
ఆ అభ్యర్థులకు జూలై 1, 2 తేదీల్లో నిర్వహణ
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో 20, 21 తేదీల్లో జరిగే డీఎస్సీ పరీక్షలను వాయిదా వేసినట్టు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
యోగా డే సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ఆ రెండు రోజుల్లో జరగాల్సిన పరీక్షలను వచ్చేనెల 1, 2 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. మారిన పరీక్షా కేంద్రాలు, తేదీలతో హాల్ టికెట్లు ఈనెల 25 నుంచి https://apdsc.apcfss.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయన్నారు.