ సమర్థించుకున్నారు. -
బయటపడ్డ DSC స్కామ్! లోకేష్ వెన్నులో వణుకు
-
చేతికి వచ్చి చేజారిన ఉద్యోగం... ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో బయటపడుతున్న లీలలు
-
అసలు ఏలా స్కామ్ చేశారంటే? సంచలన నిజాలు బయటపెట్టిన DSC అభ్యర్థి
-
స్కాం ఎలా చేశారంటే..? కోట్లల్లో డీల్.. బయటపడ్డ లోకేష్ DSC స్కాం
-
సీబీఐతో విచారించాలి
సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు సర్కారు దగా చేసిందని టీచర్ పోస్టుల అభ్యర్థులు, నిరుద్యోగులు భగ్గుమన్నారు. డీఎస్సీ అవకతవకలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ 2025లో అక్రమాలపై వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విద్యార్థి పోరుకు భారీ స్పందన వచి్చంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిరుద్యోగులు, టీచర్ అభ్యర్థులు వేలాదిగా తరలివచ్చి చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. డీఎస్సీలో అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాలు, ఆర్డీవో కార్యాలయాలు, కలెక్టరేట్ల వద్ద నిరుద్యోగులు, విద్యార్థులు, పార్టీ నేతలు పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, అర్హతలేని వారికి ఉద్యోగాల కేటాయింపు, పేపర్ లీకేజీ ఆరోపణలు, ఫేక్ సరి్టఫికెట్లతో ఎంపికలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు నిర్వాకాలను ఎండగడుతూ నిర్వహించిన నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతమైనట్లు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య తెలిపారు. శుక్రవారం గుంటూరులో పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లాడ్జి సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి వినతి పత్రం సమర్పించారు. పూర్తిగా పారదర్శకత లోపించిన మెగా డీఎస్సీ తంతులో పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్టు మాయం లాంటి అనేక అవకతవకలు జరిగాయని పానుగంటి చైతన్య ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డబ్బులు వసూలు చేసి పోస్టులు అమ్ముకున్నారని మండిపడ్డారు. ధర్నాలో వైఎస్సార్ సీపీ జిల్లా, నగర అధ్యక్షులు అంబటి రాంబాబు, షేక్ నూరిఫాతిమా, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, పార్టీ నేతలు పోతిన మహేష్, అంబటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ..⇒ పల్నాడు జిల్లా నరసరావుపేటలో స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సు«దీర్ భార్గవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.⇒ బాపట్లలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం చేపట్టిన నిరసన ర్యాలీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తదితరులు పాల్గొన్నారు.⇒ శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పార్టీ శ్రేణులతో కలసి పాల్గొన్నారు. విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, అక్రమాలపై సీబీఐ విచారణ నిర్వహించాలని నినదించారు.⇒ డీఎస్సీ 2025 నియామకాల్లో అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ ప్రధాన ద్వారం ఎదుట నిర్వహించిన ధర్నాలో పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డితో కలసి ఆయన పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సూచనల మేరకు శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో ఒక్కో ఉద్యోగాన్ని రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకున్నారని ఆరోపించారు.⇒ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను నట్టేట ముంచేశారని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు శశిదీప్, నియోజవర్గ అధ్యక్షులు సద్ధాం ఆరోపించారు. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చిత్తూరు దర్గా సర్కిల్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో ధర్నా నిర్వహించి విద్యాశాఖ మంత్రి లోకేశ్కు వ్యతిరేకంగా నినదించారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న నారా లోకే‹శ్మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.⇒ ఉమ్మడి విశాఖ జిల్లాల్లో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం వద్దవైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణంరాజు శ్రీవత్సవ్ నేతృత్వంలో దగాడీఎస్సీపై నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణే‹Ùకుమార్,సమన్వయకర్తలు తిప్పల దేవాన్రెడ్డి, మొల్లి అప్పారావు పాల్గొన్నారు.⇒ మెగా డీఎస్సీ నిర్వహణలో అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం విగ్రహం నుంచి కోటిపల్లి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించింది. సకల శాఖా మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు.⇒ కాకినాడలో వైఎస్సార్సీపీ విద్యారి్థ, యువజన విభాగాల ఆధ్వర్యంలో స్థానిక ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లిలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు.⇒ ఒంగోలులో నిరసన ర్యాలీ, ధర్నా కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ,ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహా్మనందరెడ్డి, ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ భవనం నుంచి ర్యాలీ నిర్వహించారు.⇒ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాల్లో ‘విద్యార్థి పోరు’ పేరుతో నిరసన ర్యాలీలు నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు.⇒ నెల్లూరు వీఆర్సీ సెంటర్లో శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు బలవంతంగా పోలీస్స్టేషన్కు తరలించడంతో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అక్కడకు చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును⇒ చంద్రబాబు సర్కారుకు డీఎస్సీపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యముందా అని వైఎస్సార్సీపీ నేతలు నిలదీశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినా‹Ù, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన చంద్రబాబు, లోకేశ్ డౌన్ డౌన్ అంటూ నినదించారు.⇒ దగా డీఎస్సీకి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నంద్యాల బొమ్మలసత్రం వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.⇒ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంబేడ్కర్ సెంటర్, ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. -
చేతికి వచ్చి చేజారిన పోస్టు.. ‘సారూ’.. తారుమారు!
జిల్లా టాపర్ అయినా జాబు రాలేదు..ఎస్సీ విభాగంలో నేను శ్రీకాకుళం జిల్లా టాపర్ అయినా నాకు ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటాలో ఒక మహిళకు ఉద్యోగం ఇచ్చారు. దీనిపై ఫిర్యాదు చేస్తే ఆ పోస్టింగ్ నిలిపారు. తర్వాత మెరిట్ అభ్యర్థిగా నాకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉన్నా ఆరు నెలలుగా ప్రభుత్వం స్పందించడం లేదు. – కె.అనిల్కుమార్, డీఎస్సీ బాధితుడు, శ్రీకాకుళంసాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025లో విస్తుగొలిపే వాస్తవాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నడుమ ఏళ్ల తరబడి శ్రమించి సాధించుకున్న అరుదైన అవకాశాన్ని చంద్రబాబు సర్కారు కాల రాసిందని కాల్ లెటర్లతో వెరిఫికేషన్కు సైతం హాజరై మోసపోయిన అర్హులైన అభ్యర్థులు మండిపడుతున్నారు. జిల్లాకు ఓ విధానం అమలు చేసి ‘హారిజాంటల్’ రిజర్వేషన్ అని పేరు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పోస్టుకు ఒక్కరే అభ్యర్థిని (1:1 నిష్పత్తి) సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచి, అన్నీ సక్రమంగా ఉన్నట్లు ప్రకటించిన తరువాత తీరా తుది జాబితాలో తమ పేర్లు గల్లంతు చేశారని అర్హులు వాపోతున్నారు. ఒక పోస్టుకు ఒక్కరినే పిలిస్తే.. హాజరైన అభ్యర్థి సర్టిఫికెట్ల్లలో లోపం ఉంటే ఆ విషయం చెప్పి వారిని పక్కనబెడతారు. అనంతరం రెండో స్థానంలో ఉన్నవారికి అవకాశం కల్పించాలి. కానీ ఇక్కడ ఉద్యోగాలకు ఎంపికైన వారికే కాల్ లెటర్లు పంపి సర్టిఫికెట్ల పరిశీలనకు రావాల్సిందిగా నిర్ణీత తేదీని ప్రకటించారు. అన్ని పత్రాల పరిశీలన పూర్తి చేసి అంతా సక్రమమేనంటూ ప్రకటించారు. కానీ తుది ఎంపిక జాబితాలో మాత్రం అర్హుల పేర్లు లేకుండా చేశారు. ప్రభుత్వ నిర్వాకానికి బలైన ప్రతిభ గల డీఎస్సీ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మందికి పైగా ఉన్నట్లు చెబుతున్నారు.మెరిట్లో ఉన్నారని ప్రకటించి మోసం..!డీఎస్సీ ఫలితాలను ప్రకటించేటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ప్రకారం అభ్యర్థులకు వచ్చిన మార్కులతో మెరిట్ లిస్ట్ విడుదల చేయాలి. కానీ డీఎస్సీ 2025లో మాత్రం ఫలితాల ప్రకటన వరకు ఒక విధానం.. సర్టిఫికెట్ల పరిశీలనకు మరో విధానం.. తుది ఎంపిక జాబితా విడుదల సమయంలో మరో విధానాన్ని అమలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్ష రాసిన అభ్యర్థులంతా మెరిట్ లిస్ట్ను పరిశీలించే వీలు లేకుండా చేశారని ఆక్రోశిస్తున్నారు. మెరిట్ లిస్టును ప్రకటించిన తర్వాత సెలక్షన్ లిస్ట్ తయారు చేసి కౌన్సెలింగ్ నిర్వహించాలి.కానీ మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా ‘సెలెక్టెడ్’ అభ్యర్థులను ఒక పోస్టుకు ఒక్కరినే (1:1) ఎంపిక చేసి సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. పరీక్ష రాసిన 3,36,307 మందిలో కేవలం 16,437 పోస్టులకు అంత మందికే కాల్ లెటర్లు పంపారు. కాల్ లెటర్లు పంపిన వారిని నిర్ణీత తేదీల్లో ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని లేఖల్లో పేర్కొన్నారు. చెక్ లిస్టు సరి చూసుకున్న తర్వాత వారిని ‘ఓకే’ కూడా చేశారు. అయితే తిరస్కరణ జాబితాలో పేర్లు లేని, సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయిన కొందరు అభ్యర్థుల పేర్లను తుది ఎంపిక జాబితాల్లో నుంచి తొలగించడం గమనార్హం.గోడు పట్టించుకోని విద్యాశాఖ మంత్రి కార్యాలయం..తమ సర్టిఫికెట్లు అన్నీ సరిగా ఉన్నాయని ప్రకటించాక కూడా పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదని జిల్లా అధికారులను ప్రశ్నిస్తే... ఇందులో తమదేం లేదని, రాష్ట్ర కార్యాలయంలో సంప్రదించాలని సలహా ఇచ్చారు. బాధితులంతా రాష్ట్ర కార్యాలయంలో సంప్రదిస్తే.. మళ్లీ డీఎస్సీకి ప్రయత్నించండని ఉచిత సలహా ఇచ్చి అవమానించారని అభ్యర్థులు వాపోతున్నారు. ఈ డీఎస్సీలో ప్రభుత్వం అనుసరించిన విధానాల ప్రకారం.. మెరిట్లో ఉండి, పోస్టు వస్తుందన్న వారికే కాల్ లెటర్లు పంపారు. వారికి సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తి చేశారు. చివరకు వారికి మొండిచెయ్యి చూపించారు. అర్హులు తమకు జరిగిన అన్యాయంపై విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని సంప్రదించగా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేది లేక న్యాయ పోరాటానికి దిగారు.సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కావాలంటూ ఎం.ఏకాంబరానికి వచ్చిన కాల్ లెటర్ చిత్తూరు జిల్లా మాదిరెడ్డిపల్లికి చెందిన ఎం.ఏకాంబరం (బీసీ–డి) డీఎస్సీలో ఎస్ఏ సోషల్ స్టడీస్ విభాగంలో 125వ ర్యాంకు సాధించారు. జిల్లాలో బీసీ–డీ కేటగిరీలో 7 పోస్టులు ఉండగా ఆయన ఆరో అభ్యర్థి. ఆగస్టు 28న సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలని కాల్ లెటర్ అందింది. అన్ని పత్రాలు పరిశీలించి అధికారులు ధ్రువీకరించారు. కానీ సెలక్షన్ లిస్టులో అతడి పేరు లేదు. అంతకు ముందే పెట్టిన రిజెక్ట్ లిస్టులోనూ ఏకాంబరం పేరు లేదు. ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తే.. ‘గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసుకోండి..’ అని డీఈవో సమాధానం ఇచ్చారు.సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం టి.విజయలక్ష్మికి వచ్చిన కాల్ లెటర్చిత్తూరు జిల్లా యాదమర్రికి చెందిన టి.విజయలక్ష్మి (ఓసీ) స్కూల్ అసిస్టెంట్ (ఇంగి్లష్) ఎస్జీటీలో 647వ ర్యాంకు వచ్చింది.ఆగస్టు 29న సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రావాలని ఆమెకు కాల్ లెటర్ పంపారు. వెరిఫికేషన్ కూడా పూర్తయింది. కానీ ఫైనల్ ఎంపిక జాబితాలో మాత్రం పేరు లేదు. అటు రిజెక్ట్ లిస్టులో కూడా పేరు లేదు. దీనిపై డీఈవో కార్యాలయంలో సంప్రదించగా.. స్పోర్ట్సు కోటాలో మీ పోస్టు పోయిందని సమాధానం చెప్పారు. గ్రీవెన్స్లో ఫిర్యాదు చేస్తే కటాఫ్ అంతకు ముందే అయిపోయిందని చెప్పారు.సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రావాలంటూ ఇ.శ్రీనివాసులుకు వచ్చిన కాల్ లెటర్ ప్రకాశం జిల్లా యర్రగొండపాలేనికి చెందిన ఇ.శ్రీనివాసులు (బీసీ–డి) ఎస్జీటీలో 87వ ర్యాంకు సాధించారు. ఆగస్టు 29న సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలని ఆయనకు కాల్ లెటర్ అందింది. అయితే 2,665 ర్యాంకు అభ్యర్థికి హారిజాంటల్ రిజర్వేషన్ పేరుతో పోస్టు ఇచ్చారు. దీనిపై శ్రీనివాసులు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేస్తే 85 ర్యాంకుతో పూర్తయిందని మౌఖికంగా, 58వ ర్యాంకుతో పూర్తయిందని రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇందులో ఏది నిజం?సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం వై.శ్రవణ్కు వచ్చిన కాల్ లెటర్అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడ నరసాపురానికి చెందిన వై.శ్రవణ్కుమార్(బీసీ–ఏ) ఎస్ఏ ఫిజికల్ సైన్స్లో 52వ ర్యాంకు, బీసీ–ఏ కోటాలో 3వ ర్యాంకు సాధించారు. ఆగస్టు 29న సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. కానీ 10 రోజుల తర్వాత విడుదలైన లిస్టులో ఆయన పేరు లేదు. అటు రిజెక్ట్ లిస్టులోనూ కనిపించలేదు. దీనిపై ఆర్జేడీ కార్యాలయంలో గ్రీవెన్స్కు దరఖాస్తు చేయగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు.సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఎస్.పృథ్వీరాజుకు వచ్చిన కాల్ లెటర్నెల్లూరు జిల్లా సంగం గ్రామానికి చెందిన ఎస్.పృథీ్వరాజ్ (బీసీ–బీ) టీజీటీ తెలుగు జోన్–2లో 157వ ర్యాంకు సాధించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సెప్టెంబర్ 9న గుంటూరులో జరిగింది. కానీ 15న విడుదలైన సెలక్షన్ లిస్టులో ఆయన పేరు లేదు. దీనిపై విద్యాభవన్లోని గ్రీవెన్స్లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు స్పందన లేదు.సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం బండారు యమునకు వచ్చిన కాల్ లెటర్విశాఖ జిల్లాకు చెందిన బండారు యమున (బీసీ–డీ మహిళ) ఫిజికల్ సైన్స్లో 68వ ర్యాంకు సాధించారు. సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత తనకు రావాల్సిన పోస్టును 311వ ర్యాంకు సాధించిన అభ్యర్థికి ఇచ్చారని యమున ఆవేదన వ్యక్తం చేసింది. అంత పెద్ద ర్యాంకు వచ్చిన వారికి ఎలా ఇచ్చారని జిల్లా అధికారులను ప్రశ్నిస్తే ‘స్పోర్ట్సు కోటా’లో ఇచ్చామని చెబుతున్నట్లు పేర్కొంది. జనరల్ విభాగంలో పరీక్ష రాసి 311వ ర్యాంకు పొందిన అభ్యర్థికి స్పోర్ట్సు కోటాలో ఉద్యోగం ఇచ్చినట్లు చూపారు. మెగా డీఎస్సీలో ఇలాంటి విచిత్రాలు మరెన్నో!⇒ వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లికి చెందిన షేక్ నసీమూన్ (బీసీ–ఈ) డీఎస్సీ 2025లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సైన్స్లో 43వ ర్యాంకు సాధించింది. సెప్టెంబర్ 7న సర్టిఫికెట్ల పరిశీలనకు కాల్ లెటర్ అందింది. అదే రోజు జిల్లా కేంద్రంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాగా అన్నీ సక్రమంగా ఉన్నట్లు ప్రకటించి పోస్టు ఓకే చేశారు. తీరా నాలుగు రోజుల అనంతరం విడుదలైన ఎంపిక జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో అధికారులను సంప్రదించగా.. ‘బై మిస్టేక్ వల్ల మీకు కాల్ లెటర్ అందింది..’ అంటూ చేతులు దులుపుకొన్నారు. జిల్లా కలెక్టర్, డీఈవో కార్యాలయాల చుట్టూ తిరిగినా ఆమెకు న్యాయం జరగలేదు.అలా ఎలా ఇచ్చేస్తారు?డీఎస్సీ రాసి సర్టిఫికెట్ వెరిఫికేషన్కు కూడా హాజరయ్యా. రిజెక్టెడ్, సెలెక్టెడ్ లిస్ట్లో నా పేరు లేదు. స్పోర్ట్స్ కోటాలో పోస్టు ఇచ్చినట్లు చెప్పారు. నాది 198వ ర్యాంక్ అయితే స్పోర్ట్స్ కోటా కింద పోస్ట్ ఇచ్చిన వ్యక్తి ర్యాంక్ 872. నాకు కాల్ లెటర్ ఇవ్వక ముందే స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగింది. మరి నాకు ఇవ్వాల్సిన పోస్టు స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చామని ఎలా చెబుతారు? – ఎస్.నూకరాజు, కాకినాడసుప్రీంకోర్టు ఉత్తర్వులను పట్టించుకోరా?మెరిట్లో ఉన్నవారికి పోస్ట్లు ఇవ్వాలని.. మెరిట్ను డీ మెరిట్ చేయవద్దని సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా పోస్టులను ఇచ్చేశారు. ప్రతిభగల నాలాంటి వారికి అన్యాయం జరిగింది. ఓపెన్ కేటగిరిలో 30 పోస్ట్లు ఉన్నాయి. 87వ ర్యాంక్ వచ్చిన నాకు పోస్టు ఇవ్వలేదు. ప్రతిభను గుర్తించకపోతే ఎలా? – పి.ప్రతిభ, రాజమండ్రితీరని అన్యాయం..సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు కొంతమందికి మాత్రమే వ్యక్తిగతంగా సందేశాలు పంపి పిలిచారు. రిజర్వేషన్ నిబంధనలను సక్రమంగా అమలు చేయలేదు. ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ మార్కులను పారదర్శకంగా ప్రకటించలేదు. ఒకే అభ్యర్థి అనేక పోస్టుల జాబితాల్లో కొనసాగడంతో పలువురు అర్హులు ఉద్యోగాలను కోల్పోయారు. అభ్యర్థులకు తీరని అన్యాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. – దేవరకొండ వెంకట్రావు దర్శి, ప్రకాశం జిల్లానా ఉద్యోగం.. ఇతరులకు ఇచ్చారుడీఎస్సీ 2025లో బయాలజీ సైన్స్ ఉర్దూ మీడియం పరీక్ష రాశా. 57.77 మార్కులు వచ్చాయి. ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన నాకు ఎస్ఏ పోస్టు ఇవ్వాలి. నాకివ్వాల్సిన పోస్టును బీసీ–ఈ అభ్యర్థికి ఇచ్చారు. న్యాయం చేయాలని 8 నెలలుగా అధికారులకు, విద్యాశాఖ మంత్రికి, చివరకు సీఎంకు విన్నవించుకున్నా ఫలితం లేదు. –సయ్యద్ జమీల్, రాయచోటి, అన్నమయ్య జిల్లా -
అరాచకమే విధానం
మన విద్యావిధానానికేమైంది? ‘నీట్’ పోటీ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్తో మొదలై ఇప్పుడు సీబీఎస్ఈ జవాబుపత్రాల తప్పుడు మూల్యాంకనం బయటికొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన డీఎస్సీలో ప్రశ్నపత్రాలు లీకయ్యాయనీ, పోస్టుల్ని అమ్ముకున్నారనీ, అనర్హులకు దొంగ ర్యాంకులు పంచారనీ వెల్లడై ప్రభుత్వం అభాసుపాలవుతుండగానే, అక్కడ ఎస్సెస్సీ జవాబుపత్రాల మూల్యాంకనం పరమ అధ్వాన్నంగా సాగిందని బట్ట బయలైంది. ‘నీట్’కు ఈసారి 22.79 లక్షలమంది పోటీపడ్డారు.వీరంతా అర్ధాకలితో మాడుతూ నెలల తరబడి పట్టణాల్లో, నగరాల్లో ఉండి కోచింగ్ సంస్థలకు వేలాది రూపాయలు అర్పించి చదువుకున్నవారు. కానీ ప్రశ్నపత్రాలు లీకై అదంతా వ్యర్థమైంది. పరీక్ష రద్దయ్యాక పలుచోట్ల నిరాశా నిస్పృహలతో అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గత పన్నెండేళ్లలో 15 రాష్ట్రాల్లో 70 ప్రధాన లీక్లు చోటుచేసుకున్నాయని ఒక కథనం చెబుతోంది. అదే నిజమైతే ప్రశ్నపత్రాల వెల్లడి యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దీనివెనక పెద్ద మాఫియానే ఉండొచ్చు. బట్టబయలైనప్పుడే సమస్య అందరికీ తెలుస్తోంది. నీట్ వివాదం సద్దుమణగకముందే సీబీఎస్ఈ వంతు వచ్చింది. ఈ ఏడాది పన్నెండో తరగతి పరీక్షలు 18 లక్షలమంది రాశారు. నిద్రాహారాలు మాని చదువుకున్న ఈ పిల్లల జవాబు పత్రాలు దిద్దటానికి ‘హైటెక్’ ఆలోచన చేసింది సంస్థ. ఆ పత్రాలను స్కాన్ చేసి వాటి డిజిటల్ ఫైళ్లను అప్లోడ్ చేసి మూల్యాంకనం చేసే విధానాన్ని అనుసరించింది. ఆన్ స్క్రీన్ మార్కింగ్(ఓఎస్ఎం) అనే ఈ విధానం గురించి తొలి పరీక్షకు పదిరోజుల ముందు పాఠశాలలకు చెప్పిందంటున్నారు. ఇలాంటి కొత్త విధానంపై పాఠశాల ప్రిన్సిపాళ్లకూ, విద్యార్థులకూ అవగాహన కల్పించాలనీ, అభ్యంతరాలు వ్యక్తమైతే ప్రత్యామ్నాయం ఆలోచించాలనీ దానికి లేకపోయింది.తీరా ఈ నెల 13న ఫలితాలు వెలువడినప్పుడు లక్షలాదిమంది విద్యార్థులు నిర్ఘాంతపోయారు. 90 శాతం వరకూ మార్కులొస్తాయని నమ్మినవారి స్కోర్ అడ్డంగా పడిపోయింది. అప్పటికే హార్వర్డ్, బ్రౌన్, యేల్, కార్నెల్ వంటి ఉన్నత శ్రేణి విశ్వవిద్యాలయాల్లో సీట్లు లభించినవారు బావురుమన్నారు. ఈ అరకొర మార్కులతో కనీసం ఆ విశ్వవిద్యాలయాల గేట్లు తాకే అర్హత కూడా ఉండదు మరి! సీబీఎస్ఈలో నిరుడు ఉత్తీర్ణత శాతం 88.39 అయితే, ఈసారి 85.29 శాతానికి పడిపోయింది. 90 శాతంపైగా మార్కులొచ్చినవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. బ్రిటిష్ వలసపాలకుల హయాంలో 1921లో అత్యున్నత విద్యాప్రమాణాల కోసం స్థాపించిన ఒక సంస్థ కాలక్రమంలో... అంటే 1962లో ఇప్పుడున్న రూపానికి మారింది. అక్కడ ఉత్తీర్ణత సాధించి, సర్టిఫికెట్ తెచ్చుకుంటే ప్రపంచంలో అత్యున్నత శ్రేణి విశ్వ విద్యాలయాలు రెడ్ కార్పెట్ పరిచేంత ప్రతిష్ఠను సీబీఎస్ఈ సంపాదించుకుంది.ఆ సంస్థ ఇప్పుడెంతగా భ్రష్టుపట్టిందంటే... పాఠశాలలు మొదలై మూణ్ణెల్లు గడిచి, ఒక యూనిట్ టెస్ట్ కూడా అయినాక, మెడమీద కత్తిపెట్టి త్రిభాషా సూత్రం పేరిట హిందీ లేదా సంస్కృతం నేర్చుకుతీరాలని శాసిస్తోంది. అందుకోసం పాఠ్యపుస్తకం కూడా లేదంటే... ఆరో తరగతి పుస్తకం చదవాలంటోంది. పైగా ఆ మార్కుల్ని పట్టించుకోబోనని అభయమిస్తోంది. ఇంతకన్నా అరాచకం ఉంటుందా అని అందరూ అనుకునేలోగానే ఈ ముదనష్టపు మూల్యాంకనం వెల్లడైంది. డీఎస్సీ నిర్వాకం బయటపడ్డాక, అంతా సవ్యంగానే ఉందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దబాయిస్తున్న తరుణంలోనే తాజాగా టెన్త్ మూల్యాంకనం అడ్డదిడ్డంగా సాగిన వైనం బయటపడింది. విద్యార్థులు రాసిన కొన్ని జవాబుల్ని పట్టించుకోకపోవటం, దిద్దినా ఆ మార్కుల్ని పరిగణించకపోవటం వంటి చిత్రాలు చోటుచేసు కున్నాయి. తెలివైన విద్యార్థులు అనుమానం వచ్చి రీవెరిఫికేషన్, రీవాల్యూయేషన్ కోసం దరఖాస్తులు చేశాక ఇదంతా బయటికొచ్చింది.పాలన గాలికొదిలిన చోట ఇలాంటి అరాచకాలు జరగటంలో ఆశ్చర్యమేమీ లేదుగానీ...‘నీట్’ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కు ఏమైంది? సీబీఎస్ఈ ఎలా ధ్వంసమైంది? పాలకులు జవాబుదారీ తనంతో వ్యవహరించటం, జరిగే తప్పులకు నైతిక బాధ్యత తీసుకోవటం తప్పనిసర య్యేలా ప్రజలు ఒత్తిళ్లు తెస్తేనే ఈ దుఃస్థితి మారుతుంది. అప్పుడే ఇతర వ్యవస్థలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తాయి. లేకుంటే అవి కూడా చోద్యం చూస్తుంటాయి. -
వీళ్ళ బండారం ఎలా బయట పడిందంటే క్లుప్తంగా వివరించిన అంబటి
-
కూటమి దగా డీఎస్సీపై కదం తొక్కిన వైఎస్సార్సీపీ (ఫొటోలు)
-
విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నమంత్రి నారా లోకేష్..
-
మెగా డీఎస్సీ అక్రమాలపై YSRCP పోరుబాట..
-
డిమెరిట్ డీఎస్సీగా మెగా డీఎస్సీ.. అభ్యర్థులకు కూటమి మొండి చేయి..
-
‘సకల శాఖల మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందే’
ఏపీలో కూటమి సర్కార్ పాలనలో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలంటూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగింది. అన్ని జిల్లాల్లోనూ పలు విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, పార్టీ నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడం, పేపర్ లీకేజీపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.అనంతపురం..డీఎస్సీ స్కాంపై విద్యార్థి సంఘాల ఆగ్రహంఅనంతపురం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన విద్యార్థి విభాగం నేతలువిద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ఉరేసుకుని విద్యార్థుల వినూత్న నిరసనటీడీపీ కూటమి సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలుఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్విద్యార్థి విభాగం నేతల ఆందోళనకు సంఘీభావం తెలిపిన డీఎస్సీ అభ్యర్థులు గుంటూరు..పానుగంటి చైతన్య వైఎస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షుడు కామెంట్స్..ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి రాగానే వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని లోకేష్ చెప్పారు.అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహించకుండా ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేసిందిప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ ఒక అక్రమాల పుట్టడీఎస్సీ పరీక్ష గందరగోళంగా మారిందిడీఎస్సీ లో జరిగిన అక్రమాలు అవకతవకలపై ప్రభుత్వం వెంటనే సీబీఐతో విచారించాలివిద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలిమాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్...ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీపరీక్షలు నిర్వహించే వారు ఎలా డీఎస్సీ పరీక్ష రాస్తారులోకేష్ డబ్బులకు స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్ముకున్నారుస్పోర్ట్స్ కేటగిరీ కింద ఉన్న ఉద్యోగాలను లోకేష్ అమ్ముకున్నారులోకేష్ కు సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాలిడీఎస్సీ లో జరిగిన అక్రమాలు అవకతవకలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించి లోకేష్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలిఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్..దేశంలో చంద్రబాబు లాంటి దరిద్రపు ప్రభుత్వం ఎక్కడా లేదుయువకుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందిడీఎస్సీ లో జరిగిన అక్రమాలు అవకతవకలపై ప్రభుత్వం వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలినారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలికర్నూలు..ఎమ్మెల్యే వీరుపాక్షి కామెంట్స్..రాష్ట్రంలో చంద్రబాబు పాలన రాక్షస పాలన.రాష్ట్రంలో మెగా డీఎస్సీ దగా డీఎస్సీగా మార్చి అభ్యర్థులను రోడ్డున పడేశారు.మెగా డీఎస్సీలో భారీ కుంభకోణం జరిగిందివిద్యాశాఖలో జరిగిన అవినీతికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి.డీఎస్సీలో మెరిట్ విద్యార్థుల పేర్లను మంత్రి లోకేష్ తప్పించారు.అభ్యర్థులు నుండి నేరుగా డబ్బులు ముట్టినట్లు సమాచారం.డీఎస్సీలో అన్యాయం జరిగిందని అడిగితే కేసులు పెడుతున్నారు.డీఎస్సీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. విశాఖ..డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ పోరుబాట..డాబా గార్డెన్స్ అంబేద్కర్ కూడలి పార్టీ శ్రేణుల ఆందోళన..అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన నేతలు..కార్యక్రమానికి హాజరైన జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కుంభ రవి బాబు తదితరులు..నెల్లూరు..నెల్లూరు విఆర్సీ సెంటర్ వద్ద వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనడీఎస్సీ పరీక్షల నిర్వహణ, అభ్యర్థుల ఎంపికలో అవకతవకలపై ఆందోళననియామక ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై ఆగ్రహంనిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాణి, కూటమి ప్రభుత్వ పరిపాలన లోపంపై మండిపాటుఎస్వీ యూనివర్సిటీ ఎదుట వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నిరసన కార్యక్రమంలో భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు.భూమన కామెంట్స్..డీఎస్సీ అక్రమాలకు బాధ్యత చేస్తూ రాజీనామా చేయాలిఒక్కో ఉద్యోగం 15 నుంచి 20 లక్షలకు అమ్ముకున్నారుఓసీ ఓపెన్ కటాఫ్ లేకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు అన్యాయం చేశారుబీసీ, ఎస్సీ, ఎస్టీలు మెరిట్లో వచ్చినా రిజర్వేషన్లో మాత్రమే ఎంపిక చేశారు, ఓపెన్ కేటగిరిలో అన్యాయం చేశారుఓపెన్ కేటగిరి కటాఫ్ బయట పెట్టాలిరిజర్వేషన్ లేకుండా కొన్ని లక్షలు మందికి అన్యాయం చేశారుదీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం.స్పోర్ట్స్ కోటాలో అదనపు కోట కలిపి, శాప్ చైర్మన్ రవినాయుడు అర్హత లేని వారికి ఉద్యోగాలు3.50 లక్షలు మంది డీఎస్సీ రాస్తే.. వాళ్లకు కావాల్సిన వారికి ఉద్యోగాలు వచ్చాయిప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వ్యాఖ్యలు..మంత్రి నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలిదీనిపై సీబీఐ విచారణ జరిపించాలి.సకల శాఖ మంత్రి నారా లోకేష్ భారీ ఎత్తున కోట్లు అవినీతికి పాల్పడ్డారు -
లోకేశ్.. నీ ఘన చరిత్ర అందరికీ తెలుసులే!
సాక్షి, అమరావతి: డీఎస్సీలో అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్కు వైఎస్సార్సీపీ హితవు పలికింది. చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. పూర్తి మెరిట్ జాబితాను విడుదల చేసి డీఎస్సీ ఆశావహులకు నిజాయితీగా సమాధానం చెప్పాలే తప్ప డైవర్షన్ పాలిటిక్స్, వ్యక్తిగత దూషణలు చేస్తే సమాజం హర్షించదని హెచ్చరించింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ పోస్టు చేసింది. డీఎస్సీ కుంభకోణంపై ప్రశ్నలకు లోకేశ్ ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారని నిలదీసింది. ‘వెబ్సైట్ నుంచి మెరిట్ జాబితాను ఎందుకు తొలగించారు?, పారదర్శకత లేకుండా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను ఎందుకు ఇచ్చారు?, రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు ఎందుకు నిరసన తెలుపుతున్నారు?’ అంటూ చురకలు అంటించింది. ‘మిమ్మల్ని (లోకేశ్ను) ఇంటర్మీడియెట్ పాస్ చేయించడానికి ఇప్పటి మంత్రి నారాయణ పడ్డ కష్టాలు అందరికీ తెలిసినవే. ఆ రోజుల్లో మీకోసం నారాయణ పడ్డ కష్టం వల్లే ఇప్పటికే మీమధ్య అనుబంధం అంత బలంగా ఉందనేది తెలిసినవారు అందరూ చెప్పుకుంటారు. అంతేకాదు.. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మీరు తీసుకున్న డిగ్రీ వెనుక ఒక పారిశ్రామికవేత్తనుంచి తీసుకున్న ముడుపుల కథ ఉందని మర్చిపోకండి. ఆ రోజుల్లో ఆ ముడుపులను మీ ఫీజులు రూపంలో చెల్లించిన వాస్తవ కథ తెలుగు ప్రజలకు ఇంకా గుర్తు ఉంది. అలాంటి మీరు డిగ్రీల గురించి, పరీక్షల గురించి చెబితేం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతుంది’ అని లోకేశ్ వ్యవహర శైలిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. -
డీమెరిట్ డీఎస్సీ
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన మొదటి నోటిఫికేషన్ మెగా డీఎస్సీ–2025 డీమెరిట్ డీఎస్సీగా మారిపోయిందా? ఈ డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులకు ప్రభుత్వం మొండి చేయి చూపించనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సర్కారు తప్పులు, అధికారుల విచ్చలవిడితనం వెరసి ప్రతిభగల అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. అన్ని సర్టిఫికెట్లు సరిగా ఉన్నా సరే వివిధ సాకులతో వారిని అనర్హులుగా చేశారు. మెరిట్లో తర్వాత ఉన్నవారికి ఆ పోస్టును ఇచ్చేశారు. కనీసం అభ్యర్థులు చెప్పింది వినకపోగా, కనీస గడువూ ఇవ్వకుండా నచ్చినట్టు చేసుకుంటూ పోయారు. తీరా డీఎస్సీ అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు అన్నీ సక్రమమే అని ఆయా శాఖల నుంచి పత్రాలు తెచ్చుకున్నా.. ‘అంతా అయిపోయింద’ంటూ చేతులెత్తేవారు. దీంతో దాదాపు ఐదారేళ్ల కాలంపాటు డీఎస్సీ కోసమే కష్టపడి చదివి, పరీక్షల్లో మెరిట్ సాధించిన వారికి తీవ్ర అన్యాయమే జరిగింది. వాస్తవానికి ఇలాంటి సమయంలో నష్టపోయిన వారికి ప్రభుత్వం న్యాయంగా పోస్టులు సృష్టించి ఇవ్వాలి. కానీ ప్రభుత్వం మాత్రం మరో డీఎస్సీలో ప్రయత్నించండి అన్నట్టుగా వ్యవహరిస్తోంది. గ్రీవెన్స్లోనూ న్యాయం జరగని వైనం మెగా డీఎస్సీలో అన్ని అర్హతలూ ఉండి పోస్టులు రాని అభ్యర్థుల కోసం జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో గ్రీవెన్స్ రెడ్రెస్ సెల్స్ ఏర్పాటు చేశారు. మొదటి స్థాయిలో న్యాయం జరగకపోతే, రెండో దశలో ఆర్జేడీ స్థాయిలో పరిష్కరించాలి. అక్కడా పరిష్కారం కాకపోతే రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాలి. మొదటి రెండు స్థాయిల్లో 15 రోజుల చొప్పున, మూడో స్థాయిలో నెల రోజుల్లోనూ పరిష్కారం చేయాలి. కానీ, కింది స్థాయిలో ఒక్కటీ పరిష్కరించిన దాఖలా లేదు. మెరిట్ లిస్టు, అభ్యర్థుల ఎంపిక అంతా రాష్ట్ర స్థాయిలో పూర్తిచేసి, కేవలం ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మాత్రమే జిల్లా అధికారులు చేశారు. దాంతో తమ పరిధి కాదని తమకు వచ్చిన ఫిర్యాదులను రాష్ట్ర కార్యాలయానికి పంపినట్టు అభ్యర్థులు చెబుతున్నారు. రాష్ట్ర స్థాయి పరిష్కార వేదికలో అభ్యర్థులకు అవమానాలే గాని న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. – అన్నమయ్య జిల్లాకు చెదిన ఓ అభ్యర్థి ఓసీ–ఈడబ్లు్యఎస్ కోటాలో ఎస్ఏ బయాలజీ పోస్టు రావాలి. తన కంటే మందున్న అభ్యర్థి గతంలో ‘బీసీ’ కోటాలో డీఎస్సీ పరీక్షలు రాశాడు. ఈసారి అతడు ఓసీ–ఈడబ్లు్యఎస్గా నమోదు చేసుకుని తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందాడు. బాధిత అభ్యర్థి ఆధారాలతో పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయంలోని గ్రీవెన్సెస్లో ఫిర్యాదు చేయగా ‘‘ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థి సర్టిఫికెట్లు తప్పుడువని తహసీల్దార్తో రద్దు చేయించి రా.. అప్పుడు నీ ఉద్యోగం గురించి ఆలోచిస్తా’’ అని ఓ అధికారి అవమానకరంగా మాట్లాడారని ఆవేదన చెందాడు. సూపర్ ‘నో’మరి..! సాధారణంగా ప్రభుత్వ చర్యలతో నష్టపోయిన ఉద్యోగార్థులకు వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఆ ప్రభుత్వంపైనే ఉంటుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి 148 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేసింది. ఇందులో 15,941 పోస్టులను తప్పుల తడకగా భర్తీ చేసి, మిగిలిన 406 పోస్టులను క్యారీ ఫార్వర్డ్ కింద మరో నోటిఫికేషన్కు బదిలీ చేశారు. ఇక్కడ అధికారులు నిబంధనలను ఇష్టానుసారంగా మార్చేయడంతో పాటు వేగంగా పని పూర్తిచేశామన్న రికార్డు కోసం తాపత్రయపడ్డారేగాని, వారి చర్యల ద్వారా అభ్యర్థులకు ఎంత తీవ్రమైన అన్యాయం జరిగిందో పట్టించుకోలేదు. నష్టపోయిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి తమ నిజాయతీని నిరూపించుకున్నారు. వెంటనే వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. కానీ అప్పటికే పోస్టుల భర్తీ పూర్తయిపోయిందని, ఆయా స్థానాల్లో మరొకరికి పోస్టింగ్ ఇచ్చేశామని చెప్పడం గమనార్హం. కోర్టు తీర్పు ప్రకారం వారికి పోస్టులు ఇవ్వాలి, అదుకోసం సూపర్న్యూమరీ పోస్టులు సృష్టించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఆ దిశగా ఇచ్చేందుకు చంద్రబాబు సర్కారు అంగీకరించడం లేదు. దీనివల్ల ప్రతిభ గల అభ్యర్థులు నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
కోర్టు చెబితే ఇచ్చేయాలా?
సాక్షి, అమరావతి: రేయింబవళ్లు కష్టపడి సాధించుకున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి పొమ్మంటే వారికి ఎలా ఉంటుంది? ఆ బాధ వర్ణనాతీతం! మళ్లీ నోటిఫికేషన్ నాటికి వయసు ఉంటుందో మీరిపోతుందో తెలియని పరిస్థితి. అలాంటిది మెగా డిఎస్సీ–2025లో కష్టపడి సాధించుకున్న ఉపాధ్యాయ ఉద్యోగాలను పలువురికి ఇచ్చేదిలేదు పొమ్మంది చంద్రబాబు ప్రభుత్వం. దాంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా, వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించింది. కానీ ప్రభుత్వం మాత్రం అప్పటికే నియామకాలు జరిగి పోయాయని చెప్పడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నష్టపోయిన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని మరోసారి ఆదేశించగా, సర్కారు వాటినీ పెడచెవిన పెట్టింది. దాంతో అధికారులను ఇంప్లీడ్ చేస్తూ అభ్యర్థులు కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేశారు. ఇలా దాదాపు 20కి పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయంటే చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీని ఎంత పారదర్శకంగా, ఘనంగా ఎలా చేపట్టిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 148 రోజుల్లో మొత్తం ప్రక్రియ ముగించామని సర్కారు పెద్దలు గొప్పలు చెబుతున్నా, తీవ్రంగా నష్టపోయిన అభ్యర్థుల గురించి మాత్రం పట్టించుకోక పోవడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెగా డీఎస్సీ విధానాలపై దాఖలైన 200కు పైగా పిటిషన్లలో పలు కోర్టు ధిక్కరణ పిటిషన్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఎంపికప్రక్రియ పూర్తయిపోయిందని చెబుతున్న ప్రభుత్వం.. నష్టపోయిన వారికి కోర్టు ఆదేశాల మేరకు పోస్టులు ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. ఆదిలోనే మెరిట్కు పాతర గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసిన చంద్రబాబు ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమర్పించారు. అభ్యర్థులు వారి వారి అర్హతలను బట్టి ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2,41,387 దరఖాస్తులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందే అర్హతలున్న వారివే. పరీక్షలు సైతం వేర్వేరుగా నిర్వహించారు. అర్హతలు, ప్రతిభగల అభ్యర్థులు ఎస్జీటీతో పాటు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టుల్లో రెండు కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందే అర్హత సాధించారు. వీటిల్లో ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులు ప్రాధాన్యక్రమంలో ఉంటాయి. ఒక ఎస్జీటీ 20 ఏళ్లకు పైగా పని చేసి, అర్హత సంపాదిస్తే స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ)గా పదోన్నతి వస్తుంది. ఇక పీజీటీ అయ్యే అవకాశమే లేదు. ఈ క్రమంలో రెండు లేదా మూడు ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులు ఉన్నత ఉద్యోగం పొందాలనే కోరుకుంటారు. మెరిట్ ప్రకారం మూడు పోస్టులకు కాల్ లెటర్లు పంపాల్సి ఉన్నా, దరఖాస్తులో మొదటి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్న పోస్టుకే కాల్ లెటర్లు పంపారు. దీంతో అభ్యర్థి సాధించిన పోస్టుల్లో నచ్చిన పోస్టు ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇలా దాదాపు 4 వేల మంది ఉన్నత పోస్టును పొందే అవకాశం కోల్పోయారు. దాంతో కొందరు అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును అధికారులు పట్టించుకోలేదని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 11 మంది డీఎస్సీ అభ్యర్థులు వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ (నం.4203/2025), కుల ధ్రువీకరణ పత్రం నకిలీదని తిరస్కరించిన ఘటనలో ఏఎస్సార్ జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ హైకోర్టులో వేసిన పిటిషన్ 3470/25 వివరాలు సర్కారు తీరుపై న్యాయస్థానం ఆగ్రహండీఎస్సీలో ఉన్నత ఉద్యోగాలు సాధించినా, ఆప్షన్ ఇవ్వలేదన్న కారణంతో 54 మందిని ఎస్జీటీలుగా పరిగణించారు. వీరంతా హైకోర్టును ఆశ్రయించారు. దాంతో న్యాయస్థానం విద్యా శాఖ తీరును తప్పుబట్టింది. విద్య, వైద్యంలో మెరిట్ను కాదని, కింది వారికి అవకాశం ఇస్తే ఆ దేశం నాశనం అవుతుందని తీవ్రంగా ఆక్షేపించింది. వారు సాధించిన పోస్టులు వారికే ఇచ్చేయాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కానీ, కోర్టు ఉత్తర్వులు పట్టించుకోకుండా ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 15 నాటికి డీఎస్సీ ఎంపిక, పోస్టింగ్స్ ఇచ్చేసి ప్రక్రియ ముగించామని తెలిపింది. దీంతో కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని అభ్యర్థులు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వ న్యాయవాది వారి స్థానాల్లో వేరే వారిని నియమించామని చెప్పడంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. తమ మధ్యంతర ఉత్తర్వులను పట్టించుకోకుండా.. మీకు తోచిన సమాధానం చెప్పడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించింది. రెండు నెలల్లోగా వారి ఉద్యోగాలు వారికి ఇవ్వాలని జనవరిలోనే తీర్పునిచ్చింది. కానీ, ప్రభుత్వం మాత్రం హైకోర్టు తీర్పును ఇప్పటికీ పట్టించుకోలేదు. బాధితులు ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. డీఎస్సీ ప్రక్రియ ముగిసిపోయిందని, కొత్తగా ఎవరికీ ఉద్యోగాలు ఇచ్చేది లేదని అభ్యర్థులపై పాఠశాల విద్యాశాఖ బెదరింపు ధోరణి ప్రదర్శించినట్టు బాధితులు వాపోయారు.తప్పుపై తప్పులకు నిదర్శనాలెన్నెన్నో..⇒ 200 మందికి పైగా అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లలో మచ్చుకు కొన్ని ఇలా ఉన్నాయి.⇒ డీఎస్సీలో మెరిట్ సాధించినా పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడ్డారని ఆరోపిస్తూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 11 మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. కోర్టులో ఆ ఆరోపణలను ప్రభుత్వం రుజువు చేయలేక పోవడంతో వారికి పోస్టింగ్ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ తీర్పును ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారంతా మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ (నం.4203/2025) వేశారు. ఇందులో డీఎస్సీ నాటి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజును ప్రధాన ప్రతివాదిగా చేర్చారు.⇒ అనంతపురం జిల్లాకు చెందిన గొల్ల రెడ్డమ్మ (4261/25), బి.సరస్వతి (3585/25), వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన శ్రీకాంత్ రాయల్ (3130/ 25) స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు (స్పోర్ట్స్ కోటా) ఎంపికయ్యారు. అయితే వారి సర్టిఫికెట్లపై అనుమానం వ్యక్తం చేస్తూ పోస్టులు ఇచ్చేందుకు తిరస్కరించారు. దాంతో వారు కోర్టును ఆశ్రయించి తమ తప్పులేదని నిరూపించుకున్నారు.⇒ అనంతపురం జిల్లాకు చెందిన రవీంద్రకుమార్ (1350/25), చిత్తూరు జిల్లా నగరికి చెందిన ఎం.మోహన్ (1347/26) స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించినా మెరిట్ కం రోస్టర్ సరిగా అమలు చేయకపోవడంతో అవకాశం కోల్పోయారు. తమకు అన్యాయం జరిగిందని ఆధారాలతో కోర్టును ఆశ్రయించగా, వారికి పోస్టు ఇవ్వాలని ఆదేశించింది. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు.⇒ అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ (3470/25) ఉపాధ్యాయ ఉద్యోగం సాధించినా, కుల ధ్రువీకరణ పత్రం నకిలీదంటూ తిరస్కరించారు. దాంతో ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా, స్థానిక తహసీల్దార్ నేతృత్వంలో అధికారుల కమిటీని వేసి దుర్గాప్రసాద్ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ సరైనదేనని నిర్ధారించారు. కానీ, అతనికి పోస్టు ఇవ్వలేదు. ఇదే కోవలో తిరుపతి జిల్లాకు చెందిన ఎ.శిరీష (3060/25) ఉద్యోగాన్ని కూడా ఎస్సీ సర్టిఫికెట్ ఫేక్ అని తిరస్కరించారు. ఆమె కూడా తన సర్టిఫికెట్ సరైనదేనని నిరూపించుకున్నారు. కానీ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు.⇒ గుంటూరుకు చెందిన జి.రాజేశ్ దినకర్ (1335/26) ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ ‘ఫేక్’ అని ఎస్ఏ పోస్టు తిరస్కరించారు. దాంతో మరోసారి గుంటూరు వైద్యుల కమిటీ ముందు హాజరై సచ్చీలతను నిరూపించుకున్నారు. సదరం సర్టిఫికెట్ సరైనదేనని ధ్రువీకరించినా పోస్టు ఇవ్వలేదు. -
మెగా DSCపై చంద్రబాబు వీడియో అంబటి నెక్స్ట్ లెవెల్ ర్యాగింగ్
-
డీఎస్సీ ‘మెగా’ మోసం!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025 తప్పిదాలను కప్పిపుచ్చి మభ్యపెట్టేందుకు చంద్రబాబు సర్కారు పడరాని పాట్లు పడుతోందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆధారాలతో సహా డీఎస్సీ అక్రమాలు బహిర్గతం కావడంతో ప్రభుత్వం బెంబేలెత్తుతోందన్నారు. ‘ఫస్ట్ ర్యాంకర్కు కాల్ లెటర్ పంపకుండా ఎందుకు ఆపారు? నవీన్ క్యాండిడేట్ ఐడీని ప్రభుత్వం బ్లాక్ చేయడం నిజం కాదా? ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఏకంగా ఫస్ట్ ర్యాంకు రావడం.. ఫస్ట్ ర్యాంకు వచ్చినా కూడా ఉద్యోగంలో చేరకపోవడం చరిత్రలో ఎక్కడైనా ఉందా? డీఎస్సీ–2025 మొదటి మెరిట్ లిస్టు ఎందుకు రద్దు చేశారు?’ అని ఒక ప్రకటనలో సూటిగా ప్రశ్నించారు. గతంలో డీఎస్సీ మెరిట్ లిస్టులు కలెక్టర్ కార్యాలయాల్లోనే వెరిఫై చేసేవారని, ఈదఫా మాత్రం సెలెక్ట్ అయిన వారికి నేరుగా మెసేజ్లు పంపడం వెనుక మతలబు ఏమిటని నిలదీశారు. డీఎస్సీలో డొల్లతనంపై ‘సాక్షి’లో వరుసగా కథనాలు వెలువడటం.. మాజీ సీఎం వైఎస్ జగన్ దీన్ని ఎండగట్టడం.. సీబీఐ విచారణకు డిమాండ్ చేయడంతో ఉలిక్కిపడిన బాబు సర్కారు కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే అర్ధరాత్రి తూతూమంత్రంగా ఓ ప్రకటన జారీ చేసి చేతులు దులుపుకొనే యత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. డీఎస్సీ అక్రమాలను సర్వత్రా నిలదీస్తుంటే విద్యాశాఖ మంత్రి మాత్రం అంతా పారదర్శకమని తన ‘ఎక్స్’ ఖాతాలో బుకాయించడం విస్మయం కలిగిస్తోందన్నారు. మెరిట్ కలిగి ఉండి అన్యాయానికి గురైన అభ్యర్థులను బుజ్జగించేందుకు విద్యాశాఖ మంత్రి రాజకీయాలు చేయడం ఏమిటన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులను ఎలాంటి పరీక్ష లేకుండా భర్తీ చేసిన ప్రభుత్వం తాజాగా అదే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందాలంటే రాత పరీక్ష తప్పనిసరి అంటూ పాలసీ, జీవోలను సవరించడం వెనుక మతలబు ఏమిటని నిలదీశారు.తప్పించుకునేందుకు ‘శాప్’ ఆపసోపాలు..ప్రభుత్వం వివరణ: శాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడాకోటా డీఎస్సీ పోస్టుల భర్తీలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలు అవాస్తవం, నిరాధారమైనవి.ఇదీ వాస్తవం: క్రీడా కోటా డీఎస్సీ పోస్టుల భర్తీలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పోస్టులు పొందారని, అనర్హులకు పోస్టుల దక్కాయని.. అర్హులైనప్పటికీ తమకు అన్యాయం జరిగిదంటూ ఎందరో అభ్యర్థులు ‘శాప్’కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా కోర్టులకు వెళ్లి తేల్చుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. సమాచార హక్కు–2005 ప్రకారం అర్హులైన అభ్యర్థులు కోరిన సమాచారాన్ని ‘శాప్’ ఇంత వరకు ఇవ్వకపోవడం దేనికి సంకేతం? ఏదైనా నోటిఫికేషన్ తర్వాత పోస్టు భర్తీ చేస్తే ఆ పోస్టుకు సంబంధించిన సమగ్ర వివరాలు, ఉద్యోగి ఏ అర్హతతో ఉద్యోగం పొందారో సమాచారం ఇవ్వాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలో స్పష్టం చేసింది. దీనిని శాప్ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? టీచర్ పోస్టులకు బేరాలు పెడుతూ నంబర్తో సహా ఫోన్ కాల్ రికార్డింగ్స్ బహిర్గతమైతే వాటిపై శాప్ విచారణ చేయడం మానేసి మౌనం దాల్చడం వెనుక మతలబు ఏమిటి?ప్రభుత్వం వివరణ: 3,600 మంది అభ్యర్థులు దాఖలు చేసుకున్న 5,326 దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రాష్ట్ర స్థాయి కమిటీకి పంపించి పోస్టులు భర్తీ చేసింది.ఇదీ వాస్తవం: స్క్రీనింగ్ కమిటీలో సభ్యులైన డీఎస్డీవోలను ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా తయారీ వరకు ఎందుకు కొనసాగించలేదు? ప్రాథమిక ఎంపిక జాబితాను బహిరంగంగా ఎందుకు ప్రదర్శించలేదు? ఒకవేళ ప్రదర్శిస్తే కచ్చితంగా అభ్యంతరాలు వచ్చేవి. కానీ శాప్లో ఒక్క అభ్యంతరం కూడా ఎందుకు నమోదు కాలేదు? అంటే, అసలు ప్రాథమిక జాబితా ప్రదర్శించకుండానే తుది జాబితా సిద్ధం చేసేశారు. చివరికి ఫలితాల రోజు అనర్హురాలైన విజయనగరానికి చెందిన ఓ క్రీడాకారిణికి ఉద్యోగం రావడం గమనించి అర్హులు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తే శాప్ వాటిని ఎందుకు పట్టించుకోలేదు? ఈ ఏడాది ఏప్రిల్ 24న సాక్షిలో ‘డీఎస్సీ డీల్స్’ కథనం వెలువడగానే సదరు క్రీడాకారిణిపై విచారణ చేస్తున్నట్లు శాప్ పేర్కొంది. ఇప్పటికీ నెల రోజులు దాటినా విచారణ ఎందుకు ముగించడం లేదు? అంటే ప్రభుత్వమే వాస్తవాలు బయటపడకుండా అడ్డుకుంటోంది కదా!తాను ఎస్సీఈఆర్టీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా 2016 నుంచి పనిచేసినట్టు కోర్టుకు తెలిపిన నవీన్ సర్కారు అబద్ధాల వివరణలపై అభ్యర్థుల మండిపాటు..డీఎస్సీ–2025లో కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్గా ప్రకటించిన పి.నవీన్ ఎస్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్పై కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. అతడికి డీఎస్సీలో ప్రశ్నలను ఆన్లైన్ చేసే బాధ్యతలు అప్పగించారు. డీఎస్సీ ఫలితాల అనంతరం అతడికి టాప్ ర్యాంకులు వచ్చాయని గుర్తించిన అధికారులు మొత్తం ఎంపిక ప్రక్రియనే మార్చేశారు. అబద్ధాల వివరణలతో ప్రభుత్వం వరుసగా కట్టు కథలు వినిపిస్తోందని టీచర్ అభ్యర్థులు మండిపడుతున్నారు. చంద్రబాబు సర్కారు తీరును నిలదీస్తూ పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. తమ ప్రశ్నలకు జవాబు చెప్పాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న పలు సందేహాలు, ప్రభుత్వ వివరణలు ఇలా ఉన్నాయి..!ప్రభుత్వం వివరణ: డీఎస్సీ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్ పి.నవీన్ 2016 నవంబర్ నుంచి ఎస్సీఈఆర్టీలో అవుట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తూ వ్యక్తిగత కారణాలతో 2025లో రాజీనామా సమర్పించాడు. అన్నింటికంటే ముఖ్యంగా మెరిట్ ప్రాతిపదికన అతడిని జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా సర్టిఫికెట్ వెరిఫికేషన్కు పిలిచినా వెరిఫికేషన్కు హాజరు కాలేదు. ఇదీ వాస్తవం: డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 26న కాల్ లెటర్లు విడుదల చేశారు. వీటిని ఆయా అభ్యర్థులు తమ డీఎస్సీ నంబర్ ఆధారంగా కంప్యూటర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆగస్టు 29 నుంచి ప్రారంభమైన సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. అయితే, నవీన్ తన క్యాండిడేట్ లాగిన్ ఐడీని అధికారులు బ్లాక్ చేశారంటూ హైకోర్టుకు ఆధారాలు సమర్పించాడు. అసలు కాల్ లెటర్ లేకుండా సర్టిఫికెట్ల పరిశీలనకు అనుమతిస్తారా?ప్రభుత్వం వివరణ: నవీన్ వ్యక్తిగత కారణాలతో 2025లో రాజీనామా సమర్పించాడు.ఇదీ వాస్తవం: నవీన్ 2025 ఏ నెలలో రాజీనామా చేశాడో చెప్పలేదు. తాను డీఎస్సీ ప్రక్రియ ముగిసే వరకు ఎస్సీఈఆర్టీలోనే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేశానంటూ కోర్టుకు ఇచ్చిన పిటిషన్లో అతడు పేర్కొన్నాడు. మరి వ్యక్తిగత కారణాలతో ఎప్పుడు రాజీనామా చేశాడు?ప్రభుత్వం వివరణ : డీఎస్సీ రాసేందుకు నిర్ణీత విధానాల ప్రకారం ముందుగా శాఖకు సమాచారం ఇచ్చి సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే నవీన్ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, అనుమతి పొందకుండా పరీక్షలకు హాజరయ్యాడు. అందువల్ల అతడి పేరు తదుపరి ఎంపిక ప్రక్రియ రికార్డుల నుంచి తొలగించాం. ఇదీ వాస్తవం: అనుమతి పొందకుండా పరీక్షలకు హాజరైతే అతడి ఎంపిక ప్రక్రియను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. కానీ దాదాపు ఏడాదిన్నర కాలంపాటు సాగిన డీఎస్సీ ప్రక్రియలో ఈ విషయాన్ని ఎందుకు గుర్తించలేదు? గుర్తించి ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలా ఎక్కడా చేయలేదు. ఎంపిక ప్రక్రియలో నవీన్ను తొలగించి ఉంటే అతడి స్థానంలో మరో అభ్యర్థికి సోషల్ స్టడీస్లో మొదటి ర్యాంకు, జోన్–2 టీజీటీలో ఆరో ర్యాంకును మరో అభ్యర్థికి కేటాయించి ఉండాలి. ఇలా ఎందుకు చేయలేదు? ప్రభుత్వ తీరును తప్పుబడుతూ నవీన్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. అతడికి పోస్టు ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. మరి నవీన్ విద్యాశాఖ అనుమతి లేకుండా పరీక్ష రాశాడని, అందుకే అతడికి పోస్టు కేటాయింపును రద్దు చేశామని కోర్టుకు ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు?ఉర్దూ మీడియం పోస్టుల్లోనూ తప్పిదాలు..!ప్రభుత్వం వివరణ: అన్నమయ్య, కడప జిల్లాలకు చెందిన స్కూల్ అసిస్టెంట్ బయాలజీ (ఉర్దూ మీడియం) పోస్టుల భర్తీ పూర్తిగా మెరిట్, రోస్టర్ నిబంధనల ప్రకారమే జరిగింది. ఓపెన్ కాంపిటీషన్ (ఓసీ) రోస్టర్ పాయింట్ కింద అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థిని, ఓసీ–ఈడబ్ల్యుఎస్ కోటా కింద చెల్లుబాటు అయ్యే సర్టిఫికెట్ గల మెరిట్ అభ్యర్థిని నిబంధనల ప్రకారమే ఎంపిక చేశాం. ఇందులో ఎటువంటి నిబంధనల అతిక్రమణ జరగలేదు.ఇదీ వాస్తవం: అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన సయ్యద్ జమీల్ డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ (ఉర్దూ)లో 58.77 స్కోరు సాధించారు. ఓసీ–ఈడబ్ల్యుఎస్ కోటాలో ఆయనకు ఆ పోస్టు ఇవ్వాలి. కానీ ఆ పోస్టును ముస్లిం బీసీ(షేక్) వర్గానికి చెందిన అభ్యర్థికి ఇచ్చారు. ఎంపిక అయిన అభ్యర్థి 2008, 2012, 2014, 2018 డీఎస్సీల్లో ‘బీసీ’గా నమోదు చేసుకున్నాడు. 2025 నాటికి ‘ఓసీ–ఈడబ్ల్యుఎస్’గా నమోదు చేశాడు. గతంలో బీసీ కులం అని చూపించి 2025 డీఎస్సీలో ఓసీగా ఎలా మారిపోయాడు?ఇదేనా పారదర్శకత?డీఎస్సీ నియామకాలను అత్యంత పారదర్శకంగా పూర్తి చేశామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. అదే నిజమైతే టెట్ మార్కుల సవరణకు పలు పర్యాయాలు ఎందుకు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది? ఒకసారి మెరిట్ జాబితాను విడుదల చేశాక సవరణతో రెండోసారి జాబితా ఎందుకు ఇచ్చారు? అనంతరం వాటిని ఆన్లైన్ నుంచి తొలగించి నేరుగా ఎంపిక జాబితాలు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? ఎంపికైనట్లు కొందరు అభ్యర్థులకు ఎస్ఎంఎస్లు పంపి, ఆ తర్వాత కాదని చెప్పడం నిజం కాదా? అమరావతిలో వేడుకలకు ఆహ్వానించి ఆ తర్వాత మీరసలు టీచర్ పోస్టులకే ఎంపిక కాలేదని చెప్పడంలో ఆంతర్యమేంటి? జూలై–2024 టెట్ను విజయవంతంగా పూర్తి చేసిన అధికారిని డీఎస్సీ కన్వీనర్గా నియమించామని చెబుతున్నారు. మరి ప్రారంభంలో ఆయనకే బాధ్యతలు ఎందుకు అప్పగించలేదు? అప్పటికే ఉన్న డీఎస్సీ కన్వీనర్ను ఎందుకు తొలగించారు?ప్రభుత్వం వివరణ: క్రీడా సంఘాలు, ఫెడరేషన్ల ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను ఇచ్చాం.ఇదీ వాస్తవం: స్క్రీనింగ్ కమిటీ ద్వారా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన అత్యంత రహస్యంగా సాగింది. ఇందులో ఎక్కడా క్రీడా సంఘం, ఫెడరేషన్కు సంబంధించిన వ్యక్తులు లేరు. శాప్ తయారు చేసిన తుది జాబితా లిస్టు ప్రకారం ఆయా క్రీడా సంఘాల నుంచి సమ్మతి లేఖలు తీసుకుని ‘మమ’ అనిపించింది. జాతీయ స్థాయిలో పోస్టుల భర్తీలో ఫెడరేషన్లకు చెందిన వ్యక్తులను దగ్గర పెట్టుకుని సర్టిఫికెట్ల ధ్రువీకరణ చేపట్టడం ఆనవాయితీ. క్రీడాకారుల టీమ్ ఫొటోలు, మెడల్స్ లాంటివి స్వయంగా పరిశీలించి ధ్రువీకరిస్తారు. మరి ఇక్కడ అలా ఎందుకు జరగలేదు? డిగ్రీ లేకున్నా ఇతర రాష్ట్రాల్లో డిగ్రీ చదివినట్లు ఫేక్ సర్టిఫికెట్ తీసుకొచ్చి అనర్హులు టీచర్ ఉద్యోగాలు పొందారు. ఆ డిగ్రీలకు సంబంధించి శాప్ ఇతర రాష్ట్రాల వర్సిటీలను ఎందుకు సంప్రదించలేదు?ప్రభుత్వం వివరణ: మార్గదర్శకాలకు అనుగుణంగానే స్పోర్ట్స్ కోటా సీట్లను భర్తీ చేశాం.ఇదీ వాస్తవం: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డీఎస్సీలో 421 పోస్టులను స్పోర్ట్స్ కోటాలో పరీక్ష లేకుండా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి తగ్గట్టుగా 97 శాతం పోస్టులు నింపేశారు. డీఎస్సీ ముగిసిన 8 నెలల తర్వాత క్రీడా పాలసీ, 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ హఠాత్తుగా ఎందుకు మారింది? ఈ డీఎస్సీలో రాత పరీక్షల అవసరం లేకుండా క్రీడల కోటాలో ఉద్యోగాలు ఇవ్వగా ఇప్పుడు మాత్రం ఆయా శాఖలు నిర్వహించే రాత పరీక్షల్లో కచ్చితంగా అర్హత సాధించాలని ఎందుకు సవరించారు? రాత పరీక్ష లేకుండా ఉద్యోగం ఇవ్వడం తప్పయితే.. 2025 డీఎస్సీ పూర్తిగా తప్పిదమే. అది సక్రమమే అయితే.. ఇప్పుడు రాత పరీక్షను తప్పనిసరి ఎందుకు చేశారు? కర్నూలు జిల్లాలో ఓపెన్ కేటగిరీ పోస్టును భర్తీ చేసిన తర్వాత మళ్లీ నాన్–లోకల్ పోస్టు ఎలా భర్తీ చేస్తారు? దీనిపై కోర్టుల్లో కేసులు వేస్తే శాప్ 2002 తర్వాత జరిగిన సవరణలను దాచిపెట్టి కేవలం రాష్ట్రపతి ఉత్తర్వులు–1975 అంశాలను మాత్రమే కోర్టుకు ఎందుకు నివేదించింది?జవాబు చెప్పలేక జగన్పై వ్యక్తిగత విమర్శలా?విద్యాశాఖ మంత్రి లోకేశ్ డీఎస్సీపై వాస్తవాలను అంగీకరించకుండా మాజీ సీఎం వైఎస్ జగన్పై వ్యక్తిగత దూషణలు, విమర్శలు చేస్తూ ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు పెట్టడాన్ని బొత్స తీవ్రంగా ఖండించారు. డీఎస్సీలో అర్హులకు అన్యాయం జరగడం ముమ్మాటికీ నిజమని.. దీనిపై ‘సాక్షి’ ప్రచురించిన కథనం తప్పు అని నిరూపించే ఒక్క ఆధారాన్ని కూడా లోకేశ్ చూపలేకపోయారని పేర్కొన్నారు. 16 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామని, పది వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చామని గొప్పలు చెప్పుకున్న లోకేశ్ ఎక్కడా తప్పు జరగలేదని చెప్పే ధైర్యం చేయలేకపోయారని వ్యాఖ్యానించారు. డీఎస్సీ–2025లో జరిగిన దారుణాలు ఆధారాలతో సహా కళ్లముందే కనిపిస్తున్నా దర్యాప్తు చేస్తామని ఒక్కమాట అనేందుకు లోకేశ్ సాహసించలేదన్నారు. మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు 200 కేసులు వేయించారని జగన్పై నిరాధార ఆరోపణలతో బురద చల్లారని మండిపడ్డారు. వాస్తవానికి డీఎస్సీలో తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లిన వారంతా ప్రతిభ కలిగిన టీచర్ అభ్యర్థులేనని, వారిలో పరీక్ష రాయని వారు ఒక్కరూ లేరని గుర్తు చేశారు. ‘వారికి పోస్టులు ఇవ్వాలని సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. అయితే కోర్టు తీర్పు కాపీ వచ్చేలోపే ప్రక్రియను హడావుడిగా ముగిస్తూ ప్రభుత్వం ఫలితాలు ప్రకటన, ఎంపిక ప్రక్రియ, పోస్టింగ్లు ఇచ్చేశారు. దీనిపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మెరిట్ అభ్యర్థులకు పోస్టులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడంతో పాటు విద్యాశాఖ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఇది నిజం కాదా? ఈ విషయం తెలిసి కూడా లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా ఎలా కొనసాగుతున్నారు? అర్హులకు ఎందుకు న్యాయం చేయలేదు? డీఎస్సీకి 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమర్పించారు. కూటమి ప్రభుత్వం ఆడిన అవినీతి క్రీడతో 3 లక్షల మందికి పైగా అభ్యర్థులకు పూడ్చలేని నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం తక్షణం క్షమాపణ చెప్పి అభ్యర్థులకు న్యాయం చేయాలి’ అని బొత్స డిమాండ్ చేశారు. స్పోర్ట్సు డీఎస్సీలో జరిగిన స్కామ్పై ‘సాక్షి’లో కథనం వెలువడిన నెల రోజుల తర్వాత అబ్బే.. తప్పు జరగలేదంటూ ‘శాప్’ మంగళవారం ఓ ప్రకటన జారీ చేసి చేతులు దులుపుకోవటాన్ని బొత్స తప్పుబట్టారు.ఈ ప్రశ్నలకు జవాబేది చినబాబూ..1. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఎస్సీఈఆర్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?2. ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు?3. కృష్ణా జిల్లాలో సోషల్ స్టడీస్లో టాపర్గా వచ్చిన ఎస్సీఈఆర్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి పి.నవీన్ ఎంపిక జాబితాలో తనకు పోస్టు లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది వాస్తవం కాదా?4. రాయలసీమ జిల్లాకు చెందిన ఓ క్రీడాకారిణి న్యాయంగా తనకు దక్కాల్సిన పోస్టు నాన్ృలోకల్ కోటాలో వేరే వ్యక్తికి కట్టబెట్టేశారని హైకోర్టును ఆశ్రయించింది నిజం కాదా?5. సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు?6. రూ.15 లక్షలకు ‘‘స్పోర్ట్స్ కోటా’’ పోస్టులు బేరసారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయి? వారు ఏయే క్రీడల్లో ప్రతిభ చూపారు? వారికి ఎలా పోస్టింగులు ఇచ్చారో మొత్తం వివరాలు బయటపెట్టగలరా?7. టెట్ కన్వీనర్గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీనర్ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్ను డీఎస్సీ కన్వీనర్గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏమిటి?8. మెగా డీఎస్సీ పేరుతో అమరావతిలో నిర్వహించిన నియామకపత్రాల ప్రదానోత్సవానికి కొందరు డీఎస్సీ ఉద్యోగార్థులను పిలిచి, తర్వాత వాళ్లు సెలెక్ట్ కాలేదని వాళ్ల జీవితాల్లో నిప్పులు పోసిన మాట వాస్తవం కాదా? -
లోకేశ్ శాఖ అక్రమాలపై పవన్ ప్రశ్నించరా?
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్.. విద్యాశాఖ మంత్రి లోకేశ్ శాఖలో జరిగిన డీఎస్సీ అక్రమాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ నిలదీశారు. మెగా డీఎస్సీ పేరుతో రాష్ట్రంలో భారీ స్కామ్ జరిగిందని, ఒక్కో టీచర్ పోస్టును రూ.15 లక్షలకు అమ్ముకున్నారనే ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. ప్రశ్నాపత్రాల లీకేజీ నుంచి మెరిట్ లిస్ట్ దాచిపెట్టడం వరకు మొత్తం నియామక ప్రక్రియపై సిట్టింగ్ జడ్జితో విచారణగానీ, సీబీఐతో దర్యాప్తుగానీ జరిపించాలని డిమాండ్ చేశారు.ఆయన మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ–2025 పరీక్ష రాసే వ్యక్తికే ప్రశ్నాపత్రాల తయారీ బాధ్యతలు అప్పగించారని చెప్పారు. ప్రశ్నాపత్రాలు లీకైన తర్వాత కూడా ఆ ఉద్యోగిని ఎందుకు సస్పెండ్ చేయలేదని, ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎలాంటి సిఫార్సులు లేకుండా ప్రతిభ ఆధారంగా 1.20 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తుచేశారు. గోదావరి కలుషితం కాకుండా వైఎస్ జగన్ చర్యలు గోదావరి కలుషితం కాకుండా ఉండాలని గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.756 కోట్లతో డీపీఆర్ రూపొందించి కేంద్రానికి పంపిందని చెప్పారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ద్వారా ఏఆర్సీపీ స్కీమ్లో రూ.88 కోట్లు తీసుకొచి్చనట్లు తెలిపారు. పేపర్ మిల్లు నుంచి వచ్చే కలుషిత నీటిని పూర్తిగా శుద్ధిచేసిన తర్వాతే గోదావరిలో వదలాల్సి ఉందన్నారు.తమ హయాంలో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) పనులు 50 శాతం పూర్తయ్యాయని చెప్పారు. కానీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కమీషన్ల కోసం కాంట్రాక్టర్ను బెదిరించి పనులు ఆపేశారని విమర్శించారు. ట్రీట్మెంట్ పేరుతో రూ.లక్షలు ఖర్చు చేస్తున్నామని చెబుతూ నేరుగా కలుషిత నీటిని గోదావరిలోకి వదులుతున్నారన్నారు. దీంతో ప్రజల్లో కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. పవన్కళ్యాణ్ ఎస్టీపీ చానల్ను పరిశీలించి అక్కడ జరుగుతున్న అక్రమాలను బయటపెట్టాలని సూచించారు.ఇసుక మాఫియా అక్రమాలకు అంతేలేదు రాజమహేంద్రవరంలో ఇసుక మాఫియా అక్రమాలకు అంతే లేకుండా పోయిందని చెప్పారు. గ్యామన్ ఇండియా బ్రిడ్జిని రాజమహేంద్రవరం సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు పంచుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. బ్రిడ్జి స్తంభాల వద్ద విపరీతంగా ఇసుక తవ్వేస్తున్నారని చెప్పారు. ఇక్కడ ఇసుక మాఫియా, మట్టి మాఫియా, చిట్టీల మాఫియా రెచ్చిపోతున్నాయని తెలిపారు. గ్యామన్ ఇండియా బ్రిడ్జి వద్ద జరుగుతున్న ఇసుక దోపిడీ, పేపర్ మిల్లు కాలుష్యంపై పవన్కళ్యాణ్ రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు. -
మెగా డీఎస్సీ ఒక స్కామ్
సాక్షి, రాజమహేంద్రవరం: డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం మెగా స్కామ్కు తెర తీసిందని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మంగళవారం మాట్లాడారు. డీఎస్సీ–2025పై అభ్యర్థుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్కు చిత్తశుద్ధి ఉంటే పదవికి రాజీనామా చేసి డీఎస్సీపై సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు జిమ్మిక్కులు, స్కామ్లు చేయడంలో సిద్ధహస్తులని, ప్రజలను, నిరుద్యోగులను మోసం చేయడం అనేక సందర్భాల్లో చూశామని చెప్పారు.మాజీ సీఎం వైఎస్ జగన్ 6,500 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే నానా యాగీ చేసిన చంద్రబాబు, పవన్, లోకేశ్.. తాము అధికారంలోకొస్తే మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ అంటూ ప్రగల్భాలు పలికారన్నారు. మెగా డీఎస్సీ అంటూ దగా డీఎస్సీ నిర్వహించారని మండిపడ్డారు. నిరుద్యోగుల నోట్లో మన్ను కొటా్టరని, డీఎస్సీ అభ్యర్థులు పడిన కష్టాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. నవీన్ అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి తనకు వచ్చిన ర్యాంకులపై కోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం మెరిట్ జాబితాను వెబ్సైట్ నుంచి తొలగించడం డీఎస్సీలో అవకతవకలకు నిదర్శనమన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 3.36 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ రాస్తే 16,430 మందికి మాత్రమే సెలెక్టెడ్ మెసేజ్లు పంపించడం, మెరిట్ జాబితాలు అందుబాటులో ఉంచకపోవడం దుర్మార్గమన్నారు. వెబ్సైట్లో మెరిట్ లిస్టులు మాయం చెయ్యడం, రోస్టర్ విధానం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ సక్రమంగా పాటించకపోవడంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని దుయ్యబట్టారు. చిత్తశుద్ధి ఉంటే మంత్రి లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో పోస్టులను వేలం పెట్టి మరీ రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు బేరాలు ఆడిన ఆడియోల టేపులు బహిర్గతం కావడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఆడియో టేపుల లీకేజ్పై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హమన్నారు. సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో ఆయనకు తెలియకుండానే డీఎస్సీలో ఇన్ని అక్రమాలు చోటు చేసుకుంటున్నాయా అని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించకపోతే యువజన విభాగం ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థుల తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
డీఎస్సీ స్కాంపై నోరెత్తరేం?
అధికారంలోవున్న ప్రతిసారీ పదో తరగతి మొదలుకొని ప్రభుత్వోద్యోగాల భర్తీ వరకూ జరిగే ఏ పరీక్షనూ ఎన్నడూ సక్రమంగా నిర్వహించటం చేతకాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి కూడా ఆ ‘ఘనత’ సొంతం చేసుకున్నారు. డీఎస్సీ నిర్వహణలో పూర్తిగా ఫెయిలైనా ఏమీ జరగనట్టు ప్రవర్తిస్తున్నారు. అధికారంలో కొచ్చాక తొలి సంతకం పెట్టి, నిరుడు ఆర్భాటంగా జరిపించిన డీఎస్సీ పాపాలపుట్ట బద్దలై నాలుగు రోజులవుతున్నా ఆయనగానీ, విద్యాశాఖను చూస్తున్న ఆయన కుమారుడు లోకేశ్గానీ ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోవటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. పేపర్లీక్ మొదలు కొని స్పోర్ట్స్ కోటా పోస్టులు అమ్ముకోవటంవరకూ ఆరోపణలు వచ్చిపడుతున్నా తండ్రీ కొడుకులు సంజా యిషీ ఇవ్వకపోవటం, చడీచప్పుడూ లేకుండా కొందరిని బాధ్యతల నుంచి తప్పించటం, ర్యాంకుల్ని పక్కనç ³డేయటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇదేమీ కుటుంబ వ్యవహారం కాదు... పార్టీ సంస్థాగత అంశం అంతకన్నా కాదు. జవాబు దారీతనాన్ని గుర్తెరిగి సంజాయిషీ చెప్పి తీరాల్సిన అతి ముఖ్యమైన విషయం.జీవితంలో ఏనాడైనా కష్టపడి చదివుంటే, నిజాయితీగా ఎదిగుంటే పరీక్షలంటే ఏమిటో, అభ్యర్థులుపడే ఇబ్బందులెలా ఉంటాయో తెలిసేది. దశాబ్దాలుగా అనుసరిస్తున్న నియమ నిబంధనలకు మంగళం పాడి, కాసులతో తూకంవేసి పోస్టులు భర్తీ చేశారని నిరుద్యోగులు ఆక్రోశిస్తున్నారు. డీఎస్సీ నిర్వహణలో, ఎంపికలో అనేక లోపాలున్నాయంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థులు ఆశ్రయిస్తే ప్రభుత్వ తీరుపై ధర్మాసనం నిరుడు అక్టోబర్లోనే ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒకటికన్నా ఎక్కువ ఉద్యో గాలు పొందిన వారిని ఉన్నత అర్హతగల ఉద్యోగానికి ఎంపిక చేయాలనీ, ఇది రెండు నెలల్లో పూర్తి కావాలనీ నిరుడు ఆగస్టులో మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కానీ ఎనిమిది నెలలు గడుస్తున్నా అతీగతీ లేదు. ప్రచండమైన పోటీ, పరిమిత అవకాశాలుగల వర్తమానంలో పోటీ పరీక్షలపై లక్ష లాదిమంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకుంటున్నారు. స్వస్థలాలనుంచి దూరప్రాంతాల కెళ్లి కోచింగ్ పేరిట వేలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. తినీతినకా కష్టాలూ పడుతూ రాత్రింబగళ్లు చదువుకుంటున్నారు. ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. తమ పిల్లలకు ఎలాగైనా అవకాశం దక్కాలంటూ తల్లిదండ్రులు కనిపించని దేవుళ్లకు మొక్కుకుంటు న్నారు. పరీక్షలు బాగా రాశామనీ, అవకాశం వచ్చితీరుతుందనీ ఎదురుచూసే వారికి శరాఘాతంగా పోస్టులన్నీ అంగడి సరుకుగా మార్చేస్తే ఏమనాలి? పేరుకు ‘మెగా డీఎస్సీ’ అని ప్రచారం చేసుకున్నా ఈసారి కేవలం 16,347 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, కావాలని ఆలస్యంచేసి ఇచ్చిన ఈ కొత్త నోటిఫికేషన్ కనీవినీ ఎరుగని ‘మెగా’ద్భుతమంటూ ప్రచారం చేసుకున్నారు. తీరా నిర్వాకం ఇలా తగలబడింది. ఈసారి ఫలితాలు పారదర్శ కంగా లేవు. కేవలం సెలెక్టయినవారి జాబితాతో సరిపెట్టారు. ఎంపికైనవారు వేరే అవకాశాలొచ్చి వెళ్లినప్పుడు, ఒకటికి మించి ఉద్యోగావకాశాలొచ్చిన వారున్నప్పుడు తమకు అవకాశం దక్కుతుందని ఆశలు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా చేశారు. ఎంపికైన వారికి ఫోన్లో ‘రారమ్మ’ని ఆహ్వానించటం, కొన్ని రోజులు గడిచాక రావొద్దని చెప్పడం ఒక ప్రహసనం. కొత్తగా వచ్చిన టీచర్లకు శిక్షణ శిబిరం నిర్వహిస్తూ, అందులో ఎంపిక కానివారికి చోటిచ్చి, అటుపై వారిని ‘టీచర్లు’గా ముద్రేసిన వైనం మరో చిత్రం. దేశం మొత్తం ‘నీట్’ పరీక్ష గురించి మాట్లాడుకుంటున్నది. కానీ ఈ డీఎస్సీ కుంభకోణం ముందు అది పిపీలకం. అక్కడ ప్రశ్నపత్రాలు లీకైతే... ఇక్కడ ప్రశ్నపత్రాలు మొదలుకొని పోస్టుల భర్తీ వరకూ అడుగడుగునా అవకతవకలే. ఫోన్లలో బేరసారాలూ, స్పోర్ట్స్ కోటా పోస్టుల అమ్మకాలు, మహిళా అభ్యర్థులతో అసభ్య చాటింగులు పాలకుల హైన్యాన్ని చాటుతున్నాయి. జగన్ పాలనలో గ్రామ సచివాలయం మొదలుకొని ఉన్నతో ద్యోగాలవరకూ... టెన్త్ మొదలుకొని పీజీ పరీక్షలవరకూ ఎలాంటి అక్రమాలకూ తావు లేకుండా సమర్థవంతంగా నిర్వహించినప్పుడు కూటమి సర్కారుకు ఏమైంది? లోకేశ్ను బర్తరఫ్ చేసి, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపితే అసలు దొంగలు బయటికొస్తారు. -
ఉద్యోగస్తులు అంటే ఎందుకు అంత పగ
-
అవినీతి డీల్ గా మారిన AP మెగా DSC..!
-
డీఎస్సీ పేపర్ లో బాబు స్కాం.
-
మెగా డీఎస్సీనా? లేక దగా డీఎస్సీనా?... చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన మాజీ సీఎం వైఎస్ జగన్
-
మెగా డీఎస్సీనా? దగా డీఎస్సీనా?
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు సర్కార్ నిర్వహించిన డీఎస్సీ–2025 పరీక్షలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘ఇది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పూర్తిగా లోపించిందని ఆక్షేపించిన మాజీ సీఎం వైఎస్ జగన్, పేపర్ లీకులు, డేటా డిలీట్లు, మెరిట్ లిస్టుల మాయం వంటి ఘటనలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.తమ హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి, ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి, కొత్త నోటిఫికేషన్ను ప్రచారానికి వాడుకున్నారని విమర్శించారు. నారా లోకేశ్ని మంత్రి పదవి నుంచి తప్పించి ... మెగా డీఎస్సీని స్కాంపై సీబీఐ దర్యాప్తు కోరాలన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా సోమవారం సీఎం చంద్రబాబు సర్కార్ తీరును ఎండగడుతూ వైఎస్ జగన్ పోస్టు చేశారు. చంద్రబాబూ.. మీరు నిర్వహించింది మెగా ⇒ డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది? పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి? మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా?. దీనికేమి సమాధానం చెబుతారు? మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘డార్క్ ఆపరేషన్’ను ఎందుకు దాచిపెడుతున్నారు?. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఎస్సీఈఆర్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది? ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు? సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు? ⇒ రూ.15 లక్షలకు ‘‘స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేరసారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టీఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి? ⇒ టెట్ కన్వీనర్గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీనర్ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్ను డీఎస్సీ కన్వీనర్గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏమిటి? మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి.. దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ ను పదవి నుంచి తప్పించి వెంటనే సీబీఐ దర్యాప్తు కోరాలి. చంద్రబాబూ..! మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయాలి. -
డీఎస్సీ నియామకాల్లో ప్రభుత్వ బరితెగింపు
సాక్షి, అమరావతి/ఒంగోలు సిటీ/కోరుకొండ : డీఎస్సీ నియామకాల్లోను స్కామ్లకు పాల్పడిన ప్రభుత్వ బరితెగింపు అత్యంత దుర్మార్గమని మాజీమంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సమాజానికి భావిపౌరుల్ని అందించాల్సిన విద్యా వ్యవస్థలో సైతం స్కాంలు చేసే దౌర్భాగ్య స్థితికి చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపోయిందన్నారు. వీరు సోమవారం వేర్వేరు చోట్ల డీఎస్సీ అక్రమాలపై స్పందిస్తూ ఏమన్నారంటే.. ఇంతకన్నా బరితెగింపు ఏమైనా ఉంటుందా?.. డీఎస్సీలో కాంట్రాక్టు ఉద్యోగికి స్టేట్ఫస్ట్ ర్యాంకు ఎలా వచ్చింది? ఈ చోద్యం ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. మెరిట్ లిస్ట్ ప్రకటించమని హైకోర్టు చెప్పినా పట్టించుకోలేదు. ఇంతకన్నా బరితెగింపు ఏమైనా ఉంటుందా? కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన చంద్రబాబు, ఆయన కుమారుడికి మాత్రమే పైలా పచ్చిస్లా సాగింది. మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటూ విమర్శలు చేస్తున్న టీడీపీ వాళ్లది తడిగుడ్డల పార్టీ. ఇప్పటంలో రోడ్డు విస్తరణ కోసం గోడ కూల్చివేత సమయంలో స్పందించిన పవన్కళ్యాణ్ కార్ టాప్పై ఎక్కి మరీ వచ్చారు.. ఇప్పుడు బందరులో కార్యకర్త ఇంటి కూల్చివేత విషయంలో ఎందుకు స్పందించడం లేదు? – పేర్ని నాని, మాజీమంత్రిడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి. నిరుద్యోగులను చంద్రబాబు, లోకేశ్ దగా చేశారు. అది మెగా డీఎస్సీ కాదు. మెగా స్కామ్. డీఎస్సీ ప్రక్రియను ప్రభుత్వ పెద్దల గుప్పెట్లో ఎందుకు పెట్టుకున్నారు? జిల్లా సెలక్షన్ కమిటీలను ఎందుకు నిర్వీర్యం చేశారు? టెట్ నిబంధనలను ఎందుకు మార్చేశారు? ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు తీసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. – మేరుగు నాగార్జున, మాజీమంత్రిలోకేశ్ పూర్తిగా విఫలమయ్యారు.. చంద్రబాబు సర్కారు నిర్వహించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నుంచి ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ, ఎంపికల వరకు భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయి. అది మెగా డీఎస్సీ కాదు.. పూర్తిగా మాయా డీఎస్సీ. విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ పూర్తిగా విఫలమయ్యారు. విద్యాశాఖను ఆయన పూర్తిగా గాలికి వదిలేసి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరినా ప్రభుత్వం చెప్పడంలేదు. లోకేశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. – ఆదిమూలపు సురేష్, మాజీమంత్రి సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారించాలి.. సీఎం చంద్రబాబు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో అవినీతి అడ్డూ, అదుపులేకుండా సాగుతోంది. డీఎస్సీ నిర్వహించిన వ్యక్తే టాపర్గా నిలవడం, ముందుగా పేపర్ లీక్ అవడం భారీస్కామ్ జరిగిందనడానికి బలం చేకూరింది. టాపర్గా నిలిచిన వ్యక్తికి పోస్టు ఇవ్వకపోవడం.. అక్రమాల ఆనవాళ్లు లేకుండా ఆన్లైన్ డేటాను డిలీట్ చేయడం, మెరిట్లిస్టును ప్రకటించకుండా, ఎంపికైన అభ్యర్థులకు మెస్సేజ్లివ్వడం సిగ్గుచేటు. ఈ స్కామ్పై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. – జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు -
మెగా ‘డీల్’ఎస్సీ..!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీని చంద్రబాబు సర్కారు.. మెగా అవినీతి డీల్గా మార్చేసింది. అభ్యర్థుల బంగారు భవితతో దొంగాట ఆడింది. మెగా డీఎస్సీ–2025లో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. టెట్ పరీక్షల నిర్వహణ నుంచి డీఎస్సీ నియామక పత్రాలు ఇచ్చే దాకా అడుగడుగునా జరిగిన లోపాలు బయటపడుతున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన తర్వాత కూడా మరికొందరికి శిక్షణ కేంద్రంలో ఆర్డర్లు ఇచ్చారు. మరోపక్క జిల్లాల్లో సర్టీఫికెట్ల పరిశీలన తర్వాత మీరు ఉద్యోగానికి ఎంపికయ్యారని ప్రకటించిన అభ్యర్థులను సీఎం అధ్యక్షతన అమరావతిలో జరిగే వేడుకకు రావాలని అధికారులు ఫోన్ చేసి చెప్పి, తర్వాత మీరు ఎంపిక కాలేదని ప్రకటించారు.ఇలాంటి చిత్ర విచిత్రాలెన్నో మెగా డీఎస్సీలో చోటు చేసుకున్నాయి. అలాగే, టెట్ పూర్తయ్యాక పరీక్ష రాసిన అభ్యర్థుల అందరి మార్కుల డేటా విద్యాశాఖ వద్ద ఉండాలి. కానీ ఈ డేటాను సక్రమంగా నిర్వహించకపోవడంతో ఏపీ టెట్లో అభ్యర్థులు సాధించిన మార్కులు ఎన్నో కూడా ప్రభుత్వం వద్ద లేవు. దీంతో మార్కుల సవరణ చేసే అవకాశం కూడా అభ్యర్థులకే అప్పగించారు. మరోవైపు క్రీడా కోటా డీఎస్సీ పోస్టు భర్తీలో పక్కా ప్రణాళిక ప్రకారమే స్కామ్లకు పాల్పడ్డారు. తొలి దశలో స్క్రీనింగ్ కమిటీ, తుది దశలో రాష్ట్ర స్థాయిలో అత్యున్నత అధికారుల కమిటీ పరిశీలించిన తర్వాత కూడా అనర్హులకు పోస్టులు దక్కడం విస్తుగొలుపుతోంది. టెట్ మార్కుల సవరణ అభ్యర్థులకే.. ప్రభుత్వం 16,347 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ కంటే ముందే 2024 అక్టోబర్ 3 నుంచి 21 వరకు ఏపీ టెట్ నిర్వహించారు. అనంతరం సీపీటీ విధానంలో జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు రెండు షిఫ్టుల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. వాస్తవానికి టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో అభ్యర్థులు టెట్ పరీక్షలు నిర్వహించినప్పుడల్లా అభ్యర్థులు మార్కులు పెంచుకునేందుకు పరీక్షలు రాస్తారు. ఇందులో ఎక్కువగా వచ్చిన మార్కులనే డీఎస్సీలో పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, విద్యాశాఖ వద్ద గతంలో నిర్వహించిన టెట్ స్కోరు వివరాలు లేకపోవడంతో అభ్యర్థులనే నేరుగా ఆన్లైన్లో టెట్ స్కోరు సవరించుకోవాలని కోరారు. నెలరోజుల్లో దాదాపు నాలుగు సార్లు ఈ అవకాశం ఇవ్వడంతో అభ్యర్థులు టెట్ స్కోరు నమోదు చేశారు. అయితే, ఎవరు ఎంత వేశారో లెక్కాపత్రం సర్కారు వద్ద లేకుండా పోయింది. దీంతో చేసేది లేక విద్యాశాఖ వద్ద ఉన్న స్కోరునే పరిగణనలోకి తీసుకుని ఆగస్టు 13న సవరించిన టెట్ స్కోరుతో డీఎస్సీ స్కోరు కార్డులు విడుదల చేశారు. దీనిపై ఎన్నో అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోకుండా ఎంపిక లిస్టును ప్రకటించారు. ఈ క్రమంలో చాలామంది అభ్యర్థులు ఉత్తమ స్కోరు సాధించినా ఉద్యోగాలు కోల్పోయారు.ఎంపికైనవారికి కాదని.. కొత్తవారికి ఆర్డర్లు డీఎస్సీలో 16,347 పోస్టులకు 15,941 పోస్టుల భర్తీ చేశారు. సీఎం తొలి సంతకం చేసిన నోటిఫికేషన్ కావడంతో గతేడాది సెపె్టంబర్ 25న అమరావతిలో నియామకపత్రాల పంపిణీ వేడుక నిర్వహించారు. ఇందుకోసం పోస్టులకు ఎంపికైన అభ్యర్థులతో భారీస్థాయిలో సభ నిర్వహించారు. తొలుత సెపె్టంబర్ 19న వేడుకలు నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలకు ఒకరోజు ముందే రావాలని అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే, వాతావరణం బాగాలేదని చెప్పి వేడుకలను సెప్టెంబర్ 25కి వాయిదా వేశారు.అయితే, ఆరురోజుల వ్యవధిలో ఆహ్వానం అందుకున్న పలువురు అభ్యర్థులకు తిరిగి ఫోన్ చేసి మీరు పోస్టుకు ఎంపిక కాలేదని, వేడుకలకు రావొద్దని సమాచారం ఇచ్చారు. దీంతో పలవురు అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా 100 మందికిపైగా ఉన్నట్టు అంచనా. ఇంకోవైపు కొత్త టీచర్లకు అక్టోబర్ 3వ తేదీ నుంచి 10 రోజుల పాటు జిల్లాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అయితే, ఆగిరిపల్లిలో జరిగిన పీజీటీ, టీజీటీ శిక్షణ కేంద్రంలో నలుగురు అభ్యర్థులకు ఎలాంటి నియామక పత్రాలు లేకుండా ప్రణాళిక ప్రకారం అధికారులు శిక్షణకు పంపించారు.అదే కేంద్రంలో శిక్షణ ప్రారంభమైన అనంతరం విడతల వారీగా వారికి నియామక పత్రాలు ఇవ్వడం కలకలం రేపింది. ఇలాంటి ఘటనలే పలు జిల్లాల్లో జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. మెరిట్లో ఉండి సర్టీఫికెట్ల పరిశీలన అనంతరం పోస్టుకు ఎంపికైనట్టు ప్రకటించిన అభ్యర్థులను తర్వాత ఎంపిక కాలేదని ప్రకటించడం.. ఎలాంటి ఆర్డర్ లేకుండానే కొందరిని శిక్షణకు పంపడం.. కొన్నిరోజుల తర్వాత వారికి నియామక పత్రాలు అందించడం పలు అనుమానాలకు తావిస్తోంది. పక్కా ప్రణాళికతో ‘అవినీతి క్రీడ’ క్రీడా కోటాలో పోస్టులను భర్తీ చేయడంలో శాప్ కీలకంగా వ్యవహరించింది. శాప్ పాలక వర్గంలో సీఎం బంధువు, కీలక వ్యక్తి మాస్టర్మైండ్గా వ్యవహరించి కథ మొత్తం నడిపించారు. ఇక్కడ, శాప్లోని తనకు నచ్చిన అధికారులు, కోచ్లను స్క్రీనింగ్ కమిటీలో నియమించి తాను తలచిందే జరిపించారు. వాస్తవానికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ శాప్ పరిపాలన అధికారిని పెట్టారు. సదరు అధికారిని డెప్యూటేషన్పై శాప్లోకి తీసుకొచ్చిందే మాస్టర్మైండ్. ఆరుగురితో స్క్రీనింగ్ కమిటీ వేయాలని ఉత్తర్వులు జారీ చేస్తే శాప్లో 8 ప్రత్యేక కమిటీలను పెట్టి ఇష్టారీతిన దరఖాస్తులను స్రూ్కటినీ చేయడం గమనార్హం. కమిటీలో స్రూ్కటినీ సమయంలో ఉన్న ఉద్యోగులను చివరి ఫైనల్ లిస్టు తయారు చేసే సమయంలో బయటకు పంపిణీ చేయడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. సర్టీఫికెట్ల పరిశీలనలో కీలకంగా వ్యవహరించిన ఓ డీఎస్డీవో ఇప్పుడు శాప్ ప్రధాన కార్యాలయంలో కీలక బాధ్యతల్లో కొనసాగుతున్నారు. స్క్రూటినీలో సీనియర్ కోచ్గా వ్యవహరించిన వ్యక్తి ఓ జిల్లాకు డీఎస్డీవో అయ్యారు. పేరుకే అసిస్టెంట్ డైరెక్టర్(టెక్నికల్) స్క్రీనింగ్ కమిటీలో సభ్యుడిగా పెట్టి ఓ కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ ఉద్యోగితో వ్యవహారం జరిపించేశారు. విచిత్రం ఏమంటే! ఆడుదాం–ఆంధ్రాపై లేనిపోని ఆరోపణలు చేసి.. శాప్లో కీలకంగా వ్యవహరించారంటూ పేర్కొన్న సదరు కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ ఉద్యోగితోనే డీఎస్సీ డీల్స్ చేపట్టడం కొసమెరుపు. అసలు, స్క్రీనింగ్ కమిటీలో ఎవరు ఉన్నారు? ఎవరు ఏం చేశారో బయటకు పొక్కకుండా తంతు ముగించేశారు. ఫేక్ సర్టిఫికెట్లు.. ఫేక్ పుట్టిన తేదీలతో పోస్టులా?ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ ప్రాథమికంగా మెరిట్ జాబితా సిద్ధం చేయాలి. అది ప్రచురించిన తేదీ నుంచి ఏడు రోజుల్లోగా అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు కోరాలి. ఈ ప్రక్రియ ఎక్కడా జరగలేదు. కేవలం తుది మెరిట్ జాబితాను సిద్ధం చేసి రాష్ట్ర స్థాయి కమిటీకి పంపేశారు. రాష్ట్ర స్థాయిలో కమిటీలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి(సర్వీసెస్/మానవవనరులు), శాప్ ఎండీ ఉంటారు. సదరు రాష్ట్ర స్థాయి కమిటీ స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన నివేదికను సంపూర్ణంగా సమీక్షించాలి. రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదించిందే తుది జాబితా అవుతుంది. ఇందులో సమగ్ర సమీక్ష, పరిశీలనే చేయకపోవడంతోనే డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో ఘోరమైన తప్పి దాలు దొర్లాయి. పోస్టుల భర్తీ సమయంలో అభ్యర్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులనూ కనీసం పరిగణనలోకి తీసుకోకుండా బుట్టదాఖలు చేయడం ఇందుకు నిదర్శనం. దీనికితోడు ఫేక్ సర్టీఫికెట్లు, దొంగ పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో వచ్చిన అభ్యర్థులకు ఉద్యోగాలను అత్యంత హేయంగా అమ్మేసుకోవడం గమనార్హం.ఈ తప్పులకు ఎవరు బాధ్యులు..ఫేక్ సర్టీఫికెట్లతో క్రీడాకారులను ఆడిస్తున్న క్రీడా సంఘాలపై శాప్ ఇటీవల కొరడా ఝుళిపించింది. పోలీసు కేసులు పెట్టి జైలుకు పంపించింది. మరీ, స్పోర్ట్స్ కోటాలో తప్పుల తడకగా పోస్టింగులు ఇచ్చి లక్షలాది మంది అభ్యర్థులకు అన్యాయం చేసినందుకు స్క్రీనింగ్ కమిటీ, రాష్ట్రస్థాయి కమిటీలను బాధ్యులను చేస్తుందా? అంటూ క్రీడాలోకం ప్రశి్నస్తోంది. విజయనగరం జిల్లాలో దొంగ పుట్టిన తేదీతో క్రీడల్లో పాల్గొన్న వ్యక్తికి ఉద్యోగం కట్టబెట్టిన ఘనటలో క్షేత్రస్థాయిలో ఆధారాలన్నీ స్పష్టంగా ఉంటే శాప్ ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.కనీసం, విచారణ ముగిసే వరకు కూడా ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని పాఠశాల విద్యను కోరకపోవడం గమనార్హం. నకిలీ క్రీడా సర్టీఫికెట్లు మాత్రమే కాకుండా డిగ్రీ అర్హత లేని వ్యక్తులకు ఉద్యోగాలు అమ్మేశారు. ప్రతిభ గల క్రీడాకారుడికి డిగ్రీ ఉండి.. మెరిట్ స్పోర్ట్స్ సర్టీఫికెట్ ఉంటే వారికి ముందుగా పీఈటీ/పీడీ పోస్టు ఇచ్చి.. పొస్టు పొందిన ఐదేళ్లలోపు బీపీఈడీ కోర్సు పూర్తి చేయాలని నిబంధన పెట్టింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న మాస్టర్మైండ్ డిగ్రీ లేనివ్యక్తులకు ఫేక్ సర్టీఫికెట్లు సృష్టింపజేసి ఉద్యోగాలు అమ్మేశారు.క్రీడల్లో జాతీయ స్థాయి పతకం సాధించిన ఓ వ్యక్తికి డిగ్రీ లేదు. దీంతో అతను వేరే రాష్ట్రాల్లో డిగ్రీ చదివినట్టు ఫొటోషాప్లో పట్టా క్రియేట్ చేసి తెచ్చుకుని పీఈటీ/పీడీ పోస్టు కొట్టేశారు. ఇప్పుడు ఆ ఉద్యోగి పశి్చమగోదావరి జిల్లాలో పీడీగా పని చేస్తున్నారు. ఇదిలా ఉంటే అర్హులైన మహిళా అభ్యర్థులతోనూ అసభ్య చాటింగులు చేసి కోరికలు తీర్చాలని మాస్టర్మైండ్ వేధించినట్టు ఆరోపణలు ఉన్నాయి. తన కోరిక తీర్చకుంటే పోస్టులు రావని బెదిరించినట్టు విమర్శలు వెల్లువెత్తడం గమనార్హం. -
ఇది రిక్రూట్మెంటా?.. లేక వేలం పాటా..?: వైఎస్ జగన్ ఫైర్
సాక్షి,తాడేపల్లి : డీఎస్సీ పరీక్షల లీకులు, డేటా బేస్ మాయంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ను పదవి నుండి తొలగించాలనీ.. లీకుల విషయమై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సోమవారం (మే 25) వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వ లోపాలను ప్రశ్నించారు.చంద్రబాబూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా?. లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా?. పారదర్శకత ఎక్కడ ఉంది?.పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి?. మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా?. మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘‘డార్క్ ఆపరేషన్’’ను ఎందుకు దాచిపెడుతున్నారు?. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న SCERT అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?.ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు?.మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు?.టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు?. సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారు?.కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు?రూ.15 లక్షలకు “స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేరసారాలా?.మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా?.ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా?. ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి?.టెట్ కన్వీనర్గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీర్ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్ను డీఎస్సీ కన్వీనర్గా ఎందుకు పెట్టారు?దీనివెనుక మతలబు ఏంటి?.మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి… దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ను పదవినుంచి తప్పించి, వెంటనే సీబీఐ దర్యాప్తును కోరండి. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి’అని డిమాండ్ చేశారు. .@ncbn గారూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది?1.పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి?2.మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 25, 2026 -
ఖేల్ ఖతం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ‘డీఎస్సీ’ క్రీడా కోటా పోస్టుల భర్తీలో అవకతవకలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు కట్టి మరీ అమ్మేసుకోవడం నిరుద్యోగ యువతలో అలజడి రేకెత్తిస్తోంది. ఏకంగా 421 పోస్టుల్లో 97 శాతం పోస్టులు భర్తీ చేయగా ఇందులో వంద పోస్టులూ నిజమైన అర్హులకు దక్కలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.సాక్షాత్తూ ముఖ్యనేత బంధువు, శాప్ పాలకవర్గంలోని ఓ కీలక వ్యక్తిని మాస్టర్మైండ్గా ముందు పెట్టి సాగించిన దందా సాక్ష్యాలతో సహా బయటకొచ్చే సరికి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. నిజమైన అర్హత కలిగిన క్రీడాకారులకు తీవ్ర అన్యాయం చేస్తూ ముడుపులు తీసుకుని క్రీడలంటే తెలియని వ్యక్తులకు పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేయడం దుర్మార్గ పాలనకు అద్దం పడుతోంది. దీనికితోడు డీఎస్సీ ముగిసిన తరువాత తాజాగా క్రీడా పాలసీని సవరించడం అనుమానాలకు తావిస్తోంది. సర్టీఫికెట్ చాలదు.. పరీక్ష రాయాల్సిందే! ప్రభుత్వ క్రీడా విధానం 2024–29 ప్రకారం.. 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ ద్వారా ప్రతిభగల క్రీడాకారులకు వారి సర్టీఫికెట్ల ఆధారంగా నేరుగా ప్రభుత్వ శాఖల్లో పోస్టింగ్ ఇవ్వాలని సర్కారు నిర్దేశించింది. దీని ప్రకారమే డీఎస్సీలో 421 పోస్టుల్లో 97శాతం పోస్టులను భర్తీ చేసింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ, ఇతర స్థాయిల్లో సాధించిన పతకాలు, సర్టిఫికెట్ల ఆధారంగా నియామకాలు పూర్తిచేసింది. దీనిని అనువుగా చేసుకునే ముఖ్యనేత బంధువు, మాస్టర్మైండ్ పోస్టుకో రేటు పెట్టి ముడుపులు దండుకున్నారు.అర్హులకు పోస్టులు దక్కకుండా చేశారు. ఇంత జరిగాక.. డీఎస్సీ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్రీడాపాలసీ 2024–29ను చంద్రబాబు సర్కారు సవరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు, 3శాతం హారిజంటల్ రిజర్వేషన్లో అభ్యర్థి కచ్చితంగా ఆయా శాఖల్లో పోస్టులకు నిర్వహించే రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే క్రీడా కోటాలో సర్టీఫికెట్లు పరిగణనలోకి తీసుకుని నియామకాలు చేపట్టనున్నట్టు సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. అంటే, ఇక్కడ ఒక పథకం ప్రకారం మెగా డీఎస్సీలో పోస్టులను విచ్చలవిడిగా అమ్మేసుకుని, ఆ తంతు ముగిసిపోయిన తర్వాత తీరిగ్గా క్రీడా పాలసీని సవరించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఎవరికిచ్చిన అభయం కోసం!! ఇదిలా ఉంటే రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ క్రీడా కోటా పాలసీని సవరించిన సర్కారు శాప్లో గ్రేడ్–3 కోచ్ల నియామకానికి మాత్రం దీనిని వర్తింపజేయకపోవడం, ఇక్కడ పాత పద్ధతిలోనే సర్టీఫికెట్ల మెరిట్ ఆధారంగానే చేస్తుండటం గమనార్హం. డీఎస్సీ క్రీడా కోటాలో తనకు అన్యాయం జరిగిందని న్యాయపోరాటానికి సిద్ధమైన అనంతపురానికి చెందిన ఓ ఫెన్సింగ్ క్రీడాకారిణిని బెదిరించి నిలువరించిన శాప్,, శాశ్వత కోచ్ల నియామకంలో కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. దీనిని బట్టి డీఎస్సీలో మాస్టర్మైండ్ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు శాప్ కోచ్ల నియామకానికి రాతపరీక్ష అర్హతలు పెట్టలేదని స్పష్టమవుతోంది.ఇలా వందల మంది పోస్టుల రాని క్రీడాకారులను మభ్యపెట్టినట్టు సమాచారం. ఇదిలా ఉంటే డీఎస్సీలో రెండేళ్లకోసారి, అసలు ఎప్పుడు జరుగుతుందో తెలియని నేషనల్ గేమ్స్ను ముందు వరుసలో పెట్టి సీనియర్ నేషనల్స్ ప్రాధాన్యాన్ని వెనక్కి నెట్టేసింది. నేషనల్స్లో పాల్గొన్నట్లు సర్టీఫికెట్లు తెచ్చుకున్న వారికి రూ.15 లక్షల చొప్పున పోస్టులు అమ్మేశారు. వాస్తవానికి నేషనల్ గేమ్స్ అనేవి ఒక్కోసారి ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇందులో ఒక్కో క్రీడాంశంలో కేవలం టాప్–8 ఉండే రాష్ట్రాల జట్లు మాత్రమే పాల్గొంటాయి. ఏటా జరిగే సీనియర్ నేషనల్స్లో దేశం మొత్తం నుంచి ఆయా రాష్ట్రాల్లో వడపోసిన క్రీడాకారులు ప్రదర్శనకు వస్తారు. సీనియర్ నేషనల్స్లో నెగ్గుకురావడం చాలా కష్టం. అలాంటి సీనియర్ నేషనల్స్ను పక్కన పడేసి నేషనల్ గేమ్స్కు డీఎస్సీలో ప్రాధాన్యం ఇవ్వడం సర్కారు దుర్నితికి అద్దం పడుతోంది. క్రీడల విభజనతో మొత్తం గోల్మాల్దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో క్రీడలను కూటమి ప్రభుత్వం రెండు రకాలుగా వర్గీకరించింది. ఇందులో ఏపీలో ప్రాధాన్యంలో ఉన్న క్రీడలను తక్కువ కేటగిరీలోకి నెట్టేసింది. జీవోలో 65 క్రీడలను చేరిస్తే ఏ–కేటగిరీలో 36, బీ–కేటగిరీలో 29 క్రీడలను పెట్టింది. ఇది క్రీడా ప్రమాణాలకు విరుద్ధమని క్రీడా సంఘాల ప్రతినిధులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నా ప్రభుత్వంలో కదలిక రాలేదు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ క్రీడల విభజన లేదు. శాప్ గుర్తింపు లేని సంఘాలను ఏ– కేటగిరిలో ఉంచి, శాప్ గుర్తింపు ఉన్న కొన్ని సంఘాలను బీ కేటగిరిలోకి తేవడం కొసమెరుపు. ఉద్యోగాల భర్తీలో ఏ–కేటగిరి పూర్తయిన తరువాత బీ–కేటగిరి క్రీడలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించి ఆ ప్రకారం డీఎస్సీలో పోస్టులు ఇష్టారీతిన భర్తీ చేసేశారు.ఉదాహరణకు.. బీ–కేటగిరీలో ఉన్న క్రీడలో సదరు క్రీడాకారుడు జాతీయ స్థాయిలో పతకాలు సాధించినా.. ఏ–కేటగిరిలో ఉన్న క్రీడాకారుడు రాష్ట్ర స్థాయి ఆటల్లో పాల్గొన్న సర్టీఫికెట్తో వస్తే చాలు అతనికే ప్రాధాన్యం ఇచ్చి పోస్టులు భర్తీ చేశారు. దీనిపైనా హైకోర్టులో కేసులు కొనసాగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో గోల్ఫ్ కోర్టులు ఎక్కడా లేవు, గోల్ఫ్ ఆడే క్రీడాకారులూ లేరు, ఈ క్రీడను ఏ–కేటగిరిలో చేర్చి రాష్ట్రంలో యువత రాణించే సెపక్తక్రా, నెట్బాల్, క్యారమ్స్, ఆత్యా పాత్యా, బాడీ బిల్డింగ్, కరాటే, టెన్నిస్బాల్ క్రికెట్, సాఫ్ట్ టెన్నిస్, యోగాసన క్రీడలను బీ–కేటగిరిలో పెట్టి డీఎస్సీని అడ్డుపెట్టుకుని దోచేశారు. క్రీడా సర్టీఫికెట్లకు గతంలో ఉన్న 10 ఏళ్ల కాలపరిమితిని ఎత్తివేశారు. -
సర్కారు ‘మాస్టర్’ప్లాన్
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025 పేరుతో భారీ స్కామ్కు చంద్రబాబు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వేసిందా? ప్రణాళిక ప్రకారమే నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులను నిలువునా ముంచేసిందా? అంటే డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ నుంచి ఉద్యోగాల భర్తీ వరకు జరిగిన పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తోంది. వాస్తవానికి డీఎస్సీ పరీక్ష పూర్తయిన తర్వాత మెరిట్ లిస్టులను జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ)లకు అందించాలి. కానీ అంతా తామే చేస్తామని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయమే మొత్తం ప్రక్రియను చేతిలోకి తీసుకుంది. పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయని, తమకు అన్యాయం జరుగుతోందని అభ్యర్థులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా అంతా సక్రమమేనంటూ బుకాయించింది.దరఖాస్తు ప్రక్రియ మొదలు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ వరకు అంతా తన చేతిలోనే పెట్టుకున్న ఉన్నతాధికారులు పరీక్ష నిర్వహణలో కీలకమైన విధుల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించడం విస్మయం కలిగిస్తోంది. వాస్తవానికి డీఎస్సీ పేపర్ తయారీని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) చూస్తుంది. ప్రశ్నల తయారీ, జవాబుపత్రాల వ్యాలిడేషన్ ఎంతో కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థల మధ్య చేపట్టాలి. కానీ ఈ మొత్తం ప్రక్రియను ఓ కాంట్రాక్టు ఉద్యోగి చేతిలో పెట్టడం గమనార్హం. అంతకు ముందే టెట్ కన్వీనర్ను తొలగించి ఆ బాధ్యతలను మరొకరికి అప్పగించడం కూడా సర్కారు పాత్రపై అనుమానాలకు బలం చేకూరుస్తోంది. టెట్ కన్వీనర్ను తొలగించి.. వాస్తవానికి ఏపీ టెట్ కన్వీనర్గా ఉండే అధికారే డీఎస్సీకి కూడా కన్వీనర్. టెట్ సెల్కు విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిని ప్రభుత్వం టెట్ కన్వీనర్గా నియమించింది. అయితే, టెట్ పరీక్షలు ప్రారంభమైన కొద్దిరోజుల్లోనే ఆయనను ఆ బాధ్యతల నుంచి ఉన్నఫళంగా తొలగించి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ను కన్వీనర్గా నియమించింది. దీంతో టెట్ నిర్వహణ, డీఎస్సీ పేపర్ తయారీలో ఒకే అధికారి కొనసాగారు. అనంతరం ఎస్సీఈరీ్టలో కేవలం కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి నవీన్కు కేవలం డీఎస్సీ ప్రశ్నలు తయారీతో పాటు వాటిని ఆన్లైన్ చేయడం చేసే బాధ్యతలు అప్పగించారు. అతను కూడా డీఎస్సీకి హాజరవుతున్నాడని తెలిసినా అధికారులు అదే విధుల్లో కొనసాగించడం కొసమెరుపు.అసలు రహస్యంగా జరగాల్సిన కీలక విధుల్లో కాంట్రాక్టు ఉద్యోగిని ఎలా నియమించారన్నది పెద్ద ప్రశ్న. ఫలితాలు విడుదల కాగానే కాంట్రాక్టు ఉద్యోగి నవీన్ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్గానూ, టీజీటీలో ఆరో ర్యాంకు సాధించడంతో లీకేజీ వ్యవహారం బయటపడింది. దీంతో పరువు పోతుందేమోనని భయపడిన అధికారులు అతడిని బెదిరించి విధుల నుంచి తొలగించినట్టు సమాచారం. దీంతో నవీన్ తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించడంతో విషయం బయటకు రాకుండా అతనిని తమదైన శైలిలో సముదాయించినట్టు విశ్వసనీయ సమాచారం.ఈ క్రమంలో భారీగా నగదు చేతులు మారాయన్న విమర్శలూ విద్యాభవన్లో చక్కర్లు కొడుతున్నాయి. లీకేజీ వ్యవహారాన్ని దాచేందుకు అధికారులు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. జిల్లా స్థాయిలో జరగాల్సిన ఎంపికల ప్రక్రియనూ తమ చేతుల్లోకి తీసుకున్నారు. జిల్లా సెలక్షన్ కమిటీలను కేవలం ఎంపికైన అభ్యర్థుల సర్టీఫికెట్ల పరిశీలనకే పరిమితం చేశారు. కాల్ లెటర్ల జారీలో ‘టెస్టింగ్’ డీఎస్సీ నియామకాల్లో తొలి నుంచీ అనేక అవకతవకలకు పాల్పడిన చంద్రబాబు ప్రభుత్వ కుట్రలో మరో కోణమిది. కాల్ లెటర్ల జారీలో ‘టెస్టింగ్’ల (ఎస్ఎంఎస్) పేరుతో ఉపాధ్యాయ ఉద్యోగార్థుల భవితవ్యంతో ఆడుకుంది. ఒకే కేటగిరీకి చెందిన వారిలో ముందు, వెనుక ఉన్నవారికి లెటర్లు పంపడం, మధ్యలో ఉన్నవారికి ఇవ్వకపోవడం గమనార్హం. దీంతోపాటు అభ్యర్థుల డీఎస్సీ మార్కులూ రోజుకో విధంగా మార్చేసింది, ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (ఈపీటీ) పాసైనట్టు ప్రకటించి, తర్వాత వెబ్సైట్ నుంచి డేటా తొలగించి, ‘నాట్ క్వాలిఫైడ్’ అని ప్రకటించింది.ప్రత్యేక విభాగంలోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)ల ఉద్యోగాలకూ ఎసరు పెట్టే ఎత్తుగడ వేసింది. ఈపీటీ అవసరం లేదని నోటిఫికేషన్లో ప్రకటించి అందుకు అనుగుణంగా హాల్టికెట్లు ఇచ్చి పరీక్ష నిర్వహించింది. తర్వాత ఈపీటీ పాసవలేదని కాల్ లెటర్లు నిలిపివేసింది. ‘మేము మెరిట్ లిస్టులో ఉన్నా కాల్ లెటర్లు రాలే’దంటూ వేలమంది అభ్యర్థులు జిల్లాల్లో కౌన్సెలింగ్ సెంటర్ల వద్ద ఆందోళన చేస్తే అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం రాజకీయ రంగు పులిమి తప్పులను కప్పిపుచ్చే యత్నం చేసింది. ప్రతిభకు అడుగడుగునా అన్యాయండీఎస్సీ నోటిఫికేషన్ దగ్గర నుంచి కాల్ లెటర్ల (ఎస్ఎంఎస్) జారీ, సర్టీఫికెట్ల పరిశీలన వరకు అభ్యర్థుల జీవితాలను పణంగా పెట్టే రీతిలోనే ప్రక్రియ నడిచింది. నోటిఫికేషన్లో పేర్కొన్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. 16,347 ఉపాధ్యాయు పోస్టులకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమర్పించారు. అభ్యర్థులకు ఆయా పరీక్షలను సర్కారు వేర్వేరుగా నిర్వహించింది. ఇందులో ప్రతిభ గల అభ్యర్థులు ఎస్జీటీతోపాటు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ మూడు పోస్టులు సాధించారు.మెరిట్ ప్రకారం మూడు పోస్టులకు కాల్ లెటర్లు పంపాల్సి ఉన్నా దరఖాస్తులో మొదట ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్న పోస్టుకే కాల్ లెటర్లు పంపారు. దీంతో అభ్యర్థి సాధించిన పోస్టుల్లో నచి్చన పోస్టు ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇలా దాదాపు 4 వేల మంది ఉన్నత అవకాశం కోల్పోయారు. డీఎస్సీ నిర్వహణలో తమదే పేటెంట్గా చెప్పుకుంటున్న టీడీపీ సర్కారు అడుగడుగునా అడ్డగోలుగా తప్పులు చేసి అభాసుపాలైంది. ప్రతిభావంతుల భవిష్యత్తును నాశనం చేసింది. హైకోర్టు ఆక్షేపించినా..!చంద్రబాబు ప్రభుత్వంలో డీఎస్సీ నిర్వహణలో లోపాలు ఉన్నాయని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తాము రెండు, మూడు పోస్టులకు ఎంపికైతే ఒక పోస్టుకే కాల్ లెటర్ పంపి.. తమ ఉన్నత ఉద్యోగ హక్కుకు భంగంకలిగించారని వందలాది మంది పిటిషన్లు వేయడంతో హైకోర్టు విచారణ చేపట్టింది. ఉన్నత ఉద్యోగం అభ్యర్థి హక్కు అని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందినవారికి పోస్టు ప్రిపరెన్సీ క్రమంలో కాకుండా ఉన్నత అర్హత గల ఉద్యోగం ఇవ్వాలని అక్టోబర్ 12నే మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.అయినా వాటిని పట్టించుకోకుండా అక్టోబర్ 15న ఎంపిక ప్రక్రియను సర్కారు పూర్తిచేసేసింది. దీంతో మరో సారి అభ్యర్థులు కోర్టుకెళ్లగా న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశి్నంచింది. ఇది దారుణమైన, దుర్మార్గమైన చర్యగా అభివరి్ణంచింది. 2 నెలల్లోగా వారికి ఉన్నత ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులిచ్చి ఏడునెలలైనా అభ్యర్థులకు న్యాయం జరగలేదు. -
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో పగిలిన అక్రమాల పుట్ట... ఎస్సీఆర్టీ నుంచే కుంభకోణం..
-
అక్రమాలు దిట్ట.. పగిలిన పుట్ట
డీఎస్సీలో భారీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా డీఎస్సీ ప్రక్రియ చూసిన ఎస్సీఈఆర్టీ నుంచే ఈ దారుణాలు జరిగాయని అభ్యర్థుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిజిటల్ విభాగంలో పని చేస్తున్న ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగుల ద్వారా డీఎస్సీ ప్రశ్నలు లీకైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక, వీరిలో ఒకరికి డీఎస్సీలో టాప్ మార్కులు రావడంతో పాటు సోషల్ స్టడీస్లో కృష్ణా జిల్లా టాపర్గా, జోన్–2 టీజీటీలో 6వ ర్యాంకు సాధించడమే నిదర్శనమని అభ్యర్థులు వాపోతున్నారు. స్కామ్ వెలుగు చూశాక వీరిద్దరినీ విధుల నుంచి తొలగించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అవకతవకలు బయట పడటంతో వారి మార్కులు, ఇతర వివరాలను సైతం డేటా బేస్ నుంచి తొలగించారు.⇒ కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం కొత్తపేటకు చెందిన పి.నవీన్ మెగా డీఎస్సీృ2025లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో 89.7465 స్కోరుతో జిల్లా టాపర్గా మొదటి ర్యాంకు సాధించాడు. అలాగే, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) తెలుగులో 78.73 స్కోరుతో జోన్ృ2లో ఆరో ర్యాంకు సాధించాడు. రెండు ఉద్యోగాల్లోనూ టాప్ స్కోరు సాధించిన నవీన్కు తప్పనిసరిగా ఉద్యోగం రావాలి. కానీ ప్రభుత్వం అతడికి టీచర్ పోస్టు ఇవ్వలేదు. ప్రభుత్వం మొదట విడుదల చేసిన కృష్టా జిల్లా సోషల్ స్టడీస్ మెరిట్ లిస్టులో సైతం మొదటి ర్యాంక్ వివరాలు తొలగించారు. అలాగే, టీజీటీ మెరిట్ లిస్టులో సైతం ఈ అభ్యర్థి వివరాలు లేకుండా చేశారు.⇒ అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన సయ్యద్ జమీల్ డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ (ఉర్దూ)లో 58.77 స్కోరు సాధించాడు. మెరిట్ లిస్టులో 7వ ర్యాంకు సాధించాడు. ఒక పోస్టు జనరల్, మరో పోస్టు ఈడబ్ల్యూఎస్ కోటా కింద కేటాయించారు. ఈ క్రమంలో ఓపెన్ కేటగిరీలో ఇతనికి పోస్టు రావాలి. కానీ, ముస్లిం బీసీ వర్గానికి చెందిన అభ్యర్థికి ఇచ్చారు. జరిగిన తప్పును ఆధారాలతో సహా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు.సాక్షి, అమరావతి: సీఎంగా చంద్రబాబు తొలి సంతకం చేసిన మెగా డీఎస్సీ–2025లో కుంభకోణం చోటుచేసుకుందని అభ్యర్థులు వాపోతున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయంటున్నారు. సాక్షాత్తు సీఎం తనయుడు లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పడుతుండటమే ఇందుకు నిదర్శనమని నొక్కి వక్కాణిస్తున్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులను అమ్ముకున్న వైనం ఇప్పటికే బయటపడిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో జనరల్ డీఎస్సీలోనూ భారీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా డీఎస్సీ ప్రక్రియ చూసిన ఎస్సీఆర్టీ నుంచే ఈ దారుణాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.డిజిటల్ విభాగంలో పని చేస్తున్న ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగుల ద్వారా డీఎస్సీ ప్రశ్నలు బయటకు లీకైనట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక, వీరిలో ఒకరికి డీఎస్సీలో టాప్ మార్కులు రావడంతో పాటు, సోషల్ స్టడీస్లో కృష్ణా జిల్లా టాపర్గా, జోన్–2లో టీజీటీలో 6వ ర్యాంకు సాధించడమే ఇందుకు నిదర్శనం. ఫలితాలు వచ్చాక ఈ విషయం గుర్తించిన అధికారులు.. వీరిద్దరినీ విధుల నుంచి తొలగించడం అనుమానాలకు బలం చేకూరుతోంది. అంతేగాక టాప్ మార్కులు సాధించిన సదరు కాంట్రాక్టు ఉద్యోగికి టీచర్ పోస్టును రద్దు చేయడంతో పాటు అతను సాధించిన మార్కులు, ఇతర వివరాలను డేటా బేస్ నుంచి తొలగించినట్టు సమాచారం. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను చంద్రబాబు సర్కార్ సంతలో సరుకు మాదిరిగా అమ్మేసింది. అభ్యర్థులను ఇళ్లకు పిలిపించుకుని మరీ బేరసారాలు సాగించింది. క్రీడా శాఖలో నామినేటెడ్ పోస్టును అడ్డం పెట్టుకుని సీఎం బంధువుగా ప్రచారం చేసుకుంటున్న ‘మాస్టర్ మైండ్’ డైరెక్షన్లో ఈ కుంభకోణం దిగి్వజయంగా సాగింది. ర్యాంకర్ వివరాలు ఎందుకు తొలగించారు? డీఎస్సీ ఫలితాల విడుదలలో తొలుత సబ్జెక్టు వారీగా, జిల్లాల వారీగా మెరిట్ లిస్టు ప్రకటిస్తారు. మెగా డీఎస్సీ–2025లోనూ ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్గా డీఎస్సీ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఎస్సీఆర్టీ కాంట్రాక్టు ఉద్యోగి నిలిచాడు. అయితే, తొలుత అతడి వివరాలు లేకుండా రెండో ర్యాంకు నుంచి మెరిట్ లిస్టు విడుదల చేశారు. అనంతరం ఈ విషయం బయటకు రాకూడదని మెరిట్ లిస్టులను రద్దు చేసి, ఏకంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఎస్ఎంఎస్లు పంపారు.కానీ, అప్పటికే జిల్లాల్లో కొందరు మెరిట్ లిస్టులను డౌన్లోడ్ చేసుకున్నారు. మరోపక్క కృష్ణా జిల్లాలో సోషల్ స్టడీస్లో టాపర్గా వచ్చిన ఎస్సీఆర్టీ కాంట్రాక్టు ఉద్యోగి పి.నవీన్కు మాత్రం ఎంపిక జాబితాలో పోస్టు లేకపోవడంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను కీలకమైన డీఎస్సీ నిర్వహణలో నియమించరాదు. కానీ ఇక్కడ మాత్రం ఆన్లైన్ ప్రశ్నలు అప్లోడ్ చేసే బాధ్యతను కాంట్రాక్టు ఉద్యోగికే అప్పగించారు. ఫలితాల్లో అతడు టాపర్గా నిలిచినా పోస్టు ఇవ్వలేదు. స్పోర్ట్స్ పోస్టులను అమ్మేసిన మాస్టర్మైండ్ క్రీడా శాఖలో రాజకీయ నామినేటెడ్ పోస్టును అడ్డుపెట్టుకుని సీఎం బంధువుగా ప్రచారం చేసుకుంటున్న ‘మాస్టర్ మైండ్’ డైరెక్షన్లో స్పోర్ట్స్ డీఎస్సీ పోస్టులను భారీగా అమ్మేశారు. ఒక్కో పోస్టుకు డిమాండ్ను బట్టి రూ.15 లక్షలు రేటు ఫిక్స్ చేసి అమ్మకానికి పెట్టారు. ఇక్కడ పొరుగు శాఖలకు చెందిన కొందరు ఉద్యోగులను క్రీడా శాఖలోకి డెప్యూటేషన్పై తీసుకొచ్చి వారి ద్వారా తన దోపిడీ దందాను నడిపించడం విస్తుగొలుపుతోంది. సదరు వ్యక్తులు అభ్యర్థులకు ఫోన్లు చేసి డీఎస్సీ పోస్టుల కేటాయింపులపై బేరసారాలు సాగించిన ‘వాయిస్ రికార్డులు’ కలకలం రేపుతున్నాయి. ఇలా మొత్తం స్పోర్ట్స్ డీఎస్సీలో నాలుగింట మూడొంతులు పోస్టులు అమ్మేసినట్టు తెలుస్తోంది. ఇలా రూ.40–50 కోట్లు దండుకున్నట్టు క్రీడా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. బేరసారాలు ఇలా...మాస్టర్ మైండ్ ఏజెంట్ : డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్లో మేము చెప్పినట్టు పోస్టింగ్ చేయిస్తాం. అభ్యర్థి కుటుంబ సభ్యులు: అలా కాదు సార్, ఎంత అవుద్ది. మాస్టర్ మైండ్ ఏజెంట్ : ఒకసారి వస్తే మాట్లాడదాం. అభ్యర్థి కుటుంబ సభ్యులు: కలిసి మాట్లాడమంటారా? మాస్టర్ మైండ్ ఏజెంట్ : అవును. అభ్యర్థి కుటుంబ సభ్యులు: రేపు బయలుదేరి రమ్మంటారా? ఎన్నింటికి రమ్మంటారు సార్. మాస్టర్ మైండ్ ఏజెంట్ : మీ ఇష్టం. మీరు ఏ టైంకి అయినా రండి. అభ్యర్థి కుటుంబ సభ్యులు: సరేసార్. ఇప్పుడు అభ్యర్థి కూడా కావాలా? నేను, మా బావ వస్తే సరిపోతుందా? మాస్టర్ మైండ్ ఏజెంట్ : మీ ఇద్దరైనా రండి. మీ ఒక్కరైనా రండి. అభ్యర్థితో ఏం పనిలేదు. మీరే మాట్లాడి ఫైనల్ చేసుకోండి. అభ్యర్థి కుటుంబ సభ్యులు: రేపు పది గంటలకల్లా వస్తాం సార్. వచ్చాక కాల్ చేస్తాం ఈ నంబర్ (944..558..)కు కాల్ చేస్తాం. మాస్టర్ మైండ్ ఏజెంట్ : మాగ్జిమమ్ ఒక్కరు వస్తేనే బెటర్. ఇద్దరు వస్తే కూడా ఒక్కరితోనే మాట్లాడేది. కొంచెం ఇది సీక్రెట్గా చేసుకునే పని కదా. అభ్యర్థి కుటుంబ సభ్యులు: తప్పకుండా సార్. మాకు అర్థమయ్యింది సార్. ఇంతని అంటే.. ఫిగర్ చెబితే నేను రెడీ చేసుకుంటా. మాస్టర్ మైండ్ ఏజెంట్ : ఇది డీఎస్సీలో పోస్టింగ్. మీకు ఐడియా ఉంటుంది. ఒకేనా? అభ్యర్థి కుటుంబ సభ్యులు: అవును సార్ మాస్టర్ మైండ్ ఏజెంట్ : ఇప్పుడొచ్చేసి మార్కెట్ రూ.15 లక్షలు అలా నడుస్తుంది. అభ్యర్థి కుటుంబ సభ్యులు: బాబోయ్ అంతంటే పెట్టలేము సార్.. మాస్టర్ మైండ్ ఏజెంట్ : ఇదేంటంటే డైరెక్టుగా పోస్టింగ్ ఇవ్వడం. సరే ఏదైనా మీరు వచ్చి మాట్లాడండి. ఏమైనా నెగోõÙషన్స్ చేద్దాం. అభ్యర్థి కుటుంబ సభ్యులు: సరే సార్ అయితే, ఓకే.. మాస్టర్ మైండ్ ఏజెంట్ : వీలైనంత చేస్తాను. యాక్చువల్లీ టైమ్ తక్కువగా ఉందని ఇంటికే పిలిపించి మాట్లాడుతున్నా. ఇక్కడే మాట్లాడుకుందాం. పర్సనల్గా వస్తే మాట్లాడి చేద్దాం అభ్యర్థి కుటుంబ సభ్యులు: తప్పకుండా.. ఓకే సార్.. థ్యాంక్యూ సార్.. మాస్టర్ మైండ్ ఏజెంట్ : కొంచెం పర్సనల్గా రండి. ఎవరితో దీని గురించి డిస్కస్ చేయొద్దు. అభ్యర్థి కుటుంబ సభ్యులు: లేదండి.. నాకు చెప్పారు.. పోస్టు ఇంపార్టెంట్ కదండి.. వస్తాం.. చూసుకుంటాం సార్.. మాస్టర్ మైండ్ ఏజెంట్ : సరేండి జాగ్రత్తగా రండి. చేద్దాం.బెదిరించి కేసులు విత్డ్రా చేయించి.. అనంతపురం జిల్లాకు చెందిన ఫెన్సింగ్ క్రీడాకారిణి తనకు డీఎస్సీ ఎంపికల్లో అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించింది. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ ప్రాధాన్యత క్రమంలో సదరు క్రీడ అగ్రస్థానంలో ఉంటుంది. ఆమెకు కోర్టులో కేసు గెలిచే అవకాశం ఉంది. ఆ తర్వాత పోస్టు కచ్చితంగా వస్తుంది. ఈ క్రమంలో సదరు క్రీడాకారిణి కేసు విత్డ్రా చేసుకునేందుకు మాస్టర్ మైండ్ తీవ్రంగా బెదిరించారు. శాప్లోని సాంకేతిక విభాగంలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగితో ఫోన్ చేయించి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు. అప్పటికే మాస్టర్ మైండ్ ఆ పోస్టును బేరంపెట్టి అమ్మేసుకోవడంతో సదరు క్రీడాకారిణి కేసు గెలిస్తే తనకు ఇబ్బందులొస్తాయని బెదిరింపులకు ఒడిగట్టడం గమనార్హం. అనర్హులు స్పోర్ట్స్ కోటా, సర్టీఫికెట్లతో ఉద్యోగాలు పొందారంటూ వచ్చిన ఫిర్యాదులను శాప్ ఉద్దేశ పూర్వకంగానే తొక్కిపెట్టింది. కనీసం సమాచార హక్కు చట్టం–2005 ప్రకారం ఇవ్వాల్సిన సమాచారాన్ని సైతం ఇవ్వకుండా ఆర్టీఐ యాక్టివిస్టులను సైతం ఇబ్బంది పెడుతోంది. ‘డీఎస్సీ డీల్స్’ అంటూ సాక్షి ఆధారాలతో సహా కథనాన్ని ప్రచురిస్తే శాప్ ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు. విచారణ పేరుతో వారాల పాటు కాలం గడిపేసి దొంగలకు వత్తాసు పలుకుతోందనే విమర్శలొస్తున్నాయి. కాగా, డీఎస్సీలో అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని బాధిత అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.లీకేజీ బయటపడకుండా జాగ్రత్తలు రాష్ట్రంలో 1990 నుంచి 2019లో జరిగిన స్పెషల్ డీఎస్సీ వరకు ఫలితాలను ప్రకటించేటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ను పరిగణనలోకి తీసుకుని, అభ్యర్థులకు వచ్చిన మార్కులతో మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులంతా ఆ మెరిట్ లిస్ట్ పరిశీలించే వీలు కలి్పంచారు. దాంతో మెరిట్లో తాము ఎక్కడ ఉన్నామో తెలుసుకుని తమకు పోస్టు వస్తుందా లేదా అని అంచనా వేసుకునేవారు. దీని ప్రకారం పరీక్ష జరిగిన తర్వాత అభ్యర్థుల మార్కులు విడుదల చేయాలి. మెరిట్ లిస్టు ప్రకటించిన తర్వాత సెలక్షన్ లిస్ట్ తయారు చేసి కౌన్సెలింగ్ నిర్వహించాలి.కానీ తాజా డీఎస్సీలో మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా ‘సెలెక్టెడ్’ అభ్యర్థుల ఫోన్లకు మెసేజ్లు పంపి సర్టీఫికెట్ వెరిఫికేషన్కు పిలిచారు. పరీక్ష రాసిన 3,36,307 మంది మెరిట్ను ప్రకటించకుండా కేవలం 16,437 పోస్టులకు గాను అంత మందికే మెసేజ్ పంపడం గమనార్హం. ఇందులోనూ అనేక తప్పులు జరిగాయి. అభ్యర్థుల మార్కులు సైతం రోజుకో విధంగా మారిపోవడం, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (ఈపీటీ) పాసైనట్టు ప్రకటించి, తర్వాత వెబ్సైట్ నుంచి డేటా తొలగించారు. ఇదంతా లీకేజీని దాచిపెట్టడం కోసమే చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఆటే రాకున్నా.. పోస్టు ఇచ్చేశారు ⇒ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా డైరెక్టు నియామకాలే కాదు.. రాత పరీక్షల్లో స్పోర్ట్స్ సర్టీఫికెట్ వెయిటేజీల్లోనూ అక్రమాలే జరిగాయి. అసలు ఆటే రాని వ్యక్తులు దొంగ సర్టీఫికెట్లు పెట్టి పోస్టులు కొట్టేశారు. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో ఓ మహిళకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. రాత పరీక్షకు తోడు స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ జత చేయడంతో పోస్టు దక్కింది. అయితే సదరు మహిళ ఎన్నడూ క్రీడా మైదానంలో కాలు పెట్టింది గానీ, జిల్లా, రాష్ట్ర, స్థాయిలో ఆడింది లేకున్నా ఏకంగా జాతీయ స్థాయి సర్టిఫికెట్ పుట్టించి మరీ పోస్టు కొట్టేశారు. సదరు వ్యక్తి భర్త పీఈటీ కావడంతో మాస్టర్మైండ్ ఏజెంట్లతో కలిసి ఫేక్ సర్టీఫికెట్లు సృష్టించి పోస్టు తెచ్చుకున్నారు. దీనిపై పలువురు అభ్యర్థులు శాప్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ⇒ రాయలసీమ జిల్లాకు చెందిన ఓ క్రీడాకారిణి న్యాయంగా తనకు దక్కాల్సిన పోస్టు నాన్–లోకల్ కోటాలో వేరే వ్యక్తికి కట్టబెట్టేశారని హైకోర్టును ఆశయ్రించారు. అయితే, 20 శాతం నాన్లోకల్/ఓపెన్ కేటగిరీలో.. 80 శాతం లోకల్ కోటాలో పోస్టులు భర్తీ చేయాలి. సదరు జిల్లాలో ఐదు పోస్టుల్లో టాపర్ను ఓపెన్ కేటగిరీల మొదటి పోస్టుగా భర్తీ చేశారు. ఆ తర్వాత మూడో పోస్టు నాన్లోకల్లో భర్తీ చేసి స్థానికులకు అన్యాయం చేశారు.ఒకసారి ఓపెన్ క్యాటగిరీలో పోస్టు భర్తీ చేసిన తర్వాత మళ్లీ నాన్–లోకల్లో ఎలా భర్తీ చేస్తారన్నది ప్రశ్న? దీనిపై క్రీడాకారిణి కోర్టుకు వెళ్లగా శాప్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి న్యాయ వ్యవస్థను సైతం మోసం చేసే ప్రయత్నం చేసింది. 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులను చూపించి తప్పు చేయలేదని చెప్పుకొచ్చింది. అయితే ఆ తర్వాత ఆరుసార్లకుపైగా రాష్ట్రపతి ఆర్డర్లు సవరించిన విషయాన్ని ఉద్దేశ పూర్వకంగా కోర్టుకు తెలుపక పోవడం గమనార్హం. -
స్పెషల్ డీఎస్సీపై సర్కారు మౌనం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆటిజం, బుద్ధిమాంద్యం వంటి ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల కోసం స్పెషల్ టీచర్లను నియమించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఏడాది గడిచినా కార్యరూపం దాల్చలేదు. అత్యున్నత న్యాయస్థా నం ఇచ్చిన నిర్దేశాలకు అనుగుణంగా ప్రభుత్వం కొత్త పోస్టులు సృష్టించాల్సింది పోయి, ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖలోని రెగ్యులర్ టీచర్ పోస్టు ల్లో 2,260 పోస్టులను సర్ప్లస్(మిగులు)గా చూపి వాటిని స్పెషల్ టీచర్ పోస్టులుగా (1,136 స్పెష ల్ ఎస్జీటీలు, 1,124 స్పెషల్ స్కూల్ అసిస్టెంట్) మార్పు చేసింది. ఈ మేరకు గతేడాది ఏప్రిల్లో ప్రభుత్వం జీఓనెం.13ను విడుదల చేసింది. అనంతరం ఆర్థిక ఆమోదం తెలపడంతోపాటు గత మేలో ఈ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. మెగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్ ప్రక టన సమయంలో సహా పలు సందర్భాల్లో ప్రభు త్వం స్పెషల్ టీచర్ పోస్టుల (డీఎస్సీ) భర్తీకి చర్య లు చేపడుతున్నట్టు ప్రకటించి అభ్యర్థుల్లో ఆశలు పెంచింది. వాస్తవంలో మాత్రం ఏడాది కాలంగా నోటిఫికేషన్ జారీ చేయకపోవడంతో స్పెషల్ బీఈడీ, డీఎడ్ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. 5 వేల వరకూ ఖాళీలు.. స్పెషల్ టీచర్ల నియామకానికి సంబంధించి విద్యాశాఖ 13 ఉమ్మడి జిల్లాల్లోనూ గుర్తించిన ఖాళీలు ఒక్క పాఠశాల విద్యాశాఖలోని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ స్కూళ్లకు సంబంధించినవి మాత్రమే కావడం మరో విశేషం. మిగిలిన ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, మహాత్మ జ్యోతిబాపూలే, జువైనల్, మోడల్ స్కూల్స్ తదితర శాఖలు ఇప్పటికీ ఆయా స్కూళ్లల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రకటించలేదు. పైగా ఈ ఖాళీలపై ఇప్పటి వరకు ప్రభుత్వం వద్ద స్పష్టత కూడా లేదు. అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని ఖాళీలు కలిపి మొత్తం 5 వేల వరకు ఉంటాయని అంచనా. దివ్యాంగ విద్యార్థుల వికాసమే లక్ష్యంగా... ⇒ ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 10 మంది విద్యార్థులకు ఒకరు, ఉన్నత పాఠశాలల్లో ప్రతి 15 మందికి ఒక స్పెషల్ టీచర్ ఉండాలని ఆర్టీఈ–2009 చట్టంలో 2022 సవరణ చెబుతోంది. ⇒ దివ్యాంగ విద్యార్థులకు సమాన విద్యావకాశాలు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ⇒ స్పెషల్ టీచర్లను నియమించాలని ప్రభుత్వాలకు గతేడాది మార్చిలో విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది. విద్యకు దూరమవుతున్న స్పెషల్ విద్యార్థులు రాష్ట్రంలో సమగ్ర శిక్ష కింద 679 భవిత కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల్లో 9 వేల మంది ఆటిజం, బుద్ధిమాంద్యం పిల్లలు చదువుకుంటున్నారు. ఇక భవిత కేంద్రాల పరిధిలో దాదాపు 80 వేల మంది స్పెషల్ విద్యార్థులున్నారు. వీరిలో 1–5 తరగతుల వయసు వారు 17 వేల మంది భవిత కేంద్రాల్లో ఉన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యాబుద్ధులు నేరి్పంచేందుకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ (ఐఈఆర్టీ) 1,286 మంది కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు. వీరంతా స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినవారే. మిగిలిన 63 వేల మంది విద్యార్థులు స్థానిక ప్రాథమిక, యూపీ, ఉన్నత పాఠశాలల్లో చేరినా స్పెషల్ టీచర్లు లేక విద్యకు దూరమవుతున్నారు. ప్రస్తుతమున్న 6 స్పెషల్ స్కూళ్లల్లోనూ ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ‘భవిత’ స్పెషల్ టీచర్ల ఆందోళన భవిత సెంటర్లలో 10 ఏళ్లుగా పనిచేస్తున్న వారి సర్వీసును రెగ్యులర్ చేయాలని లేదా రెగ్యులర్ టీచర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని గతేడాది సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం హడావుడిగా వీరి అర్హతలను నిర్ధారించేందుకు కమిటీని నియమించింది. కానీ ఇంత వరకు దీనిపై ఎటూ తేల్చలేదు. సుప్రీం తీర్పు నేపథ్యంలో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న వారంతా తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మభ్యపెట్టే ధోరణి అవలంభించడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. -
‘డీఎస్సీ డీల్స్’లో ప్రలోభాల పర్వం
సాక్షి, అమరావతి: డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పోస్టుల కుంభకోణంలో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. పోస్టుల భర్తీలో అవినీతి, అక్రమాలు సాక్ష్యాలతో సహా బయటపడటంతో చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత హేయంగా అంగడి సరుకులా డీఎస్సీ పోస్టులను సీఎం బంధువుగా చెప్పుకుంటూ అమ్మేసిన ‘మాస్టర్మైండ్’ మెడకు ఉచ్చు బిగుసుకోవడంతో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.మూడు రోజులకుపైగా విచారణ పేరుతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కాలయాపన చేసి కనీసం ప్రాథమిక నివేదికను కూడా సిద్ధం చేయలేకపోయింది. బుధవారం రాష్ట్ర క్రీడా సంఘాలను శాప్ ఎంపికల్లో ఎక్కడా తప్పు జరగలేదని, క్రీడాకారులు తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందలేదని స్టేట్మెంట్లు ఇవ్వాలని ‘మాస్టర్మైండ్’ ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. అయితే, అవినీతికి కొమ్ముకాసి అభాసుపాలు కాలేమని, ప్రభుత్వం చెప్పినట్టు తలాడించలేమని క్రీడా సంఘాల ప్రతినిధులు తెగేసి చెప్పినట్టు తెలిసింది. దీంతో శాప్ పరువు పోతోందని, కాపాడాలని క్రీడా సంఘాలను వేడుకోవడం గమనార్హం. విచారణ పేరుతో పిలిచిన క్రీడాకారులు ఇంకా అదే ఉద్యోగంలో కొనసాగుతుండటం కొసమెరుపు. మాస్టర్మైండ్ గేమ్లో చిక్కుకున్నశాప్ ఉన్నతాధికారులు డీఎస్సీ డీల్స్లో కీలకమైన ‘మాస్టర్ మైండ్’ గేమ్లో శాప్ ఉన్నతాధికారులు సైతం చిక్కుకుపోతున్నట్టు శాప్ వర్గాలే విమర్శిస్తున్నాయి. మరోవైపు ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న శాప్ ఎలా విచారణ చేస్తుంది? అందులో శాప్ అధికారులే కమిటీ సభ్యులుగా ఎలా ఉంటారు? ఈ ఒక్క విచారణతోనే నిజనిర్ధారణ చేసేస్తుందా? వాస్తవాలు బయటకు రావాలంటే కచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు, రిటైర్డ్ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తేనే ఇంటి దొంగలు బయటపడతారు’ అని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, డీఎస్సీలో స్పార్ట్స్ కోటా ఉపాధ్యాయ పోస్టుల అమ్మకం ద్వారా మాస్టర్మైండ్ ఏకంగా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లను దండుకున్నట్టు ఆరోపణలు రావడంతో శాప్లో జరుగుతున్న మరిన్ని అవినీతి బాగోతాలు బయటకొస్తున్నాయి. ఉన్న పోస్టులు రద్దు.. ఉద్యోగాలు అడగొద్దుచంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఖాళీగా ఉన్న సర్కారు పోస్టులను భర్తీ చేయకపోగా.. మంజూరైన పోస్టులను రద్దు చేయడమే లక్ష్యంగా ఉంటుంది. ఇప్పుడు కూడా చంద్రబాబు సర్కారు అదే బాటలో పయనిస్తోంది. సమాచార శాఖలో రెండు అటెండర్ పోస్టులను రద్దుచేసి.. వాటి స్థానే ఒక చీఫ్ ఫొటోగ్రాఫర్ పోస్టు భర్తీ చేసేందుకు అనుమతించింది. అంటే మంజూరైన నాలుగో తరగతి పోస్టుల్ని రద్దు చేసి నిరుద్యోగుల ఆశలకు గండికొట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలో ఉండగా ఖాళీగా ఉన్న నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోగా.. ఆ పోస్టులన్నింటినీ రద్దు చేశారు. అవసరమైన చోట ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా 2014–19 మధ్య చంద్రబాబు సాధారణ పరిపాలన, పోలీసు శాఖలతోపాటు అనేక విభాగాల్లో మంజూరైన పోస్టులను రద్దు చేసి వాటి స్థానే ఔట్ సోర్సింగ్ విధానంలో కొన్ని మాత్రమే భర్తీ చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే తరహా పాలనను కొనసాగిస్తున్నారు. సమాచార శాఖలో ఖాళీగా ఉన్న రెండు డార్క్ రూమ్ అటెండర్ల పోస్టులను రద్దు చేస్తూ ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వాటిస్థానే రూ.44,570–1,27,480 వేతన స్కేలుతో ఒక చీఫ్ ఫొటోగ్రాఫర్ పోస్టును మంజూరు చేశారు. ఇందుకు అనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకపోగా.. ఆ పోస్టులనే రద్దు చేయడం అంటే శాశ్వతంగా ప్రభుత్వంలో నాలుగో తరగతి ఉద్యోగాలనేవి ఇక నిరుద్యోగులకు అందని ద్రాక్షగా మిగిలిపోనున్నాయి. -
డీఎస్సీ ‘డీల్స్’.. తప్పించుకునే ‘డ్రిల్స్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్రీడా కోటా డీఎస్సీ–2025 ఎంపికల్లో పారదర్శకతకు సమాధి కట్టేశారు. పోస్టుల భర్తీ కంటే ముందే దొంగ సర్టిఫికెట్లు, తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులపై ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదు. ఇక్కడ సాక్షాత్తు సర్టీఫికెట్లు పరిశీలించి, వాటి వాస్తవికతను ధ్రువీకరించిన శాప్ అధికారులకే ఫిర్యాదులు అందాయి. అయితే.. సీఎం బంధువు, మాస్టర్మైండ్ తన రాజకీయ బలంతో ఫిర్యాదులను తొక్కిపెట్టేశారు. తాను ముందుగా డీల్ కుదుర్చుకున్న వ్యక్తులకే ఉద్యోగాలు అమ్మేయడం ద్వారా దాదాపు రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లు దోచేశారు.ఇంతటి దుర్మార్గపు నియామకాలను సాక్ష్యాలతో సహా ఎండగడుతూ శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురించిన ‘డీఎస్సీ డీల్స్’ కథనంతో శాప్ కార్యాలయం ఉలిక్కిపడింది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అత్యంత పారదర్శకంగా పోస్టులను భర్తీ చేశామంటూ చెబుతూనే తప్పించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చిన ఉద్యోగులను 27న విచారించి సమగ్ర నివేదికను నియామక సంస్థ అయిన పాఠశాల విద్యా శాఖకు సమర్పించనున్నట్టు శాప్ పేర్కొనడం గమనార్హం. ఆగస్టులో ఫిర్యాదులొస్తే ఏం చేసినట్టు? విజయనగరానికి చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి పోస్టల్ శాఖలో ఉద్యోగానికి అనర్హురాలిగా తేలడంతో పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పైగా సదరు క్రీడాకారిణి స్కూల్లో చేరినప్పటి డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్టులోని డేట్ ఆఫ్ బర్త్లో ఏడాదికిపైగా వ్యత్యాసం ఉంది. ఈ ఆధారాలతోనే ఆగస్టులో శాప్కు ఫిర్యాదు అందింది. కానీ.. దీని వెనుక చక్రం తిప్పిన ‘మాస్టర్ మైండ్’ ఆదేశాలతో ఆ ఫిర్యాదు గాలిలో కలిసిపోయింది. అప్పుడే విచారణ చేసి ఉంటే తప్పుడు నియామకం జరిగేది కాదు. కానీ, శాప్ ఇప్పుడు విచారణ చేసి తప్పులేదని తేల్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది.పైగా ప్రభుత్వ ఉద్యోగం పొందే క్రమంలో అభ్యర్థుల ప్రవర్తన (కాండక్ట్)ను పరిశీలించాలి. కానీ, సదరు క్రీడాకారిణిపై స్పష్టంగా ఎఫ్ఐఆర్ నమోదై ఉన్నా.. ఆ విషయాన్ని కావాలనే దాచిపెట్టారా? లేదా వాస్తవం తెలిసినా ఉద్యోగం ఇచ్చేశారా? అనే ప్రశ్నలొస్తున్నాయి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఫిర్యాదులు, అభ్యంతరాలను పారదర్శకంగా పరిష్కరించాలి. కానీ, ఆగస్టులో నమోదైన ఫిర్యాదుపై నేటికీ శాప్ నుంచి స్పందన లేదు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక ‘విచారణ చేస్తాం.. నివేదిక ఇస్తాం’ అంటూ తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానా పాట్లు పడుతోంది. పోనీ, ఇప్పుడు నియామకం తప్పని రుజువైతే నష్టపోయిన అర్హతగల అభ్యర్థులకు రోస్టర్ ప్రకారం ఆ పోస్టును భర్తీ చేస్తారా? లేదో స్పష్టత ఇవ్వలేదు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో క్రీడా సంఘాలు ఎక్కడ? వాస్తవానికి శాప్, క్రీడా సంఘాల సమన్వయంతోనే క్రీడలు అభివృద్ధి చెందుతాయి. కానీ, డీఎస్సీ పోస్టుల భర్తీలో క్రీడా సంఘాలను ప్రణాళిక ప్రకారం దూరం పెట్టారు. కేవలం మాస్టర్మైండ్ తనకు అనుకూల అధికారులను దగ్గర పెట్టుకుని ధ్రువీకరణ పత్రాల పరిశీలన ముగించేశారు. ఆ తర్వాత మొక్కుబడిగా క్రీడా సంఘాల నుంచి జెన్యూన్ సర్టీఫికెట్లు తెప్పించారు. కుల ధ్రువీకరణ, జనన ధ్రువీకరణ పత్రాల ఆమోదం మొత్తం శాప్లోనే నిర్ధారించేశారు. దీనికోసం బహుళ స్థాయిల్లో పరిశీలన చేసినట్టు శాప్ పేర్కొనడం చూస్తుంటే మాస్టర్ మైండ్ చేసింది తప్పని నిర్ధారణ అయితే అందరినీ బలిచేసే కుట్ర చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక్కడంతా ‘మాస్టర్మైండ్’ సీఎం పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ విచ్చలవిడిగా దోపిడీ చేయడంపై క్రీడాకారులు, క్రీడా సంఘాలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి.జీవో–4 సవరణపై దాటవేత సీనియర్ నేషనల్స్లో ప్రతిభ చాటిన క్రీడాకారులే నేషనల్ గేమ్స్లో పాల్గొంటారంటూ శాప్ వింత వాదన తెరపైకి తెచ్చింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా నేషనల్ గేమ్స్కు ప్రాధాన్యం కలి్పంచి పోస్టుల భర్తీ అనంతరం ఆ క్లాజ్ను సవరించే ప్రయత్నాల్లో భాగంగా జీవో–4 మార్పుపై సమాధానం దాటవేసింది. ఇక్కడ సీనియర్ నేషనల్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తారు. కానీ, నేషనల్ గేమ్స్ మాత్రం రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. కానీ, చరిత్ర చూస్తే నాలుగేళ్ల పాటు నేషనల్ గేమ్స్ను వాయిదా వేసిన దాఖలాలున్నాయి.అంటే, ఒక ఈవెంట్లో పతకం సాధించిన వ్యక్తి నాలుగేళ్లు ఆ పతకంతో కొనసాగితే.. సీనియర్ నేషనల్స్లో ఏటా పతకాలు సాధిస్తున్న వ్యక్తులు మారిపోతుంటారు. అంటే, ఇక్కడ ప్రతిభ ఎప్పుడూ ఒకరి దగ్గరే ఉండదు. ఈ క్రమంలో నేషనల్ గేమ్స్కు ప్రాధాన్యాన్ని తెరపైకి తెచ్చి యువ అర్హులైన క్రీడాకారులకు అన్యాయం చేశారు. పైగా నేషనల్ గేమ్స్ ఆధారంగా జాతీయ జట్టును ఎంపిక చేయనప్పుడు ఎలా ప్రాధాన్యత ఇస్తారో శాప్ చెప్పకపోవడం గమనార్హం. నాన్ లోకల్ కోటాతో తమకు అన్యాయం చేశారని అభ్యర్థులు కోర్టులో వేసిన కేసులు విచారణ దశలో ఉంటే.. శాప్ మాత్రం గతంలో నాన్లోకల్ కోటా కింద దాఖలైన పిటిషన్లను కోర్టులు కొట్టేసినట్టు పేర్కొనడం గమనార్హం. -
డీఎస్సీలో ‘డీల్స్’!
డీఎస్సీలో స్థానికంగా మెరిట్ అభ్యర్థులను పక్కన పెట్టి.. నాన్–లోకల్ కోటాలో బయట జిల్లా వ్యక్తికి ఉద్యోగం ఇచ్చేశారు. నాన్ లోకల్లో పోటీపడే వారు స్థానికుల కంటే మెరిట్ జాబితాలో అగ్రస్థానంలో ఉండాలి. కానీ, సదరు ఉద్యోగి స్థానికుల కంటే రెండు స్థానాలు దిగువన ఉన్నప్పటికీ రాయలసీమ జిల్లాలో నాన్లోకల్ కోటాలో పోస్టు కట్టబెట్టేశారు. ఈ విషయం పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలిసినా మిన్నకుండిపోయారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డీఎస్సీ–2025 పోస్టుల భర్తీలో అవినీతి, అక్రమాల దందా రాజ్యమేలింది. అర్హులకు తీవ్ర అన్యాయం చేస్తూ... నకిలీ ధ్రువపత్రాలతో అనర్హులకు చంద్రబాబు సర్కార్ ఉద్యోగాలు కట్టబెట్టినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ‘ముఖ్య’నేతకు బంధువుగా చెప్పుకుంటూ క్రీడాశాఖలో కీలక పదవిని అనుభవిస్తున్న వ్యక్తి ఈ వసూళ్ల దందాలో మాస్టర్ మైండ్గా వ్యవహరించినట్లు చెబుతున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం కొందరు అభ్యర్థులతో డీల్ కుదుర్చుకుని ఒక్కొక్కరి నుంచి పోస్టును బట్టి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు దండుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే జీవోలో అప్రాధాన్య నేషనల్ గేమ్స్ను చేర్చారని స్పష్టం చేస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందే వ్యూహాత్మకంగా క్రీడా విధానం (స్పోర్ట్స్ పాలసీ) 2024–25 ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను అంగట్లో సరుకులు మాదిరిగా విక్రయించినట్లు పేర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 421 డీఎస్సీ పోస్టులను క్రీడా కోటాలో పరీక్ష లేకుండా భర్తీ చేయడం ఒక ఎత్తయితే.. భారీగా ముడుపులు తీసుకుని అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టడం మరో ఎత్తు. క్రీడా విధానం రూపకల్పన సమయంలో అక్రమాలకు తెర తీస్తూ జీవో నంబర్ 4లో స్పోర్ట్స్ ప్రాధాన్యతలను ఇవ్వడం.. డీఎస్సీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాధాన్యతలను మార్పు చేస్తుండటం తీవ్ర చర్చనీయాంశమైంది. తమ జీవితాలతో చంద్రబాబు సర్కారు గేమ్స్ ఆడిందని అభ్యర్థులు వాపోతున్నారు. సీబీఐతో విచారణకు డిమాండ్..కొన్ని క్రీడా సంఘాలను భయపెట్టి క్రీడాకారుల పోస్టులకు అనుగుణంగా అవసరమైన పత్రాలు రూపొందించడంలో మాస్టర్ మైండ్ చక్రం తిప్పారు. ఈ అవినీతి బాగోతాన్ని నడిపించడంలో క్రీడా ప్రాధికార సంస్థలోని ఓ డీఎస్డీవో రేయింబవళ్లు మాస్టర్మైండ్కు సహాయ సహకారాలు అందించారు. చిన్నాచితకా సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. అందులోనూ రెండేసి డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నా, సబ్ జూనియర్ స్థాయి నుంచి వరస క్రమంలో సర్టిఫికెట్లు లేకున్నా పోస్టులు ఇచ్చేశారు. ఐదు నుంచి పది పోస్టులు మినహా చాలావరకు క్రీడా కోటాలోనే భర్తీ చేయడం గమనార్హం. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో సమగ్ర విచారణ చేయించి అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు.ప్రతిభకు ప్రాధాన్యం ఎక్కడ?క్రీడా విధానం 2024–29లో భాగంగా క్రీడా కోటా రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు సర్కార్ జీవో 4 జారీ చేసింది. ఇందులో విచిత్రంగా సీనియర్ నేషనల్ విభాగం కంటే ‘నేషనల్ గేమ్స్’కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇదంతా ముందస్తు పథకం ప్రకారం చేశారు. ఫెడరేషన్ల ఆధ్వర్యంలో జరిగే సీనియర్ నేషనల్స్ సర్టిఫికెట్కు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. జాతీయ జట్టు ఎంపికలు సైతం వాటి ఆధారంగానే చేస్తారు. రెండేళ్లకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే ‘నేషనల్ గేమ్స్’ను పెద్దగా ఎవరూ పరిగణనలోకి తీసుకోరు. జాతీయ జట్ల ఎంపికలతో వీటికి సంబంధం ఉండదు. ఇందులో చాలా రాష్ట్రాలు తమ ప్రాతినిధ్యాన్ని సైతం పెద్దగా ప్రోత్సహించవు. అలాంటి ‘నేషనల్ గేమ్స్’ను చంద్రబాబు సర్కారు జీవో 4లో ప్రాధాన్యంగా పెట్టి డీఎస్సీ క్రీడా కోటాలో అక్రమాలకు తెర తీసింది. డీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందే క్రీడా కోటాలో పోస్టులను అమ్ముకునేందుకు ముఖ్యనేతకు బంధువుగా చెప్పుకునే ‘మాస్టర్మైండ్’ పక్కా స్కెచ్ వేశారు. కేవలం పోస్టులు అమ్ముకోవడం కోసమే జీవో 4లో నేషనల్ గేమ్స్ను చేర్చి.. వసూళ్ల దందా పూర్తి కావడంతో ఆ జీవోను సవరించి చేతులు దులుపుకొనే యత్నం చేస్తున్నట్టు సమాచారం.హైకోర్టు ఆదేశాలు బేఖాతర్...⇒ చంద్రబాబు సర్కారు జారీ చేసిన డీఎస్సీ–2025 నోటిఫికేషన్కు సంబంధించి పలు న్యాయవివాదాలు రేకెత్తాయి. డీఎస్సీ ప్రక్రియలో పలు లోపాలు ఉన్నాయని, పోస్టుల భర్తీలో తప్పులు దొర్లాయని పెద్ద ఎత్తున అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో డీఎస్సీపై 104కుపైగా కేసులు దాఖలయ్యాయి. రిజర్వేషన్లు అమలు, స్పోర్ట్స్ కోటాతో పాటు దరఖాస్తు దశలోనే పోస్టుల ప్రాధాన్యం తీసుకోవడం లాంటి వాటిల్లో తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు ఫిర్యాదు చేశారు. కీలకమైన పోస్టుల ప్రాధాన్యంపై అప్పట్లో హైకోర్టు స్పందిస్తూ ప్రతిభ గల అభ్యర్థులు నష్టపోకుండా ఉన్నతమైన ఉద్యోగం పొందడం వారి హక్కు అని తీర్పునిచ్చింది. అయితే, ఆ తీర్పు ఇచ్చిన రోజే.. ఆర్డర్ కాపీ రాకుండా హడావుడిగా ఫలితాలను ప్రకటించి చంద్రబాబు సర్కారు పోస్టులను భర్తీ చేసింది. కాగా ‘మాస్టర్మైండ్’కు చెందిన ఓ అసోసియేషన్ నుంచి సర్టిఫికెట్లు పొందిన వారికి తగిన అర్హతలు లేకున్నా టీచర్ పోస్టులు కట్టబెట్టేశారు. అనంతరం ఆ మాస్టర్మైండ్ సన్మానం కూడా చేయించుకున్నారు. అయితే ఆ నియామక పత్రాలు ఇచ్చేలోగా ప్రతిభ గల కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో వెనక్కి తగ్గారు.⇒ విజయనగరం జిల్లాకు చెందిన ఓ వెయిట్ లిఫ్టర్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పోస్టల్ శాఖలో క్రీడా కోటాలో ఉద్యోగానికి అనర్హురాలిగా తేలింది. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో మోసగించేందుకు యత్నించినట్లు గుర్తించడంతో విజయనగరం జిల్లాలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే అనూహ్యంగా ఆమె ఏపీ డీఎస్సీ–2025లో క్రీడా కోటాలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఎంపికైంది. దీనిపై సామాజిక కార్యకర్తలు ‘శాప్’కు సైతం ఫిర్యాదు చేశారు.⇒ విజయనగరానికి చెందిన మరో క్రీడాకారుడు జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు పొందారు. ఏపీ డీఎస్సీలో క్రీడా కోటాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆ తర్వాత ఆయన పోస్టల్ శాఖలో అదే క్రీడా కోటాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందారు. -
DSCలో అక్రమ నియామకాలు.. ఏపీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి,విజయవాడ: డీఎస్సీలో అక్రమ నియామకాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. షెడ్యూల్డ్ ఏరియాలోని గిరిజనుల చేత పూరించవలసిన 3వేల అధ్యాపక పోస్టులను జనరల్లో పూరించడంపై సీరియస్ అయ్యింది.గిరిజన యువతీ యువకులకు అన్యాయం చేయడమే రాష్ట్రప్రభుత్వ ఉద్దేశమా అని హైకోర్టు ప్రశ్నించింది. అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. గిరిజన నిరుద్యోగులకు చెందాల్సిన పోస్టులను ఏ అధికారంతో డీఎస్పీలో కలిపారంటూ నిలదీసింది.ప్రభుత్వాలు చేస్తున్న తప్పుల వల్ల ప్రజలు ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎన్ని ఖాళీలున్నాయి. ఎంతమంది అభ్యర్థుల చేత ఖాళీలు పూరించబడ్డాయి. ఇంకా ఎన్నిపోస్టులు పూరించాలో ప్రమాణపత్రం దాఖలు చేయాలని.. ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది.రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల గిరిజన నిరుద్యోగులు తమ హక్కులు కోల్పోతున్నారన్న న్యాయస్థానం.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. -
హైకోర్టు ఇమ్మంది.. ప్రభుత్వం పొమ్మంటోంది!
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025లో మెరిట్ అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని హైకోర్టు సీరియస్గా తీసుకుంది. ప్రతిభావంతులకు అన్యాయం జరిగితే సహించబోమని ఇటీవల హెచ్చరించడంతోపాటు, వారికి రెండు నెలల్లోగా అర్హత సాధించిన పోస్టుల్లో ఉన్నతమైన పోస్టు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. ఇందుకు చంద్రబాబు సర్కారు ససేమిరా అంటోంది. ఇప్పటికే నియామకాలు పూర్తి చేశామని, ఇవ్వడం కుదరదని చెప్పింది. పైపెచ్చు హైకోర్టు తీర్పుపై అప్పీల్కు విద్యా శాఖ సిద్ధమవుతోంది. చేసిన తప్పుల నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం పాట్లు పడుతోందేగానీ, హైకోర్టు ఆదేశాల ప్రకారం మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేసేందుకు మాత్రం అంగీకరించడం లేదు. డీఎస్సీ–2025 అభ్యర్థుల జీవితాలతో ఆది నుంచి ఆడుకున్న ప్రభుత్వం.. గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తు సమయంలోనే తొలి ప్రాధాన్య పోస్టు ఏదో అభ్యర్థులను ఎంచుకోమంది. అభ్యర్థులు తొలి ప్రాధాన్యంగా ఏ పోస్టు ఎంచుకుంటే అదే పోస్టు వస్తుందని ప్రకటించింది. ఈ విధానం గతంలో ఎప్పుడూ లేదు. కౌన్సెలింగ్ సమయంలో మాత్రమే పోస్టుల ప్రాధాన్యం అడిగేవారు. దాని ద్వారా అభ్యర్థులు తాము మెరిట్ సాధించిన వాటిలో ఉన్నత పోస్టును పొందే అవకాశం ఉండేది. ఈసారి దరఖాస్తు సమయంలోనే అడగడంతో వందలాది అభ్యర్థులు ఉన్నత పోస్టులను కోల్పోయారు. డీఎస్సీ –2025 ఫలితాలు ప్రకటించాక దాదాపు 2 వేల మంది అభ్యర్థులు ఎస్జీటీ తొలి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్నా స్కూల్ అసిస్టెంట్, పోస్టు గ్రాడ్యుయేట్ పోస్టులు కూడా సాధించారు. అయితే వారికి తొలి ప్రాధాన్యమైన ఎస్జీటీ పోస్టు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. అంతకంటే మంచి పోస్టులైన స్కూల్ అసిస్టెంట్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు అర్హత సాధించినప్పటికీ, ప్రభుత్వం వారికి ఆ పోస్టులు ఇవ్వలేదు. దీంతో 54 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.తాము ఎంతో కష్టపడి సాధించుకున్న ఉన్నతమైన పోస్టును కోల్పోతున్నామని, గతంలో కౌన్సెలింగ్ దశలో అభ్యర్థులకే పోస్టు ప్రాధాన్యం ఎంచుకునే వెసులుబాటు ఉండేదని, తమకు న్యాయం చేయాలని హైకోర్టును కోరారు. దీంతో ఉన్నత ఉద్యోగం అభ్యర్థి హక్కుగా హైకోర్టు పేర్కొంది. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందిన వారికి ప్రాధాన్యత ఎంపిక విధానంలో కాకుండా ఉన్నత అర్హత గల ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పు బేఖాతర్ హైకోర్టు తీర్పును ప్రభుత్వం పట్టించుకోకుండా ఆగస్టు 11న ఫలితాలను, 21న మెరిట్ లిస్టును ప్రకటించడంతోపాటు ఈ తీర్పుపై డివిజన్ బెంచ్కు అప్పీల్ చేసింది. అక్కడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. అయినప్పటికీ ప్రభుత్వం హడావుడిగా గతేడాది సెపె్టంబర్లో పోస్టింగులు సైతం పూర్తి చేసింది. దీనిపై హైకోర్టు సెపె్టంబర్ 12న మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ మెరిట్ విద్యార్థులకు పోస్టులు ఇవ్వాల్సిందేనని మరోసారి ఆదేశించింది. కానీ దీన్ని కూడా ప్రభుత్వం లెక్కలోకి తీసుకోకుండా సెపె్టంబర్ 15న సెలక్షన్ లిస్టును విడుదల చేసి, ప్రభుత్వం మళ్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టు బెంచ్ ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేసి, మెరిట్కే ప్రాధాన్యమివ్వాలని ఆదేశించింది. డిసెంబర్ 29న తుది తీర్పునిస్తూ మెరిట్కే ప్రాధాన్యమివ్వాలని ఆదేశించింది. ఇప్పటికే పోస్టింగ్స్ పూర్తయ్యాయని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో హైకోర్టు మండిపడింది. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను పట్టించుకోకుండా ఎలా పోస్టులు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కోర్టును ఆశ్రయించిన 54 మంది మెరిట్ అభ్యర్థులతోపాటు ఆర్థి కారణలతో హైకోర్టుకు వెళ్లలేని వారికీ న్యాయం దొరుకుతుందని అంతా భావించారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును పాటించకుండా మరోసారి అప్పీల్కు వెళ్లే యోచన చేస్తుండడం గమనార్హం. న్యాయస్థానాన్ని సైతం లెక్క చేయని ప్రభుత్వ తీరుపై అభ్యర్థులు, యువజన సంఘాలు మండిపడుతున్నాయి. -
కొత్త టీచర్లకు టోకరా!
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం డీఎస్సీ–2025 నిర్వహణలోనే కాదు.. ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వడంలోనూ ఎక్కడలేని గందరగోళం సృష్టిస్తోంది. స్కూళ్ల ఎంపికలో అభ్యర్థులు ఆప్షన్స్ పెట్టే సమయంలోనూ వారిని తప్పుదారి పట్టించింది. దీంతో చాలామందికి క్లస్టర్ కాంప్లెక్స్లో పోస్టింగ్స్ వచ్చాయి. మరోపక్క.. చాలామంది అభ్యర్థులకు ఏ స్కూలూ కేటాయించకుండానే జాయినింగ్ రిపోర్టులు జారీచేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పైగా.. కొత్త టీచర్లు అందరూ సోమవారం వారికి కేటాయించిన స్కూళ్లల్లో రిపోర్టు చేయాలని, వెంటనే విధుల్లో చేరాలని విద్యాశాఖ ఆదేశించింది. అయితే, ఏ స్కూలూ కేటాయించని తాము ఎక్కడ రిపోర్టు చేయాలో అర్ధంగాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. కస్టర్లలో పోస్టింగ్లు..డీఎస్సీ–2025 ద్వారా ఎంపికైన టీచర్లకుఈనెల 3 నుంచి శిక్షణ ఇస్తున్నారు. ఆయా కేంద్రాల్లోనే పోస్టింగ్స్ కోసం వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అనుమతించారు. దీంతో అభ్యర్థులు మండలాల వారీగా ఉన్న స్కూళ్లను ఎంచుకున్నారు. కానీ, చాలామంది అభ్యర్థులకు క్లస్టర్లలో పోస్టింగ్స్ వచ్చాయి. దీంతో వీరు మొదటి నుంచే మిగులు ఉపాధ్యాయులుగా మారినట్లైంది. ఆప్షన్ల సమయంలో సర్కారు దొంగాట..మరోవైపు.. పాఠశాల విద్యాశాఖ మేలో చేపట్టిన ఉపాధ్యాయుల సాధారణ బదిలీల్లో దాదాపు ఐదువేల మంది స్కూల్ అసిస్టెంట్లు మిగులుగా తేలారు. వీరందరినీ డీఈఓ పూల్, క్లస్టర్ పూల్లో ఉంచారు. స్కూళ్లు కేటాయించకుండా ఉపాధ్యాయులను సర్ప్లస్ చేయడంపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో.. డీఈఓ పూల్లో ఉన్న టీచర్లను సర్దుబాటు చేసి, క్లస్టర్ పూల్లో ఉన్నవారిని అలాగే ఉంచారు.ఇలా ఐదు నెలలుగా వీరికి స్థానాలు కేటాయించలేదు. తాజా డీఎస్సీ–2025లో ప్రకటించిన పోస్టుల్లో 7,725 స్కూల్ అసిస్టెంట్ పోస్టులే. ఇప్పుడు కొత్తగా స్కూల్ అసిస్టెంట్లుగా ఎంపికైన అత్యధికులను కూడా క్లస్టర్ కాంప్లెక్స్ల్లో వేసినట్లు తెలిసింది. రెగ్యులర్ ఉపాధ్యాయులు సెలవుల్లో వెళ్లినప్పుడు ఆ సమయంలో వీరి సేవలను ఉపయోగించుకుంటారు. అయితే, ఆప్షన్లు ఇచ్చుకునే సమయంలోనే కొత్త టీచర్లను సర్కారు తికమకకు గురిచేసి దొంగాట ఆడినట్లు తెలుస్తోంది. ఎక్కడ రిపోర్టు చేయాలో?ఇదిలా ఉంటే.. జాయినింగ్ ఆర్డర్ అందిన అభ్యర్థులు సోమవారం తమకు కేటాయించిన స్థానాల్లో రిపోర్టు చేయాలని అధికారులు ఆదేశించారు. కొందరు అభ్యర్థులకు స్థానాలు చూపకపోవడంతో ఎక్కడ రిపోర్టు చేయాలో తెలీక వారు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలా కొత్త టీచర్లలోని కొందరిని రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్లలో మిగులు ఉపాధ్యాయులుగా మారిస్తే మరికొందరిని ఎటూగాకుండా చేసింది.రూ.50 వేల బాండ్ ఇవ్వాలంట..ఇదిలా ఉంటే.. సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో నియమితులైన కొత్త టీచర్లు రూ.50 వేల పూచీకత్తుతో బాండ్ను సమర్పించాలని నిబంధన విధించారు. అంతేగాక.. కనీసం ఐదేళ్లు సొసైటీలో పనిచేస్తామని హామీ ఇవ్వాలని పేర్కొనడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు, కార్పొరేటు కంపెనీలు విధించే నిబంధనలను టీడీపీ కూటమి ప్రభుత్వం పెట్టడంపై వారు దుమ్మెత్తిపోస్తున్నారు. -
జగన్ ను కలిసి కన్నీరు పెట్టుకున్న డీఎస్సీ అభ్యర్థులు
-
డీఎస్సీ టీచర్లకు ‘వెబ్ ఆప్షన్స్’ ప్రారంభం
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 ద్వారా ఎంపికైన అభ్యర్థులు జిల్లాల్లో పాఠశాలలు ఎంపిక చేసుకునేందుకు బుధవారం వెబ్ ఆప్షన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం వీరికి జరుగుతున్న శిక్షణ కేంద్రాల్లోనే విద్యాశాఖాధికారులు ఇందుకు ఏర్పాట్లుచేశారు. ఈనెల 10 వరకు ఇది జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఖాళీల వివరాలను ప్రకటించారు. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 3, 4 కేటగిరీ పాఠశాలలకు సంబంధించిన ఖాళీలను మాత్రమే చూపినట్లు తెలిసింది. ఉపాధ్యాయుల్లేని ప్రాంతాలు, సింగిల్ టీచర్ పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న స్కూళ్లను కొత్త టీచర్లకు కేటాయిస్తున్నట్లు సమాచారం. అలాగే, జూన్లో జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో రిలీవర్ లేక అదే స్కూళ్లలో ఉండిపోయిన వారి స్థానాలను ఇక్కడ చూపడంలేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పునకు భిన్నంగా పోస్టుల భర్తీ.. ఇక డీఎస్సీ నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని, మెరిట్ లిస్టు ఇవ్వకుండానే నేరుగా అభ్యర్థులను ఎంపిక చేశారని కొందరు.. రిజర్వేషన్ ప్రక్రియ సక్రమంగా చేపట్టలేదని మరికొందరు, స్పోర్ట్స్ కోటా ఎంపికలోనూ అవకతవకలు జరిగాయని ఇంకొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అలాగే.. రెండు, మూడు పోస్టులు పొందిన వారికి తక్కువ కేటగిరీ పోస్టులు ఇవ్వడంపైనా హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలకమైన తీర్పును వెలవరించింది. ఉన్నతమైన పోస్టు పొందడం అభ్యర్థి హక్కు అని, వారికి ఆయా పోస్టులు ఇవ్వాలని తేల్చిచెప్పింది. ఫిర్యాదులకు సంబంధించిన పోస్టులను మినహాయించాలని కోర్టు తీర్పునిచ్చినట్లు అభ్యర్థులు చెబుతున్నారు. అయితే, అందిన ఫిర్యాదులను గ్రీవెన్స్ ద్వారా పరిష్కరించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయిలో 60 రోజుల్లో పరిష్కరిస్తామని ప్రకటించింది. కానీ, ఈ సమస్యలు పరిష్కరించకుండానే మొత్తం అన్ని పోస్టులను భర్తీచేసేందుకు ఏర్పాట్లుచేసింది. మొత్తం 15,941 పోస్టులను నింపి ఈ నెల 13 నాటికి కొత్త టీచర్లు స్కూళ్లలో చేరాలని ఆదేశించిడం గమనార్హం. మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి.. ఇదిలా ఉంటే.. కొత్త ఉపాధ్యాయులకు ఆన్లైన్ విధానంపై పూర్తి అవగాహన ఉండదని, వారికి మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ విద్యాశాఖను డిమాండ్ చేశారు. బదిలీల్లో ఎస్జీటీలకు అనుసరించిన విధానాన్నే వీరికి కూడా అమలుచేయాలన్నారు. అలాగే, బదిలీ అయ్యి రిలీవ్ కాని ఉపాధ్యాయుల సమస్య పరిష్కరించేలా ఖాళీలు చూపించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. ఒక్క కర్నూలు జిల్లాలో ఒక్కో అభ్యర్థి 1,650 ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుందని, దీనివల్ల అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొంది. -
Tadepalli: జగన్ను కలిసి కన్నీరు పెట్టుకున్న డీఎస్సీ అభ్యర్థులు
-
వైఎస్ జగన్ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. డీఎస్సీ-2025 ను రద్దు చేసేలే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. రీ నోటిఫికేషన్ ఇచ్చి ఒకే పేపర్తో పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు కోరారు. నచ్చినట్లుగా మార్కులు కలిపే నార్మలైజేషన్ విధానం మోసపూరితంగా ఉందని డీఎస్సీ అభ్యర్థులు అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77 రద్దుచేసేలా ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. డిఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తి పట్ల వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. -
హైకోర్టు ఆదేశాలు లెక్కచేయకుండా అమరావతిలో DSC వేడుకలు
-
DSC అభ్యర్థుల ఎంపికలో భారీ కుట్ర
-
హైకోర్టు అంటే లెక్కేలేదు
సాక్షి, అమరావతి: హైకోర్టు తీర్పయినా తమకు లెక్కేలేదన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోది. డీఎస్సీ దరఖాస్తు సమయంలో తీసుకున్న పోస్టుల ప్రాదాన్యం చెల్లదని, అభ్యర్థులు సాధించిన పోస్టుల్లో ఉన్నతమైన ఉద్యోగం ఇవ్వాలని హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది. దీనిని పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకెళుతోంది. సోమవారం హడావుడిగా డీఎస్సీ ఎంపిక జాబితాను ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర సచివాలయం సమీపంలో ప్రత్యేక వేదిక సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఎంఈవోలు, హెచ్ఎంలు, ఇతర ఉపాధ్యాయులతో కోర్ కమిటీలను నియమించి ఎంపిక చేసిన 15,941 మంది అభ్యర్థులతో పాటు అదేస్థాయిలో బంధువులను అమరావతికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. కాగా.. పోస్టుల ఎంపికపై అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు వచ్చినా అమలు చేయలేదని బాధిత అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై ప్రభుత్వం డివిజన్ బెంచ్కు వెళ్లినా సింగిల్ జడ్జి తీర్పునే అమలు చేయాలని చెప్పడంతో పాటు మొత్తం ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ఓ పక్క హైకోర్టు ఆదేశాలు ఉండగా.. అందుకు విరుద్ధంగా ప్రభుత్వ నియామక పత్రాల పంపిణీ చేపడుతుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రాజకీయ మైలేజీ కోసం.. డీఎస్సీ ఎంపిక జాబితాను ఉమ్మడి జిల్లాల వారీగా ప్రకటించారు. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 16,347 పోస్టులు ప్రకటించగా.. 15,941 మంది ఎంపికైనట్టు ప్రకటించారు. గతంలో డీఎస్సీ అభ్యర్థులకు జిల్లాల్లోనే కౌన్సెలింగ్ నిర్వహించి ఎంపికైన వారికి డీఈవో నియామక పత్రాలు అందించేవారు. కానీ, అందుకు భిన్నంగా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం హడావుడిగా ప్రకటించిన ఎంపిక జాబితాలోని అభ్యర్థులకు అమరావతిలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయంలో కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ముందుకెళుతోంది. 15,941 మంది అభ్యర్థులతో పాటు వారి కుటుంబంలోని ఒకరు తప్పనిసరిగా హాజరు కావాలని అధికారులు సమాచారం పంపించారు. అంటే మొత్తం 32 వేల మందిని ఈనెల 19న అమరావతికి తరలించనున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఎంపికైన అభ్యర్థుల సంఖ్యను బట్టి 65 నుంచి 134 వరకు ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. అభ్యర్థులు ఎక్కడ ఉన్నా గురువారం సాయంత్రానికి సంబంధిత జిల్లా కేంద్రానికి చేరుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరంతా జిల్లా కేంద్రం నుంచి ఏర్పాటు చేసిన బస్సుల్లోనే బయలుదేరాలని స్పష్టం చేసింది. వీరిని సమన్వయం చేసేందుకు ఒక్కో బస్సుకు ఒక్కొక్క ఎంఈవో, ఒక్కో హెచ్ఎం, ఇద్దరు ఉపాధ్యాయులను నియమించింది. అంటే జిల్లాకు సరాసరిన 350 మంది సిబ్బందిని ఇందుకోసం సిద్ధం చేసింది. కాగా.. హైకోర్టు ఇంటీరియం ఆర్డర్ అమలుపై విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కుటుంబ సభ్యులు తప్పనిసరి కాదు డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం అమరావతిలో నియామక పత్రాల ప్రదాన కార్యక్రమానికి కుటుంబ సభ్యులు తప్పనిసరి కాదని విద్యాశాఖ తెలిపింది. బంధువులు, సన్నిహితులు, స్నేహితులను కూడా తీసుకురావొచ్చని ప్రకటించింది. కుటుంబ సభ్యుల్లో వృద్ధులు, గర్భిణులు ఉంటే వారికి బదులు మరొకరి పేరు సూచించవచ్చని చెప్పింది. ఈ అవకాశం లేని అభ్యర్థులు ఒక్కరే వచ్చేలా ఉంటే ఆ విషయం స్థానిక డీఈవోలకు తెలియజేయాలంది. -
మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీగా మార్చేసిన కూటమి ప్రభుత్వం
-
సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో మెరిట్ను ఎలా విస్మరిస్తారు?
-
గిరిజన ఔట్సోర్సింగ్ టీచర్లకు వెన్నుపోటు
సాక్షి, అమరావతి: ‘డీఎస్సీ ఇచ్చినా మిమ్మల్ని తొలగించం. ఉద్యోగ భద్రత కల్పిస్తాం.. వేతనాలు పెంచుతాం.. కాంట్రాక్ట్ పద్ధతిలోకి మారుస్తాం..’ ఇవీ కూటమి ప్రభుత్వం గిరిజన ఔట్సోర్సింగ్ టీచర్లకు ఇచ్చిన హామీలు. వీటిని సైతం కూటమి సర్కార్ చెత్త బుట్టలో పడేసి.. గిరిజన గురుకులాల ఔట్సోర్సింగ్ టీచర్ల బతుకులకు భరోసా లేకుండా చేసింది. అడవి బిడ్డలకు అక్షర వెలుగులు పంచుతున్న వారి జీవితాలను చీకట్లోకి నెట్టేసింది. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ వారిని బయటకు పంపేస్తోంది. కూటమి ప్రభుత్వ దగాతో 1,143 కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారబోతోంది. రాష్ట్రంలోని 191 గిరిజన గురుకుల విద్యాలయాల్లో మొత్తం 1,659 మంది ఔట్సోర్సింగ్ విధానంలో 10 నుంచి 18 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్లుగా మార్చి.. ఉద్యోగ భద్రతకల్పించాలని కోరగా.. వాటిని నెరవేరుస్తామంటూ కూటమి నాయకులు ఎన్నికల సమయంలో నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోలేదు. దీంతో గతేడాది నవంబర్లో 45 రోజులపాటు ఆందోళన చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్లో 1,143 గిరిజన ఔట్ సోర్సింగ్ టీచర్ల పోస్టులు చూపించడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న తాము అన్యాయమైపోతామంటూ ధర్నాలు చేశారు.ఈ నేపథ్యంలో వారితో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి చర్చలు జరిపారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వేతనాలు పెంచుతామని, కాంట్రాక్ట్ పద్ధతిలోకి మారుస్తామని నమ్మబలికి సమ్మె విరమింపజేశారు. అవే విషయాలను అసెంబ్లీలో సైతం మంత్రి సంధ్యారాణి స్పష్టంగా ప్రకటించారు. జాతీయ ఎస్టీ కమిషన్ సైతం స్పందించింది. వారిని తొలగించవద్దని ఆదేశాలివ్వగా.. కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. 2026 వరకు వారిని కొనసాగించాలన్న హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసింది. మీరంతా బయటకు వెళ్లిపోవాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.మరీ ఇంత దారుణమా?డీఎస్సీలో పోస్టులు పేర్కొన్నప్పటికీ.. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తాన్న హామీ ఏమైందని గిరిజన గురుకుల ఔట్ సోర్సింగ్ టీచర్లు, లెక్చరర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున నాయక్ ప్రభుత్వాన్ని ప్రశి్నంచారు. మీ ఉద్యోగాలు తొలగించబోమని పదే పదే చెప్పిన ప్రభుత్వం.. 1,143 మందిని నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీలో పోస్టులు భర్తీ అవుతున్నాయని.. ఇక మీరు బయటకు వెళ్లిపోవాల్సిందేనంటూ అధికారులు చెబుతున్నారని వాపోయారు. హైకోర్టు ఆదేశాలను సైతం ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.టీసీ కోసం పీజీ విద్యార్థి అర్ధనగ్న ప్రదర్శనఫీజు బకాయి చెల్లించకపోతే టీసీఇవ్వలేమన్న ఎస్వీ ఆర్ట్ కాలేజ్ అధికారులుతిరుపతి సిటీ: కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు, హాస్టల్ బకాయిలు వేలాది కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టింది. దీంతో లక్షలాది మంది విద్యార్థులు కాలేజీల నుంచి ధ్రువీకరణపత్రాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీలో చోటుచేసుకున్న ఘటన ఇందుకు నిదర్శనం. 2024–25 సంవత్సరంలో పీజీ పూర్తి చేసి, బీఈడీ చదవాలనుకున్న విద్యార్థి వినోద్ కుమార్ తన టీసీ కోసం కళాశాలకు వచ్చాడు.ఫీజు బకాయి ఉందని చెప్పి కాలేజీ అధికారులు అతనికి టీసీ ఇవ్వడానికి నిరాకరించారు. దీనికి నిరసనగా ఆ విద్యార్థి అర్ధనగ్నంగా ప్రిన్సిపాల్ కార్యాలయం ఎదుట కూర్చొని ఆందోళన చేశాడు. తన తల్లిదండ్రులు కూలీలని, ప్రభుత్వం స్కాలర్íÙప్, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుందనే నమ్మకంతో కర్నూలు నుంచి వచ్చి చదివానని, కళాశాలలో చేరేటప్పుడు కూడా అలాట్మెంట్ కాపీలో ఫీజు ప్రభుత్వం ఇస్తుందని అప్పటి అధికారులు తెలిపారని వాపోయాడు. తీరా చూస్తే ప్రభుత్వం ఇవ్వలేదని విద్యార్థుల దగ్గర ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశాడు. ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీల కో–ఆర్డినేటర్ అశోక్కుమార్ ఇతర విద్యార్థులు వినోద్కు మద్దతుగా నిలిచారు. -
ఆది నుంచి దగా
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీగా మార్చేసింది. ఏళ్ల తరబడి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం అహోరాత్రులు కష్టపడ్డ అభ్యర్థులకు అసంబద్ధ నిబంధనలు, నిర్ణయాలతో మెరిట్ను పట్టించుకోకుండా అన్యాయం చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎంపిక ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చినట్టయింది. నోటిఫికేషన్లో కూటమి ప్రభుత్వం పోస్టుల ప్రాధాన్యం మెలిక పెట్టి అభ్యర్థుల ప్రతిభను మంటగలిపే ప్రయత్నం చేసింది. దీనిపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.దాదాపు ఏడాదిన్నరగా జరుగుతున్న డీఎస్సీ ప్రక్రియలో కూటమి ప్రభుత్వం అడుగడుగునా తప్పులు చేయడం చూస్తుంటే కాలయాపన కోసమే ఇలా చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు గతేడాది జూన్ 12న తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీపై చేసి 16,347 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. అప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రకటించిన 6,100 పోస్టులకు ఇవి అదనం అని అభ్యర్థులు భావించగా, ఆ వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత అనేక డ్రామాలు నడిపి నోటిఫికేషన్ను ఆలస్యం చేసి అభ్యర్థుల్లో గందరగోళం నింపింది. రెండు రోజుల క్రితం ఫలితాలు ప్రకటించే దాకా ఇదే గందరగోళం కొనసాగించడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ విధానాలపైనే అనుమానాలు కలుగుతున్నాయి.తప్పుడు లెక్కలు.. భర్తీ ప్రక్రియలో సాగదీతలు⇒ ‘మేం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే.. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తాం’ అంటూ ఎన్నికల వరకు నారా చంద్రబాబుతో పాటు కూటమి ముఖ్య నాయకులంతా తెగ ప్రచారం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఉన్నవి 16,347 పోస్టులే అన్నారు. కానీ సమాచార హక్కు చట్టం కింద విద్యా శాఖ ఇచ్చిన సమాధానంలో ఆంధ్రప్రదేశ్లో 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంగీకరించారు.⇒ గతేడాది డిసెంబర్ నాటికే డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, అనేక కారణాలతో వాయిదాలు వేసి దాదాపు 11 నెలల తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 19న డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి జూలై 2 వరకు పరీక్షలు నిర్వహించారు.అభ్యర్థుల అర్హత మార్కుల పెంపుతో ఆందోళన⇒ మెగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్లో ఎస్జీటీ పోస్టులకు ఇంటర్లో 50 శాతం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50 శాతం, పీజీటీ పోస్టులకు పోస్టు గ్రాడ్యుయేషన్లో 55 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. ఇలా కనీస అర్హత మార్కులు ఉండాలని నిబంధన విధించి, దరఖాస్తు దశలోనే లక్షలాది మంది అభ్యర్థులపై అనర్హత వేటు వేసింది.⇒ ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు టీచర్లుగా పని చేస్తున్న వారికి ఎలాంటి వెయిటేజీ ఇవ్వలేదు. పదో తరగతి వరకు సీబీఎస్ఈలో చదివి, డీఈడీ ఇంగ్లిష్ మీడియంలో పూర్తి చేసిన వారికీ ప్రభుత్వం డీఎస్సీలో అన్యాయం చేసింది.ప్రశ్నల్లో తప్పులున్నాసరిచేయకుండానే ఎంపిక⇒ డీఎస్సీ ప్రశ్నల్లో అనేక తప్పులు దొర్లినా విద్యా శాఖ సరిచేయలేదు. అభ్యర్థులు సరైన సమాధానాలు గుర్తించినా రెస్పాన్స్ షీట్లలో జవాబులు గుర్తించినట్టు లేకపోవడంతో ఖంగుతిన్నారు. ఒక్కో అభ్యర్థి 160 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించినా 60 నుంచి 20 ప్రశ్నలకు అసలు సమాధానాలు గుర్తించనట్టుగా నమోదైంది.⇒ అభ్యర్థులు గుర్తించిన జవాబుకు ఖాళీ చూపడం, లేదా చుక్కలు నమోదవడం, జవాబు మారిపోవడం (జంబ్లింగ్)తో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖ ప్రకటించిన ఫైనల్ ‘కీ’లో అనేక లోపాలను అభ్యర్థులు గుర్తించారు. వాటికి ఆధారాలను సైతం విద్యా శాఖకు పంపించారు. కానీ ఆయా అభ్యర్థనలపై ఏం చర్యలు తీసుకున్నారో ఎవరికీ తెలియలేదు.⇒ ఆపై మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా ‘సెలెక్టెడ్’ అభ్యర్థుల ఫోన్లకు మెసేజ్లు పంపి సరి్టఫికెట్ వెరిఫికేషన్కు పిలిచారు. పరీక్ష రాసిన 3,36,307 మంది మెరిట్ను ప్రకటించకుండా కేవలం 16,437 పోస్టులకు గాను అంత మందికే మెసేజ్ పంపడం గమనార్హం.కాల్ లెటర్ల జారీలో ‘టెస్టింగ్’⇒ ఒకే కేటగిరీకి చెందిన వారిలో వెనక ఉన్న వారికి తొలుత లెటర్లు పంపడం, మధ్యలో ఉన్న వారికి ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. దీంతో పాటు అభ్యర్థుల డీఎస్సీ మార్కులు రోజుకో విధంగా మారిపోవడం, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాసైనట్టు ప్రకటించి, తర్వాత వెబ్సైట్ నుంచి డేటా తొలగించి, నాట్ క్వాలిఫైడ్ అని ప్రకటించడం గమనార్హం.⇒ ప్రత్యేక విభాగంలోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)ల ఉద్యోగాలకు సైతం ఎసరు పెట్టే ఎత్తుగడ వేసింది. ఈపీటీ అవసరం లేదని నోటిఫికేషన్లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే హాల్ టికెట్లు పంపి పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు మాత్రం ఈపీటీ పాసవలేదని కాల్ లెటర్లు నిలిపివేశారు. ‘మేము మెరిట్ లిస్టులో ఉన్నా కాల్ లెటర్లు రాలేదు’ అంటున్న వారు వేలల్లో జిల్లాల్లో కౌన్సెలింగ్ సెంటర్ల వద్ద ఆందోళన చేస్తే అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం రాజకీయ రంగు పులిమి తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.అభ్యర్థుల భవిష్యత్తుతో ఆటలు⇒ డీఎస్సీ నోటిఫికేషన్ దగ్గర నుంచి కాల్ లెటర్ల జారీ, సరి్టఫికెట్ల పరిశీలన వరకు అభ్యర్థుల జీవితాలను పణంగా పెట్టే రీతిలోనే ప్రక్రియ నడిచింది. నోటిఫికేషన్లో పేర్కొన్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు ఆయా పరీక్షలను వేర్వేరుగా హాల్ టికెట్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించారు.⇒ 16,347 ఉపాధ్యాయ పోస్టులకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమరి్పంచారు. ఇందులో ప్రతిభ గల అభ్యర్థులు ఎస్జీటీతో పాటు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ మూడు పోస్టులు సాధించారు. మెరిట్ ప్రకారం మూడు పోస్టులకు కాల్ లెటర్లు పంపాల్సి ఉన్నా దరఖాస్తులో మొదటి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్న పోస్టుకే కాల్ లెటర్లు పంపారు.⇒ దీంతో అభ్యర్థి సాధించిన పోస్టుల్లో నచ్చిన పోస్టు ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇలా దాదాపు 4 వేల మంది ఉన్నత అవకాశం కల్పోయారు. ఇలా డీఎస్సీ నిర్వహణలో ప్రభుత్వం అడుగడుగునా కుట్ర పూరితంగానే వ్యవహరించింది.⇒ కూటమి ప్రభుత్వంలో డీఎస్సీ నిర్వహణలో పలు లోపాలు ఉన్నాయని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. డీఎస్సీపై 104 వరకు కేసులు నమోదయ్యాయి. డీఎస్సీ దరఖాస్తు సమయంలోనే పోస్టుల ప్రాధాన్యత తీసుకున్నప్పటికీ, అర్హత సాధించాక నచ్చిన పోస్టును ఎంచుకునే అవకాశం లేకుండా చేయడం సరికాదని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సైతం ప్రభుత్వం బేఖాతరు చేస్తూ సోమవారం హడావుడిగా తుది ఫలితాలను ప్రకటించేసింది. ఆపై ప్రభుత్వం డివిజన్ బెంచ్కు వెళ్లగా చుక్కెదురైంది. దీన్ని బట్టి ప్రభుత్వం ప్రతి దశలోనూ కుట్ర పూరితంగానే వ్యవహరించిందని స్పష్టమవుతోంది. -
మెరిట్ను ఎలా విస్మరిస్తారు?
ఎస్జీటీకి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తులిచి్చ.. వేర్వేరు ఫీజులు వసూలు చేసి.. వేర్వేరుగా పరీక్షలు నిర్వహించినప్పుడు మెరిట్ను ఎలా విస్మరిస్తారు? మెరిట్ను కాదని ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోవడం ఏమిటి? ఇది ఎంత మాత్రం సరికాదు. అందువల్ల మేము సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో ఏమాత్రం జోక్యం చేసుకోలేం. – హైకోర్టు ధర్మాసనంమెరిట్ లిస్ట్లో ఉన్నా ఎంపిక చేయలేదు నేను ఎస్టీ కేటగిరి మహిళను. మెరిట్ లిస్ట్లో స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్), ఎస్జీటీ విభాగాల్లో నా పేరు ఉంది. ఎస్జీటీలో 61.63.. ఎస్ఏలో 61.00 స్కోర్ వచ్చింది. మూడో విడతలో నాకు కాల్ లెటర్ పంపించారు. అధికారులు నా సర్టిఫికెట్లు పరిశీలించారు. తీరా సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన ఎంపిక జాబితాలో నా పేరు లేదు. – కమ్మిడి లత, డుంబ్రిగుడ, అల్లూరి సీతారామరాజు జిల్లాసాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 కింద సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులను అభ్యర్థుల మెరిట్ ఆధారంగా కాకుండా దరఖాస్తు సమయంలో వారిచ్చిన ప్రాధాన్యతల ఆధారంగా భర్తీ చేయడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పు పట్టింది. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ నిమిత్తం దరఖాస్తు సమయంలోనే అభ్యర్థుల నుంచి ప్రాధాన్యతలను తీసుకోవడాన్ని ధర్మాసనం ఆక్షేపించింది. ఇలా చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయ పడింది. పరీక్షలు పూర్తయి ఫలితాలు వచ్చాక మెరిట్ ఆధారంగా ప్రాధాన్యతలను కోరి ఉంటే సబబుగా ఉండేదని పేర్కొంది. పోస్టులు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఎస్జీటీ పోస్టులకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటారని, ఆ తర్వాత రాత పరీక్షలో వారు ఎస్ఏ పోస్టులో అత్యుత్తమ ర్యాంకు సాధించినప్పటికీ, ప్రాధాన్యత కింద ఎస్జీటీ పోస్టును ఎంపిక చేసుకున్నారు కాబట్టి, ఎస్ఏ పోస్టు ఇవ్వమని చెప్పడం దారుణమంది. ఎస్జీటీ నుంచి పదోన్నతిపై ఎస్ఏగా నియమితులవుతారని, కాబట్టి మంచి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థిని ఎస్ఏగా కాకుండా ఎస్జీటీగా నియమిస్తామనడం ఎంత వరకు భావ్యమని ప్రశ్నించింది. అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివి, మంచి ర్యాంకు తెచ్చుకుని కూడా తక్కువ స్థాయి పోస్టుతో సంతృప్తి చెందాలంటే వారికి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలంది. ఇది అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన విషయమని తెలిపింది. ఎస్జీటీ, ఎస్ఏ పోస్టులకు పరీక్షలు రాసి, రెండింటిలోనూ మంచి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఎస్ఏ పోస్టుకు అర్హులేనని, పోస్టుల భర్తీలో మెరిట్కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది. ఈ మొత్తం వ్యవహారంపై ఇరుపక్షాల వాదనలు వినాలని సింగిల్ జడ్జిని కోరింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాలు లేక, వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివి ఉత్తీర్ణత సాధించి ఉంటారని, అలాంటి వారి విషయంలో ప్రాధాన్యత పేరుతో ఏకపక్షంగా వ్యవహరించడానికి వీల్లేదని ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేయాలన్న సింగిల్ జడ్జి స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పరీక్షలో మెరిట్ సాధించిన తమను ప్రాధాన్యత పేరుతో ఆ పోస్టుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని, ఈ విషయంలో జోక్యం చేసుకుని తమను ఎస్ఏ పోస్టుకు పరిగణనలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కర్నూలుకు చెందిన బండేగిరి బషీరున్, మరో తొమ్మిది మంది హైకోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సింగిల్ జడ్జి జస్టిస్ న్యాపతి విజయ్ విచారణ జరిపారు. మెరిట్ ఆధారంగా కాకుండా దరఖాస్తు సమయంలో అభ్యర్థులిచ్చిన ప్రాధాన్యతల ఆధారంగా పోస్టులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. మెరిట్ ఆధారంగానే పోస్టులు భర్తీ చేయాలని స్పష్టం చేశారు. మెరిట్ ఆధారంగా కాకుండా ప్రాధాన్యతల ఆధారంగా పిటిషనర్లను ఎస్ఏ పోస్టుకు పరిగణనలోకి తీసుకోకపోవడం అన్యాయమని, వారిని ఎస్ఏ పోస్టులకు పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గత వారం ఉత్తర్వులు జారీ చేశారు.సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అప్పీళ్లు వేసిన ప్రభుత్వం ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసింది. ఈ అప్పీళ్లపై మంగళవారం జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం రూపొందించిన రూల్స్ను పిటిషనర్లు సవాలు చేయలేరన్నారు. దరఖాస్తుల సమయంలోనే ప్రాధాన్యతలు ఇవ్వాలని నిబంధనల్లో స్పష్టంగా ఉందన్నారు. దీనిపై పిటిషనర్లు అప్పుడు అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు కోర్టుకొచ్చారని తెలిపారు. ఎస్జీటీ పోస్టులు ఎక్కువ ఉండటంతో పిటిషనర్లు ఆ పోస్టుకు తమ ప్రాధాన్యతలను ఇచ్చారన్నారు. దాని ప్రకారమే వారికి ఆ పోస్టులు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పుడు పిటిషనర్లకు అనుకూలంగా ఉత్తర్వులిస్తే, మరింత మంది అభ్యర్థులు వేర్వేరు అభ్యర్థనలతో కోర్టుకొస్తారని, దీని వల్ల మొత్తం నియామక ప్రక్రియ ప్రభావితం అవుతుందన్నారు.ఎస్జీటీ నుంచి ఎస్ఏ కావాలంటే 20 ఏళ్లు పడుతుంది పిటిషనర్ల తరఫున జీవీఎస్ కిషోర్ కుమార్, గొట్టిపాటి కవిత వాదనలు వినిపించారు. పిటిషనర్లు రాత పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధించారని, అందువల్ల వారు ఎస్ఏ పోస్టులకు అర్హులవుతున్నారని తెలిపారు. అయితే దరఖాస్తు సమయంలో వీరు ఎస్జీటీకి తమ ప్రాధాన్యతను ఇచ్చారని, ఎక్కువ పోస్టులు ఉండటంతోనే అలా చేశారని వివరించారు. ఎస్జీటీ నుంచి ఎస్ఏ పోస్టుకు పదోన్నతిపై వెళ్లాలంటే 20 ఏళ్లు ఎదురు చూడాల్సి ఉంటుందన్నారు. మెరిట్ను కాకుండా ప్రాధాన్యతల ఆధారంగా నియామకాలు చేపట్టడం సరికాదన్నారు.ప్రాధాన్యతలే ముఖ్యమైతే మెరిట్ ఎందుకు? ర్యాంకులెందుకు?ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, నిబంధనల పేరుతో దరఖాస్తు సమయంలో అభ్యర్థులిచ్చిన ప్రాధాన్యతలకే ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తే, ఇక మెరిట్ ఎందుకని, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది. ఎస్జీటీకి, ఎస్ఏ పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తులిచ్చి.. వేర్వేరు ఫీజులు వసూలు చేసి.. వేర్వేరు పరీక్షలు నిర్వహించినప్పుడు మెరిట్ను కాకుండా ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోవడం ఏమిటని నిలదీసింది. మెరిట్ను పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదంది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమంది. ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ, ఈ వ్యవహారాన్ని సింగిల్ జడ్జికే నివేదించి.. తుది విచారణ జరిపి పిటిషన్లపై నిర్ణయం వెలువరించేలా చూడాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ, ఈ వ్యాజ్యాల్లో ఇరుపక్షాల వాదనలు విని నాలుగు వారాల్లో నిర్ణయం వెలువరించాలని సింగిల్ జడ్జిని ధర్మాసనం కోరింది. ఈ ఉత్తర్వులతో ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను పరిష్కరించింది.ఆ విభాగంలో నేనొక్కడినే.. అయినా పోస్టు రాలేదుడీఎస్సీ నిర్వహణ తొలి నుంచి లోపభూయిష్టంగా ఉంది. కనిగిరి మండలంలో 4 నుంచి 8వ తరగతి వరకు చదువుకున్నాను. హియరింగ్ ఇంపెయిర్డ్ కోటాలో డీఎస్సీ ఫిజికల్ సైన్స్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాను. హియరింగ్ ఇంపెయిర్డ్ కోటాలో మెన్కు ఒకపోస్టు, ఉమెన్కు ఒక పోస్టు ఉన్నాయి. డీఎస్సీలో నాకు 34.55 శాతం మార్కులు వచ్చాయి. ఆ పోస్టుకు ఒక్కడినే ఉండడంతో కాల్ లెటర్ పంపించారు. ఈ నెల 2న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయింది. హియరింగ్ ఇంపెయిర్డ్ నిర్ధారణ కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి పంపించారు. తీరా సోమవారం ప్రకటించిన డీఎస్సీ జాబితాలో నా పేరు లేదు. మరోవైపు హియరింగ్ ఇంపెయిర్డ్ కోటా కింద ఉన్న ఒక పోస్టును క్యారీ ఫార్వార్డ్లో పెట్టినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. – వెంకటనారాయణ, కనిగిరి, ప్రకాశం జిల్లా‘అనంత’లో తక్కువ మెరిట్ ఉన్న వారికి ఉద్యోగాలుడీఎస్సీ–25 తుది ఎంపిక జాబితాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తక్కువ మెరిట్ ఉన్నవారి పేర్లు ఉండడంతో అర్హులైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎస్ఏ ఇంగ్లిష్లో ఎ.ఆంజనేయులు 48వ ర్యాంకులో ఉన్నాడు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. బీసీ–ఏ కేటగిరీకి చెందిన ఈ అభ్యర్థి కంటే వెనకున్న 49వ ర్యాంకు అభ్యర్థి ఓపెన్ కేటగిరీలో ఉన్నాడు. బీసీ–ఏ కేటగిరీకి 7 పోస్టులు ఉన్నాయి. ఈయన కంటే వెనుకున్న 8 మంది ఎంపిక జాబితాలో ఉన్నా, ఎ.ఆంజనేయులు పేరు లేకపోవడంతో డీఈఓను కలిసి విన్నవించాడు. చంద్రిక అనే అభ్యర్థిని స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, పీఈటీ రెండు పోస్టులకూ ఎంపికైంది. ఈమె కేజీబీవీలో పని చేస్తోంది. కేజీబీవీలో పని చేస్తూ బీపీఈడీ కోర్సు చేసిందనే ఫిర్యాదు రావడంతో ఆ పోస్టుకు అనర్హురాలిగా తేల్చారు. యూజీపీడీ ఉన్న కారణంగా పీఈటీ పోస్టుకు ఎంపికైంది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. ఎంపిక జాబితాలో మాత్రం ఈమె పేరు లేదు. తన కేటగిరీలో తన కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చాయంటూ ఆమె అధికారులను కలిసి వాపోయారు. మెంటల్లీ ఇన్హెల్త్ కేటగిరీ కింద కె.శ్రీనివాసులు అనే అభ్యర్థి మెరిట్ జాబితాలో ఉన్నాడు. ఈయనకు ‘0’ శాతం వైకల్యం ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించినా.. ఆ సర్టిఫికెట్ను ఆన్లైన్లో అప్లోడ్ చేయలేదు. ఫలితంగా ఆయన అర్హత లేకపోయినా ఉద్యోగానికి ఎంపికయ్యాడు. – సాక్షి నెట్వర్క్డీఎస్సీలో ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలి : కేవీపీఎస్సాక్షి, అమరావతి: డీఎస్సీలో మెరిట్ మార్కులు వచ్చిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు న్యాయం చేయాలని, సామాజిక న్యాయానికి తూట్లు పొడవద్దని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఒ.నల్లప్ప, ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెరిట్లో ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులను రిజర్వేషన్ కేటగిరీలోనే చూపించే ప్రతిపాదన సరికాదన్నారు.నిరుద్యోగులతో చెలగాటం : డీవైఎఫ్ఐసాక్షి, అమరావతి: నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, డీఎస్సీ–2025లో జరిగిన గందరగోళం ఏ డీఎస్సీలోనూ జరగలేదని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న విమర్శించారు. డీఎస్సీ అభ్యర్థుల అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో అభ్యర్థులు మంగళవారం మంగళగిరిలోని విద్యాభవన్ ఎదుట నిరసన తెలిపారు. -
డీఎస్సీ తుది ఎంపిక జాబితా విడుదల
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైనవారి తుది జాబితాను సోమవారం సచివాలయంలో పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజుతో కలిసి విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ విడుదల చేశారు. డీఎస్సీ–2025లో ప్రకటించిన 16,347 పోస్టుల్లో 15,941 పోస్టులు భర్తీ అయ్యాయని, మిగిలిన 406 పోస్టులకు ఆయా రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు లేనందున వాటిని వచ్చే డీఎస్సీకి బదిలీ చేసినట్టు తెలిపారు. ఉద్యోగాలు సాధించిన వారిలో 7,955 మంది మహిళలు(49.9 శాతం), 7,986 మంది పురుషులు(50.1 శాతం) ఉన్నారని చెప్పారు. టెట్ మార్కులకు 20 శాతం... డీఎస్సీ మార్కులకు 80శాతం వెయిటేజీ: డీఎస్సీకి 3,36,300 మంది నుంచి 5,77,675 దరఖాస్తులు అందాయని, సీబీటీ విధానంలో జూన్ 6 నుంచి జూలై 2 వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించినట్టు కోన శశిధర్ వెల్లడించారు. టెట్ స్కోర్కు 20శాతం, డీఎస్సీ మార్కులకు 80శాతం వెయిటేజీ ఇచ్చి మెరిట్ జాబితాలను తయారు చేశామన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా డీఈవో కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లతోపాటు www.apdsc.apcfss.in లో అందుబాటులో ఉంచామని తెలిపారు.అభ్యర్థులు 8125046997, 9398810958, 7995649286, 7995789286 ద్వారా సహాయం పొందొచ్చన్నారు. డీఎస్సీపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన, పెండింగ్లో ఉన్న 100కి పైగా కేసులపై న్యాయ నిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులందరికీ ఈ నెల 19న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామకపత్రాలు అందజేయనున్నట్టు తెలిపారు. అనంతరం 22 నుంచి 29 వరకు జిల్లాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి పోస్టింగ్స్ ఇస్తామని వివరించారు.ఉన్నతమైన ఉద్యోగం పొందడం అభ్యర్థి హక్కు: హైకోర్టుడీఎస్సీ–2025 నిర్వహణలో పలు లోపాలు ఉన్నాయని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వీటిలో రిజర్వేషన్ల అమలు, స్పోర్ట్స్ కోటాతోపాటు దరఖాస్తు దశలోనే పోస్టుల ప్రాధాన్యం తీసుకోవడం తదితర విషయాల్లో తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం పోస్టుల ప్రాధాన్యంపై హైకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. ప్రతిభ గల అభ్యర్థులు నష్టపోకుండా ఉన్నతమైన ఉద్యోగం పొందడం అభ్యర్థి హక్కని స్పష్టం చేసింది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన వారికి ఉన్నతమైన పోస్టును ఎంచుకునే హక్కు ఉందని, వారికి ఆ పోస్టులు కేటాయించాలని స్పష్టం చేసింది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఎస్జీటీ పోస్టుకు మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చినప్పటికీ స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఉన్నతమైనదని, పైగా ఎస్జీటీ నుంచి ప్రమోషన్తో కూడుకున్నదని పేర్కొంది.ఈ తీర్పు కాపీ ఆదివారం అభ్యర్థులకు చేరడంతో వారు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, డైరెక్టర్లకు మెయిల్ చేశారు. గతంలో బిహార్ కేసులోనూ సుప్రీంకోర్టు ఇదే విధమైన తీర్పును ఇచ్చినట్టు న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం హడావుడిగా విద్యాశాఖ డీఎస్సీ ఫైనల్ జాబితాను విడుదల చేయడం గమనార్హం. తప్పును సరిదిద్దకుండా హైకోర్టు ఆదేశాలు తమకు అందడానికి ముందే ఫలితాలు వెల్లడించేశామని చెప్పేందుకు ఇలా చేసినట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ వాదన ప్రకారం తొలి ప్రాధాన్యం ఎస్జీటీకి ఇచ్చిన అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికైనా వారు ఎస్జీటీ పోస్టుకు మాత్రమే అర్హులవుతారు. దీని ప్రకారం.. ఎస్జీటీగా ఎంపికైనవారు 20 ఏళ్ల సర్వీసు పూర్తిచేసినా స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ వస్తుందో... రాదో... తెలియదు. ఈ క్రమంలో కొందరు ఎస్జీటీలుగానే ఉద్యోగ విరమణ చేసే అవకాశం ఉంది.’ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివారు 4 వేల మంది అభ్యర్థుల వరకు ఉంటారని చెబుతున్నారు. -
DSC Candidates: మెరిట్ ఉన్న.. నో కాల్ లెటర్
-
ప్రతిభకు పాతర
తక్కువ ర్యాంక్ వారికి కాల్ లెటర్లు డీఎస్సీలో నాకు బీసీ–ఎ కేటగిరీలో 5వ ర్యాంకు వచ్చింది. ఇదే కేటగిరీలో నాకంటే ముందున్న నలుగురికి, నా తర్వాత 6, 7 ర్యాంకుల వారికి కాల్ లెటర్లు వచ్చాయి. నాకు ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు. అధికారులకు చెబితే వెయిట్ చేయండి అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – శెట్టి బాబూరావు, సంగం మండలం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా18 పోస్టులుంటే 14 మందికే పిలుపు విజయనగరం జిల్లా డీఎస్సీలో ఎస్జీటీకి సంబంధించి బీసీ–ఏ విభాగంలో 18 పోస్టులు ఉన్నాయి. ఈ లెక్కన 18 మంది మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్లు రావాలి. అయితే ఒకటి నుంచి 14వ ర్యాంకు వరకు మాత్రమే పిలిచారు. 16వ ర్యాంకు వచ్చిన నాతో సహా 15, 17, 18 ర్యాంకుల వారికి కాల్ లెటర్లు రాలేదు. డీఈవోకు వినతిపత్రం అందజేశాం. పరిశీలిస్తామని చెప్పారు. – శ్రావ్య, విజయనగరం జిల్లా ఎస్జీటీ అభ్యర్థినిసాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: డీఎస్సీ నియామకాల్లో కూటమి ప్రభుత్వ కుతంత్రం కొత్త పుంతలు తొక్కుతోంది. అభ్యర్థులను మోసగిస్తున్న తీరు రోజుకో రూపంలో బయట పడుతోంది. కాల్ లెటర్ల జారీలో ‘టెస్టింగ్’ల పేరుతో ఉపాధ్యాయ ఉద్యోగార్థుల భవితవ్యాన్ని నట్టేట ముంచేసినట్టే.. మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు ఇంకా కాల్ లెటర్లు పంపక పోవడంపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఒకే కేటగిరీకి చెందిన వారిలో ముందు.. వెనుక ఉన్న వారికి లెటర్లు పంపడం, మధ్యలో ఉన్న వారికి ఇవ్వక పోవడంపై అభ్యర్థుల్లో టెన్షన్ పెంచుతోంది. దీంతో పాటు అభ్యర్థుల డీఎస్సీ మార్కులు సైతం రోజుకో విధంగా మారిపోవడం, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (ఈపీటీ) పాసైనట్టు ప్రకటించి, తర్వాత వెబ్సైట్ నుంచి డేటా తొలగించి, నాట్ క్వాలిఫైడ్ అని ప్రకటించడం గమనార్హం. ప్రత్యేక విభాగంలోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) ఉద్యోగాలకు సైతం ఎసరు పెట్టే ఎత్తుగడ వేసింది. ఈపీటీ అవసరం లేదని నోటిఫికేషన్లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే హాల్ టికెట్లు పంపి పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు మాత్రం ఈపీటీ పాసవ్వలేదని కాల్ లెటర్లు నిలిపివేశారు. ప్రకటించిన 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి 15 వేల మందికి పైగా అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపామని అధికారులు చెబుతున్నా ‘మేము మెరిట్ లిస్టులో ఉన్నా కాల్ లెటర్లు రాలేదు’ అని చెబుతున్న వారు వేలల్లో జిల్లాల్లో కౌన్సెలింగ్ సెంటర్ల వద్ద ఆందోళనలకు దిగారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో అంత దారుణంగా అక్రమాలు జరుగుతుంటే, అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు.. రాజకీయ రంగు పులిమి తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందు దబాయించి.. తర్వాత జారుకుని..డీఎస్సీ నిర్వహణ తీరు పారదర్శకంగా, చట్టంలో పొందు పరిచిన నిబంధనల ప్రకారం కంటే.. కూటమి రాజకీయ వార్ రూమ్ నుంచి క్షణక్షణం నిర్ణయాలను మార్చుకునే అనుకూలత మధ్య సాగుతోందని విమర్శలొస్తున్నాయి. టీజీటీ–స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడం చూస్తుంటే.. ప్రభుత్వం నిర్లజ్జగా తన అక్రమాల నగ్నత్వాన్ని ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తోంది. తాను పొందుపరిచిన నిబంధనలను చివరి నిమిషంలో విశృంఖలంగా మార్చేసి వేలాది మంది అభ్యర్థుల జీవితాలపై కోలుకోలేని దెబ్బ కొడుతోంది. వాస్తవానికి టీజీటీ–స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులైన గణితం, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ పరీక్షలు రాసిన వారికి ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్టు అవసరం లేదని నోటిఫికేషన్లోనే స్పష్టంగా పేర్కొన్నారు. పైగా ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ డీఎస్సీ సిలబస్, పరీక్ష విధానం.. చివరికి హాల్ టికెట్లోనూ ఇదే అంశాన్ని పొందు పరిచారు. ఈ క్రమంలో డీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థులు మంచి మార్కులతో అర్హత సాధించారు. తీరా, కాల్ లెటర్లు పంపే సమయంలో టీజీటీ–స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు ఈపీటీ పాస్ కాలేదని పేర్కొంటూ వారిని అనర్హులుగా ప్రకటించడం డీఎస్సీ పారదర్శకతనే ప్రశ్నిస్తోంది. పరిస్థితిని గుర్తించిన అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ను నేరుగా సంప్రదిస్తే.. అధికారులు దబాయింపునకు దిగారని వాపోయారు. ఆధారాలను చూపితే.. చివరికి తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. అందుకు అనుగుణంగా స్పెషల్ టీజీటీ పోస్టులకు ఈపీటీ తప్పనిసరి అని ఉన్న కాలమ్ను శనివారం వెబ్సైట్ నుంచి తొలగించారు. కానీ, అర్హులకు కాల్ లెటర్లు పంపేదానిపై స్పష్టత ఇవ్వలేదు. అభ్యర్థుల భవిష్యత్తుతో ఆటలుడీఎస్సీ నోటిఫికేషన్ దగ్గర నుంచి కాల్ లెటర్ల జారీ, సర్టిఫికెట్ల పరిశీలన వరకు అభ్యర్థుల జీవితాలను పణంగా పెట్టే రీతిలోనే ప్రక్రియ నడుస్తోంది. నోటిఫికేషన్లో పేర్కొన్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు కూడా ఆయా పరీక్షలను వేర్వేరుగా నిర్వహించారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమర్పించారు. ఇందులో ప్రతిభ గల అభ్యర్థులు ఎస్జీటీతో పాటు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ మూడు పోస్టులు సాధించారు. మెరిట్ ప్రకారం మూడు పోస్టులకు కాల్ లెటర్లు పంపాల్సి ఉన్నా, దరఖాస్తులో తొలి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్న పోస్టుకే కాల్ లెటర్లు పంపారు. అభ్యర్థి సాధించిన పోస్టుల్లో నచ్చిన పోస్టు ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా, కేవలం ఒక్క పోస్టు(ఎస్జీటీ)కే పరిమితం చేశారు. డీఎస్సీ నియామక ప్రక్రియను ప్రహసనంగా మార్చేసిన తీరుపై అభ్యర్థుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉండగా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 46 మంది అభ్యర్థులు తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి కాల్ లెటర్లు వచ్చాయని రాత పూర్వకంగా డీఈవోకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వికలాంగుల కోటాలో తనకు అర్హత ఉన్నప్పటికీ కాల్ లెటర్ రాలేదని కోడూరు మండలం లింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన జరుగు సుమతి ఆవేదన వ్యక్తం చేశారు.విజయనగరంలో ఆందోళనమెగా డీఎస్సీలో బీసీ–ఏ రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందంటూ విజయనగరం కలెక్టరేట్లోని డీఈఓ కార్యాలయం వద్ద శనివారం ఎస్జీటీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. డీఎస్సీలో మొత్తం 272 పోస్టులుండగా కేవలం 16 మందినే పిలిచారని ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన వారెవరికీ కాల్ లెటర్స్, మెసేజ్లు రాలేదని వాపోయారు. విజయనగరానికి చెందిన బీసీ–ఏ ఎస్జీటీ అభ్యర్థి శ్రావ్య, మరో 14 మంది డీఈఓ మాణిక్యంనాయుడును కలిసి, తమకు అర్హత ఉన్నా కాల్ లెటర్స్ రాలేదని విన్నవించారు. ఈ సందర్భంగా డీఈవో స్పందిస్తూ.. మరోసారి కమిటీ మొత్తం కూర్చొని అభ్యర్థుల డిమాండ్లను పరిశీలిస్తామన్నారు. అప్పటికీ న్యాయం జరగలేదనుకుంటే కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపారు. -
డీఎస్సీ (విజయనగరం వాయిస్)
-
బాబు తొలి సంతకం.. ఘరానా మోసం
-
డీఎస్సీలో డ్రామా గురూ! 'గురువులకు గోడకుర్చీ'
సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో ఉంటున్న ఎర్రా సూరిబాబు (ఎండీఎస్సీ 0116090) డీఎస్సీలో ఎంపికయ్యాడని, గురువారం ఉదయం 9 గంటలకు ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కావాలంటూ ప్రభుత్వం కాల్ లెటర్ పంపింది. ఎంతో ఆనందంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కేంద్రానికి వెళ్లిన సూరిబాబు అధికారులు చెప్పిన మాట విని తెల్లబోయాడు. ‘మాకిచ్చిన డీఎస్సీ ఎంపిక జాబితాలో మీ పేరు లేదు... మీకు పంపిన కాల్ లెటర్ కేవలం ‘టెస్టింగ్’ కోసం మాత్రమే! మీ సర్టిఫికెట్లు మేం పరిశీలించలేం...’ అని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేశారు. దీంతో సదరు అభ్యర్థి తన డీఎస్సీ లాగిన్లోకి వెళ్లి చూడగా అక్కడ ఏ వివరాలు కనపడకపోవడంతో షాక్ తిన్నాడు. ముందు రోజు కనిపించిన కాల్లెటర్ మర్నాడు అదృశ్యమైంది! ఒక్క రోజులోనే వెబ్సైట్ లాగిన్ నుంచి తొలగించడంతో నిశ్చేష్టుడయ్యాడు! రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ ధ్రువపత్రాల పరిశీలన కేంద్రాలకు వెళ్లిన వేలాది మంది అభ్యర్థుల దుస్థితి ఇదీ! 16 వేలకుపైగా టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కూటమి సర్కారు కేవలం పది వేల మందికి మాత్రమే కాల్ లెటర్స్ పంపడం.. వాటిని తీసుకుని అక్కడకు వెళ్లిన వారిని ‘టెస్టింగ్’ అంటూ వెనక్కి పంపుతుండటంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రభుత్వం పంపిన కాల్ లెటర్ను పరిగణనలోకి తీసుకోకుండా ఇలా పరాచికాలు ఏమిటని మండిపడుతున్నారు. తంతు ముగించే కుట్రలు..!డీఎస్సీలో ఎంపికయ్యారో లేదో.. అసలు ఉద్యోగం వస్తుందో రాదో కూడా తెలియనివ్వకుండా అభ్యర్థుల భవిష్యత్తును ప్రభుత్వం నాశనం చేస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల మొదలు దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, నార్మలైజేషన్, పోస్టుల కేటగిరీ వరకు మభ్యపుచ్చడమే ప్రభుత్వ విధానంగా కనిపించింది. చివరికి డీఎస్సీలో ఎంపికైనవారికి కాల్ లెటర్లు విడుదల చేయడంలోనూ ‘టెస్టింగ్’ల పేరుతో పారదర్శకతకు పాతరేస్తూ దగా చేస్తోంది. ఓ అభ్యర్థి ఉద్యోగానికి ఎంపికయ్యాడో లేదో తెలుసుకునే లోపు ఈ తంతు ముగించి తమకు నచ్చిన వాళ్లకు, ముడుపులు ముట్టజెప్పిన వాళ్లకు పోస్టులు కట్టబెట్టే కుట్రలకు తెర తీసింది. రెండు రోజుల క్రితం అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించి.. సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాలకు వెళ్లిన తర్వాత ‘తూచ్’.. అవి చెల్లవనడం ఈ ప్రభుత్వ అసమర్థత, నిర్వాకాలకు నిదర్శనంగా నిలుస్తోంది.అభ్యర్థుల అగచాట్లకు ‘టెస్టింగ్’..ప్రభుత్వం అడుగడుగునా మోసం చేస్తూనే ఉంది. చివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్లోనూ ఇదే రీతిలో వ్యవహరించింది. జీవితాశయం కోసం అహర్నిశలు శ్రమించి పరీక్షలు రాస్తే ‘టెస్టింగ్’ అంటూ గందరగోళానికి గురి చేస్తోంది. అభ్యర్థులు ఎంపికయ్యామో లేదో తెలియని దుస్థితి నెలకొంది. ఎస్జీటీ, ఎస్ఏ, టీజీటీ, పీజీటీ.. నాలుగు వేర్వేరు పరీక్షలు పెట్టి.. నాలుగింటిలోనూ ఎంపికైనవారికి తొలుత ఇచ్చిన ఆప్షన్ ప్రకారమే పోస్టు ఉంటుందని చెప్పి బాంబు పేల్చింది. దీంతో ప్రతిభావంతులు మెరుగైన అవకాశాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడింది. రాత్రికి రాత్రే లెటర్లు మాయం..అభ్యర్థుల ఎంపిక వేళ కుట్ర కోణాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. తుది జాబితా ప్రకటనకు ముందు ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలనకు కాల్ లెటర్ల జారీ ప్రక్రియే దీనికి నిదర్శనం. నాలుగు రోజుల క్రితం.. అభ్యర్థులకు విడివిడిగా కాల్ లెటర్లు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే 16,347 ఉపాధ్యాయు పోస్టులకు ఎంపికైన వారిలో కనీసం 10 వేల మందికి కూడా కాల్ లెటర్లు అందకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకున్న పలువురు గురువారం ధ్రువపత్రాల పరిశీలన సెంటర్లకు వెళ్లారు. తీరా అధికారులు ఆ కాల్ లెటర్లు చెల్లవని, వారి ధ్రువపత్రాలను పరిశీలించడం కుదరదని చెప్పడంతో నివ్వెరపోయారు. ప్రభుత్వం కేవలం ‘టెస్టింగ్’ కోసం మాత్రమే కాల్ లెటర్లు వెబ్సైట్లో పెట్టిందని, వారు ఎంపిక జాబితాలో లేరని చెబుతూ అభ్యర్థులను అడ్డుకున్నారు. ముందు రోజు డీఎస్సీ వెబ్సైట్ నుంచి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు.. మళ్లీ వెబ్సైట్ పరిశీలించగా అవి మాయం కావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అనంతపురంలో తమకంటే తక్కువ ర్యాంకు వచ్చిన అభ్యర్థినికి కాల్లెటర్ వచ్చిందంటూ జిల్లా పరిశీలకుడికి ఫిర్యాదు చేస్తున్న అభ్యర్థులు వేల మందిలో తీవ్ర ఉత్కంఠ..కాల్ లెటర్ల జారీలో ప్రభుత్వం అభ్యర్థుల సహనానికి పరీక్ష పెడుతోంది. ఒకే సామాజిక వర్గం (రిజర్వేషన్ కేటగిరీ) అభ్యర్థుల్లో తక్కువ మార్కులు సాధించిన వారికి తొలుత కాల్ లెటర్లు పంపించి.. వారి కంటే మెరుగైన మార్కులు పొందిన వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సందిగ్ధంలో పెట్టింది. మరోవైపు ఓపెన్ కేటగిరీలో ఎంపికైన వారికి తొలుత కాల్లెటర్లు పంపించడం గందరగోళానికి దారి తీసింది. గురువారం రాత్రి కూడా కాల్ లెటర్ల కోసం తీవ్ర ఉత్కంఠతో వేచి చూస్తున్నవారు వేలల్లో ఉండటం ప్రభుత్వ అసమర్థతను చాటుతోంది. నియామక ప్రక్రియలో అత్యంత పారదర్శకత పాటించాల్సి ఉండగా ప్రభుత్వం ప్రతి దశలోనూ గందరగోళానికి గురి చేస్తోంది. తప్పులను సరిదిద్దుకోకుండా ఎదురు దాడికి దిగుతోంది. వీటిని నివృత్తి చేయాల్సిన యంత్రాంగం ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో గుంభనంగా ఉంటోంది. ప్రతిభను పక్కకు తప్పించి కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకే ఇలా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నాయి.సెలక్షన్ జాబితా వెల్లడించాలి..గతంలో డీఎస్సీ మెరిట్ లిస్ట్ ఇచ్చాక సెలక్షన్ లిస్ట్ విడుదల చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించినియామకాలు చేపట్టేవారు. ప్రస్తుతం దానికి భిన్నంగా సెలక్షన్ లిస్ట్ ఇవ్వకుండా కేవలం మెరిట్ జాబితా ప్రకారం కాల్ లెటర్ పంపిన అభ్యర్థులను మాత్రమే వెరిఫికేషన్కు పిలవడం సరికాదు. డీఎస్సీ 2025లో అవకతవకలు జరుగుతున్నాయనే అనుమానాలకు తావిస్తోంది. మెరిట్లో ఉన్నవారికి కూడా కాల్ లెటర్స్ అందడం లేదు. సెలక్షన్ జాబితాను బహిర్గతం చేసి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నచ్చిన పోస్టు ఎంచుకునే అవకాశం ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ వెలుపల చదివి గత ఏడేళ్లుగా రాష్ట్రంలో నివాసం ఉంటూ మెరిట్ జాబితాలో ఎక్కువ మార్కులు పొందిన అభ్యర్థులను రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 మేరకు స్థానికులుగా పరిగణించాలి. – నల్లపల్లి విజయ్ భాస్కర్, ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపిక జాబితా ఇవ్వాలిడీఎస్సీ నియామకాలకు సంబంధించి గతంలో మాదిరిగా ఎంపిక జాబితా విడుదల చేయలేదు. దీంతో ఎంపిక పారదర్శకంగా జరగలేదని అపోహలున్నాయి. ఎంపిక జాబితాలను బహిర్గతం చేయాలి. ఆ తర్వాతే సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగాలి. గందరగోళాన్ని నివారించేందుకు సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తూ కేటగిరీ వారీగా కటాఫ్ మార్కులను వెల్లడించాలి. – అన్నం శ్రీనివాసులు, వాసిలి సురేష్ (పూలే టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ⇒ ప్రకాశం జిల్లాలో శ్రీ సరస్వతి జూనియర్ కాలేజీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరైన కొండూరి శ్రీవైష్ణవికి చెక్ లిస్ట్ కాపీ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించడంపై ఆర్జేడీని ఫోన్ ద్వారా సంప్రదించగా తమకు ఈమేరకు పైనుంచి ఆదేశాలు అందాయన్నారు. సర్టిఫికెట్లు పరిశీలించినట్లు ఎలాంటి ధృవీకరణ పత్రం ఇవ్వకపోవడం, కనీసం అభ్యర్థి లాగిన్లోనైనా ఆ సమాచారాన్ని పొందుపరచకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. ⇒ విజయనగరం జిల్లాలో వివిధ కేటగిరీల్లో టీచర్ పోస్టుల భర్తీకి తొలిరోజు 383 మంది అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలిచారు. సర్వర్ సమస్య కారణంగా ఉదయం 50 మంది సర్టిఫికెట్లను మాత్రమే పరిశీలించారు. రెండు మూడు ఉద్యోగాలకు ఎంపికైన వారు దాదాపు వంద మంది వరకు ఉండవచ్చని చెబుతున్నారు. ⇒ అనంతపురం జిల్లాలో తొలిరోజు 625 మంది అభ్యర్థులకు మాత్రమే కాల్లెటర్లు వచ్చాయి. తక్కిన వారికి కాల్లెటర్లు రాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బీసీ–డీ కేటగిరీకి చెందిన బొట్టికయల రాజేశ్వరి (ఎండీఎస్సీ 0084323) 70.70 మార్కులతో 121వ ర్యాంకు సాధించినా కాల్ లెటర్ రాలేదు. అదే కేటగిరీకి చెందిన మరో యువతి 70.57 మార్కులతో 124వ ర్యాంకులో ఉండగా ఆమెకు కాల్ లెటర్ రావడం గమనార్హం. మెరిట్లో ఆమె కంటే ముందున్నా తనకు కాల్లెటర్ రాలేదని రాజేశ్వరి వాపోయింది. ఇదే తరహాలో పలువురు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందాయి. ⇒ ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురు అభ్యర్థులు తమకు కాల్ లెటర్లు రాకపోవడంతో కేంద్రాల వద్దకు చేరుకుని ఆరా తీయడం కనిపించింది. ⇒ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇంకా 338 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు రావాల్సి ఉంది. సాయంత్రం 6 గంటల సమయంలో కొంత మందికి వచ్చినట్లు చెబుతున్నారు. మూడు కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టగా తొలిరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వెరిఫికేషన్ మొదలు కాలేదు. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా గురువారం సాయంత్రం వరకు 1,099 మంది అభ్యర్థుల సెలక్షన్ జాబితాను విద్యాశాఖ అధికారులు జిల్లాకు పంపారు. మరో 379 పోస్టులకు సంబంధించి జాబితా రాలేదు. అర్హత సాధించిన అభ్యర్థుల తుది సెలక్షన్ జాబితా ప్రదర్శించాలని ఎస్టీయూ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు మదన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. -
డీఎస్సీ పోస్టులు మార్చుకునే అవకాశం లేదు
సాక్షి, అమరావతి: డీఎస్సీలో ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నచ్చిన పోస్టును ఎంచుకునే అవకాశం ఇక లేనట్టే. పోస్టుల ఆప్షన్స్ మార్చుకునే అవకాశం లేదని డీఎస్సీ కన్వినర్ ఎం.వి.కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు పోస్టులు ఎంపిక చేసుకున్నారని, ఇక వాటిని మార్చేది లేదని మరోసారి తెలిపారు. డీఎస్సీ పరీక్షలకు ముందే పోస్టుల ప్రాధాన్యం తీసుకున్నామని, ఇప్పుడు అదే ‘ఫైనల్’ అని పేర్కొన్నారు.తాజా డీఎస్సీలో ఒకటికంటే ఎక్కువ పోస్టులు సాధించి, మొదటి ఆప్షన్గా ఎస్జీటీని పెట్టినవారు రాష్ట్రంలో 10 వేలమందికి పైగా ఉన్నారు. ఇప్పుడు వారంతా తాము సాధించిన ఉన్నతమైన పోస్టును కోల్పోయినట్టే. రెండు, మూడు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ప్రాధాన్యతాక్రమంలో మొదటి ఆప్షన్గా పెట్టిన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తోంది.మెరిట్ లిస్టు ప్రకటించే ముందు వరకు టెట్ మార్కుల సవరణ కోసం విద్యాశాఖ అధికారులు నాలుగుసార్లు అవకాశం కల్పించారు. అంతకుముందు దరఖాస్తుల్లో అభ్యర్థులు చేసిన తప్పులను సైతం సరిదిద్దుకునే అవకాశం ఇచ్చారు. కానీ.. పోస్టుల ఎంపికలో మాత్రం అవకాశం ఇచ్చేది లేదని కన్వినర్ ‘సాక28 నుంచి సరి్టఫికెట్ల పరిశీలనడీఎస్సీ మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన గురువారం ప్రారంభమవుతుందని కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. వాస్తవానికి సోమవారం ప్రారంభించాల్సిన ఈ ప్రక్రియ వివిధ కారణాలతో ఆలస్యమైంది. దీంతో అభ్యర్థులకు కాల్లెటర్లు సైతం అందించలేదు. సోమవారం రాత్రి నుంచి కాల్లెటర్లు పంపించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు మంగళవారం మధ్యాహ్నం నుంచి డీఎస్సీ వెబ్సైట్ నుంచి కాల్లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని కన్వినర్ తెలిపారు. జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచి్చనవారికి వారు దరఖాస్తు చేసిన అన్ని పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన సంబంధిత జిల్లాల్లోనే ఈనెల 28న ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా డీఎస్సీ వెబ్సైట్ నుంచి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని అందులోని సూచనలను కచి్చతంగా పాటించాలని ఆయన సూచించారు. -
కూటమి ప్రభుత్వ వింత నిర్ణయంతో డీఎస్సీ మెరిట్ అభ్యర్థులకు అన్యాయం
-
డీఎస్సీ... ఇక నో ఆప్షన్!
కర్నూలు జిల్లాకు చెందిన ఎం.నాగజ్యోతికి డీఈడీ, బీఎస్సీ, బీఈడీ అర్హత ఉండడంతో డీఎస్సీలో ఎస్జీటీతోపాటు స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్), టీజీటీ (మ్యాథ్స్) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీలో ఆమె ఎస్జీటీతోపాటు స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్) పోస్టుకు ఎంపికయ్యారు. కానీ, పరీక్షలకు ముందే తొలి ప్రాధాన్యం ఎస్జీటీకే ఇవ్వడంతో ఆమె ఉన్నతమైన స్కూల్ అసిస్టెంట్ పోస్టును కోల్పోవాల్సి వస్తోంది. కర్నూలు పట్టణానికి చెందిన కురువ నటరాజ్ డీఎడ్, బీఈడీ చేశారు. ప్రస్తుత డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుతోపాటు ఎస్జీటీ పోస్టుకు ఎంపికయ్యారు. ఆయన కూడా మెరిట్ లిస్టులో ఉన్నప్పటికీ పోస్టుల ప్రాధాన్యంలో మొదట ఎస్జీటీకి ఇవ్వడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అవకాశం లేకుండాపోయింది. చిత్తూరు జిల్లాకు చెందిన పి.అనిత డీఎడ్, బీఎస్సీ, బీఈడీ పూర్తిచేశారు. ఆమె డీఎస్సీలో ఎస్జీటీ విభాగంలో జిల్లాస్థాయి 89వ ర్యాంకు, స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ)లో 10వ ర్యాంకు పొందారు. కానీ, పోస్టుల ప్రయారిటీలో మొదట ఎస్జీటీకే ఆప్షన్ ఇవ్వడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టును కోల్పోనున్నారు. సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025లో అత్యుత్తమ మార్కులు సాధించినవారి ఆనందాన్ని... కూటమి సర్కారు తెచ్చిన ‘ముందస్తు ఆప్షన్ నిబంధన’ ఆవిరి చేస్తోంది. పరీక్షలకు ముందే పోస్టుల ప్రాధాన్యత ఎంపిక చేసుకోవాలని చెప్పడం... అధికారులు ఇప్పుడు అదే ‘ఫైనల్’ అని ప్రకటించడంతో మెరిట్ అభ్యర్థులకు శాపంగా మారింది. పరీక్ష పాసై మెరిట్ లిస్టులో ఉండి రెండు, మూడు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ముందుగానే ప్రాధాన్యత క్రమంలో మొదటి ఆప్షన్గా పెట్టిన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తోంది. ఇలా రాష్ట్రంలో 10వేల మందికి పైగా రెండు నుంచి నాలుగు ఉద్యోగాలు సాధించినా... ప్రాధాన్యత క్రమంలో మొదట ఇచ్చిన ఎస్జీటీ పోస్టుకే పరిమితమయ్యే పరిస్థితి తలెత్తింది. చేజారిపోతున్న ‘ఉన్నత’ అవకాశం ఎన్నడూ లేనివిధంగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్లో మాత్రమే అభ్యర్థులు దరఖాస్తు దశలోనే పోస్టుల ప్రాధాన్యత క్రమం కూడా తెలియజేయాలని నిబంధన పెట్టారు. అభ్యర్థులు ఎన్ని పోస్టులకు ఎంపికైనా, మొదటి ప్రాధాన్యతగా పేర్కొన్న ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుందని, మిగిలిన పోస్టులు బ్లాక్ అవుతాయని అధికారులు ప్రకటించారు. ఎడిట్కు అవకాశం ఇవ్వని విద్యాశాఖ తెలియక పోస్టుల ప్రాధాన్యత క్రమం తప్పుగా ఇచ్చామని, ఎడిట్ అవకాశం కల్పించాలని పరీక్షకు ముందే డీఎస్సీ నిర్వాహక అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినా పరిగణనలోకి తీసుకోలేదని అభ్యర్థులు వాపోతున్నారు. పోస్టుల ప్రాధాన్యత ఎడిట్ అవకాశం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థులకు జీవితాంతం వేదనే...» స్కూల్ అసిస్టెంట్, టీజీటీ పోస్టులు వచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం పెట్టిన ముందస్తు ఆప్షన్ నిబంధన వల్ల ఎస్జీటీలో చేరినవారు తీవ్రంగా నష్టపోతారు. » ఎస్జీటీ పోస్టులో చేరినవారు 10 నుంచి 15 సంవత్సరాల సర్వీసు పూర్తయినా స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి వస్తుందన్న గ్యారెంటీ లేదు. » అదే టీజీటీ పోస్టులో చేరితే ఐదేళ్లలో పీజీటీ, మరో పదేళ్లలో ప్రిన్సిపాల్ అయ్యే అవకాశం ఉంటుంది. » ప్రభుత్వం పెట్టిన ఒక్క నిబంధనతో ఇప్పుడు మెరిట్లో ముందున్న దాదాపు 10వేల మంది అభ్యర్థులు జీవితాంతం కుమిలిపోయే పరిస్థితి ఏర్పడింది. -
డీఎస్సీ–2025 మెరిట్ లిస్టుల విడుదల
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ–2025 మెరిట్ జాబితాలను శుక్రవారం అర్ధరాత్రి ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర, జోన్, జిల్లా స్థాయిలో అన్ని సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్టులను ప్రకటించింది. వీటిని డీఎస్సీ అధికారిక వెబ్సైట్ (http;//apdrc.apcfrr.in/లోనూ, సంబంధిత జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లలోనూ అందుబాటులో ఉంచామని డీఎస్సీ–2025 కన్వినర్ ఎంవీ కృష్ణారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ కేటగిరీ పోస్టులకు సంబంధించి జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు వారి వ్యక్తిగత డీఎస్సీ లాగిన్ ఐడీల ద్వారా కాల్ లెటర్లు అందిస్తామన్నారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకుని అందులో సూచనలను అనుసరించాలని ఆయన పేర్కొన్నారు. సదరు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు తాజాగా తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన మూడుసెట్ల జిరాక్స్ కాపీలు, ఐదు పాస్పోర్టు సైజు ఫొటోలతో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలి. అంతకుముందే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, టైముకి సర్టిఫికెట్ల పరిశీలనకు వ్యక్తిగతంగా హాజరుకావాలి. హాజరుకాని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దుచేస్తారు. మెరిట్ లిస్టులో తదుపరి ఉన్న అభ్యర్థిని సర్టిఫికెట్ల పరిశీలకులు పిలుస్తారు. ఇక సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చినంత మాత్రాన అభ్యర్థులు ఎంపిక అయినట్లు కాదని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి స్పష్టంచేశారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్, అర్హత, సంబంధిత నియమ నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని స్పష్టంచేశారు. ఇక రాష్ట్రస్థాయి పోస్టులైన ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు రాష్ట్రస్థాయి, జోనల్ స్థాయిలో ర్యాంకులను ప్రకటించగా.. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలకు ఉమ్మడి జిల్లాల వారీగా ర్యాంకులు, స్కోర్ను విడుదల చేశారు. పీజీటీ రాష్ట్ర టాపర్లు వీరే.. ఇంగ్లిష్ : వారణాశి లక్ష్మీ స్వరూప (87 స్కోరు) హిందీ : రమేష్ రామనుకొలను (93.5 స్కోరు) సంస్కృతం: తునికిపాటి భాను (94 స్కోరు) తెలుగు: పట్నాన ధర్మారావు (85.5 స్కోరు ) బయాలజీ (ఇంగ్లిష్ మీడియం): చోడవరం శివకుమార్ (81.5 స్కోరు) గణితం (ఇంగ్లిష్ మీడియం): సంకరణం విజయ్ (78.5 స్కోరు) ఫిజిక్స్ (ఇంగ్లిష్ మీడియం): బాలకిశోర్ కురాకుల (74.5 స్కోరు) సోషల్ స్టడీస్ (ఇంగ్లిష్ మీడియం): నిరోషా కురమాన (85 స్కోరు) ప్రిన్సిపాల్: చింతల గౌతమ్ (75.5 స్కోరు) పీఈటీ రాష్ట్ర ర్యాంకర్లు.. అన్నెపు జగదీశ్వరరావు: 90.5 స్కోరు టీజీటీ ఇంగ్లిష్.. వెలగల రమ్యశ్రీ : 85.43 స్కోరు టీజీటీ హిందీ.. గొల్లపల్లి పవన్ నారాయణ్ కౌశిక్ శాస్త్రి: 88.53 స్కోరు టీజీటీ సంస్కృతం.. తునికిపాటి భాను: 93.60 స్కోరు టీజీటీ తెలుగు.. కల్లె మహేశ్బాబు: 85.20 స్కోరు టీజీటీ మ్యాథ్స్.. సుంకరణం విజయ్: 87.33 స్కోరు టీజీటీ సైన్స్.. బోకం అనిత: 77.89 స్కోరు టీజీటీ సోషల్ స్టడీస్.. బొమ్మిడి డిల్లేశ్: 84.20 -
డీఎస్సీలో డొంక తిరుగుడు!
సాక్షి, అమరావతి :మెగా డీఎస్సీ.. ‘దగా డీఎస్సీ’గా మారనుందా..? ఉపాధ్యాయ పోస్టులను అంగట్లో అమ్మకానికి పెట్టారా..? పారదర్శకంగా మెరిట్ లిస్ట్ వెల్లడించకుండా ఎంపికైన అభ్యర్థుల ఫోన్లకు మెసేజ్ పంపిస్తాం.. మీరే చూసుకోండి అని గుంభనంగా వ్యవహరించడం ఏమిటి? అనే అనుమానాలు ఉపాధ్యాయ అభ్యర్థుల్లో రేకెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం తీరు చూస్తుంటే తమకు కావాల్సిన అభ్యర్థులకు లబ్ధి చేకూర్చేందుకు అడ్డదారులు ఎంచుకుందా? అనే సందేహాలు కలుగుతున్నాయని మండిపడుతున్నారు. గతానికి భిన్నంగా డీఎస్సీ అభ్యర్థుల మెరిట్ లిస్ట్ వెల్లడించకుండా నేరుగా ఎంపికైన అభ్యర్థుల ఫోన్లకు మెస్సేజ్ పంపించేందుకు ఏర్పాట్లు చేయడం వెనుక పెద్ద కుట్రే దాగుందన్న అభిప్రాయం అభ్యర్థుల్లో కలుగుతోంది. ఏ డీఎస్సీలోనూ లేని రీతిలో..సాధారణంగా డీఎస్సీ పరీక్షలు జిల్లా స్థాయిలో నిర్వహించి మెరిట్ లిస్ట్ ప్రకటించి ర్యాంకుల ఆధారంగా పోస్టింగ్స్ ఇవ్వాలి. కానీ 2018లో నాటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి పరీక్షలకు శ్రీకారం చుట్టింది. దీంతో అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించారు. దాంతో నియామకాలు నిలిచిపోగా తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం న్యాయ వివాదాలను పరిష్కరించి పోస్టింగ్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, 2018 డీఎస్సీ కంటే దారుణమైన తప్పులు 2025 డీఎస్సీలో చోటు చేసుకున్నట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు. లిస్ట్, సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా ‘సెలెక్టెడ్’ అభ్యర్థుల ఫోన్లకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం మెసేజ్లు పంపుతామని ప్రభుత్వం చెబుతుండటంతో అభ్యర్థులు నివ్వెరపోతున్నారు. తప్పులు సరిచేయకుండానే మార్కుల వెల్లడి3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమర్పించగా ఈ ఏడాది జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం విడుదలైన ఫైనల్ కీ చూసి అభ్యర్థులు కంగుతిన్నారు. అనేక తప్పులు ఉన్నట్లు గుర్తించినా, దీనిపై అభ్యంతరాలు తీసుకునేది లేదని విద్యాశాఖ ప్రకటించడంతో ఫైనల్ కీలో తప్పులపై విద్యాభవన్ హెల్ప్లైన్ నంబర్లకు ఫిర్యాదులు చేశారు. ‘సాక్షి’ ఈ విషయాన్ని డీఎస్సీ కన్వీనర్ దృష్టికి తీసుకెళ్లగా ఫైనల్ కీలో ఎలాంటి తప్పులు లేవంటూనే నిపుణులతో పరిశీలన చేయిస్తున్నట్లు చెప్పారు. తీరా ఆ తప్పులను సరిచేయకుండానే అభ్యర్థుల మార్కులు ప్రకటించారు. టెట్ మార్కుల నమోదులోనూ నిర్లక్ష్యం టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ కల్పించారు. టెట్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలో సాధించిన వాటికి అదనంగా కలవడంతో మెరిట్ లిస్ట్లో ఉంటారు. ఇప్పటి వరకు జరిగిన టెట్ వివరాలు, అభ్యర్థుల డేటా, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో సదరు అభ్యర్థి ఆధార్, ఫోన్ నంబర్లతో లింక్ అయ్యి ఉంటాయి. ఫోన్ నంబర్లు మారినా ఆధార్ మారే అవకాశం లేదు. కానీ డీఎస్సీ 2025 నిర్వహణలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎన్నో అనుమానాలు.. !నార్మలైజేషన్ అనంతరం ఆగస్టు 11న ఫలితాలను ప్రకటించగా సవరించిన టెట్ మార్కులతో ఈనెల 13న స్కోర్ కార్డులను విడుదల చేశారు. టెట్ మార్కుల్లో తప్పులు ఉంటే అభ్యర్థులే స్వయంగా సవరించుకోవాలంటూ ఒకరోజు అవకాశం కల్పించారు. అభ్యర్థులే టెట్ మార్కులు తప్పుగా నమోదు చేశారంటూ పాఠశాల విద్యాశాఖ నెపం వారిపై నెడుతోంది. మరి విద్యాశాఖ వద్ద అభ్యర్థుల ‘టెట్’ డేటా ఉంటే అభ్యర్థులే సవరించుకోవాలని ఎందుకు చెప్పినట్లు? డీఎస్సీ దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించే క్రమంలోనే అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ వివరాలు నమోదు చేయగానే టెట్ మార్కులు వచ్చేలా ఎందుకు చేయలేదు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.మెరిట్ అభ్యర్థులకు అన్యాయం..!1990 నుంచి 2019 స్పెషల్ డీఎస్సీ వరకు ఫలితాలను ప్రకటించేటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులకు వచ్చిన మార్కులతో మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. డీఎస్సీ 2025లో మాత్రం అభ్యర్థుల మెరిట్ లిస్ట్ను ప్రభుత్వం ప్రకటించకపోవడం సందేహాలకు దారి తీస్తోంది. దీనివల్ల ఏ అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయి? మెరిట్ లిస్ట్లో ఏ స్థానంలో ఉన్నామో అంతు చిక్కని పరిస్థితి నెలకొంది. ఈ విధానం తమకు కావాల్సిన వారికి లబ్ధి చేకూర్చేందుకేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే డీఎస్సీలో చోటుచేసుకున్న తప్పులపై కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎక్స్ సర్వీస్మెన్ కోటా ఎత్తివేయడంపై ఆయా అభ్యర్థులు కూడా న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.డీఎస్సీ ఫలితాల్లో గూడుపుఠాణీ!టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన మెగా డీఎస్సీ ఫలితాల వెల్లడిలో అభ్యర్థులను దగా చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర మండిపడ్డారు. డీఎస్సీ ఫలితాలు ప్రకటించే సమయంలో మెరిట్ లిస్ట్లను తొక్కిపెట్టడం వెనుక భారీ కుట్ర దాగి ఉందన్నారు. పారదర్శకతకు పాతర వేస్తూ మెరిట్ అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టేందుకు మంత్రి నారా లోకేశ్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. ఫలితాలు వెలువడే ముందు దాదాపు 60 వేల మందికి టెట్ మార్కుల సవరణకు అవకాశం ఇవ్వడం అభ్యర్థుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడే ఈ విధానాలకు తక్షణం స్వస్తి పలకాలి అని డిమాండ్ చేశారు. -
నేడో, రేపో డీఎస్సీ మెరిట్ లిస్ట్!
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 అభ్యర్థుల మెరిట్ జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. టెట్ మార్కుల సవరణకు ఈనెల 17వ తేదీ వరకు అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైనవారి జాబితా సైతం సిద్ధమైంది. ఇక మిగిలింది తుది జాబితా విడుదల మాత్రమే. ఈ నేపథ్యంలో సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే అన్ని జిల్లాల్లో డీఎస్సీ విధుల్లోకి సిబ్బందిని నియమించారు. సీనియర్ హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్, ఎంఈవోలకు ఈ విధులను అప్పగించారు. ఈ డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులు భర్తీచేయనున్నారు. అంతేసంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచే అవకాశం ఉంది. డీఎస్సీ పరీక్షలకు పిలిచిన ఆన్లైన్ దరఖాస్తుల్లో దాదాపు 60 వేలమంది అభ్యర్థులు తమ టెట్ మార్కులను తప్పుగా నమోదు చేసినట్టు గుర్తించారు. దీంతో వారి మార్కులను వారే సవరించుకోవాలని రెండుసార్లు విద్యాశాఖ అవకాశం కల్పించింది. చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మెరిట్ లిస్ట్ విడుదల అనంతరం జిల్లాల్లో సర్టిఫికెట్ల పరిశీలనలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని సీనియర్ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. తుది మెరిట్ లిస్ట్లో ఉన్నవారిలో అన్ని సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే, జాబితాలో తర్వాత ఉన్న వారిని పరిగణనలోకి తీసుకుని పోస్టింగ్ ఇస్తారు. డీఎస్సీ ద్వారా కొత్త టీచర్లు వచ్చేనెల 5వ తేదీ నాటికి విధుల్లో ఉండేలా విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం. -
డీఎస్సీ అభ్యంతరాల స్వీకరణ గడువు ఒక రోజు పెంపు
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025పై అభ్యంతరాల స్వీకరణ అనంతరం సవరించిన టెట్ మార్కులతో స్కోర్ కార్డులను https://apdsc.apcfss.in/ వెబ్సైట్లో ఉంచినట్టు డీఎస్సీ కన్వినర్ ఎంవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు టెట్ మార్కులను తప్పుగా నమోదు చేసిన నేపథ్యంలో అభ్యంతరాలు వచ్చాయన్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థి ఐడీ నంబర్తో వెబ్సైట్లో వివరాలను స్వయంగా సరిచేసుకునేందుకు శుక్రవారం వరకు అవకాశం పొడిగించామన్నారు. -
డీఎస్సీ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం డీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రంలోని పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల నియాకానికి డీఎస్సీ–2025 నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఖాళీలకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు చేసుకున్నారు. వారికి జూన్ 6వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకూ 23 రోజులపాటు పరీక్షలు నిర్వహించారు. ఇటీవల తుది కీ విడుదల చేయగా అందులో పలు తప్పులు ఉన్నాయని పలువురు అభ్యర్థులు ఫిర్యాదులు చేశారు. వాటిని పరిశీలించి సవరించిన తుది కీ ఆధా రంగా డీఎస్సీ ఫలితాలను విడుదల చేసినట్లు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో ఫలితాలను, స్కోర్ కార్డులను పొందవచ్చని, స్పోర్ట్స్ కోటా వివరాలు అందిన తర్వాత తుది ఎంపిక జాబితా (సెలక్షన్ లిస్ట్) ప్రకటిస్తామని వివరించారు. ఈ ప్రక్రియ ఈ నెల 20 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.కాగా, తుది కీపై వచ్చిన అభ్యంతరాలకు ఎటువంటి వివరణ ఇవ్వకుండానే ఫలితాలు విడుదల చేసినట్లు విమర్శలు రావడం గమనార్హం. కాగా, https:// apdsc. apcfss. in సెట్లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి టెట్ వివరాలు సరిచేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చినట్లు కన్వీనర్ తెలిపారు. ఈ అవకాశం ఈ నెల 13వ తేదీ వరకే అందుబాటులో ఉంటుందని తెలిపారు. -
డీఎస్సీ తుది ‘కీ’ తప్పులపై పరిశీలన!
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 తుది ‘కీ’లో వచి్చన తప్పులపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. ‘కీ’ విడుదలైనప్పటి నుంచి ప్రతి రోజు విద్యాశాఖ డైరెక్టరేట్కు ఫిర్యాదులు వస్తున్నాయి. పదుల సంఖ్యలో అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లు, ఆధారాలను తీసుకొచ్చి ‘కీ’లోని తప్పులపై ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో తొలుత ఫైనల్ ‘కీ’పై ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించేది లేదని ప్రకటించిన అధికారులు.. ఇప్పుడు ఆయా తప్పులపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ నెల 25 నాటికి డీఎస్సీ ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.ప్రతి ఒక్క మార్కు అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయించేది కావడంతో ప్రభుత్వం, అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ‘కీ’లో తప్పులను సరిచేయకుండా ముందుకువెళితే న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలో తప్పులకు మార్కులు కలుపుతారా? లేక తుది ‘కీ’నే ఖరారు చేస్తారా? అనేదానిపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అధికారులు నార్మలైజేషన్ ప్రక్రియపై దృష్టి పెట్టారు. వీలైనంత వేగంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, ‘కీ’లో వచి్చన తప్పులపై తుది నిర్ణయం ప్రకటించకుండా నార్మలైజేషన్ ఎలా చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. బాగున్న వాటిలో మార్పులు? ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం డీఎస్సీ–2025 పరీక్షలను జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు 23 రోజులపాటు నిర్వహించింది. మొత్తం 16,437 పోస్టులకు 3,36,307 మంది 5,77,694 దరఖాస్తులు సమరి్పంచారు. పరీక్షలు ముగిశాక ప్రాథమిక ‘కీ’తోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచింది. తప్పులు ఉంటే వాటిపై సరైన ఆధారాలతో అభ్యంతరాలు తెలియజేయాలని కోరింది. అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా తప్పులపై అభ్యంతరాలను డీఎస్సీ విభాగానికి పంపించారు. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎస్ఏపీఈ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీఈటీ), ఎస్జీటీ, ఎస్ఏ సైన్స్ పేపర్లలో సైతం తప్పులు వచి్చనట్టు ఫిర్యాదులు అందాయి.వీటికి సంబంధించిన ఆధారాలను సైతం అభ్యర్థులు చూపుతున్నారు. ఈ క్రమంలో ఆగస్టు ఒకటో తేదీన విద్యాశాఖ తుది ‘కీ’ని విడుదల చేసింది. దీనిపై ఎలాంటి అభ్యర్థనలు తీసుకునేది లేదని ప్రకటించింది. అయితే ప్రాథమిక ‘కీ’లో వచ్చిన తప్పులకు సంబంధించి తాము తెలిపిన అభ్యంతరాలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియడం లేదని, ఫైనల్ ‘కీ’లో సైతం పలు మార్పులు చోటు చేసుకున్నాయని, సరైన ప్రశ్నలకు కూడా తప్పులు దొర్లాయని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డీఎస్సీలో అర మార్కు కూడా తమ జీవితాలను నిర్ణయిస్తుందని వాపోతున్నారు. ఇదే అంశంపై ఈ నెల రెండో తేదీ నుంచే అభ్యర్థులు ఆధారాలతో సహా పాఠశాల విద్యాశాఖ ఆఫీసుకు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో తమకు అందిన అభ్యర్థనలపై అధికారులు సబ్జెక్టు నిపుణులతో చర్చిస్తున్నారు. అయితే, తప్పులకు మార్కులు కలుపుతారా? లేక తాము చెప్పిందే ఫైనల్ అంటారా? అనేది ఒకటి, రెండు రోజుల్లో తేలనుంది. -
ఉపాధ్యాయుల పేట
సాక్షి, మహబూబాబాద్: ఆ ఊరు ఉపాధ్యాయులకు కేరాఫ్గా మారింది. ఎన్ని ఎకరాల భూములున్నా.. ఎంత పెద్ద కొలువు వచ్చే అవకాశం ఉన్నా.. ఈ ఊరి యువత మాత్రం బడి పంతులు ఉద్యోగానికే మొగ్గు చూపుతుంది. ఇప్పటి వరకు 200 మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. అందుకే మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటను ఉపాధ్యాయుల ఊరుగా చెప్పుకుంటారు. గ్రామ సర్పంచ్ చొరవతో.. స్వాతంత్య్రానికి ముందు నుంచే నర్సింహులపేట మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల ఉండేది. అప్పుడు ఉర్దూ మీడియంలో బోధన జరిగేది. ఆ రోజుల్లో ఖాజాం అలీ అనే ఉపాధ్యాయుడు పనిచేసేవారు. ఆ తర్వాత షేక్ హుస్సేన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరారు. స్వాతంత్య్రం వచి్చన తర్వాత ఊరి పాఠశాలలో తెలుగు మీడియం బోధించడం మొదలు పెట్టారు. అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రెండో సర్పంచ్గా ఎన్నికైన నాయిని మనోహర్ రెడ్డి.. బడిపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఎస్సెస్సీ తర్వాత హెచ్ఎస్సీ కోర్సును ప్రవేశపెట్టారు.అది చదివిన వారు ఇంటర్ చేయకుండానే ఎస్జీబీటీ శిక్షణకు అర్హులు. అలా ఆ ఊరిలో హెచ్ఎస్సీ చదివిన వారు.. సర్పంచ్ వద్దకు వెళ్లి చెప్పడంతో అప్పుడు సమితి అధ్యక్షులకు ఉత్తరం రాసి పంపితే చాలు మరుసటి రోజు నుంచే ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరే వారు. ఇలా ఒక్కొక్కరుగా సమితిలో ఉద్యోగం చేరడం.. వారి తర్వాత తరం కూడా కాలానుగుణంగా ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకొని చదవడం, ఉద్యోగాలు పొందడం పరిపాటిగా మారింది. ఇలా గ్రామంలోని కుటుంబాలకు కుటుంబాలే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. గ్రామంలో పుట్టి చదువుకున్నవారే కాకుండా గ్రామం, పరిసర ప్రాంతాల్లో పనిచేసిన ఉపాధ్యాయులు కూడా ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉండటం గమనార్హం. ప్రతీ డీఎస్సీలో ఉద్యోగం.. స్వాతంత్య్రానికి ముందు ఉర్దూ మీడియం, తర్వాత తెలుగు మీడియంలో సమితి పరిధిలో నియామకాల నుంచి ప్రస్తుతం ఉపాధ్యాయ ఉద్యోగం కోసం నిర్వహించే డీఎస్సీ వరకు ప్రతిసారి ఈ గ్రామానికి ఉపాధ్యాయ ఉద్యోగం తప్పకుండా వస్తుందనే నమ్మకం. 2024 డీఎస్సీలో కూడా నర్సింహులపేట గ్రామం నుంచి టీచర్లు, 15 మందికి గురుకుల టీచర్ ఉద్యోగం వచి్చంది. ఇప్పటికీ బీఈడీ, డీఈడీ, పీఈటీ, పండిట్, టైలరింగ్, డ్రాయింగ్, క్రాఫ్ట్ వంటి ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకొని డీఎస్సీ ఎప్పుడు పడుతుందా? అని ఎదురు చూసేవారు 50 మందికి పైగా ఉంటారు.మా కుటుంబం నుంచి పది మంది టీచర్లు.. మాది ఉమ్మడి కుటుంబం. మేం ఐదుగురం అన్నదమ్ములం. ఇందులో నలుగురం, మా బావ, మా పిల్లలు, అల్లుళ్లు మొత్తం పది మందిమి ప్రభుత్వ ఉపాధ్యాయులమే. మా ఇంట్లో ఫంక్షన్లు వస్తే అందరం ఉపాధ్యాయులమే కనిపిస్తాం. ఉపాధ్యాయులుగా పనిచేయడం అదృష్టంగా భావిస్తాం. – కొండ్రెడ్డి మల్లారెడ్డి, నర్సింహులపేటదొరవారి దగ్గరికి పోతే ఉద్యోగమే.. మా రోజుల్లో పంతులు ఉద్యోగం అంటే జీతం తక్కువ. అందుకోసం పెద్దగా పోటీ ఉండేది కాదు. మా ఊరి దొరవారు (సర్పంచ్ మనోహర్ రెడ్డి) ఉపాధ్యాయ ఉద్యోగం చేయాలని ప్రోత్సహించేవారు. చదువుకొని ఆయన దగ్గరికి పోతే పోస్టు పెట్టించే వారు. మా ఇంటి నుంచి ముగ్గురం అన్నదమ్ములం, మా అక్కకొడుకు, వాళ్ల పిల్లలు అందరూ ప్రభుత్వ ఉపాధ్యాయులమే. – దాసరోజు దక్షిణామూర్తి, నర్సింహులపేటటీచర్ ఉద్యోగం చేయాలన్న క్రేజీ మా ఊరిలో ఎంత చదివాం అన్నది ముఖ్యం కాదు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. అందుకోసమే నేను, మా తమ్ముడు, మరదలు, ఇద్దరు కొడుకులు, కోడలు అంతా ప్రభుత్వ ఉపాధ్యాయులమే. ఏ ఉద్యోగం చేసినా లేని తృప్తి ఉపాధ్యాయ వృత్తిలో ఉంది. – గండి మురళీధర్, నర్సింహులపేటపూర్వం నుంచి అదే పద్ధతి గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటారు. వారిని చూసినప్పుడల్లా తాము కూడా అదే కావాలని కోరుకుంటూ చదువుతారు. అందుకోసమే ఇంటర్ పూర్తి కాగానే డీఈడీ, డిగ్రీ పూర్తి కాగానే బీఈడీ పూర్తి చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ డీఎస్సీలో మా ఊరికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది. – జినుకల వెంకట్రాం నర్సయ్య, నర్సింహులపేట


