
సాక్షి, అమరావతి: ఏపీలో డీఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డీఎస్సీ పరీక్షల తేదీల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను జులై 1, 2 తేదీల్లో నిర్వహించనున్నట్లు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి శనివారం ప్రకటన విడుదల చేశారు.
కాగా, ఈ నెల 25 నుంచి మార్పు చేసిన హాల్ టికెట్లను https://apdsc.apcfss.inలో అందుబాటులో ఉంచనున్నట్లు కృష్ణారెడ్డి వెల్లడించారు. అభ్యర్థులు ఈ మార్పును గమనించి మార్చిన హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని కొత్త తేదీల ప్రకారం పరీక్షలకు హాజరు కావాలని ఆయన తెలిపారు.